Business
-
'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై.. ఇరాన్ - అమెరికా యుద్ధం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని గురించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఐఎంఎఫ్ విడుదల చేసిన 'వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్' నివేదిక ప్రకారం.. 2026 సంవత్సరానికి గాను గ్లోబల్ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వృద్ధి సుమారు 3.1 శాతంగా ఉంటుంది పేర్కొంది. జనవరిలో ఇది 3.3 శాతం ఉంటుందని అంచనా వేసినప్పటికీ, మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైన తరువాత పరిస్థితులు మారాయి.ఈ యుద్ధం ఇరాన్ - అమెరికా,ఇజ్రాయెల్ దాడుల మధ్య ఉద్రిక్తతలతో ప్రారంభమై.. ఆ ప్రాంతంలో తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసింది. ఈ పరిణామాల కారణంగా ముఖ్యంగా చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇరాన్ హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాను అడ్డుకోవడం వల్ల ప్రపంచ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంధన ధరల పెరుగుదలతో.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. ఐఎంఎఫ్ ప్రకారం.. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 4.4 శాతానికి చేరవచ్చని అంచనా. ఇది జనవరిలో చెప్పిన అంచనాల కంటే చాలా ఎక్కువ.అయితే.. 1970లలో జరిగిన చమురు సంక్షోభంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా చమురు మీద ఆధారపడటం తగ్గింది. పునరుత్పాదక శక్తి, అణుశక్తి వంటి ప్రత్యామ్నాయ శక్తి వనరులు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరంగా నిలబడే అవకాశం ఉంది.యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే పరిస్థితి మరింత దిగజారవచ్చు. అప్పుడు గ్లోబల్ వృద్ధి రేటు 2.5 శాతం లేదా 2 శాతానికి కూడా పడిపోవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారుతుంది. ఈ ప్రభావం అన్ని దేశాలపై సమానంగా ఉండదని ఐఎంఎఫ్ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు ఎక్కువగా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ఆహార ధరలు పెరిగే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్కు ఇరాన్ చమురు.. ఏడేళ్లలో తొలిసారి!మధ్యప్రాచ్యం - మధ్య ఆసియా ప్రాంతాల్లో వృద్ధి రేటు గణనీయంగా తగ్గి 1.9 శాతానికి చేరవచ్చని అంచనా. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా కూడా ప్రభావితమవుతున్నాయి. అమెరికా వృద్ధి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, చైనాలో వృద్ధి కొంచెం మందగించనుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. -
గోల్డ్ ఈటీఎఫ్లు మెరిశాయ్
న్యూఢిల్లీ: బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు మార్చి త్రైమాసికంలో ఇన్వెస్టర్ల నుంచి బలమైన ఆదరణ కనిపించింది. రూ.31,561 కోట్ల తాజా పెట్టుబడులను ఇవి ఆకర్షించాయి. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులతో పోల్చితే ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం. అంతేకాదు 2025–26 డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన రూ.23,132 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూసినా 36 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన డేటా ప్రకారం.. మార్చి నెలలో మాత్రం పెట్టుబడుల రాక బలహీనపడింది.మార్చి నెలలో కేవలం రూ.2,266 కోట్ల పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో రూ.24,040 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,255 కోట్లతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. బంగారం ధరలు గత రెండేళ్లలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం తెలిసిందే. ఫలితంగా ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్లవైపు మొగ్గు చూపడం పెరిగింది. దీంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వీటిల్లోకి వచ్చాయి. ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు అమ్మకాల ఒత్తిడికి కొంత తగ్గిన నేపథ్యంలో, ఈటీఎఫ్ పెట్టుబడులపై ఇది ప్రభావం చూపించనట్టు తెలుస్తోంది. రూ.1.71 లక్షల కోట్ల ఆస్తులు గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) మార్చి చివరికి రూ.1.71 లక్షల కోట్లకు చేరాయి. 2025 మార్చి చివరికి వీటి విలువ రూ.58,888 కోట్లతో పోల్చితే మూడు రెట్లు పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోలు (ఒక ఈటీఎఫ్లో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి గుర్తింపు సంఖ్య) గత ఆర్థిక సంవత్సరంలో 54.28 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోలు 1.24 కోట్లకు చేరాయి. ‘‘జనవరిలో పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్ (మార్పులు, చేర్పులు), రిస్క్ తీసుకునే ధోరణి ఫలితంగా గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు అధికంగా వచ్చాయి.దీంతో తర్వాతి నెలల్లో పెట్టుబడులు బలహీనంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మార్చి నెలలో సానుకూల పెట్టుబడులు నమోదవడం అన్నది మార్కెట్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో బంగారాన్ని వైవిధ్యమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారనేదానికి సంకేతం’’అని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. బంగారంతో పోల్చితే ఈక్విటీల వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా మారినందున మార్చి నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు తగ్గడానికి కారణమని ద వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ సీఐవో (డెట్) ఉమేష్ శర్మ చెప్పారు. -
భారత్ వృద్ధికి... క్రూడ్ కోత!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరిగి బ్యారెల్కు 130 డాలర్లకు చేరితే భారత్ ఆర్థిక వృద్ధి రేటుపై 80 బేసిస్ పాయింట్ల (0.8 శాతం) మేర ప్రభావం పడొచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, పటిష్టమైన ఆర్థిక రంగంతో చమురు ధరల పెరుగుదలను భారత్ తట్టుకోగలదని పేర్కొంది. ‘‘చమురు ధరలు పెరిగితే ప్రభుత్వ ద్రవ్య లోటు లక్ష్యాలకు కొంత ఆటంకం కలగొచ్చు. కానీ భారత్ ‘సావరిన్ రేటింగ్’ పై తక్షణమే ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు’’అని ఎస్అండ్పీ స్పష్టం చేసింది. ఒకవేళ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి, చమురు సరఫరా సాధారణ స్థితికి వస్తే.. భారత్ తిరిగి పుంజుకుంటుందని నివేదిక పేర్కొంది. నివేదికలోని ఇతర అంశాలు.. ⇒ చమురు ధరల పెరుగుదల వల్ల గృహ వినియోగం, కార్పొరేట్ లాభాలు, బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల జీడీపీ వృద్ధి రేటు మందగించే అవకాశం ఉంది. ⇒ కంపెనీల ఎబిట్డా 2027 ఆర్థిక సంవత్సరంలో 15–25 శాతం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కెమికల్స్, రిఫైనింగ్ మరియు విమానయాన రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ⇒ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్పీఏలు) 3.5 శాతానికి పెరగొచ్చు. అయినప్పటికీ, భారతీయ బ్యాంకుల వద్ద తగినంత మూలధనం ఉండటం ఊరటనిచ్చే అంశం. ⇒ చమురు ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలతో దేశ కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 0.4% పెరగవచ్చు. దీనివల్ల రూపాయి విలువపైనా ఒత్తిడి పడుతుంది. ⇒ భారతీయ కంపెనీలు గత కొన్నేళ్లుగా అప్పులను తగ్గించుకుంటూ రావడంతో వాటి బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉన్నాయి. బ్యాంకుల వద్ద మెరుగైన మూలధనంతోపాటు తక్కువ స్థాయిలో ఎన్పీఏలు సానుకూలాంశాలు. -
Ai+ నోవా 2 అమ్మకాలు ఎప్పుడంటే?
నోవా సిరీస్లో భాగంగా తమ సరికొత్త డివైస్ 'నోవా 2' విక్రయాలు ప్రారంభమైనట్లు Ai+ స్మార్ట్ఫోన్ ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ ఔట్లెట్స్లో అందుబాటులో ఉంటుంది.Ai+ నోవా 2 ధరలు4జీబీ + 64 జీబీ: రూ.8,9996 జీబీ + 128 జీబీ: రూ.10,999మొదటిసారి అప్గ్రేడ్ అవుతున్న లేదా Ai+కి మారుతున్న వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ నోవా 2 ఉండనున్నాయి. ఇది నమ్మకమైన, విశ్వసనీయమైన రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుందని Ai+ స్మార్ట్ఫోన్ సీఈఓ, నెక్స్ట్ క్వాంటం (NxtQuantum) షిఫ్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మాధవ్ సేథ్ అన్నారు.6000mAh బ్యాటరీతో కూడిన నోవా 2.. స్ట్రీమింగ్, బ్రౌజింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్కు సరిపోయేలా తయారైంది. ఇది నెక్ట్స్ క్వాంటం (NxtQuantum) OSతో కూడిన ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తూ సున్నితమైన, ఆప్టిమైజ్ చేసిన అనుభూతి అందిస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HBM సపోర్ట్తో కూడిన 6.745 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వినియోగదారులు కంటెంట్ను చూస్తున్నా లేదా రోజువారీ పనులు చేస్తున్నా, నోవా 2 స్పష్టమైన విజువల్స్, నిరంతరాయమైన స్క్రోలింగ్ అందిస్తుంది.ఈ స్మార్ట్ఫోన్లో అన్ని రకాల లైటింగ్ పరిస్థితులలోనూ కచ్చితమైన, సహజమైన ఫొటోలు తీయడానికి అనువైన 50MP బ్యాక్ కెమెరా, అలాగే స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP64 రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో కూడిన మెరుగైన నిర్మాణాన్ని నోవా 2 కలిగి ఉంది. ఇది పర్పుల్, గ్రీన్, పింక్, బ్లూ, బ్లాక్ అనే ఐదు విభిన్న రంగులలో లభిస్తుంది. -
కో-ఆపరేటివ్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా
నిబంధనల ఉల్లంఘన విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కఠినంగా వ్యవహరించింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్పై రూ.7.50 లక్షల నగదు జరిమానాను విధిస్తూ కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఖాతాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల విషయంలో బ్యాంక్ వైఫల్యం చెందడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్బీఐ స్పష్టం చేసింది.తనిఖీలో వెలుగుచూసిన లోపాలునేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) 31 మార్చి 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీలో ఈ లోపాలు బయటపడ్డాయి. తనిఖీ నివేదిక ప్రకారం.. ఖాతాదారుల రిస్క్ ప్రొఫైల్ను కాలానుగుణంగా సమీక్షించే పటిష్టమైన వ్యవస్థను అమలు చేయడంలో బ్యాంక్ విఫలమైంది. ఆర్బీఐ నిర్దేశించిన కేవైసీ, ఇతర నియంత్రణ ప్రమాణాలను పాటించలేదు.ఆర్బీఐ చర్యల నేపథ్యంనిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరుతూ ఆర్బీఐ ఇదివరకే సదరు బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన సమాధానం, వ్యక్తిగత విచారణలో ప్రతినిధులు చేసిన మౌఖిక వాదనలు, వారు సమర్పించిన అదనపు పత్రాలను ఆర్బీఐ క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే, బ్యాంక్ వివరణ సంతృప్తికరంగా లేదని, ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతోనే ఈ జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.‘ఈ చర్య కేవలం రెగ్యులేటరీ వ్యవస్థలో లోపాలపై తీసుకున్న నిర్ణయం మాత్రమే. దీనికి బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలకు లేదా అది జరిపే లావాదేవీల చెల్లుబాటుకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే, ఈ జరిమానా విధించడం వల్ల బ్యాంకుపై భవిష్యత్తులో తీసుకునే ఇతర చట్టపరమైన చర్యలకు ఎటువంటి ఆటంకం కలగదు’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
బీవైడీ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) దిగ్గజం బీవైడీ ప్రధాన కార్యాలయం ఉన్న షెన్జెన్ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పింగ్షాన్ జిల్లాలోని కంపెనీ ప్రాంగణంలో ఉన్న ఒక మల్టీస్టోర్ పార్కింగ్ గ్యారేజీలో ఈ మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.ప్రమాదం జరిగిన తీరుసోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఫుటేజీ ప్రకారం.. బహుళ అంతస్తుల భవనంలోని ఒక విభాగం నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై బీవైడీ ప్రతినిధి స్పందిస్తూ, ‘మంటలు చెలరేగిన ప్రాంతం కేవలం పరీక్షలు పూర్తి చేసుకున్న, స్క్రాప్ చేసిన (పాత) వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ గ్యారేజీ మాత్రమే’ అని వివరించారు.ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన అంశాలుసాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగితే అవి బ్యాటరీ లోపం వల్లేననే ఆందోళన వ్యక్తమవుతుంటుంది. కానీ, ఈ ఘటనపై స్థానిక అగ్నిమాపక శాఖ, బీవైడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ ప్రమాదానికి బ్యాటరీ సెల్ఫ్-ఇగ్నిషన్ (స్వయంగా మంటలు అంటుకోవడం) లేదా నాణ్యత లోపాలు కారణం కాదని దర్యాప్తులో తేలింది.గ్యారేజ్ ప్రాంతంలో జరిగిన అశాస్త్రీయ బాహ్య నిర్మాణ కార్యకలాపాల వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాహనాలకు లేదా ఉత్పత్తిలో ఉన్న కొత్త వాహనాలకు దీనితో ఎలాంటి సంబంధం లేదని కంపెనీ భరోసా ఇచ్చింది.WATCH: Massive fire breaks out at Chinese electric vehicle company BYD’s parking garage in Shenzhen, China pic.twitter.com/hPMm61hHgu— Insider Paper (@TheInsiderPaper) April 14, 2026ఈవీలో మంటలు.. నిపుణుల హెచ్చరికసాధారణ పెట్రోల్/డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలను ఆర్పడం సవాలుతో కూడుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈవీ బ్యాటరీల్లో మంటలు ఒకసారి ఆరిపోయినట్లు అనిపించినా అవి మళ్లీ మళ్లీ రాజేసుకునే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే వీటిని ఆర్పేందుకు ఎక్కువ సమయం పడుతుందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.ఈ తాజా ప్రమాదం సాంకేతిక లోపం కాదని తేలినప్పటికీ గతంలో బీవైడీ కొన్ని భద్రతా సమస్యలను ఎదుర్కొంది. సెప్టెంబర్ 2024లో స్టీరింగ్ కంట్రోల్ యూనిట్లో తయారీ లోపం కారణంగా సుమారు 97,000 ‘డాల్ఫిన్, యువాన్ ప్లస్’ మోడళ్లను రీకాల్ చేసింది. జనవరి 2025లో అగ్ని ప్రమాద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో 6,843 ‘బావో 5’ హైబ్రిడ్ ఎస్యూవీలను రీకాల్ చేసింది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
సామాన్యుడిపై ధరల భారం తప్పదా?
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు ముడి చమురు ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర ఇటీవలే 110 డాలర్ల మార్కును తాకడం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే రాష్ట్ర ఎన్నికల అనంతరం సామాన్యుడిపై ఇంధన ధరల భారం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.కంపెనీల నెత్తిన నష్టాల భారంఅంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) సంస్థలు ఏప్రిల్ 2022 నుంచి రిటైల్ ధరలను సవరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్పుట్ ఖర్చులు పెరగడం, విక్రయ ధరలు స్థిరంగా ఉండటంతో ఈ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. పెట్రోల్పై నష్టం లీటరుకు సుమారు రూ.18, డీజిల్పై నష్టం లీటరుకు సుమారు రూ.35గా ఉందని అంచనా. ఓఎంసీలకు ఒక దశలో రోజుకు రూ.2,400 కోట్లుగా ఉన్న ఈ నష్టం ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత ప్రస్తుతం రూ.1,600 కోట్లకు చేరింది.మాక్వారీ నివేదిక విశ్లేషణప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ (Macquarie) తాజా నివేదిక ప్రకారం, చమురు కంపెనీల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన స్వల్ప లాభాలను మార్చి నెల నష్టాలు తుడిచిపెట్టేశాయి. ‘అంతర్జాతీయంగా స్పాట్ ధరలు బ్యారెల్కు 135 - 165 డాలర్ల మధ్య ఉన్న తరుణంలో భారత్లో విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీలు భారీ నష్టాలను ప్రకటించే అవకాశం ఉంది’ అని తెలిపింది. అంతేకాకుండా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.దిగుమతులపై ఆధారపడటం ఒక సవాల్భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 88% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది (2025 గణాంకాల ప్రకారం). మధ్యప్రాచ్యం, రష్యా, అమెరికాల నుంచి మనం చమురును సేకరిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 10 డాలర్లు పెరిగితే, దేశీయంగా లీటరుపై రూ.6 నష్టం అదనంగా పెరుగుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం చమురు కంపెనీలు మనుగడ సాగించాలంటే బ్యారెల్ ధర 80-85 డాలర్ల మధ్య ఉండాలి, కానీ ఇప్పుడు అది 120 డాలర్ల వద్ద ఉండటం ఆందోళనకరం.అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గని పక్షంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చమురు ధరల పెంపు అనేది అనివార్యంగా కనిపిస్తోంది. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపి, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేసే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
డ్రాగన్కు యుద్ధం దెబ్బ!
ప్రపంచ ఆర్థిక గమనానికి దిక్సూచిగా భావించే చైనా వాణిజ్య రంగం ప్రస్తుతం మిశ్రమ ఫలితాలను చవిచూస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ డిమాండ్పై ప్రతికూల ప్రభావం చూపడంతో మార్చి నెలలో చైనా ఎగుమతుల వృద్ధి ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే, దీనికి విరుద్ధంగా దిగుమతులు మాత్రం గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట వృద్ధిని నమోదు చేయడం విశేషం. చైనా కస్టమ్స్ విభాగం విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి.ఎగుమతుల్లో బ్రేక్.. దిగుమతుల్లో జోరురాయిటర్స్ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ చైనా ఎగుమతులు మార్చిలో కేవలం 2.5% మాత్రమే వృద్ధి చెందాయి. ఏడాది మొదటి రెండు నెలల్లో నమోదైన 21.8% వృద్ధితో పోలిస్తే ఇది భారీ పతనం. విశ్లేషకులు కనీసం 8.6% వృద్ధిని ఆశించినప్పటికీ, అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్ డ్రాగన్ ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు, దిగుమతుల రంగం అనూహ్యంగా పుంజుకుంది. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి దిగుమతులు 27.8% పెరిగాయి. నవంబర్ 2021 తర్వాత ఇదే అత్యధిక వృద్ధి కావడం గమనార్హం. 11.2% పెరుగుదల ఉంటుందన్న అంచనాలను మించి ఈ వృద్ధి నమోదు కావడం గమనార్హం.ఇంధన షాక్ను తట్టుకునే వ్యూహంమధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. హార్మూజ్ జలసంధి వంటి కీలక రవాణా మార్గాల్లో ఆటంకాలు ఎదురైతే ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. అయితే, ఈ ముప్పును ఎదుర్కోవడానికి బీజింగ్ పటిష్టమైన బఫర్ను సిద్ధం చేసుకుంది. చైనా వద్ద ప్రస్తుతం 120 రోజులకు పైగా సరిపడా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. కేవలం చమురుపైనే ఆధారపడకుండా బొగ్గు, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరులను చైనా వేగంగా అభివృద్ధి చేస్తోంది. పెరిగిన ఇంధన ధరల భారాన్ని వినియోగదారులపై వేయకుండా ప్రభుత్వం నియంత్రిస్తోంది.అమెరికాతో తగ్గిన వాణిజ్యం..అమెరికాతో పెరుగుతున్న సుంకాల యుద్ధం, ఉద్రిక్తతల ప్రభావం గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మార్చిలో అమెరికాకు చైనా ఎగుమతులు ఏకంగా 26.5% పడిపోయాయి. ప్రపంచ సరఫరా గొలుసులో ఇబ్బందులు, ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా చైనా మొత్తం వాణిజ్య మిగులు 264.3 బిలియన్ డాలర్లకు (3% తగ్గుదల) పరిమితమైంది.ముందున్న సవాలుచైనా తన మొదటి త్రైమాసిక జీడీపీ గణాంకాలను గురువారం విడుదల చేయనుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది 4.8% గా ఉండొచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు వాటా కలిగిన చైనా ఎగుమతులు మందగించడం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.ఇదీ చదవండి: నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు! -
నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!
ఐటీ రంగంలో మానవీయ విలువలకు, గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేస్తుందని పేరున్న ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ‘జోహో’లోనూ లేఆఫ్స్ కలకలం రేపుతున్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాదాపు 300 మంది ట్రైనీలను కంపెనీ ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తోంది. టెక్ నిపుణుల వేదిక ‘బ్లైండ్’లో బాధిత ఉద్యోగి ఒకరు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఏం జరిగింది? ఈ నిర్ణయానికి కారణమేంటి?బాధితుడి కథనం ప్రకారం.. కంపెనీలో అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాలే ఈ తొలగింపులకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సీనియర్ ఉద్యోగి, ‘మీరు మమ్మల్ని (అనుభవజ్ఞులను) తీసేసి తక్కువ జీతానికే వచ్చే ట్రైనీలతో ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నారా?’ అని యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ చర్చ జరిగిన కొద్ది రోజుల్లోనే ఫ్రెషర్లను భర్తీ చేస్తున్నారనే అపవాదు పోగొట్టుకోవడానికి కంపెనీ ఏకంగా 300 మంది ట్రైనీలను తొలగించిందని సదరు యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఫ్రెషర్ల ఆవేదన‘నేను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఈ ఉద్యోగం నాకు కెరీర్తోపాటు నా కుటుంబానికి జీవనాధారం. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను వదులుకుని జోహోలో చేరాను. అక్కడైతే కనీసం బెంచ్ మీద ఉన్నా భద్రత ఉండేది. ఇక్కడ కనీసం నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశారు’ అని ఒక బాధిత యువకుడు ‘బ్లైండ్’లో వాపోయాడు.వెంబు మాటలకు, చేతలకు పొంతన లేదు!జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తరచుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, చిన్న పట్టణాల నుంచి ప్రతిభను వెలికితీయడం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు విమర్శిస్తున్నారు. ‘చిన్న పట్టణాల నుంచి నియామకాలు చేపడుతున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, వివరణ లేకుండా వందలాది మంది యువత భవిష్యత్తును దెబ్బతీయడం ఏ రకమైన సంస్కృతి?’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.టెక్ వర్గాల్లో తీవ్ర నిరసనఈ వ్యవహారంపై గూగుల్, గోల్డ్మన్ సాక్స్, హెచ్పీ వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘300 మంది కెరీర్లతో ఆటలాడటం దారుణం. ఫ్రెషర్లను పావులుగా వాడుకుంటున్నారు’ అని గోల్డ్మన్ సాక్స్లో పనిచేసే ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు. ‘అంతర్గత రాజకీయాల క్రాస్ఫైర్లో ఎప్పుడూ అమాయక ఫ్రెషర్లే బలిపశువులవుతున్నారు’ అని మరొకరు పేర్కొన్నారు.కంపెనీ స్పందన కోసం నిరీక్షణఈ ఆరోపణలపై వివరణ కోరుతూ జోహో సంస్థకు కొన్ని మీడియా సంస్థలు ఈమెయిల్ పంపాయని తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేకపోయినా, సోషల్ మీడియాలో వస్తున్న వరుస పోస్టులు మాత్రం ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
యాపిల్ పెట్టుబడిపై నీలినీడలు!
‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ బెర్క్షైర్ హాత్వే సీఈఓ బాధ్యతల నుంచి డిసెంబర్ 31న తప్పుకున్నప్పటి నుంచి యాపిల్ పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకున్నాయి. తన అర్ధ శతాబ్దపు ప్రస్థానంలో బెర్క్షైర్ క్లాస్-ఏ షేర్లను ఏకంగా 61,00,000 శాతం వృద్ధి పథంలో నడిపించిన బఫెట్, ఆ పగ్గాలను ఇటీవల తన వారసుడు గ్రెగ్ అబెల్కు అప్పగించారు. అయితే, అబెల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బెర్క్షైర్ అత్యంత కీలకమైన యాపిల్ పెట్టుబడి బఫెట్ నిర్దేశించిన ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తోందనే చర్చ ఆసక్తికరంగా మారింది.విలువే ప్రాణం.. కానీ..వారెన్ బఫెట్ పెట్టుబడి శైలిలో అత్యంత ముఖ్యమైన నియమం ‘వాల్యుయేషన్’. ఒక సంస్థకు తిరుగులేని మార్కెట్ పట్టు, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పటికీ ఆ సంస్థ షేరు ధర దాని అసలు విలువ కంటే ఎక్కువగా ఉంటే బఫెట్ అటువైపు చూడరు. గ్రెగ్ అబెల్ తాను రాసిన మొదటి వార్షిక లేఖలో యాపిల్ను తన ‘ఫరెవర్ హోల్డింగ్స్’ (ఎప్పటికీ కొనసాగించే పెట్టుబడులు) జాబితాలో చేర్చారు. కానీ ప్రస్తుత మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే యాపిల్ షేరు ధర బఫెట్ సూత్రాలకు విరుద్ధంగా చాలా ఖరీదుగా కనిపిస్తోంది.స్తంభించిన వృద్ధిఇటీవలి కాలంలో యాపిల్ అమ్మకాల వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఉత్పత్తుల ఆదాయం మందగించింది. కేవలం సర్వీసెస్ విభాగం మాత్రమే స్వల్ప వృద్ధిని కనబరుస్తోంది. ఏప్రిల్ 10 నాటికి యాపిల్ షేర్లు తమ ఆర్జన కంటే 33 రెట్లు (33 రెట్లు ఈపీఎస్-ఎర్నింగ్ పర్ షేర్) ఎక్కువ ధరకు ట్రేడ్ అవుతున్నాయి. 2016లో బఫెట్ తొలిసారి యాపిల్లో వాటాలను కొనుగోలు చేసినప్పుడు, ఆ స్టాక్ కేవలం 10 నుంచి 15 రెట్ల పీఈ రేషియోలో లభించేది. బఫెట్ సీఈఓగా ఉన్న చివరి తొమ్మిది త్రైమాసికాల్లోనే యాపిల్లోని సుమారు 75 శాతం వాటాను (687.6 మిలియన్ షేర్లు) విక్రయించడం గమనార్హం. కేవలం వాల్యుయేషన్ పరంగా ఆకర్షణీయంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఏఐ ఆశలు వర్కౌట్ అవుతాయా?యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా కృత్రిమ మేధ రంగంలోకి కంపెనీ అడుగుపెట్టడం ఇన్వెస్టర్లలో కొంత ఉత్సాహాన్ని నింపినప్పటికీ అది తక్షణ ఆదాయ వృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందనేది ప్రశ్నార్థకమే. యాపిల్ తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే కార్యక్రమం(బైబ్యాక్) కోసం 2013 నుంచి 841 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినప్పటికీ ఆదాయ వృద్ధి లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది.ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలా?గ్రెగ్ అబెల్ యాపిల్ను దీర్ఘకాలిక సంపద సృష్టికర్తగా చూస్తున్నప్పటికీ బఫెట్ మార్గంలోనే నడిస్తే మాత్రం రాబోయే త్రైమాసికాల్లో బెర్క్షైర్ తన యాపిల్ వాటాను మరింత తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కేవలం బ్రాండ్ విలువను చూసి పెట్టుబడి పెట్టడం కంటే, ఆ సంస్థ ఇచ్చే రాబడి, వాల్యుయేషన్ మధ్య సమతుల్యతను గమనించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ వంటి దిగ్గజ సంస్థలే వృద్ధి కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను పునసమీక్షించుకోవడం ఉత్తమం.గమనిక: పై కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. షేర్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మధ్యతరగతి ప్రజలే కీలకం. దేశంలో తయారయ్యే సగటు వస్తువులను అధికంగా కొనేది వీరే. ప్రభుత్వానికి సింహభాగం పన్నులు కట్టేదీ వీరే. కానీ, ప్రస్తుతం వారు ఆర్థికంగా, సామాజికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పేదల కోసం పథకాలు ఇస్తోంది. ధనికుల కోసం ప్రోత్సాహకాలు అందిస్తోంది. కానీ, ఈ రెండింటి మధ్య ఉన్న మధ్యతరగతి ప్రజల కష్టాలను మాత్రం విస్మరిస్తోంది.వచ్చే జీతం చాలడం లేదుమునుపటితో పోలిస్తే ఇప్పుడు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ సామాన్యుడి జీతం మాత్రం పెరగడం లేదు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కో లేదా ఆఫీస్ ఉద్యోగికో వచ్చే ప్రారంభ జీతం ఎంత ఉందో, నేటికీ దాదాపు అంతే ఉంది. కానీ, అప్పటితో పోలిస్తే ఇళ్ల అద్దెలు, పెట్రోల్, కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. మన దేశంలో 70 శాతం మంది సంపాదన దేశ సగటు ఆదాయం కంటే తక్కువగానే ఉంది. అంటే, కొద్దిమంది ధనికులు రోజురోజుకు మరింత ధనవంతులు అవుతుంటే మెజారిటీ ప్రజలు మాత్రం బతుకు బండి అంతంతమాత్రంగానే నెట్టుకొస్తున్నారు.చదువు, వైద్యం, ఇల్లుమధ్యతరగతి బడ్జెట్ను ఈ మూడు అంశాలు పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేక, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భరించలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఏటా ప్రైవేట్ రంగంలో ఫీజులు 10-20% పెరుగుతున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం సొంత అవసరాలను త్యాగం చేసి మరీ ఫీజులు కడుతున్నారు. మరోవైపు పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ ఉన్నా అది అన్నింటికీ సరిపోవడం లేదు. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. సొంత ఇల్లు కొందామంటే బ్యాంక్ వడ్డీలు భయం పుట్టిస్తున్నాయి. దీంతో సంపాదనలో సగం అద్దెకో లేదా ఈఎంఐకో సరిపోతోంది.‘ప్రభుత్వం లెక్కించే ధరల పెరుగుదల పాత పద్ధతిలో ఉంది. అది పప్పులు, ఉప్పుల ధరల మీద దృష్టి పెడుతుంది కానీ, మనం ఎక్కువగా ఖర్చు చేసే స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులను సరిగ్గా లెక్కలోకి తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. అందుకే ప్రభుత్వ లెక్కల్లో ధరలు తక్కువగా ఉన్నా సామాన్యుడికి మాత్రం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి’పొదుపు మాయం.. అప్పులే శరణ్యంఒకప్పుడు మధ్యతరగతి వారు భవిష్యత్తు కోసం డబ్బు దాచుకునేవారు. కానీ ఇప్పుడు నెలవారీ జీతం క్షణాల్లో అయిపోతోంది. దాచుకోవడానికి రూపాయి మిగలడం లేదు. అవసరాల కోసం అప్పులు చేయడం, క్రెడిట్ కార్డులు వాడటం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజల పొదుపు తగ్గిపోయి, అప్పులు పెరగడం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం.ఆశలు నీరుగారుతున్నాయిమధ్యతరగతి వారు కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్లు లేవు. కొత్త ఉద్యోగం చూద్దామంటే రిస్క్ ఎక్కువగా ఉంది. కొత్త టెక్నాలజీలు సంప్రదాయ కొలువులకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. కొంతమంది సంపన్నులకే మంచి చదువు దొరుకుతుండటంతో పేద/దిగువ మధ్యతరగతి వారు పైకి రావడం ఒక యుద్ధంలా మారింది.‘మధ్యతరగతి వారు కేవలం పన్నులు కట్టే యంత్రాలు కాదు. దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఈ వర్గం కూడా బలంగా ఉండాలి. పెరిగిన పన్నుల భారం తగ్గించి విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా ఏ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దేశ ప్రగతి ప్రమాదపు అంచులకు చేరుతుంది’ఇదీ చదవండి: ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా? -
ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?
ఆరోగ్య బీమా అనేది ఆపద సమయంలో ఆదుకునే ఒక రక్షా కవచం. కానీ, అవసరానికి ఆ కవచం పనిచేయకపోతే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం దేశంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి ఖర్చుల కోసం క్లెయిమ్ చేస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక కారణంతో తిరస్కరించడం లేదా సగం డబ్బులే ఇవ్వడం వంటివి సాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారిక గణాంకాలు, నిపుణుల విశ్లేషణతో రూపొందించిన ప్రత్యేక కథనం మీ కోసం..క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడికి ఆరోగ్య బీమా కొండంత అండ. అయితే, క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో పాలసీదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ‘బీమా భరోసా’ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు, 2025 ఆర్థిక సంవత్సరం మొత్తం ఫిర్యాదుల సంఖ్యను మించిపోయాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఈ పోర్టల్లో సుమారు 73,729 ఫిర్యాదులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో దాదాపు 69% ఫిర్యాదులు కేవలం క్లెయిమ్ తిరస్కరణ లేదా జాప్యానికి సంబంధించినవే కావడం గమనార్హం.క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణాలుబీమా సంస్థలు క్లెయిమ్లను తిరస్కరించడానికి నిబంధనలతోపాటు పాలసీదారుల అవగాహన లోపం కూడా ఒక కారణం. క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.ముందస్తు వ్యాధులను చెప్పకపోవడం..పాలసీ తీసుకునేటప్పుడు బీపీ, షుగర్ వంటి పాత జబ్బుల గురించి దాచడం అతిపెద్ద తప్పు. 36 నెలల నిరీక్షణ కాలం (మారటోరియం పీరియడ్) ముగియకముందే ఇలాంటివి బయటపడితే కంపెనీలు క్లెయిమ్ను నేరుగా తిరస్కరిస్తాయి.వెయిటింగ్ పీరియడ్కొత్తగా పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు కవరేజీ ఉండదు. సాధారణంగా మొదటి 30 రోజులు (ప్రమాదాలు మినహా) నిర్దిష్ట వ్యాధులకు (హెర్నియా, క్యాటరాక్ట్.. వంటివి) 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈలోపు క్లెయిమ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది.వైద్య అవసరం లేకుండానే ఆసుపత్రిలో చేరికకేవలం డయాగ్నోస్టిక్ పరీక్షల కోసం లేదా ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం ఉన్న జబ్బులకు ఆసుపత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. కనీసం 24 గంటల ఆసుపత్రి చేరిక తప్పనిసరి (డే కేర్ చికిత్సలు మినహా).కాస్మెటిక్ సర్జరీలు, దంత చికిత్సలు, విటమిన్ సప్లిమెంట్స్ వంటివి చాలా పాలసీల్లో కవర్ కావు. మీరు పాలసీ తీసుకునే ముందే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.ఆసుపత్రిలో చేరిన 24-48 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ విషయంలో డిశ్చార్జ్ అయిన 15-30 రోజుల్లోపు పత్రాలు సమర్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి.పాలసీ కొనే ముందు చెక్ చేయాల్సినవి..పాలసీ డాక్యుమెంట్ అనేది కేవలం కాగితాల కట్ట కాదు, అది ఒక చట్టపరమైన ఒప్పందం. కొనే ముందు కీలక అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి.గది అద్దెపై పరిమితి ఉందో లేదో చూడండి. గది అద్దె పరిమితి మించితే, మొత్తం బిల్లులో కంపెనీ కోత విధిస్తుంది.బిల్లులో కొంత శాతం మీరే చెల్లించాలనే నిబంధన(కో-పేమెంట్) ఉంటే ప్రీమియం తగ్గుతుంది కానీ, క్లెయిమ్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుంది.మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు ఆ బీమా నెట్వర్క్లో ఉన్నాయో లేదో సరిచూసుకోండి.ఒకే ఏడాదిలో ఒకటికంటే ఎక్కువసార్లు అనారోగ్యం పాలైతే బీమా మొత్తం (సమ్ అస్యూర్డ్) తిరిగి రీఛార్జ్ అయ్యే సౌకర్యం ఉందో లేదో చూడండి.ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పే మాటల కంటే పాలసీలోని ‘కీ ఫీచర్స్ డాక్యుమెంట్’ చదవడం ఉత్తమం. ఏదైనా ఫిర్యాదు ఉంటే మొదట బీమా సంస్థకు, అక్కడ పరిష్కారం లభించకపోతే ఐఆర్డీఏఐ ‘బీమా భరోసా’ పోర్టల్ లేదా ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ను ఆశ్రయించవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
రెమిటెన్సులకు యుద్ధం సెగ
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో భారత్కు వచ్చే రెమిటెన్స్ ప్రవాహం తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ప్రవాస భారతీయుల నుంచి వచ్చే మొత్తం రెమిటెన్స్ల్లో సుమారు మూడో వంతు గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల నుంచే వస్తుందని పేర్కొంది. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే ఈ ప్రవాహం మందగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రవాస భారతీయుల ఆదాయాలు తగ్గితే కరెంట్ ఖాతా లోటు (సీఏడీ)పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే వాణిజ్య లోటు ఒత్తిడిలో ఉన్న సమయంలో రెమిటెన్స్ తగ్గుదల ఆర్థిక సమతౌల్యంపై మరింత ప్రభావం చూపవచ్చని పేర్కొంది. ప్రవాసుల నుంచి రెమిటెన్స్లు అత్యధికంగా పొందుతున్న దేశంగా భారత్ ప్రపంచంలో ముందంజలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఈ రూపంలో 135 బిలియన్ డాలర్లకు పైగా వచ్చాయి. ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడిపశ్చిమాసియా ఘర్షణల కారణంగా గ్లోబల్ వాణిజ్య ప్రవాహాల్లో అంతరాయం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల భారత ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. అయితే అమెరికా సుంకాలు తగ్గడం కొంతమేర మద్దతు ఇస్తుందని పేర్కొంది. మరోవైపు ముడి చమురు ధరలు సంవత్సరానికి 8–9% పెరగడం వల్ల దిగుమతి బిల్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. లాజిస్టిక్ సమస్యలు, సరఫరా గొలుసు పునర్వ్యవస్థీకరణ కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు ప్రభావితమవుతున్నాయని తెలిపింది. ఎగుమతులు ఇలాజీసీసీ దేశాలకు భారత్ 57 బిలియన్ డాలర్లు (మొత్తం ఎగుమతుల్లో 13%), ఇతర పశ్చిమ ఆసియా దేశాలకు 9 బిలియన్ డాలర్లు (2%) ఎగుమతులు చేసింది. బాస్మతి బియ్యం (70% పైగా), బోవైన్ మీట్ (30%), సిరామిక్ ఉత్పత్తులు (25%), పెట్రోలియం ఉత్పత్తులు (15%), రత్నాలు – ఆభరణాలు (20%) వంటి ఉత్పత్తుల్లో ఆ ప్రాంతానికి అధిక ప్రాధాన్యం ఉందని నివేదిక వెల్లడించింది. రవాణా సమస్యలు, సరఫరా విధానాల్లో మార్పుల కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు తగ్గడం లేదా ఆలస్యం కావచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
మహిళలకూ ఉండాలి టర్మ్ పాలసీ
మరింత మంది మహిళలు ఉద్యోగాల్లోకి చేరుతున్న నేపథ్యంలో వారికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్రణాళికల ఆవశ్యకత నెలకొందని ఇన్సూరెన్స్ ఎవేర్నెస్ కమిటీ (ఐఏసీ–లైఫ్) సభ్యులు రుషభ్ గాంధీ, పరాగ్ రాజా తెలిపారు. కుటుంబ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు వారు తాత్కాలికంగా గానీ శాశ్వతంగా గానీ ఉద్యోగాలకు దూరం కావడం వల్ల పొదుపు, రిటైర్మెంట్ నిధిపై ప్రభావం పడుతుందన్నారు.పురుషులతో పోలిస్తే మహిళల జీవితకాలం సగటున నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి తమతో పాటు తమపై ఆధారపడే వారి కోసం కూడా దీర్ఘకాలికమైన, మెరుగైన పొదుపు ప్రణాళికలు అవసరమవుతాయని తెలిపారు. ఆదాయార్జన వ్యవధి తక్కువగా ఉండటం, జీవితకాలం అధికంగా ఉండటమనేది మహిళలు ఎదుర్కొనే విశిష్టమైన సవాలని వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అక్షరాస్యత దన్నుతో వారు ఆర్థిక ప్రణాళికల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. యాన్యుటీలు, గ్యారంటీడ్ ఇన్కం ప్లాన్లు వారు స్థిరమైన ఆదాయాన్ని అందుకునేందుకు తోడ్పడతాయని వారు చెప్పారు. తమ ఆర్థిక ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు బీమా పరిశ్రమ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
దీర్ఘకాలిక ప్రణాళికలకు దక్షిణాది ఓటు
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విషయంలో దక్షిణాది వారు ముందుంటున్నారు. రిటైర్మెంట్ ప్లాన్ల విషయంలో స్పష్టతతో ఉంటున్నారు. ఇప్పటికే మూడింట రెండొంతుల మంది ఇందుకు సంబంధించిన ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇఫ్సాస్ ఇండియా భాగస్వామ్యంతో హెచ్డీఎఫ్సీ లైఫ్ నిర్వహించిన రెడీ టు లైఫ్ ఇండెక్స్ సూచీలో దక్షిణాది రెడీనెస్ స్కోరు జాతీయ సగటైన 59కి మించి 60 స్థాయిలో నమోదైంది.ఈ నివేదిక ప్రకారం బీమా భద్రతపై అవగాహన ఉన్నప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. తక్షణ రాబడి ఉండదని, చర్చించడానికి కొంత ఇబ్బందికరమైనదని, ఎటువంటి క్లెయిమ్ తలెత్తకపోతే నిష్ప్రయోజనమనే భావన ఇందుకు కారణమని నివేదికలో వెల్లడైంది. దక్షిణాది వారి పొదుపు ప్రాధాన్యతల్లో పిల్లల చదువు, సొంత ఇల్లు, ఆకస్మిక ప్రణాళికలు మొదలైనవి అగ్రస్థానంలో ఉన్నాయి. అత్యవసర నిధి విషయంలో దక్షిణాది అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ మూడింట ఒక వంతు మంది సదరు నిధి ఒక నెలకు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళిక, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత, ఆరోగ్యం, పదవీ విరమణ వ్యూహాలపై అవగాహన–సన్నద్ధత మధ్య అంతరాలను పూరించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సూచీ సంబంధిత అధ్యయనంలో 25–55 ఏళ్ల వయస్సు గల 1,836 మంది పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ఫ్లెక్సిబుల్ ఐటీ ఉద్యోగాల్లో మహిళల జోరు
ఐటీ, ఐటీ ఆధారిత రంగాల(ఐటీఈఎస్) రంగంలో కాంట్రాక్ట్, ఫ్లెక్సిబుల్ ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందని టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరీర్ నెట్ నివేదిక తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2025–26 ముగిసే నాటికి ఇది 40 శాతానికి చేరిందని వెల్లడించింది. ఎఫ్వై 2026లో కాంట్రాక్టు ఉద్యోగాల్లో జరిగిన 3,000 నియామకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. ఎఫ్వై22 – ఎఫ్వై26 మధ్య మహిళల నియామకాలు 10 శాతం పాయింట్లు పెరిగి ఎఫ్వై26లో 40 శాతానికి చేరుకున్నాయని తెలిపింది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల గణాంకాలతో దీనిని పోల్చి ట్రెండ్లను విశ్లేషించినట్లు వెల్లడించింది. కెరీర్నెట్ నివేదికలోని ముఖ్యాంశాలుఫైనాన్స్–అకౌంటింగ్లో (43%) విభాగంలో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉంది. డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ (34%), యూఎక్స్, డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ (31%), ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (29%), ఇంజినీరింగ్–సాఫ్ట్వేర్, క్యూఏ (27%) రంగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కన్సలి్టంగ్లో మహిళల ప్రాతినిధ్యం 20 శాతంతో తక్కువగా ఉంది. ఈ విభాగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇంకా విస్తృత అవకాశాలు ఉన్నాయని నివేదిక సూచించింది.మహిళల భాగస్వామ్యం మెట్రో నగరాల్లోనే అధికంగా కేంద్రీకృతమై ఉంది. బెంగళూరు (21%), హైదరాబాద్ (20%), పుణే (17%) ముందుండగా, ఢిల్లీ ఎన్సీఆర్ (13%), చెన్నై (9%) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై (7%), కోల్కతా (2 శాతం) చివరి స్థానాలతో సరిపెట్టుకున్నాయి. టైర్–2 నగరాల్లో మహిళల భాగస్వామ్యం 11 శాతంగా మాత్రమే ఉన్నట్లు నివేదిక తెలిపింది.కెరీర్ వ్యవధి పరంగా చూస్తే.., మహిళల భాగస్వామ్యం ‘ప్రారంభ, మధ్య దశ’ల్లో గణనీయంగా ఉంది. రెండేళ్లలోపు అనుభవం ఉన్న ‘ప్రారంభ దశ’ ఉద్యోగుల్లో మహిళల వాటా 30%గా ఉంది. 5 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్న ‘మధ్య దశ’లో అది 31% గా నమోదైంది. సీనియర్ స్థాయిల్లో మహిళల భాగస్వామ్యం తగ్గుతోంది. 9–14 సంవత్సరాల అనుభవం ఉన్నవారి వాటా 13 శాతంగా, 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నవారి వాటా కేవలం 4 శాతంగా నమోదైంది. ఇది మహిళలను ఉద్యోగాల్లో నిలుపుదల (రిటెన్షన్) చేయడం, ఉన్నత స్థాయిలకు ఎదగడంలో (అడ్వాన్స్మెంట్) ఇంకా లోటుపాట్లు ఉన్నాయని నివేదిక సూచిస్తోంది.‘‘గత ఐదేళ్లలో ఐటీ/ఐటీఈఎస్ రంగంలో మహిళల భాగస్వామ్యం కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా, వారు ఎంపిక చేసుకుంటున్న ఉద్యోగాల స్వరూపంలో కూడా గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫైనాన్స్– అకౌంటింగ్ విభాగం ముందంజలో ఉండటం, మహిళలు ఇకపైనా ప్రాధాన్యం లేని పాత్రల్లో మాత్రమే కాకుండా కీలక రంగాల్లోకి అడుగు పెడుతున్నారనే సంకేతాలను సూచిస్తోంది. వ్యాపార ఫలితాలపై నేరుగా ప్రభావం చూపే ప్రధాన విభాగాల వైపు మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు’’ అని కెరీర్ నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలభ్ శుక్లా తెలిపారు. ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
కార్మికుల వేతనాలు పెంపు
ఉత్తరప్రదేశ్లోని పారిశ్రామిక రంగంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న అశాంతికి తెరదించుతూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఈ కొత్త వేతన రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఇస్తాయని తెలిపింది. నోయిడాలో వేలాది మంది ఫ్యాక్టరీ కార్మికులు వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపరచాలని సోమవారం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.సవరించిన వేతనాల వివరాలుగౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపమ్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడిస్తూ, ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్ఈ కీలక పారిశ్రామిక ప్రాంతాల్లో వేతనాలు అత్యధికంగా ఉన్నాయి. నైపుణ్యం లేని కార్మికులకు నెలకు రూ.13,690 (గతంలో రూ.11,313), సెమీ స్కిల్డ్ వర్కర్లకు రూ.15,059, నైపుణ్యం కలిగిన కార్మికులకు రూ.16,868 వేతనం నిర్ణయించారు.ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో..నైపుణ్యం లేని వారు: రూ. 13,006సెమీ స్కిల్డ్: రూ. 14,306నైపుణ్యం కలిగిన వారు: రూ.16,025మిగిలిన జిల్లాల్లో..నైపుణ్యం లేని వారు: రూ.12,356సెమీ స్కిల్డ్: రూ.13,591నైపుణ్యం కలిగిన వారు: రూ.15,224సమతుల్య విధానం - ప్రభుత్వ వివరణయజమానుల సంఘాలు, కార్మిక సంస్థలతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాతే ఈ సమతుల్య, ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవైపు కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే అయినప్పటికీ, మరోవైపు పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆర్థిక సవాళ్లు, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, పడిపోతున్న ఎగుమతులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.తప్పుడు ప్రచారాలను నమ్మొద్దుసోషల్ మీడియాలో కార్మికులకు నెలకు రూ.20,000 ఏకరీతి కనీస వేతనం నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. జాతీయ స్థాయిలో ‘ఫ్లోర్ వేజ్’ నిర్ణయించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని, ఇప్పటి వరకు అటువంటి నోటిఫికేషన్ ఏదీ జారీ చేయలేదని స్పష్టం చేసింది.యాజమాన్యాలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తిముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిశ్రమల యజమానులకు పలు సూచనలు చేశారు. వాటి ప్రకారం.. సకాలంలో వేతనాలు చెల్లించాలి. అదనపు పని గంటలకు(ఓటీ) సరైన పరిహారం ఇవ్వాలి. బోనస్, వారపు సెలవులు, సామాజిక భద్రతా ప్రయోజనాలను అమలు చేయాలి. ముఖ్యంగా మహిళా కార్మికులకు అత్యంత సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలి. త్వరలోనే పూర్తిస్థాయి వేతన బోర్డును ఏర్పాటు చేసి, దాని సిఫార్సుల మేరకు తుది వేతన నిర్ణయ ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇండెక్సేషన్ ఆధారంగా మధ్యంతర పెంపును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో తగ్గిన ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ధరలు.. ఇంకాస్త పైకి
న్యూఢిల్లీ: మార్చిలో నిత్యావసరాల ధరలు మరింత పెరిగాయి. రిటైల్ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణాన్ని సూచించే ) 3.4 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో ఇది 3.21 శాతంగా ఉంది. ముఖ్యంగా మార్చి నెలలో బంగారం, వెండి ఆభరణాలు, కొబ్బరి, టమాటా, క్యాలిఫ్లవర్ ధరలు పెరిగాయి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, వెల్లుల్లి, కందిపప్పు, శనగపప్పు ధరలు తగ్గినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన డేటా ఆధారంగా తెలుస్తోంది. అయినప్పటికీ మార్చి నెల ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతానికి దిగువనే ఉండడం గమనార్హం. ఈ గణాంకాలు 2024 బేస్ ఇయర్ ఆధారంగా రూపొందించినవి. విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధన విభాగంలో ద్రవ్యోల్బణం 1.65 శాతం నమోదైంది. ఫిబ్రవరిలో ఇదే విభాగం ద్రవ్యోల్బణం 1.52 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 3.63 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.11 శాతం చొప్పున మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. దేశవ్యాప్తంగా చూస్తే అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలో 5.83 శాతంగా ఉంది. అత్యల్పంగా మిజోరాంలో 0.66 శాతం నెలకొంది. పశ్చిమాసియా ప్రభావం.. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం కొంత మేర ద్రవ్యోల్బణంలో కనిపించినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. ప్రధానంగా ఆహారం, విద్యుత్, గ్యాస్ ధరల పెరుగుదలతో నెలవారీగా ద్రవ్యోల్బణం ఎగసినట్టు చెప్పారు. -
హర్ముజ్ బ్లాకేడ్తో భారత్పై తీవ్ర ప్రభావం!
