breaking news
Business
-
2026లో జీతాలు పెరిగేది వీరికే!
భారతదేశంలో 2026లో జీతాలు 9 శాతం పెరుగుతాయని, Aon యాన్యువల్ శాలరీ ఇంక్రీజ్ అండ్ టర్నోవర్ సర్వే ద్వారా వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ, 2025లో నమోదైన 8.9 శాతం జీతాల వృద్ధి కంటే.. ఈ అంచనా స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది.రియల్ ఎస్టేట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) వరుసగా 10.9 శాతం, 10 శాతం చొప్పున అత్యధిక జీతాల పెరుగుదలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎగుమతులు తగ్గడం, ఏఐ (కృత్రిమ మేధస్సు) ప్రభావం కారణంగా టెక్నాలజీ కన్సల్టింగ్ రంగాలు మాత్రం 6.5 శాతానికి పరిమితం చేయనున్నాయి. 2025 ఐటీ కంపెనీలు 7 శాతం జీతాల పెరుగుదలను ప్రకటించాయి.టాప్/సీనియర్ & మిడిల్ మేనేజ్మెంట్ జీతాల వృద్ధి వరుసగా 8.5 శాతం, 8.9 శాతం వద్ద ఉంటాయి. అయితే.. జూనియర్ మేనేజ్మెంట్ జీతాలు మాత్రం 9.5 శాతానికి (2025లో 9.3 శాతం పెరుగుదల) చేరే అవకాశం ఉంది. పోటీ మార్కెట్లో యువ ప్రతిభను ఆకర్షించడంలో భాగంగానే ఈ కొంత జీతాల పెంపు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఉద్యోగ విరమణ 17.1 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.1060 కంపెనీల నుంచి సేకరించిన డేటాఈ నివేదికను.. 45 పరిశ్రమలలోని 1,060 కంటే ఎక్కువ కంపెనీల నుంచి డేటా ఆధారంగా రూపొందించారు. ఇందులో సుమారు 43 శాతం కంపెనీలు FY26కి వార్షిక ఆదాయ వృద్ధిని 10 శాతం కంటే ఎక్కువ అంచనా వేయగా.. 27 శాతం మంది 5–10 శాతం వృద్ధిని ఆశిస్తున్నారు. మరో 12 శాతం మంది ఎటువంటి ప్రభావం లేదని అంచనా వేస్తున్నారు. 14 శాతం మంది 0–5 శాతం వృద్ధిని చూస్తున్నారు. 4 శాతం మంది మాత్రం ప్రతికూల వృద్ధిని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు -
కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు
ఎప్పుడు, ఎవరు, ఎలా కోటీశ్వరులవుతారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇది అందరి జీవితంలో జరుగుతుందని కచ్చితంగా చెప్పలేము. ఒకవేళా జరిగితే మాత్రం.. వారిని మించిన అదృష్టవంతులు ఇంకొకరు లేరనే చెప్పాలి. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.స్టాక్ మార్కెట్స్ గురించి ప్రస్తుతం అందరికీ తెలుసు.. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని కొందరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఊహకందని నష్టాలను కూడా చూడాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడంతా డిజిటల్ లావాదేవీలు వచసాయి. ఒక 20-30 ఏళ్లు వెనక్కి వెళ్తే.. అప్పుడంతా పేపర్ రూపంలోనే లావాదేవీలు జరిగేవి. ఆ నాటి పేపర్స్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టులో.. సుమారు 30ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన షేర్లకు సంబంధించిన పేపర్లు దొరకడంతో ఒక వ్యక్తి.. ఇప్పటి వాటి విలువను చూసి ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ వ్యక్తి 1995లో జేవీఎస్ఎల్ (JVSL) కంపెనీకి సంబంధించిన షేర్లను ఒక్కక్కరి రూ. 10 చొప్పున.. 100 కొనుగోలు చేసాడు. 1000 రూపాయలు పెట్టి కొన్న షేర్స్.. ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అవి ఇప్పుడు దొరికాయి. వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ. 1.83 కోట్లు అయింది.ఇదీ చదవండి: మిలియనీర్గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!2005లో జేవీఎస్ఎల్ కంపెనీ.. జేఎస్డబ్ల్యూ సంస్థలో విలీనమైంది. ఆ సమయంలో ఒక జేవీఎస్ఎల్ షేర్ ఉన్న వారికి.. జేఎస్డబ్ల్యూ కంపెనీ 16 షేర్స్ ఇచ్చింది. దీంతో 1995లో కొన్న వ్యక్తి 1000 షేర్స్ 16000 షేర్స్ అయ్యాయి. ఈ విషయాన్ని మార్కెటింగ్ గ్రోమాటిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం JSW ధర ఒక్కో షేరుకు రూ. 1,146 ఉంది. దీంతో ఆ షేర్స్ విలువ రూ. 1.83కోట్లుగా మారింది. ఆ వ్యక్తి ఒకేసారి కోటీశ్వరుడయ్యాడు. View this post on Instagram A post shared by Startup | Marketing (@marketing.growmatics) -
ఐఐహెచ్ఎల్ మారిషస్ చేతికి స్టెర్లింగ్ బ్యాంక్
న్యూఢిల్లీ: బహమాస్కి చెందిన స్టెర్లింగ్ బ్యాంకులో మిగతా 49 శాతం వాటాలను దక్కించుకున్నట్లు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) మారిషస్ వెల్లడించింది. దీనితో బ్యాంకు కొనుగోలు పూర్తయినట్లు వివరించింది.2022 సెప్టెంబర్లో బ్యాంకులో 51 శాతం వాటాను ఐఐహెచ్ఎల్ మారిషస్ కొనుగోలు చేసింది. బ్యాంకు పేరును ’ఐఐహెచ్ఎల్ బ్యాంక్ అండ్ ట్రస్టు’ గా మార్చనున్నట్లు సంస్థ తెలిపింది. బ్యాంకింగ్, బీమా తదితర ఆర్ధిక సేవలందించే ఐఐహెచ్ఎల్ నికర విలువ 1.26 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్లో అయిదో పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఇండస్ఇండ్ బ్యాంక్నకు ఐఐహెచ్ఎల్ ప్రమోటరుగా ఉంది. -
మిలియనీర్గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!
ఎక్కడైనా ట్యాక్సీ కోసం.. మారుతి కారునో, మహీంద్రా కారునో లేదా టాటా కారునో ఉపయోగిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన ఒక బార్బర్ ఏకంగా రూ.3.2 కోట్ల విలువైన కారును ట్యాక్సీగా అద్దెకు ఇవ్వడానికి కొనుగోలు చేశారు.బెంగళూరుకు చెందిన రమేష్ బాబు.. టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లెక్కలేనన్ని కార్లను ఈ ఫ్లీట్లో చేర్చిన ఈయన.. తాజాగా 'రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యుబీ' కారును చేర్చారు. ఈ కారును డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.రమేష్ బాబు టూర్స్ అండ్ ట్రావెల్స్లో.. ఇప్పటికే రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ మేబాచ్, జీ వ్యాగెన్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130, బీఎండబ్ల్యు ఐ7 వంటి కార్లు చేరాయి. ఇప్పుడు తాజాగా రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యుబీ చేరింది. ఈ కారు ఫుజి వైట్ క్లాసీ షేడ్లో ఉన్న హెచ్ఎస్ఈ లాంగ్ వీల్బేస్ వేరియంట్. ఇది 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా 346 బీహెచ్పీ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.రమేష్ బాబు లగ్జరీ కార్లురమేష్ బాబు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కష్టాలను అధిగమించి.. నేడు మిలియనీర్ స్థాయికి ఎదిగారు. బెంగళూరులో జన్మించిన రమేష్ బాబు తండ్రి బార్బర్, అయితే తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో.. తల్లి తమను పోషించడానికి పనిమనిషిగా పనిచేసింది. ఈ క్రమంలో రమేష్ బాబు చిన్న చిన్న పనులు చేస్తూ.. పాఠశాల విద్యను పూర్తి చేసి, తండ్రికి చెందిన బార్బర్ షాప్ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులోనే మెల్లగా ఎదిగి, మారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: రోజుకు 12 గంటల నిద్ర!.. ఇదే నా సక్సెస్ సీక్రెట్: టెలిగ్రామ్ సీఈఓమారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేసిన తరువాత.. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా కొంత డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఆలా అద్దెకు కార్లను ఇవ్వడం ద్వారా సంపాదించడం ప్రారభించి.. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రీమియం కార్ల అద్దె కంపెనీ ఏర్పాటు చేశారు. 2011లో అద్దెకు ఇవ్వడానికి రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ I కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈయన అనేక ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తున్నారు. -
ప్యాసివ్ ఫండ్స్కు పెరుగుతున్న ఆదరణ
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతోంది. ఇందుకు నిదర్శనంగా ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల (ఏయూఎం) విలువ 2025 మార్చి నాటికి రూ.12.2 లక్షల కోట్లకు చేరింది. 2019 నాటికి ఉన్న రూ.1.91 లక్షల కోట్ల నుంచి ఆరు రెట్లు పెరిగింది.మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ మూడో ఎడిషన్ ‘ప్యాసివ్ సర్వే 2025’ ఈ వివరాలు విడుదల చేసింది. 2023 మార్చి నుంచి చూసినా ప్యాసివ్ ఫండ్స్ ఏయూఎం 1.7 రెట్లు పెరిగింది. మూడు వేల మందికి పైగా ఇన్వెస్టర్లు, ఫండ్స్ పంపిణీదారుల నుంచి అభిప్రాయాలను సర్వేలో భాగంగా మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ తెలుసుకుంది.ప్యాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్లు) అన్నవి నిర్దేశిత సూచీల్లోని స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. రాబడి కూడా సూచీల స్థాయిలోనే ఉంటుంది. యాక్టివ్ ఫండ్స్ మెరుగైన రాబడుల అవకాశాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తూ, అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. యాక్టివ్ ఫండ్స్తో పోల్చి చూస్తే ప్యాసివ్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. సర్వే అంశాలు..76 శాతం మంది ఇన్వెస్టర్లు తమకు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల పట్ల అవగాహన ఉన్నట్టు చెప్పడం గమనార్హం.68 శాతం ఇన్వెస్టర్లు కనీసం ఒక ప్యాసివ్ ఫండ్లో పెట్టుబడులు పెట్టారు. 2023లో ఇలాంటి వారు 61 శాతంగా ఉన్నారు.ప్యాసివ్ ఫండ్స్కు ఆదరణ పెరిగినప్పటికీ.. యాక్టివ్ ఫండ్స్పైనా కొందరు ఇన్వెస్టర్లలో అమిత విశ్వాసం కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు యాక్టివ్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరికి ప్యాసివ్ ఫండ్స్ గురించి పెద్దగా తెలియకపోవడం కూడా ఒక కారణం.ప్యాసివ్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడానికి తక్కువ వ్యయాలు కారణమని 54 శాతం మంది చెప్పారు. సులభత్వం, పారదర్శక గురించి 46 శాతం మంది ప్రస్తావించారు. 29 శాతం మంది పనితీరును కారణంగా పేర్కొన్నారు.మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారుల్లోనూ 93% మందికి ప్యాసివ్ ఫండ్స్పై అవగాహన ఉంది.సర్వేలో పాల్గొన్న ఇన్వెస్టర్లలో 85 శాతం మంది మూడేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. దీర్ఘకాలం కోసం పెట్టుబడుల ధోరణి వారిలో కనిపించింది. ఏడాది నుంచి మూడేళ్ల మధ్య పెట్టుబడులు కొనసాగిస్తున్న వారు 13 శాతంగా ఉన్నారు.57 శాతం మంది ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), ఒకే విడతలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. 26 శాతం మంది కేవలం సిప్లో, 17 శాతం ఒకే విడత పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.ఆర్థిక స్వేచ్ఛ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు 61 శాతం మంది చెప్పగా, రిటైర్మెంట్ నిధి కోసం 49 శాతం ఇన్వెస్ట్ చేస్తున్నారు. -
రోజుకు 12 గంటల నిద్ర!.. ఇదే నా సక్సెస్ సీక్రెట్
స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుందని.. అందరూ నమ్ముతుంటే, ఫోన్ వాడకపోవడం వల్లే నేను సక్సెస్ సాధించా అని టెలిగ్రామ్ కో-ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ (Pavel Durov) చెబుతున్నారు. ఇంతకీ అదెలా సాధ్యమైంది?, వివరాలు ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం.లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ''రోజులో వీలైనంత సమయం.. సుమారు 11 నుంచి 12 గంటలు నిద్ర కోసం కేటాయించడానికి ప్రయత్నిస్తాను. అయితే అన్ని గంటలు నిద్రకోసం కేటాయించినా.. నిద్రపోను. మంచం మీద పడుకుని ఆలోచిస్తూనే ఉంటాను'' అని దురోవ్ పేర్కొన్నారు.పడుకున్నప్పుడే.. నాకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. తాను సోషల్ నెట్వర్కింగ్లో ఉన్నప్పటికీ.. స్మార్ట్ఫోన్ వాడకం చాలా తక్కువని పేర్కొన్నారు. నిద్ర లేచిన వెంటనే తన ఫోన్ చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. నోటిఫికేషన్లు, సోషల్ మీడియా వంటివన్నీ ఒక వ్యక్తి రోజును డిసైడ్ చేస్తాయని నమ్ముతాను.జీవితంలో ఏది ముఖ్యమైనదో నిర్ణయించుకోవాలి. ఇతర వ్యక్తులు, కంపెనీ వంటివన్నీ మన జీవితంలో చాలా ముఖ్యమైనవి కాదు. ప్రతి రోజూ ఉదయం ఫోన్ లేకుండానే మీ దినచర్యను ప్రారభించడం అలవాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలువ్యాయామం చేసేటప్పుడు.. ఇతరత్రా పనులు చేసేటప్పుడు కూడా వీలైనంత ఫోనుకు దూరంగా ఉండాలి. ఫోన్ దూరంగా ఉన్నప్పుడే మీకు అద్భుతమైన ఆలోచనలు రావొచ్చని దురోవ్ చెబుతున్నారు. టెక్నాలజీ, కనెక్టివిటీ వంటి వాటికి మద్దతు ఇస్తున్నప్పటికీ.. జీవితంలో ఏది ముఖ్యమో దానికోసం సమయం వెచ్చించాలని ఆయన సూచించారు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 136.63 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 81,926.75 వద్ద, నిఫ్టీ 30.65 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 25,108.30 వద్ద నిలిచాయి.ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్, ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్, సెంచరీ ఎక్స్ట్రూషన్స్, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, మైండ్టెక్ (ఇండియా) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. గ్లోటిస్ లిమిటెడ్, సిగ్మా సాల్వ్ లిమిటెడ్, ఏఏఏ టెక్నాలజీస్, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, కేఐఓసీఎల్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లెక్స్ ఆఫీస్ ట్రెండ్.. హైదరాబాద్ టాప్
దేశంలో ఫ్లెక్స్ ఆఫీస్ ట్రెండ్ వేగంగా సాగుతోంది. అభివృద్ధి చెందిన నగరాల్లో.. హైబ్రిడ్ వర్క్ మోడల్కు ఇదొక ఉత్తమ పరిష్కారం. మైహెచ్క్యూ (MyHQ) 'ఫ్లెక్స్ ఆఫీస్ స్టాక్ ఫుట్ప్రింట్' పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.మైహెచ్క్యూ డేటా ప్రకారం.. భారతదేశంలోని మొత్తం ఫ్లెక్స్ ఆఫీసులలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ఈ నగరం ఫ్లెక్స్ ఆఫీస్ హబ్గా మారింది. ఇక్కడ కూడా ప్రధానంగా.. హైటెక్ సిటీలో 23.4 శాతం ఫ్లెక్స్ ఆఫీసుల, మాదాపూర్లో 11.2 శాతం ఉన్నట్లు నివేదిక చెబుతోంది. ఆ తరువాత జాబితాలో బంజారా హిల్స్ (9.9%), బేగంపేట (9.9%), కొండాపూర్ (9.5%), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (5.3%) మొదలైనవి ఉన్నాయి.మెట్రో సౌకర్యం, రవాణా కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఫ్లెక్స్ ఆఫీసుల సంఖ్య పెరుగుతోంది. ఈ సంఖ్య గడిచిన మూడేళ్ళలో పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ ట్రెండ్సెట్టర్గా మారిపోయింది. దీంతో ఫ్లెక్స్ ఆఫీసులకు డిమాండ్ పెరుగుతోంది.కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ప్రారంభమైంది. అయితే కరోనా దాదాపు కనుమరుగైపోయినప్పటికీ.. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ విధానాలకు అలవాటుపడిపోయారు. దీనిని నివారించడానికి.. సంస్థలు హైబ్రిడ్ వర్క్ కల్చర్ స్టార్ట్ చేశాయి. దీనికోసం ఫ్లెక్స్ ఆఫీసులను ఎంచుకోవడం మొదలైంది. దీంతో ఫ్లెక్సిబుల్ ఆఫీసులు పుట్టుకొచ్చాయి. ఫ్లెక్సిబుల్ సొల్యూషన్స్ ప్రస్తుతం అన్ని కార్యాలయ లావాదేవీలలో 20% వాటా కలిగి ఉన్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ వ్యాప్తి దాదాపు 30%కి చేరుకుంటుందని సమాచారం.ఫ్లెక్స్ ఆఫీస్ ఉపయోగాలుఫ్లెక్స్ ఆఫీస్ (Flexible Office) అనేది.. ఒకవిధమైన ఆఫీస్ వర్క్ స్పేస్. ఇక్కడ ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు. స్టార్టప్ కంపెనీలు తక్కువ ఖర్చుతో.. కార్యాలయ నిర్వహణ చేసుకోవడానికి ఫ్లెక్స్ ఆఫీస్ ఉపయోగపడుతుంది. ఫ్రీలాన్సర్లు, రిమోట్ వర్కర్లు తమకు అవసరమైన స్థలాన్ని ఎంచుకుని పని చేయవచ్చు. ఉద్యోగ వాతావరణం ఉంటుంది కాబట్టి.. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. -
జీఎస్టీ క్రమబద్ధీకరణ తర్వాత ఎస్బీఐ జనరల్ నుంచి కొత్త హెల్త్ ప్లాన్
భారతదేశంలో ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తమ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా హెల్త్ ఆల్ఫా (Health Alpha) పేరుతో సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఆధునిక వైద్య ఖర్చులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, అన్ని వయసుల వారికి మెరుగైన రక్షణ కల్పించడానికి రూపొందిస్తున్నట్లు చెబుతున్న ఈ ప్లాన్ వివిధ రకాల ప్రత్యేకతలు, సౌకర్యాలు, ప్రయోజనాలు కలిగి ఉందని కంపెనీ తెలిపింది.అనూహ్యంగా పెరిగే వైద్య ఖర్చుల నుంచి పాలసీదారులకు ఆర్థిక భద్రత కల్పించడానికి ఎస్బీఐ జనరల్ (SBI General) ఈ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. జీఎస్టీ సంస్కరణల తర్వాత ఎస్బీఐ ప్రారంభించిన మొదటి ఆరోగ్య బీమా ఇది.అదనంగా ప్రీమియం చెల్లించకుండా 10 రెట్లు క్లెయిం-ఫ్రీ క్యుమిలేటివ్ బోనస్ను అందిస్తున్నట్లు చెప్పింది. ఈ ప్లాన్లో బేస్ కవరేజీపై గరిష్ట పరిమితి లేదని తెలిపింది. ‘జిమ్, స్పోర్ట్స్ ఇంజ్యూరీ కవరేజి కూడా లభిస్తుంది. అందుకు ఓపీడీ ప్రయోజనాలు, పరీక్షలు, చికిత్స, మందుల ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ప్లాన్ కొనుగోలు చేసేందుకు కోట్ చేసిన 5 రోజుల్లోగా కొనుగోలు చేసినట్లయితే ప్రీమియంపై 5% తగ్గింపు పొందవచ్చు’ అని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: చనిపోయేంత కాలం బ్యాంకు నుంచి డబ్బు వచ్చేలా.. -
ఏపీలో 172 బావుల ఏర్పాటుకు రూ.8,110 కోట్లు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజు (PML) బ్లాకుల్లో 172 ఆన్షోర్ బావులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. వీటి ద్వారా చమురు, గ్యాస్ ఉత్పత్తి కోసం రూ.8,110 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అడవులు, వాతావరణ మార్పులకు సంబంధించిన ఒక కమిటీ గత నెలలో జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి (EC) ఇవ్వడానికి సిఫార్సు చేసింది.ఈ ఆన్షోర్ బావుల ఏర్పాటు కోసం పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (EMP)కు సంబంధించి మూలధన వ్యయం రూ.172 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఏటా ఈఎంపీ రెన్యువల్ కోసం చేసే ఖర్చు రూ.91.16 కోట్లు ఉంటుందని చెప్పింది. కమిటీ బహిరంగ విచారణలో చేసిన హామీల కోసం రూ.11 కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. పర్యావరణ అనుమతిని సిఫార్సు చేస్తూ కమిటీ ఓఎన్జీసీని అన్ని పర్యావరణ పరిరక్షణ చర్యలు, భద్రతా ఏర్పాట్లను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.మే నెలలో జారీ చేసిన ఎన్ఓసీ (NOC) ప్రకారం కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం పర్యావరణ సున్నిత ప్రాంతం (eco-sensitive area) నుంచి 10 కి.మీ. లోపు ఏ బావిని కూడా ఏర్పాటు చేయరు. ముందస్తు అనుమతి లేకుండా అటవీ భూమి/ రక్షిత ప్రాంతంలో పైప్లైన్లు ఏర్పాటు చేయరు.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
చనిపోయేంత కాలం బ్యాంకు నుంచి డబ్బు వచ్చేలా..
బ్యాంకు లోన్ ఇస్తే మనం ఈఎంఐ చెల్లించడం ఆనవాయితి. అయితే అందుకు పూర్తి భిన్నంగా బ్యాంకే మనకు డబ్బు చెల్లిస్తే.. అవును.. ఈ ఊహ ఎంత బావుందో కదా.. అయితే అందుకు మన ప్రాపర్టీని బ్యాంకు వద్ద తనఖా పెట్టాల్సి ఉంటుంది. దాంతో ప్రతినెల లేదా ఒకేసారి పెద్ద మొత్తంలో బ్యాంకు ద్వారా డబ్బు పొందవచ్చు. ఆ వివరాలు కింద చూద్దాం.సీనియర్ సిటిజన్ల (వృద్ధుల) కోసం బ్యాంకుల్లో కొన్ని ప్రత్యేక లోన్లు ఉంటాయి. సాధారణంగా హోమ్ లోన్లో రుణగ్రహీత బ్యాంకుకు ఈఎంఐలు చెల్లిస్తే రివర్స్ మార్టగేజ్ లోన్లో బ్యాంకులే సీనియర్ సిటిజన్కు క్రమానుగతంగా లేదా ఒకేసారి కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. దీనికి బదులుగా సీనియర్ సిటిజన్ తమ స్థిరాస్తులను బ్యాంకులో తాకట్టు (Mortgage) పెట్టాల్సి ఉంటుంది.రివర్స్ మార్టగేజ్ లోన్లు అంటే ఏమిటి?తమ సొంత ఇంట్లో ఉంటూనే ఆర్థిక అవసరాల కోసం తమ ఆస్తిపై ఉన్న విలువను నగదు రూపంలో పొందేందుకు ఈ లోన్లు వృద్ధులకు సహాయపడతాయి. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం లేని వారికి ఈ లోన్ ఒక మంచి ఆదాయ మార్గంగా ఉపయోగపడుతుంది. లోన్ తీసుకున్న వ్యక్తి (రుణగ్రహీత) జీవించి ఉన్నంత కాలం లేదా ఇంట్లో నివసిస్తున్నంత వరకు లోన్ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు.వాటిని బ్యాంకులు ఎలా జారీ చేస్తాయి?షెడ్యూల్డ్ బ్యాంకులు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) వద్ద నమోదైన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు) ఈ రుణాలను అందిస్తాయి.వృద్ధులు తమ నివాస ఆస్తిని బ్యాంకులో తాకట్టు పెడతారు.బ్యాంక్ ఆ ఆస్తి విలువను అంచనా వేస్తుంది. రుణగ్రహీత వయసు, ఆస్తి విలువ, వడ్డీ రేటు ఆధారంగా ఎంత లోన్ ఇవ్వవచ్చో నిర్ణయిస్తుంది.మంజూరైన లోన్ మొత్తాన్ని రుణగ్రహీతకు నిర్ణీత పద్ధతిలో చెల్లిస్తారు.నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక వాయిదాలుగా చెల్లిస్తారు. (సాధారణంగా గరిష్ఠ నెలవారీ చెల్లింపు పరిమితి రూ.50,000 వరకు ఉంటుంది).లోన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి కూడా తీసుకోవచ్చు (సాధారణంగా 50% వరకు).ఈ లోన్ను రుణగ్రహీత జీవించి ఉన్నంత కాలం చెల్లించాల్సిన అవసరం లేదు. చివరి రుణగ్రహీత మరణించిన తర్వాత లోన్ అసలు, దానిపై పేరుకుపోయిన వడ్డీ మొత్తం చెల్లించవలసి వస్తుంది. వారసులు ఈ మొత్తాన్ని చెల్లించి ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు లేదా ఆస్తిని అమ్మి లోన్ను సెటిల్ చేయవచ్చు.ఈ లోన్ పొందేందుకు అర్హతలేమిటి?సాధారణంగా రివర్స్ మార్టగేజ్ లోన్ పొందడానికి కింది అర్హతలు అవసరం అవుతాయి.వయసు: దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి.ఉమ్మడి రుణం: వివాహిత జంటల విషయంలో ఒకరు 60 ఏళ్లు పైబడినవారు, మరొకరు 55 ఏళ్ల కంటే తక్కువ కాకుండా ఉంటే ఉమ్మడి రుణగ్రహీతలుగా అర్హులు.ఆస్తి యాజమాన్యం: ఆస్తికి సంబంధించిన స్పష్టమైన టైటిల్ (Clear Title) ఉండాలి. అది ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి.ఆస్తి రకం: అది స్వయం-ఆర్జితం (Self-acquired) లేదా వారసత్వంగా వచ్చిన నివాస ఆస్తి (ఇల్లు లేదా ఫ్లాట్) అయ్యి ఉండాలి.నివాసం: ఆ ఆస్తిని రుణగ్రహీత ప్రాథమిక నివాసంగా ఉపయోగించాలి.బ్యాంకులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?ఆస్తిని తాకట్టు పెట్టుకోవడం ద్వారా బ్యాంకుకు అధిక భద్రత (Security) లభిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించలేకపోయినా ఆస్తిని అమ్మి లోన్ను వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు సేవ చేయడం ద్వారా కొత్త మార్కెట్ను చేరుకోగలుగుతారు. ఈ లోన్పై వడ్డీ కాలక్రమేణా పెరుగుతూ పోతుంది. రుణ వ్యవధి ముగిసిన తర్వాత లేదా వారసులు ఆస్తిని అమ్మినప్పుడు ఈ వడ్డీతో సహా అసలు మొత్తాన్ని బ్యాంకు పొందుతుంది.కస్టమర్లకు ఎలాంటి లాభాలున్నాయి?రుణగ్రహీత తమ ఇంట్లోనే జీవించే హక్కును కలిగి ఉంటారు. లోన్ తీసుకున్నంత మాత్రాన ఆస్తి యాజమాన్యం పోదు. స్థిరమైన ఆదాయ వనరులు లేని వృద్ధులకు క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది. ఇది వారి రోజువారీ ఖర్చులకు, వైద్య అవసరాలకు, ఇంటి మరమ్మతులకు ఉపయోగపడుతుంది. రుణగ్రహీత జీవించి ఉన్నంత కాలం నెలవారీగా లోన్ను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.పన్ను ప్రయోజనాలురివర్స్ మార్టగేజ్ ద్వారా పొందిన డబ్బును ఆదాయంగా పరిగణించరు. కాబట్టి దానిపై సాధారణంగా ఆదాయపు పన్ను ఉండదు (అయితే తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంక్ అమ్మి లోన్ రికవరీ చేసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) వర్తించవచ్చు). రుణగ్రహీత లేదా వారి వారసులు ఎప్పుడైనా లోన్ను ముందుగానే చెల్లించవచ్చు. చాలా బ్యాంకులు ముందస్తు చెల్లింపుకు పెనాల్టీ విధించవు.బ్యాంకులు పాటిస్తున్న నియమాలు..భారతదేశంలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఈ లోన్లను అందిస్తాయి. ఇందులో గరిష్ఠ లోన్ చెల్లింపు వ్యవధి 20 సంవత్సరాలు మించకూడదు. రుణగ్రహీత ఆస్తి విలువ తగ్గకుండా దాన్ని మంచి స్థితిలో ఉంచాలి. ఆస్తి పన్నులు (Property Taxes), ఇంటి బీమా (Home Insurance) ప్రీమియంలను రుణగ్రహీత క్రమం తప్పకుండా చెల్లించాలి. బ్యాంక్ కనీసం ప్రతి ఐదేళ్లకోసారి ఆస్తి విలువను తిరిగి అంచనా వేయవచ్చు లేదా లోన్ మొత్తాన్ని సవరించవచ్చు. రుణగ్రహీత మరణించిన తర్వాత లేదా శాశ్వతంగా ఆస్తిని విడిచిపెట్టిన తర్వాత ఆరు నెలల్లోపు లోన్ మొత్తం చెల్లించాలి. రుణగ్రహీత ఆస్తి పన్నులు లేదా బీమాను చెల్లించడంలో విఫలమైతే లేదా నిరంతరంగా ఒక సంవత్సరం కంటే ఎక్కువకాలం ఇంట్లో నివసించకపోతే బ్యాంకు లోన్ను రద్దు (Foreclosure) చేయవచ్చు.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
వరుసలో చివరి అక్షరం అని తీసిపారేయకండి!
కార్పొరేట్ కంపెనీలు, కొత్తగా ప్రారంభమవుతున్న స్టార్టప్లు తమ పేర్లను ‘Z’ అనే అక్షరంతో ప్రారంభించడానికి మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇలా కంపెనీలు Zతో పేర్లను ప్రారంభించడానికిగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఈ పంథాను ఇప్పటికే అనుసరించిన కొన్ని ప్రముఖ కంపెనీల వివరాలను కింద చూద్దాం.Gen Zతో అనుబంధంజెన్జీ- 1990 నుంచి 2010ల మధ్య జన్మించిన Gen Z (జనరేషన్ Z) ప్రస్తుతం ప్రపంచ వినియోగదారుల్లో, శ్రామిక శక్తిలో బలమైన ప్రభావాన్ని చూపుతున్నారు. ఈ తరం డిజిటల్ నేటివ్గా మారుతున్నారు. వీరు వేగవంతమైన మార్పులను అంగీకరించే వారిగా ఉన్నారు. కంపెనీ పేరులో 'Z' ఉండటం ద్వారా తాము ఈ ఆధునిక, సాంకేతికత ఆధారిత, డైనమిక్ తరానికి చెందినవారమని, వారి అవసరాలను తీర్చగలమని పరోక్షంగా కంపెనీలు సందేశం పంపవచ్చు.'Z' అక్షరం యువతలో ట్రెండీగా, విభిన్నంగా కనిపిస్తుంది. ఇది కొత్తదనాన్ని, భవిష్యత్తు, సాంప్రదాయేతర విధానాన్ని సూచిస్తుంది.మార్కెట్లో విభిన్నతఆంగ్ల అక్షరమాల (Alphabet)లో చివరి అక్షరం 'Z'. ఇది ఒక కంపెనీని సులభంగా గుర్తుంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. 'A' లేదా 'G'.. వంటి సాధారణ అక్షరాలతో పోలిస్తే 'Z' తో ప్రారంభమయ్యే పేర్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి కంపెనీ పేరు వేగంగా దృష్టిని ఆకర్షిస్తుంది.కొన్నిసార్లు వెబ్సైట్ డైరెక్టరీల్లో లేదా యాప్ స్టోర్ల్లో (A-Z జాబితా) పేర్లు ఆల్ఫాబెటికల్ క్రమంలో ఉన్నప్పుడు 'Z' తో ప్రారంభమయ్యే పేర్లు జాబితాలో చివరిలో కనిపించి వినియోగదారులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది.డొమైన్ నేమ్స్ఇంటర్నెట్లో కొత్త స్టార్టప్లకు తమకు నచ్చిన పేరుతో డొమైన్ పేరు (ఉదా: example.com) దొరకడం చాలా కష్టం. 'Z' అక్షరం అరుదుగా ఉపయోగించబడటం వల్ల ఈ అక్షరంతో ప్రారంభమయ్యే అర్థవంతమైన పేర్లు, వాటికి అనుగుణమైన డొమైన్ నేమ్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ సులభంగా లభిస్తాయి.'Z' తో ప్రారంభమయ్యే పేర్లను తరచుగా పలకడం, వినడం సులువుగా ఉంటుంది. (ఉదాహరణకు: జెప్టో, జొమాటో). ఇది వేగవంతమైన డిజిటల్ యుగానికి సరిపోయేలా ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..'Z' అక్షరంతో ప్రారంభమైన ప్రముఖ కంపెనీలుకంపెనీస్థాపించబడిన దేశంప్రధాన వ్యాపారంZeptoభారతదేశంక్విక్ కామర్స్ (10 నిమిషాల కిరాణా డెలివరీ)Zetwerkభారతదేశంమ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ (B2B)Zomatoభారతదేశంఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ అగ్రిగేటర్Zerodhaభారతదేశంఆన్లైన్ స్టాక్ బ్రోకరేజ్ (ట్రేడింగ్)Zillowఅమెరికారియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్Zoomఅమెరికావీడియో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ -
ఎస్యూవీ మార్కెట్లోకి నిస్సాన్ కొత్త మోడల్
నిస్సాన్ మోటార్ ఇండియా సీ-సెగ్మెంట్ ఎస్యూవీ (SUV) మార్కెట్లో కొత్త మోడల్ను తీసుకురాబోతున్నట్లు తెలిపింది. నిస్సాన్ టెక్టాన్(Nissan Tecton) పేరుతో త్వరలో కొత్త ఎస్యూవీని లాంచ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొత్త మోడల్ పేరు వెల్లడించడంతోపాటు దీని ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ డిజైన్ టీజర్ను విడుదల చేసింది. డీలర్లకు ఇప్పటికే దీని వివరాలు వెల్లడించినట్లు కంపెనీ తెలిపింది. 2026 రెండో త్రైమాసికంలో భారత మార్కెట్లో ఈ మోడల్ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.నిస్సాన్ టెక్టాన్ డిజైనింగ్ పరంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎస్యూవీ ఇంజిన్ పైభాగం బానెట్ వెడల్పుగా ఉండడంతోపాటు ముందు భాగంలో ఎల్ఈడీ డీఆర్ఎల్ (LED DRL) సిగ్నేచర్ మధ్యలో నిస్సాన్ లోగోతో ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. స్ప్లిట్ హెడ్ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ క్లస్టర్లు, ఫ్రంట్ బంపర్ డిజైన్తో కలిసి దీని ఎస్యూవీ ఆకర్షణను పెంచుతుందని తెలిపారు.వెనుక భాగంలో టెక్టాన్ ఇటీవలి నిస్సాన్ గ్లోబల్ మోడళ్ల మాదిరిగానే కనెక్ట్ ఎల్ఈడీ టెయిల్ లైట్ బార్, స్క్వేర్డ్ టెయిల్ ల్యాంప్స్ను కలిగి ఉంటుందని చెప్పింది. టెక్టాన్ అల్లాయ్ వీల్స్ దీనికి డైనమిక్, ప్రీమియం లుక్ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఇంటీరియర్లో ప్రీమియం ఫీచర్లు ఉంటాయని తెలిపింది. లేయర్డ్ డాష్బోర్డ్ డిజైన్, లార్జ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ సీట్లు, అధునాతన డ్రైవర్-సహాయక వ్యవస్థల (ADAS)సూట్ను అందించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపింది. అయితే దీన్ని ఏ ప్రైస్ రేంజ్లో మార్కెట్లో తీసుకొస్తారని అంశాలను వెల్లడించాల్సి ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
బంగారం ధరల తుపాను.. ఒక్కరోజే భారీగా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: మహీంద్రా బొలెరోకు కొత్త హంగులు..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మహీంద్రా బొలెరోకు కొత్త హంగులు..
దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహింద్రా తన సూపర్ హిట్ బొలెరో ఎస్యూవీలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బొలెరో B8, బొలెరో నియో N11 అని పిలుస్తున్న ఈ కొత్త వేరియంట్ల ధరలు రూ.7.99 లక్షల నుంచి రూ.9.99 లక్షల (ఎక్స్ షో రూమ్) వరకూ ఉండనున్నాయి.డిజైన్ పరంగా చూస్తే కొత్త బొలెరోలో ఆకట్టుకునే హారిజోంటల్ యాక్సెంట్స్తో ఆకర్షణీయమైన డిజైన్ను సరికొత్తగా సిద్ధం ఏశారు. ఫాగ్ల్యాంప్స్తోపాటు డైమండ్ కట్ ఆర్-15 అలాయ్ వీల్స్ను అందిస్తున్నారు. మూడు రంగుల్లో, డ్యుయల్టోన్, స్టెల్త్ బ్లాక్ రంగు ఆప్షన్స్తో అందుబాటులో ఉన్న ఈ వాహనాలల్లో ప్రయాణీకుల సౌకర్యాలకు పెద్దపీట వేశారు.సరికొత్త 17.8 సెం.మీ. టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, స్టీరింగ్పైనే ఆడియో నియంత్రణకు అవసరమైన బటన్లు ఉన్నాయి. అలాగే వాహనాన్ని నడపడంలో సౌలభ్యం కోసం రైడ్ &హ్యాండ్లింగ్ టెక్నాలజీ టెక్ను వాడారు. ఎలాంటి నేలపైనైనా వెళ్లేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.ఈ ఎస్యూవీల్లో 55.9 kW శక్తి మరియు 210 Nm టార్క్ను అందించే mHAWK75 ఇంజిన్ను ఉపయోగించారు. బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణ స్వరూపంతో పటిష్టంగా ఉంటుంది. పగుళ్లిచ్చిన రహదారులపై కూడా మెరుగైన ట్రాక్షన్ లభించేలా బొలెరో నియోలో క్రూయిజ్ కంట్రోల్ మరియు మల్టీ-టెరైన్ టెక్నాలజీ (ఎంటీటీ) ఉన్నాయి.ఇంటీరియర్స్ విషయానికి వస్తే లూనార్ గ్రే, మోకా బ్రౌన్ థీమ్ ఆప్షన్లు ఉన్నాయి. లెదరెట్ అప్హోల్స్ట్రీతోపాటు రియర్ వ్యూ కెమెరా, 22.8 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్ఫోటెయిన్ మెంట్ ఏర్పాట్లు ఉన్నాయి.కొత్త బొలెరో ధర రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం అవుతుండగా, కొత్తగా ప్రవేశపెట్టిన టాప్ ఎండ్ B8 వేరియంట్ ధర రూ. 9.69 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంటుంది. కొత్త బొలెరో నియో ధర రూ. 8.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూం) ప్రారంభమవుతుంది. కొత్త టాప్-ఎండ్ వేరియంట్ N11 రేటు రూ. 9.99 లక్షలు. మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటోమోటివ్ డివిజన్) నళినికాంత్ గొల్లగుంట మాట్లాడుతూ “పాతికేళ్లుగా భారతదేశపు అత్యంత విశిష్టమైన, పటిష్టమైన ఎస్యూవీగా సుస్థిర స్థానం సంపాదించుకున్న బొలెరో నవ భారత యువత ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త శ్రేణి తీర్చిదిద్దింది. దృఢత్వం, సమకాలీన స్టైలింగ్, మరింత సౌకర్యం, ఆధునిక ఫీచర్ల మేళవింపుతో సరికొత్త బొలెరో, బొలెరో నియో, పట్టణ ప్రాంతాల్లోనూ అటు సంక్లిష్టమైన ఎత్తుపల్లాల్లోనూ సమంగా, అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ అనుభూతిని అందిస్తాయి” అని తెలిపారు.ఇదీ చదవండి: 6జీ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకం -
గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,122కు చేరింది. సెన్సెక్స్(Sensex) 127 పాయింట్లు పుంజుకొని 81,919 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
6జీ అభివృద్ధిలో భారత్ పాత్ర కీలకం
భారతదేశం 6జీ టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో, ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడంలో చురుకుగా ముందుకు సాగుతోంది. విశ్వసనీయ భాగస్వామిగా భారత్కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు 6జీ వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో ఈమేరకు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో 6జీ టెక్నాలజీ, దాని స్పెక్ట్రమ్ పరిమితులు, భారత్పై ప్రభావం, ప్రపంచవ్యాప్త అభివృద్ధి గురించి వివరంగా తెలుసుకుందాం.6జీ టెక్నాలజీ అంటే ఏమిటి?6జీ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ ఆరో తరం సాంకేతికత. ఇది ప్రస్తుతం ఉన్న 5జీ నెట్వర్క్ల సామర్థ్యాన్ని, వేగాన్ని, విశ్వసనీయతను గణనీయంగా పెంచుతుంది. 6జీ సాంకేతికత ప్రధాన లక్ష్యం అల్ట్రా-హైస్పీడ్, అల్ట్రా-లో లేటెన్సీ (చాలా తక్కువ జాప్యం), భారీ కనెక్టివిటీతో కూడిన కమ్యునికేషన్ను సృష్టించడం.6జీ ముఖ్య లక్షణాలుఅత్యధిక వేగం (Ultra-High Speed)6జీ నెట్వర్క్లు సెకనుకు 1 టెరాబిట్ (Tbps) లేదా అంతకంటే ఎక్కువ గరిష్ట డేటా ట్రాన్స్ఫర్ రేటును అందించగలవని అంచనా. ఇది 5జీ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని కొందరు చెబుతున్నారు.చాలా తక్కువ జాప్యం (Ultra-Low Latency)డేటా బదిలీకి పట్టే సమయం 100 మైక్రోసెకన్ల కంటే తక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ అతి తక్కువ జాప్యం వల్ల రియల్-టైమ్ ఆపరేషన్స్, క్లిష్టమైన అప్లికేషన్లు మరింత సులభతరం అవుతాయి.విస్తృత కనెక్టివిటీ (Massive Connectivity)ఒక చదరపు కిలోమీటరుకు కోట్లాది డివైజ్లను కనెక్ట్ చేసే సామర్థ్యం 6జీకి ఉంటుంది. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), స్మార్ట్ సిటీస్ విస్తరణకు ఎంతో తోడ్పడుతుంది.ఏఐ ఏకీకరణ (AI Integration)ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) నెట్వర్క్తో పూర్తిగా కలిసిపోయి ఆటోమేటెడ్, సమర్థవంతమైన నెట్వర్క్ నిర్వహణను అందిస్తుంది.హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్6జీ ద్వారా త్రీ-డైమెన్షనల్ (3D) హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్, వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) వంటి ఇమ్మర్సివ్ అనుభవాలు సాధ్యమవుతాయి.6జీకి కావాల్సిన స్పెక్ట్రమ్ పరిమితులు6జీ నెట్వర్క్లకు కావాల్సిన అత్యంత వేగం, సామర్థ్యం కోసం ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో పాటు కొత్త, విశాలమైన స్పెక్ట్రమ్ బ్యాండ్లు అవసరం. 6జీ కోసం దృష్టి సారిస్తున్న ప్రధాన స్పెక్ట్రమ్ పరిమితులు కింది విధంగా ఉంటాయి.సబ్-టెరాహెర్ట్జ్ (Sub-Terahertz - Sub-THz) బ్యాండ్ఇది 90 GHz (గిగాహెర్ట్జ్) నుంచి 3 THz (టెరాహెర్ట్జ్) మధ్య ఉండే ఫ్రీక్వెన్సీ పరిధి. ఈ బ్యాండ్ చాలా విశాలమైన బ్యాండ్విడ్త్ను అందిస్తుంది. దీని ద్వారానే 1 Tbps వేగం సాధ్యమవుతుందని అంచనా. అయితే ఈ ఫ్రీక్వెన్సీల్లో సిగ్నల్స్ పరిధి తక్కువగా ఉండి భవనాలు వంటి అడ్డంకులను దాటడం కష్టం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.సెంటీమీటర్ వేవ్ (cmWave) బ్యాండ్ప్రస్తుతం 5జీకి వాడుతున్న మిడ్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలకు దగ్గరగా ఉండే 7 GHz నుంచి 15 GHz మధ్య ఉన్న ఈ బ్యాండ్ను ‘6జీ గోల్డెన్ బ్యాండ్’గా పరిగణిస్తున్నారు. ఇది మంచి కవరేజ్, సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 6జీ కోసం 1.5-2 GHz మిడ్-బ్యాండ్ స్పెక్ట్రమ్ అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు.ఇండియాలో 6జీ వస్తే చోటు చేసుకోనున్న పరిణామాలుఇండియాలో ‘భారత్ 6జీ విజన్’ కింద 6జీ సాంకేతికతను 2030 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ వంటి అతిపెద్ద జనాభా గల దేశంలో 6జీ రాక వల్ల భారీ పరివర్తనలు సంభవిస్తాయి.డిజిటల్ విప్లవం: 6జీ గ్రామీణ, సరైన కనెక్టివిటీలేని ప్రాంతాలకు సైతం మెరుగైన కమ్యునికేషన్ అందిస్తుంది.ఆరోగ్య సంరక్షణ (Healthcare): రియల్-టైమ్ టెలిసర్జరీలు, రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఏఐ-ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటివి విస్తృతం అవుతాయి. అంబులెన్స్లు, ఆసుపత్రులు సహా అన్ని వైద్య మౌలిక సదుపాయాలు ఏఐ ఆధారితంగా అనుసంధానమవుతాయి.విద్య (Education): విద్యార్థులు వర్చువల్ టీచర్లతో, క్లాస్మేట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కడైనా, ఎప్పుడైనా నాణ్యమైన విద్యా వనరులను పొందేందుకు 6జీ ఉపయోగపడుతుంది.పరిశ్రమల ఆటోమేషన్ (Industrial Automation): స్మార్ట్ ఫ్యాక్టరీల్లో యంత్రాల రియల్-టైమ్ రిమోట్ కంట్రోల్, ఏఐ-ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, రోబోటిక్స్ వంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను అసాధారణంగా పెంచుతాయి.రవాణా (Transportation): అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM), అటానమస్ వాహనాల (Self-Driving Cars) కోసం 6జీ కమ్యూనికేషన్ అత్యంత అవసరం. ట్రాఫిక్ నిర్వహణ, లాజిస్టిక్స్లో డ్రోన్ ఫ్లీట్ల వాడకం పెరుగుతుంది.రక్షణ రంగం (Defence): కమాండర్లకు వేగవంతమైన, రియల్-టైమ్ క్షేత్ర సమాచారం అందించేందుకు వీలవుతుంది. సురక్షితమైన కమ్యూనికేషన్, డ్రోన్లు, హైపర్సోనిక్ ఆయుధాలకు కమ్యూనికేషన్ లింక్లు అందించడం ద్వారా రక్షణ సామర్థ్యం పెరుగుతుంది.ఈ టెక్నాలజీ వివిధ దేశాల పరిశోధనలుప్రస్తుతానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా వాణిజ్యపరమైన (Commercial) 6జీ నెట్వర్క్ వాడుకలో లేదు. 6జీ సాంకేతికతను 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి, పరిశోధన (R&D)లో వివిధ దేశాలు, టెక్ కంపెనీలు చురుగ్గా పోటీ పడుతున్నాయి.6జీ అభివృద్ధిలో ముందున్న దేశాలుచైనా: 6జీ పరిశోధన, అభివృద్ధిలో ముందంజలో ఉంది. చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. టెరాహెర్ట్జ్ సిగ్నల్ ప్రసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని (Experimental Satellite) ప్రయోగించింది. 6జీ పేటెంట్ ఫైలింగ్స్లో చైనా అగ్రస్థానంలో ఉంది.దక్షిణ కొరియా: 5జీని వేగంగా అమలు చేసిన దక్షిణ కొరియా 6జీలో కూడా బలమైన పోటీదారుగా ఉంది. శాంసంగ్, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలు 6జీ R&D కేంద్రాలను ఏర్పాటు చేశాయి. 2028 నాటికి 6జీని వాణిజ్యపరంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.జపాన్: టెక్నాలజీ అభివృద్ధిలో తన నైపుణ్యాన్ని కొనసాగిస్తూ 2030 నాటికి 6జీని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.యునైటెడ్ స్టేట్స్, యూరప్: యూఎస్ ‘నెక్స్ట్ G అలయన్స్’ ద్వారా ఈయూ ఆధ్వర్యంలో ‘హెక్సా-ఎక్స్’ (Hexa-X) వంటి చొరవలతో 6జీ పరిశోధనలో చురుకుగా పాల్గొంటున్నాయి.ప్రస్తుత డిజిటల్ అభివృద్ధిపైన తెలిపిన దేశాలు ఇంకా 6జీని వాడకపోయినా 5జీని వేగంగా, విస్తృతంగా అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు దక్షిణ కొరియా వంటి దేశాలు ప్రపంచంలోనే అత్యధిక 5జీ కవరేజ్, వేగాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఇప్పటికే రిమోట్ సర్జరీ, ఏఐ-ఆధారిత స్మార్ట్ ఫ్యాక్టరీలు వంటి డిజిటల్ ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తోంది. 6జీ రాకతో ఈ డిజిటల్ అభివృద్ధి మరింత వేగవంతమై ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.చివరగా..6జీ టెక్నాలజీ అనేది కేవలం మొబైల్ స్పీడ్ను పెంచేది మాత్రమే కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, హోలోగ్రాఫిక్స్, అటానమస్ సిస్టమ్స్ వంటి వాటిని అనుసంధానించే ఒక కొత్త డిజిటల్ ఫ్రేమ్వర్క్. భారత్ తన ‘భారత్ 6జీ విజన్’తో ఈ రేసులో దూసుకుపోతోంది. విశ్వసనీయ భాగస్వామిగా ఉన్న భారత్ అంతర్జాతీయ సహకారంతో 6జీ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో విజయం సాధిస్తే అది దేశ సామాజిక-ఆర్థిక పురోగతిని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో దాని నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది. ఈ ఆవిష్కరణతో ప్రజల జీవన నాణ్యత మెరుగుపడటంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని చెప్పవచ్చు.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు -
కొత్త మొబైల్ యూజర్లలో టాప్ కంపెనీ
కొత్త మొబైల్ యూజర్లకు సంబంధించి ఆగస్టులో రిలయన్స్ జియో జోరు కొనసాగగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ దాదాపు ఏడాది తర్వాత భారతి ఎయిర్టెల్ను అధిగమించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం మొబైల్ సెగ్మెంట్లో ఆగస్టులో నికరంగా 35.19 లక్షల కొత్త కనెక్షన్లు నమోదయ్యాయి. జియో కస్టమర్లు అత్యధికంగా 19 లక్షల మేర పెరగ్గా బీఎస్ఎన్ఎల్ (13.85 లక్షలు), ఎయిర్టెల్ (4.96 లక్షలు) తర్వాత స్థానాల్లో నిల్చాయి.చివరిసారిగా 2024 సెప్టెంబర్లో అన్ని ప్రైవేట్ సంస్థలను మించి బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా యూజర్లను దక్కించుకుంది. అప్పట్లో కంపెనీ 3జీ సేవలను మాత్రమే అందించేది. అయితే, ప్రైవేట్ టెల్కోలు టారిఫ్లను పెంచేయడం బీఎస్ఎన్ఎల్కి కలిసొచ్చింది. కంపెనీ ఇటీవలే దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించింది. ఇక, తాజాగా జూలైలో 122 కోట్లుగా ఉన్న మొత్తం టెలిఫోన్ సబ్ర్స్కయిబర్స్ సంఖ్య ఆగస్టులో 122.45 కోట్లకు చేరింది. వొడాఫోన్ ఐడియా అత్యధికంగా 3.08 లక్షల యూజర్లను కోల్పోయింది. బ్రాడ్బ్యాండ్ సెగ్మెంట్లో (మొబైల్, ఫిక్సిడ్ లైన్ కలిపి) 50 కోట్ల కస్టమర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో 30.9 కోట్ల కనెక్షన్లతో భారతి ఎయిర్టెల్, 12.7 కోట్లతో వొడాఫోన్ ఐడియా, 3.43 కోట్ల కనెక్షన్లతో బీఎస్ఎన్ఎల్, 23.5 లక్షల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లతో ఏట్రియా కన్వర్జెన్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు -
సేవల రంగంలో నిదానించిన వృద్ధి
సేవల రంగంలో కార్యకలాపాల వృద్ధి సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సేవల రంగం పీఎంఐ ఆగస్ట్లో 15 ఏళ్ల గరిష్ట స్థాయి 62.9 పాయింట్లకు చేరగా, సెప్టెంబర్లో 60.9కు తగ్గింది. అయినప్పటికీ 50 పాయింట్లకు పైన నమోదు కావడాన్ని వృద్ధి కిందే పరిగణిస్తుంటారు. వేగం తగ్గినప్పటికీ, వృద్ధి ధోరణికి ఢోకా లేదని హెచ్ఎస్బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ పేర్కొన్నారు.అంతర్జాతీయంగా భారత సేవలకు డిమాండ్ కొంత నిదానించడంతో వృద్ధి వేగానికి కాస్త బ్రేక్లు పడినట్టయింది. సెప్టెంబర్లో ఎగుమతుల్లో వృద్ధి నెలకొన్నప్పటికీ, ఈ ఏడాది మార్చి తర్వాత నుంచి చూస్తే తక్కువకు పరిమితమైనట్టు హెచ్ఎస్బీసీ ఇండియా సర్వే గుర్తించింది. సెప్టెంబర్లో ఉపాధి కల్పన సైతం మోస్తరు స్థాయికి నిదానించిందని, కేవలం 5 శాతానికంటే కొంచెం ఎక్కువ కంపెనీలు నియామకాల్లో వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపింది.ఇక భవిష్యత్తు కార్యకలాపాలకు సంబంధించిన సూచీ మాత్రం ఈ ఏడాది మార్చి తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో వ్యాపార కార్యకలాపాల పరంగా సేవల రంగ కంపెనీల్లో ఆశాభావం బలపడినట్టు ఈ సర్వే పేర్కొంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ (తయారీ, సేవల రంగం కలిపి) 61గా నమోదైంది. ఆగస్ట్లో ఇది 63.2 పాయింట్లుగా ఉంది. ఈ ఏడాది జూన్ తర్వాత తక్కువ వృద్ధి రేటు ఇదే కావడం గమనార్హం.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
ఆరు ఐపీవోలకు గ్రీన్సిగ్నల్
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో ఆరు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐవేర్ రిటైల్ సంస్థ లెన్స్కార్ట్ సొల్యూషన్స్, వేక్ఫిట్ ఇన్నోవేషన్స్, టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియా, కార్డీలియా క్రూయిజెస్ నిర్వహణ సంస్థ వాటర్వేస్ లీజర్ టూరిజం, కాటన్ యార్న్ల తయారీ కంపెనీ శ్రీరామ్ ట్విస్టెక్స్, ఇండ్రస్టియల్ ల్యామినేట్స్ ఉత్పత్తి చేసే లామ్టఫ్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి సుమారు రూ. 6,500 కోట్లు పైగా సమీకరించవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్–జూలై మధ్య ఈ ఆరు కంపెనీలు దరఖాస్తు చేసుకోగా, సెపె్టంబర్ 26 – అక్టోబర్ 3 మధ్య అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. 2025లో 80 కంపెనీలు ఇప్పటికే ఐపీవోల ద్వారా నిధులు సమీకరించుకోగా, ఈ నెలలో మరిన్ని సంస్థలు లైనులో ఉన్నాయి.లెన్స్కార్ట్తాజాగా షేర్ల జారీ ద్వారా లెన్స్కార్ట్ సొల్యూషన్స్ రూ. 2,150 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 13.22 కోట్ల షేర్లు విక్రయించనున్నారు. ఐపీవో నిధులను కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు, స్టోర్ల లీజులు–అద్దెలు మొదలైన వాటి చెల్లింపులకు, టెక్నాలజీ–క్లౌడ్ ఇన్ఫ్రాపై ఇన్వెస్ట్ చేసేందుకు, బ్రాండ్ మార్కెటింగ్కు, ఇతర సంస్థ కొనుగోలుకు, ఇతరత్రా సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. వేక్ఫిట్ ఇన్నోవేషన్స్రూ. 468.2 కోట్ల వరకు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రస్తుత వాటాదారులు 5.84 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే నిధుల్లో రూ. 82 కోట్లను 117 కంపెనీ ఆపరేటెడ్ కంపెనీ ఓన్డ్ (కోకో)–రెగ్యులర్ స్టోర్స్, ఒక కోకో–జంబో స్టోర్ ఏర్పాటుకు; కొత్త పరికరాల కొనుగోలుకు రూ. 15.4 కోట్లు; ప్రస్తుత స్టోర్ల లీజులు, అద్దెల కోసం రూ. 145 కోట్లు; మార్కెటింగ్ కోసం రూ. 108 కోట్లను కంపెనీ వినియోగించుకోనుంది.టెనెకో క్లీన్ ఎయిర్ ఇండియాఇష్యూ ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ టెనెకో మారిషస్ హోల్డింగ్స్ ఈ షేర్లను విక్రయించనుంది. వాటర్వేస్ లీజర్ టూరిజంకొత్తగా షేర్లను జారీ చేయడం ద్వారా రూ.727 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 552.53 కోట్లను తమ అనుబంధ సంస్థ బేక్రూయిజ్ షిప్పింగ్ అండ్ లీజింగ్కి సంబంధించిన అడ్వాన్స్లు, లీజులు మొదలైన వాటిని చెల్లించేందుకు, మిగతా మొత్తాన్ని కార్పొరేట్ అవసరాలకు కంపెనీ ఉపయోగించుకోనుంది. శ్రీరామ్ ట్విస్టెక్స్1.06 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఈ నిధులను సొంత అవసరాల కోసం 6.1 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు, 4.2 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంటు ఏర్పాటు కోసం; అలాగే రుణాల చెల్లింపు, ఇతరత్రా నిర్వహణ మూలధన అవసరాల కోసం వినియోగించుకోనుంది.లామ్టఫ్కొత్తగా 1 కోటి షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు 20 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు. తెలంగాణలో తమకున్న తయారీ ప్లాంటు విస్తరణకు, నిర్వహణ మూలధనం, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం నిధులను కంపెనీ ఉపయోగించుకుంటుంది.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
సోషల్ మీడియాలో మోసపూరిత కంటెంట్ తొలగింపు
సోషల్ మీడియా వేదికలపై ఇన్వెస్టర్లను మోసగించే చట్టవిరుద్ధమైన కంటెంట్ను గత 18 నెలల్లో లక్షకు పైగా తొలగించినట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మోసగాళ్ల బారి నుంచి ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. చట్టవిరుద్ధమైన కంటెంట్ విషయాన్ని గూగుల్, మెటా తదితర ప్లాట్ఫామ్ల దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.ఎన్ఎస్ఈలో ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ల అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మోసపూరిత కంటెంట్ను గుర్తించడంతో టెక్నాలజీ సాయపడుతున్నట్టు తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లపై కేవలం 36 శాతం మందికే అధికంగా లేక మోస్తరు అవగాహన ఉందన్న ఇటీవలి సర్వే ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఈ పరిస్థితుల్లో మోసపూరిత కంటెంట్ మెజారిటీ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే అవకాశం లేకపోలేదన్నారు.‘విశ్వాసం దెబ్బతింటే అప్పుడు ఆర్థిక వ్యవస్థకు చోదకం కుంటుపడుతుంది. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు వెనకాడతారు’అని పాండే పేర్కొన్నారు. అందుకే ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడం సెబీకి కీలక ప్రాధాన్యంగా తెలిపారు. ఈ దిశగా ఎన్నో చర్యలు చేపట్టినట్టు చెప్పారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
లలితా జ్యువెల్లరి ఐపీవోకి సెబీ ఓకే
హైదరాబాద్: లలితా జ్యువెల్లరి మార్ట్ ప్రతిపాదిత ఇనీషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,700 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,014.50 కోట్లను కొత్త స్టోర్స్ ఏర్పాటుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 1985లో చెన్నై టీ నగర్లో తొలి స్టోర్ ప్రారంభించిన లలితా జ్యువెల్లరి దక్షిణాదిలో 56 స్టోర్లతో విస్తరించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 6 స్టోర్స్ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,316.80 కోట్లుగా ఉన్న ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,788 కోట్లకు చేరగా లాభం రూ. 238.3 కోట్ల నుంచి రూ. 359.8 కోట్లకు చేరింది. -
‘దీపావళి’ పర్యాటక కళ!
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణ బుకింగ్లకు డిమాండ్ నెలకొంది. దేశీయంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులతో పండుగ సంబరాలు చేసుకునేందుకు.. దేశ, విదేశాల్లోని సుందర ప్రదేశాలు చూసి వచ్చేందుకు.. ఇలా అన్ని రకాల ట్రావెల్ బుకింగ్లకు డిమాండ్ ఏర్పడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బంధు మిత్రులను కలుసుకోవడం పడుగల సీజన్లో ప్రయాణాలకు కీలక డిమాండ్గా ఉన్నట్టు మేక్మై ట్రిప్ కో ఫౌండర్, గ్రూప్ సీఈవో రాజేష్ మాగోవ్ తెలిపారు. ఈ సమయంలో వేడుకల కోసం స్వస్థలాలకు వెళుతుంటారని చెప్పారు. అత్యధికంగా బుకింగ్లు జరిగిన టాప్–10 ప్రదేశాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయంటూ.. పుణ్యక్షేత్రాలకు సైతం డిమాండ్ పెరిగినట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చూస్తే యూఏఈ, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాంకు బుకింగ్లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా కొత్త ప్రదేశాలకు చూసి వచ్చేందుకు ఆసక్తి పెరుగుతోందని థామస్ కుక్ (ఇండియా) ప్రెసిడెంట్ రాజీవ్ కాలే సైతం తెలిపారు. ‘‘ఒక్కొక్కరు పర్యటన కోసం చేసే సగటు వ్యయం పెరుగుతుండడం ఆసక్తికరం. ప్రయాణికులు ఎక్కువ రోజులు బస చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా కనిపించే మూడు రోజులకు బదులు 6–12 రోజులకు బుక్ చేసుకుంటున్నారు’’అని తెలిపారు. యూరప్లో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆ్రస్టియా, స్పెయిన్, పోర్చుగల్ ప్రధాన బుకింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. స్వల్పకాలం కోసం వియత్నాం, ఒమన్, మాల్దీవులు, బాలి, కంబోడియాకు డిమాండ్ నెలకొన్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. వీసా పరంగా సులభ ప్రవేశానికి అవకాశం ఉన్న థాయ్లాండ్, మలేషియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, దుబాయి–అబుదాబి, ఇండోనేíÙయా, ఫిలిప్పీన్స్కు ఎప్పటి మాదిరే డిమాండ్ కనిపిస్తున్నట్టు చెప్పారు. వారణాసికి డిమాండ్.. దేశీయంగా కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, అండమాన్తోపాటు ఆధ్యాత్మిక కేంద్రాలైన చార్ధామ్, కైలాస్ మానససరోవర్, అయోధ్య, వారణాసి వెళ్లొచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. ఈ దీపావళి సందర్భంగా ఫ్లయిట్ బుకింగ్లు పెరిగినట్టు ఇక్సిగో గ్రూప్ సీఈవో అలోకే బాజ్పాయ్ తెలిపారు. గతేడాదితో పోల్చి చూస్తే 60–65 శాతం డిమాండ్ పెరిగినట్టు చెప్పారు. ముఖ్యంగా అయోధ్య, వారణాసికి బుకింగ్లు 100 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు. జెనరేషన్ జెడ్, దంపతులు అయితే క్రూయిజ్ బుకింగ్లు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. ఈ దీపావళి సీజన్కు ముందు 4, 5 స్టార్ హోటళ్లలో బుకింగ్లు గణనీయంగా పెరిగినట్టు, ముఖ్యంగా 5 స్టార్ కోసం రెండు రెట్లు అధికంగా బుకింగ్లు వస్తున్నట్టు క్లియర్ట్రిప్ అధికార ప్రతినిధి సైతం తెలిపారు. పండుగలకు ముందు నాటితో పోల్చి చూస్తే ఫ్లయిట్ బుకింగ్ రెండు రెట్లు, హోటల్ బుకింగ్లు 3.5 రెట్లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. -
త్వరలో పెట్రోల్ వాహనాల రేట్లకి ఈవీలు
న్యూఢిల్లీ: వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రేట్లు కూడా పెట్రోల్ వాహనాల ధరల స్థాయిలో లభించగలవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటమనేది ఆర్థికంగా భారం కావడంతో పాటు పర్యావరణంపరంగాను ప్రతికూల పరిణామాలకు దారి తీస్తోందన్నారు. ఏటా ఇంధన దిగుమతులపై రూ. 22 లక్షల కోట్లు వెచి్చంచాల్సి వస్తోందని 20వ ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. అయిదేళ్లలోగా భారత్ను ప్రపంచంలోనే నంబర్ వన్ ఆటోమొబైల్ పరిశ్రమగా నిలపాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ‘నేను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్లకు చేరింది‘ అని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ అగ్రస్థానంలోను, రూ. 47 లక్షల కోట్ల పరిమాణంతో చైనా తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. మరోవైపు, దేశ పురోగతికి స్వచ్ఛ ఇంధనాల వినియోగం చాలా కీలకమని మంత్రి వివరించారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేయడం వల్ల రైతులకు అదనంగా రూ. 45,000 కోట్ల మేర ఆదాయం వచి్చందని పేర్కొన్నారు. ఇక 2027 నాటికల్లా ఘనవ్యర్ధాలను రహదారుల నిర్మాణంలో వినియోగించే ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి చెప్పారు. ఉన్నత విద్యాభ్యాసం, నైపుణ్యాలను పెంచుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. -
పసిడి హైజంప్!
న్యూఢిల్లీ: బంగారం ధర మరో రికార్డు గరిష్టానికి చేరింది. ఒక్క రోజే 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,700 ఎగిసి, ఢిల్లీ మార్కెట్లో సోమవారం రూ.1,23,300 సరికొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. వెండి సైతం కిలోకి రూ.7,400 పెరిగి మరో నూతన జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,57,400కు చేరింది. ముఖ్యంగా డాలర్తో రూపాయి బలహీనపడడం బంగారం ధరలకు ఆజ్యం పోసినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘బంగారం ధరలు సోమవారం నూతన ఆల్టైమ్ గరిష్టానికి చేరాయి. రికార్డు స్థాయి ధరల్లోనూ ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. బలమైన సానుకూల ధోరణితో బులియన్ ధరలు మరింత పెరుగుతాయన్నది వారి అంచనా. అమెరికా ప్రభుత్వం ఎక్కువ రోజుల పాటు షట్డౌన్ కావడం ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందన్న ఆందోళనలు సైతం తాజా డిమాండ్కు తోడయ్యాయి’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్కు 85 డాలర్లు ఎగసి 3,994 డాలర్లకు కొత్త రికార్డును తాకింది. వెండి ఔన్స్కు 1% పెరిగి 48.75 డాలర్ల స్థాయిని తాకింది. ‘యూఎస్ ప్రభుత్వం షట్డౌన్ ఆరో రోజుకు చేరుకుంది. దీంతో బంగారం సరికొత్త గరిష్టాలను చేరింది’ అని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కేనత్ చైన్వాలా తెలిపారు. నాన్ స్టాప్ ర్యాలీ...ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఇప్పటి వరకు ఆగకుండా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. 2024 డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో రూ.78,950 వద్ద ఉంది. అక్కడి నుంచి చూస్తే నికరంగా రూ.44,350 పెరిగింది. వెండి ధర సైతం ఈ ఏడాది ఇప్పటి వరకు 75 శాతం ర్యాలీ (కిలోకి నికరంగా రూ.67,700) చేసింది. గత డిసెంబర్ చివరికి కిలో ధర రూ.89,700 వద్ద ఉండడం గమనార్హం. ‘‘2025సంవత్సరం ఎన్నో అనిశ్చితులకు కేంద్రంగా ఉంది. మొదట రాజకీయ ఉద్రిక్తతలు, ఆ తర్వాత సుంకాల పరమైన అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, రేట్ల కోతపై అస్పష్టత, ఇప్పుడు యూఎస్ ప్రభుత్వం షట్డౌన్. వీటన్నింటితో సురక్షిత సాధనమైన బులియన్ ధరలు ఈ ఏడాది దూసుకెళ్లాయి. డాలర్ బలహీనత, సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తుండడం, గోల్డ్ ఈటీఎఫ్లకు పెరుగుతున్న డిమాండ్, హెడ్జింగ్ సాధనంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం డిమాండ్ పెరగడం ధరల ర్యాలీకి కారణం. -
ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
చదువుకుని ఒక డిగ్రీ తెచ్చుకుంటే.. వెంటనే ఉద్యోగంలో చేరిపోవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు త్వరగా లభిస్తాయని చెప్పలేమని లింక్డ్ఇన్ సీఈఓ 'ర్యాన్ రోస్లాన్స్కీ' (Ryan Roslansky) పేర్కొన్నారు.పరుగులు పెడుతున్న పోటీ ప్రపంచంలో కేవలం ఒక కాలేజీ డిగ్రీ సరిపోదు. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చాలా నేర్చుకోవాల్సి ఉందని.. గత వారం కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ర్యాన్ రోస్లాన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.మార్పు అనేది చాలా ఉత్తేజకరమైన విషయం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగ భవిష్యత్తు ఇకపై ఫ్యాన్సీ డిగ్రీలు ఉన్నవారికి లేదా మంచి కాలేజీలో చదువుకున్న వారికి మాత్రమే చెందదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అలోచించి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఉద్యోగాలు లభిస్తాయని నా అంచనా అని అన్నారు.ఏఐ మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తుందనే విషయాన్ని నేను నమ్మనని ర్యాన్ రోస్లాన్స్కీ అన్నారు. అయితే కమ్యునికేషన్, ఎవరితో అయినా మాట్లాడగలగడం వంటివి నేర్చుకోవాలి. స్కిల్స్ ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్న ఏ పనిలోనైనా విజయం సాధించడానికి అవి చాలా కీలకం అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?ఏఐ గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏఐ నైపుణ్యాలు ఉన్న వ్యక్తికే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంటే ఉద్యోగం కోసం ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోంది. నిపుణులు నిరంతరం తమను తాము అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూనే ఉన్నారని ర్యాన్ రోస్లాన్స్కీ చెప్పారు. -
ఇండియన్ ఆయిల్ డైరెక్టర్గా సౌమిత్ర పి శ్రీవాస్తవ
ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ డైరెక్టర్గా.. సౌమిత్ర పి శ్రీవాస్తవ (Saumitra P Srivastava) బాధ్యతలు స్వీకరించారు. కంపెనీలో సుమారు 30ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈయన.. ఐఐటీ రూర్కెలా నుంచి సివిల్ ఇంజినీరింగ్, ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.ఎల్పీజీ వ్యాపార విభాగంలో నాలుగేళ్ల పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఆయిల్ సంస్థలో చేరిన.. సౌమిత్ర పి శ్రీవాస్తవ సేల్స్ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో వ్యాపార విస్తరణకు కీలకంగా మారారు. ఈయనకు ముంబై, ఢిల్లీ డివిజన్ కార్యాలయాలను నడిపిన అనుభవం కూడా ఉంది. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా సేల్స్ విభాగంలో పనిచేశారు. మహారాష్ట్ర, గోవా హెడ్ ఆఫ్ స్టేట్గా పనిచేసిన సమయంలో.. ప్రధాన ఉత్పత్తులు, వ్యాపారాలను ఈయన విజయవంతంగా నిర్వహించారు. -
టిమ్ కుక్ తరువాత యాపిల్ సీఈఓ ఎవరు?
టిమ్ కుక్ (Tim Cook)కు వచ్చే ఏడాదికి 65 ఏళ్లు నిండుతాయి. 2011లో యాపిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఈయన కంపెనీ నుంచి నిష్క్రమించిన తరువాత.. అతని స్థానంలో ఎవరు రావచ్చనే దానిపై ఇప్పటికే చర్చ మొదలైపోయింది. టెక్ ప్రపంచంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న పెద్ద ప్రశ్న ఇదే!.గత కొన్ని సంవత్సరాలుగా.. యాపిల్ కంపెనీ నుంచి ఎంతోమంది ఉన్నత స్థాయి ఉద్యోగులు వైదొలిగారు. ఈ జాబితాలో డిజైన్ చీఫ్ జోనీ ఐవ్, రిటైల్ హెడ్ ఏంజెలా అహ్రెండ్ట్స్, సీఎఫ్ఓ లూకా మాస్ట్రీ, సీఓఓ జెఫ్ విలియమ్స్ ఉన్నారు. వీరు కంపెనీ నుంచి వైదొలిగినప్పుడు ఇంత పెద్ద చర్చ జరగలేదు. కానీ టిమ్ కుక్ నిష్క్రమణ తప్పకుండా చర్చనీయాంశమే. ఎందుకంటే.. ఆయన స్థానాన్ని పొందే వ్యక్తి యాపిక్ సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అంతటి వ్యక్తి 'జాన్ టర్నస్' అని వినిపిస్తోంది.జాన్ టర్నస్.. యాపిల్ కంపెనీలో హార్డ్వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్. ఆయన దాదాపు 24 సంవత్సరాలుగా యాపిల్లో ఉంటూ.. కీలక పదవులను చేపట్టారు. ఈయన వ్యూహాలు కూడా హార్డ్వేర్ పాత్రకు మించి ఉంటాయి. ప్రస్తుతం ఈయన వయసు 50 ఏళ్లు. యాపిల్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పుడు టిక్ కుక్ వయసు 50 సంవత్సరాలే.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?జాన్ టర్నస్కు టిమ్ కుక్ దగ్గర మంచి పేరు ఉంది. ఈయన యాపిల్ మొట్టమొదటి కొత్త ఐఫోన్ ఫారమ్ ఫ్యాక్టర్ అయిన ఐఫోన్ ఎయిర్ను పరిచయం చేశారు. ఈయన ఐఫోన్ 17 లాంచ్ సందర్భంగా లండన్లోని యాపిల్ రీజెంట్ స్ట్రీట్ స్టోర్లో కస్టమర్లను కూడా పలకరించారు. ఇలాంటి కారణాల వల్ల కుక్ స్వయంగా అతన్ని ఎక్కువగా విశ్వసిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతాయి. అయితే సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగే అంశం గురించి టిమ్ కుక్ ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన చేయలేదు. -
హైదరాబాద్లో ప్రారంభమైన రీఫర్ రైలు సర్వీస్
ఇండియా ఫార్మాస్యూటికల్ లాజిస్టిక్స్ను ప్రోత్సహించడంలో భాగంగా.. డీపీ వరల్డ్, హైదరాబాద్లో మొట్టమొదటి స్పెషల్ రీఫర్ రైలు (Reefer Rail)ను ప్రారంభించింది. తిమ్మాపూర్ (Thimmapur) నుంచి నవా షెవా (Nhava Sheva) మధ్య దీని సేవలను అందిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తరలించాల్సిన వస్తువులను.. ఈ రీఫర్ రైలు ద్వారా సరఫరా చేస్తారు. ఫార్మా ఎగుమతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.వారానికి ఒకసారి మాత్రమే ప్రయాణించే ఈ రైలులో 43 రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లు ఉంటాయి. ఇది నెలకు నాలుగుసార్లు ప్రయాణిస్తుంది. స్పెషల్ ట్రైన్ ప్రారంభించడం వల్ల.. 43 ట్రక్కుల అవసరం తగ్గడం మాత్రమే కాకుండా.. రోడ్డుపై రద్దీ కూడా కొంత తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు కూడా 70 శాతం వరకు తగ్గుతాయి.ప్రతి కంటైనర్ ఖచ్చితమైన ఉష్ణోగ్రతను కలిగి ఉండటం కోసం.. కావలసిన ఏర్పాట్లను చేశారు. సాంకేతిక నిపుణులు దీనిని పర్యక్షిస్తూ ఉంటారు. కాబట్టి దీని ద్వారా వస్తువులను సురక్షితంగా గమ్యం చేర్చవచ్చు. -
బస్సులకు డిజిటల్ పాస్లు.. యాప్లో బుకింగ్
హైదరాబాద్: తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ మరింత స్మార్ట్గా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) విభాగం నిర్వహిస్తున్న ‘మీటికెట్’ యాప్ ద్వారా త్వరలో టీజీఆర్టీసీ ఇంటర్సిటీ బస్సు సేవలు & క్యూ ఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్లు అందుబాటులోకి రానున్నాయి.స్టేట్ స్మార్ట్ మొబిలిటీ ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ విస్తరణతో ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించనుంది. ఇక నుంచి బస్సు టికెట్లు, నెలవారీ పాస్లు మొబైల్లోనే పొందవచ్చు. 2025 జనవరి 9న ప్రారంభమైన మీటికెట్ యాప్ ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటి వరకు 1.35 లక్షల డౌన్లోడ్లు, 2.6 లక్షల టికెట్ బుకింగ్స్, రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. యాప్ రేటింగ్ 3.5కు పైగా ఉండగా, ప్రస్తుతం 221 ప్రదేశాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో, 123 పార్కులు, 16 దేవాలయాలు, ఆరు మ్యూజియాలు, ఖుత్బ్ షాహీ సమాధులు వంటి ప్రదేశాలు ఈ సేవల్లో ఉన్నాయి.టీజీఆర్టీసీ సేవలు చేర్చడంతో ఇకపై సాధారణ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఎసీ), పుష్పక్ ఎసీ బస్సులకు కూడా డిజిటల్గా టికెట్లు, పాస్లు పొందవచ్చు. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు వంటి ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా చెల్లింపు చేసుకోవచ్చు. దీంతో క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు.ప్రస్తుతం మీటికెట్ పరిధిలో 98 అటవీ ప్రదేశాలు, 52 పర్యాటక బోటింగ్ సెంటర్లు, 16 దేవాదాయ శాఖ దేవాలయాలు, 9 వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం, గాంధీ సెంటెనరీ మ్యూజియం వంటి ప్రదేశాలను కూడా ఈ యాప్లో చేర్చారు. పర్యాటకులు, స్థానికులకు ఇది సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు. టీజీఆర్టీసీ సేవల అధికారిక ప్రారంభ తేదీ త్వరలో ప్రకటించనున్నట్లు ఈఎస్డీ విభాగం వెల్లడించింది. ఇది రాష్ట్రంలో పౌర సౌకర్యాలను పెంచుతూ, డిజిటల్ గవర్నెన్స్ వైపు తెలంగాణ మరో ముందడుగు అని అధికారులు పేర్కొన్నారు. -
5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఏథర్ మైలురాయి
బెంగళూరు: దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ వాహన ఉత్పత్తిలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. తమిళనాడులోని హోసూర్లో ఉన్న తమ తయారీ ప్లాంట్ నుండి 5 లక్షలవ వాహనాన్ని రోల్-అవుట్ చేయడం ద్వారా ఒక ముఖ్యమైన ఉత్పత్తి మైలురాయిని సాధించినట్లు ఏథర్ ప్రకటించింది. ఈ మైలురాయి వాహనం ఏథర్ ఫ్లాగ్షిప్ ఫ్యామిలీ స్కూటర్ రిజ్టా.“5,00,000 స్కూటర్లను అధిగమించడం ఏథర్కు ఒక ప్రధాన మైలురాయి. మా మొట్టమొదటి ప్రోటోటైప్ నుండి నేటి వరకు, మా ప్రయాణం కేవలం వాహనాలను నిర్మించడం మాత్రమే కాదు, స్కేలబుల్, నమ్మకమైన, స్థిరమైన తయారీ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించింది” అని ఏథర్ ఎనర్జీ సహ-వ్యవస్థాపకుడు, సీటీవో స్వప్నిల్ జైన్ పేర్కొన్నారు.ఏథర్ ప్రస్తుతం తమిళనాడులోని హోసూర్లో రెండు తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఒకటి వాహన అసెంబ్లీ కోసం, మరొకటి బ్యాటరీ ఉత్పత్తి కోసం. హోసూర్ ప్లాంట్ సంవత్సరానికి 4,20,000 స్కూటర్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, ఏథర్ తన మూడవ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో ఏర్పాటు చేస్తోంది. -
ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?
రిలయన్స్ చైర్మన్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరులలో ఒకరు. ఈయన సంపద కొన్ని చిన్న దేశాల జీడీపీ(GDP)ల కంటే ఎక్కువ. ఇంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు తన పర్సులో ఎంత డబ్బు పెట్టుకుంటారో బహుశా ఎవరికీ తెలిసి ఉండదు. అయితే దీనికి అంబానీ సమాధానం ఇచ్చారు.ముకేశ్ అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇందులో భాగంగానే.. వీరు ఖరీదైన ఇంట్లో నివసించడం, అత్యంత లగ్జరీ కార్లను తమ రోజువారీ వినియోగిస్తుండటం వంటివి జరుగుతున్నాయి. నీతా అంబానీ, ఆమె కుమార్తె ఇషా కూడా విలువైన ఆభరణాలు ధరించడం.. అనంత్ అంబానీ బ్రాండెడ్ గడియారాలు ధరించిన సన్నివేశాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ముఖేష్ అంబానీ మాత్రం.. ఎక్కువగా సాధారణ దుస్తులు ధరించి, ఫార్మల్ ప్యాంటుతో కనిపిస్తారు.డబ్బు ఒక వనరు మాత్రమేముకేశ్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు, డబ్బు కేవలం ఒక వనరు మాత్రమే అని వెల్లడించారు. నేను ఎప్పుడూ పర్సులో నగదు లేదా క్రెడిట్ కార్డులను తీసుకెళ్లనని స్వయంగా వెల్లడించారు. అయితే బిల్లులు చెల్లించడానికి ఎల్లప్పుడూ నాతో ఎవరైనా ఉంటారని పేర్కొన్నారు. తాను స్కూల్, కాలేజీ రోజుల్లో కూడా ఎప్పుడూ తనతో డబ్బు తీసుకెళ్లలేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!బిరుదులు ఇష్టం ఉండదుమీడియా లేదా ఏదైనా ప్రత్యేక వార్తాపత్రిక తనను ఏదైనా బిరుదుతో సత్కరించడం తనకు ఇష్టం ఉండదని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రపంచ ధనవంతులలో ఒకరైన ఈయన.. తన వ్యక్తిగత జీవితంలో చాలా నిశ్చింతగా ఉండటానికి ఇష్టపడతారని వీటిని బట్టి చూస్తే అర్థమవుతుంది. అతను సరళమైన జీవనశైలిని ఆస్వాదిస్తాఋ, ఉదయాన్నే నిద్రలేవడం.. ఎక్కడికీ వెళ్ళే ముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. -
కొత్త రకాల వీసాలను ప్రకటించిన యూఏఈ
ప్రపంచ ప్రతిభను ఆకర్షించడానికి, పర్యాటకాన్ని పెంచడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించింది. రెసిడెన్సీ వ్యవస్థలోనూ మార్పులు చేసింది. వీటిలో ఏఐ, ఎంటర్టైన్మెంట్, ఈవెంట్, క్రూయిజ్ టూరిజం కోసం నాలుగు కొత్త వీసా (New Visa) కేటగిరీలు ఉన్నాయి.అంతే కాకుండా, వ్యాపార, ట్రక్ డ్రైవర్ వీసాలకు సంబంధించి కూడా మార్పులు చేశారు. మానవతా సహాయం, వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, నివాసితుల బంధువులు, స్నేహితులకు కూడా రెసిడెన్సీ అవకాశం కల్పిస్తున్నారు.నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలు ఇవే..ఏఐ స్పెషలిస్ట్ వీసా: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని నిపుణుల కోసం ఉద్దేశించినది. ఇందు కోసం టెక్ ఫోకస్డ్ కంపెనీ నుంచి స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది. ఒకటి లేదా ఎక్కువ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ వీసా: కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ సెక్టార్ లోని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వీసా ఇది. విశ్రాంతి లేదా ప్రదర్శన నిమిత్తం వచ్చే ప్రముఖులకు దీన్ని కేటాయిస్తారు.ఈవెంట్ వీసా: పండుగలు, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్సులకు హాజరయ్యేవారికి ఈ ఈవెంట్ వీసాలు జారీ చేస్తారు. అయితే వీటిని ఈవెంట్ నిర్వాహకులచే స్పాన్సర్ చేయాలి.క్రూయిజ్ టూరిజం వీసా: క్రూయిజ్ ట్రావెలర్లకు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇది. లైసెన్స్ పొందిన మారిటైమ్ సంస్థల ద్వారా స్పాన్సర్ చేస్తారు.రెసిడెన్సీ, ఇతర వీసా అప్డేట్లుహ్యుమానిటేరియన్ రెసిడెన్స్ పర్మిట్: సంక్షోభ పరిస్థితుల నుంచి వచ్చే వ్యక్తులకు ఒక సంవత్సరం పునరుద్ధరించతగిన వీసా.స్నేహితులు, బంధువుల కోసం విజిట్ వీసా: నివాసితులు తమ బంధువులకు దీన్ని స్పాన్సర్ చేయవచ్చు.ట్రక్ డ్రైవర్ వీసా: లాజిస్టిక్స్ లో కార్మిక కొరతను పరిష్కరించే వీసా. లైసెన్స్ పొందిన కంపెనీల ద్వారా స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది.వితంతువులు, విడాకులకు రెసిడెన్సీ: నిర్వచించిన పరిస్థితులలో ఒక సంవత్సరం పునరుద్ధరణ అనుమతి.బిజినెస్ ఎక్స్ ప్లోరేషన్ వీసా: బిజినెస్ ప్రారంభించేందుకు వచ్చే ఆర్థిక సాల్వెన్సీ రుజువు ఉన్న వ్యాపారవేత్తలకు జారీ చేస్తారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైం దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 582.95 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 81,790.12 వద్ద.. నిఫ్టీ 183.40 పాయింట్లు లేదా 0.74 శాతం లాభంతో 25,077.65 వద్ద నిలిచాయి.అట్లాంటా, ఇండ్బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఏఏఏ టెక్నాలజీస్, ఓరియంట్ టెక్నాలజీస్, తారా చంద్ ఇన్ఫ్రాలాజిస్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సిగ్మా సాల్వ్, హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా, సైబర్టెక్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్, మాస్టర్ ట్రస్ట్, ప్రోజోన్ రియాల్టీ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జాయింట్ డెవలప్ అగ్రిమెంట్లు.. జాగ్రత్తలు
జాయింట్ డెవలప్ అంటే మీకు బాగా తెలుసు.. ఒక ఓనర్, ఒక డెవలపర్, వారి మధ్య అగ్రిమెంటు. అపార్ట్మెంట్లు ఎన్ని కడతారు, వాటిని ఎలా పంచుకోవాలిలాంటి మిగతా విషయాలతో కూడుకున్న ఒక అగ్రిమెంటు.ఒకప్పుడు ఇలా ఒప్పందంపై సంతకం పెట్టగానే ఓనర్ నెత్తి మీద బాంబు పడేది. ఏ రోజు సంతకం పెట్టారో ఆ రోజునే ఆ ల్యాండ్ బదిలీ అయినట్లు లెక్క. డెవలపర్ పని మొదలుపెట్టకపోయినా, మొదలుపెట్టి పూర్తి చేయకపోయినా, పూర్తి చేసి ఓనర్కి వారి వంతు అపార్ట్మెంట్లు ఇవ్వకపోయినా, డబ్బులు చేతికి రాకపోయినా కూడా.. పన్ను భారం మాత్రం విధించే వారు. ఇది అశనిపాతంలాంటిది. ఏదో శాపవిమోచనంలాగా 2017 సంవత్సర శుభవేళ, చట్టంలో (అధికారులు చూడటంలో) మార్పు వచ్చింది.ఇక నుంచి అగ్రిమెంటు రోజు కాదు, డెవలపర్ అపార్టుమెంట్ను పూర్తి చేసి, కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ చేసిన నాడు పన్ను భారం ఏర్పడుతుంది. ప్రతిఫలం ఎంత అంటే, ల్యాండ్ ఓనర్కి ఇచ్చిన షేరు, స్టాంప్ డ్యూటీ విలువ, అదనంగా ఇచ్చిన నగదు. ఈ కథ సజావుగా సాగుతోంది. అందరూ బాగున్నారు. కానీ అధికారులకు ఇందులో కొన్ని లొసుగులు కనిపించాయి. కొన్ని మోసాలు బైటపడ్డాయి. వేల్యుయేషన్లలో అవకతవకలు కనిపించాయి. వివిధ రకాల వేల్యుయేషన్, అస్థిరమైన అంకెలు, చాలా సందర్భాల్లో అండర్ వేల్యుయేషన్, కొన్ని చోట్ల అండర్ రిపోర్టింగ్.. వెరసి మతలబుల గారడీ అయ్యింది.2014 సంవత్సరంలో జారీ చేసిన ఉత్తరం (ఉత్తర్వులాంటిది) ప్రకారం 2021–22, 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో జారీ చేసిన ఆక్యుపెన్సీ–కమ్–కంప్లీషన్ సరి్టఫికెట్లను రివ్యూ చేయాలన్నారు. ఆ డేటాని డిపార్టుమెంటు వాళ్లకు దాఖలు చేసిన డాక్యుమెంట్లు/సమాచారంతో సమన్వయం చేయాలన్నారు. ఈ విషయంలో కలకత్తా అధికారులు ఒక సరైన, సమర్ధవంతమైన, సమగ్రమైన పద్ధతి ఫాలో అయ్యారు.అదేమిటంటే..రెరా (ఆర్ఈఆర్ఏ), హిరా (హెచ్ఐఆర్ఏ)లాంటి ప్రభుత్వ సంస్థల అధికారిక వెబ్సైట్లలో సమాచారాన్ని తీసుకుని, సమన్వయం ద్వారా డేటాని సేకరించడంజాయింటు డెవలప్మెంటు అగ్రిమెంట్లో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించడం. ప్రాజెక్టు వివరాలు, కాగితాలు, అసలు ఎన్నింటికి అనుమతి లభించింది? ల్యాండ్ ఓనర్లు ఎవరు, డెవలపర్లు ఎవరు, ఏ సంవత్సరంలో, ఏ స్థాయిలో వర్క్ జరిగింది మొదలైన వివరాల పరీక్ష, సమీక్ష.సీపీసీ 2.0 పోర్టల్ ద్వారా రిటర్నుల్లో ఏయే సమాచారం ఉంది, రిటర్న్ ప్రకారం ఏయే ప్రాజెక్టులు పూర్తయ్యాయి మొదలైన వివరాలను క్రాస్ వెరిఫై చేయడం రిటర్నులో ఒక షెడ్యూలు క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించినది. అందులో పొందుపర్చిన వివరాల సేకరణ.అన్ని వివరాలు చేతిలో పడ్డాక, పిలక దొరికినట్లే. సమన్లు జారీ చేయడం, అస్సెసీలను పిలవడం, అన్ని వివరాలు రాబట్టుకోవడం, గుట్టు రట్టు చేయడం.దీనివల్ల రెవెన్యూపరంగా ఎన్నో సత్ఫలితాలు వచ్చాయి. వివరాలను వెల్లడించని ఎందరో బడాబాబులు చట్టాన్ని గౌరవించడం (విధి లేక) మొదలెట్టారు. దేశమంతటా కలకత్తా మోడల్ని ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానంగా మలిచారు. ఉత్తమ పద్ధతిగా తీర్చిదిద్దారు. స్పష్టమైన వైఖరి, డేటా ఆధారిత ఫ్రేమ్వర్క్, పారదర్శకత, దేశమంతటా ఒకే విధానం, గోప్యత పాటిస్తూ వివరాల సేకరణ.. ఇదీ లక్ష్యం.ఈమధ్యే, అంటే 2025 సెప్టెంబర్ 15న ఒక ఆఫీస్ మెమొరాండంను జారీ చేశారు. దీని లక్ష్యాలు రెండు..1. కాంప్లయెన్స్ (నిబంధనలను పాటించడం) జరగాలి2. పన్ను వసూళ్లు అస్సెస్సీలు ఇచ్చే సమాచారం మీద తక్కువగా ఆధారపడటమనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం.సూచన ఏమిటంటే: సరైన, సమగ్రమైన సమాచార సేకరణ కోసం రెరా అధికారులు, డెవలప్మెంట్ అధికారులను సంప్రదించాలి.వారు ఏం చేస్తారు: సమాచారాన్ని సేకరించి ఇన్వెస్టిగేషన్ అధికారులకు పంపుతారు. తేడా ఉంటే వారు తోలు తీస్తారు.చివరగా 2025 అక్టోబర్ 31లోగా ఈ సమాచారాన్ని సేకరించాలి. అధికారులు త్వరితగతిన పురోగతి చూపిస్తారు.ఏం చేయాలి: మీరు ఓనర్ అయినా డెవలపర్ అయినా జాగ్రత్త వహించాలి. ఇన్వెస్ట్మెంటుపరంగా డెవలపర్, క్యాపిటల్ గెయిన్స్పరంగా ఓనర్.. తగిన శ్రద్ధ పెట్టాలి. ఈ విషయంలో మీ నిజాయితీ, నీతే మీ స్థిరాస్థి! -
వాట్సప్కు పోటీగా అరట్టై.. 75 లక్షల డౌన్లోడ్స్!
భారతదేశపు ఐటీ కంపెనీ జోహో అభివృద్ధి చెందిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ 'అరట్టై'కు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ యాప్ శుక్రవారం నాటికి మొత్తం 75 లక్షల డౌన్లోడ్లను అధిగమించింది. అంటే అంతమంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారన్నమాట. దీన్ని బట్టి చూస్తే ఇది ఇటీవలి కాలంలో.. అతి తక్కువ కాలంలో ఎక్కువ డౌన్లోడ్స్ పొందిన యాప్లలో ఒకటిగా నిలిచింది.ఇప్పటి వరకు చాలామంది భారతీయులు.. మెటా యాజమాన్యంలోని వాట్సప్ను వినియోగిస్తున్నారు. అయితే ఇక దేశీయ యాప్ అరట్టైను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా నేను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నా అంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలు➤అరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.➤అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.➤అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!➤అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
ఆనంద్ మహీంద్రా ఫోన్లో కొత్త యాప్ డౌన్లోడ్
వాట్సాప్ మాదిరి దేశీయ కంపెనీ జోహో తయారు చేసిన ఆన్లైన్ కమ్యునికేషన్ యాప్ ‘అరట్టై’(Arattai)ని గర్వంగా డౌన్లోడ్ చేసినట్లు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఈ యాప్ మొదటిసారిగా 2021లో యాప్ స్టోర్లోకి ప్రవేశించింది. అయితే భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ మేడ్ ఇన్ ఇండియా యాప్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దేశీయ టెక్నాలజీ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడంలో తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. జోహో సంస్థ కొత్తగా రూపొందించిన చాట్, కాలింగ్ యాప్ అరట్టైకి ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మద్దతు ప్రకటించారు. ‘గర్వంగా అరట్టైను డౌన్లోడ్ చేశా’ అని ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. దీనికి యాప్ అధికారిక హ్యాండిల్ తక్షణమే స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అరట్టై ప్లాట్ఫామ్లోకి ఆయనను ఆహ్వానించింది.దీనిపై కంపెనీ చీఫ్ శ్రీధర్ వెంబు స్పందిస్తూ.. ‘నేను మా తెన్కాసి కార్యాలయంలో అరట్టై ఇంజినీర్లతో సమావేశంలో ఉన్నాను. యాప్కు మెరుగుదలలు చేస్తున్నాం. మా టీమ్లో ఒక సభ్యుడు ఈ ట్వీట్ను చూపించాడు. ధన్యవాదాలు @anandmahindra. మీ మద్దతు మాకు మరింత స్ఫూర్తినిచ్చింది’ అని ఎక్స్లో పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆనంద్ మహీంద్రా ‘మీ జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ప్రోత్సహించారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
హైదరాబాద్లో ఎలి లిల్లీ తయారీ కేంద్రం ఏర్పాటు
గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Company) భారతదేశంలో తయారీ కార్యకలాపాలను విస్తరించడానికి 1 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్లో మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ హబ్ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం భారతదేశం అంతటా కంపెనీ కాంట్రాక్ట్ తయారీ నెట్వర్క్ను పర్యవేక్షిస్తుంది.ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులను ప్రశంసించారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ ఆవిర్భవించడానికి సంకేతమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞానంతో మమేకమైన మౌలిక సదుపాయాలు, సులభతర వ్యాపారం (Ease of Doing Business) వంటి అంశాలు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి కీలకం అవుతున్నట్లు చెప్పారు.కంపెనీ ఏర్పాటు చేయబోయే అత్యాధునిక సదుపాయంలో ఇంజినీర్లు, రసాయన శాస్త్రవేత్తలు, ఇతర శాస్త్రవేత్తలు, నిపుణుల కోసం తక్షణమే నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్లో ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు బలాన్ని ఇస్తూ వినూత్న ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా లిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాట్రిక్ జాన్సన్ మాట్లాడుతూ..‘మా గ్లోబల్ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్రంగా భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. లిల్లీ డయాబెటిస్, ఊబకాయం, అల్జీమర్స్, క్యాన్సర్.. వంటి వాటికి ఔషధాలు తయారు చేస్తోంది. గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
రూ.2.5 లక్షలతో బుకింగ్: కేవలం 100మందికే ఈ కారు!
స్కోడా (Skoda) కంపెనీ భారతదేశంలో.. లాంచ్ చేయనున్న తన కొత్త 'ఆక్టావియా ఆర్ఎస్' (Octavia RS) కోసం బుకింగ్లను స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారు కోసం రూ. 2.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కారు అక్టోబర్ 17న లాంచ్ అయిన తరువాత.. నవంబర్ 6 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారును కంపెనీ.. కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీని ధరను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ధర రూ. 45 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?కంపెనీ తన కొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారును కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే.. దీనిని వందమంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కారు మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 216 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే కారు.. టాప్ స్పీడ్ 250 కిమీ/గం అని సమాచారం. -
దీపావళి ధమాకా.. ఐఫోన్పై రూ.55 వేల డిస్కౌంట్!
దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండూ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై అద్భుతమైన డిస్కౌంట్ డీల్స్ అందిస్తున్నాయి. పాత స్మార్ట్ ఫోన్ నుంచి ఐఫోన్కు అప్గ్రేడ్ కావాలనుకుంటున్నవారికి, ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్కు మారాలనుకుంటున్నవారికి ఇంతకంటే మంచి సమయం లేదు.ఐఫోన్ 16 ప్రో మాక్స్పై భారీ తగ్గింపుప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఉన్న స్టాండ్ అవుట్ ఆఫర్లలో ఐఫోన్ 16 ప్రో మాక్స్ డీల్ ఒకటి. ఇది ఇప్పటివరకు సంవత్సరంలో అతిపెద్ద తగ్గింపు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (256 జీబీ వేరియంట్) వాస్తవ ధర రూ .1,34,999 కాగా ఫ్లిప్కార్ట్ రూ .1,09,999 కు లిస్ట్ చేసింది. కస్టమర్లు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే రూ .5,000 వరకు తగ్గింపు పొందవచ్చు.అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఈఎంఐ కొనుగోళ్లపై రూ .4,000 వరకు తగ్గింపును అందుకోవచ్చు. అంతేకాదు.. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్లను ఎక్స్చేంజ్కి ఇచ్చి ఫోన్ కండీషన్ను బట్టి రూ.55,790 వరకు పొందవచ్చు. ఇలా అన్ని డిస్కౌంట్లను కలిపితే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనుగోలుపై రూ.35,000 నుంచి రూ.55,000 ఆదా చేయవచ్చు. ఈ ఆఫర్లు పరిమితమైనవి, లభ్యతకు లోబడి ఉంటాయని గమనించాలి.ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫీచర్లుడిజైన్: ప్రీమియం టైటానియం నలుపు, తెలుపు, నేచురల్, డిసెర్ట్ ఫినిషింగ్.డిస్ప్లే: 6.9-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ ఓఎల్ఈడీ, 120 హెర్ట్జ్ ప్రోమోషన్, హెచ్డీఆర్, ఆల్వేస్-ఆన్.పనితీరు: అధునాతన యాపిల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ ఇంజిన్ తో A18 ప్రో చిప్.కెమెరా: 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్, అల్ట్రా వైడ్, 5ఎక్స్ టెలిఫోటో, నైట్ మోడ్, మాక్రో, 4కే డాల్బీ విజన్.ఇతర స్పెసిఫికేషన్లు: ఫేస్ ఐడీ, యాపిల్ పే, ఐపీ 68 రేటింగ్, 5జీ, వైఫై 7, స్పేషియల్ ఆడియో, శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ ఎస్ఓఎస్. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆటో మోడ్లో!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 15 ఏళ్లుగా స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని, ప్రస్తుతం ఇతర అంశాల సహాకారం లేకుండా కూడా నిర్దిష్టమైన వృద్ధిని నమోదు చేసే ఆటో మోడ్లో ఉందని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO, నరెడ్కో) అధ్యక్షుడు మేకా విజయ సాయి తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నరెడ్కోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఆర్ఈడీఏ అని పిలిచేవారు. నరెడ్కో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రాపర్టీ షో వివరాలు తెలిపేందుకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేకా విజయ సాయి మాట్లాడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విస్తీర్ణం ఇప్పుడు ఏకంగా 1,28,000 చదరపు కిలోమీటర్ల వరకూ ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడి టారిఫ్లు, ఐటీ ఉద్యోగాల్లో అనిశ్చితి వంటివి ఒడిదుడుకులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఈ రంగం స్థిరమైన అభివృద్ధిని నమోదు చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రీజనల్ రింగ్ రోడ్డు వంటివి ఇందుకు దోహదపడతాయని అన్నారు. వృద్ధి విషయంలో హైదరాబాద్, ముంబైను దాటిపోయిందన్నారు. హైదరాబాద్లో భూమి అందుబాటులో ఉండటం, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటం ఇందుకు కారణమని తెలిపారు. గత ఏడాది జూలై సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్మకం ధరలు ఎనిమిది శాతం వరకూ పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ పెరుగుదల నాలుగు నుంచి 24 శాతం వరకూ ఉందన్నారు.ఐటీ అనిశ్చితి, ట్రంప్ విధానాలు ఒక రకంగా హైదరాబాద్ రియల్ ఎస్టే్ట్ రంగానికి ఉపయోగపడేవని అభిప్రాయపడ్డారు. అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి పెంచుకుంటున్నారని తెలిపారు.అమ్మకాలపై నెగటివ్ ప్రచారం..హైదరాబాద్లో లక్ష వరకూ రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడు పోకుండా ఉన్నాయని ఇటీవల వచ్చిన వార్తలను మేకా విజయ సాయి ఖండించారు. నగరంలో ఎన్ని యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి? ఎన్ని అమ్ముడుపోయాయి? ఎన్ని కాదు? అన్నది తెలుసుకునేందుకు తగిన శాస్త్రీయ సమాచారం ఏదీ అందుబాటులో లేదని తెలిపారు. ప్రభుత్వ సంస్థల నుంచి భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతుల ఆధారంగా కొందరు రియల్ ఎస్టేట్ యూనిట్లు అమ్ముడుపోవడం లేదన్న వార్తలు సృష్టించారని చెప్పారు. తమకున్న సమచారం మేరకు డెవలపర్లు స్థిరంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. నగరంలో అపార్ట్మెంట్ల ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో లేకుండా పోయాయన్న విమర్శకు ఆయన బదులిస్తూ.... 600 - 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన అపార్ట్మెంట్లు చాలా వరకూ అమ్ముడుపోవడం లేదని, దీన్నిబట్టి ప్రజలు మరింత విశాలమైన ఆపార్ట్మెంట్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోందని అన్నారు.ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్: కె.శ్రీధర్ రెడ్డినరెడ్కో 15వ ప్రాపర్టీ షో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుందని సంస్థ ప్రధాన కార్యదర్శి కె.శ్రీధర్ రెడ్డి తెలిపారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో 74 మంది బిల్డర్లు, డెవలపర్లు పాల్గొంటున్నారని తెలిపారు. వీరితోపాటు బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఆరు, సరఫరాదారులు ఐదుగురు, పర్యాటక రంగానికి చెందిన రెండు, భవన నిర్మాణ సామాగ్రీ, టెక్నాలజీలకు సంబంధించిన ఎనిమిది స్టాళ్లు ఏర్పాటు కానున్నాయని వివరించారు. ఈ ప్రదర్శనలో రియల్ ఎస్టేట్ యూనిట్ కొనుగోలుదారులు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజ్లో ప్రత్యేక రాయితీ అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నరెడ్కో ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్, కోశాధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..
భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ముందుంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% జీడీపీ వృద్ధిని సాధించింది. తయారీ, సేవల రంగాల్లో బలంగా ఉంది. అయితే దేశ సంపదకు మూలమైనవారు.. కంపెనీల వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు మాత్రం దేశాన్ని విడిచి వెళ్తున్నారు. తమ సంస్థలు భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్నా తాము విదేశాల్లో స్థిరపడేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు కొన్ని కారణాలను కోటక్-ఈవై సర్వే వెల్లడించింది.భారతదేశం అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుంటే దాని సంపద సృష్టికర్తలు ఎందుకు నిష్క్రమిస్తున్నారనే దానిపై కోటక్ ఈవై నివేదిక రూపొందించింది. భారతీయ ధనవంతులు విదేశాలకు వలస వెళ్లడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలిపింది.మెరుగైన జీవన నాణ్యత, మౌలిక సదుపాయాలుప్రపంచంలోని 50 అత్యంత కలుషితమైన నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి. ఇది సంపన్న కుటుంబాలను సింగపూర్, ఆస్ట్రేలియా, యూరప్ వంటి సురక్షితమైన, సుసంపన్నమైన జీవన వాతావరణానికి ప్రేరేపించేలా చేస్తుంది.ఆరోగ్య సంరక్షణ, విద్యా వ్యవస్థలుభారతదేశం జీడీపీలో ప్రజారోగ్యం కోసం కేవలం 2.1%, విద్య కోసం 2.9% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది ప్రపంచ ప్రమాణాలైన 6% కంటే చాలా తక్కువ. దీని కారణంగా ధనవంతులు మెరుగైన ప్రైవేట్ సేవలు, ప్రపంచ స్థాయి విద్య కోసం యూఎస్ఏ, యూకే లేదా కెనడా వైపు మొగ్గు చూపుతున్నారు.స్నేహపూర్వక పన్ను విధానాలు..భారత్లో 42.74% అధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉంది. దుబాయ్లో సున్నా పన్ను. పోర్చుగల్లో పదేళ్ల పన్ను మినహాయింపులు ఆకర్షణీయంగా తోస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో 52 మిలియన్లకు పైగా కోర్టు కేసులు పెండింగ్లో ఉండటం వలన పౌర వివాదాలు దశాబ్దాల పాటు సాగుతున్నాయి. ఇది వ్యాపారవేత్తలకు ఆమోదయోగ్యం కాని జాప్యాన్ని సూచిస్తుంది.విదేశాల్లోని భారతీయులుపేరుస్థూల విలువ (రూ.కోట్లలో)ప్రస్తుత ప్రదేశంగోపీచంద్ హిందూజా & ఫ్యామిలీ1,85,310లండన్లక్ష్మీ మిట్టల్1,75,390లండన్జే చౌదరి1,46,470శాన్ జోస్, అమెరికాఅనిల్ అగర్వాల్1,11,400లండన్షాపూర్ పల్లోంజీ మిస్త్రీ, కుటుంబం88,650మొనాకోప్రకాష్ లోహియా87,700లండన్వివేక్ చాంద్ సెహగల్57,060మెల్బోర్న్జయశ్రీ ఉల్లాల్50,170శాన్ ఫ్రాన్సిస్కోయూసఫ్ అలీ, ఎం.ఎ.46,300అబుదాబిరాకేష్ గంగ్వాల్42,790మయామి, అమెరికా నీరవ్ మోదీ (యూకే), మెహుల్ చోక్సీ (ఆంటిగ్వా) వంటివారు పరారీలో ఉన్నారు. ఈ వజ్రాల వ్యాపారులు అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.దేశీయ పెట్టుబడుల బలహీనతలిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS-దేశం నుంచి విదేశాలకు వెళ్లే డబ్బు) కింద విదేశీ చెల్లింపులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 27.14 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 38% పెరిగింది. ఈ మూలధనం విదేశీ రియల్ ఎస్టేట్, రెసిడెన్సీ కార్యక్రమాలకు మళ్లించబడుతుంది. ఇది దేశీయ వృద్ధికి ఉపయోగపడదు. దీనికి విరుద్ధంగా భారతదేశంలోకి ఎఫ్డీఐ 2022-23లో 84.8 బిలియన్ డాలర్ల నుంచి 71 బిలియన్ డాలర్లకు తగ్గింది.2023లో 6,500 మంది మిలియనీర్లు భారతదేశాన్ని విడిచిపెట్టారని హెన్లీ & పార్టనర్స్ నివేదించింది. 2025 నాటికి ఈ సంఖ్య సంవత్సరానికి 8,000కి పెరగవచ్చని గతంలో అంచనా వేసింది. ఇది ప్రతిభతోపాటు సంపదను కోల్పోవడాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు -
అదానీ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు
టాప్ బిలియనీర్ గౌతమ్ అదానీకి (Gautam Adani) ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీ ఏసీసీ లిమిటెడ్పై రెండు వేర్వేరు డిమాండ్ నోటీసుల్లో మొత్తం రూ .23.07 కోట్లు జరిమానాలు విధించింది. వీటిని అదానీ గ్రూప్ కంపెనీ అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయాలని యోచిస్తోంది.ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) జారీ చేసిన డిమాండ్ నోటీసుల్లో 2015-16 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయానికి సంబంధించిన తప్పుడు వివరాలను అందించడం"పై రూ .14.22 కోట్ల జరిమానా విధించగా, 2018-19 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయాన్ని తక్కువగా నివేదించడం"పై మరో రూ .8.85 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.సవాలు చేస్తాం.."నిర్ణీత కాలపరిమితిలో ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు అప్పీళ్లు దాఖలు చేయడం ద్వారా కంపెనీ రెండు ఉత్తర్వులను సవాలు చేస్తుంది. దీంతోపాటు సమాంతరంగా, సంబంధిత ఉత్తర్వుల ప్రకారం లేవనెత్తిన జరిమానా డిమాండ్లపై స్టే కోరుతుంది" అని ఏసీసీ రెగ్యులేటర్ ఫైలింగ్స్లో తెలిపింది. ఈ రెండు డిమాండ్ నోటీసులను అక్టోబర్ 1న స్వీకరించినట్లు చెప్పిన కంపెనీ.. ఈ జరిమానాలు సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది.అదానీ సిమెంట్ గురించి..అదానీ సిమెంట్.. అంబుజా సిమెంట్ అనుబంధ సంస్థ. ఇది కంపెనీలో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్లో అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్కు చెందిన హోల్సిమ్ గ్రూప్ నుండి అంబుజా సిమెంట్స్ దాని అనుబంధ సంస్థ ఏసీసీ లిమిటెడ్ను 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. -
ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో విమానయాన రంగంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు విపరీతంగా పెరగకుండా నిరోధించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికులకు సరసమైన ధరలు లభించేలా చూడటానికి దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన సామర్థ్యాన్ని పెంచాలని రెగ్యులేటర్ ఆదేశించింది.పండుగ కాలంలో టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు విమానయాన సంస్థలతో ఈ సమస్యను ముందుగానే చర్చించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన మార్గాల్లో విమాన ఛార్జీల పోకడలను సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక డిమాండ్ ఉన్న దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సమయాల్లో ఛార్జీల హెచ్చుతగ్గులపై ప్రయాణికుల నుంచి ఇటీవల ఫిర్యాదుల పెరుగుతున్న దృష్ట్యా డీజీసీఏ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.భారతదేశంలో ‘ఓపెన్ స్కైస్ పాలసీ’ ప్రకారం విమానయాన సంస్థలకు తమ ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఛార్జీలు అసమానంగా పెరిగితే జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని అధికారులు స్పష్టం చేశారు. పండుగ సీజన్లో ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటానికి విమాన ఛార్జీలు, విమాన సామర్థ్యాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని డీజీసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.డీజీసీఏ సలహాకు అనుగుణంగా ప్రధాన విమానయాన సంస్థలు అదనపు విమానాలను మోహరిస్తున్నాయి. ఈ అదనపు విమానాలు అక్టోబర్, నవంబర్ నెలల్లో సేవలందించనున్నాయి. దేశంలో 64.2 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్న ఇండిగో 42 సెక్టార్లలో 730 అదనపు విమానాలను నడపనుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కలిసి 20 మార్గాల్లో సుమారు 486 విమానాలను జోడించనున్నాయి. స్పైస్ జెట్ 38 సెక్టార్లలో 546 అదనపు సేవలను మోహరించనుంది.ఇదీ చదవండి: మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు! -
మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు!
వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన కథనం వైరల్గా మారింది. రిక్రూట్మెంట్ సమయంలో పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోం అని చెప్పిన కంపెనీ సడెన్గా ఫిజికల్గా ఆఫీస్కు రావాలని ఆదేశించినట్లు అందులో రాసుకొచ్చారు. అయితే మేనేజర్ కావాలనే ఇలా తనను వేదిస్తున్నట్లు చెప్పారు. తాను ఉంటున్న ప్రాంతం ఆఫీస్కు 300 కి.మీ ఉండడంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.‘రిక్రూట్మెంట్ సమయంలో పర్మనెంట్ వర్క్ ఫ్రం హోం అన్నారు. నేను కంపెనీలో చేరి ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. నేను ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం మా ఆఫీస్కు 300 కి.మీ. ఇప్పటివరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆఫీస్కు రమ్మనారు. కానీ ఇప్పడు నన్ను మేనేజర్ కావాలనే ప్రతివారం రమ్మంటున్నాడు. టీమ్ బిల్డింగ్, ఆఫీస్ సంస్కృతిని సంరక్షించడం అనేవి కారణంగా చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై మేనేజర్తో మాట్లాడినా లాభం లేకుండా పోయింది. ఇది స్నేహపూర్వకమైన వృత్తిపరమైన సంబంధాన్ని ఘర్షణకు, ఒత్తిడికి తావిస్తుంది. మేనేజర్ ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నాను. అదేసమయంలో కెరియర్ అవకాశాలు, టీమ్ రిలేషన్స్ దెబ్బతింటాయేమోనని ఆలోచలున్నాయి’ అని పోస్ట్లో తెలిపారు.రెడిట్ ప్లాట్ఫామ్లో వెలసిన ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఉద్యోగి పట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక అనివార్య సమస్య అని పేర్కొన్నారు. ‘టీమ్ బిల్డింగ్’ లేదా ‘ఆఫీస్ సంస్కృతి’ని సంరక్షించడం అనే సాకుతో చాలామంది ఇలా ఉద్యోగులను ఇబ్బందిపెడుతున్నట్లు కొందరు చెప్పారు. కొంతమంది మేనేజర్లు తాము రిమోట్గా పని చేస్తూనే కింది సిబ్బందిని కార్యాలయానికి రావాలని బలవంతం చేస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: పెళ్లి నిధిని ఎలా సమకూర్చుకోవాలి? -
పసిడి కొత్త ధరలు: వింటే దడ పుట్టడం ఖాయం!!
దేశంలో బంగారం ధరలు అంతే లేకుండా పెరిగిపోతున్నాయి. విజయదశమి సందర్భంగా కాస్త శాంతించినట్టే కనిపించినా మళ్లీ స్పీడ్ను అమాంతం పెంచేశాయి. ధర వింటేనే పసిడి ప్రియులకు దడ పుడుతోంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Gold price today) ఒక్కసారిగా ఎగిశాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 23 పాయింట్లు పెరిగి 24,916కు చేరింది. సెన్సెక్స్(Sensex) 69 పాయింట్లు పుంజుకొని 81,279 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పెళ్లి నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
కుమార్తె వివాహ అవసరాల కోసం ప్రతి నెలా రూ.45,000 చొప్పున ఆరేళ్ల పాటు పెట్టుబడి చేయాలన్నది ప్రణాళిక. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – జి. దేవిగుప్తామన దేశంలో వివాహ వేడుకలన్నవి భారీ ఖర్చుతో కూడుకున్నవి. ప్రతి నెలా రూ.45,000 చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే గణనీయమైన మొత్తమే సమకూరుతుంది. వివాహం లక్ష్యం విషయంలో రాజీపడలేం. అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే. కనుక రిస్క్ తక్కువగా ఉండాలని కోరుకునే వారు తటస్థ మార్గాన్ని అనుసరించొచ్చు. ఇందులో భాగంగా 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి.డెట్ విషయంలో షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్క్యాప్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే.. ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారం కోసం గోల్డ్ ఈటీఎఫ్ల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బంగారం విలువ పెరుగుదల రూపంలో రాబడి సమకూర్చుకోవచ్చు. వివాహ సమయంలో గోల్డ్ ఈటీఎఫ్లను విక్రయించి ఆభరణాలు కొనుగోలు చేసుకోవచ్చు. నేను దీర్ఘకాలం కోసం స్మాల్క్యాప్ ఫండ్స్లోనే నూరు శాతం ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇది సరైనదేనా? – నిరంజన్ దాస్స్మాల్క్యాప్లో పెట్టుబడులు పెట్టుకునే ముందు దీర్ఘకాలం ఒక్కటే చూడకూడదు. మార్కెట్ దిద్దుబాట్లలో స్మాల్క్యాప్ పెట్టుబడుల గణనీయమైన కుదుపులకు లోనవుతుంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలంలో ఇవి మెరుగైన రాబడులను ఇవ్వగలవు. కనుక పెట్టుబడుల కోసం స్మాల్క్యాప్ పథకాలను పరిశీలించొచ్చు. కాకపోతే ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి కనుక, మీ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మించి స్మాల్క్యాప్ పథకాలకు కేటాయించుకోకపోవడమే మంచిది. చిన్న కంపెనీ దిగ్గజ కంపెనీగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో చిన్న కంపెనీల్లో సంపదను తుడిచిపెట్టేవీ ఉంటాయి. ఆటుపోట్లను తట్టుకునే బలం చిన్న కంపెనీలకు తక్కువగా ఉంటుంది.స్మాల్క్యాప్ కంపెనీల విషయానికొస్తే కావాల్సినంత లిక్విడిటీ ఉండదు. చిన్న కంపెనీలు కావడంతో ఫ్రీ ఫ్లోటింగ్ ఈక్విటీ తక్కువే ఉంటుంది. దీంతో మార్కెట్ల కరెక్షన్లలో కొద్ది విక్రయాలకే ఎక్కువ నష్టపోతుంటాయి. అందుకే మిడ్క్యాప్, లార్జ్క్యాప్ కంపెనీలతో పోలిస్తే స్మాల్క్యాప్ కంపెనీల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్మాల్క్యాప్ కంపెనీల్లో అయితే నేరుగా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడమే మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే చిన్న కంపెనీల్లో ఏ ధరలో కొనుగోలు చేశారన్నది రాబడులను నిర్ణయిస్తుంది. పైగా ఈ విభాగంలో వైఫల్యాలు, మోసాల రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. నిపుణులైన ఫండ్ మేనేజర్లు వీటన్నింటినీ పరిశీలిస్తూ వేగంగా పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు అమలు చేస్తుంటారు. కనుక మొత్తం పెట్టుబడుల్లో స్మాల్క్యాప్ విభాగానికి పరిమితంగానే కేటాయింపులు చేసుకోవాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు.ఇదీ చదవండి: వయసు 31.. సంపద రూ.21 వేలకోట్లు! ఎలా సాధ్యమైంది? -
భవిష్యత్తులో పాలసీ రేట్ల కోతకు మరింత చాన్స్: క్రిసిల్
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించిన రిజర్వ్ బ్యాంక్, భవిష్యత్తులో పాలసీ రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశాలను తెరిచి ఉంచిందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ ఒక నివేదికలో తెలిపింది. అమెరికా టారిఫ్లపరమైన అనిశి్చతుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ద్వితీయార్థంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తిరోగమించే రిస్కులు ఉన్నట్లు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కూడా పేర్కొందని గుర్తు చేసింది. అయితే, ఇటీవల జీఎస్టీ రేట్లను క్రమబదీ్ధకరించడం వల్ల టారిఫ్లపరమైన ప్రతికూల ప్రభావం కొంత తగ్గొచ్చని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తెలిపింది. కారి్మక శక్తి అధికంగా ఉండే నిర్దిష్ట రంగాలపై టారిఫ్ల ఎఫెక్ట్ గణనీయంగా ఉంటుందని, వాటికి పాలసీపరమైన మద్దతును అందించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణంపరమైన ఆందోళన కొంత తగ్గే అవకాశం ఉందని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు ప్రభావంతో ఆర్బీఐ కూడా పాలసీ రేట్లను తగ్గించడానికి కాస్త ఆస్కారం ఉంటుందని వివరించింది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు (1%) తగ్గించింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున, ఎంపీసీ సిఫార్సుల మేరకు, పాలసీ రేట్లను ఆర్బీఐ ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్లో మరో 25 బేసిస్ పాయింట్లు, జూన్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది ప్రస్తుతం 5.5 శాతానికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న 4 శాతం లోపే కొనసాగుతోంది. -
ఏడాదిలో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్
న్యూఢిల్లీ: భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ని ఏడాదిలోగా 5జీకి అప్గ్రేడ్ చేయనున్నట్లు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. భారత దేశం కూడా సొంతంగా 4జీ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టిందని ప్రపంచవ్యాప్తంగా స్వీడన్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా, చైనాకు చెందిన హువావే, జడ్టీఈ, శాంసంగ్, నోకియా, ఎరిక్సన్ తదితర ఐదు కంపెనీలు 4జీ టెక్నాలజీలో ఆధిపత్యం వహిస్తున్నాయని, భారత్ కూడా ఇప్పుడు 4జీ ప్రపంచ క్లబ్లో ప్రవేశించిందన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భరూచ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 92564 టవర్లను ప్రారంభించినట్లు సింధియా తెలిపారు. ఈ వేగం ఇక్కడితో ఆగదని వచ్చే ఏడాదిలోగా ఈ 4జీ టవర్లను 5జీ నెట్వర్క్కు అప్గ్రేడ్ చేసి దేశమంతా 5జీ సేవలు అందిస్తామని సింథియా వెల్లడించారు. -
ఎలక్ట్రానిక్స్ తయారీకి రాష్ట్రాలూ చేయూతనివ్వాలి
న్యూఢిల్లీ: నాన్ సెమీకండక్టర్ ఎల్రక్టానిక్ విడిభాగాల తయారీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పాదక అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం స్థానిక తయారీకి జోన్నివ్వనుంది. తుది ఉత్పత్తుల విలువలో స్థానిక తయారీ విలువ 40 శాతానికి పెరుగుతుందని ఎల్రక్టానిక్స్ పరిశ్రమల సంఘం (ఎల్సినా) ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ‘ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం’ (ఈసీఎంఎస్)కు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈసీఎంఎస్ కింద రూ.1.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు రావడం గమనార్హం. రూ.59,000 కోట్ల పెట్టుబడులు రాబట్టుకోవాలని కేంద్రం ఆశించగా, అంతకు రెట్టింపు మేర స్పందన వచి్చంది. మొత్తం 249 కంపెనీలు పెట్టుబడుల ప్రతిపాదనలు సమరి్పంచాయి. కేంద్ర ప్రభుత్వ కమిటీ వీటిని పరిశీలించిన అనంతరం, అర్హత కలిగిన వాటికి ఆమోదం లభించనుంది. ‘‘దేశ ఎల్రక్టానిక్స్ తయారీ వ్యవస్థలో స్థానిక విలువ జోడింపును ప్రస్తుతమున్న 15–20 శాతం నుంచి 35–40 శాతానికి వచ్చే ఐదేళ్లలో పెరిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది’’ అని ఎల్సినా సెక్రటరీ జనరల్ రాజు గోయల్ తెలిపారు. రూ.10.34 లక్షల కోట్ల తయారీ తాము రూ.4,56,500 కోట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంటే, రూ.10.34 లక్షల కోట్ల ఉత్పత్తికి సంబంధించిన ప్రతిపాదనలు వచి్చనట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ నెల 2న ప్రకటించడం గమనార్హం. ఇందులో ప్రధానంగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులకు సంబంధించి రూ.16,542 కోట్లు, ఎలక్ట్రో మెకానికల్ విడిభాగాలకు సంబంధించి రూ.14,362 కోట్లు, మల్టీ లేయర్ పీసీబీలకు సంబంధించి రూ.14,150 కోట్లు, డిస్ప్లే మాడ్యూల్ సబ్ అసెంబ్లీకి సంబంధించి రూ.8,642 కోట్లు, కెమెరా మాడ్యూల్ సబ్ అసెంబ్లీకి సంబంధించి రూ.6,205 కోట్లు, లిథియం అయాన్ సెల్స్కు సంబంధించి రూ.4,516 కోట్ల చొప్పున ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఎలక్ట్రో మెకానికల్స్, ఐటీ ఉత్పత్తులకు సంబంధించి ఎన్క్లోజర్లు, మల్టీ లేయర్ పీసీబీలు, ఫ్లెక్సిబుల్ పీసీబీలకు ంసబంధించి పెద్ద మొత్తంలో, అధిక విలువ మేర ప్రతిపాదనలు వచి్చనట్టు ఎల్సినా తెలిపింది. తయారీ కేంద్రంగా భారత్పై పెరుగుతున్న విశ్వాసానికి ఈ స్పందన నిదర్శనమని ఎల్సినా ప్రెసిడెంట్ శశి గంధనం పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులను కల్పించడం ద్వారా ఈ ధోరణికి రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రాలు సైతం తమవంతు ప్రోత్సాహకాలు కల్పిస్తే మరిన్ని పెట్టుబడులు రావడంతోపాటు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పన సాధ్యపడుతుందన్నారు. -
గణాంకాలు, ప్రపంచ పరిణామాలే దిక్సూచి!
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలతో పాటు ఐటీ దిగ్గజం టీఎస్ఎస్తో బోణీ కానున్న రెండో త్రైమాసిక (క్యూ2) ఫలితాలు మన మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. వరుసగా మూడు నెలల నుంచి అమ్మకాల బాటలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కార్యకలాపాలను కూడా మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తాయని చెప్పారు. మరోపక్క, జారుడు బల్లపై ఉన్న రూపాయి మారకం విలువ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరల కదలికలు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. టీసీఎస్ బోణీ... కార్పొరేట్ల క్యూ3 (జూలై–సెపె్టంబర్) ఆర్థిక ఫలితాలు ఈ వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫలితాలతో బోణీ కొట్టనుంది. ట్రంప్ సర్కారు హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం, 25 శాతం అదనపు టారిఫ్ల మోత తదితర భారత్ వ్యతిరేక చర్యల నేపథ్యంలో క్యూ2 ఫలితాలపై, కంపెనీల భవిష్యత్తు అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. ‘క్యూ2 ఫలితాల సందర్భంగా టారిఫ్ల ప్రభావం, వీసా ఫీజుల పెంపు, డీల్స్, కంపెనీల వ్యయాలు, ఉద్యోగాల కోత, హైరింగ్ అవుట్లుక్ వంటి అంశాలపై టీసీఎస్ యాజమాన్యం చేసే వ్యాఖ్యలు ఐటీ రంగంలో పాటు మార్కెట్ల సెంటిమెంట్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది’ అని ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్ టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈఓ పోన్ముడి ఆర్ అభిప్రాయపడ్డారు. గణాంకాలపై ఫోకస్.. ‘టీసీఎస్ ఫలితాలకు తోడు హెచ్ఎస్బీసీ సర్వీస్ రంగం పీఎంఐ డేటా, బ్యాంకింగ్ రంగ రుణ, డిపాజిట్ వృద్ధి గణాంకాలు రానున్నాయి. టాటా క్యాపిటల్, ఎల్జీ బడా ఐపీఓలతో ప్రైమరీ మార్కెట్ కార్యకలాపాలు జోరందుకోనున్నాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. కాగా, అమెరికాలో ఫెడర్ రిజర్వ్ ఇటీవలి పాలసీ భేటీ వివరాలు (మినిట్స్), నిరుద్యోగ గణాంకాలు, కన్జూమర్ సెంటిమెంట్ డేటా వంటి వాటిపై ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఫోకస్ చేసే అవకాశం ఉంది. కొనసాగుతున్న అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా కొన్ని కీలక ఆర్థిక గణంకాలు ఇప్పటికే ఆలస్యమయ్యయాని మిశ్రా పేర్కొన్నారు. గత వారమిలా... వరుసగా 8 రోజుల పాటు నష్టాల బాటలో సాగిన దేశీ మార్కెట్లకు ఆర్బీఐ పాలసీ కాస్త ఊరటనిచి్చంది. గురు, శక్రవారాల్లో ప్లస్లో నిలిచిన సూచీలు లాభాలతో వారాన్ని ముగించాయి. సెన్సెక్స్ 781 పాయింట్లు (0.97%), నిఫ్టీ 240 పాయింట్లు (0.97%) చొప్పున ఎగబాకాయి. కీలక రెపో రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగించినప్పటికీ, రానున్న నెలల్లో రేట్ల కోతకు ఆస్కారం ఉందంటూ ఇచ్చిన సిగ్నల్స్ మార్కెట్ను మెప్పించింది. మరోపక్క, ఐపీఓ ఫైనాన్సింగ్, షేర్ల తనఖా రుణ పరిమితిని భారీగా పెంచడం కూడా ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. ‘జీడీపీ వృద్ధి అంచనాలను పెంచడంతో పాటు పాలసీ సందర్భంగా ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచింది. ఇటీవలి కరెక్షన్ నుంచి మార్కెట్లు మళ్లీ సానుకూల పథంలోకి మారాయి’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు.మెగా ఐపీఓ వారం..పబ్లిక్ ఆఫర్ల వరదతో కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లను ఈ వారం మెగా ఐపీఓలు (దాదాపు రూ.27,000 కోట్లు) ముంచెత్తనున్నాయి. టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్ల ఇష్యూతో పాటు (6న ప్రారంభమై 8న ముగుస్తుంది). దీని ప్రైస్ బ్యాండ్ను కంపెనీ రూ.310–326గా నిర్ణయించింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ కూడా ఈ వారమే ప్రారంభమవుతోంది. దాదాపు రూ.11,607 కోట్ల ఈ ఆఫర్ అక్టోబర్ 7న మొదలై 9న క్లోజవుతుంది. దీని ధరల శ్రేణి రూ.1,080–1,140. ఇవి కాకుండా రూబికాన్ రీసెర్చ్ రూ.1,377 కోట్ల ఇష్యూ అక్టోబర్ 9న షురూ కానుంది. ఇప్పటికే మొదలైన రూ.3,000 కోట్ల వియ్వర్క్ ఆఫర్ 7న ముగియనుంది. 2025లో ఇప్పటికే 78 ఐపీఓలు పూర్తవగా.. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు వరుస కట్టనున్నాయి.ఎఫ్పీఐల రివర్స్ గేర్...సెపె్టంబర్ నెలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) అమ్మకాల జోరు పెంచారు. ఈ ఒక్క నెలలోనే రూ.23,885 కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మేశారు. దీంతో ఈ ఏడాది ఇప్పటిదాకా ఈక్విటీ మార్కెట్లో ఎప్పీఐల నికర అమ్మకాలు రూ.1.58 లక్షల కోట్లకు చేరాయి. వరుసగా మూడో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడటం తాజా కరెక్షన్కు ఆజ్యం పోసింది. ఆగస్ట్లో ఏకంగా రూ.34,990 కోట్లు ఉపసంహరించున్న ఎఫ్పీఐలు, జూలైలో రూ.17,700 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ‘ఇటీవలి అమ్మకాలకు ప్రధానంగా అమెరికా టారిఫ్ల మోతతో పాటు ఇతరత్రా పాలసీ షాక్లు ప్రధాన కారణం. భారతీయ వస్తువులపై 50 శాతం టారిఫ్ల విధింపు, హెచ్1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంపు వంటివి ఎగుమతి ఆధారిత రంగాలపై, ముఖ్యంగా ఐటీ పరిశ్రమ సెంటిమెంట్ను దెబ్బతీసింది. రూపాయి రికార్డు కనిష్టాలకు పడిపోతుండటం వల్ల తలెత్తుతున్న కరెన్సీ రిస్క్, భారతీయ స్టాక్స్లో అధిక వేల్యుయేషన్లు వంటివి కూడా ఎఫ్ఐపీలను తాత్కాలికంగా ఇతర ఆసియా మార్కెట్ల వైపు (రొటేషన్) దృష్టి సారించేలా చేస్తోంది’ అని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా ప్రిన్సిపల్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. -
‘హెల్త్ ఎమర్జెన్సీ’కి సిద్ధమా!
అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సి వస్తే ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఆస్పత్రిలో నగదు రహిత వైద్యానికి బీమా పాలసీ భరోసానిస్తుంది. కానీ, ఆస్పత్రిలో చేరిన తర్వాత నగదు రహిత చెల్లింపులకు తిరస్కారం ఎదురైతే..? రూ.లక్షల బిల్లు సొంతంగా చెల్లించడం మినహా మరో మార్గం ఉండదు. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని బిల్లులతో బీమా కంపెనీ వద్ద రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేసుకోవాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో ఆస్పత్రులు, బీమా కంపెనీల మధ్య ఏర్పడిన విశ్వాస వైరుధ్యం.. పాలసీదారులను ఆందోళనకు గురిచేసే అంశమే. దీనిపై అవగాహన కలిగి ఉంటే.. అత్యవసర పరిస్థితులను ధైర్యంగా, సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు నగదు రహిత చికిత్సలను సెప్టెంబర్ 22 నుంచి నిలిపివేస్తున్నట్టు అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ (ఏహెచ్పీఐ) సెప్టెంబర్ 12న ప్రకటించింది. ఏహెచ్పీఐ కింద దేశవ్యాప్తంగా 15 వేల ఆస్పత్రులు సభ్యులుగా ఉన్నాయి. అక్టోబర్ 10 నుంచి నగదు రహిత చికిత్సలను తిరిగి ప్రారంభించేందుకు పరస్పర అంగీకారం కుదిరినట్టు ఏహెచ్పీఐ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కొన్ని రోజుల తర్వాత ప్రకటించాయి. అంతకుముందు ఆగస్ట్లో బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్,, నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకూ ఇదే అనుభవం ఎదురైంది. తన ఎంపానెల్డ్ హాస్పిటల్స్ జాబితా నుంచి మ్యాక్స్ హాస్పిటల్స్ను తొలగిస్తున్నట్టు ఆగస్ట్ 16న నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. సరిగ్గా మ్యాక్స్ హాస్పిటల్స్ విషయంలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సైతం ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఇదే విధంగా వ్యవహరించింది. కొన్ని సందర్భాల్లో బీమా సంస్థలు, కొన్ని సందర్భాల్లో ఏహెచ్పీఐ ఈ తరహా చర్యలకు ఉపక్రమిస్తుండడం పాలసీదారులను అయోమయానికి గురిచేస్తోంది. విధానం – వివాదం → సాధారణంగా అన్ని బీమా సంస్థలకు ‘నెట్వర్క్ హాస్పిటల్స్’ అంటూ ఒక జాబితా ఉంటుంది. ఇందులో ఉన్న వాటిని ‘ఎంపానెల్డ్ హాస్పిటల్స్’ అని పేర్కొంటారు. బీమా సంస్థలు అన్ని ముఖ్యమైన ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంటూ ఉంటాయి. ప్రతి చికిత్సకు సంబంధించి తక్కువ రేట్లతో ఒక టారిఫ్పై అంగీకారం కుదుర్చుకుంటాయి. → ప్రధానంగా ఈ ధరల విషయంలో ఆస్పత్రులు, బీమా సంస్థల మధ్య ప్రస్తుతం వివాదం నెలకొంది. ఆస్పత్రులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని, బోగస్ క్లెయిమ్లకు (క్లెయిమ్ మోసాలు) చోటు కల్పిస్తున్నాయని, ప్రొటోకాల్కు విరుద్ధమైన, అవసరం లేని వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఔషధాలను సూచిస్తున్నాయని, ముందు పేర్కొన్న క్లెయిమ్ కంటే తుది క్లెయిమ్ భారీగా పెరిగిపోతోందని.. ఇలా ఎన్నో ఆరోపణలు బీమా సంస్థలు నుంచి వినిపిస్తున్నాయి. 2020 తర్వాత చికిత్సల టారిఫ్లను సవరించలేదని, అత్యాధునిక చికిత్సా విధానాలు, పెరిగిన సిబ్బంది వేతనాల దృష్ట్యా రేట్లను సవరించాల్సి ఉందని.. కానీ, తక్కువ చార్జీలకు అంగీకారం తెలపాలంటూ బీమా కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయని, నగదు రహిత క్లెయిమ్లకు తొలుత అంగీకారం తెలిపి, తుది క్లెయిమ్ సమయంలో తిరస్కరిస్తున్నాయని ఆస్పత్రుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. అలాగే, క్లెయిమ్ మొత్తాన్ని తగ్గించేస్తున్నాయని అంటున్నాయి. → ఆస్పత్రిలో పాలసీదారుడు చేరిన సమయంలో అతడి నుంచి ప్రీ ఆథరైజేషన్ ఫారమ్ను ఆస్పత్రి సిబ్బంది తీసుకుని, బీమా కంపెనీలు లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్కు (టీపీఏ) పంపిస్తాయి. ఈ పత్రంలో ఆరోగ్య సమస్య ఏమిటి, చికిత్స వివరాలు, అంచనా వ్యయాలు ఉంటాయి. దీనికి బీమా కంపెనీలు నాలుగు గంటల్లోపు స్పందిస్తాయి. ఆమోదిస్తే నగదు రహిత చికిత్స తీసుకోవచ్చు. లేదంటే సొంతంగా చెల్లించి, తర్వాత రీయింబర్స్మెంట్కు (తిరిగి పొందడం) వెళ్లాల్సి ఉంటుంది. బీమా కంపెనీ నుంచి ఆమోదం లభించిన కేసుల్లో.. డిశ్చార్జ్కు ముందు మొత్తం చికిత్స వ్యయం, పూర్తి వివరాలతో తుది క్లెయిమ్ బీమా కంపెనీకి వెళుతుంది. అప్పుడు చికిత్సలకు విధించిన చార్జీలు తమ ఒప్పందం ప్రకారమే ఉన్నాయా? లేక అదనంగా బాదేశారా? అని బీమా కంపెనీ లేదా టీపీఏ బృందాలు పరిశీలిస్తాయి. ఆరోగ్య సమస్య, చికిత్స, ఔషధ వినియోగం, వ్యాధి నిర్ధారణ పరీక్షలనూ లోతుగా పరిశీలిస్తాయి. ఏవైనా సందేహాలుంటే మరిన్ని వివరాలు కోరతాయి. పాలసీదారుడి ఆరోగ్య చరిత్ర విషయంలో సందేహాలు నెలకొంటే తుది క్లెయిమ్కు తిరస్కరిస్తాయి. రీయింబర్స్మెంట్ విధానంలో రావాలని సూచిస్తాయి. ఒకవేళ ఆస్పత్రులు అధికంగా చార్జీలు వేసినట్టు భావిస్తే, ఆ మేరకు బిల్లులో తగ్గించి క్లెయిమ్కు ఆమోదం తెలపొచ్చు. అప్పుడు మిగిలిన మొత్తాన్ని పాలసీదారు చెల్లించాల్సి ఉంటుంది. నగదు రహిత క్లెయిమ్ తిరస్కరణకు గురై, రీయింబర్స్మెంట్ క్లెయిమ్కు వెళ్లిన సందర్భంలోనూ పూర్తి మొత్తం వస్తుందన్న భరోసా లేదు.కళ్లు తెరిపించే గణాంకాలు..→ ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ 2023–24 నివేదిక ప్రకారం.. హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి బీమా కంపెనీలపై ఫిర్యాదులు అంతకుముందు సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు 21.7 శాతం పెరిగాయి. మొత్తం 31,490 ఫిర్యాదులు వచ్చాయి. → 13,308 ఫిర్యాదులు ఒక్క స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్కు వ్యతిరేకంగా వచ్చాయి. ఇందులో 10,196 ఫిర్యాదులు క్లెయిమ్ల తిరస్కారాలకు సంబంధించినవే. → కేర్ హెల్త్ ఇన్సూరెన్స్కు వ్యతిరేకంగా 3,718 ఫిర్యాదులు పాలసీదారుల నుంచి దాఖలు కాగా, అందులో క్లెయిమ్ తిరస్కరణకు సంబంధించి 2,393 ఉన్నాయి. → నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్కు వ్యతిరేకంగా 2,511 ఫిర్యాదులు రాగా, 1,770 క్లెయిమ్ తిరస్కరణకు సంబంధించినవే. నేషనల్ ఇన్సూరెన్స్కు వ్యతిరేకంగా 2,196, న్యూ ఇండియా అష్యూరెన్స్కు వ్యతిరేకంగా 1,602 ఫిర్యాదులు వచ్చాయి. → ముఖ్యంగా క్లెయిమ్ తిరస్కరణలు, బీమా కంపెనీ సేవలపై ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ప్రతీ బీమా సంస్థ పరిధిలో అంతర్గత అంబుడ్స్మన్ వ్యవస్థను ఏర్పాటునకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. అత్యవసర నిధి.. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో క్లెయిమ్ రాకపోతే స్వయంగా చెల్లించక తప్పదు. ఒక్కోసారి బీమా కవరేజీ పరిధిలో లేని అనారోగ్య సమస్యలు కూడా ఎదురుకావొచ్చు. లేదా కవరేజీకి మించి చికిత్సల వ్యయాలు ఎదురుకావొచ్చు. కనుక ఒక కుటుంబం కనీసం రూ.4–5 లక్షలతో అత్యవసర వైద్యనిధిని ప్రత్యేకంగా సమకూర్చుకోవాలన్నది నిపుణుల సూచన. క్లెయిమ్ తిరస్కరిస్తే..బీమా కంపెనీలు–ఆస్పత్రుల మధ్య వివాదం పాలసీదారుల ప్రయోజనాలకు భంగం కలిగించరాదు. అవసరంలో ‘బీమా’ అదుకోనప్పుడు పాలసీదారులు మిన్నకుండిపోనక్కర్లేదు. నిబంధనల మేరకు క్లెయిమ్ మొత్తాన్ని పొందే హక్కు పాలసీదారులకు ఉంటుంది. నగదు రహిత క్లెయిమ్ తిరస్కరణకు గురైతే, స్వయంగా చెల్లించి రీయింబర్స్మెంట్ క్లెయిమ్ను 30 రోజుల్లోపు (డిశ్చార్జ్ అనంతరం) దాఖలు చేయాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు 90 రోజుల వరకు అవకాశం కలి్పస్తున్నాయి. → ముందుగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వకముందే బీమా కంపెనీ కస్టమర్కేర్కు కాల్ చేసి, నగదు రహిత చెల్లింపులకు ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు. ఫలితం లేకపోతే డిశ్చార్జ్ అనంతరం రీయింబర్స్మెంట్ క్లెయిమ్కు వెళ్లడమే. → చెల్లింపులు పూర్తి స్థాయిలో రాకపోతే పాలసీ నియమ, నిబంధనల ప్రకారమే బీమా కంపెనీ వ్యవహరించిందా? అన్నది సరిచూసుకోవాలి. క్లెయిమ్ తిరస్కరించినా లేక పాక్షిక చెల్లింపులతో సరిపెట్టినా.. అప్పుడు రాతపూర్వక వివరణ తీసుకోవాలి. → బీమా కంపెనీ వివరణ సమంజసంగా, సహేతుకంగా, పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టయితే.. తొలుత బీమా కంపెనీ అంబుడ్స్మన్ వద్ద ఫిర్యాదు దాఖలు చేసి, పరిష్కారానికి ప్రయతి్నంచాలి. ఫలితం లేకపోతే బీమా రంగ అంబుడ్స్మన్ను ఆశ్రయించొచ్చు. అప్పటికీ పరిష్కారం కాకపోతే చట్టప్రకారం బీమా కంపెనీపై చర్యలకు వెళ్లాల్సి ఉంటుంది.ఇవి తెలియాలి..→ పాలసీ కొనుగోలుకు ముందు నియమ నిబంధనలు, షరతులు, మినహాయింపులు, అర్హతల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఏవైనా సందేహాలుంటే బీమా కంపెనీ కస్టమర్ కేర్ను సంప్రదించాలి. → క్లెయిమ్ చెల్లింపుల నిష్పత్తి (సీఎస్ఆర్) సాధారణంగా 90కు పైన ఉంటే మంచిది. 95పైన ఉంటే మరింత భరోసా ఉన్నట్టుగా భావించొచ్చు. క్లెయిమ్ రేషియోను ఏటా ఐఆర్డీఏఐ ప్రకటిస్తుంటుంది. బీమా సంస్థలకు వ్యతిరేకంగా అంబుడ్స్మన్ వద్ద ఎన్ని ఫిర్యాదులు నమోదైనదీ పరిశీలించాలి. → బీమా కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రుల జాబితా విస్తృతంగా, తమ నివాస ప్రాంతంలోని అన్ని ముఖ్య ఆస్పత్రులతో ఉండేలా చూసుకోవాలి. → సమగ్రమైన కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కస్టమర్ సేవలు మెరుగ్గా ఉన్నాయో లేదో చూడాలి. → పాలసీ దరఖాస్తులో కచ్చితమైన వివరాలను నమోదు చేయాలి. మరీ మఖ్యంగా పాలసీ తీసుకునే ముందు కొన్నేళ్లలో ఏవైనా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటే వాటి వివరాలు.. తీసుకునే నాటికి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వాటి గురించి సమగ్రంగా వెల్లడించాలి. → పాలసీ తీసుకున్న మొదటి 30 రోజుల్లో ప్రమాదాలు మినహా మిగతా క్లెయిమ్లు దాఖలు చేసుకోవడానికి ఉండదు. పాలసీ తీసుకునే నాటికి ఉన్న వ్యాధులకు 3–4 ఏళ్ల వరకు.. కొన్నింటికి రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ నిబంధన వర్తిస్తుంది. పాలసీ తీసుకునే ముందే ఏ వ్యాధులకు ఎంత కాలం పాటు వేచి ఉండాలో సమగ్రంగా తెలుసుకోవాలి. అదనపు ప్రీమియంతో వెయిటింగ్ పీరియడ్ లేకుండా కొన్ని బీమా సంస్థలు పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. → ఆస్పత్రిలో చేరిక గురించి బీమా సంస్థలకు సకాలంలో సమాచారం ఇవ్వాలి. సకాలంలో క్లెయిమ్లు దాఖలు చేయాలి. → బీమా సంస్థ ఎంపానెల్డ్ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవడం సూచనీయం. ఎప్పటికప్పుడు తాజా జాబితా బీమా సంస్థ పోర్టల్పై అందుబాటులో ఉంటుంది. → క్లెయిమ్ను స్వయంగా దాఖలు చేస్తే, అన్ని డా క్యుమెంట్లు సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని బీమా సంస్థలు తమ ఎంపానెల్డ్ జాబితా నుంచి కొన్ని ఆస్పత్రులను తొలగిస్తున్నాయి. బీమా సంస్థలు ఒక్కటైతే.. మేము కూడా (ఆస్పత్రులన్నీ) ఉమ్మడిగా చేతులు కలిపి, ఆయా కంపెనీలతో వ్యాపారం నిర్వహించబోం. కరోనా తర్వాత నుంచి రేట్లపై చర్చలు జరగాల్సి ఉంది. కొన్ని బీమా సంస్థలు అయితే 2017 నుంచి రేట్లను సవరించలేదు. అసాధారణ స్థాయిలో టెక్నాలజీ పరంగా పురోగతి, సిబ్బంది జీతభత్యాల పరంగా పెరిగిన భారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా రేడియాలజీ, కేన్సర్, రోబోటిక్ చికిత్సల పరంగా ఎంతో పురోగతి ఉంది. సూపర్ స్పెషలిస్ట్ వైద్యుల కొరత వేధిస్తోంది. అధిక డిమాండ్ కారణంగా వారు మతిపోయే వేతనాలు డిమాండ్ చేస్తున్నారు– గిరిధర్ జ్ఞాని, డైరెక్టర్ జనరల్, ఏహెచ్పీఐఆస్పత్రులు కరోనా సమయంలో చార్జీలను అసాధారణంగా పెంచేయడమే కాదు, ఏటా ఇదే తీరులో వ్యవహరిస్తున్నాయి. హాస్పిటల్స్ ధరలను పెంచిన ప్రతి సందర్భంలోనూ బీమా కంపెనీలకు నష్టాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రీమియంలను సవరించాల్సి వస్తోంది. దీన్ని పరిష్కరించాలన్నది బీమా పరిశ్రమ డిమాండ్. ద్రవ్యోల్బణం కారణంగా ఏటా రేట్లు పెరగడం సహజమే. కానీ, ఇది 15–20 శాతం స్థాయిలో ఉండరాదు. అపెండెక్టమీ చికిత్స ధర సాధారణంగా రూ.30,000–40,000 ఉంటుంది. పేరున్న ఆస్పత్రులు ఇందుకు రూ.1–1.5 లక్షలు చార్జీ వసూలు చేస్తున్నాయి. బీమా పరిశ్రమ అధిక నియంత్రణల మధ్య పనిచేస్తోంది. అలాగే, ఆస్పత్రులు, హెల్త్కేర్ ప్రొవైడర్లపైనా ఇదే మాదిరి నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలి. – హెల్త్ ఇన్సూరెన్స్ పరిశ్రమ– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) చేసిన ఒక ట్వీట్.. నెట్ఫ్లిక్స్ (Netflix) మార్కెట్ విలువను భారీగా దెబ్బతీసింది. 2025 సెప్టెంబర్ 27న 514 బిలియన్ డాలర్లుగా ఉన్న దాని మార్కెట్ విలువ.. 2025 అక్టోబర్ 3 నాటికి సుమారు 25 బిలియన్ డాలర్లు తగ్గిపోయి.. 489 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందన్నమాట.పిల్లల షోలలో ట్రాన్స్జెండర్ సందేశాలను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో మస్క్ స్ట్రీమర్ను విమర్శించారు. ''మీ పిల్లల ఆరోగ్యం కోసం నెట్ఫ్లిక్స్ రద్దు చేయండి'' అని ఆయన తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా!: మస్క్హమీష్ స్టీల్ దర్శకత్వం వహించిన.. నెట్ఫ్లిక్స్ యానిమేటెడ్ సిరీస్ 'డెడ్ ఎండ్: పారానార్మల్ పార్క్' లింగ మార్పిడి సమస్యలను ప్రోత్సహిస్తోందని, వోక్ ఎజెండాను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాబట్టి పిల్లల మానసిక ఆరోగ్యం దృష్ట్యా నెట్ఫ్లిక్స్ చూడటం ఆపాలని మస్క్ అన్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ మార్కెట్ విలువ భారీ పతనాన్ని చవిచూసింది.Cancel Netflix for the health of your kids https://t.co/uPcGiURaCp— Elon Musk (@elonmusk) October 1, 2025 -
హోండా ఏడీవీ 350: ఇప్పుడు కొత్త హంగులతో..
2022లో యూరోపియన్ మార్కెట్లో లాంచ్ అయిన 'హోండా ఏడీవీ 350' (Honda ADV 350) స్కూటర్.. ఇప్పుడు కొత్త వెర్షన్లో కనిపించింది. ఇది కొత్త కాస్మొటిక్ అప్డేట్లను పొందుతుంది. కానీ మెకానికల్, టెక్నికల్ అంశాలు మాత్రం అలాగే ఉన్నాయి. కాగా ఇది మూడు కొత్త రంగులలో అందుబాటులోకి రానుంది.సరికొత్త హోండా ఏడీవీ 350 స్కూటర్.. 330 సీసీ ఎస్ఓహెచ్సీ ఫోర్ వాల్వ్ ఇంజిన్ ద్వారా 30 హార్స్ పవర్, 31.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది యూఎస్డీ ఫ్రంట్ ఫోర్కులు, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్లను పొందుతుంది. 11.7 లీటర్ల ఫ్యూయెల్ ట్యాక్స్ కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్.. ముందు భాగంలో 256 మిమీ డిస్క్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ పొందుతుంది.ఇదీ చదవండి: సరికొత్త బ్రిక్స్టన్ బైక్: దీని గురించి తెలుసా?ఫీచర్స్ విషయానికి వస్తే హోండా ఏడీవీ 350 స్కూటర్.. ప్రీలోడ్ అడ్జస్టబుల్ రియర్ స్ప్రింగ్లు, హోండా రోడ్సింక్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీతో 5 ఇంచెస్ టీఎఫ్టీ స్క్రీన్, ఫోర్ వే టోగుల్ స్విచ్, స్టోరేజ్ కంపార్ట్మెంట్ లైట్, ఆటో క్యాన్సిలింగ్ ఇండికేటర్లు మొదలైనవి పొందుతుంది. అయితే ఈ స్కూటర్ను కంపెనీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందా? లేదా? అనే విషయాన్ని వెల్లడించలేదు. -
వికీపీడియాకు పోటీగా గ్రోకీపీడియా!: మస్క్
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) వికీపీడియాకు పోటీగా.. గ్రోకీపీడియా (Grokipedia) లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దీని బీటా వెర్షన్ రెండు వారాల్లో ప్రారంభమవుతుందని ఆయన తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.గ్రోకీపీడియాను.. మస్క్ ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ (xAI) రూపొందిస్తోంది. ''గ్రోకిపీడియా ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖచ్చితమైన జ్ఞాన వనరుగా మారబోతోంది'' అని ఒక ఎక్స్ యూజర్ చేసిన పోస్టుకు.. మస్క్ రిప్లై ఇచ్చారు. అయితే ఈ గ్రోకీపీడియాకు సంబంధించిన ఫీచర్లను గురించి అధికారికంగా వెల్లడించలేదు. నిజాలను వెల్లడించానికే ఈ ఫ్లాట్ఫామ్ను రూపొందిస్తున్నట్లు సమాచారం.Version 0.1 early beta of Grokipedia will be published in 2 weeks https://t.co/M6VrGv8zp5— Elon Musk (@elonmusk) October 5, 2025Exactly https://t.co/Ia38jMbJoj— Elon Musk (@elonmusk) October 5, 2025 -
మన దేశంలో మొదటి క్రెడిట్ కార్డు అందించిన బ్యాంక్ ఏదంటే?
క్రెడిట్ కార్డుల వినియోగం ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపోయింది. ఉద్యోగస్తులు మాత్రమే కాకుండా, వ్యాపారవేత్తలు సైతం వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే మనదేశంలో.. క్రెడిట్ కార్డు ఎప్పుడు ప్రారంభమైందనే విషయం బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.1980లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మొదటి క్రెడిట్ కార్డును జారీ చేసింది. దీనిని సెంట్రల్ కార్డు అని పిలిచేవారు. ఇది వీసా నెట్వర్క్ కింద ఉండేది. దీన్ని బట్టి చూస్తే.. ఇండియాలో క్రెడిట్ కార్డు ప్రారంభమైన దాదాపు 45 సంవత్సరాలైందన్నమాట.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ప్రస్తుతం, భారతదేశంలో 11 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ కార్డులు, ట్రావెల్ కార్డులు, లైఫ్ స్టైల్ కార్డులు, ఫ్యూయెల్ కార్డులు, సెక్యూర్ కార్డులు యూపీఐ కార్డులు వంటివి అనేకం ఉన్నాయి. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా.. కావలసిన క్రెడిట్ కార్డులను ఎంచుకుంటారు.ఇదీ చదవండి: బిట్కాయిన్ సరికొత్త రికార్డ్.. ఆల్టైమ్ గరిష్టాలకు చేరిన ధరఒకప్పుడు.. పెద్ద బ్యాంకులు మాత్రమే, క్రెడిట్ స్కోర్ల ఆధారంగా క్రెడిట్ కార్డులను జారీ చేసేవి. కానీ ఇప్పుడు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి చిన్న ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఈ కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డులను వినియోగించేవారి సంఖ్య బాగా పెరిగింది. -
సరికొత్త బ్రిక్స్టన్ బైక్: దీని గురించి తెలుసా?
బ్రిక్స్టన్ మోటార్ సైకిల్స్.. తన మొట్టమొదటి మిడ్-కెపాసిటీ అడ్వెంచర్ మోటార్ సైకిల్ అయిన 'స్టోర్ 500'(Storr 500)ను ఆస్ట్రియాలోని తన ప్రధాన కార్యాలయంలో అధికారికంగా ఆవిష్కరించింది. ఈ బైక్ కోసం ప్రీ-బుకింగ్లు డిసెంబర్ 2025లో ప్రారంభమవుతాయి. ఆ తరువాత డెలివరీ ఎప్పుడనే విషయాన్ని సంస్థ వెల్లడించనుంది. ముందుగా బుక్ చేసుకున్నవారికి.. ముందుగా డెలివరీలు జరుగుతాయని సంస్థ వెల్లడించింది.బ్రిక్స్టన్ స్టోర్ 500 బైక్.. 486 సీసీ లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ద్వారా 8500 ఆర్పీఎం వద్ద 47.6 బీహెచ్పీ పవర్, 6750 ఆర్పీఎం వద్ద, 43 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఈ బైక్ యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, సెంట్రల్ రియర్ మోనోషాక్ వంటి సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్తో డిస్క్ బ్రేక్లు ఈ బైకులో ఉంటాయి.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?ఫీచర్స్ విషయానికి వస్తే.. కనెక్టివిటీ ఎంపికలతో కూడిన 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే, ఎల్ఈడీ డీఆర్ఎల్ & ఇండికేటర్స్, ఇంటర్నల్ ఫాగ్ ల్యాంప్స్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి ఈ బైకులో ఉన్నాయి. అయితే కంపెనీ ఈ బైకుని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుందా?, లేదా అనేది వెల్లడించలేదు. -
బిట్కాయిన్ సరికొత్త రికార్డ్.. ఆల్టైమ్ గరిష్టాలకు చేరిన ధర
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ కారణంగా.. పెట్టుబడిదారులలో ఆందోళన మొదలైంది. డాలర్ విలువ రోజురోజుకి తగ్గుముఖం పట్టింది. ఈ తరుణంలో బిట్కాయిన్ వాల్యూ ఆదివారం ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకొని.. 1,25,000 డాలర్ల మార్కును దాటింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఒక బిట్కాయిన్ విలువ సుమారు రూ. 1.08 కోట్లు.ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ విలువ తాజాగా 1,25,689 డాలర్లకు చేరుకుంది. ఆగస్టు 14న నెలకొల్పిన 1,24,514 రికార్డును సైతం.. ఇప్పుడు అధిగమించింది. ప్రస్తుత పరిస్థితులు బిట్కాయిన్ విలువను అమాంతం పెంచే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా అమెరికా స్టాక్లలో లాభాలు, బిట్కాయిన్ లింక్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి ఇన్ఫ్లోలు పెరిగాయి.ఇటీవల ప్రారంభమైన ప్రభుత్వ షట్డౌన్.. డబ్బును సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టేలా చేసింది. మార్కెట్ వర్గాలు దీనిని 'డీబేస్మెంట్ ట్రేడ్' అని పిలుస్తున్నారు. "ఈక్విటీలు, బంగారం, పోకీమాన్ కార్డుల వంటి సేకరణలతో సహా అనేక ఆస్తులు ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. డాలర్ విలువ తగ్గడం.. బిట్కాయిన్ విలువ పెరగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు" అని క్రిప్టో ప్రైమ్ బ్రోకరేజ్ సంస్థ ఫాల్కన్ఎక్స్ మార్కెట్ల కో హెడ్ జాషువా లిమ్ అన్నారు.సాధారణంగా అక్టోబర్ నెల బిట్కాయిన్కు అనుకూలమైనది.. దీనిని "అప్టోబర్" అని మార్కెట్ నిపుణులు పిలుచుకుంటారు. గత కొన్నేళ్లుగా బిట్కాయిన్ పెరుగుతూనే ఉంది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదని చెబుతున్నారు.బిట్కాయిన్ పెరుగుదలపై విక్రమ్ సుబ్బురాజ్ ఏమన్నారంటే?బిట్కాయిన్ విలువ 125000 డాలర్లు దాటడం అనేది మరో మైలురాయి కాదు. గత కొంతకాలంగా దీని విలువ పెరుగుతూనే ఉంది. పరిస్థితులు కూడా బిట్కాయిన్కు అనుకూలంగా మారుతున్నాయి. దీనికి కారణం రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం, పెరుగుతున్న సంస్థాగత భాగస్వామ్యం.. స్థిరమైన డిమాండ్ అని జియోటస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ అన్నారు. అంతే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు బిట్కాయిన్ ఒక ప్రత్యేక ఆస్తి అని కూడా ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్.. విజయ్ దేవరకొండ నెట్వర్త్ ఎంతో తెలుసా? -
రెనోలో 3000 మంది బయటకు!: కారణం ఇదే..
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ తొలగింపులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.రెనాల్ట్ కంపెనీ.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించనుంది. మొత్తం మీద సంస్థ తన మొత్తం ఉద్యోగులలో 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొలగింపులు సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రదేశాలలో కూడా ఉన్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రెనాల్ట్ కంపెనీ 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 98,636 మంది సిబ్బందిని నియమించింది. ''ఆటోమోటివ్ మార్కెట్లోని అనిశ్చితులు.. పోటీ వాతావరణం దృష్ట్యా, మా కార్యకలాపాలను సరళీకృతం చేయడానికి తగిన మార్గాలను పరిశీలిస్తున్నాము. ఇందులో భాగమని లేఆఫ్స్ కూడా చేయడానికి చూస్తున్నట్లు'' రెనాల్ట్ ప్రతినిధి పేర్కొన్నారు.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?రెనాల్ట్ జూలై ఆర్థిక నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో 11.2 బిలియన్ యూరోల (13 బిలియన్ డాలర్లు) నష్టాన్ని చవిచూసింది. ఇందులో భాగస్వామి నిస్సాన్పై కూడా 9.3 బిలియన్ యూరోల నష్టం ఉంది. కంపెనీ నికర ఆదాయం కూడా 461 మిలియన్ యూరోలకు తగ్గిపోయింది. ఖర్చులు పెరగడం.. పెరుగుతున్న పోటీ వాతావరణం నుంచి ఉత్పన్నమయ్యే వాణిజ్య ఒత్తిళ్లు ఈ తగ్గుదలకు కారణమని సమాచారం. -
హైదరాబాద్ అపార్ట్మెంట్లలో ‘పార్కింగ్’ దందా..
‘గ్రోహె–హురన్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్లో చోటు సంపాదించుకున్న నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇది. హైదరాబాద్లోని ఓ ప్రాజెక్ట్లో ద్విచక్ర వాహనం కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని.. కార్గా ఏమార్చి కొనుగోలుదారునికి విక్రయించి సొమ్ము చేసుకుంది. భవన నిర్మాణ అనుమతి పత్రంలో బైక్ పార్కింగ్ స్థలాన్ని డ్రాయింగ్లో కారు బొమ్మగా మార్చారని ఆరోపిస్తూ ఓ ఫిర్యాదుదారుడు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా)ను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన టీజీ–రెరా అప్రూవల్ ప్లాన్ను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు’.. గృహ కొనుగోలుదారులకు పార్కింగ్ స్థలం విక్రయంలో పేరు మోసిన నిర్మాణ సంస్థ తీరే ఇలా ఉంటే చిన్నాచితక డెవలపర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య కాలంలో బిల్డర్ల అక్రమ పార్కింగ్ విక్రయాలపై టీజీ–రెరాకు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోజీవో నంబరు 168 ప్రకారం 2 వేల గజాలపైన నిర్మించే నివాస భవన నిర్మాణాలలో 33 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్కు కేటాయించాలి. ఇందులో 30 శాతం ఆ భవనంలోని నివాసితులకు, 3 శాతం సందర్శకుల కోసం కేటాయించాల్సి ఉంటుంది. అలాగే వాణిజ్య భవన నిర్మాణాలలో అయితే 44 శాతం బిల్టప్ ఏరియాను పార్కింగ్కు కేటాయించాల్సి ఉంటుంది. ఇందులో 40 శాతం రిటైల్ స్టోర్లకు, 4 శాతం సందర్శకులకు కేటాయించాలి. 2.5/4.5 మీటర్ల పొడవు, వెడల్పుతో కారు పార్కింగ్ను కేటాయించాలి. దీనికంటే తక్కువ ఉండకూడదు. కానీ, ప్రస్తుతం ఈ నిబంధనలను తూ.చ. తప్పకుండా అనుసరించే డెవలపర్లు చాలా తక్కువే.లాటరీ పద్ధతిలో పార్కింగ్ ప్లేస్.. ఏ గృహ కొనుగోలుదారుడికి ఎక్కడ పార్కింగ్ ప్లేస్ కేటాయించాలనే అంశంపై కూడా నిబంధనలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) వచ్చిన మూడు నెలలలోపు అసోసియేషన్ ఏర్పాటు కావాలి. నివాసితులకు పార్కింగ్ ప్లేస్ల కేటాయింపు కోసం ఆఫీస్ బేరర్స్ సమక్షంలో లాటరీ పద్ధతిలో కేటాయించాలి. 600 గజాలలోపు నిర్మించే స్టిల్ట్+5 అంతస్తుల భవనాలకైతే డీమ్డ్ టు సాటిస్ఫై ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాలలో అక్రమ పార్కింగ్ విక్రయాలపై సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి.టీడీఆర్తోనూ పార్కింగ్ సమస్యలే.. సాధారణంగా డెవలపర్లు అనుమతి ఉన్న దాని కంటే అదనంగా పార్కింగ్ ప్లేస్లను విక్రయిస్తుంటారు. ఉదాహరణకు అప్రూవల్ డ్రాయింగ్లో 450 కార్ల పార్కింగ్ ప్లేస్లకు అనుమతి లభిస్తే.. 600ల పార్కింగ్ ప్లేస్లుగా మార్చి విక్రయిస్తుంటారు. డిమాండ్ను బట్టి ఒక్కో కారు పార్కింగ్ను రూ.1–5 లక్షల చొప్పున అమ్ముకుంటుంటారు. కొందరు డెవలపర్లు స్టిల్+4 అంతస్తులకు నిర్మాణ అనుమతులు తీసుకొని, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) తీసుకొని ఇంకో అంతస్తు నిర్మిస్తున్నారు. 400 గజాల్లో 8 అపార్ట్మెంట్లు వస్తే.. టీడీఆర్ తీసుకొని ఇంకో అదనపు అంతస్తులో రెండు ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. దీంతో యూనిట్ల సంఖ్య పెరిగి, పార్కింగ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.డ్రైవ్ వేలు కూడా పార్కింగ్గానే.. ఆరు నెలల్లో 10–12 అక్రమ పార్కింగ్ విక్రయ ఫిర్యాదులే వచ్చాయి. కొందరు డెవలపర్లు డ్రైవ్ వేలను కూడా పార్కింగ్ ప్లేస్గా మార్చి విక్రయిస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదులలో అప్రూవ్డ్ డ్రాయింగ్ ప్లాన్ను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నాం. – కే.శ్రీనివాసరావు, సభ్యులు, టీజీ–రెరా -
ఈ దీపావళికి బంగారం కొనడం మరింత కష్టం!
దీపావళి సమీపిస్తున్న కొద్దీ, బంగారం, వెండి ధరలు చారిత్రాత్మక గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పండుగ డిమాండ్, సెంట్రల్ బ్యాంక్ విధానాల వల్ల పసిడి ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధరలు (gold price) ఇప్పటికే 10 గ్రాములకు రూ .1,18,000 దాటగా, వెండి కిలోకు రూ .1,44,000 దాటింది. దీపావళి రోజు అంటే అక్టోబర్ 21 నాటికి బంగారం రూ .1.22 లక్షలు, వెండి (silver price)రూ .1.50 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆజ్యం పోస్తున్న ప్రపంచ పోకడలుఅంతర్జాతీయంగా, బంగారం ఔన్స్ కు 3950– 4000 డాలర్లకు చేరుకుంటుందని, అలాగే వెండి ఔన్స్ కు 49– 50 డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ ధరల వేగానికి విశ్లేషకులు చెబుతున్న కారణాలు.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ డోవిష్ (తక్కువ వడ్డీ రేట్లు, వృద్ధికి ప్రాధాన్యం) వైఖరి, బలహీనపడుతున్న అమెరికన్ డాలర్, బలమైన ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు, భారతదేశ పండుగ, వివాహ సీజన్ల నుండి బలమైన డిమాండ్.వెండికి పారిశ్రామిక డిమాండ్ సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల నుండి పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కూడా వెండి ర్యాలీకి మద్దతు ఇస్తోంది. సరఫరా పరిమితులు, రూపాయి విలువ తరుగుదల మరింత ఊపందుకుంటోంది.ఇదీ చదవండి: ఆశ పెట్టి అంతలోనే.. ఒక్కసారిగా కొత్త రేట్లకు పసిడి, వెండి -
చిన్న బిజినెస్.. పెద్ద మ్యాజిక్!
నేటి రోజుల్లో చిన్న చిన్న వ్యాపార యజమానులందరూ సులభంగా, వేగంగా, సురక్షితంగా పని చేయాలనుకుంటే, ఒక్కసారి ఈ స్మార్ట్ టూల్స్ ప్రయత్నించాల్సిందే!పేపర్ ప్లస్ డిజిటల్ మ్యాజిక్ఒకప్పుడు నోట్స్ రాస్తే కేవలం కాగితాలకే పరిమితం అయ్యేది. ఒక్క కాగితం మిస్ అయినా, రాసిన మాట, గీసిన డ్రాయింగ్ అంతా మాయం అవుతుంది. ఇప్పుడు ‘హుయిన్ డిజిటల్ నోట్బుక్’తో ఆ భయం పూర్తిగా తొలగింది. ఇది కేవలం ఒక నోట్బుక్ కాదు, పేపర్ ప్లస్ డిజిటల్ టాబ్లెట్. ఇందులో రాసిన ప్రతి అక్షరం, గీసిన ప్రతి లైన్ వెంటనే మీ డివైస్లో స్టోర్ అవుతుంది. ఆడియో రికార్డ్ ఫీచర్తో, మీ వాయిస్ కూడా నోట్స్తో కలిసి రికార్డ్ అవుతుంది. ఒక్క క్లిక్తో షేర్ చేసుకోవచ్చు కూడా. పేజీలను మిళితం చేయడం, విడగొట్టడం చాలా సులభం. ముఖ్యమైన విషయాలను హైలైట్ చేయడానికి సులభమైన టూల్స్ కూడా ఉన్నాయి. ధర రూ. 7,105 ల ప్యాక్లో ఒక హుయిన్ నోట్, ఏ ఐ నోట్ ప్యాడ్, యూఎస్బీ కేబుల్, మాగ్నెటిక్ పెన్ స్లీవ్, రీఫిల్స్, ప్లాస్టిక్ పెన్ నిబ్స్, మార్గదర్శక పుస్తకంతో వస్తుంది.ఒక్క కార్డు చాలు! ఒకప్పుడు పాత పేపర్ విజిటింగ్ కార్డ్ అంటే స్టేటస్ సింబల్. ‘ఇదిగో నా కార్డ్’ అంటూ ఇచ్చేసి స్టయిల్ కొట్టేవాళ్లు. కాని, నిజం చెప్పాలంటే ఆ కార్డుల ఫ్యూచర్ బాగుండేది కాదు. రోజుల తరబడి జేబులో మురిగి, కాఫీ కప్పుల కింద నలిగి, చివరికి ఏ డస్ట్బిన్లోనో ఎండ్ అయ్యేది. అలాంటప్పుడు వాటికోసం అనవసరంగా ఖర్చు ఎందుకు చేయటం. కేవలం, ఒక్క టాప్తోనే మీ పేరు, నంబర్, వెబ్సైట్, సోషల్ మీడియా అన్నీ ఎదుటివారి మొబైల్లో బజ్ అయ్యే మాయ చేస్తుంది ఈ ‘టాప్మో స్మార్ట్ బిజినెస్ కార్డ్’. ఇందులో చిన్న లోగో, క్యూ ఆర్ కోడ్, లైఫ్టైమ్ వాలిడిటీ అన్నీ రెడీ! యాప్ డౌన్లోడ్ అనే తలనొప్పి లేదు, ‘కార్డులు అయిపోయాయి’ అనే టెన్షన్ లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు కూడా. ధర కేవలం రూ. 599 మాత్రమే!పోర్టబుల్ సర్వర్స్మాల్ బిజినెస్ ఓనర్స్కు కస్టమర్ డేటా, ఫైనాన్స్ రికార్డులు, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ రక్షించుకోవాలంటే పెద్ద సర్వర్ అవసరమా? లేనే లేదు! బిజినెస్ డీటైల్స్ అన్నీ ఒకే చోట, సురక్షితంగా ఉంచాలంటే ‘అప్రికార్న్ ఏజిస్ ప్యాడ్లాక్’ బెస్ట్ ఆప్షన్. 480 జీబీ స్టోరేజ్, 256–బిట్ ఎన్క్రిప్షన్, రగ్డ్ బాడీ, టూ స్టెప్ వెరిఫికేషన్తో ఏ ఫైల్ అయినా సేఫ్గా స్టోర్ చేస్తుంది. ఇది కేవలం స్టోరేజ్ సర్వర్ మాత్రమే కాదు, చిన్న బిజినెస్కి నమ్మకమైన డేటా గార్డు. ఆఫీస్లోనైనా, ఇంట్లోనైనా, ట్రావెల్లోనైనా సులభంగా ఉపయోగించవచ్చు. చిన్న, పోర్టబుల్ బాడీతో జేబులోనైనా పెట్టుకుని క్యారీ చేయవచ్చు. ఏకకాలంలో డేటా యాక్సెస్, బ్యాకప్, షేర్ అన్నీ సులభం. ధర రూ. 49,325. -
ఫాస్టాగ్ లేకపోతే డబుల్ ఛార్జ్..
జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్ (FASTag) లేకపోతే డబుల్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఫంక్షనల్ ఫాస్టాగ్లు లేని వాహనాలు లావాదేవీలో నగదును ఉపయోగిస్తే రెట్టింపు రుసుము చెల్లించాలి. అదే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా చెల్లిస్తే వినియోగదారు రుసుముకు 1.25 రెట్లు మాత్రమే వసూలు చేస్తారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతోపాటు జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సవరించిన జాతీయ రహదారుల రుసుము (రేట్లు, వసూళ్ల నిర్ణయం) నిబంధనలు, 2008 ప్రకారం.. చెల్లుబాటు అయ్యే, ఫంక్షనల్ ఫాస్టాగ్ లేకుండా ఫీజు ప్లాజాలోకి ప్రవేశించే వాహనాలు యూపీఐ (UPI) ద్వారా చెల్లింపును ఎంచుకుంటే ఆ వాహన కేటగిరికి వర్తించే వినియోగదారు రుసుము కంటే 1.25 రెట్లు మాత్రమే వసూలు చేస్తారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.కొత్త ఫీజుల విధానం నవంబర్ 15 నుండి అమల్లోకి వస్తుంది. "ఈ సవరణ ఫీజు వసూలు ప్రక్రియను బలోపేతం చేయడం, టోల్ వసూలులో పారదర్శకతను పెంచడంతోపాటు జాతీయ రహదారి వినియోగదారులకు ప్రయాణ సౌలభ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది" అని రోడ్డు రవాణా శాఖ పేర్కొంది. -
తెగ అప్పులిచ్చేసిన బ్యాంకులు.. హెచ్డీఎఫ్సీ బ్యాంకుదే జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంకుల రుణ వితరణ (Bank loans) గణనీయంగా పెరిగింది. రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంకు (HDFC Bank ) రుణాలు 9 శాతం పెరిగి రూ. 27.9 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు క్రెడిట్ బుక్ రూ. 25.6 లక్షల కోట్లుగా నమోదైంది.మరోవైపు, కోటక్ మహీంద్రా బ్యాంక్లో రుణ వృద్ధి 15.8 శాతంగా నమోదైంది. రుణాల పరిమాణం రూ. 3.99 లక్షల నుంచి రూ. 4.62 లక్షల కోట్లకు ఎగిసింది. ఇక ఐడీబీఐ బ్యాంకు రుణాలు 15 శాతం పెరిగి రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.3 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం వ్యాపారం 12 శాతం పెరిగింది.రూ. 4.78 లక్షల కోట్ల నుంచి రూ. 5.33 లక్షల కోట్లకు ఎగిసింది. అటు క్యూ2లో యూకో బ్యాంక్ మొత్తం వ్యాపారం 13 శాతం పెరిగి రూ. 5.37 లక్షల కోట్లకు చేరింది. మొత్తం రుణాలు 16.67 శాతం వృద్ధి చెంది రూ. 1.98 లక్షల కోట్ల నుంచి రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి. -
ఇక ఫోకస్ అంతా 6జీపైనే.. 8 నుంచి ఇండియా మొబైల్ కాంగ్రెస్
ఈ నెల 8 నుంచి 11 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 సదస్సులో ప్రధానంగా 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడం, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. విశ్వసనీయ భాగస్వామిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారత్, 6జీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించగలదని డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫాం ఐఎంసీ సీఈవో పి. రామకృష్ణ తెలిపారు.’6జీ వ్యవస్థకు ప్రధానమైన అంశాలను అనుసంధానం చేయగలిగే కీలక ప్లాట్ఫాంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎదుగుతోంది. ఇందులో భారత్తో పాటు యూరప్, బ్రిటన్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి పరిశ్రమకు చెందిన సీనియర్ నేతలు, నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. 6జీ సిపోజియంలో టెక్నాలజీ దిగ్గజాలతో పాటు ఐఐటీ, అంతర్జాతీయ యూనివర్సిటీల్లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి విద్యావేత్తలు పాల్గోనున్నారు.6జీకి సంబంధించిన టెక్నాలజీలు, కృత్రిమ మేథ నెట్వర్క్లు, స్పెక్ట్రం క్రమబద్ధీకరణ తదితర అంశాలపై అత్యున్నత స్థాయిలో చర్చలు జరపనున్నట్లు రామకృష్ణ చెప్పారు. 7,000 మంది పైగా గ్లోబల్ ప్రతినిధులు, 800 మంది వక్తలు, 150 దేశాల నుంచి 400 మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటారని అంచనా. 6జీ గ్లోబల్ రేసుకు భారత్ సారథ్యం వహించనుందని సెల్యులార్ ఆపరేటర్స్ సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు.ఏఐ, జెన్ఏఐ టెక్నాలజీల్లో భారతీయ డిజిటల్ ఆవిష్కరణలు, దేశీయంగా టెలికం రంగాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 5జీ విస్తరణ, 6జీ సన్నద్ధతకు 6 గిగాహెట్జ్ బ్యాండ్ను సమర్ధవంతంగా కేటాయించడం కీలకంగా ఉంటుందని వివరించారు. -
పునాది నుంచే పొదుపు.. తక్కువ ఖర్చుతో సొంతిల్లు
గత దశాబ్దంలో గృహ నిర్మాణ వ్యయం (house construction) రెండింతలు పెరిగింది. ముఖ్యంగా పునాది నిర్మాణంలో అవసరమైన మెటీరియల్స్ (construction material) ధరలు గణనీయంగా పెరిగాయి. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సొంతిల్లు కలను నెరవేర్చుకోవాలంటే ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరైంది.ఈ నేపథ్యంలో, సంప్రదాయ మెటీరియల్స్కు ప్రత్యామ్నాయంగా చౌకగా, మన్నికగా, పర్యావరణ హితంగా ఉండే కొత్త మేటీరియల్స్ ఇప్పుడు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. తక్కువ ఖర్చుతోనే నిర్మాణ నాణ్యతను కోరుకునే వారికి ఇవి వరంగా మారుతున్నాయి.మెటీరియల్సంప్రదాయ ఎంపికలుకొత్త/చౌకైన ప్రత్యామ్నాయాలువిశేషాలుసిమెంట్ఓపీసీ, పీపీసీజియోపాలిమర్ సిమెంట్, స్లాగ్ బేస్డ్ సిమెంట్తక్కువ ఉద్గారాలు, శాశ్వతత ఎక్కువఇసుకనది ఇసుకఎం-సాండ్, రోబో సాండ్తక్కువ ధర, నది పరిరక్షణరాళ్లు20ఎంఎం, 40ఎంఎం మిక్స్రీసైకిల్ అగ్రిగేట్వ్యర్థాలను ఉపయోగించి తయారీస్టీల్ (TMT)Fe500, Fe550బసాల్ట్ రీబార్తక్కువ బరువు, తక్కువ ఖర్చు, ఎక్కువ సంవత్సరాలు మన్నికబీమ్ & ఫౌండేషన్సైట్లలో తయారు చేసే బీమ్లుప్రికాస్ట్ ఫౌండేషన్ బ్లాక్స్వేగంగా నిర్మాణం, శ్రమ ఆదాకొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీలు, మెటీరియల్స్రోబో సాండ్ – ఇసుకకు ఉత్తమ ప్రత్యామ్నాయం* మేనుఫ్యాక్చర్డ్ శాండ్ (M-Sand) కన్నా మెరుగైన గుణాత్మకత కలిగిన రోబో సాండ్, హైదరాబాద్, సంగారెడ్డి, విజయవాడ ప్రాంతాల్లో సులభంగా అందుబాటులో ఉంది.* ధర నది ఇసుక కంటే 25-30% తక్కువ.* గృహ నిర్మాణానికి సరైన పైనెస్ మోడ్యూలస్ (Fineness modulus) కలిగి ఉంటుంది.జియోపాలిమర్ సిమెంట్ – పర్యావరణ హితమైన కొత్త పరిష్కారం* జియోపాలిమర్ సిమెంట్ తయారీలో లైమ్ వినియోగం తక్కువగా ఉంటుంది.* OPC కంటే 60% తక్కువ కార్బన్ ఉద్గారాలు విడుదల చేస్తుంది.* పునాది స్థాయిలోనే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ను అమలుపరచవచ్చు.ప్రికాస్ట్ బ్లాక్స్ – వేగంగా నిర్మాణం* ఫౌండేషన్, పిలర్స్, వాల్ సెక్షన్లను ముందే తయారు చేసి సైటులో ఫిక్స్ చేయడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుంది.* ఒక సాధారణ 1000 చ.అ. ఇంటికి 15 రోజుల పని, 5–6 రోజుల్లో పూర్తవుతుంది.బసాల్ట్ రీబార్ – స్టీల్కు ఆధునిక ప్రత్యామ్నాయం* బసాల్ట్ ఫైబర్తో తయారవుతుంది.* తక్కువ బరువు, తక్కువ ఖర్చు.* తేమ, ఉప్పు వల్ల తుడుపుకు గురికాకపోవడం దీని ప్రత్యేకత.నిర్మాణ ఖర్చు తగ్గాలంటే.. ఇంజినీర్లు, నిపుణుల సలహాలు* స్థలానికి దగ్గరగా లభించే మెటీరియల్స్ను ప్రాధాన్యత ఇవ్వాలి.* పునాది నిర్మాణానికి ముందు సైట్ సొయిల్స్ టెస్టింగ్ తప్పనిసరిగా చేయించాలి. తద్వారా అవసరమైన మెటీరియల్స్ను సరిగ్గా అంచనా వేయవచ్చు.* సామూహిక కొనుగోలు లేదా గ్రామీణ కాంట్రాక్టర్లతో పనిచేయడం ద్వారా మెటీరియల్ ధరకులను తగ్గించవచ్చు.* ప్రికాస్ట్ టెక్నాలజీని అనుసరించడం వల్ల పని వేగంగా పూర్తవుతుంది, లేబర్ ఖర్చు తగ్గుతుంది.చివరగా..పునాది నుంచే చౌకగా, మన్నికగా, పర్యావరణహితంగా నిర్మించగలిగితే ఇంటి మొత్తం నిర్మాణ వ్యయం మీద సగటున 15 నుంచి 20 శాతం వరకు ఆదా చేయవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
డీమార్ట్ ఆదాయం జంప్.. 3 నెలల్లో ఎన్ని వేల కోట్లు వచ్చాయంటే..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్మార్ట్స్ ఆదాయం రూ. 16,219 కోట్లుగా (స్టాండెలోన్) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 14,050 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. త్రైమాసికాలవారీగా క్యూ1లో నమోదైన రూ. 15,932 కోట్లతో పోలిస్తే 1.8 శాతం వృద్ధి చెందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.2025 సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం స్టోర్స్ సంఖ్య 432గా ఉంది. స్టాండెలోన్, కన్సాలిడేటెడ్ ఫలితాలను ఆమోదించేందుకు అక్టోబర్ 11న కంపెనీ బోర్డు మసావేశం కానుంది. ఆంధ్రపద్రేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో డీమార్ట్కి కార్యకలాపాలు ఉన్నాయి. -
హైదరాబాద్లో హార్ట్ఫోర్డ్ టెక్నాలజీ సెంటర్
హైదరాబాద్: అమెరికాకు చెందిన బీమా సేవల సంస్థ ది హార్ట్ఫోర్డ్ తాజాగా హైదరాబాద్లో తమ ఇండియా టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించింది. కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా అధునాతన వర్క్స్టేషన్లు, శిక్షణా సదుపాయాలు మొదలైన ప్రత్యేకతలతో దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. డిజిటల్, కృత్రిమ మేథ సామర్థ్యాలను పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శేఖర్ పన్నాల తెలిపారు.సుశిక్షితులైన టెక్నాలజీ నిపుణుల లభ్యత, గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్ పేరొందిన నేపథ్యంలో నగరాన్ని ఎంచుకున్నట్లు చీఫ్ డేటా, ఏఐ, ఆపరేషన్స్ ఆఫీసర్ జెఫ్ హాకిన్స్ తెలిపారు. దాదాపు 200 ఏళ్ల పైగా చరిత్ర గల ది హార్ట్ఫోర్డ్కి ప్రపంచవ్యాప్తంగా 19 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలోని హార్ట్ఫోర్డ్, షికాగో తదితర ప్రాంతాల్లో టెక్నాలజీ కేంద్రాలు ఉన్నాయి. -
జొమాటో డెలివరీ సిబ్బందికి హెచ్డీఎఫ్సీ పెన్షన్
న్యూఢిల్లీ: జొమాటో, హెచ్డీఎఫ్సీ పెన్షన్ మధ్య భాగస్వా మ్యం కుదిరింది. జొమాటో డెలివరీ భాగస్వాములకు ‘ఎన్పీఎస్ ప్లాట్ఫామ్ వర్కర్స్మోడల్’ను హెచ్డీఎఫ్సీ పెన్షన్ ఆఫర్ చేయనుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రారంభించారు.‘‘ప్లాట్ఫామ్ ప్రారంభించిన 72 గంటల్లోనే 30,000 మందికి పైగా డెలివరీ భాగస్వాములు శాశ్వత రిటైర్మెంట్ ఖాతా నంబర్లను (ప్రాన్) తీసుకున్నారు. లక్ష మందికి పైగా డెలివరీ భాగస్వాములకు ఎన్పీఎస్ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని జొమాటో ప్రకటించింది. -
బ్యాంకులకు డిపాజిట్ సవాళ్లు
ముంబై: ఫిక్స్డ్ డిపాజిట్లలో క్షీణత, కరెంట్–సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు (కాసా) తగ్గుదలతో బ్యాంక్లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి సవాళ్లను ఎదుర్కోనున్నట్టు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. గృహ పొదుపులు అధిక రాబడులను ఆకాంక్షిస్తూ క్యాపిటల్ మార్కెట్లకు మళ్లుతుండడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయంటూ కొంత కాలంగా ఆందోళనలు నెలకొనడం తెలిసిందే. వ్యవస్థ పరిణతిలో భాగంగా ఇలాంటి పరిణామం చూస్తున్నట్టు నిపుణుల అభిప్రాయంగా ఉంది. ‘‘టర్మ్ డిపాజిట్లు, కాసా నిష్పత్తిలో గృహాల వాటా తగ్గుతోంది. డిపాజిట్ కూర్పులో నిర్మాణాత్మక మార్పును ఇది సూచిస్తోంది. డిపాజిట్ స్థిరత్వానికి ఇది సవాలుగా మారొచ్చు. మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో బ్యాంకుల నిధుల వ్యయాలపైనా ప్రభావం చూపిస్తుంది. 2025 మార్చి నాటికి బ్యాంకుల డిపాజిట్లలో గృహాల వాటా 60 శాతానికి తగ్గింది. 2020 మార్చి నాటికి ఇది 64 శాతంగా ఉంది’’అని క్రిసిల్ నివేదిక వివరించింది. డిపాజిట్లలో వృద్ధి బ్యాంకులకు ఎంతో కీలకమని, స్థిరత్వం, వ్యయాలను ఇది ప్రభావితం చేయగలదని పేర్కొంది. రానున్న కాలంలో బ్యాంక్ డిపాజిట్లలో గృహాల వాటా మరింత తగ్గుతుందని అంచనా వేసింది. పెరుగుతున్న ఆర్థికేతర సంస్థల వాటా ఆర్థికేతర సంస్థలు తమ వాటా పెంచుకుంటున్నట్టు క్రిసిల్ డైరెక్టర్ శుభ శ్రీనారాయణన్ ఎత్తిచూపుతూ.. కార్పొరేట్ డిపాజిటర్లు రేటుకు సున్నితంగా ఉంటారని, వారు స్వల్పకాలానికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ‘‘నగదు లభ్యత పరిస్థితులు (లిక్విడిటీ) కఠినంగా ఉన్నప్పుడు ఈ తరహా పరిస్థితుల్లో మరిన్ని డిపాజిట్లు బయటకు వెళ్లిపోతాయి. దీంతో బ్యాంకులకు నిధుల వ్యయాలు పెరుగుతాయి. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు మరింత ఆదరణకు నోచుకుంటాయి. దీంతో బ్యాంకు డిపాజిట్లలో గృహాల వాటా మరింత తగ్గుతుంది’’అని నారాయణన్ వివరించారు. బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల్లోని డిపాజిట్లపై వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై 3 శాతం వరకు బ్యాంకులు వడ్డీ కింద చెల్లిస్తుంటాయి. ఇక కరెంటు ఖాతా డిపాజిట్లపై ఎలాంటి వడ్డీని ఇవ్వవు. దీంతో వాటికి తక్కువ వ్యయాలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతుంటాయి. అందుకే బ్యాంకుల వృద్ధికి కాసా డిపాజిట్లను కీలకంగా పరిగణిస్తుంటారు. 2025 జూన్ చివరికి బ్యాంకుల కాసా డిపాజిట్ల నిషపత్తి 36 శాతానికి తగ్గిపోయినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. 2022 మార్చిలో నమోదైన 42 శాతం చారిత్రక గరిష్ట స్థాయి నుంచి తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా సేవింగ్స్ డిపాజిట్లు తగ్గుముఖం పడుతున్నట్టు పేర్కొంది. ఇటీవలి కాలంలో బ్యాంకులు సేవింగ్స్ డిపాజిట్లపై రేట్లను తగ్గించడం దీన్ని మరింత వేగవంతం చేస్తుందని అంచనా వేసింది. సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీని ఎస్బీఐ సహా పలు ప్రముఖ బ్యాంకులు ఇటీవల 2.5 శాతానికి తగ్గించడం గమనార్హం. లిక్విడిటీ పెంపు దిశగా ఆర్బీఐ పలు చర్యలు తీసుకున్నందున సమీప కాలానికి ఈ డిపాజిట్లు స్థిరంగా వృద్ధి చెందాల్సి ఉందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. -
బ్యూటీ బ్రాండ్స్లోకి పెట్టుబడుల జోరు..
న్యూఢిల్లీ: గ్లోబల్ బ్రాండ్స్ భారత మార్కెట్లోకి విస్తరిస్తున్నప్పటికీ, దేశీ ఆన్లైన్ డైరెక్ట్–టు–కన్జూమర్ (డీ2సీ) సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్స్లోకి కూడా భారీగా పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. 20 అగ్రగామి డీ2సీ బ్రాండ్స్లోకి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది (జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో) ఇన్వెస్ట్మెంట్స్ 7 శాతం పెరిగాయి. సుమారు 63.1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 560 కోట్లు) పైగా వచ్చినట్లు బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ట్రాక్షన్ డేటాలో వెల్లడైంది. 2020లో నమోదైన 21.6 మిలియన్ డాలర్లతో పోలిస్తే పెట్టుబడులు సుమారు మూడు రెట్లు ఎగియడం గమనార్హం. ఫండింగ్ సమకూర్చుకున్న సంస్థల్లో షుగర్ కాస్మెటిక్స్, ఇన్నోవిస్ట్, ఫే బ్యూటీ, రెనీ కాస్మెటిక్స్లాంటివి ఉన్నాయి. బ్యూటీ కేటగిరీలో పెట్టే పెట్టుబడులపై సగటున 10 నుంచి 25 రెట్లు రాబడులు వస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ విభాగంలో మార్జిన్లు అధికంగా ఉండటం, మూలధనాన్ని సమర్ధంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ప్రీమియం ఉత్పత్తులకి, వినియోగానికి గణనీయంగా డిమాండ్ నెలకొనడం ఈ కేటగిరీకి సానుకూలాంశమని, ఇతరత్రా మిగతా ఏ కేటగిరీల్లోనూ ఇలాంటి పరిస్థితి లేదని వివరించాయి. ఫాక్స్టేల్కి 30 మిలియన్ డాలర్లు.. ఆర్ఏఎస్ లగ్జరీ స్కిన్కేర్ సంస్థ ఈ ఏడాది యూనిలీవర్ వెంచర్స్ నుంచి 5 మిలియన్ డాలర్లు, ఆయుర్వేదిక్ బ్యూటీ బ్రాండ్ ఇండి వైల్డ్ కూడా దాదాపు అంతే మొత్తాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులోనూ యూనిలీవర్ వెంచర్స్ సారథ్యంలోని ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికాలో కార్యకలాపాల విస్తరణ కోసం కంపెనీ ఈ నిధులను సమకూర్చుకుంది. ఇక ఆగస్టులో రెనీ కాస్మెటిక్స్ సంస్థ సిరీస్ సీ విడత కింద ప్లేబుక్, మిడాస్ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి 5.8 మిలియన్ డాలర్లు సేకరించింది. ఇక ఫాక్స్టేల్ సైతం సిరీస్ సీ విడత కింద పాంథెరా, కోసీ కార్పొరేషన్ తదితర సంస్థల నుంచి ఏకంగా 30 మిలియన్ డాలర్లు దక్కించుకుంది. అటు బేర్ అనాటమీ, కెమిస్ట్ ఎట్ ప్లే, సన్సూ్కప్లాంటి బ్రాండ్స్ మాతృ సంస్థ ఇన్నోవిస్ట్ సైతం ఐసీఐసీఐ వెంచర్, మిరాబిలిస్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ నుంచి 16 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంది. 45 బిలియన్ డాలర్లకు చేరనున్న పరిశ్రమ .. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తుల మార్కెట్ పరిమాణం సుమారు 24 బిలియన్ డాలర్లుగా ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2030 నాటికి ఇది 40–45 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ మార్కెట్లో ఆన్లైన్ కేటగిరీ వాటా 2023లో 13 శాతంగా ఉండగా 2024లో దాదాపు 17 శాతానికి పెరిగినట్లు వివరించాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లలో ఈ–కామర్స్ బూమ్ నెలకొనడంతో కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు అవకాశాలు లభిస్తున్నాయని తెలిపాయి. దీంతో వేగంగా వృద్ధి సాధించేందుకు, విస్తృత శ్రేణిలో ఉత్పత్తులను అందించేందుకు, మార్కెట్లో మరింత విస్తరించేందుకు దేశీ బ్యూటీ బ్రాండ్స్ నిధులను సమకూర్చుకుంటున్నట్లు ట్రాక్షన్ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో బడా కంపెనీలు, ఇలాంటి బ్యూటీ బ్రాండ్స్ను కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉంటున్నాయి. దేశీ స్కిన్ కేర్ బ్రాండ్ మినిమలిస్ట్లో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) 90.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 2,706 కోట్లు వెచి్చంచింది. అటు మారికో సంస్థ దాదాపు రూ. 400 కోట్లతో బియర్డోను కొనుగోలు చేసింది. ది మ్యాన్ కంపెనీని ఇమామీ దక్కించుకుంది. గ్లోబల్ బ్రాండ్స్ వెల్లువ.. దేశీయంగా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లోకి పలు అంతర్జాతీయ బ్రాండ్స్ కూడా పెద్ద ఎత్తున ఎంట్రీ ఇస్తున్నాయి. స్వీడిష్ బ్రాండ్ హెచ్అండ్ఎం ఇటీవలే భారత్లో బ్యూటీ సెగ్మెంట్లోకి ప్రవేశించగా, రిలయన్స్కి చెందిన టీరాతో కలిసి పాప్ ఐకాన్ రిహానా తన ఫెంటీ బ్రాండ్ను ప్రవేశపెట్టింది. అటు ఎంఏసీ, హుడా, అనస్టాషియా బెవర్లీ హిల్స్, స్మాష్బాక్స్, చార్లొట్ టిల్బరీ కూడా రంగంలోకి దిగాయి. ఇక ఓటీటీ ప్లాట్ఫాంలలో కొరియన్ కంటంట్కి ఆదరణ పెరుగుతుండటంతో, ప్రీమియం ఉత్పత్తులతో ఇన్నిస్ఫ్రీ, కాస్ఆర్ఎక్స్, బ్యూటీ ఆఫ్ జోసియోన్లాంటి కొరియన్ బ్రాండ్లు కూడా భారత వినియోగదారులకు గాలమేస్తున్నాయి. -
లిస్టింగ్ బాటలో మరిన్ని కంపెనీలు
ఈ ఏడాది ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ మరోవైపు ప్రైమరీ మార్కెట్లు మాత్రం చెలరేగిపోతున్నాయి. ఈ నెలలోనూ (అక్టోబర్) సెకండరీ మార్కెట్లను ఓవర్టేక్ చేయనున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి హైదరాబాద్ కంపెనీలు విరూపాక్ష ఆర్గానిక్స్, ఆర్వీ ఇంజినీరింగ్ ఇటీవలే ప్రాస్పెక్టస్లు దాఖలు చేయగా.. అదే బాటలో మరో 5 కంపెనీలు నిధుల వేటలో పడ్డాయి. ఈ జాబితాలో రన్వాల్ డెవలపర్స్, లాల్బాబా ఇంజినీరింగ్, స్టెరిలైట్ ఎలక్ట్రిక్, సీజే డార్సిల్ లాజిస్టిక్స్, జెరాయ్ ఫిట్నెస్ చేరాయి. 2025లో ఇప్పటివరకూ మెయిన్బోర్డులో 77 కంపెనీలు లిస్ట్కాగా.. ఈ నెలలో టాటా ఇన్వెస్ట్మెంట్, ఎల్జీ ఎల్రక్టానిక్స్ తదితర దిగ్గజాల ఐపీవోలకు తెరలేవనుంది. రూ. 2,000 కోట్లపై కన్ను రియల్టీ రంగ కంపెనీ రన్వాల్ డెవలపర్స్ ఐపీవో ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ ముంబై కంపెనీ రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్ సందీప్ సుభాష్ రన్వాల్ మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ సహా అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 1988లో ఏర్పాటైన కంపెనీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె నగరాల్లో రిటైల్, వాణిజ్య ప్రాపరీ్టలను నిర్వహిస్తోంది. 1,500 కోట్ల సమీకరణ .. రూ.1,500 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో సెబీకి స్టెరిలైట్ ఎలక్ట్రిక్ ఐపీవో పత్రాలను దాఖలు చేసింది. కార్యకలాపాల విస్తరణ, రుణ భారం తగ్గింపు లక్ష్యాలతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందులో భాగంగా 77.9 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇంతే పరిమాణంలో షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్లు ట్విన్ స్టార్ ఓవర్సీస్తోపాటు కైలాష్ చంద్ర మహేశ్వరి, జాకబ్ జాన్, రామ్గురు రాధాకృష్ణన్ షేర్లను విక్రయించనున్నారు. సెపె్టంబర్ 20 నాటికి కంపెనీకి రూ.600 కోట్ల రుణ భారం ఉంది. ఐపీవోలో సమీకరించే నిధుల్లో రుణ చెల్లింపులకు రూ.350 కోట్లు వినియోగించాలన్న ప్రణాళికతో ఉంది. మిగిలిన నిధులను విస్తరణ కార్యకలాపాలకు వెచి్చంచనుంది. లాల్బాబా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కార్యకలాపాలు నిర్వహించే లాల్బాబా ఇంజనీరింగ్ ఐపీవోలో భాగంగా తాజా షేర్ల జారీ రూపంలో రూ.630 కోట్ల నిధులను, ప్రమోటర్ల వాటాల విక్రయ రూపంలో మరో రూ.370 కోట్లను సమీకరించనుంది. తాజా షేర్ల జారీ రూపంలో సమకూరే నిధుల నుంచి రూ.271 కోట్లను మూలధన వ్యయాల కోసం వెచ్చించనుంది. హల్దియా ప్లాంట్ విస్తరణకు కేటాయించనుంది. రూ.209 కోట్లను రుణ చెల్లింపులకు ఉపయోగించుకోనుంది. లాల్బాబా ఇంజనీరింగ్ సంస్థ సీమ్లెస్ ట్యూబులు, ప్రెసిషన్ ఫోర్జింగ్స్, ఇంటెగ్రేటెడ్ రైల్ స్టిస్టమ్స్ తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సీజే డార్సిల్స్ లాజిస్టిక్స్ సమగ్ర లాజిస్టిక్స్ సరీ్వసుల సంస్థ సీజే డార్సిల్ లాజిస్టిక్స్ భారత్తో పాటు అంతర్జాతీయంగా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు సరుకు రవాణా, వేర్హౌసింగ్ తదితర సేవలను అందిస్తోంది. సెబీకి సమరి్పంచిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ 2.64 కోట్ల వరకు షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు 99.05 లక్షల షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్త యంత్రపరికరాల కొనుగోలు, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించుకోనుంది.జెరాయ్ ఫిట్నెస్ జిమ్ ఎక్విప్మెంట్ సరఫరా చేసే జెరాయ్ ఫిట్నెస్ ప్రమోటర్లు 43.92 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి కంపెనీకి ఐపీవో ద్వారా నిధులేమీ లభించవు. దేశ, విదేశాల్లో కమర్షియల్ జిమ్లు, హోటళ్లు, కార్పొరేషన్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు జెరాయ్ ఎక్విప్మెంట్ను అందిస్తోంది. జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ్రస్టేలియా, సెర్బియా, స్వీడన్ తదితర దేశాలకు కూడా ఎగుమతులు చేస్తోంది. దేశవ్యాప్తంగా 14 ఎక్స్క్లూజివ్ షోరూమ్లు ఉన్నాయి. -
భారత్లో రూ.4.12 కోట్ల మసెరటి కారు లాంచ్
మసెరటి ఇండియా.. ఎంసీపూరా, ఎంసీపూరా సిలో కన్వర్టిబుల్ కార్లను లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ.4.12 కోట్లు, రూ.5.12 కోట్ల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. 2025 జులైలో గుడ్వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్లో కనిపించిన ఈ కార్లు ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన 3 నెలల తర్వాత భారతదేశంలో లాంచ్ అయ్యాయి.లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. గ్రిల్, సీ పిల్లర్పై ట్రైడెంట్ లోగోలను పొందుతుంది. స్క్రిప్ట్, వీల్ సెంటర్ క్యాప్లపై కూడా ఎంసీపూరా బ్యాడ్జ్లు చూడవచ్చు. బటర్ఫ్లై వింగ్ డోర్లు, కార్బన్ ఫైబర్ మోనోకోక్ ఛాసిస్, కన్వర్టిబుల్ వెర్షన్ కోసం రిట్రాక్టబుల్ గ్లాస్ రూఫ్ వంటివి ఈ కారులో చూడవచ్చు.ఇంజిన్ విషయానికి వస్తే.. మసెరటి ఎంసీ పూరా 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ6 ఇంజిన్ పొందుతుంది. ఇది 621 హార్స్ పవర్, 719 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారు కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 325 కిమీ/గం. -
పండక్కి సెలవు తీసుకుంటే.. జాబ్ నుంచి తీసేశారు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులను చూస్తుంటే.. ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడు, ఎందుకు, ఎలా పోతున్నాయో కూడా అర్థం కానీ పరిస్థితి కనిపిస్తోంది. దుర్గా పూజకు.. అనుమతితో సెలవు తీసుకున్నందుకు ఉద్యోగం నుంచి తీసేశారంటూ.. ఒక టెకీ రెడ్దిట్ వేదికగా పోస్ట్ చేశారు.దుర్గా పూజకు సెలవు తీసుకున్నందుకు తొలగించారు.. అనే శీర్షికతో వైరల్ అయిన రెడ్డిట్ పోస్ట్లో ఒక టెకీ తన అనుభవాన్ని వెల్లడించారు. నేను సెలవు తీసుకుంటానని మూడు వారాల ముందే మేనేజర్కు సమాచారం ఇచ్చాను. కంపెనీ సీఈఓ నుంచి కూడా అనుమతి పొందాను. కానీ హెచ్ఆర్ నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు టెర్మినేషన్ మెయిల్లో పేర్కొన్నారు. అనుమతి లేకుండా సెలవు తీసుకున్న కారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.గత కొన్ని రోజులుగా కంపెనీ కోసం ఎంతో కష్టపడి పనిచేసాను. పనిగంటలు పొడిగించినప్పుడు కూడా వర్క్ చేసాను. అనుమతితో సెలవు తీసుకున్నప్పటికీ.. నన్ను కంపెనీ నుంచి తొలగించారు. నాకు చాలా బాధగా ఉంది. కంపెనీ వాళ్ళు నాకు రిలీవింగ్, ఎక్స్పీరియన్స్ లెటర్, పే స్లిప్స్ వంటివి ఇస్తారా లేదా అనే సందేహం కూడా ఉంది. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో నాకు సలహా ఇవ్వండి అని పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 'మీరు ఆ కంపెనీలోనే ఉంటే.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులో ఎదుర్కొనేవారు' అని ఒకరు వెల్లడించగా.. ''వినడానికి బాధగా ఉంది, మీరు ఏదో చిన్న స్టార్టప్లో పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది, అలాంటి సంస్థల్లో.. ఇలాంటివి చాలా సాధారణం'' అని ఇంకొకరు అన్నారు. -
ఈపీఎఫ్ఓ కాంటెస్ట్: ట్యాగ్ చెప్పు.. క్యాష్ పట్టు!
భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO), MyGov సహకారంతో, EPFO కోసం ఒక ట్యాగ్లైన్ కాంటెస్ట్ ప్రారంభించింది. సంస్థ ఆశయాలు, విధులకు అద్దం పట్టేలా (ఈపీఎఫ్ఓకు సూటయ్యే విధంగా) ఓ మంచి ట్యాగ్లైన్ అందించాలని ప్రజలకు సూచించింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఈ కాంటెస్ట్ 2025 అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతుంది.వచ్చిన మొత్తం ట్యాగ్లైన్లలో మూడు ఉత్తమమైన వాటిని ఎంపిక చేయడం జరుగుతుంది. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం కూడా అందించడం జరుగుతుంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగే ఈపీఎఫ్ఓ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరు కావడానికి కూడా వారికి ఆహ్వానం లభిస్తుంది.నగదు బహుమతిమొదటి బహుమతి: రూ. 21,000రెండవ బహుమతి: రూ. 11,000మూడవ బహుమతి: రూ. 5,100తప్పకుండా పాటించాల్సిన షరతులు➤ఈ పోటీలో పాల్గొనేవారు భారతీయ పౌరులై ఉండాలి. ➤ట్యాగ్లైన్ హిందీలోనే ఉండాలి.➤ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే.. అంటే ఒక ట్యాగ్లైన్ మాత్రమే ఇవ్వాలి. ➤ఈ ట్యాగ్లైన్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత, దార్శనికతకు అద్దం పట్టేలా ఉండాలి.➤ఏఐ కంటెంట్ ఉపయోగించకూడదు.Be the voice of trust & security!Join the EPFO Tagline Contest & craft a line that echoes financial safety & social empowerment.👉 https://t.co/86rKW27zrS #EPFO #FinancialSecurity #MyGovContest@LabourMinistry pic.twitter.com/4en8gQljTt— MyGovIndia (@mygovindia) October 3, 2025 -
9 నెలల్లో 3000 సేల్స్!: ఇండియాలో ఆడి అమ్మకాలు
ఆడి ఇండియా.. 2025 మొదటి తొమ్మిది నెలల్లో కేవలం 3,197 యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. భౌగోళిక రాజకీయ సవాళ్లు, కస్టమర్ సెంటిమెంట్ వంటివన్నీ అమ్మకాల మీద ప్రభావం చూపించింది. GST 2.0 అమలు తర్వాత.. పండుగ సమయంలో డిమాండ్ పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.కంపెనీ అమ్మకాల గురించి.. ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం లగ్జరీ కార్ల విభాగం కొంత ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కొత్త జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత.. కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నామని అన్నారు.ఆడి కంపెనీ దేశ వ్యాప్తంగా తన నెట్వర్క్ విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే.. తన ఎలక్ట్రిక్ కార్ల కోసం ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం, డీలర్షిప్స్ విస్తరించడం వంటివి చేస్తోంది. అంతే కాకుండా బ్రాండ్ అమ్మకాలను పెంచడానికి కంపెనీ వారంటీలను పెంచడం, రోడ్సైడ్ అసిస్ట్ వంటి వాటిని కూడా అందిస్తోంది. -
మూడు నెలల్లో 97,080 ఇళ్ల అమ్మకం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు కొనసాగుతున్నప్పటికీ.. మన దేశంలో నివాస విభాగం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, గృహ యజమానుల అభిరుచులతో గృహాల కొనుగోళ్లు స్థిరంగానే ఉంటున్నాయి.దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది మూడో త్రైమాసికం(క్యూ3)లో 97,080 ఇళ్లు అమ్ముడుపోయాయి. గతేడాది క్యూ3లో విక్రయమైన 1,07,060 యూనిట్లతో పోలిస్తే 9 శాతం తగ్గగా.. ఈ ఏడాది క్యూ2లో సేల్ అయిన 96,290 నివాసాలతో పోలిస్తే 1 శాతం వృద్ధి చెందాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.ఇక, 2025 క్యూ3లో 96,690 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. క్యూ2లో సరఫరా అయిన 98,630 యూనిట్లతో పోలిస్తే 2 శాతం క్షీణించగా.. గతేడాది క్యూ3లో సప్లయ్ అయిన 93,750 యూనిట్లతో పోలిస్తే మాత్రం 3 శాతం పెరిగాయి. అయితే ఇళ్ల అమ్మకాలు తగ్గినప్పటికీ వాటి విలువ మాత్రం 14 శాతం పెరిగింది. గతేడాది క్యూ3లో అమ్ముడైన ఇళ్ల విలువ రూ.1.33 లక్షల కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది క్యూ3లో విక్రయమైన గృహాల విలువ రూ.1.52 లక్షల కోట్లుగా ఉంది.లగ్జరీ ఇళ్లదే హవా..ఇళ్ల విక్రయాలు, లాంచింగ్స్లో ముంబైలో అత్యధికంగా జరిగాయి. దేశ ఆర్థిక రాజధానిలో 2025 క్యూ3లో 30,260 గృహాలు అమ్ముడుపోగా.. 29,565 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పుణెలో 16,620 ఇళ్లు విక్రయం కాగా.. 19,375 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. లాంచింగ్స్లో అత్యధికంగా లగ్జరీ గృహాలదే ఆధిపత్యం కొనసాగుతుంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్న విలాసవంతమైన ఇళ్ల వాటా 38 శాతంగా ఉండగా.. అందుబాటు గృహాల వాటా 16 శాతంగా ఉంది. రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర ధర ఉన్న ప్రీమియం గృహాల వాటా 24 శాతం, రూ.40–80 లక్షల ధర ఉన్న మధ్యతరగతి ఇళ్ల వాటా 23 శాతంగా ఉంది.5.64 లక్షల ఇన్వెంటరీ..అమ్మకానికి సిద్ధంగా ఉన్న(ఇన్వెంటరీ) యూనిట్ల సంఖ్య గతేడాది క్యూ3లో 5.64 లక్షలుగా ఉండగా.. ఈ క్యూ3 నాటికి 5.61 లక్షలకు తగ్గాయి. ఏడాదిలో ప్రాపరీ్టల ధరలు 9 శాతం పెరిగాయి. వార్షిక ప్రాతిపదికన అత్యధికంగా ఎన్సీఆర్లో ధరలు 24 శాతం పెరగగా.. బెంగళూరులో 10 శాతం వృద్ధి చెందాయి.హైదరాబాద్లో..ఈ ఏడాది మూడో త్రైమాసికంలో హైదరాబాద్లో 8,630 గృహాలు లాంచింగ్ అయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ప్రారంభమైన 13,890 యూనిట్లతో పోలిస్తే ఇది 38 శాతం తక్కువ. ఏడాది కాలంలో నగరంలో లాంచింగ్స్ 22 శాతం మేర తగ్గాయి. నగరంలో ప్రీమియం, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాల డిమాండ్ కొనసాగుతోంది. అందుకే ఈ క్యూ3లో లాంచింగ్ అయిన యూనిట్లలో రూ.80 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా ఏకంగా 87 శాతంగా ఉంది. ఇక, 2025 క్యూ3లో నగరంలో 11,305 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే కాలంలో విక్రయమైన 12,735 ఇళ్లతో పోలిస్తే ఇది 11 శాతం తక్కువ.ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
రష్మికతో ఎంగేజ్మెంట్.. విజయ్ దేవరకొండ నెట్వర్త్ ఎంతో తెలుసా?
తెలుగు సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన నటులలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాలో ఓ డాక్టర్గా, గీత గోవిందంలో మేడమ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ అంటూ అమ్మాయిల మనసు దోచుకున్న.. ఈ వరల్డ్ ఫెమస్ లవర్ గ్యారేజిలో జర్మన్, బ్రిటీష్, అమెరికన్, స్వీడన్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. అంతే కాకుండా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పరిసరాల్లో రూ. కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తున్నారు. అయితే ఈ కథనంలో విజయ్ దేవరకొండ లగ్జరీ కార్లు, నెట్వర్త్ వంటి ఆసక్తికరమైన విషయాలు చూసేద్దాం..విజయ్ దేవరకొండ కార్ల ప్రపంచం (Vijay Deverakonda Car Collection)ఫోర్డ్ మస్టాంగ్: ఇండియన్ మార్కెట్లో ఒకప్పటి నుంచి ఎంతో ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న ఫోర్డ్ మస్టాంగ్ విజయ్ దేవరకొండ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 75 లక్షలు ఉంటుందని సమాచారంమెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ: భారతీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. కంపెనీకి చెందిన జీఎల్సీ కూడా విజయ్ గ్యారేజిలో ఉంది. ఇతర కార్లకంటే కూడా విజయ్ ఈ కారునే ఎక్కువగా ఉపయోగిస్తాడని సమాచారం. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.వోల్వో ఎక్స్సీ 90: విజయ్ దేవరకొండ గ్యారేజిలో స్వీడన్ బ్రాండ్ కారు.. వోల్వో ఎక్స్సీ 90 కూడా ఉంది. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 90 లక్షల నుంచి రూ. 1.31 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వోల్వో కంపెనీ భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన కార్లలో ఇది ఒకటి కావడం విశేషం.రేంజ్ రోవర్: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ ఒకటి. విజయ్ దేవరకొండ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.బిఎమ్డబ్ల్యూ 5-సిరీస్: విజయ్ దేవరకొండ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ కారు మాత్రమే కాకుండా బీఎండబ్ల్యు కంపెనీకి చెందిన 5-సిరీస్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 60 లక్షల కంటే ఎక్కువ. 2021 బిఎండబ్ల్యు 5-సిరీస్ 530ఐ ఎమ్ స్పోర్ట్స్, 520డి మరియు 530డి ఎమ్ స్పోర్ట్స్ అనే మూడు వేరియంట్లో విడుదలైంది. వీటి ధరలు రూ. 63 లక్షల నుంచి రూ. 72 లక్షల వరకు ఉన్నాయి.నెట్వర్త్ (Net Worth) విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ కేవలం ఒక నటుడుగా మాత్రమే కాకుండా.. కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవరిస్తున్నారు. దీంతో ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. ఈయన నెట్వర్త్ మొత్తం రూ. 50 కోట్ల నుంచి రూ. 70 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం.విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థంహీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో ఉదయం 11 గంటలకు వీరి ఎంగేజ్మెంట్ అయింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులు స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: గిఫ్ట్గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత? -
ఐదు బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఐదు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. మార్గదర్శకాలను పాటించనందుకు ద్రవ్య జరిమానాలు విధించింది. ఈ జాబితాలో ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కూడా ఉంది. ఈ వివరాలను ఆర్బీఐ పత్రికా ప్రకటనలో తెలియజేసింది.రెండు కర్ణాటక బ్యాంకులుఆర్బీఐ చర్యలకు గురైన బ్యాంకులలో రెండు కర్ణాటకకు చెందినవి. బీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి ఇతర సహకార సంఘాలలో వాటాలను కలిగి ఉన్నందుకు హసన్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ కు రూ .1 లక్ష జరిమానా విధించింది. అలాగే నిర్ణీత కాలవ్యవధిలోగా కస్టమర్ కేవైసీ రికార్డులను సెంట్రల్ కెవైసి రికార్డ్స్ రిజిస్ట్రీకి అప్ లోడ్ చేయడంలో ఈ బ్యాంక్ విఫలమైంది.డైరెక్టర్ సంబంధీకులకు రుణాలు మంజూరు చేసినందుకు గానూ బాగల్కోట్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్కు ఆర్బీఐ రూ.5.50 లక్షల జరిమానా విధించింది. నిర్ణీత కాలపరిమితిలో నాబార్డ్కు కొన్ని చట్టబద్ధమైన రిటర్న్లను సమర్పించడంలోనూ ఇది విఫలమైంది.క్రెడిట్, డెబిట్ కార్డు నిబంధనలు ఉల్లంఘించినందుకు..క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎక్స్ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్ కు ఆర్బీఐ రూ.31.80 లక్షల జరిమానా విధించింది. కొంతమంది క్రెడిట్ కార్డుదారుల క్రెడిట్ బ్యాలెన్స్ లను వారి బ్యాంకు ఖాతాలకు తిరిగి చెల్లించడం/ఫెయిల్/రివర్స్ చేయడంలో బ్యాంకు విఫలమైందని దర్యాప్తులో తేలింది.గుజరాత్ లోని పటాన్ లో ఉన్న రనూజ్ నగరిక్ సహకార బ్యాంక్ లిమిటెడ్ మంజూరు చేసిన కొన్ని రుణాలు దారిమళ్లకుండా చూడటంలో విఫలమైనందుకు రూ .3 లక్షల జరిమానా ఎదుర్కొంది. ఇంకా, అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలపై అభ్యంతరాలను లేవనెత్తడానికి ఎస్ఎంఎస్ హెచ్చరికలకు వెంటనే స్పందించడంలో తన వినియోగదారులను అనుమతించడంలోనూ విఫలమైంది.తమిళనాడులోని దివ్యం విద్యాలయం టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు రూ.1 లక్ష జరిమానా విధించింది. చట్టం కింద జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ రిస్క్ పరిమితికి మించి కొన్ని కొత్త రుణాలు, అడ్వాన్సులు, 100% కంటే ఎక్కువ రిస్క్ ఎక్స్పోజర్లతో కొన్ని రుణాలు, అడ్వాన్సులను మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే నిర్ణీత కాలవ్యవధిలోగా కస్టమర్ కేవైసీ రికార్డులను సెంట్రల్ కెవైసి రికార్డ్స్ రిజిస్ట్రీకి అప్ లోడ్ చేయడంలో బ్యాంక్ విఫలమైంది.ఈ ఎన్బీఎఫ్సీకి జరిమానా2023-24 ఆర్థిక సంవత్సరంలో తన ఖాతాల్లో పాన్ సమాచారం లేదా ఫారం నంబర్ 60 పత్రాలను అందించడంలో విఫలమైనందుకు హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కు ఆర్బీఐ రూ .4.20 లక్షల జరిమానా విధించింది. -
షాపింగ్ మాల్స్ విస్తరణ: రిటైల్ కేంద్రాలకు అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: సంస్థాగత పెట్టుబడులు ద్వితీయ శ్రేణి పట్టణాలకు శరవేగంగా విస్తరిస్తున్నాయి. పట్టణీకరణ, అధిక జనాభా, కొనుగోలు శక్తి పెరుగుతుండటంతో వ్యవస్థీకృత రిటైల్ కేంద్రాలకు అవకాశాలు లభిస్తున్నాయి. మారుతున్న వినియోదారుల అభిరుచులతో ప్రపంచ బ్రాండ్లు విస్తరణపై దృష్టిసారిస్తున్నాయి.చంఢీఘడ్, ఇండోర్, సూరత్, భువనేశ్వర్, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు నెక్సస్(బ్లాక్ స్టోన్), డీఎల్ఎఫ్, ఫీనిక్స్ మిల్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, లేక్షోర్, రహేజా గ్రూప్, పసిఫిక్ వంటి సంస్థాగత దిగ్గజాలను ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడు సంస్థలు వచ్చే 3–5 ఏళ్లలో 4.25 కోట్ల చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణంలో కొత్తగా 45 షాపింగ్ మాల్స్ను అందుబాటులోకి తీసుకురానున్నాయి.ప్రస్తుతం ఈ ఏడు సంస్థలకు సమష్టిగా 3.4 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 58 మాల్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రేడ్-ఏ, బీ, సీ కేటగిరీ మాల్స్ అన్నీ కలిపి 650 షాపింగ్ మాల్స్ ఆపరేషనల్లో ఉన్నాయి. ఇండియాలో 11 కోట్ల చ.అ. నాణ్యమైన రిటైల్ స్పేస్ ఉంది. అమెరికాలో 70 కోట్ల చ.అ., చైనాలో 40 కోట్ల చ.అ. రిటైల్ స్థలం అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అధిక శాతం స్థలం సంస్థాగత నిర్మాణ సంస్థల యాజమాన్యంలోనే ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. -
జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?
జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ (QR Code) ఏర్పాటు చేయడానికి.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సన్నద్ధమవుతోంది. ఇంతకీ ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు?, దీనివల్ల వాహనదారులకు ఉపయోగం ఏమిటి? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ప్రయాణీకులకు అవసరమైన సమాచారాన్ని తక్షణమే పొందేలా చేయడానికి.. ఎన్హెచ్ఏఐ జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్లతో కూడిన సైన్బోర్డులను ఏర్పాటు చేయనుంది. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ పత్రికా ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.జాతీయ రహదారులపై ఏర్పాటు చేయనున్న క్యూఆర్ కోడ్ సైన్ బోర్డులు.. వాహనదారులకు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా.. నేషనల్ హైవేల సంఖ్య, చైనేజ్, ప్రాజెక్ట్ పొడవును సంబంధించిన వివరాలతో పాటు.. 1033తో సహా ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నంబర్లను తెలుసుకోవచ్చు. టోల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, రెసిడెంట్ ఇంజనీర్, ఎన్హెచ్ఏఐ ఫీల్డ్ ఆఫీసులు వంటి కీలక అధికారుల సంప్రదింపు వివరాలను కూడా పొందవచ్చు.క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా.. హాస్పిటల్స్, పెట్రోల్ పంపులు, టాయిలెట్లు, పోలీస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, వెహికల్ రిపేర్ షాప్స్, టోల్ ప్లాజాలు, ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు వంటి సమీపంలోని అత్యవసర సేవలకు గురించి కూడా తెలుసుకోవచ్చు. రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు అవసరమైన సేవలను గుర్తించడంలో సహాయపడటం ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.ఇదీ చదవండి: కొత్త రూల్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సౌండ్ తప్పనిసరి!జాతీయ రహదారులపై ఈ క్యూఆర్ సైన్బోర్డులను.. రోడ్ స్టార్టింగ్, ఎండింగ్ పాయింట్ల వద్ద మాత్రమే కాకుండా, టోల్ ప్లాజాల దగ్గర, రోడ్డుపక్కన కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. ఈ క్యూఆర్ కోడ్స్ రహదారి భద్రతను మెరుగుపరచడంలో సహాయపడటమే కాకుండా.. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల గురించి వినియోగదారు అనుభవాన్ని, అవగాహనను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
వయసు 31.. సంపద రూ.21 వేలకోట్లు! ఎలా సాధ్యమైంది?
భారతదేశపు అతి పిన్న వయసున్న బిలియనీర్గా అరవింద్ శ్రీనివాస్(31)కు ప్రత్యేక గుర్తింపు లభించింది. చెన్నైలో జన్మించిన ఈయన పెర్ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడిగా, ఆ సంస్థ సీఈఓగా ఉన్నారు. దాంతోపాటు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.21,190 కోట్ల (సుమారు $2.5 బిలియన్లు) నికర విలువతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.తమిళనాడులోని చెన్నైలో పెరిగిన అరవింద్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మెషిన్ లెర్నింగ్, ఏఐ పట్ల అభిరుచి పెంచుకున్నారు. తన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్లీ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ సంపాదించారు. ఈ ప్రయాణంలో శ్రీనివాస్ తన నైపుణ్యాలను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఏఐ సంస్థలతో కలిసి మెరుగుపరుచుకున్నారు. ఈ క్రమంలో OpenAI, గూగుల్, డీప్ మైండ్ల్లో పనిచేశారు. ఇక్కడ అతను అత్యాధునిక ఏఐ నమూనాలు, ఎల్ఎల్ఎం(లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్)పై అనుభవం సాధించారు. ఇది అతని సొంత కంపెనీ స్థాపనకు కీలకంగా మారింది.పెర్ప్లెక్సిటీ ఏఐ2022లో శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్వినిస్క్తో కలిసి పెర్ప్లెక్సిటీ ఏఐను స్థాపించారు. ఇది సాధారణ సెర్చ్ ఇంజిన్ కాదు. ఇది ఒక ఇంటెరాక్షన్ ఏఐ సెర్చ్ ఇంజిన్. ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి వేగవంతమైన మార్గంగా దీన్ని శ్రీనివాస్ అభివర్ణించారు. మార్కెట్లో తన పోటీదారులకు బలమైన ప్రత్యామ్నాయంగా పెర్ప్లెక్సిటీ నిలుస్తుంది. సంప్రదాయ సెర్చ్ ఇంజిన్ల మాదిరిగా హైపర్లింక్ల జాబితాను అందించడానికి బదులుగా పెర్ప్లెక్సిటీ ప్రత్యక్ష, ఇంటెరాక్షన్ సమాధానాలను అందిస్తుంది. ఇది మరింత కచ్చితమైన ప్రతిస్పందనలను రూపొందించడానికి జనరేటివ్ ఏఐను రియల్టైమ్ వెబ్ డేటాతో విలీనం చేస్తుంది. ఈ కంపెనీకి సిలికాన్ వ్యాలీలో గుర్తింపు లభించింది. ఈ స్టార్టప్కు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్తో సహా అగ్రశ్రేణి పెట్టుబడిదారుల నుంచి నిధులు సమకూరాయి.ఇదీ చదవండి: సర్ క్రిక్ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత? -
ఇల్లు కొనేవాళ్లకు భరోసా.. అక్రమ డెవలపర్లకు కొరడా!
ప్రీలాంచ్లు, సాఫ్ట్ లాంచ్ల పేరుతో ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయకముందే కస్టమర్లు నుంచి ముందస్తుగా డిపాజిట్లు సేకరించడం, వసూలు చేసిన సొమ్ము వ్యక్తిగత అవసరాలకు మళ్లించడం, న్యాయపరమైన చిక్కులతో నిర్మాణ అనుమతులు రాకపోవడం, ఒకవేళ వచ్చినా నిర్మాణ వ్యయ భారంతో నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేయడం, సంవత్సరాల కొద్దీ నిర్మాణ పనులు కొనసాగిస్తుండటం.. ఇలా ఒకట్రెండు కాదు సొంతింటి కలకు సవాలక్ష సవాళ్లు. కానీ, ఇవన్నీ రెరా కంటే ముందు మాట. దేశంలో రెరా చట్టం అమలులోకి వచ్చిన తర్వాత డెవలపర్లలో స్థిరాస్తి రంగంలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. దీంతో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొంది. – సాక్షి, సిటీబ్యూరోదేశంలో 2016లో అమలులోకి వచ్చిన రెరా.. రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కీలకమైన ఘట్టం. దశాబ్దాలుగా అనిశ్చితి దేశీయ స్థిరాస్తి రంగాన్ని సంఘటితంగా, పారదర్శక, జవాబుదారీతనంగా మార్చింది మాత్రం రెరానే. విక్రయాలు, ప్రాజెక్ట్ డెలివరీ, స్థిరమైన ధరల పెరుగుదలను తీసుకురావడంతో పాటు రియల్టీలోకి సంస్థాగత, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులకు అవకాశాలను కల్పించిందని నైట్ఫ్రాంక్, నరెడ్కో సంయుక్త నివేదిక వెల్లడించింది. అయితే రెరా అమలు అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా లేకపోయినప్పటికీ.. చట్టం ప్రధాన ఉద్దేశం మాత్రం విప్లవాత్మకమైనదే. దేశం పట్టణీకరణ, ఆర్థిక వృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రెరా స్థిరమైన, సమానమైన అమలు సాగడం అత్యవసరం.1.50 లక్షల ప్రాజెక్ట్ల నమోదు..ఇప్పటి వరకు మన దేశంలో నాగాలాండ్ మినహా 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో రెరా నోటిఫై అయ్యింది. దేశవ్యాప్తంగా రెరాలో 1.50 లక్షలకు పైగా ప్రాజెక్ట్లు, లక్ష కంటే ఎక్కువ మంది ఏజెంట్లు నమోదయ్యారు. ఇప్పటి వరకు 1.50 లక్షలకుపైగా ఫిర్యాదులు పరిష్కృతమయ్యాయి.ఎస్క్రో అకౌంట్..దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ 648 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో 52 శాతం వాటా ఉన్న నివాస సముదాయం విభాగంలో పారదర్శకత అత్యవసరం. కస్టమర్ల నుంచి వసూలు చేసే సొమ్ములో 70 శాతాన్ని ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతా తెరిచి అందులో వేయాలి. ఆయా సొమ్మును కేవలం నిర్ధిష్ట ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసం మాత్రమే వెచ్చించాలి.తెలంగాణ రాష్ట్రంలో..2016లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) ముందంజలో ఉంది. పారదర్శకత, సామర్థ్యం, చురుకైన అమలుతో దేశంలో అత్యధిక ప్రాజెక్ట్లు, ఏజెంట్ల నమోదులో ఇతర రాష్ట్రాల కంటే తొలిస్థానంలో నిలిచింది. మహా రెరాలో ఇప్పటి వరకు 50 వేలకు పైగా ప్రాజెక్ట్లు, 52 వేల మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ప్రస్తుతం టీజీ రెరాలో 10,123 ప్రాజెక్ట్లు, 4516 ఏజెంట్లు రిజిస్టరయ్యారు. 2,340 ఫిర్యాదులు అందగా.. 1,566 పరిష్కృతమయ్యాయి.రెరా ఎందుకొచ్చిందంటే?గత దశాబ్దంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ రియల్ ఎస్టేట్ రంగంలో వేగవంతమైన విస్తరణకు కారణమైంది. రెరా కంటే ముందు రియల్టీ పరిశ్రమలో అనిశ్చితి ఉంది. ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అంటూ లేదు. డెవలపర్లను, లావాదేవీలను నియంత్రించడానికి నిర్ధిష్టమైన చట్టాలు లేవు. ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా వంటి ప్రధాన మెట్రో ప్రాంతాలలోనే రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పెద్దగా రియల్టీ మార్కెట్ ఉండేది కాదు. డెవలపర్లు తరచూ ఊహాజనిత పెట్టుబడులపై ఆధారపడేవారు. లావాదేవీలలో పారదర్శకత లోపించేది. దీంతో అధిక పరపతి, విస్తృత రుణ డిఫాల్ట్లు, ప్రాజెక్ట్ డెలివరీలో తీవ్ర జాప్యం, వ్యయాల పెరుగుదల, గృహ కొనుగోలుదారుల నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వంటివి జరిగేవి. ఈ వ్యవస్థాగత వైఫల్యాలతో అనేక ప్రాజెక్ట్లు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో కొనుగోలుదారుల విశ్వాసం దెబ్బతింది. లక్షలాది మంది కస్టమర్లు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. స్థిరాస్తి మార్కెట్ కార్యకలాపాలు క్షీణించాయి.దీంతో విధానపరమైన జోక్యం, కఠిన నిబంధనల అమలు అత్యవసరమయ్యాయి. 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ మరియు అభివృద్ధి చట్టం(రెరా)కు దారి తీసింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, క్రమబదీ్ధకరణతో పాటు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు ఆర్థిక భరోసా కల్పిచడమే లక్ష్యంగా రెరా అమలులోకి వచ్చింది.ఏ దేశంలో ఏ రకమైన నిర్మాణ రంగం చట్టాలంటే?1920: దక్షిణాఫ్రికా, ది హౌసింగ్ యాక్ట్1937: అమెరికా, యునైటెడ్ స్టేట్స్ హౌసింగ్ యాక్ట్1960: సింగపూర్, హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్(హెచ్డీబీ)1965: యూఎస్ఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (హెచ్యూడీ)1985: యూకే, హౌసింగ్ యాక్ట్1994: చైనా, అర్బన్ రియల్ ఎస్టేట్ అడ్మినిస్ట్రేషన్ లా2007: దుబాయ్, యూఏఈ, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీ(రెరా)2016: ఇండియా, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ఇదీ చదవండి: ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా.. -
సెలవుల్లేవ్.. వారంలో 7 రోజులు పని!
భారతదేశంలో మారుతి సుజుకి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీంతో కంపెనీ సెప్టెంబర్ నెలలో తమ ఉత్పత్తిని 26 శాతం పెంచింది. వాహనాల ఉత్పత్తి పెరగడం వల్ల.. కొనుగోలుదారులకు సకాలంలో డెలివరీలు జరిగాయి. ఈ తరుణంలో ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించడానికి.. ప్రొడక్షన్ టీమ్ ఆదివారాలు & సెలవు దినాలలో పని చేయాలని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.నవరాత్రి మొదటి ఎనిమిది రోజుల్లో మారుతి సుజుకి దాదాపు 1,65,000 వాహనాలను డెలివరీ చేసింది. ఈ అమ్మకాలు గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే 27.5 శాతం ఎక్కువ. త్వరలో డెలివరీలు రెండు లక్షలకు చేరుకుంటుందని చెబుతున్నారు. కంపెనీ సేల్స్ పెరగడానికి జీఎస్టీ 2.0 కూడా సహకరించింది. గత పదేళ్లలో ఇంతటి వృద్ధి (బుకింగ్స్ & డెలివరీలు) ఎప్పుడూ చూడలేదని కూడా పార్థో బెనర్జీ అన్నారు.ఇదీ చదవండి: గిఫ్ట్గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?డిమాండుకు తగ్గ డెలివరీలు చేయడానికి.. మారుతి సుజుకి గత నెలలో 12,318 యూనిట్ల ఆల్టో & ఎస్ ప్రెస్సో మోడళ్లను ఉత్పత్తి చేసింది. బాలెనో, సెలెరియో, డిజైర్ & స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ మోడళ్ల ఉత్పత్తి సెప్టెంబర్లో 93,301 యూనిట్లు. బ్రెజ్జా, ఎర్టిగా & ఫ్రాంక్స్ వంటి యుటిలిటీ వాహనాల ఉత్పత్తి 79,496 యూనిట్లకు చేరుకుంది. ఈకో ఉత్పత్తి కూడా 13,201 యూనిట్లకు పెరిగింది. మొత్తం మీద కంపెనీ ఈ ఏడాది అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. -
మహీంద్రా థార్ మళ్లీ మార్కెట్లోకి.. కాస్త కొత్తగా..
మహీంద్రా తన ప్రసిద్ధ ఆఫ్-రోడర్ అయిన థార్ (Mahindra Thar) రిఫ్రెష్ వేరియంట్ను (facelift) భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త థార్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరను రూ. 9.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ అప్డేట్ మోడల్, థార్ కోర్ బాక్సీ డిజైన్, ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే, రోజువారీ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక సౌకర్యాలు, కనెక్టివిటీ ఫీచర్లు, కొంతమేర ఎక్స్టీరియర్ మార్పులతో వచ్చింది.ముఖ్యమైన అప్గ్రేడ్లుఇంటీరియర్లో పెద్దదైన 10.25-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ (ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేసహా), రియర్ ఏసీ వెంట్స్, స్లైడింగ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, రీడిజైన్ అయిన డాష్బోర్డ్, కొత్త స్టీరింగ్ వీల్, రీ-లొకేట్ చేసిన పవర్ విండో స్విచ్లు ఉన్నాయి.ఇక ఎక్స్టీరియర్ విషయానికి వస్తే బాడీ-కలర్ ఫ్రంట్ గ్రిల్, వాషర్తో రియర్ వైపర్, స్పేర్ వీల్ హబ్లో పార్కింగ్ కెమెరా, కొత్తగా టాంగో రెడ్, బాటిల్ షిప్ గ్రే కలర్ షేడ్లు కొత్త వేరియంట్లో అప్డేట్ అయ్యాయి.ఇంజిన్ & ట్రాన్స్మిషన్థార్ మూడు ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి.. 2.0-లీటర్ ఎంస్టాలిన్ పెట్రోల్, 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్, డీ117 సీఆర్డీఈ డీజిల్. ఇవి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తాయి. డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో ఆర్డబ్ల్యూడీ, డ్రైవ్ లైన్ డిస్కనెక్ట్ ఫీచర్తో కూడిన 4x4 వేరియంట్లు ఉన్నాయి. వీటివల్ల థార్ను సిటీ వాహనంగానూ, వీకెండ్ ఆఫ్-రోడర్లాగానూ ఉపయోగించవచ్చు.ధరలు (ఎక్స్-షోరూమ్)ఎంట్రీ-లెవల్ ఏఎక్స్టీ ఆర్డబ్ల్యూడీ ఎమ్టీ ట్రిమ్ ధర రూ. 9.99 లక్షలు.టాప్-ఎండ్ ఎల్ఎక్స్టీ 4డబ్ల్యూడీ ఏటీ ట్రిమ్ ధర రూ. 16.99 లక్షలు4డబ్ల్యూడీ ఆటోమేటిక్ వేరియంట్ల ధర రూ. 16 లక్షలుసౌకర్యం & ప్రాక్టికాలిటీ:కొత్తగా A-పిల్లర్ గ్రాబ్ హ్యాండిల్స్, ఇంధన మూతకు ఇంటీరియర్ ఓపనింగ్ మెకానిజం, అదనంగా యూఎస్బీ టైప్-సీ పోర్ట్స్ వంటివి జోడించడం వల్ల రోజువారీ ఉపయోగంలో థార్ మరింత ప్రాక్టికల్గా మారింది.ఇదీ చదవండి: హైదరాబాద్లో తొలి టెస్లా కారుకు వాహన పూజ.. -
ఈ–స్పోర్ట్స్ కోసం ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ప్రతిపాదన
ఈ–స్పోర్ట్స్, డిజిటల్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహించేందుకు, రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ)పై నిషేధం అమలుకు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాను (ఓజీఏఐ) ఏర్పాటు చేసేలా కేంద్రం ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. దీనికి ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) సారథ్యం వహిస్తుంది. సమాచార–ప్రసార శాఖ, యూత్ అఫైర్స్ తదితర శాఖల సమన్వయంతో ఇది పనిచేస్తుంది.ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ (పీఆర్వోజీ) చట్టం 2025 కింద కేంద్రం ఈ మేరకు ముసాయిదా నిబంధనలను ఆవిష్కరించింది. వీటిపై అక్టోబర్ 31లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ముసాయిదా ప్రకారం ఓజీఏఐకి మెయిటీలోని అదనపు కార్యదర్శి స్థాయి అధికారి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఇది దేశీయంగా చట్టబద్ధంగా ఆడతగిన ఈ–స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ఆమోదిస్తుంది.అలాగే పీఆర్వోజీ చట్టాన్ని ఉల్లంఘించే గేమ్స్, స్పోర్ట్స్ను రద్దు కూడా చేయగలదు. ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీసులు ఆఫర్ చేసే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా లేదా రెండింటినీ కలిపి విధించే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ మనీ గేమ్స్పై ప్రకటనలు ఇస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.ఇదీ చదవండి: సర్ క్రిక్ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత? -
యూఏఈకి ఉచిత వీసాలు.. అబుదాబి కంపెనీ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు అబుదాబిలోని ఏడీఎన్హెచ్ కంపెనీ (Abu Dhabi company) తెలంగాణలోని జీటీఎం సంస్థ ద్వారా ఉచితంగా వీసాలను (free visa) జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పలుమార్లు అనేకమందికి ఉచితంగా వీసాలు ఇచ్చిన ఈ సంస్థ..మరోసారి ఉచిత వీసాల జారీ కి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏడీఎన్హెచ్ కంపెనీ క్లీనింగ్, క్యాటరింగ్ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిస్తోంది. ఈనెల 10న జగిత్యాలలో, 11న నిజామాబాద్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉన్న యువకులకు అర్హత వయస్సు 21 నుంచి 38 ఏళ్ల వరకూ ఉండొచ్చని జీటీఎం సంస్థ చైర్మన్ చీటి సతీష్రావు ‘సాక్షి’తో చెప్పారు.బేసిక్ ఇంగ్లిష్ వచ్చి ఉండాలని, పచ్చబొట్టు కనబడకుండా ఉండాలని తెలిపారు. ఒరిజినల్ పాస్పోర్టుతో జగిత్యాల లేదా నిజామాబాద్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. ఎంపికైన వారికి రూ. 23 వేల వరకూ వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్టు వెల్లడించారు. ఎవరికీ నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు జీటీఎం సంస్థ నిజామాబాద్ (8686860999), ఆర్మూర్ (8332062299), జగిత్యాల (8332042299), సిరిసిల్ల (9347661522) నంబర్లలో సంప్రదించాలని సతీష్రావు సూచించారు. -
సర్ క్రిక్ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత?
భారతదేశంలోని గుజరాత్కు, పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్కు మధ్య రాన్ ఆఫ్ కచ్ (Rann of Kutch) ప్రాంతంలో ఉన్న సర్ క్రిక్ (Sir Creek) అంశం సముద్ర సరిహద్దు వివాదానికి కేంద్రంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల ట్రంప్ పాకిస్థాన్లో భారీగా చమురు నిల్వలున్నట్లు ప్రకటించారు. అవసరమైతే భారత్కు సైతం చమురు సరఫరా చేయగల సామర్థ్యం పాక్కు వస్తుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అసలు సర్ క్రిక్ వద్ద ఎలాంటి పరిస్థితులున్నాయో.. అవి భారత వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుందో తెలుసుకుందాం.సర్ క్రిక్ వివాదంసర్ క్రిక్ అనేది గుజరాత్, పాకిస్థాన్లోని సింధ్ రాష్ట్రాల మధ్య రాన్ ఆఫ్ కచ్లోని చిత్తడినేల సరిహద్దులో 96 కిలోమీటర్ల పొడవు గల సముద్ర ప్రాంతం. ఈ ప్రాంతం స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. 1947 తర్వాత దేశ విభజన జరిగినప్పుడు సర్ క్రిక్ సరిహద్దు రేఖను నిర్ణయించడంలో భారత్, పాకిస్థాన్ల మధ్య వివాదం మొదలైంది.పాక్ వాదనపాకిస్థాన్ 1914 నాటి బాంబే గవర్నమెంట్ రెజల్యూషన్ను ఆధారం చేసుకొని క్రిక్కు తూర్పు వైపున ఉన్న ఒడ్డు (ఈస్టర్న్ బ్యాంక్) వెంబడి సరిహద్దును గుర్తించాలని వాదిస్తుంది.ఇండియా వాదనభారతదేశం అంతర్జాతీయ చట్టంలోని ‘థాల్వెగ్ సూత్రం’ (Thalweg Principle) ప్రకారం నది లేదా కయ్య మధ్యలో అత్యంత లోతైన ప్రాంతం గుండా సరిహద్దు నిర్ణయించాలని వాదిస్తుంది. భారత్ వాదన ప్రకారం సరిహద్దు మధ్యలో ఉంటే భారతదేశానికి ప్రత్యేక ఆర్థిక మండలి (Exclusive Economic Zone - EEZ) పరిధిలో ఎక్కువ సముద్ర ప్రాంతం లభిస్తుంది. ఈ వివాదం కారణంగా సర్ క్రిక్ ప్రాంతంలో సముద్ర సరిహద్దు రేఖ (International Maritime Boundary Line)పై స్పష్టత కొరవడింది.చమురు నిల్వల అంచనాలుఈ ప్రాంతంలోని సముద్ర భాగంలో భారీగా చమురు, సహజవాయు నిల్వలు ఉన్నట్లు శాస్త్రీయ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాల వల్లే ఈ ప్రాంతం భౌగోళిక-రాజకీయంగా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ దేశం సరిహద్దుగా గుర్తించబడుతుందో ఆ దేశానికి ఈ నిల్వలను వెలికితీసే హక్కు లభిస్తుంది.ట్రంప్ వ్యాఖ్యలుపాకిస్థాన్లో భారీ చమురు నిక్షేపాలు ఉన్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాంతాన్ని ఉద్దేశించే అయ్యి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా స్పష్టమైన సమాచారం లేదు. సర్ క్రిక్ సమీపంలోని ప్రాంతాల్లో చమురు నిల్వలు ఉన్నట్లయితే ఆ నిల్వలు ఎవరి సరిహద్దులో ఉన్నాయనే దానిపై చర్చ కీలకమవుతుంది. ఒకవేళ ఇరుప్రాంతాల్లో తీవ్ర సైనిక ఘర్షణ తలెత్తితే అది భారతదేశ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై వివిధ రూపాల్లో ప్రభావం చూపుతుంది.సముద్ర వాణిజ్యంపై ప్రభావంసర్ క్రిక్ గుజరాత్లోని కీలక నౌకాశ్రయాలకు (కాండ్లా (Kandla), ముంద్రా (Mundra)) దగ్గరగా ఉంది. ఈ నౌకాశ్రయాలు భారతదేశంలోని పశ్చిమ ప్రాంత వాణిజ్యానికి, ముడి చమురు దిగుమతులు, ఎగుమతులకు కీలకంగా ఉంది. యుద్ధం జరిగితే ముంద్రా, కాండ్లా నౌకాశ్రయాల గుండా వెళ్లే వాణిజ్య నౌకల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, గగనతల ఆంక్షల కారణంగా సముద్ర మార్గాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. నౌకల రాకపోకలు ఆగిపోతే ముడిసరుకు, తయారైన వస్తువుల సరఫరా గొలుసు (Supply Chain) తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది భారతదేశంలోని పశ్చిమ ప్రాంత పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.శక్తి వనరుల భద్రతభారతదేశం తన చమురు అవసరాలలో అధిక భాగాన్ని పశ్చిమాసియా దేశాల నుంచి సముద్ర మార్గంలో దిగుమతి చేసుకుంటుంది. ఈ నౌకలు గుజరాత్ తీరం గుండానే ప్రయాణిస్తాయి. క్రిక్ ప్రాంతంలో అనిశ్చితి నెలకొంటే చమురు ట్యాంకర్లకు ముప్పు వాటిల్లి దిగుమతులకు అంతరాయం కలుగుతుంది. క్రూడ్ సరఫరాలో ఆటంకం ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు (Crude Oil Prices) పెరిగి అది భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు, ద్రవ్యోల్బణం (Inflation) పెరగడానికి దారితీస్తుంది.మత్స్య పరిశ్రమపై ప్రభావంసర్ క్రిక్ ప్రాంతం మత్స్య సంపదకు కేంద్రం. ఈ సరిహద్దు వివాదం కారణంగా ఇరు దేశాల మత్స్యకారులు తరచుగా ఒకరి జలాల్లోకి మరొకరు ప్రవేశించడం, అరెస్టులు జరగడం సాధారణం. యుద్ధ వాతావరణం ఏర్పడితే మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడి, ఈ ప్రాంతంలోని మత్స్య పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోతుంది.వివాదం పరిష్కారానికి చేపట్టాల్సిన కీలక చర్యలుదౌత్యపరమైన చర్చలుఈ వివాదాన్ని పరిష్కరించడానికి రెండు దేశాలు అన్ని స్థాయిలలో నిరంతరంగా, విశ్వసనీయంగా దౌత్య చర్చలు కొనసాగించాలి. సరిహద్దు అంశాలతో పాటు చమురు నిల్వలపై ఉమ్మడి ప్రయోజనాలు, మత్స్యకారుల సమస్యలు మొదలైనవాటిని చర్చించాలి. సర్ క్రిక్ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి దౌత్య ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఇది రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం లేకుండా చర్చలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది.అంతర్జాతీయ చట్టాల అమలుఈ ప్రాంతం సరిహద్దును గుర్తించడానికి అంతర్జాతీయ జలాల చట్టంలో (International Law of the Sea) ఉన్న థాల్వెగ్ సూత్రాన్ని (ప్రవాహంలోని లోతైన కాలువ మధ్య రేఖ) ప్రామాణికంగా స్వీకరించడంపై చర్చించాలి. ఇది సముద్ర సరిహద్దు సమస్యల పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సూత్రం. సముద్ర సరిహద్దులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు (EEZ), ఖండాంతర తీరం (Continental Shelf) పరిధిని నిర్ణయించడానికి ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒడంబడిక (UNCLOS) నిబంధనలను పాటించడంపై ఏకాభిప్రాయం సాధించాలి.శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనరెండు దేశాల నిపుణులు సంయుక్తంగా ఈ ప్రాంతంలో కచ్చితమైన జల సర్వే (Hydrographic Survey) నిర్వహించాలి. ఈ సర్వే ద్వారా క్రిక్లోని కాలువ లోతు, ప్రవాహ మార్పులు, వాస్తవ భౌగోళిక మార్పులను నిర్ధారించాలి. ద్వైపాక్షిక చర్చలు విఫలమైతే రెండు దేశాలు ఆమోదించిన అంతర్జాతీయ ట్రిబ్యునల్ లేదా అంతర్జాతీయ న్యాయస్థానానికి (ICJ) వివాదాన్ని అప్పగించడం ఒక పరిష్కార మార్గం. మధ్యవర్తిత్వంలో మూడవ పక్షం సహాయం తీసుకుంటే, నిష్పక్షపాతమైన పరిష్కారం లభించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: క్రిప్టోకరెన్సీ.. ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు -
ఇల్లు కొనేవాళ్లకు డబుల్ ధమాకా..
పండగ అంటే ప్రతి ఇంటా ఆనందమే.. ఫెస్టివల్ సీజన్ (Festive Season) వస్తుందంటే చాలు మార్కెట్లు కళకళలాడుతుంటాయి. దీనికి స్థిరాస్తి రంగం మినహాయింపు కాదు. తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితితో ఆరంభమయ్యే పండగ సీజన్ హోలీ వరకూ కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో కేంద్రం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంచింది. దీంతో ఈసారి పండగ ప్రాపర్టీ కొనుగోలుదారులకు డబుల్ ధమాకాగా మారింది. - సాక్షి, సిటీబ్యూరోదీంతో ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు 25–30 శాతం అధికంగాఉంటాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. డెవలపర్లలో నూతనోత్తేజం నెలకొంది. పండగ సీజన్లో రియల్ రంగానికి (Real Estate) పండగే. కాకపోతే ఈసారి కొనుగోలుదారులకే సిసలైన పండగ అని చెప్పాలి. ఎందుకంటే గతేడాదితో పోలిస్తే ఈసారి గృహ రుణాలపై వడ్డీ భారం తగ్గుముఖం పట్టింది. జీఎస్టీ భారం తగ్గింది. అందుకే ఈ పండగ సీజన్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావించేవారికి డబుల్ ధమాకాగా చెప్పొచ్చు.హైదరాబాద్లో ఏడాదిన్నరగా ఇళ్ల విక్రయాలు గణనీయంగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలతో అడుగులు ముందుకు వేస్తుండటంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం పెరుగుతోంది. కాకపోతే ఇళ్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాలని కొందరు ఎదురుచూస్తుండగా.. మార్కెట్ మెరుగ్గా లేని తరుణంలో కొంటేనే మెరుగని, ఒకసారి అమ్మకాలు పెరిగితే కొనుగోలు చేయడం కష్టమని భావించిన కొందరు కస్టమర్లు నచ్చిన ప్రాజెక్ట్లలో ఫ్లాట్లను కొనేందుకు ముందుకొస్తున్నారని పలువురు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు.ఔత్సాహిక బయ్యర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ.. కోకాపేట, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, నియోపొలిస్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లను ఎంచుకోవడానికి కొనుగోలుదారులు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిమిత సంఖ్యలో ఉన్న ఫ్లాట్లను ఇప్పుడు కొనకపోతే మరెప్పుడూ కొనలేమనే ఆలోచన బయ్యర్లలో ఏర్పడింది. అందుకే ఆయా ప్రాంతాలలో ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించినా కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. -
ఆశ పెట్టి అంతలోనే.. ఒక్కసారిగా కొత్త రేట్లకు పసిడి, వెండి
దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. రెండు రోజుల క్రితం పసిడి ధరలకు బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు ఉపశమనం కలిగింది. కానీ శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Gold price today) ఒక్కసారిగా ఎగిశాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
క్రిప్టోకరెన్సీ.. ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
సమకాలీన ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం (FinTech) పెరుగుతున్న నేపథ్యంలో స్టేబుల్ కాయిన్ల (Stablecoins) గురించి భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ ప్రారంభ సెషన్లో ఆమె ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్టేబుల్ కాయిన్ల అవసరాన్ని నొక్కి చెప్పారు. కొన్ని దేశాలు వాటిని స్వాగతించినా లేదా వ్యతిరేకించినా స్టేబుల్ కాయిన్ల వాడకానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ద్రవ్య ఆవిష్కరణలకు అనుగుణంగా ఎంత త్వరగా మారాల్సిన అవసరం ఉందో ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.స్టేబుల్ కాయిన్స్ అంటే ఏమిటి?స్టేబుల్ కాయిన్లు అనేవి క్రిప్టోకరెన్సీలో ఒక ప్రత్యేక కేటగిరీకి చెందినవి. వీటిని ధరల అస్థిరతను తగ్గించడానికి రూపొందించారు. బిట్ కాయిన్ లేదా ఎథీరియం వంటి సాంప్రదాయ క్రిప్టోకరెన్సీల ధరలు విపరీతంగా మారే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా స్టేబుల్ కాయిన్లు సాధారణంగా యూఎస్ డాలర్ వంటి స్థిరమైన ఫియట్ కరెన్సీకి లేదా బంగారం వంటి వస్తువులతో ముడిపడి ఉంటాయి. ఈ మెకానిజం క్రిప్టోకరెన్సీ మాదిరిగా అస్థిరతకు లోనుకాకుండా వినియోగదారులకు డిజిటల్ కరెన్సీ ప్రయోజనాలను అందించడానికి ఉద్దేశించబడింది.కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తల ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ కరెన్సీల పెరుగుదలను, స్టేబుల్ కాయిన్లను ఇకపై విస్మరించలేమని చెబుతున్నారు. క్రిప్టో రంగంలో భారతదేశం జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సమయంలో ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీయంగా ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు చట్టపరమైన గుర్తింపును ఇవ్వకపోయినప్పటికీ అది వర్చువల్ డిజిటల్ ఆస్తి లావాదేవీల కోసం పన్ను ఫ్రేమ్వర్క్ను (30% పన్ను, 1% టీడీఎస్) అమలు చేస్తోంది. చాలామంది దీన్ని ఆర్థిక వ్యవస్థలో క్రిప్టో ఉనికిని అంగీకరించే చర్యగా చూస్తున్నారు.ఆర్బీఐ వైఖరిరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై సందేహాస్పదంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం, వినియోగదారుల రక్షణ, ద్రవ్య విధానానికి ప్రమాదాలు సంభవించవచ్చని పేర్కొంటూ గతంలో పూర్తి నిషేధాన్ని సమర్థించింది. అదే సమయంలో తన సొంత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) కోసం పైలట్ ప్రోగ్రామ్లను ప్రారంభించింది. దీన్ని ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలకు సురక్షితమైన, నియంత్రిత ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. సీబీడీసీలు కేంద్ర బ్యాంకులచే జారీ చేయబడతాయి. సాంప్రదాయ కరెన్సీ మాదిరిగానే చట్టపరమైన హోదాను పొందుతాయి. చైనా, స్వీడన్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు కూడా తమ CBDCలను పరీక్షించి అమలు చేస్తున్నాయి.సూక్ష్మ నియంత్రణ చర్చలకు దారిఇదిలాఉండగా, సీతారామన్ నిర్దిష్ట విధాన మార్పులను వివరించకపోయినా స్టేబుల్ కాయిన్లను పరివర్తన శక్తిగా గుర్తించడం భారతదేశ క్రిప్టో విధానంలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. ఈ ప్రకటన మరింత సూక్ష్మమైన నియంత్రణ చర్చలకు దారితీస్తుందని కొందరు భావిస్తున్నారు. డిజిటల్ ఆస్తుల కేటగిరీల మధ్య తేడాను చూపే భవిష్యత్తు ఫ్రేమ్వర్క్కు ఇది మార్గం సుగమం చేయవచ్చని చెబుతున్నారు. ఆ ఫ్రేమ్వర్క్లో స్టేబుల్ కాయిన్లు, ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు, CBDCలను స్పష్టంగా పరిగణించే అవకాశం కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
నవరాత్రుల్లో విక్రయాలకు జీఎస్టీ జోష్
వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) తగ్గింపుతో పండగ సీజన్లో అమ్మకాలకు బూస్ట్ ఇచ్చినట్లయింది. ఈసారి నవరాత్రుల్లో దశాబ్దకాలంలోనే అత్యధికంగా విక్రయాలు నమోదయ్యాయి. వాహనాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది నవరాత్రులతో పోలిస్తే మారుతీ సుజుకీ సేల్స్ రెట్టింపయ్యాయి. 3.5 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి. నవరాత్రుల్లో తొలి ఎనిమిది రోజుల్లో కంపెనీ 1.65 లక్షల వాహనాలను డెలివరీ చేసింది.మారుతీ సుజుకీ గతేడాది ఇదే వ్యవధిలో సుమారు 85,000 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల అమ్మకాలు 60 శాతం పెరిగాయి. క్రెటా, వెన్యూలాంటి మోడల్స్కి డిమాండ్ నెలకొనడంతో హ్యుందాయ్ వాహన విక్రయాల్లో ఎస్యూవీల వాటా దాదాపు 72 శాతంగా నమోదైంది. టాటా మోటర్స్ 50,000కు పైగా వాహనాలను విక్రయించింది. ఆ్రల్టోజ్, పంచ్, నెక్సాన్, టియాగోలాంటి మోడల్స్కి డిమాండ్ నెలకొంది. ఇక ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ షోరూంలను సందర్శించే వారి సంఖ్య రెట్టింపు కాగా, బజాజ్ ఆటో విక్రయాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఎల్జీ, హయర్ రెండంకెల స్థాయి వృద్ధి..కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విభాగంలో ఎల్జీ, హయర్, గోద్రెజ్ అప్లయెన్సెస్ మొదలైన సంస్థల విక్రయాలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. హయర్ అమ్మకాలు 85 శాతం ఎగిశాయి. 65 అంగుళాల టీవీలను రోజుకు 300–350 మేర విక్రయించింది. రూ. 2.5 లక్షల పైగా ఉండే 85 అంగుళాలు, 100 అంగుళాల టీవీలకు సంబంధించి దీపావళి స్టాక్ దాదాపుగా అమ్ముడైపోయింది. అతిపెద్ద రిటైల్ సంస్థ రిలయన్స్ రిటైల్ విక్రయాలు 20–25 శాతం పెరిగాయి. పెద్ద స్క్రీన్ టీవీలు, స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్ మొదలైన విభాగాల్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. విజయ్ సేల్స్ విక్రయాలు కూడా 20 శాతం పెరిగాయి.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
అనిశ్చితులకు బంగారం సరికొత్త కొలమానం
ప్రపంచ అనిశ్చితులకు సరికొత్త కొలమానంగా బంగారం ధరలు వ్యవహరిస్తుట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు ఎలా ఉండేవో బంగారం ధరలు కూడా అలాగే మారినట్టు చెప్పారు. ద్రవ్యపరంగా నేడు ప్రతి దేశం ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతమున్న వాణిజ్య విధాపరమైన వాతావరణం కొన్ని ఆర్థిక వ్యవస్థల వృద్ధికి నష్టం కలిగించనున్నట్టు తెలిపారు.ఈ పరిస్థితుల్లో కొన్ని స్టాక్ మార్కెట్లు కరెక్షన్ను చూడొచ్చని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అవకాశాలను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తున్నాయంటూ.. ఈక్విటీ మార్కెట్లు సైతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా పలు మార్కెట్లలో ర్యాలీ వెనుక టెక్నాలజీ స్టాక్స్ పాత్రను ప్రస్తావిస్తూ.. త్వరలో దిద్దుబాటు చోటుచేసుకోవచ్చన్నారు.‘భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు మునుపటి దశాబ్దంలో చమురు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఆ తర్వాత ఒక శ్రేణికి పరిమితమయ్యాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థల్లో చమురు అవసరాలు తగ్గడం ఇందుకు కారణం. గతంలో ప్రపంచ అనిశ్చితులను చమురు ధరలు ఎలా అయితే కొలమానంగా పనిచేశాయో.. ఇప్పుడు బంగారం ధరలు తీరు కూడా అలాగే ఉంది’ అని మల్హోత్రా వివరించారు.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
డీ2సీలోనే ఎఫ్ఎంసీజీ కొనుగోళ్లు
గత ఐదేళ్లలో దేశీయంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ప్రధానంగా డైరెక్ట్టు కన్జూమర్(డీ2సీ) విభాగంలోని కంపెనీలనే కొనుగోలు చేసినట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ పేర్కొంది. ఇతర సంస్థల కొనుగోళ్లలో ముప్పావువంతు డీ2సీ సంస్థలేనని తెలియజేసింది. తద్వారా ఎఫ్ఎంసీజీ రంగంలోని దిగ్గజాలు వృద్ధికి ఊతమివ్వడంతోపాటు.. ప్రీమియం విభాగాలలో విస్తరణకు దారి ఏర్పరచుకున్నట్లు తెలియజేసింది. దీంతోపాటు విస్తరణ, లాభదాయకతల్లో టార్గెట్ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.ఈ జాబితాలో హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్యూఎల్) ఇటీవల అప్రైజింగ్ సైన్స్ ప్రయివేట్(మినిమలిస్ట్)ను రూ. 2,706 కోట్లకు సొంతం చేసుకోగా.. సాతియా న్యూట్రాస్యూటికల్స్(ప్లిక్స్)ను రూ. 380 కోట్లకు మారికో కొనుగోలు చేసింది. హీలియోస్ లైఫ్స్టైల్(ద మ్యాన్ కంపెనీ)ను రూ. 272 కోట్లు వెచి్చంచి ఇమామీ టేకోవర్ చేయగా.. స్ప్రౌట్లైఫ్ ఫుడ్స్(యోగా బార్)ను రూ. 225 కోట్లకు ఐటీసీ చేజిక్కించుకుంది. ఈ అధ్యయనానికి 82 ఎఫ్ఎంసీజీ కంపెనీలను, 58 డీ2సీ సంస్థలను పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
విదేశీ కంపెనీలకూ ప్రిజంప్టివ్ పన్ను పథకం
విదేశీ కంపెనీలకు సైతం ప్రిజంప్టివ్ పన్ను పథకాన్ని ప్రవేశపెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ కీలక సూచన చేసింది. దీనివల్ల సులభత్వం, స్పష్టత ఏర్పడుతుందని పేర్కొంది. శాశ్వత ఏర్పాటుకు సంబంధించి వివాదాలకు ఐచ్ఛిక ప్రిజంప్టివ్ పన్ను విధానం ముగింపు పలుకుతుందని అభిప్రాయపడింది. ప్రిజంప్టివ్ పన్ను పథకం కింద.. కంపెనీల వాస్తవ లాభాలు, వ్యయాలతో సంబంధం లేకుండా స్థిర, ముందస్తుగా నిర్ణయించిన రేటుపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల కంపెనీలపై నిబంధన అమలు భారం తగ్గుతుంది.అకౌంట్ పుస్తకాలను నిర్వహించే భారం ఉండదు. విదేశీ కంపెనీలకు సైతం దీన్ని అమలు చేయడం వల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందన్నది నీతి ఆయోగ్ అభిప్రాయం. దీర్ఘకాలిక సమస్యకు ఇది ఆచరణాత్మక పరిష్కారం కాగలదని పేర్కొంది. అంతర్జాతీయంగా వ్యాపార సూచీల్లో భారత్ స్థానం మెరుగుపడుతుందని పేర్కొంది. ఈ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘స్థిరమైన, స్పష్టమైన, ఊహించతగిన పన్ను విధానం అన్నది పెట్టుడులకు, ఆర్థిక వృద్ధికి ఎంతో అవసరం. పెట్టుబడిదారులకు లేదా వ్యాపారాలకు అనిశ్చితి అన్నది ఎంత మాత్రం మంచిది కాదు. 2047 నాటికి వికసిత్ భారత్గా అవతరించాలన్నది లక్ష్యం. ఇందుకు గాను వేగంగా వృద్ధి చెందాల్సి ఉంటుంది. ప్రజలకు తగినన్ని ఉపాధి అవకాశాలు చూపించాలి. వీటన్నింటికీ పెట్టుబడులు, ఊహాత్మక వ్యాపార వాతావరణం అవసరం’అని సుబ్రమణ్యం పేర్కొన్నారు.ఇదీ చదవండి: అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల తగ్గింపునకు ప్రోత్సాహకం -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల తగ్గింపునకు ప్రోత్సాహకం
బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను (గడువు తీరినా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయినవి) తగ్గించేందుకు ఆర్బీఐ(RBI) ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఒక ఖాతా కార్యకలాపాల్లేకుండా (ఇనాపరేటివ్) ఉండిపోయిన కాలం, అందులో ఉన్న డిపాజిట్ ఆధారంగా బ్యాంకులకు ప్రోత్సాహకం చెల్లించనుంది. 4 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లేని ఖాతాలకు సంబంధించి 5 శాతం లేదా రూ.5,000, అలాగే పదేళ్లకు పైగా కార్యకలాపాల్లేని ఖాతాలకు సంబంధించిన డిపాజిట్ల విలువలో 7.5 శాతం లేదా రూ.25,000 ఏది తక్కువ అయితే ఆ మేరకు బ్యాంకులకు ప్రోత్సాహంగా అందనుంది.ప్రస్తుతమున్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను అలాగే.. నిర్ణీత కాలం దాటిన తర్వాత డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్కు బదిలీ అయ్యే ఇలాంటి డిపాజిట్లను తగ్గించడం లక్ష్యంగా పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. కస్టమర్లు/ డిపాజిటర్లు తమ ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు.. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను వారికి చెల్లించేందుకు వీలుగా బ్యాంకులను చురుగ్గా పనిచేయించడమే దీని ఉద్దేశమని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల కింద బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ లేకుండా 10 ఏళ్లకు మించిన డిపాజిట్లను డీఈఏ ఫండ్కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇలా డీఈఏ కిందకు బదిలీ అయిన తర్వాత కూడా వాటిని డిపాజిటర్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.67,000 కోట్లుగా ఉన్నాయి. బంగారం తయారీదారులకు మూలధన రుణాలుబంగారం, వెండి ముడి పదార్థంగా వినియోగించే తయారీదారులకు సైతం మూలధన రుణాలను (అవసరం మేరకు) అందించేందుకు బ్యాంక్లను ఆర్బీఐ అనుమతించింది. ఇప్పటి వరకు జ్యుయలర్లకే ఈ వెసులుబాటు ఉండేది.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
జీఎస్టీ జోరుకు కళ్లెం
సాక్షి, హైదరాబాద్: ఐదు నెలలుగా జోరు మీద ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు కళ్లెం పడింది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 సెప్టెంబర్లో తెలంగాణ జీఎస్టీ రాబడులు రూ.4,998 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5వేల కోట్లకు తక్కువగా జీఎస్టీ ఆదాయం నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గత ఏడాది సెప్టెంబర్తో పోల్చినా ఇది తక్కువే. 2024 సెప్టెంబర్లో రూ.5,267 కోట్లు జీఎస్టీ ఆదాయం రాగా, ఈసారి అంతకంటే రూ.269 కోట్లు (5 శాతం) తక్కువగా వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.దేశమంతా రాబడులు పెరిగినా తెలంగాణలో తక్కువగా రావడం గమనార్హం. దేశంలో రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఈ ఏడాది సెప్టెంబర్లో జీఎస్టీ ఆదాయం పడిపోయింది. మణిపూర్ (1 శాతం), ఢిల్లీ (1 శాతం), హిమా చల్ప్రదేశ్ (4శాతం)లో రాబడులు తగ్గాయి. మధ్య ప్రదేశ్లో 21 శాతం, బిహార్లో 17, ఉత్తరప్రదేశ్లో 11, రాజస్తాన్లో 10 శాతం మేర జీఎస్టీ పెరిగింది. దక్షిణాది విషయానికొస్తే కేరళలో 13 శాతం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో (4 శాతం), కర్ణాటకలో 7 శాతం జీఎస్టీ పెరిగింది. కానీ, తెలంగాణలో మాత్రం గత సెప్టెంబర్తో పోలిస్తే ఈ సెప్టెంబర్లో తక్కువ ఆదాయం వచ్చిందిఆగస్టు వరకూ పైపైకే...:ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ మినహాయిస్తే మిగిలిన ఐదు నెలల జీఎస్టీ రాబడులు రాష్ట్రంలో ఆశాజనకంగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వరుసగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో చూస్తే మాత్రం ప్రతి నెలా (ఒక్క జూలై మినహా) తగ్గుతూనే ఉన్నాయి. 2025లో ఏప్రిల్లో అత్యధికంగా రూ. 6,983 కోట్లు వచ్చిన జీఎస్టీ రాబడులు ఆ తర్వాతి నెలలో రూ.5,310 కోట్లకు పడిపోయాయి. జూన్లోనూ అంతకంటే తక్కువగా నమోదు కాగా, జూలైలో మాత్రం రూ.300 కోట్ల పెరుగుదల కనిపించింది. ఇక, ఆగస్టు, సెప్టెంబర్లో మళ్లీ తగ్గుదలే నమోదైంది.కారణాలేంటి?దేశవ్యాప్తంగా జీఎస్టీ రాబడులు పెరగ్గా.. రాష్ట్రంలో మాత్రం తగ్గేందుకు కారణాలేంటన్న దానిపై వాణిజ్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, జీఎస్టీ అధికారులు మాత్రం ఇందుకు చెప్పుకోదగిన కారణాలేవీ లేవని, సాంకేతిక కారణాలతోనే అలా జరిగి ఉంటుందని అంటున్నారు. ఈ తగ్గుదల యాదృచ్ఛికమేనని చెబుతున్నారు. తెలంగాణలో లగ్జరీ వస్తువుల వినియోగం ఎక్కువగా ఉంటుందని, సెప్టెంబర్ రిటర్న్స్ వచ్చే నెలలో ఆ వస్తువుల కొనుగోళ్లు తగ్గి ఉండటం, కేంద్రం నుంచి వచ్చిన పాత బకాయిలు, పరిహారం లాంటివి ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా వచ్చి ఉండొచ్చని, లేదంటే ఆయా రాష్ట్రాల్లో పెద్ద స్థాయిలో వచ్చిన డిమాండ్ ఈనెలలో కార్యరూపం దాల్చి ఉంటుందని అంటున్నారు. అంతేతప్ప జీఎస్టీ రాబడుల్లో తెలంగాణలో ప్రత్యేక తగ్గుదల లేదని వారు చెబుతుండటం గమనార్హం. -
ఒడిదుడుకుల ప్రపంచానికి లంగరుగా భారత్
న్యూఢిల్లీ: ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచాన్ని స్థిరపర్చే లంగరుగా భారత్ కీలక పాత్ర పోషిస్తోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండటం, విదేశీ మారక నిల్వలు సమృద్ధిగా ఉండటం, కరెంటు అకౌంటు లోటు నెమ్మదించడం, బ్యాంకులు..కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉండటం తదితర అంశాల దన్నుతో దేశ ఆర్థిక స్థితి పటిష్టంగా ఉందని ఆయన చెప్పారు. ‘ప్రభుత్వంలోని విధానకర్తలు, నియంత్రణ సంస్థలు, నియంత్రిత సంస్థల సమిష్టి కృషితో ఇది సాధ్యపడింది. ఇటీవల ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, పటిష్టమైన వృద్ధి బాటలో ఎకానమీ కుదురుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇదొక గొప్ప ఫీట్లాంటిదే‘ అని ఆయన పేర్కొన్నారు. కౌటిల్య ఎకనమిక్ కాంక్లేవ్ 2025లో పాల్గొన్న సందర్భంగా మల్హోత్రా ఈ విషయాలు చెప్పారు. అనేక దశాబ్దాలుగా నిర్మితమైన భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు, ధరల కట్టడి, ఆర్థికాంశాలు, స్థిరమైన విధానాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ఇందుకు దోహదపడిందని ఆయన వివరించారు. ఇటీవలి పరపతి సమీక్షలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచిన ఆర్బీఐ ద్రవ్యోల్బణ అంచనాలను 3.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గించింది. వర్షపాతం సాధారణంగా కన్నా అధిక స్థాయిలో ఉండటం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం తదితర సానుకూలాంశాలు ఇందుకు కారణమని పేర్కొంది. సెపె్టంబర్ 26తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 700.236 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
వంట గదుల్లో నలభీములు!
ముంబైలోని చిన్న వంటగదిలో 29 ఏళ్ల జస్టిన్ వారంలో ఒక రాత్రి తన ఎయిర్ ఫ్రయర్లో స్వీట్ పోటాటో వెజెస్ వేయిస్తూ, సలాడ్ సిద్ధం చేస్తుంటాడు. వంట అనేది అతనికి విసుగెత్తించే పనికాదు, రిలాక్స్ అవడానికి, స్నేహితులను ఎంటర్టైన్ చేయడానికి, కొత్త రుచులను అన్వేíÙంచడానికి అదో మార్గం. జస్టిన్ ఇప్పుడు భారతదేశ నగరాల్లో పెరుగుతున్న ఒక వర్గానికి ప్రతినిధి. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది పురుషులు స్టైలిష్ గాడ్జెట్లు, ఆధునిక కుక్వేర్తో వంటింట్లోకి అడుగుపెడుతున్నారు. ఇది మారుతున్న అలవాట్లకే కాదు వాణిజ్యపరంగా కూడా ఒక విప్లవం. దృక్పథం మారుతోంది...ఆన్లైన్లో వంటింటి సామాను కొనేవారిలో ఇపుడు 30% మంది పురుషులే ఉంటున్నారు ఐదారేళ్ల క్రితం ఇది చాలా తక్కువ శాతం మాత్రమే. ఇంట్లో వంటగది ఎలా ఉండాలి, కుకింగ్ త్వరగా అయేందుకు ఏమేం వస్తువులు కొనాలి అనే నిర్ణయాన్నిఇపుడు అనేక ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ కలిసి తీసుకుంటున్నారని స్టాల్ కిచెన్స్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు.వంటింటి సామ్రాజ్యానికి ఇప్పటికీ మహిళలే మహారాణులైనా పురుషుల వాటాకూడా క్రమంగా పెరుగుతోందని వండర్ చెఫ్ వ్యవస్థాపకుడు రవి సక్సేనా స్పష్టంచేశారు. 70% వారానికోసారి...ఆన్లైన్ కొనుగోళ్ల ఆల్గరిథమ్ను పరిశీలిస్తే వంటింటి సామాను కొనే పురుషులు రెండు రకాలని తెలుస్తోంది. మొదటిరకం.. స్వతంత్రంగా జీవించే యువకులు వీరు రోజువారీ వాడుకకు పనికివచ్చే, నాన్–టాక్సిక్ కుక్వేర్, ఒకటి రెండు మాత్రమే కొనుగోలు చేస్తారు.ఇక రెండో రకం ప్యాషనేట్ కుక్స్ (బిజీ ప్రొఫెషనల్స్) వీరు ప్రతిరోజూ వంట చేయకపోయినా, ప్రీమియం సెట్లు కొనుగోలు చేసి సంప్రదాయ కుటుంబ వంటకాలతోపాటు రెస్టారెంట్లో లభించే రుచులను వంటింట్లో తయారుచేసేందుకు ప్రయతి్నస్తారు. కుక్వేర్ కొనే పురుషుల్లో 70% మంది కనీసం వారానికి ఒకసారి వాటిని వాడతారు. వీరు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులు, పూర్తి సెట్లను కొనడానికి ఇష్టపడతారు. వీరి సగటు ఆర్డర్ విలువ ఇతరులతో పోలిస్తే 12% ఎక్కువని ఎంబర్ కుక్వేర్ సీఈఓ సిద్ధార్థ్ గడోదియా చెప్పారు. పురుషులకు బాగా నచ్చేవి, ఎక్కువగా కొనే కిచెన్ ఉత్పత్తులు మలీ్ట–ఫంక్షనల్ పరికరాలు (కలపడం, ముద్ద చేయడం, కట్ చేయడం, ఆవిరి వేయడం, వండడం ఇలా ఆల్ రౌండర్ టైపువి. స్టీలు పెనాలు, మూకుళ్లు ఉంటాయని గడోదియా తెలిపారు. మొత్తానికి, పురుషులు వంటింట్లోకి అడుగుపెట్టడం వల్ల కుక్వేర్ మార్కెట్కి కొత్త కళ వచి్చంది.పురుషులు వంటగదిలోకి రావడానికి కారణాలు→ ఆరోగ్యంపై శ్రద్ధ (తక్కువ నూనె, ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించడం) → ఫ్లెక్సిబుల్ వర్క్ ప్యాటర్న్స్ (హోమ్ ఆఫీస్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్) → సోషల్ మీడియాలో నోరూరిస్తూ లభించే సులభమైన రెసిపీలు -
టాటా క్యాపిటల్ @ రూ.310–326
ముంబై: టాటా క్యాపిటల్ మెగా పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు రూ.310–326 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ఈ నెల 6న మొదలై 8న ముగుస్తుంది. జూలైలో చేపట్టిన రైట్స్ ఇష్యూతో పోలిస్తే ఐపీఓ షేరు ధర 5 శాతం తక్కువేనని, విస్తృత స్థాయిలో భాగస్వామ్యంతో పాటు మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే దీని లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈఓ రాజీవ్ సబర్వాల్ పేర్కొన్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా టాటా క్యాపిటల్ షేరుకు రూ.343 చొప్పున రూ.1,750 కోట్లు సమీకరించింది. అతి పెద్ద ఇష్యూ... ఐపీఓ ద్వారా టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. మార్కెట్ విలువ రూ.1.38 లక్షల కోట్లుగా నమోదు కావచ్చని అంచనా. దీంతో ఈ ఏడాది మన స్టాక్ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది నిలుస్తుంది. ఇష్యూలో భాగంగా టాటా సన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 23 కోట్ల షేర్లను, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) 3.58 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. కంపెనీ 21 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేస్తోంది. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్కు 88.6%, ఐఎఫ్సీకి 1.8 శాతం వాటా ఉంది. దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)గా నిలుస్తున్న టాటా క్యాపిటల్ లోన్ బుక్ రూ.2.3 లక్షల కోట్ల పైమాటే. ఇందులో 88 శాతం రుణాలు రిటైల్ ఖాతాదారులు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) ఇచి్చనవే కావడం గమనార్హం. 2023లో నవంబర్లో టాటా టెక్నాలజీస్ అరంగేట్రం తర్వాత టాటా గ్రూప్ నుంచి వస్తున్న మరో భారీ ఐపీఓ కానుంది. -
టెక్స్టైల్స్ పీఎల్ఐ స్కీమ్ గడువు పెంపు
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కేంద్రం పొడిగించింది. ఆగస్టులో మొదలుపెట్టిన మలి విడతలో మ్యాన్–మేడ్ ఫైబర్ (ఎంఎంఎఫ్) దుస్తులు, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ సహా వివిధ విభాగాల నుంచి దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలో గణనీయంగా ఆసక్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ స్కీములో పాల్గొనేందుకు భావి ఇన్వెస్టర్లకు మరో అవకాశం కలి్పస్తున్నట్లు టెక్స్టైల్స్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జౌళి పరిశ్రమ వృద్ధికి తోడ్పడటం, పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడం లక్ష్యంగా 2021 సెపె్టంబర్ 24న ప్రభుత్వం ఈ స్కీమును ప్రకటించింది. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ. 28,711 కోట్ల పెట్టుబడుల హామీలతో 74 సంస్థలు ఎంపికయ్యాయి. -
ప్రపంచ ఆర్థిక స్థిరీకరణ శక్తిగా భారత్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయని, ఆర్థిక ఆంక్షలు–టారిఫ్లు ప్రపంచ సరఫరా వ్యవస్థలను మార్చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ తరుణంలోనూ భారత్ 8 శాతం వృద్ధిరేటును ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ‘కౌటిల్య ఆర్థిక సమావేశం 2025’ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. వాణిజ్యం, ఇంధన భద్రత పరంగా ప్రపంచం ఎంతో అసమతుల్యతలను చూస్తోందని, నిర్మాణాత్మక పరివర్తనం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఈ తరుణంలో భారత్ స్థిరీకరణ శక్తిగా నిలుస్తున్నట్టు చెప్పారు. వెలుపలి షాక్లను తట్టుకోగలదన్నారు. ‘‘2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు 8 శాతం మేర స్థిరమైన జీడీపీ వృద్ధికి చేరుకోవడం అవసరం. మనం చూస్తున్నది తాత్కాలిక అస్థిరతలు కాదు. నిర్మాణాత్మక మార్పు. ఒకప్పుడు బలమైన కూటములు అనుకున్నవి నేడు కాల పరీక్షను ఎదుర్కొంటున్నాయి. కొత్త కూటములు అవతరిస్తున్నాయి. కనుక కేవలం ప్రపంచ అస్థిరతలను ఎదుర్కోవడమే కాదు. వాణిజ్యం, ఇంధనం, ఆర్థిక అస్థిరతలతోనూ పోరాడాల్సి రావడం మనముందున్న సవాలు’’అని అని పేర్కొన్నారు. ప్రపంచ సంస్థలు బలోపేతం కావాలి.. అంతర్జాతీయ సంస్థలు (డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ తదితర) బలోపేతం కావాల్సిన అవసరాన్ని మంత్రి సీతారామన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవి నిరీ్వర్యమవుతుండడంతో ప్రపంచ విశ్వాసం సన్నగిల్లుతున్నట్టు చెప్పారు. ఇవి నేటి వాస్తవాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందన్నారు. దేశీయంగా సంస్కరణలు అమలు చేయడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమన్వయం చేసుకోవడం ద్వారా భారత్ పెరుగుతున్న సుంకాల అవరోధాలను, వాణిజ్య కూటముల్లో మార్పులను అధిగమించగలదని చెప్పారు. పెరిగిపోయిన ఉద్రిక్తతలు, అధిక సుంకాలు, విధానపరమైన తీవ్ర అనిశి్చతులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే, పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం, పెరిగిపోయిన నిధుల వ్యయాలు, ఇంధన ధరల్లో అస్థిరతలు సైతం వేధిస్తున్నట్టు చెప్పారు. వీటన్నింటి మధ్య భారత్ స్థిరీకరణ శక్తిగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ ద్రవ్య స్థిరీకరణ, మూలధన వ్యయాల నాణ్యతపై దృష్టి సారించినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ‘‘జీడీపీలో వినియోగం, పెట్టుబడుల వాటా ఈ కాలంలో స్థిరంగా కొనసాగింది. భారత్ వృద్ధి దేశీ అంశాలపై బలంగా ఆధారపడి ఉంది. ఇది వెలుపలి షాక్లను పరిమితం చేస్తోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది’’అని వివరించారు. -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. కలిసొచ్చిన నవరాత్రి: అమ్మకాల్లో అరుదైన రికార్డ్!
భారతదేశంలో ప్రతి సంవత్సరం పండుగ సీజన్లో వాహన విక్రయాలు కొంత పెరుగుతాయి. అయితే ఈ సారి మాత్రం వెహికల్ సేల్స్ ఊహకందని రీతిలో గణనీయంగా పెరిగాయి. దీనికి కారణం మోదీ ప్రభుత్వం అమలుచేసిన జీఎస్టీ 2.0 అని తెలుస్తోంది. కొత్త జీఎస్టీ సంస్కరణల కారణంగా.. కార్లు, బైకులు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సేల్స్ భారీగా పెరిగాయి.ఆటోమొబైల్ రంగంఏ రంగం ఎలా ఉన్నా.. ఆటోమొబైల్ రంగానికి మాత్రం పండుగ సీజన్ బాగా కలిసొచ్చింది. మారుతి సుజుకి నవరాత్రి అమ్మకాలు.. గత సంవత్సరం కంటే రెట్టింపు అయ్యాయి. నవరాత్రి మొదటి ఎనిమిది రోజుల్లో 1.65 లక్షల వాహనాలను కంపెనీ డెలివరీ చేసింది. మొదటి రోజు 30,000 కార్లను డెలివరీ చేసి అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. సంస్థ మొత్తం బుకింగ్లు 1.50 లక్షలుగా నివేదించింది. ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుకుంటుందని కంపెనీ భావిస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ 85,000 వాహనాలను విక్రయించింది. దీన్నిబట్టి చూస్తే.. మారుతి సుజుకి సేల్స్ ఏ స్థాయిలో పెరిగాయో స్పష్టంగా అర్థమవుతోంది.ఇక దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఫెస్టివల్ సీజన్లో 60 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఎక్స్యూవీ700, స్కార్పియో ఎన్ వంటి కార్లను ఎక్కువ సంఖ్యలో విక్రయించింది. ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, టియాగో వంటి మోడళ్లకు డిమాండ్ పెరగడంతో టాటా మోటార్స్ 50,000 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ క్రెటా, వెన్యూలకు డిమాండ్ పెరగడంతో..ఈ ఎస్యూవీల వాటా మొత్తం అమ్మకాలలో 72 శాతానికి పైగా పెరిగింది.ఇక టూ వీలర్స్ విషయానికి వస్తే.. హీరో మోటోకార్ప్ ముందు వరుసలో నిలిచింది. అంటే ఈ బ్రాండ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. కంపెనీ షోరూమ్ల వద్ద రద్దీ ఈ నవరాత్రిలో రెట్టింపు అయ్యింది. కమ్యూటర్ విభాగంలోని బైకుల సేల్స్ గణనీయంగా పెరిగాయి. బజాజ్ ఆటో కూడా బలమైన అమ్మకాలను నమోదు చేసింది.ఎలక్ట్రానిక్స్ రంగంఆటోమొబైల్ రంగం పక్కన పెడితే.. ఎలక్ట్రానిక్స్ రంగం కూడా మంచి పురోగతిని సాధించింది. హైయర్ అమ్మకాలు 85 శాతం పెరిగాయి. ఈ కంపెనీ తన దీపావళి స్టాక్ అయిన.. 85 ఇంచెస్, 100 ఇంచెస్ టీవీలను దాదాపుగా విక్రయించేసింది. అంతే కాకుండా ఈ సంస్థ రోజుకు 300-350 యూనిట్ల 65 ఇంచెస్ టీవీలను సేల్ చేసింది.ఇదీ చదవండి: గిఫ్ట్గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?భారతదేశంలోని అతిపెద్ద రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ అమ్మకాలు.. గత సంవత్సరం నవరాత్రి కంటే 20-25 శాతం పెరిగాయి. పెద్ద స్క్రీన్ టీవీలు, స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్ వంటి సేల్స్ అమాంతం పెరిగాయి. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ 'విజయ్ సేల్స్' అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందాయి. -
రాడిసన్ బ్లూ ప్లాజాకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డు
బంజారా హిల్స్లో రాడిసన్ బ్లూ ప్లాజా, క్లాసిఫైడ్ హోటల్స్ - 5 స్టార్ కేటగిరీ కింద.. తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక టూరిజం ఎక్సలెన్స్ అవార్డు 2025 పొందింది. హైదరాబాద్లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అవార్డును అందుకుంది.టూరిజం ఎక్సలెన్స్ అవార్డును.. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ తరపున సౌత్ ఇండియా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ జోషి, రాడిసన్ బ్లూ ప్లాజా బంజారా హిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజర్షి భట్టాచార్జీ అందుకున్నారు. ఆతిథ్యంలో అత్యుత్తమ ప్రతిభ, అత్యుత్తమ సేవా నాణ్యత ఈ అవార్డు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ అవార్డును అందుకోవడం మాకు ఎంతో గౌరవంగా ఉందని జోషి పేర్కొన్నారు. -
దక్షిణ మధ్య రైల్వే అరుదైన రికార్డ్: ఆరు నెలల్లో..
దక్షిణ మధ్య రైల్వే 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో రూ.10143 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. సుమారు 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి.. దీని ద్వారా రూ.6635 కోట్ల ఆదాయాన్ని పొందింది. ప్రయాణీకుల ద్వారా రూ.2991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సరుకు రవాణా, ప్రయాణీకుల విభాగాలలో అత్యుత్తమ పనితీరును కనబరిచింది. జోన్ 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.10143 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది 2024 - 25లో నమోదైన మునుపటి అత్యుత్తమ ఆదాయమైన రూ. 9966 కోట్ల కంటే 1.7 శాతం ఎక్కువ. ఈ కాలంలో రూ.2991 కోట్ల ప్రయాణీకుల ఆదాయం, రూ.6635 కోట్ల సరుకు రవాణా ఆదాయం దీనికి దోహదపడింది. అదేవిధంగా జోన్ మునుపెన్నడూ లేని విధంగా సరుకు రవాణాలో 71.14 మిలియన్ టన్నుల సరకు లోడింగ్ను సాధించింది. ఇది 2024-25లో లోడ్ చేసిన 67 మిలియన్ టన్నుల మునుపటి ఉత్తమ సరుకు రవాణా లోడింగ్ కంటే 6 శాతం ఎక్కువ.దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది అసాధారణ సమిష్టి కృషి, అన్ని విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఫలితంగా రికార్డు స్థాయి పని తీరును సాధించగలిగింది. జోన్లోని ప్రస్తుత సరుకు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూనే, సరుకు రవాణా విభాగంలో నూతన పంథాలను ప్రవేశపెడుతున్నారు. ఈ దిశలో నిరంతర ప్రయత్నం ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో జోన్ 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణా వస్తువులను రవాణా చేయడం ద్వారా అత్యుత్తమ సరుకు రవాణాను నమోదు చేసింది. ఇదే కాలంలో గత సంవత్సరంలోని సరుకు రవాణా కంటే ఇది 4.13 మిలియన్ టన్నులు ఎక్కువ (67 మిలియన్ టన్నులు ). ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు, సిమెంట్ మొదలైన వస్తువుల లోడింగ్ పెరగడం వల్ల సరుకు రవాణాలో మెరుగుదల ప్రధానంగా ఉంది.అదే సమయంలో, వీలైనంత వరకు అవసరమైన చోట ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడానికి, నడపడానికి జోన్ ప్రయాణీకుల రవాణా ధోరణులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ప్రవేశపెట్టిన రైళ్లు మంచి ఆదరణతో నడుస్తున్నాయి. అదనంగా, డిమాండ్, సాధ్యాసాధ్యాలు ఉన్న చోట జోన్ అదనపు కోచ్లతో రైళ్లను నడుపుతోంది, ప్రత్యేక రైళ్ల నిర్వహణకు అదనంగా దీని వలన వెయిట్లిస్ట్ లోనున్న ప్రయాణీకులకు ఉపయోగపడుతోంది. ప్రయాణీకుల ఆదాయం పరంగా, ఈ కాలంలో జోన్ రూ. 2991 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇది గత సంవత్సరం గడించిన రూ. 2909 కోట్ల కంటే 2.8 శాతం అధికం.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ అద్భుతమైన ఆదాయాలను సాధించినందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే బృందాన్ని అభినందించారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్తమ పనితీరును సాధించడానికి అన్ని డివిజన్లు మరియు ప్రధాన కార్యాలయాల సిబ్బంది మరియు అధికారులు ఇదే స్పూర్తితో ఒకే వేగాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. -
మస్క్ కంపెనీలో జాబ్స్: జీతం ఎంతో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏఐ కంపెనీ అయిన ఎక్స్ఏఐ (xAI) దాని చాట్బాట్ 'గ్రోక్' కోసం ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. వీడియో గేమ్ల కోసం.. వీడియో గేమ్స్ ట్యూటర్లను నియమించుకోనుంది. వీరు గ్రోక్కు గేమ్లను రూపొందించడం, కథలు చెప్పడం, యూజర్ ఆలోచనలకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వనున్నారు.గ్రోక్ టెక్స్ట్ ఆధారిత సంభాషణలకు పరిమితం చేయకుండా.. మరింత సృజనాత్మకంగా ఉండేలా ట్యూటర్స్ శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి వీరు ఎక్స్ఏఐ సాఫ్ట్వేర్తో పని చేస్తారు. గేమ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం కంపెనీ అన్వేషిస్తోంది. అయితే ఎన్ని ఉద్యోగాలు, ఎంతమందిని నియమించుకుంటారనే విషయం వెల్లడించలేదు.ఎంపికైన ఉద్యోగులు కాలిఫోర్నియాలోని ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. కానీ రిమోట్గా కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. రిమోట్గా వర్క్ చేయాలనుకునే అభ్యర్థులకు సెల్ఫ్ డిసిప్లైన్, స్ట్రాంగ్ మోటివేషన్ వంటివి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు మొదటి రెండు వారాలు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అనుకూలమైన టైమ్ ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!జీతం & ప్రయోజనాలుఎంపికైన ఉద్యోగులకు జీతం గంటకు 45 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు ఉంటుంది. ప్రయోజనాలు దరఖాస్తుదారు నివసించే దేశంపై ఆధారపడి ఉంటాయి. ఫుల్ టైమ్ జాబ్ చేసే ఉద్యోగులకు మెడికల్ కవరేజ్ లభిస్తాయి. అయితే, పార్ట్-టైమ్ ఉద్యోగులకు ఇలాంటి ప్రయోజనాలు ఉండవు. -
సిట్రోయెన్ కొత్త కారు: ధర ఎంతంటే?
సిట్రోయెన్ ఇండియా.. దేశీయ మార్కెట్లో 'ఎయిర్క్రాస్ ఎక్స్' లాంచ్ చేసింది. ఈ కారు ధరలు రూ. 8.29 లక్షల నుంచి ప్రారంభమై రూ. 13.69 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. కంపెనీ ఈ లేటెస్ట్ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త డీప్ ఫారెస్ట్ గ్రీన్ రంగులో కనిపించే ఈ కొత్త సిట్రోయెన్ ఎయిర్క్రాస్ ఎక్స్.. ఎంట్రీ & పుష్ స్టార్ట్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, ఆటో ఐఆర్వీఎం, ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పొందుతుంది.లేటెస్ట్ డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ ఫ్రెంచ్ బ్రాండ్ కారు.. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. కాబట్టి ఇందులో ఆరు ఎయిర్బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన సేఫ్టీ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి.ఇదీ చదవండి: 8 నెలలు.. 30000 సేల్స్: అమ్మకాల్లో కైలాక్ హవా!ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త సిట్రోయెన్ ఎయిర్క్రాస్ ఎక్స్ 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ & 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎంపికను మాత్రమే పొందుతుంది. రెండోది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను పొందుతుంది. -
గిఫ్ట్గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?
2025 ఆసియా కప్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కింద భారత యువ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మకు 'హవల్ హెచ్9' అనే లగ్జరీ కారు గిఫ్ట్గా లభించింది. ఈ కారు ధర సుమారు రూ. 33 లక్షలు అని సమాచారం. క్రికెటర్లు గిఫ్ట్గా స్వీకరించే కార్లు, ఇతర విలాసవంతమైన వస్తువులు పూర్తిగా పన్ను రహితం కాదు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. వాటి విలువపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కథనంలో క్రికెటర్లు గిఫ్ట్గా అందుకునే కార్లపై ఎంత పన్ను చెల్లించాలి.. నియమాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.భారతదేశంలోని క్రికెటర్లు తరచుగా విలాసవంతమైన గిఫ్ట్స్ అందుకుంటారు. టోర్నమెంట్ గెలిచినప్పుడు లేదా అత్యుత్తమ ప్రదర్శన కనపరిచినప్పుడు కంపెనీలు, బ్రాండ్లు లేదా పారిశ్రామికవేత్తలు వారికి కార్లు, బైక్లు లేదా ఇతర విలాసవంతమైన వస్తువులను గిఫ్ట్గా ఇస్తారు. చాలా మంది ఈ గిఫ్ట్స్ పూర్తిగా ఉచితం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఆదాయపు పన్ను నియమాలు వీటికి కూడా వర్తిస్తాయి.ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక వస్తువును గిఫ్ట్గా స్వీకరిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే దగ్గరి బంధువు నుంచి.. అంటే వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా తోబుట్టువుల నుంచి గిఫ్ట్ తీసుకుంటే, దానిపై పన్ను విధించబడదు. కానీ.. అదే గిఫ్ట్ కంపెనీ, బ్రాండ్, వ్యాపారవేత్త నుంచి వస్తే దానిపై పన్ను విధించబడుతుంది.ఇదీ చదవండి: నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!ఇక ట్యాక్స్ విషయానికి వస్తే.. చాలా మంది క్రికెటర్లు ఎక్కువగా సంపాదిస్తారు. కాబట్టి వీరు అత్యధిక పన్ను పరిధి(30 శాతం)లోకి వస్తారు. ఇది కాకుండా సెస్ కూడా యాడ్ అవుతుంది. మొత్తంగా 31.2 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వీరు తీసుకునే గిఫ్ట్కు అదే పన్ను విధించబడుతుంది. ఉదాహరణకు, ఒక క్రికెటర్ రూ. 20 లక్షల విలువైన కారును గిఫ్ట్గా అందుకుంటే, అతను ఆ గిఫ్ట్పై సుమారు రూ. 6 లక్షల కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే అభిషేక్ శర్మ.. హవల్ హెచ్9 కారుకు రూ. 9 లక్షల కంటే ఎక్కువ ట్యాక్స్ చెల్లిచాలి. -
సెప్టెంబర్లో రిజిస్టర్ అయిన టెస్లా, విన్ఫాస్ట్ ఈవీల సంఖ్య
ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లలో వేగంగా ఎదుగుతున్న గ్లోబల్ ఈవీ తయారీదారుల్లో ఒకటైన టెస్లా, విన్ఫాస్ట్ ఇటీవలే భారత్లోకి ప్రవేశించాయి. గత నెలలో ఈ రెండు దిగ్గజ సంస్థలు తమ తొలి బ్యాచ్ వాహన రిజిస్ట్రేషన్లను నమోదు చేశాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహన్ (Vaahan) పోర్టల్ డేటా ప్రకారం సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా మొత్తం 60 టెస్లా కార్లు, 6 విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.జులైలో భారతీయ కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత ఈ రెండు కంపెనీలకు ఇది మొదటి అధికారిక బ్యాచ్ రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ఈవీ మార్కెట్ను శాసిస్తున్న టెస్లా జులై 15న ముంబైలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించింది. దీని మోడల్ వై ఎస్యూవీ ధరలు రియర్-వీల్ డ్రైవ్ వెర్షన్కు రూ.59.89 లక్షలు, లాంగ్-రేంజ్ వేరియంట్ రూ.67.89 లక్షల నుంచి ప్రారంభమయ్యాయి. ఇది సుమారు 500 కి.మీ. వరకు రేంజ్ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.మరోవైపు వియత్నాం ఈవీ తయారీదారు విన్ఫాస్ట్ మిడ్-రేంజ్ మార్కెట్పై దృష్టి సారించింది. కంపెనీ ప్రీ-బుకింగ్లను ప్రారంభించడమే కాకుండా స్థానిక తయారీకి భారీ పెట్టుబడిని ప్రకటించింది. తమిళనాడులోని తూత్తుకుడిలో నెలకొల్పిన విన్ఫాస్ట్ అసెంబ్లీ ప్లాంట్ ఆగస్టులో కార్యకలాపాలను మొదలుపెట్టింది. దీని ప్రారంభ సామర్థ్యం ఏటా 50,000 వాహనాలుగా ఉంది. దీనిని 1.5 లక్షల యూనిట్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఇదీ చదవండి: సంద్రంలో వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్ -
సంద్రంలో వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్
టెక్నాలజీ అనేది చాలామంది పనులను వేగవంతం చేస్తుంది. దాంతోపాటు కొందరి ప్రాణాలు కోల్పోకుండా కాపాడుతుంది. అదెలాగని అనుకుంటున్నారా.. ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలియాల్సిందే. ఆ ఘటనలో ధరించగలిగే సాంకేతిక పరిజ్ఞానం (wearable technology) మరోసారి ప్రాణాలను రక్షించే సామర్థ్యాన్ని రుజువు చేసింది. పుదుచ్చేరి తీరంలో సంభవించిన స్కూబా డైవింగ్ ప్రమాదంలో యాపిల్ వాచ్ అల్ట్రా ముంబైకి చెందిన 26 ఏళ్ల టెక్కీని ఊహించని విధంగా కాపాడింది.ఈ-కామర్స్ రంగంలో పనిచేస్తున్న, స్కూబా డైవింగ్పై ఆసక్తి ఉన్న క్షితిజ్(26) అనే వ్యక్తి ఇటీవల బంగాళాఖాతంలో డైవింగ్ కోసం వెళ్లాడు. తన కోచ్తో కలిసి సముద్రంలో సుమారు 36 మీటర్ల లోతుకు చేరుకున్నాడు. ఒక్కసారిగా సంద్రంలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అది గమనించిన క్షితిజ్ పైకి రావాలని నిర్ణయించుకున్నాడు. కానీ డైవింగ్ కిట్లో ముఖ్యమైన భాగంగా ఉన్న అతని వెయిట్ బెల్ట్ (Weight Belt) వదులైంది. దాంతో కంగారుపడి మరింత వేగంగా పైకి రావడానికి ప్రయత్నించాడు.నీటి అడుగున ఒత్తిడి మార్పుల కారణంగా డైవర్లు వేగంగా ఆరోహణ (Rapid Ascent) దిశగా లోతు నుంచి పైకి వచ్చే క్రమంలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవచ్చు. ఇది ఊపిరితిత్తుల ఓవర్ ఎక్స్పాన్షన్ ఇంజురీలకు దారితీస్తుంది. అదేమీ లెక్క చేయకుండా వేగంగా పైకి రావడానికి క్షితిజ్ ప్రయత్నించాడు. అప్పటికే అతడు సాహసోపేత క్రీడల కోసం రూపొందించిన యాపిల్ వాచ్ అల్ట్రాను ధరించాడు. అతను వేగంగా పైకి వెళ్తుండగా వాచ్లోని సెన్సార్లు ఉపరితలం నుంచి లోతు, తన వేగాన్ని పరిగణించి అసాధారణ మార్పును గుర్తించాయి. వాచ్ స్క్రీన్పై తక్షణమే ఒక హెచ్చరిక కనిపించింది. ‘నెమ్మదిగా ఉండండి. మీరు చాలా వేగంగా వెళ్తున్నారు’ అని మేసేజ్ రూపంలో వచ్చింది.అయినప్పటికీ క్షితిజ్ పట్టించుకోకుండా వేగంగా వెళ్తున్నాడు. ఈ కీలక సమయంలో అత్యవసర పరిస్థితుల కోసం రూపొందించిన వాచ్ అల్ట్రా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. దాని శబ్దం సముద్రంలో గందరగోళ వాతావరణంలో కూడా స్పష్టంగా వినిపించేలా ఉండడంతో ముందు వెళ్తున్న కోచ్ ఆ శబ్దం విని తన వద్దకు వచ్చాడు. కోచ్ జోక్యం చేసుకుని క్షితిజ్ పరిస్థితిని నియంత్రించాడు. సురక్షితంగా పైకి వచ్చేందుకు తోడ్పాటు అందించాడు. ‘ఆ వాచ్లో సైరన్ ఫీచర్ ఉందని కూడా నాకు తెలియదు’ అని క్షితిజ్ అంగీకరించాడు. ‘ఇది నా ప్రాణాలను కాపాడింది’ అని చెప్పుకొచ్చాడు.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 223.86 పాయింట్లు లేదా 0.28 శాతం లాభంతో 81,207.17 వద్ద, నిఫ్టీ 57.95 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 24,894.25 వద్ద నిలిచాయి.ఓరియంట్ టెక్నాలజీస్, కేఐఓసిఎల్, ఏఏఏ టెక్నాలజీస్, అట్లాంటా, ఒరిస్సా మినరల్స్ డెవలప్మెంట్ కంపెనీ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. సెంటమ్ ఎలక్ట్రానిక్స్, సిగ్మా సాల్వ్ లిమిటెడ్, బజార్ స్టైల్ రిటైల్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
హైదరాబాద్లో తొలి టెస్లా కారుకు వాహన పూజ..
భారతదేశంలో ఏదైనా కొత్త వాహనం కొన్నప్పుడు దానికి వాహన పూజ చేయించడం ఆనవాయితీ. వాహనాన్ని స్థానిక గుడికి తీసుకెళ్లి పసుపు, కుంకుమ, పూలదండలతో అలంకరిస్తారు. పూజారి ఆ వాహనానికి పూజ చేసి కొబ్బరి కాయ కొడతారు. ఇలా చేస్తే వాహనాలు ఎటువంటి ప్రమాదాలకూ గురికాకుండా దేవుని ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు. తరతరాలుగా అనుసరిస్తున్న ఈ ఆనవాయితీ ఎలక్ట్రిక్, ఫ్యూచరిస్టిక్ వాహనాల యుగంలో కూడా కొనసాగుతోంది.ఇటీవలే అల్ట్రా రెడ్ టెస్లా మోడల్ వై కారును కొనుగోలు చేసిన హైదరాబాద్కు చెందిన డాక్టర్ ప్రవీణ్ కోడూరు కూడా తన కారుకు వాహనపూజ చేయించారు. ఈ సందర్భంగా కొత్త టెస్లా కారును పసుపు, కుంకుమలు, పూలదండలతో అలంకరించి కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పంచుకున్నారు. "వాహన పూజ చేయకపోతే టెస్లాతో సహా ఏ కారు కూడా భారతీయ సంస్కృతిలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందదు" అని రాసుకొచ్చారు.ఈ పోస్ట్ వెంటనే సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. చాలా మంది తమదైన శైలిలో దీనిపై ప్రతిస్పందించారు. "హా హా !! భారతీయ సౌందర్యంలో ఈ కారు మరింత మెరుగ్గా కనిపిస్తుంది"అని ఓ యూజర్ పేర్కొనగా "భారతదేశంలో వాహన పూజే అంతిమ క్రాష్ టెస్ట్ సర్టిఫికేషన్" అని మరొకరు చమత్కరించారు.టెస్లా ఈ ఏడాది జూలైలో భారత్ లోకి ప్రవేశించింది. లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ కోడూరు గత వారం తన టెస్లా మోడల్ వై కారును డెలివరీ తీసుకున్నారు. ఇది హైదరాబాద్లో మొదటిది. మోడల్ వై కారు రెండు ఇండియన్ వేరియంట్లలో లభిస్తుంది. 60kWh బ్యాటరీతో రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ.59.89 లక్షలు కాగా 75kWh బ్యాటరీతో లాంగ్ రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ మోడల్ ధర 67.89 లక్షల నుండి ప్రారంభమవుతాయి. టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) ప్యాకేజీ కావాలంటే మరో రూ.6 లక్షలు అదనం.No car , including Tesla, can get a five star safety rating in Indian culture, unless a vahan Pooja is done @elonmusk @TeslaClubIN @Tesla_India 😀🙏🏻😛 pic.twitter.com/5TxuGQzcPY— Dr Praveen koduru (@drpraveenkoduru) October 1, 2025 -
నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!
కార్పొరేట్ ఉద్యోగాలు నీటిమీద బుడగలాగా మారిపోయాయి. ఎప్పుడు జాబ్ పోతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. దీనికి కారణం కొన్ని కంపెనీల ప్రవర్తనే. ఇటీవల ఒక కంపెనీ నాలుగు నిముషాల మీటింగ్ తరువాత.. లేఆఫ్స్ అంటూ షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాకు చెందిన ఒక కంపెనీలో.. రిమోట్గా పనిచేస్తున్న ఒక భారతీయ ఉద్యోగి రెడ్డిట్లో తనకు ఎదురైన ఆకస్మిక & షాకింగ్ లేఆఫ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. నేను ఉదయం 9 గంటలకు లాగిన్ అయ్యాను. 11 గంటలకు కంపెనీ సీఓఓ భారతదేశానికి చెందిన ఉద్యోగులతో మీటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మీటింగ్ కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే సాగింది.నాలుగు నిమిషాల మీటింగ్లోనే.. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు, మీటింగ్ పూర్తైన తరువాత మెయిల్స్ అందుతాయని చెప్పాడు. తొలగింపులు పనితీరుకు సంబంధించినవి కాదని, అంతర్గత పునర్నిర్మాణ ప్రక్రియలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఇది విన్న నేను ఒక్కసారిగా షాక్కు గురయ్యాను.ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలుఉద్యోగులను ఎక్కువగా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం ఏమిటంటే.. ముందస్తు సరైన సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించడం. అక్టోబర్ నెల పూర్తి జీతం నెలాఖరులోగా చెల్లిస్తామని, పెండింగ్లో ఉన్న సెలవులను నగదుగా మారుస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని ఉద్యోగి పేర్కొన్నారు. నేను ఉద్యోగం కోల్పోవడం ఇదే మొదటిసారి, ఇది నిజంగా బాధాకరం వెల్లడించారు. -
తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు
ప్రపంచంలోనే చైనాను వెనక్కినెట్టి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. 2023 ఏప్రిల్ నాటికి భారతదేశ జనాభా చైనాను అధిగమించినట్లు కొన్ని నివేదికలు ధ్రువీకరించాయి. ఈ పరిణామం భారతదేశానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని సృష్టిస్తుంది. ఒకప్పుడు జనాభా పెరుగుదల ఆర్థికాభివృద్ధికి భారంగా కనిపించినప్పటికీ సరైన వ్యూహాలతో వ్యవహరిస్తే దేశ ఆర్థిక వృద్ధికి, వస్తు వినియోగానికి (Consumption), వాణిజ్య విస్తరణకు అనుకూలంగా దీన్ని మలచుకోవచ్చు.భారతదేశంలోని దాదాపు 145 కోట్ల జనాభాలో అధిక శాతం యువ జనాభా (సుమారు 47% మంది 25 ఏళ్ల లోపు వారు) ఉండటం దేశానికి అతిపెద్ద బలం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్గత వినియోగదారుల మార్కెట్ (Domestic Consumer Market)ను అందిస్తుంది. అనేక అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తుల విక్రయాల కోసం ఇప్పటికే భారత్పై ఆధారపడుతున్నాయి. ఎందుకంటే, భారతదేశంలో వస్తువులకు డిమాండ్ నిరంతరాయంగా ఉంటుంది. ఈ భారీ డిమాండ్ అంతర్జాతీయ వాణిజ్యపరమైన ఆటుపోట్లను తట్టుకోవడానికి దేశానికి ఒక స్థిరమైన ఆధారాన్ని ఇస్తుంది.జనాభా అధికంగా ఉన్న మరో దేశం చైనా ప్రారంభంలో తయారీ రంగంపై దృష్టి సారించి ప్రపంచ మార్కెట్ను ఆకర్షించింది. అయితే భారత్ మాత్రం మొదట్లో సేవల రంగం (Services Sector)పై ఆసక్తి చూపింది. ముఖ్యంగా ఐటీ, ఐటీ-బీపీఎం రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో సేవల రంగం వాటా 55% కంటే ఎక్కువగా ఉంది. ఈ సేవల రంగం సాధించిన ప్రగతిని ఇప్పుడు తయారీ రంగం (Manufacturing Sector) వృద్ధికి అనుసంధానించడం తక్షణావసరంగా తోస్తుంది.తయారీ రంగం బలోపేతానికి చర్యలుఅధిక జనాభాను వస్తు వినియోగానికి తోడ్పడేలా, దీని ద్వారా వాణిజ్య పరంగా దేశం అభివృద్ధి చెందేందుకు భారతదేశం వ్యూహాత్మక చర్యలను చేపట్టాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’పై పెట్టుబడులు పెంచాలి. అంతర్గత మార్కెట్తో పాటు, చైనా తరహాలో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదగాలి. దీనికి ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు (Production Linked Incentive - PLI Schemes)’ను మరింత విస్తృతం చేయాలి.గ్లోబల్ సరఫరా చెయిన్లో (Global Supply Chain) వైవిధ్యం కోరుకునే ప్రపంచ కంపెనీలను ఆకర్షించేలా స్థిరమైన, పారదర్శకమైన విధానాలను అమలు చేయాలి. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వంటి అధిక విలువ కలిగిన రంగాలపై దృష్టి సారించాలి.భారత్లో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచ స్థాయి నాణ్యత (Global Quality Standards) కలిగి ఉండేలా కఠినమైన ప్రమాణాలను అమలు చేయాలి.వినియోగం నుంచి ఉత్పత్తి వైపు..భారతదేశంలోని అధిక జనాభా కేవలం వినియోగదారులుగా కాకుండా, అత్యంత సమర్థవంతమైన ఉత్పాదక శక్తి (Productive Force)గా మారాలి. తయారీ రంగం అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వడం, సాంకేతిక విద్య (Vocational Training)పై ఎక్కువ పెట్టుబడి పెట్టడం అవసరం. యువ జనాభా వరం కావాలంటే, వారికి ఉపాధి కల్పన (Employment Generation) జరగాలి. తక్కువ రవాణా ఖర్చులు, వేగవంతమైన వస్తు రవాణా కోసం మెరుగైన రోడ్లు, పోర్టులు, లాజిస్టిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఇది తయారీ రంగ ఖర్చులను తగ్గించి గ్లోబల్ మార్కెట్లో పోటీ పడేందుకు వీలు కల్పిస్తుంది.వాణిజ్యపరమైన సవాళ్లను ఎదుర్కోవడంయూఎస్ వంటి దేశాలు భారత్పై సుంకాలు విధించినప్పటికీ అధిక జనాభా ఉన్న చైనాపై ఆ చర్యలు తీసుకోకపోవడం అనేది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో భారత్ ఎదుర్కొంటున్న సంక్లిష్టతను సూచిస్తుంది. ప్రపంచ ఆర్థిక శక్తులతో (యూఎస్, యూరోపియన్ యూనియన్) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (Free Trade Agreements - FTAs) చర్చించి వాణిజ్య అవరోధాలను తగ్గించుకోవాలి. ప్రపంచ కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా చూస్తున్న ‘చైనా ప్లస్ వన్’ వ్యూహాన్ని భారత్ అనుకూలంగా మలచుకోవాలి. రాజకీయంగా స్థిరమైన, ఆర్థికంగా ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా భారత్ తనను తాను నిరూపించుకోవాలి.గ్రామీణ వినియోగాన్ని పెంచడంభారతదేశ జనాభాలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది. గ్రామీణ ఆదాయం పెరిగితే, అంతర్గత వస్తు వినియోగం అమాంతం పెరుగుతుంది. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా గ్రామీణ డిమాండ్ ఊపందుకునేలా చేయాలి. ఇది తయారీ రంగ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ను అందిస్తుంది.భారతదేశానికి అధిక జనాభా అనేది ఒక భారీ సామర్థ్యం ఉన్న వనరుగా గుర్తుంచుకోవాలి. ఈ జనాభా శక్తిని కేవలం వినియోగంగానే కాకుండా ఉత్పాదకత, వాణిజ్య శక్తిగా మార్చగలగాలి. తయారీ రంగంపై దృష్టి సారించి, యువతకు సరైన నైపుణ్యాలు అందించి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. చైనా తయారీ రంగాన్ని ఎంచుకున్నట్లుగా భారత్ కూడా తన సేవల రంగాన్ని బలంగా ఉంచుతూనే తయారీ రంగానికి కొత్త ఊపిరి పోయడం ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత వృద్ధి సాధిస్తుంది.ఇదీ చదవండి: టూరిస్టు వీసాపై సౌదీ వెళ్తున్నారా? ఇవి తెలియకపోతే అంతే.. -
చెక్ ఇస్తే గంటల్లో క్లియర్.. రేపటి నుంచే కొత్త విధానం
బ్యాంకులలో చెక్ల క్లియరెన్స్కు (Cheque Clearance) సంబంధించి కొత్త విధానం అమల్లోకి వస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా ప్రైవేట్ బ్యాంకులు అక్టోబర్ 4 నుంచి ఒకే రోజులో చెక్ క్లియరెన్స్ విధానాన్ని ప్రారంభిస్తామని తెలియజేశాయి. అక్టోబర్ 4వ తేదీ నుండి డిపాజిట్ చేసిన చెక్కులను కొత్త వ్యవస్థ కింద అదే రోజున అంటే కొన్ని గంటల్లోనే క్లియర్ చేస్తారు.చెక్ బౌన్స్, ఆలస్యం లేదా తిరస్కరణలను నివారించడానికి చెక్లో అవసరమైన అన్ని వివరాలను ఖచ్చితంగా నింపాలని బ్యాంకులు వినియోగదారులను కోరాయి. అలాగే మెరుగైన భద్రత కోసం పాజిటివ్ పే సిస్టమ్ను ఉపయోగించాలని, ధృవీకరణ కోసం కీలకమైన చెక్ వివరాలను ముందస్తుగా సమర్పించాలని సూచిస్తున్నాయి. ముఖ్యంగా రూ .50,000 కంటే ఎక్కువ విలువైన చెక్లను డిపాజిట్ చేయడానికి కనీసం 24 గంటల ముందు ఖాతా నంబర్, చెక్ నంబర్, తేదీ, నగదు మొత్తం, లబ్ధిదారు పేరు తదితర వివరాలను బ్యాంకుకు అందించాలి.కస్టమర్లు చెక్ వివరాలను బ్యాంకుల నిర్దిష్ట ప్రాంతీయ చిరునామాలకు ఈమెయిల్ చేయాలి. ప్రాసెస్ చేయడానికి ముందు బ్యాంకులు అందుకున్న తర్వాత రసీదు సందేశాన్ని పంపుతాయి. కస్టమర్లు ముందస్తుగా అందించిన వివరాలు.. చెక్పై నమోదు చేసిన వివరాలను బ్యాంకులు పరిశీలించి సమాచారం సరిపోలినట్లయితే చెక్లను క్లియర్ చేస్తాయి. లేకపోతే, అభ్యర్థనను తిరస్కరిస్తాయి. దీంతో డ్రాయర్ వివరాలను తిరిగి సమర్పించాలి.చెక్కు ఎలక్ట్రానిక్ చిత్రాన్ని, దాని వివరాలను డ్రాయీ బ్యాంకుకు పంపే చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) ప్రస్తుతం బ్యాంకులు ఉపయోగిస్తున్నాయి. ఇది చెక్కులను భౌతికంగా బదిలీ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది, కానీ డ్రాప్ బాక్స్ లు లేదా ఆటోమేటెడ్ టెల్లర్ యంత్రాలలో డిపాజిట్ చేసినప్పుడు, సెటిల్మెంట్కు సాధారణంగా రెండు రోజులు పడుతోంది.చెక్ల క్లియరెన్స్కు సంబంధించి రూ .5 లక్షల కంటే పైబడిన చెక్కులకు పాజిటివ్ పే విధానాన్ని ఆర్బీఐ తప్పనిసరి చేసింది. దీంతోపాటు రూ .50,000 లకు మించిన చెక్లకు కూడా విధానాన్ని అమలు చేస్తే మంచిదని బ్యాంకులకు సూచించింది. ఇలా పే విధానంలో వ్యాలిడేట్ చేసిన చెక్లకు కూడా ఆర్బీఐ వివాద పరిష్కార వ్యవస్థ కింద రక్షణ ఉంటుంది. కంటిన్యూయస్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ మొదటి దశ అక్టోబర్ 4న ప్రారంభమవుతుందని, ఫేజ్ 2 వచ్చే ఏడాది జనవరి 3న మొదలవుతుందని ఆర్బీఐ (RBI) ప్రకటించింది. -
టూరిస్టు వీసాపై సౌదీ వెళ్తున్నారా? ఇవి తెలియకపోతే అంతే..
ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రలో ఉమ్రాహ్కు ప్రత్యేకత ఉంది. రంజాన్ పర్వదినం తర్వాత హజ్ యాత్ర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో తబాబ్, అరాఫత్ పర్వత సందర్శన.. సైతానుపై రాళ్లను విసరడం.. అక్కడే ఒక నిద్ర చేయడం వంటి క్రతువులు ఉంటాయి. హజ్ సీజన్లో కాకుండా.. మక్కా యాత్ర చేయడాన్ని ఉమ్రాహ్ అంటారు. ఇప్పుడు ఉమ్రాహ్ విషయంలో సౌదీ సర్కారు కొత్త నిబంధనలను ప్రకటించింది. టూరిస్టు వీసాపై వచ్చేవారికి ఉమ్రాహ్కు అవకాశం ఉండదని తేల్చిచెప్పింది.ఏమిటీ ఉమ్రాహ్హజ్లో మాదిరిగానే ఉమ్రాహ్లోనూ క్రతువులుంటాయి. అయితే.. అరాఫత్ సందర్శన, సైతానుపై రాళ్లు వేయడం ఉండదు. ఉమ్రాహ్కు వెళ్లేవారు దోవతి, ఉత్తరీయం మాదిరి తెలుపురంగు దుస్తులను ధరించాలి. దీన్ని దీక్షగా భావిస్తారు. నిజానికి మక్కాకు 30కిలోమీటర్ల దూరంలోనే ఈ రీతిలో వస్త్రధారణ చేసి.. యాత్రను ప్రారంభించాలి. భారతీయులు మాత్రం విమానాశ్రయంలోనే ఈ దుస్తులను ధరిస్తారు. మక్కాలోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశాక.. బయటకు వచ్చి, శిరోముండనం చేయించుకుంటే.. ఉమ్రాహ్ పూర్తవుతుంది. మహిళా భక్తులు శిరోముండనం చేయించుకోరు. కానీ, మూడు లేదా ఐదు కత్తెరలు ఇస్తారు.ఉమ్రాహ్ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి విదేశాల నుంచి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన మార్పులను అసా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ కైసర్ మహమూద్ తెలిపారు.వీసా దరఖాస్తు చేసేటప్పుడే వసతి బుకింగ్యాత్రికులు ఇకపై వసతిని ధ్రువీకరించకుండా ఉమ్రాహ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు. నుసుక్ యాప్కు అనుసంధానించబడిన మసర్ వ్యవస్థ ద్వారా ప్రయాణికులు వీసా దరఖాస్తు సమయంలో ఆమోదించిన హోటల్ను ఎంచుకోవాలి. లేదా వారు సౌదీ అరేబియాలోని బంధువులతో ఉంటారని ధ్రువీకరించుకోవాలి. హోటళ్లు, రవాణా మసర్ అని పిలువబడే సౌదీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. టాక్సీలను కూడా పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాలి.బంధువులతో ఉండటానికి హోస్ట్ ఐడీ అవసరంప్రయాణికులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉండాలని ప్లాన్ చేస్తే హోస్ట్ ఏకీకృత సౌదీ ఐడీ నంబర్ను అందించాలి. ఈ ఐడీ మీ వీసాకు డిజిటల్కు అటాచ్ చేస్తారు. ప్లాన్లో ఏదైనా మార్పు ఉంటే వసతి రుజువుగా అదే ఐడీతో సిస్టమ్లో అప్ డేట్ చేయాలి.టూరిస్ట్ వీసాలపై ఉమ్రాహ్ చేయకూడదు..టూరిస్ట్ వీసాపై ఉమ్రాహ్ చేయడం నిషేధించారు. ఒకవేళ ఇందుకోసం ప్రయత్నించే యాత్రికులను మదీనాలోని రియాజ్ ఉల్ జన్నా వంటి కీలక ప్రదేశాల్లో ప్రవేశం నిరాకరిస్తారు.డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా తప్పనిసరినుసక్ ప్లాట్ఫామ్ ద్వారా లేదా లైసెన్స్ పొందిన ఆపరేటర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా మాత్రమే చెల్లుబాటు అవుతుంది.ప్రయాణ మార్పులు అనుమతించరు..వీసా దరఖాస్తు సమయంలో యాత్రికులందరూ వివరణాత్మక ప్రయాణ ప్రణాళికను అప్లోడ్ చేయాలి. దీన్ని సబ్మిట్ చేసిన తరువాత ఎలాంటి మార్పులు లేదా వాయిదాలకు అవకాశం ఉండదు. ప్రయాణ తేదీలను మార్చడం కుదరవు. తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేస్తే ఏజెంట్లకు ఒక్కొక్కరికి కనీసం 734(రూ.18 వేలు) దిర్హమ్లు జరిమానా విధిస్తారు.వీసా ఆన్ అరైవల్యూకే, యూఎస్, కెనడా లేదా షెంజెన్ వీసాలు కలిగి ఉన్నవారు లేదా ఆ దేశాల్లో నివాసితులుగా ఉన్నవారు వీసా ఆన్ అరైవల్ కోసం అర్హులు. ఈ వీసా ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది.హోటల్, ట్రాన్స్పోర్ట్ బుకింగ్స్ కోసం తనిఖీలుసౌదీ విమానాశ్రయాల్లో అధికారులు నుసక్ లేదా మసార్ వ్యవస్థల ద్వారా చేసిన అన్ని బుకింగ్లను ధ్రువీకరిస్తారు. చెల్లని బుకింగ్లు తిరస్కరిస్తారు. దాంతోపాటు అక్కడికక్కడే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.అధీకృత రవాణాకు మాత్రమే అనుమతియాత్రికులు రవాణాను ముందస్తుగా బుక్ చేసుకోవాలి. టాక్సీలు, బస్సులు లేదా హరమైన్ రైలుతో సహా అధీకృత ఛానెళ్ల ద్వారా ముందే బుక్ చేయాలి. రిజిస్టర్ కాని సర్వీసులు అనుమతించరు.హరామైన్ రైలు టైమింగ్స్మక్కా, మదీనా మధ్య సులువైన రవాణా మార్గం అయిన హరామైన్ హై-స్పీడ్ రైలు ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడుస్తుంది. దీని తర్వాత వచ్చే ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ రవాణాను ఏర్పాటు చేయాలి.భారీ జరిమానాలుఈ కొత్త నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే.. అంటే ఎక్కువ కాలం ఉండటం, అనధికార రవాణాను ఉపయోగించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేయడం.. వంటి వాటికి కనీసం 734 దిర్హమ్ల నుంచి జరిమానాలు ఉంటాయి. ఏజెంట్లను కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది.ఇదీ చదవండి: లద్ధాఖ్లో వాణిజ్య అవకాశాలు ఇవే.. -
లద్ధాఖ్లో వాణిజ్య అవకాశాలు ఇవే..
లద్ధాఖ్లో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2019లో జమ్మూ కశ్మీర్ రాష్ట్రం నుంచి లద్ధాఖ్ను వేరు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా (Union Territory - UT) ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనలు, ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు ఈ ప్రాంతంలోని అసంతృప్తి తీవ్రతను సూచిస్తున్నాయి.ఇటీవల పరిణామాలులద్ధాఖ్లోని లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) వంటి పౌర సమాజ సంస్థల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ నాయకత్వంలో కూడా నిరసనలు ఉధృతమయ్యాయి.నిరసనలకు కారణాలేమిటి?లద్ధాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ (Sixth Schedule) కింద రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శనలు జరిగాయి. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసు కాల్పులు జరిగాయి. ఇందులో కొందరు మరణించారు. ఆందోళనకారులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు (సోనమ్ వాంగ్చుక్ వంటి వారిని అరెస్ట్ చేయడం వంటివి) లద్ధాఖ్లో ఉద్రిక్తతను పెంచాయి. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత శాసనసభ (Legislature) లేకపోవడం, స్థానిక పాలనపై లెఫ్టినెంట్ గవర్నర్ (LG) ఆధ్వర్యంలోని అధికారుల నియంత్రణ పెరగడం పట్ల స్థానిక ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.రాజ్యాంగ రక్షణ లేదనే వాదనలులద్ధాఖ్ జనాభాలో 97% పైగా గిరిజనులే (Tribal Population). ఆర్టికల్ 370 రద్దు తర్వాత బయటి వ్యక్తులు ఇక్కడ భూమిని కొనుగోలు చేస్తారనే భయం స్థానికుల్లో ఉంది. లద్ధాఖ్ను ఆరో షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది వారికి భూమి వినియోగం, వనరుల నిర్వహణ, సాంప్రదాయ చట్టాలపై నియంత్రణను ఇచ్చేందుకు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కు (Autonomous District Councils - ADCs) అధికారం కల్పిస్తుంది. తద్వారా పర్యావరణాన్ని, సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించవచ్చు.ప్రభుత్వం ప్రతిపాదించిన మెగా సోలార్ పార్కులు, సొరంగాల నిర్మాణం (tunnels), విస్తృతమైన రహదారులు వంటి పెద్ద పారిశ్రామిక ప్రాజెక్టుల వల్ల లద్ధాఖ్ సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు, మంచు పర్వతాలకు నష్టం జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు.శాసనసభ లేకపోవడం వల్ల స్థానిక రాజకీయ శక్తి తగ్గిపోయిందని, తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి, చట్టాలను రూపొందించుకోవడానికి రాష్ట్ర హోదా అవసరమని డిమాండ్ చేస్తున్నారు.యువతలో నిరుద్యోగం (Unemployment) అధికంగా ఉంది. స్థానిక ఉద్యోగాల్లో డొమిసైల్ (Domicile) ఆధారంగా పూర్తిస్థాయి రక్షణ లేకపోవడం, ప్రభుత్వం నుంచి సరైన నియామక విధానాలు రూపొందించకపోవడం అసంతృప్తికి దారితీసింది.కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత లేహ్, కార్గిల్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ (LAHDCs) అధికారాలు తగ్గిపోయాయని, కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన అధికారులు స్థానిక పాలనలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఎలాంటి చర్యలు చేపట్టాలి?లద్ధాఖ్ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడానికి కేంద్ర ప్రభుత్వం, స్థానిక నాయకుల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించడం చాలా ముఖ్యమని కొందరు భావిస్తున్నారు.ఆరో షెడ్యూల్ అమలులద్ధాఖ్ డిమాండ్ చేసిన విధంగా ఆరో షెడ్యూల్ను అమలు చేయడం లేదా దానికి సమానమైన ప్రత్యేక రాజ్యాంగ రక్షణను (ఉదాహరణకు, ఆర్టికల్ 371 తరహాలో) రూపొందించడం. ఇది భూమి, వనరులు, సాంస్కృతిక అంశాలపై స్థానిక కౌన్సిల్స్కు చట్టబద్ధమైన అధికారాన్నిస్తుంది. రాష్ట్ర హోదా డిమాండ్పై పారదర్శకమైన చర్చలు ప్రారంభించాలని కొందరు చెబుతున్నారు.స్థానిక సాధికారతఅటానమస్ హిల్ కౌన్సిల్స్కు శాసనపరమైన, ఆర్థికపరమైన అధికారాలను పెంచాలి. తద్వారా స్థానిక ప్రజల భాగస్వామ్యం పెరిగి అభివృద్ధి నిర్ణయాలు వారి అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. స్థానికుల కోసం ఉద్యోగాలను రిజర్వ్ చేయడంతోపాటు, లద్ధాఖ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి.సుస్థిర అభివృద్ధిభారీ ప్రాజెక్టులను చేపట్టే ముందు పర్యావరణ ప్రభావ అంచనా (Environmental Impact Assessment)ను పారదర్శకంగా, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలి. పర్యావరణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని పర్యాటక రంగంలో పరిమితులను విధించడం, స్థానికులను ప్రోత్సహించే పర్యావరణ పర్యాటక (Ecotourism) విధానాలను అమలు చేయాలి.వాణిజ్యం పరంగా ఎలాంటి అవకాశాలున్నాయి?రంగంవాణిజ్య అవకాశాలుపర్యాటకంసాహస పర్యాటకంలో భాగంగా ట్రెక్కింగ్, పర్వతారోహణ కీలకంగా ఉంది. బౌద్ధ ఆశ్రమాలు, సాంప్రదాయ ఉత్సవాలు ఉన్నాయి. దాంతో పర్యావరణ అనుకూల గెస్ట్హౌజ్లు వ్యాపారం సాగుతోంది.పునరుత్పాదక శక్తిలద్దాఖ్లో అధిక సూర్యరశ్మి ఉంటుంది. కాబట్టి భారీ సోలార్ పార్కులు, సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమలకు అపారమైన అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో పవన విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం ఉంది.వ్యవసాయం, ఉద్యానవనంపండ్ల ప్రాసెసింగ్ యూనిట్లు (జామ్లు, జ్యూస్లు, నూనెలు)కు అవకాశం. బెర్రీల ప్రాసెసింగ్ ద్వారా జ్యూస్లు, నూనెలు తయారు చేయడం.చేనేత, హస్తకళలుప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యమైన పష్మినా ఉన్ని లద్దాఖ్ నుంచి లభిస్తుంది. పష్మినా ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ ఎగుమతికి అవకాశం. బుద్ధ విగ్రహాలు, థాంకా పెయింటింగ్లు వంటి సాంప్రదాయ హస్తకళల మార్కెటింగ్ ప్రధానంగా ఉంది. చివరగా..లద్ధాఖ్ సమస్యల పరిష్కారం కేవలం పాలనాపరమైన చర్యలతోనే సాధ్యం కాదు. స్థానిక ప్రజల అభీష్టాన్ని గౌరవించి, వారి ప్రత్యేక సంస్కృతిని, సున్నితమైన పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా సుస్థిర అభివృద్ధి నమూనాను (Sustainable Development Model) రూపొందించడం ద్వారానే ఈ ప్రాంతంలో శాంతి, పురోగతి సాధ్యమవుతాయి.ఇదీ చదవండి: అప్పు చేసి పప్పుకూడు! -
దసరా డబుల్ ధమాకా.. మళ్లీ తగ్గిన పసిడి, వెండి ధరలు
దేశంలో భారీగా పెరుగుతూన్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. గురువారంతో పోలిస్తే శుక్రవారం బంగారం ధరలు (Gold price today) మరి కాస్త క్షీణించాయి. అలాగే వెండి ధరలు (Silver price today) కూడా భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అప్పు చేసి పప్పుకూడు!
డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు అది తాత్కాలికంగా అప్పటి అవసరాలు తీరుస్తుంది. ఇది కొంచెం రిలీఫ్ను ఇస్తుంది. కానీ అప్పు అనేది ఫ్రీగా ఎవరూ ఇవ్వరు. అందుకు వడ్డీ చెల్లించాలి. అది క్రెడిట్ కార్డు అయితే సంవత్సరానికి 36 నుంచి 42%, పర్సనల్ లోన్ అయితే సంవత్సరానికి 15% దాకా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. వీటికి అదనంగా ఇంకొన్ని ఛార్జీలుంటాయి. అప్పు తీసుకున్న తర్వాతి క్షణం నుంచి వాటిని కట్టడానికి కష్టపడాల్సి ఉంటుంది.ఉదాహరణకు.. ఒక వ్యక్తికి రూ.25,000 రూపాయల నెలవారీ జీతం. అతడు క్రెడిట్ కార్డు ఉపయోగించి రూ.50,000 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. తాత్కాలికంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తర్వాత నెల నుంచి దానికి ఈఎంఐ కట్టలేక మళ్లీ నెల నెల కొంత అప్పు చేస్తున్నాడు. దానివల్ల అతడి క్రెడిట్ స్కోర్ కూడా తగ్గవచ్చు. భవిష్యత్తులో ఇంటి కోసం, పిల్లల చదువు కోసం లోన్ కావాలంటే రాకపోవచ్చు. అంటే డబ్బు అప్పుగా తీసుకున్న ప్రతిసారి రేపటి జీవితాన్ని కష్టంలో పెడుతున్నారు. అయితే ఆర్థికంగా ఎదిగేందుకు అప్పు చేస్తే తప్పులేదు. కానీ స్థోమత లేకపోయినా విలాసాలకు అప్పు చేస్తే ఇబ్బందులు తప్పవు.తిరిగి ఇవ్వాలనే ఉద్దేశమే లేదు..ఓ స్నేహితుడు మిమ్మల్ని రూ.2000 అప్పు అడిగాడు. మీరు ఇచ్చారు అనుకోండి. ఆ తర్వాత అతడు మీకు స్పందించట్లేదు. ఆ సమయంలో మీరు కంగారు పడకుండా సంతోషపడండి. ఎందుకంటే అతడు మీ నమ్మకాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. అతడికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశమే లేదు. తిరిగి ఇవ్వకపోవడం తప్పు అనే గిల్టీ భావన కూడా లేదు. ఇలాంటి వారు ఎమోషనల్ కథలు చెప్తారు. మరి అలాంటివాడు చిన్న అమౌంట్తోనే పారిపోయాడు. అదే రూ.2000కు బదులు మిమ్మల్ని రూ.20,000 అడిగినా కూడా మీరు ఇచ్చి ఉండేవారు కదా. అంటే పెద్ద నష్టానికి ముందే మీకు అతడి గురించి తెలిసిపోయింది. మీరు ఎవరికైనా కొద్దిగా డబ్బు అప్పుగా ఇచ్చి తర్వాత వారిని మళ్లీ చూడకపోతే అది మంచిదే అనుకోవాలి. ఎందుకంటే వారి నిజ స్వభావం బయటపడింది. పెద్ద నష్టాల నుంచి మీరు తప్పించుకున్నారు.మీ విలువ ఎంత?మనలో కొంతమంది మాత్రమే ఆర్థికంగా విజయం సాధిస్తారు. కానీ మరికొందరు ఎంత కష్టపడినా సంపాదించలేరు. ఇద్దరికీ అవకాశాలు ఒకటే.. నాలెడ్జ్ ఒకటే మరి ఎక్కడ తేడా ఉందని ఆలోచించారా? ఈ సందర్భంలో సెల్ఫ్ వర్త్ అంటే స్వీయ విలువ మీకు మీరు ఎలా విలువ ఇచ్చుకుంటున్నారు అనేది కీలకంగా ఉంటుంది. మీ సెల్ఫ్ వర్త్ పెరిగితే మీ నెట్ వర్త్ కూడా పెరుగుతుంది. నెట్ వర్త్ అంటే మీ మొత్తం ఆస్తులు మైనస్ అప్పులు. సెల్ఫ్ వర్త్ అనేది మీ విలువ పెంచుకోవడం మాత్రమే కాదు మీపై మీకున్న నమ్మకం, ఎబిలిటీస్, తెలివి.. ఇవన్నీ వస్తాయి.ఉదాహరణకు సుందర్ పిచాయ్ చిన్న ఇంట్లో పెరిగినా తనపై నమ్మకంతో అంటే సెల్ఫ్ వర్త్తో గొప్ప అవకాశం అందిపుచ్చుకొని గూగుల్కు సీఈఓ అయ్యారు. మొత్తానికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ స్వీయ విలువ అంటే సెల్ఫ్ వర్త్ పెరిగినప్పుడు మీ నికర విలువ అంటే నెట్వర్త్ కూడా దాంతో పాటే పెరుగుతుంది.ఇదీ చదవండి: డబ్బులోని కష్టాన్ని గ్రహిస్తున్నారా? -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
మిశ్రమ ప్రపంచ సంకేతాల ప్రభావంతో భారత బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 నష్టాల్లో కదులుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 299.17 పాయింట్ల నష్టంతో 80,684.14 వద్ద, అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 76.75 పాయింట్ల క్షీణతతో 24,759.55 వద్ద ప్రారంభమయ్యాయి.బీఎస్ఈలో టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ టాప్ డ్రాగ్స్గా నిలిచాయి. ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ గా ఉండగా, మాక్స్ హెల్త్, ఐషర్ మోటార్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.మరోవైపు విస్తృత మార్కెట్లు పెరిగాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.33 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి. నిఫ్టీ మెటల్, పీఎస్యూ బ్యాంక్, ఫార్మా వరుసగా 0.95 శాతం, 0.48 శాతం, ఫార్మా 0.34 శాతం లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.45 శాతం నష్టపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈ నెలలో పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? వడ్డీ ఎక్కడ తక్కువో చూడండి..
ప్రతి నెలా చాలా మందికి ఏదోఒక విషయమై అప్పు అవసరమవుతూ ఉంటుంది. ఇందు కోసం ఎక్కువ మంది బ్యాంకుల్లో పర్సనల్ లోన్లను ఆశ్రయిస్తుంటారు. మీకు కూడా ఈ నెలలో పర్సనల్ లోన్ తీసుకుంటుంటే.. బ్యాంకును ఎంచుకునే ముందు, వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను పోల్చుకుని ఆ తరువాత, ఏది తక్కువ వడ్డీ రేటుతో రుణం అందిస్తుంటే దానిని ఎంచుకోవచ్చు.పర్సనల్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లతో పాటు ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇది కూడా రుణం తీసుకుంటున్నప్పుడు మీ ఆర్థిక భారాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఛార్జీలు మొత్తం వ్యవహారాన్ని ఖరీదైనదిగా చేస్తాయి. ఈ నెలలో కొన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పర్సనల్ లోన్లపై ఎంత మేర వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయో ఇక్కడ తెలుసుకోండి..ప్రభుత్వ బ్యాంకులుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): ఈ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు సంవత్సరానికి 10.05 నుండి 15.05 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ఈ రేట్లు 15 ఆగస్టు 2025 నుండి అమల్లోకి వచ్చాయి. పర్సనల్ లోన్ పై ప్రాసెసింగ్ ఛార్జీలు రూ.1,000 నుంచి రూ.15,000 వరకు ఉంటాయి.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇది పర్సనల్ లోన్లపై సంవత్సరానికి 10.75% నుండి 14.45% వరకు వడ్డీని వసూలు చేస్తుంది.బ్యాంక్ ఆఫ్ బరోడా: ఈ ప్రభుత్వ బ్యాంకు సంవత్సరానికి 10.40 నుండి 15.75 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది.ప్రైవేట్ బ్యాంకులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు సంవత్సరానికి 9.99 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. అలాగే రూ .6,500 ప్రాసెసింగ్ ఛార్జీలతో పాటు జీఎస్టీని వసూలు చేస్తుంది.ఐసీఐసీఐ బ్యాంక్: ఇది సంవత్సరానికి 10.60% నుంచి 16.50% పరిధిలో వడ్డీని వసూలు చేస్తుంది. ఇక ప్రాసెసింగ్ ఛార్జీలు రుణ మొత్తంలో 2 శాతం వరకు, వర్తించే పన్నులు ఉంటాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్: వడ్డీ రేటు ఛార్జీలు సంవత్సరానికి 9.98 శాతం నుండి ప్రారంభమవుతాయి. ప్రాసెసింగ్ ఫీజు 5 శాతం వరకు ఉంటాయి. పన్నులు అదనం.ఫెడరల్ బ్యాంక్: ఇది సంవత్సరానికి 11.99 నుండి 18.99% వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు సంవత్సరానికి 3% వరకు ఉంటాయి. -
అనుబంధ కంపెనీని అమ్మేస్తున్న గూగుల్!
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) మాతృ సంస్థ ఆల్ఫాబెట్ (Alphabet Inc.) తన లైఫ్ సైన్సెస్ యూనిట్ ‘వెరిలీ’ని వదిలించుకోవడానికి సిద్ధమైంది. వెరిలీని సాంకేతికంగా విడదీయడానికి ఆల్ఫాబెట్ గత రెండేళ్లుగా పనిచేస్తోందని, ఇందులో భాగంగా దాన్ని విక్రయించడమో లేదా విడిపడి వేరే సంస్థగా ఏర్పాటు చేయడమో జరుగుతుందని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.గూగుల్ చట్టవిరుద్ధంగా ప్రకటనల సాంకేతికతను గుత్తాధిపత్యం చేసిందన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రతివాది సాక్షిగా హాజరైన గూగుల్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ హీథర్ అడ్కిన్స్ వెరిలీ ప్రణాళికలను వివరించారు.వర్జీనియాలోని ఫెడరల్ కోర్టులో అడ్కిన్స్ మాట్లాడుతూ.. ఆల్ఫాబెట్ గొడుగు కింద గూగుల్కు సోదరి సంస్థగా ఉన్న వెరిలీ గత రెండున్నర సంవత్సరాలుగా గూగుల్ సొంత మౌలిక సదుపాయాల నుండి బయటపడటానికి, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లోకి వెళ్లడానికి కృషి చేస్తోందన్నారు."మేము వారిని (వెరిలీ) స్వతంత్ర సంస్థగా మార్చడానికి సహాయపడే ప్రక్రియలో ఉన్నాము" అని ఆమె యూనిట్ గురించి చెప్పారు. అది అమ్మకం లేదా స్పిన్ ఆఫ్ ద్వారా కావచ్చు అన్నారు. "ఇది (వెరిలీ) ఇకపై ఆల్ఫాబెట్ సంస్థగా ఉండకూడదన్నదే ఆలోచన" అని పేర్కొన్నారు.వెరిలీ గురించి..వెరిలీ అనేది గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కి చెందిన ఒక లైఫ్ సైన్సెస్ విభాగం. ఇది ఆరోగ్య పరిశోధన, ప్రెసిషన్ మెడిసిన్, డేటా ఆధారిత హెల్త్కేర్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది. వెరిలీ (మునుపటి పేరు గూగుల్ లైఫ్ సైన్స్ సర్వీస్) 2015 డిసెంబర్లో ఏర్పాటైంది. ఆల్ఫాబెట్ ఏర్పాటైన తర్వాత, గూగుల్ లైఫ్ సైన్సెస్ నుంచి వెరిలీ పేరుతో విడిపోయింది. -
SBI క్రెడిట్ కార్డులకు కొత్త మార్పులు.. ఛార్జీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన క్రెడిట్ కార్డు (Credit Card) వినియోగదారులకు నవంబర్ 1 నుండి కొత్త ఛార్జీల విధానాన్ని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. ఎస్బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి క్రెడ్, చెక్ లేదా మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా స్కూల్ లేదా కాలేజీ ఫీజులను చెల్లిస్తే, వారు లావాదేవీ మొత్తంలో 1% అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆయా స్కూల్ లేదా కాలేజీలు, విశ్వవిద్యాలయాల అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా పీఓఎస్ మెషీన్ ద్వారా నేరుగా చెల్లింపు చేస్తే ఎటువంటి రుసుము ఉండదు.మరో కొత్త ఛార్జీ ఏంటంటే ఎస్బీఐ కార్డుదారులు రూ .1,000 కంటే ఎక్కువ మొత్తంతో వాలెట్ లోడ్ చేస్తే, 1% రుసుము వర్తిస్తుంది. ఈ నియమం నెట్ వర్క్ భాగస్వాముల ద్వారా సెట్ చేసిన మర్చంట్ కోడ్ లకు వర్తిస్తుంది. ఈ మార్పు గురించి ఎస్బీఐ కార్డుదారులకు ముందుగానే తెలియజేసింది. తద్వారా వారు తమ ఖర్చులను సముచితంగా ప్లాన్ చేసుకోవచ్చు. గతంలో రూ.500 వరకు లావాదేవీలపై రుసుము ఉండేది కాదు.ఇక నగదు ఉపసంహరణ రుసుములు, చెక్ చెల్లింపు రుసుములు , ఆలస్య చెల్లింపు రుసుములు వంటి ఇతర సాధారణ ఛార్జీలు మారవు. అయితే, వరసగా రెండు బిల్లింగ్ సైకిల్స్లో కనీస నెలవారీ బ్యాలెన్స్ చెల్లించడంలో విఫలమైనట్లయితే, ప్రతి సైకిల్ కు అదనంగా రూ.100 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. -
టీసీఎస్లో తొలగించినవాళ్లకు రెండేళ్లు జీతం!
దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భారీగా తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తొలగింపు కారణంగా ప్రభావితమైన ఉద్యోగుల కోసం కంపెనీ ఆకర్షణీయమైన సెవెరన్స్ ప్యాకేజీలను ప్రకటించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి.మారుతున్న టెక్నాలజీ, కంపెనీ అవసరాలకు సరిపోలని ఉద్యోగులకు ఆరు నెలల నుండి గరిష్టంగా రెండేళ్ల వరకు జీతం ప్యాకేజీని అందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తొలగింపునకు గురైన ఉద్యోగులకు టీసీఎస్ ఇంకా ఏమేమి ఆఫర్ చేస్తోందో ఈ కథనంలో చూద్దాం.12,000 మందికి ఉద్వాసనమనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. టీసీఎస్ తన ఉద్యోగులలో సుమారు 2 శాతం లేదా సుమారు 12,000 మందిని వచ్చే సంవత్సరంలో తొలగించాలని నిర్ణయించింది. టెక్నాలజీ మార్పు, ఆటోమేషన్ యుగంలో చురుకైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటానికి ఈ దశ అవసరమని కంపెనీ నమ్ముతోంది.మీడియా నివేదికలు ఉటంకించిన కంపెనీ వర్గాల ప్రకారం.. ఈ తొలగింపులు ప్రధానంగా ఎవరి నైపుణ్యాలు అవసరాలకు తగినట్లు లేవో, ఎవరైతే తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోలేదో అలాంటి ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నాయి.కంపెనీ ఇస్తున్న ఆఫర్లు..ఉద్యోగులకు వారి సేవా వ్యవధిని బట్టి మూడు నెలల నోటీసు వ్యవధి, ఆరు నెలల నుండి 24 నెలల వరకు సెవెరన్స్ ప్యాకేజీని అందిస్తున్నారు. పదవీ విరమణ వయస్సుకు దగ్గరగా ఉన్న ఉద్యోగులకు కూడా కంపెనీ ముందస్తు పదవీ విరమణ ఎంపికలను విస్తరిస్తోందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకం కింద, వారు బీమా వంటి పూర్తి పదవీ విరమణ ప్రయోజనాలతో పాటు వారికి ఇంకా మిగిలి ఉన్న సర్వీస్ కాలాన్ని బట్టి ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల జీతానికి సమానమైన అదనపు సెవెరన్స్ ప్యాకేజీని పొందుతారు.సెవెరన్స్ ప్యాకేజీలు ఇలా..స్టాండర్డ్ ఆఫర్: 3 నెలల నోటీసు పీరియడ్ పే.10–15 సంవత్సరాల సర్వీసు: 1.5 సంవత్సరాల జీతం.15 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు: 2 సంవత్సరాల వరకు జీతంబెంచ్ ఉద్యోగులు (8 నెలలకుపైగా వర్క్ అసైన్ కానివారు): 3 నెలల నోటీసు వేతనం మాత్రమే.కెరీర్ అవుట్ ప్లేస్ మెంట్: రెజుమ్ తయారీ, జాబ్ సెర్చ్లో సహాయం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ (3 నెలలపాటు ఏజెన్సీ ఫీజులు).మానసిక ఆరోగ్య మద్దతు: "టీసీఎస్ కేర్స్" ప్రోగ్రామ్ ద్వారా సహాయం. -
పండుగ వేళ.. ‘కొత్త రకం’ బంగారానికి డిమాండ్..
దేశంలో కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చారిత్రక గరిష్టాలను తాకాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్తో రూపాయి బలహీనపడటం, అస్థిర అంతర్జాతీయ పరిస్థితులు.. ఇవన్నీ కలిసి పెట్టుబడిదారులను పసిడి వైపు నెట్టివేశాయి. దాని ధరను మరింత పెంచేశాయి.అయితే పెరిగిన బంగారం ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లకు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు కొనడం చాలా కష్టంగా మారింది. ఫలితంగా, వినియోగదారులు ఇప్పుడు మరింత తక్కువ క్యారెట్ ఆభరణాల వైపు మళ్లుతున్నారు. 9 క్యారెట్లు, 14 క్యారెట్లు, 18 క్యారెట్ల ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.బంగారం సెంటిమెంట్..నిశ్చింతైన పెట్టుబడిగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగానూ ఇళ్లలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లి సీజన్ తో పాటు దసరా, దీపావళి వంటి పండుగలను బంగారం కొనడానికి అత్యంత శుభ సమయాలుగా పరిగణిస్తారు. కానీ ధరలు కొత్త గరిష్టాలను తాకడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో దుకాణదారులు సంప్రదాయం, స్థోమత రెండింటినీ సమతుల్యం చేస్తూ తక్కువ క్యారెట్ పసిడి ఆభరణాలను కొనుగోలుదారులకు అందుబాటు తీసుకొచ్చారు.ప్రభుత్వ మద్దతు22 క్యారెట్ల బంగారం మాదిరిగానే 9 క్యారెట్, 14 క్యారెట్ల బంగారానికి కూడా హాల్ మార్కింగ్ ను అనుమతించాలని ప్రభుత్వం తీసుకున్న చర్య కొనుగోలుదారుల విశ్వాసాన్ని పెంచింది. తక్కువ క్యారెట్ల ఆభరణాలను ఎంచుకున్నప్పుడు కూడా వినియోగదారులు నాణ్యత గురించి భరోసా పొందుతారు.ఎవరు కొంటున్నారు..?పాత కొనుగోలుదారులు ఇప్పటికీ దీర్ఘకాలిక విలువ కోసం 22 క్యారెట్ల ఆభరణాలను ఇష్టపడుతున్నారు. యువ వినియోగదారులు తక్కువ క్యారెట్లలో తేలికపాటి, అధునాతన ఆభరణాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్పు రాబోయే కొన్నేళ్లలో భారతదేశంలో ఆభరణాల పోకడలను పునర్నిర్వచించే అవకాశం ఉంది. సంప్రదాయాన్ని స్థోమత, ఫ్యాషన్తో మిళితం చేస్తుంది. -
పడిఉన్న రూ.80,000 కోట్లను పట్టించుకోండి..
డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పొదుపు సాధనాలలో దాదాపు రూ.80,000 కోట్ల సొమ్ము.. ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో అనామకంగా పడిఉంది. ఈ సొమ్మును దాని హక్కుదారులు, వారసులు గుర్తించి, తిరిగి పొందటానికి సహాయపడటానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.యువర్ మనీ.. యువర్ రైట్కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 4న గుజరాత్లోని గాంధీనగర్లో 'యువర్ మనీ, యువర్ రైట్' అనే మూడు నెలల అవగాహన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ)తో ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) ఈ ప్రచారాన్ని సమన్వయం చేస్తోంది."బీమా పాలసీ క్లెయిమ్లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ ఆదాయంతో సహా క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులు అవగాహన లేకపోవడం లేదా కాలం చెల్లిన ఖాతా వివరాల కారణంగా అన్క్లెయిమ్గా మిగిలిపోతున్నాయి. ప్రజలు ఆదా చేసే ప్రతి రూపాయిని వారు లేదా వారి చట్టపరమైన వారసులు, నామినీలు సముచితంగా క్లెయిమ్ చేసుకునేలా చూడటానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీలు), సంబంధిత ఫండ్ రెగ్యులేటర్లు అభివృద్ధి చేసిన తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏక్యూలు) ద్వారా తమ సొమ్మును ఎలా గుర్తించాలో, క్లెయిమ్ చేయాలనే దానిపై ప్రజలకు స్పష్టమైన సమాచారాన్ని అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియకస్టమర్లు ఆర్బిఐకి చెందిన ఉద్గమ్ (UDGAM) పోర్టల్ ద్వారా అన్క్లెయిమ్ చేయని డిపాజిట్లను చెక్ చేయవచ్చు. అయితే క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయడానికి వారు సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించాలి. బ్యాంకులు చేపట్టబోయే ప్రతిపాదిత మార్పులు ఈ ప్రక్రియను డిజిటలైజ్ చేస్తాయి. ఆ తర్వాత ఆన్లైన్లో డిపాజిట్ను తిరిగి పొందటానికి అనుమతిస్తాయి.కాగా బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం, 2025.. ప్రతి బ్యాంకు ఖాతాకు అంగీకరించిన నామినీల సంఖ్యను ఒకటి నుండి నలుగుకు పెంచింది. ఖాతా డార్మాంట్గా ఉంటే లబ్ధిదారులను సులభంగా గుర్తించడానికి అనుమతిస్తుంది. చట్టం ముఖ్య నిబంధనలు ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చాయి.ఇదీ చదవండి: డీఏ పెరిగింది.. మరి జీతమెంత పెరుగుతుంది? -
టాటా సన్స్ ఐపీవో గడువు మిస్..
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసిన గడువు ముగియడంతో తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై స్పందించారు. రిజిస్ట్రేషన్ రద్దయ్యేవరకూ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకునే వీలున్నట్లు తెలియజేశారు.టాటా సన్స్సహా.. కొన్ని సంస్థలను ఆర్బీఐ ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్కు ఆదేశించింది. అయితే డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ కీలక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ(సీఐసీ) రిజిస్ట్రేషన్ను అప్పగించేందుకు గతేడాది ఆర్బీఐకు దరఖాస్తు చేసింది.తద్వారా తప్పనిసరి లిస్టింగ్ను తప్పించుకుకోనుంది. కాగా.. ఆర్బీఐ ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇప్పటికే అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీలుగా గుర్తింపు పొందిన 15 సంస్థలను సెపె్టంబర్ 30లోగా ఐపీవో చేపట్టమంటూ ఆదేశించింది.టాటా సన్స్మినహా మిగిలిన కంపెనీలు నిబంధనలను పాటించాయి. కంపెనీ లిస్టయితే 18 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ లబ్ది పొందనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
పెరిగిన కార్ల అమ్మాకాలు: కారణం ఇదే!
న్యూఢిల్లీ: జీఎస్టీ శ్లాబుల క్రమబద్దీకరణ ఫలితంగా కార్ల ధరలు గణనీయంగా తగ్గడంతో సెప్టెంబర్ నెలలో విక్రయాలు బలంగా పుంజుకున్నాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో చక్కని వృద్ధిని నమోదు చేశాయి. నిర్దేశిత సామర్థ్యం కలిగిన పెట్రోల్, డీజిల్ వాహనాలను 28 శాతం నుంచి 18 శాతం రేటు కిందకు మార్చడం తెలిసిందే. ఎలాంటి లెవీ లేకుండా విలాసవంతమైన కార్లపై 40 శాతం పన్ను విధించడంతో వాటి ధరలు సైతం తగ్గడం అమ్మకాలు పెరిగేందుకు దారితీసింది.కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే. మారుతీ మొత్తం విక్రయాల పరంగా 3% వృద్ధిని నమోదు చేసినప్పటికీ, దేశీయంగా చూస్తే డీలర్లకు సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల డిస్పాచ్ క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 8% తగ్గి 1,32,820 యూనిట్లుగా ఉంది. రిటైల్ విక్రయాలు 27.5 శాతం పెరిగి 1.73 లక్ష లయూనిట్లుగా ఉన్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థోబెనర్జీ తెలిపారు. దసరా నవరాత్రుల్లో మొదటి ఎనిమిది రోజుల్లోనే 1.65 లక్షల యూనిట్లను విక్రయించినట్టు, మరో రెండు రోజుల్లో కలిపి 2 లక్షల యూనిట్ల విక్రయాన్ని అధిగమిస్తామని చెప్పారు. -
స్టాక్ మార్కెట్ కుప్పకూలబోతోందా?: బఫెట్పై.. కియోసాకి ఆగ్రహం
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. వారెన్ బఫెట్ ఇటీవల బంగారం & వెండిని ప్రశంసించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎప్పుడూ స్టాక్ మార్కెట్, ఫండ్స్ వాణి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే వారెన్ బఫెట్.. ఇప్పుడు బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. బఫెట్ కొత్త వైఖరి సాంప్రదాయ స్టాక్లు, బాండ్లకు పొంచి ఉన్న సంక్షోభాన్ని సూచిస్తుందని రాబర్ట్ కియోసాకి తీవ్రంగా స్పందించారు.స్టాక్ మార్కెట్ మసకబారుతోందా?కొన్నేళ్లుగా.. వారెన్ బఫెట్ బంగారం & వెండి వంటివి ఉత్పాదకత లేని ఆస్తులుగా పరిగణించారు. 2011లో బెర్క్షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో కూడా అయన బంగారం ఎక్కువగా ఉపయోగపడేది కాదని, అది లాభాలను తీసుకురాదని వ్యాఖ్యానించారు. వ్యాపారాలు, వ్యవసాయ భూములు, ఇండెక్స్ నిధులను నిజమైన రాబడిని చెబుతూ.. నమ్మకమైన పెట్టుబడులుగా పేర్కొన్నారు. కానీ ఆయనే ఇప్పుడు బంగారం & వెండిని ఆమోదించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.బఫెట్ ఒకప్పుడు బంగారాన్ని ఎగతాళి చేసినప్పటికీ, ఇప్పుడు దానిని పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ప్రశంసిస్తున్నాడు. ఇది బఫెట్ దృక్పథంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని కియోసాకి అన్నారు. అంతే కాకుండా.. బఫెట్ మాట విని కొంత బంగారం, వెండి, బిట్కాయిన్ కొనాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. వారెన్ బఫెట్కు అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్గా పేరుంది. ఆయన ఎక్కువగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంటారు. దీంతో ఆయన్ను, ఆయన ఆలోచనలకు మంది అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు. ఇప్పుడు మారిన బఫెట్ వైఖరితో స్టాక్ మార్కెట్ నుంచి వైదొలిగి బంగారం, వెండి వైపు పయనిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు తగ్గి కుప్పకూలలే ప్రమాదముందా అంటూ కియోసాకి సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్!డబ్బు దాచుకోవడం వల్ల పేదవాళ్లు అవుతారని, డబ్బును బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మీ పెట్టుబడి పెరుగుతుందని రాబర్ట్ కియోసాకి చాన్నాళ్లుగా చెబుతూనే ఉన్నారు. వెండిపై పెట్టుబడి.. మీకు ఐదు రేట్లు లాభాలను తీసుకొస్తాయని ఆయన ఇటీవలే అన్నారు.I WANT TO VOMIT: getting nauseus, listening to Buffet tout the virtues of gold and silver…. after he ridiculed gold and silver for years. That means the stock and bond market are about to crash. Depression ahead?Even though Buffet shit on gold and silver investors like me…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 1, 2025 -
విదేశీ రుణం 747 బిలియన్ డాలర్లు
ముంబై: భారత్ విదేశీ రుణ భారం (ఎక్స్టర్నల్ డెట్) 2025 జూన్ నాటికి 747.2 బిలియన్ డాలర్లకు చేరింది. 2025 మార్చి నుంచి 11.2 బిలియన్ డాలర్లు పెరిగింది. జీడీపీలో విదేశీ రుణ భారం నిష్పత్తి మాత్రం 2025 మార్చి నాటికి ఉన్న 19.1 శాతం నుంచి 18.9 శాతానికి తగ్గినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా తెలియజేస్తోంది.డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించడం విదేశీ రుణ భారం అధికంగా పెరగడానికి దారితీసింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి జూన్ చివరికి రూపాయి మారకం విలువ ప్రభావాన్ని మినహాయించి చూస్తే నికరంగా పెరిగిన విదేశీ రుణ భారం 6.2 బిలియన్ డాలర్లుగానే ఉంది.మొత్తం విదేశీ రుణ భారంలో స్వల్పకాల రుణం 18.3 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింది. మొత్తం విదేశీ రుణ భారంలో డాలర్ రూపంలో తీసుకున్నది 53.8 శాతంగా ఉంది. రూపాయి మారకంలో రుణ భారం 30.6 శాతం, యెన్ రూపంలో 6.6 శాతం, సింగపూర్ డాలర్ రూపంలో 4.6 శాతం, యూరో మారకం రూపంలో 3.5 శాతం చొప్పున ఉంది. -
ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్!
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk).. దాదాపు అర ట్రిలియన్ డాలర్ల నికర విలువను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ ట్రాకర్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి.. ఇప్పుడు 500.1 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. ఈయన నికర విలువ ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ కంటే 150 బిలియన్ డాలర్లు ఎక్కువ.దక్షిణాఫ్రికాలో జన్మించిన బిలియనీర్ ఎలాన్ మస్క్.. సంపద అతని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla)తో ముడిపడి ఉంది. సెప్టెంబర్ 15 నాటికి అతను 12.4 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల నాటికి టెస్లా షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. దీంతో మస్క్ సంపదకు 9.3 బిలియన్ డాలర్లు యాడ్ అయ్యాయి. ఇలా కంపెనీ స్టాక్ వాల్యూ ఎప్పటికప్పుడూ పెరుగుతూ ఉండటం వల్ల.. మస్క్ సంపద కూడా పెరుగుతూనే ఉంది.డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. మస్క్ టెస్లా షేర్స్ భారీగా పెరిగాయి. కాగా కంపెనీ ఇప్పుడు ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ, స్పేస్ఎక్స్ కంపెనీలను కూడా విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. ఇది కూడా మస్క్ సంపదను మరింత పెంచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఆ పాస్పోర్ట్తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరికపిచ్బుక్ డేటా ప్రకారం, ఎక్స్ఏఐ జూలై నాటికి 75 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. అదే సమయంలో స్పేస్ఎక్స్ విలువ 400 బిలియన్ డాలర్లు (బ్లూమ్బెర్గ్ ప్రకారం). మస్క్ సంపద ఇదే వృద్ధి రేటుతో కొనసాగితే.. 2023 మార్చి నాటికి ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ కాగలరని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. -
పండుగ వేళ అమాంతం తగ్గిన బంగారం ధరలు: వెండి మాత్రం..
భారీగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. విజయదశమి సందర్భంగా గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరలలో మార్పులు జరిగాయి. వెండి ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఈ కథనంలో నేటి (అక్టోబర్ 02) గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆ పాస్పోర్ట్తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరిలో వైట్ హౌస్కు తిరిగి వచ్చిన తరువాత.. తన ప్రారంభ ప్రసంగంలో "పురుషుడు & స్త్రీ అనే రెండు లింగాలు మాత్రమే ఉన్నాయని" ప్రకటించినప్పటి నుంచి ట్రాన్స్జెండర్స్, బైనరీయేతర వ్యక్తులపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం తమ పాస్పోర్ట్లలో నాన్బైనరీ 'ఎక్స్' లింగ హోదాతో పాస్పోర్ట్లను కలిగి ఉన్న పౌరులకు హెచ్చరిక జారీ చేసింది.ఎక్స్ లింగ హోదాతో పాస్పోర్ట్లను కలిగిఉన్న వారు యునైటెడ్ స్టేట్స్కు వెళితే.. ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని కెనడా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్తో పాస్పోర్ట్లను జారీ చేసినప్పటికీ.. ఇది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలుకెనడా 2019లో పాస్పోర్ట్లపై 'ఎక్స్' ఎంపికను ప్రవేశపెట్టింది. ఫెడరల్ డేటా ప్రకారం.. జనవరి నాటికి దాదాపు 3,600 మంది కెనడియన్లు దీనిని ఎంచుకున్నారు. కెనడా మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ దేశాలు కూడా ఎక్స్ జెండర్ పాస్పోర్ట్లను జరీ చేస్తోంది. కానీ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్తో పాస్పోర్ట్ల జారీని నిలిపివేసింది. కాగా ఈ విధానం అమలులోకి రాకుండా కోర్టు నిషేధం విధించింది. -
అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలు
సోషల్ మీడియాలో నెలల తరబడి తన ఉద్యోగ అన్వేషణ గురించి.. వివరించిన భారతీయ మహిళ 'అనన్య జోషి' తగిన ఉద్యోగం పొందలేకపోయింది. దీంతో అమెరికా (America) విడిచిపెట్టాల్సి వచ్చింది. సెప్టెంబర్ 29న ఆమె అమెరికా విడిచిపెట్టే సమయంలో కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి 2024లో బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన అనన్య జోషి.. F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా బయోటెక్ స్టార్టప్లో ఉద్యోగంలో చేరింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆమె ఉద్యోగం కోల్పోయింది. అయితే స్టూడెంట్ వీసాతో చదువు పూర్తి చేసుకున్న తరువాత.. ఎఫ్-1 వీసా(F-1 Visa)తో ఉద్యోగంలో చేరింది. ఎఫ్-1 వీసా కలిగి ఉన్న వ్యక్తులు ఉద్యోగం కోల్పోయిన నెల రోజుల సమయంలో మరో ఉద్యోగాన్ని పొందాలి. లేకుంటే దేశం వీడి బయటకు వచేయాలి.ఇదీ చదవండి: బలవంతపు రాజీనామాలు!.. ఆందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుఉద్యోగం కోల్పోయిన అనన్య.. నెల రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసినప్పటికీ.. చివరికి నిరాశే మిగిలింది. చేసేదేమీ లేక అమెరికా విడిచిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి వచ్చే సమయంలో.. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రయాణంలో నేను చాలా కష్టతరమైన అడుగు వేసాను. ఐ లవ్ యూ అమెరికా అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Ananya 🐬 | Relatable Adult Life (@ananyastruggles) -
పసిడి మరో కొత్త రికార్డు
న్యూఢిల్లీ: పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. గురువారం సైతం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు రూ.1,100 పెరిగి మరో కొత్త జీవితకాల గరిష్ట స్థాయి రూ.1,21,000ను నమోదు చేసింది.వెండి ధర కిలోకి రూ.1,50,500 వద్ద ఫ్లాట్గా ట్రేడయ్యింది. అమెరికా ప్రభుత్వం షట్డౌన్ కావడం పసిడి ధరలపై ప్రభావం చూపించింది. అమెరికా లేబర్ మార్కెట్లో బలహీనత నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మద్దతునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు ఒక శాతానికి పైగా పెరిగి 3,895 డాలర్లకు చేరింది. -
సెబీ చెంతకు 6 కంపెనీలు
కొత్త కేలండర్ ఏడాదిలో సెకండరీ మార్కెట్లను ఓవర్టేక్ చేస్తూ చెలరేగుతున్న ప్రైమరీ మార్కెట్లు ఈ నెల(అక్టోబర్)లోనూ మరింత దూకుడు చూపనున్నాయి. శుక్రవారం(3న) వియ్వర్క్ ఇండియా ఐపీవో ప్రారంభంకానుండగా.. వచ్చే వారం దిగ్గజాలు టాటా క్యాపిటల్, ఎల్జీఎల్రక్టానిక్స్ ఐపీవోలు ప్రారంభంకానున్నాయి. ఈ బాటలో మరో 6 కంపెనీలు నిధుల సమీకరణ బాట పట్టాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా 6 కంపెనీలు ఐపీవోకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ఈ జాబితాలో విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్, గౌడియం ఐవీఎఫ్ అండ్ విమెన్ హెల్త్, కామ్టెల్ నెట్వర్క్స్, శంకేష్ జ్యువెలర్స్, ప్రీమియర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, సీఎస్ఎం టెక్నాలజీస్ చేరాయి. రూ. 2,250 కోట్లపై దృష్టి నీటి వినియోగం, వృధా నీటి నిర్వహణ సంబంధ స ర్వీసులందించే విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్ ఐపీవో ద్వారా రూ. 2,250 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్ సంస్థ ప్రీమియర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. మూడు కీలక ప్రాజెక్టులలో పెట్టుబడులకు వెచి్చంచనుంది. కంపెనీ ప్రధానంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగించేందుకు వీలుగా వృధా నీటిని శుద్ధి చేయడం తదితరాలను చేపడుతోంది. 2025 మార్చి31కల్లా రూ. 16,011 కోట్ల విలువైన ఆర్డర్బుక్ను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,759 కోట్ల ఆదాయం, రూ. 266 కోట్ల నికర లాభం ఆర్జించింది. 19 కొత్త కేంద్రాల ఏర్పాటు ఫెర్టిలిటీ సర్వీసులందించే గౌడియం ఐవీఎఫ్ అండ్ విమెన్ హెల్త్ ఐపీవోలో భాగంగా 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 95 లక్షల షేర్లను ప్రమోటర్ మనికా ఖన్నా విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లు దేశవ్యాప్తంగా 19 ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనుంది. మరో రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. రీప్రొడక్టివ్ టెక్నాలజీస్లో కంపెనీ సేవలు విస్తరించింది. జనవరిలో కంపెనీ ప్రమోటర్లు ఐపీవో ద్వారా 25.31 లక్షల షేర్లు విక్రయించేందుకు ప్రతిపాదించారు. తద్వారా తాజాగా పరిమాణాన్ని పెంచారు. ఈక్విటీ జారీని 1.83 కోట్ల షేర్ల నుంచి తగ్గించారు. కంపెనీ గతేడాది(2024–25) రూ. 71 కోట్ల ఆదాయం, రూ. 19 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇంజినీరింగ్ సంస్థ ఐపీవోలో భాగంగా స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కంపెనీ కామ్టెల్ నెట్వర్క్స్ రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 750 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ తదితర రంగాలకు కీలకమైన ఇంటెగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్, సెక్యూరిటీ, సేఫ్టీ సిస్టమ్స్ డిజైనింగ్, బిల్డింగ్, ఇంప్లిమెంటింగ్ చేపడుతోంది. వైర్ తయారీ కేంద్రం ప్రీమియర్ ఇండ్రస్టియల్ కార్పొరేషన్ ఐపీవోలో భాగంగా 2.25 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 54 లక్షల షేర్లను ప్రమోటర్ విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మహారాష్ట్రలోని హోనడ్(ఖాలాపూర్, రాయ్గడ్) వద్ద వైర్ తయారీ యూనిట్ ఏర్పాటుతోపాటు.. వాడ(పాల్గర్) తయారీ యూనిట్ విస్తరణకు వెచి్చంచనుంది. కంపెనీ వెల్డింగ్ కన్జూమబుల్స్ పరిశ్రమలో వినియోగించే పౌడర్లు, వైర్ల తయారీలో ఉంది. రుణ చెల్లింపులకు బంగారు ఆభరణ వర్తక కంపెనీ శంకేష్ జ్యువెలర్స్ ఐపీవోలో భాగంగా 3 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో కోటి షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 158 కోట్లు రుణ చెల్లింపులకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు రూ. 38 కోట్లు చొప్పున కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా క్లయింట్ల అవసరాలకు తగిన విధంగా బంగారు ఆభరణాల తయారీని చేపడుతోంది. ప్రభుత్వ సేవలు.. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ప్రభుత్వ స ర్వీసులు(గోవ్టెక్), ఐటీ కన్సల్టింగ్ సర్వీసులందించే సీఎస్ఎం టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1.29 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా భువనేశ్వర్ కంపెనీ రూ. 150 కోట్లు సమీకరించనుంది. నిధులను వృద్ధి, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టత, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 1998లో సైబర్టెక్ సాఫ్ట్వేర్ అండ్ మల్టిమీడియాగా ప్రారంభమైన కంపెనీ 2014లో సీఎస్ఎం టెక్నాలజీస్గా అవతరించింది. ప్రధానంగా ప్రభుత్వాలు, పీఎస్యూలకు స ర్వీసులు సమకూర్చే కంపెనీ పలు దేశాలలో అనుబంధ సంస్థలను నిర్వహిస్తోంది. గతేడాది(2024–25) రూ. 199 కోట్ల ఆదాయం, రూ. 14 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
స్టాక్ మార్కెట్పై కుటుంబాల ఆసక్తి
న్యూఢిల్లీ: దేశీయంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపట్ల కుటుంబాలలో ఆసక్తి కనిపిస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన సర్వే పేర్కొంది. కుటుంబ ఆదాయాలలో 10 శాతం సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. కుటుంబీకులలో 63 శాతం కనీసం ఒక మార్కెట్ ప్రొడక్ట్పై అవగాహన ఉన్నట్లు సెబీ ఇన్వెస్టర్ల సర్వే వెల్లడించింది. సెక్యూరిటీలలో పట్టణ ప్రాంతాల నుంచి 15 శాతం పార్టిసిపేషన్ కనిపించగా.. గ్రామీణ ప్రాంతాలలో 6 శాతమే పెట్టుబడులు నమోదయ్యాయి. రాష్ట్రాలలో 20.7 శాతం వాటాతో ఢిల్లీ ఆధిపత్యంవహించగా.. 15.4 శాతం కుటుంబాల పార్టిసిపేషన్తో గుజరాత్ తదుపరి ర్యాంకులో నిలిచింది. అయితే 36 శాతంమంది ఇన్వెస్టర్లకు మాత్రమే సెక్యూరిటీ మార్కెట్లపట్ల ఓమాదిరి అవగాహన ఉన్నట్లు సర్వే తెలియజేసింది. దీంతో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ విస్తరించవలసిన అవసరం ఉన్నట్లు అభిప్రాయపడింది. పెట్టుబడి రక్షణకే ఓటు సెబీ తాజా సర్వే ప్రకారం 80 శాతం కుటుంబీకులు అధిక రిటర్నులకంటే పెట్టుబడి పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వెరసి వివిధ వయసులవారు రిస్క్ తీసుకోవడంలో విముఖత చూపుతున్నట్లు సర్వే తెలియజేసింది. నిజానికి జెన్జెడ్ కుటుంబీకులలోనూ 79 శాతంమంది రిస్్కలకు వెనకాడుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా ఫైనాన్షియల్ ప్రొడక్టులలో క్లిష్టత, అవగాహనాలేమి, విశ్వాసరాహిత్యం, నష్టాల భయం వంటి అంశాలు అధికశాతం మందిలో పెట్టుబడులకు అడ్డుతగులుతున్నట్లు వివరించింది. దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ)తోపాటు.. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ తదితర మార్కెట్ ఇన్ఫ్రా సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల సర్వే చేపట్టింది. సుమారు 400 పట్టణాలలోని 90,000 కుటుంబాలు, 1,000 గ్రామాలలో సర్వే నిర్వహించింది. -
జీఎస్టీ సంస్కరణలు వృద్ధిని బలపరుస్తాయ్
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ తాజా సంస్కరణలు సానుకూల ప్రభావం చూపిస్తాయని ఆర్బీఐ బులెటిన్ అభిప్రాయపడింది. వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందని, రిటైల్ ధరలు దిగొస్తాయని, వినియోగం బలపడుతుందని పేర్కొంది. అమెరికా విధించిన ప్రతీకార సుంకాలతో అనిశ్చితులు ఏర్పడినట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో (క్యూ1) జీడీపీ వృద్ధి ఐదు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరి తన బలాన్ని చాటినట్టు పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో స్వల్పంగా పెరిగినప్పటికీ ఆర్బీఐ లక్ష్యానికంటే ఎంతో దిగువనే ఉన్నట్టు గుర్తు చేసింది. వ్యవస్థలో లిక్విడిటీ (నగదు లభ్యత) మిగులు ఉన్నట్టు తెలిపింది. క్యూ1లో కరెంట్ ఖాతా లోటు గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మోస్తరు స్థాయికి చేరినట్టు, సేవల ఎగుమతులు బలంగా ఉండడం, రెమిటెన్స్లు (విదేశాల నుంచి నగదు బదిలీలు) ఇందుకు సాయపడినట్టు బులెటిన్లో పేర్కొంది. జీఎస్టీ తాజా సంస్కరణలు చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు, జీఎస్టీలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గిస్తుందని, పన్ను నిబంధనల అమలును పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ల నుంచి 45 శాతం ఎగుమతులకు మినహాయింపు కల్పించడాన్ని ప్రస్తావించింది. సుంకాల ప్రభావం రంగాలవారీగా ఉండొచ్చని పేర్కొంది. వాణిజ్య అనిశ్చితులు నెలకొన్నప్పటికీ ఎగుమతులు బలంగా ఉండడాన్ని గుర్తు చేసింది. తయారీ, సేవల రంగాల పనితీరు దశాబ్ద గరిష్టానికి చేరినట్టు తెలిపింది. -
మళ్లీ ముకేశ్ నంబర్ వన్!
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి దేశంలోకెల్లా ధనవంతుడిగా నిలిచారు. 2025 ఎం3ఎం హురున్ ఇండియా బిలియనీర్ జాబితా ప్రకారం అంబానీ సంపద 6 శాతం క్షీణించి రూ. 9.55 లక్షల కోట్లకు చేరింది. అయినప్పటికీ 2025లో దేశీయంగా అపర కుబేరుడిగా అవతరించారు. దీంతో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ రూ. 8.14 లక్షల కోట్ల సంపదతో దేశీ బిలియనీర్లలో రెండో ర్యాంకుకు పరిమితమయ్యారు. గతేడాది అదానీ సంపద 95 శాతం జంప్చేసి రూ. 11.6 లక్షల కోట్లను తాకడంతో అంబానీని అధిగమిస్తూ టాప్ చెయిర్ను పొందిన సంగతి తెలిసిందే. నిజానికి యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు పతనమైనప్పటికీ తిరిగి నష్టాలు రికవర్ అయ్యాయి. కాగా.. తొలిసారి హెచ్సీఎల్ గ్రూప్ రోష్నీ నాడార్ మల్హోత్రా టాప్–3లో చోటు సాధించారు. రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో మూడో ర్యాంకులో నిలవగా.. సైరస్ పూనావాలా, ఆయన కుటుంబం రూ. 2.46 లక్షల కోట్లతో నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఈ బాటలో కుమార మంగళం బిర్లా రూ. 2.32 లక్షల కోట్ల సంపదతో ఐదో ర్యాంకులో నిలిచారు. నీరజ్ బజాజ్, ఆయన కుటుంబం సంపద 43 శాతం జంప్చేసి రూ. 2.33 లక్షల కోట్లకు చేరడం ద్వారా నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకున్నారు. దేశ జీడీపీలో హురున్ జాబితాలో చోటుచేసుకున్న బిలియనీర్ల ఉమ్మడి సంపద రూ. 167 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం. జాబితాలో రూ. 1,000 కోట్ల సంపదతో 1,687 మంది వ్యక్తులు స్థానం పొందగా.. ఈ సంఖ్య 284 పెరిగింది. వీరిలో 148 కొత్తగా చోటు సాధించారు. గత రెండేళ్లుగా భారత్లో ప్రతీ వారం ఒక బిలియనీర్ ఆవిర్భవిస్తున్నట్లు హురున్ పేర్కొంది. దీంతో జాబితాలో చోటు పొందినవారిద్వారా ప్రస్తుతం రోజుకి రూ. 1,991 కోట్ల సంపద జమవుతున్నట్లు తెలియజేసింది. కాగా.. పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ రూ. 21,190 కోట్లతో జాబితాలో స్థానాన్ని పొందారు. తద్వారా యువ బిలియనీర్గా నిలిచారు. యువ బిలియనీర్లలో ఓయో వ్యవస్థాపకుడు 31 ఏళ్ల రితేష్ అగర్వాల్ సైతం రూ. 14,400 కోట్ల నెట్వర్త్తో పిన్నవయస్కుడిగా జాబితాలో చోటు సాధించారు.జెప్టో వ్యవస్థాపకులకు చోటుహురున్ తాజా జాబితాలో ఈకామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో సహవ్యవస్థాపకులు 23 ఏళ్ల ఆదిత్ పాలిచా, 22 ఏళ్ల కైవల్య వోహ్రా చోటు సంపాదించారు. బిలియనీర్లలో పిన్న వయసు్కలు(జెన్ జెడ్)గా నిలిచారు. 2021లో ఏర్పాటైన జెప్టో వేగంగా వృద్ధి చెందడంతో వోహ్రా సంపద రూ. 4,480 కోట్లకు చేరగా, పాలిచా నెట్వర్త్ రూ. 5,380 కోట్లను తాకింది. కంపెనీ విలువ 5.9 బిలియన్ డాలర్లకు చేరింది. రూ. 1,140 కోట్ల సంపదతో ఎస్జీ ఫిన్సర్వ్ వ్యవస్థాపకుడు రోహన్ గుప్తా, ఆయన కుటుంబం సైతం చోటు సాధించారు. -
జీఎస్టీ వసూళ్లు 9 శాతం అప్
న్యూఢిల్లీ: గత నెల(సెప్టెంబర్)లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు 9 శాతం ఎగశాయి. రూ. 1.89 లక్షల కోట్లను తాకాయి. గత నెల 22 నుంచి జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచి్చన నేపథ్యంలో తాజా వసూళ్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతక్రితం నెల(ఆగస్ట్)తో పోలిస్తే 1.5 శాతం పుంజుకోగా.. 2024 సెప్టెంబర్తో చూస్తే 9%పైగా వృద్ధి నమోదైంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం స్థూల వసూళ్లు 1.89 లక్షల కోట్లకు చేరాయి. 2024 సెప్టెంబర్లో రూ. 1.73 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ రేట్లు, శ్లాబులను క్రమబదీ్ధకరించడంతో వసూళ్లలో వృద్ధి నమోదైంది. రేట్ల మార్పు ప్రభావంతో కిచెన్ అప్లయెన్సెస్తోపాటు.. ఎల్రక్టానిక్స్వరకూ 375 వస్తువుల ధరలు చౌకయ్యాయి. వీటిలో ఔషధాలు, ఆటోమొబైల్స్ సైతం చేరాయి. జీఎస్టీ తగ్గడంతో పలు ప్రొడక్టులకు డిమాండ్ పుంజుకుంది. -
మల్హోత్రా.. మరో‘సారీ’!
ముంబై: ఒకవైపు అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లతో ఎగుమతులకు ఏర్పడిన అవరోధాలు, హెచ్1బీ వీసా నిబంధనల కట్టడి.. మరోవైపు గతంలో చేపట్టిన రేట్ల తగ్గింపు ఫలితం పూర్తి స్థాయిలో కనిపించాల్సి ఉండడం, ఇటీవలి జీఎస్టీ రేట్ల తగ్గింపు, రూపాయి విలువ పతనం నేపథ్యంలో ఆర్బీఐ వరుసగా రెండో విడత కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను గతంలో వేసిన 6.5% నుంచి 6.8 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగిరావడం రేట్ల తగ్గింపు పరంగా వెసులుబాటు కలి్పంచినప్పటికీ.. దీనికంటే ముందు గతంలో తీసుకున్న చర్యల తాలూకూ ఫలితంపై పూర్తి స్థాయి స్పష్టత అవసరమని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాలసీ భేటీ తర్వాత మీడియాకు తెలిపారు. అమెరికా టారిఫ్ల నుంచి ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఎదురైతే రానున్న నెలల్లో రేట్ల తగ్గింపుతో మద్దతుగా నిలుస్తామని సంకేతం ఇచ్చారు. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులు సైతం రేట్ల తగ్గింపునకు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఆర్థిక స్థిరత్వంతో పాటు, వృద్ధికి విఘాతం ఉండకూడదన్నారు. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు వసూలు చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. వృద్ధి బలంగా..: ఎగుమతుల డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ.. వర్షాలు సమృద్ధిగా కురవడం, తక్కువ ద్రవ్యోల్బణం, గతంలో రెపో రేటు తగ్గింపు, జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా ఏర్పడే సానుకూల ప్రయోజనంతో దేశ వృద్ధి అవకాశాలు బలంగా ఉన్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2025–26 సంవత్సరంలో జీడీపీ 6.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆగస్ట్ సమీక్షలో ఈ అంచనా 6.5 శాతంగా ఉంది. వాణిజ్యపరమైన అనిశ్చితుల నేపథ్యంలో క్యూ3 (అక్టోబర్–డిసెంబర్), ఆ తర్వాతి కాలానికి వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. 2025–26 క్యూ1లో (జూన్ త్రైమాసికం) జీడీపీ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం తెలిసిందే. క్యూ2లో (సెపె్టంబర్ త్రైమాసికం) 7%, క్యూ3లో 6.4%, క్యూ4లో 6.2 శాతం చొప్పున ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. అమెరికా విధించిన టారిఫ్లతో ఎగుమతులు మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ఎగుమతిదారులకు అండ.. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ఎగుమతిదారులకు అండగా ఆర్బీఐ పలు చర్యలు ప్రకటించింది. ‘ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్’ (ఐఎఫ్ఎస్సీ)లోని ఫారిన్ కరెన్సీ అకౌంట్ల నుంచి నిధులను స్వదేశానికి బదిలీ చేసేందుకు ఇప్పటి వరకు ఉన్న నెల గడువును మూడు నెలలకు పొడిగించింది. వస్తు వాణిజ్య లావాదేవీలకు సంబంధించి చెల్లింపుల గడువును నాలుగు నెలల నుంచి ఆరు నెలలకు పెంచింది. ఇక చిన్న తరహా ఎగుమతి/దిగుమతిదారులకు నిబంధనల అమలు భారాన్ని తగ్గించే చర్యలను సైతం ప్రకటించింది. రూపాయి అంతర్జాతీయం అంతర్జాతీయంగా రూపాయి ప్రాతినిధ్యాన్ని పెంచే చర్యలను సైతం ఆర్బీఐ ప్రకటించింది. భూటాన్, నేపాల్, శ్రీలంక దేశ వాసులకు ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూపాయి మారకంలో రుణాల మంజూరుకు బ్యాంక్లను అనుమతించింది.ముఖ్యాంశాలు..→ రెపో రేటును 5.5 శాతం వద్ద కొనసాగించేందుకు ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రివర్స్ రెపో రేటు సైతం 3.35 శాతంగా కొనసాగుతుంది. → భవిష్యత్తులో పరిస్థితులకు అనుగుణంగా రేట్లపై ఎటువంటి చర్యను అయినా చేపట్టేందుకు వీలుగా తటస్థ విధానాన్నే కొనసాగించింది. → ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఆర్బీఐ 1 శాతం రెపో రేటును తగ్గించింది. ఆగస్ట్ సమీక్ష నుంచి యథాతథ స్థితిని కొనసాగిస్తోంది. → 2025–26 సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతానికి తగ్గించింది. 4 శాతం నిర్దేశిత లక్ష్యం కంటే ఇది తక్కువే. లోగడ ఇది 3.1 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా. ఆగస్ట్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతంగా ఉంది. → సేవల ఎగుమతులు, విదేశాల నుంచి స్వదేశానికి నిధుల బదిలీ (రెమిటెన్స్లు) దన్నుతో కరెంటు ఖాతా లోటు నియంత్రణలోనే ఉంటుంది.→ ఆర్బీఐ తదుపరి సమీక్ష సమీక్ష డిసెంబర్ 3–5 వరకు జరుగుతుంది. -
జియో 3 నెలల ప్లాన్: చౌకగా డైలీ 2జీబీ.. అన్లిమిటెడ్
రిలయన్స్ జియో తన 9వ వార్షికోత్సవాన్ని ఇటీవలె జరుపుకొంది. అప్పటి నుండి, కంపెనీ తన వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. అందులో ఒకటే రూ.899 ప్లాన్. దీంతో హై స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్తో పాటు ఇతర ఆకట్టుకునే ప్రయోజనాలను అందిస్తోంది.జియో రూ.899 ప్లాన్.. ప్రయోజనాలుజియో నుండి వచ్చిన ఈ ఆకట్టుకునే ప్లాన్ ధర రూ.899. పూర్తి 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు 20జీబీ అదనపు డేటాను కూడా అందిస్తోంది. అంటే మొత్తం డేటా 200GB అవుతుంది.ఇంకా ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ ను కూడా అందిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపించుకోవచ్చు. జియో 5జీ నెట్ వర్క్ ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు.డేటా, కాలింగ్ మాత్రమే కాదు, ఈ ప్లాన్ జియో టీవీ, జియో ఐ క్లౌడ్, జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ లతో సహా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్లో 3నెలల జియో హాట్ స్టార్ మొబైల్, టీవీ సబ్ స్క్రిప్షన్ కూడా చేర్చారు.అదనంగా, ఈ ప్లాన్ లో 3 నెలల పాటు జియోసావ్ ప్రోకు 1 నెల జొమాటో గోల్డ్ సబ్ స్క్రిప్షన్, ఉచితంగా 6 నెలల నెట్ మెడ్స్ ఫస్ట్ సభ్యత్వం ఉన్నాయి. ఇంకా ఈజీ మై ట్రిప్ పై రూ .2220 వరకు డిస్కౌంట్, హోటల్ బుకింగ్ లపై 15% వరకు తగ్గింపును అందిస్తుంది. అజియోపై రూ.200 తగ్గింపు, రిలయన్స్ డిజిటల్పై రూ.399 వరకు తగ్గింపును కూడా పొందుతారు. -
ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు
దసరా, దీపావళి పండుగల సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించింది. “ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్” పేరుతో ఎలక్ట్రానిక్ వస్తువులను తగ్గింపు జీఎస్టీ ధరలపై అందిస్తోంది. అగ్రగామి బ్యాంక్ కార్డులపై అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, జియో మార్ట్ డిజిటల్ స్టోర్స్, ఆన్లైన్ (www.reliancedigital.in)లో రూ.15000 వరకు సత్వర డిస్కౌంట్ కల్పిస్తోంది.కస్టమర్లు పేపర్ ఫైనాన్స్ ఎంచుకుంటే రూ.30,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీంతో పెద్ద విలువ గల ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం సులభం అవుతుంది. రిలయన్స్ డిజిటల్ వారి ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ అక్టోబర్ 25 వరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయి. రిలయన్స్ డిజిటల్ లో లభించే కొన్ని డీల్స్ ఇవీ...• తోషిబా 65 ఇంచ్ క్యూ ఎల్ఈడీ రూ. 45,990 లకే.• ఐఫోన్ 16ఈ ప్రారంభ ధర రూ.44,990• 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ప్రారంభ ధర రూ.17,990• రిఫ్రిజిరేటర్ కొంటే రూ.8,990 వరకు విలువ గల ఫ్రీబీస్.• డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ప్రారంభ ధర రూ.18,990• సెమీ- ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ధరలో టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ప్రారంభ ధర రూ. 10,990• చిన్న డొమెస్టిక్ వస్తువులు 1 కొంటే 5% తగ్గింపు, 2 కొంటే 10% తగ్గింపు, 3 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులపై 15% తగ్గింపు• పర్సనల్ ఆడియో, స్మార్ట్ వాచీలు, టాబ్లెట్స్, ఇతర టెక్ యాక్సెసరీస్ పై 5% తగ్గింపు. -
ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్లో కేటీఎం టీమ్..
ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ (ఐఎస్ఆర్ఎల్) కేటీఎం రేసింగ్, ట్రైకలర్ మోటార్ స్పోర్ట్స్ మధ్య కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. దీని కింద ఐఎస్ఆర్ఎల్ సీజన్2లో కేటీఎం ప్రత్యేక నేమింగ్ రైట్స్ పార్టనర్, అధికారిక బైక్ భాగస్వామిగా మారింది. బ్రాండ్ అంబాసిడర్, ఇన్వెస్టర్గా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ లీగ్కు మద్దతిస్తున్నారు.ఈ భాగస్వామ్యం కింద, కేటీఎం ట్రైకలర్ మోటార్ స్పోర్ట్స్ పేరుతో రేసింగ్ టీమ్ పోటీపడనుంది. భారతీయ మోటార్ స్పోర్ట్ ఫ్రాంచైజీకి ఒక ప్రపంచ మోటార్ సైకిల్ తయారీ సంస్థ పేరు హక్కులను పొందడం ఇదే మొదటిసారి. అనేక ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిల్స్ తో కేటీఎం దశాబ్దాల ప్రపంచ రేసింగ్ నైపుణ్యాన్ని మోటోక్రాస్, సూపర్ క్రాస్లలో తీసుకురానుంది.ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ వ్యవస్థను నిర్మించడానికి ప్రపంచ బ్రాండ్లను భారతీయ జట్లతో ఏకం చేయాలనే లీగ్ దృష్టికి ఈ భాగస్వామ్యం సరిపోతుందని ఐఎస్ఆర్ఎల్ ప్రమోటర్ వీర్ పటేల్ అన్నారు. టీవీ, ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో 20 మిలియన్లకు పైగా వీక్షకులతో విజయవంతమైన సీజన్ 1 తరువాత, సీజన్2 అక్టోబర్ 25-26 తేదీల్లో ప్రారంభమవుతుంది. తర్వాత రేసులు డిసెంబర్ 6-7, డిసెంబర్ 20-21 తేదీలలో మూడు వేర్వేరు వేదికలలో జరుగుతాయి. -
డీఏ పెరిగింది.. మరి జీతమెంత పెరుగుతుంది?
కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ పెంచింది. దసరా,దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్, రిటైరైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ రిలీఫ్ను 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. డీఏ అంటే ఏమిటి.. దాన్ని ఎలా లెక్కిస్తారు.. జీతం ఎంత పెరుగుతుంది.. ఈ కథనంలో తెలుసుకుందాం..డీఏ అంటే ఏమిటి?డీఏ అంటే డియర్నెస్ అలవెన్స్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ప్రభావాన్ని ఎదుర్కోవడంలో సహాయపడేందుకు డీఏ చెల్లిస్తారు. ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల ధరలు పెరుగుతుంటాయి. దీనివల్ల జీవన వ్యయం అధికమవుతుంది. దీన్ని తగ్గించడానికే ఎప్పటికప్పుడు డీఏను పెంచుతుంటారు. డీఏ పెరిగితే ఉద్యోగులకు ప్రతినెలా చేతికందే జీతమూ పెరుగుతుంది.ఎలా లెక్కిస్తారు? ఉద్యోగుల మూల వేతనం అంటే బేసిక్ శాలరీపై లెక్కిస్తుంటారు. వినియోగదారు ధరల సూచీ (CPI) ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ 3 శాతం పెంపుకు ఆమోదం తెలిపారు. తాజా పెంపు డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగుతుంది.జీతంలో ఎంత పెరుగుంది?ఉదాహరణకు ఉద్యోగి బేసిక్ జీతం రూ.50,000 అనుకుంటే ఇప్పుడున్న 55 శాతంతో డీఏ రూ.27,500. తాజాగా 3 శాతం పెరిగింది కాబట్టి ఇది 58 శాతానికి చేరుతుంది. రూ.50,000 జీతంపై 58 శాతం డీఏ 29,000 అవుతుంది. అంటే ఉద్యోగికి ప్రతినెలా అందే జీతంలో రూ.1,500 పెరుగుతుందన్న మాట. అయితే హెచ్ఆర్ఏ, టీఏ వంటి ఇతర అలవెన్సులు డీఏ పెంపుతో మారవు. పెన్షనర్లకు డీఆర్ (Dearness Relief) రూపంలో ఇదే శాతం వర్తిస్తుంది.