Business
-
ట్రంప్ ప్రకటన.. ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!
''ఇరాన్తో యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాం, తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం, మరో ఐదు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేస్తున్నాం'' చర్చలు జరుగుతున్నాయని అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని క్షణాలకే చమురు ధరలు 13 శాతానికి పైగా పడిపోయాయి. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 96 డాలర్లకు, అంటే 14 శాతం వరకు తగ్గింది.బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 17 డాలర్లు, అంటే 15 శాతం పడిపోయి, 1108 GMT సమయానికి బ్యారెల్కు 96 డాలర్ల సెషన్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 13 డాలర్లు, అంటే సుమారు 13.5 శాతం పడిపోయి, సెషన్ కనిష్ట స్థాయి అయిన 85.28 డాలర్లకు చేరింది.అయితే.. ట్రంప్ పేర్కొన్నట్లు అటువంటి చర్చలు ఏవీ జరగలేదని ఇరాన్ ఖండించిన తర్వాత, చమురు ధరలు సుమారు 5 శాతం పెరిగి బ్యారెల్కు 101 డాలర్లకు చేరుకున్నాయి, కానీ మళ్లీ 100 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోయాయి.అమెరికా,ఇజ్రాయెల్ - ఇరాన్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ధరలు 60 శాతానికి పైగా పెరిగాయి. సంఘర్షణకు ముందు బ్యారెల్కు సుమారు 70 డాలర్లుగా ఉన్న ఈ ధరలు, ప్రధానంగా హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయం కలగడం, గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలపై జరిగిన దాడుల కారణంగా, సోమవారం నాటికి బ్యారెల్కు సుమారు 112 డాలర్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. కేవలం గత 30 రోజుల్లోనే ముడి చమురు ధరలు ఎంత గరిష్టాలకు చేరుకున్నాయో స్పష్టమవుతోంది.Trump announces he ordered to postpone strikes against Iranian energy infrastructure for 5 days pic.twitter.com/ELW18FLsAL— The Daily News (@DailyNewsJustIn) March 23, 2026 -
26 ఏళ్ల వయసులో కోట్ల డబ్బు: ఖర్చు చేసిన స్టైల్.. నెట్టింట వైరల్!
ఓ 26 ఏళ్ల యువకుని చేతిలో మిలియన్ డాలర్ల డబ్బు ఉంటే.. ఏం చేస్తాడు. లగ్జరీ కారు కొంటాడు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తాడు. ఇంకా అయితే దుబారా ఖర్చు కూడా చేసే అవకాశం ఉంది. కానీ 'అమన్ గోయల్' మాత్రం వీటన్నింటికీ పూర్తిగా విరుద్ధం. తనకు వచ్చిన డబ్బును ఎలా ఖర్చు చేశాడనే విషయాన్ని అతడు వివరంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2021 నవంబర్లో, నేను నా స్టార్టప్ను ఒక పెద్ద కంపెనీకి మిలియన్ డాలర్లకు అమ్మాను. ఇది జరిగినప్పుడు నా వయసు 26 సంవత్సరాలు. ఆ వయసులో చాలా మంది ఆడంబరమైన కార్లు, వాచీలు లేదా ఇతరులను ఆకట్టుకునే జీవనశైలి కోసం విపరీతంగా ఖర్చుపెట్టేవారు. నేను మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకున్నాను. సౌకర్యం, సంతోషం, దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛను సమతుల్యం చేసుకుంటూ, ఉద్దేశపూర్వకంగా నా జీవితాన్ని ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించుకున్నానని అమన్ గోయల్ పేర్కొన్నారు.కుటుంబానికి మొదటి ప్రాధాన్యతస్టార్టప్ను అమ్మిన తరువాత.. అదే సంవత్సరం, నేను నా తల్లిదండ్రులను ముంబైలో నాతో పాటు నివసించడానికి తీసుకువచ్చాను. మన సంపదను మనకు అత్యంత ముఖ్యమైనవారితో పంచుకోకపోతే.. దానికి అర్థం లేదని అన్నారు. వారు ఇప్పటికీ నాతోనే నివసిస్తున్నారు, నిజం చెప్పాలంటే, నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం అదే.ఆరోగ్యండబ్బు వచ్చింది కదా అని ఊరికే ఉంటే సరిపోదు. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ద వహించాను. నేను 15 కేజీలకు పైగా బరువు తగ్గాను. దీనికోసం ఒక ఫిట్నెస్ కోచ్ను నియమించుకున్నాను. నేను, నా భార్య కూడా సంవత్సరానికి రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాము. మీరు కూడా ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోకపోతే.. రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.ఆహారంనేను బయటి ఆహారం, షుగర్, వేయించిన పదార్థాలను చాలా వరకు తగ్గించాను. ఆరోగ్యం వంటగదిలో మొదలవుతుంది, జిమ్లో కాదు అని అమన్ పేర్కొన్నారు.ఇల్లునేను 2022లో మొత్తం డబ్బు చెల్లించి ఒక ఇల్లు కొన్నాను. ఎలాంటి లోన్స్ తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు లేవు. అద్దెకు ఉండటమే తెలివైన పని అని చాలా మంది అంటారు. ఒకరకంగా అది నిజమే కావచ్చు.. కానీ నా తల్లిదండ్రులు స్థిరపడి, సంతోషంగా ఉండటానికి సొంత ఇల్లు అవసరం.అప్గ్రేడ్లు అంటే విపరీతమైన ఖర్చు అని అర్థం కాదు. వాటి అర్థం శాంతి, ఆరోగ్యం. మీరు ప్రేమించే వారితో గడిపే సమయం. మీకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చినప్పుడు మీరు కొనవలసిన నిజమైన విలాసాలు ఇవే అని అమన్ తన ట్వీట్ పూర్తి చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు అతని నిర్ణయాలకు ఫిదా అవుతున్నారు.In November 2021, I sold my startup to a larger company for millions of dollars. I was 26 years old when this happened.Most people that age would have splurged on flashy cars, watches, or a lifestyle designed to impress. I went a different way.I chose to upgrade my life with… https://t.co/ign188f5EM pic.twitter.com/dxesoDKSD4— Aman Goel (@amangoeliitb) March 22, 2026 -
స్టాక్ మార్కెట్ క్రాష్: రూ.14 లక్షల కోట్లు ఆవిరి!
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లోనే ముగిశాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల మదుపర్ల సంపద ఏకంగా రూ.14 లక్షల కోట్లు ఆవిరైపోయింది. నిరంతరాయంగా విదేశీ నిధులు తరలిపోవడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపింది.సోమవారం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సరికి.. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి. దీంతో ఈరోజును నిపుణులు బ్లాక్ మండేగా అభివర్ణించారు.స్టాక్ల విషయానికొస్తే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్టైమ్ ఛైర్మన్ 'అటాను చక్రవర్తి' (Atanu Chakraborty) రాజీనామా నేపథ్యంలో, గత రెండు సెషన్లలో 7.4 శాతం క్షీణించిన తర్వాత ఆ బ్యాంక్ షేరు సుమారు 2.5 శాతం పడిపోయింది. 2024 అసెస్మెంట్ సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను శాఖ నుండి రూ. 6,337 కోట్ల పన్ను డిమాండ్ అందిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు 3.6 శాతం పడిపోయింది. 16 ప్రధాన రంగాల సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. విస్తృత సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి, నిఫ్టీ స్మాల్క్యాప్100, నిఫ్టీ మిడ్క్యాప్100 వరుసగా 3.82 శాతం, 3.45 శాతం మేర పడిపోయాయి. -
జియో.. జెరోధా.. కొత్త మ్యూచువల్ ఫండ్లు
జెరోధా మ్యూచువల్ ఫండ్ నుంచి నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 50:50 ఇండెక్స్ ఫండ్ న్యూ ఫండ్ ఆఫర్ 23న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లు రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్ను కేదార్నాథ్ మిరాజ్కార్ నిర్వహించనున్నారు. ఈ ఫండ్ అధిక రిస్క్ కిందకు వస్తుంది.నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 50:50 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. కనుక సూచీ రాబడులే ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా ఉంటాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ విభాగంలో బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడుల ద్వారా మెరుగైన సంపద సృష్టించుకోవాలని భావించే ఇన్వస్టర్లకు ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా జియో బ్లాక్రాక్ లార్జ్క్యాప్ ఫండ్ను తీసుకొచ్చింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఈ నెల 24న ప్రారంభమై, ఏప్రిల్ 7న ముగుస్తుంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిని వృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశ్యం. బీఎస్ఈ 100 ఇండెక్స్ (టీఆర్ఐ) ఈ పథకం పనితీరుకు ప్రామాణికం.తన్వి కచేరియా, సాహిల్ చౌదరి ఈ పథకానికి మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. డైరెక్ట్ప్లాన్ (మధ్యవర్తుల ప్రమేయం లేని), గ్రోత్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లార్జ్క్యాప్ కంపెనీల్లో 80–100 శాతం వరకు, 0–20 శాతం మేర ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. -
గంటల వ్యవధిలో కుప్పకూలిన పసిడి.. కొత్త ధరలు ఇవే!
భారతదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఉదయం రూ.5000 తగ్గిన రేటు.. సాయంత్రానికి రూ.10 వేలకు చేరింది. అంటే తులం గోల్డ్ రేటు రూ. పదివేలు తగ్గిందన్నమాట. దీంతో ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఈ కథనంలో తాజా ధరలు ఏ నగరంలో.. ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10,320 తగ్గి.. రూ.1,35,650 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి రూ. 1,23,450 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. పసిడి ధరలు ఎంత వరకు పతనమైందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నైలో కూడా గోల్డ్ రేటు బాగా తగ్గింది. దీంతో ఉదయం ధరల కంటే.. సాయంత్రం ధరలు చాలా తగ్గుముఖం పట్టింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,39,200 వద్దకు (రూ.9380 తగ్గింది). 22 క్యారెట్ల తులం రేటు రూ.1,27,600 వద్ద (రూ.8600 తగ్గింది) నిలిచింది.ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,35,800 (రూ.10,320 తగ్గింది) వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 9450 రూపాయలు తగ్గి 1,24,500 రూపాయల వద్ద నిలిచింది. వెండి ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ ధర రూ.2.30 లక్షల వద్ద కొనసాగుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్! -
ఇంటికొచ్చే గ్యాస్ ఇన్ని రకాలా..?
సామాన్యుడి వంటగదిలో ఎర్రటి గ్యాస్ సిలిండర్ (LPG) కనిపించడం సర్వసాధారణం. కానీ, మారుతున్న కాలంతో పాటు గ్యాస్ వినియోగం తీరు కూడా మారుతోంది. నగరాల్లో వాహనాల కోసం సీఎన్జీ (CNG), ఇళ్లలో పైప్లైన్ ద్వారా వచ్చే పీఎన్జీ (PNG).. ఇలా గ్యాస్ రకాలు వినడానికి ఒకేలా ఉన్నా, వాటి ఉపయోగాలు మాత్రం వేరు. భారతదేశ ఇంధన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ నాలుగు రకాల గ్యాస్ల గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం.వంటగదిలో రారాజు.. ఎల్పీజీకోట్లాది భారతీయ కుటుంబాలకు వంటగదిలో గ్యాస్ అంటే మొదట గుర్తొచ్చేది ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో లభించే ప్రోపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమమే ఇది. గ్యాస్ను ద్రవ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. దీనిని రవాణా చేయడం సులభం కాబట్టి, మారుమూల గ్రామాల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' వంటి పథకాలతో ఇది ఇప్పుడు ప్రతి ఇంటికీ చేరువైంది.సీఎన్జీ.. వాహనాలకు ‘గ్రీన్’ సిగ్నల్కాలుష్యాన్ని తగ్గించడంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) కీలక పాత్ర పోషిస్తోంది. పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా దీనిని వాహనాల్లో వాడుతున్నారు. ఇది ఇతర ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ప్రస్తుతం నగరాల్లో ఆటోలు, బస్సులు, కార్ల కోసం సీఎన్జీ వాడకం విపరీతంగా పెరిగింది. ఇది సహజ వాయువును అధిక పీడనం వద్ద కంప్రెస్ చేయడం ద్వారా తయారవుతుంది.పీఎన్జీ.. సిలిండర్ల గోల లేని వంట గ్యాస్నగరాల్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG). ఇంటికి వాటర్ కనెక్షన్ ఉన్నట్టే, భూగర్భ పైప్లైన్ల ద్వారా నేరుగా వంటగదికి గ్యాస్ వస్తుంది. దీని వల్ల సిలిండర్ అయిపోతుందనే భయం ఉండదు. మీరు ఎంత వాడుకుంటే అంతకే మీటర్ రీడింగ్ ప్రకారం బిల్లు చెల్లించవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు.ఎల్ఎన్జీ.. భారీ పరిశ్రమల ఇంధనంలిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సాధారణంగా మనం నేరుగా వాడేది కాదు. కానీ ఇది దేశీయ ఇంధన సరఫరా గొలుసులో అత్యంత కీలకమైనది. సహజ వాయువును మైనస్ 162°C వద్ద చల్లబరిచి ద్రవంగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల దాని పరిమాణం తగ్గి, ఓడల ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సులభం అవుతుంది. తీర ప్రాంతాలకు చేరుకున్న ఎల్ఎన్జీని తిరిగి గ్యాస్గా మార్చి విద్యుత్ ప్లాంట్లు, భారీ పరిశ్రమలకు పంపిస్తారు. -
జేపీ అసోసియేట్స్ దివాలా కేసు: NCLATను ఆశ్రయించిన వేదాంత
జైప్రకాష్(జేపీ) అసోసియేట్స్ దివాలా పరిష్కార ప్రక్రియపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తీర్పును సవాలు చేస్తూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను వేదాంత ఆశ్రయించింది.జేపీ అసోసియేట్స్ ఆస్తులకు రూ.14,535 కోట్లతో అదానీ గ్రూప్ సమర్పించిన బిడ్కు ఎన్సీఎల్టీ ఆమోదం తెలపడం తెలిసిందే. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ ఆస్తుల కోసం అదానీతోపాటు వేదాంత, దాల్మియా భారత్ సైతం పోటీ పడ్డాయి. కానీ, రుణదాతల కమిటీ మాత్రం అదానీ ఎంటర్ప్రైజెస్ సమర్పించిన రూ.14,535 కోట్ల బిడ్కు అంగీకారం తెలిపగా.. దీనికి మార్చి 17న ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. దీన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్లో వేదాంత సవాల్ చేసింది. దీనిపై ఇద్దరు సభ్యుల బెంచ్ సోమవారం విచారణ చేపట్టనుంది. -
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ.. ప్రభుత్వం కొత్త ‘ఆఫర్’
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్లో ప్రధాన వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గాన్ని ఎంచుకునే అవకాశముంది. ప్రస్తుతం బ్యాంక్లో పబ్లిక్కు 5.29 శాతం వాటా మాత్రమే ఉంది. ఈ నెల మొదట్లో ప్రభుత్వం బ్యాంక్లో 60.72 శాతం వాటా విక్రయానికి బిడ్స్ను ఆహ్వానించింది.అయితే ఇందుకు సరైన స్పందన లభించకపోవడంతో ఓఎఫ్ఎస్ అవకాశాలనుప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ ధర కంటే దిగువన అదికూడా రెండు సంస్థలు మాత్రమే వాటా కొనుగోలుకి ఆసక్తి చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్లో ప్రభుత్వానికి 45.48 శాతం, బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటా ఉన్న సంగతి తెలిసిందే.పబ్లిక్ వాటా స్వల్పంగా ఉన్న నేపథ్యంలో బ్యాంక్ మార్కెట్ విలువ పరిమితంగానే నమోదవుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పబ్లిక్కు కనీసం 10–15 శాతం వాటా కల్పిస్తే బ్యాంక్ షేరుకి తగిన ధర నమోదయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డాయి. దీంతో ఓఎఫ్ఎస్ ద్వారా వాటా విక్రయానికి తెరతీయనున్నట్లు తెలుస్తోంది. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు!
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,836.57 పాయింట్లు లేదా 2.46 శాతం నష్టంతో 72,696.39 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు లేదా 2.60 శాతం నష్టంతో 22,512.65 వద్ద నిలిచాయి.హ్యాండ్స్ఆన్ గ్లోబల్ మేనేజ్మెంట్ (HGM) లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్ లిమిటెడ్, NOCIL లిమిటెడ్, బర్న్పూర్ సిమెంట్ లిమిటెడ్, మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్నోవిజన్ లిమిటెడ్, రామ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్, జెహెచ్ఎస్ స్వెండ్గార్డ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, బైక్ హాస్పిటాలిటీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
బంగారం ధరలు ఎందుకింతగా పడిపోతున్నాయ్!
సాధారణంగా యుద్దాలు జరిగినప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అమాంతం పెరుగుతాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ కూడా ఇదే. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి తలకిందులైపోయిందని కోబేస్సీ లెటర్ చేసిన ట్వీట్ ద్వారా వెల్లడైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రస్తుతం బంగారం, వెండి వంటి విలువైన లోహాల మార్కెట్ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఓ వైపు ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఈ రెండు లోహాల మార్కెట్ విలువలో సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల మేర తగ్గుదల చోటుచేసుకోవడం విశేషం.యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు.. బంగారం ధరలు పెరగాలి. అయితే.. ఇప్పుడు గోల్డ్ రేటు తగ్గడానికి కారణం బాండ్ మార్కెట్లో వచ్చిన మార్పులు. అమెరికా 10 సంవత్సరాల ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరగడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. బంగారం వంటి వడ్డీ ఇవ్వని ఆస్తులతో పోలిస్తే, బాండ్లు ఇప్పుడు ఆదాయం అందించే సురక్షిత మార్గంగా మారాయి. అందువల్ల చాలా మంది పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను తీసుకుని బాండ్లలో పెట్టడం ప్రారంభించారు.Something very strange is happening in precious metals right now:In just 3 hours, gold and silver just erased a combined -$2 TRILLION in market cap.Meanwhile, oil prices have erased their gains on the day and US stock market futures are nearly green.Since the Iran War… pic.twitter.com/zP43wSr9wE— The Kobeissi Letter (@KobeissiLetter) March 23, 2026ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అమెరికన్ డాలర్ బలపడటం. యుద్ధ పరిస్థితుల్లో డాలర్ కూడా సురక్షిత ఆస్తిగా పరిగణించబడుతుంది. డాలర్ విలువ పెరిగితే, బంగారం ధరలు సాధారణంగా తగ్గుతాయి. ఇదే సమయంలో మార్కెట్లో లీవరేజ్ అధికంగా ఉండటం పరిస్థితిని మరింత తీవ్రమైంది చేసింది. ప్రస్తుతం లోహాల మార్కెట్లలో ఏదో జరుగుతోందని.. కోబేస్సీ లెటర్ వెల్లడించింది.గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు వేగంగా పెరగడంతో, చాలా మంది ట్రేడర్లు అధిక రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టారు. ధరలు ఒక్కసారిగా పడిపోవడం ప్రారంభమైనప్పుడు, స్టాప్ లాస్ ఆర్డర్లు అమల్లోకి వచ్చాయి, మార్జిన్ కాల్స్ వచ్చాయి, పెట్టుబడిదారులు తమ పొజిషన్లను బలవంతంగా విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల ధరలు మరింత వేగంగా క్షీణించాయి.భారతదేశంలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఇతర లోహాలు కూడా ఇదే దిశగా కదిలాయి. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లు ఎప్పుడూ సాంప్రదాయ సిద్ధాంతాల ప్రకారం ప్రవర్తించవు. పరిస్థితులు మారినప్పుడు సురక్షితమైనవిగా భావించే ఆస్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు, డాలర్ బలం, లిక్విడిటీ వంటి అంశాలు మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది. -
ప్రకటనల హోరు.. స్పాన్సర్షిప్ జోరు
భారత క్రీడా రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఇయర్ ముగిసే నాటికి దేశీయ క్రీడా ఆర్థిక వ్యవస్థ మొదటిసారిగా 2 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెటింగ్ సంస్థ డబ్ల్యూపీపీ మీడియా విడుదల చేసిన ‘స్పోర్టింగ్ నేషన్: బిల్డింగ్ ఏ లెగసీ’ నివేదిక ప్రకారం, భారత క్రీడా మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.18,864 కోట్లకు (2.13 బిలియన్ డాలర్లు) చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 13.4 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం నాలుగేళ్ల కాలంలోనే (2021లో రూ.9,530 కోట్లు) ఈ రంగం రెట్టింపు వృద్ధిని సాధించడం గమనార్హం.నివేదికలోని ముఖ్యాంశాలుక్రీడా రంగం మొత్తం ఆదాయంలో 51 శాతం వాటా ప్రకటనలదే. గత ఏడాదితో పోలిస్తే ఇవి 19.8 శాతం పెరిగి రూ.9,571 కోట్లకు చేరాయి.టీమ్, లీగ్ స్పాన్సర్షిప్ల ద్వారా రూ.7,943 కోట్లు (42% వాటా) సమకూరాయి.క్రీడాకారుల బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాల విలువ 10.3 శాతం పెరిగి రూ.1,350 కోట్లకు చేరింది.‘భారత క్రీడా రంగం సుస్థిరత, విస్తరణ దశకు చేరుకుంది. 2021 నుంచి చూస్తే 19 శాతం చక్రవడ్డీ రేటుతో (సీఏజీఆర్) ఈ వృద్ధి కొనసాగుతోంది’ అని డబ్ల్యూపీపీ మీడియా ఎండీ (కంటెంట్, స్పోర్ట్స్) వినీత్ కర్ణిక్ తెలిపారు.ఎదురులేని రారాజు క్రికెట్భారత మార్కెట్లో క్రికెట్ తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం క్రీడా ఆదాయంలో 89 శాతం వాటా (రూ.16,704.2 కోట్లు) ఒక్క క్రికెట్ ద్వారానే లభిస్తోంది. లీనియర్ టీవీ (సాధారణ ఛానెళ్లు) కంటే డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనల వ్యయం వేగంగా పెరుగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం స్పాన్సర్షిప్ ఆదాయం మొదటిసారిగా రూ.1,000 కోట్ల మార్కును దాటింది. రియల్ మనీ గేమింగ్ యాప్లపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ లోటును సంప్రదాయ బ్రాండ్లు భర్తీ చేశాయని నివేదిక పేర్కొంది.ఇతర క్రీడల పరిస్థితి ఏమిటి?క్రికెట్ దూసుకుపోతున్నా ఇతర క్రీడల ఆదాయం 2025లో 12.2 శాతం క్షీణించి రూ.2,159.9 కోట్లకు పరిమితమైంది. ఇండియన్ సూపర్ లీగ్ వాయిదా పడటం, ఇతర భారీ అంతర్జాతీయ టోర్నీలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే, నీరజ్ చోప్రా క్లాసిక్, మెస్సీ ఇండియా టూర్ వంటి ఈవెంట్లతో పాటు పికిల్ బాల్ వంటి కొత్త క్రీడలకు ఆదరణ పెరుగుతుండటం సానుకూలాంశం.ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే.. -
తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే..
కృత్రిమ మేధ (ఏఐ) అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఒకప్పుడు క్లిష్టంగా భావించిన మ్యాసివ్ మల్టీ టాస్కింగ్ ల్యాంగ్వేజ్ అండర్స్టాండింగ్(ఎంఎంఎల్యూ) వంటి పరీక్షల్లో 90 శాతానికి పైగా స్కోరు సాధించి మనుషుల మేధస్సును సవాలు చేస్తోంది. అయితే, ఏఐ సామర్థ్యాన్ని కొలిచే పాత కొలమానాలు సరిపోవని భావించిన శాస్త్రవేత్తలు దానికి అత్యంత కఠినమైన పరీక్షలు సిద్ధం చేశారు. అదే ‘హ్యూమనిటీస్ లాస్ట్ ఎగ్జామ్(హెచ్ఎల్ఈ). ఎంఎంఎల్యూ అనేది ఏఐ మోడల్స్ తెలివితేటలను, విజ్ఞానాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే ఒక అత్యంత ప్రజాదరణ పొందిన బెంచ్మార్క్ పరీక్ష. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారిన హెచ్ఎల్ఈ పరీక్ష వివరాలు, ఏఐ మోడల్స్ పనితీరుపై కథనం.ఏమిటీ హెచ్ఎల్ఈ? ఎందుకంత కఠినం?ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 500 సంస్థల నుంచి దాదాపు 1,000 మంది నిపుణులు సిద్ధం చేసిన 2,500 ప్రశ్నల సమాహారమే ఈ హెచ్ఎల్ఈ. సెంటర్ ఫర్ ఏఐ సేఫ్టీ, స్కేల్ ఏఐ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఏఐ మోడల్స్లోని లోపాలను ఎత్తిచూపడం, వాటి అసలు సామర్థ్యాన్ని పరీక్షించడం దీని లక్ష్యం. 100కు పైగా విభాగాల్లోని నిపుణులు పంపిన ప్రతి ప్రశ్న ప్రస్తుత ఏఐ మోడల్స్ను ఓడించడమే కాకుండా ఇద్దరు నిపుణుల సమీక్షను దాటాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నాయంటే ఆయా రంగాల్లోని నిపుణుల మధ్యే 15.4% నుంచి 18% వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంటే, ఏ ఒక్క మనిషి కూడా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అసాధ్యం.గెలుపు ఎవరిది?ఈ పరీక్ష ప్రారంభమైనప్పుడు (జనవరిలో ‘నేచర్’ పత్రికలో ప్రచురితమైన సమయానికి) అత్యుత్తమ ఏఐ మోడల్స్ కూడా 10 శాతం కంటే తక్కువ స్కోరుకే పరిమితమయ్యాయి. కానీ, గత కొద్ది నెలల్లోనే ఈ పరిస్థితి వేగంగా మారుతోంది.ఏఐ మోడల్ప్రారంభ స్కోరు (%)ప్రస్తుత స్కోరు (%)GPT-4o2.7%-OpenAI o18.0%-DeepSeek-R18.5%-GPT-5-25.3%Gemini 2.5 Pro-21.6%Gemini 3 Pro (Live)-38.3% ఆందోళన కలిగిస్తున్న అంశాలుఈ పరీక్షలో బయటపడిన ప్రధాన లోపం ‘కాలిబ్రేషన్ ఎర్రర్’. సమాధానం తప్పు అని తెలిసినా ఏఐ మోడల్స్ అది 100% సరైనదని మొండిగా వాదిస్తున్నాయి. ఇది భవిష్యత్తులో వైద్య రంగం లేదా ఆర్థిక రంగంలో ఏఐని వాడేటప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. ‘ఒక తప్పు సమాధానాన్ని తప్పు అని ఏఐ గుర్తించలేకపోవడం అనేది సాంకేతిక లోపం కాదు, ప్రస్తుత ఏఐ డిజైన్ లోనే ఉన్న ఒక నిర్మాణాత్మక సమస్య’ అని నిపుణులు చెబుతున్నారు.కొలమానమే కరిగిపోతోందా?ఏఐ సామర్థ్యం ఎంత వేగంగా పెరుగుతుందంటే దాన్ని కొలిచే ‘యార్డ్స్టిక్’ కూడా సరిపోవడం లేదు. అందుకే పరిశోధకులు ‘హెచ్ఎల్ఈ రోలింగ్’ పేరుతో నిరంతరం అప్డేట్ అయ్యే డైనమిక్ టెస్టింగ్ విధానాన్ని ప్రకటించారు. ఇందులో అత్యుత్తమ స్కోరు సాధించినంత మాత్రాన దానికి జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్లు కాదని, కేవలం అకడమిక్ ప్రశ్నల్లో నిపుణత సాధించినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా మనిషి సృష్టించిన పరీక్షను మనిషి కంటే వేగంగా ఏఐ ఛేదిస్తుండటం విశేషం.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి ఆర్థిక ప్రణాళికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలను ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్లో వివరించారు.నిర్లక్ష్యం.. నిశ్శబ్ద శత్రువు!తన కుటుంబ సభ్యురాలితో జరిగిన ఒక చర్చను ఉదహరిస్తూ.. "చాలా మంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించడం లేదు" అని కియోసాకి (Robert Kiyosaki) ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉండి, ఎటువంటి పొదుపు లేకుండా, ఇప్పటికీ పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ.. చాలామంది "ఏం పర్వాలేదు.. సంతోషంగా ఉంటే చాలు (Don't worry, be happy)" అనే ధోరణిలో ఉండటం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.యువతకు విలువైన హెచ్చరికఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా రావచ్చని, దాన్ని ఎదుర్కోవడానికి యువతకు ఉన్న అతిపెద్ద ఆస్తి "సమయం" అని ఆయన గుర్తు చేశారు. సమయం, ఆరోగ్యం.. ఇవే మనిషికి ఉన్న గొప్ప ఆస్తులు. వీటిని వృథా చేయకుండా పెట్టుబడిగా మార్చుకోవాలి.తాను 28 ఏళ్ల వయస్సులో ఇల్లు లేకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. కానీ ఆ వయస్సులో తాను నేర్చుకున్న పాఠాలే నేటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతున్నాయని ఆయన వివరించారు.ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరం!ప్రపంచ దేశాల్లో ముద్రిస్తున్న 'నకిలీ కరెన్సీ' (ఫేక్ మనీ), పెరుగుతున్న జాతీయ అప్పులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలను విస్మరించడం తెలివైన పని కాదని కియోసాకి హెచ్చరించారు. వయస్సు పెరిగే కొద్దీ కొత్తగా సంపాదించే సామర్థ్యం తగ్గుతుందని, అందుకే యువత తమ సమయాన్ని తెలివిగా ఖర్చు చేయాలని ఆయన సూచించారు.(ఇది చదివారా 👉పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్)"వయస్సును, మీకు ఉన్న సమయాన్ని గౌరవించండి. ఆరోగ్యం, యవ్వనం ఉన్నప్పుడే సరైన ఆర్థిక పునాదులు వేసుకోకపోతే, రిటైర్మెంట్ సమయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు" అన్నది కియోసాకి మాటల సారాంశం.DON’T WORRY….BE HAPPY. I was talking to a family member about the national debt, the war, printing fake money, inflation, and possible crash of the stock market. She got angry and said to not talk about money, the world economy, and possible global depression. She was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 23, 2026 -
LPG సిలిండర్పై వినియోగదారులకు కేంద్రం గుడ్న్యూస్?!
సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు 10 కిలోల గ్యాస్ చిన్న సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులకు అంతరాయం కలుగుతోంది. భారత్ వినియోగించే ఎల్పీజీ ఎక్కువ శాతం ఈ ప్రాంతం ద్వారా వస్తుంది. సరఫరా తగ్గిపోవడంతో గృహ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న 10 కిలోల గ్యాస్ సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగానికి 14.2 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల సరఫరా ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. సరఫరా సమస్యలు తలెత్తితే గృహ వినియోగదారులు గ్యాస్ అందుబాటులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఉపశమనం కలిగించవచ్చు.ప్రభుత్వం ఇప్పటికే ఈ పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆహారం, ఇంధనం, విద్యుత్ వంటి కీలక అవసరాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎల్పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వనరులను కూడా పరిశీలిస్తోంది. భవిష్యత్ చర్యలలో చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశపెట్టడం, ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలను అన్వేషించడం, నిల్వలను పెంచడం, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించే విధానాలు అమలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది. -
ఉగ్రదేశంలో ఇంధన సెగ
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అడుగంటిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ బ్లెండెడ్ ఫ్యూయల్ (హెచ్ఓబీసీ) ధరను ఏకంగా లీటరుకు రూ.200 పెంచుతూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోద ముద్ర వేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఆర్థిక క్రమబద్ధీకరణప్రధాని షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఈ చర్యలు అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి నెలకు సుమారు 9 బిలియన్ పాకిస్థానీ రూపాయల (పీకేఆర్) ఆదాయం మిగులుతుందని, ఈ మొత్తాన్ని ప్రజలకు ఉపశమనం కలిగించే పథకాలకు మళ్లిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.సాధారణ పెట్రోల్తో పోలిస్తే హెచ్ఓబీసీ ఫ్యుయెల్లో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య 87 నుంచి 92 మధ్య ఉంటే, హై-ఆక్టేన్ ఇంధనం 95 నుంచి 100 వరకు ఉంటుంది. కేవలం లగ్జరీ కార్లు, ఖరీదైన వాహనాలు వాడే ఉన్నత ఆదాయ వర్గాలపైనే ఈ పెరిగిన ధరల భారం పడుతుంది. తక్కువ, మధ్య ఆదాయ వర్గాలు ఉపయోగించే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రస్తుతం అదనపు భారం వేయలేదు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ లేదా విమాన ప్రయాణ ఖర్చులపై తక్షణ ప్రభావం ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితిఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాక్ ప్రభుత్వం ఇప్పటికే మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. మారిన ధరల ప్రకారం..ఇంధనం రకంపాత ధర (లీటరుకు)ప్రస్తుత ధర (లీటరుకు)పెట్రోల్రూ. 266.17రూ. 321.17డీజిల్రూ. 280.86రూ. 335.86 విమాన ప్రయాణికులకు షాక్ప్రభుత్వం సామాన్యుడిపై భారం పడదని చెబుతున్నప్పటికీ జెట్ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంపై అప్పుడే మొదలైంది. పాకిస్థాన్లోని ఏఆర్వై మీడియా కథనం ప్రకారం, మార్చి 10 నుంచి పాకిస్థాన్ ఎయిర్లైన్స్ ఛార్జీలను భారీగా పెంచాయి. దేశీయ ప్రయాణం(కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ రూట్లు)పై టికెట్ ధరలు రూ.2,800 నుంచి రూ.5,000 వరకు పెరిగాయి. విదేశీ ప్రయాణాలపై రూ.10,000 నుంచి రూ.28,000 వరకు అదనపు భారం పడింది.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
బ్యాంకు సెలవులు.. వారంలో 4 రోజులు క్లోజ్!
మీరు ఈ వారంలో బ్యాంకు పనులు ఏవైనా ప్లాన్ చేసుకున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. వివిధ పండుగలు మరియు వారాంతపు సెలవుల కారణంగా మార్చి 26 నుండి మార్చి 29 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో శ్రీరామనవమి పండుగ, వారాంతపు సెలవుల కారణంగా వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలగనుంది.సెలవుల వివరాలు ఇవే...మార్చి 26 (గురువారం): శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో బ్యాంకులు మూసిఉంటాయి.మార్చి 27 (శుక్రవారం): తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి సెలవు పాటించనున్నారు.మార్చి 28 (శనివారం): ఇది నెలలో నాలుగో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.మార్చి 29 (ఆదివారం): సాధారణ సెలవు దినం.నెల ఆఖరిలో మరో సెలవు: మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహా మెజారిటీ రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ వంటివి) బ్యాంకులు మూతపడతాయి.డిజిటల్ సేవలు యథాతథంబ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.ఏటీఎం (ATM) సేవలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.డిజిటల్ బ్యాంకింగ్: నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా UPI, NEFT, RTGS లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.ఇతర సేవలు: ఫిక్స్డ్ డిపాజిట్లు తెరవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి పనులను ఆన్లైన్లో పూర్తి చేసుకోవచ్చు.మార్చి నెలాఖరు కావడంతో అకౌంట్ క్లోజింగ్ పనులు కూడా ఉంటాయి. కాబట్టి, అత్యవసర బ్యాంకింగ్ పనులు ఏవైనా ఉంటే ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం. -
పాత సంవత్సరాలకు నోటీసులొస్తున్నాయి..
