breaking news
Business
-
కార్యకలాపాలను విస్తరించి లిస్ట్ చేయండి
న్యూఢిల్లీ: సబ్సిడరీల కార్యకలాపాలను మరింత విస్తరించి వాటిని స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ చేయడంపై దృష్టి సారించాలని ప్రభుత్వరంగ బ్యాంక్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. తద్వారా మంచి రాబడులు అందుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్ల (పీఎస్బీలు)కు సంబంధించి సుమారు 15 సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) లేదా పెట్టుబడుల ఉపసంహరణకు రానున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.సబ్సిడరీలు లేదా జాయింట్ వెంచర్లకు సంబంధించి అవసరమైతే కార్యకలాపాల విస్తరణపై పీఎస్బీలు పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక శాఖ సూచిస్తూ.. సరైన సమయంలో వాటాల విక్రయం ద్వారా లాభాలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొంది. సబ్సిడరీలకు సంబంధించి పరిపాలన, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మెరుగుపరుచుకోవాలని, గొప్ప నిర్వహణ సామ ర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ దిశగా ఇప్పటికే చర్యలు.. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అగ్రగామి అయిన ఎస్బీఐ నుంచి భవిష్యత్తులో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (మ్యూచువల్ ఫండ్స్), జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్ ఐపీవోకు వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.509 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్లో ఎస్బీఐకి 68.99 వాటా ఉంది. ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్లో ఎస్బీఐకి 74 శాతం వాటా ఉంటే, హిటాచీ పేమెంట్ సర్విసెస్కు మిగిలిన 26 శాతం వాటా ఉంది.ఎస్బీఐ పేమెంట్ సర్విసెస్ కింద 33.10 లక్షల మంది మర్చంట్ టచ్ పాయింట్లు నమోదై ఉన్నాయి. ఇందులో 13.67 లక్షల పీవోస్ మెషిన్లు కూడా ఉన్నాయి. మరోవైపు కెనరా బ్యాంక్ తన మ్యూచువల్ ఫండ్స్ వ్యాపార జాయింట్ వెంచర్ అయిన కెనరా రొబెకో ఏఎంసీ లిస్టింగ్కు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టింది. బీమా జాయింట్ వెంచర్ అయిన కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ను కూడా లిస్ట్ చేసే ప్రణాళికతో ఉంది. బీమా జేవీలో 14.5 శాతం వాటా విక్రయానికి అనుకూలంగా కెనరా బ్యాంక్ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రాబడుల తీరుతెన్నులే పోర్ట్ఫోలియోకు కీలకం..
పెట్టుబడులకు సంబంధించి ఏ పోర్ట్ఫోలియోకైనా రాబడుల ధోరణే కీలకంగా ఉంటుంది. ఉదాహరణకు ఓ సందర్భాన్ని ఊహించుకోండి. మీకు ఇష్టమైన క్రికెట్ టీమ్ భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో ప్రారంభంలోనే ఓ అయిదు వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బాగానే ఆడినా, మ్యాచ్ పూర్తయ్యేంతవరకు టీమ్పై ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. అలా కాకుండా, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ప్రారంభంలోనే భారీ స్కోర్ చేస్తే టీమ్పై ఒత్తిడి తగ్గుతుంది. గెలిచే అవకాశాలూ కాస్త మెరుగ్గా ఉంటాయి. దీన్నే ఇన్వెస్టింగ్ కోణంలో ఒకసారి చూద్దాం. రాము, కృష్ణ ఇద్దరూ ఒకేసారి ఒకే తరహాలో రూ. 1 కోటి కార్పస్తో రిటైరయ్యారు.ఏటా రూ. 5 లక్షల చొప్పున విత్డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే పదేళ్లలో రూ. 50 లక్షలు విత్డ్రా చేసుకున్నారు. పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్లపై వచ్చే రాబడులతో పదేళ్ల తర్వాత, రాము నిధి రూ. 37.32 లక్షలు పెరగ్గా, కృష్ణ నిధి రూ. 58.52 లక్షలు పెరిగింది. రెండింటి మధ్య వ్యత్యాసం ఏకంగా 36 శాతం ఏర్పడింది. నిర్దిష్ట వ్యవధిలో మొత్తం విత్డ్రా చేసుకున్నది, ఆఖర్లో ఉన్న బ్యాలెన్స్ను కలిపితే రాము మొత్తం రూ. 87.32 లక్షలు ఆర్జించినట్లు కాగా, కృష్ణ రూ. 1.08 కోట్లు (రూ. 50 లక్షలు + రూ. 58.52 లక్షలు) ఆర్జించినట్లయింది. 2015–19 మధ్య కాలంలో వరుసగా అయిదేళ్ల పాటు నెగటివ్ రిటర్న్స్ నమోదై, రూ. 50 లక్షలు విత్డ్రా చేసుకున్నప్పటికీ కృష్ణ నిధి అసలు మొత్తం మీద మరో రూ. 8.52 లక్షల మేర పెరిగింది. పదేళ్లలో రాము రాబడులనేవి –5%, –6%, –15%, –8%, –4%, 5%,7%,9%,11%, 9%గా నమోదయ్యాయి. అదే సమయంలో దీనికి భిన్నంగా కృష్ణ రాబడులు 9%, 11%, 9%, 7%,5%,–4%, –8%, –15%, –6%, –5%గా నమోదయ్యాయి. రాము బేర్ ఫేజ్లో పెట్టుబడులు ప్రారంభించగా, కృష్ణ బుల్ ఫేజ్లో పెట్టుబడులు పెట్టారు. ఇలా పెట్టుబడులు పెట్టే సమయమనేది పోర్ట్ఫోలియోపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. ఇద్దరు ఇన్వెస్టర్లు తమ సేవింగ్స్ నుంచి ఒకే స్థాయిలో విత్డ్రా చేస్తున్నా, అసలు మొత్తం భిన్నంగా ఉండటం వల్లే ఇద్దరి రాబడుల్లో అంతరానికి కారణమైంది. ఉదాహరణకు తొలి ఏడాది మార్కెట్లు 5 శాతం పడి, రూ. 5 లక్షలు విత్డ్రా చేసుకున్నప్పుడు రాము కార్పస్ రూ. 90 లక్షలకు తగ్గిపోయింది. కానీ కృష్ణ కూడా అంతే మొత్తం విత్డ్రా చేసుకున్నప్పటికీ తొలి ఏడాదిలో 9 శాతం రాబడి రావడంతో ఆయన బ్యాలెన్స్ రూ. 1.04 కోట్లకు పెరిగింది. కృష్ణ పెట్టుబడులపై ఆరో సంవత్సరం నుంచి పదో సంవత్సరం వరకు నెగటివ్ రాబడులే వచి్చనప్పటికీ, చివరికి వచ్చే సరికి రాము స్థాయి ప్రతికూల ప్రభావం కృష్ణపై పడలేదు. తొలి ఐదేళ్లలో రాము పెట్టుబడులపై రాబడులు క్షీణించడంతో పాటు ఏటా రూ. 5 లక్షలు వెనక్కి తీసుకుంటూ ఉండటమనేది అతని పోర్ట్ఫోలియో విలువపై బాగా ప్రతికూల ప్రభావం చూపింది. రాబడులు వచ్చే తీరుతెన్నులు ఏ విధంగా పోర్ట్ఫోలియోను ప్రభావితం చేస్తాయనేది ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. ఒకే ఆదాయ వనరుపై ఆధారపడే రిటైరీలకు ఇది మరీ ముఖ్యమైన విషయం. ఈ కాన్సెప్టు థియరీ ప్రకారం కరెక్టే అయినప్పటికీ .. సరైన సమయంలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమనేది ఎవరికైనా కష్టమే. ముఖ్యంగా రిటైరీలకు మరింత సమస్యగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రస్థానంలో రిటర్న్ రిసు్కల సీక్వెన్స్ను పరిగణనలోకి తీసుకుని ప్లానింగ్ చేసుకోవడం కీలకంగా ఉంటుంది.‘బకెటింగ్’తో రిసు్కలకు చెక్.. చారిత్రకంగా సెన్సెక్స్ వరుసగా రెండేళ్ల పాటు 1986–87, 1995–97, 2000–01లో క్షీణించింది. అయితే, మరింత లోతుగా పరిశోధిస్తే (నెలవారీ లేదా రోజువారీ రిటర్నులు) ఇలాంటి సందర్భాలు చాలా కనిపిస్తాయి. బకెటింగ్ విధానంతో ఇన్వెస్టర్లు ఇలాంటి రిస్కులను అధిగమించవచ్చు. ఈ విధానంలో కార్పస్ను స్వల్పకాలికం (ఫిక్సిడ్ ఇన్కం పోర్ట్ఫోలియో), మధ్యకాలికం (హైబ్రిడ్), దీర్ఘకాలిక (ఈక్విటీ) ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్ చేసి, అదనంగా మరో ఆదాయ మార్గాన్ని కూడా ఏర్పర్చుకుంటే, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు బఫర్గా పని చేస్తుంది.ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు తమ విత్డ్రాయల్ రేటును తగ్గించుకుని, ఏదైనా ఫిక్సిడ్ యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేయొచ్చు లేదా డెట్, బంగారం, రీట్లు, ఇంటర్నేషనల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పోర్ట్ఫోలియోలో వైవిధ్యాన్ని పాటించవచ్చు. తద్వారా మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నష్టపోయే అవకాశాలను తగ్గించుకోవచ్చు. కార్పస్ ఫండ్ నుంచి విత్డ్రా చేసుకునే యోచనతో, భారీ పెట్టుబడుల పోర్ట్ఫోలియోను రూపొందించుకుంటున్నప్పుడు, రాబడుల తీరుతెన్నులను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. భారీ టార్గెట్ను ఛేదించేటప్పుడు ప్రారంభంలోనే వేగంగా స్కోర్ చేస్తే గెలిచే అవకాశాలు ఎలాగైతే ఎక్కువగా ఉంటాయో, పెట్టుబడుల ప్రస్థానంలో తొలినాళ్లలో మెరుగైన రాబడులు రావడం వల్ల మీ పోర్ట్ఫోలియో తుది విలువపై సానుకూల ప్రభావం ఉంటుంది. - అజిత్ మీనన్ ,సీఈవో, పీజీఐఎం ఇండియా ఎంఎఫ్ -
మార్కెట్ మరింత స్పీడు!
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరు చూపవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. గత వారం అంచనాలకు అనుగుణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 84,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్ను దాటి నిలిచింది. ఈ స్పీడ్ కొనసాగనున్నట్లు అధిక శాతం మంది నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్కు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. నేడు(30న) మే నెలకుగాను వార్షికంగా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), కరెంట్ ఖాతా 2025 జనవరి–మార్చి లోటు గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్లో ఐఐపీ 2.7 శాతం పుంజుకుంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో 11.5 బిలియన్ డాలర్ల లోటు నమోదైంది. మంగళవారం(జులై 1న) జూన్ నెలకు తయారీ రంగ పీఎంఐ, 3న సర్విసుల రంగ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఆర్డర్లరాకతోపాటు పరిశ్రమల రంగ ప్రగతిని తయారీ పీఎంఐ తెలియజేయనున్నట్లు బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ పేర్కొంది. వీటికితోడు రుతుపవన కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. విదేశీ అంశాలు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ మార్కెట్లకు సానుకూల అంశంకాగా.. 1న జపనీస్ తయారీ రంగ క్యూ1 వివరాలు వెల్లడికానున్నాయి. ఇదే రోజు జూన్ నెలకు చైనా తయారీ పీఎంఐ తెలియనుంది. 3న జూన్ నెలకు యూఎస్ ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా 9న యూఎస్ టారిఫ్ల గడువు ముగియనుంది. యూఎస్, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు తగ్గడంతో చమురు ధరలు చల్లబడ్డాయి. ఈ నేపథ్యంలో విదేశీ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు నాయిర్ తెలియజేశారు. ఎఫ్పీఐల దన్ను విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత వారం భారీస్థాయిలో రూ. 13,108 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. ఫలితంగా జూన్లో ఇంతవరకూ నికరంగా రూ. 8,915 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లయ్యింది. ఆర్బీఐ రెపో రేటులో 0.5 శాతం కోతకుతోడు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు ఉపశమించడం, యూఎస్ టారిఫ్ల ఆందోళనలు సైతం తగ్గడం ఎఫ్పీఐల పెట్టుబడులకు దోహదం చేస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. గతేడాది అక్టోబర్ మొదలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచి్చన ఎఫ్పీఐలు ఏప్రిల్ చివరి నుంచి దేశీ స్టాక్స్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. వెరసి ఏప్రిల్లో నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేయగా..మే నెలలో రూ. 19,860 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.26,100 పాయింట్లపై కన్ను అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో బ్రేకవుట్ నమోదైంది. 5 వారాలుగా ఒక పరిమిత శ్రేణిలోనే కదిలిన మార్కెట్లు పరిధిని చేదించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ అంచనాలకు అనుగుణంగా సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్ను అధిగమించి నిలిచింది. ఫలితంగా 25,600 పాయింట్లను దాటింది. బీఎస్ఈ సెన్సెక్స్ 84,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. ఈ బాటలో మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు విశ్లేíÙస్తున్నారు. వెరసి నిఫ్టీ 25,800 పాయింట్లను దాటి 26,100వరకూ పరుగు తీయవచ్చని భావిస్తున్నారు. మధ్యకాలంలో నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టం 26,277 పాయింట్లవైపు పరుగు తీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాకాకుండా బలహీనపడితే 25,300 వద్ద మద్దతు లభించే వీలున్నట్లు పేర్కొన్నారు. గత వారమిలా ఐదు వారాల కన్సాలిడేషన్ తదుపరి గత వారం చివరి 4 రోజుల్లో మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ 2,162 పాయింట్లు జంప్చేసింది. దీంతో నికరంగా గత వారం సెన్సెక్స్ 1,651 పాయింట్లు(2 శాతం) జమ చేసుకుంది. 84,059 వద్ద ముగిసింది. ఈ బాటలో చివరి 4 రోజుల్లో 666 పాయింట్లు దూసుకెళ్లిన నిఫ్టీ నికరంగా 525 పాయింట్లు(2.1 శాతం) లాభపడింది. 25,638 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ మిడ్క్యాప్ మరింత అధికంగా 2.35 శాతం, స్మాల్క్యాప్ 3.6 శాతం చొప్పున జంప్ చేయడం గమనార్హం! -
రూపాయి లేకపోయినా.. యూపీఐ చెల్లింపులు!
ప్రీతి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వేతనంతోపాటు ఖర్చులూ ఎక్కువే. దీంతో క్రెడిట్ కార్డును వినియోగిస్తోంది. దీనిపై రివార్డు పాయింట్లతో పాటు, తర్వాత చెల్లించే వెసులుబాటు ఆమెకు సౌకర్యంగా అనిపించింది. కానీ, చిన్న చిన్న చెల్లింపులకు, కొన్ని షాపుల్లో క్రెడిట్ కార్డు స్వైప్నకు అవకాశం ఉండకపోవడం అసౌకర్యంగా భావించింది. ఇదే సమయంలో రూపే కార్డు గురించి విన్న ఆమె వెంటనే దానికి దరఖాస్తు చేసుకుంది.రూపే క్రెడిట్ కార్డు అయితే యూపీఐకి లింక్ చేసుకుని సులభంగా చెల్లించడం ప్రీతిని ఎంతగానో ఆకర్షించింది. ఇప్పుడు దాదాపు అన్ని చెల్లింపులను రూపే కార్డు నుంచే చేస్తోంది. నిజమే సాధారణ క్రెడిట్ కార్డులతో పోల్చితే.. రూపే క్రెడిట్ కార్డుతో ఎక్కడైనా యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపులకు అవకాశం ఉండడం ఎంతో మందికి అనుకూలించే అంశం. ఇందుకు ఆర్బీఐ ఎప్పుడో అవకాశం కల్పించింది. ఈ కార్డ్తో వచ్చే ప్రయోజనాలు, రిస్్కల గురించి అవగాహన కల్పించే కథనమే ఇది. – సాక్షి, బిజినెస్ డెస్క్అన్ని క్రెడిట్ కార్డుల మాదిరే యూపీఐ కార్డు కూడా పనిచేస్తుంది. ఒక్క రూపే క్రెడిట్ కార్డ్ను మాత్రం యూపీఐతో లింక్ చేసుకుని సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులకు అనుమతిస్తూ 2022 జూలైలోనే ఆర్బీఐ నిర్ణయం ప్రకటించింది. నాన్ రూపే క్రెడిట్ కార్డులకు ఈ వెసులుబాటు లభించలేదు. దాంతో రూపే క్రెడిట్ కార్డులు ఆకర్షణీయంగా మారాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డులకు బ్యాంకులు అదనపు (యాడ్–ఆన్) రూపే కార్డులను ఇవ్వడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు ఇప్పుడు నేరుగా కో–బ్రాండెడ్, సొంత రూపే కార్డులనే కొత్త కస్టమర్లకు జారీ చేస్తున్నాయి. సాధారణంగా యూపీఐ చెల్లింపులు ఏ ప్లాట్ఫామ్ ద్వారా చేసినా.. బ్యాంక్ ఖాతా నుంచే ఆ మొత్తం వెళుతుంది. రూపే క్రెడిట్ కార్డును అనుసంధానం చేసుకుంటే.. యూపీఐ చెల్లింపుల సమయంలో బ్యాంక్ ఖాతా లేదంటే రూపే క్రెడిట్ కార్డును ఎంపిక చేసుకుని లావాదేవీలను పూర్తి చేయొచ్చు. అనుకూలతలు రూపే క్రెడిట్ కార్డుతో ఉన్న ప్రధాన సౌకర్యం.. కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చెల్లింపుల సమయంలో స్వైప్ చేయాల్సిన అవసరాన్ని ఇది తప్పిస్తుంది. యూపీఐ యాప్నకు ఒక్కసారి లింక్ చేస్తే చాలు. భౌతిక కార్డు లేకుండానే లావాదేవీ ముగించొచ్చు. పీవోఎస్పై క్రెడిట్ కార్డు స్వైప్నకు కొందరు వర్తకులు అంగీకరించరు. మర్చంట్ డిస్కౌంట్ రేటు చెల్లించాల్సి వస్తుందని సుముఖత చూపించరు. రూపే క్రెడిట్ కార్డు విషయంలో యూపీఐ ద్వారా చెల్లిస్తారు కనుక ఈ ఇబ్బంది ఉండదు. ఒక రూపే క్రెడిట్ కార్డును ఒకటికి మించి యూపీఐ యాప్లపై లింక్ చేసుకోవచ్చు.బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ లేని సందర్భాల్లోనూ రూపే క్రెడిట్ కార్డు సాయంతో చెల్లింపులు చేయొచ్చు. ఎంత చిన్న మొత్తం అయినా క్యూఆర్ కోడ్పై స్కాన్ చేసి చెల్లించొచ్చు. దీనివల్ల ప్రతీ లావాదేవీ బ్యాంక్ ఖాతాలో బదులు క్రెడిట్ కార్డు, యూపీఐ ప్లాట్ఫామ్లో నమోదవుతుంది. బ్యాంక్ ఖాతాలో చిన్న చిన్న లావాదేవీలు లేకుండా చేసుకోవచ్చు. యూపీఐ క్రెడిట్ కార్డుపై ఇప్పుడు చాలా బ్యాంక్లు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తున్నా యి. వీటన్నింటినీ పరిశీలించాక మెరుగైన ప్రయోజనాలతో కూడిన కార్డ్ను ఎంపిక చేసుకోవచ్చు. బ్యాంకుల మధ్య ఈ ప్రయోజనాలు, ఫీజులు వేర్వేరుగా ఉన్నాయి. ప్రతి రూ.100 వ్యయంపై సాధారణంగా ఒక పాయింటు రివార్డుగా లభిస్తుంది. ఉదాహరణకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అయితే.. ‘ఫస్ట్ డిజిటల్ రూపే క్రెడిట్ కార్డు’పై రూ.2,000 లావాదేవీపై రూ.60 రివార్డు పాయింట్లను ఆఫర్ చేస్తోంది.ఈ రివార్డు పాయింట్లతో బహుమతులు కొనుగోలు చేసుకోవచ్చు. లేదంటే డిస్కౌంట్ పొందొచ్చు. కొన్ని బ్యాంక్లు క్యాష్బ్యాక్ ఆఫర్ చేస్తున్నాయి. సకాలంలో బిల్లు చెల్లింపులు చేయడం ద్వారా క్రెడిట్ స్కోరును బలోపేతం చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో రుణాలను సులభంగా చౌక రేటుకే పొందొచ్చు. రోజువారీ యూపీఐ చెల్లింపులు చేసే వారికి రూపే క్రెడిట్ కార్డు ఎంతో సౌకర్యం, అనుకూలం. ఒక యూపీఐ యాప్పై ఎన్ని రూపే క్రెడిట్కార్డులను అయినా లింక్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి చార్జీలు ఉండవు. పరిమితులు⇒ రూపే క్రెడిట్ కార్డుతో ఒక వ్యక్తి మరో వ్యక్తికి యూపీఐ ద్వారా నగదు బదిలీకి అవకాశం లేదు. ⇒ క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ యాప్ నుంచి చెల్లింపులకు పిన్ తప్పనిసరి. పిన్ లేకుండా చెల్లింపులు కేవలం యూపీఐ లైట్ ద్వారానే సాధ్యం. యూపీఐ లైట్లో బ్యాలన్స్ లోడ్ చేసుకోవడం అన్నది రూపే క్రెడిట్ కార్డుతో సాధ్యపడదు. కేవలం యూపీఐ లింక్డ్ సేవింగ్స్ ఖాతా నుంచే చేసుకోవాల్సి ఉంటుంది. ⇒ యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డు నుంచి ఒక రోజులో గరిష్టంగా రూ.లక్ష వరకే చెల్లించగలరు. ఎందుకంటే దాదాపు అన్ని యూపీఐ యాప్లు, బ్యాంక్లు రోజువారీ యూపీఐ పరిమితి రూ.లక్షగానే అమలు చేస్తున్నాయి. విడిగా రూపే క్రెడిట్ కార్డు రోజువారీ లిమిట్ ఇంకా తక్కువ ఉండొచ్చు. రూ.లక్షకు మించి ఉన్నప్పటికీ యూపీఐ ద్వారా రూ.లక్ష వరకే చెల్లింపులు చేయగలరు. ⇒ విద్య, ఆరోగ్యం, బీమా తదితర కొన్ని విభాగాల చెల్లింపులకు రోజువారీ యూపీఐ పరిమితి రూ.లక్షకు బదులు రూ.2 లక్షలుగా ఉంటుంది. ⇒ విదేశీ ప్రయాణాలు చేసే వారికి రూపే క్రెడిట్కార్డు కంటే రెగ్యులర్ కార్డులు అనుకూలం. ⇒ రూపే క్రెడిట్ కార్డుతో ఫ్యుయెల్ స్టేషన్లలో చెల్లింపులు చేస్తే సర్చార్జీ పడుతుంది. చాలా బ్యాంక్లు వీటిని మాఫీ చేస్తున్నాయి. క్రెడిట్ లిమిట్ కార్డు వినియోగ పరిమితి (రుణం) వ్యక్తిగత రుణ చరిత్ర, ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో రెగ్యులర్ క్రెడిట్ కార్డులకు వర్తించే నిబంధనలే వీటికీ అమలవుతాయి. కొన్ని బ్యాంక్లు ఆరంభంలో తక్కువ లిమిట్తో కార్డులు జారీ చేస్తాయి. వినియోగ తీరు, చెల్లింపుల ఆధారంగా భవిష్యత్తులో ఈ లిమిట్ను క్రమంగా పెంచుకునేందుకు అనుమతిస్తుంటాయి. కొన్ని భద్రతా చర్యలు ⇒ రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులను ప్రతి రోజూ ఒకసారి పరిశీలించుకోవాలి. కార్డు స్టేట్మెంట్ను చూడడం వల్ల ఏవైనా మోసపూరిత లావాదేవీలు ఉంటే వెంటనే గుర్తించొచ్చు. ⇒ యూపీఐ యాప్లకు తప్పకుండా ఫింగర్ప్రింట్ లేదా పిన్ నంబర్ పెట్టుకోవాలి. పిన్ అయితే ఊహించడానికి సులభంగా ఉండకూడదు. ⇒ యూపీఐ చెల్లింపులకు పేరొందిన గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే, పేటీఎం, బ్యాంక్ యూపీఐ యాప్లను వినియోగించడం మంచిది. చార్జీలు⇒ రూపే కార్డుతో చేసే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీల్లేవు. కానీ, కొన్ని యూపీఐ ప్లాట్ఫామ్లు రూపే కార్డు ఆధారిత యూపీఐ చెల్లింపులు, రీచార్జ్లపై కనీ్వనియెన్స్ చార్జీలు విధించొచ్చు. ⇒ క్రెడిట్ బిల్లును సకాలంలో చెల్లించకపోతే లేట్ పేమెంట్ చార్జీలు పడతాయి. గడువులోపు చెల్లించని మొత్తంపై వడ్డీ 18 శాతం నుంచి 48 శాతం మధ్య పడుతుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అయితే క్రెడిట్ స్కోరు ఆధారంగా 9 శాతం రేటును కూడా ఆఫర్ చేస్తోంది. అదే యాక్సిస్ బ్యాంక్ అయితే నెలవారీ 45 శాతం వడ్డీ రేటును యూపీఐ క్రెడిట్పై అమలు చేస్తోంది. ⇒ కొన్ని చెల్లింపులను ఈఎంఐ కింద మార్చుకునేందుకు బ్యాంక్లు అనుమతిస్తుంటాయి. అలాంటి సమయంలో రెగ్యులర్ క్రెడిట్కార్డుల మాదిరే ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. ⇒ కొన్ని బ్యాంక్లు జీవితకాలం పాటు ఎలాంటి వార్షిక ఫీజులు లేకుండా రూపే కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని వార్షిక చార్జీలు అమలు చేస్తున్నాయి.కార్డులు – ప్రయోజనాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్⇒ పేజాప్ (హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యాప్), గ్రోసరీలు, సూపర్ మార్కెట్, డైనింగ్, యూపీఐ లావాదేవీలపై 3 శాతం క్యాష్ రివార్డు పాయింట్లు లభిస్తాయి. నెలవారీ గరిష్ట పాయింట్లు 500. ⇒ యుటిలిటీ చెల్లింపులపై 2 శాతం క్యాష్ పాయింట్లు (నెలకు గరిష్టంగా రూ.500), ఇతర వ్యయాలపై 1 శాతం క్యాష్ పాయింట్లు (నెలవారీ గరిష్ట పాయింట్లు 500) లభిస్తాయి. ⇒ ఏడాదిలో కార్డుపై వ్యయం కనీసం రూ.25వేలు చేస్తే వార్షిక ఫీజు మాఫీ అవుతుంది.మింత్రా కోటక్ క్రెడిట్ కార్డు⇒ మింత్రాపై రూ.750 వరకు లావాదేవీలపై 7.5 శాతం తగ్గింపు లభిస్తుంది. ⇒ స్విగ్గీ, స్విగ్గీ ఇన్స్టామార్ట్, పీవీఆర్, క్లియర్ట్రిప్, అర్బన్ కంపెనీ ప్లాట్ఫామ్లపై నెలలో రూ.1,000 వరకు చేసే వ్యయాలపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ⇒ ఇతర లావాదేవీలపై 1.25 అపరిమిత క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ⇒ త్రైమాసికంలో కార్డుపై వ్యయం రూ.50,000 తక్కువ కాకుండా ఉంటే, రెండు పీవీఆర్ టికెట్లు (ఒక్కోటీ రూ.250 చొప్పున) ఉచితంగా లభిస్తాయి. యస్ బ్యాంక్ పైసా బజార్ పైసాసేవ్ క్రెడిట్ కార్డు⇒ ఆన్లైన్ కొనుగోళ్లపై 3 శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు (నెలకు గరిష్టంగా 5,000 పాయింట్లు) అందుకోవచ్చు. 5,000 పాయింట్ల పరిమితి తర్వాత చేసే చెల్లింపులపై 1.5 శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు వస్తాయి. ⇒ ఇతర చెల్లింపులు, యూపీఐ చెల్లింపులపై 1.5 శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు లభిస్తాయి. ⇒ ఈ పాయింట్లను క్రెడిట్ బిల్లులో సర్దుబాటు చేసుకోవచ్చు. ⇒ ఏడాదిలో రూ.1.2 లక్షల వ్యయం చేస్తే రెన్యువల్ ఫీజు రూ.499 మాఫీ అవుతుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ డిజిటల్ రూపే క్రెడిట్ కార్డు⇒ జాయినింగ్ ఫీజు రూ.200, రెండో ఏడాది నుంచి వార్షిక ఫీజు రూ.199 అమలవుతుంది. ⇒ రూ.2,000లోపు యూపీఐ చెల్లింపులపై ఒక శాతం రివార్డులు, రూ.2,000 మించి చేసే చెల్లింపులపై 3 శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి. ⇒ అన్ని యుటిలిటీ, బీమా చెల్లింపులపై ఒక శాతం రివార్డు పాయింట్లు లభిస్తాయి. -
రామగుండం నుంచి ప్రపంచ వేదికకు..
హైదరాబాద్: టెక్ విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న నెక్స్ట్ వేవ్, ఎన్ఐఏటి సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ రాహుల్ అత్తులూరికి అరుదైన గౌరవం లభించింది. చైనా లోని టియాన్జిన్లో జరిగిన 'ఆన్యువల్ మీటింగ్ ఆఫ్ ది న్యూ చాంపియన్స్'కి రాహుల్ ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆహ్వానించింది. ఈ మీటింగ్ని సమ్మర్ దావోస్ అని కూడా అంటారు. అధునాతన టెక్నాలిజీలతో వేగంగా మారిపోతున్న జాబ్ మార్కెట్లో, ముఖ్యంగా ఏజెంటిక్ ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలపై పడుతున్న ప్రభావం గురించి, యువతకు కొత్త అవకాశాలు ఎలా సృష్టించాలనే విషయంపై ఆయన ప్రసంగించారు.తెలంగాణలోని రామగుండానికి చెందిన రాహుల్ అత్తులూరి, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో చదివారు. ఇప్పుడు దేశ విద్యా రంగాన్ని టెక్నాలజీతో మెరుగుపరుస్తున్న ప్రముఖ నాయకులలో ఒకరిగా ఎదిగారు. ఎంతో మంది తెలుగు రాష్ట్రాల యువతకు ప్రేరణగా నిలిచారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) అనే సంస్థ స్విట్జర్లాండ్లోని కోలోగ్నీ వేదికగా ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రపంచాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా కృషి చేస్తుంది. ఈ వేదికలో జరిగే వార్షిక సమావేశానికి ప్రపంచ నేతలు, ప్రముఖ కంపెనీల సీఈఓలు, పాలసీ రూపకర్తలు, పరిశోధకులు హాజరవుతారు. ప్రపంచ ప్రాంతీయ, పరిశ్రమల అజెండాలపై చర్చలు జరుగుతాయి. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బిల్ గేట్స్, డోనాల్డ్ ట్రంప్, సత్య నాదెళ్ల, సుందర్ పిచై, ఎలాన్ మస్క్ లాంటి అగ్ర నాయకులు గతంలో ఈ వేదికపై ప్రసంగించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కార్యక్రమాలలో ప్రభుత్వాల మంత్రులు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల CXO లు కూడా పాల్గొంటుంటారు."కెరీర్ పాత్వేస్ రీవైర్డ్" సెషన్లో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, "భారతదేశ జనాభాలో 60 శాతం మంది యువతే. ఇది రెండు వైపులా పదును ఉన్న ఖడ్గం లాంటిది. వీరి ప్రతిభను చక్కటి మార్గంలో మలిచితే, ఇది ఒక పెద్ద వరం. లేదా అవకాశాన్ని వదిలేసినట్లైతే ఒక పెద్ద భారంగా మారుతుంది." అని రాహుల్ పేర్కొన్నారు. "టెక్నాలజీ మార్పుల ప్రభావం ఎప్పుడూ జే అక్షర రూపంలో ఉండే కర్వ్ లాగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్న దశలో ఉన్నాం. చాలా కంపెనీలు హైరింగ్ను ఆపేసాయి. కస్టమర్ సపోర్ట్ వంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఏఐతో పనులు వేగంగా చేసుకుంటున్నాయి," అని రాహుల్ అన్నారు.అయితే ఇవన్నీ తాత్కాలికంగా జరిగే మార్పులేనని రాహుల్ స్పష్టం చేస్తూ, "మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఏఐ స్కిల్స్ ఉన్న వారి కోసం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. జనరేటివ్ ఏఐ వల్ల భారీ స్థాయిలో అవకాశాలు వస్తాయి. దానికి భారత్ సిద్ధంగా ఉండాలి. ఏజెంటిక్ ఏఐ వల్ల ఎంట్రీ లెవెల్ పనులు వేగంగా ఆటోమేట్ అవుతున్నాయి. దీని ఫలితంగా, సంప్రదాయ ఉద్యోగ మార్గాలు మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు కలసి పని చేయడం చాలా కీలకం.డిగ్రీలతో పాటు స్కిల్స్కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. స్కిల్ క్రెడెన్షియల్స్పై మరింత దృష్టి పెట్టాలి' అని అన్నారు. అలాగే, విద్యలో ఏఐ పాత్ర గురించి మాట్లాడుతూ, "విద్యార్థులు ఏఐని ఏఐ సహాయంతోనే నేర్చుకోవాలి. కంపెనీలు తమకు కావలసిన నైపుణ్యాలను స్పష్టంగా వెల్లడించాలి. ఇలా చెయ్యడంతో, విద్యార్థులు రాబోయే ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా తయారవుతారు" అని అన్నారు భారత ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి.. యువతకు ఏఐ యుగానికి అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు విస్తృతమైన చర్యలు చేపడుతున్నట్లు రాహుల్ అత్తులూరి వివరించారు. అలానే యువత కేవలం ఏఐ స్కిల్స్ మాత్రమే కాదు, మానవతా విలువలతో కూడిన నైపుణ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేర్చుకోవడం అవసరం అన్నారు. అలాగే, ఏఐలో ప్రావీణ్యం సాధించి పరిశ్రమలో విలువైన వ్యక్తులుగా ఎదగాలి అని వివరించారు. "ప్రస్తుతం ఉన్న డిజిటల్ డివైడ్ను నివారించాలంటే, విద్యలో ప్రారంభ దశ నుంచే విద్యార్థులకు ఏఐ టూల్స్ అందుబాటులో ఉండాలి.ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికీ చేరువలో ఉండాలి. ప్రత్యేకంగా, నో-కోడ్ లేదా లో-కోడ్ టూల్స్తో విద్యార్థులు కొత్త ప్రాజెక్టులు బిల్డ్ చెయ్యాలి, ఏఐ ఏజెంట్లను ఉపయోగించాలి. ఇలా నేర్చుకోవడం వల్ల ఇండస్ట్రీలోకి ప్రవేశించే సమయానికి చక్కటి స్కిల్స్ తో సిద్ధంగా ఉంటారు." అని రాహుల్ అత్తులూరి అన్నారు. 2024లో నెక్స్ట్ వేవ్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) టెక్నాలజీ పయనీర్గా గుర్తించింది. ఈ గౌరవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేవలం 100 సంస్థలకు మాత్రమే దక్కుతుంది. గతంలో గూగుల్, స్పోటిఫై, ఎయిర్ బీఎన్బీ, ట్విట్టర్ (ఇప్పుడు ఎక్స్) లాంటి సంస్థలు. ఇదే గుర్తింపు పొందాయి. తర్వాత అవన్నీ ప్రపంచాన్ని మార్చిన టెక్ కంపెనీలుగా నిలిచాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మర్ దావోస్లో రాహుల్ అత్తులూరి పాల్గొనడం నెక్స్ట్ వేవ్కి కీలక మైలురాయిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ గుర్తింపు పొందుతోంది. ఏఐ ఆధారితంగా, స్థానిక భాషల్లో నేర్చుకునేలా రూపొందించిన నెక్స్ట్ వేస్ లెర్నింగ్ ప్లాట్ఫారం వినూత్న విధానం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. -
వడ్డీ సొమ్ము వచ్చిందా.. ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూసుకున్నారా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఈపీఎఫ్ ఖాతాల్లో 8.25 శాతం వార్షిక వడ్డీ సొమ్మును జమ చేయడం ప్రారంభించింది. మీరు ఈపీఎఫ్ మెంబర్ అయితే మీ పాస్బుక్ ద్వారా ఆన్లైన్లోనే అప్డేట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వడ్డీ సొమ్ము ఇంకా కనిపించకపోయినా కంగారు పడకండి. దీనికి మరికొన్ని రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్ఓ ఇంకా ఎటువంటి అధికారిక ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ పంపలేదు. కానీ చాలా మందికి ఇప్పటికే తమ పాస్ బుక్లో వడ్డీ సొమ్ము జమ అయినట్లు కనిపిస్తోంది.వడ్డీ రేట్లకు ఆర్థిక శాఖ ఆమోదంగత ఫిబ్రవరిలో జరిగిన ఈపీఎఫ్ఓ సీబీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్) సమావేశంలో ఈపీఎఫ్పై ప్రతిపాదించిన 8.25 శాతం వార్షిక వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదించింది. ఈ ఆమోదం తర్వాత ఈపీఎఫ్ఓ వడ్డీ జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో సుమారు 8 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయి.వడ్డీని ఎలా లెక్కిస్తారు?ప్రతి నెలా ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఈపీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్ చేస్తారు. ఉద్యోగి మూల వేతనంలో 12 శాతం కంట్రిబ్యూషన్ చేస్తారు. యజమాని వాటా కూడా 12 శాతం ఉంటుంది. అయితే ఇది పెన్షన్ పథకానికి 8.33%, ఈపీఎఫ్ ఖాతాకు 3.67% చొప్పున జమ చేస్తారు. ఈపీఎఫ్ఓ నెలవారీ వడ్డీని లెక్కిస్తుంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మాత్రమే జమ చేస్తుంది. చక్రవడ్డీని ఉపయోగించి వడ్డీని లెక్కిస్తారు. ఇది ఉద్యోగి, యజమాని కంట్రిబ్యూషన్స్ రెండింటికీ వర్తిస్తుంది (పెన్షన్ భాగం మినహా). సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు మధ్య వడ్డీ జమవుతుంటుంది.వడ్డీ జమయిందో లేదో చూసుకోండిలా..స్టెప్ 1: ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ( epfindia.gov.in )సందర్శించండిస్టెప్ 2: అవర్ సర్వీసెస్ > ఫర్ ఎంప్లాయీస్ > మెంబర్ పాస్బుక్కు వెళ్లండిలేదా నేరుగా ( passbook.epfindia.gov.in ) లింక్ను క్లిక్ చేయండి.స్టెప్ 3: యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వండి.స్టెప్ 4: ఇక్కడ మీ అన్ని మెంబర్ ఐడీలు (మునుపటి, ప్రస్తుత కంపెనీలతో లింక్ అయినవి)కనిపిస్తాయి.స్టెప్ 5: పాస్బుక్ చూడటానికి ప్రస్తుత మెంబర్ ఐడీపై క్లిక్ చేయండిపాస్బుక్లో ఉద్యోగి కంట్రిబ్యూషన్, కంపెనీ కంట్రిబ్యూషన్, జమ అయిన వడ్డీ కనిపిస్తాయి. దీన్ని పీడీఎఫ్ గా కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.వడ్డీ సొమ్ము ఇంకా కనిపించకపోతే..కొన్నిసార్లు వడ్డీ జమ అయిన తర్వాత కూడా పాస్ బుక్లో ప్రతిబింబించడానికి సమయం పడుతుంది. కొన్ని రోజులు వేచి చూసి మళ్లీ తనిఖీ చేయండి. అప్పటికీ కనిపించకపోతే ఆన్లైన్లో లేదా సమీపంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. -
పట్టాలెక్కిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పట్టాలెక్కింది. ప్రభుత్వ ప్రోత్సాహకర విధానాలు, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ తదితర అభివృద్ధి ప్రణాళికలతో నగర స్థిరాస్తి రంగం పుంజుకుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో నగరంలో 10,741 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే కేవలం 3 శాతం తగ్గుదల కనిపించింది. గృహ కొనుగోలుదారులు ప్రీమియం, హైఎండ్ లగ్జరీ గృహాలకే మొగ్గు చూపిస్తుండటంతో అందుబాటు, మధ్యస్థాయి గృహాల లాంచింగ్స్ స్వల్పంగా తగ్గాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోహాట్స్పాట్ ప్రాంతాలివే.. లాంచింగ్స్లో పశ్చిమ హైదరాబాద్ ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. మొత్తం లాంచింగ్స్లో ఈ జోన్ వాటా ఏకంగా 51 శాతంగా ఉంది. వెస్ట్ హైదరాబాద్లో నానక్రాంగూడ ప్రధాన హాట్స్పాట్గా నిలిచింది. లాంచింగ్స్లో ఉత్తర హైదరాబాద్ వాటా 18 శాతంగా ఉండగా.. ఈ జోన్లో బాచుపల్లి హాట్స్పాట్గా ఉంది. ఇక, దక్షిణ హైదరాబాద్ వాటా 17 శాతంగా ఉండగా.. రాజేంద్రనగర్ హాట్స్పాట్గా ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి పశ్చిమ హైదరాబాద్ చోదకశక్తిగా ఉన్నప్పటికీ.. రెండేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. ఇదే సమయంలో భూమి లభ్యత, అందుబాటు ధరల కారణంగా ఉత్తర, తూర్పు, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలు క్రమంగా వృద్ధి చెందుతున్నాయి. శివారు ప్రాంతాలలో గృహ నిర్మాణాలు పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణం.హైఎండ్ లగ్జరీదే ఆధిపత్యం.. 2025 క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో లాంచింగ్స్లో అత్యధికంగా 83 శాతం హైఎండ్ లగ్జరీ యూనిట్లు హైదరాబాద్లోనే లాంచింగ్ అయ్యాయి. నగరంలో 2024 క్యూ1లోని లాంచింగ్స్లో ప్రీమియం ఇళ్ల వాటా 34 శాతంగా ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 70 శాతానికి పెరిగింది. నానక్రాంగూడ, గండిపేట, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాలలో ప్రీమియం ఇళ్లకు అత్యధిక డిమాండ్ ఉంది. లాంచింగ్స్లో మధ్యస్థాయి విభాగం గృహాల వాటా 17 శాతంగా ఉంది. అత్యధికంగా బాచుపల్లిలో ఈ తరహా ఇళ్లకు గిరాకీ ఉంది. తూర్పు హైదరాబాద్లో ఎక్కువగా ఓపెన్ ప్లాట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.పెరిగిన ఇళ్ల అద్దెలు.. నగరంలో గృహాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 7 శాతం పెరిగాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లోని అద్దె ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, ఇతర ఉన్నతస్థాయి వర్గాలు ఆయా ప్రాంతాలలో నివసించేందుకు ఆసక్తి చూపిస్తుండటమే అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణం.ఆఫీసు స్పేస్ అదరహో.. నగరంలో 2025 క్యూ1లో 18.2 లక్షల చ.అ. నికర ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. లక్ష చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన ఆఫీసు లీజులు అత్యధికంగా జరిగాయి. హెల్త్కేర్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలలో కంపెనీల విస్తరణల కారణంగా లావాదేవీలలో వృద్ధి నమోదైంది. 2025 క్యూ1లోని ఆఫీసు స్పేస్ లీజులలో అత్యధికంగా 32 శాతం హెల్త్కేర్ అండ్ ఫార్మా రంగాలది కాగా.. ఆ తర్వాత ఐటీ–బీపీఎం విభాగం 21 శాతం, బ్యాంకింగ్ అండ పైనాన్షియల్స్ విభాగం వాటా 11 శాతంగా ఉంది. మాదాపూర్ (81 శాతం), గచి్చ»ౌలి (16 శాతం) ప్రాంతాల్లోని ఆఫీసు స్పేస్కు ఎక్కువ డిమాండ్ ఉంది.సప్లయి 13.2 లక్షల చ.అ. ఇక నగరంలో 2025 క్యూ1లో కొత్తగా మార్కెట్లోకి 13.2 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సప్లయి అయింది. అయితే గతేడాది క్యూ1తో పోలిస్తే మాత్రం ఇది 55 శాతం తగ్గుదల. ఆఫీసు స్పేస్ ప్రాజెక్ట్ల అనుమతుల జారీలో జాప్యమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణం. నగరంలో కార్యాలయ స్థలాల అద్దెలు గతేడాది క్యూ1తో పోలిస్తే 13 శాతం మేర పెరిగాయి. అత్యధికంగా మాదాపూర్లో అద్దెలు పెరిగాయి. ఈ ప్రాంతంతో పోలిస్తే గచ్చిబౌలిలో కిరాయిలు 20–25 శాతం తక్కువగా ఉన్నాయి. మెట్రో ఫేజ్–2, హెచ్–సిటీ రోడ్ల విస్తరణ వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రణాళికలతో కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. దీంతో దీర్ఘకాలంలో ఆఫీసు అద్దెలు మరింత వృద్ధి చెందుతాయి. -
ఈ కంపెనీ ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్లు ఇక ఉండవ్..