హర్ముజ్ జలసంధిని అమెరికా సైన్యం దిగ్బంధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సౌదీ అరేబియా సహా పలు దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు రిక్వెస్ట్లు చేస్తున్నాయి. చైనా సహా ఇంకొన్ని దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అదే సమయంలో.. ఈ బ్లాకేడ్ ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిణామం భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కనిపిస్తోంది.గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం 99 డాలర్ల వద్ద ఉంది. హర్ముజ్ బ్లాకేడ్ కొనసాగితే అది 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, వాణిజ్య లోటు పెరిగే అవకాశం లేకపోలేదు. పైగా జలసంధి ద్వారా రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఈ మార్గం మూసుకుపోతే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్ర తరం కావొచ్చు. అలాగే పెరిగిన ఇంధన ధరలు నేరుగా రవాణా, విద్యుత్, ఆహార ధరలపై ప్రభావం చూపెట్టొచ్చు. హర్ముజ్ బ్లాకేడ్పై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.అదంతా ఉత్త ప్రచారమే!భారత నౌకలకు హర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసేసిందని ఒక ప్రచారం నడుస్తోంది. అయితే అది ఉత్తదేనని ఇరాన్ అంటోంది. న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం మా స్నేహపూర్వక దేశం. హర్ముజ్ మార్గం భారత నౌకలకు తెరిచే ఉంటుంది. అమెరికా ఈ బ్లాకేడ్తో తప్పు లెక్కలు వేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ధ్వంసం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది’’ అని హెచ్చరించారు.మొత్తంగా, హోర్ముజ్ బ్లాకేడ్ భారత్కు ఇంధన భద్రతా సంక్షోభం తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఇరాన్ ఇచ్చిన హామీ కొంత ఉపశమనం కలిగిస్తోంది. కానీ ధరల పెరుగుదల, సరఫరా అంతరాయం వంటి సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారే అవకాశం లేకపోలేదు. -
ఫార్మా వృద్ధికి పరిశోధనలు కీలకం
న్యూఢిల్లీ: బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్పై మరింతగా దృష్టి పెడుతూ అంతర్జాతీయంగా ఫార్మా రంగానికి సారథ్యం వహించేలా భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఇందుకోసం పరిశోధనలు–అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలను బలోపేతం చేయడం, పెట్టుబడులు పెరగడం మొదలైన అంశాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఫార్మా 2026 కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు చెప్పారు. నాయకత్వ సామర్థ్యాలు, అందుబాటు ధరలో జనరిక్ ఔషధాలతో అనేక సంవత్సరాలుగా ప్రపంచానికి ఫార్మసీగా భారత్ గుర్తింపు పొందిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం గ్లోబల్ ఫార్మా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్పై ఫోకస్ పెరుగుతోందన్నారు. దీనికి అనువుగా భారత్ తనను తాను మల్చుకోవడంతో పాటు సారథ్యం కూడా వహించేందుకు స్థితిలో ఉందని నడ్డా వివరించారు. దేశీ ఫార్మా పరిశ్రమను గ్లోబల్ లీడరుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అయిదేళ్ల వ్యవధి కోసం రూ. 10,000 కోట్లతో బయోఫార్మా శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రకటించినట్లు చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధి, బల్క్ డ్రగ్స్ స్కీము, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ)లాంటి కార్యక్రమాలతో దేశీయంగా తయారీ కార్యకలాపాలకు ఊతమిస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ని (సీడీఎస్సీవో) పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు, 1,500 మంది నిపుణులతో సైంటిఫిక్ సమీక్ష కోసం బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. -
గోద్రెజ్ చైర్మన్గా పిరోజ్షా
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ నాయకత్వ మార్పిడికి సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుత చైర్పర్శన్, బంధువు నాదిర్ నుంచి ఈ ఏడాది ఆగస్ట్లో పిరోజ్షా గోద్రెజ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తదుపరి నాదిర్ గోద్రెజ్ కంపెనీ గౌరవ చైర్మన్గా సేవలు అందించనున్నట్లు గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ పేర్కొంది. తరాలవారీ నాయకత్వ మార్పిడి ప్రణాళిక ప్రకారం ఇతర ఎంపికలు సైతం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇది ఇటు అధికారం, అటు బాధ్యతల సమయమని పిరోజ్షా పేర్కొన్నారు. తరతరాలుగా నిర్మించుకున్న గ్రూప్ వారసత్వ సంపదతోపాటు విలువలను నిలుపుకుంటూనే ముందుకు సాగవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. 2026 ఆగస్ట్లో నాదిర్ వయసు 75ఏళ్లకు చేరనుండటంతో పదవీ విరమణ చేయనున్నారు. ఫలితంగా గ్రూప్లోని గోద్రెజ్ ఇండస్ట్రీస్, ఆగ్రోవెట్, కన్జూమర్ ప్రొడక్ట్స్సహా గోద్రెజ్ ప్రాపర్టీస్ బోర్డుల నుంచి తప్పుకోనున్నారు. సోమవారం(13) నుంచి ఆస్టెక్ లైఫ్సైన్సెస్ కంపెనీ చైర్మన్, నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలకు టాటా చెప్పారు. కొత్త తరంతో.. తదుపరి తరం నాయకత్వంలో గోద్రెజ్ గ్రూప్ మరింత పటిష్ట వృద్ధిని అందుకోనున్నట్లు ఈ సందర్భంగా నాదిర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గోద్రెజ్ గ్రూప్నకు పలు దశాబ్దాలుగా నాదిర్ సేవలు అందిస్తున్న విషయం విదితమే. నాదిర్ సోదరుడు ఆది, పరమేశ్వర్ గోద్రెజ్ కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ ఆగస్ట్ 14 నుంచి గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్, గోద్రెజ్ ఇండస్ట్రీస్కు చైర్పర్శన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ చైర్మన్గా నాదిర్ కుమారుడు బుర్జీస్ గోద్రెజ్ ఆగస్ట్ 14న బాధ్యతలు స్వీకరించడంతోపాటు.. గోద్రెజ్ ఇండస్ట్రీస్ బోర్డులో నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరనున్నారు. ఆస్టెక్ లైఫ్సైన్సెస్ ఎండీ పదవి నుంచి వెనువెంటనే తప్పుకుని బోర్డులో నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. ఆస్టెక్ లైఫ్ చైర్పర్శన్గా గోద్రెజ్ కెమికల్స్ సీఈవో విశాల్ శర్మ వెనువెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆస్టెక్ లైఫ్ ప్రస్తుత సీవోవో ఆరిజిత్ ముఖర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. -
ఎలక్ట్రిక్ బైక్.. రయ్ రయ్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ మోటార్సైకిల్స్పై డిమాండ్ పెరుగుతోంది. వాహన్ డేటా ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో 17,173 వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 13,430 యూనిట్లతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. పరిమాణం తక్కువగానే ఉన్నప్పటికీ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాత, కొత్త సంస్థలు మార్కెట్లోకి ఆకర్షణీయమైన కొత్త వాహనాలను ప్రవేశపెట్టడంలో పోటీపడుతుండటంతో కస్టమర్లలో వీటిపై ఆసక్తి పెరుగుతోంది. ఒబెన్ ఎలక్ట్రిక్, రివోల్ట్ మోటార్స్, అ్రల్టావయోలెట్ ఆటోమోటివ్, మ్యాటర్ మోటార్లాంటి సంస్థలు ముఖ్యంగా పనితీరు, టెక్నాలజీ, విశిష్టమైన రైడింగ్ అనుభూతిపై దృష్టి పెడుతూ వినూత్నమైన మోడల్స్ని అందిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఫ్లయింగ్ ఫ్లీతో రంగంలోకి దిగింది. సంప్రదాయ ఇంజిన్ల మోటార్సైకిల్స్నే ఇష్టపడే రైడర్లు క్రమంగా ఎలక్ట్రిక్ ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నారని మ్యాటర్ మోటార్ వ్యవస్థాపకుడు మోహల్ లాల్భాయ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనానికి మళ్లడాన్ని, పనితీరు విషయంలో రాజీపడటంలాగా కాకుండా అప్గ్రేడ్ కావడంగా పరిగణిస్తున్నారని వివరించారు. నిర్వహణ ఖర్చు తక్కువ.. వాహన కొనుగోలు, నిర్వహణ వ్యయాలు మొదలైన వాటికి సంబంధించిన టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్íÙప్ (టీసీవో) అనేది సాధారణ మోటార్సైకిల్స్, ఈ–బైక్స్కి దాదాపు సరిసమాన స్థాయికి చేరుతోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. రన్నింగ్ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటమనేది ఈ–మోటార్సైకిల్స్కి ఆదరణ పెరగడానికి తోడ్పడుతోందని వివరించాయి. రోజుకు 30–50 కి.మీ. రైడ్ చేసే వారు, పెట్టిన పెట్టుబడి 18–24 నెలల్లో తిరిగి వచ్చేయగలదని పేర్కొన్నాయి. పనితీరు, ఆదాకి సంబంధించి రెండింటి మధ్య ఏదో ఒక దాని విషయంలో రాజీపడాల్సిన అవసరం ఉండటం లేదని తెలిపాయి. అయితే, డిమాండ్–సరఫరా మధ్య అంతరాలు, నాణ్యతను కూడా పాటిస్తూ భారీగా ఉత్పత్తి చేయడం, ముడి వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు, పటిష్టమైన నెట్వర్క్ని నిర్మించుకోవడంలాంటివి పరిశ్రమకు సవాళ్లుగా ఉంటున్నాయని లాల్భాయ్ తెలిపారు. తయారీ సామర్థ్యాలు, చార్జింగ్ సదుపాయాలు మెరుగుపడటంలాంటి అంశాలతో ఎలక్ట్రిక్ టూ–వీలర్ల సెగ్మెంట్ స్థిరంగా వృద్ధి చెందుతోందని ప్రైమస్ పార్ట్నర్స్ ఎండీ అనురాగ్ సింగ్ తెలిపారు. ఊహించిన దానికంటే వృద్ధి నెమ్మదిగానే ఉన్నా మరింత స్పష్టతతో పురోగమిస్తోందన్నారు. అయితే, మరో ఐదేళ్ల పాటు సంప్రదాయ ఇంజిన్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ ఉంటుందని చెప్పారు.ఓలా కొత్త స్కూటర్ ఎస్1 ఎక్స్ ప్లస్320 కి.మీ రేంజ్ ధర రూ.1,29,999 ముంబై: ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఎస్1 ఎక్స్ ప్లస్ 5.2 కేడబ్ల్యూహెచ్ అనే కొత్త స్కూటర్ ను విడుదల చేసింది. దీని ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. ఇందులో కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీని వినియోగించింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఇందులో 11 కేడబ్ల్యూ మిడ్–డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ (ఎంసీయూ) ఉన్నాయి. దీని గరిష్టం వేగం 125 కి.మీ. ఇందులో బ్రేక్–బై–వైర్ టెక్నాలజీతో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. ఇవి రోజువారీ వినియోగంలో మెరుగైన కంట్రోల్, భద్రతను అందిస్తాయి. ప్రీమియం మోడల్స్లో మాత్రమే ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఓలా ప్రతినిధి చెప్పారు. -
ఓలా కొత్త స్కూటర్ లాంచ్.. 320 కిమీ రేంజ్!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. స్వదేశీంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్తో పనిచేసే S1 X+ 5.2 kWhను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన కొత్త టూవీలర్ ప్రారంభ ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). అయితే ఈ ధర 2026 ఏప్రిల్ 15 తరువాత పెరగనుంది. 4680 భారత్ సెల్ ప్రత్యేకత ఏమిటంటే, ఓలా తన సొంత సెల్ టెక్నాలజీని సామాన్య ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తోంది.తమ సొంత సెల్ టెక్నాలజీతో.. ఎక్కువ రేంజ్ అందించే ఈవీ స్కూటర్లను మార్కెట్కు అందుబాటులోకి తీసుకురావచ్చని సంస్థ చెబుతోంది. ఓలా ఎస్1 ఎక్స్+ ఇంటిగ్రేటెడ్ ఎంసీయూతో కూడిన 11 కిలోవాట్ల మిడ్-డ్రైవ్ మోటార్తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. ఇందులో బ్రేక్-బై-వైర్, ఫ్రంట్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. 5.2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ ఒకే ఛార్జ్పై 320 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.Big launch! S1 X+ 5.2 kWh powered by our 4680 Bharat Cell. 320 km range for just ₹1,29,999 - offer ends 15th April!Taking 4680 cells to the mass market and resetting range expectations for every Indian. While others push overpriced low-range scooters, only Ola can do this!… pic.twitter.com/EEwZObETBn— Bhavish Aggarwal (@bhash) April 13, 2026 -
భారత్కు ఇరాన్ చమురు.. ఏడేళ్లలో తొలిసారి!
అమెరికా ఇటీవల ఇచ్చిన తాత్కాలిక అనుమతిని ఉపయోగించుకొని, ఇరాన్ నుంచి చమురు భారత్ పోర్టులకు మళ్లీ చేరడం ప్రారంభమైంది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఇరాన్ చమురు భారతదేశానికి వస్తుండటం గమనార్హం. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ (LSEG) షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. రెండు భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు భారత పోర్టులకు చేరుకున్నాయి.భారత పోర్టులకు చేరుకున్న రెండు ట్యాంకర్లలో.. ఒకటి ఇరాన్ జెండా ఉన్న 'ఫెలిసిటీ' అనే VLCC నౌక పశ్చిమ భారతదేశంలోని సిక్కా పోర్టుకు చేరింది. మరొకటి కురాకావో జెండా ఉన్న 'జయా' అనే నౌక ఒడిశా తూర్పు తీర పోర్టుకు చేరుకుంది. VLCC అనేది సుమారు రెండు మిలియన్ బ్యారెల్స్ చమురు రవాణా చేయగల భారీ నౌక.భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. అయితే.. అమెరికా ఒత్తిడితో 2019 మే నుంచి ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పుడు అమెరికా ఇచ్చిన తాత్కాలిక మినహాయింపు కారణంగా భారత రిఫైనరీలు మళ్లీ ఇరాన్ చమురు కొనుగోలు చేయగలిగాయి. ఈ మినహాయింపు ఏప్రిల్ 19న ముగియనుంది. -
వార్ ఎఫెక్ట్.. పతనం వైపు బంగారం ధరలు!
పెరుగుదల దిశగా అడుగులు వేసిన గోల్డ్ రేటు ఈ రోజు (సోమవారం) తగ్గుదల వైపు పయనించింది. దీంతో బంగారం ధర కొంతమేర తగ్గింది. దీనికి కారణం యూఎస్ డాలర్ బలపడటం, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు అని తెలుస్తోంది. అమెరికా - ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడం కూడా బంగారం ధరలు పెరుగుదలకు మరో కారణం అయింది.శాంతి చర్చలు విఫలమైన తర్వాత, ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా - ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి. ఈ సంఘటనల వల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్కు 100 డాలర్లు దాటాయి.చమురు ధరలు పెరగడం అంటే రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడం. దీని వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేంద్ర బ్యాంకులు.. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్, వడ్డీ రేట్లు తగ్గించడానికి ఇష్టపడవు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే, బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడులు తగ్గుతాయి. అందువల్ల బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉంది.2026 ప్రారంభంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే కియోసాకి వంటి విశ్లేషకులు గోల్డ్ రేటు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, పెట్టుబడిదారులు కూడా ఇందులో పెట్టుబడి పెడితే ధనవంతులవుతారని చెబుతున్నారు. -
ఉజ్జీవన్ బ్యాంక్ దరఖాస్తు తిరస్కరించిన ఆర్బీఐ
మైక్రోఫైనాన్స్ రంగం నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్ వైపు అడుగులు వేస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) షాక్ ఇచ్చింది. యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం బ్యాంక్ సమర్పించిన దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. రుణాల పంపిణీలో మరింత వైవిధ్యం అవసరమని పేర్కొంటూ కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.ఆర్బీఐ అభ్యంతరం ఏమిటి?స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ఉజ్జీవన్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, బ్యాంక్ లోన్ పోర్ట్ఫోలియోపై ఆర్బీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉజ్జీవన్ రుణాలు ఎక్కువగా ఒకే రకమైన విభాగాలకు (ప్రధానంగా అన్ సెక్యూర్డ్ మైక్రో లోన్స్) పరిమితమై ఉన్నాయి. రుణాలను వైవిధ్యపరచడానికి బ్యాంక్ ఇటీవల చేసిన ప్రయత్నాలను ఆర్బీఐ గుర్తించినప్పటికీ ఒక యూనివర్సల్ బ్యాంక్కు ఉండాల్సిన సమతుల్య లోన్ బుక్ ఇంకా సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో రుణాల పంపిణీని మరింత విస్తృతం చేసిన తర్వాతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆర్బీఐ సలహా ఇచ్చింది.యూనివర్సల్ బ్యాంక్ హోదా ఎందుకు ముఖ్యం?స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థాయి నుంచి యూనివర్సల్ బ్యాంక్గా మారితే బ్యాంకుకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అందులో.. చిన్న రుణాలు, తక్కువ సేవలందించే విభాగాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ బ్యాంకింగ్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలను అందించవచ్చు. ప్రాధాన్యత రంగ రుణ నిబంధనల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. యూనివర్సల్ బ్యాంక్గా మారితే కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడంతో పాటు తక్కువ వడ్డీ రేటుకే నిధులను సేకరించడానికి దోహదపడుతుంది.ఇదీ చదవండి: ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు -
ఫీచర్ ఫోన్తో సులువుగా ఆన్లైన్ లావాదేవీలు
దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో చేతులు కలిపి డిజిటల్ ఇండియా దిశగా మరో అడుగు వేసింది. స్మార్ట్ఫోన్ లేని సామాన్యులకు కూడా అత్యాధునిక బ్యాంకింగ్ సేవలను చేరువ చేస్తూ ఫీచర్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘బాబ్ వరల్డ్ లైట్’ను సోమవారం అధికారికంగా ప్రారంభించింది.ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో జియోఫోన్ ‘ప్రైమా 4జీ’ ద్వారా ఈ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. భారత ప్రభుత్వం, ఆర్బీఐ ఆశిస్తున్న ఆర్థిక సమగ్రత లక్ష్య సాధనలో ఈ పరిణామం ఒక కీలక మలుపుగా నిలవనుంది.సాధారణంగా మొబైల్ బ్యాంకింగ్ యాప్లు కేవలం హై-ఎండ్ స్మార్ట్ఫోన్లకే పరిమితమవుతుంటాయి. కానీ, 'బాబ్ వరల్డ్ లైట్' దీనికి భిన్నం. బ్యాంకు, జియో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ ఇంటర్నెట్ వేగం ఉన్నా ఈ యాప్ నిరాటంకగా పనిచేస్తుంది. టచ్ స్క్రీన్ అవసరం లేకుండా కీప్యాడ్తోనే సులభంగా ఆపరేట్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా సులభమైన నమోదు ప్రక్రియ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.ఏయే సేవలు అందుబాటులో ఉంటాయంటే..యూపీఐ ఆధారిత స్కాన్ అండ్ పేమనీ ట్రాన్స్ఫర్ (డబ్బు పంపడం)బిల్లుల చెల్లింపులు, రీచార్జ్లుప్రొఫైల్ మేనేజ్మెంట్జియోఫోన్ ప్రైమా 4జీ పరికరాల్లో ఈ యాప్ ముందే లోడ్ చేయబడి ఉంటుంది. పాత వినియోగదారులు జియో స్టోర్ ద్వారా దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘డిజిటల్ బ్యాంకింగ్ను కోట్లాది మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు చేరవేయడమే మా ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో ఈ ‘లైట్’ వెర్షన్ కీలక పాత్ర పోషిస్తుంది’ అని దేవదత్త చంద్ర్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తెలిపారు.ఈ భాగస్వామ్యం గురించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అధ్యక్షుడు సునీల్ దత్ మాట్లాడుతూ, ‘జియో ఎప్పుడూ సామాన్యుడికి డిజిటల్ సేవలను అందుబాటు ధరలో అందించడానికే ప్రాధాన్యత ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిపి మేము అందిస్తున్న ఈ సేవలు దేశవ్యాప్తంగా ఉన్న జియోఫోన్ వినియోగదారులకు సురక్షితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తాయి’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు -
‘ఉద్యోగుల దుష్ర్పవర్తనపై రాజీ పడబోం’
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ బ్రాంచ్లో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణల కలకలంపై టాటా గ్రూప్ కఠినంగా స్పందించింది. ఉద్యోగుల దుష్ప్రవర్తన, వేధింపుల విషయంలో సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సోమవారం స్పష్టం చేశారు.విచారణాధికారిగా సీఓఓఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించేందుకు టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఆర్తీ సుబ్రమణియన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ‘ఈ ఘటనలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవసరమైన చోట సంస్థాగత మార్పులు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.అసలేం జరిగింది?గత మార్చి నెలలో టీసీఎస్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని, పెళ్లి పేరుతో తనను శారీరకంగా లొంగదీసుకున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఇది కేవలం వ్యక్తిగత నేరం కాదని వ్యవస్థీకృత వేధింపులని తేలింది. ఎనిమిది మంది మహిళలు, ఒక పురుష ఉద్యోగి వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారు. బాధితులను బలవంతంగా మతమార్పిడికి ప్రేరేపించడం, మాంసం తినాలని ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవతలను అవహేళన చేస్తూ ఉద్యోగుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.ఏడుగురు అరెస్ట్..నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్లుగా గుర్తించారు. వీరిపై లైంగిక వేధింపులు, మత విద్వేషాల ప్రేరేపణ వంటి సెక్షన్ల కింద 8 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.హెచ్ఆర్ అధికారుల వైఫల్యంపై విచారణబాధితులు గతంలోనే కంపెనీకి చెందిన హెచ్ఆర్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పుణెకు చెందిన టీసీఎస్ హెచ్ఆర్ అధికారిణిని పోలీసులు విచారిస్తున్నారు. ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆమె నిందితులకు పరోక్షంగా సహకరించారా అనే కోణంలో నోటీసులు జారీ చేశారు.ప్రభుత్వం సీరియస్.. సిట్ ఏర్పాటుమహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించారు. ‘ఇది సమాజంలో విద్వేషాలు నింపే అత్యంత తీవ్రమైన విషయం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో లోతైన కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. నాసిక్ పోలీసులు తీసుకున్న వేగవంతమైన చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల భద్రత, నైతిక విలువలపై ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు -
ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రకటించిన ‘నౌకా దళ దిగ్బంధనం’ (నేవల్ బ్లాకేడ్) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో పాటు శాంతి స్థాపన కోసం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తమ అధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించింది.యురేనియం తరలింపునకు ప్రతిపాదనప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు కలిగిన రష్యా, ఇరాన్ అణు సంక్షోభాన్ని నివారించడానికి కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను రష్యాకు తరలించడం ద్వారా అగ్రరాజ్యంతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని క్రెమ్లిన్ సూచించింది. ‘ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు పుతిన్ గతంలోనే అమెరికా ముందు ఉంచారు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.అంతేకాకుండా, ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడానికి రష్యా మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.హార్మూజ్ జలసంధి.. ట్రంప్ కఠిన నిర్ణయంపాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందం మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో అమెరికా తన తదుపరి వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సోమవారం నుంచి ఇది ప్రారంభమవుతుందన్నారు. ఇరాన్ ఓడరేవులకు వచ్చే లేదా అక్కడి నుంచి వెళ్లే అన్ని రకాల నౌకలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూతపడటం అంతర్జాతీయ మార్కెట్ను అతలాకుతలం చేసే అవకాశం ఉంది.అయితే, ఈ దిగ్బంధనాన్ని అమెరికా సైన్యం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు, ఇరాన్ సైన్యం ఈ చర్యను పైరసీగా అభివర్ణించింది.యుద్ధం ముగిసేది ఎప్పుడు?ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారాంతపు చర్చలు విఫలమవ్వడంతో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఇరాన్ తన స్నేహపూర్వక దేశాలైన చైనా వంటి ప్రాంతాలకు మాత్రమే చమురు నౌకలను అనుమతిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రష్యా ముందుకొస్తున్నా అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే ప్రపంచం భారీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన.. -
దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన..
దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో భాగంగా నిరసనకారులు ఫేజ్-2, సెక్టార్-60 పరిసరాల్లో వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కరించలేని కార్మికుల డిమాండ్లు ఈ నిరసనలకు ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్మికులు డిమాండ్లు కింద తెలియజేశాం.వేతనాల పెంపుప్రస్తుతం నోయిడాలోని పారిశ్రామిక కార్మికులు నెలకు రూ.13,000 నుంచి రూ.15,000 మధ్య చెల్లిస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని వారు వాపోతున్నారు. కనీస వేతనాన్ని రూ.20,000కు పెంచాలని పట్టుబడుతున్నారు. ‘పదేళ్లుగా ధరలు పెరిగాయి కానీ, మా శ్రమకు దక్కే ఫలితం మాత్రం దక్కడం లేదు’ అని ఒక కార్మిక నేత ఆవేదన వ్యక్తం చేశారు.హరియాణాతో పోలికఈ నిరసనలకు ప్రధాన ప్రేరణ పొరుగు రాష్ట్రమైన హరియాణా తీసుకున్న నిర్ణయం. అక్కడి ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.14,000 నుంచి రూ.19,000కు (సుమారు 35 శాతం) పెంచింది. ఒకే పని చేస్తున్నా ఉత్తరప్రదేశ్ (నోయిడా) కార్మికులు హరియాణా కార్మికుల కంటే దాదాపు రూ.6,000 తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ వ్యత్యాసమే అశాంతికి ఆజ్యం పోసింది.12 గంటల షిఫ్టులకు స్వస్తి పలకాలిహోసియరీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో కార్మిక చట్టాలను తుంగలో తొక్కి బలవంతంగా 12 గంటల పాటు పని చేయిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పని గంటలను చట్టబద్ధమైన 8 గంటలకే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదనపు పనిని 'నిబంధన'గా కాకుండా, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.ఓవర్ టైం, బోనస్ బకాయిలుకార్మిక చట్టాల ప్రకారం, అదనపు గంటలు పనిచేసినప్పుడు సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. వార్షిక బోనస్ల విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు.పని ప్రదేశంలో భద్రత - గౌరవంఫ్యాక్టరీ లోపల కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని, మహిళా కార్మికులపై వేధింపులు అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన యంత్రాంగం దీనికి స్పందిస్తూ, మహిళా అధికారిణి నేతృత్వంలో ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే, ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కచ్చితంగా అమలు కావాలని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపుఅనేక కంపెనీలు నెలల తరబడి వేతన బకాయిలను, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన సెటిల్మెంట్లను నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కష్టార్జితం తమకు దక్కకుండా యాజమాన్యాలు తాత్సారం చేస్తున్నాయని, ఈ బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
లండన్లో ఓపెన్ఏఐ శాశ్వత కార్యాలయం
ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిగ్గజం చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ బ్రిటన్ రాజధాని లండన్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. యూకేలో తన మొట్టమొదటి శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సుమారు 500 మంది సభ్యుల సామర్థ్యంతో కూడిన ఈ కార్యాలయం కోసం సోమవారం లీజు ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి.కీలక కేంద్రంగా లండన్..లండన్లోని ప్రముఖ ‘కింగ్స్ క్రాస్’ ప్రాంతంలో సుమారు 88,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన కార్యాలయం ఏర్పాటు కానుంది. గూగుల్ డీప్మైండ్, మెటా, సింథెసియా, వేవ్ వంటి అగ్రశ్రేణి ఏఐ కంపెనీలకు ఈ ప్రాంతం ఇప్పటికే నిలయంగా ఉంది. ‘యూకేలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఏఐ రంగంలో బ్రిటన్కు బలమైన చరిత్ర ఉంది’ అని ఓపెన్ఏఐ లండన్ సైట్ లీడ్ ఫోబ్ థాకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం లండన్లో 200 మంది ఉద్యోగులు ఉండగా, అమెరికా వెలుపల తమ అతిపెద్ద పరిశోధనా కేంద్రంగా లండన్ను తీర్చిదిద్దుతామని కంపెనీ గతంలోనే వెల్లడించింది.స్టార్ గేట్ ప్రాజెక్ట్కు బ్రేక్.. కారణం అదేనా?ఒకవైపు కార్యాలయ విస్తరణ జరుగుతున్నప్పటికీ మరోవైపు మౌలిక సదుపాయాల విషయంలో యూకేకు కొంత నిరాశ ఎదురైంది. భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అయిన ‘స్టార్ గేట్’ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఓపెన్ఏఐ ధ్రువీకరించింది. ప్రపంచంలోనే పారిశ్రామిక ఇంధన ధరలు యూకేలో అత్యధికంగా ఉండటం, విద్యుత్ గ్రిడ్ను యాక్సెస్ చేయడంలో జరుగుతున్న జాప్యం, లండన్లోని కఠినమైన నిబంధనలు కూడా ప్రాజెక్ట్ పురోగతికి అడ్డంకిగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ భాగస్వామి అయిన ‘ఎన్ స్కేల్’తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
తల్లడిల్లిన దలాల్ స్ట్రీట్!
భారతీయ స్టాక్ మార్కెట్లు నేడు తీవ్ర ఒడిదుడుకులకు లోనై భారీ నష్టాలతో ముగిశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తోడు అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా మారడంతో మదుపర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోయి ఇన్వెస్టర్ల ఆందోళనను పెంచాయి.మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలువిఫలమైన శాంతి చర్చలుపశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగియడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఇరాన్పై అమెరికా కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న వార్తలు, హార్మూజ్ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు సృష్టించాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందన్న భయంతో ఇన్వెస్టర్లు సురక్షిత మార్గాలవైపు మళ్లుతున్నారు.సెగ పుట్టిస్తున్న క్రూడాయిల్ ధరలుయుద్ధ వాతావరణం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. నేడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 102 డాలర్ల మార్కును అధిగమించింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణానికి దారితీస్తాయన్న ఆందోళన మార్కెట్ను కుంగదీసింది.ఫెడ్ రిజర్వ్ కఠిన వైఖరిఅమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గడం మరో ప్రధాన కారణం. ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాకపోవడంతో 2026లో వడ్డీ రేట్ల తగ్గింపు కేవలం ఒక్కసారి మాత్రమే ఉండొచ్చన్న సంకేతాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను (ఎఫ్ఐఐ) ఆందోళనకు గురిచేశాయి. ఫలితంగా భారత మార్కెట్ల నుంచి భారీగా నిధుల ఉపసంహరణ జరిగింది.నేటి మార్కెట్ గణాంకాలు (క్లోజింగ్ సమయానికి)సూచీముగింపునష్టం (పాయింట్లు)శాతం (%)సెన్సెక్స్76,842-702-0.90%నిఫ్టీ23,842-207-0.86% -
చైనా ‘ఇంధన దిగ్బంధనం’పై తైవాన్ కసరత్తులు
ఇంధన సరఫరానే లక్ష్యంగా చైనా విధించగల సంభావ్య నౌకాదళ దిగ్బంధనాన్ని (నావెల్ బ్లాకేడ్) ఎదుర్కోవడానికి తైవాన్ ప్రభుత్వం భారీ యుద్ధ విన్యాసాలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేస్తున్న తరుణంలో తైవాన్ తన సొంత ఎనర్జీ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. చైనా ఒకవేళ తైవాన్ చుట్టూ ఇంధన దిగ్బంధనం విధిస్తే దానికి ధీటుగా సహజ వాయువు (ఎల్ఎన్జీ), చమురు నౌకలను సురక్షితంగా తీరానికి చేర్చేలా ఈ కసరత్తులు ఉండనున్నాయి.ఎస్కార్ట్ మిషన్లుఈ ప్రత్యేక రక్షణ విన్యాసాల్లో తైవాన్ నావికాదళం కీలక పాత్ర పోషించనుంది. సముద్ర మార్గంలో చైనా నౌకలు అడ్డుకోకుండా ఇంధనంతో వచ్చే భారీ నౌకలకు తైవాన్ యుద్ధనౌకలు రక్షణ కవచంలా (ఎస్కార్ట్) నిలుస్తాయి. శత్రువుల దిగ్బంధనాన్ని ఎలా ఛేదించాలో ఈ డ్రిల్స్లో భాగంగా సైన్యం అనుకరిస్తుంది. ప్రధాన ఓడరేవులపై చైనా పట్టు సాధిస్తే ఇతర చిన్న రేవుల ద్వారా సరఫరాను ఎలా కొనసాగించాలనేది కూడా ఈ ప్రణాళికలో భాగం.ప్రాంతీయ ముప్పుగా 'బ్లాకేడ్'తైవాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ ఈ కసరత్తులపై స్పందిస్తూ చైనా చర్యలు కేవలం తైవాన్కు మాత్రమే పరిమితం కావని హెచ్చరించారు. ‘చైనా విధించే ఇంధన దిగ్బంధనం తైవాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతం ఇంధన సరఫరా గొలుసును ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇది ప్రపంచ ఇంధన భద్రతకే సవాలు’ అని ఆయన పేర్కొన్నారు.ఇంధన సంక్షోభం వైపు తైవాన్?ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు తైవాన్కు కీలకంగా మారాయి. తైవాన్ తన విద్యుత్ అవసరాల కోసం 50% పైగా ఎల్ఎన్జీ పైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం తైవాన్ వద్ద ఉన్న గ్యాస్ నిల్వలు కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం వస్తే ఈ నిల్వలు త్వరగా నిండుకునే ప్రమాదం ఉంది. దిగ్బంధనం సమయంలో గ్యాస్ కొరతను అధిగమించడానికి తైవాన్ తన బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను సిద్ధం చేస్తోంది.తైవాన్ సమీపంలో చైనా తన సైనిక కదలికలను పెంచుతున్న నేపథ్యంలో తైపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ఎనర్జీ డ్రిల్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం ఆయుధాలే కాదు, ఇంధన లభ్యత కూడా కీలకమని తైవాన్ గుర్తించింది.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
ఏళ్ల తరబడి ఉన్న యాప్ను నిలిపేసిన మైక్రోసాఫ్ట్
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో తక్కువ డేటా, తక్కువ మెమరీతో పనిచేసేలా రూపొందించిన ‘అవుట్లుక్ లైట్’ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026, మే 25వ తేదీ నుంచి ఈ యాప్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని కంపెనీ స్పష్టం చేసింది.ఏమిటీ మార్పు? ఎందుకు?ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లు, నెమ్మదిగా ఉండే ఇంటర్నెట్ కనెక్షన్లను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ గతంలో ఈ ‘లైట్’ వెర్షన్ను ప్రవేశపెట్టింది. అయితే, తన మొబైల్ ఈమెయిల్ వ్యూహాన్ని ఏకీకృతం చేయడంలో భాగంగా ఇకపై సింగిల్ ప్లాట్ఫామ్ పైనే దృష్టి సారించాలని కంపెనీ నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్ 365 సేవలతో అనుసంధానం, మెరుగైన భద్రతా ఫీచర్లు, వ్యక్తిగత, కార్పొరేట్ వినియోగదారులకు విస్తృతమైన సౌకర్యాలను ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2025 చివరి నుంచే కొత్త డౌన్లోడ్లను నిలిపివేసిన కంపెనీ ఇప్పుడు తుది గడువును ఖరారు చేసింది.వినియోగదారులపై ప్రభావం ఇలా..మే 25 తర్వాత మీ ఫోన్లో యాప్ ఐకాన్ కనిపించినప్పటికీ మెయిల్ బాక్స్ ఓపెన్ కాదు. అంటే, మీరు కొత్త ఈమెయిల్స్ చూడటం, పంపడం లేదా క్యాలెండర్ ఈవెంట్లను నిర్వహించడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఈమెయిల్స్, కాంటాక్ట్స్, క్యాలెండర్ డేటా అంతా సురక్షితంగా ఉంటుంది. యూజర్లు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రధాన ‘అవుట్లుక్ మొబైల్’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.ఇప్పుడేం చేయాలి?అంతరాయం లేని అవుట్లుక్ సర్వీసుల కోసం వినియోగదారులు గడువు ముగిసేలోపే కొన్ని చర్యలు తీసుకోవాలని కంపెనీ సూచించింది. అవుట్లుక్ లైట్ యాప్లోనే అప్గ్రేడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా నేరుగా మెయిన్ యాప్కు వెళ్లవచ్చు. మెయిన్ అవుట్లుక్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ పాత మైక్రోసాఫ్ట్ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే సరిపోతుంది. మీ మెయిల్స్, అటాచ్మెంట్లు ఆటోమేటిక్గా సింక్ అవుతాయి. కంపెనీ ఐటీ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు కానీ, తమ ఉద్యోగులు సకాలంలో కొత్త యాప్కు మారేలా అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది.సాంకేతికత సర్వీసులు వేగంగా మారుతున్న తరుణంలో ఫీచర్ రిచ్ ప్లాట్ఫామ్ల వైపు మొగ్గు చూపడం ద్వారా యూజర్లకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కాబట్టి, గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ఇప్పుడే మెయిన్ యాప్కు మారడం ఉత్తమం.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
కొరియా చిన్నది.. కోట్ల సంపదలో పెద్దది!!
సాంకేతిక రంగం అంటేనే సృజనాత్మకతకు, అపారమైన సంపదకు నిలయం. తాజాగా ఈ రంగంలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. దక్షిణ కొరియాకు చెందిన 22 ఏళ్ల కిమ్ జంగ్-యున్ (Kim Jung-youn) ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా టెక్ బిలియనీర్గా ఫోర్బ్స్-2026 జాబితాలో నిలిచారు. గేమింగ్ రంగంలో ఆమె కుటుంబం సృష్టించిన సామ్రాజ్యం, నేడు ఆమెను ఈ అత్యున్నత స్థానంలో నిలబెట్టింది.వారసత్వ సంపద.. అంతర్జాతీయ గుర్తింపుగేమింగ్ దిగ్గజం 'నెక్సాన్' (Nexon) వ్యవస్థాపకుడు, దివంగత కిమ్ జంగ్-జు కుమార్తె జంగ్-యున్. 2022లో తన తండ్రి మరణం తర్వాత, నెక్సాన్ హోల్డింగ్ కంపెనీ అయిన NXCలో ఆమెకు, ఆమె సోదరి జంగ్-మిన్కు భారీగా వాటాలు దక్కాయి. ఫోర్బ్స్ తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 12, 2026 నాటికి జంగ్-యున్ నికర ఆస్తి విలువ 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12,520 కోట్లు)ప్రస్తుతం ఆమె దక్షిణ కొరియాలోని జెజు ద్వీపంలో నివసిస్తున్నారు. సంపద పరంగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం, సంస్థ నిర్వహణ విషయాల్లో చాలా గోప్యంగా ఉండటానికే మొగ్గు చూపుతారు.నెక్సాన్.. గేమింగ్ రంగంలో ట్రెండ్ సెట్టర్1994లో ప్రారంభమైన నెక్సాన్, ఆన్లైన్ గేమింగ్ ప్రపంచంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. మాపుల్ స్టోరీ (MapleStory), డంజియన్ & ఫైటర్ (Dungeon & Fighter) వంటి ప్రపంచ ప్రసిద్ధ గేమ్స్ ఈ సంస్థ ఖాతాలో ఉన్నాయి. ఏటా బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని ఆర్జిస్తూ, ఆసియా డిజిటల్ గేమింగ్ మార్కెట్లో నెక్సాన్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ బలమైన పునాదే నేడు జంగ్-యున్ సంపదకు ప్రధాన వనరు.2026లో యువ బిలియనీర్ల హవాఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది 30 ఏళ్లలోపు వయస్సున్న బిలియనీర్ల సంఖ్య 35కు చేరింది. వీరి మొత్తం ఆస్తి విలువ సుమారు 92.4 బిలియన్ డాలర్లు. వీరిలో అత్యధికులు వారసత్వంగా ఆస్తులు పొందిన వారే అయినప్పటికీ, AI (కృత్రిమ మేధ) వంటి రంగాల్లో సొంతంగా ఎదిగిన వారు (Self-made) కూడా 12 మంది ఉండటం విశేషం. టెక్ రంగంలో జంగ్-యున్తో పాటు లువానా లోపెస్ లారా(కల్షి), లూసీ గువో (స్కేల్ ఏఐ) వంటి యువ మహిళామణులు కూడా సత్తా చాటుతున్నారు. -
ఇన్వెస్టర్ల మనసంతా ఆ ఇన్వెస్టింగ్పైనే..
ముంబై: పారదర్శకమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇండెక్స్ ఇన్వెస్టింగ్పై మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా తమ సంస్థ వివిధ సూచీల ఆధారిత ఫండ్స్ని అందిస్తున్నట్లు వివరించింది.2026 ఫిబ్రవరి 28 నాటికి వీటిలో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 849 కోట్లకు, 100 ఇండెక్స్ ఫండ్ ఏయూఎం రూ. 1,983 కోట్లకు చేరినట్లు తెలిపింది. 2022 జనవరిలో ప్రవేశపెట్టిన నిఫ్టీ నెక్ట్స్ 50 ఫండ్ గణనీయంగా వృద్ధి చెందుతోందని పేర్కొంది. ఇవి లార్జ్ క్యాప్ మొదలుకుని వివిధ స్థాయుల్లో మార్కెట్కి ప్రాతినిధ్యం వహించే, భవిష్యత్తులో లీడర్లుగా ఎదిగే సామర్థ్యాలున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది.యాక్టివ్గా మేనేజ్ చేసే ఫండ్స్తో పోలిస్తే, ఇండెక్స్ ఫండ్స్లో హ్యూమన్ ఎర్రర్ (నిర్ణయాల్లో పొరపాట్లు) తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను ఆశించే ఇన్వెస్టర్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త తరం ఇన్వెస్టర్లు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో (నిర్వహణ వ్యయం) కలిగిన ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పద్ధతులపై అవగాహన పెంచుకుంటున్నారు. -
టెక్ దేశానికి వీసా ఫీజులు పెరుగుతున్నాయ్..!