ముందుగా పాఠకలోకానికి పరాభవ నామ ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. త్వరలో రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్నుపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా, సాఫీగా గడవాలని కోరుకుంటున్నాం. ఆన్లైన్లో నోటీసుని చూడగానే ముందుగా ఎంతో ఆందోళన చెందారు చెంగలరావుగారు. తాను ప్రతి సంవత్సరం ఠంచనుగా సకాలంలో పన్నులు చెల్లించి, సకాలంలో రిటర్నులు వేసే కచ్చితమైన మనిషి. ఆరేడేళ్ల క్రితం గవర్నమెంటు వారిచ్చిన మెడల్, నగదు బహుమతి పొందారు. ఒకప్పుడు ఆయకర్ రత్న అవార్డులు, రాష్ట్రీయ సన్మానాలు పొందిన వారు చెంగలరావుగారికి ఆదర్శం. ప్రభుత్వం ఇటువంటి వారిని దేశ ఆర్థికాభివృద్ధిలో పాల్గొనే వ్యక్తులుగా గుర్తిస్తుంది. అంత మంచి ట్రాక్ రికార్డు ఉన్న చెంగలరావు గారికి నోటీసులు వచ్చాయి. ఆర్థిక సంవత్సరంలో మీరు పన్ను పూర్తిగా చెల్లించలేదు.. బకాయి, వడ్డీ చెల్లించండి అనేది వాటి సారాంశం. ఆ నోటీసులను పది సార్లు చదివి, ఉగ్రుడైపోయాడాయన. కోపం, విసుగు, అసహనం.. వెంటనే ఆడిటర్కి ఫోన్ చేశారు.‘‘ఏమోనండి. రికార్డులు తెచ్చి చూపిస్తే కానీ ఏమీ చెప్పలేం. అన్ని కాగితాలూ పట్టుకురండి’’ అని తేల్చిచెప్పారు ఆడిటరు. సంఘాన్ని, ప్రభుత్వాన్ని, డిపార్టుమెంటుని ఎడాపెడా తనలో తానే తిట్టుకుంటూ, కాసేపు ఆ కోపాన్ని పన్ను ఎగవేతదార్లపై ప్రదర్శించాక, భార్య కాంతం తమ్ముడు ఏకాంబరం వైపు ఫోకస్ మళ్లింది. ‘‘నీ తమ్ముడు కాంట్రాక్టరు. వాడెప్పుడైనా నేను కట్టినంత కట్టాడా. ఎప్పుడూ ఏడుపే. నష్టాలే బావగారూ అని. అటువంటి వాళ్లను ఏమీ అనరు’’ అంటూ విరుచుకుపడ్డారు. కానీ ఆమె జవాబు ఇవ్వలేదు.మనవడి సహాయంతో బీరువాపైన ఉన్న కాగితాలు కిందికి దించి, ఫైళ్లు వెతకడం మొదలెట్టారు. ఒక నోటీసు 2007–08ది కాగా మరో నోటీసు 2013–14ది. ముందుగానే రెండు నోటీసులను కాపీలు తీసుకుని, ఆయా సంవత్సరాల కాగితాల కోసం వెతుక్కోవడం మొదలెట్టారు. ఒకటి ఇంచుమించు 18 ఏళ్ల క్రితం నాటిది. మరొకటి 12 ఏళ్ల నాటిది. అదృష్టవశాత్తు ఆయా కాగితాలు దొరికాయి. ‘ధన్యుడనైతిని రామా’ అని ఊపిరి పీల్చుకుని, ముందుగా 2007–08కి సంబంధించిన ఫైళ్లు తీసి ఒక్కొక్క కాగితాన్ని పరిశీలించడం మొదలెట్టారు.2014లో ఒక నోటీసు వచ్చింది. టీడీఎస్ తక్కువగా జమ అయింది, మిగతా మొత్తం చెల్లించమని. అన్ని కాగితాలు తీసి, ఒక్కొక్క రికవరీ, చెల్లింపు జమకి వివరణ ఇస్తూ, సమన్వయ పట్టిక చేసి, ఎంతో వివరంగా ఇచ్చారు. దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. అది ఇంకా క్లోజ్ అయినట్లు లేదు. అదే సంవత్సరానికి గాను మళ్లీ నోటీసు. ఆ రిటర్నులు.. అన్ని రికార్డులు, ఆ నోటీసు, తన జవాబు, తాను జతపరచిన కాగితాలు.. అన్నింటినీ పది సార్లు చెక్ చేసుకున్నారు. తనవన్నీ సరిగ్గా ఉన్నాయి. అయినా నోటీసు. వెంటనే ఆడిటర్గారికి ఫోన్ చేశారు. మొదటి పది నిమిషాలు ప్రసంగం..ఉక్రోషం.. ఊగిపోవడమైంది. అయినా సరే, నోటీసు వచ్చింది కాబట్టి, మళ్లీ జవాబు ఇవ్వాల్సిందేనని ఆడిటర్ ఆర్గ్యూ చేశారు. రాత్రి కొడుకు వచ్చాక, అప్పటివరకు అయిన గొడవంతా ఏకరువు పెట్టి, తానే స్వయంగా రిప్లైని చేతితో రాసి, కొడుకు చేత ప్రింటర్లో అన్ని కాపీలు తీశారు. అదొక అరవై పేజీల పుస్తకం అంత అయింది. ఈలోగా రాత్రయ్యింది. ఇక మర్నాడు మరొక నోటీసు.. అంటే 2013–14ది బైటికి తీశారు. 26ఏఎస్లో వివరాలు మిస్ మ్యాచ్ అయ్యాయనేది అందులోని సారాశం. టీడీఎస్ క్రెడిట్లు అవలేదు. షరామామూలే! అదే విపత్తు. అదే కసరత్తు.. మళ్లీ పని యావత్తూ. మొత్తానికి అన్ని కాగితాలూ దొరికాయి. కొడుకు సహాయంతో జవాబు పూర్తి చేశాక, ఓ 30 పేజీల ఫైలు తయారైంది. తన జ్యూరిస్డిక్షన్ అధికారి ఆఫీసుకి ఆటోలో బయలుదేరాడాయన. అధికారులు రెండు జవాబులు తీసుకుని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఎంతో ఆశగా అడిగారాయన ‘‘అన్నీ పర్ఫెక్టుగా ఉన్నాయి.. రెండు మూడు రోజుల్లో అయిపోతుందా’’ అని. ఆ అధికారి ఆ కాగితాలను పక్కన పెట్టుకుంటూ ‘‘రెండు మూడు నెలల తర్వాత’’ అని ముక్తసరిగా చెప్పారు. ఇలాంటి చెంగలరావుగార్లు ఎందరో లెక్కలేదు. ఎంతో నిజాయితీగా చెల్లించే రిటైర్డు ఉద్యోగస్తులపై అస్త్రాల మీద అస్త్రాలు వస్తున్నాయి. రికార్డులు అప్డేట్ చేసుకోవడం లేదు.. ఇచ్చిన రిప్లై సరిగ్గా చెక్ చేసుకోవడం లేదు. ఇచ్చిన వారికే నోటీసులు ఇవ్వడం.. ఎంతో విచిత్రమైన పరిస్థితి. అంత పాత రికార్డులు ఉండకపోతే/దొరక్కపోతే ఏంటి పరిస్థితి! కాబట్టి డిమాండ్ల విషయంలో ఎంతో మెలకువగా వ్యవహరించాలి అధికారులు. -
ఇంధన భద్రతకు ‘సౌర’ భరోసా
ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గల్ఫ్ రీజియన్లో మారుతున్న పరిణామాలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ ఎంత సున్నితమైందో మరోసారి గుర్తుచేశాయి. శిలాజ ఇంధనాల దిగుమతులపై భారీగా ఆధారపడే భారతదేశం వంటి దేశానికి ఇంధన భద్రత అనేది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, అది ఒక వ్యూహాత్మక ప్రాధాన్యత. ఈ నేపథ్యంలో సౌరశక్తి వినియోగాన్ని గరిష్ట స్థాయికి చేర్చుకోవడమే మన ముందున్న ఏకైక మార్గం.దశాబ్ద కాలంలో ఇలా..గడిచిన పదేళ్లలో భారత్ సౌరశక్తి రంగంలో అసాధారణ వృద్ధిని సాధించింది. భారీ సోలార్ పార్కులు, రూఫ్-టాప్ ఇన్స్టాలేషన్ల ద్వారా దేశీయ సోలార్ పవర్ సామర్థ్యం 130 గిగావాట్లకు చేరుకుంది. అయితే, సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఆ విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానించడంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.భారీ ప్రాజెక్టులు.. వికేంద్రీకృత వ్యవస్థభారీ సోలార్ ప్లాంట్లు (ఎల్ఎస్ఎస్) తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ వాటికి ప్రధాన అడ్డంకి ట్రాన్స్మిషన్ (సరఫరా) వ్యవస్థ. మారుమూల ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను నగరాలకు చేరవేయడానికి భారీ వ్యయంతో కూడిన కారిడార్లు అవసరం. దీనివల్ల విద్యుత్ నష్టాలు పెరగడం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆలస్యం కారణంగా విద్యుత్ తరలింపు నిలిచిపోతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘పీఎం సూర్య ఘర్’ వంటి పథకాలు గృహ వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యుత్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడే వినియోగిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్పై ఒత్తిడి తగ్గుతుంది.గ్రిడ్ నిర్వహణలో సాంకేతిక ఇబ్బందులుసాధారణంగా విద్యుత్ గ్రిడ్లు ఒకే దిశలో (పవర్ ప్లాంట్ నుంచి వినియోగదారుడికి) ప్రవహించేలా రూపొందించబడ్డాయి. కానీ రూఫ్-టాప్ సోలార్ వల్ల విద్యుత్ రెండు వైపులా ప్రవహిస్తుంది. దీనివల్ల గ్రిడ్ అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉంది. సంపన్న వినియోగదారులు సోలార్ వైపు మళ్లడంతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నష్టపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని రాష్ట్రాలు అదనపు ఛార్జీలు విధిస్తూ సోలార్ వినియోగాన్ని పరోక్షంగా నిరుత్సాహపరుస్తున్నాయనే వాదనలున్నాయి.సవాళ్లు - పరిష్కారాలుసౌర విద్యుత్ ఉత్పత్తి మధ్యాహ్నం వేళలో గరిష్టంగా ఉంటుంది, కానీ ఆ సమయంలో గృహాల్లో వినియోగం తక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో డిమాండ్ పెరిగినప్పుడు సౌర ఉత్పత్తి ఉండదు. దీనినే అంతర్జాతీయంగా ‘డక్ కర్వ్’ సమస్య అంటారు. దీనిని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. పగటిపూట మిగిలిన విద్యుత్ను భద్రపరిచి రాత్రి వేళల్లో వాడుకోవాలి. విద్యుత్ సమృద్ధిగా ఉన్న సమయంలో రేట్లు తగ్గించి వినియోగదారులను ఆ సమయంలోనే ఎక్కువ విద్యుత్ వాడేలా ప్రోత్సహించాలి.సరికొత్త వ్యూహం.. సోలార్, ఈవీ అనుసంధానంప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత. ప్రభుత్వం పీఎం-డ్రైవ్ పథకం ద్వారా ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించాలని చూస్తోంది. సగటున ఒక ఇంటిపై ఉండే 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ నుంచి వచ్చే మిగులు విద్యుత్ తక్కువగా ఉండొచ్చు. కానీ ఒక అపార్ట్మెంట్ లేదా కాలనీలోని ఇళ్లన్నీ కలిపి ఆ మిగులు విద్యుత్ను అక్కడే ఉండే పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు మళ్లించవచ్చు.తూత్తుకుడిలోని వీవోసీ పోర్ట్ ఇప్పటికే ఈ నమూనాను విజయవంతంగా అమలు చేస్తోంది. స్థానిక సౌర విద్యుత్ను అక్కడే ఈవీ వినియోగానికి అనుసంధానించడం ద్వారా భారీగా ఖర్చు తగ్గించుకున్నారు. భారతదేశ ఇంధన భవిష్యత్తు సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల అనుసంధానంలోనే ఉంది. డిస్కంలు సోలార్ను ఒక ముప్పుగా కాకుండా ఒక అవకాశంగా భావించి స్మార్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. అప్పుడే నిజమైన ఇంధన స్వయంసమృద్ధిని సాధించగలం.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
జాక్పాట్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు (Today Gold Rate) నేడు ఊహించని స్థాయిలో ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి జాక్పాట్ తగిలినట్లయింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా అమాంతం పతనమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మార్కెట్లపై బేర్ పంజా.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 411 పాయింట్లు తగ్గి 22,711 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1269 పాయింట్లు నష్టపోయి 73,268 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.67బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 112.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.51 శాతం పడిపోయింది.నాస్డాక్ 2.01 శాతం నష్టపోయింది.Today Nifty position 23-03-2026(time: 9:34 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పార్లమెంట్లో నేడు ‘సీఏపీఎఫ్ బిల్లు-2026’
దేశ అంతర్గత భద్రతలో కీలకమైన కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) నిర్వహణలో కీలక మార్పులు లక్ష్యంగా రూపొందించిన ‘కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సాధారణ పరిపాలన) బిల్లు-2026’ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్, క్యాడర్ సంస్కరణలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ బిల్లు ప్రాధాన్యత సంతరించుకుంది.ఏకీకృత చట్టం.. లక్ష్యం ఇదే!ప్రస్తుతం సీఆర్పీఎప్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ వంటి దళాలు వేర్వేరు చట్టాల ద్వారా నడుస్తున్నాయి. దీనివల్ల నియామకాలు, పదోన్నతులు, సేవా నిబంధనల్లో వ్యత్యాసాలు ఉండి పరిపాలనాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను తొలగించి సుమారు 10 లక్షల మంది సిబ్బంది ఉన్న ఈ దళాలన్నింటికీ ఒకే విధమైన చట్టపరమైన చట్రాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.బిల్లులోని కీలక అంశాలుఅధికారుల నియామకం, పదోన్నతి, డిప్యుటేషన్లపై నిబంధనలు రూపొందించే పూర్తి అధికారం కేంద్రానికి ఉంటుంది. అవసరమైతే ఇతర చట్టాలను ఇది నియంత్రించవచ్చు.అత్యున్నత స్థాయి పదవుల్లో ఐపీఎస్ అధికారుల ప్రాబల్యాన్ని ఈ బిల్లు చట్టబద్ధం చేస్తోంది.ఐజీ స్థాయిలో.. 50 శాతం పోస్టులు ఐపీఎస్ డిప్యుటేషన్ ద్వారా భర్తీ.ఏడీజీ స్థాయిలో.. కనీసం 67 శాతం పోస్టులు ఐపీఎస్ అధికారులకే.స్పెషల్ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్ పదవులన్నీ పూర్తిగా డిప్యుటేషన్ ద్వారానే భర్తీ అవుతాయి.కోర్టు తీర్పుకు విరుద్ధమా?మే 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ బిల్లు వివాదాస్పదంగా మారింది. సీఏపీఎఫ్ అధికారులను ‘ఆర్గనైజ్డ్ గ్రూప్-A సర్వీస్’గా గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం, ఉన్నత స్థాయిల్లో ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్ను క్రమంగా తగ్గించాలని, క్యాడర్ రివ్యూ చేపట్టాలని ఆదేశించింది. అక్టోబర్ 2025లో కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది. తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు కోర్టు ఆదేశాలను నీరుగార్చేలా ఉందని మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిరసనలుబిల్లులోని నిబంధనలపై మాజీ సీఏపీఎఫ్ అధికారులు తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ఐపీఎస్ అధికారుల లేటరల్ ప్రవేశం వల్ల సొంత క్యాడర్ అధికారుల పదోన్నతులు నిలిచిపోతున్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పని చేసే జవాన్లకు స్పష్టమైన కెరీర్ వృద్ధి ఉండాలి. నాయకత్వ బాధ్యతల్లో అంతర్గత అధికారులకు ప్రాధాన్యత ఇస్తేనే క్షేత్రస్థాయి నిర్ణయాలు సమర్థవంతంగా ఉంటాయి’ అని హెచ్.ఆర్. సింగ్, ఎస్.కె. సూద్ (రిటైర్డ్ అధికారులు) చెబుతున్నారు.కేంద్రం వాదనరాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే కేంద్ర దళాల స్వభావాన్ని కాపాడాలంటే ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్లు అత్యవసరమని కేంద్రం వాదిస్తోంది. ఈ కొత్త చట్టం వల్ల నిబంధనల్లో స్పష్టత వస్తుందని, అనవసరమైన లిటిగేషన్లు తగ్గి పరిపాలనా సామర్థ్యం పెరుగుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నేడు రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. కోర్టు తీర్పులను అధిగమిస్తూ కేంద్రం తీసుకువస్తున్న ఈ నిబంధనలపై విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
యుద్ధ సంక్షోభం.. రంగంలోకి మంత్రుల బృందం..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాన్యులపై దాని ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంక్షోభం వల్ల ఏర్పడే సవాళ్లను ఎదుర్కోవడానికి మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారు. ఈ సమావేశానికి హోం, రక్షణ, ఆర్థిక శాఖల మంత్రులతో సహా మొత్తం 13 మంది మంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏకతాటిపై పని చేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు.ఆహార, ఇంధన భద్రతపై ప్రత్యేక దృష్టిపశ్చిమాసియా పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సామాన్యుడి అవసరాలకు విఘాతం కలగకుండా కొన్ని అంశాలపై వివరణాత్మక సమీక్ష నిర్వహించారు.ముడి చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడటంపై చర్చించారు. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న బఫర్ స్టాక్ వల్ల ప్రస్తుతానికి ఇబ్బంది లేదని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.ఆహార భద్రతకు ఎటువంటి ముప్పు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.దిగుమతుల వైవిధ్యం - ఎగుమతుల విస్తరణరసాయనాలు, ఫార్మాసూటికల్స్, పెట్రోకెమికల్స్ వంటి కీలక పారిశ్రామిక రంగాలకు అవసరమైన ముడి పదార్థాల కోసం కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా, దిగుమతి వనరులను వైవిధ్యీకరించాలని సమావేశం నిర్ణయించింది. అలాగే, భారతీయ వస్తువుల కోసం కొత్త ఎగుమతి గమ్యస్థానాలను వేగంగా అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారు.రాష్ట్రాలతో సమన్వయం..ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని మోదీ ఆదేశించారు. ‘నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై, బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి’ అని ప్రధాని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?
చాలామందికి ఆదాయం అంటే నెల జీతం మాత్రమే. పెట్టుబడులను కూడా ఖర్చుల్లానే చూస్తుంటారు. భవిష్యత్తు ఆదాయానికి పెట్టుబడులే ప్రధానమన్న సూత్రాన్ని పెద్దగా పట్టించుకోరు. వారెన్ బఫెట్ మాటల్లో చెప్పాలంటే రెండో ఆదాయమనేది పెట్టుబడులతోనే వస్తుంది. మరి పెట్టుబడుల్లో సక్సెస్ కావాలంటే.? దీనికి పెద్ద పరిజ్ఞానం అవసరం లేదు. కావాల్సిందల్లా సరైన ఆలోచన... క్రమశిక్షణ, ఓర్పు. ఈ మూడింటితో పెట్టుబడులను సరైన దారిలో కొనసాగించడం, సమయానికి మార్పులు చేయడం, దీర్ఘకాలం కొనసాగించటం చేయొచ్చు. అదే సంపద సృష్టికి మార్గం. నిజానికి చాలా మంది ఇన్వెస్టర్లు తొలుత ఉత్సాహంగా పెట్టుబడులు మొదలెడతారు. కొన్నాళ్లకు నిర్లక్ష్యం చేస్తారు. ఇదే వారి వైఫల్యానికి ప్రధాన కారణం. పెట్టుబడుల్లో విజయానికి ఫైనాన్షియల్ ప్లానర్లు ప్రత్యేకంగా చెబుతున్న సూత్రాలను వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...ముందుగా తెలుసుకోవటం... తరవాతే ఇన్వెస్ట్మెంట్చాలామంది ఇతరులు చెప్పారని, సోషల్ మీడియాలో చూశామని, ఇది బాగా లాభాలిస్తుందని ఎవరో చెబితే విన్నామని పెట్టుబడులు పెడతారు. ఇదే మొదటి పెద్ద తప్పు. మీరు దేనిలో పెట్టుబడి పెడుతున్నారో దాని గురించి బాగా తెలుసుకోవాలి. అది ఎలా పనిచేస్తుంది? అందులో రిస్క్ ఎంత? రిటర్న్స్’ ఎన్నాళ్లకు వస్తాయి? మీ లక్ష్యాలకు ఇది సరిపోతుందా? ఇవన్నీ సరిచూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, డెట్ ఫండ్స్, ఈక్విటీ వంటి వాటి లక్షణాలు, లాభాలు, రిసు్కలు తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టకూడదు. తెలియని దాంట్లో పెట్టుబడి పెట్టకూడదన్నది తొలి నియమం.మీ రిస్క్ సామర్థ్యాన్ని మీరే తెలుసుకోండిఅందరూ ఒకే రకమైన ఇన్వెస్టర్లు కాదు. కొంతమంది అధిక రిస్క్ తీసుకోగలుగుతారు. మరికొందరు అస్సలు రిస్క్ తీసుకోలేరు. ఇది ప్రధానంగా వారి ఆర్థిక స్థాయిలను బట్టి మారుతుంటుంది. మీరు తట్టుకోలేని స్థాయిలో రిస్క్ తీసుకుంటే... మార్కెట్లో సంభవించే చిన్న చిన్న మార్పులకే భయపడతారు. అప్పుడు ఆందోళనతో తప్పుడు నిర్ణయాలు తీసుకుని, నష్టాల్లో కూరుకుపోతారు. మంచి ఇన్వెస్టర్ అంటే భయంలేని వాడు కాదు. తన సామర్థ్యాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేసేవాడు.ఉచిత సలహాలకు విలువ ఉండదుఉచితంగా లభించే విషయాలను ఎవరూ సీరియస్గా తీసుకోరు. ఫైనాన్స్ విషయంలోనూ అదే జరుగుతుంది. కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే నష్టం మాత్రం చాలా ఖరీదైనదిగా మారుతుంది, ఒక్కోసారి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ అవసరాలు, లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుని సరైన మార్గాన్ని నిర్దేశిస్తాడు., అవసరమైన సందర్భాల్లో పోర్ట్ఫోలియోలో మార్పులు కూడా సూచిస్తాడు. పెయిడ్ అడ్వైజర్ని సంప్రదించడం ఖర్చు కాదు. భవిష్యత్తు పెట్టుబడుల్లో భాగం.లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టండిలాభాలు వచ్చినప్పుడు వాటిని మొత్తం ఖర్చు చేయకండి. కొంత భాగాన్ని మళ్లీ పెట్టుబడుల్లో పెట్టండి. దీనివల్ల లాభాలపై మళ్లీ లాభాలు వస్తాయి. ఇదే నిజమైన సంపద రహస్యం. సరైన అసెట్ అలొకేషన్మీ పెట్టుబడులపై ఎంత రాబడి వస్తుందనేది మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టారనేదానిపై ఆధారపడి ఉంటుంది. దీన్నే అసెట్ అలొకేషన్గా చెబుతుంటారు. ఈక్విటీ, డెట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ వంటి విభాగాల్లో మీ డబ్బును సరైన శాతాల్లో పెట్టుబడి చేయడమే ఈ అసెట్ అలొకేషన్. మీ వయస్సు, రిస్క్ తీసుకునే సామర్థ్యం , మీ లక్ష్యాలు వాటి కాల వ్యవధి మీద ఇది ఆధారపడి ఉంటుంది. యువ ఇన్వెస్టర్లు రిస్క్ ఎక్కువ తీసుకోగలరు. అందుకే ఈక్విటీల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ భద్రత ముఖ్యం అవుతుంది. అప్పుడు డెట్లో పెట్టుబడికి ప్రాధాన్యమివ్వాలి. ఎవరైనా మొత్తం డబ్బు ఒకే చోట పెట్టడం ప్రమాదకరం.మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాట వినండిమీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ పెట్టుబడులను పర్యవేక్షిస్తుంటారు. మార్కెట్ ట్రెండ్స్ను గమనిస్తుంటారు. వారు ఇచ్చే సూచనలను నిర్లక్ష్యం చేయకుండా, ఆలోచించి అమలు చేయడం మంచిది. ఫైనల్ నిర్ణయం మీరే తీసుకున్నా.. వారి అనుభవం పెట్టుబడుల విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది.మార్కెట్ ఊగిసలాటలు సహజమేమార్కెట్ ఎప్పుడూ పైకి మాత్రమే వెళ్లదు. అప్పుడప్పుడూ పడిపోతుంది. కానీ మళ్లీ పెరుగుతుంది. ఇది సహజ ప్రక్రియ. చిన్న మార్పులకు భయపడి పెట్టుబడులు ఉపసంహరించుకుంటే, మీరు నష్టాలకే బాట వేస్తారు. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయనే విషయం చరిత్ర చెబుతోంది. పెట్టుబడుల విషయంలో ఓర్పు ఇన్వెస్టర్కు అత్యంత ముఖ్యమైన ఆయుధం.పెట్టుబడులూ ప్రధానమే..మనందరికీ కుటుంబం ముఖ్యం. పని ముఖ్యం. కానీ పెట్టుబడులూ అంతే ముఖ్యమని తెలు సుకోవాలి. ఎందుకంటే ఇవే మీ భవిష్యత్తును కాపాడతాయి. చాలామంది చేసే తప్పేంటంటే ముందుగా ఖర్చులు చేస్తారు, మిగిలితే ఇన్వెస్ట్ చేస్తారు. స్మార్ట్ ఇన్వెస్టర్లు చేసే పని ముందుగా ఇన్వెస్ట్ చేయడం. తర్వాత ఖర్చులు ప్లాన్ చేసుకోవటం. ఇది చిన్న మార్పులా అనిపించినా, దీర్ఘకాలంలో సంపద సృష్టికి పెద్ద ఆధారమవుతుంది.దీర్ఘకాలిక లక్ష్యాలను ఎప్పుడూ మరవద్దుపిల్లల చదువు, రిటైర్మెంట్, ఇల్లు కొనడం లాంటి లక్ష్యాలు 10–15 సంవత్సరాల తర్వాత వచ్చే దీర్ఘకాలిక లక్ష్యాలు. ఇవి సమయం మీద ఆధారపడే లక్ష్యాలు. సమయం అంటే కాంపౌండింగ్ శక్తి. ఈ డబ్బును చిన్న అవసరాలకు వాడితే మీరు కోల్పోయేది కేవలం డబ్బు కాదు. అంతకంటే విలువైన సమయం. డబ్బు మళ్లీ సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేరు.పెట్టుబడులు చేయడం అలవాటు చేసుకోండివిజయవంతమైన ఇన్వెస్టర్లు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టరు. క్రమ పద్ధతిలో పెట్టుబడులు చేస్తుంటారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ (సిప్) వంటి పద్ధతులు మీలో క్రమశిక్షణను పెంచుతాయి. చిన్న మొత్తాలతో మొదలుపెట్టినా, కాలక్రమంలో అవి పెద్ద మొత్తాలుగా మారతాయి.పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేయాలిమార్కెట్ మారుతుంది. మీ జీవితం కూడా మారుతుంది. కొత్త లక్ష్యాలు వస్తాయి, పాత లక్ష్యాలు పూర్తవుతాయి. ఈ మార్పులకు అనుగుణంగా మీ పెట్టుబడుల్లో కూడా మార్పులు చేయాలి. దీన్నే పెట్టుబడుల పరిభాషలో రీ–బ్యాలెన్సింగ్ అంటారు.ఉదాహరణకు పిల్లల చదువుకు చేసిన పెట్టుబడులు పూర్తయ్యాక, ఆ డబ్బును రిటైర్మెంట్ లక్ష్యానికి మళ్లించాలి.ఇదీ చదవండి: ‘జీడి’ రైతుకు కొత్త ఆదాయం -
పశ్చిమాసియాపైనే ఫోకస్!
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల కీలక ఆర్థిక అంశాలు కొరవడిన నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితులే దారి చూపనున్నాయి. దీంతో చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, రూపాయి మారకం తదితర అంశాలు కీలకంగా నిలవనున్నాయి. గురువారం(26న) శ్రీరామ నవమి సందర్భంగా దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. వివరాలు చూద్దాం... రోజులు గడిచేకొద్దీ పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం ముదురుతోంది. యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన తదుపరి పరిస్థితులు మరింత వికటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. దీంతో ఆసియా మొదలు అమెరికా వరకూ స్టాక్ మార్కెట్లు పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనలే ప్రధానంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. శ్రీరామ నవమి(26న) సెలవుతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గణాంకాల విడుదల దేశీయంగా ఈ వారం మార్చి నెలకు రేపు(24న) హెచ్ఎస్బీసీ ఫ్లాష్ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. తయారీ, సర్వీసులు, కాంపోజిట్ వివరాలు వెల్లడికానున్నాయి. తద్వారా బిజినెస్ యాక్టివిటీ ముందస్తు అంచనాలకు వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఈ బాటలో 28న ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మ్యాన్యుఫాక్చరింగ్ గణాంకాలు విడుదలకానున్నాయి. హార్ముజ్పై ఫోకస్ కొద్ది రోజులుగా హార్ముజ్ ద్వారా జల రవాణా దాదాపు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలకు విఘాతం ఏర్పడుతోంది. దీంతో పశ్చిమాసియా పరిస్థితులు కీలకంగా మారినట్లు ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. పేర్కొన్నారు. సమీప కాలంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని అంచనా వేశారు. బ్రెంట్ చమురు 100 డాలర్ల ఎగువన కదులుతుండటం దేశీయంగా వాణిజ్య లోటును పెంచడంతోపాటు రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఆర్థికవేత్తలు విశ్లేషించారు. చమురు ధరలతో పలు దేశాలలో ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తుండటంతో కేంద్ర బ్యాంకులు కఠిన పరపతి విధానాలవైపు చూపు సారించవచ్చని వివరించారు. గత వారం అక్కడక్కడే తీవ్ర ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 31 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,533 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 37 పాయింట్లు క్షీణించి 23,115 వద్ద స్థిరపడింది.సాంకేతికంగా ఈ వారంయుద్ధ భయాల నుంచి గత వారం నెమ్మదిగా రికవరీ బాట పట్టిన దేశీ స్టాక్ మార్కెట్లను ప్రయివేట్ బ్యాంకింగ్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ దెబ్బకొట్టింది. మరోపక్క ముడిచమురు ధరల మంట సెంటిమెంటుకు షాకివ్వడం దీనికి జత కలసింది. దీంతో చివరికి మార్కెట్లు దాదాపు యథాతథంగా ముగిశాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం పశ్చిమాసియా ప్రకంపనల ఆందోళనలతో బలహీనపడటానికే అధిక వీలుంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీస్థాయిలో విక్రయాలకు పాల్పడుతుండటం బ్లూచిప్స్ను పడగొడుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. → నిఫ్టీకి తొలుత 22,900 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. తదుపరి 22,300–22,200 స్థాయిలో కొనుగోళ్లకు వీలుంది. ఒకవేళ తొలి మద్దతుస్థాయి నుంచి బలపడితే.. 23,800–24,000 వరకూ పుంజుకోవచ్చు. సమీప కాలంలో 22,900– 24,000 శ్రేణిలో కదిలేందుకు వీలుంది.ఎఫ్పీఐల భారీ అమ్మకాలు.. యుద్ధ భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఇటీవల దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలోనే ఇప్పటివరకూ నగదు విభాగంలో ఏకంగా రూ. 88,180 కోట్ల(9.6 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ధరల పెరుగుదలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఆందోళనలు వ్యక్తం చేయడానికితోడు.. డాలరుతో మారకంలో రూపాయి పతనంకావడం సైతం కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ముదురుతున్న పశ్చిమాసియా యుద్ధం, ముడిచమురు ధరలతో కార్పొరేట్ ఫలితాలు నీరసించవచ్చన్న ఆందోళనలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. కాగా.. అంతకుముందు నెల(ఫిబ్రవరి)లో గత 17 నెలల్లోనే అత్యధికంగా ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రక్షణ ప్లస్ రాబడి
మన దేశంలో ఇన్వెస్ట్మెంట్లంటే మొదటి నుంచీ ఒకటే ధోరణి. అయితే డిపాజిట్లు. లేకుంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు. ఇవి రెండూ కాకుంటే బంగారం లేదా రియలీ్ట. స్టాక్ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం ఇబ్బందికరం అనుకునేవారు మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయించటం. ఇప్పటికీ చాలామందిది ఇదే తీరు. వారికి మ్యూచువల్ ఫండ్లంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవే. కానీ ఇప్పుడు మార్కెట్లు ఇలా వేటిలోనూ ఒకదాంట్లో పెట్టుబడులు పెట్టి ఊరుకునేలా లేవు. అలాగని అన్నింట్లోనూ పెట్టుబడులు పెట్టాలంటే... వాటిని గమనిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మార్చుకోవటం అంత తేలికకాదు. అందుకే ఇలాంటివన్నీ చేసే ఫండ్స్ను చూసుకోవాలి. అటు డెట్లోను, ఇటు స్టాక్ మార్కెట్లో, మరోవైపు బంగారంలోనూ... ఇలా మూడింటా పెట్టుబడులు పెడుతూ... అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకెళ్లేవే మల్టీ అసెట్ ఫండ్స్. పేరుకు తగ్గట్టే ఇవి భిన్న రకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. డెట్లో పెడతాయి కనక కొంత రక్షణ తప్పనిసరిగా ఉంటుంది. పైపెచ్చు అవసరాన్ని బట్టి మారుస్తాయి కనక చక్కని రాబడి కూడా ఇస్తున్నాయి. రిస్క్ లు, రాబడుల మధ్య సమతూకాన్ని పాటిస్తూ వివిధ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఈ మల్టీ అసెట్ ఫండ్స్... ప్రస్తుతం అందరికీ అవసరమైనవనటంలో సందేహం లేదు. వాటిపై సమగ్ర అవగాహనే ఈ వెల్త్ స్టోరీ...కనీసం మూడు అసెట్స్లో ఇన్వెస్ట్ చేసే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్నే మల్టీ అసెట్ ఫండ్స్గా వ్యవహరిస్తుంటారు. ఇవి పెట్టుబడి వృద్ధి కోసం ఈక్విటీల్లో, స్థిరత్వం కోసం డెట్ సాధనాలు– బాండ్స్లో, రిస్క్ లను హెడ్జ్ చేసేందుకు పసిడి/ కమోడిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రతి అసెట్ క్లాస్కి కనీసం ఇంత కేటాయించాలనే నిబంధనలుంటాయి. కాబట్టి దానికి తగ్గట్లే ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇలాంటి ఫండ్ ఒకటి ఉంటే సంపూర్ణమైన పోర్ట్ఫోలియో ఉన్నట్లే లెక్క. ఇవన్నీ ఎందుకు ప్రాచుర్యం పొందుతున్నాయి.. ప్రస్తుతం మార్కెట్లను చూస్తే విడివిడిగా స్టాక్స్ని ఎంచుకోవడం కన్నా అసెట్స్ అలొకేషన్ వైపే పరిస్థితులు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. డెట్ మార్కెట్లు స్థిరపడుతున్నాయి. పుత్తడి పటిష్టమైన హెడ్జింగ్కి ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక్క అసెట్ని నమ్ముకుంటే వర్కౌట్ కాదని ఇన్వెస్టర్లు గ్రహిస్తున్నారు. మల్టీ అసెట్ ఫండ్స్తో ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందుకుంటున్నారు. ఇవి పరిస్థితులను బట్టి వివిధ అసెట్స్ మధ్య కేటాయింపులను ఆటోమేటిక్గా మార్చేస్తాయి. మార్కెట్లలో మార్పులను బట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటాయి. పోర్ట్ఫోలియో పతనమయ్యే రిస్కులను తగ్గిస్తాయి. మల్టీ అసెట్ ఎందుకు ఉపయోగకరం అంటే..వివిధ అసెట్స్ వ్యాప్తంగా పెట్టుబడులను డైవర్సిఫై చేసేందుకు వీలుంటుంది. పరిస్థితులను బట్టి పోర్ట్ఫోలియో ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ అవుతుంది. ఈక్విటీల్లో మాత్రమే పెట్టే పెట్టుబడులతో పోలిస్తే హెచ్చుతగ్గులు తక్కువగా ఉంటాయి. వీటిలోనైతే మార్కెట్ కరెక్షన్లకు లోనయ్యేటప్పుడు రక్షణ ఉంటుంది. దీర్ఘకాలికంగా సిప్ ఇన్వెస్టింగ్ కోసం ఇవి అనువైనవి కూడా.డెట్ (బాండ్లు) పాత్ర.. డెట్ విభాగమనేది మల్టీ అసెట్ ఫండ్స్కి ఉండే బలాల్లో ఒకటి. ఇది స్థిరమైన రాబడిని అందిస్తుంది. పోర్ట్ఫోలియోలో ఒడిదుడుకులను తగ్గిస్తుంది. ఈక్విటీలు కరెక్షన్కి లోనయ్యే సమయంలో పోర్ట్ఫోలియో మరీ ఎక్కువగా పడిపోకుండా కాస్త కుషన్గా పని చేస్తుంది. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు బాండ్లు అనేవి భద్రత కోసమే కాక పోర్ట్ఫోలియోను సంరక్షించుకునే వ్యూహంగా కూడా పనికొస్తాయి. సరైన ఫండ్ని ఎంచుకోవడం ఇలా.. అసెట్ అలొకేషన్ని పరిశీలించాలి → ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపించే ఫండ్లలో అధిక రాబడులతో పాటు అధిక రిస్క్ లూ ఉంటాయి. → బ్యాలెన్స్డ్గా పెట్టుబడులు పెట్టే ఫండ్లలో మాత్రమే స్థిరమైన రాబడులుంటాయి. నిలకడపై ఫోకస్ → స్వల్పకాలిక రాబడులను కాకుండా 3–5 ఏళ్ల పనితీరును పరిశీలించాలి. ఫండ్ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి → ఐసీఐసీఐ = కాంట్రేరియన్ → ఎస్బీఐ = బ్యాలెన్స్డ్ → క్వాంట్ = అగ్రెసివ్ మీ రిస్కు సామర్థ్యాలను బట్టి అనువైనవి ఎంచుకోవాలి→ కన్జర్వేటివ్ = ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ → మోడరేట్ = ఐసీఐసీఐ, కోటక్ → అగ్రెసివ్ = నిప్పన్, క్వాంట్ ఈ రిస్క్ లుంటాయ్.. మార్కెట్లు బులిష్గా దూకుడు మీదున్నప్పుడు ఇవి పెద్దగా రాణించకపోవచ్చు. అలాగే రాబడులనేవి ఫండ్ మేనేజర్ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇక మరీ డైవర్సిఫికేషన్ ఎక్కువగా చేసినా కూడా వృద్ధి అవకాశాలు పరిమితమవుతాయి.– సాక్షి, వెల్త్ -
రూ.1000లోపు రీఛార్జ్.. 164 రోజుల వ్యాలిడిటీ!
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికామ్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కూడా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన కొత్త ప్లాన్ ప్రకారం.. 997 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 164 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాతో పాటు.. అపరిమిత కాలింగ్స్ సదుపాయం లభిస్తుంది. అంతే కాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ ఈ నెల చివరి వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుంది.More days, same price! BSNL Validity Bonus Offer ₹997 plan now gives 164 days instead of 150 days.Plan detail:* Cost: ₹997* Validity: 164 Days (Bonus included!)* Data: 2GB/Day* Calls: UnlimitedDon't miss out—this limited-time bonus till March 31, 2026.Recharge… pic.twitter.com/225a4Cb04P— BSNL India (@BSNLCorporate) March 22, 2026 -
2047 నాటికి సంపన్న దేశంగా భారత్: అమెరికన్ మ్యాగజైన్ సంచలన రిపోర్ట్!
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం 2047 నాటికి.. సంపన్న దేశంగా మారుతుందని అమెరికా మ్యాగజైన్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' నివేదించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వాషింగ్టన్ ఎగ్జామినర్ ప్రకారం.. గత రెండు దశాబ్దాలుగా దేశం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2003 నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ.. సగటు వార్షిక వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంది. రాబోయే 20 ఏళ్లపాటు ఇదే ఊపు కొనసాగితే తలసరి జీడీపీ 15,000 డాలర్లు దాటేస్తుంది. ఇంతటి స్థిరమైన వృద్ధి సాధించడం వల్ల భారత్.. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తుర్కీయే వంటి ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసిన మధ్య ఆదాయ ట్రాప్ను (మిడిల్ ఇన్కమ్ ట్రాప్) దాటేయగలదు.భారతదేశం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన విధానాలు, జనాభా, పెరుగుతున్న టెక్నాలజీ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది. ఇండియాలో 28 సంవత్సరాలు మధ్య వయసున్న వారు.. యునైటెడ్ స్టేట్స్, చైనా దేశాల కంటే ఎక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశంలో యువకులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ జనాభా ధోరణి బలమైన దేశీయ మార్కెట్కు మద్దతునిస్తుందని, తద్వారా వృద్ధి కోసం ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదించింది.ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి.. విధాన రూపకర్తలు ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు వేగవంతమవుతున్నాయి. మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరా గొలుసులను బలోపేతం చేసి, దేశీయ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది.నిరంతర పెట్టుబడులు, కార్మిక శక్తిని విస్తరించడం, సాంకేతికతను స్వీకరించడం ద్వారా దేశాలు అధిక - ఆదాయ హోదాకు మారగలవని చారిత్రక ధోరణులు చూపిస్తున్నాయి. ఈ మూడు లక్షణాలు భారతదేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది.వికసిత భారత్ - మోదీ కలభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల. ఈ లక్ష్యం ద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో శక్తివంతంగా మార్చడం ప్రధాన ఉద్దేశ్యం.వికసిత భారత్ అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చేయడం. గ్రామాలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందాలి. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కూడా ఈ లక్ష్యంలో భాగం.మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడం వంటివి కూడా ఇందులో ప్రధాన లక్ష్యాలు.ఇదీ చదవండి: బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా.. -
రూ. 15వేలు జీతంలో ఆనందం.. రూ. 2.5లక్షల్లో అసంతృప్తి!
జీతం ఎక్కువ వచ్చే జాబ్ చేస్తే.. సంతోషంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అది ఏ మాత్రం నిజం కాదంటూ, వచ్చే జీతానికి సంతోషానికి సంబంధం ఉండదని ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''నాకు నిజంగా ఆనందం కలిగింది.. నెలకు 15,000 రూపాయల జీతం పొందిన సమయంలోనే. కానీ ఇప్పుడు నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ, సంతృప్తి తగ్గిపోయింది'' అని ఎక్స్ యూజర్ సాక్షి వెల్లడించారు. ఇది డబ్బు ఎక్కువ కావడం వల్ల కాదు, ఇతరుల జీవన స్థితులతో తనను పోల్చుకోవడం వల్ల ఏర్పడిన అసంతృప్తి అని ఆమె పేర్కొన్నారు.ఉద్యోగం వదిలిన తర్వాత కొన్ని నెలలు జీతం లేకపోవడం వల్ల ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా, అది నిజాన్ని గ్రహింపజేసింది. నిజమైన సంతోషం అంటే ఎక్కువ జీతం పొందడంలో కాదు, మనం నిజంగా ఇష్టపడే పని చేయడంలో ఉందని. ఇప్పుడు నేను ఇతరుల గురించి ఆలోచించకుండా పనిచేస్తాను. ఆమె అభిప్రాయం ప్రకారం, “పెద్ద జీతం లేదా తక్కువ జీతం కాదు, జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నావో అనేది ముఖ్యం.At a salary of:15K per month, I was the happiest.150K per month, I felt it was less - I deserved more.250K per month, I felt I was doing well, but after seeing others, it again felt less.I realised it was never about the salary.It was the comparison that created…— Sakshi (@Sakshi50038) March 20, 2026 -
స్కోడా కుషాక్ ఫేస్లిఫ్ట్ వచ్చేసింది: ధర ఎంతంటే?
స్కోడా కంపెనీ.. అప్డేటెడ్ కుషాక్ ఫేస్లిఫ్ట్ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధరలు రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ లేటెస్ట్ మిడ్-సైజ్ ఎస్యూవీ డిజైన్, ఫీచర్లు, పవర్ట్రెయిన్ ఆప్షన్లలో గణనీయమైన అప్గ్రేడ్లను పొందింది. అదే సమయంలో కంపెనీ సేఫ్టీకి కూడా ప్రాధాన్యత కల్పించింది.హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్వ్యాగన్ టైగన్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే.. కుషాక్ ఫేస్లిఫ్ట్.. క్లాసిక్ ప్లస్, సిగ్నేచర్, స్పోర్ట్లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో అనే ఐదు ట్రిమ్లలో 1.0 TSI, 1.5 TSI టర్బో పెట్రోల్ ఇంజన్లతో లభిస్తుంది.కుషాక్ ఫేస్లిఫ్ట్ 5-స్టార్ గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ కూడా పొందింది. అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్బ్యాగ్లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ మౌంట్లు వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.మెకానికల్ పరంగా.. అతిపెద్ద అప్డేట్ ఏమిటంటే, మునుపటి 6-స్పీడ్ యూనిట్ స్థానంలో 1.0-లీటర్ TSI ఇంజిన్తో కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ను ప్రవేశపెట్టడం. ఈ ఇంజిన్ 115bhp పవర్, 178 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్తో కూడా లభిస్తుంది. 1.5-లీటర్ TSI ఇంజన్ 147bhp, 250Nm టార్క్ అందిస్తుంది. దీనికి 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్బాక్స్ యూనిట్ ఉంటుంది. మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం ఇప్పుడు దీనికి వెనుక డిస్క్ బ్రేకులు ఉన్నాయి. -
బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా..
ఎప్పుడైనా ప్రపంచ యుద్దాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. ఈ సమయంలో బంగారం, వెండి వంటి లోహాలకు విలువ ఒక్కసారిగా పెరిగిపోతుంది. అయితే ప్రస్తుతం.. గోల్డ్, సిల్వర్ రేటు దీనికి విరుద్ధంగా ఉంది.అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం జరుగుతున్నా సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణం.. డాలర్ విలువ బలపడటమే అని నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ ఎప్పుడైతే పెరుగుతుందో.. ఆ సమయంలో పసిడికి డిమాండ్ కొంత తగ్గుతుంది. అంతే కాకుండా.. బంగారం రేటు పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్లకు వెనుకడుగు వేస్తారు. కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు పతనమవుతాయి.వారం రోజుల్లో రూ.13 వేలు డౌన్!బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.బంగారం ధరలు తగ్గుతాయా?బంగారం ధరలు తగ్గుతాయా? అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుదల, తగ్గుదల అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల మాదిరిగానే.. ధరలు తగ్గితే, గోల్డ్ రేటు పతనమవుతుందని చెప్పవచ్చు. కానీ కియోసాకి వంటి నిపుణులు బంగారం ధర పెరుగుతుందనే చెబుతున్నారు. -
హీట్కు హాట్ సొల్యూషన్: ఇదిగో కూల్ గ్యాడ్జెట్లు!
వేసవి వచ్చిందంటే బయట అడుగు పెడితే చాలు, సూర్యుడు తన వేడి గాలిని ముఖంపై కొడుతూ ‘ఇంట్లోనే ఉండు’ అని హెచ్చరిస్తూనే ఉంటాడు. కాని, టెక్నాలజీ తెచ్చిన ఈ చిన్న గ్యాడ్జెట్లు, సూర్యుడు తన వేడి ఎంత పెరిగినా ‘ఊఫ్’ నుంచి ‘ఆహా!’గా మార్చేస్తాయి.ఫోనుకి బుజ్జి ఏసీ!సమ్మర్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా వీడియోలు చూస్తున్నప్పుడు మీ ఫోన్ వేడి పెనంలా మారిపోతుందా? అయితే మీ ఫోన్ చల్లబరచడానికి వచ్చేసింది ఈ మొబైల్ కూలింగ్ ప్యాడ్! ఇది మామూలు ఫ్యాన్ కాదు, ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ మీ ఫోన్ టెంపరేచర్ను కేవలం సెకన్లలోనే తగ్గించేస్తుంది. అంటే బయట ఎండలు మండిపోతున్నా, మీ ఫోన్ మాత్రం వింటర్ వాతావరణంలో ఉన్నట్టే చిల్ అవుతుంది! దీనికి ఉన్న ఎల్ఈడీ డిస్ప్లే ఫోన్ ఎంత చల్లగా ఉందో ఎప్పటికప్పుడు చూపిస్తుంది. పైగా ఇందులోని మ్యాగ్నెట్ ఫీచర్ వల్ల ఫోన్ వెనుక సులభంగా అతుక్కుపోతుంది, మీరు గంటల తరబడి గేమింగ్ చేసినా లేదా లైవ్ స్ట్రీమింగ్ చేసినా ఫోన్ హ్యాంగ్ అవ్వదు, బ్యాటరీ కూడా వేడెక్కదు. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్.. ఏదైనా సరే, సెట్ అయిపోతుంది. ధర రూ. 700 మాత్రమే!మ్యాజిక్ గ్లాసెస్!ఫోన్ చూసి చూసి మీ కళ్లు ‘ఫ్రై’ అయిపోతున్నాయా? బయటకి వెళ్దామంటే సూర్యుడు సెగలతో సినిమా చూపిస్తున్నాడా? ఇలా ఒకేసారి కళ్లకు రక్షణ, మైండ్కి రిలాక్సేషన్ ఇచ్చేందుకు వచ్చేసింది ఈ స్మార్ట్ బ్లూటూత్ గ్లాసెస్! ఇందులో ఇన్–బిల్ట్ స్పీకర్లు కూడా ఉన్నాయి. అంటే మీరు కళ్లజోడు పెట్టుకుంటే చాలు, పక్కన ఎవరికీ వినిపించకుండా మీ చెవుల్లో మ్యూజిక్ వినిపిస్తుంది.ఫోన్ తీయకుండానే కాల్స్ కూడా మాట్లేడేయొచ్చు. సాంగ్స్ మార్చుకోవచ్చు. ఇక ఇందులో ఉన్న ఫోటోక్రోమిక్ లెన్సులు ఇంట్లో ఉన్నప్పుడు బ్లూ లైట్ నుంచి, అదే అడుగు బయట పెట్టగానే సెకన్లలో కూలింగ్ గ్లాసెస్లా మారి కళ్లకు రక్షణ ఇస్తాయి. పైగా వర్షం పడినా, చెమట పట్టినా ఏమీ కాకుండా దీనికి వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ధర రూ. 1,200 మాత్రమే!మంచు కురిపించే గొడుగు!బయట ఎండలు మండిపోతుంటే.. గొడుగు పట్టుకున్నా సెగలు తగులుతూ చిరాగ్గా ఉందా? అయితే మీ పర్సనల్ ఏసీలాంటి ఈ బీఎన్ఎఫ్ సన్ అంబ్రెల్లాని చూస్తే మీరు ఫిదా అయిపోతారు! దీని లోపల ఒక బుజ్జి ఫ్యాన్ ఉండటమే కాకుండా, ఇది చల్లని నీటిని మంచులా చల్లుతుంది. అంటే ఎండలో వెళ్తున్నా, మీ గొడుగు కింద ఒక చిన్న మంచువాన కురుస్తుంది. కేవలం నాలుగు ఏఏ బ్యాటరీలు ఉంటే చాలు.. గాలికి తిరగబడని విండ్ప్రూఫ్ డిజైన్తో, అటు గాలిని.. ఇటు మంచు జల్లులను మీకు అందిస్తుంది. ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇది ఒక అదిరిపోయే ఆప్షన్. ధర రూ. 5,900. -
బిడ్డను కోల్పోయిన గర్భిణి.. కంపెనీకి రూ.210 కోట్ల ఫైన్!
మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో.. దాదాపు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పిస్తుంటాయి. కానీ అమెరికాలోని టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థ.. తమ ఉద్యోగి గర్భంతో ఉన్నప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించలేదు. ఆ తరువాత ఏకంగా రూ.210 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.అమెరికాలోని హామిల్టన్ కౌంటీలో జరిగిన విషాదకర సంఘటనకు సంబంధించి కోర్టు తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కేసులో టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థపై భారీ నష్టపరిహారం విధించారు.చెల్సియా వాల్ష్ అనే మహిళ.. గర్భధారణ సమయంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉండేది. 2021 ఫిబ్రవరిలో, ముందస్తుగా ప్రసవం జరగకుండా ఉండేందుకు ఆమె ఒక వైద్య చికిత్స చేయించుకుంది. డాక్టర్లు ఆమెకు ఎక్కువగా కదలకుండా ఉండాలని, బెడ్ రెస్ట్ తీసుకోవాలని.. ఉద్యోగం చేస్తున్నట్లయితే.. ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.డాక్టర్ల సలహాను అనుసరించి.. చెల్సియా తన కంపెనీని సంప్రదించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి కోరింది. కానీ కంపెనీ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అంతేకాకుండా.. ఆఫీసుకు రావాలని లేదా జీతం లేకుండా సెలవు తీసుకోవాలని చెప్పింది. ఇది ఆమెకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కష్టమైన పరిస్థితిని సృష్టించింది.కంపెనీ తన అభ్యర్థనను తిరస్కరించడంతో.. చెల్సియా తన ఆరోగ్యానికి విరుద్ధంగా మూడు రోజుల పాటు ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఫిబ్రవరి 24న కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతిచ్చింది. అయితే అదే రోజు ఆమెకు ముందస్తు ప్రసవం జరిగింది.ఆమె కుమార్తె 'మాగ్నోలియా' కేవలం 21 వారాల గర్భధారణలోనే జన్మించింది. పుట్టినప్పుడు ఆ శిశువు శ్వాస తీసుకుంటూ, గుండె కొట్టుకుంటూ ఉండింది. కానీ ఎంతో బాధాకరంగా, కేవలం ఒక గంటా ముప్పై నిమిషాల్లోనే ఆమె తల్లి ఒడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: రూ.47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే!ఈ ఘటనపై కోర్టులో కేసు పెట్టగా, జ్యూరీ సభ్యులు కంపెనీ తీసుకున్న నిర్ణయం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని తేల్చారు. మొదట 25 మిలియన్ డాలర్ల నష్టపరిహారం విధించినా, 90% బాధ్యత కంపెనీదిగా నిర్ణయించి చివరికి 22.5 మిలియన్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.210 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇచ్చారు. -
ఎల్పీజీ ఏటీఎం వచ్చేసింది.. ఇక ఎనీ టైమ్ గ్యాస్!
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతీయ వంటిళ్లపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 60% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో, సరఫరా గొలుసులో అప్పుడప్పుడు అంతరాయాలు కలుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకుని, డెలివరీ బాయ్ కోసం గంటల తరబడి వేచి చూడటం వినియోగదారులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా భారత్ పెట్రోలియం (BPCL) వినూత్నమైన 'స్మార్ట్ ఎల్పీజీ వెండింగ్ మెషిన్'ను అందుబాటులోకి తెచ్చింది.ఎక్కడంటే..దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం ఇప్పుడు గురుగ్రామ్లో ప్రారంభమైంది. గురుగ్రామ్లోని సోహ్నా, సెక్టార్ 33లోని సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో బీపీసీఎల్ ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. 'భారత్ గ్యాస్ ఇన్స్టా ఎల్పీజీ' పేరుతో పిలిచే ఈ ఏటీఎం, సాధారణ నగదు ఏటీఎం తరహాలోనే 24 గంటల పాటు సేవలు అందిస్తుంది. ఫోన్ కాల్స్, బుకింగ్ స్లాట్లతో పనిలేకుండా కేవలం 2-3 నిమిషాల్లోనే నిండు సిలిండర్ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.ఏటీఎంలో సిలిండర్ ఎలా పొందాలంటే..ఈ మెషిన్ ద్వారా గ్యాస్ పొందడం అత్యంత సులభం. దీని పనితీరు ఇలా ఉంటుంది..మొబైల్ నంబర్: మెషిన్ స్క్రీన్పై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి.ఓటీపీ వెరిఫికేషన్: మీ మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి.క్యూఆర్ కోడ్ స్కాన్: మీ ఖాళీ సిలిండర్పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్ లేదా బార్కోడ్ను మెషిన్ స్కానర్ ముందు ఉంచాలి. అది చెల్లుబాటు అవుతుందో లేదో మెషిన్ తనిఖీ చేస్తుంది.ఖాళీ సిలిండర్ డిపాజిట్: ధ్రువీకరణ పూర్తయ్యాక, విండో తెరుచుకుంటుంది. అందులో మీ ఖాళీ సిలిండర్ను ఉంచాలి. మెషిన్ దాని స్వచ్ఛతను, బరువును స్వయంచాలకంగా తనిఖీ చేసి లోపలికి తీసుకుంటుంది.చెల్లింపు: స్క్రీన్పై కనిపించే గ్యాస్ ధరను UPI ద్వారా స్కాన్ చేసి చెల్లించాలి.నిండు సిలిండర్: పేమెంట్ సక్సెస్ అవ్వగానే, పక్కనే ఉన్న డెలివరీ విండో నుండి సీల్ చేసిన నిండు సిలిండర్ బయటకు వస్తుంది.ఏంటీ ఏటీఎం ప్రత్యేకతలు?లైట్ వెయిట్ సిలిండర్లు: ఈ మెషిన్ ద్వారా 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లను అందిస్తున్నారు. ఇవి పాత ఇనుప సిలిండర్ల కంటే చాలా తేలికగా ఉంటాయి.స్మార్ట్ అలర్ట్ సిస్టమ్: మెషిన్లో ఒకేసారి 10 సిలిండర్లను లోడ్ చేయవచ్చు. స్టాక్ తగ్గిపోయి, కేవలం రెండు సిలిండర్లు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, మెషిన్ స్వయంచాలకంగా సమీప గ్యాస్ ఏజెన్సీకి రీఫిల్ కోసం అలర్ట్ పంపిస్తుంది.గ్యాస్ సిలిండర్ల డెలివరీలో పారదర్శకత పెంచడానికి మరియు వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడానికి ఈ 'ఎనీ టైమ్ గ్యాస్' విధానం ఎంతగానో దోహదపడనుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. -
ఇన్ఫ్రా స్పీడుకు బ్రేకులు.. పడిపోయిన వృద్ధి
న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి ఫిబ్రవరిలో మూడు నెలల కనిష్టానికి నెమ్మదించింది. రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్షీణించడంతో 2.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఫిబ్రవరిలో ఇది 3.4 శాతంగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఫిబ్రవరిలో ఎరువులు, సిమెంటు, విద్యుదుత్పత్తి వరుసగా 3.4 శాతం, 9.3 శాతం, 0.5 శాతం మేర క్షీణించింది.అయితే బొగ్గు, ఉక్కు ఉత్పత్తి మాత్రం మెరుగ్గా నమోదైంది. ఇక ఏప్రిల్–ఫిబ్రవరి మధ్యకాలంలో ఇన్ఫ్రా వృద్ధి 2.9 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 4.4 శాతంగా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తలెత్తడానికి ముందు నుంచే కీలక రంగాల వృద్ధి నెమ్మదించిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. -
పసిడి పతనం.. 1983 నాటి సీన్ రిపీట్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. శనివారం నాటి ట్రేడింగ్లో బంగారం ధరలు భారీగా కుప్పకూలాయి. 1983 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ, దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకే వారంలో అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్ (COMEX)లో ఔన్స్ బంగారం ధర 4,500 డాలర్ల దిగువకు పడిపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీసింది.కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.47 శాతం క్షీణించి, ఔన్స్కు 4,492 డాలర్ల వద్ద ట్రేడయింది. బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ ఒకే రోజులో 5 శాతం పతనమై ఔన్స్కు 70 డాలర్ల దిగువకు చేరుకుంది. కొద్ది నెలల క్రితం 119 డాలర్ల వద్ద ఉన్న వెండి.. ఇప్పుడు పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెట్టేసింది.పతనానికి ప్రధాన కారణాలుసాధారణంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రస్తుత ఇరాన్-యుఎస్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ పసిడి ధరలు తగ్గడానికి ఈ కింది కారణాలు కనిపిస్తున్నాయి.బలమైన డాలర్: అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరగడం బంగారంపై ఒత్తిడి పెంచింది.ద్రవ్యోల్బణం & చమురు: పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఇతర వస్తువుల డిమాండ్ను తగ్గిస్తున్నాయి.ప్రాఫిట్ బుకింగ్: గత కొంతకాలంగా భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు (Pull-back) మొగ్గు చూపుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి.1983లో ఏం జరిగిందంటే.. 1979-80 మధ్య ఇరాన్ విప్లవం, చమురు సంక్షోభం కారణంగా బంగారం ధర అప్పట్లో 850 డాలర్లకు ఎగబాకింది. అయితే 1983లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల ధరలు 15-20 శాతం పతనమై 375-400 డాలర్లకు పడిపోయాయి. అప్పట్లో పాల్ వోకర్ వడ్డీ రేట్లను పెంచి డాలర్ను బలోపేతం చేయడమే ఇందుకు కారణం. సరిగ్గా ఇప్పుడు కూడా అలాంటి ఆర్థిక పరిణామాలే కనిపిస్తుండటంతో, పసిడి మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తోంది.నేటి బంగారం, వెండి ధరలు నేడు (మార్చి 22, 2026) దేశీయంగా ఎంసీఎక్స్ (MCX) మార్కెట్కు సెలవు కావడంతో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు 22 క్యారెట్స్ 10 గ్రాములకు రూ.1,33,800 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.1,45,970 వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది. -
ఉద్యోగులకు ఏఐ ట్రైనింగ్.. పియర్సన్తో టీసీఎస్ జట్టు
ముంబై: గ్లోబల్ లెర్నింగ్ సర్వీసుల సంస్థ పియర్సన్తో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) జట్టు కట్టింది. కృత్రిమ మేథతో సిబ్బందికి శిక్షణనిచ్చి, వారిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడంలో కంపెనీలకు తోడ్పాటు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది. ఇందుకోసం ఇరు సంస్థలు ఏఐ ఆధారిత లెర్నింగ్ ప్రోడక్టులు, సర్వీసులను రూపొందిస్తాయి.నియామకాల్లో, సిబ్బంది అభివృద్ధి ప్రోగ్రాంలలో అభ్యర్ధుల సామర్థ్యాలను మదింపు చేసే ప్రక్రియలో పియర్సన్కి చెందిన వెర్సాంట్ ఇంగ్లీష్ ప్రొఫీషియెన్సీ విధానాన్ని టీసీఎస్ ఉపయోగించనుంది. మరోవైపు అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసులను డిజిటలీకరించే దిశగా ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ సంస్థ అమెడ్యూస్తో టీసీఎస్ చేతులు కలిపింది.మరోవైపు, ఐటీ ఇన్ఫ్రా, డేటా సెంటర్లు, ఇతరత్రా టెక్నాలజీల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఆటోమేషన్ దిగ్గజం ఏబీబీ, టీసీఎస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
ఇల్లు కొనేవాళ్లకు ఇదే మంచి ఛాన్స్!
ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సరుకు రవాణాలో అడ్డంకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సామాన్యుడి సొంతింటి కలపై కూడా నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, సరఫరా గొలుసులో జాప్యం కలవరపెడుతున్నాయి.ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఇల్లు కొనడం లేదా నిర్మాణం చేపట్టడం సరైనదేనా అనే అంశంపై ప్రత్యేక విశ్లేషణ ఈ కథనంలో చూద్దాం..ఆకాశాన్ని తాకుతున్న నిర్మాణ ఖర్చులుఅంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల, ఎర్ర సముద్రం మీదుగా రవాణా నిలిచిపోవడం వంటి కారణాలు నిర్మాణ రంగాన్ని దెబ్బతీస్తున్నాయి.స్టీల్, సిమెంట్ ధరల మోత: అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడంతో స్టీల్ తయారీ ఖర్చు 20% వరకు పెరిగింది. ప్రస్తుతం టన్ను స్టీల్ ధర సుమారు రూ.72,000కు చేరింది. సిమెంట్ ధరలు కూడా బస్తాకు రూ.20 - రూ.40 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.రవాణా ఛార్జీల భారం: అంతర్జాతీయ కంటైనర్ రవాణా ధరలు పెరగడంతో ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లంబింగ్ సామగ్రి, విదేశీ టైల్స్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో కంటైనర్పై సుమారు రూ.1.5 లక్షల నుండి రూ.3.5 లక్షల వరకు అదనపు భారం పడుతోంది.అల్యూమినియం, పీవీసీ: యుద్ధ ప్రభావంతో అల్యూమినియం ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోగా, పీవీసీ పైపుల ధరలు 20-33% వరకు పెరిగాయి.హైదరాబాద్ మార్కెట్ పరిస్థితి.. ఇల్లు కొనాలా? వద్దా?ప్రస్తుత సంక్షోభం ఉన్నప్పటికీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇతర నగరాల కంటే స్థిరంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడే కొనడం ఎందుకు మంచిదంటే.. పెరగనున్న ధరలు: నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల బిల్డర్లు కొత్త ప్రాజెక్టుల ధరలను పెంచక తప్పదు. వచ్చే 3-6 నెలల్లో అపార్ట్మెంట్ల ధరలు 10-15% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, పాత ధరలకు అందుబాటులో ఉన్న రెడీ-టు-మూవ్ ఇళ్లను తీసుకోవడం లాభదాయకం.తక్కువ వడ్డీ రేట్లు: ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేట్లు 5.5% నుండి 6.0% మధ్య ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.డిమాండ్&సరఫరా: హైదరాబాద్లో ఐటీ, ఫార్మా రంగాల విస్తరణ వల్ల ఇళ్లకు డిమాండ్ తగ్గడం లేదు. కొకాపేట, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ధరలు నిలకడగా పెరుగుతున్నాయి.మీరు సొంత అవసరానికి ఇల్లు కొనాలనుకుంటే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలే మేలనిపిస్తుంది. అయితే, పెట్టుబడి దృష్ట్యా ఆలోచించే వారు మాత్రం భౌగోళిక రాజకీయ పరిస్థితులు కుదుటపడే వరకు కొంత సమయం వేచి చూడటం లేదా 'ఓపెన్ ప్లాట్ల'పై దృష్టి పెట్టడం సురక్షితం.నిర్మాణం చేపట్టే వారు జాగ్రత్త!మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావిస్తే, బడ్జెట్లో 15-20% అదనపు నిధులు కేటాయించుకోవడం అవసరం. ధరల పెరుగుదల వల్ల అనుకున్న బడ్జెట్ దాటిపోయే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు స్థానిక సామగ్రిని వాడటం ద్వారా ఖర్చును నియంత్రించవచ్చు. -
సిబిల్ స్కోరుపై పెరుగుతున్న అవగాహన
ముంబై: రుణాల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న క్రెడిట్ స్కోరు గురించి తెలుసుకోవడంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ట్రాన్స్యూనియన్ సిబిల్ ఒక నివేదికలో తెలిపింది. దీని ప్రకారం 18.3 కోట్ల మంది భారతీయులు తమ సిబిల్ స్కోరును స్వయంగా పరిశీలించుకుంటున్నారు.తొలిసారిగా పరిశీలించుకునే వారి సంఖ్య గతేడాది డిసెంబర్ గణాంకాల ప్రకారం వార్షికంగా 27 శాతం పెరిగింది. క్రెడిట్ మానిటరింగ్ చేసుకుంటున్న వారి సగటు స్కోరు 728గా ఉంది. ఇలా పర్యవేక్షించుకుంటున్న వారిలో సుమారు 45 శాతం మంది ఆరు నెలల వ్యవధిలో తమ స్కోరును మరింత మెరుగుపర్చుకుంటున్నారు.సాధారణంగా వ్యక్తిగత రుణాల్లాంటివి అవసరమైనప్పుడు మాత్రమే వినియోగదారులు స్కోరును తెలుసుకునే వారని, కానీ ప్రస్తుతం తరచుగా తెలుసుకోవడం, దాన్ని మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నారని సంస్థ ఎండీ భవేష్ జైన్ తెలిపారు. మిలీనియల్స్, జెన్ జెడ్ తరం, మహిళలు ఈ విషయంలో ముందుంటున్నారని పేర్కొన్నారు. మెట్రోయేతర ప్రాంతాల్లో స్కోరు ను పరిశీలించుకునే ధోరణి పెరుగుతోందన్నారు. -
మినీ రత్న హోదాకు దగ్గర్లో ‘ఫ్యాక్ట్’
కోచి: ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ (ఫ్యాక్ట్) మినీరత్న హోదా పొందేందుకు కావాల్సిన దాదాపు అన్ని ముఖ్యమైన నిబంధనలను పూర్తి చేసిందని కంపెనీ డైరెక్టర్ (మార్కెటింగ్) అనుపమ్ మిశ్రా ప్రకటించారు. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోందని.. ఇది పూర్తయితే హోదా లభిస్తుందన్నారు.ఈ హోదాతో కంపెనీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎరువులు సహా ప్రతీ రంగంలోనూ స్వావలంబన దిశగా దేశం అడుగులు వేస్తోందంటూ.. ఈ దిశగా ఫ్యాక్ట్ తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు.‘‘ప్రభుత్వానికి వరుసగా మూడో ఏడాది డివిడెండ్లు చెల్లించాం. వరుసగా ఏడు సంవత్సరాల నుంచి లాభాల్లో కొనసాగుతున్నాం. ఐదేళ్లుగా కంపెనీ నికర విలువ సానుకూల స్థితిలో ఉంది. 2018–19లో కంపెనీ టర్నోవర్ రూ.18,00–1,900 కోట్లుగా ఉంటే.. నేడు రూ.5,000 కోట్లకు పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.50,000 కోట్లకు చేరింది’’అంటూ సంస్థ సాధించిన పురోగతిని మిశ్రా వివరించారు. -
వ్యాపారాలకు రూ.2వేల కోట్ల ప్రయోజనాలు: అమెజాన్
బెంగళూరు: దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ ప్లాట్ఫాం ద్వారా గతేడాది రూ. 2,000 కోట్ల మేర ప్రయోజనాలు పొందేందుకు దోహదపడినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ బిజినెస్ వెల్లడించింది. క్యాష్బ్యాక్ రివార్డులు, బల్క్ డిస్కౌంట్లు, ఎక్స్క్లూజివ్ డీల్స్ రూపంలో అత్యంత చిన్న వ్యాపారాల నుంచి భారీ స్థాయి వ్యాపారాల వరకు వివిధ సంస్థలు లబ్ధి పొందినట్లు వివరించింది.ఐటీ, ఎలక్ట్రానిక్స్పై అదనంగా 5 శాతం మేర, ఆఫీస్లకు అవసరమయ్యే ఉత్పత్తులపై 30 శాతం వరకు బల్క్ డిస్కౌంట్లు ఉంటున్నాయని పేర్కొంది. పారదర్శకత కారణంగా అమెజాన్ బిజినెస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. సూరత్, లూధియానా, కొచ్చి తదితర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ ధోరణి మరింత స్పష్టంగా ఉందని సంస్థ వివరించింది. తమ కస్టమర్ బేస్లో ఇలాంటి నగరాల్లోని వ్యాపారాల వాటా ప్రస్తుతం 70 శాతానికి చేరినట్లు అమెజాన్ బిజినెస్ వివరించింది. -
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ గా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ‘‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ ’గా పేరొందిన భారత్ ఔషధ పరిశ్రమ... దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానిస్తూ, ఆరోగ్య రంగంలోనే కాక ఆర్థిక అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తక్కువ ధరలతో నాణ్యమైన మందులు, భారీ ఎగుమతులు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలతో ప్రపంచ ఫార్మా రంగంలో భారత్కి ప్రత్యేక స్థానమని హర్షం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో ఫార్మా రంగం అభివృద్ధి చెందుతున్న విధానంపై ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’(పీఐబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య రంగానికి, ఆర్థికాభివృద్ధికి అనుసంధానకర్త ‘ఫార్మాస్యూటికల్’ రంగం కీలక స్థానాన్ని ఆక్రమించినట్లు తెలిపింది. అవసరమైన మందులు, టీకాలను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉపాధి అవకాశాలు, సప్లై చైన్ బలోపేతం, సామాజికాభివృద్ధికి ఈ రంగం తోడ్పడుతున్నట్లు వివరించింది. ప్రపంచ ఫార్మా మార్కెట్లో భారత్ది ప్రత్యేక స్థానం: భారత ఔషధ పరిశ్రమ ప్రపంచంలో వాల్యూమ్(పరిమాణం) పరంగా మూడవ స్థానం, విలువ పరంగా 11వ స్థానంలో ఉందని పీఐబీ తెలిపింది. దేశంలో 3 వేలకు పైగా కంపెనీలు, 10,500 తయారీ యూనిట్లు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం 60 బిలియన్ డాలర్ల విలువ కలిగిన దేశీయ మార్కెట్ 2030 నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరనుంది. భారత్ ప్రపంచంలో జనరిక్ మందుల అతిపెద్ద సరఫరాదారుగా నిలవనుంది. ప్రపంచ సరఫరాలో దాదాపు 20శాతం వాటా భారత్దే కావడం గమనార్హం. సుమారు 60వేల జనరిక్ బ్రాండ్లు 60 చికిత్స విభాగాల్లో ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ నమ్మకం, నాణ్యతకు గుర్తింపు: అమెరికా వెలుపల అత్యధికంగా యూఎస్ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఔషధ తయారీ యూనిట్లు భారత్లోనే ఉన్నాయని తెలిపింది. సుమారు 500 ఏపీఐ(యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్)తయారీ సంస్థలు ఉండటం ద్వారా ప్రపంచ ఏపీఐ మార్కెట్లో భారత్కు ఎనిమిది శాతం వాటా ఉంది. ఇక ఎగుమతుల్లోనూ భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. భారత్ డిప్తీరియా, టెటనస్, పెర్టుసిస్ (డీపీటీ), బీసీజీ మీజిల్స్ టీకాల సరఫరాలో ప్రథమ స్థానంలో ఉంది. యూనిసెఫ్కు 60% టీకాలను భారత్ సరఫరా చేస్తుండటం గరి్వందచదగ్గ విషయంగా పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ మీజిల్స్ టీకా అవసరాల్లో 90% భారత్ నుంచే సరఫరా అవుతోంది. ఇక 2024–25లో ఔషధ ఎగుమతులు 30.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుతం భారత్ 191 దేశాలకు ఔషధాలు ఎగుమతి చేస్తున్నట్లు వివరించింది.ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలుఫార్మా రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక పథకాలను అమలు చేస్తున్నట్లు పీఐబీ తెలిపింది. ఇందులో భాగంగా ప్రధానంగా.. ‘పీఎల్ఐ పథకం’. ఈ పథకం ప్రభావం రూ.3.16 లక్షల కోట్ల అమ్మకాలు, రూ.2.03 లక్షల కోట్ల ఎగుమతులు, సుమారు 97వేల ఉద్యోగాలు, బల్క్ డ్రగ్ – మెడికల్ డివైస్ పార్కులు అని వివరించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్కులు, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్లో మెడికల్ డివైస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ‘ప్రధాన్ మంత్రి భారతీయ జనఔషధి పరియోజన’ కింద దేశవ్యాప్తంగా 18,600కి పైగా కేంద్రాలు పనిచేస్తున్నాయి. తక్కువ ధరలకు నాణ్యమైన మందులు అందిస్తూ ప్రజల ఖర్చులను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇక ‘ఇన్నోవేషన్, పరిశోధన’కు కూడా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపింది. ఈపథకం కింద పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తున్నారు. 111 పరిశోధన ప్రాజెక్టులు, పేటెంట్లు నమోదు కావడం ఈ రంగం పురోగతిని సూచిస్తుందన్నారు. 2026–27 బడ్జెట్లో ‘‘బయోఫార్మా శక్తి’’ పథకానికి రూ.10వేల కోట్లు కేటాయించారు. బయోలాజిక్స్, బయోసిమిలర్స్ ఉత్పత్తిలో భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ వంటి సంస్థలు ఔషధాల నాణ్యత, ధరలు, భద్రతపై కట్టుదిట్టమైన నియంత్రణ నిర్వహిస్తున్నట్లు పీఐబీ వివరించింది.కొత్త మార్కెట్లలో విస్తరణ: నైజీరియా, మెక్సికో, బ్రెజిల్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతులు పెంచుతూ భారత్ తన మార్కెట్ను విస్తరిస్తూ అగ్రస్థానంలో నిలుస్తుందని పీఐబీ పేర్కొంది. ఇక విదేశీ పెట్టుబడులు కూడా పెరుగుతున్నట్లు వెల్లడించింది. ఫార్మా రంగం విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రధాన రంగాల్లో ఒకటిగా నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సెపె్టంబర్ వరకు రూ.13,193 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఇక వాణిజ్య ఒప్పందాలతో భారత్ గ్లోబల్గా విస్తరిస్తోంది. యూరోపియన్ యూనియన్, యూనైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్తో కుదిరిన వాణిజ్య ఒప్పందాలు భారత ఔషధ రంగానికి కొత్త అవకాశాలు తెరిచాయి. టారిఫ్ తగ్గింపులతో ఎగుమతులు పెరగనున్నాయి. ముఖ్యంగా యూకే మార్కెట్లో భారత జనరిక్ మందులకు మరింత పోటీ సామర్థ్యం లభించనున్నట్లు పీఐబీ పేర్కొంది. -
మైక్రోఫైనాన్స్ సంస్థలకు కేంద్రం ఆసరా
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మైక్రోఫైనాన్స్ రంగానికి దన్నుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ’క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్–2.0’ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎంఎఫ్ఐలకు సుమారు రూ. 20 వేల కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణాల లభ్యత పెరగనుంది. ఫలితంగా అట్టడుగు వర్గాలకు చెందిన సుమారు 36 లక్షల మంది చిన్న తరహా రుణ గ్రహీతలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎంఎఫ్ఐలకు ఇచ్చే రుణాలకు కేంద్రం గ్యారెంటీ కలి్పస్తుంది. సంస్థల పరిమాణాన్ని బట్టి (చిన్న, మధ్య, పెద్ద) ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలకు 70 శాతం నుంచి 80 శాతం వరకు గ్యారెంటీ కవరేజీ లభిస్తుంది. → సామాన్యులకు వడ్డీ భారం తగ్గించేలా కేంద్రం ఇందులో కీలక నిబంధన చేర్చింది. ఎంఎఫ్ఐలు చిన్న తరహా రుణ గ్రహీతలకు ఇచ్చే వడ్డీ రేటును.. గత ఆరు నెలల సగటు వడ్డీ రేటు కంటే కనీసం 1 శాతం తక్కువకు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల పరిధిలోకి వచ్చే చిన్న రుణ గ్రహీతలందరూ దీనికి అర్హులే. మైక్రోఫైనాన్స్ రంగం నిధుల లేమితో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే ఈ స్కీమ్ను తీసుకొచ్చారు. 2026 జూన్ 30 వరకు లేదా రూ.20 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ పూర్తయ్యే వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్యారంటీ స్కీమును మైక్రోఫైనాన్స్ పరిశ్రమ స్వీయ నియంత్రణ సంస్థ ఎంఎఫ్ఐఎన్ స్వాగతించింది. సవాళ్లెదుర్కొంటున్న తమ రంగానికి తోడ్పాటునిచ్చేలా సకాలంలో తీసుకున్న సరైన చర్యగా అభివరి్ణంచింది. → మరోవైపు, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఎగుమతిదారులకు మరింత మద్దతునిచ్చేలా మ్యుచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (ఎంసీజీఎస్–ఎంఎస్ఎంఈ)లో సవరణలు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సరీ్వసుల రంగాన్ని కూడా ఇందులో చేర్చినట్లు పేర్కొంది. -
సెమాగ్లూటైడ్ జనరిక్స్ వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైప్–2 మధుమేహం, ఊబకాయం నియంత్రణకు ఉపయోగించే సెమాగ్లూటైడ్ ఔషధం పేటెంట్ దేశీయంగా ముగియడంతో దేశీ ఫార్మా దిగ్గజాలు పెద్ద ఎత్తున చౌక జనరిక్ వెర్షన్లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. దీనితో వీటి ధరలు గణనీయంగా దిగి వచ్చాయి. జనరిక్ వెర్షన్ను ఆవిష్కరించిన దిగ్గజాల్లో డాక్టర్ రెడ్డీస్, నాట్కో, సన్ ఫార్మా, గ్లెన్మార్క్ మొదలైనవి ఉన్నాయి. ఇన్నోవేటర్ హోదాలో డెన్మార్క్కి చెందిన నోవో నార్డిస్క్ సంస్థ .. సెమాగ్లుటైడ్ మాలిక్యూల్తో తయారు చేసిన ఔషధాన్ని ఒజెంపిక్, వెగోవీ బ్రాండ్స్ పేరిట విక్రయిస్తోంది. నెలకు సరిపడే డోసేజీలకు సంబంధించి వీటి వ్యయాల పరిమాణం .. డోసేజీ, దశను బట్టి రూ. 8,800 నుంచి రూ. 11,175 వరకు ఉంటోంది. తాజాగా జనరిక్ వెర్షన్ల రాకతో ధరలు దాదాపు 80 శాతం వరకు దిగి వచి్చనట్లవుతుంది. మల్టీ–డోస్ వయల్స్, ప్రీ–ఫిల్డ్ పెన్ డివైజ్ల రూపంలో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ఔషధం ఒకటే అయినప్పటికీ ప్యాకేజింగ్, తయారీ విధానం, సౌకర్యం కారణంగా ప్రీ–ఫిల్డ్ పెన్ల ధర వయల్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. → డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సంస్థ ఒబెదా బ్రాండ్ పేరిట వారానికి ఒకసారి తీసుకునే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ని ప్రీ–ఫిల్డ్, డిస్పోజబుల్ పెన్ రూపంలో ప్రవేశపెట్టింది. కనీసం నాలుగు వారాలకు సరిపడేలా 2ఎంజీ, 4 ఎంజీ డోసుల్లో ఇది లభిస్తుంది. నెలవారీ వ్యయం రూ. 4,200గా ఉంటుందని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. దీన్ని ఇతర దేశాల్లో కూడా ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో యూఎస్వీ సంస్థ యుసెమా బ్రాండ్ పేరిట ఇంజెక్షన్ని ఆవిష్కరించింది. → మరోవైపు, నాట్కో ఫార్మా సంస్థ మల్టీ–డోస్ వయల్స్ని సెమానాట్, సెమాఫుల్ పేరిట ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. వీటి నెలవారీ వ్యయం రూ. 1,290–1,750 శ్రేణిలో ఉంటుంది. అలాగే రూ. 4,000 నుంచి రూ. 4,500 వరకు నెలవారీ వ్యయం ఉండే పెన్ డివైజ్ని వచ్చే నెలలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఇక సెమాగ్లుటైడ్ జనరిక్ వెర్షన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు నాట్కో ఫార్మాతో ఒప్పందం ఉన్న ఎరిస్ లైఫ్ సైన్సెస్.. దీన్ని ’సండే’ పేరిట ప్రవేశపెట్టింది. అటు టోరెంట్ ఫార్మా సంస్థ సెంబాలిక్, సెమాలిక్స్ బ్రాండ్స్ పేరిట ఆవిష్కరించింది. ఇతర సంస్థల వివరాలిలా.. సన్ ఫార్మా: నావెల్ట్రీట్, సెమాట్రినిటీ బ్రాండ్స్ కింద ఇంజెక్షన్లను ఆవిష్కరించింది. నావెల్ట్రీట్ 0.25 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు అయిదు డోసేజీల్లో లభిస్తుంది. వారంవారీ వ్యయం సుమారు రూ. 900 నుంచి రూ. 2,000 వరకు ఉంటుంది. ఇక సెమాట్రినిటీ వ్యయం రూ. 750 నుంచి రూ. 1,300 వరకు ఉంటుంది. గ్లెన్మార్క్: గ్లిపిక్ పేరిట ఇంజెక్షన్ని ప్రవేశపెట్టింది. వయల్స్ వ్యయం వారంవారీగా రూ. 325 నుంచి రూ. 440 వరకు ఉంటుంది. పెన్ల రూపంలో కూడా ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. జైడస్ లైఫ్సైన్సెస్: సెమాగ్లిన్టీఎం, మాషెమాటీఎం, ఆల్టర్మెట్ బ్రాండ్స్ పేరిట ఇంజెక్షన్లను ఆవిష్కరించింది. సగటున నెలవారీ వ్యయం రూ. 2,200గా ఉంటుంది. ఆల్కెమ్ ల్యాబ్స్: సెమాసైజ్, ఒబీసిమా, హెపాగ్లైడ్ బ్రాండ్స్ పేరిట ఇంజెక్షన్లను ఆవిషఅకరించింది. ప్రీ–ఫిల్డ్ డిస్పోజబుల్ ఇంజెక్షన్ పెన్ నెలకు నాలుగు డోసుల కింద లభిస్తుంది. వారం వారీ వ్యయం సుమారు రూ. 450 నుంచి, నెలవారీ వ్యయం రూ. 1,800 నుంచి ప్రారంభమవుతుంది. రీయూజబుల్ పెన్ రూపంలో కూడా లభిస్తుంది. -
చౌకగా సెమాగ్లూటైడ్.. దిగ్గజ కంపెనీల లాంచ్!
భారతదేశంలో డయాబెటిస్ (షుగర్) చికిత్సలో కొత్త మార్పులకు నాంది పలుకుతూ.. ప్రముఖ ఔషధ సంస్థలు గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్, జైడస్ లైఫ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ 'సెమాగ్లూటైడ్' (Semaglutide) ఆధారిత కొత్త మందులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. సెమాగ్లూటైడ్ ఔషధానికి భారతదేశంలో పేటెంట్ గడువు ముగిసిన వెంటనే ఈ కంపెనీలు తక్కువ ధరలతో జనరిక్ వేరియంట్లను విడుదల చేశాయి.టైప్-2 డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) చికిత్సలో కీలకంగా భావించే GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) థెరపీని మరింత చౌకగా, సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ కంపెనీలు ఈ ఉత్పత్తులు ప్రవేశపెట్టాయి. పెరుగుతున్న డయాబెటిస్ భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త లాంచ్లు దేశవ్యాప్తంగా రోగులకు మెరుగైన, అందుబాటు వైద్య సేవలను అందించనున్నాయి.మనదేశంలో డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. GLP-1 ఆధారిత చికిత్సలు ఈ పెరుగుతున్న ప్రజారోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది.ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (DCGI) ప్రకారం.. దేశంలో సుమారు 8.9 కోట్ల మంది పెద్దలు డయాబెటిస్తో బాధపడుతున్నారు, ఇది మొత్తం వయోజన జనాభాలో 10.5 శాతంగా ఉంది. ఊబకాయం దాదాపు అన్ని వయసుల వారిలో వేగంగా పెరుగుతోంది. పెద్దల్లో మహిళల్లో ఊబకాయం శాతం 12.6% నుంచి 24.0%కి, పురుషుల్లో 9.3% నుంచి 22.9%కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.సెమాగ్లుటైడ్ వంటి GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) మందులు బరువు తగ్గడంతో కూడా సహాయపడతాయి. ఇవి మెదడుకు కడుపు నిండినట్లు సంకేతాలు పంపి, జీర్ణక్రియను నెమ్మదింపజేసే ఒక సహజ హార్మోన్ను అనుకరించడం ద్వారా పనిచేస్తాయి. తద్వారా తక్కువ తింటారు.. క్రమంగా బరువు తగ్గడం జరుగుతుంది.ఇవి తక్కువ తినడానికి మరియు మరింత సమర్థవంతంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఆవిష్కర్త అయిన నోవో నార్డిస్క్, 20 మార్చి 2026న పేటెంట్ ప్రత్యేకతను కోల్పోకముందే, ప్రారంభ మార్కెట్ వాటాను చేజిక్కించుకునే ప్రయత్నంలో, గత సంవత్సరం భారతదేశంలో తన సెమాగ్లుటైడ్ బ్రాండ్లైన వెగోవి మరియు ఓజెంపిక్లను విడుదల చేసింది. -
రూ.47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే!
పోటీ ప్రపంచంలో లక్షల జీతం లభించే జాబ్ వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ.. తాను ఎంపికైన ఉద్యోగానికి కావలసిన నైపుణ్యం తన దగ్గర లేదని ఒక టెకీ రూ.47 లక్షల వేతనం లభించే ఉద్యోగాన్ని వదులుకున్నారు. దీనికి సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వనేష్ మాలి అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. తనకు పూణేలో ఒక మంచి కంపెనీలు సీనియర్ ఉద్యోగానికి రూ.47 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు. ప్యాకేజీ బాగుంది, కంపెనీ కూడా గొప్పదే, కానీ ఆ పదవికి అవసరమైన నైపుణ్యాలు నాకు ఇంకా పూర్తిగా లేవని.. తాను ప్రస్తుతం ఆ స్థాయిలో పని చేయడానికి సిద్ధంగా లేనని, ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆ ఆఫర్ను అంగీకరించి, ఉద్యోగంలోనే అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందని అన్నారు. కాగా మరికొందరు అతని నిజాయితీని ప్రశంసించారు. అలాంటి జాబ్ ఆఫర్ వదులుకోవడానికి ధైర్యం కావాలని మరికొందరు అన్నారు.Career Update:I recently got a fantastic job offer of Rs. 47 LPA in Pune for a senior role.The package was good and the company was great, but the position demanded skills I don’t fully possess yet.I politely rejected the offer, explaining that I am not ready to deliver at…— Vanesh Mali (@vaneshmali) March 20, 2026 -
వారం రోజుల్లో రూ.13 వేలు తగ్గిన బంగారం: కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు ఊహకు అందని విధంగా తగ్గుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా భారీ తగ్గడంతో పసిడి ప్రియులలో సంతోషం నెలకొంది. ఇంకా తగ్గే అవకాశం ఉందా? అన్నట్లు కొందరు వేచి చూస్తున్నారు. ఈ కథనంలో వారం రోజుల్లో గోల్డ్ రేటులో ఎంత వ్యత్యాసం ఉండనే విషయాలను తెలుసుకుందాం.మార్చి 15న (ఆదివారం) హైదరాబాద్, విజయవాడలలో 1,59,660 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (శనివారం) 1,45,970 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో తగ్గిన రేటు రూ. 13,690 తగ్గింది. 22 క్యారెట్ల తులం బంగారం విషయానికి వస్తే.. దీని ధర రూ.1,46,350 నుంచి రూ.1,33,800 వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,47,600 రూపాయల నుంచి 136200 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 161020 రూపాయల నుంచి 1,48,580 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధరలు వారం రోజుల్లో ఎంత తగ్గిందనే విషయం స్పష్టమవుతోంది.దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా వారం రోజుల్లో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. మార్చి 15న రూ.1,59,810 వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు, మార్చి 21 నాటికి రూ.1,46,120 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,46,500 రూపాయల దగ్గర నుంచి రూ. 1,33,950 వద్దకు చేరింది. -
యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్2 లాంచ్: ధర ఎంతంటే?
