breaking news
Business
-
సరికొత్త ఏఐ తయారీకి బ్లూప్రింట్ సిద్ధం
విభిన్నమైన మూలాధారాల నుంచి సమాచారాన్ని విశ్లేషించి వాస్తవిక ప్రపంచ సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించగల కృత్రిమ మేథ ఆవిష్కరణకు బాటలువేసే ‘బ్లూప్రింట్’సిద్ధమైంది. బ్రిటన్లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయం, అలాన్ ట్యూరింగ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ బ్లూప్రింట్ను రూపొందించారు. ఈ పరిశోధన తాలూకు వివరాలు ప్రఖ్యాత ‘నేచర్ మెషీన్ ఇంటెలిజెన్స్’జర్నల్లో ప్రచురితమయ్యాయి.కంటికి కనిపించని, తనకు అర్థంకాని భాష నుంచి సైతం సమాచారాన్ని ఎలాగోలా రాబట్టి దాని సారాన్ని ఒడిసిపట్టే సామర్థ్యంతో కొత్త ఏఐను సృష్టించేందుకు ఈ బ్లూప్రింట్ అక్కరకొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతమున్న ఏఐలు చిత్రాలు, వీడియోలు, వాక్యాలు, శబ్దాలు, సెన్సార్లలో ఏకకాలంలో ఏదో ఒకటి, రెండు అంశాల నుంచి మాత్రమే డేటాను సంగ్రహించగలవు. కానీ అన్నిరకాల డేటాను విశ్లేషించేలా మల్టీమోడల్ ఏఐ వ్యవస్థను రూపొందించనున్నారు.దృశ్య, శ్రవణ, పర్యావరణ, పరిసర, సెన్సార్ డేటాలను ఏకకాలంలో విశ్లేషించగలిగితే స్వయంచోదిత కార్ల వంటి వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. దీంతోపాటే వైద్య, చికిత్స, జన్యు డేటాలను ఏకకాలంలో విశ్లేషించగలిగితే వ్యాధి నిర్ధారణ పరీక్షలతోపాటు ఏఏ ఔషధాల సమ్మేళనం ఎంత మోతాదులో ఖచ్చితత్వంతో పనిచేస్తుందో సులువుగా కనిపెట్టవచ్చు.‘‘భవిష్యత్ విపత్తులు, సుస్థిర ఇంధనం, వాతావరణ మార్పుల వంటి అంశాలకు పరిష్కారాలు వెతకాలంటే విస్తృతస్తాయి డేటాను లోతుగా విశ్లేషించగలగాలి’’అనిఈ పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ హైపింగ్ లూ అన్నారు. షెఫీల్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, మెషీర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఈయన ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. -
శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ విడుదల
శామ్ సంగ్ తాజాగా “వరల్డ్ వైడ్ ఓపెన్” ఈవెంట్లో తన కొత్త ఎక్స్ఆర్ (XR-ఎక్స్టెండెడ్ రియాలిటీ) వ్యూహాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా, గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్తో పాటు, వైర్డ్, వైర్లెస్ ఎక్స్ఆర్ గ్లాసెస్, ఏఐ గ్లాసెస్ అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. గూగుల్తో భాగస్వామ్యంలో రూపొందిస్తున్న ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్లాట్ఫామ్ను ఈ పరికరాలు ఉపయోగించనున్నాయి.డిస్ప్లే ఉన్న హెడ్సెట్ల నుండి డిస్ప్లే రహిత ఏఐ గ్లాసెస్ వరకు ఎక్స్ఆర్ పరికరాల పూర్తి సిరీస్ను ఈ ఈవెంట్లో శాంసంగ్ వివరించింది. శాంసంగ్, జెంటిల్ మాన్స్టర్, వార్బీ పార్కర్ వంటి బ్రాండ్లతో కలిసి గ్లాసెస్ డిజైన్లో పనిచేస్తోంది.ఏఐ గ్లాసెస్ ప్రత్యేకంగా ఓక్లే మెటా గ్లాసెస్కు ప్రత్యర్థిగా ఉండనున్నాయి. వీటిలో డిస్ప్లే ఉండదు కానీ, గూగుల్ జెమినీ ఏఐ (Google Gemini AI) సాయంతో మెసేజింగ్, నావిగేషన్, అనువాదం వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తాయి. గూగుల్ ఇప్పటికే ఈ తరహా గ్లాసెస్ను డెమోలో ప్రదర్శించింది.శాంసంగ్ ఎక్స్ గ్లాసెస్ (కోడ్నేమ్: HEN) క్వాల్కమ్ XR2+ Gen 2 చిప్సెట్ను ఉపయోగించి ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ ప్లాట్ఫారమ్పై నడుస్తాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్ లెన్స్ డిస్ప్లే, ఆడియో స్పీకర్లు, కెమెరాలు, చేతి సంజ్ఞల ఆధారంగా నియంత్రణలు ఉంటాయని అంచనా.గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లుడిస్ప్లే: మైక్రో-OLED, 3,552×3,840 రిజల్యూషన్, 60–90Hzచిప్సెట్: క్వాల్కమ్ XR2+ Gen 2ర్యామ్: 16GB స్టోరేజ్: 256GBఓఎస్: ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్కెమెరా: 6.5MPసెన్సార్లు: నాలుగు ఐ-ట్రాకింగ్, రెండు పాస్-త్రూ, ఐదు ఐఎంయూ, డెప్త్, ఫ్లిక్కర్ ఒక్కోటి ఉంటాయి.బ్యాటరీ: 2 గంటలు సాధారణ వినియోగం, 2.5 గంటలు వీడియో ప్లేబ్యాక్కనెక్టివిటీ: వైఫై7, బ్లూటూత్ 5.4బరువు: హెడ్సెట్ - 545 గ్రాములు, బ్యాటరీ - 302 గ్రాములుశామ్ సంగ్ గెలాక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ యాపిల్ విజన్ ప్రోకి (Apple Vision Pro), రాబోయే ఎక్స్ఆర్ గ్లాసెస్ మెటా రేబాన్ గ్లాసెస్కి పోటీగా నిలవనున్నాయి. ఏఐ గ్లాసెస్ 2025లో విస్తృత వినియోగానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. -
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా డీల్
స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలు రక్షణ, అంతరిక్ష రంగంలో కీలక ఉపకరణాల దాకా అన్నింటి తయారీకి అత్యావశ్యకమైన ఖనిజాల సరఫరాపై చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. విదేశాలకు తమ అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయాలంటే కఠిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని చైనా మొండికేయడం తెల్సిందే.దీంతో చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా, ఆస్ట్రేలియా రూ.75,000 కోట్ల విలువైన చరిత్రాత్మకమైన ‘అరుదైన ఖనిజాల ఒప్పందం’కుదుర్చుకున్నాయి. అధ్యక్షభవనంలో డొనాల్డ్ ట్రంప్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు.‘‘గత కొన్ని నెలలుగా చర్చలు జరిపి ఎట్టకేలకు నేడు ఒప్పందం కుదుర్చుకున్నాం. మరో ఏడాదిలోగా మా రెండు దేశా లు భారీ ఎత్తున అరుదైన ఖనిజ నిల్వలను సాధించనున్నాయి. ఈ నిల్వలతో మేమేం చేస్తామో మీకు కూడా తెలీదు’’అని వ్యాఖ్యానించారు.తొలి ఆరు నెలల్లో ఇరు దేశాలు చెరో 3 బిలియన్ డాలర్ల మేర ఖనిజాల తవ్వకాల ప్రాజెక్ట్ల్లో పెట్టుబడులు పెడతాయి. ఉపగ్రహాలు, ఎంఆర్ఐ యంత్రాలు, గైడెన్స్ వ్యవస్థలు, లేజర్లు, జెట్ ఇంజిన్లదాకా అన్నింటి తయారీలోనూ అరుదైన భూ మూలకాలనే ఉపయోగిస్తారు. -
ఒకప్పుడు దివాలా.. నేడు 12 కంపెనీలకు అధిపతి
వ్యాపార రంగంలో ఎవరు ఎప్పుడు సక్సెస్ అవుతారో చెప్పలేం. ఒకప్పుడు దివాలా తీసి తర్వాత ఉన్నతస్థాయికి చేరనవారు చాలా మందే ఉన్నారు. దీపావళికి ముందు తన ఉద్యోగులకు 51 లగ్జరీ కార్లను బహుమతిగా (Gifts Luxury Cars on Diwali) ఇచ్చిన చండీగఢ్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత గురించి వినే ఉంటారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఉద్యోగులకు 51 లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిన ఆయన ఎంఐటీఎస్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఎం.కె. భాటియా. దీపావళి వేడుకల సందర్భంగా సరికొత్త స్కార్పియో ఎస్యూవీల తాళాలను తానే స్వయంగా ఉద్యోగులకు అందజేశారు. ఈయన కూడా ఒకప్పుడు దివాలా తీసి తర్వాత ఎదిగినవారే.దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం.. కంపెనీలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా చిహ్నంగా ఎస్యూవీలను బహుమతులుగా ఇచ్చారు. ఆసక్తికరంగా, భాటియా తన సిబ్బందికి లగ్జరీ కార్లు బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా దీపావళి సందర్భంగా వివిధ వాహనాలను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.దివాలా తీయడం నుంచి దిగ్విజయం వరకు..భాటియా విజయ ప్రస్థానం మరింత స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు ఎంఐటీఎస్ (MITS) గ్రూప్ వ్యవస్థాపకుడైన ఆయన ఒకప్పుడు 2002లో తన మెడికల్ స్టోర్ భారీ నష్టాలను చవిచూసినప్పుడు దివాలా తీశారు. కానీ ఆయన అక్కడితో ఆగిపోకుండా తన జీవితాన్ని, వ్యాపారాన్ని పునర్నిర్మించుకున్నారు. 2015 లో ఎంఐటీఎస్ను ప్రారంభించారు.నేడు.. భాటియా ఎంఐటీఎస్ బ్యానర్ కింద 12 కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. భారత్తోపాటు విదేశాలలోనూ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. హర్యానాలోని పంచకుల కేంద్రంగా ఉన్న ఆయన కంపెనీ ఇప్పటికే కెనడా, లండన్, దుబాయ్లలో లైసెన్సులను కలిగి ఉంది.మఇదీ చదవండి: వారెన్ బఫెట్ చెప్పిన సక్సెస్ సీక్రెట్.. -
వైట్హౌస్ను కూల్చేస్తున్న ట్రంప్
అమెరికాలోని వైట్హౌస్లో 250 మిలియన్ల (సుమారు రూ.2,000 కోట్లు) భారీ వ్యయంతో కొత్త బాల్రూమ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్లో భాగంగా వైట్హౌస్ తూర్పు విభాగం (ఈస్ట్ వింగ్)ను పాక్షికంగా కూల్చివేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో తన కలల ప్రాజెక్టుగా భావించే ఈ బాల్రూమ్ నిర్మాణం కోసమే ఈస్ట్ వింగ్లో కొంత భాగాన్ని కూల్చివేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం వైట్హౌస్లో అతిపెద్ద హాల్ ‘ఈస్ట్ రూమ్’. దీనిలో సుమారు 200 మంది మాత్రమే కూర్చునే సామర్థ్యం ఉంది. స్టేట్ డిన్నర్లు, ఇతర పెద్ద ఈవెంట్లకు ఇది సరిపోవడం లేదని ట్రంప్ చాలాకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అతిథులను, ప్రపంచ నాయకులను వైట్హౌస్లోనే సౌకర్యవంతంగా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా బాల్రూమ్ అవసరమని ఆయన తెలిపారు.తాత్కాలికంగా టెంట్లలో..స్టేట్ డిన్నర్లు వంటి అతిపెద్ద కార్యక్రమాలను గత అధ్యక్షులు తరచుగా వైట్హౌస్ దక్షిణ ప్రాంగణంలో (సౌత్ లాన్లో) తాత్కాలికంగా వేసిన టెంట్లలో నిర్వహించేవారు. దీనిపై ట్రంప్ అయిష్టంగా ఉన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త, సువిశాలమైన 90,000 చదరపు అడుగుల (సుమారు 8,300 చ.మీ.) బాల్రూమ్ 1000 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుందని, అవసరమైతే భవిష్యత్తులో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం వంటి కార్యక్రమాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించడం లేదని దీన్ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి సమకూర్చిన ఫండింగ్ ద్వారా పూర్తి చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.ఈస్ట్ వింగ్ కూల్చివేతఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించిన సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొత్త బాల్రూమ్ వైట్హౌస్కు సమీపంలో ఉంటుందని, ఏమీ కూల్చివేతలు ఉండవని తెలిపారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభమవగానే ఈస్ట్ వింగ్ ముఖభాగంలో కొంత భాగం కూల్చివేశారు. వైట్హౌస్ ఇచ్చిన వివరణ ప్రకారం కొత్త బాల్రూమ్ ప్రాజెక్ట్లో భాగంగా దేశ ప్రథమ మహిళ కార్యాలయం వంటి ఆఫీసులు ఉండే ఈస్ట్ వింగ్ను కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని తెలిసింది. ఈస్ట్ వింగ్ సంప్రదాయబద్ధంగా ప్రథమ మహిళ కార్యాలయాలకు, సందర్శకుల ప్రవేశానికి కేంద్రంగా ఉండేది. 1942లో ప్రపంచ యుద్ధం సమయంలో దీనికి రెండో అంతస్తు, బంకర్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు -
రాయదుర్గ్లో భూముల వేలం.. కాసుల వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని రాయదుర్గ్లో భూముల వేలం కాసుల వర్షం కురిపిస్తుండటంతో మరిన్ని భూముల వేలానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల మొదటి వారంలో రెండు ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలంలో ఎకరా ధర గరిష్టంగా రూ.177 కోట్లు పలికిన విషయం తెలిసిందే. సుమారు 19 ఎకరాలకు నిర్వహించిన ఈ వేలం ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.3,135 కోట్లు సమకూరాయి.ఈ నేపథ్యంలో రాయదుర్గ్లోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ లే ఔట్లో వచ్చే నెల 10న సుమారు ఎకరా భూమిని వేలం వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేసింది. వేలం ప్రక్రియ, ఇతర అంశాలపై ఔత్సాహిక కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 22న రాయదుర్గ్లోని టీ హబ్లో (t-hub) ప్రీబిడ్ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్, ఈఎండీ చెల్లించేందుకు నవంబర్ 4ను గడువుగా నిర్దేశించారు.ఎకరా రూ.200 కోట్లు? రాయదుర్గ్ (Raidurg) పాన్మక్తాలోని సర్వే నంబరు 83/1లోని 14ఏ/1, 14బీ/1 ప్లాట్లను టీజీఐఐసీ వేలం వేస్తోంది. ఈ రెండు ప్లాట్ల విస్తీర్ణం కలుపుకుని 4,718.22 చదరపు గజాలు (సుమారు ఎకరా విస్తీర్ణం) కాగా, ఒక్కో చదరపు గజం అప్సెట్ ధరను (వేలం ప్రారంభ ధర)ను రూ.3.10 లక్షలుగా, ఎకరా ధరను సుమారు రూ.146 కోట్లుగా నిర్ణయించింది. వేలం పాటలో ఎకరా ధర రూ.200 కోట్ల మార్క్ను అధిగమించే అవకాశముందని టీజీఐఐసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇటీవలి వేలంలో 17 మంది బిడ్డర్లు పోటీ పడిన నేపథ్యంలో తాజా వేలానికి కూడా భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రాయదుర్గ్లో టీజీఐఐసీ (TGIIC) అదీనంలో 470 ఎకరాలు ఉండగా, గడిచిన దశాబ్ద కాలంలో 200 ఎకరాలకుపైగా విక్రయించారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో మరో పది ఎకరాల మేర వేలానికి సిద్ధంగా ఉండగా, 50 ఎకరాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. దీంతో కోర్టు వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా టీజీఐఐసీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.చదవండి: హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొత్త ట్రెండ్ -
రూ.1కే సిమ్కార్డ్, అన్లిమిటెడ్ కాల్స్, ఇంకా మరెన్నో!
తిరుపతి ఎడ్యుకేషన్ : దీపావళి పండుగ సందర్భంగా వినియోగదారులకు ఈ నెల 18 నుంచి నవంబరు 18వ తేదీ వరకు వివిధ ఆఫర్లను బీఎస్ఎన్ఎల్ ప్రకటించినట్లు జీఎం సి.అమరేంద్రనాథ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు రూపాయికే సిమ్కార్డుతో పాటు 30రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ ఇంటర్నెట్, 100ఎస్ఎంఎస్లు ఉంటాయని తెలిపారు. ఏదేని కార్పొరేట్ కస్టమర్ కనిష్టంగా పది అంతకుమించి పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు తీసుకున్నా, ఒక ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ తీసుకున్నా వారికి మొదటి నెల రీచార్జ్పై 10శాతం డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 18నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్ ద్వారా మిత్రులకు, కుటుంబ సభ్యులకు రీచార్జ్ చేస్తే, రీచార్జ్ మొత్తంలో 2.5శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు. దీపావళి సందర్భంగా సీనియర్ సిటిజన్లకు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.1,812కే సిమ్కార్డుతో పాటు 365 రోజుల పాటు అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, ప్రతి రోజు 2జీబీ డేటా, 100ఎస్ఎంఎస్లు, 6నెలల పాటు బైటీవీ సబ్్రస్కిప్షన్ అందించనున్నట్లు తెలిపారు. వీటితో పాటు ఈ నెల 18నుంచి నవంబరు 18వ తేదీ వరకు రూ.485, రూ.1,999 ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసిన వారికి 5శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సది్వనియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
తెలుగోడి సత్తా.. భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం
టాప్ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్కు సారథ్యం వహిస్తున్న తెలుగు తేజం సత్య నాదెళ్ల (Satya Nadella ) తన ఘనతను చాటుకున్నారు. ఏఐ (Artificial Intelligence-AI)) నిపరుగులుపెట్టించిన మైక్రోసాఫ్ట్ సీఈవో (Microsoft CEO)గా ఆయన జీతం భారీగా పెరిగింది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సత్యనాదెళ్ల జీతం 22 శాతం ఎ గిసి 96.5 మిలియన్ల డాలర్లకు చేరుకుంది. భారత కరెన్సీ ప్రకారం.. రూ.847.31 కోట్లు. దశాబ్దం క్రితం ఈ పదవిని చేపట్టినప్పటి నుండి సత్యా నాదెళ్ల అందుకుంటున్నఅత్యధిక జీతం. ఏఐ)లో కంపెనీ సాధించిన పురోగతి ఈ పెరుగుదలకు కారణమని బోర్డు చెప్పిందని బ్లూమ్బెర్గ్ నివేదించింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సత్తా చాటడంతో ఆయన వేతనం భారీగా పెరిగిందని "ఈ తరాల సాంకేతిక మార్పుకు సత్య నాదెళ్ల చ అతని నాయకత్వ బృందం మైక్రోసాఫ్ట్ను స్పష్టమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడర్గా నిలబెట్టిందని బోర్డు పరిహార కమిటీ మంగళవారం విడుదల చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్లో ,వాటాదారులకు రాసిన నోట్లో పేర్కొంది. దీని ప్రకారం సత్య నాదెళ్ల బేసిక్ సాలరీ 2.5 మిలియన్ డాలర్లు. మిగిలిన కంపెనీ షేర్ల రూపంలో అందుకోనున్నారు. నాదెళ్ల జీతంలో దాదాపు 90 శాతం మైక్రోసాఫ్ట్ షేర్ల రూపంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్న సంగతి తెలిసిందే. (ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్)సత్యనాదెళ్ల ప్రస్థానం1967 ఆగస్టు 19న హైదరాబాద్లో జన్మించారు సత్య నాదెళ్ల. తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. తల్లి ప్రభావతి లెక్చరర్. హైదరాబాద్లో పాఠశాల విద్య అనంతరం, కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీఈ పట్టా పొందారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ నుంచి 1990లో ఎంఎస్ పూర్తి చేశారు.1992లో మైక్రోసాప్ట్లో ఉద్యోగంలో చేరిన అంచెలంచెలుగా ఎదిగి వివిధ హోదాల్లో సత్తాచాటుకున్నారు. 2014లో నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఏఐ రేపుతున్న సంచలనం ఆయనకు వరంగా మారింది.ఇదీ చదవండి: 35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ -
‘నో’ చెప్పడం ఎలాగో!?
జీవితం ఒకేసారి నాలుగు బంగారు అవకాశాలను ఇచ్చి అందులో కొన్నింటినే ఎంచుకోవాలనే పరిస్థితి తలెత్తితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించండి. సరిగ్గా ఇలాంటి విచిత్రమైన పరిస్థితే 20 ఏళ్ల టెక్కీకి ఎదురైంది. ఉద్యోగ వేటలో ఉన్న తనకు ముందుగా రెండు ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. ఆ రెండూ ఎంఎన్సీ సంస్థలు కావడంతో వాటికి అంగీకారం తెలిపి సంతకాలు చేశాడు. ఉన్నట్టుండి మరో రెండు కంపెనీల ఆఫర్లు వచ్చాయి. ఈసారి ఆఫర్ చేసినవి మునుపటి కంపెనీల కంటే టాప్ సంస్థలు. దాంతో ఇప్పటికే సంతకం చేసిన కంపెనీలకు ‘నో’ చెప్పడం ఎలాగో తెలియక తన పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అదికాస్తా వైరల్గా మారింది.ఈ టెక్కీ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. తన పరిస్థితి గమనించిన నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఆచరణాత్మకంగా ఆలోచించమని చెబుతున్నారు. ‘ఉద్యోగుల తొలగింపుల సమయంలో కంపెనీలు పెద్దగా పట్టించుకోవు. కాబట్టి మీరు కంపెనీ ఆఫర్ను తిరస్కరించడం పెద్ద విషయం కాదు’ అని ఒకరు సూచించారు. మర్యాదపూర్వకంగా ఒక ఈమెయిల్ పంపాలని కొందరు సలహా ఇచ్చారు. చివరి నిమిషంలో కంపెనీలు ఆఫర్ లెటర్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నందున ఆ యువకుడు చేరాలనుకుంటున్న సంస్థ గురించి కచ్చితంగా తెలిసే వరకు ఏ నిర్ణయం తీసుకోరాదని కొందరు తెలిపారు.ఇదీ చదవండి: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు -
అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు
అమెరికాలోని విదేశీ విద్యార్థులకు హెచ్ -1బీ (H-1B) వీసా ఫీజు కింద వసూలు చేసే 1,00,000 డాలర్లను మినహాయిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో టెక్ కంపెనీలకు ఉపశమనం కలిగినట్లయింది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ప్రతిభావంతులను నియమించుకునే సంస్థలకు ఇది మంచి పరిణామం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం F1 వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు (భారతీయ విద్యార్థులతో సహా) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారిని నియమించుకునే కంపెనీలు 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇది యూఎస్ కార్పొరేట్ కంపెనీలు, స్టార్టప్లకు అక్కడే చదువుతున్న విదేశీ విద్యార్థులను నియామకం చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. అమెరికన్ కంపెనీలు తక్కువ ఖర్చుతో ఈ ప్రతిభను నియమించుకోవడానికి అవకాశం ఏర్పడటంతో ఇది వారికి పెద్ద విజయం అని కొందరు భావిస్తున్నారు.భారతీయ ఐటీ సంస్థలపై ప్రభావంభారతీయ ఐటీ సేవల సంస్థలకు ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయలున్నాయి. సాంప్రదాయకంగా ఈ సంస్థలు భారతదేశం నుంచి ఉద్యోగులను H-1B వీసాలపై బదిలీ చేస్తుంటాయి. వీరి వీసా ఫీజు లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే భాతర ఐటీ కంపెనీలు తాము H-1B వీసాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించామని చెబుతున్నాయి. స్థానికులనే ఎక్కువగా నియమించుకుంటున్నట్లు తెలిజేస్తున్నాయి.విప్రో వంటి సంస్థల్లో యూఎస్ ఉద్యోగుల్లో దాదాపు 80% మంది స్థానిక ఉద్యోగులేనని సమాచారం. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ సైతం కొద్దిమంది ఉద్యోగులను మాత్రమే ఇమ్మిగ్రేషన్ సేవలకోసం ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. మిగిలినవారు ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్నారని తెలిపారు. టీసీఎస్ కూడా ప్రతి సంవత్సరం వేలాది వీసాల కోసం దాఖలు చేసినా కేవలం 500 మంది మాత్రమే H-1B వీసాపై యుఎస్కు వెళ్తున్నట్లు గతంలో తెలిపింది.ఇదీ చదవండి: ఒక్కరోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తున్నారా? -
రోజుకు రెండు లక్షలు దాటితే..?
డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ బ్యాంకింగ్కు ప్రాధాన్యత ఇస్తున్న ఈ కాలంలో ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీల (Cash Transactions) విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనల ప్రకారం ఒక రోజులో ఎంతమేరకు నగదు లావాదేవీలు జరపాలో చట్టపరమైన పరిమితి గురించి అవగాహన ఉండకపోవచ్చు. వ్యక్తిగత అవసరాల కోసం లేదా వ్యాపార ప్రయోజనాల కోసం నగదును స్వీకరిస్తే ఎలాంటి నియమాలున్నాయో తెలుసుకుందాం. నిర్దిష్ట పరిమితికి మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే భారీ జరిమానాలు, చివరికి ఆదాయపు పన్ను నోటీసు కూడా రావచ్చని గుర్తుంచుకోవాలి.సెక్షన్ 269ఎస్టీఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్టీ ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒకే రోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదును స్వీకరించడానికి అనుమతుల్లేవు. ఈ పరిమితులు సదరు నగదు లావాదేవీ వ్యక్తిగతమా లేక వ్యాపారమా అనే దానిపై ఆధారపడవు. అంటే అందరికీ వర్తిస్తుంది.ఉదాహరణకు: ఒక వ్యక్తి తన కారును అమ్మి కొనుగోలుదారు నుంచి రూ.2.5 లక్షల నగదు అందుకుంటే అది ఆదాయపు పన్ను చట్టానికి విరుద్ధం అవుతుంది. రూ.2 లక్షలకు మించి నగదును స్వీకరిస్తే ఆదాయపు పన్ను శాఖ మీరు తీసుకున్న మొత్తం నగదుకు సమానమైన జరిమానా విధించవచ్చు. ఉదా.. మీరు ఆస్తి లేదా వ్యాపార లావాదేవీల కోసం రూ.5 లక్షల నగదును స్వీకరిస్తే జరిమానా మొత్తం రూ.5 లక్షల వరకు ఉండవచ్చు. ఈ జరిమానాను సెక్షన్ 271డీఏ కింద విధిస్తారు. నగదును స్వీకరించిన వ్యక్తి మాత్రమే దీనికి జవాబుదారీగా ఉంటారు.ఆర్థిక వ్యవస్థలో నల్లధనం (Black Money), పన్ను ఎగవేతలను అరికట్టడానికి ఉద్దేశించిన ప్రధాన చర్యల్లో భాగంగానే ఈ రూ.2 లక్షల నగదు లావాదేవీల పరిమితిని విధించారు. బ్యాంకు బదిలీలు, చెక్కులు లేదా ఇతర డిజిటల్ మార్గాల ద్వారా నిర్వహించే అన్ని పెద్ద లావాదేవీలు పారదర్శకంగా ఉండేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని స్వీకరించాలంటే బ్యాంకు (NEFT, RTGS, IMPS), చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్, యూపీఐ లేదా ఇతర డిజిటల్ వాలెట్ల ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు.ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణ వ్యవస్థఆదాయపు పన్ను శాఖ అసాధారణమైన లేదా అధిక విలువ గల నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను పర్యవేక్షించడానికి ఏఐ ఆధారిత డేటా విశ్లేషణను ఉపయోగిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో రూ.10 లక్షలు లేదా కరెంట్ ఖాతాలో రూ.50 లక్షలకు మించిన నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలు చేస్తే ఆదాయపు పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేయవచ్చు.ఇదీ చదవండి: గోల్డ్ ఢమాల్.. భారీగా తగ్గిన బంగారం ధరలు -
గోల్డ్ ఢమాల్: భారీగా తగ్గిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.కారణాలివేనా..? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన యూఎస్, చైనా మధ్య నెలకొన్న టారిఫ్ వార్ విషయంలో సానుకూల చర్చలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ విలువ పుంజుకోవడం, యూఎస్ ప్రభుత్వ షట్డౌన్ వంటి అంశాలు పసిడి, వెండి తదితర విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం చైనా, యూఎస్ ప్రెసిడెంట్ల మధ్య సమావేశం జరగనుండటం సానుకూల అంశంగా తెలియజేశాయి.మరోవైపు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించడం మెటల్స్లో భారీ ర్యాలీకి కారణమైంది. టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్కు చేరడంతోపాటు.. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణలో భాగంగా అమ్మకాలు చేపట్టడం విలువైన లోహాలలో కరెక్షన్కు దారితీస్తున్నట్లు నిపుణులు వివరించారు. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
భారత్ పథకాలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు
ఎలక్ట్రిక్ వాహనాలు (EV), అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్, ఆటోమొబైల్స్ విభాగంలో భారత్ కంపెనీలకు అందిస్తున్న ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాలకు వ్యతిరేకంగా చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఉన్న ఈ పథకాలను డబ్ల్యూటీఓ వేదికపై సమర్థించుకోవాల్సిన అవసరం భారత్కు ఏర్పడింది.చైనా ఆరోపణలుచైనా తన ఫిర్యాదులో భారతదేశం ఈవీ ప్రోత్సాహకాలు, పీఎల్ఐ పథకాలు చైనీస్ కోర్ వస్తువులపై వివక్ష పూరితంగా ఉన్నట్లు ఆరోపించింది. ఈ పథకాల కింద దేశీయ విలువ జోడింపునకు సంబంధించిన అంశాలు WTO కీలక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని చైనా పేర్కొంది. అందులో సబ్సిడీలు, కౌంటర్వైలింగ్ చర్యలపై ఒప్పందం (SCM అగ్రిమెంట్-రాయితీలకు వ్యతిరేకం), సుంకాలు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (GATT 1994), వాణిజ్య సంబంధిత పెట్టుబడి చర్యల ఒప్పందం (TRIM)ను భారత్ బేఖాతరు చేసినట్లు చైనా తెలిపింది.భారతదేశం వైఖరిఈ పథకాలను అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’కు అనుగుణంగా ఈ పథకాలు ఉన్నాయని భారత్ చెబుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయ ప్రోత్సాహకాలు డబ్ల్యూటీఓ చట్టంలో ‘గ్రే ఏరియా’(పారిశ్రామిక రాయితీలు, టెక్నాలజీ ప్రమోషన్ పథకాలు, పర్యావరణ, అభివృద్ధి లక్ష్యాలను పేర్కొంటూ చట్టంలో స్పష్టంగా నిషేధించబడని విధాన చర్యలను సూచిస్తుంది)లో ఉన్నాయి. అందువల్ల పారిశ్రామిక అభివృద్ధి కోసం విధానాలు రూపొందించే హక్కు భారత్కు ఉంది.డబ్ల్యూటీఓ వివాద ప్రక్రియడబ్ల్యూటీఓ వివాద పరిష్కార విధానంలో భాగంగా సమస్యను పరిష్కరించేందుకు భారత్, చైనాలు ముందుగా ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంటుంది. సంప్రదింపులు విఫలమైతే చైనా తీర్పు ఇవ్వడానికి విధాన ప్యానెల్ను అభ్యర్థించవచ్చు. భారతదేశానికి ప్రతికూల తీర్పు వస్తే అప్పీల్ చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం -
ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం
చైనా ప్రత్యేక ఎరువుల ఎగుమతులను మళ్లీ నిలిపివేయడం ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగం ఈ నిర్ణయంతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. చైనా చర్యల వల్ల భారత్లో ఎరువుల లభ్యత, ధరలపై ప్రభావం పడునుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.చైనా ఎగుమతి నిలిపివేతఅక్టోబర్ 15, 2025 నుంచి టెక్నికల్ మోనోఅమ్మోనియం ఫాస్ఫేట్ (TAMP), యాడ్ బ్లూ (యూరియా సొల్యూషన్), డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP), సాంప్రదాయ యూరియా వంటి ప్రత్యేక ఎరువుల ఎగుమతులను చైనా నిలిపివేసింది. ఈ సస్పెన్షన్ సుమారు 5-6 నెలల పాటు ఉంటుంది. అంటే ఈ నిలిపివేత మార్చి 2026 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ చర్య వల్ల అంతర్జాతీయ ఎరువుల మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని అనుసరించి సరఫరా గొలుసులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంపై దీని ప్రభావంభారతదేశం ఈ ప్రత్యేక ఎరువుల్లో దాదాపు 95% చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇది ఏటా సుమారు 2.5 లక్షల టన్నులు, అంటే 60-65% రబీ సీజన్లో ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఎరువుల దిగుమతులపై ఆధారపడుతుండడం వల్ల చైనా ఏకపక్ష నిర్ణయాలు భారతదేశ వ్యవసాయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.చైనా నిర్ణయం వల్ల కఠినమైన ప్రపంచ సరఫరా, అనిశ్చితి ఫలితంగా ఎరువుల ధరలు 10-15% వరకు పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదలతో అంతిమంగా రైతులపై భారం పడనుంది. దాంతో పంట ఉత్పత్తి వ్యయం పెరుగనుంది. కొందరు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుత రబీ సీజన్ (అక్టోబర్-మార్చి) కోసం భారతీయ వ్యాపారుల వద్ద ఇప్పటికీ నిల్వలున్నాయి. కాబట్టి తక్షణ ఎరువుల కొరత లేనప్పటికీ భవిష్యత్తులో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.గతంలో ఇలా..చైనా గతంలో కూడా 2023 మధ్యలో, మే-జూన్ 2025లో (భారతదేశ ఖరీఫ్ సీజన్ను ప్రభావితం చేస్తూ) ఎగుమతులను నిలిపివేసింది. ఆగస్టు 2025లో దౌత్య చర్చల తర్వాత తాత్కాలికంగా వీటిపై నిషేధం ఎత్తివేశారు. తిరిగి అక్టోబర్ 15 నుంచి మళ్లీ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సస్పెన్షన్ మార్చి 2026 తర్వాత కూడా కొనసాగితే భారతదేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడం, స్థిరమైన ప్రత్యామ్నాయ సరఫరాదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడం, ఎరువుల వినియోగంలో సామర్థ్యాన్ని పెంచే విధానాలను అమలు చేయడం వంటి చర్యలు అత్యవసరం.ఇదీ చదవండి: పాకిస్థాన్లో కేజీ టమాటా రూ.700 -
నెమ్మదించిన మౌలికం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి, నెలలవారీగా చూస్తే, ఈ ఏడాది సెప్టెంబర్లో నెమ్మదించింది. 3 శాతానికి పరిమితమైంది. ఆగస్టులో ఇది 6.5 శాతంగా ఉండగా, గతేడాది సెప్టెంబర్లో 2.4 శాతంగా నమోదైంది. బొగ్గు, క్రూడాయిల్, రిఫైనరీ ఉత్పత్తులు .. సహజ వాయువు ఉత్పత్తి తగ్గడంతో 3 నెలల కాలవ్యవధిలో సెప్టెంబర్లోనే అత్యల్పంగా మౌలిక వృద్ధి నమోదైంది.సమీక్షాకాలంలో ఎరువులు, సిమెంటు ఉత్పత్తి వృద్ధి రేటు వరుసగా 1.9 శాతం నుంచి 1.6 శాతానికి, 7.6 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది. అయితే, ఉక్కు, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– సెప్టెంబర్ మధ్యకాలంలో 8 మౌలిక రంగాల వృద్ధి గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 4.3% నుంచి 2.9 శాతానికి నెమ్మదించింది. -
‘మూరత్’లో స్వల్ప లాభాలు
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా మంగళవారం గంటపాటు జరిగిన మూరత్ ట్రేడింగ్లో స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. కొత్త హిందూ క్యాలెండర్ సంవత్సరం ‘విక్రమ్ సంవత్ 2082’ తొలిరోజున సెన్సెక్స్ 63 పాయింట్లు పెరిగి 84,426 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 25,869 వద్ద నిలిచింది. ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం 1:45 గంటలకు మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు ఉత్సాహంగా కదలాయి.ఒక దశలో సెన్సెక్స్ 302 పాయింట్లు ఎగసి 84,665 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు బలపడి 25,934 గరిష్టాన్ని నమోదు చేశాయి. చివర్లో బ్యాంకులు, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సూచీలు మధ్యాహ్నం 2:45 గంటకు స్వల్పలాభాలతో ట్రేడింగ్ను ముగించాయి.⇒ దీపావళి బలిప్రతిపద సందర్భంగా బుధవారం(నేడు) మార్కెట్కు సెలవు. ఎంసీఎక్స్, ఫారెక్స్ మార్కెట్లు సాయంత్రం సెషన్లో పనిచేస్తాయి. -
బంగారం, వెండి క్రాష్..!
సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్ది నెలలుగా అప్రతిహతంగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఉన్నట్టుండి కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో గత 12 ఏళ్లలోలేని విధంగా పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 6.3 శాతం పతనంకాగా.. వెండి మరింత అధికంగా 2021 తదుపరి 8.7 శాతం పడిపోయింది. వెరసి యూఎస్ కామెక్స్లో ఔన్స్ పసిడి ధర 4,082 డాలర్లకు చేరగా.. వెండి ఔన్స్ 47.89 డాలర్లను తాకింది. దీంతో దేశీయంగా బంగారం 10 గ్రాములు కనీసం రూ. 6,000 తగ్గవలసి ఉన్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.దేశీయంగా ఇటీవల బంగారం 10 గ్రాములు రూ. 1,34,800ను తాకగా.. వెండి రూ. 1,85,000కు చేరిన విషయం విదితమే. అయితే డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, దిగుమతి సుంకం మదింపు తదుపరి ధరలు నిర్ణయమయ్యే సంగతి తెలిసిందే. ఈ బాటలో పలాడియం, ప్లాటినం ధరలు సైతం అంతర్జాతీయ మార్కెట్లో 7 శాతం చొప్పున పతనం కావడం గమనార్హం! కాగా.. 2025 డిసెంబర్ ఫ్యూచర్స్ పసిడి రాత్రి 10.30 ప్రాంతంలో 5.5 శాతం (237 డాలర్లు) క్షీణించి 4,122 డాలర్ల వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా 4,393 డాలర్లకు చేరగా.. 4,095 డాలర్ల వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 7.36 శాతం పడిపోయి 47.60 డాలర్ల వద్ద కదులుతోంది. ఒక దశలో 51.61 డాలర్ల వద్ద గరిష్టాన్ని, 47.14 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. కారణాలేటంటే? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన యూఎస్, చైనా మధ్య నెలకొన్న టారిఫ్ వార్ విషయంలో సానుకూల చర్చలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ విలువ పుంజుకోవడం, యూఎస్ ప్రభుత్వ షట్డౌన్ వంటి అంశాలు పసిడి, వెండి తదితర విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం చైనా, యూఎస్ ప్రెసిడెంట్ల మధ్య సమావేశం జరగనుండటం సానుకూల అంశంగా తెలియజేశాయి.మరోవైపు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ఈటీఎఫ్లకు ఇన్వెస్టర్ల నుంచి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించడం మెటల్స్లో భారీ ర్యాలీకి కారణమైంది. టెక్నికల్గా ఓవర్బాట్ పొజిషన్కు చేరడంతోపాటు.. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణలో భాగంగా అమ్మకాలు చేపట్టడం విలువైన లోహాలలో కరెక్షన్కు దారితీస్తున్నట్లు వివరించారు. -
పండుగ సేల్స్ @ 6 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు, కొనుగోలుదారుల సానుకూల సెంటిమెంటు దన్నుతో దీపావళి పండుగ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. విక్రయాలు రూ. 6.05 లక్షల కోట్ల రికార్డు స్థాయిని తాకాయని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ వెల్లడించింది. ఇందులో రూ. 5.40 లక్షల కోట్ల విలువ చేసే వస్తువులు, రూ. 65,000 కోట్ల విలువ చేసే సర్వీసులు ఉన్నట్లు తెలిపింది. గతేడాది దీపావళి విక్రయాలు రూ. 4.25 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.వివిధ రాష్ట్రాల రాజధానులతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 60 కీలక పంపిణీ కేంద్రాలవ్యాప్తంగా సీఏఐటీ రీసెర్చ్ వింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్యాకేజింగ్, ఆతిథ్యం, క్యాబ్ సరీ్వసులు, ట్రావెల్, ఈవెంట్ మేనేజ్మెంట్, డెలివరీ విభాగాల్లో రూ. 65,000 కోట్ల మేర విక్రయాలు నమోదైనట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బి.సి. భార్తియా తెలిపారు. శీతాకాలం, వివాహాల సీజన్తో పాటు జనవరి మధ్య నుంచి మొదలయ్యే పండుగల సీజన్లోను ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎఫ్ఎంసీజీ, ఆభరణాలకు డిమాండ్.. 2025 దీపావళి సందర్భంగా లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ తదితర విభాగాల్లో 50 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాల కల్పన జరిగింది. మొత్తం వ్యాపారంలో గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల వాటా సుమారు 28 శాతంగా నమోదైంది. సీఏఐటీ నివేదిక ప్రకారం.. మొత్తం అమ్మకాల్లో వాటాలపరంగా చూస్తే నిత్యావసరాలు..ఎఫ్ఎంసీజీ వాటా 12 శాతంగా, బంగారం.. ఆభరణాలు 10 శాతంగా, ఎల్రక్టానిక్స్..ఎలక్ట్రికల్స్ 8 శాతంగా, కన్జూమర్ డ్యూరబుల్స్.. రెడీమేడ్ దుస్తులు..గిఫ్ట్ ఐటమ్లు మొదలైన వాటి వాటా తలో 7 శాతంగా నమోదైంది. మరోవైపు, గతేడాదితో పోలిస్తే మొబైల్స్, ఎల్రక్టానిక్స్, భారీ ఉపకరణాలు, ఫ్యాషన్ విక్రయాలు భారీగా పెరిగినట్లు ఫ్లిప్కార్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రతీక్ శెట్టి తెలిపారు. జెనరేషన్ జెడ్ (1997–2012 మధ్య జన్మించినవారు) నుంచి డిమాండ్ గణనీయంగా నెలకొన్నట్లు వివరించారు. మార్కెట్ప్లేస్ మెరుపులు: యూనికామర్స్ ఈసారి దీపావళి పండుగ సీజన్లో ఈ–కామర్స్కి సంబంధించి ఆర్డర్ల పరిమాణం వార్షికంగా 24 శాతం, స్థూల కొనుగోళ్ల విలువ (జీఎంవీ) 23 శాతం మేర పెరిగినట్లు యూనికామర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక క్విక్ కామర్స్ యాప్ల ద్వారా ఆర్డర్ల పరిమాణం 120 శాతం ఎగియగా, బ్రాండ్ వెబ్సైట్లలో ఆర్డర్లు 33 శాతం పెరిగాయి. మొత్తం కొనుగోళ్లలో 38 శాతం వాటా, 8 శాతం ఆర్డర్ల పరిమాణం వృద్ధితో మార్కెట్ప్లేస్ల (అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటివి) ఆధిపత్యం కొనసాగింది. 2024, 2025 సంవత్సరాల్లో 25 రోజుల పండుగ సీజన్ వ్యవధిలో తమ ఫ్లాగ్షిప్ ప్లాట్ఫాం యూనివేర్ ద్వారా జరిగిన 15 కోట్లకు పైగా లావాదేవీల ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించినట్లు యూనికామర్స్ తెలిపింది. మరిన్ని విశేషాలు... ⇒ ఎఫ్ఎంసీజీ (డ్రైఫ్రూట్ కాంబో ప్యాక్లు మొదలైన ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులు), గృహాలంకరణ..ఫరి్నచర్, సౌందర్య సంరక్షణ..ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యం.. ఫార్మా (సప్లిమెంట్లు మొదలైనవి) అత్యధికంగా అమ్మకాలు నమోదైన కేటగిరీల్లో నిల్చాయి. ⇒ చిన్న పట్టణాల్లో కూడా డిజిటల్ వినియోగం, కొనుగోలు శక్తి పెరుగు తోందనడానికి నిదర్శనంగా మొత్తం ఆర్డర్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 55 శాతంగా నమోదైంది. ప్రాంతీయంగా ద్వితీయ శ్రేణి నగరాల నుంచి ఆర్డర్లు 28 శాతం, పెద్ద నగరాల్లో 24 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 23 శాతం మేర పెరిగాయి. ⇒ డిజిటల్ లావాదేవీలపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తూ ప్రీపెయిడ్ ఆర్డర్లు 26 శాతం పెరగ్గా, క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ఆర్డర్ల పరిమాణం 22 శాతం.. విలువ 35 శాతం మేర పెరిగాయి. ⇒ యూనికామర్స్ లాజిస్టిక్స్ ప్లాట్ఫాం షిప్వే డేటా ప్రకారం ఈ ఏడాది డెలివరీలు చాలా వేగవంతమయ్యాయి. గతేడాది పండగ సీజన్తో పోలిస్తే ఈ ఏడాది 15 శాతం తక్కువ వ్యవధిలోనే డెలివరీ చేశారు.30 రోజుల్లో లక్ష కార్లు..ఈసారి పండుగ సీజన్లో దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కొత్త రికార్డు సాధించింది. నవరాత్రుల నుంచి దీపావళి వరకు 30 రోజుల వ్యవధిలో 1 లక్ష వాహనాలను డెలివరీ చేసినట్లు కంపెనీ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 33 శాతం వృద్ధి చెందినట్లు వివరించారు. ఎస్యూవీలు అత్యధికంగా అమ్ముడైనట్లు చెప్పారు. నెక్సాన్ వాహన విక్రయాలు 73 శాతం పెరిగి 38,000 యూనిట్లుగా, పంచ్ అమ్మకాలు 29 శాతం వృద్ధితో 32,000 యూనిట్లుగా నమోదైనట్లు శైలేష్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పోర్ట్ఫోలియో కూడా పటిష్టంగా 37 శాతం వృద్ధి చెందింది. 10,000 ఈవీలు అమ్ముడయ్యాయి. -
చేతిలో ఐఫోన్.. కారు.. అన్నీ అప్పుతో కొంటున్నవే..!
భారతీయ కుటుంబాలు మునుపెన్నడూ లేని విధంగా అప్పుల్లో కూరుకుపోతున్నాయి. పండుగ వేళ విపరీతమైన షాపింగ్, అప్పులు సులభంగా లభ్యమవుతున్న నేపథ్యంలో పర్సనల్ ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సర్ నేహా నగర్ అప్పులపై ఆధారపడే ధోరణి పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో 70 శాతం ఐఫోన్లు (iPhones) రుణాల ద్వారా, 80 శాతం కార్లు ఈఎంఐల ద్వారా కొంటున్ననవేనని పేర్కొన్నారు.వినియోగదారు రుణంలో ఈ పెరుగుదల భారతదేశ ఆర్థిక ప్రవర్తనలో లోతైన మార్పును ప్రతిబింబిస్తుంది. ఆదాయాల కంటే ఆకాంక్షలు వేగంగా పెరుగుతుండటంతో చాలా మంది ఆస్తులను నిర్మించడానికి బదులుగా జీవనశైలికి నిధులు సమకూర్చుకోవడానికి రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలాంటి అప్పులు చేటు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు."ధనవంతులు ఆస్తులను నిర్మించుకోడానికి పరపతిగా రుణాలను ఉపయోగిస్తుంటే పేద, మధ్యతరగతివారు మాత్రం విలాసాలను కొనుక్కోవడానికి వాటిని ఉపయోగిస్తారు" అని ఫైనాన్స్ రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తకంలో ప్రముఖంగా చెప్పారు. ఆ వ్యత్యాసమే చాలా మంది మధ్య ఆదాయ వర్గాలు రాబడిని ఇచ్చే పెట్టుబడులకు బదులుగా గాడ్జెట్లు, వాహనాల వంటి క్షీణించే ఆస్తుల కోసం ఈఎంఐ (EMI) చక్రాలలో ఎలా చిక్కుకుపోతున్నారో వివరిస్తుంది. -
వాట్సాప్లో రాబోతున్న కొత్త ఫీచర్.. మెసేజ్లకు లిమిట్!