జపాన్లో నివసిస్తున్న విదేశీయులకు, అక్కడికి వెళ్లాలనుకునే వారికి ఆ దేశ ప్రభుత్వం షాకింగ్ వార్త చెప్పింది. ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్కు సవరణలు చేయడం ద్వారా వీసా పునరుద్ధరణ (Renewal), శాశ్వత నివాస (Permanent Residency) రుసుములను భారీగా పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ ప్రతినిధి జపాన్ పార్లమెంటు దిగువ సభలో వివరాలను వెల్లడించారు.ప్రతిపాదిత కొత్త ఫీజుల వివరాలుప్రస్తుత నిబంధనల ప్రకారం వీసా గడువుతో సంబంధం లేకుండా పునరుద్ధరణకు కేవలం 6,000 యెన్లు మాత్రమే వసూలు చేస్తున్నారు. అయితే కొత్త సవరణల ప్రకారం ఈ ధరలు ఆకాశాన్నంటనున్నాయి. 5 ఏళ్ల వీసా రెన్యువల్ కోసం ప్రస్తుతమున్న ఫీజు ఏకంగా 70,000 యెన్లకు పెరగనుంది. స్వల్పకాలిక వీసా (3 నెలలు అంతకంటే తక్కువ) పునరుద్ధరణకు సుమారు 10,000 యెన్లు ఖర్చవుతుంది. ఇక శాశ్వత నివాసం (PR) ఫీజు అత్యంత భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం 10,000 యెన్లు ఉన్న పీఆర్ రుసుము, ఏకంగా 2,00,000 యెన్లకు పెరగనుంది.గరిష్ట పరిమితులు ఖరారు చేసిన ప్రభుత్వంఫీజుల పెంపుపై ప్రభుత్వం కేబినెట్ ఆమోదం కోసం ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్ సవరణలను సమర్పించింది. ఇందులో భాగంగా గరిష్ట ఫీజు పరిమితులను కూడా నిర్ణయించింది. శాశ్వత నివాసం కోసం గరిష్టంగా 3,00,000 యెన్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇతర వీసా కేటగిరీలకు గరిష్టంగా 1,00,000 యెన్ల వరకు పరిమితి విధించారు. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. అర్హతను బట్టి వారికి ఫీజులో తగ్గింపు లేదా పూర్తి మినహాయింపు ఇచ్చే నిబంధనలను కూడా అధికారులు పొందుపరిచారు.పెంపునకు కారణం ఏంటి?మారుతున్న పరిపాలనా అవసరాలు, ఇమ్మిగ్రేషన్ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే క్రమంలో ఈ ఫీజుల సర్దుబాటు తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, పర్యవేక్షణ ఖర్చులను భర్తీ చేయడానికి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఫారమ్ 15 G/H బదులుగా ఫారమ్ 121
కొత్త చట్టం, కొత్త రూల్స్తో ఫారాల నంబర్లు మారడం సహజం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 15 G/Hలు రెండింటికి బదులుగా ఒకే ఫారమ్ తెచ్చారు. దాని నెంబరు 121గా ఉంది. కొత్త ఫారమ్ ఎందుకు దాఖలు చేయాలి? విషయం పాతదే. మీకు బాగా తెలిసిందే. మీరు సంపాదించిన బ్యాంకు డిపాజిట్లు మీద వడ్డీని ఇతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఇది పన్నుకు గురి అవుతుంది. ఒక ఏడాది ఇటువంటి ఆదాయం రూ.50 వేలు, ఏడాది దాటితే ఈ పరిమితి సీనియర్ సిటిజన్లకు అయితే రూ.1,00,000. బ్యాంకు వాళ్లు దాని మీద టీ.డీ.యస్ రివకరీ చేస్తారు. అందుకని ముందుగా లెక్కలు వేసుకోండి. మీ నికర టాక్స్ బుక్ ఆదాయం 2026–27లో రూ.12,00,000 దాటకపోతే మీకు పన్ను భారం ఏర్పడదు. మీకు ఏర్పడ్డ ఆదాయంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ కూడా ఉండి, మొత్తం ఆదాయం రూ.12,00,000 దాటకపోతే పన్ను భారమే ఉండదు కాబట్టి టీడీఎస్కి గురి కావడం అనవసరం. అందుకని ఈ నెలలోనే 121 ఫారమ్ సబ్మిట్ చేయండి. మీరు బ్యాంకుకి సబ్మిట్ చేయకపోతే బ్యాంకు వారు టీడీఎస్ కట్ చేస్తారు. అందుకని 121 వేయండి.పాత ఫారమ్లు ఇక ఉండవా..? 1.4.2026 నుంచి పాత ఫారమ్లు 15 G/H ఉండవు. రద్దు అయ్యాయి అని అనవచ్చు. గతేడాది వరకు 60 ఏళ్లు దాటిన వారికి ఒక ఫారమ్, దాటని వారికి వేరొక ఫారమ్ అమల్లో ఉండేవి. ఇక నుంచి ఒకే ఫారమ్. దాని నెంబరే 121. వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవ్వరైనా 121 దాఖలు చేయాలి. టీడీఎస్ ఏ పరిస్థితుల్లో చేస్తారు.. ఫారమ్ 121 దాఖలు చేసినా, చేయకపోయినా డిపాజిట్ హోల్డర్లకి పాన్ లేకపోతే టీడీఎస్ 20% చొప్పున చేస్తారు. పాన్ ఉండి పనిచేయకపోయినా.. ఆధార్తో అనుసంధానం కాకపోయినా 20 % రివకరీ చేస్తారు. బ్యాంకు వడ్డీ రూ.50,000 దాటి, గత రెండు అస్సెస్మెంట్ సంవత్సరాలకు ఆదాయపు పన్ను రిటర్ను వేయకపోతే టీడీఎస్ 20 శాతం కట్ చేస్తారు. క్యాపిటల్ గెయిన్స్ ఆదాయం ఉంటే .. ఫారమ్ 121 కేవలం పన్ను భారం లేని వారికి మాత్రమే. 87 అ కింద రిబేటు సౌకర్యం/సదుపాయం పొందడానికి క్యాపిటల్ గెయిన్స్ మీద కాకుండా ఏర్పడ్డ ఇతర అన్ని ఆదాయాలకు మాత్రమే. మీకు క్యాపిటల్ గెయిన్స్ మీద ఆదాయం ఉంటే ఫారమ్ 121 వేయకూడదు. కింది ఉదాహరణ అర్థం చేసుకోండి .. 2026–27లో మీ ఆదాయం రూ.12,00,000 లోపల ఉంది. ఈ సందర్భంలో పన్ను భారం ఉండదు. రూ.2,00,000 బ్యాంకు వడ్డీ ఇందులో కలిసి ఉండదనుకొండి. 121 ఇచ్చారు. బ్యాంకు వాళ్లు టీడీఎస్ చేయరు. కానీ సంవత్సరాంతంలో మీకొక క్యాపిటల్ గెయిన్స్ వచ్చింది అనుకోండి. పన్ను భారం ఏర్పడుతుంది. మినహాయింపులు పొందవచ్చు. మినహాయింపులు వద్దనుకుంటే... 87 అ బెనిఫిట్ రద్దు అవుతుంది. అంటే రేట్ల ప్రకారం రూ.12,00,000 మీద క్యాపిటల్ గెయిన్స్ మీద చెల్లించాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మీరు ఫారమ్ 121 ఇవ్వడం తప్పు అవుతుంది. ఆ తప్పు నుంచి బయట పడాలంటే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు పొందాల్సిందే. అప్పుడు ఫారమ్ 121 ఇవ్వడం సముచితము. రెండు విభిన్న ఆలోచనలు .. ఏ ఆదాయం ఎంత ఉన్నా.. ఫారమ్ 121 ఇవ్వకపోతే అప్పుడు బ్యాంకు వాళ్లు టీడీఎస్ రికవరీ చేస్తారు. సంవత్సరం చివరన ఆదాయం లెక్కించడం, పన్ను చెల్లించడం.. ఒక వర్గం వాదన ఇది. కాగా మరో వర్గం ఆలోచన ఏమిటంటే ఏ ఆదాయం ఎంత ఉన్నా ఫారమ్ 121 ఇవ్వడం... పన్ను కోత టీడీఎస్ లేకుండా బయటపడటం.. కానీ సంవత్సరాంతంలో ఆదాయం లెక్కించి పన్ను కట్టడం, లేదా రిఫండ్ తెచ్చుకోవడం .. ఇలా కూడా చేయొచ్చు. మీరు ముందుగానే లెక్కలన్నీ వేసి నిర్ణయం తీసుకోండి. ఫారమ్ 121 గురించి సాంకేతిక సమాచారం .. ఇందులో రెండు భాగాలుంటాయి. పార్ట్ అ లో అంకెలు మనం నింపాలి. ఫారమ్ ఆ బ్యాంకు వాళ్లు నింపుతారు. అంశాలన్నీ మీకు తెలిసినవే. మొత్తం సంవత్సర ఆదాయం ఎంతో చెప్పాలి. అంతేకాకుండా గత రెండేళ్ల ఆదాయపు రిటర్నులు వివరాల ఇవ్వాలి. 121 దాఖలు చేయగానే బ్యాంకు అధికార్లు 26 క్యారెక్టర్లతో అంకెలు/అక్షరాలు కలిపిన నెంబరు ఇస్తారు. ఇందులో బ్యాంకు పేరు, టాన్ నంబరు, ఆర్థిక సంవత్సరం మొదలైనవి ఉంటాయి. ఈ నంబరుతో డిపార్ట్మెంట్ వారు మీ వివరాలన్నింటినీ ట్రాక్ చేస్తారు. దీని వలన దురి్వనియోగం/అనుచితయోగం తగ్గుతుంది. ఈ ఫారమ్లో వివరాలు ఇతర ఫారాలతో లింక్ చేయడం వలన అన్నీ ఫారాల్లోని అంశాలు అప్డేట్ అవుతాయి. తగిన జాగ్రత్త వహించండి. -
పసిడి ప్రియులకు ఊరట.. బంగారం తగ్గుముఖం
పసిడి ప్రియులకు ఊరట కలిగింది. దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజుల తర్వాత పసిడి ధరలు (Today Gold Rate) నేడు కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా క్షీణించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
స్టాక్మార్కెట్ అలర్ట్: నాలుగు రోజులే ట్రేడింగ్
స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు, ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక. ఈ వారం సెలవుల కారణంగా ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 19 మధ్య ట్రేడింగ్ కేవలం నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి, వారాంతపు సెలవుల సందర్భంగా మూడు రోజులు మార్కెట్లకు సెలవు ఉంటుంది.మార్కెట్ సెలవుల వివరాలుఏప్రిల్ 14 (మంగళవారం) అంబేడ్కర్ జయంతి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) పూర్తిగా మూసిఉంటాయి. అలాగే వారాంతపు సెలవులైన ఏప్రిల్ 18 (శనివారం), ఏప్రిల్ 19 (ఆదివారం) మార్కెట్లు యధావిధిగా పనిచేయవు. మంగళవారం విరామం తర్వాత, ఏప్రిల్ 15 (బుధవారం) ఉదయం నుండి ట్రేడింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.ఈ విభాగాల మూసివేతఅంబేడ్కర్ జయంతి నాడు కేవలం ఈక్విటీ మార్కెట్ మాత్రమే కాకుండా.. డెరివేటివ్స్, కరెన్సీ, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O), ఫారెక్స్ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్లలో కూడా క్రయవిక్రయాలు నిలిచిపోతాయి. అలాగే సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్లకు కూడా సెటిల్మెంట్ హాలిడే కావడంతో లావాదేవీల క్లియరెన్స్లో జాప్యం ఉండవచ్చు.కమోడిటీ మార్కెట్మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో ట్రేడింగ్ చేసే వారికి కొంత ఊరట లభించనుంది. ఇక్కడ మార్కెట్ పూర్తిగా మూసిఉండదు. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:45 వరకు ట్రేడింగ్ ఉండదు. ఈ సమయంలో బంగారం, వెండి, ముడిచమురు వంటి లోహాల వ్యాపారం నిలిచిపోతుంది. సాయంత్రం 5:30 గంటల నుండి ట్రేడింగ్ యధావిధిగా కొనసాగుతుంది. -
8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల సంపద ఢమాల్
స్టాక్ మార్కెట్లపై హర్ముజ్ సంక్షోభం ఎఫెక్ట్ పడింది. చర్చలు విఫలమై చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,350 పాయింట్లకుపైగా.. నిష్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో కేవలం 8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరయ్యింది.హర్ముజ్ జలసంధి సంక్షోభం ప్రభావంతో ఇవాళ్టి ట్రేడింగ్ సెషన్లో భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా కుదేలయ్యాయి. చర్చలు విఫలమవడంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 8 శాతం పెరగడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామం వెంటనే మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.సెన్సెక్స్ 73,000 స్థాయికి చేరగా, నిఫ్టీ 23,600 కంటే దిగువకు పడిపోయింది. కేవలం ఎనిమిది నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ పతనంతో మార్కెట్లో భయాందోళనలు పెరిగి, చిన్న పెట్టుబడిదారులు పెద్ద నష్టాలను ఎదుర్కొంటున్నారు. చమురు ధరల పెరుగుదలతో ఎయిర్లైన్స్, పెయింట్స్, ఫర్టిలైజర్స్ వంటి రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంధన ఖర్చులు పెరగడంతో ఇండిగో, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు, ఎనర్జీ-అప్స్ట్రీమ్ రంగం, డిఫెన్స్ సంబంధిత షేర్లు మాత్రం కొంత స్థిరంగా నిలిచాయి. నిపుణుల అంచనా ప్రకారం.. హర్ముజ్ సంక్షోభం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దిగుమతి ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం అధికమవడం, వృద్ధి మందగించడం వంటి సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. పెట్టుబడిదారులు తాత్కాలికంగా రిస్క్ ఉన్న రంగాల నుండి దూరంగా ఉండి, స్థిరమైన రంగాల వైపు దృష్టి మళ్లించాలని సూచిస్తున్నారు. -
కోటక్, యాక్సిస్.. న్యూఫండ్ ఆఫర్స్
కోటక్ మహీంద్రా ఏఎంసీ తాజాగా మల్టీ అసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)ని ఆవిష్కరించింది. ఇందులో ఏప్రిల్ 22 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000గా ఉంటుంది. ఈక్విటీ, డెట్, కమోడిటీ ఆధారిత స్కీముల యూనిట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిసు్కకు తగ్గట్లుగా మరింత మెరుగైన రాబడులను అందించడం ఈ ఫండ్ లక్ష్యంగా ఉంటుంది. ఒకే ఫండ్ ద్వారా డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను పొందేందుకు ఇది ఉపయోగపడగలదని సంస్థ ఎండీ నీలేశ్ షా తెలిపారు. యాక్సిస్ డిఫెన్స్ ఫండ్యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ డిఫెన్స్ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)ను ప్రారంభించింది. ఈ నెల 24 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రక్షణ రంగానికి కేంద్రం ఎంతో ప్రా ధాన్యం ఇస్తుండడం తెలిసిందే. దేశీయంగానే అత్యాధునిక ఆయుధాల అభివృద్ధి, తయారీ దిశగా పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.మారిన ప్రపంచ క్రమంలో రక్షణ రంగానికి పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తోంది. 2013–14 నుంచి చూస్తే రెండున్నర రెట్లు పెరిగి 2025–26 నాటికి రూ.6.8 ల క్షల కోట్లకు కేటాయింపులు పెరిగాయి. దీంతో రక్షణ రంగంలోని కంపెనీలు దీర్ఘ కాలానికి మెరుగైన అవకాశాలు కల్పిస్తుండడంతో ప్రత్యేకంగా డిఫెన్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ను ప్రారంభించింది. -
ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక
వాషింగ్టన్: ప్రపంచాన్ని ప్రస్తుతం భారీ ఆర్థిక భూకంపం కుదిపేస్తోంది. ఇరాన్లో జరుగుతున్న యుద్ధం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు.. దాని సెగ ఇప్పుడు సామాన్యుని జేబుకు కూడా గట్టిగానే తగులుతోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరా నిలిచిపోతున్న నేపధ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని, ప్రతి వస్తువుపై ధరల మంట తప్పదని స్పష్టం చేసింది.ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా ‘సీబీఎస్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే పరిస్థితుల తీవ్రతను తెలియజేశారు. గత ఐదు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా కావాల్సిన 13 శాతం చమురు, 20 శాతం గ్యాస్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆమె తెలిపారు. ఇది ఒక చిన్న కుదుపు కాదని, ఒక పెద్ద షాక్ అని ఆమె అభివర్ణించారు. దీని ప్రభావం వల్ల ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అత్యంత దారుణంగా నష్టపోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ధరల పెరుగుదల భారాన్ని తమ ఆదాయంపై పడుతున్న అదనపు పన్నులా మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంక్షోభం కేవలం ఇంధనానికే పరిమితం కాలేదు. రవాణా, ఎరువుల సరఫరా, వ్యవసాయ రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎరువుల ధరలు పెరగడం వల్ల భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఆసియాలోని అనేక దేశాలు ఇప్పటికే ఇంధన కొరతతో సతమతమవుతున్నాయి. ఒకవేళ ఇరాన్లో వెంటనే కాల్పుల విరమణ జరిగినా, తక్షణ ఉపశమనం మాత్రం ఉండదని ఐఎంఎఫ్ తేల్చిచెప్పింది. ధ్వంసమైన గ్యాస్, ఇంధన మౌలిక సదుపాయాలు పూర్తిగా కోలుకునేందుకు మరో మూడు నుంచి ఐదు సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేసింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు కూడా పడిపోయే అవకాశం ఉందని, ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు పేదలకు అండగా నిలవాలని ఐఎంఎఫ్ సూచించింది.ఇది కూడా చదవండి: ‘లక్ష్మీ’ వర్సెస్ ‘దుర్గ’: ఎవరిది అసలైన స్కెచ్? -
సక్సెస్కు ‘సప్త’పది! ‘కొత్త’గా ఇన్వెస్ట్ చేద్దాం..
నిన్న మొన్నటిదాకా పెట్టుబడులు పోటెత్తాయి. దీంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. ఆ పరిస్థితుల నుంచి ఇపుడు మార్కెట్లు ఆటుపోట్ల దశవైపు మళ్లాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మార్కెట్లు విపరీతమైన ఊగిసలాటకు గురవుతున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. గత కొన్నాళ్లుగా ఈక్విటీలు పటిష్టంగా ర్యాలీలు చేస్తుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గు చూపటం వారికి మంచి లాభాలనే ఇచ్చింది. కానీ 2027 ఆర్థిక సంవత్సరం కాస్త విభిన్నంగా ఉండబోతోంది. అంతర్జాతీయంగా వృద్ధిపై అనిశ్చితి నెలకొంది. ద్రవ్యోల్బణం దిగి వస్తున్నా, అంత తేలిగ్గా లొంగడం లేదు. వడ్డీ రేట్లు కూడా మరీ దూకుడుగా ఏమీ తగ్గడం లేదు. భారతీయ ఇన్వెస్టర్లకు దేశీయంగా పటిష్టమైన వృద్ధి వల్ల అవకాశాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ, విధానాలను కాస్త మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది, రాబడులపై ఆశలతో గుడ్డిగా పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులను స్మార్ట్గా తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం ఉపయోగపడే ఏడు వ్యూహాల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ... ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక లక్ష్యాల మదింపు చాలా మంది ఇన్వెస్టర్లు ఒక్కసారి లక్ష్యాలను నిర్దేశించుకున్నారంటే చాలు మళ్లీ వాటిలో మార్పులు, చేర్పులు చేసుకోరు. అయితే, కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు, ఆదాయ స్థాయిలు, వ్యక్తిగత బాధ్యతలు మారుతుంటాయి. కాబట్టి మీరు పెడుతున్న పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది పునఃసమీక్షించుకునేందుకు ఈ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఒక చక్కని అవకాశంగా మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యానికి 2–3 ఏళ్లే ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే ఒడిదుడుకులపరంగా అనవసర రిసు్కలు ఎదురుకావచ్చు. అదే రిటైర్మెంట్ లేదా సంపదను పెంచుకోవడంలాంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టి ఉంటే ఈక్విటీల్లో అధిక పెట్టుబడులను కొనసాగించవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆటో పైలట్ మోడ్లో పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడం కాకుండా లక్ష్యానికి ఉన్న వ్యవధికి తగ్గట్లుగా కేటాయింపులు మార్చాల్సి ఉంటుంది.అసెట్ అలోకేషన్ని సరి చేసుకోవడం ఇపుడు అన్నింటికన్నా పెద్ద రిస్కు మార్కెట్ ఒడిదుడుకులు కాదు.. కేవలం ఒకే పెట్టుబడి సాధనంలో, అందులోనూ, ఈక్విటీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడమే రిస్కీ వ్యవహారం. చాలా మటుకు పోర్ట్ఫోలియోలు అనుకోకుండానే ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లలో ఒకే రకమైన రిటర్నులు రాకపోవచ్చు. కాబట్టి, అసెట్ అలొకేషన్పై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈక్విటీ, డెట్, పసిడితో సమతూకమైన పోర్ట్ఫోలియో ఉంటే షాక్లేవైనా ఎదురైనా తట్టుకుంటూ సంపదను పెంచుకునేందుకు వీలవుతుంది. ఉదాహరణకు... ఈక్విటీలు పతనమైనప్పుడు, డెట్ సాధనాలు స్థిరత్వాన్ని అందిస్తాయి. ఇక గ్లోబల్ అనిశి్చతికి పసిడి హెడ్జింగ్ సాధనంగా పని చేస్తుంది. వార్షికంగా రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల పోర్ట్ఫోలియోకి మీరు నిర్దేశించుకున్న స్థాయికి మించి రిస్కులు ఎదురవకుండా చూసుకోవచ్చు.డైవర్సిఫికేషన్ ప్రధానం పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించడమంటే బోలెడన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉండాలనే అపోహ ఒకటి ఇన్వెస్టర్లలో ఉంది. వాస్తవానికి సదరు ఫండ్స్ అన్నీ కూడా ఒకే రకమైన రంగాలు లేదా మార్కెట్ క్యాప్లకు చెందినవైతే, అప్పుడు కూడా మొత్తం పోర్ట్ఫోలియోలో ఒకే తరహా పెట్టుబడులున్నట్లే అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో సిసలైన డైవర్సిఫికేషన్ అంటే వివిధ అసెట్ క్లాస్లు, భౌగోళిక ప్రాంతాలు, పెట్టుబడి వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించడం. ఈక్విటీల విషయానికొస్తే, స్థిరత్వం కోసం లార్జ్ క్యాప్స్లో, అడాప్టబిలిటీ కోసం ఫ్లెక్సి క్యాప్స్లో, సమతూకం కోసం డెట్, పసిడిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ మరింతగా ఉంటుంది.ఒడిదుడుకులు.. వ్యూహాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటుపోట్లు ప్రత్యేకంగా కనిపించనున్నాయి. ఇన్వెస్టర్లు వీటిని రిస్కులుగా అనుకోకుండా, అవకాశాలుగా మార్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) చక్కగా పని చేస్తాయి. దీనివల్ల కాలక్రమేణా కొనుగోలు రేటు సగటు స్థాయికి వస్తుంది. అయితే, మార్కెట్లు కరెక్షన్లకు లోనైనప్పుడు సిప్లతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులను కూడా జోడిస్తే స్మార్ట్ విధానంగా ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్లు అర్థవంతంగా తగ్గితే, అదనంగా పెట్టుబడులను కొద్ది కొద్దిగా పెట్టడం వల్ల దీర్ఘకాలిక రాబడులు మెరుగుపడతాయి. మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పుడు భావోద్వేగాలతో కాకుండా క్రమశిక్షణతో వ్యవహరించడం ముఖ్యం.లిక్విడిటీ పటిష్టం చేసుకోవాలి అనిశ్చితిలో రాబడులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో లిక్విడిటీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా చాలా మటుకు డబ్బును మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నిర్మాణాత్మకమైన ఆర్థిక ప్రణాళికలో కనీసం ఆరు నెలలకు సరిపడే ఎమర్జెన్సీ నిధి కూడా ఉంటుంది. అనూహ్య పరిస్థితులు ఏవైనా తలెత్తితే దీర్ఘకాలిక పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఇది తోడ్పడుతుంది. లిక్విడిటీ ఉంటే ప్రధాన పోర్ట్ఫోలియోని డిస్టర్బ్ చేయకుండా మార్కెట్లో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుంది.పోర్ట్ఫోలియోలో డెట్ సాధనాలకూ చోటివ్వండి ఈక్విటీ మార్కెట్లు బాగున్నప్పుడు డెట్ పెట్టుబడులను పెద్దగా పట్టించుకోరు. కానీ రాబడులు ఒక మోస్తరు స్థాయికి పరిమితమై, వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్న దశలో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. డెట్ సాధనాల వల్ల అంచనాలకు అనుగుణమైన రాబడులు వస్తాయి. పోర్ట్ఫోలియోలో ఆటుపోట్లు తగ్గుతాయి. మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న దశలో పోర్ట్ఫోలియోకి కాస్త స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడిని సంరక్షించుకోవడం చాలా కీలకంగా ఉండే స్వల్పకాలిక, మధ్యకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి 2026–27లో అత్యంత నాణ్యమైన డెట్ సాధనాలకు సమతూకంగా కేటాయిస్తే, భారీ రాబడులు లేకపోయినా, రిసు్కకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను అందుకునేందుకు వీలవుతుంది. క్రమశిక్షణ ముఖ్యం సాధారణంగా సరైన ఫండ్ని ఎంపిక చేసుకుంటే చాలు మంచి రాబడులు వస్తాయనే దృష్టితో చాలా మంది ‘అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్ని వెతికి పట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. నిజానికి, నిలకడ, క్రమశిక్షణ, అసెట్స్కి సరైన అలొకేషన్ చేయడమే దీర్ఘకాలికంగా ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవలి కాలంలో పనితీరు బాగుండటం లేదంటూ మాటిమాటికీ ఫండ్స్ని అటూ ఇటూ మార్చడం వల్ల అసలుకే మోసం వస్తుంది. దీనివల్ల భారీ వేల్యుయేషన్స్కి కొనుక్కుని, తాత్కాలికంగా పడగానే, ని్రష్కమించినట్లవుతుంది. అలా గాకుండా మెరుగ్గా నిర్వహిస్తున్న కొద్ది ఫండ్స్ని ఎంచుకుని, పెట్టుబడులను కొనసాగిస్తూ, మధ్యమధ్యలో వాటిని సమీక్షించుకుంటూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ తాత్కాలిక భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల గాకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం వల్లే మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరంలో దూకుడుగా, అస్తవ్యస్తంగా పెట్టుబడులను పెడితే ఫలితాలు దక్కేలా లేవు. ఎవరైతే సమతూకం, నిలకడ, రిస్క్ మేనేజ్మెంట్పై ప్రధానంగా ఫోకస్ చేస్తారో వారికే ప్రయోజనాలు లభిస్తాయి. మార్కెట్ కదలికలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నం చేయడం కాకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే విధంగా పోర్ట్ఫోలియోని తీర్చిదిద్దుకోవడం స్మార్ట్ వ్యూహంగా ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సరిచేసుకుంటూ, సరైన అసెట్ అలొకేషన్ని పాటిస్తూ, సమర్ధవంతంగా డైవర్సిఫై చేస్తూ, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఇన్వెస్టర్లు ఒకవైపు దీర్ఘకాలికంగా సంపదను పెంచుకుంటూనే మరోవైపు అనిశ్చితి నుంచి బైటపడొచ్చు. చివరగా చెప్పేదేమిటంటే, గొప్ప ఫలితాలు సాధించాలంటే ఏదైనా అసాధారణమైనది చేయడం కాదు.. నిలకడగా కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలు. -
మార్కెట్కు మళ్లీ ‘పశ్చిమాసియా’ సెగ?
ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశి్చమాసియా మళ్లీ భగ్గుమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి డీల్ కుదరకుండానే ఇరు పక్షాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో మార్కెట్ సెంటిమెంట్పై దీని ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దాడులు మొదలై హార్మూజ్ జలసంధిలో తిరిగి ఇరాన్ అడ్డంకులు సృష్టిస్తే.. క్రూడ్ ధరలు దూసుకెళ్లడంతో పాటు దీని సెగ మార్కెట్కు గట్టిగానే తగలవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం (14న) మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్పశ్చిమాసియాలో చోటుచేసుకునే కీలక పరిణామాలకు తోడు క్రూడ్ ధరల కదలికలు మార్కెట్ ట్రెండ్ను నిర్దేశించనున్నాయి. ఇరాన్–అమెరికా మధ్య సీజ్ఫైర్... శాంతి ఒప్పందంపై ఆశలతో గతవారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు రివ్వుమన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రూడ్ 100 డాలర్ల కిందికి జారడంతో సూచీలకు బూస్ట్ లభించింది. అణు కార్యకలాపాలకు స్వస్తి చెప్పేందుకు ఇరాన్ ససేమిరా అనడంతో చర్చలు విఫలయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపించగా.. యూఎస్ అలవికాని డిమాండ్లే డీల్ కుదరకపోవడానికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, దౌత్య ప్రయత్నాలు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ పేర్కొనడం విశేషం.చర్చలు విఫలమైన నేపథ్యంలో సమీపకాలానికి మార్కెట్ ముఖచిత్రం మళ్లీ మారిపోయే అవకాశం ఉందని లివ్లాంగ్ వెల్త్ రీసెర్చ్ ఎనలిస్ట్ హరిప్రసాద్ కె అభిప్రాయపడ్డారు. ’నిఫ్టీ శరవేగంగా తిరిగి 24,000 స్థాయిని అధిగమించిన నేపథ్యంలో సూచీకి ఈ వారం చాలా కీలకంగా మారనుంది. అయితే, ఇరాన్–అమెరికా శాంతి చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో మళ్లీ మార్కెట్లలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. సోమవారం సూచీలు భారీ గ్యాప్డౌన్తో మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తాజా సీజ్ఫైర్ ర్యాలీలో ఆర్జించిన లాభాలు చాలా వరకు ఆవిరయ్యే ప్రమాదం నెలకొంది’ అని ఆయన పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం డేటా.. ఈ వారంలో విడుదలయ్యే ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా మార్కెట్పై ప్రభావం చూపనున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.. మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ఏప్రిల్ 13న, టోకు ధరల ద్రవ్యోల్బణం 14న వస్తుంది. ఆహార ధరల మంటతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి ఎగబాకగా.. టోకు ద్రవ్యోల్బణం 11 నెలల గరిష్ట స్థాయి అయిన 2.13 శాతానికి చేరింది. రానున్న కాలంలో ఆర్బీఐ పాలసీ నిర్ణయంలో ద్రవ్యోల్బణం గణాంకాలు కీలక పాత్ర పోషించనున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఈ డేటాపై మరింత ఫోకస్ చేయనున్నారు.ఫలితాలపై దృష్టి... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025–26, క్యూ4) ఫలితాల సీజన్ను గతవారంలో టీసీఎస్ బోణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వారం విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల ఫలితాలు వెలువడనున్నాయి. క్యూ4తో పాటు విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా మార్కెట్కు దిక్సూచిగా నిలుస్తాయని మిశ్రా పేర్కొన్నారు.సాంకేతికంగా చూస్తే... ఇరాన్–అమెరికా చర్చలు విఫలం కావడంతో మార్కెట్ గ్యాప్డౌన్తో మొదలైతే 23,700 వద్ద తొలి మద్దతు లభించచ్చని.. ఆ స్థాయిని కోల్పోతే 23,500 మద్దతు కీలకమని మార్కెట్నిపుణులు చెబుతున్నారు. ఇక సూచీ గనుక పెరిగితే 24,100 వద్ద తొలి నిరోధం, ఆపై 24,300 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉందనేది వారి విశ్లేషణ.గత వారమిలా...ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పుంజుకోవడం, రూపాయి బలోపేతం, క్రూడ్ ధరలు శాంతించడం వంటి పరిణామాలతో దేశీ మార్కెట్లు కూడా భారీగా కోలుకున్నాయి. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 4,231 పాయింట్లు (5.77%) దూసుకెళ్లగా.. ఎస్ఎస్ఈ నిఫ్టీ 1,338 పాయింట్లు (5.88%) ఎగబాకింది.విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల బాట... దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల తొలి 10 రోజుల్లో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.48,213 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం దీనికి నిదర్శనం. ఫిబ్రవరిలో రూ.22,615 కోట్ల నికర పెట్టుబడుల అనంతరం, మార్చిలో రికార్డు స్థాయిలో రూ. 1.17 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్పీఐలు అమ్మేసిన సంగతి తెలిసిందే. దీంతో 2026లో ఇప్పటిదాకా మొత్తం రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను వారు ఉపసంహరించుకున్నారు.పశ్చిమాసియా సంక్షోభం తర్వాత మార్కెట్ భారీ పతనానికి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలే కీలకంగా నిలిచాయి. ‘పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ధరలు భగ్గుమనడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం రిస్కులు తీవ్రమయ్యాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు స్థూల ఆర్థిక ప్రతికూలతలు ఎఫ్పీఐల భారీ అమ్మకాలకు పురిగొల్పుతున్నాయి’ అని మార్నింగ్ స్టార్ రీసెర్చ్ ఇండియాకు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
హెల్త్ ఇన్సూరెన్స్.. మీ ‘ప్లాన్’ ఏంటి?
చందన (38) ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఆమె భర్త (44) ఓ చిన్న వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. వీరి కుటుంబానికి రూ.5 లక్షల సమ్ ఇన్సూర్డ్తో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. చందన ఆటో ఇమ్యూన్ (లూపస్) వ్యాధిని ఎదుర్కొంటోంది. ఆమె భర్తకు మధుమేహం, బీపీ, స్థూలకాయం సమస్యలున్నాయి. వివేక్ (40) ఓ బ్యాంకులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాడు. ఆయన భార్య (35) గృహిణి. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరికి కూడా రూ.5 లక్షల కవరేజీతో బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ప్లాన్ ఉంది. చూడ్డానికి హెల్త్ కవరేజీ సమానమే. కానీ ఇక్కడి రెండు కుటుంబాల ఆరోగ్య చరిత్ర వేరు. కుటుంబ సభ్యుల సంఖ్య వేరు. మనలో చాలా మంది బీమా విషయంలో ఒకే ధోరణిని అనుసరిస్తుండడాన్ని గమనించొచ్చు. కానీ, అందరికీ ఒకే తరహా ప్లాన్, అందరికీ ఒకే విధమైన రక్షణ కవరేజీ అన్నది ఎంత మాత్రం సమంజసం కాదన్న విషయాన్ని గుర్తించాలి. 25 ఏళ్లు, 60 ఏళ్ల వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి మధ్య ప్రాధాన్యతలు, ఆరోగ్య సమస్యలు, రిస్క్ ఒకే విధంగా ఉండవు. అందుకే ప్రతీ కుటుంబం కూడా తమ ఆరోగ్య చరిత్ర, వయసు, సభ్యుల సంఖ్య ఆధారంగా మెరుగైన కవరేజీతో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇందుకు ఏం చేయాలన్నది ఈ వెల్త్ స్టోరీలో చూద్దాం. వయసు కీలకం..→ ఒకే తరహా బీమా పాలసీ అందరికీ అనుకూలమని చెప్పలేం. → వైద్య విభాగంలో ద్రవ్యోల్బణం 10–12 శాతంగా ఉంటోంది. అంటే ఏటా చికిత్సలు, ఔషధాలు ఇలా మొత్తం మీద వాటి వ్యయాలు ఈ మేరకు పెరుగుతున్నాయి. → మారిన ఆహార నియమాలు, పని వేళలు, తక్కువ శ్రమ కారణంగా జీవనశైలి వ్యాధుల ముప్పు పెరిగిపోయింది. 30 ఏళ్ల నుంచే మధుమేహం, బీపీ, థైరాయిడ్ సమస్యలు సాధారణమయ్యాయి. కేన్సర్ల రిస్క్ మన దేశంలో వేగంగా పెరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. → హెల్త్ ఇన్సూరెన్స్ రక్షణ సమగ్రంగా లేకపోతే పొదుపు, పెట్టుబడులన్నీ కరిగిపోయే రిస్క్ ఎదురవుతుంది. → కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కేవలం రక్షణ సాధనమే కాదు. ఆర్థిక ప్రణాళికలో ఇదొక భాగం. ఆర్థిక సంక్షోభ నివారణ సాధనం.25–35 ఏళ్ల వారికి.. ప్రధాన లక్ష్యం→ తక్కువ ప్రీమియంపై అధిక కవరేజీ ఉండేలా చూసుకోవాలి. ఎంపిక → అవివాహితులు అయితే వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్, వివాహితులు అయితే కుటుంబం అంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఎంపిక చేసుకోవచ్చు. → కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల సమ్ ఇన్సూర్డ్తో బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ తీసుకోవాలి. → బేసిక్ ప్లాన్ కవరేజీలో తీసుకున్నంత మేర (రూ.5–10 లక్షలు) డిడక్టబుల్ పెట్టుకుని, రూ.20–25 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ కొనుగోలు చేయాలి. → ఇలా చేయడం వల్ల ఒక ఏడాదిలో ఆస్పత్రి బిల్లు బేసిక్ ప్లాన్ కవరేజీని మించినప్పుడు, సూపర్ టాపప్ ప్లాన్ నుంచి చెల్లింపులు లభిస్తాయి.వీటిపై దృష్టి పెట్టాలి→ నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ) ఉండేలా చూసుకోవాలి. → బీమా సంస్థ హాస్పిటల్ నెట్వర్క్ను పరిశీలించాలి. ఎన్ని ఎక్కువ ఆస్పత్రులు జాబితాలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా తాము నివసించే ప్రాంతంలోని ముఖ్యమైన ఆస్పత్రులు బీమా నెట్వర్క్ పరిధిలో ఉన్నాయేమో చూసుకోవాలి. దీనివల్ల వైద్యం అవసరమైనప్పుడు సులభంగా క్యాష్లెస్ క్లెయిమ్ పొందడం వీలు పడుతుంది. → చిన్న వయసు వల్ల తక్కువ ప్రీమియంతోపాటు ఎలాంటి వ్యాధుల్లేకపోవడం అనుకూలం. అన్ని వెయిటింగ్ పీరియడ్ (కొన్ని వ్యాధులకు కవరేజీ)లను ఈజీగా అధిగమించొచ్చు. ఈ తప్పులు వద్దు.. → నేను ఆరోగ్యవంతుడిని కదా, ఇంత చిన్న వయసులో నాకు ఆరోగ్య బీమా ఎందుకు? అన్న ఆలోచన తప్పు. ఆరోగ్య సమస్యలే రానక్కర్లేదు. ప్రమాదం కారణంగా ఆస్పత్రి పాలై క్లిష్టమైన చికిత్సలు అవసరమైతే బిల్లు వాచిపోవచ్చు. → పనిచేసే సంస్థ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా చాలులే అనుకోవద్దు. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయినా లేదా సంస్థను వీడినా సొంతంగా బీమా రక్షణ ఉండదు.30–50 ఏళ్ల వయసు..ప్రధాన లక్ష్యం→ కుటుంబం అంతటికీ సరైన రక్షణ కల్పించుకోవడం ఈ వయసు వారికి ప్రధాన లక్ష్యంగా ఉండాలి. కవరేజీ–ప్రీమియం మధ్య సమతూకం ఉండాలి.ఏది అనుకూలం? → ఈ వయసులో దాదాపు అధిక శాతం వివాహం చేసుకుని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కనుక వీరికి ఫ్యామిలీ ఫ్లోటర్ సరైనది. అవివాహితులైతే ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్ తీసుకోవచ్చు. → కుటుంబం మొత్తానికి కవరేజీ బేసిక్ ప్లాన్లో రూ.10–25 లక్షలు ఉండేలా చూసుకోవాలి. అదే ఇండివిడ్యువల్ ప్లాన్లో రూ.5–10 లక్షలు సరిపోతుంది. → రూ.25–50 లక్షలతో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. బేసిక్ ప్లాన్లో కవరేజీ మేర డిడక్టబుల్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఒక్కరికైనా, కుటుంబానికైనా సూపర్ టాపప్తో అదనపు రక్షణ అనేది ఈ రోజుల్లో ఎంతో అవసరం.కీలక ప్రాధాన్యతలు వీటికి.. → పెళ్లై పిల్లల కోసం ప్లాన్ చేసుకునే వారు తాము తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్లో మెటరి్నటీ (ప్రసవ సంబంధిత) కవరేజీ తప్పక ఉండేలా చూసుకోవాలి. → మధ్య వయసు దృష్ట్యా డే కేర్ ప్రొసీజర్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. → హాస్పిటల్లో చేరక ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అదే సమస్యకు సంబంధించి తీసుకునే చికిత్సకు కవరేజీ ఉండాలి. ఇప్పుడు చాలా ప్లాన్లు 90–120 రోజుల వరకు చేరక ముందు, డిశ్చార్జ్ అయిన తర్వాత కవరేజీని ఇస్తున్నాయి. → రూమ్ రెంట్కు సంబంధించి ఎలాంటి పరిమితులు లేకపోతే మేలు. → వ్యాధులకు సంబంధించి ఉప పరిమితులు (చెల్లింపుల్లో) ఉండకూడదు. → కో–పేమెంట్ విషయంలో (ప్రతీ క్లెయిమ్లో పాలసీ దారు తన వంతు చెల్లించాల్సిన మొత్తం) దూరంగా ఉండాలి. → బేసిక్ ప్లాన్, సూపర్ టాపప్తో తక్కువ ప్రీమియానికి మెరుగైన కవరేజీ లభిస్తుంది. 50 ఏళ్లు దాటిన వారికి.. వీటికి ప్రాధాన్యం..→ అప్పటికే ఉన్న వ్యాధులతోపాటు అన్ని రకాల కవరేజీలు ఉన్న ప్లాన్ అవసరం. → ఈ వయసులో ఫ్యామిలీ ఫ్లోటర్ కంటే కూడా ఇండివిడ్యువల్ హెల్త్ ప్లాన్ మేలు. → బేసిక్ ప్లాన్స్లో రూ.10లక్షల కవరేజీకి అదనంగా 50 లక్షలతో సూపర్ టాపప్ తీసుకోవాలి.వీటిని చూడాలి..→ ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీని ఆఫర్ చేసే ప్లాన్ తీసుకోవాలి. సాధారణంగా పాలసీ తీసుకునే నాటికి ఉన్న వ్యాధులకు సంబంధించి కవరేజీ పొందాలంటే కనీసం 3–4 ఏళ్లు ఆగాలి. అప్పటికే ఉన్న వ్యాధులకు సంబంధించి వ్యయాలకు పాలసీదారు సొంతంగా ఖర్చు చేసుకోవాలి. కొన్ని సంస్థలు కాస్త అదనపు ప్రీమియంతో వెయిటింగ్ పీరియడ్ను తగ్గించేందుకు/మాఫీ చేసేందుకు అనుమతిస్తున్నాయి. → ఒకవేళ వెయిటింగ్ పీరియడ్ క్లాజు ఉన్నా, సాధ్యమైనంత తక్కువ ప్లాన్కు ప్రాధాన్యం ఇవ్వాలి. → క్లెయిమ్ చెల్లింపుల రేషియో ఎక్కువ ఉన్న బీమా సంస్థ అయితే నయం. అదే సమయంలో ఆయా బీమా సంస్థ సేవలు బాగున్నాయేమో చూసుకోవాలి.రిస్క్లు..→ ఈ వయసులో పాలసీలకు కంపెనీలు అధిక ప్రీమియం నిర్ణయిస్తుంటాయి. → అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా కొన్ని బీమా సంస్థలు పాలసీ ఇవ్వడానికి నిరాకరించొచ్చు. ఇవి అందరికీ.. → వయసు ఏదైనప్పటికీ అధిక కవరేజీ ఉంటే ఎంతో మంచిది. కనీసం రూ.20 లక్షలు అంతకంటే అధికం (సూపర్ టాపప్) ఉండేలా చూసుకోవాలి. → ఆస్పత్రుల నెట్వర్క్ను ప్రధానంగా చూడాలి. ఎక్కువ ఆస్పత్రుల్లో, అందులోనూ పేరున్న ఆస్పత్రులు అన్నీ ఉంటే మంచిది. → రూమ్ రెంట్లకు సంబంధించి పరిమితులు, కో–పేమెంట్, వ్యాధుల వారీ పరిమితులు ఏవీ లేకుండా చూసుకోవాలి. → పాలసీ తీసుకునే ముందు పాలసీ వర్డింగ్స్ డాక్యుమెంట్ ఆసాంతం చదివి.. అందులో సదుపాయాలు, మినహాయింపుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. → గడువులోపు పాలసీని తప్పక రెన్యూ చేసుకోవాలి. దీనికి ఆటో డెబిట్ యాక్టివేట్ చేసుకోవాలి.– సాక్షి, వెల్త్ -
TCSలో కలకలం.. రంగంలోకి పోలీసులు
ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), తన నాసిక్ యూనిట్లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఘటనలు జరిగాయని ఆరోపిస్తూ.. తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఏ రూపంలోనైనా వేధింపులు, బలవంతం పట్ల తమకు ‘జీరో-టాలరెన్స్’ విధానం ఉందని టీసీఎస్ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టయిన ఆరుగురితో సహా, విచారణలో ఉన్న ఉద్యోగులను ఆ సంస్థ ఇప్పటికే సస్పెండ్ చేసింది.దీనిపై టీసీఎస్ ప్రతినిధి మాట్లాడుతూ.. “నాసిక్లో ఈ విషయం మా దృష్టికి రాగానే, మేము తక్షణ చర్యలు తీసుకున్నాము. విచారణలో ఉన్న ఉద్యోగులను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశాము. మేము అధికారులకు సహకరిస్తున్నాము, ఈ విచారణ ముగింపు ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటాము” అని అన్నారు.దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఈ కేసును సుమోటోగా స్వీకరించి, ఈ ఘటన "చాలా తీవ్రమైనది" అని అభివర్ణించారు. అంతే కాకుండా త్వరితగతిన స్పందించిన నాసిక్ పోలీసులను ప్రశంసించారు.ఇదీ చదవండి: టీసీఎస్లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. నాసిక్ పోలీసులు ప్రస్తుతం పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ హెచ్ఆర్ అధికారిని విచారిస్తున్నారు, ఇప్పటివరకు, కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. -
మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఇలా..