డిసెంబర్ 2020లో యాపిల్ కంపెనీ ఒరిజినల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ విడుదల చేసిన తరువాత.. ఇప్పుడు ఎయిర్పాడ్స్ మ్యాక్స్ 2ను పరిచయం చేసింది. ఈ కొత్త ప్రీమియం ఓవర్-ఇయర్ హెడ్ఫోన్ల ధర భారతదేశంలో రూ. 67,900గా ఉంది. ఈ కొత్త హెడ్ఫోన్లు యాపిల్ హెచ్2 చిప్తో పనిచేస్తాయి. ‘మునపటి తరంతో పోల్చితే 1.5 రెట్లు ఎక్కువ ప్రభావంతమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఏఎన్సి)ను అందిస్తుంది’ అని కంపెనీ ప్రకటించింది. విమానం, రైలు శబ్దాల వంటి బాహ్య శబ్దాలను ఈ అప్గ్రేడ్ సమర్థవంతంగా నిరోధిస్తుంది.ఈ హెడ్ఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్లు మార్చి 25న ప్రారంభమవుతాయి, కాగా డెలివరీలు ఏప్రిల్ ఆరంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ హెడ్ఫోన్లో అప్గ్రేడ్ మైక్రోఫోన్లు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి వాటిని అప్డేట్ చేసింది. కాబట్టి ఇది వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుంది.Headphones that are so much more than just headphones!The new AirPods Max 2 have even better audio, even better ANC, and even better features like Adaptive Audio and Live Translation. pic.twitter.com/tXnOxPCLor— Greg Joswiak (@gregjoz) March 16, 2026యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్భారతదేశంలో యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా యువత, ప్రీమియం వినియోగదారుల మధ్య iPhone, MacBook, iPad వంటి పరికరాలు ప్రతిష్టాత్మక గుర్తుగా మారాయి. మెరుగైన కెమెరా నాణ్యత, సేఫ్టీ ఫీచర్స్, ఎకోసిస్టమ్ సమగ్రత వల్ల వినియోగదారులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా.. EMI ఆఫర్లు, ఆన్లైన్ విక్రయాలు.. భారతదేశంలో స్థానిక తయారీ పెరగడం వంటి అంశాలు కూడా యాపిల్ ఉత్పత్తుల చేరువను పెంచాయి. -
ఆయిల్పై అమెరికా అంచనా.. ఇరాన్ క్లారిటీ
అంతర్జాతీయ చమురు విఫణిలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ షాక్ ఇచ్చింది. తమ వద్ద అంతర్జాతీయ సరఫరాకు సరిపడా అదనపు ముడి చమురు నిల్వలు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. ఆంక్షల సడలింపు ద్వారా ఇరాన్ నుండి పెద్ద ఎత్తున చమురు సరఫరా జరుగుతుందని, తద్వారా ధరలు తగ్గుతాయని అమెరికా చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది.అమెరికా ప్రకటన - ఇరాన్ వివరణమార్చి 20 నాటికి నౌకల్లో లోడ్ చేసిన ముడి చమురుపై అమెరికా ఇటీవల స్వల్పకాలిక ఆంక్షలను సడలించింది. ఏప్రిల్ 19 వరకు అమల్లో ఉండే ఈ మినహాయింపు ద్వారా సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు మార్కెట్లోకి వస్తుందని, తద్వారా పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేయవచ్చని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే, ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ విడుదల చేసిన ప్రకటన ఈ అంచనాలను తలకిందులు చేసింది. "ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేయడానికి ఇరాన్ వద్ద అదనపు ముడి చమురు లేదా మిగులు నిల్వలు లేవు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ వ్యాఖ్యలు కేవలం కొనుగోలుదారులలో భరోసా నింపడానికి, మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తున్నాయి."మంటలు పుట్టిస్తున్న ముడి చమురు ధరలుపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా సాగే రవాణాపై ఆందోళనల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 120 డాలర్ల మార్కును తాకింది. ఈ తరుణంలో ఇరాన్ నుండి అదనపు సరఫరా ఉండదని తెలియడంతో మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఫుల్ ఛార్జ్పై 580 కిమీ.. ఇదిగో లెక్సస్ కొత్త ఎలక్ట్రిక్ కారు!
లెక్సస్ ఇండియా.. కొత్త తరం లెక్సస్ ES 500eని భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 89.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది భారత మార్కెట్ కోసం కంపెనీ అందిస్తున్న మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ వాహనం ఇదే. దీని హైబ్రిడ్ వెర్షన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.లెక్సస్ ES 500e కారు 74.69kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇది 338bhp శక్తిని ఉత్పత్తి చేసే డ్యూయల్ మోటార్ సెటప్ను కలిగి ఉంది, ఇది 5.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్పై 580 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.డిజైన్ విషయానికి వస్తే.. కొత్త ES డ్యూయల్ L-ఆకారపు LED DRLలతో అప్డేటెడ్ స్టైలింగ్ లాంగ్వేజ్ను అనుసరిస్తుంది. అయితే హెడ్ల్యాంప్లు బంపర్పై దిగువన ఉన్నాయి. 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు.. సెమీ-ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ను పొందుతుంది. వెనుక భాగంలో లెక్సస్ అక్షరాలతో కూడిన ఒక సొగసైన కనెక్టెడ్ LED లైట్ బార్ ఉంటుంది.లోపల, క్యాబిన్లో 12.3-అంగుళాల హుడ్లెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్.. వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 14-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో లెవెల్ 2 ADAS, ఎలక్ట్రిక్ సన్రూఫ్, 17-స్పీకర్ల మార్క్ లెవిన్సన్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ IRVM, సాఫ్ట్-క్లోజ్ డోర్లు, డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు ఉన్నాయి. -
ఎస్బీఐకి ఐటీ శాఖ భారీ ట్యాక్స్ నోటీసు..
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ఆదాయపు పన్ను శాఖ నుండి భారీ నోటీసు అందింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 6,337.5 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎస్బీఐ ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.అసలు ఏం జరిగింది?ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(3), 144సి(3), 144బి కింద ఐటీ శాఖ మార్చి 19న ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి (AY24) సంబంధించి నిర్వహించిన స్క్రూటినీ అసెస్మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ పన్ను డిమాండ్ ఉత్పన్నమైందని బ్యాంక్ తెలిపింది. వివిధ అంశాల్లో ఆదాయపు పన్ను శాఖ చేసిన కోతలే (Disallowances) ఈ భారీ మొత్తానికి కారణమని తెలుస్తోంది.సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే ఏవైనా ప్రధాన పరిణామాలు చోటుచేసుకుంటే వాటిని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పన్ను డిమాండ్ మొత్తం 'మెటీరియాలిటీ థ్రెషోల్డ్' (నిర్ణీత పరిమితి) కంటే ఎక్కువగా ఉన్నందున, పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్లో భాగంగా ఎస్బీఐ ఈ వివరాలను బహిర్గతం చేసింది.ఎస్బీఐ తదుపరి చర్యలుఈ నోటీసుపై ఎస్బీఐ ధీమాగా ఉంది. గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి అంశాలపైనే బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోందని, తాజా నోటీసును కూడా అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పన్ను నోటీసు వల్ల బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణపై ఎటువంటి ప్రభావం ఉండదని ఎస్బీఐ యాజమాన్యం పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది. -
మారనున్న పాన్ కార్డు రూల్స్.. కేంద్రం కఠిన నిబంధనలు!
భారతదేశంలో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (PAN) కోసం దరఖాస్తు చేసే విధానంలో.. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఆధార్ కార్డును ఉపయోగించి.. పాన్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశం ఉండేది. అయితే మార్చి 31 తరువాత అదనంగా గుర్తింపుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ఈ కొత్త నియమాల ప్రకారం.. PAN కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి ఆధార్తో పాటు మరో గుర్తింపు కార్డును తప్పనిసరిగా సమర్పించాలి. ఇందులో బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి సర్టిఫికేట్ లేదా మేజిస్ట్రేట్ ఇచ్చే అఫిడవిట్ వంటి పత్రాలు ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న సరళమైన విధానం కంటే కాస్త కఠినమైన ధృవీకరణ ప్రక్రియగా మారనుంది.కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి.. PAN కార్డులో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరుతో పూర్తిగా సరిపోవాలి. ఇంతకు ముందు చిన్న మార్పులు లేదా వేరియేషన్లు ఉన్నా పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ ఏప్రిల్ నుంచి అలాంటి అసమానతలకు అవకాశం ఉండదు. ఇది వ్యక్తుల గుర్తింపు వివరాలను మరింత ఖచ్చితంగా నమోదు చేయడానికి తీసుకున్న చర్యలలో భాగం అని తెలుస్తోంది.సైబర్ నేరాలుఇటీవల కాలంలో ఈ పాన్ డౌన్లోడ్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. సెకన్ల వ్యవధిలో పాన్ డౌన్లోడ్ చేసుకోండంటూ.. కొందరు సైబర్ నేరగాళ్లు కొన్ని లింక్స్ పంపిస్తున్నారు. ఆ లింక్స్ నమ్మి ఓపెన్ చేయాలని చూస్తే యూజర్లు మోసపోతారు. అలాంటి మోసాలకు చెక్ పెట్టడంలో భాగంగానే.. కేంద్రం కొత్త డాక్యుమెంట్స్ కూడా అందించాలని ద్రువీకరించింది.ఇదీ చదవండి: తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా? -
నాడు జుకర్బర్గ్.. నేడు మన సూర్య
ఒకప్పుడు 'ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్' అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్. దాదాపు 18 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న ఆ రికార్డును ఇప్పుడు ఒక భారత సంతతి యువకుడు తిరగరాశాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే అపర కుబేరుడిగా అవతరించి, ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు మన సూర్య మిధా.18 ఏళ్ల రికార్డు బ్రేక్గతంలో మార్క్ జుకర్బర్గ్ తన 23వ ఏట బిలియనీర్ హోదాను అందుకుని రికార్డు సృష్టించారు. అయితే, సూర్య మిధా అంతకంటే ఒక ఏడాది ముందే, అంటే 22 ఏళ్లకే 2.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 18,000 కోట్లు) నెట్వర్త్తో జుకర్బర్గ్ను అధిగమించారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ సూర్యనే!విజయానికి బాట వేసిన 'మెర్కోర్'సూర్య సాధించిన ఈ అసాధారణ విజయానికి మూలం ఆయన స్థాపించిన 'మెర్కోర్' అనే ఏఐ (AI) స్టార్టప్. 2023లో తన స్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్లతో కలిసి ఆయన ఈ సంస్థను ప్రారంభించారు.మెర్కోర్ అనేది ఒక కృత్రిమ మేధ (AI) ఆధారిత రిక్రూట్మెంట్ ప్లాట్ఫారమ్. కంపెనీలకు కావాల్సిన సరైన ప్రతిభావంతులను గుర్తించేందుకు ఇది 'AI అవతార్'లను ఉపయోగిస్తుంది. దరఖాస్తుదారులను నేరుగా ఇంటర్వ్యూ చేయడం ద్వారా నియామక ప్రక్రియను ఈ ప్లాట్ఫారమ్ సులభతరం చేస్తుంది.2025 అక్టోబర్ లో జరిగిన 'సిరీస్-సి' ఫండింగ్లో ఈ సంస్థ ఏకంగా 350 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ప్రస్తుతం ఈ సంస్థలో బ్రెండన్ ఫుడీ సీఈవోగా, ఆదర్శ్ హిరేమత్ సీటీవోగా వ్యవహరిస్తుండగా, సూర్య మిధా బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఢిల్లీ టూ కాలిఫోర్నియా..సూర్య మిధా మూలాలు భారతదేశంలోని ఢిల్లీలో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వెళ్లి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. మౌంటైన్ వ్యూలో జన్మించిన సూర్య, జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో విదేశీ వ్యవహారాల అంశంపై విద్యనభ్యసించారు. సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న మక్కువతో, స్నేహితులతో కలిసి ప్రారంభించిన స్టార్టప్ నేడు ఆయనను ప్రపంచ కుబేరుల జాబితాలో నిలబెట్టింది. -
మొండి బకాయిదారుల తీరుపై ఆగ్రహం
దివాలా, రుణ పరిష్కార చట్టం (ఐబీసీ)లోని లొసుగులను అడ్డు పెట్టుకునే మొండి బకాయిదారుల తీరుపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని రక్షణ కవచంగా వాడుకుంటూ అప్పులు ఎగ్గొట్టే ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. జస్టిస్ మనీష్ పితాలే, జస్టిస్ శ్రీరామ్ శిర్సత్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఏమిటీ ఆందోళనకర ధోరణి?రుణ ఎగవేతదారులు అనుసరిస్తున్న వ్యూహాలను కోర్టు ‘డిస్టర్బింగ్ ట్రెండ్’(ఆందోళనకర ధోరణి)గా అభివర్ణించింది. సాధారణంగా బ్యాంకులు తాకట్టు పెట్టిన ఆస్తులను రికవరీ చేయడానికి ‘సర్ఫేసీ’ (SARFAESI) చట్టం కింద వేలం ప్రక్రియ చేపడతాయి. అయితే, ఈ ప్రక్రియ ముగిసి వేలంలో ఆస్తులు కొనుగోలు చేసిన వారు రంగంలోకి వచ్చే వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండే డిఫాల్టర్లు చివరి నిమిషంలో ఎన్సీఎల్టీని(వివాద పరిష్కారాల ట్రిబ్యునల్) ఆశ్రయిస్తున్నారు.‘ఐబీసీ కింద తప్పుడు మార్గాల్లో మొరటోరియం(చట్టబద్ధంగా కొంతకాలం పాటు వేలం వాయిదా వేయడం) పొందడం ద్వారా వారు అప్పటివరకు జరిగిన చట్టబద్ధమైన వేలం ప్రక్రియను స్తంభింపజేస్తున్నారు. ఇది కేవలం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే కాకుండా దేశ వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తుంది’ అని బాంబే హైకోర్టు తెలిపింది. ‘కొన్ని సంస్థల తీరువల్ల ఐబీసీ లక్ష్యం దెబ్బతింటోంది. ఐబీసీ అసలు ఉద్దేశం రుణ పరిష్కారం, కానీ ఇక్కడ అది రికవరీని అడ్డుకోవడానికి వాడుతున్నారు. ఇటువంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. నిజాయితీ గల రుణదాతల హక్కులను కాపాడటంలో కఠినంగా వ్యవహరించాలి’ అని చెప్పింది.కేసు నేపథ్యం ఇదే..రోజినా ఫిరోజ్ హజియాని, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సంస్థ రూ.6.25 కోట్ల రుణ సౌకర్యాన్ని పొందింది. అప్పు చెల్లించకపోవడంతో బ్యాంకు ముంబైలోని తాకట్టు ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేసింది. వేలం ప్రక్రియ పూర్తయి పిటిషనర్లు ఆ ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత.. సదరు రుణగ్రహీతలు ఒక్కసారిగా ఐబీసీని తెరపైకి తెచ్చి ఎన్సీఎల్టీ ద్వారా స్టే పొందారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) సేల్ రిజిస్ట్రేషన్ను నిలిపివేసింది. దీన్ని సవాలు చేస్తూ కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించారు.దేశంలో మొండి బకాయిల వసూలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బలమైన ఆయుధం ఐబీసీ. అయితే, కొందరు విల్ఫుడ్ డిఫాల్టర్లు(ఉద్దేశపూర్వక ఎగవేతదారులు) దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని బ్యాంకుల చేతులు కట్టేస్తున్నారు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చట్టంలోని లొసుగులను వాడుకుని కాలయాపన చేసే వారికి గట్టి హెచ్చరిక. ఇది భవిష్యత్తులో వేలం కొనుగోలుదారులకు భరోసానివ్వడమే కాకుండా బ్యాంకింగ్ రంగంలో క్రమశిక్షణను పెంచుతుంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
‘జీడి’ రైతుకు కొత్త ఆదాయం
సాధారణంగా జీడి తోటలంటే కేవలం జీడిపిక్కల కోసమేననే భావన రైతుల్లో బలంగా ఉంది. కానీ, ఆ పిక్కకు అనుబంధంగా ఉండే ‘జీడిపండు’ రైతు ఆర్థిక స్థితిగతులను మార్చేయగల అద్భుత శక్తి అని వ్యవసాయ రంగ నిపుణులు నొక్కి చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా లక్షలాది టన్నుల జీడిపండు వృథాగా నేలపాలవుతోందని, దీన్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పుత్తూరులోని ఐకార్-జీడి పరిశోధన డైరెక్టరేట్ (డీసీఆర్) నిర్వహించిన పరిశ్రమల ముఖాముఖి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది.గణాంకాలు ఇలా..డీసీఆర్ డైరెక్టర్ జె.దినకర అడిగా సమర్పించిన వివరాల ప్రకారం, దేశంలో జీడిపండు వినియోగం అత్యల్పంగా ఉంది. భారతదేశంలో ఏటా సుమారు 60 లక్షల టన్నుల జీడిపండు ఉత్పత్తి అవుతోంది. ఇందులో కేవలం 1 శాతం మాత్రమే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి వాడుతున్నారు. ఒక హెక్టారు జీడి తోటలో సగటున 1 టన్ను జీడిపిక్కలు లభిస్తే ఏకంగా 8 టన్నుల జీడిపండు లభిస్తుంది. అంటే మనం ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న పిక్కల కంటే 8 రెట్లు ఎక్కువగా పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన, సాంకేతికత లేక వాటిని వృథా చేస్తున్నాం. జీడిపండు నుంచి రసం తీసిన తర్వాత మిగిలే పిప్పితోనూ ఆదాయం పొందే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ సహకారంతో జీడిపండు పిప్పి పొడితో చేపల మేతను తయారు చేసే సాంకేతికతను డీసీఆర్ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే స్వచ్ఛమైన జీడిపండు రసం, పాశ్చరైజ్డ్ జ్యూస్, లిక్విడ్ స్వీటెనర్, జీడిపండు పిప్పి టీ వంటి వినూత్న ఉత్పత్తుల సాంకేతికతను డైరెక్టరేట్ సిద్ధం చేసింది.బ్రెజిల్ ఆదర్శంబ్రెజిల్ వంటి దేశాల్లో జీడిపండును అత్యధికంగా వినియోగించుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. భారతదేశంలో చిన్న స్థాయిలోనైనా ఈ ప్రయత్నం మొదలుపెడితే భవిష్యత్తులో ఇది పెద్ద పరిశ్రమగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రభుత్వ సంస్థలు తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను బదిలీ చేసేటప్పుడు వసూలు చేసే రాయల్టీలు స్టార్టప్లను నిరుత్సాహపరిచేలా ఉండకూడదు. నామమాత్రపు ధరలకే సాంకేతికతను అందిస్తే యువత ఈ రంగంలోకి వస్తారు’ అని చెబుతున్నారు.కేవలం జీడిపిక్కల అమ్మకానికే పరిమితం కాకుండా జీడిపండును కూడా ఒక వాణిజ్య పంటగా గుర్తిస్తే రైతులకు ఇది బోనస్ ఆదాయం అవుతుంది. ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త ఊపిరి పోయడం ఖాయం.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
గుడ్న్యూస్.. బంగారం బాగా తగ్గిందోచ్!!
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా గణనీయంగా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారుల తొలగింపు
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ వేటు వేసింది. ఎన్నారై (NRI) క్లయింట్లకు 'క్రెడిట్ సూయిస్ AT-1' బాండ్లను తప్పుదోవ పట్టించి విక్రయించినట్లు తేలడంతో బ్యాంక్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మరోవైపు బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామాతో గురువారం స్టాక్ మార్కెట్లో బ్యాంక్ షేర్లు 2.4% మేర పతనమయ్యాయి.వేటు పడిన అధికారులు వీరే..దుబాయ్ బ్రాంచ్ ద్వారా జరిగిన ఈ బాండ్ల విక్రయ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు ఉన్నతాధికారులను బ్యాంక్ విధుల నుంచి తొలగించింది. వారిలో బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ సంపత్ కుమార్, ఈవీపీ (మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా & ఎన్నారై బిజినెస్) హర్ష్ గుప్తా, ఎస్వీపీ స్థాయి అధికారి పాయల్ మంధ్యాన్ ఉన్నారు.అసలేం జరిగింది?జనవరి 2025లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై బ్యాంక్ అంతర్గత విచారణ చేపట్టింది. దుబాయ్, బహ్రెయిన్ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది, భారత ఎన్నారై క్లయింట్లను తప్పుదోవ పట్టించి అధిక రిస్క్ ఉన్న AT-1 బాండ్లను విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.క్లయింట్ల వద్ద ఉన్న ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లను ఈ బాండ్లలోకి మళ్లించేలా ఒత్తిడి తెచ్చారు. ఈ బాండ్లను సురక్షితమైన 'ఫిక్స్డ్ మెచ్యూరిటీ' ఉత్పత్తులుగా ప్రచారం చేశారు. పెట్టుబడిదారుల నుంచి ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, బాండ్లలోని రిస్క్ అంశాలను వారికి వివరించకుండా దాచిపెట్టారని విచారణలో తేలింది.రెగ్యులేటరీ చర్యలు - భారీ నష్టంక్రెడిట్ సూయిస్ బ్యాంక్ పతనం తర్వాత, యూబీఎస్ (UBS) నేతృత్వంలో జరిగిన బెయిలౌట్ సమయంలో ఈ AT-1 బాండ్ల విలువ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు. ఎన్నారైల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా నిషేధం విధించింది.బ్యాంక్ వివరణ"మా యూఏఈ బ్రాంచ్లో క్లయింట్ ఆన్-బోర్డింగ్ ప్రక్రియలో కొన్ని లోపాలను గుర్తించాం. అంతర్గత విచారణ అనంతరం నిబంధనల ప్రకారం బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం" అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.ఏమిటీ AT-1 బాండ్లు?ఇవి ఈక్విటీ లక్షణాలున్న రుణ సాధనాలు. ఇందులో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటే లేదా దివాలా తీస్తే, ఈ బాండ్లలో పెట్టిన పెట్టుబడిని తిరిగి చెల్లించాల్సిన అవసరం బ్యాంకులకు ఉండదు. -
సాగుకు ముందస్తు భరోసా
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగింది. రానున్న ఖరీఫ్-2026 సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతులను వేగవంతం చేస్తూ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.యూరియా ఉత్పత్తికి ప్రాధాన్యతదేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు చేసింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) కొరత కారణంగా పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్న ప్లాంట్లకు ఊరటనిస్తూ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.ఎల్పీజీ(వంటగ్యాస్) అవసరాల తర్వాత గ్యాస్ సరఫరాలో ఎరువుల ప్లాంట్లకు రెండో ప్రాధాన్యత కల్పించారు. స్పాట్ మార్కెట్ నుంచి బిడ్డింగ్ ద్వారా అదనంగా 7.31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే(ఎంఎంఎస్సీఎండీ) గ్యాస్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్లాంట్లకు అందుతున్న గ్యాస్ సరఫరా 32 ఎంఎంఎస్సీఎండీ నుంచి 39.31 ఎంఎంఎస్సీఎండీకి (23 శాతం) పెరుగుతుంది. అమోనియాను విడిగా విక్రయించవద్దని దాన్ని పూర్తిగా యూరియా తయారీకే ఉపయోగించాలని కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.ప్రస్తుతం ప్లాంట్లకు అవసరమైన గ్యాస్లో 62 శాతం మాత్రమే అందుతుండగా కొత్త ఒప్పందంతో అది 76 శాతానికి చేరనుంది. దీనివల్ల దేశీయ యూరియా ఉత్పత్తి రోజుకు 54,500 టన్నుల నుంచి 67,000 టన్నులకు పెరుగుతుందని అంచనా.ఖరీఫ్ 2026.. అందుబాటులో భారీ నిల్వలుజూన్ 1న నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ కోసం ఇప్పటికే సరిపడా నిల్వలను సిద్ధం చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గా ఉన్నాయన్నారు.మార్చి 19 నాటికి ఎరువుల నిల్వల వివరాలు (లక్షల టన్నుల్లో)ఎరువు రకంప్రస్తుత నిల్వలు (2026)గతేడాది నిల్వలు (2025)యూరియా61.1455.22డీఏపీ24.2411.85కాంప్లెక్స్57.2134.44ఎస్ఎస్పీ24.823.15ఎంఓపీ12.6514.13 వ్యూహాత్మక అడుగులుయుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ రష్యా, బెలారస్, మొరాకో, కెనడా వంటి దేశాలు ఎరువుల సరఫరాకు ముందుకొచ్చాయి. అయితే, ప్రభుత్వం ప్రస్తుతం దేశీయంగా యూరియా ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించింది. రాబోయే 1-2 వారాల్లో అంతర్జాతీయ పరిస్థితులు కుదుటపడితే అవసరానికి అనుగుణంగా దిగుమతులపై తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
విదేశీ ఇన్వెస్టర్లకు ఇదో అద్భుత అవకాశం
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో చోటుచేసుకున్న ఇటీవలి మార్పులు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు ఒక గొప్ప అవకాశంగా మారాయని సెబీ హోల్ టైమ్ మెంబర్ కమలేష్ చంద్ర వర్ష్నే పేర్కొన్నారు. ప్రస్తుత కరెక్షన్ వల్ల షేర్ల విలువ ఆకర్షణీయంగా మారాయని, ఇది భారత్లో పెట్టుబడులు పెంచుకోవడానికి సరైన సమయమని విశ్లేషించారు.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) వేదికగా జరిగిన ‘రష్యా-ఇండియా క్యాపిటల్ మార్కెట్ ఇంటిగ్రేషన్’ ఫోరంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత కొన్ని రోజులుగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. ఈ కరెక్షన్ వల్ల పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని వర్ష్నే తెలిపారు. అంతర్జాతీయ ఒడిదొడుకుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయదారులుగా ఉన్నారు. కేవలం మార్చి మొదటి 15 రోజుల్లోనే సుమారు రూ.77,000 కోట్ల నిధులు బయటకు వెళ్లడం గమనార్హం. రష్యా ఇన్వెస్టర్లకు ఎదురవుతున్న సాంకేతిక, విధానపరమైన అడ్డంకులను తొలగించడానికి సెబీ సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.‘భారతీయ మార్కెట్లలోని అనుబంధ సంస్థల విలువ, విదేశాల్లోని వారి మాతృ సంస్థల కంటే ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. రష్యా కంపెనీలు భారత మార్కెట్లలో లిస్ట్ అవ్వడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు’ అని తెలిపారు. భారతీయ మార్కెట్లు కేవలం పెట్టుబడితోపాటు అంతర్జాతీయ ఆర్థిక అనుసంధానానికి వేదికగా మారుతున్నాయని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓ ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ఇంధన భద్రతలో భారత్ ముందున్న సవాలు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల, సరఫరా గొలుసులో అంతరాయాలు భారత్ వంటి భారీ వినియోగ క్రూడ్ దేశాలకు హెచ్చరిక లాంటిది. ఈ నేపథ్యంలో దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలవాల్సిన వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు భారత్లో ఏ స్థాయిలో ఉన్నాయి? మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.వ్యూహాత్మక నిల్వలు ఎందుకు కీలకం?ఇంధన నిల్వలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ప్రభుత్వం నిర్వహించే వ్యూహాత్మక నిల్వలు, రిఫైనరీలు నిర్వహించే వాణిజ్య నిల్వలు. వీటి ప్రాముఖ్యత ఆర్థిక పరంగానే కాకుండా దేశ రక్షణకు కూడా సంబంధించింది కావడం గమనార్హం.భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరంతర ఇంధన సరఫరాకు ఇవి అండగా నిలుస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు ఈ నిల్వలు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. ఇంధనాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించే దేశాల ముందు భారత్ తలవంచకుండా ఉండేందుకు ఈ బఫర్ స్టాక్ రక్షణ కవచంగా పనిచేస్తుంది.ఆందోళనకరంగా ఎల్పీజీ నిల్వలుభారత్ వంటగ్యాస్ పంపిణీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ, నిల్వ సామర్థ్యం విషయంలో మాత్రం వెనుకబడి ఉంది. విశాఖపట్నం కేవర్న్(హెచ్పీసీఎల్, టోటల్ఎనర్జీస్ జేవీ) సామర్థ్యం 60,000 టన్నులు, మంగళూరు కేవర్న్(హెచ్పీసీఎల్) 80,000 టన్నులతో మొత్తం సామర్థ్యం 1,40,000 టన్నులుగా ఉంది.దేశవ్యాప్తంగా రోజువారీ ఎల్పీజీ డిమాండ్ సుమారు 90,000 టన్నులు అని అంచనా. అంటే మన దగ్గర ఉన్న వ్యూహాత్మక నిల్వలు కనీసం రెండు రోజులకు కూడా సరిపోవు. ప్రస్తుతం మన మౌలిక సదుపాయాలన్నీ గ్యాస్ను పోర్టుల నుంచి నేరుగా వినియోగదారులకు చేరవేసే ‘ఆపరేషనల్ ఫ్లో’ మోడల్లోనే ఉన్నాయి తప్ప దీర్ఘకాలిక నిల్వ కోసం ఉద్దేశించినవి కావని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఎందుకీ పరిస్థితి?ముడి చమురు నిల్వల విషయంలో భారత్ ఇప్పటికే భారీ వ్యూహాత్మక నిల్వలను నిర్మించుకుంది. కానీ గ్యాస్ విషయంలో మాత్రం ఆ పురోగతి కనిపించలేదు. దీనికి కొన్ని కారణాలున్నాయి.గతంలో గ్యాస్ సరఫరా సులభంగా, తక్కువ ధరకే లభించడంతో నిల్వల కంటే సరఫరా వ్యవస్థపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.గ్యాస్ను భూగర్భంలో నిల్వ చేయడానికి తగిన సహజ కేవర్లు గుర్తించడం సాంకేతికంగా సంక్లిష్టమైన ప్రక్రియ.గ్యాస్ స్టోరేజ్ టెర్మినల్స్ నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్నది.కొత్త వ్యూహం: ప్రభుత్వం ఏం చేస్తోంది?పశ్చిమాసియా సంక్షోభం తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యాస్ భద్రతపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వ్యూహాత్మక గ్యాస్ నిల్వల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు పెట్రోలియం శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎల్ఎన్జీ/ఎల్పీజీ టెర్మినల్స్లో అదనంగా 10 శాతం నిల్వ సామర్థ్యాన్ని తప్పనిసరి చేసే నిబంధనను సమీక్షిస్తున్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఆరు కొత్త ప్రాంతాల్లో నిల్వ కేంద్రాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో ఉన్న ‘సాల్ట్ కేవర్లు’ గ్యాస్ నిల్వకు అత్యంత అనువైనవిగా భావిస్తున్నారు.అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకోవాలంటే భారత్ కేవలం సరఫరాపైనే కాకుండా నిల్వపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. విధానపరమైన వేగం, సాంకేతిక తోడ్పాటు తోడైతేనే ఇంధన భద్రతలో భారత్ స్వయంసమృద్ధి సాధించగలదు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
రూపీ.. ‘లో’బీపీ
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, క్రూడాయిల్ రేట్లు పెరిగిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోతోంది. డాలర్తో పోలిస్తే శుక్రవారం 64 పైసలు క్షీణించి కొత్త ఆల్టైమ్ కనిష్టం 93.53 వద్ద క్లోజయ్యింది. రిస్కు తీసుకోవడానికి ఇన్వెస్టర్లు ఇష్టపడకపోవడం, ముడిచమురు ధరలు ఎగియడంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ అనిశ్చితి రిసు్కల వల్ల ఇంధన రేట్లు పెరుగుతుండటంతో వాణిజ్య లోటు, ఫలితంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఎగిసే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో పోలిస్తే రూపాయి ట్రేడింగ్ 92.92 వద్ద ప్రారంభమైంది. తర్వాత తొలిసారిగా 93 మార్కు దిగువకు పడిపోయింది. చివరికి 64 పైసల నష్టంతో ముగిసింది. రాబోయే రోజుల్లో రూపాయి మారకం 93.75–92.90 శ్రేణిలో తిరుగాడొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
గ్యాంబ్లింగ్ సైట్లపై కేంద్రం కొరడా
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. 300 పైగా వెబ్సైట్లు, యాప్లను బ్లాక్ చేసింది. ఇవన్నీ కూడా ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్ఫాంలు, ఆన్లైన్ కేసినోలకు సంబంధించినవని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే సట్టా, మట్కా గ్యాంబ్లింగ్ నెట్వర్క్లు, రియల్ మనీ కేసినో గేమ్ యాప్స్పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఇలాంటి 8,400 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు వివరించాయి. ఇందులో అత్యధిక భాగం (సుమారు 4,900) ఆన్లైన్ గేమింగ్ చట్టం వచ్చాక చర్యలు తీసుకున్నవేనని వివరించాయి. -
పన్ను ఎగవేతలకు టెక్నాలజీతో చెక్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు విరోధులుకాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సక్రమ పన్ను చెల్లింపుదారులకు నిబంధనలు భారంకాకుండా ఆదాయపన్ను శాఖ అధికారులు వ్యవహరించవలసి ఉన్నదని సలహా ఇచ్చారు. అయితే టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని సూచించారు. 2025 ఆదాయపన్ను శాఖ చట్టంపై జాతీయస్థాయి అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన 2026 ప్రారంభ్ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగించారు. ఏప్రిల్ 1 నుంచి అమలుకానున్న కొత్త చట్టం ద్వారా భారత్ స్నేహపూర్వక పన్ను దేశంగా అవతరించనున్నట్లు పేర్కొన్నారు. -
కొత్త ఐటీ చట్టం రెడీ!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు నిబంధనలను మరింత సరళతరం చేస్తూ ఇక కొత్త ఆదాయపన్ను (ఐటీ) చట్టం అమల్లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం–2025 నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) శుక్రవారం నోటిఫై చేసింది. ‘ఆదాయ పన్ను నిబంధనలు–2026గా వ్యవహరించే ఈ కొత్త రూల్స్ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి’ అని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. పాన్ విషయంలో భారీ ఊరటతో పాటు హెచ్ ఆర్ఏ క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై కిరాయిదారు–యజమాని మధ్య సంబంధాన్ని తప్పనిసరిగా వెల్లడించడం వరకు అనేక మార్పులు కొత్త చట్టంలో చోటు చేసుకోనున్నాయి. అనవసర సెక్షన్లు తొలగింపు... పాత ఆదాయపన్ను చట్టం–1961 స్థానంలో తీసుకొస్తున్న కొత్త చట్టానికి 2025 ఆగస్టు 12న పార్లమెంటు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కొత్త పన్ను రేట్ల ప్రతిపాదనల వంటివేవీ ఇందులో లేనప్పటికీ ఆరు దశాబ్దాల నాటి సంక్లిష్టమైన పాత చట్టాన్ని మరింత సరళమైన, అందరికీ అర్థమయ్యే రీతిలో తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం. 1961 నాటి ఐటీ చట్టంలో ఉన్న 819 సెక్షన్లను ఇప్పుడు 536కు కుదించడంతో పాటు చాప్టర్ల సంఖ్యను కూడా 47 నుంచి 23కు తగ్గించారు. అలాగే చట్టంలోని మొత్తం పదాలను 5.12 లక్షల నుంచి సగానికి అంటే 2.6 లక్షల పదాలకు తగ్గించడం గమనార్హం. అంతేకాకుండా మరింత మెరుగైన స్పష్టత కోసం 39 కొత్త టేబుల్స్, 40 కొత్త ఫార్ములాలను కూడా కొత్త చట్టంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పాన్ వెసులుబాటు.. బ్యాంకుల్లో నగదు డిపాజిట్/ఉపసంహరణ నుంచి కొత్త వాహనాలు, ప్రాపర్టీ కొనుగోళ్లు, హోటల్ బిల్స్ చెల్లింపు దాకా శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) వెల్లడికి సంబంధించి లావాదేవీల పరిమితి భారీగా పెరుగుతుంది. బ్యాంకుల్లో ఇప్పుడు రూ.50,000కు మించి నగదు డిపాజిట్కు పాన్ కాపీ తప్పనిసరి నిబంధన ఉంది. కొత్త రూల్స్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో క్యాష్ డిపాజిట్, ఉపసంహరణల లావాదేవీల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే (ఒకటి లేదా మరిన్ని ఖాతాలకు) పాన్ ఇస్తే సరిపోతుంది. ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు/విక్రయం, జాయింట్ డెవలప్మెంట్ లావాదేవీలు రూ.20 లక్షలు దాటితేనే (ప్రస్తుతం రూ.10 లక్షలు) పాన్ సమర్పించాలన్న నిబంధన వర్తిస్తుంది. అలాగే, ఏ వాహన కొనుగోలుకైనా విలువ రూ.5 లక్షలకు మించితేనే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన ఉంది. హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తులకు చేసే చెల్లింపులు రూ. లక్షకు మించితే ఇకపై పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50 వేలు మించితేనే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమల్లో ఉంది.ఇతర ముఖ్యాంశాలివీ..→ ఇంటి అద్దెపై ఐటీ మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై కిరాయిదారు–యజమాని సంబంధాన్ని వెల్ల డించాల్సి ఉంటుంది. ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పంద రుజువును చూపించాల్సి ఉంటుంది. → ఇకపై ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు.. ఈ ఎనిమిది నగరాలు 50% హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి జాబితాలోకి రానున్నాయి. మిగతా చోట్ల 40% పరిమితి కొనసాగుతుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నైలో వేతన జీవులకు మాత్రమే 50% నిబంధన వర్తిస్తోంది. → షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, డిపాజిట్ సర్టిఫికెట్ల వంటి కన్వర్టెడ్ సెక్యూరిటీలకు సంబంధించి నిర్దిష్ట కేసుల్లో మూలధన లాభాలు స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికమా అనేది నిర్ణయించడానికి హోల్డింగ్ వ్యవధి లెక్కింపుపై మరింత స్పష్టత. మార్పిడికి ముందు అవి ఎంత కాలం పాటు ఉన్నాయనే దాన్ని కూడా హోల్డింగ్ పీరియడ్లో చేర్చుతారు. → పన్ను రిటర్నుల దాఖలు మరింత సులభతరం కానుంది. సులభతర పత్రాలు, ఆదాయపన్ను శాఖ వద్దకు చేరిన సమాచారం ముందుగానే ఆయా పత్రాల్లో నింపి ఉంటుంది. → యాజమాన్యాలు ఉద్యోగులకు ఇచ్చే ప్రో త్సాహకాల విషయంలోనూ పన్ను మినహాయింపు పరిమితులు పెరగనున్నాయి. → క్రిప్టో ఎక్సే్చంజీలు ఐటీ శాఖతో సమాచారం పంచుకోవడం ఇకపై తప్పనిసరి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) సైతం ఆమోదనీయమైన ఎల్రక్టానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది. -
టెక్నాలజీలో ముందుకు.. ఆలోచనల్లో వెనక్కి?
టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఆలోచనల విషయంలో మాత్రం యువత వెనక్కి వెళ్తోందని తాజా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. జెన్ జెడ్ యువకుల్లో దాదాపు 31% మంది ‘భార్య ఎల్లప్పుడూ భర్తకు లోబడి ఉండాలి’ అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఒక అంతర్జాతీయ సర్వే చెబుతోంది.➤న్యూ గ్లోబల్ సర్వే ప్రకారం 33% మంది యువకులు ముఖ్యమైన నిర్ణయాలలో తమదే తుది నిర్ణయం కావాలని భావిస్తున్నారు. ➤భారతదేశంతో సహా గ్రేట్ బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి 29 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ➤నేటి యువకులు జెండర్ రోల్స్కు సంబంధించి సంప్రదాయ అభిప్రాయాలను కలిగి ఉండే అవకాశం ఉందని తెలియజేస్తోంది న్యూ గ్లోబల్ సర్వే.➤జెన్ జెడ్ యువకులు బేబీ బూమర్ల కంటే వివాహానికి సంబంధించి సంప్రదాయ ఆలోచనలతో ఉన్నారు.➤కెరీర్లో రాణిస్తున్న మహిళలను ఇష్టపడుతున్న యువకులు 41 శాతం మంది ఉన్నారు. జెన్ జడ్ యువకులు తమ భాగస్వామి బాగా సంపాదించాలని కోరుకుంటున్నప్పటికీ తమ అదుపు, ఆజ్ఞలలో ఉండాలని కోరుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ➤పిల్లల సంరక్షణ, ఇంటి పనులకు మహిళలే ప్రధాన బాధ్యత వహించాలని అంటున్నారు యువకుల్లో 35 శాతం మంది. ➤బేబీ బూమర్స్ (13%) కంటే ఈతరం యువకులే (31%) రెట్టింపు స్థాయిలో సంప్రదాయ భావాలను కలిగి ఉన్నారు. -
ఒక ఛార్జ్తో 902 కిమీ రేంజ్!.. షియోమి కారు
షియోమి చైనాలో అప్డేటెడ్ SU7 సెడాన్ను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మోడల్ భద్రతా పరికరాలు, డ్రైవర్-అసిస్టెన్స్ హార్డ్వేర్, క్యాబిన్ ఫీచర్లు, ఛాసిస్ సెటప్లో చాలా మార్పులు పొందింది. దీని ధర 219,900 యువాన్ల (సుమారు రూ. 29.79 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.కొత్త SU7 ఎలక్ట్రిక్ కారు 73 kWh, 96.3 kWh LFP ప్యాక్లతో పాటు, 101.7 kWh టెర్నరీ లిథియం బ్యాటరీ కూడా పొందుతుంది. వెర్షన్ను బట్టి CLTC రేంజ్ 720 కి.మీ, 902 కి.మీ, 835 కి.మీ ఉంటుందని షియోమి పేర్కొంది. ఈ ప్లాట్ఫామ్ 752V నుంచి 897V పరిధిలో హై-వోల్టేజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది.ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగంలో, షియోమీ అప్డేటెడ్ మెటీరియల్స్ & ఇంటర్ఫేస్ డిజైన్తో క్యాబిన్ను సవరించింది. ఇందులో 16.1-అంగుళాల సెంట్రల్ డిస్ప్లే, 7.1-అంగుళాల రొటేటింగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్-అప్ డిస్ప్లే ఉన్నాయి. ఇవన్నీ షియోమీ స్మార్ట్ కాక్పిట్ సిస్టమ్కు అనుసంధానమై ఉన్నాయి. ఈ సెటప్ వాయిస్ కంట్రోల్స్, మల్టీ-స్క్రీన్ ఇంటరాక్షన్కు సపోర్ట్ చేస్తుంది. -
తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?
ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. బంగారం ధరలు గత కొంత కాలంగా తగ్గుతూ.. ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఈ విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉంటాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే సందేహం చాలామందిలో కలిగింది. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.ఈ రోజు (మార్చి 20) బంగారం ధర 0.6% పెరగగా, వెండి ధర 1.7% ఎందుకు తగ్గింది. ఇటీవలి తగ్గుదలల తర్వాత, సాంకేతిక కొనుగోళ్లు మార్కెట్కు మద్దతు ఇవ్వడంతో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బలమైన అమెరికన్ డాలర్ ఒత్తిడి, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వస్తున్న సంకేతాల కారణంగా, గోల్డ్ వరుసగా మూడవ వారం కూడా పతనం దిశగా పయనించింది. అదే సమయంలో, మార్కెట్లో బలహీనమైన డిమాండ్ను ప్రతిబింబిస్తూ వెండి ధరలు తగ్గాయి.భౌగోళిక రాజకీయ పరిణామాలు, చమురు ధరల కదలికలు, భారతదేశం.. చైనాలలో భౌతిక డిమాండ్లో మార్పులతో సహా ప్రపంచ కారకాలు బంగారం, వెండి ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి తగ్గుదలల తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు జరపడం, ధరలు సాంకేతిక మద్దతు జోన్లను నిలబెట్టుకోవడంతో బంగారం ధరలు పెరిగాయి. అయితే, భౌతిక డిమాండ్ తగ్గడం మరియు కొనసాగుతున్న అమ్మకాల కార్యకలాపాల కారణంగా వెండి ధరలు పడిపోయాయి.ఆసియా ట్రేడింగ్ సమయంలో స్పాట్ గోల్డ్ 0.6% పెరిగి ఔన్సుకు 4,675.23 డాలర్లకు చేరుకుంది. గత సెషన్లో దాదాపు రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన ఈ లోహం కోలుకుంది. వెండి 1.7% తగ్గి ఔన్సుకు 71.66 డాలర్లకు చేరింది. ఇతర లోహాలు మిశ్రమ కదలికలను కనబరిచాయి. ప్లాటినం 0.2% పెరిగి 1,974.45 డాలర్లకు చేరగా, పల్లాడియం 1% పెరిగి 1,461.36 డాలర్లకు చేరింది.బంగారం ధరల పెరుగుదల ఎప్పుడుబంగారం వంటి విలువైన లోహాల విలువ ఎలాంటి సమయంలో అయినా భారీగా క్షిణించే అవకాశం ఉండదు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవచ్చు, ఆర్ధిక మాంద్యం రావచ్చు. అలంటి సమయంలో కూడా మీకు బంగారం, వెండి వంటివి చాలా ఉపయోగపడతాయని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు చెబుతున్నారు. -
సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్.. చైనా సరికొత్త ఆవిష్కరణ
ఇప్పటివరకు చాలామంది సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు గురించి వినే ఉంటారు. ఎప్పుడైనా సెల్ఫ్ డ్రైవింగ్ టూవీలర్స్ గురించి విన్నారా?, గతంలో దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ.. ఇప్పటివరకు ఈ తరహా స్కూటర్లు లాంచ్ కాలేదు. అయితే ఇప్పుడు చైనాకు చెందిన ఒక కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ లాంచ్ కోసం సిద్ధమైంది.చైనా కంపెనీ లాంచ్ చేయనున్న సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్ టెస్టింగ్ కూడా మొదలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక స్కూటర్ తనకు తానుగా ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఇది ఎలక్ట్రిక్ మోడల్ అని తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.ఆటోమొబైల్ మార్కెట్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న చైనా.. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి పూనుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే లెక్కకు మించిన కొత్త మోడల్స్ విఫణిలో లాంచ్ అవుతున్నాయి.వీడియోలో గమనించినట్లయితే.. స్కూటర్ ఎవరి సహాయం లేకుండానే ముందుకు వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత మరోవైపు నుంచి వచ్చినప్పుడు సైడ్ స్టాండ్ కూడా తనకు తానుగానే వేసుకోవడం కూడా స్పష్టంగా ఈ వీడియోలో కనిపిస్తోంది. ఎలాంటి మోడల్స్ భారతదేశంలో లాంచ్ అవుతాయా?, లేదా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.🚨 China is testing self-driving electric scooters with features like auto-balance. 🙏 pic.twitter.com/tL6Bz82cYi— Indian Tech & Infra (@IndianTechGuide) March 20, 2026 -
ఫ్లిప్కార్ట్ సీఎఫ్ఓ రాజీనామా
పబ్లిక్ లిస్టింగ్కు ముందు, ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ (సీఎఫ్ఓ) ఆఫీసర్ శ్రీరామ్ వెంకటరామన్ తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ తెలిపింది. తదుపరి సీఎఫ్ఓ నియామకం వరకు.. రవి అయ్యర్ ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని సంస్థ వెల్లడించింది.''శ్రీరామ్ నాయకత్వ బృందంలో ఒక సభ్యుడిగా ఉంటూ.. ఇన్నేళ్లుగా సంస్థ ఆర్థికంగా ముందుకు సాగడంతో కీలక పాత్ర పోషించారు. ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ.. భవిష్యత్తులో ఆయన మరింత రాణించాలని ఆకాంక్షిస్తున్నాము'' అని గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.ఐపీఓ లక్ష్యంగా..2025 డిసెంబర్లో ఫ్లిప్కార్ట్ తన అధికారిక చిరునామాను చట్టపరంగా సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి అనుమతి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ విభాగాలను సరళీకృతం చేస్తూ సింగపూర్కు చెందిన ఎనిమిది సంస్థలను ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం చేసింది. -
ఇంక సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏం చేస్తారు?
సాంకేతిక రంగంలో కొలువుల కోత భయాలు నిజమవుతున్నాయా? గతంలో కేవలం సాధారణ పనులకే పరిమితమైన కృత్రిమ మేధ (AI), ఇప్పుడు హై-టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ (QA) రంగాల్లో పనిచేసే వారి భవితవ్యంపై పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ అరవింద్ శ్రీనివాస్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.'ప్రాపంచిక' పనులకు ఇక స్వస్తి..ప్రముఖ ఏఐ సెర్చ్ ఇంజిన్ 'పెర్ప్లెక్సిటీ' సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ (X) వేదికగా టెక్ పరిశ్రమలో రాబోయే మార్పులపై కుండబద్దలు కొట్టారు. "సాఫ్ట్వేర్ ఉత్పత్తుల టెస్టింగ్, నాణ్యతను అంచనా వేయడం (QA) వంటి ప్రాపంచిక పనులు (Mundane Jobs) క్రమంగా కనుమరుగవుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. కేవలం కోడింగ్ మాత్రమే కాదు, ఆ కోడ్ను తనిఖీ చేసే బాధ్యతను కూడా ఏఐ తన భుజాన వేసుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.రంగంలోకి 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్'పెర్ప్లెక్సిటీ సంస్థ ఇటీవల విడుదల చేసిన 'పెర్ప్లెక్సిటీ కంప్యూటర్' అప్డేట్ ఈ విప్లవాత్మక మార్పుకు నాంది పలికింది. ఈ సాధనం వెబ్ అప్లికేషన్లను నిర్మించడమే కాకుండా, వాటిని స్వయంగా పరీక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఆటోమేటెడ్ టెస్టింగ్ : 'ప్లేరైట్' (Playwright) సాంకేతికతతో పనిచేసే ఈ సిస్టమ్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా క్వాలిటీ చెకర్ అవసరం లేకుండానే అప్లికేషన్ను రన్ చేస్తుంది.మానవ ప్రమేయం అక్కర్లేదు: ఒక సాధారణ వినియోగదారు యాప్ను ఎలా ఉపయోగిస్తారో, ఈ AI సిస్టమ్ కూడా అలాగే యాప్ను తనిఖీ చేసి, లోపాలను (Bugs) గుర్తిస్తుంది.క్షణాల్లో పరిష్కారం: డెవలపర్లు జోక్యం చేసుకోకముందే సమస్యలను గుర్తించి, వాటిని బ్యాక్గ్రౌండ్లోనే పరిష్కరించేలా ఈ టూల్ను రూపొందించారు. -
ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన జొమాటో!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అయిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును మరోసారి పెంచింది. ఒక్కో ఆర్డర్కు ప్లాట్ఫామ్ ఫీజును రూ. 12.50 నుంచి రూ. 14.90కి పెంచినట్లు వెల్లడించింది. పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ఈ ధరల పెంపు చోటుచేసుకుంది.చివరిసారిగా ప్లాట్ఫామ్ పీజుల పెంపును కంపెనీ సెప్టెంబర్ 2025లో చేపట్టింది. జొమాటో ఫుడ్ డెలివరీకి.. పోటీదారు అయిన స్విగ్గీ ప్రస్తుతం ఒక్కో ఆర్డర్కు 14.99 రూపాయలు వసూలు చేస్తోంది. ధరల పెరుగుదల వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందిఇదిలా ఉండగా.. ఫుడ్ డెలివరీ రంగంలో కొత్త పోటీదారులు పుట్టుకొస్తున్నారు. ఇందులో భాగంగానే.. అర్బన్ మొబిలిటీ స్టార్టప్ అయిన రాపిడో, ఇటీవల బెంగళూరులో 'ఓన్లీ' అనే తన ఫుడ్ డెలివరీ సర్వీస్ను ప్రారంభించింది. డెలివరీ ఫీజు మినహా, కస్టమర్ల నుంచి గానీ, రెస్టారెంట్ల నుండి గానీ ఎలాంటి అదనపు రుసుములను వసూలు చేయబోమని ఆ కంపెనీ తెలిపింది.ఫుడ్ డెలివరీ ఆర్డర్లపై కంపెనీలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న సమయంలో రాపిడో తీసుకున్న ఈ చర్య ఇప్పటికే ఉన్న సంస్థలపై కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. కాగా.. ప్లాట్ఫామ్ ఫీజుల పెంపుకు సంబంధించిన ప్రకటన తరువాత.. ఎటర్నల్ షేర్లు దాదాపు 2% పెరిగి ఒక్కో షేరు రూ. 233 వద్ద ముగిశాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 325.72 పాయింట్లు లేదా 0.44 శాతం లాభంతో 74,532.96 వద్ద, నిఫ్టీ 112.35 పాయింట్లు లేదా 0.49 శాతం లాభంతో.. 23,114.50 వద్ద నిలిచింది.వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్, బ్రెయిన్బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్, కెఐఓసిఎల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నెక్స్ట్ మీడియావర్క్స్ లిమిటెడ్, ఫిన్కర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, నోవా అగ్రిటెక్ లిమిటెడ్, రేవతి ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
భారత్లో ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తన ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ .2 పెంచింది. సవరించిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీ ఈ పెంపు వెనుక ఎటువంటి కారణాన్ని పేర్కొననప్పటికీ, కొనసాగుతున్న ఇరాన్-యుఎస్ వివాదం మధ్య ప్రపంచ ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు, లాజిస్టిక్స్ ఖర్చులలో మార్పులే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.ఇక హైదరాబాద్లో ఈ ధరలు కనిష్ఠంగా రూ.2.26 మేర పెరిగినట్లు పెట్రోల్ డీలర్స్ చెబుతున్నారు. అయితే.. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మేరకు ఒక్కో బంకులో ఒక్కోరకంగా ధరల్లో తేడాలు ఉండే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. అంటే.. అయిదు నుంచి పది పైసల మేర ఈ తేడా ఉంటుందని వెల్లడించారు.సాధారణ పెట్రోల్ ధరలో మార్పు లేదు..సాధారణ పెట్రోల్ వాడే సామాన్యులకు మాత్రం ఈ పెంపు నుంచి ఉపశమనం లభించింది. హెచ్పీసీఎల్ సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అంతేకాకుండా, చమురు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని సంస్థ స్పష్టం చేసింది. "అదనపు సరకు రవాణా ఇప్పటికే మార్గంలో ఉంది. రాబోయే రోజుల్లో దేశీయ సరఫరా మరింత బలోపేతం అవుతుంది. ప్రజలు పుకార్లను నమ్మవద్దు" అని హెచ్పీసీఎల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేసింది.ఏమిటీ ప్రీమియం పెట్రోల్?ప్రీమియం పెట్రోల్ను ‘హై-ఆక్టేన్ ఫ్యూయల్’ లేదా ‘పవర్ పెట్రోల్’ అని పిలుస్తారు. ఇది సాధారణంగా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్లు, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్లలో వాడతారు. ఇది ఇంజిన్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, మైలేజీని కూడా పెంచుతుంది. ఈ ధరల పెంపు ప్రధానంగా లగ్జరీ వాహన యజమానులపై, సంపన్న వర్గాలపైనే ప్రభావం చూపనుంది.డీజిల్ ధర కూడా పెంపు హెపీసీఎల్ను అనుసరిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) కూడా బల్క్ డీజిల్ ధరను లీటరుకు ఏకంగా లీటరుకు రూ.22 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు రూ.87.57 గా ఉన్న లీటరు డీజిల్ ధర.. తాజా రేట్ల పెంపుతో రూ.109.59కి చేరుకుంది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ ధరలపై ప్రస్తుతం పెద్దగా ప్రభావం లేనప్పటికీ.. నేరుగా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనే పారిశ్రామిక వినియోగదారులకు షాక్ తగిలింది.రవాణా ఛార్జీలు పెరిగే అవకాశంబల్క్ డీజిల్ ధరల పెరుగుదల ప్రధానంగా తయారీ రంగం, భారీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ విభాగాలపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. సిమెంట్, ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్రాలను నడిపే పరిశ్రమలకు డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. ఇది లీటరుకు రూ.22 పెరగడం వల్ల వారి ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. అలాగే నేరుగా కంపెనీల నుంచి డీజిల్ కొనే భారతీయ రైల్వే, రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు వల్ల రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీయవచ్చు.వచ్చేవారం పెట్రోల్ మోత?పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్నా.. చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సామాన్యులపై పెట్రోల్ భారం వేయలేదు. దేశంలో 60 రోజులకు సరిపడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నప్పటికీ.. వచ్చేవారం నుంచి పెట్రోల్ మోతకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు పెట్రోల్, డీజిల్పై రూ.3 నుంచి రూ.5 మేర అదనపు భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపాయి.ఇదీ చదవండి: అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే.. -
ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక అప్డేట్ అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.కొత్త ధరల వివరాలుప్రస్తుతం చలామణిలో ఉన్న వార్షిక పాస్ ధర రూ.3,000 ఉండగా దీన్ని రూ.3,075కు పెంచుతూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. అంటే నేరుగా రూ.75 భారం పడనుంది. నేషనల్ హైవేస్ ఫీ (రేట్ల నిర్ధారణ, వసూలు) నిబంధనలు, 2008 ప్రకారం ఈ వార్షిక ధరల సవరణ జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.వార్షిక పాస్ ప్రయోజనాలు.. నిబంధనలుఈ వార్షిక పాస్ ముఖ్యంగా తరచుగా హైవేలపై ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు (కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలు) ఎంతో లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది వరకు లేదా 200 టోల్ క్రాసింగ్ల వరకు (ఏది ముందు పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రతి ట్రిప్పుకు విడివిడిగా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి చెల్లింపు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది.రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎక్స్ప్రెస్వేలు (ఉదాహరణకు యమునా ఎక్స్ప్రెస్వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే వంటివి) ఈ పాస్ పరిధిలోకి రావు. అక్కడ సాధారణ ఫాస్టాగ్ చార్జీలే వర్తిస్తాయి.పాస్ ఎలా పొందాలి?వాహనదారులు తమ ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్కే ఈ వార్షిక పాస్ను లింక్ చేసుకోవచ్చు. ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. నగదు చెల్లించిన కొద్దిసేపట్లోనే పాస్ యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 56 లక్షల మందికి పైగా వాహనదారులు ఈ వార్షిక పాస్ సేవలను వినియోగించుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
క్లౌడ్ఫ్లేర్ సీఈఓ హెచ్చరిక!.. 2027 నాటికి..
ఆటోమేటెడ్ ఆన్లైన్ కార్యకలాపాలలో జనరేటివ్ ఏఐ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నందున, 2027 నాటికి ఏఐ-ఆధారిత బాట్ ట్రాఫిక్.. మానవ ఇంటర్నెట్ వినియోగాన్ని మించిపోయే అవకాశం ఉందని క్లౌడ్ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ హెచ్చరించారు. ఆస్టిన్లోని SXSW సదస్సులో మాట్లాడుతూ.. ఈ విషయం వెల్లడించారు.AI-ఆధారిత ఏజెంట్లు మనుషుల కంటే చాలా ఎక్కువ వెబ్సైట్లను సందర్శించగలవని మాథ్యూ వివరించారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్సైట్లను తనిఖీ చేస్తారు. కానీ ఒక AI వ్యవస్థ సమాచారాన్ని సేకరించడానికి వేలాది పేజీలను స్కాన్ చేయగలదు. ఇది వెబ్ ట్రాఫిక్లో తీవ్రమైన పెరుగుదలకు దారితీస్తుంది. అంతే కాకుండా.. ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.బాట్స్ అంటేబాట్స్ అనేవి స్వయంచాలకంగా పనిచేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఇవి మనుషుల సహాయం లేకుండా వెబ్సైట్లు సందర్శించడం, డేటాను సేకరించడం వంటి పనులు చేస్తాయి. గతంలో కూడా బాట్స్ ఉండేవి, కానీ వాటిలో చాలా భాగం గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లకు సంబంధించినవి. ఉదాహరణకు గూగుల్ ఉపయోగించే క్రాలర్లు వెబ్సైట్లను స్కాన్ చేసి సమాచారం సేకరించేవి. అలాగే కొన్ని బాట్స్ దుష్ట కార్యకలాపాలకు కూడా ఉపయోగించేవారు.కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. జనరేటివ్ AI రాకతో, బాట్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక సాధారణ వ్యక్తి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్సైట్లను మాత్రమే చూస్తాడు. అయితే AI ఆధారిత బాట్ మాత్రం వేలాది వెబ్సైట్లను స్కాన్ చేసి, పూర్తి సమాచారం సేకరిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ అనూహ్యంగా పెరుగుతోంది.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!ఈ పెరుగుతున్న ట్రాఫిక్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతోంది. మరిన్ని డేటా సెంటర్లు, శక్తివంతమైన సర్వర్లు అవసరం అవుతున్నాయి. గతంలో COVID-19 సమయంలో కూడా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. అప్పుడు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫార్మ్లను ఎక్కువగా ఉపయోగించారు. అయితే ఆ పెరుగుదల తాత్కాలికం. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పెరుగుదల మాత్రం నిరంతరంగా కొనసాగుతుందని మాథ్యూ చెప్పారు. -
ముంచుకొస్తున్న నీటి గండం!
దేశవ్యాప్తంగా ఎండలు ముదురుతున్న వేళ భారత్ తీవ్రమైన జల సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని 166 ప్రధాన జలాశయాల్లో 40 శాతానికి పైగా రిజర్వాయర్లు వాటి పూర్తి సామర్థ్యంలో సగం కంటే తక్కువ నీటి నిల్వను కలిగి ఉన్నాయి. ప్రస్తుతానికి దేశంలోని అన్ని ఆనకట్టల సగటు నీటి మట్టం 51 శాతానికి పడిపోయింది.ప్రస్తుత పరిస్థితికేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం, ఈ 166 జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 183.565 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా, ప్రస్తుతం కేవలం 94.063 బీసీఎం (51 శాతం) మాత్రమే నీరు నిల్వ ఉంది. వాటిలో..39 జలాశయాలు: 40 శాతం కంటే తక్కువ నిల్వ.33 జలాశయాలు: 50 శాతం కంటే తక్కువ నిల్వ.కేవలం 1 జలాశయం: ఝార్ఖండ్లోని జఖేత్ హిల్ రిజర్వాయర్ మాత్రమే ప్రస్తుతం 100 శాతం నిండి ఉంది.18 జలాశయాలు: 80 శాతానికి పైగా నిల్వను కలిగి ఉన్నాయి.లోటు వర్షపాతంఈ జల సంక్షోభానికి ప్రధాన కారణం.. లోటు వర్షపాతమని నివేదికలు చెబుతున్నాయి. ఐఎండీ అందించిన 726 జిల్లాల డేటా ప్రకారం, మార్చి 1 నుంచి దేశంలోని 78 శాతం ప్రాంతాల్లో వర్షపాతం అసలు లేకపోవడం అధిక భారీ లోటు నమోదైంది. ఏడాది ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా వర్షపాతంలో 70 శాతానికి పైగా లోటు ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.ఈ పరిణామాలకు దారితీసిన కారణాలురుతుపవనాల అనంతర కాలంలో, ఈ ఏడాది ప్రారంభంలో కురవాల్సిన వర్షాలు కురవకపోవడంతో రిజర్వాయర్లలోకి ఇన్-ఫ్లో నిలిచిపోయింది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావడంతో బాష్పీభవనం పెరిగి నీటి మట్టాలు వేగంగా తగ్గుతున్నాయి. వేసవి పంటల సాగుకు, తాగునీటి అవసరాలకు డిమాండ్ పెరగడంతో నిల్వలు వేగంగా ఖర్చవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులు భారత వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపి వర్షపాతాన్ని తగ్గించాయి.ప్రాంతంజలాశయాల సంఖ్యప్రస్తుత నిల్వ శాతంస్థితిగతులుదక్షిణ భారతం4241%తెలంగాణ (35% దిగువకు), కర్ణాటక (40% కంటే తక్కువ) ఆందోళనకరంగా ఉన్నాయి.ఉత్తర భారతం1145.5%హిమాచల్ప్రదేశ్ 40% లోపు ఉండగా, పంజాబ్, రాజస్థాన్లలో 55% పైగా ఉంది.తూర్పు భారతం2750%అస్సాం (20%), పశ్చిమ బెంగాల్ (25%) కనిష్ట స్థాయిలో ఉన్నాయి.పశ్చిమ భారతం5362%గోవా, మహారాష్ట్ర, గుజరాత్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.మధ్య భారతం2857%ఛత్తీస్గఢ్ (71%) మెరుగ్గా ఉండగా, ఉత్తరాఖండ్ (43%) తక్కువగా ఉంది. గడిచిన 10 ఏళ్ల సగటుతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్త నీటి నిల్వలు సాంకేతికంగా కొంత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ (గత ఏడాది కంటే 13.5 శాతం పాయింట్లు ఎక్కువ), లోటు వర్షపాతం రాబోయే రోజుల్లో సవాలుగా మారనుంది. అయితే, సమీప భవిష్యత్తులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దాంతో రిజర్వాయర్ల మట్టం తగ్గే వేగం కొంత నిమ్మదిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ఒక్క యాక్సిడెంట్.. 1.32 లక్షల కార్లు రీకాల్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పాపులర్ ఎస్యూవీ 'పాలిసేడ్' (2026 మోడల్) విక్రయాలను తక్షణమే నిలిపివేస్తూ (Stop-Sale) ఆదేశాలు జారీ చేసింది. ఒక చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైన సాంకేతిక లోపం వెలుగుచూడటంతో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.32 లక్షల వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.అసలేం జరిగింది?నివేదికల ప్రకారం.. పాలిసేడ్ కారులోని మూడవ వరుస (3rd Row) పవర్ సీటు మధ్యలో చిక్కుకుపోవడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కార్లలో 'యాంటీ-పించ్' (Anti-Pinch) ఫీచర్ ఉంటుంది. సీటు ఫోల్డ్ అవుతున్నప్పుడు లేదా జరుగుతున్నప్పుడు ఏదైనా అడ్డంకి (వ్యక్తులు లేదా వస్తువులు) తగిలితే ఈ సెన్సార్ వెంటనే గుర్తించి ఆగిపోవాలి. అయితే, ఈ మోడల్లో ఆ సెన్సార్ సరిగ్గా పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.ప్రభావితమైన వాహనాలుహ్యుందాయ్ స్వచ్ఛందంగా చేపట్టిన ఈ రీకాల్ పరిధిలోకి 2026 హ్యుందాయ్ పాలిసేడ్ 'లిమిటెడ్', 'కాలిగ్రఫీ' ట్రిమ్స్ వస్తాయి. ఉత్తర అమెరికా, కెనడాలలో 68,500 వాహనాలు, ప్రపంచవ్యాప్తంగా 1,32,000 వాహనాలను కంపెనీ రీకాల్ చేసింది.లోపం ఎక్కడ ఉంది?నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA)కు సమర్పించిన పత్రాల ప్రకారం.. రెండో, మూడో వరుస సీట్లను పవర్-ఫోల్డ్ చేసేటప్పుడు లేదా వన్-టచ్ టిల్ట్-అండ్-స్లైడ్ ఫీచర్ వాడుతున్నప్పుడు సెన్సార్లు ప్రయాణికులను గుర్తించడంలో విఫలమవుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులు సీట్ల మధ్య నలిగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ అంగీకరించింది.కంపెనీపై ఆర్థిక ప్రభావంఈ రీకాల్ ప్రక్రియ కోసం హ్యుందాయ్ సుమారు 100 బిలియన్ వాన్లు (66.8 మిలియన్ డాలర్లు) ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. 2026లో హ్యుందాయ్ అంచనా వేసిన వార్షిక లాభం 12.9 ట్రిలియన్ వాన్లు. రీకాల్ ఖర్చు కంపెనీ లాభంలో కేవలం 0.8% మాత్రమే. కాబట్టి, కంపెనీ ఆర్థిక స్థితిపై లేదా షేర్ ధరపై దీని ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.కాగా తమ కారు వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారి కుటుంబానికి హ్యుందాయ్ సంస్థ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. కస్టమర్ల భద్రతకే తాము పెద్దపీట వేస్తామని స్పష్టం చేసింది. -
మహిళల కోసం ఎస్బీఐ సెక్యూరిటీస్ కొత్త ఫీచర్
భారతీయ మహిళలు ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ సంపద సృష్టిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ధోరణిని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎస్బీఐ సెక్యూరిటీస్ తన మొబైల్ అప్లికేషన్లో ‘ఉమెన్స్ మోడ్’ అనే సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. మహిళా పెట్టుబడిదారుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ప్లాట్ఫారమ్ ఎకానమీ మార్కెట్లో వారి భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేయనుంది.6,000 మంది మహిళల అభిప్రాయాలతో..ఏదో ఒక ఫీచర్ను మొక్కుబడిగా ప్రవేశపెట్టడం కాకుండా క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఎస్బీఐ సెక్యూరిటీస్ విస్తృతమైన కసరత్తు చేసిందని అధికారులు చెప్పారు. సుమారు 6,000 మందికి పైగా మహిళా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ ‘ఉమెన్స్ మోడ్’ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సంక్లిష్టంగా ఉండే పెట్టుబడి ప్రక్రియను సరళతరం చేయడం ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.ఈ ఫీచర్ ప్రత్యేకతలుఈ ఫీచర్తో ఈక్విటీ మార్కెట్లో ఎడ్యుకేషన్, పదవీ విరమణ లేదా సొంత ఇల్లు వంటి వ్యక్తిగత ఆకాంక్షలకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. మార్కెట్ జార్గన్ (క్లిష్ట పదజాలం) తగ్గించి సులభమైన రీతిలో సమాచారాన్ని అందిస్తుంది. ఇన్వెస్టర్ల అనుభవం, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వ్యక్తిగతీకరించిన పెట్టుబడి మార్గాలను సూచిస్తుంది.ఎస్బీఐ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో భువనేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఇప్పుడు ఆర్థిక నిర్ణయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ‘మహిళల ఆర్థిక ఆకాంక్షలకు అనుగుణంగా సమస్య పరిష్కారాలను రూపొందించాల్సిన బాధ్యత ఆర్థిక సంస్థలపై ఉంది. మహిళలకు సాధికారత కల్పించి వారిలో నమ్మకాన్ని నింపే ఉమెన్స్ మోడ్ను ప్రారంభించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
దాపరికాలుంటే ఊరుకోం..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కలవరపెడుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశీయ ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు వీలుగా స్థానికంగాఉన్న అన్ని చమురు, సహజ వాయువు కంపెనీలు తమ నిల్వలు, ఎగుమతులు, దిగుమతుల పూర్తి వివరాలను ప్రభుత్వంతో పంచుకోవాలని కేంద్రం కఠిన ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ)కు ఈ డేటాను క్రమం తప్పకుండా అందించాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.ఈ కొత్త నిబంధనల ద్వారా సమాచార సేకరణకు చట్టపరమైన బలాన్ని చేకూర్చామని మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ ఓ సమావేశంలో వెల్లడించారు. ‘గతంలోనూ పీపీఏసీ సమాచారాన్ని సేకరించేది, కానీ తాజా నోటిఫికేషన్తో దీనికి పూర్తిస్థాయి చట్టపరమైన శక్తి లభించింది. ఇప్పుడు ప్రతి సంస్థ కచ్చితంగా సమాచారాన్ని వెల్లడించాల్సిందే. దీనివల్ల పర్యవేక్షణ మరింత పకడ్బందీగా అమలు అవుతుంది’ అని ఆమె పేర్కొన్నారు.ఎవరు వివరాలు వెల్లడించాలి?ప్రభుత్వ తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఈ కింది కార్యకలాపాల్లో నిమగ్నమైన సంస్థలన్నీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.ముడి చమురు ఉత్పత్తి, రిఫైనింగ్ సంస్థలు.సహజ వాయువు ప్రాసెసింగ్, రవాణా సంస్థలు.పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగ్, పంపిణీదారులు.దిగుమతిదారులు, టెర్మినల్ ఆపరేటర్లు.ఈ సంస్థలు తమ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం, కేటాయింపులు, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని రోజువారీ, వారం లేదా నెలవారీ ప్రాతిపదికన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా అందించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ తన అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండటమే ఈ తాజా ఆదేశాల ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.‘గోప్యత’ సాకు చెల్లదుచమురు సంస్థలు తాము కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు లేదా గోప్యతా నిబంధనలను సాకుగా చూపి సమాచారాన్ని దాచడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సమాచారం ‘వాణిజ్యపరంగా సున్నితమైనది’ అనే కారణంతో ఏ సంస్థ కూడా నిరాకరించడానికి వీలులేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. గతంలో ఉన్న ఇతర నిబంధనలకు అదనంగా ఈ కొత్త ఆదేశాలు అమలులో ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. మారుతున్న ఏటీఎం రూల్స్
మీకు బ్యాంకు ఖాతా ఉండి ఏటీఎంల ద్వారా తరచుగా నగదు విత్ డ్రా చేస్తుంటే ఈ వార్త మీకోసమే. వచ్చే ఏప్రిల్ 1 నుంచి దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఏటీఎం/సీఆర్ఎం నగదు ఉపసంహరణ నిబంధనల్లో కీలక మార్పులు చేయనున్నాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), హెచ్డీఎఫ్సీ (HDFC), బంధన్ బ్యాంకులు తమ కస్టమర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి.యూపీఐ (UPI) ఆధారిత నగదు ఉపసంహరణలు, రోజువారీ విత్ డ్రాయల్ లిమిట్స్, ఉచిత లావాదేవీల సంఖ్యపై ఈ ప్రభావం ఉండనుంది. ఆ మార్పులేంటో ఒకసారి చూద్దాం..పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్పులుపంజాబ్ నేషనల్ బ్యాంక్ తన డెబిట్ కార్డ్ వేరియంట్లను బట్టి రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం, భద్రతను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.రూపే ఎన్సీఎంసీ ప్లాటినం (డొమెస్టిక్ & ఇంటర్నేషనల్), ఉమెన్ పవర్ ప్లాటినం, పీఎన్బీ పలాష్, రూపే బిజినెస్ ప్లాటినం, మాస్టర్ కార్డ్ ప్లాటినం, వీసా గోల్డ్ కార్డులకు నగదు విత్డ్రా పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 50,000కు తగ్గించింది.ఇక రూపే సెలెక్ట్, పీఎన్బీ రూపే నియో/ఎక్సెల్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డులకు క్యాష్ విత్డ్రా లిమిట్ రూ. 1.5 లక్షల నుంచి రూ. 75,000కు తగ్గనుంది.అయితే పీఓఎస్ (POS), ఈ-కామర్స్ లావాదేవీల పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లు తమ లిమిట్ను పీఎన్బీవన్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత ఛార్జీలుప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) ద్వారా చేసే ఏటీఎం విత్ డ్రాయల్స్ను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల కోటాలో చేర్చింది.నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు తీసుకుంటే ప్రతి లావాదేవీకి రూ. 23 + పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కార్డు లేకుండా నగదు పొందే సౌలభ్యం ఉన్నప్పటికీ, ఇకపై లావాదేవీల సంఖ్యపై కస్టమర్లు నిఘా ఉంచక తప్పదు.బంధన్ బ్యాంక్ మారిన నిబంధనలుబంధన్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఏటీఎం వినియోగ నియమాలను మార్చింది.సొంత బ్యాంకు అంటే బంధన్ బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత ఫైనాన్షియల్ లావాదేవీలే ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ చెక్ వంటివి) మాత్రం అపరిమితం.ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు కేవలం 3 ఉచిత లావాదేవీలు (ఫైనాన్షియల్ + నాన్ ఫైనాన్షియల్ కలిపి), నాన్-మెట్రో నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది. -
ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.769 కోట్ల జీఎస్టీ నోటీసు
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు జీఎస్టీ విభాగం నుంచి నోటీసులు అందాయి. ముంబై ఈస్ట్ కమిషనరేట్కు చెందిన సీజీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఏకంగా రూ.769 కోట్ల డిమాండ్ నోటీసులను జారీ చేశారు.డిమాండ్ మొత్తం రూ.384,33,53,972 (సుమారు రూ.384 కోట్లు)గా ఉన్నా పెనాల్టీ రూపంలో పన్ను మొత్తంతో పాటు దానికి సమానమైన జరిమానా, వడ్డీని కూడా చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. దాంతో మొత్తంగా రూ.769 కోట్లు అయింది. మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 లోని సెక్షన్ 74 ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.వివాదం నేపథ్యం ఏమిటి?సాధారణంగా బ్యాంకులు తమ వినియోగదారుల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల సేవలను ఉచితంగా అందిస్తుంటాయి. అయితే, ఈ ఉచిత సేవలకు కూడా ప్రతిఫలం ఉంటుందని, దానిపై పన్ను చెల్లించాలని జీఎస్టీ విభాగం వాదిస్తోంది. ఈ అంశంపై గతంలో కూడా షోకాజ్ నోటీసులు అందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ‘గతంలోనూ ఇలాంటి అంశాలపై బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోంది. అయితే ప్రస్తుత డిమాండ్ మొత్తం పరిమితిని మించి ఉన్నందున నిబంధనల ప్రకారం దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదిస్తున్నాం’ అని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది.తదుపరి కార్యాచరణఈ నోటీసులపై ఐసీఐసీఐ బ్యాంక్ వెనక్కి తగ్గడం లేదు. నిర్ణీత గడువులోగా రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదా అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించడం ద్వారా ఈ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం బ్యాంక్ ఆర్థిక వ్యవహారంపై పెద్దగా ప్రభావం చూపకపోయినా చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
కేఫ్-2 నిబంధనల అమలుపై అనిశ్చితి
దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ‘కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం’ (కేఫ్-2) నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయంలో దీనికి సంబందించి జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో బ్యూరోక్రాటిక్ అంశాలు, బాధ్యతల నుంచి తప్పించుకునే ధోరణిపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అయితే, వివిధ ఆటోమొబైల్ సంస్థలపై విధించిన సుమారు రూ.8,800 కోట్ల భారీ జరిమానాలను ఎవరు వసూలు చేయాలనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.కేఫ్-2 అంటే..కేఫ్-2(కార్పొరేట్ యావరేజ్ ఫ్యుయెల్ ఎఫిషియెన్సీ ఫేజ్ 2) అంటే కార్ల తయారీ కంపెనీలు విక్రయించే అన్ని వాహనాల సగటు ఇంధన సామర్థ్యాన్ని నియంత్రించే నిబంధనలు. దీని ముఖ్య ఉద్దేశం వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటం. ఒకవేళ ఏదైనా కంపెనీ అమ్మిన కార్ల సగటు ఉద్గారాలు నిర్ణీత పరిమితి దాటితే ఆ కంపెనీకి భారీగా జరిమానాలు విధిస్తారు. ఈ నిబంధనల వల్ల కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ ఇంజిన్లు, సీఎన్జీ వాహనాల తయారీపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.బాధ్యత ఎవరిది?ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా, కీలక అధికారుల సమక్షంలో చర్చ జరిగింది. ‘ఈ జరిమానాలను ఎవరు నిర్ణయించారు? వీటిని ఎవరు ఆమోదించారు? వీటన్నింటికీ మించి రూ.8,000 కోట్లకు పైగా ఉన్న బకాయిలను రికవరీ చేసే బాధ్యత ఎవరిది?’ అని పీఎంఓ ప్రతినిధులు గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సమావేశంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల శాఖ, పెట్రోలియం శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నప్పటికీ జవాబుదారీతనంపై ఏ ఒక్కరూ స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు.మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయలోపంవిద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) కేఫ్ నిబంధనలను నిర్దేశిస్తుంది. అయితే, జరిమానాల వసూలు తమ పరిధిలోకి రాదని ఇది స్పష్టం చేస్తోంది. రోడ్డు రవాణా శాఖ స్పందిస్తూ తాము కేవలం మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహన ప్రమాణాలను మాత్రమే పర్యవేక్షిస్తామని, ఇంధన సామర్థ్య జరిమానాల రికవరీ తమ బాధ్యత కాదని తేల్చి చెప్పింది. నిబంధనలు రూపొందించింది బీఈఈ కాబట్టి వసూలు బాధ్యత కూడా వారిదే అని రవాణా శాఖ వాదిస్తోంది.జరిమానాలు ఇలా..ఈ సమావేశంలో సమర్పించిన గణాంకాల ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంనాటికి కేఫ్-2 లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనందుకు 10 ప్రధాన కంపెనీలకు నోటీసులు అందాయి. అందులో ప్రధానంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ.2,800 కోట్లు, మహీంద్రా అండ్ మహీంద్రా రూ.1,788 కోట్లు, కియా ఇండియా రూ.1,346 కోట్లు చెల్లాంచాల్సి ఉంది. మరోవైపు మారుతి సుజుకి, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, బీఎమ్డబ్ల్యూ వంటి కంపెనీలు నిబంధనలను సక్రమంగా పాటించినట్లు ప్రభుత్వం గుర్తించింది.కేఫ్-3 భవితవ్యంపై ప్రభావంఏప్రిల్ 1, 2027 నుంచి మరింత కఠినమైన కేఫ్-3 నిబంధనలను అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే, ప్రస్తుత గందరగోళాన్ని పరిష్కరించకుండా ముందడుగు వేయడం సాధ్యం కాదని పీఎంఓ స్పష్టం చేసింది. పాత జరిమానాల రికవరీపై ఏకాభిప్రాయ యంత్రాంగం రూపొందించుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. దీని అమలు, రికవరీకి సంబంధించిన స్పష్టమైన ఫ్రేమ్ వర్క్తో తదుపరి సమావేశానికి హాజరుకావాలని మంత్రిత్వ శాఖలకు తుది హెచ్చరికలు జారీ అయ్యాయి.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే..
దేశంలో పసిడి ధరల పతనానికి బ్రేక్ పడింది. రెండు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు (Today Gold Rate) అంతలోనే ధర పుంజుకున్నాయి. నిన్న ఒక్కరోజే సుమారు రూ.7 వేలు తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం తగ్గుముఖంలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
గ్రీన్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ(Nifty) 260 పాయింట్లు పెరిగి 23,259 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 811 పాయింట్లు పుంజుకొని 75,019 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.44బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 106.59 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.27 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.28 శాతం నష్టపోయింది.Today Nifty position 20-03-2026(time: 9:41 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అదనపు ఛార్జీ లేకుండానే ఇష్టమైన సీటు ఎంపిక
విమాన ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లోని మొత్తం సీట్లలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది. పారదర్శకతను పెంచడం, ప్రయాణీకుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలను విడుదల చేసింది.ఖర్చు లేకుండా సీట్ల కేటాయింపుప్రస్తుతం చాలా విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ లేదా టికెట్ బుకింగ్ సమయంలో ‘ప్రిఫర్డ్ సీట్’ పేరుతో ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు టికెట్ ధర కంటే ఈ ఫీజుకే ఎక్కువే చెల్లించాల్సి వస్తోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి విమానంలో 60 శాతం సీట్లు కచ్చితంగా ఉచిత ఎంపిక కేటగిరీలో ఉండాలి. ఒకే పీఎన్ఆర్పై టికెట్ బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కలిసి కూర్చునేలా విమానయాన సంస్థలు ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల పక్కపక్క సీట్ల కోసం అదనంగా చెల్లించే అవసరం తప్పుతుంది.బ్యాగేజీపై డీజీసీఏ సూచించిన స్పష్టమైన విధానాలుస్పోర్ట్స్ కిట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు తీసుకెళ్లడంపై స్పష్టమైన, సులభతరమైన నిబంధనలు ఉండాలి.విమానాల్లో పెంపుడు జంతువుల రవాణాపై ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ విమానయాన సంస్థలు తమ వెబ్సైట్లలో కచ్చితమైన పాలసీని ప్రదర్శించాలి.ప్రయాణికుల హక్కులు, విమాన ఆలస్యం లేదా రద్దు సమయంలో లభించే పరిహారం గురించి వెబ్సైట్లు, ఎయిర్పోర్ట్ కౌంటర్లలో తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.భారత విమానయాన రంగం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్గా ఎదుగుతోంది. రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్న తరుణంలో ప్రయాణికుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యతని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
చమురు భగభగ..