అవాంఛనీయ సందేశాలను తగ్గించడానికి మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. పరిచయం లేని వ్యక్తులకు పంపే మెసేజ్లపై పరిమితి విధింపును పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా కొత్తవారికి ఒకసారి మెసేజ్ పంపితే దానికి అటు నుంచి రిప్లై రాకపోతే అలాంటి ప్రతి అవుట్ గోయింగ్ సందేశాన్నీ లెక్కిస్తారు. ఇవి నెలలో ఒక పరిమితి చేరుకున్నాక ఇక ఆ నెలలో కొత్తవారికి మెసేజ్ పంపేందుకు వీలుండదు.అయితే ఈ పరిమితి ఎంత ఉంటుంది అన్నంది వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. మార్కెట్లలో వేర్వేరు పరిమితులను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఒక నెలలో రిప్లై రాని కొత్త మెసేజ్లు పరిమితికి చేరువకాగానే యూజర్లను అప్రమత్తం చేసేందుకు బ్యానర్ లేదా పాప్-అప్ రూపంలో హెచ్చరిక కనిపిస్తుంది.పెద్ద వాల్యూమ్ బ్రాడ్ కాస్టర్లు, బిజినెస్ ఖాతాల నుంచే మెసేజ్లు సాధారణ యూజర్ల ఇన్ బాక్స్ లను మంచెత్తకుండా నిరోధించడం దీని ఉద్దేశం. తెలిసినవారికి అంటే కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారికి మెసేజ్లు పంపే సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని వాట్సాప్ వర్గాలు తెలిపినట్లు ‘టెక్ క్రంచ్’ పేర్కొంది. -
దీపావళి తర్వాత బంగారం తగ్గుతుందా? అంతర్జాతీయ బ్యాంకు అంచనా
బంగారం ధరలు ఆగకుండా దూసుకెళ్తున్నాయి. రోజుకో కొత్త రేటుకు చేరుతున్నాయి. ధనత్రయోదశి, దీపావళి (Diwali) రోజుల్లో కాస్త తగ్గినట్లే అనిపించినా మళ్లీ ఎగిశాయి. ఈ క్రమంలో దీపావళి తర్వాత బంగారం ధరలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా అని చాలామంది కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. కానీ అలాంటి అవకాశం ఇప్పట్లో లేదని తెలుస్తోంది.హెచ్ఎస్బీసీ అంచనాఅంతర్జాతయ బ్యాంకు అయిన హెచ్ఎస్బీసీ (HSBC) తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. బంగారం ధరలు (Gold Price) ఇప్పట్లో మందగించే అవకాశం లేదని సూచించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఇప్పటికే ఔన్స్ కు 4,300 డాలర్లు దాటింది. అక్టోబర్ 18న ఇది ఔన్స్ కు 4,362 ట్రేడ్ అవుతోంది. ఇది స్థిరమైన బుల్లిష్ సెంటిమెంట్ను సూచిస్తుంది.పండుగ రద్దీ తర్వాత కూడా బంగారం తన వేగాన్ని కొనసాగిస్తుందని హెచ్ఎస్బీసీ భావిస్తోంది. 2026 ప్రథమార్థం నాటికి బంగారం ఔన్స్ కు 5,000 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తోంది.అంతకుముందు, హెచ్ఎస్బీసీ 2025లో ఔన్స్ కు సగటు బంగారం ధర 3,355 డాలర్లుగా అంచనా వేసింది. దాన్ని ఇప్పుడు 3,455 డాలర్లకు సవరించింది. 2026 కోసం అంచనా ఔన్సుకు 3,950 డాలర్ల నుండి 4,600 డాలర్లకు పెంచేసింది. రాయిటర్స్ కూడా ఇవే అంచనాలను ఉదహరించింది.బంగారం ధరల పెరుగుదలకు కారణాలుబంగారం ధరల పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని, గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లో పెట్టుబడులు పెరుగుతున్నాయని, అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బలపడుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రపంచ వాణిజ్య వివాదాలతో ముడిపడి ఉన్న అనిశ్చితులకు లోనుకాని, సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా బంగారం కొనుగోలుదారును ఆకర్షిస్తూనే ఉంది.ఇటీవల స్పాట్ గోల్డ్ వారం రోజుల్లోనే అమాంతం ఎగిసింది. ఇది ఔన్స్ కు 4,300 డాలర్లకు పెరిగింది. 2008 డిసెంబర్ నుండి ఇది వేగవంతమైన వారపు లాభాలలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో 2026 ప్రారంభం వరకు పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్ఎస్బీసీ నమ్ముతోంది. అయితే ఆ సంవత్సరం చివర్లో మాత్రం కొంత కరెక్షన్ జరగొచ్చని భావిస్తోంది.ఇతర బ్యాంకులదీ అదే అంచనాబంగారం ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని, మరింత పెరుగుతాయని ఒక్క హెచ్ఎస్బీసీ మాత్రమే కాదు.. కొన్ని ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ భావిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, సొసైటీ జనరల్ కూడా రాబోయే సంవత్సరానికి బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లను చేరుతుందని అంచనా వేశాయి. 2026 జూన్ నాటికి బంగారం ధర 4,600 డాలర్లకు చేరుకుని, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని ఏఎన్జెడ్ బ్యాంక్ అంచనా వేసింది.ఇదీ చదవండి: వారెన్ బఫెట్ చెప్పిన సక్సెస్ సీక్రెట్.. -
దీపావళి బోనస్ ఇవ్వలేదని భారీ నష్టం తెచ్చారు!
దీపావళి బోనస్ (Diwali Bonus) ఇవ్వకపోవడంపై నిరసనగా ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కేంద్ర ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయ నష్టాన్ని కలిగించింది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేలోని ఫతేహాబాద్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం గంటలపాటు గేట్లు తెరిచి ఉంచడంతో వేలాది వాహనాలు టోల్ చెల్లించకుండా టోల్ గేట్ దాటి వెళ్లిపోయాయి.దేశమంతా ఘనంగా జరుపుకొనే అతిపెద్ద పండుగ దీపావళి. ఈ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేట్ కంపెనీల నుంచి చిన్నాచితకా సంస్థల వరకు తమ ఉద్యోగులకు ఎంతో కొంత మొత్తాన్ని దీపావళి బోనస్ల కింద ఇస్తుంటాయి. శ్రీసాయి, దాతార్ టోల్ ఆపరేటింగ్ సంస్థలకు చెందిన ఉద్యోగులు కూడా తమకు దీపావళి బోనస్ లభిస్తుందని ఆశించారు.గత వారం దీపావళి సందర్భంగా తమ బోనస్ లు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని కంపెనీ హామీ ఇచ్చిందని, కానీ బోనస్లు జమ కాలేదని ఆందోళనకారులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు ఆదివారం రాత్రి టోల్ బూత్ బూమ్ బారియర్ ను తెరిచి సమ్మెలో కూర్చున్నారు. 10 గంటల పాటు కొనసాగిన ధర్నా అధికారులు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన తరువాత విరమించారు.“నేను ఏడాదిగా కంపెనీలో పనిచేస్తున్నాను. మాకు ఎటువంటి బోనస్ ఇవ్వలేదు. జీతాలు కూడా ఆలస్యంగా వస్తున్నాయి” అని ఒక ఉద్యోగి మీడియాకు తెలిపారు. బోనస్ ఇవ్వకపోగా కొత్త ఉద్యోగులను పెట్టుకుంటామని సంస్థ ప్రతినిధులు బెదిరించడం ఉద్యోగులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి.ఫతేహాబాద్ టోల్ ప్లాజా ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ప్రవేశ మార్గంగా ఉంటోది. ఢిల్లీ-ఎన్సీఆర్ను యమునా ఎక్స్ప్రెస్వే ద్వారా లక్నోకు అనుసంధానించే ఈ మార్గం దేశానికి కీలకమైన వ్యూహాత్మక రహదారిగా గుర్తింపు పొందింది.ఇదీ చదవండి: జియో దీపావళి ఆఫర్.. ప్లాన్లపై ‘అన్లిమిటెడ్’ ప్రయోజనాలు -
ముహూరత్ ట్రేడింగ్: ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
దీపావళి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్ ఫ్లాట్గా ముగిసింది. భారత స్టాక్ మార్కెట్లు ‘సంవత్ 2082’ను జాగ్రత్తగా ప్రారంభించాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు స్వల్ప సానుకూలం వైపు స్థిరపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 62.97 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 84,426.34 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 25.45 పాయింట్లు లేదా 0.1 శాతం పెరిగి 25,868.60 స్థాయిల వద్ద స్థిరపడింది.విస్తృత మార్కెట్లలో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.11 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.52 శాతం పెరిగాయి. సెక్టోరల్ ఫ్రంట్ లో నిఫ్టీ బ్యాంక్, పిఎస్యూ బ్యాంక్, రియల్టీ ప్రతికూలంగా స్థిరపడ్డాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్వల్ప లాభాలతో ముగిశాయి.సెన్సెక్స్ లో బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్.ట్రేడింగ్ సెషన్ లో 2,213 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. 710 తగ్గుముఖం పట్టాయి. ఎన్ఎస్ఈలో 116 షేర్లలో మార్పులేదు. 106 స్టాక్స్ కొత్త 52 వారాల గరిష్టాన్ని తాకగా, 36 షేర్లు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి.దీపావళి రోజున సాధారణ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు సెలవు ఉంటుంది. కేవలం గంటపాటు ముహూరత్ ట్రేడింగ్ పేరుతో ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహిస్తారు. దీన్ని సంప్రదాయంగా, ఒక శుభప్రదమైన కార్యక్రమంగా భావిస్తూ, నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది కొత్త హిందూ క్యాలెండర్ సంవత్సరం విక్రమ్ సంవత్ 2082 ప్రారంభాన్ని సూచిస్తుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పాకిస్థాన్లో కేజీ టమాటా రూ.700
నిత్యావసర కూరగాయల్లో ముఖ్యమైన టమాటా ధర పాకిస్థాన్లో సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. అక్కడ కిలో టమాటా ధర రూ.700 పలుకుతుందంటే ఆ దేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత కొద్ది నెలలుగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులన్నీ కలిసి టమాటా ధరలను ఆకాశానికి చేర్చాయి. టమాటా ధరల పెరుగుదలకు ప్రధానంగా ఈ క్రింది కారణాలు దోహదపడుతున్నాయి.ప్రకృతి వైపరీత్యాలు (వరదలు, వాతావరణ మార్పులు)పాకిస్థాన్లో చుట్టూ ఉన్న సింధ్, బలూచిస్థాన్, దక్షిణ పంజాబ్ ప్రాంతాల్లో గతంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎకరాల్లో టమాటా పంట నాశనమైంది. దీని ఫలితంగా దేశీయ మార్కెట్లోకి టమాటా సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. వరదలు, వాతావరణ మార్పుల వల్ల రహదారులు దెబ్బతినడం, రవాణా ఆలస్యం కావడం వంటి కారణాల వల్ల కూడా పంట ఉన్న ప్రాంతాల నుంచి మార్కెట్లకు సరుకు చేరడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంపాకిస్థాన్ రూపాయి విలువ(భారత రూపాయితో పోలిస్తే పాక్ రూపాయి విలువ 0.31 పైసలుగా ఉంది) ఇతర కరెన్సీలతో పోలిస్తే భారీగా పడిపోతోంది. దీనివల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశీయంగా పంట నష్టం జరగడంతో టమాటా కొరతను తీర్చడానికి పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే పాక్ రూపాయి విలువ తగ్గడం, సరిహద్దుల్లో అనిశ్చితులు పెరగడం వల్ల దిగుమతి చేసుకునే టమాటా ధరలు అధికమయ్యాయి. గతంలో టమాటాకు సరైన ధరలు లభించకపోవడం, వాతావరణ మార్పుల వల్ల తరచుగా పంట నష్టాలు వాటిల్లడం వంటి కారణాల వల్ల రైతులు పంట సాగును తగ్గించారు.సీజనల్ కొరతటమాటా ధరలు సీజన్ను బట్టి తరచుగా మారుతుంటాయి. ముఖ్యంగా రెండు ప్రధాన పంటల సీజన్ల మధ్య కొద్దిపాటి కొరత ఏర్పడటం సర్వసాధారణం. అయితే ప్రస్తుత ఆర్థిక, వాతావరణ పరిస్థితులు ఈ సాధారణ కొరతను మరింత తీవ్రతరం చేశాయి. సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు కొంతమంది వ్యాపారులు పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా తీసుకుని కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రమోషన్ రావాలంటే 4 చిట్కాలు.. -
ముహూరత్ ట్రేడింగ్ షురూ.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ముహూరత్ ట్రేడింగ్ను పురస్కరించుకొని లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ సెషన్ మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1:50 సమయానికి నిఫ్టీ(Nifty) 62 పాయింట్లు పెరిగి 25,905కు చేరింది. సెన్సెక్స్(Sensex) 182 పాయింట్లు పుంజుకుని 84,546 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.73బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 60.79 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.96 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.07 శాతం పెరిగింది.నాస్డాక్ 1.37 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రమోషన్ రావాలంటే 4 చిట్కాలు..
ఆఫీసులో బాగా పనిచేయడం ఒక్కటే సరిపోదు.. దాన్ని ఉన్నత ఉద్యోగుల వద్ద చూపించుకోగలిగితేనే ప్రమోషన్లు వస్తాయని, ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఓ ఉద్యోగి తెలిపారు. ఈ విధానం వల్లే తనకు ప్రమోషన్ వచ్చినట్లు చెప్పారు. తాను చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. రోహిత్ యాదవ్ అనే ఈ ఉద్యోగి తన ప్రమోషన్కు దోహదపడిన నాలుగు ప్రత్యేకమైన అంశాలను తెలిపారు.యాదవ్ తన కెరీర్లో ఎదిగేందుకు మొదటగా బాగా పని చేసినప్పటికీ, తన పనిని ఇతరులకు కనిపించేలా చేయడం ప్రారంభించినప్పటి నుంచే ఉద్యోగం పరంగా వృద్ధి సాధించినట్లు చెప్పారు.వీక్లీ విన్స్(వారంలో సాధించిన విజయాలు)ప్రతి శుక్రవారం యాదవ్ పని పరిమాణంతో సంబంధం లేకుండా తాను సాధించిన మూడు పని సంబంధిత విజయాలను డాక్యుమెంట్ చేసేవాడు. ఇది పనిపై స్పష్టతను పొందడానికి, సమీక్షల సమయంలో తన పని గురించి చర్చించడానికి సహాయపడినట్లు చెప్పారు.మంత్లీ మేనేజర్ అప్డేట్స్ప్రతి నెలా తన మేనేజర్కు కీలక ఫలితాలు, తాను నేర్చుకున్న పాఠాలను క్లుప్తంగా సందేశం పంపేవారు. ఈ అప్డేట్స్ తన పని ఫలితాలకు సంబంధించినవి మాత్రమే ఉండేవి. పని పరంగా గొప్పలు చెప్పుకోకుండా తనను తాను ఎలా తీర్చిదిద్దుకుంటున్నాడో పేర్కొన్నారు.సరైన ప్రశ్న అడగడంవన్-ఆన్-వన్ సమావేశాల్లో ఆయన అడిగే ప్రధాన ప్రశ్న.. ‘తదుపరి స్థాయికి సిద్ధంగా ఉండటానికి నేను ఏమి మెరుగుపరుచుకోవాలి?’. ఈ ప్రశ్న నిర్మాణాత్మక అభిప్రాయానికి మార్గం వేసింది. మేనేజర్ తనను చూసే విధానాన్ని మార్చిందని యాదవ్ వివరించారు.సమావేశాలలో మాట్లాడటంప్రతి మీటింగ్లోనూ తన అభిప్రాయాలు చెప్పేవాడని తెలిపారు. సమావేశాల్లో నిశ్శబ్దంగా ఉండే వారిని అధికారులు విస్మరించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. View this post on Instagram A post shared by Rohit Yadav (@rohitdecoded)ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. యాదవ్ వ్యూహాత్మక కెరీర్ విధానాన్ని చాలా మంది లింక్డ్ఇన్ వినియోగదారులు ప్రశంసించారు. ‘నేను కార్పొరేట్ వాతావరణానికి కొత్త. ఈ చిట్కాలకు చాలా ధన్యవాదాలు. రేపటి నుంచి ప్రారంభిస్తాను’ అని ఒక కొత్త ఉద్యోగి స్పందించారు. ‘నేను మీరు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్లను ప్రయత్నించాను. కానీ మీలా జరగలేదు. చెప్పేది కనీసం వినే సహాయక మేనేజర్ అవసరమని నమ్ముతున్నాను’ అని మరో వ్యక్తి రాశారు. మరొకరు ‘పక్షపాతం పనిచేసే చోట ఇది పని చేయదు’ అని చెప్పారు.ఇదీ చదవండి: చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే.. -
ఇన్ఫోసిస్ క్యాంపస్ పాత వీడియో వైరల్
ఒకప్పుడు సాఫ్ట్వేర్ కార్యాలయాల్లో విరామ సమయాలంటే సహోద్యోగులతో సరదా సంభాషణలు, కలిసి భోజనం చేస్తూ అనుభవాలు పెంచుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం విరామ సమయాల్లో ఫోన్లను చూస్తూ గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 1990 దశకంలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంటీన్ లోపల తీసిన ఒక పాత వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.ఈ వీడియోలో యువ నిపుణుల బృందం భోజనం చేస్తూ, ఉల్లాసంగా మాటామంతి చేస్తూ, నవ్వుతూ కనిపిస్తున్నారు. ‘1990లలో బెంగళూరులోని ఇన్ఫోసిస్ క్యాంటీన్ ఫుటేజ్. ఇందులో దాదాపు చాలామంది మల్టీ-మిలియనీర్లు అయ్యారు. ప్రస్తుతం వారు విదేశాల్లో స్థిరపడ్డారు’ అనే క్యాప్షన్లో ఈ వీడియో షేర్ అయింది. ఆ సమయంలో భారతదేశ సాంకేతిక విప్లవంలో తాము భాగమవుతున్నామన్న విషయం వారికి తెలియకపోయి ఉండవచ్చు. ఈ వీడియో మాజీ ఉద్యోగులు, ఐటీ ఎక్స్పర్ట్లతో సహా అనేక మందిని ఆకట్టుకుంది.దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..‘చాలా క్లాస్! వారు రిలాక్స్గా కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫిట్గా, తెలివిగా ఉన్నారు. చేతిలో ఫోన్ కూడా లేదు. అవి నిజంగా గోల్డెన్ డేస్’ అని ఒకరు రాశారు. మరొకరు ‘కులం, మతం, లింగ వ్యత్యాసాలను పట్టించుకోని, సమాజంలో సానుకూలంగా ప్రభావితమైన క్యాంపస్’ అని రాశారు.Footage from Infosys canteen, Bangalore in 1990s. Almost everyone in this is probably a multi-millionaire and settled abroad today. pic.twitter.com/nTKDQMiXrJ— Arjun* (@mxtaverse) October 18, 2025ఇదీ చదవండి: చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే.. -
టపాసులా పేలిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు మరింత అధికమయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే..
ప్రపంచ వాణిజ్య వేదికపై అమెరికా (US), చైనాల మధ్య టారిఫ్లు, వాణిజ్యపరమైన ఆంక్షల రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అరుదైన అయస్కాంత లోహాల సరఫరాను అడ్డుకోవద్దని అమెరికా చైనాకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిచర్యగా ఈ కీలక లోహాల ఎగుమతులను నియంత్రించాలని చైనా చూస్తోంది. ఈ అరుదైన లోహాల ఉత్పత్తి, శుద్ధి ప్రక్రియలో చైనా ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తోంది.ప్రపంచంలోని అరుదైన ఖనిజాల తవ్వకంలో దాదాపు 70%, వాటి శుద్ధిలో 90% వరకు చైనా నియంత్రిస్తోంది. ఈ ఏకఛత్రాధిపత్యం కారణంగా ఈ లోహాలపై ఎగుమతి నియంత్రణలను విధిస్తే అమెరికాపై చైనా గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు. ఈ నేపథ్యంలో చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి, టారిఫ్లను తగ్గించుకోవడానికి ఈ లోహాల నియంత్రణను ఒక ‘ట్రంప్ కార్డ్’గా ఉపయోగించుకోవాలని చూస్తోంది.అరుదైన అయస్కాంత లోహాల ఉపయోగాలుఅరుదైన అయస్కాంత లోహాల్లో ముఖ్యంగా నియోడైమియం (Neodymium), ప్రెసోడైమియం (Praseodymium), డిస్ప్రోసియం (Dysprosium) వంటి మిశ్రమాలతో తయారైన శాశ్వత అయస్కాంతాలు (Permanent Magnets) కీలకంగా ఉన్నాయి. ఇవి ఆధునిక సాంకేతికతకు, డిఫెన్స్ రంగానికి వెన్నెముకగా ఉన్నాయి. ఇవి చాలా చిన్నవిగా, తేలికగా ఉండి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో, పవన విద్యుత్ టర్బైన్ల జనరేటర్లలో కీలకం. ఇవి అధిక సామర్థ్యంతో శక్తి మార్పిడిని సాధ్యం చేస్తాయి.కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, స్పీకర్లు, హెడ్ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇవి తప్పనిసరి.అధునాతన ఆయుధ వ్యవస్థలైన ఫైటర్ జెట్లు, క్షిపణులు, ఇతర స్మార్ట్ బాంబులు వంటి వాటిలో ఉపయోగించే మోటార్లు, సెన్సార్లకు ఈ అయస్కాంత లోహాలు ఎంతో అవసరం. ఈ కారణం వల్లనే ఈ లోహాలను వ్యూహాత్మకంగా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.ఎంఆర్ఐ యంత్రాలు (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్), పేస్మేకర్లు, హియరింగ్ ఎక్విప్మెంట్లు వంటి వైద్య పరికరాల్లో వీటిని ఉపయోగిస్తారు.పవర్ టూల్స్, రోబోటిక్స్, హై-పెర్ఫార్మెన్స్ ఏసీ సర్వో మోటార్లతో సహా అనేక పారిశ్రామిక అనువర్తనాలలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.అరుదైన అయస్కాంత లోహాల వివాదం కేవలం వాణిజ్య పరమైన సమస్య కాకుండా ప్రపంచ భద్రత, సాంకేతిక ఆధిపత్యం, గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ లోహాలపై చైనాకున్న పట్టు దాన్ని ఒక శక్తివంతమైన భౌగోళిక రాజకీయ ఆయుధంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇతర దేశాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి తమ సొంత అరుదైన లోహాల సరఫరా గొలుసులను బలోపేతం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే.. -
రిలయన్స్ రిటైల్ 600 డార్క్ స్టోర్లు ప్రారంభం
రిలయన్స్ రిటైల్ (Reliance Retail) దేశవ్యాప్తంగా 600కు పైగా డార్క్ స్టోర్లను ఇప్పటికే ప్రారంభించిందని ఇటీవల తెలిపింది. వినియోగదారులకు డెలివరీలను వేగవంతం చేయడానికి మరిన్నింటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొంది.డార్క్ స్టోర్లు అంటే ఏమిటి?డార్క్ స్టోర్ (Dark Store) అనేది రిటైల్ వ్యాపారానికి సంబంధించిన ఒక నూతన విధానం. దీన్నే ‘డార్క్ షాప్’, ‘డార్క్ సూపర్ మార్కెట్’ అని కూడా పిలుస్తారు. ఈ స్టోర్లు సాధారణంగా కస్టమర్ల కోసం ఏర్పాటు చేసినవి కావు. అంటే కస్టమర్లు లోపలికి వెళ్లి వస్తువులను కొనుగోలు చేయడానికి లేదా పరిశీలించడానికి అనుమతి ఉండదు.ఆన్లైన్ ఆర్డర్ల నిర్వహణకు..ఇది ప్రత్యేకంగా ఆన్లైన్ ఆర్డర్లను (Online Orders) సిద్ధం చేయడానికి, ప్యాక్ చేయడానికి, డెలివరీ చేయడానికి ఉద్దేశించిన ఒక వేర్హౌస్ (Warehouse) లేదా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లాగా పనిచేస్తుంది. వేర్హౌస్ లోపల వస్తువులను వేగంగా ఎంచుకోవడానికి, ప్యాక్ చేయడానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణ సూపర్ మార్కెట్ లాగా అల్మారాలు ఉన్నప్పటికీ కస్టమర్లను ఆకర్షించే డిస్ప్లేలు, ప్రచార సైన్బోర్డ్లు ఇందులో ఉండవు.ప్రధాన లక్ష్యండార్క్ స్టోర్ల ప్రధాన లక్ష్యం ఆన్లైన్ ఆర్డర్లు, నిత్యవసరాలు, ఆహార పదార్థాలు వంటి వాటిని తక్కువ సమయంలో (క్విక్-కామర్స్), వేగంగా డెలివరీ చేయడం. రిలయన్స్ రిటైల్ కూడా 30 నిమిషాల లోపు డెలివరీలను విస్తరించడానికి కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన డార్క్స్టోర్లను ఉపయోగిస్తోంది.ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే.. -
రియల్టీలో బ్లాక్మనీ చక్కర్లు.. ఎలాగంటే..
రియల్ ఎస్టేట్ రంగాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. అయినప్పటికీ ఈ రంగం దశాబ్దాలుగా నల్లధనం (Black Money) లేదా లెక్కల్లో చూపని ధనం ప్రవాహానికి ప్రధాన వేదికగా మారిందనే వాదనలున్నాయి. ఇక్కడ జరిగే కొనుగోళ్లు, అమ్మకాలు, పెట్టుబడుల్లో గణనీయమైన భాగం నగదు రూపంలోనే జరుగుతుండటం దీనికి ముఖ్య కారణం. డిజిటలైజేషన్ అని చెప్పుకుంటున్న, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు వచ్చినా ఈ విభాగంలో ఇప్పటికీ చాలా వరకు నగదు రూపంలోనే లావాదేవీలు జరుగుతున్నాయనేది వాస్తవం. రియల్టీ రంగంలో నల్లధనం ఎలా ప్రవహిస్తుంది, అందుకు గల కారణాలు, దాని ప్రభావాలను విశ్లేషిద్దాం.నల్లధనం ప్రవాహం ఎలా జరుగుతుంది?సాధారణంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు రెండు రకాలుగా విభజిస్తారు. అధికారిక లావాదేవీలు.. ఇది బ్యాంక్ ద్వారా చెక్, ఆన్లైన్ బదిలీ (RTGS/NEFT) రూపంలో చెల్లిస్తారు. ఈ మొత్తం ప్రభుత్వ రికార్డులలో నమోదు చేయబడి, దీనిపై కొనుగోలుదారు, విక్రేత పన్నులు చెల్లిస్తారు. డాక్యుమెంట్లలో, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చూపించే ధర ఇదే.నగదు లావాదేవీఇది అధికారిక పత్రాల్లో చూపకుండా కొనుగోలుదారు నేరుగా విక్రేతకు నగదు రూపంలో ఇచ్చే మొత్తం. ఈ లావాదేవీ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు లేదా ప్రభుత్వానికి తెలియజేయరు. మార్కెట్ ధర, డాక్యుమెంట్ ధర మధ్య ఉన్న వ్యత్యాసం ఈ నల్లధనం.ప్రవాహ విధానంకొనుగోలు దశ: ఒక కొనుగోలుదారు తాను దాచుకున్న నల్లధనాన్ని ఉపయోగించి ఒక ఆస్తిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఆస్తి యజమానికి డాక్యుమెంట్లో ఉన్న ధర కంటే ఎక్కువ మొత్తాన్ని (అదనపు నగదు) చెల్లిస్తారు. ఈ అదనపు మొత్తం కొనుగోలుదారు నల్లధనంగా ఉంటుంది. ఇదే తర్వాత కాలంలో ఆస్తి యజమానికి సైతం నల్లధనంగా మారుతుంది.అమ్మకం దశ: కొనుగోలుదారు ఆస్తిని అమ్మే సమయానికి ఆ ఆస్తి విలువ పెరిగి ఉంటుంది. అప్పుడు అతను కొత్త కొనుగోలుదారు నుంచి మార్కెట్ విలువ ప్రకారం ధరను తీసుకుంటాడు. ఇందులో కొంత భాగం అధికారికంగా లెక్క చూపినా పెరిగిన విలువలో ఎక్కువ భాగం నగదు రూపంలో (నల్లధనం) తీసుకునేందుకు మొగ్గు చూపుతాడు. ఆస్తి అమ్మే సమయానికి పన్ను ఎగవేత కోసం ఇది నల్లధనంగా మారుతుంది.నిర్మాణం/డెవలప్మెంట్: రియల్ ఎస్టేట్ డెవలపర్లు భూమి కొనుగోలు, నిర్మాణ సామగ్రి, కార్మికుల వేతనాలు వంటి వాటిలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహిస్తారు. ఇది వారికి లెక్కల్లో చూపని ఆదాయం (నల్లధనం) సృష్టించడానికి అవకాశం ఇస్తుంది.ప్రధాన కారణాలుఅధిక స్టాంప్ డ్యూటీ, పన్నులుఆస్తుల రిజిస్ట్రేషన్, అమ్మకాలపై ప్రభుత్వాలు విధించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) చాలా ఎక్కువగా ఉండటం. ఈ అధిక పన్నులను తప్పించుకోవడానికి కొనుగోలుదారులు, విక్రేతలు ఇద్దరూ డాక్యుమెంట్లలో ఆస్తి విలువను తక్కువగా చూపించి మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో లావాదేవీ చేస్తారు.ధరల్లో వ్యత్యాసంప్రభుత్వం నిర్ణయించిన సర్కిల్ రేటు కంటే మార్కెట్ ధర చాలా ఎక్కువగా ఉండటం. విక్రేత మార్కెట్ ధరను డిమాండ్ చేసినప్పుడు కొనుగోలుదారు స్టాంప్ డ్యూటీని ఆదా చేసుకోవడానికి సర్కిల్ రేటుకు మాత్రమే డాక్యుమెంట్ చేయించి మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తాడు.దాచుకునే అవకాశంనల్లధనం (లెక్కల్లో చూపని ఆదాయం) ఉన్న వ్యక్తులకు ఆ డబ్బును సులభంగా, సురక్షితంగా దాచుకోవడానికి రియల్ ఎస్టేట్ ఒక ఉత్తమ మార్గంగా కనిపిస్తుంది. నల్లధనాన్ని ఆస్తి రూపంలోకి మార్చడం ద్వారా వారు దానిపై వడ్డీ లేదా పన్ను చెల్లించకుండా తప్పించుకుంటారు.రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పూర్తి పారదర్శకత లేకపోవడం. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) వంటి వ్యవస్థలు ఉన్నా పాత లేదా వ్యక్తిగత ఆస్తుల కొనుగోలు, అమ్మకాలలో నగదు ప్రవాహాన్ని నియంత్రించే యంత్రాంగం బలహీనంగా ఉందనే వాదనలున్నాయి. రియల్ ఎస్టేట్లో తరచుగా ధరలు వేగంగా పెరుగుతుంటాయి. ఈ లాభాలపై పన్నులు కట్టకుండా ఉండటానికి విక్రేతలు నగదు రూపంలో అమ్మకాలు జరపడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.పరిణామాలు ఇలా..రియల్ ఎస్టేట్లో నల్లధనం ప్రవాహం అనేక ఆర్థిక, సామాజిక సమస్యలకు దారితీస్తుంది. నల్లధనం వల్ల వాస్తవ మార్కెట్ ధర కృత్రిమంగా పెరుగుతుంది. మధ్యతరగతి, పేద ప్రజలకు ఇల్లు కొనుగోలు చేయడం కష్టమవుతుంది. పన్ను ఎగవేత కారణంగా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, మూలధన లాభాల పన్ను రూపంలో రావాల్సిన ఆదాయం కోల్పోతుంది. నల్లధనం ప్రవాహం దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. ఈ రంగంలోని అధికారులకు లంచాలు ఇచ్చి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వంటి అవినీతి కార్యకలాపాలకు ఇది ఆజ్యం పోస్తుంది.ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే.. -
ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే..
ఆస్తులను పోగేసి వారసులకు పంచిపెట్టాలా లేదా అనేది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక. అయితే మారుతున్న జీవన విలువలు కారణంగా చాలామంది కేవలం డబ్బు కోసమే తమ తల్లిదండ్రులను చూసుకుంటున్నవారు ఉన్నారు. అదే డబ్బు చేతికి రాగానే ఆ పండుటాకులను నిర్దాక్షిణ్యంగా బయటకు తరిమేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తులు పంపకాలకు ముందు వారసుల కంటే తమ అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన.జీవితకాలం కష్టార్జితం వృద్ధాప్యంలో మెరుగైన జీవనానికి భరోసా ఇవ్వాలి. తమ అవసరాలకు పోను మిగిలినది తమ తదనంతరం వారసులకు పంపిణీ చేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. అయితే పిల్లల చదువులకు ఉన్నదంతా ఖర్చు చేసి.. వారికి మెరుగైన భవిష్యత్తును అందించిన తల్లిదండ్రులు మిగిలిన కొద్ది ఆర్థిక వనరులు/ ఆస్తులను తమ కోసమే వినియోగించుకునేందుకైనా ప్రాధాన్యం ఇవ్వాలి.అవసరాలకు మించి అదనంగా కలిగి ఉంటే అప్పుడు జీవించి ఉండగానే బదిలీ చేయడాన్ని పరిశీలించొచ్చు.కొందరు పిల్లలకు ఆస్తులను పంపిణీ చేసే సందర్భంలో జీవిత భాగస్వామిని విస్మరిస్తుంటారు. ముందుగానే ఆస్తులన్నింటినీ పిల్లలకు పంచేసిన తర్వాత.. దంపతుల్లో ఒకరు ముందుగా కాలం చేస్తే అప్పుడు రెండో వ్యక్తి యోగ క్షేమాలను పిల్లలు పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. కనుక జీవిత భాగస్వామికి ఈ విషయంలో భరోసా కల్పించాలి.పిల్లల్లో ఒకరిద్దరు గొప్పగా స్థిరపడి.. ఎవరో ఒకరు వైవాహిక జీవితం విచ్ఛిన్నం కారణంగా తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉండొచ్చు. అలాంటి ప్రత్యేక కేసుల్లో వారు జీవితాంతం అదే ఇంట్లో నివసించే హక్కు (రైట్ టు రిసైడ్)ను వీలునామా ద్వారా కల్పించొచ్చు.ఆస్తుల పంపకంలో పిల్లల ఆసక్తులను పట్టించుకోవాలి. వారికి ఇష్టం లేని ఆస్తులు, వ్యాపారాలను విడిచిపెట్టడం మంచి నిర్ణయం కాబోదు. అలా ఇచ్చిన వ్యాపారాలు, ఇంటి నిర్వహణను వారు పట్టించుకోకపోతే కొంత కాలానికి వాటి విలువ క్షీణిస్తుంది.ముఖ్యంగా మైనర్ పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే వారి కోసం సంరక్షకులను వీలునామా ద్వారా నియమించుకోవచ్చు. లేదా ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించొచ్చు. ఇలాంటి వారికి ఆస్తుల బదిలీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల సాయంతో వారికి జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయ మార్గం కల్పించడంపై దృష్టి పెట్టాలి.ఆస్తుల బదిలీకి అనుకూలమైన చట్టబద్ధమైన ప్రక్రియలు, పన్ను బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. విదేశాల్లో స్థిరపడిన పిల్లలకు ఆస్తులను బదిలీ చేస్తుంటే.. వారు తమ దేశాల్లో పన్నులు చెల్లించాల్సి రావచ్చు. కనుక వీటి గురించి ముందే పిల్లలతో చర్చించాలి.ఇదీ చదవండి: నా సోదరుడి ఆత్మహత్యకు ఓలా సీఈఓ కారణం -
అమెజాన్ సర్వీసుల్లో అంతరాయం
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లోని వివిధ ప్లాట్ఫామ్ల్లో అంతరాయాలు ఏర్పడినట్లు యూఎస్ వినియోగదారులు తెలిపారు. ఈ అంతరాయం కారణంగా చాలా మంది వెబ్సైట్లను, అమెజాన్తో కనెక్ట్ చేసిన గేమింగ్ ప్లాట్ఫామ్లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు.డౌన్ డిటెక్టర్ ప్రకారం, సోమవారం తెల్లవారుజామున 3:44 గంటల నాటికి 5,852 మంది వినియోగదారులు AWSతో సమస్యలనున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యలు ఎక్కువగా యుఎస్-ఈస్ట్-1 ప్రాంతంలో (77%) కేంద్రీకృతమై ఉన్నాయి. తరువాత యుఎస్-వెస్ట్-1 (13%), యుఎస్-వెస్ట్-2 (10%) ప్రాంతాల్లో నమోదయ్యాయి. అమెజాన్ (.com) వినియోగదారులు కూడా పెద్ద సంఖ్యలో సమస్యలను నివేదించారు. తెల్లవారుజామున 3:44 గంటల నాటికి 14,000 మందికి పైగా వినియోగదారులు అంతరాయం గురించి తెలిపారు.ఇదీ చదవండి: సెలవున్నా స్టాక్ మార్కెట్లు పని చేస్తాయ్! -
సెలవున్నా స్టాక్ మార్కెట్లు పని చేస్తాయ్!
స్టాక్మార్కెట్ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 21న లక్ష్మీ పూజ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మార్కెట్లకు సెలవు. అయినా మధ్యాహ్నం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్ను నిర్వహిస్తాయని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.ముహూరత్ ట్రేడింగ్ఈ ముహూరత్ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్ఎస్ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు.ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 21న ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్ను క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్ ఎక్స్పర్ట్లు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. దీపావళి బలిప్రతిపద సందర్భంగా అక్టోబర్ 22న ఎక్స్ఛేంజీలు పనిచేయవు.ఇదీ చదవండి: నా సోదరుడి ఆత్మహత్యకు ఓలా సీఈఓ కారణంముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలుఅక్టోబర్ 21 మధ్యాహ్నం 1:45కు మార్కెట్ ఓపెన్ అవుతుంది.మధ్యాహ్నం 2:45కు ముగుస్తుంది.అక్టోబర్ 22న బలిప్రతిపద సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు. -
నా సోదరుడి ఆత్మహత్యకు ఓలా సీఈఓ కారణం
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేస్తున్న 38 ఏళ్ల ఇంజినీర్ ఆత్మహత్య కేసులో బెంగళూరు నగర పోలీసులు ఆ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. యాజమాన్యం వేధింపుల కారణంగానే తన సోదరుడు చనిపోయినట్లు అశ్విన్ కన్నన్ ఫిర్యాదు చేశాడు. ఆ ఆరోపణలకు బలం చేకూరేలా మృతుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.మృతుడిని బెంగళూరులోని చిక్కలసంద్రకు చెందిన కె. అరవింద్గా గుర్తించారు. అతను 2022 నుంచి ఓలా ఎలక్ట్రిక్లో హోమోలోగేషన్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 28న అరవింద్ మృతి చెందగా అతని సోదరుడు అశ్విన్ కన్నన్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 6న కేసు నమోదైంది.బీఎన్ఎస్ సెక్షన్ 108భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లో భవీష్ అగర్వాల్తో పాటు వెహికల్ హోమోలోగేషన్స్ అండ్ రెగ్యులేషన్స్ హెడ్ సుబ్రత్ కుమార్ దాష్, ఇతరులను కేసులో చేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు, మృతుడి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. అరవింద్ తన 28 పేజీల సూసైడ్ నోట్లో దాష్, అగర్వాల్ తనను పనిలో వేధిస్తున్నారని తెలిపారు. అలాగే జీతాలు, ఇతర ప్రోత్సాహకాలు కూడా సక్రమంగా చెల్లించలేదని చెప్పారు. ఇది అరవింద్ను తీవ్ర నిరాశకు గురిచేసిందని మృతుడి సోదరుడు అశ్విన్ పేర్కొన్నారు. పోలీసులు వారిపై తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.మరణం తర్వాత అనుమానాస్పద లావాదేవీలుఅశ్విన్ కన్నన్ ఫిర్యాదు ప్రకారం అరవింద్ మరణించిన రెండు రోజుల తరువాత సెప్టెంబర్ 30న నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(NEFT) ద్వారా అతని బ్యాంకు ఖాతాలో రూ.17,46,313 జమ చేశారు. ‘అతని బ్యాంకు ఖాతాలో ఇంత భారీ డబ్బు జమ కావడంతో నాకు అనుమానం వచ్చింది. సుబ్రత్ కుమార్ దాష్ను విచారించిన తరువాత అతను హెచ్ఆర్ (HR)ను సంప్రదించాలని కోరాడు. వారిని కలిసిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధులు కృతేష్ దేశాయ్, పరమేష్, రోషన్ అందరూ ఇంటికి వచ్చి డబ్బు లావాదేవీల గురించి వివరించారు. కంపెనీ ఏదో సమాచారాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది’ అని అశ్విన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.కొనసాగుతున్న దర్యాప్తుఈ కేసును తొలుత అసహజ మరణంగా నమోదు చేసినట్లు డీసీపీ (సౌత్ వెస్ట్) అనితా బి హద్దన్నవర్ తెలిపారు. అయితే డెత్ నోట్ వెలుగులోకి వచ్చిన తరువాత మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఆమె చెప్పారు. ‘మేము ఈ కేసును పరిశీలిస్తున్నాం. దర్యాప్తు జరుగుతోంది’ అని తెలిపారు. ఈ విషయంలో భవీష్ అగర్వాల్, దాష్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. -
ఆవిష్కరణ.. ఆహార వ్యర్థాలతో కోట్ల రూపాయలు
ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఆహార ఉత్పతుల నుంచి వచ్చే వ్యర్థాలు దేనికీ పనికిరాకుండా ఉండేవి. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉపఉత్పత్తులను(Byproducts) విలువైన, లాభదాయకమైనవిగా కొన్ని కంపెనీలు మారుస్తున్నాయి. ఈ విభాగంలో కంపెనీలు వినూత్నంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. ఇవి ఆహార నష్టాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, లాభదాయకమైన వ్యాపార అవకాశాలకు మార్గం చూపుతున్నాయి.పండ్ల వ్యర్థాల నుంచి..సింగపూర్లోని డోల్ స్పెషాలిటీ ఇంగ్రీడియెంట్స్ వంటి కంపెనీలు అరటి, పైనాపిల్ తొక్కల వ్యర్థాలను వినూత్నంగా ఉపయోగిస్తున్నాయి. ఈ తొక్కల నుంచి ఎంజైమ్లు, నూనెలు, ఫైబర్స్ వంటి విలువైన ఉత్పత్తులను సేకరిస్తున్నారు. ఉదాహరణకు, అరటి ఫైబర్ పౌడర్ను బిస్కెట్లు, తృణధాన్యాల్లో వాడుతున్నారు. కొన్ని రకాల ఫైబర్లను వస్త్ర పరిశ్రమలో తిరిగి వినియోగిస్తున్నారు.సీఫుడ్ వ్యర్థాల వినియోగంచేపల పొలుసులు, తలలు, ఇతర ఉపఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా ఒమేగా-3-రిచ్ ఫిష్ ఆయిల్ వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇది ఆహార పదార్థాలు, క్రియాత్మక ఆహారాల విభాగంలో డిమాండ్ను అందుకోవడంతో పాటు వ్యర్థాలను తగ్గించి లాభదాయకమైన ఆదాయ వనరులను సృష్టిస్తుంది.బ్రేవరీ వ్యర్థాలతో ఇలా..బెంగళూరుకు చెందిన సేవింగ్ గ్రెయిన్స్ వంటి సంస్థలు బ్రేవరీల నుంచి మిగిలిపోయిన ధాన్యాలను (Spent Grains) సేకరించి వాటితో రుచి, ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.అప్సైకిల్జైపూర్లోని ది మిస్ఫిట్స్ వంటి సంస్థలు సాధారణంగా మార్కెట్లో కొనుగోలుదారులు తిరస్కరించే పండ్లు, కూరగాయలను డిప్స్, జామ్లుగా అప్సైకిల్ చేస్తున్నాయి. దీని ద్వారా ఆహార నష్టాన్ని పరిష్కరిస్తున్నాయి.షెల్ఫ్ లైఫ్ పొడిగింపుఆహార వ్యర్థాలను అప్సైక్లింగ్ చేయడంతో పాటు ఉత్పత్తులు పాడవకుండా అరికట్టడం మరొక ముఖ్యమైన అంశం. చెన్నైలోని గ్రీన్పాడ్ ల్యాబ్స్ వంటి స్టార్టప్లు పండ్లు, కూరగాయల షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి సహజ మొక్కల సారాలను ఉపయోగిస్తున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారంలో దాదాపు 40% వృధా అవుతున్న నేపథ్యంలో ఇటువంటి ఆవిష్కరణలు ఆహార నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. -
దీనదయాళ్ పోర్ట్లో తగ్గిన రష్యా చమురు సరఫరా
ప్రపంచ దేశాల ఒత్తిడి, యూఎస్, ఈయూల సెకండరీ ఆంక్షల(రష్యాతో వ్యాపారం సాగిస్తున్న దేశాలు, కంపెనీలపై పరోక్షంగా విధించి ఆంక్షలు) ప్రభావం కారణంగా రష్యా నుంచి భారత్కు ముడి చమురు దిగుమతులు తగ్గినట్లు తెలుస్తుంది. దాంతో దేశంలోని 13 ప్రధాన ఓడరేవుల్లో అత్యంత ముఖ్యమైన దీనదయాళ్ పోర్ట్(Deendayal Port)లో గణనీయంగా సరఫరా దెబ్బతింది. రష్యన్ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ నౌకాశ్రయం తాజా గణాంకాల ప్రకారం క్రూడ్ వాల్యూమ్ క్షీణతను నమోదు చేసింది.2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దీనదయాళ్ పోర్ట్ నిర్వహించిన ముడి చమురు, ఎల్పీజీ/ఎల్ఎన్జీ మొత్తం వాల్యూమ్ 30.07 లక్షల టన్నులకు తగ్గింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 32.5 లక్షల టన్నుల వాల్యూమ్తో పోలిస్తే దాదాపు 6% క్షీణతను సూచిస్తుంది. భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల్లో దీనదయాళ్ పోర్ట్ రష్యన్ చమురును అధికంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది.తగ్గుదలకు కారణాలుభారతదేశంపై రష్యా చమురు దిగుమతులకు సంబంధించి ప్రత్యక్ష ఆంక్షలు లేనప్పటికీ అమెరికా (USA), యూరోపియన్ యూనియన్ (EU) విధించిన ద్వితీయ పరిమితుల (Secondary sanctions) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా రష్యన్ చమురు సరఫరాపై పడింది. రవాణా, బీమా, ఆర్థిక లావాదేవీలు కఠినతరం కావడంతో దిగుమతిదారులు రష్యన్ చమురును నిలిపేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ వనరుల వైపు మళ్లుతున్నారు.భారత్పై ఒత్తిడిభారతదేశం తన ఇంధన అవసరాల కోసం రష్యా ముడి చమురుపై భారీగా ఆధారపడటాన్ని తగ్గించాలని యూఎస్, ఈయూ వంటి దేశాల నుంచి అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో అమెరికా, పశ్చిమ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్కు ఉంది. రష్యా చమురు దిగుమతులను కొనసాగించడం ఈ సంబంధాలకు ఇబ్బంది కలిగిస్తుంది. రష్యా చమురుతో సంబంధం ఉన్న సంస్థలు, బ్యాంకులపై భవిష్యత్తులో అమెరికా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.రిఫైనరీలపై ప్రభావందీనదయాళ్ పోర్ట్ ద్వారా సాగే ముడి చమురు సరఫరా ప్రధానంగా నయారా ఎనర్జీ (Nayara Energy- రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ మద్దతు కలిగిన సంస్థ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వంటి రిఫైనరీలపై పడుతుంది. నయారా ఎనర్జీకి రష్యాకు చెందిన రోస్నెఫ్ట్తో 10 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. అయితే ఈ ఒత్తిళ్ల మధ్య కూడా నయారా చమురు సరఫరా ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి 6,700కు పైగా ఫ్యూయల్ స్టేషన్లకు ఇంధనాన్ని నింపుతూ దేశీయ సరఫరాను కొనసాగిస్తున్నాయి. తాత్కాలికంగా ఐఓసీకి చెందిన వదినార్ రిఫైనరీలో నిర్వహణ పనులు కూడా ముడి చమురు వినియోగం తగ్గడానికి మరో కారణంగా నిలిచింది.ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. -
దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు..