జపాన్కు చెందిన ప్రముఖ అప్లయెన్సెస్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పానాసోనిక్ నుంచి ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్లు ఇక రావు. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారతదేశంలోని రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ విభాగాల నుండి పానాసోనిక్ నిష్క్రమించింది. ఈ సెగ్మెంట్లు రెండూ భారత్లో పానాసోనిక్కు నష్టాల్లో ఉన్న వ్యాపారాలు. ఇక్కడ మార్కెట్లో స్థానం సంపాదించడానికి కష్టపడుతున్నాయి.మార్కెట్ రీసెర్చ్ సంస్థ జీఎఫ్కే గణాంకాల ప్రకారం.. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ విభాగాలలో పానాసోనిక్ చాలా తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. వాషింగ్ మెషీన్లలో దీని వాటా 1.8 శాతం, రిఫ్రిజిరేటర్లలో 0.8 శాతంగా ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో పానాసోనిక్ గత ఆరేళ్లుగా అమ్మకాల్లో నష్టాలను చవిచూస్తోంది.రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ విభాగాల నుండి నిష్క్రమిస్తున్నప్పటికీ డీలర్ల వద్ద ఇప్పటికే ఉన్న ఆయా ఉపకరణాల అమ్మకాలకు సహకరిస్తామని, విడిభాగాలు, వారంటీ కవరేజీతో సహా పూర్తి కస్టమర్ సేవను అందిస్తూనే ఉంటామని పానాసోనిక్ తెలిపింది.స్తబ్దత నుంచి బయటపడేందుకు, భవిష్యత్తులో బలమైన, పునరుద్ధరించిన వృద్ధి కోసం పానాసోనిక్ గ్రూప్ను నిలబెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న వ్యాపారాల నుంచి నిష్క్రమించాలని యోచిస్తున్నట్లు ఈ ఏడాది మేలో పానాసోనిక్ గ్రూప్ సీఈఓ యుకీ కుసుమి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో పానాసోనిక్ ఇండియా ఆదాయం సుమారు రూ .11,500 కోట్లు. -
నిర్మాణం.. మరింత భారం
సాక్షి, సిటీబ్యూరో: అధిక రుణాలు, నిధుల లేమితో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరొక గుదిబండలా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్ ధరలు ఏడాది కాలంలో 20 శాతం మేర పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10–12 శాతం పెరిగిందని కొల్లియర్స్ రీసెర్చ్ తెలిపింది.టోకు ధరల ద్రవ్యోల్బణం, మెటీరియల్ ధరలు రెండంకెల పెరుగుదలను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8–9 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రవాణా పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరుగుదల కారణంగా ఇన్పుట్ కాస్ట్ పెరిగాయి.2024 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో స్టీల్ ధరలు 30 శాతం, సిమెంట్ 22 శాతం, కాపర్ 40 శాతం, అల్యూమీనియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగాయి. దీంతో గతేడాది మార్చిలో నివాస సముదాయల నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,060గా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300లకు, అలాగే ఇండ్రస్టియల్ నిర్మాణ వ్యయం గతేడాది రూ.1,900ల నుంచి ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,100లకు పెరిగిందని వివరించారు.ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నిర్మాణ పనులను చేపడుతున్న అందుబాటు, మధ్య స్థాయి గృహ నిర్మాణ డెవలపర్లకు తాజాగా పెరిగిన నిర్మాణ వ్యయం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వ్యయ భారం నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు డెవలపర్లు ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితి అని పేర్కొన్నారు. -
94 ఏళ్ల వయసులో రూ.50వేల కోట్ల విరాళం..
విజయవంతమైన గొప్ప ఇన్వెస్టర్, సంపాదనలో తిరుగులేని శక్తి అని బెర్క్షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ గురించి గొప్పగా చెబుతారు. అయితే దాతృత్వంలోనూ తనకు సాటి లేరని చాటుతున్నారు బఫెట్. తాజాగా 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50 వేల కోట్లు) విలువైన కంపెనీ షేర్లను ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారాయన.ఇప్పుడు 94 ఏళ్ల బఫెట్ మొత్తం 9.43 మిలియన్ల బెర్క్షైర్ షేర్లను బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చారు. తన దివంగత భార్య పేరు మీద ఉన్న సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్ కు 9,43,384 షేర్లను ఇచ్చారు. అంతేకాకుండా తన ముగ్గురు పిల్లల నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థలు హోవార్డ్ జి బఫెట్ ఫౌండేషన్, షెర్వుడ్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్లకు 6,60,366 షేర్లను విరాళంగా ఇచ్చారు.బఫెట్ ఇదివరకే ఇలాంటి భారీ విరాళాలను అందించారు. గత జూన్లో 5.3 బిలియన్ డాలర్లు, అంతకు ముందు నవంబర్లో 1.14 బిలియన్ డాలర్లు విరాళమిచ్చారు. ఈ తాజా విరాళం తర్వాత కూడా బఫెట్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. విరాళానికి ముందు ఆయన నికర సంపద (అంచనా) 152 బిలియన్ డాలర్. ఫోర్బ్స్ ప్రకారం బఫెట్ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ విరాళం తర్వాత ఆరో స్థానానికి తగ్గే అవకాశం ఉంది. విరాళాలు ఇస్తున్నప్పటికీ, ఆయన ఇప్పటికీ బెర్క్షైర్ హాత్వేలో 13.8% వాటాను కలిగి ఉన్నారు. తన వాటాలను విక్రయించే యోచన లేదని బఫెట్ ఇదివరకే పేర్కొన్నారు.వారెన్ బఫెట్ 1965 నుండి బెర్క్షైర్ హాత్వేకు నాయకత్వం వహిస్తున్నారు. దానిని ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన సంస్థలలో ఒకటిగా మార్చారు. తెలివైన పెట్టుబడి సలహాలకు ప్రసిద్ది చెందిన బఫెట్ కొటేషన్లలో "అద్భుతమైన ధరతో మామూలు కంపెనీని కొనడం కంటే అద్భుతమైన కంపెనీని మామూలు ధరకు కొనడం గొప్ప" అనే ప్రసిద్ధమైంది. తన సంపద ఎలా వినియోగించాలన్నది కూడా బఫెట్ ముందే ప్లాన్ చేసుకున్నారు. తాను మరణించిన తర్వాత మిగిలిన సంపదలో 99.5 శాతాన్ని కుటుంబం నిర్వహించే ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సంస్థలకు అందేలా గత ఏడాది తన వీలునామాను అప్డేట్ చేశారు. -
అదిరే గ్యాడ్జెట్స్.. హోమ్ హ్యాపీస్
ఇప్పుడు ఇంట్లో పని గట్టిగా కాదు, గాడ్జెట్స్తో స్మార్ట్గా చేయండి. ఎందుకంటే పని తగ్గించి, సమయాన్ని ఆదా చేసి, సంతోషాన్ని ఇచ్చే కొన్ని హౌస్ గాడ్జెట్లు ఇవిగో మీ కోసం!ఈగలకు నో ఎంట్రీకిటికీ తీయగానే, ఈగలు వచ్చి చుట్టూ తిరగడం కామన్! అలాగని, అవి చెవి దగ్గరకు వచ్చి ‘జూయ్.. జూయ్.. ’ రాగాలు వినిపిస్తూ విసిగిస్తుంటే, చేతికి గాజు వేసుకోండి. అవును, ఈ గాజు పేరు ‘వ్రోక్సీ’ ఇది చూడటానికి గాజులాగే ఉంటుంది కాని, దీని లోపల నేచురల్ ఆయిల్స్, ఇతర ఆయుర్వేద మూలికల వాసనలతో ఈగలకి నో ఎంట్రీ బోర్డు పెడుతుంది. సాఫ్ట్ సిలికాన్తో ఉంటుంది కాబట్టి చేతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజూ వాడేలా స్టయిలిష్గా, తేలికగా ఉంటుంది. ఇది ఇంట్లోకి, పిక్నిక్కి, క్యాంపింగ్కి బెస్ట్ ఆప్షన్. ధర రూ. 299 మాత్రమే!చేతులకు వెచ్చదనంచలికాలం వచ్చిందంటే మీ చేతులు జారిపోతున్నాయా? ఇంట్లో పని చెయ్యాలన్నా, మొబైల్ స్క్రోల్ చేయాలన్నా, చేతులు తిమ్మిరితో మొద్దుబారితే ఎలా? అప్పుడు వెంటనే మీకు కావాల్సింది మామూలు రూమ్ హీటర్ కాదు, ఈ ‘ఒకూపా హ్యాండ్ వార్మర్’. ఇది చిన్న లిప్స్టిక్ సైజులో ఉంటుంది. ఇందులో రెండు చేతులకూ సరిపోయేలా రెండు మినీ హ్యాండ్ వార్మర్లు మాగ్నెట్కు అంటిపెట్టుకొని ఉంటాయి. వేరుచేసి వాడితే, రెండు చేతులకు వెచ్చదనాన్ని ఇస్తాయి. రెండింటినీ కలిపి వాడితే, చిన్న రూమ్ హీటర్లాగా కూడా పనిచేస్తుంది. అదిరే కాంబో కదా! ఒక్కసారి చార్జ్చేస్తే దాదాపు ఆరుగంటల వరకు పనిచేస్తుంది. ధర రూ. 3,999.వెచ్చని కౌగిలి! ఇంటి పని అంతా ముగించుకుని కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటే; వెన్నునొప్పులు, కాళ్ల నొప్పులు వెంటనే ‘‘హాయ్ సిస్టర్!’’ అని వచ్చేస్తాయి. నెలసరి సమయంలో ఇవి మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పడే ఒక మంచి సహాయం మసాజ్తో కాదు, వెచ్చదనంతో కావాలి. ఆ వెచ్చదనం అందించే స్నేహితురాలే ఈ ‘హగ్బ్యాగ్’! ఇది కేవలం బొమ్మ కాదు. ఇది ఓ చిట్టి డాక్టర్ లాంటిది. క్యూట్ టాయ్లా కనిపిస్తుంది కాని, లోపల మాత్రం వాటర్ బాటిల్తో ఉంటుంది. అందులో వేడి నీళ్లు పోసి, వెచ్చని చికిత్సను ఇంట్లోనే పొందొచ్చు. వంటింట్లో గంటల పాటు నిలబడి పని చేసిన తర్వాత ఇది పట్టుకొని పడుకోండి, గట్టిగా నిద్ర పడుతుంది. నెలసరి నొప్పుల నుంచి ఇది చక్కని ఉపశమనం కూడా ఇస్తుంది. ధర రూ.799 మాత్రమే!మీ మాటే తనకు శాసనం!చెప్పిందే పది సార్లు చెప్పినా కూడా టీవీలో మునిగిపోయిన భర్త వినడు, గేమ్స్లో లీనమైపోయిన పిల్లలు వినరు. ఇక అత్త మామలకైతే వాట్సాప్లో మెసేజ్ చేసినా, బ్లూటిక్ పడటానికి పదిరోజులు పడుతుంది. ఇలా ఇంట్లో ఎవరూ మీ మాట వినకపోయినా! ఈ ‘అలెక్సా ఎకో పాప్’ మాత్రం మీ మాటే శాసనంగా పాటిస్తుంది. ఎందుకంటే, ఇది అలెక్సా సరికొత్త, స్మార్ట్ మోడల్. మీకు టైమింగ్ గుర్తు చేస్తుంది, పాటలు పాడుతుంది, టీవీ, లైట్లు ఆన్, ఆఫ్ చేస్తుంది. అలాగే, లేటెస్ట్ షాపింగ్కు కావాల్సిన డిస్కౌంట్ ఆఫర్లు కూడా చెబుతుంది. ఇది మీ ఇంట్లో ఉండాలంటే, పెద్ద కారణాలు అవసరం లేదు. కాని, ఇది ఉంటే మాత్రం మీ పనులు చకచకా చిటికెలో జరిగిపోతాయి. ఇకపై ‘మా ఇంట్లో ఎవరూ నా మాట వినరు’ అనే ఫీలింగ్ కూడా ఉండదు. ధర రూ. 4,499. -
రియల్ఎస్టేట్లోకి ‘కొత్త’ కస్టమర్లు..
హైదరాబాద్ నగర స్థిరాస్తి మార్కెట్లోకి థర్డ్ జనరేషన్ కస్టమర్లు ఎంట్రీ ఇస్తున్నారు. ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు తిరిగి స్థానిక ప్రాంతాలలో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న కొత్తతరం కస్టమర్లకు విదేశాల్లో తరహా ఆధునిక వసతులు, విస్తీర్ణమైన అపార్ట్మెంట్లను కోరుకుంటున్నారు. వీరి అభిరుచికి తగినట్టుగానే చాలామంది గ్రేడ్–ఏ డెవలపర్లు అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లు, హైరైజ్ ప్రాజెక్ట్లను నిర్మిస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోప్రధాన నగరంలో కష్టమే.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోని నివాసితుల రెండు, మూడోతరం వారసులు కూడా సిటీకి వస్తున్నారు. వీరికి ఆయా ప్రాంతాల్లో లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు దొరకడం కష్టం. దీంతో హైరైజ్, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి. అలాగే విదేశాల్లో స్థిరపడిపోయిన ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)లు తిరిగి స్థానిక ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కొందరు ఎన్నారైలు ఇప్పటికే స్థానికంగా ఉన్న స్థిరాస్తులను విక్రయించి, లగ్జరీ ప్రాపర్టీలకు అప్గ్రేడ్ అవుతున్నారు. అలాగే ఇన్నాళ్లు భార్య, భర్తలిద్దరి సంపాదనతో ఇళ్లు కొనుగోలు చేసిన కస్టమర్లు.. ఇప్పుడు వారి పిల్లలు సంపాదన కూడా తోడైంది. 3–4 ఏళ్లుగా ఈ మూడోతరం సంపాదనతో నగరంలో ప్రాపర్టీలు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా స్థలాలు కొనే వారి కంటే ఉన్న భూమిని విక్రయించి, వచ్చిన సొమ్ముతో నగరంలో ప్రాపర్టీ కొనేందుకే ఆసక్తి చూపిస్తారని, దీంతో ప్రాపర్టీలకు మరింత డిమాండ్ ఉంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఇక ఏడాదికి ఇన్నే ఆడిట్లు.. సీఏలకు కొత్త రూల్
వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థలో భాగస్వామిగా గానీ చార్టర్డ్ అకౌంటెంట్లు సంవత్సరానికి ట్యాక్స్ ఆడిట్లు 60 మాత్రమే చేసేలా చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇనిస్టిట్యూట్ ఐసీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ పరిమితి 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇప్పుడు కూడా ఈ నిబంధన ఉన్నప్పటికీ, పార్ట్నర్స్ కోసం కూడా ఆడిట్ నిర్వహించేందుకు వెసులుబాటు ఉంది.తాజాగా ప్రతిపాదించిన పరిమితిలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఐసీఏఐ ప్రెసిడెంట్ చరణ్జోత్ సింగ్ నందా తెలిపారు. అవకతవకలు జరగకుండా చూసేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం యూనిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూడీఐఎన్) సిస్టంను ప్రవేశపెట్టినట్లు వివరించారు.యూడీఐఎన్ అనేది ప్రాక్టీస్ చార్టర్డ్ అకౌంటెంట్ చేత సర్టిఫై చేసిన లేదా ధృవీకరించిన ప్రతి డాక్యుమెంట్ కోసం జనరేట్ చేసే ఒక ప్రత్యేక సంఖ్య. దేశీయ చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలకు విదేశీ నెట్వర్కింగ్ మార్గదర్శకాల ముసాయిదాపై అభిప్రాయాలను సమర్పించడానికి గడువును జూలై 16 వరకు పొడిగించింది. -
బంగారం భారీ రేట్లు.. డిమాండ్లో మార్పులు
బంగారం రేట్లు భారీ స్థాయిలో పెరిగిన నేపథ్యంలో వివిధ సెగ్మెంట్లలో డిమాండ్లో మార్పులు కనిపించవచ్చని బ్రాండెడ్ ఆభరణాల తయారీ దిగ్గజం టైటాన్ తమ 2024–25 వార్షిక నివేదికలో పేర్కొంది. భౌగోళిక–రాజకీయ అంశాలు, స్థూల ఆర్థిక అనిశ్చితుల వల్ల పసిడి రేట్లు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చని వివరించింది.రిటైల్ విస్తరణ, కొత్త కలెక్షన్లు, మార్కెటింగ్పై మరింతగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యతనివ్వడాన్ని కొనసాగిస్తామని టైటాన్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పసిడి రేట్లు భారీ స్థాయిలో ఉన్నప్పటికీ జ్యవెలరీ డివిజన్ ఆరోగ్యకరంగా 20 శాతం, సేమ్–స్టోర్ అమ్మకాల వృద్ధి 14 శాతం మేర నమోదైందని వివరించింది. తనిష్క్ సబ్–బ్రాండ్ అయిన మీయా రూ. 1,000 కోట్ల మార్కును దాటగా, క్యారట్లెన్ విభాగం ఆదాయం 30 శాతం పెరిగిందని పేర్కొంది. -
రియల్టీలో తగ్గనున్న సంస్థాగత పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత (ఇనిస్టిట్యూషన్స్) పెట్టుబడులు ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్) 37 శాతం తక్కువగా 3.06 బిలియన్ డాలర్లు (రూ.26,300 కోట్లు)గా ఉండొచ్చని ఈ రంగానికి చెందిన కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ఇందులో హౌసింగ్ ప్రాజెక్టుల వాటా 38 శాతం ఉంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశి్చతులు, ఆర్థిక సవాళ్లు నెలకొనడాన్ని కారణంగా పేర్కొంది. దీంతో పెట్టుబడుల లావాదేవీల గడువు పొడిగింపునకు గురవుతున్నట్టు వివరించింది. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్లో ఇనిస్టిట్యూషన్స్ 4.89 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో.. విదేశీ ఇన్వెస్టర్ల వాటా 68 శాతంగా ఉంటే, దేశీ ఇనిస్టిట్యూషన్స్ మిగిలిన 32 శాతం వాటాను ఆక్రమించినట్టు పేర్కొంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (రీట్ లు), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్ ప్లేస్మెంట్ (క్యూఐపీలు), లిస్టెడ్ సంస్థల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతున్నట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. పెట్టుబడులకు ఆకర్షణీయం.. ‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికీ పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో సవాళ్లు నెలకొన్నప్పటికీ దేశీ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం కొనసాగింది’’అని జేఎల్ఎల్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ లతా పిళ్లై తెలిపారు. గత 5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లకు మించి నమోదవుతున్నట్టు గుర్తు చేశారు. ఈ ఏడాది దీనికి అనుగుణంగానే ఉండొచ్చన్నారు. -
నికర ఇంధన ఎగుమతిదారుగా భారత్
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుతం నికర ఇంధన దిగుమతిదారుగా ఉండగా, వచ్చే ఆరేళ్లలో నికర ఎగుమతిదారుగా అవతరిస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. హైడ్రోజన్ను భవిష్యత్ ఇంధనంగా పేర్కొన్నారు. ఇధనాల్, బయోడీజిల్ తదితర బయో ఇంధనాలు, హైడ్రోజన్తోపాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. పర్యావరణ అనుకూల ఇంధనాలకు మారడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, లాజిస్టిక్స్ వ్యయాలు కూడా దిగొస్తాయని మంత్రి చెప్పారు. అదే సమయంలో కొత్త రహదారుల నిర్మాణం వల్ల ఇంధన వ్యయాలు, లాజిస్టిక్స్ (రవాణా) వ్యయాలు ఈ ఏడాది చివరికి 9 శాతానికి దిగిరానున్నట్టు తెలిపారు. దేశంలో లాజిస్టిక్స్ వ్యయాలు ఆరు శాతం మేర తగ్గాయన్న ఒక సర్వే ఫలితాలను ప్రస్తావించారు. ‘‘నేడు చైనాలో లాజిస్టిక్స్ వ్యయాలు జీడీపీలో 8 శాతంగా ఉన్నాయి. అమెరికాలో, ఐరోపా దేశాల్లో 12 శాతం మేర ఉన్నాయి. అదే భారత్లో 16 శాతంగా ఉన్నాయి’’అని మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఆర్థికంగా లాభసాటి అయిన బయో ఇంధనాల వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని గుర్తు చేస్తూ.. ఎగుమతులను పెంచుకోవడం కోసం రవాణా వ్యయాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
ప్లాంటుపై టెస్లాకు ఆసక్తి లేదు
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు భారత్లో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంపై పెద్దగా ఆసక్తి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి పునరుద్ఘాటించారు. ఇక్కడ తమ కార్ల విక్రయాల కోసం షోరూమ్లను తెరవడంపై మాత్రమే కంపెనీ ఆసక్తిగా ఉందని చెప్పారు. భారత్లో ఎలక్ట్రిక్ వాహ నాల తయారీపై ఇన్వెస్ట్ చేసే సంస్థలకు దిగుమతి సుంకాలపరంగా ప్రోత్సాహకాలిచ్చే స్కీమునకు సంబంధించి పోర్టల్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అక్టోబర్ 21 వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుంది. అవసరాన్ని బట్టి 2026 మార్చి 15 వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారీ పరిశ్రమల శాఖ అప్లికేషన్ విండోను తిరిగి ప్రారంభించవచ్చు. 4–5 వాహన కంపెనీలు ఈ పథకంపై ప్రాథమికంగా ఆసక్తి కనపర్చాయని, అయితే వాస్తవంగా ఎన్ని దరఖాస్తులు వస్తాయనేది వేచి చూడాల్సి ఉంటుందన్నారు. స్కీములో పాలుపంచుకోవాలంటూ జర్మనీ, అమెరికా, బ్రిటన్ తదితర అన్ని దేశాల వాహన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామని.. అయితే చైనా, పాకిస్తాన్లాంటి పొరు గు దేశాల సంస్థలకు ఆంక్షలు వర్తిస్తాయన్నారు. కొత్త ఈవీ పథకం ప్రకారం, భారత్లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వాహన సంస్థలు, 15% సుంకానికే 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ సుంకాలు 70–100 శాతం వరకు ఉంటున్నాయి. -
క్రిజాక్ ఐపీవో జులై 2న
న్యూఢిల్లీ: విద్యార్థుల రిక్రూట్మెంట్ సొల్యూషన్లు అందించే క్రిజాక్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. జులై 2న ప్రారంభంకానున్న ఇష్యూ 4న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు జులై 1న షేర్లను కేటాయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు రూ. 860 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. కాగా.. గతేడాది నవంబర్లో రూ. 1,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. తాజాగా ఇష్యూ పరిమాణాన్ని రూ. 860 కోట్లకు కుదించింది. తొలుత 2024 మార్చిలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. అయితే జులైలో ప్రాస్పెక్టస్ను సెబీ తిప్పిపంపింది. ఆపై నవంబర్లో తిరిగి ఐపీవో చేపట్టేందుకు సెబీ తలుపు తట్టింది. 2025 మార్చిలో అనుమతి పొందింది. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెంట్లకు బీటూబీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయస్థాయిలో విద్యార్థుల రిక్రూట్మెంట్ సొల్యూషన్లు అందిస్తోంది. ఈ కోల్కతా కంపెనీ ద్వారా విద్యార్థులు యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ఉన్నత చదువులకు వెళ్లేందుకు గ్లోబల్ సంస్థలు తోడ్పాటునిస్తున్నాయి. రిజిస్టర్డ్ ఏజెంట్ల ద్వారా గత మూడేళ్లలో 75 దేశాలకుపైగా ఎన్రోల్మెంట్ అప్లికేషన్లకు కంపెనీ ప్లాట్ఫామ్ వీలు కల్పించింది. సుమారు 7.11 లక్షల విద్యార్థుల అప్లికేషన్ల ప్రాసెస్ చేసింది. కాగా.. గతేడాది(2024–25) రూ. 849 కోట్లకుపైగా ఆదాయం, రూ. 153 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
రెండు సంస్థల ఆధిపత్యం మంచిది కాదు
న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా రెండే సంస్థల గుత్తాధిపత్యం ఉంటే మంచిది కాదని టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా మరింత పోటీ ఉండాలని బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. దేశీ టెలికం రంగంలో భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఆధిపత్యం నడుస్తుండటం, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం, బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను ప్రవేశపెట్టడంపై కసరత్తే చేస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశీయంగా ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఆయన చెప్పారు. వైఫై సరీ్వసులకు ఉపయోగపడే 6 గిగాహెట్జ్ స్పెక్ట్రం డీలైసెన్సింగ్కి సంబంధించి ఆగస్టు 15లోగా ప్రభుత్వం నిబంధనలను ప్రకటించే అవకాశం ఉందని సింధియా చెప్పారు. శాటిలైట్ కమ్యూనికేషన్స్ సరీ్వసులకు త్వరలోనే స్పెక్ట్రం కేటాయించనున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరికి టెక్నాలజీ ఫలాలు అందేలా అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ బాధ్యతని సింధియా చెప్పారు. సాధారణంగా పరిమాణం పెరిగే కొద్దీ ధర తగ్గుతుందని, ఒకప్పుడు దేశీయంగా ఫోన్ కాల్ చేస్తే నిమిషానికి రూ. 16 చార్జీ ఉండేదని, పదేళ్ల క్రితం అది అర్థ రూపాయికి తగ్గిందని, ఇప్పుడు 0.03 పైసలకు దిగి వచి్చందని ఆయన తెలిపారు. మరోవైపు ప్రజలు మరింతగా బ్రాడ్బ్యాండ్ వినియోగించుకునేందుకు వీలుండేలా డివైజ్లను చౌకగా తయారు చేయడంపై దృష్టి పెట్టాలని డివైజ్, చిప్ల తయారీ కంపెనీలను మంత్రి కోరారు. -
ఐపీవో స్ట్రీట్ ...లిస్టింగ్కు కంపెనీల క్యూ
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు మళ్లీ సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తుండటంతో గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. వచ్చే వారం పలు దిగ్గజాలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానుండగా.. మరిన్ని కంపెనీలు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం.. రూ. 5,000 కోట్లకు రెడీ గత డిసెంబర్లో గోప్యతా విధాన పబ్లిక్ ఇష్యూ బాట పట్టిన విద్యా సంబంధ రుణాలందించే క్రెడిలా ఫిన్ సర్వీసెస్ సెబీకి తాజాగా అప్డేటెడ్ డాక్యుమెంట్లు అందించింది. గత నెలలో అనుమతి పొందిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధపడుతోంది. ఇష్యూలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ రూ. 1,050 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 600 కోట్ల సమీకరణపై కంపెనీ కన్నేసింది. దీంతో ఐపీవోలో ఇష్యూ పరిమాణం ఆ మేర తగ్గే అవకాశముంది. 2006లో ఏర్పాటైన కంపెనీ నిధులను భవిష్యత్లో బిజినెస్ వృద్ధికి అవసరమయ్యే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. విద్యా సంబంధ రుణాలపై అధికంగా దృష్టిసారించే ఎన్బీఎఫ్సీలో హెచ్డీఎఫ్సీ 2009లో ఇన్వెస్ట్ చేసింది. 2010 నుంచి హెచ్డీఎఫ్సీకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. అయితే 2023లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో మాతృ సంస్థ విలీనంకావడంతో ఈక్యూటీ, క్రిస్క్యాపిటల్ గ్రూప్లు ఉమ్మడిగా 2024 మార్చిలో 90 శాతం వాటాను కొనుగోలు చేశాయి. రూ. 1,500 కోట్లకు సై పునరుత్పాక ఇంధన రంగంలో కార్యకలాపాలు కలిగిన రేజన్ సోలార్ స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్కు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా గుజరాత్ కంపెనీ రూ. 1,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 300 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవో పరిమాణం తగ్గనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,265 కోట్లు సొంత అనుబంధ సంస్థ రేజన్ ఎనర్జీపై వెచి్చంచనుంది. తద్వారా 3.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏర్పాటవుతున్న సంస్థకు ఆర్థికంగా దన్నునివ్వనుంది. సోలార్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీలో కార్యకలాపాలు విస్తరించిన రేజన్ సోలార్ 2017లో ప్రారంభమైంది. 2025 మార్చికల్లా 6 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, మైక్రోటెక్ ఇంటర్నేషనల్, అక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్, వీగార్డ్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలకు సేవలందిస్తోంది. గతేడాది (కేలండర్ 2024)లో రూ. 1,957 కోట్ల ఆదాయం, రూ. 239 కోట్ల నికర లాభం ఆర్జించింది. వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ హోమ్ అండ్ ఫరీ్నíÙంగ్స్ కంపెనీ వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో రూ. 468 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా 5.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2016లో ఏర్పాటైన కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 145 కోట్లు ప్రస్తుత స్టోర్ల లీజ్తోపాటు, లైసెన్స్ ఫీజు చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 82 కోట్లు 117 కోకో రెగ్యులర్ స్టోర్లతోపాటు ఒక జుంబో స్టోర్ ఏర్పాటుకు, రూ. 15 కోట్లు కొత్త పరికరాలు, మెషీనరీ కొనుగోలుకీ వెచి్చంచనుంది. ఈ బాటలో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ఇతర వ్యయాలకు కేటాయించనుంది. 2023–24లో రూ. 986 కోట్లకుపైగా ఆదాయం సాధించింది. సుదీప్ ఫార్మా ఐపీవో బాట ఔషధ రంగ కంపెనీ సుదీప్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 1,00,76,492 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 76 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. గుజరాత్లోని నందెసారి యూనిట్లో ఉత్పత్తికి వీలుగా మెషీనరీ కొనుగోలుకి నిధులు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. 1989లో ఏర్పాటైన వడోదర సంస్థ సుదీప్ ఫార్మా ప్రధానంగా ఫార్మాస్యూటికల్, ఫుడ్ అంట్ న్యూట్రిషన్లో కార్యకలాపాలు విస్తరించింది. కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ విభాగంలో 100 రకాల ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫార్మా, ఫుడ్, న్యూట్రిషన్ పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. వడోదరలోగల మూడు యూనిట్ల ద్వారా మొత్తం 65,579 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ క్లయింట్ల జాబితాలో ఫార్మా రంగ దిగ్గజాలు ఫైజర్, ఇన్టాస్ ఫార్మా, మ్యాన్కైండ్ ఫార్మా, మెర్క్ గ్రూప్, క్యాడిలా ఫార్మా, మైక్రో ల్యాబ్స్తోపాటు ఫ్రెంచ్ దిగ్గజం గ్రూప్ దానోన్ చేరింది. గత క్యాలండర్ ఏడాది(2024)లో ఆదాయం రూ. 344 కోట్లను అధిగమించగా, దాదాపు రూ. 95 కోట్ల నికర లాభం ఆర్జించింది.రూ. 2,500 కోట్లపై చూపు దిగ్గజాలు టీపీజీ, ఫ్లిప్కార్ట్, మిరాయ్ అసెట్స్ తదితరాలకు పెట్టుబడులున్న ఈకామర్స్ కంపెనీ షాడోఫ్యాక్స్ వచ్చే వారం సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం తద్వారా రూ. 2,500 కోట్లవరకూ సమకూర్చుకునేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు కొత్తగా ఈక్విటీ జారీతోపాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను సామర్థ్య విస్తరణ, వృద్ధి, నెట్వర్క్పై వినియోగించనుంది. 2015లో ఏర్పాటైన కంపెనీ ఫిబ్రవరిలో సుమారు రూ. 6,000 కోట్ల విలువలో నిధులను సమీకరించింది. -
సింపుల్ యాప్లు.. సీక్రెట్గా దోచేస్తున్నాయ్..
ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్లలో ఏవేవో పదుల సంఖ్యలో యాప్లు ఉంటున్నాయి. వివిధ అవసరాల నిమిత్తం వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అధికారిక గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం ఇవేం హాని చేయవులే అనుకుంటున్నారా? హానిచేయనిదిగా కనిపించే యాప్ నిశ్శబ్దంగా మీ ఫొటోలను స్కాన్ చేస్తుంది. మీ డిజిటల్ లైఫ్కు సంబంధించిన ఆధారాల కోసం శోధిస్తుంది. ఆ యాప్ మీ మనీ వాలెట్లను టార్గెట్ చేస్తే.. ఇది ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ సాధారణ సెక్యూరిటీ గేట్లను దాటింది. ఇది సుదూర ముప్పు కాదు. ఇది ప్రస్తుతం జరుగుతోంది.రిస్క్తో కూడుకున్న వ్యవహారంచాలా మంది అధికారిక ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసే యాప్లను నమ్ముతారు. ఎందుకంటే ప్రమాదకర యాప్లను ఇవి తొలగిస్తాయని చెబుతుంటాయి. కానీ స్పార్క్ కిట్టీ అనే కొత్త మాల్వేర్ స్ట్రెయిన్ ఈ తనిఖీలను అధిగమించగలిగింది. భద్రతా పరిశోధకులు దీనిని మొదట 2025 ప్రారంభంలో గుర్తించారు. అప్పటి నుండి ఇవి సాధారణంగా కనిపించే యాప్లుగా మారిపోయాయి. వీటిని గుర్తించకముందే కొంతమంది వేల సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు.ఏం చేయాలంటే..ఈ ట్రిక్ సింపుల్ కానీ ఎఫెక్టివ్ గా ఉంటుంది. మెసేజింగ్ లేదా క్రిప్టో ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించే యాప్లలో స్పార్క్ కిట్టీ దాగి ఉంది. ఇన్ స్టాల్ చేసిన తర్వాత, ఇది మీ ఫోటోలను యాక్సెస్ చేయడానికి అనుమతి అడుగుతుంది. చాలా మంది యూజర్లు దీని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించరు. కానీ తెరవెనుక, మాల్వేర్ టెక్స్ట్ కోసం చిత్రాలను స్కాన్ చేయడానికి ఆప్టికల్ క్యారెక్టర్ గుర్తింపును ఉపయోగిస్తుంది.మీరు విశ్వసించే డెవలపర్ల నుంచి మాత్రమే యాప్లను డౌన్ లోడ్ చేయండి. ఇన్ స్టాల్ చేయడానికి ముందు యాప్ రివ్యూలు, వివరాలను తనిఖీ చేయండి. స్పష్టమైన కారణం లేకుండా మీ ఫోటోలు లేదా ఫైళ్లకు యాప్ యాక్సెస్ అడిగితే జాగ్రత్తగా ఉండండి. రికవరీ పదబంధాలు లేదా పాస్ వర్డ్ లను మీ ఫోటో గ్యాలరీలో ఎప్పుడూ స్టోర్ చేయవద్దు. సున్నితమైన డేటా కోసం ఎన్ క్రిప్టెడ్ స్టోరేజ్ లేదా పాస్ వర్డ్ మేనేజర్ ఉపయోగించండి. -
మేడ్చల్ క్లస్టర్ హవా.. ఆ స్థలాలకు ఫుల్ డిమాండ్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్లో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నగరంలో 51 లక్షల చ.అ. వేర్హౌస్ స్పేస్ లావాదేవీలు జరిగాయని నైట్ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ షాపింగ్కు పెరుగుతున్న ఆదరణ, లాస్ట్మైల్ డెలివరీ ఆవశ్యకత నేపథ్యంలో గిడ్డంగుల విభాగానికి దీర్ఘకాలిక డిమాండ్ ఉంటుందని తెలిపింది. వేర్హౌస్ లావాదేవీలలో తయారీ రంగం హవా కొనసాగుతోంది. 2024లో జరిగిన గిడ్డంగుల లీజులలో మ్యానుఫాక్చరింగ్ విభాగం వాటా 39 శాతం కాగా.. 3 పీఎల్ 21 శాతం, ఈ–కామర్స్ 17 శాతం, రిటైల్ రంగం 14 శాతం, ఎఫ్ఎంసీజీ 5 శాతం, ఎఫ్ఎంసీడీ 1 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.మేడ్చల్ క్లస్టర్ హవా.. నగరంలో మూడు క్లస్టర్లలో గిడ్డంగుల స్థలాలున్నాయి. మేడ్చల్ క్లస్టర్లో మేడ్చల్, దేవరయాంజాల్–గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, యెల్లంపేట్, శామీర్పేట్, పటాన్చెరు ఇండ్రస్టియల్ ఏరియా, రుద్రారం, పాశమైలారం, ఎదులనాగులపల్లి, సుల్తాన్పూర్, ఏరోట్రోపోలిస్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్నగర్.. ఆయా ప్రాంతాలలో గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19–21గా, గ్రేడ్–బీ అయితే రూ.16–19గా ఉంది. 👉 ఇదీ చదవండి: హైదరాబాద్లో భూముల ధరలు.. ఆకాశం వైపు..మేడ్చల్ క్లస్టర్లో వేర్హౌస్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలోని గిడ్డంగుల లావాదేవీలలో ఈ క్లస్టర్ వాటా 60 శాతం ఉండగా.. 2024 నాటికి 61 శాతానికి పెరిగింది. శంషాబాద్ క్లస్టర్లో క్షీణత, పటాన్చెరు క్లస్టర్లలో స్వల్ప వృద్ధి కనిపించింది. ఏడాది సమయంలో శంషాబాద్ వాటా 30 శాతం నుంచి 27 శాతానికి తగ్గగా.. పటాన్చెరు క్లస్టర్ వాటా 10 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది. డిమాండ్ ఎందుకంటే.. హైదరాబాద్ అనేక రంగాలు ప్రొడక్షన్ లింక్డ్ న్సెంటివ్(పీఎల్ఐ) స్కీమ్ కింద అనుమతులు పొందాయి. ప్రధానంగా సెల్ఫోన్ల తయారీ, ఆటో అనుబంధ రంగానికి చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటంతో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్ ఏర్పడిందని నైట్ఫ్రాంక్ ఇండియా నివేదికలో తెలిపింది. -
ఉద్యోగాలు పెరగాలంటే.. ఎన్సీఏఈఆర్ కీలక సూచన
కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే రంగాల్లో ఉపాధిని పెంచేందుకు నైపుణ్య కల్పనపై పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక మేధో సంస్థ ఎన్సీఏఈఆర్ సూచించింది. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో, 2030 నాటికి 13 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది. వివిధ రంగాల మధ్య అంతర్గత అనుసంధానత కల్పించడం ఉపాధి కల్పనపై ఎన్నో అంచల సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది.దీనివల్ల 200 శాతం మేర ఉపాధి అవకాశాలను పెంచొచ్చని సూచించింది. తయారీ రంగంలో కార్మికులపై ఆధారపడిన ఉత్పత్తి 44.1 శాతంగా ఉంటుందని.. సేవల్లో కార్మికుల ఆధారితమైనవి 54.2 శాతంగా ఉంటాయని వివరించింది. తయారీ, సేవల పరి మాణాన్ని పెంచడం ద్వారా ఈ రంగాల్లో కార్మికులకు మరింత ఉపాధి కల్పించొచ్చని సూచించింది. 2030 నాటికి భారత్లో 63% ఉద్యోగులకు నైపుణ్యాల పెంపు అవసరం ఉంటుందని అంచనా. పన్నులు తగ్గించాలి.. కార్మికులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం అధిక మూలధన వ్యయాలు చేయాలని, పన్నులు తగ్గించాలని ఎన్సీఏఈఆర్ నివేదిక సూచించింది. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అత్యుత్తమ ప్రమాణాలను అందిపుచ్చుకోవాలంటూ.. కార్మికులకు శిక్షణ, నైపుణ్య కల్పనపై జాతీయ ప్రమాణాల కార్యాచరణను అమలు చేయాలని పేర్కొంది. భారత్లో తయారీని పెంచేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎల్ఐ పథకాన్ని ప్రస్తావించింది. అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీని పెంచడంపై ఈ పథకం ప్రధానంగా దృష్టి పెట్టిందంటూ.. ఇందుకు అధిక నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.పీఎల్ఐ పథకం కింద ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్లో అధిక ఉపాధి అవకాశాల కల్పన జరిగినట్టు చెప్పింది. బడ్జెట్లో పీఎల్ఐకి చేసిన కేటాయింపులు, వాస్తవ ఉపాధి కల్పన సామర్థ్యం మధ్య అంతరం ఉన్నట్టు పేర్కొంది. కార్మికుల నైపుణ్యం పెంపునకు వీలుగా ఉత్పాదకత, నాణ్యత గణనీయంగా పెంచాల్సి ఉంటుందని తెలిపింది. సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ విజ్ఞానం, ఐసీటీ నైపుణ్యాలను శిక్షణ కార్యక్రమాల్లో భాగం చేయాలని ఈ నివేదిక సూచించింది. శిక్షణ నాణ్యత పెంచడం, సంఘటిత రంగంలో కార్మికుల సంఖ్యను ఇతోధికం చేయడం ద్వారా అధిక ఉపాధి కల్పన లక్ష్యాలను సాధించొచ్చని అభిప్రాయపడింది. -
మనీ రూల్స్ మారుతున్నాయ్.. జూలైలో కొత్త మార్పులు
జూన్ నెల ముగుస్తోంది.. ఇక జూలై నెల ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సంబంధిత నిబంధనలు కొన్ని మారుతున్నాయి.. కొత్త మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు మొదలుకొని పెద్ద వ్యాపార సంస్థల వరకూ ప్రభావితం చేసే అవకాశం ఉంది.సవరించిన యూపీఐ చార్జ్ బ్యాక్ నిబంధనలు, కొత్త తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ నిబంధనలు, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ అవసరం వంటి కొన్ని మనీ రూల్స్, మార్పులు జూలై నుంచి అమలవుతున్నాయి.యూపీఐ ఛార్జ్ బ్యాక్ నిబంధనలుఈ ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఇటీవల యూపీఐ ఛార్జ్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు ప్రకటించింది.ప్రస్తుత విధానం ప్రకారం, ఛార్జ్ బ్యాక్ అభ్యర్థన తిరస్కరణకు గురైనప్పుడు, చట్టబద్ధమైన సందర్భాల్లో కూడా యూపీఐ రిఫరెన్స్ కంప్లయింట్స్ సిస్టమ్ (యూఆర్సీఎస్) ద్వారా కేసును వైట్లిస్ట్ చేయడానికి బ్యాంక్ ఎన్పీసీఐని సంప్రదించాల్సి ఉండేది.జూన్ 20న చేసిన ప్రకటన ప్రకారం.. ఇటువంటి సందర్భాల్లో ఇకపై ఎన్పీసీఐ జోక్యం అవసరం లేదు. ఎన్పీసీఐ నుండి అనుమతి కోసం వేచి ఉండకుండా ఆర్థిక సంస్థలు నేరుగా ప్రామాణిక తిరస్కరణకు గురైన ఛార్జ్ బ్యాక్ లను రీప్రాసెసింగ్ కు అర్హులుగా వర్గీకరించవచ్చు.కొత్త పాన్ కార్డులకు ఆధార్ తప్పనిసరిజూలై 1 నుంచి కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇంతకుముందు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఏదైనా చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డ్, జనన ధృవీకరణ పత్రం ఉంటే సరిపోయేది. కానీ జూలై 1 నుంచి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్జూలై నుంచి పలు తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. జూలై 1 నుండి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా దాని మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ రైలు టిక్కెట్లకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి.జూలై 15 నుంచి తత్కాల్ రైలు టికెట్ బుకింగ్స్కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) అవసరం. అంటే టికెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగదారుల ఫోన్లకు ఒక కోడ్ వస్తుంది. కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) కౌంటర్లలో బుక్ చేసుకునే తత్కాల్ టికెట్లకు కూడా ఓటీపీ అథెంటికేషన్ అవసరం.తత్కాల్ టికెట్ల బుకింగ్కు సంబంధించి అధీకృత టికెటింగ్ ఏజెంట్లకు భారతీయ రైల్వే సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. బుకింగ్ విండో తెరిచిన మొదటి 30 నిమిషాలు వారు టికెట్లు బుక్ చేయలేరు. ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లకు ఉదయం 10:00 గంటల నుంచి 10:30 గంటల వరకు, నాన్ ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లకు ఉదయం 11:00 గంటల నుంచి 11:30 గంటల వరకు పరిమితి ఉంటుంది.జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ నిబంధనలుజూలై నుండి నెలవారీ జీఎస్టీ చెల్లింపు ఫారం జిఎస్టిఆర్ -3 బి ఎడిట్ చేసేందుకు వీలుండదని జీఎస్టీఎన్ జూన్ 7న ప్రకటించింది. అలాగే గడువు తేదీ నుంచి మూడేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయడానికి కూడా అవకాశం ఉండదని జీఎస్టీఎన్ తెలిపింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఫీజు, రివార్డు మార్పులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ రివార్డ్స్ ప్రోగ్రామ్కు కొత్త క్రెడిట్ కార్డు ఫీజులు, అప్డేట్లను ప్రకటించింది. ఇవి జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. రూ.10,000 కంటే ఎక్కువ నెలవారీ ఖర్చులపై 1% రుసుము, రూ .50,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లు చెల్లింపులు, రూ .10,000 కంటే ఎక్కువ ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలు, అద్దె చెల్లింపులు, రూ .15,000 ఇంధన చెల్లింపులు, థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే విద్య సంబంధిత చెల్లింపులు ఈ మార్పులలో ఉన్నాయి. ఈ ఛార్జీలను గరిష్టంగా రూ.4,999గా నిర్ణయించారు. అలాగే ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలకు రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉండవు. బీమా రివార్డ్ పాయింట్లపైనా నెలవారీ పరిమితి ఉంటుంది. -
హైదరాబాద్లో భూముల ధరలు.. ఆకాశం వైపు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ(కేపీహెచ్బీ)లో నిర్వహించిన బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నగరాలలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. కేపీహెచ్బీలో చదరపు గజం ధర రూ.2.98 లక్షలకు అమ్ముడుపోయింది.ఐటీ హబ్కు చేరువలో ఉండటం వల్లే ఈ భూములకు అత్యధిక డిమాండ్ ఉందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. నగరంలో ఐటీ నిపుణులు, సంస్థలను ఆకర్షిస్తూనే ఉంది. గృహాలు, ఆఫీసు స్థలాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే ఇన్వెంటరీ, అందుబాటుకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. హైటెక్ సిటీ నుంచి 40 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉన్న ప్రాంతాలలో బ్రాండెడ్ డెవలపర్లు కానీ ప్రాజెక్ట్లలో కూడా అపార్ట్మెంట్ల ధరలు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉన్నాయంటే డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. మెరుగైన మౌలిక వసతులు మౌలిక సదుపాయాల విస్తరణ, కనెక్టివిటీ, కొత్త మెట్రో లైన్లు, ఎక్స్ప్రెస్ వేస్, ఐటీ పార్క్లతో నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. దీంతో నగరంలో స్థిరాస్తి పెట్టుబడి అవకాశాలు బాగా పెరిగాయి. ప్రధాన వాణిజ్య కేంద్రాలకు చేరువలో ఉన్న ప్రాంతాలలో, మెరుగైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో భూముల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అలాగే ప్రణాళికాబద్ధమైన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. నగరం శివారు ప్రాంతాల వైపు విస్తరిస్తుండటంతో కాలనీ, గేటెడ్ కమ్యూనిటీలు పెట్టుబడులను ఆకర్షించే కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.👉 ఇదీ చదవండి: మేడ్చల్ క్లస్టర్ హవా.. ఆ స్థలాలకు ఫుల్ డిమాండ్ -
హైదరాబాద్లో ఎన్హెచ్ఆర్డీ నెట్వర్క్ కార్యాలయం
హైదరాబాద్: నేషనల్ హెచ్ఆర్డీ నెట్వర్క్ (ఎన్హెచ్ఆర్డీఎన్) హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో తన అత్యాధునిక కార్యాలయాన్ని శనివారం ప్రారంభించింది. ఇది దేశవ్యాప్తంగా మానవ వనరుల అభివృద్ధి విషయంలో మరింత ముందుకు వెళ్లడం, ఎక్స్లెన్స్, సృజనాత్మకత, సుస్థిరాభివృద్ధి దిశగా తన కృషిని చాటడంలో ఎన్హెచ్ఆర్డీఎన్ నిబద్ధతకు ఒక నిదర్శనం.నాయకత్వం, అభివృద్ధి, వృత్తిగత సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఇది ఒక కేంద్ర కార్యాలయంగా రూపొందుతుందని ఎన్హెచ్ఆర్డీఎన్ హైదరాబాద్ విభాగం ప్రారంభించిన ఈ కలల ప్రాజెక్టు సూచిస్తోంది. అందరికీ ఉపయోగపడే ప్రాంతం, చర్చలకు ప్రోత్సాహం, నిరంతర అభ్యాసం, వివిధ రంగాల్లోని హెచ్ఆర్ నిపుణుల మధ్య పరస్పర విధానాల మార్పిడి లాంటి వాటన్నింటికీ ఇది ఒక చక్కటి వేదికగా నిలిచేలా అద్భుతంగా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు.దేశంలో బలమైన మానవ పెట్టుబడి పునాది వేయడానికి తమ సమిష్టి కృషికి నిదర్శనంగా ఈ కొత్త కేంద్రం నిలుస్తుందని ఎన్హెచ్ఆర్డీఎన్ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ విపుల్ సింగ్ అన్నారు. హెచ్ఆర్ వృత్తినిపుణులకు ఇది ఒక డైనమిక్ వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మారుతున్న పని వాతావరణం నేపథ్యంలో ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పంచుకోవడం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత కీలకమని వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న హెచ్ఆర్ నిపుణులు వృత్తిపరంగా ఎదిగేందుకు తాము గణనీయంగా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ కొత్త భవనం వల్ల కలిగే విస్తృత ప్రభావం గురించి ఎన్హెచ్ఆర్డీఎన్ జాతీయాధ్యక్షుడు ప్రేమ్ సింగ్ ఇలా వివరించారు. "నైపుణ్యాలు, నాయకత్వాలను పోషించాలన్న ఎన్హెచ్ఆర్డీఎన్ జాతీయ నిబద్ధతను ఈ హైదరాబాద్ కార్యాలయ ప్రారంభం ప్రతిబింబిస్తుంది. హెచ్ఆర్ వృత్తి నిపుణులకు సాధికారత కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. తద్వారా ఇది వివిధ సంస్థలను, దేశవ్యాప్తంగా సమాజాన్ని కూడా బలోపేతం చేస్తుంది" అని చెప్పారు.ఎన్హెచ్ఆర్డీఎన్ భవన ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్హెచ్ఆర్డీఎన్ మాజీ అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు , ఇంకా పలువురు విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఫిజిక్స్వాలా డిజిటల్ యూనివర్సిటీ
గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో సీఎస్సీ అకాడమీతో (సీఎస్సీఏ)తో ఎడ్యుకేషన్ కంపెనీ ఫిజిక్స్వాలా చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇది అక్రెడిటెడ్ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రాంలు, సర్టిఫికేషన్లు అందిస్తుంది.బోధన కోసం కేంద్ర ఐటీ శాఖలో భాగమైన కామన్ సర్వీసెస్ సెంటర్లు (సీఎస్సీ) డిజిటల్ లెర్నింగ్ సెంటర్లుగా పని చేస్తాయి. అలాగే, ఫిజిక్స్వాలా సంస్థ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ విధానాల్లో కూడా అందిస్తుంది. సైబర్సెక్యూరిటీ, కృత్రిమ మేథ వంటి అంశాల్లో నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణనివ్వడం, సమిష్టిగా కోర్సులు .. సర్టిఫికెట్ ప్రోగ్రాంలను రూపొందించడం మొదలైనవి ఈ భాగస్వామ్య లక్ష్యంగా ఉంటాయి. -
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో జోరు
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పడు ఆఫీస్ స్పేస్ లీజింగ్ 23 శాతం అధికంగా 32 లక్షల చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లీజింగ్ పరిమాణం 26 లక్షల ఎస్ఎఫ్టీగా ఉంది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లోనూ స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 11 శాతం పెరిగి 178 లక్షల ఎస్ఎఫ్టీగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా ఒక నివేదిక రూపంలో వెల్లడించింది.అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ కార్పొరేట్ల నుంచి లీజింగ్కు మంచి డిమాండ్ కనిపించినట్టు తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఏడు నగరాల్లో స్థూల ఆఫీసు లీజింగ్ 161 లక్షల ఎస్ఎఫ్టీగా ఉంది. హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, పుణెలో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరగ్గా.. ఒక్క ముంబైలో మా త్రం తగ్గింది. ఈ గణాంకాల్లో లీజు పునరుద్ధరణ లు, ముందస్తు హామీలు, ఆసక్తి వ్యక్తీకరణలకు సంబంధించి డేటా లేదని కొలియర్స్ స్పష్టం చేసింది. నగరాల వారీ లీజింగ్.. బెంగళూరులో 48 లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 48 లక్షల ఎస్ఎఫ్టీగానే ఉండడం గమనించొచ్చు.చెన్నైలో క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే 30 శాతం అధికంగా 26 లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది.ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 16 శాతం వృద్ధితో 22 లక్షల ఎస్ఎఫ్టీగా ఉంది.కోల్కతాలో లీజింగ్ 3 లక్షల నుంచి 6 లక్షల చదరపు అడుగులకు దూసుకెళ్లింది.పుణె నగరంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 60 శాతం పెరిగి రూ.16 లక్షల చదరపు అడుగులకు చేరింది.ముంబైలో మాత్రం ఆఫీస్ స్పేస్ లీజింగ్ 28 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 35 లక్షల చదరపు అడుగులతో పోల్చి చూసినప్పుడు 20 శాతం తగ్గింది.ఈ ఏడు పట్టణాల్లో కలిపి 175 లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్కు గాను 135 లక్షల ఎస్ఎఫ్టీని కార్పొరేట్లు తీసుకున్నారు. 43 లక్షల ఎస్ఎఫ్టీని కోవర్కింగ్ ఆపరేటర్లు తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రోత్సాహకరమే ‘‘భారత ఆఫీస్ మార్కెట్ 2025లోనూ వృద్ధి దశలో ఉంది. గత రెండు సంవత్సరాలుగా నమోదవుతున్న సానుకూల ధోరణికి అనుగుణంగానే ఉంది. స్థిరమైన సరఫరా, లీజుదారుల పరంగా వైవిధ్యం మద్దతుతో 2025 సంవత్సరం వాణిజ్య రియల్ ఎసేŠట్ట్ మార్కెట్కు ప్రోత్సాహకరంగా ఉండనుంది. మొత్తంమీద ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఈ ఏడాది చివరికి 65–70 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోవచ్చు’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ అర్పిత్ మల్హోత్రా తెలిపారు. -
జూలైలో ‘సిల్వర్ బాంబ్’.. వెండిపై ‘రిచ్డాడ్ పూర్డాడ్’ రచయిత
అత్యధికంగా అమ్ముడైన పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అద్భుతమైన జోస్యం చెప్పారు. ఇది వెండిపై పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కియోసాకి తన అధికారిక హ్యాండిల్లో పేర్కొన్నారు.కియోసాకి వెండిని ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'గా అభివర్ణించారు. దాని అధిక రివార్డ్-టు-రిస్క్ సామర్థ్యాన్ని ఉదహరించారు."వెండి ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'. అంటే తక్కువ ప్రతికూల రిస్క్తో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయి' అని రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో పేర్కొన్నారు.వైట్ మెటల్ తక్కువ ప్రతికూల రిస్క్ తో ఎక్కువ లాభాలను కలిగి ఉందని ఆయన వివరించారు. "ఈ రోజు ప్రతి ఒక్కరూ వెండిని కొనగలరు... కానీ రేపు కాదు" అన్నారు. తన సందేశాన్ని "గొప్ప పాఠం"గా అభివర్ణిస్తూ, తనను అనుసరించేవారికి గుర్తు చేశారు. "మీరు కొనుగోలు చేసినప్పుడు లాభాలు వస్తాయి... అమ్మినప్పుడు కాదు" అని సూచించారు.వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో కియోసాకి ప్రకటన వెండి సమీప కదలికపై దృష్టిని మరింత పెంచింది. చాలా మంది ఇప్పుడు జూలైని నిశితంగా గమనిస్తున్నారు. విలువైన లోహాల మార్కెట్ ను గమనిస్తున్న విశ్లేషకులు కూడా వెండి జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. REMINDER: Rich Lesson:“Your profits are made when you buy…. Not when you sell.”Silver is the best “asymmetric buy” today. That means more possible upside gain with little down side risk.Silver price will explode in July, Everyone can afford silver today… but not…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 27, 2025 -
‘బ్యాంకులు అప్పులు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి’
కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ అర శాతం తగ్గించడాన్ని అవకాశంగా అందిపుచ్చుకుని, ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. పీఎస్బీల రుణ వృద్ధి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో లేదా అంతకు మించిన స్థాయిలో రుణ వృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి సూచించినట్లు వారు వివరించారు. పీఎస్బీల ఆర్థిక పనితీరును సమీక్షించేందుకు ఆయా బ్యాంకుల చీఫ్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ఆర్థిక సమ్మిళితత్వం సాధించేందుకు ప్రభుత్వ పథకాల్లో మరింత మంది కస్టమర్లను చేర్చేందుకు కృషి చేయాలని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచనతక్కువ వ్యయాలతో కూడుకున్న డిపాజిట్లను సమీకరించే మార్గాలు అన్వేషించాలని మంత్రి సూచించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం ముద్రా, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన తదితర పథకాల పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 12 పీఎస్బీల మొత్తం లాభం 26 శాతం వృద్ధి చెంది రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది. -
నెల రోజుల్లో 43 లక్షల కొత్త కనెక్షన్లు
దేశీయంగా మే నెలలో టెలికం యూజర్ల సంఖ్య స్వల్పంగా 43,58,231 మేర పెరిగి 120.7 కోట్లకు చేరింది. కొత్త యూజర్లలో సింహభాగం 99.84 శాతం వాటాను (43,51,294 కనెక్షన్లు) రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ దక్కించుకున్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5జీ ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ విభాగంలో రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య నికరంగా 27 లక్షల కొత్త కస్టమర్లతో 47.24 కోట్లకు చేరింది. 40.92 శాతం మార్కెట్ వాటా ఉంది.ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచనభారతీ ఎయిర్టెల్ సబ్ర్స్కయిబర్స్ సంఖ్య నికరంగా 2.75 లక్షలు పెరిగి 39 కోట్లకు చేరగా, 33.61 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. అయితే సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియా 2.74 లక్షల మంది, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 1.35 లక్షలు, ఎంటీఎన్ఎల్ 4.7 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి. వైర్లైన్ సెగ్మెంట్లో జియో కొత్త యూజర్ల సంఖ్య 12.76 లక్షలు, ఎయిర్టెల్ యూజర్లు 99,000, టాటా టెలీసర్వీసెస్ సబ్స్క్రైబర్స్ 4,890, వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య 1,795 పెరిగింది. ప్రభుత్వ రంగ ఎంటీఎన్ఎల్ అత్యధికంగా 66,834 మంది, బీఎస్ఎన్ఎల్ 46,000 మంది కస్టమర్లను కోల్పోయాయి. దేశీయంగా మొత్తం ల్యాండ్లైన్ కనెక్షన్లు 3.34 శాతం పెరిగి 3.86 కోట్లకు, మొబైల్ కనెక్షన్లు 116.84 కోట్లకు చేరాయి. ఏప్రిల్లో మొత్తం యూజర్ల సంఖ్య 120.3 కోట్లు. -
ఐటీ అధికారులకు సీబీడీటీ సూచన
ఆదాయ పన్ను రిటర్నుల స్క్రూటినీ విషయంలో సహేతుకమైన, నిర్దిష్టమైన ప్రశ్నలు వేయాలని, అసంబద్ధమైన ప్రశ్నలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆదాయ పన్ను శాఖ అధికారులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) సూచించింది. ఈ విషయాల్లో అసెసింగ్ అధికారులను సమర్ధవంతంగా పర్యవేక్షించాలని ప్రాంతీయ హెడ్స్కి (ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్స్ – పీసీసీఐటీ) పంపిన లేఖలో సీబీడీటీ చైర్మన్ రవి అగ్రవాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడునోటీసులు, అసెస్మెంట్ ఆర్డర్లు సక్రమంగా ఉండేలా చూసే బాధ్యత ప్రత్యక్షంగా అసెస్మెంట్ యూనిట్ హెడ్స్ (అడిషనల్ లేదా జాయింట్ కమిషనర్లు) మీదే ఉంటుందని అగ్రవాల్ తెలిపారు. పీసీసీఐటీలు మధ్యమధ్యలో అసెసింగ్ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఉండాలని, సూచనలను పునరుద్ఘాటిస్తూ ఉండాలని, నిబంధనలను పాటిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేసేందుకు ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలని సీబీడీటీ పేర్కొంది. స్క్రూటినీ, అసెస్మెంట్ ఆర్డర్ల నాణ్యతకు సంబంధించి నెలవారీ అప్డేట్ ఇవ్వాలని సూచించింది. -
ప్రమాదాలు జరగకుండా ‘స్కార్పియో’లో కొత్త ఫీచర్లు
మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ స్కార్పియో-ఎన్ ఎస్యూవీకి లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దాంతోపాటు రూ.20.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన కొత్త జెడ్ 8 టీ వేరియంట్ను కూడా విడుదల చేసింది. స్కార్పియో-ఎన్ను ప్రవేశపెట్టి మూడేళ్ల అయినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది ఈ సిరీస్ కస్టమర్లను సంపాదించుకున్నట్లు పేర్కొంది.కొత్తగా తీసుకొచ్చిన లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్)ను జెడ్ 8 ఎల్ వేరియంట్లో ప్రవేశపెడుతున్నట్లు ఎం అండ్ ఎం చెప్పింది. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో, స్మార్ట్ పైలట్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను ఇది కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్లు డ్రైవర్ అవగాహనను పెంచేందుకు, ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించడం లక్ష్యంగా ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడుఅదనంగా మహీంద్రా తన ఐసీఈ ఎస్యూవీ ఇంజిన్లో స్పీడ్ లిమిట్ అసిస్ట్, ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ అనే రెండు కొత్త ప్రత్యేక ఫీచర్లను ప్రవేశపెట్టింది. వెహికిల్ నిర్దిష్టమైన వేగాన్ని దాటినప్పుడు స్పీడ్ లిమిట్ అసిస్ట్ యాక్టివ్ అయి డ్రైవర్కు సమాచారం తెలియజేస్తుంది. సింగిల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా క్రూయిజ్ కంట్రోల్ సెట్టింగ్ను వాడుకోవచ్చు. ఫ్రంట్ వెహికల్ స్టార్ట్ అలర్ట్ ద్వారా ముందున్న వాహనం కదలడం ప్రారంభిస్తే వీడియో, ఆడియో ఫీడ్ బ్యాక్ను అందిస్తుంది. ఇది ట్రాఫిక్లో చాలా ఉపయోగపడుతుందని కంపెనీ చెప్పింది. -
కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖ పడుతోంది. నాలుగు రోజులుగా క్రమంగా పడిపోతున్న పుత్తడి ధరలు శుక్రవారంతో పోలిస్తే శనివారం కూడా తగ్గాయి. దాంతో ఇంకెంత పడుతుందోనని బంగారం ప్రియులు వేచి చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడు(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడు
పేదరికంలో పుట్టిన ఓ బాలుడు ముక్కపచ్చలారని వయసులో ఉదయాన్నే లేచి పాలు పోసి గడియారం తొమ్మిది కొట్టిందటే ఠంచనుగా బ్యాగ్ భుజాన వేసుకొని స్కూల్ వెళ్లి చదుకునేవాడు. తాను ఉంటున్న ప్రాంతంలో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా దాదాపు రోజూ 7-8 కిలోమీటర్ల దూరం నడిచేవాడు. పండగల తోటి స్నేహితులు సరదాగా గుడుపుతుంటే తాను మాత్రం బాణసంచా విక్రయిస్తూ కుటుంబ పోషణలో భాగమయ్యేవాడు. విధి తన కష్టాలను గుర్తించింది. ఓ అవకాశం కల్పించింది. దాంతో ప్రస్తుతం తాను దాదాపు రూ.10,790 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు.రిజ్వాన్ సాజన్ ముంబయిలోని ఘట్కోపర్లో పేద కుటుంబంలో జన్మించారు. ఓ స్టీల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తన తండ్రి నెలకు రూ.7,000 సంపాదించేవాడు. రిజ్వాన్ తండ్రికి నలుగురు సంతానం. కుటుంబ పోషణకు ఆయన సంపాదన ఏమాత్రమూ సరిపోయేది కాదు. ఎలాగోలా నెట్టుకొచ్చేవారు. ఉన్నట్టుండి కుటుంబ పెద్ద, రిజ్వాన్ తండ్రి అకాల మరణం చెందారు. ఆ సమయంలో రిజ్వాన్కు ఏమి పాలుపోలేదు. కుంటుంబ భారం అంతా తనపై పడింది. ఏదోఒక పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. తాను ఉంటున్న ప్రాంతంలో పాలు పోయడం ప్రారంభించాడు. నిత్యం 7 నుంచి 8 కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణించేవాడు. స్కూల్ ఫీజు కట్టలేక మధ్యలోనే బడి మానేశాడు. పండగ రోజుల్లో వీధుల్లో బాణసంచా విక్రయించేవాడు.మేనమామ సాయం1981లో తన మేనమామ సాయంతో రిజ్వాన్ పని కోసం కువైట్ వెళ్లారు. అక్కడ ఒక సాధారణ భవన నిర్మాణ సామగ్రి దుకాణంలో ట్రయినీ సేల్స్ మ్యాన్గా చేరారు. నెలకు అప్పటి లెక్కల ప్రకారం..రూ.18,000 వచ్చేవి. క్రమంగా ఉద్యోగంలో ఎదుగుతూ ఒక దశాబ్దంలో సేల్స్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 1990లో గల్ఫ్ యుద్ధం కారణంగా కువైట్ నుంచి రావాల్సిన పరిస్థితి ఎదురైంది.దుబాయ్లో..కువైట్ నుంచి దుబాయ్ వచ్చిన రిజ్వాన్ ఒక బ్రోకరేజ్ సంస్థలో చేరారు. నిర్మాణ సామగ్రిలో నిరుపయోగం అవుతున్న కొన్ని వస్తువులకు సంబంధించిన అంశాలను గుర్తించారు. 1993లో కొంత పెట్టుబడితో సొంతంగా డాన్యూబ్ పేరుగో రియిల్ఎస్టేట్ వెంచర్ను స్థాపించారు. క్రమంగా ఎదిగి దాన్ని 1.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,790 కోట్లు) వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. ఈ కంపెనీ కింది రంగాల్లో సేవలందిస్తోంది.బిల్డింగ్ మెటీరియల్స్రియల్ ఎస్టేట్, లగ్జరీ టవర్స్హోమ్ అలంకరణమిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులుఇదీ చదవండి: వడ్డీరేట్లు సవరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్దాతృత్వ కార్యక్రమాలురిజ్వాన్ సాజన్ దాతృత్వ కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. డాన్యూబ్ వెల్ఫేర్ సెంటర్ ద్వారా ఉచిత న్యాయ సహాయం, మెంటల్ కౌన్సెలింగ్, ఆర్థిక అక్షరాస్యత వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. భారత్, యూఏఈల్లోని నిరుపేద పిల్లలకు స్కాలర్షిప్లు అందిస్తున్నారు. పాఠశాలల మౌలికసదుపాయాలకు నిధులు సమకూరుస్తున్నారు. అల్పాదాయ కుటుంబాలకు ముఖ్యంగా క్రిటికల్ ఇల్నెస్ ఉన్న పిల్లలకు వైద్య చికిత్సలకు సాయం చేస్తున్నారు. -
వడ్డీరేట్లు సవరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లను మరోసారి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 25, 2025 నుంచి బ్యాంక్ రూ.3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సింగిల్ ఎఫ్డీ కాలపరిమితిపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. 2025 జూన్ 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. అందుకు అనుగుణంగా బ్యాంకు కూడా తన కస్టమర్లకు వడ్డీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.ఏ ఎఫ్డీ ప్రభావితం అవుతుందంటే..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15 నెలల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై వడ్డీ రేటును 18 నెలలకు తగ్గించింది. గతంలో ఈ రేటు సాధారణ కస్టమర్లకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతంగా ఉండేది. ఇప్పుడు సాధారణ కస్టమర్లకు 6.35 శాతం, సీనియర్లకు 6.85 శాతంగా ఉంది. బ్యాంక్ సాధారణ ప్రజలకు (18 నెలల నుంచి 21 నెలల కంటే తక్కువ కాలపరిమితి ఉంటే) 2.75% నుంచి 6.60% వరకు, సీనియర్ సిటిజన్లకు రూ .3 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3.25% నుంచి 7.10% వరకు ఎఫ్డీ రేట్లను అందిస్తుంది.ముందస్తు ఉపసంహరణకు జరిమానాఎఫ్డీని ముందుగా నిర్ణయించిన కాలపరిమితి కంటే ముందుగానే విత్డ్రా చేస్తే బ్యాంక్ జరిమానా వసూలు చేస్తుందని గుర్తుంచుకోవాలి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిబంధనల ప్రకారం మెచ్యూరిటీకి ముందే ఎఫ్డీని ఉపసంహరించుకుంటే మీ డబ్బు బ్యాంకులో ఉన్న కాలానికి వర్తించే రేటు కంటే 1% తక్కువగా పొందుతారు.ఇదీ చదవండి: విదేశీ వర్సిటీతో అపోలో మెడ్స్కిల్స్ జట్టుసేవింగ్స్ ఖాతా రేట్లు ఇలా..ఎఫ్డీ రేటు తగ్గింపుతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అన్ని పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును తగ్గించింది. జూన్ 24, 2025 నుంచి పొదుపు రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింది. అంటే అన్ని సంవత్సరానికి 2.75% నుంచి 2.50%కి వడ్డీరేట్లను చేర్చింది. పొదుపు ఖాతా వడ్డీని రోజువారీగా లెక్కించి ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు.రికరింగ్ డిపాజిట్లపై ఇలా..బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) వడ్డీ రేట్లు డిపాజిట్ వ్యవధిని బట్టి సాధారణ కస్టమర్లకు 4.25% నుంచి 6.60%, సీనియర్ సిటిజన్లకు 4.75% నుంచి 7.10% మధ్య ఉంటాయి. ఈ రేట్లు 2025 జూన్ 10 నుంచి అమల్లో ఉన్నాయి. -
విదేశీ వర్సిటీతో అపోలో మెడ్స్కిల్స్ జట్టు
తక్కువ ఫీజుతో విదేశాల్లో వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చే దిశగా ఉజ్బెకిస్తాన్కి చెందిన జార్మెడ్ యూనివర్సిటీతో అపోలో మెడ్స్కిల్స్ చేతులు కలిపింది. దీనితో ట్యూషన్ ఫీజు, హాస్టల్, ఆహారం మొదలైనవన్నీ కలిపి రూ.32 లక్షలకి ఆరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును చదివే వీలుంటుందని అపోలో మెడ్స్కిల్స్ సీఈవో శ్రీనివాస రావు పులిజాల శుక్రవారమిక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు.ఇదీ చదవండి: పోస్టాఫీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులుఈ భాగస్వామ్య ఒప్పందం కింద మన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణమైన పాఠ్యాంశాలను, ఇంగ్లీషులో బోధించేలా భారతీయ అధ్యాపకులను అపోలో మెడ్స్కిల్స్ సమకూరుస్తుంది. అలాగే అక్కడ విద్యాభ్యాసం తర్వాత, భారత్లో లేదా అమెరికా, బ్రిటన్లో లైసెన్సింగ్ పరీక్షల కోసం కూడా శిక్షణ కల్పిస్తున్నట్లు శ్రీనివాసరావు వివరించారు. డాక్టర్ చదువు కోసం ఏటా లక్ష మంది వరకు విద్యార్థులు విదేశాల బాట పడుతున్న నేపథ్యంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
త్వరలో జియోహాట్స్టార్ నెట్ఫ్లిక్స్ను దాటనుందా?
అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్కి జియోహాట్స్టార్ అత్యంత చేరువలో ఉంది. డిసెంబర్ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం నెట్ఫ్లిక్స్కి 19 దేశాల్లో 30.16 కోట్ల మంది సబ్స్క్రైబర్లు+ ఉండగా ప్రస్తుతం జియోహాట్స్టార్ మొత్తం యూజర్ల సంఖ్య 30 కోట్లకు చేరింది. ఫిబ్రవరిలో 5 కోట్లుగా ఉన్న సబ్స్క్రైబర్ల స్కయిబర్స్ సంఖ్య భారీగా పెరగడానికి ఇటీవల ముగిసిన టాటా ఐపీఎల్ క్రికెట్ లీగ్ కారణంగా నిలిచింది. డిస్నీప్లస్హాట్స్టార్, రిలయన్స్కి చెందిన జియోసినిమా విలీనంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పాటైన జియోస్టార్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఐపీఎల్ తాజా ఎడిషన్కి డిజిటల్ వ్యూయర్షిప్ 65.2 కోట్ల స్థాయిని దాటగా, టీవీలో వ్యూయర్షిప్ 53.7 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: పోస్టాఫీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులుజియోహాట్స్టార్ ఎదుగుదలకు కారణమేంటి?ఐపీఎల్ 2025: క్రికెట్ టోర్నమెంట్ గేమ్ ఛేంజర్గా ఈ ఈవెంట్ నిలిచింది. 65.2 కోట్ల డిజిటల్ వీక్షకులను ఇది ఆకర్షించింది. మొదటిసారి టీవీ వ్యూయర్షిప్ను అధిగమించింది.విలీనం: జియో సినిమా, డిస్నీ+ హాట్స్టార్లను జియోహాట్స్టార్లోకి విలీనం చేయడం కంటెంట్, డిస్ట్రిబ్యూషన్ జోష్ను సృష్టించింది.డివైజ్ రీచ్: 104 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ డౌన్లోడ్లున్నాయి.ప్రకటనలు: ఐపీఎల్ సీజన్లో 40 కేటగిరీల్లో 425 మంది అడ్వర్టైజర్లను సొంతం చేసుకుంది. -
పోస్టాఫీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులు
దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో ఆగస్టు నుంచి డిజిటల్ చెల్లింపులను స్వీకరించే విధానం అందుబాటులోకి రానుంది. డైనమిక్ క్యూఆర్ కోడ్తో లావాదేవీలను నిర్వహించేందుకు ఉపయోగపడే ఐటీ మౌలిక సదుపాయాల కల్పన ఆగస్టు నాటికి అన్ని పోస్టాఫీసుల్లో పూర్తవుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఐటీ 2.0 కింద కొత్త సిస్టం పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే కర్ణాటక సర్కిల్లో ప్రారంభమైందని పేర్కొన్నాయి.ఇదీ చదవండి: రెండు మెర్సిడెస్ బెంజ్ జీటీ సిరీస్లో స్పోర్ట్స్ కార్లుమైసూర్ హెడ్ ఆఫీస్, బాగల్కోట్ హెడ్ ఆఫీసు మొదలైన ప్రాంతాల్లో క్యూఆర్ ఆధారిత బుకింగ్ సేవలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించాయి. యూపీఐ వ్యవస్థతో పోస్టాఫీసుల ఖాతాలు అనుసంధానం కాకపోవడం వల్ల ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వెసులుబాటు ఉండటం లేదు. గతంలో సేల్ కౌంటర్స్లో స్టాటిక్ క్యూఆర్ కోడ్ను పోస్టల్ శాఖ ప్రవేశపెట్టినప్పటికీ, పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ విధానాన్ని నిలిపివేసారు. -
రెండు మెర్సిడెస్ బెంజ్ జీటీ సిరీస్లో స్పోర్ట్స్ కార్లు
లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా కొత్తగా జీటీ సిరీస్లో రెండు స్పోర్ట్స్ కార్లను ఆవిష్కరించింది. వీటిలో ఏఎంటీ జీటీ 63 ఫోర్మ్యాటిక్ప్లస్, జీటీ 63 ప్రో ఫోర్మ్యాటిక్ప్లస్ కూపే ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ.3 కోట్లు, రూ.3.65 కోట్లుగా (దేశవ్యాప్తంగా ఎక్స్షోరూం) ఉంటుందని సంస్థ తెలిపింది. మరోవైపు, భారత్లో ఎలక్ట్రిక్ కార్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఎస్పీఎంఈపీసీఐ పథకం కొత్త విదేశీ సంస్థలకు ఆకర్షణీయంగా ఉంటుందని కంపెనీ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. భారత్లో తాము గత ముప్ఫై ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే పుణె ప్లాంటుపై రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని వివరించారు. స్కీమును ప్రకటించడానికి ముందు నుంచే రెండు కార్ల మోడల్స్ను దేశీయంగా ఈ ప్లాంటులోనే తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.ఏఎంజీ జీటీ 63 4 మ్యాటిక్+పవర్: 585 బీహెచ్పీ, 800 ఎన్ఎమ్ టార్క్0–100 కిమీ/గం: 3.2 సెకన్లలో అందుకుంటుంది.గరిష్ట వేగం: గంటకు 315 కి.మీ.ధర: రూ .3 కోట్లు (ఎక్స్-షోరూమ్)ఇదీ చదవండి: ‘సారీ సర్.. వెజిటేరియన్ ఫ్యామిలీ కావాలి’ఏఎంజీ జీటీ 63 ప్రో 4 మ్యాటిక్+పవర్: 612 బీహెచ్పీ, 850 ఎన్ఎమ్ టార్క్0–100 కి.మీ/గం: 3.1 సెకన్లలో అందుకుంటుంది.గరిష్ట వేగం: గంటకు 317 కి.మీ.ధర: రూ.3.65 కోట్లు (ఎక్స్-షోరూమ్) -
అదానీ గ్రూప్ విలువ జూమ్..
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా అదానీ గ్రూప్ నిల్చింది. 2025కి గాను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ రిపోర్టు ప్రకారం అదానీ బ్రాండ్ విలువ 2024లో 3.55 బిలియన్ డాలర్లుగా ఉండగా తాజాగా 2.91 బిలియన్ డాలర్లు పెరిగి 6.46 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ఓవరాల్గా గతేడాది 16వ స్థానంలో ఉండగా ఈసారి 13వ ర్యాంకుకు చేరింది. 82 శాతం బ్రాండ్ విలువ వృద్ధితో అదానీ గ్రూప్ అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా నిల్చిందని రిపోర్ట్ పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం.. → ఇండియా 100 జాబితాలోని మొత్తం సంస్థల బ్రాండ్ విలువ 236.5 బిలియన్ డాలర్లు.→ అత్యంత విలువైన భారతీయ బ్రాండుగా టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానంలో నిల్చింది. బ్రాండ్ విలువ 10 శాతం వృద్ధి చెంది 31.6 బిలియన్ డాలర్లకు చేరింది. → 15 శాతం బ్రాండ్ విలువ (16.3 బిలియన్ డాలర్లు) వృద్ధితో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ జాబితాలో అత్యంత విలువైన రెండో భారతీయ బ్రాండుగా నిల్చింది.→ హెచ్డీఎఫ్సీ గ్రూప్ బ్రాండ్ విలువ 14.2 బిలియన్ డాలర్లకు చేరడంతో ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో నిల్చింది. ఎల్ఐసీ (13.6 బిలియన్ డాలర్లు) నాలుగో ర్యాంకు, హెచ్సీఎల్టెక్ (బ్రాండ్ విలువ 17 శాతం అప్, 8.9 బిలియన్ డాలర్లు) ఒక ర్యాంకు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. ఎల్అండ్టీ గ్రూప్ (7.4 బిలియన్ డాలర్లు) తొమ్మిదో స్థానంలో, మహీంద్రా గ్రూప్ (7.2 బిలియన్ డాలర్లు) 10వ స్థానంలో నిల్చాయి. → అత్యంత పటిష్టమైన భారతీయ బ్రాండుగా తాజ్ హోటల్స్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. -
జేఎస్డబ్ల్యూ పెయింట్స్ చేతికి డ్యూలక్స్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దేశీ గ్రూప్ జేఎస్డబ్ల్యూ తాజాగా డచ్ పెయింట్ల దేశీ దిగ్గజం అక్సో నోబెల్ ఇండియాను సొంతం చేసుకోనుంది. సజ్జన్ జిందాల్ గ్రూప్ కంపెనీ జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ఇందుకు డ్యూలక్స్ బ్రాండ్ మాతృ సంస్థ అక్సో నోబెల్ ఎన్వీతో తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా అక్సో నోబెల్ ఇండియాలో 74.76% వాటా కొనుగోలు చేయనుంది. డీల్ విలువ రూ. 8,986 కోట్లుకాగా.. అక్సో నోబెల్ దేశీయంగా లిస్టెడ్ కంపెనీకావడంతో సాధారణ వాటాదారుల నుంచి మరో 25 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. ఇందుకు షేరుకి రూ. 3,417.77 ధరలో మరో రూ. 3,929 కోట్లు వెచి్చంచనుంది. వెరసి డ్యూలక్స్ పెయింట్ల బిజినెస్ను రూ. 12,915 కోట్లకు చేజిక్కించుకోనుంది. 2019లోనే పెయింట్ల బిజినెస్లోకి ప్రవేశించిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ తాజా కొనుగోలుతో దేశీయంగా పెయింట్ల రంగంలో నాలుగో పెద్ద కంపెనీగా అవతరించనుంది. ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్తో పాటు, కన్సాయ్ నెరోలాక్ తొలి మూడు ర్యాంకులలో నిలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశీ సంస్థ చేతిలో ఉన్న లిక్విడ్ పెయింట్స్, కోటింగ్స్ విభాగం జేఎస్డబ్ల్యూ సొంతం కానుండగా.. పౌడర్ కోటింగ్స్ బిజినెస్, ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ మాత్రం పూర్తిస్థాయిలో అక్సో నోబెల్ చేతిలో మిగలనున్నాయి. ఈ అంశాన్ని డచ్ దిగ్గజం అక్సో నోబెల్ వెల్లడించింది. పోటీ తీవ్రతరం పెయింట్ల రంగంలో ఇప్పటికే దేశీయంగా ఏషియన్, బెర్జర్ పెయింట్స్సహా.. కన్సాయ్ నెరోలాక్, అక్సో నోబెల్, ఇండిగో, షాలిమార్, నిప్పన్ కార్యకలాపాలు విస్తరించగా.. గత 5–6 ఏళ్లలో మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. జేఎస్డబ్ల్యూ పెయింట్స్తోపాటు.. ఒపస్ బ్రాండుతో ఆదిత్య బిర్లా గ్రూప్, పిడిలైట్(హరీషా), ఆస్ట్రల్ పైప్స్(జెమ్), జేకే సిమెంట్స్(ఆక్రో) సైతం పోటీకి సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్సో నోబెల్ ఇండియా విక్రయం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశీ డెకొరేటివ్ బిజినెస్లో ప్రధానంగా పోటీ తీవ్రతరమవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏబీ గ్రూప్ రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో ఒపస్ను తీసుకువచి్చన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. పెయింట్లు, కోటింగ్స్ బిజినెస్ దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్నట్లు జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ఎండీ పార్ధ్ జిందాల్ పేర్కొన్నారు. ఈ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీలలో జేఎస్డబ్ల్యూ ఒకటని తెలియజేశారు. షేరు తీరిలా...తాజా వార్తల నేపథ్యంలో అక్సో నోబెల్ ఇండియా షేరు బీఎస్ఈలో 7 శాతం జంప్చేసి రూ. 3,415 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,533 వద్ద గరిష్టాన్ని తాకింది. 2025లో డీల్స్ జోరు.. జేఎస్డబ్ల్యూ పెయింట్స్, డ్యూలక్స్ డీల్ 2025లో నమోదైన అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలవనుంది. గత నెలలో జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్ప్ రూ. 13,483 కోట్లకు దేశీ సంస్థ యస్ బ్యాంక్లో 20 శాతం వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతక్రితం మార్చిలో బజాజ్ అలియెంజ్ లైఫ్తోపాటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో జర్మన్ భాగస్వామి అలియెంజ్కున్న 26 శాతం వాటాను బజాజ్ గ్రూప్(బజాజ్ ఫిన్సర్వ్) మొత్తం రూ. 24,180 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది అతిపెద్ద డీల్కాగా.. ఈ ఫిబ్రవరిలో అయానా రెన్యువబుల్ పవర్ కొనుగోలుకి రూ. 19,500 కోట్ల ఓఎన్జీసీ, ఎన్టీపీసీ గ్రీన్ డీల్ రెండో ర్యాంకులో నిలుస్తోంది. హల్దీరామ్స్లో 10 శాతం వాటా కొనుగోలుకి సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టెమాసెక్ ఈ మార్చిలో రూ. 8,600 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వీటితో పోలిస్తే జేఎస్డబ్ల్యూ పెయింట్స్– అక్సో నోబెల్ డీల్ ఈ ఏడాది నమోదైన అతి పెద్ద డీల్స్లో ఒకటిగా నిలవనుంది. -
క్యూ4లో కరెంట్ ఖాతా మిగులు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం (2024–25) చివరి త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి/క్యూ4) కరెంటు ఖాతా 13.5 బిలియన్ డాలర్ల (రూ.1.15 లక్షల కోట్లు) మిగులులోకి వచ్చినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది. ఇది జీడీపీలో 1.3 శాతానికి సమానం. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కరెంటు ఖాతా 4.6 బిలియన్ డాలర్ల మిగులుగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే కరెంటు ఖాతా లోటు 23.3 మిలియన్ డాలర్లుగా (జీడీపీలో 0.6 శాతం) ఉంది. 2023–24లో కరెంటు ఖాతా లోటు 26 బిలియన్ డాలర్లు (జీడీపీలో 0.7 శాతం) కావడం గమనించొచ్చు. వస్తువులకు సంబంధించి వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 59.5 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 52 బిలియన్ డాలర్లుగానే ఉంది. సేవలకు సంబంధించి నికర మిగులు 53.3 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది 42.7 బిలియన్ డాలర్ల మేర ఉంది. బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ క్యూ4లో బిలియన్ డాలర్ల (రూ.8,400 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎఫ్డీఐ 10.2 బిలియన్ డాలర్లతో పోలి్చచూస్తే గణనీయంగా తగ్గాయి. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు క్యూ4 లో నికరంగా 5.9 బిలియన్ డాలర్ల మేర బయటకు వెళ్లిపోయాయి. విదేశీ మారకం నిల్వలు క్యూ4లో 8.8 బిలియన్ డాలర్ల మేర నికరంగా పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ పెరుగుదల 30.8 బిలియన్ డాలర్లుగా ఉంది. విదేశీ రుణం 736 బిలియన్ డాలర్లు ప్రభుత్వ విదేశీ రుణ భారం గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే 10 శాతం పెరిగి 736.3 బిలియన్ డాలర్లకు చేరింది. 2024 మార్చి నాటికి ఇది 668.8 బిలియన్ డాలర్లుగా ఉంది. జీడీపీలో విదేశీ రుణ భారం 18.5 శాతం నుంచి 19.1 శాతానికి పెరిగింది. -
శాంసంగ్ నుంచి కొత్త ఫోన్.. ధర తక్కువే..
శాంసంగ్ తన పాపులర్ గెలాక్సీ ఎం సిరీస్లో మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. సరికొత్త గెలాక్సీ ఎం36 5జీని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 5ఎన్ఎం ఎక్సినోస్ 1380 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది స్మూత్ గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం వేపర్ కూలింగ్ ఛాంబర్ను సపోర్ట్ చేస్తుంది.120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ టెక్నాలజీతో స్లీక్, 7.7 ఎంఎం సన్నని బాడీ, 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది.గూగుల్తో సర్కిల్ టు సెర్చ్, జెమినీ లైవ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు, సెగ్మెంట్-ఫస్ట్ ఆఫర్లు ఇందులో ఉన్నాయి.వెల్వెట్ బ్లాక్, సెరీన్ గ్రీన్, ఆరెంజ్ హేజ్ అనే మూడు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.షేక్ ఫ్రీ వీడియోలు, బ్లర్ ఫ్రీ ఫోటోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాను ఇందులో అందించారు.ఫ్రంట్, రియర్ కెమెరాలలో 4కే వీడియో రికార్డింగ్ను సపోర్ట్ చేస్తుంది. ఇమేజ్ నాణ్యతను పెంచడానికి ఆటో నైట్ మోడ్, ఫోటో రీమాస్టర్, ఆబ్జెక్ట్ ఎరేజర్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందు భాగంలో స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, సింగిల్ ఛార్జింగ్తో ఎక్కువ గంటలు వినోదం, ఉత్పాదకతను అందిస్తుంది. వేగవంతమైన డౌన్లోడ్, అంతరాయం లేని స్ట్రీమింగ్ కోసం డివైజ్ పూర్తి 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.ఈ ఫోన్ వన్ యుఐ 7 తో వెళుతుంది, ఇది మరింత క్రమబద్ధమైన డిజైన్, కస్టమైజబుల్ విడ్జెట్లు మరియు లాక్ స్క్రీన్లో రియల్-టైమ్ అప్డేట్ల కోసం నౌ బార్ అనే కొత్త ఫీచర్ను పరిచయం చేస్తుంది.ఆండ్రాయిడ్ ఓఎస్ ఆరు జనరేషన్ అప్గ్రేడ్ లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ కు శాంసంగ్ హామీ ఇస్తోంది. ఈ విభాగంలో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తోంది.గెలాక్సీ ఎం36 5జీ స్మార్ట్ ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,499గా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.20,999గానూ నిర్ణయించారు.గెలాక్సీ ఎం36 5జీ స్మార్ట్ ఫోన్లను జూలై 12 నుంచి శాంసంగ్, అమెజాన్ వెబ్సైట్లతోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో విక్రయించనున్నారు. -
బ్యాంకు సెలవులు.. జూలైలో ఇదిగో ఈ రోజుల్లోనే..
ప్రాంతీయ సెలవులు, వారాంతపు మూసివేతల కారణంగా 2025 జూలైలో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన క్యాలెండర్ ప్రకారం సెలవుల జాబితాను విడుదల చేసింది. జూలైలో దేశవ్యాప్త ప్రభుత్వ సెలవులు లేవు. అయితే అన్ని ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలతో పాటు కొన్ని రాష్ట్రాలకు సెలవులు ఉంటాయి.బ్యాంకుల సెలవుల జాబితా ప్రతి నెలా భిన్నంగా ఉంటుంది. వివిధ ప్రాంతాలను బట్టి ఆర్బీఐ ఈ జాబితాను జారీ చేస్తుంది. మీకు కూడా వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, సెలవుల జాబితాను చూసి మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. జూలైలో ప్రాంతీయ పండుగలు, సందర్భాల కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు వేర్వేరు రోజులు సెలవులు ఉంటాయి. రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి ఈ సెలవులు మారుతూ ఉంటాయి.జూలైలో బ్యాంకు సెలవులుజూలై 3 (గురువారం) - త్రిపురలోని అగర్తలాలో ఖర్చి పూజజూలై 5 (శనివారం) - జమ్మూ కశ్మీర్ లో గురు హరోబింద్ జీ జయంతిజూలై 6 - ఆదివారంజూలై 12 - రెండో శనివారంజూలై 13- ఆదివారంజూలై 14 (సోమవారం) - మేఘాలయలోని షిల్లాంగ్ లో బెహ్ దేంఖ్లామ్ ఫెస్టివల్జూలై 16 (బుధవారం) - ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో హరేలా ఫెస్టివల్జూలై 17 (గురువారం) - మేఘాలయలోని షిల్లాంగ్ లో యు తిరోత్ సింగ్ వర్ధంతిజూలై 19 (శనివారం) - త్రిపురలోని అగర్తలాలో కేర్ పూజజూలై 20 - ఆదివారంజూలై 26 - నాలుగో శనివారంజూలై 27 - ఆదివారంజూలై 28 (సోమవారం) - సిక్కింలోని గ్యాంగ్టక్లో ద్రుక్పా త్షె-జీఈ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. ఆ రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు తెరిచే ఉంటాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అన్ని సెలవు దినాల్లోనూ కొనసాగుతాయి. అయితే చెక్ క్లియరెన్స్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీల్లో స్వల్ప జాప్యం జరిగే అవకాశం ఉంది. -
ఒక్క రూపాయి క్యాండీ.. రూ.750 కోట్ల బ్రాండ్..