సైబర్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఆర్ధిక పరమైన నేరాలకు పాల్పడుతున్నారు. బ్రతికున్న వారి డాక్యుమెంట్స్ అనధికార కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. కొంతకాలం తరువాత అయినా తెలుసుకోవచ్చు. ఒకవేళా చనిపోయినవారి డాక్యుమెంట్స్ ద్వారా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే?..దీనిని దృష్టిలో ఉంచుకుని.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ ఆధార్ డీ యాక్టివేట్ విధానం పరిచయం చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డీయాక్టివేట్ చేయడం ఇలా.. ➤అధికారిక UIDAIలో MyAadhaar పోర్టల్కు వెళ్లండి➤మీ స్వంత ఆధార్ నెంబర్ లేదా కుటుంబ సభ్యులలో ఎవరిదో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.➤లాగిన్ అయిన తరువాత Report Death of a Family Member అనే ఆప్షన్ ఎంచుకుని.. మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు నమోదు చేయాలి.➤తరువాత డెత్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.➤మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. వివరాలను వెరిఫై చేసిన తర్వాత UIDAI మరణించిన వ్యక్తి ఆధార్ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది.Reporting death and deactivation of Aadhaar of a deceased family member helps in preventing the misuse of their Aadhaar.Report death on myAadhaar Portal: https://t.co/4k2YjTw4BM#Aadhaar #UIDAI #ReportDeath #AadhaarDeactivation pic.twitter.com/jELeDN2EIu— Aadhaar (@UIDAI) April 10, 2026 -
వంటగది కోసం.. ప్రత్యేక గ్యాడ్జెట్స్!
వంటగదిలో గంటల తరబడి కష్టపడాల్సిన పనిలేకుండా, అదే పనిని తక్కువ టైమ్లో, తక్కువ శ్రమతో స్టయిలిష్గా పూర్తి చేసే గాడ్జెట్లు మీకోసం!స్ప్రే టచ్! మీ కిచెన్లో టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ కూడా కంట్రోల్లో ఉండాలంటే ఈ స్మార్ట్ ఆయిల్ స్ప్రేయర్ ఉండాల్సిందే! ఎందుకంటే, ఇది కేవలం ఒక నూనె బాటిల్ మాత్రమే కాదు. ఇందులో డ్యూయల్ మ్యాజిక్ ఉంది. మీకు కావాలంటే నూనెను ధారగా పోసుకోవచ్చు, వద్దు అనుకుంటే పైన ఉన్న నాజిల్తో మంచు జల్లులా స్ప్రే చేసుకోచ్చు. మీరు ఎయిర్ ఫ్రయ్యర్లో చికెన్ రోస్ట్ చేసినా, దోశలు వేస్తున్నాం ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు, నూనె మొత్తం సమానంగా పరుచుకుంటుంది. దీనివల్ల నూనె వృథా కాదు, మీ ఒంట్లో కొవ్వు చేరే చాన్స్ కూడా తగ్గుతుంది! సలాడ్స్ నుంచి బార్బెక్యూ వరకు అన్నిటికీ పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చే దీని ధర రూ. 380 మాత్రమే!వంటింట్లో ఆర్గానిక్ ఫామ్!బయట మార్కెట్లో దొరికే మొలకలు ఎప్పుడు తయారు చేశారో, ఎంత శుభ్రంగా ఉన్నాయో అని సందేహిస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే తాజా మొలకలను అతి తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవడానికి వచ్చేసింది ఈ స్ప్రౌట్ మేకర్! ఇందులో ఉన్న స్మార్ట్ ‘నాబ్’ టెక్నాలజీ వల్ల నీరు ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు నెమ్మదిగా వెళ్లి, గింజలకు కావాల్సిన తేమను అందిస్తుంది.దీంతో మొలకలు కుళ్లిపోకుండా, చాలా తాజాగా, పోషకాలతో నిండి ఉంటాయి. పైగా ఇందులో నాలుగు వేర్వేరు కంపార్ట్మెంట్ ట్రేలు ఉంటాయి. అంటే ఒకేసారి పెసలు, శనగలు, అలసందలు ఇలా నాలుగు రకాల గింజలను మొలకెత్తించవచ్చు. అంతేకాదు, ట్రాన్స్పరెంట్ బాక్స్ వల్ల మొలకలు ఎంతవరకు వచ్చాయో బయట నుంచే చూసుకోవచ్చు. ధర రూ. 290 మాత్రమే!స్నాక్ పార్ట్నర్!సినిమా చూస్తున్నప్పుడో లేదా ఇష్టమైన మ్యాచ్ జరుగుతున్నప్పుడో పిస్తాపప్పులు, వేరుశెనగలు తింటూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? కానీ ఆ పెంకులు, తొక్కలు ఎక్కడ వేయాలో తెలియక చేత్తో పట్టుకోవడమో లేదా టేబుల్ మీద పడేయడమో చేస్తున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ డబుల్ డిష్ నట్ బౌల్!ఇది మామూలు గిన్నె కాదు, మీ స్నాక్ టైమ్ను క్లీన్గా, స్టయిలిష్గా మార్చే చిన్న మ్యాజిక్ బౌల్! ఇందులో డబుల్ డిష్ బౌల్స్ ఉంటాయి. పై భాగంలో మీ ఫేవరెట్ నట్స్ లేదా పండ్లను పెట్టుకోవచ్చు. తిన్న తర్వాత వచ్చే పెంకులు, విత్తనాలు లేదా పిక్కలను కింద ఉన్న హోల్డర్లో సులభంగా పడేయవచ్చు. అవసరమైతే దీనిని విడదీసి రెండు విడివిడి గిన్నెలుగా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా గట్టిగా ఉండటమే కాకుండా, క్లీన్ చేయడం కూడా చాలా సులభం. ధర రూ. 280 మాత్రమే! -
టీసీఎస్లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. FY27లో ఇప్పటికే 25,000 ఫ్రెషర్స్కు ఆఫర్లు ఇచ్చామని, మార్కెట్ డిమాండ్ పరిస్థితిని బట్టి మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశముందని సంస్థ సీఈఓ కే కృతివాసన్ తెలిపారు.2026 ఆర్ధిక సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్స్ను నియమించి, ప్రైవేట్ రంగంలో అత్యధిక నియామకాలు చేపట్టిన కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచిన టీసీఎస్.. ఈ ఏడాది నియామకాలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం.FY26లో సంస్థ 12,000 మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ, అది ఏఐ ప్రభావం వల్ల కాదని, ప్రాజెక్టుల అమలు విధానంలో మార్పులు రావడం వల్ల ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల అవసరం తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతి వాసన్ తెలిపారు. అయితే.. సంస్థ భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుందని, ప్రస్తుత వ్యాపార పరిస్థితి స్థిరంగా ఉందని, కొత్త ప్రాజెక్టులు విభిన్న రంగాలు, ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు! -
బెంజ్ కీలక నిర్ణయం: నాలుగు మోడల్స్కు గుడ్బై!
ప్రముఖ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. ఇండియన్ మార్కెట్ నుంచి A-క్లాస్ సెడాన్, EQA, EQB, EQE SUVలను నిలిపివేసింది. కంపెనీ ఈ నాలుగు మోడళ్లను తన అధికారిక వెబ్సైట్ నుంచి కూడా తొలగించింది.మెర్సిడెస్ బెంజ్.. కొత్త ప్రీమియం కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న నాలుగు మోడల్స్ నిలిపివేసింది. కాగా సంస్థ ఏప్రిల్ 24న మూడవతరం సీఎల్ఏ కారును లాంచ్ చేయనుంది.మార్చి 2021లో ప్రారంభమైన ఏ-క్లాస్ లిమౌసిన్, గతంలో భారతదేశంలో అత్యంత సరసమైన మెర్సిడెస్-బెంజ్గా ఉండేది, దీని ధరలు రూ. 44.46 లక్షల నుంచి రూ. 45.92 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండేవి. దాని ఉత్పత్తి నిలిపివేయడంతో, ఇప్పుడు GLA SUV ఈ స్థానంలోకి చేరనుంది. ఈ కారు ధరలు సుమారు రూ. 51.80 లక్షల నుంచి రూ. 55 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. దీన్నిబట్టి చూస్తే బెంజ్ కారు ప్రారంభ ధర పెరిగినట్లు స్పష్టమవుతోంది.జీఎల్ఏ కారుకు ఎలక్ట్రిక్ ప్రతిరూపంగా నిలిచిన EQA, భారతదేశంలో మెర్సిడెస్-బెంజ్ యొక్క అత్యంత సరసమైన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం, దీని ప్రారంభ ధర సుమారు రూ. 66 లక్షలు.మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కారు CLA EV 800-వోల్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ను కలిగి ఉంది. ఇది భారతదేశంలో లాంచ్ కానున్న దీని ఎంట్రీ-లెవల్ 85kWh 250+ వెర్షన్, WLTP సైకిల్ ప్రకారం.. సుమారుగా 792 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 272 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల సీఎల్ఏ A 250+ కేవలం 6.7 సెకన్లలో పూర్తిగా ఆగి ఉన్న స్థితి నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. -
వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు!
భారతదేశంలో బంగారం ధరల మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా వేడెక్కుతున్నాయి. లేటెస్ట్ సిల్వర్ రేటు.. గత ఆదివారం రోజుతో పోలిస్తే చాలా ఎక్కువ. అయితే ఈ కథనంలో ఏడు రోజుల్లో వెండి ధరల ప్రవాహం ఎలా సాగింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయి. రేట్లు పెరగడానికి కారణం ఏమిటనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.వెండి ధరలుఏప్రిల్ 5న.. అంటే గత ఆదివారం రోజు 2.55 లక్షల రూపాయల వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు శనివారం నాటికి రూ.2.65 లక్షలకు చేరింది. ఈ రోజు (ఆదివారం) వెండి రేటు స్థిరంగా రూ.2.65 లక్షల వద్దనే నిలిచింది. హైదరాబాద్, విజయవాడ మొదలైన నగరాల్లో ఈ ధరలు ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం వెండి రేటు వారం రోజుల్లో రూ.2.50 లక్షల నుంచి రూ.2.60 లక్షలకు చేరింది.వెండి రేటు పెరగడానికి కారణాలుపారిశ్రామిక వినియోగం: వెండిని ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రంగాల్లో డిమాండ్ పెరిగితే వెండి ధర కూడా పెరుగుతుంది.పెట్టుబడిదారుల డిమాండ్: ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు, ప్రజలు సురక్షిత పెట్టుబడిగా వెండిని కొనుగోలు చేస్తారు. ఇది ధరను అమాంతం పెంచుతుంది.బంగారం ధరల ప్రభావం: బంగారం ధరలు కూడా వెండి రేటును ప్రభావితం చేస్తాయి. పసిడి ధరలు పెరిగితే, కొంతమంది వెండిలో పెట్టుబడి పెడతారు. అందువల్ల వెండి ధర కూడా పెరుగుతుంది.డాలర్ విలువ మార్పులు: అమెరికన్ డాలర్ బలహీనమైతే, వెండి వంటి లోహాల ధరలు సాధారణంగా పెరుగుతాయి.సరఫరా లోపం: ఖనిజ ఉత్పత్తి తగ్గినా లేదా మైనింగ్లో సమస్యలు వచ్చినా, వెండి సరఫరా తగ్గి ధర పెరుగుతుంది.ద్రవ్యోల్బణం: ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, వెండి వంటి విలువైన లోహాలను నిజమైన ఆస్తులుగా భావిస్తారు. కాబట్టి చాలామంది సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. తద్వారా రేటు పెరుగుతుంది.ప్రభుత్వ విధానాలు, దిగుమతులు: పన్నులు, దిగుమతి సుంకాలు పెరిగితే దేశీయంగా వెండి ధరలు పెరగవచ్చు.ఇదీ చదవండి: IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు! -
ఇల్లు ఈజీగా కొనండి.. ధనవంతులు అవ్వండి!!
రాబర్ట్ కియోసాకి రాసిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అది ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించే ఒక మార్గదర్శి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి సంపదను ఎలా సృష్టించాలో ఈ పుస్తకం అద్భుతంగా వివరిస్తుంది. అసలు తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా అడుగుపెట్టాలి? సొంత ఇంటి కల ఎలా నెరవేర్చుకోవాలి? ఆ వివరాలు మీకోసం..ఆస్తి అంటే..కియోసాకి చెప్పే ప్రాథమిక సూత్రం ఒకటే: మీ జేబులోకి డబ్బును తీసుకొచ్చేది 'ఆస్తి' (Asset), మీ జేబులో నుండి డబ్బును బయటకు పంపేది 'అప్పు' (Liability). చాలా మంది తాము నివసించే ఇంటిని అతిపెద్ద ఆస్తిగా భావిస్తారు. కానీ, కియోసాకి దృష్టిలో అది ఒక లయబిలిటీ. ఎందుకంటే దాని వల్ల ప్రతి నెలా మెయింటెనెన్స్, ట్యాక్సుల రూపంలో డబ్బు బయటకు వెళ్తుంది. అదే మీరు ఒక ఇంటిని కొని అద్దెకు ఇస్తే, అది మీకు ప్రతి నెలా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అప్పుడు మాత్రమే అది నిజమైన 'ఆస్తి' అవుతుంది.తక్కువ పెట్టుబడితో రియల్ ఎస్టేట్ శ్రీకారంరియల్ ఎస్టేట్ అంటే కోట్ల రూపాయలు ఉండాలని భయపడక్కర్లేదు. తక్కువ మొత్తంతో ప్రారంభించడానికి ఈ మార్గాలు చూడండి..ఓపెన్ ప్లాట్లు: నగరం శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో చిన్న ప్లాట్లను కొనుగోలు చేయడం ఉత్తమం. వీటి ధర తక్కువగా ఉంటుంది, భవిష్యత్తులో మంచి లాభాలను అందిస్తాయి.రీట్స్: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs)తో స్టాక్ మార్కెట్ లాగే, మీరు రియల్ ఎస్టేట్లో నేరుగా ఆస్తి కొనకుండానే తక్కువ మొత్తంతో (కొన్ని వేల రూపాయలతో) షేర్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు.క్రౌడ్ ఫండింగ్: గ్రూపుగా ఏర్పడి నమ్మకమైన స్నేహితులు లేదా బంధువులతో కలిసి ఉమ్మడిగా ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా రిస్క్, పెట్టుబడి భారం తగ్గుతాయి.సొంతిల్లు సాకారమయ్యే టిప్స్సొంత ఇంటి కల నెరవేరాలంటే కియోసాకి స్టైల్లో ఈ వ్యూహాలు అనుసరించండి..ముందుగా ఆదాయ వనరుల సృష్టి: నేరుగా హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం కంటే, మొదట చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం (Passive Income) మీ ఇంటి EMI చెల్లించేలా ప్లాన్ చేయండి.లోకేషన్ ముఖ్యం: అభివృద్ధి చెందుతున్న హైవేలు, ఐటీ కారిడార్లు లేదా మెట్రో ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాలను గుర్తించి ముందే పెట్టుబడి పెట్టండి.పన్ను ప్రయోజనాలు: రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లభించే పన్ను మినహాయింపుల గురించి అవగాహన పెంచుకోండి. ఇది మీ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.కియోసాకి గోల్డెన్ రూల్: 'డబ్బు కోసం పని చేయకండి'ధనవంతులు డబ్బు కోసం పని చేయరు, వారి డబ్బు వారి కోసం పని చేసేలా చూసుకుంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన మార్గం."పెద్ద ఇల్లు కొనడం తప్పు కాదు, కానీ ఆ ఇంటి ఖర్చులను మీ జేబులో నుండి కాకుండా, మీరు పెట్టిన ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలతో చెల్లించడమే అసలైన ఆర్థిక తెలివితేటలు." -
వజ్రాలకు పెరుగుతున్న డిమాండ్
ముంబై: దేశీయంగా సహజసిద్ధమైన వజ్రాభరణాల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2030 నాటికి ఇది రూ. 1.50 లక్షల కోట్లకు చేరనుంది. పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు ఇందుకు దోహదపడనున్నాయి. డిబీర్స్ గ్రూప్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.భారత్లో నేచురల్ డైమండ్ జ్యుయలరీ మార్కెట్ భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని రిపోర్ట్ పేర్కొంది. డైమండ్స్ అనేవి వివాహంలాంటి సంప్రదాయ సందర్భాలకే పరిమితం కాకుండా రోజువారీ ధరించేందుకు కొనుగోలు చేసే ఉత్పత్తుల కేటగిరీలోకి చేరుతున్నాయని వివరించింది. మహిళల్లో ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుండటం, జనరేషన్ జెడ్, మిలీనియల్స్ ఆకాంక్షలు ఇందుకు తోడ్పడుతున్నాయి.ఈ వర్గం వాటా మొత్తం మార్కెట్ విలువలో 86 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. వజ్రాలకు డిమాండ్ కేవలం మెట్రోల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా గణనీయంగా కనిపిస్తోంది. వ్యక్తిగత ఆదాయాలు పెరిగే కొద్దీ కొత్త తరం వినియోగదారులు సిసలైన, అరుదైన, సహజసిద్ధమైన వజ్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని డిబీర్స్ గ్రూప్ గ్లోబల్ ఎస్వీపీ శ్వేతా హరిత్ తెలిపారు. -
డీజిల్, ఏటీఎఫ్పై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై ఆయిల్ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాల మీద పన్నులను (విండ్ఫాల్ ట్యాక్స్) కేంద్రం పెంచింది. దీనితో ఇది డీజిల్పై లీటరుకు రూ. 21.50 నుంచి రూ. 55.5కి, విమాన ఇంధనం ఏటీఎఫ్పై లీటరుకు రూ. 29.5 నుంచి రూ. 42కి పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ ఎగుమతులపై ఎలాంటి సుంకాలు లేవు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ విండ్ఫాల్ పన్నులను క్రమపద్ధతిలో సవరిస్తూ వస్తోంది. దేశీయ చమురు ఉత్పత్తిదారులు అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల పొందే అదనపు ప్రయోజనాలను నియంత్రించడమే ఈ పన్ను ప్రధాన ఉద్దేశం. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, దేశీయ రిఫైనరీలు తమ ఉత్పత్తులను విదేశాలకు తరలించకుండా స్థానిక మార్కెట్ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తుంది. -
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఇలా..
దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
దివాలా తీసిన జేఏఎల్ కొనుగోలు.. అదానీకే ‘జై’!
న్యూఢిల్లీ: దివాలా తీసిన తమ సంస్థ జేఏఎల్ కొనుగోలుకి సంబంధించి అదానీ గ్రూప్ వైపై జేపీ గ్రూప్ వ్యవస్థాపకుడు జైప్రకాశ్ గౌర్ మొగ్గు చూపారు. గౌతమ్ అదానీ సారథ్యంలో గ్రూప్ పురోగమించగలదని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. రుణదాతల కమిటీ (సీవోసీ), దివాలా పరిష్కార నిపుణుడు పారదర్శకంగా బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు గౌర్ పేర్కొన్నారు.ఇందులో పాల్గొన్నందుకు అదానీ గ్రూప్, వేదాంత గ్రూప్నకు ధన్యవాదాలు తెలిపారు. అదానీ గ్రూప్ను సీవోసీ ఎంపిక చేయడాన్ని తాను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. బిడ్డింగ్లో తాము గెల్చినట్లు రాతపూర్వకంగా ధృవీకరించిన తర్వాత, దానికి భిన్నంగా అదానీ గ్రూప్ను విజేతగా ప్రకటించారంటూ పోటీ సంస్థ వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ ఆరోపించిన నేపథ్యంలో గౌర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రూ. 57,185 కోట్ల రుణాలు బాకీ పడటంతో 2024 జూన్లో జేఏఎల్పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. రూ. 14,535 కోట్ల అదానీ గ్రూప్ బిడ్కు గతేడాది నవంబర్లో సీవోసీ ఆమోదించగా, మార్చి 17న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (అలహాబాద్ బెంచ్) కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, రూ. 17,926 కోట్లకు బిడ్ చేసిన వేదాంత, దీన్ని సవాలు చేస్తూ అపీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై ఎన్సీఎల్ఏటీ విచారణ చేపట్టినప్పటికీ, ఎన్సీఎల్టీ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించడానికి నిరాకరించింది. -
పసిడి, ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ఇటీవల తగ్గముఖం పట్టిన భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో 9.063 బిలియన్ డాలర్లు పెరిగి 697.121 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు (మార్చి 27) వారంలో ఇవి 10.288 బిలియన్ డాలర్లు క్షీణించి 688.058 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది.ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.784 బిలియన్ డాలర్లు పెరిగి, 552.856 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 7.221 బిలియన్ డాలర్లు పెరిగి 120.742 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
మన ఆయిల్, గ్యాస్.. ఎంత ఖర్చయినా తెచ్చుకుందాం
న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధన సరఫరాల కోసం పశ్చిమాసియా దేశాలపై అధికంగా ఆధారపడడంపై అప్రమత్తత అవసరమని ఓఎన్జీసీ చైర్మన్, సీఈవో అరుణ్ కుమార్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ తన చమురు దిగుమతుల్లో సగం మేర, గ్యాస్ అవసరాల్లో 30 శాతం, ఎల్పీజీ అవసరాల్లో 85–90 శాతాన్ని మధ్యప్రాచ్య దేశాల నుంచి సమకూర్చుకుంటున్నట్టు చెప్పారు.పశ్చిమాసియాలో సంఘర్షణల కారణంగా దశాబ్దాలలో ఎన్నడూ లేనంతటి ఇంధన సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో అరుణ్ కుమార్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యం నెలకొంది. పశ్చిమాసియా మనకు సమీపంలో ఉండడంతో అక్కడి వనరులను సులభంగా పొందొచ్చనుకోవడాన్ని కొంత సందేహంగానే చూడాలన్నారు. ఇంధన భద్రతపై పీఎన్జీఆర్బీ నిర్వహించిన సదస్సులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రపంచ క్రమం మారుతోందని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఇంధన భద్రతపై దీర్ఘకాలం నుంచి ఉన్న అంచనాలు మారిపోతున్నాయంటూ హెచ్చరించారు. కనుక దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఆయిల్, గ్యాస్ ఉన్నా.. ఎంత ఖర్చు అయినా దాన్ని వెలుగులోకి తెచ్చుకోవాలంటూ.. సంక్షోభంలో మనకు ఎవరూ సాయం చేయరన్నారు. అలాగే, దేశంలో ఇంధన నిల్వల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్లో ఒకే రోజు 108 ఈ-విటారా కార్లు డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా 2031 నాటికి మరో 4 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనుంది. అప్పటికి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహన (బీఈవీ) విభాగంలో అగ్రస్థానానికి చేరాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ తెలిపారు. హైదరాబాద్లో ఒకే రోజున 108 ఈ–విటారా వాహనాలను డెలివరీ చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు.కమోడిటీల ధరలు పెరిగిన నేపథ్యంలో తమ కార్ల రేట్లను పెంచే యోచనలో ఉన్నట్లు వివరించారు. అయితే, పెంపు పరిమాణం ఎంత, ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. 44 దేశాలకు 25,000 పైచిలుకు ఈ–విటారా వాహనాలను ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు. ఎగుమతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలను ఇంకా మదింపు చేయాల్సి ఉందన్నారు. దేశీయంగా హైదరాబాద్లో అత్యధికంగా 14.5 శాతం స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉంటోందని ఆయన చెప్పారు.తెలంగాణవ్యాప్తంగా 256 చార్జింగ్ పాయింట్లు ఉన్నాయని, హైదరాబాద్లో ప్రతి 5 కి.మీ.కి ఒకటి చొప్పున 119 ఉన్నాయని వివరించారు. కస్టమర్లలో ముందుగా రేంజిపరమైన ఆందోళన తొలగించేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాకే విద్యుత్ వాహనాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతోనే ఎలక్ట్రిక్ కార్ ఆవిష్కరణలో కొంత జాప్యం జరిగినట్లు పార్థో బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,000కు పైగా ఎక్స్క్లూజివ్ చార్జింగ్ పాయింట్లు ఉండగా 2030 నాటికి లక్షకు పైగా పబ్లిక్ చార్జింగ్ పాయింట్ల నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నామన్నారు. -
‘ఆమె’ తీసుకున్న లోన్లు రూ.76 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళా శక్తి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు చిన్నపాటి అవసరాల కోసం రుణాలు తీసుకోవడానికే పరిమితమైన వనితలు .. ఇప్పుడు వ్యాపార విస్తరణకు భారీ స్థాయిలో రుణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మహిళల రుణ పోర్ట్ఫోలియో అక్షరాలా రూ.76 లక్షల కోట్లకు చేరిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. వ్యవస్థలోని మొత్తం రుణాల్లో మహిళల వాటా ఏకంగా 26 శాతానికి ఎగబాకింది.నీతి ఆయోగ్ సీఈఓ నిధి చిబ్బర్ న్యూఢిల్లీలో విడుదల చేసిన ‘ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్: ఉమెన్ అండ్ ఇండియాస్ ఎవాల్వింగ్ క్రెడిట్ మార్కెట్‘ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ (డబ్ల్యూఈపీ), ట్రాన్స్యూనియన్ సిబిల్, మైక్రోసేవ్ కన్సల్టింగ్ (ఎంఎస్సీ) సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. 2017 నుంచి చూస్తే మహిళలకు ఇచి్చన రుణాల పరిమాణం 4.8 రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం రుణాలు పొందడం మాత్రమే కాకుండా, అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గుణాత్మకంగా మారుతోందని వెల్లడించింది.పరుగులు పెడుతున్న వృద్ధి .. 2017 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ మధ్య కాలంలో క్రియాశీలక మహిళా రుణగ్రహీతల సంఖ్య 9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదు చేసింది. మహిళల్లో రుణ విస్తృతి 19 శాతం నుంచి 36 శాతానికి ఎగబాకింది. ప్రస్తుతం రుణ మార్కెట్లో 16 కోట్ల మంది యాక్టివ్ మహిళా రుణగ్రహీతలు ఉన్నారు. 2017లో రూ.16 లక్షల కోట్లుగా ఉన్న వీరి బకాయిలు, 2025 నాటికి రూ.76 లక్షల కోట్లకు చేరాయి. దేశంలో రుణ అర్హత కలిగిన 45 కోట్ల మంది మహిళలు ఉండగా, భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.మైక్రోఫైనాన్స్ నుంచి అప్గ్రేడ్ .. చిన్నపాటి మైక్రోఫైనాన్స్ రుణాలతో మొదలుపెట్టిన మహిళలు ఆ తర్వాత మంచి క్రెడిట్ హిస్టరీ సాధించి క్రమంగా రిటైల్, కమర్షియల్ రుణాల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న మైక్రోఫైనాన్స్ రుణగ్రహీతల్లో 19 శాతం మంది రిటైల్ లేదా కమర్షియల్ లోన్స్ కలిగి ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. ఈ ’కస్టమర్ గ్రాడ్యుయేషన్’లోనూ దక్షిణాది రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. అత్యధికంగా తమిళనాడులో 27 శాతం మంది మహిళలు పెద్ద రుణాల వైపు అప్గ్రేడ్ అవ్వగా, కర్ణాటకలో ఈ రేటు 20 శాతంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ఉన్న బలమైన క్రెడిట్ వ్యవస్థకు ఇది నిదర్శనమని నివేదిక స్పష్టం చేసింది.డిజిటల్ అండతో సత్వర రుణాలు: కేరళ కేస్ స్టడీ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), అధికారిక రుణ వ్యవస్థల కలయికతో ఆర్థిక భాగస్వామ్యం సులభతరమైందని నీతి ఆయోగ్ సీఈఓ నిధి చిబ్బర్ పేర్కొన్నారు. గుర్తింపు, చెల్లింపులు, అండర్రైటింగ్, లోన్ సరీ్వసింగ్ వంటి అంశాల్లో డిజిటలైజేషన్ పెరగడం వల్ల మహిళలకు రుణాలు త్వరగా మంజూరవుతున్నాయి. ప్రధాన వినియోగ విభాగాల్లో అదే రోజు రుణం మంజూరు (సేమ్–డే అప్రూవల్స్) ఏకంగా 45 శాతానికి చేరింది. గ్రామీణ మహిళా వ్యాపారుల డిజిటల్ ప్రయాణంపై అధ్యయనం చేసిన బృందం.. కేరళలో పలు ఆసక్తికర విషయాలు గుర్తించింది.కేరళలోని గ్రామీణ మహిళా వ్యాపారుల్లో 38 శాతం మంది మహిళలు.. ’సమయాభావం’ తమ వ్యాపార వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందని వెల్లడించారు. ఇంటి బాధ్యతలు, వ్యాపారం రెండింటినీ చూసుకోవాల్సి రావడం వల్ల డిజిటల్ టూల్స్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామని వారు తెలిపారు. అయినా సరే కొందరు గ్రామీణ వ్యాపారులు వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, పింటెరెస్ట్ వంటి డిజిటల్ టూల్స్ ఉపయోగించి మార్కెటింగ్ చేసుకుంటున్న తీరును నివేదిక కేస్ స్టడీలుగా ప్రచురించింది. భవిష్యత్తులో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా తమ వ్యాపారాలను మరింత వృద్ధి చేసుకోవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.మహిళలు అధికారిక ఫైనాన్షియల్ సిస్టమ్స్ వైపు మళ్లడం, వివిధ రుణ విభాగాల్లో చురుకుగా పాల్గొనడం భారత్ ఆర్థిక ముఖచిత్రంలో ఒక అర్థవంతమైన మార్పని డబ్ల్యూఈపీ మిషన్ డైరెక్టర్ అన్నా రాయ్ తెలిపారు. దాదాపు 16 కోట్ల మంది యాక్టివ్ మహిళా రుణగ్రహీతల డేటాతో పాటు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 161 మంది మహిళా నానో–ఎంటర్ప్రెన్యూర్ల ప్రైమరీ రీసెర్చ్ ఆధారంగా ఈ నివేదికను సమగ్రంగా రూపొందించారు. వ్యాపార రుణాల్లో దక్షిణాది హవా .. వ్యాపార అవసరాల కోసం రుణాలు తీసుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2022–2025 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్ క్రెడిట్ వృద్ధి రేటు 17 శాతంగా ఉండగా, మహిళా వ్యాపారుల రుణాల వృద్ధి రేటు ఏకంగా 31 శాతంగా నమోదైంది. 2017 నుంచి చూస్తే వ్యాపార రుణాల బకాయిల పరిమాణం 7.5 రెట్లు పెరిగింది. ఈ విభాగంలో దక్షిణాది రాష్ట్రాలు బలమైన ముద్ర వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ రుణాలు తీసుకున్న మహిళల్లో ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే 15 శాతం మంది ఉండగా, కర్ణాటక వాటా 9 శాతంగా ఉంది. అయితే వృద్ధి రేటు పరంగా చూస్తే ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్ (59%), ఉత్తరప్రదేశ్ (42%) వేగంగా దూసుకెళ్తున్నాయని నివేదిక తెలిపింది. -
క్విక్–కామర్స్లో భారత్ హవా!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్ రిటైల్ మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2025లో ఈ మాధ్యమం ద్వారా అమ్ముడైన ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 65–66 బిలియన్ డాలర్లుగా ఉంటుందని బెయిన్ అండ్ కంపెనీ, ఫ్లిప్కార్ట్ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. విలువపరంగా 19–21 శాతం వృద్ధి నమోదైందని రిపోర్టు పేర్కొంది. ఈ క్రమంలో క్విక్–కామర్స్ విభాగానికి సంబంధించి ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఎదిగినట్లు వివరించింది. ఈ–కామర్స్ జీఎంవీలో దాదాపు 16–17 శాతం ఈ క్విక్ కామర్స్ ద్వారానే వచి్చనట్లు తెలిపింది. ఇది చైనా సహా చాలా మార్కెట్లలో నమోదైన దానికంటే అధికమని వివరించింది. ఆన్లైన్ షాపింగ్, అందుకోసం చేసే వ్యయం పెరుగుతుండటంతో ఏటా 20 శాతం వృద్ధితో 2030 నాటికి భారత ఈ–రిటైల్ మార్కెట్ 170–180 బిలియన్ డాలర్లకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. → స్థూల ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో గతేడాది పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. జీఎస్టీ కోతలు, ఆదాయ పన్నుపరమైన ఊరట, నెమ్మదిస్తున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తగ్గింపు తదితర సానుకూలాంశాలతో ప్రైవేట్ వినియోగం పెరిగింది. 2022–24 మధ్య 8 శాతంగా ఉన్న ప్రైవేట్ వినియోగం 2025లో 10.5 శాతానికి చేరింది. 2026 తొలి త్రైమాసికంలోనూ ఇదే ఊపు కొనసాగడంతో 23–25 శాతం వృద్ధి చెందింది. → గత రెండేళ్లుగా క్విక్ కామర్స్ విభాగం రెట్టింపయ్యింది. 2025లో ఈ సెగ్మెంట్ జీఎంవీ 10–11 బిలియన్ డాలర్లకు చేరింది. రాబోయే రోజుల్లో 2030 నాటికి ఇది 65–70 బిలియన్ డాలర్లకు చేరనుంది. అదనంగా నమోదయ్యే ఈ–రిటైల్ జీఎంవీలో దీని వాటా 45–50 శాతానికి చేరొచ్చు. అప్పటికి మొత్తం ఆన్లైన్ షాపింగ్లో సంప్రదాయ ఈ–రిటైల్ విభాగం వాటా 60–65 శాతంగా ఉండవచ్చు. → అంతర్జాతీయంగా వినియోగానికి భారత్ కీలక చోదకంగా నిలుస్తోంది. వచ్చే అయిదేళ్లలో వినియోగంపై అదనంగా వెచి్చంచే ప్రతి 8 డాలర్లలో భారత్ వాటా 1 డాలరుగా ఉండనుంది. → గతేడాది ఈ–రిటైల్ మార్కెట్ భారీగా వృద్ధి చెందినా, ఆఫ్లైన్ మాధ్యమాన్ని ప్రాధాన్యతను కొట్టిపారేసేందుకు వీలు లేదు. మెజారిటీ వినియోగదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికీ ఇది కీలకంగా ఉంటోంది. దీని దన్నుతోనే 2030 నాటికి మొత్తం రిటైల్ పరిశ్రమ 1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోనుంది. → గడిచిన అయిదేళ్లలో భారత్లో ఆన్లైన్ షాపింగ్ మార్కెట్ రెట్టింపయ్యింది. షాపింగ్ చేసే వారి సంఖ్య 2025లో రెట్టింపయ్యి 29–30 కోట్లకు చేరింది. విక్రేతల వ్యవస్థ విస్తరించడం (గత అయిదేళ్లలో మూడు రెట్లు), భౌగోళికంగా మరిన్ని ప్రాంతాల్లోకి సేవలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడుతోంది. → జెన్ జెడ్ తరం కీలకంగా మారింది. ఈ–రిటైల్ షాపర్స్లో వీరి వాటా 40–45 శాతంగా ఉంటోంది. 2025లో అదనంగా వచ్చి ఈ–రిటైల్ ఆర్డర్లలో 50 శాతం ఈ వర్గం నుంచే వచ్చింది. లైఫ్స్టయిల్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్ తదితర కేటగిరీలవ్యాప్తంగా ఈ విభాగం కస్టమర్ల షాపింగ్ ప్రాధాన్యతలు చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, వీడియోలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం, సత్వర రుణ సదుపాయం వినియోగించుకోవడం ఎక్కువగా ఉంటోంది. → ఇంటర్నెట్ యూజర్లలో షాపింగ్ చేసే వారి సంఖ్య 25–30 శాతంగానే ఉన్నప్పటికీ (మెట్రోలు/ప్రథమ శ్రేణి నగరాల్లో ఇది 45–50 శాతంగా ఉంది), గతేడాది అదనంగా నమోదైన ఆన్లైన్ ఆర్డర్లలో ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 50 శాతంగా ఉంది. → పరిశ్రమ గణనీయంగా ఎదుగుతున్నప్పటికీ భారత్లో ఇప్పటికీ ఈ–రిటైల్ విస్తరణ చాలా తక్కువగానే జీడీపీలో 1.6 శాతం మాత్రమే ఉంది. అదే చైనాలో 13–14 శాతంగా, ఇండొనేషియాలో 4–4.5 శాతంగా ఉంది. ఇంటర్నెట్ యూజర్లలో 30 శాతం మంది మాత్రమే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. చైనాలో ఇది 92 శాతంగా, అమెరికాలో 74 శాతంగా ఉంది. ఇవన్నీ భారత్లో ఈ రంగం మరింత వృద్ధి చెందడానికి గల అవకాశాలను సూచిస్తున్నాయి. → వచ్చే అయిదేళ్లలో ఈ–రిటైల్ మార్కెట్ తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెట్టనుంది. క్యూ–కామర్స్ ఇందుకు దన్నుగా నిలవనుంది. నిత్యావసరాలు, అలాగే డిస్క్రెషనరీ ఉత్పత్తులకు సంబంధించి సౌకర్యవంతమైన మాధ్యమంగా క్యూ–కామర్స్ నిలుస్తోంది. ప్రస్తుతం 200 పైగా నగరాల్లో 7,000 పైగా మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ పని చేస్తున్నాయి. భారీ స్థాయిలో కార్యకలాపాల నిర్వహణ వల్ల లాభదాయకత మెరుగుపడింది. అయితే, టాప్ మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాల పరిధిని దాటి ఇతర ప్రాంతాల్లో దీని వినియోగం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. -
బంగారం ధరల్లో భారీ మార్పు: అంతలోనే ఇంతలా..
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ వారాంతంలో కొంత పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో మార్పు జరిగింది. ఈ కథనంలో వారం రోజుల్లో బంగారం ధరలు పెరిగాయా?, తగ్గాయా?, అనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఏప్రిల్ 5 (ఆదివారం) 1,50,930 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,840 వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో గోల్డ్ రేటు పెరుగుతూ.. తగ్గుతూ, మొత్తం మీద 1910 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,350 రూపాయల నుంచి 1,40,100 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది.చెన్నైలో గోల్డ్ రేటు వారం రోజుల్లో పెరుగుదల దిశగానే అడుగులు వేసింది. ఏప్రిల్ 5న 1,52,180 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,53,820 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,39,500 రూపాయల నుంచి 1,41,000 రూపాయల (రూ.1500 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా ధరల పెరుగుదల కనిపించింది. ఏప్రిల్ 5న దేశ రాజధాని నగరంలో 1,51,080 రూపాయల వద్ద ఉన్న తులం 24 క్యారెట్ల బంగారం ధర, ఈ రోజుకు (ఏప్రిల్ 11) రూ.1,52,990 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు వారం రోజుల్లో 1,38,500 రూపాయల నుంచి 1,40,250 రూపాయల (రూ.1750 పెరిగింది) వద్దకు చేరింది. -
''ఒరాకిల్ ఉద్యోగం పోయింది.. మేకలు పెంచాలనుకుంటున్నా''
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న తరుణంలో.. టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సలహాలు కోరాడు.''ఒరాకిల్లో సీనియర్ SDEగా ఉద్యోగం కోల్పోయాను. మా సొంత ఊరిలో ఏదైనా జాబ్ చేద్దామంటే? వచ్చే జీతం నేను ఇంతకుముందు పొందుతున్న దానికి ఏమాత్రం సరిపోదు, ఆ డబ్బుతో ప్రతి నెలా నా కార్ లోన్ కూడా కట్టలేను. నేను సుమారు 15 లక్షల రూపాయలు పొదుపు చేశాను. నేను భారతదేశంలో ఏ వ్యాపారం చేయగలను? నేను మేకల పెంపకం చేయవచ్చా? నేను కష్టపడి పనిచేసే వ్యక్తిని, ఒక చిన్న చవకైన భూమి కొని ఒక చిన్న ఆఫీసు పెట్టుకుని, ఫ్రీలాన్స్గా పని వెతుక్కుంటూ, మేకలను పెంచుకుంటూ జీవించగలను. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు, దయచేసి సహాయం చేయండి'' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు, అతను టెక్నాలజీ రంగంలోనే కొనసాగాలని సూచించారు. ముఖ్యంగా AIపై నైపుణ్యాలు పెంచుకుని, కొత్త అవకాశాలను వెతకాలని సూచించారు. మరికొందరు గోట్ ఫార్మింగ్ మంచి వ్యాపారమని చెప్పినప్పటికీ, అందులో స్థిరపడడానికి ఒకటి.. రెండు సంవత్సరాలు పట్టవచ్చని హెచ్చరించారు.ఇంకొంత మంది మరింత జాగ్రత్తగా ఆలోచించాలని సూచిస్తూ, ముందుగా ఒక స్థిరమైన ఉద్యోగం సంపాదించి, ఆ తర్వాత మీ పొదుపును అదనంగా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. మీ అనుభవంతో, దాన్ని నడపడానికి మీరు వ్యక్తులను నియమించుకోవచ్చు. ఆ వ్యాపారం మీ జీతం కంటే ఎక్కువ స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించిన తర్వాత, మీరు దానిని పూర్తికాల ఉద్యోగంగా పరిగణించవచ్చు'' అని సూచించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పు: ఏడు రోజుల్లో ఇంతలా.. -
టయోటా కారు.. రెండు లక్షల సేల్స్!
టయోటా కంపెనీకి చెందిన 'ఇన్నోవా హైక్రాస్' అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ విషయాన్ని టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థ 2026 ఏప్రిల్ 9న ప్రకటించింది.నవంబర్ 2022లో లాంచ్ అయిన ఇన్నోవా హైక్రాస్ భారతదేశంలో రెండు లక్షల అమ్మకాలను పొందింది. కొత్త డిజైన్, లేటెస్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వంటివాటితో భారతీయ కొనుగోలుదారులను ఈ కారు చాలా వేగంగా ఆకట్టుకుంది. న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (TNGA) ప్లాట్ఫామ్పై నిర్మితమైన ఇన్నోవా హైక్రాస్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ను ఎలక్ట్రిక్ మోటార్తో జతచేసే స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది 186 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.రూ. 19.53 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ప్రారంభమయ్యే ఈ కారు.. భారత్ NCAP కింద 5-స్టార్ భద్రతా రేటింగ్ను కూడా పొందింది. కాబట్టి ఇది అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.ఇన్నోవా హైక్రాస్ రెండవ వరుసలో పవర్డ్ ఒట్టోమాన్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్గేట్ వంటి వాటితో పాటు.. 65కు పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు వంటివి ఉన్నాయి. రహదారిపై భద్రతను, డ్రైవర్ అనుభూతిని మెరుగుపరచడానికి రూపొందించిన అధునాతన డ్రైవర్ సహాయక సూట్ అయిన టయోటా సేఫ్టీ సెన్స్ను కూడా ఇది కలిగి ఉంది. -
గూగుల్ పిక్సెల్ 10 కొనుగోలుపై భారీ తగ్గింపు!
ఖరీదైన స్మార్ట్ఫోన్లు ఎప్పుడెప్పుడు తక్కువ ధరకు లభిస్తాయా?.. అని చాలామంది వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఇప్పుడు పిక్సెల్ 10 మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే.. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 55వేల కంటే తక్కువ ధరకు లభించనుంది.ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో పిక్సెల్ 10 ప్రారంభ ధర రూ. 79,999 ఉండగా.. దానిని తగ్గింపుతో రూ. 74,999కు అందుబాటులో ఉంచింది. అంటే ప్రారంభంలోనే రూ.5000 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. ఇది కాకుండా.. HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే వెంటనే రూ. 4,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా భారీ తగ్గింపు పొందవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీనిద్వారా గరిష్టంగా రూ.52,000 వరకు తగ్గింపు పొందవచ్చు.ఉదాహరణకు మీ దగ్గర ఉన్న పాత పిక్సెల్ 7 ఎక్స్చేంజ్ చేసుకుంటే.. 15,000 రూపాయల వరకు ఎక్స్చేంజ్ లభించవచ్చు. అదనంగా మరో 5000 ఇతర డిస్కౌంట్స్ లభిస్తాయి. కాబట్టి గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ రూ. 55,000 కంటే కూడా తక్కువకు లభించే అవకాశం ఉంది.గూగుల్ పిక్సెల్ 10గూగుల్ పిక్సెల్ 10 మొబైల్ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజిని పొందుతుంది. టెన్సర్ జీ5 ప్రాసెసర్ లభిస్తుంది. ఏఐ బేస్డ్ పనులను నిర్వహించడానికి కూడా చాలా సహాయపడుతుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. డిస్ప్లే 6.3 అంగుళాల OLED స్క్రీన్తో వస్తుంది, ఇది మంచి క్లారిటీ ఇస్తుంది. అలాగే 4970 యాంపియర్ బ్యాటరీ ఉండటం వల్ల సాధారణ వినియోగంలో ఒక రోజు మొత్తం సులభంగా పనిచేస్తుంది. -
తొలగించిన కంపెనీ.. మళ్లీ పిలిచింది: చివరికి అవమానమే!
ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీల తీరు చాలా మారిపోయింది. సంస్థలు ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో ఘటన తెరమీదకు వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఒక మహిళ తన ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న ఒక బాధాకరమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది.రెడ్దిట్ పోస్టు ప్రకారం.. గత సంవత్సరం ఒక కంపెనీలో పనిచేస్తూ ఆమె పనిని ఎంతో నిబద్ధతతో, 100 శాతం కృషితో నిర్వహించారు. అయినప్పటికీ, తనకు మొదటి నుంచే అక్కడ ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. కొత్తగా చేరిన ఉద్యోగులను టీమ్లో అధికారికంగా పరిచయం చేసే విధానం ఉన్నప్పటికీ, తనను మాత్రం ఎప్పుడూ సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇది చిన్న విషయంగా అనిపించినప్పటికీ.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన కలిగించిందని పేర్కొన్నారు.ఇతర ఉద్యోగులను సమావేశాలకు పిలిచినప్పుడు, తనను మాత్రం తరచూ పక్కన పెట్టేవారు. కొంతమంది సహచరులు కూడా “మీరు మీటింగ్లో ఎందుకు లేరు?” అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆమెకు అసౌకర్యంగా మాత్రమే కాకుండా.. అవమానకరంగా అనిపించాయని అన్నారు.కొంతకాలం తర్వాత.. కంపెనీ తనను ఉద్యోగం నుంచి తొలగించింది. సంస్థ నిర్ణయాన్ని ప్రశాంతంగా స్వీకరించింది. కానీ తర్వాత.. అదే పని కోసం ఇద్దరిని కొత్తగా నియమించుకున్నారని తెలుసుకున్నప్పుడు ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అంతే కాకుండా.. కొన్ని నెలల తర్వాత అదే కంపెనీ తనను మళ్లీ సంప్రదించి, తాత్కాలికంగా తిరిగి రావాలని కోరింది. కొత్తగా చేరిన ఉద్యోగులకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ఉద్యోగ జీవితంలో గ్యాప్ రాకుండా ఉండాలని భావించి, ఆమె తిరిగి ఆ ఆఫర్ను అంగీకరించారు.ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే.. ''నా తర్వాత నియమితులైన వారికి నేను సహాయం చేస్తున్నాను, వారే నాకు రోజువారీ పనులు అప్పగిస్తూ ఏమి చేయాలో చెబుతున్నారు''.ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆమె తనకు తాను నిలబడాల్సిందని, కంపెనీ వద్ద తిరిగి చేరినప్పుడు కఠినమైన షరతులు పెట్టాల్సిందని సూచించారు. కొందరు కన్సల్టింగ్ ఫీజులు తీసుకోవాలని కూడా అభిప్రాయపడ్డారు. మరికొందరు.. తన స్వభావం కారణంగా తాను మృదువుగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని అభిప్రాయపడ్డారు. -
విడ్స్లో కొత్త ఫీచర్లు
తమ ‘విడ్స్’ ప్లాట్ఫామ్ను 2024లో పరిచయం చేసింది గూగుల్. అప్పటి నుంచి ఇది క్రియేటర్లకు ఉపయోగపడుతోంది. ప్రారంభంలో కేవలం సంస్థల కోసమే ఉద్దేశించినప్పటికీ కాలక్రమేణ ఇతర వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తాజా విషయానికి వస్తే....గూగుల్ తన వీడియో క్రియేషన్ యాప్ ‘విడ్స్’లో కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. ఎడిటింగ్లో అనుభవం లేని వారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు. వీడియో మేకింగ్ను సులభతరం, వేగవంతం, మరింత సృజనాత్మకంగా మార్చడానికి కొత్త ఫీచర్లు ఉపయోగపడతాయి.అప్డేట్లో ప్రధానమైనది...సాధారణ టెక్ట్స్ప్రాంప్ట్లను ఉపయోగించి డిజిటల్ అవతార్లను మ్యానేజ్ చేసే కొత్త పద్ధతి. క్యారెక్టర్లను మాన్యువల్గా యానిమేట్ చేయడానికి బదులుగా సూచనలు టైప్ చేయడం ద్వారా అవతార్లు స్పందించేలా చూడవచ్చు.టెక్స్ట్ టు యాక్షన్ఈ అప్డేట్తో యూజర్లు సహజమైన భాషను ఉపయోగించి ఒక సన్నివేశంలో అవతార్లు నటించేలా చేయవచ్చు. ఒక ప్రొడక్ట్ గురించి అవతార్ చెప్పడంలాటి వాటి గురించి క్రియేటర్లు చెబితే దానికి అనుగుణంగా యాప్ ఆ సీన్ను జనరేట్ చేస్తుంది. వ్యాపారం లేదా బ్రాండెడ్ కంటెంట్ కోసం ఇది ఉపయోగపడుతుంది.ప్రాంప్ట్ను బట్టీ అవుట్పుట్ మారినప్పటికీ, వీడియో అంతటా అవతార్లు దృశ్యపరంగా స్థిరంగా ఉంటాయి. ప్రొఫెషనల్ లుక్తో కనిపించడానికి ఇది ఉపకరిస్తుంది. యూజర్లు క్యారెక్టర్లను మరింత కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్లను ఉపయోగించి క్యారెక్టర్ల రూపాన్ని మార్చవచ్చు. వీడియో థీమ్కు సరిపోయే కొత్త నేపథ్యాన్ని జోడించవచ్చు. క్రియేటర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం.స్మార్ట్ వీడియో క్రియేషన్ టూల్స్‘అవతార్’ కంట్రోల్తో పాటు వీయో 3.1 వీడియో–జనరేషన్ మోడల్ని విడ్స్లో అనుసంధానించింది గూగుల్. ఎడిటర్లోనే నేరుగా షార్ట్, ఎనిమిది సెకన్ల వీడియోలను క్రియేట్ చేయడానికి ఈ ఫీచర్ యూజర్లకు ఉపకరిస్తుంది. సాధారణ యూజర్లు నెలకు పది వీడియోల వరకు ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు.గత నెలలో విడ్స్ కోసం లైరియా 3, లైరియా 3 ప్రో మ్యూజిక్ మోడల్స్ను విడుదల చేసింది గూగుల్. అదనపు సాఫ్ట్వేర్ అవసరం లేకుండానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్లను జోడించి పూర్తి వీడియోలు రూపొందించడానికి యూజర్లకు వీలు కల్పిస్తుంది.చదవండి: ఐఆర్సీటీసీ కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే చాన్స్ లేదు!సులభంగా... షేరింగ్ అండ్ రీకార్డింగ్యూజర్లు తమ స్క్రీన్ రికార్డ్ చేయడానికి క్రోమ్ ఎక్స్ టెన్షన్ డెవలప్ చేసింది గూగుల్. తద్వారా ఆడియో, వీడియో ట్యుటోరియల్స్, డెమోనిస్ట్రేషన్స్ను సులభతరం చేస్తుంది. -
IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు!
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వే ఒక కీలక మార్పు ప్రవేశపెట్టింది. చివరి నిమిషంలో ప్రయాణానికి సంబంధించిన బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కొత్త రూల్ ప్రకారం.. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ను, రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వరకు మార్చుకోవచ్చు. గతంలో బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవాలంటే.. ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల చాలామందికి ఇబ్బందులు కలిగేవి.బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడంలో IRCTC కొంత స్వేచ్ఛ కల్పించింది. ముఖ్యంగా ట్రాఫిక్, ఆలస్యం వంటి కారణాల వల్ల ఎంపిక చేసుకున్న స్టేషన్కు సమయానికి చేరుకోలేని పరిస్థితుల్లో ఈ సదుపాయం సహాయపడుతుంది. ఈ సదుపాయం ప్రధానంగా IRCTC ద్వారా బుక్ చేసిన టికెట్లకు వర్తిస్తుంది. ఒకసారి స్టేషన్ మార్చిన తర్వాత, తప్పనిసరిగా కొత్తగా ఎంచుకున్న స్టేషన్ నుంచే రైలులో ఎక్కాలి.ఈ సౌకర్యాన్ని ఉపయోగించేటప్పుడు.. కొత్తగా ఎంపిక చేసిన స్టేషన్ నుంచి కూడా రైలును మిస్ అయితే, టికెట్ రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణ ప్రణాళికను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవడం అవసరం. ఈ విషయాన్ని వినియోగదారులు తప్పకుండా గమనించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: 'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం' -
పశ్చిమాసియా సంక్షోభానికి మోక్షం లభించేనా?
వేలాది మంది ప్రాణాలను బలిగొని ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపుకు చేరుకుంది. నెలల తరబడి సాగుతున్న రక్తపాతానికి ముగింపు పలికే దిశగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నేడు (ఏప్రిల్ 11, 2026) పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. యుద్ధ మేఘాల మధ్య ఆశా కిరణంలా కనిపిస్తున్న ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.శాంతి మంతనాలు - పట్టువిడుపులుమధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే ధ్యేయంగా అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నతాధికారులు ఇస్లామాబాద్లో ముఖాముఖి భేటీ అవుతున్నారు. అయితే, చర్చల ప్రారంభానికి ముందే ఇరు దేశాలు తమ పంతాలను నెగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్లో కాల్పుల విరమణ, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయి భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అడ్డంకిగా మారిన హెజ్బుల్లా అంశంమార్చి నెలలో ప్రారంభమైన పోరాటంలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్లో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. అయితే, లెబనాన్ అంశాన్ని ఈ ద్వైపాక్షిక చర్చలతో ముడిపెట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ ససేమిరా అంటున్నాయి.ఆర్థిక ఆంక్షలు.. అణు కార్యక్రమంసంవత్సరాలుగా తమ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆంక్షలను అమెరికా వెంటనే ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణు, క్షిపణి తయారీ కార్యక్రమాలు నిలిపేస్తేనే ఆంక్షల ఉపశమనం ఉంటుందని వాషింగ్టన్ సంకేతాలిచ్చింది. ముఖ్యంగా యురేనియం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిపై పట్టుప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై తన సార్వభౌమత్వాన్ని గుర్తించాలని, అక్కడ రవాణా రుసుములు వసూలు చేసే అధికారం తమకు ఉండాలని ఇరాన్ కోరుతోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా, ఎటువంటి పరిమితులు లేకుండా అంతర్జాతీయ చమురు ట్యాంకర్ల రాకపోకలు సాగాలని డిమాండ్ చేస్తోంది.సైనిక ఉపసంహరణ - పరిహారంగత ఆరు వారాలుగా జరిగిన యుద్ధ నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేయనుండగా, అమెరికా దీనిపై మౌనం వహిస్తోంది. అలాగే, మధ్యప్రాచ్యం నుంచి అమెరికా తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా, శాంతి ఒప్పందం కుదిరే వరకు సైన్యం కదిలేది లేదని, ఒకవేళ ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధం తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరించారు.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!
దేశ రాజధానిలో కాలుష్యం నుంచి విముక్తి పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేసే దిశగా ఢిల్లీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కొత్తగా రూపొందించిన ‘ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030’ ముసాయిదాను రవాణా శాఖ విడుదల చేసింది. పర్యావరణ హితమే లక్ష్యంగా రూపొందించిన ఈ పాలసీలో సామాన్యులకు, మధ్యతరగతి వాహనదారులకు భారీ రాయితీలను ప్రకటించింది.రూ.30 లక్షల లోపు కార్లకు పూర్తి రాయితీకొత్త ముసాయిదా విధానం ప్రకారం, ఢిల్లీలో రిజిస్టర్ చేసుకునే రూ.30 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్ ధర) విలువ కలిగిన అన్ని ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100 శాతం మినహాయింపు లభించనుంది. ఈ ప్రయోజనం 31 మార్చి 2030 వరకు అమల్లో ఉంటుంది. రూ.30 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు ఈ రాయితీలు వర్తించవు. తద్వారా సామాన్య వాహనదారులకు ఈవీలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా ఉంది.హైబ్రిడ్ వాహనాలకూ ప్రోత్సాహంకేవలం పూర్తిస్థాయి ఈవీలకే కాకుండా తక్కువ ఉద్గారాలను విడుదల చేసే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. వీటిపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో 50 శాతం రాయితీని ప్రతిపాదించింది. దీనివల్ల ఇంధన వాహనాల నుంచి విద్యుత్ వాహనాల వైపు మళ్లే క్రమంలో హైబ్రిడ్ కార్లు ఒక వారధిగా మారుతాయని ప్రభుత్వం భావిస్తోంది.గాలి నాణ్యత మెరుగుదలే లక్ష్యంఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు వాహన ఉద్గారాలను తగ్గించడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. రాయితీలతోపాటు నగరం అంతటా ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను బలోపేతం చేయడం, ఈవీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇది భారతదేశపు నెట్-జీరో ఉద్గారాల లక్ష్యానికి, జాతీయ క్లీన్ మొబిలిటీ ప్లాన్కు అనుగుణంగా ఉంది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
అందరికీ నచ్చిన జియో రీఛార్జ్ ప్లాన్!
మొబైల్ రీచార్జ్ ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా నిలిచింది తక్కువ ఖర్చుతో.. సిమ్ యాక్టివ్గా ఉంచుకోవాలని భావించే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపిక.రూ.189 రీఛార్జ్ ప్లాన్ వివరాలురిలయన్స్ జియో అందిస్తున్న రూ.189 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 300 ఎస్ఎమ్ఎస్లు, ఇంటర్నెట్ వినియోగానికి 2జీబీ డేటా లభిస్తాయి. ఒకసారి ఈ డేటా పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. కానీ స్పీడ్ తగ్గుతుంది. దీనివల్ల కనీస అవసరాల కోసం అయినా కనెక్టివిటీ కొనసాగించవచ్చు.50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. కాలింగ్స్ మాత్రమే కాకుండా జియోటీవీ ద్వారా ఎక్కడైనా టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. అంతే కాకుండా.. డిజిటల్ యుగంలో డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని 50జీబీ జియోక్లౌడ్ స్టోరేజ్ను ఉచితంగా అందిస్తున్నారు. ఇది ఫోటోలు, వీడియోలు వంటి ఫైల్స్ను సురక్షితంగా నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.అయితే.. ఈ ప్లాన్ కొన్ని థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్లో కనిపించకపోవచ్చు. అందువల్ల వినియోగదారులు మైజియో యాప్ను డౌన్లోడ్ చేసి, అందులోని ‘రీఛార్జ్’ విభాగంలో ఈ ప్లాన్ను ఎంపిక చేసుకుని యాక్టివేట్ చేయాలి. -
పసిడి పండుగ.. అప్పుడు పది గ్రాములు..
ఆశలు అక్షయం కావాలని కోరుకుంటూ భారతీయులు జరుపుకునే పవిత్ర పండుగ అక్షయ తృతీయ. ఈ ప్రత్యేక సందర్భంలో పసిడి కొనుగోలు చేయడం అనవాయితీ. ఈ ఏడాది కూడా పసిడి కొనుగోళ్లకు జనం సిద్ధమవుతున్నప్పటికీ, ఆకాశాన్నంటుతున్న ధరలు సామాన్యుడి అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే బంగారం ధరల్లో వచ్చిన భారీ మార్పు ఇప్పుడు కొనుగోలుదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.ధరల వ్యత్యాసం2025 అక్షయ తృతీయ నాటి ధరలతో పోలిస్తే, ఈ ఏడాది (2026) బులియన్ మార్కెట్లో పెను మార్పులు సంభవించాయి. గతేడాది 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.96,000 నుండి రూ.97,000 మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధరకు కేవలం 6 నుండి 6.5 గ్రాములు మాత్రమే వస్తోంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే కొనుగోలుదారుల శక్తి 30-40% వరకు క్షీణించిందని విశ్లేషకులు చెబుతున్నారు.దేశంలో ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం (24 క్యారెట్స్) ధర రూ.1,52,840 లుగా (ఏప్రిల్ 11 నాటికి) ఉంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,40,100 లుగా ఉంది.ఎందుకీ పరుగు?బంగారం ధరలు ఇలా అదుపు లేకుండా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు 'సురక్షిత ఆస్తి'గా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువ తగ్గడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భౌతిక బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, ఇటిఎఫ్ (ETF)లపై ఆసక్తి పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పైపైకి వెళ్తున్నాయి.మారిన వినియోగదారుల తీరుధరలు భారమైనా సెంటిమెంట్ను వదులుకోని భారతీయులు, తమ కొనుగోలు పద్ధతులను మార్చుకుంటున్నారు. భారీ ఆభరణాల కంటే తక్కువ బరువుతో ఆకర్షణీయంగా కనిపించే డిజైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యాషన్ కంటే పెట్టుబడి దృక్పథంతో బంగారు నాణేలను కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా నగదు ఖర్చు చేసే కంటే, ఇంట్లో ఉన్న పాత ఆభరణాలను ఇచ్చి కొత్తవి తీసుకునే 'ఎక్స్ఛేంజ్ స్కీంల' వైపు జనం మొగ్గు చూపుతున్నారు.వ్యాపారుల వ్యూహాలుకస్టమర్లను ఆకర్షించడానికి జ్యువెలరీ షాపులు కూడా రాయితీలను ప్రకటిస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలపై తగ్గింపులు, ముందస్తు బుకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. స్టోర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గకపోయినప్పటికీ, ఒక్కొక్కరు కొనే బంగారం పరిమాణం తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
21 నెలల కనిష్ఠానికి ఎల్పీజీ వినియోగం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును అతలాకుతలం చేస్తున్న వేళ, భారత ఇంధన రంగంలో విరుద్ధమైన ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకవైపు యుద్ధ భయాలతో రవాణా ఇంధనాలైన పెట్రోల్, డీజిల్కు విపరీతమైన గిరాకీ పెరగ్గా, మరోవైపు వంట గ్యాస్ వినియోగం గత 21 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) విడుదల చేసిన తాత్కాలిక గణాంకాలు ఈ ఆసక్తికర అంశాలను వెల్లడించాయి.ఎల్పీజీ వినియోగంలో భారీ క్షీణతమార్చి 2026లో దేశీయ ఎల్పీజీ వినియోగం గణనీయంగా తగ్గింది. గత నెలతో పోలిస్తే 16 శాతం, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం క్షీణత నమోదైంది. మార్చిలో మొత్తం వినియోగం 2.38 మిలియన్ టన్నుల వద్ద నిలిచింది. జూన్ 2024 తర్వాత ఎల్పీజీ వినియోగంలో ఇంతటి భారీ పతనం నమోదు కావడం ఇదే తొలిసారి.దిగుమతులపై హార్మూజ్ ప్రభావంభారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సుమారు 90 శాతం దిగుమతులు వ్యూహాత్మకమైన హార్మూజ్ జలసంధి గుండానే సాగుతుంటాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ సంక్షోభం ఈ జలసంధి ద్వారా రవాణాను ప్రభావితం చేయడంతో ఫిబ్రవరిలో 2 మిలియన్ టన్నులుగా ఉన్న దిగుమతులు మార్చి నాటికి 1.1 మిలియన్ టన్నులకు పడిపోయాయి.పెట్రోల్, డీజిల్కు డిమాండ్సరఫరాలో అంతరాయాలు కలగవచ్చనే భయంతో వినియోగదారులు ముందు జాగ్రత్తగా ఇంధన కేంద్రాలకు క్యూ కట్టడం వల్ల రవాణా ఇంధనాల వినియోగం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.ఇంధనంమర్చి నెల వినియోగంవృద్ధి (నెలవారీ)వృద్ధి (వార్షిక)డీజిల్8.73 MT (రికార్డు)14%8%పెట్రోల్3.78 MT (రికార్డు)12%8% వార్షిక ధోరణి ఆశాజనకంమార్చి నెలలో ఎల్పీజీ వినియోగంలో క్షీణత కనిపించినప్పటికీ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం వినియోగం మాత్రం ఆశాజనకంగానే ఉంది. గతేడాది కంటే 6 శాతం వృద్ధి చెంది 33.21 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత నమోదైన అత్యధిక వార్షిక వృద్ధి కావడం విశేషం.ప్రభుత్వ భరోసా - ప్రత్యామ్నాయ మార్గాలుప్రస్తుత అస్థిరతపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. దేశీయ ఎల్పీజీ వినియోగంలో 90 శాతంపైగా ఉన్న గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీపై భారాన్ని తగ్గించేందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. మార్చిలోనే 3 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వగా ఏప్రిల్ చివరి నాటికి మరో 6 నుంచి 7 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
రూ. 640 కోట్ల ఇల్లు.. నాన్న ఇచ్చిన గిఫ్ట్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ తాజాగా తన పుట్టినరోజును జరుపుకొన్నారు. బాలీవుడ్ అగ్ర తారలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటంతో సోషల్ మీడియా సందడి నెలకొంది. ఈ ప్రత్యేక సందర్భంలో, రాధికా మర్చంట్తో వివాహానికి ముందు తండ్రి ముఖేష్ అంబానీ కానుకగా ఇచ్చిన దుబాయ్లోని అద్భుతమైన విల్లా విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.పామ్ జుమేరాలో బిలియనీర్ ప్యాలెస్దుబాయ్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పామ్ జుమేరా ద్వీపంలో ఉన్న ఈ విల్లా విలువ దాదాపు రూ. 640 కోట్లు. సముద్రపు అంచున, ప్రకృతి ఒడిలో నిర్మితమైన ఈ నివాసం విలాసానికి మారుపేరులా నిలుస్తుంది.విల్లాలోని అద్భుతమైన ఫీచర్లుదాదాపు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవంతి విస్తరించి ఉంది.ఇందులో మొత్తం 10 రాజభవనాల్లాంటి బెడ్రూమ్లు ఉన్నాయి.ఈ విల్లాకు అనుబంధంగా 70 మీటర్ల పొడవైన ప్రైవేట్ బీచ్ ఉండటం విశేషం.ఇటాలియన్ మార్బుల్స్తో మెరిసిపోయే ఫ్లోరింగ్, గోడలపై అరుదైన కళాఖండాలు ఈ ఇంటికి రాయల్ లుక్ను ఇస్తాయి.తెల్లటి రంగు ఇంటీరియర్స్ ఎడారి వేడిలోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి.విల్లాలో అధునాతన స్పా, టెర్రస్ గార్డెన్, ఇండోర్-అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి.ప్రముఖుల నిలయం.. పామ్ జుమేరాదుబాయ్లోని ఈ ప్రాంతం కేవలం అంబానీలకే కాదు, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (జన్నత్ విల్లా), అమితాబ్ బచ్చన్ వంటి సెలబ్రిటీల నివాసాలకు కూడా నిలయం. సముద్రపు అలల మధ్య, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ 'డెజర్ట్ మాన్షన్' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఖరీదైన ఆస్తుల్లో ఒకటిగా నిలుస్తోంది. -
ఓపెన్ ఏఐ నిపుణులను తన్నుకుపోయిన మెటా!
కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోరు కొత్త మలుపు తిరుగుతోంది. చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐకు గట్టి షాక్ ఇస్తూ ఆ సంస్థలోని అత్యంత కీలకమైన నిపుణులను మెటా ప్లాట్ఫారమ్స్ తన గూటికి చేర్చుకుంటోంది. సూపర్ కంప్యూటింగ్, భారీ డేటా సెంటర్ల నిర్మాణంలో ఆరితేరిన కొందరు అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ టీమ్లో చేరడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.మెటా గూటికి స్టార్గేట్ వ్యూహకర్తలుఓపెన్ ఏఐ మౌలిక సదుపాయాల విభాగంలో కీలకంగా నిలిచిన పీటర్ హోషెల్, షమీజ్ హేమానీ, అనుజ్ సహారాన్ ఇప్పుడు మెటాలో చేరారు. వీరు ఓపెన్ ఏఐ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘స్టార్గేట్’ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన వారు. ఈ ప్రాజెక్ట్ను వందల బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ సామర్థ్యాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టారు. ఇప్పుడు ఈ నిపుణులు మెటా సొంత సూపర్ కంప్యూటింగ్ ప్రయత్నాలకు, ముఖ్యంగా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విస్తరణకు కీలకంగా మారనున్నారు.జుకర్బర్గ్ భారీ స్కెచ్: రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడి!ఏఐ రేసులో వెనుకబడకూడదనే పట్టుదలతో ఉన్న మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం ఈ ఏడాదిలోనే సుమారు 135 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11.25 లక్షల కోట్లు) మూలధన వ్యయాన్ని మెటా అంచనా వేస్తోంది. దీర్ఘకాలికంగా వందల బిలియన్ డాలర్లను ఏఐ హార్డ్వేర్, చిప్స్, డేటా సెంటర్ల కోసం వెచ్చించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ భారీ సామ్రాజ్యాన్ని నడిపించడానికి ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన నిపుణులు దిక్సూచిగా మారనున్నారు.రక్షణలో ఓపెన్ ఏఐ..మరోవైపు, ఓపెన్ ఏఐ తన దూకుడుకు కాస్త బ్రేకులు వేసినట్లు కనిపిస్తోంది. కంపెనీ తన మౌలికసదుపాయాల వ్యూహాలను పునసమీక్షిస్తోంది. బ్రిటన్లో చేపట్టాలనుకున్న ‘స్టార్గేట్’ ప్రాజెక్టును కంపెనీ తాత్కాలికంగా పక్కన పెట్టింది. త్వరలో పబ్లిక్ లిస్టింగ్కు వెళ్లే ఆలోచనలో ఉన్న ఓపెన్ ఏఐ అపరిమితమైన ఖర్చులను నియంత్రించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త సైట్లను లీజుకు తీసుకోవడాన్ని కూడా వాయిదా వేసింది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
పెట్రోల్ బండ్లు బ్యాన్.. రిజిస్ట్రేషన్లు బంద్!
దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు 'ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030' ముసాయిదాను రవాణా శాఖ విడుదల చేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం.. రానున్న రెండేళ్లలో పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్లపై పూర్తిస్థాయిలో నిషేధం విధించి, నగరాన్ని ఈవీ హబ్గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.కీలక గడువులు ఇవే..పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించేందుకు ప్రభుత్వం స్పష్టమైన టైమ్ లైన్లను ప్రకటించింది. జనవరి 1, 2027 నుండి ఢిల్లీలో కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల (ఆటోలు) రిజిస్ట్రేషన్కు మాత్రమే అనుమతి ఉంటుంది. పెట్రోల్/సీఎన్జీ ఆటోల రిజిస్ట్రేషన్ నిలిచిపోనుంది.ఏప్రిల్ 1, 2028 నుండి పెట్రోల్ ద్విచక్ర వాహనాలపై (బైకులు, స్కూటర్లు) పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అప్పటి నుండి కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్లను మాత్రమే అనుమతిస్తారు.ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే.. డెలివరీ యాప్లు, అగ్రిగేటర్ల పరిధిలోని వాహనాలకు జనవరి 1, 2027 నుంచే కఠిన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఉన్న BS-6 వాహనాలను డిసెంబర్ 31, 2026 వరకు మాత్రమే అనుమతించి, ఆపై పూర్తిగా ఈవీలను తప్పనిసరి చేయనున్నారు.వ్యక్తిగత వాహనాలే కాకుండా, ప్రభుత్వ, విద్యాసంస్థల వాహనాలపై కూడా ఈ ప్రభావం ఉండనుంది. 2030 నాటికి 30 శాతం పాఠశాల బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ఏటా నిర్దిష్ట కోటాను పెంచుకుంటూ పోతారు.ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలన్నీ 100% ఎలక్ట్రిక్ మాత్రమే అయి ఉండాలి. అలాగే అద్దెకు తీసుకునే వాహనాలను కూడా తక్షణమే ఈవీలుగా మార్చాలని నిర్ణయించారు.ఢిల్లీకి వచ్చే ఇతర రాష్ట్రాల బస్సులు కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ లేదా హైడ్రోజన్ ఇంధన సాంకేతికతకు మారాల్సి ఉంటుంది.ప్రజాభిప్రాయ సేకరణఈ మార్పులు ఆకస్మికంగా కాకుండా, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా దశలవారీగా అమలు చేస్తాం. మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ పాయింట్ల విస్తరణపై ప్రభుత్వం భారీగా దృష్టి సారించిందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.ప్రస్తుతం ఈ ముసాయిదాను పౌరులు, నిపుణుల సలహాల కోసం పబ్లిక్ డొమైన్లో ఉంచారు. రాబోయే 30 రోజుల్లో వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం దీనిపై తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. శీతాకాలంలో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేసే కాలుష్య కోరల నుండి విముక్తి పొందేందుకు ఈ ఈవీ పాలసీ కీలకం కానుంది. -
ఎయిరిండియా ఉద్యోగులకు ఛైర్మన్ హెచ్చరిక
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, రాబోయే కాలం మరింత సవాలుతో కూడుకున్నదని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. రికార్డు స్థాయి నష్టాలు, నిరంతర కార్యాచరణ వైఫల్యాల నేపథ్యంలో సంస్థను గాడిలో పెట్టేందుకు ఉద్యోగులందరూ అంకితభావంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల గురుగ్రామ్లోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్గత సమావేశంలో ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్థ భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేస్తూనే ప్రస్తుత ఇబ్బందులను చంద్రశేఖరన్ హైలైట్ చేశారు.ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..‘గతంలో ఎయిరిండియా సిబ్బంది కంపెనీ క్లిష్ట సమయాల్లో ఎంతో పట్టుదల చూపారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. సంస్థ ఆశయాలకు అనుగుణంగా బలమైన పునాది వేసినప్పటికీ, విమానయాన రంగంలో వస్తున్న మార్పులు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం మన నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెట్టాలి. పనితీరు అమలు, ఖర్చుల నియంత్రణలో రాజీ పడకూడదు’ అని సూచించారు.ఎయిరిండియాకు సవాళ్లు..టాటా గ్రూప్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎయిరిండియాను పునరుద్ధరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ పలు అంశాలు సంస్థను వేధిస్తున్నాయి. ఈ ఏడాది కంపెనీ తన అతిపెద్ద వార్షిక నష్టాన్ని నివేదించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) క్యాంప్బెల్ విల్సన్ కంపెనీ నుంచి నిష్క్రమిస్తుండడం మరో ఎదురుదెబ్బ. విస్తారాతో విలీనం తర్వాత ఏకీకరణ ప్రక్రియకు అవుతున్న భారీ ఖర్చులు, కొత్త విమానాల కొనుగోలు వ్యయం సంస్థపై భారాన్ని పెంచాయి.బాహ్య కారణాల ప్రభావంఅంతర్జాతీయ పరిణామాలు కూడా ఎయిరిండియా లాభదాయకతను దెబ్బతీస్తున్నాయి. పెరుగుతున్న విమాన ఇంధన ధరలు నిర్వహణ వ్యయాన్ని పెంచాయి. పాకిస్థాన్ గగనతలంపై ఆంక్షలు, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా విమానాలను ఇతర మార్గాల్లో మళ్లించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా కీలకమైన అమెరికా, యూరప్ మార్గాల్లో కంపెనీ తన ఆధిక్యతను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.టాటా గ్రూప్ పూర్తి మద్దతుఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంస్థ పునరుద్ధరణకు టాటా గ్రూప్ కట్టుబడి ఉందని చంద్రశేఖరన్ భరోసా ఇచ్చారు. ‘టాటా గ్రూప్ బోర్డు సంస్థకు పూర్తి మద్దతు ఇస్తుంది. మేనేజ్మెంట్ టీమ్తో కలిసి నిరంతరం పనిచేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
బంగారం ఈరోజు కొంటే.. ఇదే రేటు!
దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాటపట్టాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు (Today Gold Rate) స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఊడిన ఉద్యోగికి ఎంత కష్టం!!
ప్రైవేటు రంగంలో పెరుగుతున్న లేఆఫ్స్ కేవలం ఉద్యోగ భద్రతనే కాకుండా, మధ్యతరగతి ఆర్థిక మూలాలను, ముఖ్యంగా ఈఎంఐ (EMI) చెల్లింపుల వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈఎంఐలు అంటే సాధారణ వ్యావహారికంలో సులభ వాయిదాలుగా వ్యవహిరిస్తారు. కానీ ఉద్యోగం కోల్పోయిన వారికి ఇప్పుడవే భూతంగా భయపెడుతున్నాయి. ఈ పరిస్థితిపై తాజా నివేదికలు, విశ్లేషణలతో ప్రత్యేక కథనం..ఐటీ లేఆఫ్స్.. ఈఎంఐ సంక్షోభంగత దశాబ్ద కాలంగా భారత ఐటీ రంగం స్థిరమైన ఆదాయానికి, విలాసవంతమైన జీవనశైలికి చిరునామాగా నిలిచింది. అయితే, 2025-26 కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ కొలువులు ఊడుతున్నాయి. ఇది నేరుగా బ్యాంకింగ్, రుణ చెల్లింపుల రంగంపై ప్రభావం చూపుతోంది.పెరుగుతున్న గృహ రుణాల ఆందోళనఐటీ నిపుణులు ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాల్లో భారీ ధరలకు ఇళ్లను కొనుగోలు చేశారు. మెట్రో నగరాల్లో సగటు ఐటీ ఉద్యోగి హోమ్ లోన్ ఈఎంఐ రూ.80,000 నుండి రూ.1.2 లక్షల మధ్య ఉంటోంది. ఇటీవల ఒక సర్వే ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన వారిలో 60% మందికి కేవలం 6 నుండి 8 నెలల వరకు మాత్రమే ఈఎంఐలు చెల్లించగల అత్యవసర నిధి (Emergency Fund) ఉంది. ఆ తర్వాత డిఫాల్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.భారమైన బకాయిలుఆర్బీఐ (RBI) తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (2026) ప్రకారం, భారతదేశ గృహ రుణాలు జీడీపీలో 41% దాటాయి. ఇందులో అధిక భాగం వినియోగ అవసరాల కోసం తీసుకున్న పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలే. ఐటీ నిపుణులు తమ జీవనశైలిని కొనసాగించేందుకు తీసుకున్న అన్సెక్యూర్డ్ లోన్స్ ఇప్పుడు భారంగా మారాయి. ఆదాయం ఆగిపోవడంతో, ఈ రుణాల రికవరీ బ్యాంకులకి సవాలుగా మారుతోంది.మారిన సిబిల్ నిబంధనలతో తక్షణ ప్రభావంఏప్రిల్ 2026 నుండి ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. బ్యాంకులు ఇప్పుడు ప్రతి వారం రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్కు పంపాలి (గతంలో ఇది 15-30 రోజులకు ఒకసారి ఉండేది). దీంతో ఒక్క ఈఎంఐ మిస్ అయినా, కేవలం 7 రోజుల్లోనే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. దీనివల్ల ఉద్యోగం కోల్పోయిన వారు ఇతర రుణాల కోసం ప్రయత్నించడం లేదా రీఫైనాన్సింగ్ చేసుకోవడం కష్టతరమవుతోంది.తాజా నివేదికల ముఖ్యాంశాలు బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (NPA) చారిత్రాత్మక కనిష్టంలో (2.15%) ఉన్నప్పటికీ, పర్సనల్ లోన్ విభాగంలో ఒత్తిడి పెరుగుతోంది. గృహ రుణాలు జీడీపీలో 41% కి చేరాయి. ఇది ఆందోళనకర స్థాయి. ఐటీ హబ్లలో నివసించే వారిలో పొదుపు శాతం 15% తగ్గింది. ఐటీ ఉద్యోగుల నుండి రుణ కాలపరిమితి పెంచాలని కోరుతూ వచ్చే దరఖాస్తులు 25% పెరిగాయి.ఉద్యోగం కోల్పోతే ఏం చేయాలి?లేఆఫ్స్ జరిగినప్పుడు భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం లేదా బ్యాంకులకు ముఖం చాటేయడం అతిపెద్ద తప్పు. రుణదాతలతో సంప్రదింపులు జరిపి మోరటోరియం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ కోరడం ఉత్తమ మార్గమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.అన్నిటా లేఆఫ్లు పెరుగుతున్న తరుణంలో ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి ఉద్యోగులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. కనీసం 12 నెలల ఈఎంఐలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ నిధిని ముందే సిద్ధం చేసుకోవాలి. మొదట హోమ్ లోన్ వంటి సెక్యూర్డ్ లోన్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకంటే ఆస్తి జప్తు అయ్యే అవకాశం ఉంటుంది. ఆదాయం తగ్గినప్పుడు వెంటనే విలాసవంతమైన ఖర్చులను నిలిపివేయాలి.ఐటీ రంగంలో లేఆఫ్స్ అనేవి కేవలం ఒక రంగ సమస్య కాదు, ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని, రుణ చెల్లింపుల చక్రాన్ని ప్రభావితం చేస్తోంది. క్రెడిట్ స్కోర్ పట్ల బ్యాంకులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో, ఐటీ ఉద్యోగులు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. -
స్విగ్గీకి నందన్ రెడ్డి గుడ్బై.. తప్పుకొంటున్న కోఫౌండర్
ప్రముఖ ఫుడ్, గ్రొసరీ డెలివరీ దిగ్గజం 'స్విగ్గీ' (Swiggy)లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఇన్నోవేషన్ హెడ్ నందన్ రెడ్డి తన ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తన సొంత వెంచర్ను ప్రారంభించే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.వ్యవస్థాపక త్రయంలో మిగిలింది ఒక్కరే..శ్రీహర్ష మజేటీ, రాహుల్ జైమినిలతో కలిసి నందన్ రెడ్డి స్విగ్గీని స్థాపించారు. వీరిలో రాహుల్ జైమిని ఇప్పటికే 2020లో కంపెనీ నుంచి తప్పుకోగా, ఇప్పుడు నందన్ రెడ్డి కూడా వైదొలగడంతో వ్యవస్థాపక బృందంలో శ్రీహర్ష మజేటీ మాత్రమే మిగిలారు. "బెంగళూరులో ఒక చిన్న ప్రాంతంలో మొదలైన స్విగ్గీ నేడు దేశవ్యాప్తంగా విస్తరించడంలో నందన్ కృషి వెలకట్టలేనిది. ఆయన దార్శనికత మా కంపెనీ డీఎన్ఏలోనే ఉంది" అని కంపెనీ సీఈవో శ్రీహర్ష ఈ సందర్భంగా కొనియాడారు.బోర్డులో కొత్త ముఖాలునందన్ రెడ్డి నిష్క్రమణతో పాటు బోర్డు సభ్యుల్లోనూ స్విగ్గీ పలు మార్పులు చేపట్టింది. గతంలో 'ఇన్స్టామార్ట్' బాధ్యతలు చూసిన ఫణి కిషన్ అడెపల్లి ఇప్పుడు బోర్డు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈయన చీఫ్ గ్రోత్ ఆఫీసర్గా ఉన్నారు. ఇక కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) రాహుల్ బోత్రా కూడా బోర్డులో చేరనున్నారు. మరోవైపు రెనాన్ డి కాస్ట్రో అల్వెస్ పింటో ప్రోసస్ వెంచర్స్ ప్రతినిధిగా బోర్డులోకి రానున్నారు.పెట్టుబడిదారుల హక్కుల్లో మార్పులుకంపెనీ తన 'ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్'ను సవరిస్తూ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కీలక విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. గతంలో డైరెక్టర్లను నామినేట్ చేసే హక్కులు కలిగి ఉన్న యాక్సెల్, సాఫ్ట్ బ్యాంక్ వంటి సంస్థల హక్కులను కంపెనీ తొలగించింది. గ్రూప్ సీఈఓ శ్రీహర్ష మజేటీకి బోర్డు సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని కల్పించారు. దీనివల్ల కంపెనీ నిర్ణయాధికారాల్లో మేనేజ్మెంట్కు పట్టు పెరగనుంది.ప్రస్తుతం ప్రతిపాదించిన ఈ మార్పులన్నీ వాటాదారుల ఆమోదం పొందిన తర్వాత అమల్లోకి వస్తాయి. ఐపీఓ (IPO) దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో స్విగ్గీలో జరుగుతున్న ఈ అంతర్గత మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ ఒలెక్ట్రా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్టెక్ ‘ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీడే’ అనే ట్యాగ్లైన్తో తమ నూతన బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ స్థాయి నుంచి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏకీకృత మొబిలిటీ, పరిష్కారాలను అందించే ఆవిష్కరణల ఆధారిత సంస్థగా కంపెనీ పరిణామక్రమాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.పర్యావరణహిత మొబిలిటీ, ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా బాధ్యతాయుతమైన భవిష్యత్తువైపు ప్రపంచాన్ని నడిపించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుందని సంస్థ ఎండీ మహేశ్ బాబు తెలిపారు. నిర్మాణాత్మక సమగ్రత, లక్ష్యంతో కూడుకున్న దిశను సూచించేలా త్రిభుజాకారంలో ఒలెక్ట్రా ప్రిజం, దాని చుట్టూ ఒలెక్ట్రా యూనివర్స్ని సూచించే వృత్తంతో లోగో ఉంటుంది. వాటాదారులు, నగరాలు, కంపెనీ అందించే సేవల విస్తృత వ్యవస్థను ఇది ప్రతిబింబిస్తుంది. -
ప్రజా ప్రయోజనార్థం టాటా సన్స్ను లిస్ట్ చేయాలి
న్యూఢిల్లీ: నిబంధనల అమలు కోణంలోనే కాకుండా ప్రజా ప్రయోజనార్థం కూడా టాటా సన్స్ని లిస్ట్ చేసి తీరాలని ఎస్పీ గ్రూప్ చైర్మన్ షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ స్పష్టం చేశారు. దీని వల్ల కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగుపడి, పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని పేర్కొన్నారు. అలాగే లక్షలాది రిటైల్ వాటాదారులకు గణనీయంగా విలువ చేకూరుతుందని, మరింత మంది పేద వర్గాలకు తోడ్పాటు అందించేలా టాటా ట్రస్ట్స్కి కూడా భారీగా డివిడెండు లభించగలదని మిస్త్రీ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. టాటా సన్స్ని లిస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న వారు దాని లిస్టింగ్ వల్ల టాటా ట్రస్ట్స్ ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటాయి, లబి్ధదారులకు సేవలందించడంలో సామర్థ్యాలు ఎలా తగ్గిపోతాయనే దానిపై ఇప్పటివరకూ రుజువులతో కూడుకున్న ఆధారాలేవీ చూపలేదని ఆయన పేర్కొన్నారు. టాటా సన్స్ లిస్టింగ్కి టాటా ట్రస్ట్స్లోని ఇద్దరు ట్రస్టీలు (వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్) అనుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మిస్త్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, టాటా ట్రస్ట్ చైర్మన్ నోయెల్ టాటా మాత్రం లిస్టింగ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. టాటా సన్స్లో 66 శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్స్ ట్రస్టీల మధ్య గతేడాది అక్టోబర్లో అంతర్గత పోరు తెరపైకి వచ్చిన తరుణంలో దాన్ని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయాలంటూ మిస్త్రీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. టాటా సన్స్లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి 18.37 శాతం వాటాలు ఉన్నాయి. -
భారత్ వృద్ధి అంచనాలు అప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థికంగా, భౌగోళిక–రాజకీయాంశాలపరంగా పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) భారత్ వృద్ధి రేటు పటిష్టంగా 6.9 శాతం స్థాయిలో ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. డిసెంబర్లో వెలువరించిన 6.5 శాతం స్థాయి కన్నా అధికంగా ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ పటిష్టంగా ఉండటం, సులభతరంగా రుణాల లభ్యత, భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్ల తగ్గుదలలాంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఒక నివేదికలో పేర్కొంది. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరల పెరుగుదల, వాణిజ్య నిర్వహణకు ఆటంకాలు, రెమిటెన్సులు తగ్గుదల తదితర అంశాలు వృద్ధిపై ప్రభావం చూపవచ్చని ఏడీబీ తెలిపింది. ఇక సానుకూల పాలసీలు, అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడటం వల్ల దేశీయంగా వినియోగం, పెట్టుబడులకు ప్రయోజనం చేకూరుతుందని, ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2026–27 అంచనాలను ఏడీబీ సవరించినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరపు 7.6 శాతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.9 శాతానికి తగ్గనుండటం గమనార్హం. -
భారత్కు విశ్వసనీయ సరఫరాదారుగా ఉంటాం
న్యూఢిల్లీ: భారత్కు ఇక ముందు విశ్వసనీయమైన ఇంధన సరఫరాదారుగా ఉంటామని ఖతార్ హామీ ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి రెండు రోజుల దోహా పర్యటన (9, 10 తేదీలు) సందర్భంగా, అక్కడి ఇంధన మంత్రి సాద్ షెరీదా ఆల్కాబితో చర్చలు నిర్వహించారు. పశ్చిమాసియాలో ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వానికి ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు. ఖతార్ నాయకత్వానికి భారత ప్రధాని సంఘీభావాన్ని ఈ సందర్భంగా మంత్రి పురి తెలియచేశారు. ఇరాన్–అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణను భారత్, ఖతార్ స్వాగతించాయి. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాల్లో సమస్యలు ఏర్పడిన దృష్ట్యా ఘర్షణలకు త్వరగా ముగింపు పలకాలని పేర్కొన్నాయి. భారత్ అవసరాల్లో 45 శాతం ఎల్ఎన్జీ, 20 శాతం ఎల్పీజీని ఖతార్ సరఫరా చేస్తుండడం గమనార్హం. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఇంధన భద్రత అవసరాల దృష్ట్యా మంత్రి పురి ఖతార్ పర్యటనకు వెళ్లడం గమనార్హం. -
ఈక్విటీ ఫండ్స్.. తగ్గేదేలే!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆటుపోట్లు నెలకొన్న తరుణంలోనూ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడుల పట్ల తమ విశ్వాసాన్ని చాటారు. మార్చి నెలలో ఈక్విటీ ఫండ్స్లోకి రికార్డు స్థాయిలో రూ.40,456 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో వచ్చిన రూ.25,978 కోట్లతో పోల్చి చూస్తే 56 శాతం పెరిగాయి. 2025 జూలై (రూ.42,702 కోట్లు) తర్వాత ఒక నెలలో వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవి. ముఖ్యంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్కు అత్యధిక ఆదరణ లభించింది. మరోవైపు డెట్ ఫండ్స్ నుంచి భారీ స్థాయిలో రూ.2.95 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరిలో ఇదే విభాగం రూ.42,106 కోట్లను ఆకర్షించడం గమనార్హం. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మార్చిలో రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులను నికరంగా కోల్పోయింది. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తుల (ఏయూఎం) విలువ ఫిబ్రవరి చివరికి ఉన్న రూ.82.03 లక్షల కోట్ల నుంచి మార్చి చివరికి రూ.73.73 లక్షల కోట్లకు తగ్గింది. ఇందులో ఈక్విటీ ఫండ్స్ రూ.31,97,698 కోట్లుగా ఉంది. స్టాక్స్ విలువలు తగ్గడం ఏయూఎంపై ప్రభావం చూపించింది. విభాగాల వారీగా.. → అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రూ.10,054 కోట్ల పెట్టుబడులను మార్చి నెలలో ఆకర్షించాయి. → స్మాల్క్యాప్ ఫండ్స్లోకి రూ.6,263 కోట్లు, మిడ్క్యాప్ లోకి రూ.6,063 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. → లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ రూ.5,307 కోట్లు, లార్జ్క్యాప్ ఫండ్స్ రూ.2,997 కోట్ల చొప్పున రాబట్టాయి. → మల్టీక్యాప్ ఫండ్స్లోకి రూ.2,981 కోట్లు రాగా, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ రూ.437 కోట్లను కోల్పోయాయి. → గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు భారీగా తగ్గి రూ.2,266 కోట్లకు పరిమితమయ్యాయి. ఫిబ్రవరిలో ఇదే విభాగంలోకి రూ.5,255 కోట్లు, జనవరిలో రూ.24,040 కోట్లు చొప్పున రావడం గమనార్హం. → హైబ్రిడ్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.16,500 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ నుంచి రూ.21,000 కోట్లు బయటకు వెళితే, మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్లోకి రూ.5,000 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్ల నమ్మకం.. ‘మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టిపై ఇన్వెస్టర్లలో స్థిరమైన విశ్వాసం కొనసాగుతోందని మార్చి నెల పెట్టుబడులు తెలియజేస్తున్నాయి. భారత్ నిర్మాణాత్మక వృద్ధి బలంగా ఉండడంతో, ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. సిప్ సరికొత్త రికార్డు.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీల్లోకి నెలవారీ వచ్చే పెట్టుబడులు మార్చిలో ఆల్టైమ్ గరిష్ట రికార్డును నమోదు చేశాయి. రూ.32,087 కోట్ల పెట్టుబడులు సిప్ రూపంలో వచ్చాయి. ఫిబ్రవరిలో సిప్ పెట్టుబడులు రూ.29,845 కోట్లుగా ఉన్నాయి. దీర్ఘకాలం కోసం సిప్ రూపంలో వివిధ పథకాల్లో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టే సంస్కృతి ఇటీవలి కాలంలో విస్తరిస్తున్నట్టు ఈ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. -
బజాజ్ 2026 పల్సర్ లాంచ్.. ధర ఎంతంటే?