బ్యాంకులు తమ వినియోగదారులకు దీపావళి ధమాకా ఆఫర్లను ప్రకటించాయి. అందులో కొత్తగా వస్తువులు కొనుగోలు చేసే వారి నుంచి పర్సనల్ లోన్లు తీసుకునే వారి వరకు బ్యాంకును అనుసరించి చాలా ఆఫర్లు అందిస్తున్నాయి. వీటిలో క్యాష్బ్యాక్ ఆఫర్లు, వడ్డీ రేట్ల తగ్గింపులు కూడా ఉన్నాయి. ఏయే బ్యాంకులు ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నాయో తెలుసుకుందాం.హెచ్డీఎఫ్సీ బ్యాంక్దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన HDFC బ్యాంక్ కార్డులు, రుణాలు, పేజాప్, ఈజీ ఈఎంఐల్లో 10,000 కంటే ఎక్కువ ఆఫర్లను ప్రకటించింది. 9.99% వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలు, 72 నెలల వరకు కాలపరిమితి, జీరో ఫోర్క్లోజర్ ఫీజు (రుణ మొత్తం రూ. 15 లక్షలకు పైన, కస్టమర్ సిబిల్ స్కోర్ 730 కంటే ఎక్కువ ఉంటే)ను ఆఫర్ చేస్తుంది. అక్టోబర్ చివరి వరకు 7.4% నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లను ప్రకటించింది.ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ & సీఈఓ శశిధర్ జగదీషన్ మాట్లాడుతూ..‘జీఎస్టీ, వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రుణ వృద్ధిని వేగవంతం చేయడానికి ఇదే సరైన సమయం’ అన్నారు.ఐసీఐసీఐ బ్యాంక్గృహ రుణాలు: ప్రత్యేక ప్రాసెసింగ్ ఫీజు రూ.5,000.ఆటో రుణాలు: ప్రాసెసింగ్ ఫీజు రూ.999.క్యాష్బ్యాక్ ఆఫర్లు: ఐఫోన్ 17 కొనుగోలుపై రూ.6,000 తక్షణ క్యాష్బ్యాక్.ఎల్జీ, హైయర్, పానాసోనిక్, బ్లూస్టార్, జేబీఎల్ వంటి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ల వస్తువుల కొనుగోలుపై రూ.50,000 వరకు క్యాష్బ్యాక్, డిస్కౌంట్లు.బ్యాంక్ ఆఫ్ బరోడాగృహ రుణాలు: సున్నా ప్రాసెసింగ్ ఫీజుతో 7.45% నుంచి ప్రత్యేక వడ్డీ రేట్లు.మహిళా రుణగ్రహీతలకు, జన్ జీ(2000 తర్వాత పుట్టినవారు), మిలీనియల్స్ (40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు)కు వడ్డీ రేటులో రాయితీలు ఇస్తోంది.ఇండస్ఇండ్ బ్యాంక్గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, ఆస్తిపై రుణాలు వంటి రుణ ఉత్పత్తులన్నింటిపై ప్రాసెసింగ్ ఫీజుపై 50% వరకు తగ్గింపు.వ్యక్తిగత రుణాలు: 10.49% నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు, రూ.50 లక్షల వరకు రుణ మొత్తాలు, 84 నెలల వరకు కాలపరిమితి ఆఫర్ చేస్తుంది.దీర్ఘకాలిక గృహ రుణాలు: రూ.10 కోట్ల వరకు రుణ మొత్తాలకు రూ.10,000 ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పొడిగించిన కాలపరిమితులు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్లన్లు ఉంటాయి.ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్.. డబ్బు మిగలాలంటే ఇలా చేయాల్సిందే.. -
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త యులిప్ ప్లాన్
బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా ‘బజాజ్ లైఫ్ సుప్రీమ్’ పేరుతో యూనిట్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత జీవిత బీమా పొదుపు పథకాన్ని ప్రారంభించింది. సంపద సృష్టికి, స్థిరమైన ఆదాయానికి ఈ ప్లాన్ ఉపకరిస్తుందని తెలిపింది. పరిశ్రమలోనే తొలిసారి గ్యారంటీడ్ వెల్త్ బూస్టర్ ఫీచర్ ఇందులో ఉన్నట్టు తెలిపింది.ప్రీమియం అలోకేషన్పై ఏటా 7 శాతం కాంపౌండెడ్ వృద్ధికి హామీ ఇస్తున్నట్టు, ఈ మొత్తం 15వ ఏట చివర్లో పాలసీ ఫండ్కు జోడించడం జరుగుతుందని పేర్కొంది. పన్నులేని సంపద బదిలీకి మార్గమని తెలిపింది. మోర్టాలిటీ చార్జీలను వెనక్కివ్వడం, పాలసీ కాల వ్యవధి తర్వాత క్రమానుగతంగా ఉపసంహరించుకునే ఫీచర్లు సైతం ఇందులో ఉన్నాయి.మిగతా కీలక ఫీచర్లుపన్ను ప్రయోజనాలు: ఈ ప్లాన్ ద్వారా సంపద బదిలీపై పన్నుల నుంచి మినహాయింపు లభిస్తుంది, ఇది కుటుంబ భద్రతకు తోడ్పడే ప్రధాన ప్రయోజనం.మోర్టాలిటీ చార్జీల రీఫండ్: పాలసీ కాలం పూర్తయ్యే నాటికి, పాలసీదారులు చెల్లించిన మోర్టాలిటీ చార్జీలు వారికి తిరిగి అందజేయడం ఈ ప్లాన్ ప్రత్యేకత.స్టెప్-అప్ విత్డ్రావల్స్ (క్రమానుగత ఉపసంహరణలు): పాలసీ మియాదు తర్వాత, పాలసీదారులు తమ నిధులను తక్కువ మోతాదులో కానీ సుస్థిరంగా ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీని వల్ల రిటైర్మెంట్ అనంతర కాలానికి సులభమైన నగదు ప్రవాహం ఏర్పడుతుంది.బహుళ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎంపికలు: బజాజ్ లైఫ్ సుప్రీమ్ ద్వారా వినియోగదారులు తమ పెట్టుబడుల లక్ష్యాలకు అనుగుణంగా వివిధ నిధుల ఎంపిక చేసుకోవచ్చు. స్థిర ఆదాయం నుంచి మ్యూచువల్ ఫండ్ తరహా పెట్టుబడుల దాకా.లాంగ్టర్మ్ వాల్యూ సృష్టి: ఈ యులిప్ పథకం, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాల కోసం రూపొందించబడింది. ప్రత్యేకంగా, పిల్లల విద్య, రిటైర్మెంట్, ఇంటి కొనుగోలు వంటి జీవన లక్ష్యాలను చేరుకునేందుకు ఇది సహాయకారి. -
టాప్ 3లో భారత టెలికం సేవలు
అత్యుత్తమ టెలికం సేవలున్న టాప్ 3 దేశాల జాబితాలో భారత్ కూడా ఒకటని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. సర్వీసులను మెరుగుపర్చేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించేందుకు అక్టోబర్ 1 నుంచి మరింత కఠినతరమైన నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు మంత్రి చెప్పారు.వీటిపై టెలికం ఆపరేటర్లు ఇప్పటికే తొలి నివేదికలను అందించాయని, సర్వీసుల నాణ్యత సమస్యలేమైనా ఉంటే వాటిని పరిష్కరించడంపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. వైఫై విస్తృతిని పెంచేందుకు 6 గిగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రంలో కొన్ని ఫ్రీక్వెన్సీలకు లైసెన్సు నుంచి మినహాయింపునిచ్చినట్లు సింధియా చెప్పారు. దీంతో నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలను ఉపయోగించుకునే కంపెనీలు స్పెక్ట్రం ఫీజులేమీ చెల్లించనక్కర్లేదని పేర్కొన్నారు.శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నుంచి తుది సిఫార్సులు వచ్చిన తర్వాత నిబంధనలను ఖరారు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇక టెలికం నెట్వర్క్ విస్తరణను మరింత వేగవంతం చేస్తున్నామని, ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 1,882 సమస్యలను పరిష్కరించామని, మరో 533 అంశాలపై రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. -
జియో దీపావళి ఆఫర్.. ప్లాన్లపై ‘అన్లిమిటెడ్’ ప్రయోజనాలు
దీపావళి పండుగను పురస్కరించుకుని, రిలయన్స్ జియో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ (Reliance Jio Diwali 2025 offer)లో భాగంగా జియో యూజర్లు అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 5జీ డేటా, జియో సినిమా, జియో హాట్స్టార్, జియోహోమ్ ట్రయల్స్ వంటి సేవలను ఆస్వాదించవచ్చు. అర్హత కలిగిన ప్లాన్లపై జియో గోల్డ్ క్రెడిట్ కూడా కంపెనీ ఇస్తోంది.ఆఫర్ వివరాలుమైజియో యాప్తో పాటు జియో వెబ్సైట్లోనూ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లకు "ఫెస్టివల్ ఆఫర్: గోల్డ్ + హోమ్ ట్రయల్" పేరుతో దీపావళి సందర్భంగా బెనిఫిట్లు ప్రకటించింది. వీటిలో స్వల్ప వ్యాలిడిటీతో దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్లు ఉన్నాయి. పైన చెప్పినట్లుగా, ఈ ఆఫర్ లో జియో 5జీ నెట్ వర్క్ యాక్సెస్, బండిల్ చేసిన ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు, జియో రివార్డ్స్ ఎకోసిస్టమ్ లో ఉపయోగించగల అదనపు జియో గోల్డ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ ఫెస్టివల్ ప్లాన్లు ఇప్పటికే ఉన్నవారితోపాటు కొత్త ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.ఫెస్టివల్ ఆఫర్ కింద ఉన్న ప్లాన్లు ఇవే..జియో రూ.349 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, జియో గోల్డ్ బోనస్, జియోహోమ్ ట్రయల్, ఓటీటీ బండిల్ ఉన్నాయి.జియో రూ.899 ప్లాన్: 90 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ, మొత్తంగా 20 జీబీ అదనపు డేటా.జియో రూ.999 ప్లాన్: 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, జియో గోల్డ్ బోనస్, జియోహోమ్ ట్రయల్, ఓటీటీ బండిల్ ఉన్నాయి.జియో రూ.3,599 ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటా.జియో రూ.100 యాడ్-ఆన్: 30 రోజుల వ్యాలిడిటీ, 5 జీబీ నాన్-డైలీ డేటా. అయితే బేస్ ప్లాన్ వ్యాలిడిటీపై ఎలాంటి ప్రభావం ఉండదు. -
85% పేమెంట్స్ యూపీఐ నుంచే..
దేశంలో 85 శాతం డిజిటల్ చెల్లింపులు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) రూపంలోనే జరుగుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రతి నెలా 20 బిలియన్ యూపీఐ లావాదేవీలు నమోదవుతున్నాయని, వీటి విలువ 280 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు చెప్పారు.సమ్మిళిత, సురక్షిత, విస్తరణకు అనుకూలమైన డిజిటల్ పబ్లిక్ ఫ్లాట్ఫామ్ల (డీపీపీలు) విషయంలో భారత్ ప్రపంచానికి ఒక కేసు స్టడీ (అధ్యయనం చేయతగిన) అవుతుందన్నారు. వాషింగ్టన్లో ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా ఆర్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా మల్హోత్రా మాట్లాడారు.సమ్మిళిత వృద్ధి, ఆవిష్కరణలకు డిజిటల్ పబ్లిక్ ప్లాట్ఫామ్లు ప్రేరణినిస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ గుర్తింపునకు ఉద్దేశించిన ఆధార్, రియల్టైమ్ చెల్లింపులకు వీలు కల్పిస్తున్న యూపీఐ ద్వారా.. తక్కువ వ్యయాలతో, ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించే వ్యవస్థలకు ఎలా నిర్మించొచ్చో విజయవంతంగా చూపించినట్టు పేర్కొన్నారు.డిజిటల్ పరివర్తనను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ‘వసుదైక కుటుంబం’ స్ఫూర్తితో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. యూపీఐని ఒక ముఖ్యమైన డిజిటల్ పబ్లిక్ ప్లాట్ఫామ్గా పేర్కొంటూ, చెల్లింపుల ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మార్చేసినట్టు చెప్పారు. -
పసిడి ప్రియులకు ‘పండుగ’.. మళ్లీ తగ్గిన బంగారం
గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు (Gold Price) ఎట్టకేలకు దిగివచ్చాయి. ధనత్రయోదశి (Dhanteras) రోజున కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని కలిగించిన బంగారం ధరలు దీపావళి (Diwali) రోజున కూడా ఊరట కలిగించాయి. వెండి ధరలు (Silver Price) కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయి.. దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం వాటి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Income tax: కొత్త చట్టం వస్తోంది కానీ...
ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఆదాయపన్ను చట్టం 1922, ఆ తరువాత చట్టం 1961 ... ఇప్పుడు కొత్తం చట్టం 2025 పేరుతో వస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన ఈ చట్టం 1.4.2026 నుంచి అమల్లోకి రానుంది. కొత్త చట్టం అత్యంత సరళీకృతంగా ఉంది. నిడివి, సెక్షన్లు తగ్గించారు. ‘పన్ను సంవత్సరం’ అనే కొత్త నిర్వచనంతో వర్చువల్ డిజిటల్ ఆస్తులను కూడా కలుపుతూ, సెర్చ్, సీజర్ అధికారాలను విస్తృత పరుస్తూ, ఎన్నో సంస్కరణలతో రూపుదిద్దుకొని ఇది ముస్తాబయింది.ఈ సంవత్సరంలో అన్నీ పూర్తయినా, అమలు మాత్రం 1.4.2026 నుండే ఉంటుంది. అయితే 2025 బడ్జెట్లో తెచ్చిన మార్పులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో వర్తిస్తాయి. 2026లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని మార్పులు రావడం సహజం. ముఖ్యంగా బేసిక్ లిమిట్, మినహాయింపులు, శ్లాబులు, రేట్లు, ఇవి రావచ్చు. లేదా రాకపోవచ్చు. వచ్చేవి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం. కొత్త విధానాన్ని ప్రతిపాదించినప్పటి నుంచే ప్రభుత్వం దాన్ని సమర్థిస్తూ, వెనకేసుకొస్తోంది. మధ్య తరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని శ్లాబులు, రేట్లు తెచ్చారు. దీని ప్రకారం రూ.12,00,000కు పన్ను ఉండదు. శ్లాబులు మార్చారు. రేట్లు మారాయి.రూ.12,00,000 ఆదాయాల విషయంలో శ్లాబులను మార్చకుండా రిబేటును 87 అ ప్రకారం రూ.60వేల వరకు పెంచి ఎంతో ఉపశమనం ఇచ్చారు. నికర ఆదాయం పెరిగితే వైకుంఠపాళి ఆటలో పాము నోట్లో పడినట్లే. శ్లాబుల వారీగా పన్ను కట్టాల్సి వస్తోంది. సాండర్డ్ డిడక్షన్ని కొత్త విధానంలో రూ.75వేలకు పెంచారు.ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తులు రెండు సొంత ఇళ్ల మీద పన్ను కట్టాల్సిన అవసరం లేదు. గతంలో ఒక ఇంటికే ఉన్నా.., ఇప్పుడు మినహాయింపుని రెండో ఇంటికీ కల్పించారు.కొత్త విధానంలో ఫ్యామిలీ పెన్షను మినహాయింపుని రూ.25వేలకు పెంచారు. గతంలో ఇది రూ.13,000గా ఉండేది. ఈ విధంగా కొత్త విధానాన్ని సమర్ధిస్తూ.., ఉపశమనం ఇచ్చారు. కొత్త విధానం కొంగు బంగారం అయ్యింది. ఆర్థికపరంగా ఎందరో చిన్న చిన్న అస్సెస్సీలకు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. టాక్స్ ప్లానింగ్ పేరుతో ఎటువంటి అక్రమ మార్గాలకు పాల్పడకుండా రాచమార్గంలో రాజహంసలాగా రాజీ పడకుండా, రాంగ్ రూటు వెళ్లకుండా రైట్వే ఇది. యూలిప్ ద్వారా వచ్చే మొత్తాలను క్యాపిటల్ గెయిన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మొదటి రూ.25వేలకు మినహాయింపు ఉంది. టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ సోర్స్) వర్తించే విషయాల్లో పరిమితిని పెంచారు. దానివల్ల కొంతమంది టీడీఎస్కి గురికారు. విదేశాల చెల్లింపుల్లో వర్తించే టీసీఎస్(టాక్స్ కలెక్టెడ్ సోర్స్) విషయంలో పరిమితి పెంచారు.కొన్ని వస్తువుల అమ్మకపు విషయంలో పరిమితి రూ.50,00,000 ఇక నుంచి లేదు.అప్డేటెడ్ రిటర్నులను ఫైల్ చేసుకోవడానికి 24 నెలల నుంచి 48 నెలలకు వెనక్కి వెళ్లవచ్చు. ఇది మంచి అవకాశం. అయితే షరతులకు లోబడి మాత్రమే.రిటర్నులు వేయనివారిని నాన్ఫైలర్స్ అంటారు. గతంలో ఎక్కువ టీడీఎస్/టీసీఎస్ రేట్లు వేసేవారు. ఇప్పుడు ఆ వివక్ష లేదు.భాగస్వాములకు చెల్లించే చెల్లింపుల మీద టీడీఎస్ ప్రవేశపెట్టారు. నాన్ రెసిడెంట్లకి సంబంధించి కొన్ని డిజిటల్ వ్యవహారాల మీద వేసే పన్ను 6% ఎత్తివేశారు. ఈ మార్పులను పెట్టుకొని టాక్స్ ప్లానింగ్ వైపు అడుగులు వేయండి. -
ఇంకా సగం మంది ఇంటర్నెట్కు దూరమే!
దేశీయంగా 47 శాతం మంది ప్రజలు ఇంకా ఇంటర్నెట్కి దూరంగా, ఆఫ్లైన్లోనే ఉన్నారని గ్లోబల్ టెలికం పరిశ్రమ జీఎస్ఎంఏ ఓ నివేదికలో తెలిపింది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో పురుషులతో పోలిస్తే మహిళలు 33 శాతం తక్కువగా ఉంటున్నారని వివరించింది.హ్యాండ్సెట్స్ ధర అధికంగా ఉండటం, సాంకేతిక నైపుణ్యాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు కనెక్టివిటీ మధ్య అంతరాలకు కారణమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025లో పాల్గొన్న సందర్భంగా జీఎస్ఎంఏ ఆసియా పసిఫిక్ హెడ్ జులియన్ గోర్మన్ తెలిపారు. దీన్ని సత్వరం పరిష్కరించకపోతే సమ్మిళిత వృద్ధికి అవరోధంగా నిల్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.దశాబ్దం క్రితం 108 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత డిజిటల్ ఎకానమీ 2023లో మూడు రెట్లు పెరిగి 370 బిలియన్ డాలర్లకు చేరిందని, 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయని నివేదిక వివరించింది. అయితే, కీలకమైన ఆవిష్కరణలు, వినియోగం మధ్య అంతరాలను పూడ్చకపోతే ఈ వేగం గతి తప్పే అవకాశం ఉందని, పేర్కొంది.డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు, మొబైల్ వినియోగాల్లో భారత్ అగ్రగామిగా ఉన్నప్పటికీ, పరిశోధనలు..అభివృద్ధి కార్యకలాపాలపై పెట్టుబడులు పెట్టడం, ప్రైవేట్ రంగంలో ఆవిష్కరణలు, సుశిక్షితులైన నిపుణులను అట్టే పెట్టుకోవడం వంటి విషయాల్లో వెనుకబడి ఉందని నివేదిక తెలిపింది. -
Stock Market: ఎగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
దీపావళి సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు దలాల్ స్ట్రీట్లో టపాసుల్లా పేలాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు అర శాతానికి పైగా ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 661 పాయింట్లు లేదా 0.8 శాతం పెరిగి 84,614 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 50 సూచీ 191 పాయింట్లు లేదా 0.74 శాతం పెరిగి 25,901 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ ఇండెక్స్లో కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బాన్, బజాజ్ ట్విన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అయితే క్యూ 2 ఫలితాల తరువాత పెట్టుబడిదారులు స్టాక్ లో లాభాలను బుక్ చేయడంతో ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ లూజర్గా నిలిచింది. అల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం స్టాక్స్ కూడా నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 0.7 శాతం లాభపడింది. ఇతర రంగాల సూచీలు కూడా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 0.7 శాతం దాకా పెరిగాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
షేర్లు అమ్ముకుంటున్న శాంసంగ్ యాజమాన్య కుటుంబీకులు
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) యాజమాన్య కుటుంబీకులు తమ షేర్లను అమ్ముకుంటున్నారు. ముగ్గురు కుటుంబ సభ్యులు దక్షిణ కొరియాలో సుమారు 1.73 ట్రిలియన్ వాన్ (దాదాపు రూ.10,200 కోట్లు) విలువైన కంపెనీ వాటాలను విక్రయించనున్నారు. ఇటీవల కొరియా ఎక్స్చేంజ్కు అందజేసిన రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ వివరాలను కంపెనీ వెల్లడించింది.విక్రయించే వాటాల్లో 17.7 మిలియన్ షేర్లు ఉండగా, ఇవి చైర్మన్ జే వై.లీ తల్లి హాంగ్ రా-హీ, ఆయన సోదరీమణులు లీ బూ-జిన్, లీ సియో-హ్యూన్లకు చెందినవి. 2020లో లీ కుటుంబ పెద్ద లీ కున్-హీ మరణించిన తర్వాత విధించిన సుమారు 12 ట్రిలియన్ వాన్ల (దాదాపు రూ.66,800 కోట్లు) వారసత్వ పన్ను చెల్లించేందుకు ఈ విక్రయం చేపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఈ విక్రయ ప్రక్రియను (stake sale) షిన్హాన్ బ్యాంక్, ట్రస్ట్ కాంట్రాక్టు కింద నిర్వహించనుండగా, 2026 ఏప్రిల్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. లీ బూ-జిన్, లీ సియో-హ్యూన్, హాంగ్ రా-హీ తమ వాటాలో 0.3% వాటాను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఇది వారసత్వ పన్ను చెల్లింపులో సహాయపడే దిశగా ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ సంవత్సరం ఇంతవరకు శాంసంగ్ స్టాక్ ధర 84% పైగా పెరిగింది. శుక్రవారం 0.2% పెరిగి 97,900 వాన్లకు చేరుకుంది. జూలైలో టెస్లాతో చిప్ సరఫరా ఒప్పందం ప్రకటించిన తర్వాత, కంపెనీ షేర్లు 48% వృద్ధి చెందిన సంగతి తెలిసిందే. అదే సమయంలో శాంసంగ్.. ఓపెన్ ఏఐ, ఎన్విడియా వంటి కీలక కస్టమర్లతో సరఫరా ఒప్పందాలు కుదుర్చుకుంది.కార్పొరేట్ విశ్లేషణ సంస్థ లీడర్స్ ఇండెక్స్ అధిపతి పార్క్ జు-గన్ మాట్లాడుతూ.. “గత ఏడాది ప్రకటించిన 10 ట్రిలియన్ వాన్ షేర్ బైబ్యాక్ ప్రణాళిక ద్వారా స్టాక్ విలువను రక్షించడంతోపాటు, వారసత్వ పన్నుకు నిధులు సమకూర్చేందుకు కూడా కుటుంబానికి ఇది తోడ్పడింది" అన్నారు.అయితే, ప్రస్తుతం లాభాల్లో ఉన్న సమయంలో ఇలా వాటాలు విక్రయించడం రిటైల్ పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. "శాంసంగ్ స్టాక్ దేశవ్యాప్తంగా సుమారు 5 మిలియన్ల రిటైల్ వాటాదారుల యాజమాన్యంలో ఉంది. వారు షేర్ ధర 100,000 వాన్ మార్కును చేరాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు" అని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: వారెన్ బఫెట్ చెప్పిన సక్సెస్ సీక్రెట్.. -
దీపావళి కోణంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు..
దీపావళి పండగకి సంబంధించి తినుబండారాల కోణంలో మార్కెట్లను అభివర్ణించాల్సి వస్తే .. జిలేబీగా అభివర్ణించవచ్చు. అవును, మార్కెట్లు కూడా జిలేబీలాగే మెరిసిపోతూ, వంకర్లు తిరుగుతూ, అనూహ్యమైన విధంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే బోలెడంత సహనం ఉండాల్సిందే.జిలేబీ ఆకారంలాగే ఈ ఏడాదంతా అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, వడ్డీ రేట్ల అంచనాల్లో మార్పులు, భౌగోళికరాజకీయపరంగా ఆశ్చర్యపర్చే పరిణామాలు, సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో రణగొణ ధ్వనులతో గడిచింది. అయినప్పటికీ ప్రశాంతంగా, పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు చాలా తియ్యని అనుభవాలే ఎదురయ్యాయి. స్పెక్యులేషన్కి పోకుండా క్రమశిక్షణతో ఉంటూ, ఓర్పు వహించినందుకు బహుమతిగా చిన్న చిన్న విజయాలు, నేర్చుకునే అవకాశాలు లభించాయి.ఈ ఏడాది బంగారం, వెండి టపాసుల్లాగా పేలాయి. సంప్రదాయ సిద్ధంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడి తన పాత్రను చక్కగా పోషించింది. అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్థిరత్వాన్ని అందించింది. ఒక్కసారిగా ఎగిసిన వెండి దీనికి మరింత హంగులు దిద్దింది. పాతతరం వివేకం, కొత్త తర పు ఉత్సాహం రెండూ కూడా కలిసి మెరిసేందుకు అవకాశం ఉందని ఇవి తెలియజేశాయి. అవకాశం, భద్రత మధ్య సమతుల్యతను పాటించడమే పోర్ట్ఫోలియో పటిష్టతకు కీలకమని తెలియజేశాయి. ఒకవేళ దీపావళి బహుమతులను తనదైన ప్రత్యేకత ఉన్న అసెట్ క్లాస్గా వరి్ణంచాల్సి వస్తే బంగారాన్ని వారసత్వ నెక్లెస్గా అభివరి్ణంచవచ్చు. కాలాతీతమైనదై, భావోద్వేగాలతో కూడుకున్నదై, తరతరాలుగా తన విలువను కాపాడుకుంటూ వస్తోంది పసిడి. ఇక బాండ్లను డ్రై ఫ్రూట్ బాక్సుగా అభివర్ణించవచ్చు. ఆకట్టుకునే మెరుపులు ఉండకపోయినా, ఇవి నమ్మకమైనవిగా, నిశ్శబ్దంగా అండగా నిలుస్తాయి.ఈక్విటీల విషయానికొస్తే.. ఇంట్లో తయారు చేసిన స్వీట్లలాంటి. చాలా ఓపిగ్గా, నమ్మకంతో, ఆశాభావంతో ఇవి తయారవుతాయి. అప్పుడప్పుడు గందరగోళంగా అనిపించినా ఆ తర్వాత చాలా సంతృప్తిని కలిగిస్తాయి. మరి క్రిప్టో విషయమేంటి? ఇవి పక్కింటివాళ్ల డ్రోన్ షో లాంటివి. చాలా ఆర్భాటంగా, పట్టించుకోకుండా ఉండలేని విధంగా ఉంటాయి. కానీ వీటిని కాస్త సురక్షితమైన దూరం నుంచే ఆస్వాదించడం మేలు. సంక్షోభ సమయాల్లోనే పసిడి రాణిస్తుందనే అపోహ ఒకటుంది. ఈ పండుగ సీజన్లో దాన్నుంచి బైటపడాలి. వాస్తవానికి బంగారమంటే, మార్కెట్లు బాగా లేనప్పుడు నీడనిచ్చే సాధనం మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోర్ట్ఫోలియోకు స్థిరత్వాన్నికూడా అందిస్తుంది. పర్ఫెక్ట్ దీపావళి పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే.. సమతూకంగా గల మల్టీ–అసెట్ థాలీలాగా ఉంటుంది. వృద్ధి కోసం ఈక్విటీలు .. స్థిరత్వం కోసం పసిడి .. క్రమశిక్షణ కోసం బాండ్లు .. ఇక సమర్ధత, డైవర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కోసం మ్యుచువల్ ఫండ్లో చక్కగా చుట్ట చుట్టినట్లుగా ఉంటుంది. సాధారణంగా పండుగల సందర్భంలో మార్కెట్ సెంటిమెంటు ఉత్సాహంగా ఉంటుంది. కానీ, ఊదరగొట్టే అన్లిస్టెడ్ ఐడియాలు, సైక్లికల్ థీమ్లు ఇక ముగింపు దశకొస్తున్నాయనే వార్తలు, ‘దీపావళి టిప్’ స్టాక్లు మొదలైన వాటి విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లు ఉత్సాహభరిత వాతావరణాన్ని ప్రతిబింబించవచ్చు కానీ అంతిమంగా మాత్రం ఎమోషన్లను కాకుండా ఆదాయాలనే ఫాలో అవుతాయి. వచ్చే దశాబ్దకాలం కోసం పోర్ట్ఫోలియోను రూపొందించుకోవడమే ఈ దీపావళికి మీకు మీరు ఇచ్చుకునే అత్యుత్తమ బహుమతి అవుతుంది. ఎందుకంటే సిసలైన సంపద కూడా, అందమైన రంగవల్లిలాంటిదే. ఓ లక్ష్యం పెట్టుకుని, ఎంతో ఓపిగ్గా, సమతూకాన్ని పాటిస్తూ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్లకి దీపం కొండెక్కినా, ఈ సుగుణాలే దీర్ఘకాలం పాటు నిలిచి ఉంటాయి. -
క్యూ2 ఫలితాల ఎఫెక్ట్
దీపావళి సందర్భంగా మంగళవారం(21) నిర్వహించనున్న మూరత్ ట్రేడింగ్ను మినహాయిస్తే ఈ వారం మార్కెట్లు మూడు రోజులే పనిచేయనున్నాయి. అయితే క్యూ2 ఫలితాలతోపాటు పలు అంశాలు మార్కెట్లను నడిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారాంతాన మార్కెట్లు ముగిశాక డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్(ఆర్ఐఎల్)సహా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జూలై–సెపె్టంబర్ ఫలితాలు ప్రకటించాయి. దీంతో నేడు(20న) ఈ కౌంటర్లు యాక్టివ్గా ట్రేడ్కానున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో ఈ వారం హిందుస్తాన్ యూనిలీవర్, కాల్గేట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోఫోర్జ్, ఐటీసీ హోటల్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో నేడు ఫలితాల ప్రభావంతో ట్రెండ్ నిర్దేశితంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. హెచ్యూఎల్, డాక్టర్ రెడ్డీస్ కార్పొరేట్ ఫలితాల సీజన్కు దారి చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. సంవత్ 2082 షురూ స్టాక్ మార్కెట్లలో మంగళవారం కొత్త ఏడాది సంవత్ 2082 ప్రారంభంకానుంది. దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు(బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 వరకూ ప్రత్యేక(ముహూరత్) ట్రేడింగ్ను నిర్వహించనున్నాయి. మరుసటి రోజు(22న) బలిప్రతిపాద సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఆపై గురు, శుక్రవారాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఫలితాలు, పండుగ జోష్ సంవత్ 2082 తొలి రోజు సెంటిమెంటుకు బలాన్నివ్వనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. గణాంకాలు.. దేశీయంగా 21న సెపె్టంబర్ నెలకు మౌలిక రంగ గణాంకాలు వెలువడనున్నాయి. 2025 ఆగస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔట్పుట్ 6.3 శాతం ఎగసింది. ఇది 13 నెలల గరిష్టంకాగా.. కోల్, స్టీల్, సిమెంట్ తదితరాలు ఇందుకు సహకరించాయి. ఇక 24న అక్టోబర్ తయారీ, సరీ్వసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. తయారీ పీఎంఐ సెపె్టంబర్లో 57.7కు నీరసించగా.. ఆగస్ట్లో 59.3కు బలపడింది. అంతర్జాతీయ అంశాలు చైనాపై యూఎస్ విధించిన తాజా టారిఫ్లు, వీటిపై చైనా స్పందనతోపాటు.. పరిష్కారం వంటి అంశాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు తెలియజేశారు. యూఎస్, చైనా మధ్య వాణిజ్య ఆందోళనలకు తెరపడితే సెంటిమెంటు పుంజుకోవచ్చని గౌర్ అభిప్రాయపడ్డారు. జూలై–సెపె్టంబర్కు చైనా జీడీపీ గణాంకాలు 20న విడుదలకానున్నాయి. ఏప్రిల్–జూన్లో 5.2 శాతం వృద్ధి చూపింది. 23న యూఎస్ సెపె్టంబర్ గృహ విక్రయ గణాంకాలు వెలువడనున్నాయి. 24న యూఎస్ ద్రవ్యోల్బణ వివరాలు వెల్లడికానున్నాయి. ఇవికాకుండా ముడిచమురు ధరలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు తీరు వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మిశ్రా, గౌర్ పేర్కొన్నారు.కొనుగోళ్లకు ఎఫ్పీఐలు సై ఈ నెలలో రూ. 6,480 కోట్లు గత మూడు నెలలుగా దేశీ స్టాక్స్పట్ల విముఖత చూపుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అక్టోబర్లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టపడటంతో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల 1–17 మధ్య రూ. 6,480 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం సెపె్టంబర్లో రూ. 23,885 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. ఆగస్ట్లో రూ. 34,900 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే.గత వారమిలా..13–17 మధ్య ముగిసిన గత వారం వరుసగా మూడోసారి దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,625 పాయింట్లు(2 శాతం) ఎగసి 83,952 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 483 పాయింట్లు(2 శాతం) బలపడి 25,710 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు స్వల్పంగా 0.2 శాతం పుంజుకున్నాయి. -
పసిడి పైపైకే..
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో పసిడి, వెండి ధరలు రాకెట్లలాగా దూసుకెళ్తున్నాయి. గత దీపావళి నుంచి చూస్తే పసిడి దాదాపు 63 శాతం, వెండి అంతకు మించి 72 శాతం స్థాయిలో రాబడులిచ్చాయి. గత పదేళ్ల వ్యవధిలో రెండు దీపావళి పండుగల మధ్య మూడేళ్లు మినహా ఏడు సందర్భాల్లో ఈ రెండూ సానుకూల రాబడులనే ఇచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కొత్త సంవత్లో కూడా ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ షాపింగ్ను కొనసాగిస్తాయని అంచనాలు ఉన్నాయి. 2026 దీపావళి నాటికి అంతర్జాతీయ మార్కెట్లలో 4,500–5,000 డాలర్లకు చేరొచ్చని, దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో రూ.1,40,000 – రూ.1,50,000 స్థాయికి చేరొచ్చని నిపుణులు తెలిపారు. అటు వెండి సైతం అంతర్జాతీయంగా ఔన్సుకు (31.1 గ్రాములు) 60–70 డాలర్లకు, దేశీయంగా ఎంసీఎక్స్లో రూ. 1,80,000 – రూ. 2,00,000కు చేరొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశి్చతులు తగ్గితే తప్ప, సురక్షితమైన పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండి ర్యాలీ ఇకపైనా కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ తెలిపారు. రిస్క్ ప్రొఫైల్ని బట్టి పోర్ట్ఫోలియోల్లో కనీసం 10 శాతం వాటాని పసిడి, వెండికి కేటాయించాలని పేర్కొన్నారు. -
దీపావళి స్టాక్స్ పటాకా!
కొత్త సంవత్ 2082లో కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మార్కెట్లు ముందుకే సాగుతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదాయాల వృద్ధి వేగం పుంజుకోవడం, మళ్లీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం మొదలు కావడం, వాణిజ్య విధానాలపై స్పష్టత, భౌగోళిక రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. దేశీయంగా పాలసీలు స్థిరంగా కొనసాగడం, భారీ పెట్టుబడులు, సానుకూల ద్రవ్యపరపతి విధానాలు మొదలైనవి కీలక చోదకాలుగా నిలుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం నెమ్మదించడం, ఆర్థిక క్రమశిక్షణ, కార్పొరేట్ల రుణభారం తగ్గడం తదితర అంశాల దన్నుతో కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని నువామా రీసెర్చ్ అభిప్రాయపడింది. 2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఫెడ్, ఈసీబీలు వడ్డీ రేట్లను మరికాస్త తగ్గించవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం కాస్త అదుపులో ఉన్న నేపథ్యంలో దేశీయంగా ఆర్బీఐ కూడా ఇదే బాటలో పయనించవచ్చని తెలిపింది. వేల్యుయేషన్స్ సముచిత స్థాయిలో ఉన్నాయని, అయితే గణనీయంగా పెరిగిన మిడ్–స్మాల్ క్యాప్స్లో మాత్రం కన్సాలిడేషన్కి ఆస్కారం ఉందని వివరించింది. జీఎస్టీ 2.0 సరళీకరణ, ఆదాయపు పన్నుపరమైన ఊరట, పండుగల సీజన్ మొదలైన అంశాల కారణంగా వినియోగం గణనీయంగా రికవర్ అవుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ట్రావెల్, హోటల్స్, రిటైల్ వంటి రంగాలు మెరుగ్గా ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, తదితర రంగాలు ఆకర్షణీయంగా ఉంటాయని సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది. నిఫ్టీ 28,500కి, సెన్సెక్స్ 95,000కు చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ఆధారిత సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులు మెరుగ్గా రాణించవచ్చని ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ తెలిపారు. వచ్చే ఏడాది కాలానికి వివిధ బ్రోకరేజీ సంస్థలు అందిస్తున్న స్టాక్ సిఫార్సులు సాక్షి పాఠకులకు ప్రత్యేకం! బ్రోకరేజ్: జేఎం ఫైనాన్షియల్ మారుతీ సుజుకీప్రస్తుత ధర: రూ. 16,399 టార్గెట్ ధర: రూ. 19,000 (వృద్ధి: 16%) కార్యకలాపాలు స్థిరపడే కొద్దీ విస్తరణ వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ప్రోడక్టుల మేళవింపు సానుకూలంగా ఉండటం మార్జిన్లు మెరుగుపడేందుకు దోహదపడొచ్చు. ఇన్హౌస్ బ్యాటరీ ప్లాంటుతో మరిన్ని హైబ్రిడ్ వాహనాలను ప్రవేశపెట్టొచ్చు. హైబ్రిడ్ సెగ్మెంట్లో వ్యయాలు తగ్గి, లాభదాయకత పెరుగుతుంది. అయితే, తీవ్రమైన పోటీ, కొత్తగా ప్రవేశపెట్టిన ప్యాసింజర్ వాహనాలకు స్పందన అంతంతమాత్రంగానే ఉండటం వంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 1,200 టార్గెట్ ధర: రూ. 1,330 (వృద్ధి: 11%)ఆకర్షణీయమైన వేల్యుయేషన్, అసెట్ క్వాలిటీ రిస్కులు తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయాలు నెమ్మదించడం వంటివి సానుకూలాంశాలు. రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి వేగం మరింత పుంజుకోవచ్చు. నికర వడ్డీ మార్జిన్లు ఊహించిన దానికంటే క్షీణించే అవకాశాలు ప్రతికూలాంశం. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 498 టార్గెట్ ధర: రూ. 600 (వృద్ధి: 20%)వేల్యుయేషన్ మెరుగ్గా ఉండటం, ఆదాయ రికవరీ వల్ల రీ–రేటింగ్కి అవకాశం ఉంది. పసిడి ధరల పరుగు కొనసాగుతుండటమనేది ఆదాయ అంచనాల పెంపునకు, రుణాల పోర్ట్ఫోలియో మెరుగుపడేందుకు ఉపయోగపడొచ్చు. అయితే, రుణ సంబంధ వ్యయాలు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండటం కీలక రిసు్కల్లో ఒకటిగా ఉంటుంది.ఎల్అండ్టీ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 266 టార్గెట్ ధర: రూ. 300 (వృద్ధి: 13% )మాతృ సంస్థ పటిష్టంగా ఉండటం, వైవిధ్యమైన ప్రోడక్టుల పోర్ట్ఫోలియో, లోన్ బుక్లో రిటైల్ ఫైనాన్స్ వాటా 90 శాతానికి పెరగడం వంటివి సానుకూలాంశాలు. ద్వితీయార్ధంలో పండగ సీజన్ డిమాండ్తో వృద్ధి వేగం పటిష్టంగా ఉండొచ్చు. అసెట్ క్వాలిటీపరమైన రిసు్కలు మళ్లీ తలెత్తే అవకాశాలుండటం ప్రతికూలాంశాల్లో ఒకటిగా నిలవొచ్చు. అపోలో హాస్పిటల్స్ ప్రస్తుత ధర: రూ. 7,909 టార్గెట్ ధర: రూ. 9,000 (వృద్ధి: 14% )కొత్తగా 1,717 పడకలు జతకానుండటం, ఫార్మసీ ఔట్లెట్స్ సంఖ్య 8 శాతం పెరుగుదల, పోటీ సంస్థ మ్యాక్స్ హెల్త్కేర్తో పోలిస్తే డిస్కౌంటులో ట్రేడవుతుండటం మొదలైనవి పాజిటివ్ అంశాలు. పడకల సామర్థ్యం పెంపు ఊహించిన దానికన్నా నెమ్మదిగా ఉండటం, రెగ్యులేటరీ రిస్కుల్లాంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు.బ్రోకరేజ్: చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 212 టార్గెట్ ధర: రూ. 245 (వృద్ధి: 16% )టెక్నికల్గా కొన్నాళ్ల నుంచి పటిష్టమైన బేస్ ఏర్పర్చుకుంటోంది. రూ. 195–215 శ్రేణిలో తిరుగాడుతోంది. కరెక్షన్ జరిగిన ప్రతిసారి సపోర్ట్ బలపడుతోంది. 220పై నిలకడగా కొనసాగితే రూ. 245–255 వైపు ర్యాలీ చేయొచ్చు. రూ. 207–205 వరకు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా భావించవచ్చు. రూ. 195 దిగువకి పడిపోతే బలహీనపడటాన్ని సూచిస్తుంది. సిప్లా ప్రస్తుత ధర: రూ. 1,578 టార్గెట్ ధర: రూ. 1,770 (వృద్ధి: 12%) నిర్దిష్ట శ్రేణిలో కన్సాలిడేట్ అవుతూ షేరు బలపడుతున్న సంకేతాలిస్తోంది. రూ. 1,580 వద్ద తక్షణ రెసిస్టెన్స్ ఉండగా, దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా రూ. 1,770–1,850 వైపుగా వెళ్లొచ్చు. తగ్గితే రూ. 1,480 వద్ద సపోర్ట్ లభిస్తుంది. మొమెంటమ్ ఇండికేటర్ల ప్రకారం చూస్తే బులి‹Ùగానే కనిపిస్తోంది. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర: రూ. 134 టార్గెట్ ధర: రూ. 151 (వృద్ధి: 13% )కనిష్ట స్థాయిల్లో కన్సాలిడేట్ అవుతూ, స్థిరంగా రికవర్ అవుతోంది. ప్రస్తుతం వీక్లీ చార్ట్లో బులి‹Ùగా కనిపిస్తోంది. టెక్నికల్గా రూ. 140 తక్షణ రెసిస్టెన్స్ని దాటితే మధ్య, దీర్ఘకాలికంగా రూ. 151–రూ. 158 వరకు పెరగవచ్చు. దిగువ వైపున రూ. 131 వరకు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. రూ. 126 వద్ద పటిష్టమైన మద్దతు ఉంటుంది. దానికన్నా దిగువకి పడిపోతే ర్యాలీకి స్వల్పకాలిక రిస్కులు ఉంటాయి. సెయిల్ ప్రస్తుత ధర: రూ. 129 టార్గెట్ ధర: రూ.147 (వృద్ధి: 14% )టెక్నికల్గా పటిష్టమైన బేస్ ఏర్పర్చుకున్న స్టాక్, ప్రస్తుతం నిర్ణయాత్మక బ్రేకవుట్కి సిద్ధంగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారీ వాల్యూమ్స్తో రూ. 138కి ఎగువన నిలకడగా క్లోజయితే, తదుపరి దశ ర్యాలీకి దారితీయొచ్చు. దిగువన రూ. 125 స్థాయి వరకు మరింతగా షేర్లను మరింతగా కొనుగోలు చేయొచ్చు. రూ. 116 వద్ద సపోర్ట్ ఉంటుంది. బీడీఎల్ ప్రస్తుత ధర: రూ. 1,540 టార్గెట్ ధర: రూ. 1,700 (వృద్ధి: 10% )ఫిబోనకీ రిట్రేస్మెంట్ లెవెల్కి 50 శాతం వద్ద కన్సాలిడేట్ అవుతోంది. ఇదే జోన్లో సపోర్ట్ లభిస్తోంది. సాధారణంగా ర్యాలీ చేసే ముందు, ఇలాంటి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. తక్షణ రెసిస్టెన్స్ రూ. 1,560 వద్ద ఉంటుంది. దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే బులిష్ ధోరణి బలపడి, సమీప భవిష్యత్తులో మరింత ర్యాలీకి దోహదపడొచ్చు. తగ్గితే, రూ. 1,440 వరకు కొనుక్కోవచ్చు. రూ. 1,380 బలమైన సపోర్ట్ జోన్గా ఉంటుంది.బ్రోకరేజ్: మిరే అసెట్ షేర్ఖాన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర: రూ. 8,245 టార్గెట్ ధర: రూ. 9,300 (వృద్ధి: 13%) ఈ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులను అందిస్తోంది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో ఏసీలతో పాటు కంపెనీ వాషింగ్ మెషీన్ల మార్కెట్లోకి, అటు ఎల్రక్టానిక్స్లోకి, సెమీకండక్టర్ సబ్్రస్టేట్ పీసీబీలు మొదలైన వాటిల్లోకి ప్రవేశిస్తుండటం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించుకుంటోంది. ఎల్రక్టానిక్స్పై వచ్చే అయిదేళ్లలో రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. చాలెట్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 975 టార్గెట్ ధర: రూ. 1,172 (వృద్ధి: 20%)వ్యూహాత్మక కొనుగోళ్లు, గదుల పెంపు, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వంటివి సంస్థకు సానుకూలంగా ఉండనున్నాయి. అలాగే, కమర్షియల్ బిజినెస్ వాటా పెరుగుతుండటమనేది వృద్ధికి కీలక చోదకంగా నిలవనుంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025 డిసెంబర్ ఆఖరు నాటికి గదుల సంఖ్యను 4,500కి పెంచుకోనుంది. కమిన్స్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 3,976 టార్గెట్ ధర: రూ. 4,500 (వృద్ధి: 13% )హై–హార్స్పవర్ (హెచ్హెచ్పీ) జెన్సెట్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. పటిష్టమైన బ్రాండింగ్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. 2025 తొలినాళ్ల నుంచి పవర్జెన్ వ్యాపారం పుంజుకుంది. డేటా సెంటర్లు, హాస్పిటల్స్, మొదలైన రంగాల నుంచి హెచ్హెచ్పీ జెన్సెట్లకు డిమాండ్ కొనసాగనుంది. ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. యూరప్, ఆప్రికా, పశ్చిమాసియాలో డిమాండ్ స్థిరంగా ఉంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ప్రస్తుత ధర: రూ. 4,880 టార్గెట్ ధర: రూ. 6,000 (వృద్ధి: 23%) ఎయిర్క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు, ఇంజిన్లు, యాక్సెసరీలు అందించే హెచ్ఏఎల్కి భారతదేశపు డిఫెన్స్ రంగంలో విశిష్టమైన స్థానం ఉంది. తయారీ సెగ్మెంట్ కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల ఆదాయ వృద్ధి మెరుగుపడొచ్చు. రూ. 1.9 లక్షల కోట్ల ఆర్డర్ బ్యాక్లాగ్ ఉంది. రాబోయే 1–2 ఏళ్లలో రూ. లక్ష కోట్ల ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. హడ్కో ప్రస్తుత ధర: రూ. 224 టార్గెట్ ధర: రూ. 260 (వృద్ధి: 16% )సామాజిక హౌసింగ్, అర్బన్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది. ప్రభుత్వాలతో పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏయూఎం వార్షికంగా 25 శాతం పైగా, లాభం 23 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. వచ్చే 18 నెలల్లో మొండిపద్దుల భారాన్ని పరిష్కరించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది. బ్రోకరేజ్: మోతీలాల్ ఓస్వాల్ ఎస్బీఐ ప్రస్తుత ధర: రూ. 889 టార్గెట్ ధర: రూ. 1,000 (వృద్ధి: 12%)జీఎస్టీ 2.0, ఆదాయ పన్ను సంస్కరణలు, ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు మొదలైనవి రుణ వృద్ధికి దారి తీయొచ్చని, బీఎఫ్ఎస్ఐ రంగం లాభదాయకతకు తోడ్పడవచ్చని అంచనాలు ఉన్నాయి. రిటైల్, ఎస్ఎంఈ, కార్పొరేట్ సెగ్మెంట్లవ్యాప్తంగా పటిష్టమైన కార్యకలాపాలు ఉండటం బ్యాంకుకు సానుకూలాంశం. ఎంఅండ్ఎం ప్రస్తుత ధర: రూ. 3,648 టార్గెట్ ధర: రూ. 4,091 (వృద్ధి: 12%)2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి 2030 నాటికి కంపెనీ 7 ఐసీఈ ఎస్యూవీ వాహనాలను, 5 బీఈవీలను, 5 ఎల్సీవీలను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఐసీఈ, ఈవీ సెగ్మెంట్లలో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ, కొత్త ఉత్పత్తుల దన్ను, ట్రాక్టర్ల మార్జిన్లు మెరుగుపడటం మొదలైనవి సంస్థకు కలిసి రానున్నాయి. భారత్ ఎల్రక్టానిక్స్ ప్రస్తుత ధర: రూ. 413 టార్గెట్ ధర: రూ. 490 (వృద్ధి: 19% )ఆర్మీ నుంచి రూ. 30,000 కోట్ల అనంత శస్త్ర ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి కంపెనీ, లీడ్ ఇంటిగ్రేటరుగా వ్యవహరిస్తుండటం వల్ల కంపెనీ అర్డరు బుక్ రూ. లక్ష కోట్ల స్థాయిని దాటే అవకాశముంది. ఇది, వ్యూహాత్మక డిఫెన్స్ ప్రోగ్రాంలలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని తెలియజేస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్వ్యాప్తంగా అవకాశాలతో దీర్ఘకాలికంగా కంపెనీ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. స్విగ్గీ ప్రస్తుత ధర: రూ. 432 టార్గెట్ ధర: రూ. 550 (వృద్ధి: 27% )పోటీ నెమ్మదిస్తుండటం, డార్క్ స్టోర్లను విస్తరణ క్రమంగా స్థిరపడుతుండటం మొదలైన వాటి కారణంగా కంపెనీకి చెందిన ఇన్స్టామార్ట్ విభాగం త్వరలో లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ మార్పుల వల్ల వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వ్యాపార వృద్ధి, గతంలో అంచనా వేసిన 20 శాతానికన్నా మెరుగ్గా 23 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా. ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 735 టార్గెట్ ధర: రూ. 880 (వృద్ధి: 20% )ఆక్యుపెన్సీ, ఏఆర్ఆర్ పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా దేశీయంగా హాస్పిటాలిటీ పరిశ్రమ 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా వృద్ధి చెందనుంది. అలాగే ఎంఐసీఈ యాక్టివిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వితీయార్ధంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైనవి కూడా కంపెనీ వృద్ధికి దోహదపడనున్నాయి. బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్ (ఏఏబీఎల్) ప్రస్తుత ధర: రూ. 1,058 టార్గెట్ ధర:రూ. 1,182 (వృద్ధి: 12% )క్రమంగా ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ వైపు మళ్లుతోంది. మధ్యప్రదేశ్లో 20–25 శాతం వరకు మార్కెట్ వాటా ఉంది. అలాగే, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఉత్తర్ప్రదేశ్ మార్కెట్లలోకి కూడా విస్తరిస్తోంది. ఇటీవలే నికోబార్ జిన్, హిల్ఫోర్ట్ విస్కీ అనే ప్రీమియం బ్రాండ్లను ప్రవేశపెట్టడంతో పాటు కొత్తగా బ్రాందీ, టెకీలాలో కూడా మరిన్ని ప్రోడక్ట్లను ప్రవేశపెట్టబోతోంది. వ్యయాలు తగ్గించుకుని, స్థిరమైన మార్జిన్లను సాధించేందుకు కసరత్తు చేస్తోంది. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: రూ. 2,011 టార్గెట్ ధర: రూ. 2,244 (వృద్ధి: 12%) ఏఆర్ పీయూ, డిజిటల్ వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏఆర్పీయూ రూ. 250గా ఉండగా, టారిఫ్ల పెంపుతో రూ. 300 సమీపానికి చేరే అవకాశం ఉంది. ఇక గూగుల్, ఒరాకిల్, యాపిల్, హ్యూస్లాంటి దిగ్గజాలతో జట్టు కట్టడం ద్వారా మొబైల్ సరీ్వసుల పరిధికి మించి ఇతర విభాగాల్లోకి ప్రవేశించడంలో కంపెనీకి తోడ్పడనుంది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్రస్తుత ధర: రూ. 541 టార్గెట్ ధర: రూ. 639 (వృద్ధి: 18% )భారతదేశపు ఇంధన పరివర్తన లక్ష్యాలతో కంపెనీకి ప్రయోజనం చేకూరనుంది. కంపెనీ ఇప్పటికే నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే 20 గిగావాట్ల స్ట్రాటెజీ 2.0 టార్గెట్ని సాధించింది. ఇప్పుడు 2030 నాటికి 30 గిగావాట్ల కెపాసిటీ, 40 గిగావాట్అవర్ స్టోరేజీని సాధించే దిశగా ముందుకెళ్తోంది. రూ. 1.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ప్రణాళికలు ఉన్నప్పటికీ పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. ఎల్అండ్టీ ప్రస్తుత ధర: రూ. 3,839 టార్గెట్ ధర: రూ. 4,243 (వృద్ధి: 11%) క్యాపిటల్ గూడ్స్ విభా గానికి చెందిన ఈ సంస్థ కు రూ. 6.1 లక్షల కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఇన్ఫ్రా, ఎనర్జీ, హైడ్రోకార్బన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ. 14.8 లక్షల కోట్ల ఆర్డర్లు కుదిరే దశలో ఉన్నాయి. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా కంపెనీ లాభదాయకత మరింత మెరుగుపడనుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 72 టార్గెట్ ధర: రూ. 88.5 (వృద్ధి: 23%)కాసా డిపాజిట్లు 26 శాతం వృద్ధి చెందాయి. దీంతో కాసా నిష్పత్తి 48 శాతానికి, క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తి 93.4 శాతానికి పెరిగాయి. నిధుల సమీకరణ వ్యయా లు తగ్గి, 2025–26 మూడో త్రైమాసికానికి మార్జిన్లు 5.7 శాతానికి చేరే అవకాశముంది. 2024–25లో రూ. 1,525 కోట్లుగా ఉన్న లాభాలు, 2026 కల్లా రూ. 4,560 కోట్లకు ఎగిసే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పోస్టల్ ఉద్యోగులకు బిగ్ న్యూస్.. దీపావళి కానుక ప్రకటన
దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఆనందకరమైన బహుమతిని ప్రకటించింది. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉత్పాదకత-లింక్డ్ బోనస్ను ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పోస్టల్ ఉద్యోగులకు 60 రోజుల వేతనానికి సమానమైన బోనస్ లభిస్తుంది.ఈ బోనస్ను పొందే ఉద్యోగుల వర్గాలుపోస్టల్ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. ఈ బోనస్ పొందడానికి ఈ కింది వర్గాల ఉద్యోగులు అర్హులురెగ్యులర్ ఉద్యోగులు - గ్రూప్ సి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్), నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులు.గ్రామీణ డాక్ సేవకులు - రెగ్యులర్ సర్వీస్లో ఉన్నవారుతాత్కాలిక, ఫుల్టైమ్ క్యాజువల్ ఉద్యోగులుఅదనంగా, 2025 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా డిప్యుటేషన్కు వెళ్లిన ఉద్యోగులు కూడా ఈ బోనస్ కు అర్హులు.బోనస్ లెక్కింపు విధానంబోనస్ లెక్కించడానికి పోస్టల్ శాఖ స్పష్టమైన ఫార్ములాను కూడా అందించింది. రెగ్యులర్ ఉద్యోగులకు బోనస్ = (సగటు వేతనం × 60 రోజులు ÷ 30.4). అయితే, బోనస్ లెక్కించడానికి గరిష్ట జీతం పరిమితిని నెలకు రూ .7,000 గా నిర్ణయించారు.గ్రామీణ డాక్ సేవకులకు (జీడీఎస్)కు వారి టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (టీఆర్సీఏ), డియర్ నెస్ అలవెన్స్ ఆధారంగా బోనస్ నిర్ణయిస్తారు.తాత్కాలిక లేదా ఫుల్ టైమ్ క్యాజువల్ వర్కర్లకు వారి అంచనా వేతనం రూ.1,200 ఆధారంగా వారికి అడ్హాక్ బోనస్ ఇస్తారు.సర్వీసు విడిచిపెట్టిన అంటే 2025 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా బదిలీ అయిన ఉద్యోగులకు కూడా ప్రో-రేటా ప్రాతిపదికన బోనస్ లభిస్తుందని ఉత్తర్వులో పోస్టల్ శాఖ పేర్కొంది. -
వారెన్ బఫెట్ చెప్పిన సక్సెస్ సీక్రెట్..
ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పేరుగాంచిన వారెన్ బఫెట్.. తన సంపత్తి కంటే ఎక్కువగా తన పెట్టుబడి మేథసంపత్తికి, పట్టుదలకి, దాతృత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యాపారవేత్త. ప్రపంచంలోని అత్యంత వయోవృద్ధ బిలియనీర్లలో ఒకరైన ఆయన, టీనేజ్లోనే తన మొదటి పెట్టుబడి పెట్టారు. ‘1% క్లబ్’లో భాగంగా, తన సంపాదనలో 99 శాతాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని ప్రతిజ్ఞ చేసిన బఫెట్.. తన దాతృత్వ ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.బఫెట్ విజయం వెనుక అలవాట్ల పాత్ర ఎక్కువవారెన్ బఫెట్ (Warren Buffett) జీవిత సూత్రం "తక్కువగా పనిచేయడం కాదు, కానీ తెలివిగా జీవించడం". ప్రతిరోజూ చదవడం, త్వరగా పడుకోవడం, ఏ పనినైనా ప్రారంభించే ముందు చక్కగా ఆలోచించడం ఆయన దైనందిన జీవితంలోని అలవాట్లు. ఇవి సింపుల్ కనిపిస్తాయి. కానీ ప్రభావవంతమైనవి. వాస్తవానికి, బఫెట్ రోజులో 80 శాతానికి పైగా చదవడం, ఆలోచించడానికే కేటాయిస్తారు. కొన్ని రోజుల్లో ఇది 6 గంటల దాకా ఉంటుంది.అలవాట్ల శక్తి గురించి బఫెట్ ఆసక్తికర ఉదహరణఒకసారి, యువ విద్యార్థులతో మాట్లాడుతుండగా, బఫెట్ అలవాట్ల రూపకల్పనలో ఉన్న "అదృశ్య శక్తి" గురించి ఆసక్తికరంగా వివరించారు. "మీరు గౌరవించే ఇద్దరు వ్యక్తులు, అలాగే మీకు అసహ్యంగా అనిపించే మరో వ్యక్తిని తీసుకోండి. తరువాత, ఈ ముగ్గురు వ్యక్తుల లక్షణాలను పేపర్పై రాయండి" అంటూ సూచించారు.ఈ ప్రక్రియ ద్వారా బఫెట్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే.. "మీరు ఆదర్శంగా భావించే వ్యక్తుల లక్షణాలు మీకూ సాధ్యమైనవే. కొంత అభ్యాసం చేస్తే మీరు కూడా అలాంటి వ్యక్తిగా మారగలరు. ఇవి అలవాట్లుగా మారినపుడు, అవే మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి".అలవాట్లు ఎలా ఏర్పడతాయో, వాటిని చిన్నవయస్సులో ఎలా మార్చగలమో స్పష్టంగా వివరించేందుకు బఫెట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఉదాహరణను ప్రస్తావించారు. ఫ్రాంక్లిన్ "ఒక వ్యక్తి కావాలనుకునే లక్షణాన్ని తాను అభ్యసించి అలవాటుగా మార్చుకున్నాడు" అని బఫెట్ చెబుతూ.. "అలవాట్ల గొలుసులు మొదట తేలికగా ఉంటాయి. మనం గుర్తించలేము కూడా. కానీ, అవి గట్టిపడితే, విరగ్గొట్టడం కష్టమవుతుంది. కాబట్టి చిన్న వయస్సులోనే మంచి అలవాట్లను అభ్యసించండి" అన్నారు.ఇదీ చదవండి: రిచ్ అవ్వాలంటే కూడబెట్టాల్సింది ఆ ‘ఫేక్ డబ్బు’ కాదు.. -
స్వల్ప యాంటీబయాటిక్ చికిత్సతోనే నవజాత ఇన్ఫెక్షన్లు నయం
హైదరాబాద్: స్వల్పకాలిక యాంటీబయాటిక్ చికిత్సలతోనే నవజాత శిశువుల్లో ఇన్ఫెక్షన్లను నయం చేయొచ్చని శిశు వైద్య నిపుణులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్ ఫెర్నాండెజ్ హాస్పిటల్కి చెందిన డా. సాయికిరణ్.డితో సహా భారతీయ నియోనాటాలజీ నిపుణుల బృందం ప్రముఖ జర్నల్ ‘లాన్సెట్ క్లినికల్ మెడిసిన్’లో కీలక అధ్యయనాన్ని ప్రచురించింది. సాధారణంగా తీవ్రమైన నవజాత ఇన్ఫెక్షన్లకు 10–14 రోజుల యాంటీబయాటిక్ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. కానీ వీటిలో చాలావాటిని 7 రోజుల స్వల్ప కాలిక చికిత్సలతోనే నయం చేయొచ్చని ఈ అధ్యయనంలో తేల్చారు.అధికంగా లేదా ఎక్కువకాలం యాంటీబయాటిక్స్ వాడకం ద్వారా వ్యాధికారక బ్యాక్టీరియా ప్రతిరోధకత పెరగడంతోపాటు దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, దీంతో ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకంగా అకాల లేదా అనారోగ్యంతో జన్మించిన శిశువులు ఎక్కువగా యాంటీబయాటిక్స్కు లోనవుతున్నారు.శిశువుల ఇన్ఫెక్షన్లపై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక యాంటీబయాటిక్ చికిత్సల ప్రభావాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించారు. ముఖ్యంగా “బయోమార్కర్స్” ఆధారంగా చికిత్స కొనసాగింపును నిర్ణయించడం మెరుగైన ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. రక్త పరీక్షల ద్వారా సంక్రమణ తగ్గుతుందా లేదా అన్న విషయాన్ని గమనించి, అవసరమైనప్పుడు చికిత్స ఆపడం సాధ్యమవుతుంది.అధ్యయన ఫలితాల్లో కీలకాంశాలు10–14 రోజుల చికిత్సల స్థానంలో 7 రోజుల స్వల్పకాలిక చికిత్స చాలా సందర్భాల్లో సరిపోతుందని తేలింది.“బయోమార్కర్” పరీక్షలు చికిత్స నిర్ణయానికి సహాయపడతాయి.అయితే 3–4 రోజుల చికిత్సకు, 5–7 రోజుల చికిత్స మధ్య తేడాపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ అంశంలో ఇంకా పరిశోధన అవసరం.మూత్ర సంక్రమణ, మెనింజైటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లపై మరింత స్పష్టత అవసరం. -
రెట్టింపైన ఐడీబీఐ బ్యాంకు లాభం
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్)లో వాటా విక్రయం ద్వారా వచి్చన లాభంతో కలుపుకొని, ఐడీబీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.3,627 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఎన్ఎస్డీఎల్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 2.22 కోట్ల ఈక్విటీలు(11.11% వాటాకు సమానం) జారీ చేసి రూ.1,698.96 కోట్లు ఆర్జించినట్లు బ్యాంకు ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఆర్జించిన రూ.1,836 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది రెట్టింపు. ఇదే క్యూ2లో నిర్వహణ లాభం 17% వృద్ధి చెంది రూ.3,006 కోట్ల నుంచి రూ.3,523 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,875 కోట్ల నుంచి రూ.3,285 కోట్లకు దిగివచ్చింది. స్థూల ఎన్పీఏ రేషియో 3.68% నుంచి 2.65 శాతానికి మెరుగుపడింది.నికర ఎన్పీఏ స్వల్పంగా 0.20% నుంచి 0.21 శాతానికి పెరిగింది. మొత్తం వ్యాపార వార్షిక వృద్ధి 12% పెరిగి రూ.5,33,730 కోట్లకు చేరింది. సెపె్టంబర్ 30 నాటికి బ్యాంకు మొత్తం డిపాజిట్ల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ రూ.1,39,036 కోట్లుగా, కాసా రేషియో 45.81% నమోదైందని పేర్కొంది. -
జియో ఫైనాన్షియల్ లాభం అంతంతే..!
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (ముకేశ్ అంబానీకి చెందిన) సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి (2025–26లో క్యూ2) రూ. 695 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్స రం ఇదే త్రైమాసికంలో లాభం రూ. 689 కోట్లతో పోల్చితే 0.9% పెరిగింది.క్యూ2లో మొత్తం ఆదాయం రూ.981 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 694 కోట్లు గా ఉంది. అంటే ఆదా యం 40% వృద్ధి చెందింది. వడ్డీ ఆదా యం దాదాపు రెట్టింపు రూ.392 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ.205 కోట్లుగానే ఉంది.ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఫర్వాలేదు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో (2025–26 క్యూ2) రూ.561 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.571 కోట్లతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గింది. ఆదాయం ఇదే కాలంలో 9 శాతం వృద్ధితో రూ.2,857 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా వ్యయాలు 11 శాతం ఎగసి రూ.1,647 కోట్లకు చేరడం లాభాలపై ప్రభావం చూపించింది.వసూలు కాని మొండి రుణాలకు (ఎన్పీఏలు) చేసిన కేటాయింపులు 29 శాతం పెరిగి రూ.481 కోట్లుగా ఉన్నాయి. క్యూ2లో డిపాజిట్లు 21 శాతం పరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరాయి. సంజయ్ అగర్వాల్ను ఎండీ, సీఈవోగా మరో మూడేళ్ల కాలానికి కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. వాటాదారులు, ఆర్బీఐ ఆమోదం తెలిపితే 2026 ఏప్రిల్ 19 నుంచి 2029 ఏప్రిల్ 18 వరకు ఎండీ, సీఈవోగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. -
‘కొత్త’ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. కోట్లలో జీతాలు
టెక్ రంగంలో నూతన ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా (Meta) తాజాగా గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకుని ఎంట్రీ లెవల్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అర్హత ఉన్న అభ్యర్థులకు మెటా మంచి జీతాలు, స్టాక్ ఆప్షన్లు, ఆరోగ్య ప్రయోజనాలువంటి ఆకర్షణీయమైన ప్యాకేజ్లను అందిస్తోంది.కావాల్సిన అర్హతలు ఇవే..మెటా ప్రస్తుతం ఫుల్-స్టాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (full-stack software engineers), ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (product software engineer)లాంటి ఉద్యోగాల కోసం అభ్యర్థులను నియమిస్తోంది. ఈ ఉద్యోగాలకు..కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ సైన్సెస్లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ సమయంలో లేదా తరువాత ఈ కిందివాటిలో కనీసం ఒకదాన్నైనా కలిగి ఉండాలి..సంబంధిత యూనివర్సిటీ కోర్సు, ఇంటర్న్షిప్, థీసిస్PHP, Hack, C++, Python లాంటి లాంగ్వేజెస్లో 12 నెలల పని అనుభవంReact వంటి ఫ్రేమ్వర్క్లో పని చేసిన అనుభవంలార్జ్ స్కేల్ స్టోరేజ్ సిస్టమ్లతో పని చేయగల సామర్థ్యంiOS సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలకు మాత్రం అభ్యర్థులకు ఒక సంవత్సరం అనుభవం.. ముఖ్యంగా ఆబ్జెక్ట్-ఒరియెంటెడ్ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడింగ్, Linux/Unix సిస్టమ్స్లో ఉండాలి.జీతం ఎంతంటే.. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, ఈ ఎంట్రీ లెవల్ పాత్రలకు వార్షిక జీతం 176,000 డాలర్ల నుంచి 290,000 డాలర్ల వరకు ఉంటుంది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.1.46 కోట్ల నుంచి రూ.2.41 కోట్లు అన్న మాట. జీతంతో పాటు వార్షిక బోనస్లు, స్టాక్ ఈక్విటీలు, ఆరోగ్య భద్రతా ప్రయోజనాలు, * ఇతర కార్మిక సంక్షేమ పథకాలు ఉంటాయి.అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగాలు ఆన్-సైట్ మాత్రమే. అంటే వాషింగ్టన్ లేదా కాలిఫోర్నియాలోని మెటా కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. రిమోట్ వర్క్ ఆప్షన్ ఉండదు.ఈ అవకాశాల ప్రాముఖ్యత ప్రస్తుతం చాలా కంపెనీలు నూతన గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంలో జాప్యం చేస్తుండగా, మెటా మాత్రం యువ ప్రతిభను గుర్తించి, వారిని ఉద్యోగాలలో చేర్చుకోవడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. ఆటోమేషన్ పెరుగుతున్న ప్రస్తుత ఉద్యోగ విపణిలో, ఇది ఒక దిగ్గజ కంపెనీ నుంచి వచ్చిన సువర్ణావకాశంగా నిలిచింది.మార్క్ జుకర్బర్గ్ అభ్యర్థుల్లో చూసేదిదే..మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) సాంప్రదాయ విద్యా ప్రమాణాల కంటే ప్రయోజనకర నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆయన మాటల్లోనే.."ఒకరు ఏదైనా పనిని లోతుగా నేర్చుకొని అద్భుతంగా చేయగలరని చూపగలిగితే, వారు ఆ నైపుణ్యాన్ని ఇతర రంగాల్లో కూడా వర్తింపజేయగలరు"కాబట్టి, అభ్యర్థులు తమ అభ్యాస నైపుణ్యాలను, సమస్యలపై అవగాహనను స్పష్టంగా చూపగలగాలి. మెటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అవకాశాలను అందుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు.. దాన్ని ప్రయోగించగలగడం ముఖ్యమైంది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. చిగురించిన ఆశలు -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.. 3 నెలల్లో రూ. 12359 కోట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 3.2 శాతం పెరిగి (కన్సాలిడేటెడ్) రూ. 13,357 కోట్లకు చేరింది. ప్రొవిజనింగ్ తగ్గడమనేది మార్జిన్ క్షీణత ప్రభావాలను అధిగమించేందుకు తోడ్పడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన లాభం రూ. 11,746 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ. 12,359 కోట్లకు చేరింది.మరోవైపు, 10.6 శాతం రుణాల వృద్ధి దన్నుతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 7.4 శాతం పెరిగి రూ. 21,529 కోట్లకు చేరింది. అయితే, నికర వడ్డీ మార్జిన్ మాత్రం 4.36 శాతం నుంచి 4.30 శాతానికి పరిమితమైంది. రాబోయే రోజుల్లో నికర వడ్డీ మార్జిన్లు స్థిర శ్రేణిలో తిరుగాడవచ్చని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా తెలిపారు.అయితే, రిజర్వ్ బ్యాంక్ గానీ నగదు నిల్వల నిష్పత్తిని తగ్గిస్తే ఇది మెరుగుపడొచ్చని, పోటీ తీవ్రత వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపొచ్చని పేర్కొన్నారు. చిన్న వ్యాపార సంస్థల రుణాల నాణ్యత దిగజారే అవకాశాలపై స్పందిస్తూ.. బిజినెస్ బ్యాంకింగ్ సెగ్మెంట్లో రుణాల పరిస్థితి మెరుగ్గానే ఉందని బాత్రా చెప్పారు. అందుకే ఆ విభాగానికి రుణాలను పెంచుకుంటున్నట్లు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రిటైల్ రుణాలు సహా క్రెడిట్ వృద్ధి పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశీ కార్పొరేట్ల వద్ద పుష్కలంగా నిధులున్నాయని, రుణాలను సమకూర్చుకునేందుకు ఇతరత్రా మార్గాలు కూడా ఉన్నాయని బాత్రా చెప్పారు. ఆర్థిక ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు.. క్యూ2లో వార్షిక ప్రాతిపదికన రూ. 1,233 కోట్ల నుంచి, త్రైమాసికాలవారీగా రూ. 1,815 కోట్ల నుంచి ప్రొవిజనింగ్ రూ. 914 కోట్లకు తగ్గింది. స్థూల మొండిబాకీలు (జీఎన్పీఏ) రూ. 5,073 కోట్ల నుంచి స్వల్పంగా రూ. 5,034 కోట్లకు తగ్గాయి. జీఎన్పీఏ నిష్పత్తి 1.97 శాతం నుంచి 1.67 శాతానికి తగ్గింది. డిపాజిట్ వృద్ధి 9.1 శాతంగా ఉంది. రిటైల్ రుణాలు 6.6 శాతం పెరిగాయి. మొత్తం లోన్ బుక్లో వీటి వాటా 52.1 శాతంగా ఉంది. బిజినెస్ బ్యాంకింగ్ పోర్ట్ఫోలియో 24.8 శాతం వృద్ధి చెందింది. కార్పొరేట్ రుణాలు 3.5 శాతం పెరిగాయి. క్యాపిటల్ అడెక్వసీ 17.31 శాతంగా ఉంది. ట్రెజరీ లావాదేవీలు మినహా వడ్డీయేతర ఆదాయం 13.2 శాతం పెరిగి రూ. 7,356 కోట్లుగా నమోదైంది. ట్రెజరీ ఆదాయం మాత్రం రూ. 680 కోట్ల నుంచి ఏకంగా రూ. 220 కోట్లకు పడిపోయింది. -
మొన్న జెడ్900.. ఇప్పుడు వెర్సిస్ 1100: కవాసకి కొత్త బైక్
జపనీస్ వాహన తయారీదారు.. కవాసకి ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసిన తరువాత, 2026 వెర్షన్ వెర్సిస్ 1100 లాంచ్ చేసింది. దీని ధర రూ. 13.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ అడ్వెంచర్ టూరర్ ఫిబ్రవరి 2025లో భారతదేశంలో తొలిసారిగా వెర్సిస్ 1000 స్థానంలో లాంచ్ అయింది.2026 వెర్షన్ వెర్సిస్ 1100 డిజైన్, ఫీచర్లలో ఎలాంటి మార్పులు కనిపించినప్పటికీ.. పనితీరు పెరిగిందని తెలుస్తోంది. ఇందులోని 1099 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ ఫోర్ ఇంజన్.. 133 హెచ్పి పవర్, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్, టార్క్ రెండూ కూడా స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువే. కాబట్టి పనితీరు మెరుగ్గా ఉంటుంది.2026 కవాసకి వెర్సిస్ 1100 బైకులో కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ (KTRC) సిస్టమ్, కవాసకి కార్నరింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్ (KCMF), కవాసకి ఇంటెలిజెంట్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ (KIBS) వంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 21 లీటర్లు. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి.. లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: టీవీఎస్ కొత్త అడ్వెంచర్ బైక్: ధర ఎంతో తెలుసా? -
పెరిగిన యస్ బ్యాంక్ లాభం: రూ. 654 కోట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం రూ. 654 కోట్లకు చేరింది. గత క్యూ2లో నమోదైన రూ. 553 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగింది. ఇక లోన్బుక్ 6.4 శాతం వృద్ధి చెందడంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 0.10 శాతం మెరుగుపడి 4.6 శాతానికి చేరింది. ఇతర ఆదాయం 16.9 శాతం పెరిగి రూ. 1,644 కోట్లుగా నమోదైంది.తాజా స్లిప్పేజీలు అంతక్రితం త్రైమాసికంలో ఉన్న రూ. 1,458 కోట్ల నుంచి రూ. 1,248 కోట్లకు దిగివచ్చాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి పెద్దగా మార్పు లేకుండా 1.6 శాతం స్థాయిలో కొనసాగుతోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం స్థాయి రుణ వృద్ధి సాధించాలని నిర్దేశించుకున్నట్లు బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఇకనుంచి నికర వడ్డీ మార్జిన్లు మరింత మెరుగుపడగలవని ఆయన పేర్కొన్నారు. జపాన్ దిగ్గజం ఎస్ఎంబీసీ 24 శాతం పైగా వాటాను కొనుగోలు చేసినప్పటికీ, తక్షణమే వ్యాపార ప్రణాళికల్లో మార్పులేమీ ఉండబోవని కుమార్ వివరించారు. భవిష్యత్ ప్రణాళికలను నిర్దేశించే వార్షిక సర్వసభ్య సమావేశం యథా ప్రకారంగానే జరుగుతుందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 80 శాఖలను ప్రారంభించే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. -
యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు, ఎక్కడికి వెళ్లినా గోల్డ్ కొనేస్తూ ఉంటారు. ఇంకొందరైతే గోల్డ్ కొనుగోలు చేయడానికి ప్రత్యేకించి.. అరబ్ దేశాలకు వెళ్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిబంధనల ప్రకారం.. భారతీయ ప్రయాణికుల వద్ద ఎంత విలువైన బంగారం ఉంటే డిక్లేర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.భారతీయులు యూఏఈ (UAE)కి ప్రయాణించే సమయంలో తమ వద్ద ఉన్న బంగారం విలువ రూ.13.5 లక్షల(AED 60,000)కు మించి ఉంటే, దానికి డిక్లేర్ (declare) చేయాల్సి ఉంటుంది. అంటే, మీరు వెంట తీసుకెళ్లే బంగారం విలువ.. ఈ పరిమితికి మించి ఉంటే, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.పరిమితికి మించి బంగారం తీసుకెళ్లడానికి లీగల్గా ఎలాంటి అనుమతి ఉండదు. కాబట్టి దీనికి ట్యాక్స్, డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. వివాహాలు, పండుగలు లేదా గిఫ్ట్ రూపంలో.. సాంప్రదాయకంగా బంగారు ఆభరణాలను తీసుకెళ్లే భారతీయ పర్యాటకులు, NRIలు, వ్యాపార ప్రయాణికులు ఆ విషయాన్ని తప్పకుండా గమనించాలి.ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు, ట్యాక్స్ ఎగవేతను అడ్డుకునేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. డిక్లేర్ చేయకుండా ఎక్కువ బంగారం తీసుకెళితే, దానిని సీజ్ చేయవచ్చు. లేదా మీకు భారీ జరిమానా పడవచ్చు లేదా జైలుశిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుంది. -
ఫన్ అండ్ ఫవర్ఫుల్ టీవీ!
ఇంట్లో కుటుంబం మొత్తానికి ఆనంద కేంద్రం టీవీ. కాని, దాని వలన ఎక్కువసార్లు సంతోషం కంటే సమస్యలే ఎదురవుతాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం ఇచ్చే అద్భుతమైన గాడ్జెట్లు ఇవీ!కామ్గా చూడొచ్చు!రాత్రి హాయిగా పిల్లలు పడుకొని ఉంటే, అప్పుడే పేరెంట్స్ ‘ఇప్పుడు మనం ప్రశాంతంగా సినిమా చూడొచ్చు’ అనుకుంటారు. కాని, టీవీలో వచ్చే ఒక్క మాస్ సీన్ సౌండ్తో మొత్తం ఇంటి సీనే రివర్స్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా, బ్లూటూత్ అడాప్టర్తో టీవీని హెడ్సెట్ సాయంతో చూడవచ్చు. దీనిని టీవీకి జత చేస్తే, ఇక మీరు ఏ హెడ్సెట్నైనా కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఒకేసారి నాలుగు హెడ్సెట్లను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలా మీరు సీరియస్గా సీరియల్ లేదా సినిమా చూస్తున్నప్పుడు పక్కన వాళ్లని ‘షుష్..’ అని చెప్పాల్సిన అవసరం లేదు. బటన్లతో వాల్యూమ్ను తక్కువ లేదా ఎక్కువ చేయడం సులభం. ధర రూ. 1,799 మాత్రమే!అన్ని పరికరాకలకూ ఒక్కటే రిమోట్సోఫాలో హాయిగా కూర్చుని, పక్కన స్నాక్స్ పెట్టుకుని, ఫ్యామిలీతో సినిమా చూడటానికి సిద్ధమయ్యే క్షణంలో ‘రిమోట్ ఎక్కడ?’ అనే ప్రశ్న! ఆ తర్వాత ఏసీ ఆన్ అవ్వకపోయినా, సెటప్బాక్స్ సిగ్నల్ రాకపోయినా, సేమ్ ప్రశ్నే రిపీట్! ఇలా పలు రకాల రిమోట్ల కోసం అవసరం లేకుండా చేస్తుంది. ‘సోఫా బటన్ ఎక్స్వన్ యూనివర్సల్ రిమోట్’. ఇది ఒక్కటి ఉంటే చాలు, అన్ని పరికరాల రిమోట్లకు గుడ్బై చెప్పేయొచ్చు. టీవీ, ఏసీ, సెటప్ బాక్స్, లైట్స్ అన్నీ ఒక్క బటన్తోనే నియంత్రించవచ్చు. వాయిస్ కంట్రోల్తో కూడా ఆపరేట్ చేయవచ్చు. అంటే చేతులు బిజీగా ఉన్నపుడు ‘రిమోట్, టీవీ ఆన్ చేయి’ అని చెప్తే చాలు, వెంటనే చేసేస్తుంది. ఇన్ఫ్రారెడ్ కనెక్టివిటీతో అతి తక్కువ సమయంలో సులభంగా అమర్చుకోవచ్చు. ఒకేసారి ఐదు లక్షల పరికరాల వరకు కనెక్ట్ చేసుకునే వీలుంది. ధర రూ. 3,999 మాత్రమే!ఎక్కడినుంచైనా చూడొచ్చు!ఇక టీవీ చూడటానికి మెడ తిప్పే రోజులు పోయాయి! వంటగదిలో ఉన్నా, హాల్లో ఉన్నా, టీవీనే మీ వైపు తిరిగి ‘కనిపిస్తునున్నానా, ఇంకొంచెం జరగాలా?’ అంటుంది. ఇదే ‘రోబోస్టు టీవీ వాల్ మౌంట్ బ్రాకెట్’ మ్యాజిక్. గోడపై తిప్పుతూ, వంచుతూ, టీవీని మీ చూపు కోణానికి సరిపడేలా సర్దేస్తుంది. ఇక వంట చేసేటప్పుడు సీరియల్ మిస్ కానివ్వదు, క్రికెట్ స్కోర్ కూడా బాల్కనీలో కాఫీతో కలిపి చూడొచ్చు. చిన్న నుంచి పెద్ద వరకు ఏ టీవీ అయినా, ఇది తన భుజాల మీద సేఫ్గా మోస్తుంది. మెటల్ బాడీ, తుప్పు, ధూళి భయం లేదు. ఇన్స్టాలేషన్ కూడా చాలా సులభం. ధర కేవలం రూ. 568 మాత్రమే! -
అరట్టైను తెలుగులో ఎలా పిలవాలంటే?: శ్రీధర్ వెంబు
భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ 'అరట్టై' (Arattai)కు ఆదరణ పెరుగుతోంది. లక్షలమంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే కొందరికి అరట్టై అంటే ఏమిటో బహుశా తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో దీని గురించి తెలుసుకుందాం.అరట్టై అనేది తమిళ పదం. దీనిని ఏ భాషలో ఎలా పిలవాలి అనే విషయాన్ని జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ట్వీట్ చేసారు. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో అరట్టైకు తెలుగులో 'మాటలాట' (మాట్లాడుకోవడం) అని సూచించారు.జోహో మెసేజింగ్ యాప్.. అరట్టై మెటా యాజమాన్యంలోని వాట్సాప్'కు ప్రత్యర్థిగా వచ్చింది. ఇందులో వాట్సాప్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ ఉండటం వల్ల, దేశీయ యాప్ కావడం వల్ల ఎక్కువమంది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని ఉపయోగించాలని కేంద్రమంత్రులు కూడా పిలుపునిచ్చారు.How to say "Arattai" in various languages. pic.twitter.com/ynqBe4euBo— Sridhar Vembu (@svembu) October 11, 2025అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలు●అరట్టై ఆండ్రాయిడ్ టీవీలకు, ఆ స్థాయి పరికరాలకు యాక్సెస్ అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.●అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యూ' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.●అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: ఏఐ ట్రాఫిక్ సిస్టం: ఎవ్వరూ తప్పించుకోలేరు! -
పేరులో జీరో.. పనితీరులో హీరో: సరికొత్త సోలార్ కారు
పెట్రోల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, గ్యాస్ కార్లకు గుడ్బై చెప్పే సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కొత్త హీరో వచ్చాడు. పేరు ‘లైట్యేర్ జీరో’. ఇది ప్రపంచంలోనే సౌరశక్తితో నడిచే మొట్టమొదటి కారు. ప్రముఖ డచ్ కంపెనీ రూపొందించిన ఈ కారు పైభాగం, ముందువైపు మొత్తం సోలార్ ప్యానెల్స్తో కప్పబడి ఉంటుంది. కారు డిజైన్కు ఇది ఏ మాత్రం ఆటంకం కలిగించదు. పైగా, దీన్ని గాలి ఒరిపిడిని తగ్గించేలా తేలికపాటి నిర్మాణాలతో డిజైన్ చేశారు. ఫలితంగా, సాధారణ కార్లతో పోలిస్తే ఎక్కువ వేగంతో మరింత సమర్థంగా పనిచేస్తుంది.ఒక్క సూర్యోదయంతో దాదాపు డైబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఒకసారి బ్యాటరీని చార్జ్ చేస్తే, ఏకంగా ఏడువందల కిలోమీటర్లు వెళ్లగలదు. అంటే, ఛార్జింగ్ స్టేషన్ల కోసం ఎదురుచూసే రోజులు ఇక పోతాయి. గ్రామాలు, ఇంధన సమస్యలున్న ప్రాంతాలకు ఇది నిజమైన ‘సూపర్ హీరో’ కారు. ప్రస్తుతం ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు కాని, భవిష్యత్తులో మొత్తం రవాణా వాహనాలు ఇలాగే మారుతాయని నిపుణులు చెప్తున్నారు.ఇదీ చదవండి: దీపావళి వేళ ఏరో ఎడిషన్ లాంచ్: స్పెషల్ కిట్ కూడా -
ధనత్రయోదశి ప్రభావం.. బంగారం ఎంత కొన్నారంటే?
ఈ ఏడాది ధంతేరస్ (ధనత్రయోదశి) సందర్భంగా భారతీయ వినియోగదారులు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వ్యాపారుల సంఘం శనివారం తెలిపింది. బంగారం, వెండి ధరలు బాగా పెరిగినప్పటికీ.. సుమారు 60,000 కోట్ల రూపాయలు వీటికోసం ఖర్చు చేసినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా. ఈ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 25% ఎక్కువ.బంగారం ధరలు గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 60 శాతం పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది. ధరలు పెరిగినప్పటికీ.. సెంటిమెంట్, డిమాండ్ రెండూ కలిసొచ్చాయని సీఏఐటీ ఆభరణాల విభాగం, ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా అన్నారు. ఢిల్లీ బులియన్ మార్కెట్లలో మాత్రమే రూ. 10,000 కోట్లకు పైగా అమ్మకాలు నమోదయ్యాయని ఆయన అన్నారు.ధంతేరస్, దీపావళి సమయంలో బంగారం కొనుగోలు శుభప్రదమని చాలామంది భావిస్తారు. ఈ కారణంగా ప్రతిఏటా ఈ పండుగల సమయంలో బంగారం అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా పెరిగి.. కేజీ వెండి రేటు సుమారు రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రేటు ఇందుకు ముందు ఏడాదితో పోలిస్తే.. 55 శాతం ఎక్కువ.బంగారం, వెండి అమ్మకాలు కాకుండా.. వంట సామాగ్రి అమ్మకాలు రూ.15,000 కోట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులు రూ.10,000 కోట్లు, అలంకరణ.. మతపరమైన వస్తువుల అమ్మకాలు రూ.3,000 కోట్లుగా ఉన్నాయని వ్యాపారుల సంఘం తెలిపింది.ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్ధన్తేరస్ కొనుగోలు పెరుగులపై.. సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, జీఎస్టీ రేట్లలో తగ్గింపులు, స్థానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహం అందించడం వల్ల పండుగల సమయంలో వ్యాపారాలు పెరగడానికి దోహదపడ్డాయని అన్నారు. సాంప్రదాయ మార్కెట్లు, స్థానిక ఆభరణాల స్టోర్స్.. రిటైల్ దుకాణాలు రికార్డు స్థాయిలో కస్టమర్ల రద్దీని నమోదు చేశాయని పేర్కొన్నారు. -
గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్తో సెంట్రల్ బ్యాంక్ జట్టు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్తో కో లెండింగ్ (80:20 నిష్పత్తిలో) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇరు సంస్థలు కలసి ఉమ్మడిగా రుణాలు ఇవ్వనున్నాయి. సెపె్టంబర్ త్రైమాసికానికి బలమైన పనితీరు నమోదు చేసింది. బ్యాంకుల రుణ ఆస్తుల నాణ్యత కూడా బలపడింది.నికర లాభం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 33 శాతం వృద్ధితో రూ.1,213 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో బ్యాంక్ ఆర్జించిన లాభం రూ.913 కోట్లుగానే ఉంది. బ్యాంక్ మొత్తం వ్యాపారం విలువ సెప్టెంబర్ చివరికి 14 శాతానికి పైగా పెరిగి రూ.7.38 లక్షల కోట్లకు చేరింది.బ్యాంక్ మొత్తం రుణాల్లో వసూలు కాని స్థూల మొండి బాకీలు (ఎన్పీఏలు) క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న 4.59% నుంచి 3.01 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు (కేటాయింపుల అనంతరం) సైతం ఇదే కాలంలో 0.69% నుంచి 0.48 శాతానికి దిగొచ్చాయి. క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 17.34 శాతంగా ఉంది. -
తేలికగా, దృఢంగా, వేగంగా, ఖర్చు తక్కువగా..