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా గల్ఫ్ ఇంధన క్షేత్రాలు, నిల్వలపై దాడులకు తెరతీయడంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 9 శాతం జంప్చేసి 117 డాలర్లకు చేరింది. దేశీయంగా ఎంసీఎక్స్లో ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ రూ. 74 పెరిగి రూ. 9,067ను తాకింది. యూఎస్ నైమెక్స్లోనూ లైట్ స్వీట్ చమురు పీపా 1.6 శాతం బలపడి 97 డాలర్లకు చేరింది. హార్మూజ్ మూసివేతకుతోడు.. ఖతార్లోని గ్యాస్ సౌకర్యాలు, కువైట్లోని చమురు రిఫైనరీలు దాడులకు గురికావడం తదితర అంశాలు ఇంధన సరఫరాలను దెబ్బతీయనున్న ఆందోళనలు ధరలను ఎగదోస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో భారత్ చమురు బాస్కెట్ 145 డాలర్లను అధిగమించనున్నట్లు వెలువడిన అంచనాలు దేశీయంగా ఇంధన రంగ దిగ్గజ షేర్లలో భారీ అమ్మకాలకు దారి చూపాయి. -
క్రూడ్ బాంబ్.. మార్కెట్ క్రాష్
ముంబై: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో దలాల్ స్ట్రీట్లో అన్ని రంగాల షేర్లు దగ్ధమయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ క్షేత్రాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం పేకమేడలా కూలిపోయింది. క్రూడాయిల్ ధరలు మళ్లీ తారస్థాయికి చేరుకోవడం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాత్కాలిక చైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం తదితర అంశాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ ఏకంగా 2,497 పాయింట్లు(3.26%) క్షీణించి 74,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 776 పాయింట్లు కుప్పకూలి 23,002 వద్ద నిలిచింది. 2024 జూన్ 24 తర్వాత ఇరు సూచీలకిదే అత్యంత భారీ పతనం కావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ మూడు శాతానికిపైగా పతనంతో ఒక్కరోజే రూ.12.87 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.426 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఆసియా మార్కెట్లు 3%, యూరప్ మార్కెట్లు 2.50% పతనమయ్యాయి. అమెరికా స్టాక్ సూచీలు ఒకశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. అమ్మకాల సునామీ: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలతో సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 2,753 పాయింట్లు క్షీణించి 73 వేల స్థాయి దిగువన 73,951 వద్ద, నిఫ్టీ 848 పాయింట్లు పతనమై 22,930 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. → బీఎస్ఈ ఇండెక్సుల్లో ఆటో 4.07%, రియల్టీ 3.79%, ఫైనాన్సియల్ సరీ్వసెస్ 3.66% పతనయమ్యాయి. మిడ్, స్మాల్ క్యాప్లు వరుసగా 3.34%, 2.77% పడ్డాయి. సెన్సెక్స్లో 30 షేర్లూ నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్(5.6%), బజాజ్ ఫైనాన్స్(5.4%), ఎంఅండ్ఎం(5.2%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(5.1%), ఎల్అండ్టీ (4.7%) అత్యధికంగా నష్టపోయాయి.పతనానికి ‘పంచ’ కారణాలు → భగ్గుమన్న చమురు ధరలు: ఇరాన్ దాడులు తీవ్రం చేయడంతో గల్ఫ్ దేశాల్లో చమురు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ పూర్తి గా స్తంభించిపోయింది. దీంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర మళ్లీ 119 డాలర్ల స్థాయికి తాకింది. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. → విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు: యుద్ధ భయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ వారంలో కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలో మొత్తం రూ.24 వేల కోట్ల విలువైన దేశీయ ఈక్విటీలు విక్రయించారు. గురువారం ఒక్క రోజే రూ.7,558 కోట్లు అమ్మకాలకు పాల్పడ్డారు. గడిచిన 14 రోజులుగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తున్నారు. → ఫెడ్ వడ్డీరేట్లు యథాతథం: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంశాలను కారణాలుగా చూపుతూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా కొనసాగించింది. రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు.→ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్ల అమ్మకాలు: ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాత్కాలిక ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామాతో బ్యాంకు షేరు ఇంట్రాడేలో బ్యాంక్ షేర్లు 8.7 శాతం మేర పతనమయ్యాయి. అధిక వెయిటేజీ కలిగిన స్టాక్ కావడంతో సూచీలపై ఆ ప్రభావం కనిపించింది.→ లాభాల స్వీకరణ: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా... దేశీ సూచీలు గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ మొత్తం 2,140 పాయింట్లు(2.87%) ఎగసింది. క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరగడం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల ప్రభావంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. -
జియో ప్లాన్: ఒక్కసారి రీచార్జ్తో బోలెడు బెనిఫిట్లు
పదే పదే రీఛార్జ్ చేయించుకునే తలనొప్పి లేకుండా, ఒక్కసారి రీఛార్జ్తో ఏడాది మొత్తం ప్రశాంతంగా గడపాలనుకునే వారి కోసం రిలయన్స్ జియోలో ఒక అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. రూ. 3,599 ధరతో కూడిన ఈ ప్లాన్ కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాకుండా, ఏకంగా రూ. 35,000 పైగా విలువైన ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుండటం విశేషం.జియో రూ. 3,599 ప్లాన్ పూర్తి వివరాలుఈ ప్లాన్ ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు ఇవే.. 365 రోజులు (పూర్తిగా ఒక సంవత్సరం) వాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత ఉచిత కాలింగ్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అర్హత ఉన్న వినియోగదారులకు అపరిమిత 5G డేటా పొందే అవకాశం ఉంటుంది.సాధారణ బెనిఫిట్స్తో పాటు, ఈ ప్లాన్ ద్వారా లభించే ఎక్స్ట్రా ఫీచర్లు యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. క్రికెట్ మ్యాచ్లు, లేటెస్ట్ సినిమాలు చూడాలనుకునే వారి కోసం కంపెనీ 3 నెలల డిస్నీ+ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తోంది.అలాగే ఈ ప్లాన్లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro) సబ్స్క్రిప్షన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రియుల కోసం భారీ విలువ కలిగిన గూగుల్ జెమిని ప్రో సబ్స్క్రిప్షన్ను జియో ఆఫర్ చేస్తోంది. ఫోన్ మెమరీ సమస్యను అధిగమించేందుకు 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని కూడా జియో కల్పిస్తోంది. -
ఆల్గో ట్రేడింగ్ కేసులో సెటిల్మెంట్లు
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని 111 సంస్థలు వినియోగించుకున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. కొన్ని ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్తో చేతులు కలిపిన స్టాక్ బ్రోకర్లపై పెండింగ్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలను నిలువరించేందుకు వీలుగా సెటిల్మెంట్ పథకాన్ని సెబీ తీసుకువచ్చింది.దీంతో ఒక్కో సంస్థ రూ. లక్ష చొప్పున చెల్లించి కేసులు సెటిల్ చేసుకున్నట్లు సెబీ పేర్కొంది. శాట్ లేదా వివిధ కోర్టులలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కోవలసి ఉన్న స్టాక్ బ్రోకర్ సంస్థలకు 2025 జూన్ 16 నుంచి సెపె్టంబర్ 16వరకూ సెబీ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే పథకానికి చివర్లో భారీ స్పందన కనిపించడంతో 2025 అక్టోబర్వరకూ గడువును పొడిగించింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భారీ కుదుపు..
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిణామంతో గురువారం స్టాక్ మార్కెట్లో బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 1 లక్ష కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.అసలేం జరిగింది?మార్చి 17న పంపిన తన రాజీనామా లేఖలో చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్ధతులు, నిర్ణయాలు తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు."నేను బ్యాంకులో ఏదో తప్పు జరిగిందని ఆరోపించడం లేదు. కానీ నా వ్యక్తిగత భావజాలం, సంస్థ అనుసరిస్తున్న పద్ధతులు ఒకేలా లేవు. అందుకే తప్పుకుంటున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.ఆర్థిక శాఖ మాజీ బ్యూరోక్రాట్ అయిన చక్రవర్తి, 2021లో బోర్డులో చేరారు. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్తో విలీనం వంటి కీలక ప్రక్రియలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.మార్కెట్లో ప్రకంపనలుచక్రవర్తి నిష్క్రమణ వార్త బయటకు రాగానే మార్కెట్ తీవ్రంగా స్పందించింది. ప్రారంభ ట్రేడింగ్లోనే షేరు ధర 9 శాతం మేర పడిపోయి రూ.770 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల పతనం కారణంగా బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ-50 వందల పాయింట్ల మేర నష్టపోయింది. అయితే, మార్కెట్ ముగిసే సమయానికి షేరు స్వల్పంగా కోలుకుని, క్రితం ముగింపుతో పోలిస్తే 3.8 శాతం నష్టంతో రూ.810.80 వద్ద స్థిరపడింది.రంగంలోకి దిగిన ఆర్బీఐపరిస్థితిని చక్కదిద్దేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తక్షణమే రంగంలోకి దిగింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ వెటరన్ కేకీ మిస్త్రీని మార్చి 19 నుండి మూడు నెలల కాలానికి తాత్కాలిక పార్ట్ టైమ్ ఛైర్మన్గా నియమించేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది.బ్యాంకులో ఎలాంటి ఆధిపత్య పోరాటాలు, కార్యాచరణ లోపాలు లేవని కేకీ మిస్త్రీ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన బ్యాంక్ అని, దాని వద్ద తగినంత మూలధనం, నగదు లభ్యత ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. మేనేజ్మెంట్ తీరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు -
నక్కతోక తొక్కినట్లు.. గంటల్లోనే పడిపోయిన బంగారం!
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. గురువారం ఉదయం గణనీయంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి మరింత భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు నక్కతోక తొక్కినట్లు మరింత ఊరట లభించింది.హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం రూ.2550 తగ్గి రూ.1,42,750 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.7140 క్షీణించి రూ.1,37,750 లకు దిగివచ్చింది.అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర గురువారం ఉదయం రూ.2780 తగ్గి రూ.1,54,640 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.6550 కరిగి రూ. 1,50,280 లకు క్షీణించింది.ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు సిల్వర్ కేజీకి రూ.10000 క్షీణించి రూ.2,65,000 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్ మార్కెట్ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రక్తపాతాన్ని చవిచూశాయి! అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడిచమురు సెగలు దలాల్ స్ట్రీట్ను అతలాకుతలం చేశాయి. అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేస్తూ.. ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో ఏకంగా రూ.12 లక్షల కోట్లు ఆవిరైపోయింది.బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు 2,196.89 పాయింట్లు (3.26%) పతనమై 74,207.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 775.65 పాయింట్లు (3.26%) క్షీణించి 23,002.15 వద్ద స్థిరపడింది.మార్కెట్ను ముంచేసిన 5 ప్రధాన కారణాలుపతాక స్థాయికి చేరిన మధ్యప్రాచ్య సంక్షోభంఅమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయబ్రాంతులకు గురిచేసింది. ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్లోని రాస్ లఫ్ఫాన్ LNG ప్లాంట్లతో పాటు సౌదీ, కువైట్ రిఫైనరీలపై దాడులు జరగడం గ్లోబల్ ఎనర్జీ సరఫరా వ్యవస్థను దెబ్బతీసింది.భగ్గుమన్న ముడిచమురుయుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కరోజే 5-11% పెరిగి బ్యారెల్కు 119 డాలర్లకి చేరుకుంది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, కంపెనీల నిర్వహణ వ్యయం భారమై లాభాలు తగ్గుతాయన్న ఆందోళన పెరిగింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో కుదుపుదేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) పార్ట్-టైమ్ చైర్మన్ అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామా మార్కెట్ను షాక్కు గురిచేసింది. "విలువలు, నైతికత" విషయంలో విభేదాల కారణంగా ఆయన తప్పుకోవడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 7-8% కుప్పకూలింది. ఇది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ను భారీగా కిందకు లాగింది.అమెరికా ఫెడ్ 'హాకిష్' వైఖరిఅమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమే కాకుండా, కఠిన వైఖరిని ప్రదర్శించింది. యుద్ధం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉన్నందున, 2026లో కేవలం ఒకే ఒక్క వడ్డీ రేటు కోత (25 bps) ఉండొచ్చని సూచించడం గ్లోబల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది.రూపాయి పతనం- ఎఫ్ఐఐల అమ్మకాలుఅంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.63కి పడిపోయింది. దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపరులు (FII) భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, అటు ఆసియా, యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండటంతో భారత మార్కెట్లు కోలుకోలేకపోయాయి. -
ఏఐలో భారత్కి ప్రత్యేక స్థానం: కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో భారత్కి విశిష్ట స్థానం ఉందని టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ చీఫ్ ఏఐ ఆఫీసర్ బాబక్ హోద్జాత్ తెలిపారు. డిజిటల్ సిస్టమ్లు, ప్రక్రియల గురించి అపార అవగాహన ఉన్న ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉండటం ఇందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు.ఏఐ సిస్టమ్లను రూపొందించడంలో, వివిధ పరిశ్రమలవ్యాప్తంగా వినియోగాన్ని వేగవంతం చేయడంలో ఈ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఏఐ సాధనాలతో కోడింగ్ సులభతరమవుతున్నప్పటికీ, ఔట్పుట్ నాణ్యతను మదింపు చేయడానికి డెవలపర్లు ఇప్పటికీ అవసరమేనని ఆయన చెప్పారు.వివిధ రంగాలవ్యాప్తంగా మరింత మంది ప్రొఫెషనల్స్కి ఏఐ సాధికారత కల్పిస్తోందని వివరించారు. కంపెనీలు కృత్రిమ మేథ టెక్నాలజీలను వినియోగించుకోవడంలో సహకరించే దిశగా కాగ్నిజెంట్ ఇప్పుడు ఏఐ బిల్డర్ కంపెనీగా రూపాంతరం చెందిందని బాబక్ చెప్పారు.ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. కంపెనీలో అంతర్గతంగా కోడ్ జనరేషన్లో ఏఐ వాటా సుమారు 30 శాతంగా ఉండగా, ఇది గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. -
స్టాక్ మార్కెట్ క్రాష్.. ముంచేసిన చమురు!
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సంఘర్షణ చమురు మౌలిక సదుపాయాలకు మరింత నష్టం కలిగించడంతో ఇంధన ధరలు పెరగడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ క్షీణించాయి.ఎన్ఎస్ఈ నిఫ్టీ 775.65 పాయింట్లు లేదా 3.26 శాతం క్షీణించి 23,002.15 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2496.89 పాయింట్లు లేదా 3.26 శాతం తగ్గి 74,207.24 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ లోని అన్ని స్టాక్స్ నష్టాలలో ముగిశాయి. పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ ఈ జాబితాలో ఉన్నాయి.విస్తృత మార్కెట్ సూచీలు నెత్తురు కక్కాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 3.19 శాతం, స్మాల్ క్యాప్ 100 2.94 శాతం నష్టపోయాయి. కౌంటర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి.మార్కెట్ సమయంలో, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు 11 శాతం పెరిగి 119.5 డాలర్లకు చేరుకుంది. కీలకమైన రిఫైనర్లు దెబ్బతిన్న తరువాత సౌదీ అరేబియా యాన్బు నౌకాశ్రయంలో చమురు లోడ్ చేయడాన్ని నిలిపివేసిందని నివేదికలు వచ్చిన తరువాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 11 శాతం పెరిగింది. -
టాటా వాణిజ్య వాహనాల ధరల పెంపు
న్యూడిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. ఈ ఏప్రిల్ 1 నుంచి అన్ని కమర్షియల్ వాహనాలపై 1.50 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. మోడల్, వేరియంట్ను బట్టి పెంపు పరిధి మారుతుందని పేర్కొంది. ముడి సరుకుల ధరలు, ఇతర ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో వాటి ప్రభావాన్ని కొంత మేర తగ్గించుకునేందుకు ఈ ధరల పెంపు చేపడుతున్నట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. 180 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్లో భాగమైన టాటా మోటార్స్, దేశంలో యుటిలిటీ వాహనాలు, పిక్అప్ వాహనాలు, ట్రక్కులు, బస్సుల తయారీలో అతిపెద్ద సంస్థగా ఉంది. -
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ అంబానీ
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్) నిధుల మళ్లింపు కేసులో రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ గురువారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు నమోదైన రూ.2929.05 కోట్ల బ్యాంకు మోసం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించింది.నిధుల మళ్లింపుపైనే ప్రధాన దృష్టితెల్లవారుజామునే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అనిల్ అంబానీని ఆర్కామ్కు కేటాయించిన రుణాల వినియోగంపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కంపెనీ అవసరాల కోసం తీసుకున్న రుణాలను ఇతర అవసరాలకు మళ్లించడం, నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిపారనే ఆరోపణలున్నాయి. ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది ఆగస్టులో అనిల్ అంబానీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. అనిల్ అంబానీ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 19, 20 తేదీల్లో ఆయన దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరు అవుతున్నారు.ముగిసిన ‘జై అన్మోల్’ విచారణఇదే క్రమంలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీని కూడా సీబీఐ వదిలిపెట్టలేదు. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)లో జరిగిన రూ.228.06 కోట్ల ఆర్థిక అవకతవకలపై గత వారం (మార్చి 14, 2026) ఆయన్ను అధికారులు విచారించారు. ‘చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు అనిల్ అంబానీ కట్టుబడి ఉన్నారు. అందులో భాగంగానే ఈ విచారణకు హాజరవుతున్నారు’ అని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి చెప్పారు.ఈ కేసులో మరికొంతమంది ప్రభుత్వ అధికారులు, రిలయన్స్ గ్రూప్ మాజీ ఉన్నతాధికారుల పాత్రపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే జై అన్మోల్ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు, తాము సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
నెలకు అద్దె @ రూ.1.2 లక్షలు!
కలల నగరం ముంబైలో అద్దె కోసం ఇల్లు దొరకడం ఒక ఎత్తయితే, దాని అద్దె చెల్లించడం మరో ఎత్తు. సామాన్యుడి నెల జీతం కంటే కొన్ని ప్రదేశాల్లో ఇక్కడ అద్దెలే ఎక్కువగా ఉంటాయన్నది జీర్ణించుకోలేని వాస్తవం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ముంబై జీవన ప్రమాణాలు, అద్దె భారం గురించి చర్చకు తెరలేపింది.ప్రముఖ వ్లాగర్ ఆర్య కొఠారి తన ఇన్స్టాగ్రామ్ సిరీస్ ‘రెంట్ ఇన్ ముంబై - ఈపీ 4’ లో భాగంగా అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఒక యువతిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రాంతంలో ఒక 3బీహెచ్కే (మూడు పడకగదుల) ఫ్లాట్ కోసం ఆమె నెలకు ఏకంగా రూ.1.2 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు వెల్లడించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ విశాలమైన గది, ఆధునిక వంటగది చూస్తుంటే ముంబై వంటి నగరంలో అది ఎంత లగ్జరీనో అర్థమవుతుంది.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ‘ముంబైలో అద్దె కట్టడమే ఒక పూర్తిస్థాయి ఉద్యోగంలా మారిపోయింది’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ‘ఒకరికి రూ. 1.2 లక్షల అద్దె సౌకర్యం కావచ్చు, మరొకరికి రూ.80 వేల జీతంతో బతకడమే పెద్ద పోరాటం కావచ్చు’ అని మరికొరు అన్నారు. View this post on Instagram A post shared by Arya Kothari (@arya_kothari) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో చోటుచేసుకున్న అనూహ్య మార్పులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా చేసిన నేపథ్యంలో సంస్థ పాలనా విషయాల్లో ఎటువంటి ఆందోళనలు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది.గందరగోళానికి తెరదించిన ఆర్బీఐహెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఇటీవలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆర్బీఐ, బ్యాంక్ మేనేజ్మెంట్ కోరిన విధంగా పరివర్తన ఏర్పాట్లకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో బ్యాంక్ పటిష్టతపై ఆర్బీఐ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యుత్తమ ఆర్థిక ప్రమాణాలు, సమర్థవంతమైన మేనేజ్మెంట్ బృందాన్ని కలిగి ఉంది. మా అంచనాల ప్రకారం ఈ బ్యాంక్ నిర్వహణ లేదా పాలనలో ఎటువంటి భౌతిక పరమైన లోపాలు లేవు’ అని ఆర్బీఐ పేర్కొంది.తాత్కాలిక సారథిగా కేకీ మిస్త్రీఅతాను చక్రవర్తి నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కేకీ మిస్త్రీని మార్చి 19 నుంచి మూడు నెలల పాటు తాత్కాలిక పార్ట్-టైమ్ ఛైర్మన్గా నియమించేందుకు ఆర్బీఐ పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.కేకీ మిస్త్రీగురువారం జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో కేకీ మిస్త్రీ మాట్లాడుతూ, బ్యాంక్ పనితీరులో ఎటువంటి లోపాలు లేవని పునరుద్ఘాటించారు. ‘మా అంతర్గత చర్చల్లో కానీ, మా దృష్టికి వచ్చిన అంశాల్లో కానీ ఎటువంటి కార్యాచరణ లోపాలు లేవు. హైలైట్ చేయాల్సిన ప్రత్యేక సమస్యలేవీ ప్రస్తుతానికి లేవు’ అని ఆయన స్పష్టం చేశారు.అతాను చక్రవర్తి నిష్క్రమణ వెనుక..మే 2021లో బోర్డులో చేరిన అతాను చక్రవర్తి మార్చి 17న తన రాజీనామా లేఖను సమర్పించారు. తన వ్యక్తిగత విలువలు, నైతికతకు ప్రస్తుత పరిస్థితులు అనుగుణంగా లేవని ఆయన లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే, రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు మినహా ఇతర కారణాలేవీ లేవని బ్యాంక్ యాజమాన్యం ధ్రువీకరించింది. చక్రవర్తి హయాంలోనే హెచ్డీఎఫ్సీ లిమిటెడ్తో బ్యాంక్ విలీనం వంటి చారిత్రాత్మక నిర్ణయం జరిగింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
బిగ్రిలీఫ్.. పండగపూట బంపర్ ఆఫర్..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మళ్లీ నేలకరిచిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. గడిచిన మూడు సెషన్లలో లాభాల్లోకి చేరిన మార్కెట్లు ఈరోజు నష్టాల్లోకి వెళ్లాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 459 పాయింట్లు తగ్గి 23,312 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1526 పాయింట్లు దిగజారి 75,201 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.09బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 111.37 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.27 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.36 శాతం పడిపోయింది.నాస్డాక్ 1.46 శాతం నష్టపోయింది.Today Nifty position 19-03-2026(time: 9:28 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సిరామిక్ టైల్స్పై యుద్ధం ఎఫెక్ట్
దేశీ సిరామిక్ టైల్స్ పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధం ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో పరిశ్రమ ఆదాయం 1–2 శాతంస్థాయిలో నీరసించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వరుసగా రెండో ఏడాది ఆదాయంలో క్షీణత నమోదుకానున్నట్లు తెలియజేసింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా సిరామిక్ టైల్స్ ఉత్పత్తి, ఎగుమతులు, సరఫరాలకు విఘాతం కలగనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 53,000 కోట్ల విలువైన దేశీ సిరామిక్ టైల్స్ పరిశ్రమపై యుద్ధం రెండు విధాల ప్రభావం చూపనున్నట్లు వివరించింది.మధ్యప్రాచ్య దేశాలకు లాజిస్టిక్స్పరంగా సవాళ్లు ఎదురవుతుండటంతో సరఫరా వ్యవస్థ అస్తవ్యస్థంకావడంతోపాటు ఎగుమతులు దెబ్బతినే వీలున్నట్లు క్రిసిల్ పేర్కొంది. సిరామిక్ టైల్స్ ఆదాయంలో ప్రధానంగా ఎగుమతులు 40 శాతం వాటా ఆక్రమిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాల వాటా 15 శాతంగా తెలియజేసింది. హార్ముజ్ ద్వారా జల రవాణాకు అవాంతరాలు ఎదురవుతుండటంతో ఎగుమతుల ఆదాయం 6–7 శాతం క్షీణించనున్నట్లు అంచనా వేసింది. డెలివరీలు నిలిచిపోవడంతోపాటు.. బీమా వ్యయాలు పెరిగిపోనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు చేపట్టే ఎగుమతి వ్యయాలు సైతం పెరగనున్నట్లు వెల్లడించింది.ఎల్ఎన్జీ సెగతయారీ వ్యయాల్లో 35 శాతం వాటా ఆక్రమించే కీలక ముడిసరుకులు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ), ప్రొపేన్ సరఫరాలు తగ్గడంతో దేశీయంగా పలు సిరామిక్ టైల్స్ తయారీ కంపెనీల కార్యకలాపాలు మూతపడటం లేదా ఉత్పత్తి నిలిచిపోవడం లేదా ఉత్పత్తిలో భారీ క్షీణతకు అవకాశమున్నట్లు క్రిసిల్ నివేదికలో వివరించింది. ఈ నెల(మార్చి)లో టైల్స్ ఉత్పత్తి దాదాపు నిలిచిపోగా.. దేశీ వినియోగ వ్యయాలు సైతం మందగించనున్నట్లు తెలియజేసింది. ఫలితంగా దేశీ టైల్స్ మార్కెట్ వృద్ధి గతంలో వేసిన 7–8% అంచనాలస్థానే 4–5 శాతానికి పరిమితంకానున్నట్లు పేర్కొంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో రెండు, మూడు వారాలు కొనసాగితే కంపెనీల దీర్ఘకాలిక మూసివేతలు, భారీ నష్టాలకు కారణంకావచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలియజేశారు. దీంతో నెలవారీ ఆదాయంలో 7–8 శాతం క్షీణత నమోదుకావచ్చని అంచనా వేశారు. ఈ అంశాలన్నీ కంపెనీల నిర్వహణ లాభదాయకతను 1.3–1.5%మేర దెబ్బతీయవచ్చని నివే దిక పేర్కొంది. వెరసి ఐదేళ్ల కనిష్టం 9.3–9.5%నికి మార్జిన్లు బలహీనపడవచ్చని అభిప్రాయపడింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ఎస్యూవీలపై మారుతీ సుజుకీ ఫోకస్
దేశీయ ప్యాసింజర్ వాహన మార్కెట్లో శరవేగంగా విస్తరిస్తున్న స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) విభాగంపై మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా వచ్చే 5–6 ఏళ్లలో 7 కొత్త ఎస్యూవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు ఎండీ హిశాషి టెకుచి తెలిపారు. ఇన్వెస్టర్ల ప్రజెంటేషన్లో ఆయన మాట్లాడుతూ, భారతీయ వాహన మార్కెట్లో ఎస్యూవీల వాటా వేగంగా పెరుగుతోందన్నారు. 2019లో 26.5 శాతంగా ఉన్న ఎస్యూవీ వాటా 2024 నాటికి 54.7 శాతానికి చేరిందన్నారు.అదే విధంగా, కంపెనీ ఎస్యూవీ మార్కెట్ వాటా 2019–20 ఆర్థిక సంవత్సరంలో 16.8 శాతం ఉండగా, 2025–26 కాలంలో 19.6 శాతానికి పెరిగిందని తెలిపారు. గత నాలుగేళ్లలో ఈ విటారా, విక్టోరిస్, జిమ్నీ, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి మోడళ్లను విడుదల చేయడంతో పాటు బ్రెజ్జా మోడల్ను పూర్తిగా ఆధునీకరించడం ద్వారా ఈ వృద్ధి సాధ్యమైందన్నారు. వినియోగదారుల అభిరుచుల్లో మార్పులను దృష్టిలో ఉంచుకుని మధ్యస్థ, భారీ ఎస్యూవీ/ఎంపీవీ మోడళ్ల శ్రేణిని విస్తరించనున్నట్లు తెలిపారు. అలాగే మిడ్–ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలిసారి కార్లు కొనుగోలు చేసే వినియోగదారులను ఆకర్షించేందుకు ‘‘సుజుకికి ప్రత్యేకమైన’’ ఎంట్రీ లెవల్ కారును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. గ్లోబల్ తయారీ కేంద్రంగా భారత్‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా ఆటోమొబైళ్లు, ద్విచక్ర వాహనాల తయారీలో భారత్ను గ్లోబల్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న పేరెంట్ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ లక్ష్యాన్ని టెకుచి పునరుద్ఘాటించారు. దేశీయ డిమాండ్ను తీర్చడంతో పాటు భారత్ను గ్లోబల్ ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 40 లక్షల యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ, తగిన సమయంలో దశలవారీగా ఈ సామర్థ్యాన్ని పెంచుతామని పేర్కొన్నారు. కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాల సాధనలో భాగంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలతో పాటు సీఎన్జీ, బయోఫ్యూయెల్ వంటి బహుళ ఇంధన విధానాలను అనుసరించనున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
సవాళ్ల నుంచి అవకాశాలదాకా.. కెమికల్స్ రంగం బూమ్
దేశీ కెమికల్స్ పరిశ్రమ ఆర్థిక వృద్ధిని మించి పరుగుతీయనున్నట్లు కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ అండ్ కంపెనీ తాజా నివేదికలో పేర్కొంది. దీంతో 2030కల్లా కెమికల్స్ రంగం 230–255 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. ఇందుకు అధిక వృద్ధిలో ఉన్న విభాగాలు దోహదం చేయనున్నట్లు ‘ప్రపంచ అవరోధాలమధ్య సవాళ్ల నుంచి అవకాశాలలోకి దేశీ కెమికల్ పరిశ్రమ’ పేరుతో విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది.ప్రస్తుతం 155–165 బిలియన్ డాలర్లుగా ఉన్న కెమికల్స్ పరిశ్రమ అంతర్జాతీయంగా అవాంతరాలు ఎదురైనప్పటికీ వార్షిక ప్రాతిపదికన 8–9 శాతం పురోగతిని సాధించనున్నట్లు అభిప్రాయపడింది. ఈ రంగంలో ప్రధానంగా 8 విభాగాలు అధిక వృద్ధిని అందుకోనున్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో సెమీకండక్టర్స్, ఎలక్ట్రిక్ వాహనాలు– బ్యాటరీలు, రెనెవబుల్స్, కన్స్ట్రక్షన్, ఏరోస్పేస్– డిఫెన్స్, ఆటో విడిభాగాలు, బయో– ఎక్స్, ఈకామర్స్ను ప్రస్తావించింది. ఈ విభాగాలు 16 శాతం వార్షిక వృద్ధితో 2030కల్లా 30–35 బిలియన్ డాలర్ల అదనపు డిమాండుకు తెరతీయనున్నట్లు అంచనా వేసింది. ఈ కాలంలో నిర్మాణ సంబంధ కెమికల్స్ రెట్టింపై 28 బిలియన్ డాలర్లను తాకనున్నట్లు పేర్కొంది. ఇందుకు మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది.17 శాతం రిటర్నులుగత దశాబ్ద కాలంలో వార్షిక ప్రాతిపదికన మొత్తం వాటాదారులకు 17 శాతం రాబడిని అందించినట్లు మెకిన్సీ నివేదిక పేర్కొంది. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు, విదేశీ కంపెనీలను అధిగమించినట్లు వెల్లడించింది. అయితే కెమికల్స్ రంగంలో 31 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ ప్రధానంగా ఇనార్గానిక్స్(12 బిలియన్ డాలర్లు), పాలిమర్స్(13 బిలియన్ డాలర్లు)లో దిగుమతి ప్రత్యామ్నాయాలకు వీలున్నట్లు వివరించింది. ఇందుకు ఉదాహరణగా స్టైరీన్, ఎసెటిక్ యాసిడ్, పాలియోల్స్ తదితర వేల్యూ చైన్స్లో ప్రపంచస్థాయి సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వృద్ధిని అందుకునేందుకు వీలుగా కంపెనీలు అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించవలసి ఉన్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా భాగస్వామ్యాలు నెలకొల్పుకోవడం, ఇతర సంస్థల కొనుగోళ్లు, పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)పై వ్యయాల పెంపు, ఏఐ ఆధారిత సామర్థ్యాలను అమలు చేయడం తదితరాలను ప్రస్తావించింది. ప్రపంచస్థాయిలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునేందుకు సరఫరా చైన్, బ్యాలన్స్షీట్లను పటిష్టపరచుకోవడంతోపాటు.. విలువ ఆధారిత వృద్ధిపై దృష్టిపెట్టవలసి ఉన్నట్లు తెలియజేసింది. వెరసి కెమికల్స్ పరిశ్రమ నిర్వచనా దశాబ్దంలోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొంది. వాటా స్వల్పమేగత దశాబ్ద కాలంలో దేశీ కెమికల్స్ పరిశ్రమ పటిష్ట వృద్ధిని సాధించినప్పటికీ అంతర్జాతీయ కెమికల్స్ వాణిజ్యంలో వాటా 3 శాతమే. చైనా 20 శాతం వాటాను ఆక్రమిస్తుంటే.. యూరోపియన్ యూనియన్ 15 శాతం, యూఎస్ 10 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. దేశీయంగా ఈ రంగంలో విలీనాలు, కొనుగోళ్ల వాటా 0.9 శాతమేకాగా.. జాతీయ సగటు 2.5 శాతంగా ఉంది. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోర్ట్ఫోలియో క్రమబద్ధీకరణకు తెరలేవడంతోపాటు.. యూరప్లో ఆస్తుల విలువ పునర్నిర్మితమవుతున్న నేపథ్యంలో ఇతర సంస్థల కొనుగోళ్లు, టెక్నాలజీ అందుకునేందుకు దేశీ కంపెనీలకు అవకాశాలున్నట్లు నివేదిక పేర్కొంది. జపాన్, యూఎస్, ఈయూలతో పోలిస్తే దేశీ కంపెనీలు చాల స్వల్ప స్థాయిలో అంటే ఆదాయంలో 0.5 శాతమే ఆర్అండ్డీపై వెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. ఈ రంగంలో ఆర్అండ్డీ కీలకమని పేర్కొంది. ఏఐ, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ వినియోగంతో ప్రొక్యూర్మెంట్, సరఫరా చైన్ నిర్వహణ తదితరాలలో భారీ పెట్టుబడులు చేపట్టకుండానే ఇబిటాను 8–12 శాతంమేర మెరుగుపరచుకోవచ్చని అభిప్రాయపడింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
60% సీట్లకు అదనపు చార్జీలు వద్దు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, వారి సౌకర్యార్థం ఎయిర్లైన్స్కి పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) మార్గదర్శకాలు జారీ చేసింది. సీట్ల కేటాయింపునకు సంబంధించి కనీసం 60 శాతం సీట్లపై అదనపు చార్జీలు విధించొద్దని సూచించింది. ప్రస్తుతం 20 శాతం సీట్లను ఉచితంగా బుక్ చేసుకోవడానికి ఉండగా మిగతా సీట్లకు అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటోంది. ఇక ఒకే పీఎన్ఆర్పై ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు ఒకే దగ్గర కూర్చునే విధంగా చూడాలని కూడా డీజీసీఏ సూచించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. దేశీ రూట్లలోని ఫ్లయిట్స్కి ఇవి వర్తిస్తాయి. ప్యాసింజర్లకు మరింత వెసులుబాటు కలి్పంచేలా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనల అమలును మరింత కఠినతరం చేస్తామన్నారు. దేశీ విమాన ప్రయాణాలకు సంబంధించి భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్గా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగి 17.5–18.1 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య సెపె్టంబర్ 2025 నాటికి 162కి చేరింది. దేశ, విదేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్–అక్టోబర్ 2025 మధ్య కాలంలో 23.74 కోట్లకు చేరింది. మార్గదర్శకాల ప్రకారం.. → స్పోర్ట్స్ పరికరాలు, సంగీత సాధనాలను పారదర్శకమైన విధంగా, సురక్షితంగా చేర్చాలి. → అలాగే, పెంపుడు జంతువుల విషయంలోను స్పష్టమైన, పారదర్శకమైన విధానాలు ఉండాలి. → ఫ్లయిట్స్ జాప్యం, రద్దు, బోర్డింగ్కి నిరాకరించడం తదితర కేసుల్లో ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనలను కచి్చతంగా పాటించాలి. → ప్రయాణికుల హక్కులను ఎయిర్లైన్స్ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, బుకింగ్ ప్లాట్ఫాంలు, ఎయిర్పోర్ట్ కౌంటర్లలో స్పష్టంగా డిస్ప్లే చేయాలి. → ప్రాంతీయ భాషల్లో కూడా ప్రయాణికుల హక్కులను తెలియజేయాలి. -
సెమీకాన్ మార్కెట్ @ 300 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ సెమీకండక్టర్ల మార్కెట్ 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే 2035 నాటికి 300 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందనుంది. కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుండటం, ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధి చెందుతుండటం, డేటా సెంటర్లు విస్తరిస్తుండటం తదితర అంశాలు ఇందుకు దన్నుగా నిలవనున్నాయి. టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్స్ భవిష్యత్తుపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 90 శాతం సెమీకండక్టర్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, 2035 ఆఖరు నాటికి దేశీ డిమాండ్లో 60 శాతం చిప్స్ను స్థానికంగానే ఉత్పత్తి చేసుకోనుంది. ‘భారత్లో సెమీకండక్టర్ మార్కెట్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 45–50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, గత మూడేళ్లుగా వార్షికంగా 20 శాతం మేర వృద్ధి చెందుతోందని అంచనా. ఈ నేపథ్యంలో ఏఐ, ఆటోమోటివ్స్, డేటా సెంటర్స్, ఎల్రక్టానిక్స్ తయారీ ఊతంతో 2030 నాటికల్లా 120 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరొచ్చు‘ అని డెలాయిట్ పేర్కొంది. దేశీయంగా సెమీకండక్టర్ల డిమాండ్లో మొబైల్ ఫోన్లు, ఆటోమోటివ్, కంప్యూటింగ్, డేటా సెంటర్లలాంటి సెగ్మెంట్ల వాటా 70 శాతం పైగా ఉండనుంది. ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు .. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) కింద ఇప్పటికే 10 ప్రాజెక్టుల్లోకి 19 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటిలో ఎనిమిది ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ ..టెస్ట్ (ఓఎస్ఏటీ) ప్లాంట్లు, ఒక సెమీకండక్టర్ ఫ్యాబ్ ఉన్నాయి. సుమారు 20–25 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో మరో 18–20 ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ‘వచ్చే ఐదేళ్లలో భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమలోకి మరో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావొచ్చు. అలాగే 2030–2035 మధ్య ఇంకో 75–80 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ వ్యవస్థ మరింతగా విస్తరిస్తుంది‘ అని నివేదిక వివరించింది. భారీగా ఉద్యోగాలు.. సెమీకండక్టర్ల వ్యవస్థ విస్తరించడంతో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పన కూడా జరగనుంది. 2035 నాటికి పరిశ్రమలో సుమారు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. ఇందులో 30% ఉద్యోగాలు తయారీ కార్యకలాపాల్లో, 30% డిజైన్ సర్వీసుల్లో, మిగతా 40 శాతం ఇతరత్రా విభాగాల్లోనూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమ ఏటా 4,00,000–5,00,000 మందికి పరిశ్రమ సంబంధిత కోర్సులు, నైపుణ్యాల్లో శిక్షణనివ్వాల్సి ఉంటుందని నివేదిక వివరించింది. అయితే, ఈ సానుకూల పరిణామాలన్నీ కూడా వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంపైనే ఆధారపడి ఉంటాయని వివరించింది. స్థలం, యుటిలిటీలు, మౌలిక సదుపాయాలకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత మెరుగుపడాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, వార్షికంగా బడ్జెట్లో కేటాయింపులు, నిర్దిష్ట కాలపరిమితితో కూడుకున్న ప్రోత్సాహక స్కీములకే పరిమితం కాకుండా నిధుల లభ్యతపరంగా కచ్చితత్వం ఉండేలా జాతీయ స్థాయి ప్రోగ్రాంను రూపొందించాలని సూచించింది. -
ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు
ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతం పెరిగి 108.66 డాలర్లకు చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) 2.5 శాతం పెరిగి 98.65 డాలర్లకు చేరింది. బ్రెంట్–WTI మధ్య ధర తేడా 2019 తర్వాత ఇదే అత్యధికం. కాగా, బుషెహర్ ప్రావిన్స్ తీరంలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ఫీల్డ్ "సౌత్ పార్స్" సదుపాయాలు దాడికి గురయ్యాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ చేసింది. ఈ దాడుల తర్వాత ఇరాన్.. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోని ఆయిల్–గ్యాస్ సదుపాయాలపై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది.హెచ్చరించిన విధంగానే ఇరాన్ ఖతార్లోని రాస్ లాఫాన్ గ్యాస్ ఫెసిలిటీపై బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు మంటలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా చమురు, సహజ వాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. రోజుకు 7–10 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి తగ్గినట్లు అంచనా. ఇది ప్రపంచ డిమాండ్లో 7–10 శాతం తగ్గుదల. చమురు–గ్యాస్ ధరలు ఎక్కువ కాలం ఇలాగే పెరుగుతూ పోతే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికాఅమెరికా ప్రభుత్వం ఇంధన సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు జోన్స్ యాక్ట్ నిబంధనలను 60 రోజుల పాటు సడలించింది. అలాగే, వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ PDVSAతో కొన్ని లావాదేవీలకు అనుమతి ఇచ్చింది. -
రైల్వే టికెట్ బుకింగ్లో భారీ మార్పులు.. త్వరలోనే!
దేశంలో రైలు టికెట్ బుకింగ్ వ్యవస్థ త్వరలో మరింత వేగవంతం, సులభతరం కానుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఎదురయ్యే ఆలస్యం, సర్వర్ సమస్యలు, లావాదేవీ వైఫల్యాలకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ భారీ అప్గ్రేడ్ పనులు చేపట్టింది.జూన్ నాటికి కొత్త వ్యవస్థ సిద్ధం!అధికారుల ప్రకారం.. అప్గ్రేడ్ చేసిన ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నిమిషానికి సుమారు 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యవస్థ, అప్గ్రేడ్ తర్వాత నిమిషానికి 1.5 లక్షల బుకింగ్స్ను నిర్వహించగలదు. దీంతో పీక్ టైమ్లో కూడా సాఫీగా టికెట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది.ఎంక్వైరీ సేవల్లోనూ వేగంటికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా, రైలు వివరాలు, సీట్ల లభ్యత తెలుసుకునే ఎంక్వైరీ సేవలు కూడా మరింత వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల విచారణలను నిర్వహిస్తున్న వ్యవస్థ, అప్గ్రేడ్ తర్వాత ఇంకా అధిక సామర్థ్యంతో పని చేయనుంది.సాంకేతిక సమస్యలకు చెక్ప్రస్తుతం వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సర్వర్ క్రాష్లు, స్లో స్పీడ్, పేమెంట్ ఫెయిల్యూర్స్. కొత్త వ్యవస్థతో ఈ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా రద్దీ సమయాల్లో కన్ఫర్మ్ టికెట్ పొందడం సులభమవుతుంది.కొత్త ఫీచర్లుఅప్గ్రేడ్ వ్యవస్థలో పలు కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వివిధ తేదీలలో టికెట్ ధరలను ముందుగానే తెలుసుకునే ఫేర్ క్యాలెండర్, ప్రయాణికుడు స్వయంగా సీటు ఎంపిక చేసుకునే ఆప్షన్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావచ్చు. అలాగే బహుభాషా సౌకర్యం కూడా కల్పించనున్నారు.ఆన్లైన్ బుకింగ్కు పెరుగుతున్న ఆదరణప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్లైన్ ద్వారా బుక్ అవుతుండగా, కేవలం 11 శాతం మాత్రమే కౌంటర్లలో కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మార్పులతో ఆన్లైన్ బుకింగ్ మరింత నమ్మదగినదిగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనుంది. మొత్తంగా, ఈ అప్గ్రేడ్తో రైలు ప్రయాణికుల టికెట్ బుకింగ్ అనుభవం పూర్తిగా మారిపోనుంది. -
విమాన ప్రయాణం.. ఇక కొత్త నిబంధనలు
దేశంలో విమాన ప్రయాణాన్ని మరింత పారదర్శకంగా, సరసమైనదిగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చే దిశగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. యాడ్-ఆన్ ఛార్జీల భారం తగ్గించి, మొత్తం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఉచితంగా సీట్ల కేటాయింపుకొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్ల కేటాయింపును ఉచితంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికులు తమకు నచ్చిన సీటును ఎంచుకోవడానికి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తగ్గనుంది.ఒకే పీఎన్ఆర్ ఉంటే పక్కపక్కనే సీట్లుఒకే పీఎన్ఆర్పై టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా దంపతులకు విమానయాన సంస్థలు సాధ్యమైనంత వరకు పక్కపక్కనే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో విడివిడిగా సీట్లు రావడం, అదనపు చార్జీలు చెల్లించడం వంటి ఇబ్బందులు తగ్గనున్నాయి.క్రీడా సామగ్రి, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాపై విమానయాన సంస్థలు పారదర్శక విధానాలు పాటించాలి. భద్రతా నిబంధనలతో పాటు ప్రయాణికులకు అనుకూలంగా వీటి నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఆదేశించింది.రద్దులు, ఆలస్యాలపై కఠిన నియంత్రణవిమానాల ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎయిర్లైన్ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, బుకింగ్ ప్లాట్ఫామ్లు, విమానాశ్రయ కౌంటర్లలో ప్రయాణికుల హక్కులను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు.విమానాశ్రయాల్లో ‘ఉడాన్ యాత్రి కేఫ్లు’ ఏర్పాటు చేసి సరసమైన ధరల్లో ఆహారం అందించనున్నారు. ‘ఫ్లైబ్రరీ’ ద్వారా ఉచితంగా పుస్తకాలు చదుకునే అవకాశం కల్పించనున్నారు. అదనంగా ఉచిత వై-ఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. -
ఘనంగా సీడీకే 'కన్వర్జెన్స్ 2026' వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ సంస్థ 'సీడీకే' (CDK), తన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో 'కన్వర్జెన్స్ 2026' వేడుకలను ఘనంగా నిర్వహించింది. సంస్థ సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడంతో పాటు, భారతీయ సంస్కృతి కుటుంబ విలువలకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఏడాది "మన భారతీయ మూలాల్లోకి వెళ్దాం" అనే థీమ్తో వేడుకలు నిర్వహించారు.ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే సీడీకే సంస్థ, 2019 నుండి వరుసగా 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' (GPTW) గుర్తింపును పొందుతోంది. అంతేకాకుండా, 2025 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ 100 ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయాల వెనుక ఉద్యోగుల శ్రమతో పాటు వారి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని ఈ వేడుక చాటిచెప్పింది.కన్వర్జెన్స్ 2026 వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకరించిన వేదికపై సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు థీమ్ ఆధారిత ఫ్యాషన్ వాక్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోన్ ఆకట్టుకుంది. ఇదే వేదికపై సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులకు 'రివార్డ్స్ అండ్ రికగ్నిషన్' విభాగంలో అవార్డులను అందజేసి గౌరవించారు. -
డెల్ కంపెనీ సైలెంట్గా ఇంత పని చేసిందా!!
ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ టెక్నాలజీస్ (Dell Technologies) సైలెంట్గా భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన గ్లోబల్ వర్క్ఫోర్స్ను సుమారు 11,000 తగ్గించి, మొత్తం సిబ్బందిని 108,000 నుండి 97,000కు తీసుకువచ్చింది. ఈ వివరాలు తాజాగా విడుదల చేసిన వార్షిక 10-K ఫైలింగ్లో వెల్లడయ్యాయి.కంపెనీ ఈ తొలగింపులపై పెద్దగా బహిరంగ ప్రకటన చేయకపోయినా, ఉద్యోగ విరమణ (severance) ఖర్చుల రూపంలో సుమారు 569 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలిపింది. ఇది కంపెనీ అమలు చేస్తున్న “క్రమశిక్షణా వ్యయ నిర్వహణ” వ్యూహంలో భాగమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు 693 మిలియన్ డాలర్లు ఉండగా, ఈసారి తగ్గడం గమనార్హం.ఒకేసారి పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించడం కాకుండా, దశలవారీగా సిబ్బందిని తగ్గించుకున్నట్లు కంపెనీ ఫైలింగ్ సూచిస్తోంది. ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం, కార్యకలాపాలను ఆధునీకరించడం, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), ఎంటర్ప్రైజ్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.డెల్ ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల కొత్త విషయమేమీ కాదు. 2023లో సుమారు 1.33 లక్షల మంది ఉన్న డెల్ వర్క్ఫోర్స్, 2024లో 1.20 లక్షలకు, 2025లో 1.08 లక్షలకు పడిపోయింది. తాజా కోతలతో మూడు సంవత్సరాల్లో దాదాపు 27 శాతం వర్క్ఫోర్స్ తగ్గిపోయినట్లైంది.ఇక టెక్ రంగంలో మొత్తం పరిస్థితి కూడా ఇదే దిశగా సాగుతోంది. లేఆఫ్స్.ఎఫ్వైఐ డేటా ప్రకారం, 2026లో ఇప్పటివరకు 66 టెక్ కంపెనీలు కలిపి 39,000కు పైగా ఉద్యోగాలను తగ్గించాయి. మెటా ప్లాట్ఫామ్స్, అట్లాసిన్, బ్లాక్ వంటి సంస్థలు కూడా ఏఐ ఆధారిత మార్పుల దిశగా ఉద్యోగ కోతలు చేపడుతున్నాయి. -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త పథకానికి ఆమోదం
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 33,600 కోట్ల రూపాయల ఖర్చుతో 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తారు.వంద నుంచి వెయ్యి ఎకరాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవ్య ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు జరగనుంది. అలాగే యూపీలో బారాబంకి నుంచి బహరాజ్ వరకు 101 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ జాతీయ రహదారి నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి 6969 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.ఇక పత్తి గిట్టుబాటు ధరల నిధికి 1718 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023-24 పత్తి సీజన్లో ఎంఎస్పీ కోసం సీసీఐకి కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. -
ఐటీ, రియల్టీ స్టాక్స్ అండతో భారీ లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, రియల్టీ స్టాక్స్ మద్దతు ఇవ్వడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు రోజు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిఫ్టీ 0.83 శాతం లేదా 196.65 పాయింట్ల లాభంతో 23,777.80 వద్ద, సెన్సెక్స్ 0.83 శాతం లేదా 633.29 పాయింట్లు పెరిగి 76,704.13 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.94 శాతం, 1.70 శాతం పెరిగాయి.రంగాల వారీగా నిఫ్టీ ఐటీ టాప్ గెయినర్ గా నిలిచింది. నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. రంగాల సూచీలలో నిఫ్టీ మెటల్, ఎఫ్ఎంసిజి అత్యధికంగా క్షీణించాయి. -
ఆ బుడగ పేలిందా!! 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తుచేసుకోండి..
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అలజడి నడుస్తున్న నేపథ్యంలో, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన హెచ్చరిక జారీ చేశారు. త్వరలోనే చరిత్రలోనే అతిపెద్ద ఆస్తుల బుడగ (బబుల్ బస్ట్) పగిలిపోతుందని, దాని తర్వాత బంగారం, వెండి, బిట్కాయిన్, ఈథేరియం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఆయన పేర్కొన్నారు.కియోసాకి తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన తాజా సందేశంలో, "బబుల్ పగిలే 'పిన్' ఏదైనా ఈవెంట్ త్వరలోనే జరగనుంది. అది ఏ సంఘటన అయినా.. ఇప్పుడే బిట్కాయిన్, బంగారం, వెండి, ఈథేరియం ఎక్కువగా సేకరించాలి" అని సూచించారు. క్రాష్ తర్వాత ఒక సంవత్సరంలో బంగారం ఒక ఔన్స్కు 35,000 డాలర్లు, వెండి 200 డాలర్లు, బిట్కాయిన్ ఒక్కో కాయిన్ 750,000 డాలర్లు, ఈథేరియం 95,000 డాలర్లకు చేరుతాయని ఆయన ధీమాగా అంచనా వేశారు."మీ లాభం అమ్మేటప్పుడు కాదు.. కొనేటప్పుడే వస్తుంది" అనే తన 'రిచ్ డాడ్' సూత్రాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు కొనుగోలు చేసి భవిష్యత్తులో ధనవంతులు కావాలని, లేకపోతే చాలామంది పేదలవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం బిట్కాయిన్ ధర సుమారు 74,000–75,000 డాలర్ల మధ్య ఉండగా, ఈథేరియం 2,300–2,400 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది. -
మారుతి సుజుకీకి రూ.5,786 కోట్ల ట్యాక్స్ నోటీసు!
దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్కు ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.5,786 కోట్ల విలువైన ముసాయిదా అంచనా ఉత్తర్వులను (డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్) జారీ చేసింది. ఈ మేరకు కంపెనీ ఇటీవల స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది.వివాదం ఏమిటి?కంపెనీ తన ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపిన ఆదాయానికి, ఐటీ శాఖ అంచనాలకు మధ్య తేడాలు రావడమే ఈ నోటీసులకు ప్రధాన కారణం. రిటర్నుల్లో వెల్లడించిన ఆదాయానికి కొన్ని అంశాలను కలపడం లేదా కొన్ని మినహాయింపులను నిరాకరించడం ద్వారా ఈ భారీ మొత్తాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.కంపెనీ స్పందనఈ నోటీసులపై మారుతి సుజుకీ స్పందిస్తూ.. ఐటీ శాఖ ప్రతిపాదనలను సవాలు చేస్తూ వివాద పరిష్కార ప్యానెల్ ముందు అభ్యంతరాలను దాఖలు చేయనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ఆర్డర్ వల్ల కంపెనీ ఆర్థిక స్థితిగతులపై లేదా రోజువారీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని యాజమాన్యం స్పష్టం చేసింది.ఎగుమతులకు ‘షిప్పింగ్’ సెగమరోవైపు, మిడిల్ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఎర్ర సముద్రం, హర్మూజ్ జలసంధి వంటి కీలక వాణిజ్య మార్గాల్లో అంతరాయాలు కలగడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మారుతి సుజుకీతో పాటు టాటా మోటార్స్, హ్యుందాయ్ ఇండియా, వోక్స్వ్యాగన్ వంటి కంపెనీలు ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు వాహనాల రవాణాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాయి.సముద్ర మార్గాల్లో దాడుల భయం వల్ల కంటైనర్ లభ్యత తగ్గింది. దీనికి తోడు కంటైనర్కు 2,000 డాలర్ల వరకు ఎమర్జెన్సీ షిప్పింగ్ సర్ఛార్జీలు, యుద్ధ-ప్రమాద భీమా ప్రీమియంలు పెరగడం కంపెనీలకు భారంగా మారింది. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించడం ప్రమాదకరమని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో నౌకలు దక్షిణాఫ్రికా మీదుగా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఇది రవాణా వ్యయాన్ని అమాంతం పెంచుతోంది. మారుతి సుజుకీ మొత్తం ఎగుమతుల్లో మిడిల్ఈస్ట్ దేశాల వాటా దాదాపు 12.5 శాతం. తాజా అంతరాయాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతుల లక్ష్యాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
2033 నాటికి అందరికీ బీమా
దేశంలోని ప్రతి పౌరుడికీ ఆరోగ్య బీమా రక్షణ కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 2033 నాటికి దేశ ప్రజలందరికీ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈమేరకు పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో బీమా రంగంపై అడిగిన ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చారు.గ్రామ పంచాయతీలే ప్రామాణికంగ్రామీణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంటూ మంత్రి కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 25,000 గ్రామ పంచాయతీలను కవర్ చేసేలా భారీ ‘రూరల్ అవుట్రీచ్’ ప్రణాళికను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) 2024లో కొత్త నిబంధనలను నోటిఫై చేసిందని గుర్తు చేశారు. దీని ప్రకారం, బీమా కవరేజీ, గ్రామీణ బాధ్యతలను కొలవడానికి ఇకపై గ్రామ పంచాయతీనే ప్రాథమిక యూనిట్గా పరిగణిస్తారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్లో బీమా పొందడం (Insurance Penetration) తక్కువగా ఉందని మంత్రి అంగీకరించారు.ఆరోగ్య బీమా మార్కెట్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోందని మంత్రి గణాంకాలతో వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం రూ.1,17,505 కోట్ల ప్రీమియం నమోదు చేసింది. వివిధ పథకాల ద్వారా ప్రస్తుతం దేశంలో 58 కోట్ల మందికి ఆరోగ్య బీమా రక్షణ లభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ మద్దతు గల బీమా సంస్థలు సమన్వయంతో కవరేజీని విస్తరిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనపేద, బలహీన వర్గాలకు బీమాను చేరువ చేసేందుకు ప్రీమియం రేట్లను అత్యంత సరసమైన ధరల్లో ఉంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సాధించిన విజయాన్ని ఆమె ఉదహరించారు. ‘కేవలం రూ.436 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా కవరేజీని ఈ పథకం అందిస్తోంది. ఇప్పటివరకు ఇందులో 26.79 కోట్ల మంది నమోదు చేసుకోవడం సామాజిక భద్రతపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం’ అని ఆర్థిక మంత్రి తెలిపారు.సామాజిక రక్షణే పరమావధికేంద్రం తీసుకుంటున్న ఈ బహుళ విధాన చర్యలు కేవలం బీమా రంగాన్ని వృద్ధి చేయడమే కాకుండా ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక, సామాజిక రక్షణ కవచాన్ని నిర్ధారించడానికి దోహదపడతాయని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
పసిడి ప్రియులకు ఊరట.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
దుబాయ్ రియల్టీ.. ఒకప్పుడు స్వర్గధామం.. కానీ ఇప్పుడు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం మాత్రం దూసుకుపోయింది. 2025 నాటి గణాంకాలను పరిశీలిస్తే విదేశీ పెట్టుబడిదారులు దుబాయ్లో ఆస్తులను కొనుగోలు చేయడానికి ఎంతటి ఆసక్తిని చూపుతున్నారో స్పష్టమవుతోంది. కొన్ని సర్వేల ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తున్న దేశాల జాబితాలో భారతదేశం 22% వాటాతో అగ్రస్థానంలో ఉంది.భారత్ తర్వాతి స్థానాల్లో యునైటెడ్ కింగ్డమ్ (17%), చైనా (14%), సౌదీ అరేబియా (11%), రష్యా (9%) నిలిచాయి. ఇది దుబాయ్ మార్కెట్ కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉందని నిరూపిస్తోంది.దుబాయ్ రియల్టీ ఎందుకు పుంజుకుంది?దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందడానికి కొన్ని కీలక అంశాలు దోహదపడ్డాయి. ప్రపంచ రాజకీయాల్లో అస్థిరత ఉన్నప్పటికీ దుబాయ్ ఒక సురక్షితమైన సేఫ్ హెవెన్గా పెట్టుబడిదారులకు కనిపిస్తోంది. ఆస్తుల కొనుగోలుపై, అద్దెలపై ఆదాయపు పన్ను లేకపోవడం అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. బుర్జ్ ఖలీఫా వంటి అద్భుత కట్టడాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పర్యాటక, నివాస రంగాలను బలోపేతం చేస్తున్నాయి. ప్రాపర్టీ లావాదేవీల్లో పారదర్శకత కోసం బ్లాక్చెయిన్, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించడం వల్ల పెట్టుబడిదారులకు నమ్మకం పెరుగుతోంది.ఇప్పుడు సమస్య ఏంటి?ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, అమెరికా ప్రమేయం వంటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై మిశ్రమ ప్రభావాన్ని చూపుతున్నాయి. పొరుగు దేశాల్లో యుద్ధం లేదా అస్థిరత నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు తమ సంపదను సురక్షితంగా ఉంచుకోవడానికి దుబాయ్ను ఎంచుకునేవారు. కానీ ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో నేరుగా ఇరాన్ వ్యతిరేకంగా ఉన్న అమెరికాపై దాడి చేయలేక పక్కన ఉన్న యూఏఈలోని యూఎస్ స్థావరాలపై దాడికి పాల్పడుతోంది. దాంతో ఎంతో సురక్షితంగా భావించిన దుబాయ్ కూడా అనిశ్చితిలోకి వెళ్లినట్లయింది. ఈ పరిస్థితులు దుబాయ్ రియల్టీ మార్కెట్ను భారీగా కుంగదీశాయి.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
క్రమంగా పుంజుకుంటున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 142 పాయింట్లు పెరిగి 23,723 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 423 పాయింట్లు ఎగబాకి 76,485 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.59బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 100.97 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.18 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.25 శాతం పెరిగింది.నాస్డాక్ 0.47 శాతం పుంజుకుంది.Today Nifty position 18-03-2026(time: 9:37 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
డాలర్ ఆధిపత్యానికి గండి!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ భౌగోళిక రాజకీయాలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని కూడా వేగంగా మారుస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధి కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు అమెరికా డాలర్ ఏకఛత్రాధిపత్యానికి సవాలు విసురుతున్నాయి.డీ-డాలరైజేషన్ వేగవంతం?హర్మూజ్ జలసంధి గుండా ప్రపంచంలోని 20% పైగా చమురు రవాణా జరుగుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్, దానికి మద్దతు ఇచ్చే కొన్ని దేశాలు చమురు వ్యాపారాన్ని డాలర్లకు బదులు చైనా కరెన్సీ ‘యువాన్’లో జరపాలని యోచిస్తున్నాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో 80% పైగా చమురు లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ఇప్పుడు యువాన్ వైపు మొగ్గు చూపడం వల్ల డాలర్కు ఉన్న గ్లోబల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటే సురక్షితమైన కరెన్సీగా డాలర్ను కాకుండా ప్రత్యామ్నాయాల వైపు దేశాలు చూడటం అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది.భారత రూపాయిపై ప్రభావంప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ కరెన్సీ మార్పుల ప్రభావం భారత రూపాయిపై ద్వంద్వ ప్రభావం చూపే అవకాశం ఉంది.చైనా ఆధిపత్యం పెరగడంఅంతర్జాతీయ చమురు మార్కెట్లో యువాన్ పట్టు సాధిస్తే అది ఆసియాలో చైనా ఆర్థిక శక్తిని మరింత పెంచుతుంది. భారత్కు చైనాతో సరిహద్దు వివాదాలు, వాణిజ్య పోటీ ఉన్న నేపథ్యంలో మన పొరుగు దేశం కరెన్సీ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారడం భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లావేదేవీలు సర్వసాధారణం. ఒకవేళ యువాన్ వాడకం పెరిగితే భారత్ తన చమురు దిగుమతుల కోసం యువాన్ను భారీగా కొనాల్సి ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో యువాన్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ దానికి సాపేక్షంగా తగ్గే ప్రమాదం ఉంది. దాంతో మన విదేశీ మారక నిల్వలలో డాలర్ల కంటే యువాన్ నిల్వలను ఎక్కువగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర ప్రభావిత అంశాల గురించి కింద చూద్దాం.ఇదీ చదవండి: ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం! -
ఉత్తరాలే కాదు.. ఇక లాభాలూ డెలివరీ!
చిన్న పొదుపులు ఇపుడు పెద్ద పెట్టుబడుల దిశగా అడుగులు వేయనున్నాయి.పెట్టుబడుల్లో కొత్త అధ్యాయానికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై మీ ఇంటి పక్కన ఉండే పోస్టాఫీసు కేవలం ఉత్తరాలు, సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే పరిమితం కాదు. స్టాక్ మార్కెట్ లాభాలను సామాన్యులకు అందించేలా మ్యూచువల్ ఫండ్స్ అమ్మకానికి సిద్ధమవుతోంది. భారత తపాలా శాఖ, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) చేతులు కలపడంతో దేశవ్యాప్తంగా పెట్టుబడుల విప్లవం రాబోతోంది.పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్తో మ్యూచువల్ ఫండ్లు గ్రామీణ ప్రాంతాలతో పాటు, మారు మూల పల్లెలకూ చేరే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన పెంచి, సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిని చేయాలనే సంకల్పంతో పోస్టాఫీసుల ద్వారా ఈ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు యాంఫి సీఈఓ వెంకట్ చలసాని చెప్పారు. పోస్ట్ ఆఫీసుల నెట్వర్క్తో మ్యూచువల్ ఫండ్లు మెట్రోల నుంచి మండలాలు, పల్లెలోకి అడుగుపెడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో మహారాష్ట్రే దేశంలో అగ్రస్థానంలో ఉంది దేశ మొత్తం ఫండ్ ఆస్తుల్లో 40శాతానికి పైగా వాటా ముంబై, పుణె నగరాలదే. దీంతో మహారాష్ట్రలోని ముంబై, పూణె, నాగపూర్, ఔరంగాబాద్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా తపాలాశాఖ మ్యూచువల్ ఫండ్స్ విక్రయానికి తెరతీసింది. అది విజయవంతం కావడంతో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండో దశలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా పదివేల మంది పోస్టల్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎంపిక చేసిన సిబ్బందికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ శిక్షణ ఇస్తుంది. సర్టీఫై అయిన ఉద్యోగులు పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీములను విక్రయిస్తారు. యాంఫి డి్రస్టిబ్యూటర్గా వ్యవహరిస్తుంది. చిన్న పట్టణాలపై ఫోకస్ దేశంలోని మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో 80 శాతం టాప్ 10 నగరాల నుంచే వస్తున్నాయి. 65 శాతం మందికి అవగాహన ఉన్నా, కేవలం 7 శాతం మాత్రమే అంటే 6 కోట్ల మందే పెట్టుబడి పెడుతున్నారు. గ్రామీణప్రాంతాల, పల్లెలదాకా విస్తరిస్తే వారి సంఖ్య 50 కోట్లకు పెరుగుతుందని యాంఫి అంచనా వేస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ బడ్జెట్ బూస్ట్ఒక్కో కొత్త ఇన్వెస్టర్కు రూ2,000 ప్రోత్సాహకం 2026 బడ్జెట్లో ప్రతి కొత్త మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కు రూ2,000 ప్రోత్సాహకాన్ని ఆరి్ధక మంత్రి ప్రకటించారు. పోస్టల్ సిబ్బందికి ఈ ప్రోత్సాహకంలో భాగస్వామ్యం కల్పించే విధానాన్ని తపాలాశాఖ రూపొందిస్తోంది. ఇది వారి రెగ్యులర్ కమిషన్కు అదనంగా ఉంటుంది. 2025 ఆగస్టు నుంచి అమల్లోకి వచి్చన ఈ ఒప్పందం 2028 ఆగస్టు వరకు మూడేళ్ల పాటు ఉంటుందని యాంఫి వెల్లడించింది. -
సాయి పేరెంటరల్స్ @ రూ. 372–392
హైదరాబాద్: డైవర్సిఫైడ్ ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ల కంపెనీ సాయి పేరెంటరల్స్ పబ్లిక్ ఇష్యూకి తాజాగా రూ. 372–392 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 27న ముగియనుంది. దీనిలో భాగంగా హైదరాబాద్ కంపెనీ రూ. 285 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 32 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి.కంపెనీ వృద్ధి ప్రయాణంలో ఐపీవో కీలక మైలురాయిగా కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్ కేకే పేర్కొన్నారు. తాము సాధించిన పురోగతిని ఇది ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు. వ్యూహాత్మక ప్రణాళికలను వేగవంతం చేసేందుకు తోడ్పాటునివ్వగలదని పేర్కొన్నారు. తద్వారా తదుపరి విస్తరణ దశకు మద్దతు లభించనున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా గ్లోబల్ ఫార్ములేషన్ల బిజినెస్తోపాటు.. ఇంజెక్టబుల్స్, ఓరల్ డోసేజీ ఫార్ములేషన్లలో కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు వివరించారు. -
పీఎఫ్సీ డివిడెండ్ రూ. 3.25
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) బోర్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) నాలుగో మధ్యంతర డివిడెండ్ను చెల్లించేందుకు అనుమతించింది. దీంతో వాటాదారులకు షేరుకి రూ. 3.25 చొప్పున లభించనుంది. ఇందుకు ఈ నెల 23 రికార్డ్ డేట్కాగా.. ఏప్రిల్ 16కల్లా చెల్లించనుంది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో రూ. 1,60,000 కోట్ల రుణ సమీకరణ ప్రణాళికకు సైతం బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈబీఆర్ నిధులకు సంబంధంలేకుండా వీటిని ఒకేసారి లేదా దశలవారీగా వివిధ మూలాల నుంచి సమీకరించనుంది. వీటిలో రూ. లక్ష కోట్లు బాండ్లు, సెక్యూరిటీలు, మధ్యకాలిక ఇన్స్ట్రుమెంట్స్, కాలావధి రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. వివిధ ఇన్స్ట్రుమెంట్స్ జారీతో రూ. 20,000 కోట్ల విదేశీ మారకపు రుణాలు సైతం వీటిలో కలసి ఉన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో పీఎఫ్సీ షేరు బీఎస్ఈలో 3% జంప్చేసి రూ. 418 వద్ద ముగిసింది. -
సాయంత్రానికి సగం తగ్గిన గోల్డ్ రేటు!
రోజురోజుకి తగ్గుతున్న గోల్డ్ రేటు ఈ రోజు (మంగళవారం) కొంత పెరిగింది. అయితే 24 గంటలు కూడా గడవకముందే.. పెరిగిన రేటులో సగం తగ్గిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం లేటెస్ట్ ధరల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,45,400 రూపాయల వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల బంగారం ధర సాయంత్రానికి రూ.1,44,900 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.500 తగ్గిందన్నమాట. 24 క్యారెట్ల ధర 1,58,620 రూపాయల నుంచి రూ.1,58,080 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో లేటెస్ట్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 158230 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 145050 రూపాయల వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం ఉన్న ధరల కంటే తక్కువ కావడం గమనార్హం.చెన్నైలో గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ధరలు ఉదయం ఎలా ఉన్నాయో, సాయంత్రానికి కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,46,500 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,59,820 వద్ద ఉంది. -
బీవైడీ సీలియన్ కొత్త ఎడిషన్: ధర, వివరాలు
బీవైడీ కంపెనీ భారతదేశంలో తన సీలియన్ 7 కారును లాంచ్ చేసి ఏడాది కాలం అయింది. ఈ సందర్భంగా సంస్థ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్ను లాంచ్ చేసింది. దీనికోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.70000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని బీవైడీ వెల్లడించింది.బీవైడీ సీలియన్ 7 యానివర్సరీ ఎడిషన్ ప్రీమియం, పెర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. టాప్-స్పెక్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ కేవలం 4.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు, కాగా ప్రీమియం వెర్షన్ అదే వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుంది. రెండు వేరియంట్లు 82.56 kWh బ్యాటరీ ప్యాక్ పొందినప్పటికీ.. NEDC ప్రమాణాల ప్రకారం, పెర్ఫార్మెన్స్ మోడల్ డ్రైవింగ్ రేంజ్ 542 కిలోమీటర్లు కాగా.. ప్రీమియం వేరియంట్ 567 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.బీవైడీ సీలియన్ 7 యానివర్సరీ ఎడిషన్ ప్రీమియం, పెర్ఫామెన్స్ ధరలు వరుసగా.. రూ. 49.40 లక్షలు, రూ. 54.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ముందు బుక్ చేసుకున్న 1100 మందికి ఇన్స్టాలేషన్తో పాటు 11 kW హోమ్ ఛార్జర్ను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తారు. అంతేకాకుండా, ఈ ప్యాకేజీలో రెండు సంవత్సరాల ఉచిత సర్వీస్ మరియు మెయింటెనెన్స్ కూడా లభిస్తాయి. -
రూ. 216 కోట్లతో ఎగ్జికామ్ ప్లాంటు
ఈవీ చార్జర్లు తదితర ఉత్పత్తుల సంస్థ ఎగ్జికామ్ టెలీసిస్టమ్స్ హైదరాబాద్లో తమ కొత్త సమగ్ర తయారీ ప్లాంటును ప్రారంభించింది. దీనిపై రూ. 216 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ సీఈవో అనంత్ నహతా తెలిపారు. 18.4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ప్లాంటు తొలి దశతో ఉత్పత్తి సామర్థ్యం రెండున్నర రెట్లు పెరుగుతుందని, ప్రాంతీయంగా 750 పైగా ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని ఆయన వివరించారు.దేశీయంగా ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్స్, క్రిటికల్ పవర్ సొల్యూషన్స్కి పెరుగుతున్న డిమాండ్ని తీర్చేందుకు ఇది ఉపయోగపడగలదని నహదా చెప్పారు. ఇందులో ట్రై–ఫ్లక్స్ లిక్విడ్ కూల్డ్ పవర్ మాడ్యూల్స్ని కూడా తయారు చేయనున్నట్లు, అలాగే దేశీయంగా తొలి ఈవీ చార్జర్ ఇంటరాపరబిలిటీ టెస్టింగ్ సెంటర్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
EPF కనీస పెన్షన్ పెంపు.. పార్లమెంటు కమిటీ కీలక సిఫార్సులు
ఈపీఎఫ్ చందాదారులు రిటైర్మెంట్ తర్వాత పొందే పెన్షన్కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 (EPS, 1995) కింద.. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్స్టైల్స్, స్కిల్ డెవలప్మెంట్పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అందుతున్న మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని, దాన్ని రూ.7,500కు పెంచాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల పాటు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పందించింది.కనీస పెన్షన్పై ఇప్పటికే పెన్షనర్ల నుంచి పలు విజ్ఞాపనలు వచ్చినట్లు పేర్కొంది. ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కనీస మొత్తం ఏమాత్రం సరిపోదని కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995ని పునః సమీక్షించి పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రతిపాదించింది. ఇందుకోసం కేటాయింపులు చేయాలని సూచించింది.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్! -
ప్లాట్ కొనేముందు ఇలా చేయండి: హైడ్రా హెచ్చరిక
రాజధానిలో ప్లాట్, ఇంటి స్థలం కొనేముందు పూర్తిగా విచారించి, అన్నీ సరిగా ఉంటేనే ముందుకెళ్లాలని హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఏమైనా ఉందా? అనుమతి పొందిన లే అవుట్ అయినా.. ఇంటి నంబరు, బై నంబర్లతో అమ్ముతున్నప్పుడు మరింత అప్రమత్తంగా పరిశీలించి కొనుగోలు చేయాలని పేర్కొంది.ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ హెచ్చరికలు చేసింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 48 ఫిర్యాదులు వచ్చాయి.అమీన్పూర్ చెరువులో తమ లేఔట్ మునిగిపోయిందని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు.కాప్రా జీఆర్ రెడ్డి నగర్ హెచ్ఎండీఏ లే ఔట్లో మొత్తం నాలుగు పార్కులు ఉన్నాయి. ఒక పార్కులో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రార్థన స్థలాలు వస్తున్నాయని నివాసితులు ఫిర్యాదు చేశారు. బాలానగర్ శోభనా కాలనీలోని అక్షయ ఎన్క్లేవ్ పేరిట 7.12 ఎకరాల్లో 69 ప్లాట్లతో 1983లో లేఔట్ వేశారు. ఇందులో రెండు స్థలాలను పార్కుల కోసం కేటాయించారు. 1700 గజాల పార్కును కబ్జా చేసేందుకు స్థానికులు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200 గజాలు ఆక్రమించి షెడ్డు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే హైడ్రా స్పందించి చర్యలు తీసుకోవాలని, పార్కును కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. -
కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పెట్టుబడికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా మరో ట్వీట్ చేసారు. చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' ఉందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.చరిత్రలోనే అతిపెద్ద 'బబుల్ బస్ట్' (ఒక ఆస్తి విలువ.. అసలు విలువ కంటే చాలా ఎక్కువగా పెరగడం) జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందనేది నాకు తెలియదు, అని కియోసాకి పేర్కొన్నారు. ''అది జరుగుతుందా లేదా అన్నది ప్రశ్న కాదు. అది ఎప్పుడు జరుగుతుంది అన్నదే ప్రశ్న'' అని అన్నారు.బబుల్ బస్ట్ సంఘటన జరిగినప్పుడు.. ఒక ఏడాది తరువాత గోల్డ్ ధర ఔన్సుకు 35,000 డాలర్లకు చేరుకుంటుందని నేను అంచనా వేస్తున్నాను. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బిట్కాయిన్ ధర 7,50,000 డాలర్లకు, ఇథీరియం ధర 95,000 డాలర్లకు చేరుకుంటుంటుందని కియోసాకి వెల్లడించారు.ఆర్ధిక సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్లు కుప్పకూలిపోతాయి. అలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా పెట్టిన పెట్టుబడులు (గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్, ఇథీరియం) మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి అలోచించి ఇన్వెస్ట్ చేయండి. ధనవంతులు కావడానికి ఇదే సరైన సమయమా? అంటూ కియోసాకి ట్వీట్ ముగించారు.BIGGEST BUBBLE BUSTI do not know what pin, what event will pop the biggest bubbles in histor. What ever the event, the pin is near.It’s not IF. It’s WHEN.When the bubbles go bust I predict gold will hit $35,000 an ounce one year after the gold bubble goes pop..I predict…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 16, 2026 -
లేబర్ ఫోర్స్ సర్వే: నిరుద్యోగం రేటు ఇలా..
దేశీయంగా 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గింది. జనవరిలో నిరుద్యోగిత రేటు (యూఆర్) 5 శాతంగా ఉండగా, గత నెల 4.9 శాతానికి నెమ్మదించినట్లు కార్మిక శక్తి సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదికలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6.6 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేకుండా 4.2 శాతంగా కొనసాగింది.గత నెలలో మహిళల్లో (15 సంవత్సరాలు పైబడిన వారు) యూఆర్ జనవరిలో 5.6 శాతంగాను ఉండగా, గత నెల 5.1 శాతానికి దిగివచి్చంది. పట్టణ ప్రాంతాల్లో 9.8 శాతం నుంచి 8.7 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 4.3 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,74,879 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రజల్లో ఉద్యోగాలు, నిరుద్యోగాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే పీఎల్ఎఫ్ఎస్ని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహిస్తుంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 514.24 పాయింట్ల లాభంతో 76,017.09 వద్ద, నిఫ్టీ 150.00 పాయింట్ల లాభంతో 23,558.80 వద్ద నిలిచాయి.డిసిఎం శ్రీరామ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్, MOIL లిమిటెడ్, ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. LMW లిమిటెడ్, ప్రుడెన్షియల్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్, జెల్ప్మాక్ డిజైన్ అండ్ టెక్ లిమిటెడ్, శ్యామ్ టెలికాం లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
2026 రెనాల్ట్ డస్టర్ లాంచ్: ధర ఎంతంటే?
2026 గణతంత్ర దినోత్సవం రోజు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్ కారు.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఐదు వేరియంట్లు, మూడు ఇంజిన్ ఎంపికలతో లభించే ఈ కారు.. ఆరు రంగుల్లో లభిస్తుంది. దీని ధరలు రూ. 10.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).రెనాల్ట్ కంపెనీ 2026 డస్టర్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి విక్టోరిస్, కియా సెల్టోస్ వంటి ప్రముఖ మోడళ్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. 2026 రెనాల్ట్ డస్టర్ టాప్ వేరియంట్లో 1.8-లీటర్ ఫోర్-సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీనిని రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జతచేసి E-టెక్ 160 హైబ్రిడ్ సెటప్తో రూపొందించారు. ఇది 160 bhp పవర్, 172 Nm టార్క్ అందిస్తుంది.160 bhp పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (టర్బో TCe 160) కూడా ఉంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్ రెండింటితోనూ అందుబాటులో ఉంది. బేస్ మోడల్ విషయానికి వస్తే.. ఇది 100 bhp పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలో లభిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది.కొత్త రెనాల్ట్ డస్టర్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.భద్రతకు సంబంధించిన ఫీచర్ల జాబితాలో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ SUVకి లెవెల్ 2 ADAS కూడా లభిస్తుంది. -
ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం!
మానవ మనుగడకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుత రోజుల్లో రసాయన ఎరువులపై మితిమీరి ఆధారపడటం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అస్థిరమైన గ్లోబల్ మార్కెట్లు మన ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవసాయ రంగం ప్రకృతి సాగువైపు అడుగులు వేయడం కేవలం పర్యావరణ హితం మాత్రమే కాదు.. దేశ ఆర్థిక, ఆరోగ్య భద్రతకు అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుత ఆధునిక వ్యవసాయం శిలాజ ఇంధనాలతో విడదీయలేని విధంగా ముడిపడి ఉంది. ఐపీఈఎస్-ఫుడ్ 2024-25 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లభించే పెట్రోకెమికల్స్లో 40%, శిలాజ ఇంధనాల్లో 15 కేవలం ఆహార వ్యవస్థలకే వినియోగిస్తున్నారు. అంటే, అంతర్జాతీయ ఇంధన ధరల్లో వచ్చే స్వల్ప మార్పు కూడా సామాన్యుడి కంచంలోని ఆహార ధరను ప్రభావితం చేస్తోంది.రసాయన ఎరువుల సెగప్రపంచవ్యాప్త ప్రోటీన్ వినియోగంలో 40% కేవలం ‘హేబర్-బోష్’(గాలిలో ఉండే నైట్రోజన్ను మొక్కలకు ఉపయోగపడే అమ్మోనియాగా మార్చే పద్ధతి) ప్రక్రియ ద్వారా తయారయ్యే సింథటిక్ నైట్రోజన్ ఎరువులపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం యూరియా ధర టన్నుకు 585 డాలర్ల వద్ద ఉండగా భవిష్యత్తులో ఇది 650-700 డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం తన అమ్మోనియా, సల్ఫర్ దిగుమతుల్లో 2/3 వంతు గల్ఫ్ దేశాల నుంచే పొందుతోంది. అక్కడ తలెత్తే రాజకీయ అనిశ్చితి మన పొలాల్లో ఎరువుల కొరతకు దారితీస్తోంది.శాస్త్రీయ వాస్తవాలుఐపీసీసీ(ఇంటర్గవర్న్మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్) హెచ్చరికల ప్రకారం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంట కాలాలను కుదించేస్తున్నాయి. దేశంలో ఇది ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల గోధుమల దిగుబడి తగ్గుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వరిసాగులో గింజ గట్టిపడే ప్రక్రియ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యాంత్రాంగం స్పందించి వరి, గోధుమలపైనే కాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల వైపు సాగును మళ్లించాల్సిన సమయం ఆసన్నమైంది.రసాయన సాగు వల్ల నేలతోపాటు మానవులు రోగాల బారిన పడుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం, ఆహారంలో రసాయన అవశేషాల వల్ల అంటువ్యాధులు కాని రోగాలు (ఎన్సీడీ) వేగంగా పెరుగుతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతినడం వల్ల పరాగ సంపర్కం చేసే కీటకాలు అంతరించిపోతున్నాయి. ఇది దిగుబడుల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది.మార్పు కోసం వ్యూహంప్రకృతి సాగు వైపు మార్పు అనేది ఒక్కరోజులో జరిగే పనికాదు. ఇది క్రమబద్ధంగా శాస్త్రీయంగా జరగాలి. దీనికోసం ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని సూత్రాలను నిపుణులు సూచిస్తున్నారు.రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులను ప్రోత్సహించాలి.నేల ఆరోగ్యం, సూక్ష్మజీవుల పాత్ర, చెట్లు-పశువులు-పంటల కలయికపై వ్యవసాయ పరిశోధనా సంస్థలు దృష్టి సారించాలి.ఎరువుల కోసమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడే రైతులకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించే వారికి ప్రోత్సాహకాలు అందించాలి.ప్రకృతి సాయంతో తయారైన ఉత్పత్తులకు ప్రత్యేక సరఫరా గొలుసును నిర్మించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలి.యుద్ధాలను, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను వెంటనే నియంత్రించలేకపోవచ్చు. కానీ, మన ఆహారాన్ని ఎలా పండించుకోవాలో మనం నిర్ణయించుకోగలం. పెట్టుబడి తగ్గించి, ప్రకృతితో మమేకమయ్యే సాగు ద్వారానే మన భూమిని, భావితరాల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని గుర్తుంచుకోవాలి. -
భారత్లో పాగా వేసేందుకు అమెజాన్ దూకుడు!
భారతీయ శాటిలైట్ ఇంటర్నెట్ కమ్యునికేషన్ (శాట్కామ్) విభాగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దిగ్గజ కంపెనీల మధ్య పోటీ ముదురుతోంది. ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఇప్పటికే రేసులో ముందంజలో ఉండగా జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ తన ‘ప్రాజెక్ట్ కూపర్’ కోసం అనుమతులను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు అమెజాన్ ప్రతినిధులు భారత టెలికాం శాఖ (డాట్)ను సంప్రదించినట్లు తెలుస్తోంది.అనుమతుల కోసం..భారత్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కోసం అమెజాన్ గత కొంతకాలంగా వేచి చూస్తోంది. ఇతర పోటీదారులతో పోలిస్తే అనుమతుల ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో దీన్ని వేగవంతం చేయాలని కోరుతూ అమెజాన్ వరుస లేఖలు రాసినట్లు సమాచారం.స్టార్లింక్ వర్సెస్ కూపర్ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో పాగా వేయడమే కాకుండా భారత్లో కూడా అనుమతుల ప్రక్రియలో తుది దశకు చేరుకుంది. స్టార్లింక్తో పోలిస్తే అమెజాన్ తన సాటిలైట్ లాంచింగ్ షెడ్యూల్లో కొంత వెనుకబడి ఉంది. ఈ గ్యాప్ను భర్తీ చేయడానికి, భారతీయ వినియోగదారులకు త్వరగా చేరువ కావడానికి అమెజాన్ వేగంగా చర్యలు చేపడుతోంది.భారీ కెపాసిటీతో సవాలుస్టార్లింక్ సేవలతో పోలిస్తే తమ శాటిలైట్ నెట్వర్క్ భారత్లో గణనీయమైన స్థాయిలో డేటా కెపాసిటీని అందించగలదని అమెజాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. వేగవంతమైన ఇంటర్నెట్, నిరంతర కనెక్టివిటీ విషయంలో స్టార్లింక్కు గట్టి పోటీ ఇస్తామని కంపెనీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.టెలికాం రంగంలో కొత్త విప్లవంకేవలం నగరాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ కూపర్ పనిచేస్తోంది. అయితే, స్పెక్ట్రమ్ కేటాయింపులు, ధరల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ కంపెనీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.భారత ప్రభుత్వం ఇప్పటికే స్పెక్ట్రమ్ కేటాయింపులను వేలం ద్వారా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించడంతో అంతర్జాతీయ సంస్థలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అమెజాన్ ఎంత త్వరగా లైసెన్స్ పొందుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అమెజాన్ రంగంలోకి దిగితే ధరల యుద్ధం మొదలై అంతిమంగా భారతీయ వినియోగదారులకే మేలు జరుగుతుందని కొందరు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఇన్సూరెన్స్ ప్రీమియంల మోత.. నో లాజిక్!