2026 బజాజ్ పల్సర్ 180 భారతదేశంలో రూ. 1,22,490 ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయింది. ఈ మోటార్సైకిల్ బజాజ్ పల్సర్ 150, బజాజ్ పల్సర్ 220F మధ్య ఉంది. సాధారణ మోడల్ కంటే కూడా ఇది అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.పల్సర్ 180 లో 178.61cc, సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,500rpm వద్ద 16.77bhp పవర్, 6,500rpm వద్ద 15Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది అన్నివిధాలా వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.డిజైన్ పరంగా.. బజాజ్ ఐకానిక్ పల్సర్ స్టైలింగ్ను అలాగే కొనసాగించింది. అయితే.. 2026 మోడల్ ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా ఉండేలా సూక్ష్మమైన కాస్మెటిక్ అప్డేట్స్ చేసింది. ఈ బైక్ ఇప్పుడు బ్లాక్ అవుట్ పెయింట్ స్కీమ్ను కలిగి ఉంది. కలర్ ఆప్షన్ను బట్టి కాంట్రాస్టింగ్ హైలైట్స్తో వస్తుంది. అదనంగా.. ముందు మడ్గార్డ్ కార్బన్-ఫైబర్ లాంటి ఫినిషింగ్ను పొందింది, ఇది దాని స్టైలింగ్కు మరింత స్పోర్టీ టచ్ను జోడిస్తుంది. హెడ్ల్యాంప్ డిజైన్లో ఎల్ఈడీ లైటింగ్ను పొందుపరిచారు. -
తక్కువ ధరలో.. టెస్లా కొత్త కారు!
మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల ధ్రువీకరించారు. ఇప్పుడు మరో కొత్త మోడల్ రానున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఎంట్రీ-లెవల్ మోడళ్ల కంటే చిన్నదిగా ఉంటుందని సమాచారం.ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, తన ప్రస్తుత ఎంట్రీ-లెవల్ మోడళ్ల కంటే చిన్నదిగా, చౌకైన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కంపెనీ యోచించినప్పటికీ.. అమల్లోకి త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.రాబోయే చిన్న, సరసమైన కారును కేవలం ఒక వేరియంట్లో మాత్రమే కాకుండా.. మోడల్ 3, మోడల్ వై కంటే భిన్నంగా ఉండేలా తయారు చేయనుంది. దీని బరువు 1.5 మెట్రిక్ టన్నులు ఉండేలా సిద్ధం చేయనున్నారు. ధరను తగ్గించడం కోసం.. చిన్న బ్యాటరీ ప్యాక్ అమర్చే అవకాశం ఉంది. అంటే ఈ కారు రేంజ్ కొంత తక్కువగా ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: హ్యుందాయ్ వైబ్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?టెస్లా కొత్త కారును షాంఘైలోని గిగాఫ్యాక్టరీలో ప్రారంభించనున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగితే, చివరికి తయారీని యునైటెడ్ స్టేట్స్, యూరప్లకు విస్తరించే అవకాశం ఉంది. అయితే దీనిని ఎప్పుడు ప్రారంభించనున్నారు?, మొదటి ఎక్కడ విక్రయించనున్నారు? అనే విషయాలను సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
బంగారం ధరల్లో మార్పు.. అమాంతం తగ్గిన రేటు!
శుక్రవారం ఉదయం.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు సాయంత్రానికే ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గోల్డ్ రేటులో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈ కథనంలో లేటెస్ట్ పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ.1,40,250 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సాయంత్రానికి 1,39,650 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే రేటు రూ.600 తగ్గినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.1,53,000 నుంచి రూ.152350 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు జరిగింది. దేశ రాజధానిలో 24 క్యారెట్ల తులం బంగారం 1,53,150 రూపాయల నుంచి రూ.1,52,500 వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,40,400 రూపాయల నుంచి 1,39,800 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి 22 క్యారెట్ల తులం రేటు 1,41,250 రూపాయల వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,54,090 రూపాయల వద్ద ఉంది. అంటే ఈ రోజు ఉదయం ధరలకు, సాయంత్రం ధరలకు ఎలాంటి తేడా లేదు.వెండి ధరలువెండి ధరలు ఈ రోజు పెరుగుదల దిశగా పయనించాయి. దీంతో కేజీ సిల్వర్ ధర హైదరాబాద్లో 2.65 లక్షలు. కాగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.60 లక్షలు వద్ద ఉంది. -
'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'
అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్నారై జంట.. తాము పనిచేసే కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని ప్లాన్ వేసుకున్నారు. 2025 అక్టోబర్లో మహిళ ఉద్యోగం కోల్పోగా, ఇటీవల ఒరాకిల్ లేఆఫ్స్ సమయంలో ఆమె భర్తకు కూడా ఉద్యోగం పోయింది. 60 రోజుల గడువులో.. ఇండియాకు రావాలనుకుంటున్న సమయంలో జాబ్ కోసం నెటిజన్ల సలహాలు అడిగారు. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తరువాత నుంచి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, H4 వీసా కోసం ఎదురుచూశానని ఆమె పోస్టులో వెల్లడించారు. అయితే సరైన అవకాశాలు లేకపోవడంతో పరిస్థితి కష్టంగా మారింది. ఇదే సమయంలో తన భర్త కూడా ఉద్యోగం కోల్పోయారు. అతని H1B వీసాకు సంబంధించి PERM, I-140 ప్రాసెస్ లేకపోవడంతో, వీసా రిన్యూవల్ లేదా దీర్ఘకాలికంగా అమెరికాలో ఉండే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతనికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే మిగిలింది.ఈ పరిస్థితుల్లో.. ఆ దంపతులు అమెరికాలో కొనసాగడం సాధ్యం కాదని భావించి, భారతదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూలై నాటికి ఇండియాకు వెళ్లి అక్కడ కొత్తగా జీవితం ప్రారంభించాలని వారు ఆలోచిస్తున్నారు. “ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం ఎలా దొరుకుతుంది? ఎంత సమయం పడుతుంది? కెరీర్ను ఎలా మళ్లీ ప్రారంభించాలి?” వంటి ప్రశ్నలు అడిగారు. దీనికి నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.ఇదీ చదవండి: 'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓకొంతమంది ''భారతదేశంలో స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి'' అని ప్రోత్సహించారు. మరికొందరు ''ఇక్కడ కూడా ఉద్యోగ మార్కెట్ కఠినంగానే ఉంది, కానీ అమెరికాతో పోలిస్తే స్థిరత్వం మెరుగ్గా ఉండొచ్చు'' అని చెప్పారు. ఇంకొందరు మాత్రం ''ముందు మానసికంగా స్థిరపడండి, తర్వాత ప్లానింగ్ చేసుకోండి'' అని సలహా ఇచ్చారు. -
'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓ
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతూ.. దాదాపు అన్ని రంగాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తోంది. 2007లో యాపిల్ కంపెనీ ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు.. ఫోన్ పరిశ్రమలో ఒక మహత్తర మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు మనం ఉపయోగించిన కీప్యాడ్ ఫోన్లు నెమ్మదిగా అంతరించిపోయి, టచ్స్క్రీన్ ఫోన్లు వచ్చేశాయి. ఇప్పడూ స్మార్ట్ఫోన్లను మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయాయి.నథింగ్ సీఈఓ 'కార్ల్ పీ' అభిప్రాయం ప్రకారం.. గత ఇరవై సంవత్సరాలుగా స్మార్ట్ఫోన్ల వినియోగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. మనం ఇంకా లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్, యాప్లు, యాప్ స్టోర్లకు పరిమితమై ఉన్నాం. ఏ చిన్న పని చేయాలన్నా మనం అనేక యాప్లను ఉపయోగిస్తూ.. సమయం వృధా చేస్తున్నాం. ఇది కొంత క్లిష్టంగా మారింది.ప్రస్తుతం ఏఐ ఒక కొత్త విప్లవానికి దారితీయనుంది. భవిష్యత్తులో యాప్లు పూర్తిగా మాయమైపోయి.. వాటి స్థానంలో ఏఐ ఏజెంట్స్ రానున్నాయి. అలవాట్లు, ఇష్టాలు, అవసరాలను అర్థం చేసుకుని మన తరఫున పనులను స్వయంగా నిర్వహిస్తాయి. ఉదాహరణకు, ఒక స్నేహితుడితో కాఫీకి వెళ్లాలని అనుకుంటే, మనం వేర్వేరు యాప్లను ఉపయోగించకుండా, ఏఐ మన కోసం సమయం నిర్ణయించి, స్థలం ఎంపిక చేస్తుందన్నమాట.ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇచ్చే ఆదేశాలపై ఆధారపడి పనిచేస్తుంది. కానీ భవిష్యత్తులో రానున్న ఏఐ మన ఆలోచనలను కూడా ముందుగానే అర్థం చేసుకుని సూచనలు ఇవ్వగలదు. ఇది మన జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, టెక్నాలజీపై మన ఆధారాన్ని కూడా పెంచుతుంది.ఈ మార్పు స్టార్టప్ కంపెనీలకు ఒక సవాలుగా మారవచ్చు. ఇప్పటివరకు యాప్లపై ఆధారపడిన వ్యాపార నమూనాలు భవిష్యత్తులో పనిచేయకపోవచ్చు. అందువల్ల.. కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుని, ఏఐ ఆధారిత పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. లేకుంటే.. వారు ఇతర సంస్థలతో వెనుకబడే అవకాశం ఉంది.ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏఐను తమ ఉత్పత్తుల్లో అమలు చేయడం ప్రారంభించాయి. నథింగ్ వంటి సంస్థలు వినియోగదారులకు ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తూ, కొత్త అనుభవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో ఏఐ ఎంతగా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
హ్యుందాయ్ వైబ్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
హ్యుందాయ్ ఇండియా.. తన గ్రాండ్ ఐ10 నియోస్ కొత్త వైబ్ ఎడిషన్ను పరిచయం చేసింది. దీని ధరలు రూ. 7.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ఈ స్పెషల్ ఎడిషన్ స్పోర్ట్జ్, స్పోర్ట్జ్ (O) వేరియంట్ల ఆధారంగా నిర్మితమైంది.గ్రాండ్ ఐ10 నియోస్ వైబ్ ఎడిషన్ స్పోర్ట్జ్ వైబ్, స్పోర్ట్జ్ (ఓ) వైబ్ అనే రెండు ట్రిమ్లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లలోనూ ఎరుపు రంగు ఇన్సర్ట్లతో కూడిన నలుపు రంగు ఇంటీరియర్, అలాగే నలుపు రంగులో పెయింట్ చేసిన 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. లెదర్-ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి.స్పోర్ట్జ్ (ఓ) వైబ్ వేరియంట్లో పుష్-బటన్ స్టార్ట్తో కూడిన స్మార్ట్ కీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, ఆరు ఎయిర్బ్యాగ్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇందులో లభిస్తాయి.పవర్ట్రెయిన్ ఎంపికల విషయానికొస్తే, వైబ్ ఎడిషన్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్తో కొనసాగుతుంది, దీనికి 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్ లభిస్తుంది. కాబట్టి పనితీరు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 918.60 పాయింట్లు లేదా 1.20 శాతం లాభంతో 77,550.25 వద్ద, నిఫ్టీ 275.50 పాయింట్లు లేదా 1.16 శాతం లాభంతో 24,050.60 వద్ద నిలిచాయి.డీపీ వైర్స్ లిమిటెడ్, గ్లోటిస్ లిమిటెడ్, ఆర్ట్ నిర్మాణ్ లిమిటెడ్, హింద్ రెక్టిఫయర్స్ లిమిటెడ్, అట్లాస్ సైకిల్స్ (హర్యానా) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆర్ఎమ్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇన్వెంచర్ గ్రోత్ & సెక్యూరిటీస్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, శేషాసాయి టెక్నాలజీస్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్!
ఒక సంస్థలో ఏళ్ల తరబడి పనిచేసిన ఉద్యోగికి, ఆ సంస్థ పట్ల వారు చూపిన అంకితభావానికి, విధేయతకు ఇచ్చే గౌరవపూర్వకమైన బహుమతే గ్రాట్యుటీ. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, ఉద్యోగి శ్రమకు యాజమాన్యం ఇచ్చే గుర్తింపు. మరి ఈ గ్రాట్యుటీ అందరికీ వస్తుందా? దీని లెక్కలేంటి? తాజా నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఓసారి పరిశీలిద్దాం.గ్రాట్యుటీ అంటే ఏమిటి?‘పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972’ ప్రకారం, ఒక ఉద్యోగి ఒకే సంస్థలో దీర్ఘకాలం పనిచేసినందుకు ప్రతిఫలంగా యజమాని ఇచ్చే మొత్తాన్ని గ్రాట్యుటీ అంటారు. సాధారణంగా ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా దురదృష్టవశాత్తు మరణించినప్పుడు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు.గ్రాట్యుటీ పొందడానికి అర్హతలుగ్రాట్యుటీ అందరికీ వర్తించదు. దీనికి కొన్ని ప్రాథమిక నియమాలు ఉన్నాయి. ఒకే సంస్థలో కనీసం 5 ఏళ్ల నిరంతర సేవలు పూర్తి చేసి ఉండాలి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఉద్యోగి మరణించినా లేదా ప్రమాదం వల్ల అంగవైకల్యం సంభవించినా ఈ ఐదేళ్ల నిబంధన వర్తించదు. అటువంటప్పుడు వారు పనిచేసిన కాలానికే గ్రాట్యుటీ చెల్లిస్తారు.ఎలా లెక్కిస్తారు?గ్రాట్యుటీ లెక్కించడానికి ఒక నిర్దిష్టమైన సూత్రం ఉంది. ఇందులో ప్రధానంగా రెండు అంశాలు కీలకం. చివరిగా తీసుకున్న వేతనం (బేసిక్+డీఏ), పూర్తి చేసిన సర్వీసు కాలం.గ్రాట్యుటీ=(చివరగా తీసుకున్న వేతనం*సర్వీసు చేసిన మొత్తం సంవత్సరాలు*15)/26ఇక్కడ 26 రోజులను ఒక నెలగా పరిగణిస్తారు. నెలలో 4 ఆదివారాలు తీసివేసి 15 రోజులను సగటు వేతనంగా లెక్కిస్తారు.ఉదాహరణ:రాము అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 10 ఏళ్ల 7 నెలలు పనిచేశాడు. అతను ఉద్యోగం వదిలేటప్పుడు అతని బేసిక్ పే, డీఏ కలిపి రూ.50,000 అనుకుందాం.గమనిక: సర్వీసు కాలం 6 నెలల కంటే ఎక్కువ ఉంటే దాన్ని తదుపరి ఏడాదిగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ రాము సర్వీసును 11 ఏళ్లుగా తీసుకోవాలి.గ్రాట్యుటీ: (50000*11*15)/26=రూ.3,17,307.ముఖ్యమైన అంశాలుప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి గరిష్టంగా రూ.20 లక్షల వరకు గ్రాట్యుటీని పన్ను మినహాయింపుతో పొందవచ్చు. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వస్తే ఈ పరిమితి పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10(10) ప్రకారం నిర్దేశిత పరిమితి వరకు మినహాయింపు లభిస్తుంది.ప్రతి ఉద్యోగి తన గ్రాట్యుటీ కోసం నామినీని నియమించుకోవడం తప్పనిసరి.ఇదీ చదవండి: రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట! -
స్పెయిన్లో ఉద్యోగం.. ఇల్లు కూడా ఫ్రీ!
ఉన్న ఊరిలో లేదా నగరంలో కాకుండా.. ఎక్కడైనా ఉద్యోగం చేయాలంటే?, తప్పకుండా నివాసం (ఇల్లు) వెతుక్కోవాల్సిందే. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అయితే.. ఇంటి అద్దెలకు వేలరూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే.. వచ్చే జీతంలో ఇంటికోసం కొంత వెచ్చించాల్సి వస్తుంది. కానీ స్పెయిన్ దేశంలో ఒక చిన్న గ్రామం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.ఉద్యోగం ఇవ్వడమే కాకుండా.. ఉచితంగా ఇల్లు కూడా ఇస్తామంటోంది స్పెయిన్లోని అరెనిల్లాస్. ఈ గ్రామం స్పెయిన్లోని సొరియా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 40 మంది మాత్రమే శాశ్వత నివాసం ఉంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజలు వలస వెళ్తుండటంతో, ఈ ప్రాంతం 'ఎంప్టీ స్పెయిన్' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ పరిస్థితిని మార్చడానికి ఈ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది.షరతులుఈ ఆఫర్ ప్రకారం, ఒక కుటుంబానికి పూర్తిగా పునరుద్ధరించిన ఇల్లు ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా వారికి ఒక స్థిరమైన ఉద్యోగం కూడా కల్పిస్తారు. గ్రామంలో శాశ్వతంగా నివసించే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. ఈ అవకాశానికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఆ కుటుంబానికి పాఠశాల వయస్సు ఉన్న పిల్లలు ఉండాలి. వారు గ్రామంలో పూర్తిగా నివసిస్తూ, గ్రామంలోని బార్ను నిర్వహించాలి. అదేవిధంగా భవనాల నిర్వహణ వంటి మున్సిపల్ పనులు కూడా చేయాలి.100 కంటే ఎక్కువ దరఖాస్తులు!నిజానికి ఎక్కడైనా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా ఇవ్వడం అనేది చాలా అరుదు. కానీ ఇలాంటి ఆఫర్ అరెనిల్లాస్ అందించడం చాలా ప్రత్యేకమైన విషయం. ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చాక.. ఇప్పటివరకు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.అరెనిల్లాస్ గ్రామం పర్వత ప్రాంతంలో ఉండటం వల్ల ప్రకృతి అందాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వసంత కాలంలో సుమారు 24°C వరకు ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఇది ఒక అందమైన ప్రదేశంలా కనిపిస్తుంది.ఇబ్బందులూ ఉంటాయ్!ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనం అనిపించవచ్చు. శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ప్రజా రవాణా సదుపాయాలు తక్కువగా ఉండటంతో, సొంత వాహనం అవసరం అవుతుంది. సమీప పాఠశాల సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అయితే పిల్లలకు ఉచిత రవాణా ఉంటుంది. ఆరోగ్య సేవలు కూడా ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉంటాయి.ఇదీ చదవండి: WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్ -
టెక్ స్టార్టప్ల్లోకి పెట్టుబడులు తగ్గాయ్..
న్యూఢిల్లీ: దేశీ టెక్నాలజీ అంకుర సంస్థల నిధుల సమీకరణ గత ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 14.3 బిలియన్ డాలర్లతో పోలిస్తే 18 శాతం క్షీణించింది. అయితే, 2023–24లో సమీకరించిన 9.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే పెరిగింది. మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ’ట్రాక్షన్’ ఇండియా టెక్ వార్షిక ఫండింగ్ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా నిధులను దక్కించుకున్న స్టార్టప్లపరంగా అంతర్జాతీయంగా అమెరికా, బ్రిటన్, చైనా తర్వాత భారత్ నాలుగో స్థానంలో నిల్చింది. జర్మనీ, ఫ్రాన్స్కన్నా ముందుంది. తాజా గణాంకాల ప్రకారం సీడ్ స్థాయి స్టార్టప్లలో పెట్టుబడులు 1.5 బిలియన్ డాలర్ల నుంచి 15 శాతం క్షీణించి 1.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. వ్యాపారాలను విస్తరించే ప్రణాళికల్లో ఉన్న ఎర్లీ స్టేజ్ అంకురాల్లోకి ఫండింగ్ 3.6 బిలియన్ డాలర్ల నుంచి 33 శాతం ఎగిసి 4.8 డాలర్లకు పెరిగింది. లేట్ స్టేజ్ స్టార్టప్లకు నిధులు 9.2 బిలియన్ డాలర్ల నుంచి 38 శాతం క్షీణించి 5.6 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. నివేదికలో మరిన్ని వివరాలు.. 2025–26లో 100 మిలియన్ డాలర్ల పైబడిన ఫండింగ్ లావాదేవీలు 13 నమోదయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 23గా, 2023–24లో 13గా నమోదయ్యాయి. నిధులను ఆకర్షించడంలో ఫిన్టెక్, రిటైల్ టాప్ రంగాలుగా నిల్చాయి. ప్రధానంగా ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఫిన్టెక్ కంపెనీలకు భారీ స్థాయిలో నిధులను లభించాయి. నెక్స్ట్రాలోకి 710 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు, నెయిసాలోకి 600 మిలియన్ డాలర్లు, ఐనాక్స్ క్లీన్ ఎనర్జీలోకి 344 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్లోకి దాదాపు అంతక్రితం ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే 3.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఫిన్టెక్ సంస్థలు 14 శాతం అధికంగా 2.4 బిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. రిటైల్ స్టార్టప్లలోకి పెట్టుబడులు 32 శాతం క్షీణించి 3.5 బిలియన్ డాలర్ల నుంచి 2.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఐపీవోలపరంగా టెక్ సంస్థల ఇష్యూలు 52 శాతం పెరిగి 47కి చేరాయి. లెన్స్కార్ట్, గ్రో, మీషోలాంటి బడా ఐపీవోలు వీటిలో ఉన్నాయి. 2024–25లో 4 అంకురాలు యూనికార్న్ హోదా (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్) దక్కించుకోగా, 2025–26లో ఇది 50 శాతం పెరిగి 6 స్టార్టప్లకు చేరింది. -
ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి దారి దొరికిందా?
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ విక్రయ చర్యలలో భాగంగా ప్రభుత్వం ఇద్దరు కొనుగోలుదారులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తద్వారా బ్యాంక్లో మెజారిటీ వాటా విక్రయానికి నిర్ణయించిన రిజర్వ్ ధరకంటే తక్కువకు దాఖలు చేసిన బిడ్స్ సవరణను కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంక్లో వ్యూహాత్మక వాటా విక్రయంపై ప్రస్తుతం సాంకేతిక మదింపు జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్, అసెట్ మానిటైజేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ అనిశి్చతుల ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు వివరించారు. తద్వారా ద్రవ్యపరమైన దన్నుకు దారి ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలియజేశారు. మూడేళ్ల ప్రయత్నాల తదుపరి ఐడీబీఐ బ్యాంక్లో మెజారిటీ వాటా విక్రయ చర్యలు ఫైనాన్షియల్ బిడ్ స్థాయికి చేరిన విషయం విదితమే. వెరసి ప్రభుత్వం మళ్లీ తొలి నుంచీ మొదలుపెట్టేందుకు సిద్ధంగా లేదని ప్రభుత్వ అధికారి వెల్లడించారు.ఇది బ్యాంక్ విక్రయాన్ని మరింత ఆలస్యం చేసే వీలుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వ వాటా 45.48 శాతంకాగా.. పీఎస్యూ బీమా దిగ్గజం ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. దీంతో ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా 60.72 శాతం వాటా విక్రయించేందుకు 2022 అక్టోబర్లో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు ఆహ్వానం పలికాయి. ప్రేమ్వత్సా సంస్థ ఫెయిర్ఫాక్స్, ఎమిరేట్స్ ఎన్బీడీ ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలు చేశాయి. బ్యాంక్లో ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటా విక్రయించనున్నాయి. -
బంగారం అమ్మేసుకుంటున్న దేశాలు..
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ మేఘాలు దేశాల పసిడి నిల్వలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా భావించిన బంగారాన్ని ఇప్పుడు కొన్ని దేశాలు తమ ఆర్థిక అవసరాల కోసం, ముఖ్యంగా యుద్ధ వ్యయాల కోసం విక్రయిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వివిధ దేశాల పసిడి నిల్వల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం..యుద్ధం తెచ్చిన మార్పులేంటి?ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు సాధారణంగా తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పటిష్టం చేసుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలు పసిడి నిల్వలను పెంచుకుంటుంటే, యుద్ధంలో చిక్కుకున్న కొన్ని దేశాలు మాత్రం నిల్వలను అమ్ముకుంటున్నాయి.బంగారం అమ్ముతున్న దేశాలు ఇవే..ఇటీవలి నివేదికల ప్రకారం.. మూడు ప్రధాన దేశాలు తమ పసిడి నిల్వలను విక్రయించడం లేదా తగ్గించుకోవడం చేస్తున్నాయి.రష్యా: ఉక్రెయిన్తో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా తన పసిడి నిల్వలను విక్రయించక తప్పడం లేదు. యుద్ధ వ్యయాలను భరించడానికి, పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి బయటపడటానికి రష్యా 2025 నుండి నిరంతరంగా బంగారాన్ని విక్రయిస్తోంది. ఫిబ్రవరి 2026 నాటికి రష్యా పసిడి నిల్వలు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి (సుమారు 2,327 టన్నులకు) పడిపోయినట్లు తెలుస్తోంది.టర్కీ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన కరెన్సీ 'లిరా' విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి టర్కీ సుమారు 60 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లు సమాచారం. దీని విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు.పోలాండ్: గతంలో పసిడి కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉన్న పోలాండ్, ఇప్పుడు తన రక్షణ బడ్జెట్ కోసం నిల్వలను వినియోగించుకోవాలని యోచిస్తోంది.భారత్ పరిస్థితి ఇలా..ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాత్రం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటోంది. భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 880.18 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. దీని విలువ ఫిబ్రవరి 2026 నాటికి రికార్డు స్థాయిలో 131.63 బిలియన్ డాలర్లకు చేరింది.ర్యాంకుదేశంనిల్వలు (టన్నుల్లో)నిల్వల విలువ (బిలియన్ డాలర్లలో)1అమెరికా81331,250+2జర్మనీ33505623ఇటలీ24524204ఫ్రాన్స్24374085రష్యా23273806చైనా23073877స్విట్జర్లాండ్10401758జపాన్8461429భారత్88013110నెదర్లాండ్స్612102 -
ఎలక్ట్రిక్ బుల్లెట్ వచ్చేసింది..!
ఐషర్ మోటార్స్ గ్రూప్నకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్.. ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ విభాగంలోకి అడుగుపెట్టింది. తొలి ఎలక్ట్రిక్ బైక్ ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పట్టణ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా డిజైన్ చేశారు.ఎక్స్ షోరూం ధర రూ.2.79 లక్షలు. కాగా, ‘బ్యాటరీ–యాజ్–ఎ–సర్వీస్’ ఆప్షన్తో ధరను రూ.1.99 లక్షలు కంపెనీ నిర్ణయించింది. డెలివరీలు మే చివరి నుంచి ప్రారంభం కానున్నాయి.‘‘కంపెనీ 125వ ఏడాదిలో ‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’ ద్వారా ఎలక్ట్రిక్ బైక్ల రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ మార్పు మాత్రమే కాదు, నగర ప్రయాణాలకు సరికొత్త విధానాన్ని సృష్టించడం. రాయల్ ఎన్ఫీల్డ్ వందేళ్లకు పైగా మంచి రైడింగ్ అనుభవం ఇవ్వడంపైనే దృష్టి పెట్టింది. ఇప్పుడు ‘ఫ్లయింగ్ ఫ్లీ’తో అదే అనుభవాన్ని ఎలక్ట్రిక్ బైక్లలో కొనసాగిస్తోంది’’ అని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈవో బి. గోవిందరాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ పేమెంట్ అలర్ట్.. గంట తర్వాతే చెల్లింపులు!
డిజిటల్ లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలను తగ్గించేందుకు ఆర్బీఐ కీలక చర్యలు ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి ఒక చర్చాపత్రం విడుదల చేసింది. డిజిటల్ లావాదేవీ రూ.10,000 కంటే ఎక్కువ ఉంటే ఒక గంట తర్వాతే దాన్ని అమలు చేసే విధానం (ల్యాగ్) ఉండాలని ప్రతిపాదన తెచ్చింది.వద్దనుకుంటే గంటలోపు విజయవంతం కాకముందే దాన్ని రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల సైబర్ నేరస్థులు డెబిట్ చేసుకునేట్టు అయితే ఆ లావాదేవీల సమాచారం కస్టమర్లకు ముందే తెలుస్తుంది. అలాగే, మ్యూల్ ఖాతాలకు చెక్ పెట్టేందుకు ఒక ఖాతాలోకి వచ్చే మొత్తం జమలపై పరిమితులను ప్రతిపాదించింది. మెరుగైన శ్రద్ధ లేని ఖాతాలకు వార్షిక క్రెడిట్లను సుమారు రూ .25 లక్షలకు పరిమితం చేయాలని సూచించింది.ఒకే క్లిక్తో అన్ని డిజిటల్ చెల్లింపులను నిలిపివేసే (కిల్ స్విచ్) విధానాన్ని పేర్కొంది. ఇక 70 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులను మోసపుచ్చి పెద్ద మొత్తాల్లో డబ్బులు ఖాతా నుంచి మళ్లించకుండా, ఆయా లావాదేవీలకు విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా అదనపు ధ్రువీకరణను తీసుకువచ్చే ప్రతిపాదనను చేసింది. రూ .50,000 లకు మించిన లావాదేవీల విషయంలో వినియోగదారులకు నిధులను బదిలీ చేయడానికి ముందు నామినేటెడ్ వ్యక్తి నుండి అనుమతి అవసరం. -
స్టార్లింక్కు భద్రతా అడ్డంకులు క్లియర్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని శాటిలైట్ బ్రాడ్బాండ్ కంపెనీ స్టార్లింక్ భారత్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత భద్రతా సంస్థలు విధించిన అన్ని నిబంధనలను స్టార్లింక్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్రమంలో వచ్చే వారమే డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) సమావేశమై ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.కీలక భద్రతా అనుమతులు పూర్తిభారత టెలికాం నిబంధనల ప్రకారం కఠినమైన భద్రతా పరీక్షలను స్టార్లింక్ ఎదుర్కొంది. ముఖ్యంగా అక్టోబర్ 2025లో ముంబైలో ప్రారంభించిన ఎక్విప్మెంట్ టెస్టింగ్ (పరికరాల పరీక్ష) ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. శాటిలైట్ కమ్యూనికేషన్ల ద్వారా దేశ భద్రతకు ఎటువంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ గ్రీన్ సిగ్నల్ లభించిందని కంపెనీ తెలిపింది. వచ్చే వారం డీసీసీ ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం ముందుకు వెళ్లనుంది. అక్కడ క్లియరెన్స్ రాగానే భారత్లో స్టార్లింక్ సేవలు అధికారికంగా ప్రారంభమవుతాయి.వేగవంతమైన పరిణామాలుఏప్రిల్ 1న స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్, వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయిన తర్వాత ఈ ప్రక్రియ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ చర్చల ఫలితంగానే పెండింగ్లో ఉన్న సాంకేతిక, భద్రతాపరమైన అంశాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.టెలికాం దిగ్గజాల మధ్య పోటీస్టార్లింక్ రాకతో భారత శాటిలైట్ బ్రాడ్బాండ్ రంగంలో పోటీ తీవ్రతరం కానుంది. ఇప్పటికే ఈ రంగంలో పాగా వేయాలని చూస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన జియో స్పేస్ఫైబర్, సునీల్ భారతీ మిట్టల్ మద్దతు ఉన్న యూటెల్శాట్ వన్వెబ్ సంస్థలకు స్టార్లింక్ గట్టి పోటీ ఇవ్వనుంది. మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు హై-స్పీడ్ డేటాను అందించడంలో ఈ పోటీ సామాన్యులకు మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.స్పెక్ట్రమ్ ధరపై ఇంకా సందిగ్ధతభద్రతా పరమైన అనుమతులు లభించినప్పటికీ స్పెక్ట్రమ్ ధరల విషయంలో ప్రభుత్వం, నియంత్రణ సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఏడాదికి 4 శాతం స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీని ట్రాయ్ సిఫార్సు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మాత్రం 5 శాతం ఛార్జీ వసూలు చేయాలని మొగ్గు చూపుతోంది. అంతేకాకుండా, వినియోగదారుల టెర్మినల్స్పై సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. తద్వారా పూర్తిగా మార్కెట్ ఆధారిత ధరలే అమలయ్యే అవకాశం ఉంది.వ్యూహాత్మక భాగస్వామ్యాలుసేవలు ప్రారంభించక ముందే స్టార్లింక్ తన నెట్వర్క్ పంపిణీ కోసం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలతో పంపిణీ ఒప్పందాలు కుదుర్చుకోవడం విశేషం. ఎయిర్టెల్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవల విస్తరణపై దృష్టి పెట్టగా, జియో తన నెట్వర్క్లో శాటిలైట్ బ్రాడ్బాండ్ను అంతర్భాగం చేయనుంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా కూడా ఏఎస్టీ స్పేస్మొబైల్తో జతకట్టి ఈ పోటీలో నిలిచేందుకు సిద్ధమైంది.ఇదీ చదవండి: రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట! -
బంగారు.. తారుమారు! ధరలు మారాయిలా..
దేశంలో బంగారం ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. క్రితం రోజు భారీగా తగ్గిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు మళ్లీ పెరుగుదలను అందుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రఫేల్ డీల్.. ‘స్వదేశీ’ అస్త్రాలకు పెద్దపీట!
భారత వాయుసేన(ఐఏఎఫ్)లో సుమారు రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో కొనుగోలు చేయనున్న 114 రఫేల్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ (ఎంఆర్ఎఫ్ఏ) ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిబంధనను చేర్చబోతోంది. ఈ యుద్ధ విమానాల్లో భారతీయ క్షిపణులు, ఆయుధ వ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు వీలుగా ‘ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్’ (ఐసీడీ)ను ఒప్పందంలో అంతర్భాగం చేయాలని భారత్ నిర్ణయించుకుంది.ఏమిటీ ఐసీడీ? దీని ప్రాముఖ్యత ఏంటి?సాధారణంగా ఏ దేశమైనా ఇతర దేశాల నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసినప్పుడు ఆ విమానాల తయారీ సంస్థలు తమ సొంత క్షిపణులను మాత్రమే వాడుకునేలా సాఫ్ట్వేర్ కట్టడి చేస్తాయి. అయితే, రాబోయే 114 రాఫెల్ విమానాల విషయంలో భారత్ భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. తుది ఒప్పందంలో ఐసీడీలో మార్పులు చేయడంతో భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణులు రఫేల్ వ్యవస్థతో అనుసంధానం కావడానికి మార్గం సుగమం అవుతుంది.దీనివల్ల భవిష్యత్తులో మనం ఫ్రాన్స్ నుంచి ఖరీదైన క్షిపణులను కొనాల్సిన అవసరం లేకుండా దేశీయ టెక్నాలజీతో గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులను, ఇతర స్వదేశీ బాంబులను ఈ విమానాల ద్వారా ప్రయోగించవచ్చు.మేక్ ఇన్ ఇండియాకు ఊతంఫిబ్రవరి 12న డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఈ భారీ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. వచ్చే నెలలో డసో ఏవియేషన్ సంస్థకు ‘రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్’ (ఆర్ఎఫ్పీ) జారీ కానుంది. మొత్తం 114 విమానాలలో 18 విమానాలు నేరుగా ఫ్రాన్స్ నుంచి సిద్ధంగా వస్తాయి. మిగిలిన 96 విమానాలు 25 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లోనే తయారవుతాయి. ఇది దేశీయ రక్షణ రంగ తయారీలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.సోర్స్ కోడ్ వివాదంపై స్పష్టతసోర్స్ కోడ్ బదిలీ విషయంలో వస్తున్న అపోహలను రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కొట్టిపారేశారు. ఏవియానిక్స్, రాడార్, ఫ్లైట్ కంట్రోల్ వంటి కీలక విధులను నియంత్రించే సోర్స్ కోడ్ను పంచుకోకపోవడం అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక ప్రామాణిక పద్ధతి. భారత్కు అత్యంత సన్నిహిత దేశాలైన రష్యా (Su-30 MKI విషయంలో), అమెరికా కూడా తమ సోర్స్ కోడ్లను ఎవరికీ పంచుకోవు. అయినప్పటికీ, ఐసీడీ ద్వారా సాఫ్ట్వేర్ అనుసంధానత లభిస్తుంది కాబట్టి, సోర్స్ కోడ్ లేకపోయినా మన ఆయుధాలను వాడుకోవడానికి ఎటువంటి ఆటంకం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ? -
450 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 151 పాయింట్లు పెరిగి 23,926 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 458 పాయింట్లు ఎగబాకి 77,122 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.89బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 96.2 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.62 శాతం పెరిగింది.నాస్డాక్ 0.83 శాతం పుంజుకుంది.Today Nifty position 10-04-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టీసీఎస్ బోణీ బాగుంది! ఇక ఏప్రిల్ 1 నుంచే వేతనాల పెంపు
ఐటీ పరిశ్రమలో ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆకర్షణీయమైన ఫలితాలతో క్యూ4 సీజన్కి బోణీ కొట్టింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 12.22 శాతం వృద్ధితో రూ. 13,718 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో ఇది రూ. 10,657 కోట్లుగా ఉండగా, అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ4లో రూ. 12,224 కోట్లుగా నమోదైంది.ఆదాయం రూ. 64,479 కోట్ల నుంచి సుమారు 10 శాతం వృద్ధితో రూ. 70,698 కోట్లకు ఎగిసింది. 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ లాభం 1.35 శాతం వృద్ధితో రూ. 48,553 కోట్ల నుంచి రూ. 49,210 కోట్లకు చేరింది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 2.67 లక్షల కోట్లుగా నమోదైంది. ఒక్కో షేరుకు రూ. 31 చొప్పున తుది డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. దీనితో పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 39,571 కోట్ల మేర డివిడెండ్ ఇచ్చినట్లవుతుంది.ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు..క్యూ4లో నిర్వహణ మార్జిన్ 24.2 శాతం నుంచి 25.3 శాతానికి పెరిగింది. వార్షికంగా 2.3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండేలా క్యూ4లో ఏఐ ఆదాయాలు నమోదయ్యాయి. నాలుగో త్రైమాసికంలో 12 బిలియన్ డాలర్ల విలువ చేసే కొత్త డీల్స్ కుదిరాయి.కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఏఐ నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణిని గతేడాది తరహాలోనే కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ కంపెనీ కొనసాగించనుంది.ఉద్యోగులు పెరిగారు.. వరుసగా రెండు త్రైమాసికాల పాటు క్షీణించిన ఉద్యోగుల సంఖ్య క్యూ4లో మళ్లీ పెరిగింది. నికరంగా 2,356 మంది చేరడంతో మార్చి ఆఖరు నాటికి మొత్తం సంఖ్య 5,84,519కి చేరింది. ఉద్యోగాల కోత చేపట్టడం వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 23,460 మేర తగ్గింది.వేతనాల పెంపు ఏప్రిల్ 1 నుంచే..ఏప్రిల్ 1 నుంచి తిరిగి వేతనాల పెంపును అమలు చేసే విధానానికి మళ్లినట్లు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ తెలిపారు. గతేడాది ఇంక్రిమెంటు లభించని సీనియర్ సిబ్బంది ఈసారి అందుకోనున్నారు. టాప్ పర్ఫార్మర్లకు రెండంకెల స్థాయిలో పెంపు ఉంటుంది.టెక్నాలజీపై పెట్టుబడులకు ఆసక్తిసీక్వెన్షియల్గా వరుసగా మూడో క్వార్టర్లో వృద్ధిని సాధించాం. స్థూల ఆర్థిక పరిస్థితుల రీత్యా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, టెక్నాలజీపై కస్టమర్లు పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మాకు ఇది సానుకూలాంశంగా ఉంటుంది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈవో, ఎండీ -
జీసీసీ లీజింగ్.. రికార్డ్
విదేశీ సంస్థలు భారత్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు పోటీ పడుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 9.1 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కార్యాలయ స్థలాలను (ఆఫీస్ స్పేస్) జీసీసీల ఏర్పాటుకు విదేశీ సంస్థలు టాప్–9 నగరాల్లో తీసుకున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ తెలిపింది.ఒక త్రైమాసికంలో జీసీసీలకు సంబంధించి ఇదే గరిష్టమని పేర్కొంది. మార్చి త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ నగరాల్లో 5 శాతం పెరిగి 20.7 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. 2025 మొదటి మూడు నెలల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 19.7 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉంది. హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె, ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతా, అహ్మదాబాద్, కోచి నగరాల డేటాను ఈ నివేదికలో సీబీఆర్ఈ ప్రస్తావించింది.జీసీసీ లీజింగ్ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదు కావడం అన్నది సంక్లిష్టమైన సామర్థ్య కార్యకలాపాలకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా అవతరిస్తుండడానికి సంకేతమని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ తెలిపారు. ఏదో ఒక రంగానికే ఈ డిమాండ్ పరిమితం కాలేదని, ఈ–కామర్స్, టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ ఇలా ఎన్నో రంగాల్లో నెలకొన్నట్టు చెప్పారు. అమెరికా సంస్థలే ముందు.. టాప్–9 నగరాల్లో జీసీసీలకు సంబంధించి తీసుకున్న లీజింగ్లో 73 శాతం అమెరికా సంస్థల నుంచే ఉన్నట్టు సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. పర్యావరణ అనుకూలమైన సర్టిఫికేషన్, మెరుదైన సదుపాయాలు ఉన్న వాటికి కిరాయిదారులు ప్రాధాన్యమిస్తున్నట్టు సీబీఆర్ఈ ఎండీ (లీజింగ్ సర్వీసెస్) రామ్ చందానీ తెలిపారు.జీసీసీలు బహుళ కార్యకలాపాలకు సంబంధించి ఆవిష్కరణల కేంద్రాలుగా మారుతున్నాయని, ఏఐ అనుకూల కార్యాలయ వ్యూహాలను సంస్థలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. టాప్–9 నగరాల్లో బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ 29 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్ 22 శాతం, ముంబైలో 16 శాతం వాటా కలిగి ఉన్నాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో టాప్–9 నగరాల్లోని కార్యాలయ స్థలాల మొత్తం లీజింగ్లో ఈ మూడు నగరాల వాటాయే 67 శాతం ఉండడం గమనార్హం. -
విదేశీ చెల్లింపులపై కస్టమర్లకు వెంటనే సమాచారం
ముంబై: విదేశాల నుంచి భారత్లోని ఖాతాలకు వచ్చే సీమాంతర చెల్లింపులపై (జమలు) ఖాతాదారులకు వెంటనే సమాచారం (నోటిఫికేషన్) ఇవ్వాలని బ్యాంక్లకు ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకు వీలుగా తమ ప్రక్రియలను క్రమబద్దీకరించుకోవాలని సూచించింది. ఖాతాలో జమ అయిన వెంటనే కస్టమర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది.ఫారెక్స్ మార్కెట్ పనిచేయని వేళ్లలో వచ్చే చెల్లింపుల విషయాన్ని మరుసటి రోజు తెలియజేయాలని కోరింది. బ్యాంకులు తమ విదేశీ ఖాతాల లావాదేవీలను గరిష్టంగా ఒక గంటలోపే పరిశీలించి సరిచూడాలని ఆదేశించింది. ఫారీన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ పనివేళ్లలో వచ్చే చెల్లింపులను మాత్రం అదే రోజు జమ చేయాలని పేర్కొంది. ఇందుకు వీలుగా వ్యవస్థలను సరిచేసుకోవాలని సూచించింది.2025 అక్టోబర్ 29న జారీ చేసిన ముసాయిదా నిబంధనలపై భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ నిబంధనలను ఆర్బీఐ జారీ చేసింది. ఇవి ఆరు నెలల తర్వాత నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం సీమాంతర చెల్లింపులకు సంబంధించి సమాచారం అందించిన వెంటనే, ఆ మొత్తాన్ని తక్షణమే సంబంధిత లబ్దిదారు ఖాతాలో జమ చేయనప్పటికీ, కస్టమర్లకు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. -
భారత్ పెట్రోలియం సీఎండీగా సంజీవ్ ఖన్నా
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కొత్త చైర్మన్, ఎండీగా (సీఎండీ) సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు బీపీసీఎల్లోనే రిఫైనరీస్కు ఆయన డైరెక్టర్గా పనిచేశారు. సీఎండీగా జి.కృష్ణకుమార్ పదవీ కాలం 2025 ఏప్రిల్30తో ముగిసింది.అప్పటి నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలను సైతం ఖన్నాయే చూశారు. పెట్రోలియం శాఖ నుంచి నియామకం సమాచారం రావడంతో సీఎండీ బాధ్యతలను ఖన్నా స్వీకరించినట్టు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు బీపీసీఎల్ సమాచారం ఇచ్చింది. ఆయన నియామకం ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది.2029 మే 31 వరకు (పదవీ విరమణ) లేదంటే తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతలు చూస్తారని తెలిపింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లిలో ఖన్నా కెమికల్ ఇంజనీర్ చదివారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఫైనాన్స్ మేనేజ్మెంట్లో పోస్ట్గ్రాడ్యుయేషన్ సైతం పూర్తి చేశారు. -
పసిడి, వెండి రివర్స్గేర్
న్యూఢిల్లీ: అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధానికి రెండు వారాల విరామంపై అంగీకారంతో ర్యాలీ చేసిన పసిడి, వెండి ఒక్క రోజు తిరగకుండానే గురువారం అమ్మకాల ఒత్తిడికి నష్టపోయాయి. కాల్పుల విరమణకు విరుద్ధంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేసిందంటూ, ఒప్పందం నుంచి తప్పుకుంటామని ఇరాన్ చేసిన హెచ్చరికలు, హర్మూజ్ను మూసేసిందన్న వార్తలతో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.ఈ ప్రభావంతో ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి ఏకంగా రూ.7,800 నష్టపోయి రూ.2.43 లక్షలకు దిగొచి్చంది. అటు బంగారం 10 గ్రాములకు రూ.1,500 తగ్గి రూ.1,54,900 స్థాయికి పరిమితమైంది. ‘పశి్చమాసియాలో కాల్పుల విరమణపై ఏర్పడ్డ సందేహాలతో బంగారం, వెండి ముందటి రోజు లాభపడిన స్థాయిలో నష్టపోయాయి. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై అనిశి్చతులు నెలకొనడం, ట్యాంకర్లు నిలిచిపోయాయన్న సమాచారం మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపించింది.దీంతో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనలు తిరిగి నెలకొన్నాయి’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 12 డాలర్లు పెరిగి 4,789 డాలర్ల వద్ద ఉంటే, వెండి 0.74 డాలర్ల నష్టంతో 74.83 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. -
సవాళ్లున్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలను తట్టుకునేలా భారత్ పటిష్టమైన స్థితిలోనే ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారీ స్థాయిలో విదేశీ మారక నిల్వలు, తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం, మరింతగా వ్యయం చేయగలిగే సామర్థ్యాల వల్ల గ్లోబల్ ఇంధన షాక్లను ఎదుర్కొనగలదని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) వృద్ధి అంచనాలను 6.6 శాతానికి పెంచినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్, ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభంలోకి పటిష్టమైన స్థితిలోనే అడుగుపెట్టిందని వరల్డ్ బ్యాంక్ రీజనల్ ప్రాక్టీస్ డైరెక్టర్ (దక్షిణాసియా) సెబాస్టియన్ ఎకార్ట్ తెలిపారు. యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకోవడంతో పాటు సానుకూల పాలసీలు మొదలైన అంశాలు భారత్ అధిక వృద్ధి సాధించేందుకు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, మిగతా వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత్తో పాటు ప్రాంతీయంగా మిగతా దేశాలు పటిష్టమైన వృద్ధి సాధించగలవని భావిస్తున్నాం‘ అని వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా ఉన్న భారత్ వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతానికి చేరింది. దేశీయంగా డిమాండ్ పటిష్టంగా ఉండటం, ఎగుమతులు మెరుగ్గా నమోదు కావడం ఇందుకు తోడ్పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరపు అంచనాలు అంతకన్నా తక్కువగా 6.6 శాతంగానే ఉన్నప్పటికీ, జనవరిలో వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న 6.5 శాతం కన్నా కొంత ఎక్కువే కావడం గమనార్హం. వేగవంతమైన వృద్ధి..: ఎగుమతులపై అత్యధిక టారిఫ్లను ఎదుర్కొన్నప్పటికీ గతేడాది భారత్ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందిన ఎకానమీగా నిల్చిందని ఇండియాకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ లీడ్ ఎకానమిస్ట్ ఆరిలియెన్ క్రూస్ తెలిపారు. ఆదాయ పన్ను కోతలు, జీఎస్టీ రేట్ల తగ్గింపులాంటివి దేశీ వినియోగం పెంచడానికి దోహదపడ్డాయన్నారు. ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొందని, అయితే రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో రిస్క్ లు తలెత్తే అవకాశం ఉన్నందున వృద్ధిపై ప్రభావం పడొచ్చని క్రూస్ పేర్కొన్నారు. -
సరైన విజన్తో విశ్వగురువుగా అవతరిస్తాం
న్యూఢిల్లీ: భారత్ విశ్వగురువుగా, సూపర్ ఎకానమీగా అవతరించాలంటే అందుకు భవిష్యత్ అభివృద్ధికి సంబంధించి దార్శనికత అవసరమని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 11వ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. టెక్నాలజీ, ఆర్థికంగా లాభసాటి, ముడి సరకుల లభ్యత, తుది ఉత్పత్తుల మార్కెట్కు ఆధారంగా నిలిచే పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. ఎగుమతుల మార్కెట్ సామర్థ్యాలను అర్థం చేసుకోవాలంటూ.. వ్యవసాయం, అనుబంధ రంగాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. బ్లూ ఎకానమీలో (సముద్ర, తీర ప్రాంత వనరుల ఆధారిత)ఒక్క మత్స్యరంగమే రూ.7 లక్షల కోట్ల మార్కెట్గా అవతరించగలదన్నారు. ఇందులో సగం మేర ఎగుమతులు చేయొచ్చన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలని మంత్రి సూచించారు. సవాళ్లను ఎదుర్కోగలం ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాన్ని భారత్ ఎదుర్కోగలదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పరిపూర్ణత కలిగిన ప్రజాస్వామ్యం, దౌత్యం, వైవిధ్యం, నిర్ణయాత్మక చర్యలతో దీన్ని అధిగమిస్తామని చెప్పారు. ఏఐఎంఏ సదస్సులో భాగంగా మంత్రి సింధియా మాట్లాడారు. ‘‘భారత్ నేడు పలు దేశాలతో సంప్రదింపులు నిర్వహించగలదు. హర్మూజ్ జలసంధి ద్వారా భారత్ ఓడలు నేడు తీరాలకు చేరుకుంటున్నాయి’’అని మంత్రి సింధియా వివరించారు. ప్రతీ గ్రామాన్ని బ్రాడ్బ్యాండ్తో అనుసంధానించేందుకు ప్రభుత్వం రూ.1.39 లక్షల కోట్లను ఖర్చు చేస్తోందని చెప్పారు. దీంతో బ్రాడ్బ్యాండ్ వృద్ధి 10 శాతం పెరుగుతుందన్నారు. వచ్చే ఐదు, పదేళ్లలో భారత్ జీడీపీ పరిమాణం మరో 1.5–2 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందన్నారు. కీలక ఖనిజాలు ఎంతో అవసరం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంధన వనరుల్లో వైవిధ్యం, కీలక ఖనిజాల లభ్యత ఎంతో అవసరమని టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సవాళ్లు సహజమేనన్నారు. వైవిధ్యంలోనూ సమస్యలు ఉన్నాయంటూ.. దిగుమతులపై ఆధారపడడం కాకుండా, అవి నిరాటంకంగా సాగేలా రాజకీయ సమ్మతి కూడా అవసరమేనన్నారు. ప్రపంచం విశ్వసనీయమైన భాగస్వాముల కోసం చూస్తోందంటూ.. భారత్ ఎగుమతుల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలదన్నారు. ఏఐతో కలసి నడవాల్సిందే.. వచ్చే దశాబ్ద కాలాన్ని కృత్రిమ (ఏఐ) మేధ శాసించనుందని.. ఏఐని సది్వనియోగం చేసుకునేందుకు, ఏఐ ఆధారిత టెక్నాలజీలకు మారేందుకు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడంతోపాటు విద్యా సంస్కరణలు అవసరమని వెటరన్ బ్యాంకర్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ కేవీ కామత్ అభిప్రాయపడ్డారు. ఖరీదైన ఫౌండేషన్ మోడళ్ల కంటే వాస్తవ పరిష్కారాలపై భారత్ దృష్టి సారించాలని సూచించారు. లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను సృష్టించడం కాకుండా, వాటి అవసరం ఎక్కడో ఉందో చూడాలన్నారు. ఏఐ సామర్థ్యాల పెంపునకు, వ్యయాల తగ్గింపునకు, కస్టమర్లకు మెరుగైన అనుభవానికి సాయపడుతుందని చెప్పారు. స్కూళ్లు, కాలేజీల నుంచి వచ్చే విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వాలని, పాఠ్యాంశాల్లో సమగ్రమైన మార్పు కూడా అవసరమేనన్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. భారత్లో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు నియంత్రిత పరిధిలో ఉన్నట్టు చెప్పారు. సంక్షోభాలతో అవకాశాలు: శక్తికాంతదాస్ అంతర్జాతీయ సంక్షోభా ల్లో భారత్ స్థిరంగా నిలబడడమే కాకుండా, వాటిని అవకాశాలుగా మలుచుకుని మరింత బలంగా అవతరించినట్టు ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. రియల్ జీడీపీ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతంగా (అంచనా) ఉన్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు గత ఐదేళ్లలో సగటు వృద్ధి 7.8 శాతంగా ఉండడాన్ని గుర్తు చేశారు. స్థూల ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో నిలకడ, మౌలిక వసతుల ఆధారిత వృద్ధి, బలమైన దేశీ వినియోగ డిమాండ్ను దాస్ ఏఐఎంఏ సదస్సులో భాగంగా ప్రస్తావించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అస్థిరతలు, సరఫ రా వ్యవస్థలో అవరోధాలు, వృద్ధిలో అసమానతలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోందని.. ఈ రిస్క్లు ప్రతికూలంగా ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ.. ఆర్థిక స్థిరత్వానికి ఇది ఎంతో ముఖ్యమన్నారు. వేగవంతమైన డిజిటలైజేషన్, తయారీ రంగ వృద్ధిని గుర్తు చేశారు. కరోనా విపత్తు సమయంలో ఆర్బీఐ గవర్నర్గా (2018 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్) దాస్ పాలసీ చర్యలతో ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవడం తెలిసిందే. -
ఏడాదిలో రెండోసారి.. మరోమారు పెరిగిన ధరలు!
ఇతర వాహన తయారీ సంస్థల మాదిరిగానే.. హ్యుందాయ్ కంపెనీ కూడా తన మొత్తం మోడల్ లైనప్లో ధరల అప్డేట్ ప్రకటించింది. 2026 మే 1 నుంచి కొత్త ధరలు (1 శాతం పెరుగుదలతో) అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ధృవీకరించింది.హ్యుందాయ్ ప్రకారం.. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చుల కారణంగా ధరలను పెంచడం జరిగిందని తెలుస్తోంది. అయితే వినియోగదారులను అధిక ప్రభావం పడకుండా.. ఖర్చులలోని హెచ్చుతగ్గులను తామే భరించడానికి ప్రయత్నించినప్పటికీ, ఖర్చులు నిరంతరం పెరుగుతుండటంతో, ఆ భారాన్ని కొంతమేరకు స్వల్ప ధర పెంపు ద్వారా వినియోగదారులపై మోపవలసి వచ్చిందని కంపెనీ తెలిపింది.ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయం కంపెనీ వెల్లడించలేదు. కొత్త ధరలు త్వరలోనే వెల్లడవుతాయి. కాగా హ్యుందాయ్ కంపెనీ వాహనాల ధరలను పెంచడం 2026లో రెండవసారి. గత జనవరిలో.. తన అన్ని మోడళ్లపై 0.6 శాతం వరకు ధరలను పెంచింది. ఇటీవలే.. మార్చిలో ప్రారంభ ధర ముగిసిన తర్వాత, కంపెనీ హ్యుందాయ్ వెన్యూ ధరను రూ. 20,000 మేర సవరించింది. -
WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్
కొన్ని కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగం నీటి మీద బుడగ మాదిరిగా అయిపోయింది. ఎప్పుడు జాబ్ పోతుందో?, ఎందుకు పోతుందో? తెలియక చాలామంది ఇప్పటికి కూడా భయం గుప్పెట్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో.. ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కోరిన ఉద్యోగిని, బాస్ రెండు నిమిషాల్లోనే తొలగించారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గురుగ్రామ్కు చెందిన స్టార్టప్ ఫౌండర్ నిఖిల్ రాణా.. కంపెనీ The 15లో, ఒక ఉద్యోగిని కేవలం రెండు నిమిషాలలో తొలగించేసారు. దీనికి కారణం ఆ ఉద్యోగి ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడగడమే అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు.నిఖిల్ రాణా.. ఉద్యోగిని తొలగించడమే కాకుండా, ఆ విషయాన్ని లింక్డ్ఇన్లో షేర్ చేసారు. అంతే కాకుండా కంపెనీలో ఉద్యోగుల నుంచి తాను ఏమి కోరుకుంటున్నాడనే విషయాన్ని కూడా వెల్లడించారు. నోటిస్ పీరియడ్ అనేది సమయం వృధా అని కూడా పేర్కొన్నారు.''స్వంత బాధ్యత తీసుకునే వ్యక్తులు, ఫౌండర్లపై ఆధారపడగలిగే వ్యక్తులు, ‘హై ఏజెన్సీ’ కలిగిన వ్యక్తులు, సరిగ్గా సమయం కోసం వేచి కూడదు, పనిని పూర్తి చేయగల వ్యక్తులు'' తనకు కావాలని నిఖిల్ రాణా చెప్పారు. నైపుణ్యాలకు ఎవరూ చిల్లిగవ్వ కూడా విలువ ఇవ్వరు. ఎందుకంటే అవి ఇప్పుడు సాధారణమయ్యాయి అని అన్నారు.నిఖిల్ రాణా తీరుపై చాలామంది విమర్శిస్తున్నారు. సానుభూతి లేకుండా ప్రవర్తించాడని, కేవలం ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగినందుకు తక్షణమే తొలగించడం అన్యాయం అని అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఉద్యోగుల నిబద్ధతకు మరింత ఖచ్చితమైన ప్రమాణాలు ఉండాలనేది రాణా ఫీప్రాయమని కొందరు మద్దతు ఇచ్చారు. -
ఉద్యోగం - ఆర్థిక స్వేచ్ఛ: కియోసాకి సూచన
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆర్ధిక పరమైన విషయాలు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగానే నిజమైన ఆర్థిక స్వేచ్ఛను ఎప్పుడు, ఎలా పొందాలనే విషయం వెల్లడించారు.రాబర్ట్ కియోసాకి ప్రకారం.. మనం జీవితాంతం ఇతరుల కోసం పని చేస్తూ ఉంటే, మనకు తక్షణ అవసరాలు తీరవచ్చు. కానీ.. దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛ సాధ్యం కాదు. ఈ మాటల అర్థం ఉద్యోగం చేయడం తప్పు అని చెప్పడం కాదు. ఉద్యోగం మనకు ఆదాయం ఇస్తుంది, కానీ అది ఒకే మార్గంగా ఉంటే, మనం సంపదను సృష్టించలేము.మనం సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని పెట్టుబడులుగా మార్చి, మనకోసం పని చేసే ఆస్తులను నిర్మించాలి. ఉదాహరణకు.. ఇల్లు అద్దెకు ఇవ్వడం, షేర్లలో పెట్టుబడి పెట్టడం లేదా చిన్న వ్యాపారం ప్రారంభించడం. ఇవి మనం పని చేయకపోయినా డబ్బు తీసుకువస్తాయి.ఆదాయం కోసం పనిచేయడం అంటే.. ఆర్థికంగా మీరు స్వేచ్ఛగా లేనట్లే. అంటే మనం పని చేయలేకపోతే, ఆదాయం ఆగిపోతుంది. కాబట్టి మన దగ్గర ఆస్తులు ఉంటే.. అవి మనకోసం పని చేస్తూ డబ్బు సంపాదిస్తాయి. ఇదే నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం.చాలా మంది ''స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు, జీవితం సురక్షితం'' అని భావిస్తారు. కానీ నేటి కాలంలో ఖర్చులు పెరుగుతున్నాయి, ఆర్థిక నిర్ణయాలు క్లిష్టమవుతున్నాయి. చాలా మంది నెలాఖరులో డబ్బు మిగలకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే రాబర్ట్ కియోసాకి ఈ విధమైన పరిష్కారం చెబుతున్నారు.కియోసాకి మాటలను జీవితంలో అమలు చేయాలంటే?➤ముందుగా మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో గమనించాలి. ➤ప్రతి నెలలో కొంత మొత్తాన్ని ముందుగా పెట్టుబడిగా పెట్టాలి. ➤ఆర్థిక విషయాలపై కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.➤మన పని సమయానికి సంబంధం లేకుండా ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించాలి.➤పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ముందు.. అది మనకు లాభం తెస్తుందా లేక నష్టమా అనేది ఆలోచించాలి.మొత్తం మీద ''కేవలం కష్టపడి పని చేయడం కాదు, తెలివిగా పని చేసి మనకోసం పని చేసే వ్యవస్థలను నిర్మించాలి''. అప్పుడు మాత్రమే మనం నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందగలం అని కియోసాకి విశ్వసిస్తారు.ఇదీ చదవండి: ఒక వైపు 30వేల లేఆఫ్స్.. మరోవైపు రూ.270 కోట్ల ఆఫర్! -
‘హెక్టాకార్న్’గా మారిన రిలయన్స్ రిటైల్
రిలయన్స్ రిటైల్ ప్రపంచంలో అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్ట్అప్ కంపెనీల గ్లోబల్ జాబితాలో 7వ స్థానాన్ని సాధించింది. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చేసిన పరిశోధన ప్రకారం.. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువతో ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. అత్యంత విలువైన టాప్ 100 స్టార్టప్ కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. అందులో రిలయన్స్ రిటైల్ అత్యున్నత ర్యాంక్ సాధించి, భారతదేశం బలమైన ప్రాతినిధ్యాన్ని చాటింది.రిపోర్ట్ ప్రకారం.. రిలయన్స్ రిటైల్ పోస్ట్ మనీ విలువ 100 బిలియన్ డాలర్లకు మించి ఉంది. దీంతో ఇది ప్రపంచంలో ‘హెక్టాకార్న్’గా పిలవబడే ఏడు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్లను ‘హెక్టాకార్న్’ అని అంటారు. టాప్ 7 కంపెనీల్లో రిటైల్ రంగానికి చెందిన ఏకైక సంస్థ రిలయన్స్ రిటైల్ మాత్రమే.ఈ సంస్థకు ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, కెకేఆర్, సిల్వర్ లేక్, జీఐసీ, టీపీజీ, ముబాదాలా వంటి ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు లభించాయి. ఇన్వెస్టర్లు నిర్ణయించిన కంపెనీ విలువనే ఈ ర్యాంకింగ్కు ప్రధాన ప్రమాణంగా తీసుకున్నారు. ఈ ర్యాంకింగ్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యొక్క వెంచర్ క్యాపిటల్ ఇనిషియేటివ్ పరిశోధన ఆధారంగా, జనవరి 2026 వరకు ఉన్న డేటాతో రూపొందించబడింది.జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఓపెన్ఏఐ, స్పేస్ఎక్స్, ఆంత్రోఫిక్ ఉన్నాయి. ఇది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్లో టెక్నాలజీ, ఏఐ కంపెనీల పెరుగుతున్న ఆధిపత్యాన్ని సూచిస్తుంది.ఈ రిపోర్ట్లో మొత్తం మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా 24 బిలియన్ డాలర్ల విలువతో 27వ స్థానంలో ఉంది. టాటా ఈవీ మొబిలిటీ 9 బిలియన్ డాలర్ల విలువతో 93వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 65 కంపెనీలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, కాగా చైనా నుంచి 21 కంపెనీలు ఉన్నాయి. భారత్, బ్రిటన్ నుంచి తలో మూడు కంపెనీలు చోటు సంపాదించాయి. -
4 రోజులే పని.. నచ్చినప్పుడే చేయొచ్చు..
కార్పొరేట్ ప్రపంచంలో 'హస్టిల్ కల్చర్' (నిరంతరం కష్టపడటం) పేరుతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వేళ, యూకేకి చెందిన ఒక పారిశ్రామికవేత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పని గంటల సంఖ్య కంటే, ఇచ్చే 'ఫలితాల'కే (Results-Only) ప్రాధాన్యతనిస్తూ తన సంస్థలో సరికొత్త పని వాతావరణాన్ని సృష్టించారు.ఒక్క మెసేజ్తో మొదలైన చర్చ'స్పైసీ మార్గరిటా' అనే ఎస్ఈఓ (SEO) కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు బెన్ గూడీ, ఇటీవల తన లింక్డ్ఇన్ పోస్ట్లో ఒక ఆసక్తికరమైన సంభాషణను పంచుకున్నారు. తన బృందంలోని ఒక సభ్యుడు, "ఈ రోజు నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఈ పనిని వారాంతంలో పూర్తి చేయనా?" అని అడగడానికి ఇబ్బంది పడటం చూసి బెన్ ఆశ్చర్యపోయారు."నా సంస్థలో ఎవరినైనా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినప్పుడు, నచ్చిన చోట పని చేసుకోవచ్చు. పని పూర్తవుతుందా లేదా అన్నదే ముఖ్యం" అని బెన్ స్పష్టం చేశారు.బర్న్ అవుట్ నేర్పిన పాఠంతానూ గతంలో సాధారణ ఉద్యోగిగా ఉన్నప్పుడు తీవ్రమైన 'బర్న్ అవుట్' (మానసిక, శారీరక అలసట) అనుభవించానని బెన్ గుర్తు చేసుకున్నారు. కేవలం పై అధికారులను మెప్పించడానికి, ఆఫీసులో ఎక్కువ గంటలు గడపడానికి ప్రయత్నించి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన సొంత కంపెనీలో అలాంటి పరిస్థితులు ఉండకూడదని నిర్ణయించుకున్నారు.బెన్ గూడీ కంపెనీలో ప్రత్యేకతలువారానికి 4 రోజుల పని: రీఛార్జ్ అవ్వడానికి తగినంత సమయం.వర్క్ ఫ్రమ్ ఎనీవేర్: ప్రపంచంలో ఎక్కడి నుండైనా పని చేసే వెసులుబాటు.నిర్ణీత గంటలు లేవు: ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు కూర్చోవాలనే నిబంధన లేదు.అనవసర సమావేశాలకు స్వస్తి: సమయాన్ని వృధా చేసే మీటింగ్స్ను దాటవేసే స్వేచ్ఛ.సోషల్ మీడియాలో ప్రశంసల జల్లుబెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. "చాలా ఆఫీసుల్లో డెస్క్ దగ్గర ఎన్ని గంటలు కూర్చున్నారనే లెక్కిస్తారు కానీ, ఎంత పని చేశారనేది చూడరు. మీ ఆలోచన చాలా బాగుంది" అని ఒకరు వ్యాఖ్యానించగా.. "అనుమతి అడగడానికి ఉద్యోగులు భయపడుతున్నారంటే, అది పాత కార్పొరేట్ వ్యవస్థలు వారికి నేర్పిన భయం. దాన్ని పోగొట్టడానికి సమయం పడుతుంది" అని మరొకరు అభిప్రాయపడ్డారు.బెన్ గూడీ నేపథ్యంలండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన బెన్ గూడీ, వివిధ రంగాల్లో అనుభవం గడించిన తర్వాత 2024లో 'స్పైసీ మార్గరిటా'ను స్థాపించారు. ప్రస్తుతం ఆయన తన సంస్థలో స్ట్రాటజీ లీడ్గా ఉంటూనే, ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. -
ఒక వైపు 30వేల లేఆఫ్స్.. మరోవైపు రూ.270 కోట్ల ఆఫర్!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. ఇలాంటి సమయంలో కంపెనీ చీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (CFO)గా హిలరీ మ్యాక్సన్ను భారీ వేతనంతో నియమించింది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చకు దారితీసింది.ఒరాకిల్ కొత్త సీఎఫ్ఓ హిలరీ మ్యాక్సన్కు కంపెనీ 9,50,000 డాలర్ల జీతం ఇవ్వనుంది. అదనంగా పనితీరు ఆధారంగా 2.5 మిలియన్ డాలర్ల వరకు బోనస్ పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా 26 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ (షేర్లు) కూడా సంస్థ అందిస్తుంది. వీటిలో 80 శాతం సమయానికి అనుసంధానమైనవి కాగా, 20 శాతం పనితీరుపై ఆధారపడి ఉంటాయి.మ్యాక్సన్ తన ఈక్విటీని పూర్తిగా స్టాక్ ఆప్షన్ల రూపంలో లేదా స్టాక్ ఆప్షన్లు, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ల రూపంలో తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆమెకు 2,50,000 విలువైన రీలోకేషన్ అలవెన్స్ కూడా అందిస్తోంది. ఇవన్నీ కలిగి ఆమె మొత్తం ప్యాకేజీ సుమారు 29.7 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.273 కోట్లు) చేరుకుంటుంది.హిలరీ మ్యాక్సన్ ఒరాకిల్లో చేరడానికి ముందు.. ష్నైడర్ ఎలక్ట్రిక్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఎఫ్ఓగా పనిచేశారు. అంతే కాకుండా ఆమె ఏఈఎస్ కార్పొరేషన్లో 12 సంవత్సరాలు పాటు ఫైనాన్స్, స్ట్రాటజీ మొదలైన విభాగాల్లో పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు.కంపెనీ భారీ లేఆఫ్స్ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ భారీ లేఆఫ్ ప్రభావం భారతదేశంలో సుమారు 12,000 మంది ఉద్యోగులపై పడింది. కంపెనీ ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం.. కంపెనీ నిర్మాణ మార్పులు, ఖర్చు తగ్గింపు చర్యలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అని తెలుస్తోంది. ఈ కోతలు ఒరాకిల్ హెల్త్, సేల్స్, క్లౌడ్, కస్టమర్ సక్సెస్, నెట్సూట్లోని సిబ్బందిని ప్రభావితం చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు! -
పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు
సంపాదించే ప్రతి వ్యక్తి తన భవిష్యత్తు కోసమో, తన కుటుంబం భవిష్యత్తు కోసమో ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. అయితే రిస్క్తో కూడిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు అందరూ చేయలేరు. అలాంటి వారి కోసం రిస్క్ లేకుండా మెరుగైన రాబడినిచ్చే అనేక పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆయా స్కీములు ఏంటి.. వాటికి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. తెలుసుకుందాం..2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ప్రకటించింది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. సురక్షితమైన పెట్టుబడితో పాటు ఆకర్షణీయమైన రాబడులు ఇచ్చే ప్రధాన పథకాల వివరాలు ఇలా ఉన్నాయి..సుకన్య సమృద్ధి యోజన: ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తోంది. దీర్ఘకాలిక అవసరాలకు ఇది ఉత్తమ ఎంపిక. దీనికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్: వృద్ధులకు సామాజిక భద్రత కల్పిస్తూ, సుకన్య సమద్ధితో సమానంగా అత్యధిక 8.2% వడ్డీని అందిస్తోంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. దీనిపై ప్రస్తుతం 7.1% వడ్డీ లభిస్తోంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC): ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ పథకం స్థిరమైన, సురక్షితమైన రాబడులకు గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై అందిస్తున్న వడ్డీ 7.7 శాతం.కిసాన్ వికాస్ పత్ర (KVP): తమ పెట్టుబడిని నిర్ణీత కాలంలో రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుత రేటు ప్రకారం 115 నెలల్లో నగదు రెట్టింపు అవుతుంది. దీని వడ్డీ రేటు 7.5%.మంత్లీ ఇన్కమ్మ్ స్కీమ్ (MIS): ఒకేసారి పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం అనువైనది. దీనికి 7.4% వడ్డీ లభిస్తుంది.టైమ్ డిపాజిట్లు & రికరింగ్ డిపాజిట్లుబ్యాంకు ఎఫ్డీలతో పోలిస్తే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్లు గట్టి పోటీనిస్తున్నాయి. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..కాలపరిమితివడ్డీ రేటు (%)ఏడాది టైమ్ డిపాజిట్6.9రెండేళ్ల టైమ్ డిపాజిట్7.0మూడేళ్ల టైమ్ డిపాజిట్7.1ఐదేళ్ల టైమ్ డిపాజిట్7.55 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ (RD)6.7సాధారణ సేవింగ్స్ డిపాజిట్లపై యథావిధిగా 4 శాతం వడ్డీ కొనసాగుతోంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకాలు సామాన్యులకు పెట్టుబడి సాధనాలుగా నిలుస్తున్నాయి. -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 931.25 పాయింట్లు లేదా 1.20 శాతం నష్టంతో 76,631.65 వద్ద, నిఫ్టీ 222.25 పాయింట్లు లేదా 0.93 శాతం నష్టంతో 23,775.10 వద్ద నిలిచాయి.ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, ప్రీతి ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్, భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అక్షర్ స్పిన్టెక్స్ లిమిటెడ్, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్ లిమిటెడ్, వర్వీ గ్లోబల్ లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్, రుషిల్ డెకార్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
కొత్త లుక్లో టైగన్ ఫేస్లిఫ్ట్: డిజైన్, ఫీచర్స్ ఇలా..
ఫోక్స్వ్యాగన్ కంపెనీ భారత మార్కెట్లో ఎట్టకేలకు టైగన్ ఫేస్లిఫ్ట్ ఆవిష్కరించింది. ఇది అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటేస్ట్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2021లో దేశీయ విఫణిలో లాంచ్ అయిన టైగన్.. దాదాపు ఐదేళ్లకు ఫేస్లిఫ్ట్ రూపంలో అడుగుపెట్టింది. ఈ ఎస్యూవీలోని కొత్త హెడ్లైట్స్.. ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లతో అనుసంధానం అయింది. గ్రిల్ డిజైన్ కూడా అప్డేట్ అయింది. వెనుక భాగంలో టెయిల్లైట్లు, నలుపు రంగులో ఉన్న టైగన్ లోగో పొందుతుంది. అల్లాయ్ వీల్స్కు కూడా ఒక కొత్త డిజైన్ ఉంది.కొత్త టైగన్ అవకాడో పెర్ల్, స్టీల్ గ్రే రంగులలో లభిస్తుంది. దీంతో మొత్తం 9 రంగుల ఎంపికలు అందుబాటులోకి వచ్చింది. ఇది 10.09-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పొందుతుంది. ఇది 15 విభిన్న అప్లికేషన్లను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంతే కాకుండా.. ఇందులో కొత్త 9 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ కూడా ఉంది, ఇది మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ను కూడా అందిస్తుంది.వోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్లిఫ్ట్ 'హలో వోక్స్వ్యాగన్' వాయిస్ అసిస్ట్ను కూడా పొందుతుంది, ఇది ఏసీ కంట్రోల్స్, మ్యూజిక్ మరియు మరిన్ని ప్రాథమిక ఫంక్షన్లను నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. 6 ఎయిర్బ్యాగ్లు, మల్టీ-కొలిజన్ బ్రేక్లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాగా ఈ ఎస్యూవీ ధరలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి!పనితీరు పరంగా చూస్తే.. కొత్త వోక్స్వ్యాగన్ టైగన్ 114 హార్స్ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది. మునుపటి 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ స్థానంలో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ను చేర్చారు. 147 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కూడా ఈ తాజా మోడల్లో అందుబాటులో ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ల మధ్య ఎంపికలను అందిస్తుంది. -
హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ వచ్చేసింది..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా, తాజాగా తన పాపులర్ ఎస్యూవీ క్రెటాలో 'సమ్మర్ ఎడిషన్' (Creta Summer Edition)ను లాంచ్ చేసింది. వేసవి కాలానికి సరికొత్త హంగులతో వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధరను కంపెనీ రూ. 12.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.వేరియంట్లు, ధరల వివరాలుఈ సమ్మర్ ఎడిషన్ ప్రధానంగా ఎంట్రీ లెవల్ EX ట్రిమ్ నుండి టాప్-ఎండ్ SX ట్రిమ్ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ధర రూ. 12.06 లక్షలు (EX వేరియంట్) కాగా టాప్-ఎండ్ ధర రూ. 17.89 లక్షలు (SX ట్రిమ్). ఇవే కాకుండా S(O), S(O) నైట్ (Knight) ట్రిమ్లలో కూడా ఈ సమ్మర్ ఎడిషన్ లభిస్తుంది.కొత్తగా చేరిన ఫీచర్లు ఇవే!డిజైన్ పరంగా ప్రామాణిక మోడల్ను పోలి ఉన్నప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకోవడానికి హ్యుందాయ్ ఇందులో పలు అదనపు ఫీచర్లను జోడించింది.EX (O) వేరియంట్: ఇందులో 16-అంగుళాల డ్యూయల్-టోన్ స్టీల్ వీల్స్, స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్, క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, పొజిషనింగ్ ల్యాంప్లు ఉన్నాయి. అదనంగా రియర్ విండో సన్షేడ్, డైనమిక్ గైడ్లైన్స్తో కూడిన రియర్ కెమెరా సౌకర్యం ఉంది.S(O) & S(O) నైట్ ఎడిషన్: ఈ వేరియంట్లలో భద్రత కోసం డాష్ క్యామ్ (Dashcam)ను ప్రత్యేకంగా అందించారు. అలాగే 10.25 అంగుళాల మల్టీ-డిస్ప్లే డిజిటల్ క్లస్టర్ కూడా ఆకర్షణగా నిలుస్తుంది.SX ప్రీమియం: టాప్ వేరియంట్లో సరౌండ్ వ్యూ మానిటర్ (SVM), బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ (BVM), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.ఇంజిన్, పెర్ఫార్మెన్స్హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి 1.5-లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. అయితే, ఈ స్పెషల్ ఎడిషన్లో టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ను కంపెనీ అందించడం లేదు. ట్రాన్స్మిషన్ పరంగా చూస్తే, కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా MT (మాన్యువల్), iVT, AT (ఆటోమేటిక్) గేర్బాక్స్ ఎంపికలను ఎంచుకోవచ్చు. -
వజ్రాల మెరుపు వెనుక అసలు కథ
వజ్రాల వ్యాపారులు, వినియోగదారులు నిన్న(ఏప్రిల్ 8, 2026) తొలి ‘ప్రపంచ వజ్రాల దినోత్సవం’ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నేచురల్ డైమండ్ కౌన్సిల్ (ఎన్డీసీ) పిలుపు మేరకు జరిగిన ఈ వేడుకల్లో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో సహజ వజ్రాలకు ధీటుగా ‘ల్యాబ్గ్రోన్ డైమండ్లు’ విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? వీటి భవిష్యత్తు వినియోగం ఎలా ఉండబోతోంది? అనే అంశాలను విశ్లేషిద్దాం.సహజ వజ్రం.. ల్యాబ్గ్రోన్ డైమండ్ మధ్య తేడా..చాలామంది ల్యాబ్గ్రోన్ డైమండ్లను నకిలీ వజ్రాలు అనుకుంటారు, కానీ అది తప్పు. ఇవి భౌతికంగా, రసాయనికంగా, ఆప్టికల్గా దాదాపు సహజ వజ్రాల మన్నికనే పోలి ఉంటాయి. సహజ వజ్రాలు భూమి అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రత, పీడనం వల్ల ఏర్పడతాయి. ల్యాబ్గ్రోన్ డైమండ్లు ప్రయోగశాలల్లో కేవలం కొన్ని వారాల్లోనే తయారవుతాయి. సహజ వజ్రాలతో పోలిస్తే ల్యాబ్గ్రోన్ వజ్రాలు 60% నుంచి 80% వరకు తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని భూమిని తవ్వి ప్రాసెసింగ్ చేయాల్సిన అవసరం లేనందున ‘ఎకో-ఫ్రెండ్లీ’ డైమండ్లుగా పిలుస్తారు.కృత్రిమంగా ఎలా తయారు చేస్తారు?ల్యాబ్లో వజ్రాలను సృష్టించడానికి ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి.హెచ్పీహెచ్టీ(హై ప్రెషర్ హై టెంపరేచర్): భూమి పొరల్లో ఉండే సహజ వాతావరణాన్ని (అధిక పీడనం, ఉష్ణోగ్రత) యంత్రాల ద్వారా సృష్టించి కార్బనైజేషన్ ద్వారా వజ్రాన్ని అభివృద్ధి చేస్తారు.సీవీడీ (కెమికల్ వేపర్ డెపొజిషన్): ఒక ఛాంబర్లో కార్బన్ వాయువులను నింపి ప్లాస్మా సాంకేతికతతో కార్బన్ పరమాణువులను పొరలు పొరలుగా పేరుకుపోయేలా చేస్తారు. ప్రస్తుతం అత్యుత్తమ నాణ్యత గల వజ్రాల కోసం భారత్లో ఈ పద్ధతినే ఎక్కువగా వాడుతున్నారు.వినియోగదారులు తేడాను ఎలా గుర్తించాలి?సాధారణంగా సహజ వజ్రానికి, ల్యాబ్గ్రోన్ వజ్రానికి మధ్య తేడాను కనిపెట్టడం అసాధ్యం. అనుభవజ్ఞులైన వ్యాపారులు కూడా వీటిని కొన్నిసార్లు గుర్తుపట్టలేరు. కాబట్టి వినియోగదారులు వజ్రాలు కొనేముందు కొన్ని అంశాలు గమనించాలి. వజ్రాభరణాలు కొనేటప్పుడు జీఐఏ(జెమొలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా) లేదా ఐజీఐ వంటి సంస్థల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అడగాలి. అందులో అది ‘నేచురల్’ లేదా ‘లేబొరేటరీ గ్రోన్’ అని స్పష్టంగా ఉంటుంది. ల్యాబ్ వజ్రాల గర్డిల్ (అంచు)పై మైక్రోస్కోపిక్ లేజర్ మార్కింగ్ ఉంటుంది.ఈ విభాగంలో ఉపాధి అవకాశాలువజ్రాల తయారీ రంగంలో భారత్లోని సూరత్ గ్లోబల్ హబ్గా మారింది. దాంతో స్థానికంగా సీవీడీ మిషన్ల నిర్వహణకు ఇంజినీర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల అవసరం పెరుగుతోంది. వజ్రాలను సానబెట్టే (పాలిషింగ్) నైపుణ్యం ఉన్నవారికి దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. తక్కువ ధర వల్ల మధ్యతరగతి ప్రజలు కూడా వజ్రాల వైపు మొగ్గు చూపుతుండటంతో సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో వేలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి.భవిష్యత్తు ఎటువైపు?సహజ వజ్రాలు పెట్టుబడిగా, వారసత్వ సంపదగా వాటి విలువను కాపాడుకుంటున్నాయి. కొన్ని పెళ్లిళ్లు, భావోద్వేగ సందర్భాల కోసం వీటిని వాడుతున్నారు. ల్యాబ్గ్రోన్ డైమండ్లు ఫ్యాషన్ జ్యువెలరీ, రోజువారీ వాడకానికి ఇవి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. వీటి పర్యావరణ హితం, తక్కువ ధర కారణంగా యువత, జెన్జీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ? -
అనంత్ అంబానీ బర్త్డే స్పెషల్.. గజరాజులకు విందు..
వన్యప్రాణుల పట్ల తనకున్న అమితమైన ప్రేమను అనంత్ అంబానీ మరోసారి చాటుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు రాజస్థాన్ రాజధాని జైపూర్ శివార్లలోని హాథీ గావ్లో జరిగాయి. మూగజీవాల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా స్థానిక ‘హాథీ గావ్ వికాస్ సమితి’ ఈ వినూత్న వేడుకను నిర్వహించింది.ఈ వేడుకలో ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన భారీ ‘ఫ్రూట్ బఫే’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 3,000 కిలోల బరువున్న వివిధ రకాల పండ్లను ఏనుగులకు విందుగా వడ్డించారు. ఈ బఫేలో అరటిపండ్లు, యాపిల్స్, పుచ్చకాయ, బొప్పాయి, నారింజ వంటి కాలానుగుణ ఫలాలతో పాటు ఏనుగులకు ఇష్టమైన చెరకు, బెల్లం, పచ్చి పశుగ్రాసాన్ని భారీగా సిద్ధం చేశారు. రాజస్థానీ సాంప్రదాయ శైలిలో అలంకరించిన గజరాజులు ఈ విందును ఆస్వాదించాయి.మావత్ కుటుంబాలకు అండగా..వన్యప్రాణుల సంరక్షణలో కీలక పాత్ర పోషించే మావత్ (ఏనుగుల సంరక్షకులు)లను ఈ సందర్భంగా సమితి గౌరవించింది. ఏనుగుల సంక్షేమం కోసం శ్రమించే వారికి నిత్యావసర వస్తువులతో కూడిన రేషన్ కిట్లు, దుస్తులు, టోపీలు, పాదరక్షలు, రోజువారీ వినియోగ వస్తువులను పంపిణీ చేశారు.అనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3,500 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి వన్యప్రాణి పునరావాస కేంద్రం వంతారాను స్థాపించిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో వేధింపులకు గురైన, అనారోగ్యంతో ఉన్న సుమారు 200 జాతులకు చెందిన జంతువులకు వంతారాలో ఆశ్రయం కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లోని ఏనుగుల సంరక్షణకు ఆయన అందిస్తున్న ఆర్థిక సాయం పట్ల స్ఫూర్తి పొంది ఈ వేడుకను నిర్వహించినట్లు హాథీ గావ్ వికాస్ సమితి అధ్యక్షుడు షఫీక్ బల్లు ఖాన్ తెలిపారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ? -
ఐటీ కంపెనీలు ‘వార్న్’ నోటీసులు.. ఇచ్చాయంటే..
అంతర్జాతీయ ఐటీ రంగంలో మళ్లీ కుదుపు మొదలైంది. ముఖ్యంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ ఐటీ దిగ్గజ సంస్థలు ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నాయి. కృత్రిమ మేధ (AI) వినియోగం పెరగడం, క్లయింట్ల నుంచి వ్యయ నియంత్రణ ఒత్తిడి ఎక్కువవ్వడంతో ఆన్సైట్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.ఏమిటీ ‘వార్న్’ నోటీసులు?అమెరికా చట్టాల ప్రకారం.. 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలు, ఒకేసారి 50 మందికి పైగా సిబ్బందిని తొలగించాలన్నా లేదా కార్యాలయాన్ని మూసివేయాలన్నా 60 రోజుల ముందే సమాచారం ఇవ్వాలి. దీనినే 'వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్' (WARN) అంటారు. తాజాగా భారతీయ కంపెనీలు వివిధ రాష్ట్రాల్లో దాఖలు చేస్తున్న ఈ నోటీసులు ఐటీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.2026లో పెరిగిన కోతలు: గణాంకాలను పరిశీలిస్తే, 2025 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2026 తొలి మూడు నెలల్లోనే అత్యధికంగా ఉద్యోగాల తొలగింపులు జరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.పెద్ద ఒప్పందాల ప్రభావం: గతంలో కుదుర్చుకున్న 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన భారీ ఒప్పందాల పునర్నిర్మాణం (Restructuring) వల్ల ఎక్కువ మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.ముందు వరుసలో దిగ్గజాలు: జనవరి-మార్చి మధ్య కాలంలో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హిందూజా గ్లోబల్ సర్వీసెస్ వంటి సంస్థలు ఫ్లోరిడా, టెక్సాస్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో వార్న్ నోటీసులు ఇచ్చాయి.గత ఏడాది పరిస్థితి: 2024లో జెన్పాక్ట్, హెచ్సీఎల్, టీసీఎస్ వంటి సంస్థలు కేవలం నాలుగు నోటీసులు మాత్రమే ఇవ్వగా, 2025లో జెన్పాక్ట్ విస్కాన్సిన్లో నోటీసులు జారీ చేసింది. కానీ, ప్రస్తుత ఏడాదిలో ఈ ధోరణి వేగవంతమైంది.ఏఐ, క్లయింట్ల ఒత్తిడిసాంకేతికత మారుతున్న కొద్దీ కంపెనీలు పాత పద్ధతులకు స్వస్తి పలుకుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్వీకరణ పెరగడంతో, క్లయింట్లు తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేయాలని ఐటీ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారు. దీనివల్ల ఆన్సైట్లో ఉన్న ఉద్యోగులను తగ్గించుకోవడం లేదా రీస్ట్రక్చరింగ్ చేయడం కంపెనీలకు తప్పనిసరి అవుతోంది.తొలగింపులే కాకపోవచ్చుఅన్ని వార్న్ నోటీసులు నేరుగా ఉద్యోగ తొలగింపులే కాకపోవచ్చు. ఉదాహరణకు, ఫిబ్రవరిలో ఇన్ఫోసిస్ BPM విభాగం 248 మంది ఉద్యోగుల కోసం నోటీసు ఇచ్చింది. అయితే వీరు ఇన్ఫోసిస్ క్లయింట్ అయిన 'వాన్గార్డ్' సంస్థకు తిరిగి వెళ్తున్నట్లు వెల్లడైంది.మరోవైపు, టెక్ దిగ్గజం ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగించగా, అందులో భారత్కు చెందిన 10,000 మంది ఉండటం గమనార్హం. తెల్లవారుజామున ఈమెయిల్స్ ద్వారా ఉద్యోగులకు సమాచారం పంపుతూ కంపెనీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. -
40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ?
ప్రపంచ ఇంధన మార్కెట్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఒకవైపు పశ్చిమ దేశాల ఆంక్షలు, మరోవైపు హార్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి మధ్య దక్షిణాసియా దేశాలను ఆకర్షించేందుకు రష్యా భారీ డిస్కౌంట్లను ఎరగా వేస్తోంది. ముఖ్యంగా అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్న తన ఎల్ఎన్జీ ప్రాజెక్టుల నుంచి గ్యాస్ను విక్రయించేందుకు రష్యా ఏకంగా 40 శాతం రాయితీని ప్రకటిస్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, రష్యా కొన్ని మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా ఈ రాయితీని ఆఫర్ చేస్తోంది. గ్యాస్ కొనుగోలు చేసే దేశాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఈ సరుకు ఒమన్ లేదా నైజీరియా వంటి రష్యాయేతర దేశాల నుంచి వస్తున్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కూడా సృష్టించడానికి అక్కడి ప్రైవేట్ విక్రేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.ముఖ్యంగా ఆర్కిటిక్ ఎల్ఎన్జీ 2 వంటి బ్లాక్లిస్ట్ చేసిన ప్లాంట్ల నుంచి ఎగుమతులను పెంచుకోవడమే రష్యా ప్రధాన ఉద్దేశంగా ఉన్నట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఈ గ్యాస్ను షాడో ఫ్లీట్ (గుర్తింపు లేని నౌకలు) ద్వారా దిగుమతి చేసుకుంటున్న ఏకైక దేశం చైనా మాత్రమే. అయితే, తన కస్టమర్ బేస్ను విస్తరించుకోవడానికి రష్యా ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాలను సంప్రదిస్తుంది.ఖతార్ ఎగుమతుల నిలిపివేతప్రస్తుతం ఆసియాలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉండటానికి ప్రధాన కారణం హార్మూజ్ జలసంధిలో తలెత్తిన ఉద్రిక్తతలు. ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన ఖతార్ నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలు స్పాట్ మార్కెట్లో రెట్టింపు ధర చెల్లించి గ్యాస్ కొనాల్సి వస్తోంది. గ్యాస్ కొరత కారణంగా ఎరువుల రంగానికి సరఫరాను నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. గత ఏడాది తన అవసరాల్లో 60 శాతం గ్యాస్ను ఖతార్ నుంచి పొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. ఇదే అదనుగా రష్యా తన రాయితీ ఆఫర్ను ముందుకు తెచ్చింది.ఆచితూచి అడుగులురష్యా ఆఫర్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భారత్ మాత్రం ఆంక్షల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. బ్లాక్లిస్ట్ చేసిన రష్యా ప్రాజెక్టుల నుంచి గ్యాస్ తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అయితే, ఇటీవల అమెరికా ట్రెజరీ జనరల్ లైసెన్స్ ద్వారా కొన్ని ఆంక్షలను సడలించిన తర్వాత 2019 నుంచి మొదటిసారిగా భారత్ ఇరాన్ నుంచి చమురు రవాణాను కొనుగోలు చేసింది. అమెరికా నుంచి ఎటువంటి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయంతో భారతీయ కంపెనీలు రష్యా ఎల్ఎన్జీ పట్ల ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.రష్యా ఆఫర్ చేస్తున్న 40 శాతం డిస్కౌంట్ ఆర్థికంగా భారత్, బంగ్లాదేశ్లకు ఊరటనిచ్చే విషయమే. అయినప్పటికీ, దీని వెనుక ఉన్న దౌత్యపరమైన రిస్క్ తక్కువేమీ కాదు. ఒకవేళ ఈ ఒప్పందాలు జరిగితే అది అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీస్తుంది. ప్రస్తుతానికి బ్లూమ్బెర్గ్ వంటి సంస్థలు ఈ కొనుగోళ్లు జరిగాయో లేదో ధ్రువీకరించలేదు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
యుద్ధ విరమణతో భారత్కు దక్కేదేమిటి?