ఇంటి నిర్మాణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అయితే నిరంతరం పెరుగుతున్న నిర్మాణ వ్యయాలు సామాన్యులకు ఒక సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టేందుకు అనుసరించే సంప్రదాయ పద్ధతులు, ఖర్చు తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలు, కొత్త సాంకేతికతలపై సమగ్ర అవగాహన అవసరం.సంప్రదాయ విధానంభారతదేశంలో ఇళ్లు కట్టడానికి శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులు ప్రధానంగా స్థానికంగా లభించే వస్తువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. కాల్చిన ఎర్ర ఇటుకలు, సిమెంటు, ఇసుక మిశ్రమంతో (మోర్టార్) గోడలను నిర్మించడం.. దీనిపై కాంక్రీటు (RCC) స్లాబ్తో పైకప్పు వేయడం సాధారణంగా వస్తున్న ఆనవాయితి. ఇది దృఢమైన, మన్నికైన పద్ధతి. ఇటుక గోడలు ఉష్ణ బంధకాన్ని (Thermal Insulation) అందించి వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. అయితే దీని నిర్మాణం శ్రమతో కూడుకుంది. సమయం ఎక్కువ పడుతుంది. పునాది ఖర్చు ఎక్కువ. ఇటుకల తయారీ పర్యావరణంపై ప్రభావం చూపుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో మట్టి, గడ్డి, వెదురు, కలప, రాళ్లను ఉపయోగించి ఇళ్లను నిర్మించేవారు. కచ్చా ఇళ్లుగా పిలిచే ఈ విధానంలో ‘కాబ్’ (మట్టి, గడ్డి మిశ్రమం), ‘అడోబ్’(ఎండబెట్టిన మట్టి ఇటుకలు) వంటి పద్ధతులను వాడేవారు. వీటికి ఖర్చు తక్కువ. వీటి వల్ల పర్యావరణహితం, ఉష్ణ నియంత్రణ (Thermal Regulation) ఉంటుంది. అయితే వీటి మన్నిక తక్కువ. తరచుగా మరమ్మత్తులు అవసరం. భారీ వర్షాలకు అంతగా నిలబడవు.రాతి నిర్మాణంస్థానికంగా లభించే రాళ్లను సున్నం లేదా మట్టి మోర్టార్తో కలిపి గోడలు కట్టేవారు. ఇవి దృఢమైనవి. దీర్ఘకాల మన్నిక, సహజ ఉష్ణ బంధక సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటి నిర్మాణానికి ఎక్కువ శ్రమ అవసరం. ఎక్కువ సమయం పడుతుంది.ఇంటి నిర్మాణ వ్యయం తగ్గించే పద్ధతులునిర్మాణ సాంకేతికతలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఖర్చును తగ్గించి, సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతున్నాయి.ప్రిఫ్యాబ్రికేషన్, మాడ్యులర్ నిర్మాణంగోడలు, పైకప్పు స్లాబులు, కిటికీలు వంటి భవన భాగాలను ఫ్యాక్టరీలో ముందుగా తయారు చేయించి ఆపై నిర్మాణ స్థలంలో వాటిని నేరుగా బిగించవచ్చు. దీంతో నిర్మాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. శ్రమ తక్కువ. నాణ్యతలో స్థిరత్వం ఉంటుంది. వ్యర్థాలు తగ్గుతాయి.ఇన్సులేటెడ్ కాంక్రీట్ ఫారమ్లుఇది థర్మాకోల్ లేదా ఇన్సులేటింగ్ మెటీరియల్తో చేసిన బోలు బ్లాకులను ఉపయోగించి గోడలను నిర్మించే విధానం. ఈ బోలు బ్లాకుల మధ్య తర్వాత కాంక్రీటు పోస్తారు. దీని వల్ల గోడలకు అధిక ఇన్సులేషన్ (ఉష్ణ బంధకం) లభిస్తుంది. ఇంట్లో ఉష్ణోగ్రత నియంత్రణ సులభమై ఎయిర్ కండీషనర్ల వినియోగం, తద్వారా విద్యుత్ బిల్లులు తగ్గుతాయి.స్టీల్ ఫ్రేమ్ నిర్మాణంస్టీల్ కాలమ్స్, బీమ్లను ఉపయోగించి భవనానికి ప్రధాన ఫ్రేమ్ను నిర్మించే విధానం. ఈ నిర్మాణం తేలికగా, దృఢంగా ఉంటుంది. భూకంపాలను తట్టుకోగలదు. నిర్మాణ సమయం తక్కువ.ఫ్లై యాష్ ఆధారిత ఇటుకలు/ బ్లాకులుథర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే వ్యర్థ పదార్థం (ఫ్లై యాష్), ఇతర బైండర్లను ఉపయోగించి ఇటుకలు, బ్లాక్లను తయారు చేసే విధానం. ఉదాహరణకు ఏఏసీ బ్లాక్లు. ఇవి సాంప్రదాయ ఇటుకల కంటే తేలికైనవి. మెరుగైన ఉష్ణ బంధకాన్ని అందిస్తాయి. సిమెంట్ వినియోగాన్ని తగ్గిస్తాయి. పర్యావరణహితమైనవి.ఇంటి నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కేవలం వస్తువుల ధరలు మాత్రమే కాకుండా నిర్మాణ ప్రణాళిక, డిజైన్, సాంకేతికతలో మార్పులు తీసుకురావడం ముఖ్యం. సంప్రదాయ నిర్మాణ పద్ధతుల్లోని మన్నికను, స్థానిక వస్తువుల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటూనే ప్రిఫ్యాబ్రికేషన్, ఏఏసీ బ్లాక్లు, సమర్థవంతమైన డిజైన్ వంటి ఆధునిక, తక్కువ ఖర్చు పద్ధతులను అనుసరించడం ద్వారా కలల ఇంటిని నిర్మించుకోవచ్చు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
రెండు నెలల్లో సింగిల్ డిజిట్కి లాజిస్టిక్స్ వ్యయాలు
న్యూఢిల్లీ: ఎక్స్ప్రెస్వేలు, ఆర్థిక కారిడార్లను వేగవంతంగా విస్తరించిన నేపథ్యంలో దేశీయంగా లాజిస్టిక్స్ వ్యయాలు వచ్చే రెండు నెలల్లో సింగిల్ డిజిట్ స్థాయికి తగ్గుతాయని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే ఇది 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గినట్లు ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్, ఐఐఎం బెంగళూరు రూపొందించిన నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు. డిసెంబర్ కల్లా ఇది 9 శాతానికి దిగి వస్తుందని అసోచాం వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గడం వల్ల అంతర్జాతీయంగా మన ఎగుమతిదారులు మరింతగా పోటీపడేందుకు వీలవుతుందన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో లాజిస్టిక్స్ వ్యయాలు 12 శాతంగా ఉండగా, చైనాలో 8–10 శాతంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. మరోవైపు, వచ్చే అయిదేళ్లలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. తాను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ రూ. 14 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. పరిశ్రమ 4 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తోందని, కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధికంగా జీఎస్టీ కడుతోందని గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ రూ. 78 లక్షలకోట్లుగా, చైనా మార్కెట్ రూ. 47 లక్షల కోట్లుగా తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. శిలాజ ఇంధనాల దిగమతులపై భారత్ ఏటా రూ. 22 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని, దేశం పురోగమించాలంటే వీటికి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాలను వినియోగించడం కీలకమని మంత్రి తెలిపారు. -
జీఎస్టీ ప్రయోజనాల పూర్తి బదలాయింపు
న్యూఢిల్లీ: ధరల తగ్గింపు రూ పంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) రేట్ల కోత ప్రయోజనాలు వినియోగదారులకు పూర్తిగా బదిలీ అవు తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రోజువారీ వినియోగించే 54 ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం సమీక్షిస్తోందని జీఎస్టీ బచత్ ఉత్సవ్పై నిర్వహించిన సమావేశంలో ఆమె చెప్పారు. వీటి వివరాలను ఎప్పటికప్పుడు జోనల్ ఏరియాల నుంచి తెప్పించుకుంటున్నామని మంత్రి వివరించారు. సెపె్టంబర్ 22 నుంచి జీఎస్టీ రేట్లను నిర్దిష్టంగా 2 శ్లాబుల కింద (5%, 18%, అల్ట్రా లగ్జరీ ఉత్పత్తులపై ప్ర త్యేకంగా 40% రేటు) సవరించిన సంగతి తెలిసిందే. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో కొనుగోళ్లు పెరిగాయని ఆమె పేర్కొ న్నారు. షాంపూ, పౌడరు, ఉపకరణాలు, బొమ్మలు మొదలైన వాటిపై రేట్లు తగ్గాయని వివరించారు. జీఎస్టీ రేట్ల కోతకు తగ్గట్లుగా ధరలు తగ్గించలేదంటూ వినియోగదారుల వ్యవహారాల విభాగానికి 3,169 ఫిర్యాదులు రాగా 3,075 ఫిర్యాదులు నోడల్ ఆఫీసర్లకు బదిలీ అయినట్లు పేర్కొన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంకులో ఎన్బీడీకి మెజారిటీ వాటాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంకులో మెజారిటీ 60 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ. 26,853 కోట్లు ఆఫర్ చేసింది. విలువపరంగా దేశీ ఆర్థిక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సంబంధించి ఇది అత్యంత భారీ డీల్ కానుంది. ఇటీవలే జపాన్కి చెందిన ఎస్ఎంబీసీ మరో దేశీ ప్రైవేట్ బ్యాంక్ యస్ బ్యాంకులో 24.9 శాతం వాటాలను రూ. 16,333 కోట్లతో కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఆమోదించిన సందర్భంగా ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ నుంచి రూ. 26,853 కోట్ల సమీకరణకు కూడా తమ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఆర్బీఎల్ బ్యాంకు తెలిపింది. ఈ డీల్తో రెండు బ్యాంకుల భాగస్వాములకు ప్రయోజనం చేకూరగలదని ఆర్బీఎల్ బ్యాంక్ ఎండీ ఆర్ సుబ్రమణియకుమార్ తెలిపారు. ప్రిఫరెన్షియల్ ఇష్యూ .. ఒక్కొక్కటి రూ. 10 ముఖ విలువ చేసే 95.90 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను రూ. 228 రేటు చొప్పున ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంకునకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కేటాయించేందుకు బోర్డు ఆమోదించింది. ఇది 60 శాతం వాటాకు సమానం. ప్రిఫరెన్షియల్ ఇష్యూ అనంతరం ఆర్బీఎల్ బ్యాంకుపై ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్నకు నియంత్రణ లభిస్తుంది. అటుపైన దాన్ని ప్రమోటరుగా వ్యవహరిస్తారు. ఆర్బీఎల్ బ్యాంకును విదేశీ బ్యాంక్ అనుబంధ సంస్థగా వర్గీకరిస్తారు. ప్రిఫరెన్షియల్ ఇష్యూ కారణంగా ఎమిరేట్స్ ఎన్బీడీ, ఆర్బీఎల్ బ్యాంక్ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంకు నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 223 కోట్ల నుంచి రూ. 179 కోట్లకు క్షీణించింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ. 19,611 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గత క్యూ2తో పోలిస్తే బ్యాంకు నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సుమారు 10 శాతం పైగా పెరిగి రూ. 19,611 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన లాభం సుమారు 11 శాతం పెరిగి రూ. 18,641 కోట్లుగా నమోదైంది. ఇక రుణాల్లో 10 శాతం వృద్ధి దన్నుతో నికర వడ్డీ ఆదాయం 4.8 శాతం ఎగిసి రూ. 31,550 కోట్లకు చేరింది. అయితే, నికర వడ్డీ మార్జిన్ (నిమ్) మాత్రం 3.5 శాతం నుంచి 3.27 శాతానికి నెమ్మదించింది. రాబోయే ఒకటి రెండేళ్లలో ఇది స్థిరంగా కొనసాగవచ్చని, లేదా మరింతగా పెరగొచ్చని బ్యాంకు తెలిపింది. సమీక్షాకాలంలో వడ్డీయేతర ఆదాయం 25 శాతం పెరిగి రూ. 21,730 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్పీఏ) నిష్పత్తి 1.36 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గింది. లక్ష్యాల వైపు ముందుకు.. క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తిని 96 శాతానికి పరిమితం చేసుకోవడం, రుణ వృద్ధిని మెరుగుపర్చుకోవడంలాంటి గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్తున్నట్లు బ్యాంకు ఎండీ శశిధర్ జగదీశన్ తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంకింగ్ వ్యవస్థకు మించి రుణ వృద్ధి సాధించగలమని, మార్కెట్ వాటాను పెంచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీఎస్టీ క్రమబదీ్ధకరణ, ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు, ఆర్బీఐ రేట్ల కోత తదితర పాలసీలపరమైన అంశాల దన్నుతో క్షేత్ర స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయని, దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్యాపార వృద్ధికి గణనీయంగా అవకాశాలు లభించగలవని జగదీశన్ తెలిపారు. కంపెనీల కొనుగోళ్ల లావాదేవీలకు నిధులు సమకూర్చేలా (ఎక్విజిషన్ ఫైనాన్స్) బ్యాంకులకు అనుమతి లభించడం ఇటు బ్యాంకర్లకు, అటు రుణగ్రహీతలకు మేలు చేసే విషయమని సీఈవో శ్రీనివాసన్ వైద్యనాథన్ తెలిపారు. దీనితో కార్పొరేట్లకు లావాదేవీల వ్యయాల భారం తగ్గుతుందన్నారు. తాము కూడా ఎక్విజిషన్ ఫైనాన్స్ కార్యకలాపాలు చేపట్టే దిశగా తుది మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నామని వైద్యనాథన్ వివరించారు. ఉద్యోగాలపై జనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం ఉంటుందని భావించడం లేదని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీల రాకతో కొందరు సిబ్బంది బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి మారొచ్చని తెలిపారు. జనరేటివ్ ఏఐ సహా వివిధ టెక్నాలజీలపై బ్యాంకు అంతర్గతంగా కొన్ని ప్రయోగాలు చేస్తోందన్నారు. మరిన్ని విశేషాంశాలు.. → సమీక్షాకాలంలో బ్యాంక్ స్థూల స్లిపేజీలు రూ. 7,400 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో రూ. 1,100 కోట్లు వ్యవసాయ రుణాలున్నాయి. → మొత్తం ప్రొవిజన్లు రూ. 2,700 కోట్ల నుంచి రూ. 3,500 కోట్లకు పెరిగాయి. అయితే, అంతకు ముందు త్రైమాసికంలో నమోదైన రూ. 14,441 కోట్లతో పోలిస్తే తగ్గాయి. → రిటైల్ రుణాలు 7.4 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్ మార్కెట్ సంస్థలకు రుణాలు 17 శాతం, కార్పొరేట్..హోల్సేల్ రుణాలు 6.4 శాతం పెరిగాయి. → వడ్డీయేతర ఆదాయం 25 శాతం పెరిగి రూ. 21,730 కోట్లకు చేరింది. నిర్వహణ వ్యయాలు 6.4 శాతం పెరిగి రూ. 17,980 కోట్లుగా నమోదయ్యాయి. -
స్పైస్జెట్ కీలక నిర్ణయం: నజాఫ్కి ఫ్లైట్ సర్వీస్
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ (SpiceJet) తాజాగా ఇరాక్లోని నజాఫ్కి నాన్స్టాప్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ముంబై-నజాఫ్ రూట్లో 2025 అక్టోబర్ 18 నుంచి, అహ్మదాబాద్ రూట్లో 19 నుంచి సర్వీసులు మొదలవుతాయని పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు కీలక ఆధ్యాత్మిక కేంద్రాల్లో నజాఫ్ కూడా ఒకటి. కొత్త విమానాలను సమకూర్చుకోవడం సహా దేశ, విదేశ రూట్లలో మరిన్ని రూట్లకు విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు స్పైస్జెట్ వివరించింది. ఈ సర్వీసులు ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఇదీ చదవండి: దీపావళికి.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్ -
గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్
పెరుగుతున్న బంగారం ధరలు.. ఆర్ధిక శ్రేయస్సు కంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడిని సూచిస్తుందని జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐఎమ్ఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ రాసిన కథనంపై స్పందిస్తూ.. యూఎస్ మార్కెట్లపై చేసిన అంచనాతో తాను ఏకీభవిస్తున్నానని శ్రీధర్ వెంబు చెప్పారు. ''అమెరికా స్టాక్ మార్కెట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగారం కూడా ఒక పెద్ద హెచ్చరిక సంకేతాన్ని సూచిస్తోంది. నేను బంగారాన్ని పెట్టుబడిగా భావించను, దానిని ఆర్థిక ప్రమాదానికి బీమాగా భావిస్తున్నాను. వ్యవస్థలోని అన్ని రుణాలను తిరిగి చెల్లించడానికి AI కృషి చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని ఆయన ట్వీట్ చేశారు.గీతా గోపీనాథ్ ఏమన్నారంటే?వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇటీవల బాగా దెబ్బతింది. డాట్ కామ్ క్రాష్ తరువాత జరిగిన దానికంటే.. స్టాక్ మార్కెట్ కరెక్షన్ మరింత తీవ్రమైంది. టారిఫ్ యుద్ధాలు.. సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అంతర్లీన సమస్య అసమతుల్య వాణిజ్యం కాదు అసమతుల్య వృద్ధి. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని మరిన్ని దేశాలు/ప్రాంతాల్లో అధిక వృద్ధి మరియు రాబడి అవసరం.పెట్టుబడిదారులు చాలావరకు సురక్షితమైన ఆస్తిగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోతోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరగడం మాత్రమే కాకుండా.. ఆర్థిక స్థిరత్వంలో కొత్త ఆందోళనలు పుడుతున్నాయి. ఈ తరుణంలో 2026 జనవరి నాటికి 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు.. ముఖ్యంగా చైనా, జపాన్లలో బలమైన డిమాండ్ కారణంగా ప్రపంచ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని, ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) వ్యవస్థాపక సభ్యుడు & మాజీ చైర్మన్ అనంత పద్మనాబన్ పేర్కొన్నారు.I agree with Dr Gita Gopinath.The US stock market is in a clear and massive bubble.The degree of leverage in the system means that we cannot rule out a systemic event like the global financial crisis of 2008-9. Gold is also flashing a big warning signal. I don't think of… https://t.co/7xVPL3FXDq— Sridhar Vembu (@svembu) October 18, 2025 -
వరుస సెలవులు.. ఐదు రోజులు బ్యాంకులు బంద్!
భారతదేశంలో ఎక్కువమంది జరుపుకునే పండుగలలో.. దీపావళి ఒకటి. ఈ ఫెస్టివల్ సమయంలో అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు.. బ్యాంకులకు వరుసగా సెలవులు ఉన్నాయి. ఈ కథనంలో ఈ సెలవులకు సంబంధించిన మరిన్ని వివరాలు చూసేద్దాం.➤అక్టోబర్ 19, ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 20, సోమవారం: దీపావళి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 21, మంగళవారం: గోవర్ధన్ పూజ / లక్ష్మీ పూజ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, మణిపూర్, జమ్మూ, శ్రీనగర్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 22, బుధవారం: బలిపాడ్యమి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, సిక్కింలోని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 23, గురువారం: భాయ్దూజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ (అహ్మదాబాద్, గ్యాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్కతా, లక్నో, సిమ్లాలలో బ్యాంకులుకు సెలవు).అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: దీపావళికి.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్ -
దీపావళికి.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్
ప్రయాణికుల సౌలభ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' పాస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పాస్ను ఇష్టమైనవారికి గిఫ్ట్గా ఇవ్వొచ్చని 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ దీపావళికి మీ ప్రియమైన వారికి ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్గా ఇవ్వండి. ఇది దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు మరియు జాతీయ ఎక్స్ప్రెస్వేలలో ఏడాది పొడవునా ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుందని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.గిఫ్ట్గా ఎలా ఇవ్వాలి?రాజ్మార్గయాత్ర యాప్ ద్వారా యాన్యువల్ పాస్ను గిఫ్ట్గా ఇవ్వొచ్చు. ఈ యాప్లోని 'యాడ్ పాస్' ఆప్షన్ మీద క్లిక్ చేసి, వినియోగదారుడు ఎవరికైతే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారో.. వారి వెనికల్ నంబర్ & ఇతర వివరాలను ఫిల్ చేసిన తరువాత.. ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయవద్దు. ఇలా చేసిన తరువాత యాన్యువల్ పాస్ యాక్టివేట్ అవుతుంది.రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. యాన్యువల్ పాస్కు జాతీయ రహదారి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 15న అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. కాగా దీనిని ప్రారంభించిన రెండు నెలల్లోనే దాదాపు 5.67 కోట్ల లావాదేవీలతో.. 25 లక్షల మంది వినియోగదారుల మైలురాయిని దాటింది.ఇదీ చదవండి: ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియాజాతీయ రహదారి వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే.. ఈ ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్లకు (ఏది ముందు అయితే అది) అనుమతిస్తుంది. దీనికోసం రూ. 3000 వన్ టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా లేదా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లిస్తే.. రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.This Diwali, gift your loved ones #FASTagbasedAnnualPass — a thoughtful gesture ensuring seamless travel and hassle-free toll payments all year round.Read more: https://t.co/WULEWyNDMG Let’s make every journey bright and safe. ✨#NHAI #FASTag #Diwali2025 pic.twitter.com/1dyiHPVj7B— NHAI (@NHAI_Official) October 18, 2025 -
దీపావళి వేళ ఏరో ఎడిషన్ లాంచ్: స్పెషల్ కిట్ కూడా
టయోటా హైరైడర్.. స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. ఈ కొత్త కారు పేరు 'హైరైడర్ ఏరో ఎడిషన్' (రూ.10.94 లక్షలు). ఇది స్టాండర్డ్ హైరైడర్ కంటే రూ. 31,999 ఎక్కువ ధరలో ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్ను పొందుతుంది.కంపెనీ అందించే ఈ ప్రత్యేకమైన స్టైలింగ్ కిట్లో.. బంపర్కు మరింత దూకుడుగా ఉండే లుక్ని ఇచ్చే ఫ్రంట్ స్పాయిలర్, వెనుక భాగంలో స్పాయిలర్, హైరైడర్కు మొత్తం మీద స్పోర్టియర్ లుక్ని తెచ్చే సైడ్ స్కర్ట్లు వంటివి ఉన్నాయి. ఈ కిట్ కూడా పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియాహైరైడర్ ఏరో ఎడిషన్ తెలుపు, సిల్వర్, నలుపు, ఎరుపు అనే నాలుగు రంగులలో లభిస్తుంది. కాగా టయోటా హైరైడర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్, సీఎన్జీ పవర్ట్రెయిన్తో అందుబాటులో ఉంది. ఇందులోని 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, 103 హార్స్ పవర్, 136 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ 116 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది e-CVTతో లభిస్తుంది. CNG ఇంజిన్ 87 హార్స్ పవర్, 121 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
ఇల్లు కొనాలంటే.. చుట్టుపక్కల ఇవి ఉండాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగణలోకి తీసుకున్నారు. నేటి యువతరం ఇల్లు కొనేటప్పుడు చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు.అత్యవసరంలో ఎంత సమయంలో ఆసుపత్రికి చేరుకోవచ్చు? ఎంత సమీపంలో వైద్య సదుపాయాలు ఉన్నాయనేది ఆరా తీస్తున్నారు. ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇల్లు విశాలంగా ఉండటమే కాదు కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి గృహ కొనుగోలుదారుల మాట.పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే ఇష్టపడుతున్నారు. చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనాపాలనా చూసే డే కేర్ సౌకర్యాలు ఉండాలని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్ ఫ్రం హోమ్ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. కమ్యూనిటీలో డే కేర్ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు.వీకెండ్ ఎంజాయ్..వీకెండ్ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. పచ్చని ప్రకృతిని ఆస్వాదించాలని కోరుకునే నివాసితులు శివారు ప్రాంతాలలో ఫామ్హౌస్లు, విల్లాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు ఎంత దూరంలో ఉందనేది కస్టమర్ల ప్రాధామ్యాలలో ఒకటి. నగరంలో ట్రాఫిక్లోనే అధిక సమయం వృథా అవుతుంది కాబట్టి దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి. ప్రజా రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు. -
ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియా
భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. అయితే మోటార్స్పోర్ట్ రంగం మాత్రం సవాళ్ళను ఎదుర్కొంటోంది. దీనిని అభివృద్ధి చేయాలంటే.. తగిన ఎన్విరాన్మెంట్ ఏర్పాటు చేయాలని, రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) అన్నారు. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే ఈ విభాగం అంతగా అభివృద్ధి చెందలేదని స్పష్టం చేశారు.ఒక సమావేశంలో గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ, మీరు మోటార్స్పోర్ట్లో ప్రపంచ స్థాయిలో రాణించాలనుకుంటే, దానికి తగిన పర్యావరణం ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు, భారతదేశంలో క్రికెట్ కోసం ఒక పర్యావరణ వ్యవస్థ ఉంది. కొందరు గల్లీలలో క్రికెట్ ఆడతారు. అలా క్రికెట్ మన జీవన శైలిలో భాగమైపోయింది. క్రికెట్ మాదిరిగా.. మోటార్స్పోర్ట్ కోసం ప్రాక్టీస్ లేదు. ప్రస్తుతం మనకు భారతదేశం నుంచి ఐదుగురు మాత్రమే మోటార్స్పోర్ట్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. ఈ సంఖ్య యూకేలో 70,000 ఉందని ఆయన అన్నారు.కార్టింగ్ లీగ్లు, పబ్లిక్ ట్రాక్లు.. పాఠశాల స్థాయి నుంచి అందుబాటులో లేకపోవడం వల్ల ఇందులో (మోటార్స్పోర్ట్) అభివృద్ధి ఆగిపోతోంది. నారాయణ్ కార్తికేయన్, జెహాన్ దారువాలా, కుష్ మైనీ.. చిన్న వయస్సు నుండే రేసింగ్లో శిక్షణ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని గౌతమ్ సింఘానియా పేర్కొన్నారు.ఇదీ చదవండి: మరింత తగ్గిన ఆల్టో కే10 ధర: రూ.3.70 లక్షలు!ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన గౌతమ్ సింఘానియా ఒక ఆటోమోటివ్ ఔత్సాహికుడు. ఈయన చాలా సందర్భాల్లో రేసింగ్లో పాల్గొన్నారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా కార్లను కొనుగోలు చేశారు. ఈయన వద్ద లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్లెగ్గేరా, లంబోర్ఘిని అవెంటడోర్ SVJ, ఫెరారీ 458 ఇటాలియా, మరియు మెక్లారెన్ 720ఎస్ వంటి రేసింగ్ కార్లు ఉన్నాయి. ఆయన ఇటీవలే వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ (WMSC)కు భారతదేశ అధికారిక ప్రతినిధిగా నియమితులయ్యారు. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు ఈ హోదాలో పనిచేస్తున్నారు. -
దీపావళి బోనస్లు, గిఫ్ట్లు భారీగా వచ్చాయా..?
దేశమంతా దీపావళి పండుగ సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా జరిగే పెద్ద పండుగ కావడంతో దీపావళికి చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు, గిఫ్ట్లు ఇస్తుంటాయి. కొన్ని సంస్థలు వీటిని భారీ స్థాయిలో అందిస్తుంటాయి. ఇప్పటికే దాదాపు చాలా సంస్థలు దీపావళి బోనస్లు, బహుమతులు ఇచ్చేశాయి.మరికొన్ని ఇంకా ఇవ్వాల్సి ఉండటంతో బోనస్లు, బహుమతుల గురించి ఆశతో ఎదురుచూస్తున్నారు. కొంతమంది నగదు బోనస్ను ఆశిస్తే, మరికొందరు బహుమతులు, వోచర్లు, స్వీట్లు లేదా గాడ్జెట్లు పొందుతారు. అయితే, మీకు తెలిసా? ఈ బోనస్లు, బహుమతులు పన్ను చెల్లింపులకు కూడా కారణమవవచ్చు.చాలా మంది ఈ పండుగ సమయంలో వచ్చే బహుమతులు పూర్తిగా పన్ను మినహాయింపు పొందుతాయని అనుకుంటారు. కానీ వాస్తవానికి, ఇవి కూడా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట పరిమితికి మించి ఉంటే పన్ను వర్తించవచ్చు. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం..ఇలా ఉంటే పన్ను మినహాయింపుఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఒక ఉద్యోగి ఏడాదిలో పొందే బహుమతులు రూ.5,000, అంత లోపు విలువ ఉంటే పన్ను మినహాయింపు పొందుతాయి. ఉదాహరణకు స్వీట్లు, దుస్తులు, చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, గిఫ్ట్ వోచర్లు (రూ.5,000 లోపు విలువతో) వంటివి. ఇవి పరిధిలోపు ఉన్నట్లయితే, ఉద్యోగి ఆదాయంలోకి జోడించాల్సిన అవసరం లేదు.రూ.5,000 దాటితే..బహుమతుల మొత్తం విలువ రూ.5,000 మించి పోతే, ఆ మొత్తం ఉద్యోగి వార్షిక ఆదాయంలో భాగంగా పరిగణిస్తారు. వీటిని ‘పెర్క్’ (perquisite) గా లెక్కిస్తారు. ఉదాహరణకు.. రూ.10,000 విలువైన ల్యాప్టాప్ బహుమతిగా లభిస్తే మొత్తం రూ.10,000 ఆదాయంలోకి జోడించాలి. రూ.7,000 విలువ గల వోచర్ వచ్చినా మొత్తం వాల్యూ పన్ను పరిధిలోకి వస్తుంది.దీపావళి క్యాష్ బోనస్దీపావళి సందర్భంగా క్యాష్ బోనస్లపై (Diwali bonus) కూడా ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదు. దీన్ని కూడా ఉద్యోగి జీతంలో భాగంగానే పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు దీపావళి రోజున రూ.30,000 బోనస్ అందుకుంటే, దీన్ని మీ వార్షిక జీతానికి జోడిస్తారు. తద్వారా, మీరు ఉన్న ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.ఐటీఆర్ ఫైలింగ్లో జాగ్రత్తలురూ.5,000 కంటే ఎక్కువ విలువ ఉన్న బహుమతులను ఐటీఆర్లో తప్పనిసరిగా చేర్చాలి. లేని పక్షంలో, ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. సంస్థలు ఇచ్చే ఫార్మ్ 16లో ఈ వివరాలు ఉండవచ్చు. కానీ మీరు కూడా చెక్ చేయడం మంచిది.ఇదీ చదవండి: దీపావళి ఇన్సూరెన్స్ రూ.5 లకే.. -
బాస్ అంటే ఇలా ఉండాలి: ఉద్యోగులకు 51 కార్లు గిఫ్ట్
దసరా, దీపావళి పండుగలు వచ్చాయంటే.. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు ఇస్తాయి, మరికొన్ని ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతుంటాయి. ఇలాంటి కోవకు చెందిన కంపెనీలలో ఒకటి.. 'మిట్స్ నేచురా లిమిటెడ్' (Mits Natura Limited). ఈ కంపెనీ బాస్ తన ఉద్యోగులు గత రెండేళ్లుగా కార్లను గిఫ్ట్గా ఇస్తున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా ఇదే విధానం కొనసాగించారు. ఈసారి ఏకంగా 51 మందికి కార్లను గిఫ్ట్ ఇచ్చారు.ప్రముఖ ఔషదాల తయారీ సంస్థ.. మిట్స్ నేచురా లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ ఎంకే భాటియా ఈ దీపావళికి.. తమ సంస్థలో పనిచేస్తూ ఉత్తమ పనితీరును కనపరిచిన 51 మంది ఉద్యోగులకు కార్లను గిఫ్ట్ ఇస్తూ.. వాటి తాళాలను తానే స్వయంగా అందజేసి.. ప్రతి ఒక్కరినీ అభినందించారు.ప్రతి సంవత్సరం ఇంత ఖరీదైన కార్లను ఎందుకు బహుమతిగా ఇస్తారని భాటియాను అడిగినప్పుడు.. నా ఉద్యోగులే నా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు వెన్నెముక. వారి కృషి, నిజాయితీ, అంకితభావం మా విజయానికి పునాది. వారి ప్రయత్నాలను గుర్తించడం.. వారిని కూడా ఎదిగేలా చేయడం మా విధి అని ఆయన అన్నారు.కార్లను గిఫ్ట్ ఇవ్వడం అనేది ప్రదర్శించుకోవడానికి కాదు. జట్టులో స్ఫూర్తిని నింపడానికి, సంస్థను ఒక కుటుంబంలా ముందుకు తీసుకెళ్లడానికి అని ఆయన అన్నారు. టీమ్ లేదా ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడు.. కంపెనీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అయితే ఈ సారి బ్రాండ్ కార్లను గిఫ్ట్ ఇచ్చారు అనే విషయం అధికారికంగా వెలువడలేదు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు! -
రైతులకు బ్యాంకులు రుణాలు ఎందుకు ఇవ్వవంటే..
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, గ్రామీణ అభివృద్ధిని పెంచడానికి వ్యవసాయ రుణాలు చాలా ముఖ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను వ్యవసాయ రుణాలు పెంచాలని తరచుగా ఆదేశిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సకాలంలో రుణం అందడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవనోపాధికి కీలకం. అయితే ఈ దిశగా కేంద్రం చేస్తున్న కృషికి అనుగుణంగా బ్యాంకులు వీటి పంపిణీని ఆశించినంతగా పెంచడం లేదు. అందుకు కొన్ని సవాళ్లను ఎదురవుతున్నాయనే వాదనలున్నాయి.నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్(NPA) భయంవ్యవసాయ రంగంలో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వాల రుణమాఫీ పథకాల ప్రకటన కారణంగా రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. దీని ఫలితంగా బ్యాంకులకు మొండి బకాయిలు (NPA) పెరిగే అవకాశం ఉంది. పెద్ద పరిశ్రమల మొండి బకాయిలతో పోలిస్తే రైతుల మొండి బకాయిలు తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులకు ఇది ఆందోళనగా మిగిలిపోతుంది.రుణాల దుర్వినియోగంకొందరు రుణగ్రహీతలు వ్యవసాయం పేరుతో బంగారం తాకట్టు రుణాలు తీసుకుని వాటిని రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం (ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో) బ్యాంకు అధికారులు తనిఖీల్లో గుర్తిస్తున్నారు. దీనివల్ల రుణం పొందిన ప్రయోజనం నెరవేరకపోవడం, రాయితీ వడ్డీ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ కఠిన మార్గదర్శకాలు తీసుకువచ్చింది.పూచీకత్తు సమస్యలుచిన్న, సన్నకారు రైతులకు, కౌలు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. కౌలు రైతుల విషయంలో సరైన ధ్రువీకరణ వ్యవస్థ లేకపోవడంతో వారికి రుణాలు అందడం లేదు.వ్యవసాయ క్షేత్రాల పరిశీలన సవాళ్లుగ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల పంపిణీ తర్వాత అవి నిజంగా వ్యవసాయ అవసరాలకు వాడుతున్నారా లేదా అని తనిఖీ చేయాలి. అందుకు బ్యాంకులకు తగినంత మానవ వనరులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక సమస్యగా ఉంది.రుణమాఫీ జాప్యంగత ప్రభుత్వాల హయాంలో రుణమాఫీ పథకాలు ప్రకటించినప్పటికీ వాటి అమలులో జాప్యం జరుగుతుంది. దానివల్ల రైతులు పాత రుణాలను రెన్యూవల్ చేసుకోలేకపోతున్నారు. దీని ఫలితంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.ఇదీ చదవండి: భారత రైల్వేలో అపార అవకాశాలు -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొత్త ట్రెండ్..
విలాసవంతమైన గృహాలే కానీ, అందుబాటు ధరల్లో..! ఇదీ ఇప్పుడు హైదరాబాద్ నగర రియల్టీ మార్కెట్లో కొత్త ట్రెండ్. ఆడంబరాల కంటే గృహ కొనుగోలుదారుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్ట్ను తీర్చిదిద్దడమే ఈ అఫర్డబుల్ లగ్జరీ యూనిట్ల ప్రత్యేకత. సాధ్యమైనంత వరకూ నిర్మాణ, నిర్వహణ వ్యయాలను అదుపులో పెట్టుకుంటూ.. ధరలు అందుబాటు ఉండేలా చేసే అధిక సాంద్రత ప్రాజెక్ట్లతో ఇది సాధ్యమేనంటున్నారు రియల్టీ పరిశ్రమ నిపుణులు. - సాక్షి, సిటీబ్యూరోదేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని కరోనాకు ముందు, తర్వాత అని విభజించక తప్పదు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి కాలంలో ఇంటి అవసరం తెలిసొచి్చంది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్లు రకరకాల కారణాలతో ఇంట్లో గడిపే సమయం పెరిగింది. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో ఇంట్లో ప్రత్యేకంగా గది, వ్యాయామం, యోగా వంటి ఆరోగ్య అవసరాల కోసం ప్రత్యేక స్థలం అవసరమైంది. దీంతో క్రమంగా నాలుగు గోడల చౌక గృహాలకు బదులుగా విశాలమైన లగ్జరీ ఇళ్లకు డిమాండ్ ఏర్పడింది.ప్రాంతం, వసతులు, నాణ్యత, గడువు కంటే ఇప్పటికీ గృహ కొనుగోళ్లలో కస్టమర్ల తొలి ప్రాధాన్యత ధరకే.. అందుకే ధరను బ్యాలెన్స్ చేస్తూ కస్టమర్ల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్ట్లను చేపట్టేందుకు డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ గృహాలు, స్థోమత మధ్య చక్కటి సమతుల్యతను పాటిస్తుండటంతో నగరంలో సరసమైన లగ్జరీ హౌసింగ్ భావన ఊపందుకుంది. అఫర్డబుల్ లగ్జరీ గృహ విభాగం ప్రధాన ప్రయోజనం ఏంటంటే.. డెవలపర్లు గృహ కొనుగోలుదారుల సంపూర్ణ అవసరాలను పరిగణలోకి తీసుకోవడమే. ప్రాజెక్ట్ను హైప్ చేయడానికి ఫ్యాన్సీ ఆడంబరాలు, అలంకరణలను జోడించడానికి బదులుగా ఖర్చులను ఆదా చేస్తూ కస్టమర్లకు అవసరమైన వసతులు, సౌకర్యాలను అందించడానికి ప్రయతి్నస్తారు.యువ కస్టమర్ల ఆసక్తి..ఈ విలాసవంతమైన ఇళ్ల కొనుగోలుదారులు ఎక్కువగా యువ కస్టమర్ల నుంచే ఆదరణ ఎక్కువగా ఉంది. మీలినియల్స్, అధిక సంపాదన ఆర్జించే జెన్–జెడ్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వంటి కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ఐటీ హబ్ నగరాలలో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ తరహా గృహ కొనుగోలుదారులు తమ ఆదాయ స్థాయిలకు సరిపోయే ధర, ఎక్కువ వసతులు ఉండే నివాస సముదాయాలను కోరుకుంటున్నారు.అధిక అద్దెలు కూడా కారణమే..గృహాల అద్దెలు పెరగడం కూడా విలాసవంతమైన ఇళ్ల డిమాండ్కు కారణమే. ఐటీ హబ్ నగరాలలో ఏటా అద్దెలు 9–15 శాతం మేర పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడులపై అధిక రాబడి ఆర్జిస్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు సరసమైన లగ్జరీ ప్రాపర్టీలను ఆర్థికంగా చురుకైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా పరిగణిస్తున్నారు. అద్దె ఆదాయంతో నెలవారీ వాయిదా(ఈఎంఐ) చెల్లింపులతో భర్తీ చేయాలని భావిస్తుండటంతో విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది.అత్యాధునిక నిర్మాణ పద్ధతులుభూముల ధరలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ముఖ్యంగా ద్వితీయ శ్రేణి పట్టణాలు, ప్రాంతాలలో అధిక సాంద్రత కలిగిన ప్రాజెక్ట్లను నిర్మించడం ఒక కీలకమైన వ్యూహం. అలాగే డెవలపర్లు ఖర్చులను తగ్గించడానికి అత్యాధునిక నిర్మాణ పద్ధతులు, స్మార్ట్ డిజైన్లను అవలంభిస్తున్నారు. సాంకేతికత వినియోగంతో దీర్ఘకాలిక నిర్వహణ వ్యయాలనునియంత్రిస్తున్నారు. దీంతో నివాస సముదాయాలు పర్యావరణహితంగానే కాకుండా బడ్జెట్ అనుకూలంగా మారుస్తుంది. వ్యవస్థీకృతమైన ఆప్టిమైజ్ లే–అవుట్లతో సమర్థవంతమైన యూనిట్ పరిణామాలను అందించడంతో తక్కువ ధరకే లగ్జరీ వసతులను యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది.లగ్జరీ ఫీలింగ్..డెవలపర్లు కార్పెట్ ప్రాంతాన్ని పెంచడానికి స్మార్ట్ డిజైన్ లేఅవుట్లను ఎంపిక చేస్తారు. కాంక్రీట్ను సాధ్యమైనంత తక్కువ ఉపయోగించడంతో పాటు విశాలమైన, విలాసవంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పెద్ద సైజు కిటికీలు, తలుపులను ఏర్పాటు చేస్తున్నారు. ఎత్తయిన సీలింగ్తో ప్రవేశ ద్వారాన్ని సెవెన్ స్టార్ హోటల్ మాదిరి గా లగ్జరీ ఆంబియెన్స్ను కల్పిస్తున్నారు. వేగవంతమైన డెలివరీ, నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు మాడ్యులర్ నిర్మాణ పద్ధతులను అమలు చేస్తున్నారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, వెల్నెస్ ఫీచర్లు, స్థిరమైన పద్ధతులతో నివాస సముదాయాల విలువలను పెంచుతున్నారు.నిర్మాణ, నిర్వహణ వ్యయాలు..డెవలపర్లు ఉపయోగిస్తున్న మరో విధానం స్థిరత్వం. ఈ తరహా నిర్మాణాలు ఖర్చు, సమర్థవంతమైన ముందస్తు వ్యయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పర్యావరణంపై తక్కువ ప్రభావం ఉండేలా చేస్తుంది. ఈ నిర్మాణాలను తక్కువ ఆర్థిక భారం, పన్ను ప్రయోజనాలతో నిర్మించడంలో సహాయపడుతుంది. స్థిరమైన పద్ధతులను అవలంభించడం వల్ల దీర్ఘకాలిక కార్యాచరణ వ్యయాలు తగ్గుతాయి. అలాగే పర్యావరణ స్పృహ ఉన్న కస్టమర్లను ఆకర్షిస్తాయి. పర్యావరణ అనుకూలమైన నిర్మాణ సామగ్రి, శక్తి సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానం వాడకం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుంది.వెల్నెస్, ఫిట్నెస్కు ప్రాధాన్యంకరోనా తర్వాత నుంచి ప్రజల్లో ఆరోగ్యం, పర్యావరణ స్పృహపై అవగాహన పెరిగింది. దీంతో సస్టెనబులిటీ, గ్రీనరీకి ప్రాధాన్యత ఇచ్చే నివాసాల కొనుగోళ్లు, పెట్టుబడులకు కీలక అంశంగా మారింది. అఫర్డబుల్ లగ్జరీ ఇళ్లకు యువ కస్టమర్ల నుంచి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. మిలీనియల్స్, జెన్–జెడ్ గృహ కొనుగోలుదారులు బహుళ ప్రయోజనాలు ఉండే ప్రాపరీ్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వెల్నెస్, ఫిట్నెస్ సౌకర్యాలు, సోషలైజింగ్ కోసం కమ్యూనిల్ ప్రాంతాలు, బహుళ ఈ–కామర్స్ డెలివరీలు, ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లు, పాయింట్లు వంటి అనుకూలమైన మౌలిక సదుపాయాలు కోరుకుంటున్నారు. ఆటోమేటిక్ లైటింగ్ ఏర్పాట్లు, అధునాతన భద్రత వ్యవస్థ, తక్కువ విద్యుత్ను వినియోగించే ఉపకరణాలు వంటి స్మార్ట్ హోమ్ టెక్నాలజీలు ప్రామాణికంగా మారుతున్నాయి.బయోఫిలిక్ డిజైన్లు..బయోఫిలిక్ డిజైన్ అనేది నివాస, వాణిజ్య నిర్మాణ రంగంలో పెరుగుతున్న ధోరణి. సమృద్ధిగా సహజ కాంతి, ఇండోర్ మొక్కలు, కమ్యూనిటీ గార్డెన్లు వంటి వివిధ అంశాల ద్వారా పచ్చని, ప్రకృతిని సృష్టించడం. ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవన పరిస్థితులు. స్థానిక జంతుజాలం, పచ్చని ప్రదేశాలు, స్థానిక మొక్కలతో మార్గాలను ఏకీకృతం చేస్తాయి. కలప, రాయి, టెర్రకోట వంటి సహజ పదార్థాలను ఫ్లోరింగ్, అలంకరణలో ఉపయోగిస్తారు. అలాగే ఆకుపచ్చ, నీలం, మట్టి రంగుల పాలెట్తో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. చిన్న ఇండోర్ ఫౌంటేన్లు, టేబుల్ టాప్ వాటర్ ఫౌంటేన్ల వంటివి ఏర్పాటు చేస్తారు. పెద్ద కిటికీలతో సహజ కాంతికి ప్రాధాన్యత ఇస్తారు. గాలి నాణ్యత, నివాసితుల మానసిక స్థితిని మెరుగుపర్చడానికి గాలి వీచేందుకు ప్రోత్సహిస్తారు.యాంత్రిక వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించి తక్కువ విద్యుత్ను వినియోగించే ఉపకరణాలను వాడతారు. ఈ తరహా ప్రాజెక్ట్ల కొనుగోలుదారులు మృదువైన ఫినిషింగ్, ఆధునిక డిజైన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే లగ్జరీ, సౌందర్యంపై ఏమాత్రం రాజీపడరు. కొనుగోలుదారుల కార్యచరణ ఖర్చులను తగ్గించే శక్తి సామర్థ్యం, స్థిరమైన లక్షణాలు ఉండే పర్యావరణ అనుకూల ఎంపికలను కోరుకుంటారు. ఈ తరహా ప్రాజెక్ట్లకు ప్రాంతం, కనెక్టివిటీకి కూడా ముఖ్యమే. హైవేలు, మెట్రో లైన్లతో మంచి కనెక్టివిటీలతో పాటు సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోని ప్రాపరీ్టలకు నివాసితులకు కోరుకుంటున్నారు. -
సామాన్యులు కన్నెత్తి చూడలేని స్థితిలో బంగారం
బంగారం ధరలు స్టాక్ మార్కెట్తో పోటీపడుతూ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో కొనుగోళ్లు లేక బంగారం వ్యాపారస్తులు డీలా పడుతున్నారు. శనివారం ధనత్రయోదశి నాడైనా వ్యాపారం కళకళలాడుతుందని బంగారు దుకాణాల యజమానులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.వన్టౌన్(విజయవాడ): భారతీయ సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానం. ఏ శుభకార్యం ఉన్నా బంగారం ప్రస్తావన లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. ప్రజలు వారివారి స్థాయిలో ఎంతో కొంత బంగారం ఆభరణాలను కొనుగోలు చేసి తమ హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. అయితే గడిచిన కొన్ని మాసాలుగా బంగారం ధర ఊహించని స్థాయిలో పెరుగుతుండడంతో ఆ ప్రభావం వ్యాపారంపై పడింది. తత్ఫలితంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వందలాది బంగారు దుకాణాల్లో వ్యాపారం దారుణంగా పడిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు. రెండేళ్లలో రెట్టింపైన ధర.. దేశంలోనే విజయవాడ బంగారం విక్రయాలకు చాలా ముఖ్యమైన ప్రాంతంగా వ్యాపారులు చెబుతారు. ఇక్కడ వ్యాపారులు, బంగారం ఆభరణాలు చేసే కారి్మకుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఇక్కడ బంగారం ధరలో మార్పులు ఆయా వర్గాలను సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. విజయవాడలో 2023 అక్టోబర్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.60వేలు ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,450గా ఉంది. తాజాగా శుక్రవారం అదే 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ. 1,35,000 కాగా 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ.1,21,700గా ఉంది. గడిచిన వారం రోజు లుగా బంగారం పరుగులు పెడుతూనే ఉంది. కొద్దిగా తడబడినా పరుగులు కొనసాగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో దిగజారిన వ్యాపారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రతి రోజూ 150 నుంచి 200 కిలోల బంగారం వ్యాపారం జరుగుతుందని అంచనా. విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో బంగారు ఆభరణాల విక్రేతలకు సంబంధించి కార్పొరేట్ సంస్థలుగా ఉన్న దుకాణాలు సుమారుగా 30 నుంచి 40 వరకూ పని చేస్తున్నాయి. ఇవి కాకుండా విజయవాడ పాతబస్తీ, రాజగోపాలాచారివీధి, గవర్నరుపేట, సత్యనారా యణపురం, పటమట, బందరురోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారుగా 800 నుంచి వెయ్యి వరకూ దుకాణాలు కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మరో మూడు నుంచి నాలుగు వందల వరకూ దుకాణాలు ఉన్నాయి. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1300 నుంచి 1500 దుకాణాల్లో వ్యాపారం జరుగుతోంది. మామూలు కొనుగోలు దారులు కాకుండా సుమారు 20 వేల మంది బంగారు ఆభరణాల తయారీ కార్మికులు కూడా భారీగానే బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. విజయవాడ నగరంలోని కార్పొరేట్, కొన్ని సంప్రదాయ దుకాణాల్లోనే 80 శాతం వ్యాపారం జరిగితే మిగిలిన దుకాణాల్లో పది నుంచి 20 శాతం వ్యాపారం జరుగుతుందని సంఘ నేతలు చెబుతున్నారు. అయితే గడిచిన కొద్ది మాసాలుగా వ్యాపారం భారీగా దిగజారిందని, పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ సగానికి పైగా పడిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాహాల సీజన్ ఉన్నా వ్యాపారం జరగకపోవటంపై వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారు. భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నా...నగరంలోని పలు కార్పొరేట్ బంగారు ఆభరణాల దుకాణాలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నా వ్యాపారం జరగటం లేదని చెబుతున్నారు. ప్రధానంగా గ్రాముకు వాల్యూ యాడెడ్ చార్జీలు 10 నుంచి 30 శాతం వరకూ ఆయా ఆభరణాల రకా లను బట్టి వ్యాపారులు విధిస్తారు. అంటే గ్రాము 12 వేలు ఉంటే అత్యధికంగా రూ.3,600 వరకూ వీఏ పేరుతో చార్జీలను వ్యాపారులు వసూలు చేస్తారు. ఇది కాకుండా జీఎస్టీ ఉంటుంది. అయి తే తాజాగా వ్యాపారులు చాలా వరకూ ఈ వీఏ పేరుతో వసూలు చేసే చార్జీలను కొంతమంది సగానికి తగ్గించగా, మరికొంతమంది ఇంకా తగ్గించి ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరికొంతమంది వ్యాపారులు గ్రాముకు వంద నుంచి రూ.500 వరకూ తగ్గింపు ఇస్తామని ప్రకటిస్తున్నా.. వ్యాపారం జరగటం లేదని వాపోతున్నారు. ధనత్రయోదశి సెంటిమెంట్ అయినా ఫలిస్తుందా.. బంగారం వ్యాపారులు ధనత్రయోదశిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల 18వ తేదీన ధనత్రయోదశి తిథి ఉన్నట్లుగా పండితులు చెబుతున్నారు. ధనత్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది అనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఆ క్రమంలో గడిచిన దశాబ్ద కాలంగా బంగారం విక్రయాలు ధనత్రయోదశి రోజున నగరంలో భారీగా జరుగుతున్నాయి. వ్యాపారులు ఇప్పటికే ప్రత్యేకంగా ఆఫర్లను ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పెద్ద దుకాణాలు ఎలా ఉన్నా చిన్న వ్యాపారులు ధనత్రయోదశి రోజున ఎంతోకొంత వ్యాపారం పెరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు.వ్యాపారం దారుణంగా పడిపోయింది బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో వ్యాపారం భారీగా దిగజారిపోయింది. అసలే కార్పొరేట్ దుకాణాల తాకిడికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాధారణ వ్యాపారులకు ఈ ధరల పెరుగుదల గోరుచుట్టుపై రోకటి పోటులా తయారైంది. బంగారం ధరల పెరుగుదలతో చాలా దుకాణాల్లో రోజుల తరబడి బోణీ సైతం కాని పరిస్థితులు ఉన్నాయి. ధనత్రయోదశి, దీపావళి పండుగలను పురస్కరించుకుని అయినా వ్యాపారాలు కోలుకుంటాయని ఆశగా ఎదురు చూస్తున్నాం. – కోన శ్రీహరి సత్యనారాయణ, అధ్యక్షుడు, ది బెజవాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ -
భారత రైల్వేలో అపార అవకాశాలు
భారతీయ రైల్వే వ్యవస్థ ప్రస్తుతం గణనీయమైన పరివర్తన దశలో ఉంది. భారత రైల్వే కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన లక్ష్యాల ప్రకారం.. 2047 నాటికి 7,000 కిలోమీటర్ల మేర హై-స్పీడ్ కారిడార్లను విస్తరించడం, వందేభారత్, అమృత్ భారత్ రైళ్లను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు ప్రతిపాదించారు. దాంతో అంతర్జాతీయ, దేశీయ కంపెనీలకు భారత రైల్వే మార్కెట్లో అపారమైన అవకాశాలు లభిస్తాయనే అంచనాలున్నాయి.ప్యాసింజర్ల అవసరాలకు అనువుగా..అంతర్జాతీయ కంపెనీలతోపాటు దేశీయ సంస్థలు భారతీయ ప్యాసింజర్ల అవసరాలు తీర్చడానికి కొన్ని విధానాలు అనుసరించాల్సి ఉంటుంది. హై-స్పీడ్, ప్రీమియం విభాగం (వందేభారత్ వంటివి) అవసరమే అయినప్పటికీ మెజారిటీ ప్రయాణీకులకు సరసమైన ప్రయాణం(అమృత్ భారత్ వంటివి) అవసరం. ధరల విషయంలో భారతదేశ మార్కెట్కు ప్రత్యేకంగా సరిపోయే భాగాలను, రైళ్లను ఉత్పత్తి చేయాలి. భారతీయ రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేసే విధంగా కోచ్ డిజైన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. సీటింగ్, లగేజీ స్థలం వంటివి దృష్టిలో ఉంచుకోవాలి.దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని భారతీయ భాగస్వాములకు బదిలీ చేయాలి. రైల్వే విడి భాగాలు, వ్యవస్థలను భారతదేశంలోనే తయారుచేయడానికి తయారీ యూనిట్లను నెలకొల్పాలి. తద్వారా స్థానిక ఉపాధి కల్పన పెరుగుతుంది. ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేయాలనే లక్ష్యం ‘మేక్ ఇన్ ఇండియా’ కేంద్రాల నుంచే ప్రారంభమైతే అంతర్జాతీయ కంపెనీలకు భారత ప్రభుత్వ సహకారం మరింత లభించే అవకాశం ఉంటుంది.భద్రత ప్రమాణాలు కీలకంరైళ్ల వేగం పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు అత్యంత కీలకం. కవచ్ వంటి స్వదేశీ సాంకేతికతలతో అనుసంధానం అయ్యే అత్యాధునిక సిగ్నలింగ్, ట్రాకింగ్ నిర్వహణ వ్యవస్థలను అందించాలి. రైలు ఆలస్యాలను, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి అత్యంత విశ్వసనీయత కలిగిన డివైజ్లను అందించాలి. దాంతోపాటు రైళ్లలో మెరుగైన సౌకర్యాలు (ఉదా: పరిశుభ్రమైన మరుగుదొడ్లు, మెరుగైన సీటింగ్, వినోద వ్యవస్థలు) అందించడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా కోచ్ డిజైన్లను అభివృద్ధి చేయాలి.కంపెనీలకు వాణిజ్య అవకాశాలుభారత రైల్వే విస్తరణలో హై-స్పీడ్ కారిడార్లు, వందే భారత్, అమృత్ భారత్ వంటి రైళ్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాంతో కంపెనీలకు అనేక వాణిజ్య అవకాశాలున్నాయి.మౌలిక సదుపాయాలుప్రభుత్వం 2047 వరకు 7,000 కి.మీ.ల హై-స్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేయాలని తలపెట్టిన నేపథ్యంలో అధిక నాణ్యత కలిగిన ట్రాక్ మెటీరియల్స్, వెల్డింగ్ సాంకేతికతలు, ట్రాక్ నిర్వహణ యంత్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల నిర్మాణ నైపుణ్యం అవసరం. హై-స్పీడ్ రైళ్లకు అత్యాధునిక ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ (OHE), ప్రపంచ స్థాయి సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ముఖ్యం. కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు.వందేభారత్ స్లీపర్ వెర్షన్లు, మెట్రో రైళ్లు, అమృత్ భారత్ (నాన్-ఏసీ జనరల్ క్లాస్) రైళ్లను పెద్ద సంఖ్యలో తయారు చేయాల్సి ఉంటుంది. కంపెనీలు కోచ్ డిజైన్, ప్రొపల్షన్ సిస్టమ్స్, బ్రేకింగ్ సిస్టమ్స్ వంటి అత్యంత కీలక భాగాలను సరఫరా చేయవచ్చు. భారత రైల్వేతో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి ప్రారంభించవచ్చు.ఎగుమతి ఉత్పత్తి కేంద్రాలుభారతదేశాన్ని రైల్వే భాగాల తయారీ కేంద్రంగా ఉపయోగించుకోవడానికి కంపెనీలకు ఇదో అవకాశం. ఇక్కడ తక్కువ ఖర్చుతో తయారైన రైల్వే భాగాలను ఆఫ్రికా, ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిర్వహణ వ్యవస్థలు, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత ట్రాక్ పర్యవేక్షణ, ప్రయాణీకుల సమాచార వ్యవస్థలను అందించడంలో అవకాశాలు ఉన్నాయి. కొత్త రైళ్లను, సాంకేతికతలను నిర్వహించడానికి ప్రస్తుత రైల్వే వర్క్షాప్లను ఆధునీకరించడానికి అత్యాధునిక యంత్రాలు, నైపుణ్యం అవసరం.అమృత్ భారత్ స్టేషన్ పథకంఈ పథకం కింద వేల సంఖ్యలో స్టేషన్లను పునరుద్ధరిస్తున్నారు. కంపెనీలు స్టేషన్ డిజైన్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, లాంజ్ సౌకర్యాలు, రిటైల్ స్పేస్ల అభివృద్ధిలో పాలుపంచుకోవచ్చు. ఇందులో భారీ పెట్టుబడులు అవసరం కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) నమూనాల ద్వారా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో కంపెనీలు ముఖ్య పాత్ర పోషించవచ్చు.ఇదీ చదవండి: పలుచబడిన ఐపీఎల్ మార్కెట్! కారణాలివే.. -
రిచ్ అవ్వాలంటే కూడబెట్టాల్సింది ఆ ‘ఫేక్ డబ్బు’ కాదు..