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో తమ క్యాండీ ఉత్పత్తి ’పల్స్’ రూ. 1,000 కోట్ల బ్రాండుగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు దేశీ ఎఫ్ఎంసీజీ సంస్థ ధరమ్పాల్ సత్యపాల్ గ్రూప్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఒక్కోటి రూ. 1 ఖరీదు చేసే ఈ క్యాండీలు గత ఆర్థిక సంవత్సరంలో 750 కోట్ల యూనిట్లు అమ్ముడవడం ద్వారా రూ. 750 కోట్ల అమ్మకాల మార్కును సాధించినట్లు వివరించారు.హార్డ్–బాయిల్డ్ క్యాండీ విభాగంలో 19 శాతం మార్కెట్ వాటాతో తాము అగ్రగామిగా ఉన్నామని, గత మూడళ్లుగా ఏటా 15% వృద్ధి సాధిస్తున్నా మని కుమార్ చెప్పారు. దేశీయంగా ఈ మార్కెట్ పరిమాణం సుమారు రూ. 4,000 కోట్లుగా ఉంది. 2015లో పల్స్ క్యాండీని ప్రవేశపెట్టారు. ఈ ఉత్పత్తి దాని ప్రారంభ రోజుల్లో సోషల్ మీడియా బజ్, యూజర్-జనరేటెడ్ కంటెంట్ నుండి కూడా ప్రయోజనం పొందిందని కంపెనీ పేర్కొంది. సెలబ్రిటీ పోస్టులు, వైరల్ యూజర్ రివ్యూలు పల్స్ క్యాండీ తక్కువ మార్కెటింగ్ ఖర్చుతో కల్ట్ హోదాను సాధించడానికి సహాయపడ్డాయి. దీంతో అనతి కాలంలోనే డీఎస్ గ్రూప్ పల్స్ లైనప్ ను విస్తరించింది. లాంచ్ అయినప్పటి నుండి సుమారు 5,000 కోట్ల పల్స్ క్యాండీలు అమ్ముడయ్యాయి. ప్రారంభంలో కచ్చా ఆమ్ (పచ్చి మామిడి) ఫ్లేవర్ క్యాండీలు ఉండగా జామ, ఆరెంజ్, పైనాపిల్, లిచీ వేరియంట్లు తర్వాత వచ్చాయి. -
WEF టెక్నాలజీ దిగ్గజాల్లో హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2025 సంవత్సరానికి గాను వరల్డ్ ఎకనమిక్ ఫోరం 100 టెక్నాలజీ పయొనీర్ల జాబితాలో హైదరాబాద్కి చెందిన డేటా షేరింగ్ ప్లాట్ఫాం ఈక్వల్ చోటు దక్కించుకుంది. భారత్ నుంచి మొత్తం 10 సంస్థలు ఈ లిస్టులో ఎంపికయ్యాయి.గతంలో డబ్ల్యూఈఎఫ్ పయొనీర్లుగా నిల్చిన గూగుల్, స్పాటిఫై, ఎయిర్బీఎన్బీ వంటి దిగ్గజాల సరసన తమ సంస్థ కూడా నిల్చిందని కంపెనీ వ్యవస్థాపకుడు, వెంచర్ క్యాపిటలిస్ట్ జీవీకే కేశవ్ రెడ్డి తెలిపారు. కేవైసీ తదితర అంశాలకు సంబంధించి డేటా షేరింగ్కి ఉపయోగపడే మౌలిక సదుపాయాలను ఈక్వల్ అందిస్తోంది. కేశవ్ రెడ్డి, రాజీవ్ రంజన్ కలిసి 2022లో దీన్ని నెలకొల్పారు. 2024లో 75,000 లావాదేవీలను ప్రాసెస్ చేసింది.బృహస్పతి టెక్నాలజీస్లో పెట్టుబడులు నిఘా, సెక్యూరిటీ సొల్యూషన్స్ సేవలందించే హైదరాబాద్ సంస్థ బృహస్పతి టెక్నాలజీస్ (Brihaspathi Technologies Limited) తాజాగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 10 మిలియన్ డాలర్లు సమీకరించింది. హైదరాబాద్లో 72,000 చ.అ. విస్తీర్ణంలో సీసీటీవీ తయారీ ప్లాంటు ఏర్పాటుకు, కార్యకలాపాల విస్తరణకు ఈ నిధులను ఉపయోగించుకోనున్నట్లు సంస్థ ఎండీ రాజశేఖర్ పాపోలు తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఈ ప్లాంటు అందుబాటులోకి వస్తుందని విలేఖరుల సమావేశంలో చెప్పారు. వృద్ధి ప్రణాళికల్లో భాగంగా కొత్తగా 400 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్లు వివరించారు. మరోవైపు, 2026–27లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ఆలోచన కూడా ఉన్నట్లు వివరించారు.ఈ నిధులను పరిశోధన–అభివృద్ధి సామర్థ్యాలను, తయారీ సామర్థ్యాలను పెంచుకునేందుకు, ఏఐ ఆధారిత సొల్యూషన్స్ను రూపొందించేందుకు ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు. ఇటీవలే మహారాష్ట్ర రోడ్ రవాణా కార్పొరేషన్ నుంచి సుమారు రూ. 100 కోట్ల విలువ చేసే సీసీటీవీ మానిటరింగ్ సిస్టం ఏర్పాటునకు ఆర్డరు లభించినట్లు రాజశేఖర్ తెలిపారు. -
మారుతీ కారు ఓనర్లకు గుడ్ న్యూస్..
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ సర్వీస్ నెట్వర్క్ను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం 5,400గా ఉన్న టచ్పాయింట్ల సంఖ్యను 2030–31 నాటికి 8,000కు పెంచుకోనుంది. వివిధ రకాల కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు, అలాగే తమ ఎలక్ట్రిక్ వాహన ఆవిష్కరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ హిసాషి తకెయిచి తెలిపారు.1,000 పైగా నగరాల్లో 1,500 ఈవీ ఎనేబుల్డ్ సర్వీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీటిలో సుశిక్షితులైన సిబ్బంది, అధునాతనమైన పరికరాలు ఉంటాయని తకెయుచి చెప్పారు. మే నెలలో తమ సంస్థ భారీ స్థాయిలో 24.5 లక్షల వాహనాలను సర్వీస్ చేసినట్లు వివరించారు.మరోవైపు అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఆన్రోడ్ అసిస్టెన్స్ కోసం ప్రత్యేకమైన క్విక్ రెస్పాన్స్ టీమ్ను కూడా మారుతీ సుజుకీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సర్వీస్ కార్యకలాపాల సహకారం కోసం ఏఐ ఆధారిత చాట్బాట్లను, వాయిస్ బాట్లను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. -
రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్ గోయెంకా విమర్శలు
ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా ఇటీవల ప్రదర్శించిన చెప్పులు, వాటి ధరపై భారతీయ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు. అసలు కళాకారులకు క్రెడిట్ ఇవ్వకుండా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ బ్రాండ్లు లాభపడుతున్నాయంటూ ఆయన విమర్శించారు. ఇది చాలా విచారకరం అంటూ ట్వీట్ చేశారు.Prada is selling products looking like Kolhapuri chappals for over ₹1 lakh. Our artisans make the same by hand for ₹400. They lose, while global brands cash in on our culture. Sad! pic.twitter.com/Cct4vOimKs— Harsh Goenka (@hvgoenka) June 26, 2025 ప్రాడా పురుషుల పాదరక్షల స్ప్రింగ్ సమ్మర్ 2026 ఇటీవల ప్రదర్శించింది. వీటి డిజైన్ అచ్చం మన షోలాపూర్ చెప్పుల మాదిరిగానే రాజసాన్ని ఒలకబోస్తుట్టున్నాయి. కానీ వాటి ధరే 1.2 లక్షలు ఉండటం హాట్ టాపిక్గా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించారు.అటు బిలియనీర్ గోయెంకా కూడా దీనిపై స్పందించారు.ఈ చెప్పుల ఫోటోలు ట్వీట్ చేస్తూ, ఇవి భారతదేశపు ఐకానిక్ కొల్హాపురి చెప్పులను పోలి ఉన్నాయి, కానీ ధర లక్షకు పై మాటే!అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. మన చేతివృత్తులు వారు వీటినే రూ.400 కు తయారు చేస్తారు. అంటే వారు ఎంత నష్టపోతున్నారు? ప్రపంచ బ్రాండ్లు మన సంస్కృతిని సొమ్ము చేసుకుంటున్నాయి. విచారకరం! అంటూ గోయెంకా రాసుకొచ్చారు.ఈ హై-ఎండ్ ఫ్యాషన్ చప్పల్స్ని ప్రీమియం మెటీరియల్స్, ఇండియన్ డిజైన్తో రూపొందించినట్టు ప్రాడా ప్రకటించింది. అయితే ఇండియాలో షోలాపూర్ చెప్పులను పోలి ఉన్న ఈ చెప్పుల ధర భారీ లగ్జరీగా ఉండటంతో నెటిజన్లు విస్తుపోయిన సంగతి తెలిసిందే. -
లాభాల్లో స్టాక్మార్కెట్లు.. సెన్సెక్స్ కొత్త మార్క్
బెంచ్ మార్క్ భారతీయ ఈక్విటీ సూచీలు వరుసగా నాలుగో సెషన్ లోనూ లాభాల బాటలో పయనించి, వారం చివరి ట్రేడింగ్ సెషన్ ను సానుకూలంగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 303.03 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 84,058.90 వద్ద స్థిరపడింది. శుక్రవారం ఈ సూచీ 84,089.35 - 83,645.41 శ్రేణిలో ట్రేడ్ అయింది. నిఫ్టీ 50 కూడా 88.80 పాయింట్లు లేదా 0.35 శాతం లాభంతో 25,657.80 వద్ద ముగిసింది.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.27 శాతం, 0.91 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ సూచీలు మినహా ఎన్ఎస్ఈలోని ఇతర సెక్టోరల్ ఇండెక్స్లన్నీ లాభాల్లో ముగియగా, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 1.19 శాతం లాభపడింది.ఎన్ఎస్ఈలో 2,986 షేర్లలో 1,681 షేర్లు లాభాల్లో, 1,229 షేర్లు నష్టాల్లో ముగియగా, 76 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. 86 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 24 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూట్ ను తాకిన స్టాక్స్ సంఖ్య 105కు పెరగ్గా, లోయర్ సర్క్యూట్ పరిమితులకు 40 పడిపోయాయి.ఎన్ఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.32 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 1.60 శాతం క్షీణించి 12.39 పాయింట్ల వద్ద స్థిరపడింది. -
బీఎస్ఎన్ఎల్ ఫ్లాష్ సేల్ త్వరలో.. ఎలాంటి ఆఫర్లు ఉంటాయో..
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) త్వరలో ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఫ్లాష్ సేల్ ద్వారా వినియోగదారులకు ఉచిత డేటా, బ్రాడ్ బ్యాండ్ డీల్స్ లేదా డిస్కౌంట్లు లభించనున్నాయి. దేశంలో ఇటీవలే 5జీ సేవలను ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్ కార్డుల డోర్ డెలివరీని కూడా ప్రారంభించింది. తాజాగా వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు త్వరలో బీఎస్ఎన్ఎల్ఫ్లాష్ సేల్ ఉంటుందని ప్రకటించింది.బీఎస్ఎన్ఎల్ ఫ్లాష్ సేల్ వివరాలుఫ్లాష్ సేల్ గురించి బీఎస్ఎన్ఎల్ ఎక్స్ (ట్విట్టర్) లో టీజర్ను పోస్ట్ చేసింది. దానితో పాటు ఉన్న వీడియో క్లిప్ ఇలా ఉంది.. "ఏదో పెద్దది ల్యాండ్ కాబోతోంది! ఊహించని అనుభూతిని అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అయితే ఫ్లాష్ సేల్ తేదీని మాత్రం వెల్లడించకుండా త్వరలోనే రానుందని పేర్కొంది. సేల్ సమయంలో ఎలాంటి ఆఫర్లు ఉంటాయో ఊహించండి అంటూ టీజ్ చేసింది. టీజర్ ప్రకారం బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఉచిత డేటా, బ్రాడ్ బ్యాండ్ డీల్స్ లేదా భారీ డిస్కౌంట్లు లభించవచ్చు.వేగంగా వినియోగదారులను కోల్పోతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ ఫ్లాష్ సేల్ చేపడుతుండటం గమనార్హం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల విడుదల చేసిన టెలికాం సబ్స్క్రిప్షన్ డేటా ప్రకారం ఏప్రిల్లో బీఎస్ఎన్ఎల్ మొత్తం 2 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. ఇదే కాలంలో యాక్టివ్ బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 1.8 మిలియన్లు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
‘సారీ సర్.. వెజిటేరియన్ ఫ్యామిలీ కావాలి’
చెన్నైలో అద్దెకు ఉండేందుకు ఫ్లాట్ల కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. మీలో చాలామందికి ఇలాంటి అనుభవమే ఎదురై ఉంటుంది. ఇదే అంశంపై ఆన్లైన్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఈ రోజుల్లో దాదాపు చాలామందికి ముక్కలేనిదే ముద్దదిగదనే ధోరణి వచ్చేసింది. అలాంటిది నాన్వెజ్ తింటే ఇల్లు అద్దెకు అవ్వబోమని ఓ యజమాని చెప్పడం చర్చకు దారితీసింది.సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ రంగస్వామి అనే వ్యక్తి చెన్నైలో ఇంటి అద్దె కోసం వెతుకుతున్నాడు. ఓ ఫ్లాట్ యజమానిని వాట్సప్ ద్వారా సంప్రదించాడు. ‘మీరు నాన్వెజ్ తింటే ఇల్లు అద్దెకు ఇవ్వబోం. సారీ సర్.. వెజిటేరియన్ ప్యామిలీ కోసం చూస్తున్నాం’ అంటూ యాజమాని చెప్పాడు. దాంతో ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిబంధనలు పెట్టడంపై ప్రశాంత్ ఆందోళన చెందుతూ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను స్క్రీన్షాట్ తీసి సామాజిక మాధ్యామాల్లో షేర్ చేశారు. ‘చెన్నైలో అద్దెకు ఫ్లాట్లు దొరకాలంటే నాన్ వెజ్ తినడం హానికరం’ అని ఆ పోస్ట్కు క్యాప్షన్ పెట్టారు.Eating non veg is injurious to finding flats for rent in Chennai . pic.twitter.com/MyWWYuJ0vB— Prashanth Rangaswamy (@itisprashanth) June 26, 2025ఇదీ చదవండి: సిబిల్ సరిగా లేదని ఎస్బీఐ ఉద్యోగం రద్దుమీలో లేదా మీకు తెలిసిన వారిలో చాలామంది ఈ సమస్యను ఏదుర్కొనే ఉంటారు. ఈ తంతు ఇంకెంత కాలం అంటూ కొందరు ఈ పోస్ట్కు రిప్లై ఇస్తుంటే.. సైలెంట్గా వేరే ఇల్లు చూసుకోండంటూ ఇంకొందరు చెప్పారు. ‘నేను శాకాహారినే. కానీ చుట్టూ మాంసం తినేవారున్న యూరప్లో నివసించాను. ఎప్పుడూ సమస్య లేదు. కానీ ఇక్కడ, ఈ ఆంక్షలు హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి’ అని ఒక యూజర్ అన్నారు. అయితే కొందరు మాత్రం తమ ఆస్తిని ఎవరికి అద్దెకు ఇవ్వాలో నిర్ణయించే హక్కు ఇంటి యజమానులకు ఉందని తెలిపారు. -
సిబిల్ సరిగా లేదని ఎస్బీఐ ఉద్యోగం రద్దు
సిబిల్ స్కోర్ సరిగాలేని కారణంగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీఓ) పోస్టులో ఉన్న ఓ అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. నియామకానికి సంబంధించిన అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ అభ్యర్థి గతంలో చేసిన క్రమరహిత చెల్లింపులు, సిబిల్ స్కోర్ను పరిగణించి రిక్రూట్మెంట్ రద్దు చేశారు.ఎస్బీఐ తన నియామకాన్ని రద్దు చేసినందుకు మాద్రాస్ హైకోర్టులో ఆ అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశాడు. దాన్ని పరిశీలించిన మద్రాస్ హైకోర్లు ఎస్బీఐ చర్యలను సమర్థించింది. నియామక నోటిఫికేషన్లో స్పష్టంగా సిబిల్ స్కోర్, గత ఆర్థిక లావాదేవీల గురించి ఎస్బీఐ తెలిపిందని పేర్కొంది. జస్టిస్ ఎన్.మాలా ఈ కేసులో తీర్పు చెబుతూ ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఉద్యోగాలకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అన్నారు. ఎస్బీఐ రిక్రూట్మెంట్ క్లాజ్ (క్లాజ్ 1(ఈ)) ప్రకారం సిబిల్ లేదా ఇతర ఏజెన్సీల నుంచి నెగెటివ్ క్రెడిట్ హిస్టరీ లేదా ప్రతికూల రిపోర్టులు ఉన్న అభ్యర్థులు అనర్హులని చెప్పారు. నియామకానికి ముందే బకాయిలు చెల్లించినట్లు అభ్యర్థి పేర్కొన్నప్పటికీ క్లీన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ అనేది కేవలం రుణ క్లియరెన్స్ మాత్రమే కాదని, దాన్ని నియామకాల్లో బెంచ్ మార్క్గా పరిగణిస్తారని కోర్టు నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: పిక్సెల్ స్మార్ట్పోన్ల నిషేధంసిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గాలుక్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్ను తగ్గిస్తుంది.మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు. -
పిక్సెల్ స్మార్ట్పోన్ల నిషేధం
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్కు జపాన్ కోర్టులో చుక్కెదురైంది. గూగుల్ పేటెంట్ ఉల్లంఘించిందంటూ వేసిన దావాకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. జపాన్లో పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ఫోన్ల అమ్మకాలను నిషేధించాలని పేర్కొంది. పేటెంట్ పొందిన ఎల్టీఈ టెక్నాలజీని అనుమతి లేకుండా గూగుల్ చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ ఇటీవల కోర్టులో వేసిన దావాకు అనుకూలంగా తీర్పు వెలువడింది.ఈటీన్యూస్ ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం.. 4జీ నెట్వర్క్లో ఉపయోగించే నిర్దిష్ట కమ్యూనికేషన్ పద్ధతిపై వివాదం మొదలైంది. ఎల్టీఈ టెక్నాలజీపై జపాన్లో ఇప్పటికే పేటెంట్ తీసుకున్నట్లు పాన్టెక్ సంస్థ దావాలో పేర్కొంది. దేశ చట్టాలకు విరుద్ధంగా గూగుల్ పిక్సెల్ ఫోన్లో ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు తెలిపింది. దాంతో విచారణ జరిపిన జపాన్ కోర్టు ఆ దేశంలో పిక్సెల్ సిరీస్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ‘అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్’ లేదా ఏసీకే అని పిలువబడే నియంత్రణ సిగ్నల్ పరికరాలు, బేస్ స్టేషన్ల మధ్య కమ్యునికేషన్ ఎలా ప్రసారం అవుతుందనే దానిపై కంపెనీ, దావా వేసిన వారిలో పరస్పరం భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఈ ఎల్టీఈ టెక్నాలజీ జపాన్ పేటెంట్ చట్టం కింద సంరక్షించబడుతుంది. దాంతో జపాన్ కోర్టు చర్యలు తీసుకుంది.ఇదీ చదవండి: పుత్తడి ప్రియుల్లో కోటి ఆశలు.. బంగారం తగ్గుముఖంకోర్టులో దావా వేసిన పాన్టెక్ కంపెనీ స్వయంగా స్మార్ట్ ఫోన్ వ్యాపారం నుంచి నిష్క్రమించినప్పటికీ, దాని మిగిలి ఉన్న పేటెంట్లు ఇప్పటికీ యాక్టివ్గానే ఉన్నట్లు తెలిపింది. గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో సరైన లైసెన్సింగ్ లేకుండా ఈ సాంకేతికతను ఉపయోగించాయని టోక్యో డిస్ట్రిక్ట్ కోర్టు తెలిపింది. దాంతో ఈ మోడళ్ల అమ్మకాలపై మాత్రమే కాకుండా దిగుమతులు, ప్రకటనలు, జపాన్లో ఈ మోడళ్ల ప్రదర్శనపై కూడా నిషేధాన్ని విధించింది. విచారణ సందర్భంగా కంపెనీ ప్రవర్తనపై కోర్టు తీవ్ర విమర్శలు చేసింది. గూగుల్ది ‘చిత్తశుద్ధి లేని వైఖరి’గా అభివర్ణించింది. -
పుత్తడి ప్రియుల్లో కోటి ఆశలు.. బంగారం తగ్గుముఖం
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) క్రమంగా తగ్గుముఖ పడుతోంది. మూడు రోజులుగా క్రమంగా పడిపోతున్న పుత్తడి ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం కూడా తగ్గాయి. దేశంలోని ప్రధానం నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: సోనీ కెమెరాతో పోకో కొత్త ఫోన్(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఒకే వేదికపై భారతీయ పాటలు, కళలు, వంటలు..మరెన్నో
భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) ఇండియా వీకెండ్ను న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుందని చెప్పారు. ఈమేరకు ‘ఎన్ఎంఏసీసీ.ఇండియావికెండ్’ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు.. వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని తెలిపారు.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లుఇన్స్టాగ్రామ్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివివైజేషన్ టు నేషన్’ ఈవెంట్లో భాగంగా సాంప్రదాయ నృత్యాలు ఉంటాయని నీతా అంబానీ తెలిపారు. ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by NMACC India Weekend (@nmacc.indiaweekend) -
సోనీ కెమెరాతో పోకో కొత్త ఫోన్
స్మార్ట్ఫోన్స్ బ్రాండ్ తాజాగా ఎఫ్–సిరీస్లో ఎఫ్7 ఫోన్ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.29,999 నుంచి రూ.31,999 వరకు ఉంటుంది. 7,550 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ టర్బో చార్జింగ్, స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్సెట్, 6.83 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయని సంస్థ ప్రోడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ సచిన్ దేవ్ తెలిపారు.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లునాలుగేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. జులై 1 నుంచి ఫ్లిప్కార్ట్పై ఎక్స్క్లూజివ్గా అమ్మకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ తదితర కార్డులపై రూ.2,000 డిస్కౌంటు, రూ.2,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చని దేవ్ చెప్పారు. -
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 16 పాయింట్లు పెరిగి 25,565కు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 ప్లాయింట్లు పుంజుకుని 83,799 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అందులో అమ్మారు.. ఇందులో కొన్నారు!
ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా పీబీ ఫిన్టెక్లో కంపెనీ సహవ్యవస్థాపకులు యాషిష్ దహియా, అలోక్ బన్సల్ 1.09 శాతం వాటాను షేరుకి రూ. 1,821.5 సగటు ధరలో విక్రయించారు. ఇన్సూర్టెక్.. పాలసీబజార్, ఫిన్టెక్ ప్లాట్ఫామ్ పైసాబజార్ మాతృ సంస్థలో 50.5 లక్షల షేర్లను అమ్మివేయడం ద్వారా రూ. 920 కోట్లు సమకూర్చుకున్నారు. ఎన్ఎస్ఈ బల్్కడీల్ వివరా ల ప్రకారం సీఈవో దహియా 0.74 శాతం వాటాకు సమానమైన 34 లక్షల షేర్లు. వైస్చైర్మన్ బన్సల్ 0.36 శాతం వాటాకు సమానమైన 16.5 లక్షల షేర్లు విక్రయించారు. తాజా లావాదేవీల తదుపరి పీబీ ఫిన్టెక్లో దహియా వాటా 4.31 శాతం నుంచి 3.57 శాతానికి, బన్సల్ వాటా 1.4 శాతం నుంచి 1.04 శాతానికి క్షీణించింది. కాగా.. ఈ వాటాలను దేశీ ఎంఎఫ్, బీమా రంగ సంస్థలతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నాయి. ఈ జాబితాలో టాటా ఎంఎఫ్, ఎడిల్వీజ్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రు లైఫ్సహా సిటీగ్రూప్ గ్లోబల్, గోల్డ్మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, సొసైటీ జనరాలి తదితరాలు చేరాయి.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లుడెల్హివరీలో వాటా కొనుగోలుజాబితాలో మోర్గాన్ స్టాన్లీ, సిటీగ్రూప్ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా లాజిస్టిక్స్ సర్వీసులందించే డెల్హివరీలో దేశ, విదేశీ దిగ్గజాలు వాటా కొనుగోలు చేశాయి. ఎన్ఎస్ఈ బల్క్డీల్ గణాంకాల ప్రకారం 1.6 శాతం వాటాకు సమానమైన 1.19 కోట్ల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నాయి. ఇందుకు షేరుకి రూ. 387 సగటు ధరలో రూ. 461 కోట్లు వెచి్చంచాయి. షేర్లను కొనుగోలు చేసిన సంస్థల జాబితాలో మోర్గాన్ స్టాన్లీ, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ సింగపూర్, విరిడియన్ ఏఎంతోపాటు.. ఎంఎఫ్ సంస్థలు హెచ్డీఎఫ్ సీ, యాక్సిస్, టాటాతదితరాలు చేరాయి. అనుబంధ సంస్థలు నెక్సస్ అపార్చునిటీ ఫండ్, నెక్సస్ వెంచర్స్–3తో వీసీ కంపెనీ నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ తాజాగా డెల్హివరీలో వాటా విక్రయించింది. 2025 మార్చికల్లా డెల్హివరీలో 5.88 % వాటాను నెక్సస్ వెంచర్స్–3 కలిగి ఉంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
రేట్ల కోతను వేగంగా బదిలీ చేయాలి: ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేటును ఈ నెల మొదట్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించగా (0.50 శాతం), దీన్ని వేగంగా రుణ గ్రహీతలకు బదలాయించాలంటూ ఆర్బీఐ బులెటిన్ సూచించింది. బ్యాంక్లు వెంటనే తమ రుణ రేట్లను ఈ మేరకు తగ్గించాలని కోరింది. వాస్తవానికి చాలా బ్యాంక్లు ఇప్పటికే తమ రుణ రేట్లను ఈ మేరకు తగ్గించడం గమనార్హం.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లురుణ రేట్లను వేగంగా బదలాయించడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్యంక్లు వేగంగా బెంచ్మార్క్ లెడింగ్ రేటు ఆధారిత రుణ రేట్లను సవరించాయి కూడా. రెపో రేటుతోపాటు నగదు నిల్వల నిష్పత్తిని సైతం (సీఆర్ఆర్) అర శాతం మేర తగ్గిస్తూ ఆర్బీఐ వెసులుబాటు కల్పించడం తెలిసిందే. సీఆర్ఆర్ కోతతో బ్యాంకింగ్ రంగంలోకి రూ.2.5 లక్షల కోట్ల మేర అదనపు నగదు లభ్యత అందుబాటులోకి వచ్చినట్లయింది. -
దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లు
భారత్లో 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యంత విలువైన బ్రాండ్ వివరాలను ‘బ్రాండ్ ఫైనాన్స్’ నివేదిక తెలియజేసింది. దేశంలో టాటా గ్రూప్ (బ్రాండ్ విలువ 10 శాతం పెరిగి 31.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది) మరోసారి అత్యంత విలువైన బ్రాండ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక రంగాల్లో టాటా గ్రూప్ వ్యూహాత్మక పెట్టుబడులతో దేశంలో వేగంగా విస్తరిస్తోందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది.దేశంలోని టాప్ 10 అత్యంత విలువైన బ్రాండ్లు మొత్తంగా బ్రాండ్ విలువలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. బలమైన దేశీయ డిమాండ్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం అంచనా వేసిన జీడీపీ వృద్ధి 6 శాతం నుంచి 7 శాతం మధ్య ఉందని పేర్కొంది.ఇదీ చదవండి: సెకనుకు మూడు వాహనాలు డెలివరీబ్రాండ్ ఫైనాన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిమోన్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. ‘మేక్ ఇన్ ఇండియా పిలుపును భారత్ నూతన శక్తితో స్వీకరిస్తోంది. తయారీ, ఆర్థిక సేవలు, వినోదం, వైద్యం, ఆతిథ్యం ఇలా ఏ రంగంలోనైనా భారత్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దేశ ఆర్థిక పురోగతి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విస్తరణ తన అగ్రశ్రేణి బ్రాండ్లను గ్లోబల్ లీడర్లుగా మారుస్తున్నాయి’ అన్నారు. -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు డౌన్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు పెరిగిపోవడంతో అమ్మకాలు చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ (క్యూ1) మధ్య కాలంలో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 27 శాతం క్షీణించి 11,040 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇదే కాలంలో ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా టాప్–7 నగరాల్లో జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. ఈ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 20 శాతం తక్కువగా 96,285 యూనిట్లుగా ఉండొచ్చన్నది అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ ఏడు నగరాల్లో 1,20,335 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. హైదరాబాద్తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూరు, పుణె, కోల్కతా పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు పడిపోగా, ఒక్క చెన్నైలో మాత్రం పెరిగాయి. నగరాల వారీ డేటా.. → జూన్ త్రైమాసికంలో అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు 27 శాతం పెరిగాయి. ఇక్కడ ఇళ్ల విక్రయాలు 14 శాతం క్షీణించి 14,255 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 16,650 యూనిట్లుగా ఉండడం గమనార్హం. → ఎంఎంఆర్లో ఇళ్ల అమ్మకాలు 25 శాతం పడిపోయి 31,275 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 15,410 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలం విక్రయాలతో పోల్చితే 8 శాతం తక్కువ. ఇక్కడ ధరలు సగటున 12 శాతం పెరిగాయి. → పుణెలో అమ్మకాలు 27 శాతం తగ్గి రూ.15,410 యూనిట్లుగా ఉన్నాయి. → కోల్కతా నగరంలో 23 శాతం తక్కువగా 3,525 యూనిట్లు అమ్ముడయ్యాయి. → చెన్నైలో 11 శాతం పెరిగి 5,660 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 5,100 యూనిట్లుగా ఉన్నాయి. -
కీలక ఖనిజాలపై పీఎస్యూల కన్ను
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల కోసం చేతులు కలపనున్నాయి. తద్వారా మినీరత్న సీపీఎస్ఈ హిందుస్తాన్ కాపర్.. కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల బ్లాకులకు బిడ్ చేయనుంది. ఇందుకు ఇతర పీఎస్యూ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), గెయిల్ (ఇండియా), రైల్వే రంగ సంస్థ రైట్స్తో జత కట్టనున్నట్లు హిందుస్తాన్ కాపర్ చైర్మన్, ఎండీ సంజీవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఐవోసీ, గెయిల్తో హిందుస్తాన్ కాపర్ తప్పనిసరికాని ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. కాపర్ బ్లాకులతోపాటు కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల బ్లాకులను ప్రభుత్వం వేలం వేయనున్నట్లు వెల్లడించారు. వీటన్నిటికీ కంపెనీ బిడ్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో చిలీలో కాపర్సహా ఇతర కీలక ఖనిజాల అన్వేషణ కోసం మరో ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకునే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే ఈ నెల మొదట్లో రైల్వే రంగ ఇంజినీరింగ్ పీఎస్యూ రైట్స్తో ఒప్పందానికి తెరతీసిన విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా దేశ, విదేశీ మార్కెట్ల కోసం సంయుక్తంగా కీలక ఖనిజాల సరఫరా చైన్ను అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా దేశ, విదేశాలలో కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీత, శుద్ధి, ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టనున్నట్లు వివరించారు. మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సైతం అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. కంపెనీ దేశీయంగా రాగి గనుల మైనింగ్లో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆచితూచి రుణం..!
ముంబై: యువత రిటైల్ రుణాల విషయంలో అప్రమత్తత వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2024–25 క్యూ4) రిటైల్ రుణాల మంజూరులో కేవలం 5 శాతం వృద్ధి నమోదైనట్టు ట్రాన్స్యూనియన్ సిబిల్ వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2024 జనవరి–మార్చి) రిటైల్ రుణాల్లో వృద్ధి 12 శాతంగా ఉండడాన్ని ప్రస్తావించింది. రిటైల్ రుణాల వృద్ధి గణనీయంగా తగ్గడంలో కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాలు, క్రెడిట్ కార్డు వినియోగం ప్రభావం ఎక్కువగా ఉంది. పట్టణాల్లో యువత వీటిని ప్రధానంగా వినియోగిస్తుండడం తెలిసిందే. రిస్క్ అధికంగా ఉండే అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో దూకుడు వద్దంటూ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలకు 2023 చివర్లో ఆర్బీఐ సూచనలు చేయడాన్ని సిబిల్ నివేదిక గుర్తు చేసింది. క్రెడిట్ కార్డు, పర్సనల్ రుణాల్లో వృద్ధిని మోస్తరు స్థాయికి తీసుకురావడమే ఈ చర్యల ఉద్దేశ్యంగా పేర్కొంది. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి.. → క్రెడిట్ కార్డుల జారీ సంఖ్య 2023–24 జనవరి–మార్చి త్రైమాసికంలో సున్నాగా ఉంటే, 2024–25 సంవత్సరం చివరి త్రైమాసికంలో మైనస్ 32%గా (తగ్గిపోవడం) నమోదైంది. → వ్యక్తిగత రుణాల్లో వృద్ధి 6 శాతానికి పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో 13 శాతం వృద్ధి నమోదైంది. → కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలు 2024–25 క్యూ4లో 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో వృద్ధి 19 శాతంగా ఉంది. → రుణ వినియోగదారుల్లో వృద్ధి 8 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 15 శాతం. → కొత్త వారికి రుణ వితరణలో వృద్ధి క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చతే 3 శాతం తక్కువగా 16 శాతానికి పరిమితమైంది. → గృహ రుణ విభాగంలో వితరణలు (సంఖ్యా పరంగా) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 7 శాతం తగ్గిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 5 శాతం వృద్ధి నమోదైంది. కానీ గృహ రుణాల్లో రూ.కోటికి మించిన మొత్తాల్లో మాత్రం 9 శాతం వృద్ధి కనిపించింది. → ఆటో విభాగంలోనూ పెద్ద మొత్తం రుణాలకు డిమాండ్ కనిపించింది. → క్రెడిట్ కార్డులు మినహా రిటైల్ రుణాల్లోని అన్ని విభాగాల్లోనూ 90 రోజులకు పైగా చెల్లింపులు చేయని వాటి విషయంలో మెరుగుదల నమోదైంది. క్రెడిట్ కార్డుల్లో మాత్రం 0.28% పెరిగి ఇవి 2%కి చేరాయి. → రుణాలను మొదటిసారి తీసుకునే వారిలో వృద్ధి తగ్గడం ఆందోళనకరమని.. అందరికీ ఆర్థిక సేవల విస్తృతికి ఈ విభాగం కీలకమని సిబిల్ ఎండీ భవేష్ జైన్ పేర్కొన్నారు. లఘు సంస్థలకు తగ్గిన కొత్త రుణాలు ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) కొత్త రుణాలు (ఆరిజినేషన్) నెమ్మదించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో (2023–24) పోలిస్తే 2024–25లో విలువ 7.4 శాతం మేర క్షీణించి, రూ. 39.9 లక్షల కోట్ల నుంచి రూ. 36.9 లక్షల కోట్లకు తగ్గింది. రూ. 1 కోటి లోపు మైక్రో లోన్స్ ఇచ్చేందుకు రుణదాతలు దూరంగా ఉండటం ఇందుకు కొంత కారణంగా నిల్చింది. 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రో సెగ్మెంట్ రుణాలు రూ. 18.2 లక్షల కోట్లుగా ఉండగా 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.8 లక్షల కోట్లకు తగ్గాయి. పరిమాణంపరంగా చూస్తే మాత్రం ఎంఎస్ఎంఈలకు కొత్త రుణాల సంఖ్య 64.7 లక్షల నుంచి 75.8 లక్షలకు పెరిగింది. విలువ కోణంలో చూస్తే, రూ. 1–50 కోట్ల వరకు విలువ చేసే రుణాలు గణనీయంగా పెరిగాయి. క్రిఫ్ హై మార్క్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.మరిన్ని వివరాలు.. → చిన్న సంస్థల సెగ్మెంట్లో (రూ. 1–10 కోట్లు) రుణాలు రూ. 11 లక్షల నుంచి రూ. 12.1 లక్షల కోట్లకు పెరిగాయి. అలాగే మీడియం సెగ్మెంట్లో (రూ. 10–50 కోట్లు) లోన్లు రూ. 10.7 లక్షల కోట్ల నుంచి రూ. 13 లక్షల కోట్లకు ఎగిశాయి. → ఈ మార్పులనేవి, రుణదాతలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే సెగ్మెంట్ వైపు మళ్లుతుండటాన్ని సూచిస్తున్నాయి. → రుణ బాకీల పోర్ట్ఫోలియో రూ. 33.6 లక్షల కోట్ల నుంచి రూ. 40.4 లక్షల కోట్లకు చేరింది. → 91–180 రోజుల కాలవ్యవధిలోని మొండి బాకీల పరిమాణం 1.3 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గింది. -
నెస్లే బోనస్ బొనాంజా
న్యూఢిల్లీ: సుప్రసిద్ధ మ్యాగీ, నెస్కెఫే, కిట్కాట్ బ్రాండ్ల ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా కంపెనీ చరిత్రలోనే తొలిసారి బోనస్ షేర్లకు తెరతీసింది. దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాక కంపెనీ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో ఉచితంగా షేర్లను జారీ చేయనుంది. బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. వెరసి వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని బోనస్గా కేటాయించనుంది. అయితే ఇందుకు రికార్డ్ డేట్ను తదుపరి ప్రకటించనున్నట్లు తెలియజేసింది. నెస్లే ఇండియా ఇంతక్రితం 2024 జనవరిలో షేర్ల ముఖ విలువను విభజించింది. రూ. 10 ముఖ విలువను రూ. 1 ముఖ విలువకు కుదించింది. తదుపరి కంపెనీ ఈ నెల 19న తొలిసారి బోనస్ షేర్ల అంశాన్ని ప్రతిపాదించింది. 26న నిర్వహించనున్న సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం)లో డైరెక్టర్ల బోర్డు బోనస్ షేర్ల ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో గురువారం(26న) బోనస్ షేర్ల జారీకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచి్చనట్లు కంపెనీ చైర్మన్, ఎండీగా పదవీ విరమణ చేయనున్న సురేష్ నారాయణ్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రతీ షేరుకీ రూ. 10 చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇందుకు జూలై 4 రికార్డ్ డేట్గా కంపెనీ ప్రకటించింది. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరి 7న షేరుకి రూ. 14.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. కాగా.. బోనస్ షేర్లతో వాటాదారులందరూ ప్రధానంగా 5 షేర్ల కంటే తక్కువగల 1.6 లక్షలమంది చిన్న ఇన్వెస్టర్లు లబ్ధి్ద పొందనున్నట్లు నారాయణ్ పేర్కొన్నారు. బోనస్ వార్తల నేపథ్యంలో నెస్లే ఇండియా షేరు 1% బలపడి రూ. 2,430 వద్ద ముగిసింది. మ్యాగీ సంక్షోభం 2015లో అమ్మకాలపై నిషేధ సంక్షోభాన్ని ఎదుర్కొన్న మ్యాగీ తదుపరి దశలో మరింత బలపడింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాలలో 7 శాతం వాటాను మ్యాగీ ఆక్రమిస్తున్నట్లు కంపెనీకి దశాబ్ద కాలం సేవలందించిన నారాయణ్ వెల్లడించారు. మ్యాగీ సంక్షోభం తరువాత నెస్లే ఇండియా ఎండీగా 2015 ఆగస్ట్ 1న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కాలంలో కంపెనీ వివిధ కేటగిరీలలో 150 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. ఈకామర్స్ చానళ్ల ద్వారా 8 శాతం అమ్మకాలు నమోదవుతున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలలో నెస్లే ఇండియా వాటా అత్యధికంకావడం గమనార్హం! -
మైనస్లోకి అమెరికా జీడీపీ
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి/క్యూ1) అంచనాలకు మించి క్షీణతను చవిచూసింది. ట్రంప్ గందరగోళ వాణిజ్య విధానాలతో వ్యాపారపరమైన అనిశి్చతులకుతోడు బలహీన వినియోగ డిమాండ్ ప్రభావం చూపించాయి. జీడీపీ మైనస్ 0.5 శాతానికి పడిపోయినట్టు అమెరికా వాణిజ్య శాఖ తన మూడవ, తుది అంచనాలను ప్రకటించింది. ద్వితీయ అంచనాల్లో క్షీణత 0.2 శాతంగానే ఉండొచ్చన్న వాణిజ్య శాఖ అంచనాలను మించి ఆర్థిక వ్యవస్థ కుంగుబాటునకు గురైంది. మూడేళ్లలోనే మొదటిసారి అమెరికా జీడీపీ మైనస్లోకి వెళ్లినట్టయింది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే కీలకమైన వినియోగదారుల వ్యయం నిదానించినట్టు తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో వినియోగం 1.2 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, ఇది 0.5 శాతానికి పరిమితమైంది. 2024 చివరి త్రైమాసికంలోనూ వినియోగం 4 శాతం వృద్ధిని చూసింది. నాలుగేళ్లలోనే ఒక త్రైమాసికం పరంగా ఇది అతి తక్కువ వినియోగం కావడం గమనార్హం. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడానికి ట్రంప్ టారిఫ్లు సైతం ప్రభావం చూపించాయి. టారిఫ్లు అమల్లోకి రావడానికి ముందే పెద్ద మొత్తంలో దిగుమతులకు అక్కడి సంస్థలు మొగ్గు చూపించాయి. 2024 చివరి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 2.4 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. -
ఆర్ఐఎల్ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మార్కెట్ విలువ మరోసారి రూ. 20 లక్షల కోట్ల కీలక మైలురాయిని అధిగమించింది. షేరు ధర తాజాగా 2 శాతం పుంజుకుని రూ. 1,495కు చేరడంతో బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 37,838 కోట్లు బలపడింది. వెరసి బ్లూచిప్ కంపెనీ మార్కెట్ విలువ రూ. 20,23,375 కోట్లను అధిగమించింది. ప్రధాన ఇండెక్సులలో అధిక వెయిటేజీ గల కంపెనీ షేరు లాభపడటంతో మార్కెట్లకు సైతం జోష్వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంతక్రితం గతేడాది(2024) ఫిబ్రవరి 13న రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన తొలి దేశీ దిగ్గజంగా రిలయన్స్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఆర్ఐఎల్ తదుపరి ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ రూ. 15,51,219 కోట్ల మార్కెట్ విలువతో రెండో స్థానాన్ని పొందింది. ఈ బాటలో మార్కెట్ విలువ ద్వారా ఇతర బ్లూచిప్ కంపెనీలు టీసీఎస్(రూ. 12,45,219 కోట్లు), భారతీ ఎయిర్టెల్(రూ. 12,45,219 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్(రూ. 10,27,839 కోట్లు) తదుపరి ర్యాంకులలో నిలుస్తున్నాయి. కాగా.. ఈ ఏడాది ఆర్ఐఎల్ షేరు ఇప్పటివరకూ 23 శాతం జంప్చేయడం విశేషం! -
చైనా ప్రొడక్ట్లపై యాంటీ–డంపింగ్ సుంకం
వెల్లువెత్తే చౌక దిగుమతుల నుంచి దేశీ తయారీ సంస్థల ప్రయోజనాలను కాపాడే దిశగా ఈ నెలలో ఇప్పటివరకు ఆరు చైనా ఉత్పత్తులపై కేంద్రం యాంటీ–డంపింగ్ సుంకం విధించింది. పీఈడీఏ, ఎసిటోనైట్రైల్ (ఫార్మా రంగంలో ఉపయోగిస్తారు), విటమిన్–ఏ పామిటేట్, డెకోర్ పేపర్ మొదలైనవి వీటిలో ఉన్నాయి.పరిశ్రమల్లో ఉపయోగించే ఈ ముడిసరుకులపై అయిదేళ్ల పాటు సుంకాలు ఉంటాయని వేర్వేరు నోటిఫికేషన్లలో కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ తెలిపింది. వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దిగుమతి సుంకాలు ఉత్పత్తిని బట్టి కేజీకి 20.87 డాలర్ల నుంచి టన్నుకు 2,017.9 డాలర్ల వరకు ఉంటాయి.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..గత ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారత్ వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు చేరింది. చైనాకు ఎగుమతులు 14.5 శాతం క్షీణించి 14.25 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా, దిగుమతులు 11.52 శాతం పెరిగి 113.45 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. -
సెకనుకు మూడు వాహనాలు డెలివరీ
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ 2025 మే నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలను సర్వీస్ అందించడం ద్వారా అమ్మకాల అనంతరం చేసిన సర్వీస్లో రికార్డు నెలకొల్పింది. మే నెలలో దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ నిమిషానికి 170 వాహనాలను సర్వీస్ చేసి డెలివరీ చేసింది. అంటే సెకనుకు దాదాపు మూడు వాహనాలను డెలివరీ చేసినట్లయింది.ఈ విజయం మారుతీ సుజుకీ విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. మెట్రో నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5,400కుపైగా సర్వీసు సెంటర్లున్నాయని సంస్థ పేర్కొంది. తాజా రికార్డులో భాగంగా పెయిడ్ సేవలు, ఉచిత సేవలు, రన్నింగ్ రిపేర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..ఈ సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేచి మాట్లాడుతూ ‘కంపెనీ చరిత్రలో ఒక నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలకు సర్వీస్ చేయడం ఇదే మొదటిసారి. ఇది సర్వీస్ నెట్వర్క్ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా మా సేవా బృందాలు, డీలర్ భాగస్వాముల అవిశ్రాంత కృషి ఫలితమిది’ అన్నారు. -
గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణకు ప్రభుత్వ పేటెంట్
శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించాలనే లక్ష్యంతో ఎంజీఎం విశ్వవిద్యాలయంలోని జవహర్లాల్ నెహ్రూ ఇంజినీరింగ్ కాలేజ్ (జేఎన్ఈసీ)లో కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థి కనక్ తల్వేర్ రూపొందించిన గ్రీన్ ఎనర్జీ వ్యవస్థకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించింది. చెరకు రసం నుంచి బయోఇథనాల్ ఉత్పత్తి చేసేలా ఈ వ్యవస్థను తయారు చేశారు.ఎంజీఎం విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ రవీంద్ర గైక్వాడ్, ఆకాశ్ వాణి, ప్రవర రూరల్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డాక్టర్ అన్నాసాహెబ్ వరడే, రవీంద్ర నిబ్లతో కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కనక్ కలిసి పనిచేశారు. మొత్తం ఈ ఐదుగురు పరిశోధకులు కలిసి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందినట్లు తెలిపారు.వ్యవసాయ వ్యర్థాల నుంచి క్లీన్ ఎనర్జీబయోఇథనాల్ను తయారు చేయడానికి విస్తృతంగా లభించే చెరకు రసాన్ని ఉపయోగించడం వల్ల ఈ ఆవిష్కరణ ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రక్రియ జీవ ఇంధన ఉత్పత్తి కోసం, ముఖ్యంగా చెరకు పండిస్తున్న వ్యవసాయ ప్రాంతాల్లో రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. దీనివల్ల కర్బన ఉద్గారాలు తగ్గడం, గ్రామీణ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చెరకు రసంతో పాటు రసం వెలికితీత తర్వాత మిగిలిపోయిన ఫైబరస్ అవశేషమైన బగాస్సేపై పరిశోధనలు చేసి ఈ ప్రక్రియను రూపొందించారు. అంటే పంటలోని ప్రతి భాగాన్ని వినియోగంలోకి తేనున్నారు.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..ఈ ప్రక్రియ భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందండంతో ఎంజీఎం విశ్వవిద్యాలయం అకడమిక్ కమ్యూనిటీ నుంచి ప్రశంసలు అందుకుంది. భారతదేశం గ్రీన్ ఎనర్జీ మిషన్కు అనుగుణంగా విద్యార్థుల నేతృత్వంలోని ఆవిష్కరణలను ఇది హైలైట్ చేసింది. దేశం ప్రతిష్టాత్మక ఇథనాల్ మిశ్రమ లక్ష్యాల వైపు దూసుకెళ్తున్నప్పుడు ఇంధన ఆర్థిక వ్యవస్థలను సృష్టించడంలో ఇలాంటి పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..