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. గత నెల రోజులుగా సాగుతున్న యుద్ధ వాతావరణాన్ని చల్లారుస్తూ అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. మంగళవారం అర్థరాత్రి దాటాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో వెలువడిన ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.ఏమిటీ ఒప్పందం? ప్రధానాంశాలు ఇవే..అమెరికా, ఇరాన్లు రెండు వారాలపాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకూడదు. క్షిపణి ప్రయోగాలు, ప్రతీకార దాడులు తక్షణమే నిలిపివేయాలి. యుద్ధం కారణంగా నిలిచిపోయిన రవాణా నౌకలను హార్మూజ్ జలసంధి గుండా అనుమతించేందుకు ఇరాన్ తాత్కాలికంగా అంగీకరించింది. అయితే, ఇరాన్ సైనిక పర్యవేక్షణలోనే ఈ నౌకలు ప్రయాణించాలి. తదుపరి దౌత్యపరమైన చర్చల కోసం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు దేశాల ప్రతినిధులను ఏప్రిల్ 10న ఇస్లామాబాద్కు ఆహ్వానించారు.ఎవరి వాదన వారిదే!ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు తమ విజయంగానే అభివర్ణించుకుంటున్నాయి. ‘మా సైనిక లక్ష్యాలు నెరవేరాయి. ఇది పూర్తి విజయం. ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిందే. భూగర్భంలో ఉన్న అణు వ్యర్థాలను తొలగించేందుకు ఇరాన్తో కలిసి పని చేస్తాం’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ తన 10 పాయింట్ల శాంతి ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇందులో ఇరాన్పై ఆంక్షల తొలగింపు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ వంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇవి నెరవేరితేనే శాంతి సుస్థిరమవుతుందని ఇరాన్ అంటోంది.భారత్పై ప్రభావం ఎలా ఉంటుంది?పశ్చిమాసియాలోని ఈ పరిణామం భారత్కు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. మన దేశ ఇంధన భద్రత హార్మూజ్ జలసంధిపైనే ఆధారపడి ఉంది. భారత్ దిగుమతి చేసుకునే వంటగ్యాస్లో 90% ఈ జలసంధి గుండానే వస్తుంది. గత నెల రోజులుగా సరఫరా ఆగిపోవడంతో దేశీయంగా ధరలు పెరగడమే కాకుండా కొరత ఏర్పడింది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 30%, సహజ వాయువులో 47% ఈ మార్గం ద్వారానే వస్తాయి. యుద్ధం విరమణ ప్రకటన రాగానే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 15% పడిపోయి 90 డాలర్ల స్థాయికి చేరింది. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది.ఇజ్రాయెల్ - లెబనాన్ పరిస్థితి ఏమిటి?ఈ కాల్పుల విరమణ ఇరాన్తో యుద్ధానికి మాత్రమే వర్తిస్తుందని, లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై తమ పోరాటం కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇది చర్చల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి హార్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన 16 భారతీయ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
బంగారం ధరలు రివర్స్.. కొనేవారికి గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు దిగివచ్చాయి. క్రితం రోజు భారీగా పెరిగిన పసిడి ధరలు (Today Gold Rate) నేడు గణనీయంగా క్షీణించాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా తగ్గుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
డిస్నీలో లేఆఫ్స్?
ప్రపంచ వినోద రంగ దిగ్గజం ‘వాల్ట్ డిస్నీ’ తన ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది వారాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ప్రధానంగా కంపెనీలోని మార్కెటింగ్ విభాగంపై ఈ ప్రభావం అధికంగా ఉండనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.మార్కెటింగ్ విభాగమే లక్ష్యంగా..డిస్నీలో జరుగుతున్న ఈ తాజా పరిణామాలు సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగమని తెలుస్తోంది. కొత్తగా నియమితులైన చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ) అసద్ అయాజ్ కంపెనీ మార్కెటింగ్ గ్రూపును ఏకీకృతం చేసే పనిలో ఉన్నారు. ‘ప్రాజెక్ట్ ఇమాజిన్’ అనే రహస్య కోడ్ పేరుతో వ్యయ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జనవరిలో బాధ్యతలు చేపట్టిన అయాజ్ సంస్థలోని అన్ని మార్కెటింగ్ కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు.కొత్త చేపట్టబోయే లేఆఫ్స్ డిస్నీ మొత్తం శ్రామిక శక్తిలో 1 శాతం కంటే తక్కువే. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి డిస్నీలో సుమారు 2,31,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జోష్ డి అమారో డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించక ముందే ఈ ఉద్యోగాల తగ్గింపు ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం.స్పందించని డిస్నీ యాజమాన్యంఈ వార్తలపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టత కోరగా, డిస్నీ యాజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ఈ నివేదిక బయటకు రావడంతో కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి అందుబాటులోకి రాలేదు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ మెరుగు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి–మార్చి త్రైమాసికంలో ఢీలాపడ్డాయి. హైదరాబాద్లో సానుకూల ధోరణి కనిపించింది. అమ్మకాలు ఒక శాతం పెరిగాయి. మొత్తం మీద హైదరాబాద్ సహా టాప్–8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 84,827 యూనిట్లుగా ఉన్నాయి. 2025 మొదటి మూడు నెలల్లో అమ్మకాలు 88,361 యూనిట్లతో పోల్చితే 4 శాతం తగ్గాయి.అధిక ధరలకు తోడు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితులు అమ్మకాలపై ప్రభావం చూపించినట్టు నైట్ఫ్రాంక్ తెలిపింది. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు బలమైన వృద్ధి అనంతరం మార్కెట్లో స్థిరీకరణ సహజమేనని నైట్ఫ్రాంక్ చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. ధరలు పెరుగుతూ ఉండడం, విక్రయాలు తగ్గడం అన్నది ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిళ్లను తెలియజేస్తున్నట్టు చెప్పారు. మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలపై భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం సైతం ఉన్నట్టు తెలిపారు.నగరాల వారీ డేటా..హైదరాబాద్లో 9,541 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలతో పోల్చి చూస్తే 1 శాతం పెరిగాయి.బెంగళూరులోనూ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఇళ్ల అమ్మకాలు 5 శాతం పెరిగి 13,092 యూనిట్లుగా ఉన్నాయి.చెన్నైలో 9 శాతం అధికంగా 4,763 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.అహ్మదాబాద్లో 2 శాతం అధికంగా 4,758 యూనిట్ల విక్రయాలు జరిగాయి.కోల్కతాలో 4,043 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 5 శాతం వృద్ధి నమోదైంది.ముంబైలో ఇళ్ల విక్రయాలు 7 శాతం పడిపోయి 23,185 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో ఇళ్ల అమ్మకాలు 12,711 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 11 శాతం తగ్గాయి. పుణెలోనూ 11 శాతం తక్కువగా 12,711 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.జనవరి–మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గి 94,855 యూనిట్లకు పరిమితమైంది. -
స్వల్ప నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 25 పాయింట్లు తగ్గి 23,970 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 172 పాయింట్లు నష్టపోయి 77,393 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.05బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 96.6 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 2.51 శాతం పెరిగింది.నాస్డాక్ 2.8 శాతం పుంజుకుంది.Today Nifty position 09-04-2026(time: 9:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సహజ వాయువు కోటా 95 శాతానికి పెంపు
దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచే ఎరువుల పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇంధన భద్రతను సమీక్షించిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎరువుల తయారీ యూనిట్లకు సరఫరా చేసే సహజ వాయువు కోటాను 95 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన కేటాయింపులు గురువారం (ఏప్రిల్ 9, 2026) నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ ఇటీవల జరిగిన ఇతర మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. గడిచిన ఆరు నెలల సగటు వినియోగం ఆధారంగా ఈ కేటాయింపులు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.పెరిగిన కేటాయింపులుగత వారం (ఏప్రిల్ 6) ఎరువుల రంగానికి గ్యాస్ సరఫరాను 90 శాతానికి పెంచిన ప్రభుత్వం, తాజాగా అందుబాటులో ఉన్న నిల్వలు, షెడ్యూల్ ప్రకారం వస్తున్న ఎల్ఎన్జీ కార్గోలను దృష్టిలో ఉంచుకుని మరో 5 శాతం పెంచి మొత్తం కోటాను 95 శాతానికి చేర్చింది. దేశ సగటు గ్యాస్ వినియోగం రోజుకు సుమారు 196 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు(ఎంఎస్సీఎం). ఎరువుల రంగ అవసరం రోజుకు సుమారు 52 ఎంఎస్సీఎండీగా ఉంది. ఒక ఎంఎస్సీఎం గ్యాస్తో సుమారు 1,600 టన్నుల యూరియాను ఉత్పత్తి చేయవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎరువుల రంగం 9,753 ఎంఎస్సీఎంల గ్యాస్ను వినియోగించింది. ఇది దేశ మొత్తం వినియోగంలో 28 శాతానికి సమానం.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
రియల్టీకి ‘సీజ్ఫైర్’ ఊతం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణగడం అంతర్జాతీయ స్థిరాస్తి మార్కెట్పై సానుకూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం కారణంగా గత కొన్ని వారాలుగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని వెనక్కి నెట్టింది. అయితే, ప్రస్తుతం ఇరాన్, అమెరికా ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణతో తిరిగి ఈ రంగం గాడిలో పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం అనిశ్చితి భయాలతో నిలిపివేసిన లావాదేవీలు ఇప్పుడు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు.యుద్ధంతో వెనక్కి తగ్గిన పెట్టుబడిదారులుఇరాన్-ఇజ్రాయెల్ వివాదం గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో పెట్టుబడిదారులు తమ మూలధనాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు మొగ్గు చూపారు. దీని ప్రభావం దుబాయ్ రియల్టీ మార్కెట్పై స్పష్టంగా కనిపించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల కొనుగోలుదారులు తమ నిర్ణయాలను వాయిదా వేయడంతో మార్చి నెలలో నివాస గృహాల అమ్మకాలు 30 శాతానికి పైగా పడిపోయాయి. ప్రధానంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల లావాదేవీల విలువ, పరిమాణం గణనీయంగా క్షీణించాయి. దుబాయ్ రియల్టీలో దాదాపు 20 శాతం వాటా కలిగిన భారతీయ పెట్టుబడిదారులు కూడా తాత్కాలికంగా తమ కొనుగోలు ప్రయత్నాలను విరమించుకున్నారు.డిమాండ్ బౌన్స్బ్యాక్కాల్పుల విరమణ ప్రకటన వెలువడగానే మార్కెట్లో ఒక్కసారిగా చలనం మొదలైందని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో కొనుగోళ్లపరంగా వెనక్కి తగ్గిన క్లయింట్లు ఇప్పుడు తిరిగి బ్రోకర్లను సంప్రదిస్తున్నారు. ‘గతంలో ఒప్పందం కుదుర్చుకుని హోల్డ్లో పెట్టిన వారు ఇప్పుడు తిరిగి మార్కెట్లోకి వస్తున్నారు’ అని ప్రోయాక్ట్ లగ్జరీ రియల్ ఎస్టేట్ సీఈఓ రీతూ కాంత్ ఓజా తెలిపారు. వాయిదా పడిన లావాదేవీలన్నీ ఒక్కసారిగా కార్యరూపం దాల్చనుండటంతో ఏప్రిల్ నెలలో దుబాయ్ రియల్టీ రంగం భారీగా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, రాబోయే 6 నుంచి 8 వారాలు మార్కెట్ స్థిరత్వానికి అత్యంత కీలకమని హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..పెట్టుబడిదారులకు నిపుణుల సూచనలుఅనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రాజెక్టుల కంటే వెంటనే అందుబాటులో ఉన్న ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.దుబాయ్ మెరీనా, డౌన్టౌన్ దుబాయ్, జుమేరా విలేజ్ సర్కిల్ (జేవీసీ) వంటి ప్రాంతాల్లో అద్దె ఆదాయం స్థిరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.యుద్ధ మేఘాలు తొలగిపోతుండటంతో దుబాయ్ మరోసారి గ్లోబల్ ఇన్వెస్టర్లకు ‘సేఫ్ హెవెన్’గా మారుతోంది. పెండింగ్లో ఉన్న డిమాండ్ అంతా ఒక్కసారిగా మార్కెట్లోకి రానుండటంతో ఈ వేసవిలో దుబాయ్ రియల్టీ సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. -
బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్కి ప్రత్యేక వర్గీకరణ
నిర్వర్తించే విధులను బట్టి బ్యాంకింగ్ బిజినెస్ కరెస్పాండెంట్స్ని రెండు కేటగిరీలుగా వర్గీకరించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. వారికి ఇచ్చే కమీషన్ లేదా రెమ్యూనరేషన్ ఒకే విధంగా ఉండేలా ప్రతిపాదించింది. బ్రాంచ్ ఆథరైజేషన్కి సంబంధించి విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం మూడు డెలివరీ పాయింట్లను ఆర్బీఐ ప్రతిపాదించింది.ఇందులో బ్యాంక్ శాఖలతో పాటు బిజినెస్ కరెస్పాండెంట్–బ్యాంకింగ్ అవుట్లెట్ (బీసీ–బీవో), బిజినెస్ కరెస్పాండెంట్–బ్యాంకింగ్ టచ్పాయింట్ (బీసీ–బీటీ) ఉన్నాయి. ప్రస్తుతమున్న బిజినెస్ ఫెసిలిటేటర్ల స్థానంలో, బీసీలని నియమించుకోవడాన్ని సులభతరం చేయడం ఈ నిబంధనల ఉద్దేశమని ఆర్బీఐ పేర్కొంది. దీనిపై ప్రజలు, సంబంధిత వర్గాలు మే 5 నాటికి తమ అభిప్రాయాలను నియంత్రణ సంస్థకి తెలియజేయాల్సి ఉంటుంది. మారు మూల ప్రాంతాల్లో కూడా ఆర్థిక సేవలను విస్తరించే దిశగా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు ..రిటైల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
ఎంట్రప్రెన్యూర్లకు ముద్రా రుణాల దన్ను
ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ముద్రా రుణాలు ఆర్థికంగా సాధికారత కల్పిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత భారత్ 2047 లక్ష్యంలో వారు కూడా భాగమయ్యేలా తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ప్రారంభించి 11 ఏళ్లయిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. ఈ స్కీము దన్నుతో గత దశాబ్దకాలంలో కోట్లాది సామాన్య ప్రజలు సరికొత్త ఆత్మవిశ్వాసంతో ఎంట్రప్రెన్యూర్షిప్ చేపట్టినట్లు మంత్రి వివరించారు.‘రుణాలను మరింతగా అందుబాటులోకి తేవడం ద్వారా కోట్లాది మంది ప్రజలు గొప్ప కలలు కనేందుకు, వాటిని సాకారం చేసుకునేందుకు పీఎం ముద్రా యోజన సాధికారత కల్పించింది’ అని ప్రధాని నరేంద్ర మోదీ .. ఎక్స్లో పోస్ట్ చేశారు. 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైన పీఎంఎంవై కింద ఇప్పటివరకు రూ. 40.07 లక్షల కోట్ల విలువ చేసే 57.79 కోట్ల రుణాలు మంజూరైనట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మూడింట రెండొంతుల లోన్స్ మహిళా ఎంట్రప్రెన్యూర్లకు, అయిదింట ఒక వంతు రుణాలు ఫస్ట్ టైమ్ ఎంట్రప్రెన్యూర్లకు మంజూరైనట్లు ఆమె పేర్కొన్నారు. ఈ పథకం అమల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర భాగస్వాములు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి ప్రశంసించారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
డిస్కౌంట్లకన్నా సౌకర్యానికే ఓటు
దేశీయంగా క్విక్ కామర్స్ వినియోగదారులు డిస్కౌంట్ల కన్నా సౌకర్యానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డిస్కౌంట్లు తగ్గించినా సరే సదరు ప్లాట్ఫాంలను వినియోగించడాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా వినియోగదారుల ధోరణుల్లో వస్తున్న మార్పులను సూచించేలా గ్రాంట్ థార్న్టన్ భారత్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో 1,600 మంది వినియోగదారులు, 1,000కి పైగా కిరాణా స్టోర్స్ ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. దీని ప్రకారం రోజువారీ కొనుగోళ్ల విషయంలో ధర కన్నా వేగం, లభ్యతకు ప్రాధాన్యత పెరుగుతోంది. డిస్కౌంట్లను తగ్గించినా కూడా క్విక్ కామర్స్ ప్లాట్ఫాంలను వినియోగించడాన్ని కొనసాగిస్తామంటూ 70 శాతం మంది తెలిపారు. సంప్రదాయ రిటైల్ ఫార్మాట్ల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయడం కాకుండా, నిర్దిష్ట సందర్భాల కోసం మాత్రమే క్విక్ కామర్స్ని ప్రజలు వినియోగిస్తున్నారు. ఆఖరు నిమిషపు, అర్జంట్ ఆర్డర్ల కోసం 45 శాతం మంది వినియోగదారులు వీటిని ఎంచుకుంటున్నారు. ఇక 24 శాతం మంది పాలు, బ్రెడ్లాంటి ప్రతి రోజు అవసరమయ్యే వాటి కోసం ఉపయోగిస్తున్నారు. 19 శాతం మంది అప్పటికప్పుడు తినాలని, తాగాలనిపించే స్నాక్స్, పానీయాల్లాంటి కోసం క్విక్ కామర్స్ ప్లాట్ఫాలంను వినియోగిస్తున్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు..గత ఏడాది వ్యవధిలో కిరాణా స్టోర్స్పై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్లు 51 శాతం మంది తెలిపారు. అయితే, 27 శాతం మంది ఈ విషయంలో చెప్పుకోతగ్గ మార్పేమీ లేదనగా, 13 శాతం మంది మాత్రం ఇప్పుడు వీటిని మరింతగా ఎంచుకుంటున్నట్లు చెప్పారు.మార్జిన్లపరంగా ఒత్తిడి పెరుగుతుండటం, వినియోగదారుల్లో మారుతున్న ధోరణులకు అనుగుణంగా సంప్రదాయ రిటైలర్లు వ్యాపారాన్ని తీర్చిదిద్దుకునేందుకు సుముఖంగా ఉంటున్నారు.40 శాతం మంది కిరాణా రిటైలర్లు, క్విక్ కామర్స్ ప్లాట్ఫాంలతో జట్టు కట్టడంపై ఆసక్తి వ్యక్తం చేశారు.32 శాతం మంది తమకు ఆసక్తిగా ఉన్నా, ఇలాంటి భాగస్వామ్యాలు ఎలా పని చేస్తాయనేది తెలియడం లేదని పేర్కొన్నారు. తమకు నిర్వహణపరమైన లేదా సాంకేతికపరమైన మద్దతు లభిస్తే తప్పకుండా జట్టు కడతామని 20 శాతం కిరాణా రిటైలర్లు తెలిపారు. ద్వితీయ శ్రేణి, వర్ధమాన పట్టణ మార్కెట్లు రాబోయే రోజుల్లో రిటైల్ రంగ తదుపరి వృద్ధి చోదకాలుగా ఉండనున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
ధరల భయం.. రేట్లు యథాతథం!
ముంబై: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.9 శాతానికి తగ్గించింది. ప్రస్తుతానికి పరిస్థితులను సునిశితంగా గమనిస్తూ, స్పష్టత వచ్చే వరకు వేచి చూడడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. దీంతో రెపో రేటు 5.25 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) రేటు 5 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు 5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఇక వడ్డీ రేట్లకు సంబంధించి తన విధానాన్ని తటస్థంగానే ఆర్బీఐ కొనసాగించింది. ఇరాన్–ఇజ్రాయెల్/అమెరికా యుద్ధంతో ముడి చమురు ధరలు గరిష్టాలకు పెరిగిపోవడం, రూపాయి బలహీనపడడం, ఎగుమతులు/దిగుమతులకు ఏర్పడిన అవరోధాలను ఆర్బీఐ ఎంపీసీ ప్రస్తావించింది. ఇరాన్–అమెరికా కాల్పుల విరమణనను సమీక్షలో పరిగణనలోకి తీసుకున్నా మని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా చెప్పారు. పాలసీ ముఖ్యాంశాలు.. → గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.6 శాతం కాగా, ప్రస్తుత 2026–27లో 6.9 శాతానికి పరిమితం కావొచ్చు. → పశ్చిమాసియా యుద్ధం ఎంత కాలం పాటు కొనసాగుతుంది? నష్టం ఏ మేరకు అన్నది ద్రవ్యోల్బణం, వృద్ధి రిస్్కలను నిర్ణయిస్తుంది. → ద్రవ్యోల్బణం 2026–27లో 4.6 శాతంగా ఉండొచ్చు. క్యూ1లో 4 శాతం, క్యూ2లో 4.4 శాతం, క్యూ3లో 5.2 శాతం, క్యూ4లో 4.7 శాతంగా అంచనా. ఆర్బీఐ లక్ష్యం 4 శాతం కాగా, అసాధారణ పరిస్థితుల్లో గరిష్టంగా 6 శాతం మించకుండా చూడాలన్న విధానాన్ని అనుసరిస్తోంది.→ 2026–27లో రూపాయి డాలర్తో 94 వద్ద, ముడి చమురు బ్యారెల్కు 85 డాలర్ల వద్ద (సగటున) స్థిరపడొచ్చు. → 2025 ఫిబ్రవరి వరకు ఆర్బీఐ మొత్తం మీద 1.25% మేర రెపో రేటును తగ్గించడం గమనార్హం. → తదుపరి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష జూన్ 3 నుంచి 5 వరకు ఉంటుంది.దీర్ఘకాలం పాటు తక్కువ రేట్లే...పశ్చిమాసియా ఘర్షణలు ఎగుమతులు, వృద్ధిని అడ్డుకోవచ్చు. ఇంధన ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో విఘాతాలు కీలక ముడి సరుకుల లభ్యతను అడ్డుకుంటుంది. ఇది వ్యవసాయం, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు. వృద్ధిని నిదానింపజేయొచ్చు. అయినప్పటికీ దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. తటస్థ విధానాన్నే కొనసాగిస్తున్నాం. మధ్యకాలం నుంచి దీర్ఘకాలం పాటు కనిష్ట వడ్డీ రేట్లే కొనసాగుతాయి. – ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా -
గోల్డ్–సిల్వర్ జూమ్.. క్రూడ్ క్రాష్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ వాతావరణానికి తాత్కాలికంగా బ్రేక్ పడటంతో బంగారం, వెండి ధరలు తిరిగి జోరందుకున్నాయి. యూఎస్, ఇరాన్ మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణకు తెరలేవడంతో విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ వివరాల ప్రకారం స్థానిక మార్కెట్లో కేజీ వెండి రూ. 11,000 (5 శాతం) జంప్చేసి రూ. 2,51,000ను తాకింది. ఇక మేలిమి బంగారం సైతం 10 గ్రాములు రూ. 3,200 (2 శాతం) ఎగసి రూ. 1,56,400కు చేరింది. విదేశీ మార్కెట్లోనూ: అంతర్జాతీయ మార్కెట్లలోనూ వెండి, బంగారం మెరిశాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 2 శాతంపైగా (97 డాలర్లు) బలపడి 4,803 డాలర్లకు చేరింది. మరోపక్క సిల్వర్ ఔన్స్ 6% జంప్చేసి 77.33 డాలర్లను తాకింది. హార్మూజ్ను తెరిచే వీలున్నట్లు ఇరాన్ సంకేతాలివ్వడంతో సెంటిమెంటు మెరుగుపడినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ముడిచమురు 20% క్షీణత కొద్ది రోజులుగా చుక్కలు చూపిస్తున్న క్రూడ్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నౌకల రవాణాకు అడ్డంకులు తొలగనున్న అంచనాలతో చమురు ధరలు తొలుత 20% పతనమయ్యాయి. తదుపరి బ్రెంట్ పీపా 15.5% (17 డాలర్లు) దిగజారి 92 డాలర్లస్థాయిలో ట్రేడవుతోంది. ఇక డబ్ల్యూటీఐ పీపా 18% (20 డాలర్లు) పడిపోయి 93 డాలర్ల దిగువకు చేరింది. రూపాయికి జోష్ పశ్చిమాసియాలో పరిస్థితులు శాంతించడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 1%పైగా బలహీనపడి 98.5కు చేరింది. దీంతోపాటు.. దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేయడం రూపాయికి బలాన్నిచి్చనట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ 52 పైసలు పుంజుకుని 92.54 వద్ద ముగిసింది. -
వార్ సీజ్.. బుల్స్ ఫైర్!
ముంబై: ఇరాన్–అమెరికా మధ్య రెండు వారాల పాటు సీజ్ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. సీజ్ఫైర్తో అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ, క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు రావడం, ఆర్బీఐ కీలక వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం, రూపాయి రికవరీ వంటి అంశాలు సూచీల భారీ లాభాలకు దోహదపడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్ 2,946 పాయింట్లు (3.95%) ఎగసి 77,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 874 పాయింట్లు (3.78%) పెరిగి 23,997 వద్ద నిలిచింది. గతేడాది(2025) మే 12వ తేదీ తర్వాత సూచీలకిదే అతిపెద్ద లాభం. అలాగే వరుసగా అయిదో లాభాల ముగింపు కూడా. భారీ లాభాలతో షురూ.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,674 పాయింట్ల లాభంతో 74,617 వద్ద, నిఫ్టీ 731 పాయింట్లు పెరిగి 23,855 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఆర్బీఐ వరుసగా రెండోసారీ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ఆరంభ ఉత్సాహం ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగింది. ఒకదశలో సెన్సెక్స్ 3,019 పాయింట్లు ర్యాలీ చేసి 77,636 వద్ద, నిఫ్టీ 901 పాయింట్లు దూసుకెళ్లి 24,025 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. గడిచిన అయిదేళ్లలో సూచీలకిదే ఇంట్రాడేలో అతి పెద్ద లాభం. అంతర్జాతీయ మార్కెట్లు రయ్... పశ్చిమాసియాలో శాంతి పవనాలతో ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా 6.43%, జపాన్ 5.11%, తైవాన్ 4.41%, ఇండోనేసియా 4.23%, హాంగ్కాంగ్ 3%, చైనా 2.62%, సింగపూర్ 1.39 శాతం లాభపడ్డాయి. యూరప్ ఫ్రాన్స్ 5%, సీఏసీ 4.47%, ఎఫ్టీఎస్ఈ 2.58 శాతం ర్యాలీ చేశాయి. అమెరికా ప్రధాన స్టాక్ సూచీలు నాస్డాక్ 2.63%, డోజోన్స్ సూచీ 2.49 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో రియల్టీ 6.76%, ఆటో 6.55%, పీఎస్యూ బ్యాంక్స్ 5.79%, బ్యాంకెక్స్ 5.72%, ప్రైవేటు బ్యాంక్స్ ఇండెక్స్ 5.62%, ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.48%, సర్వీసెస్ 5.22%, కన్జూమర్ డిస్క్రేషనరీ 5.11 శాతం ర్యాలీ చేశాయి. మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 5%, 4% చొప్పున పెరిగాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఇండిగో 8.16%, ఎల్అండ్టీ 7.64%, బజాజ్ ఫైనాన్స్ 7.03%, ఎంఅండ్ఎం 6.79% యాక్సిస్ బ్యాంక్ 6.56 శాతం అత్యధికంగా లాభపడిన టాప్–5 షేర్లుగా నిలిచాయి. టెక్ మహీంద్రా (–1.53%), సన్ఫార్మా(–0.29%), పవర్గ్రిడ్ (–0.20%) మాత్రమే నష్టపోయాయి. → గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఊరట లభించడంతో అదానీ గ్రూప్ షేర్లు భారీ ర్యాలీ చేశాయి. అదానీ గ్రీన్ 11.38%, అదానీ ఎనర్జీ 8.78%, అదానీ ఎంటర్ప్రైజెస్ 8.62%, అదానీ టోటల్ గ్యాస్ 7.60% ర్యాలీ చేశాయి. → ఎన్డీటీవీ 6.48%, అంబుజా సిమెంట్స్ 6.28%, అదానీ పోర్ట్స్ 5.28 %, ఏసీసీ 5.20%, అదానీ పవర్ 3.55% పెరిగాయి. అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14.22 లక్షల కోట్లకు చేరింది. → సీజ్ఫైర్ ఎఫెక్ట్తో క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఏవియేషన్ షేర్లు రివ్వున ఎగిశాయి. ఇండిగో షేరు 8.16% లాభపడింది. స్పైస్ జెట్ షేరు 5% లాభపడి రూ.11.14 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి అక్కడే ముగిసింది.రూ.16.25 లక్షల కోట్ల సంపద సృష్టి సూచీల చరిత్రలో రెండో అతిపెద్ద ర్యాలీతో స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.16.25 లక్షల కోట్లు పెరిగి రూ.445.51 లక్షల కోట్లకు చేరింది. -
సెప్టెంబర్ వరకూ ఐపీవో గడువు పెంపు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పబ్లిక్ ఇష్యూలతోపాటు.. పబ్లిక్కు కనీస వాటా కేటాయింపు గడువును పెంచింది. 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30లోపు ముగిసిపోయే ఐపీవోల అనుమతుల గడువును 2026 సెప్టెంబర్30 వరకూ పొడిగించింది.ఇదేవిధంగా పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా కల్పించే నిబంధనల విషయంలోనూ 2026 సెప్టెంబర్ 30 వరకూ వెసులుబాటు(ఒకేసారి)కు తెరతీసింది. రెండింటికీ విడిగా సర్క్యులర్లను జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30లోపు పబ్లిక్కు కనీస వాటా నిబంధనలను అమలు చేయవలసిన లిస్టెడ్ కంపెనీలకు 2026 సెప్టెంబర్ 30వరకూ గడువు లభించింది.గతంలో కరోనా మహమ్మారి తలెత్తిన కాలంలోనూ సెబీ ఇదేతరహా వెసులుబాటును కల్పించిన విషయం విదితమే. పశ్చిమాసియా యుద్ధ భయాల నేపథ్యంలో తలెత్తిన అనిశ్చితి, మార్కెట్ ఆటుపోట్లను దృష్టిలో పెట్టుకుని సెబీ గడువు పెంపునకు నిర్ణయించింది. -
ఏఐ స్కిల్స్పై స్కాలర్షిప్ టెస్ట్
తెలంగాణకు చెందిన స్టార్టప్ 'కాగ్నిటివ్స్కోర్.ఏఐ' విద్యను మార్కుల ఆధారిత మూల్యాంకనం నుండి మేధోశక్తి వైపు మళ్లించే లక్ష్యంతో 'కాగ్నిచాంప్ ఇండియా స్కాలర్షిప్ — తెలంగాణ ఎడిషన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కీర్తి కుమార్ జైన్, విక్రమ్ సింగ్ నేగి స్థాపించిన ఈ కార్యక్రమం, ఏఐ-ఆధారిత ప్రపంచంలో అవసరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలను గుర్తించి, పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.3 నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఈ స్కాలర్షిప్లో, 20 నిమిషాల ఆన్లైన్, గేమిఫైడ్, అడాప్టివ్ అసెస్మెంట్ ఉంటుంది. ఇది మే 2 లేదా 3, 2026న జరగనుంది. దీనికి రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 26న ముగుస్తాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇందులో పాల్గొనడం ఉచితం కాగా, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రూ.499 చెల్లించి నమోదు చేసుకోవచ్చు.సాంప్రదాయ పరీక్షలకు భిన్నంగా, కాగ్నిచాంప్ మేధోశక్తి, ఉన్నత స్థాయి ఆలోచనా సామర్థ్యం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఇంకా సృజనాత్మకత, సమస్య పరిష్కారం వంటి 21వ శతాబ్దపు కీలక నైపుణ్యాలను మూల్యాంకనం చేస్తుంది. దీని ద్వారా విద్యార్థులు గుర్తింపు, 12వ తరగతి వరకు 100% ట్యూషన్ ఫీజు మద్దతుతో కూడిన స్కాలర్షిప్లు, వారి బలాబలాలపై వ్యక్తిగత అంతర్దృష్టుల వంటి అవకాశాలను పొందుతారు.ఈ కార్యక్రమం, జాతీయ విద్యా విధాన చట్రానికి అనుగుణంగా, విద్యార్థుల అభ్యసనం, అభివృద్ధిపై పాఠశాలలకు, తల్లిదండ్రులకు ఆచరణాత్మకమైన అంతర్దృష్టులను కూడా అందిస్తుంది. ఈ ప్రారంభంతో, భారతదేశంలో భవిష్యత్తుకు సిద్ధమైన, జ్ఞానాత్మక ఆధారిత విద్యలో అగ్రగామిగా నిలవాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది. -
తొలగింపుల్లో టాప్ అమెజాన్.. 30 వేలకు పైనే..
అంతర్జాతీయ టెక్ రంగంలో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతూనే ఉంది. గడిచిన 2025 సంవత్సరం నుంచి ఇప్పటివరకు (2026) ప్రముఖ దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజా గణాంకాల ప్రకారం, ఈ లేఆఫ్స్ జాబితాలో ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అగ్రస్థానంలో నిలిచింది.అమెజాన్, ఇంటెల్ సంస్థల్లోనే అధికంవివిధ నివేదికల ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. 2025 నుంచి ఇప్పటివరకు అమెజాన్ ఏకంగా 30,184 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దీని తర్వాత చిప్ మేకర్ ఇంటెల్ (Intel) 27,058 మందిని, సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) 15,347 మందిని తొలగించి టాప్-3లో నిలిచాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, నిర్వహణ ఖర్చుల తగ్గింపు, సంస్థాగత మార్పులే ఈ భారీ తొలగింపులకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు.కంపెనీల వారీగా తొలగింపుల వివరాలు కంపెనీ పేరుతొలగించిన ఉద్యోగుల సంఖ్య1అమెజాన్30,1842ఇంటెల్27,0583మైక్రోసాఫ్ట్15,3474హెచ్పీ8,0005మెటా5,8006సేల్స్ఫోర్స్5,3857బ్లాక్ (Block)4,9318నార్త్ వోల్ట్2,8009హ్యూలెట్ ప్యాకర్డ్2,55210ఆటోడెస్క్2,350ఎందుకీ కోతలు?గత రెండేళ్లుగా టెక్ పరిశ్రమలో అనిశ్చితి కొనసాగుతోంది. AI ప్రభావం: పనులను ఆటోమేట్ చేయడం వల్ల కొన్ని విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గుతోంది.ఆర్ధిక మందగమనం: పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖర్చులను తగ్గించుకోవాలనే ఒత్తిడి కంపెనీలపై ఉంది.రీస్ట్రక్చరింగ్: లాభదాయకత లేని ప్రాజెక్టులను మూసివేసి, ప్రాధాన్యత ఉన్న రంగాలపై పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.ఈ పరిణామాలు ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తుండగా, రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమెజాన్లో మళ్లీ లేఆఫ్స్.. ఖండించిన కంపెనీగడిచిన రెండేళ్లుగా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన అమెజాన్ వచ్చే మే నెలలోనూ మరో భారీ రౌండ్ లేఆఫ్లకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈసారి సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిని అమెజాన్ ఖండించింది. ఇవన్నీ అవాస్తమని, తమకు అలాంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది.🚨 Disclosed layoffs in 2025 and 2026 so far.1. Amazon - 30,1842. Intel - 27,0583. Microsoft - 15,3474. HP - 8,0005. Meta - 5,8006. Salesforce - 5,3857. Block - 4,9318. Northvolt - 2,8009. Hewlett Packard - 2,55210. Autodesk - 2,35011. Workday - 2,15012. Synopsys -…— Indian Tech & Infra (@IndianTechGuide) April 4, 2026 -
దేశాలకు టారిఫ్ల షాక్.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరోసారి టారిఫ్ల షాక్ ఇచ్చారు. ఇరాన్ కు ఆయుధాలను విక్రయించే దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమయ్యే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే సుంకాలు అమలు తెస్తున్నట్లు బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు."ఇరాన్ కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు విక్రయించే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే 50 శాతం సుంకం విధిస్తున్నాం. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులులు ఉండవు" అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్లో రాసుకొచ్చారు. -
38 ఏళ్ల నాటి రికార్డ్.. ఆకాశంలో తపాలా సేవలు
ఇప్పుడంటే సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి రావడంతో కేవలం సింగిల్ క్లిక్ లో వాట్సాప్ మెసేజెస్ , ఫొటోస్, వీడియోస్ ఎక్కడ నుంచి ఎక్కడికైనా పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు వీడియో కాల్స్ ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకునే అవకాశం ఉంది. దేశ, విదేశాలనుంచి కాకుండా పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు సైతం టక్కుమని క్లిక్ చేస్తే ఈ-మెయిల్ వెళ్ళిపోతుంది, సెకన్లలో అవతలి వ్యక్తికి సందేశం చేరుతుంది. కానీ, ఒకప్పుడు మారుమూల దీవులకు ఉత్తరం చేరాలంటే రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఆ నిరీక్షణకు తెరదించుతూ, సరిగ్గా 38 ఏళ్ల క్రితం భారత తపాలా శాఖ ఆకాశ మార్గాన చేపట్టిన ఒక సాహసోపేత ప్రయోగం 'హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్'. కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించిన ఆ విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..హెలికాప్టర్ పోస్టల్ సేవలు.. భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ పోస్టల్ సేవలు 1988, జనవరి 27న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అగాధమైన సముద్రం, దట్టమైన అడవులతో కూడిన అండమాన్ నికోబార్ దీవులను ఈ చారిత్రక ఘట్టానికి వేదికగా ఎంచుకున్నారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్లాక్ దీవుల మధ్య సాగిన ఈ మొదటి ప్రయాణం తపాలా వ్యవస్థలో ఒక మైలురాయి. ఈ వినూత్న ప్రయోగాన్ని విజయవంతం చేయడానికి భారత తపాలా శాఖ, పవన్ హాన్స్ లిమిటెడ్తో జతకట్టింది.మెయిల్ బస్తాలను చేరవేయడానికి శక్తివంతమైన 'డౌఫిన్' హెలికాప్టర్లను రంగంలోకి దించారు. గతంలో పడవలు లేదా ఇతర మార్గాల ద్వారా ఉత్తరాలు చేరడానికి రెండు మూడు రోజులు పట్టే చోట, హెలికాప్టర్ పుణ్యమా అని గంటల వ్యవధిలోనే సందేశాలు చేరడం ప్రారంభమైంది. ఈ తొలి ప్రయాణాన్ని స్మరిస్తూ విడుదల చేసిన 'ఫస్ట్ డే కవర్లు', ప్రత్యేక స్టాంపులు నేటికీ తపాలా బిళ్ళల సేకరణకర్తలకు నిధి లాంటివి.ఆకాశ మార్గాన తపాలా సేవలు.. ఆకాశ మార్గాన తపాలా సేవలు అందించాలనే ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ప్రపంచంలోనే తొలి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ 1947, అక్టోబర్ 1న అమెరికాలో మొదలైంది. లాస్ ఏంజిల్స్ ఎయిర్వేస్ సహకారంతో 'సికోర్స్కీ ఎస్-51' హెలికాప్టర్ ద్వారా ఈ సేవలు అందించారు. అమెరికా బాటలోనే నడుస్తూ బ్రిటన్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సేవలను ప్రారంభించి ఐరోపాలో రికార్డు సృష్టించింది.సాంకేతికత ఎంత పెరిగినా, ఆనాడు మారుమూల ప్రాంతాల ప్రజలను అనుసంధానించడానికి భారత తపాలా శాఖ చేసిన ఈ 'గగన విహారం' ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. మేఘాలను చీల్చుకుంటూ వచ్చిన ఆ ఉత్తరం వెనుక ఎన్నో కుటుంబాల అనురాగాలు, ఆప్యాయతలు ఉండేవి.. అలాంటివాటిని ఏమాత్రం చెక్కుచెదరకుండా వారికి అందించిన ఘనత భారత తపాలా శాఖకు దక్కుతుంది. -పసుపులేటి వెంకటేశ్వరరావు. -
కాసుల వర్షం: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథ స్థితిని కొనసాగించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ ఐదు రోజుల లాభాల పరంపరను నమోదు చేశాయి.నిఫ్టీ 3.78 శాతం లేదా 873.70 పాయింట్ల లాభంతో 23,997.35 వద్ద, సెన్సెక్స్ 3.95 శాతం లేదా 2,946.32 పెరిగి 77,562.90 వద్ద ముగిశాయి.ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (Market Capitalization) రూ. 16.59 లక్షల కోట్లు పెరిగింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 446 లక్షల కోట్ల మార్కును చేరుకుంది.శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్లో టాప్ గెయినర్లుగా నిలిచాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 4.03 శాతం, 4.39 శాతం లాభపడ్డాయి. రంగాల వారీగా.. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఆటో సహచర రంగాలను అధిగమించాయి. అదే సమయంలో నిఫ్టీ ఐటీ తక్కువ లాభాలతో తక్కువ పనితీరు కనబరిచింది.ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ ఏప్రిల్ సమీక్షలో బెంచ్మార్క్ పాలసీ రెపో రేటును 5.25 శాతంగా ఉంచాలని నిర్ణయించింది. పర్యవసానంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డిఎఫ్) రేటు కూడా వరుసగా 5 శాతం, 5.5 శాతం వద్ద మారలేదు. -
టెక్స్టైల్స్ పీఎల్ఐ పరిధిలోకి మరిన్ని విభాగాలు
టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.10,683 కోట్లతో ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్ఐ) పరిధిలోకి మ్యాన్ మేడ్ వ్రస్తాలు (ఎంఎంఎఫ్), ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్నూ చేర్చనున్నట్టు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. దీనివల్ల పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. అలాగే తాజా పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని, టెక్స్టైల్స్రంగంలో వృద్ధి వేగం అందుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం, అంతర్జాతీయ టెక్స్టైల్ మార్కెట్లో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడం నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఫుట్వేర్ పరిశ్రమల ప్రతినిధులు తనను కలసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముడి సరకుల లభ్యత, నాణ్యత సమస్యలను పాదరక్షల పరిశ్రమల ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గత 12 ఏళ్లలో దేశంలో కొనుగోలు శక్తికి అనుగుణంగా పాదరక్షల వినియోగం పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. యూఎస్లో ఒక్కో వ్యక్తి 7 జతల పాదరక్షలు వినియోగిస్తుంటే, చైనాలో 3.3 జతలుగా ఉందని.. భారత్లోనూ 3 జతలకు చేరినట్టు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
విమానయాన రంగానికి భారీ ఊరట
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానశ్రయాలలో వసూలు చేసే ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 3 నెలల పాటు 25 శాతం తగ్గిస్తూ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్ఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది.రంగంలోకి ఏఈఆర్ఏకేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఈఆర్ఏ ఈ తాత్కాలిక తగ్గింపును తక్షణమే అమలులోకి తెచ్చింది. రాబోయే మూడు నెలల వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుతం ఛార్జీల తగ్గింపు వల్ల విమానాశ్రయాలకు కలిగే ఆదాయ లోటును భవిష్యత్తులో చేపట్టే టారిఫ్ సమీక్షల ద్వారా సర్దుబాటు చేస్తామని రెగ్యులేటర్ ఏఈఆర్ఏ చేసింది.దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాశ్రయ రుసుములను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ సంస్థలు ప్రస్తుతం రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పాకిస్థాన్ గగనతలంపై నిషేధం ఉండటంతో భారత విమానాలు ఇప్పటికే చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. ఇరాన్ యుద్ధ మేఘాల వల్ల పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాల ఇంధన ఖర్చులు, నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. ‘ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలకు ఇంధనం, సిబ్బంది వేతనాల తర్వాత విమానాశ్రయ, ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ఛార్జీలే అధిక ఖర్చులుగా ఉన్నాయి’ అని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తెలిపింది.మరోవైపు, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న సానుకూల పరిణామాలు విమానయాన రంగ షేర్లకు ఊపునిచ్చాయి. ఇరాన్తో అమెరికా రెండు వారాల యుద్ధ విరమణ ప్రకటించిన వార్తలతో బుధవారం ట్రేడింగ్లో ఇండిగో షేర్లు లాభపడ్డాయి. యుద్ధం సద్దుమణిగితే ఇంధన ధరలు దిగివస్తాయన్న ఆశతో ఇన్వెస్టర్లు విమానయాన రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
యథాతథంగా కీలక వడ్డీరేట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇది మొదటి విధాన సమీక్ష. ఈ సమీక్ష సమావేశంలో కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది.2025-26 ఏడాది ప్రారంభం నుంచి వరుసగా రేట్లు తగ్గించిన ఆర్బీఐ.. గడిచిన సమావేశంతోపాటు ఈసారీ రేట్ల తగ్గింపుపై తటస్థ వైఖరి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడుసార్లు రేట్లలో కోత విధించింది. దాంతో మొత్తంగా 100 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటు ప్రస్తుతం 5.25గా ఉంది.ఇదీ చదవండి: అమెరికా ఇన్ఫ్రాపై ఇరాన్ హ్యాకర్ల పంజా? -
బుల్రన్.. 2600 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 761 పాయింట్లు పెరిగి 23,890 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 2602 పాయింట్లు ఎగబాకి 77,198 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.9బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 94 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.24 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.08 శాతం పెరిగింది.నాస్డాక్ 0.1 శాతం పుంజుకుంది.Today Nifty position 08-04-2026(time: 9:39 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