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich dad Poor dad) రచయిత రాబర్ట్ కియోసాకి అమెరికా ద్రవ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ వంటి పెట్టుబడుల పెరుగుదల అనేది వ్యవస్థల వైఫల్యానికి సంకేతమని అని ఆయన హెచ్చరించారు. అమెరికా బేబీ బూమర్ (1946-1964 మధ్య పుట్టినవారు)తరగతికి ఈ ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపించబోతుందని ఆయన భావిస్తున్నారు."ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు" అంటూ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ చేశారు. "కానీ ద్రవ్యోల్బణం పేద మధ్యతరగతి ప్రజల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తుంది." ధరలు పెరుగుతున్నప్పుడు, ఫియట్ మనీ లేదా "నకిలీ డబ్బు" సామాన్య అమెరికన్ల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఎథీరియం వంటి "నిజమైన డబ్బు" లో ఆదా చేయాలని ప్రజలకు సూచించారు.అక్టోబర్ లో బంగారం ధరలో జరిగిన నాటకీయ ర్యాలీని అనుసరించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం, బంగారం ప్రపంచవ్యాప్తంగా ఔన్సుకు 4,250 డాలర్లు, భారతదేశంలో 10 గ్రాములకు రూ.1.31 లక్షల వద్ద (అక్టోబర్ 18 నాటికి) ట్రేడ్ అవుతోంది. వెండి కూడా దూసుకెళ్తోంది. అయితే బిట్ కాయిన్ మార్కెట్ గందరగోళం మధ్య 1,21,000 డాలర్ల నుండి 108,000 డాలర్లకు పడిపోయింది.1947 లో జన్మించిన రాబర్ట్ కియోసాకి, తన లాంటి బేబీ బూమర్ తరగతికి ఈ ద్రవ్యోల్బణం బలమైన హానిని కలిగించే అవకాశం ఉందని చెప్పారు. "ద్రవ్యోల్బణం ద్వారా మనం పూర్తిగా తుడిచిపెట్టకుపోతామని" ఆయన హెచ్చరించారు. "మీ అమ్మ, నాన్నలు వీధుల్లోకి రావచ్చు ఎందుకంటే ద్రవ్యోల్బణం వారి సామాజిక భద్రతను తుడిచిపెట్టబోతోంది." అన్నారు.THE RICH get RICHER: while I am personally happy gold, silver, Bitcoin, Ethereum are going up…. My concern is the price of life…. AKA…inflation….makes life harder on the poor and middle class.Please do your best to not be a victim of a broken and corrupt monetary system.…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 17, 2025 -
ఈవీ ఉంటే.. ఇంటి ధర పెంచుడే..
ఇంధన వనరుల ధరలు రోజుకు ఒకలా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోజిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది.2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కొత్త ప్రాజెక్ట్లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగం (రెట్రోఫిట్) ప్రాజెక్ట్ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది.ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సర్వీస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయిస్తాయని అంచనా.ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి కనుక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు.ఆఫీస్ స్పేస్లలో కూడా..ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవిన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్ పార్కింగ్లలో ఖాళీ ప్లేస్లు లేకపోవడమే అసలైన సవాలు.ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేట్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సర్వీస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది. -
బంగారం, వెండి కొనేవాళ్లకు ‘పండగే’
గత కొన్ని రోజులుగా ఆగకుండా దూసుకెళ్తున్న పసిడి ధరలు (Gold Price) ఎట్టకేలకు దిగివచ్చాయి. ధనత్రయోదశి (Dhanteras) రోజున కొనుగోలుదారులకు భారీ ఉపశమనాన్ని కలిగించాయి. దాదాపు వారం రోజుల తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు (Silver Price) కూడా భారీగా దిగివచ్చాయి. వరుసగా మూడో రోజూ పతనమయ్యాయి. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయి.. దేశంలోని వివిధ నగరాల్లో ప్రస్తుతం వాటి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రియల్ ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలు
సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కంటే ముందుతో పోలిస్తే ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో ఇంటి కొనుగోలు ఎంపికలో రాజీ పడటం లేదు. రిస్క్ తీసుకునైనా సరే సొంతింటిని కొనుగోలు చేయాలని.. చిన్న సైజు ఇంటి నుంచి విస్తీర్ణమైన గృహానికి వెళ్లాలని.. ఐసోలేషన్ కోసం ప్రత్యేక గది లేదా కుటుంబ సభ్యులతో గడిపేందుకు హాలిడే హోమ్ ఉండాలని భావించే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో రాబోయే రోజుల్లో గృహ విభాగానికి డిమాండ్ ఏర్పడటం ఖాయమని జేఎల్ఎల్–రూఫ్ అండ్ ఫ్లోర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది.వర్క్ ఫ్రం హోమ్ ఇతరత్రా అవసరాల కోసం బాల్కనీ స్థలంలో అదనంగా ఒక గదిని, ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఆ తరహా ప్రాజెక్ట్లలో కొనుగోళ్లకే కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్లు లేదా పేరున్న డెవలపర్లకు చెందిన నిర్మాణంలోని ప్రాజెక్ట్లలో మాత్రమే కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.వచ్చే మూడు నెలల కాలంలో 80 శాతం కంటే ఎక్కువ కొనుగోలుదారులు గృహాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రూ.75 లక్షల కేటగిరీలోని ప్రాపర్టీలను కొనేందుకు సుముఖంగా ఉన్నారు. హైదరాబాద్తో సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్కే ఫ్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఆయా మార్కెట్లలో పెట్టుబడిదారులు తామ ఉండేందుకు గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో విల్లాలు, అభివృద్ధి చేసిన ప్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ధరలు అందుబాటులో ఉండటం, మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడం, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్టీ మార్కెట్లో ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. -
పలుచబడిన ఐపీఎల్ మార్కెట్! కారణాలివే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్కెట్ విలువ 2025లో గణనీయంగా పడిపోవడానికి దారితీసిన అంశాలను ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో విశ్లేషించారు. ఐపీఎల్ విలువ గతేడాది రూ.92,500 కోట్ల నుంచి 2025లో రూ.76,100 కోట్లకు పడిపోవడం వెనుక ఉన్న ప్రధాన కారణాలను తెలియజేస్తూ అవి మార్కెట్, ప్రకటనలు, చట్టపరమైన మార్పులు, క్రికెట్ మార్కెట్పై చూపిన ప్రభావాన్ని అంచనా వేశారు.మీడియా హక్కులపై ఏకఛత్రాధిపత్యండిస్నీ స్టార్, వయాకామ్ 18 విలీనం కావడం ద్వారా మార్కెట్లో ఒకే పెద్ద బ్రాడ్కాస్టర్ (జియోస్టార్)కు అవకాశం ఏర్పడింది. గతంలో మీడియా హక్కుల కోసం పెద్ద సంస్థల మధ్య తీవ్రమైన పోటీ (బిడ్డింగ్ వార్) ఉండేది. దీని వల్ల మీడియా హక్కులను చేజిక్కించుకునేందుకు మరింత డబ్బు వెచ్చించేవారు. డిస్నీ స్టార్, వయాకామ్ 18 విలీనంతో ప్రధాన బ్రాడ్కాస్టర్గా ఏర్పడినప్పుడు పోటీ లేకపోవడం వల్ల ఐపీఎల్ (IPL) మీడియా హక్కుల కోసం చెల్లించే ధరలు తగ్గిపోయాయి. ఇది ఐపీఎల్ (IPL) మొత్తం విలువపై తీవ్ర ప్రభావం చూపింది.ఫాంటసీ, గేమింగ్ ప్రకటనలపై నిషేధంకొత్త ఆన్లైన్ గేమింగ్ చట్టం కింద ఫాంటసీ స్పోర్ట్స్, ఇతర గేమింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం లేదా కఠినమైన నిబంధనలు విధించారు. ఐపీఎల్ (IPL) ప్రసారాలకు ఫాంటసీ గేమింగ్ సంస్థలు ఒకప్పుడు అతిపెద్ద ప్రకటనదారులుగా ఉండేవి. కొత్త నిబంధనలతో ఈ వర్గాన్ని కోల్పోవడం లేదా వారి ప్రకటన బడ్జెట్ తగ్గడం వల్ల లీగ్ (League) ప్రకటనల ఆదాయంపై భారీగా దెబ్బతింది.ఆర్థిక అనిశ్చితిప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా ఆర్థిక మందగమనం, అనిశ్చితి నెలకొన్నప్పుడు కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా కంపెనీలు తమ ప్రకటనల బడ్జెట్లను పరిమితం చేశాయి. ముఖ్యంగా బ్రాండ్ (Brand) ప్రచారం కోసం చేసే ఖర్చు తగ్గింది.Why IPL valuation dropped again in 2025- from Rs 92,500 cr to Rs 76,100 cr:1. Disney Star–Viacom18 merger → single broadcaster (JioStar) → no bidding war, lower media-rights value.2. Ban on fantasy & gaming ads under new Online Gaming Act → loss of key advertiser category.…— Harsh Goenka (@hvgoenka) October 16, 2025ఫ్రాంచైజీల లాభాలపై ఒత్తిడిఏటా ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి, వారి జీతాల కోసం అయ్యే ఖర్చు (సాలరీ క్యాప్) పెరుగుతూ వస్తోంది. మరోవైపు ప్రధాన స్పాన్సర్షిప్ ఒప్పందాల విలువ అనుకున్నంత వేగంగా పెరగడం లేదు. అధిక ఖర్చులు, స్తబ్దుగా ఉన్న వీటి ఆదాయాల కారణంగా లాభాలు తగ్గుతున్నాయి.గ్లోబల్ క్రికెట్ప్రపంచ క్రికెట్ మార్కెట్లో అనేక కొత్త లీగ్లు పుట్టుకొస్తున్నాయి. ఇది ప్రేక్షకులను ఐపీఎల్ నుంచి కాస్త దూరంగా ఉంచుతుంది. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ (BBL), కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), సౌతాఫ్రికా టీ20, యూఏఈ (UAE) లీగ్ వంటి అనేక అంతర్జాతీయ లీగ్లు ఉన్నాయి.ఇదీ చదవండి: అమెరికా అణ్వాయుధ సిబ్బందికి లేఆఫ్స్ -
అమెరికా అణ్వాయుధ సిబ్బందికి లేఆఫ్స్
యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అణ్వాయుధాల రూపకల్పన, వాటి నిర్వహణ, వాటిని భద్రపరచడానికి బాధ్యత వహించే కీలక ఏజెన్సీ అయిన నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (NNSA) సిబ్బందికి సామూహిక లేఆఫ్స్ తప్పవని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వహణకు నిధులు లేకపోవడంతో ఏజెన్సీ తన ఉద్యోగుల్లో అధికశాతం మందిని తాత్కాలికంగా తొలగించవలసి వస్తుంది. దీంతో అమెరికా జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..‘NNSA వద్ద ఉన్న నిధులు త్వరలో అయిపోనున్నాయనే సమాచారం ఉంది. దీని కారణంగా ఏజెన్సీలోని ఉద్యోగుల్లో 80 శాతం మందిని తొలగించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్ఎన్ఎస్ఏపై షట్ డౌన్ ప్రభావాల గురించి మాట్లాడుతూ..‘త్వరలో ఏజెన్సీలో పని చేస్తున్న సుమారు పదివేల మందికి లేఆఫ్స్ ఇస్తాం. మా జాతీయ భద్రతకు వారు కీలకమైన సిబ్బంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ చర్యలు తప్పడం లేదు’ అని తెలిపారు.జాతీయ భద్రతపై ఆందోళన?‘ఏజెన్సీలో చాలామంది ఉద్యోగులు దేశానికి సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తిని నిర్వహిస్తున్నారు. అందులో భద్రత, అత్యవసర సిబ్బంది విధుల్లో ఉంటారు. మేము ఇప్పటికే ఉన్న ఆయుధాగారాన్ని చెక్కుచెదరకుండా, సురక్షితంగా ఉంచబోతున్నాం. జాతీయ భద్రతపై ఎలాంటి ఆందోళన వద్దు’ అని రైట్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
ఒకప్పుడు మిలిటరీ డాక్టర్.. ఇప్పుడేమో క్యాబ్ డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఓ మహిళకు కెనడాలో కారులో మిస్సిస్సాగా నుంచి టొరంటోకు ప్రయాణిస్తున్నప్పుడు వింత అనుభవం ఎదురైంది. తాను ఎక్కిన క్యాబ్ డ్రైవర్తో మాటామంతి సాగిస్తుండగా తన ప్రొఫైల్ విని ఆశ్చర్యపోయింది. ఆ డ్రైవర్ తనతో ఏ విషయాలు పంచుకున్నారో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయింది.క్యాబ్ డ్రైవర్ బెంగళూరు మహిళ మేఘనా శ్రీనివాస్తో చెప్పిన వివరాల ప్రకారం..‘నేను ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వ్యక్తిని. గతంలో యూఎస్, కెనడా కోసం మిలిటరీలో వైద్యుడిగా పనిచేశాను. ప్రస్తుతం కెనడాలో పర్మనెంట్ రెసిడెంట్(PR) కోసం ప్రయత్నిస్తున్నాను. నా వైద్య వృత్తిని కొనసాగించడానికి అవసరమైన లైసెన్స్ పొందడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం కెనడాలో ఒక డిగ్రీ కోసం చదువుతున్నాను. రోజువారీ ఖర్చుల కోసం ఇలా క్యాబ్ నడుపుతున్నాను. క్యాబ్ నడపడం ద్వారా సుమారు నెలకు 4,000 డాలర్లు సంపాదిస్తున్నాను. కానీ టొరంటోలో ఒక పడకగదికి సుమారు 3,000(రూ.2.63 లక్షలు) డాలర్లు చెల్లించవలసి వస్తుంది. టొరంటోలో అద్దెగదులు చాలా ఖరీదైనవి’మేఘనా తన పోస్ట్లో విదేశాలకు మకాం మార్చే ముందు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి సరైన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. కెనడాకు వెళ్లే ముందు విద్యార్థులు, ఇతర వ్యక్తులు క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. అక్కడి విద్యా వ్యవస్థ లేదా నగరాల గురించి మాత్రమే కాకుండా జీవన ఖర్చులు, విధానాలు, ఉద్యోగ మార్కెట్.. వంటి చాలా అంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలని తెలిపారు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
స్వల్పంగా పెరిగిన నిరుద్యోగిత
న్యూఢిల్లీ: సెప్టెంబర్లో నిరుద్యోగం (ఉపాధి లేమి) కాస్తంత ఎగిసింది. ఆగస్ట్లో 5.1 శాతంగా ఉంటే, సెప్టెంబర్లో 5.2 శాతానికి పెరిగింది. 15 ఏళ్లు, అంతకుమించి వయసులోని వారికి సంబంధించి ఉపాధి వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళిక అమలు శాఖ ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది జూలైలో నిరుద్యోగిత 5.2 శాతంగా ఉంటే, జూన్, మే నెలల్లో 5.6 శాతం, ఏప్రిల్లో 5.1 శాతం చొప్పున నమోదు కావడం గమనార్హం. వరుసగా రెండు నెలల పాటు తగ్గిన నిరుద్యోగ రేటు సెప్టెంబర్లో స్వల్పంగా పెరిగినట్టు గణాంకాలు, ప్రణాళిక అమలు శాఖ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఆగస్ట్లో 4.3 శాతంగా ఉంటే, సెప్టెంబర్లో 4.6 శాతానికి ఎగిసింది. అదే పట్టణ ప్రాంతాల్లో మాత్రం 6.7 శాతం నుంచి 6.8 శాతానికి చేరింది. ఉపాధి గణాంకాలు.. → పట్టణ మహిళల్లో నిరుద్యోగ రేటు ఆగస్ట్లో ఉన్న 8.9 శాతం నుంచి సెప్టెంబర్లో 9.3 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగిత 5.2 శాతం నుంచి 5.5 శాతానికి ఎగిసింది. → పట్టణ పురుషుల్లో ఉపాధి లేమి 5.9 శాతం నుంచి 6 శాతానికి.. గ్రామీణ ప్రాంతాల్లో 4.5 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది. → పనిచేసే జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) సెప్టెంబర్ చివరికి 52.4 శాతానికి చేరింది. ఈ ఏడాది మే నెల తర్వాత ఇదే గరిష్ట స్థాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శ్రామికశక్తి పెరగడం ఇందుకు అనుకూలించింది. → మహిళల్లో డబ్ల్యూపీఆర్ జూన్లో 30.2 శాతంగా ఉంటే, సెప్టెంబర్ నాటికి 32.3 శాతానికి మెరుగుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కారి్మక శక్తి గత మూడు నెలలుగా పెరుగుతూ వస్తోంది. జూన్లో 33.6 శాతంగా ఉంటే, సెప్టెంబర్ చివరికి 36.3 శాతానికి చేరింది. → 15 ఏళ్లు, అంతకుమించిన జనాభాలో కార్మికుల భాగస్వామ్య రేటు జూన్లో నమోదైన 54.2 శాతం నుంచి సెప్టెంబర్ చివరికి 55.3 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 56.1 శాతం నుంచి 57.4 శాతానికి మెరుగుపడగా, పట్టణాల్లో మాత్రం 50.9 శాతం వద్దే కొనసాగింది. మహిళా కారి్మకుల భాగస్వామ్య రేటు (పనిచేసే వారు) జూన్లో ఉన్న 32 శాతం నుంచి సెప్టెంబర్ చివరికి 37.9 శాతానికి పుంజుకున్నది. -
తోషిబా.. భారీ విస్తరణ..!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా విద్యుత్కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత్, జపాన్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,232 కోట్లు (55 బిలియన్ యెన్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. దీనితో 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపవుతుందని సంస్థ వివరించింది. ప్రాథమిక అంచనాలకు మించి విద్యుత్కి డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్న నేపథ్యంలో జపాన్లోని హమాకవాసాకి కార్యకలాపాలపై, హైదరాబాద్లోని తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డి్రస్టిబ్యూషన్ సిస్టమ్స్ (ఇండియా)పై గణనీయంగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ‘గ్లోబల్గా విద్యుత్కి డిమాండ్ పెరుగుతుండటంతో సరఫరా పరికరాల (టీఅండ్డీ) లభ్యత మరింత కీలకంగా మారింది. ప్రస్తుత మౌలిక సదుపాయాలు పాతబడిపోతుండటం, పునరుత్పాదక విద్యుత్ పెరుగుతుండటం, కొత్త డేటా సెంటర్ల నిర్మాణం మొదలైన అంశాల దన్నుతో 2030 నాటికి జపాన్లో టీఅండ్డీ పరికరాలకు డిమాండ్ భారీగా పెరగనుంది. అలాగే, భారత్లో కూడా పట్టణ ప్రాంత జనాభా, పునరుత్పాదక విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతుండటంతో విద్యుత్కి డిమాండ్ గణనీయంగా పెరగనుంది‘ అని తోషిబా వైస్ ప్రెసిడెంట్ హిరోషి కనెటా తెలిపారు. ఈ నేపథ్యంలో హై–వోల్టేజ్ టీఅండ్డీ పరికరాల సరఫరాను పెంచే దిశగా, తాము ప్రస్తుత ప్లాంట్లను ఆధునీకరించుకుంటూ, కొత్త ప్లాంట్లను నిర్మిస్తూ, ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు వివరించారు. -
రిలయన్స్ క్యూ2.. గుడ్
టెలికం, డిజిటల్ ప్లాట్ఫామ్ రిలయన్స్ జియో సహా.. రిలయన్స్ రిటైల్, ఆయిల్ టు కెమికల్స్(ఓ2సీ) విభాగాల దన్నుతో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పటిష్ట పనితీరు చూపింది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) క్యూ2లో నికర లాభం 10 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ తాజాగా జూలై–సెప్టెంబర్(క్యూ2) ఆర్థిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 18,165 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 16,653 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 26,994 కోట్లతో పోలిస్తే 33 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ. 2.35 లక్షల కోట్ల నుంచి రూ. 2.39 లక్షల కోట్లకు ఎగసింది. కొత్త కస్టమర్లను జత చేసుకోవడం, వినియోగదారునిపై ఆదాయం పుంజుకోవడం, వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ బిజినెస్లతో జియో లాభం 13 శాతం పుంజుకోగా.. స్టోర్ల నిర్వహణ మెరుగుపడటంతో రిటైల్ విభాగం ఆర్జన 22 శాతం ఎగసింది. మరోవైపు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా చమురును ప్రాసెస్ చేయడంతో బలపడిన రిఫైనింగ్ మార్జిన్లు ఈ క్యూ2లో ఆర్ఐఎల్కు జోష్నిచ్చాయి. క్యూ1తో పోలిస్తే ఇన్వెంటరీ నష్టాలు రెట్టింపై రూ. 8,421 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 15% జంప్చేసి రూ. 50,367 కోట్లను తాకింది. రుణ భారం రూ. 3.38 లక్షల కోట్ల(క్యూ1) నుంచి రూ. 3.48 లక్షల కోట్లకు పెరిగింది. ఓ2సీ ఓకే: చమురు, రసాయనాల విభాగం ఇబిటా 21% జంప్చేసి రూ. 15,008 కోట్లను తాకింది. జామ్నగర్ జంట రిఫైనరీల చమురు శుద్ధి మార్జిన్లు బలపడ్డాయి. కొత్త రికార్డ్తో 20.8 మిలియన్ టన్నుల చమురును ప్రాసెస్ చేసింది. ఇంధన రిటైల్ బిజినెస్ జియో–బీపీ డీజిల్, పెట్రోల్ విక్రయాలు 30 శాతం జంప్చేశాయి. రిటైల్ నెట్వర్క్ 2,000 ఔట్లెట్లకు చేరింది. ఇక కేజీ–డీ6 క్షేత్రాలలో గ్యాస్ ఉత్పత్తి 5 శాతంపైగా క్షీణించింది.ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు 1.4 శాతం లాభంతో రూ. 1,417 వద్ద ముగిసింది. రిటైల్ భళా రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం 22 శాతం ఎగసి రూ. 3,457 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 90,018 కోట్లను తాకింది. ఇబిటా 17 శాతం అధికమై రూ. 6,816 కోట్లయ్యింది. ఈ కాలంలో కొత్తగా 412 స్టోర్లను జత చేసుకోవడంతో వీటి సంఖ్య 19,821కు చేరింది. నిర్వహణ మార్జిన్లను మెరుగుపరిచేందుకు కార్యకలాపాల క్రమబదీ్ధకరణను చేపట్టింది. ఈకామర్స్ ప్లాట్ఫామ్ ఎజియో కేటలాగ్ 35 శాతం పెరిగి 2.7 మిలియన్ ఆప్షన్లకు చేరింది. ఆన్లైన్ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ షీన్ యాప్ డౌన్లోడ్స్ 60 లక్షలను దాటాయి. జియో జోరు టెలికం, డిజిటల్ అనుబంధ సంస్థ జియో ప్లాట్ఫామ్స్ నికర లాభం క్యూ2లో 13 శాతం పుంజుకుని రూ. 7,379 కోట్లను తాకింది. డేటా మినిట్స్ వినియోగం, ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ), సబ్స్క్రయిబర్ల సంఖ్య మెరుగుపడటం ఇందుకు సహకరించింది. కస్టమర్ల సంఖ్య 49.81 కోట్ల నుంచి 50.64 కోట్లకు పెరిగింది. ఏఆర్పీయూ రూ. 208.8 నుంచి రూ. 211.4కు బలపడింది. వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సరీ్వస్ జియోఎయిర్ఫైబర్ వినియోగదారుల సంఖ్య 9.5 మిలియన్లకు చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంకాగా.. నెలకు మిలియన్ కొత్త కనెక్షన్లు జత కలుస్తున్నట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది.జియోస్టార్ జూమ్ మీడియా, ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ జియోస్టార్ నికర లాభం రూ. 1,322 కోట్లను తాకగా.. రూ. 7,232 కోట్ల ఆదాయం అందుకుంది. రూ. 1,738 కోట్ల ఇబిటాతోపాటు 28.1 శాతం మార్జిన్లు సాధించింది.ఓ2సీ, జియో, రిటైల్ విభాగాల దన్నుతో క్యూ2లో పటిష్ట పనితీరు ప్రదర్శించాం. అన్నివిధాలా డిజిటల్ సరీ్వసుల బిజినెస్ వృద్ధి కొనసాగుతోంది. అధిక అమ్మకాల కారణంగా రిటైల్ విభాగం ఆదాయం, ఇబిటా పుంజుకున్నాయి. ఇంధన మార్కెట్ల అనిశి్చతుల్లోనూ ఓ2సీ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కొత్త వృద్ధి ఇంజిన్లు న్యూఎనర్జీ, మీడియా, కన్జూమర్ బ్రాండ్స్లో నమోదవుతున్న పురోగతికి సంతోíÙస్తున్నాం. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
‘బంగారం ఓ కొనేస్తున్నారా? ఆ రిస్క్ మాత్రం తప్పదు’
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అక్టోబర్ 17న తారాస్థాయికి పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,379 డాలర్లని తాకి, తరువాత 4,336 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, డిసెంబర్ యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి 4,349 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. ఈ పెరుగుదల గత ఐదేళ్లలో బంగారం సాధించిన అతిపెద్ద వారపు లాభంగా నమోదైంది. కేవలం ఈ ఒక్క వారంలోనే 8% పెరుగుదల నమోదైంది. ఇది 2020 మార్చి తర్వాత అతి పెద్ద వృద్ధి.భారతదేశంలో కూడా బంగారం (gold price) ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,21700కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,32,770గా ఉంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని “సురక్షిత స్వర్గధామం”గా చూస్తున్నారు. బంగారం ఎక్కువగా కొనేస్తూ దాని మీదే ఎక్కువ పెట్టుబడి పెట్టేస్తున్నారు.దిద్దుబాటు వస్తే..అయితే, అందరూ ఈ పెరుగుదలపై సంబరాలు చేసుకుంటున్నారనే గమనించాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ నిపుణుడు అక్షత్ శ్రీవాస్తవ కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేశారు. "మీరు 100% బంగారంలో పెట్టుబడి పెట్టినవారైతే, ఇప్పుడు పరిస్థితి బాగున్నట్లే అనిపించొచ్చు. కానీ తిరిగి పెట్టుబడి పెట్టే సమయం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది?" అంటూ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.ఆయన పునఃపెట్టుబడి ప్రమాదం (Reinvestment Risk)పై దృష్టి సారిస్తున్నారు. బంగారంలో లాభాల ఆశతో చాలామంది దీన్ని కలవరిస్తూ ఉండొచ్చు కానీ మార్కెట్ దిద్దుబాటు (correction) వచ్చినప్పుడు, దీని ప్రభావం ఈక్విటీల కన్నా తీవ్రమై ఉండే అవకాశం ఉంది అంటున్నారు.ఆస్తుల వైవిధ్యం అవసరంశ్రీవాస్తవ సూచన ఏమిటంటే.. పెట్టుబడులు ఒకే ఆస్తిలో కాకుండా ఈక్విటీలు, క్రిప్టో, రియల్ ఎస్టేట్, బంగారం వంటి వివిధ ఆస్తుల్లో విభజించాలి. మరో ముఖ్యమైన అంశం.. బంగారంలో తిరుగులేని పెరుగుదల వల్ల, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ SIPల నుండి పెట్టుబడిదారులు నిధులను తీసివేయొచ్చు. ఇది దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దీని ఫలితంగా ఉత్పాదక ఆర్థిక కార్యకలాపాలు మందగించవచ్చు.బంగారంపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ జోక్యం అవసరమని శ్రీవాస్తవ సూచిస్తున్నారు. బంగారంపై అధిక పన్నులు, లేదా ఈక్విటీ పెట్టుబడులకు పన్ను రాయితీలు వంటి మార్గాల ద్వారా సమతుల్యతను ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. -
రూ. 1 లక్ష కోట్ల మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ ఎంట్రీ..
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ విభాగంలోకి ప్రవేశించింది. గృహావసరాల కోసం ఓలా శక్తి పేరుతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) సొల్యూషన్ను ఆవిష్కరించింది.దేశీయంగా విద్యుత్ కొరత లేదని, కాకపోతే నిల్వ చేసుకోవడానికి సంబంధించి సవాళ్లు ఉంటున్నాయని సంస్థ సీఎండీ భవీష్ అగర్వాల్ తెలిపారు. దీన్ని ఒక అవకాశంగా మల్చుకోవచ్చని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం ప్రపంచ స్థాయి బ్యాటరీ, సెల్ టెక్నాలజీని రూపొందించామని, ఓలా శక్తి దానికి కొనసాగింపని అగర్వాల్ చెప్పారు.అధునాతన 4680 భారత్ సెల్ని ఉపయోగించి దీన్ని పూర్తిగా దేశీయంగా తయారు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం బీఈఎస్ఎస్ మార్కెట్ రూ. 1 లక్ష కోట్లుగా ఉండగా, 2030 నాటికి రూ. 3 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.ఓలా శక్తి ముఖ్య ఫీచర్లుతక్షణ పవర్ స్విచింగ్:సాంప్రదాయ ఇన్వర్టర్లు లేదా డీజిల్ జనరేటర్ల మాదిరిగా కాకుండా, ఉపకరణాలను సురక్షితంగా ఉంచుతూ, తక్షణమే (0 మిల్లీసెకన్లు) శక్తిని మారుస్తుంది.స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్:రియల్టైమ్లో శక్తి వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. నియంత్రిస్తుంది. వినియోగ విధానాలను తెలుసుకుని వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. విద్యుత్, డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది.వోల్టేజ్ రక్షణ: విస్తృత వోల్టేజ్ పరిధిలో (120V–290V) పనిచేస్తుంది. పరికరాలను హెచ్చుతగ్గుల నుండి రక్షిస్తుంది.సురక్షితం, సమర్థవంతం: రన్నింగ్ లేదా నిర్వహణ ఖర్చులు లేకుండా ఆటోమోటివ్-గ్రేడ్ భద్రత, 98 శాతం వరకు సామర్థ్యం. వాతావరణ నిరోధకత: IP67-రేటెడ్ బ్యాటరీలకు దుమ్ము, నీరు, భారీ వర్షాల నుండి పూర్తిగా రక్షణఅధునాతన ఫీచర్లు:టైమ్-ఆఫ్-డే (ToD) ఛార్జింగ్, స్మార్ట్ బ్యాకప్ ప్రాధాన్యత, రిమోట్ డయాగ్నస్టిక్స్, OTA సాఫ్ట్వేర్ అప్డేట్లు, విస్తరణ ఎంపికలు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఆన్లైన్ ఆపరేషన్.ధర, లభ్యతఓలా శక్తి 1.5 kWh, 3 kWh, 5.2 kWh, 9.1 kWh కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. మొదటి 10,000 యూనిట్లకు ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి.. 1.5 కిలోవాట్లకు రూ.29,999, 3 కిలోవాట్లకు రూ. 55,999, 5.2 కిలోవాట్లకు రూ.1,19,999, 9.1 కిలోవాట్లకు రూ. 1,59,999 లుగా కంపెనీ నిర్ణయించింది. రూ.999 ధరతో రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మకర సంక్రాంతి నుండి డెలివరీలు ఉంటాయని భావిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్ వరుస సెలవులు.. సోమవారం ట్రేడింగ్ ఉంటుందా?
దేశీయ స్టాక్మార్కెట్కు వచ్చే వారం వరుసగా వరుస సెలవులు ఉన్నాయి. దీపావళి పండుగ కారణంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) రెండు రోజులు మూతపడనున్నాయి. అయితే వచ్చే సోమవారం అంటే అక్టోబర్ 20న మార్కెట్ ట్రేడింగ్ ఉంటుందా.. లేదా? అన్న సందేహం ఇన్వెస్టర్లలో ఉంది. ఏయే రోజుల్లో స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సెలవు ఉంటుందో ఇప్పుడు చూద్దాం..ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన స్టాక్ మార్కెట్ హాలిడే (Stock Market Holidays) క్యాలెండర్ ప్రకారం.. దీపావళి (Diwali 2025) లక్ష్మి పూజ, బలిప్రతిపదా కారణంగా అక్టోబర్ 21, 22 తేదీలలో సెలవు ఉంటుంది. ఆయాల రోజుల్లో సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.అక్టోబర్ 20న అమావాస్య తిథి రావడంతో ఈ రోజున పలు రాష్ట్రాల్లో దీపావళి పండుగను జరుపుకోనున్నారు. కానీ భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తెరిచే ఉంటాయి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ అక్టోబర్ 21న వ్యాపారులు, ఇన్వెస్టర్ల కోసం 'ముహూర్త్ ట్రేడింగ్' పేరుతో ఒక గంట ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:45 గంటల వరకు ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ జరగనుంది.2025లో రాబోయే స్టాక్ మార్కెట్ సెలవులు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన మార్కెట్ హాలిడే క్యాలెండర్ లో 2025లో మొత్తం 14 ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇంకా మిగిలిన సెలవులు కింది విధంగా ఉన్నాయి..అక్టోబర్ 21 - దీపావళి లక్ష్మీ పూజ అక్టోబరు 22 - బలిప్రతిపాద నవంబర్ 5 - ప్రకాష్ గురుపుర్బ్ శ్రీ గురునానక్ దేవ్ డిసెంబర్ 25 - క్రిస్మస్ -
బ్యాంకులు.. భలే లాభాలు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ప్రోత్సాహకర ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) 2025–26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 58 శాతం జంప్చేసి రూ. 1,226 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 777 కోట్లు మాత్రమే ఆర్జించింది. వడ్డీ ఆదాయం 16 శాతం ఎగసి రూ. 5,856 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 5,055 కోట్ల వడ్డీ ఆదాయం సాధించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.72 శాతం నుంచి 1.83 శాతానికి తగ్గాయి.ఇండియన్ బ్యాంక్ లాభం ప్లస్ ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో స్టాండెలోన్ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 3,018 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,706 కోట్లు ఆర్జించింది. వడ్డీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ. 11,964 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 11,125 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 1,099 కోట్ల నుంచి రూ. 739 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.48%ం నుంచి 2.6 శాతానికి తగ్గాయి. సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం అప్ ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో స్టాండెలోన్ నికర లాభం 8 శాతం ఎగసి రూ. 351 కోట్లను తాకింది. ప్రొవిజన్లు తగ్గడం లాభించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 325 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం క్షీణతతో రూ. 808 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు 3.24 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడ్డాయి. వడ్డీయేతర ఆదాయం 26 శాతం ఎగసి రూ. 516 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 43 శాతం క్షీణించి రూ. 63 కోట్లను తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.4 శాతం నుంచి 2.93 శాతానికి తగ్గాయి. బ్రాంచీల సంఖ్య 948కు చేరింది. -
ఐడియా అదిరింది.. డబ్బు మిగిలింది!
కలిసివుంటే కలదు అంటుంటారు మన పెద్దలు. దీనికి చాలా ఉదాహరణలు కూడా చెబుతారు. కలిసివుంటే డబ్బు కూడా ఆదా చేయొచ్చు అంటున్నారు గుజరాతీలు. వ్యాపార నిర్వహణ, డబ్బు సంపాదనలో గుజరాతీల ప్రావీణ్యం గురించి ప్రపంచమంతా తెలుసు. ఎక్కడికి వెళ్లినా ఇట్టే కలిసిపోయేతత్వం వారి సొంతం. వర్తకాన్ని ఒడుపుగా నిర్వహించడం, బలమైన సమాజ సంబంధాలతో ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నెగ్గుకొస్తుంటారు. అంతేకాదు తమవారికి దన్నుగా నిలిచి పైకి తీసుకురావడంలో వారికి వారే సాటి. తాజాగా గుజరాత్లోని జైన్ సామాజికవర్గం (Jain Community) ఓ ఆసక్తికర విషయంతో వార్తల్లో నిలిచింది.మనం మాంచి కాస్ట్లీ కారు కొనాలంటే ఏం చేస్తాం? దగ్గరలోని కార్ల షోరూంకు (Car Showroom) వెళ్లి మోడల్ సెలెక్ట్ చేసుకుని, రేటు మాట్లాడుకుంటాం. ఓ మంచి ముహూర్తం చూసుకుని కారును ఇంటికి తెచ్చుకుంటాం. గుజరాత్లోని జైన్ కమ్యునిటీ వాళ్లు మనలా చేయలేదు. దేశవ్యాప్తంగా ఉన్న తమవాళ్లలో ఎవరెవరు ఖరీదైన కొనాలనుకుంటున్నారో ముందుగా వాకబు చేశారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) ఇలాంటి వారి వివరాలను సేకరించింది. ఎవరెవరికి ఏయే మోడల్ కారు కావాలో తెలుసుకుంది. మొత్తం 186 కొత్త కార్లు లెక్కకువచ్చాయి. ఇందులో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ సహా 15 రకాల టాప్ బ్రాండ్స్ ఉన్నాయి.ఒకేసారి 186 కార్లను కొనుగోలు చేసేందుకు JITO నేరుగా రంగంలోకి దిగింది. ఆయా కార్ల కంపెనీలకు చెందిన డీలర్లతో బేరసారాలు సాగించింది. ఒకేసారి ఎక్కువ కార్లు అమ్ముడవుతుండడంతో విక్రేతలు కూడా మార్కెట్ ధర కంటే తక్కువకు ఇచ్చేందుకు మొగ్గుచూపారు. JITO బేరసారాలతో తమ సభ్యులకు రూ. 21.22 కోట్ల డిస్కౌంట్ లభించింది. రూ. 149.54 కోట్ల విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం, వాటన్నింటినీ దేశవ్యాప్తంగా ఒకేరోజు డెలివరీ చేయడం వరకు అంతా పక్కాగా జరిగింది. తామంతా ఐకమత్యంగా ఉండడం వల్లే ఇలాంటివి చేయగలుతున్నామని JITO అపెక్స్ వైస్-చైర్మన్ హిమాన్షు షా తెలిపారు.అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నజైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో దేశవ్యాప్తంగా 65 వేల మంది సభ్యులు ఉన్నారు. సామూహిక కొనుగోలుతో భారీగా లబ్ధిపొందిన JITO తమ సభ్యుల కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. దేశమంతా తమ సభ్యుల అవసరాలు తెలుసుకుని వారికి కావాల్సిన వాటిని టోకుగా కొని ప్రయోజనం పొందెలా ప్లాన్ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఆభరణాలు, ఇతర వస్తువుల సామూహిక కొనుగోలుకు రెడీ అవుతోంది.121 జేసీబీలు.. రూ. 4 కోట్లు ఆదాజైన్ కమ్యునిటీ మాత్రమే కాదు భర్వాడ్ సామాజికవర్గం (Bharwad Community) కూడా ఇదేవిధంగా తమ సభ్యులకు ప్రయోజనం చేకూర్చింది. తమ కమ్యునిటీలోని యువత ఉపాధి కోసం గుజరాత్లోని భర్వాద్ యువ సంఘటన్ ఇటీవల 121 జేసీబీ యంత్రాల కొనుగోలుకు ముందుకు వచ్చింది. ఆయా వ్యాపార సంస్థలతో బేరాలు సాగించి ఒక్కొ యూనిట్కు రూ. 3.3 లక్షల తగ్గింపు పొంది రూ. 4 కోట్లు ఆదా చేసింది. యువత తమ కాళ్లపై తాము నిలబడటానికి తోడ్పాటు అందిస్తున్నామని భర్వాద్ యువ సంఘటన్ అధ్యక్షుడు దిలీప్ భర్వాద్ చెప్పారు. తాము ష్యూరిటీ ఇవ్వడంతో బలమైన క్రెడిట్ స్కోర్లు లేని వారు కూడా పాన్, ఆధార్ ధృవీకరణ ఆధారంగా జీరో డౌన్ పేమెంట్తో JCBలను పొందారని వెల్లడించారు.చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్చూశారుగా కలిసి కొంటే ఎంత లాభమో.. అవి లగ్జరీ కార్లు (luxury cars) అయినా, భారీ యంత్రాలు అయినా. సామూహిక కొనుగోలు శక్తితో ఇన్ని ప్రయోజనాలుంటాయని గుజరాత్ కమ్యునిటీలు నిరూపిస్తున్నాయి. సో.. కలిసివుంటే సుఖపడటమే కాదు.. డబ్బు కూడా ఆదా చేయొచ్చు! -
దీపావళి ఇన్సూరెన్స్ రూ.5 లకే..
దీపావళి (Diwali 2025) అంటే ఆనందాల వేడుక. కానీ విషాదానికీ అవకాశం ఉన్న పండుగ. ఏటా దీపావళికి దేశవ్యాప్తంగా ఆసుపత్రులు బాణసంచా కారణమైన ప్రమాదాలతో అధిక భారం ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కాలిన గాయాలు, కంటి గాయాలు, మంటలు మొదలైనవి.2024లో ఒక్క ఢిల్లీలోనే అగ్నిమాపక కాల్స్ 53 శాతం పెరిగాయి. బెంగళూరు, లక్నో, చండీగఢ్ లాంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. చాలా కేసుల్లో పిల్లలు, బాణాసంచా కాల్చడం చూస్తున్నవారికి కూడా ప్రమాదాలు సంభవించాయి.దీన్ని దృష్టిలో ఉంచుకొని, ‘కవర్ ష్యూర్’ (CoverSure) అనే ఇన్సూర్టెక్ సంస్థ కేవలం రూ.5కే ఫైర్క్రాకర్ ఇన్సూరెన్ (Firecracker Insurance ) ప్లాన్ను ప్రారంభించింది. బాణసంచా సంబంధిత ప్రమాదాల నుంచి రక్షణను అందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు.ప్లాన్ ముఖ్యాంశాలు* అకాల మరణానికి కవరేజీ: రూ.50,000 వరకు* కాలిన గాయాలకు కవరేజీ: రూ.10,000 వరకు* 10 రోజుల పరిమిత కాల కవరేజీ (కొనుగోలు చేసిన తర్వాతి రోజు నుంచి)* డిజిటల్ యాక్టివేషన్– ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా, వెంటనే యాక్టివ్* కవర్ ష్యూర్ యాప్/వెబ్సైట్ ద్వారా తక్షణ కొనుగోలుఎందుకు అవసరమంటే..భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,000కి పైగా దీపావళి ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఈ సందర్భాల్లో చికిత్స ఖర్చు రూ.25,000 నుంచి రూ.1 లక్ష వరకు ఉంటోంది. చాలా మందికి సాంప్రదాయ ఆరోగ్య బీమా లేదు. దీంతో చిన్న ప్రమాదాలూ ఆర్థికంగా పెద్ద భారం కావచ్చుఈ ప్లాన్ ప్రామాణిక ఆరోగ్య/టర్మ్ పాలసీలను భర్తీ చేయదగినది కాదు కానీ వాటితో పాటు ముఖ్యంగా పండుగల కాలంలో అదనపు రక్షణగా పనిచేస్తుంది. బీమా తీసుకోండి.. దీపావళిని శుభంగా, సురక్షితంగా జరుపుకోండి.ఇదీ చదవండి: ఎల్ఐసీ కొత్త పాలసీలు.. జీఎస్టీ తగ్గాక వచ్చిన ప్లాన్లు ఇవే.. -
టీవీఎస్ కొత్త అడ్వెంచర్ బైక్: ధర ఎంతో తెలుసా?
