Business
-
ఆదిత్య బిర్లా సన్లైఫ్ అన్మోల్ అక్షయ ప్లాన్
ముంబై: జీవిత బీమా రక్షణతోపాటు, భవిష్యత్ లక్ష్యాల కోసం పొదుపు ప్రయోజనాలతో ‘ఏబీఎస్ఎల్ఐ అన్మోల్ అక్షయ’ ప్లాన్ను ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఏబీఎస్ఎల్ఐ) ప్రారంభించింది. తమ పిల్లల విద్యావసరాలకు ఉపయోగపడే విధంగా జీవితంలోని వివిధ దశల్లో చెల్లింపులు చేసే ‘మై చైల్డ్’ను ఎంపిక చేసుకోవచ్చు.కుమార్తె వివాహం, ఇల్లు కొనుగోలు, రిటైర్మెంట్ తదితర జీవిత లక్ష్యాలకు సంబంధించి మధ్య, దీర్ఘకాలంలో కావాల్సిన నిధిని సమకూర్చుకునేందుకు వీలుగా ‘మై సేవింగ్స్’ ఆప్షన్ కూడా ఈ ప్లాన్లో ఉంది. మహిళా పాలసీదారులకు ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ‘హర్ బెనిఫిట్స్’ కింద.. భవిష్యత్తు లక్ష్యాలకు పొదుపు చేసుకోవచ్చు. డాక్టర్ కన్సల్టేషన్లు, ఆరోగ్యంపై కోచింగ్, రెండో మెడికల్ (డాక్టర్) ఒపీనియన్ తదితర సేవలను పొందొచ్చు.తమ అవసరాలకు అనుగుణంగా బీమా కవరేజీని పెంచుకునే ‘ఎక్స్టెండెడ్ లైఫ్ కవర్ (ఈఎల్స్)’ను కావాల్సిన వారు ఎంపిక చేసుకోవచ్చు. దీని ద్వారా పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా 75 లేదా 85 ఏళ్ల వరకు బీమా రక్షణ కొనసాగుతుంది. ఒకవేళ పాలసీదారుడు కాల వ్యవధిలోపు మరణించినట్టయితే, ఒకే విడత పరిహారం అందించి.. మెచ్యూరిటీ అయిన తర్వాత మిగిలిన పాలసీ ప్రయోజనాలు అందించే ఆప్షన్ కూడా ఉంది. -
మెరుస్తూనే ఉంటాయి... కానీ!
సాక్షి, వెల్త్: ఈక్విటీలు, బంగారం, వెండి.. ఏ అసెట్ ర్యాలీ చేస్తున్నా ఇన్వెస్టర్లకు సందడే. స్టాక్స్ ర్యాలీలో బుల్స్ వెంట పరుగులు తీస్తారు. అనిశ్చితులు, సంక్షోభాలతో ఈక్విటీలు బేల చూపులు చూస్తుంటే.. బంగారం, వెండిని ఎత్తుకుంటారు. ఏ ర్యాలీ అయినా రివర్స్ గేర్ తీసుకుంటే మాత్రం కంగారు పడిపోతుంటారు. 2020లో కరోనా విపత్తు, 2022లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, 2025లో ట్రంప్ రెండో విడత అమెరికా అధ్యక్ష బాధ్యతల అనంతరం ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాల యుద్ధాన్ని ప్రకటించడం, 2026లో ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం.. ఈ అనిశ్చితి, అయోమయ పరిస్థితులతో రెండేళ్లుగా పసిడి, వెండి జిగేల్మన్నాయి.ఏ దశలో పెట్టుబడి పెట్టినా ఇన్వెస్టర్లకు కాసులు కురిపించాయి. కానీ, ఈ ఏడాది జనవరి నుంచి బంగారం 25 శాతం, వెండి 45 శాతం వరకు పతనమయ్యాయి. ఎందుకని? ఎందుకంటే యుద్ధాలు, సంక్షోభాలు, ధరల మంటలు, ఆర్థిక మాంద్యాలు వంటి సందర్భాల్లో పెట్టుబడుల విలువను కాపాడుకునేందుకు (హెడ్జింగ్ కోసం) ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి కొంత పెట్టుబడులను పసిడి, వెండిలోకి మళ్లిస్తారు.సంక్షోభం కుదుటపడుతోందని సంకేతాలొచ్చినా... లేదా అప్పటికే భారీగా పెరిగి ఉన్నా కొంత విక్రయించి లాభాలు స్వీకరిద్దామన్న ధోరణి నెలకొన్నా.. పసిడి, వెండి రివర్స్ గేర్ తీసుకుంటాయి. 2026 జనవరిలో జీవితకాల గరిష్ట స్థాయికి చేరాక పసిడి, వెండిలో కనిపించిన దిద్దుబాటు ఒక రకంగా ఇలాంటిదే. ఒక్క ఈ నెలలోనే 12 శాతం మేర వీటి ధరలు పతనమయ్యాయి. మరి ఈ కరెక్షన్ బుల్ మార్కెట్ ముగింపు కార్డా? ఇన్వెస్టర్ల ముందున్న మార్గం ఏంటి? ఏం చేయాలిపుడు?ఎందుకు ఈ పతనం?⇒ ఏ ప్రయాణం మధ్యలో అయినా ఎక్కడో ఒక చోట బ్రేక్ తీసుకుంటాం. పసిడి, వెండిలోనూ ఇప్పుడదే చూస్తున్నాం. ⇒ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలతో అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితులు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్లు గత రెండేళ్ల కాలంలో ఇన్వెస్టర్లను గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లకు చేరువ చేశాయి. ఇప్పుడు అనిశ్చితి పరిస్థితులు కొంత తెరిపిన పడుతున్నాయి. ⇒ ఇంతకాలం దేశీ ఈక్విటీలు బలహీనంగా కదలాడాయి. ఆకర్షణీయ వేల్యుయేషన్ల వద్ద ఉండడంతో సమీప కాలంలో ఈక్విటీలు ర్యాలీ చేయొచ్చన్న విశ్వాసం పెరుగుతోంది. ⇒ బంగారాన్ని కేవలం విలువను కాపాడే వస్తువుగానే చూస్తుంటారు. అంతేకానీ దీనిపై పెట్టుబడి పెడితే స్థిరమైన ఆదాయమేదీ రాదు. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణంతో గరిష్టాల్లో వడ్డీ రేట్లు ఉండడం, మన దగ్గరా సమీప కాలంలో వడ్డీ రేట్లు పెరిగే పరిస్థితులతో వడ్డీ రాబడినిచ్చే బాండ్లు, డిపాజిట్లు ఇప్పుడు ఆకర్షణీయంగా మారుతున్నాయి. కనుక ఎలాంటి రాబడి లేని పసిడి, వెండి నుంచి పెట్టుబడులు బాండ్లు, ఈక్విటీల వైపు యూటర్న్ తీసుకుంటాయి. ⇒ అంతర్జాతీయంగా పసిడి ధరలు డాలర్లోనే ట్రేడవుతుంటాయి. డాలర్ బలపడడం బంగారం, వెండి ధరలపై ఒత్తిడికి దారితీస్తోంది. ⇒ బంగారం, వెండి గత 18– 24 నెలల్లో అసాధారణ రాబడులనిచ్చాయి. ఏదో ఒక దశలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం సహజమే. ఒక విధంగా ఇది పోర్ట్ఫోలియోకి మంచిది కూడా. అప్పుడే తాజా పెట్టుబడిదారులకు ధరలు అందుబాటులోకి వస్తాయి. ఏంటి మార్గం..?⇒ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పె ట్టిన వారు ప్రస్తుత దిద్దుబాటును చూసి ఎ లాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ⇒ బంగారం, వెండిలో 10–12 శాతం దిద్దుబాటు అసాధారణమేమీ కాదు. చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ర్యాలీ తర్వాత బంగారం, వెండి ర్యాలీ దిద్దుబాటుకు చవిచూశాయి. ⇒ ధరలను చూసి నిర్ణయం తీసుకోవద్దు. అస లు మీ పెట్టుబడి లక్ష్యం ఏంటో తెలుసుకుని, అందుకు అనుగుణంగా వ్యవహరించండి. ⇒ కేవలం ధరలు పెరుగుతున్నాయి కదా అని, ఇన్వెస్ట్ చేసి కొన్ని రోజుల్లో విక్రయించడం ద్వారా లాభాలు సంపాదించొచ్చని అ డుగు పెట్టినట్టయితే.. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్వల్పకాలంలో ధరల తీరును ఎవరూ అంచనా వేయలేరు. ⇒ ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారు ఒకే విడత కాకుండా, క్రమానుగతంగా, నెలవారీ కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే మంచిది. గోల్డ్ ఈటీఎఫ్లు, లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ను ఎంపిక చేసుకోవచ్చు. ⇒ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి ప్రస్తుత దిద్దుబాటు అనుకూలం. వెండికి అదనపు అనుకూలత⇒ ఆభరణాలతోపాటు పెట్టుబడికి హెడ్జింగ్ సాధనంగా పసిడికి గుర్తింపు ఎక్కువ. వెండికి పెట్టుబడితోపాటు పరిశ్రమల నుంచి ముడి పదార్థంగానూ బలమైన డిమాండ్ నెలకొంది. ⇒ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్వాహనాలు, సోలార్ ప్యానెళ్లు ఇలా ఎన్నో అత్యాధునిక పరిశ్రమల్లో వెండి అవసరం. ⇒ బంగారంతోపాటు వెండికి సైతం పెట్టుబడుల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కానీ పసిడితో పోలి్చతే వెండిలో అస్థిరతలు ఎక్కువన్నది గుర్తు పెట్టుకోవాలి. కథ ముగిసినట్టేనా?బంగారం కథ ఇంతటితో సమాప్తం అని అనుకోవడానికి లేదు. ⇒ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్లు తమ రిజర్వ్ అసెట్స్లో బంగారానికీ పెద్ద పీట వేస్తున్నాయి. గతంలో యూఎస్ డాలర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు డాలర్ వెయిటేజీ తగ్గించి, గోల్డ్కు వెయిటేజీని పెంచడం ద్వారా వైవిధ్యంపై దృష్టి పెట్టాయి. ⇒ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల అప్పుల భారం గరిష్ట స్థాయిల్లోనే ఉంది. ⇒ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఇక ముందు పెరగవని, మళ్లీ ఏర్పడవని కూడా చెప్పలేం. ⇒ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ కనుక స్వల్పకాలంలో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా.. దీర్ఘకాలానికి పెట్టుబడుల పరంగా వాటి ప్రాధాన్యంలో ఎలాంటి మార్పు రాలేదు. ఎంత కేటాయించొచ్చు?⇒ రిటైల్ ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పెట్టుబడుల కేటాయింపుల్లో పసిడికి 10–15 శాతం కేటాయించుకోవచ్చు. పెట్టుబడి పరంగా వెండి కంటే పసిడిలో స్థిరత్వం ఎక్కువ. చారిత్రకంగా చూస్తే బంగారం కంటే ఈక్విటీలే అధిక రాబడినిచ్చాయి. రూ.10 లక్షల మోడల్ పోర్ట్ఫోలియో వేటికి ఎంత చోటు అసెట్ క్లాస్ కేటాయింపులు (రూ.లలో) ఈక్విటీలు - 6,00,000 డెట్ఫండ్స్/ఎఫ్డీలు/ బాండ్లు తదితర స్థిరదాయ సాధనాలు - 2,00,000 బంగారం - 1,00,000 వెండి - 50,000 నగదు/లిక్విడ్ ఫండ్స్ - 50,000ఒక్కటి గుర్తు పెట్టుకోండిప్రస్తుత దిద్దుబాటు విలువైన లోహాల ర్యాలీ లో కేవలం విరామమే. ర్యాలీ వెంట పరుగెత్తడం, పతనంలో ఆందోళన చెందడానికి దూరంగా ఉండాలి. బంగారం ఇన్వెస్టర్లను రాత్రికి రాత్రి ఐశ్వర్యవంతులను చేసేయదు. ఇతర పెట్టుబడి సాధనాల్లో అల్లకల్లలాలు నెలకొన్నప్పుడు పోర్ట్ఫోలియోకి స్థిరత్వాన్నిచ్చి, కొనుగోలు శక్తిని కాపాడే సాధనం. తాత్కాలిక దిద్దుబాట్లను సహనంతో ఎదుర్కొన్న వారికే విలువైన లోహాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని చరిత్ర చెబుతోంది.పడుట పెరుగుట కొరకే⇒ బంగారం, వెండిలో దిద్దుబాట్లు ఎన్నో సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. ప్రతీ దిద్దుబాటు అనంతరం తిరిగి పుంజుకున్నాయి. ⇒ అందుకే ఈక్విటీలు, పసిడిని దీర్ఘకాల పెట్టుబడి ఆస్తులుగానే చూడాలి. ⇒ స్వల్పకాల అవసరాల కోసం ఉద్దేశించిన వాటిని స్థిరాదాయ పథకాలకే కేటాయించుకోవాలి. ⇒ పోర్ట్ఫోలియోకి బీమాగా బంగారం, వెండినిచూడొచ్చు. ఇవీ... వాస్తవాలుబంగారం వెండి 10–20శాతం 20–30శాతం కరెక్షన్లు సాధారణం కరెక్షన్లు సాధారణం 25–35శాతం 40–60శాతం కరెక్షన్లు అరుదు కరెక్షన్లు అరుదు -
పేటెంట్లలో టాప్కి దూసుకెళ్లిన జియో ప్లాట్ఫార్మ్స్
ముంబై: భారతీయ టెక్నాలజీ రంగానికి మరో కీలక మైలురాయిగా, రిలయన్స్కు చెందిన జియో ప్లాట్ఫామ్స్ (Jio Platforms) ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (WIPO) పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (PCT) 2025 ర్యాంకింగ్స్లో ప్రపంచ టాప్-20 ఇన్నోవేటర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. గ్లోబల్ టాప్-20లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ టెక్నాలజీ సంస్థగా జియో నిలిచింది. 2025లో జియో ఏకంగా 320 స్థానాలు ఎగబాకి, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఇన్నోవేటర్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.జియో పేటెంట్ పోర్ట్ఫోలియో ప్రధానంగా 5G, 6G, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్-నేటివ్ ప్లాట్ఫార్మ్స్, ఎడ్జ్ ఇంటెలిజెన్స్, నెట్వర్క్ స్లైసింగ్ వంటి భవిష్యత్ డిజిటల్ సాంకేతికతలపై కేంద్రీకృతమైంది. సంస్థ ఇప్పటివరకు మొత్తం 6,817 పేటెంట్లను దాఖలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 1,009 పేటెంట్లు జియో ప్లాట్ఫామ్స్కు మంజూరయ్యాయి. మార్చి 31, 2026 నాటికి భారత్లో 538, విదేశాల్లో 471 పేటెంట్లు జియోకు లభించాయి.ఈ సందర్భంగా జియో ప్లాట్ఫార్మ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ (Akash Ambani) మాట్లాడుతూ, భారత్ను సాంకేతికతను సృష్టించే, ఎగుమతి చేసే దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా PCT దాఖలాలు 2025లో కేవలం 0.7% మాత్రమే పెరిగినప్పటికీ జియో టాప్-20లోకి ప్రవేశించడం విశేషమని డబ్ల్యూఐపీవో వెల్లడించింది. హువావే, శాంసంగ్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజాల సరసన జియో చేరడం భారత డీప్టెక్ సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. -
టూవీలర్లు.. ఆన్లైన్లోనే కొనేస్తున్నారు!
భారతదేశంలో టూవీలర్ కొనడమంటే.. అదో పెద్ద కార్యక్రమం. ఇంకా చెప్పాలంటే ఓ వేడుక లాంటిది. ఓ మంచి రోజు చూసి కుటుంబ సభ్యులంతా షోరూంకి వెళ్లి పదుల సంఖ్యలో వాహనాలను పరిశీలించి, రంగులు, హంగులూ అన్నీ చూసి ఓ బండిని కొనుక్కుంటారు. దీనికి ఓ పూటంతా పడుతుందంటే ఆశ్చర్యమేమీ లేదు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడంతా మారిపోయింది. బట్టలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొంటున్నట్టుగా టూవీలర్లను కూడా ఆన్లైన్లో కొనేవాళ్లు ఎక్కవయ్యారు.ఆన్లైన్ టూవీలర్ అమ్మకాలు రెట్టింపుఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, తమ వేదికపై ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఏడాది వ్యవధిలో రెండింతలు పెరిగాయి. ముఖ్యంగా మెట్రో నగరాల కంటే టయర్-2, టయర్-3 పట్టణాల నుంచే ఎక్కువ డిమాండ్ నమోదవుతోంది. కంపెనీ ప్రకారం, ప్రతి ముగ్గురు కొనుగోలుదారుల్లో ఇద్దరు చిన్న నగరాలు, పట్టణాల నుంచే వస్తున్నారు.ఎలక్ట్రిక్, ప్రీమియం బైక్లకు భారీ డిమాండ్రోజువారీ ప్రయాణాల కోసం కమ్యూటర్ బైక్లతో పాటు ప్రీమియం మోటార్సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్లో 20కిపైగా బ్రాండ్లకు చెందిన వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ట్రయంఫ్, కేటీఎం, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణతో ఆన్లైన్ కొనుగోళ్లు మరింత ఊపందుకున్నాయి.తెలుగు నగరాల్లో బుకింగ్స్ జోరుదక్షిణ భారతదేశంలో కాకినాడ, తిరుపతి, నెల్లూరు నగరాల్లో ద్విచక్ర వాహన బుకింగ్స్ 12 రెట్లు పెరిగినట్లు అమెజాన్ వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని నాగౌర్, జింద్, అలాగే పశ్చిమ ప్రాంతంలోని రాజ్కోట్, జామ్నగర్ వంటి నగరాల్లో కూడా బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి. చిన్న పట్టణాల్లో డిజిటల్ చెల్లింపులు, ఇంటర్నెట్ విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.తొలిసారి ఆన్లైన్లో కొనేవాళ్లూ ఎక్కువే..గత 12 నెలల్లో దేశవ్యాప్తంగా టయర్-3 పట్టణాలకు చెందిన 2,300కు పైగా వినియోగదారులు అమెజాన్ ద్వారా తొలిసారిగా టూవీలర్ కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. షోరూంకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ధరలు పోల్చుకోవడం, ఫైనాన్స్ ఆప్షన్లు చూడటం, డిజిటల్ పేమెంట్లతో బుకింగ్ చేయడం వినియోగదారులను ఆకర్షిస్తోంది.భారత టూవీలర్ మార్కెట్లో కొత్త ధోరణిదేశీయ టూవీలర్ మార్కెట్లో కూడా ప్రీమియం, ఎలక్ట్రిక్ వాహనాల వాటా క్రమంగా పెరుగుతోంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం, 2025లో భారత టూవీలర్ విక్రయాలు రెండు కోట్ల యూనిట్లను దాటగా, 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ అమ్మకాలు 2.14 కోట్ల యూనిట్లకు చేరి 13%కు పైగా వృద్ధి నమోదు చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రీమియం మోటార్సైకిళ్లు ఈ వృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా నిలిచాయి.భవిష్యత్తులో మరింత విస్తరణప్రస్తుతం ఆన్లైన్ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు మొత్తం మార్కెట్లో చిన్న వాటానే కలిగి ఉన్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో ఈ విభాగం వేగంగా విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిన్న పట్టణాల్లో డిజిటల్ అవగాహన పెరగడం, విస్తృత బ్రాండ్ ఎంపికలు, ధరల్లో పారదర్శకత కారణంగా భవిష్యత్తులో టూవీలర్ కొనుగోలు అనుభవం పూర్తిగా ఆన్లైన్ వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది. -
సహారా కేసులో సుప్రీం కోర్టుకు సెబీ
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ సంస్థ రూ.14,106 కోట్ల అక్రమ నిధుల సేకరణ కేసులో ‘సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కంపెనీ అక్రమాలకు డైరెక్టర్లు మాత్రమే బాధ్యులని, అక్కడ పనిచేసే కంపెనీ సెక్రటరీ, నలుగురు మేనేజర్లు కేవలం ‘ఉద్యోగులు’ మాత్రమేనని పేర్కొంటూ వారికి ‘శాట్’ మినహాయింపునిచ్చింది.అయితే, సంస్థ అక్రమ పత్రాలపై సంతకాలు చేసినందుకు ఉద్యోగులనూ బాధ్యులను చేయాలని సెబీ వాదిస్తోంది. కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల జవాబుదారీతనంపై కీలకమైన ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు జూన్ 18న విచారించనుంది. -
అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్లైన్ రేపే..
పన్ను చెల్లింపుదారులకు కీలక గడువు సమీపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY 2026-27) సంబంధించిన తొలి అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను) వాయిదాను (advance tax deadline 2026) జూన్ 15లోగా చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ప్రకారం తొలి అడ్వాన్స్ ట్యాక్స్ వాయిదా ఇదే.అడ్వాన్స్ ట్యాక్స్ విధానం ద్వారా ప్రభుత్వం "సంపాదించిన కొద్దీ పన్ను చెల్లింపు" (Pay-as-you-earn) వ్యవస్థను అమలు చేస్తోంది. ఏడాది చివర్లో ఒకేసారి పన్ను చెల్లించకుండా, అంచనా పన్నును నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం ఉంటుంది.అడ్వాన్స్ ట్యాక్స్ తప్పనిసరి ఎవరికి?టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) మినహాయింపుల తర్వాత కూడా వార్షిక పన్ను బాధ్యత రూ.10,000 దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కింది వర్గాలకు వర్తిస్తుంది:🔹 జీతభత్యాలు పొందే ఉద్యోగులు🔹 ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు🔹 స్వయం ఉపాధి నిపుణులు🔹 వ్యాపారులు🔹 అద్దె ఆదాయం పొందేవారు🔹 వడ్డీ ఆదాయం లేదా పెట్టుబడి లాభాలు పొందేవారుఅంటే జీతం నుంచి టీడీఎస్ కట్ అవుతున్నప్పటికీ, అదనంగా అద్దె, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తే అడ్వాన్స్ ట్యాక్స్ బాధ్యత ఏర్పడే అవకాశం ఉంది.సీనియర్ సిటిజన్లకు మినహాయింపు60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వ్యాపార ఆదాయం ఉంటే ఈ మినహాయింపు వర్తించదు.తొలి వాయిదాలో ఎంత చెల్లించాలి?సాధారణ పన్ను చెల్లింపుదారులు తమ అంచనా వార్షిక పన్ను బాధ్యతలో కనీసం 15 శాతం మొత్తాన్ని జూన్ 15లోగా చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల షెడ్యూల్ ఇలా ఉంటుంది:🔹జూన్ 15: మొత్తం పన్నులో 15%🔹సెప్టెంబర్ 15: మొత్తం పన్నులో 45%🔹డిసెంబర్ 15: మొత్తం పన్నులో 75%🔹మార్చి 15: మొత్తం పన్నులో 100%ఆన్లైన్లో ఎలా చెల్లించాలి?ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా అడ్వాన్స్ ట్యాక్స్ సులభంగా చెల్లించవచ్చు. ప్రక్రియ ఇలా ఉంటుంది:🔹ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి.🔹e-File → e-Pay Tax ఆప్షన్ను క్లిక్ చేయాలి.🔹New Payment ఎంచుకోవాలి.🔹Income Tax కేటగిరీలో Advance Tax ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి.🔹సంబంధిత అసెస్మెంట్ ఇయర్ (AY) ఎంచుకోవాలి.🔹Minor Head 100 (Advance Tax) ఎంపిక చేయాలి.🔹చెల్లించాల్సిన మొత్తం నమోదు చేసి పేమెంట్ పూర్తి చేయాలి.గడువు దాటితే జరిమానా తప్పదుఅడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే వడ్డీ భారం పడుతుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లో సెక్షన్ నంబర్లు మారినప్పటికీ, నిబంధనల సారాంశం దాదాపు యథాతథంగా ఉంది. పాత చట్టంలోని సెక్షన్లు 234B, 234Cలకు సమానమైన నిబంధనలు కొత్త చట్టంలో వర్తిస్తున్నాయి.🔹 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం పన్నులో 90% కన్నా తక్కువ చెల్లిస్తే నెలకు 1% వడ్డీ విధిస్తారు.🔹 వాయిదా వారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని గడువులోపు చెల్లించకపోయినా నెలకు 1% వడ్డీ వర్తిస్తుంది. -
సముద్రంపై AI సామ్రాజ్యం! శామ్సంగ్ కొత్త ప్రయోగం
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తున్న కొద్దీ డేటా సెంటర్ల అవసరం మరింతగా పెరుగుతోంది. అయితే భూమిపై స్థలం కొరత, భారీ విద్యుత్ అవసరాలు, శీతలీకరణ సమస్యలు టెక్ దిగ్గజాలకు సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్ (Samsung Heavy Industries) సముద్రంపై తేలియాడే ఏఐ డేటా సెంటర్ల (Floating Data Centers) అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.మూడు సంస్థలు కలిసి..తేలియాడే డేటా సెంటర్ల అభివృద్ధి కోసం శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, గ్రీకు షిప్పింగ్ సంస్థ క్యాపిటల్ క్లీన్ ఎనర్జీ క్యారియర్స్, సముద్ర భద్రతా ప్రమాణాల సంస్థ లాయిడ్స్ రెజిస్టర్ కలిసి సంయుక్త అభివృద్ధి ఒప్పందం (JDP) కుదుర్చుకున్నాయి. ఇటీవల గ్రీస్లో జరిగిన ప్రముఖ అంతర్జాతీయ షిప్పింగ్ ఎగ్జిబిషన్ ‘పోసిడోనియా 2026’ సందర్భంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ఇందు లో శామ్సంగ్ సాంకేతిక రూపకల్పన, నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, క్యాపిటల్ పెట్టుబడులు, ప్రాజెక్టు అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. లాయిడ్స్ రిజిస్టర్ భద్రతా ధ్రువీకరణలు, నియంత్రణ అంశాలను చూసుకుంటుంది.డేటా సెంటర్లు సముద్రంపై ఎందుకు?భారీ ఏఐ డేటా సెంటర్లకు విస్తారమైన స్థలం, అపారమైన విద్యుత్ సరఫరా, అధిక శీతలీకరణ వ్యవస్థలు అవసరం. అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో భూమి లభ్యత తగ్గిపోవడం, విద్యుత్ గ్రిడ్ కనెక్షన్ల ఆలస్యం కారణంగా కొత్త డేటా సెంటర్ల నిర్మాణం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సముద్రంలో లేదా నదులపై తేలియాడే డేటా సెంటర్లు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాయి. సముద్రపు నీటినే నేరుగా శీతలీకరణ కోసం వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది.50 మెగావాట్ల సామర్థ్యం.. వేలాది ఏఐ సర్వర్లుశామ్సంగ్ అభివృద్ధి చేస్తున్న తొలి ఫ్లోటింగ్ డేటా సెంటర్ (Samsung floating AI data center) సామర్థ్యం 50 మెగావాట్లు (MW)గా ఉంటుంది. ఇది వేల సంఖ్యలో ఏఐ సర్వర్లను నడిపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ కేంద్రం రెండు విధాలుగా విద్యుత్తును పొందగలదు. తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్నప్పుడు సముద్ర అడుగు కేబుళ్ల ద్వారా విద్యుత్ గ్రిడ్కు అనుసంధానమవుతుంది. అవసరమైతే ద్రవీకృత సహజ వాయువు (LNG) ఆధారిత సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ ద్వారా స్వయంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.సర్వర్లకు సముద్రం సవాలే!అయితే సముద్రంలో ఏఐ సర్వర్లను దీర్ఘకాలం నిర్వహించడం అంత సులభం కాదు. ఓడల కదలికలు, కంపనాలు, ఉప్పునీటి ప్రభావం, తేమ వంటి అంశాలు సున్నితమైన హార్డ్వేర్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు శామ్సంగ్ హెవీ ఇండస్ట్రీస్, సూపర్మైక్రో సంస్థతో కలిసి పరిశోధనలు నిర్వహిస్తోంది. సముద్ర వాతావరణంలో సర్వర్ల పనితీరును పరీక్షించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.షిప్పింగ్ పరిశ్రమకు కొత్త వ్యాపార అవకాశాలుఫ్లోటింగ్ డేటా సెంటర్లు షిప్పింగ్ పరిశ్రమకు కూడా కొత్త ఆదాయ మార్గాలను తెరవవచ్చు. ఇప్పటివరకు సరుకు రవాణాపైనే ఆధారపడిన ఓడ యజమానులు, భవిష్యత్తులో టెక్ కంపెనీలు, క్లౌడ్ సేవల సంస్థలకు డేటా సెంటర్ సామర్థ్యాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంది.మరిన్ని సముద్ర డేటా సెంటర్లుఈ రంగంలో శామ్సంగ్ ఒక్కటే కాదు. జపాన్కు చెందిన మిత్సుయి ఒ.ఎస్.కె. లైన్స్ (MOL), టర్కీకి చెందిన కర్పవర్షిప్ కలిసి 73 మెగావాట్ల తేలియాడే డేటా సెంటర్ను 2027 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. చైనాలో షాంఘై సమీపంలో 24 మెగావాట్ల నీటి అడుగున డేటా సెంటర్ ఇప్పటికే పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నాటిలస్ డేటా టెక్నాలజీస్ 6.5 మెగావాట్ల బార్జ్ ఆధారిత డేటా సెంటర్ను నిర్వహిస్తోంది.ఇదీ చదవండి: ‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’ -
మార్కెట్లోకి ఎల్జీ ‘ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్’
హైదరాబాద్: గృహోపకరణాల తయారీ సంస్థ ‘ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా’ మార్కెట్లోకి సరికొత్త ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. భారతీయ కుటుంబాల జీవన విధానం, అవసరాలకు అనుగుణంగా 83.82 సెం.మీ (33 అంగుళాల) వెడల్పు విభాగంలో ‘ఆటో ఐస్ మేకర్’ సదుపాయంతో వీటిని రూపొందించారు. 574 లీటర్ల నుండి 610 లీటర్ల సామర్థ్యంతో లభించే ఈ రిఫ్రిజిరేటర్లు దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్లెట్లలో లభిస్తాయి. ప్రారంభ ధర రూ.1.18 లక్షలతో అందుబాటులో ఉన్నాయి.ఈ సరికొత్త ఫోర్–డోర్ నిర్మాణంలో ‘రిఫ్రిజిరేటర్’ పై భాగంలో, ‘ఫ్రీజర్’ దిగువ భాగంలో ఉన్నాయి. ఇందులో అమర్చిన ఎల్జీ ‘ఇన్స్టా వ్యూ’ ఫీచర్ ద్వారా కేవలం రెండుసార్లు తట్టడంతోనే లోపల ఉన్న వస్తువులను చూడవచ్చు. ఆహార పదార్థాల తాజాదనం కోసం ‘ఫ్రెష్ కన్వర్టర్ ప్లస్’, నిరంతర ఐస్ ఉత్పత్తి కోసం రీఫిల్ చేయగల వాటర్ ట్యాంక్ సిస్టమ్ గల ‘ఆటో ఐస్ మేకర్’ ఉన్నాయి. వీటితో పాటు ఇన్బిల్ట్ వాటర్ డిస్పెన్సర్, డోర్ కూలింగ్, హైజీన్ ఫ్రెష్ ప్లస్, స్మార్ట్ లెర్నర్ కూలింగ్ టెక్నాలజీ, ఎల్జీ థింక్ వై–ఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఈ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోమ్ సొల్యూషన్స్ డైరెక్టర్ యంగ్ మిస్ హ్వాంగ్ మాట్లాడుతూ ‘‘భారతీయ వినియోగదారుల రోజువారీ జీవితాన్ని మెరుగుపరిచే ఆవిష్కరణలను తీసుకురావడానికి మేము నిరంతరం కృషి చేస్తాం. మా కొత్త ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ శ్రేణి ప్రీమియం డిజైన్, సౌలభ్యం, స్మార్ట్ టెక్నాలజీ పట్ల మాకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’’ అన్నారు. -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
మోటోరోలా సరికొత్త ‘5జీ’ స్మార్ట్ఫోన్లు!
న్యూఢిల్లీ: భారత్లో లీడింగ్ కృత్రిమ మేధ (ఏఐ) స్మార్ట్ఫోన్ బ్రాండ్ ‘మోటోరోలా’ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో రెండు 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. ‘మోటో జీ37’, ‘మోటో జీ37 పవర్’ పేర్లతో వస్తున్న మోడళ్లపై పరిమిత కాల ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ, భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారుల బడ్జెట్కు తగినట్లుగా అత్యంత తక్కువ ధరకే ప్రీమియం తరహా ఫీచర్లు, అత్యుత్తమ బ్యాటరీ పర్ఫార్మెన్స్, మిలిటరీ గ్రేడ్ ల్యాబ్ సర్టిఫైడ్ రక్షణతో ఈ ఫోన్లను తీసుకొచి్చనట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు ఆకర్షణీయమైన పాంటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఫీచర్లు ఇవే మోటో జీ37, మోటో జీ37 పవర్.. ఈ రెండు ఫోన్లలోనూ 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో కూడిన భారీ 6.7 అంగుళాల డిస్ప్లేను అందించారు. సినిమాటిక్ ఆడియో అనుభూతిని అందించే వినూత్నమైన ‘డాల్బీ అట్మోస్’ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం గూగుల్ ఏఐ ఎడిటింగ్ టూల్స్ సపోర్ట్ చేసే ‘50ఎంపీ క్వాడ్ పిక్సెల్ ఏఐ కెమెరా’ను ఈ రెండు మోడళ్లలోనూ అమర్చారు. ముఖ్యంగా ‘మోటో జీ37 పవర్’ ఫోన్లో మూడు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసే భారీ 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ టర్బోపవర్ ఛార్జింగ్ సదుపాయం ఉన్నాయి. అలాగే ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 128జీబీ స్టోరేజ్, గరిష్టంగా 24జీబీ వరకు ర్యామ్ బూస్ట్ చేసుకునే ఆప్షన్ అందించారు. దీనికి రక్షణగా స్క్రీన్ పై గొరిల్లా గ్లాస్ 7ఐ, ఎంఐఎల్–ఎస్టీడీ–810 హెచ్ మిలిటరీ గ్రేడ్ సరి్టఫికేషన్, ఐపీ64 వాటర్–రెసిస్టెంట్ డిజైన్ ఉన్నాయి. స్మార్ట్ యూజర్ అనుభూతి కోసం గూగుల్ ‘జెమిని’, ‘సర్కిల్ టు సెర్చ్’ వంటి ఏఐ ఫీచర్లు ఇందులో ఇన్బిల్ట్గా వస్తాయి.ధరల విషయానికొస్తే: మోటో జీ37 బేసిక్ మోడల్ ప్రత్యేక పరిమిత కాల ఆఫర్ ధర రూ.13,999 గా ఉంది (దీని అసలు ధర రూ.14,999). ఇక ‘మోటో జీ37 పవర్’ మోడల్ 4జీబీ+128జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.15,999 గా ఉండగా , దీని టాప్ వేరియంట్ (8జీబీ+128జీబీ) అసలు ధర రూ.21,999 కాగా.. రూ.2,000 బ్యాంక్ ఆఫర్తో రూ.19,999 కే లభిస్తుంది. వినియోగదారులు ఈ ఫోన్లను ఈ–కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్సైట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. -
హోండా నుంచి నాలుగు ప్రీమియం బైక్లు ఇవే!
ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ (హెచ్ఎంఎస్ఐ) దేశీయ మార్కెట్లోకి నాలుగు సరికొత్త ప్రీమియం బైక్లను విడుదల చేసింది. తన పోర్ట్ఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన 755సీసీ ప్లాట్ఫామ్పై వినూత్నమైన ‘ఈ–క్లచ్’ సాంకేతికతను జోడిస్తూ.. సీబీ750 హార్నెట్, ఎక్స్ఎల్750 ట్రాన్స్ఆల్ప్ బైక్లను ప్రవేశపెట్టింది. వీటితో పాటు లగ్జరీ టూరింగ్ బైక్ ‘గోల్డ్ వింగ్’ను సరికొత్త కలర్ ఆప్షన్లో, రేసింగ్ ప్రియుల కోసం ఫ్లాగ్షిప్ సూపర్స్పోర్ట్ బైక్ ‘సీబీఆర్1000ఆర్ఆర్–ఆర్ ఫైర్బ్లేడ్ ఎస్పీ’ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న హోండా టాప్లైన్, బిగ్వింగ్ డీలర్షిప్లలో ఈ బైక్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సీబీ750 హార్నెట్ ఈ–క్లచ్ఇదొక స్ట్రీట్ నేకెడ్ బైక్. ఇందులో 755సీసీ ప్యారలల్–ట్విన్ ఇంజిన్ను ఉపయోగించారు. ఇది 67.5 కేడబ్ల్యూ పవర్, 75 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. షోవా 41ఎంఎం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, 5.0 అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఫీచర్లు ఉన్నాయి. అలాగే హోండా రోడ్సింక్ కనెక్టివిటీ, విభిన్న రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ అందించారు. సీబీఆర్1000 ఆర్ఆర్–ఆర్ ఫైర్బ్లేడ్ ఎస్పీ సాహస యాత్రలపై ఆసక్తి చూపే వారి కోసం (అడ్వెంచర్ టూరింగ్) దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. హార్నెట్ తరహాలోనే ఇందులోనూ 755సీసీ శక్తివంతమైన ఇంజిన్ ఉంది. కఠినమైన రోడ్లపై సులువుగా ప్రయాణించడానికి ‘గ్రావెల్’ మోడ్తో కూడిన రైడింగ్ ఆప్షన్లు, డ్యూయల్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, షోవా సస్పెన్షన్ దీని ప్రత్యేకత.గోల్డ్ వింగ్ (లగ్జరీ టూరింగ్ బైక్)సుదూర ప్రాంతాల రైడింగ్ కోసం లగ్జరీ ఫీచర్లతో వచ్చే ఈ బైక్లో 1833సీసీ 6–సిలిండర్ ఇంజిన్ ఉంది. స్మూత్ రైడింగ్ కోసం 7–స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (డీసీటీ)తో పాటు వెనక్కి జరుపుకోవడానికి రివర్స్, వాకింగ్ స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. ఎల్రక్టానికల్లీ అడ్జస్టబుల్ విండ్్రస్కీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎయిర్బ్యాగ్ వంటి ప్రీమియం భద్రతా ఫీచర్లు ఈ బైక్ సొంతం.ఎక్స్ఎల్ 750 ట్రాన్స్ఆల్ప్సాహస యాత్రలపై ఆసక్తి చూపే వారి కోసం (అడ్వెంచర్ టూరింగ్) దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. హార్నెట్ తరహాలోనే ఇందులోనూ 755సీసీ శక్తివంతమైన ఇంజిన్ ఉంది. కఠినమైన రోడ్లపై సులువుగా ప్రయాణించడానికి ‘గ్రావెల్’ మోడ్తో కూడిన రైడింగ్ ఆప్షన్లు, డ్యూయల్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, షోవా సస్పెన్షన్ దీని ప్రత్యేకత.వినియోగదారులకు సరికొత్త అనుభూతి‘‘కొత్త ‘ఈ–క్లచ్’ టెక్నాలజీ ద్వారా ప్రీమియం మోటార్సైకిల్ రైడింగ్ను మరింత సులభతరం, సౌకర్యవంతం చేస్తున్నాం. రోజువారీ నగర ప్రయాణాల నుంచి సుదూర ప్రాంతాల టూరింగ్ వరకు.. ఈ బైక్లు రైడర్లకు నమ్మకమైన, అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. భారతీయ వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికతను అందించాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం’’ అని హోండా మోటార్సైకిల్స్ ప్రెసిడెంట్, సీఈఓ సుత్సుమి ఒటానీ తెలిపారు. -
ఇంధన కొరతపై కేంద్ర మంత్రి క్లారిటీ!
దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ముడిచమురు, ఎల్జీ, సహజ వాయువు సరఫరా పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి శనివారం స్పష్టం చేశారు. దేశీయంగా 60 రోజులకు పైగా సరిపడా ముడిచమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఎల్పీజీ సరఫరా కూడా చాలా మెరుగ్గా ఉందన్నారు. గరిష్టంగా 75 నుంచి 80 రోజులకు సరిపోయేలా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఎల్పీజీ కనెక్షన్ దారులు క్రమంగా పైప్డ్ గ్యాస్ (పీఎన్జీ) వైపు మారాలని ఆయన కోరారు. ఇక డీజిల్ విక్రయాలపై రోజుకు 200 లీటర్ల పరిమితి విధించడంపై స్పందిస్తూ.. బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.అమెరికా దాడిపై భారత్ తీవ్ర ఆగ్రహంఒమన్ గల్ఫ్లో ఒక వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నౌకా సిబ్బంది మరణించిన ఘటనపై భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార ప్రతినిధిని రెండుసార్లు పిలిపించి మాట్లాడామని చెప్పారు. అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో నేరుగా మాట్లాడి తమ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి వివరించారు.పెరగనున్న ‘ఈ85’ ఇంధన పంపులుపర్యావరణ అనుకూల ఇంధన రంగం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో 47 ‘ఈ85’ (85 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంధన పంపులు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాబోయే డిసెంబర్ 2026 నాటికి వీటి సంఖ్యను 500కు, డిసెంబర్ 2027 నాటికి ఏకంగా 5,000 పంపులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. -
ఫేబుల్-5, మైథోస్-5 సేవలు నిలిపివేత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ‘ఆంథ్రోపిక్’కు అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా యూఎస్ ప్రభుత్వం ‘ఎగుమతి నియంత్రణ’ ఆదేశాలను జారీ చేసింది. దీనికి స్పందించిన ఆంథ్రోపిక్ తన అధునాతన ఏఐ మోడళ్లు ‘ఫేబుల్ 5’, ‘మైథోస్ 5’లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లందరికీ ఈ సేవల యాక్సెస్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.అమెరికా భూభాగంలోనైనా, వెలుపలనైనా, ఏ విదేశీ పౌరుడికైనా, చివరికి ఆంథ్రోపిక్ సంస్థలో పనిచేసే విదేశీ ఉద్యోగులకు సైతం ఫేబుల్ 5, మైథోస్ 5 మోడళ్ల యాక్సెస్ను పూర్తిగా నిలిపివేయాలని యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, అయితే తమ ఇతర ఏఐ మోడళ్ల సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని ఆంథ్రోపిక్ వివరణ ఇచ్చింది.భారత్పై తీవ్ర ప్రభావం అమెరికా తర్వాత ఆంథ్రోపిక్ సంస్థకు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ కావడంతో తాజా నిర్ణయం భారతీయ క్లయింట్లు, కార్పొరేట్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇటీవలే దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన 50 వేల మంది ఉద్యోగులకు ఆంథ్రోపిక్ ఏఐ మోడళ్లపై శిక్షణ అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్లాడ్ మోడళ్ల ఆధారంగా అధునాతన ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్లను అమలు చేసేందుకు ఫిబ్రవరిలో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అలాగే సైబర్ సెక్యూరిటీ చొరవ కింద ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ ద్వారా కొన్ని భారత ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలకు కూడా ఈ మైథోస్ మోడల్ యాక్సెస్ లభించింది. తాజా నిర్ణయంతో ఈ సేవలన్నీ నిలిచిపోనున్నాయి.ప్రభుత్వ నిర్ణయంతో విభేదిస్తున్న ఆంథ్రోపిక్ప్రభుత్వ ఆదేశాలు జూన్ 12న సాయంత్రం 5.21 గంటలకు అందినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ‘ఫేబుల్ 5’, ‘మైథోస్ 5’ మోడళ్లలో భద్రతా లోపాలను దారి మళ్లించే ఒక పద్ధతి బయటపడిందని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ప్రభుత్వం చెబుతున్న లోపం చాలా చిన్నదని, సాఫ్ట్వేర్ లోపాలను సరిదిద్దమని మోడల్ను కోరడం లాంటి సాధారణ విషయమేనని కంపెనీ వాదిస్తోంది. ఇలాంటి ఫీచర్లు ఓపెన్ఏఐకు చెందిన జీపీటీ–5.5తో పాటు ఇతర ఏఐ మోడళ్లలో కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఒక కమర్షియల్ మోడల్ను ఇలాంటి చిన్న కారణంతో నిలిపివేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ, సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంథ్రోపిక్ వెల్లడించింది. -
కొత్త ఐ20.. ఇప్పుడు బ్రెజిల్ మార్కెట్లో!
హ్యుందాయ్ కంపెనీ తన ప్రీమియం హ్యాచ్బ్యాక్ 'i20'ను కొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్ను బ్రెజిల్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ పరిమాణం కొంత పెరగడంతో.. దీని పొడవు 4.1 మీటర్లకు చేరింది. దీంతో ఇది మునుపటి కంటే మరింత స్పేస్, ప్రీమియం లుక్ను అందిస్తోంది.ధరలు బ్రెజిల్ మార్కెట్లో 99,990 నుంచి 1,39,990 బ్రెజిలియన్ రియల్ వరకు ఉండగా, భారత కరెన్సీలో ఇది సుమారు రూ.18.8 లక్షల నుంచి రూ.26.3 లక్షల వరకు ఉంటుంది. ఇది కియా కే3 ప్లాట్ఫామ్కు ఆధారంగా నిర్మితమైంది. ఇదే ప్లాట్ఫామ్పై కియా సెల్టోస్ కూడా నిర్మించబడింది. ఈ ప్లాట్ఫామ్ క్రాష్ టెస్టుల్లో మంచి సేఫ్టీ రేటింగ్ సాధించినందున కొత్త i20 కూడా మరింత దృఢంగా తయారైనట్లు భావించవచ్చు.డిజైన్ పరంగా కొత్త i20 పూర్తిగా లేటెస్ట్ లుక్ను కలిగి ఉంది. ఫ్రంట్ అండ్ రియర్లో కనెక్టెడ్ లైట్ బార్లు, కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, స్పోర్టీ స్టాన్స్ దీనికి ప్రీమియం ఫీల్ ఇస్తాయి. ఇంటీరియర్లో 12.3 ఇంచెస్ కర్వ్డ్ డ్యూయల్ స్క్రీన్ సెటప్, వైర్లెస్ ఛార్జింగ్, డ్యూయల్-టోన్ లెదర్ సీట్లు, లోగో లెస్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కూడా ఇందులో ఉంది. ఇది భద్రతను మరింత పెంచుతుంది. బూట్ స్పేస్ సుమారు 346 లీటర్లు ఉంది.ఇంజిన్ ఆప్షన్ విషయానికి వస్తే, కొత్త i20లో రెండు 1.0 లీటర్ ఇంజిన్లు ఉన్నాయి. ఒకటి MPi ఫ్లెక్స్ ఫ్యూయల్ (నేచురల్ ఆస్పిరేటెడ్), మరొకటి TGDi టర్బో ఇంజిన్. ఇవి వరుసగా సుమారు 79bhp/100Nm - 113bhp/171Nm పవర్ డెలివరీ చేస్తాయి. ఈ ఇంజిన్లు పెట్రోల్, ఎథనాల్ వంటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్లకు అనుగుణంగా పనిచేస్తాయి.బ్రెజిల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ కొత్త i20 అదే డిజైన్, ఫీచర్స్ వంటివాటితో భారతదేశానికి రావడం కష్టం. కానీ ఇది 4 మీటర్ల లోపు కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్గా మార్చబడే అవకాశం ఉంది. ఏడీఏఎస్ ఫీచర్లు ఉండకపోవచ్చు. ఇంజిన్ లైనప్లో 1.2-లీటర్ NA పెట్రోల్, 1.0-లీటర్ టర్బో ఉండవచ్చు. -
‘మెటాలో ఇక భారీ తొలగింపులు ఉండకపోవచ్చు’
సోషల్ మీడియా దిగ్గజం మెటా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సంస్థగా రూపాంతరం చెందే క్రమంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని పొరపాట్లు జరిగాయని దాని అధినేత మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) అంగీకరించారు. అంతర్గత మెమోలో ఉద్యోగులను ఉద్దేశించి, వేగంగా మారుతున్న ఏఐ ప్రపంచంలో ఇలాంటి సవాళ్లు సహజమని జుకర్బర్గ్ పేర్కొన్నారు. “ఈ మార్పుల సంక్లిష్టత దృష్ట్యా మేము తప్పులు చేశాం. భవిష్యత్తులో కూడా కొన్ని తప్పిదాలు జరిగే అవకాశం ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.ప్రస్తుతం మెటా సంస్థ తన వ్యాపార వ్యూహాన్ని పూర్తిగా ఏఐ చుట్టూ పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందుకోసం డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాలు, సూపర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలో సంస్థలో విస్తృత స్థాయి పునర్నిర్మాణం చేపట్టింది. మే నెలలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతం ఉద్యోగులను తొలగించగా, మరో 7,000 మంది ఉద్యోగులను ఏఐ సంబంధిత బృందాలకు బదిలీ చేసింది.అయితే ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నంలో జుకర్బర్గ్ కీలక హామీ ఇచ్చారు. “ఈ ఏడాది సంస్థవ్యాప్తంగా మరోసారి భారీ స్థాయి ఉద్యోగ కోతలు ఉంటాయని మేము భావించడం లేదు” అని స్పష్టం చేశారు. ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నందున అతిగా హామీలు ఇవ్వలేనప్పటికీ, సంస్థాగత స్థిరత్వాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఏఐ మోడళ్ల శిక్షణ కోసం బదిలీ చేసిన ఉద్యోగులకు కొత్త అవకాశాలు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. అవసరమైతే కొన్ని విభాగాల్లో తగ్గించిన సిబ్బందిని తిరిగి ఇతర బృందాలకు మార్చే అవకాశమూ ఉంటుందని చెప్పారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను వినియోగించుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, మెటాలో జరిగిన ఏఐ ఆధారిత పునర్వ్యవస్థీకరణపై కొంత అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పాటైన ఏఐ విభాగాల్లో పని స్వరూపం, బాధ్యతలపై కొందరు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు జూలైలో భారీ ఏఐ హ్యాకథాన్, టీమ్ ఈవెంట్లు నిర్వహించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.ఏఐ పోటీలో ముందంజలో నిలవాలన్న లక్ష్యంతో మెటా దూసుకెళ్తున్నప్పటికీ, ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం, సంస్థాగత మార్పులను సమతుల్యం చేయడం కంపెనీకి ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. -
పెరుగుతున్న పసిడి ధరలు.. ఇంకా పెరుగుతాయ్!
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం బంగారం ధరలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అయితే ఈ పెరుగుదల రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు రాబోయే రెండేళ్లలో కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. తాజా నివేదిక ప్రకారం 2026 నాల్గవ త్రైమాసికంలో బంగారం సగటు ధర ఔన్స్కు 6,000 డాలర్లకు చేరుకుంటుందని, 2027 చివరి నాటికి 6,300 డాలర్ల స్థాయిని తాకే అవకాశం ఉందని పేర్కొంది.ఇటీవలి నెలల్లో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ దీర్ఘకాలిక ధోరణి మాత్రం బలంగానే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పెట్టుబడిదారుల ఆసక్తి కొంత తగ్గినట్లు కనిపించినా, ద్రవ్యోల్బణ భయాలు, ప్రపంచ ఆర్థిక మందగమనం ఆందోళనలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలపై అనిశ్చితి, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారానికి ‘సేఫ్ హెవెన్’ డిమాండ్ను కొనసాగిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.ఈ ర్యాలీకి కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా చైనా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ విదేశీ మారక నిల్వలను డాలర్పై ఆధారపడకుండా వైవిధ్యపరచడానికి బంగారం నిల్వలను పెంచుతున్నాయి. జేపీ మోర్గాన్ అంచనాల ప్రకారం కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వచ్చే ఏడాదిలో కూడా బలంగానే కొనసాగనున్నాయి.ప్రస్తుత ధరలుప్రస్తుతం (జూన్ 13 నాటికి) అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ కమోడిటీ మార్కెట్ (COMEX)లో స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్స్కు సుమారు 4,238 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయంగా ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,230 పలుకుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి. అలాగే ఇక్కడ నిపుణులు, విశ్లేషకులు పేర్కొన్న అంచనాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. పాఠకులు స్వయంగా పరిశీలించుకున్న మీదటే పెట్టుబడుల నిర్ణయం తీసుకుకోవాల్సినదిగా సూచన.) -
ట్రిలియనీర్ మస్క్.. ఇల్లు మరీ ఇంత సింపులా?
సాధారణంగా సంపన్నుల ఇళ్లు చాలా విలాసవంతంగా ఉంటాయి. భారీ అంతస్తుల్లో, సకల సౌకర్యాలతో ఇంద్ర భవనాలను తలపిస్తుంటాయి. భారతీయ అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాస భవనం యాంటిలియా (Antilia) గురించి విన్నాం కదా. మరి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా (లక్ష కోట్ల డాలర్ల సంపద) నిలిచిన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon Musk) ఇల్లు ఇంకెంత విలాసవంతంగా ఉంటోందనన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే మస్క్ ఎలాంటి ఇంట్లో నివసిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా నిలిచిన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. జూన్ 12న జరిగిన ‘స్పేస్ఎక్స్’ చారిత్రాత్మక ఐపీఓ (SpaceX IPO success) అనంతరం కంపెనీ విలువ ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరుకోవడంతో మస్క్ వ్యక్తిగత సంపద కూడా ఒక ట్రిలియన్ డాలర్ల మార్క్ను దాటినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.అయితే ఇంత అపార సంపద ఉన్నప్పటికీ మస్క్ జీవనశైలి మాత్రం సంప్రదాయ బిలియనీర్లకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలోని బోకా చికా సమీపంలో, స్పేస్ఎక్స్ స్టార్బేస్ కేంద్రానికి దగ్గరగా ఉన్న సుమారు 400 చదరపు అడుగుల ప్రీఫ్యాబ్రికేటెడ్ చిన్న ఇంటిలోనే (Elon Musk Tiny House) ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఇంటిని మాడ్యులర్ హౌసింగ్ సంస్థ బాక్సబుల్ (Boxabl) రూపొందించింది.చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ ఇంటిలో లివింగ్ ఏరియా, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. మర్ఫీ బెడ్, బిల్ట్-ఇన్ స్టోరేజ్, శక్తి పొదుపు డిజైన్ వంటి అంశాలు ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి. మస్క్ గతంలో ఓసారి ఈ ఇంటి గురించి మాట్లాడుతూ “అద్భుతమైనది”గా అభివర్ణించారు.2020 తర్వాత కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన పలు ఆస్తులను విక్రయించిన మస్క్, వ్యక్తిగత ఆస్తుల కంటే తన వ్యాపార లక్ష్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా స్టార్షిప్ రాకెట్ అభివృద్ధి, స్టార్లింక్ విస్తరణ, కృత్రిమ మేధ (AI) ప్రాజెక్టులపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు స్టార్బేస్కు సమీపంలోనే మస్క్ నివసిస్తున్నారు.స్పేస్ఎక్స్ ఐపీఓ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలిచింది. షేర్లు మార్కెట్లో జోరుగా లిస్టింగ్ కావడంతో కంపెనీ విలువ రెండు ట్రిలియన్ డాలర్లకు చేరువై, మస్క్ సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్ల స్థాయిని తాకినట్లు అంచనాలు వెలువడ్డాయి.చదవండి: లక్ష రూపాయల ఫోన్.. ఇప్పుడు సగం ధరకే -
హైదరాబాద్లో టెస్లా గ్రాండ్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: అమెరికా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ సంస్థ టెస్లా.. హైదరాబాద్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 17న హైటెక్ సిటీలో తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించనుంది. మన దేశంలో టెస్లాకిది ఐదో సెంటర్.కాగా.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఆక్టేవ్ బ్లాక్లో రానున్న ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్లో 6 సీటింగ్ కెపాసిటీ టెస్లా వై ఎల్ (లాంగ్– వీల్ బేస్) మోడల్ కారును ప్రదర్శించనున్నారు. 88 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, డ్యూయల్ మోటార్ ఏడబ్ల్యూడీ సిస్టమ్ ఫీచర్స్తో ఉన్న ఈ కారు.. 5 సెకన్ల వ్యవధిలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.61.99 లక్షలు. ఇప్పటికే ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరులో కొలువుదీరిన టెస్లా షోరూమ్లు.. తాజాగా భాగ్యనగరానికి రానున్నాయి.చదవండి: లక్ష రూపాయల ఫోన్.. ఇప్పుడు సగం ధరకే -
ఓవైపు ఉద్యోగ భయం.. మరోవైపు భారీ వాడకం!
అన్నింటా ఏఐ వినియోగం పెరిగింది. దీంతో రోజుకొక కొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ఇదే క్రమంలో ఏఐ విస్తృతితో కంపెనీలు ఉద్యోగాలను తగ్గిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రాబోయే మరింతగా ఉద్యోగాల కోత ఉంటుందన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగుల భయాలను తొలగిస్తూ హమ్మయ్య అనిపించే తాజా నివేదిక ఒకటి వెల్లడైంది. ఉద్యోగాల తొలగింపుల భయాలు ఒకవైపు ఉన్నా మరోవైపు ఏఐ వినియోగంలో మనోళ్లు దూసుకెళ్తున్నారు.ఏఐ వినియోగంలో అగ్రస్థానంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని సుమారు 41 శాతం మంది ఉద్యోగులు ప్రతిరోజూ ఏఐని ఉపయోగిస్తుండగా, 80 శాతం మంది వారంలో నాలుగైదు సార్లు వాడుతున్నారు. సర్వేలో పాల్గొన్న అన్ని దేశాల కంటే ఇది అత్యధికం. ఇటువంటి పరిస్థితుల్లో సంస్థలు తమ ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్ మార్గాలను చూపాలని, నిరంతర నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాలని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ తెలిపారు. సేవా రంగం విస్తృతంగా ఉన్న భారత్ వంటి దేశాల్లో ఆపరేషనల్, ప్రాసెస్ ఆధారిత పనుల్లో లక్షలాది మంది ఉన్నారు. అందువల్ల ఏఐ సాంకేతికతతో పాటు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించడం సంస్థల బాధ్యత’’ అని రాహుల్ గోయల్ పేర్కొన్నారు.ఏఐతో ఉద్యోగాలు పోవు..‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్ఫోర్స్ సర్వేను నిర్వహించింది. -
లక్ష రూపాయల ఫోన్.. ఇప్పుడు సగం ధరకే!
ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. అయితే అందుకు వారి బడ్జెట్ సహకరించదు. ఎందుకంటే వాటి ధరలు రూ.లక్ష వరకు ఉంటాయి. ఇలాంటి కస్టమర్లకు శామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ (Samsung Galaxy S25 Edge) ఇప్పుడు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. భారత్లో ఈ ఫోన్ను గతేడాది మేలో రూ.1,09,999 ప్రారంభ ధరతో విడుదల చేసిన శామ్సంగ్, ప్రస్తుతం ఈ మోడల్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అధికారిక లాంచ్ సమయంలో రూ.1 లక్షకు పైగా ధర కలిగిన ఈ ఫోన్, ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో రూ.60 వేల పరిధిలోనే లభిస్తోంది.ప్రస్తుతం 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.59,999కు, 512GB వేరియంట్ రూ.71,999కు అందుబాటులో ఉన్నట్లు ఆన్లైన్ ఆఫర్లు సూచిస్తున్నాయి. దీంతో అసలు లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు రూ.50,000 వరకు తగ్గింపు (Samsung S25 Edge Discount) లభిస్తోంది. కొన్ని బ్యాంక్ కార్డులపై అదనపు ఇన్స్టంట్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.గెలాక్సీ S25 ఎడ్జ్ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని అల్ట్రా-స్లిమ్ డిజైన్. కేవలం 5.8 మిల్లీమీటర్ల మందం, 163 గ్రాముల బరువుతో ఇది శామ్సంగ్ గెలాక్సీ S సిరీస్లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత సన్నని ఫోన్గా గుర్తింపు పొందింది. టైటానియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 రక్షణతో ప్రీమియం లుక్తో పాటు మన్నికను కూడా అందిస్తోంది.స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో 6.7 అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీ ప్రాసెసర్, 12GB ర్యామ్ ఉన్నాయి. కెమెరా విభాగంలో 200 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించబడింది. అలాగే గేలాక్సీ ఏఐ ఫీచర్లు, IP68 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం సౌకర్యాలు కూడా ఉన్నాయి.అయితే ఈ ఫోన్లో 3,900mAh బ్యాటరీ మాత్రమే ఉండటం కొంతమందికి ప్రతికూల అంశంగా భావించవచ్చు. అయినప్పటికీ, స్లిమ్ డిజైన్, ఫ్లాగ్షిప్ పనితీరు, 200MP కెమెరా కలయికను ప్రస్తుతం లభిస్తున్న తగ్గింపు ధరలో పరిశీలిస్తే, గెలాక్సీ S25 ఎడ్జ్ ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ నుంచి ‘వాల్యూ ఫర్ మనీ ఫ్లాగ్షిప్’ కేటగిరీలోకి మారినట్లే కనిపిస్తోంది. -
మల్టీప్లెక్స్ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీప్లెక్స్ థియేటర్ల ముఖచిత్రం వేగంగా మారుతోంది. కేవలం భారీ బడ్జెట్, అగ్ర హీరోల పెద్ద సినిమాలపైనే ఆధారపడకుండా నిరంతరం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సరికొత్త వ్యూహాలను తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ‘జెన్ జీ’ వినియోగదారులను తమ ప్రధాన ఆడియన్స్ గ్రూప్గా మల్టీప్లెక్స్ పరిశ్రమ టార్గెట్ చేస్తోంది. ఓటీటీలు, రీల్స్ వంటి ఆన్లైన్ వేదికలపై విరక్తి (డిజిటల్ అలసట) చెందిన యువత.. మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేస్తుండటం ఇండస్ట్రీలో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది.మరోవైపు, పెద్ద సినిమాల విడుదలకు మధ్య ఉండే గ్యాప్లో మల్టీప్లెక్స్ల్లో ఆక్యుపెన్సీ రేటు పడిపోకుండా ప్రాంతీయ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు, ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లే చిన్న చిత్రాలు (స్లీపర్ హిట్లు) కీలక పాత్ర పోషిస్తున్నాయి.బాక్సాఫీస్ను శాసిస్తున్న యూత్!ఇటీవల విడుదలైన ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా టోబర్ 2026 నివేదిక ప్రకారం.. భారతీయ బాక్సాఫీస్ వసూళ్లలో యువత పాత్ర ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. హిందీ బాక్సాఫీస్ మొత్తం కలెక్షన్లలో 30 ఏళ్ల లోపు ఉన్న యువత వాటా ఏకంగా 57% గా ఉంది. ఇక ఒక సినిమా విడుదలైన మొదటి రోజు (ఫస్ట్ డే) వచ్చే రెవెన్యూలో ఈ యువ తరం వాటా అత్యధికంగా 70% గా నమోదు కావడం విశేషం.‘ప్రస్తుతం సినిమా థియేటర్లకు వస్తున్న వారిలో జెన్ జీ తరం వారే అత్యధికంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేదికలతో విసిగిపోయిన యువత, మళ్లీ వెండితెర అనుభూతిని ఆస్వాదించేందుకు థియేటర్లకు తిరిగి వస్తున్నారు’ అని పీవీఆర్ ఐనాక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ బిజ్లీ అన్నారు.ఒరిజినల్ కథలకే జై కొడుతున్న యువతఏదో ఒక సూపర్ హీరో ఫ్రాంచైజీలనో, పాత హిట్ చిత్రాల రీమేక్లనో లేదా రీబూట్లనో కాకుండా.. సరికొత్త లైన్లతో, ఒరిజినల్ కథాంశాలతో వచ్చే సినిమాలను చూసేందుకే యువత మక్కువ చూపుతున్నారని సంజీవ్ బిజ్లీ పేర్కొన్నారు. యువ దర్శకులు రూపొందించిన సరికొత్త చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎలా కనెక్ట్ చేస్తున్నాయనే దానికి కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’, కేన్ పార్సన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాక్రూమ్స్’ చిత్రాల విజయాలే నిదర్శనమని ఉదహరించారు.భవిష్యత్తు ట్రెండ్స్ ఇవే..సినిమా ఎగ్జిబిషన్ రంగాన్ని రాబోయే రోజుల్లో కొన్ని అంశాలు శాసించనున్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అవి..థియేటర్లలో అధునాతన స్క్రీన్లు, మెరుగైన సీటింగ్, లగ్జరీ అనుభూతిని అందించడం.ద్వితీయ, తృతీయ శ్రేణి (టైర్2, టైర్3) పట్టణాలు, నగరాలకు మల్టీప్లెక్స్లను విస్తరించడం.కేవలం ఈవెంట్ సినిమాలు, పెద్ద చిత్రాలపైనే ఆధారపడకుండా.. విభిన్నమైన కంటెంట్తో వచ్చే స్లీపర్ హిట్ చిత్రాల ద్వారా థియేటర్లను నిరంతరం నిర్వహించడం.ఇదీ చదవండి: కాకపెంచుతున్న పసిడి ధరలు -
కాకపెంచుతున్న పసిడి ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇటీవల కొంత తగ్గిన బంగారం ధరలు నిన్న, ఈరోజు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
జెన్జీ..చెప్పుడు మాటలు నమ్మట్లేదు
నిన్నటివరకు కేవలం గాడ్జెట్లు, ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఎంపికలకే పరిమితమనుకున్న ‘జెన్-జీ’ వినియోగదారుల ప్రభావం.. ఇప్పుడు ఫుడ్ బ్రాండ్లకు పాకింది. దశాబ్దాల చరిత్ర గల ప్రముఖ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు సైతం ఇప్పుడు తమ వ్యూహాలను మార్చుకోక తప్పడం లేదు. కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, ప్రొడక్ట్ లేబులింగ్, సరికొత్త ఉత్పత్తుల రూపకల్పన.. ఇలా ప్రతి నిర్ణయాన్నీ ఈ తరం యువ వినియోగదారులే శాసిస్తున్నారని పరిశ్రమవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.దేశీయ వినియోగంలో 35 శాతం వీరిదే!ఇప్సోస్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఫుడ్ వినియోగ వ్యయంలో దాదాపు 35 శాతం వాటా 15 నుంచి 20 ఏళ్ల పైబడిన జెన్-జీ యువతదే. ఆరోగ్యం, డిజిటల్ పరిజ్ఞానం, పర్యావరణ స్పృహ వంటి అంశాలే వీరి ఎంపికలను నిర్ణయిస్తున్నాయి.లేబుల్స్ చదువుతున్నారు.. ప్రశ్నిస్తున్నారు!ఒకప్పుడు బ్రాండ్ పేరు చూసి వస్తువులు కొనేవారు. కానీ నేటి తరం ఆలోచనా విధానం వేరుగా ఉంది. దీనిపై ఎమ్టీఆర్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ తివారీ మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘కాలేజీకి వెళ్లే నా కుమారుడు, అతని స్నేహితులు ఏ ప్రొడక్ట్ కొన్నా.. బ్రాండ్తో సంబంధం లేకుండా వెనుక వైపు ఉన్న లేబుల్ను నిశితంగా పరిశీలించడం స్వయంగా చూశాను. నేను మార్కెట్ విజిట్స్కి వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గమనిస్తుంటాను. యువ వినియోగదారులు షాపింగ్ మాల్స్లో నిలబడి లేబుల్స్ను పోల్చి చూస్తూ ఆ ప్రొడక్ట్లో ఏమేం పదార్థాలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి సమయం కేటాయిస్తున్నారు. బ్రాండ్లు చెప్పే మాటలను నమ్మడం లేదు. చదువుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఆపైనే నిర్ణయం తీసుకుంటున్నారు’ అని విశ్లేషించారు.ఫ్యూచర్-రెడీ దిశగా దిగ్గజ కంపెనీలుయువతను ఆకట్టుకునే వ్యూహంలో భాగంగా మారిపోతున్న ట్రెండ్ను మారికో ఎండీ సౌగతా గుప్తా వివరిస్తూ.. ‘మేము ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడంతో పాటు సంస్థను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలంటే.. మా ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో కచ్చితంగా జెన్-జీ, మిలీనియల్స్ అభిరుచులకు అనుగుణంగా ఉండాలి’ అన్నారు. ఇందుకు తగ్గట్టుగానే, మారికో సంస్థ కేవలం మూడు వారాల వ్యవధిలోనే యువతను టార్గెట్ చేసే మూడు డైరెక్ట్-టు-కన్స్యూమర్ బ్రాండ్లను దాదాపు రూ.800 కోట్లతో కొనుగోలు చేసింది.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో..అంశంశాతం తమ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలనుకుంటున్న జెన్-జీ యువత79%అరోగ్యం కోసం జీవనశైలిలో గణనీయమైన మార్పులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నవారు83%2022 - 2025 మధ్య కాలంలో భారతదేశంలో ప్లాంట్-బేస్డ్ (మొక్కల ఆధారిత) ఫుడ్ ఇండస్ట్రీ సాధించిన వృద్ధి19% -
విమానాల కొనుగోలు ప్రణాళిక వాయిదా?
టాటా గ్రూప్ సారథ్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఆర్థిక ఒడిదొడుకుల నేపథ్యంలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కొత్త విమానాల డెలివరీలను వాయిదా వేయడంతో పాటు, తన ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తాము ఆర్డర్ చేసిన సుమారు 500 విమానాల డెలివరీ ప్రక్రియను మందగించేలా (స్లో డౌన్) చేయడంపై ప్రముఖ విమాన తయారీ సంస్థలైన ‘ఎయిర్బస్ ఎస్ఈ’, ‘బోయింగ్ కో’లతో ఎయిరిండియా చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదిక వెల్లడించింది.భారీ చెల్లింపులు తప్పించుకునేందుకా?సాధారణంగా విమానయాన సంస్థలు జెట్ విమానాల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులను చాలా సంవత్సరాల పాటు విడతల వారీగా చెల్లిస్తాయి. అయితే, మొత్తం కొనుగోలు ధరలో సింహభాగం..అంటే దాదాపు 80 శాతం నిధులను విమానాన్ని అప్పగించే (డెలివరీ) సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డెలివరీలను వాయిదా వేసుకోవడం ద్వారా తయారీదారులకు చెల్లించాల్సిన ఈ భారీ వ్యయాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చని, తద్వారా ప్రస్తుత నిధుల కొరత నుంచి ఉపశమనం పొందవచ్చని ఎయిరిండియా వ్యూహాత్మకంగా యోచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.దీనితో పాటు కొత్త దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభించే ప్రణాళికలపై సంస్థ పునసమీక్ష జరుపుతోంది. లాభదాయకంగా లేని కొన్ని పాత మార్గాలను పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ఎయిర్పోర్ట్ల్లో తమ కార్యకలాపాల ప్రారంభాన్ని వాయిదా వేయాలని చూస్తోంది. ఇప్పటికే వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఎయిరిండియా గత నెలలో అంతర్జాతీయ విమాన సామర్థ్యాన్ని తాత్కాలికంగా 27 శాతం (జూన్ - ఆగస్టు మధ్య 145 వారపు విమానాలు), దేశీయ విమాన సామర్థ్యాన్ని 22 శాతం వరకు తగ్గించిన సంగతి తెలిసిందే.ఇందుకు దారితీసిన కారణాలుపశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల తరచూ గగనతలం మూసివేత.గత ఏడాది మార్చి నుంచి పాకిస్థాన్ వైపు గగనతలాన్ని శాశ్వతంగా మూసివేయడం వల్ల విమాన ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు పెరగడం.అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు భగ్గుమనడం.అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం.ఎయిర్ ఇండియా ప్రతినిధి ఏమన్నారంటే..బ్లూమ్బెర్గ్ నివేదికపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ... ఈ వార్తలు కేవలం ఊహాజనితమైనవని కొట్టిపారేశారు. తమ ఫ్లీట్ను ఆధునీకరించడానికి, దీర్ఘకాలిక పరివర్తన ప్రణాళికను అమలు చేయడానికి సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
మధ్యతరగతిపై ధరల భారం
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ బడ్జెట్ను నిర్వహించడం సవాలుగా మారింది. వచ్చే ఆదాయానికి, అయ్యే ఖర్చులకు పొంతన కుదర్చడానికి సామాన్యుడు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే కిరాణా సామాగ్రి, ఇంధన ధరలు, పిల్లల పాఠశాల ఫీజులు, ఈఎంఐలు, కరెంట్ బిల్లులు లాంటి యుటిలిటీ బిల్లులు గృహ ఆదాయంలో అత్యధిక భాగాన్ని మింగేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఊహించని ఖర్చుల కోసం రూపాయి దాచుకుందామన్నా సాధ్యపడటం లేదు.ఈక్రమంలో తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు సామాన్యుడు మరింత ఆందోళన చెందేలా ఉన్నాయి. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో నమోదైన 3.48 శాతం నుంచి మే నెల నాటికి 3.93కి పెరిగింది. ప్రధానంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరగడమే ఇందుకు కారణం. కాగితంపై ఈ పెరుగుదల స్వల్పంగానే కనిపించవచ్చు. అలాగే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత పరిమితిలోనే ఉండవచ్చు. కానీ, ఒక స్థిరమైన జీతంపై ఆధారపడే కుటుంబాలకు మాత్రం రాబోయే రోజుల్లో నిత్యావసరాలు మరింత ప్రియం కానున్నాయా అనే ఆందోళన మొదలైంది.మళ్లీ పెరిగిన ఆహారం, ఇంధనం మంట!సాధారణ వినియోగదారుడికి ద్రవ్యోల్బణం లెక్కలు, ఆర్థిక అంచనాలతో పెద్దగా పనిలేదు. మార్కెట్కు వెళ్తే కూరగాయలు, వంటనూనె ఎంతకు వస్తున్నాయి, బండిలో పెట్రోల్ కొట్టించడానికి ఎంతవుతోంది అనేదే వారి లెక్క. ఏప్రిల్లో 4.20 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం, మే నెలలో 4.78కు ఎగబాకింది. రవాణా ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 0.01గా ఉన్న ఉంటే మే నాటికి ఏకంగా 1.75 శాతానికి పెరిగింది.ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నెలలోనే నాలుగు సార్లు ఇంధన ధరలను సవరించడం దీనికి ప్రధాన కారణం. రవాణా ఖర్చులు పెరిగినప్పుడు ఆ భారాన్ని వ్యాపారాలు వినియోగదారులపైకే నెట్టేస్తాయి. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతాయి. ‘మే నెలలో రిటైల్ వినియోగదారులు టోకు ద్రవ్యోల్బణ తీవ్రత నుంచి కొంతవరకు తప్పించుకున్నప్పటికీ.. రెస్టారెంట్లు, వంట గ్యాస్, రవాణా వంటి రంగాలలో అప్పుడే ధరల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది’ అని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపమ్ చౌధురి అన్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఇది పట్టణ మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తూ మార్కెట్లో డిమాండ్ను తగ్గిస్తోంది.భవిష్యత్తు మరింత భారమేనా?ప్రస్తుత ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు లోబడే ఉన్నప్పటికీ ధరల ఒత్తిడి మాత్రం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలారా క్యాపిటల్ డిప్యూటీ హెడ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎకనామిస్ట్ గరిమా కపూర్ మాట్లాడుతూ.. ‘ఇంధనం, ఆహార ధరల ప్రభావం ఉన్నప్పటికీ మే నెల సీపీఐ ద్రవ్యోల్బణం అంచనాల కంటే కొంచెం తక్కువగానే నమోదైంది. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారం దిశగా అడుగులు పడటం, ఆర్బీఐ-ప్రభుత్వ చర్యల వల్ల స్థూల ఆర్థిక నేపథ్యం ప్రస్తుతం కాస్త అనుకూలంగా మారింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని అదుపు చేయడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది’ అని విశ్లేషించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
స్పేస్ఎక్స్ బ్లాక్బస్టర్.. మస్క్ తొలి ట్రిలియనీర్!
3.. 2.. 1.. లిఫ్ట్ ఆఫ్ పచ్చని డాలర్లను చిమ్ముకుంటూ స్పేస్ఎక్స్ మార్కెట్ ‘స్పేస్‘లోకి దూసుకెళ్లింది. అంతరిక్ష, శాటిలైట్ టెక్నాలజీ రంగంలో సంచలనాలు రేపుతున్న స్పేస్ఎక్స్.. స్టాక్ మార్కెట్ అరంగేట్రంలోనూ రికార్డులు బ్రేక్ చేసి ఇన్వెస్టర్ల పంట పండించింది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్లాక్బస్టర్ ఐపీఓగా... లిస్టింగ్లో 2.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అధిగమించి ప్రభంజనం సృష్టించింది. స్పేస్ఎక్స్ కెప్టెన్ ఎలాన్ మస్క్ .. సంపద విలువ కూడా స్పేస్ షిప్లా దూసుకుపోయింది. దీంతో ఈ అపర కుబేరుడు.. ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనీర్గా అవతరించి సరికొత్త చరిత్ర లిఖించాడు. అటు టెస్లా ఎలక్ట్రిక్ కార్లు.. ఇటు స్పేస్ఎక్స్ రాకెట్లతో నింగీ నేలా నాదే అంటూ సంపదలో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.ట్రిలియన్ డాలర్ల సంపద అంటే.. → స్పేస్ఎక్స్ లిస్టింగ్తో ప్రత్యర్థులు మస్క్ దరిదాపుల్లో కూడా లేకుండాపోయారు. మస్క్ తర్వాత టాప్–5లో ఉన్న గూగుల్ లారీ పేజ్ (270 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (249 బి.డాలర్లు), అమెజాన్ జెఫ్ బెజోస్ (235 బిలియన్ డాలర్లు), మెటా మార్క్ జుకర్బర్గ్ (229 బి. డాలర్లు) సంపద మొత్తం 970 బిలియన్ డాలర్లు కలిపినా కూడా ట్రిలియన్ డాలర్ల లోపే ఉండటం విశేషం!→ 100 డాలర్ల నోట్లుగా కట్టలు కడితే 10,000 టన్నులవుతుంది. ఒకదానిపై ఒక నోటు పెట్టుకుంటూ పోతే 1,000 కిలోమీటర్లు ఎత్తుకు ఎదుగుతుంది → 1 డాలరు నోట్లను పరుచుకుంటూ పోతే 1,09,220 కిలోమీటర్ల దూరం వెళ్లొచ్చు. అంటే 2.75 సార్లు భూమధ్య రేఖను చుట్టేయొచ్చన్నమాట! → అమెరికాలో దిగ్గజ స్పోర్ట్స్ టీమ్లు, టాప్ యూరోపియన్ సాకర్ క్లబ్లన్నింటినీ కొనేయగలడు. → ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 4,200 డాలర్లుగా ఉంది. దీని ప్రకారం ఎలాన్ సంపదతో సుమారు 7,500 టన్నుల బంగారం వస్తుంది. అంటే అమెరికా సెంట్రల్ బ్యాంక్ వద్దనున్న (8,133 టన్నులు) మొత్తం గోల్డ్తో సరితూగుతుంది. → ట్రిలియన్ డాలర్లను సెకనుకు 1 డాలరు చొప్పున ఖర్చు పెడితే మొత్తం సంపద కరిగిపోవడానికి 31,710 ఏళ్లు పడుతుంది! గంటకు 10,000 డాలర్లు చొప్పున అయితే 11,407 ఏళ్లు అవుతుంది.→ బోయింగ్ 787 డ్రీమ్లైనర్ బ్రాండ్ న్యూ విమానాలు దాదాపు 3,500 కొనేయొచ్చు. → ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా కట్డడానికి అయిన ఖర్చు 1.5 బిలియన్ డాలర్లు. దీని ప్రకారం 660 బుర్జ్ ఖలీఫా టవర్లను కట్టొచ్చు. → కోకాకోలా మార్కెట్ విలువ సుమారు 350 బిలియన్ డాలర్లు. అంటే మస్క్ తలచుకుంటే మూడు కోకాకోలా సైజు కంపెనీలను కొనేయగలడు. → ప్రపంచంలో 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ గల దేశాల సంఖ్య సుమారు 20. అంటే 170 దేశాకు పైగా జీడీపీల కంటే ఒక్క మస్క్ సంపదే ఎక్కువ! తైవాన్, ఐర్లాండ్, స్వీడన్, సింగపూర్ వంటి దేశాల జీడీపీలను మించిపోయాడు. → 10 మంది ముకేశ్ అంబానీల (ప్రస్తుత సంపద సుమారు 105 బిలియన్ డాలర్లు)తో సమానం. → భారత్లో మొత్తం 229 మంది బిలియనీర్లు ఉండగా.. వారి మొత్తం సంపద అంతా కలిపినా ఎలాన్ ముందు దిగదుడుపే!సంపద పెరిగిందిలా.. ఇంతింతై ‘మస్క్ ’ అంతై అన్నట్లుగా.. కుబేరుడికే కన్ను కుట్టేలా... ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా అవతరించి సంచలనం సృష్టించాడు. టెస్లాలో 12 శాతం వాటాతో పాటు స్టాక్ ఆప్షన్లను కలిపితే ప్రస్తుత సంపద విలువ 273 బిలియన్ డాలర్లు. ఇక స్పేస్ఎక్స్లో 41 శాతం వాటా విలువ 927 బిలియన్ డాలర్లుగా లెక్క. అంటే మొత్తం మస్క్ సంపద 1.2 ట్రిలియన్ డాలర్ల పైమాటే! ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్ల డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకుంటే దాదాపు రూ.95 లక్షల కోట్లు. → ప్రస్తుతం ఎలాన్ సంపద విలువంతా దాదాపు స్పేస్ఎక్స్, టెస్లా వాటాలదే. ఇవి కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(గతంలో ట్విటర్ – దీన్ని 44 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి కొన్నాడు), ఎక్స్ఏఐ (గతేడాది ఎక్స్లో విలీనమైంది), టన్నెల్ ఇన్ఫ్రా సంస్థ బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ తదితర వ్యాపారాలున్నాయి. → 2002లో ఫైనాన్షియల్ టెక్ దిగ్గజం పేపాల్ను విక్రయించడం ద్వారా (తనకున్న 11.7% వాటాకు 180 మిలియన్ డాలర్లు లభించాయి) తొలిసారి 100 మిలియన్ డాలర్లను అధిగమించాడు. → 2011 చివర్లో మొట్టమొదటిసారిగా ఎలాన్ వెల్త్ బిలియన్ డాలర్ల మార్కును దాటింది. → 2012లో తొలిసారిగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. → 2020లో ఆరంభంలో ఎలాన్ సంపద సుమారు 30 బిలియన్ డాలర్లు ఉండగా.. టెస్లా షేరు జోరుతో ఏడాది చివరికల్లా తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్కును దాటేశాడు. తొలిసారి టాప్–10లోకి ఎక్కాడు. → 2021 జనవరిలో 185 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ను వెనక్కినెట్టి తొలిసారి ప్రపంచ అపర కుబేరుడిగా ‘టాప్’లేపాడు. అదే ఏడాది చివరికి 300 బిలియన్ డాలర్లకు మస్క్ సంపద దూసుకెళ్లింది. అప్పటి నుంచీ (2022లో కొంత కాలం మినహా) ప్రపంచ నంబర్వన్ ప్లేస్ మస్క్ దే! → 2025 నవంబర్లో టెస్లా కంపెనీ బోర్డు కార్పొరేట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సీఈఓ ఎలాన్ మస్క్ కు 1 ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఆమోదించింది. టెస్లా నిర్దిష్ట లక్ష్యాలను అందుకుంటే 10 ఏళ్లకు పైగా కాలంలో ఆయనకు ఈ ప్యాకేజీ లభిస్తుంది.స్పేస్ఎక్స్ను ప్రారంభించేటప్పుడు అది విజయవంతమయ్యే అవకాశం 10 శాతం మాత్రమే అనుకున్నాను. కానీ ప్రయత్నమే చేయకపోతే నేడు అంతరిక్షంలో ప్రయాణించే స్థాయికి ఎప్పటికీ ఎదగలేమని ,ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా స్పేస్ ఎక్స్ను ముందుకు నడిపించాను. నేడు ప్రపంచ అంతరిక్ష రంగాన్ని శాసిస్తూ మానవాళిని బహుళ గ్రహాలపై నివసించే భవిష్యత్తు వైపు నడిపిస్తోంది. – ఎలాన్ మస్క్ -
భారత్ మార్కెట్పై ఎల్జీ ఫోకస్
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎల్రక్టానిక్స్ తన భవిష్యత్ వ్యాపార వృద్ధికి భారత్ను కీలక కేంద్రంగా చూస్తోంది. భారత్తోపాటు సౌదీ అరేబియా, బ్రెజిల్ మార్కెట్ల నుంచి ఆదాయాన్ని 2030 నాటికి రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సంస్థ సీఈవో ల్యూ జే చియోల్ తెలిపారు. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడం, అతిపెద్ద వినియోగ మార్కెట్ కూడా కావడంతో.. ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) వినియోగం ఇంకా విస్తృతంగా పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. దీంతో ఎల్జీ బ్రాండ్కు ఉన్న ఆదరణ దృష్ట్యా తన మార్కెట్ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత గృహోపకరణాల విస్తరణపై ఎల్జీ దృష్టి సారించింది. వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్లు, ఎయిర్ కండీషనర్లు, కిచెన్ ఉత్పత్తుల్లో ఏఐతోపాటు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఎగుమతులకూ ప్రాధాన్యం.. 2025లో భారత్, సౌదీ అరేబియా, బ్రెజిల్ దేశాల నుంచి ఎల్జీకి 6.2 ట్రిలియన్ కొరియన్ వోన్ల ఆదాయం లభించగా, 2023తో పోలిస్తే ఇది 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. గతేడాది సంస్థ మొత్తం ఆదాయం 89.2 ట్రిలియన్ వోన్ల్లో 8 శాతానికి సమానం. ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీ సంస్థ సాధించిన వృద్ధితో పోలి్చతే ఇది రెండింతలకుపైగా కావడం విశేషం. ఇంత భారీ వృద్ధి అవకాశాల నేపథ్యంలో భారత్ను ‘గ్లోబల్ సౌత్’ వ్యూహానికి కేంద్రబిందువుగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్టు ఎల్జీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ సంస్థకు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా, మహారాష్ట్రలోని పుణేలో ప్లాంట్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో మూడో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇది 2026 చివరినాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులను పెంచుకోవాలని చూస్తున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం భారత్లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు పేర్కొంది. యూకే, ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగా, వీటిని అనుకూలంగా చేసుకోవడాన్ని పరిశీలించనున్నట్టు తెలిపింది. ప్రీమియం ఉత్పత్తులపై దృష్టిప్రస్తుతం భారత్లో మధ్యస్థ, తక్కువ ధరల ఉత్పత్తుల తయారీపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఎల్జీ, ఇకపై నాలుగు డోర్ల ఫ్రిజ్లు, ఫ్రెంచ్ డోర్ ఫ్రిజ్లు వంటి ప్రీమియం ఉత్పత్తుల తయారీని పెంచనున్నట్టు వెల్లడించింది. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోవడం, స్థానిక సంస్థలను కొనుగోలు చేయడం లేదా విలీన అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు పేర్కొంది. హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ (హెచ్వీఏసీ) విభాగంలోకీ విస్తరించనున్నట్టు ప్రకటించింది. భారత వినియోగదారులు సాధారణ ఉత్పత్తుల కంటే ఇంటెలిజెంట్, కనెక్టెడ్ (ఒకదానితో ఒకటి అనుసంధానిత) గృహోపకరణాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధస్సు ఆధారిత గృహోపకరణాలు, వాటిని అనుసంధానించే స్మార్ట్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్టు వెల్లడించింది. -
మేలోనూ ధరల మంటే!
న్యూఢిల్లీ: రిటైల్ ధరలు మే నెలలో మరికొంత ఎగిశాయి. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) ఏప్రిల్లో ఉన్న 3.48 శాతం నుంచి 3.93 శాతానికి పెరిగింది. ఆహార ధరలు, ఇంధన ధరలు ఈ పెరుగుదలకు దోహదం చేసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్త్నుాయి. → ఆహార విభాగంలో సీపీఐ ఏప్రిల్లో 4.2 శాతంగా ఉంటే, మేలో 4.78 శాతానికి పెరిగింది. → మేలో పసిడి, వెండి ఆభరణాలు, టమాటోలు, అల్లం, కిస్మిస్ ధరలు అధికంగా పెరిగాయి. → ఆలుగడ్డలు, బఠానీ, మోటారు కార్లు, జీలకర్ర, మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలు తగ్గాయి. → మే నుంచి చూస్తే పెట్రోల్ ధర 7.4 శాతం, డీజిల్ ధర రూ.8.4 శాతం చొప్పున పెరగడం తెలిసిందే. → పట్టణాల్లో ద్రవ్యోల్బణం తక్కువగా 3.93 శాతంగా ఉంటే, పల్లెల్లో 4.25 శాతంగా నమోదైంది. → దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే 6.15 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. మిజోరంలో అత్యల్పంగా 1.03 శాతం ఉంది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉండొచ్చంటూ ఆర్బీఐ ఎంపీసీ ఇటీవలి సమీక్ష అనంతరం ప్రకటించడం తెలిసిందే. ఆహారంతోపాటు, ఆహారేతర వస్తువుల ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించినట్టు క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త దీప్తి దేశ్పాండే తెలిపారు. ‘‘తయారీదారులకు ముడిసరుకుల ధరలు ప్రియంగా మారాయి. టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 8.3 శాతానికి చేరడం ఇదే సూచిస్తోంది. ఇప్పుడు ఈ భారం రిటైల్ ధరలపైనా క్రమంగా ప్రతిఫలిస్తోంది’’అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆర్బీఐ లకి‡్ష్యత పరిధిలోనే (2–6 శాతం) ద్రవ్యోల్బణం ఉండొచ్చని అసోచామ్ ప్రెసిడెంట్ నిర్మల్ కే మిండా అంచనా వేశారు. -
క్యాష్ ఈజ్ ట్రాష్.. కియోసాకి హెచ్చరిక!
ఎప్పటికప్పుడు ఆర్ధిక పరమైన అంశాలను వెల్లడించే.. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా మరో అంశాన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ట్రిలియన్ డాలర్లు అంటే ఎంత? అని ప్రశ్నిస్తూనే.. దీనికి 1 తర్వాత 12 సున్నాలు ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. మీరు నిమిషానికి ఒక డాలర్ చొప్పున ఖర్చు చేస్తే, ఆ మొత్తం ఖర్చు చేయడానికి మీకు 34,000 సంవత్సరాలు పడుతుంది. దీన్నిబట్టి చూస్తే ఇది ఎంత పెద్ద సంఖ్య అనేది స్పష్టమవుతోంది.ఒక సాధారణ మనిషికి ట్రిలియన్ డాలర్లు ఊహించడం కూడా చాలా కష్టం. కానీ ఫెడ్, యూఎస్ ట్రెజరీకి ఒక ట్రిలియన్ డాలర్లను ముద్రించడానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పడుతుందని కియోసాకి పేర్కొన్నారు.కియోసాకి ప్రకారం.. డబ్బు భద్రమైన పెట్టుబడి కాదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం సమయంలో దీని విలువ క్రమంగా తగ్గుతుంది. కాబట్టి డాలర్లను పొదుపు చేసేవారు నష్టపోతారు. క్యాష్ ఈజ్ ట్రాష్ అంటూనే.. మీ డబ్బును బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని రిచ్ డాడ్ వివరించారు.అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతి పెట్టుబడికి లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. బంగారం వంటి సంప్రదాయ ఆస్తులు స్థిరత్వాన్ని ఇస్తే, క్రిప్టోకరెన్సీలు ఎక్కువ మార్పులు కలిగి ఉంటాయి. కాబట్టి ఏ పెట్టుబడి అయినా వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, లక్ష్యాలు, ప్రమాద సహనాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.HOW MUCH is a $ TRILLION?A trillion is a 1 with 12 zeros after it.$1,000,000,000,000If you were to spend $1 a minute it would take you 34,000 years to spend.It takes the Fed and US Treasury less than a minute to print $1 trillion.Get the picture?Savers of dollars are…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 12, 2026 -
భారీ రీకాల్.. 2.5 లక్షల వాహనాలు వెనక్కి!
అమెరికా ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్.. తాజాగా భారీ స్థాయిలో తన వాహనాలను రీకాల్ ప్రకటించింది. మొత్తం 2.5 లక్షలకు పైగా వాహనాలు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయి. గతంలో చేసిన రీకాల్లో సరిగా మరమ్మతులు చేయకపోవడం వల్ల, మళ్లీ సమస్య తలెత్తినట్లు గుర్తించిన సంస్థ ఇప్పుడు మరోమారు రీకాల్ జారీ చేసింది.ఈ రీకాల్ ప్రధానంగా 2012 నుంచి 2018 మధ్య తయారైన ఫోర్డ్ ఫోకస్ మోడల్ కార్లకు వర్తిస్తుంది. ఈ వాహనాల్లో ఉన్న కానిస్టర్ పర్జ్ వాల్వ్ లోపం కారణంగా ఇంజిన్ ఆకస్మికంగా ఆగిపోయే అవకాశం ఉంది. డ్రైవింగ్ సమయంలో ఇలాంటి సమస్య అనుకోని సమస్యను తీసుకొస్తుంది. దీనిని పరిష్కరించేందుకు డీలర్లు వాహనాలకు ఉచితంగా పవర్ట్రైన్ సాఫ్ట్వేర్ అప్డేట్ అందించనున్నారు. దీని ద్వారా ఇంజిన్ పనితీరును మెరుగుపరచి, అకస్మాత్తుగా ఆగిపోవడాన్ని నివారించవచ్చని కంపెనీ తెలిపింది.వాహన యజమానులకు సంబంధించిన నోటిఫికేషన్ లేఖలు జూలై 6 నుంచి పంపించడం మొదలైంది. అంతే కాకుండా.. ఫోర్డ్ వినియోగదారులు ఫోర్డ్ కస్టమర్ సర్వీస్ నంబర్ ద్వారా మరింత సమాచారం పొందవచ్చు. రీకాల్కు సంబంధించిన వాహనాల వివరాలు మరియు VIN నంబర్లు జూలై 6 నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది. -
AI వల్ల ఉద్యోగాలు పోతాయా..: లేటెస్ట్ రిపోర్ట్ ఇదే!
‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది.అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్ఫోర్స్ సర్వేను నిర్వహించింది.ఉత్పాదకతపై భిన్న అభిప్రాయాలుఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగుల ఉత్పాదకత విషయంలో కొంత అయోమయం నెలకొన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రతిరోజూ ఏఐని ఉపయోగించే వారిలో 30 శాతం మంది పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ.. ఏఐ వాడని వారితో పోలిస్తే తాము తక్కువ ఉత్పాదకతతో ఉన్నట్లు భావిస్తున్నామని వారు చెప్పారు. నిత్యం చేసే సాధారణ పనులను ఏఐ చూసుకోవడం వల్ల, తమ సొంత పనితీరును అంచనా వేయడం కష్టంగా మారుతోందని ఉద్యోగులు భావిస్తుండటమే దీనికి కారణం.సాంకేతికత-స్కిల్స్ కీలకంవ్యాపార సంస్థల అధిపతులు కేవలం ‘తక్కువ మందితో ఎక్కువ పని’ అనే కోణంలో ఆలోచించకుండా, సాంకేతికతను, మానవ నైపుణ్యాలను ఎలా మేళవించాలనే దానిపై దృష్టి పెట్టాలని రాహుల్ గోయల్ సూచించారు. రోజు వారీగా పదే పదే చేసే పనులను ఏఐ సులువుగా పూర్తి చేస్తుంది.దీనివల్ల ఉద్యోగులకు సమయం కలిసివచ్చి, వారు నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల పరిష్కారం, సమన్వయం వంటి మానవ మేధస్సుకు సంబంధించిన సృజనాత్మకత పనులపై మరింత దృష్టి పెట్టవచ్చు. నాలెడ్జ్ ఆధారిత రంగాల్లో ఉన్న ఉద్యోగులు తమ కెరీర్పై ధీమాగా ఉన్నారు. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి సమయం వృథా చేయకుండా, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని గోయల్ వివరించారు. -
EVలకు ఫుల్ డిమాండ్: కారణం ఇదే!
భారత ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించేందుకు పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) వైపు అడుగులు వేసిన ప్రభుత్వం, భవిష్యత్తులో E22, E25, E27, E30 వంటి అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలకు కూడా మార్గం సుగమం చేస్తోంది. ఈ పరిణామాలు దేశంలోని వాహన కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.ఇటీవల ప్రభుత్వం 22 నుంచి 30 శాతం వరకు ఇథనాల్ కలిగిన పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఇవ్వడం ద్వారా అధిక ఇథనాల్ వినియోగానికి మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఇంధనాలు మార్కెట్లో అందుబాటులో లేకపోయినా, వాటి ప్రమాణాలను ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేయడం గమనార్హం.ఈ నేపథ్యంలో.. వాహన కొనుగోలుదారుల్లో అనిశ్చితి నెలకొంది. భవిష్యత్తులో అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం కొనుగోలు చేసే పెట్రోల్ వాహనాలు వాటికి అనుకూలంగా ఉంటాయా?, లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై నిర్వహించిన సర్వేలో 28 వేలకుపైగా మంది పాల్గొన్నారు. వారిలో 43 శాతం మంది E20, E30 వంటి ఇంధనాల భవిష్యత్ ప్రభావాల కారణంగా వచ్చే ఏడాది కొత్త వాహనాల కొనుగోలును వాయిదా వేయాలని లేదా ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చని తెలిపారు.సర్వేలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 6 శాతం మంది మాత్రమే కొత్త పెట్రోల్ వాహనం కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు 7 శాతం మంది ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), 7 శాతం మంది హైబ్రిడ్ వాహనాలను కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారు. అంటే పెట్రోల్ వాహనాలతో పోలిస్తే EVలు, హైబ్రిడ్ వాహనాలపై ఆసక్తి రెట్టింపుకన్నా ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.ఇంధన భవిష్యత్తుపై అనిశ్చితి, పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఫలితంగా ప్రముఖ ఈవీ మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది.దేశవ్యాప్తంగా EVల వినియోగం కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోషియేషన్ (FADA) గణాంకాల ప్రకారం, 2026 మే నెలలో మొత్తం వాహన అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 11 శాతాన్ని దాటింది. అదే నెలలో EVల రిటైల్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 45 శాతం పెరిగి 2.71 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ 81 శాతం పెరగడం ఈ రంగంలో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. -
ఈ ఐటీ కంపెనీలో జీతాల పెంపునకు కొత్త ఫార్ములా..
ప్రపంచ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) తన ఉద్యోగుల వేతన పెంపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై వేతన పెంపు మొత్తం బేసిక్ పేలో కలపకుండా, దానిని రెండు భాగాలుగా విభజించి అందించనుంది. ఒక భాగం శాశ్వత బేస్ పే పెంపుగా ఉండగా, మిగిలిన భాగాన్ని జూన్లో ఒకేసారి చెల్లించే లంప్సమ్ బోనస్గా ఇవ్వనుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగులకు తక్షణ నగదు ప్రయోజనం కల్పించడంతో పాటు కంపెనీ తన స్థిర వేతన వ్యయాలను నియంత్రించగలదని సంస్థ భావిస్తోంది.కంపెనీ అంతర్గత సమాచారం ప్రకారం.. ఒక ఉద్యోగికి 3 శాతం వేతన పెంపు మంజూరైతే అందులో 1.5 శాతం మాత్రమే బేస్ పేలో చేరుతుంది. మిగిలిన 1.5 శాతం జూన్లో ఒకసారి చెల్లించే బోనస్గా అందుతుంది. అయితే ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు వర్తించే పెంపు మాత్రం పూర్తిగా బేస్ పేలోనే జమ అవుతుంది. అలాగే జూన్ లంప్సమ్ చెల్లింపు డిసెంబరులో ఇచ్చే వార్షిక పనితీరు బోనస్కు పూర్తిగా వేరుగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.యాక్సెంచర్లో జూన్ నెలే ప్రమోషన్లు, వేతన సవరణలకు ప్రధాన చక్రంగా కొనసాగుతోంది. గత ఏడాది పరిమిత సంఖ్యలో మాత్రమే ‘స్టే-అట్-లెవల్’ ఉద్యోగులకు పెంపు లభించగా, ఈసారి మరింత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పెంపు పరిధిలోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు కనీసం కొంత మేర వేతన ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడింది.ఈ నిర్ణయం వెనుక ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఐటీ సేవల రంగంలో కొనసాగుతున్న ఒత్తిళ్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. స్థిర ఖర్చులను అదుపులో ఉంచుతూ ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా యాక్సెంచర్ ఈ హైబ్రిడ్ వేతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వేతన నిర్ణయాలు ఉద్యోగుల నైపుణ్యాలు, పనితీరు, వ్యాపారంపై చూపిన ప్రభావం, ప్రవర్తనా ప్రమాణాల ఆధారంగానే కొనసాగుతాయని సంస్థ తెలిపింది.భారత్లో యాక్సెంచర్కు సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త విధానం వారి వేతన నిర్మాణంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. కొంతమంది ఉద్యోగులు తక్షణ నగదు లాభాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, బేస్ పే పెరుగుదల పరిమితంగా ఉండటం వల్ల భవిష్యత్ వేతన వృద్ధిపై ప్రభావం పడొచ్చనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
ఒక్క ‘ముద్దు’తో రూ.25 వేల కోట్లు ఆవిరి!
చైనా టెక్ రంగంలో సంచలనం రేపిన ఓ వ్యక్తిగత వివాదం, కేవలం కొన్ని గంటల్లోనే బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువను తుడిచిపెట్టేసింది. చైనాకు చెందిన ప్రముఖ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల తయారీ సంస్థ విక్టరీ జెయింట్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు, చైర్మన్ చెన్ టావో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంపెనీ షేర్లు ఒక్కసారిగా భారీ ఒత్తిడికి గురయ్యాయి.జూన్ 6న చైనా సోషల్ మీడియా వేదిక డౌయిన్లో "జెన్జెన్ జానిస్" పేరుతో ఉన్న ఓ యూజర్.. చెన్ టావోతో తనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తూ పలు పోస్టులు చేసింది. అందులో లిఫ్ట్లో ఓ మహిళతో చెన్ టావో చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి దృశ్యాలు ఉన్నాయని చైనా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. చెన్ టావో వివాహితుడు కావడంతో ఈ వీడియోలు వేగంగా వైరల్ అయ్యి చైనా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.పడిపోయిన షేర్లుఈ వివాదం స్టాక్ మార్కెట్ను కూడా ప్రభావితం చేసింది. జూన్ 8న విక్టరీ జెయింట్ టెక్నాలజీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఒక దశలో కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 20 బిలియన్ యువాన్లు (దాదాపు 2.9 బిలియన్ డాలర్లు) భారత కరెన్సీలో సుమారు రూ.25 వేల కోట్లు ఆవిరయ్యాయి. అయితే మరుసటి రోజున పెట్టుబడిదారుల ఆందోళనలు కొంత తగ్గడంతో షేర్లు తిరిగి కోలుకున్నాయి.వివాదంపై స్పందించిన కంపెనీ యాజమాన్యం.. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆరోపణలకు, సంస్థ కార్యకలాపాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఉత్పత్తి, ఆర్డర్లు, సరఫరా వ్యవస్థలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది. అలాగే ఈ వ్యవహారం కార్పొరేట్ గవర్నెన్స్ లేదా షేర్హోల్డర్లకు వెల్లడించాల్సిన కీలక అంశం కాదని పేర్కొంది. ఇక చెన్ టావో భవిష్యత్తు పాత్రపై వచ్చిన ప్రశ్నలకు మాత్రం "వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం" అంటూ స్పందించేందుకు నిరాకరించింది.54 ఏళ్ల చెన్ టావో స్థాపించిన విక్టరీ జెయింట్ టెక్నాలజీ అమెరికా ఏఐ చిప్ దిగ్గజం ఎన్విడియాకు ప్రధాన సరఫరాదారుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇటీవల హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో నిర్వహించిన భారీ ఐపీఓ ద్వారా సుమారు 2.6 బిలియన్ డాలర్లు సమీకరించి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. చెన్ టావో వ్యక్తిగత సంపద సుమారు 11.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.లక్ష కోట్లు). -
పెరిగిన భారత్ బంగారం నిల్వల విలువ
భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో (Forex Reserves) స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ గణనీయంగా పెరిగింది. ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జూన్ 5తో ముగిసిన వారంలో దేశ బంగారం నిల్వల విలువ 1.98 బిలియన్ డాలర్లు పెరిగి 114.58 బిలియన్ డాలర్లకు చేరుకుంది.అదే సమయంలో మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు 711 మిలియన్ డాలర్లు తగ్గి 681.61 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఫారెక్స్ రిజర్వుల్లో అతిపెద్ద వాటా కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) 2.70 బిలియన్ డాలర్లు తగ్గి 543.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఎఫ్సీఏలను అమెరికా డాలర్ విలువలో లెక్కిస్తారు. అయితే ఈ నిల్వల్లో యూరో, పౌండ్ స్టెర్లింగ్, జపాన్ యెన్ వంటి ఇతర ప్రధాన కరెన్సీలు కూడా ఉండటంతో, వాటి మారకపు విలువల్లో చోటుచేసుకునే మార్పులు ఎఫ్సీఏపై ప్రభావం చూపుతాయి.గత వారంలో భారత విదేశీ మారక నిల్వలు సుమారు 938 మిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. రూపాయి మారకపు విలువలో అధిక ఒడిదుడుకులు కనిపించినప్పుడు లేదా మార్కెట్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆర్బీఐ ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుంటూ నిల్వలను వినియోగిస్తుంది.ఇటీవల అమెరికా డాలర్ నిల్వలను బలోపేతం చేయడం, రూపాయి స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఎఫ్సీఎన్ఆర్-బీ (FCNR-B) డిపాజిట్ల హెడ్జింగ్ ఖర్చును భరించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.ప్రస్తుతం భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే 95 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన 97 స్థాయితో పోలిస్తే మెరుగైన స్థితిగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రూపాయి మారకం విలువ 94.70 నుంచి 95.60 మధ్య కదలాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: టాటా కారు కొనుగోలుదారులకు షాక్! -
టాటా కారు కొనుగోలుదారులకు షాక్!
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటర్స్ (Tata Motors) మరోసారి కారు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిలోని పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలను జూలై 1, 2026 నుంచి గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్ను బట్టి ధరల పెంపు భిన్నంగా ఉండనుంది. కొత్త ధరల జాబితాను జూలై 1న వెల్లడించనున్నారు.ముడి పదార్థాల ధరలు పెరగడం, తయారీ వ్యయాలు అధికమవడం, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కంపెనీ తెలిపింది. ఖర్చుల భారాన్ని ఇప్పటివరకు గణనీయంగా సంస్థే భరించినప్పటికీ, దాని ప్రభావంలో కొంత భాగాన్ని ఇప్పుడు వినియోగదారులకు బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని టాటా మోటార్స్ పేర్కొంది.ఈ ధరల పెంపు టాటా ప్యాసింజర్ వాహనాల మొత్తం శ్రేణిపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్ఫోలియోలో టాటా టియాగో (Tata Tiago), టాటా టైగర్, టాటా పంచ్ (Tata Punch), టాటా నెక్సాన్, టాటా కర్వ్ (Tata Curvv), టాటా హారియర్, టాటా సఫారీ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా ఉన్నాయి. ఇటీవల పరిచయమైన టాటా సియెర్రా (Tata Sierra), సియెర్రా ఈవీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.టాటా మోటార్స్ ఈ ఏడాదిలో చేపడుతున్న రెండో ధరల పెంపు ఇది. అంతకుముందు ఏప్రిల్ 1 నుంచే కొన్ని వాహనాల ధరలను సంస్థ పెంచింది. మరోవైపు కమర్షియల్ వాహనాల ధరలను కూడా ఏప్రిల్లో 1.5 శాతం వరకు టాటా మోటర్స్ పెంచింది.ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న వ్యయాల ప్రభావంతో ఇతర కంపెనీలు కూడా ధరల సవరణలు చేపడుతున్నాయి. మారుతీ సుజుకీ (Maruti Suzuki) జూన్ 1 నుంచి కొన్ని మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచగా, హ్యుందాయ్ మోటర్స్ ఇండియా (Hyundai) కూడా జూన్ నుంచి ధరలను పెంచింది. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది.జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానుండటంతో, టాటా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు జూన్ నెలాఖరు లోపు బుకింగ్ లేదా కొనుగోలు పూర్తి చేస్తే ప్రస్తుత ధరల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ జూన్ నెలలో కొన్ని మోడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తోంది. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్ సూచీలు ఎగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 461.30 పాయింట్లు లేదా 1.99 శాతం పెరిగి 23,622.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,695.40 పాయింట్లు లేదా 2.30 శాతం పెరిగి 75,527.95 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 50 ఇండెక్స్లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టూబ్రో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 2.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 2.8 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది. -
ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ ఐపీఓకు రికార్డు స్పందన
ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో(IPO)గా నిలిచిన ‘స్పేస్ఎక్స్’ (SpaceX) షేర్ల విక్రయానికి మదుపరుల నుంచి భారీ స్పందన లభించింది. ఎలాన్ మస్క్కు చెందిన ఈ రాకెట్, శాటిలైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐపీఓలో రిటైల్ పెట్టుబడిదారులు ఒక్కరే 100 బిలియన్ డాలర్లకు పైగా కొనుగోలు ఆర్డర్లు సమర్పించినట్లు బ్లూమ్బర్గ్, రాయిటర్స్ నివేదికలు వెల్లడించాయి.స్పేస్ఎక్స్ షేర్లు ఒక్కొక్కటి 135 డాలర్ల ధరకు విక్రయించగా, మొత్తం 555.6 మిలియన్ షేర్ల ద్వారా సుమారు 75 బిలియన్ డాలర్లు సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 1.75 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించింది...కానీ అందరికీ షేర్లు దక్కవుస్పేస్ఎక్స్ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కనీసం 20 శాతం షేర్లను కేటాయించినప్పటికీ, వచ్చిన డిమాండ్ ఆ కేటాయింపును అనేక రెట్లు మించి ఉంది. సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి కూడా భారీగా ఆర్డర్లు రావడంతో చాలా మంది చిన్న మదుపరులకు పూర్తి కేటాయింపు దక్కే అవకాశాలు తగ్గాయి. మొత్తం పెట్టుబడిదారుల డిమాండ్ 250 బిలియన్ డాలర్లను దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి.చైనా ఇన్వెస్టర్లకు నో!అమెరికా సాంకేతిక ఎగుమతి పరిమితుల కారణంగా చైనా ప్రధాన భూభాగం, హాంకాంగ్కు చెందిన ఇన్వెస్టర్ల ఆర్డర్లను స్పేస్ఎక్స్ ఐపీఓలో అంగీకరించలేదు. రాకెట్, ఉపగ్రహ, కృత్రిమ మేధస్సు రంగాలకు సంబంధించిన కీలక సాంకేతికత కారణంగా ఈ పరిమితులు అమల్లోకి వచ్చాయి.మస్క్కు మరో మైలురాయిస్పేస్ఎక్స్ ఐపీఓ విజయంతో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యానికి మరో కీలక మైలురాయి చేరింది. అయితే కంపెనీ భారీ విలువ, ఇంకా లాభదాయకత సాధించని వ్యాపార నమూనా, భవిష్యత్ వృద్ధి అంచనాలపై మార్కెట్లో చర్చ కొనసాగుతోంది. అయినప్పటికీ, స్పేస్ఎక్స్ ఐపీఓ ప్రపంచ మూలధన మార్కెట్ల చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలవడం ఖాయం.చైనా, హాంకాంగ్ ఐపీఓల ముందు చిన్నదే!స్పేస్ఎక్స్ ఐపీఓకు వచ్చిన స్పందన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనప్పటికీ, చైనా, హాంకాంగ్ మార్కెట్లలో కొన్ని ఐపీఓలు ఇంకా పెద్ద స్థాయిలో రిటైల్ ఆసక్తిని ఆకర్షించాయి. 2025లో షాంఘైలో చిప్ తయారీ సంస్థ మెటాఎక్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐపీవోకు సుమారు 3 ట్రిలియన్ యువాన్లు (దాదాపు 444 బిలియన్ డాలర్లు) విలువైన రిటైల్ బిడ్లు వచ్చినట్లు మార్కెట్ డేటా సూచిస్తోంది. అదే విధంగా హాంకాంగ్లో బబుల్-టీ దిగ్గజం మిక్సు గ్రూప్ ఐపీవోకు దాదాపు 1.8 ట్రిలియన్ హాంకాంగ్ డాలర్లు (సుమారు 230 బిలియన్ యూఎస్ డాలర్లు) ఆర్డర్లు నమోదయ్యాయి.చైనాలో ఐపీఓలకు అంత క్రేజ్ ఎందుకు?చైనా ప్రధాన భూభాగంలో కొత్తగా లిస్ట్ అయ్యే కంపెనీల షేర్లు మొదటి రోజే భారీ లాభాలు ఇవ్వడం సాధారణం. నియంత్రణ సంస్థలు ప్రారంభ ధరలను తక్కువగా ఉంచడం వల్ల ఇన్వెస్టర్లకు తొలి రోజు లాభాలపై అధిక నమ్మకం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది చిన్న మదుపరులు ఐపీఓలను ఒకరకమైన "లాటరీ అవకాశం"గా భావిస్తూ దరఖాస్తు చేస్తుంటారు.హాంకాంగ్లో అయితే బ్రోకరేజీలు సులభంగా మార్జిన్ రుణాలు ఇవ్వడం వల్ల పెట్టుబడిదారులు పెద్ద మొత్తాల్లో అప్పు తీసుకుని కూడా ఐపీఓలకు దరఖాస్తు చేస్తుంటారు. తదుపరి టెక్ దిగ్గజాన్ని కోల్పోతామనే భయం (FOMO) కూడా ఈ ఉత్సాహానికి కారణమవుతోంది. -
పేపర్ నోట్ల స్థానే ప్లాస్టిక్ నోట్లు! ప్రభుత్వం వివరణ
‘జూన్ 30 తర్వాత మీ జేబులోని కాగితపు కరెన్సీ నోట్లు చెల్లవు.. వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి’— ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల్లో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ సారాంశం ఇది. 2016 నాటి నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఈ వార్త వ్యాపార వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిజంగానే కాగితపు నోట్లను నిషేధిస్తోందా? కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏమంటోంది? అనే అంశాలను కింద చూద్దాం.వైరల్ అవుతున్న పోస్ట్లో ఏముంది?సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్టుల ప్రకారం.. జూన్ 30, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. అదే తేదీ నుంచి వాటి స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ (పాలిమర్ నోట్లు) అమల్లోకి వస్తుందని ఆ పోస్టుల సారాంశం.పీఐబీ ఫ్యాక్ట్ చెక్ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ వాదనను పూర్తిగా నకిలీ (ఫేక్ న్యూస్) అని కొట్టిపారేసింది. ‘జూన్ 30, 2026 నాటికి కాగితపు నోట్లను దశలవారీగా తొలగించే లేదా వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఎలాంటి ప్రణాళికలు ఆర్బీఐ వద్ద లేవు. వివిధ సామాజిక గ్రూపుల్లో వచ్చే ధ్రువీకరించని సమాచారాన్ని, ఫార్వార్డ్ మెసేజ్లను గుడ్డిగా నమ్మవద్దు’ అని ప్రభుత్వం కోరింది. కరెన్సీకి సంబంధించిన ఎలాంటి వివరాల కోసమైనా నేరుగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.Several social media posts are falsely claiming that RBI will withdraw paper currency notes and replace them with plastic currency notes from June 30, 2026.#PIBFactCheck❌ This claim is #Fake✅ According to @RBI, there are no plans to withdraw paper currency notes or… pic.twitter.com/dhZqANjip9— PIB Fact Check (@PIBFactCheck) June 9, 2026పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలుఇటీవల (జూన్ 5, 2026న) జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్లాస్టిక్ నోట్లపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ‘పాలిమర్ నోట్ల ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే. మేము దాని వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేస్తున్నాం. అయితే, ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
పెంటగాన్ ఏఐ డీల్తో గూగుల్లో సంక్షోభం
సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి కంపెనీల్లో ఉద్యోగులు బలవంతంగా బయటకు వెళ్తున్న తరుణంలో గూగుల్కు చెందిన ఒక టాప్ డైరెక్టర్ తన నైతిక విలువల కోసం కోట్లాది రూపాయల ప్యాకేజీని, అత్యున్నత హోదాను స్వచ్ఛందంగా వదులుకున్నారు. గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ సెక్యూరిటీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రెనే మేర్హోఫర్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్)తో గూగుల్ కుదుర్చుకున్న వివాదాస్పద కృత్రిమ మేధ ఒప్పందమే ఇందుకు ప్రధాన కారణం. రాజీనామా లేఖను వ్యక్తిగత బ్లాగ్ పోస్ట్లో బహిర్గతం చేస్తూ గూగుల్ మేనేజ్మెంట్ తన నైతికతను కోల్పోయిందని రెనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2017వ సంవత్సరంలో గూగుల్ నుంచి వచ్చిన తిరస్కరించలేని ఆఫర్తో రెనే మేర్హోఫర్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ సెక్యూరిటీ డైరెక్టర్గా చేరారు. దాదాపు దశాబ్ద కాలం పాటు సేవలందించిన ఆయన, తొమ్మిదేళ్ల క్రితం తాను చేరిన నాటి గూగుల్ సంస్కృతికి, నేటి గూగుల్ వైఖరికి అసలు పొంతన లేదని స్పష్టం చేశారు.‘ప్రపంచ స్థాయిలో అద్భుతాలు చేయడానికి గూగుల్ ఒక సరైన వేదిక. ఇక్కడి పారదర్శక సంస్కృతి, భిన్న అభిప్రాయాలకు ఇచ్చే గౌరవం నన్ను ఆకర్షించాయి. ఒక గూగులర్గా మా సొంత గుర్తింపును, విలువలను పనిలో చూపించే స్వేచ్ఛ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నత స్థాయి యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సంస్కృతిని దెబ్బతీశాయి’ అని జోహన్నెస్ కెప్లర్ యూనివర్శిటీ లింజ్లో ప్రొఫెసర్గా, ఇన్స్టిట్యూట్ ఫర్ నెట్వర్క్స్ అండ్ సెక్యూరిటీ అధిపతిగా కూడా ఉన్న మేర్హోఫర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ, ప్రైవసీ ఇంజినీరింగ్ ఉపాధ్యక్షుడు డేవ్ క్లీడర్మాకర్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ సెక్యూరిటీ హెడ్ నిక్ క్రాలెవిచ్లు తనపై ఉంచిన నమ్మకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.సుందర్ సొంత ఏఐ సూత్రాలను పక్కనబెట్టారా?2018లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా కొన్ని ఏఐ సూత్రాలను ప్రకటించారు. వాటి ప్రకారం గూగుల్ అభివృద్ధి చేసే ఏఐ అప్లికేషన్లు కింది అంశాలకు విరుద్ధంగా ఉండకూడదు.1. ఆయుధాల తయారీ లేదా ప్రజలకు ప్రత్యక్షంగా గాయం కలిగించే సాంకేతికతలు.2. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ సామూహిక నిఘా కోసం సమాచారాన్ని సేకరించడం.3. అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల సూత్రాలను ఉల్లంఘించే సాంకేతికతలు.అయితే, ప్రస్తుత పెంటగాన్ ఒప్పందం ద్వారా గూగుల్ యాజమాన్యం ఈ నియమాలను నిశ్శబ్దంగా తుంగలో తొక్కిందని మేర్హోఫర్ ఆరోపించారు. అమెరికా రక్షణ శాఖ ఏదైనా చట్టబద్ధమైన ఉద్దేశం కోసం తమ ఏఐ నమూనాలను వాడుకునేలా గూగుల్ ఒప్పందం చేసుకుందని, అయితే అవి ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు రుజువైందని ఆయన ఎండగట్టారు.ఉద్యోగుల తీవ్ర నిరసనఅమెరికా రక్షణ శాఖకు క్లాసిఫైడ్ ఏఐ సేవలు అందించడాన్ని గూగుల్ అంతర్గత ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రక్షణ శాఖతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ 600 మందికి పైగా ఉద్యోగులు సంతకాలు చేసిన లేఖను సీఈఓ సుందర్ పిచాయ్కు పంపినప్పటికీ యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. ఈ నిర్ణయాలన్నీ కేవలం ఉన్నత స్థాయి యాజమాన్యం మాత్రమే తీసుకుందని, అంతర్గత ఛానెళ్ల ద్వారా తమలాంటి డైరెక్టర్లకు కూడా కనీస సమాచారం ఇవ్వలేదని మేర్హోఫర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
ఏఐ దారి తప్పకుండా థియోమ్ పటిష్ట నిఘా!
