Business
-
ఏడిపించే ఏడు ఆర్థిక సమస్యలు
ఆర్థిక స్వాతంత్ర్యం చాలా మంది యువకుల కల. కానీ సమర్థమైన డబ్బు నిర్వహణ అలవాట్లు కొరవడడంతో సంపాదన మొదలుపెట్టిన ప్రాథమిక దశలోనే యువతకు ఆర్థిక కష్టాలు తప్పడంలేదు. అయితే సరైన ప్రణాళికతో ఈ ఇబ్బందులను గట్టెకవచ్చని నిపుణులు చెబుతున్నారు. సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. యువత సాధారణంగా ఎలా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారో.. దాని నుంచి ఎలా బయటపడవచ్చో కింది ఏడు సమస్యలు-పరిష్కారాల ద్వారా తెలుసుకుందాం.1. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడంచాలా మంది యువతకు బడ్జెట్, రుణ నిర్వహణ, పెట్టుబడి వంటి ముఖ్యమైన ఆర్థిక నైపుణ్యాలు ఉండవు. అవకాశం ఉన్నా వాటిని నేర్చుకోవాలనే స్పృహ ఉండదు. పాఠశాలలు, కళాశాలల్లోనూ నిజ జీవితంలోని ఆర్థిక పరమైన సమస్యలపై అరుదుగా బోధిస్తారు. దానికితోడు యువత స్థిరమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవడం కూడా సమస్యలకు కారణం అవుతుంది.పరిష్కారం: టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో వివిధ మాధ్యమాల ద్వారా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించుకోవాలి. రిచ్ డాడ్ పూర్ డాడ్, ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి... వంటి చాలా పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి. వాటిలో మంచి పుస్తకాన్ని ఎంచుకొని ప్రాథమికంగా అందులోని అంశాలను నేర్చుకోవాలి.2. అధిక వ్యయం, జీవనశైలి ద్రవ్యోల్బణంసామాజిక మాధ్యమాలతో లాభాలున్నట్లే నష్టాలున్నాయి. యువత ప్రధానంగా ప్రస్తుతం అనుసరిస్తున్న సోషల్ మీడియా అకౌంట్ల్లో తోటివారిలాగా తమ లైఫ్స్టైల్ను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి బట్టలు, ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు.. వంటివి కొనుగోలు చేస్తున్నారు. తోటివారి నుంచి ఏర్పడే పరోక్ష ఒత్తిడి ద్వారా శక్తికి మించి ఖర్చు చేయడానికి సోషల్ మీడియా అవకాశం కల్పిస్తుంది.ఉదా: రూ.30,000 సంపాదించే వ్యక్తి సోషల్మీడియా ప్రభావం ద్వారా రూ.25,000 ఖర్చు చేసే అవకాశం ఉంది. దాంతో పొదుపునకు పరిమిత అవకాశం ఉంటుంది.పరిష్కారం: 50/30/20 నియమాన్ని అనుసరించాలి. అంటే అవసరాలకు 50%, కోరికలకు 30%, పొదుపునకు 20% ఖర్చులతో బడ్జెట్ రూపొందించుకోవాలి.3. నియంత్రించలేని రుణం, క్రెడిట్ కార్డు దుర్వినియోగంక్రెడిట్ కార్డులు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తాయి. కానీ వాటి దుర్వినియోగం అధిక వడ్డీలకు కారణం అవుతుంది. సులభంగా ఉన్నట్లు కనిపించే ‘బై నౌ, పే లేటర్ (బీఎన్పీఎల్)’ పథకాలు యువతను ఖర్చుల వైపు లాగేస్తున్నాయి. నెలల తరబడి చెల్లించని రూ.50,000 క్రెడిట్ కార్డు బిల్లు అధిక వడ్డీ కారణంగా రూ.70,000 అయ్యేందుకు అవకాశం ఉంటుంది.పరిష్కారం: ప్రణాళికాబద్ధమైన ఖర్చులకు మాత్రమే క్రెడిట్ కార్డులను ఉపయోగించాలి. వడ్డీ ఛార్జీల నుంచి తప్పించుకోవడానికి ప్రతి నెలా బిల్లులను పూర్తిగా చెల్లించాలి. అత్యవసరమైతే తప్ప బీఎన్పీఎల్కు దూరంగా ఉండాలి.4. పొదుపు చేయకపోవడంఅత్యవసర నిధి లేకుండా యువకులు వైద్య బిల్లులు, ఉద్యోగం కోల్పోవడం లేదా అత్యవసర ప్రయాణం వంటి ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారు. వాటిని పూడ్చేందుకు చాలా మంది అప్పులు చేయడం లేదా ఖరీదైన రుణాలు తీసుకోవడం చేస్తుంటారు.పరిష్కారం: కనీసం 3-6 నెలల సరిపడా ఖర్చులను ప్రత్యేక అత్యవసర నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. అవసరం లేని కొనుగోళ్ల కోసం అప్పుల్లో మునిగిపోవద్దు.5. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లేకపోవడంచాలా మంది యువత మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి సంపదను పెంచే అవకాశాల్లో పెట్టుబడి పెట్టడానికి బదులు డబ్బును పొదుపు ఖాతాలు, ఇతర సాధానాల్లో ఉంచుతారు. ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం వల్ల కాలక్రమేణా కాంపౌండింగ్ ప్రయోజనాలు తగ్గుతాయి.పరిష్కారం: దీర్ఘకాలిక వృద్ధి కోసం మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ప్రారంభించాలి. స్టాక్స్, ఈటీఎఫ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులను వైవిధ్యపరచాలి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు రిస్క్, రిటర్న్లపై స్పష్టత ఉండాలి.6. స్కామ్ల బారిన పడడంవేగంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువ పెట్టుబడిదారులు తరచుగా పోంజీ పథకాలు(మోసపూరిత స్కీమ్లు), క్రిప్టో స్కామ్లు, నకిలీ స్టాక్ చిట్కాలకు మొగ్గుచూపుతారు. సరైన పరిశోధన లేకుండా కష్టపడి సంపాదించిన పొదుపును కోల్పోతున్నారు.పరిష్కారం: పెట్టుబడి పెట్టేముందు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లను సరిచూసుకోవాలి. ఆథరైజ్డ్ ఆర్థిక నిపుణుల సలహాలు పాటించి సొంతంగా నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యా7. పన్ను ప్రణాళికలు విస్మరించడంచాలా మంది ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్, ఎన్పీఎస్ వంటి పన్ను ఆదా పథకాలను ఉపయోగించకపోవడం వల్ల అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ఆదాయం తగ్గుతుంది.పరిష్కారం: పొదుపు, పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి సెక్షన్ 80 సీ ఆప్షన్లను ఉపయోగించాలి. పన్నులను కచ్చితంగా సమయానికి దాఖలు చేయాలి. -
ఆర్బీఐ ఒక్క నిర్ణయం.. హోమ్లోన్ ఈఎంఐ తగ్గింపు
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. గత ఐదేళ్లుగా ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. 2025 ఫిబ్రవరిలో చాలాకాలం తర్వాత 25 పాయింట్లు తగ్గించింది. తర్వాత మరోసారి ఏప్రిల్లో మరో 25 పాయింట్లు కోత విధించింది. తాజాగా శుక్రవారం 50 బేసిస్ పాయింట్లు కట్ చేసింది. దాంతో ప్రధానంగా అధిక కాలం ఈఎంఐలు కొనసాగే గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.గృహ రుణంపై ఊరట ఎంతంటే..?ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 8.5 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.21,696 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్బీఐ అర శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.20,911కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.785 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ.1,88,299 మిగులుతుంది. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఇదీ చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యారెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. -
జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యా
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం వల్ల బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కీలక అంశాలు పంచుకున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంకు సంబంధించి మాల్యా 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి ప్రస్తావించారు. 2008 వరకు కంపెనీ సమర్థంగా పనిచేసిందని చెప్పారు.పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా మాట్లాడుతూ.. ‘2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఎదురైంది. ఇది భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమయంలో ప్రతి రంగం దెబ్బతింది. డబ్బు సరఫరా నిలిచిపోయింది. రూపాయి విలువ దారుణంగా దెబ్బతింది. 2005లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అనతికాలంలోనే లగ్జరీ సేవలకు పేరు తెచ్చుకున్నప్పటికీ పరిస్థితులు క్షీణించడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. కార్యకలాపాలను పెంచే ప్రణాళికతో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించాం. సమస్యలు వివరించాం. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల సంఖ్యను తగ్గించే ప్రణాళికలతో, ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఈ ఆర్థిక పరిస్థితుల్లో పని చేయలేకపోతున్నానని చెప్పాను. బ్యాంకుల మద్దతు ఉంటుందని ముఖర్జీ చెప్పారు. కానీ అలా ఏం జరగలేదు’ అని అన్నారు.గొప్పగా పని చేయలేదన్నారు..‘కొంతకాలానికి పరిస్థితులు మరింత దిగజారడంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులను నిలిపివేసింది. కంపెనీ కష్టాల్లో పడింది. మళ్లీ రుణం కోసం బ్యాంకుల వద్దకు వెళితే కంపెనీ అంత గొప్పగా పని చేయలేదని అన్నారు’ అని చెప్పారు. 2016లో భారత్ను విడిచి పారిపోయిన మాల్యా అప్పటి నుంచి యూకేలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయనను భారత్కు రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.దొంగను కాదు..మాల్యాను ‘చోర్(దొంగ)’ అని పిలవడంపై.. పాడ్కాస్ట్లో స్పందించారు. ‘పారిపోయిన వ్యక్తి’ అనే అంశంపై కూడా మాట్లాడారు. తనను దొంగగా ప్రజలు భావించడాన్ని ఖండించారు. ‘మార్చి 2016 తర్వాత భారత్కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తిగా పిలవండి. నేను పారిపోలేదు. ముందుగా నిర్ణయించిన పర్యటన కోసం భారతదేశం నుంచి బయలుదేరాను. సరైన కారణాల వల్ల నేను తిరిగి రాలేదు. కాబట్టి మీరు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలవాలనుకుంటే మీ ఇష్టం. కానీ ‘చోర్’ అనే ముద్ర వేస్తున్నారు. దొంగతనం ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.అప్పు పలుమార్లు రికవరీభారతీయ బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.6,200 కోట్లను పలుమార్లు రికవరీ చేశారని మాల్యా కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. తన నుంచి యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్- ప్రస్తుతం లిక్విడేషన్ దశలో ఉంది), ఇతర అనుబంధ సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని పూర్తిగా లెక్కించాలని కోరారు.భారత్కు తిరిగి వస్తారా..?భారత్కు తిరిగి రాకపోవడంపై అడిగిన ప్రశ్నకు విజయ్ మాల్యా సమాధానమిస్తూ..‘భారత్ లో నిష్పాక్షిక విచారణ, గౌరవప్రదమైన హామీ ఉంటే మీరు చెప్పిన దానిపై మరోసారి ఆలోచిస్తాను’ అని చెప్పారు. మాల్యాతో పాటు ఇతర వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం యూకే నుంచి భారత్ రప్పించే ప్రయత్నం చేస్తోంది. కానీ, భారత నిర్బంధ షరతులు ఈసీహెచ్ఆర్ (యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్)లోని ఆర్టికల్ 3ను ఉల్లంఘిస్తున్నాయని, అందువల్ల వారిని వెనక్కి పంపలేమని అప్పీల్ హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది.ఇదీ చదవండి: ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!స్టేట్మెంట్ ఇవ్వాలి..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా రుణదాతలకు రూ.11,101 కోట్లకు పైగా రుణానికి సంబంధించిన కేసులో విజయ్ మాల్యా ఈ ఏడాది ఏప్రిల్ 9న లండన్ హైకోర్టులో దివాలా ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీల్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి బ్యాంకులు వసూలు చేసిన రుణాల రికవరీ వివరాలను కోరారు. వాస్తవానికి రూ.6,200 కోట్లు బకాయి ఉండగా, బ్యాంకులు రూ.14,000 కోట్లు రికవరీ చేశాయని మాల్యా తరఫు న్యాయవాది వాదించారు. రుణం పూర్తిగా క్లియర్ అయిందని, ఇంకా రికవరీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, రికవరీ మొత్తాన్ని వివరిస్తూ స్టేట్మెంట్ ఇచ్చేలా బ్యాంకులను ఆదేశించాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. -
వడ్డీరేట్లు తగ్గిస్తే మంచిదే.. మరి నష్టం ఏంటి?
భారతీయ బ్యాంకులు ఇటీవల పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి తాజాగా 50 బేసిస్ పాయింట్లు రెపో రేటు తగ్గించడంతో ఈమేరకు బ్యాంకులు మళ్లీ కీలక వడ్డీ రేట్లను కుదించే వీలుంది. ప్రపంచ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒడిదొడుకులు, ఆర్థిక అనిశ్చితుల మధ్య వృద్ధిని ఉత్తేజపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని అంశాలపై ప్రతికూల ప్రభావం కూడా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రుణాలు, పెట్టుబడులకు ప్రోత్సాహంతక్కువ వడ్డీ రేట్లు వ్యక్తులు, వ్యాపారాలకు రుణాలు చౌకగా అందేలా చేస్తాయి. ఇది మౌలిక సదుపాయాలు, తయారీ, ఇతర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాల సృష్టికి ఊతం ఇస్తుంది. ఆర్థిక విస్తరణకు దారితీస్తుంది. తగ్గిన రుణ ఈఎంఐలు డిస్పోజబుల్ ఆదాయాన్ని(నెలవారీ ఖర్చులుపోను మిగిలిన డబ్బు) పెంచుతాయి. వినియోగదారుల వ్యయాన్ని అధికం చేస్తాయి.పొదుపుపై ప్రభావంమరోవైపు పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండడంతో సంప్రదాయ పొదుపు తగ్గిపోతుంది. దాంతో ఖాతాదారులు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇవి అధిక నష్టాలను కలిగి ఉంటాయి కానీ, మంచి రాబడిని అందిస్తాయి. ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయగలిగినప్పటికీ, ఇది మార్కెట్ అస్థిరతకు దారి తీయవచ్చు. బ్యాంకుల్లో పొదుపు డబ్బును ఇలా ఇతర మార్గాలవైపు మళ్లించడం బ్యాంకులకు కొంతమేరకు సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!ఏం చేయాలంటే..ఆర్బీఐ రెపో రేటుకు అనుగుణంగా భారతీయ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం రెండువైపులా పదునున్న కత్తితో సమానం. ఇది ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ పొదుపుదారులకు, బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను మిగులుస్తుంది. ఆర్థిక స్థిరత్వంతో వృద్ధిని సమతుల్యం చేయడానికి ఈ మార్పులు ఎంత సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయనే దానిపై దీర్ఘకాలిక ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఈమేరకు వ్యవస్థలు సమర్థ విధానాలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. -
ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు స్థిరంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.91,300 (22 క్యారెట్స్), రూ.99,600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పులు లేవు. చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.91,300, రూ.99,600గా ఉన్నాయి. దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధరలో నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పులేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.91,450గా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.99,750గా ఉంది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే శుక్రవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.3,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,17,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
రెపో రేటు తగ్గింపు.. ఈఎంఐ వెంటనే తగ్గుతుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరిస్థితులను సులభతరం చేయడానికి, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. దాంతో ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5 శాతానికి చేర్చారు. ఈ నిర్ణయం రెపో రేటుతో అనుసంధానమయ్యే రుణగ్రహీతలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థపై, ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR), డిపాజిట్లతో ముడిపడి ఉన్న రుణాలపై విస్తృత ప్రభావాలు చూపడానికి కొంత సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.రెపో ఆధారిత రుణాలపై ప్రభావంఆర్బీఐ రేట్ల తగ్గింపు వల్ల రెపో రేటుతో ముడిపడి ఉన్న రుణాలతో రుణగ్రహీతలకు తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై విధించే వడ్డీని రెపో రేటు అంటారు. రెపో రేటును తగ్గించడం వల్ల ఈ రుణగ్రహీతలకు వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని వెంటనే లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. ఇది చాలా మంది రుణగ్రహీతలకు సమాన నెలవారీ వాయిదాలను (EMI) తగ్గించడానికి దారితీస్తుంది.ఎంసీఎల్ఆర్ రుణాలపై ప్రభావం ఇలా..ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంసీఎల్ఆర్తో ముడిపడి ఉన్న రుణాలపై ప్రభావం వెంటనే కనిపించదు. ఎంసీఎల్ఆర్ అనేది గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతర రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్మార్క్ వడ్డీ రేటు. రెపో రేటు మాదిరిగా కాకుండా బ్యాంకులకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు.. వంటి వాటిపై ఆధారపడి ఎంసీఎల్ఆర్లో మార్పులు ఉంటాయి. రేట్ల కోత ప్రభావం ఎంసీఎల్ఆర్లో పూర్తిగా ప్రతిబింబించడానికి కనీసం రెండు త్రైమాసికాలు పట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు తమ వ్యయాలను సర్దుబాటు చేయడానికి, రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణగ్రహీతలకు బదిలీ చేయడానికి కొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. ఫలితంగా ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లు తీసుకున్నవారు తమ ఈఎంఐలు తగ్గాలంటే మరికొంత కాలం ఆగాలి.ఇదీ చదవండి: ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!డిపాజిట్లకు సవాల్..వడ్డీరేట్ల తగ్గింపు డిపాజిట్ల పరంగా బ్యాంకులకు సవాలుగా మారుతుంది. రుణ రేట్లు తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను కూడా బ్యాంకులు నిర్వహించాల్సి ఉంటుంది. డిపాజిట్ రేట్లను వెంటనే తగ్గించడం వల్ల బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించడం, వారిని నిలుపుకోవడం కష్టతరం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ పొదుపుపై మంచి రాబడిని కోరుకునే ఇతర మార్గాలను ఎంచుకుంటారని విశ్లేషిస్తున్నారు. -
ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించిన దానికంటే ఎక్కువగా మరోసారి రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది 5.5 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఏప్రిల్ తర్వాత మరోసారి తాజాగా ఇలా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) జూన్ 04న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తనకు మూడో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. తాను పదవి చేపట్టిన తర్వాత ముందుగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భాగంగా రెపోరేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్లోనూ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈసారీ తిరిగి మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో బెంచ్మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6 శాతం నుంచి తాజాగా 5.5 శాతానికి చేరింది.రెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు తగ్గితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది.గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయంగా అనిశ్చితులు కొనసాగుతున్నాయి. దాంతో ప్రపంచ వృద్ధి, వాణిజ్య అంచనాలను సవరిస్తున్నారు. అంతర్జాతీయ ఒడిదుడుకుల మధ్య ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం కేంద్ర బ్యాంకులకు సవాలుగా మారుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలను అందిస్తోంది. గత ఆరు నెలల్లో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ద్రవ్యోల్బణ అంచనాలను 3.7 శాతానికి తగ్గిస్తున్నాం. గతంలో ప్రధాన ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసిన 4 శాతం కంటే ఇది తక్కువే. బ్యాంకుల వద్ద నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం. రూ.2.5లక్షల కోట్ల బ్యాంకు నిధులను విడుదల చేయనున్నాం. దీంతో బ్యాంకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు వీలు కల్పించినట్లవుతుంది. ఈ ఏడాది జనవరి నుంచి రూ.9.5లక్షల కోట్లు ద్రవ్యాన్ని వ్యవస్థలోకి తీసుకొచ్చాం. విదేశీ మారక నిల్వలు 691.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మరో 11 నెలల వరకు దిగుమతులకు ఇబ్బంది ఉండదు’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు2026 ఆర్థిక సంవత్సరం వాస్తవ జీడీపీ వృద్ధిని ఆర్బీఐ అంచనా వేసింది. త్రైమాసికాల వారీగా వృద్ధి ఇలా..క్యూ1-6.5 శాతంక్యూ2-6.7 శాతంక్యూ3-6.6 శాతంక్యూ4-6.3 శాతం -
అందరిచూపు ఆర్బీఐ వైపు.. ఫ్లాట్గా మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:17 సమయానికి నిఫ్టీ(Nifty) 21 పాయింట్లు నష్టపోయి 24,727కు చేరింది. సెన్సెక్స్(Sensex) 158 ప్లాయింట్లు దిగజారి 81,293 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.53 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.83 శాతం దిగజారింది.ఈ రోజు ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ఆర్బీఐ ఈసారి కూడా వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో నిన్న మార్కెట్లు పుంజుకున్నాయి. అంచనాలకు తగినట్లుగానే ఈసారి రెపో రేటులో ఆర్బీఐ కోత విధిస్తే ఇది వరుసగా మూడోసారి అవుతుంది. ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీరేట్లును తగ్గించారు. తర్వాత ఏప్రిల్లోనూ కుదించారు. డిసెంబర్లో సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా వడ్డీరేట్లును తగ్గిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు
ఎలాన్ మస్క్ సారథ్యం వహిస్తున్న టెస్లా షేరు విలువ కుప్పకూలింది. గురువారం ఒక్కరోజే 14 శాతం పడిపోయి 150 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచి ఈ షేరు భారీగా క్షీణించింది. ఈ కంపెనీకి సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బహిరంగ విభేదాలే ఇలా టెస్లా షేరు విలువ పడిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పెరిగిన షేరు ధర ఇద్దరి మధ్య వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వస్తున్న వరుస కథనాలకు భారీగా కుప్పకూలుతోంది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయి 916 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది.ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తాం..ఇటీవల బహిరంగంగా మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. మస్క్ వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ప్రభుత్వ వ్యయ బిల్లుపై మస్క్ చేసిన విమర్శలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్ను ఎదుర్కోవడం కష్టంగా మారిందని, ఆయన అతిగా స్పందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.ఈవీ క్రెడిట్లు లేకపోవడంపై అసంతృప్తిఓవల్ ఆఫీస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎలాన్కు నాకు మంచి అనుబంధం ఉంది. ఇకపై కలిసి పని చేస్తామో లేదో తెలియదు. (ఇటీవల డోజ్ నుంచి మస్క్ వైదొలిగారు) ట్రంప్ ఇటీవలి చర్యలకు నేను ఆశ్చర్యపోయాను’ అంటూ కొత్త బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) క్రెడిట్లు లేకపోవడంపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందంభవిష్యత్తు ఎన్నికల్లో సవాళ్లుట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా మస్క్ వెంటనే ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో స్పందించారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, డెమ్స్ సభను నియంత్రించేవారని, సెనేట్లో రిపబ్లికన్లు 51-49తో గెలిచేవారని పేర్కొన్నారు. మస్క్ ఇటీవల బలమైన రాజకీయ వైఖరిని తీసుకున్నారు. కొత్త బడ్జెట్ బిల్లు అసహ్యంగా ఉందని, దానికి మద్దతిచ్చే ప్రజాప్రతినిధులు భవిష్యత్ ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. -
భారత్లో ఓపెన్ఏఐ అకాడమీ
న్యూఢిల్లీ: చాట్జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ, కేంద్ర ఐటీ శాఖలో భాగమైన ఇండియాఏఐ మిషన్ కలిసి భారత్లో ఓపెన్ఏఐ అకాడమీని ప్రారంభించాయి. ఇందుకు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దేశీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న డెవలపర్ల కమ్యూనిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్టార్టప్లు.. ఆవిష్కర్తల నెట్వర్క్కు ఏఐపరంగా కావాల్సిన విద్యావనరులు, సాధనాలు దీనితో అందుబాటులోకి వస్తాయని ఓపెన్ఏఐ తెలిపింది. విద్య, టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉమ్మడి లక్ష్య సాధన దిశగా ఇది కీలక ముందడుగని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ అకాడమీ లో డిజిటల్, ఇన్–పర్సన్ లెరి్నంగ్ విధానంలో ఇంగ్లీష్, హిందీలో కంటెంట్ అందుబాటులో ఉంటుంది. త్వరలో మరిన్ని ప్రాంతీయ భాషలను కూడా జోడించనున్నారు. విద్యార్థులు, డెవలపర్లు, విద్యావేత్తలు, సివిల్ సర్వెంట్లు, చిన్న స్థాయి వ్యాపారవర్గాలు మొదలైన వారందరికీ ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇండియాఏఐ మిషన్ ఆమోదించిన 50 ఫెలోస్/స్టార్టప్లకు 1,00,000 డాలర్ల వరకు విలువ చేసే ఏపీఐ క్రెడిట్స్ లభిస్తాయి. -
మరో పావుశాతం కోత?
ముంబై: కీలక పాలసీ రేట్లపై ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహిస్తున్న రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నేడు (శుక్రవారం) నిర్ణయాన్ని ప్రకటించనుంది. జూన్ 6 ఉదయం 10 గం.లకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా దీనిపై ప్రకటన చేస్తారని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. బుధవారం ప్రారంభమైన మూడు రోజుల సమీక్ష శుక్రవారం ముగుస్తుంది. ఆర్బీఐ నుంచి ముగ్గురు, ప్రభుత్వం నియమించిన మరో ముగ్గురు మొత్తం ఆరుగురు ఎంపీసీలో సభ్యులుగా ఉన్నారు. ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్లో పావు శాతం చొప్పున రెండు విడతలుగా మొత్తం అర శాతం మేర కీలక పాలసీ రేటును (రెపో) తగ్గించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల వల్ల అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో తాజాగా మూడో విడతలో మరో పావు శాతం తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఆర్బీఐ పాలసీ రేటును తగ్గించడంతో చాలా మటుకు బ్యాంకులు కూడా రెపో రేటు ఆధారిత రుణ రేట్లను, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రేటును ఇప్పటికే కొంత తగ్గించాయి. రెపో రేటు తగ్గితే బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది. రియల్టర్ల ఆశలు.. హౌసింగ్కి డిమాండ్ పెంచే దిశగా ఆర్బీఐ రెపో రేటును కనీసం మరో పావు శాతమైనా తగ్గించవచ్చని రియల్టర్ల సమాఖ్యలు క్రెడాయ్, నారెడ్కో ఆశిస్తున్నాయి. గత మూడు నెలలుగా హౌసింగ్ డిమాండ్ నెమ్మదించిన నేపథ్యంలో రేట్లు తగ్గిస్తే అమ్మకాలు మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ తెలిపారు. ఆర్థిక వృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు కూడా సహాయకరంగా ఉంటుందని నారెడ్కో ప్రెసిడెంట్ జి. హరిబాబు చెప్పారు. -
వెండి వెలుగులు
న్యూఢిల్లీ: దేశీయంగా వెండి గురువారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం వరుసగా నాలుగో రోజు పరుగును కొనసాగిస్తూ న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి కేజీ ధర మరో రూ. 2,000 పెరిగి రూ. 1,04,100 (పన్నులు కలిపి) పలికింది. చివరిసారిగా మార్చి 19న వెండి రేటు ఆల్ టైమ్ గరిష్టమైన రూ. 1,03,500 స్థాయిని తాకింది. పటిష్టమైన ఫండమెంటల్స్, పరిశ్రమల నుంచి డిమాండ్, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా ఉపయోగిస్తుండటం, అంతర్జాతీయంగా సరఫరా నెమ్మదించడం తదితర అంశాల కారణంగా దేశీ మార్కెట్లో వెండి రేటు సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకినట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. అటు మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్లో సిల్వర్ ఫ్యూచర్స్ జూలై కాంట్రాక్టు ధర ఒక దశలో సుమారు రూ. 3,833 పెరిగి రూ. 1,05,213 వద్ద ట్రేడయ్యింది. పసిడి పరుగు.. డాలరు బలహీనత, అమెరికా రుణభారంపై ఆందోళనలు, అనిశ్చితిలో సురక్షితమైన సాధనంగా పసిడికి పేరుండటం వంటి అంశాల కారణంగా బంగారం ధర కూడా పరుగు తీస్తోంది. 99.9 శాతం స్వచ్ఛత గల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 430 పెరిగి రూ. 99,690 వద్ద (పన్నులు కలిపి) ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం రూ. 400 పెరిగి రూ. 99,100 వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్సుకు (31.1 గ్రాములు) 3,395 డాలర్ల పైకి చేరగా, దేశీయంగా ఎంసీఎక్స్లో రూ. 98,450 వద్ద ట్రేడయినట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.దీపావళి నాటికి దీపావళి నాటికి వెండి ధర రూ. 1,14,000 – రూ. 1,20,000 స్థాయికి చేరే అవకాశం ఉందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా అనిశ్చితుల కారణంగా ఈలోపు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని పేర్కొన్నారు. మరోవైపు, కొత్తగా భౌగోళిక రాజకీయ పరిణామాలేమైనా తలెత్తితే మరింత అనిశ్చితికి ఆజ్యం పోసినట్లవుతుందని, దీంతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారంవైపు మొగ్గు చూపవచ్చని అబాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సీఈవో చింతన్ మెహతా చెప్పారు. -
సర్క్యూలర్ బిజినెస్ మోడల్లో తొలి స్పోర్ట్స్ రిటైలర్
డెకాథ్లాన్ ఇండియా తన ప్రధాన వ్యాపార నమూనాలో సర్క్యూలర్ బిజినెస్ మోడల్ను అనుసరిస్తున్నట్లు తెలిపింది. భారతదేశంలోనే ఈ చొరవ చూపిన మొదటి స్పోర్ట్స్ రిటైలర్గా నిలిచినట్లు పేర్కొంది. ఈ ‘మిషన్ ఎల్ఐఎఫ్ఈ (లైఫ్స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)’ స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ వ్యర్థాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెప్పారు.సర్క్యులర్ బిజినెస్ మోడల్లోని అంశాలు..రిపేర్ సర్వీసులు: 95+ స్టోర్లలో రిపేర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇది వినియోగదారులు వారి స్పోర్ట్స్ వస్తువులకు మరింత సర్వీసు వెసులుబాటును పొందవచ్చు.సెకండ్ లైఫ్ రీసేల్: పునరుద్ధరించిన ఉత్పత్తులు 90+ స్టోర్లలో తిరిగి విక్రయించనున్నారు. ఇది క్రీడా పరికరాలను మరింత చౌకగా చేస్తుంది.బైబ్యాక్ ప్రోగ్రామ్: ఉపయోగించిన పరికరాలను 50+ స్టోర్లలో తిరిగి ఇవ్వవచ్చు. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు.ఇదీ చదవండి: రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందంసుస్థిరత లక్ష్యాలుడెకాథ్లాన్ 2024 స్థాయితో పోలిస్తే 2027 నాటికి సర్క్యులర్ బిజినెస్ టర్నోవర్లో 200% వృద్ధిని అంచనా వేస్తుంది. 2027 నాటికి 3,00,000 కంటే ఎక్కువ క్రీడా ఉత్పత్తులను పునరుద్ధరించాలని భావిస్తుంది. డెకాథ్లాన్ గ్లోబల్ డీకార్బనైజేషన్ వ్యూహంలో భాగంగా 2050 నాటికి నికర-సున్నా ఉద్గారాలను, 2030 నాటికి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 42% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే అధిక నాణ్యత, దీర్ఘకాలిక ఉత్పత్తులను సరసమైనవిగా మార్చడం లక్ష్యమని డెకాథ్లాన్ ఇండియా సీఈఓ శంకర్ ఛటర్జీ నొక్కి చెప్పారు. -
రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందం
భారత వైమానిక దళంలో కీలకంగా ఉన్న రఫేల్ యుద్ధవిమానాల తయారీ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్లు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాయి. ఇరు కంపెనీలు భారత్, ఇతర ప్రపంచ మార్కెట్ల కోసం రఫేల్ యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి నాలుగు ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ ఒప్పందాలపై ఈమేరకు సంతకాలు చేశాయి. ఫ్రాన్స్ వెలుపల రఫేల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం.దేశ ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో, ప్రపంచ సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా డసో ఏవియేషన్ తెలిపింది. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఈ తయారీ కేంద్రం భారతదేశ ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల్లో కీలకమైన పెట్టుబడికి ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొంది.ఈ ఒప్పందంలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లో రఫేల్కు చెందిన లేటరల్ షెల్స్, పూర్తి వెనుక భాగం, సెంట్రల్ ఫ్యూజ్లేజ్ సెక్షన్, ఫ్రంట్ సెక్షన్ వంటి కీలక నిర్మాణ విభాగాల తయారీకి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొదటి ఫ్యూజ్లేజ్ విభాగాలు 2028లో అసెంబ్లింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇరు కంపెనీలు తెలిపాయి. ఈ సదుపాయం ద్వారా నెలకు రెండు ఫ్యూజ్లేజ్లను డెలివరీ చేయనున్నట్లు చెప్పాయి.రఫేల్ యుద్ధ విమానాలను తొలిసారిగా ఫ్రాన్స్ వెలుపల హైదరాబాద్లో ఉత్పత్తి చేయనున్నారు. ‘భారతదేశంలో సరఫరా గొలుసును బలోపేతం చేయడంలో ఇది ఒక నిర్ణయాత్మక దశ. భారత ఏరోస్పేస్ పరిశ్రమలో ప్రధాన సంస్థల్లో ఒకటైన టీఏఎస్ఎల్తో సహా స్థానిక భాగస్వాముల విస్తరణకు కట్టుబడి ఉన్నాం’ అని డసో ఏవియేషన్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎరిక్ ట్రాపియర్ అన్నారు.ఇదీ చదవండి: ఆడుతూ.. పాడుతూ.. డబ్బు పాఠాలుటాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సుకరణ్ సింగ్ మాట్లాడుతూ ‘ఈ భాగస్వామ్యం భారతదేశ ఏరోస్పేస్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ. భారతదేశంలో పూర్తి రఫేల్ ఫ్యూజ్లేజ్ ఉత్పత్తికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు పూర్తి సామర్థ్యాలున్నాయి. ఆధునిక, బలమైన ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ను స్థాపించడంలో భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతిని ఈ ఒప్పందం హైలైట్ చేస్తుంది’ అని అన్నారు. ఈ ఒప్పందాలపై సంతకాలు చేయడం భారతదేశం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ కార్యక్రమాల పట్ల డసో ఏవియేషన్ నిబద్ధతతో ఉందని అధికారులు తెలిపారు. -
ఆడుతూ.. పాడుతూ.. డబ్బు పాఠాలు
పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత నేర్పించడం చాలా ముఖ్యం. ఈ వేసవి సేలవుల్లో తల్లిదండ్రులు విభిన్న వయసు కలిగిన పిల్లలు, యువతకు వైవిధ్యంగా, ఆకర్షణీయంగా డబ్బుకు సంబంధించిన అంశాలను తెలియజేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో మనీ మేనేజ్మెంట్ విషయాలపై బలమైన పునాది నిర్మిస్తే పొదుపు, దీర్ఘకాలంలో సమకూరే ప్రయోజనాలపై స్పష్టత ఏర్పడుతుంది. వయసు వారీగా పిల్లలకు ఎలా డబ్బు అంశాలు తెలియజేయాలో చూసేద్దాం.వయసు 3–5 ఏళ్లునాణేలు, కరెన్సీని గుర్తించడంపై అవగాహన కల్పించాలి. డబ్బు ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చని అర్థం చేయించేలా అవసరాలు, ఆ అవసరాల మధ్య తేడాను గుర్తించేలా చెప్పేందుకు ప్రయత్నించాలి. కథలు చెప్పడం, ఆడించడం లేదా నాటకం రూపంలో దుకాణంలో వస్తువులను కొనుగోలు చేయడం, డబ్బు ఇవ్వడం, తీసుకోవడం.. వంటి వాటిని తెలియజేయాలి.వయసు 6–13పొదుపు చేయడం, ఖర్చు చేయడం, ఈ రెండింటి మధ్య తేడాలు, ఖర్చు అధికమైతే కలిగే నష్టాలను చెప్పాలి. బేసిక్ బడ్జెటింగ్ సూత్రాలు చెప్పాలి. పిల్లలు ఏదైనా వస్తువు కొనాలంటే డబ్బు ఎలా వస్తుందో చెబుతూ.. ఇంట్లో చిన్నచిన్న పనులు చేయమని చెప్పాలి. అందుకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వండి. దాంతో రెండు ప్రయోజనాలుంటాయి. డబ్బు సంపాదించేందుకు ఎంత కష్టపడాలో తెలుస్తుంది. దాన్ని ఎలా ఖర్చు చేయాలో ఆలోచిస్తారు. అనవసర వస్తువులకు డబ్బు ఖర్చు చేసిన తర్వాత ఏదైనా అత్యవసర సమయాల్లో మనీ కావాలంటే మళ్లీ కష్టపడాల్సి వస్తుందనే భావనను తెలియజేయాలి. పొదుపుపై అవగాహన పెంచాలి. డబ్బును కిట్టీ బ్యాంకులో జమ చేయడం అలవాటు చేయాలి.టీనేజ్ (14+)క్రెడిట్, వడ్డీ, పెట్టుబడి, పన్నుల గురించి చర్చించాలి. బ్యాంక్ స్టేట్మెంట్ చదవడం లేదా యాప్లు, స్ప్రెడ్ షీట్లను ఉపయోగించి ఖర్చులను ట్రాక్ చేయడం ఎలాగో నేర్పించాలి.షాపింగ్ వెళ్తున్నారా..వేసవి సెలవులు ఇంకొన్ని రోజుల్లో ముగుస్తాయి. పుస్తకాలు, బట్టలు ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు పిల్లలు తల్లిదండ్రులతో షాపింగ్మాళ్లకు వెళ్తుంటారు. దుకాణాల వద్ద ధరలను గమనించాలి. డిస్కౌంట్లను చర్చించాలి. బ్రాండ్లలో ఉండే తేడాలు పరిశీలించాలి. లోకల్ షాపులోనూ అదే తరహా వస్తువులు లభిస్తాయి. కానీ రెండింటి మధ్య తేడాలేమిటో అడిగి తెలుసుకోవాలి. ఇతర దేశాల వస్తువులపై ఏమేరకు పన్నులు విధిస్తున్నారో తెలుసుకోవాలి. ఆ పన్నుల వల్ల కంపెనీలు, వినియోగదారులపై కలిగే ప్రభావాలను గమనించాలి.ఇదీ చదవండి: బెస్ట్ క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్ కార్డులుపిల్లలు బడ్జెట్ తయారు చేసుకోవాలి. బడ్జెట్ సమయంలో 50-30-20 నియమాన్ని పాటించాలి. అంటే నిత్యం అవసరాల కోసం చేసే తప్పనిసరి ఖర్చుకు మొత్త రాబడిలో 50 శాతం, కోరికల కోసం 30 శాతం, పొదుపునకు మరో 20 శాతం కేటాయించాలి. కుటుంబ బడ్జెట్ రాసేప్పుడు పిల్లలను కూడా అందులో భాగస్వామ్యం కావాలి. -
బెస్ట్ క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు ఇచ్చే క్రెడిట్ కార్డులు
చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించిన కొద్ది నెలల్లోనే బ్యాంకు సిబ్బంది ఫోన్ చేసి ‘సర్.. క్రెడిట్ కార్డు తీసుకుంటారా? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైఫ్ టైమ్ ఫ్రీ.. మీ శాలరీ బేస్ చేసుకుని కార్డు ఇస్తున్నాం’ అని చెబుతుంటారు. డబ్బు అవసరం లేనివారికి ఈ కార్డు ఒక వనరుగా పనిచేస్తే.. మనీ నిత్యం అవసరం ఉండేవారికి మాత్రం ఇదో సంకటంగా మారతుందనే వాదనలున్నాయి. ఏదేమైనా క్రెడిట్ కార్డు వాడుతుంటే రివార్డ్ పాయింట్లు, క్యాష్బ్యాక్ రూపంలో ఎంతోకొంత ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఎలాంటి ప్లాయింట్లు అందిస్తున్నాయో తెలుసుకుందాం.క్యాష్ బ్యాక్ & రివార్డు పాయింట్లుఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్: ఆన్ లైన్ ఖర్చులపై 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తుంది.అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్: ప్రైమ్ మెంబర్లకు 5% క్యాష్ బ్యాక్తో ఎలాంటి ఛార్జీలు లేకుండా లైఫ్టైమ్ ఫ్రీ కార్డు.హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు: షాపింగ్, డైనింగ్పై క్యాష్ పాయింట్స్ అందిస్తుంది.ట్రావెల్ & లాంజ్ యాక్సెస్ కార్డులుహెచ్డీఎఫ్సీ డైనర్స్ క్లబ్ బ్లాక్ మెటల్ ఎడిషన్: అపరిమిత ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, అధిక రివార్డు పాయింట్లు అందిస్తుంది.యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డు: అపరిమిత దేశీయ, అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్ ఇస్తున్నారు.యాక్సిస్ అట్లాస్ క్రెడిట్ కార్డ్: ప్రయాణ ఖర్చుల్లో రాయితీలు పొందవచ్చు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బంగారం ధర!ప్రీమియం, లైఫ్స్టైట్ కార్డులుహెచ్డీఎఫ్సీ గోల్డ్ క్రెడిట్ కార్డు: ఎంపిక చేసిన బ్రాండ్లపై ఐదు రేట్లు రివార్డ్ పాయింట్లు అందిస్తుంది.అమెక్స్ ప్లాటినం ట్రావెల్ కార్డ్: ప్రత్యేక ప్రయాణ ప్రయోజనాలు, హోటల్ మెంబర్షిప్ పొందవచ్చు. -
ఈ-ఆధార్తో తత్కాల్ టికెట్ల బుకింగ్.. అమలు ఎప్పుడంటే..
తత్కాల్ రైలు టికెట్ల బుకింగ్ కోసం భారతీయ రైల్వే తప్పనిసరి ఈ-ఆధార్ ధ్రువీకరణను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నెలాఖరులో కొత్త విధానం అమల్లోకి రానుందని అధికార వర్గాలు తెలిపాయి. తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఈ కోటా కింద నిజమైన ప్రయాణికులకు రైలు టికెట్లను అందించడమే ఈ చర్యల లక్ష్యమని రైల్వేశాఖ తెలిపింది. రైలు టికెట్ బుకింగ్లను ఈ-ఆధార్ వెరిఫికేషన్తో అనుసంధానం చేయడం ద్వారా మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా టికెటింగ్ ప్రక్రియ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.చివరి నిమిషంలో ప్రయాణ ప్రణాళికల కోసం ఉద్దేశించిన తత్కాల్ టికెట్లను కొందరు ఏజెంట్లు అన్యాయమైన మార్గాలను ఉపయోగించి హోర్డింగ్, ఆటోమేటెడ్ బుకింగ్లకు తెరతీస్తున్నారని వాదనలున్నాయి. కొత్త ఈ-ఆధార్ ధృవీకరణ ద్వారా ప్రయాణీకులు బుకింగ్ సమయంలో వారి గుర్తింపును డిజిటల్గా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇది మోసపూరిత బుకింగ్లను అరికట్టడానికి, ప్రక్రియను మరింత మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వేకు తోడ్పడుతుంది.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బంగారం ధర!‘తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి భారతీయ రైల్వే త్వరలో ఈ-ఆధార్ ధ్రువీకరణను ఉపయోగిస్తుంది. ఇది నిజమైన వినియోగదారులు అత్యవసర సమయంలో టికెట్లను పొందడానికి సహాయపడుతుంది’ అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. సాధారణంగా ప్రయాణికులు సీట్ల లభ్యతను బట్టి 60 రోజుల ముందుగానే రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తర్వాతి రోజు బయలుదేరే రైలు టికెట్ బుకింగ్ కోసం ఏసీ క్లాసులు (1ఎ, 2ఎ, 3ఎ, సిసి, ఇసి, 3ఇ)కు ఈరోజు ఉదయం 10:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. నాన్-ఏసీ తరగతుల (ఎస్ఎల్, ఎఫ్సీ, 2ఎస్) టికెట్ బుకింగ్ కోసం ఉదయం 11:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. బుకింగ్లను అనుమతించే తత్కాల్ పథకం ద్వారా 20% టికెట్లు విక్రయిస్తారు. -
దూసుకెళ్తున్న బంగారం ధర!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.91,300 (22 క్యారెట్స్), రూ.99,600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.400, రూ.430 పెరిగింది.చెన్నైలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.430 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.91,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,600 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.91,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.430 పెరిగి రూ.99,750 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే గురువారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,14,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఆర్సీబీకి మాల్యా అభినందనలు.. ఎస్బీఐ ట్వీట్ వైరల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ను గెలుచుకోవడంతో కర్ణాటకలో సందడి నెలకొంది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించిన ఆర్సీబీ ఈ విజయంతో సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుతో పాటు దేశం అంతటా ఈ సంబరాలు జోరుగా సాగుతున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైన ట్వీట్ ఈ వేడుకల్లో ఆసక్తిగా నిలిచింది.భారత్లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి దేశం విడిచి వెళ్లిపోయిన వ్యాపారవేత్త, ఆర్సీబీ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతోపాటు పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆర్సీబీ జట్టును అభినందించిన మాల్యా ‘18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్స్ నిలిచింది. 2025 టోర్నమెంట్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆర్సీబీకి అభినందనలు! ఈ సారి కప్పు మనదే’ అని ట్వీట్ చేశారు. అదికాస్తా వైరల్గా మారింది. అందుకు అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.RCB are IPL Champions finally after 18 years. Superb campaign right through the 2025 tournament. A well balanced team Playing Bold with outstanding coaching and support staff. Many congratulations ! Ee sala cup namde !!— Vijay Mallya (@TheVijayMallya) June 3, 2025‘దయచేసి ఈ శుభ సందర్భంగా కీర్తినగర్లోని ఎస్బీఐ బ్రాంచికి ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్లండి సర్..’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా మాల్యా ట్వీట్కు ఎస్బీఐ నుంచి వచ్చినట్లు ఉన్న రిప్లై (సర్, భారత్కు రండి. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం)ను జోడిస్తూ అందుకే ఎక్స్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు.That’s why I like X pic.twitter.com/hR3QIEwJWV— Harsh Goenka (@hvgoenka) June 4, 2025ఇదీ చదవండి: మస్క్ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రిఎస్బీఐ ట్వీట్ నిజమేనా?వైరల్గా మారుతున్న మాల్యా ట్వీట్కు వస్తున్న రిప్లైలు ఆసక్తిగా మారుతున్న తరుణంలో ఎస్బీఐ నుంచి వచ్చిన రిప్లైను ధ్రువీకరించాలని ఏఐ అసిస్టెంట్ గ్రోక్ను ఓ యూజర్ కోరాడు. దానికి ప్రతిస్పందనగా ఇది కల్పితమై ఉండొచ్చని గ్రోక్ సూచించింది. ఏదేమైనా #EeSalaCupNamde అనే హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండ్ అయింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 10:06 సమయానికి నిఫ్టీ(Nifty) 127 పాయింట్లు పెరిగి 24,747కు చేరింది. సెన్సెక్స్(Sensex) 406 ప్లాయింట్లు ఎగబాకి 81,408 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.67 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.36 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.01 శాతం లాభపడింది. నాస్డాక్ 0.32 శాతం పుంజుకుంది.ప్రధానంగా బ్లూచిప్ కౌంటర్లలో నిన్నటి మార్కెట్లో కొనుగోళ్ల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. దీంతో మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. అంచనాలను మించిన యూఎస్ ఉపాధి గణాంకాలకుతోడు టారిఫ్లపై యూఎస్, చైనా వాణిజ్య చర్చలు సెంటిమెంటుకు జోష్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. నిన్నటి మార్కెట్లో ఎన్ఎస్ఈలో మెటల్, ఆయిల్ రంగాలు 0.6 శాతం పుంజుకోగా.. రియల్టీ 0.7 శాతం నీరసించింది.రూపాయి నేలచూపుదేశీ కరెన్సీ రెండో రోజు డీలా పడింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 26 పైసలు క్షీణించి 85.87 వద్ద నిలిచింది. రూపాయి 85.69 వద్ద ప్రారంభమై 86.05 వరకూ పతనమైంది. మంగళవారం సైతం రూపాయి 22 పైసలు కోల్పోయి 85.61 వద్ద ముగిసిన విషయం విదితమే. వెరసి రెండు రోజుల్లో 48 పైసలు నష్టపోయింది. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 99.11కు చేరింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సేవల రంగానికి డిమాండ్ దన్ను
న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడటంతో దేశీయంగా సేవల రంగం మే నెలలో స్వల్పంగా పెరిగింది. సర్వీసెస్ సెక్టార్ పనితీరును ప్రతిబింబించే హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఏప్రిల్లో 58.7 పాయింట్లుగా ఉండగా మే నెలలో 58.8 పాయింట్లుగా నమోదైంది. పీఎంఐ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, 50కి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. అంతర్జాతీయంగా పటిష్టమైన డిమాండ్ నెలకొనడాన్ని సూచిస్తూ ఏప్రిల్ నుంచి కొత్తగా ఎగుమతులు పుంజుకోవడమనేది మే నెలలో సేవల రంగానికి సానుకూలాంశంగా నిల్చిందని హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు. ఇండెక్స్కి సంబంధించిన సర్వే ప్రకారం ప్రకటనలు, డిమాండ్, ప్రస్తుత క్లయింట్ల నుంచి మళ్లీ ఆర్డర్లు రావడం వంటివి అంశాలు సర్వీసెస్ సెక్టార్ మెరుగ్గా రాణించేందుకు తోడ్పడ్డాయని భండారీ తెలిపారు. -
ఐపీవోకు 6 కంపెనీలు రెడీ
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆరు కంపెనీల ఐపీవో ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్సహా డార్ఫ్–కెటల్ కెమికల్స్, విక్రమ్ సోలార్ తదితరాలు చేరాయి. ఈ ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఉమ్మడిగా రూ. 20,000 కోట్లకుపైగా సమీకరించాలని ప్రణాళికలు వేశాయి. 2024 అక్టోబర్– 2025 జనవరి మధ్య సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. సెబీ అనుమతి పొందిన జాబితాలో ఏవన్ స్టీల్స్ ఇండియా, శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్, శ్రీజి షిప్పింగ్ గ్లోబల్ సైతం ఉన్నాయి. గత నెలలో వచి్చన ఐదు ఐపీవోలతో కలసి 2025లో ఇప్పటివరకూ 16 కంపెనీలు లిస్టింగ్ బాటలో సాగడం గమనార్హం!రూ. 12,500 కోట్లపై కన్నుఐపీవోలో హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ చేయనుంది. ఎన్బీఎఫ్సీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 94.36 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను టైర్–1 మూలధన పటిష్టతకు వెచ్చించనుంది.రూ. 5,000 కోట్లకు రెడీ డార్ఫ్–కెటల్ కెమికల్స్ ఐపీవోలో రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. మరో రూ. 3,500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ మెనన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 829 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 333 కోట్లు అనుబంధ సంస్థలో పెట్టుబడికి వెచ్చించనుంది. సోలార్ మాడ్యూల్ సంస్థ ఐపీవోలో విక్రమ్ సోలార్ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 17.45 మిలియన్ షేర్లను ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయించనున్నాయి. ఐపీవో నిధుల్లో రూ. 793 కోట్లు అనుబంధ సంస్థ వీఎస్ఎల్ గ్రీన్ పవర్ పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. తద్వారా 3,000 మెగావాట్ల సోలా ర్ సెల్ మాడ్యూల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది.లాజిస్టిక్స్ సొల్యూషన్ల సంస్థ షిప్పింగ్, లాజిస్టిక్స్సొల్యూషన్లు అందించే శ్రీజి షిప్పింగ్ గ్లోబల్ ఐపీవోలో భాగంగా 2 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ప్రధానంగా డ్రై బల్క్ కార్గోకు సేవలందించే కంపెనీ ఇష్యూ నిధుల్లో రూ. 289 కోట్లు సూపర్మ్యాక్స్ విభాగంలో సెకండరీ మార్కెట్ నుంచి డ్రై బల్క్ క్యారియర్స్ కొనుగోలుకి వెచ్చించనుంది. మరో రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. ఏవన్ స్టీల్స్ ఇండియా సై ఐపీవోలో భాగంగా ఏవన్ స్టీల్స్ ఇండియా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 50 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ వన్యా స్టీల్స్లో పెట్టుబడులకు వినియోగించనుంది. తద్వారా మెషీనరీ కొనుగోలు, తయారీ సామర్థ్య విస్తరణ, విద్యుత్ యూనిట్ ఏర్పాటు, రుణ చెల్లింపులు చేపట్టనుంది.బంగారు ఆభరణ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా బంగారు ఆభరణాల తయారీ కంపెనీ శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ 1.8 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధుల్లో రూ. 46 కోట్లు జైపూర్ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది. మరో రూ. 190 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు కేటాయించనుంది. -
మస్క్ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రి
అంతరిక్ష సర్వీసులు అందిస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో కీలకంగా ఉన్న స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్మస్క్ ఆలోచనలను ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్ వ్యతిరేకించారు. ఎలాన్ మస్క్ ప్రస్తుతం చేస్తున్న గ్రహాంతర ప్రయాణాల ప్రయోగాలపై ఎర్రోల్ మస్క్ విమర్శలు గుప్పించారు. రాకెట్లు మానవులు, ఇతర గ్రహాలను కాలనీలుగా మారుస్తాయని మస్క్ అభిప్రాయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎర్రోల్ మస్క్ తోసిపుచ్చారు. ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పారు. శాస్త్రీయంగా లోపభూయిష్టమైనదిగా పేర్కొన్నారు.ఎలాన్ మస్క్ దీనికి బదులుగా గురుత్వాకర్షణ, అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు పట్టే సమయాన్ని కుదించేలా అధ్యయనం చేయడం మేలని ఎర్కోల్ మస్క్ చెప్పారు. అంతరిక్ష అన్వేషణలో ఈమేరకు చేసే అధ్యయనాలు భవిష్యత్తు పురోగతికి కీలకంగా మారుతాయని అభిప్రాయపడ్డారు. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కృషిని ప్రస్తావిస్తూ మానవాళి కేవలం రాకెట్లపై ఆధారపడకుండా లోతైన శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇదీ చదవండి: ‘ఆర్టిఫిషియల్’ మూవీ.. ఎవరి గురించి అంటే..స్పేస్ఎక్స్ ద్వారా అంగారక గ్రహంలో మానవుల నివాసానికి అనువుగా ఉండే ప్రదేశాలను, అక్కడి వాతావరణాన్ని తెలుసుకునేందుకు ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మక ప్రణాళికలు వేస్తున్నారు. ఈ సమయంలో ఆయన తండ్రి వ్యాఖ్యలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. -
‘ఆర్టిఫిషియల్’ మూవీ.. ఎవరి గురించి అంటే..
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ను నాటకీయంగా తొలగించి 2023 చివరిలో తిరిగి కంపెనీ సీఈఓగా నియమించుకున్న ఘట్టాన్ని ఫీచర్ ఫిల్మ్ ‘ఆర్టిఫిషియల్’ను తెరకెక్కించేందుకు ఫిల్మ్ మేకర్ లూకా గ్వాడాగ్నినో చర్చలు జరుపుతున్నారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్లో ఈ చిత్రాన్ని హేడే ఫిల్మ్స్ పతాకంపై డేవిడ్ హేమన్, జెఫ్రీ క్లిఫోర్డ్ నిర్మించాలని చూస్తున్నారు. నిర్మాతగా వ్యవహరిస్తున్న సైమన్ రిచ్ స్క్రీన్ ప్లే కూడా అందించాలనుకుంటున్నారు. జెన్నిఫర్ ఫాక్స్ సంస్థ నిర్మాణ బృందంలో చేరడానికి చర్చలు జరుపుతోంది.ది హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం శాన్ఫ్రాన్సిస్కో, ఇటలీని కీలక షూటింగ్ ప్రాంతాలుగా గుర్తించారు. సమ్మర్ షూట్ కోసం చర్చలను వేగవంతం చేస్తున్నారు. కాస్టింగ్ ఒప్పందాలు ఏవీ ఇప్పటివరకు ఖరారు కానప్పటికీ, ప్రారంభ చర్చల ప్రకారం ఆల్టమన్ పాత్రను ఆండ్రూ గార్ఫీల్డ్ పోషించవచ్చని, మోనికా బార్బరో కంపెనీ సీటీఓ మీరా మురాటి పాత్రను పోషించవచ్చని అంచనా వేస్తున్నారు. ఆల్ట్మన్ను తొలగించే ప్రయత్నానికి నాయకత్వం వహించిన సహవ్యవస్థాపకురాలు ఇలియా సుట్స్కేవర్ పాత్రలో యురా బోరిసోవ్ నటించవచ్చని చెబుతున్నారు.తొలగింపునకు కారణం ఇదే..ఓపెన్ ఏఐ(OpenAI) సంస్థ సామ్ ఆల్ట్మన్ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ ఆర్థిక సహకారం ఉన్న కంపెనీ ఆయనను విశ్వసించకపోవడమే సీఈఓగా తొలగించడానికి ప్రధాన కారణమని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా.. ఆల్ట్మన్ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: ‘ఎక్స్ చాట్’ ప్రారంభించిన మస్క్దాంతో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న సామ్ ఆల్ట్మన్ను తిరిగి అదే పదవిలోకి తీసుకుంటున్నట్లు ఓపెన్ఏఐ మళ్లీ ప్రకటించింది. తనను తొలగించిన కంపెనీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని సామ్ పెట్టిన షరతుకు ఓపెన్ఏఐ ఒప్పుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. -
‘ఎక్స్ చాట్’ ప్రారంభించిన మస్క్
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ టూల్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్.. వంటి వాటికి పోటీగా ఎక్స్(గతంలో ట్విటర్) కొత్తగా ‘ఎక్స్ చాట్’ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇది తన వినియోగదారులకు అంతరాయం లేని, సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ సీఈఓ ఎలాన్మస్క్ తెలిపారు.ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్, ఆడియో/ వీడియో కాల్స్ వంటి అధునాతన సామర్థ్యాలను హైలైట్ చేస్తూ మస్క్ ఎక్స్ పోస్ట్లో ఈమేరకు ఎక్స్ చాట్ వివరాలు ప్రకటించారు. ఇన్స్టంట్ మెసేజింగ్ స్పేస్లో ఇప్పటికే దూసుకుపోతున్న కంపెనీలకు ఎక్స్ చాట్ పోటీదారుగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: దేశంలోని తొలితరం సంపన్న మహిళలుప్రస్తుతం బీటా టెస్టింగ్లో ఉన్న ఈ అప్డేటెడ్ మెసేజింగ్ ఇంటర్ ఫేస్ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్ చాట్లో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వాయిస్, వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. ఈ అప్గ్రేడ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్గా ఎక్స్ను అభివృద్ధి చేయాలనే మస్క్ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. -
దేశంలోని తొలితరం సంపన్న మహిళలు
దేశంలో తొలితరం మహిళా పారిశ్రామికవేత్తల సంపద పెరుగుతోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘2025 కాండేర్ హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్’ లిస్ట్ ప్రకారం పది మంది తొలితరం మహిళా పారిశ్రామికవేత్తల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరింది. ప్రధానంగా సాఫ్ట్వేర్, హెల్త్కేర్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మొదటి నుంచి బిలియన్ డాలర్ల వ్యాపారాలను నిర్మించిన మహిళలు ఈ జాబితాలో చోటు సంపాదించారు.ఇదీ చదవండి: ప్చ్.. బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..లిస్ట్లో జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకురాలు రాధా వెంబు రూ.55,300 కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానంలో అమెరికాకు చెందిన అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ రూ.48,900 కోట్ల సంపదతో ఉన్నారు. టాప్ 10 మహిళల్లో ఏడుగురు భారత్లో ఉండగా, మిగిలిన ముగ్గురు అమెరికాలో నివసిస్తున్నారు. మొత్తం సంపదలో రూ.1.11 లక్షల కోట్లతో సాఫ్ట్వేర్, సేవల రంగం ఆధిపత్యం సాగిస్తోంది. హెల్త్ కేర్, రిటైల్, ఫైనాన్స్, టెక్స్ టైల్స్, మీడియా తదితర రంగాలకు చెందినవారున్నారు.పేరు సందప(రూ. కోట్లల్లో)వయసుకంపెనీరాధా వెంబు55,30052జోహో కార్పొరేషన్జయశ్రీ ఉల్లాల్48,90063అరిస్టా నెట్ కిరణ్ మజుందార్ షా32,00071బయోకాన్ఫాల్గుణి నాయర్29,00061నైకానేహా నర్ఖేడే6,80041సంగమంకవితా సుబ్రమణియన్6,50043అప్స్టాక్స్నేహా బన్సాల్5,10043లెన్స్కార్ట్ఇంద్ర కె నూయి4,80069పెప్సికో జూహీ చావ్లా4,60057నైట్ రైడర్స్ మీనా సేథీ2,70080ఓరియంట్ ఫ్యాషన్ -
ప్చ్.. బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,900 (22 క్యారెట్స్), రూ.99,170 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.100, రూ.110 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,170 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.100 పెరిగి రూ.91,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.260 పెరిగి రూ.99,320 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై ఏకంగా రూ.1,900 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,13,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఎఫ్డీ రేట్లు సవరించిన బ్యాంకులు
కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) జూన్ 1, 2025 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లపై సమకూరే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. రూ.3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై తమ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లను సవరించాయి. ఈ రెండు బ్యాంకులు నిర్దిష్ట కాలపరిమితిపై రేట్లను తగ్గించగా, ఎంపిక చేసిన దీర్ఘకాలిక డిపాజిట్లపై పీఎన్బీ రేట్లను పెంచింది.కెనరా బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లుకెనరా బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 4% నుంచి 7% మధ్య, సీనియర్ సిటిజన్లకు 4% నుంచి 7.50% మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను అందిస్తుంది. వీటిలో జూన్ 1, 2025 నుంచి కొన్ని సవరణలు చేసింది. కెనరా బ్యాంక్ ఏడాది కాలపరిమితికి ఎఫ్డీ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దాంతో ఇది 6.85% నుంచి 6.75%కి తగ్గింది. మూడు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్డీ కాలపరిమితికి వడ్డీ రేటును 7% నుంచి 6.75% కు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.పీఎన్బీ ఇలా..పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.3 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త రేట్లు జూన్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి 3.50% నుంచి 6.90% మధ్య ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తుంది. 390 రోజుల కాలపరిమితిపై అత్యధికంగా 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో 390 రోజుల కాలపరిమితిపై అత్యధికంగా 7 శాతం వడ్డీని ఆఫర్ చేసేవారు.ఇదీ చదవండి: విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గింపుఏడాది నుంచి 390 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై వడ్డీ రేటును పంజాబ్ నేషనల్ బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 390 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటును 7 శాతం నుంచి 6.90 శాతానికి సవరించారు. 391 రోజుల నుంచి 505 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.70 శాతానికి, 506 రోజుల కాలపరిమితిపై 6.70 శాతం నుంచి 6.60 శాతానికి తగ్గించారు. 507 రోజుల నుంచి రెండేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటును 6.80 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించారు. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.75 శాతం నుంచి 6.70 శాతానికి తగ్గించింది.వడ్డీరేట్లు పెంపు వీరికే..సీనియర్ సిటిజన్లకు పీఎన్బీ బ్యాంక్ ఇప్పటివరకు 4% నుంచి 7.40% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. సవరించిన తర్వాత 4.30% నుంచి 7.70% వరకు వడ్డీ ఇస్తుంది. -
విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు
విద్యాలక్ష్మి స్కీము కింద విద్యా రుణాలపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు (0.2%) తగ్గించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వెల్లడించింది. సంస్థను బట్టి విద్యా రుణాలపై వడ్డీ రేటు 7.5% నుంచి ప్రారంభం అవుతుందని వివరించింది. ఉన్నత విద్యను అభ్యసించడంలో విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటునందించే లక్ష్యంతో ఈ స్కీమును రూపొందించారు. దేశవ్యాప్తంగా నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలుగా (క్యూహెచ్ఈఐ) గుర్తింపు పొందిన 860 సంస్థల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటోంది.ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదలవిద్యాలక్ష్మి పథకం కింద ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేయాలంటే కింది డాక్యుమెంట్లు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.కేవైసీ వివరాల కోసం: ఆధార్, పాన్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్.అకడమిక్ రికార్డులు: మునుపటి అకడమిక్ ఏడాదిలోని మార్కు షీట్లను సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి.ప్రవేశ పరీక్ష ఫలితాలు: ఇప్పటికే ఏదైనా యూనివర్సిటీలో ప్రవేశం కోసం చూస్తూ, దాని ప్రవేశ పరీక్ష రాసి ఉంటే అందుకు సంబంధించిన ర్యాంక్ కార్డును జోడించాలి.అడ్మిషన్ ప్రూఫ్: ఇప్పటికే సంస్థ నుంచి అడ్మిషన్ వస్తే ఫీజు స్ట్రక్చర్తో పాటు సంస్థ నుంచి అడ్మిషన్ లెటర్.ఫొటోలు: పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.లోన్ హిస్టరీ: ఇప్పటికే బ్యాంకులు/ రుణదాతల నుంచి గతంలో లేదా ప్రస్తుతం ఉన్న రుణాల వివరాలు.ఆదాయ ధ్రువీకరణ పత్రం: రాష్ట్రంలోని నిర్దేశిత పబ్లిక్ అథారిటీ నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 50 పాయింట్లు పెరిగి 24,590కు చేరింది. సెన్సెక్స్(Sensex) 154 ప్లాయింట్లు ఎగబాకి 80,895 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.22 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 65.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.45 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.58 శాతం లాభపడింది. నాస్డాక్ 0.81 శాతం పుంజుకుంది.అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య సుంకాల భయాలతో దేశీయ స్టాక్ సూచీలు నిన్న ఒకశాతం మేర నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 636 పాయింట్లు నష్టపోయి 80,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,543 వద్ద నిలిచింది. సూచీలకిది మూడో రోజూ నష్టాల ముగింపు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
రష్యా చమురు దిగుమతులు జూమ్
న్యూఢిల్లీ: దేశీయంగా రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు గత నెలలో భారీగా పెరిగాయి. వెరసి మే నెలలో రోజుకి 1.96 మిలియన్ బ్యారళ్ల(బీపీడీ)ను తాకాయి. ఇది 10 నెలల గరిష్టంకాగా.. ప్రపంచ ప్రామాణిక ధరలకంటే తక్కువలో చమురు లభించడం ఇందుకు సహకరించినట్లు గణాంకాల సంస్థ కెప్లర్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం, దిగుమతులకు మూడో ర్యాంకులో నిలిచే భారత్ విదేశాల నుంచి 5.1 మిలియన్ బ్యారళ్ల చమురును కొనుగోలు చేసింది. ముడిచమురును శుద్ధి చేయడం ద్వారా రిఫైనరీలు పెట్రోల్, డీజిల్ తదితర ఇంధనాల తయారీని చేపట్టే సంగతి తెలిసిందే.భారత్ కొనుగోలు చేసిన చమురులో రష్యా 38 శాతం వాటా ఆక్రమిస్తోంది. రోజుకి 1.2 మిలియన్ బ్యారళ్ల సరఫరా ద్వారా ఇరాక్ రెండో పెద్ద సరఫరాదారుగా నిలిచింది. ఈ బాటలో భారత్కు 6,15,000 బీపీడీ చమురును సౌదీ అరేబియా ఎగుమతి చేయగా.. యూఏఈ 14,90,000 బీపీడీ అందించింది. యూఎస్ నుంచి 2,80,000 బీపీడీ చమురును అందుకుంది. గత నెలలో భారత్ చమురు దిగుమతుల ప్రొఫైల్ ధరల ఆధారంగా విభిన్న ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు కెప్లర్ వివరించింది. నిజానికి మధ్యప్రాచ్యం నుంచి భారత్ అత్యధికంగా చమురును కొనుగోలు చేస్తుంటుంది. -
భారత మార్కెట్లో భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: భారత ఐటీ పరిశ్రమ, ఔట్సోర్సింగ్ మోడల్ నుంచి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా ఎదిగిందని బ్రిటన్ విమానయాన సంస్థ వర్జిన్ అట్లాంటిక్ సీఈవో షాయ్ వైస్ తెలిపారు. ఇండియా మార్కెట్లో విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. తమకు అమెరికా తర్వాత రెండో అతి పెద్ద మార్కెట్గా భారత్ నిలుస్తోందని వైస్ వివరించారు. వర్జిన్ అట్లాంటిక్ గత పాతికేళ్లుగా భారత్కి విమానాలు నడుపుతోంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి లండన్ హీత్రో ఎయిర్పోర్ట్కి రోజూ అయిదు ఫ్లయిట్స్ను నిర్వహిస్తోంది.ప్రయాణికులను నిరాటంకంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ విమానయాన సంస్థ ఇండిగోతో కంపెనీకి కోడ్õÙర్ ఒప్పందం ఉంది. కొత్త రూట్లలో సర్విసులు ప్రారంభించడమనేది డిమాండ్పై ఆధారపడి ఉంటుందని వైస్ చెప్పారు. భారత్–బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశల మధ్య వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటాయని, తమ కార్గో వ్యాపారానికి కూడా ఇది ప్రయోజనకరమైన అంశమని తెలిపారు.భారత్ రూట్లో నడిపే ప్రతి విమానంలో స్థానికతకు పెద్ద పీట వేసేలా నలుగురు లోకల్ సిబ్బంది ఉంటారని, మెనూలో సమోసాలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. టారిఫ్లపరమైన ఆందోళనపై స్పందిస్తూ విమానయాన సంస్థలకు ఇలాంటి పరిస్థితులు అలవాటేనని వైస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, బ్రెగ్జిట్, కోవిడ్ మహమ్మారిలాంటివెన్నో చూశాయని చెప్పారు. ఇక సరఫరావ్యవస్థపరంగా అంతరాయాల విషయానికొస్తే తమ దగ్గర తగినన్ని విమానాలు ఉన్నాయని, ఈ ఏడాది డెలివరీలేమీ లేవని వైస్ వివరించారు. -
81,000 దిగువకు సెన్సెక్స్
ముంబై: అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, వాణిజ్య సుంకాల భయాలతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతం మేర నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 636 పాయింట్లు నష్టపోయి 80,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 174 పాయింట్లు కోల్పోయి 24,543 వద్ద నిలిచింది. సూచీలకిది మూడో రోజూ నష్టాల ముగింపు. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆరంభంలోనే తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.ఇంధన, ఫైనాన్స్, ఐటీ షేర్లలో భారీగా విక్రయాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 799 పాయింట్లు క్షీణించి 80,575 వద్ద, నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 24,502 వద్ద కనిష్టాన్ని తాకాయి. అమెరికా తయారీ రంగం వరుసగా మూడోనెలా తగ్గుముఖం పట్టడంతో పాటు చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ ఎనిమిది నెలల్లో తొలిసారి క్షీణించినట్లు డేటా రావడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 22 పైసలు బలహీనపడి 86.61 వద్ద స్థిరపడింది.⇒అదానీ గ్రూప్ ముంద్రా రేవు ద్వారా కొన్ని కంపెనీలు ఇరాన్ ఎల్పీజీ దిగుమతి చేసుకునేందుకు సహకరించిందనే ఆరోపణల నేపథ్యంలో గ్రూప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ పోర్ట్స్, ఎన్డీటీవీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజస్ 2.50% – 2% క్షీణించాయి. ⇒ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.105)తో పోలిస్తే 19% ప్రీమియంతో రూ.125 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 24% ఎగసి రూ.130 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 20% లాభంతో రూ.126 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.743 కోట్లకు చేరింది. -
టాటా హారియర్ ఈవీ రెడీ
న్యూఢిల్లీ: వాహనాల దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని మరింతగా విస్తరించే క్రమంలో హారియర్ ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 21.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 500 కి.మీ. రేంజ్ ఉంటుంది. జూలై 2 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. లైఫ్టైమ్ వారంటీ గల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. ఆటో పార్క్ అసిస్ట్, 6 టెరెయిన్ మోడ్లు, 55 పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు మొదలైనవి ఇందులో ఉంటాయి. ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్ కస్టమర్లకు ఇది ఆకర్షణీయంగా ఉంటుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ప్రతి నెలా 25,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ప్రీమియం ఎస్యూవీ విభాగంలో హారియర్, సఫారీ వాహనాలతో టాటా మోటార్స్కి సుమారు 25 శాతం మార్కెట్ వాటా ఉంది.ఎస్యూవీ సెగ్మెంట్ ఏటా గణనీయంగా వృద్ధి చెందుతోందని, దేశీయంగా మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ప్రస్తుతం 54 శాతం వాటా దక్కించుకుందని చంద్ర చెప్పారు. చార్జింగ్ వేగం కూడా గణనీయంగా మెరుగుపడటంతో, సంప్రదాయ వాహనాలకు దీటుగా, మెరుగైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. -
ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరం.. పాక్ బడ్జెట్పై గందరగోళం!
రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో పాకిస్థాన్ రక్షణ వ్యయానికి చేసే కేటాయింపులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆందోళనలు రేకెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సైనిక చర్యలకు నిధులు కేటాయించడంపై ఐఎంఎఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అభ్యంతరాలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో జూన్ 2న విడుదల చేయనున్న పాకిస్థాన్ బడ్జెట్ను జూన్ 10కి వాయిదా వేశారు.పాక్ ప్రతిపాదిత బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని 18% పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని దేశ ఆర్థిక రికవరీని పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం (38% కంటే ఎక్కువ), పెరుగుతున్న రుణ భారం, 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పాక్ పోరాడుతున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల కంటే సైనిక నిధులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఐఎంఎఫ్ అభిప్రాయపడుతోంది. ఇటీవల ఒక బిలియన్ డాలర్ల అప్పును ఐఎంఎఫ్ పాకిస్థాన్కు ఆమోదించిన విషయం తెలిసిందే.బడ్జెట్ వాయిదారక్షణ కేటాయింపులు, పన్ను కోతలకు సంబంధించి ఐఎంఎఫ్తో విభేదాలు తలెత్తడంతో జూన్ 2న విడుదల కావాల్సిన బడ్జెట్ను పాకిస్థాన్ జూన్ 10కి వాయిదా వేసింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని నివారించేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ సూచించింది. సైనిక వ్యయాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను గుర్తించాలని ఐఎంఎఫ్ పాకిస్థాన్కు తెలిపింది.అభివృద్ధి కార్యక్రమాలకు కోతలుపాకిస్థాన్ ప్రతిపాదిత బడ్జెట్ సవరణలో అభివృద్ధికి అత్యంత కీలకంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (పీఎస్డీపీ)కి కేటాయింపులను గతంలో కంటే 20% తగ్గించారు. ఈ తగ్గింపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే రంగాల్లో వృద్ధి అవకాశాలను పరిమితం చేస్తుంది.పెరుగుతున్న రుణ, ఆర్థిక సవాళ్లుపాకిస్థాన్ రుణ-జీడీపీ నిష్పత్తి(డెట్ టు జీడీపీ రేషియో) 70%గా ఉంది. ఇది దేశం ఆర్థిక సౌలభ్యం, అత్యవసర సేవలకు నిధులు సమకూర్చే వెసులుబాటును పరిమితం చేస్తుంది. పెరుగుతున్న వాణిజ్య లోటు నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఆర్థిక పునరుద్ధరణకు తక్కువ మార్గాలను చూపుతుంది.ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదలగతంలో కంటే బడ్జెట్లో భారీగా కోతలు ఎదుర్కొంటున్న ఇతర రంగాలు..మౌలిక సదుపాయాలు: రూ.644 బిలియన్లు (రూ.661 బిలియన్ల నుంచి తగ్గుదల)ఎనర్జీ: రూ.144 బిలియన్లు (రూ.169 బిలియన్ల నుంచి తగ్గుదల)నీటి నిర్వహణ: రూ.109 బిలియన్లు (రూ .135 బిలియన్ల నుండి తగ్గింది)హౌసింగ్ అండ్ ఫిజికల్ ప్లానింగ్: రూ.59 బిలియన్లు (రూ.89 బిలియన్ల నుంచి 34 శాతం క్షీణత)సోషల్ సెక్టార్లు: రూ.150 బిలియన్లు (రూ.200 బిలియన్ల నుంచి 25% తగ్గుదల)సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ.53 బిలియన్లు (రూ.62 బిలియన్ల నుంచి తగ్గుదల)గవర్నెన్స్ ప్రాజెక్టులు: రూ.9 బిలియన్లు (రూ.17 బిలియన్ల నుంచి తగ్గుదల)ఉత్పత్తి రంగాలు: రూ .11 బిలియన్లు (రూ .15 బిలియన్ల నుండి తగ్గాయి). -
రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదల
దేశవ్యాప్తంగా ప్రాపర్టీ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను ఆధునీకరించేందుకు ఉద్దేశించిన రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదాను కేంద్రం ఆవిష్కరించింది. ఈ ప్రతిపాదిత చట్టం సమకాలీన డిమాండ్లకు సరిపోని నాటి 1908 రిజిస్ట్రేషన్ చట్టాన్ని భర్తీ చేయడానికి ఏర్పాటు చేశారు. కొత్త బిల్లు ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ వ్యవస్థకు మద్దతుగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. తద్వారా బ్యూరోక్రసీ, మధ్యవర్తుల అవసరం తగ్గనుంది.ప్రాపర్టీ డాక్యుమెంటేషన్పై ఆధారపడిన ఆర్థిక లావాదేవీలు, చట్టపరమైన నిర్ణయాలు, పరిపాలనా సేవలను క్రమబద్ధీకరించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. భూ దందాల్లోనే కాకుండా వివిధ ఆర్థిక, చట్టపరమైన కార్యకలాపాల్లో కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నందున ఈ మార్పులు ప్రాధాన్యత చోటుచేసుకుంటున్నాయి.1908 రిజిస్ట్రేషన్ చట్టం ఆన్లైన్ డాక్యుమెంట్ నిర్వహణ, డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ వంటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడలేదు. ఈ వెసులుబాట్లు టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో అత్యవసరంగా మారాయి. ప్రాపర్టీ డాక్యుమెంట్లు ఇప్పుడు కేవలం భూ దందాలకు మాత్రమే కాకుండా వివిధ ఆర్థిక, చట్టపరమైన కార్యకలాపాలకు కీలకంగా మారుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఆన్లైన్ అప్లోడ్లు, ఆధార్ ఆధారిత ధ్రువీకరణను అమలు చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా దేశం అంతటా స్థిరమైన, విశ్వసనీయమైన వ్యవస్థను స్థాపించడానికి కొత్త చట్టం అవసరమని భావిస్తున్నారు. ఈ ఏకరూపత పౌరులందరికీ సమర్థవంతమైన, సురక్షితమైన ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: 15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపుప్రతిపాదిత అంశాలు..గృహ కొనుగోలుదారులకు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతంగా నిర్వహించడం కొత్త బిల్లులోని ప్రధానాంశాల్లో ఒకటి. ప్రతిపాదిత విధానంలో పౌరులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పదేపదే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆస్తి పత్రాలను డిజిటల్గా నమోదు చేసుకోవచ్చు.ఆన్లైన్ ద్వారా పేపర్ వర్క్ తగ్గుతుందని, ప్రక్రియలను వేగవంతం చేస్తుందని, మధ్యవర్తులపై ఆధారపడటాన్ని పరిమితం చేస్తుందని భావిస్తున్నారు.ఆస్తుల లావాదేవీలకు డిజిటల్ రికార్డులను తప్పనిసరి చేయడం ద్వారా చట్టపరమైన రక్షణ పెరుగుతుంది. ఈ చర్యతో అమ్మకం ఒప్పందాలు, తనఖా పత్రాలు, సేల్ సర్టిఫికేట్లు వంటి కీలక డాక్యుమెంట్ల చట్టబద్ధత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.డిజిటల్-ఫస్ట్ విధానాన్ని అవలంబించడం ద్వారా, ఆస్తి లావాదేవీలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా చేయడమే ఈ బిల్లు లక్ష్యం. -
వచ్చే ఐదేళ్లలో 50 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు
దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేసి మొత్తం ఎయిర్పోర్ట్ల సంఖ్యను 212కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం (ఐఏటీఏ) వార్షిక సమావేశంలో ఈమేరకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. ఈ విస్తరణలో ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.దేశం అంతటా ప్రజలకు మరింత చౌకగా, అందుబాటు ప్రాంతాల్లో విమానప్రయాణం చేసేలా ఉడాన్ పథకం సంస్కరణలు తీసుకొస్తోంది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 619 కొత్త మార్గాలను నెట్వర్క్లో జోడించింది. ఇది చిన్న పట్టణాలు, నగరాలకు ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పొందేందుకు దోహదపడుతుంది. విమానాశ్రయాల సంఖ్యను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: 15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపుప్యాసింజర్ కనెక్టివిటీకి మించి భారత్ గ్లోబల్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ (ఎంఆర్ఓ) హబ్గా కూడా నిలదొక్కుకుంటోంది. 2031 నాటికి ఎంఆర్ఓ విభాగం 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విమానాల నిర్వహణ అవసరాలను తీర్చే ప్రపంచ స్థాయి సౌకర్యాలను సృష్టించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మార్పు విదేశీ మరమ్మతు సేవలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. భారతదేశ విమానయాన ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది. -
15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపు
ముడి వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు వారాల్లో రిటైల్ స్థాయిలో వంట నూనెల ధరలు 5-6 శాతం తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో దాదాపు 17 శాతం పెరిగిన వంట నూనె ధరలు ఎట్టకేలకు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఇది సింగిల్ డిజిట్కు చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఇమామి అగ్రోటెక్ డైరెక్టర్, సీఈవో సుధాకర్ రావు దేశాయ్ తెలిపారు.తగ్గిన సుంకాల వల్ల కలిగే ప్రయోజనం మరో 15 రోజుల్లో రిటైల్ ధరల్లో ప్రతిఫలిస్తుందని భావిస్తున్నారు. హోల్సేల్ మార్కెట్లు ఇప్పటికే ధరలు తగ్గుముఖం పట్టే సంకేతాలను చూపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ధరల దిద్దుబాటు కేవలం దిగుమతి చేసుకునే నూనెలకే పరిమితం కాదని దేశాయ్ తెలిపారు. దిగుమతులపై ఆధారపడని ఆవనూనె కూడా వంటనూనెలపై కూడా 3-4 శాతం తగ్గుదలను చూడవచ్చని అన్నారు.ఇదీ చదవండి: 300 మందికి జాబ్కట్ చేసిన మైక్రోసాఫ్ట్ముడి వంట నూనె, రిఫైన్డ్ ఆయిల్ సుంకాల మధ్య వ్యత్యాసం 12.5 శాతం నుంచి 22.5 శాతానికి పెరగడం వల్ల కంపెనీలు ముడినూనెను దిగుమతి చేసుకుని దేశీయంగా శుద్ధి చేయడం చాలా ఖర్చుతో కూడుకుంది. అయితే తాజాగా 10 శాతం సుంకం తగ్గింపు నిర్ణయం ఈ విభాగంలోని వ్యాపారాలకు బూస్ట్గా నిలుస్తుందని హల్దర్ వెంచర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేశవ్ కుమార్ హల్దర్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్ వంటి దిగుమతి చేసుకున్న వంట నూనెల దేశీయ రిటైల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే రైస్ బ్రాన్, ఆవనూనె వంటి నూనెలకు కూడా ఈ తగ్గుదల వర్తించే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
300 మందికి జాబ్కట్ చేసిన మైక్రోసాఫ్ట్
ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ తాజాగా 300 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. మే నెలలో దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపిన కొన్ని రోజుల్లోనే ఇలా మరో 300 మంది ఉద్యోగాలు కట్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఈ తొలగింపులు సంస్థ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణానికి అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపినట్లు బ్లూమ్బర్గ్ చెప్పింది. ఈ లేఆఫ్స్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, దీర్ఘకాలిక ప్రాధాన్యతలపై వనరులను కేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.పనితీరుతో సంబంధం లేదు..ఇటీవల టౌన్హాల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగుల తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ లేఆఫ్స్ పనితీరుకు సంబంధించినవి కావని, వ్యూహాత్మక మార్పులో భాగంగా ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఏఐ మౌలిక సదుపాయాలు, దాని అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ ప్రాజెక్ట్ల్లో దాదాపు 30% కోడ్ రాయడానికి సహాయపడుతుందని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ఆటోమేషన్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్పై అధికంగా ఆధారపడడాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: లకారం దగ్గర్లో పసిడి! ఈరోజు ధరలు ఇలా..ఉద్యోగులపై ప్రభావంమైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించిన లేఆఫ్స్లో ఏ కేటగిరీ ఉద్యోగులను తొలగించిందో పేర్కొననప్పటికీ, మునుపటి తొలగింపులో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లను లక్ష్యంగా చేసుకున్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో ఏఐ అసిస్టెడ్ కోడింగ్ టూల్స్ను మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్ఫామ్స్తో సహా ఇతర సంస్థలు ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతర్గతంగా సంస్థల్లో తక్కువ మంది సిబ్బంది నియామకానికి కారణమవుతుందని సేల్స్ఫోర్స్ గత వారం తెలిపింది. మైక్రోసాఫ్ట్లో జూన్ 2024 నాటికి 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 55% మంది యూఎస్లో పనిచేస్తున్నారు. -
లకారం దగ్గర్లో పసిడి! ఈరోజు ధరలు ఇలా..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరలు గడిచిన రెండు రోజులుగా పడిపోయాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు రేట్లు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,800 (22 క్యారెట్స్), రూ.99,060 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.90,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.99,060 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.90,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.70 పెరిగి రూ.99,060 వద్దకు చేరింది.ఇదీ చదవండి: భారత్లో టెస్లా తయారీ లేనట్లే!వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లో మార్పులు వచ్చాయి. కేజీ వెండిపై రూ.100 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,100 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పెయింటర్స్కు గుర్తింపు ఇస్తున్న ప్రోగ్రామ్..
ప్రతి మనిషి తన జీవితాన్ని రంగులమయం చేసుకోవాలనుకుంటారు. అందుకు సరైన అవకాశం రావాలి. అయితే అలాంటి అవకాశాలు వాటంతటవే వస్తాయని కూర్చుంటే మాత్రం ఎప్పటికీ విజయం వరించదు. జీవితంలో కెరియర్ పరంగా ఎదిగేందుకు వచ్చే ప్రతి మలుపును అవకాశంగా మలుచుకోవాల్సిందే. వివిధ రంగులను కలబోసి ప్రత్యేక రంగులు సృష్టించేవారికి మార్కెట్లో డిమాండ్ ఉంది. అందుకు కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా పెయింటర్లకు శిక్షణ ఇస్తున్నాయి. వాటిని తన జీవితంలో ఎదిగేందుకు అవకాశంగా మలుచుకున్నవారిలో విశాఖపట్నానికి చెందిన గణిరాజు సిరిపురం ఉన్నారు. అందుకు ప్రముఖ పెయింట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ అందించిన ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ ద్వారా చాలా మందికి శిక్షణ ఇస్తోంది. ఇందులో రంగుల కలయికతో ప్రదేశానికి తగినట్లుగా, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎలాంటి రంగులు తయారు చేయాలో, ఎలాంటి డిజైన్లను ఇష్టపడుతున్నారో వంటి అంశాలను తెలియజేస్తూ ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ (ఐడీసీ) వంటి ఆధునిక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో గణిరాజు సిరిపురం ‘కామ్యాబీ కే రంగ్’ సీజన్ 6లో ప్రతిభ కనబరిచారు.పాఠాలు నేర్చుకున్నారు.. జీవితాలు మార్చుకున్నారు..గణిరాజు ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కంపెనీ తెలిపింది. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ ద్వారా పాఠాలు నేర్చుకొని తమ జీవితాలను మార్చుకున్న కాంట్రాక్టర్ల స్ఫూర్తిదాయక కథలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. సీజన్ 6లో గణిరాజు ప్రతిభ కనబరిచినట్లు తెలిపింది. ఇప్పటివరకు వివిధ సీజన్ల్లో ఢిల్లీకి చెందిన జునైద్ కాజ్మీ, గుజరాత్లోని మధపార్కు చెందిన అమృత్ బెన్, వారణాసి నుంచి బంటి బింద్ ముందువరుసలో ఉన్నారని చెప్పింది.కుటుంబ పోషణకు పెయింటింగ్ వైపుఏషియన్ పెయింట్స్ ప్లాట్ఫాం ద్వారా సంస్థ లక్షల మందికి ప్రేరణ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వారిలో విశాఖపట్నంకు చెందిన గణిరాజు సిరిపురం ఒకరు. పట్టుదలతో తన జీవితాన్ని విజయగాథగా మార్చుకున్న ఆయనకు చిన్నప్పటి నుంచి చదువుపై మక్కువ ఎక్కువ. కానీ పేదరికంలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి బాధపడుతున్న తండ్రిని చూసి తన కలలను పక్కన పెట్టారు. కుటుంబాన్ని ఆదుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో కుటుంబ పోషణ కోసం పెయింటింగ్ వేసేవారు. ఈ క్రమంలో వైవిధ్యంగా పెయింటింగ్ వేస్తూ తానకంటూ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు.పని పట్ల గౌరవం.. జీవితంపై స్పష్టత..కాలక్రమేణా కస్టమర్ల అంచనాలు పెరుగుతున్న కొద్దీ తనను తాను మెరుగుపరచుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ గురించి తెలుసుకున్నారు. ఈ ప్లాట్ఫాం ద్వారా ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ (ఐడీసీ) వంటి ఆధునిక శిక్షణ పొందారు. ఈ శిక్షణతో తనలో ఆత్మవిశ్వాసంతో పాటు పని పట్ల గౌరవం, జీవితంపై స్పష్టత వచ్చింది. ఈ ప్రోగ్రామ్లో మెలకువలు నేర్చుకుని వినియోగదారుల మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు గణిరాజు కేవలం పెయింటర్ మాత్రమే కాదు. ఒక కళాకారుడిగా తన కెరియర్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తన పనికి ఒక గుర్తింపు ఉంది. ఈ వృత్తిలో ఆయన నైపుణ్యం కలిగిన వ్యక్తిగా స్థిరపడ్డారు. సరైన అవకాశం దొరికితే ఎటువంటి కష్టం వచ్చినా జీవితాన్ని రంగులమయం చేసుకోవచ్చని తన కథ చెబుతోంది.ఇదీ చదవండి: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలుఎంతో మందికి స్ఫూర్తిదాయకంఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ సింగిల్ మాట్లాడుతూ ‘కామ్యాబీ కే రంగ్ అనేది సాధారణ క్యాంపెయిన్ మాత్రమే కాదు. వ్యక్తుల విజయాలను స్మరించుకునే ఒక ఉత్సవం. సాధారణ జీవితం సాగించే పెయింటర్లు కంపెనీ ప్రోగ్రామ్ ద్వారా సమాజంలో ఎదగడం చూస్తున్నాం. ఈ ప్రయాణం మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటివరకు 21 లక్షలకు పైగా ట్రైనింగ్ సెషన్లు నిర్వహించింది. ఈ శిక్షణలోని పెయింట్ అప్లికేషన్, వాటర్ప్రూఫింగ్, ఉడ్ ఫినిషెస్, మెషినరీ వాడకం, కస్టమర్ సర్వీస్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్ని 79 శాతం మంది తమ ఆదాయాన్ని పెంచుకున్నారు. 88 శాతం మంది తమ పనిలో మెరుగయ్యారు. 86 శాతం మందికి సామాజిక గౌరవం లభించింది’ అన్నారు. -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 84 పాయింట్లు తగ్గి 24,634కు చేరింది. సెన్సెక్స్(Sensex) 329 ప్లాయింట్లు దిగజారి 81,044 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.92 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 64.96 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.41 శాతం లాభపడింది. నాస్డాక్ 0.67 శాతం పుంజుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో రిస్క్లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యూపీఐ లావాదేవీల రికార్డ్
న్యూఢిల్లీ: పేద, ధనిక తేడా లేకుండా స్మార్ట్ఫోన్ వినియోగదారులందరికీ అత్యంత చేరువైన యూపీఐ లావాదేవీలు గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాయి. మే నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ. 25.14 లక్షల కోట్లను తాకింది. 2024 మే నెలలో నమోదైన రూ. 20.44 లక్షల కోట్ల విలువైన లావాదేవీలతో పోలిస్తే వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదైంది. అంతక్రితం నెల అంటే ఈ ఏప్రిల్లో నమోదైన రూ. 23.94 లక్షల కోట్లతో చూసినా వీటి విలువ 5 శాతం ఎగసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్(ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలివి. పరిమాణంలోనూ లావాదేవీల సంఖ్య 1,789.3 కోట్ల నుంచి 1,867.7 కోట్లకు పెరిగింది. కాగా..రోజువారీ లావాదేవీల విలువ ఈ ఏప్రిల్తో చూస్తే రూ. 79,831 కోట్ల నుంచి రూ. 81,106 కోట్లకు బలపడింది. -
‘మే’లో తయారీ మందగమనం
న్యూఢిల్లీ: దేశీ తయారీ రంగ వృద్ధి గత నెలలో మందగించింది. మూడు నెలల కనిష్టానికి చేరింది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) మే నెలలో 57.6కు చేరింది. అంతకుముందు నెల ఏప్రిల్లో 58.2గా నమోదైంది. ఇందుకు ప్రధానంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, డిమాండ్ నీరసించడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రభావం చూపాయి. పీఎంఐ 50కుపైగా నమోదైతే తయారీ రంగం వృద్ధిలో కొనసాగుతున్నట్లే. 50 దిగువకు చేరితే ప్రతికూల వృద్ధికి చేరినట్లు. అయితే మే నెలలో తయారీ రంగ వృద్ధి రేటు గత మూడు నెలల్లోనే కనిష్టంగా నమోదైనట్లు సర్వే పేర్కొంది. -
గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతున్న 30 అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాల్లో దేశీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చోటు దక్కించుకుంది. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ట్రెండ్స్ పేరిట రూపొందించిన నివేదికలో భాగమైన లిస్టులో 23వ స్థానంలో నిల్చింది. తద్వారా భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా నిల్చింది. కృత్రిమ మేధ సాంకేతికత వినియోగ ధోరణులు, ప్రభావంపై రూపొందించిన ఈ నివేదికలో మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా తొలి ఎనిమిది స్థానాల్లో అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అమెజాన్ తదితర సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది చైనా నుంచి 3 సంస్థలు, జర్మనీ కంపెనీలు 2, తైవాన్.. నెదర్లాండ్స్ .. దక్షిణ కొరియా.. భారత్ నుంచి ఒక్కో కంపెనీ చొప్పున తొలిసారిగా ఈ లిస్టులో చేరాయి. అమెరికా టాప్.. అత్యంత విలువైన 30 గ్లోబల్ టెక్ కంపెనీల జాబితాలో మూడు దశాబ్దాలుగా అమెరికా ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ లిస్టులో 1995లో అమెరికా వాటా 53 శాతంగా ఉండగా 2025లో 70 శాతానికి పెరిగింది. 30 టాప్ కంపెనీల్లో 21 సంస్థలు అమెరికావే ఉన్నాయి. 1995లో జపాన్కి 30 శాతం వాటా ఉండగా ప్రస్తుతం అది సున్నా స్థాయికి పడిపోయింది. -
ఈవీ మేకర్స్కు గుడ్ న్యూస్!
న్యూఢిల్లీ: విదేశీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు కూడా దేశీయంగా తయారీ కార్యకలాపాలు చేపట్టేలా ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పెట్టుబడుల పరిమాణం ఆధారంగా దిగుమతి సుంకాలను తగ్గించేలా కొత్త ఈవీ పాలసీ మార్గదర్శకాలను నోటిఫై చేసింది దీని ప్రకారం రూ. 4,150 కోట్ల వరకు స్థానికంగా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల తయారీపై ఇన్వెస్ట్ చేస్తే 8,000 వరకు ఈవీలను అత్యంత తక్కువగా 15 శాతం సుంకాలతో దిగుమతి చేసుకునేందుకు వీలవుతుంది. ప్రస్తుతం ఈ సుంకాలు 70–100 శాతం వరకు ఉన్నాయి. సదరు సంస్థలు అనుమతులు పొందిన నాటి నుంచి మూడేళ్లలోగా భారత్లో తయారీ ప్లాంట్ల కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. మరికొద్ది వారాల్లో ఈ స్కీముకు దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని, కనీసం 120 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. భారీ పరిశ్రమల శాఖ గతేడాది మార్చి 15న ఈ స్కీమును ప్రకటించింది. విధివిధానాల్లో కొన్ని.. ప్లాంటు ఏర్పాటు, యంత్ర పరికరాలు మొదలైన వ్యయాలకు స్కీము కింద పెట్టుబడుల ఆధారిత ప్రయోజనాలు లభిస్తాయి. స్థల సమీకరణ కోసం చేసిన వ్యయాలను పరిగణనలోకి తీసుకోరు. అప్లికేషన్ ఫారంతో పాటు దరఖాస్తుదారు రూ. 5,00,000 నాన్–రిఫండబుల్ ఫీజు చెల్లించాలి. ఆటోమోటివ్ తయారీకి సంబంధించి గ్లోబల్ స్థాయిలో గ్రూప్ ఆదాయం రూ. 10,000 కోట్లు దాటిన కంపెనీలకు ఈ స్కీము వర్తిస్తుంది. గరిష్టంగా రూ. 6,484 కోట్ల వరకు సుంకాలపరమైన మినహాయింపు ఉంటుంది. కార్ల తయారీకి సంబంధించి తొలి మూడేళ్లలో దేశీయంగా జోడించే అదనపు విలువ కనీసం 25 శాతం ఉండాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచుకోవాలి. చార్జింగ్ మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాలను కూడా పెట్టుబడి కింద పరిగణిస్తారు. కంపెనీ హామీ ఇచి్చన పెట్టుబడి మొత్తంలో ఇది 5 శాతం లోపు వరకు దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు.టెస్లాకు భారత్లో కార్ల తయారీపై ఆసక్తి లేదు..కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు భారత్లో షోరూమ్లను ప్రారంభించడంపైనే ఆసక్తి ఉంది తప్ప ఉత్పత్తి చేయడంపై లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఈవీ పాలసీ మార్గదర్శకాల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. స్కీముకు సంబంధించిన తొలి విడత చర్చల్లో మాత్రమే టెస్లా ప్రతినిధులు పాల్గొన్నారని, రెండో .. మూడో విడత సంప్రదింపుల్లో పాల్గొనలేదని మంత్రి వివరించారు. మరోవైపు, మెర్సిడెస్ బెంజ్, స్కోడా–ఫోక్స్వ్యాగన్, హ్యుందాయ్, కియాలాంటి అంతర్జాతీయ దిగ్గజాలు మాత్రం భారత్లో తయారీపై ఆసక్తి కనపర్చాయని చెప్పారు. -
రియల్టీలో రూ.700 కోట్లతో కొత్త ఏఐఎఫ్ ప్రారంభం
రియల్టీ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న మీనాక్షి ఆల్టర్నేటివ్స్ (ఎం-ఆల్ట్స్) రూ.700 కోట్ల ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్) ‘మీనాక్షి రియల్ అసెట్స్ ఫండ్స్’ను ప్రారంభించినట్లు తెలిపింది. రియల్ ఎస్టేట్, క్లీన్ ఎనర్జీలో బలమైన పట్టున్న మీనాక్షి గ్రూప్నకు కొత్తగా ప్రారంభించిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సబ్సిడరీగా ఈ ఫండ్ పెట్టుబడి వ్యూహాలు అందిస్తోందని, వినూత్న ఫైనాన్సింగ్ మోడళ్లను తీసుకువస్తుందని భావిస్తున్నారు.ఏఐఎఫ్ ద్వారా తాజాగా మీనాక్షి గ్రూప్ రూ.700 కోట్ల పెట్టుబడులు పెడుతుండడం దేశీయ వాణిజ్య, నివాస స్థిరాస్తి మార్కెట్పై పెరుగుతున్న నమ్మకాన్ని హైలైట్ చేస్తుంది. గత పదేళ్ల నుంచి ఏఐఎఫ్లు పట్టు సాధిస్తున్నాయి. ఇవి సంస్థాగత, అధిక నికర విలువ కలిగిన పెట్టుబడిదారులను సాంప్రదాయ పెట్టుబడి మార్గాలకు మించి వారి పోర్ట్ఫోలియోలను వైవిధ్యపరుస్తున్నాయి. మీనాక్షి రియల్ అసెట్స్ ఫండ్ దేశంలో అభివృద్ధి చెందుతున్న పట్టణ మౌలిక సదుపాయాలు, ఆర్థిక విస్తరణకు అనుగుణంగా నిర్మాణాత్మక పెట్టుబడి అవకాశాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. అందుకు స్థిరాస్తి రంగాన్ని ఎంచుకోవడం వృద్ధికి బాసటగా నిలుస్తుందని నమ్ముతుంది.ఈ ఫండ్ సెబీ ఆమోదించిన కేటగిరీ-2 ఏఐఎఫ్ డెట్, ఈక్విటీ పెట్టుబడులను సమతుల్యం చేస్తూ హైబ్రిడ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అనుసరిస్తుంది. మొత్తం రూ.700 కోట్ల కార్పస్తో ఆరేళ్ల ఇన్వెస్ట్మెంట్ విభాగంలో రియల్ ఎస్టేట్ డీల్స్ ద్వారా రాబడులను ఆప్టిమైజ్ చేయడానికి ఈ ఫండ్ రూపొందించారు. రియల్టీ డెవలపర్లు, మార్కెట్ లీడర్లు, దేశంలోని మైక్రో మార్కెట్లలో కీలక సంస్థలకు మూలధనాన్ని కేటాయించడం ఈ ఫండ్ లక్ష్యం.ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఇన్ఫీ సీఈఓ వేతనం.. ఎంతంటే..మీనాక్షి ఆల్టర్నేట్స్ సీఈఓ మహేష్ కాట్రగడ్డ మాట్లాడుతూ ఏఐఎఫ్ లైసెన్స్ పొందడం తమ వృద్ధికి కీలకంగా మారిందని చెప్పారు. తమ బృందం భవిష్యత్తు అవకాశాలను పక్కాగా అంచనా వేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ వద్ద మూడు సంభావ్య ఒప్పందాలున్నాయన్నారు. కొన్నేళ్లుగా మీనాక్షి గ్రూప్ స్థిరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తోంది. దీనిపనితీరు క్లీన్ ఎనర్జీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగంగా మీనాక్షి ఆల్టర్నేటివ్స్ను రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా నిలబెట్టినట్లు సంస్థ అధికారులు తెలిపారు. -
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్ల కోత?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో జరగబోయే ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటును మరోసారి తగ్గించేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. గతంలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి ఆర్బీఐ వ్యవస్థలో లిక్విడిటీని పెంచింది. ఈసారి జూన్ 6న జరగబోయే ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు కట్ చేసే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా నివేదికలో తెలిపింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వ్యూహాత్మక ప్రయత్నంగా ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంటుందని భావిస్తోంది.నివేదికలో ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం మిగులు లిక్విడిటీ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక సంస్థలు సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను 2.70 శాతానికి తగ్గించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 30-70 బేసిస్ పాయింట్లు తగ్గాయి. దాంతో బ్యాంకుల వద్ద లిక్విడిటీ పెరుగుతోంది. దీన్ని అప్పులు ఇచ్చేందుకు అవకాశంగా మలుచుకుంటున్నాయి.ఇదీ చదవండి: ఇకపై మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఓకేజూన్ పాలసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్ల రేట్ కోత ఉంటుందని భావిస్తున్నామని ఎస్బీఐ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రేటు తగ్గింపు 100 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్బీఐ నిబంధనలమేరకే ఉన్నాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సాధారణం కంటే ఎక్కువ రుతుపవనాలు ఉంటాయని అంచనా వేయడంతో పంటల దిగుబడి, ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలను ఉటంకిస్తూ ఎస్బీఐ 2026 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణ అంచనాను 3.5 శాతానికి తగ్గించింది. ఆర్థిక పనితీరు పరంగా చూస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ 7.4%కు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 8.4% నుంచి తగ్గింది. -
ఇకపై మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఓకే
పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ నిబంధనను పాటించకపోతే ఇకపై జరిమానా విధించబోమని కెనరా బ్యాంక్ ప్రకటించింది. జూన్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త విధానం రెగ్యులర్, శాలరీ, ఎన్ఆర్ఐ ఖాతాలతో సహా అన్ని కేటగిరీల పొదుపు బ్యాంకు ఖాతాలకు వర్తిస్తుందని తెలిపింది.ఈ నిర్ణయంతో కెనరా బ్యాంక్ మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలపై పూర్తి మినహాయింపు అమలు చేసిన మొదటి ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది. దీంతో ఈ బ్యాంక్ వినియోగదారులందరికీ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తుంది. ‘స్వేచ్ఛను అనుభవించండి. వ్యత్యాసాన్ని గుర్తించండి. జూన్ 1, 2025 నుంచి కెనరా బ్యాంక్ పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఎటువంటి జరిమానా విధించబోం’ అని బ్యాంక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈమేరకు పోస్ట్ చేసింది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఇన్ఫీ సీఈఓ వేతనం.. ఎంతంటే..గతంలో బ్యాంక్ ఖాతాదారులు పట్టణ బ్రాంచిల్లో రూ.2 వేలు, సెమీ అర్బన్ బ్రాంచిల్లో రూ.1,000, గ్రామీణ శాఖల్లో రూ.500 సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిర్వహించాల్సి ఉండేది. ఈ పరిమితులను చేరుకోవడంలో విఫలమైతే పెనాల్టీ ఛార్జీలు విధించేవారు. కొత్త విధానం ద్వారా ఈ ఛార్జీలను పూర్తిగా తొలగించారు. బ్యాంకింగ్ సౌకర్యాలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. -
భారీగా పెరిగిన ఇన్ఫీ సీఈఓ వేతనం.. ఎంతంటే..
ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సలీల్ పరేఖ్ వార్షిక వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో 22 శాతం పెరిగినట్లు వార్షిక నివేదికలో తెలిపారు. దాంతో ఆయన వేతనం రూ.80.6 కోట్లకు చేరుకుందని కంపెనీ పేర్కొంది. ఆయన వేతనం పెరుగుదలకు ప్రధాన కారణం తనకు అనుసంధానించిన నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్యూ), ఈక్విటీ విలువ పెరగడమేనని తెలిపింది.2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్కు పోటీగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో వంటి కంపెనీ సీఈఓల వేతనం కంటే కూడా సలీల్ ప్యాకేజీ అధికంగా ఉండడం గమనార్హం. దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారుగా ఉన్న టీసీఎస్ సీఈఓ, ఎండీ కె.కృతివాసన్ వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతం పెరిగి రూ.26.5 కోట్లకు చేరుకుంది. విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పలియా వేతనం 10 శాతం పెరిగి 6.2 మిలియన్ డాలర్లకు లేదా సుమారు రూ.53.6 కోట్లకు చేరుకుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో పరేఖ్ పారితోషికం రూ.71 కోట్ల నుంచి రూ.56 కోట్లకు తగ్గింది.ఇదీ చదవండి: భారత్లో టెస్లా తయారీ లేనట్లే!సలీల్ పరేఖ్ స్టాక్ ఆప్షన్ల ద్వారా రూ.49.5 కోట్లు ఆర్జించగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.39 కోట్లుగా ఉంది. బేస్ పే కింద రూ.7.5 కోట్లు, రిటైర్డ్ బెనిఫిట్స్ కింద రూ.50 లక్షలు పొందారు. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.19.8 కోట్లుగా ఉన్న ఆయన వేరియబుల్ వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.23.2 కోట్లకు పెరిగింది. కంపెనీ ఉద్యోగుల సగటు వేతనం రూ.10.72 లక్షలుగా ఉందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ఏఐ, క్లౌడ్, డేటా, డిజిటల్ రంగాల్లో ఇన్ఫోసిస్ అగ్రగామిగా ఉందని వాటాదారులకు రాసిన లేఖలో పరేఖ్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కంపెనీ 15,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకుందని, ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 3,20,000 మందికి పైగా ఉద్యోగులున్నట్లు తెలిపారు. -
మియావాకి ఫారెస్ట్ను విస్తరిస్తున్న రియల్టీ కంపెనీ
ప్రముఖ ఎకో రియల్టీ సంస్థ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి ఫారెస్ట్ను మరింత విస్తరిస్తూ ‘వుడ్స్ శంషాబాద్’ రెండో దశను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.300 కోట్ల ఆదాయం సమకూరుతుందని కంపెనీ అంచనా వేసింది. భారత్లో సుస్థిర నివాస స్థలాలకు పెరుగుతున్న డిమాండ్ను ఇది బలపరుస్తుందని తెలియజేసింది.వుడ్స్ శంషాబాద్ స్థానిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించేలా జపనీస్ పర్యావరణ పునరుద్ధరణ పద్ధతి మియావాకి అటవీకరణ పద్ధతిని అమలు చేస్తుంది. దీని ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో అడవిని తలపించేలా పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ పర్యావరణాన్ని పెంపొందిస్తారు. గత మూడేళ్లుగా అభివృద్ధి చేసిన మొదటి దశలో భాగంగా ఇప్పటికే 4,50,000 చెట్లు, మొక్కలతో స్వయం సమృద్ధి సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఫేజ్ 2తో స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ 100 ఎకరాల్లో దీన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా 150 కొత్త స్థానిక వృక్ష జాతులను సాగు చేయడం, 141 పక్షి జాతులు, 126 పండ్లు, పుష్పించే చెట్లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: భారత్లో టెస్లా తయారీ లేనట్లే!స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ఫౌండర్, సీఈఓ కీర్తి చిలుకూరి ఈ విస్తరణపై మాట్లాడుతూ..‘ఫేజ్ 1లో భాగంగా కంపెనీ అన్ని అంచనాలను అధిగమించింది. సుస్థిర జీవన నమూనాకు పెరుగుతున్న డిమాండ్ను ఇది ధ్రువీకరించింది. ఫేజ్ 2 వ్యక్తులు, కుటుంబాలకు ప్రత్యేకమైన రోజువారీ మెరుగైన జీవన వాతావరణాన్ని అనుభవించేందుకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది’ అన్నారు. -
భారత్లో టెస్లా తయారీ లేనట్లే!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా తన కార్లను భారతదేశంలో తయారు చేసే అవకాశం లేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కానీ, దేశంలో షోరూమ్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా కంపెనీ వాహనాలను భారత్లో విక్రయించేందుకు ఆసక్తిగా ఉందని చెప్పారు. అందుకోసం జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి టెస్లా నేరుగా దేశంలో వాహనాలను దిగుమతి చేసుకునే వీలుందని అంచనా వేశారు. దీంతో ఇప్పటివరకు భారత్లో టెస్లా కార్లు తయారవుతాయని భావించిన వారికి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.కొత్త ఈవీ పాలసీభారత్లో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో భాగంగా దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. ప్రధాన అంతర్జాతీయ వాహన తయారీదారులను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడుతుంది. రాయిటర్స్ నివేదించిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విధానాన్ని ఖరారు చేసింది. ఇది వాహన తయారీదారులకు కేవలం 15% దిగుమతి సుంకంతో 35,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను నేరుగా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ తక్కువ టారిఫ్లకు అర్హత పొందేందుకు కంపెనీలు దేశంలో తయారీ ప్లాంట్ను స్థాపించాల్సి ఉంటుంది. అందుకు 486 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉండాలి. నిర్ణీత గడువులోపు స్థానికంగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం ప్రారంభించాలి.దేశీయ వాహన తయారీదారులను అంతర్జాతీయ పోటీ నుంచి రక్షించడానికి భారత్లో ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకునే వారు తమ ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల్లో కనీసం 25% మొదటి మూడేళ్లలో స్థానిక కంపెనీల నుంచే తీసుకోవాలి. క్రమంగా తర్వాత ఐదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలనే నిబంధనలున్నాయి. మెర్సిడెస్ బెంజ్, స్కోడా, ఫోక్స్ వ్యాగన్, హ్యుందాయ్, కియా వంటి అనేక ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు.భారత్లో టెస్లా ప్రణాళికలుటెస్లా ఇప్పటికే ముంబయి, ఢిల్లీలో రెండు షోరూమ్లను ఖరారు చేసింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో 4,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని సిద్ధం చేస్తుంది. టెస్లా ఈ ప్రాంతంలో అత్యధిక నెలవారీ లీజు రేట్లతో ఈ స్థాలాన్ని దక్కించుకుంది. నెలకు సుమారు రూ.35 లక్షలు (చదరపు అడుగుకు సుమారు రూ.900) చెల్లించడానికి సిద్ధమైంది. ఐదేళ్ల కాలపరిమితితో లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. కంపెనీ మరో విస్తరణ చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్లో రెండో షోరూమ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో తన మోడల్ 3, మోడల్ వై లను పరీక్షిస్తోంది. త్వరలో స్థానికంగా వీటిని ఆవిష్కరించేదుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు!ట్రంప్కు భయపడ్డారా..?ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్ పాలసీను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా యూఎస్ కంపెనీలు స్థానికంగా అమెరికాలోనే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే చైనా, భారత్లో తయారీ సాగిస్తున్న యాపిల్ వంటి దిగ్గజ కంపెనీకి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ టెస్లా భారత్లో తయారీని ప్రారంభిస్తే ట్రంప్ తీవ్రంగా స్పందిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలాన్మస్క్ ఎంత సన్నిహితుడైనా దేశ అభివృద్ధికి ఆటంకం కలిగితే మాత్రం ట్రంప్ ఊరుకోరని నిపుణులు చెబుతున్నారు. దాంతో రిస్క్ చేయడం ఎందుకనే భావనతో భారత్లో తయారీని వాయిదా వేసుకుంటున్నారా అనే అంచనాలు వెలువడుతున్నాయి. -
వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు!
రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక గణాంకాలు వెల్లడించింది. రూ.2000 నోట్లు రద్దయి రెండేళ్లు గడిచినా ఇంకా చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన రిపోర్ట్లో తెలిపింది. మే 31, 2025 వరకు ఇంకా వ్యవస్థలో రూ.6,181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయని చెప్పింది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 98.26% మాత్రమే తిరిగి వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.2023 మే 19న చలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ ప్రకటన రోజున చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్ల నుంచి 2025 మే 31 నాటికి రూ.6,181 కోట్లకు పడిపోయిందని ఆర్బీఐ పేర్కొంది. రూ.2000 నోట్ల రద్దు సమయంలో 2023 అక్టోబర్ 7 వరకు బ్యాంకు శాఖల్లో వీటి డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే అవకాశం ఉందని ఆర్బీఐ తెలిపింది. దాంతో చాలామంది వారి వద్ద ఉన్న నోట్లను సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి మార్చుకున్నారు. అప్పటికీ మార్చుకోలేనివారు ఆ తేదీ తరువాత దేశవ్యాప్తంగా ఆర్బీఐకు చెందిన 19 కార్యాలయాల్లో ఈ నోట్లను మార్చుకునే వీలు కల్పించింది.ఇదీ చదవండి: నెలలో 22,315 యూనిట్లు సరఫరా2023 అక్టోబరు 9 నుంచి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు రూ.2000 నోట్లను బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి స్వీకరిస్తున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా వీటి ద్వారా రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. లేదా పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలకు పంపవచ్చు. -
నెలలో 22,315 యూనిట్లు సరఫరా
భారత ఆటోమోటివ్ మార్కెట్లో కియా ఇండియా తన ఉనికిని బలోపేతం చేస్తున్నట్లు తెలిపింది. మే 2025లో దేశీయంగా డీలర్లకు పంపించిన కార్ల సరఫరాలో సంవత్సరం ప్రాతిపదికన 14% వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది. మే 2023లో 19,500 యూనిట్లతో పోలిస్తే మే 2025లో కంపెనీ 22,315 యూనిట్లను సరఫరా చేసినట్లు బిల్లులు దాఖలు చేసింది. ఈ పెరుగుదల కియా పోర్ట్ఫోలియోకు పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తుందని కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: పన్ను ఆదా కోసం ఫేక్ చేస్తే.. కొత్త రూల్స్తో కొరడాకారెన్స్ క్లావిస్కియా లైనప్లో ఇటీవల ఆవిష్కరించిన కారెన్స్ క్లావిస్ మోడల్ గేమ్ ఛేంజర్గా నిలుస్తుందని అధికారులు చెప్పారు. ఈ మోడల్ స్టైల్, ఫంక్షనాలిటీ, అత్యాధునిక టెక్నాలజీ వినియోగదారులకు ఆకర్షిస్తుందని తెలిపారు. కాంపాక్ట్ ఎస్యూవీల నుంచి ప్రీమియం ఎంపీవీల వరకు వివిధ రకాల వాహనాలను అందించడంపై సంస్థ దృష్టి సారించిందని పేర్కొన్నారు. -
ఈపీఎఫ్వో UAN యాక్టివేషన్ గడువు పెంపు
ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ) పథకానికి సంబంధించి ముఖ్యమైన చర్యల గడువును ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) మరోసారి పొడిగించింది. ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను యాక్టివేట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో లింక్ చేసుకోసుకునేందుకు గడువును జూన్ 30 వరకు పొడిగించింది.యూఏఎన్ అంటే..యూఏఎన్ అనేది వేతన ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఇచ్చే 12 అంకెల సంఖ్య. ఇది ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనది. వ్యక్తి ఉద్యోగం మారినప్పటికీ ఒకేలా ఉంటుంది. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను ఆన్లైన్లో సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి, నిర్వహించడానికి యూఏఎన్ సహాయపడుతుంది.యూఏఎన్ యాక్టివేట్ చేయడం ఎలా?ఉద్యోగులు ఆధార్ ఆధారిత ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) ఉపయోగించి తమ యూఏఎన్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ ఎలాగో చూడండి..ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ను సందర్శించండి."ఇంపార్టెంట్ లింక్స్" విభాగం కింద "యాక్టివేట్ యూఏఎన్" పై క్లిక్ చేయండి.యూఏఎన్, ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్కు పర్మిషన్ ఇవ్వడానికి 'అగ్రీ' క్లిక్ చేయండి.మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ రావడానికి "గెట్ ఆథరైజేషన్ పిన్" పై క్లిక్ చేయండి.యాక్టివేషన్ పూర్తి చేయడానికి ఓటీపీ ఎంటర్ చేయండి. మీ యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పాస్వర్డ్ వస్తుంది. -
పన్ను ఆదా కోసం ఫేక్ చేస్తే.. కొత్త రూల్స్తో కొరడా
ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు సీజన్ నడుస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్కు గడువు సాధారణంగా జూలై 31 వరకూ ఉండగా ఈసారికి ఆ గడువును సెప్టెంబర్ 15కు పెంచింది ప్రభుత్వం. ట్యాక్స్ ఫైలింగ్ అంటేనే అందరి దృష్టి ట్యాక్స్ డిడక్షన్లపైనే ఉంటుంది. అయితే కొంతమంది పన్ను ఆదా కోసం తప్పుడు ట్యాక్స్ డిడక్షన్లతో మోసానికి పాల్పడుతున్నారు.ఆదాయపు పన్ను శాఖ ఇటీవల చేసిన దర్యాప్తులో 90,000 మందికి పైగా వేతన జీవులు తప్పుడు మినహాయింపులు క్లెయిమ్ చేసినట్లు తేలింది. ఇది దేశ పన్ను ఖజానాకు రూ .1,070 కోట్లకు పైగా నష్టాన్ని కలిగించింది. దీంతో ఆదాయపు పన్ను శాఖ ఈసారి ఫైలింగ్ ప్రక్రియను కఠినతరం చేసింది. మోసపూరిత పన్ను మినహాయింపులు క్లయిమ్ చేయడం ఇప్పుడు అంత సులువు కాదు. నవీకరించిన ఆదాయపు పన్ను రిటర్న్ యుటిలిటీలు ఐటీఆర్ -1, ఐటీఆర్ -4 ఇప్పుడు ఆదాయపు పన్ను చట్టంలోని కీలక విభాగాలలో మినహాయింపులకు బలమైన రుజువును కోరుతున్నాయి.ఎల్ఐసీ, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్ వంటి పెట్టుబడులను కవర్ చేసే సెక్షన్ 80సీ కింద చేసే క్లెయిమ్లలో పాలసీ నంబర్లు లేదా డాక్యుమెంట్ ఐడీలు ఉండాలి. సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా కోసం, పన్ను చెల్లింపుదారులు బీమా కంపెనీ పేరు పాలసీ నంబర్ను పేర్కొనాల్సి ఉంటుంది. రుణాలపై కోరే మినహాయింపులనూ ప్రభుత్వ కఠినతరం చేసింది. సెక్షన్ 80ఈ, 80ఈఈ, 80ఈఈఏ కింద క్లయిమ్ చేసే ఎడ్యుకేషన్, హోమ్ లోన్ బెనిఫిట్స్ కు బ్యాంకుల పేర్లు, లోన్ అకౌంట్ నంబర్లు, మంజూరు తేదీలతో సహా సవివరంగా వెల్లడించాల్సి ఉంటుంది. సెక్షన్ 80ఈఈబీ కింద ఎలక్ట్రిక్ వాహనాల మినహాయింపుల కోసం, వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను కూడా వెల్లడించాలి.200 శాతం జరిమానాట్యాక్స్ ఫైలర్లు చేసిన క్లెయిమ్లను క్రాస్ చెక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ వార్షిక సమాచార ప్రకటన (ఏఐఎస్) ను ఉపయోగించుకుంటుంది. నకిలీ క్లెయిమ్లను అరికట్టడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, ఆటోమేటెడ్ వెరిఫికేషన్ ద్వారా సమ్మతిని పెంచడం ఈ కఠిన నిబంధనల లక్ష్యం. కాబట్టి పన్ను చెల్లింపుదారులు తాము చేసే ప్రతి మినహాయింపునకు సరైన డాక్యుమెంటేషన్తో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే పన్ను బకాయిపై 200 శాతం జరిమానాను 24 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. సెక్షన్ 276సీ కింద దర్యాప్తును కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
గూగుల్ సంచలన యాప్.. ఇంటర్నెట్ లేకుండా ఏఐ..
విస్తృతమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. స్మార్ట్ ఫోన్లలో ఏఐ వినియోగాన్ని భిన్నంగా మార్చే ఓ సంచలన యాప్ను తీసుకొచ్చింది. దీని పేరు ‘ఏఐ ఎడ్జ్ గ్యాలరీ’. ఈ యాప్ ద్వారా శక్తిమంతమైన ఏఐ మోడల్స్ను మొబైల్స్లో ఆఫ్లైన్లోనే రన్ చేయొచ్చు. అంటే ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఏఐతో ఇమేజ్లను సృష్టించడం, కోడ్ రాయడం, సమాధానాలు రాబట్టడం వంటివి చేయొచ్చన్న మాట.ఇందులో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. యూజర్ ప్రైవసీకి ముప్పు చాలా తక్కువ. ఎందుకంటే యూజర్లు అందించే డేటా క్లౌడ్ సర్వర్లకు వెళ్లకుండా మొత్తం ఫోన్లోనే రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీ ముప్పును తగ్గిస్తుంది. అలాగే పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. సర్వర్ కోసం వేచిచూసే పనిలేకుండా యూజర్ల అడిగే ప్రశ్నలకు నేరుగా స్పందించేందుకు ఏఐకి ఆస్కారం కలుగుతుంది.గెమ్మా 3 1బీ అనే లాంగ్వేజ్ మోడల్పై ఆధారపడి ఈ యాప్ పనిచేస్తుంది. కేవలం 529 ఎంబీ పరిమాణంలో వచ్చే ఈ కాంపాక్ట్ మోడల్ సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. పెద్ద మొత్తంలో టెక్ట్స్ను క్షణాల్లో జనరేట్ చేయగలదు. గెమ్మా పరిమాణం చిన్నదైనప్పటికీ కోరిన కంటెంట్ను సృష్టించడం దగ్గర నుంచి డాక్యుమెంట్ విశ్లేషణ, స్మార్ట్ రిప్లైల వరకు అన్నింటినీ క్షణాల్లో చేయగలిగినంత శక్తివంతమైనది.ప్రస్తుతానికి ఈ యాప్ను "ప్రయోగాత్మక ఆల్ఫా విడుదల" గా గూగుల్ పేర్కొంటున్నప్పటికీ, అపాచీ 2.0 లైసెన్స్ కింద పూర్తిగా ఓపెన్ సోర్స్గా ఈ యాప్ అందుబాటులో ఉంది. అంటే డెవలపర్లు, కంపెనీలు దీనిని ఉపయోగించవచ్చు. మార్పులు చేయవచ్చు. వాణిజ్య ఉత్పత్తులలో జోడించవచ్చు. కాగా గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ ఐఓఎస్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. -
రేటెక్కిన బంగారం.. ఇప్పుడు తులం..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. రెండు రోజులు నిలకడగా కొనసాగిన పసిడి ధరలు నేడు (జూన్ 2) పెరుగుదల బాట పట్టాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. జూన్ 2 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.👉ఇది చదివారా? గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వంఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,790🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,650ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,640🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,500బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.330, రూ.300 చొప్పున పెరిగాయి.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు స్వల్ప పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.100 పెరిగి రూ.1,11,000 వద్దకు చేరింది. ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.100 పెరిగి రూ. 1,00,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉక్కు దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల ఆందోళనల మధ్య భారత బెంచ్మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీనికి తోడు దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు, ఎఫ్ఐఐల అమ్మకాలు, రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఆర్బీఐ ద్రవ్య విధాన ఫలితాలకు ముందు భయాందోళనలు సోమవారం సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి.బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 581 పాయింట్లు లేదా 0.71 శాతం క్షీణించి 80,870 వద్ద ఉండగా, నిఫ్టీ 50 సూచీ 165 పాయింట్లు లేదా 0.67 శాతం క్షీణించి 24,586 వద్ద ప్రారంభమైంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్అండ్టీ, టాటా స్టీల్, హెచ్సీసీఎల్ టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, భారతీ ఎయిర్టెల్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు 1.7 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు హెచ్యూఎల్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, ఎస్బీఐ నష్టాల నుంచి తప్పించుకున్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం చొప్పున క్షీణించాయి. ఫియర్ గేజ్ ఇండియా వీఐఎక్స్ ప్రారంభ డీల్స్ లో 8 శాతం పెరిగింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతానికి పైగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.9 శాతం నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 1.16 శాతం పెరిగింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
353 బ్యాంకులపై ఆర్బీఐ జరిమానాలు
నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. భారీ జరిమానాలు విధిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 353 బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలపై రూ .54.78 కోట్ల జరిమానాలు విధించినట్లు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన తన వార్షిక నివేదికలో తెలిపింది.సైబర్ సెక్యూరిటీ, ఎక్స్పోజర్ నిబంధనలు, ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, కేవైసీ మార్గదర్శకాలు, మోసాల వర్గీకరణ, రిపోర్టింగ్ విషయాల్లో నిబంధనలు పాటించని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, సహకార బ్యాంకులపై ఆర్బీఐ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకుంది. సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్కు డేటాను సమర్పించడం, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం వంటి అంశాల్లోనూ ఆయా సంస్థలు అలసత్వం ప్రదర్శించాయి.మొత్తం జరిమానాలలో సహకార బ్యాంకులే అత్యధికంగా ఎదుర్కొన్నాయి. రూ.15.63 కోట్ల విలువైన 264 జరిమానాలను ఆర్బీఐ వాటిపై విధించింది. 37 ఎన్బీఎఫ్సీలు, ఏఆర్సీలు రూ.7.29 కోట్ల జరిమానా ఎదుర్కొన్నాయి. 13 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రూ.83 లక్షల జరిమానాను ఆర్బీఐ విధించింది. ఇక వాణిజ్య బ్యాంకుల్లో 8 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.11.11 కోట్లు, 15 ప్రైవేటు రంగ బ్యాంకులకు రూ.14.8 కోట్ల జరిమానా విధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు విదేశీ బ్యాంకులపైనా ఆర్బీఐ జరిమానా విధించింది. -
యాపిల్ మూడో స్టోర్ బెంగళూరులో.. రెంట్ ఎంతో తెలుసా?
స్మార్ట్ఫోన్ దిగ్గజం యాపిల్ భారత్లో తన రిటైల్ ఉనికిని విస్తరించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని ముంబై, ఢిల్లీలలో తమ రిటైల్ స్టోర్లను ప్రారంభించిన యాపిల్.. మూడో స్టోర్ను బెంగళూరులో తెరుస్తోంది. ఉత్తర బెంగళూరులోని ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో యాపిల్ కొత్త స్టోర్ను ఏర్పాటు చేస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి.ఢిల్లీ స్టోర్తో ఉత్తర భారతదేశంలో.. ముంబై స్టోర్తో పశ్చిమ భారత్లో ఆదరణను పెంచుకున్న యాపిల్.. ఇప్పుడు బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న స్టోర్తో దక్షిణ భారత్లోనూ తమ ఉనికి విస్తరిస్తుందని భావిస్తోంది. తమ తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ కూడా ఇక్కడ కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు.బెంగళూరు స్టోర్ రెంట్ ఎంతంటే..యాపిల్ బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న స్టోర్కు నెలకు రూ.16 లక్షలకు పైగానే అద్దె చెల్లించనున్నట్లు తెలుస్తోంది. యాపిల్ బెంగళూరులోని తన స్టోర్ కోసం రూ .2.09 కోట్ల వార్షిక అద్దెతో 7,997.8 చదరపు అడుగుల స్థలాన్ని 10 సంవత్సరాల లీజుకు తీసుకుందని రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ ద్వారా పొందిన లీజు ఒప్పందాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. 2024 నవంబర్ 8న లీజు అధికారికంగా ప్రారంభం కాగా, 2025 ఆగస్టు 8 నుంచి అద్దె చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాపర్టీ స్పార్కిల్ వన్ మాల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందినది. -
జీఎస్టీ వసూళ్లు జూమ్
న్యూఢిల్లీ: స్థూలంగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు గత నెలలో 16.4 శాతం జంప్ చేశాయి. రూ. 2.01 లక్షల కోట్లను అధిగమించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం మే నెలలో స్థూలంగా దేశీ లావాదేవీల విలువ 13.7 శాతం ఎగసి రూ. 1.5 లక్షల కోట్లను తాకింది. దిగుమతుల జీఎస్టీ ఆదాయం 25 శాతంపైగా పెరిగి రూ. 51,266 కోట్లకు చేరింది. అంతకుముందు నెల(ఏప్రిల్)లో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డ్కు తెరతీస్తూ రూ. 2.37 లక్షల కోట్లుగా నమోదైన విషయం విదితమే. గత నెలలో స్థూల సెంట్రల్ జీఎస్టీ ఆదాయం రూ. 35,434 కోట్లుకాగా.. రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ. 43,902 కోట్లకు చేరింది. సమీకృత జీఎస్టీ రూ. 1.09 లక్షల కోట్లుగా నమోదైంది. సెస్ నుంచి రూ. 12,879 కోట్ల ఆదాయం లభించింది. -
మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్
గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు ఆర్బీఐ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్పీఐ పెట్టుబడులు, యూఎస్ టారిఫ్ పరిస్థితులు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం బలపడింది. చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.4 శాతం వృద్ధి చూపింది. జీడీపీ విలువ 3.9 లక్షల కోట్ల డాలర్లకు చేరడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) మూడు రోజుల సమావేశం బుధవారం(4న) ప్రారంభంకానుంది. శుక్రవారం(6న) పాలసీ సమీక్షా నిర్ణయాలు వెలువడనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఈ వారం మే నెల తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ఆర్బీఐ గత(ఏప్రిల్) సమీక్షలో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6 శాతానికి దించిన సంగతి తెలిసిందే.గణాంకాలు కీలకం మే నెలకు ఆటో అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. వీటికితోడు జీఎస్టీ వసూళ్లు తదితర అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఇటీవల ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఆటుపోట్లను చవిచూడటం, 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ క్షీణించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. దేశీయంగా ఆర్బీఐ రెపో రేటులో 0.25 శాతం కోత పెట్టవచ్చన్న అంచనాలున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎస్యూ బ్యాంకులు యాక్టివ్గా కదిలే వీలున్నట్లు ఖేమ్కా అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వసూళ్లు, ఆటో విక్రయాలు, జీడీపీ తదితర ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు అధిక శాతంమంది నిపుణులు అంచనా వేశారు. ఇతర అంశాలు గత నెల(మే)లో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి మార్చివరకూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిచ్చిన ఎఫ్పీఐలు ఇటీవల నికర పెట్టుబడిదారులుగా నిలుస్తుండటం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి బలపడటం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, ముడిచమురు ధరలు దిగిరావడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు దన్నునివ్వగలవని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ గతేడాదికి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించడం ప్రభుత్వ పెట్టుబడులకు దన్నునిస్తుందని తెలియజేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ల విధింపునకు యూఎస్ ఫెడరల్ కోర్టు చెక్ పెట్టిన నేపథ్యంలో విదే శీ పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు.పెట్టుబడులకే ఎఫ్పీఐల మొగ్గు మే నెలలో రూ. 19,860 కోట్లు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత నెలలో పెట్టుబడులకే ఆసక్తి చూపా రు. వెరసి మే నెలలో నికరంగా రూ. 19,860 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. అంతకుముందు ఏప్రిల్లో అమ్మకాలు, కొను గోళ్ల మధ్య నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 2024 అక్టోబర్లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చిన ఎఫ్పీఐలు ఈ ఏడాది (2025) జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, మార్చిలో రూ. 3,973 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. అయితే ఆపై ఏప్రిల్ చివరి నుంచి కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! -
రిటర్నుల దాఖలుకు రెడీనా..?
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 6.47 కోట్ల నుంచి 8.39 కోట్లకు రిటర్నులు పెరిగాయి. పెరుగుతున్న అవగాహన, ఆదాయపన్ను శాఖ విస్తృత ప్రచారం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్మెంట్ సంవత్సరం 2025–26) ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. వీటిల్లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటి ఫలితంగా అదనపు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. వీటితోపాటు.. ఆదాయన్ను రిటర్నుల పత్రాల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఐటీఆర్ 1, 4లో మార్పులు ఐటీఆర్ 1, 4 పత్రాల దాఖలుకు మరింత మందికి అర్హత లభించింది. ఈక్విటీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభం కలిగిన వారు సైతం వీటిని దాఖలు చేయవచ్చు. కాకపోతే మూలధన లాభం ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలు మించకూడదు. ‘‘ముందు సంవత్సరాల్లో సెక్షన్ 112ఏ కింద దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపు పరిధిలోనే ఉన్నప్పటికీ ఐటీఆర్–1 ఫారమ్కు అర్హత ఉండేది కాదు. దీనికి బదులు ఐటీఆర్–2 లేదా 3 దాఖలు చేయాల్సి వచ్చేది. ఇవి మరింత సంక్లిష్టంగా ఉండడంతో అధిక సమయం పట్టేది. చిన్న పన్ను చెల్లింపుదారులకు శ్రమ తగ్గించే ఉద్దేశ్యంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఐటీఆర్–1, 4 పరంగా అర్హత ప్రమాణాలను సవరించింది. మొత్తం ఎల్టీసీజీ రూ.1.25 లక్షలు మించనప్పుడు, మూలధన నష్టాలను క్యారీఫార్వార్డ్ (తదుపరి సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ 1, 4 దాఖలు చేసుకునేందుకు అనుమతించింది’’అని ట్యాక్స్మన్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాద్వా తెలిపారు. ఒకవేళ దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించినా లేదా మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వారు ఇంతకుముందు మాదిరే ఐటీఆర్ 2 లేదా 3లో నిబంధనల ప్రకారం తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రూ.1.25 లక్షల వరకు మూలధన లాభంపై ఎలాంటి పన్ను లేకపోవడంతో ఈ వెసులుబాటు లభించింది. ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ఐటీఆర్ 1, 2, 3, 5 పత్రాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ కాలమ్ను తొలగించారు. ఇంతకుముందు వరకు ఆధార్ లేకపోయినా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్రోల్మెంట్ నంబర్తో ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం ఉండేది. అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) 2025–26 ఐటీఆర్లు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఆధార్ నంబర్ ఉండాల్సిందే. లేదంటే ఐటీఆర్ దాఖలు చేయలేరని వాద్వా తెలిపారు. వ్యాపారులైతే అదనపు వివరాలు వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం ఉన్న వారు ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మళ్లేందుకు అవకాశం లేదు. వీరు ఒక్కసారి కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే, జీవిత కాలంలో తిరిగి ఒక్కసారే పాత విధానానికి మళ్లేందుకు అనుమతిస్తారు. ‘‘గతేడాది ఐటీఆర్ 4 పత్రం కొత్త పన్ను విధానం నుంచి తప్పుకున్నారా? అని మాత్రమే అడిగేది. అవును అని బదులిస్తే ఫారమ్ 10–ఐఈఏ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇవ్వాల్సి వచ్చేది. ఏవై 2025–26 ఐటీఆర్–4లో మాత్రం మరిన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫారమ్ 10–ఐఈఏ గత ఫైలింగ్ల ధ్రువీకరణలను సైతం సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రస్తుత సంవత్సరంలోనూ కొత్త పన్ను విధానం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా రా? అనే ధ్రువీకరణ సైతం ఇవ్వాలి’’అని వాద్వా తెలిపారు. టీడీఎస్ వివరాలు ఈ ఏడాది ఐటీఆర్ 1, 2, 3, 5లో టీడీఎస్ కాలమ్లో.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏ ఆదాయం నుంచి టీడీఎస్ మినహాయించారన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనం కాకుండా ఇతర ఆదాయంపై టీడీఎస్ మినహాయించినట్టయితే ఆ వివరాలు నమోదు చేయడం తప్పనిసరి అని వాద్వా తెలిపారు. మూలధన నిబంధనల్లో మార్పులు 2024 బడ్జెట్లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల నిబంధనల్లో మార్పులు చేశారు. ఇవి 2024 జూలై 23 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లిస్టెడ్ షేర్లు లేదా అన్లిస్టెడ్ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇల్లు, భూమి లేదా ఇతర క్యాపిటల్ అసెట్లను విక్రయించినట్టయితే.. అవి ఏ తేదీన విక్రయించారన్న దాని ఆధారంగా పన్ను బాధ్యతలను వేర్వేరుగా మదింపు వేసుకోవాలి. 2024 జూలై 23కు ముందు విక్రయించినట్టయితే ఒక రేటు, ఆ తర్వాత విక్రయించిన వారికి మరొక రేటు వర్తిస్తుంది. ఐటీఆర్ పత్రాల్లో 2024 జూలై 23కు ముందు, ఆ తర్వాత లావాదేవీల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ఈక్విటీ, డెట్ సెక్యూరిటీలపై వేర్వేరు రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి. మూలధన లాభం ఉంటే ఐటీఆర్ 2, 3 లేదా 5లో నిబంధనల ప్రకారం తమకు సరిపోయే పత్రాన్ని దాఖలు చేయాలి. అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై లాభం అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై మూలధన లాభాలను ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంటుంది. 2024 జూలై 23 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ‘‘వీటి ప్రకారం.. అన్లిస్టెడ్ డిబెంచర్లు లేదా బాండ్లు 2024 జూలై 22 లేదా అంతకుముందు ఇష్యూ చేసి ఉంటే, వాటి గడువు ముగింపు లేదా విక్రయం లేదా బదిలీ 2024 జూలై 23 లేదా ఆ తర్వాత జరిగితే.. ఆ మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం కిందే పరిగణిస్తారు. ఎంతకాలం పాటు కొనసాగించారన్న దానితో సంబంధం లేదు. ఈ ఆదాయాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. 2024 జూలై 23కు ముందు ఇన్వెస్ట్ చేసి, ఆ లోపే విక్రయించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం కింద 20 శాతం పన్ను చెల్లించాలి’’అని వాద్వా వివరించారు. అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లలో పెట్టుబడులు కలిగిన వారు ఐటీఆర్ 2, 3 లేదా 5 ద్వారా వెల్లడించాల్సి ఉంటుంది. బైబ్యాక్ సైతం డివిడెండే2024 అక్టోబర్ 1 నుంచి లిస్టెడ్ కంపెనీలు చేపట్టే షేర్ల బైబ్యాక్లో పాల్గొని, ఆదాయం అందుకుంటే ఆ మొత్తాన్ని డివిడెండ్ కిందే పరిగణిస్తారు. ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’ (ఇతర వనరుల రూపంలో వచ్చిన ఆదాయం) కింద బైబ్యాక్ మొత్తాన్ని డివిడెండ్ ఆదాయంగా చూపించాలని వాద్వా సూచించారు. ‘‘క్యాపిటల్ గెయిన్స్ షెడ్యూల్లో మాత్రం బైబ్యాక్లో షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని సున్నా కింద చూపించాలి. అప్పుడు షేర్ల కొనుగోలుకు చేసిన పెట్టుబడి మొత్తం మూలధన నష్టం అవుతుంది. దీన్ని తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలి. తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో దీర్ఘకాల మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు’’అని వాద్వా వివరించారు. 80డీడీ, 80యూ కోసం డిజేబిలిటీ సర్టీఫికెట్ వైకల్యంతో ఉన్న వారి కోసం చేసిన వ్యయాలను పాత పన్ను విధానంలో సెక్షన్ 80డీడీ లేదా సెక్షన్ 80యూ కింద మినహాయింపు కోరుకునే అవకాశం ఉంది. ఇందుకు గతంలో ఫారమ్ 10–ఐఏ వివరాలు ఇస్తే సరిపోయేది. అయితే ఈ ఏడాది నుంచి ఈ సెక్షన్ల కింద మినహాయింపు కోరేవారు ఫారమ్ 10–ఐఏతోపాటు (మెడికల్ సర్టీ ఫికెట్) డిజేబిలిటీ సర్టిఫికెట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ (వైకల్య సర్టిఫికెట్ ధ్రువీకరణ) ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఐటీఆర్ 2 లేదా 3ని ఎంపిక చేసుకోవాలని వాద్వా సూచించారు. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్) దివ్యాంగుల కోసం చేసే వైద్య వ్యయాలు లేదా ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80డీడీ కింద పన్ను మినహాయింపు కోరొచ్చు. 80యూ సెక్షన్ అన్నది స్వయంగా వైకల్యం ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించినది. 40 శాతం వైకల్యం ఉన్న వారు రూ.75,000, 80 శాతం వరకు వైకల్యం ఎదుర్కొనే వారు రూ.1.25 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపును ఈ రెండు విభాగాల్లోని వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.కోటిదాటితేనే అప్పుల వివరాలు.. ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మొ త్తం ఆదాయం రూ.50లక్షలు మించినట్టయితే ఆస్తులు, అప్పుల వివరాలను ఐటీఆర్లో వెల్లడించాల్చి వచ్చేది. 2025–26 అసెస్మెంట్ సంవత్సరం నుంచి మొత్తం ఆదాయం రూ.కోటి మించినప్పుడే ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాలంటూ నిబంధనల్లో మార్పులు చేశారు. ఎవరికి ఏ ఫారమ్? ఐటీఆర్–1: వేతనం లేదా పింఛను రూపంలో రూ.50లక్షలకు మించకుండా ఆదాయం, ఒక ఇంటిపై ఆదాయం కలిగిన వారు, ఇతర ఆదాయం ఉన్న వారు (లాటరీ లేదా పందేల్లో గెలుపు రూపంలో కాకుండా) ఐటీఆర్–1 దాఖలు చేసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి వచ్చిన మార్పుల ప్రకారం దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలు మించని వారు సైతం ఇదే పత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. భారత్కు వెలుపల ఆస్తులు కలిగిన వారు లేదా విదేశీ ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–1 దాఖలుకు అర్హులు కారు. అలాగే రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగిన వారు, వ్యవసాయ ఆదాయం రూ.5,000 మించిన వారికీ ఐటీఆర్–1 వర్తించదు. ఐటీఆర్–2: వ్యక్తులు లేదా హెచ్యూఎఫ్లు రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగి.. అదే సమయంలో వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం లేనట్టయితే ఐటీఆర్–2ను ఎంపిక చేసుకోవాలి. ఇతర ఆదాయం (లాటరీలు, పందేల రూపంలో గెలుచుకున్న ఆదాయం సైతం) కలిగి ఉంటే.. స్వల్పకాల మూలధన లాభం, రూ.1.25 లక్షలకు మించి దీర్ఘకాల మూలధన లాభం, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలనుకుంటే, ఒకటికి మించి ఇళ్లపై ఆదాయం.. విదేశీ ఆస్తులు/ ఆదాయం.. క్రిప్టో ఆదాయం కలిగినవారు (మూలధన లాభంగా చూపించేట్టయితే), వ్యవసాయం ఆదాయం రూ.5,000 మించి ఉంటే, ఒక కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉంటే, అన్లిస్టెడ్ షేర్లు కలిగిన వారు సైతం ఫారమ్ 2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–3: ఐటీఆర్–2లో పేర్కొన్న అన్ని ఆదాయాలకు అదనంగా ఒక సంస్థలో భాగస్వామిగా ఉంటే, క్రిప్టో ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా చూపిస్తుంటే ఐటీఆర్–3ని ఎంపిక చేసుకోవాలి. వ్యాపారం, వృత్తి నుంచి ఆదాయం (ఆడిట్, ఆడిట్ అవసరం లేని కేసులు), వేతనం, అద్దె ఆదాయం, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలు, వడ్డీ, డివిడెండ్లు, లాటరీ ఆదాయం లేదా ఇతర ఏదైనా ఆదాయం.. ఒక సంస్థలో భాగస్వామిగా ఆదాయం అందుకున్న వారికి ఇది వర్తిస్తుంది. వ్యాపారం లేదా వృత్తి నిర్వహిస్తూ ప్రిజంప్టివ్ ఇన్కమ్ను ఎంపిక చేసుకోని వారు, వ్యాపారం లేదా వృత్తి ఆదాయం కలిగి రికార్డులు నిర్వహిస్తూ, వాటిని ఆడిటింగ్ చేయాల్సి ఉన్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఐటీఆర్–4: రూ.50లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, పార్ట్నర్íÙప్ ఫర్మ్లు (ఎల్ఎల్పీలు కాకుండా).. ఐటీఆర్–1 కిందకు వచ్చే ప్రతీ ఆదాయానికి అదనంగా.. ప్రిజంప్టివ్ ఇన్కమ్ (టర్నోవర్పై నిరీ్ణత శాతాన్ని ఆదాయంగా చూపించే) స్కీమ్ కింద వ్యాపారం/వృత్తి ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–4ను ఎంపిక చేసుకోవాలి. వ్యవసాయం ఆదాయం రూ.5,000 కు మించకుండా ఉంటేనే దీనికి అర్హత ఉంటుంది. లాటరీ, పందేల రూపంలో కాకుండా ఇతర ఆదాయం కలిగిన వారు.. వీటికి అదనంగా దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించకుండా ఉండి, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ –4 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–5: ఎల్ఎల్పీలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్లు (ఏవోపీలు), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీవోఐలు), ఆర్టీఫీషియల్ జ్యురిడికల్ పర్సన్ (ఏజేపీలు)లకు ఇది వర్తిస్తుంది. ఐటీఆర్–6: సెక్షన్ 11 కింద మినహాయింపులు క్లెయిమ్ చేయని కంపెనీలు ఐటీఆర్–6 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–7: సెక్షన్ 139(4ఏ), లేదా సెక్షన్ 139(4బి) లేదా సెక్షన్ 139(4సి), లేదా సెక్షన్ 139(4డి), లేదా సెక్షన్ 139(4ఈ), లేదా సెక్షన్ 139(4ఎఫ్)ల కింద ఆదాయం కలిగిన వ్యక్తులు, కంపెనీలకు ఐటీఆర్–7 వర్తిస్తుంది. డిజిటల్ ఫారమ్ 16 ఆదాయపన్ను శాఖ కొత్తగా డిజిటల్ ఫారమ్ 16ను ప్రకటించింది. ఉద్యోగుల వేతనం నుంచి మినహాయించిన పన్ను వివరాలు (టీడీఎస్) ఫారమ్ 16లో ఉంటాయి. సాధారణంగా ఏటా మే చివరి నాటికి ఈ పత్రాన్ని యాజమాన్యాలు ఉద్యోగులకు జారీ చేస్తుంటాయి. దీని ఆధారంగా ఉద్యోగులు రిటర్నులు దాఖలు చేస్తుంటారు. ఇకపై ట్రేసెస్ పోర్టల్ నుంచి నేరుగా ఫారమ్ 16 డిజిటల్ పత్రాన్ని జారీ చేయనున్నారు. దీంతో ఈ డిజిటల్ ఫారమ్ 16ను పన్ను రిటర్నుల దాఖలు పోర్టళ్లపై డిజిటల్గా అప్లోడ్ చేసుకోవచ్చు. దాంతో ఫారమ్ 16లో ఉన్న వివరాలన్నీ ఐటీఆర్లో ఆటోమేటిగ్గా భర్తీ అవుతాయి. ఇవి గమనించాలి.. → వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు జూలై 31 లేదా ఆలోపు ఐటీఆర్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో మార్పులు తీసుకొచ్చినందున ఈ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. → ఆడిటింగ్ అవసరమైన వ్యాపార సంస్థలకు ఈ గడువు అక్టోబర్ 31. → సవరణ రిటర్నులు దాఖలుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుంది. → రూ.5లక్షలకు మించని ఆదాయం కలిగిన వారు రూ.5వేల ఆలస్యపు రుసుం, రూ.5 లక్షలు మించిన ఆదాయం కలిగిన వారు రూ.1,000 ఆలస్యపు రుసుంతో డిసెంబర్ 31 వరకు బిలేటెడ్/లేట్ రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుమతి ఉంది. → అప్డేటెడ్ రిటర్నులను అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి నాలుగేళ్ల వరకు దాఖలు చేసుకోవచ్చు. ఇందుకు మార్చి 31 తుది గడువు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
దండుకున్న బ్యాంకులు దిగొస్తున్నాయి..!
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేని సామాన్యుల దగ్గర నుంచి మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల కింద రూ. కోట్లు దండుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడిప్పుడే దిగొస్తున్నాయి. అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లేకపోతే విధించే చార్జీలను తొలగిస్తున్నాయి. ప్రధాన బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ తాజాగా అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది. అయితే ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేదన్న కారణంతో బ్యాంకులు కస్టమర్ల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నాయో తెలిస్తే అవాక్కవుతారు..మూడేళ్లలో రూ.5,614 కోట్లు లాక్కున్నాయి..2024 ఆర్థిక సంవత్సరంలో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఖాతాదారుల నుంచి రూ. 2,331 కోట్లు వసూలు చేశాయి. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన రూ. 1,855.43 కోట్లతో పోలిస్తే 25.63 శాతం ఎక్కువ. గత మూడు సంవత్సరాలలో (2022–2024) ఈ బ్యాంకులు మొత్తం రూ.5,614 కోట్లు సామాన్య కస్టమర్ల నుంచి మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల రూపంలో దోచేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐదు ప్రధాన ప్రైవేటు బ్యాంకులు (యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్) కలిపి కనీస బ్యాలెన్స్ కోసం రూ.21,000 కోట్లకు పైగా వసూలు చేశాయి.సామాన్య ఖాతాదారుల నుంచి చార్జీలు దండుకోవడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ముందువరసలో నిలిచింది. 2024లో ఈ బ్యాంకు రూ.633.4 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 386.51 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 369.16 కోట్లు దండుకున్నాయి. సాధారణంగా, మెట్రో ప్రాంతాల్లో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) రూ.3,000 – రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,000–రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.500–రూ.1,000 ఉంటుంది. దీనిని నిర్వహించకపోతే రూ.400–రూ.500 జరిమానా రూపంలో బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆ వస్తువులు ఇక అమ్మరు..
ఆన్లైన్ షాపింగ్ అన్నది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. దుస్తుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల వరకూ అన్నింటినీ ఈ-కామర్స్ సంస్థల్లోనే కొనేస్తున్నారు. అయితే ఇలా అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లో విక్రయించేందుకు వీల్లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, జియోమార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు వాకీ-టాకీల విక్రయాలను నిలిపేశాయి.రేడియో పరికరాల అక్రమ లిస్టింగ్, అమ్మకాల నివారణ, నియంత్రణ కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) మార్గదర్శకాలను జారీ చేసిన మీదట ఈ-కామర్స్ సంస్థలు తమ విక్రయ వస్తువుల జాబితా నుంచి వాకీ-టాకీలను తొలగించాయని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. రేడియో కమ్యూనికేషన్ పరికరాలు ముఖ్యంగా భద్రతా ముప్పును కలిగించే వాకీ-టాకీలను ఆన్లైన్లో అనధికారికంగా విక్రయించడాన్ని అరికట్టడానికి ఈ మార్గదర్శకాలను జారీ చేశారు.టెలికమ్యూనికేషన్స్ విభాగం, హోం మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు సీసీపీఏ పీఐబీ ప్రకటనలో పేర్కొంది. చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు లేదా లైసెన్సింగ్ వివరాలు లేకుండానే చాలా సంస్థలు ఆన్లైన్లో వాకీటాకీలను విక్రయిస్తున్నట్లు గుర్తించామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా సంస్థలు వాకీటాకీల ఫ్రీక్వెన్సీ రేంజ్, వాటిని వినియోగానికి లైసెన్స్ అవసరమా అన్న వివరాలను పేర్కొనకుండా, ఆ పరికరాలను స్వేచ్ఛగా ఉపయోగించవచ్చని వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని గుర్తించిన మీదట తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.దీంతో కొన్ని ఈ- కామర్స్ సంస్థలు తమ లిస్టింగ్ నుంచి వాకీటాకీలను తొలగించినప్పటికీ మరికొన్ని మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగిస్తుండటం గమనార్హం. అన్ని ప్రధాన ఆన్లైన్ విక్రయ సంస్థల్లో 16,970 వస్తువులకు సంబంధించి ఫ్రీక్వెన్సీ, అవసరమైన లైసెన్సింగ్ వివరాలు లేకపోవడంపై సీసీపీఏ గతంలోనే 13 నోటీసులు జారీ చేసింది. ఈ ప్లాట్ ఫామ్ లు నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయి. -
బ్యాంకు అకౌంట్లో పైసా లేకపోయినా పర్లేదు..!
బ్యాంక్ అకౌంట్.. దేశంలోని ప్రతి పౌరుడికీ కనీస అవసరంగా మారింది. ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల కోసం అందరూ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. కానీ ఆ బ్యాంకు అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉంచడం పేదలు, సామాన్యులకు భారంగా మారింది. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే చార్జీల పేరుతో బ్యాంకులు బాదేస్తున్నాయి. అయితే కొన్ని బ్యాంకులు ఇప్పుడిప్పుడే సామాన్యులకు ఉపశమనం కల్పిస్తున్నాయి.తాజాగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు జూన్ 1 నుంచి అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది. ఇదే క్రమంలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని, తక్కువ లేదా జీరో బ్యాలెన్స్కు ఎటువంటి జరిమానాలు విధించని జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను మరికొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఇలాంటి అకౌంట్లను ఏయే బ్యాంకులు అందిస్తున్నాయి.. ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నాయి.. ఈ కథనంలో తెలుసుకోండి...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ (బీఎస్బీడీఏ)ను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు, నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ యాక్టివేట్ చేయడానికి లేదా అకౌంట్ క్లోజర్కు ఎలాంటి ఛార్జీలు ఉండవు.వడ్డీ రేటు: రూ .10 కోట్ల వరకు సంవత్సరానికి 2.70%అర్హత: భారతీయ నివాసితులు; చెల్లుబాటు అయ్యే కేవైసీ (ఆధార్, పాన్ మొదలైనవి) అవసరం.అదనపు గమనికలు: గరిష్ట బ్యాలెన్స్ పై గరిష్ట పరిమితి లేదు; ఏటీఎం లేదా బ్రాంచీల వద్ద విత్ డ్రా ఫారాల ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్:జూన్ 1 నుండి, కెనరా బ్యాంక్ అన్ని పొదుపు ఖాతాలలో కనీస బ్యాలెన్స్ జరిమానాలను తొలగించింది. జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా మార్చింది.ఫీచర్లు: తక్కువ లేదా జీరో బ్యాలెన్స్ లకు ఛార్జీలు ఉండవు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను ప్రోత్సహిస్తాయి.సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్ఆర్ఐ ఎస్బీ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది.ఇండియన్ బ్యాంక్:బీఎస్బీడీఏ, మైనర్ల ఖాతాలు వంటి నిర్దిష్ట జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాలను అందిస్తుంది (గరిష్టంగా రూ. 2,00,000 ఉన్న ఖాతాలకు కనీస బ్యాలెన్స్ లేదు).ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్బుక్, ఇంటర్నెట్ / మొబైల్ బ్యాంకింగ్ (అభ్యర్థనపై).వడ్డీ రేటు: సంవత్సరానికి 2.75% –2.90% (2024 లో బ్యాలెన్స్ ఆధారంగా).గమనిక: సాధారణ పొదుపు ఖాతాలకు రూ .500 (చెక్బుక్ లేకుండా) లేదా రూ. 1,000 (చెక్బుక్తో) కనీస బ్యాలెన్స్ అవసరం, కానీ ఈ ఖాతాలలో ఈ మినిమమ్ బ్యాలెన్స్ ఉంచకపోయినా ఎటువంటి జరిమానాలు ఉండవు. నిర్దిష్ట పథకాలకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు అందుబాటులో ఉన్నాయి.యాక్సిస్ బ్యాంక్:ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా బేసిక్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, బేసిక్ బ్యాంకింగ్ సేవలు (డిపాజిట్లు/ ఉపసంహరణలు), ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్ యాక్సెస్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% –3.5% (బ్యాలెన్స్ ఆధారంగా).బ్యాంక్ ఆఫ్ బరోడా:ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయంతో కూడిన బరోడా రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు, ఇంటర్నెట్/మొబైల్ బ్యాంకింగ్, జీరో బ్యాలెన్స్కు ఎలాంటి పెనాల్టీలు ఉండవు.వడ్డీ రేటు: మారుతుంది (సాధారణంగా సంవత్సరానికి 2.75%–3.25%).హెచ్డీఎఫ్సీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్బీడీఏను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, ప్రారంభ డిపాజిట్ అవసరం లేదు, అపరిమిత ఏటీిఎం ఉపసంహరణలు, ఉచిత నెట్ / మొబైల్ బ్యాంకింగ్, ఎల్పీజీ సబ్సిడీలు, డీబీటీ వంటి ప్రభుత్వ సబ్సిడీ పథకాలకు ప్రాప్యత.వడ్డీ రేటు: ఏడాదికి 3 శాతం (రూ.50 లక్షలలోపు బ్యాలెన్స్లకు), 3.5 శాతం (రూ.50 లక్షలకు మించిన బ్యాలెన్స్లకు).ఐసీఐసీఐ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా బీఎస్బీడీఏ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు, 15,000+ ఏటీఎంలకు యాక్సెస్, ఉచిత నగదు డిపాజిట్లు, పాస్బుక్, ఆప్షనల్ ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్.వడ్డీ రేటు: సంవత్సరానికి 3% (ప్రారంభ రేటు).కోటక్ మహీంద్రా బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా కోటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతాను అందిస్తోంది.ఫీచర్లు: 811 యాప్ లేదా వెబ్సైట్ ద్వారా తక్షణ ఖాతా తెరవడం, ఉచిత వర్చువల్ డెబిట్ కార్డు (సంవత్సరానికి రూ.199 వద్ద ఫిజికల్ కార్డు), అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, డెబిట్ కార్డు చెల్లింపులపై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 4% వరకుఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్:కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా ప్రథమ్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు (మైక్రో ఏటీఎంలతో సహా), ఉచిత నెట్/ మొబైల్ బ్యాంకింగ్, నెలవారీ వడ్డీ క్రెడిట్లు, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. రూ.35 లక్షల ప్రమాద బీమా, డైనింగ్ డీల్స్).వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు (లిస్టెడ్ బ్యాంకుల్లో అత్యధికం).ఆర్బీఎల్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే డెబిట్ కార్డు (విత్ డ్రా లిమిట్ రూ.50,000/రోజు), ఉచిత అన్ లిమిటెడ్ నెఫ్ట్/ఆర్టీజీఎస్, ఉచిత నెట్/మొబైల్/ఫోన్ బ్యాంకింగ్, షాపింగ్/డైనింగ్ పై డిస్కౌంట్లు.వడ్డీ రేటు: ఏడాదికి 7.5% వరకు.యస్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత అంతర్జాతీయ డెబిట్ కార్డు, యెస్ బ్యాంక్ ఏటీఎంలలో అపరిమిత ఏటీఎం ఉపసంహరణలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు, ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్/ ఐఎంపీఎస్, కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ (ఉదా. యాక్సిడెంటల్ డెత్ కవర్).వడ్డీ రేటు: ఏడాదికి 2.75% (రూ.50 లక్షల వరకు), 3.25% (రూ.40 కోట్ల వరకు).డీసీబీ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత ఏటీఎం కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్/ ఆర్టీజీఎస్, ఉచిత నెట్/ మొబైల్/ ఫోన్ బ్యాంకింగ్, ఫిజికల్/ ఈమెయిల్ స్టేట్మెంట్లు.వడ్డీ రేటు: వనరులలో పేర్కొనబడదు, కానీ సాధారణంగా పోటీ.ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:సెల్ఫీ సేవింగ్స్ అకౌంట్ (జీరో బ్యాలెన్స్, యువతను లక్ష్యంగా చేసుకుని) అందిస్తోంది.ఫీచర్లు: నో మినిమమ్ బ్యాలెన్స్, ఉచిత డెబిట్ కార్డు, ఇంటర్నెట్/ మొబైల్ బ్యాంకింగ్, కాంపిటీటివ్ వడ్డీ రేట్లు.వడ్డీ రేటు: పరిశ్రమలో అత్యధికం (క్రెడిట్ త్రైమాసికం).ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్:మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది.ఫీచర్లు: ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డు, అపరిమిత ఉచిత నెఫ్ట్ / ఆర్టీజీఎస్ / ఐఎంపీఎస్, రూ .5,000 వరకు కాంటాక్ట్ లెస్ లావాదేవీలు, క్యాష్ బ్యాక్ / రివార్డులు.వడ్డీ రేటు: ఏడాదికి 7% వరకు. -
ఇంట్లో ఇలాంటి మొక్కలే పెంచుతున్నారు..
సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లో స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలను పెంచుకుంటున్నారు. దాంతో అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్ గార్డెనింగ్ మొక్కల ప్రత్యేకత ఏంటంటే.. వీటికయ్యే వ్యయం చాలా తక్కువ. నిర్వహణ కూడా తేలికే. పైగా అందంగా, అద్భుతమైన డిజైన్లతో అలంకారప్రాయంగా ఉంటాయి.ఇండోర్ గార్డెనింగ్పై ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్ ప్లాంట్కే. నిర్వహణ అత్యంత సులువు. తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఉంచినప్పటికీ.. స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తుంది. నిలువుగా పెరుగుతుంది. మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్ ప్లాంట్ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచూ శుభ్రం చేస్తుండాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి. లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది.గార్డెనింగ్ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు. ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి.కాలుష్య కారకాలను తొలగించడం, కార్బన్ మోనాక్సైడ్, అమ్మోనియా ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరెథైలీన్లను పీల్చుకోవటంలో, ఇండోర్లోని గాలిని శుభ్రం చేయడంలో పీస్ లిల్లీలు అద్భుతంగా పనిచేస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది పుష్పించే మొక్క కాదు. ఇది ఉష్ణమండల ప్రాంతాల నుంచి వస్తుంది. ఇది పెరగాలంటే నేల, తేమ అవసరం. దీనికి తరుచూ నీళ్లు పోస్తుండాలి. ఆకులు పడిపోతున్నాయంటే నీటి అవసరం ఉందన్న విషయం మీరు గ్రహించాలి.ఈ మొక్కలు ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు అనేక రకాలుగా వస్తాయి. చైనీస్ ఎవర్గ్రీన్ లేదా ఆగ్లోనెమాస్ బహుముఖ ప్రయోజనాలు ఉండే మొక్కలు. వీటి నిర్వహణ సులువు. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. వీటిని ఇంటీరియర్ డిజైనింగ్లో వినియోగించుకోవచ్చు. అధిక స్థాయిలో ఆక్సిజన్ను విడుదల చేయడంతో పాటు హానికారక రసాయనాలను పీల్చుకుంటాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో.. ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కలు పెరుగుతాయి. -
ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్కార్డులపై కొత్త చార్జీలు.. జూలై 1 నుంచి..
ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఛార్జీలను పెంచుతున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ రెండూ క్రెడిట్ కార్డు లావాదేవీల నిబంధనలను సవరించాయి. కొత్త చార్జీలను ప్రవేశపెడుతున్నాయి. ఇవి జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు కస్టమర్లకు ఆయా బ్యాంకులు నోటిఫికేషన్లు పంపించాయి.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్పులివే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీల నిబంధనలను సవరించింది. గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ ఛార్జీలపై జూలై 1 నుండి కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టింది. డ్రీమ్ 11, రమ్మీ కల్చర్, జంగ్లీ గేమ్స్ లేదా ఎంపీఎల్ వంటి ప్లాట్ఫామ్లలో నెలకు రూ .10,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే 1% ఛార్జీ వర్తిస్తుంది. ఇది గరిష్టంగా రూ.4,999గా ఉంటుందని, ఆన్ లైన్ గేమింగ్ లావాదేవీలపై ఎలాంటి రివార్డు పాయింట్లు లభించవని బ్యాంక్ తెలిపింది.క్రెడిట్ కార్డును ఉపయోగించి పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్ లేదా ఓలా మనీ వంటి ప్లాట్ఫామ్లలో నెలకు రూ .10,000 కంటే ఎక్కువ వాలెట్ లోడింగ్ చేస్తే 1% చార్జీ వసూలు చేస్తారు. నెలకు మొత్తం వాలెట్ లోడింగ్ ఖర్చుకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. గరిష్టంగా రూ .4,999 ఉంటుంది.క్రెడిట్ కార్డులతో నెలకు రూ.50,000 లకు మించిన యుటిలిటీ లావాదేవీలపై 1% ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. నెలకు మొత్తం యుటిలిటీ ఖర్చులకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఇది రూ .4,999 వరకు ఉంటుంది. అయితే బీమా లావాదేవీలను యుటిలిటీ లావాదేవీలుగా పరిగణించబోమని, అందువల్ల వీటిపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని బ్యాంక్ స్పష్టం చేసింది.👉ఇది చదివారా? కొత్త ఈపీఎఫ్వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులురెంట్, ఫ్యూయల్, ఎడ్యుకేషన్ కేటగిరీలకు సంబంధించి ఒక్కో లావాదేవీకి గరిష్ట ఛార్జీని రూ.4,999గా నిర్ణయించారు. ప్రస్తుతం రూ .15,000 మించిన ఇంధన లావాదేవీలపై మాత్రమే 1% ఛార్జీ వసూలు చేస్తున్నారు. జూలై 1 నుంచి అన్ని అద్దె లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. అయితే కాలేజీ/స్కూల్ వెబ్సైట్లు లేదా వాటి పీఓఎస్ మెషీన్లలో థర్డ్ పార్టీ యాప్ చెల్లింపుల ద్వారా చేసే విద్యా లావాదేవీలకు మాత్రం ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చార్జీలుడీడీ (డిమాండ్ డ్రాఫ్ట్), పీవో (పే ఆర్డర్), ఏటీఎం ఇంటర్చేంజ్, ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డు ఫీజులను ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది. నగదు డిపాజిట్, చెక్కు, డీడీ, పీవో బదిలీకి ఛార్జీలను ప్రతి రూ.1000కు రూ.2గా సవరించింది. ఇది కనిష్ఠంగా రూ.50, గరిష్టంగా రూ.15 వేలు ఉంటుంది. గతంలో రూ.10,000 వరకు అయితే రూ.50, రూ.10,000 దాటితే ప్రతి రూ.1000కు రూ.5 చొప్పున జనరల్ చార్జీలు వసూలు చేసేవారు.ఏటీఎం ఇంటర్ఛేంజ్ లావాదేవీలకు 3 మూడు దాటితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఆర్థికేతర లావాదేవీకైతే రూ.8.5 లుగా బ్యాంకు సవరించింది. ఇవి గతంలో వరుసగా రూ.21, రూ.8.5లుగా ఉండవి. ఇక ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు 5 దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్కు ఛార్జీని రూ.21 నుంచి రూ.23కు పెంచారు. డెబిట్ కార్డు వార్షిక ఫీజును రూ.200 నుంచి రూ.300కు, రీప్లేస్ మెంట్ కార్డు ఫీజును రూ.200 నుంచి రూ.300కు పెంచారు. -
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు అడ్డాగా హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లోని వాణిజ్య స్థిరాస్తి రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) జోరు కొనసాగుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలు గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీపీ)లకు అడ్డాగా మారాయి. దేశంలోని 7 ప్రధాన నగరాలలో 2025 తొలి త్రైమాసికం(క్యూ1)లో 1.94 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగగా.. ఇందులో 43 శాతం వాటా జీసీసీలదేనని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.సౌత్ జోరు.. 2025 క్యూ1లో జీసీసీలు 83.5 లక్షల చ.అ. స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అదే 2024 క్యూ1లో జరిగిన 48.7 లక్షల చ.అ. జీసీసీ లావాదేవీలతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. అత్యధికంగా దక్షిణాది నగరాలలో 64 శాతం వాటా 53.4 లక్షల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. ఢిల్లీ–ఎన్సీఆర్లో 19.5 లక్షల చ.అ. లీజులు జరిగాయి. జీసీసీ లావాదేవీల్లో అత్యధికంగా ఐటీ, ఐటీఈఎస్ రంగం వాటా 35 శాతం కాగా.. బీఎఫ్ఎస్ఐ రంగం 22 శాతం, తయారీ, పారిశ్రామిక రంగం వాటా 13 శాతంగా ఉంది. 100–110 బిలియన్ డాలర్లకు.. 2024 ముగింపు నాటికి ఏడు నగరాలలో మొత్తం 1,700 గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు ఉన్నాయి. వీటి మార్కెట్ విలువ సుమారు 52 బిలియన్ డాలర్లు. ఆయా జీసీసీలలో 17–18 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2030 నాటికి 2,200–2,300 జీసీసీ సెంటర్లకు చేరుతుందని అంచనా. వాటి మార్కెట్ విలువ 100–110 బిలియన్ డాలర్లకు చేరుతుంది. అలాగే ఆయా జీసీసీలలో ఉద్యోగుల సంఖ్య 24–28 లక్షలకు చేరుతుంది.జీసీసీ అంటే? జీసీసీలకు ఇండియా ప్రధాన కేంద్రంగా మారింది. అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందకొస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలకు పొరుగు, ప్రాసెస్ సేవలను అందించేందుకు నైపుణ్యంతో పాటు చవకగా మానవ వనరులు లభించే ఇతర దేశాల్లో ఏర్పాటు చేసుకునే ఉప కార్యాలయాలనే గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ)లుగా పేర్కొంటారు. -
ల్యాండ్ రోవర్ మసారా ఎడిషన్: 12 మందికి మాత్రమే..
జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన లిమిటెడ్ ఎడిషన్ మోడల్ 'రేంజ్ రోవర్ ఎస్వీ మసారా'ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 4.99 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది కేవలం 12 యూనిట్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే దీనిని 12 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు.రేంజ్ రోవర్ ఎస్వీ మసారా.. చూడటానికి కొంత భిన్నంగా ఉంటుంది. మసారా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ఇది భారతీయ సంస్కృతితో దాని లోతైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. బానెట్, టెయిల్గేట్పై రేంజ్ రోవర్ అక్షరాలు కనిపిస్తాయి. 23 ఇంచెస్ ఆబ్లివియన్ 1077 డైమండ్ టర్న్డ్ వీల్స్పై గ్లోస్ డార్క్ గ్రే కాంట్రాస్ట్ & బ్లాక్ కాలిపర్స్ మొదలైనవి ఇందులో చూడవచ్చు.క్యాబిన్ అద్భుతమైన డ్యూయల్ టోన్ థీమ్ కలిగి ఉంది. ఇందులో పూర్తిగా వాలుగా ఉండే సీట్లు, పవర్డ్ క్లబ్ టేబుల్, డిప్లాయబుల్ కప్హోల్డర్లు, ఎస్వీ ఎచెడ్ గ్లాస్వేర్తో కూడిన రిఫ్రిజిరేటెడ్ కంపార్ట్మెంట్ ఉన్నాయి. వీటితో పాటు 13.1 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ & పవర్డ్ టెయిల్గేట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.రేంజ్ రోవర్ ఎస్వీ మసారా ఎడిషన్ 4.4 లీటర్ వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 615 Bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.ఇదీ చదవండి: గడ్కరీ సతీమణి పండించిన ఉల్లి: ఒక్కొక్కటి కేజీ బరువు! అదెలాగంటే? -
లిటిల్ ఫ్రెండ్స్ కోసం.. సూపర్ గాడ్జెట్స్
హుషారుగా ఆడుకుంటూ, సరదాగా నేర్పించే మ్యాజిక్ మెషిన్స్ను తెలివిగా వాడుకుంటే, ఏ పిల్లలైనా చదువుల్లోనే కాదు, ఆరోగ్యంపైన కూడా శ్రద్ధ చూపిస్తారు. పిల్లల కోసం టెక్నాలజీ అందించిన ఫ్రెండ్లీ గాడ్జెట్స్ మీ కోసం..బ్రషింగ్ గేమ్ ఆడుదాం!చిన్నపిల్లలకు బ్రషింగ్ చేయించడం అంటే మినీ యుద్ధం చేయటంలాంటిది. శత్రుసైన్యంగా ఉండే టూత్పేస్ట్కి టార్చర్. బ్రష్కు బ్రేకప్.. ఇలా పేస్ట్, బ్రష్లతో పేరెంట్స్ పిల్లలకు బ్రషింగ్ చేయించడానికి పోరాడుతుంటారు. ఇప్పుడు ఈ యుద్ధానికి ఒక చిన్న టూత్బ్రష్ స్వస్తి పలికింది.'విల్లో అటో ఫ్లో’ కేవలం టూత్బ్రష్ మాత్రమే కాదు. ఇదొక అటోమెటిక్ బ్రషింగ్ డివైజ్. బలమైన, మృదువైన బ్రిసిల్స్తో ఇది చాలా సులభంగా పిల్లలకు బ్రషింగ్ చేయిస్తుంది. నీళ్లు తానే తీసుకుంటుంది. పేస్ట్ తానే ఇస్తుంది. దీనిని మొబైల్ యాప్కు కనెక్ట్ చేసుకొని వాడితే, మరింత ఆసక్తికరంగా పనిచేస్తుంది.‘క్యావిటీ కిల్లర్’ టైటిల్తో యాప్లో పిల్లలతో బ్రషింగ్ గేమ్ ఆడేలా చేస్తుంది. వివిధ కౌంట్డౌన్లు, బ్యాడ్జ్లు, రివార్డ్స్ ఇస్తూ వారికి బ్రషింగ్ అంటే ఇకపై యుద్ధంలా కాకుండా, ఒక సరదా ఆటలా కనిపించేలా చేస్తుంది. ఇక అప్పటి నుంచి టూత్పేస్ట్ బాత్రూమ్ గోడలపై కాదు, పళ్లపై ఉంటుంది. ధర 249 డాలర్లు (రూ.21,266).ఉఫ్.. ఉఫ్.. పిల్లిచూడటానికి చిన్నగా కనిపించే ఈ బుజ్జి పిల్లి. చేసే పని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏ పిల్లి అయినా తన తోక నొక్కితే వెంటనే ‘మ్యావ్.. మ్యావ్..’ అంటూ బయటకు వినిపించని బూతులెన్నో తిడుతుంది. కాని, ‘నికోజిటా ఫు ఫు’ అనే ఈ పిల్లి మాత్రం దీని తోకకున్న బటన్ నొక్కగానే ‘ఉఫ్.. ఉఫ్..’ అంటూ వేడి వేడిగా ఉండే ఫుడ్ని కేవలం మూడు నిమిషాల్లోనే ‘ఇప్పుడు లాగించొచ్చు’ అనే స్థితిలోకి వచ్చేలా చల్లారుస్తుంది.చిన్నపిల్లలు ఉండే ఇంట్లో దీని అవసరం చాలా ఉంటుంది. ప్లేట్, బౌల్, కప్పు ఇలా ఏ వస్తువుకైనా ఈజీగా దీనిని తగిలించుకొని ఉపయోగించుకోవచ్చు. రీచార్జబుల్, వాషబుల్. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ఒక గంట వరకు పనిచేస్తుంది. ధర 27 డాలర్లు (రూ. 2,303) మాత్రమే!పీస్ఫుల్ గుడ్ఇల్లు పీకి పందిరేసే పిల్లలతో కూడా శాంతి మత్రం జపించేలా చేయగలడు ఇతడు. చూడ్డానికి చాలా చిన్నగా ఒక చిన్న పక్షి గుడ్డు సైజులో ఉంటాడు. తాకి చూస్తే దూది కంటే మెత్తగా ఉంటాడు. కాని, మహా మొండి ఘటాల్లాంటి పిల్లలను కూడా ప్రశాంతంగా మార్చేస్తాడు. ఇంతకీ మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త యోగా గురువు పేరు ఏంటంటే ‘మూడ్ బడ్డీ’.దీనిని ఒక పది నిమిషాలు పిల్లల చేతికి అందిస్తే చాలు, వెంటనే ప్రశాంతంగా మారిపోతారు. ఇందులో నాలుగు రకాల బ్రీతింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో వివిధ వాయిస్ కమాండ్స్, వైబ్రేషనల్ మోడ్స్ ఉంటాయి. ఇవి క్షణాల్లో మెదడును శాంతపరిచి, సెలెంట్ మోడ్లోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. రోజూ దీనిని వాడితే ప్రశాంతంగా మారడమే కాదు, సరైన సమయానికి నిద్ర కూడా పోతారట. ధర 99 డాలర్లు (రూ.8,458). -
మోసాల నివారణకు.. యాంటీఫ్రాడ్ యాప్
సీమాంతర సైబర్ ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో క్విక్ హీల్ టెక్నాలజీస్ తాజాగా మోసాల నివారణ సొల్యూషన్ యాంటీఫ్రాడ్డాట్ఏఐ ఫ్రీమియం వెర్షన్ను ప్రవేశపెట్టింది. ఫోన్లో కనిపించే హానికరమైన యాప్లతో పాటు కనిపించకుండా దాక్కునే యాప్లను కూడా గుర్తించడం దీని ప్రత్యేకత.ఫిషింగ్, స్పైవేర్, ఆర్థిక మోసాలపరమైన దాడుల కోసం ఉపయోగించే ఈ హిడెన్ యాప్లు యూజరుకు తెలియకుండా పని చేస్తాయి. ఇలాంటి యాప్ల గురించి యాంటీఫ్రాడ్డాట్ఏఐ యూజర్లను అలర్టు చేసి, తగు చర్యలు తీసుకునేందుకు సహాయపడుతుంది.స్కామ్ ప్రొటెక్షన్, రిస్క్ ప్రొఫైల్ అసెస్మెంట్, కాల్ ఫార్వార్డింగ్.. బ్యాంకింగ్ ఫ్రాడ్ అలర్ట్, ఫ్రాడ్ ప్రొటెక్ట్ బడ్డీ మొదలైన ఫీచర్లు ఇందులో ఉంటాయి. దీన్ని ప్రాథమికంగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, మరింత భద్రత కోరుకునే వారు సబ్్రస్కిప్షన్ ద్వారా ప్రీమియం వెర్షన్ తీసుకోవచ్చని సంస్థ సీఈవో విశాల్ సాల్వి తెలిపారు. -
గడ్కరీ సతీమణి పండించిన ఉల్లి: ఒక్కొక్కటి కేజీ బరువు! అదెలాగంటే?
నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిగా విధులు నిర్వహిస్తూనే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. పెట్రోల్ & డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వెహికల్స్ వినియోగించాలని చెబుతూ.. హైడ్రోజన్ కారులో పార్లమెంటుకు వెళ్లి, పర్యావరణంపై ఆయనకున్న మక్కువను చూపించారు. భర్త బాటలోనే నడుస్తూ.. గడ్కరీ సతీమణి ఆర్గానిక్ పద్దతిలో, మల్చింగ్ పేపర్ టెక్నాలజీతో ఉల్లిని పండించారు.ఉల్లిని అందరూ పండిస్తారు.. అందులో వింతేముంది అనుకోవచ్చు. కానీ వీరు పండించిన ఉల్లి ఒక్కొక్కటి సుమారు 800 గ్రాముల నుంచి 1000 గ్రాములు లేదా ఒక కేజీ బరువు ఉన్నాయి. ఈ విషయాన్ని గడ్కరీ తన ఎక్స్ ఖాతలో పేర్కొన్నారు. ''నా భార్య కాంచన్, నాగ్పూర్లోని ధపేవాడలోని మా భక్తి ఫామ్లో, మల్చింగ్ పేపర్ టెక్నిక్ ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేసి, ఒక కిలో వరకు బరువున్న సేంద్రీయ ఉల్లిపాయలను విజయవంతంగా ఉత్పత్తి చేశారు'' అని ట్వీట్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పొలం దున్నడం.. ఉల్లి విత్తనాలను నాటు వేయడం వంటివన్నీ చూడవచ్చు. మొత్తానికి ఇక్కడ పండిన ఉల్లి సాధారణ ఉల్లికంటే.. చాలా పెద్దవిగా ఉన్నాయి. ఒక రకంగా వీటిని బాహుబలి ఉల్లి అని కూడా చెప్పొచ్చు.మల్చింగ్ పేపర్ టెక్నాలజీమల్చింగ్ పేపర్ టెక్నాలజీలో.. మట్టి బెడ్ మీద ఒక ప్లాస్టిక్ షీట్ కప్పుతారు. దీనిపైన చిన్న రంధ్రాలు చేసి.. ఉల్లినారు నాటుతారు. ఈ విధంగా వ్యవసాయం చేయడం వల్ల నీటి వృధా తగ్గుతుంది. కలుపు మొక్కలను నివారించవచ్చు. ఈ ఉల్లిని పండించడానికి కాంచన్ గడ్కరీ సేంద్రీయ పద్ధతులనే ఉపయోగించారు. అంతే కాకుండా.. ఉల్లి విత్తనాలను ప్రత్యేకంగా నెదర్లాండ్స్ నుంచి తెప్పించి ప్రయోగం చేశారు.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరికనాణ్యమైన విత్తనాలు ఉపయోగించి.. సహజ సిద్దమైన పద్దతులతో వ్యవసాయం చేస్తే తప్పకుండా మంచి దిగుబడి ఉంటుందని గడ్కరీ దంపతులు చెబుతున్నారు. అంతే కాకుండా.. స్థానిక రైతులకు ఈ పద్దతిపై అవగాహన కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంచన్ గడ్కరీ పేర్కొన్నారు.नागपुर के धापेवाड़ा स्थित हमारे भक्ति फार्म में मेरी पत्नी, श्रीमती कांचन ने एक अनूठा प्रयोग करते हुए, मल्चिंग पेपर तकनीक का इस्तेमाल कर एक किलो तक वज़न वाले ऑर्गेनिक प्याज़ का सफल उत्पादन किया है।#OrganicFarming #OrganicOnion #Nagpur pic.twitter.com/nTjU11anHR— Nitin Gadkari (@nitin_gadkari) May 29, 2025 -
విద్యుత్కు భారీ డిమాండ్: వచ్చే ఐదేళ్లలో..
విద్యుత్ డిమాండ్ ఏటా 6 శాతం నుంచి 6.5 శాతం చొప్పున (కాంపౌండెడ్గా) వచ్చే ఐదేళ్ల పాటు పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విస్తరణతోపాటు గ్రీన్ హైడ్రోజన్కు ఇస్తున్న ప్రాధాన్యం, డేటా సెంటర్ల విస్తరణ విద్యుత్ అవసరాలను అధికం చేస్తుందని పేర్కొంది.2025–26 ఆర్థిక సంవత్సరంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో 44 గిగావాట్లుగా ఉంటుందని అంచనా వేసింది. 2024-25లో ఆల్టైమ్ గరిష్ట ఉత్పత్తి 34 గిగావాట్లుగా ఉంది. వచ్చే ఐదేళ్లలో అదనంగా ఏర్పడే డిమాండ్లో ఈ మూడు రంగాల నుంచే 20-25 శాతం వాటా ఉంటుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెండ్ విక్రమ్ తెలిపారు.రూఫ్టాప్ సోలార్ వినియోగం పెరుగుతుండడం, ఆఫ్ గ్రిడ్ ప్రాజెక్టుల నేపథ్యంలో గ్రిడ్ సామర్థ్య డిమాండ్ కొంత వరకు తగ్గొచ్చన్నారు. రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్లను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రస్తావించారు. 2026 మార్చి నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 520 గిగావాట్లకు చేరుకుంటుందని ఇక్రా రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది.2025–2026లో థర్మల్ విభాగం నుంచి 9-10 గిగావాట్ల కొత్త సామర్థ్యం అందుబాటులోకి రానుండగా.. మిగిలినదంతా పునరుత్పాదక విద్యుత్ వనరుల రూపంలో ఉంటుందని తెలిపింది. రానున్న సంవత్సరాల్లో కొత్త సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ (ఆర్ఈ) కీలక పాత్ర పోషించనుందని పేర్కొంది. థర్మల్ విద్యుత్ విభాగం పట్ల స్థిరమైన అవుట్లుక్తో ఉన్నట్టు ఇక్రా తెలిపింది. -
మరోసారి తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.24 తగ్గించాయి. కొత్త ధరలు రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు (జూన్ 1) నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయి.వాణిజ్య ఎల్పీజీ ధరలు తగ్గడం వరుసగా ఇది మూడోసారి. మే ప్రారంభంలో కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.14.50 తగ్గించాయి. అంతకు ముందు ఏప్రిల్ 1న సిలిండర్ ధర రూ.41 తగ్గింది. కాగా ఇప్పుడు రూ.24 తగ్గింది. కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గినా.. గృహాల్లో ఉపయోగించే ఎల్పీజీ ధరలలో ఎలాంటి మార్పు లేదు.19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు•ఢిల్లీ: రూ. 1723.50•కోల్కతా: రూ. 1826•ముంబై: రూ. 1674.50•చెన్నై: రూ. 1881ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక -
'ఇకపై ఉద్యోగాల పరిస్థితి ఇది': సర్వేలో కీలక విషయాలు
న్యూఢిల్లీ: ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులు నెలకొని, ఖర్చులు విషయంలో కంపెనీలు ఆచి తూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నియామకాలు నెమ్మదించనున్నాయి. రిక్రూట్మెంట్ కార్యకలాపాల వృద్ధి (ఎన్ఈసీ) 2.8 శాతానికి పరిమితం కానుంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-మార్చి త్రైమాసికంలో ఇది 7.1 శాతంగా నమోదైంది. నియామకాల తీరుతెన్నులపై టీమ్లీజ్ సర్వీసెస్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.నివేదిక ప్రకారం 47 శాతం సంస్థలు సిబ్బందిని పెంచుకుంటామని, 28 శాతం సంస్థలు స్థిరంగా కొనసాగిస్తామని, 25 శాతం కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా 20 నగరాల నుంచి 23 పరిశ్రమలకు చెందిన 1,263 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు➤డిమాండ్ను బట్టి ఉద్యోగులను తీసుకునే ఫ్లెక్సి స్టాఫింగ్ విధానానికి 69 శాతం సంస్థలు మొగ్గు చూపాయి. దీర్ఘకాలిక వ్యయాల భారం లేకుండా, సత్వరం కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ విధానంలో వీలుంటోంది.➤హైరింగ్ వ్యూహాల్లో గిగ్ ఎకానమీకి (స్వల్పకాలిక కాంట్రాక్టులు, ఫ్రీలాన్స్ వర్కింగ్) ప్రాధాన్యం లభిస్తోంది. 64 శాతం కంపెనీలు గిగ్ విధానాల ద్వారా సేల్స్, కస్టమర్ సరీ్వస్ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.➤ద్రవ్యోల్బణం, ఎగుమతులు మందగించడం, జీడీపీ నెమ్మదించడం తదితర అంశాల కారణంగా వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు 58 శాతం కంపెనీలు తెలిపాయి. దీంతో ఉద్యోగుల సంఖ్యను ఏదో పేరుకి మాత్రమే పెంచుకోవడం కాకుండా, నిర్దిష్ట నైపుణ్యాలున్న వారినే తీసుకోవడంపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక➤76 శాతం కంపెనీలు డిజిటల్ లిటరసీకి, 68 శాతం కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్కి, 63 శాతం సంస్థలు కమ్యూనికేషన్లాంటి కీలక నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపాయి.➤ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పర్యావరణ అనుకూల మొబిలిటీ సొల్యూషన్స్కి డిమాండ్ పెరుగుతుండటంతో ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాలు, అనుబంధ మౌలిక సదుపాయాల రంగాలు, ఈ–కామర్స్, టెక్ స్టార్టప్లు వృద్ధి చెందనున్నాయి. -
ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!
ఒకటో తేదీ వచ్చిందంటే.. దాదాపు చాలా రూల్స్ మారిపోతాయి. క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి గ్యాస్ ధరల వరకు.. చాలా మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఈ రోజు (జూన్ 1) నుంచి కొన్ని ఐఫోన్లు & ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ చర్య 2025 మే 1వ తేదీ నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొంచెం ఆలస్యం కావడంతో.. వినియోగదారులు తమ ఫోన్లను మార్చుకోవడానికి సమయం దొరికింది.వాట్సప్కు సపోర్ట్ చేయని మొబైల్స్..➤ఐఫోన్ 5ఎస్➤ఐఫోన్ 6➤ఐఫోన్ 6 ప్లస్➤ఐఫోన్ 6ఎస్➤ఐఫోన్ 6s ప్లస్➤ఐఫోన్ ఎస్ఈ (ఫస్ట్ జనరేషన్)➤శామ్సంగ్ గెలాక్సీ ఎస్4➤శామ్సంగ్ గెలాక్సీ నోట్ 3➤సోనీ జెడ్పీరియా జెడ్1➤ఎల్జీ జీ2➤హువావే అసెండ్ పీ6➤మోటో జీ (ఫస్ట్ జనరేషన్)➤మోటరోలా రేజర్ హెచ్డీ➤మోటో ఈ 2014జాబితాలోని అన్ని ఫోన్లు చాలా పాత వెర్షన్లు. అయితే కొన్ని ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ సాధ్యమైతే.. వాట్సప్ పనిచేసే అవకాశం ఉంది.ఫోన్లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం.. భద్రతా ప్రమాణాలే అని తెలుస్తోంది. యాపిల్ ఇకపై పాత iOS వెర్షన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్లను అందించదు. కాబట్టి ఈ పరికరాల్లో భద్రత లోపిస్తుంది. భద్రతా లోపం సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరికగత కొన్ని నెలలుగా, వాట్సాప్ వినియోగదారుల గోప్యతను బలోపేతం చేయడం.. వ్యక్తిగత డేటాను రక్షించడం లక్ష్యంగా అనేక అప్డేట్స్ చేస్తూనే ఉంది. చాట్లు, సమూహ సంభాషణల నుంచి ఇతరులు టెక్స్ట్, ఫోటోలు లేదా వీడియోలను కాపీ చేయకుండా నిరోధిచడమే లక్ష్యంగా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకొస్తోంది. అంతే కాకుండా.. వాట్సాప్ చాట్ లాక్ వంటి మెరుగైన ఫీచర్స్ కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు పాస్వర్డ్, వేలిముద్ర లేదా ఫేస్ ఐడితో వ్యక్తిగత చాట్లను సురక్షితంగా ఉంచడానికి అనుమతిస్తుంది. -
కెనరా బ్యాంక్ గుడ్న్యూస్: పొదుపు ఖాతాల్లో..
బెంగళూరు: సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది.సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్ఆర్ఐ ఎస్బీ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. దీనితో ఇక ఏ పొదుపు ఖాతా కస్టమరుపైనా కనీస బ్యాలెన్స్ పాటించనందుకు ఎలాంటి రుసుములు లేదా పెనాల్టీల భారం ఉండదని బ్యాంకు తెలిపింది. వేతన జీవులు, సీనియర్ సిటిజెన్లు, విద్యార్థులు, ఎన్నారైలకు కూడా దీనితో ప్రయోజనం లభిస్తుందని బ్యాంకు ఎండీ కె. సత్యనారాయణ రాజు వివరించారు. ప్రస్తుతం అకౌంటు రకాన్ని బట్టి నెలవారీగా కనీస బ్యాలెన్స్ పాటించాల్సి ఉంటోంది. పాటించకపోతే పెనాల్టీ చార్జీలు కట్టాల్సి ఉంటోంది.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక -
డిజిటల్ ప్లాట్ఫామ్లపై సమస్యాత్మక ప్రకటనలు
ముంబై: సమస్యాత్మక ప్రకటనలకు డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రధాన మాధ్యమంగా మారాయని భారతీయ ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ) తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) మొత్తం 9,599 ప్రకటనల ఫిర్యాదులు ఏఎస్సీఐ దృష్టికి రాగా.. ఇందులో 7,199 ప్రకటనల ఉల్లంఘనలను గుర్తించింది. వీటిల్లో 95 శాతం ప్రకటనలు డిజిటల్ ప్లాట్ఫామ్లపై ప్రసారమైనవేనని ఏఎస్సీఐ ప్రకటించింది. వీటిల్లోనూ మూడింట రెండొంతులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రాయోజిత ప్రకటనలు కాగా, 32 శాతం ప్రకటనలు కంపెనీల సొంత వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లలో వచ్చినవిగా తెలిపింది. అత్యధికంగా 79 శాతం సమస్యాత్మక ప్రకటనలకు మెటా (ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ మాతృ సంస్థ) కేంద్రంగా ఉన్నట్టు పేర్కొంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో సమస్యాత్మక ప్రకటనల్లో 43.52 శాతం ఆఫ్షోర్ బెట్టింగ్కు సంబంధించి ఉంటే, 25 శాతం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినవిగా ఏఎస్సీఐ తెలిపింది. 3,347 ప్రకటనలు చట్ట నిబంధనలను ఉల్లఘించేవిగా ఉండడంతో వాటిపై చర్యలకు ప్రభుత్వానికి నివేదించినట్టు వెల్లడించింది. డిజిటల్ మీడియా పెద్ద సవాళ్లను తీసుకొస్తోందని.. భాగస్వాములు అందరూ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కలసికట్టుగా చర్యలు తీసుకోవాల్సి ఉందని ఏఎస్సీఐ అభిప్రాయపడింది. టీవీ, పత్రికల్లో ఇచ్చే ప్రకటనలు ఒకే తీరులో ఉంటే.. ఆల్గోరిథమ్ ఆధారితంగా నడిచే డిజిటల్ ప్లాట్ఫామ్లపై మాత్రం విభిన్న యూజర్లకు విభిన్న ప్రకటనలు ప్రదర్శితం అవుతున్నాయని.. వీటిని పర్యవేక్షించడం క్లిష్టంగా మారినట్టు తెలిపింది. డిజిటల్ వేదికలపై సమస్యాత్మక ప్రకటనలను గుర్తించేందుకు వీలుగా.. ఫ్రెంచ్ సంస్థతో ఏఎస్సీఐ జట్టు కట్టడంతోపాటు.. టెక్నాలజీపై పెట్టుబడులను పెంచడం గమనార్హం. -
ఐపీవోల బాటలో బీఎఫ్ఎస్ఐ సంస్థలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగం) కంపెనీలు భారీ స్థాయిలో పబ్లిక్ ఇష్యూకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి పలు కంపెనీలు ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లు దాఖలు చేశాయి. కొత్తగా షేర్లను జారీ చేయడం లేక ఆఫర్ ఫర్ సేల్ రూపంలో లేదా రెండింటి మేళవింపుతో ఈ ఇష్యూలు ఉండబోతున్నాయి. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇష్యూల ద్వారా బీఎఫ్ఎస్ఐ కంపెనీల నిధుల సమీకరణ రూ. 50,000 కోట్ల మార్కును దాటేసే అవకాశం ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన దానికి మూడు రెట్లు అధికం. 2025 ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్ఎస్ఐ రంగానికి చెందిన ఎనిమిది కంపెనీలు ఐపీవోల ద్వారా సుమారు రూ. 16,275 కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 10 సంస్థలు రూ. 9,655 కోట్ల మొత్తాన్ని పబ్లిక్ ఇష్యూల ద్వారా సమకూర్చుకున్నాయి. హెచ్డీబీ ఫైనాన్షియల్ రూ. 12,500 కోట్లు... పబ్లిక్ ఇష్యూలకు వస్తున్న వాటిలో హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (రూ. 12,500 కోట్లు), క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ (5,000 కోట్లు), అవాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (రూ. 3,500 కోట్లు), హీరో ఫిన్కార్ప్ (రూ. 3,668 కోట్లు), వెరిటాస్ ఫైనాన్స్ (రూ. 2,800 కోట్లు), ఎస్కే ఫైనాన్స్ (రూ. 2,200 కోట్లు) మొదలైన సంస్థలు ఉన్నాయి. టాటా క్యాపిటల్ నిర్దిష్టంగా ఎంత సమీకరించేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ అన్లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ తీరుతెన్నులను బట్టి చూస్తే 2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఇష్యూ ఉండొచ్చని భావిస్తున్నారు. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ మొదలైనవి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వ్యాపార అవసరాలరీత్యా.. నియంత్రణ సంస్థపరమైన నిబంధనలు, మార్కెట్.. వ్యాపార అవసరాల రీత్యా పలు బీఎఫ్ఎస్ఐ కంపెనీలు ఐపీవో బాట పడుతున్నాయి. దాదాపు డజను పైగా సంస్థలు పబ్లిక్ ఇష్యూకి సిద్ధమవుతున్నాయి. కొంతకాలం పాటు మందగించిన ఈక్విటీ మార్కెట్లు, మళ్లీ కనిష్ట స్థాయుల నుంచి 15–20 శాతం పుంజుకున్నాయని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ హెడ్ (ఫండమెంటల్ రీసెర్చ్ – ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్) నరేంద్ర సోలంకి తెలిపారు. దీంతో ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు బీఎఫ్ఎస్ఐ సంస్థలు ధీమాగా ముందుకొస్తున్నాయని వివరించారు. ఇక లిక్విడిటీ కొరతను అధిగమించేందుకు ఆయా కంపెనీల మాతృసంస్థలు .. ముఖ్యంగా బ్యాంకులకు, ఈ ఐపీవోలు కొంత ఉపయోగకరంగా ఉండగలవని తెలిపారు. క్యాపిటల్ అడిక్వసీ నిష్పత్తి నిబంధనలను పాటించడానికి, కార్యకలాపాల విస్తరణకు, రుణభారాలను తగ్గించుకునేందుకు ఐపీవోలు వ్యూహాత్మక మార్గంగా ఉంటాయని ప్రమోటర్లు భావిస్తున్నట్లు వివరించారు. చాలా కంపెనీలు వ్యాపార వృద్ధికి అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకునేందుకు, నియంత్రణ సంస్థపరమైన నిబంధనలు పాటించేందుకు, నిధుల సమీకరణకు ఉపయోగపడే వనరులను పెంచుకునేందుకు చాలా మటుకు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బీమా సంస్థలు, ఫిన్టెక్ సంస్థలు ప్రైమరీ మార్కెట్ల బాట పడుతున్నాయి. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ), రిజర్వ్ బ్యాంక్ నిబంధనల కారణంగా పారదర్శకత, గవర్నెన్స్పరమైన ప్రమాణాలను మెరుగుపర్చుకునేందుకు ఐపీవోలకు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇన్వెస్టర్లు ఆచితూచి కంపెనీలను ఎంచుకుంటున్న నేపథ్యంలో ఈ ఐపీవోల్లో ఎన్ని భారీ స్థాయిలో విజయవంతమవుతాయో చూడాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. -
బీమాలో ఏఐకి విశ్వసనీయత సవాళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో కృత్రిమ మేథను (ఏఐ) ఉపయోగించడం గణనీయంగా పెరుగుతున్నప్పటికీ బీమా పరిశ్రమలో మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించడంపై సమస్యలు ఎదురవుతున్నాయి. విశ్వసనీయత, డేటా నిర్వహణ దీనికి ప్రధాన సవాళ్లుగా ఉంటున్నాయి. కేపీఎంజీ ఇంటర్నేషనల్ రూపొందించిన ‘స్మార్ట్ ఇన్సూరెన్స్’ పరిశోధన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, ఏఐని పూర్తిగా విశ్వసించడంపై సందేహాలు నెలకొన్నట్లు సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో 46 శాతం సంస్థలు తెలిపాయి. కేవలం 25 శాతం సంస్థలు మాత్రమే దీన్ని పూర్తిగా విశ్వసిస్తున్నాయి. ఇక ఏఐ వినియోగాన్ని పెంచుకోవడంలో డేటా నిర్వహణ మరో కీలక సవాలుగా ఉంటోందని 72 శాతం ఇన్సూరెన్స్ సంస్థలు వెల్లడించాయి. మరోవైపు, ఏఐపై తొందరపడి ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే సమీప భవిష్యత్తులో ఆ పెట్టుబడులు వృధా అవుతాయేమో అనే సందేహాలు ఉన్నట్లు మూడొంతుల మంది ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్లు తెలిపారు. ఓవైపు కార్పొరేట్లు పర్యావరణహితమైన విధానాలతో కార్యకలాపాలు నిర్వహించుకోవడంపై దృష్టి పెడుతుండగా మరోవైపు ఏఐ కోసం భారీ ఎత్తున విద్యుత్ కూడా ఉపయోగించాల్సి వస్తుండటం సైతం కృత్రిమ మేథ విస్తృతికి ప్రతిబంధకంగా ఉంటోంది. తమ సస్టైనబిలిటీ లక్ష్యాలు, ఏఐ విద్యుత్ వినియోగానికి మధ్య సమతౌల్యం పాటించేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు 72 శాతం మంది ఎగ్జిక్యూటివ్స్ తెలిపారు. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు ఏఐ ఉపయోగపడుతోందని, తమ ప్రోడక్టులు, సరీ్వసులకు కృత్రిమ మేథ కీలకంగా ఉంటోందని 57 శాతం మంది పేర్కొన్నారు.ఏం చేయాలంటే..ఈ నేపథ్యంలో ఏఐని తమ ప్రస్తుత వ్యవస్థలకు అనుసంధానించడంతో పాటు కొత్త ఆవిష్కరణలు, పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మల్చుకోగలిగే సంస్కృతిని పెంపొందించుకోవడంపై బీమా సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని కేపీఎంజీ ఇంటర్నేషనల్ గ్లోబల్ హెడ్ (ఇన్సూరెన్స్) ఫ్రాంక్ ఫాఫెన్జెలర్ తెలిపారు. ప్రస్తుతం బీమా పరిశ్రమ ఇన్సూర్టెక్, కృత్రిమ మేథ, డిజిటైజేషన్ మొదలైన వాటన్నింటినీ సమన్వయపర్చుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ఉందని కేపీఎంజీ భారత విభాగం హెడ్ (ఇన్సూరెన్స్) కైలాస్ మిట్టల్ తెలిపారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు తగ్గట్లుగా ఏఐని వినియోగించుకోవడంపై కంపెనీలు వ్యూహాత్మకమైన మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. అకౌంటింగ్ ప్రమాణాలను నిర్వచించేందుకు, రిసు్కలను ఎదుర్కొనేందుకు, గోప్యతపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ బీమా సంస్థలు పటిష్టమైన ఏఐ వ్యవస్థలను రూపొందించుకోవాలని పేర్కొంది. అలాగే, ముప్పులను నివారించేందుకు, అవాంఛనీయ ధోరణులను గుర్తించే క్రమంలో ఏఐ మోడల్స్ను నిరంతరం ఆడిట్ చేసేందుకు అధునాతన భద్రతా చర్యలు, సాధనాలను ఉపయోగించాలని సూచించింది. -
డేటా సెంటర్ల బూమ్..
న్యూఢిల్లీ: దేశీ డేటా సెంటర్ (డీసీ) పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదారేళ్లలో కొత్తగా 20–25 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించనుంది. దీనితో సెంటర్ల ఏర్పాటు కోసం వినియోగించే రియల్ ఎస్టేట్ కూడా మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం 15.9 మిలియన్ చ.అ.లుగా ఉన్న స్పేస్ 2030 నాటికి 55 మిలియన్ చ.అ.లకు చేరనుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, ఐవోటీ వినియోగం పెరుగుతుండటం, వివిధ రంగాల వ్యాప్తంగా డిజిటలీకరణ వేగవంతం అవుతుండటం తదితర అంశాల దన్నుతో డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యాలు మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 4.5 గిగావాట్లకు చేరనున్నాయి. 2018లో 307మెగావాట్లుగా ఉన్న డీసీల సామర్థ్యం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి, అంటే కేవలం ఏడేళ్ల వ్యవధిలో సుమారు నాలుగు రెట్లు పెరిగి 1.26 గిగావాట్లకు చేరింది. పరివర్తన దశలో పరిశ్రమ.. ప్రస్తుతం పరిశ్రమ పరివర్తన దశలో ఉందని నిపుణులు తెలిపారు. మెట్రో నగరాల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తోందని వివరించారు. డీసీల విషయంలో ముంబై, చెన్నైల ఆధిపత్యం ఉంటోంది. మొత్తం సామర్థ్యాల్లో మూడింట రెండొంతుల వాటా వీటిదే ఉంటోంది. అత్యధికంగా 41 శాతం వాటాతో ముంబై అగ్రస్థానంలో, 23 శాతంతో చెన్నై రెండో స్థానంలో, 14 శాతం వాటాతో ఢిల్లీ ఎన్సీఆర్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్లు కలిసి గత 6–7 ఏళ్లలో డేటా సెంటర్ రియల్ ఎస్టేట్ మూడు రెట్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. ‘‘తక్కువ లేటెన్సీ, రియల్ టైమ్ అనాలిసిస్, మెరుగైన యాప్ల పనితీరు, వివిధ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు తమను తాము మల్చుకోవాల్సి వస్తుండటం తదితర అవసరాలరీత్యా డేటా సెంటర్లు భారీగా విస్తరిస్తున్నాయి’’ అని కొలియర్స్ ఇండియా వెల్లడించింది. 2030 నాటికి డీసీల కెపాసిటీ 4.5 గిగావాట్లకు ఎగియడానికి కూడా ఇదే దోహదపడుతుందని పేర్కొంది. పునరుత్పాదక విద్యుత్, 3 గిగావాట్ల విద్యుత్ మిగులులాంటివి చౌకగా హోస్టింగ్ సేవలు అందించడంలో భారత్కు సానుకూలాంశాలని క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ వర్గాలు తెలిపాయి. అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని వివరించాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో తలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం క్యాపిటలాండ్ మొత్తం మీద 1.15 బిలియన్ సింగపూర్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తోంది. 2020 నుంచి పెట్టుబడుల ప్రవాహం.. భారత డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్టర్లకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. 2020 నుంచి 14.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా 2030 నాటికి మరో 20–25 బిలియన్ డాలర్లు రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తక్కువ లేటెన్సీ, అత్యుత్తమ పనితీరు కోసం ఓటీటీ ప్లాట్ఫాంలు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ (సీడీఎన్) సేవల సంస్థల నుంచి డిమాండ్ నెలకొన్నట్లు నె్రక్ట్సా బై ఎయిర్టెల్ సీఈవో ఆశీశ్ ఆరోరా తెలిపారు. ఈ సంస్థ 65 పైగా నగరాల్లో 120 ఎడ్జ్ డేటా సెంటర్లు, 14 హైపర్స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాము ప్రాంతీయంగా చిన్న పట్టణాల్లోకి కూడా విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని ఆరోరా వివరించారు. విజయవాడ, అగర్తలా, పాటా్న, గువాహటి, సంబల్పూర్, గంగాగంజ్లాంటి కీలక నగరాల్లో తమ ఎడ్జ్ సెంటర్లను విస్తరించినట్లు వివరించారు. వీటితో మెట్రోల వెలుపల తృతీయ శ్రేణి నగరాల్లోని యూజర్లకు కూడా డిజిటల్ మౌలిక సదుపాయాలు మరింతగా అందుబాటులోకి వస్తున్నాయని, లైవ్.. హై–డెఫినిషన్ స్ట్రీమింగ్కి సంబంధించి లేటెన్సీ.. బ్యాండ్విడ్త్ వ్యయాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. డీసీల విభాగంలో కొత్త పరిణామాలు చూస్తే అదానీకనెక్స్ సంస్థ చెన్నైలో 100 మెగావాట్ల క్యాంపస్ను, నోయిడాలో 50 మెగావాట్ల సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. మరిన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే గ్రేటర్ నోయిడాలో ఉన్న యోటా డీ1తో పాటు హైపర్స్కేల్ క్యాంపస్ల విస్తరణపై యోటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 39,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. క్యాపిటల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ తమ నవీ ముంబై సెంటర్పై రూ. 1,940 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఎస్టీటీ జీడీసీ ఇండియా, ఎన్టీటీ గ్లోబల్ తదితర సంస్థలు హైదరాబాద్, చెన్నై, పుణె, బెంగళూరు నగరాల్లో కొత్త హైపర్స్కేల్ సెంటర్స్తో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.హైదరాబాద్, ముంబై సారథ్యం.. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో భారత్లో కొత్తగా 859 మెగావాట్ల డీసీ సామర్థ్యాలు జతయ్యాయి. ఇందులో ముంబై వాటా 44 శాతంగా, చైన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ వాటా సంయుక్తంగా 42 శాతంగా ఉంది. 2023 నుంచి అయిదేళ్ల వ్యవధిలో కొత్తగా 3 – 3.7 గిగావాట్ల కొత్త సామర్థ్యాలు జత కానున్నాయి. చెరి 1–1.2 గిగావాట్ల సామర్థ్యాలతో హైదరాబాద్, ముంబై ఇందుకు సారథ్యం వహించనున్నాయి. హైదరాబాద్ వర్ధమాన హైపర్స్కేల్ హబ్గా ఎదుగుతోంది. పుణె 300–450 మెగావాట్లు, చెన్నై 400–450 మెగావాట్ల కొత్తగా సామర్థ్యాలను జతపర్చుకోనున్నాయి. -
జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి పేరు చెప్పగానే.. ముందుగా గుర్తొచ్చేది ఆయన రాసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకమే. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయి, ఆర్ధిక సంక్షోభం రానుంది అని సంచనల ప్రకటనలు చేసిన.. ఈయన మరో గొప్ప మాట సెప్పరూ. జీవితాన్ని నాశనం చేసే పదం, అన్నినీటికంటే ప్రమాదమైంది ఏదనే విషయాన్ని స్పష్టం చేశారు.జీవితాన్ని అన్నింటికంటే ఎక్కువ నాశనం చేసేది 'రేపు' అని వాయిదా వేయడం. వాయిదా వేయడం వల్ల కలిగే నష్టాల గురించి చెబుతూ.. పెట్టుబడి పెట్టడానికి, రుణాలను పరిష్కరించడానికి లేదా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి వేచి ఉండటం ఒక వ్యక్తి ఆర్థిక భవిష్యత్తును గణనీయంగా దెబ్బతీస్తుందని, ఆలస్యం చిన్న సమస్యలను సైతం అధిగమించలేని అడ్డంకులను తీసుకొస్తుందని పేర్కొన్నారు.రిచ్ డాడ్ పూర్ డాడ్ ద్వారా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కియోసాకి.. దశాబ్దాలుగా ఆర్థిక అక్షరాస్యత, సాధికారత & తక్షణ చర్య వంటి వాటి గురించి చెబుతూనే ఉన్నారు. పెట్టుబడులు లేదా ఆర్థిక విద్యను ఆలస్యం చేయడం వల్ల అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని, ఇది కాలక్రమేణా గణనీయమైన నష్టాలకు దారితీస్తుందని అతని బోధనలు నిరంతరం హైలైట్ చేస్తాయి.రేపు అన్న పదం కేవలం అప్పటికి ఉపశమనం కలిగించవచ్చు. కానీ ఇది బరువును పెంచేస్తుంది. వాయిదా లేదా ఆలస్యం అనేది కేవలం ఒక తాత్విక అంశం కాదు. ఇది మారుతున్న ఆర్థిక వాతావరణంలో లోతుగా ప్రతిధ్వనించే ఆచరణాత్మక హెచ్చరిక. 'రేపు' అనే పదం చిన్నదే కావచ్చు, కానీ పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇది ఒకరి ఆర్థిక భవిష్యత్తును నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి 2024 - 2025 అంతటా, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మార్కెట్ అనూహ్యత ప్రపంచవ్యాప్తంగా చాలా కుటుంబాలపై విపరీతమైన ఒత్తిడిని కలిగించాయి. కియోసాకి సలహాను పాటించిన వ్యక్తులు, రుణాన్ని నిర్వహించడం, అత్యవసర పొదుపులను సృష్టించడం లేదా వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితులను ముందుగానే పరిష్కరించుకున్న వ్యక్తులు, సాధారణంగా చర్యను వాయిదా వేసిన వారి కంటే ఈ తుఫానులను మరింత విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి "రేపు"పై ఆధారపడిన వారు ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయారు.. ఆర్థిక స్వాతంత్ర్యానికి దూరంగా ఉన్నారని పలువురు చెబుతున్నారు. -
సుజుకి ఈ-యాక్సెస్ vs హోండా యాక్టివా ఈ: రేంజ్ & ధరలు
సుజుకి మోటార్సైకిల్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఈ-యాక్సెస్'ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కథనంలో ఈ రెండు స్కూటర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుందాం.స్పెసిఫికేషన్స్రెండు స్కూటర్లు ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్కూటర్లు. కాబట్టి ఇవి చాలా సింపుల్ డిజైన్ పొందుతాయి. యాక్టివా ఈ స్కూటర్ 6 కిలోవాట్ మోటార్ మోటారుతో శక్తినిస్తుంది. ఇందులో 1.5 కిలోవాట్ బ్యాటరీలు రెండు ఉంటాయి. ఇవి ఒక సింగిల్ ఛార్జితో 102 కిమీ రేంజ్ అందిస్తాయి. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం.సుజుకి ఈ యాక్సెస్ విషయానికి వస్తే.. ఇందులో 3.072 కిలోవాట్ లిథియం ఫాస్పెట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 95 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 4.1 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 15 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 71 కిమీ/గం.ఫీచర్స్సుజుకి ఈ యాక్సెస్ స్కూటర్.. ఎల్ఈడీ లైటింగ్, రెండు చివర్లలో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 765 మిమీ ఎత్తైన సీటు, 122 కేజీల బరువు ఉంటుంది. ఈ స్కూటర్ ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. బ్లూటూత్/యాప్ కనెక్టివిటీతో పాటు 4.2 ఇంచెస్ TFT LCD కన్సోల్, మూడు రైడింగ్ మోడ్లు, USB ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి కూడా ఇందులో ఉన్నాయి.హోండా యాక్టివా ఈ స్కూటర్ విషయానికి వస్తే.. ఇందులో 7 ఇంచెస్ TFT స్క్రీన్తో పాటు ఆప్షనల్ హోండా రోడ్ సింక్ యాప్ కనెక్టివిటీ, మూడు రైడింగ్ మోడ్లు, రివర్స్ మోడ్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.ఛార్జింగ్ డీటైల్స్ఛార్జింగ్ విషయంలో మాత్రం రెండు స్కూటర్లు భిన్నంగా ఉంటాయి. పోర్టబుల్ ఛార్జర్ని ఉపయోగించి, సుజుకి ఇ-యాక్సెస్ను 4 గంటల 30 నిమిషాల్లో 80 శాతం, 6 గంటల 42 నిమిషాల్లో 100 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 1 గంట 12 నిమిషాల్లో 80 శాతం & 2 గంటల 12 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. ఇదీ చదవండి: జర్మన్ బ్రాండ్తో చేతులు కలిపిన నీరజ్ చోప్రా'హోండా యాక్టివా ఈ'లో బ్యాటరీని సబ్స్క్రిప్షన్గా అందిస్తుంది. దీనికి ఛార్జ్ చేయదగిన బ్యాటరీలు లేవు కాబట్టి, మార్చుకోగల బ్యాటరీలు మాత్రమే ఉంటాయి. ప్రాథమిక ప్లాన్ నెలవారీ అద్దె రూ. 1,999 + GSTతో వస్తుంది, దీని ద్వారా 35 kWh ఎనర్జీ లభిస్తుంది. ఈ స్కూటర్ రోజుకు 40 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరం ప్రయాణించే రైడర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.ధరలుహోండా యాక్టివా ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, రోడ్ సింక్. వీటి ధరలు వరుసగా రూ. 1.17 లక్షలు, రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ.. సుజుకి ఈ-యాక్సెస్ ధరలు ఇంకా వెల్లడించలేదు.అయితే దీని ధర రూ. 1.0 నుంచి రూ. 1.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. -
విద్యార్థులకు రూ.కోటి ఉపకార వేతనాలు: రిలయన్స్
ముంబై: రిలయన్స్ డిజిటల్ ఇండియా ‘బూట్ అప్ ఇండియా’ పేరుతో అతిపెద్ద ల్యాప్టాప్ సేల్స్ ప్రకటించింది. వ్యాపారపరంగా మాత్రమే కాకుండా ‘నేటి విద్యార్థులను రేపటి అవకాశాలకు సన్నద్ధం చేయడం’ అనే గొప్ప సంకల్పంతో క్యాంపెన్ నిర్వహించనుంది.సేల్స్లో భాగంగా ల్యాప్ట్యాప్లు, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్స్ ఉపకరణాలు తక్కువ ధరకే లభిస్తాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఒక కోటి రూపాయల ఉపకార వేతనాలు ఇవ్వనుంది. అలాగే 25 కార్లు, 40 బైకులు, 450 పైగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు గెలుచుకునే అవకాశం కలి్పస్తుంది. -
6000 మంది ఉద్యోగుల తొలగింపు అందుకే: సత్య నాదెళ్ళ
మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 6,000 మంది ఉద్యోగులను, అంటే దాని ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు 3 శాతం మందిని తొలగించింది.. అసలు కంపెనీ ఇంతమందిని ఎందుకు తొలగించింది అనే విషయాన్ని సీఈఓ సత్యనాదెళ్ళ వివరించారు.ఇటీవల ఉద్యోగులతో జరిగిన టౌన్ హాల్ సమావేశంలో సత్యనాదెళ్ళ మాట్లాడుతూ.. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం పనితీరు సరిగ్గా లేకపోవడం కాదు. సంస్థ పునర్వ్యవస్తీకరణలో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.పోటీ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ తన కోపైలెట్ ఏఐ అసిస్టెంట్లను మరింత వేగంగా వినియోగదారులకు చేర్చడం మీద కూడా దృష్టి సారించింది. దీనికోసం కొన్ని సంస్థలతో.. ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. ఏఐ టూల్స్ వాడకం మాత్రమే కాకుండా.. ఇందులో ఉద్యోగులకు సైతం శిక్షణ ఇవ్వాల్సిన ఉందని సత్యనాదెళ్ళ వివరించారు.మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ఏఐ మౌలిక సదుపాయాలలో 80 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇందులో ఏఐ సామర్థ్యాలను విస్తరించడం మాత్రమే కాకుండా.. వివిధ ప్లాట్ఫామ్లు, సేవలలో దాని కోపైలట్ ఏఐ అసిస్టెంట్లను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: టాటా గ్రూప్లో కీలక పరిణామం: చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామామైక్రోసాఫ్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ 'అపర్ణ చెన్నప్రగడ' కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొన్నారు. కోడింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అధ్యయనం వాడుకలో లేకుండా పోతుందనే ఆలోచనలను గురించి మాట్లాడుతూ.. "కంప్యూటర్ సైన్స్ చదవకూడదనే లేదా కోడింగ్ చనిపోయిందనే భావన ఏ మాత్రం సరైంది కాదు, ఇందులో ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదని.. భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆమె భరోసా ఇచ్చారు. -
AskDISHA 2.0: క్షణంలో ట్రైన్ టికెట్ బుకింగ్
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).. లేటెస్ట్ ఏఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ 'ఆస్క్ దిశ 2.0' (AskDISHA 2.0) తీసుకొచ్చింది. ఇది ప్రయాణీకులకు అందించే సేవలను మరింత సులభారతం చేస్తుంది. ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. రీఫండ్ స్టేటస్లను తనిఖీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా 'ఆస్క్ దిశ 2.0' చాట్బాట్ను యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కమాండ్స్ సాయంతో కూడా మీకు కావాల్సిన సమాచారం పొందవచ్చు. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీతో సహా వివిధ భాషలలో వాయిస్ కమాండ్లను ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఈ కొత్త విధానం అనుమతిస్తుంది. అయితే దీనికోసం మీరు ప్రత్యేకంగా ఐఆర్సీటీసీ పాస్వర్డ్ అవసరం లేదు.. ఓటీపీ ద్వారా బుకింగ్స్ పూర్తి చేయొచ్చు.టికెట్ క్యాన్సిల్ లేదా ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ జరిగినటప్పుడు రిఫండ్ కూడా చాలా వేగంగా జరగడానికి ఈ 'ఆస్క్ దిశ 2.0' ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులో ప్రయాణికుల వివరాలను సేవ్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో బుకింగ్ చేసుకోవడం వేగవంతం అవుతుంది.ఇదీ చదవండి: ఫేస్ స్కాన్ చేస్తే.. పేమెంట్ పూర్తయిపోయింది: వీడియోఆస్క్ దిశ 2.0తో టికెట్ బుకింగ్➤IRCTC వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే కింద కుడివైపు.. ఆస్క్ దిశ 2.0 చాట్బాట్ కనిపిస్తుంది.➤ఇక్కడ హలో లేదా టికెట్ బుక్ టైప్ చేయడం ద్వారా లేదా వాయిస్ కమాండ్లను ఉపయోగించి చాట్ ప్రారభించవచ్చు. ➤మీ స్టేషన్, గమ్యస్థానం, ప్రయాణ తేదీ, తరగతి (స్లీపర్, 3ఏసీ, 2ఏసీ) ఎంటర్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. ➤ఆస్క్ దిశ.. అందుబాటులో ఉన్న ట్రైన్స్ జాబితా, వాటి టైమింగ్స్, సీట్లు మొదలైనవాటిని చూపిస్తుంది. ఇందులో మీకు కావాల్సిన ట్రైన్, క్లాస్, సీటు మొదలైనవాటిని ఎంచుకోండి.➤చాట్బాట్ మీ వివరాలను ద్రువీకరిస్తుంది. అవసరమైతే.. ఓటీపీ ద్రువీకరనతో చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఒకే స్టేటస్ ఇమేజ్లో ఆరు ఫొటోలు.. వాట్సాప్ కొత్త అప్డేట్
మెటా కంపెనీ ఆధ్వర్యంలోని ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త అప్డేట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తిగత సమాచారంతోపాటు వేడుకలు, ఇతర జ్ఞాపకాలను ముఖ్యమైన వారితో పంచుకోవడానికి వాట్సాప్ స్టేటస్ను గతంలోనే తీసుకొచ్చింది. అయితే అందులో ఇప్పటివరకు కేవలం ఒకే ఇమేజ్ను అప్లోడ్ చేసే వీలుండేది. తాజాగా వాట్సాస్ తీసుకొచ్చిన అప్డేట్తో స్టేటస్ ఇమేజ్లో గరిష్ఠంగా ఆరు ఇమేజ్లను అప్లోడ్ చేసేలా వెసులుబాటు కల్పించింది.ఈమేరకు మే 30న కొత్త అప్డేట్ అందించింది. స్టేటస్ ద్వారా యూజర్లు మరింత సృజనాత్మకంగా తమ ఇమేజ్లను ఇతరులతో పంచుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్తగా లేఅవుట్లు, మ్యూజిక్, ఫొటో స్టిక్కర్లు.. వంటి ఫీచర్లతో ‘యాడ్ యువర్స్’ ఆప్షన్ ద్వారా ఇమేజ్లను యాడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.ఇదీ చదవండి: నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యంవినియోగదారులు సులభంగా ఉపయోగించేలా ఎడిటింగ్ టూల్స్తో గరిష్టంగా ఆరు ఫోటోలను ఒకే ఇమేజ్ స్టేటస్లో పొందుపరిచేలా లేఅవుట్ను రూపొందించారు. యూజర్లు ఇమేజ్లన్నింటినీ ఒకే ఫ్రేమ్లో ఎలా చూపించాలనుకుంటున్నారో సరిగ్గా అమర్చుకుంటే సరిపోతుంది. దీనికి అదనంగా మ్యూజిక్ను యాడ్ చేసుకోవచ్చు. వినియోగదారుల మానసిక స్థితిని అనుసరించి ట్యూన్ సెట్ చేయవచ్చు. దాంతోపాటు మ్యాజిక్ స్టిక్కర్ను ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించాలంటే వాట్సాప్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. -
హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాలలో వీకెండ్ అంటే సంథింగ్ స్పెషల్.. నిద్ర లేచే సమయం నుంచి తినే తిండి, తిరిగే ప్రాంతం వరకూ.. ప్రతీది డిఫరెంట్గా ఉండాలనుకుంటారు. కరోనా తర్వాత నుంచి ఈ అభిరుచికి పర్యావరణం కూడా తోడైంది. దీంతో వారంలో కనీసం రెండు రోజులైనా పచ్చని ప్రకృతిలో సేదతీరాలని భావిస్తున్నారు. చుట్టూ చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, రణగొణ ధ్వనులు, కాలుష్యం లేని ప్రాంతం.. ఇంటికి తిరిగొస్తూ వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు వెంట తెచ్చుకునే వీలూ ఉండాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే వీకెండ్ హోమ్స్ ఆదరణ పెరిగింది.ఈ ప్రాంతాల్లో డిమాండ్ కడ్తాల్, తలకొండపల్లి, షాద్నగర్, శంకర్పల్లి వంటి ప్రాంతాలలో వీకెండ్ హోమ్స్కు డిమాండ్ ఉంది. చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. వీకెండ్ హోమ్స్ అంటే ఎకరాల కొద్ది స్థలం అవసరం లేదు. కొద్ది స్థలంలోనే ప్రణాళికబద్ధంగా వినియోగిస్తే.. అందమైన వీకెండ్ హోమ్స్ను డిజైన్ చేయవచ్చు. ఈ నిర్మాణంలో వినియోగించే ప్రతి వస్తువూ పర్యావరణ హితమైనవే ఉంటాయి. ఉష్ణోగ్రతను నిరోధించేలా మట్టి ఇటుకలు, కలపతో నిర్మాణం ఉంటుంది. వర్షపు నీటి సేకరణతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులకు ఏమాత్రం విఘాతం కలిగించకుండా ఉంటుంది.ఎక్కడ చూసినా గ్రీనరీనే.. వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్లలో సాధ్యమైనంత స్థలాన్ని గ్రీనరీకే కేటాయిస్తారు. ఒకవేళ వీకెండ్ హోమ్స్ను కస్టమర్లు వినియోగించలేని పక్షంలో కంపెనీయే అద్దెకు తీసుకుంటుంది. వాటిని డెస్టినేషన్ వెండింగ్స్ కోసం వినియోగించి.. వచ్చే లాభాలలో కస్టమర్లకు వాటా ఇస్తుంది. వాటి నిర్వహణ బాధ్యత కంపెనీదే. ఒకవేళ కొనుగోలుదారులు ఇంటిని నిర్మించుకునేందుకు వీలుగా తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తారు. -
బట్టలుతికే సర్ఫ్ కంపెనీ టర్నోవర్ ఎంతంటే..
హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) ఆధ్వర్యంలోని లాండ్రీ డిటర్జెంట్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల టర్నోవర్ మార్కును అధిగమించినట్లు తెలిపింది. వినియోగదారుల్లో ఈ బ్రాండ్కు ఉన్న ఆదరణే ఈ మార్కు చేరేందుకు తోడ్పడిందని కంపెనీ సీఈఓ, ఎండీ రోహిత్ జవా తెలిపారు.ఇదీ చదవండి: నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యం2022 ఆర్థిక సంవత్సరంలో రూ.8,200 కోట్ల అమ్మకాలను నమోదు చేసిన సర్ఫ్ ఎక్సెల్ హెచ్యూఎల్ అతిపెద్ద బ్రాండ్ల్లో ఒకటిగా తన స్థానాన్ని నిలబెట్టుకుందని జవా చెప్పారు. 2025 నాటికి ఇది రూ.10,000 కోట్లు మార్కును చేరినట్లు తెలిపారు. హెచ్యూఎల్ వార్షిక నివేదికలో భాగంగా ఈ మేరకు వివరాలు వెల్లడించారు. హెచ్యూఎల్ హోమ్ కేర్ విభాగం రూ.22,972 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని చెప్పారు. కంపెనీ మొత్తం టర్నోవర్ రూ.60,000 కోట్లు దాటిందని పేర్కొన్నారు. అండర్లైయింగ్ వాల్యూమ్ వృద్ధి(ధరల్లో ఒడిదొడుకులున్నా అమ్మకాలు పెరగడం)లో 2% పెరుగుదలను, ప్రతి షేరుకు 5% ఆదాయం (ఈపీఎస్) వృద్ధి నమోదు చేసినట్లు చెప్పారు. -
ఇది అమలైతే.. ఇన్సూరెన్స్ అంత ఈజీ కాదు..
దేశ బీమా రంగంలో భారీ మార్పు రాబోతోంది. పారదర్శకతను పెంపొందించడం, మోసాలను అరికట్టడంలో భాగంగా రిస్క్ అంచనా కోసం జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సిబిల్ వంటి క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థను తీసుకొచ్చేపనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కోరింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తే ఇన్సూరెన్స్ తీసుకోవడం అంత సులువుగా ఉండదు. ముఖ్యంగా ఫ్రాడ్ హిస్టరీ ఉన్న హైరిస్క్ వ్యక్తులను గుర్తించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలకు సులభమవుతుంది.పాలసీదారులపై ప్రభావంబ్యాంకులు రుణ దరఖాస్తుదారులను వారి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఎలా అంచనా వేస్తాయో, బీమా ప్రొవైడర్లు కూడా దరఖాస్తుదారులను వారి గత బీమా రికార్డుల ఆధారంగా మదింపు చేస్తారు. క్లీన్ క్లెయిమ్స్ చరిత్ర ఉన్న వ్యక్తులు తక్కువ ప్రీమియంల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇక మోసపూరిత క్లెయిమ్లకు పాల్పడిన చరిత్ర ఉన్నవారు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. కవరేజీ తిరస్కరణను కూడా ఎదుర్కోవచ్చు.మోసపూరిత క్లెయిమ్లతో రూ. వేల కోట్ల నష్టంప్రస్తుతం బీమా రంగంలో మోసపూరిత క్లెయిమ్లు ఏటా రూ.12,000-రూ.15,000 కోట్లుగా ఉన్నాయి. ఇది బీమా సంస్థలకు సవాలుగా మారింది. బీమా క్రెడిట్ స్కోర్లను అమలు చేయడం ద్వారా తప్పుడు క్లెయిమ్లను తగ్గించడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, మరింత ప్రీమియంలతో పాలసీలను అందించేందుకు బీమా కంపెనీలకు వీలవుతుంది. ఇది బాధ్యతాయుతమైన పాలసీదారు ప్రవర్తనను ప్రోత్సహిస్తుందని, బీమా ఉత్పత్తులకు విస్తృత అందుబాటును నిర్ధారిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.బీమా పరిశ్రమకు గేమ్ ఛేంజర్..క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థ భారత బీమా పరిశ్రమకు గేమ్ ఛేంజర్గా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు, గోప్యత, డేటా వినియోగానికి సంబంధించి ఆందోళనలు ఉన్నప్పటికీ, నియంత్రణ సంస్థలు డేటా సంరక్షణ చట్టాలను కచ్చితంగా పాటిస్తామని హామీ ఇస్తున్నాయి. ఇటు బీమా కంపెనీలకు, అటు పాలసీదారులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే ఈ బీమా క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థ 2026 ప్రారంభం నాటికి అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. -
నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను గ్రామీణ పేదలకు కనీస జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో రూపొందించారు. అయితే ఇటీవల కాలంలో దాని లక్ష్యం నీరుగారుతోందనే వాదనలున్నాయి. ఈ పథకం పేదల జీవనోపాధి వనరులను బలోపేతం చేయాలనే దాని ప్రధాన లక్ష్యాన్ని సాధించడంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ స్టాండింగ్ కమిటీ ఇటీవల విడుదల చేసిన నివేదిక అందుకు సంబంధించిన కీలక అంశాలను లేవనెత్తింది. వేతనాల రేట్లు స్తబ్దుగా ఉండటం, తగినంత బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వంటి పలు ఆందోళనలను ఈ నివేదిక ఎత్తిచూపింది.ప్రభావితం చేసే సమస్యలుతక్కువ వేతన రేట్లు2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల సగటు వేతన రేటు రూ.259గా ఉంది. కేవలం 10 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే రూ.300 కంటే ఎక్కువ రోజువారీ వేతనాలను అందిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుత రోజువారీ చెల్లింపులు సరిపోవని సూచిస్తూ, అత్యవసరంగా రోజువారీ వేతనాలను రూ.400కు సవరించాలని కమిటీ సిఫార్సు చేసింది.బడ్జెట్ పరిమితులుగ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు రూ.86,000 కోట్లుగా ఉన్నాయి. అయితే వాస్తవ వ్యయం నిత్యం అంచనాలను మించుంతుందని గత గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ కేటాయింపులు రూ.60,000 కోట్లు ఉన్నాయి. కానీ వ్యయం రూ.1.05 లక్షల కోట్లు దాటింది. ఇది పునరావృత ఆర్థిక లోటు(రికరింగ్ ఫైనాన్షియల్ షార్ట్ఫాల్స్)ను ఎత్తిచూపుతుంది.పరిమిత పని లభ్యతలిబ్ టెక్ ఇండియా చేసిన ఒక అధ్యయనంలో కేవలం 7% కుటుంబాలు మాత్రమే ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద హామీ ఇచ్చిన 100 రోజుల పనిని పొందుతున్నాయని వెల్లడైంది. ఇది ముందస్తు అంచనాల కంటే చాలా తక్కువ.జీడీపీ కేటాయింపులుభారతదేశ జీడీపీలో కనీసం 1.7% ఎంజీఎన్ఆర్ఈజీఏకు కేటాయించాలని ప్రపంచ బ్యాంకు సిఫార్సు చేస్తుంది. కానీ 2024-25 కేటాయింపులు జీడీపీలో కేవలం 0.26% మాత్రమే ఉన్నాయి. ఇది నిధుల కొరతపై ఆందోళనలను రేకెత్తిస్తుంది.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ నిబంధనల సడలింపు ప్రతిపాదనలుముఖ్యంగా కొవిడ్-19 వంటి సంక్షోభాల సమయంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ కీలకమైన ఉపాధి వెసులుబాటును అందించినప్పటికీ బడ్జెట్ పరిమితులు, వేతనాలు పెంపు లేకపోవడం, పరిపాలనా సమస్యల వల్ల దాని లక్ష్యానికి ఆటంకం ఏర్పడుతుంది. ఈ పథకం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి అధిక నిధులు, విధాన సర్దుబాట్లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. -
హైదరాబాద్లో ఇంటి సెంటిమెంట్..
ఓ వైపు నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.. నలువైపులా విస్తరిస్తోంది.. అందుకు తగ్గట్టే నివాస భవనాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ.. నగరవాసుల్లో సొంతింటి పట్ల ఆసక్తి ఇసుమంతైనా తగ్గలేదు. నా ఇల్లు అనే భావోద్వేగ బంధానికి, సెంటిమెంట్కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా ఓ సంస్థ నిర్వహించిన ‘బియాండ్ బ్రిక్స్: ది పల్స్ ఆఫ్ హోం బయింగ్’ అనే అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరోరియల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా సొంతింటి కల సాకారం చేసుకోవాలనే తపన మాత్రం నగరవాసుల్లో తగ్గడం లేదని తేల్చిన ఈ అధ్యయనం దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నగరాల్లో ప్రజలు సొంత ఇంటి గురించిన ఆలోచనా విధానాన్ని పరిశీలించారు. ఆ అధ్యయనం వెల్లడించిన విశేషాలివి..ఇల్లు కొనాల్సిందే..సొంతింటిని కోరుకుంటున్న నగరాల వ్యాప్తంగా చూస్తే, అత్యధిక శాతం మందికి అది సెంటిమెంట్గా మారిన నగరంగా చెన్నై తొలిస్థానంలో నిలిచింది. ఆ నగరంలో 86శాతం మంది సొంత ఇంటికి జైకొడుతున్నారు. ఆ తర్వాత స్థానాన్ని 85శాతంతో ముంబై దక్కించుకుంది. ఇక అహ్మదాబాద్వాసుల్లో 83శాతం మంది నా ఇల్లే నా స్వర్గం అంటుంటే.. ఆ తర్వాత స్థానంలో నిలిచిన మన హైదరాబాద్లో 81శాతం మంది ఇల్లు కొనాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. మన నగరం తర్వాత 80శాతంతో కోల్కతా, 74శాతంతో ఢిల్లీ, 73శాతంతో బెంగళూర్లు సొంతింటి కలలో తేలిపోతున్నాయి. సొంతిల్లు ఎందుకంటే.. సుదీర్ఘకాలం సురక్షితంగా భద్రంగా జీవించాలి అంటే సొంత ఇల్లు ఉండాల్సిందేనని నగరవాసులు భావిస్తున్నారు. సొంతిల్లు వైపు నడిపిస్తున్న తర్వాతి కారణాల్లో ఆర్థిక స్థిరత్వం.. అంటే ఇల్లు కొనడమేననే ఆలోచన బలంగా ఉండటం, 3వ కారణంగా సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడి ఉన్న సొంత ఇల్లు అనే భావన.. వంటివి ఉన్నాయి. విశేషం ఏమిటంటే.. రూ.50 లక్షలు పైబడిన ఆదాయం ఉన్న అధికాదాయ వర్గాల వారిలో 91శాతం మంది సొంతిల్లు కావాలంటుంటే, అత్యల్ప ఆదాయం ఉన్న వారిలోనూ 71శాతం మంది అదే కోరిక వ్యక్తం చేస్తున్నారు.ఇల్లు కావాలి.. అవి కూడా కావాలి..ఇల్లు కొనేటప్పుడు ప్రధానంగా ఏం చూస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా వైద్య సౌకర్యాలకే అత్యధికులు ప్రాధాన్యత ఇచ్చారు. ఆస్పత్రులకు సమీపంలో నివసించడానికే 58శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. షాపింగ్కు ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. తమ ఇల్లు మార్కెట్స్కు సమీపంలో ఉండాలని 53శాతం మంది ఆశిస్తుంటే, రవాణా సౌకర్యాలు బాగుండే చోటైతేనే రైటు అంటున్నవారు 40శాతం మంది. అంతేనా ఇరుగు పొరుగుతో కాలక్షేపం ఉండాల్సిందే అంటున్న 23శాతం మంది కమ్యూనిటీ క్లబ్లకు సమీపంలోని ఇంటిని ఇష్టపడుతున్నారు. సొంత ఇంటితో పాటే ఆరోగ్యమూ మా తోటే అంటున్న నగరవాసుల్లో 16శాతం మంది జిమ్ తదితర వ్యాయామ సౌకర్యాలు దగ్గరలో ఉన్న ఇంటిని కోరుకుంటున్నారు. నగరంలో అత్యధికులు సొంత ఇంటిని ఇప్పటికీ సెంటిమెంట్గా భావిస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుతం కనిపిస్తున్న రియల్ ఎస్టేట్ రంగంలోని ఒడిదుడుకులు తాత్కాలికమేనని స్పష్టం అవుతోంది. సొంత ఇంటి కల నిజం చేసుకునేవారి కల సాకారం చేసే విధంగా అందరికీ అందుబాటు ధరల్లో ఇళ్లు అందజేయగలిగితే.. సిటీ రియల్ రంగానికి భవిష్యత్తుకి దోకా ఉండదు. -
గోల్డ్ లోన్ నిబంధనల సడలింపు ప్రతిపాదనలు
బంగారు రుణాల కొత్త ముసాయిదా నిబంధనల నుంచి చిన్న రుణగ్రహీతలకు మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వశాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. బంగారం తనఖా పెట్టి రూ.2 లక్షల వరకు రుణాలు పొందేవారికి నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తోపాటు కొందరు ఆర్థిక నిపుణుల నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే అదనంగా కొన్ని మార్గదర్శకాలను జనవరి 1, 2026 నుంచి అమలు చేయాలని మంత్రిత్వ శాఖ ఆర్బీఐకి సిఫార్సు చేసింది.ప్రతిపాదిత మార్పులు ఇలా..ఆర్బీఐ ముసాయిదా నిబంధనల్లో రుణగ్రహీతలను గణనీయంగా ప్రభావితం చేసే రెండు కీలక మార్పులను ప్రతిపాదిస్తున్నారు. అందులో లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తి తగ్గింపు నిర్ణయం కీలకంగా ఉంది. అంటే రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారం విలువలో ఇప్పటివరకు 80% వరకు రుణాలు వచ్చేవారు కాస్తా దీన్ని 75% కి తగ్గించాలనే ప్రతిపాదనలున్నాయి. దీని ద్వారా రుణగ్రహీతలు బంగారంపై తక్కువ డబ్బును పొందుతారు. తాకట్టు పెట్టిన బంగారానికి యాజమాన్య రుజువును అందించాలనేలా మరో ప్రతిపాదన ఉంది.ఇదీ చదవండి: టర్కీ ఎయిర్లైన్స్ డీల్ ప్రశ్నార్థకంఆ నిబంధనలను ఖరారు చేయడానికి ముందు ఆర్బీఐ ప్రస్తుత బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాలతో సహా ఇతర వాటాదారుల నుంచి ఫీడ్బ్యాక్ను సమీక్షిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నిరంతరాయంగా రుణ సదుపాయం లభించేలా చూడటం ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ విధుల్లో ప్రాథమిక అంశమని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
పసిడి పలుకు: బంగారం మళ్లీ పెరిగిందా.. తగ్గిందా?
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం రోజున కాస్త పెరిగిన పసిడి ధరలు నేడు (మే 31) నిలకడగా కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. మే 31 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.👉ఇది చదివారా? గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వంఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,460🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,350ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,310🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,200బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,10,900 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 99,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
టర్కీ ఎయిర్లైన్స్ డీల్ ప్రశ్నార్థకం
భారత్కు చెందిన ఇండిగో ఎయిర్లైన్స్ టర్కీ ఏవియేషన్ కంపెనీ అయిన టర్కిష్ ఎయిర్లైన్స్తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన రెండు బోయింగ్ 777-300ఈఆర్ ఎయిర్క్రాఫ్ట్లను ఇండిగో లీజుకు తీసుకొని నడుపుతోంది. ఈ డీల్ మే31తో ముగుస్తుండగా, మరో ఆరు నెలలు పొడిగించాలని ఇండిగో సంస్థ భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరింది. అయితే ఆ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.టర్కిష్ ఎయిర్లైన్స్తో లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా రద్దు చేయాలని ఇండిగోను కేంద్రం ఆదేశించింది. ఢిల్లీతో సహా భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలెబి ఏవియేషన్కు ఇటీవల సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేసిన తరువాత ఈ పరిణామాలు మరింత తీవ్రమవుతున్నాయి.ఇండిగో వినియోగిస్తున్న టర్కీ సంస్థకు చెందిన రెండు విమానాలకు లీజు అనుమతి మే 31తో ముగుస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధ్రువీకరించింది. ఈ లీజు పొడిగింపు ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ తిరస్కరించినట్లు డీజీసీఏ తెలిపింది. అందుకు బదులుగా స్వల్పకాలిక ఉపశమనం ఇచ్చినట్లు పేర్కొంది. ప్రయాణీకుల సేవలకు తక్షణ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆగస్టు 31 వరకు మూడు నెలలపాటు అనుమతులు పొడిగించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ పొడిగింపును మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ పునరుద్ధరించబోమని తేల్చి చెప్పింది.ఇదీ చదవండి: ఆస్టన్ మార్టిన్తో రియల్మీ జట్టుపాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో భారత పౌరులను కిరాతకంగా చంపిన ఘటన నేపథ్యంలో భారత సైన్యం విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ను అమలు చేసింది. ఈ తరుణంలో పాక్ సైన్యానికి టర్కీ మద్దుతుగా నిలిచిందని భారత్ ఆరోపిస్తోంది. దాంతో ఆ దేశంలోని సంస్థలతో క్రమంగా సంబంధాలు తెంచుకుంటోంది. అందులో భాగంగానే దేశీయ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
ఆస్టన్ మార్టిన్తో రియల్మీ జట్టు
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్మీ, మోటార్ స్పోర్ట్ సంస్థ ఆస్టన్ మార్టిన్ ఫార్ములా వన్ టీమ్తో భాగస్వామ్యం కుదుర్చుకుని జీటీ 7 డ్రీమ్ ఎడిషన్ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా రియల్మీ ఫోన్ను ఆస్టన్ మార్టిన్ లోగోతో, విభిన్న స్టైలిష్ రంగుల్లో తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం మూడేళ్లపాటు ఉంటుందని కంపెనీ పేర్కొంది.రియల్మీ ఆస్టన్ మార్టిన్ సహకారంతో ఏటా రెండు మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఇది స్మార్ట్ఫోన్ పరిశ్రమలో ఫార్ములా వన్ ప్రతిష్ఠను తీసుకువస్తుందని అధికారులు తెలుపుతున్నారు. ప్రాథమికంగా ఆస్టన్ మార్టిన్ జీటీ 7 డ్రీమ్ ఎడిషన్ ఫార్ములా వన్ రేసింగ్ డిజైన్ను క్యాప్చర్ చేసేలా రూపొందించిన ఏరోడైనమిక్ బిల్డ్తో మొబైల్ను లాంచ్ చేయనున్నట్లు రియల్మీ పేర్కొంది. అందులోని ఫీచర్లు కింది విధంగా ఉండనున్నాయి.ఇదీ చదవండి: పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు..7,000 ఎంఏహెచ్ బ్యాటరీ120 వాట్ల వైర్డ్ పవర్ ఛార్జింగ్మీడియాటెక్ డైమెన్సిటీ 9400ఈ చిప్సెట్ -
అపోలో హాస్పిటల్స్కు పెరిగిన లాభం.. వాటాదారులకు డివిడెండ్
ముంబై: ఆరోగ్య సంరక్షణా సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 54 శాతం జంప్చేసి రూ. 390 కోట్లను తాకింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 254 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.కాగా.. మొత్తం ఆదాయం రూ. 4,944 కోట్ల నుంచి రూ. 5,592 కోట్లకు ఎగసింది. పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం 61 శాతం దూసుకెళ్లి రూ. 1,446 కోట్లను తాకింది. 2023–24లో రూ. 899 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 19,059 కోట్ల నుంచి రూ. 21,974 కోట్లకు బలపడింది. రానున్న ఐదేళ్లలో రూ. 8,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ప్రతాప్.సి.రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో సంస్థ షేరు బీఎస్ఈలో 0.7% బలపడి రూ. 6,878 వద్ద ముగిసింది. -
మహీంద్రా థార్ రాక్స్: డాల్బీ అట్మాస్తో తొలి ఎస్యూవీ ఇదే..
మహీంద్రా థార్ రాక్స్ ఎస్యూవీ ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించింది. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీని పొందిన ప్రపంచంలోని తొలి ఎస్యూవీగా ఇది నిలిచింది. మహీంద్రా, డాల్బీ ల్యాబొరేటరీస్ మధ్య కుదిరిన భాగస్వామ్యం ఈ అద్భుతమైన ఫీచర్ను థార్ రాక్స్ ఏఎక్స్7ఎల్ వేరియంట్కు తీసుకువచ్చింది. సాహసోపేతమైన థార్ రాక్స్ డ్రైవింగ్కు డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ తోడై థ్రిల్లింగ్ అనుభవాన్ని జోడిస్తుంది.ఈ ఎస్యూవీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో గానా యాప్ అనుసంధానం చేశారు. దీని ద్వారా వినియోగదారులు పాటలను నిరంతరాయంగా వినవచ్చు. ప్రీమియం 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టంతో నాలుగు ఛానెళ్ల లీనమయ్యే ఆడియో డాల్బీ అట్మాస్ సమకూర్చింది.థార్ రాక్స్ భారత విపణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. గత సంవత్సరం ఆగస్టులో విడుదలైన దీని ఉత్పత్తిని మహీంద్రా గణనీయంగా పెంచింది. థార్ రాక్స్, మూడు డోర్ల థార్ కలిపి 2.5 లక్షల యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు చేశాయి. ఉత్పత్తి పెరగడం వల్ల థార్ రాక్స్ వేచి ఉండే సమయం 18 నెలల నుండి గరిష్టంగా ఆరు నెలలకు తగ్గింది.థార్ రాక్స్ ధరలు రూ.12.99 లక్షల నుండి రూ.23.39 లక్షల వరకు ఉంటాయి (రెండు ఎక్స్-షోరూమ్ ధరలు). ఇది రెండు శక్తివంతమైన పవర్ట్రైన్ ఎంపికలు అందిస్తుంది: 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ 161.8బిహెచ్పి శక్తి 330ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ 176.8బిహెచ్పి శక్తి 380ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.డీజిల్ ఇంజిన్ కూడా రెండు ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభ్యమవుతోంది. మాన్యువల్ 152.1 బీహెచ్పీ శక్తి 330ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఆటోమేటిక్ రెండు ట్యూన్లలో వస్తుంది. ఒకటి మాన్యువల్ శక్తిని ఇస్తే, ఇంకొకటి 174.8 బీహెచ్పీ శక్తి 370ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్లు కేవలం ఆర్డబ్ల్యూడితో వస్తే, డీజిల్ వినియోగదారులు ఆర్డబ్ల్యూడీ, ఫోర్డబ్ల్యూడీలను ఎంపిక చేసుకోవచ్చు. -
పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు..
గత దశాబ్ద కాలంలో భారత్ 17 కోట్ల ఉద్యోగావకాశాలను సృష్టించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సీఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ 2025లో పాల్గొని మాట్లాడారు. దేశంలో నిరుద్యోగ రేటు 3.2 శాతంగా ఉందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇదే స్థాయిలో ఉందన్నారు. భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారినందున గణనీయంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘గత దశాబ్ద కాలంలో భారత్లో 17 కోట్ల ఉద్యోగావకాశాలు లభించాయి. అంతకుముందు దశాబ్దంలో ఇచ్చిన 4.5 కోట్ల ఉద్యోగాల కంటే ఎంతో అధికం. భారత్ పారదర్శక ప్రజాస్వామ్య దేశం. మెరుగైన న్యాయవ్యవస్థ, పటిష్టమైన విధానాల వల్లే ప్రపంచంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ మారింది. దాంతోపాటు దేశంలో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతోంది. అందుకే గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు’ అన్నారు.దేశంలోని ప్రతి యూనివర్సిటీలో ‘ఎడ్యుకేషన్ టు ఎంప్లాయిమెంట్ లాంజ్(విద్య తర్వాత ఉద్యోగం వచ్చేలా విధానాలు)’ ఉంటుందని, దీన్ని పారిశ్రామిక సంస్థలు నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు, విశ్వవిద్యాలయాల సహకారంతో దీన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కెరియర్ లాంజ్లో యువతకు వారి అర్హతను బట్టి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.ఇదీ చదవండి: గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్పరిశ్రమల డిమాండ్కు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ అవసరాన్ని నొక్కిచెప్పిన మంత్రి, సీఐఐ వంటి పారిశ్రామిక సంస్థలు ప్రజలకు శిక్షణ ఇవ్వడంలో, వారి అవసరాల గురించి వివరాలను పంచుకోవడంలో ప్రభుత్వానికి సహాయపడతాయని అన్నారు. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను బట్టి విశ్వవిద్యాలయాలు లేదా విద్యాసంస్థలు యువతకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తాయని, తద్వారా వారు ఉద్యోగాలు పొందడానికి దోహదపడుతుందని వివరించారు. -
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులు
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిలలో రికార్డు స్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు ఐదేళ్లలో హైదరాబాద్లో రికార్డు స్థాయిలో పెరిగాయని ఓ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చ.అ.కు రూ.7,450గా ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు చూస్తే.. 2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో రూ.12,400గా ఉండగా.. 2024 నాటికి రూ.15,350కి పెరిగాయి.👉ఇది చదివారా? హైదరాబాద్లో ప్లాట్లకే డిమాండ్..అందుబాటు గృహాలలో 15 శాతం ఏడు ప్రధాన నగరాలలో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో అత్యధికంగా ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది.మధ్యతరగతిలో 18 శాతం ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాలలో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువలలో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్లోనే నమోదైంది. మన నగరంలో మిడ్సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది. -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
ఎంఎస్ఎంఈలు నాణ్యత ప్రమాణాలను అనుసరించాలి
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ఉత్పత్తుల తయారీలో స్వచ్ఛంద, తప్పనిసరి ప్రమాణాలను పాటించాలని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సూచించారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్టు చెబుతూ.. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర ప్రధానంగా ఉంటుందన్నారు.ఎంఎస్ఎంఈలు తమ సమస్యల గురించి తెలియజేయడం, సత్వర పరిష్కారాలను పొందే విషయంలో మరింత చురుగ్గా ఉండాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రమాణాల కోసం పరిశ్రమ డిమాండ్ చేయాలని.. వాటిని రూపొందించడంలో పాలు పంచుకోవాలని కోరారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వేగంగా ప్రమాణాలను రూపొందించగలదంటూ.. ప్రమాణాల విషయంలో పరిశ్రమ పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.నాణ్యమైన ఉత్పత్తుల దిశగా గత కొన్నేళ్లలో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. ప్రస్తుతమున్న టెస్టింగ్ ల్యాబ్లను బలోపేతం చేయడంతోపాటు, కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు రూ.78 కోట్ల నిధులకు ఇటీవలే ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఏ దేశం అయినా అంతిమంగా తన ఉత్పత్తులు, సేవల్లో విశ్వసనీయతతోనే వృద్ధి చెందగలదని గుర్తు చేశారు. దిగుమతయ్యే నాసిరకం ఉత్పత్తులను తిరస్కరించే ప్రమాణాలను భారత్ కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉగాండా, రువాండాలకు సైతం నాణ్యత నియంత్రణలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం 23,000 వరకు భారతీయ ప్రమాణాలు ఉండగా, అవన్నీ స్వచ్ఛందమేనన్నారు. -
నాన్టెక్లో టెకీలుగా దూసుకొస్తున్న మహిళలు
ముంబై: టెక్యేతర రంగాల్లో మహిళా టెకీల ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. 2020 తర్వాత నుంచి ఈ ధోరణి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 2020లో టెక్నాలజీ ఉద్యోగాల్లో మహిళల వాటా 1.90 శాతంగా ఉండగా, 2023లో 11.8 శాతానికి, 2024 నాటికి 14 శాతానికి పెరిగిందని టీమ్లీజ్ డిజిటల్ ఒక నివేదికలో వెల్లడించింది. 2020–2024 మధ్యకాలంలో 13,000 మంది టీమ్లీజ్ డిజిటల్ టెక్ కాంట్రాక్ట్ సిబ్బంది డేటా విశ్లేషణ ఆధారంగా దీన్ని రూపొందించారు.దీని ప్రకారం పురుషాధిక్యత ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో మహిళల వాటా 2020లో 9.51 శాతంగా ఉండగా 2024లో 27.98 శాతానికి పెరిగింది. నాన్–టెక్ రంగాల్లో టెక్నాలజీపరమైన విధుల్లో మహిళల నియామకాలు మెరుగుపడుతుండటాన్ని ఇది సూచిస్తోందని రిపోర్ట్ పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. హోదాపరంగా చూస్తే సీనియర్ స్థాయుల్లో మహిళల ప్రాతినిధ్యం 3.35 శాతానికే పరిమితం కాగా, మిడ్–లెవెల్లో 4.07 శాతంగా, ఎంట్రీ స్థాయిలో 3.03 శాతంగా ఉంది. లీడర్షిప్ హోదాలను చేరుకోవడంలో మహిళలకు ఇప్పటికీ సవాళ్లు ఎదురవుతున్నాయనడానికి ఇది నిదర్శనం. పరిశ్రమలవారీగా నైపుణ్యాల ఆధారిత విశ్లేషణ ప్రకారం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఇటు నాన్–టెక్నికల్, అటు టెక్నికల్ నైపుణ్యాల్లో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉంది. ఇది వరుసగా 49.28 శాతం, 44.31 శాతంగా నమోదైంది. 47.32 శాతం, 34.58 శాతం వాటాతో లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్కేర్ ఆ తర్వాత స్థానంలో నిల్చింది. టెక్నాలజీయేతర రంగాల్లో టెకీ ఉద్యోగాల్లో మహిళల వాటా 14 శాతానికి చేరడమనేది సమ్మిళితత్వం పెరుగుతుండటాన్ని సూచిస్తోంది. అయితే, లీడర్షిప్ హోదాల్లో వారికి అంతగా ప్రాతినిధ్యం ఉండటం లేదు. ఈ అంతరాలను సరిచేసేందుకు తగు చర్యలు తీసుకోవాలి. మహిళలకు కూడా అవకాశాలు ..వనరులు సమానంగా అందుబాటులో ఉండేలా, పరిశ్రమపరమైన అవరోధాలను పరిష్కరించేలా, సిబ్బందిలో వారి సంఖ్య మరింత పెరిగేలా చూడటంపై కంపెనీలు మరింత దృష్టి పెట్టాలి. -
ఇంటి పొదుపు రూ.22 లక్షల కోట్లు..! ఎస్బీఐ అంచనా
కోల్కతా: గృహాల నికర పొదుపులు గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) రూ.22 లక్షల కోట్ల మేర ఉండొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ తన అంచనాలు ప్రకటించింది. జాతీయ స్థూల ఖర్చు చేయతగిన ఆదాయం (జీఎన్డీఐ)లో ఇది 6.5 శాతానికి సమానమని పేర్కొంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో గృహ నికర పొదుపులు జీఎన్డీఐలో 5.1 శాతంగా ఉంటే, దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరంలో 4.9 శాతం మేర పెరిగినట్టు తెలిపింది.ఆర్థిక పొదుపులు పెరగడం అన్నది ప్రభుత్వం, కార్పొరేట్ నిధుల లోటును భర్తీ చేసేందుకు, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎంతో కీలకమని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ఈ సందర్భంగా ఆర్బీఐ మిగులు నిల్వలను ప్రస్తావించింది. రూపాయి అస్థిరతల కట్టడికి సెంట్రల్బ్యాంక్ తీసుకునే చర్యలు ఈ పరిమాణాన్ని నిర్దేశిస్తాయని తెలిపింది. 2024–25లో ఆర్బీఐ బ్యాలన్స్ షీటు 8.19 శాతం విస్తరించగా.. అదే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 9.9 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు పేర్కొంది.ఆర్బీఐ మిగులు నిల్వలు రూ.2.69 లక్షల కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయడం (డివిడెండ్) ద్రవ్య వెసులుబాటును ఇస్తుందని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో మోసాల కేసులు తగ్గినప్పటికీ.. మోసపోయిన మొత్తం మూడు రెట్లు పెరిగి రూ.36,014 కోట్లకు చేరినట్టు గుర్తు చేసింది. -
మెట్రోల్లో తగ్గిన బ్యాంకు రుణాలు!
ముంబై: దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాంకుల రుణాల వాటా చెప్పుకోతగ్గ మేర క్షీణించింది. ఐదేళ్ల క్రితం బ్యాంకుల మొత్తం రుణాల్లో 63.5 శాతంగా ఉంటే 2025 మార్చి చివరికి 58.7 శాతానికి తగ్గినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో రుణ వితరణ పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.డిపాజిట్ల విషయంలో దీనికి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే మెట్రోపాలిటన్ శాఖల్లోనే అధికంగా 11.7 శాతం వృద్ధి 2025 మార్చిలో నమోదైంది. ఇదే కాలంలో గ్రామీణ శాఖల్లో 10.1 శాతం, సెమీ అర్బన్ శాఖల్లో 8.9 శాతం, అర్బన్ శాఖల్లో 9.3 శాతం నమోదైంది.ముంబై, ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాంకుల రుణాల వాటా తగ్గడం, గ్రామీణ, చిన్న పట్టణాల్లో రుణ వితరణ పెరగడం కొన్ని ముఖ్యమైన ఆర్థిక పరిణామాలను సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణ ప్రాప్తి పెరగడం అక్కడి వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, అలాగే చిన్న తరహా పరిశ్రమల విస్తరణకు తోడ్పడవచ్చు. దీని ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థ మరింత సమతుల్యత సాధించవచ్చు.చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల పెరుగుదల వల్ల స్థిరాస్తి, పేదరిక నిర్మూలన, అలాగే ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. బ్యాంకులు పెద్ద నగరాల బదులుగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు ప్రత్యేకంగా దృష్టి సారించడం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. మెట్రోపాలిటన్ నగరాల్లో రుణాల వాటా తగ్గడం, డిపాజిట్ల వృద్ధి ఎక్కువగా ఉండటం ఆదాయ స్థాయిలు పెరుగుతుండటం, పొదుపు అలవాట్లు మెరుగుపడటం వంటి జీవన శైలి మార్పులను సూచిస్తున్నాయి. -
బంగారం ఆభరణాల వినియోగం నెమ్మదించొచ్చు
ముంబై: బంగారం ధరల పెరుగుదలతో ఆభరణాల వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 9–10 శాతం మేర తగ్గిపోవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ముఖ్యంగా బంగారం ధరలు 33 శాతం పెరగడం వినియోగం తగ్గుముఖం పట్టడానికి కారణంగా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలోనూ (2024–25) ఆభరణాల వినియోగం 7 శాతం తగ్గడం గమనార్హం. 2023–24లో బంగారం బిస్కెట్లు, కాయిన్ల డిమాండ్ 17 శాతం, 2024–25లో 25 శాతం చొప్పున పెరిగినట్టు ఇక్రా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతులు, భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతల మధ్య సురక్షిత సాధనమైన బంగారానికి పెట్టుబడుల డిమాండ్ పెరగడమే వృద్ధిని ఇతోధికం చేసినట్టు వివరించింది. పెట్టుబడుల పరంగా పసిడికి డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) కొనసాగుతుందని అంచనా వేసింది. బంగారం బిస్కెట్ల డిమాండ్ 10 శాతం, కాయిన్ల డిమాండ్ 35 శాతం వరకు పెరగచొచ్చని తెలిపింది. ఇక 2025–26లో బంగారం ఆభరణాల వినియోగం విలువ పరంగా 12–14 శాతం వృద్ధిని చూడొచ్చని పేర్కొంది. ధరల పెరుగుదల ఫలితమే ఇదని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలోనూ ధరలు 33 శాతం పెరగడంతో విలువ పరంగా 28 శాతం వృద్ధి నమోదైనట్టు గుర్తు చేసింది. సంఘటిత జ్యుయలర్లకు సానుకూలం.. ‘‘సంఘటిత రంగంలోని పెద్ద స్థాయి రిటైల్ జ్యుయలర్ల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో 14–16 శాతం మేర పెరుగుతుందని ఇక్రా అంచనా వేసింది. ధరల పెరుగుదలకుతోడు, ప్రణాళికబద్ధమైన స్టోర్ల విస్తరణ, అసంఘటిత రంగంలోని వర్తకుల నుంచి మార్కెట్ వాటాను క్రమంగా సొంతం చేసుకుటుండడం, ఈ ఏడాది పర్వదినాలు ఎక్కువగా ఉండడం డిమాండ్కు మద్దతునిస్తాయి’’అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ హెడ్ జితిన్ మక్కర్ తెలిపారు. దూకుడుగా స్టోర్లను విస్తరించే కొన్ని సంఘటిత జ్యుయలరీ సంస్థలకు మినహా ఎక్కువ జ్యుయలర్లకు అమ్మకాల పరిమాణం తగ్గొచ్చని ఇక్రా అంచనా వేసింది. ధరలు ఈ స్థాయిలో స్థిరపడొచ్చు బంగారం ధరలు ప్రస్తుత స్థాయిలో స్థిరపడొచ్చని ఇక్రా తెలిపింది. అంతర్జాతీయంగా ఊహించని ఏవైనా పెద్ద ఘటనలు జరిగితే తప్పించి ఇదే స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. సంఘటిత రంగంలోని జ్యుయలరీ సంస్థల నిర్వహణ మార్జిన్లు 30 బేసిస్ పాయింట్లు పెరిగి 7.2 శాతంగా ఉంటాయని తెలిపింది. రుణ వ్యయాల పెరుగుదలతో నికర మార్జిన్ల విస్తరణ 10 బేసిస్ పాయింట్లు మించకపోవచ్చని పేర్కొంది. తమ మూలధన అవసరాలకు జ్యుయలర్లు బంగారం తనఖా రుణాలను వినియోగిస్తుంటారు. -
తయారీ రంగ దన్ను కావాలి
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించాలంటే ప్రధానంగా తయారీ రంగం అండగా నిలవాల్సి ఉంటుందని నితి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరతీయవలసి ఉన్నదని సలహా ఇచ్చారు. తద్వారా 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో తయారీ రంగం కీలక పాత్ర పోషించనున్నట్లు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వ్యవసాయ రంగం నుంచి ప్రజలను మళ్లించవలసి ఉన్నట్లు పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో సుబ్రహ్మణ్యం ప్రస్తావించారు. దేశీయంగా మొత్తం నైపుణ్య వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. -
జీడీపీ వృద్ధి 7.4%
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో (2024–25 ఆర్థిక సంవత్సరం క్యూ4) 7.4 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది తొలి మూడు నెలల్లో నమోదైన వృద్ధి రేటు 8.4 శాతంతో పోల్చితే ఒక శాతం క్షీణించింది. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతానికి తగ్గింది. ఇది నాలుగేళ్ల కనిష్ట వృద్ధి రేటు కావడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) 9.2 శాతంగా ఉంది. క్యూ4తోపాటు గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద తయారీ రంగం డీలా పడడం వృద్ధి రేటును ప్రభావితం చేసింది. అదే సమయంలో వ్యవసాయ రంగం బలమైన పనితీరు నమోదు చేయడం ఊరటనిచ్చే అంశం. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 330.68 లక్షల కోట్లు (3.9 ట్రిలియన్ డాలర్లు)గా నమోదైంది. వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం సుగమమైంది. ‘‘రియల్ జీడీపీ (ప్రామాణిక) లేదా స్థిరమైన ధరల ఆధారిత జీడీపీ 2024–25లో 187.97 లక్షల కోట్లుగా ఉంది. 2023–24 సంవత్సరానికి జీడీపీ సవరించిన అంచనాల ప్రకారం 176.51 లక్షల కోట్లుగా ఉంది. అంటే 6.5 శాతం వృద్ధి రేటు నమోదైంది. నామినల్ జీడీపీ (వస్తు సేవల తుది ధరల ఆధారంగా) 2024–25లో రూ.330.68 లక్షల కోట్లుగా వచ్చింది. 2023–24 సంవత్సరానికి రూ.301.23 లక్షల కోట్లుగా ఉంది. అంటే 9.8 శాతం వృద్ధి రేటు నమోదైంది’’ అని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకటించింది. 2024 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటే, 2024 జూలై–సెపె్టంబర్ క్వార్టర్కు 5.6 శాతం, 2024 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి 6.5 శాతం చొప్పున ఉండడం గమనార్హం. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో చైనా జీడీపీ 5.4 శాతం వృద్ధిని సాధించింది. డీలా పడిన తయారీ రంగం → ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం ఎక్కువ క్షీణతను చవిచూసింది. ఈ రంగం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 12.3 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతానికి పరిమితమైంది. → ఇదే కాలంలో వ్యవసాయ రంగం మెరుగైన వృద్ధితో ఆదుకుంది. 2023–24 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 2.7 శాతమే కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతానికి పుంజుకున్నది. → గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో తయారీ రంగం వృద్ధి రేటు 4.8 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన 11.3 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గింది. ఈ గణాంకాల ఆధారంగా తయారీ రంగం ఇంకా కుదుటపడలేదని తెలుస్తోంది. → ఇక వ్యవసాయ రంగం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లోనూ మెరుగైన పనితీరు చూపించింది. వృద్ధి రేటు 5.4 శాతానికి చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్కు ఇది 0.9 శాతంగా ఉంది. → నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 10.8 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 8.7 శాతంగా ఉంది. → విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల్లో వృద్ధి రేటు జనవరి–మార్చి త్రైమాసికంలో 5.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో వృద్ధి రేటు 8.8 శాతంగా ఉంది. → క్యూ4లో సేవల రంగంలో (ట్రేడ్, హోటల్, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలు) జీవీ ఏ వృద్ధి (స్థూల విలువ జోడింపు) రేటు అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఉన్న 8.8 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. → ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, వృత్తి సేవల పరంగా వృద్ధి క్యూ4లో 7.8 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 9 శాతంగా ఉంది. అంచనాల మేరకే ద్రవ్యలోటు2024–25లో 4.8 శాతం గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) జీడీపీలో ద్రవ్యలోటును 4.8 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం సాధించింది. రూ.15,77,270 కోట్లుగా నమోదైనట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్కు ప్రభుత్వం సమరి్పంచిన సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు రూ.15,69,527 కోట్ల కంటే కేవలం రూ.7వేల కోట్ల మేర (లక్ష్యంలో 105 శాతం) అదనంగా నమోదైంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం రూ.30.36 లక్షల కోట్లుగా ఉంది. సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఇది 98.3 శాతానికి సమానం. 2024–25లో ప్రభుత్వ వ్యయం రూ.46.55 లక్షల కోట్లుగా ఉందని, సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఇది 98.7 శాతానికి సమానమని సీజీఏ తెలిపింది. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 5.63 శాతంగా ఉండడం గమనార్హం. నాలుగో ఏడాది వేగవంతమైన వృద్ధిభారత్ వరుసగా నాలుగో ఏడాదీ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన వృద్ధి క్రమాన్ని కొనసాగించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ గణాంకాలు వెలువడడంతో ఆమె స్పందించారు. క్యూ4లో తయారీ రంగం చక్కని పనితీరు చూపించడం జీడీపీ వృద్ధి రేటు పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.5% చేరడానికి దారితీసినట్టు చెప్పారు. ‘‘భారత్ నాలుగో ఏడాది వేగవంతమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. చిన్న, మధ్య, భారీ పరిశ్రమల కృషి వల్లే ఇది సాధ్యమైంది. మన తయారీ, సేవల సామర్థ్యాలు చురుగ్గానే ఉన్నాయి. వ్యవసాయం సైతం స్థిరమైన వృద్ధిని చూపిస్తోంది’’అని మంత్రి చెప్పారు. -
గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. రంగంలోకి ప్రభుత్వం
దేశంలో బంగారు రుణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అత్యవసర నగదు అవసరాల కోసం లక్షలాది మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి గోల్డ్ లోన్లే ఆధారం. అయితే, గోల్డ్లోన్ మంజూరుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రతిపాదించిన నిబంధనల మార్పులు తీవ్రమైన చర్చకు దారితీశాయి. చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే గ్రహీతలపై తీవ్ర ప్రభావం పడనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ రంగంలోకి దిగింది.కఠిన నిబంధనలుగోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేసే లక్ష్యంతో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. వీటిలో..లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తిని 75 శాతానికి పరిమితం చేయడం అంటే రుణగ్రహీతలు తమ బంగారం మార్కెట్ విలువలో 75% వరకు మాత్రమే రుణంగా పొందవచ్చు.బంగారు రుణాలకు నిజమైన, ధ్రువీకరించదగిన ఆస్తుల మద్దతు ఉందని నిర్ధారించడానికి కఠినమైన పూచీకత్తు అవసరం.రుణ మంజూరులో మరింత పారదర్శకత కోసం బ్యాంకులు, రుణ సంస్థలపై పర్యవేక్షణ పెంచడం.ప్రభుత్వ జోక్యంఅయితే, కొత్త నిబంధనలు చిన్న రుణగ్రహీతలను, ముఖ్యంగా వ్యవసాయ వర్గాలను దెబ్బతీస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది.కఠినమైన నిబంధనల నుంచి రూ.2 లక్షల లోపు రుణాలను మినహాయించడం ద్వారా చిన్న రుణగ్రహీతలకు సులభంగా రుణాలు అందుతాయి.కొత్త నిబంధనలకు సజావుగా మారడానికి బ్యాంకులు, రుణ సంస్థలకు తగినంత సమయం ఇవ్వడానికి వాటి అమలును 2026 జనవరి 1 వరకు వాయిదా వేయాలని ఆర్బీఐకి ఆర్థిక శాఖ సూచించింది. -
జియో 5 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్తో..
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్ దృష్ట్యా రిలయన్స్ జియో ఒక పెద్ద అడుగు వేసింది. కంపెనీ ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. వీటిలో ఉచితంగా జియోగేమ్స్ క్లౌడ్ ప్రయోజనాన్ని అందిస్తోంది. అంటే ఖరీదైన హార్డ్వేర్ లేకుండా యూజర్లు తమ మొబైల్, పీసీ, జియో సెట్-టాప్ బాక్స్లో కన్సోల్ లాంటి గేమ్స్ను ఆస్వాదించగలరు. ఈ ప్లాన్లు రూ.48 నుంచి ప్రారంభమవుతాయి.ఏమిటీ జియోగేమ్స్ క్లౌడ్?ఇది క్లౌడ్ ఆధారిత గేమింగ్ సర్వీస్. దీని ద్వారా యూజర్లు గేమ్ను డౌన్లోడ్ చేయకుండా నేరుగా ఆన్లైన్లో ఆడవచ్చు. సాధారణంగా దీని సబ్ స్క్రిప్షన్ రూ.398. కానీ కొత్త ప్లాన్లలో ఈ సదుపాయాన్ని ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా జియో ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రస్తుతం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. పోస్ట్ పెయిడ్, బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఇది అందుబాటులో లేదు.జియో కొత్త గేమింగ్ ప్లాన్స్ ఇవే..రూ.48 ప్లాన్: ఇది గేమింగ్ ప్రయత్నించాలనుకునే స్వల్పకాలిక వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ప్లాన్. ఈ ప్లాన్ 10 ఎంబీ డేటా, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ ను 3 రోజుల పాటు అందిస్తుంది.రూ.98 ప్లాన్: ఈ ప్లాన్తో 7 రోజుల పాటు 10 ఎంబీ డేటా, గేమింగ్ యాక్సెస్ లభిస్తుంది. ఇది డేటా వోచర్, కాబట్టి దీనిని ఉపయోగించడానికి యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండటం అవసరం.రూ.298 ప్లాన్: జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ తో పాటు 3 జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. ఇది కూడా డేటా వోచర్. యాక్టివ్ ప్లాన్ తో మాత్రమే ఉపయోగించవచ్చు.రూ.495 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు అందిస్తుంది. జియోగేమ్స్ క్లౌడ్, జియోసినిమా (డిస్నీ+ హాట్స్టార్ మొబైల్), ఫ్యాన్కోడ్, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.రూ.545 ప్లాన్: ఇది అత్యంత ప్రీమియం ప్లాన్. 2 జీబీ రోజువారీ డేటా, 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత 5 జీ డేటా ఇందులో లభిస్తాయి. మిగతా ఫీచర్లన్నీ రూ.495 ప్లాన్ మాదిరిగానే ఉంటాయి. -
ఇదీ సంపాదనంటే.. 24 గంటల్లో రూ.13600 కోట్లు
ప్రపంచంలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. మార్కెట్లో ఒక్కో వస్తువు ఒక్కోసారి ట్రెండ్ అవుతుంది. అదే క్రమంలో ఇప్పుడు ఓ బొమ్మ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. స్టోర్లలో అల్లర్లకు కారణమైంది. సెలబ్రిటీల ఫేవరెట్ గా మారింది. దాని సృష్టికర్త సంపదను అమాంతం పెంచేసింది. ఎంతలా అంటే 24 గంటల్లో రూ.13,600 కోట్లకు పైగా సంపాదించేంతలా...చైనీస్ బొమ్మల కంపెనీ పాప్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ సీఈఓ వాంగ్ నింగ్ సంపద ఒక్క రోజులోనే 1.6 బిలియన్ డాలర్లు (రూ.13,600 కోట్లకు పైగా) పెరిగింది. ఆ సంస్థ సృష్టించిన ‘లబుబు’ (Labubu) బొమ్మలే ఇందుకు కారణం. విచిత్రమైన గ్రెమ్లిన్ ముఖంతో రూపొందించిన ఈ బుజ్జి బొమ్మల క్రేజ్ ప్రపంచాన్ని ఊపేసింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ గర్ల్ గ్రూప్ బ్లాక్పింక్ లీసా, రోస్, రిహన్నా, అనన్య పాండే వంటి చాలా మంది సెలబ్రిటీల దగ్గర ఈ లబుబు బొమ్మలు కనిపించాయి.టాప్ డౌన్లోడింగ్ యాప్లబుబు బొమ్మల క్రేజ్ ఎంతలా ఉందంటే.. ఈ బొమ్మల కోసం కస్టమర్లు గొడవపడటంతో పాప్ మార్ట్ యూకేలో ఇన్ స్టోర్ అమ్మకాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆన్లైన్లో ఈ బొమ్మలు విక్రయించే పాప్ మార్ట్ మొబైల్ యాప్ అమెరికాలో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న షాపింగ్ యాప్గా నిలిచింది, ఇది వాంగ్ నింగ్ నెట్వర్త్ను 18.7 బిలియన్ డాలర్లకు పెంచింది.లబుబు బొమ్మతో బ్లాక్పింక్ రోస్ఏప్రిల్ 2025 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, వాంగ్ నింగ్ అమెరికాలో తన కంపెనీకి పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా ఒక్క రోజులో 1.6 బిలియన్ డాలర్ల ధనవంతుడు అయ్యాడు. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, అమెరికన్లు లబుబు బొమ్మలను కొనడానికి గంటల తరబడి క్యూ కట్టారు. ఫోర్బ్స్ ప్రకారం వాంగ్ నింగ్ రియల్ టైమ్ నెట్వర్త్ 18.7 బిలియన్ డాలర్లుగా ఉంది. -
EPFO గుడ్న్యూస్.. ఇక అలాంటి రిజెక్షన్స్ ఉండవు
ఉద్యోగాలు మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బదిలీ ప్రక్రియలో తలెత్తుతున్న ఇబ్బందులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తొలగించింది. వివిధ సంస్థల్లో పనిచేసిన సందర్భంలో సర్వీస్ వ్యవధులు సరిపోలని కారణంగా పీఎఫ్ బదిలీ క్లెయిమ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీనిపై నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు కొత్త వివరణ ఇచ్చింది. ఇలాంటి సాంకేతికతల కారణంగా ఆలస్యాన్ని ఎదుర్కొన్న వేతన జీవులకు ఇది ఉపశమనం కలిగిస్తుంది.పీఎఫ్ బదిలీ క్లెయిమ్స్ ఎందుకు స్తంభిస్తున్నాయంటే..ఇటీవలి కొన్ని నెలలుగా అనేక ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయాలు (ఆర్పిఎఫ్ఓలు) పీఎఫ్ బదిలీ అభ్యర్థనలను తిరస్కరించడమో లేదా తిరిగి పంపడమో చేస్తున్నాయి. ఒక ఉద్యోగాన్ని అధికారికంగా విడిచిపెట్టడానికి ముందే కొత్త ఉద్యోగంలో చేరినవారి విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. రెండు సంస్థలలో ఏక కాలంలో పనిచేసినట్లు ఉండటంతో ప్రాసెసింగ్ ఆలస్యం అవుతోంది.👉 ఇది చదివారా? కొత్త ఈపీఎఫ్వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులుఈపీఎఫ్వో తాజా ఆదేశాలుపీఎఫ్ బదిలీ క్లెయిమ్ను పూర్తిగా తిరస్కరించడానికి సర్వీసు వ్యవధిని కారణాలుగా పరిగణించరాదని స్పష్టం చేస్తూ న్యూఢిల్లీలోని ఈపీఎఫ్ఓ ప్రధాన కార్యాలయం మే 20న ఒక సర్క్యులర్ జారీ చేసింది. పెన్షన్ డివిజన్ గతంలో జారీ చేసిన సర్క్యులర్ను కూడా ఇందులో ప్రస్తావించింది. ఎక్కువ ఖాతా నంబర్లున్న సందర్భాల్లో ఈపీఎస్ ప్రయోజనాలను ఎలా నిర్వహించాలో ఆ సర్క్యులర్లో మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగి రికార్డులో సర్వీస్ ఓవర్ ల్యాప్ ఉన్నప్పటికీ పీఎఫ్ బదిలీ క్లెయిమ్లను ప్రాసెస్ చేయాలని అన్ని బదిలీ కార్యాలయాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఐటీ, మెటల్, ఆటో రంగాల్లో విస్తృత స్థాయి అమ్మకాల ఒత్తిడితో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం చివరి సెషన్ లో నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 182.01 పాయింట్లు (0.22 శాతం) క్షీణించి 81,451.01 వద్ద ముగిసింది. ఈ సూచీ 81,698.21 - 81,286.45 రేంజ్లో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 82.90 పాయింట్లు (0.33 శాతం) క్షీణించి 24,750.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 24,863.95 వద్ద, ఇంట్రాడే కనిష్ట స్థాయి 24,717.40 వద్ద నమోదయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వరుసగా 0.06 శాతం, 0.06 శాతం నష్టంతో ముగియగా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ మహారాష్ట్ర బ్యాంక్, యూకో బ్యాంక్ నేతృత్వంలో 2.88 శాతం లాభంతో స్థిరపడింది.నిఫ్టీ మీడియా, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ మినహా ఎన్ఎస్ఈలోని మిగతా సెక్టోరల్ ఇండెక్స్లలన్నీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ, మెటల్ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ కూడా దాదాపు ఒక శాతం (0.98 శాతం) నష్టపోయింది.ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,955 షేర్లలో 1,581 నష్టాల్లో ముగియగా, 1,299 షేర్లు లాభాలను అందుకున్నాయి. 75 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.18 లక్షల కోట్లుగా ఉంది.2025 మార్చి త్రైమాసికానికి కార్పొరేట్ ఆదాయాల తుది సెట్ను ఇన్వెస్టర్లు అంచనా వేయడం, క్యూ4 జీడీపీ గణాంకాల కోసం వేచి ఉండటం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్ చర్యలతో ముడిపడి ఉన్న ప్రపంచ వాణిజ్య పరిణామాలను ట్రాక్ చేయడంతో మార్కెట్ సెంటిమెంట్ అప్రమత్తంగా ఉంది. -
బాలీవుడ్ నటుడు సహా 58 మందిపై సెబీ బ్యాన్
షేర్ల కొనుగోలు విషయంలో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సహా మరికొంత మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చర్యలు చేపట్టింది. సాధనా బ్రాడ్కాస్ట్ షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సిఫారసు చేస్తూ యూట్యూబ్ ఛానళ్లలో తప్పుదోవ పట్టించే వీడియోలకు సంబంధించిన కేసులో అర్షద్ వార్సీ, అతని భార్య మరియా గోరెట్టితో పాటు మరో 57 మంది వ్యక్తులు, సంస్థలను ఏడాది నుంచి ఐదేళ్ల వరకు సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి సెబీ నిషేధించింది.అర్షద్ వార్సీ, ఆయన భార్య మారియాకు చెరో రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించిన సెబీ సాధన బ్రాడ్ కాస్ట్ (ప్రస్తుతం క్రిస్టల్ బిజినెస్ సిస్టమ్ లిమిటెడ్) ప్రమోటర్లతో సహా మరో 57 మంది వ్యక్తులు, సంస్థలపై సెబీ రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు జరిమానా విధించింది. అంతేకాకుండా, రూ.58.01 కోట్ల అక్రమ లాభాలను దర్యాప్తు ముగిసినప్పటి నుంచి వాస్తవ చెల్లింపు తేదీ వరకు 12 శాతం వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సెబీ ఈ సంస్థలను ఆదేశించింది.ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడం ద్వారా అర్షద్ వార్సీ రూ.41.70 లక్షలు, ఆయన భార్య మారియా రూ.50.35 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు సెబీ పేర్కొంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక సూత్రధారులు గౌరవ్ గుప్తా, రాకేశ్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రా అని సెబీ తుది ఉత్తర్వుల్లో గుర్తించింది. సాధన బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ ఆర్టీఏ డైరెక్టర్గా ఉన్న సుభాష్ అగర్వాల్ మనీష్ మిశ్రా, ప్రమోటర్ల మధ్య జీవోగా వ్యవహరించారని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఐదేళ్లలో 50 శాతం ఉద్యోగాలు ఉఫ్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో జాబ్మార్కెట్లో దీని ప్రభావం భారీగా ఉండనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఇంతకు ముందు ఊహించిన దానికంటే చాలా తీవ్రంగా ఉంటుందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 50 శాతం ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేయబోతుందని చెప్పారు. దాంతో నిరుద్యోగ రేటు 20 శాతానికి చేరుకుంటుందని అమోది అంచనా వేస్తున్నారు.ఉద్యోగాలపై ఏఐ ప్రభావంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ ఇప్పటికే టెక్నాలజీ, ఫైనాన్స్, లా, కన్సల్టింగ్.. వంటి చాలా రంగాల్లోని ఉద్యోగులకు విఘాతం కలిగిస్తోంది. సంక్లిష్టమైన డేటా విశ్లేషణ, కంటెంట్ సృష్టి, చట్టపరమైన పరిశోధన చేసేలా మెషిన్ లెర్నింగ్ నమూనాలు, సాంప్రదాయకంగా ఇంటర్న్లు, జూనియర్ ఉద్యోగులు నిర్వహించే పనులను ఏఐ భర్తీ చేస్తోందని అమోది తెలిపారు. ఫలితంగా కంపెనీలు కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం తగ్గించాయని చెప్పారు. ముఖ్యంగా గతంలో వృత్తిపరమైన ఎదుగుదలకు కీలకంగా ఉన్న ఉద్యోగాల స్థానంలో రిక్రూట్మెంట్ గణనీయంగా పడిపోయిందని పేర్కొన్నారు. కొవిడ్ ముందు పరిణామాలతో పోలిస్తే పెద్ద టెక్ కంపెనీల్లో ఎంట్రీ లెవల్ నియామకాలు 50% పడిపోయాయని తెలిపారు. ఆటోమేషన్ వర్క్ఫ్లోలను క్రమబద్ధీకరిస్తుండడం, వ్యాపారాలకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుండడంతో ఏఐ కీలకంగా మారిందన్నారు.మౌనం తగదు..భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నోరుమెదపడం లేదని అమోది చెప్పారు. ముఖ్యంగా యూఎస్ అడ్మినిస్ట్రేషన్ ఈ అంశంపై మౌనంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. చైనాతో జరుగుతున్న ఏఐ రేసులో ఎదురుదెబ్బలు తగులుతాయనే భయంతో విధాన నిర్ణేతలు నష్టాలను అంగీకరించడానికి వెనుకాడుతున్నారని అంచనా వేశారు. ఏఐ ఆర్థిక వృద్ధికి ఆజ్యం పోస్తుందని, అదే సమయంలో లక్షలాది మంది ఉద్యోగాలకు ప్రమాదకరంగా మారుతుందని అమోది అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: క్రిప్టో విధానాలపై త్వరలో చర్చా పత్రంఏం చేయాలంటే..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న వేగాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని ప్రభావాన్ని తగ్గించడం మానేసి ఈ మార్పులకు సిద్ధంగా ఉండడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అమోది కోరారు. ఏఐ ఆధారిత ఉద్యోగాలకు అనుగుణంగా ప్రొఫెషనల్స్కు నైపుణ్యాలు పెంచుకునేందుకు వీలుగా రీస్కిల్లింగ్, అప్ స్కిల్ ప్రోగ్రామ్ల అవసరాన్ని నొక్కి చెప్పారు. -
ఏపీ, తెలంగాణలో జియో హవా
రిలయన్స్ జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఏప్రిల్ 2025కిగాను ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో జియో వైర్లెస్ మొబిలిటీ, వైర్లైన్ బ్రాడ్బ్యాండ్, 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) విభాగాల్లో సబ్స్క్రైబర్ల వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది.అత్యంత పోటీ ఉన్న వైర్లెస్(మొబైల్) విభాగంలో అత్యధిక నెట్ సబ్స్క్రైబర్లను జోడించి టాప్లో నిలిచింది. మొత్తంగా ఏప్రిల్లో జియో 95,310 కొత్త సబ్స్క్రైబర్లను జోడించి, మార్చిలో 3,17,76,074 ఉన్న వినియోగదారులను 3,18,71,384కు పెంచుకుంది. ఎయిర్టెల్ 42,600 సబ్స్క్రైబర్లను పెంచుకుంది. బీఎస్ఎన్ఎల్ 1,715 సబ్స్క్రైబర్ల సాధారణ వృద్ధిని చూపింది. కాగా వోడాఫోన్ ఐడియా 9,058 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది.ఇదీ చదవండి: క్రిప్టో విధానాలపై త్వరలో చర్చా పత్రంజియో ఫైబర్రిలయన్స్ జియో వైర్లైన్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్, జియో ఫైబర్, ఏపీ టెలికాం సర్కిల్లో ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో దూసుకుపోతోంది. ఏప్రిల్లో జియో ఫైబర్ 54,000కి పైగా కొత్త సబ్స్క్రైబర్లను జోడించింది. దాంతో మొత్తం వైర్లైన్ సబ్స్క్రైబర్ బేస్ను సుమారు 1.66 మిలియన్లకు విస్తరించింది. ఈ వృద్ధి రేటు ఎయిర్టెల్ (సుమారు 18,000 సబ్స్క్రైబర్లు), బీఎస్ఎన్ఎల్ కంటే ఎక్కువ. జియో ఎయిర్ఫైబర్ తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ లీడర్గా నిలిచింది. ఏప్రిల్ 2025 నాటికి జియో ఎయిర్ఫైబర్ దేశవ్యాప్తంగా 6.14 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. ఏపీ సర్కిల్లో జియో ఎయిర్ఫైబర్ సబ్స్క్రైబర్ బేస్ జనవరి 2025లో 4,27,439 నుంచి ఏప్రిల్లో 5,23,000కి పెరిగింది. ఈ విభాగంలో 80%కి పైగా మార్కెట్ షేర్ను దక్కించుకుంది. -
క్రిప్టో విధానాలపై త్వరలో చర్చా పత్రం
క్రిప్టో ఆస్తులపై భవిష్యత్ విధాన నిర్ణయాలకు పునాది వేసే వివరణాత్మక చర్చా పత్రాన్ని రూపొందించే చివరి దశలో భారత్ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే ప్రజలు, ఆర్థిక నిపుణుల ఫీడ్ బ్యాక్ కోసం ఈ చర్చా పత్రాన్ని విడుదల చేస్తామని విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయి. ఈ పత్రం రూపొందించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు (ఎఫ్ఎస్బీ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన సంశ్లేషణ పత్రం నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిసింది.వర్చువల్ డిజిటల్ ఆస్తులపై చర్చాపత్రానికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు ఈ ప్రక్రియలో పాల్గొన్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత క్రిప్టోపై భారతదేశం విస్తృత నియంత్రణ విధానాన్ని రూపొందించేందుకు తోడ్పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కొందరు నిపుణులు క్రిప్టో విషయంలో భారత్ వైఖరిని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం 2022లో వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుంచి వచ్చే లాభాలపై 30% పన్నును ప్రవేశపెట్టినప్పటికీ చట్టపరమైన గుర్తింపులో తేడాలున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ చర్చాపత్రంలోని అంశాలు అమల్లోకి వస్తే దేశంలో పనిచేస్తున్న అన్ని క్రిప్టో ఎక్స్ఛేంజీలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: మొబైల్లో త్వరగా ఛార్జింగ్ అయిపోతుందా?గ్లోబల్ క్రిప్టో చర్చల్లో భారత్ ఇప్పటికే ప్రముఖ పాత్ర పోషించింది. జీ20 సదస్సులో గ్లోబల్ రెగ్యులేటరీ రోడ్ మ్యాప్ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించింది. ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల మద్దతుతో ఆ రోడ్ మ్యాప్ పర్యవేక్షణకు పిలుపునిచ్చింది. క్రిప్టో అసెట్ మార్కెట్లు రిస్క్తో కూడుకున్న నేపథ్యంలో ఎఫ్ఎస్బీ సిఫార్సులను న్యూఢిల్లీ జీ20 లీడర్స్ డిక్లరేషన్ కూడా ఆమోదించింది. గ్లోబల్ డిజిటల్ ఫైనాన్స్ గవర్నెన్స్లో భారత్ పాత్రను ఇది బలోపేతం చేసింది. -
మొబైల్లో త్వరగా ఛార్జింగ్ అయిపోతుందా?
మీ మొబైల్లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్ ఉందా? అయితే దానిపై ఓ లుక్కేయాల్సిందే. ఫోన్లో త్వరగా బ్యాటరీ అయిపోతుందంటే దానికి మొబైల్లో ఇన్స్టాల్ చేసిన ఇన్స్ట్రాగ్రామ్ యాప్ కారణం కావొచ్చని గూగుల్ పోస్ట్లో తెలిపింది. ఈ సమస్య పిక్సెల్ ఫోన్ వినియోగదారులకు అధికంగా ఉందని పేర్కొంది.గత కొన్ని వారాలుగా పిక్సెల్ వినియోగదారులు తమ పరికరాల్లో బ్యాటరీ సమస్యలను నివేదించినట్లు గూగుల్ తెలిపింది. అందుకుగల కారణాన్ని ధ్రువీకరించింది. మొబైల్ బ్యాక్గ్రాండ్లో ఇన్స్టాగ్రామ్ యాప్ అధిక బ్యాటరీ వినియోగానికి కారణమవుతుందని గూగుల్ సపోర్ట్ పోస్ట్లో వెల్లడించింది. పిక్సెల్ పరికరాలకు మే నెలలో సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చినట్లు పేర్కొంది. అప్పటి నుంచి ఈ సమస్య మరింత ఎక్కువైందని చెప్పింది.ఇదీ చదవండి: నోట్ల ముద్రణకు రూ.6,373 కోట్లు ఖర్చు!ప్రపంచవ్యాప్తంగా మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ను ఆండ్రాయిడ్ ఓఎస్లో దాదాపు 100 కోట్లకు పైగా యూజర్లు వినియోగిస్తున్నారు. అయితే ఈ యాప్ బ్యాటరీ లైఫ్ను ఎలా తగ్గిస్తోందో తెలియజేయడానికి యూజర్లు రెడిట్ వేదికగా తమ సమస్యలు నివేదించారు. ఇన్స్టాగ్రామ్ పాత వెర్షన్కు తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు కొందరు తెలిపారు. ఇంకొందరు ఓవర్ హీటింగ్ వంటి మరిన్ని సమస్యలను చెప్పారు.ఈ సమస్యకు పరిష్కారం..?బ్యాటరీ డ్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్ను అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీనిపై మెటా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఇన్స్టాగ్రామ్ సమస్యకు పరిష్కారాన్ని ప్రారంభించినట్లు గూగుల్ ధ్రువీకరించింది. ఆండ్రాయిడ్ డివైజ్ల్లో బ్యాటరీ డ్రైన్ సమస్యను పరిష్కరించడానికి ఇన్స్టాగ్రామ్ అప్డేటెడ్ యాప్ను విడుదల చేస్తుందని, బ్యాటరీ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. -
పడి లేచిన పసిడి! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరలు గడిచిన రెండు రోజులుగా పడిపోయాయి. అయితే నిన్నటి మార్కెట్ ధరలతో పోలిస్తే ఈ రోజు తిరిగి రేట్లు పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,200 (22 క్యారెట్స్), రూ.97,310 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.250, రూ.270 పెరిగింది.చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,200 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,310 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.250 పెరిగి రూ.89,350కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.270 పెరిగి రూ.97,460 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా శుక్రవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు రాలేదు. దాంతో కేజీ వెండి ధర రూ.1,10,900 వద్ద స్థిరంగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
నోట్ల ముద్రణకు రూ.6,373 కోట్లు ఖర్చు!
గత ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణపై ఆర్బీఐ రూ.6,373 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ముద్రణ వ్యయం రూ.5,101 కోట్లతో పోల్చి చూసినప్పుడు ఇది 25 శాతం ఎగిసింది. మొత్తం నోట్లలో 86 శాతం (విలువ పరంగా) రూ.500 రూపంలోనే ఉండడం గమనార్హం.సంఖ్యా పరంగా మొత్తం నోట్లలో 40.9 శాతం రూ.500 రూపంలో ఉన్నాయి. ఆ తర్వాత రూ.10 నోట్లు, 20, 50 రూపాయల నోట్లు 31.7 శాతం ఉన్నాయి. చెలామణిలో కాయిన్లు విలువ (50 పైసలు, రూ.1, 2, 5, 10, 20 కాయిన్లు) 6 శాతంగా ఉంది. ఉపసంహరించుకున్న రూ.2,000 నోట్లు 2025 మార్చి నాటికి 98.2 శాతం వెనక్కి వచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. 2022 నవంబర్లో తీసుకొచ్చిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఇ–రూపీ) వినియోగం గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పుంజుకుంది.ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!2024 మార్చి నాటికి ఇ–రూపీ చెలామణి రూ.234 కోట్లుగానే ఉండగా.. 2025 మార్చి నాటికి రూ.1,016 కోట్లకు పెరిగింది. ఇందులో రూ.500 నోట్ల రూపంలోనే రూ.857 కోట్లు ఉంది. సీమాంతర చెల్లింపులకు సీబీడీసీని ప్రయోగాత్మక వినియోగాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో రిస్క్లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 20 పాయింట్లు తగ్గి 24,821కు చేరింది. సెన్సెక్స్(Sensex) 57 ప్లాయింట్లు దిగజారి 81,579 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.44 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.4 శాతం లాభపడింది. నాస్డాక్ 0.39 శాతం పుంజుకుంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో రిస్క్లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
చిన్న సంస్థలకు పేపాల్ సర్వీసులు
ఎగుమతులపరమైన సీమాంతర చెల్లింపు లావాదేవీలకు సంబంధించి పేమెంట్ అగ్రిగేటరుగా వ్యవహరించేందుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి తమకు సూత్రప్రాయ అనుమతులు లభించినట్లు పేపాల్ హోల్డింగ్స్ భారతీయ అనుబంధ సంస్థ పేపాల్ పేమెంట్స్ వెల్లడించింది. దీనితో 200 పైగా మార్కెట్లలోని విదేశీ కస్టమర్ల నుంచి భారత్లోని చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు చెల్లింపులు పొందడానికి అవసరమైన సేవలు అందించవచ్చని పేర్కొంది.ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!ఈ సంస్థలు అంతర్జాతీయంగా వ్యాపార లావాదేవీలను సురక్షితంగా, సజావుగా నిర్వహించుకునేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని తెలిపింది. భారత్ గ్లోబల్ ఎగుమతుల హబ్గా ఎదుగుతున్న నేపథ్యంలో దేశీ వ్యాపార సంస్థలకు విశ్వసనీయమైన పేమెంట్ సొల్యూషన్స్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని వివరించింది. పేపాల్ చెకవుట్, పేపాల్ ఇన్వాయిసింగ్, నో–కోడ్ చెకవుట్ టూల్స్ మొదలైన సురక్షితమైన సాధనాలతో దేశీ చిన్న సంస్థలు, అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నట్లు కంపెనీ సేల్స్ హెడ్ ఆబిద్ ముర్షీద్ తెలిపారు. -
ఇండెల్ మనీ నిర్వహణ ఆస్తుల పెంపు
బంగారం తనఖాపై రుణాలు అందించే ఇండెల్ మనీ తన నిర్వహణ ఆస్తులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి (2026 మార్చి) రూ.4,000 కోట్లను పెంచుకోనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణ ఆస్తులు (రుణాలు) రూ.2,400 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల రుణాల మంజూరును సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!గత ఆర్థిక సంవత్సరంలో 89 కొత్త శాఖలు తెరవడంతో మొత్తం 12 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శాఖల సంఖ్య 2025 మార్చి 31 నాటికి 365కు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.61 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఎన్పీఏలు గత ఆర్థిక సంవత్సరం చివరికి 1.35 శాతానికి తగ్గాయి. అంతకుముందు సంవత్సరం చివరికి ఇవి 3.17 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘రానున్న రోజుల్లో దేశీ వినియోగం మరింత పుంజుకుంటుంది. దీంతో బంగారం రుణాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం ఇందుకు అనుకూలిస్తుంది’’అని ఇండెల్ మనీ సీఈవో ఉమేష్ మోహనన్ తెలిపారు. -
యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా 15–29 ఏళ్ల వయసులో ఉన్న అందరూ మొబైల్ ఫోన్ సాయంతో ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించగలరని టెలికం సర్వేలో తెలిసింది. తాము యూపీఐ ద్వారా బ్యాంక్ లావాదేవీలు నిర్వహించగలమని 99.5 శాతం మంది చెప్పినట్టు ‘కాంప్రహెన్సివ్ మాడ్యులర్ సర్వే: టెలికం, 2025’ వెల్లడించింది. కేంద్ర గణాంకాల శాఖ ఈ నివేదికను విడుదల చేసింది.15–29 ఏళ్లలో 97.1 శాతం మంది గత మూడు నెలలుగా స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 96.8 శాతం మంది (15–29 ఏళ్లు) గత మూడు నెలల్లో కనీసం ఒకసారి మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసినట్టు తెలిపారు. పట్టణాల్లో ఈ వయసులోని వారిలో 97.6 శాతం మంది ఫోన్ను వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే వయసులోని వారిలో 95.5 శాతం మందికి స్మార్ట్ఫోన్ ఉంది. దేశంలోని 85.5 శాతం గృహాల్లో కనీసం ఒక స్మార్ట్ఫోన్ ఉంది.ఇదీ చదవండి: మార్చి త్రైమాసిక ఫలితాలుఇదిలాఉండగా, దేశంలో జరిగే డిజిటల్ లావాదేవీల్లో అత్యధికం యూపీఐ (UPI) ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి అనేక యూపీఐ యాప్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో లోపాల ద్వారా వినియోగదారులు డబ్బులు పోగుట్టుకుంటున్న సంఘటనలూ అక్కడక్కడా జరగుతున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా యూపీఐ యాప్లలో కొత్త మార్పులు త్వరలో రానున్నాయి. -
మార్చి త్రైమాసిక ఫలితాలు
ద్విచక్ర ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఇండస్ట్రీస్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర నష్టం రెట్టింపై రూ. 870 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 416 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. అయితే ఈ ఏడాది(2025–26) టర్న్అరౌండ్ సాధించనున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 1,598 కోట్ల నుంచి రూ. 611 కోట్లకు క్షీణించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం భారీగా పెరిగి రూ. 2,276 కోట్లకు చేరింది. 2023–24లో రూ. 1,584 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 5,010 కోట్ల నుంచి రూ. 4,514 కోట్లకు డీలా పడింది.సుజ్లాన్ ఎనర్జీ లాభం దూకుడుక్యూ4లో రూ. 1,181 కోట్లుపవన విద్యుత్ రంగ దిగ్గజం సుజ్లాన్ ఎనర్జీ కన్సాలిడేటెడ్ నికర లాభం గతేడాది(2024–25) చివరి త్రైమాసికం(క్యూ4)లో 5 రెట్లు దూసుకెళ్లి రూ. 1,181 కోట్లకు చేరింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు ప్రధానంగా సహకరించింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 254 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,207 కోట్ల నుంచి రూ. 3,825 కోట్లకు ఎగసింది. పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 660 కోట్ల నుంచి రూ. 2,072 కోట్లకు జంప్చేసింది. మొత్తం ఆదాయం రూ. 6,568 కోట్ల నుంచి రూ. 10,993 కోట్లకు పెరిగింది.బజాజ్ ఆటో లాభం డౌన్ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10%నీరసించి రూ. 1,802 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,011 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 11,555 కోట్ల నుంచి రూ. 12,646 కోట్లకు బలపడింది. ఈ కాలంలో 11,02,934 వాహనాలు విక్రయించింది. అంతక్రితం క్యూ4లో 10,68,576 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 210 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 5 శాతం నీరసించి రూ. 7,325 కోట్లకు చేరింది. 2023–24లో రూ.7,708 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 44,870 కోట్ల నుంచి రూ. 50,995 కోట్లకు ఎగసింది. మొత్తం వాహన విక్రయాలు 7% పుంజుకుని 46,50,966 యూనిట్లను తాకాయి.పోకర్ణ లాభం రూ.59 కోట్లుగత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పోకర్ణ లిమిటెడ్ నికర లాభం సుమారు 280 శాతం వృద్ధి చెంది రూ. 59 కోట్లకు ఎగిసింది. ఆదాయం 62 శాతం వృద్ధి చెంది రూ. 263 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 115 శాతం పెరిగి రూ. 186 కోట్లకు, ఆదాయం 35 శాతం వృద్ధి చెంది రూ. 930 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ 30 శాతం డివిడెండ్ ప్రకటించింది. అంతర్జాతీయంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ పటిష్టమైన పనితీరు సాధించగలిగామని సంస్థ చైర్మన్ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. -
గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ -
చిన్న పట్టణాల్లోకి నిప్పన్ ఇండియా విస్తరణ
కోల్కతా: నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ చిన్న పట్టణాల్లోకి సేవలను విస్తరించడం ద్వారా మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లకు చేరువ కావాలని చూస్తోంది. తద్వారా రానున్న 7–8 ఏళ్లలో తమ ఇన్వెస్టర్ల బేస్ను రెట్టింపు చేసుకోవాలన్న (5 కోట్లకు) లక్ష్యంతో ఉన్నట్టు నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో సందీప్ సిక్కా తెలిపారు. ముఖ్యంగా తూర్పు భారత్లో మ్యూచువల్ ఫండ్స్ వృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని, దాంతో ఈ ప్రాంతంపై ఎక్కువ బుల్లిష్ ధోరణితో (సానుకూలం) ఉన్నట్టు చెప్పారు. ‘‘తూర్పు భారత్లో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా 20 శాతం వృద్ధి ఉంటే నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023–24లో ఈ ప్రాంతంలో మ్యూచువల్ ఫండ్స్ సిప్ పెట్టుబడులు 38 శాతం వృద్ధిని చూస్తే.. నిప్పన్ ఇండియా సిప్ పెట్టుబడులు 55 శాతం పెరిగాయి. అదే ఏడాది జాతీయ సిప్ సగటు వృద్ధి 34 శాతంగా ఉంది. రిటైల్ మార్కెట్లోకి మరింత లోతుగా చొచ్చుకుపోవడమే మా వ్యూహం. ముఖ్యంగా ఫండ్స్ సేవలు పెద్దగా విస్తరణకు నోచుకోని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తాం. అక్కడే వృద్ధి అవకాశాలు ప్రధానంగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో యూనిక్ ఇన్వెస్టర్ల బేస్ 6 కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం మా ఇన్వెస్టర్ల సంఖ్య 2 కోట్ల మేర ఉంది’’అని సంస్థ ప్రణాళికలను సిక్కా వివరించారు. అతిపెద్ద విదేశీ మ్యూచువల్ ఫండ్ నిప్పన్ ఇండియా భారత్లో అతిపెద్ద విదేశీ మ్యూచువల్ ఫండ్ సంస్థ అని (జపాన్కు చెందిన నిప్పన్ లైఫ్).. టాప్ 5 సంస్థల్లో బ్యాంకింగ్ స్పాన్సర్ లేకుండా ఎక్కువ వృద్ధిని తాము నమోదు చేసినట్టు సందీప్ సిక్కా తెలిపారు. 2023–24లో 27 శాతం అధికంగా 82 లక్షల ఇన్వెస్టర్లను సొంతం చేసుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 269 శాఖలు ఉంటే.. తూర్పున 11 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో శాఖలు కలిగి ఉన్నట్టు తెలిపారు. ఇన్వెస్టర్లలో పెరుగుతున్న అవగాహనతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో అసంఘటిత రంగం నుంచి పొదుపులు సంఘటిత రంగం వైపు మళ్లుతున్నట్టు వెల్లడించారు. తాము కొత్త పథకాల ఆవిష్కరణ కంటే ప్రస్తుత పథకాల రూపంలో మెరుగైన పెట్టుబడుల అవకాశాలను ఆఫర్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. -
బ్యాంకింగ్లో మరిన్ని విదేశీ సంస్థల ఎంట్రీకి సానుకూలం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్బ్యాంక్లో సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ (ఎస్ఎంఎఫ్జీ) 20 శాతం వాటాలు కొనుగోలు చేయడమనేది భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఇతర విదేశీ సంస్థల ప్రవేశానికి సానుకూలాంశంగా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఈ డీల్తో యస్బ్యాంకులో అతి పెద్ద వాటాదారుగా బోర్డులో ఇద్దరిని నియమించుకోవడంతో పాటు బ్యాంకుపై ఎస్ఎంఎఫ్జీకి గణనీయమైన నియంత్రణ కూడా లభిస్తుందని పేర్కొంది. ఈ లావాదేవీని పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులోను ఇలాంటి డీల్స్ మరిన్ని నమోదు కావచ్చని వివరించింది. వోటింగ్ హక్కులు, పెట్టుబడి పరిమితులను పెంచితే విదేశీ బ్యాంకు ఇన్వెస్టర్లు మరింత ఆసక్తి చూపించవచ్చని పేర్కొంది. భారత్లో కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్న విదేశీ బ్యాంకులు.. దేశీయంగా మధ్య స్థాయి బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చని వివరించింది. ప్రస్తుతం విదేశీ పెట్టుబడుల నిబంధనల ప్రకారం భారతీయ బ్యాంకుల్లో విదేశీ సంస్థల ఓటింగ్ హక్కులపై 26 శాతం, పెట్టుబడులపై 15 శాతం పరిమితి ఉంది. -
చాలా స్టార్టప్లు.. విదేశీ సంస్థలకు నకళ్లే
న్యూఢిల్లీ: చాలా మటుకు దేశీ అంకుర సంస్థలు, పాశ్చాత్య బిజినెస్ మోడల్స్ను అనుకరిస్తున్నాయే తప్ప భారత్ అవసరాలకు అనుగుణంగా సిసలైన, సరికొత్త ఆవిష్కరణలేమీ చేయడం లేదని కౌన్సిలేజ్ ఇండియా మేనేజింగ్ పార్ట్నర్ సుహేల్ సేథ్ ఆక్షేపించారు. ‘భారత్లో స్టార్టప్ వ్యవస్థను చూస్తే, దాదాపు అన్నీ కూడా ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో చేసిన వాటికి కాపీలుగా ఉంటున్నాయి. వడా పావ్ దుకాణం మొదలుపెట్టినా స్టార్టప్ అనేస్తున్నారు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశీయంగా స్టార్టప్ల సంభాషణలు ఎంత సేపు వేల్యుయేషన్లు, యూనికార్న్ హోదా, వ్యవస్థాపకుల సంపదలాంటి అంశాల చుట్టూనే తిరుగుతుంటాయన్నారు. ఈ నేపథ్యంలో స్టార్టప్కు నిర్దిష్ట నిర్వచనం ఉండాలని సీఐఐ వార్షిక బిజినెస్ సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్టార్టప్ అంటే సాంకేతికంగా వినూత్నమైనదిగా, విశిష్టమైనదిగా, మరో దాన్ని పోలి ఉండని విధంగా, స్ఫూర్తివంతంగా ఉండాలని చెప్పారు. చైనాకు పోటీనివ్వగలం: థర్డ్ఐటెక్ సీఈవో కపూర్ పరిశ్రమలో నిపుణుల లభ్యతపరంగా చైనాకి గట్టి పోటీనివ్వగలిగే ఏకైక దేశం భారత్ అని ఫ్యాబ్లెస్ చిప్ల తయారీ సంస్థ థర్డ్ఐటెక్ సీఈవో వృందా కపూర్ తెలిపారు. అనేక గ్లోబల్ టెక్ దిగ్గజాలు పలు దశాబ్దాలుగా భారత్లో పెద్ద ఎత్తున పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ఇందుకు దోహదపడిందని వివరించారు. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల డిజైనింగ్ నిపుణుల్లో 20 శాతం మంది హైదరాబాద్, బెంగళూరు, పుణెలో ఉన్నారని కపూర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సైమీకండక్టర్ల తయారీ సామర్థ్యాల్లో, ముఖ్యంగా డిఫెన్స్ ఎల్రక్టానిక్స్లో చైనా ఆధిపత్యానికి చెక్ చెప్పగలిగే సామర్థ్యాలు భారత్కి ఉన్నాయని వివరించారు. -
లాభాలకు తగ్గట్లు జీతాలు పెంచండి
న్యూఢిల్లీ: లాభదాయకతకు అనుగుణంగా పెట్టుబడులు, ఉద్యోగుల వేతనాలను పెంచడంపై దృష్టి పెట్టాలని కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు. అప్పుడే భారత్ 6.5 శాతం పైగా ఆర్థిక వృద్ధిని నిలకడగా సాధించగలదని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలదని ఆయన చెప్పారు. పెట్టుబడుల సానుకూల వలయాన్ని వివరిస్తూ, ఇన్వెస్ట్మెంట్లతో సామర్థ్యాలు పెరగడంతో పాటు మరింత అధిక వేతనాలతో మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఇది కుటుంబాలు ఇంకాస్త ఎక్కువ పొదుపు చేసేందుకు దోహదపడుతుందని నాగేశ్వరన్ చెప్పారు. కానీ ప్రస్తుతం వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంటోందని, వచ్చే 25 లేదా 30 ఏళ్ల పాటు ఇదే తీరు కొనసాగితే నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా పురోగమించలేమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి సమస్య సంపన్న దేశాల్లోనే కనిపిస్తుందే తప్ప భారత్లాంటి వర్ధమాన దేశాల్లో ఉండదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ చెప్పారు. 21వ శతాబ్దపు రెండో దశాబ్దంలో భారతీయ ప్రైవేట్ రంగ లాభదాయకత రూ. 7.2 లక్షల కోట్ల నుంచి రూ. 28.7 లక్షల కోట్లకు నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, పెట్టుబడులు మాత్రం మూడు రెట్లే పెరిగాయని ఆయన చెప్పారు. ఇన్ఫ్రాలో కూడా ఇన్వెస్ట్ చేయాలి.. రాబోయే 25 ఏళ్లలో మౌలిక సదుపాయాలతో పాటు సామర్థ్యాల పెంపుపై భారత్ గణనీయంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని, ప్రైవేట్ రంగం ఇటు పెట్టుబడులు అటు ఉద్యోగుల వేతనాల మధ్య సమతూకం ఉండేలా చూసుకోవాలని నాగేశ్వరన్ పేర్కొన్నారు. కుటుంబాల ఆదాయాలు, పొదుపు పెరిగితేనే నిలకడగా వృద్ధి సాధ్యపడుతుందని వివరించారు. పెట్టుబడులతో మరిన్ని ప్రయోజనాలను రాబట్టాలంటే పరిశ్రమలపై రెగ్యులేటరీ భారం తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ప్రైవేట్ రంగం మధ్య విశ్వసనీయత పెరగాలని నాగేశ్వరన్ చెప్పారు. కొన్ని సార్లు నియంత్రణ సంస్థలపరంగా దేన్ని డీరెగ్యులేట్ చేయాలనే దానిపై స్పష్టత ఉన్నప్పటికీ ఎలా చేయాలనేది సవాలుగా ఉంటుందని ఆయన తెలిపారు. నియంత్రణల తొలగింపు అనేది కొన్ని సందర్భాల్లో అవాంఛితమైన విధంగా దురి్వనియోగానికి కూడా దారి తీసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యాలు సాధించాలంటే ఇరుపక్షాలు పరస్పరం నమ్మకంతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాకుండా, దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం మధ్య కూడా నమ్మకం ఉండాలి. సమిష్టిగా కలిసి పని చేస్తే తప్ప వచ్చే 25 ఏళ్లలో మనం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాన్ని సాధించలేం‘ అని నాగేశ్వరన్ చెప్పారు. మరోవైపు, ఎకనమిక్ సర్వేలో పేర్కొన్నట్లు భారత్ 6.3–6.8 శాతం మధ్య వృద్ధి రేటును నమోదు చేసిందని .. రుతుపవనాలు మెరుగ్గా ఉండటం, ప్రభుత్వ పెట్టుబడుల దన్ను, పన్నులపరమైన ఉపశమనం, వడ్డీ రేట్ల తగ్గుదల తదితర సానుకూలాంశాలతో ఇదే స్థాయి వృద్ధి సుదీర్ఘకాలం పాటు కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. -
వృద్ధి జోరులో మనమే టాప్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) భారత్ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. స్థూల ఆర్థిక బలాలకుతోడు ఆర్థిక రంగం పటిష్టంగా ఉండడం, స్థిరమైన వృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అంకిత భావం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో రిస్క్లు, బలహీనతలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్బీఐ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని ప్రకటించింది. ఈ మేరకు తన వార్షిక నివేదికను ఆర్బీఐ విడుదల చేసింది.ఎన్నో సవాళ్లు.. అయినా సానుకూలతలు బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడడం, నిధుల లభ్యత తగినంత ఉండడం ఆర్థిక రంగం పటిష్టతను సూచిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఇది ఆర్థిక కార్యకలాపాలకు మద్దతునిస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఎన్నో సమస్యలు నెలకొన్నప్పటికీ భారత ఫైనాన్షియల్ మార్కెట్లు బలంగా నిలబడినట్టు గుర్తు చేసింది. అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్యంలో సమస్యలు, సరఫరా వ్యవస్థలో అవాంతరాలు, వాతావరణ ఆధారిత అనిశ్చితులు దేశ వృద్ధి అంచనాలను దిగువ వైపునకు తీసుకెళ్లే రిస్క్ లను ఆర్బీఐ తన నివేదికలో ప్రస్తావించింది. సరఫరా వ్యవస్థలో ఒత్తిళ్లు తగ్గుముఖం పడుతుండడంతోపాటు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు శాంతించడం, వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, నైరుతిలో సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలు ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచడానికి సాయపడే అంశాలుగా పేర్కొంది. వాణిజ్య విధానాల్లో ఊహించని మలుపులు ఫైనాన్షియల్ మార్కెట్లలో అనిశ్చితులకు దారితీయవచ్చని.. ఎగుమతులకు సమస్యలు ఎదురుకావొచ్చని అంచనా వేసింది. అదే సమయంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ చర్చలు నిర్వహిస్తుండడం ఈ ప్రభావాలను పరిమితం చేయొచ్చని పేర్కొంది. మెరుగైన రిస్క్ నిర్వహణ: దేశ బ్యాంకింగ్ రంగం బలంగా ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు, ఈ దిశగా సేవల నాణ్యతను పెంచేందుకు ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్, 2021’ను ఈ ఆర్థిక సంవత్సరంలో సమీక్షించనున్నట్టు తెలిపింది. బ్యాలన్స్ షీటు 8 శాతం వృద్ధి ఆర్బీఐ బ్యాలన్స్ షీటు గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 8.20 శాతం (5.77 లక్షల కోట్లు) పెరిగి రూ.76.25 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 మార్చి నాటికి ఇది రూ.70.47 లక్షల కోట్లుగా ఉంది. మిగులు నిల్వలు 27 శాతం అధికమై రూ.2,68,590 కోట్లకు చేరాయి. విదేశీ మారకం లావాదేవీలపై ఆదాయం 33 శాతం పెరిగి రూ.1.11 లక్షల కోట్లకు చేరింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రూ.2.7 లక్షల కోట్ల భారీ డివిడెండ్ను ప్రకటించినట్టు ఈ నివేదిక తెలిపింది.బంగారం ఆస్తులు 57 శాతం జంప్ ఆర్బీఐ నిర్వహణలోని బంగారం ఆస్తుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో 57 శాతం జంప్ చేసి రూ.4.32 లక్షల కోట్లకు చేరుకుంది. 2024 మార్చి నాటికి ఈ మొత్తం రూ.2.74 లక్షల కోట్లుగానే ఉండడం గమనార్హం. పరిమాణం పరంగా చూస్తే 2024 మార్చి నాటికి 822 టన్నుల బంగారం ఉంటే, ఈ ఏడాది మార్చి నాటికి 879.58 టన్నులకు పెరిగింది.కరెన్సీ నోట్లతో పార్టీకల్ బోర్డులు కరెన్సీ నోట్లను నిరీ్వర్యం చేసే విషయమై ఆర్బీఐ పర్యావరణ అనుకూల నిర్ణయం తీసుకుంది. ముక్కలైన నోట్లు, కాలం చెల్లిన నోట్లతో పార్టికల్ బోర్డులు తయారు చేయనున్నట్టు ప్రకటించింది. తయారీదారులను నియమించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. కాగా, రూ.10, 20, 50, 100, 2000 నకిలీ నోట్లను ఆర్బీఐ గుర్తించింది. రూ.200, 500 డినామినేషన్ నకిలీ నోట్ల విలువ వరుసగా 13.9 శాతం, 37.3 శాతం చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో పెరిగాయి.మూడు రెట్లు పెరిగిన మోసాలుగత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మోసాల విలువ మూడు రెట్లు పెరిగినట్టు ఆర్బీఐ నివేదిక తెలియజేసింది. రుణ ఖాతాలు, డిజిటల్ చెల్లింపులు తదితర మోసాల విలువ రూ.36,014 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. అంతకుముందు సంవత్సరంలో ఈ మొత్తం రూ.12,330 కోట్లుగానే ఉంది. మోసాల కేసుల సంఖ్య మాత్రం 23,953 నుంచి 36,060కు తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి 122 మోసం కేసులను (రూ.18,674 కోట్ల మొత్తం) పునఃపరిశీలన తర్వాత మళ్లీ రిపోర్ట్ చేయడం వల్లే మోసాల విలువ గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగినట్టు ఆర్బీఐ తెలిపింది. -
2025 జుపీటర్: రూ.88942 మాత్రమే!
టీవీఎస్ మోటార్.. ఇండియన్ మార్కెట్లో తన అప్డేట్ జుపీటర్ 125 డీటీ ఎస్ఎక్స్సీని లాంచ్ చేసింది. దీని ధర రూ. 88,942 (ఎక్స్ షోరూమ్). ఈ వేరియంట్ రిఫ్రెష్ డిజైన్, కొత్త స్టైలింగ్ పొందుతుంది. ఐవరీ బ్రౌన్ అండ్ ఐవరీ గ్రే అనే రెండు కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఎంపికలలో లభించే ఈ స్కూటర్.. డ్యూయల్ టోన్ ప్యానెల్లు, బాడీ కలర్ రియర్ గ్రాబ్ రైల్ పొందుతుంది.టీవీఎస్ స్మార్ట్కనెక్ట్ ఫీచర్ కలిగిన ఈ స్కూటర్ కాల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్, వాయిస్ కమాండ్స్, వాహన ట్రాకింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ స్కూటర్ అదే 124.8సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 8.7 Bhp పవర్, 11.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇదీ చదవండి: దేశమంతా ఒకే ధరకు ఈ కారు! -
బంగారానికి భారీ డిమాండ్: ఆభరణాల ధరలు పైపైకి
భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. భారతీయులు బంగారాన్ని ఆభరణాలుగా, పెట్టుబడికి ఉత్తమ మార్గంగా భావించి.. ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. దేశంలో బంగారు ఆభరణాల వినియోగం 2026 ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా 12-14 శాతం గణనీయంగా పెరుగుతుందని ''ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్'' (ICRA) వెల్లడించింది.2025 ఆర్ధిక సంవత్సరంలో బంగారం ధరలు 33 శాతం పెరిగాయి, 2026లో ధరలు పెరుగుతూనే ఉంటాయని ICRA తెలిపింది. సాధారణంగా గోల్డ్ రేటు పెరిగితే.. డిమాండ్ తగ్గుతుంది. కానీ భారతదేశంలో శుభకార్యాలకు, శుభదినాలకు బంగారం కొనుగోలు పెరుగుతోంది. ధరలు మరింత పెరగడానికి ఇది ప్రధాన కారణమవుతోందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ హెడ్ జితిన్ మక్కర్ అన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాల వినియోగం విలువలో గణనీయమైన 28 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో కూడా బంగారం ఆభరణాల వినియోగం అదే తరహాలో పెరుగుతుంది. ధరలు కూడా గత ఆర్ధిక సంవత్సరం కంటే.. 20 శాతం ఎక్కువగా ఉన్నాయి.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..2024 ఆర్థిక సంవత్సరం, 2025 ఆర్థిక సంవత్సరాలలో గోల్డ్ బార్లు, నాణేల వినియోగం వరుసగా 17 శాతం, 25 శాతం పెరిగింది.దీనికి ప్రధాన కారణం ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితి, పెరిగిన భౌగోళిక రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలే. ఎందుకంటే బంగారం అనేది సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వల్ల చాలామంది.. పసిడి కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో గోల్డ్ బార్లు, నాణేలకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇక్రా తెలిపింది. -
హైదరాబాద్లో జియోస్టార్ రోడ్షో
హైదరాబాద్: తెలుగు ఆడియెన్స్కు, దక్షిణాదిలో ప్రకటనకర్తలకు మరింత చేరువయ్యే క్రమంలో హైదరాబాద్లో రోడ్షో నిర్వహించినట్లు జియోస్టార్ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ప్రతి నెలా ప్రాంతీయంగా 90 శాతం మంది తమ స్టార్ మా, స్టార్ మా మూవీస్ తదితర చానల్స్లో కంటెంట్ను వీక్షిస్తున్నట్లు వివరించింది.దీంతో పెద్ద ఎత్తున వీక్షకులకు చేరువ కావడానికి ప్రకటనకర్తలకు ఇదొక అవకాశం కాగలదని పేర్కొంది. నటులు ఆమని, శ్రీముఖి, అవినాష్, ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 24,000 గంటల తెలుగు ఎంటర్టైన్మెంట్, 1,800 పైగా టైటిల్స్తో జియోహాట్స్టార్ వద్ద అత్యధిక స్థాయిలో కంటెంట్ ఉన్నట్లు జియోస్టార్ రెవెన్యూ హెడ్ అజిత్ వర్గీస్ తెలిపారు. -
ఆధార్ లాక్.. డేటా సేఫ్: ఇదిగో టిప్స్
డిజిటల్ ప్రపంచంలో.. సైబర్ మోసగాళ్లు ఎప్పుడు మన డేటా దొంగలిస్తున్నారో తెలుసుకోవడం కష్టమైపోతోంది. ఇలాంటి సమయంలో ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు, ఫేస్ స్కాన్ వంటి సున్నితమైన సమాచారంతో అనుసంధానించబడి ఉండటంతో.. చిన్న లోపం కూడా పెద్ద దుర్వినియోగానికి దారితీస్తుంది. ఆధార్ కార్డు భద్రత కోసం బయోమెట్రిక్ లాక్ చాలా ముఖ్యం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆధార్ బయోమెట్రిక్ను ఆన్లైన్లో లాక్ చేయడం ఎలా?మీ ఆధార్ బయోమెట్రిక్స్ను లాక్ చేయాలనుకుంటే.. మీకు ముందుగా వర్చువల్ ఐడీ (VID) అవసరం. మీరు UIDAI అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆధార్ సర్వీసెస్ అనే విభాగంలో 'వర్చువల్ ఐడి జనరేటర్' ట్యాబ్పై క్లిక్ చేయడం ద్వారా మీ ఆధార్ వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు.వర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకున్న తరువాత.. ఆధార్ బయోమెట్రిక్స్ను ఆన్లైన్లో లాక్ చేయడం కోసం కింద పేర్కొన్న స్టెప్స్ ఫాలో అవ్వండి..➤యూఐడీఏఐ మైఆధార్ పోర్టల్కి వెళ్లండి.➤ఆధార్ సర్వీస్ విభాగంలో కనిపించే 'లాక్/అన్లాక్ ఆధార్' ఆప్షన్ క్లిక్ చేయండి.➤అక్కడ కనిపించే సూచనలను జాగ్రత్తగా చదివి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.➤సూచనల తరువాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే.. ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వర్చువల్ ఐడీ నెంబర్, పూర్తి పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తరువాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీ ఆధార్ బయోమెట్రిక్ విజవంతంగా లాక్ అవుతుంది. అన్లాక్ చేయడానికి కూడా ఇదే దశలను 'అన్లాక్ ఆధార్' ఆప్షన్ మీద క్లిక్ చేసి పూర్తిచేయాలి.బయోమెట్రిక్ లాకింగ్ ఉద్దేశ్యం ఆధార్ లాక్ని యాక్టివేట్ చేస్తే.. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించలేరు. గుర్తింపు ధృవీకరణ, ఆర్థిక లావాదేవీలు లేదా సిమ్ కార్డ్ జారీ కోసం అయినా, మీ ఆమోదం తప్పనిసరి అవుతుంది.ఆధార్ను పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు, ఓటరు ఐడీలు (కొన్ని రాష్ట్రాల్లో), రేషన్ కార్డులు, మొబైల్ నెంబర్ల వంటి కీలక డాక్యుమెంట్లకు లింక్ చేస్తున్నారు. ఈ అనుసంధానం.. గుర్తింపు ధృవీకరణను క్రమబద్ధీకరించడానికి, మోసాన్ని తగ్గించడానికి, అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు లేదా సబ్సిడీలను సమర్థవంతంగా అందించడంలో సహాయపడుతుంది. కాబట్టి అలాంటి ఆధార్ డేటాను కొందరు సైబర్ నేరగాళ్లు.. మోసం చేయడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆధార్ లాక్ చాలా అవసరం.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..ఆధార్ లాక్ చేస్తే.. మీ అనుమతి లేకుండా వేలిముద్రలు & ఐరిస్ స్కాన్ వంటి వాటిని ద్రువీకరించలేరు. మీరు అన్లాక్ చేయనంత వరకు మీ ప్రమేయం లేకుండా ఆధార్ వివరాలు భద్రంగా ఉంటాయి. -
ఐక్యూ నియో 10 స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ తాజాగా నియో 10 ఫోన్ను ఆవిష్కరించింది. ఆఫర్లు, డిస్కౌంట్లు పోగా రూ. 29,999 నుంచి ధర ప్రారంభమవుతుంది. భారత్లో తొలిసారిగా స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్తో దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది.శక్తివంతమైన 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ సోనీ ఓఐఎస్ కెమెరా, 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్.. 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్, మొదలైన ప్రత్యేకతలు ఈ ఫోన్లో ఉంటాయి. అమెజాన్, ఐక్యూ ఈ–స్టోర్లో జూన్ 3 మధ్యాహ్నం నుంచి ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. ముందుగా బుక్ చేసుకున్న వారికి ఐక్యూ టీడబ్ల్యూఎస్ 1ఈ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. -
ఆర్బీఐ వార్షిక నివేదిక: భారత్ జీడీపీ వృద్ధి ఇలా..
భారత్ ఇటీవలే జపాన్ను అధిగమించి.. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక మన ముందు ఉన్న లక్ష్యం జర్మనీని అధిగమించడమే. ఈ తరుణంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) వచ్చే ఆర్ధిక సంవత్సరంలో దేశ ఆర్ధిక వ్యవస్థ ఎలా ఉంటుందనే విషయాన్ని'2024-2025 వార్షిక నివేదిక'లో వెల్లడించింది.2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. అంతే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని.. తద్వారా స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుందని నివేదికలో వెల్లడించింది.మార్కెట్ అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విచ్ఛిన్నం, సరఫరా గొలుసుల అంతరాయాలు, వాతావరణ ప్రేరిత అనిశ్చితులు మొదలైనవన్నీ ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఆర్థిక ఏకీకరణ మార్గంలో ప్రభుత్వం నిరంతరం మూలధనంపై దృష్టి పెట్టడం, వినియోగదారులు & వ్యాపార ఆశావాదాన్ని బలోపేతం చేయడం, బలమైన స్థూల ఆర్థిక ప్రాథమిక అంశాలన్నీ సజావుగా ముందుకు సాగితే.. 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ దృక్పథం ఆశాజనకంగానే ఉందని స్పష్టం చేసింది.2025-26లో వ్యవసాయ రంగానికి అవకాశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం మాత్రమే కాకుండా.. ఉత్పాదకతను పెంచే ప్రభుత్వ విధానాలు కూడా అని ఆర్బీఐ పేర్కొంది. 2025-26 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి వివిధ కొత్త చొరవలను ప్రకటించారని కూడా వెల్లడించింది.ఇదీ చదవండి: ఇక భారత్ టార్గెట్ జర్మనీ: 2027 నాటికి..టారిఫ్ విధానాలలో మార్పులు ఆర్థిక మార్కెట్లలో అప్పుడప్పుడు అస్థిరతలకు దారితీయవచ్చు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్.. మేక్ ఇన్ ఇండియా వంటివి తయారీ రంగాన్ని మరింత బలపరుస్తాయి. తద్వారా.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.భారత్ ఇప్పటికే అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇందులో యూఎస్ఏ మాత్రమే కాకుండా.. ఒమన్, పెరూ, ఈయూ మొదలైన దేశాలు ఉన్నాయి. ఈ వాణిజ్య ఒప్పందాలు ఆర్ధిక వృద్ధికి దోహదపడతాయి. 2024-25లో దేశంలో అనేక ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. ఆర్ధిక వ్యవస్థ బలంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులు కూడా దేశంలో అధికంగా ఉన్నాయి. మొత్తం మీద భారత్ ఆర్ధిక వ్యవస్థలో పురోగతి ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది.वर्ष 2024-25 के लिए वार्षिक रिपोर्ट Annual Report for the Year 2024-255thhttps://t.co/vTNI6w2xnz pic.twitter.com/rqo7ZV6HnD— ReserveBankOfIndia (@RBI) May 29, 2025 -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 320.70 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో.. 81,633.02 వద్ద, నిఫ్టీ 128.35 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో 24,880.80 వద్ద నిలిచింది.మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంటీసీ), వీటో స్విచ్గేర్స్ అండ్ కేబుల్స్, ఎన్టీఎల్ గ్లోబల్, నేచురల్ క్యాప్సూల్స్, ఐఎఫ్బీ ఆగ్రో ఇండస్ట్రీస్ మొదలైన కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డెంటా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్, సందూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓరస్, ఆల్పా లాబొరేటరీస్, లాసా సూపర్జెనరిక్స్, డీసీ ఇన్ఫోటెక్ అండ్ కమ్యూనికేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
‘కంటెంట్ను లాగేస్తున్న గూగుల్’.. సీఈఓ ఏమన్నారంటే..
ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్లో దూసుకుపోతున్న గూగుల్ ఉపయోగిస్తున్న ఏఐ ఫీచర్లకు సంబంధించి కొన్ని సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొన్ని కంటెంట్ పబ్లిషర్ సంస్థలు నేరుగా యూజర్లు తమ వెబ్సైట్లోకి రాకుండా గూగుల్ అనైతికంగా ట్రాఫిక్ను మళ్లిస్తుందని వాదిస్తున్నాయి. దీనిపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు.ఏఐ జనరేటెడ్ సమాధానాలను అందించే గూగుల్ ఏఐ ఫీచర్ల ద్వారా వెబ్సైట్ ట్రాఫిక్ తగ్గుతుందని కొన్ని సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. న్యూస్ మీడియా అలయన్స్ గూగుల్ బలవంతంగా తమ కంటెంట్ను తీసుకుంటుందని అని ఇటీవల ఆరోపించింది. అనైతికంగా గూగుల్ తమ కంటెంట్ను దొంగలిస్తుందని వాదిస్తోంది.ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామంగూగుల్ పనితీరును సమర్థించిన సుందర్ పిచాయ్.. ‘మేము ఇప్పటికీ యూజర్లను వెబ్లో సెర్చ్ చేసేందుకు చాలా డబ్బు వెచ్చిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మరింత మెరుగ్గా వెబ్సైట్లకు ట్రాఫిక్ను అందించేందుకు రూపొందించారు. వినియోగదారులు అడిగే కొన్ని సాధారణ ప్రశ్నలకు కృత్రిమ మేధ ద్వారా నేరుగా సమాధానాలు లభించినప్పటికీ, వారికి విస్తృతమైన వనరులుగా వెబ్సైట్లు నిలుస్తున్నాయి. అయితే వ్యక్తిగత ప్రచురణకర్తలు తమ వెబ్సైట్ ట్రాఫిక్లో తేడాలను చూసే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ వృద్ధి ధోరణి క్రమంగా పెరుగుతోంది. వెబ్సైట్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఏఐ ఓవర్వ్యూలను మెరుగుపరిచేందుకు గూగుల్ సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. -
టాటా గ్రూప్లో కీలక పరిణామం: చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా
దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ 'ఎన్ చంద్రశేఖరన్' టాటా కెమికల్స్ డైరెక్టర్ అండ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పకున్నారు. బుధవారం ఈ విషయాన్ని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్లో కంపెనీ వెల్లడించింది."నా ప్రస్తుత.. భవిష్యత్తు నిబద్ధతలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, నేను బోర్డు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. టాటా కెమికల్స్ బోర్డుకు అధ్యక్షత వహించడం గౌరవంగా ఉంది. అంతే కాకుండా నా పదవీకాలంలో నాకు మద్దతు.. సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'' అంటూ.. టాటా సన్స్ చైర్మన్ మే 28న కంపెనీ డైరెక్టర్ల బోర్డును ఉద్దేశించి ప్రసంగించారు.ఎన్ చంద్రశేఖరన్ పదవి నుంచి వైదొలిగిన తరువాత.. 2025 మే 30 నుంచి 'ఎస్. పద్మనాభన్' కొత్త చైర్మన్ బాధ్యతలను తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. నామినేషన్, వేతన కమిటీ సిఫార్సుల ఆధారంగా, మే 28, 2025 నుంచి అమలులోకి వచ్చేలా 'మోదన్ సాహా'ను అదనపు డైరెక్టర్ (నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్)గా నియమించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.ఎవరీ ఎన్ చంద్రశేఖరన్?తమిళనాడులోని నామక్కల్లోని మోహనూర్లోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఎన్ చంద్రశేఖరన్.. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, తరువాత కోయంబత్తూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తరువాత తిరుచిరాపల్లిలోని రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) డిగ్రీని పూర్తిచేశారు.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిటాటా గ్రూప్తో ఆయన ప్రయాణం 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇంటర్న్గా చేరడంతో ప్రారంభమైంది. సెప్టెంబర్ 2007లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) స్థాయికి త్వరగా ఎదిగారు. అక్టోబర్ 2009లో, కేవలం 46 సంవత్సరాల వయసులో టీసీఎస్ సీఈఓగా నియమితులయ్యారు. -
టెలిగ్రామ్లో గ్రోక్ఏఐ పాగా
కృత్రిమ మేధకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దాంతో ఆన్లైన్ మెసేజింగ్ యాప్లు ఏఐను తమ ప్లాట్ఫామ్ల్లో భాగం చేస్తున్నాయి. అందులో భాగంగా టెలిగ్రామ్ ఎక్స్ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది. ఈమేరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఎక్స్ఏఐ గ్రోక్ చాట్బాట్ను వాడేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దాంతోపాటు టెలిగ్రామ్ ద్వారా విక్రయించిన ఎక్స్ఏఐ సబ్స్క్రిప్షన్ల నుంచి ఇరు కంపెనీలకు 50 శాతం ఆదాయ భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొన్నాయి.టెలిగ్రామ్కు ఉన్న యూజర్ బేస్ గ్రోక్ విస్తరణకు కూడా ఎంతో తోడ్పడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సంభాషణాత్మక ఏఐ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ చాట్బాట్ను టెలిగ్రామ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తన ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించినా, ఎక్స్ఏఐ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.🔥 This summer, Telegram users will gain access to the best AI technology on the market. @elonmusk and I have agreed to a 1-year partnership to bring xAI’s @grok to our billion+ users and integrate it across all Telegram apps 🤝💪 This also strengthens Telegram’s financial… pic.twitter.com/ZPK550AyRV— Pavel Durov (@durov) May 28, 2025ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామంమార్కెట్లో ఇప్పటికే వాట్సప్, గూగుల్చాట్ వంటి మేసేజింగ్ యాప్ల్లో మెటా లామా, జెమిని వంటి ఏఐ టూల్స్ సేవలందిస్తున్నాయి. ఈ కంపెనీలకు మాతృసంస్థలుగా ఉన్న మెటా, గూగుల్ సొంతంగా తయారు చేసిన ఈ ఏఐ టూల్స్ను వాడుతున్నాయి. అయితే టెలిగ్రామ్కు ఆ అవకాశం లేదు. దాంతో తన ప్లాట్ఫామ్లో ఏఐ టూల్ వాడేందుకు ఎక్స్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుందనే వాదనలున్నాయి. -
సిక్ లీవ్ పెట్టి కూర్గ్లో ఎంజాయ్... ఎలా దొరికాడో చూడండి..
సాధారణంగా వీకెండ్ ఎప్పడొస్తుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తుంటారు. ఆ వీకెండ్కు ముందో.. వెనకో మరో సెలవు తోడైతే ఎక్కడికైనా ట్రిప్ వేసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ కొందరైతే ఇందుకోసం సిక్ లీవ్లను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాగే బెంగళూరుకు చెందిన ఓ ఉద్యోగి కూడా ఎక్కువ రోజులు వారాంతాన్ని ఆస్వాదించేందుకు సిక్ లీవ్ పేరుతో నాటకమాడాడు. కానీ దొరికిపోయాడు. అతను ఎలా దొరికిపోయాడు.. ఆ తర్వాత ఏమైంది.. చదవండి...తన వీకెండ్ ట్రిప్ గురించి ఓ రెడిట్ యూజర్ ఇటీవల ఒక పోస్ట్ పెట్టాడు. ఒంట్లో బాగోలేదని చెప్పి శుక్రవారం సిక్ లీవ్ పెట్టి స్నేహితులతో కలిసి కూర్గ్ వెళ్లాడు. అక్కడ వీకెండ్ అంతా ఎంజాయ్ చేసి సోమవారం ఏమీ తెలియనట్టుగా తిరిగి విధుల్లో చేరాడు. కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన ఓ వీడియో అతన్ని పట్టించింది. ‘గత నెలలో శుక్రవారం సెలవు పెట్టి కూర్గ్ వెళ్లాను. కడుపులో ఇన్ఫెక్షన్ (స్టమక్ ఫ్లూ) అని మా మేనేజర్కు చెప్పాను. అక్కడ హోమ్ స్టేలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో రీల్ వైరల్ అయింది. అందులో బ్యాక్గ్రౌండ్లో నేనున్నాను. అలా దొరికిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.తర్వాత ఏమైందంటే..‘సోమవారం మా స్కిప్ లెవల్ మేనేజర్ ఓ రీల్ లింక్ పంపించారు. ‘ఇప్పుడు నీ కడుపులో ఇన్ఫెక్షన్ బాగైందనుకుంటాను’ అని దానికి జోడించారు. సిక్ లీవ్ ఫేక్ చేసి అలా దొరికిపోయాను. దేవుడి దయ వల్ల ఉద్యోగం పోలేదు. కానీ అప్పటి నుండి ఒక్క వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ కూడా అప్రూవ్ చేయలేదు. ఇప్పుడు ఆయన నన్ను నమ్మడం లేదు' అని ఆ పోస్టులో పేర్కొన్నారు. వైరల్గా మారిన ఈ రెడిట్ పోస్ట్కు యూజర్లు విశేషంగా ప్రతిస్పందించారు. ‘భలే నవ్వు తెప్పిస్తోంది’.. అని ఒకరు కామెంట్ చేయగా ‘వెంటనే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేయాలి’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.