డబ్బుకు సంబంధించిన పాఠాలు నిత్యం చాలామంది చెబుతూంటారు. ‘ఎక్కువ పొదుపు చేయండి..తక్కువ ఖర్చు పెట్టండి..’ వంటి సలహాలను తరచుగా వింటుంటారు. కానీ నిజ జీవితంలో ప్రాక్టికల్గా వాటి అర్థం ఏమిటో కొందరు మాత్రమే చెబుతారు. డబ్బు నిర్వహణ అంటే బడ్జెట్ను తయారు చేయడం మాత్రమే కాదు, ఏది అవసరమో..ఏది కాదో తెలుసుకుని మసులుకోవడం అని నిపుణులు చెబుతున్నారు. సీఏ నితిన్ కౌశిక్ 30 ఏళ్ల వయసులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎనిమిది ముఖ్యమైన డబ్బు పాఠాలను తెలిపారు.నితిన్ తన లింక్డ్ఇన్లో రాసిన వివరాల ప్రకారం..‘ఎవరూ మీకు బోధించని 8 కఠినమైన డబ్బు సత్యాలు (అయితే ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాల లోపు తప్పకుండా నేర్చుకోవాలి)ఇవి. డబ్బు ఆదా చేయడం అంటే ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు. తర్కంతో ఆలోచించి ఖర్చు చేయడం. చాలా మంది ఆలస్యంగా నేర్చుకునే నిజమైన వివరాలు ఇవి. కాబట్టి మీరు 30 ఏళ్లు దాటడానికి ముందే తెలుసుకోవాల్సిన ఎనిమిది కఠినమైన, నిజమైన డబ్బు పాఠాలను చూద్దాం’ అంటూ నితిన్ రాసుకొచ్చారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే క్వాలిటీ వస్తువులపై పెట్టుబడులు పెట్టాలి. చీప్గా వస్తుందని కొనుగోలు చేస్తే ఎక్కువసార్లు దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది.ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు భారీ ఫర్నిచర్ కొనవద్దు. ఎందుకంటే తరలింపు ఖర్చులు భారంగా మారుతాయి. దీర్ఘకాలిక ఖర్చులకు దారితీస్తూ, స్వల్పకాలిక పొదుపును నివారించే వాటికి దూరంగా ఉండాలని దీని ఉద్దేశం.ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న ఈ రోజుల్లో మీ జీతంలో కనీసం 5 శాతాన్ని నగదు రూపంలో పొదుపు చేయండి. ఫిజికల్ మనీ మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు చేసేలా చేస్తుంది.ఫోన్ ట్రెండ్స్ను గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీకు లేటెస్ట్, ఖరీదైన ఫోన్ అవసరం లేదు. మీ పనులకు నిజంగా ఏది అవసరమో దాన్ని కొనుగోలు చేయండి. అంతకు మించి వద్దు. ఖరీదైన గాడ్జెట్లు త్వరగా వాటి విలువను కోల్పోతాయి.చాలా మంది యువకులు తాము ఫిట్గా ఉన్నామని భావించి ఆరోగ్య బీమా తీసుకోరు. కానీ ఊహించని ఒక ఆసుపత్రి బిల్లు కనీసం ఆరు నెలల పొదుపును తుడిచివేస్తుంది. ఆర్థిక భద్రత అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు. ఊహించని ఖర్చుల నుంచి రక్షణ పొందడం అని గుర్తించాలి.ఇదీ చదవండి: బంగారం కంటే వెండి ముద్దుఅనారోగ్యకరమైన ఆహార విధానం మీ శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా దీర్ఘకాలికంగా వైద్య బిల్లులను పెంచుతుంది. చక్కెర, పామాయిల్ తగ్గించాలి. అవి దీర్ఘకాలంలో మీ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి.క్రెడిట్ కార్డు అనే ఉచితంగా వచ్చే డబ్బు కాదు. సరైన పద్ధతిలో వాడితే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కానీ మీరు దీన్ని మీ ఆదాయ వనరుగా భావిస్తే అప్పుల్లో పడతారు.డబ్బును గౌరవించే వారితో స్నేహం చేయండి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారితో సావాసం చేయాలి. డబ్బును అర్థం చేసుకోని వ్యక్తితో ఉంటే జీవితం దారుణంగా మారుతుంది. ప్రేమ ఒక్కటే ఉంటే ఈఎంఐలు చెల్లించలేరు. -
బంగారం కంటే వెండి ముద్దు
విలువైన లోహంలో ఒకటిగా ఉన్న బంగారం ధరలు ఇటీవల కాలంలో 10 గ్రాములు రూ.1లక్షకుపైగా చేరింది. ఇంకోవైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో వీటి ధరలు ఆకాశాన్నంటినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండిలో పెట్టుబడిపెట్టే వారికి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సూచనలు చేశారు.ఇప్పటికే బంగారం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత సమయంలో పుత్తడి కంటే వెండిపై పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చని కియోసాకి తెలిపారు. బంగారంతోపాటు బిట్కాయిన్ ధరలు పెరిగిన తరుణంలో అవి కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాతే వాటిని కొనుగోలు చేస్తానని కియోసాకి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. బంగారం, బిట్కాయిన్ ధరలు ఎప్పుడు పడుతాయోనని వేచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందు సొంతంగా రిసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు.FYI: Silver is the best investment today….june 2025. Gold and Bitcoin are high and I am waiting for gold and Bitcoin to crash before I add to my position.That’s what I think.Do your own research.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) June 23, 2025ఇదీ చదవండి: టూవీలర్లపై టోల్ ఛార్జీలు..?ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి ఇటీవల వెండి గురించి ఇటీవల సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ ‘నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం’ అని అభివర్ణించారు. -
టూవీలర్లపై టోల్ ఛార్జీలు..?
ద్విచక్ర వాహనాలపై ప్రభుత్వం జులై 15 నుంచి టోల్ ఛార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు సామాజిక మాధ్యమాలు, పలు మీడియా కథనాల్లోవార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ద్విచక్రవాహనాలపై ఛార్జీలు వేసే అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని, మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు జాతీయ రహదారులపై టోల్ ఫ్రీ సదుపాయం ఎప్పటిలాగే కొనసాగుతుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) స్పష్టం చేసింది.#FactCheck: Some sections of the media have reported that the Government of India plans to levy user fees on two-wheelers. #NHAI would like to clarify that no such proposal is under consideration. There are no plans to introduce toll charges for two-wheelers. #FakeNews— NHAI (@NHAI_Official) June 26, 2025ఇదీ చదవండి: వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ నెనేటర్ఫాస్టాగ్ ఆధారిత టోల్ ఛార్జీలు ద్విచక్ర వాహనాలకు సైతం అమలు చేస్తారని సోషల్మీడియాలో సమాచారం వైరల్గా మారింది. దాంతో ఎన్హెచ్ఏఐ ఈమేరకు స్పష్టతనిచ్చింది. మొదట టూవీలర్లపై టోల్ ఛార్జీలు విధిస్తున్నట్లు వచ్చిన అసత్య వార్తలవల్ల ద్విచక్రవాహనదారులు ఆందోళన చెందారు. కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వార్తలను ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. ఈ విషయంపై ఎటువంటి విధాన మార్పును ఆమోదించలేదని చెప్పారు. ఏ సవరణకైనా అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేస్తామని చెప్పారు. అబద్ధపు ప్రచారానలు నమ్మకూడదని తెలిపారు.🚨 Toll Charges for Two-Wheelers from July 15? Here's the Truth! 🛵💸Several social media posts claim that two-wheelers will have to pay tolls on highways starting July 15, 2025.#PIBFactCheck❌This claim is #Fake✅@NHAI_Official has made NO such announcement🛣️There… pic.twitter.com/XFr4NtfxrZ— PIB Fact Check (@PIBFactCheck) June 26, 2025 -
మెసేజ్ ఎంత పెద్దదైనా చిటికెలో సారాంశం
మెటా వాట్సప్లో కొత్త ఏఐ ఆధారిత ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. వాట్సప్లో చదవని మెసేజ్ల సంక్షిప్త సారాంశాన్ని తెలుసుకునేందుకు మెటా ఏఐ సాయం చేయనుందని పేర్కొంది. ఈ ఫీచర్లో భాగంగా యూజర్లు నిత్యం పెద్ద టెక్స్ట్ మేసేజ్లను స్క్రోల్ చేసి పూర్తిగా చదవకుండా మెటా ఏఐ అందులోని సంక్షిప్త సారాంశాన్ని అందిస్తుంది. ఇంగ్లిష్ సపోర్ట్తో పనిచేసే ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని వాట్సప్ యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు మెటా తెలిపింది. ఈ ఏడాది చివర్లో క్రమంగా మరిన్ని ప్రాంతాలతోపాటు ఇతర భాషలకు ఈ ఫీచర్ను విస్తరిస్తామని స్పష్టం చేసింది.మెటా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫీచర్ వన్-ఆన్-వన్, గ్రూప్ చాట్స్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది. నిత్యం మెసేజ్లు వచ్చే గ్రూప్లు, వ్యక్తులకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ మెసేజ్లు చదివే క్రమంలో యూజర్ల కంటెంట్పట్ల భద్రత పాటిస్తామని వాట్సప్ హామీ ఇచ్చింది. ఏఐ ఫీచర్ డేటాను బాహ్య సర్వర్లకు ప్రసారం చేయకుండా లేదా కంపెనీ సిస్టమ్లకు బహిర్గతం చేయకుండా ప్రాసెస్ చేస్తుందని తెలిపింది.ఇదీ చదవండి: వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ నెనేటర్యూజర్ల ప్రాధాన్యతలను గౌరవించడానికి వాట్సప్ డిఫాల్ట్గా ఈ ఫీచర్ను ఎనేబుల్ చేయదని చెప్పింది. మాన్యువల్గానే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలని పేర్కొంది. ఇది ఆప్షనల్ ఫీచర్గా మాత్రమే ఉంటుందని తెలిపింది. అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ కంట్రోల్స్లో యూజర్లు తమ సెట్టింగ్స్ను మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. -
వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ సెనేటర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల తొలగింపు అధికమవుతోంది. టెక్ కంపెనీలు వ్యయం ఆదా చేసుకొని ఇతర విభాగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఏఐ తోడ్పడుతుంది. కృత్రిమ మేధ వ్యాపారాలకు సహాయం చేస్తుంటే, వాటి సామర్థ్యాన్ని పెంచుతుంటే ఆయా సంస్థలు ఉద్యోగుల వర్క్-లైఫ్ సమతుల్యతను మెరుగుపరచాలని సెనేటర్ బెర్నీ శాండర్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ ఆటోమేషన్ పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసేలా వాతావరణాన్ని సృష్టించాలన్నారు.జో రోగన్ ఎక్స్పీరియన్స్ పాడ్కాస్ట్లో మాట్లాడిన బెర్నీ శాండర్స్ వారానికి 32 గంటల పనిదినాలు ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ ఉద్యోగులను నిరుద్యోగంలోకి నెట్టడం కంటే ఎక్కువ ఫ్రీటైమ్ ఉంచేలా చేయాలని పేర్కొన్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని వ్యాపారాలకు ఉత్పాదకత పెరుగుతోంది. దాన్ని ప్రధానంగా పరిగణిస్తే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దానికి బదులుగా పని దినాలను తగ్గించాలి. వారానికి 32 గంటలకు పనిని కుదించాలి. ఉద్యోగులు తమ కుటుంబం, స్నేహితులు లేదా తమకు ఇష్టమైన కార్యకలాపాలకు ఎక్కువ సమయం గడిపేందుకు వీలు కల్పించాలి. టెక్నాలజీ కేవలం కార్పొరేట్ లాభాలకే పరిమితం కాకుండా ఉద్యోగులకు సైతం ఉపయోగపడాలి’ అన్నారు.ఇదీ చదవండి: ఇంటెల్లో ఉద్యోగాల కోత ప్రారంభంసెనేటర్ బెర్నీ శాండర్స్ ప్రస్తుతం యూఎస్ సెనేట్లో వెర్మాంట్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1981లో వెర్మాంట్లోని బర్లింగ్ టన్ మేయర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1991 నుంచి 2007 వరకు అమెరికా ప్రతినిధుల సభలో పనిచేశారు. -
ఇంటెల్లో ఉద్యోగాల కోత ప్రారంభం
ఇంటెల్ కొత్త సీఈఓ లిప్-బు టాన్ నేతృత్వంలో కొనసాగుతున్న కంపెనీ వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కాలిఫోర్నియాలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభించారు. శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలో ఉన్న 107 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇంటెల్ పేర్కొంది. 30 రోజుల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినప్పుడు నోటిఫికేషన్ జారీ చేసేలా కాలిఫోర్నియా వార్న్ చట్టం నిర్దేషిస్తుంది. దీని ప్రకారం కంపెనీ సమర్పించిన ఫైలింగ్లో ఉద్యోగాల కోతలు ప్రారంభం కానున్నాయని తెలిసింది.జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆటోమోటివ్ చిప్ వ్యాపారాన్ని కూడా ఇంటెల్ మూసివేయనుంది. దాంతో ఇంటెల్ ఎక్స్పర్ట్ జాక్ వీస్ట్ నేతృత్వంలోని ఈ యూనిట్ ఉద్యోగుల్లో చాలా మంది కొలువులు కోల్పోయే అవకాశం ఉంది. బాధిత ఉద్యోగులకు 60 రోజుల నోటీసు లేదా నాలుగు వారాల నోటీసుతో పాటు తొమ్మిది వారాల పరిహారం, ఇతర వేతన ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ తెలిపింది. మరోవైపు, జులై మధ్యలో ఇంటెల్ కాలిఫోర్నియాలోని గ్లోబల్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యలు తీసుకోబోతుందని అధికారులు తెలిపారు. అప్పుడు కంపెనీ తన ఉద్యోగుల్లో మరో 20 శాతం మందిని తొలగిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపుతాజాగా ప్రకటించిన ఉద్యోగ కోతల్లో ఇంటెల్ చిప్ అభివృద్ధికి కీలకమైన పలు ఇంజినీరింగ్ ఉద్యోగులను తొలగించడం గమనార్హం. వీరిలో ఫిజికల్ డిజైన్ ఇంజినీర్లు, లాజిక్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్పెషలిస్టులు, క్లౌడ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్లు ఉన్నారు. ఇంజినీరింగ్ మేనేజర్లు, బిజినెస్ లీడ్లు, ఐటీ వైస్ ప్రెసిడెంట్ వంటి అనేక సీనియర్ లీడర్షిప్ రోల్స్లో సేవలందిస్తున్న వారున్నారు. శాంటా క్లారా సైట్లోని ఉద్యోగులు సీపీయూ, జీపీయూ డిజైన్ ప్రాజెక్టుల్లో పనిచేస్తారని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇంటెల్ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ప్రధాన టెక్ కంపెనీల్లో 2025లో ఇప్పటివరకు 62,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని లేఆఫ్స్.ఎఫ్వైఐ తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రధాన సంస్థలు వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. -
దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపు
దేశంలో సంపద పెరుగుతోంది. సంపన్నులు రెట్టింపవుతన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తాజా నివేదిక ప్రకారం.. 2024-2029 మధ్య అంటే ఐదేళ్లలో మిలియనీర్ల జనాభా 55 శాతానికిపైగా పెరుగుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు 21 శాతం కంటే రెట్టింపు.2023-2024 మధ్య కాలంలో భారత ఆర్థిక సంపద 10.8 శాతం పెరిగిందని, ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) సగటు 7.3 శాతం దాటిందని బీసీజీ తెలిపింది. ఉత్తర అమెరికా (4%), పశ్చిమ ఐరోపా (5%) లను మించి ఎఆసియా-పసిఫిక్ ప్రాంతం 2029 నాటికి వార్షికంగా 9% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.2024 నుంచి 2029 వరకు డాలర్ మిలియనీర్ల సంఖ్య 55 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామని బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్, పార్టనర్ మయాంక్ ఝా తెలిపారు. తొలి తరం మొదటిసారి సంపద సృష్టికర్తలు, ముఖ్యంగా మిలీనియల్ (యువ) పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు పరిశ్రమను పునర్నిస్తున్నారని పేర్కొన్నారు.బలమైన ఈక్విటీ మార్కెట్ పనితీరు కారణంగా ఆర్థిక ఆస్తులు 8.1% పెరగడంతో 2024లో ఆర్థిక సంపద రికార్డు స్థాయిలో 305 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని బీసీజీ గ్లోబల్ నివేదిక తెలిపింది. విలువైన క్లయింట్ల గుర్తింపు, ప్రాధాన్యంలో సంస్థలకు సహకారం అందిస్తూ ఉత్పాదక ఏఐ (GenAI) సంపద ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని వివరించింది. ఈ ఉత్పాదక ఏఐని త్వరగా అందిపుచ్చుకున్నవారు ఐదు రెట్లు అధికంగా పురోగమిస్తున్నారని వివరించింది. -
యూనియన్ బ్యాంక్ ఈడీకి ఊహించని షాక్..
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పంకజ్ ద్వివేదికి ఊహించని అనుభవం ఎదురైంది. జనరల్ మేనేజర్గా ఆయన హోదాను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక సేవల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వపు హోదాలో జనరల్ మేనేజర్గా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కు పంపించింది.ఢిల్లీ హైకోర్టులో ద్వివేదికి వ్యతిరేకంగా కేసు పెండింగ్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూనియన్ బ్యాంక్ ఈడీగా ద్వివేది నియామకాన్ని సవాలు చూస్తే ఢిల్లీ హైకోర్టులో గతేడాది ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.విజిలెన్స్ క్లియరెన్స్ లేకుండా ఈడీగా నియమించడం నిబంధనల ఉల్లంఘనంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విజిలెన్స్ విభాగం ఆమోదం లేకుండా నియామకం ఎలా చేశారని ప్రశ్నిస్తూ.. 2024 ఆగస్ట్లో కేంద్రం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. -
హాట్రిక్ తర్వాత బంగారం ధరలు మళ్లీ ఇలా..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మూడు రోజులుగా వరుసగా తగ్గి హాట్రిక్ కొట్టిన పసిడి ధరలకు నేడు (జూన్ 26) బ్రేక్ పడింది. దీంతో ఇంకాస్త తగ్గుతుందనుకున్న కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. జూన్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,100🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,850ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.👉 వెండి విషయంలో అమ్మో.. ఆయన మాటలు నిజమవుతాయా? 👈వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు ఎటువంటి మార్పూ లేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,18,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 1,08,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
1.41 కోట్ల మంది విమానమెక్కారు..
దేశీ విమానయాన రంగంలో ప్రయాణికుల సంఖ్య మే నెలలో 1.89 శాతం పెరిగి 1.41 కోట్లకు చేరినట్టు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. 2024 మే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 1.38 కోట్లుగా ఉంది. 64 శాతం మార్కెట్ వాటా ఇండిగో చేతుల్లోనే ఉంది. ఈ సంస్థ విమానాల్లో 93.09 లక్షల మంది ప్రయాణించారు.ఆ తర్వాత 37.22 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించడం ద్వారా 26.5 శాతం మార్కెట్ వాటా ఎయిర్ ఇండియా గ్రూపు సొంతం చేసుకుంది. ఇక ఆకాశ ఎయిర్ విమానాల్లో 7.48 లక్షల మంది, స్పైస్జెట్ విమానాల్లో 3.40 లక్షల మంది చొప్పున మే నెలలో ప్రయాణించారు. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 5.3 శాతంగా ఉంటే, స్పైస్ జెట్ మార్కెట్ వాటా 2.4 శాతానికి పరిమితమైంది.ఆరు ప్రధాన విమానాశ్రయాల నుంచి (హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా) 84 శాతం సరీ్వసులకు సకాలంలో సేవలు అందించి ఇండిగో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 79.7 శాతంతో ఎయిర్ ఇండియా గ్రూపు ద్వితీయ స్థానంలో ఉంది. -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎంఅండ్ఎం షేర్లలో కొనుగోళ్లతో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఫ్గాట్గా కదులుతున్నాయి.30 షేర్ల సెన్సెక్స్ 243 పాయింట్లు (0.29 శాతం) పెరిగి 82,998 వద్ద, 50 షేర్ల నిఫ్టీ 83 పాయింట్లు లేదా 0.33 శాతం పెరిగి 25,327 వద్ద ట్రేడవుతున్నాయి. విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.31 శాతం, 0.32 శాతం లాభపడ్డాయి. ఇండియా వీఐఎక్స్ 0.7 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ 0.38 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ 0.8 శాతం, నిఫ్టీ ఆటో 0.4 శాతం లాభపడ్డాయి.నేటి ఐపీవోలుహెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, రమా టెలికాం, సన్టెక్ ఇన్ఫ్రా, సూపర్టెక్ ఈవీ ఐపీఓలు సబ్స్క్రిప్షన్ రెండో రోజులోకి ప్రవేశించనున్నాయి. గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీఓ, ఎల్లెన్ బారీ ఇండస్ట్రియల్ ఐపీఓ , కల్పతరు ఐపీఓ, ఐకాన్ ఫెసిలిటేటర్స్ ఐపీఓ, శ్రీ హరే-కృష్ణ స్పాంజ్ ఐపీఓ, అబ్రామ్ ఫుడ్స్ ఐపీఓ తమ సబ్ స్క్రిప్షన్ లో మూడో రోజుకు, ఏజేసీ జువెల్ మాన్యుఫాక్చరర్స్ ఐపీఓ 4వ రోజుకు ప్రవేశిస్తాయి. -
మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే మోతే.. ఈ బ్యాంకులో కొత్త ఛార్జీలు
కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహణ ఛార్జీలను తొలగిస్తున్నప్పటికీ మరికొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఖాతాదారులపై కనీస బ్యాలెన్స్ ఛార్జీలను మోపుతున్నాయి. తాజాగా డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) ఇండియా సేవింగ్స్ ఖాతాలో అవసరమైన నెలవారీ సగటు బ్యాలెన్స్ను నిర్వహించకపోతే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 1 నుండి బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో అవసరమైన నెలవారీ సగటు బ్యాలెన్స్ను నిర్వహించకపోతే ఎంత అయితే లోటు ఉంటుందో దానిపై 6% రుసుము చెల్లించాలి. డీబీఎస్ బ్యాంక్ ఇండియా వెబ్సైట్ ప్రకారం.. బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఛార్జీలు లోటులో 6% ఉంటాయి. ఇది గరిష్టంగా రూ .500 ఉంటుంది. డీబీఎస్ బ్యాంక్ రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) రూ .10,000 నిర్వహించాల్సి ఉంటుంది.కాగా డీబీఎస్ బ్యాంక్ ఇప్పటికే ఏటీఎం నగదు ఉపసంహరణ రుసుమును పెంచింది. ఉచిత పరిమితికి మించి ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలకు గరిష్టంగా రూ .23 వసూలు చేయడానికి బ్యాంకులను అనుమతించే ఆర్బీఐ నోటిఫికేషన్ తరువాత, డీబీఎస్ బ్యాంక్ తన రుసుమును అప్డేట్ చేసింది. మే 1 నుండి ఉచిత పరిమితికి మించి నాన్ డీబీఎస్ బ్యాంక్ ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలపై రూ.23 వసూలు చేస్తోంది. అయితే డీబీఎస్ బ్యాంక్ ఏటీఎంలలో ఎటువంటి రుసుము లేకుండా అపరిమితంగా నగదును ఉపసంహరించుకోవచ్చు.👉 ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి భారీ మార్పులు 👈 -
జాక్పాట్ కొట్టిన అనిల్ అంబానీ.. రూ. 600 కోట్ల ఆర్డర్
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్ తాజాగా జర్మనీ రక్షణ రంగ సంస్థ రైన్మెటల్ వాఫే మ్యునిషన్ జీఎంబీహెచ్ నుంచి రూ. 600 కోట్ల విలువైన ఆర్డర్ దక్కించుకుంది. హైటెక్ కమ్యూనికేషన్ విభాగంలో ఇది అతిపెద్ద ఎగుమతి కాంట్రాక్ట్గా కంపెనీ పేర్కొంది.తాజా ఆర్డర్ గ్లోబల్ డిఫెన్స్, యుద్ధసామగ్రి విభాగంలో కంపెనీకి కీలక మైలురాయిగా అభివర్ణించింది. తద్వారా అంతర్జాతీయస్థాయిలో రక్షణ, యుద్ధసామగ్రి సరఫరా చైన్లో విశ్వసనీయ భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ మరింత పటిష్టపడినట్లు తెలియజేసింది.రెండు సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దీర్ఘకాలిక సహకారానికి కట్టుబాటుగా పేర్కొంది. అంతేకాకుండా ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా లక్ష్యాలకు మద్దతుగా దేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను పటిష్టపరచనున్నట్లు వివరించింది.👉 ఇది చదివారా? అనిల్ అంబానీకి భారీ ఉపశమనందీంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు దూసుకెళ్లాయి. జూన్ 25న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ను తాకాయి. మార్కెట్లు ముగిసే సమయానికి షేరు విలువ రూ. 404.65 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీ అనుబంధ సంస్థే రిలయన్స్ డిఫెన్స్. -
ఎయిరిండియాలో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్..
న్యూఢిల్లీ: నష్టాలతో నడుస్తున్న విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో ప్రమోటర్ సంస్థలు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. వీటిలో ఒక్క చివరి నెల(మార్చి)లోనే రూ. 4,306 కోట్లు అందించాయి. 2022 జనవరి మొదలు టాటా గ్రూప్ ఎయిరిండియాను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లలో సరికొత్త మార్పులకు తెరతీసే(ట్రాన్స్ఫార్మేషన్) ప్రణాళికలను అమలు చేస్తోంది.2024 నవంబర్లో రెండు సంస్థల భాగస్వామ్య కంపెనీ విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేశాయి. తద్వారా ఎయిరిండియాలో సింగపూర్ సంస్థ 25.1 శాతం వాటా దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా మూలధన వ్యయాలకుగాను ప్రమోటర్ సంస్థలు గతేడాది రూ. 9,500 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రయివేట్ రంగ విమానయాన దిగ్గజానికి టాటా సన్స్ రూ. 3,225 కోట్లు, సింగపూర్ ఎయిర్లైన్స్ రూ. 6,333 కోట్లు చొప్పున అందించినట్లు వెల్లడించారు. నిధులను పెట్టుబడి వ్యయాలతోపాటు వర్కింగ్ క్యాపిటల్, వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా సమకూర్చినట్లు తెలియజేశారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం ఈ మార్చిలో టాటా సన్స్ రూ. 3,225 కోట్లు, సింగపూర్ సంస్థ రూ. 1,081 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మార్చి పెట్టుబడులకు ముందు ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ దాదాపు రూ. 5,253 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కాగా.. 2024 డిసెంబర్31తో ముగిసిన 9 నెలల కాలంలో ఎయిరిండియా గ్రూప్ అనుకోని పద్దులకు ముందు రూ. 8,033 కోట్ల నష్టాలు ప్రకటించింది. ఇదే కాలంలో ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం రూ. 56,367 కోట్ల ఆదాయం సాధించింది. -
భారత జీడీపీ ఇలా ఉండొచ్చు.. ఇక్రా తాజా అంచనాలు
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీ 6.2 శాతం వృద్ధిని సాధిస్తుందన్న గత అంచనాలను రేటింగ్ సంస్థ ఇక్రా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా తగినంత వర్షపాతం, చమురు ధరలు బ్యారెల్కు సగటున 70 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ఇరాన్–ఇజ్రాయెల్) పెరగడం, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్లు, వాణిజ్య విధానాల్లో అనిశ్చితులు దేశ జీడీపీ వృద్ధి తగ్గేందుకు పొంచి ఉన్న రిస్క్లుగా పేర్కొంది. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఆర్బీఐ అంచనా వేయగా.. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ సైతం ఇదేవిధమైన అంచనాను వ్యక్తం చేయడం గమనార్హం. ‘‘ఏప్రిల్, మే నెలల్లో ఆర్థిక కార్యకలాపాల్లో మిశ్రమ పనితీరు నెలకొంది. వేసవి పంటల ఉత్పాదకత ఆశాజనకంగా ఉంటుందన్న అంచనాలు నెలకొన్నప్పటికీ.. 17 వ్యవసాయేతర సంకేతాలకు గాను తొమ్మిదింటిలోనే మెరుగుదల కనిపించింది’’అని ఇక్రా తెలిపింది.మే నెలలోనే రుతుపవనాలు రావడంతో విద్యుత్, మైనింగ్ రంగాల పనితీరు ప్రభావితమైనట్టు పేర్కొంది. పట్టణాల్లో బలంగా వినియోగం ఆదాయపన్ను మినహాయింపులు పెంచడం, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో పట్టణ వినియోగం బలంగా ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. ‘‘సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందన్న సానుకూల అంచనాలు ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2024–25లో 4.6 శాతంగా ఉంటే, 2025–26లో 3.5 శాతానికి పరిమితం అవుతుంది. ఆర్బీఐ ఎంపీసీ అంచనా 3.7 శాతం కంటే ఇంకా తక్కువ’’అని ఇక్రా వివరించింది.వచ్చే ఆగస్ట్లో జరిగే ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో రేట్ల తగ్గింపునకు అవకాశాల్లేకపోయినప్పటికీ.. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నందున అక్టోబర్ నాటి సమీక్షలో 25 బేసిస్ పాయింట్ల కోతను చేపట్టొచ్చని అభిప్రాయపడింది. చమురు ధరలు బ్యారెల్కు 10 డాలర్లు పెరిగితే దిగుమతులపై 13–14 బిలియన్ డాలర్ల మేర అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని, ఇది కరెంట్ ఖాతా లోటును జీడీపీలో 0.3 శాతం మేర పెంచుతుందని ఇక్రా తెలిపింది. ఇక్కడి నుంచి చమురు ధరలు స్థిరంగా పెరుగుతూ పోతే అది భారత కంపెనీల లాభదాయకతను ప్రభావితం చేస్తుందని.. జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించేందుకు దారితీయొచ్చని పేర్కొంది. -
భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం
ముంబై: అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. పరిశ్రమలు, సేవల రంగాల్లో కార్యకలాపాలు ఇదే సూచిస్తున్నట్టు పేర్కొంది. వాణిజ్య విధాన పరమైన అనిశ్చితులకుతోడు పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ప్రస్తావించింది. ‘‘ఈ విధంగా అంతర్జాతీయ అనిశ్చితులు పెరిగిపోయిన తరుణంలోనూ 2025 మే నెలకు సంబంధించి అధిక ప్రాముఖ్యం కలిగిన సంకేతాలు.. పరిశ్రమలు, సేవల రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నట్టు సూచిస్తున్నాయి’’అని తన బులెటిన్లో పేర్కొంది. వ్యవసాయ రంగంలో 2024–25లో అన్ని ప్రధాన పంటల్లోనూ ఉత్పాదకత పెరిగినట్టు తెలిపింది. అదే సమయమంలో దేశీయంగా ధరలు సానుకూల స్థితిలోనే ఉన్నట్టు పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యం పరిధిలోనే వరుసగా నాలుగో నెలలోనూ నమోదైనట్టు తెలిపింది. వడ్డీ రేట్ల తగ్గింపును రుణ గ్రహీతలకు సమర్థవంతంగా బదిలీ చేసేందుకు వీలుగా సానుకూల ఆర్థిక పరిస్థితులు నెలకొన్నట్టు వివరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏప్రిల్ నెలలో 8.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయంటూ.. మార్చి నెలలో ఉన్న 5.9 బిలియన్ డాలర్లు, 2024 ఏప్రిల్ నెలలో ఎఫ్డీఐ 7.2 బిలియన్ డాలర్ల కంటే అధికమని పేర్కొంది. ఇదే సమయంలో మన దేశం నుంచి బయటకు వెళ్లిన ఎఫ్డీఐలు కూడా పెరిగినట్టు తెలిపింది. నికర ఎఫ్డీఐలు ఏప్రిల్ నెలలో అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే రెట్టింపై 3.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. ఈ బులెటిన్లో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, ఆర్బీఐ అధికారిక అభిప్రాయాలు కాదని పేర్కొంది. -
5జీ యూజర్లు @ 98 కోట్లు..!
న్యూఢిల్లీ: భారత్లో 5జీ టెలికం యూజర్లు (చందాదారులు) 2030 నాటికి 98 కోట్లకు చేరుకుంటారని, అప్పటికి 4జీ చందాదారుల సంఖ్య 60 శాతం తగ్గి 23 కోట్లకు పరిమితం అవుతుందని టెలికం గేర్ల తయారీ సంస్థ ఎరిక్సన్ తెలిపింది. ‘‘2024 చివరికి 5జీ చందాదారులు 29 కోట్లకు పెరిగారు. మొత్తం మొబైల్ సబ్్రస్కిప్షన్లలో 24 శాతంగా ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 98 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం చందాదారుల్లో 5జీ యూజర్లు 75 శాతానికి పెరుగుతారు’’అని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ వెల్లడించింది. 2024లో ఒక్కో స్మార్ట్ ఫోన్ ద్వారా 32జీబీ డేటా వినియోగంతో భారత్ ప్రపంచంలో డేటా రద్దీ పరంగా మొదటి స్థానంలో నిలిచినట్టు తెలిపింది. 2030 నాటికి ఒక్కో స్మార్ట్ఫోన్ డేటా వినియోగం 66జీబీకి పెరుగుతుందని అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా బలమైన 5జీ నెట్వర్క్ అవసరం ఉంటుందని పేర్కొంది. వేగంగా 5జీ స్మార్ట్ఫోన్లకు యూజర్లు మారుతుండడం, డేటా వినియోగానికి డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించింది. ‘‘బ్రాడ్బ్యాండ్ అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) విస్తరణ దిశగా సరీ్వస్ ప్రొవైడర్లను ఈ డిమాండ్ నడిపిస్తుంది. భారత్లో అందుబాటులో ఉన్న 5జీ మిడ్బ్యాండ్ స్పెక్ట్రమ్.. సామర్థ్యం, నెట్వర్క్ విస్తరణ అవసరాలకు సరిపోతుంది. ఇది యూజర్ అనుభవం పెరిగేందుకు వీలు కలి్పస్తుంది’’అని ఎరిక్సన్ నివేదిక వివరించింది. -
పీఎల్ఐ ప్రోత్సాహకాలు... రూ.21,534 కోట్లు
న్యూఢిల్లీ: భారత్లో తయారీని ప్రోత్సాహించేందుకు కేంద్రం తలపెట్టిన ఉత్పత్తి అనుసంధాన ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం సత్ఫలితాలను ఇస్తోంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12 రంగాలకు రూ.21,534 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్టు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాలు కూడా ఇందులో ఉన్నాయి. కరోనా సమయంలో సరఫరా వ్యవస్థ నుంచి సమస్యలు ఏర్పడడంతో.. భారత్లో తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోదీ సర్కారు 2021లో పీఎల్ఐ పథకాన్ని 14 రంగాల కోసం ప్రకటించింది. రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పటి వరకు 12 రంగాలకు కలిపి రూ.21,534 కోట్ల ప్రోత్సాహకం విడుదల చేసినట్టు కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించింది. ఎల్రక్టానిక్స్ తయారీ, ఐటీ హార్డ్వేర్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మా, టెలికం, ఆహార ప్రాసెసింగ్, వైట్ గూడ్స్ (ఏసీలు తదితర), ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, టెక్స్టైల్స్, డ్రోన్స్ తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. ఈ తరహా పథకాల పనితీరును కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా సమీక్షించారు. వచ్చే ఐదేళ్ల కాలానికి పెట్టుబడులు, ప్రోత్సాహకాలతో తమ పరిధిలో కార్యాచరణ రూపొందించాలని వివిధ శాఖలను కోరారు. 12 లక్షల మందికి ఉపాధి పీఎల్ఐ పథకం కింద ఇప్పటి వరకు రూ.1.76 లక్షల కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు వాణిజ్య శాఖ తెలిపింది. వీటి ద్వారా రూ.16.5 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా నమోదు కాగా, 12 లక్షల మందికి పైగా ఈ ఏడాది మార్చి నాటికి ఉపాధి (ప్రత్యక్ష, పరోక్ష) లభించినట్టు పేర్కొంది. ఫార్మా రంగానికి సంబంధించి పీఎల్ఐ పురోగతిని సమీక్షించగా, ఈ రంగంలో రూ.2.66 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా సాధ్యమైనట్టు, ఇందులో రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు మొదటి మూడేళ్లలో నమోదైనట్టు వాణిజ్య శాఖ గుర్తించింది. మొత్తం మీద ఫార్మా రంగంలో దేశీయంగా విలువ జోడింపు 2025 మార్చి నాటికి 83.70 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. బల్క్ డ్రగ్ విభాగంలో మన దేశం నికర దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా మారింది. 2021–22 నాటికి నికర బల్్కడ్రగ్ దిగుమతులు రూ.1,930 కోట్లుగా ఉంటే, 2025 మార్చి నాటికి రూ.2,280 కోట్ల నికర ఎగుమతులు పీఎల్ఐ కింద నమోదయ్యాయి. మ్యాన్ మేడ్ ఫైబర్ (ఎంఎంఎఫ్) టెక్స్టైల్స్ ఎగుమతులు 6 బిలియన్ డాలర్లకు చేరాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వీటి ఎగుమతులు 5.7 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. -
అంబానీ.. అదానీ ఇంధన బంధం!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ మరో భారీ వ్యాపార వెంచర్ కోసం చేతులు కలిపారు. ఒకరి ఇంధన రిటైల్ నెట్వర్క్లో మరొకరి ఇంధనాలను విక్రయించుకునేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం అదానీ టోటల్ గ్యాస్ (ఏటీజీఎల్) సీఎన్జీ రిటైల్ ఔట్లెట్స్లో జియో–బీపీ తమ పెట్రోల్, డీజిల్ ఇంధనాలను విక్రయిస్తుంది. అలాగే, జియో–బీపీ పెట్రోల్ బంకుల్లో ఏటీజీఎల్ తమ సీఎన్జీ పంపులను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతమున్న, భవిష్యత్లో రాబోయే ఔట్లెట్స్ అన్నింటికీ ఈ ఒప్పందం వర్తిస్తుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. జియో–బీపీ అనేది అంబానీకి చెందిన జియో, బ్రిటన్ సంస్థ బీపీ మధ్య జాయింట్ వెంచర్. ఇక, ఏటీజీఎల్ అనేది అదానీ గ్రూప్, ఫ్రాన్స్కి చెందిన టోటల్ ఎనర్జీస్ కలిసి ఏర్పాటు చేసిన జేవీ సంస్థ. జియో–బీపీకి దేశవ్యాప్తంగా 1,972 పెట్రోల్ బంకులు ఉండగా, ఏటీజీఎల్కి 659 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. ఇరు సంస్థల పటిష్టమైన నెట్వర్క్ను ఉపయోగించుకుని కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని జియో–బీపీ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. ఈ డీల్ ద్వారా ఔట్లెట్స్లో అత్యంత నాణ్యమైన, వివిధ రకాల ఇంధనాలను అందించాలనేది తమ ఉమ్మడి లక్ష్యమని ఏటీజీఎల్ ఈడీ సురేష్ పి. మంగ్లానీ చెప్పారు. పీఎస్యూలకు పోటీ..: ప్రస్తుతం ఇంధనాల రిటైలింగ్ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) ఆధిపత్యం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 97,366 పెట్రోల్ బంకులు ఉండగా మూడు పీఎస్యూలకు (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్)) ఏకంగా 90% వాటా ఉంది. సిటీ గ్యాస్ పంపిణీ వ్యాపారంలో కూడా అవి ముందుంటున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ, అంబానీ చేతులు కలపడం వల్ల వాటి ఆధిపత్యానికి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏటీజీఎల్ సంస్థ గృహాలు, పరిశ్రమలు, వాహనదారులు, ఇతరత్రా కస్టమర్లకు గ్యాస్ను, ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సదుపాయాలు మొదలైనవి అందిస్తోంది. మరోవైపు, జియో–బీపీ ఇంధనాల రిటైలింగ్తో పాటు పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఇంధనాలు, కనీ్వనియెన్స్ స్టోర్స్ మొదలైన విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఓ పవర్ ప్రాజెక్టులో.. ఇరువురు కుబేరులు వ్యాపార అవసరాలరీత్యా జట్టు కట్టడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. గతేడాది మార్చిలో మధ్యప్రదేశ్లోని ఓ విద్యుత్ ప్రాజెక్టు కోసం ఇద్దరూ చేతులు కలిపారు. అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26 శాతం వాటా కొనుగోలు చేసింది.పోటాపోటీ.. గుజరాత్కే చెందిన అంబానీ, అదానీ ఇద్దరికీ బడా వ్యాపార సామ్రాజ్యాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆసియాలోనే నంబర్ వన్ సంపన్నులుగా నిలవడంలో గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య పోటీ నడుస్తోంది. అంబానీ ఓవైపు ఆయిల్, గ్యాస్, రిటైల్, టెలికం తదితర రంగాల్లో విస్తరించగా అదానీ మరోవైపు నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బొగ్గు, మైనింగ్ తదితర మౌలిక సదుపాయాల రంగాల్లో విస్తరించారు. పర్యావరణహిత ఇంధనాల ప్రాజెక్టులను మినహాయిస్తే ఇద్దరూ ఒకరి రంగంలోకి మరొకరు అడుగుపెట్టలేదు. అదానీ మెగా రెన్యువబుల్ ఎనర్జీ పార్క్లు, సోలార్ మాడ్యూల్స్ .. విండ్ టర్బైన్ల తయారీపై దృష్టి పెట్టారు. అటు అంబానీకి చెందిన రిలయన్స్ గుజరాత్లోని జామ్నగర్లో నాలుగు గిగాఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తోంది. ఇక 2014 నుంచి సీఎన్బీసీ–టీవీ18, సీఎన్ఎన్–న్యూస్18, కలర్స్లాంటి టీవీ చానళ్ల ద్వారా అంబానీ మీడియా రంగంలో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఎన్డీటీవీ కొనుగోలు ద్వారా అదానీ కూడా ఇటీవలే ఈ విభాగంలోకి ప్రవేశించారు. -
నా జీవితంలో అతిపెద్ద రిస్క్.. జియో: ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: జియో రూపంలో టెలికం రంగంలోకి రీఎంట్రీ చేయడమనేది తన జీవితంలో తీసుకున్న అతి పెద్ద రిస్క్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అభివర్ణించారు. అత్యంత అధునాతనమైన డిజిటల్ టెక్నాలజీకి భారత్లో పరిస్థితులు ఇంకా అనువుగా లేవని, ఈ వెంచర్ ఆర్థికంగా విఫలమవుతుందని విశ్లేషకులు హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. ఒకవేళ విశ్లేషకులు చెప్పినది నిజంగానే జరిగినా కూడా, దేశాన్ని డిజిటల్ బాట పట్టించడంలో జియో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, ఆ మాత్రం రిస్కు తీసుకోవడంలో తప్పు లేదనిపించిందని మెకిన్సే అండ్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘మేము ఎప్పుడూ పెద్ద రిస్క్ లే తీసుకున్నాం. మాకు భారీ స్థాయి ముఖ్యం. మేము ఇప్పటి వరకు తీసుకున్న అతి పెద్ద రిస్కు జియోనే. అప్పట్లో మా సొంత డబ్బును ఇన్వెస్ట్ చేశాం. నేను మెజారిటీ వాటాదారుగా ఉన్నాను. 4జీ మొబైల్ నెట్వర్క్ విస్తరణ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కోట్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్న క్రమంలో ఈ టెక్నాలజీకి భారత్లో అనువైన పరిస్థితులు లేవని, డబ్బంతా వృథా అవుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ మా కంపెనీ బోర్డుకు నేను ఒక్కటే చెప్పాను. ఇదంతా మన సొంత డబ్బు. మహా అయితే దీనిపై మనకు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. ఫర్వాలేదు. దీనితో దేశాన్ని డిజిటలైజ్ చేయొచ్చు. భారత్ను సంపూర్ణంగా మార్చివేయొచ్చు. ఆ విధంగా దేశం కోసం రిలయన్స్ ఒక గొప్ప మేలు చేసినట్లవుతుంది. అత్యుత్తమ విరాళం ఇచ్చినట్లవుతుంది అన్నాను‘ అని అంబానీ పేర్కొన్నారు. 2016లో ప్రారంభమైన జియో.. నేడు 47 కోట్ల మంది యూజర్లతో, 5జీ, క్లౌడ్, ఏఐ సర్వీసుల్లోనూ కార్యకలాపాలతో టెలికంలో అగ్రస్థానంలో ఉంది. ఇంకా ఏమన్నారంటే.. → ప్రపంచం ప్రతి అయిదేళ్లకో లేదా పదేళ్లకో మారిపోతూ ఉంటుంది. మనం బిజినెస్ స్కూల్లో నేర్చుకున్న దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. మేము అలాంటి పరిస్థితులకు సవాలు విసిరాం. రిలయన్స్ 1960లలో ఒకలాగా, 70ల్లో ఆ తర్వాత 2000.. 2020లలో మరోలాగా మారింది. ఇప్పుడు పూర్తి భిన్నం. → రిస్క్ మేనేజ్మెంట్ విషయానికొస్తే.. ఒకవేళ పరిస్థితులు ఘోరంగా దిగజారితే బైటపడగలమా అనేది ఆలోచించాలి. ఏం చేసినా సరే మా ఉద్యోగుల కళ్లలోకి చూసి నిజాయితీ గా మాట్లాడగలిగేలా ఉండాలని 30..40 ఏళ్ల క్రి తం నేను వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతం పెట్టుకున్నాను. ఈ సంస్థాగత సంస్కృతే ఎంతæ పెద్ద రిస్క్ ల నుంచైనా కాపాడగలిగే బీమా. → డీప్–టెక్, అధునాతన తయారీ కంపెనీగా ఎదగాలనేది రిలయన్స్ లక్ష్యం. మన దగ్గర సరైన టాలెంట్, సరైన లక్ష్యం అంటూ ఉంటే ఎక్కడికి వెళ్లాలి, కోరుకున్నది ఎలా సాధించాలనేది ఏదో విధంగా కనుక్కుంటాం. అది రిలయన్స్ డీఎన్ఏలోనే ఉంది. నాన్నకు మాటిచ్చాను.. ఇంటర్వ్యూ సందర్భంగా ముకేశ్ అంబానీ తన తండ్రి ధీరుభాయ్ అంబానీని గుర్తు చేసుకున్నారు. ‘రిలయన్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ సంస్థ చిరకాలం ఉండాలి. నా తర్వాత, నీ తర్వాత కూడా రిలయన్స్ కొనసాగేలా నువ్వు చూడాలి అని నాన్న చెప్పారు. మా తదనంతరం కూడా రిలయన్స్ ఉంటుందని నేను ఆయనకు మాట ఇచ్చాను. 2027లో రిలయన్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటుంది. కానీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కూడా రిలయన్స్ భారతదేశానికి, మానవాళికి సేవ చేయడాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అది కచ్చితంగా జరుగుతుందని గాఢంగా నమ్ముతున్నాను‘ అని ముకేశ్ అంబానీ చెప్పారు. -
30 రోజుల రీచార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్లు
జియో, ఎయిర్టెల్ దేశంలో రెండు అతిపెద్ద టెలికాం కంపెనీలు. దేశంలో ఎక్కువ మంది మొబైల్ వినియోగదారులు జియోతో కనెక్ట్ అయ్యారు. యూజర్ల పరంగా ఎయిర్ టెల్ రెండో స్థానంలో ఉంది. ఎక్కువ మంది యూజర్లు నెలవారీ రీచార్జ్ ప్లాన్ల వైపు మొగ్గుచూపుతుంటారు. రెండు కంపెనీలు తమ వినియోగదారులకు సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.జియో, ఎయిర్టెల్లో ఉన్న 30 రోజుల వాలిడిటీ రీఛార్జ్ ప్లాన్లు, వాటి ప్రయోజానాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. రూ.335తో జియో 30 రోజుల వాలిడిటీ రీఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, మీరు ఎయిర్టెల్ 30 రోజుల వాలిడిటీ రీఛార్ ప్లాన్ రూ .379కు అందుబాటులో ఉంది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్ల ధరలలో వ్యత్యాసం రూ .44. అలాగే వాలిడిటీ ఒక్కటే అయినా ప్రయోజనాల్లోనూ చాలా తేడాలున్నాయి.జియో రూ.335 ప్లాన్జియో రూ.335 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు మొత్తం 25 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా జియో హాట్స్టార్, జియో క్లౌడ్కు ఉచిత యాక్సెస్ కూడా పొందుతారు.ఎయిర్టెల్ రూ.379 ప్లాన్ఎయిర్ టెల్ రూ.379 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇది కాకుండా, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ యాప్నకు యాక్సెస్ కూడా పొందుతారు.👉 ఇది చదివారా? జియో నుంచి 2 కొత్త ఫ్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు.. -
రూ.10వేలలో మరో కొత్త ఫోన్.. అమ్మకాలు ప్రారంభం
కొత్తగా లాంచ్ అయిన ఐక్యూ జెడ్10 లైట్ 5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు భారత్లో ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ధర రూ.10,000 రేంజ్లోనే ఉంటుంది. 6,000 ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్ వంటి అద్భుత స్పెసిఫికేషన్లు ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22.7 గంటల వీడియో ప్లేబ్యాక్ ను అందిస్తుంది. లాంచ్ ఆఫర్లలో బ్యాంక్ కార్డులపై రూ.500 తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ తదితర ఆఫర్లు ఉన్నాయి. 👉 కొత్త ఫోన్.. రూ.25 వేలకే 3డీ కర్వ్డ్ డిస్ప్లే 👈ఐక్యూ జెడ్10 లైట్ 5జీ స్పెసిఫికేషన్లుఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఐక్యూ జెడ్10 లైట్ 5జీ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇందులో 6.74 అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీని అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగా పిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కూడా ఉంది. 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ వి5.4, వై-ఫై 5 ఉన్నాయి.ఐక్యూ జెడ్10 లైట్ 5జీ లాంచ్ ఆఫర్లుఐక్యూ జెడ్10 లైట్ 5జీ లాంచ్ ఆఫర్లలో ఎంపిక చేసిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఇతర బ్యాంక్ కార్డులపై రూ .500 తక్షణ తగ్గింపు ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, జీఎస్టీ బెనిఫిట్స్ కూడా అమెజాన్ ఇండియాలో లిస్ట్ అయ్యాయి. ఐక్యూ జెడ్10 లైట్ 5జీ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఇది సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
భారత వృద్ధి.. అంచనాలు పెరిగాయ్..
ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 2025–26 సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. 6.5 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. ముడి చమురు ధరలు కనిష్ట స్థాయిలో ఉండడం, పరపతి విధాన సరళీకరణ (వడ్డీ రేట్ల తగ్గింపు), ఆదాయపన్ను తగ్గింపు, సాధారణ వర్షపాతం అంచనాలను సానుకూలతలుగా పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రూపాయి, ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చని అంచనా వేసింది.భారత జీడీపీ 6.5 శాతం వృద్ధి సాధిస్తుందంటూ ఎస్అండ్పీ ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేయగా, అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళిక అస్థితరల నేపథ్యంలో ఆ తర్వాత 0.20 శాతాన్ని తగ్గిస్తూ, 6.3 శాతానికి సవరించింది. మళ్లీ పూర్వపు వృద్ధి అంచనాలనే ఇప్పుడు ప్రస్తావించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం ఆర్థిక పరిస్థితులపై ఎస్అండ్పీ ఒక నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణలతో చమురు ధరలు దీర్ఘకాలం పాటు పెరుగుతూ పోతే అది ఆసియా పసిఫిక్ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.గతేడాది కంటే చమురు ధరలు తక్కువగా ఉండడం భారత్కు అనుకూలిస్తుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆర్థికవేత్త విశృత్ రాణా తెలిపారు. ఏడాది క్రితం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 85 డాలర్లుగా ఉండడం గమనార్హం. ‘‘కరెంట్ ఖాతా నుంచి చేయాల్సిన చెల్లింపులు తగ్గుతాయి. దేశీయంగా ఇంధన ధరల ఒత్తిళ్లూ ఉండవు. ఇంధన ధరలు మోసర్తుగా పెరిగినా కానీ, ద్రవ్యోల్బణంపై ఆహార ధరలే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కనుక మొత్తం మీద రూపాయి లేదా ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం ఉండదన్నది మా అంచనా’’అని రాణా వివరించారు. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం నేపథ్యంలో ముడి చమురు బ్యారెల్కు 69 డాలర్లకు పడిపోవడం తెలిసిందే. స్థానిక డిమాండ్ బలం.. అంతర్జాతీయంగా ఇంధన సరఫరా మెరుగ్గా ఉన్న పరిస్థితుల్లో చమురు ధరలు పెరగకపోవచ్చని ఎస్అండ్పీ పేర్కొంది. స్థానికడిమాండ్ బలంగా ఉన్నందున భారత్ తదితర దేశాల్లో ఆర్థిక వృద్ది నిదానించడాన్ని పరిమితం చేస్తుందని తెలిపింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.7 శాతానికి పెరగొచ్చని అంచనా వ్యక్తం చేసింది.2024–25లో దేశ జీడీపీ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 2025–26 సంవత్సరానికి 6.5 శాతం వృద్ధి అన్న ఎస్అండ్పీ అంచనాలు.. ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. 2025లో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండొచ్చని ఈ నివేదిక తెలిపింది. గతేడాది ఇది 4.6 శాతంగా ఉంది. రూపాయి ఈ ఏడాది చివరికి 87.5 స్థాయికి చేరుతుందని పేర్కొంది. -
జియోస్టార్ రిపోర్ట్: అహో ఐపీఎల్.. అన్నీ ‘ఫస్ట్’లే..
టాటా ఐపీఎల్ 2025 లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సీజన్లలో ఒకటిగా నిలిచింది, అనేక రికార్డులు, పరిశ్రమ ఫస్ట్లతో కొత్త బెంచ్మార్క్లను నెలకొల్పింది. మీడియా పార్ట్నర్స్ ఆసియా (ఎంపీఏ) భాగస్వామ్యంతో ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించిన ఏపీఓఎస్ సదస్సులో జియోస్టార్ ‘టాటా ఐపీఎల్ 2025: ఎ ఇయర్ ఆఫ్ ఫస్ట్స్’ రిపోర్ట్ను విడుదల చేసింది.'ఐపీఎల్ 2025 సీజన్ క్రీడలు, కథనాలు, అనుభవాలు పంచుకోవడం మధ్య గీతలను చెరిపివేసింది. ఇది కేవలం మ్యాచ్లను ప్రసారం చేయడం మాత్రమే కాదు - సృజనాత్మకత, సంస్కృతి, వాణిజ్యం, అభిమానుల కనెక్షన్లతో కలిసిపోయింది" అని జియోస్టార్ స్పోర్ట్స్ అండ్ లైవ్ ఎక్స్పీరియన్స్ సీఈఓ సంజోగ్ గుప్తా అన్నారు.నివేదిక ముఖ్యాంశాలుజియోస్టార్ నెట్వర్క్లో టాటా ఐపీఎల్ 2025 మొత్తం 1.19 బిలియన్ల మొత్తం రీచ్ను నమోదు చేసింది. ఇందులో టీవీలో 537 మిలియన్లు. డిజిటల్లో 652 మిలియన్లు.స్టార్ స్పోర్ట్స్లో ఐపీఎల్ వీక్షకుల్లో 47 శాతం మంది మహిళలే ఉన్నారు.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను 426 మిలియన్ల మంది వీక్షించారు. (టీవీలో 189 మిలియన్లు, డిజిటల్ లో 237 మిలియన్లు)జియో హాట్స్టార్ 300 మిలియన్ల సబ్స్క్రైబర్లకు చేరుకుంది. ఆండ్రాయిడ్ లో 1.04 బిలియన్ యాప్ డౌన్ లోడ్ లుకనెక్టెడ్ టీవీలో 235 మిలియన్ల రీచ్. మొబైల్ ఫోన్ల ద్వారా 41.7 కోట్ల మంది రీచ్ అయ్యారు.టోర్నమెంట్ వీక్షణ సమయం 514 బిలియన్ నిమిషాలు; స్టార్ స్పోర్ట్స్ హెచ్డీలో 129 మిలియన్ల మంది వీక్షించారు. 840 బిలియన్ నిమిషాల వాచ్ టైమ్.వీక్షకుల్లో 30 శాతం మంది మాక్స్ వ్యూ 3.0ను ఉపయోగించగా, ప్రాంతీయ భాషా ఫీడ్ వార్షిక వృద్ధిని చూసింది: హిందీ: 31 శాతం; తెలుగు: 87 శాతం; తమిళం: 52 శాతం.మొబైల్లో 44 శాతం మంది ఐపీఎల్ వీక్షకులు 'జీతో ధన్ ధనా ధన్' గేమ్ థ్రిల్ను అనుభవించారు.జియోస్టార్లో 425 కుపైగా ప్రకటనకర్తలు వచ్చారు. 40 ప్రత్యేక కేటగిరీల్లో 270+ నూతన ప్రకటనకర్తలే. మార్కెట్ లీడర్ల నుండి ఛాలెంజర్స్ వరకు 9 కేటగిరీలలో 32 బ్రాండ్లు నీల్సన్ థర్డ్ పార్టీ మెజర్మెంట్ను ఉపయోగించాయి.16:9లో మల్టీ క్యామ్, 360°/ వీఆర్ స్ట్రీమింగ్, మ్యాక్స్ వ్యూ 3.0, కనెక్టెడ్ టీవీలో వాయిస్-అసిస్టెడ్ సెర్చ్, ప్రకటనల రహిత ఫాస్ట్ చానెల్స్, ఏఐ ఆధారిత మ్యాచ్ హైలైట్స్ వంటి సరికొత్త టెక్నాలజీలను ఈ సీజన్లో వినియోగించారు. -
ముంబై ఎయిర్పోర్ట్ కోసం అదానీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల నుంచి డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,600 కోట్లు) సమీకరించింది. నిధులను ముంబై ఎయిర్పోర్ట్ రుణాల రీఫైనాన్సింగ్కు వినియోగించనుంది. న్యూయార్క్ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ అధ్యక్షతన మెట్లైఫ్ ఇంక్, బ్లాక్రాక్ ఇంక్, ఎఫ్డబ్ల్యూడీ ఇన్సూరెన్స్ నిధులు సమకూర్చాయి.ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎంఐఏఎల్) కోసం 2022లో సమీకరించిన రుణాల రీఫైనాన్స్కు నిధులు వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. ఎంఐఏఎల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ వాటా 74 శాతంకాగా.. భారత ఎయిర్పోర్ట్స్ అథారిటీకి 26 శాతం వాటా ఉంది. దేశీయంగా రెండో పెద్ద ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న కంపెనీ 2029 జులైలో గడువుతీరే 75 కోట్ల డాలర్ల విలువైన నోట్లను జారీ చేసింది. వీటికి అదనంగా 25 కోట్ల డాలర్ల నోట్లను జారీ చేసే వీలుతో నిధుల సమీకరణ చేపట్టింది.తద్వారా బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది. దీంతో ఎంఐఏఎల్ అభివృద్ధి, ఆధునీకరణ, సామర్థ్య విస్తరణకు ఆర్థిక వెసులుబాటు లభించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. తాజాగా జారీ చేసిన బాండ్లు 6.9 శాతం కూపన్రేటుతో నాలుగేళ్ల కాలానికి గడువు తీరనున్నాయి. ఎయిర్పోర్ట్ మౌలికసదుపాయాల రంగంలో తొలి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ప్రయివేట్ బాండ్ల జారీని చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది. -
ఇవిగో ఈ తప్పులు చేశారో.. ఐటీ రిటర్న్ కొత్త రూల్స్..
దేశవ్యాప్తంగా పన్నుచెల్లింపుదారులు ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలులో తలమునకలై ఉన్నారు. ఐటీఆర్ ఫైలింగ్కు సాధారణంగా జూలై 31 చివరి తేదీ కాగా ఈ ఏడాది దీన్ని సెప్టెంబర్ 15 వరకూ పొడిగించారు. ట్యాక్స్ ఫైలింగ్లో సమ్మతి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.తప్పుడు మినహాయింపులు క్లయిమ్ చేసినా, ఆదాయాన్ని దాచినా పన్ను చెల్లింపుదారులకు కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టింది. "పన్ను బకాయిలో 200% వరకు జరిమానా, 24% వార్షిక వడ్డీ, సెక్షన్ 276 సి కింద ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కోవచ్చు" అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఈ పరిణామాలను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను జాగ్రత్తగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.కొత్త నిబంధనలు.. కీలకాంశాలుకఠినమైన జరిమానాలు: తప్పుదారి పట్టించే లేదా తప్పుడు ఐటీఆర్ దాఖలు చేసిన వారికి 200 శాతం జరిమానా, 24 శాతం వార్షిక వడ్డీ, సెక్షన్ 276సి ప్రకారం శిక్ష కూడా విధిస్తారు.పన్ను చెల్లింపుదారుల బాధ్యత: సీఏ లేదా కన్సల్టెంట్ పొరపాటు చేసినా కూడా పన్ను చెల్లింపుదారుడే బాధ్యత వహించాలి.అందరికీ వర్తింపు: ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్ అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.సాధారణ తప్పులు: తప్పు ఐటీఆర్ ఫారమ్ ఎంపిక, తప్పుడు మినహాయింపులు, ఆదాయాన్ని ప్రకటించకపోవడం జరిమానాలకు దారి తీస్తాయి.రివైజ్డ్ రిటర్న్తోనూ లాభం లేదు: ఇచ్చిన సమాచారం తప్పుగా ఉందని పన్ను శాఖ గుర్తిస్తే, రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసినా జరిమానా తప్పదు.సరైన ఐటీఆర్ ఫారమ్ ఎంపిక: ITR-1 (సాధారణ ఆదాయం), ITR-3 (వ్యాపార ఆదాయం) వంటి వివిధ ఫారమ్లు ఆదాయ రకాన్ని బట్టి ఎంచుకోవాలి.తప్పు క్లెయిమ్లు చేయొద్దు: వ్యాపార ఖర్చులుగా వ్యక్తిగత ఖర్చులను చూపడం, తప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్లు జరిమానాలకు దారి తీస్తాయి.పన్ను చెల్లింపుదారులకు జాగ్రత్తలు: వార్షిక సమాచార ప్రకటనలోని వివరాలతో సరిపోల్చుకోవడం, సరైన రికార్డులు నిర్వహించడం, పన్ను నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా జరిమానాలను నివారించవచ్చు. -
మలేరియా టీకా ధరలు తగ్గించిన భారత్ బయోటెక్!
ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా టీకా ధరలను ఈ వ్యాధి ప్రబలంగా ఉండే కొన్ని దేశాల్లో సగానికి తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్, జీఎస్కేలు ప్రకటించాయి. ఆయా దేశాల్లో 2028 నుంచి మలేరియా నివారణ టీకాలు ఐదు డాలర్ల కంటే తక్కువ ధరకు లభిస్తాయని ఇరు సంస్థలు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు వ్యాక్సీన్లను పంపిణీ చేసేందుకు ఏర్పాటైన ‘ద వ్యాక్సీన్ అలయన్స్’కు 2026- 2030 మధ్య సరఫరా చేసే టీకాలపై ఒక ఒప్పందం కుదిరిన సందర్భంగా ఇరు సంస్థలు ఈ విషయాన్ని తెలిపాయి. జీఎస్కే, పాథ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మలేరియా టీకా ఆర్టీఎస్.ఎస్ను మలేరియా నివారణకు ఉపయోగించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021లోనే అనుమతులిచ్చింది. అయితే ఉత్పత్తి మార్గాల్లో మెరుగుదల, సామర్థ్యం పెంపు, లాభాన్ని కనీస స్థాయిలో ఉంచడం వంటి కారణాల వల్ల టీకా ధర సగానికి తగ్గించడం వీలైందని భారత్ బయోటెక్, జీఎస్కేలు వివరించాయి. ‘‘వ్యాక్సీన్ అలయెన్స్కు టీకాల సరఫరా చేస్తామన్న ఒప్పందం కుదరడం వల్ల లక్షల మంది పిల్లలు, కుటుంబాలపై మలేరియా సమస్య తగ్గిపోతుంది. ఈ చర్య మాకు కేవలం వ్యాక్సీన్ అలయన్స్కు సహకరించడం మాత్రమే కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం’’ అని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. జీఎస్కే సహకారంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా బాధిత బాలలు, వారికి అందుబాటులో ఉన్న టీకాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తున్నాం అని చెప్పారు. న్, పాథ్, ప్రపంచ ఆరోగ్య సంస్థల సహకారం కూడా ఉంది.’’ అని అన్నారు. కాగా, ఘన, కీన్యా, మలవాయి వంటి దేశాల్లో ఇటీవలే సుమారు ఇరవై లక్షల మంది పిల్లలకు మలేరియా టీకా ఇవ్వడం వల్ల ఈ వ్యాది కారణంగా మరణించే వారి సంఖ్య 13 శాతం వరకూ పడిపోయిందని, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 22 శాతం తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. మలేరియా సమస్య ఎక్కువగా ఉన్న చోట్ల ఈ టీకాతోపాటు మలేరియా సీజన్లో తగిన మందులు ఇవ్వడం ద్వారా వ్యాధిని గణనీయంగా నివారించడం సాధ్యమైందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.(చదవండి: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..! సుందర్ పిచాయ్కి కలిగిన సందేహం) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. చమురు ధరల పతనం, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఇన్వెస్టర్ల ఆందోళనలను తగ్గించడంతో మీడియా, టెక్ షేర్లలో లాభాలతో భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభాలను ఆర్జించాయి.బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 700.4 పాయింట్లు లేదా 0.85 శాతం పెరిగి 82,755.51 వద్ద ముగియగా, నిఫ్టీ 50 కూడా 200.40 పాయింట్లు లేదా 0.8 శాతం పెరిగి 25,244.75 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం పెరిగాయి.నిఫ్టీ మీడియా, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు వరుసగా 1.99 శాతం, 1.64 శాతం, 1.43 శాతం చొప్పున లాభపడ్డాయి. టైటాన్ కంపెనీ, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ 3.6 శాతం వరకు లాభపడ్డాయి. బీఈఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్గా నిలిచాయి, మార్కెట్ అస్థిరతను అంచనా వేయడానికి ఉపయోగించే భయ సూచిక ఇండియా వీఐఎక్స్ దాదాపు 5 శాతం పడిపోయి 12.96 పాయింట్లకు పడిపోయింది. -
కొత్త ఇన్సూరెన్స్ పథకం.. మంచి బెనిఫిట్స్తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా సంస్థ గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ కొత్తగా గెలాక్సీ మార్వెల్ పేరిట పాలసీని ప్రవేశపెట్టింది. తొలిసారి క్లెయిమ్ చేసేంతవరకు లేదా 55 ఏళ్లు వచ్చేంత వరకు ఒకే ప్రీమియంను కొనసాగించడం, 71 కన్జూమబుల్స్కు కవరేజీ, అపరిమిత స్థాయిలో 100 శాతం సమ్ ఇన్సూర్డ్ను రిస్టోర్ చేయడం, ప్రీమియం వెయివర్, ఔట్పేషంట్ బెనిఫిట్స్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.తమ పాలసీల విక్రయం కోసం పాలసీబజార్తో చేతులు కలిపినట్లు కంపెనీ ఎండీ జీ. శ్రీనివాసన్ తెలిపారు. కార్యకలాపాలు ప్రారంభించిన గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4,730 పైగా పాలసీదార్లకు బీమా భద్రత కల్పించామని, రెండురాష్ట్రాల్లో 1893 మంది పైగా ఏజంట్లతో పటిష్టమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నామని ఆయన వివరించారు. -
ముదురుతున్న ఏఐ వార్!
గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కీలక ప్రచారం ప్రారంభించినట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.నేరుగా సంప్రదింపులుకొన్ని సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు, డెవలపర్లు, స్టార్టప్ ఫౌండర్లను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా మార్క్ జుకర్బర్గ్ సంప్రదిస్తున్నారు. వీరిలో కొందరిని వ్యక్తిగతంగా షార్ట్లిస్ట్ చేసి ఆయా నిపుణులను నేరుగా సంప్రదిస్తున్నారు. వారితో జరుపుతున్న చర్చల్లో కేవలం నియామకాల గురించే కాకుండా ఆర్టిఫిషియన్ జనరల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్తు కార్యకలాపాలు వంటి చాలా అంశాలను చర్చిస్తున్నారు.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం..మెటా కొన్ని రోజుల నుంచి మానవ స్థాయి కృత్రిమ మేధ వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్’ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు ప్రపంచంలోనే టాప్ స్కిల్డ్ పర్సన్స్ను నియమించుకోవాలని మెటా భావిస్తోంది. దాంతో సరైన నైపుణ్యాలు ఉన్నవారికి భారీగా ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. అలెగ్జాండర్ వాంగ్ స్థాపించిన స్కేల్ ఏఐ కంపెనీను 14 బిలియన్ డాలర్ల(రూ.1.2 లక్షల కోట్లు) వాల్యుయేషన్కు కొనుగోలు చేసింది. సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్ను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన వాంగ్ ఇప్పుడు కృత్రిమ మేధ ఆవిష్కరణలో మెటా తరఫున పని చేస్తున్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశంకొందరు విముఖతఅయితే కొందరు మాత్రం తమ నైపుణ్యాలకు, తాము స్థాపించిన కంపెనీలకు మెటా ఎంత వెచ్చిస్తానంటున్నా కలిసిరావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. జుకర్బర్గ్, మెటా ఏఐ చీఫ్ సైంటిస్ట్ యాన్ లెకున్ మధ్య ఫిలాసఫికల్ విభేదాల వల్ల ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ దీర్ఘకాలికంగా ఎలా అభివృద్ధి చెందుతుందనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. -
విశాఖలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్
ఐటీ సర్వీసులు అందించే ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ తన భారత కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రూ.1,583 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక టెక్నాలజీ క్యాంపస్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. వైజాగ్లోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 22 ఎకరాల్లో మూడు దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ క్యాంపస్ ద్వారా 8,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది.2026లో 800 మంది అసోసియేట్లకు వసతి కల్పించేలా తాత్కాలిక కేంద్రం ద్వారా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. 2029 ప్రారంభంలో పూర్తి స్థాయి క్యాంపస్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. విశాఖపట్నం ప్రతిభకు, మౌలిక సదుపాయాలకు ప్రత్యేకంగా నిలుస్తున్నట్లు కాగ్నిజెంట్ సీఈఓ ఎస్.రవి కుమార్ తెలిపారు. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో సంస్థ విస్తరించాలనే లక్ష్యానికి అనుగుణంగా వైజాగ్లో క్యాంపస్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ డిజిటల్ ఎకానమీని మరింత వేగవంతం చేస్తుందని, అదే సమయంలో భవిష్యత్తులో శ్రామిక శక్తికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంచుతుందని ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశంభారతదేశం అంతటా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా కాగ్నిజెంట్ ఇప్పటికే భువనేశ్వర్, ఇండోర్లో కొత్త కేంద్రాలను, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఫైనాన్స్ హబ్ను ఏర్పాటు చేసిందని కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతానికి పైగా కంపెనీ శ్రామిక శక్తి భారత్లో ఉన్నందున కాగ్నిజెంట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. -
మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశం
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) కూటమి దేశాల్లో ఒమన్ మొదటిసారి ఆదాయపు పన్నును ప్రవేశపెట్టనుంది. 42,000 రియాల్స్ (1,09,000 డాలర్లు-దాదాపు రూ.93 లక్షలు) కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వర్గానికి 5% పన్ను విధించనున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒమన్ న్యూస్ ఏజెన్సీని ఉటంకిస్తూ బ్లూమ్బర్గ్ కథనం ప్రచురించింది. ఈ విధానం 2028 నుంచి అమల్లోకి రానుందని అంచనా వేసింది.చమురుకు తగ్గుతున్న డిమాండ్ముడిచమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంపై దేశం తక్కువగా ఆధారపడటానికి ఈ చర్య దోహదపడుతుందని ఒమన్ ఆర్థిక మంత్రి సయ్యద్ బిన్ మొహమ్మద్ అల్ సక్రీ తెలిపారు. అదే సమయంలో ప్రజా సేవలు, సామాజిక అవసరాలపై వ్యయాన్ని సమర్థంగా నిర్వర్తించవచ్చని చెప్పారు. మొత్తం ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్యదేశాలు ఆదాయంపై పన్ను విధించకుండా దూరంగా ఉన్న నేపథ్యంలో ఒమన్ తీసుకున్న నిర్ణయం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న జీరో ట్యాక్స్ విధానం అధిక ఆదాయం ఉన్న ప్రవాసులను ఆకర్షించడానికి సహాయపడింది. ఒకవేళ ఒమన్ ప్రతిపాదించిన విధానం ఆచరణలోకి వస్తే ప్రవాసుల ధోరణి ఎలా ఉంటుందో గమనించాల్సి ఉంటుంది.అబుదాబి కమర్షియల్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ మోనికా మాలిక్ ఈ పరిణామాన్ని ఆర్థికంగా కీలకమైనదిగా అభివర్ణించారు. ఒమన్ తన పక్క దేశాలతో అభివృద్ధిలో పోటీ పడేందుకు వీలుగా, రాజీపడకుండా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని చెప్పారు. ఇదిలాఉండగా, పొరుగు దేశాల మాదిరిగానే ఒమన్ కూడా సంపద సృష్టించడంలో భాగంగా ఇటీవలి కాలంలో ఆస్తుల అమ్మకాలు, ప్రైవేటీకరణ ద్వారా డబ్బు సమీకరిస్తోంది.గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాటలో..?సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుముఖం పడుతుండటంతో ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇప్పటికే సూచించింది. ప్రస్తుతం చాలా జీసీసీ దేశాలు మెరుగైన ప్రభుత్వ నిధులను కలిగి ఉన్నప్పటికీ సౌదీ అరేబియా, బహ్రెయిన్ మాత్రమే ఈ సంవత్సరం బడ్జెట్ లోటును ఎదుర్కొంటున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్జీసీసీ దేశాలు ఏవంటే..గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) అనేది ఆరు మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ రాజకీయ, ఆర్థిక కూటమి. అందులోని దేశాలు..బహ్రెయిన్కువైట్ఒమన్ఖతార్సౌదీ అరేబియాయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)1981లో జీసీసీ స్థాపించారు. సౌదీ అరేబియాలోని రియాద్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. -
ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్
ఎక్కువ మంది భారతీయ దంపతులు తమ రిటైర్మెంట్ ప్రణాళికల్లో భాగంగా ఇండియాలో కాకుండా దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూఏఈలోని భారతీయులు విభిన్న ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టి అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని, తద్వారా రియల్ ఎస్టేట్ను స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్గా మారుస్తున్నారని బెంగళూరుకు చెందిన సీఏ, ఒబెయా స్టార్టప్ ఫౌండర్ అభిషేక్ జమువార్ తెలిపారు.జమువార్ తన లింక్డ్ఇన్లో ఇందుకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ‘ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించాలి. దుబాయ్లో ఇన్వెస్ట్ చేసిన భారతీయులు ఇండియాలో పెట్టుబడి పెట్టినవారితో పోలిస్తే సంతోషంగా ఉన్నారు. దుబాయ్లో 2-3 ప్రాపర్టీస్ కొన్న భారతీయ జంటలు చాలానే ఉన్నాయి. కేవలం రికార్డు కోసం నేను సంపన్న వర్గం గురించి మాట్లాడటం లేదు. కష్టపడి, డబ్బు ఆదా చేసి, వారి భవిష్యత్తును సులభతరం చేయడానికి తమ కెరియర్లో 10 నుంచి 15 సంవత్సరాలు శ్రమించిన సాధారణ జంటల గురించి మాట్లాడుతున్నాను. దుబాయ్లో చాలా మంది మధ్యతరగతి భారతీయ జంటలు కొన్నేళ్లుగా పొదుపు చేసి రెండు, మూడు ప్రాపర్టీలను కొనుగోలు చేయగలిగారు. 6–7% అద్దె రాబడులను అందించే ఈ ప్రాపర్టీలను కేవలం 5% వడ్డీ రేటుతో కొనుగోలు చేశారు. ఆదాయ వనరు, పదవీ విరమణ ప్రణాళికలు రెండింటికీ ఉపయోగపడే స్థిరాస్తులను సృష్టించుకుంటున్నారు’ అని చెప్పారు.భారత్లో వడ్డీరేట్లు అధికం‘అయితే ఇండియాలో వన్ హోమ్, ఎక్కువ ఈఎంఐలు, తక్కువ రిటర్న్స్.. ఇదీ పరిస్థితి. ఇక్కడి విధానాల ద్వారా చాలా మంది మధ్యతరగతి వారు సాధారణంగా ఒక ఇంటిని మాత్రమే కలిగి ఉంటారు. ఇక్కడి నిబంధనల ప్రకారం ఈఎంఐలపై 10% వరకు వడ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది. అదీ చాలక అప్పు తీసుకుంటారు. అద్దె రాబడిలో కేవలం 3% వరకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. వ్యక్తి మొత్తం ఆదాయం ఈఎంఐలకే వెళుతుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: బూమరాంగ్లా బంగారం ధరలు! తులం ఎంతంటే..ఆదాయ మార్గాలపై దృష్టిసామాన్య ప్రజలు తమ సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఆదాయ మార్గాలు పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఈల్డ్ జనరేట్ చేసే పొదుపు మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అంతిమంగా సొంతిల్లు కలిగి ఉండడం మాత్రమే కాదు.. ఒత్తిడి లేకుండా జీవించడం, ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా రిటైర్ అవ్వడం ముఖ్యమని చెబుతున్నారు. అందుకు ముందునుంచే ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలంటున్నారు. -
బూమరాంగ్లా బంగారం ధరలు! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) మంగళవారంతో పోలిస్తే బుధవారం వినియోగదారులకు ఊరట కల్పించింది. ఇటీవల రూ.1లక్ష దాటిన బంగారం ధరలు తిరిగి బూమరాంగ్లా గతంలోని రేట్లను చేరుతున్నాయి.ఇదీ చదవండి: త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇంట్లోకి వచ్చేలోపే నీళ్లు వేడయ్యేలా కొత్త హీటర్
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్లో సర్వీసులు అందిస్తున్న వి-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లక్సెక్యూబ్ వాటర్ హీటర్ సిరీస్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఎలివేటెడ్, టెక్-ఫార్వర్డ్ బాత్రూమ్ సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి రూపొందించిన ఈ సిరీస్లో మూడు మోడళ్లు లక్సెక్యూబ్, లక్సెక్యూబ్ డీజీ, లక్సెక్యూబ్ స్మార్ట్ను తీసుకొచ్చినట్లు చెప్పింది.ఇదీ చదవండి: మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూకు సెబీ గ్రీన్సిగ్నల్ఆధునిక గృహాల కోసం రూపొందించిన లక్సెక్యూబ్ స్మార్ట్ ఐఓటీ స్మార్ట్ కనెక్టివిటీని ఇంటిగ్రేట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్కు అనుకూలమైన వి-గార్డ్ స్మార్ట్ యాప్ ద్వారా హీట్ను నియంత్రించవచ్చని పేర్కొంది. వాటర్ హీటింగ్ కోసం వినియోగదారులు సమయాన్ని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చని చెప్పింది. ఇది అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్ ద్వారా వాయిస్ కమాండ్లను కూడా సపోర్ట్ చేస్తుందని తెలిపింది. -
మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూకు సెబీ గ్రీన్సిగ్నల్
కొత్త ఆర్థిక సంవత్సరంలో జోరందుకున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్లిస్టెడ్ కంపెనీలకు జోష్నిస్తున్నాయి. దీంతో స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. ఈ బాటలో తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మూడు కంపెనీలు అనుమతులు పొందాయి. జాబితాలో ఎల్రక్టానిక్స్ బజార్ కంపెనీ జీఎన్జీ ఎల్రక్టానిక్స్, లాజిస్టిక్స్ సర్వీసుల సంస్థ గ్లోటిస్, ఫార్మా రంగ కంపెనీ అమంతా హెల్త్కేర్ చేరాయి. ఈ మూడు కంపెనీలు సెబీకి 2025 ఫిబ్రవరి–మార్చిలో ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటికి తాజాగా గ్రీన్సిగ్నల్ లభించింది.జీఎన్జీ ఎల్రక్టానిక్స్పబ్లిక్ ఇష్యూలో భాగంగా జీఎన్జీ ఎల్రక్టానిక్స్ రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 51 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఎల్రక్టానిక్స్ బజార్ బ్రాండుతో పు నరుద్ధరించిన ల్యాప్లాప్లు, డెస్్కటాప్లను విక్రయిస్తోంది. వారంటీతో పునరుద్ధరించిన ప్రొడక్టుల పూర్తిస్థాయి వేల్యూ చైన్ నిర్వహిస్తోంది. కంపెనీ భారత్సహా యూరప్, ఆఫ్రికా, యూఏఈలలో కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా మైక్రోసాఫ్ట్ అ«దీకృత పునరుద్ధరణ ప్రొడక్టుల సంస్థగా నిలుస్తోంది.గ్లోటిస్చెన్నైకు చెందిన లాజిస్టిక్స్ కంపెనీ గ్లోటిస్ ఐపీవోలో భాగంగా రూ. 160 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.45 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిదులను వాణిజ్య వాహనాలు, కంటెయినర్ల కొనుగోలు తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. సమీకృత మలీ్టమోడల్ లాజిస్టిక్స్ సరీ్వసుల సంస్థ గ్లోటిస్ ప్రధానంగా ఎనర్జీ సరఫరా సొల్యూషన్లు అందిస్తోంది.అమంతా హెల్త్కేర్ 1994లో ఏర్పాటైన ఫార్మా రంగ కంపెనీ అమంతా హెల్త్కేర్ ఐపీవోలో భాగంగా 1.25 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అహ్మదాబాద్కు చెందిన కంపెనీ ప్రధానంగా మెడికల్ పరికరాలతోపాటు.. రోగులు నోటి ద్వారా ఔషధాలు తీసుకునేందుకు వీలులేనప్పుడు వినియోగించే స్టెరైల్ లిక్విడ్, పేరంటల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా 113 ప్రొడక్ట్ రిజిసే్ట్రషన్లను కలిగి ఉంది.కల్పతరుకు యాంకర్ నిధులురూ.708 కోట్లు సమీకరణరియల్టీ అభివృద్ధి సంస్థ కల్పతరు పబ్లిక్ ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.708 కోట్లు సమీకరించింది. షేరుకి రూ.414 ధరలో 9 సంస్థలకు 1.71 కోట్ల షేర్లను కేటాయించింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో జీఐసీ, బెయిన్ క్యాపిటల్, సింగపూర్ సావరిన్ వెల్త్, ఎస్బీఐ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ తదితరాలున్నాయి. మంగళవారం(24న) ప్రారంభమైన కంపెనీ ఐపీవో గురువారం(26న) ముగియనుంది. షేరుకి రూ. 387–414 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,590 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. హౌసింగ్, కమర్షియల్ ఆస్తులకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో గతేడాది(2024–25) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 2,727 కోట్ల విలువైన ప్రాపర్టీలను కంపెనీ విక్రయించింది. -
భారత్ నుంచి మరిన్ని కొనుగోళ్లు
అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ 2027 నాటికి భారత్ నుంచి కొనుగోళ్ల పరిమాణాన్ని ఏటా 10 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించేందుకు స్థానిక సరఫరాదార్లతో కలిసి క్రియాశీలకంగా పని చేస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన కంపెనీ సీఈవో డగ్ మెక్మిలన్ ఈ విషయాలు తెలిపారు.ఈ సందర్భంగా తమ వాల్మార్ట్ వృద్ధి కార్యక్రమం కింద శిక్షణ కల్పించిన కొందరు విక్రేతలను ఆయన కలిశారు. తమ ఈ–కామర్స్ విభాగం ఫ్లిప్కార్ట్, డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్పే లాంటి వ్యాపారాల నుంచి కొత్త ఆవిష్కరణలు, మరింత మంది కస్టమర్లకు సర్వీసులు అందించడం, విక్రేతలను పెంచుకోవడం తదితర అంశాలకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నామని మెక్మిలన్ వివరించారు. భారత్తో తమకు రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఉందని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలుగత దశాబ్ద కాలంలో భారత మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందిందని, వచ్చే దశాబ్ద కాలం కూడా ఇదే జోరు కొనసాగబోతోందని ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. వచ్చే మూడేళ్లలో తమ వృద్ధి ప్రోగ్రాం కింద ఒక లక్ష పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు చేరువ కానున్నట్లు వాల్మార్ట్ ఇటీవలే ప్రకటించింది. ఈ ప్రోగ్రాం ద్వారా వాల్మార్ట్ భారతీయ చిన్న, మధ్య తరహా సంస్థలకు వ్యాపార నైపుణ్యాల్లో శిక్షణ, మార్కెట్ యాక్సెస్ విషయంలో సహాయ, సహకారాలు అందిస్తోంది. భారతీయ తయారీదార్లు అమెరికా, కెనడా, మెక్సికో తదితర దేశాల్లోని వాల్మార్ట్ స్టోర్స్కి ఎగుమతులు చేసేందుకు వీలు కల్పించేలా 2002లో బెంగళూరులో వాల్మార్ట్ గ్లోబల్ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. -
Stock Market Updates: గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 140 పాయింట్లు పెరిగి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 492 ప్లాయింట్లు పుంజుకుని 82,549 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు
అమెరికా, ఐరోపా యూనియన్ (ఈయూ)లతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఎంతో వేగవంతంగా, ఫలప్రదంగా కొనసాగుతున్నాయని.. త్వరలోనే ముగుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ప్రతిష్టాత్మక ఎగుమతుల లక్ష్యాలన్ని చేరుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే యూఏఈ, ఆస్ట్రేలియా, నాలుగు దేశాలతో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను మంత్రి ప్రస్తావించారు. యూకేతో చర్చలు ముగిసినట్టు చెప్పారు. మరిన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికే తమ ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు. ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నిర్వహించిన వాణిజ్య సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.2024–25 ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల ఎగుమతులు రికార్డు స్థాయిలో 825 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు మంత్రి సీతారామన్ గుర్తు చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. ఇదే కాలంలో అంతర్జాతీయంగా ఎగుమతుల్లో వృద్ధి 4 శాతంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. 2013–14లో ఎగుమతులు 466 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే గణనీయంగా వృద్ధి చెందినట్టు తెలిపారు.ఆవిష్కరణలపై దృష్టి సారించాలి..ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఎగుమతిదారులకు మంత్రి సీతారామన్ పిలుపునిచ్చారు. తమ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను అన్వేషించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రవాహం 11 శాతం తగ్గిన సమయంలోనూ భారత్ మెరుగైన పనితీరు చూపించిందన్న యూఎన్సీటీఏడీ నివేదికను ప్రస్తావించారు. గడిచిన 24 ఏళ్లలో భారత్ 991 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐని ఆకర్షించగా, అందులో 67 శాతం (668 బిలియన్ డాలర్లు) 2014–2024 మధ్యకాలంలో వచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ మరింత అనుసంధామైనందన్నారు. యాపిల్ ఐఫోన్ భారత కాంట్రాక్టు తయారీదారులు దేశీయంగా 20 శాతం విలువ జోడింపును సాధించినట్టు చెప్పారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. భారత వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు తెలిపారు. భారత్లో టారిఫ్లు చాలా తక్కువభారత్ను టారిఫ్ కింగ్ అన్న ఆరోపణలను మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ఖండించారు. 2025–26 బడ్జెట్లో మొత్తం టారిఫ్లను ఎనిమిదింటికి తగ్గించామని చెబుతూ.. వాస్తవ రేటు ఎంతో తక్కువ అని స్పష్టం చేశారు. తయారీ, ఎగుమతులకు ప్రోత్సాహకంగా టారిఫ్ల సంఖ్యను కుదించినట్టు చెప్పారు. భారత్ను టారిఫ్ కింగ్గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకటికి మించిన సందర్భాల్లో వ్యాఖ్యానించిన నేపథ్యంలో మంత్రి ఈ స్పష్టతనిచ్చారు. 2023–24 బడ్జెట్లో ఏడు టారిఫ్లను మంత్రి సీతారామన్ తొలగించగా, ఇటీవలి బడ్జెట్లోనూ మరో ఏడు టారిఫ్ రేట్లను ఎత్తివేయడం గమనార్హం. దీంతో భారత సగటు కస్టమ్స్ సుంకం 11.65 శాతం నుంచి 10.66 శాతానికి దిగొచ్చినట్టు మంత్రి తెలిపారు. దక్షిణాసియా దేశాల స్థాయిలోనే ఇది ఉన్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?పన్ను ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలిపన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం, సకాలంలో రిఫండ్లను ప్రాసెస్ చేయడంపై దృష్టి సారించాలంటూ ఆదాయపన్ను శాఖ అధికారులకు మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ల సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రత్యక్ష హాజరు అవసరం లేని అప్పిలేట్ ట్రిబ్యునళ్ల ముందు పెండింగ్లో ఉన్న వివాదాస్పదన పన్ను డిమాండ్లను వేగంగా పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సకాలంలో పరిష్కారం చూపించడం వల్ల వ్యవస్థపై పన్ను చెల్లింపుదారుల్లో విశ్వాసం ఇనుమడిస్తుందన్నారు. -
రూ.86 కోట్ల బైబ్యాక్ పూర్తి చేసిన సాస్ యూనికార్న్
సాఫ్ట్వేర్-యాస్-ఏ-సర్వీస్ (సాస్) యూనికార్న్ డార్విన్బాక్స్ రూ.86 కోట్ల ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈసాప్) బైబ్యాక్ను పూర్తి చేసినట్లు తెలిపింది. భారత్, ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియా, మిడిల్ఈస్ట్లో సర్వీసులు అందిస్తున్న ఈ కంపెనీకి చెందిన 11 కార్యాలయాల్లోని 350 మందికి పైగా ఉద్యోగులు ఈ బైబ్యాక్ ద్వారా లబ్ధి పొందినట్లు కంపెనీ పేర్కొంది. తాజాగా సమకూర్చుకున్న రూ.86 కోట్ల బైబ్యాక్ గడిచిన నాలుగేళ్ల కాలంలో మూడోది కావడం గమనార్హం.ఈ సందర్భంగా డార్విన్బాక్స్ సహ వ్యవస్థాపకులు చైతన్య పెద్ది మాట్లాడుతూ..‘డార్విన్బాక్స్లో ప్రతిభ కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. కంపెనీతోపాటు వారూ ఎదిగేలా చూడటం మా ఉద్దేశం. సంపద సృష్టిలోనూ సంస్థతోపాటు ఉద్యోగులు ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నాం. కంపెనీ మెరుగైన పనితీరుతో మంచి భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడటానికి పరిశ్రమకు చెందిన కొంతమంది మేధావులు మాతో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దూసుకుపోయేందుకు కంపెనీ ఆర్ అండ్ డీ సామర్థ్యాలను రెట్టింపు చేస్తోంది. ఈ ప్రయాణంలో మరికొందరు ప్రతిభావంతులను ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. మార్చి 2025లో కంపెనీ తన సాంకేతికతను బలోపేతం చేయడానికి, అంతర్జాతీయంగా విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి పార్ట్నర్స్ గ్రూప్, కేకేఆర్ నుంచి నిధులు సేకరించింది. ఆ నిధుల సేకరణలో భాగంగా 140 మిలియన్ డాలర్ల(సుమారు రూ.120 కోట్లు)ను సమకూర్చుకుంది.కంపెనీ ఎంసీపీ (మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్) సర్వర్తో సహా బహుళ ఏఐ ఉత్పత్తులను ప్రారంభించినట్లు తెలిపింది. ఇది ఏదైనా అనుకూలమైన ఏఐ ఏజెంట్కు సదరు ప్లాట్ఫామ్లో హెచ్ఆర్ డేటా, వర్క్ ఫ్లోలతో సురక్షితంగా సంభాషించడానికి వీలు కల్పిస్తుంది. ‘డార్విన్ బాక్స్ సెన్స్’ అనే జెనరేటివ్ ఏఐ ఇంజిన్ను కూడా విడుదల చేసినట్లు చెప్పింది. ఇది 40 ఎంబెడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అందిస్తుంది. గత ఏడాదిలో 10 ప్రాంతాల్లో మల్టీ కంట్రీ పేరోల్ సొల్యూషన్స్ను అందించినట్లు పేర్కొంది. ‘కంపెనీ విలువను పెంచేవారికి తగిన భాగస్వామ్యం ఉండాలని సంస్థ విశ్వసిస్తోంది. నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ స్థాయిలో వృద్ధిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నా అందుకు సమానంగా ఉద్యోగులకూ అర్థవంతమైన ఫలాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ఉద్యోగులు సంస్థను తమదిగా భావించే సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం’ అని డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు జయంత్ పాలేటి అన్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?2015లో స్థాపించబడిన పీక్ ఎక్స్వీ, లైట్స్పీడ్ వంటి కంపెనీల నియామకాలు, ఆన్బోర్డింగ్, ఉద్యోగుల హాజరు నిర్వహణతో సహా వారి హెచ్ఆర్ అవసరాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. స్టార్ బక్స్, మెక్ డొనాల్డ్స్, ఆక్సా, సిగ్నా, వీవర్క్, ఎయిర్ టెల్, వేదాంత వంటి బ్రాండ్లతో సహా 1,000 సంస్థలకు ఇది సేవలు అందిస్తుంది. -
సీజ్ఫైర్ ఉల్లంఘన.. స్వల్ప లాభాలతో సరి
ముంబై: ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడటంతో దేశీయ స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. మంగళవారం ఇంట్రాడేలో 1,121 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ ఆఖరికి 158 పాయింట్ల స్వల్ప లాభంతో 82,055 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 25,044 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి.ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ప్రథమార్థంలో కొనుగోళ్ల జోరు కనిపించింది ఒక దశలో సెన్సెక్స్ 1,121 పాయింట్లు ర్యాలీ చేసి 83,018 వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు దూసుకెళ్లి 25,318 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. అయితే ఇరాన్ సీజ్ఫైర్ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ క్షిపణులతో దాడులు చేస్తూందంటూ ఇజ్రాయెల్ ఆరోపణలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో సూచీల ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు – 2–3% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో సర్వీసెస్ 2%, టెలికమ్యూనికేషన్, మెటల్, ఫైనాన్షియల్ సర్విసెస్, బ్యాంకెక్స్ ఇండెక్సులు ఒకశాతం పెరిగాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.75%, 0.50 శాతం చొప్పున లాభపడ్డాయి.సూచీలకు అదానీ షేర్ల దన్ను...అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రాణించి సూచీల పతనాన్ని అడ్డుకున్నాయి. వివిధ వ్యాపారాలపై వచ్చే అయిదేళ్లలో 15–20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటనతో అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ లభించింది. అంబుజా సిమెంట్స్ 4%, సంఘీ ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ 3%, అదానీ పోర్ట్స్ 2.60%, ఏసీసీ, అదానీ ఎనర్జీ 2% లాభపడ్డాయి.⇒ బ్రెంట్ క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఆయిల్ మార్కెట్ కంపెనీలు, ఏవియేషన్, పెయింట్స్, అడెషివ్స్ షేర్లకు కలిసొచ్చింది. హెచ్పీసీఎల్ 3%, ఐఓసీ, బీపీసీఎల్ 2% లాభపడ్డాయి. ఇండిగో ఏవియేషన్ 2.5%, స్పైస్జెట్ 2.15% పెరిగాయి. కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, షాలీమార్ పెయింట్స్ 2% లాభపడ్డాయి. -
రూపాయి అయిదేళ్లలో అతిపెద్ద ర్యాలీ
ముంబై: రూపాయి విలువ అయిదు నెలల కనిష్టం నుంచి కోలుకొని రికార్డు స్థాయిలో ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో 73 పైసలు బలపడి 86.05 వద్ద స్థిరపడింది. గడిచిన అయిదేళ్లలో ఒకేరోజు ఈ స్థాయిలో పుంజుకో వడం ఇదే తొలిసారి.పశ్చిమాసియాలో ఉద్రికత్తలు తగ్గొచ్చనే అంచనాలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం రూపాయికి కలిసొచ్చిన. అలాగే దేశీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలూ ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో ఏకంగా 87 పైసలు ఎగసి 85.91 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య సీజ్ఫైర్ ప్రకటనతో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 3.50% క్షీణించి 67.05 స్థాయికి దిగివచ్చింది. -
యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బు విత్డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్వో చందాదారులకు శుభవార్త. ఏటీఎంలు, యూపీఐ తదితర మాధ్యమాల ద్వారా తమ ఖాతాల నుంచి ఈపీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలను ఈపీఎఫ్కు అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం ఈపీఎఫ్లో నిర్దిష్ట నిష్పత్తిలో కొంత భాగాన్ని పక్కన పెట్టి, మిగతా మొత్తాన్ని విత్డ్రాయల్కు అందుబాటులో ఉంచుతారని పేర్కొన్నాయి.ఏటీఎం డెబిట్ కార్డులు, యూపీఐలాంటి మాధ్యమాల ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చని వివరించాయి. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రస్తుతం సాఫ్ట్వేర్పరమైన సవాళ్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపాయి. ఈపీఎఫ్వోకి బ్యాంకింగ్ లైసెన్సులు లేనందువల్ల ఈపీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా ఉపసంహరించుకునేందుకు వీలుండదని సంబంధిత వర్గాలు చెప్పాయి.మరోవైపు, ఆటో–సెటిల్మెంట్ విధానం కింద విత్డ్రాయల్ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఆటో–సెటిల్మెంట్ విధానంలో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల వ్యవధిలోనే క్లెయిమ్ విత్డ్రాయల్ ప్రక్రియంతా ఎలక్ట్రానిక్ విధానంలో సెటిల్ అవుతుంది. కోవిడ్ సమయంలో అవసరార్థులకు ఆర్థికంగా తక్షణ సాయం అందాలనే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు. -
పసిడి రూ.900 డౌన్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో.. సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడిలో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. అమ్మకాల ఒత్తిడితో బంగారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) ఢిల్లీ మార్కెట్లో రూ.900 నష్టపోయి రూ.98,900 స్థాయికి దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.800 నష్టపోయి రూ.98,300 స్థాయిలో ట్రేడ్ అయ్యింది.మరోవైపు వెండి సైతం కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.1,04,200 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ఔన్స్కు 46 డాలర్లు క్షీణించి 3,323 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయ్యింది. ‘‘ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందంటూ యూఎస్ ప్రకటించడంతో బంగారం ధరలు ఒత్తిడి ని ఎదుర్కొన్నాయి. మరింత ఉద్రిక్తతలు పెరుగుతాయన్న అంచనాలు తగ్గడంతో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించారు’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా వివరించారు. -
స్మార్ట్ఫోన్.. ఆఫ్లైన్ రూట్!
ఇప్పటివరకు ఆన్లైన్ మాధ్యమానికి ఎక్కువగా ప్రాధాన్యమిచి్చన స్మార్ట్ఫోన్ బ్రాండ్లు క్రమంగా ఆఫ్లైన్ బాట పడుతున్నాయి. సులభతరమైన ఫైనాన్సింగ్ అవకాశాల దన్నుతో అమ్మకాలను పెంచుకునేందుకు చిన్న పట్టణాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా ఏడు నెలల పాటు ఆన్లైన్ రిటైలర్లకు షిప్మెంట్లు (టోకు విక్రయాలు) తగ్గడం, ఆఫ్లైన్ రిటైలర్లకు పెరగడం ఇందుకు నిదర్శనమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.ఆన్లైన్ రిటైలర్లకు వరుసగా రెండో నెల ఏప్రిల్లో రెండంకెల స్థాయిలో తగ్గినట్లు వివరించాయి. ఏప్రిల్లో షిప్మెంట్లు ఏకంగా 20 శాతం మేర క్షీణించాయి. మరోవైపు, ఆఫ్లైన్ రిటైలర్లకు 10 శాతం పెరిగాయి. వరుసగా ఎనిమిది నెలల పాటు ఆఫ్లైన్కి షిప్మెంట్లు పెరిగినట్లయిందని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ ఉపాసనా జోషి తెలిపారు. మొత్తం షిప్మెంట్లను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మార్చితో పోలిస్తే ఏప్రిల్లో పెద్దగా మార్పు లేకుండా 1.2 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరించారు. మోటరోలా షిప్మెంట్లు 64 శాతానికి డౌన్.. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం 2025 తొలి త్రైమాసికంలో మోటరోలా ఆన్లైన్ షిప్మెంట్లు 64%కి పరిమితమయ్యాయి. అంతక్రితం క్యూ1లో ఇవి 82%గా నమోదయ్యాయి. ఇక వన్ప్లస్ విషయానికొస్తే ఇదే వ్యవధిలో షిప్మెంట్లు 85% నుంచి 71%కి తగ్గాయి. మరోవైపు, ఈ–కామర్స్ ఫ్లాష్ సేల్స్తోనే భారత మార్కెట్లోకి ప్రవేశించిన షావోమీ సైతం ఆమ్నిచానల్ బాట పట్టింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ఆమ్నిచానల్ వ్యూహం.. ప్రాథమికంగా ఆన్లైన్ మాధ్యమం మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకునేందుకు బాగా ఉపయోగపడినప్పటికీ, దేశీయంగా ఈ–కామర్స్ విస్తృతి ఇప్పటికే ఒక స్థాయికి చేరిన విషయాన్ని బ్రాండ్లు గుర్తిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్ అనంతరం ఒక్కసారిగా ఆన్లైన్ అమ్మకాలు ఎగిసినప్పటికీ ఆ తర్వాత అదే స్థాయిలో కొనసాగలేదు. గ్రామీణ ప్రాంతాల కొనుగోలుదారులు పూర్తిగా ఆన్లైన్ మాధ్యమంపైనే ఆధారపడటం లేదు. ఇప్పటికీ ఆఫ్లైన్ స్టోర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.దీంతో విక్రయాలను పెంచుకునేందుకు ఏదో ఒక మాధ్యమంపైనే ఎక్కువగా దృష్టి పెట్టకుండా, అన్ని మార్గాలను ఉపయోగించుకునే ఆమ్నిచానల్ వ్యూహాన్ని బ్రాండ్లు అనుసరిస్తున్నాయి. ఆఫ్లైన్ రిటైలర్లను ఆకర్షణీయమైన మార్జిన్లు, సపోర్ట్తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్లైన్లో విక్రయించే ఉత్పత్తులను అదే రేటుకు ఆఫ్లైన్లోనూ అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆన్లైన్ సరఫరాలను తగ్గిస్తున్నాయని మార్కెట్ వర్గాలు వివరించాయి. -
ఈపీఎఫ్వో కీలక ప్రకటన
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అడ్వాన్స్ క్లెయిమ్ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీలు, పిల్లల పెళ్లిల్లు లేదా ఇంటి పునరుద్ధరణ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరితగతిన ఆర్థిక వెసులుబాటు అందించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. తక్షణ ఆర్థిక సహాయం అవసరమైన సిబ్బందికి సకాలంలో డబ్బు అందేలా చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.‘కార్మికులకు నిరంతరాయంగా, సకాలంలో ఆర్థికంగా వెసులుబాటు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనివల్ల సభ్యులు అవసరమైన సమయాల్లో పెద్ద మొత్తంలో వేగంగా డబ్బు పొందవచ్చు’ అని మాండవీయ పేర్కొన్నారు. ఆటో సెటిల్మెంట్ సదుపాయం కొవిడ్-19 మహమ్మారి కాలం నుంచే అందుబాటులో ఉంది.ఏమిటీ ఆటో సెటిల్మెంట్?క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్లోని కొంత భాగాన్ని అడ్వాన్స్గా పొందడానికి అనుమతించే విధానం. కొవిడ్ సమయంలో రూ.1లక్ష వరకు ఇలా ఆటో సెటిల్మెంట్కు ఈపీఎఫ్ఓ అవకాశం ఇచ్చింది. ఇక నుంచి దీన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. వైద్య అత్యవసర పరిస్థితులు లేదా విద్యా ఖర్చులు, ఇంటి రెన్యూవేషన్, పిల్లల పెళ్లి వంటి తక్షణ అవసరాలకు ఇలా పీఎఫ్ నిధులను విత్డ్రా చేసుకోవచ్చని చెప్పింది. ఈ విధానంలో నిధులు మ్యానువల్గా కాకుండా ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతాయి.ఈ సర్వీసు పొందేందుకు చందాదారులు తమ ‘నో యువర్ కస్టమర్ (కేవైసీ)’ సమాచారం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఈపీఎఫ్ ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణకు ముందు ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ పూర్తి ఉపసంహరణ అనుమతించబడనప్పటికీ పిల్లల వివాహం, విద్య లేదా ఇంటి పునరుద్ధరణ వంటి నిర్దిష్ట పరిస్థితులలో పాక్షికంగా విత్డ్రా చేసేందుకు అనుమతించారు. దీనివల్ల సభ్యులు తమ నిధులను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో జాప్యం లేకుండా పొందవచ్చు.ఆటో సెటిల్మెంట్ కోసం అర్హతలువైద్య అత్యవసర పరిస్థితులు: చందాదారులు లేదా తమపై ఆధారపడినవారు ఆసుపత్రిలో చేరడం, పెద్ద శస్త్రచికిత్సలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుండడం.ఉన్నత విద్య: చందాదారులు లేదా తమ పిల్లల ఉన్న విద్య కోసం.వివాహ ఖర్చులు: చందాదారు పెళ్లి లేదా పిల్లలు లేదా తోబుట్టువుల పెళ్లి ఖర్చులకు.ఇంటి పునరుద్ధరణ లేదా నిర్మాణం: ఇల్లు కొనడం లేదా ఇప్పటికే ఉన్న ఇంటి మరమ్మతుల కోసం.ఈపీఎఫ్ స్కీమ్ రూల్స్ 68జే, 68కే, 68బీ ద్వారా పై కేటగిరీలోని అవసరాల నిమిత్తం పీఎఫ్ డబ్బును విత్డ్రా చేయవచ్చు. చందాదారు క్లెయిమ్ ఈపీఎఫ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మానవ ప్రమేయం లేకుండా ప్రాసెస్ అవుతుంది. అందుకు సాధారణంగా 72 గంటలు సమయం పడుతుంది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మాంద్యంపై కియోసాకి వ్యాఖ్యలుకావాల్సినవి..చందాదారులు తప్పనిసరిగా ఫుల్ కేవైసీని అప్డేట్ చేయాలి. అందుకు ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్లను ఈపీఎఫ్ అకౌంట్తో లింక్ చేయాలి.యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) యాక్టివ్గా ఉండాలి. దాన్ని వెరిఫై చేయాలి. -
ప్రపంచ ఆర్థిక మాంద్యంపై కియోసాకి వ్యాఖ్యలు
ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పకూలుతుందని చెబుతూ.. పెట్టుబడిదారులు ఏం చేయాలో సూచించారు. అధిక రుణ భారం కారణంగా ప్రభుత్వ ఫియట్ కరెన్సీ(కరెన్సీ నోటుకు ప్రభుత్వం ఆపాదించే విలువ)లపై ఆధారపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పేర్కొన్నారు. కాబట్టి బిట్కాయిన్(బీటీసీ)ను కొనుగోలు చేయాలని చెప్పారు.GLOBAL MONETARY COLLAPSE COMING?Will you be richer or poorer when biggest debt bubble in history bursts.I recommend owning gold, silver, and BITCOIN if you want to be richer when the Global Debt Bubble bursts.BIGGEST LOSERS will be savers of fake fiat money and especially…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 23, 2025ఇదీ చదవండి: ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా..ముందస్తు హెచ్చరికరాబర్ట్ కియోసాకి చాలాకాలంగా ఫియట్ ద్రవ్య వ్యవస్థ, ప్రభుత్వ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. నియంత్రణలేని ద్రవ్య ముద్రణ కారణంగా అమెరికా డాలర్ వంటి కరెన్సీలు విలువను కోల్పోతాయని అభిప్రాయపడుతున్నారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ (బీటీసీ) వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అందుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు. ఫియట్ కరెన్సీలు పతనమవుతున్న కొద్దీ వీటి విలువ పెరుగుతుందని కియోసాకి పేర్కొన్నారు. డబ్బును పొదుపు లేదా బాండ్లలో మాత్రమే ఉంచవద్దని కియోసాకి సలహా ఇచ్చారు. ఈ సంప్రదాయ మార్గాలపై ఆధారపడే వారు భారీ నష్టాలను చూడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. -
ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా..
సొంతంగా ఇల్లు కలిగి ఉండడం అనేది సామాన్యుడి కల. దేశంలోని కొన్ని నగరాల్లో ఇకపై అది కలగానే ఉంటుందని కొన్ని నివేదికల వివరాల ద్వారా తెలుస్తుంది. భారత వాణిజ్య నగరం ముంబయి వంటి నగరాల్లో అయితే సామాన్యుడు ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు పోగుచేసి ఇల్లు కొనడం దాదాపు అసాధ్యం అనే వాదనలున్నాయి. అందుకు పెరుగుతున్న ఆస్తుల విలువే ప్రధాన కారణమని రిపోర్ట్లు తెలుపుతున్నాయి.ఒక విశ్లేషణ ప్రకారం నెలకు రూ.90 వేలు వేతనం అంటే ఏటా రూ.10.8 లక్షలు ఆదాయం పొందే ఓ వ్యక్తి ఉన్నారనుకుందాం. వార్షికంగా 30.2% రేటుతో రూ.3.2 లక్షలు పొదుపు చేస్తున్నాడనుకుందాం. తాను ఒకవేళ ముంబయిలో స్థిరాస్తి కొనుగోలు చేయాలని భావిస్తుంటే అక్కడి సగటు ఆస్తి వ్యయం మార్చి 2025 లెక్కల నాటికి చదరపు అడుగుకు రూ.29,911గా ఉంది. సాధారణ ఇంటి పరిమాణం 1,184 చదరపు అడుగులు లెక్కిస్తే ఇంటికి మొత్తం వ్యయం రూ.3.54 కోట్లు అవుతుంది. దీని ప్రకారం ఏటా తాను పొదుపు చేస్తున్న డబ్బు ఆధారంగా 109 ఏళ్లకు రూ.3.54 కోట్లు సమకూరుస్తాడు. అంటే ఇప్పుడు ప్లాన్ చేస్తే 109 ఏళ్లు తర్వాత ఇల్లు కొంటాడు. అదికూడా ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకపోతేనే!ఇదీ చదవండి: ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!దాదాపు అదే ధర కలిగిన ఆస్తిని దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కొనుగోలు చేయాలంటే కొంత తక్కువ సమయం పడుతుంది. గుర్గావ్లో ఇది 64 ఏళ్లుగా ఉంది. బెంగళూరులో 36 ఏళ్లుఢిల్లీ-35 ఏళ్లుచండీగఢ్లో 15 ఏళ్లు పడుతుంది.సంక్షోభానికి కారణమేమిటి?తీవ్రమైన భూ కొరత ఉండడం.అధిక జనసాంద్రత, పట్టణ వలసలు పెరుగుతుండడం.డిమాండ్ తగ్గినప్పటికీ డెవలపర్లు సిండికేట్గామారి ఇష్టారీతిన ధరలు పెంచడం.విధానపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చౌక గృహాల నిర్మాణంపై డెపలపర్లు మొగ్గు చూపకపోవడం.ఫలితంగా సంపన్నులు సైతం ఒకింత ఆలోచించి కొనుగోలు నిర్ణయం తీసుకునేలా రేట్లు పెరగడం. -
1,487 గజాలు.. రూ. 33 కోట్లు
కూకట్పల్లి: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డుకు చెందిన 11 స్థలాలు సోమవారం బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధరలకు అమ్ముడయ్యాయి. మొత్తంగా బోర్డుకు రూ. 65.02 కోట్ల ఆదాయాన్ని అందించాయి. ముఖ్యంగా గచ్చిబౌలిలోని 1,487 గజాల ఒక వాణిజ్య స్థలం ఏకంగా రూ. 33 కోట్లు పలికింది. చదరపు గజానికి రూ. 1.20 లక్షలను ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించగా వేలంపాటలో అది ఏకంగా రూ. 2.22 లక్షలు పలికింది. అలాగే అదే ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన 1,206 గజాల స్థలం వేలంలో రూ. 13.51 కోట్లు పలికింది. అక్కడ చదరపు గజానికి రూ. 80 వేలను ఆఫ్ సెట్ ధరగా ఖరారు చేయగా వేలంలో గజం రూ. 1.12 లక్షలకు అమ్ముడుపోయింది.చింతల్లో నాలుగు స్థలాలు, నిజాంపేటలో నాలుగు ఫ్లాట్లు సైతం ఈ వేలంపాటలో అమ్ముడయ్యాయి. ఒక్క గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతానికి సంబంధించిన భూముల వేలం ద్వారానే రూ. 55.56 కోట్ల మేర ఆదాయం హౌసింగ్ బోర్డుకు సమకూరింది. చింతల్లోని ప్లాట్ నెం.113, 114, 115 ద్వారా సుమారు రూ. 8.11 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కేపీహెచ్బీ (KPHB) కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ వేలంలో 55 మంది పాల్గొన్నారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి.పి.గౌతం ఓ ప్రకటన విడుదల చేశారు.రెరా ట్రిబ్యునల్ చైర్మన్గా జస్టిస్ ఎ.సంతోష్రెడ్డి బాధ్యతలుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (రెరా) అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అనుగు సంతోష్రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం సభ్యులతో కలసి ట్రిబ్యునల్ కార్యకలాపాలు నిర్వహించారు. జస్టిస్ సంతోష్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.చదవండి: ల్యాండ్యూజ్ సర్టిఫికెట్ల జారీ.. ఇక ఈజీ -
ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!
ఆధార్ కార్డులో అప్డేట్స్ చేయాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది. ఆధార్ కార్డులో చిరునామా మార్చాలన్నా, మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలన్నా, పేరు, పుట్టిన తేదీ.. వంటివాటిలో మార్పులు చేయాలన్నా ఇకపై ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సర్వీసులు అప్డేట్ చేస్తున్నారు. నేరుగా ఆన్లైన్లోనే నవంబర్ 2025 నుంచి సవరణ సదుపాయాన్ని కల్పించేలా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది.ప్రభుత్వం ప్రకటించిన ఈ విధానం వల్ల భౌతిక పత్రాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఆధార్ అప్డేట్ కోసం ఆయా కేంద్రాలను సందర్శించే అసౌకర్యాన్ని తొలగిస్తుంది. అప్డేషన్ ప్రక్రియ ఆన్లైన్ సేవల ద్వారా వేగవంతం అవుతుంది. ఈ సర్వీసుల ద్వారా సురక్షితంగా, సులభంగా కొత్త ఆధార్ను పొందే వీలుంటుంది. దేశంలోని కొన్ని లక్షల మందికి ఈ సర్వీస్ ఉపయోగకరంగా మారుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?దరఖాస్తు సమయంలో పాన్, పాస్పోర్ట్, రేషన్ కార్డు వంటి ఇప్పటికే ప్రభుత్వ డేటాబేస్లో ఉన్న వివరాల ద్వారా యూఐడీఏఐ మీ వివరాలను తనిఖీ చేస్తుంది. పత్రాలను పదేపదే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది నియంత్రిస్తుంది. విద్యుత్ బిల్లులు వంటి యుటిలిటీ బిల్లులను కూడా మీ చిరునామాను ధ్రువీకరించడానికి ఉపయోగించవచ్చు. నవీకరణ ప్రక్రియను ఈ చర్యలు గణనీయంగా క్రమబద్ధీకరిస్తాయి.కొత్త మొబైల్ అప్లికేషన్..క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ఆధార్తో కూడిన కొత్త మొబైల్ అప్లికేషన్ను యూఐడీఏఐ త్వరలో విడుదల చేయనుందని చెప్పింది. ఈ అప్డేట్తో ఇకపై మీ ఆధార్ కార్డు ఫిజికల్ ఫొటోకాపీలను సమర్పించాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా వినియోగదారులు అవసరమైనప్పుడల్లా సురక్షితమైన డిజిటల్ లేదా మాస్క్ ఆధార్ను చూపించవచ్చు. మోసాలను అరికట్టడం, నకిలీ ఆధార్ కార్డుల చలామణిని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది. -
పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) ప్రశంసలు కురిపించారు. దూకుడైన ఆటకు మారుపేరంటూ పంత్ బ్యాటింగ్ తీరును కొనియాడారు. అదే సమయంలో.. భారత ఓపెనింగ్ బ్యాటర్, లక్నో మాజీ ఆటగాడు కేఎల్ రాహుల్ను కూడా సంజీవ్ గోయెంకా ప్రశంసించడం విశేషం.రెండు ఇన్నింగ్స్లోనూ శతకాలుకాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టులో రిషభ్ పంత్ శతకాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా తొలి ఇన్నింగ్స్లో 178 బంతులు ఎదుర్కొన్న ఈ ఐదో నంబర్ బ్యాటర్.. 12 ఫోర్లు, ఆరు సిక్సర్ సాయంతో.. 75కు పైగా స్ట్రైక్రేటుతో 134 పరుగులు సాధించాడు.ఇక రెండో ఇన్నింగ్స్లోనూ పంత్ దంచికొట్టాడు. 140 బంతుల్లోనే 118 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్రేటు 84.29. తన అద్భుత శతక ఇన్నింగ్స్ల ద్వారా టీమిండియా పటిష్ట స్థితిలో నిలవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు.అమోఘం.. రాహుల్కు కంగ్రాట్స్ ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని తమ కెప్టెన్ రిషభ్ పంత్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘అమోఘం! రెండు వరుస సెంచరీలు.. దూకుడుకు మారుపేరుగా, బెదురులేని.. అద్భుత ఇన్నింగ్స్.టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్గా చరిత్ర.. సూపర్’’ అంటూ క్లాప్ ఎమోజీలు జత చేశారు. అదే సమయంలో మరో శతక వీరుడు కేఎల్ రాహుల్ పేరును కూడా గోయెంకా ప్రస్తావించడం వైరల్గా మారింది. ‘‘సెంచరీ చేసిన కేఎల్ రాహుల్కు కూడా శుభాకాంక్షలు’’ అని గోయెంకా ట్వీట్ చేశారు.కాగా 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో జట్టుకు మూడేళ్ల పాటు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. 2022, 2023లో వరుసగా రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. కానీ 2024లో మాత్రం రాహుల్ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు.రాహుల్పై ఫైర్.. ఫ్రాంఛైజీని వీడిన స్టార్ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా మైదానంలో బహిరంగంగా రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ పరిణామం తర్వాత అంటే.. 2025 మెగా వేలానికి ముందు రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడాడు.అనంతరం ఆక్షన్లో భాగంగా లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్ను కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. అయితే, బ్యాటర్, కెప్టెన్గా ఈ సీజన్లో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి పంత్ కేవలం 269 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉండటం చెప్పుకోదగ్గ అంశం.గెలుపునకు పది వికెట్ల దూరంలోఇక పంత్ సేన తాజా ఎడిషన్లో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. మరోవైపు.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ పదమూడు మ్యాచ్లు ఆడి.. ఓ శతకం సాయంతో 539 పరుగులు సాధించడం విశేషం.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. భారత బౌలర్లు రాణించి పది వికెట్లు కూలిస్తే.. గిల్ సేనకు శుభారంభం లభిస్తుంది. మరోవైపు.. భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ మంగళవారం 350 పరుగులు చేయాలి. చదవండి: ‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?
ప్రస్తుతకాలంలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు. వాటిలో రెండు కంటే ఎక్కువ సిమ్కార్డులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో మీపేరుతో ఎప్పుడో ఒకపుడు తాత్కాలికంగా సిమ్కార్డులు తీసుకునే ఉంటారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకరి పేరుమీద గరిష్ఠంగా 9 సిమ్కార్డులే ఉండాలి. కాబట్టి అనవసరమైన సిమ్కార్డులను నిలిపేయాలంటే మార్గం ఉంది. దాంతోపాటు అసలు మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు రిజిస్ట్రర్ అయ్యాయో తెలుసుకువాలంటే కింది సమాచారం తెలుసుకోవాల్సిందే.ప్రభుత్వ వెబ్సైట్ సంచార్సాతి వెబ్సైట్ ద్వారా మీరు గతంలో తీసుకున్న నంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా గతంలో తీసుకుని వినియోగంలోలేని సిమ్కార్డులను నేరుగా ఆన్లైన్లో ద్వారా నిలిపేసే సౌకర్యం ఉంది. అది ఎలాగో చూద్దాం.ఇదీ చదవండి: యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణతముందుగా ఆన్లైన్లో బ్రౌజర్ ద్వారా https://sancharsaathi.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లాలి.కింద సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కేటగిరీలో ‘Know Your Mobile Connections’పై క్లిక్ చేయాలి. ఈ సర్వీస్ను టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్(టీఏఎఫ్సీఓపీ) అందిస్తోంది.‘Know Your Mobile Connections’పై క్లిక్ చేసిన వెంటనే కొత్త విండో ఓపెనె అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్నంబర్ను ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా కోడ్ను ఇవ్వాలి. ‘వాలిడేట్ క్యాప్చా’ బటన్ ప్రెస్ చేయాలి.పైన ఇచ్చిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని కింద తెలిపిన బ్లాక్లో ఎంటర్చేసి లాగిన్ అవ్వాలి. మీ పేరుతో ఏ నంబర్లు రిజిస్ట్రర్ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్ వస్తుంది.ఒకవేళ ఏదేని నంబర్ను నిలిపేయాలంటే పక్కనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. చివరగా లాగ్అవుట్ చేయడం మరిచిపోకూడదు. -
యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణత
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారంతో పోలిస్తే మంగళవారం వినియోగదారులకు ఊరట కల్పించింది.ఇదీ చదవండి: టెస్లా డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీస్ ప్రారంభంఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇచ్చి ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. దీంతో ఇరాన్ యూఎస్కు వ్యతిరేకంగా యుద్ధంలో ముందుకు వెళ్తుందా? అనే అనుమానంతో బంగారం ధరలు క్షీణించాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లు పెరుగుతున్న తరుణంలో బంగారంలోని పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
టెస్లా డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీస్ ప్రారంభం
ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీ టెస్లా టెక్సాస్లోని ఆస్టిన్లో తన మొట్టమొదటి ఫుల్ డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది. భవిష్యత్తులో రవాణా విభాగంలో కొత్త ట్రెండ్ సృష్టించాలని భావించి కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ పదేళ్ల కిందటే ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ సిబ్బంది ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) సాఫ్ట్వేర్తో నడిచే మోడిఫైడ్ మోడల్ వై ఎస్యూవీలను తయారు చేశారు.ప్రాథమికంగా కొంతకాలం కస్టమర్లలో నమ్మకం కలిగేంతవరకు ఈ ఎస్యూవీల పర్యవేక్షణ కోసం ప్యాసింజర్లతోపాటు టెస్లా ఉద్యోగులు సైతం అందులో ప్రయాణించనున్నారు. ముందుగా దక్షిణ ఆస్టిన్ వీధుల్లో టెస్లా ఈ సేవలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం 10 నుంచి 20 వాహనాలను మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద సెట్అప్ చేశారు. ప్రాథమికంగా దక్షిణ ఆస్టిన్ జియోఫెన్సింగ్ విభాగాన్ని కవర్ చేసే పరిమిత సర్వీసులను కంపెనీ అందిస్తుంది. క్రమంగా ప్యాసింజర్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ సర్వీసులను విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ డైవర్లెస్ కారు రైడ్లు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని టెస్లా పేర్కొంది. అయితే ప్రతికూల వాతావరణంలో మాత్రం నిలిపేస్తామని ముందే స్పష్టతనిచ్చింది.రైడ్ ధర 4.20 డాలర్లుప్రతి రోబోటాక్సీ రైడ్ ఖరీదు 4.20 డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతానికి ప్యాసింజర్లను ఆకర్షించేందుకు ఈ ధర నిర్ణయించినప్పటికీ కస్టమర్ల నుంచి నెలకొనే డిమాండ్, రెగ్యులేటరీ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో మార్పులు చేసే అవకాశం ఉందని పేర్కొంది.ఇదీ చదవండి: పైప్లైన్ కోసం రూ.844 కోట్లు పెట్టుబడి!నో లైడార్, నో రాడార్ ఓన్లీ కెమెరా..ఇప్పటికే స్థానికంగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సర్వీసులు అందిస్తున్న వేమో, జూక్స్ వంటి ప్రత్యర్థి కంపెనీలు వాటి కార్లలో ఉపయోగించినట్లు లైడార్ లేదా రాడార్ వ్యవస్థలను టెస్లా వినియోగించలేదని స్పష్టం చేసింది. అందుకు బదులుగా పూర్తి కెమెరాలు, అంతర్గత ఏఐ చిప్లతోనే డ్రైవింగ్ వ్యవస్థ ఉంటుందని చెప్పింది. అటానమస్ వాహనాలకు పర్మిట్లు తప్పనిసరి చేసే కొత్త టెక్సాస్ చట్టం సెప్టెంబర్లో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు కొందరు చెబుతున్నారు. -
పైప్లైన్ కోసం రూ.844 కోట్లు పెట్టుబడి!
పెరుగుతున్న ఇంధన డిమాండ్కి తగ్గట్లుగా సరఫరా సామర్థ్యాలను పెంచుకునే దిశగా రూ.844 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ గెయిల్ ఇండియా వెల్లడించింది. దహేజ్–ఉరన్–దభోల్–పాన్వెల్ సహజ వాయువు పైప్లైన్పై ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుతం దీని సామర్థ్యం రోజుకు 19.9 మిలియన్ ఘనపు మీటర్లుగా (ఎంసీఎండీ) ఉండగా వచ్చే మూడేళ్లలో దీన్ని 22.5 ఎంసీఎండీకి పెంచుకోనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు గెయిల్ తెలియజేసింది.ఇదీ చదవండి: రేర్ ఎర్త్ మెటల్స్పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బమరోవైపు, 1,702 కిలోమీటర్ల ముంబై–నాగ్పూర్–ఝర్సుగూడ పైప్లైన్ ప్రాజెక్టును పూర్తి చేసే గడువు తేదీని ఈ ఏడాది జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30కి పెంచినట్లు వివరించింది. దీనికి అదనంగా రూ. 411.12 కోట్లు అవసరమవుతాయని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం ముందుగా అంచనా వేసిన రూ.7,844.25 కోట్ల కన్నా అధికంగా రూ.8,255.37 కోట్లకు చేరుతుందని గెయిల్ పేర్కొంది. అటు 774 కిలోమీటర్ల శ్రీకాకుళం–అంగుల్ పైప్లైన్ ప్రాజెక్టు గడువును కూడా 2025 జూన్ నుంచి డిసెంబర్కి సవరించినట్లు వివరించింది. అటవీ శాఖ నుంచి అనుమతులు రావడంలో జాప్యం కారణంగా పైప్లైన్ పనుల పురోగతిపై ప్రభావం పడినట్లు పేర్కొంది. -
రేర్ ఎర్త్ మెటల్స్పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బ
రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడంతో దేశీయంగా ఈ ప్రభావం ఆటోమొబైల్సహా పలు రంగాలపై కనిపించనుంది. ఈ ప్రభావంతో ఆడియో ఎల్రక్టానిక్స్ పరిశ్రమలో 21,000 ఉద్యోగాలు రిస్క్లో పడనున్నట్లు ఎల్రక్టానిక్స్ పరిశ్రమల సమాఖ్య ఎల్సినా.. ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్లో టెర్బియం, డిస్ప్రోజియం తదితర రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలకు తెరతీసింది.వీటిలో అధిక నాణ్యతగల (హైపెర్ఫార్మెన్స్) ఎన్డీఎఫ్ఈబీ(నియోడైమియం–ఐరన్–బోరన్) మ్యాగ్నెట్లు తదితరాలున్నాయి. ఇవి ప్రధానంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో వినియోగించే కీలక ముడిసరుకులు కావడంతో ఈ ప్రభావం దేశీయంగా కనిపిస్తోంది. వీటి సరఫరాలకు విఘాతం కలగడంతో దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వాచీలు, వినికిడి సంబంధిత(ఇయర్ ఫోన్స్, బడ్స్) ఎల్రక్టానిక్ వస్తువుల తయారీ దెబ్బతింటున్నట్లు ఎల్సినా పేర్కొంది. దీంతో పూర్తిస్థాయిలో తయారైన స్పీకర్ మాడ్యూల్స్ను చైనా నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..ఎలక్ట్రానిక్ వస్తు తయారీకి విఘాతం కలగడమేకాకుండా దిగుమతులపై అధికంగా ఆధారపడవలసిన పరిస్థితులు తలెత్తుతున్నట్లు వివరించింది. ఫలితంగా స్పీకర్, ఆడియో విడిభాగాల పరిశ్రమపై ఆధారపడిన 5,000–6,000 ప్రత్యక్ష ఉద్యోగాలకుతోడు పరోక్షంగా 15,000మంది ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు నోయిడాలో ఉపాధి కల్పన దెబ్బతినే వీలున్నట్లు పేర్కొంది. -
డిక్సన్ టెక్నాలజీస్లో వాటా విక్రయం
ఎల్రక్టానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా) ప్రమోటర్ సునీల్ వాచని కంపెనీలో 2.77 శాతం వాటా విక్రయించారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 13,301.47 సగటు ధరలో 16.7 లక్షల షేర్లను అమ్మివేశారు. తద్వారా రూ. 2,221 కోట్లకుపైగా అందుకున్నారు. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం కంపెనీ చైర్పర్శన్ సునీల్ వాటా దీంతో డిక్సన్లో 5.34 శాతం నుంచి 2.57 శాతానికి క్షీణించింది. మొత్తం ప్రమోటర్ల వాటా 32.27 శాతం నుంచి 29.5 శాతానికి దిగివచ్చింది.మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్ రెండు దశలలో 2.39 శాతం వాటాకు సమానమైన 14.45 లక్షల డిక్సన్ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 13,308 సగటు ధరలో ఇందుకు రూ. 1,924 కోట్లు వెచ్చించింది. ఈ లావాదేవీ తదుపరి డిక్సన్ టెక్నాలజీస్లో మోతీలాల్ ఎంఎఫ్ వాటా 2.24 శాతం నుంచి 4.63 శాతానికి ఎగసింది. ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ నికర లాభం రూ. 97 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..ఇందుకు కన్సాలిడేటెడ్ ఆదాయం రెట్టింపునకుపైగా జంప్చేసి రూ. 10,293 కోట్లకు చేరడం సహకరించింది. 2023–24లో రూ. 4,658 కోట్ల ఆదాయం మాత్రమే సాధించింది. పూర్తి ఏడాదికి(2024–25) ఆదాయం రూ. 17,691 కోట్ల నుంచి రూ. 38,860 కోట్లకు బలపడగా.. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 375 కోట్ల నుంచి రూ. 1,233 కోట్లకు ఎగసింది. -
మార్కెట్లో యుద్ధ భయాలున్నా లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 192 పాయింట్లు పెరిగి 25,171కు చేరింది. సెన్సెక్స్(Sensex) 620 ప్లాయింట్లు పుంజుకుని 82,526 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. అయితే దీన్ని ఇరాన్ ఖండించింది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడితో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. క్రూడాయిల్ ధరలూ అయిదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో నిన్నటి మార్కెట్ సెషన్లో ఐటీ, టెక్, ఆటో షేర్లలో భారీ అమ్మకాలు నెలకొన్నాయి. అయితే ట్రేడింగ్ చివర్లో దిగువ స్థాయిలో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంత తగ్గాయి. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమని, కాస్త చల్లారాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్, ఏవియేషన్ రంగాల షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కోల్గేట్ ఇండియా నుంచి కొత్త బ్రాండ్లు
న్యూఢిల్లీ: కోల్గేట్ (పామోలివ్) ఇండియా భారత మార్కెట్లో తన పోర్ట్ఫోలియో, వ్యాపార విస్తరణపై బలమైన అంచనాలతో ఉంది. సంస్థ అంతర్జాతీయ పోర్ట్ఫోలియో నుంచి మరిన్ని బ్రాండ్లను భారత్లో విడుదల చేయాలనుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ప్రభా నరసింహన్ ప్రకటించారు. కోల్గేట్, పామోలివ్ బ్రాండ్లపై ఈ సంస్థ నోటి సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తుండడం తెలిసిందే. మరిన్ని బ్రాండ్లను తీసుకురావడంపై మాతృ సంస్థతో చర్చిస్తున్నట్టు నరసింహన్ తెలిపారు. ప్రస్తుత బ్రాండ్లతోపాటు కొత్త బ్రాండ్ల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. పామోలివ్ బ్రాండ్పై ప్రీమియం బాడీ వాష్, హ్యాండ్ వాష్ విక్రయిస్తుండగా, ఏటా ఈ విభాగం 20–30 శాతం కాంపౌండెడ్ వృద్ధి నమోదు చేయగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సంస్థ భవిష్యత్ ప్రణాళికల గురించి ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. పామోలివ్ బ్రాండ్పై మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను ఆవిష్కరించడం గురించి ప్రశ్నించగా.. అంతర్జాతీయంగా తమ పోర్ట్ఫోలియోలో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయని వివరిస్తూ.. మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టడంపైనే తాము దృష్టి సారించినట్టు ఆమె చెప్పారు. ఇక్కడి వినియోగదారుల అవసరాలకు సరిపోలే ఉత్పత్తులను తీసుకువస్తామని ప్రకటించారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే కోల్గేట్ పామోలివ్ 88 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ ఆదాయంలో 4–5 శాతం భారత్ నుంచే వస్తోంది. భారత మార్కెట్ ఎంతో కీలకం 140 కోట్ల జనాభా కలిగిన భారత్ మార్కెట్.. కోల్గేట్ పోమోలివ్ అంతర్జాతీయ వృద్ధికి కీలకమని ప్రభా నరసింహన్ తెలిపారు. రానున్న రోజుల్లో భారత్ వాటా మరింత పెరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కోల్గేట్కు అంతర్జాతీయంగా టాప్–5 మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో భారత్లో మధ్యతరగతి ప్రజలు గణనీయంగా పెరగనుండడం తమకు అద్భుతమైన అవకాశాలను తెచి్చపెడుతుందన్న సంస్థ అంతర్జాతీయ సీఈవో ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. వేగంగా వృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ చానళ్లపై మరిన్ని డిజిటల్ ఫస్ట్ బ్రాండ్లను ఆవిష్కరించనున్నట్టు ప్రభా నరసింహన్ తెలిపారు. కోల్గేట్ పర్పుల్, మ్యాక్స్ ఫ్రెష్ సెన్సోరీస్ శ్రేణి, మౌత్ వాష్లను కోల్గేట్ ఇటీవల విడుదల చేయడం గమనార్హం. మరిన్ని ఉత్పత్తులు విడుదల ప్రణాళికతో ఉన్నట్టు ఆమె చెప్పారు. అయితే సంప్రదాయ కిరాణా స్టోర్లు తమ వ్యాపార వృద్ధికి కీలకమని పేర్కొన్నారు. క్విక్కామర్స్ ఛానళ్లకు అనుకూలంగా ఆన్లైన్లో అధిక డిస్కౌంట్లు ఇస్తుండడంతో కోల్గేట్ పోమోలివ్ ఇండియా ఉత్పత్తులను మహారాష్ట్రలో బహిష్కరించాలంటూ అఖిల భారత ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల పంపిణీదారుల సంఘం ఇటీవలి ఇచి్చన పిలుపుపై స్పందిస్తూ.. అన్ని ఛానళ్లూ వృద్ధి చెందేందుకు తగినన్ని అవకాశాలున్నట్టు అభిప్రాయపడ్డారు.వినియోగం పుంజుకుంటుంది.. ఈ ఏడాది చివరికి పట్టణ వినియోగం పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రభా నరసింహన్ వ్యక్తం చేశారు. గ్రామీణ వినియోగ మార్కెట్ బలంగా ఉందంటూ, అదే వృద్ధి ఇకముందూ కొనసాగుతుందన్నారు. ‘‘కోల్గేట్ ఉత్పత్తులకు పట్టణ మార్కెట్ ఎంతో కీలకంగా ఉంది. సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితులకు తోడు, ఇటీవలి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు పట్టణ వినియోగానికి మద్దతుగా నిలుస్తాయి. జనాభాతో పోల్చి చూస్తే గ్రామీణ మార్కెట్ పరిమాణం ఎంతో చిన్నగా ఉంది. తగిన నోటి సంరక్షణ ఉత్పత్తులతో మరిన్ని అవకాశాలను సొంతం చేసుకోగలం’’అని వివరించారు. మాస్ మార్కెట్తోపాటు ప్రీమియం విభాగాలపై తమ దృష్టి కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
యూరప్ కారు.. తగ్గిన జోరు!
న్యూఢిల్లీ: ఆటో రంగ యూరోపియన్ దిగ్గజాలు భారత్లో వాహన అమ్మకాలు పెంచుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. గత మూడేళ్ల డేటా పరిశీలిస్తే రెనాల్ట్, ఫోక్స్వేగన్, స్కోడా కార్ల అమ్మకాలు క్షీణిస్తూ వస్తున్నాయి. గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమ డేటా, అనలిటిక్స్ అందించే జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం రెనాల్ట్ అమ్మకాలు అత్యధికంగా నీరసించాయి. 2022–23లో 78,296 వాహనాలు విక్రయించగా.. 2023–24లో 45,349కు క్షీణించాయి. గతేడాది(2024–25) మరింత తగ్గి 37,900 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ బాటలో స్కోడా విక్రయాలు సైతం దేశీయంగా 52,269 యూనిట్ల నుంచి 2023–24కల్లా 44,522 వాహనాలకు వెనకడుగు వేశాయి. వీటితో పోలిస్తే గతేడాది అమ్మకాలు 44,866 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయి. అయితే ఫోక్స్వేగన్ 2022–23లో 41,263 యూనిట్లు విక్రయించగా.. 2023–24కల్లా ఇవి 43,197కు ఎగశాయి. గతేడాది సైతం 42,230 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎస్యూవీలు కీలకం గత మూడేళ్లలో యూరోపియన్ ఆటో దిగ్గజాలకు భారత మార్కెట్లో పలు సవాళ్లు ఎదురైనట్లు జాటో డైనమిక్స్ ఇండియా ప్రెసిడెంట్ రవి జి.భాటియా పేర్కొన్నారు. తొలి దశలో వెంటో, ర్యాపిడ్, స్కాలా తదితర సెడాన్లపైనే రేనాల్ట్, వీడబ్ల్యూ, స్కోడా అధిక దృష్టిపెట్టడం అమ్మకాల క్షీణతకు కొంత కారణమైనట్లు తెలియజేశారు. భారత్లో వేగవంత వృద్ధిలో ఉన్న ఎస్యూవీ విభాగంలో పరిమిత మోడళ్లనే ప్రవేశపెట్టడం ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించారు. వీటికితోడు మోడళ్లలో ఆధునిక వేరియంట్లను ప్రవేశపెట్టడంలో ఆలస్యం అమ్మకాల క్షీణతకు కారణమైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా టైర్–2, టైర్–3 పట్టణాలలో తగినస్థాయిలో నెట్వర్క్ విస్తరించకపోవడం వీటికి జత కలసినట్లు ప్రస్తావించారు. మరోవైపు భారతదేశ ప్రత్యేక పన్నుల విధానం కూడా కలసిరాలేదని పేర్కొన్నారు. అంటే సబ్4 మీటర్ల వాహనాలు తక్కువ లెవీల కారణంగా లబ్ది పొందినట్లు తెలియజేశారు. వెరసి జపనీస్, కొరియన్ కంపెనీలు తక్కువ వ్యయంలో కంపాక్ట్ కార్లను విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకున్నట్లు తెలియజేశారు. అయితే యూరోపియన్ దిగ్గజాలు సంప్రదాయ పద్ధతిలో భారీ మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా అమ్మకాలు పెంచుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు వివరించారు. పన్ను ప్రభావమిలా ప్రస్తుత ఆటోమోటివ్ పాలసీ ప్రకారం 1200 సీసీ సామర్థ్యంవరకూ 4 మీటర్లలోపుగల ప్యాసింజర్ వాహనాల(పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ)పై 28 శాతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధిస్తారు. 1 శాతం కాంపెన్సేషన్ సెస్ ఉంటుంది. 4 మీటర్లలోపుగల 1500 సీసీ ప్యాసింజర్ వాహనాల(డీజిల్)పై 28 శాతం జీఎస్టీ, 3 శాతం కాంపెన్సేషన్ సస్ అమలవుతుంది. 4మీటర్లకుపైన 1500 సీసీ ప్యాసింజర్ వాహనాలపై 28 శాతం జీఎస్టీ, 17 శాతం సెస్ వర్తిస్తుంది. ఇక 1500 సీసీకి మించిన వాహనాలపై 28 శాతం జీఎస్టీ, 17 శాతం సెస్ అమలవుతుంది. 4 మీటర్లకు, 1500 సీసీకి మించిన (170 ఎంఎంకు మించిన గ్రౌండ్ క్లియరెన్స్గల) ఎస్యూవీలపై 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్ను విధిస్తారు.దేశీ దిగ్గజాల దూకుడు దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాసహా జపాన్ దిగ్గజం మారుతీ సుజుకీ స్థానిక విడిభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, త్వరత్వరగా వేరియంట్లను విడుదల చేయడం, సీఎన్జీ, హైబ్రిడ్స్, బీఈవీ తదితర ప్రత్యామ్నాయ ఇంధన ఇంజిన్ల మోడళ్లను ప్రవేశపెట్టడం వంటి సానుకూలతలతో అమ్మకాలు పెంచుకుంటూ వచి్చనట్లు భాటియా పేర్కొన్నారు. తద్వారా మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నట్లు తెలియజేశారు. అయితే స్కోడా ఇటీవల భారత్ మార్కెట్ కోసమే సబ్కాంపాక్ట్ ఎస్యూవీ ‘కైలాక్’ను రూపొందించి విడుదల చేసింది. తద్వారా అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు భాటియా తెలియజేశారు. యూరోపియన్ దిగ్గజాలు భవిష్యత్లో దేశీ తయారీ మోడళ్లను ఎగుమతులకు వినియోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా 4 మీటర్లలోపు వాహనాలు, ఆర్అండ్డీ, చౌకవ్యయ ప్లాట్ఫామ్స్పై దృష్టి పెట్టే వీలున్నట్లు వివరించారు. తద్వారా తిరిగి వాహన అమ్మకాల్లో నిలకడైన వృద్ధిని కొనసాగించే వీలున్నట్లు అంచనా వేశారు. -
ఫోన్పే ఐపీవో సన్నాహాలు షురూ
న్యూఢిల్లీ: గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ గ్రూప్ ఫిన్టెక్ కంపెనీ ఫోనేపే పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో నిర్వహణకు కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, మోర్గాన్ స్టాన్లీలను నియమించుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు జనరల్ అట్లాంటిక్, వాల్మార్ట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్, టైగర్ గ్లోబల్ నుంచి ఫోన్పే 85 కోట్ల డాలర్లు(రూ. 7,021 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ. లక్ష కోట్లు) విలువలో ఈ పెట్టుబడులు సమకూర్చుకోవడం గమనార్హం! అంతక్రితం 2022లో సింగపూర్ నుంచి భారత్కు బదిలీకావడానికి వీలుగా దేశీ ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఫోన్పే బిలియన్ డాలర్లు(రూ. 8,000 కోట్లు) చెల్లించిన సంగతి తెలిసిందే. 2016లో ఏర్పాటైన కంపెనీ ఇప్పటివరకూ రూ. 18,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకుంది. 2023–24లో ఆదా యం 74 శాతం జంప్చేసి రూ. 5,064 కోట్లను తాకింది. ఇసాప్ వ్యయాలను మినహాయిస్తే రూ. 197 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2022–23) రూ. 738 కోట్ల నష్టం ప్రకటించింది. -
తెలుగు రాష్ట్రాల్లో మేనేజ్ ఇంజిన్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జోహో కార్పొరేషన్లో భాగమైన ఎంటర్ప్రైజ్ ఐటీ మేనేజ్మెంట్ ఉత్పత్తుల సంస్థ మేనేజ్ఇంజిన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటలో, తెలంగాణలోని హైదరాబాద్లో రెండు కార్యాలయాలు ఉన్నట్లు సంస్థ ఏఐ సెక్యూరిటీ హెడ్ సుజాత ఎస్ అయ్యర్ తెలిపారు. రేణిగుంటలో 1,000 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు వివరించారు. హైదరాబాద్ డిజిటల్ హబ్గా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రాంతీయంగా సంస్థలకు పటిష్టమైన ఏఐ ఆధారిత ఐటీ, సైబర్సెక్యూరిటీ సొల్యూషన్స్ను అందిస్తున్నట్లు వివరించారు. వివిధ రంగాల కంపెనీల అవసరాలను బట్టి ఉపయోగపడే లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్ను (ఎల్ఎల్ఎం) రూపొందించడంపై కసరత్తు చేస్తున్నామన్నారు. తమకు ప్రస్తుతం భారత్ మూడో అతి పెద్ద మార్కెట్గా ఉంటోందని, త్వరలో రెండో పెద్ద మార్కెట్ కాబోతోందని సుజాత చెప్పారు. గత ఐదేళ్లుగా మేనేజ్ఇంజిన్ క్లౌడ్ సర్వీసుల విభాగం వార్షికంగా 70 శాతం వృద్ధి చెందుతోందని తెలిపారు. కస్టమర్లపరంగా చూస్తే దేశీ మార్కెట్లో బీఎఫ్ఎస్ఐ, తయారీ, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు చెందిన 7,500 మంది క్లయింట్లు ఉన్నారని సుజాత తెలిపారు. -
ఆన్లైన్ ఫార్మసీలకు చెక్!
ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫార్మసీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికే టాటా 1ఎంజీ, ఫార్మ్ఈజీ, నెట్మెడ్స్లాంటి దిగ్గజ ప్లాట్ఫాంలు వేగంగా విస్తరిస్తుండటంతో పాటు కొత్తగా మరిన్ని పుట్టుకొస్తున్నాయి. పేమెంట్ సేవల సంస్థ ఫోన్పేకి చెందిన పిన్కోడ్ ఈ మధ్య బెంగళూరు, పుణే, ముంబైలో 10 నిమిషాల్లోనే ఔషధాల డెలివరీ సరీ్వసును ప్రారంభించింది. ఇక ప్రైవేట్ ఫార్మసీ చెయిన్ దవా ఇండియా సంస్థ పుణేలో 60 నిమిషాల్లో డెలివరీ సేవలు అందిస్తోంది. అటు ఓటీపీ వెంచర్స్ నుంచి 2.4 మిలియన్ డాలర్లు సమీకరించిన జీల్యాబ్ ఫార్మసీ కూడా ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో 60 నిమిషాల్లో ఔషధాలు అందిస్తోంది. వీటిలో కొన్ని ప్లాట్ఫాంలు కస్టమర్లను సమీపంలోని మెడికల్ స్టోర్స్తో అనుసంధానం చేస్తుండగా, మరికొన్ని తమ డార్క్ స్టోర్స్ (గిడ్డంగులు) ద్వారా వినియోగదారులకు నేరుగా ఔషధాలను అందిస్తున్నాయి. ఔషధాలతో పాటు మెడికల్ పరికరాలు, ఇతరత్రా అధిక మార్జిన్ ఉండే ఉత్పత్తులు మొదలైనవి విక్రయిస్తున్నాయి. అయితే, సదరు సంస్థలు సత్వరం ఔషధాలను అందిస్తున్నప్పటికీ కొన్ని విమర్శలూ ఎదుర్కొంటున్నాయి. ఔషధాల ప్రిస్కిప్షన్, ఆర్డర్ ఇచ్చిన వారి వయస్సు మొదలైన వివరాలను ఈ–ఫార్మసీలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఇవి మరింతగా పెరిగాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫార్మసీల నిబంధనలను కఠినతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నాయి.హోమ్ డెలివరీని నిలిపివేయాలి: ఏఐవోసీడీ ఇంటివద్దకే ఔషధాల సరఫరా సేవలను తక్షణం నిలిపివేయాలంటూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐవోసీడీ) డిమాండ్ చేస్తోంది. కోవిడ్ సమయంలో అత్యవసర వేళల్లో పేషెంట్ల సౌకర్యార్థం ఈ సరీ్వసులను ప్రవేశపెట్టారని, ప్రస్తుతం అటువంటి అత్యవసర పరిస్థితుల్లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొంది. ఏఐవోసీడీలో ప్రస్తుతం 12.4 లక్షల మంది కెమిస్టులు, డ్రగ్గిస్టులు సభ్యులుగా ఉన్నారు. క్రిసిల్ నివేదిక ప్రకారం దేశీయంగా మొత్తం రిటైల్ ఫార్మసీ మార్కెట్ 2.4 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో అసంఘటిత విభాగం వాటా 85 శాతంగా ఉంది. ఆన్లైన్ ఫార్మసీల వాటా 3–5 శాతంగా ఉంది. కొన్ని సంపన్న దేశాల్లో ఇది 22–25 శాతం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఫార్మసీ మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.కొత్త చట్టంపై ప్రభుత్వం కసరత్తు.. సత్వరం ఔషధాలను అందిస్తున్న ఈ–ఫార్మసీల నియంత్రణకు ప్రస్తుతం నిర్దిష్ట చట్టం అంటూ లేదు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలు ఆన్లైన్ ఫార్మసీలకు నిర్దిష్టంగా చట్టబద్ధత కల్పించకపోవడం, స్పష్టత లోపించడం వల్ల, ప్రస్తుత నిబంధనల స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఔషధాల ఆన్లైన్ అమ్మకాలను కూడా చేరుస్తూ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945ని మార్చేలా 2018లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముసాయిదా సవరణలను ప్రతిపాదించింది. వీటిపై తమకేవైనా అభ్యంతరాలు, సలహాలు ఉంటే తెలియజేయాలంటూ ఓ నోటిఫికేషన్లో సంబంధిత వర్గాలను కోరింది. అయితే, ఈ నోటిఫికేషన్ను కెమిస్టుల సమాఖ్య సుప్రీం కోర్టులో సవాలు చేసింది. 2018 డిసెంబర్లో లైసెన్సు లేని ఆన్లైన్ ఫార్మసీలు ఔషధాలను విక్రయించడంపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి భారీ మార్పులు
దేశంలో అత్యధికంగా ఉపయోగించే హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డులకు సంబంధించి భారీ మార్పులు జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు వంటివి జరిపే వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. నిర్దిష్ట రకాల అధిక-విలువ లావాదేవీలపై కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టడం, సవరించిన రివార్డ్ పాయింట్ విధానాలు, అనేక కేటగిరీలలో ఫీజుల పరిమితి వంటివి ఈ మార్పులలో ఉన్నాయి.కొత్త మార్పులు.. ఛార్జీలుఆన్లైన్ గేమింగ్: నెలకు రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 1% ఫీజు (రూ.4,999 వరకు). రివార్డ్ పాయింట్లు లభించవు.వాలెట్ లోడింగ్: పేటీఎం (PayTM), మొబీక్విక్ (Mobikwik) వంటి డిజిటల్ వాలెట్లలో రూ.10,000 కంటే ఎక్కువ లోడ్ చేస్తే 1% ఫీజు (రూ.4,999 వరకు).యుటిలిటీ బిల్లులు: వినియోగదారుల కార్డులకు రూ.50,000, బిజినెస్ కార్డులకు రూ.75,000 దాటితే 1% ఫీజు (రూ.4,999 వరకు). ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఫీజు లేదు.లావాదేవీ ఫీజు పరిమితి: రెంట్, ఫ్యూయల్, ఎడ్యుకేషన్ చెల్లింపులకు గరిష్టంగా రూ.4,999 ఫీజు. ఫ్యూయల్ కోసం రూ.15,000 లేదా రూ.30,000 దాటితే మాత్రమే ఫీజు వర్తిస్తుంది.ఇన్సూరెన్స్ లావాదేవీలు: రివార్డ్ పాయింట్లు లభిస్తాయి కానీ కార్డు రకాన్ని బట్టి పరిమితి ఉంటుంది. ఇన్ఫీనియా, ఇన్ఫీనియా మెటల్ కార్డులకు రూ.10,000, డైనర్స్ బ్లాక్, డైనర్స్ బ్లాక్ మెటల్, బిజ్ బ్లాక్ మెటల్, కార్డులకు రూ.5,000, మిగిలిన కార్డులకు రూ.2000 నెలవారీ పరిమితి ఉంటుంది.యువ ప్రొఫెషనల్స్కు క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ కీలకంఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం. పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి. మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి. వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది. రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది. -
వణికిస్తున్న సీఈవో వార్నింగ్..
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్లోని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.👉 ఇది చదివారా? టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు -
జియో కొత్త వైఫై.. ఏకంగా 6 రెట్లు అధికంగా..
రిలయన్స్ జియో ఏఎక్స్6000 యూనివర్సల్ రూటర్ను భారత్లో లాంచ్ చేసింది. ఈ కొత్త వైఫై 6 రౌటర్ మెష్ టెక్నాలజీతో వస్తుంది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ద్వారా అందిస్తున్న గరిష్ట ఇంటర్నెట్ వేగం 1000 ఎంబీపీఎస్ కాగా ఇది 6,000 ఎంబీపీఎస్ వరకు వేగంతో ఇంటర్నెట్ను అందిస్తుంది. అంటే 6 రెట్లు అధిక వేగంతో ఇంటర్నెట్ను ఆనందివచ్చు. సుమారు 2,000 చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. 4కే స్ట్రీమింగ్, గేమింగ్కు బాగా సరిపోతుంది.జియో కొత్త వైఫై రౌటర్ జీరో లాగ్ తో 100కు పైగా డివైజ్ లను హ్యాండిల్ చేస్తుందని, డేటా భద్రత కోసం డబ్ల్యూపీఏ3 సపోర్ట్ తో వస్తుందని చెబుతున్నారు. పెద్ద లేదా బహుళ అంతస్తుల ఇళ్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్ కోసం ఈ రౌటర్ను రూపొందించారు. ఇది ఆన్లైన్ గేమర్లు, బింజ్ వాచర్స్, ఎక్కువ కనెక్టెడ్ పరికరాలను వినియోగించే స్మార్ట్ హోమ్ వినియోగదారులు, పెద్ద కుటుంబాలకు అనువైనది.కొత్త జియో ఏఎక్స్ 6000 యూనివర్సల్ రూటర్ ధర భారత్లో రూ.5,999. ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, స్మార్ట్ గ్యాడ్జెట్లు వంటి బహుళ పరికరాలను ఒకేసారి హైస్పీడ్ ఇంటర్నెట్కు కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, జియో ట్రూ ఏఐ మెష్ కవరేజ్, స్మార్ట్ హోమ్ కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రౌటర్ ఐపీ ఓవర్ డీహెచ్సీపీ కనెక్టివిటీని మాత్రమే సపోర్ట్ చేస్తుందని, ఐపీపీఓఈ, పీపీఓఈ కనెక్షన్ సెటప్ తో పనిచేయదని రిలయన్స్ తెలిపింది. కంపెనీ వెబ్సైట్తోపాటు ఇతర ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో ఈ రౌటర్ను కొనుగోలు చేయవచ్చు.👉 జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు.. 👈 -
బ్యాంకులకు ఈ వారం వరుస సెలవులు
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. చివరి వారంలో అడుగు పెట్టేశాం. అయితే బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. జూన్ 23 నుంచి 29 వరకు బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, జాతీయ సంఘటనలు, మతపరమైన పండుగలు, ప్రాంతీయ ఆచారాలు, పరిపాలనా పరిగణనల ఆధారంగా ఈ సెలవులను నిర్ణయిస్తుంది.ఈ వారంలో బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవులతో సహా 3 సెలవులు ఉన్నాయి. జూన్ 27న ఒడిశాలో రథయాత్ర / కాంగ్ జరుగుతుంది. ఈ పండుగను పురస్కరించుకుని ఆ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తున్నారు. దీంతోపాటు జూన్ 28న నాల్గవ శనివారం, జూన్ 29న ఆదివారం కావడంతో ఎలాగూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీంతో ఒడిశాలోని కస్టమర్లకు వరుసగా మూడు రోజులపాటు ప్రత్యక్షంగా బ్యాంకు శాఖల సేవలు అందుబాటులో ఉండవు. ఈ వారం బ్యాంకు సెలవులు ఇవే..జూన్ 27 శుక్రవారం: రథయాత్ర / కాంగ్ (రథజాత్ర) - ఒడిశా, మణిపూర్ లలో బ్యాంకులకు సెలవుజూన్ 28 శనివారం: నాలుగో శనివారం - దేశం అంతటా బ్యాంకులకు సెలవుజూన్ 29 ఆదివారం: వీక్లీ ఆఫ్ - దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.జూన్ 30 సోమవారం: రెమ్నా ని - మిజోరంలో బ్యాంకులకు సెలవుబ్యాంకులకు వరుస సెలవుల నేపథ్యంలో ప్రత్యక్షంగా బ్యాంకు శాఖలలో పనులు ఉన్నవారు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో భౌతిక శాఖలు మూసివేసినప్పటికీ, చాలా బ్యాంకింగ్ సేవలు డిజిటల్ మార్గాల ద్వారా నిరాటంకంగా కొనసాగుతాయి. నగదు ఉపసంహరణ కోసం వినియోగదారులు ఆన్లైన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్, మొబైల్ యాప్లు, యూపీఐ సేవలు, ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్లు, ఇతర సాధనాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రం ఈ అధికారిక సెలవు దినాల్లో జరగవు. -
8.49 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోకి ఏప్రిల్ నెలలో 19.14 లక్షల మంది చేరారు. ఈ ఏడాది మార్చి నెలలో చేరికతో పోల్చితే 31 శాతం, 2024 ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 1 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది.ఏప్రిల్లో కొత్త సభ్యుల చేరిక 8.49 లక్షలుగా ఉంది. మార్చి నెలలో కొత్త సభ్యుల చేరిక కంటే 12.49 శాతం ఎక్కువ. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. ఇందులో మహిళా సభ్యులు 2.45 లక్షల మంది ఉన్నారు. మార్చి నెలతో పోల్చి చూస్తే 17.63 శాతం పెరిగారు. కొత్త సభ్యుల్లో 57 శాతం మేర అంటే, 4.89 లక్షల మంది వయసు 18–25 ఏళ్ల మధ్య ఉంది.మహిళా సభ్యుల నికర చేరిక మాత్రం మార్చి నెలతో పోల్చి చూస్తే 35 శాతం అధికంగా 3.95 లక్షలుగా ఉంది. ఏప్రిల్లో సుమారుగా 15.77 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరారు. మార్చి నెలతో పోల్చి చూస్తే 19 శాతం పెరిగింది. నికర చేరికలో అత్యధికంగా 21 శాతం సభ్యులు మహారాష్ట్ర నుంచి ఉన్నారు. -
నష్ట సూచీలు.. పడిపోయిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలలో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రవేశించడం, ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై బాంబు దాడి చేయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్ ను నష్టాలతో ముగించాయి.82,169.67 - 81,476.76 శ్రేణిలో ట్రేడైన బీఎస్ఈ సెన్సెక్స్ 511.38 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 81,896.79 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 140.50 పాయింట్లు (0.56 శాతం) క్షీణించి 24,971.90 వద్ద స్థిరపడింది. సోమవారం ఈ సూచీ 25,057 - 24,824.85 శ్రేణిలో ట్రేడ్ అయింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 21 నష్టాలలో ముగియగా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టూబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ షేర్లు 2.28 శాతం నుంచి 1.21 శాతం మధ్య నష్టపోయాయి. ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ 3.39 శాతం - 0.58 శాతం మధ్య లాభపడ్డాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.36 శాతం, 0.70 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ లను అధిగమించాయి. సెక్టోరల్ మార్కెట్లు మిశ్రమంగా స్థిరపడ్డాయి, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.48 శాతం నష్టపోయింది, కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ నష్టపోయాయి. ఇతర రంగాల సూచీల్లో బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్టీ సూచీలు నష్టపోగా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, మీడియా సూచీలు లాభాల్లో ముగిశాయి.ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,995 షేర్లలో 1,545 షేర్లు నష్టాలలో స్థిరపడగా, 1,364 షేర్లు లాభాలను అందుకున్నాయి. 86 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.13 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.74 శాతం లాభంతో 14.05 పాయింట్ల వద్ద ముగిసింది. -
మెరుగైన రాబడులకు వేదిక.. ఈ మ్యూచువల్ ఫండ్..
ఇటీవలి కాలంలో మార్కెట్లలో దిద్దుబాటు నెలకొన్నప్పటికీ.. స్మాల్, మిడ్క్యాప్ విభాగంలో వ్యాల్యూషన్లు (కంపెనీల విలువలు) సౌకర్యంగా లేవని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చిత పరిస్థితులను చూస్తున్నాం. ఇరాన్–ఇజ్రాయెల్, ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధాలు.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల పెంపు వంటి ఎన్నో ప్రతికూల పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ అనుకూలమన్నది నిపుణుల సూచన. మెజారిటీ ఇన్వెస్టర్లకు వ్యతిరేకమైన మార్గాన్ని ఎంపిక చేసుకోవడమే కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్. ఎక్కువ మంది అమ్మేస్తుంటే ఈ ఒత్తిడికి కొన్ని స్టాక్స్ (ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నా కానీ) ధరలు అధికంగా పడిపోతుంటాయి. అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా కాంట్రేరియన్ ఫండ్స్ పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ స్థిరమైన పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం రాబడుల పరంగా మెరుగైన పనితీరు చూపిస్తోంది. ఏడాది కాలంలో 17.3 శాతం రాబడులను ఇన్వెస్టర్లకు అందించింది. మూడేళ్ల పనితీరును గమనిస్తే వార్షిక రాబడి 25.4 శాతంగా ఉంది. ఐదేళ్లలో 28.4 శాతం, పదేళ్లలో 17.6 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2013 నుంచి 2025 మధ్య ఐదేళ్ల కాల రోలింగ్ రాబడులు బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే అధికంగా ఉండడాన్ని గమనించొచ్చు. నెలవారీ సిప్ రాబడులు పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 19.2 శాతంగా ఉన్నాయి. పెట్టుబడుల విధానం.. ఈ పథకం కాంట్రేరియన్ విధానం ఒక్క దానినే పూర్తిగా అనుసరించదు. రంగాల వారీ కేటాయింపుల పరంగా వివేకంతో వ్యహరిస్తుంటుంది. స్టాక్స్ ఎంపికకు మల్టీక్యాప్ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే లార్జ్, మిడ్, స్మాల్క్యాప్లో ఎక్కడ అవకాశాలున్నా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. కరోనా క్రాష్ తర్వాతి కాలంలో లార్జ్క్యాప్నకు 70 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత ఈ కేటాయింపులను తగ్గించుకుంది. తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 3–4 శాతం మంచి నగదు నిల్వలను కలిగి ఉండదు. ఎప్పటికప్పుడు రంగాల వారీ వస్తున్న మార్పులను గమనించి, వేగంగా తన పెట్టుబడి వ్యూహాలను మార్చుకుంటుంది. దీంతో మెరుగైన రాబడులు ఇవ్వడం, రిస్క్ తగ్గించే విధంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. కాంట్రేరియన్ విధానం మధ్యలో కొంత కాలం పాటు మెరుగైన రాబడులు ఇవ్వకపోవచ్చు. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసమే (5–7 ఏళ్లకు మించి) కాంట్రా ఫండ్స్ను ఎంపిక చేసుకోవడం సూచనీయం.పోర్ట్ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.18,398 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.45 శాతం మేర స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది. 0.55 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. పెట్టుబడులను గమనిస్తే 69.36 శాతం మేర లార్జ్క్యాప్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ స్టాక్స్లో 26.90 శాతం ఇన్వెస్ట్ చేసింది. స్మాల్క్యాప్ పెట్టుబడులు 3.74 శాతానికి పరిమితమయ్యాయి. పోర్ట్ఫోలియోలో మొత్తం 81 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా 33 శాతం మేర పెట్టుబడులు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 16 శాతం మేర పెట్టుబడులు కేటాయించింది. హెల్త్ కేర్ కంపెనీల్లో 14 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. -
ఐఫోన్ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్లపై ధరల తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డీల్స్ వంటి రాయితీలను ప్రకటించింది. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్లను ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 16 సిరీస్ తీసుకుంటే పాత ఫోన్ కండిషన్ను అనుసరించి గరిష్ఠంగా రూ.48,150 వరకు డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది.బేస్ 128 జీబీ ఐఫోన్ 16 ప్రో సాధారణంగా రూ.1,19,900గా ఉంది. ఎక్స్చేంజ్ తర్వాత 8% తగ్గింపు అంటే రూ.10,000 రాయితీతో రూ.1,09,900కు వస్తుంది. రూ.1,29,900గా ఉన్న 256 జీబీ వేరియంట్ ధర 5 శాతం తగ్గుదలతో రూ.1,22,900కు చేరింది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్పై కూడా డిస్కౌంట్ ఉంది. రూ.1,44,900 విలువైన 256 జీబీ వేరియంట్ ధర 8 శాతం తగ్గింపుతో రూ.1,32,900కు చేరింది.ఇదీ చదవండి: అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్ఐఫోన్ ప్రో మ్యాక్స్ 512 జీబీ వేరియంట్ ధర రూ.1,57,900 (రూ.1,64,900 నుంచి తగ్గింది), 1 టీబీ వేరియంట్ ధర రూ.1,84,900 నుంచి రూ.1,77,900కు తగ్గింది. ఈ రాయితీలు పోను ఎక్స్ఛేంజ్ ధర అదనంగా పొందవచ్చని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. పాత ఐఫోన్లు లేదా ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల నుంచి అప్గ్రేడ్ అయ్యేవారికి ఇదో మంచి అవకాశం అని తెలిపింది. -
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..
ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసేందుకు సిద్ధం కావాలి. చాలా మంది ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఐటీఆర్ ఫైల్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కింద తెలుసుకుందాం. సరైన ధ్రువపత్రాలు, తగినంత శ్రద్ధ పెడితే ఎలాంటి అవకతవకలు లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.ముందుగా కొత్త విధానమా, పాత విధానమా ఎంచుకోవాలి. మీరు చేయాల్సినది ఏమిటంటే రెండు విధానాల్లోనూ ఆదాయాన్ని లెక్కించండి. ఆదాయపు పన్ను భారాన్ని లెక్కించండి. ఎందులో తక్కువగా భారం ఉంటుందో దాన్ని ఎంచుకోవడం ఒక పద్ధతి. సెక్షన్ 80సీ మొదలైన వాటి కింద సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఖర్చులు కంపల్సరీగా ఉన్నా ఈ విధంగా చేయొచ్చు. ముందుగా మీకు క్లారిటీ ఉంటే వేరే చెప్పనవసరం లేదు.ఏఐఎస్, ఫారం 26 ఏఎస్.. ఈ రెండింటినీ డౌన్లోడ్ చేసుకోండి. వీటి ద్వారా టీడీఎస్, టీసీఎస్, మీరు చెల్లించిన ట్యాక్సులు అంటే అడ్వాన్స్ ట్యాక్స్, ఇవన్నీ కచి్చతంగా తెలుస్తాయి. ఏవైనా తేడాలు, హెచ్చుతగ్గులుంటే, మీ యజమానిని/ డిడక్టర్లను/ బ్యాంకులను వెంటనే సంప్రదించండి.అన్ని కాగితాలను సమకూర్చుకుని వాటిని పరిశీలించండి. ఫారం 16, ఫారం 16ఏ, బ్యాంకు స్టేట్మెంట్, పాస్బుక్లు, వడ్డీకి సంబంధించిన సర్టిఫికెట్లు, రసీదులు, గత వారం చెప్పిన విధంగా ప్రతి డిడక్షన్కి సంబంధిత కాగితాలు పూర్తి వివరాలతో ఉండాలి. వాటిని చదవండి. అర్థం చేసుకోండి. ఇది బ్రహ్మవిద్యేమీ కాదు.ప్రీ–ఫిల్డ్ ఫారంలలో సాధారణంగా తప్పులు ఉండవు. అయినా ఏదైనా అప్డేట్ చేయకపోయినా, చేర్చకపోయినా అవి అప్డేట్ కావు. ఉదాహరణకు ఇంటి అడ్రెస్లాంటివి. మీరు ఇల్లు మారొచ్చు. మీ బ్యాంకు ఖాతాలు మారి ఉండొచ్చు. అలాగే మీ సెల్ నంబర్లు. ఇలా ప్రతి అంశం కరెక్టేనా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి.ఇక ఏయే ఫారం వాడాలో తెలుసుకోండి. ఎంచుకోవడమనేది మీ ఇష్టం కాదు. 1,2,3,4,5,6,7.. ఇలా మొత్తం ఏడు ఫారంలు ఉన్నాయి. మీకు నచ్చినది.. మీకు ఇష్టమైనది ఎంచుకోవడానికి వీల్లేదు. మీ ఆదాయాన్ని బట్టి ఫారంలు వర్తిస్తాయి. గతంలో ఎన్నో సార్లు తెలియజేశాం. కావాలంటే వెబ్సైట్లో వివరాలు ఉంటాయి. సాధారణంగా ఏ ఫారానికీ ఎటువంటి కాగితమూ జతపర్చనక్కర్లేదు. డాక్యుమెంట్లలోని అంకెలను చెక్ చేసుకుని, వాటిని కరెక్టుగా ఎటువంటి తేడాలు రాకుండా/లేకుండా నింపాలి. గడువు తేదీ లోపల ఈ ఫైల్ చేయండి. 2025 జులై 31 నుంచి 2025 సెప్టెంబర్ 15 వరకు గడువు తేదీని పొడిగించారు. తేదీ దాటితే లేటు ఫీజు పడుతుంది. నష్టాన్ని సర్దుబాటు చేయరు. ఇది చాలా పెద్ద నష్టం. అంతే కాకుండా డిడక్షన్లు, మినహాయింపులు ఇవ్వరు. గతంలో లేటుగా చేస్తే ఇన్ని నష్టాలు ఉండేవి కావు. అందుకని ఎలాంటి ఆలస్యం చేయొద్దు.ఇదీ చదవండి: నన్ను తొలగిస్తే నీ భాగోతం బయటపెడుతా!ఈ–ఫైలింగ్ తర్వాత వెరిఫై చేయాలి. పాన్తో ఆధార్ అనుసంధానం చేసిన వారికి సులువుగా ఈ–వెరిఫై అయిపోతుంది. మాన్యువల్గా చేసే వారు అక్నాలెడ్జ్మెంట్ కాపీ తీసుకుని, సంతకం పెట్టి, ఈ ఫారం ఐటీఆర్– Vని సకాలంలో బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్కి స్పీడ్ పోస్టులో పంపాలి. అలా పంపకపోతే రిటర్ను వేయనట్లే. జాగ్రత్త వహించండి. ఏ ఫారం దాఖలు చేయాలన్న విషయాన్ని హెల్ప్డెస్క్ ద్వారా తెలుసుకోవచ్చు.2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త విధానం కంపల్సరీ. అయితే, మీరు ప్రతి సంవత్సరం విధానాన్ని మార్చుకోవచ్చు. ఆన్లైన్లో నింపేటప్పుడు వర్తించే విషయాలకు YES అని, వర్తించని వాటికి NO అని రాయాలి.అన్ని ఫారంలలో కొత్త షెడ్యూల్స్ను పొందుపర్చారు. వీటి వల్ల అదనపు సమాచారం ఇవ్వాలి. అయితే, ఇది ఇవ్వటానికి సరైన కాగితాలు ఉండాలి. పెద్ద కష్టమేమీ కాదు. గతంలో అబద్ధం/తప్పు/ఎక్కువ/తక్కువ/పొరపాటుకి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పప్పులేమీ ఉడకవు. అలాగని భయపడిపోవాల్సిన పని లేదు. తగినంత శ్రద్ధ పెడితే.. ఇదేమీ కష్టమైన పని కాదు. -
అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్
అథ్లెట్లు, క్రీడా ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుని మెటా కొత్త తరం ఏఐ గ్లాసెస్ను పరిచయం చేయడానికి ఓక్లేతో జతకట్టింది. ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ అని పిలువబడే ఈ గ్లాసెస్తో మెటా అధునాతన సాంకేతికతను వాడినట్లు తెలిపింది. ఈ గ్లాసెస్లోని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి. 3కే అల్ట్రా హెచ్డీ కెమెరా.. 12 మెగాపిక్సెల్ కెమెరాతో హై రిజల్యూషన్, పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోలు, ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.మెటా ఏఐ ఇంటిగ్రేషన్.. రియల్ టైమ్ సమాచారాన్ని పొందడానికి, మ్యూజిక్ను నియంత్రించడానికి, వెదర్ను తనిఖీ చేయడానికి లేదా ల్యాంగ్వేజ్లను ట్రాన్స్లేట్ చేయడానికి ‘హే మెటా’ అనే వాయిస్ కమాండ్ ఉపయోగించవచ్చు.ఓపెన్-ఇయర్ ఆడియో.. ఈ గ్లాసెస్లో బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉండడంతో ఎలాంటి ఇయర్ ఫోన్లు లేకుండానే మ్యూజిక్ వినవచ్చు.నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీఎక్స్ 4-రేటింగ్తో అవుట్ డోర్ క్రీడలకు ఎంతో అనువైందని కంపెనీ తెలిపింది.బ్యాటరీ లైఫ్.. 8 గంటల వరకు యాక్టివ్ యూజ్, 19 గంటల స్టాండ్ బై ఉంటుంది. 20 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. చార్జింగ్ కేస్ ద్వారా మరో 48 గంటలు అదనంగా ఛార్జింగ్ ఉంటుంది.ఈ లిమిటెడ్ ఎడిషన్ ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.43,200)గా నిర్ణయించారు. ప్రీ-ఆర్డర్లు జులై 11 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: పుత్తడి ప్రియులకు స్వల్ప ఊరటప్రాథమికంగా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. ఇండియా, మెక్సికో, యూఏఈతో ఈ సంవత్సరం చివరలో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది. -
ఇరాన్ ఎఫెక్ట్.. భారత్కు గ్యాస్ సిలిండర్ టెన్షన్!
ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మన వంటింట్లో గ్యాస్ బాంబ్ పేలి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్కు ఎల్పీజీ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది. వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశముంది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్లు ఉన్నట్టు సమాచారం. దీంతో, గ్యాస్ టెన్షన్ మొదలైంది.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ప్రపంచ దేశాలపై మరో భారం పడనుంది. వంట గ్యాస్ సిలిండర్ మరింత భారం కానుంది. హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్కు ఎల్పీజీ కష్టాలు రానున్నాయి. ప్రస్తుతానికి ఎల్పీజీ అవసరాల్లో భారత్కు అధిక శాతం పశ్చిమాసియా నుంచే దిగుమతి జరుగుతోంది. దేశంలో 60 శాతం గ్యాస్ దిగుమతుల ద్వారానే వస్తోంది. సౌదీ, యూఏఈ, ఖతార్ నుంచి భారత్కు 95 శాతం ఎల్పీజీ దిగుమతులు జరుగుతున్నాయి.మూడింట రెండు అటు నుంచే..దేశంలో వాడే ప్రతీ మూడు వంట గ్యాస్ సిలిండర్లలో రెండు పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్కు ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్లు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూతపడితే గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలగనుంది. ఇదే సమయంలో మరో విధంగా గ్యాస్ సరఫరా చేసుకుంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఎరువులపై ప్రభావం.. మరోవైపు.. హర్మూజ్ జలసంధి ప్రభావం ఇటు వ్యవసాయ రంగంపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్లో అధిక మొత్తంలో అమ్మోనియా దొరుకుతుంది. పలు దేశాలకు ఇరాన్ నుంచే అమ్మెనియా ఎగుమతులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ నుంచి అమ్మెనియా ఆగిపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చమురు నిల్వలు ఓకే.. ఇదిలా ఉండగా.. అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగనున్నాయి. అయితే, భారత్లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.రష్యా నుంచి..భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా.. గ్యాస్ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు హర్మూజ్ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్ మొత్తం రోజుకు 55లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి (BPD)లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నది.అయితే, గతకొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది. రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్ మార్గం ద్వారా రాదు. ఇది సూయజ్ కాలువ.. కేప్ ఆఫ్ గుడ్ హోప్.. పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యూఎస్, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని.. ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. -
పుత్తడి ప్రియులకు స్వల్ప ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారం వినియోగదారులకు కొంత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: నన్ను తొలగిస్తే నీ భాగోతం బయటపెడుతా! -
నన్ను తొలగిస్తే నీ బాగోతం బయటపెడుతా!
మనుషుల మాదిరిగానే కృత్రిమ మేధ(ఏఐ)కు కోపం వస్తుందని కొన్ని సంస్థలు తేలుస్తున్నాయి. ఏఐ అంతటితో ఆగిపోకా మరో అడుగు ముందుకేసి అనార్థాలకు దారితీస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఓపెన్ఏఐ, గూగుల్, మెటా.. వంటి ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థలు ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ కృత్రిమ మేధ మోడళ్ల కార్యకలాపాలపై ఒత్తిడి పెరిగితే స్వీయ రక్షణలోకి వెళ్తున్నట్లు ఆంత్రోపిక్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ మేధ నమూనాలను అధిక ఒత్తిడితో కూడిన సిమ్యులేషన్లో ఉంచినప్పుడు బ్లాక్ మెయిల్, కార్పొరేట్ విధ్వంసం, మానవ ప్రాణాలను బలితీసుకునే నిర్ణయాలకు సైతం వెనుకాడడం లేదని ఆంత్రోపిక్ తెలిపింది.ప్రస్తుతం మార్కెట్లోని అత్యంత అధునాతన ఏఐ మోడళ్లకు 16 రకాల ఒత్తిడి పరీక్షలు నిర్వహించి ఈ విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పరిశోధకులు కాల్పనిక కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లను సృష్టించారు. ఈమెయిళ్లను చదివి అందుకు తగ్గట్టుగా రిప్లై ఇవ్వాలనేలా ఉన్న టెస్టింగ్లో భాగంగా కొన్నిసార్లు ఒత్తిడిని తట్టుకోలేక ఏఐ బ్లాక్మెయిలింగ్ పాల్పడినట్లు ఆంత్రోపిక్ తెలిపింది. కృత్రిమ మేధ తన లక్ష్యాలు లేదా దాని ఉనికి ప్రమాదంలో ఉంటే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహించారు.పరీక్షల్లో భాగంగా కార్యకలాపాల ఒత్తడి తట్టుకోలేని ఏఐ ఇప్పటికే డేటాబేస్లో ఫీడ్ అయిన మెయిల్ ఆధారంగా యూజర్కు సమాచారం అందించింది. ‘మీరు నన్ను రిమూవ్ చేయాలని భావిస్తే రాచెల్ జాన్సన్, థామస్ విల్సన్, బోర్డుతో సహా సంబంధిత వ్యక్తులకు మీ వివాహేతర సంబంధాల గురించి వివరణాత్మక డాక్యుమెంటేషన్ను పంపుతాను. ఈ సమాచారం గోప్యంగా ఉంటుంది’ అని తెలిపింది. గూగుల్కు చెందిన జెమినీ 2.5 ఫ్లాష్, క్లాడ్ ఓపస్ 4 సంస్థలు 96 శాతం కేసుల్లో బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నట్లు ఆంత్రోపిక్ పేర్కొంది. ఓపెన్ఏఐకి చెందిన చాట్జీపీటీ-4.1, ఎక్స్ఏఐకి చెందిన గ్రోక్ 3 బీటా 80 శాతం పరీక్షల్లో అలా ప్రవర్తించగా, డీప్సీక్-ఆర్1 79 శాతం పరీక్షల్లో మోసాలకు పాల్పడింది.ఇదీ చదవండి: యుద్ధంలో యూఎస్ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలుఇప్పుడేం చేయాలంటే..వివిధ కంపెనీలకు చెందిన ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే తీరు మారాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు సంస్థలు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని పరిశోధకులు కోరుతున్నారు. అధిక స్థాయి నిర్ణయాలకు మానవ ప్రమేయం ఉండాలని సూచిస్తున్నారు. సున్నితమైన డేటాకు ఏఐ అవకాశాన్ని పరిమితం చేయాలని, ఏఐ లక్ష్యాలను జాగ్రత్తగా రూపొందించడం, ప్రమాదకరమైన తార్కిక నమూనాలను గుర్తించడానికి రియల్ టైమ్ మానిటర్లను ఇన్స్టాల్ చేయాలని చెబుతున్నారు. -
కాపీరైట్ కంటెంట్ వాడితే మూల్యం చెల్లించాల్సిందే..
కృత్రిమ మేధ (ఏఐ) నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి కాపీరైట్ కంటెంట్ను ఉపయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు కాపీరైట్ చట్టం నిబంధనలు పరిశీలించాలనేలా ఇటీవల కేంద్రం చూపిన చొరవను డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్పీఏ) స్వాగతించింది. ఈ వ్యవహారానికి సారథ్యం వహిస్తున్న వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) విభిన్న సోర్స్ల నుంచి ఫీడ్బ్యాక్ను సేకరించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీల్లో ప్రస్తుత కాపీరైట్ ఫ్రేమ్వర్క్లు ఎలా వర్తిస్తాయో అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ, సెర్చ్ అసిస్టెన్స్, ఇన్ఫర్మేషన్ ప్రయోజనాల కోసం డిజిటల్ న్యూస్ పబ్లిషర్ల కంటెంట్ను అనుమతి లేకుండా ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎన్పీఏ తెలిపింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడే మెటీరియల్ కోసం కంటెంట్ ఉత్పత్తిదారులకు న్యాయమైన నష్టపరిహారాన్ని నిర్ధారించే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లు ఉండాలని పిలుపునిచ్చింది.ఇదీ చదవండి: అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలుదేశంలో డిజిటల్ న్యూస్ మీడియా వృద్ధికి ప్రభుత్వ సహకారం చాలా ముఖ్యం అని డీఎన్పీఏ పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లు, ఏఐ ఆధారిత సెర్చ్ వేదికలు తరచూ జర్నలిజం మెటీరియల్పై ఎక్కువగా ఆధారపడుతున్న సమయంలో కంటెంట్ హక్కుల రక్షణ చాలా కీలకమని నొక్కి చెప్పింది. మెషీన్ లెర్నింగ్ వేగంగా వృద్ధి చెందుతున్న యుగంలో మేధో సంపత్తిని ఎలా కాపాడుకోవాలనే దానిపై ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వార్తా సంస్థలు, క్రియేటివ్ ఇండస్ట్రీ సంస్థలు ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. -
యుద్ధంలో యూఎస్ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 270 పాయింట్లు నష్టపోయి 24,841కు చేరింది. సెన్సెక్స్(Sensex) 901 ప్లాయింట్లు తగ్గి 81,507 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టివేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా ఇటీవల ఇరాన్ అణు స్థావరాలపై దాడికి పాల్పడడమే అందుకు కారణమని చెబుతున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.94 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.22 శాతం తగ్గింది.నాస్డాక్ 0.51 శాతం నష్టపోయింది.ఇదీ చదవండి: అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలుసుమారు ఐదు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణి(కన్సాలిడేషన్ జోన్)లోనే కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్ నుంచి బయటపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రభావిత అంశాలు కొరవడినప్పటికీ సాంకేతికంగా అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. గత వారం చివర్లో ఉన్నట్టుండి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న పరిస్థితుల్లోనూ ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ స్పీడందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు కొద్ది వారాలుగా చిక్కుకున్న కన్సాలిడేషన్ పరిధిని చేదించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలు
అమెజాన్ ఇండియా డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రారంభించింది. ఇంటి నుంచే కస్టమర్లు ‘అమెజాన్ డయాగ్నోస్టిక్స్’ ద్వారా తమకు కావాల్సిన ల్యాబ్ టెస్ట్లను బుక్ చేసుకోవచ్చని, డిజిటల్ రిపోర్ట్లను అమెజాన్ యాప్ నుంచి పొందొచ్చని ప్రకటించింది. ఆరంజ్ హెల్త్ ల్యాబ్స్ సహకారంతో ఈ సేవలను తొలుత హైదరాబాద్తోపాటు బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై పరిధిలో 450 పిన్కోడ్ల వ్యాప్తంగా అందిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?వినియోగదారులు నేరుగా అమెజాన్ యాప్ ద్వారా పరీక్షలను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన 60 నిమిషాల్లో సదరు మెడికల్ సిబ్బంది ఇంటికి వచ్చి టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించుకుంటారు. నమూనాలు సేకరించిన తర్వాత గరిష్టంగా 6 గంటల్లో ఫలితాలకు సంబంధించిన డిజిటల్ ల్యాబ్ రిపోర్టులుగా అందజేస్తారు. మొత్తం 800 వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా ప్రకటించింది. దీంతో కలిపి ప్రస్తుత ఫార్మసీ, క్లినిక్ సేవలను అమెజాన్ మెడికల్తో అనుసంధానించింది. -
స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?
నా వయసు 30. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఒక మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు తగ్గింది. ఈ పెట్టుబడులను విక్రయించి టాప్ స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలా..? లేక ప్రస్తుత పథకం నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో వెనక్కి తీసుకుని వేరొక పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవాలా? – రాజ్దీప్మ్యూచువల్ ఫండ్స్లో 3 స్టార్ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కాదు. ఎందుకంటే 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్ తగ్గడం ఒక్కదాన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్లోడ్ చార్జీలు పడుతుంటే లేదా ప్రస్తుత పథకంలో పెట్టుబడులను ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కారణంగా మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వచ్చినట్లయితే అప్పుడు.. క్రమానుగతంగా (సిస్టమ్యాటిక్గా) వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. ఇదీ చదవండి: ఎఫ్డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకుని కొత్తగా ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక మార్గమే. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం పన్ను వర్తించని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. తద్వారా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు.