breaking news
Business
-
ఎలాన్ మస్క్ సైబర్ట్రక్: సేఫ్టీలో టాప్ రేటింగ్
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'టెస్లా' మార్కెట్లో సైబర్ట్రక్ లాంచ్ చేసి చాల రోజులే అవుతోంది. ఇటీవల ఈ కారుకు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) క్రాష్ టెస్ట్ నిర్వహించింది.ఎన్హెచ్టీఎస్ఏ నిర్వహించిన క్రాష్ టెస్టులో టెస్లా సైబర్ట్రక్ 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇది అన్ని టెస్టులలోనూ మంచి స్కోర్ సాధించి.. మొత్తం మీద సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైబర్ట్రక్కు టాప్ సేఫ్టీ రేటింగ్ అందుకుంది.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొంటూ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: మహీంద్రా కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారుప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో టెస్లా సైబర్ట్రక్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కంపెనీ లాంచ్ చేసినప్పుడు దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్ డాలర్లుగా(రూ.59 లక్షలు) ఉండేది. ఇప్పుడు దీని ధర 15000 డాలర్లు పెరిగినట్లు సమాచారం.Cybertruck receives top safety rating! https://t.co/H1wKwSlpYh— Elon Musk (@elonmusk) August 22, 2025 -
2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు: రాష్ట్రపతి ఆమోదం
ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు ఈ నెల 12న ఆమోదం లభించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సుల ఆధారంగా ఇందులో మార్పులు చేశారు.ఈ కొత్త ఆదాయపన్ను చట్టం, 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పాత చట్టంతో పోల్చితే కొత్త చట్టం సరళతరంగా, పారదర్శకంగా ఉంటుందని ఆదాయపన్ను శాఖ ‘ఎక్స్’ ప్లాట్ఫామ్పై ప్రకటించింది.పాత vs కొత్త బిల్లు మధ్య తేడాలుపాత ఆదాయపు పన్ను చట్టం, 1961.. దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే అందులోని భాష, నిర్మాణం వంటివన్నీ సామాన్యులకు కొంత గందరగోళంగా ఉన్నాయి. దీనిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు.ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.ఇకపై మునుపటి సంవత్సరం & అసెస్మెంట్ సంవత్సరం వంటి పదాలకు బదులు "పన్ను సంవత్సరం" అనే పదం వాడుకలోకి వస్తుంది.2025 కొత్త పన్ను బిల్లులో ఇంతకు ముందు ఉన్న శ్లాబులు, రేట్లు అలాగే ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపన్ను శ్లాబులలో కూడా ఎలాంటి మార్పు లేదు.కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.The Income-tax Act, 2025 has received the Hon’ble President’s assent on 21st Aug 2025.A landmark reform replacing the 1961 Act, it ushers in a simpler, transparent & compliance-friendly direct tax regime.Access the official document here: https://t.co/wOPk1PFQbP pic.twitter.com/Xw84hzpPb3— Income Tax India (@IncomeTaxIndia) August 22, 2025 -
ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారు
మహీంద్రా అండ్ మహీంద్రా వార్నర్ బ్రదర్స్ సహకారంతో రూ. 27.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ను 999 యూనిట్లకు పరిమితం చేసింది. కాగా కంపెనీ దీని కోసం ఈ రోజు బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం మొదలైన 135 సెకన్లలో.. అన్నీ యూనిట్లు అమ్ముడైపోయాయి.లాంచ్ సమయంలో కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ తరువాత 999 యూనిట్లకు చేరింది. అన్ని యూనిట్లు ఇప్పుడు పూర్తిగా అమ్ముడైపోయాయి. డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభం కానున్నాయి.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్మ్యాన్ డెకాల్స్, టెయిల్గేట్పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్పై బ్యాట్మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్ ఉన్నాయి. బ్రేక్లు, స్ప్రింగ్లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.ఇదీ చదవండి: భారత్లో జర్మన్ బ్రాండ్ హవా: ధర ఎక్కువైనా రికార్డ్ సేల్స్మహీంద్రా బ్యాట్మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్తో.. ఒకే ఫుల్ ఛార్జ్పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్బోర్డ్పై ఆల్కెమీ గోల్డ్లో నంబర్ ఉన్న బ్యాట్మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి.From 999 to 000 in just 135 seconds. That's how quickly we sold all units of the BE 6 Batman Edition.Deliveries will begin on Batman Day, 20th September 2025.#BE6BatmanEdition #DriveYourLegend #MahindraBE6 #MahindraElectricOriginSUVs pic.twitter.com/u4x8LVxAIG— Mahindra Electric Origin SUVs (@mahindraesuvs) August 23, 2025 -
బంగారం విలువపై 90 శాతం లోన్
ప్రైవేటు రంగంలోని సౌత్ ఇండియన్ బ్యాంక్ ‘ఎస్ఐబీ గోల్డ్ ఎక్స్ప్రెస్’ పేరుతో కొత్త బంగారం రుణ పథకాన్ని ప్రారంభించింది. బంగారం విలువపై 90% వరకు రుణాన్ని ఈ పథకం కింద పొందొచ్చు. రూ.25,000 నుంచి రూ.25 లక్షల వరకు రుణం, గరిష్టంగా మూడేళ్ల కాలానికి తీసుకోవచ్చు.ఎంఎస్ఎంఈలు, నాన్ ఎంఎస్ఎంఈలు, చిన్న సంస్థలు తమ వ్యా పార విస్తరణ, మూలధన అవసరాల కోసం రుణాలు తీసుకోవచ్చని సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఎలాంటి రహస్య చార్జీల్లేకుండా, పారదర్శకంగా ఈ రుణ పథకం ఉంటుందని తెలిపింది. మొత్తం ప్రక్రియ డిజిటల్గా పూర్తవుతుందని, మొదటిసారి రుణం తీసుకునే వారు కూడా అర్హులేనని పేర్కొంది.ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా.. -
మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్?: ఎలాన్ మస్క్ ప్లాన్ ఇదేనా..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పుడూ.. కొత్త విషయాల మీద ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ పేరు మాదిరిగా అనిపించే 'మాక్రోహార్డ్' (Macrohard) పేరును తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎక్స్ఏఐ(xAI)లో చేరి.. మాక్రోహార్డ్ అనే పూర్తిగా ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మించడంలో సహాయం చేయండి. ఇది సాధారణ పేరు, కానీ ఈ ప్రాజెక్ట్ వాస్తవమైనది. మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు స్వయంగా ఎటువంటి ఫిజికల్ హార్డ్వేర్ను తయారు చేయలేదు. కానీ వాటిని పూర్తిగా ఏఐతో సృష్టించడం సాధ్యమవుతుంది'' అని మస్క్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఆగస్టు 1న యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ కార్యాలయంలో 'మాక్రోహార్డ్' పేటెంట్ కోసం మస్క్ xAI దాఖలు చేసింది. ఇది పూర్తిగా ఏఐ ద్వారానే పనిచేస్తుంది. ఇందులో కృత్రిమ మేధస్సును ఉపయోగించి వీడియో గేమ్లను రూపొందించడం, కోడింగ్, రన్నింగ్, గేమ్స్ కోసం డౌన్లోడ్ చేయగల కంప్యూటర్ సాఫ్ట్వేర్ మొదలైనవి ఉన్నాయి.గత నెలలో Xలో ఒక పోస్ట్లో.. ''xAI లేటెస్ట్ AI సాఫ్ట్వేర్ కంపెనీ, వందలాది ప్రత్యేక కోడింగ్ మరియు ఇమేజ్ / వీడియో జనరేషన్ /అండర్స్టాండింగ్ ఏజెంట్లు అన్నీ కలిసి పనిచేస్తాయి. ఫలితం అద్భుతంగా వచ్చే వరకు వర్చువల్ మెషీన్లలో సాఫ్ట్వేర్తో పరస్పర చర్య చేసే మానవులను అనుకరిస్తాయి" అని మస్క్ అన్నారుఇదీ చదవండి: కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్గత కొన్ని సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ సంస్థను మస్క్ సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్జీపీటీ-5 మోడల్ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను నాశనం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్ తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది.Join @xAI and help build a purely AI software company called Macrohard. It’s a tongue-in-cheek name, but the project is very real!In principle, given that software companies like Microsoft do not themselves manufacture any physical hardware, it should be possible to simulate…— Elon Musk (@elonmusk) August 22, 2025 -
భారత్లో జర్మన్ బ్రాండ్ హవా: ధర ఎక్కువైనా రికార్డ్ సేల్స్
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ'.. భారతదేశంలో ఇప్పటి వరకు 5,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇండియాలో ఆరు EVలను విక్రయిస్తున్న సంస్థ.. నవంబర్ 2021లో iXతో దేశీయ లగ్జరీ ఈవీ రంగంలోకి ప్రవేశించింది.కార్ల అమ్మకాలను మాత్రమే కాకుండా.. బీఎండబ్ల్యూ 4,000 కి.మీ పవర్ ఛార్జింగ్ కారిడార్ కూడా ప్రారంభించింది. కంపెనీ ఛార్జింగ్ కారిడార్ జమ్మూ నుంచి మధురై వరకు విస్తరించి, జాతీయ రహదారులు & ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, కోయంబత్తూర్, మధురై వంటి నగరాలను కవర్ చేస్తుంది. ఇది 120 kW నుంచి 720 kW వరకు సామర్థ్యాలతో ఛార్జర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 6000 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు సమాచారం. బీఎండబ్ల్యూ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం మైబీఎండబ్ల్యూ యాప్ ద్వారా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.మూడు శాతం పెరిగిన బీఎండబ్ల్యూ ధరలుబీఎండబ్ల్యూ.. భారతదేశంలోని తన మొత్తం వాహనాల ధరలను 2025 సెప్టెంబర్ 1 నుంచి 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. నిరంతర విదేశీ మారక ద్రవ్య హెచ్చుతగ్గులు & ప్రపంచ సరఫరా గొలుసు ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. -
భారత్ కీలక నిర్ణయం.. ఆ దేశానికి పోస్టల్ సేవలు బంద్
భారత్ నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నెలాఖరులో అమల్లోకి రానున్న అమెరికా కస్టమ్స్ నిబంధనల్లో మార్పులను ఉటంకిస్తూ ఆగస్టు 25 నుంచి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ తాజాగా ప్రకటించింది. అనేక వస్తువులపై సుంకం మినహాయింపును అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో భారత తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూలై 30న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నం.14324 ద్వారా 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు డ్యూటీ-ఫ్రీ మినహాయింపు తొలగించారు. ట్రంప్ ఇటీవల భారత్పై 25 శాతం సుంకం విధించడంతో పాటు రష్యా చమురు కొనుగోలుకు అదనంగా 25 శాతం జరిమానా విధించడంతో మొత్తం టారిఫ్ భారం 50 శాతానికి పెరిగింది. ఈ పరిణామాలతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి పోస్టల్ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.ఆగస్టు 29 నుంచి అమెరికాకు తరలించే అన్ని అంతర్జాతీయ పోస్టల్ వస్తువులు వాటి విలువతో సంబంధం లేకుండా, దేశ-నిర్దిష్ట అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక శక్తి చట్టం (ఐఈఈఈపీఏ) టారిఫ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం కస్టమ్స్ సుంకాలకు లోబడి ఉంటాయని తపాలా శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అయితే 100 డాలర్ల వరకు విలువైన గిఫ్ట్ ఐటమ్స్ కు మాత్రం మినహాయింపు కొనసాగుతుందని తెలిపింది.ఎయిర్ క్యారియర్లు తమకు అవసరమైన విధానాలు లేకపోవడంతో ఆగస్టు 25 తర్వాత పార్సిళ్లు తీసుకోలేమని భారత అధికారులకు తెలియజేశారు. దీంతో భారత పోస్టల్ శాఖ ఇప్పుడు లెటర్లు/డాక్యుమెంట్లు, 100 డాలర్ల వరకూ విలువైన గిఫ్ట్ ఐటెమ్స్ మాత్రమే స్వీకరిస్తుంది. ఇప్పటికే బుక్ చేసిన బట్వాడాకు వీలులేని వస్తువులకు రిఫండ్ పొందవచ్చని పోస్టల్ శాఖ తెలియజేసింది. -
మొన్న ఈడీ.. నేడు సీబీఐ: చిక్కుల్లో అనిల్ అంబానీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించిన.. బ్యాంకు మోసం కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM), దాని ప్రమోటర్ డైరెక్టర్ 'అనిల్ అంబానీ'కి సంబంధించిన స్థలాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) శనివారం దాడులు నిర్వహించింది. ముంబైలోని ఆర్కామ్తో సహా ఆయనకు సంబంధం ఉన్న ఆరు ప్రదేశాలలో ఈ సోదాలు జరిగాయి.బ్యాంకు నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయి?.. రుణాలు మళ్లించబడ్డాయో, లేదో నిర్ధారించడానికి కీలకమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించడం కోసం సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎస్బీఐకి రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించినందుకు ఆర్కామ్పై కూడా ఏజెన్సీ కేసు నమోదు చేసింది.అనీల్ అంబానీ, ఆర్కామ్ మోసానికి పాల్పడినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 13న ప్రకటించింది. జూన్ 24న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు ఒక నివేదికను పంపింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఒక బ్యాంకు ఒక ఖాతాను మోసపూరితంగా వర్గీకరించిన తరువాత.. ఆ విషయాన్ని రుణదాత 21 రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలియజేయాలి.ఆర్కామ్లో ఎస్బీఐ క్రెడిట్ ఎక్స్పోజర్లో ఆగస్టు 26, 2016 నుంచి అమలులోకి వచ్చే వడ్డీ, ఖర్చులతో పాటు రూ. 786.52 కోట్ల నాన్-ఫండ్ బేస్డ్ బ్యాంక్ గ్యారెంటీతో పాటు.. రూ. 2,227.64 కోట్ల ఫండ్ బేస్డ్ ప్రిన్సిపల్ బకాయిలు ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గత నెలలో లోక్సభకు తెలిపారు. కాగా ఇప్పటికే అనిల్ అంబానీ కంపెనీలపై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహించింది.ఇదీ చదవండి: ఎవరూ తప్పించుకోలేరు.. ఏకంగా 8 కోట్ల ట్రాఫిక్ చలాన్లు! -
రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటోంది..
రాష్ట్రాభివృద్ధి కసం ప్రభుత్వం చేసే పనులు, అవలంభించే విధానాలు ప్రజలకు తెలిస్తేనే మరింత సక్సెస్ అవుతాయి. రాబోయే తరాల భవిష్యత్తును మార్చేసే అలాంటి కీలక ప్రాజెక్ట్లకే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైటెక్ సిటీ, ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్లతో సుమారు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారిపోయిందో అంతకు రెట్టింపు స్థాయిలో మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్లతో తెలంగాణ దశదిశలు మారిపోతాయి. ఎయిర్పోర్ట్తో హైదరాబాద్ నుంచి ప్రపంచం మొత్తానికి తలుపు తెరిచినట్టే.. ఔటర్తో తెలంగాణ మొత్తానికి కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడిదే స్థాయిలో ప్రపంచ దేశాలను ఆకర్షించే ఈ మూడు గేమ్ చేంజర్ ప్రాజెక్ట్లు రాష్ట్రాభివృద్ధిని మార్చనున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) తెలంగాణ ప్రెసిడెంట్ కే.ఇంద్రసేనారెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోవరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు వంటి హనీమూన్ పీరియడ్ ముగిసింది. దీంతో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకుంటోంది. 18 నెలల్లో నగరంలో 2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడమే ఇందుకు ఉదాహరణ. వంద చ.అ.కు ఒక జాబ్ చొప్పున 2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దీంతో గృహాలకు డిమాండ్ ఏర్పడింది. పాత ప్రభుత్వాలు కేవలం పశ్చిమ హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీలో మెట్రో విస్తరణ, దక్షిణ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్.. ఇలా ఎక్కడికక్కడ అభివృద్ధి ప్రణాళికలు చేస్తోంది. గ్రీన్ఫీల్డ్ రోడ్లు, ఓఆర్ఆర్– ట్రిపుల్ ఆర్ మధ్య కొత్త ప్రాంతాలలో భూములు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార అవకాశాలూ పెరుగుతాయి. రోడ్లను వెడల్పు చేస్తే కార్ల సంఖ్య పెరగడమే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. మెట్రో విస్తరణ దూరాలు దగ్గరవుతాయి. ప్రజా రవాణా పెంచితేనే సిటీ అభివృద్ధి, దూరం పెరుగుతుంది. దీంతో కస్టమర్లు ఎక్కడికక్కడ ఇళ్లు కొనుగోలు చేయవచ్చు.హైడ్రా లాగే రెరా.. ప్రస్తుతం దేశంలో సుమారు 1.10 లక్షల మంది బిల్డర్లు ఉన్నారు. నిర్మాణ రంగంలో అసంఘటిత బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. నకిలీ బిల్డర్లు, మధ్యవర్తుల మాయమాటలు నమ్మి, తక్కువ ధరకు వస్తుందనే ఆశతో వారి చేతిలో కస్టమర్లు మోసపోతున్నారు. గృహ కొనుగోలుదారులకు భరోసా, వారి పెట్టుబడులకు భద్రత కల్పించే పదునైనా అస్త్రం రెరా. దీన్ని గత ప్రభుత్వం విస్మరించింది. దీంతో ప్రీలాంచ్, సాఫ్ట్లాంచ్ల పేరుతో అమాయక కస్టమర్ల కష్టార్జితాన్ని కాజేశారు. కస్టమర్లు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేకుండా, రూపాయి పన్ను చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే నకిలీ బిల్డర్లను హైడ్రా తరహాలో కఠినంగా వ్యవహరించాలి. ఈమేరకు రెరాను మరింత బలోపేతం చేయాలి.ఏటా లక్ష కార్మికులకు నైపుణ్య శిక్షణ.. దేశీయ నిర్మాణ రంగంలో వచ్చే పదేళ్లలో 4.5 కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం. ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది కార్మికులు తెలంగాణ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది నైపుణ్య కార్మికులు నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకూ సంపాదిస్తున్నారు. కొడంగల్, నిజామాబాద్, పరిగి, కరీంనగర్, వరంగల్ వంటి మన తెలంగాణ నుంచి యువత ముంబై, ఎన్సీఆర్–ఢిల్లీ, దుబాయ్, గల్ఫ్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. నెలకు రూ.25–రూ.30 వేలకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు వెయ్యి ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఆయా విద్యా సంస్థలు అకడమిక్ స్థాయిలో బాగానే ఉన్నా ఆన్సైట్ ప్రాక్టికల్ శిక్షణలో వెనుకబడి ఉన్నాయి. 12 తరగతిలోపు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 180 రోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. 90 రోజుల పాటు క్లాస్రూమ్ శిక్షణ, 90 రోజులు ఆన్సైట్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే జరగనున్న క్రెడాయ్ స్టేట్కాన్ సదస్సులో సీఎం రేవంత్రెడ్డితో చర్చించనున్నాం.త్వరలోనే ఫ్యూచర్ సిటీ చాప్టర్..ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణలో 15 చాప్టర్లు, వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వీటిని 25 చాప్టర్లకు విస్తరించాలన్నది లక్ష్యం. త్వరలోనే ఫ్యూచర్ సిటీ క్రెడాయ్ చాప్టర్ను ప్రారంభించనున్నాం. కనీసం ఒక్క ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందిన, నాణ్యమైన 30 మంది సభ్యులతో ఈ చాప్టర్ను తెరవనున్నాం. కోడ్ ఆఫ్ కండక్ట్ విధిగా పాటించే సభ్యులతో ఆ తర్వాత సంగారెడ్డి, జహీరాబాబాద్ చాప్టర్లు కూడా రానున్నాయి. ప్రభుత్వం, బిల్డర్లకు మధ్య క్రెడాయ్ వారధిలా పనిచేస్తుంది. ప్రభుత్వ పాలసీలు, పన్నులు తదితరాలపై బిల్డర్లకు అవగాహన కల్పిస్తుంది. -
ఈసీఐ సేవలకు ఆధార్.. ఇక తప్పనిసరి కాదు..
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) పథకం సేవలకు ఆధార్.. ఇక తప్పనిసరి కాదు. బీమా చేసిన వ్యక్తులు, వారి కుటుంబాలకు ఆధార్ ఆధారిత ధృవీకరణ ఐచ్ఛికంగానే ఉంటుందని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) స్పష్టం చేసింది. ఈఎస్ఐ పథకం లబ్ధిదారులు ఆధార్ ద్వారా ధృవీకరించుకోకపోయినా తమ వైద్య, నగదు ప్రయోజనాలను పొందగలరు.కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కింద చట్టబద్ధమైన సంస్థగా, ఈఎస్ఐసీ సంఘటిత రంగంలోని కార్మికులకు సమగ్ర ఆరోగ్య బీమా, సామాజిక భద్రతను అందిస్తుంది. ఇందులో వైద్య సంరక్షణ, అనారోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు, వికలాంగుల పరిహారంతోపాటు సభ్యులపై ఆధారపడినవారికి పెన్షన్లు ఉన్నాయి.బెనిఫిట్ డెలివరీని సులభతరం చేయడానికి, కాగిత ప్రక్రియను తగ్గించడం కోసం గతంలో ఆధార్ ధృవీకరణను ప్రవేశపెట్టినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వివరించింది. అయితే ఆధార్ వెరిఫికేషన్ లేని కారణంతో లబ్ధిదారులకు సేవలను నిరాకరించబోమని ఈఎస్ఐసీ స్పష్టం చేసింది. ఆధార్ స్థానంలో పాస్ పోర్టులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.మరిన్ని సేవలు.. కొత్త పోర్టల్ఈఎస్ఐసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు పలు కీలక కార్యక్రమాలను లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కార్మిక మంత్రిత్వ శాఖ వివరించింది. ద్వితీయ, తృతీయ ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎంజెఎవై) ఆసుపత్రులతో సహకారం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. శాశ్వత అంగవైకల్యం పొందిన సభ్యులు, వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు పరిహారాన్ని మరింత పెంచినట్లు వివరించింది.బీమా లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు నగదు ప్రయోజన క్లెయిమ్లను డిజిటల్గా సమర్పించడానికి వీలు కల్పించే కొత్త ఆన్లైన్ పోర్టల్ను కూడా ప్రారంభించినట్లు పేర్కొంది.ఈఎస్ఐ పథకానికి ఎవరు అర్హులు?ఈఎస్ఐ పథకం ఉద్యోగులందరికీ వర్తించదు. ఎవరైతే నెలకు రూ.21 వేలు లేదా అంత కంటే తక్కువ జీతం పొందుతున్నారో వారికే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుంది. అదే దివ్యాంగ ఉద్యోగులు అయితే రూ.25 వేల వరకూ జీతం పొందుతున్నవారు కూడా ఈ పథకానికి అర్హులు. -
ఎవరూ తప్పించుకోలేరు.. ఏకంగా 8 కోట్ల ట్రాఫిక్ చలాన్లు!
ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ట్రాఫిక్ నియమాలను కఠినతరం చేసింది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. 2024లో మాత్రమే అధికారులు దేశం మొత్తం మీద 8 కోట్ల కంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు జారీ చేశారు. ఈ చలాన్ల మొత్తం విలువ సుమారు రూ. 12,000 కోట్లు.దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువ ట్రాఫిక్ రూల్స్ తప్పుతున్నట్లు, జరిమానాలు కూడా ఇక్కడ నుంచే ఎక్కువ వసూలవుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఓవర్ స్పీడ్, రెడ్-లైట్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్ వంటి ఉల్లంఘనలకు ప్రతోరోజూ 5000 కంటే ఎక్కువ ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ సంఖ్య గురుగ్రామ్లో కూడా ఎక్కువగానే ఉంది.సాధారణ ఉల్లంఘనలు - జరిమానాలుమోటారు వాహనాల చట్టం.. ట్రాఫిక్ విభాగాల డేటా ప్రకారం, జరిమానాలు విధించే సాధారణ ఉల్లంఘనలలో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం, ఓవర్ స్పీడ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, రెడ్ లైట్లు జంప్ చేయడం, స్టాప్-లైన్ ఉల్లంఘనలు, రాంగ్ లేన్లో డ్రైవింగ్ చేయడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: భవిష్యత్ ఇంధనం గురించి చెప్పిన గడ్కరీహెల్మెట్ ధరించకపోతే.. రూ. 1,000, నిర్దిష్ట వేగం కంటే వేగంగా డ్రైవింగ్ చేస్తే రూ. 2,000 లేదా అంతకంటే ఎక్కువ జరిమానాలు (కొన్ని నగరాల్లో మొదటిసారి ట్రాఫిక్ రూల్ అతిక్రమించినవారికి జరిమానా కొంత తక్కువగా ఉంటుంది) ఉంటాయి. ఒకసారి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారు.. మళ్లీ మళ్లీ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తున్నట్లు తెలిస్తే.. వారికి మరింత ఎక్కువ జరిమానా విధించే అవకాశం ఉంది. రోడ్డు భద్రతలో టెక్నాలజీఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను కనిపెట్టడం చాలా సులభమైపోయింది. ఏఐ కెమెరాలు హై రిజల్యూషన్ ఫోటోలను క్లిక్ చేయడం మాత్రమే కాకుండా.. వీడియో కూడా రికార్డ్ చేస్తాయి. వీటి ఆధారంగానే వాహనదారులకు చలాన్ జారీ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి తప్పించుకోవడం అసాధ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన వినియోగదారులు మసలుకోవాలి. దీనివల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. -
‘పశు వ్యవసాయ రంగంలో వ్యూహాత్మక విధానాలు అవసరం’
భారత పశు వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడానికి వ్యూహాత్మక విధానాలు అవసరమని కాంపౌండ్ లైవ్స్టాక్ ఫీడ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎల్ఎఫ్ఎంఏ) ఛైర్మన్ డాక్టర్ దివ్యకుమార్ గులాటీ అన్నారు. సీఎల్ఎఫ్ఎంఏ 58వ వార్షిక సాధారణ సమావేశం, 66వ జాతీయ సింపోజియం హైదరాబాద్లో జరుగుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.‘ప్రస్తుత ఆహారోత్పత్తి ఖర్చుతో మొక్కజొన్న పంటలో సుస్థిరత సాధ్యం కాదు. దిగుబడి పెంచేందుకు చేసే ఫీడ్ ఫార్ములేషన్లు నియంత్రణ, నిబంధనలకు కట్టుబడి ఉంటాయి. ఉన్న పంటలో ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వ మద్దతుతో ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాల నవీకరణలు అవసరం. రైతు కేంద్రీకృత విధానాలు రూపొందించాలి. ఈ మేరకు చర్యలు తీసుకోకపోతే దాణాకు సంబంధించి భారత్ నికర దిగుమతిదారుగా మారే ప్రమాదం ఉంది’ అని గులాటీ తెలిపారు.పశుపోషణ వ్యవసాయ జీడీపీలో దాదాపు మూడింట ఒక వంతు దోహదం చేస్తుంది. పౌల్ట్రీ, డెయిరీ, ఆక్వాకల్చర్ రైతుల సమ్మిళిత ప్రాతినిధ్యాన్ని సీఎల్ఎఫ్ఎంఏ పిలుపునిచ్చింది. పశువుల కోసం ఎగుమతి ఆధారిత జోన్లు ఏర్పాటు చేయాలని సమావేశంలో చర్చించారు. భారతదేశం ఏటా 60 మిలియన్ మెట్రిక్ టన్నుల జంతు దాణాను ఉత్పత్తి చేస్తుంది. పౌల్ట్రీ ఫీడ్ మాత్రమే 22 మిలియన్ మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను వినియోగిస్తుంది. ఇది జాతీయ మొక్కజొన్న ఉత్పత్తిలో 50% కంటే ఎక్కువ. పెరుగుతున్న ఇథనాల్ అవసరాలు మొక్కజొన్నను దాణాకు దూరం చేస్తోంది. ఇది కోళ్ల మనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది. పౌల్ట్రీలో 8-10% వార్షిక పెరుగుదలతో దాణా కొరత దిగుమతి అధికమవుతోంది. ఇది ధరల అస్థిరతకు దారితీస్తుంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి, బయోసెక్యూరిటీ ప్రమాదాలు సమావేశంలో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: ఇథనాల్ కలిపిన పెట్రోలుపై సుప్రీంకోర్టులో పిల్! -
ఇథనాల్ కలిపిన పెట్రోలుపై సుప్రీంకోర్టులో పిల్!
ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అమ్మకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇథనాల్ లేని పెట్రోలును ఎంచుకునే సౌకర్యం వినియోగదారులకు కల్పించాలని కోరుతూ అక్షయ్ మల్హోత్ర అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ సౌకర్యం కల్పించకపోవడం 2019 నాటి వినియోదారుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ప్రజల ప్రాథమిక హక్కులకూ భంగం కలిగించేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోలును విక్రయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటివరకూ పెట్రోలులో కలిపే ఇథనాల్ మోతాదు పది శాతం మాత్రమే ఉండగా.. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి దీన్ని ఇరవై శాతానికి పెంచారు. అయితే చౌక ఇథనాల్ను కలుపుతున్నా అంతమేరకు పెట్రోలు ధరలు తగ్గకపోవడంపై, ఈ-20 పెట్రోలు కారణంగా తమ వాహనాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మైలేజీ తగ్గుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఏప్రిల్ కంటే ముందు తయారైన వాహనాలు, కాలుష్య నివారణ మార్గదర్శకాలు బీఎస్-6లు రెండింటికీ ఈ ఈ-20 పెట్రోలు అనుకూలంగా లేదన్నది ఆరోపణ. ఈ-20 ఇథనాల్ ఇంజిన్ భాగాలను దెబ్బతీస్తుందని, సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా తుప్పు పట్టేందుకు అవకాశాలు ఎక్కువ చేస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు బీమా కంపెనీలు ససేమిరా అంటూండటం గమనార్హం.వినియోగదారుల అవగాహనపెట్రోల్ కంటే తక్కువ ధరకు ఇథనాల్ లభిస్తోందని కానీ ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గట్టుగా పెట్రోలు ధరలు తగ్గించలేదని పిటిషనర్ ఆరోపించారు. పెట్రోలు బంకుల్లో లభిస్తున్నది ఇథనాల్ కలిపినదా? కాదా? అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదని తగిన లేబలింగ్, ప్రకటనలు లేకపోవడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇథనాల్ లేని పెట్రోలును కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిందీ పిటిషన్. ఇథనాల్ లేదా ఇతర పదార్థాలను కలిపి అందిస్తూంటే ఆ విషయాలను స్పష్టం చేస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని పెట్రోల్ స్టేషన్లలో ఇథనాల్ లేని పెట్రోల్ను కూడా అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టును కోరింది. దీంతోపాటే మిశ్రమం ఎంత? ఏ ఏ పదార్థాలను కలిపింది కూడా పెట్రోలు బంకుల్లో స్పష్టంగా ప్రకటించాలని... ఆయా వాహనాలు మిశ్రమ ఇంధనానికి అనువైనవా? కావా? అన్న సమాచారాన్ని వినియోగదారులకు అందించాలని సూచించింది. ఈ-20 పెట్రోలు వాడకం ప్రభావం వాహనాలపై ఎలా ఉంటుందన్న విషయాన్ని దేశవ్యాప్తంగా అధ్యయనం చేయాలని అభ్యర్థించింది.ఇదీ చదవండి: పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలు -
రూ.1 లక్షతో రూ.100 కోట్లు సంపాదించిన నటుడు.. ఎలాగంటే..
బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతులు 15 సంవత్సరాల్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.100 కోట్ల కార్పస్ను క్రియేట్ చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. పెట్టుబడి పెట్టేందుకు చాలామందే ఆసక్తి చూపిస్తారు. కానీ సరైన టైమింగ్, ఇన్వెస్ట్ చేసే వ్యాపారంపై నమ్మకం, స్ట్రాటజీ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని వీరు నిరూపించారు. వ్యాపార చతురతతో జాకీష్రాఫ్ గతంలో తీసుకున్న ఒక్క నిర్ణయంతో పెద్ద మొత్తంలో కార్పస్ జనరేట్ అయింది. అసలు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు.. ఎలా అంతమొత్తంలో సంపద సృష్టించారో తెలుసుకుందాం.1995లో భారత్ తీసుకున్న ఆర్థిక సరళీకృత నిర్ణయాలవల్ల చాలా అంతర్జాతీయ కంపెనీలు దేశంలోకి ప్రవేశించాయి. అందులో భాగంగా సోనీ ఎంటర్టైన్మెంట్ కూడా తన టీవీ ఛానెల్ను భారతదేశంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో జాకీష్రాఫ్, అయేషా ష్రాఫ్తో కలిసి ఏడుగురు సభ్యుల బృందంతో కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు వ్యూహాత్మక భాగస్వాములుగా మారారు. కొత్త కంపెనీ కదా ఇందులో పెట్టుబడి పెడితే రాబడి ఎలా ఉంటుందోననే అనుమానాలకు తావు లేకుండా తాము నమ్మిన వ్యాపారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ సమయంలో టెలివిజన్ బిజినెస్కు ప్రజలు ఆసక్తి చూపుతారనే స్ట్రాటజీతో ముందుకెళ్లారు. క్రమంగా కంపెనీ ఎదిగి తాము అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన రూ.1లక్ష 15 ఏళ్ల తర్వాత రూ.100 కోట్లు అయినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలుఎందులో పెట్టుబడి పెట్టినా సరైన టైమింగ్, ఇన్వెస్ట్ చేసే వ్యాపారంపై నమ్మకం, స్ట్రాటజీ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని గమనించాలి. -
క్లబ్హౌస్లోనే.. సేఫ్టీ లాకర్!
సాక్షి, సిటీబ్యూరో: భారతీయులకు సంపద అనేది కేవలం ఆర్థిక భరోసా మాత్రమే కాదు.. అదో భావోద్వేగాలతో ముడిపడిన అంశం కూడా.. అందుకే సంపాదించడమే కాదు సంపదను భద్రపరుచుకునేందుకూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. బ్యాంక్లు, ప్రైవేట్ సంస్థలు సేఫ్టీ లాకర్ల సేవలు అందిస్తున్నా.. వాటి పనిదినాల్లో తప్ప 24/7 వాటిని వినియోగించుకోలేం. అలా కాకుండా క్లబ్హౌస్లో, నివాస సముదాయంలోనే సాయుధ దళాల వంటి భద్రత ఉంటే ఎంత బాగుంటుందో కదూ. ఈమేరకు దేశంలోనే తొలి సేఫ్టీ డిపాజిట్ లాకర్ సేవల సంస్థ ఆరంతో ప్రముఖ నిర్మాణ సంస్థ సత్త్వా గ్రూప్ చేతులు కలిపింది.ఎంత విలాసవంతమైన నివాస సముదాయంలో ఉన్నా సరే బంగారం, డబ్బు, ఆస్తి పత్రాలకు భద్రత విషయంలో కాస్త భయాందోళనలు ఉంటూనే ఉంటాయి. సాధారణంగా నివాస సముదాయాలలో జిమ్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియా వంటివి ఉంటాయి. కానీ, నివాసితుల సంపదకు భద్రత, సౌకర్యవంతం కలిగించడం వసతుల్లో భాగమే. కస్టమర్ల సంపదకు గోప్యత, సౌలభ్యం, ఆనందం, భద్రత అందించడమే వీటి ప్రత్యేకతలు.భద్రత, బీమా.. బీఐఎస్, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మిలిటరీ గ్రేడ్ వాల్ట్తో స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ప్రతీ లాకర్కు బయోమెట్రిక్ ఉంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా చొరబడితే గుర్తించే నిఘా వ్యవస్థ ఉంటుంది. ప్రతి లాకర్కు రూ.కోటి బీమా సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే లాకర్ లోపల ఏముందో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. దీంతో మీ సంపద ఎల్లవేళలా మీ నియంత్రణలోనే ఉంటుంది.కస్టమర్ల బంగారం, వజ్రాలు వంటి ఆభరణాలను సేఫ్టీ లాకర్లో భద్రపరిచే ముందు, తర్వాత వినియోగించిన ప్రతీసారి మీ కళ్లముందే తూకం వేస్తారు. ఏళ్ల పాటు బ్యాంక్ లాకర్ల వెయిటింగ్ జాబితాలు ఉండటం, అధిక విలువ డిపాజిట్లు, యాక్సెస్ పరిమితంగా ఉండటం వంటి సవాళ్లు ఉన్నాయి.అయితే వీటిల్లో మాత్రం కమ్యూనిటీలోని క్లబ్హౌస్లోనే ఈ సేఫ్టీ లాకర్ ఉంటుంది. దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా నివాసితులకు 24/7 అందుబాటులో ఉంటుంది. అందులోనే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంటుంది. దీంతో ఆభరణాల వంటివి అలంకరించుకొని బయటకు రావొచ్చు. -
పోస్టాఫీస్ స్కీమ్: 5 ఏళ్లలో రూ.7 లక్షలు వస్తాయ్..
భవిష్యత్తులో ఆర్థిక భద్రత కావాలంటే ఇప్పటి నుంచే ఎంతో కొంత పొదుపు చేయడం చాలా అవసరం. పిల్లల చదువులు, ఇల్లు కొనడం, పెళ్లి ఖర్చులు లేదా రిటైర్మెంట్ కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇందు కోసం ప్రతిఒక్కరూ పొదుపు మార్గాలను అన్వేషిస్తారు. అయితే చాలా మంది రిస్క్ లేని కానీ లాభదాయకమైన పెట్టుబడి ఎంపిక కోసం చూస్తారు. అలాంటి ఇన్వెస్టర్లకు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) స్కీమ్ మంచి ఎంపిక.పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ అంటే ఏమిటి?పోస్టాఫీస్ ఆర్డీ అనేది ప్రభుత్వ మద్దతు కలిగిన పొదుపు పథకం. ఇది సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటి. ఇందులో మీరు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. దీనిపై ప్రతి మూడు నెలలకోసారి చక్రవడ్డీని లెక్కించి జమ చేస్తారు. దీంతో రాబడి వేగంగా వృద్ధి చెందుతుంది.పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్లో కనీస నెలవారీ డిపాజిట్ రూ.100. ఆపై మీరు ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. గరిష్టంగా ఎటువంటి పరిమితి ఉండదు. కాల పరిమితి 5 ఏళ్లు. కావాలంటే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.ఈ స్కీమ్కు ప్రస్తుతం 6.7% వార్షిక వడ్డీని చెల్లిస్తున్నారు. దీనిని ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తుంది. జూలై-సెప్టెంబర్ 2025 కోసం 6.7% వార్షిక వడ్డీని నిర్ణయించింది.ఆర్డీ పథకంలో మీరు జమ చేస్తున్న సొమ్ముపై అత్యవసర పరిస్థితుల్లో రుణ సదుపాయం కూడా ఉంటుంది. మీకు ఆకస్మిక ఆర్థిక అవసరం ఎదురైతే, మీరు ఒక సంవత్సరం తర్వాత మీ డిపాజిట్ చేసిన మొత్తంలో 50% వరకు రుణం తీసుకోవచ్చు. అయితే, ఈ రుణంపై మీ ఆర్డీ రేటు కంటే 2% ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.5 ఏళ్లలో రూ.7 లక్షలు పొందండిలా..పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్లో నెలకు రూ .10,000 డిపాజిట్ చేస్తే రూ.7 లక్షలు పొందే అవకాశం ఉంది. 5 సంవత్సరాల పాటు నెలకు రూ .10,000 చొప్పున డిపాజిట్ చేస్తే మీ మొత్తం పెట్టుబడి రూ. 6 లక్షలు అవుతుంది. 6.7% వార్షిక వడ్డీ (త్రైమాసిక చక్రవడ్డీ)తో మీ మెచ్యూరిటీ మొత్తం రూ.7,13,659 అవుతుంది. అంటే మీరు వడ్డీ రూపంలో రూ.1,13,659 పొందుతారు. అసలు, వడ్డీ మొత్తం సొమ్ము ఎలాంటి రిస్క్ లేకుండా చేతికందుతుంది. -
పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలు
ఒక వ్యక్తి ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచడంలో ఆరోగ్య బీమా కీలకం. ముఖ్యంగా భారతదేశం వంటి వైద్య ఖర్చులు అధికంగా ఉన్న దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రధానపాత్ర పోషిస్తోంది. అయితే పాలసీలను విక్రయించే రేసులో చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. కొందరు అనుసరిస్తున్న మోసపూరిత ఎత్తుగడలు ఆరోగ్య బీమా పాలసీలపై అవగాహన పెంపొందించడాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఏజెంట్లు వినియోగదారులను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో.. పాలసీల్లో ఉన్న రహస్యాలను చెప్పకుండా ఎలా దాచే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకుందాం.మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్చాలా మంది బీమా ఏజెంట్లు పాలసీదారులకు మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్ ఎంతనే విషయాలను హైలైట్ చేయరు. వాటి గురించి చెబితే పాలసీ తీసుకోరేమోననే భయాలుంటాయి. కాబట్టి పెద్దగా వీటి గురించి మాట్లాడరు. ఇవి పాలసీదారుడి కవరేజీని అర్థం చేసుకోవడానికి కీలకం. మినహాయింపుల్లో ప్రీహెల్త్ కండిషన్, నిర్దిష్ట చికిత్సలు, పాలసీని కొనుగోలు చేసిన వెంటనే చేయించాలనుకునే వ్యాధుల వివరాలు ఉంటాయి. వీటి గురించి ఏజెంట్లు చెప్పకపోయినా పాలసీదారులే తెలుసుకోవాలి. కొన్ని షరతుల కోసం (ప్రసూతి కవరేజీ లేదా నిర్దిష్ట శస్త్రచికిత్సలు వంటివి) వెయిటింగ్ పీరియడ్ 1 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటాయి. ఏయే పాలసీలో ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉందో తీసుకునేముందు తెలుసుకోవాలి.గది అద్దె పరిమితులుచాలా బీమా పాలసీలు గది అద్దెపై పరిమితులను విధిస్తాయి. ఇది ఆసుపత్రిలో చేరిన సందర్భంలో కవరేజీని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, ఆసుపత్రిలో చేరిన తర్వాత ఒక పాలసీ సాధారణ వార్డులో చేరడాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. కొన్ని గది అద్దెలో రోజుకు కొంత నిర్దిష్ట మొత్తాన్నే మాత్రమే చెల్లిస్తాయి. బీమా చేసిన వ్యక్తి చికిత్సకు వైద్యపరంగా ఇతర గది అవసరమైనప్పటికీ సదరు మొత్తాన్ని చెల్లించవు. ఈ వివరాలను ఏజెంట్లు చెప్పకపోవచ్చు.జీవితకాల కవరేజీ..చాలా మంది ఏజెంట్లు పాలసీలను ఎలాగోలా కట్టబెట్టాలనే ఉద్దేశంతో ‘ఏదైనా ఆసుపత్రిలో నగదు రహిత చికిత్స’ లేదా ‘జీవితకాల కవరేజీ’ అని ప్రచారం చేస్తారు. అయితే నగదు రహిత చికిత్స సౌకర్యాలు పాలసీ ఆసుపత్రుల నెట్వర్క్కు పరిమితం అవుతాయి. పాలసీదారులు ఇతర ఆసుపత్రిని ఎంచుకుంటే ముందుగా డబ్బు చెల్లించి తర్వాత క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. కొందరు ఏజెంట్లు జీవితకాల కవరేజీ గురించి ప్రచారం చేస్తున్నప్పటికీ వృద్ధులకు వయసు పరిమితులు లేదా మినహాయింపులు ఉంటాయి.ఇప్పుడేం చేయాలంటే..తప్పుదోవ పట్టించే ఆరోగ్య బీమా పాలసీల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పాలసీ తీసుకోవడానికి ముందు ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరం.ఏజెంటు చూపించే బ్రోచర్ మాత్రమే కాకుండా పాలసీలోని అంతర్గతంగా దాగి ఉన్న అంశాలను తెలుసుకోవాలి. వాటి గురించి ప్రత్యేకంగా ఏజెంట్లును, నిపుణులను అడిగి తెలుసుకోవాలి. పాలసీ అధికారిక వెబ్సైట్ల్లో పూర్తి వివరాలు ఉంటాయి.ఐఆర్డీఏఐ అధికారిక వెబ్సైట్లో అన్ని పాలసీ సంస్థలు వివరాలు ఉంటాయి. ఏటా క్లెయిమ్ పర్సంటేజ్కు సంబంధించిన విషయాలు ఉంటాయి.క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని తనిఖీ చేయడానికి, వివిధ పాలసీ ప్లాన్లను పోల్చడానికి ఐఆర్డీఏఐ సాధనాలను అందిస్తుంది.ఏజెంట్ ఏదైనా వాగ్దానాలు లేదా మౌఖిక హామీలు (ప్రతిచోటా నగదు రహితం, జీవితకాల కవరేజీ వంటివి) ఇస్తే వాటిని పాలసీ డాక్యుమెంటేషన్లో చూపించమని డిమాండ్ చేయాలి.నిజంగా అవి డాక్యుమెంట్లో ఉంటే క్లెయిమ్ దాఖలు చేసేటప్పుడు వ్యత్యాసాల సమయంలో ఇది సాక్ష్యంగా ఉపయోగపడుతాయి.ఆరోగ్య బీమా పాలసీలు వివిధ అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. ఒక వ్యక్తికి మెరుగ్గా పనిచేసే పాలసీ మరొకరికి తగినది కాకపోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏవరి ప్రత్యేక అవసరాలు వారికి ఉంటాయని గమనించాలి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పకుండా తీసుకోవాలి.ఇదీ చదవండి: పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా? -
ఇల్లు కొనాలంటే ఇలాంటి ప్లాన్ అవసరం
తమకంటూ ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇల్లు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాక అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. సొంతింటి కోసం ముందు నుంచి పక్కా ప్రణాళికతో ప్రిపేరైతే ఇల్లు కొనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతున్నారు. ఇంటి కొనుగోలు నిర్ణయం తీసుకున్నాక ప్రాంతం, ప్రాజెక్ట్, బడ్జెట్తో పాటు ఆర్థికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా, వారి వారి వెసులుబాటు బట్టి ఎక్కడో ఓ చోట తమకంటూ సొంత ఇల్లు కట్టుకోవాలనో, కొనుక్కోవాలనో అనుకుంటారు. అయితే ఇల్లు అంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. – సాక్షి, సిటీబ్యూరోసొంతింటిని కొంతమంది చిన్న వయసులోనే సొంతం చేసుకుంటుంటే.. మరికొందరు ఉద్యోగ విరమణ వయసు నాటికి గానీ కొనుక్కోలేరు. మరికొంతమందికి సొంతిల్లు తీరని కలగానే మిగిలిపోతుంది. కనీసం ఐదారేళ్ల ముందు నుంచే ఆర్థిక ప్రణాళిక చేస్తేనే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోసం నగరాలు, పట్టణాలకు వలస వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈక్రమంలో ఎవరి స్థాయిలో వారు సొంతింటి కోసం ప్రయత్నిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలను పలువురు డెవలపర్లు చేపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇంటి కొనుగోలు ఎంతో ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ముందు నుంచే పక్కా ఆర్థిక ప్రణాళికంగా వ్యహరించాలి.పొదుపు చేస్తేనే.. సొంతింటి కల ఉన్నవారు సంపాదన ప్రారంభించిన వెంటనే ఇంటి కోసం ప్రతినెలా కొంత మొత్తం పొదుపు చేయాలి. ఎన్నేళ్లలో ఇల్లు కొనాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి ప్రతినెలా సంపాదనలో కొంత మొత్తం దాచుకోవాలి. కనీసం నెలకు రూ.10 వేల నుంచి, ఆ తర్వాత ఎవరి ఆదాయాన్ని బట్టి ఎంత వీలైతే అంత మొత్తం పొదుపు చేసుకోవాలి. గృహరుణం తీసుకుంటే నెలనెలా ఎలా ఈఎంఐ చెల్లిస్తారో అలా ఇంటి కోసం మొదటి నుంచి పొదుపు రూపంలో ఈఎంఐ చెల్లించాలన్నమాట. ఇంటి కోసం డౌన్పేమెంట్కు అవసరమయ్యే 15–20 శాతం నిధులను సమకూర్చుకుంటే మిగతా మొత్తాన్ని గృహ రుణాన్ని తీసుకోవచ్చు.బడ్జెట్ను బట్టే నిర్ణయం.. ప్రతినెలా పొదుపు చేసిన మొత్తాన్ని అధిక రాబడి వచ్చే పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. ఉద్యోగస్తులైతే పీపీఎఫ్లో మదుపు చేయడం, లేదంటే బంగారం కొనుగోలు, నమ్మకమైన సంస్థల్లో చిట్టీలు వేయడం, మ్యూచువల్ ఫండ్స్లో సిప్ చేయడం వంటి మార్గాలను అన్వేషించాలి. అంతేకాకుండా బ్యాంక్లు, పోస్టల్ పథకాలు ఇలా ఎక్కడ వీలైతే అక్కడ అసలుకు హామీ ఉండి అధిక రాబడి వచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలి. ఇంటి బడ్జెట్ ఎంతో ముందుగా అంచనాకు రావాలి. ఎవరి బడ్జెట్కు అనుగుణంగా ఆయా ధరల్లో ఇల్లు కొనుగోలు ప్రయత్నం చేయాలి. ఇల్లు కొన్నాక బ్యాంకు రుణానికి చెల్లించే ఈఎంఐ భారం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇల్లు అత్యవసరమని భావించకపోతే ముందు ఇంటి స్థలం కొనుగోలు చేసి, ఆ తర్వాత భవిష్యత్తులో అక్కడే ఇల్లు కట్టుకోవచ్చు. -
వామ్మో వెండి హ్యాట్రిక్.. బంగారం భారీ షాక్
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. తులం రూ.లక్షకు చేరిన తర్వాత కొద్దికాలంగా ఫ్లాట్గా కొనసాగుతున్న పసిడి ధరలు నేడు (శనివారం) ఒక్కసారిగా ఎగిసి కొనుగోలుదారులకు భారీ షాకిచ్చాయి. మరో వైపు వెండి ధరలు వరుసగా మూడో రోజూ భారీగా పెరిగి హ్యాట్రిక్ కొట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?
సాధారణంగా పెళ్లైన కుమార్తెలకు తండ్రి, తల్లి, తాతల ఆస్తిలో వాటా ఉండదనే అభిప్రాయాలుంటాయి. ఎలాగో పెళ్లి అయిపోయింది కదా ఆమె భర్త, మామలకు చెందిన ఆస్తులపైనే తనకు హక్కులుంటాయనే వాదనలున్నాయి. కానీ హిందూ వారసత్వ చట్టం 1956ను 2005లో సవరించకముందు వరకు ఇదే తంతు ఉండేది. కానీ ఇలాంటి అంశాలపై స్పష్టత ఇచ్చేలా ఆ చట్టాన్ని సవరించారు. అయితే ఇప్పటికీ చాలామందిలో దీనికి సంబంధించి అవగాహన ఉండకపోవచ్చు. సవరణ చట్టంలోని కుమార్తె ఆస్తి హక్కుల గురించి కింద తెలియజేశాం.2005లో ఈ చట్టం సవరణకు ముందు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కుమారులకు మాత్రమే ఉండేది. కుమార్తెలు కుటుంబంలో భాగమైనప్పటికీ సహ-భాగస్వాములుగా(ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు ఉన్న హిందూ ఉమ్మడి కుటుంబానికి చెందిన సభ్యులు) గుర్తించబడలేదు. అయితే, హిందూ వారసత్వ (సవరణ) చట్టం 2005 వివాహిత కుమార్తెలకు కుమారులతో సమానమైన హక్కులను ఇచ్చింది. అంటే వివాహమైన కుమార్తెలకు వారి వైవాహిక స్థితితో సంబంధం లేకుండా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుంది. ఈ మార్పు సవరణ తర్వాత జన్మించిన ఆడపిల్లలకే కాకుండా 2005కు ముందు జన్మించిన వారికి కూడా రెట్రోస్పెక్టివ్ హక్కులను కల్పిస్తుంది.తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?తల్లి సొంతంగా సంపాదించిన ఆస్తిని కాస్త భిన్నంగా పరిగణిస్తారు. తల్లి అకాల మరణం చెందితే (వీలునామా లేకుండా) ఆమె ఆస్తిని చట్టబద్ధమైన వారసులకు సమానంగా పంచాలి. ఇందులో కుమారులు, కుమార్తెలు పరిస్థితిని బట్టి కొన్నిసార్లు భర్త కూడా ఉంటారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం వివాహిత కుమార్తెలను క్లాస్ 1 వారసులుగా పరిగణిస్తారు. అంటే వారు తమ తల్లి ఆస్తిని వారసత్వంగా పొందడానికి సమాన హక్కు కలిగి ఉంటారు. కుతురుకు వివాహం అయినా తల్లి ఆస్తిలో కుమారులతో సమానంగా వాటా ఉంటుంది.అపోహలుసాధారణంగా వివాహం తర్వాత కుమార్తెకు తమ పూర్వీకుల ఆస్తిపై హక్కు రద్దు అవుతుందని అనుకుంటారు. కుమార్తెలు తమ తండ్రులు లేదా తాతలు వారసత్వంగా పొందిన ఆస్తిలో వాటాను పొందలేరని భావిస్తారు. అయితే హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ ప్రకారం దీని అమలుకు ముందు వివాహం చేసుకున్నప్పటికీ, పూర్వీకుల ఆస్తిపై కుమార్తెలకు సమాన హక్కు ఉందని స్పష్టం చేస్తుంది.ఆస్తి వివరాల్లో స్పష్టత వచ్చిన తర్వాత దాని హక్కులను, వారసత్వాన్ని క్లెయిమ్ చేయడంలో కొన్ని దశలు ఉంటాయి. ఇందులోని న్యాయ ప్రక్రియను అర్థం చేసుకోవడం, సజావుగా క్లెయిమ్ చేయడం చాలా అవసరం.మ్యుటేషన్ ప్రక్రియఆస్తి హక్కును నిర్ధారించడంలో మొదటి దశ ఆస్తి రికార్డుల మ్యుటేషన్. కొత్త యజమానులను (కుమార్తెలతో సహా) ప్రతిబింబించేలా భూ రికార్డులను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మ్యుటేషన్ దరఖాస్తును స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సమర్పించవచ్చు.వారసత్వ ధ్రువీకరణ పత్రంబ్యాంకు ఖాతాలు లేదా బీమా పాలసీలు వంటి మృతుడి ఆస్తి చరాస్తులుగా ఉన్న సందర్భాల్లో వారసత్వ ధ్రువీకరణ పత్రం అవసరం కావచ్చు. మృతుడి ఆస్తిపై వారసుల హక్కు ఉందని పేర్కొంటూ సివిల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు.సివిల్ కోర్టువివాదం కేసుల్లో లేదా కుటుంబ సభ్యులు కుమార్తె వాటాను అంగీకరించడానికి నిరాకరిస్తే కేసును సివిల్ కోర్టుకు తీసుకెళ్లవచ్చు. ఆస్తిలో న్యాయమైన వాటాను పొందడానికి హిందూ వారసత్వ చట్టం నిబంధనల ప్రకారం చట్టపరమైన దావా వేయవచ్చు.ఇదీ చదవండి: మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక -
మోసపూరిత పథకాల పట్ల జాగ్రత్త: సెబీ హెచ్చరిక
మోసపూరిత ట్రేడింగ్ పథకాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా (ఎఫ్పీఐలు) స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం కలి్పస్తామంటూ సోషల్ మీడియా సందేశాలు, మొబైల్ అప్లికేషన్లపై చేసే ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ తరహా పథకాలు చట్టవిరుద్ధమైనవంటూ.. వీటికి సెబీ ఆమోదం లేనట్టు స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఇతర యాప్లపై ఎఫ్పీఐల రూపంలో పెట్టుబడుల అవకాశాలు కల్సిస్తామన్న మోసపూరిత పథకాలకు దూరంగా ఉండాలని కోరింది. ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ఖాతాలు, తక్కువ ధరలకే ఐపీవోలు, ఐపీవోల్లో కచ్చితమైన కేటాయింపులు అంటూ తప్పుదోవ పట్టించే క్లెయిమ్లను నమ్మొద్దని సూచించింది. భారత్లో నివసించే పౌరులకు ఎఫ్పీఐ పెట్టుబడుల మార్గం అందుబాటులో ఉండదని గుర్తు చేసింది. ఆయా సంస్థలకు రిజిస్ట్రేషన్ ఉందా? లేదా అన్నది సెబీ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చని తెలిపింది. -
ద్రవ్యోల్బణాన్నే టార్గెట్ చేయాలా?
ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకోవాలా లేక వృద్ధికి ఊతమిచ్చేలా ఏవైనా కొత్త ప్రమాణాలను పరిశీలించాలా అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఒక చర్చాపత్రాన్ని రూపొందించింది. ఇందులో నాలుగు ప్రశ్నలు పొందుపర్చింది.ఇదీ చదవండి: ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!ఆహార, రిటైల్ ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్న పరిస్థితుల్లో మానిటరీ పాలసీకి రిటైల్ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకోవాలా? 4 శాతం ద్రవ్యోల్బణం టార్గెట్ వేగంగా ఎదుగుతున్న భారత్లాంటి దేశంలో స్థిరత్వం, వృద్ధికి మధ్య సమతౌల్యత సాధించేందుకు 4 శాతం ద్రవ్యోల్బణం టార్గెట్ సరైనదేనా? ద్రవ్యోల్బణ శ్రేణిని సవరించాలా? ద్రవ్యోల్బణ లక్ష్య స్థాయిని తొలగించి, కేవలం శ్రేణిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలా? అనే ప్రశ్నలు వీటిలో ఉన్నాయి. వీటిపై సెప్టెంబర్ 18లోగా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. -
లార్డ్ స్వరాజ్పాల్ కన్నుమూత
లండన్/న్యూఢిల్లీ: ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్లో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. స్వరాజ్పాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన దానశీలిగా ఆయన్ను అభివరి్ణంచారు. బ్రిటన్–భారత్ సంబంధాలను బలోపేతం చేసేందుకు స్వరాజ్ పాల్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. వ్యాపార దిగ్గజం, దానశీలి, అంతర్జాతీయంగా ప్రవాస భారతీయులకు ఆయనొక ఐకాన్ అని తెలిపారు. 1966లో కుమార్తె చికిత్స కోసం బ్రిటన్ వెళ్లిన లార్డ్ పాల్ ఆ తర్వాత అక్కడే అంతర్జాతీయ సంస్థ కపారో గ్రూప్ను నెలకొల్పారు. ఉక్కు, ఇంజినీరింగ్, ప్రాపర్టీ తదితర రంగాల్లో దిగ్గజంగా తీర్చిదిద్దారు. బ్రిటన్లో అత్యంత సంపన్న ఏషియన్గా ఎదిగారు. దశాబ్దాల పాటు వ్యాపార, రాజకీయ రంగాల్లో కీలకంగా నిల్చారు. -
భారత్లో ఓపెన్ ఏఐ కార్యాలయం
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ ఈ ఏడాది భారత్లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. న్యూఢిల్లీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే స్థానికంగా నియామకాలు కూడా ప్రారంభించినట్లు వివరించింది. చాట్జీపీటీకి అమెరికా తర్వాత భారత్ రెండో అతి పెద్ద మార్కెట్గా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో కార్యాలయం తెరవడం వల్ల ఇక్కడి యూజర్లకు మరింత మెరుగైన సరీ్వసులు అందించేందుకు వీలవుతుందని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్ తెలిపారు. స్థానిక భాగస్వాములు, ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, డెవలపర్లు, విద్యా సంస్థలతో కలిసి పని చేయడంపై స్థానిక సిబ్బంది దృష్టి పెడతారని వివరించారు. -
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో నిపుణుల కొరత
బీఎఫ్ఎస్ఐ రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) వేగంగా విస్తరిస్తుండడంతో నిపుణులకు తీవ్ర కొరత నెలకొన్నట్టు క్వెస్కార్ప్ తెలిపింది. అంతేకాదు, నైపుణ్యాల్లో అంతరంతోపాటు మానవ వనరులపై అధిక వ్యయాలు చేయాల్సి వస్తున్నట్టు తెలిపింది. భారత్లో బీఎఫ్ఎస్ఐ జీసీసీల విలువ 2023లో 40–41 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2032 నాటికి 125–135 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఈ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) డేటా నిపుణులకు కొరత ఉందని.. నైపుణ్యాల్లోనూ 42 శాతం మేర అంతరం ఉన్నట్టు పేర్కొంది. దీంతో కంపెనీలు మానవ వనరుల పరంగా తమ వ్యూహాలను సమీక్షించుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశీయంగా బీఎఫ్ఎస్ఐ రంగానికి సంబంధించి 190 జీసీసీలు ఉండగా, ఇవి 5,40,000 మందికి ఉపాధి కలి్పస్తున్నట్టు వెల్లడించింది. కేవలం బ్యాంక్ ఆఫీస్లుగా కాకుండా, ఆవిష్కరణలకు కేంద్రాలుగా జీసీసీలు మారినట్టు తెలిపింది. టైర్–1 పట్టణాలు అధిక విలువ కలిగిన ఆవిష్కరణలకు కేంద్రాలుగా ఉన్నప్పటికీ.. టైర్–2 పట్టణాలు మెరుగైన వసతులు, తక్కువ వ్యయాలతో జీసీసీలకు ఆకర్షణీయంగా మారినట్టు పేర్కొంది. బీఎఫ్ఎస్ఐ జీసీసీ రంగం భవిష్యత్తు అన్నది.. అవి ఎంత వేగంగా ఆవిష్కరణలను అందించగలవన్న దానిపై ఆధారపడి ఉంటుందని వివరించింది. -
బీఎఫ్ఎస్ఐలో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు
ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్ఎస్ఐ) సేవలకు డిమాండ్ బలంగా పెరుగుతోంది. దీంతో ఈ రంగంలోని కంపెనీలు మెట్రోలకే పరిమితం కాకుండా టైర్ 2, 3 పట్టణాల్లోనూ (ద్వితీయ, తృతీయ శ్రేణి) తమ సేవలను విస్తరిస్తున్నట్టు మానవ వనరుల సేవలు అందించే అడెకో ఇండియా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.7% మేర ఈ రంగం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2030 నాటికి ఈ రంగంలో 2.5 లక్షల కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ రంగంలో కొత్త ఉద్యోగాల్లో 48% టైర్ 2, 3 పట్టణాల్లోనే ఉంటున్నట్టు వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నియామకాలు 27 శాతం పెరిగినట్టు తెలిపింది. స్థానిక భాషపై పట్టు, అమ్మకాల్లో అనుభవం కలిగిన వారు ఇతరులతో పోల్చితే 2.5 రెట్లు అధికంగా ఎంపికయ్యే అవకాశాలు కలిగి ఉన్నట్టు.. 10–15% అధిక వేత నం వీరికి లభిస్తున్నట్టు వెల్లడించింది. గృహ పొదుపులు సంప్రదాయ సాధనాల నుంచి మార్కె ట్ ఆధారిత సాధనాలైన మ్యూచువల్ ఫండ్స్, యులి ప్లు, పెన్షన్ ఉత్పత్తుల వైపు మళ్లుతుండడం బీఎఫ్ఎస్ఐ సేవలకు డిమాండ్ను పెంచుతున్నట్టు తెలిపింది. ఈ రంగాల వారికి డిమాండ్.. బ్యాంక్లు సేల్స్, రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్లు, డిజిటల్ ప్రొడక్ట్ మేనేజర్లు, క్రెడిట్ రిస్క్ అనలిస్టుల నియామకాలను పెంచినట్టు అడెకో ఇండియా నివేదిక వెల్లడించింది. బీమా సంస్థలు, సంపద నిర్వహణ సంస్థలు ఫైనాన్షియల్ అడ్వైజర్లు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, డిజిటల్ అండర్రైటర్లు, క్లెయిమ్స్ అటోమేషన్ స్పెషలిస్టుల నియామకాలకు ప్రాధాన్యం పెంచినట్టు తెలిపింది. ఇందోర్, కోయింబత్తూర్, నాగర్పూర్, గువహటిలో 15–18 శాతం, సూరత్, జైపూర్, లక్నో, భువనేశ్వర్ పట్టణాల్లో నియామకాలు 11–13 శాతం పెరిగినట్టు పేర్కొంది. సేవలకు డిమాండ్ పెరుగుతుండడంతో 78 శాతం బీమా కంపెనీలు అదనపు నైపుణ్యాల కల్పనపై దృష్టి సారించినట్టు తెలిపింది. ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడులపై అవగాహన అన్నది మెట్రోలకు వెలుపల కూడా విస్తరిస్తోందని.. దీంతో స్థానిక నిపుణులకు డిమాండ్ పెరుగుతున్నట్టు తెలిపింది. 100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా అడెకో ఇండియా ఈ వివరాలను విడుదల చేసింది. -
భారత్ – బ్రిటన్ మధ్య స్నేహ వారధి.. పాల్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం స్వరాజ్ పాల్ పంజాబ్లోని జలంధర్లో 1931 ఫిబ్రవరి 18న జన్మించారు. ఆయన తండ్రి ప్యారేలాల్ స్థానికంగా చిన్నపాటి ఉక్కు ఫౌండ్రీని నడిపేవారు. స్వరాజ్ పాల్ 1949లో పంజాబ్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో (ఎంఐటీ) మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. స్వదేశానికి తిరిగొచ్చాక కుటుంబ వ్యాపారమైన ఏపీజే సురేంద్ర గ్రూప్లో చేరారు. అయితే, ల్యూకేమియాతో బాధపడుతున్న కుమార్తె అంబికాకు మెరుగైన వైద్యచికిత్స కోసం 1966లో ఆయన బ్రిటన్కి వెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తూ నాలుగేళ్లకే కుమార్తె కన్ను మూయడంతో విషాదంలో మునిగిపోయిన పాల్.. ఆ తర్వాత ఆమె పేరిట అంబికా పాల్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్టును ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా బాలల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల కోసం మిలియన్ల కొద్దీ పౌండ్లను విరాళంగా ఇచ్చారు. 1968లో లండన్ ప్రధాన కేంద్రంగా కపారో గ్రూప్నకు స్వరాజ్ పాల్ శ్రీకారం చుట్టారు. తర్వాత రోజుల్లో అది బ్రిటన్లోనే అతి పెద్ద స్టీల్ కన్వర్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార దిగజాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం బ్రిటన్, భారత్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఏటా 1 బిలియన్ డాలర్ల ఆదాయంతో కార్యకలాపాలు సాగిస్తోంది. లెజెండ్.. లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) మృతిపై ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్–భారత్ మధ్య వారధిగా వ్యవహరించిన పాల్ తనకు స్ఫూర్తిప్రదాత అని కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు లార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. విద్య, వ్యాపారం, రాజకీయాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. వోల్వర్హ్యాంప్టన్ యూనివర్సిటీ చాన్సలర్గా వర్సిటీ అభివృద్ధిలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారని విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చెయిర్ ఏంజెలా స్పెన్స్ పేర్కొన్నారు. బ్రిటన్లోని అనేక మంది భారతీయులకు మార్గదర్శిగా నిల్చిన ‘లెజెండ్’ అని పాల్ను సన్ మార్క్ వ్యవస్థాపకుడు లార్డ్ రామీ రేంజర్ అభివర్ణించారు. భారత్–బ్రిటన్ను మరింత చేరువ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆయన చెరగని ముద్ర వేశారని లండన్లోని భారత హైకమిషన్ ప్రధాని మోదీ సోషల్ మీడియా వ్యాఖ్యలను రీపోస్ట్ చేసింది. ఆయన విదేశాల్లో భారత్కి గొంతుకగా నిల్చారని హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి.. భారత్–బ్రిటన్ మధ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా 1975లో ఇండో–బ్రిటీష్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన లార్డ్ పాల్ దానికి సుదీర్ఘకాలం చైర్మన్గా వ్యవహరించారు. పాల్ సేవలకు గుర్తింపుగా 1978లో బ్రిటన్ రాణి ఆయనకు నైట్హుడ్ ప్రదానం చేశారు. 1983లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ (Padma Bhushan) పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. పలు సంవత్సరాలుగా బ్రిటన్లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. 2 బిలియన్ పౌండ్ల సంపదతో ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్లో ఆయన 81వ స్థానంలో నిల్చారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోతున్నప్పటికీ ఇటీవలి వరకు ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్కి తప్పకుండా హాజరయ్యారు. 2008లో హౌస్ ఆఫ్ లార్డ్స్ డిప్యుటీ స్పీకర్గా పాల్ వ్యవహరించారు. తద్వారా భారత నేపథ్యంతో, ఆ బాధ్యత చేపట్టిన తొలి వ్యక్తిగా ఘనత సాధించారు. 2000 నుంచి 2005 వరకు ఇండియా–యూకే రౌండ్ టేబుల్కి కో–చెయిర్గా వ్యవహరించారు. 2009లో బ్రిటన్ మోనార్క్కి సలహా మండలి అయిన ప్రీవీ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. మరోవైపు, వ్యక్తిగత జీవితంలో ఆయన్ను విషాదాలు వెన్నాడాయి. 2015లో కపారో గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్న కుమారుడు అంగద్ పాల్, 2022లో ఆయన భార్య అరుణ మరణించారు. దీనితో వారి స్మారకార్థం తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన మరింత సంపద, సమయం వెచ్చించారు. భార్య మరణానంతరం అంబికా పాల్ ఫౌండేషన్ పేరును అరుణ అండ్ అంబికా పాల్ ఫౌండేషన్గా మార్చారు. 2023 ఫిబ్రవరిలో లండన్లోని చారిత్రక ఇండియన్ జింఖానా క్లబ్లో లేడీ అరుణ స్వరాజ్ పాల్ హాల్ని ప్రారంభించారు. -
అంతర్జాతీయ స్థాయికి భారత ఆతిథ్యం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత జీఎస్టీ శ్లాబుల హేతుబద్దీకరణతో భారత ఆతిథ్య రంగం అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యాలను సంతరించుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 5 శాతం పన్ను రేటును ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం సేవలకు ప్రభుత్వం కల్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాయి. పన్నుల భారాన్ని తగ్గించేందుకు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను తీసుకురానున్నట్టు స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనను హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) స్వాగతించింది. అంతర్జాతీయంగా పర్యాటకులకు చిరునామాగా భారత్ మారేందుకు జీఎస్టీలో సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇతర దేశాలతో పోల్చితే భారత ఆతిథ్య పరిశ్రమ ఆకర్షణీయంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు, 2047 నాటికి ఏటా 10 కోట్ల మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించాలన్న లక్ష్య సాధనకు ఉపకరిస్తుందని పేర్కొంది. భారత్లో టారిఫ్లు (పన్ను రేట్లు) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్న అభిప్రాయాన్ని హెచ్ఏఐ ప్రెసిడెంట్ కేబీ కచ్రు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా టాప్–5 పర్యాటక గమ్యస్థానాల్లో భారత్ను కూడా చేర్చాలంటే దేశ పోటీతత్వాన్ని పెంచాల్సి ఉందన్నారు. హోటళ్లపై 18 శాతం కారణంగా జీఎస్టీతో గదుల రేట్లు అధికంగా ఉంటున్నాయని.. దీంతో అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి ఉన్నట్టు వివరించారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.. ‘‘ప్రస్తుతం హోటళ్లలో రూ.7,500 వరకు గదుల అద్దెపై 12 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. ఇది 6–7 ఏళ్ల క్రితం నిర్ణయించిన రేటు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని రూ.15,000కు పెంచాలి. ఇలా చేయడం వల్ల పర్యాటకులకు గదుల ధరలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం మీద పరిశ్రమ పోటీతత్వం పెరుగుతుంది’’అని హెచ్ఏఐ సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక సేవలపై ఏక రూప 5 శాతం పన్ను రేటును, ఐటీసీ సదుపాయంతో అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్టు పేర్కొంది. ఇలా చేస్తే నిబంధనల అమలు భారం తగ్గుతుందని, వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, మరిన్ని పెట్టుబడులు వచ్చి ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. -
మహిళా ఇన్వెస్టర్లపై సెబీ స్పెషల్ ఫోకస్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచడంపై సెబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా మొదటిసారి పెట్టుబడులు పెట్టే మహిళలకు ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికతో ఉన్నట్టు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే ప్రకటించారు. మహిళల సమాన ప్రాతినిధ్యం లేకుండా ఆర్థిక సమ్మిళితత్వం అసంపూర్ణంగా ఉండిపోతుందన్నారు. అందుకని వారికి పంపిణీ పరమైన ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాండే మాట్లాడారు. టాప్ 30కి (బీ30) వెలుపలి పట్టణాల్లో పంపిణీదారులకు రాయితీలు కలి్పంచాలన్న ఇటీవలి ప్రతిపాదనను ప్రస్తావించారు. ఈ చర్యలతో కొత్త పెట్టుబడిదారులను భాగస్వాములను చేయొచ్చని, మరింత మందికి మ్యూచువల్ ఫండ్స్ సేవలను చేరువ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. -
CLFMA సమావేశం: ప్రముఖుల హాజరు
హైదరాబాద్: ది కాంపౌండ్ లైవ్స్టాక్ ఫీడ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CLFMA) తన 58వ వార్షిక సాధారణ సమావేశం& 66వ జాతీయ సింపోజియంను 2025 ఆగస్టు 22, 23వ తేదీలలో హైదరాబాద్, బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్లో నిర్వహించనుంది.“భారతదేశంలో పశువుల వ్యవసాయం - భవిష్యత్ మార్గం” అనే ఇతివృత్తంతో రెండు జరిగే ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు హాజరుకానున్నారు. భారతదేశంలోని పశువుల, పాడి, పౌల్ట్రీ, ఆక్వాకల్చర్ భవిష్యత్తుపై చర్చించనున్నారు.ఈ కార్యక్రమానికి ముందు CLFMA ఆఫ్ ఇండియా ఛైర్మన్, దివ్య కుమార్ గులాటి మాట్లాడుతూ.. భారతదేశం పాడి పరిశ్రమల రంగం చాలా అభివృద్ధి చెందుతోంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకు కూడా దోహదపడుతోంది. భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి చెందుతుంది. బలమైన విధానాలు, మరింత శక్తివంతమైన కోల్డ్-చైన్ మౌలిక సదుపాయాలు, వేగవంతమైన ఆవిష్కరణలతో, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఎదగడానికి సిద్ధమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక & పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్. పి. సింగ్ బఘేల్ కూడా మాట్లాడారు.ఏజీఎం & సింపోజియం.. భారతదేశ పశువుల, పాడి, పౌల్ట్రీ, ఆక్వాకల్చర్ రంగాల కోసం ఒక సామూహిక రోడ్మ్యాప్ను రూపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి మాత్రమే కాకుండా దేశాన్ని ఒక గ్లోబల్ లీడర్గా నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. -
'తప్పుడు ప్రచారం చేస్తున్నారు': నితిన్ గడ్కరీ
20 శాతం ఇథనాల్ను పెట్రోల్తో కలపడం వల్ల ఇంజిన్ల పనితీరు తగ్గిపోతుందని వార్తలు వస్తున్న వేళ.. అవన్నీ పూర్తిగా అబద్ధం అని 'నితిన్ గడ్కరీ' తోసిపుచ్చారు. 'పెట్రోలియం లాబీ' ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.ఇథనాల్ ఉపయోగించడం వల్ల.. ఇంజిన్ల పర్ఫామెన్స్ తగ్గిపోతుందనేది అబద్దం. మేము దీనిని నిరూపించడానికి ప్రస్తుతం పాత కార్లపైన ట్రయల్స్ నిర్వహించామని గడ్కరీ అన్నారు. సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందా? అని కూడా పరిశీలించాము. పెట్రోలియం లాబీలో కొంతమంది తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. బ్రెజిల్లో వారు 27 శాతం బ్లెండింగ్ చేస్తారు. అక్కడ ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన అన్నారు.20 శాతం ఇథనాల్ ఉపయోగించడం వల్ల ఉద్గారాలు తగ్గడమే కాకుండా.. పెట్రోల్ దిగుమతి కూడా తగ్గుతుంది. ఇథనాల్ శుభ్రమైన ఇంధనం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుంది. రైతులకు సహాయపడుతుందని నితిన్ గడ్కరీ అన్నారు.భారతదేశంలో ఇథనాల్ అనేది ఎక్కువగా చెరకు మొలాసిస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న, బియ్యం, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వనరులను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్లలో మొక్కజొన్న ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతుందని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: రూ. 24తో ఐటీఆర్ ఫైలింగ్.. జియోఫైనాన్స్ బంపరాఫర్బ్లెండింగ్ కార్యక్రమం గురించి ఆందోళనలు ఉన్నాయి, ఇది వాహన పనితీరు.. మన్నికను ప్రభావితం చేస్తుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్తో ఇథనాల్ కలపడం వల్ల ఇంధన సామర్థ్యం తగ్గుతుందని.. దాని తుప్పు పట్టే లక్షణాలు ఇంధన వ్యవస్థలను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. అంతే కాకుండా బ్లెండింగ్ కార్యక్రమం ఆహార పంటలను పండించే రైతులను కూడా పక్కదారి పట్టిస్తుంది. -
రూ. 24తో ఐటీఆర్ ఫైలింగ్.. జియోఫైనాన్స్ బంపరాఫర్
2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో, జియోఫైనాన్స్ ఓ సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ. 24తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.వ్యక్తిగత పన్ను చెల్లించేవారు.. ఇప్పుడు రూ.24 ప్లాన్తోనే ఐటీ రిటర్న్ దాఖలు చేయవచ్చు. దీనికోసం కంపెనీ జియో ఫైనాన్ యాప్ ద్వారా.. కొత్త ట్యాక్స్ ప్లానింగ్, ఫైలింగ్ ఫీచర్ వంటివి వాటిని తీసుకొచ్చింది. ట్యాక్స్ పేయర్లు.. ఈ యాప్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే, కొన్ని మినహాయింపులు కూడా పొందవచ్చని సమాచారం.కేవలం రూ. 24 ప్లాన్ ద్వారా అందరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చా? అనేది చాలామందికి తలెత్తిని ప్రశ్న. ఇది రూ. 5 లక్షల వరకు ఆదాయం.. ఒకే ఫారం-16 ఉన్న జీతం పొందే వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుందని జియో ఫైనాన్స్ స్పష్టం చేసింది. ఇందులో ట్యాక్స్ పేయర్ స్వయంగా ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే బిజినెస్ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్, విదేశీ పెట్టుబడులు వంటి కాంప్లెక్స్ ట్యాక్సులు ఉన్నవారికి ఈ రూ. 24ప్లాన్ పనిచేయదు. దీనికోసం నిపుణుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారికోసం జియో ఫైనాన్స్ రూ. 999 ప్లాన్ అందిస్తోంది.ఇతర ప్లాట్ఫామ్లలో బేస్ ప్లాన్ ధరలు➤టాక్స్2విన్: బేసిక్ ప్లాన్ రూ.49, సీఏ సహాయంతో రూ. 1,274 నుంచి రూ. 7,968➤మైట్రీటర్న్: సెల్ఫ్-ఫైలింగ్ రూ.199, సీఏ సహాయంతో రూ.1,000 నుంచి రూ. 6,000➤టాక్స్ మేనేజర్: రూ. 500 నుంచి ప్రారంభమవుతుంది, సీఏ సహాయంతో రూ. 5,000 వరకు➤క్లియర్ టాక్స్: బేసిక్ రూ. 2,540, లక్స్ అడ్వైజరీ ప్లాన్ రూ. 25,000➤టాక్స్బడ్డీ (డైరెక్ట్): సెల్ఫ్-ఫైలింగ్ రూ. 699, కాంప్లెక్స్ ఫైలింగ్స్ రూ. 2,999ఇదీ చదవండి: స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్: సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలాపైన పేర్కొన్న ధరలతో పోలిస్తే.. జియో ఫైనాన్స్ అందించే రూ. 24 ప్లాన్ చాలా తక్కువ అని స్పష్టమవుతుంది. అయితే ట్యాక్స్ పేయర్లు ధరను మాత్రమే చూడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చౌక ప్లన్స్ సాధారణంగా ప్రొఫెషనల్ మార్గదర్శకత్వాన్ని అందించవు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. ప్లాన్స్ ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. -
సరికొత్త హెచ్పీ గేమింగ్ ల్యాప్టాప్: ధర & వివరాలు
భారతదేశంలో హెచ్పీ ఒమెన్ 16ను లాంచ్ చేస్తూ తన గేమింగ్ ల్యాప్టాప్ లైనప్ను విస్తరించింది. ఈ లేటెస్ట్ ఏఐ గేమింగ్ ల్యాప్టాప్ ఎన్వీడియా గెఫోర్స్ 12జీబీ ఆర్టీఎక్స్తో జత చేసిన.. ఐటెల్ కోర్ అల్ట్రా లేదా ఏఎండీ రైజిన్ ఏఐ ప్రాసెసర్ను పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.1,29,999.హెచ్పీ ఒమెన్ 16 గేమింగ్ ల్యాప్టాప్ ఇప్పుడు ఆన్లైన్ స్టోర్, హెచ్పీ వరల్డ్, అమెజాన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఇది 6 సెల్ 83 వాట్స్ బ్యాటరీ కలిగి ఫాస్ట్ ఛార్జ్కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీనిని 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ప్రత్యేకించి గేమింగ్కు చాలా అనుకూలంగా ఉంటుంది.హార్డ్వేర్ విషయానికొస్తే.. ఈ ల్యాప్టాప్ 16 ఇంచెస్ క్యూహెచ్డీ (2560 × 1600) డిస్ప్లేను పొందింది. ఇది 500 నైట్స్ బ్రైట్నెస్ను పొందుతుంది. ఇది 100 శాతం 100 శాతం sRGB కలర్ కవరేజ్.. బ్లూ లైట్ ఎక్స్పోజర్ను తగ్గించడానికి ఐసేఫ్ సర్టిఫికేషన్ను కలిగి ఉంది. అంతే కాకుండా థర్మల్ డిజైన్లో టెంపెస్ట్ కూలింగ్, ఫ్యాన్ గ్యాప్లు, హీట్ ఫేజ్ రీడిస్ట్రిబ్యూషన్ కూడా ఇందులో ఉన్నాయి. -
గేమ్ ఓవర్: ఈ ఆన్లైన్ గేమ్స్ అన్నీ బంద్
ఆన్లైన్ గేమ్లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడంతో.. పార్లమెంటు దీనిపై కీలక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత.. డ్రీమ్11, విన్జోతో సహా అనేక గేమింగ్ ప్లాట్ఫామ్లు తమ కార్యకలాపాలను నిలిపివేసాయి.పోకర్బాజీని నిర్వహిస్తున్న దాని అనుబంధ సంస్థ మూన్షైన్ టెక్నాలజీస్ ఆన్లైన్ గేమ్లను అందించడం ఆపివేసిందని నజారా టెక్ శుక్రవారం తెలిపింది. ఈ జాబితాలో విన్జో, మొబైల్ ప్రీమియర్ లీగ్, జూపీ కూడా ఉన్నాయి. డ్రీమ్ 11లో కూడా క్యాష్ గేమ్లను నిలిపివేసింది.బెంగళూరుకు చెందిన గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న ప్రముఖ రమ్మీ ప్లాట్ఫామ్.. రమ్మీకల్చర్ భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలో ఒపీనియన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ప్రోబో అడుగులు వేస్తూ తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏ23 రమ్మీ.. ఏ23 పోకర్లను నిర్వహించే హెడ్ డిజిటల్ వర్క్స్.. అన్ని ఆన్లైన్ మనీ గేమ్లను నిలిపివేసింది.ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..ఆన్లైన్ గేమ్లను నిషేధించే బిల్లును ఎవరైనా ఉల్లంగిస్తే.. మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా లేదా రెండూ కూడా విధించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. నిబంధనలను ఉల్లంఘించి ప్రకటనలు ఇచ్చేవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం కూడా ఈ నిబంధనల్లో ఉంది. -
అనన్య పాండే హోస్ట్గా 'ది స్టైల్ ఎడిట్': నలుగురికే అవకాశం!
బాలీవుడ్ నటి అనన్య పాండే న్యూఢిల్లీలో నాలుగు గంటల ఫ్యాషన్ అండ్ గ్లో-అప్ సెషన్ను నిర్వహించనున్నారు. 'ది స్టైల్ ఎడిట్' పేరుతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో.. సెలబ్రిటీ స్టైలిస్ట్ అమీ పటేల్, హెయిర్స్టైలిస్ట్ ఆంచల్ మోర్వానీ, మేకప్ ఆర్టిస్ట్ రిద్దిమా శర్మ, ఫోటోగ్రాఫర్ రాహుల్ ఝంగియాని వంటి ఆమె ప్రొఫెషనల్ బృందం ఉంటుంది. ఈ సెషన్ న్యూఢిల్లీలోని ఎయిర్బీఎన్బీ ప్రాపర్టీలో జరుగుతుంది. దీనికోసం బుకింగ్స్ 2025 ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యాయి.ది స్టైల్ ఎడిట్ కార్యక్రమంలో పాల్గొనాలకునేవారు.. ఆగస్టు 21, 2025న airbnb.com/ananyaలో భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల తరువాత బుక్ చేసుకోవచ్చు. దీనికోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ సెషన్కు నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇందులో పాల్గొనేవారే.. ఢిల్లీకి రావడానికి, తిరిగి వెళ్ళడానికి అయ్యే మొత్తం ఖర్చులను భరించుకోవాల్సి ఉంటుంది.నేను క్యూరేట్ చేసి హోస్ట్ చేసిన "అనన్యస్ స్టైల్ ఎడిట్" ద్వారా నా గ్లిట్జ్.. గ్లామర్ ప్రపంచంలోకి అతిథులను స్వాగతించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఒక నటిగా నా వ్యక్తిత్వంలో ఫ్యాషన్, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ అతిథులతో పంచుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని కోసం నేను వేచి ఉన్నాను, అని అనన్య పాండే అన్నారు.జెన్ జెడ్ కల్చర్ ఐకాన్ను అనన్య పాండేతో కలిసి పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన వ్యక్తులు హోస్ట్ చేసిన అసాధారణ అనుభవాలను దీని ద్వారా అందిస్తున్నాము. దీనికి అనన్య స్టైల్ ఎడిట్ ఒక ఉదాహరణ. ఈ సెషన్లో పాల్గొనేవారు మరపురాని అనుభవాలను పొందవచ్చు అని ఇండియా అండ్ ఆగ్నేయాసియా ఎయిర్బీఎన్బీ హెడ్ అమన్ప్రీత్ బజాజ్ అన్నారు. -
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 693.86 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 81,306.85 వద్ద, నిఫ్టీ 213.65 పాయింట్లు లేదా 0.85 శాతం నష్టంతో 24,870.10 వద్ద నిలిచాయి.కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం, చెంబాండ్ కెమికల్స్ లిమిటెడ్, ఏజెడ్ఎమ్ఓ లిమిటెడ్, ఫోసెకో ఇండియా, అపోలో మైక్రో సిస్టమ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, వండర్ ఎలక్ట్రికల్స్, ఫోర్స్ మోటార్స్, వింటా ల్యాబ్స్, డెవ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
విషాదకర ఘటన.. పొరపాటా, సాంకేతిక లోపమా?
తమిళనాడులో టాటా హారియర్ ఈవీ ఆటోపైలట్ మోడ్ వల్ల ఓ వ్యక్తి మృతి చెందాల్సి వచ్చిందనేలా సామాజిక మాధ్యామాల్లో వీడియో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా మృతుడి పొరపాటా.. లేదా కారులో సాంకేతిక లోపమా అనే స్పష్టమైన కారణాలు తెలియరాలేదని గమనించాలి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని వివరాల ప్రకారం.. ఆటో పైలట్ మోడ్ ఆన్ చేసిన ఓ వ్యక్తి మీదకు అదుపుతప్పి టాటా హారియర్ ఈవీ దూసుకుపోయింది. తమిళనాడులోని అవినాశిలో జరిగిన ఈ ఘటనలో బాధితుడి తలకు బలమైన గాయమైంది. డ్రైవర్ కారు డోర్ ఓపెన్ చేసి క్యాబిన్లోకి అడుగు పెట్టకముందే అప్పటికే ఎత్తుపై ఉన్న హ్యారియర్ ఒక్కసారిగా వంపులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అదుపు తప్పి కింద పడిన ఆ వ్యక్తిపైకి కారు టైర్ ఎక్కేసింది. ఈ సంఘటనలో అతడి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.అయితే టాటా మోటార్స్పై కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఈ ప్రమాదానికి స్పష్టమైన కారణం అయితే తెలియరాలేదు. ఇది సాంకేతిక లోపమా? మానవ తప్పిదమా? లేదా బాహ్య కారకాల వల్ల సంభవించిందా అనేది ధ్రువీకరించాల్సి ఉందని గమనించాలి. టాటా మోటార్స్ ప్రకటనఈ ఘటనపై టాటా మోటార్స్ ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని పేర్కొంది. మృతుడి కుటుంబానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వాస్తవాలను సేకరిస్తున్నట్లు చెప్పింది. వీడియోలోని దశ్యాల ప్రకారం వాలుగా ఉండడంవల్లే వాహనం కిందకు వచ్చి ఉంటుందని పేర్కొంది.సమన్ మోడ్కిక్కిరిసిన పార్కింగ్ స్థలాల కోసం డిజైన్ చేయబడిన కీని ఉపయోగించి రిమోట్గా కారు ముందుకు కదలడానికి లేదా రివర్స్ చేయడానికి అనుమతించే సెమీ అటానమస్ ఫీచర్. జూన్ 2025లో హారియర్ ఈవీతో ప్రవేశపెట్టిన టాటా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) సూట్లో ఇది భాగం. ఇదిలాఉండగా, ఇలాంటి ఫీచర్లను అమలు చేయడానికి ముందు కఠినమైన నిబంధనలు, యూజర్ ఎడ్యుకేషన్, రియల్ వరల్డ్ టెస్టింగ్ చేయాలని నిపుణులు కోరుతున్నారు. -
9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..
బంగారం అంటేనే అందరికీ 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ లేదా 18 క్యారెట్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ 9K లేదా 9 క్యారెట్ గోల్డ్ ఒకటి ఉందని, దీని ధర చాలా తక్కువ ఉంటుందని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో 9 క్యారెట్స్ గోల్డ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.బంగారం పట్ల భారతీయులకు మక్కువ ఎక్కువ, అయితే 24 క్యారెట్స్ లేదా 22 క్యారెట్స్ గోల్డ్ కొనాలంటే చాలా డబ్బు వెచ్చించాలి. కానీ 9 క్యారెట్స్ గోల్డ్ కొనాలంటే మాత్రం అంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ఈ 9 క్యారెట్స్ బంగారానికి కూడా హాల్మార్కింగ్ ఉండాలని.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) స్పష్టం చేసింది.2025 ఆగస్టు నాటికి హాల్మార్క్ ప్యూరిటీల జాబితాలో 14 క్యారెట్స్, 18 క్యారెట్స్, 20 క్యారెట్స్, 22 క్యారెట్స్, 23 క్యారెట్స్, 24 క్యారెట్స్ మాత్రమే ఉండేవి. ఇటీవల 9 క్యారెట్స్ గోల్డ్ కూడా జాబితాలో చేరింది.24 క్యారెట్స్.. 9 క్యారెట్స్ బంగారం మధ్య వ్యత్యాసం24 క్యారెట్స్ బంగారం అనేది.. 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం అన్నమాట. అంటే ఇందులో దాదాపుగా ఇతర లోహాలు ఉండవు. అయితే 9 క్యారెట్స్ బంగారంలో 37.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 62.5 శాతం.. రాగి, వెండి లేదా జింక్ వంటి మిశ్రమ లోహాలతో కూడి ఉంటుంది.9 క్యారెట్స్ బంగారం ఎందుకు?అధిక క్యారెట్ల బంగారం ధర చాలా ఎక్కువ. కాబట్టి ఎక్కువ మంది వినియోగదారులు.. ముఖ్యంగా యువకులు లేదా గ్రామీణ ప్రజలు దీనికోసం అంత డబ్బు కేటాయించలేరు. అలాంటి వారు ఈ 9 క్యారెట్స్ గోల్డ్ కొనడానికి ఇష్టపడతారు. దీనికి హాల్మార్క్ కూడా ఉండటం వల్ల ఎలాంటి మోసాలకు గురికాకుండా ఉంటారు.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?9 క్యారెట్స్ vs 24 క్యారెట్స్ గోల్డ్ ధరలుఒక గ్రామ్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 10,000 కంటే ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే.. 10 గ్రాముల కోసం రూ. లక్ష కంటే ఎక్కువ కేటాయించాలి. అయితే ఒక గ్రామ్ 9 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 3,700 ఉంటుంది. ఈ బంగారాన్ని 10 గ్రాములు కొనాలంటే రూ. 37,000 పెట్టుబడి సరిపోతుంది. -
ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీ ఫోన్ వచ్చేస్తోంది..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ రియల్మీ తన రాబోయే స్మార్ట్ఫో న్ లాంచ్ తేదీని టీజ్ చేసింది. బ్యాటరీ విషయంలో ఇది "పెద్ద" డీల్ అంటూ ఊరిస్తోంది. దీని పేరును ఇంకా వెల్లడించనప్పటికీ, కొత్త రియల్మీ డివైస్ 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కలిగి ఉంటుందని కంపెనీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్లో టీజ్ చేసింది."ఇంత పెద్దది సరిపోతుందా? ఇదిగో రియల్మీ 1x000mAh - మరోసారి పరిమితులను చెరిపేస్తుంది. ఆగస్టు 27న అద్భుతం చూడండి' అంటూ రియల్మీ పోస్ట్ చేసింది. "అతిపెద్దది మరింత పెద్దదిగా మారింది. రియల్మీ మరోసారి పరిమితులను పునర్నిర్వచించనుంది. 320వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ నుంచి 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వరకు... తర్వాత ఏం జరగబోతోంది?" అని మరో ఎక్స్ పోస్ట్ లో పేర్కొంది.అంటే ఈ స్మార్ట్ ఫోన్ లో అధునాతన బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నాలజీ ఉండొచ్చని తెలుస్తోంది. రియల్మీ రాబోయే డివైజ్ 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని దాటుతుందా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రియల్మీలో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ ఉన్న స్మార్ట్ఫోన్ రియల్మీ జీటీ 7. చైనీస్ మోడల్లో ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్తో 7,200 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంది. అదే ఇండియన్ రియల్మీ జీటీ 7 వెర్షన్లో అయితే 120వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.THE BIGGEST JUST GOT EVEN BIGGER. 🔋realme Is Set To Redefine The Limits Once More.From 320W Fast Charging To A Massive 1x000mAh Battery…What’s Coming Next?August 27 — Get Ready For The Next Power Revolution.Know More: https://t.co/c8wHve6fZ2#FreeToBeReal… pic.twitter.com/SrctmwWzrg— realme (@realmeIndia) August 21, 2025 -
వీసీలు, పీఈలకు గేమింగ్ షాక్
న్యూఢిల్లీ: రియల్ మనీ గేమ్స్పై నిషేధం విధించడం గేమింగ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన పలు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు షాకింగ్ పరిణామంగా మారింది. దీనితో అవి భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టైగర్ గ్లోబల్, కలారి క్యాపిటల్, బేస్ పార్ట్నర్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. డ్రీమ్11, నజారా టెక్నాలజీస్, జూపీ, మొబైల్ ప్రీమియర్ లీగ్, గేమ్స్ 24్ఠ7 లాంటి అయిదు బడా గేమింగ్ కంపెనీలు, వెంచర్ ఫండ్స్ నుంచి దాదాపు 2.4 బిలియన్ డాలర్ల స్థాయిలో పెట్టుబడులు సమీకరించాయి. దేశీయంగా అతి పెద్ద ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫాంలలో ఒకటైన డ్రీమ్11లో టెన్సెంట్, కలారి క్యాపిటల్, అల్ఫా వేవ్ గ్లోబల్, థింక్ ఇన్వెస్ట్మెంట్స్ మొదలైనవి 2014 నుంచి దాదాపు 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. పరిశ్రమ వర్గాల డేటా ప్రకారం కలారీ క్యాపిటల్ 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని వాటాలను విక్రయించి పాక్షికంగా తప్పుకుంది. మరోవైపు, మొబైల్ ప్రీమియర్ లీగ్ దాదాపు 396 మిలియన్ డాలర్లు సమీకరించింది. పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్ టైమ్స్ ఇంటర్నెట్, గూగుల్ వెంచర్స్లాంటివి ఇన్వెస్ట్ చేశాయి. అటు నజారా టెక్నాలజీస్ 14 విడతల్లో 128 మిలియన్ డాలర్లు పెట్టుబడులు దక్కించుకుంది. వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, సెకోయా క్యాపిటల్, సీడ్ఫండ్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. గేమ్స్ 24్ఠ7 సంస్థ ఆరు విడతల్లో టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, రైన్, మలబార్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి 108 మిలియన్ డాలర్లు సమీకరించింది. జూపీలో వెస్ట్క్యాప్, జెడ్47, ఏజే క్యాపిటల్ పార్ట్నర్స్ తదితర ఇన్వెస్టర్లు 122 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. పెయిడ్ గేమ్స్ నిలిపివేత.. కొత్త బిల్లుకు అనుగుణంగా తాము పెయిడ్ గేమ్స్ను నిలిపివేస్తున్నామని జూపీ తెలిపింది. అయితే, లూడో సుప్రీమ్, లూడో టర్బో, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, ట్రంప్ కార్డ్ మానియాలాంటి ఉచిత గేమ్స్ అందుబాటులో ఉంటాయని వివరించింది. ఇక ఎంపీఎల్, విన్జో, నజారా టెక్నాలజీస్ ఇన్వెస్ట్ చేసిన మూన్షైన్ టెక్నాలజీస్ (పోకర్బాజీ) కూడా రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు తెలిపాయి. మూన్షైన్ టెక్నాలజీస్లో నజారా టెక్నాలజీస్కి 46.07 శాతం వాటాలు ఉన్నాయి. విన్జో పోర్ట్ఫోలియోలో రమ్మీ, సాలిటైర్, ఫ్యాంటసీ క్రికెట్, పోకర్లాంటి 100 పైగా రియల్ మనీ గేమ్స్ ఉన్నాయి. ఎంపీఎల్కి ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలో 12 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ యూజర్లలో భారత్కి దాదాపు 20 శాతం, గ్లోబల్ గేమింగ్ యాప్ డౌన్లోడ్స్లో 15.1 శాతం వాటా ఉంది. మన దేశంలో 1,800 పైగా గేమింగ్ స్టార్టప్లు ఉన్నాయి. ఇక, రియల్ మనీ గేమ్స్ నిలిపివేతతో నజారా టెక్నాలజీస్ షేరు వరుసగా మూడు రోజుల్లో దాదాపు 18 శాతం పతనమైంది. శుక్రవారం నాడు గేమింగ్, హాస్పిటాలిటీ సంస్థ డెల్టా కార్ప్ 3.50 శాతం, ఆన్మొబైల్ గ్లోబల్ దాదాపు 3 శాతం క్షీణించాయి. ఐపీఎల్పైనా ఎఫెక్ట్.. రియల్ మనీ గేమింగ్స్పై నిషేధం అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పైనా భారీగా ప్రభావం చూపనుంది. డ్రీమ్11, మై11సర్కిల్లాంటి సంస్థలు ఐపీఎల్కి బడా స్పాన్సర్లుగా ఉండటమే ఇందుకు కారణం. 2025 ఐపీఎల్కి వచి్చన మొత్తం ప్రకటనల ఆదాయంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ స్పాన్సర్లు వాటా సుమారు రూ. 2,000 కోట్లు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డిజిటల్ అడ్వరై్టజింగ్పై గేమింగ్ కంపెనీలు అత్యధికంగా ఖర్చు చేస్తుంటాయి కనుక ఐపీఎల్తో పాటు ఇతరత్రా ఆటల ప్రసార హక్కులకు పలికే రేటుపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. ఆన్లైన్ గేమింగ్పై నిషేధంతో అడ్వర్టైజింగ్ పరిశ్రమ ఆదాయంపై సుమారు 10–15 శాతం ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఆందోళనలో పరిశ్రమ.. స్కిల్ గేమ్స్కి రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నప్పటికీ గేమింగ్ మీద నిషేధం విధించడం ఆశ్చర్యకరమని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం సరికాదని డ్రీమ్11 వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఫ్యాంటసీ స్పోర్ట్స్ పరిశ్రమ ప్రస్తుతం 1.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా 2030 నాటికి ఏకంగా 5.05 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు నెలకొన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డాయి. పెద్ద సంఖ్యలో దీనిపై ఆధారపడిన వారి ఉపాధి, స్పోర్ట్స్లో ఆవిష్కరణలు, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు నిషేధంతో విఘాతం కలుగుతుందని వివరించాయి. -
చేతిరాతకు ‘ఏఐ’ పవర్.. హైదరాబాద్ కంపెనీ సృష్టి
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, పుస్తకాలన్నీ డిజిటలైజ్ అయిపోతున్నా ఇప్పటికీ చాలా మంది పెన్నూ పేపర్ ఉపయోగించి చేత్తో రాయడాన్ని ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే కాగితాన్ని డిజిటల్తో కలిపే ఏఐ స్మార్ట్ నోట్బుక్ను అందుబాటులోకి తీసుకువచ్చింది హైదరాబాద్కు చెందిన స్టార్టప్.టెకీ నుంచి ఎంట్రప్రెన్యూర్గా మారిన సుమన్ బాలబొమ్మ అభివృద్ధి చేసిన రీనోట్ ఏఐ నోట్బుక్ (ReNote AI Notebook) దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత నోట్బుక్గా గుర్తింపు పొందింది. ఇది సాధారణ కాగితపై రాయడం అనుభూతిని అందిస్తూ, ఆ చేతిరాతను డిజిటల్ టెక్స్ట్గా మార్చే ప్రత్యేకమైన సాంకేతికతను కలిగి ఉంది.ఎన్నో ఫీచర్లుఈ నోట్బుక్లో నీటికి తడిసిపోని, చిరిగిపోని, రీ యూజబుల్ పేజీలు ఉంటాయి. పైలట్ ఫ్రిక్సియాన్ (Pilot Frixion) పెన్నుతో వీటిన రాసిన నోట్స్ను తుడిచేయవచ్చు. రీనోట్ ఏఐ మొబైల్ యాప్ ద్వారా చేతిరాతను డిజిటల్ టెక్స్ట్గా మార్చడం, సారాంశాలు తయారు చేయడం, తెలుగు సహా అనేక భాషల్లో అనువాదం, వాయిస్ ఆధారిత శోధన, చిత్రంగా మార్చే స్కెచ్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వ టీ-హబ్ ప్రోత్సాహంతో ఏర్పాటైన ఈ స్టార్టప్ జీఐటెక్స్ దుబాయ్, ఒసాకా వరల్డ్ ఎక్స్పో, గిఫ్ట్స్ వరల్డ్ ఎక్స్పో న్యూఢిల్లీ వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో తమ రీనోట్ ఏఐ నోట్బుక్ను ప్రదర్శించింది. మైటీ, గూగుల్ వంటి సంస్థలు ఈ యాప్ను భారతదేశం లోని టాప్ 100 మొబైల్ యాప్స్ లో ఒకటిగా గుర్తించాయి.వ్యక్తిగత అనుభవాల నుంచి ప్రేరణతో ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన సుమన్ బాలబొమ్మ.. "చేతిరాతలో ఉన్న ఫోకస్, జ్ఞాపక శక్తిని కోల్పోకుండా, డిజిటల్ సౌలభ్యాన్ని కలిపే ప్రయత్నమే రీనోట్" అని చెబుతున్నారు. ఇలాంటి ఏఐ నోట్బుక్ను ‘ఎక్స్నోట్’ (XNote) అనే అమెరికా సంస్థ కూడా రూపొందించింది. -
ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!
ఏఐ(కృత్రిమ మేధ) గాడ్ఫాదర్గా పేరొందిన జెఫ్రీ హింటన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల టెక్ పరిశ్రమ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు చేశారు. నైతిక దూరదృష్టి లేకపోవడం, నియంత్రణలేని కృత్రిమ మేధ అభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. హింటన్ ఇటీవల ఫార్చ్యూన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీల సాంకేతిక ఆధిపత్యం కొనసాగుతున్న తరుణంలో దీర్ఘకాలిక శ్రేయస్సు మసకబారుతుందని చెప్పారు.స్వల్పకాలిక లాభాలే కీలకంసాంకేతిక పరిజ్ఞానానికి శక్తినిచ్చే ఏఐ అల్గారిథమ్లను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన హింటన్, ప్రస్తుతం టెక్ కంపెనీలు మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను నిర్మించడానికి పోటీ పడుతున్నాయని తెలిపారు. ఆ సమయంలో భవిష్యత్తులో నెలకొనే విస్తృత ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నైతికంగా ఏఐ అభివృద్ధి పట్ల నిబద్ధత కంటే ప్రధానంగా పోటీ ఒత్తిళ్లు, స్వల్పకాలిక లాభాలే కీలకం అవుతున్నట్లు చెప్పారు.మానవ విలువలకు అనుగుణంగా ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ వ్యవస్థలను మోహరిస్తే వినాశకరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏఐ వల్ల తప్పుడు సమాచారం, ఉద్యోగాలు కోల్పోవడం, గోప్యతా ఉల్లంఘనలు.. వంటి ప్రమాదాల కన్నా మానవులను డామినేట్ చేసే వ్యవస్థల వల్ల మరింత నష్టం కలుగుతుందన్నారు.నైతిక ఫ్రేమ్వర్క్..కృత్రిమ మేధ అభివృద్ధిలో బలమైన నైతిక చట్రం(మోరల్ ఫ్రేమ్వర్క్) లేదని హింటన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాలను పెంచడానికి, వినియోగదారుల డేటాను మానిటైజ్ చేయడానికి బిలియన్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నప్పటికీ కొన్ని కంపెనీలు మాత్రం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(ఏజీఐ) అస్తిత్వ ప్రమాదాలపై దృష్టి పెడుతున్నాయని పేర్కొన్నారు. ఏదేమైనా కృత్రిమ మేధ అభివృద్ధికి నైతిక ప్రమాణాలు చాలా అవసరం అని చెప్పారు. నిర్దిష్ట ఫ్రేమ్వర్క్లను తయారు చేయడానికి ప్రపంచ సహకారం కావాలని పిలుపునిచ్చారు. వ్యవస్థల మధ్య ఒప్పందాలు, పర్యవేక్షణ, నైతిక ప్రమాణాలు అవసరమన్నారు. ఏఐ పరిశోధకులు, భద్రత, పారదర్శకత, దీర్ఘకాలిక ఆలోచనలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.ఇదీ చదవండి: బైక్ ట్యాక్సీ సేవలు పునరుద్ధరణ -
ఫ్లాట్ కొన్న సచిన్ టెండుల్కర్ సతీమణి.. ‘జస్ట్’ రూ. 32 లక్షలు!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) సతీమణి అంజలి టెండుల్కర్ ఫ్లాట్ కొన్నారు. ముంబైకి సమీపంలోని వివర్ ఏరియాలో చవకైన ధరకే ఫ్లాట్ను సొంతం చేసుకున్నారు. ఇందుకు గానూ ఆమె రూ. 32 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.ఈ ఫ్లాట్ విస్తీర్ణం కేవలం 391 చదరపు అడుగులు మాత్రమే. గతేడాది మే 30న అంజలి (Anjali) ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆమె రూ. 1.92 లక్షలు మేర స్టాంపు డ్యూటీ.. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 30 వేలు చెల్లించినట్లు జాప్కీ.కామ్ వెల్లడించింది.కాగా మహిళలు ఫ్లాట్లు కొనుగోలు చేస్తే స్టాంపు డ్యూటీ కింద ఒక శాతం రాయితీ ఉంటుంది. అంతేకాదు.. మహారాష్ట్రలో మహిళలు ఇంటి యజమానులుగా ఉంటే.. పట్టణాలు, జిల్లాలను బట్టి ఈ రాయితీ 5 నుంచి 7 శాతం వరకు ఉంటుంది.సచిన్ ఆస్తి ఎంతంటే?ఇరవై నాలుగేళ్లపాటు టీమిండియా క్రికెటర్గా కొనసాగిన సచిన్ టెండుల్కర్ తన సుదీర్ఘ కెరీర్లో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. అదే రేంజ్లో సంపదనూ పోగేసుకున్నాడు. ఓవైపు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గా వార్షిక జీతం, మ్యాచ్ ఫీజులు.. మరోవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్లు, సదరు బ్రాండ్లకు వ్యాపార భాగస్వామిగా ఉండటం ద్వారా రెండు చేతులా సంపాదించాడు.ఆటకు వీడ్కోలు పలికి పుష్కరం గడుస్తున్నా సచిన్ సంపాదన పెరుగుతూనే ఉంది. వివిధ నివేదికల ప్రకారం.. సచిన్ నికర ఆస్తుల విలువ రూ. 1250 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక సచిన్ కుటుంబం నివసించేందుకు బాంద్రాలో తన కలల సౌధాన్ని నిర్మించాడు. దీని విలువ రూ. 80 కోట్లకు పైమాటే!అలాంటిది సచిన్ భార్య అంజలి మాత్రం ఇంత చవగ్గా ఫ్లాట్ కొనడం పట్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వివర్లో ఇంతటి చిన్న విస్తీర్ణంలో ఉండే ఫ్లాట్లను అద్దెల కోసం కొనుగోలు చేస్తారు చాలా మంది. స్టూడియోలు, సింగిల్ బెడ్రూమ్ రెంటల్స్ కోసం వినియోగిస్తారు.క్రికెటర్గా ఎదుగుతున్న సమయంలోనే..క్రికెటర్గా ఎదుగుతున్న సమయంలోనే తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలి మెహతాను ప్రేమించిన సచిన్ టెండుల్కర్.. 1995లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె సారా, కుమారుడు అర్జున్ టెండుల్కర్ సంతానం.ఇక ఇటీవల సచిన్- అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండుల్కర్ వివాహ నిశ్చితార్థం జరిగింది. వ్యాపార దిగ్గజం రవి ఘామ్ మనుమరాలు సానియా చందోక్ మెడలో అర్జున్ మూడుముళ్లు వేయబోతున్నాడు. అర్జున్ అక్క సారాకు సానియా బెస్ట్ ఫ్రెండ్.ఇదిలా ఉంటే.. అర్జున్ క్రికెటర్గా అదృష్టం పరీక్షించుకుంటుండగా.. సారా మోడల్, న్యూట్రీషనిస్ట్గా రాణిస్తోంది. ఇటీవలే ఆమె పైలైట్స్ స్టూడియో (వెల్నెస్ సెంటర్)ను ఆరంభించింది కూడా!.. అంతా ఆట వల్లేఅతి సాధారణ కుటుంబంలో జన్మించిన సచిన్ ఈ స్థాయికి చేరడానికి ఏకైక కారణం క్రికెట్. తన నైపుణ్యాలతో శతక శతకాల ధీరుడిగా ఈ ముంబైకర్ ప్రపంచ క్రికెట్లో ఆల్టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే ఆర్థికంగానూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు.చదవండి: నేనెప్పుడూ అలా అనుకోలేదు.. తమ్ముడికి ఇష్టమే: సారా టెండుల్కర్ -
ఆర్థిక ప్రణాళికల్లో తెలంగాణ టాప్
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడంలో తెలంగాణ ప్రజలు ముందుంటున్నారని ఇన్సూరెన్స్ ఎవేర్నెస్ కమిటీ (ఐఏసీ–లైఫ్), ఐఎంఆర్బీ కాంటార్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రకారం రాష్ట్రంలో 94 శాతం మంది జీవితంలో తలెత్తే అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తుగా ప్రణాళికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.జీవిత బీమా అనేది పొదుపు, రక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని రాష్ట్రంలో 100 శాతం అవగాహన ఉంది. వచ్చే 3 నెలల్లో జీవిత బీమా కొనాలని 38 శాతం మంది భావిస్తున్నారు. సబ్సే పెహ్లే లైఫ్ ఇన్సూరెన్స్ 2.0 ప్రచారానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐఏసీ–లైఫ్ కో–చెయిర్పర్సన్ వెంకటాచలం ఈ విషయాలు తెలిపారు.రాష్ట్రంలో టర్మ్, చైల్డ్, పొదుపు ప్లాన్లతో పాటు ఇతర బీమా పథకాల గురించి ప్రాంతీయంగా టీవీ, డిజిటల్ తదితర మాధ్యమాల ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రచార కార్యక్రమాలను మరింతగా నిర్వహించనున్నట్లు వివరించారు.అధ్యయనం ముఖ్యాంశాలు94% మంది తెలంగాణ ప్రజలు అనూహ్య పరిస్థితులకు ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం అలవాటు చేసుకున్నారు.100% అవగాహన జీవిత బీమా గురించి ఉంది — ఇది పొదుపు మరియు రక్షణ సాధనంగా ఉపయోగపడుతుందని ప్రజలు అర్థం చేసుకున్నారు.38% మంది వచ్చే 3 నెలల్లో జీవిత బీమా కొనాలని భావిస్తున్నారు.87% మంది పొదుపు ప్లాన్లను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇవి గ్యారంటీడ్ లంప్సమ్ లేదా నెలవారీ ఆదాయాన్ని అందించే ప్లాన్లు.90% మంది టీవీ ద్వారా జీవిత బీమా గురించి తెలుసుకుంటే 56% మంది ఇన్సూరెన్స్ ఏజెంట్ల ద్వారా సమాచారం పొందారు.84% మంది దీర్ఘకాలిక పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నారు.87% మంది త్వరగా రిటైర్ కావాలనే లక్ష్యంతో పొదుపు అలవాటు చేసుకుంటున్నారు. ఇది సర్వే చేసిన మెట్రో మార్కెట్లలో అత్యధిక శాతం. -
బంగారం శుభవార్త.. వెండి భారీ మోత.. ఏకంగా రూ.వేలల్లో
దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. క్రితం రోజున ఒక్కసారిగా పెరిగిన పసిడి ధరలు నేడు (శుక్రవారం) మళ్లీ దిగివచ్చాయి. వెండి ధరలు వరుస పెరుగుదలను నమోదు చేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
బైక్ ట్యాక్సీ సేవలు పునరుద్ధరణ
కర్ణాటక హైకోర్టు బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో రాపిడో, ఉబర్, ఓలా వంటి ఆన్లైన్ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్లు రాష్ట్రంలో తమ బైక్ ట్యాక్సీ సేవలను తిరిగి ప్రారంభించాయి. నెలరోజుల్లోగా బైక్ ట్యాక్సీ పాలసీని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉబర్, ఓలా, రాపిడో వంటి ఆన్లైన్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్లు అందించే బైక్ ట్యాక్సీపై నిషేధం విధిస్తూ 2025 జూన్ 16న రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహన చట్టం 1988 ప్రకారం బైక్ ట్యాక్సీ సేవలు చట్టవిరుద్ధమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులను రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్లు సవాలు చేశాయి.నిషేధాన్ని ఎత్తివేసిన కోర్టురాపిడో, ఓలా, ఉబర్ సంస్థల అప్పీలును జస్టిస్ విభూ బఖ్రూ, జస్టిస్ సీఎం జోషిలతో కూడిన ధర్మాసనం విచారించింది. బైక్ ట్యాక్సీలు చట్టబద్ధమైన వ్యాపారమని, వీటిపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. బైక్ ట్యాక్సీలపై నిషేధం ఏకపక్షం, అసమంజసం, ఆర్టికల్ 14, 19(1)(జి)లను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బైక్ ట్యాక్సీ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వానికి నెల రోజులు గడువు ఇచ్చింది.బైక్ ట్యాక్సీల అవసరంటెక్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరులో రోడ్డు మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతే కాదు, ప్రజా రవాణా వసతులు ఆశించినమేరకు లేకపోవడం వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడం సవాలుగా మారుతుంది. ఇలాంటి సమయంలో బైక్ ట్యాక్సీ సర్వీసులు ఎంతో ఉపయోగపడుతున్నాయనే వాదనలున్నాయి. ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. అభివృద్ధి చెందుతున్న చాలా నగరాలకు బైక్ సర్వీసులు అవసరం అవుతున్నట్లు కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఇవాళ, రేపు హెచ్డీఎఫ్సీ సర్వీసుల్లో అంతరాయం -
జీఎస్టీ మినహాయింపు: టర్మ్, లైఫ్ ప్లాన్లపై ప్రయోజనం
బీమా పాలసీలపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీ) మినహాయించేందుకు రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం (జీవోఎం) ఆమోదం తెలపడంతో.. ఇది అమల్లోకి వస్తే ప్రధానంగా టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.కమీషన్, రీ ఇన్సూరెన్స్లకు సైతం మినహాయింపు లభిస్తుందని.. దీంతో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) నిలిపివేయడం అన్న సమస్య ఎదురుకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రస్తుతం వ్యక్తిగత ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్లాన్లపై 18 శాతం రేటు అమలవుతోంది. దీన్ని పూర్తిగా మినహాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి జీఎస్టీ మంత్రుల బృందం సైతం ఆమోదం తెలిపి జీఎస్టీ కౌన్సిల్కు నివేదించింది.18% తగ్గకపోవచ్చు.. బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించినా గానీ, తగ్గింపు అన్నది 18 శాతంగా ఉండకపోవచ్చని ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. కమీషన్లు, ఆఫీస్ అద్దెలు, సాఫ్ట్వేర్ తదితర వాటిపై తాము చెల్లించిన జీఎస్టీని కంపెనీలు తిరిగి క్లెయిమ్ చేసుకోలేవని చెప్పారు.దీంతో కంపెనీలపై పడే ఇన్పుట్ ట్యాక్స్ ఆధారంగా నికర తగ్గింపు ఆధారపడి ఉంటుందని వివరించారు. జీఎస్టీ మినహాయింపు కన్నా సున్నా రేటు కింద పరిగణిస్తే, అప్పుడు కంపెనీలు తమ ఇన్పుట్ వ్యయాలపై చెల్లించిన జీఎస్టీని తిరిగి క్లెయిమ్ చేసుకోగలవన్నారు. అలాంటప్పుడు బీమా పాలసీలపై తగ్గింపు 18 శాతంగా ఉండొచ్చన్నారు. -
250 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు తగ్గి 25,003కు చేరింది. సెన్సెక్స్(Sensex) 255 ప్లాయింట్లు దిగజారి 81,747 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘నేనో యాక్సిడెంటల్ సీఈఓ’.. దాతృత్వంలో పెద్దమనుసు
సంపాదనలో విరాళం చేయాలంటే, అది మంచి కార్యం అయితే రూ.వందలు, రూ.వేలు మహా అయితే రూ.లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడుతుంటారు. అలాంటిది సంపాదించిన మొత్తంలో 99 శాతం విరాళంగా ఇస్తానని ఓ వ్యక్తి ప్రకటించారు. సంపాదనలో 99 శాతం విరాళంగా ఇస్తానని చెప్పి అమెరికాలో పేరు మోసిన కంపెనీకి సీఈఓగా ఉన్న జూడీ ఫాల్కనర్(82) వార్తల్లో నిలిచారు. యూఎస్లో హెల్త్ కేర్ సంస్థల్లో ఒకటైన ఎపిక్ సిస్టమ్స్ కంపెనీని స్థాపించి ఆమె బిలియనీర్గా ఎదిగారు. తన 7.8 బిలియన్ డాలర్ల సంపదలో 99 శాతం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ‘ఆరోగ్య సంరక్షణలో అత్యంత శక్తివంతమైన మహిళ’గా పిలువబడే ఫాల్కనర్ వ్యాపారాన్ని, దాతృత్వాన్ని విస్తరిస్తున్నారు.1979లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఫాల్కనర్ ఎపిక్ సిస్టమ్స్ను స్థాపించారు. సాంకేతికత ద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచాలనే లక్ష్యంతో కంపెనీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 325 మిలియన్లకు పైగా రోగులకు ఈ సంస్థ సర్వీసులు అందిస్తోంది. ఫాల్కనర్ తాను ఎప్పుడూ టెక్ మొఘల్ అవ్వాలని అనుకోలేదని గతంలో పలుమార్లు చెప్పారు. ఫాల్కనర్ తనను తాను ‘యాక్సిడెంటల్ సీఈఓ’గా అభివర్ణించుకున్నారు. తాను ప్రొఫెషనల్ ఎంబీఏ చదవలేదని చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: భారత ఉత్పత్తులకు స్వాగతం.. ఆందోళన అనవసరందాతృత్వ కార్యక్రమాలు..బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ ప్రారంభించిన గివింగ్ ప్లెడ్జ్ దాతృత్య కార్యక్రమంలో చేరి తన 7.8 బిలియన్ డాలర్ల సంపదలో 99% విరాళంగా ఇస్తానని చెప్పారు. ఫాల్కనర్ తన నాన్-ఓటింగ్ ఎపిక్ షేర్లను తిరిగి కంపెనీకి విక్రయిస్తున్నారు. దాని ద్వారా సమకూరుతున్న మొత్తాన్ని తన దాతృత్వ సంస్థ ‘రూట్స్ అండ్ వింగ్స్’కు మళ్లిస్తున్నారు. ఇది అల్ప ఆదాయ కుటుంబాలకు ఆరోగ్యం, విద్యపై దృష్టి సారించిన లాభాపేక్షలేని ఇతర సంస్థలకు మద్దతు ఇస్తుంది. 2020లో ఈ ఫౌండేషన్ 115 సంస్థలకు 15 మిలియన్ డాలర్లు ఇచ్చింది. 2023 నాటికి ఇది 305 గ్రూపులతో 67 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2027 నాటికి ఏటా 100 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సేవలు రెండు రోజులు బంద్
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు సంబంధించిన కొన్ని సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుంది. వాట్సాప్ ద్వారా చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి ఫీచర్లు ఆగస్టు 22, 23 తేదీల్లో స్వల్ప కాలానికి అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో బ్యాంక్ కస్టమర్ కేర్ సేవలకు కూడా అంతరాయం కలగనుంది.ఖాతాదారులకు మొత్తం బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వ్యవస్థల నిర్వహణను చేపడుతున్నందున ఈ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. "మీ బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఆగస్టు 22 రాత్రి 11:00 గంటల నుండి ఆగస్టు 23 ఉదయం 6:00 గంటల వరకు అవసరమైన సిస్టమ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తున్నాం" అని బ్యాంక్ ఒక నోటీసులో తెలిపింది.దీంతో కొన్ని బ్యాంకింగ్ సేవలు ఏడు గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ కాలంలో కస్టమర్ కేర్ సేవలు (ఫోన్ బ్యాంకింగ్ ఐవీఆర్, ఈమెయిల్ & సోషల్ మీడియా), వాట్సాప్లో చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది.మెయింటెనెన్స్ పీరియడ్ లో ఫోన్ బ్యాంకింగ్ ఏజెంట్ సేవలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పేజాప్, మై కార్డ్స్ సేవలు మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం వివరించింది. -
ర్యాపిడోకి భారీ జరిమానా.. కొంప ముంచిన యాడ్స్
తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలకు గాను రైడ్ సేవల సంస్థ ర్యాపిడోకి వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది. ‘5 నిమిషాల్లో ఆటో లేదా రూ. 50 పొందండి ‘ ఆఫర్ కింద పరిహారం లభించని కస్టమర్లకు రీయింబర్స్ చేయాలని కూడా ఆదేశించింది.దీనితో పాటు ‘గ్యారంటీడ్ ఆటో‘ ఆఫర్ ప్రకటనలను కూడా పరిశీలించిన సీసీపీఏ, ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టించే తప్పుడు అడ్వర్టైజ్మెంట్లుగా నిర్ధారించింది. హామీ ఇచ్చినట్లుగా రూ. 50 డబ్బు రూపంలో కాకుండా రూ. 50 వరకు విలువ చేసే ర్యాపిడో కాయిన్ల రూపంలో లభిస్తాయన్న విషయాన్ని చాలా చిన్నని, చదవడానికి అనువుగా లేని ఫాంట్లలో కంపెనీ డిస్ప్లే చేసిందని సీసీపీఏ విచారణలో తేలింది.పైపెచ్చు ఆ మొత్తాన్ని బైక్ రైడ్స్ కోసమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడు రోజుల వ్యవధిలో ఉపయోగించుకోకపోతే కాలపరిమితి తీరిపోతుంది. అంతేగాకుండా ఈ హామీ బాధ్యతను కంపెనీ తన మీద పెట్టుకోకుండా వ్యక్తిగత డ్రైవర్ల మీదకు నెట్టేసినట్లు విచారణలో తేలింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్ డేటా ప్రకారం 2024 జూన్ నుంచి 2025 జూలై మధ్య కాలంలో ర్యాపిడోపై ఫిర్యాదులు 1,224కి ఎగిశాయి. అంతక్రితం 14 నెలల వ్యవధిలో 575 కంప్లైట్లు నమోదయ్యాయి. -
సంవత్సరం తిరిగే సరికి బంగారం ధర..
బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ఏడాది చివరికి ఔన్స్కు 3,600 డాలర్లకు చేరుకోవచ్చని వెంచురా సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సమస్యలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడుల పరంగా డిమాండ్ పసిడిని నడిపించొచ్చని తెలిపింది.కామెక్స్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర ఈ నెల 7న 3,534 డాలర్లను నమోదు చేయగా.. డిసెంబర్ నాటికి 3,600 డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. దేశీ మార్కెట్లో పరిశీలిస్తే ఎంసీఎక్స్లో ఈ నెల 8న అక్టోబర్ నెల గోల్డ్ కాంట్రాక్టు (10 గ్రాములు) ధర రూ.1,02,250 రికార్డు స్థాయిని నమోదు చేసింది. అమెరికాలో బలహీన వృద్ధి, యూఎస్ డాలర్ ఇండెక్స్పై ఒత్తిళ్లు, పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను వెంచురా సెక్యూరిటీస్ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. ఈ పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ బలంగా కొనసాగుతున్నట్టు తెలిపింది.‘‘ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయంగా బంగారంపై పెట్టుబడుల డిమాండ్ 3 శాతం పెరిగి రూ.1,249 టన్నులకు చేరుకుంది. విలువ పరంగా 132 బిలియన్ డాలర్లు. అంతర్జాతీయంగా గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు 16 శాతం పెరిగి జూన్ చివరికి 3,616 టన్నులుగా ఉన్నాయి’’ అని వెంచురా సెక్యూరిటీస్ వివరించింది. బంగారం నిర్వహణ ఆస్తుల విలువ ఏడాది కాలంలో 64 శాతం ఎగసి 383 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తెలిపింది. దేశీయంగానూ ఇదే ధోరణి.. దేశీయంగానూ బంగారంపై పెట్టుబడుల ధోరణి బలపడుతున్నట్టు వెంచురా సెక్యూరిటీస్ గణాంకాలను ప్రస్తావించింది. గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని బంగారం నిల్వలు జూన్ 30 చివరికి 66.68 టన్నులకు పెరిగినట్టు తెలిపింది. ఏడాది కాలంలో 42 శాతం పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని పసిడి ఆస్తుల విలువ ఇదే కాలంలో రెట్టింపై రూ.64,777 కోట్లకు చేరినట్టు పేర్కొంది.గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇన్వెస్టర్ల ఖాతాలు (ఫోలియోలు) 41 శాతం పెరిగి 76.54 లక్షలకు చేరాయని.. ఏడాది కాలంలో 317 శాతం పెరిగినట్టు తెలిపింది. గోల్డ్ ఈటీఎఫ్లు తదితర డిజిటల్ గోల్డ్ సాధనాలపై పెట్టుబడులకు యువ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించింది. అదే సమయంలో బంగారం ఆభరణాల డిమాండ్ స్థిరంగా కొసాగుతోందని తెలిపింది. ముఖ్యంగా భౌతిక, డిజిటల్ బంగారంపై పెట్టుబడులతో కూడిన హైబ్రిడ్ విధానాలను అనుసరిస్తున్నట్టు పేర్కొంది. దీర్ఘకాలంలో రాబడులు.. ‘‘గత 20 ఏళ్లలో 14 సంవత్సరాల్లో బంగారం సానుకూల రాబడులు అందించింది. దీంతో విలువ పెరిగే సాధనంగా, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా బంగారానికి గుర్తింపు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో బంగారం ధరల ర్యాలీ దీన్ని బలపరుస్తోంది. గత మూడేళ్లలో వార్షిక రాబడి 23 శాతంగా ఉంది. ఇదే కాలంలో నిఫ్టీ 50 సూచీ వార్షిక రాబడి 11 శాతంగానే ఉంది’’ అని వెంచురా సెక్యూరిటీస్ తన నివేదికలో వివరించింది.సెంట్రల్ బ్యాంక్లు సైతం స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండడాన్ని ప్రస్తావించింది. సార్వభౌమ బంగారం బాండ్ల జారీని 2024 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ నిలిపివేయడంతో, ఈటీఎఫ్, ఇతర బంగారం డిజిటల్ సాధనాల్లోకి అధిక పెట్టుబడులు వెళ్లొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.‘‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, బలహీన యూఎస్ డాలర్కు తోడు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో బంగారం ధరలు ఈ ఏడాది మిగిలిన కాలంలో స్థిరంగా ఎగువవైపు చలించొచ్చు’’అని వెంచురా సెక్యూరిటీస్ కమోడిటీస్ హెడ్ ఎన్ఎస్ రామస్వామి తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3,400 డాలర్ల సమీపంలో ఉంది. -
విప్రో చేతికి హర్మన్ డీటీఎస్.. రూ. 3,270 కోట్ల డీల్
ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో తాజాగా హర్మన్కు చెందిన డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్(డీటీఎస్) బిజినెస్ యూనిట్ కొనుగోలుకి తెరతీసింది. శామ్సంగ్కు చెందిన ఈ సంస్థలో 100 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు నగదు రూపేణా 37.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 3,270 కోట్లు) వెచ్చించనుంది.ఒప్పందంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 5,600మంది డీటీఎస్ ఉద్యోగులు విప్రోకు బదిలీకానున్నారు. 2025 డిసెంబర్31కల్లా లావాదేవీ పూర్తికావచ్చని అంచనా వేస్తున్నారు. హర్మన్ కనెక్టెడ్ సర్వీసెస్ ఇంక్లో 100 శాతం వాటా కొనుగోలుకి హర్మన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ ఇంక్తో తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసినట్లు విప్రో పేర్కొంది.తద్వారా హర్మన్ అనుబంధ సంస్థలుసహా.. సంబంధిత ఆస్తులను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. కొనుగోలు తదుపరి విప్రో ఇంజినీరింగ్ గ్లోబల్ బిజినెస్ లైన్లో డీటీఎస్ విలీనంకానున్నట్లు వెల్లడించింది. కనెక్టికట్(యూఎస్) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డీటీఎస్ అంతర్జాతీయంగా ఈఆర్అండ్డీ, ఐటీ సర్వీసులను అందిస్తోంది. ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్, డిజిటల్ ఇంజినీరింగ్, డిజైన్ థింకింగ్, క్లౌడ్, ఇన్ఫ్రా సర్వీసులలో ప్రధానంగా కార్యకలాపాలు విస్తరించింది. -
సెలబ్రేషన్స్ ముసుగులో సైబర్ ట్రాప్స్..!
న్యూఢిల్లీ: పండుగల సీజన్లో ఆదమరిచి ఉన్న తరుణంలో సైబర్ మోసాల విషయంలో జాగ్రత్త వహించాలని సైబర్సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ క్విక్ హీల్ టెక్నాలజీస్ హెచ్చరించింది. ఫేక్ బుకింగ్ ఇంటర్ఫేస్లు, బోగస్ ట్రావెల్ ప్యాకేజీలు, నమ్మశక్యం కాని బూటకపు ఈ–కామర్స్ ఆఫర్లతో మోసగాళ్లు గాలం వేసే ముప్పు ఉందని పేర్కొంది. నకిలీ టికెట్ల సైట్లు, మోసపూరిత లింకులు, ఫిషింగ్ పేజీలకు దారి తీసే యూపీఐ పేమెంట్ రిక్వెస్టుల రూపంలో ఈ దాడులు జరగొచ్చని పేర్కొంది. అలాగే, అప్పటికప్పుడు రుణాలిచ్చేస్తామని ఆకర్షించే క్రెడిట్, లోన్ యాప్లు కూడా మందుపాతరల్లాంటివని ఒక ప్రకటనలో వివరించింది. అన్నింటికీ పరి్మషన్లు కావాలంటూ అడిగే ఫేక్ యాప్లకు దూరంగా ఉండాలని సూచించింది. సాధారణంగా పండుగల సందర్భంగా డాండియా, ఇతరత్రా కార్యక్రమాల కోసం బుక్ చేసుకునే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని క్విక్ హీల్ తెలిపింది. ఆగస్టు నుంచి డిసెంబరు దాకా సాగే పండుగల నెలల్లో ఆన్లైన్, ఆఫ్లైన్లో ఇలాంటి ఉదంతాలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. ఔట్డేటెడ్ సాఫ్ట్వేర్ వల్లే ఈ తరహా మోసాలు జరుగుతుంటాయి కాబట్టి, యూజర్లంతా ఎప్పటికప్పుడు యాంటీవైరస్లను, సిస్టమ్ ప్యాచ్లను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని సూచించింది. డీల్స్ విషయంలో సందేహం కలిగితే ఎంబెడెడ్ లింకులను క్లిక్ చేయకుండా, నేరుగా బ్రాండ్ అధికారిక యాప్నే ఉపయోగించడం లేదా బ్రౌజర్లో పోర్టల్ అడ్రెస్ని స్వయంగా టైప్ చేయడం మంచిదని పేర్కొంది. తెలిసే సరికే ఆలస్యం.. → వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్ దగ్గర పడే కొద్దీ రైలు, ఫ్లయిట్ టికెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్సీటీసీ, ఎయిర్లైన్స్ వెబ్సైట్లు మొదలైన వాటిని ఉపయోగించడం పెరుగుతుంది. ఇదే అదనుగా, సిసలైన వాటిలా అనిపించే నకిలీ బుకింగ్ ఇంటర్ఫేస్లు, బోగస్ ట్రావెల్ ప్యాకేజీ ఆఫర్లతో నేరగాళ్లు మోసం చేస్తారు. → మంచి ఆఫర్ల కోసం అన్వేíÙంచే యూజర్లను నకిలీ వెబ్సైట్ల వైపు మళ్లిస్తుంటారు. వాటిలోని మాల్వేర్లతో బ్యాంకింగ్ వివరాలను తస్కరిస్తారు. మొబైల్స్కి పండుగ గ్రీటింగ్ ఈ–కార్డుల రూపంలో ట్రోజన్లను పంపించి కాంటాక్టు లిస్టులను సంగ్రహిస్తారు. ఓటీపీలను దారి మళ్లిస్తారు. తమ వ్యక్తిగత, పేమెంట్ వివరాలన్నీ క్రిమినల్స్ చేతుల్లోకి చేరిపోయాయని బాధితులకు తెలిసేసరికే ఆలస్యమైపోతుంది. → ఇక ఇన్స్టంట్ రుణాల యాప్లది మరో తీరు. వీటిని ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే, కాంటాక్టులు, ఎస్ఎంఎస్లు ఇలా ప్రతి దానికీ పర్మిషన్లు అడుగుతాయి. బాధితుల స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా మోసపూరిత మెసేజీలను పంపిస్తుంటాయి. -
ఐపీవో గ్రే మార్కెట్కు సెబీ చెక్
ముంబై: ఐపీవోకంటే ముందు(ప్రీ ఐపీవో) లావాదేవీల నిర్వహణకు అధికారిక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ప్రస్తుత అనధికార(గ్రే) మార్కెట్ లావాదేవీలకు చెక్ పెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. వెరసి నియంత్రణలకు లోబడి ప్రీఐపీవో లావాదేవీలు చేపట్టేందుకు కొత్త ప్లాట్ఫామ్ ఇన్వెస్టర్లను అనుమతించనుంది. ఐపీవో కేటాయింపులు(అలాట్మెంట్), స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ మధ్య మూడు రోజులపాటు లావాదేవీలకు వీలు కల్పించనుంది. దీంతో ప్రస్తుత గ్రే మార్కెట్ స్థానే నియంత్రిత లావాదేవీల ప్లాట్ఫామ్కు సెబీ తెరతీయనున్నట్లు పాండే వెల్లడించారు. అయితే ఇన్వెస్టర్లు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రీలిస్టింగ్ సమాచారం ఒక్కటే సరిపోదని 2025 ఫిక్కీ క్యాపిటల్ మార్కెట్ సదస్సు సందర్భంగా సెబీ చీఫ్ స్పష్టం చేశారు. క్యాపిటల్ మార్కెట్లను మరింత విస్తరించడంతోపాటు.. ఇన్వెస్టర్ల పరిరక్షణకు వీలుగా నియంత్రణలతోకూడిన ప్రీఐపీవో ట్రేడింగ్ను పరిశీలనాత్మకంగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు.నగదు ఈక్విటీ మార్కెట్పై దృష్టిఈక్విటీ డెరివేటివ్స్ గడువు(ఎక్స్పైరీ)లోనూ మార్పులు చేపట్టనున్నట్లు పాండే సంకేతమిచ్చారు. వీటి కాలావధి, ఎక్స్పైరీని ఒక క్రమపద్ధతిలో పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది(2024–25) 91 శాతం వ్యక్తిగత ట్రేడర్లు నష్టపోయిన ఇలాంటి ప్రొడక్టులకు కళ్లెం వేసే వీలుంటుందని పేర్కొన్నారు. నగదు ఈక్విటీ మార్కెట్లను విస్తరించే బాటలో ఈక్విటీ డెరివేటివ్స్లో మార్పులు తీసుకురానున్నట్లు తెలియజేశారు. దీర్ఘకాలిక గడువుగల ప్రొడక్టులను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్ నాణ్యతను సైతం పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే సంబంధిత వర్గాలతో చర్చలు చేపట్టాక, ఒక క్రమపద్ధతిలో డెరివేటివ్ ప్రొడక్టుల మెచూరిటీపై నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. దీంతో హెడ్జింగ్, దీర్ఘకాలిక పెట్టుబడులకు దన్నునివ్వనున్నట్లు వివరించారు. నగదు విభాగంలో పరిమాణం భారీగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. గత మూడేళ్లలో లావాదేవీల పరిమాణం రెట్టింపైనట్లు తెలియజేశారు. పారదర్శకత కీలకమని, దీంతో క్యాపిటల్ మార్కెట్లలో నిధుల సమీకరణకు వీలుంటుందని వివరించారు. -
మొన్న 300 మందికే.. ఇప్పుడు 999 మందికి
మహీంద్రా ఇటీవల వార్నర్ బ్రదర్స్ సహకారంతో రూ. 27.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ను లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితమైన ఈ ఎడిషన్ ఇప్పుడు 999 యూనిట్లకు చేరింది. అంటే దీనిని 999 మంది కొనుగోలు చేయగలరు.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ ఆగస్టు 21 సాయంత్రం 5 గంటల నుంచి మహీంద్రా అధికారిక వెబ్సైట్లో ఉంచింది. కాగా కంపెనీ ఈ మోడల్ కోసం ఆగస్టు 23 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. డెలివరీలు సెప్టెంబర్ 20న ప్రారంభం కానున్నాయి.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్.. కస్టమ్ శాటిన్ బ్లాక్ బాడీ కలర్తో వస్తుంది. ముందు డోర్స్ మీద బ్యాట్మ్యాన్ డెకాల్స్, టెయిల్గేట్పై డార్క్ నైట్ బ్యాడ్జ్, ఫెండర్పై బ్యాట్మ్యాన్ లోగో, బంపర్ & రివర్స్ లాంప్ ఉన్నాయి. బ్రేక్లు, స్ప్రింగ్లు ఆల్కెమీ గోల్డ్ పెయింట్ పొందాయి. ఇది చూడగానే ఒక సూపర్ హీరోను గుర్తుకు తెస్తుంది.ఇదీ చదవండి: భవిష్యత్ ఇంధనం గురించి చెప్పిన గడ్కరీమహీంద్రా బ్యాట్మ్యాన్ ఎడిషన్.. 79 kWh బ్యాటరీ ప్యాక్తో.. ఒకే ఫుల్ ఛార్జ్పై 682 కి.మీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 286 హార్స్ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్ లోపల కూడా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. డాష్బోర్డ్పై ఆల్కెమీ గోల్డ్లో నంబర్ ఉన్న బ్యాట్మ్యాన్ ఎడిషన్ ప్లేక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం చార్కోల్ లెదర్ & గోల్డ్ సెపియా స్టిచింగ్తో కూడిన స్వెడ్ లెదర్ అపోల్ స్ట్రే వంటివి ఉన్నాయి. గోల్డ్ యాక్సెంట్లు స్టీరింగ్ వీల్, ఇన్ టచ్ కంట్రోలర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వరకు విస్తరించి ఉండగా, బ్యాట్ లోగో బూస్ట్ బటన్, సీట్లు మొదలైనవాటిపై కనిపిస్తాయి. -
కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు: లిస్ట్ ఇదిగో..
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా ఒకటి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించి.. గత దశాబ్దంలో 93.6% వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ ధనవంతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ కథనంలో కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు ఎవరు?, వారి నికర విలువ (ఫోర్బ్స్ ప్రకారం) ఎంత అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు➤అజీమ్ ప్రేమ్జీ - విప్రో వ్యవస్థాపకులు: 11.7 బిలియన్ డాలర్లు➤నారాయణ మూర్తి - ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు: 4.4 బిలియన్ డాలర్లు➤ఇర్ఫాన్ రజాక్ - ప్రెస్టీజ్ గ్రూప్ : 1.7 బిలియన్ డాలర్లు➤కిరణ్ మజుందార్-షా - బయోకాన్ వ్యవస్థాపకులు: 3.4 బిలియన్ డాలర్లు➤నిఖిల్ కామత్ - జెరోధా & ట్రూ బీకాన్ సహవ్యవస్థాపకులు: 2.5 బిలియన్ డాలర్లు➤క్రిస్ గోపాలకృష్ణన్ - ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు: 3.5 బిలియన్ డాలర్లు➤రంజన్ పాయ్ - మణిపాల్ మెడికల్ & ఎడ్యుకేషన్ గ్రూప్: 2.8 బిలియన్ డాలర్లు➤రాజేష్ మెహతా - రాజేష్ ఎక్స్పోర్ట్స్ వ్యవస్థాపకులు: 1.57 బిలియన్ డాలర్లు➤నందన్ నీలేకని - ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు: 3 బిలియన్ డాలర్లు➤విజయ్ సంకేశ్వర్ - వీఆర్ఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు: రూ. 10,000 కోట్లు కంటే ఎక్కువఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్లో అత్యంత సంపన్నుడు ఎవరంటే? -
భవిష్యత్ ఇంధనం గురించి చెప్పిన గడ్కరీ
ఈ20 ఫ్యూయెల్ చుట్టూ ఉన్న గందరగోళాల మధ్య.. 'హైడ్రోజన్' భవిష్యత్ ఇంధనం అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. హైడ్రోజన్, బయో ఇంధనాలు & ఎలక్ట్రిక్ వాహనాలు రవాణా.. పరిశ్రమల భవిష్యత్తు అని ఆయన స్పష్టం చేశారు.శిలాజ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుంది. ఇది కేవలం రవాణాకు మాత్రమే కాకుండా.. పరిశ్రమలకు కూడా కీలకంగా మారుతుందని గడ్కరీ అన్నారు. రైళ్లు హైడ్రోజన్ ద్వారానే నడుస్తాయి, విమానాలు హైడ్రోజన్తో ఎగురుతాయని అన్నారు. భవిష్యత్తులో శిలాజ ఇంధనాలపై ఆధారపడటం ఉండదని పేర్కొన్నారు.ఆటోమొబైల్ మార్కెట్లో భారత్ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో భారతదేశం ఎదుగుదలను నితిన్ గడ్కరీ ప్రస్తావించారు. ఇండియా ఇటీవల జపాన్ను అధిగమించి దేశం ఏడవ స్థానం నుంచి మూడవ స్థానానికి చేరుకుందని అన్నారు. అమెరికన్ ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ. 78 లక్షల కోట్లు, చైనా విలువ రూ. 49 లక్షల కోట్లు, కాగా భారతదేశం విలువ రూ. 22 లక్షల కోట్లు. రాబోయి రోజుల్లో ఆటోమొబైల్ రంగంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.కొన్ని రోజుల క్రితం, మెర్సిడెస్ గ్లోబల్ చైర్మన్.. భారతదేశంలో ఎలక్ట్రిక్ మెర్సిడెస్ కార్లను తయారు చేస్తామని నాకు చెప్పారని నితిన్ గడ్కరీ చెప్పారు. రవాణా & పరిశ్రమ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనాలు, హైడ్రోజన్పై ఆధారపడి ఉంది. వీటి వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. పర్యావరణంలో కాలుష్యం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు. ఈ రంగంలో ఉద్యోగాలు కూడా పెరుగుతాయని చెప్పారు.ఇదీ చదవండి: కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్హైడ్రోజన్ ఇంధనం గురించి మాట్లాడుతూ.. చమురు ఉత్పత్తి చేసే దేశాలను చౌకైన హైడ్రోజన్తో భారతదేశం సమం చేయగలదని గడ్కరీ అన్నారు. హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చును తగ్గించగలిగితే.. భారతదేశం ఇంధన దిగుమతిదారు నుంచి ప్రపంచ ఎగుమతిదారుగా మారగలదని అన్నారు. అయితే హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. -
కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్
కొన్నేళ్ళకు ముందు పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. పరిస్థితులు మార్పులు.. ఉద్గారప్రమాణాలు అమలులోకి రావడం వల్ల.. డీజిల్ కార్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పెట్రోల్ కార్లు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు, సీఎన్జీ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు.. కార్ల కొనుగోలు విషయంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఈ కథనంలో కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు ఇంధన రకానికి సంబంధించి పరిగణించవలసిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.పెట్రోల్ కార్లుమీరు పెట్రోల్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లయితే.. ఇందులో విభిన్న ధరల వద్ద కార్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ కార్లు ఇతర కార్లతో పోలిస్తే కొంత తక్కువ ధర వద్ద లభిస్తాయి. అంతే కాకుండా దేశంలో పెట్రోల్ పంపులు కూడా లెక్కకు మించి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పెట్రోల్ కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. రోజువారీ వినియోగానికి, దూర ప్రయాణాలకు కూడా ఇవి ఉపయోగపడతాయి.డీజిల్ కార్లుడీజిల్ కార్లు ఒకప్పుడు విరివిగా అందుబాటులో ఉండేవి. బీఎస్6 ఉద్గార ప్రమాణాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వీటి సంఖ్య చాలా వరకు తగ్గింది. పొల్యూషన్ కారణంగా ఢిల్లీ వంటి నగరాల్లో పాత డీజిల్ కార్లను కొన్నాళ్ళు నిషేధించారు. భవిష్యత్తులో డీజిల్ కార్ల ఉత్పత్తిని కూడా కంపెనీలు బాగా తగ్గించే అవకాశం ఉంది. డీజిల్ కార్ల ధరలు కూడా పెట్రోల్ కార్ల ధరల కంటే ఎక్కువ. వీటిని కూడా రోజువారీ వినియోగనికి, దూర ప్రయాణాలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు.ఎలక్ట్రిక్ కార్లుప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి కారణం.. ఈవీలపై జీఎస్టీ తగ్గింపు. ఈవీల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో సబ్సిడీ అందించింది. అయితే ఇప్పుడు ఈవీల వినియోగానికి ప్రధాన సమస్య.. ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేకపోవడమే. వీటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది. నగర ప్రయాణాల కోసం ఈవీలను ఎంచుకోవచ్చు. కానీ దూర ప్రాంతాలకు వెళ్ళడానికి లేదా మారుమూల ప్రాంతాల్లో ఉపయోగించాలనుకుంటే మాత్రం ఛార్జింగ్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: జనరల్ మేనేజర్కు ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చిన సీఈఓసీఎన్జీ కార్లుపెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే.. సీఎన్జీ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఈ కార్లు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుత మార్కెట్లో సీఎన్జీ రీఫ్యూయలింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కంపెనీలు తమ సీఎన్జీ కార్లలో మంచి బూట్ స్పేస్ కూడా అందిస్తున్నాయి. ధర సాధారణ కార్ల కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది.హైబ్రిడ్ కార్లుభారతదేశంలో ప్రస్తుతం మైల్డ్ హైబ్రిడ్ కార్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్ టెక్నాలజీ మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు పెట్రోల్ కార్ల కంటే కూడా 10 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తాయి. అంతే కాకుండా ఇవి కాలుష్య కారకాలను కూడా తక్కువగానే విడుదల చేస్తాయి. వీటి ధరలు సాధారణ పెట్రోల్ కార్ల కంటే ఎక్కువగా ఉంటాయి. -
కొత్త ఫోన్ సేల్ షురూ.. రూ.10 వేలకే లేటెస్ట్ 5జీ మొబైల్
టెక్నో తన లేటెస్ట్ చౌకైన 5జీ మొబైల్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 5జీని ఇటీవల భారత్ లో లాంచ్ చేసింది. నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీని కోరుకునే యూజర్ల కోసం ఎంట్రీ లెవల్ 5జీ ఆప్షన్గా కంపెనీ ఈ ఫోన్ను తీసుకొచ్చింది. కొత్త 5జీ మొబైల్ ఫోన్కు అప్గ్రేడ్ అవ్వాలనుకునేవారి కోసం టెక్నో స్పార్క్ గో 5 జీ మంచి సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంది.ఫోన్ ధర, లభ్యత, సేల్ ఆఫర్లుటెక్నో స్పార్క్ గో 5జీ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, స్కై బ్లూ, ఇంక్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్, హెరిటేజ్ ప్రేరేపిత బికనీర్ రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆగస్ట్ 21 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో తొలి సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడి, డెబిట్ కార్డులపై 5% క్యాష్ బ్యాక్ సహా లాంచ్ ఆఫర్లను పొందవచ్చు. దీంతోపాటు భీమ్ యాప్ ద్వారా చేసే చెల్లింపులపై రూ.30 వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.స్పెసిఫికేషన్లు, ఫీచర్లుటెక్నో స్పార్క్ గో 5జీ స్మార్ట్ఫోన్లో 6.76 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 670 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది.మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.50 మెగాపిక్సెల్ ఏఐ అసిస్టెడ్ ప్రైమరీ రియర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు.టెక్నోకు చెందిన "నో నెట్ వర్క్ కమ్యూనికేషన్" ఫీచర్ ను కూడా ఈ హ్యాండ్ సెస్టో ఇంటిగ్రేట్ చేశారు. ఇది మొబైల్ సర్వీస్ లేకపోయినా టెక్నో ఫోన్ల మధ్య కాల్స్, సందేశాలకు వీలు కల్పిస్తుంది.డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఈ ఫోన్లో ఉంది. ఇందు కోసం ఐపీ 64 రేటింగ్ ను కలిగి ఉంది.కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్లో 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. -
స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఈ-కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ను ఉపయోగించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీన్నిబట్టి చూస్తే.. భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.స్టార్లింక్ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT).. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుంచి భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి కావలసిన అనుమతిని పొందింది. అయితే జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా టెక్నాలజీ.. మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి కొన్ని ఆన్-ది-గ్రౌండ్ సన్నాహాలు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను కంపెనీ పూర్తి చేస్తోంది.స్టార్లింక్ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత కొత్త కస్టమర్ల ఆన్బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలను అందించడానికి ప్రస్తుతం యూఐడీఏఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టమవుతోంది.స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఈకేవైసీ చేసుకున్న యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. ఇది గృహాల్లో వినియోగించడానికి, సంస్థల్లో ఉపయోగించడానికి కూడా అనుకూలంగా ఉంటుందని.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.భారతదేశంలో స్టార్లింక్ ధరలుస్టార్లింక్ హార్డ్వేర్ ధర రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుందని అంచనా. ఇందులో శాటిలైట్ డిష్ & వై-ఫై రౌటర్ ఉన్నాయి. అయితే నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. యూజర్లు 25 Mbps నుంచి 220 Mbps మధ్య ఇంటర్నెట్ వేగాన్ని ఆస్వాదించవచ్చు. ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.ఇదీ చదవండి: రెండేళ్లకే మస్క్ కంపెనీ వీడిన 16 ఏళ్ల కుర్రాడుస్టార్లింక్ సేవలను ప్రారంభ దశలో 20 లక్షల కనెక్షన్లకు మాత్రమే పరిమితం చేశారు. అయితే పరికరాల సరఫరా కోసం భారతి ఎయిర్టెల్ & రిలయన్స్ జియోలతో ఒప్పందం కుదుర్చుకుంది. మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో స్టార్లింక్ శాటిలైట్ సేవలను ప్రారంభించనున్నారు. -
ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ఆమోదం తెలిపింది. ఓ వైపు విపక్షాలు చర్చకు పట్టుబట్టినా ఉభయ సభల్లో ఎలాంటి చర్చలేకుండానే ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. నిన్నటి పార్లమెంట్ సెషన్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడిన వారిలో సామూహిక నిరుద్యోగం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయని పేర్కొంది.ఏమిటీ బిల్లు? అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్ గేమ్స్)తోపాటు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్లైన్ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది. ఆన్లైన్ గేమ్లకు ప్రచారం చేసినవారు కూడా నేరస్తులే. ఇలాంటి గేమ్ల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్లైన్లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంక్లు లేదా ఆర్థిక సంస్థలను సైతం శిక్షిస్తారు. ఆన్లైన్ గేమ్ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేసినా నేరంగా పరిగణిస్తారు. సోషల్ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు. నైపుణ్యం లేదా అదృష్టం(చాయిప్)పై ఆధారపడిన ఏ గేమ్ అయినా నిషిద్ధమే. మన దేశంలోనే కాకుండా.. దేశ సరిహద్దుల్లో లేదా విదేశీ గడ్డపై నుంచి గేమ్లను నిర్వహించినా దోషులే అవుతారు. ఈ బిల్లు ప్రకారం.. ఆన్లైన్ గేమ్ల్లో పాల్గొన్నవారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు. డబ్బుతో సంబంధం లేదని ఈ–స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది. సమాజంలో అశాంతి తలెత్తకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బిల్లులో పొందుపర్చారు. డిజిటల్ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్ చట్టబద్ధమే అవుతాయి. ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి. ఈ–స్పోర్ట్స్కు సంబంధించి శిక్షణ, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఆన్లైన్ గేమ్లను వర్గీకరించడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి రూ.50 కోట్లతో జాతీయ స్థాయిలో గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రతిఏటా రూ.20 కోట్లు కేటాయిస్తారు. ఎలాంటి గేమ్ అనేది ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. -
మారిన రీచార్జ్ ప్లాన్లు.. ఏది చవక.. లాభదాయకం?
దేశంలోని ప్రముఖ టెలికం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్లలో ఇటీవల మార్పులు చేశాయి. కొన్ని ఎంట్రీ లెవల్ ప్లాన్లను తొలగించాయి. అయితే ఇప్పటికీ దేశంలోని ఇతర టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులకు అత్యంత చవకైన ఎంపికగా కొనసాగుతోందని బీఎన్పీ పారిబాస్ ప్లాన్ విశ్లేషణ నివేదిక తెలిపింది.మూడు ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ పాపులర్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరించాయి. ఈ క్రమంలో ఏ టెలికం కంపెనీలో రీచార్జ్ ప్లాన్లు చవకగా.. లాభదాయకంగా ఉన్నాయన్నదానిపై బీఎన్పీ పారిబాస్ విశ్లేషించింది. ఇందులో జియో ఇప్పటికీ అదే ధర పాయింట్లలో అధిక డేటా ప్రయోజనాలను అందిస్తోందని తేల్చింది.28 రోజుల ప్లాన్కు ఇప్పుడు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా మూడు కంపెనీల్లోనూ ధర రూ .299గానే ఉంది. అయితే ప్రయోజనాలపరంగా చూస్తే జియో ఇప్పటికీ అధిక డేటా బెనిఫిట్లను అందిస్తోంది. దీంతో ఎక్కువ డేటా వినియోగించే కస్టమర్లకు జియో మరింత చౌకైన ఎంపికగా నిలిచిందని నివేదిక పేర్కొంది.జియోలో అందుబాటులో ఉన్న ప్లాన్లలో, రూ .799 ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తుంది. మరోవైపు, రూ .249 ప్లాన్ ఇప్పుడు ఫిజికల్ జియో స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్లైన్లో తొలగించింది. రూ .209 వాయిస్-ఓన్లీ ప్లాన్ కేవలం మై జియో యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది.ఇక రూ .189 ప్లాన్లో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు, 2 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఇంకా రూ.209 ప్లాన్ 22 రోజుల పాటు రోజుకు 1 జీబీని అందిస్తుంది. రూ.299 ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ, రూ.349 ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 2 జీబీని అందిస్తున్నాయి. ఎయిర్టెల్, వీఐ ప్లాన్లతో పోలిస్తే జియో కస్టమర్లు నెలకు రూ.50 లబ్ధి పొందుతున్నారని నివేదిక విశ్లేషించింది.ఉదాహరణకు, రోజుకు 1.5 జీబీ, 28 రోజుల ప్లాన్ ధర జియోకు రూ .299, ఎయిర్టెల్, బీఐలు అదే ప్రయోజనం కోసం రూ .349 వసూలు చేస్తున్నాయి. అంటే జియో వినియోగదారులకు నెలకు రూ .50 ఆదా అవుతుందన్న మాట. అదేవిధంగా రోజుకు 2 జీబీ డేటా అందించే 28 రోజుల ప్లాన్కు జియో రూ.349, ఎయిర్టెల్ రూ.398, వీఐ రూ.365 వసూలు చేస్తున్నాయి. ఎయిర్టెల్తో పోలిస్తే రూ.49, వీఐతో పోలిస్తే రూ.16 చొప్పున జియో యూజర్లకు నెలకు ఆదా అవుతుంది. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 142.87 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో.. 82,000.71 వద్ద, నిఫ్టీ 33.20 పాయింట్లు లేదా 0.13 శాతం లాభంతో 25,083.75 వద్ద నిలిచాయి.ఇజ్మో లిమిటెడ్, డీపీ వైర్స్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, NAVA, బీఎఫ్ యుటిలిటీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. యూవై ఫిన్కార్ప్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హింద్ రెక్టిఫైయర్స్, బీఎస్ఈ లిమిటెడ్, మాస్టర్ ట్రస్ట్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రెండేళ్లకే మస్క్ కంపెనీ వీడిన 16 ఏళ్ల కుర్రాడు
పద్నాలుగేళ్ల వయసులోనే.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగంలో చేరిన 'కైరాన్ క్వాజీ' (Kairan Quazi) గురించి పలు సందర్భాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు కైరాన్.. మస్క్ కంపెనీ విడిచిపెట్టి న్యూయార్క్లోని సిటాడెల్ సెక్యూరిటీస్లో గ్లోబల్ ట్రేడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్గా చేరనున్నాడు.స్పేస్ఎక్స్లో రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత, కొత్త సవాళ్లను స్వీకరించడానికి.. నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త కంపెనీలో చేరుతున్నట్లు కైరాన్ క్వాజీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సిటాడెల్ సెక్యూరిటీస్ నాకు ఎంతగానో ఆసక్తికరమైన పనిని అప్పగిస్తూ పూర్తిగా కొత్త డొమైన్ను కూడా అందించిందని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: డబ్బు పేదవాళ్లను చేస్తుంది!.. రాబర్ట్ కియోసాకితొమ్మిదేళ్ల వయసులో మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటెల్ ల్యాబ్స్లో AI రీసెర్చ్ కో-ఆప్ ఫెలోగా ఇంటర్న్షిప్ పొందిన కైరాన్ క్వాజీ.. 11 సంవత్సరాల వయసులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో రీసర్చ్ ప్రారంభించాడు. 2022లో సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ Blackbird.AIలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్గా నాలుగు నెలలు పనిచేశాడు. ఆ తరువాత స్పేస్ఎక్స్లో పనిచేయడమే ఉద్దేశ్యంగా అడుగులు వేసి, అనుకున్నది సాధించాడు. -
భారత ఉత్పత్తులకు స్వాగతం.. ఆందోళన అనవసరం
అమెరికా టారిఫ్ వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఉత్పత్తులను యూఎస్ దిగుమతి చేసుకోకపోతే రష్యా అండగా ఉంటుందని ఇండియాలోని రష్యా రాయబార కార్యాలయానికి చెందిన చార్గే డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. భారత వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, రష్యా భారత దిగుమతులను సాధ్యమైనంత వరకు స్వాగతిస్తుందని, దాని గురించి ఆందోళన చెందకండంటూ భరోసానిచ్చారు. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విస్తరణకు ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు.రష్యాతో భారత ఎగుమతులు, దిగుమతుల్లో వ్యాత్యాసం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యత 59 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రష్యా మరిన్ని భారతీయ వస్తువులను దిగుమతి చేసుకోవాలనే సంకేతాలను హైలైట్ చేస్తుంది. బాబుష్కిన్ చేసిన ప్రకటన ప్రత్యామ్నాయ మార్కెట్లను కోరుకునే భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.పెరుగుతున్న వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలుభారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన సానుకూలంగా సాగిందని, ఆచరణాత్మక సహకారానికి భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ) కీలక వేదికగా పనిచేస్తుందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఇరుదేశాల నేతలు ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. అధికారికంగా తేదీని ధ్రువీకరించనప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం గురించి ఊహాగానాలు పెరుగుతున్నాయి.చమురు సరఫరాకు అంతరాయం లేదుభారత్తో చమురు వాణిజ్యానికి సంబంధించి అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా ముడి చమురు ఎగుమతులను కొనసాగిస్తుందని బాబుష్కిన్ పునరుద్ఘాటించారు. భారత్ రష్యా చమురుకు అతిపెద్ద వినియోగదారని, రష్యా అతిపెద్ద చమురు ఉత్పత్తిదారని చెప్పారు. ఏకపక్ష చర్యలు సరఫరా గొలుసులకు విఘాతం కలిగిస్తాయని, ప్రపంచ మార్కెట్లను అస్థిరపరుస్తాయన్నారు.ఆంక్షలు ఉన్నప్పటికీ..రష్యాపై పాశ్చాత్య దేశాలు ఏళ్ల తరబడి ఆంక్షలు విధించినప్పటికీ భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యం విపరీతంగా పెరిగిందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇరు దేశాల వాణిజ్యం ఏడు రెట్లు అయిందన్నారు. పరస్పర చర్చల ద్వారా వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన అన్నారు. భారత్-రష్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే టాప్ 10 చమురు కంపెనీలు -
జనరల్ మేనేజర్కు ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చిన సీఈఓ
సాధారణంగా కొన్ని సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇస్తే చాలు అనుకుంటాయి. అయితే కొన్ని కంపెనీలు జీతాలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. కంపెనీ లాభాలను పొందినప్పుడు.. ఉత్తమ పనితీరును కనపరిచిన ఉద్యోగులకు కార్లు, బైకులు వంటివి గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఇటీవల కేరళకు చెందిన ఒక కంపెనీ సీఈఓ.. జనరల్ మేనేజర్కు ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కేరళకు చెందిన MyG చైర్మన్ అండ్ ఎండీ ఏకే షాజీ.. తన జనరల్ మేనేజర్కు రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్ గిఫ్ట్ ఇచ్చాడు. జనరల్ మేనేజర్ కంపెనీ డీలర్షిప్ నుంచి బైకును తీసుకున్నాడు. సీఈఓ కొత్త బైక్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషించారు. బైక్ తీసుకునే సమయంలో వేగంగా వెళ్ళవద్దు, బాధ్యతాయుతంగా బైక్ రైడ్ చేయాలని సూచించారు.జనరల్ మేనేజర్ అపెక్స్ గ్రే కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 తీసుకున్నాడు. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.46 లక్షలు. కాలికట్లో ఆన్ రోడ్ ధర రూ. 4.41 లక్షలు.ఇదీ చదవండి: భారత్లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650కాంటినెంటల్ జీటీ 650 అనేది 650 సీసీ విభాగంలో ఎంతోమందికి నచ్చిన బైక్. ఇది 648 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 47 హార్స్ పవర్, 52 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మంచి డిజైన్, రైడర్లకు కావలసిన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. View this post on Instagram A post shared by BLUEMOUNTAINAUTOS-ROYALENFIELD (@bluemountain_autos) -
ప్రపంచంలోనే టాప్ 10 చమురు కంపెనీలు
పునరుత్పాదక ఇంధనం అభివృద్ధిపై పెట్టుబడులు పెరుగుతున్నా, సాంప్రదాయక ఇంధన వనరులకు డిమాండ్ తగ్గట్లేదు. ఇది ప్రపంచ చమురు, గ్యాస్ రంగం అపారమైన ఆర్థిక, వ్యూహాత్మక వృద్ధిని సూచిస్తోంది. ఆగస్టు 2025 నాటికి పరిశ్రమలో అత్యంత విలువైన కంపెనీగా సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని సౌదీ ఆరామ్కో 1.55 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే టాప్లో నిలిచింది. భారత్కు చెందిన ఓఎన్జీసీ 34.33 బిలియన్ డాలర్లతో 45వ స్థానంలో ఉంది. మార్కెట్ విలువ పరంగా చమురు వాణిజ్యానికి సంబంధించి ప్రపంచంలోనే టాప్ కంపెనీల గురించి కింద తెలియజేశాం.పైసమాచారం కంపెనీస్మార్కెట్క్యాప్.కామ్(ఆగస్టు 20, 2025 నాటికి) లోనిది. నిత్యం మార్కెట్ వ్యాల్యూయేషన్లను అనుసరించి క్యాపిటల్ మారుతుంటుందని గమనించాలి.భారత్ స్థానం ఇదే..ఏ భారతీయ కంపెనీ కూడా గ్లోబల్ టాప్ 10లో చోటు దక్కించుకోనప్పటికీ, భారతదేశపు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓన్జీసీ) 34.33 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్తో ప్రపంచవ్యాప్తంగా 45వ స్థానంలో ఉంది.ఇదీ చదవండి: రూ.20 వేల కోట్లు నష్టం.. అయినా తప్పట్లేదు!టాప్ 100లో ఉన్న భారతీయ కంపెనీలు..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)- 56వ స్థానంభారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)- 68వ స్థానంగెయిల్ (ఇండియా) లిమిటెడ్ - 79వ స్థానంహిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్)- 95వ స్థానం -
స్మార్ట్వాచీలకు ఏమైంది? వరుసగా మార్కెట్ డౌన్
దేశీయంగా వేరబుల్ మార్కెట్ వరుసగా అయిదో త్రైమాసికంలోనూ నెమ్మదించింది. స్మార్ట్వాచీలు, ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్ విక్రయాలు తగ్గడంతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమ్మకాలు 9.4 శాతం క్షీణించి 2.67 కోట్లకు పరిమితమయ్యాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం సరఫరా తగ్గినప్పటికీ వేరబుల్స్ సగటు విక్రయ ధర (ఏఎస్పీ) ఒక మోస్తరుగా 2.2 శాతం మేర పెరిగి 19.2 డాలర్లకు (సుమారు రూ. 1,700)కు చేరింది. 2025 ప్రథమార్థంలో వేరబుల్ డివైజ్ మార్కెట్ వార్షికంగా 6.3 శాతం తగ్గి 5.16 కోట్ల యూనిట్లకు పరిమితమైంది. ఏఎస్పీ పెద్దగా మార్పులు లేకుండా 18.7 డాలర్ల (సుమారు రూ. 1,630) స్థాయిలో కొనసాగింది. స్మార్ట్ రింగ్స్, స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ రిస్ట్బ్యాండ్స్లాంటి కొత్త రకం వేరబుల్స్కి డిమాండ్ పెరిగింది.మరిన్ని ముఖ్యాంశాలు..అమ్మకాలు 4.8 శాతం తగ్గినప్పటికీ వేరబుల్స్ మార్కెట్లో 28 శాతం వాటాతో ఇమేజిన్ మార్కెటింగ్ (బోట్ బ్రాండ్) అగ్రస్థానంలో ఉంది. 13.1 శాతం వాటాతో నాయిస్ రెండో స్థానంలో నిల్చింది. విక్రయాలు 8.6 శాతం తగ్గాయి.గోబోల్ట్ (గతంలో బోల్ట్) అమ్మకాలు 21.8 శాతం పెరిగాయి. 10.9 శాతం మార్కెట్ వాటా ఉంది. ఒప్పో, వన్ప్లస్ వాటా చెరి 8 శాతంగా, రియల్మి వాటా 6.5 శాతంగా ఉంది.ఇక స్మార్ట్వాచీల అమ్మకాలు వరుసగా ఆరో త్రైమాసికంలోనూ క్షీణించాయి. జూన్ క్వార్టర్లో 28.4 శాతం తగ్గి 66 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. మొత్తం వేరబుల్స్ మార్కెట్లో వీటి వాటా 31.5 శాతం నుంచి 24.9 శాతానికి తగ్గింది. బౌల్ట్ మినహా మిగతా అన్ని బ్రాండ్ల (నాయిస్, బోట్, టైటాన్, ఫైర్ బోల్ట్) స్మార్ట్వాచీల అమ్మకాలు తగ్గాయి.2022, 2023లో భారీగా వృద్ధి చెందిన స్మార్ట్వాచీల మార్కెట్ ప్రస్తుతం కన్సాలిడేట్ అవుతోంది. ఇయర్వేర్ కేటగిరీ స్వల్పంగ్ 1.2 శాతం తగ్గి 1.99 కోట్ల యూనిట్లకు పరిమితం అయింది. ట్రూలీ వైర్లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) సెగ్మెంట్ అమ్మకాలు 1.2 శాతం తగ్గినా, 71.2 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది. నెక్బ్యాండ్ స్టయిల్ ఇయర్వేర్ మరింతగా 16.1 శాతం మేర పడిపోయింది. ఓవర్–ది–ఇయర్ సెగ్మెంట్ అమ్మకాలు 97.4 శాతం ఎగిసి 15 లక్షల యూనిట్లకు పెరిగాయి. టీడబ్ల్యూఎస్ విభాగంలో 31.9 శాతం వాటాతో బోట్ అగ్రస్థానంలో, 14.9 శాతం వాటాతో బోల్ట్ రెండో స్థానంలో ఉన్నాయి. బోట్ అమ్మకాలు 6.9 శాతం తగ్గాయి.స్మార్ట్ రింగ్స్ విక్రయాలు 2.8 శాతం పెరిగి 75,000కు చేరాయి. అ్రల్టాహ్యూమన్, గేబిట్, ఆబో సంస్థలు సంయుక్తంగా 65 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగాయి. మెటా, లెన్స్కార్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్స్ దన్నుతో స్మార్ట్ గ్లాసెస్ అమ్మకాలు 4,000 నుంచి ఏకంగా 50,000 యూనిట్లకు పెరిగాయి. స్మార్ట్ రిస్ట్బ్యాండ్స్ విక్రయాలు 118.5 శాతం పెరిగి 83,000 యూనిట్లకు చేరాయి. ప్రధానంగా శాంసంగ్కి చెందిన ఫిట్3కి గణనీయంగా డిమాండ్ నెలకొంది. క్యూ2లో రిస్ట్బ్యాండ్స్ కేటగిరీలో శాంసంగ్ 80.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. -
క్రెడిట్ హిస్టరీ లేదని లోన్ రిజెక్ట్ చేయొచ్చా? ఆర్థిక శాఖ స్పష్టత
క్రెడిట్ స్కోర్, హిస్టరీ అనేది బ్యాంకులు, ఇతర రుణ సంస్థల నుంచి లోన్ పొందడంలో కీలకంగా మారింది. అయితే తొలిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఎలాంటి క్రెడిట్ హిస్టరీ ఉండదు. ఇలాంటి వారికి క్రెడిట్ హిస్టరీ లేదన్న కారణంతో లోన్ మంజూరు చేయకుండా రుణ సంస్థలు తిరస్కరిస్తాయన్న ఆందోళన ఉంటుంది. దీనికి సంబంధించి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఖరిని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.మొదటిసారి రుణగ్రహీతలకు క్రెడిట్ హిస్టరీ లేనందున రుణ దరఖాస్తును తిరస్కరించరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది, ఇటీవల పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి క్రెడిట్ స్కోర్ కు సంబంధించిన అనేక అంశాలను స్పష్టం చేశారు. సిబిల్ నివేదికలు, క్రెడిట్ రిపోర్టులను జారీ చేయడానికి అధీకృత ఏజెన్సీలు, మొదటిసారి రుణానికి దరఖాస్తు చేయడానికి క్రెడిట్ హిస్టరీ తప్పనిసరా వంటి వాటిపై స్పష్టత ఇచ్చారు.2025 జనవరి 6న ఆర్బీఐ విడుదల చేసిన మాస్టర్ డైరెక్షన్ ప్రకారం, అన్ని క్రెడిట్ ఇన్స్టిట్యూషన్లు (CI) తమ విధానాల్లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్బీఐ పేర్కొన్న ప్రకారం, కనీస క్రెడిట్ స్కోరు అవసరం లేదు. అంటే ఆర్బీఐ ఎలాంటి క్రెడిట్ స్కోరు నిర్దేశించలేదు. కాబట్టి బ్యాంకులు తమ సొంత వాణిజ్య పరమైన విధానాల ఆధారంగా రుణ దరఖాస్తులను పరిశీలించవచ్చు. -
కొత్త బిల్లుతో ఏటా రూ.20 వేల కోట్లు నష్టం.. అయినా తప్పట్లేదు!
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ను నిషేధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిన్నటి పార్లమెంట్ సెషన్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడిన వారిలో సామూహిక నిరుద్యోగం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయని పేర్కొంది.ఈ మేరకు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో పెరుగుతున్న నిరుద్యోగ ఆందోళనల మధ్య ఈ హామీ వచ్చింది. ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్స్ వంటి ద్రవ్యేతర విభాగాల్లో అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే మనీ గేమింగ్ను పూర్తిగా నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం 45 కోట్ల మంది భారతీయులు ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్లో నిమగ్నమయ్యారని, మొత్తంగా ఏటా రూ.20,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వ అంచనాలు సూచిస్తున్నాయి. ఇది గణనీయమైన ఆదాయాన్ని త్యాగం చేయడమే అయినా వినియోగదారుల సంక్షేమం, ఆర్థిక రక్షణే ఈ నిషేధానికి కారణమని అధికారులు చెబుతున్నారు.మనీ గేమ్స్ ఆడే వారు బాధితులే తప్పా నేరస్థులు కాదని, ఈ గేమ్స్ ప్రకటనదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఫైనాన్షియల్ ఎనేబుల్స్పై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘గేమ్ మేకర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు కేవలం మనీ గేమ్స్పైనే పని చేయరు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఇతర ఈ-స్పోర్ట్స్, సోషల్ గేమ్స్పై కూడా పనిచేస్తున్నారు. ఈ విభాగాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చాం’ అని ఆయన చెప్పారు.ఏమిటీ బిల్లు? అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్ గేమ్స్)తోపాటు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్లైన్ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది. ఆన్లైన్ గేమ్లకు ప్రచారం చేసినవారు కూడా నేరస్తులే. ఇలాంటి గేమ్ల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్లైన్లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంక్లు లేదా ఆర్థిక సంస్థలను సైతం శిక్షిస్తారు. ఆన్లైన్ గేమ్ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేసినా నేరంగా పరిగణిస్తారు. సోషల్ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు.నైపుణ్యం లేదా అదృష్టం(చాయిప్)పై ఆధారపడిన ఏ గేమ్ అయినా నిషిద్ధమే. మన దేశంలోనే కాకుండా.. దేశ సరిహద్దుల్లో లేదా విదేశీ గడ్డపై నుంచి గేమ్లను నిర్వహించినా దోషులే అవుతారు. ఈ బిల్లు ప్రకారం.. ఆన్లైన్ గేమ్ల్లో పాల్గొన్నవారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు. డబ్బుతో సంబంధం లేదని ఈ–స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది. సమాజంలో అశాంతి తలెత్తకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బిల్లులో పొందుపర్చారు. డిజిటల్ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రష్యాతో వాణిజ్యం.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరండబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్ చట్టబద్ధమే అవుతాయి. ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి. ఈ–స్పోర్ట్స్కు సంబంధించి శిక్షణ, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఆన్లైన్ గేమ్లను వర్గీకరించడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి రూ.50 కోట్లతో జాతీయ స్థాయిలో గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రతిఏటా రూ.20 కోట్లు కేటాయిస్తారు. ఎలాంటి గేమ్ అనేది ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. -
రష్యాతో వాణిజ్యం.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం
ముడిచమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య అసమతుల్యత పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. వాణిజ్యం, ఆర్థికం, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ-టీఈసీ)లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఆర్థిక పరిస్థితులను తక్షణమే పునసమీక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గత నాలుగేళ్లలో వస్తువులపరంగా ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందన్నారు. 2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 నాటికి 68 బిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు. ఏదేమైనా, ఈ వృద్ధి గణనీయమైన వాణిజ్య అసమతుల్యతతో పాటు 6.6 బిలియన్ డాలర్ల నుంచి 58.9 బిలియన్ డాలర్లకు చేరిందని, ఇది తొమ్మిది రెట్లు పెరిగిందని, దీన్ని అత్యవసరంగా పునసమీక్షించాలని కోరారు.ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంభారత్-రష్యాల మధ్య ప్రత్యేకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ వాణిజ్య అంతరాన్ని పరిష్కరించడమే కాకుండా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు జైశంకర్ రోడ్ మ్యాప్ను రూపొందించారు. టారిఫ్, నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించడం, నిరంతర లాజిస్టిక్స్ అడ్డంకులను పరిష్కరించడం, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (ఐఎన్ఎస్టీసీ), ఉత్తర సముద్ర మార్గం, చెన్నై-వ్లాదివోస్తోక్ సముద్ర కారిడార్ వంటి వ్యూహాత్మక వాణిజ్య మార్గాల ద్వారా కనెక్టివిటీని పెంచడం వంటి కీలక ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.చెల్లింపు యంత్రాంగాలను క్రమబద్ధీకరించాలని, భారత్-యురేషియన్ ఎకనమిక్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ)పై చర్చలను వేగవంతం చేయాలని జైశంకర్ సూచించారు. ఆయన ప్రస్తుత పర్యటనలో ఈ ఎఫ్టీఏకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడం గమనార్హం. ఈ ప్రయత్నాలు అసమతుల్య వాణిజ్యాన్ని పెంచడానికి సహాయపడటమే కాకుండా 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల సవరించిన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సాధించడానికి చేరువ చేస్తుందని నమ్ముతున్నారు.రష్యా కంపెనీలకు ‘మేక్ ఇన్ ఇండియా’ మార్గాలుశరవేగంగా మారుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని జైశంకర్ రష్యన్ పరిశ్రమలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో పాటు పట్టణీకరణ, భారతీయ వినియోగదారుల పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త వాణిజ్య మార్గాలను తెరతీయాలని చెప్పారు. రష్యన్ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలి -
ఆటోమొబైల్ దిగ్గజంగా నంబర్ 1 స్థానానికి భారత్
భారత ఆటోమొబైల్ పరిశ్రమను వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో నంబర్ 1గా మారుస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈఐసీఐ, కేపీఎంజీ నివేదికను ఆవిష్కరించిన సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. భారత ఆటో పరిశ్రమ విలువ ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లుగా ఉందన్నారు.2014లో తాను రవాణా శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పరిశ్రమ పరిమాణం రూ.7.5 లక్షల కోట్లుగానే ఉన్నట్టు గుర్తు చేశారు. అమెరికా ఆటో రంగం విలువ రూ.78 లక్షల కోట్లుగా ఉంటే, చైనా ఆటోరంగం విలువ రూ.47 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను మార్చాలన్నది ప్రధాని మోదీ లక్ష్యమన్నారు.ఈ లక్ష్య సాధనాల్లో లాజిస్టిక్స్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జీడీపీలో లాజిస్టిక్స్ వ్యయాలు 16 శాతంగా ఉంటే 10 శాతానికి తగ్గించగలిగినట్టు చెప్పారు. త్వరలో సింగిల్ డిజిట్కు తీసుకొస్తామని ప్రకటించారు. -
బంగారం, వెండి ధరలు.. ఒక్కసారిగా రివర్స్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి ధరలు.. ఒక్కసారిగా రివర్స్ అయ్యాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఈపీఎఫ్వో ‘కొత్త’ రికార్డ్..
ఉద్యోగుల భవిష్య నిధి.. ఈపీఎఫ్వోకు జూన్లో నికరంగా 21.89 లక్షలమంది సభ్యులు కొత్తగా జత కలిశారు. ఇది సరికొత్త రికార్డ్కాగా.. వార్షికంగా 13.5 శాతం వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే ఈ సంఖ్య 9.15 శాతం బలపడింది. కార్మిక శాఖ వెల్లడించిన ప్రొవిజనల్ గణాంకాలివి. వీటి ప్రకారం 2018 ఏప్రిల్లో ఈపీఎఫ్వో పేరోల్ గణాంకాల విడుదల ప్రారంభించాక గరిష్టస్థాయిలో సభ్యులు జత కలడం గమనార్హం!ఉద్యోగ అవకాశాలు పుంజుకోవడం, ఉద్యోగ లబ్దిపై అవగాహన పెరగడానికితోడు ఈపీఎఫ్వో ప్రభావవంత కార్యక్రమాలు ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ పేర్కొంది. కాగా.. 2025 జూన్లో 10.62 లక్షలమంది కొత్త సబ్ర్స్కయిబర్లు ఎన్రోల్ అయ్యారు. 2025 మేతో పోలిస్తే 12.7 శాతం అధికంకాగా.. వార్షికంగా 3.6 శాతం వృద్ధి ఇది. వీరిలో 18–25 మధ్య వయసు కలిగినవారి సంఖ్య 6.39 లక్షలమంది. అంటే 60 శాతానికిపైగా వాటా వీరిదే.ఈ గ్రూపులో నికర పేరోల్ జమలు 9.72 లక్షలుగా నమోదైంది. ఇంతక్రితం వైదొలగినవారు సుమారు 16.93 లక్షలమంది 2025 జూన్లో ఈపీఎఫ్వోకు జత కలిశారు. ఈ కాలంలో 3.02 లక్షలమంది మహిళలు ఈపీఎఫ్వో కొత్త సబ్స్కయిబర్లుగా చేరారు. 2025 మే నెలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. నికర పేరోల్ జమల్లో మహిళల సంఖ్య 4.72 లక్షలుగా నమోదైంది. రాష్ట్రాలవారీగా పేరోల్ గణాంకాలు చూస్తే 20 శాతంతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితరాలు 5 శాతం చొప్పున వాటా ఆక్రమించాయి.ఇదీ చదవండి: ఉమాంగ్ యాప్లో యూఏఎన్.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్ -
వరుసగా ఐదు సెషన్ల నుంచి మార్కెట్లో లాభాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గడిచిన ఐదు సెషన్ల నుంచి మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ రోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,079కు చేరింది. సెన్సెక్స్(Sensex) 129 ప్లాయింట్లు పుంజుకుని 81,991 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫండ్స్ విదేశీ ఆస్తుల్లో క్షీణత
మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని విదేశీ పెట్టుబడుల (విదేశీ స్టాక్స్, ఇతర సెక్యూరిటీల్లో) విలువ గత ఆర్థిక సంవత్సంలో 5.6 శాతం తగ్గి 8.3 బిలియన్ డాలర్లుగా (రూ.72,210 కోట్లు సుమారు) ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2024 మార్చి నాటికి మ్యూచువల్ ఫండ్స్ విదేశీ నిర్వహణ ఆస్తుల విలువ 8.81 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం చివరికి ఫండ్స్ నిర్వహణలోని యూఎస్ ఈక్విటీల విలువ 3.9 శాతం తగ్గి రూ.44,500 కోట్లుగా ఉన్నట్టు ఆర్బీఐ వార్షిక సర్వే నివేదిక తెలిపింది.ఐర్లాండ్, తైవాన్లోని పెట్టుబడుల విలువ సైతం ఇదే మాదిరి తగ్గింది. భారత మ్యూచువల్ ఫండ్స్ సంస్థల విదేశీ పెట్టుబడుల్లో 95 శాతం యూఎస్, లగ్జెంబర్గ్, ఐర్లాండ్లోనే ఉన్నట్టు ఆర్బీఐ డేటా తెలియజేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన వాణిజ్య విధానాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు నెలకొనడం తెలిసిందే. ఇక గత ఆర్థిక సంవత్సరంలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పథకాల్లోని పెట్టుబడులు 25 శాతం పెరిగి రూ.29.45 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెబుతూ.. స్థానిక మార్కెట్పై ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగినట్టు వివరించింది.ఇదీ చదవండి: పీఎస్యూ బ్యాంక్ చీఫ్లతో ఆర్థిక శాఖ సమావేశంగత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ విదేశీ చెల్లింపుల బాధ్యతలు 20 శాతం పెరిగి 30.5 బిలియన్ డాలర్లకు చేరాయని.. ప్రవాస భారతీయుల పెట్టుబడులు పెరగడం వల్లేనని వివరించింది. భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో యూఏఈలోని ఎన్ఆర్ఐల పెట్టుబడులు రూ.52,549 కోట్లకు చేరాయి. ఫండ్స్ ఆస్తుల్లో యూఏఈ, యూఎస్ఏ, యూకే, సింగపూర్ ఎన్ఆర్ఐల వాటా అధికంగా ఉంది. -
పీఎస్యూ బ్యాంక్ చీఫ్లతో ఆర్థిక శాఖ సమావేశం
ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం.నాగరాజు అధ్యక్షతన ఆర్థిక శాఖ మూడు గంటలపాటు సమావేశం నిర్వహించింది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో బ్యాంకుల ఆర్థిక ఫలితాలపై సమీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఉత్పాదక రంగాలకు రుణాల విడుదలను పెంచవలసిందిగా బ్యాంకుల ఎండీలు, సీఈవోలను నాగరాజు కోరినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలిబ్యాంకింగ్ పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో రూ. 44,218 కోట్ల నికర లాభం ఆర్జించాయి. వార్షికంగా ఇది 11 శాతం వృద్ధికాగా.. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 39,974 కోట్ల లాభం ఆర్జించాయి. ఈ ఏడాది క్యూ1లో ప్రభుత్వ బ్యాంకులు ఆర్జించిన రూ. 44,218 కోట్ల లాభాల్లో కేవలం ఎస్బీఐ 43 శాతం వాటా ఆక్రమించడం విశేషం! -
ఐపీవోకు 5 కంపెనీలు రెడీ
ఇటీవల జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా ఐదు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు దారి ఏర్పడింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ జాబితాలో ఇన్నోవేటివ్యూ ఇండియా, పార్క్ మెడీ వరల్డ్, రన్వాల్ ఎంటర్ప్రైజెస్, జిన్కుషాల్ ఇండస్ట్రీస్, అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ చేరాయి. ఈ కంపెనీలు 2025 ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ మెయిన్బోర్డులో 48 కంపెనీలు లిస్ట్కావడం గమనార్హం! ఈ నెలలో ఇప్పటివరకూ 11 కంపెనీలు ఐపీవోకురాగా.. వచ్చేవారం మరికొన్ని కంపెనీల ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇష్యూల వివరాలు చూద్దాం..సెక్యూరిటీ సొల్యూషన్లుభద్రతా, నిఘా(సెక్యూరిటీ, సర్వెలెన్స్) సొల్యూషన్లు అందించే ఇన్నోవిటివ్యూ ఇండియా ఐపీవోకు రానుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా పూర్తిగా ప్రమోటర్లకు చేరనున్నాయి.ఆసుపత్రుల చైన్ఆరోగ్యపరిరక్షణ రంగ సంస్థ పార్క్ మెడి వరల్డ్ ఐపీవో చేపట్టనుంది. పార్క్ బ్రాండ్తో ఆసుపత్రులను నిర్వహిస్తున్న కంపెనీ తద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించనుంది. వీటిలో కొత్తగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 900 కోట్లు సమకూర్చుకోనుండగా.. ప్రమోటర్ అజిత్ గుప్తా రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు(కొత్త ఆసుపత్రుల ఏర్పాటు), పరికరాల కొనుగోలుకి వెచి్చంచనుంది. అనుబంధ సంస్థలు పార్క్ మెడిసిటీ(ఎన్సీఆర్), బ్లూహెవెన్స్ విస్తరణకు సైతం నిధులు వెచ్చించనుంది.రియల్టీ సంస్థఐపీవోకు రానున్న రియల్టీ అభివృద్ధి సంస్థ రన్వాల్ ఎంటర్ప్రైజెస్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 200 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 450 కోట్లు అనుబంధ సంస్థలలో పెట్టుబడులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను భవిష్యత్ రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మెషీన్ల కంపెనీచత్తీస్గఢ్కు చెందిన మెషీన్ల ఎగుమతి కంపెనీ జిన్కుషాల్ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా 86.5 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 10 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.ఆగ్రోకెమికల్జైపూర్ సంస్థ అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇలా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్తోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. డిజిటల్ రుణాల ప్లాట్ఫామ్డిజిటల్ రుణాల ప్లాట్ఫామ్ కిస్త్ మాతృ సంస్థ ఆన్ఈఎంఐ టెక్నాలజీ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 88.79 లక్షల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 750 కోట్లు అనుబంధ సంస్థ సై క్రెవా మూలధన పటిష్టతకు కేటాయించనుంది. తద్వారా భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2016లో ప్రారంభమైన కంపెనీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వేగవంత, సులభతర క్రెడిట్ సొల్యూషన్లు అందిస్తోంది. ప్రధానంగా యువతపై దృష్టిసారించింది. 2025 మార్చి31కల్లా 5.32 కోట్ల రిజిస్టర్డ్ యూజర్లను కలిగి ఉంది. 91 లక్షలకుపైగా కస్టమర్లకు సేవలు సమకూర్చింది. రూ. 4,087 కోట్ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,337 కోట్ల ఆదాయం, రూ. 161 కోట్ల నికర లాభం ఆర్జించింది.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలి -
ఐదో రోజూ అదే జోరు
ముంబై: ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించడంతో స్టాక్ సూచీలు ఐదో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 213 పాయింట్లు పెరిగి 81,858 వద్ద నిలిచింది. నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 25,051 వద్ద స్థిరపడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 341 పాయింట్లు పెరిగి 81,985 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 25,089 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో ఐటీ 3%, టెక్ 2.22%, ఎఫ్ఎంసీజీ 1.36%, రియల్టి, టెలికమ్యూనికేషన్ 0.68% రాణించాయి. మిడ్, స్మా ల్ క్యాప్ సూచీలు 0.39%, 0.30% పెరిగాయి. బ్యాంకులు, చమురు, ఫైనాన్స్ సర్విసెస్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ⇒ ఆన్లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు డీలాపడ్డాయి. రియల్ మనీ గేమింగ్ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధం లేదంటూ కంపెనీ వివరణ ఇచ్చినప్పట్టకీ.., నజరా టెక్నాలజీస్ షేరు 13% పతనమై రూ.1,222 వద్ద స్థిరపడింది. ఆన్మొబైల్ గ్లోబల్స్ షేరు 3.53% నష్టపోయి రూ.53.27 వద్ద నిలిచింది. ⇒ రీగల్ రిసోర్సెస్ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.102)తో పోలిస్తే 39% ప్రీమియంతో రూ.142 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 43% ఎగసి రూ.146 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29% లాభంతో రూ.132 వద్ద ముగిసింది. కంపెనీ మార్కె ట్ విలువ రూ.1,352 కోట్లుగా నమోదైంది. -
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీకి గుడ్బై!
న్యూఢిల్లీ: వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయింపునివ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై దాదాపు అన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. బీమాపై వివిధ రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన 13 సభ్యుల బృందం (జీవోఎం) ఈ ప్రతిపాదనపై చర్చించింది. జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాలు కంపెనీలకు కాకుండా కస్టమర్లకు బదిలీ అయ్యేలా తగు విధానాన్ని రూపొందించాలని జీఎస్టీ కౌన్సిల్ను కోరినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.వ్యక్తిగత బీమా పాలసీలకు జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వడం వల్ల ఏటా రూ. 9,700 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనాలు ఉన్నాయని వివరించారు. మంత్రుల అభిప్రాయాలు, అభ్యంతరాలను పొందుపర్చిన నివేదికను జీఎస్టీ కౌన్సిల్కి సమర్పించనున్నట్లు బీమాపై జీవోఎం కన్వీనరు, బిహార్ డిప్యుటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. అక్టోబర్ ఆఖరు నాటికి జీవోఎం తుది నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. 2023–24లో కేంద్రం, రాష్ట్రాలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై రూ. 8,263 కోట్లు, హెల్త్ రీఇన్సూరెన్స్ ప్రీమియంపై రూ. 1,484 కోట్లు జీఎస్టీ రూపంలో సమీకరించాయి. -
లక్షల ఉద్యోగాలకు ముప్పు!!
న్యూఢిల్లీ: రియల్ మనీ గేమ్స్ అన్నింటిపైనా నిషేధం విధించే బిల్లుపై పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల లక్షల కొద్దీ ఉద్యోగాలు, వేల కోట్ల పెట్టుబడులకు విఘాతం ఏర్పడుతుందని తెలిపాయి. కోట్ల మంది యూజర్లు చట్టవిరుద్ధమైన విదేశీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫాంల వైపు మళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ఈ బిల్లు విషయంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేశాయి. యూజర్లు, పరిశ్రమను పరిరక్షిస్తూ బాధ్యతాయుతమైన గేమింగ్కి తోడ్పడే పరిష్కార మార్గాలపై చర్చించేందుకు, తమ అభిప్రాయాలను కూడా తెలిపేందుకు సమావేశమయ్యే అవకాశం కల్పించాలని కోరాయి.ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఈ–గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) ఈ నెల 19న సంయుక్తంగా ఆయనకు లేఖ రాశాయి. దీని ప్రకారం .. దాదాపు రూ. 2 లక్షల కోట్ల వేల్యుయేషన్, రూ. 31,000 కోట్ల వార్షికాదాయంతో ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో ఏటా రూ. 20,000 కోట్ల ఆదాయం సమకూరుస్తోంది.20 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2028 నాటికి పరిశ్రమ రెట్టింపు స్థాయికి చేరనుంది. 2022 జూన్ వరకు పరిశ్రమలోకి రూ. 25,000 కోట్ల వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. దేశీయంగా 2020లో 36 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమర్స్ సంఖ్య 2024 నాటికి 50 కోట్లకు చేరింది. వేల కొద్దీ స్టార్టప్లు, యువ ఇంజనీర్లు, కంటెంట్ క్రియేటర్లు ఈ వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు. యూజర్లకు కూడా హాని.. చట్టబద్ధమైన, పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమపై గంపగుత్తగా నిషేధం విధించడం వల్ల దేశీ యూజర్లకు, పౌరులకు పెను హాని జరుగుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నిషేధం వల్ల పెట్టుబడులు నిల్చిపోయి, ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింటుందని.. 400 పైగా కంపెనీలు మూతబడే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. డిజిటల్ ఆవిష్కర్తగా భారత్ స్థానం కూడా బలహీనపడుతుందని వివరించాయి. ‘ఈ బిల్లు ఆమోదం పొందితే యూజర్లు, పౌరులకు తీవ్ర హాని జరుగుతుంది. నియంత్రణల పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న, బాధ్యతాయుత దేశీ ప్లాట్ఫాంలను మూయించి, కోట్ల మంది ప్లేయర్లను చట్టవిరుద్ధ మట్కా నెట్వర్క్లు, ఆఫ్షోర్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు, రాత్రికి రాత్రి పారిపోయే మోసపూరిత ఆపరేటర్ల వైపు మళ్లించినట్లవుతుంది‘ అని పేర్కొన్నాయి. ప్రజలకు రూ. 20 వేల కోట్ల నష్టం: ప్రభుత్వ అంచనాలు ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ వల్ల, ఏటా 45 కోట్ల మంది దాదాపు రూ. 20,000 కోట్లు నష్టపోతున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. సమాజానికి ఇది పెను సమస్యగా మారిందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని కోల్పోయినా సరే ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే రియల్ మనీ గేమింగ్ని నిషేధించాలన్న నిర్ణయం తీసుకుందని వివరించాయి.గత మూడున్నరేళ్లుగా పరిశ్రమను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, రియల్ మనీ గేమింగ్ సంస్థలు వాటిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నాయి. అయితే, ఆన్లైన్ గేమ్స్ అన్నింటిపైనా నిషేధం ఉండదని .. ఈస్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్స్ని ప్రమోట్ చేసేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయని ఒక అధికారి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్, స్కీములు మొదలైనవి ఉంటాయని వివరించారు. దీనితో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో ఉద్యోగావకాశాలు వస్తా యని పేర్కొన్నారు. -
సేమ్ షాక్: ఎయిర్టెల్లోనూ ఆ ప్లాన్ కనుమరుగు
టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ తన ఎంట్రీ సెగ్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ను నిలిపివేసింది. ప్రత్యర్థి సంస్థ జియో కూడా రూ.249 ధర గల ఎంట్రీ లెవల్ ప్లాన్ ను నిలిపివేసింది. ఎక్కువ మంది రీచార్జ్ చేసుకునే ఈ ప్లాన్ ను ఎయిర్టెల్ నిశ్శబ్దంగా కనుమరుగు చేసింది. ఇప్పుడు వారు రూ .299 ధర గల ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎంచుకోవలసి వచ్చింది.ఎయిర్ టెల్ నిలిపివేసిన ఈ ప్లాన్ ధర రూ.249. ఇది 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను అందించేది. ముఖ్యంగా, ఇది వినియోగదారులకు ఉచిత హలోట్యూన్స్, ప్రో ఏఐ, ఎక్స్ట్రీమ్ ప్లే వంటి ప్రయోజనాలను కల్పించేది. 28 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటాను అందించే రూ.249 ప్లాన్ ను జియో కూడా ఇటీవల తొలగించింది. జియోలో ఇకపై 1 జీబీ రోజువారీ డేటా లిమిట్తో ఎలాంటి ప్లాన్ లేదు. చౌకైన 28 రోజుల ప్లాన్ ఇప్పుడు రూ .299 నుండి ప్రారంభమవుతుంది. ఇది రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుంది.ఈ చర్య ఎయిర్ల్, జియోలకు సగటు వినియోగదారుడి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుతుండగా, సామాన్యులపై ఖరీదైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల భారం పడుతోంది. ఈ రెండు టెలికాం ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రైవేట్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా కూడా అనుసరించే అవకాశం ఉంది. -
ఫ్యామిలీకంతా రూ.కోటి ఉన్నా చాలు.. హెచ్డీఎఫ్సీ కొత్త ఆప్షన్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన ప్రీమియం “ఇంపీరియా” ప్రోగ్రామ్కు సంబంధించి కొత్త అర్హత ప్రమాణాన్ని ప్రకటించింది. అక్టోబర్ 1, 2025 నుంచి, కస్టమర్లు రూ.1 కోటి “టోటల్ రిలేషన్షిప్ వాల్యూ (TRV)” ఆధారంగా కూడా ఈ ప్రోగ్రామ్కు అర్హత పొందవచ్చు. ఇది వ్యక్తిగత ఖాతాలకే కాకుండా, కుటుంబ సభ్యులు లేదా బిజినెస్ గ్రూప్లతో కలిపి ఉన్న మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.ఇంతకు ముందు హెచ్డీఎఫ్సీ ఇంపీరియా ప్రోగ్రామ్లో టీఆర్వీ ఆధారంగా అర్హత పొందాలంటే, రూ.1 కోటి విలువను వ్యక్తిగత ఖాతా స్థాయిలో నిర్వహించాల్సి ఉండేది. అంటే, ఒక కస్టమర్కి చెందిన సేవింగ్స్, ఎఫ్డీ, పెట్టుబడులు, లోన్లు, డీమాట్, ఇన్సూరెన్స్ ప్రీమియం మొదలైనవి కలిపి రూ.1 కోటి టీఆర్వీ ఉండాలి. తాజా మార్పు ప్రకారం.. గ్రూప్ స్థాయిలో రూ.1 కోటి టీఆర్వీ ఉంటే సరిపోతుంది. కుటుంబ సభ్యులు లేదా బిజినెస్ ఎంటిటీల ఖాతాలు కలిపి ఈ విలువ చేరవచ్చు.టీఆర్వీ కాకుండా ఇతర అర్హత మార్గాల ద్వారా హెచ్డీఎఫ్సీ ఇంపీరియా ప్రోగ్రామ్లో చేరాలంటే కరెంట్ ఖాతాలో రూ.15 లక్షల సగటు త్రైమాసిక బ్యాలెన్స్ నిర్వహించాలి. అదే సేవింగ్స్ ఖాతాలో అయితే రూ.10 లక్షల సగటు నెలవారీ బ్యాలెన్స్ ఉండాలి. ఎఫ్డీ, సేవింగ్స్, కరెంట్ ఖాతాలన్నీ కలిపి అయిఏత రూ.30 లక్షల సగటు బ్యాలెన్స్ ఉండాలి. హెచ్డీఎఫ్సీ కార్పొరేట్ ఖాతాల్లో రూ.3 లక్షల పైగా నెలవారీ జీతం జమయ్యేవారికి కూడా ఇంపీరియా ప్రోగ్రామ్ ప్రయోజనాలు లభిస్తాయి.ఇంపీరియా ప్రోగ్రామ్.. దాని ప్రయోజనాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇంపీరియా ప్రోగ్రాం అనేది హై-వ్యాల్యూ కస్టమర్ల కోసం రూపొందించిన ప్రీమియం బ్యాంకింగ్ సేవల ప్యాకేజీ. దీని ముఖ్యమైన ప్రయోజనాలు కస్టమర్కు ప్రత్యేకత, ప్రాధాన్యత, ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తాయి.ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్:వ్యక్తిగతంగా సేవలు అందించే రిలేషన్షిప్ మేనేజర్పెట్టుబడులు, లోన్లు, ఇన్సూరెన్స్ వంటి అంశాల్లో గైడెన్స్వెల్త్ అడ్వయిజరీ సేవలు:ఫైనాన్షియల్ ప్లానింగ్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా సలహాలుఉచిత, తగ్గింపు సేవలు:చెక్బుక్, స్టాప్ పేమెంట్, ఇంటర్-బ్రాంచ్ ట్రాన్స్ఫర్ వంటి సేవలు ఉచితంమొదటి లాకర్ ఉచితం, రెండవది 50% తగ్గింపుప్రాధాన్యత ధరలు:ఫారెక్స్ ట్రాన్సాక్షన్లు, లోన్లు, ఎఫ్డీలు, ఇతర ఉత్పత్తులపై ప్రత్యేక రేట్లుప్రత్యేక ఆఫర్లు, ప్రోమోషన్లు:హెచ్డీఎఫ్సీ భాగస్వామ్య బ్రాండ్స్ వద్ద క్యాష్ బ్యాక్లు, రివార్డ్ పాయింట్లు, రివార్డ్పాయింట్లు, లైఫ్స్టైల్ బెనిఫిట్లు -
లైఫ్ సైన్సెస్లో తెలంగాణ ఘనత
హైదరాబాద్: ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఆధిపత్యాన్ని చాటుతూ గడిచిన ఏడాదిలోనే రూ.54,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంలో టాప్ 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో స్థానం సంపాదించుకుంది. ఇలా ఘనత చాటిన భారతదేశం నుంచి ఏకైక నగరంగా నిలిచింది.ఈ పెట్టుబడులు ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, సెల్ & జీన్ థెరపీ, మెడికల్ డివైసెస్, వ్యాక్సిన్లు, డిజిటల్ హెల్త్ వంటి విభాగాల్లో వచ్చాయి. ఈ పెట్టుబడులు 2 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించే వీలుంది. ఈ క్రమంలో లైఫ్ సైన్సెస్ రంగంలో పురోగతిపై తాజాగా జరిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ బోర్డు సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు.ఇన్నోవేషన్ ఆధారిత లైఫ్ సైన్సెస్ కు తెలంగాణ ప్రపంచ కేంద్రంగా అవతరించిందని, ప్రస్తుతం 2000 లైఫ్ సైన్సెస్ కంపెనీలకు నిలయంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టాప్ 7 గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా హైదరాబాద్ ఆవిర్భవించడం తెలంగాణ ప్రగతిశీల విధానాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, టాలెంట్ రిచ్ ఎకోసిస్టమ్ ప్రత్యక్ష ఫలితం అన్నారు. ప్రతిపాదిత లైఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ గా ప్రపంచస్థాయి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. -
లగేజ్తో రైలు ఎక్కుతున్నారా? ఇక కొత్త రూల్స్
ఇండియన్ రైల్వే ప్రయాణికుల లగేజీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రైళ్లలో సామానుపై ఉన్న నిబంధనలు సడలింపుగా ఉండటంతో, ప్రయాణికులు అధిక బరువు, పెద్ద పరిమాణం ఉన్న బ్యాగులతో ప్రయాణిస్తున్నారు. ఇది రైలు బోర్డింగ్ సమయంలో రద్దీ పెరగడానికి, ప్రయాణికుల అసౌకర్యానికి, భద్రతా సమస్యలకు దారితీస్తోంది.ఈ నేపథ్యంలో, విమానాశ్రయాల్లో అమలవుతున్న తరహాలోనే, రైల్వే కొన్ని ప్రధాన స్టేషన్లలో సామానుపై పరిమితులు ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రయాగ్రాజ్, మిర్జాపూర్, కాన్పూర్, అలీగఢ్ జంక్షన్ స్టేషన్లలో తొలుత ఈ నిబంధలను అమలు చేయనున్నారు. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు తమ సామానును ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్ల ద్వారా తూకం చేయించాల్సి ఉంటుంది. ఉచిత పరిమితికి మించి బరువు ఉంటే, అదనపు చార్జీలు విధిస్తారు. పరిమాణం ఎక్కువగా ఉండి బరువు తక్కువగా ఉన్న బ్యాగులపై కూడా ప్రత్యేక ఫార్ములా ద్వారా చార్జీలు లెక్కించనున్నారు. ఉచిత సామాను పరిమితి ప్రయాణ తరగతిని బట్టి మారుతుంది. ఉచిత పరిమితికి మించి బరువు ఉంటే ‘ఎల్’ స్కేల్పై 1.5 రెట్లు చార్జీలు విధిస్తారు. కనీస చార్జీ రూ.30, కనీస బరువు 10 కిలోలు, కనీస దూరం 50 కిలోమీటర్లు. 5–12 ఏళ్ల పిల్లలకు ఉచిత లగేజీ పరిమితిలో సగం, గరిష్టంగా 50 కేజీల వరకూ అనుమతి ఉంటుంది. పెద్ద పరిమాణం ఉన్న బ్యాగులు, బోర్డింగ్ స్పేస్ను ఆక్రమించేలా ఉంటే జరిమానా విధిస్తారు. స్కూటర్లు, సైకిళ్లు వంటి వస్తువులకు ఉచిత పరిమితి వర్తించదు.ప్రయాణ తరగతుల వారీగా ఉచిత సామాను పరిమితిప్రయాణ తరగతిగరిష్ట పరిమితిఉచిత పరిమితిఅదనపు ఛార్జీతో అనుమతించేదిఏసీ ఫస్ట్ క్లాస్150 కిలోలు70 కిలోలు15 కిలోలుఏసీ 2-టయర్ / ఫస్ట్ క్లాస్100 కిలోలు50 కిలోలు10 కిలోలుఏసీ 3-టయర్ / చైర్ కార్40 కిలోలు40 కిలోలు10 కిలోలుస్లీపర్ క్లాస్ (ఎక్స్/ఆర్డినరీ)80 కిలోలు40 కిలోలు10 కిలోలుసెకండ్ క్లాస్ (ఎక్స్/ఆర్డినరీ)70 కిలోలు35 కిలోలు10 కిలోలురైళ్లలో లగేజీ పరిమితికి సంబంధించి నిబంధనలు ఇదివరకే ఉన్నాయని, అయితే వాటి అమలు విషయంలో రైల్వే కఠినంగా వ్యవహరించేది కాదని అధికారులు చెబుతున్నారు. “లగేజీ నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి. వాటి అమలును పర్యవేక్షించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చాం” అని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ తగ్గించటం, బోర్డింగ్ సౌలభ్యం పెంచటం, రైళ్లలో భద్రత మెరుగుపరచటం ఈ చర్యల లక్ష్యంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: రైలు టికెట్లు రయ్మని బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వస్తోంది -
ఆ ఫీచర్ బంద్: గూగుల్ పే, ఫోన్పే.. యాప్లలో కీలక మార్పు
యూపీఐ మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 ‘పేమెంట్ రిక్వెస్ట్’ ఫీచర్ను నిలిపివేయాలని నిర్ణయించింది. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లలో ఈ మార్పు అమలులోకి రానుంది.మోసాల వెనుక ఉన్న మెకానిజం‘పేమెంట్ రిక్వెస్ట్’ అనే ఫీచర్ను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తూ, డబ్బు పంపుతున్నట్టు చూపించి, వినియోగదారుల నుంచి డబ్బు తీసుకుంటున్నారు. ఓఎల్ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో వాడుక వస్తువుల కొనుగోలు సందర్భాల్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వినియోగదారులు డబ్బు వస్తుందనుకుని, రిక్వెస్ట్ను అంగీకరించడం వల్ల వారి ఖాతాల్లోని డబ్బు మోసగాళ్లకు చేరుతోంది.యాప్లు అప్డేట్ చేసుకోవాలి..ఎన్పీసీఐ ఆదేశాల మేరకు, అక్టోబర్ 2 నుంచి ఈ ఫీచర్ను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా యూపీఐ యాప్లు తమ సిస్టమ్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు డిజిటల్ లావాదేవీల భద్రతను పెంచే దిశగా కీలక అడుగులుగా ఎన్పీసీఐ భావిస్తోంది.ఇదీ చదవండి: రైలు టికెట్లు రయ్మని బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వస్తోంది -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. నిఫ్టీ మళ్లీ 25000 మార్క్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ దాదాపు నెల రోజుల విరామం తర్వాత 25,000 మార్కును తిరిగి పొందగలిగింది. ఈ సూచీ చివరిసారిగా జూలై 24న 25,000 మార్క్ పైన ముగిసింది. నేడు ఐటీ షేర్లలో బలమైన లాభాలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి 25,089కు ఎగబాకి, చివరకు 70 పాయింట్లు లేదా 0.3 శాతం లాభంతో 25,050 స్థాయిల వద్ద స్థిరపడింది. ఈ క్రమంలోనే నిఫ్టీ వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో 563 పాయింట్లు లాభపడింది.బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్లు (0.3 శాతం) లాభపడి 81,858 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్ దాదాపు 4 శాతం లాభపడి రూ.1,495 స్థాయికి చేరుకోగా, ఒక్క ఇన్ఫోసిస్ మాత్రమే 165 పాయింట్లు లాభపడింది. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కూడా 1-3 శాతం మధ్య లాభాల్లో ముగిశాయి. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటివరకు దీర్ఘకాలంగా పనితీరు కనబరచకపోవడంతో విలువ కొనుగోళ్లు లాభపడటానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.బీఎస్ఈ సెన్సెక్స్లో హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) 2 శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ కూడా 1 శాతానికి పైగా క్షీణించాయి. విస్తృత సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్క్యాప్ 0.3 శాతం పెరిగాయి.రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 2.6 శాతం, రియల్టీ ఇండెక్స్ 1 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 1,718 షేర్లు క్షీణించగా, 2,347 షేర్లు లాభపడ్డాయి. అన్ని రకాల ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ)ను నిషేధించే ముసాయిదా బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించడంతో వ్యక్తిగత షేర్లలో నజారా టెక్నాలజీస్ 13 శాతం నష్టపోయింది. -
బోనస్ వస్తుందోచ్.. ఇన్ఫీ ఉద్యోగులకు శుభవార్త
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికానికి (Q1 FY2025-26) సంబంధించిన పనితీరు బోనస్ లెటర్లను జారీ చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు బలంగా ఉండటంతో ఉద్యోగులకు కూడా మెరుగైన బోనస్ను ప్రకటించింది.2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు సగటున 80% పనితీరు బోనస్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. గత త్రైమాసికంలో ఇచ్చిన 65% సగటు బోనస్ చెల్లింపుతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించిన ఈ బోనస్ ఆగస్టు నెల జీతంతో పాటు ఉద్యోగులకు అందనుంది.ఉద్యోగులు తమ పనితీరు రేటింగ్ ఆధారంగా 75% నుండి 89%వరకు బోనస్ పొందారు. ఈ బోనస్ చెల్లింపు లెవెల్ 4, 5, 6 స్థాయిల్లో ఉన్న (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లు) 3.23 లక్షల మందికి పైగా ఉద్యోగులను కవర్ చేస్తుంది. పనితీరు విషయంలో ఉద్యోగులను మూడు కేటగిరీలుగా వర్గీకరించి బోనస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఇన్ఫోసిస్ 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి బలమైన ఆర్థిక ఫలితాలు సాధించింది. రూ.6,921 కోట్ల నికర లాభం (వార్షిక ప్రాతిపదికన 8.7% వృద్ధి), రూ.42,279 కోట్ల ఆదాయం (వార్షిక ప్రాతిపదికన 7.5% వృద్ధి) నమోదు చేసి, విశ్లేషకుల అంచనాలను అధిగమించింది.ఇదీ చదవండి: ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్ -
రైతుకు చేదోడుగా మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్
పంటసాగులో రైతన్నకు కలుపు సవాలుగా మారుతున్న నేపథ్యంలో ఈ సమస్యను కట్టడి చేసేందుకు కొన్ని కంపెనీలు కలుపు మందులు తయారు చేస్తున్నాయి. పంటపోలాల్లో కలుపు తొలగించేందుకు కూలీల ఖర్చులు పెరుగుతున్న తరుణంలో గోద్రేజ్ కంపెనీ అశితాకా పేరుతో కలుపు మందును ఆవిష్కరించింది. ఇది మొక్కజొన్న సాగులో పంట నష్టం వాటిల్లకుండా కలుపు నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని గోద్రేజ్ ఆగ్రోవెట్ సీఈఓ(క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్) ఎన్కే రాజావేలు తెలిపారు.‘మొక్కజొన్న పంటలో గడ్డి, పెద్ద ఆకులతో ఉన్న కలుపు మొక్కలను నివారించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు 2-4 ఆకుల వచ్చిన దశలో ఉన్నప్పుడు మరింత సమర్థంగా పని చేస్తుంది. ఈ మందును నేరుగా పంటపై స్ప్రే చేసుకోవచ్చు. నిబంధనలకు తగినట్లు తగిన మోతాదులో దీన్ని ఉపయోగించి కలుపు నివారించుకోవచ్చు. స్ప్రే చేసే క్రమంలో గాలికి పంటపై మందు పడినా మొక్కజొన్నకు నష్టం జరగదు. ఎక్కువకాలం జీవించి, తిరిగి పెరిగే కలుపు జాతులపై ఇది ఎంతో ప్రభావం చూపుతుంది. 400 ఎంఎల్ సర్ఫక్టెంట్తోపాటు 50 ఎంఎల్ అశితాకా కలిపి ఎకరాకు పిచికారి చేసుకోవాలి’ అని రాజావేలు చెప్పారు.వర్షాభావ ప్రాంతాల్లో హెచ్చుతగ్గులకు లోనయ్యే రైతుల ఆదాయాన్ని స్థిరంగా వృద్ధి చెందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని కంపెనీ జీఎం(మార్కెటింగ్) అనిల్ చౌబే తెలిపారు. దేశవ్యాప్తంగా మొక్కజొన్న అధికంగా పండించే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ముందుగా ఈ ప్రొడక్ట్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమీప భవిష్యత్తులో దీన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు.ఇదీ చదవండి: టాప్ కంపెనీలో 2,800 ఉద్యోగాలు కట్ -
జీఎస్టీ తగ్గింపుతో వినియోగం జోరు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో రెండే పన్ను శ్లాబులతో కూడిన ప్రతిపాదిత సంస్కరణలతో ఆదాయ నష్టం ఏర్పడినప్పటికీ.. అంతిమంగా వినియోగానికి, జీడీపీకి ఊతమిస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. జీఎస్టీ 5, 12, 18, 28 శాతం శ్లాబులు ఉండగా.. 5, 18 శాతంతోపాటు లగ్జరీ, సిన్ (పొగాకు తదితర) గూడ్స్పై 40 శాతం పన్నును కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిపై మంత్రుల బృందం అధ్యయనం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేట్ల తగ్గింపు ఫలితంగా ఆదాయం రూ.85,000 కోట్లు తగ్గుతుందని, అదే సమయంలో వినియోగం రూ.1.98 లక్షల కోట్లు పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.జీడీపీ కూడా 0.6 శాతం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. జీఎస్టీ ఆరంభంలో సగటు రేటు 14.4 శాతంగా ఉంటే, 2019 సెప్టెంబర్ నాటికి 11.6 శాతానికి తగ్గిందని.. అది ఇప్పుడు 9.5 శాతానికి దిగిరావచ్చని తెలిపింది. వినియోగం పెరుగుతుండడం ద్రవ్యోల్బణాన్ని ఎగిసేలా చేయదని వివరించింది. నిత్యావసరాలైన ఆహారం, వస్త్రాలపై 12 శాతం రేటు కాస్తా 5 శాతానికి దిగొస్తుందని.. ఈ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం 10–15 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని తెలిపింది. సేవలకు సంబంధించి ద్రవ్యోల్బణం 5–10 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అంచనా కట్టింది. దీంతో మొత్తం మీద రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 0.20–0.25 శాతం తగ్గుతుందని తెలిపింది. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖజీడీపీ 1.6 శాతం పెరగొచ్చు..బడ్జెట్లో కల్పించిన ఆదాయపన్ను ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే మొత్తం మీద వినియోగం 5.31 లక్షల కోట్లు పెరుగుతుందని.. దీని ఫలితంగా జీడీపీ వృద్ధి 1.6 శాతం అధికమవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. -
మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలి
మొబైల్ ఫోన్లు, పరికరాలను, నిత్యావసర ఉత్పత్తుల కోసం ఉద్దేశించిన 5 శాతం జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలని కేంద్రానికి ఇండియా సెల్యూలార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న 18 శాతం జీఎస్టీ తిరోగమన విధానమని పేర్కొంది. నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను రెండింటికి తగ్గించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఐసీఈఏ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.ప్రస్తుతం మొబైల్ ఫోన్లనేవి విలాస వస్తువులుగా గాకుండా విద్య, వైద్యం, ఆర్థిక సమ్మిళితత్వం, గవర్నెన్స్కి సంబంధించి అత్యవసర డిజిటల్ మౌలిక సదుపాయాలకు కీలకంగా మారాయని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా మొబైల్స్ను అయిదు శాతం జీఎస్టీలో చేర్చాలని కోరారు. జీఎస్టీ ప్రవేశపెట్టడానికి ముందు చాలా రాష్ట్రాలు మొబైల్ ఫోన్లను నిత్యావసర ఉత్పత్తులుగా గుర్తించి, వాటిపై 5 శాతం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) మాత్రమే విధించాయని మహీంద్రూ చెప్పారు.ఇదీ చదవండి: అల్ట్రాటెక్ 200 ఎంటీపీఏ సామర్థ్యంఅయితే, జీఎస్టీని ప్రవేశపెట్టాక ముందు 12 శాతం శ్లాబ్లో ఉంచి ఆ తర్వాత 2020లో 18 శాతానికి మార్చారని మహీంద్రూ గుర్తు చేశారు. దీనితో అందుబాటు ధరల్లో మొబైల్స్ లభ్యతపైనా, అమ్మకాల పరిమాణంపైనా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. మొబైల్స్ వార్షిక వినియోగం 30 కోట్ల యూనిట్ల నుంచి 22 కోట్లకు తగ్గిపోయిందని వివరించారు. కాబట్టి వీటిని అయిదు శాతం శ్లాబ్లోకి చేర్చడాన్ని మినహాయింపుగా భావించరాదని, కరెక్షన్గా పరిగణించాలని మహీంద్రూ చెప్పారు. 2015 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రూ. 18,900 కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.45 లక్షల కోట్లకు చేరింది. -
టాప్ కంపెనీలో 2,800 ఉద్యోగాలు కట్
కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఒరాకిల్ కార్పొరేషన్ భారతదేశంలోని శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. దేశంలోని కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10% మందిని తొలగించాలని నిర్ణయించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్కతా వంటి కీలక ప్రాంత్రాల్లో సుమారు 28,824 మంది ఉద్యోగులు ఒరాకిల్లో పని చేస్తున్నారు. వీరిపై ప్రభావంపడే అవకాశం ఉంది.కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ సేవలు, కస్టమర్ బేస్పై నిమగ్నమైన బృందాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని క్యాంపస్ల్లో ఈ తొలగింపులు ఆకస్మికంగా ఉన్నాయని, తొలగింపు ప్యాకేజీలు లేదా అంతర్గత పునర్విభజన ఎంపికల ఊసే లేదని చెబుతున్నారు. యాజమాన్యం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఊహించని విధంగా నోటీసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఈ-కామర్స్, టెక్ స్టార్టప్ల్లో ఫ్రెషర్లకు అవకాశాలుగత నెలలో అమెరికాలో 4.5 గిగావాట్ల డేటా సెంటర్ పవర్ కోసం ఓపెన్ఏఐ ఓరాకిల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్ డేటా సెంటర్ల నుంచి భారీ మొత్తంలో కంప్యూటింగ్ పవర్ను అద్దెకు తీసుకునేందుకు ఓపెన్ఏఐ అంగీకరించింది. తర్వాత ఒరాకిల్ స్టాక్ ఆల్టైమ్ గరిష్టానికి దగ్గరగా చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఒరాకిల్ సాఫ్ట్బ్యాంక్ గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లేఆఫ్స్ తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుని, మెరుగైన పనితీరు కనబరచాలని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు ఏఐపై ఆధారపడబోతోందని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన స్కిల్స్పై ఎక్కువ దృష్టి సారించాలని చెబుతున్నారు. -
ఈ-కామర్స్, టెక్ స్టార్టప్ల్లో ఫ్రెషర్లకు అవకాశాలు
ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్ల్లో ఫ్రెషర్లకు అవకాశాలు తలుపుతట్టనున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో (జులై–డిసెంబర్) ప్రెషర్లను అధికంగా నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. టీమ్లీజ్ ఎడ్టెక్ నిర్వహించిన ‘కెరీర్ అవుటులుక్ రిపోర్ట్’ సర్వేలో.. ఈ–కామర్స్, టెక్ స్టార్టప్ల్లో 88 శాతం కంపెనీలు నియామకాల ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేశాయి. వీటి తర్వాత రిటైల్ రంగంలో 87 శాతం, తయారీ రంగంలో 82 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూల ధోరణితో ఉన్నాయి.యువ నిపుణులకు ఉన్న బలమైన డిమాండ్ను ఇది సూచిస్తున్నట్టు టీమ్లీజ్ తెలిపింది. ఈ కామర్స్, టెక్నాలజీ రంగాల్లో చురుకైన వృద్ధి ఫ్రెషర్లకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నట్లు తన నివేదికలో పేర్కొంది. డిగ్రీ అప్రెంటిస్షిప్ కార్యక్రమాలు పెరుగుతుండడం, ప్రత్యక్ష, నైపుణ్య ఆధారిత అధ్యయన మార్గాల డిమాండ్ను తెలియజేస్తున్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ తెలిపారు. వివిధ రంగాల్లోని 1,065 కంపెనీలను మే నుంచి జులై మధ్య ప్రశ్నించి ఈ వివరాలను టీమ్లీజ్ ఎడ్టెక్ విడుదల చేసింది.అయితే, ఫ్రెషర్ల నియామక ఉద్దేశం కంపెనీల్లో బలంగానే ఉన్నప్పటికీ.. క్రితం ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంతో పోల్చి చూస్తే కాస్తంత తగ్గడం గమనార్హం. 2024 ద్వితీయ ఆరు నెలల్లో 74 శాతంగా ఉంటే, ఈ ఏడాది ద్వితీయ ఆరు నెలలకు ఇది 70 శాతంగా ఉంది. ఏఐ రాకతో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు, కీలక విభాగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులను కాపాడుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. అధిక వృద్ధి రంగాల్లో అవకాశాలుఅధిక వృద్ధిని నమోదు చేస్తున్న రంగాల్లో ఫ్రెషర్లకు అవకాశాలు బలంగానే ఉన్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ నివేదిక తెలిపింది. డిగ్రీ అప్రెంటిస్ షిప్లకు తయారీలో 37 శాతం, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాలో 29 శాతం, ఐటీలో 18 శాతం చొప్పున డిమాండ్ ఉన్నట్టు వెల్లడించింది. బెంగళూరులోని కంపెనీల్లో 37 శాతం, చెన్నైలో 30 శాతం, పుణెలో 26 శాతం చొప్పున కంపెనీలు అప్రెంటిస్షిప్ల నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. పెద్ద సంస్థలతో పోల్చి చూసినప్పుడు చిన్న కంపెనీలు ఫ్రెషర్ల నియామకంపై అధిక ఆసక్తితో ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖ -
అల్ట్రాటెక్ 200 ఎంటీపీఏ సామర్థ్యం
అల్ట్రాటెక్ సిమెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 200 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి (ఎంటీపీఏ) సామర్థ్యాన్ని అధిగమిస్తుందని కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. దీంతో చైనా వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ విక్రయ కంపెనీగా అవతరిస్తుందన్నారు. కంపెనీ వార్షిక సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో జీడీపీ 7.4 వృద్ధి రేటు సాధించడం వెనుక నిర్మాణరంగం, తయారీ రంగం కీలక పాత్ర ఉన్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5 శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలో వేగంగా ప్రగతి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్టు గుర్తు చేశారు. ఇక ముందూ బలమైన వృద్ధిని కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇందులో 16.3 ఎంటీపీఏ సామర్థ్యాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోగా, ఇండియా సిమెంట్స్, కేశోరామ్ సిమెంట్స్ కొనుగోళ్ల రూపంలో 26.3 ఎంటీపీఏ సామర్థ్యం సమకూర్చుకున్నట్టు కుమార మంగళం బిర్లా తెలిపారు. దీంతో 2025 మార్చి నాటికి మొత్తం సామ ర్థ్యం 188.8 ఎంటీపీఏకు చేరుకున్నట్టు చెప్పారు. ఇక ఈ ఏడాది జూన్ క్వార్టర్లో 3.5 ఎంటీపీఏ గ్రే సిమెంట్ సామర్థ్యం తోడు కావడంతో ఇది 192.26 ఎంటీపీఏకు చేరుకున్నట్టు తెలిపారు. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖనిర్మాణ రంగం నుంచి డిమాండ్గతిశక్తి తదితర మౌలిక రంగ ప్రాజెక్టులు, ఇళ్ల పథకాలకు ప్రభుత్వం అధిక కేటాయింపులు చేస్తుండడంతో నిర్మాణ రంగం బలమైన పనితీరు చూపించనున్నట్టు కుమార మంగళం తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నిర్వహణలో 34 ఇంటెగ్రేడెడ్ యూనిట్లు, 30 గ్రైండింగ్ యూనిట్లు, 9 బల్క్ టెర్మినళ్లు ఉన్నాయని వివరిస్తూ.. ఈ స్థాయి సామర్థ్యంతో దేశ డిమాండ్ అవసరాలను తీర్చగలమని చెప్పారు. -
ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖ
రియల్ మనీ గేమ్స్పై నిషేధం విధించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ఆన్లైన్ గేమింగ్ సంస్థలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఈమేరకు లేఖ రాయడం గమనార్హం. ఇప్పటికే ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులో ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించడానికి ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేశారు.ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్), ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) సంయుక్తంగా కేంద్రం హోం మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో ఆసక్తికర అంశాలు తెలిపారు. ఆన్లైన్ స్కిల్ గేమింగ్ విభాగం ఒక ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని సృష్టిస్తుందని చెప్పారు. ‘భారతదేశపు డిజిటల్ గేమింగ్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది యువ పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు, నిపుణులు కొత్త ఆన్లైన్ గేమింగ్ బిల్లు వల్ల తీవ్రంగా ప్రభావితం చెందుతారు. ఇందులోని నిషేధ నియమాలు చట్టబద్ధమైన, ఉద్యోగాలను సృష్టించే పరిశ్రమను దెబ్బ తీస్తుంది’ అని తెలిపారు.ప్రస్తుతం ఈ పరిశ్రమ రూ.2 లక్షల కోట్లకు పైగా ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ను, రూ.31,000 కోట్ల వార్షిక ఆదాయం, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ.20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తోందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. 20 శాతం సీఏజీఆర్తో వృద్ధి చెందుతున్న ఈ రంగం 2028 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. భారతదేశంలో ఆన్లైన్ గేమర్లు 2020లో 36 కోట్ల నుంచి 2024లో 50 కోట్లకు పెరిగారు. జూన్ 2022 వరకు రూ.25,000 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆ రంగం ఆకర్షించింది. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. గేమింగ్, టెక్నాలజీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్లో ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్కు ఉందని, నిషేధానికి బదులు ప్రగతిశీల నియంత్రణను అవలంబించాలని లేఖలో ప్రభుత్వాన్ని కోరారు.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్!ఈ-స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమింగ్తో సహా ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించడానికి, కొన్ని అంశాల్లో నియంత్రించడానికి, వ్యూహాత్మక అభివృద్ధి, నిరంతర పర్యవేక్షణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేసేలా వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆన్లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య స్పష్టమైన విభజన సూచించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్నవారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా రూ.కోటి వరకు జరిమానా, లేదా ఆ రెండూ విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టయిజ్మెంట్లలో భాగం పంచుకున్నవారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికీ గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.కోటి వరకు జరిమానా వేస్తారు. -
బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్దికాలంగా పెరిగిన పసిడి ధరలు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. చాలా రోజులు నష్టాల తర్వాత గత రెండు రోజులుగా పుంజుకున్న మార్కెట్లు ఈ రోజు నష్టపోయాయి. ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 51 పాయింట్లు తగ్గి 24,933కు చేరింది. సెన్సెక్స్(Sensex) 130 ప్లాయింట్లు నష్టపోయి 81,510 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎయిరిండియాకు ఐవోసీ హరిత ఇంధనం
విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పర్యావరణహిత ఏవియేషన్ ఇంధనం (ఎస్ఏఎఫ్) సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాడేసిన వంట నూనె నుంచి ఎస్ఏఎఫ్ ఉత్పత్తి ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ఐవోసీ చైర్మన్ అరవిందర్ సింగ్ సాహ్ని తెలిపారు.ఇదీ చదవండి: భారత్పై టారిఫ్ల ప్రభావం అంతంతే!పానిపట్లోని రిఫైనరీలో ఏటా 35,000 టన్నుల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. ఐటీసీ, హల్దీరామ్స్ లాంటి హోటళ్లు, రెస్టారెంట్ చెయిన్స్ నుంచి నూనెను సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. విమాన రవాణా వల్ల వచ్చే ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోలియంయేతర ముడివనరుల నుంచి ప్రత్యామ్నాయ ఇంధనమైన ఎస్ఏఎఫ్ను తయారు చేస్తారు. లభ్యతను బట్టి సాధారణంగా వినియోగించే విమాన ఇంధనం (ఏటీఎఫ్)లో 50 శాతం వరకు దీన్ని కలపవచ్చు. -
భారత్పై టారిఫ్ల ప్రభావం అంతంతే!
యూఎస్ టారిఫ్లతో భారత కార్పొరేట్ కంపెనీలకు ప్రత్యక్ష సంబంధం తక్కువేనని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కాకపోతే ప్రస్తుతం మినహాయింపు పరిధిలో ఉన్న ఫార్మాస్యూటికల్స్, తదితర రంగాలపై భవిష్యత్తులో ఆ వెసులుబాటు తొలగిస్తే ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. భారత ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్లను ప్రస్తుతం యూఎస్ అమలు చేస్తోంది. ఈ నెల 27 నుంచి మరో 25 శాతం టారిఫ్లు అమల్లోకి రానున్నాయి.ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మాత్రం వీటి నుంచి మినహాయింపులు ఉన్నాయి. 50 శాతంతో ఆసియాలో భారత్పైనే అధిక టారిఫ్లు అమలు కానున్నట్టు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ రిస్క్లు తగ్గుతాయని పేర్కొంది. రష్యా చమురును భారత ఆయిల్ కంపెనీలు 30–40 శాతం తక్కువ రేటుకు దిగుమతి చేసుకుంటుండడం వాటి లాభాలకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. భారత ఐటీ కంపెనీలపై టారిఫ్ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం తక్కువేనని తేల్చింది. అలాగే, దేశీ మార్కెట్పై ప్రధానంగా ఆధారపడే ఆయిల్, గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజినీరింగ్, నిర్మాణ రంగం, టెలికం, యుటిలిటీలపై ప్రభావం ఉండదని తెలిపింది. అమెరికా అధిక టారిఫ్లు అలాగే కొనసాగితే భారత వృద్ధి రేటు 2025–26లో 6.5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. దీర్ఘకాలిక వృద్ధిని టారిఫ్లు అడ్డుకోవుభారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై యూఎస్ టారిఫ్లు ప్రభావం చూపించకపోవచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మరోసారి పునరుద్ఘాటించింది. కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత రేటింగ్ను సైతం బీబీబీ మైనస్ నుంచి బీబీబీ స్టెబుల్కు అప్గ్రేడ్ కూడా చేసింది. ‘రానున్న కాలంలో వృద్ది అవకాశాలు బలోపేతం అవుతాయి. వృద్ధి సగటు 6.8 శాతానికి చేరుతుంది. మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెరిగితే, దీర్ఘకాలిక వృద్ది అవకాశాలకు ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. దీంతో భారత్ దీర్ఘకాలిక వృద్ధి మరింత బలపడుతుంది’ అని ఎస్అండ్పీ తన తాజా నివేదికలో వివరించింది.స్వీయ వినియోగం సానుకూల అంశంభారత్ ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటని పేర్కొంది. గత 3–4 ఏళ్లలో ప్రాంతీయంగా ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది. భారత వృద్ధిలో 85 శాతం దేశీయ అంశాలపైనే ఆధారపడి ఉంటుందని, ఎగుమతుల రూపంలో సమకూరేది 15 శాతమేనని తెలిపింది. స్వీయ వినియోగంపై అధికంగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావడం సానుకూల అంశంగా పేర్కొంది. స్వల్పకాలంలో వ్యాపార విశ్వాసంపై ప్రభావం పడినప్పటికీ సానుకూల వృద్ది పథం, సానుకూల వ్యాపార వాతావరణం అన్నవి.. మధ్య కాలం, దీర్ఘకాలంలో వృద్ధిని నిర్ణయిస్తాయని అభిప్రాయపడింది. ‘భారత జీడీపీలో అమెరికా ఎగుమతుల పాత్ర ఒక శాతమే. టారిఫ్లు అధికంగా విధించినప్పటికీ దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలను ప్రభావితం చేస్తాయని అనుకోవడం లేదు’అని వివరించింది.ఇదీ చదవండి: ‘నా భార్య నన్ను పిచ్చోడిలా చూసింది’ -
పత్తి దిగుమతులపై సుంకాల ఊరట
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్స్టైల్స్ పరిశ్రమకు కీలక వనరైన ముడి పత్తి దిగుమతులకు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు సుంకాల నుంచి మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనిపై 11 శాతం సుంకాలతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సు కూడా వర్తిస్తోంది. ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఈ మినహాయింపు ఆగస్టు 19 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.దీనితో భారత్కి పత్తిని ఎగుమతి చేసే రెండో అతిపెద్ద సరఫరాదారైన అమెరికాకు ప్రయోజనం చేకూరనుంది. ధరలను స్థిరీకరించడానికి, ముడి సరుకు లభ్యతను మెరుగుపర్చడానికి సుంకాల మినహాయింపు ఉపయోగపడుతుందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. దేశీయంగా పత్తి ధరలు తగ్గిపోయి, రైతులపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో మినహాయింపులను ప్రభుత్వం 40 రోజులకే పరిమితం చేసినట్లు చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 579.2 మిలియన్ డాలర్లుగా ఉన్న పత్తి దిగుమతులు 2025 ఆర్థిక సంవత్సరంలో 107 శాతం ఎగిసి 1.20 బిలియన్ డాలర్లకు చేరాయి. -
చాట్జీపీటీ గో ప్లాన్@ రూ. 399
న్యూఢిల్లీ: ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ భారత్లో ‘చాట్జీపీటీ గో’కి సంబంధించి కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రకటించింది. ఉచిత ప్లాన్తో పోలిస్తే 10 రెట్లు అధికంగా మెసేజీలు, ఇమేజ్ల జనరేషన్, ఫైల్ అప్లోడ్స్ పరిమితులతో ఈ ప్లాన్ నెలవారీగా రూ. 399గా ఉంటుంది. చాట్జీపీటీ అధునాతన సామర్థ్యాలను మరింత అందుబాటు ధరలో పొందాలనుకునే వారి కోసం ‘చాట్జీపీటీ గో’ని డిజైన్ చేసినట్లు వివరించింది. యాక్సెస్ విషయంలో ప్రాధాన్యత, వేగవంతమైన పనితీరు, అధిక యూసేజీ పరిమితులు అందించే ప్రస్తుత చాట్జీపీటీ ప్లస్కి (నెలకు రూ. 1,999) ఈ కొత్త ప్లాన్ అదనంగా ఉంటుంది. అత్యంత అధునాతన మోడల్స్, మరింత కస్టమైజేషన్ కావాలనుకునే ప్రొఫెషనల్స్, సంస్థల కోసం చాట్జీపీటీ ప్రో (నెలకు రూ. 19,900)ని అందిస్తున్నట్లు ఓపెన్ఏఐ వివరించింది. యూపీఐ విధానంతో కూడా సబ్ స్క్రిప్షన్కి చెల్లింపులు జరపవచ్చని చాట్జీపీటీ వీపీ నిక్ టర్లీ తెలిపారు. చాట్జీపీటీకి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రెండో భారీ మార్కెట్గా ఉంది. -
రూ. 5,800 కోట్లతో అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ సేవల దిగ్గజంగా ఎదిగే దిశగా ఇండియా పోస్ట్ రూ. 5,800 కోట్లతో అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (ఏపీటీ) ప్రాజెక్టును ఆవిష్కరించింది. ఏపీటీ ఆధారిత మౌలిక సదుపాయాలతో ఆధునిక లాజిస్టిక్స్ కంపెనీల్లాగా ఇండియా పోస్ట్కి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ‘ఎక్స్’లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోస్ట్ చేశారు. డిజిటల్ లావాదేవీలను, ఏ బ్యాంకు కస్టమర్ల నుంచైనా యూపీఐ చెల్లింపులను స్వీకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.సాంకేతిక అంశాల కారణంగా పోస్టాఫీసు సర్వీసులను కొనుగోలు చేయాలన్నా, ఇతర చెల్లింపులు జరపాలన్నా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాల నుంచి మాత్రమే సాధ్యపడేది. ఎక్కడైనా సర్వీసులు అందించేందుకు, రియల్ టైమ్లో నిర్ణయాలు తీసుకునేందుకు కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుందని సింధియా వివరించారు. -
నాలుగోరోజూ రయ్..
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో జీఎస్టీ సంస్కరణల ఆశావహ దృక్పథం కొనసాగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా బెంచ్మార్క్ సూచీలు నాలుగోరోజూ లాభాలు గడించాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ (3%), టాటా మోటార్స్ (3.5%), ఎయిర్టెల్ (2.75%) షేర్లు రాణించి సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ 371 పాయింట్లు పెరిగి 81,644 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు బలపడి 24,980 వద్ద నిలిచింది. ⇒ బ్లూస్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్స్టైల్ షేరు లిస్టింగ్లో గట్టెక్కింది. ఇష్యూ ధర (రూ.517)తో పోలిస్తే బీఎస్ఈలో 1.58% డిస్కౌంట్తో రూ.509 వద్ద లిస్టయ్యింది. అయితే ఇంట్రాడేలో 9% ఎగసి రూ.564 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 6% లాభంతో రూ.546 వద్ద ముగిసింది.⇒ ట్రంప్ టారిఫ్ విధింపుతో టెక్స్టైల్ రంగంలో వచ్చే నష్టాలు భర్తీ చేసేందుకు కేంద్రం పత్తి దిగుమతులపై ఉన్న 11% కస్టమ్స్ డ్యూటీని తాత్కలింగా తొలగించింది. దీంతో టెక్స్టైల్ షేర్లు వర్ధమాన్ టెక్స్టైల్స్ 9%, రేమాండ్ లైఫ్స్టైల్ 8%, వెల్స్పన్ లివింగ్ 6%, అరవింద్ లిమిటెడ్, గోకల్దాస్ ఎక్స్పోర్ట్స్ 3% లాభపడ్డాయి.⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 26 పైసలు బలపడి 87.13 వద్ద ముగిసింది. -
ఏఐ స్టార్టప్లకు వీసీ నిధుల బూస్ట్!
దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రవేశించే ప్రాథమికస్థాయి కంపెనీలకు వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు పెట్టుబడులు అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఏఐ అభివృద్ధి వ్యవస్థ (ఎకోసిస్టమ్)లో ఇటీవల పలు కొత్తతరహా స్టార్టప్లు ఊపిరి పోసుకుంటున్న నేపథ్యంలో వీసీ నిధులకు ప్రాధాన్యత ఏర్పడింది. వివరాలు చూద్దాం.. –సాక్షి, బిజినెస్ డెస్క్ప్రధానంగా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలపర్ టూల్స్ విభాగాలలోని దేశీ కంపెనీలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వీసీ సంస్థలు క్యూ కడుతున్నాయి. పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న సంస్థల జాబితాలో వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, ఎలివేషన్ క్యాపిటల్, యాక్సెల్, లైట్స్పీడ్, ప్రోజస్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ తదితరాలు చేరాయి. దీంతో ఏఐలో మౌలిక, డెవలపర్ విభాగాలపై దృష్టిపెట్టిన కంపెనీలు ఎంటర్ప్రైజ్లుగా అభివృద్ధి చెందేందుకు వీసీ నిధులు తోడ్పాటునివ్వనున్నాయి. వెరసి ఎజెంటిక్ ప్లాట్ఫామ్స్కు జోష్ లభించనుంది. తద్వారా స్వతంత్ర ఏఐ ఏజెంట్ల అభివృద్ధికి వీలు చిక్కనుంది.అంటే వివిధ టాస్్కలను స్వతంత్రంగా నిర్వహించగల సామర్థ్యమున్న సాఫ్ట్వేర్ ఆధారిత టూల్స్ ఊపిరిపోసుకోనున్నాయి. ఇవి సంబంధిత ఆర్గనైజేషన్లలో క్లిష్టతరహా పనులను చక్కబెట్టడంతోపాటు.. విభిన్న వ్యవస్థలతో సమీకృతంకాగలవని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వీటికి ప్రత్యేకించిన సర్విసులను పూర్తి చేయడంపై ఆయా ప్లాట్ఫామ్స్ దృష్టిపెడతాయని తెలియజేశాయి. ఒకే టాస్్కకు పరిమితమయ్యే సంప్రదాయ ఏఐ టూల్స్తో పోలిస్తే వీటి పరిధి విస్తారంగా ఉంటుందని వివరించాయి. పలు కార్యకలాపాలను ఆటోమేషన్తో అనుసంధానించవచ్చని తెలియజేశాయి. కొత్త తరహా టూల్స్ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్, డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ (డెవ్ఆప్స్) ఆటోమేషన్, భారీస్థాయి ఎడాప్షన్ ప్లాట్ఫామ్స్పై దృష్టిపెట్టిన స్టార్టప్లకు ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఫలితంగా ఆయా స్టార్టప్లలో పెట్టుబడులకు వీసీ సంస్థలు ముందుకొస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆధునిక, సరికొత్త మోడళ్లు ఊపిరిపోసుకున్న ప్రతిసారీ ప్లాట్ఫామ్స్ మారిపోతుంటాయని ఎలివేషన్ క్యాపిటల్ ఏఐ పార్ట్నర్ కృష్ణ మెహ్రా తెలియజేశారు.దీంతో పూర్తిస్థాయిలో సరికొత్త అవకాశాలకు తెరలేస్తుంటుందని తెలియజేశారు. ఇలాంటి సందర్భాలు(సైకిల్స్) ఆయా స్టార్టప్ల వ్యవస్థాపకులకు అవకాశాలను కల్పిస్తాయని, తద్వారా ప్రపంచస్థాయిలో పోటీపడగల సంస్థలుగా తీర్చిదిద్దేందుకు వీలు చిక్కుతుందని వివరించారు. వెరసి ఈ కేలండర్ ఏడాది(2025) జనవరి నుంచి జూలైవరకూ దేశీ జెన్ఏఐ స్టార్టప్లు 52.4 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,600 కోట్లు) అందుకున్నట్లు వెంచర్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.పెట్టుబడుల తీరిదీ..సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఎలివేషన్ క్యాపిటల్ గత రెండేళ్లలో 15–20 ఏఐ పెట్టుబడులను చేపట్టడం గమనార్హం! ఇక ఎంటర్ప్రైజెస్లు కనెక్ట్ అయ్యేందుకు, తమ సాఫ్ట్వేర్ టూల్స్ను క్రమబద్ధీకరించుకునేందుకు సహకరించే యూనిఫై యాప్స్ వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి 2–2.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 200 కోట్లు) సమీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2023లో ఏర్పాటైన ఈ సంస్థలో ఎలివేషన్ సైతం ఇన్వెస్ట్ చేసింది. అప్లికేషన్ల బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయింగ్ చేపట్టే ఎమర్జెంట్ ఏఐ.. లైట్స్పీడ్ వెంచర్ తదితర సంస్థల నుంచి 2 కోట్ల డాలర్లు సమకూర్చుకుంది.కేవలం రెండు నెలల్లోనే ఈ సంస్థ కోటి డాలర్ల(రూ.87 కోట్లు) వార్షిక రికరింగ్ టర్నోవర్ సాధించడం విశేషం! ఈ బాటలో లైట్స్పీడ్ తదితర సంస్థల నుంచి ఎజెంటిక్ స్టార్టప్.. కంపోజియో 2.5 కోట్ల డాలర్లు సమీకరించింది. ఎంటర్ప్రైజ్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ ఆటోమేట్ చేసే రీఫోల్డ్ ఏఐ.. ఎనియాక్ వెంచర్స్, టైడల్ వెంచర్స్ తదితరాల నుంచి 6.5 మిలియన్ డాలర్లు(రూ.56 కోట్లు) సీడ్ఫండ్గా అందుకుంది. ప్రోజస్,యాక్సెల్, ఎక్సీడ్ వెంచర్స్ నుంచి సాఫ్ట్వేర్ ప్రొడక్టివిటీ ప్లాట్ఫామ్.. కోడ్కర్మ 2.5 మి. డాలర్లు(రూ.21 కోట్లు) పొందింది. -
అమ్మకాల్లో హవా.. ఉత్పత్తిలో రికార్డ్: ఏకంగా ఐదు లక్షలు
ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటున్న మారుతి సుజుకి అమ్మకాల్లో కూడా అరుదైన మైలురాళ్లను చేరుకుంటోంది. దీన్నిబట్టి చూస్తుంటే ఉత్పత్తి కూడా వేగంగా జరుగుతోందని తెలుస్తోంది.2023లో మార్కెట్లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్.. ఇటీవల 5,00,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. ఈ కారు ప్రతి నెలా 12,000 నుంచి 15,000 యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. 2023 మార్చిలో ఫ్రాంక్స్ ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుంచి 2023 డిసెంబర్ నాటికి.. కేవలం 9 నెలల్లో కంపెనీ లక్ష యూనిట్లను ఉత్పత్తి చేసింది.2024 జూన్ నాటికి రెండు లక్షల యూనిట్లు, నవంబర్ 2024 నాటికి 3 లక్షల యూనిట్లు, ఫిబ్రవరి 2025 నాటికి 4 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరిగింది. కాగా జులైలో దీని ఉత్పత్తి 5 లక్షల యూనిట్లకు చేరుకుంది. అమ్మకాల్లో కూడా దూసుకెళ్తున్న ఈ SUV మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. అవి సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జీటా & ఆల్ఫా వేరియంట్స్. వీటి ధరలు రూ. 7.59 లక్షల నుంచి రూ. 13.07 లక్షల (ఎక్స్ షోరూం) మధ్య ఉన్నాయి.ఇదీ చదవండి: భారత్లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?మారుతి ఫ్రాంక్స్ 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఇవి రెండూ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ పొందుతాయి. కాబట్టి పనితీరు ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా మంచి విక్రయాలను పొందుతోంది. ఈ కారణంగానే ఎగుమతుల్లో కూడా దూసుకెళ్తోంది. -
డబ్బు పేదవాళ్లను చేస్తుంది!.. రాబర్ట్ కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్థితిని, స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా రిచ్డాడ్ పాఠం పేరుతో ఓ ట్వీట్ చేశారు. ఇందులో డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. డబ్బు మిమ్మల్ని ధనవంతులను చేయదు. చాలా సందర్భాలలో ప్రజలను మాత్రమే కాకుండా దేశాలను కూడా పేదరికంగా మారుస్తుందని అన్నారు. కోట్లు సంపాదించేవారు కూడా పదవీ విరమణ లేదా ఉద్యోగ విరమణ తరువాత సుమారు 7 సంవత్సరాలలో 65 శాతం మంది దివాళా తీస్తున్నారని రికార్డులు చూపిస్తున్నాయని కియోసాకి పేర్కొన్నారు. లాటరీ విజేతలకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు.లక్షలాది డాలర్లు సంపాదించే వారు కూడా పేదవారు అవుతున్నారు. అమెరికాలో సగటు పని చేసే వ్యక్తిని తీసుకోండి, ఒక వెయిటర్ 50 సంవత్సరాల పాటు పనిచేసి సుమారు 1.75 మిలియన్ డాలర్లు సంపాదించాడు అనుకుంటే.. కొన్నేళ్ళకు ఆ డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది.ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!డబ్బు సంపాదించినప్పటికీ పేదవారుగా ఎందుకు అవవుతున్నారు?.. ఇది ఎందుకు జరుగుతుంది? అనే ప్రశ్నకు.. పేద తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బోధించే పూర్ ఫైనాన్సియల్ ఎడ్యుకేషన్ కారణమని రాబర్ట్ కియోసాకి సమాధానం ఇచ్చారు. ధనవంతులు కావాలంటే.. ధనవంతులైన వ్యక్తులను వెతకండి. విజయవంతమైన వ్యక్తుల గురించి తెలుసుకోండి అని ఆయన అన్నారు.లాటరీ గెలిచి ఎందుకు నష్టపోవాలి లేదా జీవితాంతం పని చేసి ఎందుకు పేదవాడిగా మారాలి? అనే ప్రశ్నకు.. నువ్వు దానికంటే చాలా తెలివైనవాడివిగా ఉండాలని రాబర్ట్ కియోసాకి సింపుల్గా సమాధానం ఇచ్చారు.RICHDAD $ LESSON:Q: Does money make you rich?A: NO: In most cases money makes people and countries poorer.Take extreme examples of college sports stars who join a pro team earning Millions. Records show that 65% are bankrupt 7-years after retirement. The same is true…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 19, 2025 -
హైదరాబాద్లో తలెత్తిన ఇంటర్నెట్ సమస్య
టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) హైదరాబాద్లో కేబుల్స్ తొలగించడం వల్ల, నగరంలో ఫైబర్ టు హోమ్ కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. ఇది పెద్ద సంఖ్యలో హోమ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు అంతరాయాన్ని కలిగించింది.విద్యుత్ శాఖ ఆప్టికల్ ఫైబర్ కేబుల్లను విచక్షణారహితంగా.. కత్తిరించడం వల్ల ఈ (ఇంటర్నెట్) అంతరాయం ఏర్పడింది. ఇంటర్నెట్ కేబుల్లు విద్యుత్తును తీసుకువెళ్లవని.. దీనివల్ల విద్యుత్ మౌలిక సదుపాయాలకు సంబంధం లేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) చెబుతోంది. విచక్షణారహితంగా కేబుల్స్ కట్ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని శాఖను కోరుతున్నామని వెల్లడించింది.ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!నగరంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి.. ఇంటర్నెట్ సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి సంబంధిత శాఖ పనిచేస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ దెబ్బతినడం వల్ల చాలా ముఖ్యమైన సేవలు నిలిచిపోతాయి. ప్రస్తుతం ఈ ప్రభావం జియో, ఎయిర్టెల్లకు చెందిన దాదాపు 40 వేల ఫైబర్ కస్టమర్లపై పడింది. -
టెక్నాలజీలో కెరీర్ కోసం.. టెక్బీ ప్రోగ్రామ్
ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అయిన HCLTech.. హైదరాబాద్లోని హైస్కూల్ గ్రాడ్యుయేట్ల కోసం టెక్బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ను అందించాలని & వారికి టెక్నాలజీ పరిశ్రమలో కెరీర్లను నిర్మించుకునే అవకాశాన్ని కల్పించాలని యోచిస్తోంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టెక్బీ అనేది ప్రత్యేకంగా హైస్కూల్ గ్రాడ్యుయేట్ల కోసం రూపొందించిన ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోగలరు. ఇది టెక్నాలజీలో ప్రపంచ కెరీర్లకు పునాదులు వేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది.టెక్బీ గ్రాడ్యుయేట్లు ఇప్పటికే ఏఐ & క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో తమ సహకారాన్ని అందిస్తున్నారు. HCLTech ఫార్చ్యూన్ 500 క్లయింట్లకు సేవలు అందిస్తున్నారు.ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!టెక్బీ అనేది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల కంటే ముఖ్యమైంది. ఇది టెక్ రంగంలో కెరీర్లను నిర్మించుకోవడానికి సహకరిస్తుందని.. HCLTech సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరామన్ అన్నారు. బిట్స్ పిలానీ. ఐఐటీ గువహతి, శాస్త్ర యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, ఐఐఐటీ కొట్టాయం, ఐఐఎం సిర్మౌర్ వంటి సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఈ కార్యక్రమం యువతకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని పెంపొందిస్తుంది. -
ఉత్తరప్రదేశ్లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?
దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్.. చరిత్ర, సంస్కృతికి నిదర్శనం. ఎంతోమంది గొప్ప రాజకీయంగా నాయకులను అందించిన.. ఈ రాష్ట్రం దేశానికి కొంతమంది సంపన్న వ్యవస్థాపకులు కూడా అందించింది. ఈ కథనంలో యూపీలో అత్యంత ధనవంతులు, వారి నికర విలువ (అంచనా) గురించి తెలుసుకుందాం.➤మురళీధర్ జ్ఞాన్చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 14,000 కోట్లు➤బిమల్ జ్ఞాన్చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 9,000 కోట్లు➤విజయ్ శేఖర్ శర్మ - పేటీఎం: రూ. 8,000 కోట్లు➤దినేష్ చంద్ర అగర్వాల్ - ఇండియామార్ట్: రూ. 5,400 కోట్లు➤అలఖ్ పాండే - ఫిజిక్స్ వాలా: రూ. 4,500 కోట్లు➤ప్రదీప్ కుమార్ జైన్ - పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ. 4,400 కోట్లు➤చక్రేష్ కుమార్ జైన్ - పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ.4,400 కోట్లు➤యశ్వర్ధన్ అగర్వాల్ - ప్రియాగోల్డ్ బిస్కెట్స్: రూ. 4,200 కోట్లుఇదీ చదవండి: యూజర్లకు షాకిచ్చిన జియో: చౌకైన ప్లాన్ నిలిపివేత -
అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!
భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు వివిధ రంగాలలో ఆందోళనలను రేకెత్తించాయి. ఆంక్షల కారణంగా సుమారు 3,00,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా.అమెరికా విధించిన సుంకాల ప్రభావం చాలా వరకు వస్త్ర పరిశ్రమ, రత్నాల పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ రంగాల్లో పనిచేస్తున్న లక్షలమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే.. ఎగుమతులు తగ్గినప్పటికీ.. దేశంలో డిమాండ్ ఉంటుందని, అమెరికా సుంకాలు భారత ఆర్ధిక వ్యవస్థ మీద పెద్దగా ప్రభావం చూపవని మరికొందరు చెబుతున్నారు.వస్త్ర, రత్నాల రంగాలను పక్కన పెడితే.. ఐటీ సర్వీస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కూడా అమెరికా సుంకాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఆటో విడిభాల సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని జీనియస్ హెచ్ఆర్టెక్ వ్యవస్థాపకులు & సీఎండీ ఆర్పీ యాదవ్ అన్నారు.భారతదేశం వస్త్రాలను, రత్నాభరణాలను ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అయితే టారీఫ్స్ పెరగడం వల్ల ఇప్పుడు ఇది ప్రశ్నార్థకంగా మారింది. సుంకాలు పెరగడం వల్ల.. ధరలు పెరుగుతాయి. దీనివల్ల మార్కెట్లో అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయి. అయితే మన దేశం ప్రత్యామ్నాయంగా వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవడం ద్వారా.. నష్టాన్ని ఆపవచ్చు.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?అమెరికాకు భారతదేశం ఎగుమతులు 87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది జీడీపీలో కేవలం 2.2 శాతం మాత్రమే. ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక పరిశ్రమలు ప్రస్తుతానికి ప్రభావితం కాలేదు. భారత్ తన ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించగలదని టీమ్లీజ్ సర్వీసెస్లో ఎస్వీపీ బాలసుబ్రమణియన్ అనంత నారాయణన్ పేర్కొన్నారు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 370.64 పాయింట్లు లేదా 0.46 శాతం లాభంతో 81,644.39 వద్ద, నిఫ్టీ 103.70 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 24,980.65 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో హెచ్ఎల్ఈ గ్లాస్కోట్, కేఐఓసీఎల్, ఐఎఫ్జీఎల్ రిఫ్రాక్టరీస్, వర్ధమాన్ పాలిటెక్స్, భారత్ గేర్స్ వంటి కంపెనీలు చేరాయి. నిట్కో, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్డిజి టెక్, రెలియబుల్ డేటా సర్వీసెస్, SP అప్పారల్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యూజర్లకు షాకిచ్చిన జియో: చౌకైన ప్లాన్ నిలిపివేత
సాధారణంగా ఎక్కువమంది తక్కువ ధరలో.. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్లనే ఎంచుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు టెలికాం కంపెనీలు సరసమైన ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. అయితే రిలయన్స్ జియో మాత్రం రోజుకు 1జీబీ డేటా ఇస్తున్న రూ. 249 ప్లాన్ను నిలిపివేసింది.ఆగస్టు 18 నుంచి జియో తన ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ. 249 (రోజుకి 1జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ)ను నిలిపివేసింది. కాబట్టి ఇప్పుడు వినియోగదారులు రూ. 299 ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ రోజుకి 1.5 జీబీ డేటా పొందవచ్చు. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులే.ఇప్పటి వరకు రూ. 249తో రీఛార్జ్ చేసుకున్న జియో యూజర్లు.. ఇకపై మరో 50 రూపాయలు వెచ్చించి రూ. 299 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్లాన్ ద్వారా రోజుకి 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. కొంత ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపిక అవుతుంది.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?ఇది కాకుండా రూ. 189 ప్లాన్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా 2జీబీ డేటా, 300 ఎస్ఎమ్ఎస్లు, 28 రోజులపాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. డేటా అవసరం లేదు అనుకున్న యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కంపెనీ 1జీబీ డేటా ఇచ్చే ప్లాన్ తిరిగి ఎప్పుడు ప్రవేశపెడుతుంది? అనే వివరాలు వెల్లడికాలేదు. బహుశా ఈ ప్లాన్ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం లేదని అనిపిస్తోంది. -
‘నా భార్య నన్ను పిచ్చోడిలా చూసింది’
అమెరికాలో 14 ఏళ్లు పనిచేసి న్యూయార్క్ నుంచి చెన్నైకి వచ్చిన ఓ వ్యక్తి స్టార్టప్ సంస్థ ప్రారంభించినట్లు తెలిపిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. యూఎస్ నుంచి ఇండియా వచ్చే సమయంలో తన తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ.90,000 మాత్రమే ఉన్నాయని లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఎలాంటి ఆర్థిక భరోసా లేకుండా 11 నెలల చిన్నారితో యూఎస్ నుంచి భారత్ వస్తున్న తనను తన భార్య ఓ పిచ్చిడిలా చూసినట్లు చెప్పుకొచ్చారు. వివేక్ తిరువేంగడం చేసిన ఈ పోస్ట్కాస్తా వైరల్గా మారింది.‘యూఎస్ నుంచి భారత్ రావాలని నిర్ణయించుకొని 2020 డిసెంబర్ 23న న్యూయార్క్ నుంచి చెన్నైకి వన్-వే ఫ్లైట్ టిక్కెట్ తీసుకున్నాను. ఆ సమయంలో నా బ్యాంకు ఖాతాలో రూ.90,000 ఉన్నాయి. 11 నెలల చిన్నారిని, నా భార్యను తీసుకొని విమానం ఎక్కాను. నా భార్య నన్నో పిచ్చోడిలా చూసింది. ఇండియా వచ్చేది మరో కంపెనీలో చేరడానికో.. మంచి వేతనం కోసం పని చేసేందుకో కాదు. స్టార్టప్ కంపెనీ పెట్టాలని భావించాను. కొవిడ్ సమయంలో అది అంత సులువు కాదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. జాబ్ లేదు, ఆఫీస్ లేదు, ఇన్వెస్టర్లు లేరు. కేవలం ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే ఉన్నాయి’ అని తిరువేంగడం ఉన్నారు.‘వర్కింగ్ ప్రొఫెషనల్స్ లక్ష్యంగా ఫిట్నెస్ కంపెనీని ప్రారంభించాలనుకున్నాను. కానీ కరోనా ప్రభావం కారణంగా ఇంకొంత కాలం వెయిట్ చేయమని కొందరు సలహా ఇచ్చారు. వారి మాటలు పట్టించుకోకుండా వెంటనే సంస్థను మొదలు పెట్టాను. ఐదేళ్ల తర్వాత చూస్తే నా కంపెనీలో 750+ ఉద్యోగులున్నారు. ఆరుగురితో కూడిన ప్రత్యేక బృందం కంపెనీని నడుపుతోంది’ అని చెప్పారు. ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘14 ఏళ్లుగా అమెరికాలో ఉంటే కేవలం రూ.90వేలు మాత్రమే మిగిలాయా? ఏం జరిగిందో వివరంగా చెప్పగలరా?’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘ఎలాంటి సేఫ్టీ లేకుండా ఇలాంటి సాహసం చేయడం నిజంగా భయంకరమైన విషయం’ అని మరొకరు చెప్పారు.ఇదీ చదవండి: పేరుకుపోతోన్న ‘వీఐ’ అప్పుల కుప్పజీవితంలో ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునేముందు జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అందరికీ ఇలా విజయం సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే సాహసోపేత నిర్ణయం తీసుకునేముందు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఏదైనా అత్యవసర సమయాల్లో కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలంటే లైఫ్స్టైల్కు అవసరమయ్యేలా కనీసం ఏడాదిపాటు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ను క్రియేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. -
భారత్లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?
అమెరికన్ వాహన తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్.. ఇండియన్ మార్కెట్లో తన 'స్ట్రీట్ బాబ్ 117' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ప్రారంభ ధర రూ. 18.77 లక్షలు (ఎక్స్ షోరూం). ధరలు ఎంచుకునే రంగును బట్టి మారుతూ ఉంటాయి.చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్న ఈ బైకులో 1923 సీసీ వీ-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5020 rpm వద్ద 91.18 Bhp పవర్, 2750 rpm వద్ద 156 Nm టార్క్ అందిస్తుంది. 13.2 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ మొత్తం బరువు.. 293 కేజీలు (కర్బ్). ఇది 49 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు & ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ వంటివి పొందుతుంది.స్ట్రీట్ బాబ్ పొడవైన హ్యాంగర్ హ్యాండిల్బార్ పొందుతుంది. టర్న్ ఇండికేటర్లు హ్యాండిల్బార్పై ఉండటం చూడవచ్చు. ఇది చూడటానికి కొంత పాత మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొత్త పెయింట్ స్కీమ్ పొందుతుంది. టూ ఇన్ వన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ బైక్ రైడింగ్ మోడ్లు, డ్రాగ్ టార్క్ స్లిప్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ & డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటివి కూడా పొందుతుంది.ఇదీ చదవండి: కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్ -
పేరుకుపోతోన్న ‘వీఐ’ అప్పుల కుప్ప
బ్యాంకులు వంటి సంప్రదాయ రుణదాతల నుంచి కొత్త రుణాలు పొందడంలో అడ్డంకులు ఎదురవుతుండటంతో వొడాఫోన్ ఐడియా (వీఐ) బ్యాంకింగేతర వనరుల ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)కు సంబంధించిన బకాయిలు పెరుగుతున్నాయి. కంపెనీ మొత్తం రుణాలు రూ.2 లక్షల కోట్లకుపైగా పేరుకుపోవడంతో వీఐ ఈమేరకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రముఖ బ్యాంకులతో రుణాలపై చర్చలు నిలిచిపోవడంతో వీఐ మూలధన వ్యయం (కాపెక్స్) ప్రణాళికలను కొనసాగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.నాన్ బ్యాంక్ ఫండింగ్వీఐ ఏజీఆర్ బకాయిల భారం రూ.75,000 కోట్లకు చేరడంతో కంపెనీ ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనలు నెలకొన్నాయి. ఏజీఆర్ రుణాల పరిష్కారంపై మరింత స్పష్టత వచ్చే వరకు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. దాంతో సంప్రదాయ ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణకు బదులుగా బ్యాంకింగేతర సంస్థల్లో రుణాల కోసం ప్రయత్నిస్తోంది. రూ.50,000-రూ.55,000 కోట్ల కాపెక్స్ కోసం ప్రైవేట్ క్రెడిట్ ఫండ్స్, ఇతర నాన్ బ్యాంకింగ్ రుణదాతల నుంచి నిధులను కోరుతోంది. దేశంలోని 17 సర్కిళ్లలో 5జీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు సమకూర్చడంపై కంపెనీ దృష్టి సారించింది.ముందస్తు చర్చల్లో కొన్ని కంపెనీలుడేవిడ్సన్ కెంప్నర్, ఓక్ట్రీ, వెర్డే పార్ట్నర్స్ వంటి సంస్థలు వీఐకి స్వల్పకాలిక రుణాన్ని అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే సంప్రదాయ బ్యాంకుల నుంచి వీఐ కోరిన రూ.25,000 కోట్లతో పోలిస్తే ఈ సంస్థలు తక్కువ మొత్తాన్ని అందించే అవకాశం ఉంది. కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.2,440 కోట్లు ఖర్చు చేసింది. తన నెట్వర్క్ విస్తరణ, 5జీ రోల్అవుట్ను కొనసాగించడానికి సెప్టెంబర్ 2025 నాటికి మరో రూ.5,000–రూ.6,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: యూపీఐ వినియోగంలో టాప్లో ఉన్న రాష్ట్రం ఇదే..ఏజీఆర్ బకాయిలపై ప్రభుత్వం జోక్యంఅపరిష్కృతంగా ఉన్న ఏజీఆర్ బకాయిల సమస్య వీఐ ఆర్థిక వృద్ధికి అవరోధంగా మారింది. 2026 మార్చి లోపు ఏజీఆర్ బకాయిలను పరిష్కరించాలని కంపెనీ భారత ప్రభుత్వాన్ని కోరింది. అప్పులను తగ్గించి, బ్యాంకుల నుంచి కొత్త మూలధనాన్ని సమీకరించేందుకు వీలు కల్పించేలా ప్రభుత్వ సహకారంపై కంపెనీ ఆశలు పెట్టుకుంది. -
యూపీఐ వినియోగంలో టాప్లో ఉన్న రాష్ట్రం ఇదే..
యూపీఐ వినియోగంలో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందని ఎస్బీఐ ఎకనామిక్ రిసెర్చ్ డిపార్ట్మెంట్(ఈఆర్డీ) తెలిపింది. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. అయితే కొన్ని టీపీఏపీల(థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) మధ్య లావాదేవీలు అధికంగా జరుగుతుండడంతో దేశంలో ఫిన్టెక్ ఆవిష్కరణలు దెబ్బతింటున్నట్లు హెచ్చరించింది.ఎస్బీఐ ఈఆర్డీ తొలిసారిగా ప్రచురించిన యూపీఐ లావాదేవీలపై రాష్ట్రాల వారీగా డేటాను ప్రస్తావిస్తూ, జులైలోనే 9.8 శాతం వాల్యూమ్(యూపీఐల సంఖ్య) వాటాతో మహారాష్ట్ర స్థిరంగా ముందంజలో ఉందని తెలిపింది. కర్ణాటక (5.5 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (4.1 శాతం), తమిళనాడు (4 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఈఆర్డీలో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జులై నెలలోనే డిజిటల్ చెల్లింపుల్లో(విలువ) మహారాష్ట్ర 9.2 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక (5.8 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (5.1 శాతం), తమిళనాడు (4.7 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.ఇదీ చదవండి: ఉద్యోగులకు ఆదివారాలు పని.. వివరణ ఇచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్విలువ, వాల్యూమ్ పరంగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. 2025లోనే సగటు రోజువారీ విలువ జనవరిలో రూ.75,743 కోట్ల నుంచి జులైలో రూ.80,919 కోట్లకు, ఆగస్టులో రూ.90,446 కోట్లకు (ఇప్పటివరకు) పెరిగింది. -
ఉద్యోగులకు ఆదివారాలు పని.. వివరణ ఇచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్
ఉద్యోగులు ఆదివారాల్లోనూ పనిచేయాలని సూచిస్తూ లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ కొంతకాలం కిందట చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటీవల వివరణ ఇచ్చారు. అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా మందకొడిగా సాగుతున్న ప్రాజెక్టు పురోగతిపై అంతర్గతంగా చర్చించామన్నారు. అందులో భాగంగా అనధికారిక సంభాషణ సందర్భంగా సుబ్రమణ్యన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించారు.‘అప్పుడు ఉన్న పర్థితులు భిన్నంగా ఉన్నాయి. కంపెనీతో బిజినెస్ చేస్తున్న ఐదారుగురు క్లయింట్లతోపాటు కొందరు హైప్రొఫైల్ క్లయింట్లు నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఉత్పాదకతకు సంబంధించి ఫోన్ చేశారు. మా పురోగతి గురించి ఈమెయిల్స్ పంపారు. నాతోపాటు టీమ్ ప్రమేయం ఉన్నప్పటికీ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. ఆ సందర్భంలో అనధికారికంగా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. కానీ దీన్ని తప్పకుండా పాటించాలనేలా మాత్రం చెప్పలేదు. ఈ అనధికారిక సంభాషణ సమయంలో రికార్డ్ చేయొద్దనే నియమాలున్నాయి’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు..ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో, ఉద్యోగ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. తన భార్య కూడా తన పేరుకు భంగం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సుబ్రమణ్యన్ చెప్పారు. ‘ఈ సంఘటన నా మనసును ఉంతో కలచివేసింది. ఏదేమైనా విషయం జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోలేను. ఎల్ అండ్ టీలో పనితీరే కీలకం’ అని అన్నారు. -
ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. కొద్ది రోజులుగా పసిడి ధరలు.. తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 28 పాయింట్లు పెరిగి 24,905కు చేరింది. సెన్సెక్స్(Sensex) 144 ప్లాయింట్లు పుంజుకుని 81,417 వద్ద ట్రేడవుతోంది.రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ ఇటీవల పేర్కొనడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రాక్టర్లు, బస్సుల ధరలు తగ్గింపు?
జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించాలని యోచిస్తున్నట్లు కేంద్రం ఇటీవల తెలిపిన నేపథ్యంలో ప్రధాన వాహనాలపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రధానంగా బస్సులపై పన్నును 28% నుంచి 18%కి, ట్రాక్టర్లపై పన్నును 12% నుంచి 5%కు తగ్గించే ప్రతిపాదనలున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రజారవాణాను మెరుగుపరచడం, వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో ఈ కేటగిరీల్లో అమ్మకాలను పెంచేందుకు ఈమేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.వ్యవసాయ యాంత్రీకరణకు ఊతంవ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి, రైతులపై వ్యయ భారాన్ని తగ్గించే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రాక్టర్లు, వాటి విడిభాగాలపై పన్నును తగ్గించడం వల్ల మూలధనం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయంటున్నారు. దీనివల్ల వ్యవసాయ సామర్థ్యం పెరుగుతుందని, గ్రామీణ ఆదాయాలు అధికమవుతాయని భావిస్తున్నారు. ఇదిలాఉండగా, కంపెనీలు తయారు చేసే యంత్రాలపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునే అర్హతను కొనసాగించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇన్పుట్ ట్యాక్స్లు ఎక్కువగా ఉన్నందున మరిన్ని రిఫండ్లు ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఎస్కార్ట్స్ కుబోటా డైరెక్టర్, సీఎఫ్వో భరత్ మదన్ తెలిపారు. ఇన్పుట్ ఖర్చులు ప్రస్తుతం 14-15 శాతంగా ఉన్నాయని, 12 శాతం అవుట్పుట్ ట్యాక్స్ ఉందని పేర్కొన్నారు.ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్(టీఎంఏ) డేటా ప్రకారం, ట్రాక్టర్ అమ్మకాలు ఇప్పటికే పెరుగుతున్నాయి. దేశీయంగా 2025 జనవరి-జులై కాలంలో 14% పెరిగాయి. ఇది 5,50,948 యూనిట్లుగా ఉంది. గతేడాది 4,84,024 యూనిట్ల నుంచి పెరిగింది.బస్ సెగ్మెంట్లో ఇలా..ప్రస్తుతం 28% జీఎస్టీని ఎదుర్కొంటున్న బస్సులు, వాటి విడిభాగాలపై కూడా ఉపశమనం కల్పించవచ్చు. దీన్ని 18 శాతానికి చేర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిపాదిత 10 పాయింట్ల తగ్గింపు ఈ విభాగంలో బలమైన వృద్ధిని నమోదు చేస్తుందంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులకు ఇటీవలి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎంతో కలిసొస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి ఈ సెగ్మెంట్లో మంచి పనితీరు కనబరిచినప్పటికీ జీఎస్టీ తగ్గింపు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని అశోక్ లేలాండ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ధీరజ్ హిందుజా తెలిపారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డేటా ప్రకారం, మీడియం, హెవీ బస్ సేల్స్ 2025 ఆర్థిక సంవత్సరంలో 23% పెరిగి 66,328 యూనిట్లకు చేరుకున్నాయి. లైట్ ప్యాసింజర్ క్యారియర్లు కూడా 6% పెరిగి 54,807 యూనిట్లకు చేరుకున్నాయి.ఇదీ చదవండి: నిలిపేసిన పాలసీల పునరుద్ధరణ -
నిలిపేసిన పాలసీల పునరుద్ధరణ
ప్రీమియంలను చెల్లించకుండా నిలిపివేసిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకునేందుకు అవకాశం కల్పిస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఇది ఆగస్టు 18న ప్రారంభమై అక్టోబర్ 17 వరకు ఉంటుంది. దీని కింద ఆలస్య రుసుములపై మినహాయింపులు కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.నాన్–లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై ఇది 30 శాతం వరకు ఉంటుంది. గరిష్టంగా రూ.5,000 వరకు మినహాయింపు పొందవచ్చు. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపై లేట్ ఫీజులపై 100 శాతం మినహాయింపు ఉంటుంది. స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ కింద తొలిసారిగా ప్రీమియంను నిలిపివేసిన తేదీ నుంచి అయిదేళ్ల లోపు వ్యవధి వరకు పాలసీలను, నిర్దిష్ట షరతులకు లోబడి పునరుద్ధరించుకోవచ్చు. పరిస్థితులు అనుకూలించక ప్రీమియంలను సకాలంలో చెల్లించలేకపోయిన వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఇంటెల్ రహస్య పత్రాలు దొంగలించి మైక్రోసాఫ్ట్లో.. -
స్టార్టప్లకు పన్ను లబ్ధి
న్యూఢిల్లీ: స్టార్టప్లకు పన్ను సంబంధ లబ్దిని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ) మార్గదర్శకాలను మరింత సరళీకరించడం, పొరుగు దేశాల నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలతో వాణిజ్యం, పరిశ్రమల శాఖ 100 రోజుల సంస్కరణల అజెండాకు తెరతీయనుంది. అంతేకాకుండా లెదర్, ఫుట్వేర్ పరిశ్రమకు మద్దతుగా కొన్ని పర్యావరణ నిబంధనలను సులభతరం చేయడం, ఈకామర్స్ కేంద్రాల ద్వారా ఎగుమతుల పెంపునకు నిబంధనలను సరళీకరించడం, వివిధ రంగాలకు అవసరమయ్యే ల్యాబ్ టెస్టింగ్, సర్టిఫికేషన్లను ఏకీకృతం చేయడం సైతం సంస్కరణలలో భాగంకానున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తదుపరి 100 రోజుల ట్రాన్స్ఫార్మేషన్ అజెండాలో భాగంగా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేందుకు వేగవంత చర్యలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. తాజా ప్రతిపాదనలు దేశ ఎగుమతులతోపాటు.. ఎఫ్డీఐలకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. కాగా. 2025–26 ఏప్రిల్– జూలైలో ఎగుమతులు 3.07 శాతం పుంజుకుని 149.2 బిలియన్ డాలర్లను తాకగా.. దిగుమతులు మరింత అధికంగా 5.4 శాతం పెరిగి 244 బిలియన్ డాలర్లను దాటాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో వాణిజ్య లోటు 94.81 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది(2024–25) ఎఫ్డీఐలు 13 శాతం ఎగసి 50 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
టెలికం కంపెనీలకు లాభాల మోత!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల నిర్వహణ లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 12–14% పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. రూ.1.55 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపింది. డేటా వినియోగంతో సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) పెరుగుతుందని పే ర్కొంది. 5జీ సేవలను ప్రారంభించిన అనంతరం బలమైన పనితీరు, మూలధన వ్యయాల తీవ్రత తగ్గుతుండడం, మె రుగైన నగదు ప్రవాహాలు కంపెనీల రుణ పరపతికి మద్ద తుగా నిలుస్తున్నట్టు వివరించింది. ఏఆర్పీయూ ప్రతి రూపాయి పెరుగుదలతో టెలికం కంపెనీలకు మొత్తంగా రూ.850–900కోట్లు సమకూరుతుందని వెల్లడించింది. టెలి కం రంగంలో 93% చందాదారులను కలిగిన మూడు ప్రము ఖ టెలికం కంపెనీలపై (జియో, ఎయిర్టెల్, వొడాఫోన్) అధ్యయనం చేసిన క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదికను విడుదల చేసింది. టారిఫ్ల పెంపుతో టెలికం కంపెనీల నిర్వహణ లాభం 2024–25లో 17% వృద్ధి చెందడం గమనార్హం. ప్రీమియం ప్లాన్లు.. ఓటీటీ సేవల కోసం డేటాకు డిమాండ్ పెరుగుతుండడంతో దీన్నుంచి ప్రయోజనం పొందేందుకు టెలికం కంపెనీలు ప్రీమియం ప్లాన్లను ఆఫర్ చేస్తుండడాన్ని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక ప్రస్తావించింది. ఇది కూడా సగటు యూజర్ వారీ ఆదాయాన్ని పెంచుతుందని తెలిపింది. ఇక చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సేవల విస్తరణ మరో 4–5 శాతం పెరిగి 2026 మార్చి నాటికి 82 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. వాయిస్ కాల్స్ ప్లాన్లను వినియోగిస్తున్న యూజర్లు డేటా ప్లాన్లకు మళ్లడం ఆదాయాన్ని పెంచుతుందని వివరించింది. ఈ ధోరణులతో టెలికం కంపెనీలకు ఆదాయం పెరుగుతుందని.. అదే సమయంలో కంపెనీలకు 60 శాతం వ్యయాలు స్థిరంగా ఉంటాయి కనుక నిర్వహణ లాభం అధికమవుతుందని పేర్కొంది. అలాగే, మూలధన వ్యయాల అవసరం తక్కువగా ఉండడంతో ఫ్రీక్యాష్ ఫ్లో (నికర మిగులు నిల్వలు) పెరుగుతుందని వివరించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో 31 శాతంగా ఉన్న మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24–26 శాతానికి (ఆదాయంలో) పరిమితమవుతాయని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ తెలిపారు. స్పెక్ట్రమ్ కొనుగోళ్లు దాదాపుగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే ముగిశాయని, తదుపరి స్పెక్ట్రమ్ పెట్టుబడులు 2030లో అవసరపడతాయని చెప్పారు. ఇవన్నీ కలసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లోకు దారితీస్తాయని తెలిపారు. కంపెనీల నికర రుణ భారం 3.4 రెట్ల నుంచి 2.7 రెట్లకు (మూలధనంతో దిగొస్తుందన్నారు. రూ.225కు ఏఆర్పీయూ ‘‘గత ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ రూ.205గా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.220–225కు చేరుకుంటుంది. ప్రధానంగా అధిక డేటా వినియోగం ఇందుకు దోహదం చేస్తుంది. 5జీ నెట్వర్క్ లభ్యత మరింత విస్తృతమై 2026 మార్చి నాటికి 45–47 శాతానికి చేరుకుంటుంది. 2025 మార్చి నాటికి ఇది 35 శాతంగా ఉంది’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. సోషల్ మీడియా యాప్లు, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, జెనరేటివ్ ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ కోసం డేటా వినియోగం పెరుగుతున్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సగటు యూజర్ నెలవారీ డేటా వినియోగం 27జీబీగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 31–32జీబీకి పెరుగుతుందన్నారు. ‘‘టెలికం కంపెనీలు ప్లాన్లలో డేటా ప్రయోజనాలను తగ్గిస్తున్నాయి. లేదా అధిక డేటా ప్లాన్లపైనే 5జీ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ చర్యలు కస్టమర్లు ప్రీమియం ప్లాన్లకు వెళ్లేలా చేస్తాయి. దీంతో కంపెనీల ఏఆర్పీయూ పెరుగుతుంది’’అని కులకర్ణి వివరించారు. -
యూపీఐ సబ్సిడీ కేటాయింపులు పెంచే అవకాశం
ముంబై: యూపీఐ, రూపే కార్డ్ లావాదేవీల ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకి మద్దతునిచ్చేందుకు ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేటాయించిన రూ. 437 కోట్ల వార్షిక సబ్సిడీ మొత్తాన్ని మరింతగా పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి చెందిన ఎకానమిస్టులు ఒక నివేదికలో పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం ఈ వ్యవస్థ నిర్వహణ కోసం పరిశ్రమవర్గాలు రూ. 4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు భారాన్ని మోస్తున్నాయని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,000 కోట్లుగా ఉన్న సబ్సిడీ మొత్తాన్ని ఈ బడ్జెట్లో భారీగా కోత పెట్టడంతో కొన్ని యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించేందుకు అనుమతించాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయని నివేదిక తెలిపింది. దీని ప్రకారం వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.30 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేటును (ఎండీఆర్) వసూలు చేసుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతిస్తోంది. అయితే, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో 2020 నుంచి రూపే డెబిట్ కార్డు, భీమ్–యూపీఐ ద్వారా చెల్లింపులపై చార్జీలను తొలగించింది. మరోవైపు, చిన్న వర్తకులకు యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఉండదు. పైగా రూ. 2,000 వరకు లావాదేవీ మొత్తాలపై 0.15 శాతం వరకు ప్రోత్సాహకాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్రోత్సాహకాన్ని వ్యాపారి బ్యాంకునకు ప్రభుత్వం చెల్లిస్తుంది. దాన్ని కస్టమర్ బ్యాంకుతో పాటు మిగతా వర్గాలన్నీ కలిసి పంచుకుంటాయి. ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో అమెరికన్ సంస్థలకు చెందిన ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యం నెలకొనడమనేది దేశీ ఫిన్టెక్ సంస్థలను తొక్కేసే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. -
మేకిన్ ఇండియాపై జాగ్రత్త
న్యూఢిల్లీ: ‘మేకిన్ ఇండియా’ నినాదమనేది ‘మేక్ ఆల్ దట్ ఇండియా నీడ్స్’ (భారత్కి కావల్సినవన్నీ ఇక్కడే తయారు చేసుకోవడం)గా మారకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. దీనివల్ల చైనాకు వెళ్లే పెట్టుబడులను మనవైపు ఆకర్షించే అవకాశం కోల్పోతామని, ఉత్పాదకతపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మేకిన్ ఇండియా విజయవంతం కావడమనేది, రక్షణాత్మక ధోరణి కన్నా ఎంత మెరుగ్గా పోటీపడగలమనే దానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మిగతావారితో పని లేకుండా విడిగా ఉండిపోవడం కాకుండా స్వేచ్ఛా విధానాలను అమలు చేయడం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమని దువ్వూరి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పునరుద్ఘాటించినట్లుగా ఆత్మనిర్భర భారత్ నినాద లక్ష్యం రక్షణ, ఇంధనంలాంటి సున్నిత రంగాల్లో వ్యూహాత్మకంగా స్వయం సమృద్ధి సాధించడమే కావాలే తప్ప దాన్ని ప్రతి ఒక్క దానికి అన్వయించుకోకూడదని తెలిపారు. భారత్కి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికి కూడా అవసరమైన వాటిని ఉత్పత్తి చేసే ఎగుమతుల ఆధారిత తయారీ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దడమే మేకిన్ ఇండియా ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ‘‘అయితే, 50 శాతం టారిఫ్ల వల్ల కీలకమైన అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు, ఇప్పుడు ఆసియాలోనే అత్యధిక టారిఫ్లు ఎదుర్కొంటున్న మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి సందేహిస్తారు’’ అని దువ్వూరి తెలిపారు. ‘‘ఆసియాలో బంగ్లాదేశ్, వియత్నాం, ఇండొనేíÙయా కన్నా భారత్పై అత్యధిక టారిఫ్లు వర్తిస్తుండటమనేది ఆందోళనకర అంశం. కీలక తరుణంలో చైనా ప్లస్ వన్గా ఎదగాలన్న ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి దీని వల్ల విఘాతం కలుగుతుంది’’ అని చెప్పారు. అమెరికాకు సగం ఎగుమతులపై టారిఫ్ల ప్రభావం .. మన ఎగుమతుల్లో దాదాపు 20 శాతం వాటా ఉండే అమెరికా మార్కెట్లో 50 శాతం టారిఫ్లు విధిస్తే, కనీసం సగం ఎగుమతులపై ప్రభావం పడుతుందని దువ్వూరి తెలిపారు. ముఖ్యంగా టెక్స్టైల్స్, రత్నాభరణాలు, లెదర్లాంటి కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్కు టారిఫ్ల నుంచి మినహాయింపు ఉండటం శాశ్వతమేమీ కాదని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు కొనసాగుతున్న సమీక్షల వల్ల భవిష్యత్తులో వాటిని కూడా టారిఫ్ల పరిధిలోకి చేర్చే అవకాశం ఉందన్నారు.500 బిలియన్ డాలర్ల వాణిజ్యం డౌటే.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న భారత్–అమెరికా లక్ష్యం సాకారం కావడం మిథ్యేనని స్పష్టంగా తెలుస్తోందని దువ్వూరి చెప్పారు. మన ఎగుమతుల మీద పడే ప్రభావాలపై లెక్కలు వేసుకోవడానికి ముందు, అమెరికా మార్కెట్ కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రపంచ దేశాలను చైనా తమ ఉత్పత్తులతో ముంచెత్తే ముప్పు గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, దేశీయంగా డెయిరీ, వ్యవసాయం అనేవి రాజకీయంగా చాలా సున్నితమైన రంగాలని, కోట్ల కొద్దీ ప్రజలకు జీవనోపాధి కలి్పంచడంతో పాటు దేశ ఆహార భద్రతకు కూడా ముడిపడి ఉన్నవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా దిగుమతులకు గంపగుత్తగా అనుమతించడం వాంఛనీయమూ, లాభదాయకమూ కూడా కాదని సుబ్బారావు చెప్పారు. అయితే, కొన్ని విషయాల్లో కాస్త పట్టు విడుపులతో వ్యవహరిస్తే చర్చల్లో ప్రతిష్టంభన తొలగేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. -
ఎన్బీఎఫ్సీ బాహుబలి ఐపీవో!
న్యూఢిల్లీ: అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీ.. టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లు(రూ. 94,600 కోట్లు)గా నమోదుకానున్నట్లు తాజాగా అంచనా వేశాయి. ఈ ఇష్యూ పూర్తియితే దేశంలో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఐపీఓగా రికార్డు సృష్టించనుంది. లిస్టింగ్కు వీలుగా టాటా గ్రూప్ దిగ్గజం ఇటీవలే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో మొత్తం 26.58 కోట్ల షేర్లు విక్రయించనుంది. వీటిలో 21 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుండగా.. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. టాటా క్యాపిటల్ మాతృ సంస్థ టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్సీ 3.58 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. కంపెనీ లిస్టయితే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా నమోదుకానుంది. వెరసి టాటా గ్రూప్ నుంచి రెండేళ్లలో రెండు కంపెనీలు లిస్టింగ్ను పొందినట్లవుతుంది. ఇంతక్రితం ఐటీ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ 2023 నవంబర్లో ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. పటిష్ట పనితీరు: ఈ ఏడాది తొలి త్రైమాసికం (2025–26, క్యూ1)లో టాటా క్యాపిటల్ కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపై రూ.1,041 కోట్లకు చేరింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ.472 కోట్లు ఆర్జించింది. ఆదా యం రూ. 6,557 కోట్ల నుంచి రూ.7,692 కోట్లకు ఎగసింది. -
ఏఏఏఐ డైరెక్టరుగా ‘శ్లోక’ శ్రీనివాస్ ఎన్నిక
హైదరాబాద్: అడ్వరై్టజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) డైరెక్టర్ల బోర్డుకు శ్లోక అడ్వరై్టజింగ్కి చెందిన శ్రీనివాస్ మరోసారి ఎన్నికయ్యారు. భారతీయ అడ్వరై్టజింగ్ రంగంలో ఆయనకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఏఏఏఐ బోర్డుకు తిరిగి ఎన్నిక కావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ శ్రీనివాసన్ కె. స్వామితో పాటు దిగ్గజాలతో కలిసి పని చేయడంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. నైతికతకు ప్రాధాన్యతమిస్తూ పరిశ్రమ పురోగతికి దోహదపడే సానుకూల పరిస్థితుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. దేశీయంగా అడ్వరై్టజింగ్ ఏజెన్సీల సమాఖ్య అయిన ఏఏఏఐ ప్రధానంగా సభ్యుల ప్రయోజనాలను పరిరక్షించడం, అడ్వరై్టజింగ్ ప్రమాణాలను మెరుగుపర్చడం, ప్రొఫెషనలిజంను పెంపొందించడం మొదలైన అంశాలపై దృష్టి పెడుతుంది. -
జీఎస్టీ మంత్రుల బృందం భేటీ రేపే
న్యూఢిల్లీ: జీఎస్టీలో శ్లాబుల తగ్గింపుపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం 20న చర్చించనుంది. ఈ బృందంలో భాగం కాకపోయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ సమావేశానికి హాజరు కానుండడం గమనార్హం. 5 శాతం, 18 శాతం శ్లాబులతో కూడిన కొత్త నమూనాను కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే మంత్రుల బృందం ముందుంచింది. పొగాకు తదితర కొన్నింటిపై 40 శాతం పన్ను ప్రతిపాదించింది. దీనిపై ఢిల్లీలో ఈ నెల 20, 21 తేదీల్లో జీఎస్టీ మంత్రుల బృందం (జీవోఎం) చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘జీవోఎంలో కేంద్రం భాగం కానప్పటికీ.. ఆర్థిక మంత్రి పాల్గొనడం, ప్రసంగించడం అన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన, ఉద్దేశ్యాలను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సాయపడుతుంది’’అని ఆ వర్గాలు వెల్లడించాయి. విహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆరుగురు సభ్యుల జీవోఎంకు కనీ్వనర్గా వ్యవహరిస్తున్నారు.కొత్త రేట్లను దిపావళికి ముందే అమల్లోకి తేవాలన్నది కేంద్రం ఉద్దేశంగా ఉంది. జీఎస్టీ రేట్లలో మార్పుతో ఆదాయం తగ్గుతుందన్న ఆందోళనలను కేంద్రం తొలగించే ప్రయత్నం చేసింది. ఆదాయంలో రాష్ట్రాలతో పాటు కేంద్రానికి సమాన వాటా ఉంటుందన్న విషయాన్ని అధికార వర్గాలు గుర్తు చేశాయి. కొత్త ప్రతిపాదనలతో నిరీ్ణత కాలంలో వినియోగం పెరిగి, అధిక ఆదాయానికి దారితీస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇక ప్రతిపాదిత రెండంచెల పన్ను శ్లాబులతో కూడిన కొత్త జీఎస్టీ విధానంలో మెజారిటీ ఆదాయం 18 శాతం నుంచే ఉంటుందని తెలిపాయి. ప్రస్తుతం బంగారంపై 3శాతం, ఇతర వస్తు సేవలపై 5, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. ఆహార వస్తువులు కొన్నింటిని పన్ను నుంచి మినహాయించగా, కొన్ని 5 శాతం రేటు పరిధిలో ఉన్నాయి. లగ్జరీ, సిన్ గూడ్స్ (హానికారక)పై 40 శాతం రేటు అమలవుతోంది. -
ఇక ఏసీలు, టీవీలు చౌక!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్నులో శ్లాబుల తగ్గింపుతో ఏసీలు, టీవీల ధరలు చెప్పుకోతగ్గ స్థాయిలో దిగిరానున్నాయి. ముఖ్యంగా ఎయిర్ కండీషనర్లపై (ఏసీలు) 28 శాతంగా ఉన్న జీఎస్టీ 18 శాతానికి తగ్గనుంది. దీంతో మోడల్ను బట్టి ఒక్కో ఏసీ యూనిట్ ధర రూ.1,500–2,500 మేర చౌకగా మారనుంది. 32 అంగుళాలకు మించిన టీవీలపైనా జీఎస్టీ 28% నుంచి 18 శాతానికి తగ్గనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనికితోడు బడ్జెట్లో పెద్ద మొత్తంలో ఆదాయపన్ను మినహాయింపులు కలి్పంచడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ఏసీల కొనుగోళ్లను పెంచుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. పెద్ద ముందడుగు రూమ్ ఏసీల కొనుగోళ్లు నిలిచిపోయినందున జీఎస్టీలో ప్రతిపాదిత సంస్కరణలను వేగంగా అమల్లోకి తీసుకురావాలని బ్లూస్టార్ ఎండీ బి. త్యాగరాజన్ కోరారు. ‘‘ఆగస్ట్ నెలలో రూమ్ ఏసీలను ఎవరూ కొనరు. సెపె్టంబర్ లేదా అక్టోబర్ 1 వరకు వేచి చూడొచ్చు. ఈ కాలంలో డీలర్లే కాదు, కస్టమర్లు కూడా కొనుగోళ్లు చేయరు’’అంటూ అన్సీజన్ను ఆయన గుర్తు చేశారు. 10 శాతం వరకు ఏసీల ధరలు తగ్గొచ్చొని చెప్పారు. ఇంధన ఆదా చేసే ఏసీలపై తక్కువ జీఎస్టీని అంచనా వేస్తున్నామని.. ఇతర ఏసీల ధరలు 18% రేటు పరిధిలో ఉండొచ్చని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చైర్మన్ మనీష్ శర్మ అభిప్రాయపడ్డారు. 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినా కానీ ఉత్పత్తుల ధరలు 6–7 శాతం మేర (రూ.1,500–2,500) దిగిరావొచ్చని చెప్పారు. ప్రతిపాదిత జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగాన్ని పెంచుతుందని గోద్రేజ్ అప్లయెన్సెస్ సైతం అంచనా వేసింది.‘‘దేశంలో ఏసీల వినియోగం ఇప్పటికీ 9–10 శాతంగానే ఉంది. జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే మరింత మంది ప్రజలకు ఏసీల ధరలు అందుబాటులోకి వస్తాయి. దీంతో చాలా మంది భారతీయుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది’’అని గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ అప్లయెన్సెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ప్రస్తుతం రూమ్ ఏసీలపై 28% జీఎస్టీ అమల్లో ఉండగా, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై 18 శాతం రేటు అమలు అవుతున్నట్టు తెలిపారు. ఏసీ, టీవీలకు అనుకూలం.. థామ్సన్, బ్లోపంక్త్ తదితర బ్రాండ్లపై టీవీలను తయారు చేసి విక్రయించే సూపర్ ప్లా్రస్టానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా సైతం ప్రభుత్వ చర్యతో పండుగల సీజన్లో వినియోగం పెరుగుతుంని అంచనా వేశారు. ఏసీ, స్మార్ట్ టీవీలు (32 అంగుళాల పైన) 28% జీఎస్టీ పరిధిలో ఉన్నాయంటూ.. రేట్లను తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని తెలిపారు. తాము 20% వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇక 32 అంగుళాల టీవీలను 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఈ సెగ్మెంట్లో 38 శాతం అసంఘటిత రంగం నుంచే వస్తున్నట్టు చెప్పారు. వేసవిలో ముందస్తు వర్షాలతో ఈ ఏడాది ఏసీ అమ్మకాలు తగ్గాయి.గొప్ప సంస్కరణ జీఎస్టీ పునర్నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న చర్య ఎంతో ముఖ్యమైన సంస్కరణ. దీని ద్వారా ప్రభుత్వం అద్భుతమైన పని చేస్తోంది. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఆటో పరిశ్రమపై పడే ప్రభావంపై వ్యాఖ్యానించేందుకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకునే వరకు వేచి చూడడం మంచిది.– ఆర్సీ భార్గవ, మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లు.. ఇవే!
మార్కెట్లో ఎన్నెన్ని కార్లు వచ్చినా.. ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేస్తున్నాయి. ఇందులో కేవలం పెట్రోల్ కార్లు మాత్రమే కాకుండా.. డీజిల్ హైబ్రిడ్ కార్లు కూడా ఉన్నాయి. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.5. మారుతి డిజైర్భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ఒకటైన మారుతి డిజైర్. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో ఒకటి. రూ. 6.48 లక్షల (ఎక్స్ షోరూం) ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఈ కారు.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 82 హార్స్ పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన డిజైర్.. 25.71 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.4. మారుతి స్విఫ్ట్మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ కూడా ఎక్కువ మైలేజ్ అందించే కార్ల జాబితాలో ఒకటి. ఇది 25.75 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5 మాన్యువల్, ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్ షోరూం).3. మారుతి సెలెరియో1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన మారుతి సెలెరియో.. 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ద్వారా 26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. ఇది 69 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 5.64 లక్షలు (ఎక్స్ షోరూం).2. హోండా సిటీ ఈ:హెచ్ఈవీహోండా కంపెనీకి చెందిన సిటీ ఈ:హెచ్ఈవీ అనేది హైబ్రిడ్ కారు. ఇది 27.26 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారు 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 100 హార్స్ పవర్, 121 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర రూ. 19.90 లక్షలు (ఎక్స్ షోరూం).1. టయోటా హైరైడర్ & మారుతి గ్రాండ్ విటారాటయోటా హైరైడర్ & మారుతి గ్రాండ్ విటారా రెండూ కూడా వేరు వేరు కంపెనీ కార్లు అయినప్పటికీ.. ఇవి 27.97 కిమీ/లీ మైలేజ్ అందిస్తాయని సమాచారం. ఈ కార్లు 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 92 హార్స్ పవర్, 122 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 6.84 లక్షలు, రూ. 8.34 లక్షలు (ఎక్స్ షోరూం). -
ఒక్క మెయిల్.. గుండెపోటు వచ్చినంత పనైంది!
ఉద్యోగం చేస్తున్నవారిలో చాలామంది కోరుకునేది.. వాళ్ళను కంపెనీ నుంచి తొలగించకూడదనే. అయితే అనుకోకుండా జాబ్ నుంచి తీసేస్తున్నట్లు మెయిల్ వస్తే?, గుండె ఆగినంత పని అయిపోతుంది. ఇలాంటి సంఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే?..టెర్మినేషన్ అనే సబ్జెక్ట్ లైన్తో.. హెచ్ఆర్ నుంచి కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ మెయిల్ అందింది. ఈ మెయిల్ చూడగానే దాదాపు ఉద్యోగులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉద్యోగం నుంచి తొలగించేసారమో భయపడ్డారు. అయితే ''భద్రతా ఉల్లంఘనల కారణంగా ఇద్దరు ఉద్యోగులను తొలగించినట్లు'' ఆ మెయిల్ సారాంశం. చదివిన తరువాత ఊపిరి పీల్చుకున్నారు.మెయిల్ చూడగానే.. గుండెపోటు వచ్చినంత పనైందని కొందరు ఉద్యోగులు పేర్కొన్నారు. వారికి వచ్చిన మెయిల్ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి ఇలాంటి మెయిల్స్.. కోవిడ్ సమయంలో చాలామంది అందుకున్నారు. అప్పటి నుంచి ఇలాంటి మెసేజస్ వస్తే.. ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టేస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఉద్యోగులు మెయిల్ చూడగానే భయపడినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? -
PMJDY: నిరుపయోగంగా 13 కోట్ల బ్యాంక్ అకౌంట్స్!
దేశంలో మొత్తం 56.04 కోట్ల ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాలలో 23 శాతం అకౌంట్స్ నిరుపయోగంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి 'పంకజ్ చౌదరి' వెల్లడించారు. 2025 జూలై 31 చివరి నాటికి 56.03 కోట్ల PMJDY ఖాతాలలో 13.04 కోట్లు నిరుపయోగంగా ఉన్నయని లోక్సభలో స్పష్టం చేశారు.ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 2.75 కోట్ల జన్ ధన్ ఖాతాలు పనిచేయడం లేదని.. ఆ తరువాత జాబితాలో బీహార్ (1.39 కోట్ల ఖాతాలు), మధ్యప్రదేశ్ (1.07 కోట్ల ఖాతాలు) ఉన్నాయని పంకజ్ చౌదరి పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 18 నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. ఒక పొదుపు ఖాతాలో రెండు సంవత్సరాలకు పైగా లావాదేవీలు జరగకపోతే దానిని పనిచేయని ఖాతాగా పరిగణించాలి.బ్యాంకులలో లావాదేవీలు జరగని లేదా ఇనాక్టివ్ ఖాతాల గురించి ఖాతాదారులకు లేఖలు లేదా ఈమెయిల్స్ ద్వారా తెలియజేయనున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. మొత్తం మీద ఈ ఖాతాలను మళ్ళీ యాక్టివ్ ఖాతాలుగా మార్చి.. ప్రజలు ఉపయోగించేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY)ప్రస్తుతం చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. కానీ పదేళ్ల కిందట కనీసం ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేని ఇల్లు చాలానే ఉండేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ.. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేరుతో ఓ పథకం లాంచ్ చేశారు.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?ఈ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు కేవలం డబ్బు పొదుపు చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందటానికి ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఇది జీరో అకౌంట్. ఈ ఖాతా ద్వారా సులభంగా లోన్స్ పొందవచ్చు. అయితే చాలామంది ఈ ఖాతాల ద్వారా లావాదేవీలను జరపకపోవడంతో.. అకౌంట్స్ నిరుపయోగంగా మారాయి. వీటిని రీకేవైసీ ద్వారా మళ్ళీ యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. -
హైదరాబాద్లో మోంట్రా ఎలక్ట్రిక్ డీలర్షిప్
మురుగప్ప గ్రూప్.. క్లీన్ మొబిలిటీ విభాగం అయిన మోంట్రా ఎలక్ట్రిక్, శ్రీరామ్ హర్షతో కలిసి హైదరాబాద్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్ (e-SCV) డీలర్షిప్ను ప్రారంభించింది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ను పరిష్కరించడానికి మాత్రమే కాకుండా.. కంపెనీ తన ఉనికిని విస్తరించడంలో భాగంగా డీలర్షిప్ ప్రారంభించింది.మోంట్రా ఎలక్ట్రిక్ డీలర్షిప్లో EViator కమర్షియల్ వెహికల్స్ ప్రదర్శిస్తారు. ఇవి తక్కువ పేలోడ్ కెపాసిటీ కలిగి.. చిన్న వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయి. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా సులభంగా ఉంటుంది. హైదరాబాద్లో పెరుగుతున్న లాజిస్టిక్స్ కంపెనీలు, ఫ్లీట్ యజమానులు, వ్యవస్థాపకుల నెట్వర్క్ వంటి వాటికి సేవలు అందించడానికి కంపెనీ డీలర్షిప్ ప్రారంభించింది.EViator వెహికల్ 80 కిలోవాట్ మోటారు ద్వారా 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 245 కిమీ రేంజ్ అందిస్తుందని ద్రువీకరించబడినప్పటికీ.. రియల్ వరల్డ్ రేంజ్ 170 కిమీ కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ ఈ వెహికల్ కొనుగోలుపై ఏడు సంవత్సరాలు లేదా 2.5 లక్షల కిమీ వారంటీ అందిస్తోంది.హైదరాబాద్లో డీలర్షిప్ ప్రారంభ కార్యక్రమానికి.. ఐటీ క్లీన్ మొబిలిటీ చైర్మన్ అరుణ్ మురుగప్పన్, టీఐ క్లీన్ మొబిలిటీ (మోంట్రా ఎలక్ట్రిక్) మేనేజింగ్ డైరెక్టర్ జలజ్ గుప్తా, TIVOLT ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ సాజు నాయర్ మొదలైనవారు పాల్గొన్నారు. -
బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
బంగారం, వెండి & బిట్కాయిన్.. ఈ మూడు గత ఒక సంవత్సరంలో పెట్టుబడిదారులకు భారీ రాబడులను ఇచ్చాయి. అంతకు ముందుతో పోలిస్తే బంగారం ధర 40 శాతం పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.లక్ష దాటేసింది. కేజీ వెండి ధర రూ.1.16 లక్షల వద్ద ట్రేడవుతోంది. బిట్కాయిన్ అద్భుతాలు చేస్తోంది. దీని విలువ 111 శాతం పెరిగి, కోటి రూపాయలు దాటేసింది. ఈ మూడింటిలో దేనిని ఎంచుకోవాలని కొందరు పెట్టుబడిదారులు సతమతమవుతుంటారు. ఈ ప్రశ్నకు రాబర్ట్ కియోసాకి & వారెన్ బఫెట్ ఏం చెబుతారంటే..'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి.. బంగారం, వెండి, బిట్కాయిన్ 'నిజమైన డబ్బు' అని చెబుతారు. ఎందుకంటే డబ్బును అదా చేస్తే.. దాని విలువ పెరగదు. వీటిపై (బంగారం, వెండి, బిట్కాయిన్) ఇన్వెస్ట్ చేస్తే విలువ పెరుగుతుంది, సంపన్నులవుతారని అంటారు. డాలర్ లాంటి కరెన్సీలను ఆయన 'నకిలీ డబ్బు' అని పిలుస్తారు.పేదలు, మధ్యతరగతి వారు దాదాపు డబ్బును బ్యాంకుల్లోనే దాచుకుంటారు. ఆ డబ్బు బ్యాంక్ ఖాతాలోనే ఉంటుంది. దాని విలువ ఎప్పటికీ పెరగదు. కానీ డబ్బును రియల్ ఎస్టేట్, బంగారం, చమురు, షేర్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే.. మీ సంపద పెరుగుతుందని కియోసాకి చెబుతారు.ప్రపంచంలోని గొప్ప పెట్టుబడిదారులలో ఒకరైన వారెన్ బఫెట్.. పెట్టుబడిదారుడిగా అతని జ్ఞానాన్ని పెట్టుబడి ప్రపంచంలో బైబిల్గా పరిగణిస్తారు. అయితే బంగారం పనికిరానిదని, వెండి మంచిదని, బిట్కాయిన్కు విలువ లేదని చెబుతారు. బంగారం ఏమీ చేయదు.. అక్కడే ఉంటుంది. ఏదైనా ఆస్తి ఉత్పాదకంగా ఉన్నప్పుడు మాత్రమే విలువ పెరుగుతుందని బఫెట్ విశ్వసిస్తారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ క్రాష్: రాబర్ట్ కియోసాకి హెచ్చరికబంగారం మీద పెట్టుబడి చూపడానికి ఆసక్తి చూపని బఫెట్.. వెండి మీద ఇన్వెస్ట్ చేయడానికి సుముఖత చూపుతారు. ఎందుకంటే.. వెండి ఎలక్ట్రానిక్స్, సౌర ఫలకాలు, వైద్య పరికరాల వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. భవిష్యత్తులో దీనికి మంచి వాల్యూ ఉంటుందని చెబుతారు. బిట్కాయిన్ లేదా క్రిప్టోకరెన్సీ ఏ ఉత్పాదక కార్యకలాపాలతోనూ సంబంధం లేదని ఆయన నమ్ముతారు.గమనిక: బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టాలంటే.. వాటిపై తప్పకుండా కొంత అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా వీటిలో పెట్టుబడులు పెడితే.. లాభాల సంగతి దేవుడెరుగు, నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగా వీటిపై అవగాహన పెంచుకోవాలనే విషయం మర్చిపోవద్దు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 676.09 పాయింట్లు లేదా 0.84 శాతం లాభంతో 81,273.75 వద్ద, నిఫ్టీ 245.65 పాయింట్లు లేదా 1.00 శాతం లాభంతో 24,876.95 వద్ద నిలిచాయి.పెన్నార్ ఇండస్ట్రీస్, లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, IFB ఇండస్ట్రీస్, సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, రవీందర్ హైట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ప్రీతి ఇంటర్నేషనల్, అగర్వాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్, NDL వెంచర్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టెక్ దిగ్గజం కొత్త రూల్.. జనవరి నుంచే అమలు!
ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన.. మైక్రోసాఫ్ట్ తన హైబ్రిడ్ పని నియమాలను మరింత కఠినతరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఉద్యోగులు ఎక్కువ సమయం ఆఫీసులో ఉండాలని.. వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని చెబుతోంది. ఈ రూల్ జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఉద్యోగులు ఆఫీసుకు రప్పించడానికి.. మైక్రోసాఫ్ట్ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కంపెనీ సెప్టెంబర్లో విడుదల చేసే అవకాశం ఉంది. 2020 చివర నుంచి సౌకర్యవంతమైన పని జీవితాన్ని అందించిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు కొంత కఠినంగా వ్యవహరిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్లో పర్సనల్ ఇంటర్వ్యూలు: సుందర్ పిచాయ్వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ అమలు చేసిన తరువాత చాలామంది ఇంటి నుంచి పనిచేయడానికే అలవాటు పడిపోయారు. అయితే ఈ విధానానికి స్వస్తి చెప్పడానికి కంపెనీ తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలనే కొత్త విధానం అమలు చేయడానికి సంకల్పించింది. చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడిపోవడం చేత.. మళ్ళీ ఆఫీసులకు రావాలంటే కొంత కష్టంగానే భావిస్తారు. -
టయోటా స్పెషల్ ఎడిషన్: 25.4 కిమీ/లీ మైలేజ్
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా.. దేశీయ మార్కెట్లో కొత్త 'క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్'ను రూ. 48.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ స్పెషల్ యాక్సెసరీ కిట్తో లభిస్తుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది.టయోటా క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్.. ఎమోషనల్ రెడ్, ప్లాటినం వైట్ పెర్ల్, సిమెంట్ గ్రే, ప్రెషియస్ మెటల్ & డార్క్ బ్లూ మెటాలిక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే బానెట్, రూప్ వంటివి మ్యాట్ బ్లాక్ కలర్ పొందుతాయి. ఈ కారులోని 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్ను పొందుతాయి.క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్.. లోపలి భాగంలో యాంబియంట్ లైటింగ్, పుడిల్ లాంప్స్ వంటివి పొందుతుంది.12 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జర్, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్ప్లే వంటి వాటితో పాటు 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ వంటివన్నీ కూడా ఈ స్పెషల్ ఎడిషన్లో ఉన్నాయి.ఇదీ చదవండి: కొరియా బ్రాండ్ కారుకు డిమాండ్!.. నాలుగు నెలల్లో 21000 బుకింగ్స్టయోటా లాంచ్ చేసిన క్యామ్రీ స్ప్రింట్ ఎడిషన్ డిజైన్ పరంగా అప్డేట్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎలాంటి మార్పులు పొందలేదు. కాబట్టి ఇందులో సాధారణ క్యామ్రీలోని 2.5 లీటర్ నాలుగు సిలిండర్స్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 187 హార్స్ పవర్, 221 న్యూటన్ మీటర్ టార్క్, ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7.2 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది లీటరుకు 25.4 కిమీ మైలేజ్ అందిస్తుంది. దీంతో ఈ కారు భారతదేశంలో అమ్మకానికి ఉన్న అత్యధిక మైలేజ్ కార్ల జాబితాలో ఒకటిగా మారింది. -
ఇంటెల్ రహస్య పత్రాలు దొంగలించి మైక్రోసాఫ్ట్లో..
చట్టవిరుద్ధంగా కంపెనీ రహస్య పత్రాలను దొంగలించి మైక్రోసాఫ్ట్తో పంచుకున్న ఇంటెల్ మాజీ ఇంజినీర్కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 34,000 డాలర్ల(సుమారు రూ.29 లక్షలు)కు పైగా జరిమానా విధించించారు. ఇంటెల్లో ప్రొడక్ట్ మార్కెటింగ్ ఇంజినీర్గా దాదాపు పదేళ్లు పనిచేసిన వరుణ్ గుప్తాకు ఇటీవల ఈమేరకు శిక్ష ఖరారు చేశారు. ఈ దుష్ప్రవర్తన కారణంగా మైక్రోసాఫ్ట్ కూడా వరుణ్ను పదవి నుంచి తొలగించింది.అసిస్టెంట్ యూఎస్ అటార్నీ విలియం నరస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుప్తా ఇంటెల్ కంపెనీకి 2020లో రాజీనామా చేయడానికి ముందు సంస్థ కేటాయించిన కంప్యూటర్ నుంచి వేలాది రహస్య ఫైళ్లను వ్యక్తిగత హార్డ్ డ్రైవ్కు బదిలీ చేసుకున్నాడు. తర్వాత కంప్యూటర్ ప్రాసెసర్లతో కూడిన ఒప్పందంతో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగంలో చేరాడు. ఇంటెల్లో దొంగలించిన ఫైళ్లను కొంత కాలానికి మైక్రోసాఫ్ట్లో యాక్సెస్ చేశాడు. గుప్తా యాక్సెస్ చేసిన డాక్యుమెంట్లలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. ఇది ఇంటెల్ ధరల వ్యూహాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: చదువుతో ఆర్థిక అక్షరాస్యత వస్తుందా?ఈ కారణంగా మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం కోల్పోవడంతోపాటు ఇంటెక్ కంపెనీకి జరిమానాగా 34,000 డాలర్లు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. గుప్తా తన చర్యలకు విచారం వ్యక్తం చేస్తూ..తాను తీసుకున్న చెడు నిర్ణయంతో చాలా కోల్పోయానని చెప్పాడు. ఇంటెల్, మైక్రోసాఫ్ట్తోపాటు ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాడు. పని చేస్తున్న సంస్థను ఎంతో గౌరవించాలని, తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదని ఈ వార్తపై కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
అంబానీపై అప్పు రూ.3.47 లక్షల కోట్లు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పులు భారీగా పెరిగిపోయాయి. మంచి లాభాల్లో నడుస్తున్న, దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి చెందిన కంపెనీకి అప్పులేంటి అనుకుంటున్నారా? కంపెనీ ఎంత లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ వ్యాపారాలను విస్తరించడానికి అప్పులు అవసరమవుతాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ రంగాల్లో దూకుడుగా పెట్టుబడులను కొనసాగిస్తోంది. అందుకే అప్పులు పెరిగాయి.ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీ మొత్తం అప్పు రూ.3.47 లక్షల కోట్లు కాగా, నికర రుణం రూ.1.17 లక్షల కోట్లు. గతేడాది అంటే 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం అప్పు రూ.3.24 లక్షల కోట్లు. బలమైన ఆర్థిక స్థితిని కొనసాగిస్తూనే వ్యాపారాలను పెంచుకునేందుకు భారీ పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.2025 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1,31,107 కోట్ల మూలధన వ్యయాన్ని చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2023-24లో ఈ మొత్తం రూ.1,31,769 కోట్లుగా ఉంది. వార్షిక నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరం పెట్టుబడులలో ఎక్కువ భాగం క్రూడాయిల్ నుంచి కెమికల్స్ తయారు చేసే కొత్త ఓ2సీ ప్రాజెక్టులు, రిటైల్ స్టోర్ల ఏర్పాటు, డిజిటల్ సర్వీసుల పెంపు, నూతన ఇంధన వెంచర్లను అభివృద్ధి వైపు మళ్లించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక ఆదాయం విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.5,57,163 కోట్ల ఆదాయం ఆర్జించింది. అంతక్రితం ఏడాది రూ.5,74,956 కోట్లతో పోలిస్తే ఇది 3.1 శాతం తక్కువ. కంపెనీ ఎబిటా గత ఏడాది రూ.86,393 కోట్ల నుంచి 14.2 శాతం క్షీణించి రూ.74,163 కోట్లకు పరిమితమైంది. -
భారత్లో యాపిల్ రూ.1010 కోట్ల ఆఫీస్..
టెక్ దిగ్గజం యాపిల్ ఇండియా తన దేశీయ కార్యకలాపాలను విస్తరించే దిశగా భారీ అడుగు వేసింది. బెంగుళూరులోని వసంత్నగర్లో ఉన్న ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజ్కు తీసుకుంది. ఈ డడీల్ విలువ సుమారు రూ.1,010 కోట్లు కాగా, ఇదే ఇప్పటివరకు యాపిల్ ఇండియాలో తీసుకున్న అతిపెద్ద కార్యాలయ స్థలం.డీల్లోని కీలక అంశాలుఎంబసీ గ్రూప్కు చెందిన సంస్థ మాక్ చార్ల్స్ (ఇండియా) లిమిటెడ్ నుంచి యాపిల్ ఈ స్థలాన్ని లీజ్కు తీసుకుంది. 5వ అంతస్తు నుండి 13వ అంతస్తు వరకూ మొత్తం 2.7 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని యాపిల్ తీసుకుంది. ఇందుకు నెలకు రూ.6.315 కోట్లు (చదరపు అడుగుకు రూ.235) చొప్పున అద్దె చెల్లించనుంది. ఈ లీజ్ కాల వ్యవధి 10 సంవత్సరాలు. ఏటా 4.5 శాతం చెప్పున అద్దె పెరుగుతుంది. ఇందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ రూ.31.57 కోట్లుగా డీల్లో రాసుకున్నారు.ఇంకా విస్తరించే యోచనఎంబసీ జెనిత్ భవనంలో 5 నుండి 13వ అంతస్తు వరకు లీజుకు తీసుకున్న యాపిల్ సంస్థ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుండి 4వ అంతస్తు వరకు అదనంగా 1.21 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కూడా అద్దెకు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఇది జరిగితే, మొత్తం కార్యాలయ విస్తీర్ణం 4 లక్షల చదరపు అడుగులకు చేరుతుంది.భారత్లో వ్యూహాత్మక ప్రాధాన్యతయాపిల్ ఈ విస్తరణతో భారతదేశంలో తన ఉనికిని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా ఐఫోన్ ఉత్పత్తిని పెంచనున్నట్లు ఇప్పటికే యాపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బెంగుళూరు, పుణేలో రిటైల్ స్టోర్లను ప్రారంభించడం ద్వారా భారత టెక్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో కీలక పాత్ర పోషించాలని యాపిల్ భావిస్తున్నట్లుగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. యాపిల్ ఇప్పటికే 2021లో ప్రెస్టిజ్ మిన్స్క్ స్క్వేర్లో 1.16 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకుంది, 2023లో అక్కడ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.ఇదీ చదవండి: నగరం నలువైపులా భారీ లేఅవుట్లు.. కొత్త వెంచర్లు..