టీవీఎస్ మోటార్ ఇండియన్ మార్కెట్లో.. 'అపాచీ ఆర్టీఎక్స్ 300' పేరుతో సరికొత్త అడ్వెంచర్ బైక్ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పుడున్న టీవీఎస్ బైకుల కంటే ఇది కొంత భిన్నంగా ఉండటం గమనించవచ్చు.అపాచీ ఆర్టీఎక్స్ 300.. స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ & అల్యూమినియం డైకాస్ట్ స్వింగార్మ్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, స్ప్లిట్ రియర్ సీటు, అదనపు లగేజ్ కోసం లగేజ్ ర్యాక్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ వైపర్ గ్రీన్, టార్న్ బ్రాంజ్, మెటాలిక్ బ్లూ, లైట్నింగ్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రంగులలో అందుబాటులో ఉంది.ఆర్టీఎక్స్ 300 బైక్.. టీఎఫ్టీ డిస్ప్లే పొందుతుంది. ఇది బైక్ గురించి రైడర్లకు కావలసిన సమాచారం అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో టూర్, ర్యాలీ, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: దీపావళి ఆఫర్.. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్!టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 బైక్.. 299 సీసీ లిక్విడ్ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 35.5 హార్స్ పవర్, 28.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. -
స్టాక్ మార్కెట్.. హాట్రిక్ హిట్!
భారత ఈక్విటీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఈ సెషన్ లో 52 వారాల గరిష్టాన్ని తాకాయి. దీపావళికి ముందు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడు రోజులు లాభాలను అందుకున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 484.53 పాయింట్లు లేదా 0.58 శాతం పెరిగి 83,952.19 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 124.55 పాయింట్లు లేదా 0.49 శాతం పెరిగి 25,709.85 వద్ద స్థిరపడ్డాయి.బీఎస్ఈలో ఏషియన్ పెయింట్స్, ఎం అండ్ ఎం, భారతి ఎయిర్టెల్, హెచ్యూఎల్ టాప్ గెయినర్లలో ఉండగా, ఇన్ఫోసిస్, హెచ్ఎల్టెక్, ఎటర్నల్, టాటా స్టీల్ టాప్ లూజర్లలో ఉన్నాయి.రంగాలవారీగా నిఫ్టీ ఎఫ్ఎంసిజి 1.37 శాతం లాభపడింది. నిఫ్టీ ఐటీ 1.63 శాతం, మీడియా 1.56 శాతం నష్టపోయాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.57 శాతం, 0.05 శాతం నష్టపోయాయి. -
ఏఐ ఎఫెక్ట్.. ఆ ఉద్యోగాలపై ప్రభావం: నితిన్ మిట్టల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇది నిజమే అని కొందరు నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే డెలాయిట్ గ్లోబల్ ఏఐ లీడర్ నితిన్ మిట్టల్ (Nitin Mittal).. ఈ ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం చెప్పారు.ఏఐ మన ఉద్యోగాలను తీసుకుంటుందా, ఉద్యోగులు.. ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కస్టమర్ సపోర్ట్, కాల్ సెంటర్లు, కోడింగ్ వంటి కొన్ని ఉద్యోగాలు ఏఐకు ప్రభావితం కావడం అనివార్యం. అయితే ఏఐ కారణంగా కోల్పోయిన ఒక్క ఉద్యోగాన్ని కూడా నేను చూడలేదు. దాదాపు ఉద్యోగులంతా AIతో ఎలా కలిసి పనిచేయాలో నేర్చుకుంటున్నారని మిట్టల్ పేర్కొన్నారు.ఏఐ టెక్నాలజీలో నైపుణ్యం పెంచుకోవడానికి ఆసక్తి చూపనివారిని, ఖాళీ సమయాన్ని డూమ్స్క్రోలింగ్లో గడిపేవారినికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని నితిన్ మిట్టల్ చెప్పారు. అంతే కాకుండా ఏఐ ఎవరూ ఊహించని ఉద్యోగాలను సృష్టిస్తుందని.. కాబట్టి ఇందులో తప్పకుండా నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు! -
ఎల్ఐసీ కొత్త పాలసీలు.. జీఎస్టీ తగ్గాక వచ్చిన ప్లాన్లు ఇవే..
దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండు కొత్త బీమా ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. విభిన్న వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి, ఆర్థిక రక్షణ, పొదుపు ప్రయోజనాలను అందించడానికి ‘ఎల్ఐసీ జన్ సురక్ష’, ‘ఎల్ఐసీ బీమా లక్ష్మి’ అనే పేర్లతో వీటిని రూపొందించింది.ఎల్ఐసీ జన్ సురక్ష (LIC Jan Suraksha), ఎల్ఐసీ బీమా లక్ష్మి (LIC Bima Lakshmi) అక్టోబర్ 15 నుంచి ఈ రెండు కొత్త పాలసీలు అందుబాటులో ఉంటాయని, కొత్త నెక్స్ట్ జెన్ జీఎస్టీ విధానంలో ఎల్ఐసీ విడుదల చేసిన మొదటి ఉత్పత్తులు ఇవేనని బీమా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఎల్ఐసీ జన్ సురక్షఎల్ఐసీ జన్ సురక్ష ప్లాన్ ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం రూపొందించిన తక్కువ ఖర్చుతో కూడిన బీమా పథకం. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, అంటే ఇది మార్కెట్ లేదా బోనస్ లతో లింక్ చేయబడదు.🔹 ముఖ్య లక్షణాలురకం: నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ప్రత్యేకత: తక్కువ ఆదాయ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అనుకూలంబీమా మొత్తం: కనీసం రూ.1,00,000, గరిష్టంగా రూ.2,00,000పాలసీ కాలం: 12 నుంచి 20 సంవత్సరాలుప్రీమియం చెల్లింపు కాలం: మొత్తం పాలసీ కాలంలో 5 సంవత్సరాలు తీసివేయగా వచ్చే కాలంఅర్హత:వయస్సు: 18 నుండి 55 ఏళ్లుఆరోగ్యం: పాలసీదారుకు మంచి ఆరోగ్యస్థితి ఉండాలి. వైద్య చికిత్సలు తీసుకుంటూ ఉండరాదు.అదనపు ప్రయోజనాలు:3 సంవత్సరాల ప్రీమియం చెల్లింపుల తర్వాత ఆటో కవర్1 సంవత్సరం తర్వాత పాలసీ రుణంగ్యారెంటీడ్ ఎడిషన్లుఎల్ఐసీ బీమా లక్ష్మిఎల్ఐసీ బీమా లక్ష్మి అనేది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జీవిత బీమా, పొదుపు పథకం. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ స్కీం, ఇది జీవిత బీమా, కాలానుగుణ మనీబ్యాక్ ఎంపికలు రెండింటినీ అందిస్తుంది.🔹 ముఖ్య లక్షణాలురకం: నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ మనీబ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ప్రత్యేకత: మహిళల కోసం ప్రత్యేకంబీమా మొత్తం: కనీసం రూ. 2,00,000, గరిష్ట పరిమితి లేదు (అండర్రైటింగ్ ఆధారంగా)పాలసీ కాలం: 25 సంవత్సరాలుప్రీమియం చెల్లింపు కాలం: 7 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది.అర్హత:వయస్సు: 18–50 సంవత్సరాల మధ్యఅదనపు ప్రయోజనాలుగ్యారెంటీడ్ వార్షిక జోడింపులుసర్వైవల్ బెనిఫిట్లు నచ్చినట్లు ఎంచుకునే అవకాశంసర్వైవల్ బెనిఫిట్లు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు.మెచ్యూరిటీ / డెత్ బెనిఫిట్ వాయిదాలలో తీసుకునే అవకాశంఆటో కవర్ సౌలభ్యం (3 సంవత్సరాల తర్వాత)అధిక బీమా మొత్తానికి ప్రోత్సాహకాలుఇదీ చదవండి: దీపావళి ఇన్సూరెన్స్ రూ.5 లకే.. -
ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా?
ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ధన త్రయోదశి (ధన్తేరాస్) రోజున బంగారం కొనడం భారతదేశంలో ఒక శుభప్రదమైన సంప్రదాయం. ఈ రోజున పసిడిని కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరం పొడవునా సంపద సమకూరుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. అయితే ఈ ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు సామాన్యులు కొనలేనంత భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, రూపాయి విలువ పతనం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా బంగారు ఆభరణాలు కొనడం కంటే మెరుగైన, ఆర్థికపరంగా లాభదాయకమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.నేరుగా ఆభరణాలు కొంటే..ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకోవడం చాలా మందికి ఆర్థిక భారంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉన్న ధరల కారణంగా చిన్న వస్తువు కొనుగోలుకు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాలి. బంగారు ఆభరణాల తయారీలో తరుగు రూపంలో కొంత మొత్తాన్ని అదనంగా చెల్లించాలి. వీటికి తయారీ ఛార్జీలు (Making Charges) అదనం. బంగారం ధర, తయారీ ఛార్జీలపై జీఎస్టీ వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆభరణాలు అమ్మినప్పుడు తయారీ ఛార్జీలు, తరుగు కారణంగా కొనుగోలు ధర కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుంది.ఈ ఛార్జీలు, నష్టాల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి నిపుణులు మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి భౌతిక బంగారాన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన, పారదర్శకమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి.గోల్డ్ ఈటీఎఫ్లుగోల్డ్ ఈటీఎఫ్లు అనేవి స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో షేర్ల మాదిరిగా ట్రేడ్ చేయబడే ఫండ్లు. ఇవి దేశీయ భౌతిక బంగారం ధరను ట్రాక్ చేస్తాయి. వీటిని లైవ్ మార్కెట్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల తయారీ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు ఉండవు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వేళల్లో ఎప్పుడైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. భౌతిక బంగారంలాగా దొంగిలించబడుతుందనే భయం ఉండదు. రియల్ టైమ్ మార్కెట్ ధరలకు అనుగుణంగా వీటి ధరలు ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడానికి డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా అవసరం.డిజిటల్ గోల్డ్PhonePe, Paytm వంటి యాప్ల ద్వారా 99.9% స్వచ్ఛమైన బంగారాన్ని కొద్ది మొత్తంలో డిజిటల్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారం మీ తరపున భౌతిక రూపంలో లాకర్లో నిల్వ చేస్తారు. అయితే అమ్మాలనుకుంటే మాత్రం జీఎస్టీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ విధానంలో చాలా తక్కువ డబ్బుతో కూడా కొంత మొత్తంలో కొనుగోలు చేయవచ్చు. భౌతికంగా నిల్వ చేయాలనే ఆందోళన అవసరం లేదు. అయితే దీనికి కొనుగోలు పరిమితులు ఉంటాయి. ఈ పెట్టుబడి RBI లేదా SEBI నియంత్రణలో ఉండదని గమనించాలి.ఇదీ చదవండి: లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే.. -
లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే..
పచ్చనోటు మనిషి జీవితంలో ఎంతో ప్రభావం చూపుతుంది. డబ్బుపై ఆశ కడు పెదరికంలో ఉన్న వ్యక్తిని సైతం రాజును చేయగలదు. ఆ ఆశ కొద్దిగా మితిమీరితే అదే డబ్బు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుంది. ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న బీఆర్ శెట్టి జీవితంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఆ ఆశే తన రూ.87,936 కోట్ల(అంచనా) విలువైన వ్యాపారాన్ని కేవలం రూ.74కే అమ్ముకునేలా చేసింది. అసలు అంత విలువైన కంపెనీని ఎందుకు ఇంత తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం.బి.ఆర్.శెట్టిగా ప్రసిద్ధి చెందిన బావగుతు రఘురామ్ శెట్టి 1942 ఆగస్టు 1న కర్ణాటకలోని ఉడిపిలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించారు. ఇతని పూర్వీకుల మాతృభాష తుళు, కానీ తాను కర్ణాటకలో పుట్టుడంతో కన్నడ మీడియం పాఠశాలలో చదివారు. మణిపాల్లో ఫార్మాస్యూటికల్ విద్యను పూర్తి చేశారు. ఉడిపి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. చంద్రకుమారి శెట్టిని వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.స్టాక్ ఎక్స్ఛేంజీలో..శెట్టి 31 ఏళ్ల వయసులో ఇతర ఖర్చులుపోను జేబులో కేవలం రూ.665తో యూఏఈలోని దుబాయ్కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. అక్కడే 1975లో యూఏఈ మొదటి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (ఎన్ఎంసీ)ను స్థాపించారు. తన భార్య అందులో ఏకైక వైద్యురాలిగా సేవలందించేంది. ఒకే క్లినిక్తో ప్రారంభమైన ఎన్ఎంసీ తక్కువ కాలంలోనే పెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగింది. బహుళ దేశాల్లో ఏటా మిలియన్ల మంది రోగులకు సేవలు అందించేది. ఇది యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్కేర్ ప్రొవైడర్గా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎన్ఎంసీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.వ్యాపారాల జాబితా..శెట్టి కేవలం ఆ సంస్థను స్థాపించడంతోనే ఆగిపోకుండా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. దాంతో ఇతర వెంచర్లు ఆరోగ్య సంరక్షణకు అతీతంగా విస్తరించాయి. అతను నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని, ఫినాబ్లర్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను స్థాపించారు. తన వ్యాపార పోర్ట్ఫోలియోలో రిటైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటాలిటీలో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్లో ఐకానిక్ కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సొంతంగా ప్రైవేట్ విమానం కూడా ఉండేది. 2019 నాటికి శెట్టి భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 42వ స్థానంలో నిలిచారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.18,000 కోట్లుగా ఉండేది.అనధికార నగదు లావాదేవీలు2019లో ఎన్ఎంసీపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో కీలక మలుపు చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ హెల్త్ అనధికారికంగా తన నగదు ప్రవాహాన్ని పెంచిందని, రుణాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. ఈ వాదనలు ఎన్ఎంసీ స్టాక్ ధరలు తీవ్రంగా క్షీణించేందుకు కారణమయ్యాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ వ్యవహారం దెబ్బతీసింది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో గణనీయమైన అవకతవకలు జరిగినట్లు తేలింది. శెట్టి నిబంధనల దుర్వినియోగం, మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 2020 ప్రారంభంలో ఎన్ఎంసీను ఎక్స్చేంజీ బోర్డు నుంచి తొలగించారు. నేరారోపణలు రాకముందు ఎన్ఎంసీ కంపెనీ విలువ సుమారు రూ.87,936 కోట్లుగా ఉండేది. ఈ సంస్థను బలవంతంగా అక్కడి నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చి చివరకు కేవలం రూ.74కే విక్రయించారు.ఇతర కంపెనీలపై ప్రభావంఈ పతనం శెట్టికి చెందిన ఇతర వెంచర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫినాబ్లర్ కంపెనీలో కూడా ఇలాంటి ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలువడ్డాయి. ఇది అతని ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ శెట్టి ఖాతాలను స్తంభింపజేసింది. అతనిపై అనేక అధికార పరిధుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.పడిపోయిన ఆస్తుల విలువబ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చిన అప్పులు పెరుగుతుండడం, న్యాయపరమైన సవాళ్లతో శెట్టి ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. అతని ఆస్తుల నికర విలువ పడిపోయింది. అతను దివాలా తీసినట్లు తన దగ్గరి వర్గాలు ప్రకటించాయి. అతని విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక దుర్వినియోగం అతని పతనానికి దోహదం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: అవసరాలకు అనువైన బహుమతులు.. తీరు మార్చుకున్న కంపెనీలు -
దీపావళి ఆఫర్.. కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్!
భారతదేశంలో కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత వాహన అమ్మకాలు బాగా పెరిగాయి. కాగా ఇప్పుడు కొన్ని వాహన తయారీ సంస్థలు కొన్ని ఎంపిక చేసిన కార్లపై లక్షల రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో వీటి ప్రారంభ ధరలు (ఎక్స్ షోరూమ్) చాలా వరకు తగ్గుతాయి. ఈ కథనంలో ఏ మోడల్పై ఎంత రేటు తగ్గిందనే విషయాలను చూసేద్దాం.మోడల్ వారీగా తగ్గిన ధరలు➤కియా సోనెట్: రూ. 1.02 లక్షలు➤మారుతి బాలెనొ: రూ. 1.05 లక్షలు➤హోండా సిటీ: రూ. 1.27 లక్షలు➤మారుతి ఇన్విక్టో: రూ. 1.40 లక్షలు➤కియా కారెన్స్ క్లావిస్: రూ. 1.41 లక్షలు➤కియా సెల్టోస్: రూ. 1.47 లక్షలు➤ఫోక్స్వ్యాగన్ వర్టస్: రూ. 1.50 లక్షలు➤హోండా ఎలివేట్: రూ. 1.51 లక్షలు➤కియా సిరోస్: రూ. 1.6 లక్షలు➤ఫోక్స్వ్యాగన్ టైగన్: రూ. 1.80 లక్షలు➤మారుతి గ్రాండ్ విటారా: రూ. 1.80 లక్షలు➤స్కోడా స్లావియా: రూ. 2.25 లక్షలు➤మహీంద్రా XUV400: రూ. 2.50 లక్షలు➤స్కోడా కుషాక్: రూ. 2.50 లక్షలు➤మహీంద్రా మరాజో: రూ. 3 లక్షలుఇదీ చదవండి: ఆక్టావియా ఆర్ఎస్ లాంచ్: అప్పుడే అన్నీ కొనేశారు!వాహన తయారీ సంస్థలు ప్రకటించే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి పండుగల సమయంలో కారు కొనాలనుకునే కస్టమర్లు.. తగ్గింపులకు సంబంధించిన కచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవడం ఉత్తమం. అంతే కాకుండా ఈ తగ్గింపులు బహుశా.. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. -
అవసరాలకు అనువైన బహుమతులు.. తీరు మార్చుకున్న కంపెనీలు
ప్రతి సంవత్సరం దీపావళి వచ్చిందంటే దాదాపు చాలా కంపెనీల ఉద్యోగుల చేతుల్లో పండుగ బహుమతులు ఉండడం ఖాయం. ఈ దీపావళి బహుమతుల ప్రదానంలో ఇటీవలి కాలంలో మార్పులు వస్తున్నాయి. గతంలో కేవలం సాంప్రదాయ స్వీట్ బాక్స్లు, చాక్లెట్లకే పరిమితమైన కార్పొరేట్ గిఫ్టింగ్ సంస్కృతి ఇప్పుడు ఉద్యోగుల అవసరాలు, వినియోగానికి ఉపయోగపడే కన్స్యూమర్ వస్తువుల వైపు మళ్లుతోంది.కొత్త ట్రెండ్గతంలో దీపావళి బహుమతులు అంటే ఖరీదైన మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు ఇవ్వడం ఆనవాయితీగా ఉండేది. అయితే నేటి తరం కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల దైనందిన జీవితంలో ఉపయోగపడే వస్తువులను అందించడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ మార్పునకు నిదర్శనంగా ఇటీవల కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి.ఇటీవల ఒక ప్రముఖ టెక్నాలజీ సంస్థ తన ఉద్యోగులందరికీ ప్రయాణాలకు ఉపయోగపడే వీఐపీ (VIP) బ్యాగులను బహుమతిగా అందించింది. ఇది ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఎంతగానో ఉపయోగపడుతుంది.తాజాగా మరో కంపెనీ ఉత్తమ నాణ్యత గల కిచెన్వేర్ సెట్లను దీపావళి కానుకగా ఇచ్చింది. దీనితో పాటు కొంతమంది ఉద్యోగులకు విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కూడా అందించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Bhavika Goyal (@bhavika.inframes)బహుమతుల ఎంపికలో కంపెనీలు కేవలం లాంఛనాన్ని కాకుండా ఉద్యోగుల అవసరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి.ట్రెండ్ మార్పునకు కారణాలుస్వీట్ బాక్స్లు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తే కన్స్యూమర్ వస్తువులు దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయి. ఉద్యోగులకు ఇవి తమ రోజువారీ జీవితంలో ఉపయోగపడే విలువైన కానుకగా నిలుస్తాయి.పెరుగుతున్న ఆరోగ్య స్పృహ కారణంగా చాలా మంది ఉద్యోగులు అధిక షుగర్, క్యాలరీలు ఉన్న స్వీట్ బాక్స్లను పక్కన పెట్టేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే వస్తువుల పంపిణీకి కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి.మంచి నాణ్యత గల కన్స్యూమర్ వస్తువులను అందించడం ద్వారా కంపెనీలు తమ ఉద్యోగులపై శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా ఒక సానుకూల బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకోవచ్చు.ఉద్యోగికి ఉపయోగపడే బహుమతిని ఇవ్వడం వల్ల సంస్థ పట్ల వారి విధేయత పెరుగుతుంది. ఇది ఉద్యోగులు సంస్థలో కొనసాగడానికి దోహదపడుతుంది.కేవలం లాంఛనం కాకుండా ఇలాంటి బహుమతులు పండుగ వాతావరణంలో సంస్థ గౌరవాన్ని, ప్రోత్సాహాన్ని ప్రతిబింబిస్తాయి.బహుమతుల ఎంపికలో క్రియేటివిటీని చూపడం ద్వారా కంపెనీ తమ అంతర్గత ఆవిష్కరణ సామర్థ్యాన్ని కూడా చూపుతుంది.ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్.. డబ్బు మిగలాలంటే ఇలా చేయాల్సిందే.. -
తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!
ధనత్రయోదశి, దీపావళి ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయి. చాలామంది ఈ సందర్భంగా బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడతారు. గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ప్రతి రోజూ కొత్త గరిష్టాలను చేరుకుంటున్న.. బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలేమిటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.శుక్రవారం బంగారం రేటు ఔన్సుకు 4,300 డాలర్ల కంటే ఎక్కువకు చేరి.. కొత్త గరిష్టాన్ని తాకింది. ఐదేళ్లల్లో ఈ ధరలు ఆల్టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది. వెండి ధర ఔన్సుకు 54 డాలర్లు దాటి.. 1980 తరువాత జీవితకాల గరిష్టాలను చేరుకుంది. భారతదేశంలో.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.31 లక్షలు దాటేసింది. వెండి రేటు ఏకంగా రూ. 2 లక్షలు దాటేసింది.ధరలు పెరగడానికి కారణాలుప్రపంచ ఉద్రిక్తతల మధ్య సురక్షిత ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చుట్టూ ఉన్న భయాలు, అమెరికా & చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య వివాదాలు.. ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడి సంకేతాలు పెట్టుబడిదారులను బంగారం, వెండి వైపు నెట్టాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.'బంగారం 4,300 డాలర్లు దాటడం మనం చూడటం ఇదే మొదటిసారి' అని ఒక వస్తువు వ్యాపారి పేర్కొన్నారు. ఆగస్టు నుంచి ఈ ర్యాలీ కొనసాగుతోందని అన్నారు. ఈ వారం వెండి పెరుగుదల కూడా భారీగానే ఉంది. ఔన్సు 54 డాలర్లు దాటేసింది. నాలుగు దశాబ్దాల తరువాత ధరలు కొత్త రికార్డులను చేరుకున్నాయని అన్నారు.ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యష్ సెడాని, పెరుగుతున్న ధరల గురించి స్పందిస్తూ.. బంగారంతో పోలిస్తే వెండి ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయని అన్నారు. దీనికి కారణం పారిశ్రామిక డిమాండ్ అని తెలుస్తోంది. బంగారంతో పోలిస్తే.. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల డిమాండ్ మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాలు, కొనసాగుతున్న సైనిక సంఘర్షణలు అనిశ్చితిని గణనీయంగా పెంచాయి. దీనివల్ల బ్యాంకులు & పెట్టుబడిదారులు బంగారం.. వెండిని సురక్షితమైన ఆస్తులుగా మార్చడానికి ప్రేరేపించబడ్డాయి. వడ్డీ రేటులో కదలికలు.. కేంద్ర బ్యాంకు చర్యలు కూడా ధరలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషించాయి.ఇదీ చదవండి: బంగారం కొనగలమా!.. రాకెట్లా దూసుకెళ్లిన రేటుధన్తేరాస్ & దీపావళి పండుగల సమయంలో బంగారం కొనుగోలును సంప్రదాయంగా భావించి.. ఎక్కువమంది గోల్డ్ కొంటారు. ఇది డిమాండును అమాంతం పెంచేస్తోంది. అయితే పండుగల తరువాత.. ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చూచిస్తున్నారు. అయితే దీపావళి నాటికి మరింత రేటు పెరిగే అవకాశం ఉందని కేడియా అడ్వైజరీ ఎండీ & డైరెక్టర్ అజయ్ కేడియా అన్నారు. -
నాలుగు నెలల గరిష్టాన్ని చేరిన నిఫ్టీ!
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడు రోజులుగా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఈ ర్యాలీలో కీలక సూచీ నిఫ్టీ నాలుగు నెలల్లో ఎప్పుడు లేనంతగా పెరిగింది. ఈరోజు (అక్టోబర్ 17, 2025, శుక్రవారం) మధ్యాహ్నం 12:21 గంటల సమయానికి నిఫ్టీ సూచీ 25,770 స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది జూన్లో వెళ్లిన 25,650 మార్కును దాటడం గమనార్హం. ఈ పెరుగుదల వెనుక ఉన్న ప్రధాన కారణాలను విశ్లేషిస్తే...మార్కెట్ పెరుగుదలకు దోహదపడిన కీలక అంశాలువిదేశీ సంస్థాగత మదుపర్ల (FIIలు) కొనుగోళ్లు: భారత మార్కెట్లపై విదేశీ సంస్థాగత మదుపర్ల విశ్వాసం మరింత పెరిగింది. గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో FIIలు నికర కొనుగోలుదారులుగా ఉండటం మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణమైంది. భారత్ ఆర్థిక వృద్ధి సామర్థ్యం, పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులపై నమ్మకంతో వారు పెట్టుబడులు పెడుతున్నారు.ద్రవ్యోల్బణం అంచనాల ఉపశమనం: ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుతాయనే ఆశాభావం పెరిగింది. ముఖ్యంగా ముడి చమురు ధరల్లో (క్రూడాయిల్) కొంత స్థిరత్వం లేదా తగ్గుదల ధోరణి కనిపించడం భారత్కు సానుకూలంగా మారింది. ముడి చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందనే అంచనాలు మదుపర్లలో కొనుగోలు ఆసక్తిని పెంచాయి.పటిష్టమైన దేశీయ ఆర్థికాంశాలు: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు పటిష్టంగా ఉండటం, కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు మెరుగ్గా ఉండటం మార్కెట్ పెరుగుదలకు దోహదపడుతున్నాయి.మొత్తంమీద బలమైన అంతర్జాతీయ సంకేతాలు, FIIల విశ్వాసం, ద్రవ్యోల్బణంపై ఉపశమనం, పటిష్టమైన కార్పొరేట్ పనితీరు వంటి అంశాలు కలిసి నిఫ్టీని చాలా రోజుల తర్వాత 25,770 మార్కుకు చేర్చాయి. అయితే రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వంటి అంశాలపై మార్కెట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి బుల్లిష్ (లాభాల) ధోరణి కొనసాగుతున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్.. డబ్బు మిగలాలంటే ఇలా చేయాల్సిందే.. -
ఆక్టావియా ఆర్ఎస్ లాంచ్: అప్పుడే అన్నీ కొనేశారు!
స్కోడా కంపెనీ భారతదేశంలో.. ఆక్టావియా ఆర్ఎస్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. దీనిని సంస్థ కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. బుకింగ్స్ అక్టోబర్ 6 నుంచే మొదలైపోయాయి. ఈ కారు ధర రూ. 49.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).స్కోడా తన ఆక్టావియా ఆర్ఎస్ కారును లాంచ్ చేయడానికి ముందే.. అన్ని యూనిట్లు అమ్ముడైపోయాయి. దీనిని సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దేశంలోకి దిగుమతి చేసుకుంటారు. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువ. ఇది ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్లైట్స్, డీఆర్ఎల్ వంటి వాటితో పాటు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 13 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అదనపు అప్గ్రేడ్లను పొందుతుంది.ఇదీ చదవండి: ఇండియన్ బైక్స్: ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్లో..2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 261 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ ద్వారా శక్తిని ఫ్రంట్ వీల్స్కు డెలివరీ చేస్తుంది. ఈ కారు 6.4 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం. -
16000 ఉద్యోగాల కోత!.. నెస్లే కీలక నిర్ణయం
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణపొందిన ఆహార, పానీయాల దిగ్గజం 'నెస్లే' (Nestle).. రాబోయే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు గురువారం ప్రకటించింది. సెప్టెంబర్ 2025 ప్రారంభంలో బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఈఓ ఫిలిప్ నవ్రాటిల్ ఆధ్వర్యంలో కంపెనీ పరివర్తనను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది."ప్రపంచం మారుతోంది, నెస్లే కూడా వేగంగా మారాలి" అని సీఈఓ నవ్రాటిల్ ఒక ప్రకటనలో అన్నారు. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని.. దీని ప్రకారమే ఉద్యోగాల కోతలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోత!.. తాజాగా అమెజాన్నెస్లే తొలగించనున్న మొత్తం 16,000 మంది ఉద్యోగులలో.. సుమారు 12,000 మంది వైట్ కాలర్ ఉద్యోగులు, మిగిలిన 4,000 మంది ఉత్పత్తి, సరఫరా గొలుసులు సంబంధించిన ఉద్యోగులు ఉండనున్నారు. ఉద్యోగాల తొలగింపులు తరువాత.. కంపెనీ పొదుపు లక్ష్యం 3 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్గా సంస్థ నిర్ణయించుకుంది. -
ఆన్లైన్ షాపింగ్.. డబ్బు మిగలాలంటే ఇలా చేయాల్సిందే..
పండుగ సీజన్ వచ్చిందంటే ఈ-కామర్స్ కంపెనీలకు, వినియోగదారులకు ఇద్దరికీ పెద్ద పండుగే. ఒకవైపు కంపెనీలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో అమ్మకాలను పెంచుకోవాలని చూస్తే.. మరోవైపు వినియోగదారులు ఆకర్షణీయమైన ధరల్లో తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాలని ఆశిస్తుంటారు. ఈ ఉత్సాహంలో కొందరు వినియోగదారులు తొందరపడి అనవసరమైన లేదా నకిలీ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు మోసాలకు గురవుతుంటారు.కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు లొంగకుండా సురక్షితంగా, తెలివిగా ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి వినియోగదారులు తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు, ఈ-కామర్స్ కంపెనీలు గోప్యంగా ఉంచే ఆఫర్ల వెనుక ఉన్న ఆంతర్యం, డబ్బును ఆదా చేసుకోవడానికి అనుసరించవలసిన విధానాలను పరిశీలిద్దాం.పండుగ సీజన్లో అపరిమితమైన ఆఫర్లు వస్తుంటాయి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.భద్రతా పరమైన జాగ్రత్తలుఅధికారిక వెబ్సైట్లు/యాప్లనే వాడాలి..ఎల్లప్పుడూ విశ్వసనీయమైన ఈ-కామర్స్ వేదికలు (ఉదాహరణకు, అధికారిక వెబ్సైట్ లేదా యాప్) నుంచే షాపింగ్ చేయాలి. ఈమెయిల్, మెసేజ్లు లేదా సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను (Phishing Links) క్లిక్ చేయవద్దు.వెబ్సైట్ ప్రామాణికతను నిర్ధారించుకోవాలి..పేమెంట్ చేసే ముందు వెబ్సైట్ అడ్రస్ (URL) సరిచూసుకోవాలి. నకిలీ వెబ్సైట్లు అక్షర దోషాలతో కూడిన URLలను కలిగి ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి.వ్యక్తిగత డేటా విషయంలో అప్రమత్తత..UPI PINలు, OTPలు (వన్-టైమ్ పాస్వర్డ్లు), క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎవరితోనూ ఫోన్లో, మెసేజ్లలో లేదా సోషల్ మీడియాలో పంచుకోవద్దు.పబ్లిక్ వై-ఫైని వాడొద్దుఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు పబ్లిక్ వై-ఫై నెట్వర్క్లను ఉపయోగించకూడదు. సురక్షితమైన ఇంటర్నెట్ కనెక్షన్ను మాత్రమే వాడాలి.అత్యంత భారీ డిస్కౌంట్ల పట్ల జాగ్రత్తఒక ఆఫర్ నమ్మశక్యం కానంత గొప్పగా (ఉదాహరణకు, 70% కంటే ఎక్కువ డిస్కౌంట్) ఉంటే అది మోసపూరితమయ్యే అవకాశం ఉంది. అటువంటి వాటిని అధికారిక యాప్లో లేదా వెబ్సైట్లో ధ్రువీకరించండి.కొనుగోలు చిట్కాలుఅవసరాల జాబితాఅమ్మకాలు చేసేందుకు ముందే మీకు నిజంగా అవసరమైన వస్తువుల జాబితాను తయారుచేసుకోవాలి. అందుకు బడ్జెట్ను నిర్దేశించుకోవాలి. ఇది అనవసర కొనుగోళ్లను నివారిస్తుంది.ధరల పోలికఒకే వస్తువును వేర్వేరు ఈ-కామర్స్ సైట్లలో ధరలను పోల్చి చూడాలి. ఇందుకోసం ప్రత్యేకమైన ప్రైస్ కంపారిజన్ టూల్స్ లేదా వెబ్సైట్లను ఉపయోగించవచ్చు.రివ్యూలు, రేటింగ్లువస్తువును కొనే ముందు దానిపై ఉన్న కస్టమర్ రివ్యూలు, రేటింగ్లు, విక్రేత (Seller) విశ్వసనీయతను తప్పకుండా పరిశీలించండి.తిరిగి ఇచ్చే విధానం (Return Policy)పండుగ సీజన్ అమ్మకాల్లో కొన్ని వస్తువులకు రిటర్న్ లేదా ఎక్స్ఛేంజ్ పాలసీలు మారిపోవచ్చు. కాబట్టి, కొనుగోలు చేసే ముందు రిటర్న్ పాలసీని స్పష్టంగా చదవాలి.ఆఫర్లలోని ఆంతర్యం ఏమిటి?బ్రౌజింగ్ హిస్టరీకొన్ని ఈ-కామర్స్ కంపెనీలు ప్రకటిస్తున్న డిస్కౌంట్లలో మార్కెటింగ్ వ్యూహాలు ఉంటాయి. ఈ-కామర్స్ కంపెనీలు మీ ఆన్లైన్ బ్రౌజింగ్ హిస్టరీ, వెబ్సైట్లో మీరు చూసిన వస్తువులు, కార్ట్లో ఉంచిన వస్తువులు, గతంలో చేసిన కొనుగోళ్లు వంటి డేటాను విశ్లేషిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా మీకు ప్రత్యేకంగా ఒక డిస్కౌంట్ కోడ్ లేదా ఆఫర్ను అందిస్తాయి.ఉదాహరణకు, మీరు ఒక వస్తువును కార్ట్లో చేర్చి కొనుగోలు చేయకుండా వదిలేస్తే ఆ వస్తువుపై తగ్గింపుతో కూడిన ఈమెయిల్ లేదా నోటిఫికేషన్ను మీకు పంపుతాయి.ధరలుకొన్ని కంపెనీలు వాడుతున్న టూల్స్ ఏ వినియోగదారుడు ఎంత ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడో అంచనా వేసి వారికి మాత్రమే ఆ ధరను లేదా ఆఫర్ను చూపిస్తాయి. అంటే ఒకే వస్తువు వేర్వేరు కస్టమర్లకు వేర్వేరు ధరలకు లేదా ఆఫర్లకు కనిపించవచ్చు. ఇది గరిష్ట లాభాన్ని ఆర్జించడానికి కంపెనీలకు సహాయపడుతుంది.ఫ్లాష్ సేల్‘ఈ ఆఫర్ కొద్దిసేపు మాత్రమే’ (Flash Sale), ‘ఇంకా 5 వస్తువులు మాత్రమే మిగిలాయి’ వంటి సందేశాలను వినియోగదారులకు చూపించడం ద్వారా వారిలో ఆతృతను సృష్టించి త్వరగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల వినియోగదారులు పూర్తి విశ్లేషణ చేయకుండానే కొనుగోలు చేస్తారు.కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్లుతరచుగా కొనుగోళ్లు చేసే వినియోగదారులకు లేదా ప్రత్యేక సభ్యత్వాలు (ఉదా. ప్రైమ్ మెంబర్షిప్) ఉన్న వారికి మాత్రమే కొన్ని అదనపు ఆఫర్లు లేదా త్వరగా సేల్ యాక్సెస్ ఇస్తారు. ఇది వారిని కంపెనీకి కట్టుబడి ఉండేలా చేస్తుంది.డబ్బు మిగిల్చుకోవడానికి విధానాలుమీరు కొనాలనుకున్న వస్తువును కార్ట్లో ఉంచి కొద్ది రోజులు వేచి చూడండి. కంపెనీలు తరచుగా కొనుగోలు చేయకుండా వదిలేసిన వస్తువులపై ప్రత్యేక తగ్గింపును లేదా నోటిఫికేషన్ను పంపే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు సదరు వెబ్సైట్కు సంబంధించిన కూపన్ కోడ్స్ ఉన్నాయేమో చూడాలి. కొన్ని క్యాష్బ్యాక్ యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా షాపింగ్ చేయడం వల్ల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. పండుగ సేల్లో ఈ-కామర్స్ కంపెనీలు కొన్ని బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై ఇన్స్టాంట్ తగ్గింపులు లేదా ఈఎంఐ ఆఫర్లు ఇస్తాయి. చాలా వెబ్సైట్లు తమ కొత్త కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపు కూపన్లను పంపుతాయి. ఇది మొదటి కొనుగోలుపై కొంత డబ్బు ఆదా చేస్తుంది. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు లేదా అనుబంధ ఉత్పత్తులు ఒకే ప్యాకేజీగా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది.చివరగా..కంపెనీలు ఇస్తున్న ఆఫర్ల ఆంతర్యం అంతిమంగా వాటి అమ్మకాలను, లాభాలను పెంచడమే. కాబట్టి వినియోగదారులు ఆఫర్ల వెనుక దాగి ఉన్న మార్కెటింగ్ వ్యూహాన్ని అర్థం చేసుకుని వాటిని విచక్షణతో ఉపయోగించుకోవాలి. -
ఇండియన్ బైక్స్: ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్లో..
బెంగళూరు బేస్డ్ కంపెనీ 'అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్'.. F77 పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్లో తన బైకులను లాంచ్ చేసింది.అల్ట్రావయోలెట్ బైకులు ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్తో సహా అనేక యూరోపియన్ మార్కెట్లలో విజయవంతమైన అమ్ముఅడవుతున్నాయి. ప్రపంచ వేదికపై భారతీయ ఇంజనీరింగ్ను ప్రదర్శించడం.. యూరప్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో మన ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా కంపెనీ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ మొత్తం 12 దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.అల్ట్రావయోలెట్ F77 MACH 2 & F77 సూపర్స్ట్రీట్అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ లాంచ్ చేసిన F77 MACH 2 అనేది ప్రత్యేకంగా రైడింగ్ చేసేవారికోసం రూపొందించగా.. ఎఫ్77 సూపర్స్ట్రీట్ రోజువారీ నియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని లాంచ్ చేసింది. అయితే ఈ రెండు మోడల్స్ ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. డిజైన్, ఫీచర్స్ విషయంలో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది.ఇదీ చదవండి: 1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!ఇవి 10.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా.. 40 హార్స్ పవర్, 100 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 155 కిమీ/గం వేగంతో వెళ్లే ఈ బైక్ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, రీజనరేవటివ్ బ్రేకింగ్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. -
కస్టమర్లకు రూ.1000 కోట్లకు పైగా ఆదా చేసిన అమెజాన్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (GIF) 2025లో భాగంగా 276 కోట్ల కస్టమర్ సందర్శనలతో ఆల్-టైమ్ రికార్డు సృష్టించినట్లు తెలిపింది. ఇందులో దేశవ్యాప్తంగా టైర్ 2, 3 నగరాల భాగస్వామ్యం బలంగా ఉందని చెప్పింది. బ్యాంక్ ఆఫర్లు, జీఎస్టీ ప్రయోజనాలు, క్యాష్బ్యాక్ రివార్డుల ద్వారా కస్టమర్లకు ఈ ఫెస్టివల్ సీజన్లో రూ.1000 కోట్లకు పైగా ఆదా అయినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 22 నుంచి నెలరోజుల పాటు జరుగుతున్న ఈ ఫెస్టివల్లో ఇంకా కొన్ని రోజులు మిగిలున్న నేపథ్యంలో ఈ ఈవెంట్కు సంబంధించిన కొన్ని అంశాలను పంచుకుంది.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025కు 276 కోట్లకు పైగా కస్టమర్ల సందర్శనలు నమోదయ్యాయి.మొత్తం కస్టమర్లలో 70% మందికి పైగా టైర్ 2, 3 నగరాల నుంచే ఉన్నారు.దేశవ్యాప్తంగా కాంగ్రా, హరిద్వార్, ముజఫర్పూర్, జామ్నగర్ వంటి ప్రాంతాల విక్రేతలు రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేశారు.బ్యాంక్ ఆఫర్లు, జీఎస్టీ ప్రయోజనాలు, క్యాష్బ్యాక్ రివార్డుల ద్వారా కస్టమర్లకు రూ.1000 కోట్లకు పైగా ఆదా అయింది.జీఎస్టీ బచత్ఉత్సవ్లో భాగంగా విక్రేతలు వందల కోట్ల జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించారు.కొత్తగా చేరిన అమెజాన్ ప్రైమ్ సభ్యుల్లో 70% మంది టైర్ 2, 3 నగరాలకు చెందినవారే.ప్రైమ్ సభ్యులకు వేగవంతమైన డెలివరీలు అందాయి.గత ఏడాదితో పోలిస్తే 60% అధికంగా ‘సేమ్-డే డెలివరీలు’ (1.4 కోట్లు) జరిగాయి.టైర్ 2, 3 నగరాల్లో రెండు రోజుల్లో డెలివరీలు 37% పెరిగాయి.B2B మార్కెట్లో కొత్త బిజినెస్ కస్టమర్ సైన్-అప్లు 30% (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయి.బల్క్ ఆర్డర్లు దాదాపు 120% (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయి.కార్పొరేట్ గిఫ్టింగ్ 60% (ఏడాది ప్రాతిపదికన) వృద్ధి చెందింది.చిన్న, మధ్య తరహా వ్యాపారాల (SMBs) భాగస్వామ్యం రికార్డు స్థాయిలో ఉంది. వీరిలో మూడింట రెండొంతుల మంది టైర్ 2, 3 నగరాలకు చెందినవారే.అమెజాన్ బజార్ (అల్ట్రా-అఫర్డబుల్ ప్రొడక్ట్స్ స్టోర్)లో విక్రేతల భాగస్వామ్యం 2 రెట్లు పెరిగింది.ప్రతి నలుగురు కస్టమర్లలో ఒకరు అమెజాన్ పే ఉపయోగించారు.ప్రతి 4 ఆర్డర్లలో ఒకటి యూపీఐ ద్వారా పూర్తయింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధి నమోదు చేసింది.మొబైల్స్, గృహోపకరణాల కొనుగోళ్లలో ప్రతి 6 ఆర్డర్లలో ఒకటి ఈఎంఐ ద్వారా జరిగింది. వీరిలో ఐదులో నాలుగు కొనుగోళ్లు నో కాస్ట్ ఇఎంఐ ద్వారానే జరిగాయి.రూ.30,000 పైబడిన ప్రీమియం స్మార్ట్ఫోన్లు 30% వృద్ధి చెందాయి.ఫ్యాషన్, బ్యూటీ విభాగం 95% వరకు వృద్ధిని నమోదు చేసింది. ల్యాబ్-గ్రోన్ డైమండ్ జువెలరీ 390% (y-o-y) వృద్ధి చెందింది.కొరియన్ బ్యూటీ ఉత్పత్తులు 75% పెరిగాయి.ద్విచక్ర వాహనాల అమ్మకాలు 105% (y-o-y) పెరిగాయి. సగటున 6 రోజుల్లోనే డెలివరీ అందించారు.అమెజాన్ ఫ్రెష్ టైర్ 2, 3 నగరాల నుంచి 60% వృద్ధిని నమోదు చేసింది. పండుగ సమయంలో టీని అధిగమించి కాఫీ 30% వృద్ధిని సాధించింది.ఫెస్టివ్ లైట్లు, అలంకరణ వస్తువుల అమ్మకాలు 500% పెరిగాయి.ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..‘రికార్డు స్థాయిలో 276 కోట్ల కస్టమర్ సందర్శనలతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 మరోసారి కొత్త బెంచ్మార్క్లను నెలకొల్పింది. భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన, ఆదరణ పొందిన ఆన్లైన్ షాపింగ్ గమ్యస్థానంగా అమెజాన్ నిలిచింది’ అన్నారు.ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు -
బంగారం కొనగలమా!.. రాకెట్లా దూసుకెళ్లిన రేటు
ధనత్రయోదశి ముందు రోజు.. భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు (అక్టోబర్ 17) గరిష్టంగా రూ. 3330 పెరిగి.. పసిడి ప్రియులలో ఒకింత ఆందోళన కలిగించింది. అయితే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఎలా ఉందనే విషయం తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:43 సమయానికి నిఫ్టీ(Nifty) 32 పాయింట్లు పెరిగి 25,619కు చేరింది. సెన్సెక్స్(Sensex) 124 పాయింట్లు పుంజుకుని 83,580 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రపంచంలోనే మొదటి ఏఐ మ్యుచువల్ ఫొటో షేరింగ్ యాప్..
స్నేహితులు, బంధువులతో కలిసి ఏదైనా వెకేషన్కి వెళ్లినప్పుడు ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ఒకరిద్దరి ఫోన్లోనే ఎక్కువ ఫొటోలు తీస్తుంటారు. తర్వాత వాటిని షేరింగ్ యాప్ల ద్వారా షేరు చేసుకుంటారు. కొన్ని రోజులకు మరో ఈవెంట్లో అందరూ కలిసి ఫొటోలు దిగితే మళ్లీ ఇదే మాదిరిగా షేర్ చేసుకోవాల్సిందే. అయితే ఏఐ ఆధారిత యాప్ ‘పిక్సీ’ దీనికో పరిష్కారం చూపుతుంది. ఏఐ సాయంతో స్నేహితుల వద్ద ఉన్న మీ ఫొటోలను సెర్చ్ చేసి ఇద్దరి అనుమతితో షేర్ చేసుకునే వీలు కల్పిస్తుంది. దీన్ని ‘కూ’ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిడావట్కా నేతృత్వంలోని బిలియన్ హార్ట్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే మొదటి ఏఐ మ్యుచువల్ ఫొటో షేరింగ్ యాప్ అని కంపెనీ పేర్కొంది.కొన్ని సర్వేల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల కోట్ల ఫొటోలు దిగుతున్నారు. వాటిలో చాలా వరకు ఇతరుల ఫోన్లలోనే ఉండిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి పిక్సీ ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు చెప్పింది.ప్రత్యేకతలుగివ్ టు గెట్: ఇది యాప్ ప్రధాన సూత్రం. స్నేహితులు మీ ఫోటోలను షేర్ చేయాలంటే తప్పనిసరిగా ఇరువురి అనుమతి కావాల్సిందే. ఇది పరస్పర ఆమోదం ఆధారంగా పనిచేసే వ్యవస్థ. ఇది ఫొటోల షేరింగ్ను ఆటోమేట్ చేస్తుంది.పిక్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్నేహితుల ఫోన్లలో ఉన్న మీ ఫోటోలను ఆటోమేటిక్గా గుర్తిస్తుంది. వాటిని మీకు పంపుతుంది. ఒకసారి అనుమతిస్తే మాన్యువల్గా ప్రతిసారి పంపాల్సిన శ్రమ ఉండదు.ఈ యాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను అనుసరిస్తుంది. ఫొటోలు పూర్తిగా వినియోగదారల డివైజ్లోనే ఉంటాయి. పిక్సీ సర్వర్లకు వాటిని యాక్సెస్ చేసే అవకాశం లేదు. తద్వారా వినియోగదారు గోప్యతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది.జులై 2025లో లాంచ్ అయినప్పటి నుంచి 27 దేశాలు, 160+ నగరాల్లో ఈ యాప్ వినియోగదారులున్నారు. కేవలం రెండు నెలల్లోనే 75 రెట్లు యూజర్లు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా మయాంక్ బిడావట్కా మాట్లాడుతూ..‘ప్రపంచంలో 15 ట్రిలియన్లకు పైగా ఫొటోలు ఉన్నాయి. అయినప్పటికీ చాలా వరకు షేర్ చేసుకోరు. పిక్సీ వినియోగదారుల పరస్పర అనుమతితో ఈ సమస్యను పరిష్కరిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు -
విప్రో లాభం ఫ్లాట్
ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ.3,246 కోట్లను దాటింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.3,209 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 2 శాతం పుంజుకుని రూ.22,697 కోట్లను తాకింది. అయితే త్రైమాసికవారీగా నికర లాభం 2.5 శాతం నీరసించగా.. ఆదాయం ఇదే స్థాయిలో బలపడింది.మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ఐటీ సర్వీసుల ఆదాయం –0.5–+1.5 శాతం స్థాయిలో నమోదుకాగలదని కంపెనీ తాజాగా అంచనా వేసింది. వెరసి 259.1–264.4 కోట్ల డాలర్ల మధ్య ఆదాయ గైడెన్స్ ప్రకటించింది. అయితే ఇటీవల సొంతం చేసుకున్న హర్మన్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్ ఆదాయ అంచనాలను దీనిలో కలపకపోవడం గమనార్హం! ప్రస్తుతం డిమాండ్ వాతావరణం పటిష్టంగా కనిపిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. విచక్షణా వ్యయాలు ఏఐ ఆధారిత ప్రాజెక్టులవైపు మరలుతున్నట్లు వెల్లడించారు. హెచ్1బీ వీసా ఫీజు ప్రభావం అంతంతే..యూఎస్ ఉద్యోగులలో 80% స్థానికులే కావడంతో హెచ్1బీ వీసా ఫీజు పెంపు ప్రభావం నామమాత్రమేనని కంపెనీ సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. డిమాండ్ ఆధారంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ చేపట్టనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇతర విశేషాలు..2,260 మంది ఉద్యోగులు జతకావడంతో. సిబ్బంది సంఖ్య 2,35,492ను తాకింది.2 మెగా రెన్యువల్స్, 13 భారీ డీల్స్ ద్వారా మొత్తం ఆర్డర్లు 31 శాతం జంప్చేసి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐటీ సర్వీసుల మార్జిన్లు 16.7%గా ఉన్నాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు -
మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు
ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో 8,203 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,31,991కు చేరిందని చెప్పింది. ఇన్ఫీ క్యూ2 ఫలితాలను వెల్లడించిన క్రమంలో అందులోని వివరాల ప్రకారం..జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతంపైగా ఎగసి రూ.7,364 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.6,506 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం పుంజుకుని రూ.44,490 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ.40,986 కోట్ల టర్నోవర్ అందుకుంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో 1–3 శాతం వృద్ధి(జూన్లో ప్రకటించిన) అంచనాలను తాజాగా 2–3 శాతానికి సవరించింది. నిర్వహణ మార్జిన్లు నామమాత్ర క్షీణతతో 21%గా నమోదయ్యాయి.షేరుకి రూ.23 డివిడెండ్వాటాదారులకు ఇన్ఫోసిస్ బోర్డు షేరుకి రూ.23 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈనెల 27 రికార్డు డేట్ కాగా నవంబర్ 7 కల్లా చెల్లించనుంది. దీనికితోడు రూ.18,000 కోట్ల విలువైన సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) కోసం వాటాదారుల అనుమతి తీసుకోనున్నట్లు కంపెనీ సీఎఫ్వో జయేష్ సంగ్రాజ్కా తెలిపారు.ఇతర విశేషాలుక్యూ2లో 8,203 మంది ఉద్యోగులు జత కలిశారు. దీంతో సిబ్బంది సంఖ్య 3,31,991ను తాకింది. 2025 జూన్ చివరికల్లా 3,23,788 మంది ఉద్యోగులున్నారు.ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత క్యూ2లో నమోదైన 12.9 శాతం నుంచి 14.3 శాతానికి పెరిగింది.ఈ కాలంలో 3.1 బిలియన్ డాలర్ల(రూ. 27,525 కోట్లు) విలువైన కాంట్రాక్టులను సాధించింది. ఆదాయంలో ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం 5.6 శాతం వృద్ధితో 27.7 శాతం వాటాను ఆక్రమించింది.తయారీ విభాగం 9.3 శాతం, హైటెక్ బిజినెస్ 8.3 శాతం, కమ్యూనికేషన్స్ 5.7 శాతం చొప్పున సమకూర్చాయి. రిటైల్ నామమాత్రంగా నీరసించగా.. లైఫ్ సైన్సెస్ 9 శాతం క్షీణించింది.ఉత్తర అమెరికా వాటా 1.7 శాతం పుంజుకుని ఆదాయంలో 56.3 శాతానికి చేరింది.యూరప్ బిజినెస్ 10.6 శాతం ఎగసి 31.7 శాతం వాటాను ఆక్రమించింది. భారత్ వాటా 2.9 శాతమే.ఇదీ చదవండి: నక్సల్స్పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా? -
కుల గణనలో పాల్గొనబోం
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనబోమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి ప్రకటించారు. తాము వెనుకబడిన కులాలకు చెందిన వారం కాదన్నారు. ఇటీవల తమ నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లతో వారు.. ‘మా ఇంట్లో సర్వే చేపట్టవద్దు’అని తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా, ఎన్యుమరేటర్లకిచ్చిన ప్రొఫార్మాలో సుధామూర్తి..‘మేం వెనుకబడిన కులాలకు చెందిన వారము కాదు. అందుకే, ఆ గ్రూపుల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మేం పాల్గొనడం లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తంగదాడి స్పందిస్తూ.. వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. ఈ పరిణామంపై సుధామూర్తి దంపతులు, ఇన్ఫోసిస్ అధికారులు స్పందించలేదు. -
అమీర్ చంద్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: బాస్మతి బియ్యం ఎగుమతి సంస్థ అమీర్ చంద్ జగదీష్ కుమార్(ఎక్స్పోర్ట్స్) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూ ద్వారా హర్యానా కంపెనీ రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఈ ఏడాది జూన్లో సెబీకి దరఖాస్తు చేసిన కంపెనీ తాజాగా అనుమతి పొందింది. ఐపీవో నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఏరోప్లేన్ బ్రాండు కంపెనీ ప్రధానంగా బాస్మతి బియ్యం ప్రాసెసింగ్తోపాటు ఎగుమతులు చేపడుతోంది. దేశీయంగా లిస్టెడ్ కంపెనీలు కేఆర్బీఎల్, ఎల్టీ ఫుడ్స్సహా సర్వేశ్వర్ ఫుడ్స్ తదితరాలతో పోటీ పడుతోంది. 2024 డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలంలో రూ. 1,421 కోట్ల ఆదాయం, రూ. 49 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
రూ.3,900 కోట్లు సమీకరించిన జెప్టో
న్యూఢిల్లీ: క్విక్కామర్స్ సంస్థ జెప్టో తాజాగా 450 మిలియన్ డాలర్ల (రూ.3,900 కోట్లుl. సుమారు) నిధులను సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏడాది క్రితం 350 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ నాటికి కంపెనీ మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అక్కడి నుంచి చూస్తే 40 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. తాజా నిధుల సమీకరణంలో అధిక భాగం కొత్త ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే ఉంది. అలాగే తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో కొందరు స్వల్ప వాటాలను విక్రయించారు. ఈ విడతలో కాల్పర్స్ నుంచి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీ ఖాతాల్లో 900 మిలియన్ డాలర్ల మేర నికర నగదు నిల్వలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాలకు పూర్తిగా సరిపోతాయని కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆదిత్ పలీచా తెలిపారు.త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టాలనుకుంటున్న జెప్టోలో ప్రస్తుతం దేశీ ఇన్వెస్టర్ల వాటా 12 శాతంగా ఉండగా, కొన్ని వారాల్లోనే ఇది 40 శాతానికి చేరుకుంటుందని చెప్పారు. క్విక్కామర్స్ విభాగంలో బ్లింకిట్, ఇన్స్టామార్ట్లకు గట్టిపోటీనిస్తున్న జెప్టో పట్ల ప్రైవేటు ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కనిపిస్తోంది. రోజువారీ 17 లక్షల ఆర్డర్లను స్వీకరిస్తున్నట్టు.. మెజారిటీ డార్క్స్టోర్లు లాభాల్లోకి వస్తున్నట్టు పలీచా తెలిపారు. గతేడాది నిధుల సమీకరణ నాటితో పోల్చితే ఈ విడత మెజారిటీ స్టోర్లు లాభాల్లోకి వచ్చినట్టు చెప్పారు. విస్తరణపై వ్యయం తాజాగా సమకూరిన పెట్టుబడులతో బ్యాలన్స్ షీట్ను మెరుగ్గా నిర్వహించగలమని, మోస్తరు విస్తరణకు వ్యయం చేయొచ్చని పలీచా చెప్పారు. ఒకవైపు కార్యకలాపాలను విస్తరిస్తూనే, లాభాల్లోకి రావడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. -
సెబీకి డ్యూరోఫ్లెక్స్ ప్రాస్పెక్టస్
న్యూఢిల్లీ: మ్యాట్రెస్ల తయారీ సంస్థ డ్యూరోఫ్లెక్స్ తమ పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్హెచ్పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. దీని ప్రకారం రూ. 183.6 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 2.25 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్తగా 120 స్టోర్స్ (కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్ – కోకో) ప్రారంభించేందుకు, ప్రస్తుత స్టోర్స్.. తయారీ ప్లాంటు లీజులు–అద్దెలు చెల్లించేందుకు, మార్కెటింగ్ వ్యయాలు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. 1963లో ప్రారంభమైన డ్యూరోఫ్లెక్స్, మార్కెట్ వాటాపరంగా దేశీయంగా టాప్ 3 మ్యాట్రెస్ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. డ్యూరోఫ్లెక్స్, స్లీపీహెడ్ బ్రాండ్స్ పేరిట మ్యాట్రెస్లు, సోఫాలు, ఇతరత్రా ఫర్నిచర్లు మొదలైనవి విక్రయిస్తోంది. 2025 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 73 కోకో స్టోర్స్, 5,500 పైగా జనరల్ ట్రేడ్ స్టోర్స్ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,057 కోట్లుగా ఉన్న ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,134 కోట్లకు చేరింది. -
వాహన టోకు విక్రయాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: జీఎస్టీ సంస్కరణ, పండుగ సీజన్ కలిసిరావడంతో తయారీదార్ల నుంచి డీలర్లకు ప్యాసింజర్ వాహనాలు, ద్వి చక్రవాహనాల సరఫరా గణనీయంగా పెరిగాయి. పెరిగిన టోకు విక్రయాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా ముగించవచ్చనే ఆశాభావంతో వాహన పరిశ్రమ ఉన్నట్లు సియామ్ పేర్కొంది. ‘‘కొత్త జీఎస్టీ ధరలు సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చినప్పట్టకీ.., కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్స్, త్రీ వీలర్స్ విభాగాలు గతంలో ఎన్నడూ లేనంతగా సెపె్టంబర్లో అత్యధిక అమ్మకాలు నమోదు చేశాయి. ప్రభుత్వం జీఎస్టీ 2.0 అమల్లోకి తీసుకురావడమనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇది ఆటో పరిశ్రమలో కాకుండా, మొత్తం ఆర్థికవ్యవస్థలో చైతన్యం తీసుకొస్తుంది’’ అని సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. → కంపెనీలు సెపె్టంబర్లో డీలర్లకు 3,72,458 ప్యాసింజర్ వాహనాలను పంపిణీ చేశాయి. గతేడాది ఇదే నెలలో పంపిణీ 3,56,752 యూనిట్లతో పోలిస్తే ఇవి 4% అధికం. → ద్వి చక్రవాహన విక్రయాలు 7% వృద్ధి చెంది 21,60,889 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 20,25,993 టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. → త్రీ చక్రవాహన టోకు అమ్మకాలు 79,683 నుంచి 84,077 యూనిట్లకు పెరిగాయి. త్రైమాసిక ప్రాతిపదికన.... వార్షిక ప్రాతిపదికన క్యూ2లో 10.39 లక్షల పీవీ అమ్మకాలు అమ్ముడయ్యాయి. టూ వీలర్స్ విక్రయాలు 7% వృద్ధి చెంది 55.62 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. త్రి చక్రవాహన విక్రయాలు 10% వృద్ది చెంది 2,29,239 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇదే సెప్టెంబÆ Š‡ త్రైమాసికంలో 2.4 లక్షల వాణిజ్య వాహన విక్రయాలు జరిగాయి. -
రూ.6,500 కోట్లతో జీహెచ్సీఎల్ విస్తరణ
న్యూఢిల్లీ: దేశీయంగా సోడాయాష్ తయారీలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న జీహెచ్సీఎల్ రూ.6,500 కోట్లతో గుజరాత్లోని కచ్ జిల్లాలో సోడాయాష్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఆరు నెలల్లో ప్లాంట్ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ ఎండీ ఆర్ఎస్ జలాన్ ప్రకటించారు. ఇది పూర్తయితే సోడాయాష్ తయారీ సామర్థ్యం రెట్టింపై 2.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తికి చేరుకుంటుందని తెలిపారు. 2030 నాటికి 300 గిగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి, ఈ ప్లాంట్ ఏర్పాటు కీలక మద్దతుగా నిలవనుంది. సోలార్ గ్లాస్ తయారీలో సోడాయాష్ ను కీలక ముడి పదార్థంగా వినియోగిస్తుంటారు. ఈ రంగానికి జీహెచ్సీఎల్ ముఖ్య సరఫరాదారుగా ఉండడం గమనార్హం. కొత్త ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిలో అధిక భాగాన్ని కొనుగోలు చేసినట్టు, పర్యావరణ అనుమతులు సహా అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేసినట్టు జలాన్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సోడాయాష్ తయారీ సామర్థ్యం 1.2 మిలియన్ టన్నులుగా ఉండగా, కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్లాంట్లో రెండు దశల్లో కలిపి 1.1 మిలియన్ టన్నుల కొత్త సామర్థ్యం తోడుకానుంది. సోలార్ గ్లాస్ పరిశ్రమ అవసరాలకు.. ముఖ్యంగా సోలార్ గ్లాస్ తయారీ కోసమే రూపొందించిన లార్జ్డెన్స్ సోడాయాష్ ను కొత్త ప్లాంట్లో తయారు చేయనున్నట్టు జలాన్ తెలిపారు. ‘‘119 గిగావాట్ల నుంచి 300 గిగావాట్లకు సోలార్ విద్యుదుత్పాదన పెంచుకోవడం అన్నది మాకు పెద్ద మార్కెట్ను కల్పించనుంది. గణనీయమైన సామర్థ్యంతో డెన్స్ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. కనుక మాకు పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నాయి’’అని వివరించారు. పర్యావరణ అనుకూలమైన, అధిక ఇంధన సామర్థ్యంతో, అత్యాధునిక సాంకేతికతకు ఈ ప్లాంట్ నిర్మాణంలో వినియోగిస్తున్నట్టు తెలిపారు. కంపెనీ వద్ద రూ.1,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని.. రుణం, ఈక్విటీ జారీ రూపంలో మిగిలిన నిధులను సుమకూర్చుకోనున్నట్టు చెప్పారు. మొత్తం మీద రుణ భారం ఈక్విటీలో 0.6–0.7 రెట్లు మించదన్నారు. ప్రస్తుతం కంపెనీకి ఎలాంటి రుణ భారం లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశ అవసరాల్లో 20 శాతం మేర సోడాయాష్ ను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా సోడాయాష్ తయారీలో చైనా వాటా 45 శాతంగా ఉంది. భారత్లోకి చౌకగా సోడాయాష్ ను పంపిస్తుండడంతో ఇక్కడి పరిశ్రమల మార్జిన్లపై ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్సీఎల్ కొత్త ప్లాంట్తో ముందుకు వెళుతోంది. -
పేద దేశమైనా రూపాయి కంటే బలమైన కరెన్సీ.. ఎలా?
ఆఫ్ఘనిస్తాన్ అంటే ప్రపంచంలో అత్యంత పేద, అస్థిర దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎప్పుడూ యుద్ధం లేదా ఉగ్రవాద ఘటనలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు దాని కరెన్సీ బలం వల్ల ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ఈ దేశం కరెన్సీ పరంగా మాత్రం అత్యంత స్థిరమైన దేశాల్లో ఒకటిగా అవతరించడమంటే నిజంగా ఆశ్చర్యమే.ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ విలువ ఎంత?ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ (Afghanistan Currency) ఆఫ్ఘనీ (AFN). ప్రస్తుతం ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ.. భారత రూపాయి (Indian Rupee) కంటే బలంగా ఉంది. కరెన్సీ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్ XE.com ప్రకారం.. 1 ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ విలువ రూ.1.33 భారతీయ రూపాయలతో సమానం. ఇది అర్థం ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్లో 1 లక్ష ఆఫ్ఘనీలను సంపాదించడం, భారతదేశంలో సుమారు రూ.1.33 లక్షలకు సమానమవుతుంది. ఇది ఆర్థికంగా పోరాటం చేస్తున్న దేశానికి పెద్ద విషయమే.ఆఫ్ఘన్ కరెన్సీ బలానికి కారణం2021లో అధికారంలోకి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం, దేశీయ కరెన్సీని బలోపేతం చేసే చర్యలు తీసుకుంది. అవి..విదేశీ కరెన్సీ వినియోగంపై నిషేధం: ముఖ్యంగా అమెరికన్ డాలర్, పాకిస్తాన్ రూపాయి వాడకాన్ని ఆపివేశారు.ఆఫ్ఘన్ కరెన్సీలో లావాదేవీలు తప్పనిసరి నిబంధన: ఇది స్థానిక కరెన్సీకి డిమాండ్ను పెంచింది.ద్రవ్య విధానాల పటుత్వం: కఠిన ద్రవ్య విధానాల ద్వారా ద్రవ్యపు ప్రవాహాన్ని నియంత్రించారు.కరెన్సీ స్థిరత్వం వెనుక వాస్తవంఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నదిగా ఉండవచ్చు. కానీ పరిమిత దిగుమతులు, చాలా తక్కువ విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం కారణంగా దాని కరెన్సీ స్థిరంగా ఉంది. దాదాపు ప్రతి దేశీయ లావాదేవీ స్థానిక కరెన్సీలో నిర్వహించడంతో, ఆఫ్ఘన్ ఆఫ్ఘన్ విలువ పడిపోవడానికి బదులుగా స్థిరంగా ఉంటుంది. -
హైదరాబాద్ యువతకు ఫ్లిప్కార్ట్ ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు
యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్ జట్టు కట్టాయి. హైదరాబాద్, బెంగళూరులోని యువతకు ఉద్యోగ నైపుణ్యాల శిక్షణనివ్వడంతో పాటు అవకాశాలను కూడా దక్కించుకోవడంలో తోడ్పాటు అందించనున్నాయి. ఈ ప్రోగ్రాం కింద 540 మందికి ట్రైనింగ్ కల్పించనుండగా, వీరిలో కనీసం 70 శాతం మంది మహిళలు ఉంటారు.సుమారు 380 మంది ట్రైనీలకు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. ఇందులో పాల్గొన్న వారి కుటుంబాలతో పాటు సుమారు 2,700 మందికి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. బీఎఫ్ఎస్ఐ కంటెంట్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలైన అంశాల్లో శిక్షణనిస్తారు.ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్లు ఇదివరకే భాగస్వామ్యంతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అది సత్ఫలితాలను ఇవ్వడంతో మరోసారి యువతకు శిక్షణ ఇచ్చేందుకు సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఈ భాగస్వామ్యంతో గతంలో 546 మంది యువతకు విజయవంతంగా శిక్షణ ఇచ్చారు. వీరిలో 73 శాతం మంది అర్థవంతమైన ఉపాధి అవకాశాల నుండి ప్రయోజనం పొందుతున్నారు. నిర్మాణాత్మక పోస్ట్-ప్లేస్మెంట్ ట్రాకింగ్ ద్వారా యువతకు ఉపాధిని మరింత పెంచడం, దీర్ఘకాలిక ఉద్యోగ నిలుపుదల, స్థిరమైన ఆదాయ వృద్ధికి మద్దతు ఇవ్వడం కొత్త ప్రాజెక్ట్ లక్ష్యం. -
రైలు వెనుక 'X' గుర్తు కనిపించకపోతే డేంజరే..!
దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే రవాణా సాధనాలు రైళ్లు. సరళమైనవి, సౌకర్యవంతమైనవి, దేశవ్యాప్తంగా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉండటంతో నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వేల సంఖ్యలో రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిని భారతీయ రైల్వే నిర్వహిస్తోంది.ఇండియన్ రైల్వే విస్తృత నెట్వర్క్, క్లిష్ట కార్యకలాపాలతోపాటు అనేక విశిష్ట చిహ్నాలు, గుర్తులతో ప్రయాణికులకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ప్రముఖ గుర్తుల్లో ఒకటి, ప్రతి రైలు చివరి కోచ్పై ఉండే బోల్డ్ ‘ఎక్స్’ (X) గుర్తు. మొదటిసారి చూసినప్పుడు ఇది కేవలం డిజైన్ లేదా సాధారణ గుర్తుగా అనిపించవచ్చు. అయితే, ఈ గుర్తు రైలు భద్రత, కార్యకలాపాల సమర్థతలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వాస్తవ అర్థం, ఉపయోగాన్ని తెలుసుకోవడం ట్రాక్ నిర్వహణ, రైలు ఆపరేషన్లకు ఎంతో అవసరం.రైలు పూర్తిగా దాటిందని నిర్ధారణచివరి కోచ్పై ఉన్న "X" గుర్తు ప్రధానంగా రైలు పూర్తిగా స్టేషన్ గుండా దాటిందని రైల్వే సిబ్బందికి తెలియజేస్తుంది. ఇది ఒక దృశ్య సూచనగా పని చేస్తూ, అన్ని కోచ్లు పూర్తిగా వెళ్లిపోయాయని నిర్ధారించడంలో సహాయపడుతుంది. రాత్రి సమయంలో లేదా దృష్టి మందగించే వాతావరణంలో ఇది మరింత కీలకంగా మారుతుంది. కేవలం సిగ్నళ్లపై ఆధారపడటం చాలనిపించినా ఈ "X" మార్కింగ్ అదనపు భద్రతా పొరగా నిలుస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపుకొన్నిసార్లు అరుదైన సంఘటనల్లో, ఒక కోచ్ రైలు నుండి వేరు కావచ్చు. అలాంటి సందర్భంలో, రైలు చివరి కోచ్పై "X" గుర్తు కనపడకపోతే, అది తక్షణమే ఒక హెచ్చరికగా మారుతుంది. దీనివల్ల రైల్వే అధికారులు సమస్యను వెంటనే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ప్రమాదాలను నివారించడంలో, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను పరిరక్షించడంలో కీలకంగా ఉంటుంది. -
చేతులు కలిపిన ఎయిర్టెల్, ఐబీఎం..
టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబీఎం చేతులు కలిపాయి. ముంబై, చెన్నైలో ఎయిర్టెల్ క్లౌడ్ కోసం రెండు మల్టీజోన్ రీజియన్లను (ఎంజీఆర్) నెలకొల్పేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. క్లౌడ్ సర్వీసుల కోసం పెద్ద సంఖ్యలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఎంజీఆర్గా వ్యవహరిస్తారు.దేశీయంగా ఎయిర్టెల్ క్లౌడ్ లభించే జోన్ల సంఖ్యను ప్రస్తుత నాలుగు నుంచి పదికి పెంచుకోనున్నట్లు భారతి ఎయిర్టెల్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ తెలిపారు. ఐబీఎం క్లౌడ్ సొల్యూషన్స్ను ఎయిర్టెల్ క్లౌడ్ కస్టమర్లు పోర్ట్ఫోలియో యాజ్ ఏ సర్వీస్ కింద ఉపయోగించుకునేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంది. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు టెక్నాలజీ విషయంలో స్వతంత్రతను కోరుకుంటున్న నేపథ్యంలో తమ సంస్థకు వ్యాపార అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని ఐబీఎం ఆసియా పసిఫిక్ జనరల్ మేనేజర్ హాన్స్ డెకర్స్ తెలిపారు.ప్రాజెక్ట్ ముఖ్యాంశాలుముంబై, చెన్నై నగరాల్లో ఎయిర్టెల్ క్లౌడ్ కోసం రెండు మల్టీజోన్ రీజియన్లు (MGRs) స్థాపించనున్నారు.ఇవి విస్తృత స్థాయిలో క్లౌడ్ సేవలు అందించగల నెట్వర్క్-కేంద్రిత డేటా సెంటర్ల సమాహారంగా పనిచేస్తాయి.ఎంజీఆర్లు అధిక స్థాయిలో లభ్యత, డేటా రిజిలియెన్సీ, డేటా ప్రాసెసింగ్ వేగాన్ని అందిస్తాయి.ప్రస్తుతం నాలుగు క్లౌడ్ జోన్లతో ఉన్న ఎయిర్టెల్, వాటిని పదికు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది.ఇది దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలకు, ప్రభుత్వ విభాగాలకు మరింత వేగవంతమైన, నమ్మదగిన క్లౌడ్ సేవలను అందించగలదు.ఐబీఎంకు చెందిన అధునాతన సాంకేతికతలను “పోర్ట్ఫోలియో యాస్ ఏ సర్వీస్” రూపంలో ఎయిర్టెల్ క్లౌడ్ కస్టమర్లు వినియోగించవచ్చు.ఇది కస్టమర్లకు స్కేలబులిటీ, డేటా కంట్రోల్, ఏఐ సామర్థ్యాలు వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. -
'అప్పటికి బంగారం ధరలు భారీగా పడిపోతాయ్'
ప్రస్తుతం బంగారం ధరలు(Gold price) రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది పుత్తడి ధరలు పడిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2026 ద్వితీయార్థంలో బంగారం ధర గణనీయంగా తగ్గే అవకాశముందని ఏఎన్జెడ్ (ANZ) బ్యాంక్ అంచనా వేసింది.ప్రస్తుత బంగారం ధరల పరిస్థితిస్పాట్ గోల్డ్ ధర ఔన్స్ కు 0.4 శాతం పెరిగి 4,224.79 డాలర్లకు చేరుకుంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ (డిసెంబర్ డెలివరీ) 0.9 శాతం పెరిగి 4,239.70 డాలర్లకు చేరుకుంది. భారత్లో ప్రస్తుతం (అక్టోబర్ 16) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,29,590 వద్ద ఉంది.అనిశ్చిత భౌగోళిక-రాజకీయ పరిస్థితులు, ఆర్థిక ఒడిదుడుకులు, యూఎస్ డాలర్ బలహీనత, వడ్డీ రేట్లు తగ్గే అంచనాలు అన్నీ కలిపి బంగారం ధరను ప్రస్తుతం ఆల్టైమ్ హై స్థాయికి చేర్చాయని నిపుణులు పేర్కొన్నారు.ఏఎన్జెడ్ అంచనాతక్కువ వడ్డీ రేటు వాతావరణంలో బాగా పనిచేసే అనిశ్చితి కాలంలో సురక్షితమైన ఆస్తిగా కనిపించే బంగారం ఇప్పటి వరకు 61 శాతం పెరిగింది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.1 శాతం పడిపోయి ఒక వారం కనిష్ట స్థాయికి చేరుకుంది.ఏఎన్జెడ్ అంచనా ప్రకారం (Gold price prediction).. బంగారం ధరలు ఇదే విధంగా పెరిగి 2026 మొదటి ఆరు నెలలు శిఖరానికి చేరుకుంటాయి. 2026 జూన్ నాటికి బంగారం ధర ఔన్స్కు 4,400 డాలర్లకు చేరే అవకాశం ఉంది. అయితే, ఆ తర్వాత ఈ ఏడాది రెండో భాగంలో ధరలు పడిపోవొచ్చని ఏఎన్జెడ్ అంచనా వేసింది.ఇదీ చదవండి: బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే: కమొడిటీ గురు జిమ్ రోజర్స్వెండి కూడా..2026 మధ్య నాటికి వెండి (Silver price) ఔన్స్ కు 57.50 డాలర్లకు చేరుకుంటుందని ఏఎన్జెడ్ బ్యాంక్ అంచనా వేసింది. ఏదేమైనా, హాకిష్ ఫెడ్ వైఖరి, ఊహించిన దానికంటే బలమైన యూఎస్ ఆర్థిక వృద్ధి ప్రతికూల ప్రమాదాలను కలిగిస్తుందని ఏఎన్జెడ్ హెచ్చరించింది.(Disclaimer: బంగారం, వెండి గురించి నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. కొనుగోలుదారులకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్లకు వరుస లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market ) గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఎగిశాయి. కొనసాగుతున్న క్యూ2 ఫలితాల సీజన్ లో స్టాక్-నిర్దిష్ట చర్యల మధ్య వరుసగా రెండవ సెషన్ లోనూ లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 862.23 పాయింట్లు లేదా 1.04 శాతం పెరిగి 83,467.66 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 261.75 పాయింట్లు లేదా 1.03 శాతం పెరిగి 25,585.3 వద్ద ముగిశాయి.బీఎస్ఈలో టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం టాప్ గెయినర్లలో ఉండగా, ఇన్ఫోసిస్, ఎటర్నల్ (జొమాటో) మాత్రమే వెనుకబడి ఉన్నాయి.రంగాలవారీగా అన్ని రంగాలు గ్రీన్లో ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసిజి 2.02 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో, బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ ఒక్కొక్కటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.46 శాతం, 0.24 శాతం పెరిగాయి. -
ఈ కంపెనీ దీపావళికి ఇచ్చిన గిఫ్ట్లు చూశారా..?
దీపావళి.. దేశంలో అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాన్ని పుస్కరించుకుని దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు బోనస్లు, బహుమతులు (Diwali Gifts) ఇస్తుంటాయి. కొన్ని సంస్థలు కేవలం స్వీట్ బాక్స్ లతోనే సరిపెట్టేస్తుంటాయి. మరి కొన్ని కంపెనీలు అయితే అవి కూడా లేకుండా ఉద్యోగులకు వట్టి చేతులు చూపిస్తుంటాయి. కేవలం కొన్ని కంపెనీలే తమ ఉద్యోగులకు గుర్తుండిపోయేలా బహుమతులిచ్చి ఆశ్చర్యపరుస్తుంటాయి.భారతీయ టెక్నాలజీ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ (Info Edge) తన ఉద్యోగులకు ఇచ్చిన దీపావళి బహుమతులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఉద్యోగులు స్వయంగా చిత్రీకరించిన అనేక ఇన్స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవుతున్నాయి, సంస్థ వారికిచ్చిన రిచ్ గిఫ్ట్ హ్యాంపర్స్ను హైలైట్ చేస్తున్నాయి.వీడియోలలో ప్రతి ఉద్యోగి తమ వర్క్స్టేషన్ వద్దకు రాగానే, వీఐపీ బ్రాండెడ్ సూట్కేస్, స్నాక్స్ బాక్స్, సాంప్రదాయ దీపం (దియా) అమర్చి ఉండటం కనపడుతోంది. ఆఫీసు అంతటా పండుగ శోభను సంతరించుకుని, డెస్కులు అందంగా అలంకరించి ఉన్నాయి.వైరల్గా మారిన దీపావళి గిఫ్ట్ రీల్స్తమ సంస్థ ఇచ్చిన గిఫ్ట్లను చూపుతూ ఉద్యోగులు చేసిన రీల్స్ సోషల్ మీడియా లో వైరల్గా మారాయి. ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తీసిన వీడియోలలో, బహుమతులను చూస్తూ వారు ఆశ్చర్యపోతున్న క్షణాలు బంధించారు. కొన్ని క్లిప్లలో ఉద్యోగులు సూట్కేస్ తెరిచి చూపించారు. లోపల మరొక చిన్న సూట్కేస్ ఉంది. అలాగే స్నాక్స్ బాక్స్ లను అన్బాక్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. గత ఏడాది కూడా ఈ సంస్థ ఉద్యోగులకు ఎయిర్ఫ్రైయర్లు బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు.నెటిజన్ల స్పందనలుఈ వీడియోలు వైరల్ కావడంతో, సోషల్ మీడియా కామెంట్లు వ్యంగ్యంతో పాటు అసూయతో నిండిపోయాయి. “నేను నా ఆఫీస్ నుండి వచ్చిన కాజు బర్ఫీ బాక్స్ని చూస్తూ ఈ వీడియోను చూస్తున్నాను” ఒకరు కామెంట్ చేయగా “దీనిని నా మేనేజర్కి చూపించాను. ఆయన ఇది ఏఐ అన్నాడు!” మరో వ్యక్తి హాస్యంగా కామెంట్ చేశారు.కంపెనీ గురించి..ఇన్ఫో ఎడ్జ్ సంస్థను 1995లో సంజీవ్ బిఖ్చందానీ స్థాపించారు. ఇది నౌకరి, 99ఎకర్, జీవన్ సాథీ, శిక్షిక.కామ్ వంటి ప్రధాన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను నిర్వహిస్తోంది. అలాగే, పలు స్టార్ట్అప్లలో కూడా పెట్టుబడులు పెట్టింది. సంస్థ ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది.ఇదీ చదవండి: ఈ కంపెనీల్లో కెరియర్కు తిరుగులేదు! లింక్డ్ఇన్ లేటెస్ట్ లిస్ట్ -
సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా: ఇవి కీలకం..
ఢిల్లీ వంటి మహా నగరాల్లో కాలుష్యం అధికమవడంతో పదిహేనేళ్లు దాటిన కార్లు, ట్యాక్సీలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ తరుణంలో డీజిల్, పెట్రోల్ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వీటి విక్రయాలకు అక్కడ ప్రత్యేక మార్కెట్లు ఉంటాయి. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు వ్యాపారులు తక్కువ ధరకు వాటిని అక్కడ కొనుగోలు చేసి సెకండ్ హ్యాండ్ కార్లంటూ విక్రయిస్తున్నారు. వరంగల్ నగరంలో రకరకాల పేర్లతో సుమారు 20 వరకు పాత కార్ల దుకాణాలు ఉన్నాయి. ఏటా సుమారు 1,500 నుంచి 2వేల లోపు కార్లు విక్రయాలు సాగుతున్నాయి. ఇవి కాక తెలిసిన వారు, మధ్యవర్తుల సహకారంతో తెచ్చుకునేవి మరో 1,000 వరకు ఉంటాయని తెలుస్తోంది.ధ్రువీకరణ పత్రాలు కీలకం..వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్సీ, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు అఫిడవిట్ తీసుకోవాలి. వాహనంపై ఎలాంటి కేసులు లేవని పోలీసు శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. ఎన్ఓసీ పొందిన 15 రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే నెలవారీగా జరిమానా విధిస్తారు. వాహన కాల పరిమితి 15 ఏళ్లు, మోడల్, కంపెనీ(ఇన్వాయిస్) ధరను బట్టి రోడ్ ట్యాక్స్ విధిస్తారు. ఇంజిన్ ఆన్ చేసే సమయంలో ఆయిల్ పైకి ఎగజిమ్మినా లీకైనా, పొగవచ్చినా ప్రమాదమని గుర్తించాలి. గేర్ ఇంజిన్ సరి చూసుకోవాలి. టైర్లు సరిగా లేకపోతే మైలేజీ తగ్గుతుంది.ఇదీ చదవండి: 1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!వాహనాన్ని పసిగట్టొచ్చిలా..వాహన అద్దాల చివర కంపెనీ పేరు, ఏడాది సంఖ్య ముద్రించి లేకపోతే మార్చారని గ్రహించాలి. డోర్ బాటమ్ ప్రాంతంలో రబ్బర్లు తీసి వాటిపై గుండీల ఆకారంలో అచ్చులుంటే ఎలాంటి మార్పు చేయలేదని అర్థం. కాళ్ల కింద డిక్కీ ప్రాంతంలో మ్యాట్లు ఎత్తి కింది వైపు దెబ్బతిందో లేదో చూసుకోవాలి. ప్రమాదం జరిగిన వాహనాలకు రంగులు వేసి బఫింగ్ చేస్తే పోల్చుకోవడం కష్టమవుతుంది. -
లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా 2025: టాప్లో జెప్టో
లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా 2025 జాబితాలో క్విక్ కామర్స్ ప్లాట్ఫాం జెప్టో అగ్రస్థానంలో నిల్చింది. జెప్టో నంబర్ వన్ స్థానంలో నిలవడం వరుసగా ఇది మూడో ఏడాది. తర్వాత స్థానంలో ఎంటర్ప్రైజ్ స్టోరేజ్ సంస్థ లూసిడిటీ, 10 మినిట్స్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విష్ మూడో స్థానంలో నిల్చాయి. హైదరాబాదీ స్టార్టప్ సంస్థ భాంజూ ఏడో ర్యాంకు దక్కించుకుంది.ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగంపై ఆసక్తి, ప్రతిభావంతులను ఆకర్షించగలిగే సామర్థ్యం తదితర అంశాల ప్రాతిపదికన లింక్డిన్ ఈ జాబితాను రూపొందించింది. ప్రారంభించి అయిదేళ్లు మించకుండా, భారత్లో ప్రధాన కార్యాలయం, కనీసం 30 మంది ఉద్యోగులు కలిగి ఉండి, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న సంస్థలను దీని కోసం పరిగణనలోకి తీసుకున్నారు. 2024 జూలై 2 నుంచి 2025 జూన్ 30 వరకు డేటా ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. వివిధ కేటగిరీలలో కార్యకలాపాలు సాగిస్తున్న టాప్ మూడు సంస్థలు వేగంగా వృద్ధి చెందుతూ, కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తున్నాయని లింక్డిన్ తెలిపింది. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు క్విక్ కామర్స్, ఏఐ-నేటివ్ ప్లాట్ఫాంలు, స్పెషలైజ్డ్ ఫిన్టెక్ సంస్థలు కీలక చోదకాలుగా నిలుస్తున్న తీరు జాబితాతో వెల్లడైంది.లిస్టు ప్రకారం..వీక్డే (4వ ర్యాంకు), కాన్విన్ (6), లైమ్చాట్ (19) తదితర ఏఐ స్టార్టప్లు.. జార్ (5వ స్థానం), కార్డ్91 (18), డెజర్వ్ (16) ఫిన్టెక్ సంస్థలు టాప్ 20 జాబితాలో నిల్చాయి.టాప్ 20లో తొమ్మిది స్టార్టప్లకు కేంద్రంగా నిలుస్తూ అంకురాల రాజధానిగా బెంగళూరు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. జెప్టో, స్విష్, లూసిడిటిలాంటి సంస్థలు నగరం నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.ఢిల్లీ, ముంబై నుంచి రెండు చొప్పున లిస్టులో చోటు దక్కించుకున్నాయి. పుణెకి చెందిన ఈమోటోర్యాడ్ 9వ ర్యాంకులో నిలిచింది. -
1200 మందికే ఈ బైక్: ధర తెలిస్తే షాకవుతారు!
ట్రయంఫ్ మోటార్సైకిల్ కంపెనీ.. స్పీడ్ ట్రిపుల్ 1200 RX బైకును లాంచ్ చేసింది. దీని ధర రూ. 23.07 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో.. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1200 యూనిట్లకు మాత్రమే పరిమితం. దీనిని 1200 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు. అయితే భారతదేశానికి ఎన్ని యూనిట్లను కేటాయించిందో వెల్లడించలేదు.ఈ ఏడాది ప్రారంభంలో ఆవిష్కరించబడిన స్పీడ్ ట్రిపుల్ 1200 RX.. ఇప్పటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. దీనిని స్పీడ్ ట్రిపుల్ 1200 RS ఆధారంగా రూపొందించారు. అయితే ఇది లేటెస్ట్ అప్గ్రేడ్లను పొందుతుంది. ఇది లేత పసుపు, నలుపు రంగుల కలయికతో చూడచక్కగా ఉంది.ఇదీ చదవండి: మరింత తగ్గిన ఆల్టో కే10 ధర: రూ.3.70 లక్షలు!కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 RX బైక్.. 1,163 సీసీ ఇన్లైన్ త్రీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10750 ఆర్పీఎం వద్ద 183 హార్స్ పవర్, 8750 ఆర్పీఎం వద్ద 128 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుందని సమాచారం. -
ఏఐ ట్రాఫిక్ సిస్టం: ఎవ్వరూ తప్పించుకోలేరు!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. ట్రాఫిక్ ఉల్లంఘనలను స్వయంచాలకంగా గుర్తించదానికి దుబాయ్ పోలీసులు, సరికొత్త ఏఐ బేస్డ్ ట్రాఫిక్ సిస్టం ప్రవేశపెట్టారు. ఇది మానవ ప్రమేయం లేదా ట్రాఫిక్ పోలీసుల ప్రమేయం అవసరం లేకుండానే.. ఐదు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తిస్తుంది.దుబాయ్ పోలీసులు ఎమిరేట్ అంతటా రోడ్డు భద్రతను పెంపొందించడంలో భాగంగా.. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ (ITS)ను ఆవిష్కరించారు. ఇది GITEX గ్లోబల్ 2025లో ప్రదర్శించబడిన ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్. ఈ టెక్నాలజీ డ్రైవర్లు రోడ్డు నియమాలను ఎలా పాటిస్తున్నారనే విషయాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.సీటు బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, ట్రాఫిక్ అడ్డుకోవడం, కారణం లేకుండా రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆపడం, వాహనాల మధ్య దూరాన్ని నిర్వహించడంలో విఫలం కావడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ గుర్తిస్తుంది.ట్రాఫిక్ అనేది ఇప్పటివరకు చాలా దేశాల్లో మాన్యువల్గానే నిర్వహిస్తున్నారు. గతంలో దుబాయ్ కూడా ఇదే విధానంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించింది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ కచ్చితమైన వివరాలను అందిస్తుందని, తద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుతాయని.. అక్కడి అధికారులు చెబుతున్నారు. -
పెరిగిన బంగారం, వెండి దిగుమతులు
అంతర్జాతీయంగా వాణిజ్య అనిషితుల్లోనూ దేశ ఎగుమతుల రంగం పనిష్ట పనితీరు చూపించింది. సెప్టెంబర్లో ఎగుమతులు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 6.74 శాతం అధికంగా 36.38 బిలియన్ డాలర్ల (3.20 లక్షల కోట్లు) విలువ మేర ఎగుమతులు జరిగాయి. దిగుమతులు సైతం 16.6 శాతం పెరిగి 68.53 బిలియన్ డాలర్లు(రూ.6.03 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు సెప్టెంబర్ నెలకు మరింత విస్తరించి 31.15 బిలియన్ డాలర్లు(రూ.2.74 లక్షల కోట్లు)గా నమోదైంది. 2024 సెప్టెంబర్ నెలలో దిగుమతులు 58.74 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కేంద్ర వాణిజ్య శాఖ ఈ వివరాలను విడుదల చేసింది.ప్రధానంగా బంగారం, వెండి, ఎరువుల దిగుమతులు పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 3 శాతం పెరిగి 220 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 4.53 శాతం పెరిగి 375.11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 155 బిలియన్ డాలర్లకు విస్తరించింది.అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న తరుణంలోనూ భారత వస్తు, సేవల ఎగుమతులు మంచి పనితీరు చూపించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. మెరుగైన పనితీరుకు కారణం ఏంటన్న మీడియా ప్రశ్నకు దేశీ పరిశ్రమ బలంగా ఉందంటూ.. తమ సరఫరా వ్యవస్థలను, వ్యాపార సంబంధాలను మెరుగ్గా కొనసాగించినట్టు చెప్పారు. అమెరికా 50 శాతం టారిఫ్ల ప్రభావంపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. దీన్ని తెలుసుకునేందుకు కమోడిటీ వారీగా డేటాను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అమెరికాకు మొత్తం ఎగుమతుల్లో 45 శాతానికి టారిఫ్ల నుంచి మినహాయింపు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. -
రూ.1000 తగ్గిన వెండి, అక్కడ మాత్రం పెరిగిన బంగారం!
అక్టోబర్ ప్రారంభం నుంచి దాదాపు పెరుగుతూ ఉన్న ధరలు ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెండి ధర మాత్రం రూ. 1000 తగ్గింది. దీంతో దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోని గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో పసిడి కొత్త ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అలాంటి నిర్ణయాలతో రిస్క్: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
న్యూఢిల్లీ: ఆల్గోరిథమ్ ఆధారితంగా (సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్) నిర్ణయాలు తీసుకోవడం, సేవలు కొన్ని వేదికలపైనే కేంద్రీకృతం కావడాన్ని సరిగ్గా నియంత్రించకపోతే.. ఇవి సంప్రదాయ రిస్క్లు కానందున మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం పడుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే అభిప్రాయపడ్డారు.డిజిటల్ ఆవిష్కరణలు అన్నవి నేడు కేవలం చెల్లింపులకే పరిమితం కావడం లేదన్నారు. డిజిటల్ వేదికలపై సూక్ష్మ బీమా, పింఛను ఉత్పత్తుల పంపిణీ వేగంగా విస్తరిస్తోందన్నారు. ఈ తరహా డిజిటల్ ఆవిష్కరణలు తక్కువ ఆదాయ వర్గాలకు సాయపడుతున్నట్టు చెప్పారు. యూపీఐని ఇతర దేశాలకూ విస్తరించడం వల్ల సీమాంతర చెల్లింపులు వేగాన్ని సంతరించుకున్నట్టు పేర్కొన్నారు. బాధ్యాతయుతంగా అభివృద్ధి చెందగల వాతావరణాన్ని.. సురక్షితమైన, సుస్థిరమైన, కస్టమర్ కేంద్రంగా ఉండే కొత్త ఆవిష్కరణలు, పరిష్కారాల అభివృద్ధిని ఆర్బీఐ ప్రోత్సహిస్తుందని చెప్పారు.‘‘పాలన, రిస్క్ నిర్వహణ, కస్టమర్ రక్షణకు ప్రాధాన్యం ఇస్తాం. సాంకేతిక పరమైన పురోగతి అన్నది ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతతో సరిపోలాలి’’అని స్వామినాథన్ పేర్కొన్నారు. ఫిన్టెక్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లు వేగంగా వృద్ధి చెందుతుండడంతో ఆర్థిక వ్యవస్థ సరిహద్దులు విస్తరిస్తున్నాయంటూ, ఇది సరికొత్త రిస్్కలను తెచి్చపెడుతున్నట్టు చెప్పారు. వీటిని సరిగ్గా చెక్పెట్టకపోతే అప్పుడు విడిగా సంస్థల నుంచి మొత్తం ఆర్థిక వ్యవస్థకు రిస్్కలు విస్తరిస్తాయని అభిప్రాయపడ్డారు. దేశంలో బలమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఆర్థిక సేవల విస్తృతికి మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు.