breaking news
Business
-
2025 చివరి నాటికి లాంచ్ అయ్యే కొత్త కార్లు
2025 ప్రారంభమై ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తయింది. ఇప్పటికే లెక్కకు మించిన కొత్త కార్లు, అప్డేటెడ్ కార్లు లాంచ్ అయ్యాయి. కాగా ఈ ఏడాది లాంచ్ కావడానికి మరికొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. కొత్త కారు కొనాలని ఎదురుచూస్తున్న వాళ్లకు.. అవి బహుశా మంచి ఎంపిక కావొచ్చు. జీఎస్టీ సంస్కరణలు కూడా ధరలను కొంత తగ్గేలా చేస్తాయి.2025 చివరి నాటికి దేశంలో లాంచ్ అయ్యే కార్లు●మహీంద్రా థార్ ఫేస్లిఫ్ట్●మారుతి విక్టోరిస్●టాటా పంచ్ ఫేస్లిఫ్ట్●కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ●టాటా సియెర్రా ఈవీ●స్కోడా ఆక్టేవియా ఆర్ఎస్●వోక్స్వ్యాగన్ టేరాన్మారుతి సుజుకి కొత్త విక్టోరిస్.. ఇప్పటికే షోరూమ్లకు రావడం ప్రారంభించింది. కాగా దీని ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ కారు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా పొందుతుంది. విక్టోరిస్ మూడు పవర్ట్రెయిన్ (పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, పెట్రోల్-CNG) ఎంపికలలో లభిస్తుంది.టాటా పంచ్ ఫేస్లిఫ్ట్ కూడా అక్టోబర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో చిన్న డిజైన్ మార్పులు, అప్డేటెడ్ ఫీచర్స్ ఉండనున్నాయి. నవంబర్లో టాటా సియెర్రా ఈవీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హారియర్ ఈవీ మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ కూడా కొత్త తరం వెన్యూ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది.ఇదీ చదవండి: డీజిల్లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటనమహీంద్రా థార్ కూడా ఫేస్లిఫ్ట్ రూపంలో లాంచ్ కానుంది. ఇది థార్ రాక్స్ మాదిరిగానే.. అదే ఇంజిన్, గేర్బాక్స్ ఎంపికలను పొందుతుంది. స్కోడా తన పెర్ఫార్మెన్స్ సెడాన్ ఆక్టేవియా ఆర్ఎస్ లాంచ్ చేయనుంది. దీనిని కంపెనీ భారతదేశానికి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దీని ధర రూ. 50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వోక్స్వ్యాగన్ 2025 చివరి నాటికి టేరాన్ ప్రీమియం 7-సీటర్ లాంచ్ చేసే యోచనలో ఉంది. -
'నేను చెప్పినట్లు చేయండి.. లేకుంటే': ట్రంప్ పోస్ట్ వైరల్
డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా.. నాటో దేశాలు రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు చేసినందుకు చైనాపై 50-100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.అన్ని నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపివేసినప్పుడు.. నేను రష్యాపై ప్రధాన ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాను. నాటో సభ్యులు రష్యా చమురు కొనుగోలు చేయడం షాకింగ్గా ఉంది. యుద్ధంలో గెలవడానికి వారి నిబద్ధత 100% కంటే చాలా తక్కువగా ఉందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో వెల్లడించారు.రష్యా ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశం చైనా, తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. నాటో సభ్యదేశమైన టర్కీ మూడవ స్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే 32 దేశాల కూటమిలో హంగరీ, స్లోవేకియా కూడా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.రష్యా చమురుపై నాటో నిషేధం, చైనాపై సుంకాలు ఇవన్నీ కూడా యుద్ధాన్ని ముగించడంలో గొప్ప సహాయకారిగా ఉంటాయి. చైనాకు రష్యాపై బలమైన నియంత్రణ, పట్టు ఉన్నాయి. తానూ విధిస్తున్న సుంకాలు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం జరగడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అని అన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజో బైడెన్ అధ్యక్షుదిగా ఉన్న సమయంలో.. నేను అధ్యక్షుడినై ఉండి ఉంటే, ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదు. ఇది బైడెన్, జెలెన్స్కీల యుద్ధం అని ట్రంప్ అన్నారు. నేను చెప్పినట్లుగా చేస్తే.. యుద్ధం త్వరగా ముగుస్తుంది, ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే.. మీరు నా సమయాన్ని, దేశ సమయాన్ని, శక్తిని, డబ్బును వృధా చేస్తున్నవారు అవుతారని ఆయన స్పష్టం చేశారు. -
చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారుతుందని ఇప్పటికే చాలామంది నిపుణులు పేర్కొన్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఆధునిక చరిత్రలో అతిపెద్ద మార్పు.. అని రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఏఐ వల్ల చాలా మంది తెలివైన విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతారు. నిరుద్యోగం పెరుగుతుంది. చాలా మందికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ లోన్స్ అలాగే ఉన్నాయి. నాకు ఉద్యోగం లేదు, కాబట్టి.. ఏఐ నన్ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం లేదని అన్నారు.''కొన్నేళ్ల క్రితం.. పేద తండ్రి పాఠశాలకు వెళ్లు, మంచి గ్రేడ్లు పొందు, ఉద్యోగం సంపాదించు, పన్నులు కట్టు, అప్పుల నుంచి బయటపడు, డబ్బు ఆదా చేయు, మరియు స్టాక్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ల వంటి విభిన్నమైన పోర్ట్ఫోలియోలో పెట్టుబడి పెట్టు అని చెప్పే మాటలకు బదులుగా.. ధనవంతుడైన తండ్రి సలహాను అనుసరించాను. నేను ఒక వ్యవస్థాపకుడిని అయ్యాను, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాను, అప్పును ఉపయోగించాను. డబ్బును ఆదా చేయడానికి బదులుగా, నేను నిజమైన బంగారం, వెండి, నేడు బిట్కాయిన్లను ఆదా చేస్తున్నాను'' అని రాబర్ట్ కియోసాకి చెబుతూనే.. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి అని హెచ్చరించారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా? -
ఇంటి అందాన్ని పెంచే టిప్స్
సాక్షి, సిటీబ్యూరో: దీపావళి వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లుతో పాటు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెలకువలతో ట్రెండీ లుక్ తీసుకు రావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో ఫ్రెండ్లీ దీపావళిగా మారుతుందంటున్నారు.➤సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తుల స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పల్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.300.➤ప్రముఖ ఎల్రక్టానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిని స్మార్ట్ఫోన్తో ఆపరేట్ చేసుకోవచ్చు కూడా. వైర్లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. వీటి ధర రూ.3 వేల నుంచి ఉన్నాయి.➤పండుగ సీజన్లో ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్ ఎంట్రెన్స్ లేదా భవనం మీద ఓం, స్వస్తిక్ వంటి చిహా్నలను పెట్టుకోవచ్చు. ఇవి ఎల్ఈడీ లైట్లతో తయారు చేసిన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.200 – 500 మధ్య ఉన్నాయి.➤రంగు రంగుల బాటిల్స్లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. వీటి ధర రూ.400 నుంచి ఉన్నాయి.➤అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్యరశి్మని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి. వీటిని హెవీ డ్యూటీ నైలాన్తో తయారు చేస్తారు. ఈ లాంతర్ సెట్లు వివిధ డిజైన్స్, రంగుల్లో దొరుకుతాయి.➤ఈ మధ్య కాలంలో నీళ్లలో తేలియాడే కొవ్వొత్తులు బాగా ప్రాచుర్యం పొందాయి. అలంకరణ ప్రాయంగా వీటిని పూల కుండీల్లో, మొక్కలున్న ప్రాంతాల్లో, స్విమ్మింగ్పూల్ వద్ద అమర్చుకోవచ్చు. ఇవి పరిమాణాలను బట్టి 8–10 గంటల వరకు కాంతినిస్తాయి. -
హోండా మోటార్సైకిల్ ప్రకటన: ఆ బైకులకు రీకాల్..
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా 2019 & 2025 మధ్య తయారైన ఆఫ్రికా ట్విన్ మోటార్సైకిళ్లకు రీకాల్ ప్రకటించింది. ఎడమవైపు ఉన్న హ్యాండిల్బార్ స్విచ్లోని వైరింగ్లో సమస్యను పరిష్కరించడానికి కంపెనీ స్వచ్ఛందంగా ఈ ప్రకటన చేసింది.ఈ సమస్య హ్యాండిల్ బార్ లోపల ఉన్న హార్నెస్ వైర్ నుంచి వస్తుంది. ఇది సాధారణ స్టీరింగ్ కదలికల కారణంగా పదే పదే వంగి ఉంటుంది. కాలక్రమేణా.. ఇది వైర్ జాయింట్ల వద్ద ఎలక్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. తద్వారా హారన్ పనిచేయకపోవచ్చని కంపెనీ గుర్తించింది. అంతే కాకుండా.. హెడ్లైట్ను లో బీమ్ నుంచి హై బీమ్కు మార్చడంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.2026 జనవరి చివరి వారం నుంచి.. భారతదేశంలోని అన్ని హోండా బిగ్వింగ్ డీలర్షిప్లు మీ బైక్ ఇప్పటికీ వారంటీలో ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా సమస్యను పరిష్కరిస్తాయి. కస్టమర్లకు కంపెనీ కాల్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తుంది. కాగా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కస్టమర్లే డీలర్షిప్ను సందర్శించవచ్చు.భారతదేశంలో ఆఫ్రికా ట్విన్ కోసం హోండా రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. నవంబర్ 2024 ప్రారంభంలో, ఫిబ్రవరి, అక్టోబర్ 2022 లలో కూడా ఈ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు మరోసారి రీకాల్ జారీచేయడానికి సిద్ధమైంది. ఆఫ్రికా ట్విన్ 1,048 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ను కలిగి.. 100.5 bhp పవర్, 112 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా హోండా DCT ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికతో లభిస్తుంది. -
ఫోన్పేకు రూ.21 లక్షల జరిమానా: కారణం ఇదే..
నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. ఇప్పుడు ఫిన్టెక్ కంపెనీ ఫోన్పేకు భారీ జరిమానా విధించింది. 'ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్' (PPIs) కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఫోన్పే లిమిటెడ్కు 21 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను పాటించకపోవడం మాత్రమే కాకుండా.. ఈ విషయంలో సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పాటించలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఈ కారణంగానే ఫోన్పేకు నోటీస్ జారీ చేయడం జరిగిందని స్పష్టం చేసింది. జరిమానా విధించినప్పటికీ.. ఇది యూజర్లపై ఎటువంటి ప్రభావం చూడదని పేర్కొంది.ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఫోన్పే వంటి అన్ని నాన్ బ్యాంకింగ్స్, ఎస్క్రో బ్యాలెన్స్లలో ఏదైనా లోటు ఉంటే వెంటనే రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ & సెటిల్మెంట్ సిస్టమ్స్ విభాగానికి (DPSS) నివేదించాలి. ఎస్క్రో ఖాతా నిల్వలు.. రోజు చివరిలో వ్యాపారులకు చెల్లించాల్సిన బకాయి ఉన్న PPIల విలువ, చెల్లింపుల కంటే తక్కువగా ఉండకూడదని నిబంధనలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: డీజిల్లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటనపీపీఐ మార్గదర్శకాలను పాటించనందుకు.. రిజర్వ్ బ్యాంక్ ఫోన్పేకు 2019లో రూ. కోటి, 2020లో నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 1.39 కోట్ల జరిమానా విధించింది. ఇప్పుడు మరో సారి రూ. 21 లక్షల జరిమానా విధించింది. -
క్వాలిటీ ఉంటే చాలు.. ఇల్లు కొనేందుకు సిద్ధం!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు.. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు.. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం.. అందుబాటు ధరతో పాటు నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు నగరంలో ఇల్లు కొనేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్లను నిర్మించాలని సూచించింది.మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయి. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇళ్లకు శ్రీకారం చుట్టారు.నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. ఉప్పల్, కూకట్పల్లి, మియాపూర్, కొంపల్లి, శామీర్పేట వంటి పలు ప్రాంతాల్లో రూ.45 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ హైదరాబాద్ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టిసారిస్తున్నారు. -
నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధించిన అదానీ పోర్ట్స్
భారతదేశం ముడి చమురు దిగుమతిని ప్రభావితం చేసేలా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) చర్యలు చేపట్టింది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్గా ఉన్న ఏపీసెజ్ యూఎస్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్ ద్వారా ఆంక్షల్లో ఉండి రాకపోకలు సాగిస్తున్న నౌకలపై పూర్తి నిషేధాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశంలో అదానీ ఆపరేట్ చేస్తున్న అన్ని ఓడరేవుల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది.భారతదేశ ఇంధన పోర్ట్ఫోలియోలో కీలకంగా ఉన్న రష్యన్ ముడి చమురు ప్రవాహంపై ఈ చర్యలు ప్రభావితం చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదానీ కొత్త ఆదేశాల ప్రకారం.. పాశ్చాత్య ప్రభుత్వాల ఆంక్షలకు గురైన నౌకలకు ఏపీసెజ్ టెర్మినల్స్ ప్రవేశం, బెర్తింగ్, పోర్ట్ సర్వీసులను పూర్తిగా నిషేధించింది. అందుకు అనుగుణంగా షిప్పింగ్ ఆపరేటర్లు నామినేట్ చేసిన నౌక ఆంక్షల పరిధిలో లేదని నిర్ధారిస్తూ రాతపూర్వక హామీ సమర్పించాల్సి ఉంటుంది.అంతర్జాతీయ పరిశీలన పెరగడం, షాడో ఫ్లీట్(నిబంధనలకు విరుద్ధంగా విదేశీ చమురు సరఫరా) అధికమవుతుండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరాలు, వస్తువుల ఎగుమతులు, దిగుమతులపై స్క్రూటినీ పెరుగుతున్న నేపథ్యంలో అదానీ గ్రూప్ ఈమేరకు చర్యలు చేపట్టినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ చర్యల వల్ల రష్యా చమురుపై సరఫరా పరంగా ఒత్తిడి పెరుగుతుందనే వాదనలున్నాయి.ఏపీసెజ్ ఫ్లాగ్షిప్ టెర్మినల్స్లో ఒకటైన ముంద్రా పోర్ట్ భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 10% నిర్వహిస్తుంది. రష్యన్ చమురు సరఫరాకు కీలక కేంద్రంగా ఉంది.హెచ్పీసీఎల్-మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ (హెచ్ ఈఎంఎల్) తన ముడి చమురు దిగుమతుల్లో 100 శాతం ముంద్రా ద్వారానే కొనసాగిస్తోంది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కూడా బహుళ శుద్ధి కార్యకలాపాల కోసం ముంద్రాను విస్తృతంగా ఉపయోగిస్తుంది.పోర్ట్ ట్రాఫిక్ డేటా ప్రకారం, ఇటీవలి నెలల్లో ముంద్రాకు 50% రష్యన్ ముడి చమురు బ్యారెళ్లు సరఫరా అవుతున్నాయి.కాండ్లా, ముంబై, పారాదీప్ వంటి ప్రభుత్వ ఓడరేవులకు సరఫరా పెరిగే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: వంతారాపై సుప్రీంకోర్టు విచారణ.. సీల్డ్ కవర్లో నివేదిక సమర్పణ -
డీజిల్లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటన
ఇప్పటి వరకు ఈ20 పెట్రోల్ గురించి చెప్పిన నితిన్ గడ్కరీ.. తాజాగా ఐసోబుటనాల్ గురించి పేర్కొన్నారు. డీజిల్లో 10 శాతం ఐసోబుటనాల్ను కలపడానికి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) కృషి చేస్తోందని కేంద్ర రవాణా శాఖమంత్రి అన్నారు.ఇండియా షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) వార్షిక సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డీజిల్లో పదో వంతు ఇథనాల్ను కలపడంపై జరిగిన ట్రయల్స్ విజయవంతం కాలేదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా.. ఐసోబుటనాల్ మిశ్రమం ఉపయోగించాలని అన్నారు. ఐసోబుటనాల్ అనేది మండే లక్షణాలతో కూడిన ఆల్కహాలిక్ సమ్మేళనం. దీనిని డీజిల్తో పాటు ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు.ఈ20 పెట్రోల్పై తప్పుడు ప్రచారం..ఈ20 పెట్రోల్ వినియోగంపై వస్తున్న వదంతులు అంతా.. తప్పుడు ప్రచారమని గడ్కరీ అన్నారు. ఇథనాల్ వినియోగం పెరిగితే.. ఇంధన దిగుమతులు తగ్గుతాయి. దీనివల్ల దేశ ఆర్ధిక పరిస్థితి కూడా కొంత పెరుగుతుంది, రైతుల ఆదాయం పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?భారతదేశంలో ఇథనాల్ అనేది ఎక్కువగా చెరకు మొలాసిస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న, బియ్యం, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వనరులను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్లలో మొక్కజొన్న ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతుందని మంత్రి అన్నారు. -
వంతారాపై సుప్రీంకోర్టు విచారణ.. సీల్డ్ కవర్లో నివేదిక సమర్పణ
గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాలో చట్టవిరుద్ధంగా జంతువులను కొనుగోలు చేశారనే ఆరోపణలపై నిజనిర్ధారణ విచారణ నిర్వహించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ రిపోర్ట్ను రికార్డ్ చేసింది.దర్యాప్తులో భాగంగా సిట్ బృందం వంతారాలో మూడు రోజులు గడిపింది. విచారణలో భాగంగా బృందానికి సహకరించడానికి అనేక రాష్ట్ర అటవీ శాఖల సీనియర్ అధికారులతో సహా అనేక ఇతర దర్యాప్తు సంస్థలను నియమించింది. ఇన్వెస్ట్గేషన్ సందర్భంగా వంతరా సీనియర్ సభ్యులను సుదీర్ఘంగా ప్రశ్నలు అడిగి ధ్రువపత్రాలు సేకరించింది.పిటిషనర్ ఆరోపణలు..సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని సిట్.. పిటిషనర్ సీఆర్ జయ సుకిన్ లేవనెత్తిన ఆరోపణలపై నిజనిర్ధారణ విచారణ జరిపింది. వన్యప్రాణుల రెస్క్యూ, పునరావాస సదుపాయాన్ని నిర్వహించే ముసుగులో ఏనుగులు, పక్షులు, అంతరించిపోతున్న జాతులతో సహా చట్టవిరుద్ధంగా జంతువులను కొనుగోలు చేసిందని పిటిషన్లో ఆరోపించారు. వన్యప్రాణుల రక్షణ చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు, జంతు సంక్షేమ ప్రమాణాలకు వ్యతిరేకంగా జంతువులను కేంద్రంలోకి తరలించారని పిటిషనర్ పేర్కొన్నారు.వంతారా స్పందనఈ వ్యవహారంపై వంతారా స్పందిస్తూ చట్టపరంగా మూగజీవులను కాపాడేందుకు పక్కాగా చర్యలు పాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. ‘సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తున్నాం. పారదర్శకతతో చట్టాన్ని పూర్తిగా పాటించడానికి వంతారా కట్టుబడి ఉంది’ అని వంతారా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 25, 2025న సిట్ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, సెప్టెంబర్ 12 లోగా తన ఫలితాలను సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సిట్ తన నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించింది.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: జీఎస్టీ కోతతో ఇళ్లకు డిమాండ్ -
జీఎస్టీ కోతతో ఇళ్లకు డిమాండ్
పలు ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఇది ఇళ్లకు డిమాండ్ను పెంచుతుందని రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య ‘క్రెడాయ్’ అంచనా వేసింది. సిమెంట్, మరికొన్ని బిల్డింగ్ మెటీరియల్స్పై జీఎస్టీని తగ్గించడం వల్ల నిర్మాణ వ్యయం దిగొస్తుందని పేర్కొంది. సింగపూర్లో నిర్వహించిన క్రెడాయ్–నాట్కాన్ వార్షిక సమావేశం సందర్భంగా దీనిపై ప్రకటన చేసింది.జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు తప్పకుండా వినియోదారులకు బదిలీ కావాలంటూ.. సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ కంపెనీలు రేట్లను తగ్గించాలని డిమాండ్ చేసింది. జీఎస్టీలో 12 శాతం, 28 శాతం శ్లాబులను ఎత్తివేస్తూ, ఇందులోని వస్తు, సేవలను 5 శాతం, 18 శాతం కిందకు మారుస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోగా, ఈ నెల 22 నుంచి ఇది అమల్లోకి రానుండడం తెలిసిందే.సానుకూల సెంటిమెంట్జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోదారుల్లో సానుకూల సెంటిమెంట్ నెలకొన్నట్టు క్రెడాయ్ చైర్మన్ బొమన్ ఇరానీ తెలిపారు. పండుగల సీజన్కు ముందు ఇది మంచి సంకేతంగా పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతోపాటు బడ్జెట్లో పన్ను మినహాయింపులు, రెపో రేట్ల తగ్గింపు హౌసింగ్ డిమాండ్కు ప్రేరణనిస్తాయని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు విలువ పరంగా పెరిగినప్పటికీ.. సంఖ్యా పరంగా (యూనిట్లు) తగ్గినట్టు చెప్పారు. అయితే జూన్ త్రైమాసికంలో జీడీపీ బలమైన వృద్ధిని నమోదు చేయడం, విధానపరమైన చర్యల ఫలితంగా రానున్న నెలల్లో ఇళ్ల అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుబాటు ధరల ఇళ్లకు ఉన్న రూ.45 లక్షల పరిమితిని సవరించాలన్న డిమాండ్ను మరోసారి ప్రస్తావించారు. రూ.45 లక్షల వరకు ఉన్న ఇళ్లపై జీఎస్టీ ఒక శాతం కాగా, అంతకుమించితే 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. పన్నుల భారం తగ్గించాలి..రియల్ ఎస్టేట్ రంగంపై కేంద్రం, రాష్ట్రాలు కలిపి 35–45 శాతం వరకు పన్నులు విధిస్తున్నాయని.. ఈ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని శేఖర్ పటేల్ పేర్కొన్నారు. పన్నులు తగ్గించడం వల్ల ప్రాపర్టీల ధరలు దిగొస్తాయన్నారు. క్రెడాయ్లో దేశవ్యాప్తంగా 13,000 మంది డెవలపర్లు సభ్యులుగా ఉన్నారు.ఇదీ చదవండి: ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు! -
స్టార్ హెల్త్కు నగదు రహిత చికిత్సలు బంద్
నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామంటూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కు అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్పీఐ) హెచ్చరిక జారీ చేసింది. స్టార్ హెల్త్ నుంచి ఆస్పత్రులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ప్రస్తావించింది. ఏహెచ్పీఐలో 1,500 ప్రైవేటు ఆస్పత్రులు సభ్యులుగా ఉన్నాయి.చికిత్సల ధరలను తగ్గించాలంటూ ఒత్తిడి చేయడం, డాక్టర్ల క్లినికల్ నిర్ణయాలపై అసంబద్ధమైన ప్రశ్నలు, నగదు రహిత క్లెయిమ్లకు ఆమోదం తెలిపి, తుది బిల్లులో అడ్డమైన కోతలు విధించడం వంటి చర్యలతోపాటు.. నగదు రహిత చికిత్సలను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం చేస్తున్నట్టు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దృష్టికి ఏహెచ్పీఐ తీసుకెళ్లింది. కాగా, ఏహెచ్పీఐ నిర్ణయం ఏకపక్షం, దురదృష్టకరంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాఖ్యానించింది. పాలసీదారులు స్టార్ హెల్త్ ద్వారా సేవలు పొందడంపై దీని ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. -
పసిడి ప్రియులకు ఊరట.. తగ్గిన బంగారం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారగా పెరిగాయి. అయితే శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు!
పెరుగుతున్న జీవన వ్యయాలు, మార్కెట్ అస్థిరతలు, ఆర్థిక అనిశ్చితి వల్ల పర్సనల్ ఫైనాన్స్ అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మీరు ఓ సంస్థలో ఉద్యోగిగా ఉన్నా, ఫ్రీలాన్సర్గా చేస్తున్నా, చిన్న వ్యాపారం సాగిస్తున్నా, గృహిణిగా ఉన్నా.. ఆర్థిక స్వాతంత్ర్యం ఎంతో ముఖ్యం. ఎలాంటి వారైనా దీర్ఘకాలంలో స్థిరంగా డబ్బు సంపాదించేలా కొన్ని మార్గాలను పరిశీలిద్దాం. అయితే కింది అంశాలను పరిశీలించిన తర్వాత క్రమశిక్షణతో వీటిని పాటించడం చాలాముఖ్యమని గమనించాలి.ఆదాయం.. ఖర్చుల ట్రాకింగ్..నెలకు కొందరు పెద్దమొత్తంలో సంపాదిస్తారు. ఇంకొందరు కాస్త తక్కువగానే ఆర్జిస్తారు. ఎంత ఆదాయం సమకూరుతున్నా ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. అందుకు బడ్జెట్ పాటించాలి. బ్యాంకు ఖాతాలో నుంచి వెళ్లే, అందులోకి వచ్చే ప్రతి రూపాయిని ట్రాక్ చేయాలి. అందుకు స్ప్రెడ్ షీట్లు, బడ్జెట్ యాప్లు వంటివి ఉన్నాయి. లేదా సాధారణ నోట్ బుక్లోనూ రికార్డు చేయవచ్చు. ఇందులో మీ ఖర్చులను స్పష్టమైన కేటగిరీలుగా విభజించాలి.నిత్యావసరాలు (అద్దె, కిరాణా సామాగ్రి, యుటిలిటీలు)డిసిక్రీషనరీ స్పెండింగ్ (షాపింగ్, డైనింగ్)పొదుపు, పెట్టుబడులుప్రతి కేటగిరీలో ఖర్చు పరిమితులను కేటాయించుకోవాలి.ఉదాహరణకు..కిరాణా సామాగ్రి: రూ.8,000ఎంటర్ టైన్మెంట్: రూ.3,000పొదుపు: రూ.5,000డిస్క్రీషనరీ స్పెండింగ్ను పరిమితం చేయడం వల్ల దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడానికి మరింత అవకాశం లభిస్తుంది.ఎమర్జెన్సీ ఫండ్జీవితం అనూహ్యమైనది. ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. అందుకు సిద్ధంగా ఉండాలి. లేకపోతే ఉద్యోగ నష్టం, వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంటి ఖర్చులు.. వంటి వాటితో ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.ఎంత సరిపోతుంది?కనీసం 6 నెలల విలువైన నిత్యావసర ఖర్చులు.. ఇంటి అద్దె, ఆహారం, యుటిలిటీలు, ఈఎంఐలను చెల్లించేలా కార్పస్ను క్రియేట్ చేయాలి. ఈ నిధిని అధిక వడ్డీ పొదుపు ఖాతా, స్వల్పకాలిక స్థిర డిపాజిట్ లేదా మనీ మార్కెట్ ఫండ్ వంటి లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.ఇది ఎందుకు ముఖ్యం?దీర్ఘకాలం లక్ష్యంతో చేసే పొదుపుపై ప్రభావం పడకుండా ఆపద సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ రక్షిస్తుంది. ఆర్థికంగా భారం కాకుండా, అధిక వడ్డీ రుణాలు తీసుకోకుండా భరోసా కల్పిస్తుంది.ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి?సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (ఎస్ఐపీ) నెలవారీ చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తాయి. అవి రెండు ముఖ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాంపౌండింగ్.. మీ రాబడులపై మరింత ఆదాయాన్ని పెంచుతాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. కొత్తగా పెట్టుబడి ప్రారంభించాలనుకుంటే వైవిధ్యభరితమైన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా హైబ్రిడ్ ఫండ్లతో మొదలు పెట్టవచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే, ఈక్విటీ విలువ తగ్గుతుంటే బంగారం హెడ్జింగ్గా పని చేస్తుంది.అప్పుల నిర్వహణఅప్పు చేయడం తప్పు. తప్పని పరిస్థితుల్లో చేసిన అప్పును వెంటనే తీర్చేయాలి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు తరచుగా 30% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. తిరిగి చెల్లించే క్రమంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు బిల్లుల్లో "కనీస చెల్లింపు" ఉచ్చులో పడకూడదు. దీంతో తర్వాతి బిల్లు సైకిల్లో అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బకాయిలను పే చేయాలి.ఇదీ చదవండి: తొమ్మిది ఎన్బీఎఫ్సీల లైసెన్స్లు సరెండర్ -
తొమ్మిది ఎన్బీఎఫ్సీల లైసెన్స్లు సరెండర్
ఫోన్పే టెక్నాలజీ సర్వీసెస్ సహా తొమ్మిది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీవోఆర్/లైసెన్స్లు)ను స్వాధీనం చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఎన్బీఎఫ్సీ వ్యాపారం నుంచి తప్పుకోవడంతో ఫోన్పే టెక్నాలజీ సర్వీసెస్ సీవోఆర్ను వెనక్కిచ్చేసింది.ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తన మాతృ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్లో విలీనం కావడంతో లైసెన్స్ను స్వాధీనం చేసింది. ఆర్బీజీ లీజింగ్ అండ్ క్రెడిట్, యషిలా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.లైసెన్స్లు సరెండర్ చేయడానికి కారణాలు..ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఎన్బీఎఫ్సీ నిర్మాణం ఇకపై వారి వ్యాపార లక్ష్యాలతో సరపోదని కొన్ని కంపెనీలు తెలుసుకున్నాయి. ఉదాహరణకు ఫోన్ పే టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రుణాలు, ఇతర ఆర్థిక సేవల నుంచి వైదొలిగింది. నియంత్రిత విభాగాల్లో వ్యాపారం ముందుకు సాగదని నమ్మి స్పష్టమైన వైఖరితో రిజిస్ట్రేషన్ను తిరిగి ఇచ్చేసింది.ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తన మాతృ సంస్థతో విలీనం తరువాత లైసెన్స్ను సరెండర్ చేసింది. ఏకీకృత వ్యాపార సంస్థ కింద కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.కొన్ని ఎన్బీఎఫ్సీలు తమ రుణ కార్యకలాపాలను మూసివేయడానికి లేదా ప్రత్యామ్నాయ, అనియంత్రిత ఆర్థిక నమూనాలకు మారడానికి నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ఈ రిజిస్ట్రేషన్ అనవసరంగా భావిస్తున్నాయి.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్పై రూ.35,000 వరకు ఆఫర్ -
రిటైల్ రుణాల పట్ల జాగ్రత్త
భవిష్యత్తు రిటైల్ రుణాల విషయంలో బ్యాంక్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ రంగానికి చెందిన వెటరన్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కామత్ సూచించారు. పోర్ట్ఫోలియో (రుణ ఆస్తులు) పరంగా అస్థిరతలు లేకుండా చూసుకోవాలని కోరారు. బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కామత్ మాట్లాడారు.కార్పొరేట్లు (కంపెనీలు) నిధుల కోసం బ్యాంకులపై ఆధారపడడం కొంత కాలానికి తగ్గుతుందంటూ.. భవిష్యత్తులో బ్యాంకులకు ప్రధాన వ్యాపారం రిటైల్ విభాగం నుంచే వస్తుందన్నారు. రిటైల్ విభాగంలో ఆస్తుల నాణ్యత వేగంగా క్షీణించే రిస్క్ ఉంటుందని హెచ్చరించారు. ఈ రిస్క్ పోర్ట్ఫోలియో పరంగా అసమానతల రూపంలో ఎదురవుతుందన్నారు. బ్యాలన్స్షీట్లలో లోపాలు చోటుచేసుకుంటే అన్సెక్యూర్డ్ రుణాల్లో అధిక భాగం వసూలు కాకుండా పోతాయంటూ, బ్యాంక్లు ఈ విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు.ఫిన్టెక్లతో బ్యాంకులు పోటీపడక తప్పదన్నారు. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తులకు ఫిన్టెక్లు రుణ సాయం అందిస్తున్నట్టు చెప్పారు. రిటైల్ రుణ విభాగంలో పరిమితికి మించి రుణ వితరణ (ఒకే వ్యక్తికి) ఉందన్నారు. చిన్న ఇన్వెస్టర్లు డెరివేటివ్స్లో రూ.1.75 లక్షల కోట్లు నష్టపోయారన్న ఇటీవలి సెబీ డేటాను కామత్ ప్రస్తావించారు. నియంత్రణ సంస్థలు ఇప్పుడు దీన్ని కఠినతరం చేస్తున్నాయంటూ, ఈ చర్యలు ఫలితాన్నిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే రుణ ఎగవేతలు పెరగొచ్చొని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్పై రూ.35,000 వరకు ఆఫర్ -
ఎలక్ట్రిక్ బైక్పై రూ.35,000 వరకు ఆఫర్
ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ‘ఓబెన్ ఎలక్ట్రిక్’ పండుగల సందర్భంగా పలు ఆఫర్లు ప్రకటించింది. ‘మెగా ఫెస్టివ్ ఉత్సవ్’ పేరిట దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపింది. కంపెనీ ఫ్లాగ్షిప్ మోటారు సైకిళ్లు రోర్ ఈజెడ్ సిగ్మా, రోర్ ఈజెడ్ కొనగోళ్లపై క్యాష్ బ్యాక్లు ప్రకటించింది.రోర్ ఈజెడ్ సిగ్మా లేదా రోర్ ఈజెడ్లను రూ.20,000 వరకు ధర తగ్గించి విక్రయిస్తున్నట్టు, దీనికితోడు రూ.10,000 క్యాష్బ్యాక్ అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే ప్రతీ కొనుగోలుపై బంగారం కాయిన్ను ఇస్తున్నట్టు తెలిపింది. అలాగే లక్కీ డ్రాలో ఐఫోన్ను సైతం గెలుచుకోవచ్చని పేర్కొంది. తమ మోటారు సైకిళ్ల పనితీరును తెలుసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తూ అసాధారణ విలువతో మెగా ఫెస్టివ్ ఉత్సవ్ కార్యక్రమాన్ని రూపొందించినట్టు ఓబెన్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో మధుమిత అగర్వాల్ తెలిపారు.ఇదీ చదవండి: ఊబకాయం.. ఆర్థిక భారం! -
ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాలి
న్యూఢిల్లీ: భౌగోళికరాజకీయ పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లాంటి ముడి వస్తువులు, ఇతరత్రా టెక్నాలజీలపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాల్సి ఉంటుందని ఆటో విడిభాగాల సంస్థల సంఘం ఏసీఎంఏ ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా తెలిపారు. సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలని, మొబిలిటీ విడిభాగాలకు భారత్ను విశ్వసనీయమైన హబ్గా నిలబెట్టాలనేదే తమ ఉమ్మడి లక్ష్యమని ఏసీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె వివరించారు. ‘కీలకమైన ముడి వస్తువులు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, సెమీకండక్టర్లు మొదలైన వాటి కొరత పెద్ద సవాలుగా మారింది. దీనిపై జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అపారమైన అవకాశాల కూడలిలో మనం ఇప్పుడు ఉన్నాం. కానీ అదే స్థాయిలో సవాళ్లు కూడా ఉన్నాయి. వాణిజ్య యుద్ధాలు, భౌగోళికరాజకీయ ఒడిదుడుకులు, టారిఫ్లపరమైన ఉద్రిక్తతలు, ఎగుమతులపరంగా పరిమితుల్లాంటివన్నీ కూడా సరఫరా వ్యవస్థ స్వరూపాన్ని మార్చివేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక ముడి వస్తువులను దక్కించుకునేందుకు ప్రభుత్వంతో మరింతగా కలిసి పనిచేయాలి. అలాగే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలను పటిష్టం చేసుకోవాలి. అంతర్జాతీయంగా పోటీపడే విధంగా మన పరిశ్రమ బలోపేతం కావాలి‘ అని మార్వా చెప్పారు. సరఫరా వ్యవస్థ పటిష్టం కావాలి: సియామ్ మరోవైపు, సరఫరా వ్యవస్థలనేవి కేవలం వ్యయాలను తగ్గించుకునే అంశానికే పరిమితం కాకుండా వైవిధ్యంగా, ఎలాంటి అవాంతరాలెదురైనా నిలదొక్కుకునే విధంగా పటిష్టంగా మారాలని వాహనాల తయారీ సంస్థల సంఘం సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర సూచించారు. ఇందుకోసం వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమో, అలాగే అలాంటి భాగస్వామ్యాలకు దోహదపడేలా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం కూడా ముఖ్యమేనని చంద్ర చెప్పారు. -
ఇక భారీ ఐపీవోలకు జోష్
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా భారీ కంపెనీల పబ్లిక్ ఇష్యూ నిబంధనలను సరళీకరించేందుకు నిర్ణయించింది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా విషయంలో వెసులుబాటును కల్పించనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితినీ సవరించనుంది. వీటితో పాటు పలు తాజా ప్రతిపాదనలను శుక్రవారం(12న) నిర్వహించిన బోర్డు సమావేశంలో సెబీ అనుమతించింది. వివరాలు చూద్దాం..ముంబై: అతి భారీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టడంలో దన్నునిస్తూ సెబీ తాజాగా పలు వెసులుబాట్లకు తెరతీస్తోంది. ప్రధానంగా పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించే అంశంలో గడువును సవరించేందుకు నిర్ణయించింది. దీంతో నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తదితర మెగా అన్లిస్టెడ్ కంపెనీలు లబ్ది పొందే వీలుంది. తాజా మార్గదర్శకాలు అమల్లోకి వస్తే దిగ్గజ కంపెనీలు లిస్టింగ్లోనే భారీగా వాటాను విక్రయించవలసిన అవసరం ఉండదు. పబ్లిక్కు కనీస వాటా కల్పించే విషయంలో తగినంత గడువుకు వీలు చిక్కనుంది. 10 శాతం నుంచి తగ్గింపు కొత్త మార్గదర్శకాల ప్రకారం రూ. 50,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువగల కంపెనీలు ఐపీవోలో ప్రస్తుత 10 శాతానికి బదులుగా 8 శాతం వాటాను విక్రయించేందుకు అనుమతిస్తారు. వీటికి పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించడంలో ఐదేళ్ల గడువునిస్తారు. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా అమలవుతోంది. రూ. లక్ష కోట్లకుపైన మార్కెట్ విలువతో ఐపీవోకు వచ్చే కంపెనీలు ప్రస్తుత 5 శాతానికి బదులుగా 2.75 శాతం వాటాను ఆఫర్ చేయవచ్చు. రూ. 5 లక్షల కోట్లకు మించిన అతిభారీ కంపెనీలైతే ఐపీవోలో 2.5 శాతం వాటా విక్రయానికీ వీలుంటుంది. ఇలాంటి భారీ కంపెనీలు 10ఏళ్లలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధన ఐదేళ్లు గడువును అనుమతిస్తోంది. వెరసి అతితక్కువ స్థాయిలో వాటా విక్రయించడం ద్వారా కంపెనీలు లిస్టయ్యేందుకు వీలు చిక్కుతుంది. తదుపరి దశలవారీగా పబ్లిక్ వాటాకు తెరతీయవచ్చు. దీంతో ఓకేసారి భారీస్థాయిలో వాటా విక్రయించవలసిన అవసరం తప్పుతుందని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. తద్వారా భారీ ఐపీవోలకు లిక్విడిటీ సమస్య తలెత్తకుండా నివారించవచ్చని తెలియజేశారు. రిటైల్ పరిమాణం ఓకే రూ. 5,000 కోట్లకు మించిన ఐపీవోల పరిమాణంలో రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయింపులను 35 శాతంగానే కొనసాగించనున్నట్లు పాండే తెలియజేశారు. అంతేకాకుండా అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) వాటాను సైతం 50 శాతం నుంచి పెంచే ఆలోచనలేదని స్పష్టం చేశారు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఐపీవోలలో మరింత చోటు కల్పించేందుకు వీలుగా యాంకర్ కేటాయింపులను సవరిస్తున్నట్లు వెల్లడించారు. వీటి ప్రకారం యాంకర్ వాటా రూ. 250 కోట్లుదాటితే ఇన్వెస్టర్ల సంఖ్యను ప్రస్తుత 10 నుంచి 15కు పెంచనుంది. కనీసం 5 నుంచి గరిష్టంగా 15వరకూ అనుమతిస్తారు. ఆపై ప్రతీ రూ. 250 కోట్ల కేటాయింపులకు అదనంగా 15మంది ఇన్వెస్టర్లకు వీలుంటుంది. అంటే ఒక్కో ఇన్వెస్టర్కు కనీసం రూ. 5 కోట్ల పెట్టుబడికి వీలుంటుంది. ఇదేవిధంగా యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయింపుల వాటా ప్రస్తుత 33 శాతం నుంచి 40 శాతానికి పెరగనుంది. దీనిలో ఎంఎఫ్లకు 33 శాతం, జీవిత బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్లకు మిగిలిన వాటాను రిజర్వ్ చేయనున్నారు. రీట్, ఇన్విట్లలో బీమా, పెన్షన్ ఫండ్స్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)లలో వ్యూహాత్మక ఇన్వెస్టర్ నిబంధనలను సెబీ సవరించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్)సహా కొన్ని కేటగిరీ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు)ను ఇందుకు అనుమతించనుంది. అంతేకాకుండా రీట్ను ఈక్విటీగా గుర్తించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు), స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ప్రత్యేక పెట్టుబడులకు వీలుగా ఇన్విట్ను హైబ్రిడ్గా కొనసాగించనుంది. ఇన్విట్, రీట్ నిబంధనల సవరణ ద్వారా ఇన్వెస్టర్ల పరిధి మరింత విస్తరించనుంది. దీంతో రీట్, ఇన్విట్ల వ్యూహాత్మక పెట్టుబడిదారుల కేటగిరీలో విభిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడులకు వీలు చిక్కనుంది. ఇది రీట్, ఇన్విట్లకు జోష్నివ్వడంతోపాటు.. సులభ వ్యాపార నిర్వహణకు దారి ఏర్పడనున్నట్లు పాండే పేర్కొన్నారు. పెన్షన్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, బీమా ఫండ్స్ తదితర పలు భారీ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్లకు ప్రస్తుత నిబంధనలు అడ్డుపడుతున్నట్లు తెలియజేశారు. నిజానికి దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆసక్తి చూపే ఆయా సంస్థలకు రీట్, ఇన్విట్లు అత్యుత్తమ అవకాశాలని సెబీ పేర్కొంది. ఎగ్జిట్ లోడ్ కుదింపు ఆర్థిక వృద్ధిలో అందరినీ భాగస్వాములను చేసే వ్యూహంలో భాగంగా సెబీ బోర్డు ఎంఎఫ్ పంపిణీ సంస్థలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా మరింత పారదర్శక, నిలకడైన ప్రోత్సాహకాలకు దన్నునిస్తూ గరిష్ట ఎగ్జిట్ లోడ్ను ప్రస్తుత 5 శాతం నుంచి 3 శాతానికి కోత పెట్టింది. టాప్–30 పట్టణాలను దాటి ఫండ్స్లోకి కొత్తగా మహిళా ఇన్వెస్టర్లను చేర్చుకుంటే పంపిణీదారులకు అధిక ప్రోత్సాహకాలు అందేటట్లు నిబంధనలు సవరించింది.లోరిస్క్ ఎఫ్పీఐలకు సపోర్ట్ తక్కువ రిస్్కగల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు)ను సింగిల్ విండో ద్వారా దేశీ సెక్యూరిటీల మార్కెట్లో కార్యకలాపాలు చేపట్టేందుకు అనుమతించనున్నారు. ఇందుకు వీలుగా సెబీ బోర్డు నిబంధనలను సవరించింది. తద్వారా ఎఫ్పీఐలకు దేశీయంగా సులభతర పెట్టుబడులకు వీలు చిక్కనుంది. లోరిస్క్ ఎఫ్పీఐలు దేశీ క్యాపిటల్ మార్కెట్లో సులభంగా పెట్టుబడులు చేపట్టేందుకు స్వాగత్–ఎఫ్ఐ పేరుతో తెరతీయనున్న సింగిల్ విండో దారి చూపనుంది. దీంతో యూనిఫైడ్ రిజి్రస్టేషన్ విధానం ద్వా రా విభిన్న పె ట్టుబడి మార్గాలలో ఎఫ్పీఐలు ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుందని పాండే తెలియజేశారు. ఫలితంగా పెట్టుబడుల విష యంలో ఎఫ్పీఐలకు పదేపదే ఎదురయ్యే నిబంధనలు, భారీ డాక్యుమెంటేషన్ వంటి అవరోధాలు తొలగిపోనున్నట్లు వివరించారు. లోరిస్క్ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ సొంత ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్ వెల్త్ ఫండ్స్, మలీ్టలేటరల్ సంస్థలు, అత్యంత నియంత్రణలతోకూడిన పబ్లిక్ రిటైల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ చేరనున్నట్లు వెల్లడించారు. స్వాగత్–ఎఫ్ఐ మార్గదర్శకాల ను ఎఫ్ఫీఐలతోపాటు.. విదేశీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల(ఎఫ్వీసీఐలు)కు వర్తించనున్న ట్లు పేర్కొన్నారు. 2025 జూన్30కల్లా దేశీయంగా 11,913 మంది ఎఫ్పీఐలు రిజిస్టరై ఉన్నట్లు వెల్లడించింది. రూ. 80.83 లక్షల కోట్ల ఆస్తులను హోల్డ్ చేస్తున్నట్లు తెలియజేసింది. -
భవిష్యత్ భారత్దే..!
న్యూఢిల్లీ: బలమైన ఆర్థిక శక్తిగా భవిష్యత్తంతా భారత్దేనని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషి తకెయూచి తెలిపారు. రాబోయే అనేక దశాబ్దాల పాటు భారత్ హవా నడుస్తుందన్నారు. దేశం ఆకాంక్షిస్తున్నట్లుగా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలంటే విధానాలపరంగా స్థిరత్వం అవసరమని చెప్పారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సంఘం ఏసీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా తకెయూచి ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో విశ్వసనీయమైన తయారీ హబ్గా తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు భారత్ ముందు చక్కని అవకాశం ఉందని చెప్పారు. ‘చరిత్రను చూస్తే ప్రతి కొన్ని దశాబ్దాలకు ఓ కొత్త దేశం ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం కనిపిస్తుంది. అమెరికా, జపాన్, హాంకాంగ్ మొదలైన వాటిని చూశాం. గత మూడు దశాబ్దాల కాలం చైనాకి చెందింది. ఆ దేశం ప్రపంచానికే ఫ్యాక్టరీగా ఎదిగింది. ఇకపై వచ్చే అనేక దశాబ్దాల పాటు భారత్ హవా ఉంటుంది’ అని ఆయన తెలిపారు. ఉద్యోగం చేయగలిగే వయస్సున్న జనాభా అత్యధికంగా ఉండటం, వేగంగా వృద్ధి చెందుతున్న నాలుగు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ, క్రియాశీలకమైన ప్రభుత్వ మద్దతు, కొత్త ఆవిష్కరణలు చేయడంపై ప్రజల్లో అమితాసక్తి తదితర అంశాలు భారత్కి సానుకూలమైనవని తకెయూచి చెప్పారు. జపాన్ తరహాలోనే ఇక్కడ కూడా.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు జపాన్ ఏ విధంగానైతే పరిశ్రమలకు బాసటగా నిల్చిందో భారత్లోను అదే తరహా పరిస్థితి కనిపిస్తోందని తకెయూచి చెప్పారు. ‘ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించింది, పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం), మేకిన్ ఇండియా లాంటి సాహసోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ప్రత్యక్ష పరోక్ష పన్నులను తగ్గించడంతో పాటు దేశీయంగా డిమాండ్కి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించడం లాంటి చర్యలన్నీ కూడా అంతిమంగా తయారీ రంగ వృద్ధికి దోహదపడతాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ కూడా పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను సూచిస్తాయని చెప్పారు. టారిఫ్లు పెద్ద సవాలే.. భారత ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్లు విధించడమనేది ఆటో విడిభాగాల పరిశ్రమకు పెద్ద సవాలేనని తకెయూచి అభిప్రాయపడ్డారు. అయితే, దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున సానుకూల ఫలితాలు రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇరు దేశాలు కొన్ని సానుకూల ప్రకటనలు చేసినట్లు తెలిపారు. భారత ఆర్థిక వృద్ధితో పాటు దేశ ఆటో పరిశ్రమ భవిష్యత్తు కూడా మరింత ఆశావహంగా కనిపిస్తోందన్నారు. 2024–25లో 523 బిలియన్ డాలర్ల మార్కును దాటిన ఆటో విడిభాగాల ఎగుమతులు 2030 నాటికి రెట్టింపు కాగలవని తకెయూచి చెప్పారు. ‘అంతర్జాతీయ తయారీ హబ్గా భారత్ ఎదుగుతున్న విషయాన్ని ప్రపంచం గమనిస్తోంది. అందుకే తమ తొలి గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనం ఈ–విటారా తయారీ కోసం సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఈ దేశాన్ని ఎంచుకుంది. ఈ వాహనం 100 దేశాలకు ఎగుమతి అవుతుంది’ అని పేర్కొన్నారు. -
స్వల్పంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో నమోదైన ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి నుంచి ఆగస్ట్ నెలలో కాస్తంత ఎగిసింది. జూలైలో 1.61% కాగా, ఆగస్ట్లో 2.07 శాతానికి చేరింది. కూరగాయలు, మాంసం, చేప లు, గుడ్లు, నూనెలు, ఫ్యాట్స్ ధరలు పెరగడం ఇందుకు దారితీసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) తొమ్మిది నెలల పాటు వరుస క్షీణతకు ఆగస్ట్లో బ్రేక్ పడినట్టయింది. 2024 ఆగస్ట్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.65 శాతంగా ఉంది. → ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 0.69 శాతంగా నమోదైంది. జూలైలో ఇది మైనస్ 1.76%గా ఉంది. → కూరగాయల ధరలు 15.92% పడిపోయాయి. → గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జూలైలో 1.18 శాతంగా ఉంటే, ఆగస్ట్లో 1.69 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 2.1 శాతం నుంచి 2.47 శాతానికి చేరింది. రానున్న నెలల్లో గమనించాలి.. ఆహారం, పానీయాల విభాగాల్లోని ధరల పెరుగుదల వల్లే సీక్వెన్షియల్గా (నెలవారీగా) రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్లో పెరగడానికి కారణమని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి సానుకూల ధోరణులు కనిపిస్తున్నప్పటికీ.. ఆగస్ట్ చివరి నుంచి సెపె్టంబర్ ఆరంభం వరకు అధిక వర్షాలు, వరదలు ఖరీఫ్ దిగుబడులపై ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. అంతిమంగా దిగుబడి, ధరల తీరును గమనించాల్సి ఉందన్నారు. -
బంగారం @ 1,13,800
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరల్లో ర్యాలీ కొనసాగుతోంది. శుక్రవారం ఈ విలువైన లోహాలు సరికొత్త జీవిత కాల గరిష్టాలకు చేరాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి 10 గ్రాములకు రూ.700 పెరగడంతో రూ.1,13,800 స్థాయిని నమోదు చేసింది. వెండి కిలోకి ఏకంగా రూ.4,000 పెరిగి 1,32,000ను తాకింది. అంతర్జాతీయంగా బలమైన డిమాండ్ ధరలకు మద్దతుగా నిలిచినట్టు ట్రేడర్లు తెలిపారు. ‘‘ఇటీవలి యూస్ ఆర్థిక డేటాతో ఫెడ్ 2025లోనే ఒకటికి మించిన విడతల్లో రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలు పెరిగాయి. దీంతో బంగారంలో కొనుగోళ్లు పెరిగాయి’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. పారిశ్రామిక డిమాండ్కు తోడు ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి బలమైన పెట్టుబడుల ప్రవాహంతో వెండి ధరలు పెరిగినట్టు చెప్పారు. ఈ ఏడాది పెట్టుబడిదారులకు బంగారం, వెండి మంచి లాభాన్నిచ్చాయి. ఇప్పటి వరకు బంగారం ధర 10 గ్రాములకు రూ.34,850 (44 శాతం), వెండి ధర కిలోకి రూ.42,300 (47 శాతం) చొప్పున పెరగడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం స్వల్ప లాభంతో 3,683 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
ఈయూతో ఒప్పందం.. ఆ రంగానికి అవకాశాలు
ఐరోపా సమాఖ్య (ఈయూ)తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు పెద్ద ఎత్తున అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ఎగుమతులను పెంచుకోవచ్చని, 27 దేశాల కూటమికి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలతో కొత్త భాగస్వామ్యాలకు అవకాశాలు లభిస్తాయని చెప్పారు.భారత ప్రజలకు సరైన టెక్నాలజీ, సరైన రవాణా పరిష్కారాలను తీసుకొచ్చేందుకు వీలుంటుందన్నారు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయంటూ.. ఆటోమొబైల్ రంగానికి ఇది ఎంతో ముఖ్యమన్నారు. ఈయూలో మార్కెట్ అవకాశాలపై అవగాహన కుదిరిన వెంటనే చర్చలను త్వరగా ముగిస్తామని చెప్పారు.ఈయూ అధికారుల బృందం ఢిల్లీలో 13వ విడత చర్చలు నిర్వహించిన నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి సుంకాల్లో రాయితీలు ఇవ్వాలని ఈయూ బృందం డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఈ ఏడాది మే 6న బ్రిటన్తో కుదిరిన ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో ఆ దేశ ఆటోమొబైల్ కంపెనీలకు భారత్ రాయితీలను కల్పించడం తెలిసిందే. దీంతో ఈయూ సైతం ఇదే విధమైన డిమాండ్ చేస్తోంది.బ్రిటన్తో ఒప్పందం వల్ల ఆటోమొబైల్ దిగుమతులపై టారిఫ్లు 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గుతాయని అగర్వాల్ చెప్పారు. అది కూడా 10–15 ఏళ్ల కాలంలో క్రమంగా అమలవుతుందన్నారు. సున్నిత రంగాల ప్రయోజనాలను కాపాడేందుకు యూకేతో ఒప్పందంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. భారత ఆటోమొబైల్ రంగం ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా క్రమంగా భారత్ మార్కెట్ అవకాశాలకు తలుపుల తెరిచే నిబంధనలు పెడుతున్నట్టు వివరించారు. -
రూ.2.25 లక్షల బెనిఫిట్: కొరియా బ్రాండ్ బంపరాఫర్
కియా ఇండియా.. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.2.25 లక్షల వరకు ఫ్రీ-జీఎస్టీ & పండుగ ప్రయోజనాలను కలిపి అందించే ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ 2025 సెప్టెంబర్ 22 వరకు చెల్లుతుంది.ఈ ఆఫర్లో రూ.58,000 వరకు ప్రీ-జీఎస్టీ సేవింగ్స్ & రూ.1.67 లక్షల వరకు ఫెస్టివల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఇప్పుడు సెల్టోస్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ వంటి ప్రసిద్ధ మోడళ్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఆఫర్ అనేది ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చిన్న కారుపై.. భారీ తగ్గింపు: ఏకంగా రూ.3 లక్షలుఈ సందర్భంగా, కియా ఇండియా సీఎస్ఓ జూన్సు చో మాట్లాడుతూ.. పండుగల సమయంలో మా కస్టమర్లకు మరింత ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాము. ప్రత్యేకమైన ప్రీ-జీఎస్టీ సేవింగ్స్ & పండుగ ప్రయోజనాలతో, కస్టమర్లు ఇప్పుడు తమకు ఇష్టమైన కియాను ఇంటికి తీసుకెళ్లవచ్చు. కియాను సొంతం చేసుకోవడం అంటే కేవలం కారు నడపడం మాత్రమే కాదు, రోజువారీ జీవితానికి సౌకర్యం, ఆనందాన్ని జోడించడం అని మేము విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు. -
ట్రేడ్ వార్తో భారత్కు సవాళ్లు: మారిషస్ ప్రధాని
ప్రతీకార సుంకాలు, వాణిజ్య వివాదాలతో భారత్కు భారీ సవాళ్లు ఎదురవుతున్నట్లు మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రామ్గులామ్ పేర్కొన్నారు. రక్షణాత్మక విధానాలు పెరిగిపోవడం, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఉధృతమవుతున్న ఆందోళనలు, వాతావరణ సంబంధ విఘాతాలు పలురకాల రిస్కులకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు.విదేశీ వ్యవహారాల శాఖ, ఇతర పారిశ్రామిక సమాఖ్యలతో కలసి ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన మారిషన్ ఇండియా వ్యాపార సదస్సు(బిజినెస్ కాంక్లేవ్)లో నవీన్చంద్ర ప్రసంగించారు. సామాజిక, ఆర్థికాభివృద్ధిలో దీర్ఘకాలంగా మారిషస్కు భారత్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.అన్ని సమయాలలోనూ మారిషస్కు మద్దతివ్వడంలో ధృడంగా నిలుస్తున్నట్లు ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, విధానాలు అస్థిరంగా, అంచనాలకు అందని విధంగా మారినట్లు వ్యాఖ్యానించారు. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, అదుపుతప్పుతున్న రవాణా వ్యయాలు, వాతావరణ సంబంధ విఘాతాలు విభిన్న రిస్కులకు దారి చూపుతున్నట్లు వివరించారు. -
మొదలైన ఐఫోన్ 17 బుకింగ్స్: ఎక్కడ, ఎలా ఆర్డర్ చేయాలంటే..
ఈ వారం ప్రారంభంలో యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసింది. కంపెనీ ఈ లేటెస్ట్ ఫోన్స్ కోసం ప్రీ-బుకింగ్లను భారతదేశంలో శుక్రవారం (సెప్టెంబర్ 12) సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభించింది. ఆపిల్ ఆన్లైన్ స్టోర్ లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా కూడా దీనిని బుక్ చేసుకోవచ్చు. అమ్మకాలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఆ రోజు మీరు ఐఫోన్ డెలివరీ పొందవచ్చు లేదా మీ నగరంలోని ఆపిల్ స్టోర్ నుంచి కూడా తీసుకోవచ్చు.ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్స్.. ఎలా ఆర్డర్ చేయాలంటే..●యాపిల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.●హోమ్ పేజీలోని మీ ఐఫోన్ 17 మోడల్ను ఎంచుకోండి.●మీరు బుక్ చేయాలనుకుంటున్న వేరియంట్, కలర్, స్టోరేజ్ వంటి వాటిని సెలక్ట్ చేసుకొండి.●బుకింగ్స్ పూర్తి చేయడానికి కార్ట్కు జోడించి, చెక్అవుట్ మీద క్లిక్ చేయండి.●ఆ తరువాత కార్డ్, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. లేదా ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.●ఇవన్నీ పూర్తయిన తరువాత బుకింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత కంపెనీ డెలివరీ టైమ్లైన్ను షేర్ చేస్తుంది.ఐఫోన్ 17 ధరలుఐఫోన్ 17➤ఐఫోన్ 17 - 256జీబీ: రూ. 82,900➤ఐఫోన్ 17 - 512జీబీ: రూ.1,02,900ఐఫోన్ 17 ప్రో & 17 ప్రో మాక్స్➤ఐఫోన్ 17 ప్రో 256జీబీ: రూ.1,34,900➤ఐఫోన్ 17 ప్రో 512జీబీ: రూ.1,54,900➤ఐఫోన్ 17 ప్రో 1టీబీ: రూ.1,74,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256జీబీ: రూ.1,49,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 512జీబీ: రూ.1,69,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 1టీబీ: రూ.1,89,900➤ఐఫోన్ 17 ప్రో మాక్స్ 2టీబీ: రూ. 2,29,900ఐఫోన్ 17 ఎయిర్ ➤ఐఫోన్ 17 ఎయిర్ 256జీబీ: రూ.1,19,900➤ఐఫోన్ 17 ఎయిర్ 512జీబీ: రూ.1,39,900➤ఐఫోన్ 17 ఎయిర్ 1టీబీ: రూ.1,59,900ఇదీ చదవండి: ఐఫోన్ 17 ఎయిర్: స్పందించిన ఓపెన్ఏఐ సీఈఓ -
ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో, పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువు పొడిగింపుపై డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా, బీజేపీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు భర్తృహరి మహతాబ్ (కటక్), పీపీ చౌదరి (పాలీ) కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖలు రాసి గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీఆర్ దాఖలుకు గడువు సెప్టెంబర్ 15న ముగియనుంది.పొడిగింపు కోరడానికి కారణాలుఐటీఆర్-5, ఆడిట్ సంబంధిత ఫారాలతో సహా ఐటీఆర్ ఫారాలను విడుదల చేయడంలో జాప్యం జరిగింది. జూలై, ఆగస్టు నెలల్లో ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి వచ్చాయి.ఐటీఆర్ పోర్టల్లో ధ్రువీకరణ లోపాలు, అప్లోడ్ నెమ్మదించడం, ఫారం 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్లో అసమతుల్యత వంటి సాంకేతిక లోపాలు.ఒడిశాలో వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాలు, విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయానికి అంతరాయం కలిగించాయి. దీంతో సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయడం కష్టతరం చేసింది.మరోవైపు పండుగ సీజన్ పరిమితులు.గణేష్ పూజ, దుర్గా పూజ, దసరా వంటి ప్రధాన సెలవుదినాలు సిబ్బంది లభ్యతను పరిమితం చేశాయి.ఐసీఏఐ కొత్త ఫార్మాట్ల కారణంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల తయారీకి అదనపు సమయం అవసరమవుతోంది.ఏకకాలంలో ఏకకాలంలో జీఎస్టీ ఫైలింగ్స్, ఐటీఆర్ ఫైలింగ్ పన్ను నిపుణుల పనిభారాన్ని పెంచుతోంది.ప్రతిపాదిత పొడిగింపులుఐటీఆర్ (నాన్-ఆడిట్) దాఖలుకు గడువు సెప్టెంబర్ 15 వరకు ఉండగా సెప్టెంబర్ 30 వరకు పొడింగించాలని కోరుతున్నారు. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ (TAR) గడువు సెప్టెంబర్ 30 ఉండగా అక్టోబర్ 31 వరకు, టీఏఆర్ తో ఐటీఆర్ ఫైలింగ్కు అక్టోబర్ 31 చివరి తేదీ కాగా నవంబర్ 30 పొడిగించాలని విజ్ఙప్తి చేస్తున్నారు. ఇక ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు గడువును కూడా డిసెంబర్ 31 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించాలని అభ్యర్థనలు వచ్చాయి.విస్తృత మద్దతు కర్ణాటక స్టేట్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ (KSCAA), అడ్వకేట్స్ టాక్స్ బార్ అసోసియేషన్ (ATBA), ఐసీఏఐకి సంబంధించిన సెంట్రల్ ఇండియా రీజినల్ కౌన్సిల్ (CIRC) వంటి పన్ను నిపుణుల సంఘాలు కూడా గడువు పొడిగింపును కోరుతున్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తున్న నేపథ్యంలో, లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు, నిపుణులు అధికారిక నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
కొత్త రూల్: పీయూసీ లేకుంటే.. పెట్రోల్ లేదు!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'నో హెల్మెట్, నో ఫ్యూయెల్' విధానాన్ని గత నెలలో అమలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం 'నో పీయూసీ, నో ఫ్యూయెల్' విధానానికి శ్రీకారం చుట్టింది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే.. వాహనాలకు ఇంధనం నింపకూడదని కఠిన ఆంక్షలు పెట్టింది.భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడానికి, ప్రస్తుత తరం కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నాలను బలహీనపరిచే అక్రమ పీయూసీ సర్టిఫికెట్లను ఆపాల్సిన అవసరాన్ని గురించి మహారాష్ట్ర రవాణా మంత్రి 'ప్రతాప్ సర్నాయక్' తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఈ కొత్త విధానం ప్రకారం.. ప్రతి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ను పెట్రోల్ పంపులలోని సీసీటీవీ కెమెరాల ద్వారా స్కాన్ చేసి, దాని పీయూసీ సర్టిఫికేట్ చెల్లుబాటును ధృవీకరిస్తారు. చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ లేకుండా దొరికిన వాహనాలకు ఇంధనం నింపరు. అంతే కాకుండా ఈ పీయూసీ సర్టిఫికేట్లను అక్కడిక్కడే జారీ చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అక్రమ సర్టిఫికెట్ జారీ చేసే ముఠాలను లక్ష్యంగా చేసుకుని రవాణా శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది.ఇదీ చదవండి: దేశంలో అతిపెద్ద డీల్!.. రూ.3472 కోట్లు వెచ్చించిన ఆర్బీఐభారతదేశంలో కొత్త కారు లేదా బైక్ యజమానులకు కొనుగోలు తేదీ నుంచి కనీసం ఒక సంవత్సరం పాటు పీయూసీ సర్టిఫికేట్ అవసరం లేదు. అంతే కాకుండా బీఎస్3 వాహనాలకు ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లభిస్తుంది. బీఎస్4, బీఎస్6 మోడళ్లకు పూర్తి సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ జారీ చేస్తారు. -
హైదరాబాద్ 4.0 దిశగా శరవేగంగా అడుగులు
నిజాం కాలంలో 1591లో పురుడు పోసుకున్న హైదరాబాద్ నగరం అభివృద్ధి ప్రస్థానం నేడు శరవేగంగా సాగుతోంది. తాజాగా ఫ్యూచర్ సిటీ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 1998లో ఐటీ రాకతో హైదరాబాద్ వేగం మరింత పుంజుకుంది. అప్పటివరకు హైదరాబాద్, సికింద్రాబాద్లకే పరిమితమైన అభివృద్ధి సైబరాబాద్కు విస్తరించింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డు, మెట్రోల ఏర్పాటుతో నగర రూపురేఖలే మారిపోయాయి. అంతర్జాతీయ మౌలిక వసతులు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దిగ్గజసంస్థలు నగరంలో కొలువుదీరాయి. అయితే గ్రేటర్పై ఒత్తిడి పెరగడంతో దానికి అనుబంధంగా నాలుగో నగరం అనివార్యమైపోయింది. ప్రధాన నగరంలో రద్దీని తగ్గించడంతోపాటు భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు తప్పనిసరైంది. –సాక్షి, సిటీబ్యూరోప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా నగరాల్లో ఆరు ఇండియాలోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా నగరాలు కేవలం జనాభా సెంటర్లు మాత్రమే కాదు. ప్రధాన ఆరి్థక, ఉద్యోగ కేంద్రాలు కూడా. 146 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, 87.6 కోట్ల జనాభాకు చేరుతుందని అంచనా. మన మెట్రో నగరాలు ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నాయి. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల వంటివి నగరాల అభివృద్ధి, విస్తరణకు ప్రధాన కారణాలు.మహానగరం మనదే.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఆర్థిక వృద్ధికి ఇంజిన్లు అని చెప్పవచ్చు. ప్రపంచ జీడీపీలో 80 శాతం కంటే ఎక్కువ వాటా నగరాలదే. ఉత్పాదకత, ఆవిష్కరణ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిని సాధించడంలో నగరాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలు 4,308 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. 1995 నుంచి 2025 మధ్య కాలంలో ఈ నగరాలు ఏకంగా 2,136 చ.కి.మీ. విస్తరించాయి. గత మూడు దశాబ్దాల్లో విస్తీర్ణాలు 98 శాతం పెరిగాయి. ఇందులో అత్యధిక విస్తీర్ణం హైదరాబాద్దే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ 7,257 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది.వృద్ధి ఎక్కడ్నుంచి ఎక్కడికి.. 1990 చివర్లో హైదరాబాద్లో ఫార్మాతోపాటు ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. దీంతో 2000 సంవత్సరాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ అప్గ్రేడ్ అయ్యాయి. 2008లో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రపంచ ప్రయాణికులు, కార్గో సేవలతో వృద్ధి రెండింతలైంది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో నగరం పశి్చమ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ను విమానాశ్రయానికి అనుసంధానించింది. దీంతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నైపుణ్య కారి్మకులకు నగరం వేదికైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో ఆరి్థక, సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రోలు అందుబాటులోకి రావడంతో నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దీంతో నగరాభివృద్ధి పశి్చమం వైపు నుంచి దక్షిణం దిశగా విస్తరించింది.గ్రేటరే..7,257 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో పట్టణ ప్రాంతం 519 చ.కి.మీ. 1995లో 267 చ.కి.మీ.లుగా ఉన్న నగర అర్బన్ ఏరియా 2005లో 319 చ.కి.మీ. 2015లో 407 చ.కి.మీ.లకు విస్తరించింది. గత మూడు దశాబ్దాల్లో గ్రేటర్ పట్టణ ప్రాంతం 252 చ.కి.మీ. పెరిగింది. 95 శాతం మేర వృద్ధి చెందింది. 1995లో 49 లక్షలుగా ఉన్న గ్రేటర్ జనాభా 2015 నాటికి 87 లక్షలు, ఇప్పుడు 1.13 కోట్లకు చేరింది. గత 30 ఏళ్లలో జనాభా 131 శాతం పెరిగింది. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మాసూటికల్స్, బయో టెక్నాలజీ, టూరిజం ఇదే నగరాభివృద్ధికి చోదకాలు.హెచ్ఎంఆర్ దిశగా.. దేశానికే తలమానికంగా నిలిచేలా తెలంగాణలో ఒక ప్రధాన పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్ఎంఆర్)ను ప్రతిపాదించింది. 10,472.723 చ.కి.మీ. మేర విస్తరించి ఉండే హెచ్ఎంఆర్.. రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉంటుంది. దీంతో హైదరాబాద్తోపాటు పొరుగు జిల్లాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.మాస్టర్ ప్లాన్ తప్పనిసరి ఏ నగరానికైనా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అవసరం. మౌలిక వసతుల కల్పనతోపాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే మాస్టర్ప్లాన్ ప్రకారమే అభివృద్ధి జరగాలి. సిటికీ వలసలు పెరుగుతుండటంతో పట్టణ ప్రాంతం విస్తరిస్తుంది. – కె.విద్యాధర్, డైరెక్టర్, హెచ్ఎండీఏఉద్యోగ అవకాశాల గని ఉద్యోగ, ఉపాధి అవకాశాల పుష్కలంగా ఉండటమే హైదరాబాద్ అభివృద్ధికి కారణం. పటిష్టమైన లా అండ్ ఆర్డర్, నైపుణ్య కార్మికుల లభ్యత, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి వాటితో నగరంలోకి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి.–కె.ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ -
ఎఫ్డీడీఐ-హైదరాబాద్లో కొత్త కోర్సులు
రాయదుర్గం: ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్–హైదరాబాద్ క్యాంపస్లో కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఫుట్వేర్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్, రిటైల్ అండ్ డిజిటల్ ఫ్యాషన్ వ్యాపారం, లెదర్ యాక్సెసరీస్, బ్యాగ్ల అభివృద్ధి రంగాల్లో పరిశ్రమలు, సిద్ధంగా ఉన్న విద్యార్థుల నైపుణ్యాలను బలోపేతం చేయడానికి, ఉపాధిని పెంచడానికి దోహదం చేసేలా డిప్లొమో కోర్సుల ముఖ్య లక్షణంగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కోర్సులను ఆరు నెలల వ్యవధి గల రెండు మాడ్యూల్లుగా విభజించారు. అభ్యాసకులు ఒక మాడ్యూల్ను అనుసరించి సర్టిఫికెట్ పొందవచ్చు. రెండు మాడ్యూల్లను పూర్తి చేసి పూర్తి సంవత్సరం డిప్లొమో పొందడానికి అవకాశం కల్పిస్తారు. అందుబాటులోకి వచ్చే కోర్సులు ఇవే.. మొదటి విడతలో నూతనంగా డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్మెంట్, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్మెంట్ కోర్సులకు ఒక్కోదానికి ఒక్క మాడ్యూల్కు రూ.45 వేలు, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఒక్క మాడ్యూల్కు రూ.40 వేలను చెల్లించాల్సి ఉంటుంది.ఈ కోర్సుల కోసం దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. కోర్సులను అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులు వెబ్సైట్ www.fddiindia.comలో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 94404 71336, 99667 55563, 99667 55536లలో సంçప్రదించాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలకు రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ–హైదరాబాద్ క్యాంపస్లో సంప్రదించాలని సూచించారు. -
ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?
భారతదేశంలో రాజ్యాంగ బద్దంగా.. రాష్ట్రపతి తరువాత రెండో అత్యున్నత పదవి ఉప రాష్ట్రపతి. ఈ బాధ్యతలను సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు శుక్రవారం(సెప్టెంబర్ 12వ తేదీ) చేపట్టారు. అయితే దేశ ఉపరాష్ట్రపతి పదవికి ఎటువంటి జీతం ఉండదని బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. అయితే.. జీతం తప్ప, ఇతర ప్రోత్సాహకాలు లభించే ఏకైక పదవి ఇదే అని చెప్పడంలో సందేహం లేదు.భారత ఉపరాష్ట్రపతిగా ఎటువంటి జీతం తీసుకోనప్పటికీ.. ఈ పదవిలో ఉన్న వ్యక్తి, రాజ్యసభ ఛైర్మన్గా నెలకు రూ.4 లక్షల వేతనం పొందుతారు ((2018లో దీనిని రూ.1,25,000 నుంచి సవరించారు). ఉపరాష్ట్రపతి జీతం, భత్యాలు పార్లమెంటు అధికారుల జీత భత్యాల 1953 చట్టం ప్రకారం నిర్ణయిస్తారు. ఇందులో ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యేక జీత నిబంధన లేదు.ఉపరాష్ట్రపతికి లభించే ప్రయోజనాలుభారత ఉపరాష్ట్రపతికి జీతం లేకపోయినప్పటికీ.. అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉచిత వసతి, వైద్య సంరక్షణ, రైలు & విమాన ప్రయాణం, ల్యాండ్లైన్ కనెక్షన్, మొబైల్ ఫోన్ సర్వీస్, వ్యక్తిగత భద్రత, సిబ్బంది మొదలైనవి ఉన్నాయి.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐపదవీ విరమణ తరువాత కూడా అనేక సదుపాయాలు కల్పిస్తూ.. నెలకు సుమారు రూ. 2 లక్షల పెన్షన్, పర్సనల్ సెక్రటరీ, అసిస్టెంట్, సెక్యూరిటీ, డాక్టర్, ఇతర సిబ్బంది సేవలను పొందుతూనే ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి మరణించిన తరువాత.. ఆయన భార్యకు కూడా కొన్ని సదుపాయలను కల్పిస్తారు. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 347.80 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 81,896.52 వద్ద, నిఫ్టీ 102.35 పాయింట్లు లేదా 0.41 శాతం లాభంతో 25,107.85 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, థెమిస్ మెడికేర్, లంబోధర టెక్స్టైల్, నాగరీకా ఎక్స్పోర్ట్స్, కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం వంటి కంపెనీలు చేరగా.. ఫిషర్ మెడికల్ వెంచర్స్ లిమిటెడ్, అట్లాంటా, నీలా స్పేసెస్, కాన్పూర్ ప్లాస్టిప్యాక్స్, జేఐటీఎఫ్ ఇన్ఫ్రాలాజిస్టిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పొదుపు, పెట్టుబడులకే తొలి ప్రాధాన్యం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున మినహాయింపులతో కొత్త పన్ను విధానం అమల్లోకి రాగా, అధిక వేతనం ఆర్జించే వారికి గణనీయంగా పన్ను ఆదా కానుంది. ఇలా ఆదా అయ్యే మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులకు మళ్లిస్తామని 57 శాతం మంది ఉద్యోగులు నౌకరీ నిర్వహించిన సర్వేలో తెలిపారు. విచక్షణారహిత వ్యయాలకు బదులు పెట్టుబడులకు, రుణాల తిరిగి చెల్లింపులకు ఆదా అయ్యే మొత్తాన్ని వెచ్చిస్తామని నిపుణులు చెప్పారు. రూ.12.75 లక్షల వరకు ఆర్జించే 20వేల మంది నిపుణుల అభిప్రాయాలను నౌకరీ సర్వేలో భాగంగా తెలుసుకుంది. కొత్త పన్ను విధానంలో కల్పించిన పన్ను ప్రయోజనాల గురించి తెలుసనని 64 శాతం మంది చెప్పగా, 43 శాతం మంది తమకు దీనిపై స్పష్టత లేదనో, అసలు తెలియదనో చెప్పడం గమనార్హం.పన్ను మినహాయింపుల కారణంగా మిగిలే మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లిస్తామని 57 శాతం మంది వెల్లడించారు. రుణాల చెల్లింపులకు వినియోగిస్తామని 30 శాతం మంది తెలిపారు.9 శాతం మంది మెరుగైన జీవనం కోసం ఖర్చు చేస్తామని, 4 శాతం మంది ప్రయాణాలు, విహార యాత్రల కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో అత్యధికంగా 63–64 శాతం మంది నిపుణులు మిగులు ఆదాయాన్ని పక్కన పెడతామని తెలిపారు. చెన్నైలో 44 శాతం నిపుణులు రుణ చెల్లింపులకు వినియోగిస్తామని చెప్పగా, ముంబైలో 51 శాతం మంది రిటైర్మెంట్ అవసరాలకు మళ్లిస్తామని తెలిపారు.ఇదీ చదవండి: గ్లోబల్ కంపెనీలకు కేంద్రం స్వాగతం -
భారీ ధరల వేళ.. బయటి నుంచి బంగారం ఎంత తెచ్చుకోవచ్చు?
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. భారతదేశంలో అయితే చుక్కలనంటుతున్నాయి. ఈరోజు (సెప్టెంబర్ 12) 10 గ్రాముల ధర రూ.770 మేర పెరిగి రూ.1,11,430లకు చేరింది. అయితే భారత్ కంటే కొన్ని దేశాల్లో బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బయటి దేశాల్లో ఉంటున్నవారు లేదా ఏదైనా ఏ దేశానికి పర్యటనకు వెళ్లి తిరిగివస్తున్నవారు ఆయా దేశాల్లో బంగారం కొని భారత్కు ఎంత తీసుకుని రావచ్చు.. ఇక్కడ ఆ బంగారంపై ఎంత సుంకం పడుతుంది.. వంటి అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో బంగారం వ్యాపారం భౌతిక, డిజిటల్ సహా అనేక రూపాల్లో జరుగుతుంది. చాలా మంది ఆభరణాలు, నాణేలు, బార్లు , పెట్టుబడి ఆస్తుల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అదే సమయంలో, ప్రభుత్వం డ్యూటీలు/సుంకాల ద్వారా బంగారం వ్యాపారాన్ని జాగ్రత్తగా నియంత్రిస్తుంది. కస్టమ్ డ్యూటీ అనేది ఒక రకమైన పన్ను, ఇది ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై విధిస్తారు. ఇదేవిధంగా, ఇతర దేశాల నుండి బంగారాన్ని భారత్కు తీసుకువచ్చినప్పుడు, దానిపై కూడా కస్టమ్స్ సుంకం విధిస్తారు. అయితే కొంత పరిమితి వరకు బయటి నుంచి తెచ్చిన బంగారంపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ ఉండదు. అంతకంటే ఎక్కువ బంగారాన్ని తీసుకువస్తే మాత్రం సుంకం చెల్లించాల్సి ఉంటుంది.ఎంత బంగారం తెచ్చారో చెప్పాలి..ఒక వ్యక్తి విదేశాల నుండి ఏ రకమైన బంగారు ఆభరణాలు, నాణేలు లేదా బార్లను అయినా భారతదేశానికి తీసుకురావచ్చు. కానీ, మీరు ఈ బంగారు వస్తువులను కస్టమ్ డ్యూటీ కియోస్క్ వద్ద డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత, కస్టమ్స్ డ్యూటీ అధికారి బంగారం మొత్తాన్ని బట్టి వర్తించే కస్టమ్స్ సుంకాన్ని లెక్కిస్తారు. అయితే మీరు ఎంత బంగారం తెచ్చినా కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుందనేది నిజం కాదు. ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఈ రుసుము ఉండదు. ఆ పరిమితి పురుషులు, మహిళలు, పిల్లలకు వేరువేరుగా ఉంటుంది.పురుషులు ఎంత బంగారం తేవచ్చు.. కస్టమ్ డ్యూటీ ఎంత?పురుష ప్రయాణికులు విదేశాల నుంచి 20 గ్రాములు లేదా రూ.50,000 విలువైన డ్యూటీ ఫ్రీ బంగారాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంది. అయితే, బంగారం ధర సుమారు రూ .1 లక్ష కాబట్టి 20 గ్రాముల పరిమితి ఇకపై ఆచరణాత్మకం కాదు. 20 నుంచి 50 గ్రాముల బంగారం తీసుకువస్తే 3 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. 50 నుంచి 100 గ్రాముల బంగారం తీసుకువస్తే 6 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారం తీసుకువస్తే 10% కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది.మహిళలకు పరిమితి ఇదే..మహిళా ప్రయాణికులు కస్టమ్స్ సుంకం లేకుండా 40 గ్రాములు లేదా రూ .1 లక్ష వరకు విలువైన బంగారాన్ని తీసుకురావచ్చు. కానీ అధిక బంగారం రేటు కారణంగా, 40 గ్రాముల పరిమితి ఇక్కడ కూడా ఆచరణాత్మకంగా లేదు. 40 నుంచి 100 గ్రాముల వరకు బంగారంపై 3 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. 100 నుంచి 200 గ్రాముల వరకు బంగారంపై 6 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు. 200 గ్రాములు దాటితే 10% కస్టమ్స్ సుంకం విధిస్తారు.పిల్లలకూ పరిమితి..15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా మహిళా ప్రయాణికుల మాదిరిగానే కస్టమ్స్ నియమాలకు లోబడి ఉంటారు. అయితే, వారు కొనుగోళ్లకు రుజువుగా పత్రాలను తీసుకెళ్లాలి. -
వేలానికి పోప్ లియో సంతకం చేసిన బైక్
'పోప్ లియో XIV'కి బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీకి చెందిన 'ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్' అందించారు. ఈ మోటార్సైకిల్ను మిస్సియో ఆస్ట్రియా అక్టోబర్ 2025లో సోథెబైస్ ద్వారా వేలం వేయనున్నారు. దీని నుంచి వచ్చిన డబ్బును మడగాస్కర్లోని పిల్లల సహాయ ప్రాజెక్టులకు వినియోగించనున్నారు.పోప్ లియో XIVకు ఇచ్చిన బీఎండబ్ల్యూ ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్ అనేది కస్టమైజ్డ్ బైక్. ఇది ఆయన కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ బైకును బీఎండబ్ల్యూ మోటోరాడ్ జర్మనీ అధిపతి 'మైఖేల్ సోమర్' అందించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. బైకు ఫ్యూయెల్ ట్యాంక్ మీద పోప్ సంతకం, డేట్ వంటివి ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఆర్ 18 ట్రాన్స్ కాంటినెంటల్ 1802 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ బాక్సర్ ట్విన్ ఇంజిన్ ద్వారా 991 హార్స్ పవర్, 158 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ధర భారతదేశంలో రూ. 32.50 లక్షలు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్తో 10.25 ఇంచెస్ TFT కలర్ స్క్రీన్ను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఫ్యూయెల్ లెవల్, స్పీడ్ మొదలైన వాటిని రైడర్ చూడవచ్చు. డైనమిక్ క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ హెడ్ల్యాంప్లు, కీలెస్ ఇగ్నిషన్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు.. రాక్, రోల్ అనే రైడ్ మోడ్లు ఇందులో ఉన్నాయి. -
గ్లోబల్ కంపెనీలకు కేంద్రం స్వాగతం
భారత్లో తమ ఉత్పత్తులను పరీక్షించడానికి గ్లోబల్ ఆటోమొబైల్ కంపెనీలను స్వాగతిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. తద్వారా వారు స్థానికంగా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతారని తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) నిర్వహించిన 7వ ఆటో కాన్క్లేవ్లో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారతదేశం పూర్తిగా నిర్మించిన యూనిట్ల (సీబీయూ) దిగుమతిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించిందని చెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దాంతో అంతర్జాతీయంగా చాలా కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.‘కేంద్రం దేశీయ పరిశ్రమను, తయారీదారులను రక్షించేందుకు చర్యలు చేపడుతోంది. అదే సమయంలో కంపెనీల ఉత్పత్తుల మధ్య సరసమైన పోటీకి కట్టుబడి ఉన్నాం. ఈ పోటీ సామర్థ్యాన్ని పెంచుతోంది. ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే లేదా కొత్త మోడళ్లకు అవకాశాలు కల్పించడంలో సమతుల్యత ముఖ్యం. దేశీయ తయారీకి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అయితే పరిశ్రమ వృద్ధి చెందాలంటే మరిన్ని ప్రపంచ కంపెనీలు భారతదేశానికి రావాలి. స్థానికంగా ఉత్పత్తులు తయారు చేసేందుకు లేదా సీబీయూలను పరీక్షించేందుకు ప్రపంచ కంపెనీలు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు.ఇదిలాఉండగా, జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ‘మేడ్ ఇన్ ఇండియా’ కార్లను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనుకుంటున్నట్లు సూచించిందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మెర్సిడెస్ బెంజ్ ఛైర్మన్ దేశ ఉత్పత్తి నాణ్యత బలంగా ఉందని తనకు చెప్పినట్లు గడ్కరీ ఇటీవల ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఊబకాయం.. ఆర్థిక భారం! -
రూ.40 వేలకే ఐఫోన్.. త్వరలో సేల్ ప్రారంభం
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ లభించనుంది. సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో యాపిల్ ఐఫోన్ 14 కేవలం రూ .40,000 ధరకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో విక్రయించే అన్ని ఐఫోన్ల ధరలను వెల్లడించింది. చాలా ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి.2022 సెప్టెంబర్లో లాంచ్ అయిన ఐఫోన్ 14 ఇప్పుడు కేవలం రూ .40,000కు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్పై ఇప్పటివరకు ఇదే అత్యంత తక్కువ ధర. ఐఫోన్ 14 ధర ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో రూ .52,990గా ఉంది. కానీ యాపిల్ స్టోర్ లో ఈ ఫోన్ అందుబాటులో లేదు. ఎంపిక చేసిన యాక్సిస్ క్రెడిట్ కార్డుల ద్వారా పొందగలిగే రూ .2,000 తగ్గింపుతో సహా వినియోగదారులు రూ .13,000 వరకు ఆదా చేయవచ్చు.ఫ్లిప్కార్ట్ సేల్లో ఇతర ఐఫోన్ మోడళ్ల ధరలు కూడా తగ్గాయి. ఐఫోన్ 16 ప్రో ప్రస్తుత ధర రూ .1.12 లక్షలతో పోలిస్తే కేవలం రూ .69,999 కు అందుబాటులో ఉంది. తద్వారా రూ .43,000 ఆదా అవుతుంది. అలాగే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రస్తుత ధర రూ .1,37,900 తో పోలిస్తే రూ .89,900 కు అందుబాటులో ఉంటుంది. దీంతో రూ.48,000 ఆదా అవుతుంది. సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ సందర్భంగా ఆపిల్ ఇప్పటికే కొత్త ఐఫోన్ 17 మోడళ్లను ప్రకటించింది. -
పంజాబ్లో వరద బాధితులకు రిలయన్స్ సాయం
పంజాబ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండగా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనంత్ అంబానీ భరోసా కల్పించారు. బాధితుల కష్టాలు తీర్చే ఉద్దేశంతో సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అందులో భాగంగా స్థానిక అధికారులు, రాష్ట్ర పరిపాలన విభాగం, పంచాయతీలు, వివిధ కమ్యూనిటీ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ఈమేరకు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమృత్సర్, సుల్తాన్పూర్ లోధిలోని 10,000 కుటుంబాలకు సహాయం అందించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.‘ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ ప్రజలకు మా మద్దతు ఉంటుంది. తీవ్ర వర్షాభావం వల్ల చాలా కుటుంబాలు ఇళ్లు, జీవనోపాధి, భద్రతను కోల్పోయాయి. రిలయన్స్ కుటుంబం వారికి తోడుగా ఉంటుంది. ఆహారం, నీరు, ఆశ్రయం, పారిశుద్ధ్య కిట్లు.. వంటి వాటితో ప్రజలు, జంతువుల సంరక్షణకు అన్ని చర్యలు అందిస్తోంది. పంజాబ్ ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఈ క్లిష్ట సమయంలో వారితో కలిసి ఉంటాం’ అని అనంత్ అంబానీ అన్నారు.రిలయన్స్ అందిస్తోన్న సహాయక చర్యలు..న్యూట్రిషన్ సపోర్ట్వరద బాధితుల కోసం అత్యవసర పోషకాహార అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతుంది. వారికి అవసరమైన ఆహార సామాగ్రి, డ్రై రేషన్ కిట్లను 10,000 కుటుంబాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒంటరి మహిళలు, వృద్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5,000 వంతున వోచర్ ఆధారిత సహాయం అందించనున్నారు. తక్షణ పోషణను నిర్దారించేందుకు కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పోర్టబుల్ వాటర్ ఫిల్టర్లను సిద్ధం చేస్తున్నారు.షెల్టర్ సపోర్ట్వరదల నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలను రక్షించడానికి రిలయన్స్ టార్పాలిన్లు, గ్రౌండ్ షీట్లు, దోమతెరలు, తాళ్లతో కూడిన అత్యవసర షెల్టర్ కిట్లను అందిస్తోంది. వరద నీటి నుంచి అత్యవసరంగా ఆశ్రయం అవసరమైన కుటుంబాలకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ప్రజారోగ్య ప్రమాద నిర్వహణలో భాగంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి రిలయన్స్ ఆరోగ్య అవగాహన ప్రచారాలను చేపడుతోంది. నీటి వనరుల్లో క్రిమిసంహారక చర్యలకు పూనుకుంది. వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రతి ప్రభావిత కుటుంబానికి అవసరమైన పారిశుద్ధ్య కిట్లను అందజేస్తున్నారు.పశువుల ఆరోగ్యానికి మద్దతుగా..వరదల వల్ల పశుసంవర్ధక రంగం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశువుల ఆవాసాల్లో నీరు నిలిచిపోవడం వల్ల జంతువుల మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్, పశుసంవర్ధక శాఖ సహకారంతో పశువైద్య సర్వేలు నిర్వహిస్తోంది. పశువుల సంరక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభావిత జంతువులకు మందులు, చికిత్సలు అందిస్తున్నారు. దాదాపు 5,000 పశువులకు ఆహారం ఇవ్వడానికి 3,000 కట్టల సైలేజ్ (పశుగ్రాసం) పంపిణీ చేస్తున్నారు.జంతు సంరక్షణజంతు సంరక్షణ కోసం రిలయన్స్కు చెందిన వంటారాలోని ప్రత్యేక బృందం సహాయక చర్యలను అందిస్తోంది. 50 మందికి పైగా శిక్షణ పొందిన నిపుణులతో ఈ బృందం జంతువులను రక్షించడం, వైద్య సంరక్షణను అందించడం, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి పని చేస్తోంది.కమ్యునికేషన్ పునరుద్ధరణవరద ప్రభావిత ప్రాంతాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో జియో బృందం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉండేలా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)తో కలిసి పనిచేస్తోంది. విపత్తు సహాయ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సర్వీసులు అందించేందుకు చర్యలు చేపడుతోంది.రిలయన్స్ ఫౌండేషన్ స్థానిక వాలంటీర్ల సహకారంతో క్యూరేటెడ్ డ్రై-రేషన్, పారిశుద్ధ్య కిట్లను పంపిణీ చేస్తోంది. పోషణ, పరిశుభ్రత కోసం 21 నిత్యావసర వస్తువులను కలిగి ఉన్న ఈ కిట్లను స్థానిక పంచాయతీల పరిధిలోని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. -
ఊబకాయం.. ఆర్థిక భారం!
భారత్లో ఊబకాయం పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకోసం చేసే ఆర్థిక ఖర్చులు అధికమవుతున్నట్లు యునిసెఫ్ చైల్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ రిపోర్ట్ 2025 తెలిపింది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో పెరుగుతున్న ఊబకాయం సంక్షోభాన్ని హైలైట్ చేసిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలను కోరారు. శరీరంలో పెరుగుతున్న కొవ్వులపై ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. దాన్ని తగ్గించుకునేందుకు నెలవారీ ఖర్చులను కూడా ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు.యునిసెఫ్ చైల్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ రిపోర్ట్ 2025 ప్రకారం.. పాఠశాలకు వెళ్లే, కౌమారదశలోని పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ బరువు సమస్యను భారత్ క్రమంగా అధిగమిస్తున్నప్పటికీ, ఊబకాయం సమస్యగా పరణిమిస్తుంది. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ అంచనా ప్రకారం.. 2019లో ఊబకాయం సంబంధిత ఖర్చులు దాదాపు 29 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది భారతదేశ జీడీపీలో 1 శాతం. ఒబెసిటీ సమస్యకు అత్యవసర చర్యలు తీసుకోకపోతే 2060 నాటికి ఈ సంఖ్య 839 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది జీడీపీలో 2.5 శాతంగా ఉండనుంది.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) డేటా ప్రకారం అధిక బరువు, ఊబకాయం ఉన్న ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2005-06లో ఎన్ఎఫ్హెచ్ఎస్ 3 నుంచి 2019-21లో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 మధ్య వీరి సంఖ్య 127 శాతం పెరిగింది. కౌమారదశలో ఉన్న బాలికలు, బాలురు వరుసగా 125 శాతం, 288 శాతం అధికమయ్యారు.లఖ్నవూ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పని చేస్తున్న మనోజ్ కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నడక, శారీరక వ్యాయామం లేకపోవడం ఊబకాయం పెరగడానికి కారణాలుగా పేర్కొన్నారు. ‘ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా మొదలైన వాటిని అవలంబించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు’ అని అన్నారు.ఊబకాయం పెరుగుదలకు కారణాలు.. -
రూ. లక్ష.. కోటి రూపాయలైంది..!
స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎంత ఉంటుందో లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లను దివాళా తీయిస్తే మరికొన్ని మాత్రం కోటీశ్వరులను చేస్తాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ గత దశాబ్దంలో దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లకు భారీ రాబడిని తెచ్చిపెట్టింది.ఆ కంపెనీ షేర్లు 11,419% పెరిగాయి. 2015లో రూ .14 ఉన్న షేరు ధర 2025 సెప్టెంబర్ 10 నాటికి రూ .1,612.60 కు పెరిగింది. అంటే ఎంతలా పెరిగిందంటే రూ .1 లక్ష పెట్టుబడి పెట్టారనుకుంటే ఇప్పుడది రూ .1 కోటి కంటే ఎక్కువగా పెరిగిందన్న మాట. ఆ స్టాక్ ఏదో కాదు.. ఎంఈఐఎల్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ది. 2025 జూన్ 30 నాటికి ఈ కంపెనీలో ఎంఈఐఎల్ హోల్డింగ్స్ 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉందని తాజా షేర్ హోల్డింగ్ డేటా తెలిజేస్తోంది.ఒలెక్ట్రా గురించి.. గతంలో గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రాటెక్ అనే పేరుతో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్ తయారుదారు. ఈ సంస్థ 2000లో స్థాపితమైంది. ఇది ఎలక్ట్రిక్ బస్సులు, ఇన్సులేటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు దేశంలోని దాదాపు అన్ని మెట్రో, టైర్2, టైర్3 నగరాల్లో తిరుతున్నాయి. దేశ ఎలక్ట్రిక్ బస్ రంగంలో 25 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే.2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల విక్రయాలు రూ.1801.90 కోట్లుగా నమోదయ్యాయి. పన్నులు పోనూ రూ.139.21 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 161 బస్సులు డెలివరీ చేసింది. ఎలక్ట్రిక్ బస్ ఆర్డర్ బుక్ 10,193 యూనిట్లుగా ఉంది. 5,000 బస్సుల ప్రారంభ సామర్థ్యంతో (10,000 వరకు స్కేలబుల్) రాబోయే తయారీ కేంద్రం 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం రిస్క్తో కూడుకున్నది. ఇన్వెస్టర్లు అన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది.) -
భారత్ వరికి ఎంఎస్పీ పెంచితే డబ్ల్యూటీఓలో ప్రశ్నలు!
దేశీయంలో వరి పంటలో స్వావలంబన సాధించేందుకు, ఇథనాల్ ఉత్పత్తికి, రైతులకు ఆర్థిక భరోసాకు, కొన్ని దేశాలకు బియ్యం ఎగుమతులు పెంచేందుకు భారత్ తీసుకున్న నిర్ణయానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశంలో వరి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంపు నిర్ణయానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీఓ)లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈమేరకు భారత నిర్ణయాన్ని అమెరికా, పరాగ్వే సంయుక్తంగా డబ్ల్యూటీఓలో వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ ఆహార భద్రతకు సంబంధించిన ‘బాలీ ఒప్పందాల’ను(డబ్ల్యూటీఓ ఆహార సబ్సిడీ పరిమితులు) భారత్ భేఖాతరు చేస్తుందని వాదించాయి.ఎంఎస్పీ పెంపు విధానం భారత్ దేశీయ ఆహార పంపిణీ వ్యవస్థలో భాగం అయినప్పటికీ ఎగుమతులు, ఆహారేతర ప్రయోజనాల కోసం నిల్వలు పెంచుతోందని యూఎస్, పరాగ్వే అభిప్రాయపడుతున్నాయి. భారత్ ఎంఎస్పీ పెంచడం, భారీగా నిల్వలు ఉండడం, ఎగుమతులు సాగించడం వంటి విధానాలు ప్రపంచ బియ్యం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నట్లు చెప్పాయి. పాకిస్థాన్ను ఉదాహరిస్తూ.. అక్కడి బాస్మతియేతర బియ్యం ధరలు దాదాపు రాత్రికి రాత్రే మెట్రిక్ టన్నుకు సుమారు 200 డాలర్లు పడిపోయాయని గుర్తు చేశాయి.అయితే భారత్ వాదనలు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దేశం తన వంతుగా చిన్న, సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వడానికి, పేదలకు ఆహారం అందించడానికి, కొన్ని దేశాలకు ఆహార భద్రతను నిర్ధారించేందుకు ఈ మార్పులు చేసినట్లు చెప్పింది. భారతదేశం బియ్యంపై ఆంక్షలను ఎత్తివేసినప్పటి నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2025 నాటికి రికార్డు స్థాయిలో 22.5 మిలియన్ టన్నులకు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే డబ్ల్యూటీఓ నిబంధనలకు లోబడే నిర్ణయాలున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. ఎఫ్సీఐ గోదాముల్లోని బియ్యాన్ని ఎగుమతులకు ఉపయోగించడం లేదన్నారు. అందుకు బదులుగా ఏటా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న స్టాక్నే నిల్వ ఉంచకుండా నేరుగా ఎగుమతి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై సెప్టెంబర్ 25-26 తేదీల్లో జరిగే సమీక్షా సమావేశంలో చర్చ జరగనుంది.ఇదీ చదవండి: భారత్–అమెరికా చర్చల్లో పురోగతి -
పసిడి మళ్లీ అదే స్పీడు.. రోజుకో రికార్డు
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గురువారం స్థిరంగా ఉన్న బంగారం ధరలు (Today Gold Rate) శుక్రవారం మళ్లీ స్పీడ్ అందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు పెరిగి 25,054కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 పాయింట్లు పుంజుకుని 81,691 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.63బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.83 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.03 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.85 శాతం పెరిగింది.నాస్డాక్ 0.72 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రుణాలపై మారటోరియం ఇవ్వండి
ఎగుమతిదారులు టారిఫ్లు, ద్రవ్యోల్బణం, డిమాండ్ అనిశ్చితిలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్థికంగా వెసులుబాటు లభించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్కి ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో విజ్ఞప్తి చేసింది. రుణాలకు సంబంధించి అసలు, వడ్డీపై ఒక ఏడాది పాటు వన్–టైమ్ మారటోరియం(రుణాలు చెల్లించేందుకు గడువు పొడిగింపు) ప్రకటించాలని కోరింది. అలాగే ప్రాధాన్యతా రంగం కింద వర్గీకరించినప్పటికీ ఎగుమతి సంస్థలకు తగు స్థాయిలో ప్రయోజనం లభించడం లేదని పేర్కొంది.ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన 40 శాతం రుణాలకు సంబంధించి ఎగుమతిదార్ల వాటా 2–2.5 శాతంగా ఉండేలా ఆదేశించాలని ప్రతిపాదించింది. గురువారం ఆర్బీఐతో సమావేశమైన సందర్భంగా ఎఫ్ఐఈవో ఈ మేరకు విజ్ఞప్తులు చేసింది. బ్యాంకులు సరళతరమైన విధంగా రుణాలు అందించాలని, పరిస్థితిని బట్టి పునర్వ్యవస్థీకరించాలని, అంతర్జాతీయంగా లావాదేవీల నిర్వహణ విషయంలో ఎగుమతిదార్లకు మద్దతుగా నిలవాలని కోరింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో అంతరాయాల కారణంగా కొనుగోళ్లు, ఉత్పత్తి, ఎగుమతి షెడ్యూల్స్లో జాప్యం జరుగుతోందని పేర్కొంది. కాబట్టి, ఎగుమతి చేయడానికి ముందు ఇచ్చే స్వల్పకాలిక రుణాల కాలవ్యవధిని పెంచితే ఎగుమతిదార్లకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎఫ్ఐఈవో తెలిపింది.తమ పరిధిలో లేని జాప్యాల వల్ల ఆర్థికంగా దెబ్బ తినకుండా నిర్వహణ మూలధనాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు, నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు, కాంట్రాక్టు నిబంధనలను పాటించేందుకు వీలవుతుందని వివరించింది. ఇలాంటి ఊరటనిచ్చే చర్యలతో ఎగుమతిదార్లు, మార్కెట్లలో నెలకొన్న కొత్త పరిస్థితులకు అనుగుణంగా తమ కార్యకలాపాలను, వ్యూహాలను మార్చుకునేందుకు వీలవుతుందని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) తరహా పథకాన్నిమళ్లీ ప్రవేశపెట్టాలని ఎఫ్ఐఈవో విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రస్తుతం ఇలాంటివి చాలా అవసరమని వివరించింది.ఇదీ చదవండి: భారత్–అమెరికా చర్చల్లో పురోగతి -
భారత్–అమెరికా చర్చల్లో పురోగతి
ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారత్–అమెరికా మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో ముందుకు సాగుతున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రకటించారు. చర్చల్లో పురోగతి పట్ల రెండు దేశాలు సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చలను 2025 నవంబర్ నాటికి ముగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశ వాణిజ్య మంత్రులకు సూచించినట్టు తెలిపారు. వాణిజ్య ఒప్పందం విషయమై అమెరికాతో భారత్ చురుగ్గా చర్చలు నిర్వహిస్తున్నట్టు మంత్రి గోయల్ బుధవారం సైతం ప్రకటించడం గమనార్హం.రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విజయవంతంగా పూర్తయ్యేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవని, తన మంచి స్నేహితుడైన ప్రధాని నరేంద్ర మోదీతో రానున్న వారాల్లో మాట్లాడేందుకు వేచి చూస్తున్నానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సాకారమవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సైతం వెంటనే సానుకూలంగా స్పందించారు.అమెరికా, భారత్ సహజ భాగస్వాములంటూ.. వీలైనంత ముందుగా వాణిజ్య చర్చలను ముగించేందుకు రెండు దేశాలు చురుగ్గా పనిచేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్పై చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. వాస్తవానికి భారత్–అమెరికా మధ్య పలు విడతల చర్చలు జరిగినప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడం తెలిసిందే.ఇదీ చదవండి: నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు కొత్త ఫోన్ -
నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు కొత్త ఫోన్
నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు హెచ్ఎండీ సంస్థ ‘వైబ్ 5జీ’ పేరుతో స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.8,999 గా ఉంది. కంపెనీ నుంచి రూ.10,000 లోపు ధరలో వస్తున్న తొలి స్మార్ట్ఫోన్ ఇది. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్, 50 మెగాపిక్సల్ రియర్ కెమెరా ఉంది.5000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ మొబైల్లో అమర్చారు. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ ఉంది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్కు ఏడాది రిప్లేస్మెంట్ గ్యారెంటీ సదుపాయం ఉంది. అలాగే హెచ్ఎండీ 101 4జీ, 102 4జీ పేరిట రెండు 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేశారు. వీటి ధరలు వరుసగా రూ.1,899, రూ.2,199గా ఉన్నాయి.ఇదీ చదవండి: ఈక్విటీ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడుల జోరు! -
స్క్రాప్ సర్టిఫికెట్తో అదనపు డిస్కౌంట్..
న్యూఢిల్లీ: పాత వాహనానికి సంబంధించిన స్క్రాపేజీ సర్టిఫికెట్ ఇచ్చే కస్టమర్లకు, కొత్త వాహనాలపై మరిన్ని డిస్కౌంట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. అలాగే, పాత వాహనాన్ని తుక్కు కింద మార్చి (స్క్రాప్) కొత్తవి కొంటున్న వారికి, జీఎస్టీని కొంత తగ్గించడం రూపంలో కూడా ఊరట కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కోరినట్లు ఆయన చెప్పారు. భారతీయ ఆటోమొబైల్స్ తయారీ సంస్థల సంఘం సియామ్ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. స్క్రాపేజీ పాలసీ అనేది ఇటు పరిశ్రమకు అటు ప్రభుత్వానికి కూడా ప్రయోజనకరమైనదని గడ్కరీ చెప్పారు. ‘‘ఇది పరిశ్రమకే మేలు చేస్తుంది. కానీ పరిశ్రమ నా మాట ఇంకా పూర్తిగా వినడం లేదు. కొత్త వాహనాన్ని కొనేందుకు, పాతదాన్ని స్క్రాప్ చేసిన వారికి బాగా డిస్కౌంట్లు ఇస్తే, మీ టర్నోవరే భారీగా పెరుగుతుంది. ప్రభుత్వానికి కూడా జీఎస్టీ వస్తుంది. దేశంలో కాలు ష్యం తగ్గుతుంది. కాబట్టి దీనికి మీరు కూడా ఇందు కు తప్పకుండా తోడ్పడాలి’’ అని గడ్కరీ చెప్పారు. ఇటీవల వస్తు, సేవల పన్నులను (జీ ఎస్టీ) క్రమబదీ్ధకరించడం వల్ల ఆటో రంగానికి భారీగా లబ్ధి చేకూరిందని, పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ‘‘మన ఆటో పరిశ్రమ ఇప్పుడు పరిమాణంపరంగా నంబర్ 3గా ఎదిగింది. మనం అంతా కలిసి పని చేస్తే తప్పకుండా ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకోగలం’’ అని గడ్కరీ వివరించారు. తుక్కు రీసైక్లింగ్తో ఉద్యోగాలకు దన్ను.. తుక్కును రీసైక్లింగ్ చేసే ప్రక్రియ కారణంగా అదనంగా 70 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని గడ్కరీ చెప్పారు. అలాగే ఉక్కు, సీసం, అల్యుమినియం, ప్లాటినం, పల్లాడియం లాంటి లోహాల లభ్యత కూడా పెరగడం వల్ల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని తెలిపారు. వాహనాలన్నింటినీ స్క్రాప్ చేసి అదనంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయడం వల్ల జీఎస్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి రూ. 40,000 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని గడ్కరీ చెప్పారు. స్క్రాపింగ్ తర్వాత ఏర్పడే అదనపు డిమాండ్తో ఆటోమొబైల్ పరిశ్రమ కూడా ప్రయోజనం పొందుతుందన్నారు. ప్రస్తుతం ప్రతి నెలా సగటున 16,830 వాహనాలను తుక్కు కింద మారుస్తుండగా, ప్రైవేట్ రంగం రూ. 2,700 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని ఆయన చెప్పారు. ఈ–20పై అవాస్తవాలు.. ఈ20 ఇంధనంతో వాహనాల మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ పాడవుతుందని ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలే అని గడ్కరీ కొట్టిపారేశారు. దిగుమతులను తగ్గించుకునేందుకు ఇథనాల్ ఉపయోగపడుతుందని, దీని వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన చెప్పారు. దీనితో రైతులకు రూ. 45,000 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి దేశీయంగా అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేస్తామని మంత్రి చెప్పారు.పరిశ్రమకు జీఎస్టీ బూస్ట్.. వాహనాలపై జీఎస్టీ రేట్ల తగ్గింపు దేశీ ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి మరింత దోహదపడుతుందని సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. దీనితో రేట్లు తగ్గి, ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ వాహనాలు మరింతగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తొలిసారిగా వాహనాలు కొనుగోలు చేస్తున్న వారికి, మధ్య స్థాయి ఆదాయవర్గాలకు గణనీయంగా ప్రయోజనం లభిస్తుందని చంద్ర వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లోను, అలాగే ఎగుమతులపరంగాను భారతీయ ఆటో పరిశ్రమ స్థిరమైన పనితీరు కనపర్చిందని చెప్పారు. ప్యాసింజర్ వాహనాల విభాగంలో 2 శాతం వార్షిక వృద్ధితో, అత్యధికంగా 43 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు వివరించారు. ద్విచక్ర వాహనాల విభాగం కూడా కోలుకుంటోందని 9.1 శాతం వృద్ధితో 1.96 కోట్ల విక్రయాలు నమోదయ్యాయని చంద్ర చెప్పారు. -
రిలయన్స్ భారీ ఫుడ్ పార్క్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆహారోత్పత్తులు, పానీయాల తయారీకి ఏకీకృత ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్(కాటోల్)లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్పై రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్.. మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ యూనిట్తో 500మందికిపైగా ఉపాధి కల్పించనుంది. 2026లో తయారీ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ సమీకృత ఫుడ్ పార్క్ల ఏర్పాటుకు రూ. 40,000 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, ఆధునిక టెక్నాలజీలతో ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్ పార్క్కు తెరతీయనున్నట్లు వివరించారు. రిలయన్స్ రిటైల్ నుంచి ఆవిర్భవించిన రిలయన్స్ కన్జూమర్ మూడేళ్లలోనే రూ. 11,000 కోట్ల టర్నోవర్ను సాధించినట్లు ఏజీఎంలో తెలిపారు. -
ఇన్ఫీ18,000 వేల కోట్ల రికార్డ్ బైబ్యాక్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి అంగీకరించింది. గురువారం (11న) సమావేశమైన బోర్డు షేరుకి రూ. 1,800 ధర మించకుండా 2.41 శాతం వాటా బైబ్యాక్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 18,000 కోట్లు వెచ్చించనుంది. వెరసి రూ. 5 ముఖ విలువగల 10 కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. గురువారం బీఎస్ఈలో ముగింపు ధర రూ. 1,510తో పోలిస్తే బైబ్యాక్కు 19 శాతం ప్రీమియంను నిర్ణయించింది. కంపెనీ 2025 జూన్ త్రైమాసికంలో 88.4 కోట్ల డాలర్ల (రూ. 7,805 కోట్లు) ఫ్రీ క్యాష్ ఫ్లోను ప్రకటించింది. కాగా.. కంపెనీ తొలిసారి 2017లో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ను చేపట్టింది. ఈక్విటీలో 4.92 శాతం వాటాకు సమానమైన 11.3 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. ఇందుకు ఒక్కో షేరుకి రూ. 1,150 ధరలో రూ. 13,000 కోట్లు వెచ్చించింది. ఆపై రెండోసారి 2019లో రూ. 8,260 కోట్లు, మూడోసారి 2021లో 9,200 కోట్లు చొప్పున షేర్ల బైబ్యాక్కు వినియోగించింది. ఈ బాటలో 2022లోనూ రూ. 9,300 కోట్లతో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ. 1,850 ధర మించకుండా బైబ్యాక్ చేపట్టింది. ఇన్ఫోసిస్ షేరు 1.5% క్షీణించి రూ. 1,510 వద్ద ముగిసింది. -
స్టార్టప్లకు ‘గేమింగ్’ నిషేధం సెగ..
ముంబై: దేశీయంగా రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ)పై నిషేధం విధించడంతో పలు అంకురాల వాల్యుయేషన్పై ప్రభావం చూపింది. నాలుగు బడా సంస్థలు .. యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే అంకురాలు) జాబితా నుంచి చోటు కోల్పోయాయి. డ్రీమ్11 (26 కోట్ల యూజర్లు) , గేమ్స్ 24 x 7 (12 కోట్ల యూజర్లు), గేమ్స్క్రాఫ్ట్ (3 కోట్ల యూజర్లు), మొబైల్ ప్రీమియర్ లీగ్ (9 కోట్ల యూజర్లు) వీటిలో ఉన్నాయి. ఇక యూనికార్న్లు కాకపోయినప్పటికీ ‘జూపీ’, ‘విన్జో గేమ్స్’లాంటి సంస్థల వాల్యుయేషన్లు కూడా పడిపోయాయి. ‘2025 ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్, ఫ్యూచర్ యూనికార్న్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆన్లైన్ మనీ గేమ్స్ను నిషేధించే బిల్లును పార్లమెంటు గత నెల ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్స్ సంబంధిత ప్రకటనలపై కూడా నిషేధం వర్తిస్తుంది. అలాంటి గేమ్స్ ఆడేందుకు నగదును బదిలీ చేసే సరీ్వసులను సైతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించకూడదు. ‘‘ఇలాంటి మార్పులన్నింటి వల్ల భారత్లో పేరొందిన పలు ఆర్ఎంజీ కంపెనీలపై ప్రభావం పడింది. దీనితో వాటి వృద్ధి నెమ్మదించే అవకాశం ఉంది’’ అని నివేదిక పేర్కొంది. అలాగే ఈ చట్టం వల్ల పరిశ్రమపై ఇన్వెస్టర్ల నమ్మకం కూడా సడలిందని వివరించింది. మరోవైపు, అంకురాలు క్రమంగా లాభదాయకత, పెట్టుబడులను సమర్ధంగా వినియోగించుకోవడం, దీర్ఘకాలంలో నిలకడగా ఉండే వ్యాపార విధానాల వైపు మొగ్గు చూపుతున్నాయని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ ఎండీ రాజేశ్ సలూజా తెలిపారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → 8.2 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో అత్యంత విలువైన భారతీయ స్టార్టప్గా డిస్కౌంట్ బ్రోకరేజీ సంస్థ జిరోధా అగ్రస్థానంలో ఉంది. చెరి 7.5 బిలియన్ డాలర్లతో ఫిన్టెక్ సంస్థ రేజర్పే, లెన్స్కార్ట్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. → అత్యధికంగా 26 అంకురాలతో బెంగళూరు యూనికార్న్ హబ్గా నిల్చింది. వీటి మొత్తం వాల్యుయేషన్ 70 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక 36.3 బిలియన్ డాలర్ల విలువ చేసే 12 స్టార్టప్లతో ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) రెండో స్థానంలో, 22.8 బిలియన్ డాలర్ల విలువ చేసే 11 సంస్థలతో ముంబై మూడో స్థానంలో నిల్చాయి. → దేశీయంగా అత్యంత పిన్న వయసు్కలైన యూనికార్న్ వ్యవస్థాపకులుగా జెప్టో ఫౌండర్లు కైవల్య ఓహ్రా, ఆదిత్ పలిచా (ఇద్దరికీ 22 ఏళ్లు) నిల్చారు. → వెంచర్ క్యాపిటల్ సంస్థ పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్ భారతీయ స్టార్టప్స్లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసింది. టరి్టల్మింట్, వాట్ఫిక్స్, గ్రో, ప్రిజమ్ (ఓయో) సహా 68 అంకురాల్లో 200 మిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టింది. అత్యంత విలువైన స్టార్టప్లు ఏకంగా 3.74 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. యూనికార్న్లలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 2.06 లక్షలుగా ఉంది. 11 కొత్త యూనికార్న్లు .. కొన్ని ఆర్ఎంజీ కంపెనీలు లిస్టు నుంచి నిష్క్రమించినప్పటికీ ఈ ఏడాది యూనికార్న్ల జాబితాలోని స్టార్టప్ల సంఖ్య మొత్తం మీద పెరిగి, 73కి చేరింది. ఈ ఏడాది 11 అంకురాలు యూనికార్న్ హోదా దక్కించుకున్నాయి. ఏఐడాట్టెక్, నవీ టెక్నాలజీస్, వివృతి క్యాపిటల్, వెరిటాస్ ఫైనాన్స్, ర్యాపిడో, నెట్రాడైన్, జంబోటెయిల్, డార్విన్బాక్స్, మనీవ్యూ, జస్పే, డ్రూల్స్ వీటిలో ఉన్నాయి. -
మూడేళ్లకే ముగిసిన ప్రస్థానం!.. వెబ్సైట్లో కనిపించిన బైక్ ఇదే..
సుజుకి మోటార్సైకిల్ ఇండియా తన లైనప్ నుంచి కటన బైకును నిలిపివేసింది. దీనిని కంపెనీ తన అధికారిక వెబ్సైట్ తొలగించింది. 2022 జులైలో ప్రారంభమైన ఈ బైక్ లేటెస్ట్ రెట్రో డిజైన్ రైడర్లను ఆకట్టుకుని.. మంచి అమ్మకాలను సాధించగలిగింది. అయితే కాలక్రమంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైంది. దీంతో అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. దీంతో దేశంలో అరంగ్రేటం చేసిన మూడేళ్లలోనే మార్కెట్కు దూరమైందని తెలుస్తోంది.రూ.13.61 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో, కటనను కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) మార్గం ద్వారా భారతదేశంలోకి వచ్చిన ఈ బైకును కంపెనీ ఎందుకు తొలగించిందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఆదరణ తగ్గడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ బైక్ 999 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్తో 11,000 rpm వద్ద 150 bhp, 9,250 rpm వద్ద 106 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.సుజుకి ఇప్పుడు కటన బైకును తొలగించడంతో.. పెద్ద బైక్ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం మూడు మోడళ్లు ఉన్నాయి. అవి హయబుసా (రూ. 16.90 లక్షలు), జీఎస్ఎక్స్-8ఆర్ (రూ. 9.25 లక్షలు), వీ-స్ట్రోమ్ 800డీఈ (రూ. 10.30 లక్షలు). -
హైదరాబాద్లో DESRI కొత్త ఆఫీస్
ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ అయిన DESRI.. హైదరాబాద్లోని ఆర్ఎంజెడ్ నెక్సిటీలో తన కొత్త కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నుంచి ప్రయోజనం పొందుతూ, హైదరాబాద్ను తన ప్రపంచ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో కంపెనీ దీనిని ప్రారంభించింది.2014లో హైదరాబాద్లో మొదటిసారి కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి.. కౌంటింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, లీగల్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్తో సహా వివిధ రంగాలలో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. నేడు కంపెనీ అనేక కీలకమైన కార్యకలాపాలలో కీలక పాత్రను పోషిస్తోంది.కొత్త కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా.. DESRI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ జ్విల్లింగర్ మాట్లాడుతూ, హైదరాబాద్ DESRIకి వ్యూహాత్మక కేంద్రంగా మారింది. అంతే కాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఆర్ఎంజెడ్ నెక్సిటీలో మా కొత్త కార్యాలయం ప్రారంభం, భారతదేశంలో మా ఉనికిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. -
దేశంలో అతిపెద్ద డీల్!.. రూ.3472 కోట్లు వెచ్చించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబై మెట్రో కార్పొరేషన్కు చెందిన నారిమన్ పాయింట్లోని టోనీ బిజినెస్ డిస్ట్రిక్ట్లో 4.16 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీనికోసం ఆర్బీఐ ఏకంగా రూ. 3472 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ భూమిని ఎందుకు కొనుగోలు చేసిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.ముంబైలోని నారిమన్ పాయింట్ అనేది దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం. దీనిని ప్రీమియం వ్యాపార కేంద్రంగా పరిగణిస్తారు. ఇలాంటి ప్రదేశంలో ఆర్బీఐ భూమిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద డీల్స్లో ఇది ఒకటి కావడంతో.. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఈ ఏడాది జరిగిన అతిపెద్ద భూమి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనించదగ్గ విషయం.ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరి రెండు రోజులే.. జాబ్ నుంచి తీసేసారురియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ అయిన సీఆర్ఈ మ్యాట్రిక్స్ నుంచి సేకరించిన ఆస్తి లావాదేవీ డేటా ప్రకారం.. ఆర్బీఐ కొనుగోలు చేసిన భూమి కోసం రూ. 208 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించింది. ఈ ఒప్పందం సెప్టెంబర్ 5న రిజిస్టర్ అయింది. రిజర్వ్ బ్యాంక్ తన హెడ్క్వార్టర్స్ను విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే ఈ భూమిని కొనుగోలు చేసింది. -
ఐఫోన్ 17 ఎయిర్: స్పందించిన ఓపెన్ఏఐ సీఈఓ
యాపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ను నాలుగు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులోని ఎయిర్ వేరియంట్ ఓపెన్ఏఐ సీఈఓ 'సామ్ ఆల్ట్మన్'ను తెగ ఆకట్టుకుంది. దీనిపై స్పందిస్తూ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.''చాలా కాలంగా నేను కోరుకుంటున్న మొదటి కొత్త ఐఫోన్ అప్గ్రేడ్ ఇది! చాలా బాగుంది'' అని యాపిల్ టెక్నాలజీని సామ్ ఆల్ట్మన్ ప్రశంసించారు. కంపెనీ ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ ఎయిర్ అత్యంత సన్నని హ్యాండ్సెట్. ఇది చాలా తేలికగా ఉండటం వల్ల మీ చేతిలో ఇట్టే ఇమిడిపోతుంది. 5.6 మిల్లీమీటర్ల మందం కలిగిన ఫ్రేమ్, కేవలం 165 గ్రాముల బరువు కలిగిన ఇది ఇప్పటివరకు ఉన్న అత్యంత సన్నని ఐఫోన్.గతంలో చాలామంది ఐఫోన్ ప్రియులు, విశ్లేషకులు.. కొత్త ఆవిష్కరణలు లేదని ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు ఐఫోన్ 17 ఎయిర్ ఎనిమిది సంవత్సరాలలో కంపెనీ ఆవిష్కరించిన అతిపెద్ద మార్పులలో ఒకటిగా నిలిచింది.first new iphone upgrade i have really wanted in awhile! looks very cool.— Sam Altman (@sama) September 9, 2025ఐఫోన్17 ధరలుటెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 17లో 6.3 ఇంచెస్ స్క్రీన్, ఏ19 ప్రో ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ డ్యుయల్ ఫ్యూజన్ కెమెరా, 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 256 జీబీ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయిదు రంగుల్లో లభించే అత్యంత పల్చని ఐఫోన్ 17 ఎయిర్ని కూడా యాపిల్ విడుదల చేసింది. ఐఫోన్ 17 ధర 799 డాలర్ల నుంచి, ప్రో ధర 1,099 డాలర్లు, ప్రో మ్యాక్స్ ధర 1,199 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. -
వేగవంతమైన బుకింగ్స్ కోసం.. ఈడెన్ హోమ్స్టే వెబ్సైట్
హైదరాబాద్లో ప్రయాణించే దేశీయ, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు సులభమైన, వేగవంతమైన సౌకర్యవంతమైన బుకింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా.. ఈడెన్ హోమ్స్టే కంపెనీ ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ ప్రారంభించింది. ఇది మొబైల్, టాబ్లెట్, డెస్క్టాప్లలో కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పర్యాటకులు ఈ వెబ్సైట్ ద్వారా గదుల లభ్యతతో పాటు, లేటెస్ట్ ఫోటోలను బ్రౌజ్ చేస్తూ.. వివరణాత్మక సమాచారం పొందవచ్చు. అంతే కాకుండా వేగంగా బుకింగ్స్ పూర్తి చేసుకోవచ్చు.ముఖ్యమైన ఫీచర్లు..➢రియల్-టైమ్ బుకింగ్ సిస్టమ్: తక్షణ ధృవీకరణ➢మల్టీ-కరెన్సీ సపోర్ట్: విదేశీ అతిథుల కోసం➢స్పష్టమైన ధరల సమాచారం: దేశీయ & అంతర్జాతీయ అతిథుల కోసం➢రివార్డ్ పాయింట్స్ సిస్టమ్: తదుపరి బుకింగ్లో ఉపయోగించుకోడానికి➢గిఫ్ట్ కార్డ్స్: కొనుగోలు, రీడెంప్షన్ కోసం➢ఇంటిగ్రేటెడ్ గూగుల్ మ్యాప్స్: సులభ నావిగేషన్ కోసం➢ఆథెంటిక్ గెస్ట్ రివ్యూలు: సరైన నిర్ణయం తీసుకోవడానికి➢256-బిట్ ఎన్క్రిప్షన్తో సెక్యూర్ పేమెంట్స్➢మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసంప్రాపర్టీ ఓనర్లకు కొత్తఅవకాశాలుహైదరాబాద్లో పాటు భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కంపెనీ ఈ వెబ్సైట్ తీర్చిదిద్దింది. ఈ ప్లాట్ఫారమ్ ద్వారా హోస్ట్ తమ స్టేలను లిస్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా స్థానికంగా ఉపాధిఅవకాశాలు మెరుగుపడతాయి.దీని గురించి ఈడెన్ హోమ్స్టే ప్రతినిధి మాట్లాడుతూ.. స్టేలో లభించే సౌకర్యం, ఆత్మీయతలాగే బుకింగ్ అనుభవం కూడా సులభంగా, సౌకర్యవంతంగా ఉండాలని మేము కోరుకున్నాము. ఈ అప్గ్రేడ్ మా అతిథులందరికీ నాణ్యత, ఆత్మీయత, సౌలభ్యం అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం అని అన్నారు. -
ఈఎంఐలపై ఫోన్ కొన్నవారికి షాక్! ఆర్బీఐ ఓకే అంటే మాత్రం..
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణంపై మొబైల్ ఫోన్లు తీసుకుని ఆ రుణాన్ని తిరిగి చెల్లించడంలో డీఫాల్ట్ అయితే అలాంటి ఫోన్లను వినియోగించేందుకు వీలు లేకుండా ఆ బ్యాంకులు లేదా రుణ సంస్థలు రీమోట్గా లాక్ చేయబోతున్నాయి. ఎందుకంటే వాటికి ఆర్బీఐ ఆ మేరకు అనుమతి ఇవ్వబోతోందంటూ రాయిటర్స్ కథనం పేర్కొంది.వినియోగదారుల వాస్తవ ప్రయోజనాలను కాపాడుతూనే మరోవైపు నిరర్థక రుణాలను తగ్గుంచుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఫోన్లతో సహా మూడింట ఒక వంతు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో చిన్న-టికెట్ వ్యక్తిగత రుణాలపై కొనుగోలు చేస్తున్నట్లు హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ 2024 అధ్యయనం చూపించింది.గతేడాది కూడా బ్యాంకులు, రుణ సంస్థలు ఇలాగే రుణ గ్రహీతలు డీఫాల్ట్ అయితే రుణంపై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను లాక్ చేయడానికి ప్రయత్నించగా ఆ ప్రయత్నాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అడ్డుకుంది. అయితే ఇప్పుడు ఇలాంటి నిరర్థక రుణాలు పెరిగిపోతుండటంతో రికవరీ పెంచుకోవడంలో భాగంగా కస్టమర్ల ఫోన్లను లాక్ చేసేందుకు ఆర్బీఐ రుణ సంస్థలకు అనుమతి ఇచ్చే ఆస్కారం ఉందని రాయిటర్స్ వివరించింది.బ్యాంకులు, రుణసంస్థలతో సంప్రదింపులు జరిపిన తరువాత, ఫోన్-లాకింగ్ మెకానిజమ్పై మార్గదర్శకాలను ప్రవేశపెడుతూ ఆర్బీఐ తన ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ను కొన్ని నెలల్లో అప్డేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఫోన్ లాకింగ్కు సంబంధించి రుణగ్రహీతల నుండి ముందస్తు సమ్మతిని తప్పనిసరి చేయడంతోపాటు లాక్ చేసిన ఫోన్లలో వ్యక్తిగత డేటాను రుణ సంస్థలు యాక్సెస్ చేయకుండా కూడా నిషేధించేలా ఈ నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు.ఈ చర్య అమలైతే, బజాజ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ వంటి ప్రధాన కన్జూమర్ ఫైనాన్స్ సంస్థలకు రికవరీలు మెరుగవుతాయని భావిస్తున్నారు. క్రెడిట్ బ్యూరో సీఆర్ఐఎఫ్ హైమార్క్ ప్రకారం.. రూ.1 లక్ష లోపు రుణాలే ఎక్కువగా డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లలో 85% నాన్-బ్యాంక్ రుణ సంస్థల వద్దే ఉన్నాయి. -
ఉద్యోగంలో చేరి రెండు రోజులే.. జాబ్ నుంచి తీసేసారు
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ చాలా ప్లాన్స్ ఉంటాయి. ఎక్కువ శాలరీ తెచ్చుకోవడానికి కంపెనీలను సైతం మారుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఉద్యోగమే పోతే?, వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం అసాధ్యమే. ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కంపెనీలో చేరిన రెండు రోజులకే ఉద్యోగం నుంచి తొలగించిన తమ బాధాకరమైన అనుభవాన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను గుర్గావ్లోని ఒక చిన్న కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్గా రెండు సంవత్సరాలు పనిచేసానని.. ఈ ఏడాది జూలైలో సాకేత్లోని ఫుడ్ బేస్డ్ కంపెనీలో చేరాను పేర్కొన్నాడు. ఉద్యోగంలో చేరిన రెండో రోజు.. ఆ కంపెనీ బాస్ మరిన్ని బాధ్యతలు చేపట్టగల మేనేజర్ చూస్తున్న కారణంగా.. నన్ను తొలగించారు. చేసేదేమీ లేక నేను ఆఫీసు నుంచి వెళ్ళిపోయాను.ఆ కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తరువాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదని పేర్కొన్నారు. ఇది మానసికంగా నన్ను ఎంతగానో బాధిస్తోంది. నేను ఇప్పుడు నా మునుపటి కంపెనీకి కూడా వెళ్లలేకపోతున్నాను. ఎందుకంటే నా స్థానంలో కంపెనీ మరొకరిని నియమించుకుంది. ఇప్పుడు నాకు ఏమి చేయాలో తోచడం లేదని, నాకు ఎవరైనా సహాయం చేయగలరా అని అడిగారు.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగించాలంటే.. చట్టపరమైన పరిణామాలు ఉండాలి?, మిమ్మల్ని అన్యాయంగా తొలగించారు కాబట్టి.. మీరు న్యాయవాదిని సంప్రదించండి అని ఒకరు సలహా ఇచ్చారు. వేచి ఉండండి, తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుందని మరొకరు అన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ ఉండండి, ఇంటర్యూలు విఫలమైనా బాధపడకండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. -
చిన్న సంస్థలకు ఈ–కామర్స్ దన్ను
దేశీయంగా చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోవడానికి ఈ–కామర్స్ మాధ్యమం దన్నుగా నిలుస్తోంది. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధికి దోహదకారిగా ఉంటోంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, దేశవ్యాప్తంగా వినియోగదారులకు నేరుగా చేరువ కావడానికి, వ్యాపార వృద్ధికి అమెజాన్లాంటి డిజిటల్ మార్కెట్ప్లేస్ల రూపంలో చిన్న వ్యాపారాలకు కొత్తగా మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి.మరోవైపు, ఎఫ్ఎంసీజీ (వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులు) అమ్మకాలు, పట్టణ మార్కెట్లలో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ లావాదేవీల్లో 60 శాతం వాటా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలదే ఉంటోంది. దీంతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు నేరుగా చేరువ చేసే డిజిటల్ మార్కెట్ప్లేస్ల రూపంలో చిన్న సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయి. వ్యాపార వృద్ధికి దోహదకారి.. ‘భారత ఈ–కామర్స్ వ్యవస్థ, ఎంఎస్ఎంఈలకు కీలకమైన వృద్ధి చోదకంగా మారింది. డిమాండ్ భారీగా ఉండే పండుగల సీజన్లో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటోంది.అలాగే, లోకల్ షాప్లు, ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు, వినూత్నమైన స్టార్టప్లను ప్రోత్సహించే ప్రోగ్రాంలతో చిన్న వ్యాపారాలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వీలవుతోంది. సీజనల్ నియామకాలు కూడా ఆర్థికంగా సానుకూల ప్రభావం చూపుతున్నాయి. లక్షల కొద్దీ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి‘ అని ఇండియా ఎస్ఎంఈ ఫోరం ప్రెసిడెంట్ వినోద్ కుమార్ తెలిపారు.డిజిటల్ మార్కెట్ప్లేస్ల ద్వారా అదే రోజు లేదా మరుసటి రోజే డెలివరీ అప్షన్లతో వినియోగదారులకు సత్వరం సేవలు అందించేందుకు వీలవుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 123.58 పాయింట్లు లేదా 0.15 శాతం లాభంతో 81,548.73 వద్ద, నిఫ్టీ 32.40 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,005.50 వద్ద నిలిచాయి.స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్, గ్రీన్ప్యానెల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పిక్కాడిలీ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, మోహిత్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. గుడ్ లక్ ఇండియా, ఆఫర్డబుల్ రోబోటిక్ & ఆటోమేషన్, రోబస్ట్ హోటల్స్ లిమిటెడ్, ప్రుడెన్షియల్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్, డైనమిక్ ప్రొడక్ట్స్(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐ
టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే గూగుల్ గత నెలలో జెమిని యాప్కు 'నానో బనానా' సంబంధించిన ఏఐ ఇమేజ్ నేర్ ఎడిటింగ్ టూల్ను విడుదల చేసింది. నానో బనానా లాంచ్ అయిన కొన్ని రోజుల్లోనే జెమిని యాప్ 10 మిలియన్ డౌన్లోడ్లను దాటిందని, ఈ యాప్ అధిక ప్రజాదరణ పొందిందని గూగుల్ వీపీ జోష్ వుడ్వార్డ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ప్రస్తుతం నానో బననా ట్రెండ్ సాగుతోంది. 3D బొమ్మలను సృష్టించడానికి ఇది చాలా ఉపయోగకరంగా మారింది. ఇప్పటి వరకు ఈ టూల్ 200 మిలియన్ల కంటే ఎక్కువ ఫోటోలను సృష్టించింది. వేగం, ఖచ్చితత్వంలో ఇది చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ప్రత్యర్థులంటే ముందు ఉంది. దీంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. సినీతారలు, రాజకీయ నాయకులు, పెంపుడు జంతువులను సైతం ఈ ట్రెండింగ్ ఏఐను ఉపయోగించి అద్భుతంగా రూపొందించుకుంటున్నారు. ఇవి చూపరులను వావ్ అనేలా చేస్తున్నాయి. ప్రస్తుతం నానో బననా 5 ప్రాంప్ట్లలో అందుబాటులో ఉంది.ప్రాంప్ట్ 1వినియోగదారులు తమ ఫోటోను అప్లోడ్ చేసి, బొమ్మల పెట్టె లోపల తమ బొమ్మను రూపొందించమని జెమినిని అడగవచ్చు. ఇది ప్యాకేజింగ్, గ్రాఫిక్స్, స్టోర్-షెల్ఫ్ లుక్తో పూర్తి చేస్తుంది. ఈ విధానాన్ని చాలామంది ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ప్రాంప్ట్లలో ఇది ఒకటి. మిమ్మల్ని మీరు యాక్షన్ ఫిగర్గా మార్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ప్రాంప్ట్ 2వేరే దశాబ్దంలో ఉన్నట్లు కూడా మిమ్మల్ని మీరు సృష్టించుకోవచ్చు. మీ ఫోటోను 1920ల ఫ్లాపర్, 1970ల డిస్కో డాన్సర్ లేదా 1990ల సిట్కామ్ పాత్రలో చూపించమని అడగవచ్చు. మీరు ఎంచుకున్న దశాబ్దానికి సరిపోయే విధంగా బట్టలు, హెయిర్స్టైల్స్ వంటివాటిని ఏఐ మారుస్తుంది.ప్రాంప్ట్ 3కొంతమంది తమను తాము ప్రసిద్ద టీవీ షోలలో కనిపించేలా డిజైన్ చేసుకోవాలని ఆశపడతారు. బననా ఏఐ ఇప్పుడు దీనిని సాధ్యం చేస్తుంది. మీరు కోరుకున్నట్లు ఏఐ మిమ్మల్ని మారుస్తుంది.ప్రాంప్ట్ 4జెమిని ఏఐ ఇప్పుడు మిమ్మల్ని ప్రముఖుల పక్కన ఉన్నట్లు కూడా చూపించగలదు. ఉదాహరణకు మోనాలిసా పక్కన నిలబడి ఉండటం, వాన్ గోహ్ స్టార్రి నైట్లో కనిపించడం లేదా డాలీ ది పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీలో కలిసిపోవడం వంటివి ఉన్నాయి. మీకు నచ్చిన ప్రముఖుల పక్కన మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది.ఇదీ చదవండి: క్షీణిస్తున్న అమెరికా టూరిజం: అసలైన కారణాలు ఇవే..ప్రాంప్ట్ 5బననా ఏఐ సాయంతో.. ప్రపంచంలోని ప్రముఖ ప్రదేశాల్లో ఉన్నట్లు కూడా రూపొందిందించుకోవచ్చు. ఐఫెల్ టవర్ నుంచి తాజ్ మహల్, హాలీవుడ్ సైన్ వరకు మీకు నచ్చిన ప్రసిద్ధ ప్రదేశంలో మీరు ఉన్నట్లు చూసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. ఏఐ దీనికి లైటింగ్ ఇతర షేడ్స్ కూడా అందిస్తుంది. -
ఈక్విటీ ఫండ్స్లో తగ్గిన పెట్టుబడుల జోరు!
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడుల జోరు ఆగస్ట్లో కొంత తగ్గింది. రూ.33,430 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. జూలైలో రూ.42,702 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే 22 శాతం తగ్గాయి. ఈ ఏడాది జూన్లో రూ.23,587 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 2024 ఆగస్ట్లో ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.38,239 కోట్లుగా ఉన్నాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.7,980 కోట్లు నికరంగా బయటకు వెళ్లాయి. జూలైలో రూ.1.06 లక్షల కోట్ల నికర డెట్ పెట్టుబడులతో పోల్చి చూస్తే భిన్నమైన పరిస్థితి కనిపించింది. దీంతో ఆగస్ట్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.75.20 లక్షల కోట్లకు పరిమితమైంది. జూలై చివరికి ఈ మొత్తం రూ.75.36 లక్షల కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది.ఆగస్ట్లో ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు నీరసించడం వెనుక కొత్త పథకాల (ఎన్ఎఫ్వో) ఆవిష్కరణ తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘గత ధోరణుల ఆధారంగా ఆగస్ట్ నెలలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు అధికంగా నమోదవుతాయని ఆశించాం. కానీ, అవి ఫ్లాట్గా రూ.28,265 కోట్ల స్థాయిలో ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నప్పటికీ, ఎఫ్పీఐలు విక్రయాలు కొనసాగిస్తున్నా కానీ, భారత ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. మార్కెట్లకు ఇంది ఎంతో అనుకూలం’’అని మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు. విభాగాల వారీగా..ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్లోకి అధికంగా రూ.7,679 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత మిడ్క్యాప్ ఫండ్స్ రూ.5,330 కోట్లను ఆకర్షించాయి.స్మాల్క్యాప్ పథకాల్లోకి రూ.4,993 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రూ.3,893 కోట్ల పెట్టుబడులతో సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ తర్వాతి స్థానంలో నిలిచాయి. మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్లోకి రూ.3,527 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్క్యాప్ ఫండ్స్లో రూ.2,835 కోట్లను ఆకర్షించాయి. 23 న్యూ ఫండ్ ఆఫర్లు (కొత్త పథకాలు) ఆగస్ట్లో రాగా, ఇవన్నీ కలసి రూ.2,859 కోట్లను సమీకరించాయి. డైనమిక్ అస్సెట్ అలోకేషన్/బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ రూ.2,316 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాయి. హైబ్రిడ్ ఫండ్స్ (ఈక్విటీ డెట్ కలయికతో కూడిన)లోకి పెట్టుబడులు జూలైతో పోలి్చతే ఆగస్ట్లో 27 శాతం తగ్గి రూ.15,293 కోట్లుగా ఉన్నాయి. డెట్ విభాగం నుంచి నికరంగా రూ.7,890 కోట్లను ఇన్వెస్టర్లు ఉపహరించుకున్నారు. ముఖ్యంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.13,350 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఓవర్నైట్ ఫండ్స్ రూ.4,950 కోట్లను ఆకర్షించాయి. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.2,189 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి ఆగస్ట్ మాసంలో నికరంగా రూ.52,443 కోట్ల పెట్టబుడులు వచ్చాయి. జూలైలో వచి్చన రూ.1.8 లక్షల కోట్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 24.89 కోట్లకు చేరాయి. జూలై చివరికి ఇవి 24.13 కోట్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం! -
రిజర్వ్ బ్యాంకు ఆఫీసర్ల జీతాలు ఎంతుంటాయో తెలుసా?
దేశంలోని బ్యాంకులన్నింటికీ బాసు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అదేనండి ఆర్బీఐ. సాధారణంగానే బ్యాంకు ఉద్యోగుల జీతాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. మరి దేశ అత్యున్నత బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంకులో ఆఫీసర్ల జీతాలు ఎంతుంటాయన్నది మరింత ఆసక్తికరం. ఎంట్రీ లెవల్ గ్రేడ్ బి ఆఫీసర్ల నుంచి ఉన్నత స్థాయి డిప్యూటీ జనరల్ మేనేజర్ల వరకు జీతాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది ఈ కథనంలో తెలుసుకుందామా?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే గ్రేడ్ బి ఆఫీసర్ల వేతన స్కేలును అధికారికంగా సవరించింది. 2025 నోటిఫికేషన్ ప్రకారం, ప్రారంభ ప్రాథమిక వేతనం నెలకు రూ .55,200 నుండి రూ .78,450 కు పెంచింది. స్థూల నెలవారీ వేతనం ఇప్పుడు రూ .1,50,374 కు చేరుకుంది.గ్రేడ్ బి ఆఫీసర్ సవరించిన నెలవారీ జీతం బ్రేక్డౌన్ ఇలా..బేసిక్ వేతనం: రూ.78,450స్థూల వేతనం: రూ.1,50,374 (హెచ్ఆర్ఏ మినహాయించి)ఇన్-హ్యాండ్ పే: రూ.1.2 లక్షల - రూ.1.35 లక్షలు (లొకేషన్,మినహాయింపులను బట్టి)పే స్కేల్: 16 ఏళ్లలో రూ.78,450 - రూ.1,41,600వేతనానికి మించిన ప్రోత్సాహకాలుఆర్బీఐ అధికారులు హౌసింగ్ అలవెన్సులు (మెట్రోలలో నెలకు రూ .70,000 వరకు), అభ్యాస రీయింబర్స్మెంట్లు, భోజన రాయితీలు, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్) కింద ఉదారమైన పెన్షన్ మొత్తాలను పొందుతారు.ఆఫీసర్ హోదానెల జీతంఅసిస్టెంట్ జనరల్ మేనేజర్రూ.2.44 లక్షలు – రూ.4.33 లక్షలుజనరల్ మేనేజర్రూ.2.91 లక్షలు – రూ.4.58 లక్షలుడిపార్ట్ మెంట్ మేనేజర్రూ.2.08 లక్షలు – రూ.3.33 లక్షలుడిప్యూటీ మేనేజర్రూ.1.5 లక్షలు – రూ.2.5 లక్షలుడిస్ట్రిక్ట్ మేనేజర్రూ.1.08 లక్షలు – రూ.2 లక్షలుఆఫీస్ అసిస్టెంట్రూ.43,000 – రూ.1.01 లక్షలుఆఫీస్ అటెండెంట్రూ.27,500 – రూ.66,600గమనిక: ఇక్కడ పేర్కొన్న జీతం గణాంకాలు ఆంబిషన్ బాక్స్, గ్లాస్ డోర్ వంటి థర్డ్ పార్టీ వేదికల్లో నమోదుల ఆధారంగా ఉజ్జాయింపుగా రూపొందించినవి. -
ఒక్కరోజు 40 శాతంపైగా పెరిగిన స్టాక్.. కారణం..
ఒరాకిల్ స్టాక్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులో ఏకంగా 40 శాతంపైగా పెరిగి రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్ 10న మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్ క్రమంగా పెరుగుతూ 345.38 డాలర్లు(మునుపటి సెషన్తో పోలిస్తే 40 శాతంపైగా) పెరిగి ముగింపు సమయానికి 328.33(35.95 శాతం) డాలర్ల వద్ద స్థిరపడింది. ఒరాకిల్ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలకు తోడు ఇతర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, సంస్థ అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.స్టాక్ పెరుగుదల ప్రధాన కారణాలుక్లౌడ్ కంప్యూటింగ్లో ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారుతోంది. కంపెనీ ఓపెన్ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్డ్యాన్స్.. వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దాంతో ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో 77% పెరిగి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇది 2030 నాటికి 144 బిలియన్ డాలర్ల మార్కునుతాకే అవకాశం ఉందని అంచనా.ఒరాకిల్ క్లౌడ్ సేవలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ విభాగంలో ఆదాయం 455 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ ఏఐ, ఎంటర్ప్రైజ్ పరిష్కారాలతో ముడిపడి ఉన్న భవిష్యత్తు వ్యాపారాన్ని ఇది హైలైట్ చేస్తుంది.ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్ట్రాటజిక్ పొజిషనింగ్లో ఒరాకిల్ సొంత సర్వీసులు వాడుతోంది. దాని డేటా సెంటర్లను వేగంగా అభివృద్ధి చేస్తోంది. కృత్రిమ మేధ కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చేక్రమంలో ఎన్విడియా జీపీయూలకు భద్రతను అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటి క్లౌడ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కంపెనీల సరసన ఒరాకిల్ ప్రత్యర్థిగా ఎదుగుతోంది.ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం! -
యస్ బ్యాంక్లో మార్పులకు ఆర్బీఐ ఓకే..
బోర్డులో నామినీ డైరెక్టర్ల నియామకానికి తాజాగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. ఇందుకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్(ఏవోఏ)లో ప్రతిపాదిత సవరణలకు అనుమతించినట్లు పేర్కొంది. దీంతో సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) ఇద్దరు నామినీ డైరెక్టర్లను నామినేట్ చేసేందుకు వీలు చిక్కనుంది. మరో నామినీ డైరెక్టర్ను పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) ఎంపిక చేయనుంది.యస్ బ్యాంక్లో ఎస్బీఐసహా ఏడు ఇతర బ్యాంకులకు గల వాటాలను జపనీస్ దిగ్గజం ఎస్ఎంబీసీ సొంతం చేసుకున్నాక బోర్డులో నియామకాలకు తెరలేవనుంది. కాగా.. సెకండరీ కొనుగోళ్ల ద్వారా బ్యాంకులో 20 శాతం వాటాను ఎస్ఎంబీసీ చేజిక్కించుకోనున్నట్లు మే 9న యస్ బ్యాంక్ వెల్లడించిన విషయం విదితమే. దీనిలో భాగంగా ఎస్బీఐ నుంచి 13.19 శాతం వాటాను కొనుగోలు చేయనుండగా.. యాక్సిస్, బంధన్, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా బ్యాంకుల నుంచి మిగిలిన 6.81 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది.ఈ నెల మొదట్లో ప్రతిపాదిత డీల్కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆర్బీఐ సైతం ఇందుకు అనుమతిస్తూ ఎస్ఎంబీసీ ప్రమోటర్గా గుర్తింపు పొంబోదని తెలియజేసింది. ప్రస్తుతం యస్ బ్యాంక్లో ఎస్బీఐకు 24 శాతం వాటా ఉంది. తాజా డీల్ తదుపరి 10.81 శాతానికి వాటా పరిమితంకానుంది. -
22 వరకూ ఆగుదాం!
నగర వాసులకు బొనాంజా అందనుంది. దసరా, దీపావళి పండగ ఆనందాలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సవరణతో రెట్టింపు కానుంది. ఇటీవల కేంద్రం సవరించిన జీఎస్టీ శ్లాబులు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. గతంతో పోలిస్తే ఆటో మొబైల్స్, ఎల్రక్టానిక్ వంటి చాలా వరకు ఉత్పత్తుల ధరలు సుమారు 10 శాతం మేర తగ్గనున్నాయి. దీంతో వాహనాలు, టీవీలు, కార్లు, సెల్ఫోన్లు వంటి ఉత్పత్తుల కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈ నెల 22 వరకూ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు ఈ– కామర్స్ సంస్థలు కూడా ఈ నెల 22 తర్వాతే ఆఫర్లను అందించేందుకూ సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లు, ఆన్లైన్ సంస్థల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. 18 నుంచి 5 శాతానికి..గతంలో జీఎస్టీలో ఐదు శ్లాబులు ఉండగా.. తాజాగా కేంద్రం వీటిని రెండింటికి కుదించింది. విలాసవంతమైన వస్తువులపై ప్రత్యేకంగా 10 శాతం జీఎస్టీ శ్లాబును విధించింది. ప్రస్తుతం అనేక ఉత్పత్తులపై జీఎస్టీ 28 శాతం వరకు ఉన్నాయి. 22వ తేదీ నుంచి ఈ స్లాబ్ 18 శాతానికి తగ్గనుంది. కొన్ని ఉత్పత్తులపై 18 శాతం నుంచి 5 శాతానికి కూడా తగ్గే అవకాశముంది. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి ఎల్రక్టానిక్ వస్తువులతో పాటు కార్లు, బైక్ వంటి ఆటోమొబైల్స్ ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు నిత్యావసర సరుకులపై కూడా కేంద్రం జీఎస్టీని తగ్గించింది. జీఎస్టీ శ్లాబుల్లో మార్పులతో ఒకవైపు కొన్ని కంపెనీలు రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో వినియోగదారులు మాత్రం రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలామంది షోరూమ్లకు వెళ్లి వస్తువులను చూస్తున్నారు. వాటి ఫీచర్లను పరిశీలిస్తున్నారు. కానీ కొనుగోలును మాత్రం ఈ నెల 22 తర్వాతే చేద్దామనే అభిప్రాయానికి వస్తున్నారని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. కొన్ని బ్రాండ్లు తాత్కాలికంగా ఆఫర్లు ప్రకటించినా అవి కస్టమర్లను ఆకట్టుకోలేకపోతున్నాయి. తగ్గనున్న వాహనాల ధరలు..సాధారణంగా దసరా, దీపావళి పండగ సీజన్లలో వాహనాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్గా భావిస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఆటో మొబైల్స్పై 28 శాతంగా జీఎస్టీ ఉండగా.. కొత్త జీఎస్టీ శ్లాబ్లో ఇది 18 శాతానికి తగ్గింది. ఏకంగా 10 శాతం మేర జీఎస్టీ తగ్గుతుంది. దీంతో మధ్యస్థాయి కారుపై రూ.1.5 లక్షల వరకు, బైక్పై రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య తగ్గింపు ఉండనుంది. దీంతో వాహన కొనుగోలుదారులు కొనుగోళ్లను మరో రెండు వారాల పాటు వాయిదా వేసుకుంటున్నారు. వాహన షోరూమ్లో గిరాకీ తగ్గడంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు షోరూమ్ నిర్వాహకులు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ముందస్తుగా బుకింగ్ చేసుకుని 22వ తేదీ తర్వాతే డెలివరీ చేసుకోవచ్చని భావిస్తున్నారు.ఏసీ, వాషింగ్ మెషీన్, టీవీలు సైతం.. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, డిష్వాషర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై కూడా కేంద్రం జీఎస్టీ శ్లాబ్ను తగ్గించింది. ఇప్పటివరకు వీటిపై 28 శాతం పన్ను విధించగా, ఇప్పుడవి 18 శాతం జీఎస్టీ శ్లాబ్లోకి వెళ్లాయి. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా భారీగానే తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీవీలపై రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు, మొబైల్ ఫోన్లపై రూ.2 వేల నుంచి రూ.5 వేలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉండటంతో కొనుగోళ్ల వాయిదాకే జనం మొగ్గు చూపుతున్నారు.ఈ– కామర్స్ ఆఫర్లూ అప్పుడే..ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ సంస్థలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ–కామర్స్ కొనుగోలుదారులు సైతం ఈ నెల 22 డెడ్లైన్ విధానానికే జై కొడుతుండటంతో.. కొన్ని సంస్థలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆఫర్లను సైతం నిలిపివేశాయి. దీంతో సాధారణంగా డైలీ, వీక్లీ ఆఫర్ల పేరుతో ఆన్లైన్ కస్టమర్లను ఆకర్షించే ఈ–కామర్స్ సంస్థలు.. తమ మెగా ఆఫర్లను ఈ నెల 22 తర్వాతే ప్రకటించాలని వ్యూహరచన చేస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత ‘బిగ్ బిలియన్ డేస్’, ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ వంటి పేర్లతో భారీ సేల్ నిర్వహించడానికి సిద్ధమవుతుండటం గమనార్హం.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడిగా లారీ ఎలిసన్ -
ఈ దేశంలో శాశ్వతంగా ఉండిపోవచ్చు..
విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే చాలా దేశాలు విదేశీయులకు తమ దేశంలో శాశ్వతంగా ఉండిపోయేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. జర్మనీ ప్రభుత్వం ఇప్పుడు రూ.11,500 లోపు ఫీజుతో శాశ్వత నివాస అనుమతిని (Settlement Permit) అందిస్తోంది. ఇది జర్మనీలో శాశ్వతంగా నివసించేందుకు అత్యంత భద్రమైన మార్గం. ఈ అనుమతితో మీరు కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా జీవించవచ్చు, ఉద్యోగం చేయవచ్చు లేదా స్వయం ఉపాధి ద్వారా పని చేయవచ్చు.జర్మనీలో స్కిల్డ్ వర్కర్ అంటే..రెసిడెన్స్ యాక్ట్ ప్రకారం వీరు స్కిల్డ్ వర్కర్ కేటగిరీలోకి వస్తారు..- జర్మన్ లేదా గుర్తింపు పొందిన విదేశీ డిగ్రీ కలిగినవారు- జర్మనీలో సమానమైన వృత్తి శిక్షణ పొందినవారు- ఈయూ బ్లూ కార్డ్ కలిగినవారు- ఈయూ డెరెక్టివ్ 2016/801 ప్రకారం అంతర్జాతీయ పరిశోధకులుప్రధాన అర్హతలు- సెక్షన్లు 18ఎ, 18బి, 18డి, 18జి ప్రకారం 3 సంవత్సరాలుగా చెల్లుబాటు అయ్యే నివాస అనుమతి కలిగి ఉండాలి- జీవనాధారం కోసం ప్రభుత్వ సహాయంపై ఆధారపడకుండా ఉండాలి- కనీసం 36 నెలలు పింఛను బీమా (statutory pension)లో చెల్లింపులు చేయాలి- జర్మన్ బి1 సీఈఎఫ్ఆర్ స్థాయిలో భాషా నైపుణ్యం ఉండాలి- “లివింగ్ ఇన్ జర్మనీ” పరీక్ష ద్వారా జర్మన్ సమాజం, చట్టాలపై ప్రాథమిక అవగాహన చూపించాలి- కుటుంబానికి సరిపడిన నివాస స్థలం ఉండాలిత్వరిత ప్రక్రియలుఈ కింది కొన్ని సందర్భాల్లో వేగంగా శాశ్వత అనుమతి పొందవచ్చు..- ఈయూ బ్లూ కార్డ్: 27 నెలల ఉద్యోగం తర్వాత, బి1 జర్మన్ భాష ఉంటే 21 నెలలకే అర్హత-జర్మన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు: 2 సంవత్సరాల ఉద్యోగం తర్వాత అర్హత- అత్యంత నైపుణ్యవంతులు: శాస్త్రవేత్తలు, సీనియర్ టీచర్లు మొదలైనవారు వెంటనే అర్హత పొందవచ్చు- స్వయం ఉపాధి: సెక్షన్ 21 ప్రకారం 3 సంవత్సరాల వ్యాపార అనుభవం తర్వాత అర్హతజీవిత భాగస్వాములకు..- స్కిల్డ్ వర్కర్ జీవిత భాగస్వామి సెక్షన్ 18సి ప్రకారం శాశ్వత అనుమతి కలిగి ఉండాలి- 3 సంవత్సరాలుగా నివాస అనుమతి కలిగి ఉండాలి- వారానికి కనీసం 20 గంటలు ఉద్యోగం చేయాలి- బి1 స్థాయి జర్మన్ భాషా నైపుణ్యం ఉండాలిఅప్లికేషన్ ఖర్చుజర్మనీలో శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి అయ్యే ఖర్చు సాధారణంగా 113 యూరోల (రూ .11,666) నుండి 147 యూరోల (రూ .15,176) వరకు ఉంటుంది. స్కిల్డ్ వర్కర్ లేదా హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్ వంటి మీ వర్క్ ప్రొఫైల్ ఆధారంగా ఫీజులు మారుతూ ఉంటాయి. ఇక అనువాదాలు, భాషా పరీక్ష రుసుములు, ఆరోగ్య బీమా ప్రీమియంలు వంటి ఇతర ఖర్చులు అదనం.ఇదీ చదవండి: మా దేశం వచ్చేయండి.. శాశ్వతంగా ఉండిపోండి! -
ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పెంపు..?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అక్టోబర్ 10-11 తేదీల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు తీపికబురు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మీటింగ్కు సంబంధించిన ఎలాంటి ఎజెండా ఇంకా ఖరారు కాలేదు. కొన్ని సంస్థలు, ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఇందులో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అందులోకి అంశాలు కింది విధంగా ఉన్నాయి.ఏటీఎం ద్వారా విత్డ్రా..ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థకు బ్యాంకు లాంటి కార్యాచరణను తీసుకురావనే ప్రణాళికలున్నాయి. ఇందులో ఏటీఎంల ద్వారా పాక్షిక ఉపసంహరణలను అనుమతించడం, యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వంటివి ఉన్నాయి. 8 కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పదవీ విరమణ పొదుపును ఎలా నిర్వహిస్తారనే దానిపై గణనీయమైన మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్ఓ 3.0 ప్రతిపాదన డిజిటల్ చెల్లింపులు, ఈజ్-ఆఫ్-యాక్సెస్ ఫీచర్లను ఏకీకృతం చేయాలని నిర్ణయించింది. ఆధునిక బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా ఇందులో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవి ఆమోదం పొందితే చందాదారులకు సర్వీసులు సులభతరం అవుతాయి.ప్రావిడెంట్ ఫండ్లో కొంత భాగాన్ని ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.ఎంపిక చేసిన లావాదేవీల కోసం వారి ఈపీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా చెల్లింపులు చేయడానికి యూపీఐను ఉపయోగించవచ్చు.పెన్షన్ పెంపుప్రస్తుతం రూ.1,000గా నిర్దేశించిన కనీస నెలవారీ పెన్షన్ను రూ.1500 నుంచి రూ.2,500 వరకు పెంచే ప్రతిపాదన కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ఈమేరకు నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడిగా లారీ ఎల్లిసన్ -
బంగారం స్పీడ్కు బ్రేకులు.. పసిడి ప్రియులకు ఉపశమనం
దేశంలో బంగారం ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Rate) కాస్త శాంతించి ఎటువంటి పెరుగుదల లేకుండా స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అమెరికా టారిఫ్ల ప్రభావం ఇదిగో ఇంతే..
అమెరికా టారిఫ్ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీపై నికరంగా పడే ప్రభావం 0.2–0.3 శాతం వరకు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. అయితే జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీ డిమాండ్ను పెంచడం ద్వారా ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తాయని అభిప్రాయపడ్డారు.ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అమెరికాకు చేసిన ఎగుమతుల్లో సగం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లోనే నమోదైనట్టు గుర్తు చేశారు.సుంకాలు స్వల్పకాలమే గానీ, దీర్ఘకాలం పాటు కొనసాగకపోవచ్చన్నారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అప్పుడు ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయంటూ.. పెట్టుబడులు, మూలధన వ్యయాలు, ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్పై దీని తాలూకూ అనిశ్చితి ఉంటుందని చెప్పారు.అయితే, జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీయంగా బలమైన వినియోగ సృష్టి ద్వారా టారిఫ్ల తాలూకూ ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలను అధిగమించేందుకు సాయపడతాయన్నారు. కనుక మొత్తం మీద జీడీపీపై పడే ప్రభావం 0.3 శాతం మించి ఉండదన్నారు. 2025–26 సంవత్సరానికి 6.3–6.8% మధ్య జీడీపీ వృద్ధి నమోదు కావొచ్చన్న తమ అంచనాలను గుర్తు చేశారు.సాగులో సంస్కరణలు.. వ్యవసాయ రంగం జీడీపీకి మరో 0.5–0.70 శాతం వరకు తోడ్పాటునివ్వగలదని నాగేశ్వరన్ తెలిపారు. ఇందుకు గాను రైతులు వారు కోరుకున్న చోట విక్రయించే హక్కు అవసరమన్నారు. ప్రకృతి విపత్తులపై సాగు దిగుబడులు ఆధారపడి ఉన్నందున వారికి బీమా రూపంలోనూ దన్నుగా నిలవాలన్నారు. ప్రపంచ వాణిజ్యం విషయంలో అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్ స్థానాన్ని భర్తీ చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని సీఈఏ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు.అటువంటి చర్యలో భారత్ పాలుపంచుకోదని ఓ ప్రశ్నకు సమాధనంగా చెప్పారు. డాలర్కు మెరుగైన ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదంటూ.. ఇందుకు చాలా కాలం పట్టొచ్చన్నారు. గతేడాది జరిగిన బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యానికి స్థానిక కరెన్సీల్లో చెల్లింపులకు, ప్రత్యేకంగా బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటుకు అంగీకారం కుదరడం గమనార్హం. -
ప్రపంచ కుబేరుడిగా లారీ ఎలిసన్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ఎలాన్మస్క్. కానీ ఇక నుంచి ఆ స్థానాన్ని ఒరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ భర్తీ చేస్తున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లు ఇటీవల కుదేలవ్వడంతో మస్క్కు కేటాయించిన షేర్ల విలువ భారీగా తగ్గిపోవడం ఇందుకు ఒక కారణం. కుబేరుల జాబితాలో మస్క్ తర్వాతి స్థానంలో ఉన్న ఓరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సంస్థ విలువ పెరగడం కూడా లారీని ప్రపంచంలోని కుబేరుల జాబితాలో ముందుంచింది.ఎలిసన్ నికర విలువ 393 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొన్న మంగళవారం ఒక్కరోజే అతని సంపద 101 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. ఒరాకిల్లో ఎల్లిసన్కు 40 శాతం వాటా ఉంది. ఇటీవల కంపెనీ షేర్లు పుంజుకోవడంతో ఆయన సంపద సైతం భారీగా పెరిగింది. ఒరాకిల్ ఇటీవల బ్లాక్ బస్టర్ త్రైమాసిక ఆదాయాలను విడుదల చేయడం కలిసొచ్చింది. దాని ఏఐ ఆధారిత క్లౌడ్ వ్యాపారం దూసుకుపోతుండడంతో ఈమేరకు ఇన్వెస్టర్లు కంపెనీలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపారు.ఒరాకిల్ ఇటీవల చేసిన ప్రకటనలు..ఓపెన్ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్డ్యాన్స్తో ఒప్పందాలు.2025 ఆర్థిక సంవత్సరంలో 18 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 144 బిలియన్ డాలర్లకు క్లౌడ్ రెవెన్యూ వృద్ధిని అంచనా వేశారు.ఎంటర్ప్రైజ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ ద్వారా మెరుగైన మార్జిన్లు ప్రకటన.ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్తో ప్రత్యక్ష పోటీలో ఉంది.పేరునెట్వర్త్ (సెప్టెంబర్ 2025)సంస్థలుఇటీవలి పరిణామాలులారీ ఎలిసన్393 బిలియన్ డాలర్లు41% ఒరాకిల్ఏఐ క్లౌడ్ ఒప్పందాలు, ఓపెన్ఏఐతో డీల్ఎలాన్మస్క్385 బిలియన్ డాలర్లుటెస్లా, స్పేసెఎక్స్ఏడాదిలో కంపెనీల విలువ 13% తగ్గుదల ఇదీ చదవండి: అనిల్ అంబానీపై కేసులు మీద కేసులు.. -
25,000 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 25,001కు చేరింది. సెన్సెక్స్(Sensex) 113 పాయింట్లు పుంజుకుని 81,528 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అనిల్ అంబానీపై కేసుల మీద కేసులు..
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్తోపాటు మరికొందరు అధికారులపై రూ.2,929 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. గత నెలలో సీబీఐ దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఎఫ్ఐఆర్) ఆధారంగా ఈడీ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు నష్టం కలిగించాయని, దాంతో ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించామని సీబీఐ ఇప్పటికే తెలిపింది.ముంబైలో అనిల్ అంబానీ, ఆర్కామ్కు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో ఈ సోదాలు నిర్వహించారు. అప్పుగా తీసుకున్న బ్యాంకు నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో, రుణాలు ఎందులోకి మళ్లించబడ్డాయో నిర్ధారించడానికి ఆధారాలను సేకరించే లక్ష్యంతో ఈ సోదాలు నిర్వహించారు. జూన్ 13న ఆర్కామ్, అంబానీలను ఫ్రాడ్ గుర్తించిన ఎస్బీఐ జూన్ 24న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదిక పంపింది.ఇటీవల అనిల్ అంబానీని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సైతం మోసపూరితం (ఫ్రాడ్)గా వర్గీకరించింది. దాదాపు దశాబ్దం క్రితం ఆర్కామ్ తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలిపిన సమాచారంలో బీవోబీ పేర్కొంది. ఆర్కామ్కు బీవోబీ రూ.1,600 కోట్ల రుణాన్ని, మరో రూ.862.5 కోట్లను లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మంజూరు చేసింది. ఈ మొత్తం రూ.2,462.5 కోట్లలో ఈ ఏడాది ఆగస్ట్ 28 నాటికి రూ.1,656.07 కోట్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలో కంపెనీతో పాటు ప్రమోటర్ అనిల్ అంబానీని ‘ఫ్రాడ్’గా వర్గీకరిస్తూ బీవోబీ నుంచి సెప్టెంబర్ 2న లేఖ అందినట్లు ఆర్కామ్ వెల్లడించింది. ఈ లేఖ ప్రకారం.. 2017, జూన్ 5 నుంచి బీవోబీ ఈ ఖాతాను మొండిబకాయిగా కొనసాగిస్తోంది.ఇదీ చదవండి: భారత వృద్ధి అంచనాలు అప్!ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో అంబానీని ఈడీ ప్రశ్నించింది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో రూ.3,000 కోట్లు నిధులు మళ్లించినట్లు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బ్యాంకు ప్రమోటర్లు కూడా రుణాలు మంజూరు కావడానికి ముందు చెల్లింపులు పొందినట్లు కనుగొంది. ఇది క్విడ్ ప్రో కోకు దారితీసినట్లు సూచిస్తుంది. -
భారత వృద్ధి అంచనాలు అప్!
ఫిచ్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను పెంచింది. జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందుతుందన్న గత అంచనాను 6.9 శాతం చేసింది. జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి బలమైన పనితీరు నమోదు కావడం, దేశీ వినియోగ ఆధారిత డిమాండ్ పుంజుకోవడాన్ని అంచనాలు పెంచేందుకు కారణాలుగా పేర్కొంది. అమెరికా టారిఫ్లతో భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు లోగడ పలు అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రకటించగా.. అంచనాలను పెంచిన తొలి సంస్థ ఫిచ్ కావడం గమనార్హం.మార్చి, జూన్ త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగాన్ని పుంజుకున్నట్టు ఫిచ్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. జీడీపీ జనవరి–మార్చి త్రైమాసికంలో 7.4 శాతం వృద్ధి చెందగా, జూన్ త్రైమాసికంలో 7.8 శాతానికి పెరగడాన్ని ప్రస్తావించింది. వాస్తవానికి జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని ఫిచ్ ఈ ఏడాది ఏప్రిల్లో తన అంచనాలను ప్రకటించగా, దీనికి మించి బలమైన వృద్ధి రేటు నమోదైంది. దీనికి తోడు జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ మంచి వృద్ధిని నమోదు చేస్తుందంటూ తాజా అంచనాలను ఫిచ్ విడుదల చేసింది.వినియోగమే బలమైన చోదకం.. ‘‘అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు ఇటీవలి నెలల్లో పెరిగాయి. భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం అదనపు టారిఫ్లు విధించగా, ఇవి ఆగస్ట్ 27 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో అమెరికాలో భారత ఉత్పత్తులపై టారిఫ్లు 50 శాతానికి పెరిగాయి. చర్చల ద్వారా టారిఫ్ రేట్లు అంతిమంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. వాణిజ్య సంబంధాల విషయంలో నెలకొన్న అనిశ్చితి వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. పెట్టుబడులపై దీని ప్రభావం పడుతుంది. జీఎస్టీలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వినియోగం బలంగా పెరుగుతుంది’’అని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. వృద్ధికి దేశీ వినియోగం కీలక చోదకంగా పనిచేస్తుందని తెలిపింది. సానుకూల ఆర్థిక పరిస్థితులు పెట్టుబడులను ఇతోధికం చేస్తాయని అంచనా వేసింది. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో వృద్ధి కొంత నిదానిస్తుందని ఫిచ్ అభిప్రాయపడింది. 2026–27లో 6.3 శాతం.. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.3 శాతానికి, తదుపరి ఆర్థిక సంవత్సరంలో (2027–28)లో 6.2 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. సగటు కంటే అధిక వర్షపాతం, అధిక నిల్వలతో ఆహార ధరలు తక్కువ స్థాయిలోనే కొనసాగుతాయని తెలిపింది. దీంతో ద్రవ్యోల్బణం 2025 చివర్లోనే 3.2 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2026 చివరికి 4.1 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. ఆర్బీఐ ఈ ఏడాది చివరికి పావు శాతం రేటు తగ్గిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: రొయ్యల ఎగుమతులకు టారిఫ్ ఎఫెక్ట్.. -
రొయ్యల ఎగుమతులకు టారిఫ్ ఎఫెక్ట్..
రొయ్యల ఎగుమతిదార్లపై అమెరికా టారిఫ్ల ప్రభావం భారీగానే ఉండనుంది. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) పరిశ్రమ ఆదాయం 12 శాతం క్షీణించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఒక నివేదికలో తెలిపింది. భారత ఫ్రోజెన్ రొయ్యలకు అమెరికా కీలక మార్కెట్గా ఉంటోంది. ఎగుమతుల పరిమాణంలో 41 శాతం, విలువపరంగా 48 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. 50 శాతం ప్రతీకార సుంకాల (అదనంగా యాంటీ–డంపింగ్ డ్యూటీ మొదలైనవి కూడా కలిపితే 58 శాతం) వల్ల వాణిజ్యం గణనీయంగా దెబ్బతింటుందని నివేదిక పేర్కొంది. దీనితో ఈక్వెడార్, వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాలతో భారత్ పోటీపడలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఫలితంగా ఎగుమతుల పరిమాణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించింది.ప్రధాన రొయ్యల కంపెనీల ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ ప్రకారం 2025–26లో ఆదాయాలు 12 శాతం మేర, మార్జిన్లు సుమారు 150 బేసిస్ పాయింట్ల (దాదాపు ఒకటిన్నర శాతం) మేర తగ్గే అవకాశం ఉందని ఇండ్–రా తెలిపింది. నిర్వహణ మూలధనంపరంగా కూడా కొంత ఒత్తిడి నెలకొనవచ్చని వివరించింది. అధిక టారిఫ్లను అమెరికా కొనసాగిస్తే మధ్యకాలికంగా రొయ్యల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం తప్పదని పేర్కొంది. ఎగుమతుల పరిమాణం, మార్జిన్లపై ఒత్తిళ్ల వల్ల ఆర్థికంగా అంత పటిష్టంగా లేని మధ్య స్థాయి సంస్థల రుణపరపతి దెబ్బతినే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఇతర దేశాల వైపు చూపు ..భారతీయ రొయ్యల ప్రాసెసింగ్ సంస్థలు దేశీ మార్కెట్తో పాటు అమెరికాయేతర మార్కెట్లలోకి (చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, బ్రిటన్) కూడా మరింతగా విస్తరించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ఇండ్–రా అసోసియేట్ డైరెక్టర్ ఆదర్శ్ గుత్తా తెలిపారు. అయితే, ఈ ప్రాంతాల్లో అంతగా అధిక ధర లభించదని, పైగా పరిమిత స్థాయిలోనే ఎగుమతి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యూహాత్మక డైవర్సిఫికేషన్, ఉత్పత్తులకు మరింత విలువను జోడించడంపై పెట్టుబడులు పెట్టడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంలాంటివి పోటీతత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టుకునేందుకు కీలకంగా ఉంటాయని ఆదర్శ్ చెప్పారు.ఇదీ చదవండి: లంచం కేసు సెటిల్మెంట్ చేసుకున్న సంస్థ -
లంచం కేసు సెటిల్మెంట్ చేసుకున్న సంస్థ
లంచం, ఇతరత్రా అవకతవకల ఆరోపణల కేసును సెటిల్ చేసుకున్నట్లు సౌర విద్యుదుత్పత్తి సంస్థ అజూర్ పవర్ వెల్లడించింది. ఇందుకోసం 2.3 కోట్ల డాలర్లు చెల్లించినట్లు వివరించింది. కొత్త ప్రాజెక్టులను దక్కించుకునేందుకు కీలక డేటాను తప్పుగా చూపించినట్లు, లంచాలు చెల్లించినట్లు అజూర్ పవర్తో పాటు దాని మాజీ ఎగ్జిక్యూటివ్లు రంజిత్ గుప్తా, మురళి సుబ్రమణియన్, పవన్ కుమార్ అగ్రవాల్పై ఆరోపణలు ఉన్నాయి.అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అజూర్ షేర్లు లిస్టయి ఉన్నాయి. నిబంధనలను పాటించే విషయంలో వారు తప్పుదోవ పట్టించే, తప్పుడు ప్రకటనలు చేశారని, ఫలితంగా కృత్రిమంగా పెరిగిపోయిన షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని క్లాస్ యాక్షన్ సూట్ నమోదైంది. దీంతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కంపెనీ నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది.ఇదీ చదవండి: రైళ్లకు ‘అద్దె’ చెల్లిస్తున్న భారతీయ రైల్వే! -
రిలయన్స్ ఇంటెలిజెన్స్ షురూ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సేవల కంపెనీకి తెరతీసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. పూర్తి అనుబంధ కంపెనీగా ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి సర్టీఫికెట్ను పొందినట్లు తెలియజేసింది. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) లో కొత్తగా ఏఐ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా భారీస్థాయి ఏఐ మౌలికసదుపాయాలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్తో కొత్త భాగస్వామ్యాలను సైతం ప్రకటించారు. గిగావాట్ సామర్థ్యంతో రిలయన్స్ ఇంటెలిజెన్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ ఇప్పటికే వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ మద్దతుతో ఏఐ–రెడీ డేటా సెంటర్లతో నెలకొల్పుతున్నట్లు తెలియజేసింది. దశాబ్దంక్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్కు డిజిటల్ సరీ్వసులు గ్రోత్ ఇంజిన్గా నిలవగా.. ఇకపై ఏఐతో మరింత పురోభివృద్ధిని అందుకోనున్నట్లు ఏజీఎంలో ముకేశ్ పేర్కొన్నారు. -
మన వాహన రంగం ప్రపంచంలోనే టాప్!
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తాను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు రూ. 22 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. ప్రస్తుతం అమెరికా పరిశ్రమ రూ. 78 లక్షల కోట్ల విలువతో అగ్రస్థానంలో ఉండగా, రూ. 47 లక్షల కోట్లతో చైనా రెండో స్థానంలో ఉంది. ‘భారత వాహన పరిశ్రమను ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టాలనేది మా లక్ష్యం. ఇది కాస్త కష్టమే, అయినప్పటికీ, అసాధ్యం మాత్రం కాదు’ అని గడ్కరీ చెప్పారు. భారత్లో అత్యంత నాణ్యమైన వాహనాలు చౌకగా తయారవుతున్నందున, టాప్ ఆటోమొబైల్ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు. ఈ–20కి వ్యతిరేకంగా పెట్రోల్ లాబీలు .. ఈ–20 ఇంధనంపై (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఆందోళనలు వ్యక్తమవుతుండటంపై స్పందిస్తూ.. పెట్రోలియం రంగం దీనికి వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తోందని గడ్కరీ చెప్పారు. ‘ప్రతీచోట లాబీలు ఉంటాయి. ఎవరి ప్రయోజనాలు వారివి. పెట్రోల్ లాబీ చాలా సంపన్నమైనది’ అని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయం రంగంలో ఉపయోగించే వాహనాల్లో ఫ్లెక్స్–ఫ్యూయల్ ఇంజిన్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వేగంగా ఎదుగుతున్న ఈవీ మార్కెట్: కుమారస్వామి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్లలో ఇప్పుడు భారత్ కూడా ఒకటని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. 2024–25లో దేశీయంగా 10 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని ఆయన వివరించారు. వీటిలో ఈ–టూవీలర్ల వాటా 1 శాతంగా, త్రీ–వీలర్ల వాటా 57 శాతంగా ఉందని చెప్పారు. ఆటో రిటైల్ సదస్సుకు పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పెంచాలి.. శిలాజ ఇంధనాల దిగుమతి కోసం భారత్ రూ. 22 లక్షల కోట్లు వెచి్చస్తోందని, ఇటువంటి ఇంధనాల వల్ల కాలుష్య సమస్య వస్తోందని గడ్కరీ చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ కంపెనీలు చౌకగా పనిచేసే ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులు తయారు చేస్తున్నాయని వివరించారు. అయితే, దేశీయంగా ఏటా 1,00,000 మేర ఎలక్ట్రిక్ బస్సుల అవసరం ఉంటే తయారీ సామర్థ్యం మాత్రం 50,000–60,000 మాత్రమే ఉందని ఆయన తెలిపారు. ఎగుమతులకు కూడా భారీగా అవకాశాలు ఉన్నందున ఎలక్ట్రిక్ బస్సుల తయారీని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లిథియం అయాన్ బ్యాటరీల ధర కూడా తగ్గుతోందని, కొన్నాళ్లకు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. పెట్రోల్, డీజిల్ వాహనాల రేట్లకు సమానం అవుతాయని మంత్రి చెప్పారు. -
భారత్లో 19 నుంచి ఐఫోన్ 17 సేల్..!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 17 స్మార్ట్ఫోన్ల శ్రేణి విక్రయాలు సెప్టెంబర్ 19 నుంచి భారత మార్కెట్లో ప్రారంభం కానున్నాయి. వీటి ధరల శ్రేణి రూ. 82,900 నుంచి రూ. 2,29,900 వరకు ఉంటుంది. ఎయిర్ పేరిట యాపిల్ అత్యంత పల్చని ఐఫోన్ను కూడా ప్రవేశపెట్టింది. ఇది కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఈ–సిమ్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కొత్త ఐఫోన్ మోడల్స్లో 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ను కంపెనీ నిలిపివేసింది. దీంతో ఐఫోన్ 16 సిరీస్తో పోలిస్తే బేస్ మోడల్స్ ధర పెరిగింది. భారత్ సహా 63 దేశాల్లోని కస్టమర్లు సెప్టెంబర్ 12 నుంచి ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ని ప్రీ–ఆర్డర్ చేయొచ్చని యాపిల్ తెలిపింది. ఐఫోన్ 17 ఫోన్లు 256 జీబీ, 512 జీబీ స్టోరేజీతో లభిస్తాయి. ఎయిర్ సిరీస్ 256 జీబీ నుంచి 1 టీబీ స్టోరేజీతో లభిస్తుంది. ఏ19 చిప్సెట్ వల్ల ఐఫోన్ 16తో పోలిస్తే కొత్త ఐఫోన్ 20% అధికం, ఐఫోన్ 13తో పోలిస్తే రెట్టింపు వేగంతో పని చేస్తుంది. గతానికి భిన్నంగా ఈసారి ‘ప్లస్’ మోడల్స్ ఏవీ లేవు. ప్రో మ్యాక్స్లో తొలిసారిగా 2టీబీ ఆప్షన్ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, శాటిలైట్ కమ్యూనికేషన్స్కి కూడా ఉపయోగపడేలా వాచ్ 3 అల్ట్రాను కూడా యాపిల్ ఆవిష్కరించింది. దీని ధర రూ. 89,900గా ఉంటుంది. ప్రీ–ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. -
2030 నాటికి 15.7 ట్రిలియన్ డాలర్లు.. ప్రపంచ జీడీపీకి ఏఐ శక్తి
న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు (AI) 21వ శతాబ్దాన్ని నిర్వచించే సాంకేతికతగా ఎదుగుతోంది. 2030 నాటికి ప్రపంచ జీడీపీలో సుమారు 15.7 ట్రిలియన్ డాలర్లను ఏఐ జోడించనుందని ఫీక్కీ-బీసీజీ విడుదల చేసిన "ది గ్లోబల్ ఏఐ రేస్" నివేదిక వెల్లడించింది.ఏఐ స్వీకరణలో అభివృద్ధి చెందిన దేశాలు ముందంజలో ఉన్నాయి. 66% దేశాలు జాతీయ ఏఐ వ్యూహాలను రూపొందించగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 30 శాతంగా ఉంది. ఇక తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది కేవలం 12% మాత్రమే. ఈ అసమానత విదేశీ దిగుమతులపై ఆధారపడే ప్రమాదాన్ని పెంచుతోంది.ఏఐ స్వీకరణ రేస్లో కంప్యూట్, డేటా, మోడల్స్, టాలెంట్ అనే నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. అమెరికా, చైనా వంటి దేశాలు ఏఐ నిపుణులలో ఆధిపత్యం కలిగి ఉన్నాయి. వ్యవసాయం, ప్రజా సేవలు వంటి రంగాలు ఏఐ స్వీకరణలో ఇంకా వెనుకబడ్డాయి.వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా 20% ఉత్పత్తి వృద్ధి సాధ్యమవుతుంది. అయితే, సంస్థలు పెట్టుబడులు పెట్టినా ఏఐ పైలట్లు క్షేత్రస్థాయికి వెళ్లకముందే సగం విఫలమవుతున్నాయి. రైజ్ (రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్, స్కిల్లింగ్, ఎథిక్స్) ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రభుత్వాలు ఏఐ స్వీకరణ పెంపుపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ సహకారం, మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి, నైతిక పాలన అవసరం."ఏఐ కేవలం సాంకేతిక తరంగం మాత్రమే కాదు.ఇది రాబోయే దశాబ్దాలలో ఆర్థిక, సామాజిక నాయకత్వాన్ని నిర్వచించే వ్యూహాత్మక పోటీ. ఏఐ అనేది ప్రయోజనం కోసం జరిగే పోటీ మాత్రమే కాదు. ప్రపంచానికి విలువను పెంచే పురోగతికి సమిష్టి అన్వేషణ" అని ఫీక్కీ డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్ పేర్కొన్నారు. -
చైనా సంచలనం.. అమెరికా చిప్ లేకుండా ‘బ్రెయిన్’ ఏఐ నమూనా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా మరో కీలక అడుగు వేసింది. స్పైకింగ్బ్రెయిన్ 1.0 (SpikingBrain 1.0) అనే “మెదడు ప్రేరిత” లాంగ్వేజ్ మోడల్ను విడుదల చేసింది. ఇది ఎన్విడియా చిప్లు లేకుండానే సంప్రదాయ ఏఐ మోడళ్ల కంటే 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.ఈ మోడల్ను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆటోమేషన్ అభివృద్ధి చేసింది. ఇది న్యూరోమార్ఫిక్ డిజైన్ ఆధారంగా పనిచేస్తుంది. అంటే మన మెదడు లాగా, అవసరమైన న్యూరాన్లు మాత్రమే స్పందిస్తాయి. ఈ “స్పైకింగ్ కంప్యూటేషన్” పద్ధతి వల్ల విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. అలాగే ట్రైనింగ్ డేటా అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది.స్పైకింగ్బ్రెయిన్.. చాట్జీపీటీ (ChatGPT) లాంటి మోడళ్లకు అవసరమైన ట్రైనింగ్ డేటాలో కేవలం 2 శాతం మాత్రమే ఉపయోగించి, వాటితో సమానమైన పనితీరును అందిస్తుందని ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకుడు లి గువోకి తెలిపారు. ఈ మోడల్ చైనాలోనే అభివృద్ధి చేసిన మెటాఎక్స్ చిప్లపై పనిచేస్తుంది. అమెరికా జీపీయూ ఎగుమతి నియంత్రణలకు లోనవకుండా, స్వతంత్ర ఏఐ మౌలిక సదుపాయాల వైపు చైనా అడుగులు వేస్తోంది.స్పైకింగ్బ్రెయిన్.. దాని డెమో సైట్ లో తనను తాను ఇలా పరిచయం చేసుకుంటుంది. "హలో! నేను స్పైకింగ్ బ్రెయిన్ 1.0, లేదా 'షుంక్సీ', మెదడు-ప్రేరేపిత ఏఐ మోడల్ని. మానవ మెదడు సమాచారాన్ని స్పైకింగ్ కంప్యూటేషన్ పద్ధతితో ప్రాసెస్ చేసే విధానాన్ని నేను మిళితం చేస్తాను. పూర్తిగా చైనీస్ టెక్నాలజీపై నిర్మించిన శక్తివంతమైన, నమ్మదగిన, శక్తి-సమర్థవంతమైన ఏఐ సేవలను అందించగలను" అంటోంది. -
తగ్గనున్న పాల ప్యాకెట్ల ధరలు..
ప్రతి ఇంట్లో వాడే పాల ధరలు త్వరలో తగ్గనున్నాయి. ప్యాకేజ్డ్ మిల్క్ పై 5 శాతం జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన వెంటనే దేశంలోని దాదాపు అన్ని బ్రాండ్ల పాల ప్యాకెట్ల ధరలపైనా తక్షణ ఉపశమనం లభించనుంది.ఈ జీఎస్టీ మినహాయింపు నేరుగా సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే పాలపై 5% పన్ను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఉండదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో పాలు వంటి నిత్యావసర వస్తువులను మరింత అందుబాటులో ధరల్లోకి తీసుకురావాలనేది ఈ చర్య ఉద్దేశం.దేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న ప్రముఖ పాల ఉత్పత్తుల బ్రాండ్లలో ఒకటైన అమూల్, మదర్ డెయిరీ ప్రస్తుత ధరలు, జీఎస్టీ తొలగింపు అమల్లోకి వచ్చిన తర్వాత ఎంత తగ్గుతాయన్నది ఈ కింద చూద్దాం. అమూల్ ఉత్పత్తులలో ఫుల్ క్రీమ్ మిల్క్ 'అమూల్ గోల్డ్' ధర ప్రస్తుతం లీటరుకు రూ. 69 కాగా, టోన్డ్ మిల్క్ రూ.57. అదే విధంగా మదర్ డైరీ ఫుల్ క్రీమ్ మిల్క్ రూ. 69, టోన్డ్ మిల్క్ సుమారు రూ.57 ఉంది. గేదె, ఆవు పాలు ధరలు కూడా రూ.50-75 మధ్య ఉన్నాయి.జీఎస్టీ ఎత్తివేసిన తర్వాత ధరలు ఎంత తగ్గుతాయి?ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం పాల ధరలు లీటరుకు రూ.3 నుంచి రూ.4 వరకు తగ్గుతాయి. ఉదాహరణకు, అమూల్ గోల్డ్ ధర సుమారు రూ .65-66 కు తగ్గుతుంది, మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర కూడా అదే స్థాయిలో తగ్గుతుందని భావిస్తున్నారు. టోన్డ్ మిల్ఖ్, గేదె పాలపై కూడా ఇలాంటి ఉపశమనం కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది వినియోగించే విజయ ప్యాకేజ్డ్ పాలు కూడా జీఎస్టీ మినహాయింపు తర్వాత లీటర్కు రూ.2 నుంచి రూ.3 తగ్గే అవకాశం ఉంది.పాల రకంప్రస్తుత ధర (లీటరుకు)కొత్త ధర (లీటరుకు)అమూల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్)₹69₹65–66అమూల్ ఫ్రెష్ (టోన్డ్)₹57₹54–55అమూల్ టీ స్పెషల్₹63₹59–60అమూల్ గేదె పాలు₹75₹71–72అమూల్ ఆవు పాలు₹58₹55–57మదర్ డైరీ ఫుల్ క్రీమ్₹69₹65–66మదర్ డైరీ టోన్డ్ మిల్క్₹57₹55–56మదర్ డైరీ గేదె పాలు₹74₹71మదర్ డైరీ ఆవు పాలు₹59₹56–57 -
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రత్యేక అకౌంట్..
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా ‘బీఓబీ యాస్పైర్ ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్’ ప్రవేశపెట్టింది. విదేశాలకు వెళ్లే ముందు, భారత్లోనే ఉన్నప్పుడే కస్టమర్లు బీఓబీ యాస్పైర్ ఎన్ఆర్ఈ సేవింగ్స్ అకౌంటు తెరవాలి. ఇలా తెరిచిన ఖాతా, తొలుత ‘ఇనాక్టివ్ మోడ్’లో ఉంటుంది.ఖాతాదారులు తమ ఎన్నారై హోదాను ధృవీకరిస్తూ ఇమ్మిగ్రేషన్ స్టాంపుతో పాస్పోర్ట్ కాపీ, విదేశాల్లోని చిరునామా ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన తర్వాత ఖాతా పూర్తి స్థాయిలో యాక్టివ్గా మారుతుంది. ఈ అకౌంటుపై తొలి రెండు త్రైమాసికాల్లో ఎలాంటి కనీస బ్యాలెన్స్ చార్జీలు ఉండవు.తదుపరి ప్రతి క్వార్టర్కు సగటున రూ.1,000 బ్యాలెన్స్ నిబంధన వర్తిస్తుంది. అకౌంటు బ్యాలెన్స్లో గరిష్ట పరిమితేమీ ఉండదు. ఖాతాపై వచ్చిన ఆదాయానికి, ఇన్కం టాక్స్ నుంచి, బ్యాలెన్స్లకు వెల్త్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.ఎయిర్పోర్ట్ లాంజ్ ఫెసిలిటీతో పాటు మరెన్నో ప్రయోజనాలు అందించేలా కస్టమైజ్ చేసిన డెబిట్ కార్డు ఉంటుంది. భావి ప్రవాస భారతీయుల(ఎన్నారై) అవసరాలకు అనుగుణంగా ‘బీఓబీ యాస్పైర్ అకౌంట్’ను ప్రవేశపెట్టామని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీనా వహీద్ తెలిపారు. -
లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు
బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు బుధవారం సానుకూల నోట్లో ముగిశాయి. ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టాక్స్ లో ర్యాలీతో లాభాల్లో స్థిరపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 323.83 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 81,425.15 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 104.50 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 24,973.10 వద్ద ముగిసింది.భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 4.50 శాతం లాభపడ్డాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎటర్నల్ షేర్లు 2.46 శాతం వరకు పడిపోయాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.83 శాతం, 0.73 శాతం లాభంతో స్థిరపడ్డాయి. నిఫ్టీ ఐటీ, పీఎస్యూ బ్యాంక్ సూచీలు వరుసగా 2.63 శాతం, 2.09 శాతం లాభంతో స్థిరపడ్డాయి. ఎంఆర్ఎఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్ కంపెనీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.28 శాతం నష్టంతో స్థిరపడింది.మార్కెట్ విస్తృతి సానుకూలంగా ఉంది. ఎందుకంటే ఎన్ఎస్ఈలో 3,128 ట్రేడెడ్ స్టాక్స్ లో 1,835 గ్రీన్లో ముగిశాయి. 1,210 రెడ్లో ముగిశాయి. మరోవైపు 83 షేర్లలో మార్పులేదు. ఎన్ఎస్ఈలో లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.14 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. -
ఇన్ఫోసిస్ వచ్చేస్తోంది.. క్యాంపస్ ఉద్యోగాల జాతరకు సిద్ధం
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామకాలకు సన్నద్ధమవుతోంది. దాదాపు రెండేళ్ల తర్వాత కాలేజీ క్యాంపస్లకు వచ్చి విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించుకోబోతోంది. ఈ మేరకు రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్యానెల్ ఇంటర్వ్యూలలో పాల్గొనాలని తమ సీనియర్ సిబ్బందిని ఇన్ఫోసిస్ కోరింది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోతో సహా ప్రధాన ఐటీ కంపెనీలు కోవిడ్ కారణంగా క్యాంపస్, లేటరల్ రిక్రూట్మెంట్లను తగ్గించాయి. ఇన్ఫోసిస్ అయితే ఫ్రెషర్ రిక్రూట్మెంట్లను బాగా తగ్గించేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 11,900 మందిని మాత్రమే నియమించుకుంది. అంతకుముందు సంవత్సరంలో నియామకాల సంఖ్య 50,000తో పోల్చితే ఇది చాలా తక్కువ. ఈ సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో 15,000 కు పెరిగింది.బెంగళూరుకు చెందిన ఐటీ సంస్థ మార్చి 2026 తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంబైన్డ్ ఆఫ్, ఆన్-క్యాంపస్ కార్యక్రమాల ద్వారా 15,000-20,000 కొత్త నియామకాల లక్ష్యాన్ని పెట్టుకుంది. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ల (డీఎస్ఈ) పేరుతో ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ ఎంపిక చేయబోతోంది.క్యాంపస్ ఇంటర్వ్యూల గురించి ఇన్ఫోసిస్ తొలిసారిగా మేనేజర్ స్థాయి అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ఉద్యోగులకు మాస్ ఈ మెయిల్ కమ్యూనికేషన్ పంపింది. దీని ప్రకారం.. ఇన్ఫోసిస్ ప్రతినిధులు అభ్యర్థుల ప్రాథమిక ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను, ఎంట్రీ లెవల్ డీఎస్ఈ స్థానాలకు అవసరమైన సమస్య పరిష్కార సామర్థ్యాలను అంచనా వేస్తారు.ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామాలు వచ్చే అక్టోబర్, నవంబర్ చివరి మధ్య షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో కంపెనీ వర్చువల్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. -
ప్రత్యేక కళాకృతుల ప్రదర్శన.. ఎప్పుడంటే..
ప్రత్యేకమైన కళాకృతులు, ఆభరణాలు, కళలకు సంబంధించి అత్యాధునిక డిజైన్లను అందించే ఆర్ట్ కనెక్ట్, ఎ అండ్ హెచ్ కొలాబ్ సంస్థ సంయుక్తంగా హైదరాబాద్ వేదికగా తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. సెప్టెంబర్ 15న హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్ సమీపంలో స్పిరిట్ కనెక్ట్లో ఈమేరకు ప్రదర్శన ఉంటుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు.ఆర్ట్ కనెక్ట్ కంపెనీని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి భార్య మిహీకా బాజాజ్ దగ్గుబాటి స్థాపించారు. ఏ అండ్ హెచ్ కోలాబ్ వ్యవస్థాపకులుగా అమృతా కిలాచంద్, హీనా ఓమర్ అహ్మద్ ఉన్నారు. ఈ ప్రదర్శన ప్రధానంగా ల్యామ్, వ్యానా అనే థీమ్లతో సాగుతుందని నిర్వాహకులు చెప్పారు. ఇందులో ప్రత్యేక ఆకృతులు, ఆభరణాలు, డిజైనింగ్ వస్తువులు..వంటివి ప్రదర్శనకు ఉంచబోతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మిహీకా బజాజ్ దగ్గుబాటి మాట్లాడుతూ..‘ఆర్ట్ కనెక్ట్ కళాకృతులు, కళాకారులు, వినియోగదారుల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. యూజర్లలో పెరుగుతున్న డిజైన్ స్పృహకు హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. ఇది ఏ అండ్ హెచ్ కొలాబ్ సహకారంతో రూపొందించిన మా ప్రారంభ ఎడిషన్’ అన్నారు. ఏ అండ్ హెచ్ కొలాబ్ వ్యవస్థాపకులు అమృతా కిలాచంద్, హీనా ఓమర్ అహ్మద్ మాట్లాడుతూ..‘ఈ ప్రదర్శన కోసం ఆర్ట్ కనెక్ట్తో కలిసి ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు కళాకృతుల్లో కళను, డిజైన్ను మిళితం చేస్తున్నాం’ అన్నారు. -
రైళ్లకు ‘అద్దె’ చెల్లిస్తున్న భారతీయ రైల్వే!
భారతీయ రైల్వే ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో దేశంలోని పలు మార్గాల్లో సెమీ-హై-స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ను అప్గ్రేడ్ చేస్తోన్న నేపథ్యంలో ఆర్థిక వెసులుబాటకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఓ ప్రభుత్వ సంస్థకు అద్దె చెల్లిస్తుంది. ఇది కొంత ఆకస్తిగా అనిపించినా, రైల్వే మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నగదు అప్పుగా ఇచ్చిన ఐఆర్ఎఫ్సీ కంపెనీకి భారతీయ రైల్వే లీజు చెల్లింపులు చేస్తోంది. ఇది ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ నిధులను హరించకుండా రైల్వేను ఆధునీకరించడానికి వీలు కల్పిస్తుందని నమ్ముతోంది. ఇది భారతీయ రైల్వేలు, ఐఆర్ఎఫ్సీ రెండింటికీ మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.ఆర్థికంగా తోడ్పాటు..భారతీయ రైల్వే రైళ్ల తయారీ మౌలిక సదుపాయాలకు అద్దె చెల్లించేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఐఆర్ఎఫ్సీ భారతీయ రైల్వేలకు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తోంది. ఇది మార్కెట్లో బాండ్లు, డిబెంచర్లను జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సేకరిస్తోంది. దాంతో భారతీయ రైల్వేలకు అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రోలింగ్ స్టాక్ (రైళ్లు, ఇంజిన్లు మొదలైనవి)లో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది.వాయిదాల్లో చెల్లింపులు..ఈ ఆస్తులను పెద్దమొత్తంలో నేరుగా కొనుగోలు చేయడానికి బదులుగా రైళ్లు, ఇంజిన్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఐఆర్ఎఫ్సీ బాండ్ల రూపంలో వచ్చిన నిధులతో నగదు సమకూరుస్తుంది. వీటిని ఏర్పాలు చేసి తిరిగి రైల్వేలకు లీజుకు ఇస్తోంది. ఉదాహరణకు.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐపీఎఫ్)ను ఐఆర్ఎఫ్సీ భారతీయ రైల్వేలకు లీజుకు ఇచ్చింది. ఇండియన్ రైల్వే ఐఆర్ఎఫ్సీకి చేసే లీజు చెల్లింపులను అద్దెగా పిలుస్తారు. వీటిని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అసలు, వడ్డీ రెండూ ఉంటాయి.ఈ మోడల్ ఎందుకు?వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి హైటెక్ రైళ్ల తయారీకి అయ్యే ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ భారీ ఆర్థిక భారాన్ని ముందస్తుగా భరించడానికి బదులుగా భారతీయ రైల్వే కాలక్రమేణా ఖర్చును వైవిధ్య పరుస్తుంది. ఐఆర్ఎఫ్సీ బాండ్ల వేలం ద్వారా సమీకరించిన డబ్బు ద్వారా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ ఆస్తులను ఉపయోగిస్తూ, తర్వాతి కాలంలో అందుకు అద్దె చెల్లిస్తుంది. భారతీయ రైల్వే తక్షణ బడ్జెట్పై భారీ ఒత్తిడి లేకుండా కార్యాచరణ ఆదాయాలను (ప్రయాణీకుల టిక్కెట్లు, సరుకు రవాణా మొదలైన వాటి ద్వారా వచ్చే ఆదాయాలు) ఉపయోగించి క్రమంగా చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వ బడ్జెట్ పరిమితులకు లోబడి పనిచేసే భారతీయ రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థకు ఇది చాలా ముఖ్యమైనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: భారత ఐటీ సర్వీసులపై యూఎస్ ‘హైర్’ బిల్లు ప్రతిపాదన -
ప్రభుత్వ సెక్యూరిటీల వేలం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.14,900 కోట్లు సమీకరించింది. వివిధ విడతలతో కూడిన ఈ వేలంలో ఆరు రాష్ట్రాలు తమ ఆర్థిక అవసరాల కోసం గణనీయమైన నిధులను సమకూర్చుకున్నాయి. ఆర్బీఐ అధికారిక ప్రకటన ప్రకారం.. వివిధ మెచ్యూరిటీల ద్వారా మొత్తం రూ.15,300 కోట్లు ఆఫర్ చేసింది. కానీ చివరకు రూ.14,900 కోట్లు అందించింది. ఆర్బీఐ రుణాలు ఇచ్చిన ఆరు రాష్ట్రాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఈ సెక్యూరిటీల వేలంలో బిహార్ అతిపెద్ద రుణగ్రహీతగా ఉంది. మూడు వేర్వేరు విడతల ద్వారా రూ.6,000 కోట్లు సేకరించింది. 5, 9 మరియు 11 సంవత్సరాల కాలపరిమితితో సెక్యూరిటీల ద్వారా రాష్ట్రం రూ.2,000 కోట్ల చొప్పున నిధులు సమీకరించింది. గోవా.. 11 సంవత్సరాల సెక్యూరిటీ ద్వారా 7.48% ఈల్డ్తో రూ.100 కోట్ల రూపాయలను సేకరించింది.హరియాణా రూ.1,500 కోట్లు, జమ్మూ కశ్మీర్ 7.51% ఈల్డ్ అందించే 20 సంవత్సరాల బాండ్తో రూ.300 కోట్లు సమీకరించింది. మధ్యప్రదేశ్ మూడు వేర్వేరు విడతల ద్వారా రూ. 4,000 కోట్లు సేకరించింది. మహారాష్ట్ర మూడు మెచ్యూరిటీలలో రూ.3,000 కోట్లు అప్పుగా తీసుకుంది.ఇదీ చదవండి: భారత ఐటీ సర్వీసులపై యూఎస్ ‘హైర్’ బిల్లు ప్రతిపాదన -
భారత ఐటీ సర్వీసులపై యూఎస్ ‘హైర్’ బిల్లు ప్రతిపాదన
భారతదేశం అందిస్తోన్న ఐటీ సేవల పరిశ్రమను దెబ్బ తీసేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘హైర్’ బిల్లు అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ప్రతిపాదిత బిల్లుకు అమెరికాలోని ప్రముఖ కంపెనీల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో భారత సంస్థలు ఎలాంటి విధానాలు పాటించాలో ఐటీ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.హైర్ బిల్లుగ్లోబల్ అవుట్ సోర్సింగ్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండియా వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని విదేశీ ఐటీ సర్వీసులపై 25% సుంకాన్ని హాల్ట్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ (HIRE) బిల్లు ప్రతిపాదించింది. ఇది శాసనపరంగా విఫలమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిడి మాత్రం పెరుగుతోంది. ముఖ్యంగా లారా లూమర్ వంటి వ్యక్తులు భారత కంపెనీలు అందించే కాల్ సెంటర్ సర్వీస్ ఉద్యోగాలను యూఎస్కు తిరిగి ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే భారత్ దిగమతులపై 50 శాతం సుంకాలు విధించిన అమెరికాకు తలొగ్గని కేంద్ర ప్రభుత్వంపై ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించేందుకు ఇది తోడ్పడుతుంది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా కంపెనీలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు అమల్లోకి వచ్చి భారత్ ఐటీ సర్వీసులపై ప్రభావం పడితే.. స్థానికంగా యూఎస్ తమ ఉద్యోగులకు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే భారత్లో అక్కడితో పోలిస్తే తక్కువ ఖర్చు అవుతుంది. దాంతో ఈ బిల్లుకు వ్యతిరేకత మొదలైంది.ఎక్కువగా ఆధారపడటం..హైర్ బిల్లు ప్రతిపాదనలో ఉన్న నేపథ్యంలో దేశీయ ఐటీ ఎగుమతులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్ నుంచి 60% ఐటీ సర్వీసులు ఉత్తర అమెరికాకు వెళ్తున్నాయి. అందులో టీసీఎస్- 48.2%, ఇన్ఫోసిస్- 57.9%, విప్రో- సుమారు 60% ఎగుమతులు యూఎస్కు చేస్తున్నాయి. అతిగా అమెరికాపై ఆధారపడటంతో భారతదేశ ఐటీ రంగాన్ని యూఎస్ విధాన మార్పుల ద్వారా ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి.చేయాల్సింది ఇదే..భారతదేశం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించాలి. యూరప్, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో మరింత దూకుడుగా విస్తరించాలి. ఏఐ ఆధారిత వ్యవస్థలను నిర్వహించగల అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులపై దృష్టి పెట్టాలి. స్థానికంగా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెట్టాలి. వీటిని పెంచాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఐటీ సేవలకు డిమాండ్ నెలకొంటుండడంతో వీటిపై మరింత దృష్టి సారించాలి.ఇదీ చదవండి: పాత స్టాక్పై ఎంఆర్పీ మార్చవచ్చు: కేంద్రం -
పాత స్టాక్పై ఎంఆర్పీ మార్చవచ్చు: కేంద్రం
వస్తు సేవల పన్ను శ్లాబులను ఇటీవల సవరించిన ప్రభుత్వం వినియోగ వస్తువుల కంపెనీలకు కార్యాచరణ అడ్డంకులను తగ్గించే లక్ష్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వస్తువుల తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు కొత్త జీఎస్టీ రేట్లను ప్రతిబింబించేలా అమ్ముడుపోని ప్రీ-ప్యాకేజ్డ్ స్టాక్పై గరిష్ట రిటైల్ ధర (MRP)ను సవరించడానికి అనుమతించింది. దీని అమలు డిసెంబర్ 31, 2025లోపు పూర్తికావాలని చెప్పింది. కొత్తగా తయారయ్యే స్టాక్కు మారిన రేట్లను అప్డేట్ చేస్తారని గమనించాలి.కేబినెట్ కార్యదర్శి టి.వి.సోమనాథన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల ప్రకారం మార్పులను అమలు చేయడంలో పరిశ్రమ వర్గాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈమేరకు వెసులుబాటు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది వృధాను నివారించడానికి, సప్లై చెయిన్ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటానికి ఆచరణాత్మక విధానమని చెప్పింది.నోటిఫికేషన్లోని నిబంధనలుకంపెనీలు జీఎస్టీ సవరణ తేదీకి ముందు తయారు చేసిన అమ్ముడుపోని స్టాక్పై ఉన్న ఎంఆర్పీని సవరించవచ్చు.శ్లాబుల వారీగా వస్తువుల రేట్లు పెరిగినా, తగ్గినా సవరించేలా రెండింటినీ లెక్కించవచ్చు.అప్డేట్ అయిన ధరలను స్టిక్కర్లు, స్టాంపింగ్ లేదా ఆన్లైన్ ప్రింటింగ్ ఉపయోగించి వినియోగదారులకు తెలియజేయవచ్చు.ఒరిజినల్ ఎంఆర్పీ స్పష్టంగా కనిపించాలి.కంపెనీలు సవరించిన ఎంఆర్పీల గురించి వినియోగదారులు, డీలర్లు, పంపిణీదారులకు ప్రకటనలు, పబ్లిక్ నోటీసుల ద్వారా తెలియజేయాలి.ఇప్పటికే ఉన్న ప్యాకేజింగ్, ర్యాపర్లను డిసెంబర్ 31 వరకు లేదా స్టాక్స్ అయిపోయే వరకు ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: నెలకు రూ.18 వేలు జీతం.. ప్రపంచంలోనే రిచ్.. -
నెలకు రూ.18 వేలు జీతం.. ప్రపంచంలోనే రిచ్..
ఒకప్పుడు నెలకు రూ.18,000 వేతనం వస్తున్నా, దేశంలోని ఖరీదైన నగరాల్లో ఒకటైన బెంగళూరులో నివసిస్తూ సంతోషంగా ఉన్నానని ఓ మహిళ ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం దుబాయ్లో గతంలో కంటే భారీగా జీతం సంపాదిస్తున్నా అప్పటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందలేకపోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఇదికాస్తా నెటిజన్ల కంటపడి వైరల్గా మారింది.సీమా పురోహిత్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్ట్లోని వివరాల ప్రకారం..‘బెంగళూరులో నా మొదటి ఉద్యోగం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నెలకు కేవలం రూ.18,000 సంపాదిస్తూ, దాన్ని అదృష్టంగా భావించి, సంతోషంగా జీవించాను. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక అమ్మాయిగా నేను ఫీల్ అయ్యాను. తక్కువ జీతంతో కూడా జీవితంలో చాలా ఆనందంగా ఉన్నాను. బెంగళూరులో పీజీ ఫీజు చెల్లించడానికి, వీధుల్లో షాపింగ్ చేయడానికి, క్యాంటీన్లో తినడానికి, ప్రతి వారాంతంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి పోను ఇంకా కొంచెం డబ్బు మిగిలి ఉండేది’ అని చెప్పారు.‘ప్రస్తుతం దుబాయ్లో పని చేస్తున్నాను. గతంలో కంటే భారీగానే వేతనం వస్తుంది. కానీ జీవితంలో సంతోషం కోల్పోయాను. అప్పటి ఆనందాన్ని చాలా మిస్ అవుతున్నాను’ అని వీడియోలో చెప్పుకొచ్చారు. ఆమె మాటలు ఆన్లైన్లో చాలా మందికి కనెక్ట్ అయ్యాయి. దాంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘మీరు చెప్పింది నిజమే.. ఇక్కడి జీవితం నాకు అసంతృప్తిగానే ఉంది’అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘పని-జీవిత సమతుల్యత, మానసిక ఆరోగ్యంపై చాలా మంది ఆందోళన చెందుతున్నారు’ అని మరొకరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Seema (@seemapurohit018)ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతోన్న పసిడి ధర! -
బైక్ కొనాలనుకుంటున్నారా? రెండు వారాలు ఆగండి
విశాఖ సిటీ : ద్విచక్ర వాహనాలు కొనాలనుకుంటున్నారా? రెండు వారాలు ఆగండి. జీఎస్టీ స్లాబుల సవరణతో బైక్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. దసరా, దీపావళి పండగకు ముందే డిస్కౌంట్ల ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. అన్ని ద్విచక్ర వాహనాలు రూ.10 వేలు నుంచి రూ.20 వేల వరకు తక్కువకు లభించనున్నాయి. జీఎస్టీ రేటు సవరణతో బైక్ మార్కెట్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ నెలాఖరు నుంచి భారీగా బైక్ విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని కంపెనీలు తగ్గింపు ధరలను సైతం ప్రకటించేశాయి.350 సీసీ లోపు బైక్లపై భారీగా తగ్గింపుకేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను సవరించింది. ఇందులో 350 సీసీ వరకు ఉన్న బైక్లపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. నవరాత్రి తొలి రాజు నుంచే ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో బైక్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. వినియోగదారులు వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలతో పాటు జావా, రాయల్ ఎన్ఫీల్డ్, యెజ్డీ బైకులు కూడా ప్రస్తుతం కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. 350 సీసీ ఇంజన్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్ల ధరలు మాత్రం పెరగనున్నాయి. ఇప్పటి వరకు వీటిపై 28 శాతం జీఎస్టీ ఉండగా.. ఈ నెల 22వ తేదీ నుంచి 40 శాతానికి పెరగనుంది. దీంతో లగ్జరీ బైక్ల ధరలు మాత్రం షాక్ కొట్టనున్నాయి. ఇప్పటి కంటే రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు పెరగనున్నాయి.ధరలు తగ్గిస్తూ ప్రకటనలుప్రస్తుతం విశాఖ మార్కెట్లో 110, 125, 150 సీసీ ఇంజన్ బైక్ల వినియోగమే ఎక్కువగా ఉంది. వీటి కొనుగోలుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆ తర్వాత 200, 250 సీసీ వరకు విక్రయాలు మధ్యస్తంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే వీటి ధరలు తగ్గిస్తూ కంపెనీలు కొత్త ధరలను ప్రకటించాయి. హీరో కంపెనీ బైక్లపై మోడల్, వేరియంట్ను బట్టి రూ.6 వేల నుంచి, హోండా కంపెనీ బైక్లపై రూ.8,500 నుంచి, టీవీఎస్ బైక్లపై రూ.8,700 నుంచి, బజాజ్ బైక్లపై రూ.8,500 నుంచి అత్యధికంగా రూ.15 వేలు వరకు తక్కువకు రానున్నాయి. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ వరకు బైక్లపై రూ.19 వేలకు పైగా తక్కువకు లభించనున్నాయి.మార్కెట్ జోష్జీఎస్టీ రేట్లలో సవరణతో బైక్ మార్కెట్ జోష్ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా దసరా, దీపావళికి ముందు కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంటాయి. కానీ ఈసారి జీఎస్టీ రేటును తగ్గించి కేంద్రం కూడా కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు పోటాపోటీగా తగ్గింపు ధరలను ప్రకటించాయి. ఇప్పటికే కొనుగోలుదారులు ప్రస్తుతం బైక్లు కొనుగోలు చేయకుండా ప్రీ బుకింగ్లకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 22 తర్వాత కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా రూ.10 వేలు నుంచి రూ.20 వేల వరకు తగ్గింపు పొందాలని చూస్తున్నారు. ఈ కొత్త ధరలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బైక్ విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది బైక్ మార్కెట్కు శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. -
ముంబైలో మెగా ఈవీ చార్జింగ్ హబ్
ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా టాటా పవర్,, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థలు మంగళవారం భారతదేశపు అతిపెద్ద టాటా. ఈవీ మెగాచార్జర్ హబ్ను ఆవిష్కరించాయి. ముంబై చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 సమీపంలోని ది లీలా ముంబై హోటల్ ఆవరణలో దీన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో ఎనిమిది ఫాస్ట్ డీసీ చార్జర్లు, 16 ‘చార్జింగ్ బే’లు ఉంటాయి. ఒకేసారి 16 ఈవీలను చార్జింగ్ చేయొచ్చు.ప్రైవేట్ కారు ఓనర్ల నుంచి ట్యాక్సీలు, రైడ్ సేవల సంస్థలు, లాజిస్టిక్స్ ఆపరేటర్లు మొదలైన వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. మరోవైపు, ఈవీ చార్జింగ్ నెట్వర్క్ సంస్థ బోల్ట్డాట్ఎర్త్ తాజాగా త్రీవీలర్ ఆటోల సంస్థ యోధతో చేతులు కలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్, ఎర్తింగ్ సొల్యూషన్స్ను అందించే దిశగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెంపొందించేందుకు, వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సెప్టెంబర్ 9ని ప్రపంచ ఈవీ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5.8 కోట్ల పైచిలుకు ఈవీలు ఉండగా, భారత్లో ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో 14.2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2030 నాటికి మొత్తం వాహనాల్లో ఈవీల వాటాను 30 శాతానికి పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది.ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతోన్న పసిడి ధర! తులం ఎంతంటే.. -
అంతకంతకూ పెరుగుతోన్న పసిడి ధర! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధర రికార్డు స్థాయిలకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
320 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:19 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు పెరిగి 24,976కు చేరింది. సెన్సెక్స్(Sensex) 327 పాయింట్లు పుంజుకుని 81,436 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇకపై సులువుగా పీఎస్యూ డీలిస్టింగ్
ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)లు స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి స్వచ్చందంగా వైదొలగేందుకు(డీలిస్టింగ్) వెసులుబాటు కల్పిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వానికి 90 శాతం లేదా అంతకుమించి వాటా ఉన్న పీఎస్యూలను ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ చేసేందుకు వీలు చిక్కనుంది. డీలిస్టింగ్కి మెజారిటీ సాధారణ వాటాదారులు అనుమతి పొందాల్సిన నిబంధనలను కూడా సెబీ సడలించింది. అలాగే, ఫ్లోర్ ధర మదింపులోనూ మార్పులకు తెరతీసింది. వెరసి ఫ్లోర్ ధరకంటే కనీసం 15 శాతం ప్రీమియంతో, ఫిక్స్డ్ ధర ద్వారా డీలిస్టింగ్కు అవకాశం ఏర్పడనుంది. ఇందుకు లావాదేవీల పరిమాణం తదితరాలను పరిగణనలోకి తీసుకోరు. ప్రభుత్వానికి 90 శాతం పైగా వాటా గల పీఎస్యూలకు ఈ వెసులుబాటును వర్తింపచేసేలా సెపె్టంబర్ 1న సెబీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, బీమా కంపెనీలను దీన్నుంచి మినహాయించింది. ఇన్విట్స్లో కనీస లాట్ తగ్గింపుప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా ఐపీవోలో కేటాయించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) కనీస లాట్ పరిమాణాన్ని సెబీ తాజాగా కుదించింది. సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ లాట్తో సమానం చేస్తూ రూ. 25 లక్షలకు తగ్గించింది. ఇందుకు నిబంధనలు సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రయివేట్ ప్లేస్మెంట్ చేసే ఇన్విట్లకు అసెట్ మిక్స్ ఆధారంగా కనీస లాట్ రూ. కోటి లేదా రూ. 25 కోట్లుగా అమలవుతోంది. అయితే ఇప్పటికే అసెట్ మిక్స్తో సంబంధంలేకుండా సెబీ సెకండరీ మార్కెట్లో లాట్ పరిమాణాన్ని రూ. 25 లక్షలకు కుదించింది. దీంతో ఐపీవో ప్లేస్మెంట్ లాట్ను అలైన్ చేసింది.ఇదీ చదవండి: మళ్లీ చక్కెర షేర్లు మధురం -
ప్రైవేటు మూలధన వ్యయాలకు పుష్
స్థిరమైన డిమాండ్ ప్రైవేటు మూలధన వ్యయాలకు ప్రేరణనిస్తుందని ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ప్రభుత్వ మూలధన వ్యయాలు బలంగా ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగ రిఫైనరీలు సామర్థ్య విస్తరణపై పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. ఎస్బీఐ రుణ పుస్తకంలో రూ.3–4 లక్షల కోట్లు కార్పొరేట్లవి ఉన్నట్టు చెప్పారు. రిఫైనరీలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన కంపెనీల నుంచి రుణాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. స్టీల్, సిమెంట్ కంపెనీలు ఇంకా పెట్టుబడులు పెట్టాల్సి ఉందన్నారు.‘స్థిరమైన డిమాండ్ రాక కోసం ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు డిమాండ్కు ఊతమిస్తాయి. లిక్విడిటీ తగినంత ఉండేలా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. వడ్డీ రేట్లు తగ్గించింది. ఇవన్నీ కార్పొరేట్లలో (కంపెనీల్లో) విశ్వాసాన్ని పెంచుతాయి’ అని శెట్టి వివరించారు. కంపెనీలు ఇప్పటికే తమ సామర్థ్యంలో 75 శాతం వినియోగ స్థాయికి చేరుకున్నాయంటూ, సామర్థ్య విస్తరణ చేపట్టేందుకు ఇది సరైన సమయంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ రుణదాతల మాదిరే విలీనాలు, కొనుగోళ్లకు నిధులు సమకూర్చే దిశగా బ్యాంక్లను సైతం అనుమతించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. కొనుగోళ్లు అన్నవి పారదర్శకతతో కూడిన లావాదేవీలుగా పేర్కొన్నారు. కనుక వీటికి రుణాల రూపంలో మద్దతుగా నిలిచేందుకు బ్యాంకులు మెరుగైన స్థానంలో ఉన్నట్టు చెప్పారు. సమీప కాలంలో యోనో యాప్ లిస్టింగ్ ఆలోచనేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మళ్లీ చక్కెర షేర్లు మధురం -
మళ్లీ చక్కెర షేర్లు మధురం
ఏడాది కాలంగా నేలచూపులకే పరిమితమైన షుగర్ షేర్లు ఇటీవల బలపడుతున్నాయి. ఇందుకు పలు సానుకూల పరిణామాలు తోడ్పాటునిస్తున్నాయి. లక్ష్యానికంటే ముందుగానే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిక్స్కు ప్రభుత్వ దన్ను, ఇథనాల్ తయారీలో చెరకురసం వినియోగంపై ఆంక్షల ఎత్తివేత, దేశీ మార్కెట్లో చక్కెరకు పెరుగుత్ను డిమాండ్ తదితరాలు షుగర్ కంపెనీలకు జోష్నిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు షుగర్ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం.. –సాక్షి, బిజినెస్ డెస్క్భారీగా పెరిగిన సరఫరాలు, మందగించిన మార్కెట్ పరిస్థితులు, ఇథనాల్ తయారీపై ఆంక్షలు తదితర ప్రతికూలతల కారణంగా గత ఏడాది కాలంలో షుగర్ కౌంటర్లు డీలా పడ్డాయి. దీంతో చక్కెర తయారీ కంపెనీల షేర్లు 2025 మార్చికల్లా ఏడాది కనిష్టాలకు చేరాయి. అయితే కొద్ది రోజులుగా షుగర్ పరిశ్రమ టర్న్అరౌండ్ బాట పట్టింది. ఇందుకు పలు అంశాలు దోహదపడుతున్నాయి. చక్కెరతోపాటు ఇథనాల్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇతర బిజినెస్లవైపు దృష్టిపెట్టడం, డిస్టిల్లరీల ఏర్పాటు కంపెనీలకు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా నవంబర్ నుంచి ప్రారంభంకానున్న తాజా సీజన్(2025–26)లో షుగర్కేన్ జ్యూస్, మొలాసిస్ తదితరాల ద్వారా ఇథనాల్ తయారీ చేపట్టడంలో ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. గత సీజన్(2024–25)లో ఇథనాల్ తయారీకి 4 మిలియన్ టన్నులను వినియోగించుకునేందుకు మాత్రమే అనుమతించిన సంగతి తెలిసిందే. వెరసి సవాళ్ల నుంచి సానుకూల పరిస్థితులకు పరిశ్రమ ప్రయాణిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి.పండుగల సీజన్దేశీయంగా పండుగల సీజన్ ప్రారంభంకావడంతో చక్కెరకు డిమాండ్ పెరుగుతోంది. దీనికితోడు దేశీయంగా 2025–26 మార్కెటింగ్ సీజన్లో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తిని అంచనా వేస్తున్నారు. ఇది 18 శాతం అధికమని దేశీ చక్కెర మిల్లుల అసోసియేషన్ గత నెలలో వెల్లడించింది. దీంతో 2 మిలి యన్ టన్నుల చక్కెర ఎగుమతులకు వీలు చిక్కనున్నట్లు భావిస్తోంది. అంతేకాకుండా ఇథనాల్ ఉత్పత్తికి 5 మిలియన్ టన్నులకుపైగా మళ్లించవచ్చునని తెలియజేసింది. కర్బనాల కట్టడికి వీలుగా 2025–26కల్లా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిక్స్(ఈ20)ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశీయంగా ఆటో దిగ్గజాలు ఇందుకు అనుగుణమైన వాహనాల ఉత్పత్తిని చేపట్టి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. దీంతో దేశీ పరిశ్రమ చక్కెరసహా.. ఇథనాల్ తయారీ విక్రయాల ద్వారా లబ్ది పొందనుంది. ఈ ఏడాది చెరకు దిగుబడి ఊపందుకోనున్న అంచనాల కారణంగా అక్టోబర్ నుంచి మొదలుకానున్న చక్కెర సీజన్లో ఎగుమతులకు ప్రభుత్వం అనుమతించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సగటుకంటే అధికంగా నమోదవుతున్న వర్షపాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర కీలక రాష్ట్రాలలో చెరకు సాగుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు పేర్కొన్నారు.ఇతరత్రా డిమాండ్ఇథనాల్కు ఇంధన రంగంతోపాటు ఇతర పరిశ్రమల నుంచి సైతం డిమాండ్ కనిపించనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఔషధాలు, ప్లాస్టిక్స్, పాలిష్లు, కాస్మెటిక్స్ తదితర పరిశ్రమలలోనూ వినియోగం పెరగనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో షుగర్ కంపెనీలకు ఇథనాల్ మనీ స్పిన్నర్గా అవతరించనున్నట్లు విశ్లేషించాయి. వెరసి భవిష్యత్లో షుగర్ కంపెనీలకు ఇథనాల్ అనూహ్య లాభాలను తెచి్చపెట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. నిజానికి 2023 ఏప్రిల్ నుంచే ఆటో రంగ దిగ్గజాలు ఈ20 సంబంధిత ఇంజిన్ల తయారీకి శ్రీకారం చుట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ20 పూర్తిస్థాయి అమలుకు వీలుంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ పలు రంగాలకు ఊతమిస్తూ వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలకు తెరతీసింది. ప్రధానంగా 12 శాతం, 5 శాతం శ్లాబులలోకి పలు ప్రొడక్టులను చేర్చడంతోపాటు ఈ నెల 22 నుంచి అమలుకు నిర్ణయించింది. దీంతో ఆటోసహా ఎఫ్ఎంసీజీ, సిమెంట్, ఫుట్వేర్, హోటళ్లు తదితర రంగాలు జోరందుకోనున్నాయి. ఇది వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం ద్వారా విభిన్న రంగాలలో డిమాండ్కు దారి చూపనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా షుగర్ రంగ షేర్లు లాభాల బాటలో సాగుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు వివరించారు.ఏటికి ఎదురీతగతేడాది కాలంలో షుగర్ షేర్లు క్షీణిస్తూ దాదాపు 52 వారాల కనిష్టానికి చేరినప్పటికీ ఈఐడీ ప్యారీ ఇండియా, బన్నారీ అమ్మన్ షుగర్స్, బలరామ్పూర్ చినీ లాభాలతో నిలదొక్కుకోవడం విశేషం! ఇందుకు ఆయా కంపెనీలు షుగర్తోపాటు.. ఇతర విభాగాలలోకి ప్రవేశించడం, అవసరానికి అనుగుణంగా ఉత్పత్తిని చేపట్టగల డిస్టిల్లరీలను ఏర్పాటు చేసుకోవడం సహకరించినట్లు తెలియజేశారు. పటిష్ట ఫైనాన్షియల్స్కుతోడు నామమాత్ర రుణభారం వంటి సానుకూలతలు సైతం వీటికి జత కలిసినట్లు విశ్లేషించారు.ఇదీ చదవండి: ప్రాపర్టీ విక్రయించా.. పెట్టుబడి దారేది? -
ఎన్ఎస్ఈ చైర్పర్సన్గా శ్రీనివాస్ ఇంజేటి
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ) గవర్నింగ్ బోర్డు చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలుగు వ్యక్తి శ్రీనివాస్ ఇంజేటి నియమితులయ్యారు. 1960 మే 26న జన్మించిన శ్రీనివాస్.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో బీఏ ఎకనామిక్స్ (ఆనర్స్), ఆ తర్వాత బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్లో ఎంబీయే చేశారు. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి (ఒరిస్సా కేడర్) అయిన శ్రీనివాస్కి కార్పొరేట్ రెగ్యులేషన్, ఆర్థిక సేవలు, గవర్నెన్స్, ప్రభుత్వ పాలసీలు తదితర అంశాల్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘానుభవం ఉంది.2017 నుంచి 2020 వరకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా దివాలా చట్టం, కాంపిటీషన్ చట్టం, కంపెనీల చట్టం తదితర సంస్కరణలకు సారథ్యం వహించారు. 2020 నుంచి 2023 వరకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్విసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) వ్యవస్థాపక చైర్మన్గా వ్యవహరించారు. అంతకు ముందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఖేలో ఇండియా ప్రోగ్రాంనకు శ్రీకారం చుట్టారు. అటు నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీకి కూడా సారథ్యం వహించడంతో పాటు సెబీ, ఎల్ఐసీ తదితర బోర్డుల్లో కూడా సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలతో...
ముంబై: ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలతో ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 314 పాయింట్లు పెరిగి 81,101 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 24,869 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరమైన లాభాలతో ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 81,181 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు 24,892 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీతో పాటు ఫార్మా, టెక్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.22%, 0.20 శాతం చొప్పున పెరిగాయి. ఆయిల్అండ్గ్యాస్, రియల్టి, ఇంధన, కన్జూమర్ డి్రస్కేషనరీ, ఆటో, విద్యుత్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. లాభాల్లో అంతర్జాతీయ మార్కెట్లు: ఆసియాలో చైనా, జపాన్, సింగపూర్, ఇండోనేసియా స్టాక్ సూచీలు 0.50%–2% నష్టపోయాయి. జపాన్ నికాయ్ తొలిసారి 44,000 స్థాయిని అధిగమించి 44,186 వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసింది. తదుపరి లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 0.42% నష్టపోయి 43,459 వద్ద స్థిరపడింది. హాంకాంగ్, కొరియా, థాయ్లాండ్ స్టాక్ సూచీలు 1.50% వరకు పెరిగాయి. యూరప్లో జర్మనీ డాక్స్ ఇండెక్స్ 0.50% నష్టపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు 0.25% పెరిగాయి. అమెరికా సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ షేరు 5% పెరిగి రూ.1,505 వద్ద స్థిరపడింది. డైరెక్టర్ల బోర్డు ఈ నెల 11న సమావేశమై ఈక్విటీ షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలిస్తుందని తెలపడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో 5.18% లాభపడి రూ.1,507 వద్ద గరిష్టాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.29,967 కోట్లు పెరిగి రూ.6.25 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. -
ఐఫోన్ 17 వచ్చేసింది..
క్యుపర్టీనో, అమెరికా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించింది. ఐఫోన్ 17లో 6.3 అంగుళాల స్క్రీన్, ఏ19 ప్రో ప్రాసెసర్, 48 ఎంపీ డ్యుయల్ ఫ్యూజన్ కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 256 జీబీ మెమొరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయిదు రంగుల్లో లభిస్తుంది. అత్యంత పల్చని ఐఫోన్ 17 ఎయిర్ని కూడా యాపిల్ విడుదల చేసింది. దీని మందం 5.6 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఐఫోన్ 17 ధర రూ. 799 డాలర్ల నుంచి, ప్రో ధర రూ. 1,099 డాలర్ల నుంచి, ప్రో మ్యాక్స్ రేటు 1,199 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది.ఎయిర్ ధర 999 డాలర్ల నుంచి ఉంటుంది. మంగళవారం క్యుపర్టినోలో జరిగిన కార్యక్రమంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్.. కొత్త ఐఫోన్తో పాటు పలు ఉత్పత్తులను ఆవిష్కరించారు. వీటిలో వాచీలు, ఎయిర్పాడ్స్ ఉన్నాయి. వాచ్ ఎస్ఈ, వాచ్ సిరీస్ 11, వాచ్ అల్ట్రా 3ని కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా 249 డాలర్లు, 399 డాలర్లు, 799 డాలర్లుగా ఉంటాయి. సెపె్టంబర్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. అటు కొత్త ఎయిర్పాడ్స్ ప్రో3 ధర 249 డాలర్లుగా ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 10 గంటలు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. -
వెండి.. భవిష్యత్తు బంగారం!
న్యూఢిల్లీ: బంగారం మాదిరే వెండికి సైతం డిమాండ్ బలపడుతోంది. ఫలితంగా వెండి ధర కిలోకి రూ.1.5 లక్షలకు చేరుకోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. బలమైన పారిశ్రామిక డిమాండ్, డాలర్ బలహీనత, సురక్షిత సాధనంగా పెట్టుబడుల డిమాండ్ ధరలకు మద్దతునిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ధర 37 శాతం పెరిగినట్టు గుర్తు చేసింది.‘‘వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చే ఆరు నెలల్లో కిలోకి రూ.1,35,000కు చేరుకోవచ్చు. 12 నెలల్లో రూ.1,50,000కు చేరొచ్చు. డాలర్తో రూపాయి మారకం 88.5 శాతం స్థాయిలో ఉంటుందని భావిస్తూ వేసిన అంచనా ఇది’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ తొలుత ఔన్స్కు 45 డాలర్లు, తర్వాత 50 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. బలమైన డిమాండ్ 2025లో వెండి మొత్తం ఉత్పత్తిలో 60 శాతం డిమాండ్ పారిశ్రామిక రంగం నుంచి వచ్చినట్టు యూఎస్కు చెందిన సిల్వర్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. సోలార్ విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాలు, 5జీ ఇన్ఫ్రా రంగాల నుంచి వచ్చే కొన్ని త్రైమాసికాల పాటు వెండికి డిమాండ్ కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. సిల్వర్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి పెట్టుబడులు పెరుగుతుండడం కూడా ధరలు ఎగిసేందుకు దారితీస్తున్నట్టు పేర్కొంది.బంగారానికి తోడు వెండిని సైతం తమ రిజర్వుల్లోకి చేర్చుకోవడానికి కొన్ని సెంట్రల్ బ్యాంక్లు ఆసక్తి చూపిస్తుండడం, వెండి మెరుపులకు తోడవుతోంది. వచ్చే మూడేళ్లలో 535 మిలియన్ డాలర్ల విలువైన వెండిని తమ దేశ రిజిర్వుల్లోకి చేర్చుకోనున్నట్టు రష్యా ఇటీవలే ప్రకటించింది. సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది 40 మిలియన్ డాలర్ల మేర సిల్వర్ ఈటీఎఫ్లను కొనుగోలు చేయనుంది. 3,000 టన్నుల దిగుమతిదేశీయంగానూ వెండికి డిమాండ్ బలంగా పెరుగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3,000 టన్నుల వెండి దిగుమతి అయింది. పారిశ్రామిక రంగం నుంచే కాకుండా, పెట్టుబడులకు సైతం డిమాండ్ నెలకొంది. ‘‘జాక్సన్ హోల్ సింపోజియం తర్వాత ఫెడ్ సెప్టెంబర్ సమావేశంలో పావు శాతం మేర రేట్లను తగ్గించడం తప్పనిసరి అని తెలుస్తోంది. తక్కువ రేట్లు, యూఎస్ ఈల్డ్స్ క్షీణిస్తుండడం విలువైన లోహాల ధరలకు మద్దతునిస్తోంది’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. అయితే ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా స్వల్పకాలంలో లాభాల స్వీకరణను కొట్టిపారేయలేమని పేర్కొంది. ప్రస్తుత స్థాయి నుంచి, రేట్లు తగ్గిస్తే రూ.1,18,000– 1,15,000 స్థాయి వరకు వెండిని కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. -
జియో కొత్త టెక్నాలజీ: టెన్షన్ లేకుండా 5జీ నెట్.. కాలింగ్
వినియోగదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ జియో తన సేవలను నిరంతరం అప్ డేట్ చేస్తూనే ఉంది. కాల్స్ చేయడంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ న్యూ రేడియో (VoNR) అనే ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. ఈ జియో సర్వీస్ వారి సొంతంగా పనిచేస్తుంది, అంటే స్వదేశీ 5జీ స్వతంత్ర కోర్. ఈ సేవతో ప్రతి 5జీ ఫోన్ మినీ స్టూడియోగా మారుతుందని జియో పేర్కొంది.ఇప్పటి వరకు చాలా టెలికాం కంపెనీలు 5జీ ఇంటర్నెట్ ను అందిస్తున్నప్పటికీ, కాలింగ్ కోసం బ్యాక్ ఎండ్ లో 4జీ నెట్ వర్క్ పైనే ఆధారపడేవి. వీవోఎన్ఆర్ ఈ అంతరాన్ని పూరిస్తుంది. వినియోగదారులకు పూర్తిగా 5జీ కోర్ ఆధారంగా కాలింగ్ అనుభవాన్ని ఇస్తుంది.వీవోఎన్ఆర్ అంటే ఏమిటి?జియో కొత్త టెక్నాలజీ వోఎల్టీఈ వంటి పాత వ్యవస్థల స్థానంలో వీఓఎన్ఆర్ భర్తీ చేస్తోంది. ఈ 5జీ ఫోన్ నేటివ్ వాయిస్ కాల్స్ ను అందిస్తుంది. ఈ టెక్నాలజీ కారణంగా, కాల్ త్వరగా కనెక్ట్ అవుతుంది. దీని రాకతో, కాల్ డ్రాప్లు, వాయిస్ బ్రేక్ వంటి సమస్యలు కూడా దాదాపుగా తొలగిపోతాయి. దీంతో యూజర్ల ఫోన్ బ్యాటరీని కూడా ఆదా చేస్తుందని జియో చెబుతోంది. దీనితో పాటు కాల్ రూటింగ్, నెట్ వర్క్ ఎఫిషియెన్సీ మెరుగ్గా ఉంటుంది.జియో తన వీఓఎన్ఆర్ రోల్ అవుట్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ స్టాక్ పై ఆధారపడి ఉందని పేర్కొంది. దీని అర్థం బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి సర్వీస్ మేనేజ్మెంట్ వరకు ప్రతిదీ భారతీయ ఇంజనీర్లు, భాగస్వాముల సహాయంతో నిర్మించినదే. ఇది సాంకేతిక స్వాతంత్ర్యం వైపు ఒక పెద్ద అడుగు మాత్రమే కాదు, భవిష్యత్తులో భారతదేశాన్ని డిజిటల్ పరిష్కారాలను ఎగుమతి చేసే దేశంగా మార్చగలదు.వీవోఎన్ఆర్ ప్రయోజనాలుఫాస్ట్ కాల్ కనెక్షన్ - ఫోన్ చేసిన కొన్ని సెకండ్లలోనే కాల్ కనెక్ట్ అవుతుంది.మెరుగైన వాయిస్ క్వాలిటీ - హెచ్డీ+ సౌండ్ సంభాషణను మరింత స్పష్టంగా చేస్తుంది.కాల్ డ్రాప్ లు తగ్గడం- నెట్ వర్క్ స్విచింగ్ వల్ల ఎలాంటి సమస్య ఉండదు.బ్యాటరీ సేవింగ్: ఫోన్ 4జీ, 5జీ మధ్య పదే పదే షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.మెరుగైన ఇంటర్నెట్ + కాలింగ్ - కాల్ లో మాట్లాడేటప్పుడు కూడా ఇంటర్నెట్ బ్రౌజింగ్ 5జీ వేగంతో కొనసాగుతుంది. -
బంగారం ఆల్టైమ్ రికార్డ్ ధర: ఒక్కసారిగా పెరగడానికి కారణాలు
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర మంగళవారం 10 గ్రాములకు రూ.723 పెరిగి రూ.1,10,312కు చేరుకుంది. ఎంసీఎక్స్ లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ .723 లేదా 0.65% పెరిగి రూ .1,10,312 వద్ద కొత్త గరిష్టానికి చేరుకుంది.అంతర్జాతీయంగా డిసెంబర్ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్కు 3,698.02 డాలర్ల కొత్త ఆల్-టైమ్ గరిష్టానికి పెరిగింది. స్పాట్ గోల్డ్ కూడా ఔన్స్కు 3,658.38 డాలర్ల రికార్డు స్థాయికి పెరిగింది. బంగారం ఒక్కసారిగా ఇంతలా పెరగడానికి నిపుణులు పలు కారణాలను పేర్కొంటున్నారు.బంగారం ధర ఆకాశాన్ని తాకడానికి ముఖ్య కారణాలుఅమెరికా ఫెడ్ రేటు తగ్గింపు ఆశలుట్రేడర్లు ఫెడ్ రేట్ల తగ్గింపుపై మరింత ఆశాభావంతో ఉన్నారు. మనీ మార్కెట్లు ఇప్పటికే 25-బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపును పూర్తిగా అంచనా వేశాయి. అంతేకాక సీఎంఈ ఫెడ్వాచ్ టూల్ ప్రకారం.. 50-బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు అవకాశాలు కూడా దాదాపు 12% వరకు పెరిగినట్లు తెలుస్తోంది.బలహీనమైన అమెరికన్ డాలర్జపనీస్ యెన్ తో పోలిస్తే డాలర్ 0.2 శాతం తగ్గి 147.21 వద్ద ఉండగా, బ్రిటీష్ పౌండ్ 0.1% పెరిగి 1.3558 డాలర్లకు చేరుకుంది. జూలై 24 నుండి క్లుప్తంగా గరిష్ట స్థాయిని తాకిన తరువాత యూరో 1.1752 డాలర్లకు పడిపోయింది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధంఉక్రెయిన్ పై మాస్కో ప్రతీకార దాడి తరువాత రష్యాపై అమెరికా అదనపు ఆంక్షల సంభావ్యత సురక్షిత-స్వర్గధామ ఆస్తుల డిమాండ్ ను మరింత పెంచిందని కమోడిటీస్ మార్కెట్ నిపుణులు గుర్తించారు.సుంకం మినహాయింపులునికెల్, బంగారం, వివిధ లోహాలు, అలాగే ఫార్మాస్యూటికల్ కాంపౌండ్స్, రసాయనాలతో సహా పారిశ్రామిక ఎగుమతులపై ఒప్పందాలను కుదుర్చుకునే వాణిజ్య భాగస్వాములకు సెప్టెంబర్ 8 నుంచి సుంకం మినహాయింపులను మంజూరు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. -
టయోటా కార్ల ధరల తగ్గింపు.. ఫార్చూనర్పై రూ.3.5 లక్షలు..
జీఎస్టీ తగ్గింపు, పరిహార సెస్ రద్దు వాహన కొనుగోలుదారులతో పాటు తయారీదారులకు భారీ ఉపశమనం కలిగించింది. ఇది కార్లు, ద్విచక్ర వాహనాలతో సహా అన్ని రకాల వాహనాల ధరలపైనా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఫలితంగా, వాహన తయారీ సంస్థలు తమ అన్ని మోడళ్ల సవరించిన ధరలను ప్రకటించడం ప్రారంభించాయి.తాజాగా జపాన్ ఆటో దిగ్గజం టయోటా తమ అన్ని కార్లపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే రోజు అంటే సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. సకాలంలో డెలివరీలు అందుకోవడానికి పండుగ సీజన్ ప్రారంభానికి ముందే వీలైనంత త్వరగా బుకింగ్లను కన్ఫర్మ్ చేసుకోవాలని కస్టమర్లను కోరింది.కొన్ని ప్రీమియం మోడళ్ల తగ్గింపు ధరలను కంపెనీ ప్రకటించింది. తాజా అప్ డేట్ ప్రకారం. అత్యధికంగా ఫార్చ్యూనర్ ధర రూ .3.49 లక్షల వరకు తగ్గుతుంది. దీని తరువాత మరో ప్రీమియం వేరియంట్ లెజెండర్ ధర రూ .3.34 లక్షల వరకు తగ్గనుంది. ఫార్చ్యూనర్, లెజెండర్ ధరలు వరుసగా రూ .36.05 లక్షలు, రూ .44.51 లక్షలు (రెండూ ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. తమ లైనప్ లోని ప్రతి మోడల్ ప్రతి వేరియంట్ సవరించిన ధరలను టయోటా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.సవరించిన జీఎస్టీ నిర్మాణం అన్ని విభాగాలలో కార్ల ధరలను తగ్గించింది. 4 మీటర్ల లోపు పరిమాణం ఉన్న చిన్న కార్లపై (1,200సీసీ వరకు పెట్రోల్ ఇంజిన్లు లేదా 1,500 సీసీ వరకు డీజిల్ ఇంజిన్లు) ఇకపై 28% బదులుగా 18% జీఎస్టీ వర్తిస్తుంది.దీంతో వీటి ధరలు 5-13% తగ్గుతున్నాయి.ఇక 4 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణం, పెద్ద ఇంజిన్లు ఉన్న పెద్ద కార్లపై 28 శాతం జీఎస్టీకి బదులుగా 40 శాతం (ప్రత్యేక శ్లాబ్) జీఎస్టీ విధిస్తారు. అయితే సెస్ తొలగింపుతో వీటి ధరలు కూడా 3-10% తగ్గే అవకాశం ఉంది. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఛార్జీల మోత..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కొన్ని సర్వీస్ ఛార్జీలలో మార్పులను ప్రకటించింది. లాకర్ ఛార్జీలు, స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ ఛార్జీలు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ (ఎస్ఐ) ఫెయిల్యూర్ ఛార్జీలు, నామినేషన్ ఛార్జీలకు సవరణలు వర్తిస్తాయి. కొత్త ఛార్జీలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి.లాకర్ జారీ ఛార్జీలులాకర్ పరిమాణం, బ్రాంచ్ స్థానాన్ని బట్టి బ్యాంక్ లాకర్ అద్దె ఛార్జీలను పెంచింది. సవరించిన లాకర్ అద్దె తదుపరి వార్షిక అద్దె గడువు తేదీకి వర్తిస్తుంది. ప్రతిపాదిత సవరణల ప్రకారం, చిన్న లాకర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ .1,000 (పాత ఛార్జీ), సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ .1,500 (గతంలో రూ .1250), పట్టణ, మెట్రో ప్రాంతాలకు రూ .2,000 (పాత ఛార్జీ).మీడియం సైజ్ లాకర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 (గతంలో రూ.2,200), సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.3,000 (గతంలో రూ.2,200), అర్బన్, మెట్రో ప్రాంతాల్లో రూ.4,000 (గతంలో రూ.3,500).పెద్ద లాకర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,000 (గతంలో రూ.2,500), సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.5,000 (గతంలో రూ.3,000), పట్టణ ప్రాంతాలకు రూ.6,500, మెట్రో ప్రాంతాలకు రూ.7,000 (రెండూ గతంలో రూ.5,500).అతిపెద్ద (వెరీ లార్జ్) లాకర్లకు గ్రామీణ ప్రాంతాలకు రూ.6,000(పాత ఛార్జీ), సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.7,000 (గతంలో రూ.6,000), పట్టణ ప్రాంతాలకు రూ.8,500, మెట్రో ప్రాంతాలకు రూ.9,000 (రెండూ గతంలో రూ.8,000).ఎక్స్ట్రా లార్జ్ లాకర్లకు గ్రామీణ ప్రాంతాలకు రూ.10,000 (పాత ఛార్జీ), సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.10,500, పట్టణ ప్రాంతాలకు రూ.11,000, మెట్రో ప్రాంతాలకు రూ.12,000 (మొత్తం మూడూ గతంలో రూ.10,000) ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలులాకర్లను లీజుకు ఇచ్చే సమయంలో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయానికొస్తే, ప్రస్తుతం గ్రామీణ, సెమీ అర్బన్ శాఖలకు రూ .200, అర్బన్, మెట్రో శాఖలకు రూ .500 ఛార్జీలు ఉండేవి. కొత్త ఛార్జీల ప్రకారం, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని అన్ని పరిమాణాల లాకర్లకు రూ .200, పట్టణ, మెట్రో ప్రాంతాలలో చిన్న, మీడియం లాకర్లకు రూ .500, పట్టణ, మెట్రో ప్రాంతాలలో లార్జ్, వెరీ లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ లాకర్లకు రూ .1,000 వసూలు చేస్తుంది.స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఛార్జీలుస్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ (ఎస్ఐ) వైఫల్య ఛార్జీల కింద ప్రస్తుతం ప్రతి లావాదేవీకి రూ .100 తో పాటు రెమిటెన్స్ ఛార్జీలు, వాస్తవ పోస్టేజీని వసూలు చేస్తుండగా ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం, ప్రతి లావాదేవీకి ఛార్జ్ చేయడానికి బదులుగా, నెలకు రూ .100 ఫ్లాట్ ఫీజు, జీఎస్టీ వసూలు చేయనున్నారు. అంతేకాకుండా టర్మ్ లోన్లు (టిఎల్), రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ) మొదలైన వాటికి గరిష్టంగా మూడు ఎస్ఐ లావాదేవీలకు అవకాశం ఉంటుంది.నామినేషన్ ఛార్జీలుప్రస్తుత నిబంధన ప్రకారం.. మొదటిసారి అకౌంట్ నామినీ నమోదు ఉచితం. ఆ తర్వాత ఒక్కో సందర్భానికి రూ.100 రుసుము వసూలు చేస్తున్నారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం, మొదటిసారి అభ్యర్థన ఉచితం. ఆ తరువాత, నామినీ మరణించినప్పుడు మినహా ఒక్కో సందర్భానికి రూ .100 వసూలు చేస్తారు.స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ ఛార్జీలుపీఎన్బీ సేవింగ్స్ ఖాతాలో స్టాప్ పేమెంట్ సూచనల కోసం ప్రస్తుత ఛార్జీలు ఒక్కో సాధనానికి రూ .100. వరుస చెక్కుల కోసం స్టాప్ పేమెంట్ అభ్యర్థించిన సందర్భాల్లో, బ్యాంకు మూడు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల పరిధికి రూ .300 ఛార్జీ విధిస్తుంది.అక్టోబర్ 1 నుండి సవరణల ప్రకారం, పొదుపు ఖాతాల కోసం స్టాప్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేయడానికి ఛార్జీలు గతంలో లాగే ఒక్కో సాధనానికి రూ .100 ఉంటాయి. అయితే, వరుస చెక్కులకు సూచనలు ఇస్తే, ఐదు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల పరిధికి రూ .500 రుసుము ఉంటుంది. -
ఆఫర్ చూసి క్లిక్ చేసే ముందు.. జాగ్రత్త!
పండుగ సీజన్లో సేల్స్ వస్తే తగ్గింపు ధరలు, ఉచిత డెలివరీ, స్పెషల్ ఆఫర్లు ఇలా ఎన్నో వస్తాయి. వీటిని చూసి ఎవ్వరైనా ఆకర్షితులవుతారు. కానీ అదే సమయంలో సైబర్ మోసాలకు ఇది మంచి అవకాశంగా మారుతుంది. ఒక తప్పుడు క్లిక్ చేసినా మీ డబ్బు, డేటా లేదా ఐడెంటిటీని కోల్పోవచ్చు.ఇప్పుడీ ఫిషింగ్ అనే మోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి నాలుగు సైబర్ దాడులలో ఒకటిగా మారింది. మన దేశంలో గత ఒక్క సంవత్సరంలోనే సైబర్ మోసాల వలన రూ.22,811 కోట్లకు పైగా నష్టం జరిగింది, కాబట్టి జాగ్రత్త! ఆఫర్ చూసి క్లిక్ చేసేముందు, అది నమ్మదగినదేనా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని గ్లోబల్ కొరియర్ సంస్థ ఫెడ్ఎక్స్ సూచిస్తోంది. స్కామర్లు ఉపయోగించే ట్రిక్స్, వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసింది.మోసాలు ఇలా ఉంటాయి..పండుగ సీజన్లో స్కామర్లు వినియోగదారులను మోసగించడానికి కొన్ని సాధారణ ట్రిక్స్ ఉపయోగిస్తారు. ఇవి సక్సెస్ అవుతాయి కూడా ఎందుకంటే.. అవి నిజమైన వాటిగా కనిపిస్తాయి. బ్రాండ్ల లోగోలు, అత్యవసరంగా మాట్లాడే భాష, పరిచయమైన పేర్లు వాడుతూ మిమ్మల్ని త్వరపడేలా చేస్తారు. ఆ ట్రిక్స్ ఇవే..• "మీ ఖాతాను వెరిఫై చేయండి" అంటూ బ్యాంక్ లేదా షాపింగ్ సైట్ పేరుతో ఫేక్ మెసేజ్లు పంపిస్తారు.• కార్డ్ లేదా యూపీఐ వివరాలను దొంగిలించడానికి ఒకేలా కనిపించే వెబ్సైట్లను సృష్టిస్తారు. • నమ్మలేని ఆఫర్లు లేదా క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్టు చెబుతూ ఫేక్ యాప్స్ లేదా క్యూఆర్ కోడ్లు ఉపయోగిస్తారు.• తాము కొరియర్ కంపెనీల నుంచి అన్నట్టు నటిస్తూ, "మీ పార్సల్ మధ్యలో ఆగిపోయింది" అంటూ లింక్ క్లిక్ చేయమని లేదా ఒక నంబర్కు కాల్ చేయమని చెబుతారు.•వెంటనే ట్రాక్ చేయండి అంటూ ఫేక్ డెలివరీ లింక్స్తో వాట్సాప్/ఎస్ఎంఎస్ మెసేజ్లు పంపుతారు.• “డబ్బు అందుకోవడానికి” క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయమని అడిగి, మీ ఖాతాలోని డబ్బును దొంగలిస్తారు.స్కామ్ల బారినపడకుండా ఎలా జాగ్రత్త పడాలి?ఆన్లైన్ షాపింగ్ సులభమే, అలాగే సైబర్ సురక్షితంగా ఉండడం కూడా సాధ్యం. షాపింగ్ చేస్తుంటే, స్క్రోల్ చేస్తుంటే, కోడ్ స్కాన్ చేస్తుంటే ఈ సులభమైన జాగ్రత్తలు తీసుకోండి..• తెలియని వారి దగ్గర నుండి వచ్చిన లింక్లపై ఎప్పుడూ క్లిక్ చేయకండి, నేరుగా అధికారిక యాప్ లేదా వెబ్సైట్కి వెళ్లండి.• ఎప్పుడూ వెబ్ సైట్ అడ్రస్ చూసుకోండి, నకిలీ సైట్లు చాలా సార్లు స్పెల్లింగ్ తప్పులు లేదా అదనపు పదాలు ఉంటాయి.• ఓటిపి, పాస్వర్డ్స్, కార్డ్ వివరాలను ఫోన్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా ఎవరితోనూ పంచుకోకండి• నమ్మకమైన పేమెంట్ యాప్స్ ఉపయోగించండి, వాటిని ఎప్పుడూ అప్డేట్ చేసుకోండి• ఒక ఆఫర్ చాలా బాగా కనిపిస్తే, వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. నిజమైన అమ్మకందారులు మీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేయరు.చివరిగా.. చాలా స్కామ్లు అధునాతన హ్యాకింగ్పై ఆధారపడవు, అవి నమ్మకంపై ఆధారపడతాయి. పండుగ రద్దీ సమయంలో, ఆ నమ్మకాన్నే స్కామర్లు దోపిడీ చేస్తారు. మీరు క్లిక్ చేసే ముందు, ప్రాథమికాలను తనిఖీ చేయడానికి కొంత సమయం కేటాయించండి, సందేశం ఎవరు పంపారు? సైట్ నిజమేనా? ఇది అసాధారణంగా అనిపిస్తుందా? అన్నవి చూసుకోండి. మీరు సైబర్ మోసానికి గురైనా లేదా అనుమానం కలిగినా వెంటనే మీ స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కు లేదా వెబ్సైట్ (cybercrime.gov.in) ద్వారా సమాచారం ఇవ్వండి. -
ఇన్ఫోసిస్ షేర్ల దూకుడు.. దూసుకెళ్లిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెప్టెంబర్ 11 న జరగనున్న బోర్డు సమావేశంలో షేర్ బైబ్యాక్ ను పరిశీలిస్తామని ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ ప్రకటించిన తరువాత బెంచ్ మార్క్ సూచీలు స్థిరమైన లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రోజంతా సానుకూల ధోరణిని ప్రదర్శించింది. 314 పాయింట్లు లేదా 0.4 శాతం పెరిగి 81,101 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 24,869 స్థాయికి చేరుకుంది.సెన్సెక్స్ 30 షేర్లలో ఇన్ఫోసిస్ టాప్ గెయినర్ గా ఉంది. ఒక్కో 5 శాతం పెరిగి రూ.1,504 లను తాకింది. ఈ స్టాక్ ఒక్కటే బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ కు 217 పాయింట్ల లాభానికి దోహదపడింది. అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్ 1 నుంచి 3 శాతం వరకు లాభపడ్డాయి. ట్రెంట్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్ 1-2 శాతం నష్టపోయాయి.విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం పెరిగాయి. రంగాలవారీగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2.7 శాతం ఘన లాభంతో స్థిరపడటంతో కీలకమైన అవుట్ పెర్ఫార్మర్ గా నిలిచింది. మంగళవారం ట్రేడింగ్ లో ఇండియా వోలాటిలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) 1.8 శాతం క్షీణించింది. -
ఇజ్రాయెలీ ఇన్వెస్టర్లకు నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: ఇజ్రాయెలీ ఇన్వెస్టర్లకు సంబంధించి ‘లోకల్ రెమెడీస్ ఎగ్జాషన్’ నిబంధన వ్యవధిని అయిదేళ్ల నుంచి ప్రస్తుతం మూడేళ్లకు కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (బీఐఏ) కుదుర్చుకుంది. ఈ నిబంధన ప్రకారం, వివాదాలేవైనా తలెత్తితే విదేశీ ఇన్వెస్టర్లు ముందుగా ఆతిథ్య దేశంలోని న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్కి వెళ్లాలి.సాధారణంగా భారత్ ఇందుకోసం అయిదేళ్ళ వ్యవధిని నిర్దేశిస్తోంది. తాజాగా కుదుర్చుకున్న బీఐఏలో గతానికి భిన్నంగా పోర్ట్ఫోలియో పెట్టుబడులను కూడా చేర్చారు. యూఏఈతో భారత్ కుదుర్చుకున్న బీఐఏ తరహాలోనే ఇజ్రాయెల్ బీఏఐ కూడా ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. భారత్ ఈ డీల్ కుదుర్చుకున్న తొలి ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్, డెవలప్మెంట్) కూటమి దేశం ఇజ్రాయెల్ కావడం గమనార్హం.ఇటు భారత సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లకుండా అటు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఈ ఒప్పందం ఉంటుంది. 2000 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు ఇజ్రాయెల్ నుంచి భారత్కి 337.77 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. -
చిన్న కారుపై.. భారీ తగ్గింపు: ఏకంగా రూ.3 లక్షలు
ప్రముఖ వాహన తయారీ సంస్థ ''మినీ'' ఇప్పుడు భారతదేశంలో మినీ కూపర్ ధరలను తగ్గించింది. కేంద్రం కొత్తగా ప్రకటయించిన జీఎస్టీ 2.0 సంస్కరణ తరువాత కంపెనీ ధరలు వెల్లడించింది. సవరించిన కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో ఉంటాయి.మినీ కూపర్ ప్రస్తుతం భారతీయ విఫణిలో.. నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఎసెన్షియల్, క్లాసిక్, ఫేవర్డ్, జేసీడబ్ల్యు. కంపెనీ ఇప్పుడు ఈ వేరియంట్స్ ధరలను రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు తగ్గించింది. ఇది కొత్త మినీ కార్ల కొనుగోలుదారులకు ప్రయోజనకారిగా ఉంటుంది.తగ్గిన ధరలు➤ఎసెన్షియల్: రూ. 2,50,000 తగ్గింది - (కొత్త ధర రూ. 43,70,000) ➤క్లాసిక్: రూ. 2,75,000 తగ్గింది - (కొత్త ధర రూ. 49,20,000)➤ఫేవర్డ్: రూ. 3,00,000 తగ్గింది - (కొత్త ధర రూ. 52,00,000)➤జేసీడబ్ల్యు: రూ. 3,00,000 తగ్గింది - (కొత్త ధర రూ. 54,50,000)ఇదీ చదవండి: జీఎస్టీ ఎఫెక్ట్: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధర -
అమెరికా టూరిజం.. ఫాల్ ఫాల్ ఫాల్
ప్రపంచ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. యునైటెడ్ స్టేట్స్ ఊహించని తిరోగమనాన్ని ఎదుర్కొంటోంది. అమెరికాకు వివిధ దేశాల నుంచి వచ్చేవారి సంఖ్య 8.2 శాతం తగ్గింది. ఫలితంగా పర్యటక ఆదాయం గణనీయంగా తగ్గింది. టూరిస్ట్లు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, చౌకైన గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు. అమెరికాకు పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణాలను పరిశీలిస్తే..వీసా ఆలస్యం, పెరిగిన ఖర్చులు, రాజకీయ ప్రభావం, భద్రతకు సంబంధించిన ఆందోళనలు ప్రధానంగా పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.యూఎస్కు వెళ్లే జర్మన్ల సంఖ్య 12 శాతం తగ్గింది. వీరంతా పోర్చుగల్, కెనడా, వియత్నాం దేశాలను సందర్శిస్తున్నారు. జపనీస్ సందర్శకుల సంఖ్య.. కోవిడ్ మహమ్మారి సమయం నుంచే 35 శాతం తగ్గిపోయింది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో వీరందరూ.. దక్షిణ కొరియా, థాయిలాండ్, ఆస్ట్రేలియాలను సందర్శిస్తున్నారు. అంతే కాకుండా అమెరికాకు వెళ్లే కెనడా పర్యాటకుల సంఖ్య 20.2 శాతం పడిపోయింది.వీసా ఆలస్యం కారణంగా.. బ్రెజిల్ ప్రజలు అమెరికాకు ప్రత్యామ్నాయం వెతుక్కుని, యూరప్, సౌత్ అమెరికా దేశాలకు వెళ్తున్నారు. ఈ దేశీయులు అమెరికా వీసా కోసం 300 రోజులు నిరీక్షించాల్సి ఉంది. ఇది బ్రెజిలియన్ ప్రయాణికులను వేరే మార్గం వెతుక్కునేలా చేసింది.ఇక భారత్ విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను విధించడమే కాకుండా, వీసా ఆంక్షలను కూడా మరింత కఠినం చేశారు. ఇప్పుడు వీసా కోసం భారతీయులు ఏకంగా 400 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రూపాయి కూడా బలహీనపడటం.. అమెరికాలో ఖర్చులు పెరగడం వల్ల, ఇండియన్స్.. ఆగ్నేయాసియా, యూరప్ దేశాలను ఎంచుకుంటున్నారు.ఇదీ చదవండి: అమెరికా, పాకిస్తాన్ మధ్య కొత్త ఒప్పందంపర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. అమెరికాలోని ప్రధాన నగరాలు ఇబ్బంది పడుతున్నాయి. పర్యాటకుల సంఖ్య 17 శాతం తగ్గడంతో న్యూయార్క్ నగరం 4 బిలియన్ డాలర్ల నష్టం చొసింది. శాన్ ఫ్రాన్సిస్కో & లాస్ ఏంజిల్స్ కూడా ఇలాంటి నష్టాలనే చవిచూస్తున్నాయి. వీసా విధానాలు సడలించకపోతే.. పర్యాటక రంగంలో అమెరికా కోలుకోవడానికి మరో రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
భారత్ ఎదుగుదలను ఏ శక్తి అడ్డుకోలేదు: పీయూష్ గోయల్
జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు తప్పకుండా అందించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. దీనివల్ల దేశీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. '‘జీఎస్టీ రేట్ల తగ్గింపుతోపాటు, పన్నుల నిర్మాణాన్ని సులభతరం చేయడం వల్ల దేశీ డిమాండ్కు ఊతం లభిస్తుంది. చిన్న, పెద్ద స్థాయి కంపెనీలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఉపాధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆదాయాలు పెరుగుతాయి. ఇది అధిక వ్యయాలకు దారితీస్తుంది'' అని మంత్రి వివరించారు. మౌలిక వసతుల కల్పనకుతోడు, బలమైన వినియోగ డిమాండ్ కలిగిన భారత్ ఎదుగుదలను ఏ శక్తి అడ్డుకోలేదని.. ఈఈపీసీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్లో నిరుద్యోగ రేటు ఇలా..4 లక్షల ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2–2.5 ఏళ్లలో ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంటుందన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో దేశీ డిమాండ్కు ప్రధాని ఊతమిచ్చినట్టు చెప్పారు. సంక్షోభం నుంచి బలపడే శక్తి భారత్కు ఉందంటూ, దేశీ ఉత్పత్తులపై వ్యాపారాలు దృష్టి సారించాలని కోరారు. ఇది దేశ వృద్ధికి సాయపడుతుందని, దేశ ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుందన్నారు. -
స్పీడుమీదున్న కనకం.. తొలిసారి రికార్డు స్థాయికి!
భారతదేశంలో బంగారం ధరలు తారాస్థాయికి చేరాయి. ఈ రోజు (సెప్టెంబర్ 9) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1360 పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 1,10,290 వద్దకు చేరింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి బంగారం ధరల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 281.70 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 81,068.99 వద్ద, నిఫ్టీ 76.40 పాయింట్లు లేదా 0.31 శాతం లాభంతో 24,849.55 వద్ద ముందుకు సాగుతున్నాయి.సెంచరీ ఎక్స్ట్రూషన్స్, SAL స్టీల్, షా అల్లాయ్స్, ప్రెసిషన్ కామ్షాఫ్ట్స్, మహాలక్ష్మి ఫాబ్రిక్ మిల్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. MIC ఎలక్ట్రానిక్స్, సురానా టెలికాం అండ్ పవర్, డీపీ వైర్స్, మోస్చిప్ టెక్నాలజీస్, స్పేస్నెట్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రపంచంలో విలువైన బ్రాండ్స్.. లిస్ట్లోని ఇండియన్ కంపెనీస్
2025 సంవత్సరానికి గాను.. ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లను కాంటార్ బ్రాండ్జెడ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది.. టాప్ 100 గ్లోబల్ బ్రాండ్ల మొత్తం విలువ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో వీటి మొత్తం మొత్తం విలువ 10.7 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ కథనంలో అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్స్, ఇండియన్ బ్రాండ్స్ ఏవి?, వాటి విలువ ఎంత అనే వివరాలు చూసేద్దాం.2025 లో టాప్ 10 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్స్👉🏻యాపిల్: 12,99,655 మిలియన్ డాలర్స్👉🏻గూగుల్: 9,44,137 మిలియన్ డాలర్స్👉🏻మైక్రోసాఫ్ట్: 8,84,816 మిలియన్ డాలర్స్👉🏻అమెజాన్: 8,66,118 మిలియన్ డాలర్స్👉🏻ఎన్విడియా: 509,442 మిలియన్ డాలర్స్👉🏻ఫేస్బుక్: 3,00,662 మిలియన్ డాలర్స్👉🏻ఇన్స్టాగ్రామ్: 2,28,947 మిలియన్ డాలర్స్👉🏻మెక్డొనాల్డ్స్: 2,21,079 మిలియన్ డాలర్స్👉🏻ఒరాకిల్: 2,15,354 మిలియన్ డాలర్స్👉🏻వీసా: 2,13,348 మిలియన్ డాలర్స్ఇదీ చదవండి: ఢిల్లీ కుబేరులు.. ఇదిగో టాప్ 10 జాబితా2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్➢టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్): 57,333 మిలియన్ డాలర్స్➢హెచ్డీఎఫ్సీ బ్యాంక్: 44,959 మిలియన్ డాలర్స్➢ఎయిర్టెల్: 37,094 మిలియన్ డాలర్స్➢ఇన్ఫోసిస్: 33,096 మిలియన్ డాలర్స్ -
భారత్లో నిరుద్యోగ రేటు ఇలా..
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకారం జీ20 కూటమి దేశాల్లో చూస్తే.. భారత్లోనే నిరుద్యోగ రేటు అత్యంత కనిష్టంగా 2 శాతం స్థాయిలో ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి 'మన్సుఖ్ మాండవీయ' తెలిపారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అనుగుణంగా వివిధ రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల కల్పన జరిగిందని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలాంటి స్కీములు కూడా ఇందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.నేషనల్ కెరియర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్ ద్వారా యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చేందుకు క్లాసిఫైడ్స్ ఆన్లైన్ సైట్ ‘క్వికర్’, డిజిటల్ మెంటార్షిప్ ప్లాట్ఫాం’ మెంటార్ టుగెదర్’తో కార్మిక శాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఉద్యోగార్థులకు తగిన ఉద్యోగావకాశాలు దక్కేందుకు ఈ భాగస్వామ్యాలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'ఈ రంగాలు లేకుంటే అమెరికాలో ఉద్యోగాలు సున్నా'మెంటార్ టుగెదర్ భాగస్వామ్యంతో తొలి ఏడాదిలో 2 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజె తెలిపారు. మరోవైపు క్వికర్ జాబ్స్ని ఎన్సీఎస్కి అనుసంధానించడం వల్ల పోర్టల్కి ప్రతి రోజూ 1,200 జాబ్ లిస్టింగ్లు జతవుతాయని పేర్కొన్నారు. ఎన్సీఎస్ ప్లాట్ఫాంలో 52 లక్షల పైగా సంస్థలు, 5.79 కోట్ల ఉద్యోగార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం పోర్టల్లో 44 లక్షల పైచిలుకు వేకెన్సీలు అందుబాటులో ఉన్నాయి.Opportunities. Guidance. Growth.Today, @NCSIndia signed MoUs with @mentortogether and Quikr to enhance job access and career guidance for our Yuva Shakti. Through this, Mentor Together will offer expert mentorship and career guidance, while Quikr will bring 1,200+ daily job… pic.twitter.com/nFwWNSZcF2— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 8, 2025 -
అమెరికా, పాకిస్తాన్ మధ్య కొత్త ఒప్పందం
పాకిస్తాన్లోని కీలకమైన ఖనిజాలకు సంబంధించి.. పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్, యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది."ఈరోజు ప్రధాన మంత్రి నివాసంలో పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (FWO)తో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేయడానికి యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ (USSM) నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఇస్లామాబాద్ రాయబార కార్యాలయం యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జాచ్ హార్కెన్రైడర్ వచ్చారు" అని ప్రకటన పేర్కొంది."అమెరికా భద్రత, శ్రేయస్సుకు కీలకమైన ఖనిజ వనరుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ పరిపాలనలో ఇటువంటి ఒప్పందాలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్లోని కీలకమైన ఖనిజాలు.. మైనింగ్ రంగంలో యూఎస్ కంపెనీలు, వాటి సహచరుల మధ్య భవిష్యత్తులో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి కూడా మేము ఎదురుచూస్తున్నాము" అని ఛార్జ్ డీ అఫైర్స్ నటాలీ బేకర్ అన్నారు.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!యూఎస్ఎస్ఎమ్ అనేది మిస్సోరిలో ఉన్న ఒక సంస్థ. ఇది కోబాల్ట్, నికెల్, రాగి, లిథియం వంటి కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడం, రీసైక్లింగ్ చేయడం వంటివి చేస్తుంది. ఈ ఖనిజాలను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ.. వివిధ సాంకేతిక పరిజ్ఞానాలలో తమకు అవసరమైనవిగా లేబుల్ చేసుకుంటుంది.Excited to see U.S. companies like USSM deepening economic ties with Pakistan! USSM’s visit to Islamabad marks an important milestone as they sign an MOU to collaborate on critical minerals production. A forward-looking partnership with great potential for both nations. -NB…— U.S. Embassy Islamabad (@usembislamabad) September 8, 2025 -
రామ్కో సిమెంట్స్కు సీఐఐ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు
చెన్నై: రామ్కో సిమెంట్స్ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రకటించిన ‘ఏఐ అవార్డ్స్ 2025’ ఇన్నోవేటివ్ విభాగంలో ‘ఎక్సలెన్స్ ఇన్ బెస్ట్ ఏఐ సొల్యూషన్ షోకేస్’ అవార్డు గెలుచుకుంది. కృత్రిమ మేధ ఆధారిత సొల్యూషన్స్ అమలు చేయడం ద్వారా పరిశ్రమలో డిజిటల్ పరివర్తన(సొల్యూషన్స్)ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో రామ్కో సిమెంట్స్ విశేష ప్రతిభ కనబర్చిందని అవార్డుల జ్యూరీ అభిప్రాయపడింది. రామ్కో ప్రతినిధులు మాట్లాడుతూ... ‘‘అవార్డు సొంతం చేసుకోవడం గర్వకారణం. సాంకేతికతను వినియోగించి కస్టమర్లకు ఉత్తమ పరిష్కారాలు అందించేందుకు, షేర్ హోల్డర్లకు విలువ సృష్టించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు. -
సంఘటిత రంగం వైపు ఉద్యోగుల అడుగులు
ముంబై: దేశంలో ఉద్యోగ మార్కెట్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అసంఘటిత రంగం నుంచి క్రమంగా సంఘటిత రంగంలో ఉపాధి వైపు కార్మికులు అడుగులు వేస్తున్నారు. దీంతో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో సభ్యుల చేరిక ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను తాకుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి సభ్యుల చేరిక దీన్నే సూచిస్తున్నట్టు క్వెస్ కార్ప్ నివేదిక తెలిపింది. సుమారు 1.4 కోట్ల మంది గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్లో నికరంగా చేరారు. 2018–19 సంవత్సరంలో నికర సభ్యుల నమోదు 61 లక్షలతో పోల్చి చూస్తే రెట్టింపునకు పైగా పెరిగింది. క్వెస్ కార్ప్ విడుదల చేసిన ‘ఇండియా వర్క్ఫోర్స్ ట్రెండ్స్’ నివేదిక ప్రకారం.. దేశంలో 57 కోట్ల మంది కారి్మకుల్లో ఇప్పటికీ 80 శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. 2024–25లో కొత్తగా చేరిన ఈపీఎఫ్వో సభ్యుల్లో 61 శాతం మంది వయసు 29 ఏళ్లలోపే ఉంది. ఇందులోనూ సగం మంది వయసు 18–25 ఏళ్ల మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. యువ భారతీయుల మొదటి ఎంపిక సంఘటిత రంగంలోని ఉద్యోగమేనని క్వెస్కార్ప్ నివేదిక తెలిపింది. పెరిగిన మహిళా భాగస్వామ్యం.. 2025 మార్చి నాటికి సంఘటిత రంగంలోని మహిళా కారి్మకుల భాగస్వామ్యం 41.7 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సభ్యులు ప్రతి ముగ్గురిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. ఉపాధి కల్పన పరంగా రిటైల్, బీఎఫ్ఎస్ఐ, తయారీ, టెలికం అగ్రగామి రంగాలుగా ఉన్నాయి. మానవ వనరుల సేవలు అందించే క్వెస్ కార్ప్.. 2024–25లో అత్యధికంగా 1.03 లక్షల మందికి టెలికంలో ఉపాధి చూపించింది. ఇందులో 43,000 మంది కొత్త సభ్యులు ఉన్నారు. తయారీ రంగంలో ఉద్యోగాలు గత నాలుగేళ్లలో ఏటా 32 శాతం చొప్పున పెరుగుతూ వచ్చాయి. నియామకాల పరంగా అధిక వృద్ధి ఈ రంగంలో నమోదైంది. ఇక సగటున రూ.28,500 వేతనంతో బీఎఫ్ఎస్ఐ టాప్లో నిలిచింది. ఆ తర్వాత రిటైల్లో రూ.23,000 వేతనం ఉంది. ‘‘ఉద్యోగుల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు వీలుగా సామాజిక వసతుల ఏర్పాటుపై ఎక్కువగా దృష్టి సారించాలి. సురక్షితమైన వసతి, రవాణా సదుపాయాలను కల్పించడం ద్వారా ఇందుకు సంబంధించి ఆందోళలను పరిష్కరించొచ్చు’’అని క్వెస్ కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. -
ఎయిర్బీఎన్బీతో భారత్లో 1.11 లక్షల కొలువులకు దన్ను
ముంబై: గతేడాది భారత్లో 1.11 లక్షల ఉద్యోగాల కల్పనకు చేయూతనిచ్చినట్లు, వేతనాల కింద దాదాపు రూ. 2,400 కోట్ల మేర చెల్లింపునకు దోహదపడినట్లు హోమ్–షేరింగ్ ప్లాట్ఫాం ఎయిర్బీఎన్బీ వెల్లడించింది. దేశీయంగా టూరిజం, ఆతిథ్య రంగంలో సంస్థ ప్రాధాన్యత పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని వివరించింది. ఎయిర్బీఎన్బీ తరఫున ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ రూపొందించిన నివేదికలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం భారత్లో బస, బసయేతర అవసరాల కోసం ఎయిర్బీఎన్బీ అతిథులు 2024లో రూ. 11,200 కోట్లు వెచి్చంచారు. దేశీయంగా ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం గెస్టుల్లో దేశీ పర్యాటకుల వాటా 2019లో 79 శాతంగా ఉండగా గతేడాది నాటికి 91 శాతానికి పెరిగింది. అటు విదేశీ గెస్టుల విషయం తీసుకుంటే అమెరికా, యునైటెడ్ కింగ్డం, కెనడా, ఆస్ట్రేలియా నుంచి అత్యధిక శాతం మంది ఉన్నారు. నివేదిక ప్రకారం.. గెస్టులు సగటున రెండు రాత్రుళ్లు బస చేయగా, డైనింగ్, రిటైల్ స్టోర్స్, రవాణాలాంటి బసయేతర అవసరాలపై రోజూ రూ. 11,000 మేర ఖర్చు చేశారు. ప్రతి రూ. 10,000 వ్యయంలో రెస్టారెంట్లలో రూ. 3,800, రవాణాపై రూ. 2,400, షాపింగ్పై రూ. 2,100, కళలు.. వినోదంపై రూ. 900, నిత్యావసరాలపై రూ. 800 ఖర్చు చేశారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → పర్యాటకం ఆధారిత కొలువుల్లో 0.2 శాతం (ప్రతి 417 ఉద్యోగాల్లో ఒకదానికి సమానం) ఉద్యోగాలకు ఎయిర్బీఎన్బీ దోహదపడింది. → టూరిజంకే పరిమితం కాకుండా విస్తృత ఎకానమీకి కూడా సంస్థ కార్యకలాపాలు ఉపయోగపడ్డాయి. రవాణా.. స్టోరేజీ విభాగానికి రూ. 3,100 కోట్లు, వ్యవసాయానికి రూ. 1,500 కోట్లు, రియల్ ఎస్టేట్కి రూ. 1,300 కోట్ల మేర విలువ చేకూర్చాయి. రవాణా..స్టోరేజీలో 38,000 ఉద్యోగాలు, ఫుడ్..బెవరేజెస్ విభాగంలో 19,600, హోల్సేల్..రిటైల్ ట్రేడ్లో 16,800, తయారీలో 10,700 ఉద్యోగాల కల్పనకు తోడ్పడ్డాయి. దీనితో వేతనాలపరమైన ప్రయోజనాలు కూడా ఒనగూరాయి. రవాణా .. స్టోరేజ్ల్ో రూ. 810 కోట్లు, తయారీలో రూ. 290 కోట్లు, రియల్ ఎస్టేట్ రంగంలో రూ. 260 కోట్ల మేర వేతనాలకు చెల్లింపునకు తోడ్పడ్డాయి. -
ఆగస్టులో 3% పెరిగిన వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశీయ వాహన రిటైల్ విక్రయాలు ఆగస్టులో స్వల్పంగా 3% పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య ( ఫాడా) గణాంకాలు వెల్లడించింది. మొత్తం ఆగస్టులో 19,64,547 వాహన రిజి్రస్టేషన్లు కాగా, 2024 ఆగస్టులో ఇవి 19,10,312గా ఉన్నాయని ఫాడా తెలిపింది. జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు దిగి వస్తాయని కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడంతో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పేర్కొంది. ‘‘వేచి చూసే ధోరణి కారణంగా సెపె్టంబర్ ప్రథమార్థమంతా అమ్మకాలు అంతంత మాత్రమే ఉండొచ్చు. జీఎస్టీ విధానంపై స్పష్టత, పండుగ సెంటిమెంట్తో ఈ నెల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి ఉండొచ్చు’’ అని ఫాడా అంచనా వేసింది. → ప్యాసింజర్ విక్రయాలు గతేడాది ఆగస్టుతో పోలిస్తే 3,20,291 యూనిట్ల నుంచి స్వల్పంగా 0.93% పెరిగి 3,23,256 కు చేరాయి. మెరుగైన ఎంక్వైరీలు, పండుగ బుకింగ్స్తో ఆగస్టు ప్రథమార్థమంతా సానుకూల ధోరణి కని్పంచింది. అయితే ఆగస్టు 15న ప్రధాని జీఎస్టీ సంస్కరణ ప్రకటనతో కస్టమర్లు కొనుగోళ్లు వాయిదా వేసుకున్నారని ఫాడా తెలిపింది. → ద్వి చక్ర వాహనాల రిజి్రస్టేషన్లు 2.17% పెరిగాయి. ఈ ఆగస్టులో మొత్తం 13,73,675 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 13,44,380 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగపు ఎంక్వైరీలు ఇప్పట్టకీ బలంగా ఉన్నాయి. ఓనమ్, గణేశ్ చతుర్థి పండుగ ప్రారంభంతో చాలా మంది కస్టమర్లు డెలివరీల కోసం ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఉత్తర భారతదేశంలో అధిక వర్షాలు, వరదలు గ్రామీణ రాకపోకలకు అంతరాయంతో అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి. → వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు ఆగస్టులో 69,635 యూనిట్ల నుంచి 8.55% పెరిగి 75,592 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్ రిటైల్ అమ్మకాలు 1,05,493 యూనిట్ల నుంచి 2% తగ్గి 1,03,105కు దిగివచ్చాయి. -
టూ వీలర్స్.. రయ్!
ముంబై: జీఎస్టీ క్రమబద్ధీకరణ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ద్విచక్ర వాహన విక్రయాల్లో 5–6%, ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో 2–3% వృద్ధి నమోదు కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ నివేదికలో తెలిపింది. ఈ సెపె్టంబర్ 22 నుంచి 5%, 18% పన్ను శ్లాబులు మాత్రమే అమల్లో ఉంటాయంటూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మరింత పుంజుకుంటుందని క్రిసిల్ అంచనా వేసింది. జీఎస్టీ కోతతో దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో 90% వాల్యూమ్స్ కలిగిన టూ–వీలర్స్, ప్యాసింజర్ వాహనాలకు వరుసగా 2%, 1% డిమాండ్ పెరగనుందని వివరించింది. క్రిసిల్ రేటింగ్స్లో మరిన్ని విశేషాలు.... → కోవిడ్ సంక్షోభం, ఆన్బోర్డ్ డయాగ్నస్టిక్ టూల్స్ ఐఐ(ఓబీడీ2) తప్పనిసరి అమలు, ఎంట్రీ లెవెల్ కమ్యూటర్ బైక్లకు తగ్గిన డిమాండ్, ప్యాసింజర్ వాహన ధరలు భారీగా పెరగడం తదితర కారణాలతో ఆటో పరిశ్రమ ఇబ్బందులకు లోనవుతోంది. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయంతో వాహనాలకు డిమాండ్ ఊపందుకోవచ్చు. → గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరగడం, సాధారణ వర్షపాత నమోదుతో పాటు ఈ ఏడాదిలో 15కి పైగా కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్స్ మార్కెట్లోకి విడుదల పరిణామాలు డిమాండ్ పునరుద్ధరణకు మరింత తోడ్పడవచ్చు. అయితే పండుగ సీజన్లో డీలర్ల వద్ద వాడని పన్ను క్రెడిట్ల కారణంగా ఆర్థిక ఒత్తిడి ఏర్పడవచ్చు. → అధిక అమ్మకాలు కంపెనీల సామర్థ్య వినియోగం, ఆపరేటింగ్ లీవరేజ్ల మెరుగుపరిచే అవకాశం కలిగిస్తుంది. దీని ఫలితంగా ఆటోమొబైల్ కంపెనీలకు బలమైన నగదు ప్రవాహాలు, మెరుగైన లాభాల మార్జిన్లు లభిస్తాయి. అదేవిధంగా, జీఎస్టీ తగ్గింపు తర్వాత 50–55 రోజుల ప్యాసింజర్ వాహనాల నిల్వలు తగ్గే అవకాశం ఉంది. ఇది వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడిని తగ్గించి, డీలర్ల నగదు ప్రవాహానికి మద్దతిస్తుంది. ‘‘జీఎస్టీ తగ్గింపు లాభాల బదలాయింపుతో వాహన ధరలు 5–10% (చిన్న స్థాయి పీవీలపై రూ.30–60 వేలు, టూ వీలర్స్పై రూ.3,000 –7,000 తగ్గింపు) దిగివచ్చే వీలుంది. దీనికి తోడు పండుగ సీజన్, ఆటో కంపెనీలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన కొనుగోలు సామర్థ్యం తదితర అంశాలు కలిసొచ్చి ఈ ద్వితీయార్థంలో ఆటో పరిశ్రమ దూసుకెళ్తుంది’’ అని క్రిసిల్ రేటింగ్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేత్ తెలిపారు. ఆటో పరిశ్రమపై జీఎస్టీ తగ్గింపు: కొత్త జీఎస్టీ ప్రకారం చిన్న కార్లు, 350 సీసీలోపు మోటార్సైకిళ్లపై 18 శాతం జీఎస్ పడనుంది. మధ్య, భారీ ప్యాసింజర్ వాహనాలపై పన్ను 3–7 శాతం వరకు తగ్గనుంది. ట్రాక్టర్లను సైతం 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు. సంక్షిప్తంగా చిన్న కార్లు, బైకులు(350 సీసీ) ధరలు భారీగా తగ్గనున్నాయి. పెద్ద కార్లు, ఎస్యూవీలు కొద్దిమేర చవకగా మారాయి. అయితే పెద్ద (హై ఎండ్)బైకులు ధరలు భారీగా పెరిగాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత వాహన ధరలు: జీఎస్టీ తగ్గింపు లాభాలు పూర్తి స్థాయి ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలీ చేస్తే ధరలు 5 నుంచి 10% తగ్గుతాయి. చిన్న కార్లు రూ.60వేల వరకు, త్రీ వీలర్స్ రూ.15,000 నుంచి రూ.20వేల వరకు తగ్గొచ్చు. మీడియం, హెవీ వాణిజ్య వాహన ధరలు రూ.1 లక్ష నుంచి రూ.2.5 లక్షల తగ్గొచ్చు. యథావిథిగా 5% జీఎస్టీ కొనసాగింపుతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్, త్రీ వీలర్స్ వాహన ధరలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకపోవచ్చు. -
రీట్స్, ఇన్విట్లకు చక్కని ఆదరణ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) సాధనాల్లో పెట్టుబడులకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. వీటి నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రూ.9 లక్షల కోట్లకు చేరినట్టు ఇండియన్ రీట్స్ అసోసియేషన్ (ఐఆర్ఏ), భారత్ ఇన్విట్స్ అసోసియేషన్ (బీఐఏ) ప్రకటించాయి. రీట్లు, ఇన్విట్ల నిర్వహణలోని ఉమ్మడి ఆస్తుల విలువ 2030 నాటికి రూ.25 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ప్రకటించాయి. ప్రస్తుతం ఐదు రీట్లు.. బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్, మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్, నాలెడ్జీ రియల్టీ ట్రస్ట్లు స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇక సెబీ నమోదిత 27 ఇన్విట్లు ఉండగా, వీటిల్లో ఐదు స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ అయ్యాయి. రీట్లు, ఇన్విట్లపై మొదటిసారి అవగాహన కార్యక్రమాన్ని ఐఆర్ఏ, బీఐఏ ఢిల్లీలో నిర్వహించాయి. ఇన్విట్స్ నిర్వహణలోని ఏయూఎం విలువ రూ.7 లక్షల కోట్లుగా ఉంటే, రీట్ల నిర్వహణ ఆస్తుల విలువ రూ.2.25 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రకటించాయి. ఇన్వెస్టర్లలో పెరుగుతున్న విశ్వాసం ‘‘నేడు క్యాపిటల్ మార్కెట్స్ పరిధిలో రీట్లు ప్రధాన పెట్టుబడి సాధనంగా అవతరించాయి. ఆర్థిక మార్కెట్ల పరిధిలో భౌతిక ఆస్తులను పారదర్శకంగా, నియంత్రణల మధ్య అంతర్జాతీయంగా పోటీతత్వంతో నిర్వహిస్తున్నట్టు’’ ఐఆర్ఏ చైర్మన్ అలోక్ అగర్వాల్ ప్రకటించారు. ఐదు లిస్టెడ్ రీట్ల మార్కెట్ విలువ రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటుందని బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ ఎండీ, సీఈవో అయిన అగర్వాల్ తెలిపారు. ఈ సాధనాల పట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతున్నట్టు చెప్పారు. ఇన్వెస్టర్లకు స్థిరమైన ఆదాయానికి (నగదు ప్రవాహం) వీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ‘‘ఇన్విట్లు పారదర్శకమైన ప్లాట్ఫామ్లుగా మారాయి. పెరుగుతున్న భారత మౌలిక రంగ నిధుల అవసరాలకు ఇవి సరిగ్గా సరిపోతాయి’’అని బీఏఐ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. మౌలిక రంగంలో పెద్ద ఎత్తున వృద్ధి, పెట్టుబడుల దృష్ట్యా 2030 నాటికి ఇన్విట్ల నిర్వహణ ఆస్తుల విలువ రూ.21 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. రీట్ల నిర్వహణ ఆస్తుల విలువ 2030 నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ఐఆర్ఏ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 నాటికి నాలుగు రీట్లు మొత్తం మీద రూ.24,300 కోట్లను వాటాదారులకు పంపిణీ చేశాయి. ఇక ఇన్విట్లు 2025 మార్చి నాటికి తమ వాటాదారులకు పంపిణీ చేసిన మొత్తం రూ.68,000 కోట్లుగా ఉంది. స్థిరమైన ఆదాయానికి మార్గం.. రీట్లు అన్నవి ఆదాయాన్నిచ్చే వాణిజ్య, రిటైల్ ఆస్తులను నిర్వహిస్తుంటాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాటాదారులు ప్రతీ త్రైమాసికానికి స్థిరమైన ఆదాయాన్ని డివిడెండ్, అసలు, వడ్డీ రూపంలో పంపిణీ చేస్తుంటాయి. నికర మిగులు నుంచి 90 శాతాన్ని వాటాదారులకు పంచాల్సి ఉంటుంది. ఇన్విట్లు ఆదాయాన్నిచ్చే మౌలిక రంగ ప్రాజెక్టులను (రహదారులు, విద్యుత్ ప్రసార, పంపిణీ ప్రాజెక్టులు, పైల్లైన్లు, గోదాములు తదితర) నిర్వహిస్తుంటాయి. -
పాత స్టాక్ పైనా డిస్కౌంట్!
న్యూఢిల్లీ: తగ్గిన ధరలపై ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పట్టేట్టు ఉంది. వచ్చే నెల ఆరంభం లేదా మధ్య నాటికి ఈ ఉత్పత్తులు మార్కెట్కు చేరుకుంటాయని గోద్రేజ్ కన్జ్యూమర్ సహా పలు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. కానీ, ఇప్పటికే కంపెనీలు, డీలర్లు, రిటైల్ స్టోర్లలో పెద్ద ఎత్తున ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. పాత స్టాక్ను ఎలా విక్రయించాలా? అన్న ఆలోచనలో పడ్డాయి. పాత ఎంఆర్పీ (గరిష్ట చిల్లర విక్రయ ధర)పై తగ్గింపు రేట్లతో ఈ నెల 22 తర్వాత కూడా వాటిని విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందన్న ఆశతో ఉన్నాయి. పాత స్టాక్ ఖాళీ అయి, కొత్త స్టాక్ మార్కెట్లోకి వచ్చే వరకు కొన్ని అవాంతరాలు ఎదుర్కోక తప్పేట్టు లేదని భావిస్తున్నాయి. ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది ప్రతి సంస్థ ఆలోచిస్తోందని ఇమామీ వైస్ చైర్మన్, ఎండీ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నట్టు చెప్పారు. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఎంఆర్పీలను మార్చడం దిశగా పనిచేస్తున్నట్టు తెలిపారు. దీన్ని ఎదుర్కోవడంపై ఒక ప్రణాళికతో ముందుకు వస్తామని ప్రకటించారు. జీఎస్టీలో 12, 28 శాతం రేట్లను ఎత్తివేసి, ఇందులోని వస్తువులను 5, 18% శ్లాబుల్లోకి మార్చడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. స్వల్పకాలంలో ఇబ్బందులు తప్పవు.. అధిక టారిఫ్ల్లోని ఉత్పత్తులను 5 శాతం కిందకు తీసుకురాడం వల్ల స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని గోద్రేజ్ కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సు«దీర్ సీతాపతి చెప్పారు. డీలర్లు, కంపెనీల వద్ద అధిక ఎంఆర్పీలతో ఉత్పత్తుల నిల్వలు ఉన్నట్టు చెప్పారు. కనుక కొత్త ఎంఆర్పీలతో కూడిన ఉత్పత్తులు వినియోగదారులను చేరుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. పాత స్టాక్పై తగ్గింపు ఇస్తే అది నేరుగా వినియోగదారులకు బదిలీ అవుతుందన్న గ్యారంటీ లేదన్నారు. స్పష్టత కోసం చూస్తున్నాం.. కొత్త జీఎస్టీ రేట్ల అమలు మార్గదర్శకాల కోసం పరిశ్రమ వేచి చూస్తున్నట్టు పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించామని, వెంటనే కొత్త రేట్లకు మారిపోవాలా లేక కొత సమయం ఇస్తారా? అన్నది తెలుసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే పాత ధరలతో ఉన్న నిల్వల విషయంలో ఒక్కో కంపెనీ భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతో పోల్చినప్పుడు ఆహారోత్పత్తుల మన్నిక (షెల్ప్ లైఫ్/నిల్వ కాలం) తక్కువగా ఉంటుందన్నారు. ఏం చేయాలన్నది అంతా ప్రభుత్వ మార్గదర్శకాలపైనే ఆధారపడి ఉంటుందంటూ, ఇవి త్వరలో వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ముందే తగ్గిస్తాం..తమ స్టోర్లలో ఉన్న ఉత్పత్తుల ధరల లేబుళ్లను మార్చబోమని, దీనికి బదులు తుది బిల్లు మొత్తంపై తగ్గింపు ఇస్తామని వీ–మార్ట్ రిటైల్ చైర్మన్, ఎండీ లలిత్ అగర్వాల్ ప్రకటించారు. ప్రభుత్వం జీఎస్టీలో కల్పించిన ఉపశమనం మేర బిల్లులో తగ్గింపు ఉంటుందన్నారు. కంపెనీ స్టోర్లలో కస్టమర్లకు తెలిసేలా బోర్డులు పెట్టినట్టు చెప్పారు. ఏసీలు, ఇతర కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలోని బ్లూస్టార్ సైతం సెపె్టంబర్ 22 తర్వాత కస్టమర్లకు తగ్గింపులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. -
రూ. 3,820 కోట్ల ఐపీవో.. సెబీకి ఫిజిక్స్వాలా అప్డేట్
ఎడ్టెక్ యూనికార్న్ సంస్థ ఫిజిక్స్వాలా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి తాజా ముసాయిదా పత్రాలను అందించింది. రూ. 3,820 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసిన కంపెనీ తొలుత 2025 మార్చిలో గోప్యతా విధానంలో సెబీకి దరఖాస్తు చేసింది.దీనిలో భాగంగా మరోసారి అప్డేటెడ్ పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికితోడు మరో రూ. 720 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లు అలఖ్ పాండే, ప్రతీక్ బూబ్ విడిగా రూ. 360 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనున్నారు.ప్రస్తుతం కంపెనీలో ఇరువురుకీ విడిగా 40.35 శాతం చొప్పున వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 461 కోట్లు ఆఫ్లైన్, హైబ్రిడ్ సెంటర్ల ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరో రూ. 548 కోట్లు ప్రస్తుత కేంద్రాల లీజ్ చెల్లింపులకు వినియోగించనుంది. -
‘టీసీఎస్లో ఉద్యోగికి బలవంతపు రిటైర్మెంట్’
దేశీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో బలవంతపు రాజీనామాలు, ముందస్తు రిటైర్మెంట్లు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టీసీఎస్లో సుదీర్ఘకాలంగా ఉద్యోగిగా పనిచేసిన తమ సోదరుడిని ముందస్తు పదవీ విరమణ చేయించడమే కాకుండా, సెవెరెన్స్ పే లేదా ఎలాంటి పరిహారం కూడా ఇవ్వలేదని ఒక వ్యక్తి పేర్కొన్నారు. ఆ వ్యక్తి తమ సోదరుడికి జరిగిన విషయాన్ని రెడ్డిట్ లో పోస్ట్ చేశారు."టీసీఎస్ ఉద్యోగిని 30 సంవత్సరాల తరువాత ముందస్తు పదవీ విరమణకు బలవంతం చేశారు. తొలగింపు వేతనం లేదు, పరిహారం లేదు" అని రెడ్డిట్ యూజర్ (silver_traveller) పేర్కొన్నారు. తన సోదరుడు తన జీవితంలో దాదాపు 30 ఏళ్లను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు అంకితం చేశాడని 'వర్క్ ప్లేస్ టాక్సిసిటీ' ట్యాగ్ కింద షేర్ చేసిన ఈ ఘటన పేర్కొంది.రిటైర్ అవుతావా.. తొలగించమంటావా?30 ఏళ్లుగా కంపెనీకి విధేయుడిగా ఉన్న తమ సోదరుడికి నిర్ణయం తీసుకోవడానికి కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని రెడిట్ యూజర్ ఆరోపించారు. 2025 జూన్లో ఆయనను ఒక సమావేశానికి పిలిపించి, తొలగిస్తున్నట్లు చెప్పారని, ముందస్తు పదవీ విరమణను స్వీకరించడం లేదా తొలగింపును ఎదుర్కోవడం.. రెండిటిలో ఏదో ఒకదాన్ని నిర్ణయించుకోవాలని సరిగ్గా 20 నిమిషాలే సమయం ఇచ్చారని వాపోయారు.50 ఏళ్ల వయసున్న తమ సోదరుడు ఇప్పుడు అనుభవజ్ఞులైన నిపుణులకు ప్రతికూలంగా ఉన్న జాబ్ మార్కెట్లో పరిమిత ఉద్యోగావకాశాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెడిట్ పోస్టుకు ఫాలోవర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలా మంది యూజర్లు బాధిత ఉద్యోగికి మద్దతుగా, టీసీఎస్ వైఖరికి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు.కాగా టీసీఎస్ లో బలవంతపు రాజీనామా, అక్రమ తొలగింపుకు వ్యతిరేకంగా పలువురు ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు ఇటీవలే వీధుల్లోకి వచ్చారు. నోయిడా, కోల్ కతాలో ఆలిండియా ఐటీ, ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీఈయూ) ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. నిరసనలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ, "టీసీఎస్ తొలగింపును ఆపండి, లేకపోతే ప్రతిఘటన మరింత గట్టిగా పెరుగుతుంది" అని ఏఐఐటీఈయూ ఎక్స్లో పోస్ట్ చేసింది.IT/ITeS employees across India hit the streets on 5 Sept against #ForcedResignation & #IllegalTermination in #TCS. Protests in Noida & Kolkata sent a clear message: #TCSstopRetrenchment or the resistance will grow louder. ✊ #JoinAIITEU pic.twitter.com/NidRgsU3Xy— AIITEU (@aiiteu) September 6, 2025 -
జాబ్కు అప్లయి చేస్తున్నారా? జాగ్రత్త!
భారతదేశ డిజిటల్ జాబ్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. కానీ ఆన్లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మోసాలకు ఉద్యోగార్థులు చిక్కకుండా సహాయపడటానికి, లింక్డ్ఇన్ నమ్మకాన్ని పెంపొందించడానికి, మోసాలను తగ్గించడానికి తన ధృవీకరణ సాధనాలను విస్తరిస్తోంది.లింక్డ్ఇన్లో కొత్త మార్పులుకంపెనీల పేజీ వెరిఫికేషన్ విస్తరణ: ఇప్పుడు ప్రీమియం పేజీలతో చిన్న కంపెనీలకు కూడా అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు, ఉద్యోగార్థులు, భాగస్వాములతో నమ్మకాన్ని పెంపొందించడానికి కంపెనీలకు సహాయపడుతుంది.రిక్రూటర్ వెరిఫికేషన్: "రిక్రూటర్" లేదా "టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్" వంటి టైటిల్స్ను జోడించే ముందు రిక్రూటర్లు వారి కార్యాలయాన్ని ధృవీకరించాలి. ఇది ఉద్యోగార్థులు తాము నిజమైన ప్రొఫెషనల్స్తో వ్యవహరిస్తున్నామని నిర్ధారిస్తుంది.ఎగ్జిక్యూటివ్ టైటిల్ వెరిఫికేషన్: సీనియర్ పాత్రలకు (ఉదా. మేనేజింగ్ డైరెక్టర్, వీపీ) ఇప్పుడు వర్క్ ప్లేస్ వెరిఫికేషన్ అవసరం. తాము లీడర్షిప్ రోల్లో ఉన్నామంటూ ఎవరూ మోసం చేయకుండా ఇది నివారిస్తుంది.80 మిలియన్లకు పైగా నకిలీ ఖాతాలుభారత్లో వెరిఫికేషన్ అడాప్షన్ గత ఏడాదిలో 2.4 రెట్లు పెరిగింది. వెరిఫైడ్ యూజర్లు 60% ఎక్కువ ప్రొఫైల్ వ్యూస్, 30% ఎక్కువ కనెక్షన్ రిక్వెస్ట్లు, 13% ఎక్కువ రిక్రూటర్ సందేశాలను పొందుతారు. లింక్డ్ఇన్ కేవలం ఆరు నెలల్లో 80 మిలియన్లకు పైగా నకిలీ ఖాతాలను బ్లాక్ చేసింది.ఈ జాగ్రత్తలు తీసుకోండి..మోసాల బారిన పడకుండా లింక్డ్ఇన్ ఇండియాలో బోర్డ్ డైరెక్టర్, లీగల్ & ప్రభుత్వ వ్యవహారాలకు కంట్రీ హెడ్గా ఉన్న అతిథి ఝా ఉద్యోగార్థులకు ఈ కింది సూచనలు చేశారు.ఆన్బోర్డింగ్కు ముందు బ్యాంక్ వివరాలను పంచుకోవద్దు.అనుమానాస్పద అభ్యర్థనలను నివారించండి-నిజమైన కంపెనీ ప్రతినిధులు డబ్బు లేదా సాఫ్ట్వేర్ డౌన్లోడ్లను అడగరు.మోసపూరిత జాబ్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి.అప్డేటెడ్ సెట్టింగ్స్, రికవరీ ఎంపికలతో మీ అకౌంట్ను సురక్షితంగా ఉంచుకోండి.లింక్డ్ ఇన్ సేఫ్టీ టూల్స్వెరిఫైడ్ జాబ్ పోస్టింగ్స్: వెరిఫైడ్ కంపెనీలు లేదా రిక్రూటర్లను చూపించే బ్యాడ్జీలను చూడండి.సందేశ హెచ్చరికలు: హానికరమైన కంటెంట్ను గుర్తించడానికి వీలు కల్పిస్తాయి.జాబ్ ఫిల్టర్లు: వెరిఫైడ్ జాబ్స్ మాత్రమే సెర్చ్ చేయొచ్చు.పాస్కీలు: సురక్షితమైన లాగిన్ కోసం డివైజ్ అన్లాక్ (వేలిముద్ర వంటివి) ఉపయోగిస్తుంది.టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ ఖాతాకు అదనపు రక్షణను జోడిస్తుంది. -
దేశంలో క్రెడిట్ కార్డులు 11.16 కోట్లు
దేశంలో క్రెడిట్ కార్డుల సంఖ్య, వాటి ద్వారా చేసే వ్యయం ఏటా పెరుగుతోంది. క్రెడిట్ కార్డుల వినియోగం గత ఏడు నెలల్లో గణనీయంగా పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2025 జనవరిలో 10.89 కోట్ల క్రెడిట్ కార్డులు ఉండగా, జూలై నాటికి ఈ సంఖ్య 11.16 కోట్లకు చేరింది.ఖర్చు కూడా పెరుగతోంది..కార్డుల జారీతోపాటు వినియోగదారులు నెలకు చేసే సగటు ఖర్చు కూడా పెరుగుతోంది. సగటున ఒక కార్డు ద్వారా చేసిన వ్యయం ఈ ఏడాది జనవరిలో రూ.16,950 నుంచి జులై నాటికి రూ.17,399కి ఎగబాకింది. అంటే 2.65 శాతం వృద్ధి. ఇది వినియోగదారుల ఖర్చు అలవాట్లలో మార్పును సూచిస్తుంది.వినియోగదారుల ప్రవర్తనలో మార్పులుఈఎంఐ, బీఎన్పీఎల్ స్కీములు, క్యాష్బ్యాక్లు, రివార్డుల వల్ల వినియోగం పెరుగుతోంది.డిజిటల్ చెల్లింపుల పెరుగుదలతో చిన్న లావాదేవీలు కూడా కార్డుల ద్వారా జరుగుతున్నాయి.కార్డు జారీలు పెరగడం, సులభమైన అంగీకార విధానాలు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.ఇదీ చదవండి: జాబ్కు అప్లయి చేస్తున్నారా? జాగ్రత్త! -
ఓయో కంపెనీ పేరు మారింది.. ఐపీఓ ముంగిట కీలక మార్పు
గ్లోబల్ ట్రావెల్ టెక్ ప్లాట్ ఫామ్ ఓయో (OYO) కంపెనీ పేరు మారింది. ఐపీఓ ముంగిట ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ తన పేరును ‘ప్రిజం’గా మార్చుకుంది. ఇది దాని అన్ని వ్యాపారాలకు గొడుగు సంస్థగా పనిచేస్తుంది. తమ ప్లాట్ ఫామ్కు సంబంధించిన వివిధ బ్రాండ్లను ఏకతాటిపైకి తీసుకురానుంది. అయితే ఒక బ్రాండ్గా ఓయో పేరు మాత్రం కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది.ఒరావెల్ స్టేస్ ఇకపై ‘ప్రిజం లైఫ్’ సంక్షిప్తంగా ‘ప్రిజం’గా కొత్త కార్పొరేట్ గుర్తింపును కొనసాగిస్తుందని ఓయో షేర్ హోల్డర్లకు పంపిన లేఖలో బోర్డు చైర్మన్, వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు."ప్రిజం మన విభిన్న వ్యాపారాలన్నింటికీ గొడుగులా పనిచేస్తుంది, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, మనం ఎవరో స్పష్టంగా తెలియజేయడానికి మనకు సహాయపడుతుంది. ఇది మన వేర్వేరు బ్రాండ్లను విడిపోకుండా కలుపుతుంది" అని అగర్వాల్ లేఖలో పేర్కొన్నారు.కొత్త పేరు ఇలా వచ్చింది..మాతృ సంస్థ పేరు మార్చాలని నిర్ణయించిన యాజమాన్యం కొత్త పేరు సూచించాలని ప్రపంచస్థాయిలో ఓ పోటీ పెట్టింది. ఇందులో 6,000 లకు పైగా వచ్చిన సూచనల్లో నుంచి ప్రిజం పేరును ఎంపిక చేసింది. అగర్వాల్ 2012లో స్థాపించిన ఓయో 35 దేశాల్లో 100 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఓయో, మోటెల్ 6, టౌన్ హౌస్, సండే, ప్యాలెట్ వంటి బ్రాండ్ల కింద హోటళ్లను ఈ గ్రూప్ పోర్ట్ ఫోలియో విస్తరించింది.వెకేషన్ హోమ్స్ విభాగంలో బెల్విల్లా, డాన్ సెంటర్, చెక్ మైగెస్ట్, స్టూడియో ప్రెస్టీజ్ వంటి వివిధ బ్రాండ్లను నిర్వహిస్తోంది. అమెరికాలోని జీ6 హాస్పిటాలిటీ ద్వారా దక్కించుకున్న స్టూడియో 6 ఈ ఎక్స్టెండెడ్ స్టే కేటగిరీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. అదనంగా, పోర్ట్ ఫోలియోలో వర్క్ స్పేస్ లు, సెలబ్రేషన్ స్పేస్ లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాగస్వామ్య సాధనాలు, డేటా సైన్స్ ప్లాట్ఫామ్లతో సహా ఆతిథ్య సాంకేతిక పరిష్కారాలను కూడా ఈ గ్రూప్ అందిస్తుంది.ఇదీ చదవండి: ఖరీదైన అపార్ట్మెంట్లు.. బాలీవుడ్ నటులకు భారీ లాభాలు -
'ఈ రంగాలు లేకుంటే అమెరికాలో ఉద్యోగాలు సున్నా'
అమెరికా ఉద్యోగ మార్కెట్ పరిస్థితి గురించి.. ప్రముఖ ఆర్ధిక సంస్థ మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ 'మార్క్ జాండీ' ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి ఉద్యోగుల భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ (హెల్త్కేర్), ఆతిథ్య (హాస్పిటాలిటీ) రంగాలపై ఎక్కువగా ఆధారపడుతోందని వెల్లడించారు. ఈ పరిస్థితి ఆర్ధిక మాంద్యానికి దారితీస్తుందని స్పష్టం చేశారుఈ ఏడాది ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య రంగాలలో ఆరు లక్షల ఉద్యోగాలు పుట్టాయి. ఈ రెండు రంగాలు లేకపోతే.. ఇక్కడ ఉద్యోగాల సృష్టి సున్నాకు పడిపోయే అవకాశం ఉందని మార్క్ జాండీ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఆర్థికమాంద్యం సమయంలోనే కనిపిస్తుందని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.అమెరికా ఉద్యోగ మార్కెట్ మాంద్యం ఎదుర్కొంటుందా?అమెరికా ఉద్యోగ పరిస్థితి మాంద్యంలోకి ప్రవేశించినట్లు జాండీ ట్వీట్ చెబుతోంది. జూన్ నెలలో ఉద్యోగాలు తగ్గినప్పటికీ.. జులై, ఆగస్టు నెలలో స్వల్ప వృద్ధి ఉంది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా?, తగ్గుతుందా?, అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. జీడీపీ, ఆదాయాలు కొంత పెరుగుతున్నప్పటికీ.. తయారీ, మైనింగ్, నిర్మాణం వంటి రంగాల్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్యం మాత్రమే ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. కాబట్టి ఇది పూర్తి మాంద్యం కాదని మార్క్ అన్నారు.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!యూఎస్ ఉద్యోగాల డేటాయూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (BLS) శుక్రవారం.. ఉద్యోగ డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత రేటు ఆగస్టులో 4.3% ఉంది. జూలై 2025లో 79,000గా ఉన్న ఉద్యోగాల వృద్ధి.. ఆగస్టులో 22,000కు పడిపోయింది. దీన్నిబట్టి చూస్తే అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా అవగతం అవుతోంది.What’s perhaps most disconcerting about the flagging job market is how dependent it is on healthcare and hospitality for what little job growth is occurring. Since the beginning of the year, the economy has created a paltry 600k jobs, but without the job growth in these… pic.twitter.com/lmheiipugG— Mark Zandi (@Markzandi) September 7, 2025 -
లాభాల్లో స్టాక్మార్కెట్.. దూసుకెళ్లిన టాటా మోటర్స్ షేర్లు
బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు సెషన్ ముగిసే సమయానికి లాభాలు కొంత తగ్గినప్పటికీ సోమవారం సానుకూలంగానే ముగిశాయి. ఇంట్రాడేలో 81,171.38 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం సెషన్లో 76.54 పాయింట్లు (0.09 శాతం) పెరిగి 80,787.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 32.15 పాయింట్లు (0.13 శాతం) పెరిగి 24,773.15 వద్ద స్థిరపడింది. నేటి ట్రేడింగ్ లో సూచీ 24,885.50 నుంచి 24,751.55 మధ్య కదలాడింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.50 శాతం, 0.16 శాతం లాభాలతో ముగిశాయి. భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, మదర్సన్ సుమి, టాటా మోటార్స్ నేతృత్వంలో నిఫ్టీ ఆటో ఇండెక్స్ 3.30 శాతం లాభాలతో స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ ఐటీ 0.94 శాతం నష్టపోయింది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్ టిఐ, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్ గా నిలిచాయి.ఎన్ఎస్ఈలో ట్రేడైన 3,144 షేర్లలో 1,749 షేర్లు లాభాల్లో ముగియగా, 1,285 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 110 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మొత్తం 114 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 50 స్టాక్స్ 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.07 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. -
ఖరీదైన అపార్ట్మెంట్లు.. బాలీవుడ్ నటులకు భారీ లాభాలు
ముంబైలోని ఖరీదైన అపార్ట్మెంట్లు బాలీవుడ్ నటులకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ నటి మలైకా అరోరా ముంబైలోని అంధేరీ వెస్ట్ లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను రూ.5.30 కోట్లకు అమ్మేసింది. ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. ఈ లావాదేవీ 2025 ఆగస్టులో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్) వద్ద నమోదైంది. అంధేరి వెస్ట్ లోని లోఖండ్ వాలాలో ఉన్న రన్వాల్ ఎలిగంటే అనే హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఈ ప్రాపర్టీ ఉంది.రూ.2.04 కోట్ల లాభంమలైకా ఈ అపార్ట్మెంట్ను 2018 మార్చిలో రూ.3.26 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే ఆమె దీనిపై 62 శాతం రూ.2.04 కోట్ల లాభాన్ని ఆర్జించారు. ఈ అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా 1,369 చదరపు అడుగులు, బిల్టప్ ఏరియా 152.68 చదరపు మీటర్లు. ఈ సేల్ లో ఒక కారు పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. స్టాంప్ డ్యూటీ కింద రూ.31.08 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.30 వేలు చెల్లించారు.స్క్వేర్ యార్డ్స్ డేటా ప్రకారం.. 2024 సెప్టెంబర్ నుంచి 2025 ఆగస్టు మధ్య రన్వాల్ ఎలిగెంట్ ప్రాజెక్టులో మొత్తం రూ.109 కోట్ల విలువైన 22 రిజిస్టర్డ్ ప్రాపర్టీ లావాదేవీలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో సగటు ప్రాపర్టీ ధర చదరపు అడుగుకు రూ.33,150గా ఉంది. అంధేరి వెస్ట్ ముంబైలో అత్యంత డిమాండ్ ఉన్న నివాస ప్రాంతాలలో ఒకటి. లగ్జరీ అపార్ట్మెంట్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లకు ఇది ప్రసిద్ధిగాంచిది.టైగర్ ష్రాఫ్కు రూ.3.98 కోట్ల లాభంమరో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ముంబైలోని ఖర్ లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను విక్రయించాడు. (Tiger Shroff sells Mumbai apartment) 2025 సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ అపార్ట్ మెంట్ అత్యాధునిక రుస్తుంజీ పారామౌంట్ ప్రాజెక్టులో భాగం. దీని కార్పెట్ ఏరియా 1,989.72 చదరపు మీటర్లు, బిల్టప్ ఏరియా 2,189 చదరపు మీటర్లు. ఈ ఫ్లాట్ లో మూడు కార్ పార్కింగ్ స్థలాలు ఉండటం గమనార్హం.2018లో టైగర్ ఈ ప్రాపర్టీని రూ.11.62 కోట్లకు కొనుగోలు చేశాడు. 2025లో రూ.15.60 కోట్లకు విక్రయించి రూ.3.98 కోట్ల లాభం, పెట్టుబడిపై 34.25 శాతం రాబడి వచ్చింది. ఈ లావాదేవీకి రూ.93.60 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ అపార్ట్మెంట్ వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే, రాబోయే మెట్రో మార్గాలతో బాగా అనుసంధానమై ఉంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, లోయర్ పరేల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రదేశాలకు ఇది దగ్గరగా ఉంది.ఇదీ చదవండి: ఓయో కంపెనీ పేరు మారింది.. ఐపీఓ ముంగిట కీలక మార్పు -
కృత్రిమ మేధను నడిపిస్తున్న టాప్ 10 అధినేతలు
కృత్రిమ మేధ(ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇందులో సర్వీసులు అందించే కంపెనీల అధినేతల ఆదాయం కూడా అందుకు అనుగుణంగా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం.. ఏఐలో సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీల అధినేతల నెట్వర్త్ ఎంత ఉందో.. వారు ఏయే అంశాల్లో ప్రధానంగా సర్వీసులు అందిస్తున్నారో కింద తెలియజేశాం.పేరుపాత్రనికర విలువ (2025)ప్రధానంగా సర్వీసులు అందించే విభాగంమార్క్ జుకర్బర్గ్సీఈఓ, మెటా221.2 బి.డాలర్లుసోషల్ ప్లాట్ఫామ్లు, మెటావర్స్ ఏఐఎలాన్ మస్క్వ్యవస్థాపకుడు ఎక్స్ఏఐ400 బి.డాలర్లుసోషల్ ప్లాట్ఫామ్జెన్సెన్ హువాంగ్సీఈఓ, ఎన్వీడియా150 బి.డాలర్లుఏఐ జీపీయూలుదరియో అమోదీసీఈఓ, ఆంత్రోపిక్3.7 బి.డాలర్లుఅలైన్ AI సిస్టమ్లుమాథ్యూ ప్రిన్స్సీఈఓ, క్లౌడ్ఫేర్5.5 బి.డాలర్లుఏఐ రెగ్యులేషన్, కంటెంట్ ప్రొటెక్షన్శామ్ ఆల్ట్మన్సీఈఓ, ఓపెన్ఏఐ1.2 బి.డాలర్లుగ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాఆండీ జాస్సీసీఈఓ, అమెజాన్500 మి.డాలర్లురిటైల్, క్లౌడ్, రోబోటిక్స్ ఏఐఫిడ్జీ సిమోసీఈఓ, ఓపెన్ఏఐ అప్లికేషన్స్70.75 మి.డాలర్లుఏఐ ఉత్పత్తుల స్కేలింగ్అల్లీ కె.మిల్లర్సీఈఓ, ఓపెన్ మెషిన్36 మి.డాలర్లుయాక్సెసబుల్ ఏఐ టూల్స్ఎస్.రవి కుమార్సీఈఓ, కాగ్నిజెంట్రూ.898.9 కోట్లు (108 మి.డాలర్లు)జనరేటివ్ ఏఐ ఇదీ చదవండి: హైదరాబాద్లో 150 సీసీ స్కూటర్ ఆవిష్కరణ.. ఫీచర్లు ఇవే.. -
ఆడి కీలక ప్రకటన: రూ.7 లక్షలు తగ్గిన క్యూ8 ధర
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సోమవారం (సెప్టెంబర్ 8) భారతదేశంలోని అన్ని మోడళ్లలో ధరల తగ్గింపును ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు తరువాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఇది ఆడి కార్ల కొనుగోలుదారులకు కొంత ప్రయోజనం చేకూరుస్తుంది.GST 2.0 అమలు తర్వాత 'ఆడి ఇండియా' తన ఉత్పత్తుల పోర్ట్ఫోలియో అంతటా సవరించిన ధరలను ఒక ప్రకటనలో ప్రకటించింది. ధరల తగ్గుదల తరువాత మోడల్ను బట్టి రూ. 2.6 లక్షల నుంచి రూ. 7.8 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. సరికొత్త ధరలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. పండుగ సీజన్కు ముందు కస్టమర్ డిమాండ్కు ధరల తగ్గింపు ఊతం ఇస్తున్నాయని ప్రకటన పేర్కొంది.కొత్త ధరల ప్రకారం.. కంపెనీ ఎంట్రీ SUV క్యూ3 ధర రూ. 43.07 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని ధర గతంలో రూ. 46.14 లక్షలు. అదే విధంగా టాప్ ఎండ్ SUV క్యూ8 ప్రారంభ ధర రూ. 1.1 కోట్లుగా ఉంటుంది. ఇది గతంలో రూ. 1.18 కోట్లుగా ఉండేది. సెడాన్లు A4, A6 లతో పాటు SUVలు క్యూ5, క్యూ7 వంటి ఇతర మోడళ్ల ధరలు కూడా తగ్గుతాయి. -
హైదరాబాద్లో టీవీఎస్ 150 సీసీ స్కూటర్ ఆవిష్కరణ.. ఫీచర్లు ఇవే..
టీవీఎస్ మోటార్ హైపర్ స్పోర్ట్ స్కూటర్ ‘ఎన్టార్క్ 150’ను హైదరాబాద్లో ఆవిష్కరించింది. స్పోర్టీ, ప్రీమియంలుక్తో ఈ మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఎక్స్షోరూం వద్ద బేస్ వేరియంట్ ధర రూ.1,19,000, అధునాతన టీఎఫ్టీ వేరియంట్ ధర రూ.1,29,000గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే ఈ ధరల్లో ఇటీవలి జీఎస్టీ శ్లాబుల సరళీకరణను పరిగణించలేదని, సెప్టెంబర్ 22 తర్వాత కొత్త ధరలు అప్డేట్ అయ్యే అవకాశం ఉందని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.హైదరాబాద్లో ఈ స్కూటర్ ఆవిష్కరించిన నేపథ్యంలో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెడ్ కమ్యుటర్, ఈవీ బిజినెస్ అండ్ హెడ్ బ్రాండ్ మీడియా) అనిరుద్ధా హల్దార్ మాట్లాడుతూ..‘అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించిన ఈ స్కూటర్ను జెన్జీ(2000 తర్వాత జన్మించినవారు) యువత ఎంతో ఇష్టపడుతారు. ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్, ఫ్యుచరిస్టిక్ డిజైన్కు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది. ఇందులోని టీఎఫ్టీ వేరియంట్లో స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలెక్సా, స్మార్ట్ వాచ్ అడాప్టబిలిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఎస్ఎంఎస్/కాల్ అలర్ట్లు వంటివి ఉన్నాయి’ అని చెప్పారు.రైడ్ మోడ్లు, భద్రతకు సంబంధించి కూడా ఇందులో జాగ్రత్తలు వహించినట్లు కంపెనీ తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఇందులో రేస్ మోడ్, స్ట్రీట్ మోడ్ అనే డ్యూయల్ రైడ్ మోడ్స్ ఉన్నాయి. పరిస్థితులుకు తగినట్లు ఏదైనా వాడుకునేందుకు వీలుంటుంది. క్రాష్ అలర్ట్, థెఫ్ట్ హెచ్చరిక, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, పార్క్ చేసిన ప్రదేశం, సింగిల్ ఛానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.కంపెనీ వివరాల ప్రకారం.. 149.7సీసీ ఇంజిన్.. గరిష్టంగా 7,000 ఆర్పీఎం వద్ద 13.2 పీఎస్ పవర్, 5,500 ఆర్పీఎం వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గంటకు 104 కి.మీ వేగం ప్రయాణించలదు.ఇదీ చదవండి: భారతీయులకు అమెరికా మరో షాక్.. -
యూపీఐలో కీలక మార్పులు: సెప్టెంబర్ 15 నుంచి అమలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన.. ఎంపిక చేసిన వర్గాలకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీ పరిమితులను పెంచింది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు ఎక్కువ లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం లభించింది. కొత్త పరిమితులు 2025 సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయి.యూపీఐ కొత్త పరిమితుల కింద.. వినియోగదారుడు 24 గంటల్లో 10 లక్షల వరకు లావాదేవీలను చేసుకోవచ్చు. ప్రత్యేక ధ్రువీకరణ పొందిన యూజర్లు.. వ్యాపార చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. కాగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి జరిగే లావాదేవీలలో ఎటువంటి మార్పు లేదు (రోజుకు రూ. లక్ష).యూపీఐ పరిమితులలో కీలక మార్పులు➤క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులు, బీమా చెల్లింపుల కోసం పరిమితులు రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. అంతే కాకుండా 24 గంటల్లో గరిష్టంగా రూ. 10 లక్షల వరకు అనుమతి లభిస్తుంది.➤ప్రయాణ రంగంలో.. లావాదేవీ పరిమితి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెరిగింది. రోజువారీ పరిమితి రూ. 10 లక్షలు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను ఇప్పుడు ఒకేసారి రూ. 5 లక్షల వరకు చేయవచ్చు. అయితే రోజువారీ పరిమితి రూ. 6 లక్షలకు పరిమితం చేశారు.➤లోన్, ఈఎమ్ఐ పరిమితులు రూ. 5 లక్షలకు చేరాయి. గరిష్టంగా రోజుకు రూ. 10 లక్షల వరకు లావాదేవీ చేయవచ్చు. ఆభరణాల కొనుగోళ్లు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెంచారు. రోజువారీ పరిమితి రూ. 6 లక్షలు.➤బ్యాంకింగ్ సేవలలో, డిజిటల్ ఆన్బోర్డింగ్ ద్వారా టర్మ్ డిపాజిట్లను రోజుకు రూ. 5 లక్షల వరకు అనుమతించారు. దీని పరిమితి గతంలో రూ. 2 లక్షలు మాత్రమే. -
లీగల్ హైయిర్ సర్టిఫికెట్లు.. ఇబ్బందులు
వారసులు హక్కులే కాదు బాధ్యతలు కూడా స్వీకరించాలి. అలాంటి ఎన్నో బాధ్యతల్లో ఒకానొక బాధ్యత.. చనిపోయిన వారి తరఫున వారి వారసులు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రిటర్నులు దాఖలు చేయాలి. దాఖలు చేయడానికి వారసులకు ధృవీకరణ పత్రం ఉండాలి. దాన్నే వాడుక భాషలో 'లీగల్ హైయిర్ సర్టిఫికెట్' అని అంటారు.మరణించిన వారి ఆస్తులను పొందడానికి, బ్యాంకు అకౌంటులోని డబ్బులు పొందడానికి ఈ ధృవీకరణ పత్రం ఉండాలి. ఈ పత్రంలో వారసుల పేర్లు ఉంటాయి. వారే, మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులు, బీమా పాలసీలు, బ్యాంకు అకౌంటులో ఫిక్సిడ్ డిపాజిట్లు మొదలైనవి పొందగలరు. ఇలాంటి ధృవీకరణ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ప్రక్రియ మొదలవుతుంది. సర్టిఫికెట్ ఎలా వస్తుంది..మన కాలమ్లో ఇది అప్రస్తుతం అయినా, దరఖాస్తు చేసిన తర్వాత మండల/తహసీల్దారు/కోర్టులు రుజువులు అడుగుతాయి. డాక్యుమెంట్లు ఇవ్వాలి. విచారణ ఉంటుంది. ఆ తర్వాత జారీ చేస్తారు. మిగతా అధికార్లు త్వరగా జారీ చేస్తారేమో కానీ కోర్టుకి వెళ్తే చాలాకాలం పడుతుంది.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం..మరణించిన వ్యక్తికి సంబంధించి తాను జీవించి ఉన్నంత వరకు, తన చేతికి వచ్చిన ఆదాయం మీద పన్ను అధికారికి రిటర్నులు వేయాలి. నిన్ననే ఒక వ్యక్తి పోయారనుకోండి. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఒక రిటర్ను, 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 సెప్టెంబర్ 7 వరకు మరొక రిటర్ను.. ఇలా రెండు దాఖలు చేయాలి. గడువు తేదీలోపల చేయాలి.వారసులేం చేయాలి..చట్టప్రకారం వారసులు మరణించిన వ్యక్తికి సంబంధించిన రిటర్నులు వేయాలి. ఆదాయం ఎంత, పన్ను భారం ఎంత, టీడీఎస్, టీసీఎస్ మొదలైన విషయాలు అందరికీ మామూలే. ఏం కాగితాలు /డాక్యుమెంట్లు జతపర్చాలి .. చనిపోయిన వ్యక్తి పాన్కార్డు చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ లీగల్ హైయిర్ సర్టిఫికెట్లుచనిపోయిన వారి విషయంలో పాస్ చేసిన ఆర్డర్లు/నోటీసులు.పై జాబితాలో (1), (2), అలాగే (4) సులువుగా దొరుకుతాయి. అవన్నీ అప్లోడ్ చేయొచ్చు.లీగల్ హైయిర్ సర్టిఫికెట్ అంటే..ఈ కింది వాటిని మాత్రమే ఆదాయపు పన్ను వారి పోర్టల్లో పొందుపర్చారు కోర్టు జారీ చేసిన సర్టిఫికెట్రెవెన్యూ అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్రెవెన్యూ అధికారులు జారీ చేసిన కుటుంబ సభ్యుల జాబితా సరి్టఫికెట్ రిజిస్టర్ అయిన వీలునామా స్టేట్ / సెంట్రల్ ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ సర్టిఫికెట్ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలు జారీ చేసిన సర్టిఫికెట్. అందులో నామినీ పేరుండాలి. పైన చెప్పిన డాక్యుమెంట్లు, ఇంగ్లీషులో ఉంటే మంచిది. లేకపోతే ప్రాంతీయ భాషల్లో ఉంటే వాటిని ఆంగ్లంలోకి తర్జుమా చేసి అనువాదం ఇవ్వాలి.అసలు సమస్య ఏమిటంటే..గడువు తేదీలోపల రిటర్నులు వేయడానికి ప్రధాన ప్రతిబంధకం ఏమిటంటే, పైన చెప్పిన డాక్యుమెంట్లు సకాలంలో జారీ అవ్వకపోవడమే. కోర్టు జారీ చేయడమంటే.. సంవత్సరాలు పట్టేస్తుంది. రెవెన్యూ అధికారులు జారీ చేయడం అంటే నెలలు పడుతుంది. గడువు తేదీలోపల రావడం జరగదు. ఇవి లేకపోతే రిటర్నులు వేయడానికి కుదరడం లేదు. వీలునామా సులువుగా దొరుకుతుంది. వీలునామాలో ఆస్తి పంపకాలే ఉంటాయి కానీ వారసత్వం గురించి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. పెన్షన్ సరి్టఫికెట్లో కూడా కేవలం పెన్షన్ ఎవరికి చెందుతుందో వారి పేరే ఉంటుంది. వారసులందరి పేర్లు ఉండకపోవచ్చు. బ్యాంకు వారు జారీ చేసే సరి్టఫికెట్లో నామినీ పేరుంటుంది కానీ వారసుల పేర్లు ఉండకపోవచ్చు.పైన చెప్పిన సమస్యల గురించి డిపార్టుమెంటు వారు ఆలోచించాలి. పరిశీలించాలి. ప్రాక్టికల్గా పరిగణనలోకి తీసుకుని కేవలం డెత్ సర్టిఫికెట్తో ఫైల్ చేసుకునే వీలు కల్పించాలి. అవసరం అయితే, వారసుల ధృవీకరణ కోసం అసెస్మెంట్ను పెండింగ్లో పెట్టొచ్చు. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
రైతులకు శుభవార్త చెప్పిన వియోనా ఫిన్టెక్
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ వియోనా ఫిన్టెక్.. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపుల వేదికలలో ఒకటి. గ్రామ్పే, వియోనా పే యాప్ల డెవలపర్ అయిన ఈ సంస్థ, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా పనిచేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి ఆమోదం పొందింది.ఈ ఆమోదం వియోనా వృద్ధి ప్రణాళికలను వేగవంతం చేస్తుంది, తద్వారా భాగస్వామ్య బ్యాంకులతో కలిసి యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలను అందించనుంది. ఇది ముఖ్యంగా టైర్ II, టైర్ III, గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ చెల్లింపుల వాడకాన్ని మరింత విస్తరిస్తుంది.ఈ ఆమోదం ద్వారా గ్రామీణ ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులకు డిజిటల్ చెల్లింపులు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని వియోనా ఫిన్టెక్ వ్యవస్థాపకుడు రవీంద్రనాథ్ యార్లగడ్డ తెలిపారు. వియోనా ప్రధాన ఉత్పత్తి గ్రామ్పే, గ్రామీణ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. ఈ ప్లాట్ఫారమ్ రైతులు, చిన్న వ్యాపారులు మరియు స్థానిక సమాజాలకు డిజిటల్ వసూళ్లు, చెల్లింపులు మరియు UPI లావాదేవీలు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఇది గ్రామీణ ఈ-కామర్స్ను ప్రోత్సహిస్తుంది మరియు గ్రామ స్థాయి వ్యవస్థాపకుల (VLEలు) నెట్వర్క్ ద్వారా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందిస్తుంది.వియోనా తన విస్తరణ వ్యూహంలో భాగంగా గ్రామ్పే ప్లాట్ఫారమ్లో రైతుల కోసం ఒక మార్కెట్ప్లేస్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ రైతులను నేరుగా కొనుగోలుదారులతో కలుపుతుంది, తద్వారా ధరల పారదర్శకతను మెరుగుపరచడం, చెల్లింపులను వేగవంతం చేయడం, యూపీఐ ఆధారిత చెల్లింపులకు ప్రాప్యతను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.వియోనా ఫిన్టెక్ పేఇన్, పేఔట్, వర్చువల్ అకౌంట్ నంబర్లు, మరియు UPI స్విచింగ్తో సహా అనేక రకాల UPI-ఆధారిత ఆర్థిక లావాదేవీల సేవలను అందిస్తుంది. దీని ప్లాట్ఫారమ్ వినియోగదారులు చెల్లింపుల వసూళ్లు, పంపిణీలు, మరియు రికన్సిలియేషన్ ప్రక్రియలను సురక్షితంగా మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: రూ. 3లక్షలు తగ్గిన టయోటా కారు ధర
హ్యుందాయ్ తన కార్ల ధరలు ఎంత తగ్గుతాయని విషయాన్ని వెల్లడించిన తరువాత, టయోటా కూడా తగ్గిన ధరలను స్పష్టం చేసింది. ఈ ధరలు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమలులో ఉంటాయు. సెప్టెంబర్ 3, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశంలో GST 2.0 ప్రకటన తర్వాత ధరల తగ్గుదల జరిగింది.మోడల్ వారీగా తగ్గిన టయోటా కార్ల ధరలు➜గ్లాంజా: రూ. 85,300 ➜టైసర్: రూ.1,11,100➜రూమియన్: రూ. 48,700➜హైరైడర్: రూ. 65,400➜క్రిస్టా: రూ. 1,80,600➜హైక్రాస్: రూ. 1,15,800➜ఫార్చ్యూనర్: రూ. 3,49,000➜లెజెండర్: రూ. 3,34,000➜హైలక్స్: రూ. 2,52,700➜కామ్రీ: రూ. 1,01,800➜వెల్ఫైర్: రూ. 2,78,000ఇదీ చదవండి: రూ.2 లక్షలు తగ్గిన ఫేమస్ కారు ధర -
పసిడి ప్రియులకు మంచి రోజు.. ఎందుకంటే?
బంగారం ధరలు రోజురోజుకి భారీగా పెరుగుతూ.. ఆల్ టైమ్ గరిష్టాలను చేరుకున్నాయి. నేడు (సెప్టెంబర్ 8) పసిడి రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 99,350 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,380 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 380 తగ్గింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 99,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,08,770 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 99,500 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 1,08,530 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 90 తక్కువ. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: వెండి రూ.2 లక్షలకు?.. నిపుణుల అంచనా!వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (సెప్టెంబర్ 08) కేజీ సిల్వర్ రేటు రూ. 1,37,000కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,27,000 వద్దనే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
అమెరికా కొత్త మెలికతో వీసా గోస..!
వాషింగ్టన్: కోవిడ్ సంక్షోభం వేళ త్వరగా వలసేతర వీసాల జారీ ప్రక్రియను ముగించాలనే సదుద్దేశంతో భారతీయులకు కల్పించిన ఒక చక్కటి వెసులుబాటుకు అమెరికా సర్కార్ హఠాత్తుగా మంగళం పాడింది. దీంతో భారతీయ వీసా దరఖాస్తుదారులకు మళ్లీ నిరీక్షణ కష్టాలు పెరగనున్నాయి. భారత్లోని వీసా ఇంటర్వ్యూ కేంద్రాల్లో భారీ షెడ్యూలింగ్ జాబితా ఉండటంతో విదేశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునేందుకు కోవిడ్ వేళ అమెరికా అనుమతిచ్చింది. దాంతో భారతీయులు చాలా మంది విదేశాలకు వెళ్లి అక్కడి అమెరికా కాన్సులేట్లు, రాయబార కార్యాలయాల్లో వీసా ఇంటర్వ్యూలను త్వరగా ముగించుకుని వీసాలను సాధించారు. ఇకపై అలా కుదరదని ఏ దేశం వాళ్లు ఆ దేశంలోనే దరఖాస్తు చేసుకోవాలని, అక్కడే ఇంటర్వ్యూలను పూర్తిచేసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో స్వదేశంలో వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్ మరింతగా పెరగనుంది. దరఖాస్తుదారులు తమ వంతు వచ్చేదాకా వేచిచూడాల్సిన నిరీక్షణ కాలం ఊహించనంతగా పెరిగిపోనుంది. త్వరగా వీసా పొంది అమెరికాలో వాలిపోదామనుకున్న భారతీయ వలసేతర వీసా దరఖాస్తు దారుల ఆశలు అడియాసలు కానున్నాయి. ‘‘వలసేతర వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇకపై కచ్చితంగా స్వదేశంలో లేదంటే రెసిడెన్సీ హోదా ఎక్కడ ఉందో ఆ ప్రాంతం నుంచే దరఖాస్తు చేసుకోవాలి. విదేశాలకు వెళ్లి దరఖాస్తు చేయడం కుదరదు’’అని తాజా నోటిఫికేషన్లో అమెరికా విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. పర్యాటకం(బీ2), వ్యాపారం(బీ1), విద్యార్థి, తాత్కాలిక ఉద్యోగులుసహా అన్ని వలసేతర వీసా విభాగాల దరఖాస్తుదారులకు తాజా సవరణ వర్తిస్తుందని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ‘‘నిబంధనలు మారాయని తెల్సి కూడా విదేశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే అక్కడి నుంచి వీసా అనుమతి రావడం గగనమే. అర్హత సాధించడం చాలా కష్టం. ఒకవేళ దరఖాస్తును స్వీకరించి, పరిశీలించినా నిరీక్షణకాలం ఎంతనేది చెప్పలేం. విదేశాల నుంచి చేసే దరఖాస్తుకు సంబంధించిన ఫీజు రీఫండ్ చేయడంగానీ స్వదేశంలో దరఖాస్తు చేసినట్లుగా ఆ ఫీజును పరిగణించడంగానీ జరగదు’’అని అమెరికా ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!వీసా షాపింగ్ భారతీయులకు కష్టమే తాత్కాలిక వీసా ఇంటర్యూల తంతును పూర్తిచేసుకోవాలంటే భారత్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కనీసం మూడున్నర నెలలు వేచి ఉండక తప్పని పరిస్థితి ఉందని వీసా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో స్వదేశం నుంచి కాకుండా ఇతర దేశానికి వెళ్లి అక్కడి నుంచి యూఎస్ వీసా కోసం దరఖాస్తు భారతీయుల సంఖ్య ఎక్కువైంది. ఇలా ‘వీసా షాపింగ్’చేసే భారతీయులకు ఇప్పుడు సమస్యలు తప్పవు. భారత్లో వీసారావాలంటే వారాల తరబడి వెయిట్ చేయక తప్పదు. అంతకాలం నిరీక్షించే ఓపికలేక థాయ్లాండ్, సింగపూర్, జర్మనీ, బ్రెజిల్ వంటి పలు దేశాలకు భారతీయులు పొలోమని వెళ్తున్నారు. అక్కడ త్వరగా వీసా సాధించి లబి్ధపొందిన ఉదంతాలు కోకొల్లలు. వలసేతర వీసా ఇంటర్వ్యూ కోసం 14 ఏళ్ల లోపు చిన్నారులు మొదలు 79ఏళ్లు పైబడిన వృద్దులదాకా తప్పనిసరిగా స్వయంగా వచ్చి కాన్సులేట్ ఆఫీసర్ ఎదుట హాజరవ్వాల్సిందే. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:28 సమయానికి నిఫ్టీ(Nifty) 35 పాయింట్లు పెరిగి 24,776కు చేరింది. సెన్సెక్స్(Sensex) 136 పాయింట్లు పుంజుకుని 80,857 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 97.83బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.86 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.09 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.32 శాతం నష్టపోయింది.నాస్డాక్ 0.03 శాతం క్షీణించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘థీమ్యాటిక్’తో ప్రయోజనం ఎంత..
అంతర్జాతీయంగా వ్యాపారాల్లో అనిశ్చితులు నెలకొనడం, కేవలం ఒకే రంగంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా కాదా అనే అంశంపై మరోసారి చర్చకు దారి తీసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఐటీ, ఫార్మాకు గట్టిగా దెబ్బ తగిలే అవకాశం ఉందని .. తయారీ రంగం, భారీ పెట్టుబడులు అవసరమయ్యే పరిశ్రమలు పాజిటివ్గా ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతగా బాగోలేని రంగాలను పక్కన పెట్టి, ఆకర్షణీయమైన రంగాలు లేదా థీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ, మార్కెట్లకు మించి రాబడులను రాబట్టాలనుకోవడం చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ వాస్తవంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. మెరుగ్గా రాణించే రంగాలను మాత్రమే అందిపుచ్చుకోవడమనేది పెద్ద సవాలుగా ఉంటుంది. నియంత్రణ సంస్థలపరంగా నిబంధనల్లో మార్పులు, కొత్త ఉత్పత్తులు లేదా మార్కెట్ పరిణామాలు, అంతర్జాతీయంగా వాణిజ్య పరిస్థితులు, వడ్డీ రేట్లలో మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కమోడిటీలు లేదా కరెన్సీల్లో స్వల్పకాలిక హెచ్చుతగ్గులు మొదలైన వాటి వల్ల తాత్కాలికంగా కొన్ని రంగాలు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అయితే, సగటు రిటైల్ ఇన్వెస్టర్లకు పరిశ్రమవ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితులతో పాటు కంపెనీకి మాత్రమే పరిమితమయ్యే ఇతరత్రా అంశాలను కూడా అధ్యయనం చేయడమనేది చాలా కష్టంగా ఉంటుంది. ఫలితంగా సదరు రంగం ఇటీవలి పనితీరు చూసి కావచ్చు లేదా మీడియాలో హైప్ వల్ల కావచ్చు చాలా మటుకు రిటైల్ ఇన్వెస్టర్లు, సెక్టోరల్ లేదా థీమ్యాటిక్ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.బూమ్..ఢామ్..సెక్టార్లు, థీమ్లు సాధారణంగా హెచ్చుతగ్గులు లోనవుతూ వలయాకృతిలో తిరుగాడుతుంటాయి. సదరు రంగం వాస్తవ పనితీరు కనిపించడానికి చాలా ముందే, అంచనాల ఆధారంగా స్టాక్ మార్కెట్లలో వాటి షేర్ల ధర పెరిగిపోతాయి. ఉదాహరణకు ఐటీ రంగం కొన్నాళ్లు బ్లాక్ బస్టర్ రాబడులు అందించాక (ఎన్ఎస్ఈ ఐటీ సూచీ: 1997–1999 మధ్య కాలంలో +173%, +193%, +493%), కొన్నాళ్లు భారీగా కరెక్షన్కి లోనయ్యింది (2000–2002 మధ్య కాలంలో –35%, –36%, –6%). ఇక ఫార్మా తీసుకుంటే నాలుగేళ్లు పటిష్టంగా ఉండగా (2012 నుంచి 2015 వరకు: +32%, +26%, +42%, +10%) తర్వాత వరుసగా నాలుగేళ్లు నెమ్మదించింది (–14%, –7%, –8%, –9%). అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభం తలెత్తే వరకు ఇన్ఫ్రా, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఎన్బీఎఫ్సీల పరుగులు కొనసాగాయి. ఏదైతేనేం, సెక్టోరల్ పెట్టుబడులతో విజయం సాధించాలంటే ఇన్వెస్టరు కచ్చితత్వంతో ఎంట్రీ ఇవ్వడంతో పాటు కచ్చితమైన పాయింటులో వైదొలగడమూ ముఖ్యమే. ఇది చాలా కష్టతరంగా ఉంటుంది.సెక్టోరల్ ఫండ్స్ పరిమితులు..సెక్టోరల్ ఫండ్స్కి సంబంధించి కొన్ని రంగాలకు నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. సదరు థీమ్ కారణంగా ఆ రంగంలో ఉన్న దాదాపు అన్ని సంస్థలను ఫండ్ మేనేజర్లు ఎంచుకోవాల్సి రావచ్చు. దీనితో కేవలం అత్యధిక రాబడులను అందించే స్టాక్స్ను ఎంచుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఫలితంగా ఫండ్ పనితీరు పూర్తిగా పరిశ్రమ కదలికలపైనే ఆధారపడుతుంది తప్ప ఫండ్ మేనేజరు నైపుణ్యాలకు తావుండదు.స్మార్ట్ విధానం ..ఈ నేపథ్యంలో పరిశోధనల ఆధారంగా వివిధ రంగాలకు కేటాయింపులను ఎప్పటికప్పుడు సవరించే అనుభవజు్ఞలైన నిపుణుల సారథ్యంలోని డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోల్లో ఇన్వెస్ట్ చేయడం వివేకవంతమైన నిర్ణయం అవుతుంది. సంప్రదాయ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసే వారు లేదా తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారు దాదాపు సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ కన్నా ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్స్, లేదా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్తో మొదలుపెట్టడం మంచిది. అనుభవజ్ఞులైన లేదా దూకుడుగా ఉండే మదుపరులు కోర్–శాటిలైట్ వ్యూహాన్ని అనుసరించవచ్చు. ఇందులో ఈక్విటీలకు సంబంధించి 75 శాతం లేదా అంతకు మించిన మొత్తాన్ని ఫ్లెక్సీ–క్యాప్ లేదా మల్టీ–క్యాప్ వ్యూహాల్లాంటివి పాటిస్తూ, నిర్వహణపరంగా మెరుగ్గా ఉన్న డైవర్సిఫైడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మిగతా 25 శాతాన్ని తమ నమ్మకానికి అనుగుణంగా థీమ్యాటిక్ లేదా సెక్టోరల్ ఫండ్స్కి కేటాయించవచ్చు. వినియోగం, ఆర్థికం లేదా తయారీకి సంబంధించిన థీమ్యాటిక్ ఫండ్స్ పలు పరిశ్రమలవ్యాప్తంగా విస్తరించి ఉంటాయి కాబట్టి సెక్టోరల్ ఫండ్స్తో పోలిస్తే కాస్త తక్కువ రిసు్కలు ఉండొచ్చు. ఉదాహరణకు ‘కేపెక్స్’ థీమ్ ఫండ్లో యుటిలిటీలు, సిమెంటు, విద్యుత్, హౌసింగ్, ఆటో మొదలైన రంగాలు ఉండొచ్చు. దీనితో కేవలం ఒకే రంగంలో మొత్తం పెట్టుబడులంతా పెట్టడం వల్ల వచ్చే రిసు్కలు కాస్త తగ్గవచ్చు.ఇదీ చదవండి: ప్రాపర్టీ విక్రయించా.. పెట్టుబడి దారేది? -
ప్రాపర్టీ విక్రయించా.. పెట్టుబడి దారేది?
మూడేళ్లలో రూ.10 లక్షలు సమకూర్చుకోవాలన్నది నా ఆలోచన. లార్జ్క్యాప్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – సాత్విక్మూడేళ్లలో రూ.10లక్షలు రావాలని కోరుకుంటుంటే.. అందుకు ఈక్విటీ పెట్టుబడులు అనుకూలం కాదు. స్వల్పకాలానికి ఈక్విటీలు ఎంతో రిస్క్తో ఉంటాయి. కనుక స్వల్పకాలం కోసం భద్రతతో పాటు, స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. వీటిల్లో స్థిరమైన రాబడులు ఉంటాయి. దీంతో మీ పెట్టుబడులు మార్కెట్ అస్థిరతలకు గురికావు. ఒకవేళ లక్ష్య కాలాన్ని మూడేళ్లకు మించి పెంచుకోగలిగి, రిస్క్ తీసుకునేట్టు అయితే అప్పుడు ఈక్విటీ పెట్టుబడులను పరిశీలించొచ్చు. కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఈక్విటీలు సూచనీయం. దీర్ఘకాలంలో మార్కెట్ అస్థిరతలను అధిగమించి పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. ప్రాపర్టీ విక్రయించగా వచ్చిన లాభం నుంచి పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా? లేక దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కోసం ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ జారీ చేసే సెక్షన్ 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవాలా..? – వీరేశ్ప్రాపర్టీని విక్రయించిన ఆరు నెలల్లోపు క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఈసీ కింద రూ.50 లక్షల వరకు లాభాన్ని మూలధన లాభాల నుంచి మినహాయింపునకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మద్దతు గల ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ తదితర ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు జారీ చేసే బాండ్లను క్యాపిటల్ గెయిన్ బాండ్లుగా చెబుతారు. ఇవి ఐదేళ్ల లాకిన్ పీరియడ్తో ఉంటాయి. వీటిపై 5.25 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను ఈ బాండ్లపై లభించే నికర రాబడి 3.68 శాతం అవుతుంది. ఈక్విటీ ఫండ్స్తో పోల్చి చూసినప్పుడు క్యాపిటల్ గెయిన్ బాండ్లపై లభించే 5.25 శాతం రేటు చాలా తక్కువ. ఈక్విటీల్లో దీర్ఘకాలానికి రెండంకెల రాబడి వస్తుంది.ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గత ఐదేళ్ల కాల సగటు రాబడి 20 శాతంగా ఉంది. ఇప్పుడు పన్ను ఆదా కోసం క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఐదేళ్ల కాలానికి రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, 5.25 శాతం రేటు ప్రకారం గడువు తీరిన తర్వాత రూ.63 లక్షలు సమకూరుతుంది. అదే రూ.50 లక్షల లాభంపై 20 శాతం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (రూ.10లక్షలు) చెల్లించి, మిగిలిన రూ.40 లక్షలను ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో రూ.70 లక్షలు సమకూరొచ్చు. ఇలా చూస్తే మూలధన లాభాల పన్ను చెల్లించి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైనది అవుతుంది. కానీ, ఈక్విటీల్లో మెరుగైన రాబడి వస్తుందని చెప్పి మొత్తం తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయడం సరికాదు. ఐదేళ్లు, అంతకుమించిన కాలాలకు ఈక్విటీల్లో మెరుగైన రాబడులు వస్తాయి. కానీ ఇది కచ్చితమని చెప్పలేం. ఆటుపోట్లు ఉంటాయి. కానీ, క్యాపిటల్ గెయిన్ బాండ్లు హామీతో కూడిన పన్ను లేని రాబడిని ఇస్తాయి. కనుక రిస్క్ లేని రాబడి కోరుకుంటూ, ఐదేళ్ల తర్వాత కచ్చితంగా పెట్టుబడి మొత్తం తిరిగి వెనక్కి తీసుకోవాలని అనుకుంటే క్యాపిటల్ గెయిన్ బాండ్లకు వెళ్లొచ్చు. కొంత రిస్క్ తీసుకుని, అవసరమైతే ఐదేళ్లకు అదనంగా మరికొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసేట్టు అయితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవచ్చు.ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లోనే.. జీతం ఎక్కువ! -
ప్రభుత్వ బ్యాంకుల్లోనే.. జీతం ఎక్కువ!
సాధారణంగా.. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటురంగ బ్యాంకుల్లో ఉద్యోగులకు జీతాలు ఎక్కువని అందరూ అనుకుంటారు. కానీ, ఇది తప్పు అంటున్నాయి గణాంకాలు. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివి.. దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీల కంటే సగటున ఎక్కువ జీతాలు ఇస్తున్నాయి.దేశంలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అగ్రస్థాయి బ్యాంకులు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ. వీటిలోని ఐసీఐసీఐలో ‘సగటు వేతనం’ రూ.13 లక్షలు కాగా, హెచ్డీఎఫ్సీలో రూ.11.14 లక్షలు. ఇది చాలా ఎక్కువే అనిపిస్తుంది. కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) లలో సగటు వేతనం ఇంతకంటే దాదాపు రెట్టింపు ఉండటం విశేషం. (ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఉన్న ఉద్యోగుల సంఖ్యతో.. ఆ ఏడాదిలో ఉద్యోగుల కోసం చేసిన మొత్తం ఖర్చును భాగిస్తే వచ్చేదే సగటు వేతనం.). ఎస్బీఐలో సగటు వేతనం రూ.27.2 లక్షలు కాగా, బీఓబీలో ఇది రూ.22.1 లక్షలు కావడం విశేషం.పై స్థాయిలో.. అక్కడే ఎక్కువ..ప్రైవేటు బ్యాంకుల్లోని అత్యున్నత స్థాయి అధికారులు, సీనియర్ మేనేజ్మెంట్ స్టాఫ్ మాత్రం.. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే అధిక జీతాలు పొందుతున్నారు. హెచ్డీఎఫ్సీ ఎండీ, సీఈఓ 2024–25లో పొందిన వేతనం రూ.12.06 కోట్లు కాగా ఐసీఐసీఐ సీఈఓ సంపాదించింది రూ.10.45 కోట్లు. ఇదే సమయంలో బీఓబీ సీఈఓ పొందింది రూ.73.92 లక్షలు కాగా, ఎస్బీఐ చైర్మన్ పొందింది రూ.63.87 లక్షలు.పే స్కేల్ ప్రకారం..సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు జూనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఎక్కువ ఖర్చు పెడితే.. ప్రైవేటు రంగ బ్యాంకులు సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పే స్కేల్ ప్రకారం జీతం పెరుగుతూ పోతుంటుంది. కానీ, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రధానంగా పనితీరు, నైపుణ్యం, వయసు ఆధారంగా పెరుగుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకులకు ఎంట్రీ లెవెల్లో ఎక్కువ ఉద్యోగులు కావాలి. అందువల్ల వారికి జీతాలు తక్కువగా ఉంటాయి.స్త్రీ, పురుషుల వేతనాల్లో తేడాలుబోర్డు సభ్యులు, కీలక మేనేజర్ స్థాయి వ్యక్తులను పక్కనపెడితే.. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పురుష ఉద్యోగి సగటు జీతం రూ.5.6 లక్షలు కాగా, మహిళా ఉద్యోగికి రూ.3.9 లక్షలు. ఇదే ఎస్బీఐలో పురుషుల జీతం రూ.13.9 లక్షలు కాగా, స్త్రీలకు రూ.12.8 లక్షలుగా ఉంది.ఖాళీలు తక్కువేకేంద్ర ప్రభుత్వం జులైలో రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ ఏడాది మార్చి 31 నాటికి 96 శాతం సిబ్బంది ఉన్నారు. అంటే కేవలం 3–4 శాతం మాత్రమే ఖాళీలు ఉన్నాయి. 2020–25 మధ్య ఈ బ్యాంకులు 1,48,687 మందిని నియమించుకున్నాయి. 2025–26లో మరో 48,570 మందిని తీసుకోనున్నారు.ఎస్బీఐలోనే అధికం..: 2024–25 నాటికి దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 7.58 లక్షలు. అత్యధిక ఉద్యోగులున్న బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎస్బీఐ సహా సగానికిపైగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2020–21తో పోలిస్తే.. 2024–25లో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఇక ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 2024–25 నాటికి ఐసీఐసీఐలో 1.29 లక్షలు మంది ఉంటే, హెచ్డీఎఫ్సీలో 2.14 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. -
గ్లోబల్ ఉద్యోగ సూచిక భారత్
న్యూఢిల్లీ: భవిష్యత్ ఉద్యోగ ప్రపంచానికి భారత్ ఒక సూచిక(సైన్పోస్ట్)లా నిలవనున్నట్లు గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సొంత ప్లాట్ఫామ్ లింకిడిన్ దేశీ మేనేజర్ కుమరేష్ పట్టాభిరామన్ పేర్కొన్నారు. సంస్థకు వేగంగా వృద్ధి చెందుతున్న, రెండో పెద్ద మార్కెట్గా భారత్ అవతరించినట్లు వెల్లడించారు. 16 కోట్లకుపైగా యూజర్లున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత వృద్ధి రేటురీత్యా రెండు, మూడేళ్లలో అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్గా ఆవిర్భవించనున్నట్లు అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఫస్ట్ యువతతోపాటు.. నైపుణ్యాలు, లక్ష్యాలుగల వర్క్ఫోర్స్ దేశీ మార్కెట్కు జోష్నిస్తున్నట్లు పేర్కొన్నారు. లింకిడిన్ సభ్యుల సంఖ్య గత రెండేళ్లలో 50 శాతానికిపైగా జంప్చేసినట్లు వెల్లడించారు. 2020 నుంచి ఆదాయం సైతం రెట్టింపునకుపైగా ఎగసినట్లు తెలియజేశారు. దేశీయంగా 16 కోట్లకుపైగా ప్లాట్ఫామ్లో రిజిస్టరైనట్లు పేర్కొన్నారు.