‘‘ఏఐ కట్టుతప్పుతోంది.. తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకునేంత వరకూ వాడకం ఆపేద్దాం’’. ఆంథ్రోపిక్ సీఈవో ఇటీవల చేసిన హెచ్చరిక ఇది. అయితే ఇంకో అంతర్జాతీయ ఏఐ సంస్థ థియోమ్ మాత్రం ఇందుకు భిన్నమైన ఆలోచన చేస్తోంది. హ్యాకర్లు ఏఐ దుర్వినియోగానికి ప్రయత్నిస్తూంటే... తాము ఏఐ సాయంతోనే ఏఐకు, డేటాకు రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని థియోమ్ చెబుతోంది. ఇదే అంశంపై సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈవో నవీంద్ర యాదవ్ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే...ప్రశ్న: ముందుగా థియోమ్ గురించి వివరించండి.జవాబు: థియోమ్ డేటా, ఏఐ సెక్యూరిటీ కంపెని. 2020 డిసెంబరులో స్థాపించాము. మిగిలిన సైబర్ సెక్యూరిటీ సంస్థల మాదిరిగా ఇది డేటాను నెట్వర్క్ల బయట నుంచి కాపాడదు. లోపలి నుంచి రక్షణ కల్పిస్తుంది. స్నోఫ్లేక్స్, డేటాబ్రిక్స్ వంటి భారీ డేటా స్టోర్లు, గోల్డ్మ్యాన్ శాక్స్, బ్లాక్రాక్ వంటి ఫైనాన్షియల్ సంస్థలు, హెల్త్కేర్, ఫార్మా కంపెనీలు ఈ డేటా స్టోర్లను వాడుకుంటూంటాయి. థియోమ్ ఈ డేటా స్టోర్లతోపాటు కంపెనీలు వాడే ఏఐ వ్యవస్థల్లో ఉంటూ రక్షణ కల్పిస్తుంది. ఏఐ సాఫ్ట్వేర్పై ఎవరైనా దాడులు చేస్తున్నారా? అన్నది పరిశీలించడంతోపాటు, ఏఐ డేటాతో జరిపే సంప్రదింపులను కూడా పరిశీలించి అవాంఛనీయ ఘటనలేవీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏఐ ఏ రకమైన డేటాతో పనిచేస్తోందన్నది నిత్యం గమనిస్తూండటం ద్వారా అది దారి తప్పకుండా కాపు కాస్తూ ఉంటుందన్నమాట.ప్ర: మీరు డేటా స్టోర్ల గురించి ప్రస్తావించారు. ఇవి డేటా సెంటర్లూ ఒకటేనా?జ: కాదు. రెండూ వేర్వేరు. డేటా సెంటర్లలో డేటా నిక్షిప్తమవుతుంది. కంప్యూటర్లు, సర్వర్లు ఉండే ప్రాంతం. డేటా స్టోర్లు అంటే ఈ డేటా సెంటర్లలోని సమాచారం. ఇంకోలా చెప్పాలంటే ఒక రకమైన డేటాబేస్ అన్నమాట.ప్ర: ఏఐ వ్యవస్థలకు ప్రస్తుతం ఎలాంటి ముప్పు ఎదురవుతోంది?జ: చాలానే ఉన్నాయి. ఏఐ వ్యవస్థలను తమ అవసరాల కోసం వాడుకునేందుకు నిత్యం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. డేటా చోరీతోపాటు, సమాచారాన్ని తమకు అనుకూలమైన రీతిలో మార్చుకుని లాభపడేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. ఆంథ్రోపిక్ గురించి మీరు వినే ఉంటారు. ఇటీవలే ఈ ఏఐ కంపెనీ మైథోస్ పేరుతో సరికొత్త ఏఐ సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. రెండు వారాల క్రితమే భారత ప్రభుత్వం కూడా దీన్ని వాడటం మొదలుపెట్టింది. మైథోస్ అనేది ఇతర వ్యవస్థలపై దాడి చేయగల సామర్థ్యమున్నది. థియోమ్ ఇలాంటి దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది.సింపుల్గా చెప్పాలంటే థియోమ్ అనేది శరీర రోగ నిరోధక వ్యవస్థ లాంటిది. లోపలి నుంచి రక్షణ కల్పిస్తుంది. మిగిలిన సైబర్ సెక్యూరిటీ సంస్థలు తొడుక్కునే రక్షణ కవచల్లాంటివి. అందుకే థియోమ్ అనేది ఏఐ యుగం కోసం సిద్ధం చేసిన వ్యవస్థ.ప్ర: ఆరేళ్లలో థియోమ్ ఎంత మేర విస్తరించింది?జ: థియోమ్ ఒక అంతర్జాతీయ సంస్థ. అమెరికాలో మొదలైంది. భారత్తోపాటు జర్మనీ, పోర్చుగల్, క్రొయేషియా, ఆస్ట్రేలియాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పశ్చిమార్ధగోళం నుంచి అత్యధిక ఆదాయం పొందుతున్న కంపెనీ. జెట్ బ్లూ ఎయిర్లైన్స్, ఫార్మాస్యూటికల్, హెల్త్కేర్ కంపెనీలు, గోల్డ్మ్యాన్ శాక్స్, బ్లాక్రాక్ వంటి ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, పలు ఏఐ ఫస్ట్ కంపెనీలు థియోమ్ సాయంతో తమ డేటా, ఏఐలు రెండింటినీ రక్షించుకుంటున్నాయి. స్టారప్ కంపెనీనే గానీ వేగంగా వృద్ధి చెందుతోంది.ప్ర: హైదరాబాద్ కేంద్రం నుంచి ఎలాంటి ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నారు?జ: థియోమ్కు హైదరాబాద్ బ్యాక్ ఆఫీసు కానేకాదు. అంతర్జాతీయ కస్టమర్లకు సరికొత్త ప్రాడక్ట్స్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఇప్పటివరకూ యాభై మంది ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాము. సాఫ్ట్వేర్ కోడింగ్లో ఏఐని మరింత సమర్థంగా వాడటం ఎలా అన్నది ఇక్కడే అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం.ప్ర: ఆంథ్రోపిక్ లాంటి సంస్థలు కోడింగ్లో ఏఐ వాడకాన్ని తగ్గించాలని చెబుతూంటే మీరు పెంచుతున్నారా?జ: రెండింటికీ చాలా తేడా ఉంది. మేము ఏఐతోనే ఏఐని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆంథ్రోపిక్ వ్యవస్థలపై దాడులు చేసి, లోపాలను పసిగట్టి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. థియోమ్ దీనికి భిన్నంగా ఏఐని అస్సలు నమ్మకుండా, తగిన రక్షణ ఏర్పాట్లతో సాఫ్ట్వేర్ ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో మానవ పర్యవేక్షణ ఎక్కువన్నమాట.ప్ర: ఏఐ రంగంలో ఉన్నారు కాబట్టి... జనరల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందని మీ అంచనా?జ: చెప్పడం కష్టం. కాకపోతే ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జనరల్ ఇంటెలిజెన్స్ అన్నది ఏదో ఒక దశలో అందుబాటులోకి వస్తుందని చెప్పవచ్చు కానీ.. ఇన్నేళ్లు, ఇన్ని నెలలు అని చెప్పలేము.ప్ర: ఏఐతో ఉద్యోగాలు పోతాయంటున్నారు. మీ అంచనా ఏమిటి?జ: నా ఉద్దేశం ప్రకారం ఉద్యోగాల నిర్వచనం మారిపోతుంది అంతే. ఇంటర్నెట్, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చిన కొత్తలో చాలా ఉద్యోగాలు పోతాయని అనేవారు. కానీ కొత్త రకాల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు ఏఐ స్థానంలో మళ్లీ మానవ వనరులను వాడుకుంటున్నాయి. విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏఐ వ్యవస్థలపై ఆధారపడటం వల్ల ఈ సమస్య వచ్చింది.హైదరాబాద్లో థియోమ్ కొత్త కార్యాలయండేటా, కృత్రిమ మేధ రక్షణ రంగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా దూసుకుపోతున్న థియోమ్ సంస్థ భారతదేశంలో తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో తన కొత్త కార్యాలయాన్ని తాజాగా ప్రారంభించింది. థియోమ్ తన అంతర్జాతీయ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు, కొత్త ఆవిష్కరణలను రూపకల్పన చేసేందుకు ఈ ఫెసిలిటీ దోహదపడనుందని చెప్పింది.భారతదేశపు ప్రముఖ సాంకేతిక హబ్ల్లో ఒకటైన హైదరాబాద్ కేంద్రంగా.. ఇంజినీరింగ్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ఆపరేషనల్ ఎక్సలెన్స్ రంగాల్లో థియోమ్ కీలక అడుగులు వేయనుంది. ఇక్కడి టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకుంటూ తమ ఉత్పత్తుల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని సంస్థ భావిస్తోంది. ఈ త్రైమాసికం ముగిసే నాటికి హైదరాబాద్ కేంద్రంలో 50 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని థియోమ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. డేటా సెక్యూరిటీ, క్లౌడ్ ప్రొటెక్షన్, ఏఐ ఆధారిత ఎంటర్ప్రైజ్ రక్షణ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలను తీసుకురావాలనే థియోమ్ దీర్ఘకాలిక ప్రపంచవ్యాప్త వ్యూహంలో భాగంగానే ఈ కేంద్రం రూపుదిద్దుకుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గడిచిన రెండు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
దేశాల జీడీపీలను దాటేసిన మస్క్ సంపద
ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని ప్రధాన దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థలను (జీడీపీ) సైతం అధిగమించడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐంఎఎఫ్) తాజా అంచనాలతో మస్క్ సంపదను పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆధునిక పారిశ్రామిక ప్రపంచంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ వివాదాలు-విజయాల నడుమ దూసుకుపోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆయన సంస్థ ‘స్పేస్ఎక్స్’ యూఎస్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) నిధులను సేకరించింది. దాంతో మస్క్ అధికారికంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ డాలర్లకుపైగా(సుమారు రూ.103 లక్షల కోట్లు) ఆస్తుల అధిపతిగా అవతరించారు.తైవాన్ కంటే ఎక్కువే.సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచ కేంద్రంగా పేరొందిన తైవాన్ దేశ వార్షిక జీడీపీ 976.7 బిలియన్ డాలర్లు. అయితే, స్పేస్ఎక్స్ ఐపీఓ తర్వాత మస్క్ నికర సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు (1,100 బిలియన్ డాలర్లు) చేరడంతో తైవాన్ దేశం ఒక ఏడాదిలో సృష్టించే మొత్తం ఆర్థిక విలువ కంటే మస్క్ వ్యక్తిగత ఆస్తే ఎక్కువని తేలింది.ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం.. సంపన్న దేశాలైన నెదర్లాండ్స్ (జీడీపీ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు), టర్కీ (జీడీపీ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (జీడీపీ సుమారు 1.05 ట్రిలియన్ డాలర్లు) వంటి దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల పరిమాణంతో ఎలాన్ మస్క్ ఒంటరిగా పోటీ పడుతున్నారు. ఒక వ్యక్తి ఆస్తులు ఏకంగా ఒక సార్వభౌమ దేశ ఆర్థిక వ్యవస్థను దాటిపోవడం ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది మొదటిసారి.ఇదీ చదవండి: స్పేస్ఎక్స్ ఐపీఓతో ప్రభంజనం -
870 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 238 పాయింట్లు ఎగబాకి 23,407 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 876 పాయింట్లు పెరిగి 74,701 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.81బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 88.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.46 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.75 శాతం పెరిగింది.నాస్డాక్ 2.54 శాతం పుంజుకుంది.Today Nifty position 12-06-2026(time: 09:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్పాటిఫైలో నకిలీ పాడ్కాస్ట్ల గుట్టురట్టు!
డిజిటల్ ప్రపంచంలో వినోదానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు ఇప్పుడు అక్రమ మాదకద్రవ్యాల అమ్మకాలకు మార్గమవుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఆడియో స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై వేదికగా సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ డ్రగ్స్ దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అత్యంత ప్రమాదకరమైన ఔషధాలను విక్రయించే అక్రమ ఆన్లైన్ ఫార్మసీలను ప్రోత్సహిస్తున్న పదివేల నకిలీ పాడ్కాస్ట్లను స్పాటిఫై యాజమాన్యం తాజాగా తొలగించింది. అమెరికాకు చెందిన సీఎన్ఎన్ గతంలో ప్రచురించిన పరిశోధనాత్మక కథనాల ఆధారంగా, యూఎస్ సెనేటర్ మాగీ హసన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి దర్యాప్తులో ఈ షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.అసలేమిటీ కుంభకోణం?గత ఏడాది మే నెలలో అమెరికాలో నిషేధిత లేదా కఠినమైన నిబంధనలు గల అడెరాల్, ఆక్సికాంటిన్ వంటి తీవ్ర ప్రభావం చూపే మందులను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆన్లైన్లో విక్రయించే ముఠాలు స్పాటిఫైని వేదికగా చేసుకున్నట్లు సీఎన్ఎన్ గుర్తించింది. దీనిపై స్పందించిన న్యూ హాంప్షైర్ డెమొక్రాట్, జాయింట్ ఎకనామిక్ కమిటీ ర్యాంకింగ్ సభ్యురాలు సెనేటర్ మాగీ హసన్ తక్షణమే దర్యాప్తునకు ఆదేశించారు.గురువారం విడుదలైన ఈ దర్యాప్తు నివేదిక ఫలితాలు డిజిటల్ ప్లాట్ఫారమ్ల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. నేరగాళ్లు కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకుంటూ భారీ ఎత్తున కుంభకోణాలకు పాల్పడుతున్నారని నివేదిక హెచ్చరించింది. ‘నేరస్థులు ప్రమాదకరమైన చర్యలను వేగంగా నిర్వహించేందుకు ఏఐని ఉపయోగిస్తున్నారు. కాబట్టి అన్ని ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ముందడుగు వేయాలి. తమ వినియోగదారులను రక్షించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్ను తొలగించడానికి సమగ్ర వ్యూహాలను అమలు చేయాలి’ అని హసన్ అన్నారు.ఆప్టిమైజేషన్ కోసం స్పామ్ దాడిఈ వ్యవహారంపై స్పాటిఫై ప్రతినిధి లారా బాటే స్పందిస్తూ.. ఇవి నేరుగా స్పాటిఫై వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని చేసినవి కావని, సెర్చ్ ఇంజిన్లలో సదరు అక్రమ ఆన్లైన్ ఫార్మసీల వెబ్సైట్లు మొదటి వరుసలో కనిపించేలా చేసేందుకు (ఎస్ఈఓ) ప్లాన్ చేసిన స్పామ్ దాడి అని వివరించారు. యాప్ నిబంధనల ప్రకారం అక్రమ మాదకద్రవ్యాల ప్రమోషన్ను నిషేధించామన్నారు. దీనికోసం ఆటోమేటెడ్ టెక్నాలజీతో పాటు హ్యూమన్ రివ్యూవర్లను వాడుతున్నామని కంపెనీ తెలిపింది. ఈ నకిలీ కంటెంట్ ద్వారా తాము ఎలాంటి ఆదాయాన్ని గడించలేదని స్పాటిఫై స్పష్టం చేసింది.స్పాటిఫై చర్యలుగత ఏడాది మే నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు 3,500 పాడ్కాస్ట్ అకౌంట్లును బ్లాక్ చేశారు. ఏకంగా 57,000 వ్యక్తిగత ఎపిసోడ్లు (అంతకుముందు ఏడాది కేవలం 100 లోపు ఖాతాలు మాత్రమే తొలగించబడటం గమనార్హం) తొలగించారు. అయితే, ఇలా తొలగించిన వాటిలో 94% పాడ్కాస్ట్లు ఎప్పుడూ ప్లే అవ్వలేదని స్పాటిఫై తెలిపింది. కానీ, మోడాఫినిల్ అనే డ్రగ్ను బిట్కాయిన్ ద్వారా కొనమని ప్రోత్సహించిన ఒక సిరీస్ను దాదాపు 13,000 సార్లు వినడం ఆందోళన కలిగిస్తోందని చెప్పింది.స్పాటిఫై మాత్రమే కాదు..సెనేటర్ హసన్ నివేదిక ప్రకారం, ఈ సమస్య కేవలం స్పాటిఫైకే పరిమితం కాలేదు. ఇతర ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లలో కూడా ఈ తరహా నకిలీ ఆడియోలు లభ్యమవుతున్నాయి. ఐహార్ట్లో ‘క్సానాక్స్ పిల్స్’ ఆన్లైన్ ప్రకటనలు కలకలం రేపాయి. అమెజాన్ మ్యూజిక్ అండ్ పాడ్ చేజర్లోనూ నిషేధిత మందులను ప్రోత్సహించే సిరీస్లను పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఈ అంశాలపై అమెజాన్ మ్యూజిక్, ఐహార్ట్ సంస్థలు అధికారికంగా ఇంకా స్పందించలేదు.ఇదీ చదవండి: స్పేస్ఎక్స్ ఐపీఓతో ప్రభంజనం -
వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్ బంకులకు కేంద్రం కొత్త ఆదేశాలు
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మళ్లింపులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ‘మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (టెంపరరీ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై త్రూ రిటైల్ అవుట్లెట్స్) ఆర్డర్–2026’ను జారీ చేసింది.కొత్త నిబంధనల ప్రకారం వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు ఇకపై సాధారణ రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేయరాదు. వారు తమ అవసరాలను సొంత వినియోగ పంపుల ద్వారానే తీర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పెట్రోల్ బంకులు డీజిల్ను కేవలం వాహనాల ట్యాంకుల్లో లేదా PESO (Petroleum and Explosives Safety Organisation) అనుమతించిన కంటైనర్లలో మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలాగే, ఒక వినియోగదారుడు లేదా ఒక వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ విక్రయించరాదని కేంద్రం స్పష్టం చేసింది. కొనుగోలు చేసిన డీజిల్ను తిరిగి విక్రయించడం కూడా పూర్తిగా నిషేధించింది.ఈ ఆంక్షలు ప్రారంభ దశలో గరిష్ఠంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి. పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు ద్వారా ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది. నిబంధనల అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలు ప్రత్యేక నిఘా పెట్టాలని కేంద్రం ఆదేశించింది. నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ కొనుగోళ్లు, ఇంధన మళ్లింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నిత్యవసర వస్తువుల చట్టం–1955 (Essential Commodities Act, 1955) కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
స్పేస్ఎక్స్ ఐపీఓతో ప్రభంజనం
ఆధునిక పారిశ్రామిక ప్రపంచంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ వివాదాలు-విజయాల నడుమ దూసుకుపోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన ఆయన సంస్థ ‘స్పేస్ఎక్స్’ గురువారం యూఎస్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) నిధులను సేకరించింది. ఈ చారిత్రాత్మక పరిణామంతో శుక్రవారం మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభ సమయానికి ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ (1.1 ట్రిలియన్ డాలర్లకు పైగా నికర ఆస్తుల అధిపతి-సుమారు రూ.103 లక్షల కోట్లు)గా అవతరించారు.పెట్టుబడిదారుల నమ్మకం, సాంకేతిక రంగంలో మస్క్ మార్క్ వ్యూహాలు సంప్రదాయ ఆర్థిక సూత్రాలను తిరగరాస్తూ ‘మస్కోనమీ’ అనే సరికొత్త ఆర్థిక శకానికి తెరలేపాయి.సంపదలో అందని ఎత్తులో మస్క్ఈ ఐపీఓ కంటే ముందే ఫోర్బ్స్ అంచనాల ప్రకారం మస్క్ నికర విలువ సుమారు 780 బిలియన్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుత పరిణామాలతో ఆయన సంపద 1.1 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ప్రస్తుత ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయనకు, మిగిలిన వారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఊహకందని రీతిలో పెరిగిపోయింది.‘ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడు ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ సంపద కేవలం 300 బిలియన్ డాలర్ల(రూ.28 లక్షల కోట్లు) సమీపంలోనే ఉంది. అంటే మస్క్ ఆస్తులతో పోలిస్తే అది మూడింట ఒక వంతు కంటే తక్కువ. దీనిని బట్టి మస్క్ ఏ స్థాయి ఆధిక్యంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు’ అని ఫోర్బ్స్ డిప్యూటీ ఎడిటర్ (వెల్త్ విభాగం) మాట్ డురోట్ అన్నారు. ప్రస్తుతం మస్క్ సంపదలో సింహభాగం స్పేస్ఎక్స్ నుంచే వస్తోంది. ఈ సంస్థలో ఆయనకు సుమారు 866 బిలియన్ డాలర్ల విలువైన వాటా ఉంది. టెస్లా, ఎక్స్ (ట్విట్టర్) వంటి ఇతర ఆస్తులతో కలిసి ఆయన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.విలక్షణ వ్యక్తిత్వం.. అభిమాన సామ్రాజ్యంప్రపంచవ్యాప్తంగా అపరకుబేరులపై, సామాజిక అసమానతలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలోనూ మస్క్ మాత్రం భిన్నమైన ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. వారెన్ బఫెట్ వంటి సంప్రదాయ పారిశ్రామికవేత్తల తరహా కాకుండా ఇంటర్నెట్ సంస్కృతిలో ఒక కేంద్ర బిందువుగా మారి ‘పాప్ కల్చర్’ ఐకాన్గా అవతరించారు. ఆయన ‘నో-ఫిల్టర్’ (నిర్మొహమాటంగా మాట్లాడే) శైలి, సోషల్ మీడియా వేదికగా సామాన్యులతో నేరుగా సంభాషించే విధానం లక్షలాది మంది నమ్మకమైన అభిమానులను సంపాదించి పెట్టిందని కొందరు భావిస్తున్నారు.సవాళ్లు – వివాదాలుమస్క్ ప్రస్థానం కేవలం విజయాలతోనే సాగలేదు. ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాలు ముసురుకుంటూనే ఉంటాయి. ఒకే వ్యక్తి చేతిలో అపరిమితమైన అధికారం కేంద్రీకృతం కావడంపై విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ఇవ్వడం, ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్)లో కీలక పాత్ర పోషించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత విధానపరమైన విభేదాల వల్ల ట్రంప్తో సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఇటీవల ఇరుపక్షాలు కొంత సర్దుబాటు ధోరణిని ప్రదర్శించాయి. రాజకీయ వివాదాల కారణంగా గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలో టెస్లా వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.మస్క్ కంపెనీ ఐపీఓకు ఎందుకంత ఆదరణ?ఆర్థిక విశ్లేషకుల ప్రకారం, సాధారణ కంపెనీల వాల్యుయేషన్లు వాటి లాభనష్టాల ఆధారంగా లెక్కిస్తారు. కానీ మస్క్ కంపెనీల విషయంలో ఇది వర్తించదు. దీనినే మార్కెట్ వర్గాలు ‘ఎలాన్ ప్రీమియం’ అని పిలుస్తున్నాయి. అంటే భవిష్యత్తు విజన్ పట్ల మస్క్పై ఉన్న నమ్మకంతోనే పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరిస్తున్నారు. ‘టెస్లా తరహాలోనే స్పేస్ఎక్స్ కూడా పూర్తిగా మస్క్ వ్యూహంపై నడుస్తున్నదే. 1.5 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ అనేది సంప్రదాయ ఆర్థిక సూత్రాలకు విరుద్ధం. దీనిని కేవలం ‘ఎలాన్ మస్క్ ప్రీమియం’గా మాత్రమే వర్గీకరించగలం’ అని రినైసాన్స్ క్యాపిటల్ సీనియర్ స్ట్రాటజిస్ట్ మాట్ కెన్నెడీ అన్నారు.సరిహద్దులు లేని వ్యాపార సామ్రాజ్యంమస్క్(54) దక్షిణాఫ్రికాలో జన్మించి పెన్సిల్వేనియా వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేవలం టెస్లా, స్పేస్ఎక్స్లకే పరిమితం కాలేదు. ఆయన వ్యాపార నెట్వర్క్ అపారమైనది.సంస్థ పేరుప్రధాన రంగంటెస్లాఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీస్పేస్ఎక్స్అంతరిక్ష పరిశోధనలు, శాటిలైట్ ఇంటర్నెట్న్యూరాలింక్బ్రెయిన్-కంప్యూటర్ ఇంప్లాంట్స్ది బోరింగ్ కంపెనీభూగర్భ రవాణా సొరంగాలుఎక్స్ (గతంలో ట్విట్టర్)గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ఎక్స్ఏఐకృత్రిమ మేధటెస్లాను ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల కంపెనీగా మార్చడం ద్వారా అమెరికన్ ఆటోమొబైల్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా అపారమైన గౌరవాన్ని తెచ్చారని జనరల్ మోటర్స్ మాజీ వైస్ చైర్మన్ బాబ్ లుట్జ్ మస్క్ను ప్రశంసించారు.మన కాలపు ఎడిసన్మస్క్ అసాధారణ ప్రవర్తనపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఆయన సృజనాత్మకతను ప్రపంచ దిగ్గజాలు సైతం అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు మస్క్తో సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ సైతం ఇటీవల మనసు మార్చుకున్నారు. మస్క్ను మన కాలపు థామస్ ఎడిసన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని ఆయన కొనియాడడం గమనార్హం. మొత్తంగా సాంప్రదాయ ఆర్థిక రంగానికి సవాలు విసురుతూ, అంతరిక్షాన్ని వ్యాపారమయం చేస్తూ మస్క్ సాధించిన ఈ ‘ట్రిలియనీర్’ మైలురాయి మానవ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోనుంది.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు! -
సియెరా ఈవీ లాంచ్ ఎప్పుడంటే?
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా సియెరా (Tata Sierra).. జూన్ 30న ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. 2020 ఆటో ఎక్స్పోలో కనిపించిన ఈ కారు త్వరలోనే రోడ్డెక్కనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.లాంచ్ తరువాత సియెరా ఎలక్ట్రిక్ కారును కంపెనీ కార్వ్ ఈవీ, హారియార్ ఈవీ మధ్యలో ఉంచనుంది. ఇది కూడా acti.ev+ ప్లాట్ఫారమ్పై నిర్మితమవుతుంది. కాగా ఈ కారు రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఎంపికలలో అందుబాటులో ఉండనుంది.టాటా సియెరా ఈవీ 65 కిలోవాట్, 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభించనుంది. పెద్ద బ్యాటరీ ఉన్న వేరియంట్ AWD సిస్టమ్తో రావచ్చని అంచనా. డిజైన్ పరంగా.. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, కొత్త బంపర్ డిజైన్, ఈవీ బ్యాడ్జింగ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఏరోడైనమిక్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.ఇంటీరియర్ విషయానికి వస్తే.. సియెరా ఈవీ చాలా ప్రీమియం ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. టాప్ వేరియంట్లలో మూడు స్క్రీన్ల (డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ప్యాసింజర్ డిస్ప్లే) సెటప్ ఉండవచ్చు. అలాగే పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్రైవ్ మోడ్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.ధర విషయానికి వస్తే.. సియెరా ఈవీ సుమారు రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఇది ఇండియన్ మార్కెట్లో మహీంద్రా బీఈ 6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ ఈవీ, మారుతి ఈ విటారా వంటివాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
నిజమైన వారసత్వం అంటే డబ్బు కాదు!
సాధారణంగా మనం వారసత్వం అంటే డబ్బు, ఇల్లు లేదా భూమి అని భావిస్తాం. కానీ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మాత్రం.. నిజమైన వారసత్వం అనేది డబ్బు కాదు, సంపదను సృష్టించే వ్యవస్థలు అని అభిప్రాయపడుతున్నారు.కియోసాకి ప్రకారం.. పేద కుటుంబాల పిల్లలకు సాధారణంగా జ్ఞాపకాలు, కుటుంబ వస్తువులు, ఆభరణాలు వంటి భావోద్వేగ విలువ కలిగిన వస్తువులు వారసత్వంగా వస్తాయి. మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు మాత్రం ఇళ్లు, విద్యా రుణాలు, పన్ను బాధ్యతలు వంటి ఆర్థిక బాధ్యతలు ఎక్కువగా మిగులుతాయి. ధనిక కుటుంబాల పిల్లలకు మాత్రం.. ట్రస్టులు, కంపెనీలు, వ్యాపారాలు, పెట్టుబడి వ్యవస్థలు వంటి సంపదను నిరంతరం ఉత్పత్తి చేసే నిర్మాణాలు వారసత్వంగా లభిస్తాయి.మధ్యతరగతి ప్రజలు వారసత్వం అంటే డబ్బు అని నమ్ముతారు. కానీ ధనికులు డబ్బు తాత్కాలికమని తెలుసుకుంటారు. చేతిలో ఉన్న డబ్బు క్రమంగా ఖర్చైపోతుంది. అయితే.. మంచి వ్యవస్థలు నిరంతరం ఆదాయాన్ని సృష్టిస్తూనే ఉంటాయి. అందుకే వారు కేవలం డబ్బును కాకుండా, ఆ డబ్బును పెంచే నిర్మాణాలను తదుపరి తరాలకు అందిస్తారు.ట్రస్టులు, కంపెనీలు కేవలం చట్టపరమైన పత్రాలు మాత్రమే కావు. అవి కుటుంబ సంపదను రక్షించే సాధనాలు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆస్తులను కాపాడి, నిర్వహించి, తదుపరి తరాలకు అందించే విధంగా అవి పనిచేస్తాయి. ఈ కారణంగా ధనిక కుటుంబాల సంపద తరతరాలుగా కొనసాగుతుంది.విద్యా వ్యవస్థ.. పిల్లలకు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడం నేర్పుతుంది. కానీ సంపన్న కుటుంబాలు తమ పిల్లలకు ఆస్తులను సంపాదించడం, పెట్టుబడులను ఎలా నిర్వహించాలి, వ్యాపారాలను ఎలా కొనసాగించాలి అనే విషయాలను నేర్పిస్తాయి. అందువల్ల ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ధనిక కుటుంబాల పిల్లలు ఎక్కువగా భయపడరు. ఎందుకంటే వారి ఆదాయం కేవలం జీతంపై ఆధారపడదు. వారసత్వంగా వచ్చిన వ్యాపారాలు, పెట్టుబడులు, ఇతర వ్యవస్థలు వారికి నిరంతర నగదు ప్రవాహాన్ని అందిస్తాయి.మరోవైపు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు తరచుగా బాధ్యతలను మాత్రమే వారసత్వంగా పొందుతారు. బయటకు విలువైన ఆస్తుల్లా కనిపించే కొన్ని వస్తువులు, వాస్తవానికి అప్పులు, నిర్వహణ ఖర్చులతో కూడి ఉండవచ్చు. అందువల్ల వారికి సంపద కంటే బాధ్యతలు ఎక్కువగా మిగులుతాయి.ఇక్కడ.. జీవితాంతం ఉద్యోగం చేసి, చివరికి అప్పులు లేదా ఆర్థిక బాధ్యతలు మాత్రమే మిగిల్చిన తల్లిదండ్రులు విఫలమయ్యారని కాదు. వారు పెరిగిన ఆర్థిక ఆలోచనా విధానం అలాంటిదని కియోసాకి సూచిస్తున్నారు. ఉద్యోగం మన జీవితం వరకు మాత్రమే కొనసాగుతుంది. కానీ నిర్మించిన వ్యవస్థలు మన తర్వాత కూడా పనిచేస్తూ సంపదను సృష్టిస్తాయని చెబుతున్నారు. -
రూపాయి 60 పైసలు క్రాష్..!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ 60 పైసలు క్షీణించి 95.85 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం కావడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 95.55 వద్ద ప్రారంభమైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనవుతూ, కోలుకోలేకపోయింది. ఒకానొకదశలో ఇంట్రాడే కనిష్ట స్థాయి 95.85ను తాకిన రూపాయి, చివరికి అదే స్థాయి వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 95 డాలర్ల దిశగా కదలడం, అమెరికా చమురు నిల్వలు తగ్గడం వల్ల సరఫరా కొరత భయాలు నెలకొన్నాయి. -
లాంచింగ్కు స్పేస్ఎక్స్ రెడీ!
రాకెట్ ప్రయోగాల వేదిక, ప్రపంచవ్యాప్త శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ కలిగిన దిగ్గజం స్పేస్ఎక్స్ ఐపీవో సరికొత్త రికార్డులు నెలకొల్పనుంది. కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ ఈ కంపెనీ లిస్టింగ్తో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్లు)గా అవతరించనున్నారు. అటు కార్పొరేట్లను, ఇటు ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఇష్యూకి రిస్క్ లు సైతం ఎక్కువే. అయితే దేశీ ఇన్వెస్టర్ల ఐపీవో దరఖాస్తుకు నిబంధనలు అడ్డుపడుతుండటంతో లిస్టింగ్ తదుపరి కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది! యూఎస్ ఈవీ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రాకెట్ కంపెనీ.. స్పేస్ఎక్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టింది. షేరుకి 135 డాలర్ల ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా 55.56 కోట్ల షేర్లను ఆఫర్ చేయడం ద్వారా 75 బిలియన్ డాలర్లు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు అత్యధికంగా 35 శాతం వాటా ఆఫర్ చేయడం విశేషం. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించడంతో ఇష్యూ 3 రెట్లకు పైగా ఓవర్ సబ్స్క్రయిబ్ (250 బిలియన్ డాలర్ల విలువైన బిడ్లు) అయింది. నేడు (12న) లిస్ట్కానున్న కంపెనీ ప్రపంచంలోనే అత్యంత భారీ ఇష్యూగా రికార్డ్ నెలకొల్పనుంది. తద్వారా 1.75 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను అందుకోనున్నట్లు అంచనా. వెరసి ప్రపంచంలోని అత్యంత విలువైన దిగ్గజాలలో ఒకటిగా నిలవనుంది. ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓ రికార్డు సౌదీ ఆరా మ్కో (29.4 బి. డాలర్లు) పేరిట ఉండగా.. దీన్ని స్పేస్ఎక్స్ బ్రేక్ చేయనుంది. లిస్టింగ్లోనే ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన రెండో కంపెనీ (మొదటిది సౌదీ ఆరామ్కో) గా కూడా రికార్డులకెక్కనుంది. మరోపక్క స్టాక్ ఆప్షన్స్ పొందిన కంపెనీ ఉద్యోగుల సంపద సృష్టికి సైతం తెరలేవనుంది!స్పేస్ఎక్స్ అంటే? 2002లో ఏర్పాటైన స్పేస్ఎక్స్ ప్రయివేట్ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐపీవోతో పబ్లిక్ మార్కెట్లో ప్రవేశించనుంది. రాకెట్ లాంచింగ్తోపాటు..అంతరిక్ష ప్రయాణ(స్పేస్ ట్రాన్స్పోర్టేషన్) సేవలందిస్తోంది. అయితే కంపెనీ వృద్ధికి ప్రధానంగా దోహదపడుతున్నది మాత్రం స్టార్లింక్గా పేర్కొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా టెలికం సేవలందించగల శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఇది. ఐపీవో ద్వారా స్టార్లింక్ సేవల విస్తరణకు నిధులు లభించనున్నాయి. అంతేకాకుండా కొత్త స్పేస్క్రాఫ్ట్ అభివృద్ధి, స్పేస్ ఎక్స్ప్లొరేషన్ తదితరాలకు సైతం ఆర్థికంగా మద్దతు లభించనుంది. స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ కనెక్టివిటీ, వాణిజ్యపరమైన స్పేస్ ట్రావెల్లో ఇన్వెస్ట్ చేసేందుకు రిటైలర్లకు సైతం వీలు కల్పిస్తుండటం కంపెనీ ఐపీవోకున్న ప్రత్యేకతలుగా పేర్కొనవచ్చు. మస్క్ మస్త్.. మస్త్ స్పేస్ఎక్స్ లిస్టింగ్తో ప్రమోటర్ ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా అవతరించే వీలుంది. స్పేస్ఎక్స్ ప్రణాళికలు ఫలిస్తే మార్స్లోకి మానవులను పంపిన తొలి కంపెనీగా ఘనత వహించవచ్చు. అయితే కంపెనీ కార్యకలాపాలు అత్యంత వ్యయభరితంకావడం, అత్యధిక పెట్టుబడుల అవసరం ఉండటంతో రిస్కులూ అధికమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్పేస్ఎక్స్కు గ్లోబల్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఏర్పాటు చేసిన బ్లూ ఒరిజిన్ నుంచి పోటీ ఉంది. ఇదేవిధంగా ఏఎస్టీ స్పేస్మొబైల్ నుంచి స్టార్లింక్కు సైతం సెగ తగులుతోంది.రాకెట్ స్పీడ్పునర్వినియోగానికి వీలు కల్పించే రాకెట్ సాంకేతికతకు తెరతీయడం ద్వారా స్పేస్ఎక్స్ సరికొత్త మార్పులకు తెరతీసింది. దీంతో రాకెట్ల ప్రయోగ వ్యయాలు తగ్గాయి. ఫాల్కన్ రాకెట్లు శాటిలైట్ లాంచింగ్, స్పేస్ మిషన్స్కు వినియోగించవచ్చు. అయితే కంపెనీ బిజినెస్లలో స్టార్లింక్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈవీ దిగ్గజం టెస్లాసహా.. పేపాల్కు ఊపిరిపోసిన ప్రమోటర్ ఎలాన్ మస్క్ కంపెనీ కావడంతో స్పేస్ఎక్స్పై భారీ అంచనాలున్నాయి.లిస్టింగ్ తర్వాతే...దేశీ ఇన్వెస్టర్లు స్పేస్ఎక్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు లిస్టింగ్ తదుపరి మాత్రమే వీలుంటుంది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ పథకం(ఎల్ఆర్ఎస్)లో భాగంగా అంతర్జాతీయ బ్రోకరేజీ ప్లాట్ఫామ్స్ ద్వారా షేర్ల కొనొచ్చు. అధిక విలువ కారణంగా లిస్టింగ్ తర్వాత కంపెనీ పనితీరుపై ఒత్తిడి పెరిగే వీలుంది. ప్రాజెక్టుల్లో ఆలస్యం, రాకెట్ ప్రయోగాలలో అనుకోని సవాళ్లు, టెక్నాలజీ వైఫల్యాల వంటి రిస్క్ లున్నాయి. 2025లో 18.67 బిలియన్ డాలర్ల ఆదాయం, 4.94 బి. డాలర్ల నష్టం నమోదు చేసింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నెల రోజుల్లో IRCTC కొత్త వెబ్సైట్..
రైల్వే టికెట్ బుకింగ్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జూలై 15 నాటికి పూర్తిగా పునరుద్ధరించిన, ఆధునిక ఫీచర్లతో కూడిన కొత్త ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులతో జరిగిన ఓ సమావేశంలో ప్రస్తుత పోర్టల్లో ఉన్న లోపాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.సమావేశంలో ఓ విద్యార్థిని క్యాప్చా సమస్యలు, తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్సైట్ నెమ్మదించడం లేదా క్రాష్ కావడం, పాతబడిన డిజైన్, తరచూ ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందుల గురించి ప్రస్తావించింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, 30 రోజుల్లో కొత్త వెబ్సైట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం జూలై 15న కొత్త పోర్టల్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.రైల్వే వర్గాల సమాచారం ప్రకారం, కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ మరింత వేగవంతంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నారు. టికెట్ బుకింగ్ ప్రక్రియను సరళీకృతం చేయడం, అధిక ట్రాఫిక్ను సమర్థంగా నిర్వహించడం, చెల్లింపుల ప్రక్రియను మెరుగుపరచడం, మొబైల్, డెస్క్టాప్ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నారు. -
అనంత్తో పెళ్లి.. అంబానీ కోడలి ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అంబానీ కుటుంబానికి కోడలైన రాధికా మర్చంట్ మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (IIMUN) కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. వివాహ బంధంలో సమానత్వం, పరస్పర గౌరవం, మహిళల ఆర్థిక స్వేచ్ఛ ప్రాముఖ్యతపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.అనంత్ అంబానీతో వివాహంపై..అనంత్ అంబానీతో తన దాంపత్య జీవితం గురించి మాట్లాడుతూ, ఒక విజయవంతమైన వివాహానికి ‘ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు’ అన్న భావన కంటే పరస్పర గౌరవమే ముఖ్యమని చెప్పారు. ప్రతి సంబంధంలో రాజీలు సహజమేనని, కొన్ని సందర్భాల్లో అనంత్ తన అభిప్రాయాన్ని పక్కన పెడతారని, మరికొన్ని సందర్భాల్లో తాను రాజీ పడతానని పేర్కొన్నారు. అయితే, ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకునేంత వరకు ఆ బంధం సమానత్వంతోనే కొనసాగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై మాట్లాడిన రాధికా, కుటుంబ నేపథ్యం ఎంత గొప్పదైనా, జీవిత భాగస్వామి ఎంత సంపన్నుడైనా, ప్రతి మహిళ తన సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. “మీరు ఎవరి కుమార్తె అయినా, ఎవరి భార్య అయినా, మీ జీవితంలో ఎంత సౌకర్యంగా ఉన్నా సరే, మీ నిర్ణయాలు మీరే తీసుకునే శక్తి ఉండాలంటే ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం” అని ఆమె అన్నారు.అది ప్రమాదకరంఆర్థికంగా పూర్తిగా ఇతరులపై ఆధారపడటం ప్రమాదకరమని హెచ్చరించిన ఆమె, జీవితంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని పేర్కొన్నారు. “మీకు బయటపడే అవకాశం లేనంతగా ఏదైనా పరిస్థితికి బంధించబడకండి” అని రాధిక సూచించారు.సమాజంలో నిజమైన లింగ సమానత్వం సాధించాలంటే మహిళలకు విద్య, ఉపాధి, వ్యాపారం, ఆస్తుల సృష్టి వంటి రంగాల్లో మరింత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని రాధిక అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థిక సాధికారత లేకుండా సంపూర్ణ సమానత్వం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక స్వేచ్ఛ కుటుంబాల్లో నిర్ణయాధికారాన్ని పెంచుతుందని, వ్యక్తిగత గౌరవాన్ని బలోపేతం చేస్తుందని పలువురు నిపుణులు కూడా చెబుతున్నారు. View this post on Instagram A post shared by Isha Ambani Piramal (@ishaambani)ప్రముఖ వ్యాపారవేత్తలు వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్ 1994లో ముంబైలో జన్మించారు. న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె, భారతీయ శాస్త్రీయ నృత్యంలో కూడా శిక్షణ పొందారు. ప్రస్తుతం కుటుంబానికి చెందిన ఆరోగ్య సంరక్షణ వ్యాపార సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. అనంత్ అంబానీతో గత ఏడాది జరిగిన ఆమె వివాహం దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం పొందింది. -
ఆ భయం నాకూ ఉంది: AIపై ఆంథ్రోపిక్ సీఈఓ ఆందోళన
కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి మానవ సమాజానికి అపార అవకాశాలు తెస్తున్నప్పటికీ, అదే సమయంలో తీవ్రమైన ప్రమాదాలకు కూడా దారితీయవచ్చని ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోడేయి (Dario Amodei) హెచ్చరించారు. “ఏదో ఒక సమయంలో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందనే ఆందోళన నాకూ ఉంది” అంటూ ఆయన తాజా బ్లూమ్బర్గ్ డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించారు.ఏఐ భద్రత అంశంపై చాలా కాలంగా గళం విప్పుతున్న అమోడేయి, ప్రపంచవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలు ప్రభుత్వాల నియంత్రణ సామర్థ్యాన్ని మించిపోయే వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించిన సర్వేల ప్రకారం, సగానికి పైగా ప్రజలు ఏఐ కారణంగా ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు.“స్వచ్ఛంద నియంత్రణ సరిపోదు”ఏఐ కంపెనీలు స్వయంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పడం మాత్రమే ఇక సరిపోదని అమోడేయి అభిప్రాయపడ్డారు. తాజాగా విడుదల చేసిన తన విధాన వ్యాసంలో, అత్యాధునిక “ఫ్రంటియర్ ఏఐ” మోడళ్లను విడుదల చేసే ముందు తప్పనిసరిగా స్వతంత్ర థర్డ్ పార్టీ సంస్థల ద్వారా పరీక్షించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ దాడులు, జీవాయుధాల అభివృద్ధి, మానవ నియంత్రణను దాటిపోయే స్వయంప్రతిపత్తి వంటి ప్రమాదాలను అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో మోడళ్లు విఫలమైతే, వాటి విడుదలను నిలిపివేసే లేదా పూర్తిగా నిరోధించే అధికారం ప్రభుత్వాలకు ఉండాలని ఆయన వాదించారు.ఓపెన్ఏఐతో విభేదాలూ ఇందుకే..ఒకప్పుడు ఓపెన్ఏఐ (OpenAI)లో కీలక పరిశోధకుడిగా పనిచేసిన అమోడేయి, ఏఐ భద్రత అంశాలపై విభేదాల కారణంగా సంస్థను విడిచి ఆంథ్రోపిక్ను స్థాపించారు. వాణిజ్య ప్రయోజనాలు, వేగవంతమైన ఉత్పత్తి విడుదల కంటే భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన వైఖరి. ఇదే సమయంలో ఓపెన్ఏఐ కూడా ఏఐ రిస్క్లపై తామూ స్పష్టమైన అవగాహనతో ఉన్నామని, “ప్రతిదీ పూర్తిగా ఆటోమేట్ కావడం మాకు కావలసిన భవిష్యత్తు కాదు” అని ఇటీవల వెల్లడించింది. ఏఐ వల్ల భారీ ఉత్పాదకత పెరుగుదల సాధ్యమైనప్పటికీ, ఉద్యోగాలపై దాని ప్రభావం, సామాజిక పరిణామాలను నిర్లక్ష్యం చేయరాదని పరిశ్రమ నాయకులు అంగీకరిస్తున్నారు.భారత్లోనూ నియంత్రణ ఆలోచనఏఐ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు వేగంగా జరుగుతున్న వేళ, భారత్ కూడా ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని గుర్తిస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఇటీవల మాట్లాడుతూ, 2000 నాటి ఐటీ చట్టం ఆధునిక ఏఐ యుగానికి సరిపోదని, ఆవిష్కరణకు ప్రోత్సాహం ఇస్తూనే పౌరుల భద్రతను కాపాడే కొత్త విధానాలు అవసరమని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’ -
‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’
ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Robert Kiyosaki) రచయిత, ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ఒక ప్రసిద్ధ పెట్టుబడి సూత్రాన్ని విమర్శించారు. చాలామంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ‘డైవర్సిఫికేషన్’ చేశామని భావిస్తుంటారని, వాస్తవానికి వారు ‘డీ-వర్స్-ఇఫికేషన్’ (పరిస్థితిని మరింత దిగజార్చే ప్రక్రియ) చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి.. బంగారం, వెండి, బిట్కాయిన్, స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్, చమురు వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ అవన్నీ ఈటీఎఫ్లు, ఆర్ఈఐటీలు లేదా ఇతర ఆర్థిక సాధనాల రూపంలో ఉంటే అవి చివరికి ఒకే “పేపర్ అసెట్” వర్గానికి చెందినవేనని అన్నారు. అలాంటి పెట్టుబడులు నిజమైన డైవర్సిఫికేషన్ కాదని, కేవలం తాము పెట్టుబడులను వైవిధ్యీకరించామని ఇన్వెస్టర్లు భావించే పరిస్థితి మాత్రమేనని వివరించారు.తాను మాత్రం నేరుగా యాజమాన్యం, నియంత్రణ, కస్టడీ తన చేతుల్లో ఉండే “రియల్ అసెట్స్”ను ఇష్టపడతానని కియోసాకి పేర్కొన్నారు. బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ లేదా ఇతర భౌతిక ఆస్తులను నేరుగా కలిగి ఉండటం కోసం కొంత ఎక్కువ ఖర్చు, సమయం వెచ్చించాల్సి వచ్చినా, వాటి గురించి మరింత అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని రాసుకొచ్చారు.“ఇది నా వ్యక్తిగత పెట్టుబడి విధానం. కొంతమంది దీనిని నా జాగ్రత్త లేదా అనుమాన స్వభావంగా చూడొచ్చు. కానీ నా ఎంపిక ఇదే. మీ ఎంపిక ఏమిటి? డైవర్సిఫికేషన్నా? లేక డీ-వర్స్-ఇఫికేషన్నా?” అంటూ పెట్టుబడిదారులను కియోసాకి ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఈటీఎఫ్లు, డెరివేటివ్ ఉత్పత్తులు, భౌతిక ఆస్తులపై మరోసారి చర్చకు దారితీశాయి.DEWORSE-IFIED is not Diversified.Many people are “De-Worsified” not “Diversified.”“De-Worse-ified” means they think they are diversified, but they have all their “diversified” assets, such as gold, silver, Bitcoin, stocks, bonds, real estate, and oil, in one asset class….the…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 9, 2026 -
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో సంఘర్షణ తీవ్రమైన కారణంగా రిస్క్ సెంటిమెంట్ దెబ్బతినడతో నిఫ్టీ 50, సెన్సెక్స్ అస్థిర సెషన్ ను నష్టాలతో ముగించాయి. నిఫ్టీ 53.35 పాయింట్లు లేదా 0.23 శాతం తగ్గి 23,161.60 వద్ద, సెన్సెక్స్ 150.63 పాయింట్లు లేదా 0.20 శాతం క్షీణించి 73,832.55 వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, ఎటర్నల్ నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.81 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.67 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్, నిఫ్టీ కెమికల్ షేర్లు అత్యధికంగా క్షీణించాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఫార్మా షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి. -
యువ ఆవిష్కర్తలకు బంపర్ ఆఫర్..
డిగ్రీ సర్టిఫికేట్లు, క్లాస్రూమ్ పాఠాలు మాత్రమే జీవితాన్ని నిర్దేశించలేవని నమ్మే యువ మేధావులకు కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. సాంప్రదాయ విశ్వవిద్యాలయాల చట్రం నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని మార్చే సరికొత్త ఆలోచనలతో దూసుకుపోయే యువ ఆవిష్కర్తల కోసం ప్రతిష్టాత్మక ‘థీల్ ఫెలోషిప్ 2026’ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఏకంగా 2,50,000 డాలర్లు (సుమారు రూ.2.10 కోట్లు) భారీ గ్రాంట్తో పాటు అంతర్జాతీయ మార్గదర్శకత్వాన్ని (మెంటార్షిప్) ఈ ప్రోగ్రామ్ అందించనుంది.ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్, పేపాల్ సహ-వ్యవస్థాపకుడు పీటర్ థీల్ 2011లో స్థాపించిన ఈ ఫెలోషిప్, గ్లోబల్ స్టార్టప్ రంగాన్ని శాసించే అత్యుత్తమ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.అసలు ఏంటి ఈ థీల్ ఫెలోషిప్?సాధారణంగా ఉన్నత విద్య కోసం లక్షలాది రూపాయల అప్పులు చేసి డిగ్రీలు పూర్తి చేశాక ఉద్యోగాల కోసం వెతకడం ఒక సంప్రదాయం. కానీ, థీల్ ఫెలోషిప్ దీనికి భిన్నమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఫెలోషిప్కు ఎంపికైన యువకులు తమ రెండేళ్ల కాలపరిమితిలో కాలేజీ చదువులకు స్వస్తి చెప్పాలి. చదువు పక్కన పెట్టి తాము నమ్మిన సరికొత్త వ్యాపార ఆలోచనలను లేదా పరిశోధనలను నిజం చేయడంపైనే పూర్తి దృష్టి సారించాల్సి ఉంటుంది.ఫెలోషిప్ ద్వారా లభించే ప్రయోజనాలుఎలాంటి ఈక్విటీ (వాటా) ఆశించకుండా రెండేళ్ల కాలానికి 2,50,000 డాలర్లు సహాయం.సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి పెట్టుబడిదారులు (వెంచర్ క్యాపిటలిస్ట్లు), శాస్త్రవేత్తలు, విజయవంతమైన పారిశ్రామికవేత్తలతో నేరుగా పనిచేసే అవకాశం.విద్యా రుణాలు, ఫీజుల ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా టెక్నాలజీలు, ఉత్పత్తులను రూపొందించుకునే స్వేచ్ఛ.ఇప్పటికే ఈ ఫెలోషిప్ ద్వారా లబ్ధి పొంది ప్రస్తుతం బిలియన్ డాలర్ల కంపెనీలను నడుపుతున్న పూర్వ విద్యార్థుల గ్లోబల్ కమ్యూనిటీలో సభ్యత్వం.ఏయే రంగాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత?టెక్నాలజీ మారుతున్న వేగానికి అనుగుణంగా భవిష్యత్తును మార్చే సత్తా ఉన్న ఏ రంగంలోని ప్రాజెక్ట్ అయినా ఈ ఫెలోషిప్కు అర్హమైనదే. ముఖ్యంగా కింది రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.రంగంప్రాధాన్యత గల అంశాలుసాంకేతికతఏఐ, మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ఆరోగ్యం, జీవశాస్త్రంబయోటెక్నాలజీ, మెడికల్ ఇన్నోవేషన్స్, హెల్త్కేర్ సొల్యూషన్స్పర్యావరణంగ్రీన్ ఎనర్జీ, వాతావరణ మార్పుల నివారణ, సుస్థిర అభివృద్ధిఇంజినీరింగ్అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్, ఎడ్యుకేట్, సోషల్ వెంచర్స్అర్హతలుఈ ఫెలోషిప్ కోసం ఎటువంటి నిర్దిష్ట విద్యా అర్హతలు లేదా డిగ్రీలు అవసరం లేదు. కేవలం అసాధారణ సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే బలమైన ఆశయం, సాంప్రదాయ పద్ధతులను సవాలు చేసే ధైర్యం ఉన్న యువత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతీ యువకులకు ఈ అవకాశం అందుబాటులో ఉంది.దరఖాస్తు విధానంఆసక్తి గల అభ్యర్థులు థీల్ ఫెలోషిప్ అధికారిక వెబ్సైట్(https://thielfellowship.org/) ద్వారా ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత నేపథ్యం, తాము చేస్తున్న లేదా చేయబోయే ప్రాజెక్ట్ వివరాలను సమర్పించాలి. తమ ఆలోచనల వెనుక ఉన్న దీర్ఘకాలిక లక్ష్యాలు, ఈ ఫెలోషిప్ తమకు ఎలా ఉపయోగపడుతుందనే అంశాలను స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది. అత్యంత పారదర్శకంగా, పోటీతత్వంతో కూడిన స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా తుది విజేతలను ఎంపిక చేస్తారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు! -
భారత్లో తలుపులు మూసిన ‘ఓపెన్డోర్’
సాంకేతిక రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు, ఏఐ విస్తరణ, భారతీయ ఐటీ, సర్వీస్ రంగ ఉద్యోగులపై భారీ ప్రభావమే చూపుతున్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ దిగ్గజం ‘ఓపెన్డోర్’ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 250 మంది భారతీయ ఉద్యోగులు ఒకేసారి రోడ్డున పడినట్లయింది.కంపెనీ వ్యూహాత్మక మార్పులపై ఓపెన్డోర్ సీఈఓ కాజ్ నెజాటియన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్లో కొన్ని అంశాలు అధికారికంగా ధ్రువీకరించారు. ఆ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో చర్చనీయాంశమైంది. ‘మా కస్టమర్లు అందరూ అమెరికాలోనే ఉన్నారు. కాబట్టి వారికి సేవలందించే ఆపరేషనల్ విభాగాలు కూడా ఆ కస్టమర్లకు వీలైనంత దగ్గరగా ఉండటమే వ్యాపారపరంగా ఉత్తమం’ అని చెప్పారు. గతంలో వివిధ వ్యవస్థల్లో మ్యాన్యువల్ వర్క్ఫ్లోలను నిర్వహించడానికి భారతదేశంలో ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుత సాంకేతిక పురోగతి వల్ల ఆ అవసరం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు.శ్రామిక శక్తిపై ఏఐ దెబ్బ!ఈ లేఆఫ్స్కు ప్రధాన కారణం కంపెనీ శరవేగంగా అవలంబిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతగా తెలుస్తోంది. గతంలో భారత్లోని సిబ్బంది మ్యాన్యువల్గా చేసే పనులను ఇప్పుడు అమెరికాలో ఏఐ ఎనేబుల్డ్ బృందాల సాయంతో మరింత సులభంగా పూర్తి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సాంకేతికత పెరగడం వల్ల విదేశాల్లో (భారత్లో) ప్రత్యేకంగా ఒక టీమ్ను ఉంచాల్సిన అవసరం తగ్గిందని మేనేజ్మెంట్ పేర్కొంది.I shared this note earlier today with the entire team at Opendoor. Today we began to say goodbye to our colleagues in India as we wind down our India operations.Our customers are in America, and that's where our operational work belongs. pic.twitter.com/Ak2jLxKiX5— Kaz Nejatian (@nejatian) June 10, 2026ప్రతిభకు లోటు లేదు.. కానీ తప్పట్లేదు!ఈ తొలగింపులు భారతీయ బృందం పనితీరు లోపం వల్ల జరిగినవి కావని సీఈఓ నెజాటియన్ నొక్కి చెప్పారు. భారత్లోని ఉద్యోగులు ఎంతో ప్రతిభావంతులని, ఇతర సంస్థలకు వారు అద్భుతమైన ఆస్తిగా మారుతారని ప్రశంసించారు. అయితే, వ్యాపార సరళీకరణ, ఏకీకృత ప్లాట్ఫారమ్ నిర్మాణం, మ్యాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు! -
ఆంత్రోపిక్తో చేతులు కలిపిన టీసీఎస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంచలన అడుగు వేసింది. ప్రపంచ ప్రసిద్ధ ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ భాగస్వామ్యంతో ఎంటర్ప్రైజ్ ఏఐ స్కేలింగ్ను వేగవంతం చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఐటీ రంగంలో సాంప్రదాయ శ్రమ-ఆధారిత నమూనాపై జనరేటివ్ ఏఐ ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనల నడుమ టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.50,000 మంది ఉద్యోగులకు ‘క్లాడ్ ఏఐ’ శిక్షణఈ వ్యూహాత్మక కూటమిలో భాగంగా ఆంత్రోపిక్ సంస్థకు చెందిన అత్యాధునిక ఏఐ మోడల్ ‘క్లాడ్’ వినియోగంలో దాదాపు 50,000 మంది టీసీఎస్ అసోసియేట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్కేర్ వంటి కఠినమైన నిబంధనలు ఉండే రంగాల కోసం ఇరు సంస్థలు సంయుక్తంగా సరికొత్త ఏఐ పరిష్కారాలను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. క్లాడ్ ఏఐకి ఉన్న డేటా సెక్యూరిటీ, అక్యూరసీ ఫీచర్లు కార్పొరేట్ క్లయింట్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు దోహదపడతాయని కంపెనీ అధికారులు భావిస్తున్నారు.పెట్టుబడిదారుల ఆందోళనలుభారతదేశానికి చెందిన సుమారు 315 బిలియన్ డాలర్ల ఐటీ రంగం ప్రస్తుతం ఒక కీలక సంధిగ్ధ దశను ఎదుర్కొంటోంది. సాంప్రదాయ కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ వంటి శ్రమ-ఆధారిత పనులను ఏఐ సాధనాలు భర్తీ చేస్తే ఐటీ కంపెనీల ఆదాయ నమూనా దెబ్బతింటుందనే భయాలు పెట్టుబడిదారులలో నెలకొన్నాయి.శ్రామిక శక్తిలో మార్పులుటాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మంగళవారం జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) భవిష్యత్తు వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కంపెనీ శ్రామిక శక్తిలో మానవ ఉద్యోగులు ఎంతమంది ఉంటారో, అంతే సంఖ్యలో ఏఐ ఏజెంట్లు కూడా ఉండేలా టీసీఎస్ అడుగులు వేస్తోంది. ఈ మార్పుల వల్ల రాబోయే రోజుల్లో కొత్త నియామకాల వేగం మందగించే అవకాశం ఉందని చంద్రశేఖరన్ సంకేతాలిచ్చారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు! -
కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్ సెషన్లో తులంపై రూ.4300, ఈరోజు గరిష్టంగా చెన్నైలో రూ.3270 వరకు తగ్గింది. దాంతో గడిచిన రెండు రోజుల్లోనే ఏకంగా తులం ధర రూ.7570 వరకు తగ్గినట్లయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
వాహనదారులకు గుడ్ న్యూస్, ఆ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అధిక స్థాయిలో ఇథనాల్ కలిపిన పెట్రోల్కు ఎక్సైజ్ సుంకం నుండి మినహాయింపు నిచ్చింది. బధవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 22 శాతం నుండి 30 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్పై ఇకపై ఎలాంటి ఎక్సైజ్ సుంకం ఉండదు. భారతదేశ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 లక్ష్యాన్ని చేరుకునే దశలో ఇదొక కీలక అడుగు. ఈ మినహాయింపు E22, E25, E27 , E30 వంటి ఇంధన రకాలకు వర్తిస్తుంది. E20 కి పైన ఉన్న ఇథనాల్ బ్లెండ్స్కు ఇంత పెద్ద వెసులు బాటు కల్పించడం ఇదే తొలిసారి.ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్న మూడో అతిపెద్ద దేశమైన ఇండియా, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, అలాగే దేశీయంగా తయారయ్యే స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించడం తోపాటు, తన బయో ఫ్యూయల్ ప్రణాళికలను శరవేగంగా విస్తురిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా మిడిల్ ఈస్ట్ ఉద్రికత్తలు మళ్లీ రాజుకుంటున్న తరుణంలో భారతదేశం తన ముడి చమురు సరఫరా సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇథనాల్ను ఒక వ్యూహాత్మక సాధనంగా చూస్తోంది. ఈ క్రమంలోనే ఇథనాల్ కలిపిన పెట్రోల్ను, బయో డీజిల్ను ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రిటైల్ అవుట్లెట్లలో అమ్మే సాధారణ పెట్రోల్కు సంబంధించి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఇదీ చదవండి: ప్రతీ ఆదివారం రెండు బిర్యానీలు ఫ్రీ : అవాక్కయ్యారా? -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:53 సమయానికి నిఫ్టీ(Nifty) 49 పాయింట్లు తగ్గి 23,167 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 152 పాయింట్లు దిగజారి 73,819 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.96బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 94.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.62 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.98 శాతం తగ్గింది.Today Nifty position 11-06-2026(time: 09:53 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)a -
జెన్ జీకి బెస్ట్... 5జీ ఫోన్లలో చీపెస్ట్!
దేశీ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లావా సరికొత్త 5జీ ఫోన్ను లాంచ్ చేసింది. షార్క్-2 5జీ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర కేవలం 11,999 రూపాయలు. 5జీ ఫోన్లలోకెల్లా అత్యంత చౌకది కావడం ఒక విశేషం. అలాగనీ ఇందులో ఫీచర్లకు, హంగు, ఆర్బాటాలకేమీ కొదవలేదు. అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన విషయం దీని బ్యాటరీ గురించి. ఆరువేల ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఈ ఫోన్తో ఏకంగా 13 గంటల 35 నిమిషాలపాటు యూట్యూబ్ వీడియోలు చూసుకోవచ్చునని కంపెనీ చెబుతోంది.స్క్రీన్ విషయానికి వస్తే... 120 హెర్ట్ట్జ్ రిఫ్రెష్ రేట్తో హెచ్డీ-ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంది. స్క్రీన్ సైజు దాదాపు 6.75 అంగుళాలు. సోనార్ గోల్డ్, ఆర్యా బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. లావా షార్క్-2 5జీ స్మార్ట్ఫోన్లో ఆరు నానోమీటర్ల యూనీసాక్ టీ8200 ఆక్టాకోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. నాలుగు జీబీల ర్యామ్కు అదనంగా 4 జీబీల వర్చువల్ ర్యామ్ అందుబాటులో ఉంది. ఫిజికల్ మెమరీ విషయానికి వస్తే 64 గిగాబైట్లు లభిస్తుంది. లావా షార్క్-2 5జీ ఫోన్ ఏఐ ఆధారిత 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ కెమెరా రెజల్యూషన్ 5 మెగాపిక్సెల్స్.రూ.15,000 లోపు 5జీ స్మార్ట్ఫోన్లుఫోన్ధర (రూపాయల్లో)స్క్రీన్బ్యాటరీ(mAh)కెమెరా(మెగా పిక్సెల్స్)రెడ్మీ నోట్ 14 ఎస్ఈ13,9996.67, AMOLED (120Hz)511050 MP + 2 MPమోటో జీ57 పవర్13,9996.72, FHD+ LCD (120Hz)700050 MP + 8 MPసామ్సంగ్ గెలాక్సీ ఎం1714,9996.7, Super AMOLED500050 MP + 5 MP + 2 MPఐకూ 14,5006.7, LCD (120Hz)600050 MPసీఎంఎఫ్ నథింగ్ ఫోన్ 114,6656.7, FHD+ (Dimensity 7300)500050 MP + 2 MPగమనిక: రిటైలర్, సెల్లర్ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ట్రంప్ వ్యాఖ్యలు వైరల్! ప్రత్యర్థులకు ఫుల్ జోష్
అమెరికాలో నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. మే నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం (సీపీఐ) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడంపై ఆందోళనలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. పైగా ‘ఆర్థిక గణాంకాలు చాలా బాగున్నాయి... నేను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ విలేకరులతో ట్రంప్ అనడం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వచ్చే నవంబర్లో జరగబోయే కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో ఈ ధరల పెరుగుదలనే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న డెమొక్రాట్లకు ట్రంప్ వ్యాఖ్యలు వరంగా మారుతాయని కొందరు చెబుతున్నారు.డెమొక్రాట్ల ఎదురుదాడిట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా యూఎస్ సెనేట్ డెమొక్రాటిక్ మైనారిటీ నేత చక్ షూమర్ మాట్లాడుతూ.. ‘అమెరికన్ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ట్రంప్నకు ఉన్న నిర్లక్ష్యానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. తాను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నానని పబ్లిక్గా ఒప్పుకున్నారు. అమెరికా ప్రజల పట్ల ఆయనకున్న ధిక్కారానికి హద్దులు లేవు’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.డెమొక్రాటిక్ పార్టీ వ్యూహంట్రంప్ మాట్లాడిన వీడియో క్లిప్ను జోడిస్తూ డెమొక్రాటిక్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో కొత్త ప్రచార ప్రకటనను విడుదల చేసింది. ‘ట్రంప్ తన మనసులోని నిశ్శబ్దాన్ని బయటపెట్టేశారు. ఆయనకు ద్రవ్యోల్బణం అంటే ఇష్టం. ప్రతి అమెరికన్ దీనిని గమనించాలి’ అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. మరోవైపు హౌస్ రిపబ్లికన్ స్పీకర్ మైక్ జాన్సన్ అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ట్రంప్ అన్న మాటలను అంసందర్భంగా మారుస్తూ రాజకీయం చేస్తున్నారని వాదించారు.మూడేళ్ల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణంతాజా గణాంకాల ప్రకారం, మే నెలలో వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) వార్షిక ప్రాతిపదికన 4.2 శాతానికి పెరిగింది. ఇది ఏప్రిల్ నెలలోని 3.8 శాతం కంటే ఎక్కువ మాత్రమే కాకుండా, ఏప్రిల్ 2023 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. కిరాణా సామగ్రి, ఇంధనంతో పాటు వైద్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ సేవల ఖర్చులు, విమాన ప్రయాణ ఛార్జీలు, వినోద రంగాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.ధరల పెరుగుదలకు కారణంకొవిడ్ సృష్టించిన సంక్షోభం నుంచి కోలుకోకముందే.. వరుస అంతర్జాతీయ పరిణామాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ విధించిన అంతర్జాతీయ సుంకాలు ఇప్పటికే ఆర్థికవ్యవస్థను దెబ్బతీయగా ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన యూఎస్-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం చమురు మార్కెట్ను కోలుకోలేని దెబ్బతీసింది.ప్రపంచ చమురు, వాయువు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ద్రవ్యోల్బణం ఒక్కసారిగా తగ్గుతుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. కానీ, ఆర్థికవేత్తలు మాత్రం యుద్ధం ముగిసినా చమురు ధరలు పూర్వస్థితికి రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు.ఆశాజనకమైన సంకేతాలుకొంతకాలంగా గ్యాసోలిన్ ధరలు స్వల్పంగా స్థిరపడుతుండటం మార్కెట్ విశ్లేషకులలో ఆశలు రేకెత్తిస్తోంది. ‘అధిక ఇంధన ధరలు గత నెలలో ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచిన మాట వాస్తవమే. కానీ, ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుందని మా అంచనా. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది తగ్గుముఖం పడుతుంది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి’ అని నేషన్ వైడ్ చీఫ్ ఎకనామిస్ట్ కాథీ బోస్ట్జోన్సిక్ అన్నారు.వడ్డీ రేట్ల తగ్గింపు కష్టమేనా?అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యానికి పరిమితం చేయాలని భావిస్తోంది. వచ్చే వారం ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణాయక కమిటీ సమావేశం కానుంది. గత నెలలోనే పగ్గాలు చేపట్టిన కొత్త ఛైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో జరగబోయే మొదటి సమావేశం ఇది కావడం విశేషం. వడ్డీ రేట్లను తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను యథాతథంగా ఉంచేందుకే మొగ్గు చూపవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
సెబీకి వ్యతిరేకంగా వెళ్లము
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలకు అనుగుణంగా చేపట్టనున్న ఫోరెన్సిక్ ఆడిట్కు పూర్తిస్థాయిలో సహకరించనున్నట్లు బంగారు ఆభరణాలు, రిఫైనరీ కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ తాజాగా వెల్లడించింది. కంపెనీ 2020–21 నుంచి 2024–25 కాలంలో రూ. 15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని అక్రమంగా నమోదుచేసినట్లు సెబీ గుర్తించింది. దీంతో తాజాగా ఫోరెన్సిక్ ఆడిట్కు సెబీ ఆదేశించింది. వీటిని సవాలు చేయబోమని కంపెనీ స్పష్టం చేసింది. కాగా.. ప్రాథమిక పరిశీలన అనంతరం ఆదాయ నమోదులో అక్రమాలకు తెరతీసినట్లు గుర్తించడంతో ఇటీవల కంపెనీ చైర్మన్ రాజేష్ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ నుంచి సెబీ నిషేధించింది. అయితే ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదంటూ రాజేష్ మెహతా ప్రకటించడం గమనార్హం! సెబీ అడిగిన అన్ని డాక్యుమెంట్లనూ దాఖలు చేసినట్లు చెప్పారు. ఎక్కడో సమాచార లోపం ఏర్పడినట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
135 ఎన్బీఎఫ్సీల లైసెన్స్ల రద్దు
ముంబై: జూపిటర్ ఫిన్వెస్ట్, ఎస్సెల్ ఫైనాన్స్ బిజినెస్ లోన్స్ సహా 135 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీలు) లైసెన్స్లను రద్దు చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇందులో మెజారిటీ కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయ చిరునామా పశ్చిమబెంగాల్లో ఉన్నట్టు పేర్కొంది. రద్దయిన జాబితాలో ఎక్స్ప్రెస్ ఫిన్క్యాప్ హౌస్, అక్షయ్ ఫిస్కల్ సరీ్వసెస్, టైమ్ ఫైనాన్స్, జూపిటర్ ప్రాజెక్ట్స్, సిటీవైడ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ కూడా ఉన్నాయి. వ్యాపారం నుంచి వైదొలగడం లేదా వీలీన కారణాలతో 13 సంస్థలు స్వచ్చందంగా తమ సరి్టఫికెట్ ఆఫ్ రిజి్రస్టేషన్ను స్వా«దీనం చేశాయి. ఇలా స్వాధీనం చేసిన సంస్థల్లో జే థామస్ ఫైనాన్స్, ఈకాన్ సూపర్ సేల్స్, హితేష ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, కార్నెక్స్ వినిమయ్, ఇంపాక్ట్ లీజింగ్ తదితర సంస్థలు ఉన్నాయి. -
మోదీ పాలనలో డిజిటల్ విప్లవం
న్యూఢిల్లీ: గడిచిన పన్నెండేళ్లలో మోదీ ప్రభుత్వ కాలంలో దేశంలో డిజిటల్ రంగం ఊహించని వేగంతో దూసుకుపోయిందని అధికారిక నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఇంటర్నెట్ డేటా ధరలు భారీగా తగ్గడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చాయని బుధవారం విడుదల చేసిన ‘మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలన’ నివేదిక పేర్కొంది. నివేదికలో ప్రధాన అంశాలు: → డేటా ధరల భారీగా దిగివచ్చాయి. 2014లో ఒక జీబీ డేటా ధర రూ. 269 గా ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా 97 శాతం తగ్గి రూ. 8 నుంచి రూ.10 కి పడిపోయింది. → ఇంటర్నెట్ వినియోగదారులు భారీ పెరిగారు. 2014లో దేశంలో వినియోగదారుల సంఖ్య కేవలం 25 కోట్లుగా ఉంటే, 2025 డిసెంబర్ నాటికి అది నాలుగు రెట్లు పెరిగి 103 కోట్లకు చేరింది. → బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు సైతం 12 ఏళ్లలో 17 రెట్లు పెరిగి, ఆరు కోట్ల నుంచి 100 కోట్లకు దూసుకెళ్లాయి. నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్నెట్ వాడకం వేగంగా విస్తరించింది. → ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల ఈ–కామర్స్, ఆన్లైన్ సేవలు పుంజుకున్నాయని, ఇది ఉపాధి కల్పనకు, దేశ జీడీపీ వృద్ధికి కారణమైందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. → 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ రూ. 31.64 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జాతీయ ఆదాయంలో 11.74 శాతానికి సమానం. → సాధారణ ఆర్థిక వ్యవస్థ కంటే డిజిటల్ రంగం రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతోందని, 2030 నాటికి జాతీయ ఆదాయంలో ఇది అయిదో వంతు (దాదాపు 20%) వాటాను ఆక్రమిస్తుందని నివేదిక అంచనా వేసింది. → ఒకప్పుడు మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునే భారత్, ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామి ఎగుమతిదారుగా అవతరించింది. మొబైల్ ఎగుమతుల విలువ రూ. 0.016 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ. 2.6 లక్షల కోట్లకు పెరిగింది. 2014లో దేశంలో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 300 దాటింది. → 2014లో దేశంలో ఒక్క సెమీకండక్టర్ (చిప్) ప్లాంట్ కూడా లేదు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం 12 ప్లాంట్లకు అనుమతులు మంజూరు చేసింది. స్వదేశీ సాంకేతికతతో 5జీ టెలికాం పరికరాల తయారీలో భారత్ ముందడుగు వేసింది. → గడిచిన దశాబ్ద కాలంలో ప్రభుత్వ ఆధార్ గుర్తింపు కార్డుల జారీ సైతం ఊపందుకుంది. 2014లో 61.01 కోట్లుగా ఉన్న కార్డుల సంఖ్య ఇప్పుడు 144 కోట్ల మార్కును దాటిందని నివేదిక స్పష్టం చేసింది. డిజిటల్ విప్లవం ద్వారా దేశంలో సమాచారం, వనరులు, సరికొత్త అవకాశాలు ప్రజలకు ఉచితంగా లభిస్తున్నాయని కేంద్రం పేర్కొంది. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కార్పొరేట్ల స్పందనన్యూఢిల్లీ: ప్రధానిగా సరికొత్త రికార్డు నెలకొల్పిన నరేంద్ర మోడీ చేపట్టిన సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ సమ్మిళిత వృద్ధిని సాధించినట్లు కార్పొరేట్ వర్గాలు పేర్కొన్నాయి. పరివర్తనకు బాటలు వేయడం ద్వారా ప్రపంచస్థాయిలో ప్రభావం చూపగల దేశంగా భారత్ అవతరించినట్లు తెలియజేశాయి. సరళతర వ్యాపార నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం బలపడినట్లు పరిశ్రమల సమాఖ్యలు పేర్కొన్నాయి. 2047 వికసిత్ భారత్ ప్రణాళికతో దేశీ కార్పొరేట్ రంగానికి ప్రోత్సాహం లభించినట్లు తెలియజేశాయి. సామర్థ్యాల పెంపు.. దేశ సామర్థ్యాలపట్ల పెరుగుతున్న నమ్మకాన్ని నిలకడ, లక్ష్యం, నిరంతర పురోభివృద్ధి ప్రతిబింబిస్తున్నట్లు సీఐఐ ప్రెసిడెంట్ ఆర్.ముకుందన్ పేర్కొన్నారు. దీంతో గ్లోబల్ ఎకనమిక్ పవర్హౌస్గా భారత్ ఎదుగుతున్నట్లు తెలియజేశారు. దేశం 2047 వికసిత్ భారత్వైపు ప్రయాణిస్తున్న నేపథ్యంలో పరిశ్రమల రంగం ప్రభుత్వంతో కలసి నడుస్తున్నట్లు తెలియజేశారు. పెట్టుబడుల పెంపు, బలపడుతున్న పోటీతత్వం, నైపుణ్య ఉద్యోగులతో పరిశ్రమలు ఇందుకు మద్దతిస్తున్నట్లు వివరించారు. రికార్డ్ పెట్టుబడులు.. దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో మైలురాయిని అందుకున్న ప్రధాని మోడీకి శుభాకాంక్షలు చెబుతూ.. దేశ ఆర్థిక మూలాలు గత 12ఏళ్లలో స్థిరంగా ఏకీకృతమైనట్లు ఫిక్కీ ప్రెసిడెంట్ అనంత్ గోయెంకా పేర్కొన్నారు. పటిష్ట సంస్కరణలు, బిజినెస్ల నిర్వహణ సులభతరం చేయడం, మౌలిక సదుపాయాలపై రికార్డ్ పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాల విస్తరణ, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, ప్రపంచస్థాయి తయారీ వ్యవస్థ దేశ ఆర్థిక నడకను మార్చివేసినట్లు వివరించారు. కాంతులీనుతోంది.. ప్రధాని మోడీ అధ్యక్షతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కాంతులీనుతున్నట్లు అసోచామ్ ప్రెసిడెంట్ నిర్మల్ కె.మిండా పేర్కొన్నారు. ఇతర ఏ ప్రపంచ ప్రధాన వ్యవస్థలలో చూసినా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ట పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు తెలియజేశారు. 2013–14లో నమోదైన 1.9 ట్రిలియన్ డాలర్లతో పోలిస్తే జీడీపీ రెట్టింపునకుపైగా ఎగసి గతేడాది(2025–26)కల్లా 4.1 ట్రిలియన్ డాలర్లను తాకినట్లు వెల్లడించారు. ఇందుకు తయారీ, సర్వీసుల రంగాలు సహకరించినట్లు పేర్కొన్నారు. -
కరెన్సీ కొత్త అవతార్!
భారత్లో ఇక ప్లాస్టిక్ నోట్లు రెపరెపలాడనున్నాయా? కాగితపు కరెన్సీ నోట్లకు బదులుగా ఎక్కువ కాలం మన్నే ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టడంపై రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మళ్లీ కసరత్తు చేస్తుండటంతో ఇప్పుడు అందరినోటా ఇదే టాక్ నడుస్తోంది. పదేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగినప్పటికీ.. కరెన్సీ వాడకం కూడా అంతకంతకూ ఎగబాకుతోంది. దీంతో ముద్రణ, నిర్వహణ ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఏటా సుమారు రూ.5,000–6,000 కోట్లు వెచి్చంచాల్సి వస్తోంది. దీనికితోడు పేపర్ నోట్లు త్వరగా పాడైపోతుండటం, ఏటీఎంలలో వాడకం సమస్యలు, నకిలీ నోట్ల బెడదకు చెక్ చెప్పేందుకు పాలిమర్ నోట్లే ప్రత్యామ్నాయంగా కనబడుతున్నాయి. దేశంలో కరెన్సీ నోట్ల రూపురేఖలు మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఆర్బీఐ తాజా పాలసీ సమీక్షలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలతో ప్లాస్టిక్ నోట్లపై మరోసారి తీవ్ర చర్చకు తెరలేచింది. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, పాలిమర్ నోట్ల అమలుపై సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలను బేరీజు వేయడానికి త్వరలో ఆర్బీఐ పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సమా చారం. ఇది సక్సెస్ అయితే, భారత్ కూడా పాలిమర్ నోట్ల యుగంలోకి అడుగుపెట్టేందుకు లైన్క్లియర్ అవుతుంది. పాలిమర్ నోట్లు అంటే... కాగితంతో కాకుండా ప్రత్యేకమైన పాలీప్రొపిలీన్ మెటీరియల్తో తయారు చేసే కరెన్సీని పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లుగా వ్యవహరిస్తారు. ఇవి పేపర్ నోట్లతో పోలిస్తే ఎక్కువకాలం మన్నుతాయి. తడి, దుమ్మూ ధూళి వంటి వాతావరణ పరిస్థితుల్లోనూ త్వరగా పాడైపోకుండా ఉంటాయి. దీనివల్ల తరచుగా కరెన్సీ నోట్లను మార్చాల్సిన అవసరం తగ్గుతుంది. నగదు వాడకం అధికంగా ఉండటం, రకరకాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులున్న మన దేశంలో ఇవి బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. తొలుత ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ఖర్చు కాస్త ఎక్కువగానే ఉన్నా.. వాడుకలో కరెన్సీ నిర్వహణ వ్యయం భారీగా దిగొస్తుందని పేర్కొంటున్నారు. అలాగే, బ్యాంకులు, ఏటీఎంలలో కరెన్సీ నిర్వహణ కూడా సులువవుతుంది. మరోపక్క, పాలిమర్ నోట్లతో నకిలీ కరెన్సీకి చెక్ చెప్పవచ్చని భావిస్తున్నారు. హోలోగ్రాఫిక్ అంశాలు, పలు రక్షణ పొరల వంటి అధునాతన భద్రతా ఫీచర్లను పకడ్బందీగా జోడించడం వల్ల నకిలీ ప్లాస్టిక్ నోట్ల తయారీ దాదాపు అసాధ్యమనేది బ్యాంకింగ్ వర్గాల మాట. క్యాష్ ఈజ్ కింగ్... యూపీఐ, డిజిటల్ పేమెంట్స్ రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ.. ప్రజలు క్యాష్ వాడకంలోనూ తగ్గేదేలే అంటున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీ (నోట్లు, కాయిన్లు).. అంటే సీఐసీ (కరెన్సీ ఇన్ సర్క్యులేషన్) రూ.41.68 లక్షల కోట్లకు చేరింది. 2024–25తో పోలిస్తే 12% దూసుకెళ్లింది. మరోపక్క, ప్రజల వద్దనున్న కరెన్సీ విలువ (క్యాష్ విత్ పబ్లిక్–సీడబ్ల్యూపీ) ఈ ఏడాది మార్చి నాటికి రూ.40.52 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీలో ప్రజల చేతిలో ఉన్నది 97 శాతమన్నమాట! గతంలోనే ప్రయోగం, కానీ... భారత్లో పాలిమర్ నోట్ల ఆలోచన కొత్తదేమీ కాదు. 2012లోనే వీటిపై ప్రయోగం జరిగింది. 2014 ఫిబ్రవరిలో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం.. భౌగోళికంగా, వాతావరణపరంగా అయిదు విభిన్న నగరాల్లో (కొచి్చ, మైసూరు, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్) రూ.10 విలువైన వంద కోట్ల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక, నిర్వహణ సమస్యల కారణంగా ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ పాలిమర్ నోట్ల ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. అయితే ఇది అమలులోకి వస్తుందా? ఎప్పుడు వస్తుంది? అన్నది ఆర్బీఐ తుది నిర్ణయం తర్వాతే తేలుతుంది.ఎగబాకుతున్న ఖర్చు... పాలిమర్ నోట్లపై ఫోకస్ చేయడానికి ప్రధాన కారణం మన్నిక ఒక్కటే కాదు, ఖర్చు తగ్గించుకోవడం కూడా. దేశంలో కరెన్సీ నోట్ల ముద్రణ, రవాణా, పదేపదే చేతులు మారడం, మడత పెట్టడం వల్ల చిరిగిపోయి, పాడైన నోట్లను తొలగించి కొత్త వాటితో భర్తీ చేయడం వంటి పనులకు ఖజానాపై భారీగా భారం పడుతోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2024–25లో 2,380 కోట్ల పాడైన నోట్లను చెలామణి నుంచి తొలగించి ధ్వంసం చేయాల్సి వచి్చంది. 2024–25లో నోట్ల ప్రింటింగ్ వ్యయం రూ.6,373 కోట్లకు ఎగబాకింది.ఖర్చెంత? ఇప్పుడున్న రూ.500 పేపర్ నోట్ల విషయానికొస్తే, ఒక్కో నోటు తయారీ ఖర్చు సుమారుగా రూ.2.29 అవుతోంది. అత్యధికంగా రూ. 200 నోటు తయారీకి రూ.2.93 చొప్పున వెచి్చంచాల్సి వస్తోంది. రూ.10 నోటుకు రూ.1.01 పడుతోంది. అదే ప్లాస్టిక్ కరెన్సీకి 2–3 రెట్లు ఎక్కువ ఖర్చవుతుందని అంచనా. ఇక మన్నిక సంగతి చూస్తే, పేపర్ నోటుతో పోలిస్తే (డినామినేషన్ను బట్టి సాధారణంగా 2 నుంచి 7 ఏళ్లు)... పాలిమర్ నోటు జీవితకాలం 4–5 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
1200 KM రేంజ్: వచ్చేస్తోంది కొత్త రకం హైబ్రిడ్ కారు..
న్యూఢిల్లీ: చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ‘బీవైడీ’ భారత అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా, దేశీయ మార్కెట్లో తన తొలి ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఎస్యూవీ ‘సీల్ యూ’ను ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. కంపెనీ అభివృద్ధి చేసిన డీఎం–ఐ (డ్యూయల్ మోడ్ ఇంటెలిజెంట్) సాంకేతికత ఆధారంగా రూపొందిన తొలి వాహనం ఇదేనని తెలిపింది. దీని ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలను లాంచ్ సమయంలోనే వెల్లడిస్తామని సంస్థ పేర్కొంది.‘ఎలక్ట్రిక్–ఫస్ట్ విధానంలో పనిచేసే డీఎం–ఐ సాంప్రదాయ హైబ్రిడ్ వాహనాల్లో పెట్రోల్ ఇంజిన్ ప్రధానంగా ఉండి, బ్యాటరీ కేవలం అదనపు సపోర్ట్ ఇస్తుంది. కానీ, బీవైడీ పరిచయం చేస్తున్న డీఎం–ఐ టెక్నాలజీ దీనికి భిన్నంగా ‘ఎలక్ట్రిక్–ఫస్ట్’ విధానంలో పనిచేస్తుంది. అంటే, రోజువారీ ప్రయాణాల్లో కారు గరిష్టంగా బ్యాటరీతోనే నడుస్తుంది. దూర ప్రయాణాల్లో లేదా బ్యాటరీ అయిపోతున్న సమయంలో మాత్రమే మైలేజ్ పెంచడానికి పెట్రోల్ ఇంజిన్ సహాయపడుతుంది. ఈ సరికొత్త ‘సీల్ యూ ఎస్యూవీ’ని విదేశాల నుండి నేరుగా భారత్కు దిగుమతి చేయనున్నారు. భారత్లోనే బ్యాటరీల తయారీపై కంపెనీ ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.పెరుగుతున్న ఈవీ డిమాండ్ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రికత్తల కారణంగా ఈ మే నెలలో ఇంధన ధరలు నాలుగు సార్లకు పైగా పెరగడంతో భారత్లో ఈవీల పట్ల ఆసక్తి పెరిగిందని రాజీవ్ చౌహాన్ తెలిపారు. ‘వాహన్’ డేటా ప్రకారం.. మే నెలలో దేశంలో రికార్డు స్థాయిలో దాదాపు 25,000 ఈవీ కార్లు అమ్ముడయ్యాయి. భారత్లో ఇప్పటికే 14,000 మందికి పైగా బీవైడీ కస్టమర్లు ఉన్నారు. పూర్తి ఎలక్ట్రిక్ కార్లకు మారే ముందు కస్టమర్లకు ఇదొక ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 1,200 కి.మీ పరిధి ‘‘ఒక్కసారి పూర్తి ఛార్జింగ్, ఫుల్ పెట్రోల్ ట్యాంక్తో ఈ కారు ఏకంగా 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగలదు. రోజూ సిటీలో 50 కిలోమీటర్లు తిరిగే వారు, ఇంట్లో లేదా ఆఫీస్లో ఛార్జ్ చేసుకుంటే నెలల తరబడి పెట్రోల్ అవసరం లేకుండా కేవలం ఈవీ మోడ్లోనే దీనిని నడపవచ్చు’’ అని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహిక ల్స్ బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మెరుగైందన్నారు. కేవలం హైవేలపై మాత్రమే ప్రణాళిక అవసరమన్నారు. -
పసిడి ఇంత భారీ పతనం.. ఇవే కారణాలు
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం భారీగా పతనమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు) ఏకంగా రూ.4300 క్షీణించి రూ.1,49,010లకు దిగివచ్చింది. అలాగే ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3,950 తగ్గి రూ.1,36,600లకు వచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుదల బాటపట్టిన బంగారం ధరలు క్రితం ఒక్కసారిగా ఎగిసి మళ్లీ ఈరోజు అంతకు మించి భారీగా పతనమమ్యాయి. ఒక్కరోజులో పసిడి ధరలు ఈ స్థాయిలో పతనమవడానికి ప్రధాన కారణాలు ఏంటన్నది ఈ కథనంలో చూద్దాం.తాజా మార్కెట్ డేటా పరిశీలిస్తే, ఈరోజు (జూన్ 10) బంగారం ధరలు భారీగా పడిపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా క్షీణించడమే అని స్పష్టంగా కనిపిస్తోంది. భారత మార్కెట్లో కూడా అదే ప్రభావం ప్రతిబింబించింది.ఎందుకు పడిపోయాయి?గ్లోబల్ గోల్డ్లో భారీ అమ్మకాలుఅంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు 2%–3% వరకు పడిపోయాయి. దీంతో భారత మార్కెట్లో ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా దాదాపు 2% క్షీణించి రూ.1.49 లక్షల స్థాయికి దిగివచ్చాయి.అమెరికా ద్రవ్యోల్బణ డేటాపై ఆందోళనఅమెరికా సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల ముందు ట్రేడర్లు భారీగా ప్రాఫిట్ బుకింగ్కు దిగారు. ద్రవ్యోల్బణం పెరిగితే ఫెడ్ వడ్డీ రేట్లను ఎక్కువకాలం పైనే ఉంచవచ్చన్న అంచనాలు బంగారంపై ఒత్తిడి తెచ్చాయి.డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ బలపడటంఅమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ బలపడటంతో వడ్డీ ఇవ్వని బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. ఈ అంశం కూడా ధరల పతనాన్ని వేగవంతం చేసింది.రికార్డు స్థాయిల తర్వాత ప్రాఫిట్ బుకింగ్ఇటీవలి వారాల్లో బంగారం చరిత్రాత్మక గరిష్ఠాలకు చేరుకుంది. దీంతో పెద్ద ఫండ్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. -
రూ.20 వేల రేంజ్లో రియల్మీ కొత్త ఫోన్
ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ రియల్మీ భారత మార్కెట్లో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ ‘రియల్మీ పీ4ఆర్ 5జీ’ (Realme P4R 5G) విడుదల చేసింది. బ్యాటరీ సామర్థ్యాన్ని ప్రధాన ఆకర్షణగా చేసుకుని P4 సిరీస్లో తాజా మోడల్గా వచ్చిన ఈ ఫోన్లో ఏకంగా 8,000mAh ‘టైటాన్’ బ్యాటరీని అందించడం విశేషం. ఈ ధర విభాగంలో ఇంత పెద్ద బ్యాటరీతో వచ్చిన ఫోన్లలో ఇది ఒకటిగా కంపెనీ పేర్కొంటోంది. పూర్తి ఛార్జ్పై మూడు రోజుల వరకు వినియోగాన్ని అందించగలదని రియల్మీ చెబుతోంది.ఫోన్ ప్రధాన ఫీచర్లుస్మార్ట్ఫోన్ పరిశ్రమలో కెమెరా, చిప్సెట్ల కంటే ఇప్పుడు ఎక్కువమంది వినియోగదారులు బ్యాటరీ బ్యాకప్కు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో రియల్మీ ఈ ఫోన్ను రూపొందించింది. 8,000mAh బ్యాటరీతో పాటు 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ లైఫ్ను దీర్ఘకాలం కాపాడే టెక్నాలజీ కారణంగా ఏడు సంవత్సరాల వరకు బ్యాటరీ పనితీరు నిలకడగా ఉంటుందని కంపెనీ హామీ ఇస్తోంది.ఈ ఫోన్లో 6.8 అంగుళాల సన్లైట్ డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్కు శక్తినిచ్చే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్. Realme UI 7.0 ఆధారిత ఆండ్రాయిడ్ ప్లాట్ఫారమ్పై ఇది పనిచేస్తుంది.గేమింగ్ సమయంలో హీట్ సమస్యను తగ్గించేందుకు 5,300mm² ఎయిర్ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, వన్-ట్యాప్ కూలింగ్ వంటి ఫీచర్లను అందించారు.ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ AI కెమెరాను అందించారు. AI Portrait Glow, AI Eraser 2.0, AI Ultra Clarity, AI Unblur వంటి AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను ఏర్పాటు చేశారు.భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ మందం కేవలం 8.8 మిల్లీమీటర్లు మాత్రమే. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, 400 శాతం అల్ట్రా వాల్యూమ్ సపోర్ట్ చేసే సూపర్ లీనియర్ స్పీకర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.ధరలు, ఆఫర్లురియల్మీ పీ4ఆర్ 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. ఇందులో 4GB + 128GB వేరియంట్ రూ.18,999లకు, 6GB + 128GB మోడల్ రూ.20,999లకు, 6GB + 256GB వేరియంట్ రూ.22,999లకు లభిస్తుంది. ప్రారంభ ఆఫర్లో భాగంగా రూ.2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్తో పాటు మూడు నెలల నో-కాస్ట్ EMI సదుపాయం లభించనుంది. దీంతో ప్రారంభ ధర రూ.16,999కు తగ్గనుంది.ఈ ఫోన్ టైటానియం గ్లేర్, సిల్వర్ గ్లేర్, లావండర్ గ్లేర్ అనే రంగుల్లో లభించనుంది. తొలి విక్రయాలు జూన్ 17 నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లిప్కార్ట్తో పాటు రియల్మీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు.ఇదీ చదవండి: బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్న్యూస్ -
రూ.10,000 కోట్లకు 5 ఐపీఓలు రెడీ!
ముంబై: దేశీయ ప్రాథమిక మార్కెట్ రానున్న రోజుల్లో ఐపీఓలతో మరింత సందడి చేయనుంది. గ్లోబల్ ట్రావెల్–టెక్ యూనికార్న్ ఓయో మాతృసంస్థ ‘ప్రిజమ్’, వార్బర్గ్ పింకస్ పెట్టుబడులున్న ‘ట్రూహోమ్ ఫైనాన్స్’, ‘వీగాలాండ్ డెవలపర్స్’, ‘అద్వాంతా ఎంటర్ప్రైజెస్’, ‘మెహతా హైటెక్ ఇండస్ట్రీస్’ల పబ్లిక్ ఇష్యూలకు సెబీ అనుమతి ఇచి్చంది. ఈ ఐదు కంపెనీలు కలిపి సుమారు రూ.10,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని మర్చంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కంపెనీలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలపై సెబీ జూన్ 1–5 మధ్య తన పరిశీలన పూర్తిచేసి అనుమతులు జారీ చేసింది. ప్రిజమ్ (ఓయో) భారీ ఇష్యూ గ్లోబల్ ట్రావెల్–టెక్ దిగ్గజం ఓయోను నిర్వహిస్తున్న ‘ప్రిజమ్’ సంస్థ ఐపీఓ ద్వారా రూ.6,650 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఇష్యూతో సంస్థ విలువ 7–8 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ 2025 డిసెంబరులో కాని్ఫడెన్షియల్ ప్రి–ఫైలింగ్ మార్గం ద్వారా సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచింది. ఓయో ఆపరేటర్ ‘ఒరవెల్ స్టేస్’ 2025 సెప్టెంబరులో ‘ప్రిజమ్’గా పేరు మార్చుకుంది. ట్రూహోమ్ ఫైనాన్స్ ఇష్యూ @ రూ.3,000 ట్రూహోమ్ ఫైనాన్స్ ఐపీఓ పరిమాణం రూ.3,000 కోట్లుగా ఉండనుంది. ఇందులో రూ.1,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయనుంది. అలాగే ప్రమోటర్ సంస్థ ‘మ్యాంగో క్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్’ రూ.1,500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనుంది. తాజా షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను మూలధనాన్ని బలోపేతం చేసుకోవడానికి, రుణాల పంపిణీ అవసరాలను తీర్చడానికి, ఆర్బీఐ నిర్దేశించిన మూలధన సమృద్ధి ప్రమాణాలను పాటించడానికి వినియోగించనుంది. వీగాలాండ్ డెవలపర్స్ వీ–గార్డ్ గ్రూప్కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ‘వీగాలాండ్ డెవలపర్స్’ ఐపీఓ ద్వారా రూ.250 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే ఉంటుంది. ఈ నిధులను ప్రస్తుత, రానున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు, అలాగే నివాస సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములను కొనుగోలు చేయడానికి వినియోగించనుంది. అద్వాంతా ఎంటర్ప్రైజెస్ అగ్రికల్చరల్ సొల్యూషన్స్ అందించే ఈ సంస్థ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉంటుంది. ప్రమోటర్ యూపీఎల్ లిమిటెడ్తో పాటు ఇతర ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మెల్వుడ్ హోల్డింగ్స్– ఐఐ, కేఐఏ ఈబీటీ స్కీమ్–2 కలిపి 3.61 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. మెహతా హైటెక్ ఇండస్ట్రీస్అహ్మదాబాద్కు చెందిన ఈ సంస్థ ఐపీఓ ద్వారా గరిష్టంగా 62 లక్షల కొత్త ఈక్విటీ షేర్లను ఐపీఓ ద్వారా జారీ చేయనుంది. -
ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్, తెల్లాపూర్: ప్రకృతి మధ్య ప్రీమియం లైఫ్!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగవంతమైన అభివృద్ధితో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో ఖాళీ స్థలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో, నగర పశ్చిమ కారిడార్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్ కూడా ఇదే మార్గంలో పయనించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ మాత్రం విభిన్నమైన దృక్పథంతో రూపుదిద్దుకుంది.సుమారు 28.6 ఎకరాల విస్తీర్ణంలో అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్ట్లో పది నివాస టవర్లను స్థలానికి చుట్టుపక్కల భాగంలో ఏర్పాటు చేశారు. ఫలితంగా.. ఈ ప్రాజెక్ట్ మధ్యభాగం విశాలమైన పచ్చదనంతో కూడిన ఓపెన్ స్పేస్గా నిలిచింది. చాలా ప్రాజెక్టులు నిర్మాణ విస్తీర్ణాన్ని గరిష్టంగా పెంచడంపై దృష్టి పెడితే, ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ మాత్రం ప్రకృతి, పచ్చదనం, ఖాళీ ప్రదేశాలను రోజువారీ జీవనంలో కీలక భాగంగా మార్చింది.ఆలోచనాత్మక ప్రణాళికతో రూపుదిద్దుకుందిప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ను టవర్ల మధ్య విశాలమైన ఖాళీ ప్రదేశాలు ఉండేలా ప్రత్యేకంగా రూపొందించారు. దీని వల్ల ప్రతి ఇంటికి పుష్కలమైన సహజ కాంతి అందడమే కాకుండా.. మధ్యలోని ల్యాండ్స్కేప్ విస్తృతంగా, అడ్డంకులు లేకుండా ఉంటుంది. సహజ గాలి స్వేచ్ఛగా ప్రవహించేలా ఉండటం వల్ల ఇళ్లలో క్రాస్ వెంటిలేషన్ మెరుగుపడి, ఆరోగ్యకరమైన.. సౌకర్యవంతమైన జీవన వాతావరణం ఏర్పడుతుంది.అంతే కాకుండా.. ప్రతి నివాసాన్ని వాస్తు సూత్రాలకు అనుగుణంగా డిజైన్ చేశారు. విశాలమైన ముఖ ద్వారాలు, ఆలోచనాత్మక లేఅవుట్లు, పుష్కలమైన సహజ కాంతి ప్రవేశించేలా చేసిన నిర్మాణం వల్ల ప్రతి ఇల్లు ప్రకాశవంతంగా, గాలితో నిండిన అనుభూతిని కలిగిస్తుంది.సమతుల్య జీవనశైలికి అత్యాధునిక సౌకర్యాలుప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్లో రెండు ప్రత్యేక క్లబ్హౌస్లు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రతి ఒక్కటి ఆధునిక జీవనంలోని విభిన్న అవసరాలను తీర్చే విధంగా రూపుదిద్దుకుంది.క్లబ్హౌస్ సఫైర్ ప్రధానంగా ఆరోగ్యం, ఫిట్నెస్, వినోదాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇందులో జకుజీతో కూడిన ఇండోర్ స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక జిమ్, యోగా, ఏరోబిక్స్ స్టూడియోలు, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు, స్పా వంటి అనేక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.క్లబ్హౌస్ ఎమరాల్డ్ విశ్రాంతి, సామాజిక కార్యక్రమాలు, వృత్తిపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇందులో బాంకెట్ హాల్, మినీ థియేటర్, కో-వర్కింగ్ స్పేస్లు, కేఫ్, క్లినిక్, అలాగే సమావేశాలు, వేడుకలకు అనువైన రూఫ్టాప్ BBQ డెక్ వంటి సదుపాయాలు ఉన్నాయి.అన్ని వయసుల వారికి ప్రత్యేకమైన సౌకర్యాలుప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్లోని అవుట్డోర్ సౌకర్యాలు కూడా నివాసితులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ అండ్ పాడిల్ కోర్టులు, క్రికెట్ ప్రాక్టీస్ పిచ్, స్పెషల్ సైక్లింగ్, జాగింగ్ ట్రాక్లు, సెన్సరీ పార్క్, యాంఫీథియేటర్, స్కేటింగ్ రింక్, మినీ గోల్ఫ్ ఏరియా, పెట్ పార్క్ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్లు, చిన్నారుల కోసం ప్రత్యేక ప్రదేశాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి తరానికి అనువైన సమాజాన్ని నిర్మించాలనే ప్రాజెక్ట్ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.నగరంతో అనుసంధానంప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ ప్రశాంతమైన, పచ్చదనంతో నిండిన జీవన వాతావరణాన్ని అందిస్తూనే.. హైదరాబాద్లోని ప్రధాన వ్యాపార, జీవనశైలి కేంద్రాలకు కనెక్టివిటీని కలిగి ఉంది.ఇది ORR సమీపంలో ఉండటంతో.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాలకు సుమారు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 35 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంది. ప్రముఖ పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ కేంద్రాలు, వినోద ప్రదేశాలు కూడా సమీపంలో ఉండటం నివాసితులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.వేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్గత కొన్ని సంవత్సరాలుగా తెల్లాపూర్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం.. నేడు హైదరాబాద్లో అత్యంత ఆశాజనకమైన నివాస గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది.మెరుగైన మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ, పెరుగుతున్న సామాజిక సౌకర్యాలతో.. తెల్లాపూర్ ప్రస్తుతం గచ్చిబౌలి, కొండాపూర్ వంటి స్థిరపడిన ప్రాంతాలకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. అంతేకాకుండా.. దీర్ఘకాలిక పెట్టుబడి విలువను కూడా అందిస్తోంది.స్థిరపడటానికి సరైన సమయంప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్ కేవలం ఒక నివాస ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది పచ్చదనం, విశాలమైన ఖాళీ ప్రదేశాలు, ఆధునిక సౌకర్యాలు, నగర కనెక్టివిటీని సమతుల్యం చేస్తూ రూపొందించిన సమగ్ర జీవన సముదాయం. ఇక్కడ నివసించే వారికి స్వచ్ఛమైన గాలి, ప్రకృతి మధ్య ప్రశాంత జీవనం, విశాలమైన దృశ్యాలు, అలాగే ఆధునిక నగర జీవనానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఒకే చోట లభిస్తాయి.హైదరాబాద్ అభివృద్ధి ప్రస్థానం కొనసాగుతున్న ఈ సమయంలో.. తెల్లాపూర్, నగరంలో అత్యంత ఆదరణ పొందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా వేగంగా ఎదుగుతోంది. ఆ ప్రాంతం నడిబొడ్డున నిలిచిన ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్, కేవలం నివాసం కోసం మాత్రమే కాకుండా, జీవన నాణ్యతను మరింత మెరుగుపరచడానికి రూపొందించిన ప్రత్యేక నివాస సముదాయంగా నిలుస్తోంది.మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి:https://www.prestigeconstructions.comగమనిక: పైన పేర్కొన్న ప్రాజెక్ట్ వివరాలు, ఆదాయ మార్గాలు, వసతులకు సంబంధించిన సమాచారం పూర్తిగా నిర్వాహకులు/ ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి, సాక్షి మీడియా ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం. -
బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్న్యూస్
బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) మరోసారి భారీ లాభాలను అందించాయి. 2019-20 సిరీస్–VII కింద జారీ చేసిన ఎస్జీబీల ముందస్తు రిడెంప్షన్ (Premature Redemption) ధరను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గ్రాముకు రూ.15,275గా నిర్ణయించింది.ఆర్బీఐ ఈ బాండ్లను 2019 డిసెంబర్ 10న గ్రాముకు రూ.3,745 ధరతో జారీ చేసింది. అప్పుడు వీటిని కొనుగోలుచేసినవారికి ఐదేళ్లలో సుమారు 308 శాతం లాభం లభించినట్లైంది. అంటే గ్రాముకు రూ.11,530 లాభం అన్నమాట. అలాగే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా ఆర్బీఐ ఇచ్చింది. దీంతో ఆన్లైన్లో కొన్నవారికి ఈ లాభం 313 శాతానికి పైగా చేరింది.రూ.లక్షకు రూ.4 లక్షలు!ఈ సిరీస్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల పెట్టుబడి విలువ ప్రస్తుతం రూ.4.08 లక్షలకు పైగా పెరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి అదనంగా బాండ్ జారీ ధరపై సంవత్సరానికి 2.5 శాతం స్థిర వడ్డీని కూడా అర్ధవార్షికంగా పొందారు. అంటే మొత్తం రాబడి ఇంకా ఎక్కువే.రిడెంప్షన్ ధర ఎలా నిర్ణయించారు?ఎస్జీబీ రిడెంప్షన్ ధరను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. జూన్ 5, 8, 9 తేదీల ముగింపు ధరల సగటు ఆధారంగా ఈ విడతకు గ్రాముకు రూ.15,275 ధరను ఖరారు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.ఐదేళ్ల తర్వాతే ముందస్తు నిష్క్రమణసావరిన్ గోల్డ్ బాండ్ల అసలు గడువు ఎనిమిదేళ్లు. అయితే జారీ తేదీ నుంచి ఐదో సంవత్సరం పూర్తైన తర్వాత వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తుగా బాండ్లను రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఈ సిరీస్కు జూన్ 10, 2026 తేదీని అర్హత కలిగిన రిడెంప్షన్ తేదీగా ఆర్బీఐ ప్రకటించింది.పన్ను ప్రయోజనాలు ఏమిటి?వ్యక్తిగత పెట్టుబడిదారులు ఎస్జీబీలను ఆర్బీఐ వద్ద రిడీమ్ చేసుకున్నప్పుడు లభించే మూలధన లాభాలపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. అయితే 2026 బడ్జెట్ తర్వాత పన్ను నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ వడ్డీ ఆదాయం మాత్రమే ఆదాయపు పన్నుకు లోబడి ఉంటుంది. బాండ్ల బదిలీ ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు వర్తిస్తాయి.ఏమిటీ ఎస్జీబీ పథకం?భౌతిక బంగారం కొనుగోలు అవసరం లేకుండా బంగారం ధరల పెరుగుదల ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. బంగారం ధరల పెరుగుదలతో పాటు 2.5 శాతం వార్షిక వడ్డీ కూడా లభించడం ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలిపింది. దేశంలో భౌతిక బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గృహ పొదుపులను ఆర్థిక ఆస్తులుగా మలచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.అయితే ప్రభుత్వం 2023 చివరి నుంచి కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని నిలిపివేసింది. నిర్వహణ వ్యయాలు పెరగడం, గోల్డ్ ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాల ప్రాచుర్యం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ చేసిన బాండ్లు చెల్లుబాటులోనే ఉంటాయి. పెట్టుబడిదారులు వాటిని మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు లేదా అర్హత వచ్చినప్పుడు ముందస్తు రిడెంప్షన్ను ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: ఈజీగా ‘EPF 100% విత్డ్రా’.. కొత్తగా మారిందిదే.. -
మిశ్రమంగా ముగిసిన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 27.15 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టపోయి 23,214.95 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 64.42 పాయింట్లు లేదా 0.09 శాతం పెరిగి 73,983.18 వద్ద ముగిసింది.హెచ్ యూఎల్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ సెన్సెక్స్ లో టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ వరుసగా 1.49 శాతం, 1.33 శాతం నష్టపోయాయిరంగాల వారీగా, నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియాల్టీ తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ కెమికల్ మెరుగైన పనితీరు కనబరిచాయి. -
AI Mission Million వైపు సూపర్ AI అకాడమీ
హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్యా వ్యవస్థలను ప్రభావితం చేస్తూ కొత్త యుగానికి నాంది పలుకుతున్న వేళ, ఈ సాంకేతికతను సామాన్య ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సూపర్ AI అకాడమీ మరో కీలక మైలురాయిని చేరుకుంది. సంస్థ ఇప్పటికే 25 వేల మందికి పైగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వ్యాపారవేత్తలు మరియు యువతకు AI శిక్షణ అందించి ప్రత్యేక గుర్తింపు పొందింది."AI Mission Million" పేరుతో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్న ఈ సంస్థ, 2027 ఏప్రిల్ నాటికి లక్ష మంది, 2030 నాటికి 10 లక్షల మందిని AI ద్వారా సాధికారత చేయాలని సంకల్పించింది.సూపర్ AI నెక్స్ట్జెన్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి కిరణ్ మాట్లాడుతూ, “AI అనేది ఇకపై భవిష్యత్ టెక్నాలజీ కాదు. ఇది ఇప్పటికే మన దైనందిన జీవితంలో భాగమైంది. ఈ మార్పులో తెలుగు ప్రజలు వెనుకబడకుండా, ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడం మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.సంస్థ డైరెక్టర్ నికీలు గుండా మాట్లాడుతూ, “AI విద్యను కేవలం టెక్నికల్ వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయకుండా, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. AIను అర్థం చేసుకుని ఉపయోగించగలిగితే వ్యక్తిగత అభివృద్ధి, ఉపాధి, వ్యాపార వృద్ధి వంటి అనేక అవకాశాలు తెరుచుకుంటాయి” అని పేర్కొన్నారు.మహిళా సాధికారతకు AI అండమహిళల ఆర్థిక స్వావలంబనకు AI కీలక సాధనంగా మారుతుందనే నమ్మకంతో సూపర్ AI అకాడమీ SUPER AI Women's Club కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా గృహిణులు, మహిళా వ్యాపారవేత్తలు, ఉద్యోగినులు AI ఆధారిత సేవలను అందించడం, డిజిటల్ వ్యాపారాలను ప్రారంభించడం, ఫ్రీలాన్సింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవడం వంటి అంశాల్లో శిక్షణ పొందుతున్నారు.2030 నాటికి 10 వేల మంది మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా సంస్థ వెల్లడించింది.వ్యాపార వృద్ధికి AIచిన్న, మధ్య తరహా వ్యాపారాలు AIను వినియోగించి తమ ఉత్పాదకతను పెంచుకోవడం, మార్కెటింగ్ ఖర్చులను తగ్గించడం, అమ్మకాలను పెంచుకోవడం, కస్టమర్ సేవలను మెరుగుపరచుకోవడం వంటి అంశాలపై సూపర్ AI అకాడమీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.AI ఆధారిత మార్కెటింగ్, లీడ్ జనరేషన్, కంటెంట్ క్రియేషన్, సేల్స్ ఆటోమేషన్, కస్టమర్ కమ్యూనికేషన్ వంటి అంశాల్లో ఇప్పటికే వందలాది మంది వ్యాపారవేత్తలకు శిక్షణ అందించినట్లు సంస్థ తెలిపింది.కళాశాలల్లో AI క్లబ్లుభవిష్యత్ ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో AI Student Clubs ఏర్పాటు చేయడానికి సూపర్ AI అకాడమీ ప్రణాళిక రూపొందిస్తోంది.ఈ క్లబ్ల ద్వారా విద్యార్థులకు AI ఫండమెంటల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, AI రీసెర్చ్ టూల్స్, కెరీర్ అప్లికేషన్స్, AI ఆధారిత స్టార్టప్ అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించడం, భవిష్యత్ టెక్నాలజీ నాయకులను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నారు.త్వరలో AI Creator ClubAI ఆధారిత కంటెంట్ క్రియేషన్, వీడియో ప్రొడక్షన్, డిజైనింగ్, డిజిటల్ బ్రాండింగ్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, యువత మరియు క్రియేటర్ల కోసం AI Creator Club ను ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది.ఈ క్లబ్ ద్వారా సోషల్ మీడియా క్రియేటర్లు, యూట్యూబర్లు, డిజైనర్లు, మార్కెటర్లు మరియు డిజిటల్ ప్రొఫెషనల్స్కు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.1000 మంది AI కోచ్ల తయారీదేశవ్యాప్తంగా AI అవగాహనను మరింత విస్తరించేందుకు 1000 మంది AI Coaches ను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.ఉపాధ్యాయులు, ట్రైనర్లు, కన్సల్టెంట్లు, కోచ్లు AIలో నైపుణ్యం సాధించి తమ ప్రాంతాల్లో వేలాది మందికి AI విద్యను అందించేలా ఈ కార్యక్రమం రూపొందించబడుతోంది.Microsoft – Certiport భాగస్వామ్యంసూపర్ AI అకాడమీ ఇటీవల మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన Microsoft మరియు Certiport అధికారిక సర్టిఫికేషన్ భాగస్వామిగా సంస్థ ఎంపికైంది.దీంతో అంతర్జాతీయ ప్రమాణాల డిజిటల్ మరియు AI సర్టిఫికేషన్ కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం లభించిందని సంస్థ పేర్కొంది.ఈ ఉద్యమం వెనుక ఉన్న ఆలోచనసూపర్ AI అకాడమీ వెనుక ఉన్న ప్రధాన ఆలోచనల్లో ఒకటి సంస్థ డైరెక్టర్ నికీలు గుండా యొక్క గత దశాబ్ద కాల అనుభవం. డిజిటల్ మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, బ్రాండింగ్, వ్యాపారాభివృద్ధి రంగాల్లో పని చేసిన ఆయన, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని వినియోగించే నైపుణ్యాల కొరత సమాజంలో ఎక్కువగా ఉందని గుర్తించారు.ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చిన్న వ్యాపారాలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు అవసరమైన డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు.గతంలో డిజిటల్ లిటరసీ, వ్యాపారాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్ ఎకోసిస్టమ్, యువత సాధికారత వంటి అంశాలపై వేలాది మందికి శిక్షణ ఇచ్చిన అనుభవం ప్రస్తుతం AI Mission Million రూపకల్పనకు దోహదపడిందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.AI కేవలం సాంకేతిక రంగానికే పరిమితం కాకుండా, ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే సాధనంగా మారుతుందని భావించిన నికీలు గుండా, AI విద్యను తెలుగు భాషలో అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అదే ఆలోచనతో ప్రారంభమైన కార్యక్రమాలు నేడు వేలాది మంది సభ్యులతో కూడిన కమ్యూనిటీగా ఎదిగాయి.వ్యాపారవేత్తలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లు, ట్రైనర్లు వంటి విభిన్న వర్గాలకు AIను చేరవేయాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ మిషన్, భవిష్యత్లో లక్షలాది మందికి ఉపయోగపడే సామాజిక ఉద్యమంగా మారుతుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.AI Literacy నుండి AI Leadership వరకుAI గురించి అవగాహన కల్పించడం నుంచి AI ఆధారిత వ్యాపారాలు, కెరీర్ అవకాశాలు, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి వరకు సమగ్ర ప్రయాణాన్ని రూపొందించడమే సూపర్ AI అకాడమీ లక్ష్యంగా చెబుతోంది.AI Literacy, AI Productivity, AI Entrepreneurship, AI Leadership అనే నాలుగు ప్రధాన దశల ద్వారా వ్యక్తులను అభివృద్ధి చేసి, భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేయాలని సంస్థ భావిస్తోంది.25 వేల మంది మైలురాయిని దాటిన సూపర్ AI అకాడమీ, ఇప్పుడు AI Mission Million ఉద్యమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా AI విద్యా విప్లవానికి దోహదపడే దిశగా అడుగులు వేస్తోంది."AI భవిష్యత్తు కాదు... ఇది వర్తమానం. ఈ మార్పులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి" అనే సందేశంతో సంస్థ తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తోంది.మరిన్ని వివరాలకు Super AI Academy అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు : www.superaiacademy.comగమనిక: పైన పేర్కొన్న వివరాలు, సమాచారం పూర్తిగా నిర్వాహకులు/ ప్రకటనకర్తలు అందించిన వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. దీనికి, సాక్షి మీడియా ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందే నిపుణుల సలహాలు పాటించడం ఉత్తమం. -
హాట్ టాపిక్గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా
ఓటీటీలో దూసుకుపోతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'మా బెహన్' బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్తో పాటు మరో కీలక పాత్రలో నటించిన హీరోయిన్ తృప్తి దిమ్రి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. తన తాజా చిత్రంతో క్రేజ్ సంపాదించుకుకున్న ఈ నటి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్రాపర్టీ ఇపుడు నెట్టింట విశేష చర్చగా మారింది. ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సుమారు రూ. 14 కోట్లతో ఒక బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం.IndexTap.com ద్వారా అందించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ గ్రౌండ్-ప్లస్-టూ (G+2) అంతస్తుల ఇల్లు నగరంలోని అత్యంత డిమాండ్ ఉన్న కార్టర్ రోడ్ పరిసరాల్లో ఉంది.ప్రీమియం ఏరియాలోని ఈ ప్రాపర్టీ 2,226 చదరపు అడుగుల్లో , 2,194 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో ఈ బంగ్లా స్పెషల్గా ఉంటుంది. ఈ బంగ్లా కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. హంగూ ఆర్భాటాల కంటే సరళత, సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ ఇల్లును తీర్చిదిద్దుకుందిట. సాఫ్ట్ టోన్స్ (మృదువైన రంగులు), డెకర్ ఎలిమెంట్స్తో కూడిన 'మినిమలిస్ట్' లుక్తో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అలాగే లివింగ్ రూమ్ కూడా ఎలాంటి గందరగోళం లేకుండా, చాలా ప్రశాంతంగా డిజైన్ చేశారు. మ్యూటెడ్ వాల్స్ (లైట్ కలర్ గోడలు) మధ్యలో ఉన్న ఒక 'పిస్తా గ్రీన్' కలర్ సోఫా గదికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ఓవరాల్ కలర్ ప్యాలెట్ న్యూట్రల్గా ఉంటూ, ప్రతీ వస్తువు ప్రత్యేక ఆకర్షణీయంగా రూపొందించారు. గ్లాస్ ఎలిమెంట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ ఇంట్లోకి సహజమైన వెలుతురు వచ్చేలా, ఇండోర్, అవుట్డోర్ ప్రదేశాలను కలుపుతూ విశాలంగా కనిపించేలా పెద్ద పెద్ద గ్లాస్ ప్యానెళ్లు, పార్టిషన్లను ఉపయోగించారు. పచ్చదనాన్ని జోడిస్తూ మొక్కలు, సాధారణ డెకర్ వస్తువులతో బాల్కనీని అలంకరించారు. ఇంకా 'డెకరేటివ్ షాడో ల్యాంప్స్' మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ సాఫ్ట్ లైటింగ్ గదికి మరింత వెచ్చదనాన్ని, ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. కాగా 'కాలా', 'యానిమల్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించిన తృప్తి దిమ్రి ఈ నెల ప్రారంభంలో నెట్ఫ్లిక్స్లో విడుదలైన తాజా చిత్రం 'మా బెహన్' నటనతో మంచి మార్కులు కొట్టేసింది. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) -
‘డ్రాగన్ మిలిటరీతో వీటికి సంబంధం ఉంది’
ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో దూసుకుపోతున్న చైనా కంపెనీలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. చైనా సైన్యానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సహకరిస్తున్నాయనే అనుమానంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ, బ్యాటరీ తయారీ సంస్థలతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజాలను అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తన ‘మిలిటరీ లింక్డ్ కంపెనీ’ల బ్లాక్లిస్ట్లో చేర్చింది. ఇటీవల విడుదల చేసిన ఈ తాజా జాబితా అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చకు దారితీసింది.బ్లాక్లిస్ట్లోకి చేరిన ప్రముఖ కంపెనీలుఅమెరికా రక్షణ శాఖ ఆంక్షల పరిధిలోకి తెచ్చిన చైనా కంపెనీల్లో గ్లోబల్ మార్కెట్ను శాసిస్తున్న టాప్ బ్రాండ్లు ఉన్నాయి. సోలార్ ఎనర్జీ విభాగంలో.. అతిపెద్ద సోలార్ ప్యానెల్ తయారీదారులైన ట్రినా సోలార్, జేఏ సోలార్ టెక్నాలజీ ఉన్నాయి. ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో గ్లోబల్ లీడర్లుగా ఉన్న ఈవ్ ఎనర్జీ, సీఏఎల్బీ గ్రూప్ సంస్థలున్నాయి. చైనా ఈ-కామర్స్లో కీలకంగా ఉన్న అలీబాబా, ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ప్రొవైడర్ బైడు, బయోటెక్నాలజీ సంస్థ వుజి యాప్ టెక్ ఉన్నాయి.అమెరికా చట్టం ఏం చెబుతోంది?పెంటగాన్ నిబంధనల ప్రకారం, ఈ మిలిటరీ లింక్డ్ జాబితాలో చేరిన కంపెనీలపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధిస్తుంది. అమెరికా రక్షణ శాఖ ఈ కంపెనీలతో నేరుగా ఎలాంటి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. 2027 నాటికి థర్డ్ పార్టీల ద్వారా కూడా ఈ కంపెనీల ఉత్పత్తులను లేదా సేవలను కొనుగోలు చేయకుండా పూర్తిస్థాయిలో పరిమితులు అమల్లోకి వస్తాయి.కంపెనీలు ఏం చేయబోతున్నాయి?అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా కంపెనీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దీనిపై ట్రినా సోలార్ స్పందిస్తూ.. తాము ఎలాంటి సైనిక సంబంధిత కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని ట్రినా సోలార్ స్పష్టం చేసింది. అమెరికా నిర్ణయం పూర్తిగా నిరాధారమైనదని కొట్టిపారేసింది. ‘అమెరికా ప్రభుత్వం వెంటనే ఈ పొరపాటు నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలి. అంతర్జాతీయంగా న్యాయమైన, సమానమైన, వివక్ష లేని వ్యాపార వాతావరణాన్ని కల్పించాలి. దీన్ని సవాలు చేస్తూ ఇప్పటికే చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాం’ అని ట్రినా సోలార్ ఒక అధికారిక ప్రకటనలో డిమాండ్ చేసింది.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ఎరువుల సబ్సిడీ రెట్టింపు
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాతావరణ మార్పులు, సాంకేతిక విప్లవం (ఏఐ) అంతర్జాతీయ వ్యాపార రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఎరువుల సబ్సిడీ బిల్లు ఏకంగా రూ.3.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి.భారత్పై సబ్సిడీ భారంయూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభం 100 రోజులు కావస్తుండడం, హార్మూజ్ జలసంధిలో రవాణా అంతరాయాలు, ఉత్పత్తి కేంద్రాల దెబ్బతినడం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.71 లక్షల కోట్లు కేటాయించగా ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇది రెట్టింపై రూ.3.4 లక్షల కోట్లకు చేరేలా ఉంది.రైతాంగానికి ఊరటప్రభుత్వానికి భారం పెరిగినప్పటికీ రైతులపై పైసా భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. 2018 నుంచి యూరియా ధర (45 కిలోల బస్తా) రూ.266.5 వద్దే స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఒక్కో బస్తాపై సబ్సిడీ రూ.4,000 దాటింది. డీఏపీ (50 కిలోల బస్తా) ధర కూడా రూ.1,350 వద్దే కొనసాగుతోంది.ఆయిల్ కంపెనీలకు మద్దతుగత 78 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1.23 లక్షల కోట్ల మద్దతును అందిస్తోంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించడం ఇందులో భాగమే.బడ్జెట్ పరిమితులు దాటని ద్రవ్యలోటుఈ అదనపు వ్యయాలు దేశ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీయవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2026-27 బడ్జెట్ రూపకల్పనలోనే ఇలాంటి అంతర్జాతీయ అనిశ్చితులను ముందే అంచనా వేసి వ్యూహాత్మకంగా నిధులను కేటాయించారు. బడ్జెట్లో నిర్దేశించుకున్న జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అదనపు రుణాలు లేదా అనుబంధ గ్రాంట్ల అవసరం రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.రూ.1 లక్ష కోట్ల స్థిరీకరణ నిధిఊహించని ప్రపంచ పరిస్థితులను తట్టుకోవడానికి గత ఏడాది ఏర్పాటు చేసిన రూ.1 లక్ష కోట్ల ఆర్థిక స్థిరీకరణ నిధి ప్రస్తుతం కేంద్రానికి రక్షణ కవచంగా మారింది. దీని నుంచే విమానయాన సంస్థల కోసం రూ.10,000 కోట్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధిని కేటాయించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశీయ యూరియా ప్లాంట్లకు తగినంత ఎల్ఎన్జీ సరఫరాను ప్రభుత్వం నిర్ధారించింది. ఇది సబ్సిడీ భారాన్ని కొంతవరకు తగ్గించనుంది.ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టిఅదనపు సబ్సిడీల భారాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం పన్నుయేతర ఆదాయాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. ‘డీఐపీఏఎం(దీపమ్) , డీపీఈ విభాగాలు రాబోయే ఏడాది కాలానికి స్పష్టమైన కార్యాచరణతో ఉన్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బడ్జెట్ లక్ష్యం రూ.80,000 కోట్లను మించి ఆదాయం వస్తుందని భావిస్తున్నాం’ అని ప్రభుత్వ ఉన్నత అధికార వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ఏఐ వెనుక పరుగెత్తబోం!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ ఇన్వెస్ట్మెంట్ బూమ్పై దేశీయ టెక్ దిగ్గజం జోహో అధినేత శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కెట్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఏఐ హైప్ వెనుక పరుగెత్తే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు ఎగబడుతున్న రంగాలకు భిన్నంగా.. దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే, ప్రస్తుతం అందరూ విస్మరిస్తున్న మెటలర్జీ వంటి డీప్ టెక్నాలజీ విభాగాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, మార్కెట్ విశ్లేషకులు ముత్తుకృష్ణన్ దండపాణి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్పై శ్రీధర్ వెంబు స్పందిస్తూ ఈ విశ్లేషణ చేశారు.ప్రస్తుతం అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఏఐ చుట్టూ నెలకొన్న పెట్టుబడి ధోరణిని శ్రీధర్ వెంబు తీవ్రమైన ‘ఏఐ ఉన్మాదం’గా అభివర్ణించారు. ‘అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులను వెచ్చిస్తున్నాయి. ఏఐ మౌలిక సదుపాయాలను సరఫరా చేసే కంపెనీలు ఈ వ్యయ చక్రం నుంచి తక్షణమే భారీ లాభాలను పొందుతున్నాయి. కొనుగోలుదారులు ఈ వ్యయాలను సుదీర్ఘ కాలానికి విస్తరించడం ద్వారా ప్రస్తుతానికి ఆదాయ వృద్ధిని, లాభదాయకతను కాపాడుకోగలుగుతున్నారు’ అని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ) కొందరు భారతదేశం ఏఐ రేసులో వెనుకబడిందని భావిస్తున్నారు. అయితే, ఈ ఆందోళనలను తాము ఏమాత్రం పట్టించుకోవడం లేదని వెంబు స్పష్టం చేశారు.మాకొద్దీ విధానం..ప్రస్తుత ట్రెండ్కు భిన్నమైన వైఖరిని తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని జోహో అధినేత ప్రకటించారు. ‘మేము ఏఐలో జరుగుతున్న క్యాష్ బర్న్ను వెంబడించాలనుకోవడం లేదు. మార్కెట్ దృష్టిలో బోరింగ్గా కనిపించే, భారతదేశానికి అత్యంత కీలకమైన దీర్ఘకాలిక డీప్ టెక్ విభాగాల్లో పెట్టుబడి పెడుతున్నాం’ అని తెలిపారు. దీనికి ఉదాహరణగా ఆయన మెటలర్జీ రంగాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ రంగానికి ఏఐకి వచ్చినంత పబ్లిసిటీ రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో దేశీయ ఉత్పాదక రంగానికి, వ్యూహాత్మక అభివృద్ధికి ఇది అత్యంత విలువైనదిగా మారబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.10-15 ఏళ్ల సుదీర్ఘ వ్యూహంఈ తరహా పెట్టుబడుల ఫలితాలు రాత్రికి రాత్రే రావని, తమ వ్యూహం విజయవంతం కావడానికి కనీసం 10 నుంచి 15 సంవత్సరాల కాలం పడుతుందని వెంబు అంగీకరించారు. తెలివైన దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మార్కెట్ ఫ్యాషన్లను, తాత్కాలిక హైప్లను అనుసరించరని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం జాతీయ అహంభావంతో తీసుకున్నది కాదని, దీర్ఘకాలంలో స్థిరమైన విలువను సృష్టించే రంగాలను గుర్తించడం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
డేటా సెంటర్లో అగ్నిప్రమాదం
భారతదేశంలో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశంలోని ఒక ప్రముఖ థర్డ్ పార్టీ డేటా సెంటర్లో హఠాత్తుగా సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా.. దేశవ్యాప్తంగా గూగుల్ క్లౌడ్ నెట్వర్క్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ ‘గూగుల్ క్లౌడ్’ అధికారికంగా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సాంకేతిక సిబ్బంది నెట్వర్కింగ్ పరికరాలను అత్యవసరంగా మూసివేయడం (Emergency Shutdown) వల్ల ఈ అంతరాయం తలెత్తినట్లు కంపెనీ వెల్లడించింది.మెట్రో నగరాలపై ప్రభావండేటా సెంటర్లో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు సదుపాయంలో అత్యవసర విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనివల్ల ఢిల్లీలోని ‘లోకల్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్’ పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఫలితంగా సదరు మెట్రోపాలిటన్ ప్రాంతం అంతటా నెట్వర్క్ సామర్థ్యం ఒక్కసారిగా పడిపోయింది. ఈ సాంకేతిక లోపం కారణంగా దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన కొన్ని నగరాల్లో నెట్వర్క్ ట్రాఫిక్కు ఆటంకం ఏర్పడిందని కంపెనీ తన స్టేటస్ పేజీలో స్పష్టం చేసింది. ఢిల్లీ (ఎన్సీఆర్ ప్రాంతం), ముంబై, చెన్నై, వాటి సమీప ప్రాంతాలు దీనివల్ల ప్రభావితమైనట్లు తెలిపింది.అయితే, ఈ అగ్నిప్రమాదం అసలు ఎప్పుడు సంభవించింది? దీనివల్ల ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? లేదా ఎవరికైనా గాయాలయ్యాయా? అనే పూర్తి వివరాలను గూగుల్ క్లౌడ్ అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.వ్యాపార రంగంపై ప్రభావంప్రస్తుత డిజిటల్ యుగంలో క్లౌడ్ సేవలపైనే మెజారిటీ కార్పొరేట్ కంపెనీలు ఆధారపడి ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ వంటి దిగ్గజ నెట్వర్క్ నిలిచిపోవడంతో దీని ప్రభావం గొలుసుకట్టు తరహాలో వ్యాపారాలు, వినియోగదారులపై పడింది. దేశంలోని పలు ప్రముఖ వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లు, కంపెనీల అంతర్గత సర్వర్ వ్యవస్థలు మందగించాయి.క్లౌడ్ మార్కెట్లో గూగుల్ ప్రాధాన్యతప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ సేవల అందించే కంపెనీల్లో గూగుల్ క్లౌడ్ ప్రధానమైంది. అంతర్జాతీయంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాలతో గూగుల్ క్లౌడ్ పోటీపడుతోంది. ముఖ్యంగా భారీ డేటా వాల్యూమ్లను ప్రాసెస్ చేయడానికి, అధునాతన కృత్రిమ మేధ పరికరాలను రన్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంపెనీలు గూగుల్ క్లౌడ్ను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం ఐటీ రంగాన్ని కాసేపు కుదిపేసింది.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
రిలయన్స్, మెటా.. మెగా ప్రాజెక్టు
ప్రపంచ సాంకేతిక దిగ్గజం మెటా, దేశీయ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్తంగా భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి. గుజరాత్లోని జామ్నగర్లో ఈ మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా భారత్ను నిలబెట్టే క్రమంలో మెటా సంస్థ గుజరాత్లోని జామ్నగర్లో నిర్మిస్తున్న మొట్టమొదటి ‘బిల్ట్-టు-సూట్’(కస్టమైజ్డ్) డేటా సెంటర్ ఇదే కావడం విశేషం.ప్రాజెక్టు ముఖ్యాంశాలుప్రాథమికంగా 168 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నిర్మాణం కానుంది. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించే అవకాశం ఉంది.రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.డేటా సెంటర్ డిజైన్, నిర్మాణం, యుటిలిటీల నిర్వహణ, నెట్వర్క్ కనెక్టివిటీ, మేనేజ్డ్ సర్వీసెస్ వంటి అన్ని బాధ్యతలను రిలయన్స్ గ్రూప్ నిర్వహించనుంది.ఈ డేటా సెంటర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో పనిచేస్తుంది. అంతేకాకుండా, ప్లాంట్ శీతలీకరణ (కూలింగ్) కోసం లవణరహితం(ఉప్పు తొలగించిన) చేసిన సముద్రపు నీటిని ఉపయోగించనున్నారు.జామ్నగర్ ఎంపికకు గల కారణాలువ్యూహాత్మకంగా జామ్నగర్ ఈ ప్రాజెక్టుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా నిలిచింది. పారిశ్రామికంగా అనుకూలమైన వాతావరణం, మెరుగైన పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి లభ్యతతో పాటు సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు ఇది సమీపంలో ఉంది. దీనికి తోడు జియోకు చెందిన విస్తృతమైన ఫైబర్ నెట్వర్క్ ఈ డేటా సెంటర్కు అదనపు బలాన్ని చేకూర్చనుంది.‘మెటాతో కుదిరిన ఈ భాగస్వామ్యం భారత డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ మెటాతో కలిసి ఇలాంటి అధునాతన డేటా సెంటర్ను నిర్మించడం, ప్రపంచ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇస్తోంది. జామ్నగర్ ఇకపై గ్లోబల్ హైపర్స్కేల్ ఏఐ కంప్యూటింగ్కు ప్రధాన కేంద్రంగా మారుతుంది’ అని ముకేష్ అంబానీ అన్నారు.‘భారతదేశంలో మా మొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్ను నిర్మించడానికి రిలయన్స్తో చేతులు కలపడం మాకు గర్వకారణం. జామ్నగర్లోని ఈ ప్రపంచ స్థాయి ఫెసిలిటీ ద్వారా మా ఏఐ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి సహాయపడుతుంది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థలో మా దీర్ఘకాలిక పెట్టుబడులను మరింత బలోపేతం చేస్తుంది’ అని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తెలిపారు.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 87 పాయింట్లు పెరిగి 23,327 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 358 పాయింట్లు ఎగబాకి 74,274 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.97బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 92.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.97 శాతం తగ్గింది.Today Nifty position 10-06-2026(time: 09:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్ఫోసిస్లో అసెస్మెంట్ పరీక్షలు వాయిదా!
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ప్రతిష్టాత్మకమైన స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, డిజిటల్ సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం జరగాల్సిన ఆన్లైన్ నియామక పరీక్షలు, వ్యక్తిగత అసెస్మెంట్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది.అక్రమాల గుర్తింపుతోనే బ్రేక్!ఇటీవల నిర్వహించిన మూల్యాంకన ప్రక్రియలో అభ్యర్థుల ప్రవర్తనకు సంబంధించి కొన్ని అవకతవకలు, దుర్వినియోగం జరిగినట్లు కంపెనీ అంతర్గత తనిఖీల్లో వెల్లడైంది. నియామక ప్రక్రియలో వక్రీకరణలు చోటుచేసుకున్నాయన్న నివేదికల నేపథ్యంలో పరీక్షల విధానాన్ని కాపాడేందుకు ఇన్ఫోసిస్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. బాధిత అభ్యర్థులందరికీ ఇప్పటికే ఈ వాయిదా సమాచారాన్ని ఈమెయిల్స్ ద్వారా చేరవేసినట్లు స్పష్టం చేసింది. సవరించిన కొత్త అసెస్మెంట్ షెడ్యూల్స్ ఖరారు కాగానే అభ్యర్థులకు మళ్లీ సమాచారం అందిస్తామని కంపెనీ పేర్కొంది. ‘ఈ తాత్కాలిక వాయిదా వల్ల మా నియామక కట్టుబాట్లకు ఎలాంటి ఆటంకం కలగదు. అగ్రశ్రేణి ప్రతిభావంతులను గుర్తించడం, వారికి సరైన అవకాశాలు కల్పించి పెంపొందించడంపైనే మా పూర్తి దృష్టి ఉంది’ అని ఇన్ఫోసిస్ అధికారిక ప్రకటనలో తెలిపింది.క్యాంపస్ రిక్రూట్మెంట్లు యథాతథం..కొన్ని వార్తా సంస్థల నివేదిక ప్రకారం.. ఈ పరీక్షల వాయిదా ప్రభావం కంపెనీ దూకుడుగా చేపడుతున్న క్యాంపస్ సెలక్షన్లపై పడబోదని తెలుస్తుంది. ఇన్ఫోసిస్ తన నియామక లక్ష్యాలను యథాతథంగా కొనసాగించనుంది. అయితే ఈ అంశంపై అధికారికంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సుమారు 20,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా అదే స్థాయి లక్ష్యంతో ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం! -
‘క్లాడ్ ఫేబుల్ 5’ను విడుదల చేసిన ఆంత్రోపిక్!
ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ఆంత్రోపిక్ తన శక్తివంతమైన, అత్యాధునిక ‘మైథోస్’ క్లాస్కు చెందిన మొదటి మోడల్ ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5)ను ఓపెన్ మార్కెట్లోకి విడుదల చేసింది. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, సైంటిఫిక్ రీసెర్చ్, కాంప్లెక్స్ నాలెడ్జ్ వర్క్ వంటి రంగాల్లో అత్యంత అసాధారణమైన సామర్థ్యాలు ఉన్న ఈ మోడల్ భద్రతాపరంగా కొన్ని కఠినమైన పరిమితులతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.గతంలో ఆంత్రోపిక్ సంస్థ ‘మైథోస్’ ప్రివ్యూను ప్రకటించినప్పుడు ఇది ప్రపంచంలోని ఏ సాఫ్ట్వేర్నైనా హ్యాక్ చేయగల శక్తివంతమైనదని పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సైబర్ సెక్యూరిటీ ముప్పుపై భారతదేశంతో సహా పలు ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా సైతం సైబర్ దాడుల ప్రణాళికల కోసం మైథోస్ను ఉపయోగిస్తోందనే నివేదికలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి. ఈ తీవ్రమైన భద్రతా సవాళ్లను అధిగమిస్తూ గరిష్ట రక్షణ వలయాలతో ఆంత్రోపిక్ ఈ సరికొత్త మోడల్ను రంగంలోకి దించింది.క్లాడ్ ఫేబుల్ 5 అంటే ఏమిటి? దీని ప్రత్యేకతలేంటి?ఆంత్రోపిక్ వెల్లడించిన వివరాల ప్రకారం ‘క్లాడ్ ఫేబుల్ 5’ అనేది ఇప్పటివరకు కంపెనీ సాధారణ వినియోగదారుల కోసం విడుదల చేసిన మోడళ్లన్నింటికంటే అత్యంత సమర్థవంతమైనది.అసాధారణ పనితీరు: సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, క్లిష్టమైన విశ్లేషణాత్మక పనుల్లో ఇది అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంది. కొన్ని అంతర్జాతీయ బెంచ్మార్క్ల్లో ఇది కంపెనీ ప్రస్తుత టాప్ మోడల్ ‘క్లాడ్ ఓపస్ 4.8’ కంటే 10 శాతం ఎక్కువ స్కోరు సాధించింది.జైల్బ్రేక్ రక్షణ: మోడల్ విడుదలకు ముందు కంపెనీ అంతర్గతంగా 1,000 గంటలకు పైగా ‘బగ్ బౌంటీ’ పరీక్షలను నిర్వహించింది. అలాగే ‘రెడ్-టీమింగ్’ సంస్థల ద్వారా కూడా పరీక్షించగా ఎక్కడా ఈ మోడల్ భద్రతా వలయాన్ని చేధించే లూప్హోల్స్ కనిపించలేదని స్పష్టం చేసింది.టాస్క్ కాంప్లెక్సిటీ: పని ఎంత సుదీర్ఘంగా, ఎంత సంక్లిష్టంగా ఉంటే ఇతర మోడళ్లతో పోలిస్తే ఫేబుల్ 5 అంతటి మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఆంత్రోపిక్ తెలిపింది.అత్యంత కఠినమైన భద్రతా చర్యలుమైథోస్ క్లాస్ మోడళ్ల వల్ల సైబర్ సెక్యూరిటీ, బయోలాజికల్, కెమికల్ రంగాల్లో ముప్పు పొంచి ఉందనే ఆందోళనల నేపథ్యంలో ఆంత్రోపిక్ ఈ మోడల్లో వినూత్నమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పింది.ఫాల్బ్యాక్ మెకానిజంఒకవేళ వినియోగదారు ఎవరైనా రిసిన్(ఒక రకమైన ప్రాణాంతక విషం) ఎలా తయారు చేయాలి? వంటి అత్యంత ప్రమాదకరమైన ప్రశ్నలను అడిగితే ఫేబుల్ 5 ఆ ప్రశ్నను బ్లాక్ చేస్తుంది. వెంటనే ఆ సెషన్ సురక్షితమైన ‘క్లాడ్ ఓపస్ 4.8’ మోడల్కు బదిలీ అవుతుంది. తద్వారా హానికరమైన సమాచారం బయటకు రాకుండా అడ్డుకుంటుంది. ఇలాంటి రక్షణల వల్ల దాదాపు 95 శాతం సెషన్లు పూర్తిగా ఫేబుల్ 5 లోనే నడుస్తాయని, కేవలం 5 శాతం లోపు అత్యంత సున్నితమైన కేసుల్లో మాత్రమే ఓపస్ 4.8 కి ట్రాన్స్ఫర్ అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది.చైనా వ్యూహాలకు బ్రేక్చైనాకు చెందిన కొన్ని ఏఐ కంపెనీలు తమ సొంత మోడళ్లకు శిక్షణ ఇచ్చుకోవడానికి క్లాడ్ మోడల్ను డిస్టిలేషన్ (పెద్ద మోడల్ డేటా ఆధారంగా చిన్న మోడళ్లను తయారు చేయడం) చేస్తున్నాయని ఆంత్రోపిక్ గతంలో ఆరోపించింది. అయితే, ఫేబుల్ 5 లో పొందుపరిచిన యాంటీ-డిస్టిలేషన్ రక్షణలు ఇలాంటి మేధోసంపత్తి చౌర్యానికి అడ్డుకట్ట వేయనున్నాయి.మైథోస్ 5, గ్లాస్ స్వింగ్ ప్రాజెక్ట్ఫేబుల్ 5 తో పాటు ఆంత్రోపిక్ సైబర్ డిఫెండర్లు, కీలక మౌలిక సదుపాయాలు అందించేవారికోసం ‘క్లాడ్ మైథోస్ 5’ ను కూడా పరిమితంగా అందుబాటులో ఉంచింది. ‘ప్రాజెక్ట్ గ్లాస్ స్వింగ్’ ద్వారా ఇప్పటికే అనుమతి పొందిన సంస్థలు మాత్రమే దీనిని వాడగలవు. ఫేబుల్ 5 లాగే ఇది కూడా ఒకే అంతర్గత మోడల్ను కలిగి ఉన్నప్పటికీ ఇందులో భద్రతాపరమైన పరిమితులు (రక్షణలు) ఎత్తివేశారు. సైబర్ రక్షణ పరిశోధనల కోసమే దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ చెప్పింది.ఎవరికి అందుబాటులో?క్లాడ్ ఫేబుల్ 5 ప్రస్తుతం క్లాడ్ ఏపీఐ, యూజర్-ఆధారిత ఎంటర్ప్రైజ్ ప్లాన్ల ద్వారా అందుబాటులోకి వచ్చింది. సబ్స్క్రిప్షన్ ఆధారిత వినియోగదారుల కోసం ఇది దశలవారీగా విడుదల కానుంది. జూన్ 22 వరకు అదనపు ఖర్చు లేకుండా ప్రో, మాక్స్, టీమ్, ఎంటర్ప్రైజ్ ప్లాన్ల వారికి అందుబాటులో ఉంటుంది. జూన్ 23 నుంచి స్టాండర్డ్ ప్లాన్ల నుంచి తొలగిస్తారు. తర్వాత యూజర్ సామర్థ్యం ఆధారంగా యూసేజ్ క్రెడిట్లు అవసరమవుతాయి.ఇదిలాఉండగా, మానవ ప్రమేయం లేకుండానే ఏఐ తనను తాను మరింత శక్తివంతంగా మార్చుకునే ప్రమాదం ఉందని, అందువల్ల గ్లోబల్ ఏఐ ల్యాబ్లు అన్నీ కలిసి ఈ ఫ్రాంటియర్ ఏఐ అభివృద్ధిపై నియంత్రణ కలిగి ఉండాలని ఆంత్రోపిక్ పిలుపునివ్వడం గమనార్హం.ఇదీ చదవండి: కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం! -
కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం!
ఇంట్లో పిల్లలు పసిప్రాయంలో పాఠశాల మెట్లు ఎక్కడం, చూస్తూ చూస్తూనే స్కూల్ విద్య పూర్తి అవ్వడం వేగంగా జరిగిపోతాయి. అప్పటివరకు కేవలం పాఠశాల ఫీజులకే పరిమితమైన తల్లిదండ్రుల ఆలోచనలు.. ఒక్కసారిగా కాలేజీ ఫీజులు, వృత్తిపరమైన కోర్సులు లేదా విదేశీ విద్య వైపు మళ్లుతాయి. అప్పుడే ఆర్థిక వాస్తవికత తెలిసొస్తుంది.సమస్య ఏమిటంటే, విద్యా రంగంలో ద్రవ్యోల్బణం నిశ్శబ్దంగా, వేగంగా పెరుగుతుంది. భారతదేశంలో ఐఐటీ, ఐఐఎం లేదా మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల ఖర్చులే ఇప్పుడు రూ.లక్షల్లో ఉన్నాయి. ఇక ట్యూషన్ ఫీజు, వసతి, జీవన ప్రమాణాలను లెక్కిస్తే విదేశీ విద్య రూ.కోట్లలోకి చేరుతోంది. పిల్లలకు 17 లేదా 18 ఏళ్లు వచ్చేసరికి సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి సమయం అసలు మిగలదు.ఇక్కడే మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఒక ఆయుధంగా మారుతుంది. విద్యా ప్రణాళిక విషయానికి వస్తే జీవితంలో ఆలస్యంగా పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టడం కంటే చిన్న మొత్తంతోనైనా ముందుగా ప్రారంభించడం అత్యంత కీలకమైన అంశం.కాంపౌండింగ్ చేసే అద్భుతంచాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం రూ.1 కోటి విద్యా నిధిని నిర్మించాలంటే చాలా పెద్ద మొత్తంలో లేదా అగ్రెసివ్గా పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. కానీ ఆర్థిక సూత్రాల ప్రకారం పెద్ద మొత్తంతో మొదలుపెట్టడం కంటే ముందస్తుగా ప్రారంభించడమే చాలా ముఖ్యం. పిల్లలకు 3 లేదా 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పెట్టుబడి ప్రారంభించే తల్లిదండ్రులకు ఆ డబ్బు వృద్ధి చెందడానికి ఒక దశాబ్దానికి పైగా సమయం దొరుకుతుంది. తక్కువ నెలవారీ సిప్ మొత్తాలు కూడా కాలక్రమేణా పెద్ద నిధిగా మారడానికి సుదీర్ఘ సమయం తోడ్పడుతుంది.ఉదాహరణకు, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ప్రారంభించే సిప్కు 12 నుంచి 15 సంవత్సరాల కాలపరిమితి లభిస్తే రాబడిపై అదనపు రాబడి వచ్చి చేరుతుంది. మొదటి కొన్ని సంవత్సరాలు ఈ వృద్ధి పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ కాంపౌండింగ్ అసలు విశ్వరూపం తరువాతి సంవత్సరాల్లో, ముఖ్యంగా ఫండ్ సైజ్ పెద్దదవుతున్న కొద్దీ స్పష్టంగా కనిపిస్తుంది.వాయిదా వేస్తే పెను భారంప్రస్తుత కాలంలో స్కూలు ఫీజులు, హోమ్ లోన్లు, రోజువారీ నిత్యావసరాలు, మారుతున్న జీవనశైలి ఖర్చుల వల్ల తల్లిదండ్రులు తరచుగా దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేస్తుంటారు. ‘ముందు ఈ ఖర్చులు చూసుకుందాం, పెట్టుబడి తర్వాత చేయవచ్చు’ అనుకోవడం చాలా పెద్ద పొరపాటు.ఆదాయానికి తగ్గట్లుగా అడుగులుతల్లిదండ్రుల కెరీర్ ప్రారంభంలో లేదా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆదాయం తక్కువగా ఉండటం సహజం. అందుకే పెద్ద మొత్తంలో సిప్లు ప్రారంభించడానికి తల్లిదండ్రులు వెనుకాడతారు. ఈ సమస్యకు స్టెప్-అప్ సిప్ అద్భుతమైన పరిష్కారం.ఒకేసారి పెద్ద మొత్తంతో కాకుండా ప్రస్తుతం మీ బడ్జెట్కు అనుకూలమైన మొత్తంతో (ఉదాహరణకు రూ.5,000) ప్రారంభించవచ్చు.ఏటా మీ జీతం లేదా ఆదాయం పెరిగే కొద్దీ ఈ సిప్ మొత్తాన్ని క్రమంగా (ఉదాహరణకు 10% చొప్పున) పెంచుకుంటూ పోవచ్చు.ఈ క్రమంలో రూ.5,000 కాస్తా కాలక్రమేణా రూ.8,000, రూ.12,000గా మారుతుంది. ఇది మీ ప్రస్తుత ఆర్థిక బడ్జెట్కు ఎలాంటి అంతరాయం కలిగించదు.దీర్ఘకాలంలో ఈ చిన్న క్రమబద్ధమైన పెంపు మీ తుది నిధిని ఊహించని రీతిలో పెంచుతుంది. ఎందుకంటే అదనంగా జతచేసే ప్రతి రూపాయికి కూడా కాంపౌండింగ్ సంవత్సరాల తరబడి వర్తిస్తుంది.దీర్ఘకాలంలో వరంవిద్యా లక్ష్యాలు అనేవి సాధారణంగా 12 నుంచి 15 సంవత్సరాల సుదీర్ఘ కాలపరిమితితో కూడుకున్నవి. పెట్టుబడి కాలపరిమితి పెరిగే కొద్దీ మార్కెట్ స్వల్పకాలిక హెచ్చుతగ్గులు లేదా అస్థిరత కలిగించే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది. నిజానికి మార్కెట్లు పతనమైనప్పుడు సిప్లను కొనసాగించడం వల్ల దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఒక పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. తక్కువ ధరలకే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లభిస్తాయి. కానీ, మార్కెట్ పడిపోయిన ప్రతిసారీ భయపడి పెట్టుబడులు ఆపేసే తల్లిదండ్రులు కాంపౌండింగ్ ప్రక్రియకు స్వయంగా బ్రేకులు వేసుకున్న వారవుతారు.స్థిరత్వమే ముఖ్యంఆర్థిక మార్కెట్లలో అత్యంత విజయవంతమైన పోర్ట్ఫోలియోలు మార్కెట్ను కచ్చితంగా అంచనా వేయడం వల్ల నిర్మితం కాలేదు. కేవలం పెట్టుబడిదారులు చూపిన స్థిరత్వం వల్లే సాధ్యపడ్డాయి. మంచి కాలం, చెడు కాలం, మార్కెట్ క్రాష్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, మారుతున్న జీవిత పరిస్థితులన్నింటినీ తట్టుకుని ఎవరైతే తమ నెలవారీ సిప్లను కొనసాగించారో వారే విజేతలుగా నిలిచారని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
డార్క్ ప్యాటర్న్స్తో ఏటా రూ.28,000 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన డిజిటల్ ప్లాట్ఫారమ్లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ‘డార్క్ ప్యాటర్న్స్’ (మోసపూరిత డిజైన్ విధానాలు) కారణంగా భారతీయ ఆన్లైన్ కొనుగోలుదారులు ఏటా రూ.25,000 కోట్ల నుంచి రూ.28,000 కోట్ల వరకు నష్టపోతున్నట్లు మార్కెట్ పరిశోధనా సంస్థ డేటమ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. సంస్థ మంగళవారం విడుదల చేసిన ‘డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్లైన్ మార్కెట్ప్లేసెస్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2026 తొలి త్రైమాసికంలో దేశంలోని 50 నగరాలకు చెందిన 2,590 మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన 12 ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఇందులో విశ్లేషించారు. డార్క్ పాటర్న్స్ అంటే: ఉత్పత్తులు లేదా సేవలను అంటగట్టేందుకు అనుసరించే వివిధ పద్ధతులే డార్క్ పాటర్న్స్గా వ్యవహరిస్తారు. వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, వారిని గందరగోళానికి గురిచేయడం, బలవంతంగా షాపింగ్ చేయించడమే వీటి లక్ష్యం. నివేదికలో మరిన్ని అంశాలు: → రహస్య ఛార్జీలు, బలవంతపు యాడ్–ఆన్లు, డ్రిప్ ప్రైసింగ్, ఫాల్స్ అర్జెన్సీ, సబ్్రస్కిప్షన్ ఉచ్చులు వంటి విధానాల కారణంగా దేశంలోని 30.4 కోట్ల మంది ఆన్లైన్ కొనుగోలుదారుల్లో 88 శాతం మంది నెలకు సగటున రూ.78 నుంచి రూ.87 వరకు అదనపు భారం భరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. → ప్రారంభంలో ఒక ధర చూపించి, చెల్లింపు దశలో అదనపు రుసుములు జోడించే ‘డ్రిప్ ప్రైసింగ్’ లేదా ‘హిడెన్ ఛార్జీలు’ ఎదురవుతున్నాయని 63 % మంది డిజిటల్ చెల్లింపుల వినియోగదారులు తెలిపారు. 2024లో ఈ సంఖ్య 52 శాతంగా ఉండగా, ప్రస్తుతం 63 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశమని నివేదిక పేర్కొంది → అధ్యయనంలో భాగమైన 73 శాతం ప్లాట్ఫారమ్లు వినియోగదారులకు ఇష్టం లేకపోయినా.., కొనుగోలు చేసేలా బలవంతపు వ్యూహాలు (ఫోర్డ్స్ యాక్షన్) అమలు చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. → ఆన్లైన్ కొనుగోలుదారులలో 81 శాతం మందికి ఇలాంటి మోసపూరిత టెక్నిక్స్ (డార్క్ ప్యాటర్న్స్) గురించి అవగాహన ఉన్నప్పటికీ, వారిలో 85 శాతం మంది డార్క్ ప్యాటర్న్స్ వల్ల ఏదో ఒక రూపంలో తప్పుదోవ పట్టించబడినట్లు వెల్లడించారు. దీనిని నివేదిక ‘అవగాహన వైరుధ్యం’ గా అభివరి్ణంచింది. → ఈ–కామర్స్ విభాగంలో 50 శాతం మంది వినియోగదారుల మద్దతుతో అమెజాన్ అత్యంత విశ్వసనీయ వేదికగా నిలిచింది. మరోవైపు, ఫ్లిప్కార్ట్ విషయంలో నమ్మకం (37 శాతం) కంటే అపనమ్మకమే (41 శాతం) ఎక్కువగా నమోదైంది. ఇక్కడ ప్రతి లావాదేవీలోనూ వినియోగదారుల నుంచి ‘అదనపు సొమ్ము’ వసూలు చేసే ప్రక్రియ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నివేదిక విశ్లేషించింది. → ఆన్లైన్ ట్రావెల్ రంగంలో మేక్మైట్రిప్ అత్యంత సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. కాగా క్లియర్ట్రిప్ వినియోగదారులకు ఎక్కువ నష్టం చేకూరుస్తున్నట్లు రేటింగ్ పొందింది. → క్విక్ కామర్స్ రంగంలో బిగ్బాస్కెట్ యాప్ తీవ్రమైన డార్క్ ప్యాటర్న్స్ స్కోరును నమోదు చేసింది. → ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఈ డిజిటల్ మోసాలను అరికట్టడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయని నివేదిక అభిప్రాయపడింది. అయితే, ఆన్లైన్ కొనుగోలుదారుల్లో 74 శాతం మంది పారదర్శకమైన, న్యాయబద్ధమైన డిజైన్ విధానాలను అనుసరించే ప్లాట్ఫారమ్ల కోసం అవసరమైతే కొంత ఎక్కువ ధర చెల్లించేందుకూ సిద్ధంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. -
మెటాతో ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్, సోషల్ మీడియా దిగ్గజం మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికల ద్వారా క్రియేటర్ ఆధారిత షాపింగ్ను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని తెలిపింది. ఇందులో భాగంగా కంటెంట్ క్రియేటర్లు ఫ్లిప్కార్ట్, మింత్రా వేదికలపై లభ్యమయ్యే ఉత్పత్తులను గుర్తించి, వాటిని నేరుగా తమ ఫేస్బుక్ పోస్టులు, రీల్స్లో ట్యాగ్ చేస్తారు. వినియోగదారులు ఆ ఉత్పత్తి ట్యాగ్లపై ట్యాప్ చేసి నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జరిగే ప్రతి విక్రయంపై క్రియేటర్లకు కమీషన్ లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ సేవలను తొలుత ఫేస్బుక్లో అందుబాటులోకి తెచ్చి, తదుపరి దశలో ఇన్స్ట్రాగామ్కు విస్తరించనున్నారు. మారుతున్న కొనుగోలు ధోరణులు: ‘‘భారతీయ రిటైల్ రంగంలో జెన్ జెడ్ కొనుగోలు ధోరణులను ఫ్లిప్కార్ట్ రెండేళ్ల క్రితమే గుర్తించింది. ప్రస్తుతం కొనుగోలుదారులు సెర్చ్ బార్ల కంటే సోషల్ మీడియా ఫీడ్స్ ఆధారంగానే ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటున్నారు. క్రియేటర్లే కొత్త తరహా డిజిటల్ దుకాణాలుగా అవతరిస్తున్నారు. ఈ క్రమంలో మెటాతో కుదిరిన భాగస్వామ్యం కంటెట్ క్రియేటర్లను వ్యాపారవేత్తలుగా మార్చడమే కాకుండా, బ్రాండ్లు వినియోగదారులకు మరింత చేరువ అవుతాయి’’ అని ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఎఫ్వో రవి అయ్యర్ తెలిపారు. -
విదేశీ పెట్టుబడులకు సంస్కరణల కార్పెట్!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో ఏర్పడిన ఆర్థిక అనిశ్చితులను సమర్థవంతంగా గట్టెక్కడం, విదేశీ పెట్టుబడులను తిరిగి ఆకర్షించేందుకు కేంద్రం తన సంస్కరణల అజెండాను మరింత వేగంగా ముందుకు తీసుకుపోనుంది. గత ఏడాదిన్నరగా మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలిపోతుండడం చూస్తున్నాం. హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్ సరఫరాల్లో సమస్యలు ఏర్పడి వాటి ధరలు భారీగా పెరిగిపోవడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో దిగుమతుల బిల్లు పెరిగిపోయి రూపాయి విలువ క్షీణిస్తోంది. ఇది విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరిచే అంశం. ఈ తరుణంలో తిరిగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అదనపు చర్యలను పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణపై ఎలాంటి ఆంక్షల ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశాయి. దేశీ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని.. బలమైన వినియోగానికి తోడు మెరుగైన జీఎస్టీ వసూళ్లు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు మెరుగుపడుతున్న పరిస్థితులను అవి గుర్తు చేస్తున్నాయి. చమురు, ఎరువుల దిగుమతుల బిల్లు పెరిగిపోయిన తరుణంలో దేశీ వృద్ధి పథాన్ని కాపాడుకోవడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను, ఆస్తుల విక్రయాన్ని మరింత వేగిరపరచాలని సర్కారు యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్థికరంగ సంస్కరణలు.. ఆర్థిక రంగంలో సంస్కరణలను కొనసాగించడం ద్వారా దీర్ఘకాల విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా క్యాపిటల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయాలనుకుంటోందని తెలిపాయి. అవసరమైన చర్యలను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి చేపడుతుందని, తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించనున్నట్టు చెప్పాయి. గత వారం ప్రభుత్వ సెక్యూరిటీల్లో (జీ–సెక్లు) విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను (ఎఫ్పీఐ) పెంచడం కోసం చర్యలు తీసుకోవడం తెలిసిందే. వడ్డీ ఆదాయం, దీర్ఘకాల, స్వల్పకాల మూలధన లాభాలపై పన్నుల నుంచి విదేశీ పెట్టుబడిదారులకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇది రూపాయి బలోపేతానికి కొంతమేర సాయపడినట్టు పేర్కొన్నాయి. బంగారం, వెండి దిగుమతులపైనా సుంకాలను 6% నుంచి 15 శాతానికి పెంచడం ఫలితాన్నిస్తున్నట్టు చెప్పాయి. బీమాలో 100% ఎఫ్డీఐను అనుమతించడం గమనార్హం.కట్టడిలోనే ద్రవ్యలోటు.. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో మాదిరే వృద్ధి కార్యకలాపాలు ప్రస్తుత త్రైమాసికంలోనూ (2026–27 ఏప్రిల్–జూన్) కొనసాగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లు కూడా స్థిరంగానే ఉన్నట్టు చెప్పాయి. దిగుమతుల వ్యయాలు పెరిగిపోయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును బడ్జెట్లో పేర్కొన్న విధంగా జీడీపీలో 4.3 శాతానికి కట్టడి చేయడం ఇప్పటికీ సాధ్యమేనని పేర్కొన్నాయి. -
పసిడి రీబౌండ్
న్యూఢిల్లీ: పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. యూఎస్ డాలర్ బలహీనపడడంతో బులియన్ మార్కెట్లో సెంటిమెంట్ మెరుగుపడింది. వరుసగా మూడు రోజుల నష్టాల అనంతరం మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.1,500 పెరిగి రూ.1,60,300కు చేరింది. వెండి ధర మాత్రం క్రితం రోజుతో పోలి్చతే ఎలాంటి మార్పు లేకుండా కిలోకి రూ.2,55,700 వద్ద కొనసాగింది. ముడి చమురు ధరలు దిగిరావడం, అమెరికా యూఎస్ డాలర్, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ బలహీనపడడం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులను విరమించుకోవాలన్న అంగీకారానికి రావడంతో సెంటిమెంట్ మెరుగుపడినట్టు చెప్పారు. అధికారిక కాల్పుల విరమణ దిశగా పురోగతి ఉందన్న అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలతో ద్వైపాక్షిక పరిష్కారంపై అంచనాలు ఏర్పడినట్టు తెలిపారు. దీంతో ఇంధన ధరల ఆధారిత ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గి బంగారం ధరలకు మద్దతిచ్చినట్టు చెప్పారు. అంతర్జాతీయంగా భారీ పతనంఅంతర్జాతీయ మార్కెట్లో పసిడి 2 శాతం తగ్గి ఔన్స్కు 4,270 డాలర్ల వద్ద, వెండి ధర 5 శాతం పతనంతో ఔన్స్కు 65 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. -
వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026–27) భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తగ్గించింది. గతంలో 6.7 శాతంగా ప్రకటించిన అంచనాను 6.4 శాతానికి సవరిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా–ఇరాన్ యుద్ధంతో సెపె్టంబర్, డిసెంబర్ త్రైమాసికాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు నిదానించనున్నట్టు తెలిపింది. ప్రజల ఆదాయం, వినియోగ వ్యయాలపై ధరల పెరుగుదల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదు కావడం తెలిసిందే. ‘‘జీడీపీ వృద్ధి రేటు 2026–27లో 6.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. మార్చిలో ప్రకటించిన అంచన కంటే 0.3 శాతం తక్కువ. వృద్ధిలో దేశీ డిమాండ్ కీలక పాత్ర పోషిస్తుంది. నికర దిగుమతులు తక్కువగా ఉండడం వృద్ధికి అనుకూలించనుంది’’ అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.6 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చన్నది ఆర్బీఐ తాజా అంచనా. ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని జూన్ సమీక్ష అనంతరం ప్రకటించడం తెలిసిందే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇటీవలి కాలంలో పెంచడాన్ని ఫిచ్ తన నివేదికలో ప్రస్తావించింది. 2027–28లో జీడీపీ వృద్ధి 6.7%కి పుంజుకుంటుందని అంచనా వేసింది. ధరలు పెరుగుతాయ్.. భారత్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో పెరగలేదంటూ, రానున్న నెలల్లో ధరలు క్రమంగా పెరుగుతాయని ఫిచ్ తెలిపింది. ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 8.3%కి పెరగ్గా, రిటైల్ ద్రవ్యోల్బణం 3.5%గా ఉండడాన్ని ప్రస్తావించింది.అంతర్జాతీయ వృద్ధి 2.4 శాతం 2026 సంవత్సరానికి అంతర్జాతీయ వృద్ధి రేటు అంచనాలను సైతం 0.2 శాతం తగ్గించి 2.4 శాతంగా ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. -
బెడ్షీట్ ఉతికేందుకు రూ.5 కంటే తక్కువే
భారతీయ రైల్వేలలో ఏసీ కోచ్లలో ప్రయాణించే ప్రయాణికులకు అందించే లినెన్ కిట్ గురించి అందరికీ తెలుసు. ఇందులో సాధారణంగా బెడ్షీట్, దిండు, టవల్, దుప్పటి ఉంటాయి. అయితే ఈ వస్తువులను శుభ్రం చేయడానికి రైల్వేలు ఎంత ఖర్చు చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా?లాండ్రీ టెండర్ పత్రం ప్రకారం.. ఒక బెడ్షీట్ ఉతకడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 3.16 మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటైన భారత రైల్వే వ్యవస్థలో పరిశుభ్రత నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోల్చితే ఇది చాలా తక్కువగా ఉందని చాలామంది భావిస్తున్నారు.ఉతికేందుకు ఖర్చు ఎంత?భారతీయ రైల్వేల డిపార్ట్మెంటల్ లాండ్రీ టెండర్ డాక్యుమెంట్ ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పత్రం ప్రకారం.. ఒక బెడ్షీట్ ఉతికేందుకు అధికారిక రేటు ఒక్కదానికి రూ. 3.16. ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారికి ప్రయాణంలో భాగంగా పలు లినెన్ వస్తువులు అందిస్తారు. సాధారణంగా వీటిలో బెడ్షీట్, దిండు, టవల్, దుప్పటి ఉంటాయి. ఈ ఏర్పాటు ముఖ్యంగా సుదూర, రాత్రి వేళల రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల సౌకర్యం అందించాల్సిన దృష్ట్యా అమలులో ఉంది.రైల్వే నెట్వర్క్లో ప్రతిరోజు వినియోగించే భారీ స్థాయి లినెన్ను శుభ్రం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చాలామంది ప్రయాణికులు తరచూ ఆలోచిస్తుంటారు. టెండర్ పత్రం ప్రకారం.. బెడ్షీట్ ఉతికే ఖర్చు తక్కువగానే ఉంది. భారీ స్థాయిలో లాండ్రీ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఖర్చులను భారతీయ రైల్వేలు ఎలా నియంత్రిస్తున్నాయనే అంశంపై ఇది చర్చకు దారి తీసింది.భారతీయ రైల్వేలు ప్రతిరోజు మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వేలాది ఏసీ కోచ్లు నడుస్తున్నాయి. ఇంత విస్తృత నెట్వర్క్లో లినెన్ సేవల నిర్వహణకు ప్రత్యేక లాండ్రీ కేంద్రాలు, క్రమం తప్పని శుభ్రపరిచే ప్రక్రియలు అవసరం. ఇటీవల చర్చకు వచ్చిన ఈ టెండర్ సంఖ్య, రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాల నిర్వహణకు అయ్యే నిర్వహణ వ్యయాల్లో ఒక అంశంపై అవగాహన కల్పిస్తోంది. -
బీఎస్ఈతో చేతులు కలిపిన మీషో
న్యూఢిల్లీ: ఈకామర్స్ ప్లాట్ఫామ్ మీషో తాజాగా బీఎస్ఈతో చేతులు కలిపింది. తద్వారా ప్రాజెక్ట్ శిఖర్ (Project Shikhar) పేరుతో కొత్త కార్యాచరణకు తెరతీసింది. ఇందుకు రెండు సంస్థలు అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. తాజా ప్రాజెక్ట్లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎంఎస్ఎంఈ)లు, డిజిటల్ బిజినెస్లు స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యేందుకు వెసులుబాటు కల్పించనున్నాయి.వెరసి ఎంఎస్ఎంఈలతోపాటు.. అత్యున్నత పనితీరు చూపుతున్న స్వతంత్ర ఈకామర్స్ సంస్థలు బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలుగా అవతరించేందుకు దారి ఏర్పడనుంది. దీంతో వృద్ధి అవకాశాలకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కనుంది. చురుకైన, ఉపాధి కల్పనకు వీలున్న బిజినెస్లు ప్రత్యక్షంగా క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయించేందుకు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ అత్యున్నత అవకాశాలను కల్పిస్తున్నట్లు బీఎస్ఈ ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు.గత కొన్నేళ్లుగా బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ వందలకొద్దీ సంస్థల లిస్టింగ్కు దారి చూపినట్లు తెలియజేశారు. తద్వారా వృద్ధి సంబంధ పెట్టుబడులు, పాలనాప్రమాణాల మెరుగుకు సహకరించినట్లు వివరించారు. మీషోతో తాజా భాగస్వామ్యం ద్వారా ఎస్ఎంఈలు, ఈకామర్స్ విక్రేతలకు లిస్టింగ్ అవకాశాలు మెరుగుపడనున్నట్లు పేర్కొన్నారు.చదవండి: లీటర్పై 20 రూపాయల డిస్కౌంట్! -
ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారా ఏంటి?
ప్రస్తుత కాలంలో ఆన్లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసేవారు విపరీతంగా పెరిగిపోయారు. అయితే, ఇలా కొనుగోళ్లు చేస్తున్న వారిలో ప్రతిరోజు ఎంతో కొంత మోసపోతూనే ఉన్నారు. ఉదాహరణకు.. ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తున్నప్పుడు మొదట రూ.499 అని కనిపిస్తుంది. కానీ, చెల్లింపు చేసే చివరి దశకు వెళ్లేసరికి డెలివరీ ఛార్జీ, ప్లాట్ఫాం ఫీజు, ప్యాకేజింగ్ ఫీజు అంటూ ధర రూ.600 దాటిపోతుంది. మరికొన్ని సార్లు "ఇంకా 2 నిమిషాల్లో ఆఫర్ ముగుస్తుంది", "ఈ వస్తువును 20 మంది చూస్తున్నారు" వంటి సందేశాలు చూపించి వెంటనే కొనుగోలు చేయాలనే ఒత్తిడి, ఆత్రుతను తీసుకొస్తారు. వినియోగదారులను ఇలాంటి పద్ధతులతో ప్రభావితం చేసే డిజిటల్ వ్యూహాలను "డార్క్ ప్యాటర్న్స్" అంటారు. ఈ మోసపూరిత పద్ధతుల వల్ల భారత్లో ఆన్లైన్ కొనుగోలుదారులు ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నట్లు తాజా డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా రూపొందించిన డిజిటల్ డిజైన్ పద్ధతులను కంపెనీలు పాటిస్తూ కస్టమర్లను మోసగిస్తున్నాయి."డార్క్ ప్యాటర్న్స్" అని పిలిచే మోసపూరిత ఆన్లైన్ డిజైన్ పద్ధతుల వల్ల వినియోగదారులు ప్రతి ఏడాది రూ. 25,000 కోట్ల నుంచి రూ. 28,000 కోట్ల మధ్య నష్టపోతున్నారని డాటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్లైన్ మార్కెట్ప్లేసెస్ పేరుతో విడుదలైన నివేదిక ప్రకారం.. భారత్లోని 304 మిలియన్ల ఆన్లైన్ కొనుగోలుదారుల్లో దాదాపు 88 శాతం మంది హిడెన్ (మనకు ముందు తెలియని) ఛార్జీలు, తప్పనిసరి అదనపు సేవలు, డ్రిప్ ప్రైసింగ్, సబ్స్క్రిప్షన్ వంటి పద్ధతుల కారణంగా నెలకు సగటున రూ.78 నుంచి రూ.87 వరకు అదనపు ఖర్చు భరిస్తున్నారు. డ్రిప్ ప్రైసింగ్ అంటే ప్రారంభంలో ధర తక్కువగా చూపించి, చివరి దశల్లో అదనపు ఛార్జీలు చేర్చే విధానం.మోసపూరిత డిజిటల్ పద్ధతులను అడ్డుకోవడంలో ప్రస్తుతం ఉన్న నియంత్రణ చర్యలు కొద్ది మేరకే ప్రభావం చూపుతున్నాయని నివేదిక పేర్కొంది మోసపూరిత డిజిటల్ పద్ధతులపై భారీ జరిమానాలు అవసరమని చెప్పింది. అలాగే, అమలు చేయడానికి వీలుగా ఉన్న నిబంధనలు అవసరమని సూచించింది.50 నగరాల్లోని 2,590 మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వేలో, ఆన్లైన్ చెల్లింపులు చేసే వారిలో దాదాపు 63 శాతం మంది హిడెన్ ఛార్జీలు లేదా డ్రిప్ ప్రైసింగ్ను ఎదుర్కొన్నట్లు వెల్లడైంది. ఇందులో అదనపు ఖర్చులు కొనుగోలు ప్రక్రియ చివరి దశల్లో మాత్రమే కనిపిస్తాయి. 2024లో నమోదైన 52 శాతంతో పోలిస్తే ఇది బాగా పెరిగింది. 73 శాతం వరకు వినియోగదారులపై ఒత్తిడి తెచ్చే ఫోర్స్డ్-యాక్షన్ పద్ధతులు వాడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇవి వినియోగదారులు సాధారణంగా తీసుకోని నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి పెడతాయి. -
చివరి గంటలో కొనుగోళ్ల జోరు..
గడిచిన రెండు సెషన్లుగా ఇన్వెస్టర్లను కలవరపెట్టిన నష్టాల పరంపరకు మంగళవారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా బ్యాంకింగ్ రంగంలో వ్యూహాత్మక కొనుగోళ్లు మార్కెట్లకు ఊరటనిచ్చాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 394 పాయింట్లు పుంజుకొని 73,918.76 మార్కు వద్ద స్థిరపడింది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty 50) కూడా 119 పాయింట్లు లాభపడి 23,242.10 వద్ద ముగిసింది. మధ్యాహ్నం సమయంలో కొంత లాభాల స్వీకరణ జరిగినప్పటికీ చివరి గంటలో కొనుగోలుదారులు ఆసక్తి చూపడంతో సూచీలు తిరిగి పుంజుకున్నాయి.మార్కెట్ జోష్కు దారితీసిన కారణాలునేటి మార్కెట్ గమనాన్ని విశ్లేషిస్తే ఈ రికవరీకి ప్రధానంగా కొన్ని అంశాలు దోహదపడ్డాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో..ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల తగ్గింపుపశ్చిమాసియాలో కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాల్చిన ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పర దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ మార్కెట్లలో భయాలను తొలగించింది.క్రూడాయిల్ ధరలుఅంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 0.71% తగ్గి బ్యారెల్కు 92.75 డాలర్ల వద్దకు చేరింది. భారతదేశం వంటి దిగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థకు చమురు ధరలు తగ్గడం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది.ఆర్బీఐ బూస్టర్ డోస్.. బ్యాంకింగ్ రంగం హవానేటి మార్కెట్ ర్యాలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం బూస్ట్గా మారింది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు గాను బ్యాంకులు సేకరించే తాజా ఎఫ్సీఎన్ఆర్-బీ డిపాజిట్ల కోసం యూఎస్ డాలర్-రూపాయి ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టింది. కనీసం 3 సంవత్సరాల నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది.ఈ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ ఏకంగా 1,255 పాయింట్లు దూసుకెళ్లింది. ఏప్రిల్ 10 తర్వాత బ్యాంక్ నిఫ్టీ సాధించిన అత్యుత్తమ సింగిల్-డే లాభం ఇదే కావడం గమనార్హం. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ వంటి హెవీవెయిట్ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి.అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుగత వారం అమెరికా వాల్ స్ట్రీట్లో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. ఆసియా మార్కెట్లలో సెమికండక్టర్, టెక్నాలజీ షేర్లు రాణించాయి.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో మిగులు నిధుల బదిలీ (సర్ప్లస్ ట్రాన్స్ఫర్) ఊపందుకుంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో ఆర్బీఐ ఏకంగా రూ.2,86,588.46 కోట్ల భారీ మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది. ఇది మన దేశ జీడీపీలో 0.83 శాతానికి సమానం. గడచిన మూడేళ్లుగా ఈ బదిలీలు నిరంతరాయంగా భారీ స్థాయిలో సాగుతున్నాయి.గత మూడేళ్ల బదిలీల గణాంకాలను పరిశీలిస్తే..2023-24: రూ.2,10,873.99 కోట్లు (జీడీపీలో 0.99%)2024-25: రూ.2,68,590.07 కోట్లు (జీడీపీలో 0.90%)2025-26: రూ.2,86,588.46 కోట్లు (జీడీపీలో 0.83%)ఈ నిధుల బదిలీ ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తున్నప్పటికీ దేశ ద్రవ్య వ్యవస్థ(మానిటరీ సిస్టమ్), లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై నిపుణులు కొన్ని అంశాలు పంచుకుంటున్నారు.చట్టబద్ధమైన నిబంధనలు - ఆదాయ వ్యయాలుఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 47 ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ తన మొత్తం ఆదాయం నుంచి నిర్వహణ వ్యయాలు, అవసరమైన నిధుల కేటాయింపులు పోను మిగిలిన నికర ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?ఆర్బీఐకి దేశీయ వనరులతో పాటు విదేశీ వనరుల నుంచి వచ్చే వడ్డీలు, పెట్టుబడుల అమ్మకాలు/రిడెంప్షన్ ద్వారా లభించే లాభాల రూపంలో ఆదాయం వస్తుంది. 2025-26లో ఆర్బీఐ స్థూల ఆదాయం 26.42 శాతం పెరిగి రూ.4,27,684.15 కోట్లకు చేరింది. ఇందులో అత్యధికంగా 76.53 శాతం ఆదాయం విదేశీ వనరుల నుంచే రావడం గమనార్హం.మరోవైపు ఆర్బీఐ మొత్తం వ్యయం (ఉద్యోగుల జీతాలు, కరెన్సీ ముద్రణ ఛార్జీలు, ఏజెన్సీ ఛార్జీలు మొదలైనవి) రిస్క్ ప్రొవిజన్లకు ముందు 27.60 శాతం పెరిగి రూ.1,41,091.69 కోట్లుగా నమోదైంది. రిస్క్ ప్రొవిజన్ల(భవిష్యత్తులో రాబోయే ఊహించని నష్టాలు లేదా ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆర్బీఐ తన లాభాల నుంచి ముందుగానే పక్కన పెట్టే రక్షణ నిధి)కు ముందు నికర ఆదాయం రూ.3,95,972.10 కోట్లుగా ఉండగా, మార్చి 31, 2026 నాటికి ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ సైజ్ 20.61 శాతం వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.రిస్క్ బఫర్ నిర్వహణసవరించిన ఆర్థిక మూలధన చట్రం (ఎకానామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్-ECF) ప్రకారం.. ఆర్బీఐ తన బ్యాలెన్స్ షీట్ సైజులో 4.5% నుంచి 7.5% వరకు కంటింజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్బీ-ఊహించని అత్యవసర ఖర్చులు) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ 2025-26లో ఏకంగా రూ.1,09,379.64 కోట్లను సీఆర్బీకి మళ్లించింది (గత ఏడాది ఇది రూ.44,861.70 కోట్లు మాత్రమే). ప్రస్తుతం ఈ రిస్క్ బఫర్ లెక్కింపు ప్రకారం 6.5 శాతంగా ఉంది.ద్రవ్య వ్యవస్థపై పర్యవసానాలుఆర్బీఐ వద్ద మిగులు నిధుల బదిలీ కేవలం అకౌంటింగ్ ప్రక్రియ మాత్రమే కాదు, దీనికి తీవ్రమైన ద్రవ్య ప్రాధాన్యత ఉంది. ఇది దేశ ద్రవ్య విధానంపై ప్రభావం చూపుతుంది.రిజర్వ్ మనీ పెరగడం: దేశంలో ద్రవ్య సృష్టికి మూలమైన రిజర్వ్ మనీ లేదా బేస్ మనీతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీల వైపు కరెన్సీ, బ్యాంకుల డిపాజిట్లు ఉంటే.. అసెట్స్ వైపు నెట్ డొమెస్టిక్ అసెట్స్ (ఎన్డీఏ-ప్రభుత్వానికి ఇచ్చే క్రెడిట్), నెట్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎన్ఎఫ్ఏ) ఉంటాయి.లిక్విడిటీ: ఆర్బీఐ వద్ద ఈ మిగులు ఉన్నంత కాలం నిధులు ‘నాన్-మానిటరీ లయబిలిటీ’గా రిజర్వుల్లో ఉంటాయి. ఎప్పుడైతే వీటిని ప్రభుత్వానికి బదిలీ చేస్తారో అప్పుడు ఇవి ప్రభుత్వ డిపాజిట్లుగా మారతాయి. ప్రభుత్వం ఈ నిధులను వివిధ పథకాలు, అభివృద్ధి పనుల కోసం మార్కెట్లో ఖర్చు చేసినప్పుడు.. ఆ డబ్బు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుంది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) భారీగా పెరుగుతుంది. ఇది వ్యవస్థలోకి శాశ్వత లిక్విడిటీని ప్రవేశపెట్టడంతో సమానం.రాబడిలో పెరుగుదలకేంద్ర బడ్జెట్లో ఈ నిధులను పన్నేతర రాబడి కింద ‘డివిడెండ్లు, లాభాలు’ అనే పద్దులో చూపిస్తారు.2025-26 బడ్జెట్ అంచనాలుసవరించిన అంచనాలుతుది సంఖ్యరూ.3,25,000 కోట్లురూ.3,75,590 కోట్లురూ.3,80,136 కోట్లుఈ పెరిగిన రూ.55,136 కోట్లకు ప్రధాన కారణం ఆర్బీఐ బదిలీ చేసిన మిగులు నిధులే. 2025-26లో బదిలీ అయిన రూ.2,86,588.46 కోట్లు.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పన్నేతర రాబడిలో ఏకంగా 43.01 శాతంగా నిలవనుంది. ఇది ఆర్బీఐ నిధులపై ప్రభుత్వ డిపెండెన్సీ ఏ స్థాయిలో పెరుగుతుందో సూచిస్తోంది. సాధారణ ప్రభుత్వ రంగ సంస్థల లాభాల బదిలీకి, ఆర్బీఐ మిగులు బదిలీకి చాలా తేడా ఉంటుంది. ఆర్బీఐ బదిలీ నేరుగా ప్రాథమిక ద్రవ్య విస్తరణకు దారితీస్తుంది.ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందా?సాంకేతిక కోణంలో చూస్తే ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే అంశాలాగా తోస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ బదిలీల వల్ల వ్యవస్థలోకి వచ్చే అదనపు ద్రవ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ సులువుగా విస్మరించలేదు. ప్రభుత్వానికి ఇది ఆర్థికంగా వెసులుబాటు కల్పించే అవకాశం అయినప్పటికీ, మార్కెట్లో మితిమీరిన ద్రవ్య లభ్యత వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణ ముప్పును అదుపు చేయడం ఆర్బీఐకి సవాలుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
లీటర్పై రూ.20 డిస్కౌంట్!
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త ప్రత్యామ్నాయాన్ని మార్కెట్లోకి తెచ్చింది. లీటరుపై ఏకంగా రూ.20 రూపాయల వరకు తగ్గింపు ఇస్తూ ఢిల్లీలో సరికొత్త ‘ఈ-85 ఫ్యూయల్ స్టేషన్’ను ఇటీవల ప్రారంభించింది. అయితే, ఊహించని విధంగా ఈ చౌక ఇంధనాన్ని కొనడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. బంకులు తెరిచినా కొనుగోలుదారులు రాకపోవడానికి గల అసలు కారణాలను పరిశీలిద్దాం.అసలు ఏమిటీ ఈ-85 ఇంధనం?ఈ-85 అనేది సాధారణ పెట్రోల్ కాదు. ఇది 85 శాతం ఇథనాల్, 15 శాతం సంప్రదాయ పెట్రోల్ కలయికతో తయారైన ఒక మిశ్రమ బయో-ఇంధనం. ముడి చమురు దిగుమతులపై విదేశీ భారాన్ని తగ్గించడం, వాహన కాలుష్యాన్ని నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం. పెట్రోలియం కంపెనీల తయారీ వ్యయం తగ్గడం వల్ల సాధారణ పెట్రోల్ కంటే ఇది లీటరుకు దాదాపు రూ.20 రూపాయల తక్కువ ధరకు లభిస్తుంది.ఇంత చౌకగా ఉన్నా ఎందుకు కొనడం లేదు?ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ గ్రౌండ్ రియాలిటీలో కొన్ని సాంకేతిక, అవగాహనా లోపాలు అమ్మకాలను దెబ్బతీస్తున్నాయి.ఇంజిన్ల అననుకూలత: సాధారణ పెట్రోల్తో నడిచే బైక్లు లేదా కార్లలో నేరుగా ఈ-85 ఇంధనాన్ని వాడటం అసలు సాధ్యం కాదు. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లు కలిగిన వాహనాలు మాత్రమే అవసరం. ప్రస్తుతానికి భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇలాంటి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనాన్ని పోస్తే ఇంజిన్లు పాడైపోయే ప్రమాదం ఉంది.అవగాహన రాహిత్యంకొత్తగా వచ్చిన ఈ-85 ఇంధనం గురించి సాధారణ వాహనదారులకు కనీస అవగాహన లేదు.ఈ ఇంధనం ఏ వాహనాలకు సరిపోతుంది?దీనివల్ల మైలేజీ ఎంత వస్తుంది?పాత వాహనాలను ఫ్లెక్స్ ఇంజిన్లుగా మార్చవచ్చా లేదా?అనే విషయాలపై ప్రభుత్వం, చమురు సంస్థల నుంచి విస్తృత ప్రచారం కరువైంది. దీంతో వినియోగదారులు దీని జోలికి వెళ్లడం లేదు.భవిష్యత్తు మార్కెట్ ఎలా ఉండబోతోంది?ప్రస్తుతానికి ఈ-85 స్టేషన్లు కేవలం ప్రారంభ దశలోనే ఉన్నాయి. మార్కెట్లోకి పూర్తిస్థాయి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లు, బైకులు అందుబాటులోకి వస్తేగానీ ఈ చౌక ఇంధనానికి డిమాండ్ పెరగదనే అభిప్రాయాలున్నాయి. ప్రభుత్వం కేవలం బంకులను ఏర్పాటు చేయడమే కాకుండా, వాహన తయారీ సంస్థలను ప్రోత్సహించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తేనే ఈ ప్రాజెక్టు విజయవంతం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
పేటీఎంలో నియామకాల జోరు
భారతీయ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం సరికొత్త పునర్నిర్మాణ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, మర్చంట్ నెట్వర్క్ విస్తరణే లక్ష్యంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సుమారు 10 శాతం మేర పెంచుకోవాలని నిర్ణయించింది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. రాబోయే తొమ్మిది నెలల్లో (మార్చి 2027 నాటికి) కొత్తగా సుమారు 4,000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది.అయితే, ఒకవైపు భారీ నియామకాలు చేపడుతూనే.. మరోవైపు అంతర్గత పునర్నిర్మాణంలో భాగంగా దాదాపు 400 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 1 శాతం) తొలగించేందుకు సంస్థ సిద్ధమవడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.కీలక అంశాలు..భారీ నియామకాలు: రాబోయే 9 నెలల్లో 4,000 మంది కొత్త సిబ్బంది రిక్రూట్మెంట్. ఇప్పటికే గత రెండు నెలల్లో 800 మందికి పైగా నియామకం పూర్తి.ఉద్యోగాల కోత: వార్షిక పనితీరు మదింపు ఆధారంగా ఎంపిక చేసిన విభాగాల్లో 400 మంది తొలగింపు.ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య: ప్రస్తుతం కంపెనీలో 40,000 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నూతన నియామకాలతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.ప్రధాన దృష్టి: సీనియర్ లీడర్షిప్ పాత్రలతో పాటు.. ప్రొడక్ట్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల బలోపేతం.సరికొత్త ప్లాన్2010లో విజయ్ శేఖర్ శర్మ స్థాపించిన పేటీఎం మొబైల్ రీఛార్జ్లతో ప్రారంభమై 2016 నోట్ల రద్దు తర్వాత దేశీయ ఫిన్టెక్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండేళ్ల క్రితం పేటీఎం బ్యాంకింగ్ విభాగంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన నిబంధనలు విధించడం, ఆపై లైసెన్స్ రద్దు చేయడంతో కంపెనీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో దాదాపు 4,500 మందికి పైగా సిబ్బందిని తగ్గించుకోవాల్సి వచ్చింది.ఆ నియంత్రణ సవాళ్ల నుంచి కోలుకున్న పేటీఎం వరుసగా నాలుగు త్రైమాసికాల్లో లాభాలను నమోదు చేస్తూ మళ్లీ ట్రాక్లోకి వచ్చింది. ఇప్పుడు కంపెనీకి ఉన్న రిజిస్టర్డ్ వినియోగదారులను కేవలం చెల్లింపులకే పరిమితం చేయకుండా.. రుణాలు, పెట్టుబడి ఉత్పత్తులు, ఇతర ఆర్థిక సేవలను విస్తృతంగా అందించడంపై దృష్టి సారించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
మానవీయ విలువలే ప్రగతికి మూలాధారం
సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగం అంటేనే టార్గెట్లు, డెడ్లైన్లు. ఒక రోజు లీవ్ కావాలన్నా వంద సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి. అలాంటిది, పది రోజుల సుదీర్ఘ సెలవు ముగించుకుని తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతానని మెసేజ్ చేసిన ఉద్యోగికి.. ‘కంగారేం లేదు, పరిస్థితులు సర్దుకోవడానికి మరో రోజు సెలవు తీసుకో’ అంటూ ఓ బాస్ ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఉద్యోగుల మానసిక పరిస్థితికి పెద్దపీట వేసే ఇలాంటి మేనేజర్లు కూడా ఉంటారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఒక సంస్థలో పని వాతావరణం, ఉద్యోగుల ప్రవర్తన, యాజమాన్యం తీరు ఎలా ఉండాలో ఈ కింది విధంగా విశ్లేషించవచ్చు.యాజమాన్యం, మేనేజర్ల పాత్రఈ సంఘటనలో మేనేజర్ చూపిన చొరవ కేవలం ఒక అదనపు సెలవు ఇవ్వడం మాత్రమే కాదు; అది ఉద్యోగి మానసిక ఆరోగ్యానికి ఇచ్చిన విలువ. యాజమాన్యం, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు కింది విషయాలను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.మానవత్వంతో కూడిన నాయకత్వం: నియమ నిబంధనలను పక్కన పెట్టి ఉద్యోగి పరిస్థితిని అర్థం చేసుకోవడమే నిజమైన నాయకత్వం.మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత: ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు ఇవ్వగలరు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వచ్చే అలసటను గుర్తించి స్థిరపడటానికి సమయం ఇవ్వడం ద్వారా మేనేజర్ ఉద్యోగిపై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించగలిగారు.నమ్మకాన్ని నిర్మించడం: నిరంతరం పర్యవేక్షించడం కంటే ఉద్యోగులపై నమ్మకం ఉంచడం వల్ల వారు సంస్థ పట్ల మరింత నిబద్ధతతో పనిచేస్తారు.ఆరోగ్యకరమైన పని వాతావరణం అనేది సంస్థ విజయానికి పునాది. కంపెనీల పని వాతావరణం ఇలా మారాలో కూడా నిపుణులు చెబుతున్నారు.వర్క్-లైఫ్ బ్యాలెన్స్: వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే ఉద్యోగి ఎక్కువ కాలం ఆ సంస్థలో కొనసాగుతాడు.సహకార సంస్కృతి: ఒకరినొకరు వేధించుకునే వాతావరణం కాకుండా ఒకరికొకరు మద్దతుగా నిలిచే వాతావరణం ఉండాలి. నియమాలు ఉద్యోగులను నియంత్రించడానికి మాత్రమే కాదు, వారి పనిని సులభతరం చేయడానికి ఉపయోగపడాలి.గౌరవప్రదమైన గుర్తింపు: కేవలం కంపెనీ రికార్డుల్లో ఐడీ నంబర్గా కాకుండా ప్రతి ఉద్యోగికి ఒక ప్రత్యేక గుర్తింపు, విలువ ఉన్నాయనే భావన కల్పించాలి.ఉద్యోగుల బాధ్యత ఇదే..యాజమాన్యం లేదా మేనేజర్లు ఉదారంగా ఉన్నప్పుడు ఉద్యోగులపై కూడా అంతే బాధ్యత పెరుగుతుంది. మేనేజర్ చూపిన చొరవను ఆసరాగా తీసుకుని బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించకూడదు. లభించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి. ‘ఇలాంటి మేనేజర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి పనిచేయాలి’ అని ఒక నెటిజన్లు చెబుతున్నారు. యాజమాన్యం పరిస్థితులను అర్థం చేసుకున్నప్పుడు సంస్థ వృద్ధి కోసం ఉద్యోగి తన శాయశక్తులా కృషి చేయాలి. తాము ఎప్పుడు వస్తున్నదీ, పని ఏ స్థితిలో ఉన్నదీ మేనేజర్కు ముందుగానే తెలియజేయడం ద్వారా ఉద్యోగులు కూడా తమ వృత్తిపరమైన బాధ్యతను చాటుకోవాలి.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
గోల్డ్ లోన్.. కష్టాలు!
సాధారణ, మధ్య తరగతి కుటుంబీకులకు బంగారమంటే కేవలం అలంకరణే కాదు.. ఆపద నుంచి గట్టెక్కించేది కూడా. వ్యక్తిగత, వ్యాపార, తదితర స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాల్లో తక్షణమే పొందగలిగేది పసిడి రుణం మాత్రమే. మొన్నటి వరకు బ్యాంకుల్లో చాలా సులభంగా పొందే గోల్డ్ లోన్ ప్రస్తుతం కఠినతరంగా మారింది. ఆర్బీఐ తాజాగా తీసుకొచ్చిన నిబంధనల కారణంగా బ్యాంకుల్లో బంగారు రుణాలు తీసుకున్న వారు కొత్త నిబంధనలతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ‘ప్రైవేటు’ను ఆశ్రయిస్తూ..రుణాలను అసలు, వడ్డీ చెల్లిస్తేనే రెన్యూవల్ చేస్తామని బ్యాంకర్లు చెబుతుండడంతో కొందరు రుణ గ్రహీతలు రెన్యూవల్ కోసం నానా అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్ కోసం రూ.లక్షలు అప్పులు పుట్టక.. చివరకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరు రెండు, మూడు రోజుల్లోనే రూ.2 చొప్పున వడ్డీ చెల్లిస్తేనే ఇస్తామని చెబుతున్నా.. చేసేదిలేక రుణగ్రస్తులు వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి తీవ్రంగా నష్టపోతున్నారు.నూతన నిబంధనలు ఇలా..బంగారం రుణాలను అగ్రి లోన్స్, నాన్ అగ్రి లోన్స్ అంటూ రెండు భాగాలుగా విభజించారు. రూ.2.25 లక్షల రుణం తీసుకునే వారికి నిబంధనలు కాస్త సరళతరంగా ఉండగా.. అంతకు మించి అయితే రుణం పొందలేని పరిస్థితి ఉంది. వ్యవసాయదారుడు రుణం తీసుకోవాలంటే పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు తహసీల్దార్ ధ్రువీకరించిన ఆదాయ సర్టిఫికెట్, భూమికి చెందిన 1బీ, పశువుల వివరాలు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకానికి సంబంధించిన రశీదులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నాన్ అగ్రి రుణం తీసుకునే వారికి ఐటీఆర్, సిబిల్, ఆదాయ ధ్రువీకరణ చేసుకున్నాకే రుణం మంజూరు చేస్తారు. గతంలో డిఫాల్టర్గా ఉండి సెటిల్మెంట్ చేసుకున్న వారికి బంగారంపై రుణాలు ఇవ్వబడవు. ఆదాయాన్ని బట్టి ఒక్కరు మూడు నుంచి ఐదు రుణాలను మాత్రమే తీసుకోవడానికి అర్హులు. ఆదాయ వనరులు, ఆదాయం లేని వారు రుణం పొందడానికి అనర్హులు. రెన్యూవల్లో మాత్రం నిబంధనలను సడలించింది. ఏడాదిలోపు రుణాన్ని రెన్యూవల్ చేసుకునే వారికి వడ్డీ మాత్రమే చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటు కేవలం మూడు పర్యాయాలు మాత్రమే వర్తించనుంది. అలాగే బంగారం రుణాల మంజూరు ప్రక్రియలో రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయనున్నారనే విషయంపై ఆరా తీయాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచార. అంతేకాక రుణగ్రహీతల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలని, తాకట్టు పెట్టిన బంగారం వాస్తవ హక్కుదారు ఎవరనేదీ తెలుసుకోవాలని నిర్దేశించినట్లు తెలిసింది. పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్ పెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడటమే ఆర్బీఐ ఉద్దేశంగా ఉన్నట్లు తెలుస్తోంది.భారీగా రుణాల చార్జీలు..వివిధ బ్యాంకులు బంగారం రుణాల్లో భారీగా చార్జీలు పెంచింది. గతంలో రూ.3 లక్షల వరకు ఉచితంగా ఉండగా.. రూ.3 లక్షలు పైన నామినల్ చార్జీలు తీసుకునే వారు. అయితే ఇటీవల బంగారం రుణాలు తీసుకునే వారిపై చార్జీల మోత మోగిస్తోంది. ప్రతి రూ.లక్ష రుణానికి అప్రైజర్ చార్జితో పాటు సర్వీస్ చార్జి అంటూ సుమారు రూ.900 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా రూ.5 లక్షల వరకు రుణానికి అయితే గోల్డ్ అప్రైజర్కు రూ. 590, ప్రాసెసింగ్ చార్జిలు రూ. 295లు వసూలు చేస్తుండగా.. రూ.5 లక్షల పైన రుణానికి అయితే గోల్డ్ అప్రైజర్కు రూ. 708, ప్రాసెసింగ్ చార్జిలు రూ. 590 లు వసూలు చేస్తున్నారు. కాగా, బ్యాంకుల వారీగా చార్జీలు ఉన్నాయి. ఇకనైనా బ్యాంకర్లు వడ్డీ మాత్రమే కట్టించుకుని రుణాలు రెన్యూవల్ చేయాలని రైతులు కోరుతున్నారు. -
కృత్రిమమేధ అద్భుత అవకాశం!
కృత్రిమ మేధ విస్తృతిపై ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలపై టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పష్టతనిచ్చారు. ఏఐ అనేది ఐటీ రంగానికి ముప్పు కాదని, అది ఎంటర్ప్రైజ్ ఐటీ రంగానికి లభించిన ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. ఈరోజు జరిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) వాటాదారులను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. వచ్చే మూడేళ్లలో టీసీఎస్లో మానవ ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లు పని చేస్తారని అంచనా వేశారు.జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్ల కారణంగా భారతీయ ఐటీ సేవల సంస్థల సాంప్రదాయ వ్యాపార నమూనాలు దెబ్బతింటాయేమోనన్న ఇన్వెస్టర్ల ఆందోళనల నేపథ్యంలో చంద్రశేఖరన్ చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో కొత్త భరోసాను నింపాయి. ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ వ్యయాన్ని ఏఐ ఎలా మార్చబోతోందనే అంశంపై మార్కెట్లో ఉన్న అపార్థాల వల్లే ఇటువంటి భయాలు వ్యక్తమవుతున్నాయని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.‘ఏఐ అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదు. అది మేధస్సుకు సంబంధించిన ఒక మౌలిక సదుపాయం (ఇన్ఫ్రా ఆఫ్ ఇంటెలిజెన్స్). ఈ మేధస్సు తాలూకు వ్యయం తగ్గుతున్న కొద్దీ.. మరిన్ని వ్యాపార ప్రక్రియలు, వ్యూహాత్మక నిర్ణయాలు, కస్టమర్ పరస్పర చర్యలు ఏఐ ఆధారిత పరివర్తన వైపు అడుగులు పడుతాయి’ అని చంద్రశేఖరన్ అన్నారు.ఏఐ అంతరాయం కలిగిస్తుందనే భయాలు ఉన్నప్పటికీ పరిశ్రమ ప్రాథమిక సూత్రాలు బలంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. కంపెనీ మార్జిన్లు బాగున్నాయని, ఆదాయాలు పెరిగాయని, డీల్ పైప్లైన్ గతంలో కంటే ఎంతో బలంగా ఉందని వివరించారు. రాబోయే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మూడొంతుల సంస్థలు తమ సాంకేతిక వ్యయాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
రాపిడోతో కేంద్రం జట్టు
దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘రహావీర్’ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రముఖ మొబిలిటీ ప్లాట్ఫారమ్ రాపిడో, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేతులు కలిపాయి. రోడ్డు ప్రమాదాలు జరిగిన తొలి గంటలో (గోల్డెన్ అవర్) బాధితులకు సకాలంలో ప్రాణరక్షణ సహాయం అందించడాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. కేంద్ర రోడ్ల, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంక సమక్షంలో ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు.‘‘రోడ్డు భద్రత అందరి ఉమ్మడి బాధ్యత. ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడంలో ప్రజల భాగస్వామ్యం కీలకం. రహావీర్ పథకం ద్వారా ప్రమాద బాధితులకు తొలి గంటలో సహాయం చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తున్నాము’’ అని నితిన్ గడ్కరీ తెలిపారు. రాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంక మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 400కుపైగా నగరాల్లో ఉన్న తమ నెట్వర్క్, లక్షలాది కెప్టెన్ల ద్వారా రహావీర్ పథకంపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. డిజిటల్ ప్రచారాలు, ఇన్–యాప్ ఎడ్యుకేషన్, సోషల్ మీడియా కార్యక్రమాలు, గ్రౌండ్ స్థాయి అవుట్రీచ్ ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచనున్నట్లు వెల్లడించారు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్ఈ భాగస్వామ్య ప్రారంభోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా రాపిడో కెప్టెన్లు యాప్ ద్వారా ఏకకాలంలో ‘రహావీర్’ ప్రతిజ్ఞను స్వీకరించారు. ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందిస్తామని చాటుతూ వీరంతా ఉమ్మడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పడం విశేషం. పౌరులు ఎలాంటి సంకోచం లేకుండా బాధితులను ఆదుకునేలా చేయడమే దీని ఉద్దేశమని అరవింద్ సంక తెలిపారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
క్యాపిటల్ మార్కెట్లపై గురి
దేశీయంగా కుటుంబ పెట్టుబడులలో క్యాపిటల్ మార్కెట్లకు ప్రాధాన్యం పెరుగుతున్నట్లు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. పొదుపు సొమ్ము మదుపు చేసేందుకు కీలక మార్గంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. సంపద సృష్టిలో భాగమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇది వ్యవస్థాగత మార్పును ప్రతిబింబిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. తద్వారా భారతీయులు దేశ వృద్ధిలో ఇన్వెస్ట్ చేయడంతోపాటు, భాగస్వాములవుతున్నట్లు వివరించారు.వెరసి కుటుంబాల పొదుపు సొమ్మును ఇన్వెస్ట్ చేసేందుకు క్యాపిటల్ మార్కెట్లు కీలక అవకాశంగా మారుతున్నట్లు 2026 ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇండియా ఇన్వెస్టర్ సదస్సు సందర్భంగా తెలియజేశారు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసు(పీఎంఎస్) నిబంధనలపై విస్తారిత చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. త్వరలో చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గడిచిన రెండు సెషన్లలో తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా మంగళవారం పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఇన్నోవా క్రిస్టా.. సరికొత్తగా
టయోటా ఇన్నోవా క్రిస్టా సరికొత్త లగ్జరీ హంగులతో కస్టమర్ల ముందుకు వచ్చింది. కొత్త డిజైన్ అప్డేట్లు, ఆధునిక ఫీచర్లు, మరింత మెరుగైన క్యాబిన్ అనుభవంతో మల్టీ–పర్పస్ వెహికల్(ఎంపీవీ) విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే, ఇంజిన్, పనితీరులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీని ఎక్స్–షోరూమ్ ధర రూ. 19.72 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.టయోటా డీలర్షిప్లో, సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే అన్ని మోడల్స్ ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వెనుక ఏసీ వెంట్స్, మొబైల్ ఛార్జర్ లాంటి ఫీచర్లున్నాయి. సుదూర ప్రయాణాల్లో సౌకర్యం, మంచి పనితీరు, బలమైన డీజిల్ ఇంజిన్ కారణంగా ఇన్నోవా క్రిస్టాకు మంచి డిమాండ్ ఉంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఎంపీవీ లీటరుకు 15 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.బీఎండబ్ల్యూ ఇండియా కార్ల ధరలు పెంపుజూలై 1 నుంచి అమల్లోకి ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా’ వాహన ప్రియులకు షాక్ ఇచ్చింది. వచ్చే నెల (జూలై 1) నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు సోమ వారం ప్రకటించింది. తమ పోర్ట్ఫోలియోలోని బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్ల కార్ల ధరలపై 2 శాతం వరకు పెంపు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దేశీయంగా తయారయ్యే మోడళ్లతో పాటు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని రకాల మోడళ్లకు ఈ ధరల పెంపు వర్తిస్తుంది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 10:40 సమయానికి నిఫ్టీ(Nifty) 30 పాయింట్లు పెరిగి 23,152 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 67 పాయింట్లు ఎగబాకి 73,588 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.95బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 93.4 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.3 శాతం పెరిగింది.నాస్డాక్ 0.86 శాతం పుంజుకుంది.Today Nifty position 09-06-2026(time: 10:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్యూ4లో 7.1 బిలియన్ డాలర్లు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికం(క్యూ4)లో దేశీ కరెంట్ ఖాతా 7.1 బిలియన్ డాలర్ల మిగులును సాధించింది. ఇది దేశ జీడీపీలో 0.7 శాతంకాగా.. ఇందుకు సరీ్వసుల ఎగుమతులు, అధిక రెమిటెన్సులు సహకరించాయి. అయితే అంతక్రితం ఏడాది(2024–25) జనవరి–మార్చి(క్యూ4)లో 13.7 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. ఇది జీడీపీలో 1.4 శాతానికి సమానం. ఆర్బీఐ బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్(బీవోపీ)పై తాజాగా విడుదల చేసిన గణాంకాలివి. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) 25.2 బిలియన్ డాలర్లుగా ఉంది. జీడీపీలో ఇది 0.6 శాతంకాగా.. 2024–25లోనూ 22.9 బిలియన్ డాలర్ల(0.6 శాతం) క్యాడ్ నమోదైంది. క్యూ4 వివరాలిలా గతేడాది క్యూ4లో మెర్కండైజ్ వాణిజ్య లోటు 83.4 బిలియన్ డాలర్లుకాగా.. 2024–25 చివరి త్రైమాసికంలో నమోదైన 59.3 బిలియన్ డాలర్లకంటే భారీగా పెరిగింది. సర్వీసుల నికర వసూళ్లు (రిసీప్్ట్స) 53.3 బిలియన్ డాలర్ల నుంచి 60.4 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వార్షికంగా సరీ్వసుల ఎగుమతులు ప్రధాన కేటగిరీలైన కంప్యూటర్ సరీ్వసులు, ఇతర బిజినెస్ సరీ్వసులలో బలపడ్డాయి. ఈ కాలంలో సెకండరీ ఆదాయ ఖాతాకింద వ్యక్తిగత బదిలీ రిసీప్్ట్స(రెమిటెన్స్లు) 33.9 బిలియన్ డాలర్ల నుంచి 43.5 బిలియన్ డాలర్లకు జంప్చేశాయి. ఫైనాన్షియల్ ఖాతాలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) నికరంగా 0.4 బిలియన్ డాలర్ల నుంచి 4.2 బిలియన్ డాలర్లకు ఎగశాయి. మరోపక్క విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్(ఎఫ్పీఐ) నుంచి 12 బిలియన్ డాలర్ల నికర పెట్టుబడులు లభించాయి. అయితే అంతక్రితం ఏడాది క్యూ4లో 5.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. బీవోపీ ప్రాతిపదికన విదేశీ మారక నిల్వలు 7.2 బిలియన్ డాలర్లమేర బలపడ్డాయి. అంతక్రితం క్యూ4లో ఇవి 7.2 బిలియన్ డాలర్లమేర పుంజుకున్నాయి. పూర్తి ఏడాదికి గతేడాది నికర ఎఫ్డీఐ పెట్టుబడులు 6.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 16.4 బిలియన్ డాలర్ల ఎఫ్పీఐ పెట్టుబడులు తరలిపోయాయి. 2024–25లో 3.6 బిలియన్ డాలర్ల ఎఫ్పీఐ పెట్టుబడులు లభించాయి. విదేశీ మారక నిల్వలు 23.6 బిలియన్ డాలర్లమేర క్షీణించాయి. అంతక్రితం ఏడాదిలో ఈ క్షీణత 5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
ఎల్ఐసీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలీదు!
న్యూఢిల్లీ: ఇటీవల వివాదాలలో చిక్కుకున్న ఆభరణ వర్తక కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కౌంటర్లో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పెట్టుబడులపై వాడి, వేడి చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తనకు తెలియదని రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా తాజాగా వ్యాఖ్యానించారు. కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడులు నిన్నటివి లేదా ఏడాది క్రితం చేసినవి కాదని పేర్కొన్నారు. సుమారు రెండు రెండు దశాబ్దాల కాలంలో చేపట్టిన పెట్టుబడులివని తెలియజేశారు. ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. వెరసి కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో తానకుగానీ లేదా ఇతర ప్రమోటర్లకుగానీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. కంపెనీ ప్రమోటర్లు ఎవరూ ఎల్ఐసీకి వాటా విక్రయించలేదని వెల్లడించారు. ఇదేవిధంగా ఎల్ఐసీకి ఎలాంటి షేర్ల కేటాయింపునూ చేపట్టలేదని తెలియజేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్లో బీమా దిగ్గజం చేపట్టిన పెట్టుబడులతో కంపెనీ లేదా ప్రమోటర్లకు ఎలాంటి లబ్ది చేకూరలేదని స్పష్టం చేశారు. ఎల్ఐసీ పెట్టుబడి నిర్ణయాలలో తమకు ఏ విధమైన సంబంధమూలేదని, ఈ విషయాలు తెలియవని వివరించారు. పూర్తిగా వాణిజ్య ధృక్పథంతో ఎల్ఐసీ తీసుకున్న సొంత నిర్ణయాలేనని పేర్కొన్నారు. 10.8 శాతం వాటా ప్రస్తుతం రాజేష్ ఎక్స్పోర్ట్స్లో ఎల్ఐసీ వాటా 10.8 శాతంగా నమోదైంది. తొలి దర్యాప్తులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కంపెనీ అక్రమ ఆదాయ నమోదుపై సీరియస్ అయ్యింది. రాజేష్ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ అంశంలో సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేరు సోమవారం సైతం 5 శాతం పతనమై రూ. 94.5 వద్ద ఫ్రీజయ్యింది. మూడు రోజుల్లో 14 శాతం క్షీణించింది. అయితే తనకున్న అవగాహన ద్వారా ఈ ధరలోనూ ఎల్ఐసీ నష్టపోయి ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ నష్టపోయి ఉంటే అవతలి పక్క మరొకరు లాభపడి ఉండాలని, ఇది సాధారణ పబ్లిక్ వాటాదారులేనని మెహతా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తొలిసారి మాట్లాడుతున్నానని, ఒకవేళ ఇప్పుడు ఎల్ఐసీ విక్రయిస్తుంటే కామన్ పబ్లిక్ కొనుగోలు చేస్తుంటారని, తద్వారా లబ్ది పొందుతారని, అంతేతప్ప కంపెనీ లేదా ప్రమోటర్ లాభపడరని వివరించారు. ఈ అంశాన్ని వ్యతిరేకించేవారు సాధారణ వాటాదారులు లాభపడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. -
ట్రంప్నకు షాక్.. H-1B వీసా ఫీజుపై కోర్టు కీలక తీర్పు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరో పరాభవం ఎదురైంది. తీసుకున్న H-1B వీసాలపై 1,00,000 డాలర్ల ఫీజు విధించాలన్న నిర్ణయం చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్కే ఉందని, అధ్యక్షుడికి అలాంటి అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కారణం చేత ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ కేసు 20 మంది డెమోక్రటిక్ స్టేట్ అటార్నీ జనరల్స్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా విచారణకు వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఈ అధిక ఫీజు విధానం వల్ల H-1B వీసా దరఖాస్తులు గణనీయంగా తగ్గాయని కూడా డేటా చూపించింది. బోస్టన్లోని అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ ఈ ఫీజును 'కాంగ్రెస్ అనుమతి లేకుండా విధించిన పన్ను'గా పేర్కొన్నారు.ప్రతి ఏటా ఇచ్చే వీసాలుసాధారణంగా H-1B ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం సుమారు 65,000 వీసాలను ఇస్తుంది. అదనంగా మాస్టర్స్ లేదా ఉన్నత విద్యార్హతలు ఉన్నవారికి మరో 20,000 వీసాలు లభిస్తాయి. ఇప్పటి వరకు ఈ వీసాలకు కంపెనీలు చెల్లించే ఫీజు సుమారు 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్ల వరకు మాత్రమే ఉండేది. కానీ.. కొత్తగా ప్రతిపాదించిన 1,00,000 ఫీజు కంపెనీలను తీవ్రంగా ప్రభావితం చేసింది.ఈ భారీ ఫీజు కారణంగా అనేక సంస్థలు.. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి వెనకడుగు వేసినట్లు కోర్టు రికార్డులు తెలిపాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి H-1B రిజిస్ట్రేషన్లు గతంతో పోలిస్తే దాదాపు 38.5% తగ్గినట్లు యూఎస్ ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది. ఇది విదేశీ నిపుణులపై ప్రభావం చూపింది.నిర్ణయాన్ని సమర్థించిన ట్రంప్ ప్రభుత్వంట్రంప్ ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. అమెరికా ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యమని తెలిపింది. విదేశీ ఉద్యోగులు తక్కువ జీతాలతో అమెరికన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారని, ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో ఇది పెద్ద సమస్యగా మారిందని వాదించింది. కానీ కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. ఎంతోమందికి ఉపశమనంఇక భారతదేశంపై కూడా ఈ విధానం ప్రభావం చూపింది. H-1B వీసాలపై ఆధారపడే భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కఠిన నిబంధనల వల్ల దరఖాస్తులు తగ్గి, అనేక మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా అధికారులతో చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇది మార్పు దశలో ఉన్న విధానం అని, కొన్ని ఇబ్బందులు సహజమని వ్యాఖ్యానించారు. కానీ తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు అటు కంపెనీలకు, ఇటు యూఎస్ వెళ్లాలనుకునే ఎంతోమందికి ఉపశమనం కలిగించింది. -
LIC పెట్టుబడుల వివాదం.. స్పందించిన రాజేష్ మెహతా
ఇటీవల వివాదాలలో చిక్కుకున్న ఆభరణ వర్తక కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కౌంటర్లో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పెట్టుబడులపై వాడి, వేడి చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తనకు తెలియదని రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా తాజాగా వ్యాఖ్యానించారు.కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడులు నిన్నటివి లేదా ఏడాది క్రితం చేసినవి కాదని పేర్కొన్నారు. సుమారు రెండు రెండు దశాబ్దాల కాలంలో చేపట్టిన పెట్టుబడులివని తెలియజేశారు. ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. వెరసి కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో తానకుగానీ లేదా ఇతర ప్రమోటర్లకుగానీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు.కంపెనీ ప్రమోటర్లు ఎవరూ ఎల్ఐసీకి వాటా విక్రయించలేదని వెల్లడించారు. ఇదేవిధంగా ఎల్ఐసీకి ఎలాంటి షేర్ల కేటాయింపునూ చేపట్టలేదని తెలియజేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్లో బీమా దిగ్గజం చేపట్టిన పెట్టుబడులతో కంపెనీ లేదా ప్రమోటర్లకు ఎలాంటి లబ్ది చేకూరలేదని స్పష్టం చేశారు. ఎల్ఐసీ పెట్టుబడి నిర్ణయాలలో తమకు ఏ విధమైన సంబంధమూలేదని, ఈ విషయాలు తెలియవని వివరించారు. పూర్తిగా వాణిజ్య ధృక్పథంతో ఎల్ఐసీ తీసుకున్న సొంత నిర్ణయాలేనని పేర్కొన్నారు. 10.8 శాతం వాటాప్రస్తుతం రాజేష్ ఎక్స్పోర్ట్స్లో ఎల్ఐసీ వాటా 10.8 శాతంగా నమోదైంది. తొలి దర్యాప్తులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కంపెనీ అక్రమ ఆదాయ నమోదుపై సీరియస్ అయ్యింది. రాజేష్ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ అంశంలో సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేరు సోమవారం సైతం 5 శాతం పతనమై రూ. 94.5 వద్ద ఫ్రీజయ్యింది. మూడు రోజుల్లో 14 శాతం క్షీణించింది.అయితే.. తనకున్న అవగాహన ద్వారా ఈ ధరలోనూ ఎల్ఐసీ నష్టపోయి ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ నష్టపోయి ఉంటే అవతలి పక్క మరొకరు లాభపడి ఉండాలని, ఇది సాధారణ పబ్లిక్ వాటాదారులేనని మెహతా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తొలిసారి మాట్లాడుతున్నానని, ఒకవేళ ఇప్పుడు ఎల్ఐసీ విక్రయిస్తుంటే కామన్ పబ్లిక్ కొనుగోలు చేస్తుంటారని, తద్వారా లబ్ది పొందుతారని, అంతేతప్ప కంపెనీ లేదా ప్రమోటర్ లాభపడరని వివరించారు. ఈ అంశాన్ని వ్యతిరేకించేవారు సాధారణ వాటాదారులు లాభపడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. -
జన్ధన్తో ఆర్థిక సాధికారత
న్యూఢిల్లీ: జన్ధన్ ఖాతాల రూపంలో 58 కోట్ల మందికి పైగా ప్రజలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సంక్షేమ పథకాలు, తక్కువ ప్రీమియంకే బీమా రక్షణ, పెన్షన్ ప్రయోజనాలను ఎలాంటి లీకేజీ లేకుండా ప్రజలకు చేరువ చేయడంలో జన్ధన్ పథకం కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. గరీబ్ కల్యాణ్ పథకం ప్రతీ భారతీయుడికి గౌరవం, సాధికారిత, అవకాశాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్నా హామీ అని ప్రకటించారు. పేదరికం, దారిద్య్రానికి వ్యతిరేకంగా పోరులో భారత్ అంతర్జాతీయంగా గుర్తింపును సాధించినట్టు ఎక్స్ ప్లాట్ఫామ్లో చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం 2014 ఆగస్ట్ 28న ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాలకు ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు ఈ పథకాన్ని తీసుకురావడం గమనార్హం. జన్దన్ ఖాతాదారుల్లో 56 శాతం మంది మహిళలే కావడం విశేషం. అది కూడా 67 శాతం ఖాతాలు గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ ఖాతాదారులకు ఇప్పటి వరకు వివిధ పథకాల రూపంలో రూ.45 లక్షల కోట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. -
ఈవీ హవా
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ రంగం మే నెలలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంధన పొదుపు, పర్యావరణహిత వాహనాలపై వినియోగదారుల ఆసక్తి పెరగడంతో వాహనాల రిటైల్ విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 9.55 శాతం పెరిగి 25,31,067 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది మేలో ఈ సంఖ్య 23,10,451 యూనిట్లుగా ఉంది. అలాగే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాటా తొలిసారిగా 11 శాతం మార్కును దాటిందని ఆటో డీలర్ల సమాఖ్య ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) సోమవారం వెల్లడించింది. వాణిజ్య వాహనాలు (సీవీ), ప్యాసింజర్ వాహనాలు (పీవీ), అలాగే మొత్తం ఈవీ విభాగంలో మే నెలకు సంబంధించి ఇప్పటివరకు నమోదైన అత్యుత్తమ విక్రయాలు ఇవే. ఈవీలకు పెరిగిన ఆదరణమే నెలలో ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో వినియోగదారులు ఇంధన పొదుపు కలిగిన, ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత వాహనాల వైపు మొగ్గు చూపినట్లు ఫాడా తెలిపింది. దీనివల్ల ద్విచక్ర వాహనాల విభాగంలో ఈవీల వాటా గత ఏడాది 6.11% నుంచి 9.25 శాతానికి పెరిగింది. మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల వాటా తొలిసారిగా 11% దాటడం విశేషం. అయితే పలు ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా షోరూమ్లకు వచ్చే వినియోగదారుల సంఖ్య కొంత తగ్గింది. మరోవైపు వివాహాల సీజన్, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నగదు ప్రవాహం, జీఎస్టీ 2.0 కింద అందుబాటులో ఉన్న ప్రయోజనాలు విక్రయాలకు మద్దతుగా నిలిచినట్లు డీలర్లు పేర్కొన్నారు. సవాళ్ల మధ్య వృద్ధి‘‘తీవ్ర ఎండలు, ఇంధన ధరల ఒత్తిడి, పశ్చిమాసియా ఉద్రిక్తతలు మే నెలలో ప్రభావం చూపాయి. అయినప్పటికీ భారత ఆటో రిటైల్ రంగం వృద్ధి బాటలోనే కొనసాగింది. త్రిచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్లు, మొత్తం రిజి్రస్టేషన్ల పరంగా మే నెల అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది’’ అని ఫాడా అధ్యక్షుడు సీ.ఎస్. విఘ్నేశ్వర్ తెలిపారు. అలాగే ఏప్రిల్తో పోలిస్తే మేలో విక్రయాలు 6.75 శాతం తగ్గినా, ఇది సాధారణ సీజనల్ ప్రభావం మరియు నైరుతి రుతుపవనాల ఆలస్యానికి సంబంధించినదేనని ఆయన పేర్కొన్నారు.జూన్పై ఆశాభావంనైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటం, ఖరీఫ్ సాగు పనుల ప్రారంభం, వివాహాల సీజన్ కొనసాగడం వాహనాల డిమాండ్కు మద్దతు ఇవ్వనున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆర్బీఐ తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించడం కూడా వినియోగదారుల కొనుగోలు సామర్థ్యానికి అనుకూలంగా మారనుంది. జూన్–జూలై–ఆగస్టు కాలానికి సంబంధించి ఆటోమొబైల్ రంగం అప్రమత్తతతో కూడిన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేసింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ విధానాల కొనసాగింపు, గ్రామీణ డిమాండ్ పెరుగుదల నేపథ్యంలో రెండో త్రైమాసికంలో పరిశ్రమ మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని ఫాడా అంచనా వేసింది. -
పెరిగిన నిస్సాన్ గ్రావిటీ ధర: కొత్త రేటు ఇదే..
నిస్సాన్ కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేసిన ఏడు సీట్ల ఎంపీవీ 'గ్రావిటీ' ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. లాంచ్ అయిన కొన్ని నెలల్లోనే కంపెనీ తీసుకున్న నిర్ణయం కొనుగోలుదారులపై ప్రభావం చూపనుంది.నిస్సాన్ గ్రావిటీ లాంచ్ అయినప్పుడు రూ. 5.65 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వద్ద అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ధరలు కొంతకాలం వరకు మాత్రమే ఉంటాయని కంపెనీ లాంచ్ సమయంలోనే వెల్లడించింది. కాబట్టి సంస్థ ఇచ్చిన ప్రత్యేక లాంచ్ ఆఫర్ ఇప్పుడు ముగియడంతో కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.ధర పెరుగుదల తర్వాత నిస్సాన్ గ్రావిటీ ఎక్స్-షోరూమ్ ధరలు సుమారు రూ.5.73 లక్షల నుంచి రూ.9.08 లక్షల వరకు ఉన్నాయి. వేరియంట్ను బట్టి ధరలు భిన్నంగా ఉంటాయి. కొన్ని వేరియంట్ల ధరలు రూ. 8,000 మాత్రమే పెరిగింది. మరికొన్ని వేరియంట్ల ధరలు గరిష్టంగా రూ.18,000 వరకు పెరిగింది.డిజైన్ పరంగా నిస్సాన్ గ్రావైట్.. రెనాల్ట్ ట్రైబర్ ప్రాథమిక సిల్హౌట్ను కొనసాగిస్తుంది. అయితే నిస్సాన్ కొన్ని ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్ జోడించింది. ముందు భాగంలో హనీకాంబ్ ప్యాటర్న్తో కూడిన బోల్డ్ గ్రిల్, బోనెట్పై ‘GRAVITE’ లెటరింగ్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. స్లిమ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ క్రోమ్ స్ట్రిప్తో కనెక్ట్ చేయటం వలన ఫ్రంట్ లుక్ మరింత ఆధునికంగా కనిపిస్తుంది.సైడ్ ప్రొఫైల్లో రెనాల్ట్ ట్రైబర్ పోలిక స్పష్టంగా కనిపిస్తుంది. 15-అంగుళాల స్టైలిష్ స్టీల్ వీల్స్, ఎత్తైన రూఫ్లైన్, ఉప్రైట్ స్టాన్స్ వాహనానికి ప్రాక్టికల్, స్పేసియస్ లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో ర్యాప్-అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ క్రోమ్ స్ట్రిప్తో కలిపి అమర్చారు. బంపర్పై C-షేప్ సిల్వర్ యాక్సెంట్స్ ముందుభాగానికి అనుసరణగా ఉన్నాయి.ఇంటీరియర్లో డ్యూయల్-టోన్ బ్లాక్-బేజ్ థీమ్ ఉపయోగించారు. డాష్బోర్డ్ డిజైన్ పాత ట్రైబర్ మోడల్ను గుర్తు చేస్తుంది. మధ్యలో 8-ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దాని కింద మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ కోసం మూడు రొటరీ నాబ్స్ అమర్చారు. మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, 7-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కలిపి సరళమైన, ఉపయోగకరమైన సెటప్ను అందిస్తున్నాయి.గ్రావైట్లో లభించే ముఖ్య ఫీచర్లు 8-ఇంచ్ టచ్స్క్రీన్ (వైర్లెస్ యాపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో), 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, మాన్యువల్ ఏసీ (రియర్ వెంట్స్తో), కీ-లెస్ ఎంట్రీ & పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్. ఇక సేఫ్టీ పరంగా 6 ఎయిర్బ్యాగ్స్ (స్టాండర్డ్), ఏబీఎస్ కూడిన ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రియర్ పార్కింగ్ సెన్సర్లు & కెమెరా, టీపీఎంఎస్ ఉన్నాయి.గ్రావైట్లో 1-లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అందిస్తున్నారు. ఇది 72 పీఎస్ పవర్, 96 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT గేర్బాక్స్ ఇవ్వగా.. ఇంధన సామర్థ్యం 19.3 kmpl (MT), 19.6 kmpl (AMT) వరకు ఉంటుందని తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ రంగం @ రూ.14.4 లక్షల కోట్లు!
ముంబై: ఎల్రక్టానిక్స్ తయారీ సేవల (ఈఎంఎస్) రంగం వచ్చే ఐదేళ్లలో భారీగా విస్తరించనుంది. 2030 నాటికి మూడు రెట్లకు పైగా పెరిగి 150 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.14.4 లక్షల కోట్లు) ఈఎంఎస్ మార్కెట్ చేరుకుంటుందని కేపీఎంజీ ఇండియా నివేదిక అంచనా వేసింది. దేశీ డిమాండ్కు తోడు ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు. చైనాకు ప్రత్యామ్నాయంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థల కోసం అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తుండడం (చైనా ప్లస్ వన్ విధానం) ఈ మార్కెట్ విస్తరణకు దన్నుగా నిలవనున్నట్టు తెలిపింది. 2025లో ఈఎంఎస్ మార్కెట్ పరిమాణం 40–45 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. అయితే ఈ రంగం వృద్ధి విస్తృతంగా కాకుండా పరిమితంగా ఉండడాన్ని ఎత్తి చూపించింది. అధిక విలువను తీసుకొచ్చే డిజైన్, విడిభాగాలు, మేధో హక్కుల (ఐపీ) పరంగా దేశీ సంస్థల పాత్ర పరిమితంగానే ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో మొబైల్, అధికంగా అమ్ముడుపోయే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అసెంబ్లింగ్కే భారత కంపెనీలు ఎక్కువగా పరిమితమైనట్టు వివరించింది. దీని స్థానంలో డిజైన్, తయారీ, ఐపీ, వ్యాల్యూ చైన్తో కూడిన సమగ్రమైన ఎల్రక్టానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ అవతరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. వృద్ధికి అపార అవకాశాలు.. అంతర్జాతీయ ఈఎంఎస్ మార్కెట్ 2025లో 640–650 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు పెరగనున్నట్టు కేపీఎంజీ నివేదిక అంచనా వేసింది. అనుసంధానత, ఎలక్ట్రిఫికేషన్, ఓఈఎం అవుట్సోర్సింగ్ ఈ మార్కెట్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రంగం కేవలం ఖర్చులను నియంత్రించుకోవడం కంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు పేర్కొంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా 5–6 శాతంగానే ఉండగా, ఇక్కడి నుంచి భారీ వృద్ధి సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ చర్యలు అవసరం.. ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన కీలక విడిభాగాల కోసం భారత్ ఇప్పటికీ 80–95 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దీనివల్ల ఇక్కడి కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయని.. దీన్ని అధిగమించడం అత్యంత ముఖ్యమని ఈ నివేదిక సూచించింది. సాధారణ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ ద్వారా మార్కెట్ పరిమాణం పెరిగినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం క్లిష్టమైన సాంకేతికత కలిగిన ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, ఏరోస్పేస్ రంగాలపై ఎక్కువగా దృష్టి సారించాలని పేర్కొంది. ఈ రంగాల్లో అధిక విలువ సృష్టికి అవకాశాలున్నట్టు వివరించింది. ఎల్రక్టానిక్స్ తయారీలో తక్కువ వ్యయాలతో అంతర్జాతీయంగా భారత్ పోటీపడేందుకు కేవలం సామర్థ్య ఆధారితం కాకుండా నైపుణ్య ఆధారితంగా ఎదగాల్సి ఉందని పేర్కొంది. ‘‘ఇందుకోసం ప్రభుత్వం, తయారీ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. దేశీయంగా విడి భాగాల తయారీని పెంచడంతోపాటు కారి్మకుల్లో నైపుణ్యాలను పెంచాలి. ఇంజనీరింగ్–డిజైన్పై పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థతో అనుసంధానం కావడంపై దృష్టి సారించాలి’’అని ఈ నివేదిక సూచించింది. -
హైదరాబాద్కు చేరిన కొత్త స్క్రాంబ్లర్ బైకులు!
యెజ్డీ, BSA సంస్థలు తమ కొత్త స్క్రాంబ్లర్స్ రీటైల్ విడుదలను ప్రకటించాయి. అవి ఇప్పుడు హైదరాబాద్ తమ అథీకృత డీలర్షిప్లలో లభిస్తున్నాయి.యెజ్డీ స్క్రాంబ్లర్ 350, BSA స్క్రాంబ్లర్ 650లు ప్రత్యేకంగా రూపొందించిన పవర్ ట్రైయిన్ మాత్రమే కాకుండా.. శక్తివంతమైన, ఆకర్షణీయమైన డిజైన్ పొందుతాయి. నగర ప్రయాణాలకు, రోజువారీ వినియోగానికి 350 సీసీ బైకులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులోని లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. యెజ్దీ స్క్రాంబ్లర్ 350 బైక్ ధర రూ.1,99,950 కాగా.. BSA స్క్రాంబ్లర్ 650 ధర రూ. 3,24,950.BSA స్క్రాంబ్లర్ 650 అసలైన బ్రిటిష్ స్క్రాంబ్లర్ స్టైల్ పొందుతుంది. దీని డిజైన్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గోల్డ్ స్టార్ కటాలినా, A10 స్పిట్ ఫైర్, A65 ఫైర్ బర్డ్ వంటి చారిత్రక దిగ్గజాల నుంచి స్వీకరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ రెండు బైకులు.. అత్యుత్తమ పనితీరును అందిస్తాయని సంస్థ వెల్లడించింది. -
నెలకు రూ.1.35 లక్షల భరణం ఇవ్వాల్సిందే!
ఆధునిక వివాహ బంధాల్లో వస్తున్న విభేదాలు, విడాకుల కేసులో ఇటీవల పుణె కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశం అయింది. భార్య నెలకు లక్షకు పైగా జీతం సంపాదిస్తున్నప్పటికీ, ఆమెకు భర్త భారీ మొత్తంలో భరణం (మెయింటెనెన్స్) చెల్లించాల్సిందేనంటూ పుణెలోని ఒక కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది.అసలేం జరిగింది? కేసు వివరాలు ఇవీ..ఉద్యోగ రీత్యా పుణెలో స్థిరపడిన ఒక ఐటీ/కార్పొరేట్ జంటకు వివాహమైన ఆరు నెలలకే మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో వారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ సమయంలో భార్య తరఫు న్యాయవాది కీలక వాదనను తెరపైకి తెచ్చారు. వివాహ బంధంలో ఉన్నప్పుడు తాను ఎలాంటి విలాసవంతమైన, ఉన్నతమైన జీవన ప్రమాణాలను అనుభవించిందో విడిపోయిన తర్వాత కూడా అదే స్థాయి జీవనాన్ని కొనసాగించే హక్కు ఆమెకు ఉందని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. భర్త తన విడాకులు తీసుకున్న భార్యకు నెలకు రూ.1,35,000 భరణంగా చెల్లించాలని ఆదేశించింది.ఆదాయాల లెక్కలు ఇలా..కోర్టు రికార్డుల ప్రకారం ఇద్దరి ఆదాయ వివరాలు కింది విధంగా ఉన్నాయి.వివరాలుభర్త ఆర్థిక పరిస్థితిభార్య ఆర్థిక పరిస్థితిప్రస్తుత నెలవారీ జీతంరూ. 2,79,499రూ. 1,41,436కోర్టు ఆదేశించిన భరణంరూ. 1,35,000రూ. 1,35,000తీర్పు తర్వాత మొత్తం ఆదాయంరూ. 1,44,499రూ. 2,76,436 -
లేఆఫ్స్ సమయంలో వాల్మార్ట్ వినూత్న వ్యూహం
ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ఐటీ, కార్పొరేట్ కంపెనీలు ఏఐ సాకుతో ఉద్యోగులపై లేఆఫ్స్ పంజా విసురుతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ వాల్మార్ట్ భిన్నమైన వ్యూహాన్ని ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానం అనేది మానవ వనరులను భర్తీ చేయడానికి కాదు, వారి పనితీరును మరింత మెరుగుపరచడానికేనని స్పష్టం చేసింది. అర్కాన్సాస్లోని బెంటన్విల్లేలో నిర్వహించిన వాల్మార్ట్ వార్షిక ‘అసోసియేట్స్ వీక్’ ఈవెంట్లో సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్లు కీలక ప్రకటనలు చేశారు. డిజిటల్ సాధనాలు కేవలం సమస్యల పరిష్కారానికి, వ్యాపార సరళీకరణకు, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికే ఉపయోగపడతాయని భరోసా ఇచ్చారు.ఉత్పాదకత సాధనంగానే ఏఐగత మూడు నెలల్లో అమెరికా కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించడానికి ఏఐ సాంకేతికతను ఒక ప్రధాన కారణంగా చూపినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. వాల్మార్ట్ సైతం ఇటీవల తన టెక్నాలజీ, ప్రొడక్ట్ డిజైన్ విభాగాల్లో వందలాది పోస్టులను తగ్గించినప్పటికీ ఆ నిర్ణయానికి ఏఐతో ఎటువంటి సంబంధం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఏఐని ఉద్యోగుల భర్తీ వ్యూహంగా కాకుండా ఉత్పాదకతను పెంచే ఒక సాధనంగా వాల్మార్ట్ అగ్రనాయకత్వం అభివర్ణించింది.‘సాంకేతికత మన భవిష్యత్తుకు ఊతమిస్తుంది. కానీ, మన ఉద్యోగులే దానికి నాయకత్వం వహిస్తారు’ అని డోనా మోరిస్, వాల్మార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ తెలిపారు. వాల్మార్ట్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ ఫర్నర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాల్మార్ట్ చరిత్రలో సాధించిన విజయాల వెనుక సాంకేతికత కంటే ఉద్యోగుల కృషి, వారు చూపిన ప్రతిభే కీలకమని కొనియాడారు.భిన్నాభిప్రాయాలు - ఆందోళనలుఏఐ పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ వాల్మార్ట్ వార్షిక ఆదాయం సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. అయితే గత ఐదేళ్లలో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కార్మికులపై ఏఐ ప్రభావంపై మరింత పారదర్శకత కావాలంటూ ‘యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్’ అనే లేబర్ అడ్వకసీ గ్రూప్ వాటాదారుల సమావేశంలో ప్రతిపాదన తెచ్చింది. ఏఐ సాధనాల వల్ల పని వేగం పెరిగి కార్మికులపై ఒత్తిడి తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రతిపాదనకు తగినంత మద్దతు లభించలేదు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
డబ్బు కావాలా? వీటిలో మాస్టర్స్ అవ్వాల్సిందే!
ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పంచుకున్న కొన్ని ఆర్థిక సూత్రాలు ఇప్పుడు యువతను, వర్ధమాన పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతికే సగటు ఆలోచనా విధానానికి, రూ.కోట్లకు పడగలెత్తే వ్యాపారవేత్తల మైండ్ సెట్కు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు.‘ ‘నేను ధనవంతుడిగా ఎలా మారాలి? దీనికోసం ఏదైనా మంత్రదండం ఉందా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. వారంతా నా నుంచి ఏదో ఒక సంక్లిష్టమైన ఫార్ములానో లేక మాయా పెట్టుబడి వ్యూహాన్నో ఆశిస్తారు. కానీ, నేను కుర్రాడిగా ఉన్నప్పుడే మా ‘రిచ్ డాడ్’ నాకు అసలైన రహస్యం చెప్పారు. నువ్వు నిజంగా ధనవంతుడివి కావాలననుకుంటే.. కేవలం రెండు విషయాల్లో పట్టు సాధించు. ఒకటి సేల్స్ (అమ్మకాలు), రెండు రియల్ ఎస్టేట్’ అన్నారు.ఆ రెండు నైపుణ్యాలే ఎందుకు?రాబర్ట్ కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఒక వ్యక్తి ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరడానికి ఈ రెండు రంగాలు పునాదిగా పనిచేస్తాయి.సేల్స్ (అమ్మకాలు)వ్యాపార ప్రపంచంలో ఎవరైనా ఏదైనా అమ్మనంత వరకు అక్కడ ఎలాంటి చలనం ఉండదు. సేల్స్ అంటే కేవలం వస్తువులను అమ్మడం కాదు.ఎదుటివారితో ఎలా మాట్లాడాలి.ఎలా చర్చలు జరపాలిఇతరులను ఎలా ప్రభావితం చేయాలి.విలువను ఎలా సృష్టించాలి.. అనేది సేల్స్ నేర్పుతుంది.ఇదే ఉద్దేశంతో రాబర్ట్ కియోసాకి మెరైన్ కార్ప్స్ విడిచిపెట్టిన తర్వాత కేవలం సేల్స్ నేర్చుకోవడం కోసమే ‘జిరాక్స్’ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అక్కడ కెరీర్ బిల్డ్ చేయడం ఆయన ఉద్దేశం కాదు. ఒక పారిశ్రామికవేత్తకు కావలసిన అసలైన సేల్స్ నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడమే ఆయన లక్ష్యం.రియల్ ఎస్టేట్రియల్ ఎస్టేట్ అనేది కేవలం భూములు, భవనాల కొనుగోలు మాత్రమే కాదు. అది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సూత్రాలైన అప్పు, పన్నుల గురించి నేర్పుతుంది.లెవరేజ్: రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టుడానికి మీ సొంత డబ్బు అక్కర్లేదు. ఇతరుల లేదా బ్యాంకుల డబ్బును ఎలా ఉపయోగించవచ్చో ఇది నేర్పుతుంది.క్యాష్ ఫ్లో: క్రమబద్ధమైన ఆదాయ వనరును ఎలా సృష్టించాలో చూపిస్తుంది.టాక్స్-ఫ్రీ వెల్త్: పన్ను నిబంధనలను చట్టబద్ధంగా ఉపయోగించుకుంటూ అతి తక్కువ పన్నుతో సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలో రియల్ ఎస్టేట్ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.నేటి ఆధునిక కాలంలో కేవలం అకడమిక్ డిగ్రీలు మాత్రమే జీవితంలో స్థిరపడటానికి సరిపోవు అనేది జగమెరిగిన సత్యం. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మనల్ని కేవలం ఒక ఉద్యోగిగా మారడానికే శిక్షణ ఇస్తాయి. కానీ, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి. రాబర్ట్ కియోసాకి చెప్పినట్లు సేల్స్, రియల్ ఎస్టేట్ రంగాలపై అవగాహన పెంచుకోవడం అంటే వ్యాపారం చేయడం మాత్రమే కాదు. సంపదను సృష్టించే మైండ్ సెట్ను అలవర్చుకోవడం. డిగ్రీల వేటలో పడేముందు.. ప్రతి ఒక్కరూ ఈ ప్రాథమిక ఆర్థిక నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
ముంబై-హైదరాబాద్.. కేవలం 3 గంటల్లోనే!
హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు తుది రూపానికి వచ్చాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ముంబై-పుణె-హైదరాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) అధికారికంగా ఖరారైంది. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుల్లో ఇది కీలకంగా నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని, అలాగే హైదరాబాద్ను ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించే మరో మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాట్లను కూడా సమగ్రంగా సమీక్షించారు.12 గంటల ప్రయాణం.. ఇక 3 గంటల్లోనే..ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవడానికి సాధారణ రైళ్లు లేదా రోడ్డు మార్గం ద్వారా దాదాపు 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. అయితే, ఈ ప్రతిపాదిత బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది. కేవలం 3 గంటల్లోనే ప్రయాణీకులు తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.ప్రాజెక్టు పేరు: ముంబై-పుణె-హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ప్రాజెక్ట్ అమలు చేసే సంస్థ: నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)మొత్తం దూరం: 671 కిలోమీటర్లుగరిష్ట వేగం: గంటకు 320 కిలోమీటర్లుటెర్మినల్ నగరాలు: నవీ ముంబై-హైదరాబాద్మూడు రాష్ట్రాల మీదుగా 10 స్టేషన్లుఈ హై-స్పీడ్ రైలు కారిడార్ మొత్తం మూడు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ గుండా ప్రయాణిస్తుంది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక, ఐటీ, ఆధ్యాత్మిక పట్టణ కేంద్రాలను అనుసంధానిస్తూ మొత్తం 10 స్టేషన్లను ఈ మార్గంలో ప్రతిపాదించారు.స్టేషన్ల వారీగా రూట్ మ్యాప్..1. నవీ ముంబై2. లోనావాలా3. పింప్రి-చించ్వాడ్4. పుణె (లోని)5. బారామతి6. పంఢరపూర్7. సోలాపూర్8. కలబురగి9. వికారాబాద్10. హైదరాబాద్ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు - ప్రయోజనాలుఈ మెగా ప్రాజెక్టు ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు మూడు రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది. ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ పెరగడం వల్ల పెట్టుబడులు వరదలా రానున్నాయి. గంటకు 320 కి.మీ వేగంతో నడిచే ఈ రైళ్లు రవాణా రంగంలో సరికొత్త బెంచ్మార్క్ను సెట్ చేస్తాయి. మహారాష్ట్రలోని పారిశ్రామిక ప్రాంతాలు, కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతాలు, తెలంగాణలోని ఐటీ-ఫార్మా హబ్లకు ఈ కారిడార్ ఊతం ఇవ్వనుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించి స్థిరమైన, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను భవిష్యత్తు తరాలకు అందించడమే దీని లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశల్లో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
కేంద్రానికి ఎస్బీఐ భారీ డివిడెండ్
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం, ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డులతో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.8,813 కోట్ల భారీ డివిడెండ్ను ఎస్బీఐ చెల్లించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి ఈ డివిడెండ్ చెక్కును కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్కు అధికారికంగా అందజేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఎస్బీఐ సాధించిన ఈ ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ పన్నుయేతర ఆదాయ వనరులకు మరింత బలాన్ని చేకూర్చడంతోపాటు బ్యాంక్ పటిష్టమైన ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.రికార్డు స్థాయి లాభాలతో..ఇటీవలే ముగిసిన జనవరి-మార్చి 2026 త్రైమాసికంలో ఎస్బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ బలమైన ఆదాయాలే ప్రభుత్వానికి ఈ స్థాయిలో భారీ డివిడెండ్ చెల్లించడానికి ప్రధాన కారణమయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.18,643 కోట్లతో పోలిస్తే ఈసారి నికర లాభం 6 శాతం వృద్ధితో రూ.19,684 కోట్లకు చేరింది. బ్యాంక్ ప్రధాన ఆదాయ వనరు అయిన నికర వడ్డీ ఆదాయం (రుణాలపై వచ్చే వడ్డీకి, డిపాజిట్లపై చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసం) ఏకంగా 4 శాతం వృద్ధితో రూ.44,380 కోట్లుగా నమోదైంది.Smt @nsitharaman receives a dividend cheque of Rs 8,813 crore for FY 2025-26 from Shri C S Setty, Chairman - @TheOfficialSBI. pic.twitter.com/wNeB9HkqVw— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) June 8, 2026దలాల్ స్ట్రీట్లో జోరుస్టాక్ మార్కెట్లో ఎస్బీఐ షేరు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. గత నెల రోజుల్లో స్వల్పంగా 4 శాతం మేర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ గత వారంలోనే ఈ స్టాక్ 3 శాతానికి పైగా పుంజుకుంది. ప్రస్తుతం ఎస్బీఐ మార్కెట్ విలువ సుమారు రూ.9.08 లక్షల కోట్లకు చేరింది. దేశంలోనే అత్యంత విలువైన బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటిగా ఎస్బీఐ తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
విమానయాన రంగానికి ఇంధన గండం!
ప్రపంచ విమానయాన రంగాన్ని మిడిల్ ఈస్ట్ సంక్షోభం కుదిపేస్తోంది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ల యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా జెట్ ఇంధన (ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్-ఏటీఎఫ్) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కీలకమైన ఎయిర్ కారిడార్లు మూతపడటంతో విమానాలను సుదూర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధన ఖర్చులు రికార్డు స్థాయికి చేరాయి. ఈ పెరిగిన భారంతో మున్ముందు కొన్ని విమానయాన సంస్థలు దివాలా తీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంస్థ (ఐఏటీఏ) హెచ్చరించింది. రియో డి జనీరోలో జరిగిన ఐఏటీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ రాయిటర్స్ సంస్థతో మాట్లాడుతూ పౌర విమానయాన రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని విశ్లేషించారు.బడ్జెట్ విమానయాన సంస్థలపైనే ప్రభావం..పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం పూర్తిస్థాయి సేవలందించే పెద్ద ఎయిర్లైన్స్ కంటే తక్కువ ధరలకే సేవలందించే ‘బడ్జెట్ క్యారియర్ల’పైనే ఎక్కువగా పడుతోందని ఐఏటీఏ స్పష్టం చేసింది. ‘పెద్ద విమానయాన సంస్థలకు ప్రీమియం క్యాబిన్లు, అధిక ఛార్జీలు చెల్లించే బిజినెస్ ప్రయాణికులు, క్రెడిట్ కార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్ల ద్వారా అదనపు మార్జిన్ ఆదాయం లభిస్తుంది. బడ్జెట్ ఎయిర్లైన్స్కు ఇలాంటి అదనపు వనరులు ఉండవు’ అని ఐటీఏటీ తెలిపింది. అమెరికాకు చెందిన ప్రముఖ బడ్జెట్ ఎయిర్లైన్ ‘స్పిరిట్ ఎయిర్లైన్స్’ గత నెలలో భారీగా నష్టపోయింది. రాబోయే రోజుల్లో మరికొన్ని చిన్న సంస్థలు వ్యాపారాల నుంచి తప్పుకోవడమో లేదా పెద్ద క్యారియర్ల చేతుల్లోకి వెళ్లిపోవడమో తప్పదని విల్లీ వాల్ష్ ఆందోళన వ్యక్తం చేశారు.టికెట్ ధరలు తగ్గే ప్రసక్తే లేదు!ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ నష్టాలను/మార్జిన్లను కాపాడుకోవడానికి లాభసాటి కాని మార్గాల్లో సర్వీసులను నిలిపివేస్తున్నాయి. ఇరాన్ వివాదం మొదలైనప్పటి నుంచి పెరిగిన విమాన ప్రయాణ ఛార్జీలు సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశం లేదని వాల్ష్ తేల్చిచెప్పారు. ప్రస్తుత తరుణంలో అధిక ఇంధన ధరలను తట్టుకుని నిలబడటం చాలా కష్టమన్నారు. అమెరికా మార్కెట్లో మాత్రం యునైటెడ్, డెల్టా, అమెరికన్ ఎయిర్లైన్స్ వంటి క్యారియర్లు చిన్న బడ్జెట్ పోటీదారులను గట్టిగా అణచివేస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
దలాల్ స్ట్రీట్ను ముంచెత్తిన అమ్మకాల వరద!
భారత స్టాక్ మార్కెట్ ఈ వారం తొలి సెషన్లోనే తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముడిచమురు ధరల మంట దేశీయ మార్కెట్లను కుప్పకూల్చాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయి 23,123 వద్ద స్థిరపడింది. మరోవైపు, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 719 పాయింట్లు దిగజారి 73,524 వద్ద ముగిసింది. మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా విక్స్ ఏకంగా 7.25% పెరిగి 16.93 మార్కుకు చేరడం మదుపరుల్లో ఉన్న తీవ్ర ఆందోళనను ప్రతిబింబిస్తోంది. భారత ఈక్విటీ మార్కెట్ ఇంతలా కుప్పకూలడానికి ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయం, ద్రవ్యోల్బణ భయాలు కారణమయ్యాయి.యుద్ధ సంక్షోభం తీవ్రతరంమార్కెట్లను కుదిపేసిన అత్యంత కీలకమైన అంశం పశ్చిమ ఆసియా సంక్షోభం. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య దాడులు, తాజాగా ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన దాడుల కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదరాల్సిన శాంతి ఒప్పందాలపై ఈ పరిణామాలు నీళ్లు చల్లడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. యుద్ధ భయాల నేపథ్యంలో సురక్షితమైన పెట్టుబడులవైపు మదుపరులు మొగ్గు చూపడం మార్కెట్ల పతనానికి దారితీసింది.ముడిచమురు ధరలుమధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా రవాణాకు ఆటంకం కలుగుతుందనే భయాలు పెరిగాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 4.5% పైగా పెరిగి బ్యారెల్కు 97.28 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడే భారతదేశం లాంటి ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ క్షీణిస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్లను వెంటాడింది.టెక్ షేర్లలో అమ్మకాల వెల్లువగత కొన్ని నెలలుగా ప్రపంచ మార్కెట్లను పరుగులు పెట్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక రంగానికి చెందిన షేర్లలో అంతర్జాతీయంగా ప్రాఫిట్ బుకింగ్ ఊపందుకుంది. ఈ ఏఐ ర్యాలీ అత్యంత వేగంగా, పరిమితికి మించి జరిగిందన్న భయాలతో గ్లోబల్ ఇన్వెస్టర్లు టెక్ షేర్లను విక్రయించారు. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లతో పాటు భారత ఐటీ రంగంపైనా స్పష్టంగా కనిపించింది.ఆర్బీఐ నెమ్మదించిన వృద్ధి అంచనాలుఇటీవలి ద్రవ్య పరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ రాబోయే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.9% నుంచి 6.6%కి తగ్గించింది. అలాగే ద్రవ్యోల్బణం అంచనాను 5.1%కి పెంచడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే ఉంచవచ్చనే సంకేతాలు తోడయ్యాయి.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
HDFC బ్యాంక్ అలర్ట్: EMI కస్టమర్లకు షాక్!
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను పలు కాలపరిమితులపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు జూన్ 8, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు తీసుకున్న కొందరు కస్టమర్లకు భవిష్యత్తులో ఈఎంఐలు (EMI) పెరిగే అవకాశం ఉంది.ఆర్బీఐ రెపో రేటు స్థిరంగానే.. అయినా పెంపు ఎందుకు?గత వారం జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. అయితే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయం, డిపాజిట్ ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాల ఆధారంగా ఎంసీఎల్ఆర్ను బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయిస్తాయి. అందుకే రెపో రేటులో మార్పు లేకపోయినా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన అంతర్గత బెంచ్మార్క్ రేట్లను సవరించింది.ఏయే కాలపరిమితుల్లో ఎంత పెరిగింది?సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్ల ప్రకారం ఓవర్నైట్ రేటు 8.05 శాతం నుంచి 8.10 శాతానికి పెరిగింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది.రిటైల్ రుణాలకు కీలక బెంచ్మార్క్గా భావించే ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్లో అత్యధికంగా 10 బేసిస్ పాయింట్ల పెంపు చోటుచేసుకుని 8.45 శాతం నుంచి 8.55 శాతానికి చేరగా, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ మాత్రం 8.05 శాతం వద్ద యథాతథంగా కొనసాగింది.తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు🔹 ఓవర్నైట్ – 8.10%🔹 1 నెల – 8.05%🔹 3 నెలలు – 8.20%🔹 6 నెలలు – 8.35%🔹 1 సంవత్సరం – 8.40%🔹 2 సంవత్సరాలు – 8.55%🔹 3 సంవత్సరాలు – 8.65%ఈఎంఐలు వెంటనే పెరుగుతాయా?అలా ఏం లేదు. ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాల్లో వడ్డీ రేటు ప్రతి నెల, త్రైమాసికం లేదా వార్షిక రీసెట్ తేదీకి అనుగుణంగా మారుతుంది. కాబట్టి మీ రుణ ఖాతాకు తదుపరి రీసెట్ తేదీ వచ్చినప్పుడు మాత్రమే కొత్త ఎంసీఎల్ఆర్ ప్రభావం కనిపిస్తుంది. ఈఎంఐ పెరగవచ్చు లేదా రుణ కాలపరిమితి పొడిగించవచ్చు. ఇది రుణ ఒప్పంద నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.అసలేమిటీ ఎంసీఎల్ఆర్?ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకు రుణాలను ఇవ్వగల కనీస వడ్డీ రేటు. 2016లో ఆర్బీఐ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, నగదు నిల్వల వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని నిర్ణయిస్తారు. అనేక పాత గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు ఇప్పటికీ ఎంసీఎల్ఆర్ ఆధారంగానే కొనసాగుతున్నాయి.బేస్ రేట్, బీపీఎల్ఆర్ యథాతథంహెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేస్ రేట్ ప్రస్తుతం 8.80 శాతంగా కొనసాగుతోంది. అలాగే బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR) 17.30 శాతంగా ఉంది. ఈ రేట్లు డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లో ఉన్నాయి.రుణగ్రహీతలు ఏం చేయాలి?మీ హోమ్ లోన్ లేదా ఇతర రుణం ఎంసీఎల్ఆర్ ఆధారితమా, లేక EBLR/రెపో-లింక్డ్ విధానంలో ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు ఉన్నవారు తమ తదుపరి రీసెట్ తేదీని పరిశీలించి ఈఎంఐపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసుకోవచ్చు. రెపో-లింక్డ్ రుణాలపై ఈ తాజా ఎంసీఎల్ఆర్ పెంపు ప్రత్యక్ష ప్రభావం చూపదు. -
ఈజీగా ‘EPF 100% విత్డ్రా’.. కొత్తగా మారిందిదే..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించే కీలక మార్పులు ఇటీవల తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్మును (100 శాతం) ఉపసంహరించుకునే ప్రక్రియను సరళతరం చేసింది. అర్హత ఉన్న సభ్యులు నిర్దిష్ట అత్యవసర పరిస్థితుల్లో నిధులను ఉపసంహరించుకునేందుకు ప్రత్యేక కారణాలను వివరించాల్సిన అవసరం కూడా లేదు.గత అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. గతంలో ఉపసంహరణ కోసం కారణాలను స్పష్టంగా పేర్కొనడంతో పాటు సంబంధిత ఆధారాలను సమర్పించాల్సి వచ్చేది. దీంతో అనేక క్లెయిమ్లు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురయ్యేవి. కొత్త విధానంతో ఈ సమస్యలు తగ్గే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది.గతంలో ఎలా ఉండేదంటే..గతంలో ఈపీఎఫ్ సభ్యులు ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి, సంస్థ లాక్అవుట్, దీర్ఘకాల నిరుద్యోగం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో తమ ఈపీఎఫ్ నిధులను పూర్తిగా ఉపసంహరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇందుకు నిర్దిష్ట కారణాన్ని పేర్కొనడం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో పేర్కొన్న కారణం ఈపీఎఫ్ఓ ఆమోదించిన కేటగిరీల్లో లేకపోవడంతో క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యేవి.ఏ పరిస్థితుల్లో 100% ఉపసంహరణ?ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం కింది ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అవి..🔸 సమ్మె, లాక్అవుట్ లేదా సంస్థ మూసివేత కారణంగా 15 రోజులకుపైగా వేతనం లేకుండా ఉండటం.🔸 రెండు నెలలకు పైగా జీతాలు అందకపోవడం.🔸 ఉద్యోగం నుంచి తొలగింపు లేదా డిశ్చార్జ్కు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్లో ఉండటం.🔸 సంస్థ ఆరు నెలలకు పైగా మూతపడటం వల్ల ఉద్యోగి నిరుద్యోగిగా మారడం.🔸 సభ్యుడు లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం అత్యవసర నిధుల అవసరం ఏర్పడటం.కొత్త నిబంధనలో ప్రత్యేకత ఇదే..కొత్తగా తీసుకొచ్చిన వెసులుబాటుతో అత్యవసర పరిస్థితుల్లో 100 శాతం ఈపీఎఫ్ ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసే సమయంలో కారణాన్ని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం ఉండదు. సభ్యుడు సంబంధిత కేటగిరీ కింద క్లెయిమ్ సమర్పిస్తే సరిపోతుంది. దీనివల్ల క్లెయిమ్ల పరిశీలన వేగవంతం కావడంతో పాటు తిరస్కరణలు, ఫిర్యాదులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.సాధారణ పరిస్థితుల్లో 75% వరకు మాత్రమేఅయితే ప్రతి సభ్యుడు ఎప్పుడైనా తన మొత్తం ఈపీఎఫ్ బ్యాలెన్స్ను తీసుకోలేడు. సాధారణ పరిస్థితుల్లో అర్హత కలిగిన మొత్తంలో గరిష్ఠంగా 75 శాతం వరకు మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. 100 శాతం ఉపసంహరణ మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లోనే వర్తిస్తుంది.డిజిటల్ సేవలకు ప్రాధాన్యంగత రెండేళ్లుగా ఈపీఎఫ్ఓ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారంగా ఆన్లైన్ క్లెయిమ్లు, ఆటో సెటిల్మెంట్, బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ వంటి సేవలను వేగవంతం చేసింది. దీంతో చాలా క్లెయిమ్లు కొద్ది రోజుల్లోనే పరిష్కారం అవుతున్నాయి. -
ఈ యూరప్ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్!
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక నగరాల్లో ఒకటి. కనువిందు చేసే నీటి కాలువలు, చారిత్రక భవనాలు, మ్యూజియంలు, సాంస్కృతిక వైవిధ్యంతో ఏటా కోట్లాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్న ఈ నగరం ఇప్పుడు ‘ఓవర్ టూరిజం’ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల సంఖ్యను నియంత్రించడంతో పాటు నగర నిర్వహణకు అదనపు నిధులు సమకూర్చుకునేందుకు ఆమ్స్టర్డామ్ సిటీ ప్రభుత్వం పర్యాటక పన్నును భారీగా పెంచే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.12.5 శాతం నుంచి 20 శాతానికి..ప్రస్తుతం ఆమ్స్టర్డామ్లో హోటళ్లు, హాస్టళ్లు, ఇతర వసతి కేంద్రాల్లో బస చేసే పర్యాటకులపై గది అద్దెపై 12.5 శాతం పర్యాటక పన్ను వసూలు చేస్తున్నారు. అలాగే క్రూయిజ్ నౌకల ద్వారా ఒక రోజు పర్యటనకు వచ్చే వారిపై ఒక్కొక్కరికి 15 యూరోలు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1650 పన్ను విధిస్తున్నారు.కొత్త సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం 2027 నుంచి ఈ పన్నును 16 శాతానికి పెంచి, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక శాతం చొప్పున పెంచుతూ 2030 నాటికి 20 శాతానికి చేర్చనుంది. ఇది అమలైతే ప్రపంచంలోనే అత్యధిక పర్యాటక పన్నులు విధించే నగరాల్లో ఆమ్స్టర్డామ్ ఒకటిగా నిలవనుంది.నగరంపై పెరుగుతున్న ఒత్తిడే కారణంపర్యాటకం నగర ఆర్థిక వ్యవస్థకు కీలక ఆదాయ వనరు అయినప్పటికీ, అదే సమయంలో జనసమ్మర్థ ప్రదేశాలు, మౌలిక సదుపాయాలు, స్థానికుల జీవన ప్రమాణాలపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తోందని సిటీ ప్రభుత్వం పేర్కొంది. అందుకే నగర నిర్వహణ, పరిశుభ్రత, భద్రత, చట్ట అమలు, మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చుల్లో పర్యాటకులు కూడా తగిన వాటా భరించాలని భావిస్తోంది. పన్ను పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.క్రూయిజ్ టెర్మినల్కు కూడా గుడ్బై?పన్ను పెంపుతో పాటు మరికొన్ని కఠిన నిర్ణయాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సముద్ర క్రూయిజ్ నౌకల ద్వారా వచ్చే పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకు నగరంలోని ప్రధాన క్రూయిజ్ టెర్మినల్ను మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. జాతీయ ప్రభుత్వం, ప్రాంతీయ అధికారులతో చర్చల అనంతరం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనుంది.అదనంగా, కాలువలపై బోటు టూర్లు, అద్దె పడవలు వంటి వినోద కార్యకలాపాలపై కూడా అధిక రుసుములు విధించే అవకాశాలు ఉన్నాయి. నగర కేంద్రంలోని కొన్ని భవనాలను కొనుగోలు చేసి, వాటి వినియోగాన్ని మార్చడం ద్వారా అధిక పర్యాటక ఒత్తిడిని తగ్గించే ప్రణాళికలను కూడా పరిశీలిస్తున్నారు.రెడ్ లైట్ ప్రాంతానికి ప్రత్యామ్నాయంప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆమ్స్టర్డామ్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్పై ఒత్తిడిని తగ్గించేందుకు నగర దక్షిణ ప్రాంతంలో ప్రత్యేక “ఎరోటిక్ సెంటర్” ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సెక్స్ వర్కర్లకు మరింత భద్రత కల్పించడం, నేర కార్యకలాపాల ప్రభావాన్ని తగ్గించడం, నగర కేంద్రంలో రద్దీని నియంత్రించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు.పర్యాటకులను ఆహ్వానిస్తూనే నియంత్రణగత కొన్నేళ్లుగా ఆమ్స్టర్డామ్ ‘టూరిజం ఇన్ బ్యాలెన్స్’ విధానాన్ని అమలు చేస్తోంది. పర్యాటకులను పూర్తిగా నిరోధించడం కాకుండా, నగర సామర్థ్యానికి మించి పెరుగుతున్న సందర్శకుల ప్రవాహాన్ని సమతుల్యం చేయడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలు, యునెస్కో వారసత్వ హోదా పొందిన కాలువల వలయం, సైకిల్ సంస్కృతి కారణంగా ఆమ్స్టర్డామ్ ఇప్పటికీ ఐరోపాలో అత్యధికులు సందర్శించాలనుకునే పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇకపై అక్కడికి వెళ్లే పర్యాటకులు మరింత ఖర్చుకు సిద్ధంగా ఉండాల్సి రావచ్చు. -
పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!
దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. దాదాపు పది రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు (Today Gold Rate) భారీగా పతనమయ్యాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ ఉపశమనం కలుగుతోంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు మరింత భారీగానే దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
స్టాక్ మార్కెట్ క్రాష్.. వణికిపోతున్న సూచీలు!
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో కదులుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తత మళ్లీ పెరగడంతో భారత ప్రామాణిక సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ పడిపోయాయి. వార్తల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగించింది. ఇది అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఆశలపై నీరు పోసింది. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 188.20 పాయింట్లు లేదా 0.81 శాతం క్షీణించి 23,178.50 వద్ద, సెన్సెక్స్ 610 పాయింట్లు లేదా 10.82 శాతం క్షీణించి 73,632.85 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.51 శాతం, 1.52 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ మెటల్ ఎక్కువగా క్షీణించగా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ మంచి పనితీరు కనబరుస్తున్నాయి. -
డాలర్లలో పెట్టుబడి.. కొత్త మ్యూచువల్ ఫండ్
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) నియంత్రణలో ఉండే మార్సెలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్–గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీ తాజాగా గ్లోబల్ ఈక్విటీస్ ఫండ్ని ఆవిష్కరించింది. భారతీయ ఇన్వెస్టర్లు.. గ్లోబల్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూన్ 8న ప్రారంభమై జూన్ 19న ముగుస్తుంది.కనీసం 5,000 డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫండ్ ప్రధానంగా డిఫెన్స్–ఏరోస్పేస్, విద్యుదుత్పత్తి, లగ్జరీ కన్జంప్షన్ తదితర ట్రెండ్స్కి అనుగుణంగా ఉన్న సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. పెట్టుబడులను విదేశీ కరెన్సీలో రిడీమ్ చేసుకోవచ్చు. పాన్, ఆధార్ వివరాలతో ఇన్వెస్ట్ చేయొచ్చు. గిఫ్ట్ సిటీలో విడిగా బ్యాంకు ఖాతా అవసరం లేదు. -
మీ పన్ను భారం.. మీరే ప్లాన్ చేసుకోండి..
ఆ ఇంట్లో ఏప్రిల్ మొదటి వారంలో పండుగ వాతావరణం నెలకొంది. కోలాహలం. హడావుడి. కారణం ఏమిటంటే, ఆ ఇంటాయన కొడుకు చైతన్య, కోడలు, పిల్లలు అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. అమెరికాలో చైతన్య యజమాని తెలుగు వ్యక్తి. మాటల్లో హైదరాబాద్లో ఒక ఆఫీస్ పెట్టడం, ఆ ఆఫీస్కి ఇన్చార్జి బాధ్యతలను పూర్తిగా చైతన్యకి అప్పగించడం చకచకా జరిగింది. నెలకు రూ. 5,00,000 జీతం. ఆఫీసులో జాయిన్ కాగానే, ఉత్సాహం, ఆనందం వగైరాల తర్వాత ఇన్కం ట్యాక్స్ లెక్కల ప్రస్తావన వచి్చంది. ‘‘మీరు కొత్త పద్ధతిని ఎంచుకుంటున్నారా లేక పాత పద్ధతా’’ అని అడిగారు హెచ్ఆర్ వాళ్లు. వివరాల్లోకి వెళ్తే, నెలవారీ జీతం అన్నీ కలిపి రూ. 5,00,000. మిడిమిడి జ్ఞానంతో మెటా ద్వారా తన ఆదాయపు పన్ను భారమెంతో తెలుసుకున్నాడు.అంటే నెలకు రూ.1,29,415 రికవరీ చేయాలి..ఈ లెక్కలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాడు చైతన్య. అయితే, చైతన్య తండ్రి ‘ఇది సరే గానీ.. ఒకసారి పాత పద్ధతి ప్రకారం లెక్క కట్టు.. నాకు ఎలాగూ రూ.6,00,000 దాటి ఆదాయం లే దు. మరో రూ.6,00,000 నా పేరు మీద అద్దె అన్నట్లుగా లెక్క వేయి‘ అన్నారు. చిన్నప్పటి ఫ్రెండ్కి ఫో న్ చేస్తే పాత పద్ధతిలో ఈ విధంగా లెక్క కట్టాడు. బేసిక్ రూ. 48,00,000, ఇంటద్దె రూ. 12,00,000.చైతన్య ఈ రెండు స్టేట్మెంట్లు ఎదురుగా పెట్టుకుని కంపేర్ చేయడం మొదలుపెట్టాడు. కొత్త పద్ధతిలో చేతికొచ్చేది రూ. 60,00,000, పన్నుగా చెల్లించాల్సినది రూ. 15,52,980 లేదా రూ. 15,53,000 అనుకోండి. మిగిలేది రూ. 44,47,000. నెలకు రూ. 3,70,580 అవుతుంది. సొంత ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉండటం, పిల్లల విషయంలో తాత, బామ్మల పర్యవేక్షణ, ఆలనా పాలనా దన్ను ఉంటాయి.రెండో పద్ధతిలో రూ. 60,00,000లో నుంచి తండ్రికి రూ. 6,00,000 ఇవ్వాలి. ఇచ్చి మళ్లీ వెనక్కి పుచ్చుకోవచ్చేమో.. అలా ఆలోచించకండి. మిగిలింది రూ. 54,00,000. ఇందులో నుంచి 80సి కింద కమిట్మెంట్ రూ. 1,50,000, పన్ను రూ. 17,34,876 (రౌండ్ ఫిగరు రూ. 17,35,000) తీసివేస్తే చేతిలో ఆడేది రూ. 35,15,000.చేతిలో మిగిలిన మొత్తాన్ని లెక్కలోకి తీసుకుంటే ఈ రెండింటిలో తేడా రూ. 44,47,000 – రూ. 35,15,000 = రూ. 9,32,000. అంటే నెలకు రూ. 77,666 (రౌండ్ ఫిగరు రూ. 77,000) అదనంగా మిగులుతుంది.ఆఫీసుకు వెళ్లి రావడానికి ఖర్చుల్లో ఏమీ మార్పు ఉండదు. పిల్లల చదువులకోసం చెల్లించాల్సిన ఖర్చులకు పూర్తిగా తగ్గింపు ఉండదు. మన ఇష్టం మీద చదివించే చదువులనేవి తల్లిదండ్రులుగా మన బాధ్యత. బరువు కాదు. మన స్టైల్ ఆఫ్ లివింగ్.. మన ఇష్టం. ఆడంబరాలకు పోవద్దు. అప్పుల పాలు కావొద్దు. -
దీర్ఘకాలానికి మంచి రాబడి!
ఈక్విటీల నుంచి మెరుగైన రాబడులను కోరుకునే ఇన్వెస్టర్ట పోర్ట్ఫోలియోలో లార్జ్క్యాప్తోపాటు మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్కు తప్పకుండా చోటు ఉండాలి. రిస్క్ ఎక్కువగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మిడ్, స్మాల్క్యాప్ ఫండ్స్ అదనపు రాబడిని తెచ్చి పెడతాయని చారిత్రిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్ కూడా ఒకటి. కనీసం ఏడేళ్లు అంతకుమించిన దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారు ఈ ఫండ్ను పరిశీలించొచ్చు.రాబడులు.. ఈ పథకం గతంలో ఎస్బీఐ మాగ్నం మల్టీప్లయర్ ఫండ్గా ఉండేది. 1993 నుంచి ఈ పథకం అందుబాటులో ఉంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 4.52 శాతం రాబడిని ఇచి్చంది. మూడేళ్లలో చూస్తే వార్షిక రాబడి 15.44 శాతంగా ఉంది. ఐదేళ్లలోనూ 15 శాతం, ఏడేళ్లలో 16.58 శాతం, పదేళ్లలో 15.47 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు తెచి్చపెట్టింది. కానీ, బీఎస్ఈ లార్జ్ మిడ్క్యాప్ సూచీ టీఆర్ఐ రాబడి కంటే ఈ పథకమే వివిధ కాలాల్లో 2–4 శాతం అదనపు రాబడిని అందించింది.ఇక లార్జ్అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకం 0.5 శాతం మేర అధిక ప్రతిఫలాన్ని అందించింది. గతంలో లార్జ్క్యాప్ ఫండ్గా కొనసాగింది. ఇప్పుడు లార్జ్ అండ్ మిడ్క్యాప్ మిశ్రమంగా పెట్టుబడులు చేస్తుంది. కనుక మెరుగైన ప్రతిఫలాన్ని ఈ పథకం నుంచి దీర్ఘకాలానికి ఆశించొచ్చు. డైరెక్ట్ ప్లాన్ ఎన్ఏవీ 0.64 శాతంగా ఉంది. ఏక మొత్తంలో అయితే కనీసం రూ.1,000, సిప్ రూపంలో అయితే కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.పెట్టుబడుల విధానం.. ఈ పథకం భిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వృద్ధి, వ్యాల్యూ ఇన్వెస్టింగ్ ఈ పథకంలో భాగంగా ఉండడం మరో ఆకర్షణీయ అంశం. భారీ వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అదే సమయంలో ఆకర్షణీయమైన విలువల వద్ద ట్రేడ్ అవుతున్న, వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ను గుర్తించి పెట్టుబడులు పెడుతుంది. టాప్ డౌన్, బోటమ్ అప్ రెండు విధానాల కింద స్టాక్స్ను ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్ఫోలియో పీఈ 25.61గా ఉండడం అన్నది గ్రోత్ ఆధారిత పోర్ట్ఫోలియోను సూచిస్తోంది. గత మూడేళ్లలో మార్కెట్ల నష్టాల సమయాల్లో ఎన్ఏవీ క్షీణతను పరిమితం చేసింది.పోర్ట్ఫోలియో.. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.38,426 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.94 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 0.74 శాతం పెట్టుబడులు డెట్ సెక్యూరిటీలకు కేటాయించింది. నగదు నిల్వలు 5.32 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 41.66 శాతం లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయగా, 43.32 శాతం మిడ్క్యాప్ కంపెనీల్లో, 15 శాతం స్మాల్క్యాప్ కంపెనీలకు కేటాయించింది. రంగాల వారీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 21.38 శాతం కేటాయించింది. ఆ తర్వాత మెటీరియల్స్ కంపెనీల్లో 13.81 శాతం, హెల్త్కేర్ కంపెనీల్లో 12.62 శాతం, ఇండస్ట్రియల్ కంపెనీల్లో 12.15 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. -
గణాంకాలపై మార్కెట్ ఫోకస్!
దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా పలు దేశ, విదేశీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోపక్క రోజుకో మలుపు తీసుకుంటున్న పశ్చిమాసియా పరిస్థితులు కీలకం కానున్నాయి. గత వారాంతాన యూఎస్ మార్కెట్లతోపాటు.. పసిడి, వెండి తదితర కమోడిటీలలో అమ్మకాలు వెల్లువెత్తాయి. యూఎస్ స్టాక్ మార్కెట్లు 1.5–4% మధ్య క్షీణించగా.. బంగారం 3 శాతం, వెండి 6.5% చొప్పున పతనమయ్యాయి. ముడిచమురు, కాపర్, నేచురల్ గ్యాస్ సైతం 2–4 శాతం మధ్య నీరసించాయి. ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూఎస్ లీజర్, హెల్త్కేర్, ఆతిథ్య రంగాల దన్నుతో మే నెలలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించాయి. దీంతో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు పెరిగి ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 100కు బలపడింది. మరోపక్క ఏఐ సవాళ్లతో టెక్నాలజీ స్టాక్స్లో తలెత్తిన భారీ అమ్మకాలు నాస్డాక్ను 4% పడగొట్టినట్లు తెలిపా రు. కాల్పుల విరమణ అంటూనే యూఎస్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. నేడు అటూఇటుగా గత వారం చివర్లో యూఎస్ మార్కెట్లు, కమోడిటీలలో నమోదైన అమ్మకాల ప్రభావం నేడు దేశీయంగా కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత వారం విడుదలైన దేశ జీడీపీ గణాంకాలు, ఆర్బీఐతోపాటు ప్రభుత్వం చేపట్టిన విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాల నిబంధనల సవరణలు కొంతమేర ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు వివరించారు. రాజకీయ, భౌగోళిక అనిశ్చితి, చమురు ధరల కారణంగా ఎదురవుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ తగ్గించడం కొంతమేర ప్రతికూలమేనని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు ఆర్బీఐ దన్ను, బలపడిన డాలరు.. రూపాయిపై ప్రభావం.. ఇవన్నీ కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. వెరసి నేడు మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాలపై దృష్టిఇటీవల ఆశలు రేపుతున్న రుతుపవనాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. మే నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలు 12న వస్తాయి. ఈ అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గ్లోబల్ ఐటీ దిగ్గజాల్లో అమ్మకాలు దేశీయంగానూ ప్రభావం చూపవచ్చని లివ్లాంగ్ వెల్త్ రీసెర్చ్ నిపుణులు కె.హరిప్రసాద్ చెప్పారు.సాంకేతికంగా చూస్తే.. సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం గత వారం సెన్సెక్స్ మద్దతు స్థాయిలకు సమీపంలో నిలిచినప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది. మరోపక్క 23,500 పాయింట్లను దాటలేకపోతున్న నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. వెరసి ఈ వారం నిఫ్టీ 23,000 పాయింట్ల దిగువకు 22,900కు చేరవచ్చు. బలపడితే 23,500 వద్ద రెసిస్టెన్స్కు అవకాశముంది. గత వారం డీలా విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర విక్రయాల నేపథ్యంలో గత వారం(1–5) హెచ్చుతగ్గుల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ నికరంగా 532 పాయింట్లు(0.7%) నష్టపోయి 74,243 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్లు(0.76%) క్షీణించి 23,367 వద్ద స్థిరపడింది. ఎఫ్పిఐ అమ్మకాల దెబ్బ కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలు చేపడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల తొలి వారంలోనూ ఇదే ధోరణి కొనసాగించారు. వెరసి జూన్ తొలి వారంలో రూ. 43,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేలండర్ ఏడాది(2026)లో ఇప్పటివరకూ రూ. 2.67 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇది సరికొత్త రికార్డ్కాగా.. ఎన్ఎస్డీఎల్ వివరాల ప్రకారం 2025లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు రూ. 1.66 లక్షల కోట్లను ఇవి దాటేశాయి. బలహీన కార్పొరేట్ ఫలితాలు, రూపాయి క్షీణత, గ్లోబల్ మార్కెట్లలో ఆకర్షణీయ అవకాశాలు తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లోనూ ఎఫ్పీఐలు నికర అమ్మకందారులుగానే నిలవడం గమనార్హం! మార్చిలో అత్యధికంగా రూ. 1.17 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జెన్ జెడ్.. కొత్త పాఠాలు
అప్పులంటే ఇష్టం లేదు. కానీ... ఈజీగా ‘ఇదిగో తీసుకో’ అంటూ వచ్చే మెసేజీలకు ఇట్టే ఆకర్షితులైపోతారు. అదుపులేకుండా వాడేస్తారు. ఎక్కడ పెట్టుబడి పెడితే ఏమవుతుందో సొంతగానే విశ్లేషిస్తారు. తమకు అన్నీ తెలుసనుకుంటారు. కానీ... రీల్స్లో ఇన్ఫ్లుయెన్సర్లను ఇట్టే నమ్మేస్తారు. ఖర్చుల్ని నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటారు. కానీ స్మార్ట్ఫోన్లో వేగంగా జరిపే లావాదేవీలతో... డబ్బు నిరంతరం ఖర్చవుతూనే ఉంటుంది. ముందే పొదుపు ఆరంభిస్తున్నారు. చిన్నచిన్న డిస్కౌంట్లు, ఆఫర్లకన్నా... పారదర్శకంగా చార్జీలు వసూలు చేసే సంస్థలనే నమ్ముతున్నారు. స్మార్ట్ ఫోన్లలో వాడే అప్లికేషన్ల నుంచీ ఎంటర్టైన్మెంట్ వరకూ సబ్ర్స్కిప్షన్లు ఎక్కువ. ఎప్పటికప్పుడు కొత్త గాడ్జెట్లు, లైఫ్ స్టైల్ను అప్గేడ్ చేసుకోవటం అలవాటు. ఇదంతా ‘జెడ్’ జనరేషన్ గురించి. 16 ఏళ్లు దాటి... 30 ఏళ్లు నిండని యువతరం గురించి. వీరి అలవాట్లు కొన్ని మంచివే అయినా... కొన్నింటి విషయంలో జాగ్రత్తపడాల్సిందే. 2030 నాటికి జెన్ జెడ్, యువ మిలీనియల్స్ దేశీ వినియోగ వ్యయాల్లో మెజారిటీ వాటాకు చేరుతున్న నేపథ్యంలో... వీళ్లేం చేస్తున్నారో... ఏం చేస్తే బాగుంటుందో చెప్పే ‘సాక్షి వెల్త్’ స్టోరీ ఇది.పదేళ్ల కిందటి వరకూ పర్సులో డబ్బులు లేకుండా కదలడమనేది ఊహక్కూడా అందేది కాదు. కానీ ఇప్పటి జెన్ జెడ్.. చేతిలో స్మార్ట్ఫోన్ తప్ప మరేదీ వెంట తీసుకెళ్లడం లేదు. యూపీఐ సహా డిజిటల్ లావాదేవీలు సర్వ సాధారణమైపోవటమే ప్రధాన కారణం. క్యాష్తో సౌకర్యం తక్కువని భావించటం వల్ల కూడా దీనిపై ఆధారపడటం తగ్గుతోంది. మరో గమనించదగ్గ అంశమేంటంటే ఈ తరం క్రెడిట్ కార్డులకు తక్కువ ప్రాధాన్యమివ్వటం. యూపీఐ, మొబైల్ వాలెట్స్, డెబిట్ కార్డులనే ఎక్కువ వాడటం. క్యాష్ని అత్యంత తక్కువగా ఉపయోగిస్తున్నారు. పేమెంట్ మెథడ్ ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిదనుకుంటున్నారు. పాత తరం వారు నెలవారీగా కొనుగోళ్లు, పండగ షాపింగ్లు జరుపుతుంటే... ఈ జెన్ జెడ్ మాత్రం వీకెండ్ షాపింగ్లే కాకుండా దాదాపు నిరంతరం ఖర్చు చేస్తూనే ఉన్నారు. క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీసులు, ఓటీటీ మెంబర్షిప్లు, గేమింగ్ సబ్్రస్కిప్షన్లు.. ఇలా ఒకటి కాదు నిత్యం బోలెడన్ని చిన్న చిన్న లావాదేవీలు చేస్తూనే ఉంటున్నారు. ఇలా వీరి ఖాతాల్లోంచి నిరంతరం ప్రవహిస్తున్న నగదు ఆధారంగా... ఇపుడొక కొత్త ‘రియల్ టైమ్ స్పెండింగ్ ఎకానమీ’ పుట్టుకొచ్చింది. అది అంతకంతకూ పెరుగుతోంది. అప్పంటే ఇష్టం లేదు.. కానీ.. సాధారణంగా నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టేస్తుందని యువతపై ఓ అభిప్రాయం ఉంది. కానీ జెన్ జెడ్ తరం ఆర్థిక అలవాట్లు లోతుగా చూస్తే ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక సంక్షోభాలు, కరోనా సమయంలో అనిశ్చితి, టెక్ రంగంలో ఉద్యోగాల కోతల్లాంటివన్నీ చూసిన మీదట ఈ తరం వాళ్లలో చాలా మంది ఖర్చులను అదుపులో ఉంచుకునేందుకు సంప్రదాయ క్రెడిట్ కార్డులకు బ దులు డెబిట్ కార్డుల వాడకానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీనితో సంప్రదాయ క్రెడిట్ కార్డ్ కంపెనీలకి ఈ సెగ్మెంట్లో అంతగా పట్టు లభించటం లేదు. కానీ కొత్తరూట్లో ‘‘బై నౌ, పే లేటర్’’ (బీఎన్పీఎల్) పేరిట సరికొత్త క్రెడిట్ సర్వీసులు తెచ్చేసరికి జెన్ జెడ్ ఇట్టే ఆకర్షితులయిపోతున్నారు. ఈ– కామర్స్, ఫిన్టెక్ ప్లాట్ఫాంలతో నేరుగా అనుసంధానమైన ఈ తరహా స్వల్పకాలిక ఫైనాన్సింగ్ ను యువతరం ఎక్కువగా ఉపయోగించుకుంటన్నా రు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. → చాలా తక్కువ డాక్యుమెంటేషన్, అప్పటికప్పుడు అప్రూవల్ → వార్షిక ఫీజులు లేకపోవడం, వడ్డీరహిత గ్రేస్ పీరియడ్ → చిన్న చిన్న మొత్తాల్లో సరళంగా చెల్లించే వెసులుబాటు కాకపోతే, బీఎన్పీఎల్ అనేది చాలా సౌకర్యవంతమైనదే కానీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. వివిధ యాప్ల ద్వారా దాదాపు ఒకే వ్యవధిలో చేసే చిన్న చిన్న కొనుగోళ్లన్నీ ఒకేసారి తడిసి మోపెడై, అప్పుడప్పుడే ఆదాయార్జనలో పడిన యువతకు భారీ రుణ భారంగా మారుతున్నాయి కూడా. ఈ ప్రమాదాన్ని ఊహించాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఫిన్ఫ్లుయెన్సర్ల ప్రభావం..యువతరం ఇప్పుడు ఆర్థిక సలహాల కోసం ఇంట్లో పెద్దవాళ్లనో, బ్యాంకు మేనేజర్లనో, చార్టర్డ్ అకౌంటెంట్లనో సంప్రదించడం తగ్గుతోంది. ఎక్కువగా ఫిన్ఫ్లుయెన్సర్ల వైపు మళ్లే ధోరణి పెరుగుతోంది. పాత తరం వాళ్లు ఆర్థిక సలహాల కోసం తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బ్యాంకు మేనేజర్లు, ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు, న్యూస్ పేపర్లు.. ప్రింట్ మీడియా, ఫిక్స్డ్ డిపాజిట్లవైపు చూసేవారు. కానీ జెన్ జడ్ మాత్రం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇంటిగ్రేటెడ్ ఫిన్టెక్ యాప్లు, యూట్యూబ్ పాడ్కాస్ట్లు, ఆన్లైన్ కమ్యూనిటీలు (రెడిట్, డిస్కార్డ్), ఆధునిక డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాంల వైపు చూస్తున్నారు. అన్ని చోట్లా సమాచారం అందుబాటులో ఉండటం వల్ల చిన్న వయస్సు నుంచే ఆర్థిక అక్షరాస్యత మెరుగ్గా ఉంటున్నప్పటికీ, తప్పుడు సమాచారం కూడా భారీగానే వ్యాప్తి చెందుతోంది. వీటివల్ల దెబ్బతింటున్నవాళ్లూ పెరుగుతున్నారు. దీంతో అడ్డూ అదుపూ లేకుండా ఫిన్ఫ్లుయెన్సర్లు విస్తరిస్తుండటంపై ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ సంస్థలు నిశితంగా దృష్టి పెడుతున్నాయి. తప్పుల తడకల ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ సలహాలను కట్టడి చేయడంపై కసరత్తు చేస్తున్నాయి.ముందు నుంచే పెట్టుబడులు.. డిజిటల్ వల్ల కలిగిన ప్రయోజనమేంటంటే... తమ పేరెంట్స్తో పోలిస్తే జెన్ జెడ్ చాలా ముందు నుంచే పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు. దాదాపుగా అవరోధాలేమీ లేకపోవడంతో నెలకు రూ.100 నుంచి 500 వరకు ఉండే మైక్రో సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు) రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరి పోర్ట్ఫోలియో చాలా వైవిధ్యంగా ఉంటోంది. మ్యుచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, డైరెక్ట్ ఈక్విటీలు, డిజిటల్ గోల్డ్, సావరీన్ గోల్డ్ బాండ్లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్) వంటివి ఈ పోర్ట్ఫోలియోలో ఉంటునాయి. ఇలా సాధ్యమైనంత ముందు నుంచే ఇన్వెస్ట్మెంట్ చేసే ఈ జనరేషన్ వాళ్లు... వెల్త్ మేనేజర్లకు బంగారు గనుల్లా మారుతున్నారు. ఓ ఇన్వెస్టరును 22 ఏళ్ల వయసులో పట్టుకుంటే ఆ తర్వాత బోలెడన్ని సంవత్సరాల పాటు వారు క్లయింట్లుగా కొనసాగే అవకాశం ఉండటమే దీనిక్కారణం. అయితే, ఆర్థిక సంస్థలు ఇందుకోసం తమ మార్కెటింగ్ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటోంది. జెన్ జెడ్ డిస్కౌంట్లు.. లాయల్టీ పాయింట్ల కన్నా ఎక్కువగా చార్జీల విషయంలో పారదర్శకత, నైతికతతో కూడుకున్న వ్యాపార విధానాలు, డేటా ప్రైవసీకి ప్రాధాన్యమిస్తున్నారు. హెచ్చరిక సంకేతాలు.. జెన్ జెడ్కి డిజిటల్ ఐక్యూ ఎక్కువే అయినా... కొన్ని విశిష్టమైన సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటోందని అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన లైఫ్స్టయిల్ ఖర్చులు: వేగంగా ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ, వాటికి తగ్గట్లు లైఫ్స్టయిల్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోవడం వల్ల ఖర్చులు మితిమీరిపోతున్నాయి. ఫలితంగా, ఆదాయాలను దీర్ఘకాలిక పొదుపు వైపు మళ్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. సబ్స్క్రిప్షన్లతో చిల్లు: నెలవారీగా కట్టే డజన్ల కొద్దీ డిజిటల్ సబ్్రస్కిప్షన్ల వల్ల చిన్న, చిన్నగా పర్సుకు చిల్లులు పడుతున్నాయి. సోషల్ మీడియా ఒత్తిడి: ప్రతిదాన్నీ డిజిటల్గా పోల్చి చూసుకునే సంస్కృతి వల్ల ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్), (ఇప్పుడు దొరకపుచ్చుకోకపోతే ఇంకెప్పటికీ దొరకదేమో అన్న భయం) వల్ల ఖరీదైన ఎక్స్పీరియన్స్లు, లగ్జరీ ఉత్పత్తులను కొనుక్కునే ధోరణి పెరుగుతోంది. ఎమర్జెన్సీ నిధుల కొరత: అప్పటికప్పుడు సంతృప్తి కలిగించే ఎక్స్పీరియన్స్లకు ప్రాధాన్యం ఇస్తూ, ఆర్థిక భద్రతను పక్కన పెడుతుండటం వల్ల, ఆదాయంపరంగా అనూహ్యమైన షాక్లేవైనా తగిలితే తట్టుకునే పరిస్థితి ఉండటం లేదు. గెలుపు గుర్రాలు.. జెన్ జెడ్ తెచ్చిన ఆర్థిక విప్లవమనేది దేశీ మార్కెట్ వ్యవస్థలో కొత్త మార్పులకు ఆజ్యం పోసింది. ఈ భారీ డెమొగ్రఫిక్ మార్పులతో ప్రభావితమయ్యే సంస్థల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లు ప్రయోజనం పొందవచ్చు. అవేమిటంటే ... → ఫిన్టెక్, వెల్త్ టెక్ ప్లాట్ఫామ్స్: డిజిటల్ చెల్లింపులు, ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్, మైక్రో రుణాలిచ్చే కంపెనీలు → ప్రైవేట్ బ్యాంకులు: పటిష్టమైన, అధునాతన డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయాలు అందించేవి. → ఫైనాన్షియల్ సూపర్ యాప్స్: పేమెంట్స్, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్, బీమాను ఒకే ఇంటర్ఫేస్లో అందించేవి. → అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు: భారీ స్థాయిలో సిప్ రూపంలో రిటైల్ పెట్టుబడులను అందుకుంటున్న మ్యూచువల్ ఫండ్ సంస్థలు. ఇలా, డిజిటల్గా ఆర్థిక సేవలను అందించే, తద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోగలిగే ఆర్థిక సంస్థలే భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్లగలవు. – సాక్షి, వెల్త్ -
మ్యూచువల్ ఫండ్స్ సేవల్లోకి ఆల్ఫాగ్రెప్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సేవల్లోకి ఆల్ఫాగ్రెప్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అడుగు పెట్టనుంది. తన మొదటి పథకం ‘మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్’ను వచ్చే నెల 6న ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మొదటి మూడు నుంచి ఐదేళ్ల కాలంలోనే రూ.25,000–30,000 కోట్ల నిర్వహణ ఆస్తులను (ఏయూఎం) చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు సంస్థ సీఈవో భౌతిక్ అంబానీ తెలిపారు. అత్యాధునిక గణన నమూనాలు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లరి్నంగ్ ఆధారిత క్వాంటిటేటివ్ ఈక్విటీ, హైబ్రిడ్ వ్యూహాలతో సేవలు అందించనున్నట్టు చెప్పారు. భిన్నమైన పెట్టుబడులు, సేవలతో కూడిన ఉత్పత్తులను ఇన్వెస్టర్లకు అందించనున్నట్టు తెలిపారు. మల్టీ అసెట్ అలోకేషన్ అనంతరం లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఫండ్స్ను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. -
భారత్లోకి ఆంథ్రోపిక్ ‘మైథోస్’
న్యూఢిల్లీ: అమెరికా చెందిన కృత్రిమ మేధ(ఏఐ) పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘మైథోస్’ ఏఐ మోడల్ను వినియోగించే అవకాశం కొన్ని భారతీయ సంస్థలకు లభించింది. ఆంథ్రోపిక్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ విస్తరణలో భాగంగా భారత్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ యాక్సెస్ను పొందినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ మోడల్కు యాక్సెస్ పొందిన దేశీయ సంస్థల సంఖ్య పదిలోపే ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా సంస్థల పేర్లను వెల్లడించలేదు. ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ అంటే సైబర్ భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంథ్రోపిక్ చేపట్టిన కార్యక్రమమే ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన సంస్థలకు ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అధునాతన ‘క్లాడ్ మైథోస్ ప్రివ్యూ’ ఏఐ మోడల్కు యాక్సెస్ కలి్పస్తోంది. సాఫ్ట్వేర్లలోని క్లిష్టమైన భద్రతా లోపాలు, జరగబోయే సైబర్ ముప్పులను గుర్తించడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్లో కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు సుమారు 50 భాగస్వామ్య సంస్థలకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. ఈ మోడల్ సాయంతో ఆయా సంస్థలు వివిధ కోడ్బేస్లలో 10 వేలకుపైగా అధిక లేదా అత్యంత తీవ్ర స్థాయి భద్రతా లోపాలను గుర్తించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. సైబర్ భద్రత కోసం అంతర్జాతీయ విస్తరణ తాజాగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ భారత్తో పాటు 15కుపైగా దేశాల్లోని 150 సంస్థలను భాగస్వాములుగా చేర్చింది. వీటిలో విద్యుత్, నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్, హార్డ్వేర్ రంగాలకు చెందిన కీలక మౌలిక వసతుల నిర్వాహక సంస్థలు ఉన్నాయి. సైబర్ దాడి జరిగితే కొన్ని సందర్భాల్లో 10 కోట్ల మందికిపైగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సంస్థలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ఈ యాక్సెస్ ద్వారా భాగస్వామ్య సంస్థలు తమ డిజిటల్ మౌలిక వసతుల్లోని భద్రతా లోపాలను ముందే గుర్తించడం, రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, సాఫ్ట్వేర్ ప్యాచ్ల అమలును వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టగలవు. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
దశాబ్దాలుగా, కోట్లాది కుటుంబాలకు విశ్వసనీయమైన పెట్టుబడి సాధనాల్లో మొదటి ఎంపిక ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)కే. బ్యాంకు శాఖకు వెళ్లి ఎఫ్డీ వేయడం, కావాల్సినప్పుడు వెనక్కి తీసుకోవడం.. రాబడి తక్కువే అయినా అందులోని సౌలభ్యం, నమ్మకం ఎఫ్డీకి అంత ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడంతా డిజిటల్ సేవల యుగం. దాదాపు అన్ని బ్యాంకు సేవలు డిజిటల్గానే లభిస్తున్నాయి. ఎఫ్డీ కంటే అధిక రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్ తదితర సాధనాలను స్మార్ట్ఫోన్ నుంచే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు. దీంతో గతంతో పోల్చితే ఎఫ్డీలకు డిమాండ్ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి వేగం నిదానించడం దీన్నే తెలియజేస్తోంది. దీంతో బ్యాంక్లు సైతం డిజిటల్ ఎఫ్డీలతో పోటీ పడుతున్నాయి. సొంత మొబైల్ అప్లికేషన్లు, నెట్బ్యాంకింగ్ ద్వారానే కాకుండా.. ఫిన్టెక్ల రూపంలోనూ డిజిటల్ ఎఫ్డీ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. వీటికి డిమాండ్ కూడా బ్రహా్మండం. మొదటిసారి ఇన్వెస్టర్లు సైతం సులభంగా డిజిటల్ ఎఫ్డీ చేసుకోవచ్చు. వీటి సేవలను ఎలా పొందొచ్చో తెలియజేసే కథనమే ఇది. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) సొంతంగానూ డిజిటల్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు వీటిని ఇన్వెస్టర్లకు మరింత చేరువ చేస్తున్నాయి. డిపాజిట్కు సరిపడా సొమ్మును స్వీకరించడం, ఎఫ్డీగా మార్చడం, ఉపసంహరణ తదితర సేవలన్నింటినీ ఫిన్టెక్ సంస్థలు అందిస్తాయి. డిపాజిట్ రిసీప్్టలు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీల నుంచే జారీ అవుతాయి. అంటే డిపాజిట్ మొత్తం బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలకే వెళుతుంది. ఒకే చోట డిపాజిట్లన్నీ.. → తమకు ఖాతా ఉన్న బ్యాంక్లోనే డిజిటల్ ఎఫ్డీ వేసుకోవచ్చు. → అధిక రాబడిని (వడ్డీ రేటు) ఆఫర్ చేసే చోటే ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు ఎంతో అనుకూలం. → దాదాపు అన్ని ప్రముఖ బ్యాంక్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. → అన్ని డిపాజిట్లు ఒకే చోటు కనిపించడం వల్ల ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే డిపాజిట్లను సులభంగా గుర్తించొచ్చు. → కనీసం రూ.1,000 నుంచి డిపాజిట్కు అవకాశం ఉంది. కావాలంటే అక్కడే రెన్యువల్ చేసుకోవచ్చు.డిపాజిట్ చిటికెలో పని→ డిజిటల్ ఎఫ్డీ కోసం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. నిమిషాల్లోనే ఈ పని పూర్తి చేయొచ్చు. → ఈ–కేవైసీ లేదా వీడియో కేవైసీ ద్వారా తమ గుర్తింపు వివరాలను ఇస్తే సరిపోతుంది. → అనంతరం తమకు నచ్చిన సంస్థ డిపాజిట్ను ఎంపిక చేసుకుని, నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. → గడువు ముగిసిన తర్వాత ఉపసంహరణ కూడా సులభమే. నిమిషాల్లోనే డిపాజిట్ మొత్తం వడ్డీ సహా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. → కావాలంటే ఆ డిపాజిట్ను అక్కడికక్కడే రెన్యువల్ ( పునరుద్ధరణ) చేసుకోవచ్చు. → ఈ సేవలన్నీ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్ పోర్టల్ నుంచి పొందొచ్చు. రెండూ ఒకటే.. → భౌతికంగా బ్యాంకులో చేసే ఫిక్స్డ్ డిపాజిట్, ఆన్లైన్లో డిజిటల్గా చేసే ఎఫ్డీ రెండూ ఒక్కటే. వడ్డీ రేటు, భద్రత, పన్ను తదితర అంశాల్లో ఎలాంటి మార్పుల్లేవు. → ఆర్బీఐ నియంత్రణల పరిధిలో రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం కూడా లేదు. → చాలా ఫిక్స్డ్ డిపాజిట్లలో ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక డిపాజిట్ పథకాలలో ఈ సౌకర్యం ఉండకపోవచ్చు. → ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద ఒక బ్యాంకు పరిధిలో ఒక్కో ఇన్వెస్టర్కు గరిష్టంగా రూ.5. లక్షల ఎఫ్డీకి బీమా వర్తిస్తుంది. రిస్కుల్లేవా..→ సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లలో రిస్క్ చాలా తక్కువ. → బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సంక్షోభంలో పడినప్పుడే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. → ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని అన్ని వాణిజ్య బ్యాంక్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ల్లో ఒక్కో డిపాజిటర్కు గరిష్టంగా రూ.5 లక్షల మొత్తానికి బీమా ఉంటుంది. → ఉదాహరణకు ఒక వ్యక్తి రెండు వేర్వేరు బ్యాంకుల్లో రూ.5 లక్షల చొప్పున డిపాజిట్ చేశాడనుకుందాం. రెండు బ్యాంకులూ సంక్షోభంలోకి వెళ్లాయనుకుంటే.. అప్పుడు రెండు బ్యాంకుల నుంచి డిపాజిటర్కు రూ.5 లక్షల చొప్పున వెనక్కి వస్తుంది. → కనుక ఒక బ్యాంకు పరిధిలో గరిష్ట డిపాజిట్ను రూ.5 లక్షలకు పరిమితం చేయడం ద్వారా రిస్్క తగ్గించుకోవచ్చు. → ఎన్బీఎఫ్సీల డిపాజిట్లపై వడ్డీ రేటు బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ, బ్యాంకుల్లో మాదిరి ఎన్బీఎఫ్సీల డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా సదుపాయం లేదు. ఎన్బీఎఫ్సీ సంక్షోభంలో పడితే డిపాజిట్ పూర్తిగా రిస్్కలోకి వెళ్లినట్లే. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ సేవలు మెరుగ్గా ఉన్నాయేమో విచారించుకోవాలి. → మెచ్యూరిటీ అనంతరం ఆటో రెన్యువల్ అయినా, కొత్తగా అమల్లో ఉన్న వడ్డీ రేటే వర్తిస్తుంది. గతంలో పొందిన అధిక వడ్డీ రేటు కొనసాగదు. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ కేవలం మధ్యవర్తి గా మాత్రమే పనిచేస్తుంది. డిపాజిట్ భద్రత పూర్తిగా సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందే డిపాజిట్ ఏ సంస్థ వద్ద నమోదవుతోందో పరిశీలించాలి.అధిక రాబడి→ తమ ఖాతా ఉన్న బ్యాంకులో డిపాజిట్ అయితే, మెరుగైన రేటుపై చేసే అవకాశం ఉండదు. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల ద్వారా అయితే ఏ బ్యాంక్ ఎక్కువ రేటు ఆఫర్ చేస్తుందో తెలుసుకుని, అందులోనే డిపాజిట్ చేసుకోవచ్చు. → కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు 0.5–2 శాతం వరకు అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. → గతంలో పోల్చితే డిపాజిట్లకు పోటీ పెరగడంతో ప్రముఖ బ్యాంకులు సైతం ఆకర్షణీయమైన రేటును అందిస్తున్నాయి. → సీనియర్ సిటిజన్ (60 ఏళ్లు నిండిన) డిపాజిట్లపై అరశాతం వరకు అదనపు రాబడిని అందుకోవచ్చు. → అధిక రాబడి కోసం దీర్ఘకాలాన్ని ఎంపిక చేసుకునే ముందు.. అంతకాలం పాటు వేచి ఉండగలమా? అన్నది ఆలోచించుకోవాలి.డిపాజిట్పై రుణం → చాలా బ్యాంకులు డిపాజిట్పై రుణం లేదా ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఎఫ్డీ విలువలో 75–80 శాతం మేర రుణంగా లభిస్తుంది. → ఎఫ్డీ రేటు కంటే 1–3 శాతం అధికంగా రుణానికి చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా వెనక్కి తీసుకుంటే.. → డిపాజిట్లు ఏవైనా వాటి నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే ఉపసంహరించుకుంటే రాబడి విషయంలో రాజీ పడక తప్పదు. → ఉదాహరణకు రూ.3 ఏళ్లకు డిపాజిట్ చేసి, ఏడాదికే వెనక్కి తీసుకుంటే.. ఏడాది కాలానికి వర్తించే వడ్డీ రేటు ప్రకారమే చెల్లింపులు లభిస్తాయి. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల్లో ముందస్తుగా డిపాజిట్ నుంచి తప్పుకుంటే 0.5–1 శాతం వరకు పెనాల్టీని కూడా చెల్లించాల్సి రావొచ్చు. → కాలవ్యవధి ముగిసేలోపు అత్యవసరాల్లో తీసుకోవచ్చని భావించే వారు.. ఒకే డిపాజిట్ కాకుండా ఒకటికి మించి వేర్వేరు డిపాజిట్లుగా, వేర్వేరు కాల వ్యవధిపై చేసుకోవడం వల్ల రాబడి నష్టపోకుండా, పెనాల్టీ భారం ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు. పన్ను భారం మరవొద్దు..→ ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఇది ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి వెళ్లి కలుస్తుంది. కనుక ఆదాయానికి అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది. → ఉదాహరణకు 30 శాతం పన్ను శ్లాబులో ఉన్న వ్యక్తి 8.5 శాతం రేటుపై ఎఫ్డీ చేశాడని అనుకుందాం. అప్పుడు పన్ను పోను ఎఫ్డీపై నికర రాబడి 6 శాతం మించదు. → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్పై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తికి రూ.50,000 మించితే (60 ఏళ్లలోపు), 60 ఏళ్లు నిండిన వారికి రూ.లక్ష మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పాన్ నంబర్ సమరి్పంచిన వారికి 10 శాతం, అది లేని వారికి 20 శాతం టీడీఎస్ మినహాయిస్తారు. → పన్ను వర్తించేంత ఆదాయం లేని వారు టీడీఎస్ అమలు చేయకుండా ఫారమ్ 15జీ (60 ఏళ్లలోపు), ఫారమ్ 15హెచ్ (60 ఏళ్లు నిండిన) సమర్పిస్తే సరిపోతుంది. డిజిటల్ ఎఫ్డీ వేదికలు..→ జియోఫైనాన్స్ → స్టెబుల్ మనీ → జెరోదా కాయిన్ → ఫైబ్ → పైసా బజార్→ ఐఎన్డీ మనీ → క్రెడ్ → ఫోన్పే → నవీ → పేటీఎం -
మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
హ్యుందాయ్ కంపెనీ తన కార్లపై ఆఫర్స్ ప్రకటించగా.. టాటా మోటార్స్ కూడా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపులు అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ తరుణంలో మారుతి సుజుకి.. ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు పేర్కొంది.మారుతి సుజుకి విక్టోరిస్ఎంపిక చేసిన విక్టోరిస్ వేరియంట్లపై రూ. 90,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నట్లు మారుతి సుజుకి వెల్లడించింది. స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్లకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్లు, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్లతో సహా అత్యధిక ప్రయోజనాలు లభిస్తాయి.విక్టోరిస్ CNG వేరియంట్లు రూ. 80,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉండగా, పెట్రోల్ వేరియంట్లను రూ. 60,000 వరకు తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి విక్టోరిస్ ధర రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.మారుతి సుజుకి స్విఫ్ట్దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్పై కూడా ఈ నెలలో మారుతి సుజుకి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఆటోమాటిక్ వేరియంట్ మీద రూ.45000 తగ్గింపు.. మాన్యువల్, CNG వేరియంట్లపై రూ. 40,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.మారుతి సుజుకి స్విఫ్ట్ అనేది చాన్నాళ్లుగా బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్బ్యాక్లలో ఒకటి. దీని ధర ప్రస్తుతం రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.మారుతి బ్రెజ్జా, వ్యాగన్ ఆర్మారుతి సుజుకి బ్రెజ్జాను కొనుగోలు చేయాలనుకునే వారు పెట్రోల్, CNG వేరియంట్లపై రూ. 55,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్లు మరియు కార్పొరేట్ పథకాలు ఉన్నాయి. వ్యాగన్ ఆర్ కొనుగోలుపై రూ. 52,500 వరకు తగ్గింపులు కూడా లభిస్తున్నాయి.ఆల్టో కే10, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఈకోవేరియంట్ను బట్టి మారుతి సుజుకి ఆల్టో కే10పై రూ. 52,500 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అదే సమయంలో.. సెలెరియో, మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, ఈకోలపై రూ. 37,500 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి డిజైర్, ఎర్టిగా మోడళ్లపై కంపెనీ ఈ నెలలో ఎలాంటి అధికారిక డిస్కౌంట్లు అందించడం లేదు. ఈ రెండు మోడళ్లకు ఉన్న బలమైన డిమాండ్ కారణంగా సంస్థ ఆఫర్స్ అందించకపోవడానికి కారణం కావచ్చని తెలుస్తోంది. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కంపెనీ అందిస్తున్న ఆఫర్లు నగరం, డీలర్షిప్, స్టాక్ లభ్యత, వేరియంట్ను బట్టి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆఫర్స్ అన్నీ జూన్ చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. -
రూ.20 వేలు తగ్గిన వెండి రేటు!
గడిచిన వారం రోజులు (మే 31 నుంచి జూన్ 6)గా భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా గణనీయంగా తగ్గింది. ఈ కథనంలో దేశంలో ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటు ఎలా ఉంది?, అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో మే 31న (ఆదివారం) రూ.2.90 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు జూన్ 6 (శనివారం) నాటికి రూ.2.70 లక్షలకు చేరింది. అంటే ఏడు రోజుల్లో రూ.20 వేలు తగ్గిందన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, చెన్నైలలో కూడా కొనసాగుతాయి.అయితే.. ముంబైలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.65 లక్షల వద్ద ఉంది. ఢిల్లీలో కూడా ఇదే ధర కొనసాగుతుంది. దీన్నిబట్టి చూస్తే.. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఢిల్లీ, ముంబైలలో సిల్వర్ రేటు కొంత తక్కువని స్పష్టమవుతోంది.2026లో వెండి రేటు గరిష్టంగా రూ.3 లక్షలు దాటేసింది. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ నేడు జూన్ 7 (ఆదివారం) రూ.2.75 లక్షల వద్ద స్థిరంగా ఉంది. అంటే.. సిల్వర్ రేటు భారీగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.వెండికి ఎందుకు డిమాండ్!వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. ఇది పారిశ్రామిక రంగంలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. వెండి ఎలక్ట్రానిక్స్లో సర్క్యూట్ బోర్డులు, మైక్రోచిప్లలో, విద్యుత్ పరిశ్రమలో కేబుల్స్, టర్మినల్స్, కనెక్టర్లలో ముఖ్యంగా వినియోగించబడుతుంది. ఆప్టికల్ పరికరాలు, లెన్స్లు, రిఫ్లెక్టర్లు, కొన్ని వైద్య పరికరాలు, డెంటల్ టూల్స్లో కూడా వెండి ఉపయోగం ఉంది. కాబట్టి వెండికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది.ఇదీ చదవండి: తండ్రి మాట.. అంబానీ విజయ రహస్యం! -
మే నెలలో ఎక్కువ మంది ఈ కార్లనే కొన్నారు!
మే 2026లో దేశీయ విఫణిలో ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. అమ్మకాల్లో మారుతి సుజుకి ఆధిపత్యం చెలాయించింది. ఈ బ్రాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్ల జాబితాలో ఆరు మోడళ్లకు స్థానం కల్పించింది. టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్ కూడా మంచి అమ్మకాలను నమోదు చేశాయి.అమ్మకాల్లో మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ కాంపాక్ట్ సెడాన్ మే 2026లో 24,546 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మంచి మైలేజ్, సౌకర్యం, తక్కువ ధర కారణంగా ఇది వినియోగదారుల మొదటి ఎంపికగా మారింది.రెండవ స్థానంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ నిలిచింది. ఈ మోడల్ 20,686 యూనిట్ల అమ్మకాలతో 52 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. వేగంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది మార్కెట్లో హాట్ సెల్లింగ్ మోడల్గా మారింది.మూడవ స్థానంలో మారుతి సుజుకి ఎర్టిగా నిలిచింది. కుటుంబ అవసరాలకు అనుకూలంగా ఉండే ఈ ఎంపీవీ 20,350 యూనిట్ల అమ్మకాలతో 26 శాతం వృద్ధిని సాధించింది.నాలుగవ స్థానంలో టాటా పంచ్ నిలిచింది. టాప్ 10 అమ్మకాల జాబితాలో ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ చోటు సంపాదించుకుంది. దీనికి కూడా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ మోడల్ 20,208 యూనిట్ల అమ్మకాలు చేసి 54 శాతం వృద్ధిని నమోదు చేసింది.ఐదవ స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తమ్ 19,100 యూనిట్ల అమ్మకాలతో 46 శాతం వృద్ధిని చూపింది.ఆరవ స్థానంలో మారుతి సుజుకి బాలెనో నిలిచింది. ఇది 18,396 యూనిట్లు అమ్ముడై, టాప్ 10లోనే అత్యధిక వృద్ధి రేటు (58%) సాధించింది.ఏడు, ఎనిమిది స్థానాల్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ చోటు సంపాదించుకున్నాయి. వీటి అమ్మకాలు వరుసగా 18,076.. 17,519 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎంట్రీ లెవల్, యూత్ సెగ్మెంట్లో ఇవి ఇప్పటికీ బలమైన డిమాండ్ను కొనసాగిస్తున్నాయి.తొమ్మిదవ స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచింది. దీని క్లాసిక్, కొత్త వెర్షన్లు కలిపి 15,774 యూనిట్లు అమ్ముడయ్యాయి. పదవ స్థానంలో హ్యుందాయ్ క్రెటా నిలిచింది. కఠినమైన పోటీ ఉన్నప్పటికీ ఇది 15,253 యూనిట్ల అమ్మకాలతో స్థిరమైన పనితీరు చూపించింది.ఇదీ చదవండి: కస్టమర్ల కోసం TVS కొత్త కాన్సెప్ట్! -
తండ్రి మాట.. అంబానీ విజయ రహస్యం!
భారతదేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. నేడు ముఖేష్ అంబానీ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడానికి, ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ చెప్పిన మాట అని ఒక సందర్భంలో పేర్కొన్నారు.ఒకసారి ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. తన తండ్రి చెప్పిన ఒక మాటను గుర్తుచేశారు. ''నువ్వు వ్యాపారవేత్త కావాలనుకుంటే సమస్యలకు పరిష్కారాలను నువ్వే కనుగొనాలి. మేనేజర్లకు మాత్రమే ఏం చేయాలో చెబుతారు. కానీ వ్యాపారవేత్తలకు ఎవరూ దారి చూపరు'' అని ధీరూభాయ్ అంబానీ తనకు చెప్పారని వెల్లడించారు.వ్యాపారవేత్త పరిస్థితి భిన్నం!ఈ మాటల్లో గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. సాధారణంగా ఒక ఉద్యోగి లేదా మేనేజర్కు సంస్థలో ఉన్నతాధికారులు పనులను అప్పగిస్తారు. వారు ఇచ్చిన సూచనల ప్రకారం పని చేస్తారు. కానీ.. ఒక వ్యాపారవేత్త పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతడే సమస్యలను గుర్తించాలి, అవకాశాలను వెతకాలి, నిర్ణయాలు తీసుకోవాలి, వాటి ఫలితాలకు పూర్తి బాధ్యత వహించాలి.జీవితంలో లేదా వ్యాపారంలో ఎదగాలంటే ఎప్పుడూ ఇతరుల మార్గదర్శకత్వం కోసం ఎదురు చూడకూడదని, స్వయంగా ఆలోచించి ముందుకు సాగాలని ధీరూభాయ్ అంబానీ ఉద్దేశ్యం. ఒక వ్యాపారాన్ని నిర్మించాలంటే నిర్ణయాలు తీసుకునే ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, వాటికి పరిష్కారాలు కనుగొనే ఆత్మవిశ్వాసం అవసరమని ఆయన చెబుతారు.నిర్ణయాలపై నమ్మకంప్రస్తుత కాలానికి కూడా ధీరూభాయ్ అంబానీ మాటలు చాలా ఉపయోగపడతాయి. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఎంతో మంది యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి సిద్ధమవుతారు. అయితే.. చాలామంది ప్రతి అడుగులోనూ ఎవరో ఒకరు మార్గనిర్దేశం చేయాలని ఆశిస్తుంటారు. కానీ నిజమైన వ్యాపారవేత్త తన నిర్ణయాలపై తానే నమ్మకం ఉంచి ముందుకు సాగాలి.సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఇతరులపై ఆధారపడకుండా ముందుగా మనమే ఆలోచించాలి. తప్పులు చేసినా వాటి నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే అనుభవమే మనకు ఉత్తమ గురువు. విజయవంతమైన నాయకులు తమ తప్పులను అంగీకరించి, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా ముందుకు సాగుతారు.కొత్త ప్రయత్నాలు అవసరంఅలాగే.. జీవితంలో ప్రతి విషయం స్పష్టంగా కనిపించిన తర్వాతే చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా సరైంది కాదు. కొన్నిసార్లు చర్యలు తీసుకున్న తర్వాతే స్పష్టత వస్తుంది. అందుకే అపజయాలకు భయపడకుండా.. కొత్త ప్రయత్నాలు చేయడం అవసరం. కాబట్టి ఎప్పుడూ ఇతరులు చెప్పేదాన్ని అనుసరించే వారిగా కాకుండా, సొంత దారిని సృష్టించే వారిగా మారితేనే విజయం సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: మారిన అంబానీ ప్లేస్.. ఆసియా కుబేరుడిగా అదానీ! -
మారిన అంబానీ ప్లేస్.. ఆసియా కుబేరుడిగా అదానీ!
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. అదానీ గ్రూప్కు చెందిన పలు కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో ఆయన సంపద గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో ఆసియా ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆయన తిరిగి కైవసం చేసుకున్నారు.ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఒక్క రోజులోనే అదానీ సంపద సుమారు 2.5 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ 89.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను అధిగమించి అదానీ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అంబానీ సంపద 88 బిలియన్ డాలర్లుగా ఉండగా, సాఫ్ట్బ్యాంక్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ సంపద 87 బిలియన్ డాలర్లుగా నమోదైంది.అదానీ సంపద పెరగడానికి ప్రధాన కారణం అదానీ గ్రూప్కు చెందిన కంపెనీల షేర్లలో నమోదైన భారీ ర్యాలీ. ముఖ్యంగా అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. వీటిలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు దాదాపు 6.9 శాతం పెరగగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 3.8 శాతం లాభపడింది.గత నెల రోజుల వ్యవధిలో అదానీ సంపద దాదాపు 10 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇటీవల అదానీ గ్రూప్పై నమోదైన మోసం ఆరోపణలకు సంబంధించిన కేసులను అమెరికా న్యాయశాఖ విరమించుకున్న తర్వాత పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగిందని నివేదిక తెలిపింది. అయితే.. ఆ ఆరోపణలను అదానీ, ఆయన సహచరులు మొదటి నుంచే ఖండించారు.ప్రస్తుతం అదానీ గ్రూప్కు చెందిన ఆరు ప్రధాన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ కలిపి సుమారు 191 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గ్రూప్ వ్యాపార సామర్థ్యాన్ని, మార్కెట్లో ఉన్న బలమైన స్థానాన్ని ప్రతిబింబిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వివిధ ఆరోపణలు, మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా అదానీ గ్రూప్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. అయితే.. ప్రస్తుతం కంపెనీల పనితీరు మెరుగుపడటం, షేర్ల ధరలు పుంజుకోవడం వల్ల గౌతమ్ అదానీ మళ్లీ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిపాయి. -
కొత్త టెక్నాలజీ.. డైలీ రొటీన్కు ఫన్ టచ్!
రోజూ వాడే చిన్న చిన్న వస్తువులే ఇప్పుడు స్మార్ట్గా మారిపోతున్నాయి. చూడటానికి క్యూట్గా, వాడటానికి సూపర్గా ఉండే ఈ స్మార్ట్ హెల్పర్స్తో మీ డైలీ రొటీన్కు ఒక ఫన్ టచ్ వచ్చేస్తుంది!స్పూన్తో పనిలేని మగ్!ఉదయాన్నే ఆఫీస్ హడావుడిలో కాఫీ లేదా హెల్తీ ప్రొటీన్ షేక్ కలుపుకోవడానికి స్పూన్ వెతుక్కునే ఓపిక లేనప్పుడు– మీ పనిని చిటికెలో సులువు చేయడానికే వచ్చేసింది ఈ ‘ఆటోమేటిక్ సెల్ఫ్ స్టిరింగ్ మగ్!’ ఇది మీ చేతిలో ఉంటే చాలు, మీరు స్పూన్తో తిప్పాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకే ఒక్క బటన్ ప్రెస్తో మీ డ్రింక్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసేస్తుంది.ఇందులో ఉండే అడ్వాన్డ్స్ మ్యాగ్నెటిక్ మిక్సింగ్ టెక్నాలజీ వల్ల అడుగున షుగర్ గానీ, ప్రొటీన్ పౌడర్ గానీ గడ్డలు కట్టకుండా స్మూత్గా బ్లెండ్ అవుతుంది. థర్మల్ లిడ్ డిజైన్తో రావడం వల్ల మీ డ్రింక్ ఎక్కువసేపు వేడిగా ఉంటుంది, పైగా ప్రయాణాల్లో వాడుతున్నా కూడా అస్సలు కింద వలకదు. ధర కేవలం రూ. 1000 మాత్రమే!మినీ ఎయిర్ పంప్...!సమ్మర్ క్యాంపింగ్కి వెళ్లినప్పుడు లేదా పూల్లో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఎయిర్ బెడ్స్, స్విమ్ రింగ్స్లో నోటితో గాలి ఊదలేక ప్రాణం, ప్రాణం మీదికి వస్తోందా? మీ ఊపిరితిత్తుల కష్టాలను తీరుస్తూ, చిటికెలో గాలి నింపేయడానికి వచ్చేసింది ఈ ‘ఫ్లెక్స్టైల్గేర్ మ్యాక్స్ పంప్’.కేవలం 123 గ్రాముల బరువుండే ఈ బుజ్జి గ్యాడ్జెట్.. ఏకంగా 5.0 కెపీఏ ప్రెజర్తో నిమిషానికి 500 లీటర్ల గాలిని రాకెట్ స్పీడ్తో నింపేస్తుంది. దీని డిజైన్కు అంతర్జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఎందుకంటే దీని లోపలి భాగాలు కనిపించేలా ట్రాన్స్పరెంట్ బాడీతో ఉండటమే కాకుండా, రాత్రి పూట క్యాంపింగ్లో వాడుకోవడానికి వీలుగా 3 లెవెల్స్ బ్రైట్నెస్ ఉన్న ఒక సూపర్ ఎల్ఈడీ క్యాంపింగ్ లైట్లా కూడా పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే 60 నిమిషాల పాటు నాన్ స్టాప్గా చేస్తుంది. ధర రూ. ఐదు వేల నుంచి మొదలు!చార్జర్ ప్రొటెక్టర్!మీ చార్జర్ కేబుల్స్ త్వరగా విరిగిపోతున్నాయా? లేదా వైట్ కలర్ అడాప్టర్ మురికిగా అయిపోతోందని వర్రీ అవుతున్నారా? మీ చార్జర్ని సరికొత్తగా మారుస్తూ, దానికి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి వచ్చేసింది ఈ ‘ఆస్ట్రోనాట్ థీమ్ చార్జర్ ప్రొటెక్టర్ సెట్!’ఇది చార్జర్, పవర్ అడాప్టర్లకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక క్యూట్ గ్యాడ్జెట్. హై–క్వాలిటీ సిలికాన్ మెటీరియల్తో చేసిన ఈ కేస్, మీ చార్జింగ్ బ్రిక్ను స్క్రాచెస్ పడకుండా, కింద పడినా పాడవకుండా కాపాడుతుంది. ఇందులో వచ్చే బ్లాక్ అండ్ వైట్ స్పైరల్ వ్రాప్ మీ కేబుల్స్ అస్సలు వంగిపోకుండా, చిరిగిపోకుండా రక్షణ ఇస్తుంది. అంతేకాదు, ట్రావెలింగ్లో కేబుల్స్ చిక్కుపడిపోకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవడానికి ఇందులో ఒక ఆర్గనైజింగ్ స్ట్రాప్ కూడా వస్తుంది. దీని ధర రూ. 170 మాత్రమే! -
కస్టమర్ల కోసం TVS కొత్త కాన్సెప్ట్!
భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన టీవీఎస్ మోటార్ కంపెనీ 'టీవీఎస్ ప్యాడాక్' అనే కొత్త ప్రీమియం రిటైల్ నెట్వర్క్ను ప్రారంభించింది. ప్రీమియం మోటార్సైకిల్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కంపెనీ దీనిని స్టార్ట్ చేసింది.టీవీఎస్ ప్యాడాక్ ద్వారా వినియోగదారులు సాధారణ షోరూమ్ కంటే మంచి ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. ఈ ప్రీమియం అవుట్లెట్లను లండన్కు చెందిన చెక్ల్యాండ్ కిండ్లీసైడ్స్ సంస్థ రూపొందించింది. ఇందులో కొత్త ప్రీమియం బైకుల ప్రదర్శన ఉంటుంది. అంతే కాకుండా.. వినియోగదారులకు ప్రత్యేక సలహాలు ఇచ్చే కన్సల్టేషన్ జోన్లు, బ్రాండ్కు సంబంధించిన మెర్చండైజ్ వస్తువులు, సర్వీస్ సదుపాయాలు అన్నీ అందుబాటులో ఉంటాయి.అయితే.. తొలి టీవీఎస్ ప్యాడాక్ అవుట్లెట్లు 2027 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. ఆ తరువాత దశలవారీగా వీటిని దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. 2026 ఇన్నోవా క్రిస్టా లాంచ్! -
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం రిచ్ ‘డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఆస్తులు (Assets), అప్పులు (Liabilities) మధ్య తేడాను అర్థం చేసుకోవడమే నిజమైన సంపదకు తొలి మెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఫేస్బుక్లో చేసిన పోస్టు విస్తృత చర్చకు దారి తీసింది.చాలామంది ఖర్చుతో కూడుకున్న వస్తువులను సంపదగా భావిస్తారని, అయితే అధిక ధర ఉన్నంత మాత్రాన అది ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తి కాదని కియోసాకి వివరించారు. ప్రతి నెలా మన జేబులోకి డబ్బు వస్తే అది ఆస్తి, జేబులో నుంచి డబ్బు వెళ్తే అది అప్పు అని ఆయన సరళమైన నిర్వచనం ఇచ్చారు.ఈ సందర్భంగా ఖరీదైన ఇల్లు, విలాసవంతమైన కారు వంటి వాటిని ఉదాహరణగా చూపించారు. ఇంటికి గృహ రుణం, పన్నులు, బీమా, నిర్వహణ ఖర్చులు ఉంటాయని, కారు కొనుగోలు చేసిన వెంటనే విలువ తగ్గడం ప్రారంభమవుతుందని తెలిపారు. అందువల్ల ఇవి ఎక్కువగా అప్పుల కిందకే వస్తాయని పేర్కొన్నారు.మరోవైపు అద్దె ఆదాయం వచ్చే రియల్ ఎస్టేట్, డివిడెండ్లు చెల్లించే షేర్లు, లాభాలు ఆర్జించే వ్యాపారాలు, రాయల్టీలు తెచ్చిపెట్టే మేధో సంపత్తి హక్కులు, డిజిటల్ ఉత్పత్తులు వంటి వాటిని నిజమైన ఆస్తులుగా అభివర్ణించారు. ఇవి నిరంతరం నగదు ప్రవాహాన్ని సృష్టించి యజమానికి ఆదాయం అందిస్తాయని చెప్పారు.సంపన్నులు ముందుగా ఆస్తులను కొనుగోలు చేస్తారని, మధ్యతరగతి ప్రజలు ముందుగా అప్పులను పెంచుకుని తర్వాత ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు రాలేదని ఆశ్చర్యపడుతుంటారని కియోసాకి వ్యాఖ్యానించారు. పాఠశాలలు, ఆర్థిక వ్యవహారాలపై సలహాలు ఇచ్చే అనేక మంది కూడా ఈ మౌలిక సూత్రాన్ని బోధించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.అమెరికన్ డ్రీమ్ అంటే పెద్ద ఇల్లు కాదని, ఆర్థిక స్వేచ్ఛేనని కియోసాకి పేర్కొన్నారు. ప్రతి నెలా ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులను సృష్టించుకోవడం ద్వారానే నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని తన పోస్టులో స్పష్టం చేశారు. -
టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఆఫర్లు
దేశీయ వాహన దిగ్గజం టాటా మోటర్స్ (Tata Motors) ఈ జూన్ నెలలో తమ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను మరింత పెంచుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై గ్రీన్ బోనస్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు, లాయల్టీ బోనస్ల రూపంలో మొత్తం రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ముఖ్యంగా కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ మోడళ్లపై అత్యధిక తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి.కర్వ్ ఈవీపై అత్యధిక బెనిఫిట్లుTata Curvv EV Discount: టాటా కర్వ్ ఈవీ ఎంపిక చేసిన నాన్-ఎక్స్ వేరియంట్లపై మొత్తం రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.3 లక్షల గ్రీన్ బోనస్తో పాటు రూ.30,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ లేదా రూ.35,000 స్క్రాపేజ్ బెనిఫిట్ ఉంటుంది. క్రియేటివ్ వేరియంట్లపై రూ.2.85 లక్షల వరకు ప్రయోజనాలు ఉండగా, ఎక్స్ సిరీస్ వేరియంట్లకు ఎక్స్చేంజ్, స్క్రాపేజ్, లాయల్టీ బోనస్ల రూపంలో రూ.65,000 వరకు లభించనున్నాయి.హారియర్ ఈవీపై రూ.2.75 లక్షల వరకు..Tata Harrier EV Offers: టాటా హారియర్ ఈవీ అన్ని వేరియంట్లపై రూ.2.75 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఇందులో రూ.50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.75,000 స్క్రాపేజ్ బెనిఫిట్, రూ.1 లక్ష లాయల్టీ బోనస్తో పాటు అదనంగా మరో రూ.1 లక్ష ప్రయోజనం ఉంది. దీంతో హారియర్ ఈవీ కొనుగోలుదారులకు గణనీయమైన ఆదా అవకాశం కలుగుతోంది.పంచ్ ఈవీ, టియాగో ఈవీపైనా భారీ తగ్గింపులుTata Punch EV Discount: అవుట్గోయింగ్ పంచ్ ఈవీ వేరియంట్లపై రూ.95 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లాంగ్ రేంజ్ (LR) వేరియంట్లకు గరిష్ఠంగా రూ.1.45 లక్షలు, మీడియం రేంజ్ (MR) వేరియంట్లకు రూ.1.25 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.Tata Nexon EV Offers: అలాగే అవుట్గోయింగ్ టియాగో ఈవీపై రూ.65 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు ప్రయోజనాలు ప్రకటించారు. LR XT వేరియంట్కు అత్యధికంగా రూ.1.45 లక్షల వరకు ఆఫర్ ఉండగా, ఇతర LR వేరియంట్లకు రూ.1.25 లక్షలు, MR వేరియంట్లకు రూ.65 వేల వరకు ప్రయోజనాలు అందుతున్నాయి.నెక్సాన్ ఈవీపై రూ.50 వేల వరకు..టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) సిరీస్పై మొత్తం రూ.50 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ.15 వేల గ్రీన్ బోనస్, రూ.25 వేల ఎక్స్చేంజ్ బెనిఫిట్, రూ.35 వేల స్క్రాపేజ్ బెనిఫిట్ ఉన్నాయి. అయితే ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ ఆఫర్లను ఒకేసారి పొందే అవకాశం లేదు.ఎందుకు ఇంత భారీ ఆఫర్లు?భారత ఈవీ మార్కెట్లో పోటీ పెరుగుతుండటం, కొత్త మోడళ్ల రాక, కొన్ని పాత స్టాక్లను క్లియర్ చేయాల్సిన అవసరం నేపథ్యంలో టాటా మోటార్స్ ఈ భారీ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అవుట్గోయింగ్ పంచ్ ఈవీ, టియాగో ఈవీ వేరియంట్లపై అధిక తగ్గింపులు ఇందుకు సంకేతంగా భావిస్తున్నారు.ఈ ఆఫర్లు నగరం, డీలర్ స్టాక్ లభ్యత, వాహనం తయారీ సంవత్సరం (Model Year), వినియోగదారుడి అర్హత వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. కాబట్టి కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు సమీప టాటా డీలర్షిప్ను సంప్రదించి తాజా వివరాలు తెలుసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.ఇదీ చదవండి: హ్యుందాయ్ కార్లపై ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో దాదాపు తొమ్మిది రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. క్రితం రోజున భారీగా పతనమైన బంగారం ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు ఊరట కొనసాగుతోంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
గ్యాస్ ధరలు హైదరాబాద్లోనే ఎక్కువ.. ఎందుకు?
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ పెంపు దేశమంతా ఒకేలా ఉన్నప్పటికీ, గ్యాస్ సిలిండర్ల ధరలు ఒక్కో రాష్ట్రంలో, నగరంలో ఒక్కోలా ఉంటున్నాయి. ఈ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఒకటే అయినప్పటికీ, తుది రిటైల్ ధర ఎందుకు భిన్నంగా ఉంటుంది అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ ధరల వ్యత్యాసానికి కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ (14.2 కిలోల) సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చిన తాజా సవరణతో ఒక్కో సిలిండర్పై రూ.29 పెరిగింది. గత మూడు నెలల్లో ఇది రెండో పెంపు కావడం గమనార్హం. మార్చిలో రూ.60 పెరిగిన తర్వాత ఇప్పుడు మరోసారి ధరలు పెరగడంతో కుటుంబాలపై అదనపు భారం పడనుంది.ప్రధాన నగరాల్లో తాజా ధరలునగరం14.2 కిలోల ఎల్పీజీ ధరన్యూఢిల్లీరూ.942ముంబైరూ.941.50కోల్కతారూ.968చెన్నైరూ.957.50హైదరాబాద్రూ.994బెంగళూరురూ.915.50తాజా పెంపుతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య దాదాపు రూ.80 వరకు ధరల వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్లో సిలిండర్ ధర రూ.994గా ఉండగా, బెంగళూరులో అదే సిలిండర్ రూ.915.50కే లభిస్తోంది.ఒకే దేశంలో.. ఒకే గ్యాస్.. ధరలు ఎందుకు వేరు?ఎల్పీజీని సరఫరా చేస్తున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఒకటే అయినప్పటికీ, తుది రిటైల్ ధర రాష్ట్రాల వారీగా మారుతుంది. దీనికి ప్రధాన కారణాలు ఇవే.రాష్ట్ర పన్నుల ప్రభావంప్రతి రాష్ట్రం ఎల్పీజీపై వేర్వేరు స్థాయిలో వ్యాట్, స్థానిక పన్నులు లేదా సెస్సులు విధిస్తుంది. ఈ పన్నుల రేట్లు మారడంతో వినియోగదారుడు చెల్లించే ధరలో తేడా వస్తుంది.రవాణా ఖర్చులుఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు, నిల్వ కేంద్రాల నుంచి సిలిండర్లను నగరాలకు తరలించడానికి అయ్యే రవాణా వ్యయం కూడా ధరను ప్రభావితం చేస్తుంది. సరఫరా కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.పంపిణీ వ్యయండీలర్ల కమిషన్, స్థానిక పంపిణీ ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు ప్రాంతాల వారీగా మారుతుంటాయి. దీంతో తుది ధరలో స్వల్ప తేడాలు కనిపిస్తాయి.పెంపు వెనుక కారణాలుఅంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల, మధ్యప్రాచ్య భౌగోళిక ఉద్రిక్తతలు, దిగుమతి వ్యయాల పెరుగుదల కారణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలపై భారం పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజా పెంపునకు ముందు ప్రతి గృహ సిలిండర్పై వందల రూపాయల మేర నష్టాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భరిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.హైదరాబాద్లో ఎందుకు అత్యధిక ధర?తెలంగాణలో స్థానిక పన్నులు, రవాణా, పంపిణీ వ్యయాల ప్రభావంతో హైదరాబాద్లో ధర దేశంలోని అనేక మెట్రో నగరాల కంటే ఎక్కువగా ఉంది. దీంతో ప్రస్తుతం ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అత్యంత ఖరీదైన గృహ ఎల్పీజీ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది.వినియోగదారులపై అదనపు భారంమార్చి నుంచి ఇప్పటివరకు గృహ ఎల్పీజీ సిలిండర్ ధర మొత్తం రూ.89 పెరిగింది. దీంతో నెలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలిండర్లు వినియోగించే కుటుంబాల ఖర్చులు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల గృహ బడ్జెట్పై ఈ పెంపు ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఎల్పీజీ సిలిండర్లు.. ఎన్ని రంగులో.. -
రూ. 2,873 కోట్ల లెన్స్కార్ట్ షేర్లు అమ్మేసిన సాఫ్ట్బ్యాంక్
న్యూఢిల్లీ: ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ తాజాగా ఐవేర్ కంపెనీ లెన్స్కార్ట్లో 3.25 శాతం వాటా విక్రయించింది. షేరుకి రూ. 508.55 సగటు ధరలో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 5.65 కోట్ల షేర్లను అమ్మివేసింది. ఎన్ఎస్ఈ బ్లాక్ డీల్ వివరాల ప్రకారం వీటి విలువ రూ. 2,873 కోట్లు. అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ 2 లైట్బల్బ్(కేమాన్) ద్వారా వాటా విక్రయించింది. ఈ విక్రయానికి ముందు లెన్స్కార్ట్లో సాఫ్ట్ బ్యాంక్ వాటా 13.13 శాతంకాగా.. ప్రస్తుతం 9.88 శాతానికి తగ్గింది. ఎంఎఫ్లు వైట్ఓక్ క్యాపిటల్, మిరాయ్ అసెట్, కొటక్, కెనరా రొబెకో, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్తోపాటు.. ఇన్సూరెన్స్ కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, సొసైటీ జనరాలి తదితరాలు సాఫ్ట్ బ్యాంక్ విక్రయించిన షేర్లను కొనుగోలు చేశాయి. -
వెండి హాల్మార్కింగ్ సవాళ్లపై అధ్యయనం
న్యూఢిల్లీ: వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ నిబంధనలను తప్పనిసరి చేసేందుకు మౌలిక సదుపాయాల సన్నద్ధతకు సంబంధించిన సవాళ్లను అధ్యయనం చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ సంజయ్ గర్గ్ తెలిపారు. జ్యుయలరీ, కళాకృతులు, ఫర్నిచర్ తదితర రూపాల్లో కూడా వెండిని చాలా స్టోర్స్లో విక్రయిస్తారు కాబట్టి మార్కెట్పరంగా చూసినప్పుడు పసిడితో పోలిస్తే సిల్వర్ హాల్మార్కింగ్ చాలా సంక్లిష్టంగా ఉంటుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు.బీఐఎస్లో మొత్తం హాల్మార్కింగ్ కార్యకలాపాలను కేవలం అయిదుగురు మాత్రమే పర్యవేక్షిస్తుంటారని, మిగతా సిబ్బంది అంతా ప్రైవేట్ లేదా ఔట్సోర్సింగ్ వారే అయి ఉంటారని గర్గ్ చెప్పారు. ప్రైవేట్ వర్గాల సహాయంతో హాల్మార్కింగ్ సెంటర్లను నిర్వహించడం, నమ్మకాన్ని చూరగొనడం అనేది చాలా కష్టతరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి సిల్వర్ హాల్మార్కింగ్ని క్రమంగా అమల్లోకి తేనున్నట్లు గర్గ్ చెప్పారు.2005 నుంచి వెండికి హాల్మార్కింగ్ స్వచ్ఛందంగా అమలవుతోంది. 2025 సెప్టెంబర్ నుంచి సిల్వర్ ఆర్టికల్స్ స్వచ్ఛతకు సంబంధించి హాల్మార్క్ విశిష్ట గుర్తింపు (యూహెచ్ఐడీ) సంఖ్యను అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం వెండి ఆభరణాలను పరీక్షించేందుకు బీఐఎస్ గుర్తింపు పొందిన అసేయింగ్, హాల్మార్కింగ్ సెంటర్లు (ఏహెచ్సీ) సుమారు 230 ఉన్నాయి. -
భారత ఆర్థిక వ్యవస్థ భేష్
ముంబై: రాజకీయ, భౌగోళిక సవాళ్ల నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడను చూపుతున్నట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ జే. స్వామినాథన్ ఇటీవల పేర్కొన్నారు. ఇందుకు పారిశ్రామిక, సరీ్వసుల రంగాలు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా విస్తృత డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్ ఫలితాలు తదితర అంశాలు వ్యవస్థ ప్రగతిశీలతకు మద్దతిస్తున్నట్లు వివరించారు.ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్షిత పరిధిలోనే ఉన్నట్లు కొలంబియా యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్(ఎస్ఐపీఏ) వద్ద ప్రసంగంలో సోమవారం ప్రస్తావించారు. విదేశీ ఆటుపోట్లను తట్టుకోగలమని ఈ సందర్భంగా తెలియజేశారు. జియోపాలిటిక్స్, వాతావరణ మార్పులు, ఏఐ, టెక్నాలజీ సవాళ్లపై ప్రపంచ పాలసీలు ఆధారపడుతున్న సందర్భంలో సమావేశంకానున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రసంగాన్ని ఆర్బీఐ తాజాగా వెబ్సైట్లో పోస్ట్ చేసింది.