ఆరోగ్య బీమా ప్రీమియంల పెంపుపై బీమా కంపెనీలు చెబుతున్న వాదనలకు, వాస్తవాలకు పొంతన లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. వైద్య ఖర్చుల పెరుగుదల (మెడికల్ ఇన్ఫ్లేషన్) కారణంగానే ప్రీమియంలు పెంచుతున్నామన్న కంపెనీల వాదనను బలపరిచేలా ఎలాంటి అధికారిక అధ్యయనాలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా సామాన్యులపై భారంగా మారిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల వ్యవహారంపై కేంద్రం చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.అధ్యయనం లేదు.. ఆధారాల్లేవు!బీమా రంగ నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) వద్ద దీనిపై నిర్దిష్టమైన డేటా లేదని మంత్రి తెలిపారు. మెడికల్ ఇన్ఫ్లేషన్ రేటుకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పెంపునకు మధ్య గల సంబంధంపై ఐఆర్డీఏఐ ఎటువంటి ప్రత్యేక అధ్యయనం నిర్వహించలేదు.కేవలం వైద్య ఖర్చులే కాకుండా పాలసీదారుల సగటు వయసు పెరగడం, క్లెయిమ్ హిస్టరీ, మెరుగైన పాలసీ ఫీచర్లు వంటి అనేక అంశాలు ప్రీమియం పెంపులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో కేవలం వైద్య ద్రవ్యోల్బణం వల్ల మాత్రమే ఎంత శాతం ప్రీమియం పెరిగిందో విడదీసి చూడటం సాధ్యం కాదని మంత్రి వివరించారు.కంపెనీల వాదన.. వాస్తవ పరిస్థితిసాధారణంగా బీమా కంపెనీలు దేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ 12-14 శాతం మధ్య ఉందని, ఇది సాధారణ ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు అని వాదిస్తుంటాయి. కరోనా అనంతర కాలంలో కొన్ని కంపెనీలు తమ ప్రీమియంలను ఏకంగా 100 శాతం వరకు పెంచేశాయి. కొన్ని కంపెనీలు గత ఏడాది తమ 65 శాతం ఉత్పత్తుల ధరలను పెంచడానికి వైద్య ఖర్చులే కారణమని పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం తాజా వివరణతో కంపెనీల ‘ద్రవ్యోల్బణ సాకు’ బలహీనపడింది.బీమా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి వైద్య ఖర్చులను సాకుగా చూపిస్తున్నాయనే ఆరోపణలకు కేంద్ర మంత్రి సమాధానం బలాన్ని చేకూర్చింది. పారదర్శకత లేని ప్రీమియం పెంపుదలపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఐఆర్డీఏఐ మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు. -
ముదురుతోన్న సంక్షోభం.. కీలక రంగాలకు ముప్పు
పశ్చిమాసియాలో అలుముకున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ పదకొండో రోజుకు చేరుకోవడంతో.. కేవలం చమురు, సహజ వాయువు సరఫరా మాత్రమే కాకుండా, నిత్యవసర రంగాలు సైతం సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా ఎరువులు, అల్యూమినియం, ప్యాకేజింగ్ మెటీరియల్స్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పాటు ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.అన్నదాతపై ఎరువుల సెగభారతదేశంలో విత్తనాల సీజన్ (ఖరీఫ్) ప్రారంభంకానున్న తరుణంలో ఎరువుల కొరత ఆందోళన కలిగిస్తోంది. దేశీయ ఎరువుల అవసరాల్లో 30% దిగుమతుల ద్వారానే తీరుతుండగా అందులో 40% వాటా ఒక్క మధ్యప్రాచ్య దేశాలదేనని క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది.మెరుగైన రుతుపవనాల కారణంగా డిమాండ్ పెరగడంతో 2026 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల దిగుమతులు 41% పెరిగి 22.3 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీని కేంద్రం తొలుత రూ.1.67 లక్షల కోట్లుగా అంచనా వేసినప్పటికీ అది రూ.1.86 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అయితే, 2027 ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.1.71 లక్షల కోట్లుగా కేటాయించడం గమనార్హం.చైనా ఆంక్షలుచైనా విధిస్తున్న సరఫరా పరిమితులతో గత నెలలోనే యూరియా ధరలు 20% పెరిగాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ఇప్పుడు యుద్ధం తోడవడంతో ఈ ఖర్చు మరింత భారమవ్వనుంది.అల్యూమినియం రంగంలోనూ అస్థిరతప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో 8-9% వాటా కలిగిన గల్ఫ్ దేశాల నుంచి సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది. యుద్ధం మొదలైన వారంలోపే ‘హైడ్రో’, ‘ఆల్బా’ వంటి దిగ్గజ సంస్థలు ఫోర్స్ మేజర్ (అనివార్య కారణాల వల్ల ఒప్పందాలను అమలు చేయలేకపోవడం) ప్రకటించాయి. అల్యూమినియం స్మెల్టర్లు ముడి పదార్థాల కోసం హార్మూజ్ జలసంధిపైనే ఆధారపడతాయి. యుద్ధం కారణంగా అటు ముడి పదార్థాలు, ఇటు ఇంధన లభ్యత రెండూ ప్రశ్నార్థకంగా మారాయి.ప్యాకేజింగ్ పరిశ్రమకు దెబ్బయుద్ధం కారణంగా పాలిమర్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది నేరుగా ప్యాకేజింగ్ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. ప్యాకేజింగ్ తయారీదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్న బ్రాండ్లు కొంతవరకు తట్టుకోగలిగినా స్పాట్ మార్కెట్లో కొనుగోలు చేసే చిన్న సంస్థలు అధిక ధరల అస్థిరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘సరఫరా అంతరాయాలు కలగకుండా కస్టమర్లతో కలిసి పనిచేస్తున్నాం. ఈ సవాళ్లను అధిగమిస్తామనే నమ్మకం ఉంది’ అని ఆల్టర్నిక్ ఎండీ, సీఈఓ తిమ్మయ్య ఎన్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోతే రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారం పడే ప్రమాదం పొంచి ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే దౌత్యపరమైన, ఆర్థికపరమైన చర్యలే కీలకం కానున్నాయి. -
ఉడుకుతున్న బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ(Nifty) 68 పాయింట్లు పెరిగి 23,476 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 212 పాయింట్లు ఎగబాకి 75,713 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.89బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 102.87 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.23 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.01 శాతం పెరిగింది.నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.Today Nifty position 17-03-2026(time: 9:49 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మూడు కంపెనీల లిస్టింగ్కు ఓకే
సెకండరీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్లలో సందడి తగ్గింది. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ జ్వాలలు, ముడిచమురు రవాణాకు విఘాతం కలగడంతో మండుతున్న ధరలు ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మూడు కంపెనీల ప్రాస్పెక్టస్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్కు అనుమతి పొందిన తాజా జాబితాలో ట్రావెల్స్టాక్ టెక్, లెర్న్ఫ్లుయెన్స్ ఎడ్యుకేషన్, టీ పోస్ట్ చేరాయి. ఈ మూడు కంపెనీలు గతేడాది జూన్, డిసెంబర్ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. అయితే మరో మూడు కంపెనీలు ఐపీవో రేసు నుంచి తప్పుకోవడం లేదా ప్రాస్పెక్టస్లను సెబీ తిప్పిపంపడం చేసినట్లు తెలుస్తోంది. వీటిలో రేస్ పవర్ ఇన్ఫ్రా, మాధుర్ ఐరన్ అండ్ స్టీల్, అర్జున్ జ్యువెలర్స్ ఉన్నాయి. ఈ కేలండర్ ఏడాది(2026)లో ఇప్పటివరకూ 12 కంపెనీలు ఐపీవో చేపట్టడం ద్వారా నిధులు సమీకరించాయి. ఈ బాటలో మరికొన్ని కంపెనీలు సైతం ఈ నెలాఖరుకల్లా పబ్లిక్ ఇష్యూలకు వచ్చే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.ట్రావెల్ టెక్నాలజీఐపీవోలో భాగంగా ట్రావెల్ టెక్నాలజీ కంపెనీ.. ట్రావెల్స్టాక్ టెక్ రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2,68,52,969 షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 135 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కు, రూ. 45 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన సొమ్మును సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. లక్ష్య కోచింగ్లక్ష్య బ్రాండుతో కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్న లెర్న్ఫ్లుయెన్స్ ఎడ్యుకేషన్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా రూ. 246 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 40 లక్షల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఇష్యూ నిధులను కొత్తగా క్యాంపస్ల ఏర్పాటుతోపాటు.. సేల్స్, మార్కెటింగ్ కార్యక్రమాలకు, రుణ చెల్లింపులకు, దీర్ఘకాలిక క్యాంపస్ల లీజ్ చెల్లింపులకు వినియోగించనుంది.టీ కేఫ్..టీ కేఫ్ బ్రాండ్ స్టోర్ల నిర్వాహక కంపెనీ టీ పోస్ట్ త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా 1.43 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.43 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ నిర్వహణలో కొత్తగా టీ కేఫ్ల ఏర్పాటుకు ప్రధానంగా ఐపీవో నిధులను వెచి్చంచే యోచనలో ఉంది.ఫోన్పే ప్రస్తుతానికి నోడిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్పే పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రస్తుతానికి నిలిచిపోయాయి. ప్రస్తుత రాజకీయ, భౌగోళిక వివాదాల నేపథ్యంలో ఐపీవో యోచనను ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నట్లు ఫోన్పే తాజాగా పేర్కొంది. యుద్ధ భయాల కారణంగా సెకండరీ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను చవిచూడటం తదితర అంశాలు దీనికి కారణంగా తెలియజేసింది. అయితే ప్రపంచ క్యాపిటల్ మార్కెట్లలో నిలకడ కనిపిస్తే తిరిగి లిస్టింగ్ ప్రాసెస్కు తెరతీయనున్నట్లు తెలియజేసింది. యుద్ధ ప్రభావానికి లోనవుతున్న ప్రాంతాలలో వేగంగా శాంతి నెలకొంటుందని భావిస్తున్నట్లు ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయంగా ఫోన్పేను లిస్ట్ చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
గ్యాస్ సరఫరాలో ఎగుమతి యూనిట్లకు ప్రాధాన్యం
ఎగుమతి ఆధారిత తయారీ యూనిట్లకు ప్రాధాన్య ప్రాతిపదికన ఎల్పీజీ, సహజ వాయువును కేటాయించాలని భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇంధన కొరత ఏర్పడితే భారతీయ సంస్థలు సకాలంలో ఎగుమతుల లక్ష్యాలను పూర్తి చేయలేవని.. దీంతో అంతర్జాతీయ కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ దేశాల వైపు మళ్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చైనా ప్రయోజనం పొందొచ్చని పేర్కొంది. కనుక ఎగుమతి ఆధారిత తయారీ పరిశ్రమలకు గ్యాస్ సరఫరా కొనసాగేలా చూడడం ఎంతో అవసరమని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ తెలిపారు.ఈ విషయమై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలకు లేఖ రాసినట్టు చెప్పారు. ఎగుమతులపై ఆధారపడిన చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) సైతం గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యం చూపించాలని కోరారు. ఎగుమతిదారులు సమస్యలు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత.. పశి్చమాసియాలో సంక్షోభ వాతావరణం నెలకొనడం తెలిసిందే. దీంతో చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి.గ్యాస్ కొరత ఏర్పడడంతో వంటగ్యాస్కే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. పరిశ్రమలకు ఇప్పటికే 50 శాతానిక పైనే గ్యాస్ కోత విధించడం గమనార్హం. జలంధర్ కేంద్రంగా పనిచేసే హ్యాండ్ ఉపకరణాల తయారీదారులు, ఎగుమతిదారుల సమాఖ్య ప్రెసిడెంట్ అశ్వినీ కుమార్ సైతం ఇదే మాదిరి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తమ ఉత్పత్తి కోసం రోజువారీ 425 కిలోల ఎల్పీజీ, కార్మికుల ఆహార తయారీకి వీలుగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ల సరఫరా ఎంతో అవసరమని చెప్పారు.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
పేపర్ పరిశ్రమకు ‘పశ్చిమాసియా’ సెగ
పశ్చిమాసియా సంక్షోభంతో దేశీ పేపర్ పరిశ్రమను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇంధన వ్యయాలు పెరిగిపోవడం, ఎగుమతులకు అవరోధాలతో వ్యాపారాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మన పేపర్ పరిశ్రమకు కీలక ఎగుమతి మార్కెట్లలో పశ్చిమాసియా కూడా ఒకటిగా ఉంటోంది. 2024–25లో దేశీ పరిశ్రమ 980 మిలియన్ డాలర్ల పేపర్, పేపర్బోర్డును ఎగుమతి చేయగా అందులో పశ్చిమాసియా దేశాల వాటా 290 మిలియన్ డాలర్లుగా (సుమారు 30 శాతం) ఉన్నట్లు పేపర్ తయారీ సంస్థల సమాఖ్య ఐపీఎంఏ తెలిపింది.అన్కోటెడ్ రైటింగ్..ప్రింటింగ్ పేపర్, కోటెడ్ పేపర్..పేపర్బోర్డ్, క్రాఫ్ట్ పేపర్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. తమ పరిశ్రమలో ప్రధానంగా ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుందని, దీనితో భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం తమపైనా ఉంటోందని ఐపీఎంఏ వివరించింది. ఇంధన రేట్లు పెరిగిపోవడం, సరఫరాపరమైన అవరోధాల వల్ల దేశీ పేపర్ మిల్లుల ఉత్పత్తి వ్యయాలపై నేరుగా ప్రభావం పడుతోందని వివరించింది. పేపర్ తయారీ ప్రక్రియకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్..బైండర్స్లాంటి ఉత్పత్తులను సమకూర్చుకోవడంలో మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.మరో వైపు, పేపర్ని ఉత్పత్తి చేసే చైనా, ఇండొనేషియాలాంటి దేశాలు ఎగుమతి కోసం పశ్చిమాసియాపై ఆధారపడతాయని, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల, సదరు ఉత్పత్తులను ఇప్పుడు అవి భారత్ వైపు మళ్లించే అవకాశం ఉందని ఐపీఎంఏ తెలిపింది. దీనితో చౌక దిగుమతులు వెల్లువెత్తి, దేశీ తయారీ సంస్థలపై ఒత్తిడి పెరిగిపోయే ముప్పు ఉందని వివరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే డిమాండ్పై ప్రతికూల ప్రభావం పడే ముప్పు నెలకొందని ఐపీఎంఏ ప్రెసిడెంట్ పవన్ అగర్వాల్ చెప్పారు.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
డిమాండ్కి తగినంత బొగ్గు సరఫరా
దేశీయంగా డిమాండ్కి సరిపడేంత బొగ్గును సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు కోల్ ఇండియాలో భాగమైన సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ (ఎస్ఈసీఎల్) సీఎండీ హరీష్ దుహాన్ తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 2.3 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ రంగం నుంచి డిమాండ్ పెరిగినా ఇవి సరిపోతాయని వివరించారు. వీటితో పాటు సత్వరం వెలికితీసేందుకు వీలుగా 1.2 కోట్ల టన్నుల బొగ్గు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అలాగే మైనింగ్ కార్యకలాపాల కోసం తగినంత స్థలం, ఇతరత్రా మైనింగ్..రవాణా కాంట్రాక్టులు కూడా ఉన్నట్లు హరీష్ తెలిపారు.ఇక తాము సరఫరా చేసే విద్యుత్ ప్లాంట్ల వద్ద కూడా తగినన్ని బొగ్గు నిల్వలు ఉండటం వల్ల విద్యుదుత్పత్తికి అవరోధాలు లేకుండా స్థిరంగా కొనసాగేందుకు వీలవుతుందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలో బొగ్గు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతులకు విఘాతం ఏర్పడి బొగ్గు, విద్యుత్ రంగాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో హరీష్ భరోసా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్టీపీసీ, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్, మధ్యప్రదేశ్ పవర్ జనరేటింగ్ కంపెనీ లాంటి దిగ్గజ విద్యుదుత్పత్తి సంస్థలకు కంపెనీ బొగ్గు సరఫరా చేస్తోంది.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు
దేశంలో బ్యాంకులకు టాప్–10 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రూ.40,635 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ జాబితాలో ఏబీజీ షిప్యార్డ్ (రూ.6,695 కోట్లు), గీతాంజలి జెమ్స్ (రూ.6,236 కోట్లు), బీటా నాప్తాల్ (రూ.5,268 కోట్లు), రాకేష్ కుమార్ కుల్దీప్ సింగ్ వాధ్వాన్ (రూ.4,291 కోట్లు) ఉన్నట్లు లోక్సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆమె వెల్లడించారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, బడా ఎగవేతదారుల (డిఫాల్టర్ల)పై చర్యలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆదేశాల ప్రకారం.. బ్యాంకులు ఈ మొత్తం జాబితాను అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (సీఐసీ)లకు నెలవారీగా సమర్పించాల్సి ఉంటుందని, అలాగే ఆయా సీఐసీలు దీన్ని తమ వెబ్సైట్లలో ప్రదర్శించాలని కూడా ఆమె వివరించారు.సెటిల్మెంట్ చేసుకోవచ్చు కానీ...ఆర్బీఐ నిబంధనల మేరకు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల కేటగిరీలో చేర్చిన ఖాతాలకు సంబంధించి బ్యాంకులు రాజీ సెటిల్మెంట్లు చేసుకోవచ్చని, అయితే ఆయా రుణగ్రహీతలపై కొనసాగుతున్న నేర విచారణలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసుకోవాలని సీతారామన్ పేర్కొన్నారు. డిఫాల్ట్ సొమ్మును తీవ్రమైన జాప్యాలు లేకుండా రికవరీ చేసుకోవడంలో రుణదాతలకు వెసులుబాటు కల్పించడమే దీని ఉద్దేశమని చెప్పారు.డిజిటల్ పేమెంట్స్ జోరు..గడిచిన కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్ పేమెంట్ లావాదేవీలు అసాధారణరీతిలో ఎగబాకాయని, దీనికి ప్రధానంగా ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సమన్వయంతో చేపట్టిన చర్యలే కారణమని మరో ప్రశ్నకు సమాధానంగా సీతారామన్ బదులిచ్చారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ డిజిటల్ చెల్లింపుల విలువ రూ.457.44 లక్షల కోట్లు కాగా, 2024–25 నాటికి ఇది రూ.849.12 లక్షల కోట్లకు దూసుకెళ్లిందని ఆమె చెప్పారు. వీటిలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) 81 శాతం వాటాతో ప్రపంచంలోనే అతిపెద్ద రియల్టైమ్ రిటైల్ పేమెంట్ వ్యవస్థగా ఆవిర్భవించిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.డిజిటల్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, ఎన్పీసీఐ పలు చర్యలు చేపడుతున్నాయన్నారు. కస్టమర్ మొబైల్ నంబర్, పరికరం మధ్య అనుసంధానం, పిన్ ద్వారా రెండంచెల ధృవీకరణ, రోజువారీ లావాదేవీల పరిమితి, ఇంకా కొన్ని రకాల వినియోగాలపై నియంత్రణలు ఇందులో ఉన్నాయని వివరించారు. అనుమానాస్పద లావాదేవీల విషయంలో అలెర్ట్లు పంపడం, వాటిని తిరస్కరించడానికి బ్యాంకులన్నింటికీ ఏఐ/ఎంఎల్ ఆధారిత ఫ్రాడ్–మానిటరింగ్ పరిష్కారాన్ని ఎన్పీసీఐ అందిస్తోందని కూడా ఆర్థిక మంత్రి తెలిపారు.11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్గత 11 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ (రైటాఫ్) చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. 2019–20లో గరిష్టంగా రూ.1.59 లక్షల కోట్లను రైటాఫ్ చేయగా... 2024–25లో ఈ మొత్తం రూ.47,568 కోట్లకు దిగొచ్చిందని లోక్సభకు ఇచి్చన రాతపూర్వక సమాధానంలో ఆయన పేర్కొన్నారు. ‘ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకు బోర్డులు ఆమోదించిన పాలసీ ప్రకారం, నాలుగేళ్లపాటు పూర్తి ప్రొవిజనింగ్ (కేటాయింపులు) జరిపిన మొండి బకాయిల (ఎన్పీఏ)తో సహా, ఎన్పీఏలను బ్యాంకులు రైటాఫ్ చేస్తాయి.ఈ చర్యల వల్ల రుణగ్రహీతలు చెల్లించాల్సిన అప్పులు మాఫీ కావు, అందువల్ల ఇది వారికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. రుణగ్రహీతలు బకాయిల చెల్లింపును కొనసాగించాల్సిందే. ఆయా ఖాతాలపై బ్యాంకులు చేపట్టిన రికవరీ చర్యలు కూడా కొనసాగుతుతాయి’ అని ఆయన వివరించారు.ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష -
శామ్సంగ్తో ఆర్ఐఎల్ డీల్
న్యూఢిల్లీ: గ్రీన్ అమోనియా సరఫరాకు వీలుగా దక్షిణ కొరియా కంపెనీ శామ్సంగ్ సీఅండ్టీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా వెల్లడించింది. 15ఏళ్ల కాలం అమల్లో ఉండే ఈ డీల్ విలువ 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 27,000 కోట్లు)గా తెలియజేసింది. ఇది ప్రపంచస్థాయి అమోనియా ఒప్పందాలలో ఒకటికాగా.. పూర్తిగా దేశీయంగా రూపొందించిన హరిత ఇంధనాన్ని ఎగుమతి చేయనుంది.2028–29 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఇంధన సరఫరాలు ప్రారంభంకానున్నట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. శామ్సంగ్ సీఅండ్టీ కార్పొరేషన్ (దక్షిణ కొరియా)తో గ్రీన్ అమోనియా దీర్ఘకాలిక సరఫరా, కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.2028–29 ద్వితీయార్ధం నుంచి 15ఏళ్లపాటు సరఫరాలు కొనసాగించనున్నట్లు తెలిపింది. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం ద్వారా గ్రీన్ అమోనియాను రూపొందించనున్నట్లు వెల్లడించింది. దీనిని ఎరువులు, ఇండ్రస్టియల్ కెమికల్, షిప్పింగ్తోపాటు.. విద్యుదుత్పాదనలోనూ వినియోగించవచ్చని పేర్కొంది. ఆర్ఐఎల్ షేరు 1% బలపడి రూ. 1,395 వద్ద ముగిసింది. -
వాణిజ్య లోటు ఊరట
న్యూఢిల్లీ: దేశం నుంచి గత నెలలో వివిధ వస్తువుల (మెర్కండైజ్) ఎగుమతులు వార్షికంగా 0.8 శాతం క్షీణించి 36.61 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతేకాకుండా ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 27.1 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అయితే పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కావడంతో ఈ ప్రభావం మార్చి నెల వాణిజ్య గణాంకాలపై కనిపించనుంది.మార్చి గణాంకాలు మే నెల మధ్యలో విడుదలవుతాయి. కాగా.. రవాణాపై రాజకీయ, భౌగోళిక సవాళ్లు ప్రభావం చూపడంతో మార్చిలో ఎగుమతులు క్షీణించనున్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ఫిబ్రవరిలో దిగుమతులు 24 శాతంపైగా ఎగసి 63.71 బిలియన్ డాలర్లను తాకాయి. ఇందుకు పసిడి, వెండి దిగుమతులు కారణమయ్యాయి.గోల్డ్ షిప్మెంట్స్ 219 శాతం జంప్చేసి 7.44 బిలియన్ డాలర్లకు చేరగా.. సిల్వర్ దిగుమతులు 285 శాతంపైగా ఎగసి 1.66 బిలియన్ డాలర్లయ్యాయి. మరోపక్క ముడిచమురు దిగుమతులు 9 శాతం అధికమై 12.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే జనవరిలో నమోదైన 34.68 బిలియన్ డాలర్లతో పోలిస్తే గత నెలలో వాణిజ్య లోటు తగ్గింది. వార్షికంగా అంటే 2025 ఫిబ్రవరిలో నమోదైన 14.05 బిలియన్ డాలర్లతో చూస్తే భారీగా పెరిగింది. 11 నెలల్లో..: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– ఫిబ్రవరి కాలంలో దేశ ఎగుమతులు దాదాపు 2 శాతం పుంజుకుని 402.93 బిలియన్ డాలర్లను తాకాయి. ఇదే కాలంలో దిగుమతులు 8.5 శాతం పెరిగి 713.53 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఈ ఏడాది(2025–26) తొలి 11 నెలల్లో వాణిజ్య లోటు 310.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో ఈ లోటు 261.8 బిలియన్ డాలర్లు మాత్రమే.అమెరికాకు ఎగుమతులు డౌన్అధిక టారిఫ్ల భారం కారణంగా అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు ఫిబ్రవరిలో 6.88 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12.88 శాతం తగ్గాయి. భారత్పై అమెరికా 50% పైగా సుంకాలు విధించడం, తర్వాత అక్కడి సుప్రీంకోర్టు వాటిని కొట్టివేయడంతో తిరిగి 150 రోజుల వ్యవధికి 10% విధించడం తెలిసిందే. సుంకాల తగ్గుదల ప్రభావం మార్చి ఎగుమతుల గణాంకాల్లో తెలియనుంది. 11 నెలల వ్యవధిలో..: ఇక ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల వ్యవధిలో అమెరికాకు ఎగుమతులు 3.84% పెరిగి 79.29 బి.డాలర్లకు, దిగుమతులు 15.65% పెరిగి 48.4 బి.డాలర్లకు చేరాయి. మరోవైపు, చైనాకు ఎగుమతులు 37.66% పెరిగి 17.54 బి. డాలర్లకు, దిగుమతులు 119.55 బి. డాలర్లకు ఎగిశాయి. -
ఏఎంఐ ల్యాబ్స్తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్తో నడిచే అతి పెద్ద ఏఐ ఆధారిత కంప్యూట్ ప్లాట్ఫాంను నిర్మించేందుకు ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (ఏఎంఐ)తో ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం నోయిడాలో ప్రాథమికంగా 1 గిగావాట్ ఏఐ కంప్యూట్ హబ్ను ఏర్పాటు చేస్తారు. 2030 నాటికి దీన్ని 2 గిగావాట్ల స్థాయికి విస్తరిస్తారు. దీని విద్యుత్ వ్యయాలు సంప్రదాయ డేటా సెంటర్ విద్యుత్ వ్యయాలతో పోలిస్తే 50–70 శాతం తక్కువగా ఉండనున్నాయి.ఈ ఒప్పందం కింద కంప్యూట్ ప్లాట్ఫాంకి సంబంధించి ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ భాగస్వామిగా ఓఎక్స్ఎంఐక్యూ వ్యవహరిస్తుంది. ఆర్కిటెక్చర్, హార్డ్వేర్ రోడ్మ్యాప్, సప్లై చెయిన్ వ్యూహాలను డిజైన్ చేయడంలో ఏఎంఐ ల్యాబ్స్తో కలిసి పని చేస్తుంది. ఇప్పటికే తొలి దశ పనులు ప్రారంభం కాగా, 2027 నాటికి ప్రాథమిక కంప్యూట్ సామర్థ్యం అందుబాటులోకి రానుంది.పర్యావరణహిత విద్యుత్ దిగ్గజం గ్రీన్కో మాతృ సంస్థ ఏఎం గ్రూప్లో ఏఎంఐ ల్యాబ్స్ భాగంగా ఉంది. జీపీయూ ఆర్కిటెక్చర్, ఏఐ టెక్నాలజీ కంపెనీ అయిన ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ని రాజా కోడూరి ఏర్పాటు చేశారు. సిలికాన్ వేలీ కంపెనీలకు సేవలందిస్తున్న ఓఎక్స్ఎంఐక్యూ అనుభవం తమకు ఉపకరిస్తుందని ఏఎం గ్రూప్ చైర్మన్ అనిల్ చలమలశెట్టి తెలిపారు. ఏఎంఐ ల్యాబ్స్ తమకు సరైన భాగస్వామి అని రాజా కోడూరి తెలిపారు. -
కస్టమర్లకు అలర్ట్.. మారిపోతున్న క్రెడిట్ కార్డు రూల్స్..
దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు ఏప్రిల్ 2026 నుంచి తమ క్రెడిట్ కార్డు నియమాలలో మార్పులు అమలు చేయనున్నాయి. ముఖ్యంగా క్యాష్బ్యాక్ ప్రయోజనాలు, రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ విధానం, అలాగే కొన్ని చెల్లింపులపై లావాదేవీ ఛార్జీల్లో మార్పులు ఉండనున్నాయి.ఈ మార్పులను ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), యెస్ బ్యాంక్ (YES Bank), ఎస్బీఐ (SBI Card) తమ వినియోగదారులకు తెలియజేశాయి. కాబట్టి క్రెడిట్ కార్డు వినియోగదారులు కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకుని తమ ఖర్చు విధానాన్ని సర్దుబాటు చేసుకోవడం మంచిది.యాక్సిస్ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్లో మార్పులుఏప్రిల్ 12 నుంచి ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రివార్డ్ స్ట్రక్చర్లో కొన్ని మార్పులు అమల్లోకి రానున్నాయి. వాటిలో ముఖ్యమైనవి..ఎయిర్టెల్ మొబైల్, బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ చెల్లింపులపై 25% క్యాష్బ్యాక్ కొనసాగుతుంది.ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యుటిలిటీ బిల్లులు చెల్లిస్తే 10% క్యాష్బ్యాక్ అందుతుంది.అయితే ప్రతి బిల్లింగ్ సైకిల్కు గరిష్ట క్యాష్బ్యాక్ పరిమితి ఇప్పుడు బేస్ క్యాష్బ్యాక్ క్యాప్తో అనుసంధానం అవుతుంది.స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి ప్లాట్ఫారమ్లపై ఇప్పటివరకు ఉన్న 10% క్యాష్బ్యాక్ నిలిపివేయనున్నారు.బదులుగా జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్ఫారమ్లపై 10% వాల్యూ-బ్యాక్ అందించనున్నారు.యెస్ బ్యాంక్ కొత్త ఛార్జీలుఏప్రిల్ 1 నుంచి యెస్ బ్యాంక్ యుటిలిటీ బిల్లులు, ట్రాన్స్పోర్ట్ చెల్లింపులపై కొత్త పరిమితులు, ఛార్జీలు అమలు చేయనుంది. కొత్త నిబంధనలు ఇలా.. విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులపై నెలవారీ ఖర్చు నిర్దిష్ట పరిమితిని దాటితే 1% ఛార్జీ వసూలు చేస్తారు.కార్డు రకాన్ని బట్టి పరిమితులు ఉంటాయి. యెస్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు అయితే నెలకు రూ.1,00,000 వరకు, ప్రీమియం కార్డులైతే రూ.50,000 వరకు, ఇతర కార్డులకు రూ.25,000 వరకు పరిమితులను నిర్ణయించారు.ఈ పరిమితులను దాటిన తర్వాత చేసిన యుటిలిటీ చెల్లింపులపై 1% ఫీజు వర్తిస్తుంది.అదే విధంగా టోల్, బ్రిడ్జ్ చెల్లింపులు కూడా నిర్దిష్ట పరిమితిని మించితే 1% ఛార్జీ వసూలు చేస్తారు. అయితే ఒక్క లావాదేవీకి గరిష్ట ఛార్జీ రూ.5,000 వరకు మాత్రమే ఉంటుంది.ఎస్బీఐ.. రివార్డ్ పాయింట్ రిడంప్షన్ మార్పులుఎస్బీఐ కార్డ్ కూడా ఏప్రిల్ 1 నుంచి రివార్డ్ పాయింట్ రిడంప్షన్ విధానంలో కొత్త నియమాలను అమలు చేయనుంది. కొత్త పాలసీ ప్రకారం..స్టేట్మెంట్ క్రెడిట్గా నెలకు గరిష్టంగా 60,000 రివార్డ్ పాయింట్లు మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు.రివార్డ్ పాయింట్ల రిడంప్షన్ 4,000 పాయింట్ల గుణిజాల్లో మాత్రమే ఉంటుంది.అయితే ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్ వంటి కొన్ని కార్డులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఉంటుంది. -
బంగారం ధరల్లో భారీ మార్పు.. సాయంత్రానికే కొత్త రేట్లు
దేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పడు మారిపోతున్నాయి. ఉదయం ఉన్న ధరలు సాయంత్రానికి ఉండటం లేదు. సోమవారం ఉదయం స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) సాయంత్రానికి భారీగా దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు మరింత ఊరట లభించింది.హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఉదయం రూ.450 తగ్గి రూ.1,45,900 లుగా ఉన్న 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సాయంత్రానికి మొత్తంగా రూ.2050 క్షీణించి రూ.1,44,300 లకు దిగివచ్చింది.అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర సోమవారం ఉదయం రూ.490 తగ్గి రూ.1,59,170 లుగా ఉండగా సాయంత్రం తిరిగే సరికి మరింత రూ.2240 కరిగి రూ. 1,57,420 లకు క్షీణించింది.ఇక వెండి ధరల (Today Silver Rate) విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్లో ఉదయం స్వల్పంగా కేజీకి రూ.100 తగ్గిన వెండి సాయంత్రానికి రూ.4000 క్షీణించి రూ.2,76,000 వద్దకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
యూఏఈలో ఉపాధి.. వీసా, విమాన టికెట్ ఉచితం
మోర్తాడ్(బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉపాధి విస్తరణకు ఏడీఎన్హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి ఉచిత నియామకాల మేళా నిర్వహించనున్నాయి. కేటరింగ్ విభాగంలో ఇప్పటికే ఎంతో మందికి ఉచితంగానే వీసాలు, విమాన టికెట్లు అందించిన ఈ రెండు సంస్థలు.. మరో మూడు విభాగాల్లో ఉచిత వీసాలను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. గతంలో మాదిరిగా నిర్ణీత తేదీల్లో నియామకాల ర్యాలీలు కాకుండా వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జీటీఎం సంస్థ చైర్మన్ చీటీ సతీశ్రావు ‘సాక్షి’కి తెలిపారు. హెవీ, లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లు, స్టీవార్డింగ్ సూపర్వైజర్లు, ఆఫీస్ బాయ్స్గా పని చేయాలనుకునే వారిని నేరుగా ఇంటర్వ్యూ చేస్తామన్నారు. వేతనం, అర్హతల వివరాలు.. హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్లు, స్టీవార్డ్ సూపర్వైజర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ.60 వేల చొప్పున, లైట్ డ్రైవర్లకు రూ.45 వేలు, ఆఫీస్ బాయ్స్కు రూ.25 వేల వరకు వేతనాలు చెల్లించనున్నారు. వసతి, భోజన సదుపాయాలు కంపెనీలు కల్పిస్తాయి. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. స్టీవార్డ్ సూపర్వైజర్లుగా పని చేయాలనుకునేవారికి గతంలో గల్ఫ్లో పని చేసిన అనుభవం అవసరం. ఆఫీస్ బాయ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీ పాసై ఇంగ్లిష్ మాట్లాడగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు gulfjobsgtm @gmail.com మెయిల్కు వివరాలను పంపించాలని కంపెనీల ప్రతినిధులు సూచించారు. పూర్తి వివరాలకు జీటీఎం సంస్థ కార్యాలయాలు ఉన్న ఆర్మూర్ (83320 62299), నిజామాబాద్ (93916 61522), జగిత్యాల(83320 42299), సిరిసిల్ల(93916 61522)లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
మార్కెట్ అదుర్స్.. అదరగొట్టిన ఆటో షేర్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, బ్యాంక్ స్టాక్స్ మద్దతుతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు ట్రేడ్ చివరి దశలో పదునైన లాభాలతో మూడు రోజుల నష్టాల పరంపరను బ్రేక్ చేశాయి.నిఫ్టీ 1.11 శాతం లేదా 257.70 పాయింట్ల లాభంతో 23,408.80 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 939 పాయింట్లు లేదా 1.26 శాతం పెరిగి 75,502.85 వద్ద ముగిశాయి.అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎటర్నల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్ సెన్సెక్స్లో టాప్ గెయినర్లలో ఉన్నాయి. బీఈఎల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, టైటాన్ టాప్ లూజర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 0.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.65 శాతం నష్టపోయాయి.సెక్టార్ వారీగా చూస్తే ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లలో నిఫ్టీ ఆటో అత్యధికంగా పెరిగింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. ఇక నిఫ్టీ రియల్టీ ఇతర సూచీల కంటే తక్కువ పనితీరు కనబరిచింది. -
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టౌలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. ఇండక్షన్ స్టౌల కొరత పెరగడంతో.. ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేసే పరిస్థితులు లేవని, చైనా నుంచి ముడిపదార్థాలు దిగుమతి అవ్వడానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇండక్షన్ స్టౌల లభ్యత భారీగా తగ్గిపోవడానికి కారణాలేమిటి? వరుస పండగల వేళ.. పౌరుల పరిస్థితి ఏమిటి?500 శాతం డిమాండ్ హిందువులకు నూతన సంవత్సరమైన ఉగాది.. అదేవిధంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్ మరో మూడునాలుగు రోజుల్లో రానున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడడంతో పండుగ పూట పిండివంటలు చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్పీజీ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే హాస్టళ్లలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి.హోటళ్లలో దోశ, పూరీ, మైసూర్ బజ్జీ వంటి పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థల్లోని క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి. గృహావసరాల సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. బుక్ చేసిన వారం పది రోజులకు గానీ గ్యాస్ బండ అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఆన్లైన్లో ఈ-కామర్స్ ప్లాట్ ఫారాల్లో.. ఇటు ఆఫ్లైన్లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ షోరూంలలో కూడా ఇండక్షన్ స్టౌల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టౌల కోసం ఒక్కసారిగా 500 శాతం దాకా డిమాండ్ పెరిగిందని డీలర్లు చెబుతున్నారు.ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టౌల ఉత్పత్తిని పెంచొచ్చా?ఇండక్షన్ స్టౌల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు చైనా నుంచి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులు ముడిపదార్థాల కోసం ఇప్పటికిప్పుడు ఆర్డరిచ్చినా.. అవి భారత్కు చేరడానికి కనీసం 45 రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క ఇండక్షన్ స్టౌ అని కాకుండా.. ఎయిర్ ఫ్రయ్యర్లు, ఓటీజీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ కుక్కర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం భోపాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యపట్టణం లఖ్నవూల్లో దాదాపుగా ఇండక్షన్ స్టౌలకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండక్షన్ స్టౌల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. నెల క్రితం వరకు 2,200 రూపాయలకు దొరికే ఇండక్షన్ స్టౌ ధర ఇప్పుడు 3 వేల రూపాయలకు చేరుకుంది. ఫిలిప్స్ కంపెనీకి చెందిన ముంబై బ్రాంచ్ మేనేజర్ వివేక్ గౌర్ కూడా దీనిపై స్పందించారు. ఎల్పీజీ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు వెల్లడించారు. డిమాండ్ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందన్నారు. భోపాల్లోని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వినీత్ శర్మ కూడా సాక్షితో మాట్లాడుతూ నెలకు సగటున వెయ్యి యూనిట్ల మేర ఇండక్షన్ స్టౌల విక్రయాలు జరిగేవని... ఇప్పుడు రోజుకు 10 వేల యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచడానికి ముడిపదార్థాల అవసరం ఉంటుందని, అందుకు చైనానే మార్గమని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టౌ తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం భారత్ ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఆ పదార్థాల కోసం 45 రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.ఏయే రంగాలపై ప్రభావం?గ్యాస్ కొరత దాదాపు అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరికి రెగ్యులర్ ఎల్పీజీ కనెక్షన్లు ఉండవు. చిన్న సిలిండర్లతో వంటలు చేసుకుంటారు. సాధారణంగా 650 నుంచి 750 వరకు 5 కేజీల చిన్న సిలిండర్ల రీఫిలంగ్ చార్జీలుంటాయి. గడిచిన 15 రోజులుగా మార్కెట్లో చిన్న సిలిండర్ల రీఫిల్లింగ్ జరగడం లేదు. దీంతో వాళ్లంతా స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హోటల్ రంగంపై సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రభావం పర్యాటకరంగంపై పడుతుంది. ఇండక్షన్ స్టౌలు ఇళ్లలో వంటకు సరిపోతాయే తప్ప.. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వంటకు పెద్దగా ఉపయోగపడవు.రాబోయే పండుగలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది?ఉగాదికి భక్ష్యాలు చేయడం ప్రత్యేకత. దీంతోపాటు.. కొత్త మామిడికాయలతో చేసే పులిహోర, పంచభక్ష్య పలహారాలను దేవుడికి నివేదన చేయడం తెలుగువారి సంప్రదాయం. అదేవిధంగా రంజాన్ ఈద్ సందర్భంగా షీర్కుర్మా, ఇతర వంటకాలు చేయడం ఆనవాయితీ. దీంతో.. గ్యాస్ కొరత, ఇండక్షన్ స్టౌల లభ్యత లేకపోవడం ఈ పండుగలపై తీవ్రంగా కనిపించనుంది. ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు.. అంటే మార్చి 27న శ్రీరామ నవమి, ఏప్రిల్ 3న గుడ్ఫ్రైడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పండుగల నేపథ్యంలో సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లాల స్థాయిలో గ్యాస్ సరఫరాను స్వయంగా కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు. -
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కేటాయింపు షురూ
దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ విభాగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను వివిధ రాష్ట్రాలు ప్రారంభించాయి. ఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేటాయింపులు అమల్లోకి వచ్చాయి.ప్రాధాన్యత క్రమంలో పంపిణీప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) రోజువారీ సగటు వినియోగంలో 20 శాతం మేర నియంత్రిత పంపిణీ కోసం కేటాయించాయి. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో రోజుకు సుమారు 1,800 సిలిండర్లను ఈ విధానం కింద పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంపిణీలో ఐదు స్థాయిల ప్రాధాన్యతను నిర్ణయించారు:స్థాయి 1, 2: విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వేలు, విమానాశ్రయాలకు అత్యున్నత ప్రాధాన్యత.స్థాయి 3: రెస్టారెంట్లు, భోజనశాలలకు 42 శాతం వాటా.స్థాయి 4: హోటళ్లు, గెస్ట్ హౌస్లు, ట్రస్టులకు 4 శాతం కేటాయింపు.స్థాయి 5: డెయిరీలు, బేకరీలు, స్వీట్ షాపులకు 11 శాతం కేటాయింపు.రాష్ట్రాల వారీగా..కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికే ఢిల్లీ, బిహార్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. గృహ వినియోగ గ్యాస్ మళ్లింపును అరికట్టడానికి, వాణిజ్య అవసరాలకు అంతరాయం కలగకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వల్ల పండుగల సీజన్లో, రద్దీ సమయాల్లో వాణిజ్య గ్యాస్ కొరత తలెత్తకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష


