breaking news
Business
-
సోనీ కెమెరాతో పోకో కొత్త ఫోన్
స్మార్ట్ఫోన్స్ బ్రాండ్ తాజాగా ఎఫ్–సిరీస్లో ఎఫ్7 ఫోన్ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.29,999 నుంచి రూ.31,999 వరకు ఉంటుంది. 7,550 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ టర్బో చార్జింగ్, స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్సెట్, 6.83 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయని సంస్థ ప్రోడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ సచిన్ దేవ్ తెలిపారు.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లునాలుగేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. జులై 1 నుంచి ఫ్లిప్కార్ట్పై ఎక్స్క్లూజివ్గా అమ్మకాలు ప్రారంభమవుతాయి. తొలి రోజున హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ తదితర కార్డులపై రూ.2,000 డిస్కౌంటు, రూ.2,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చని దేవ్ చెప్పారు. -
నిలకడగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 16 పాయింట్లు పెరిగి 25,565కు చేరింది. సెన్సెక్స్(Sensex) 45 ప్లాయింట్లు పుంజుకుని 83,799 వద్ద ట్రేడవుతోంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అందులో అమ్మారు.. ఇందులో కొన్నారు!
ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా పీబీ ఫిన్టెక్లో కంపెనీ సహవ్యవస్థాపకులు యాషిష్ దహియా, అలోక్ బన్సల్ 1.09 శాతం వాటాను షేరుకి రూ. 1,821.5 సగటు ధరలో విక్రయించారు. ఇన్సూర్టెక్.. పాలసీబజార్, ఫిన్టెక్ ప్లాట్ఫామ్ పైసాబజార్ మాతృ సంస్థలో 50.5 లక్షల షేర్లను అమ్మివేయడం ద్వారా రూ. 920 కోట్లు సమకూర్చుకున్నారు. ఎన్ఎస్ఈ బల్్కడీల్ వివరా ల ప్రకారం సీఈవో దహియా 0.74 శాతం వాటాకు సమానమైన 34 లక్షల షేర్లు. వైస్చైర్మన్ బన్సల్ 0.36 శాతం వాటాకు సమానమైన 16.5 లక్షల షేర్లు విక్రయించారు. తాజా లావాదేవీల తదుపరి పీబీ ఫిన్టెక్లో దహియా వాటా 4.31 శాతం నుంచి 3.57 శాతానికి, బన్సల్ వాటా 1.4 శాతం నుంచి 1.04 శాతానికి క్షీణించింది. కాగా.. ఈ వాటాలను దేశీ ఎంఎఫ్, బీమా రంగ సంస్థలతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నాయి. ఈ జాబితాలో టాటా ఎంఎఫ్, ఎడిల్వీజ్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రు లైఫ్సహా సిటీగ్రూప్ గ్లోబల్, గోల్డ్మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, సొసైటీ జనరాలి తదితరాలు చేరాయి.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లుడెల్హివరీలో వాటా కొనుగోలుజాబితాలో మోర్గాన్ స్టాన్లీ, సిటీగ్రూప్ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా లాజిస్టిక్స్ సర్వీసులందించే డెల్హివరీలో దేశ, విదేశీ దిగ్గజాలు వాటా కొనుగోలు చేశాయి. ఎన్ఎస్ఈ బల్క్డీల్ గణాంకాల ప్రకారం 1.6 శాతం వాటాకు సమానమైన 1.19 కోట్ల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నాయి. ఇందుకు షేరుకి రూ. 387 సగటు ధరలో రూ. 461 కోట్లు వెచి్చంచాయి. షేర్లను కొనుగోలు చేసిన సంస్థల జాబితాలో మోర్గాన్ స్టాన్లీ, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ సింగపూర్, విరిడియన్ ఏఎంతోపాటు.. ఎంఎఫ్ సంస్థలు హెచ్డీఎఫ్ సీ, యాక్సిస్, టాటాతదితరాలు చేరాయి. అనుబంధ సంస్థలు నెక్సస్ అపార్చునిటీ ఫండ్, నెక్సస్ వెంచర్స్–3తో వీసీ కంపెనీ నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ తాజాగా డెల్హివరీలో వాటా విక్రయించింది. 2025 మార్చికల్లా డెల్హివరీలో 5.88 % వాటాను నెక్సస్ వెంచర్స్–3 కలిగి ఉంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
రేట్ల కోతను వేగంగా బదిలీ చేయాలి: ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేటును ఈ నెల మొదట్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించగా (0.50 శాతం), దీన్ని వేగంగా రుణ గ్రహీతలకు బదలాయించాలంటూ ఆర్బీఐ బులెటిన్ సూచించింది. బ్యాంక్లు వెంటనే తమ రుణ రేట్లను ఈ మేరకు తగ్గించాలని కోరింది. వాస్తవానికి చాలా బ్యాంక్లు ఇప్పటికే తమ రుణ రేట్లను ఈ మేరకు తగ్గించడం గమనార్హం.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లురుణ రేట్లను వేగంగా బదలాయించడానికి కావాల్సిన అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్యంక్లు వేగంగా బెంచ్మార్క్ లెడింగ్ రేటు ఆధారిత రుణ రేట్లను సవరించాయి కూడా. రెపో రేటుతోపాటు నగదు నిల్వల నిష్పత్తిని సైతం (సీఆర్ఆర్) అర శాతం మేర తగ్గిస్తూ ఆర్బీఐ వెసులుబాటు కల్పించడం తెలిసిందే. సీఆర్ఆర్ కోతతో బ్యాంకింగ్ రంగంలోకి రూ.2.5 లక్షల కోట్ల మేర అదనపు నగదు లభ్యత అందుబాటులోకి వచ్చినట్లయింది. -
దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లు
భారత్లో 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యంత విలువైన బ్రాండ్ వివరాలను ‘బ్రాండ్ ఫైనాన్స్’ నివేదిక తెలియజేసింది. దేశంలో టాటా గ్రూప్ (బ్రాండ్ విలువ 10 శాతం పెరిగి 31.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది) మరోసారి అత్యంత విలువైన బ్రాండ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక రంగాల్లో టాటా గ్రూప్ వ్యూహాత్మక పెట్టుబడులతో దేశంలో వేగంగా విస్తరిస్తోందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది.దేశంలోని టాప్ 10 అత్యంత విలువైన బ్రాండ్లు మొత్తంగా బ్రాండ్ విలువలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. బలమైన దేశీయ డిమాండ్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం అంచనా వేసిన జీడీపీ వృద్ధి 6 శాతం నుంచి 7 శాతం మధ్య ఉందని పేర్కొంది.ఇదీ చదవండి: సెకనుకు మూడు వాహనాలు డెలివరీబ్రాండ్ ఫైనాన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిమోన్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. ‘మేక్ ఇన్ ఇండియా పిలుపును భారత్ నూతన శక్తితో స్వీకరిస్తోంది. తయారీ, ఆర్థిక సేవలు, వినోదం, వైద్యం, ఆతిథ్యం ఇలా ఏ రంగంలోనైనా భారత్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దేశ ఆర్థిక పురోగతి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విస్తరణ తన అగ్రశ్రేణి బ్రాండ్లను గ్లోబల్ లీడర్లుగా మారుస్తున్నాయి’ అన్నారు.అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లు ఇవే.. బ్రాండ్ విలువ(బిలియన్ డాలర్లలో)టాటా గ్రూప్ 31.6 ఇన్ఫోసిస్ 16.3హెచ్డీఎఫ్సీ 14.2ఎల్ఐసీ 13.6రిలయన్స్ 9.8ఎస్బీఐ 9.6హెచ్సీఎల్ టెక్ 8.9ఎయిర్టెల్ 7.7ఎల్ అండ్ టీ 7.4మహీంద్రా 7.2 -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు డౌన్
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు పెరిగిపోవడంతో అమ్మకాలు చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ (క్యూ1) మధ్య కాలంలో హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 27 శాతం క్షీణించి 11,040 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇదే కాలంలో ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా టాప్–7 నగరాల్లో జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. ఈ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 20 శాతం తక్కువగా 96,285 యూనిట్లుగా ఉండొచ్చన్నది అంచనా. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ ఏడు నగరాల్లో 1,20,335 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. హైదరాబాద్తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), బెంగళూరు, పుణె, కోల్కతా పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు పడిపోగా, ఒక్క చెన్నైలో మాత్రం పెరిగాయి. నగరాల వారీ డేటా.. → జూన్ త్రైమాసికంలో అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇళ్ల ధరలు 27 శాతం పెరిగాయి. ఇక్కడ ఇళ్ల విక్రయాలు 14 శాతం క్షీణించి 14,255 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 16,650 యూనిట్లుగా ఉండడం గమనార్హం. → ఎంఎంఆర్లో ఇళ్ల అమ్మకాలు 25 శాతం పడిపోయి 31,275 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 15,410 యూనిట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలం విక్రయాలతో పోల్చితే 8 శాతం తక్కువ. ఇక్కడ ధరలు సగటున 12 శాతం పెరిగాయి. → పుణెలో అమ్మకాలు 27 శాతం తగ్గి రూ.15,410 యూనిట్లుగా ఉన్నాయి. → కోల్కతా నగరంలో 23 శాతం తక్కువగా 3,525 యూనిట్లు అమ్ముడయ్యాయి. → చెన్నైలో 11 శాతం పెరిగి 5,660 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 5,100 యూనిట్లుగా ఉన్నాయి. -
కీలక ఖనిజాలపై పీఎస్యూల కన్ను
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల కోసం చేతులు కలపనున్నాయి. తద్వారా మినీరత్న సీపీఎస్ఈ హిందుస్తాన్ కాపర్.. కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల బ్లాకులకు బిడ్ చేయనుంది. ఇందుకు ఇతర పీఎస్యూ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), గెయిల్ (ఇండియా), రైల్వే రంగ సంస్థ రైట్స్తో జత కట్టనున్నట్లు హిందుస్తాన్ కాపర్ చైర్మన్, ఎండీ సంజీవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఐవోసీ, గెయిల్తో హిందుస్తాన్ కాపర్ తప్పనిసరికాని ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు తెలియజేశారు. కాపర్ బ్లాకులతోపాటు కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ మూలకాల బ్లాకులను ప్రభుత్వం వేలం వేయనున్నట్లు వెల్లడించారు. వీటన్నిటికీ కంపెనీ బిడ్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో చిలీలో కాపర్సహా ఇతర కీలక ఖనిజాల అన్వేషణ కోసం మరో ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకునే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే ఈ నెల మొదట్లో రైల్వే రంగ ఇంజినీరింగ్ పీఎస్యూ రైట్స్తో ఒప్పందానికి తెరతీసిన విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా దేశ, విదేశీ మార్కెట్ల కోసం సంయుక్తంగా కీలక ఖనిజాల సరఫరా చైన్ను అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా దేశ, విదేశాలలో కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీత, శుద్ధి, ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టనున్నట్లు వివరించారు. మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సైతం అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. కంపెనీ దేశీయంగా రాగి గనుల మైనింగ్లో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆచితూచి రుణం..!
ముంబై: యువత రిటైల్ రుణాల విషయంలో అప్రమత్తత వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2024–25 క్యూ4) రిటైల్ రుణాల మంజూరులో కేవలం 5 శాతం వృద్ధి నమోదైనట్టు ట్రాన్స్యూనియన్ సిబిల్ వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2024 జనవరి–మార్చి) రిటైల్ రుణాల్లో వృద్ధి 12 శాతంగా ఉండడాన్ని ప్రస్తావించింది. రిటైల్ రుణాల వృద్ధి గణనీయంగా తగ్గడంలో కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాలు, క్రెడిట్ కార్డు వినియోగం ప్రభావం ఎక్కువగా ఉంది. పట్టణాల్లో యువత వీటిని ప్రధానంగా వినియోగిస్తుండడం తెలిసిందే. రిస్క్ అధికంగా ఉండే అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో దూకుడు వద్దంటూ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలకు 2023 చివర్లో ఆర్బీఐ సూచనలు చేయడాన్ని సిబిల్ నివేదిక గుర్తు చేసింది. క్రెడిట్ కార్డు, పర్సనల్ రుణాల్లో వృద్ధిని మోస్తరు స్థాయికి తీసుకురావడమే ఈ చర్యల ఉద్దేశ్యంగా పేర్కొంది. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి.. → క్రెడిట్ కార్డుల జారీ సంఖ్య 2023–24 జనవరి–మార్చి త్రైమాసికంలో సున్నాగా ఉంటే, 2024–25 సంవత్సరం చివరి త్రైమాసికంలో మైనస్ 32%గా (తగ్గిపోవడం) నమోదైంది. → వ్యక్తిగత రుణాల్లో వృద్ధి 6 శాతానికి పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్లో 13 శాతం వృద్ధి నమోదైంది. → కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలు 2024–25 క్యూ4లో 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో వృద్ధి 19 శాతంగా ఉంది. → రుణ వినియోగదారుల్లో వృద్ధి 8 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 15 శాతం. → కొత్త వారికి రుణ వితరణలో వృద్ధి క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చతే 3 శాతం తక్కువగా 16 శాతానికి పరిమితమైంది. → గృహ రుణ విభాగంలో వితరణలు (సంఖ్యా పరంగా) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 7 శాతం తగ్గిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 5 శాతం వృద్ధి నమోదైంది. కానీ గృహ రుణాల్లో రూ.కోటికి మించిన మొత్తాల్లో మాత్రం 9 శాతం వృద్ధి కనిపించింది. → ఆటో విభాగంలోనూ పెద్ద మొత్తం రుణాలకు డిమాండ్ కనిపించింది. → క్రెడిట్ కార్డులు మినహా రిటైల్ రుణాల్లోని అన్ని విభాగాల్లోనూ 90 రోజులకు పైగా చెల్లింపులు చేయని వాటి విషయంలో మెరుగుదల నమోదైంది. క్రెడిట్ కార్డుల్లో మాత్రం 0.28% పెరిగి ఇవి 2%కి చేరాయి. → రుణాలను మొదటిసారి తీసుకునే వారిలో వృద్ధి తగ్గడం ఆందోళనకరమని.. అందరికీ ఆర్థిక సేవల విస్తృతికి ఈ విభాగం కీలకమని సిబిల్ ఎండీ భవేష్ జైన్ పేర్కొన్నారు. లఘు సంస్థలకు తగ్గిన కొత్త రుణాలు ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) కొత్త రుణాలు (ఆరిజినేషన్) నెమ్మదించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో (2023–24) పోలిస్తే 2024–25లో విలువ 7.4 శాతం మేర క్షీణించి, రూ. 39.9 లక్షల కోట్ల నుంచి రూ. 36.9 లక్షల కోట్లకు తగ్గింది. రూ. 1 కోటి లోపు మైక్రో లోన్స్ ఇచ్చేందుకు రుణదాతలు దూరంగా ఉండటం ఇందుకు కొంత కారణంగా నిల్చింది. 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రో సెగ్మెంట్ రుణాలు రూ. 18.2 లక్షల కోట్లుగా ఉండగా 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.8 లక్షల కోట్లకు తగ్గాయి. పరిమాణంపరంగా చూస్తే మాత్రం ఎంఎస్ఎంఈలకు కొత్త రుణాల సంఖ్య 64.7 లక్షల నుంచి 75.8 లక్షలకు పెరిగింది. విలువ కోణంలో చూస్తే, రూ. 1–50 కోట్ల వరకు విలువ చేసే రుణాలు గణనీయంగా పెరిగాయి. క్రిఫ్ హై మార్క్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.మరిన్ని వివరాలు.. → చిన్న సంస్థల సెగ్మెంట్లో (రూ. 1–10 కోట్లు) రుణాలు రూ. 11 లక్షల నుంచి రూ. 12.1 లక్షల కోట్లకు పెరిగాయి. అలాగే మీడియం సెగ్మెంట్లో (రూ. 10–50 కోట్లు) లోన్లు రూ. 10.7 లక్షల కోట్ల నుంచి రూ. 13 లక్షల కోట్లకు ఎగిశాయి. → ఈ మార్పులనేవి, రుణదాతలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే సెగ్మెంట్ వైపు మళ్లుతుండటాన్ని సూచిస్తున్నాయి. → రుణ బాకీల పోర్ట్ఫోలియో రూ. 33.6 లక్షల కోట్ల నుంచి రూ. 40.4 లక్షల కోట్లకు చేరింది. → 91–180 రోజుల కాలవ్యవధిలోని మొండి బాకీల పరిమాణం 1.3 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గింది. -
నెస్లే బోనస్ బొనాంజా
న్యూఢిల్లీ: సుప్రసిద్ధ మ్యాగీ, నెస్కెఫే, కిట్కాట్ బ్రాండ్ల ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా కంపెనీ చరిత్రలోనే తొలిసారి బోనస్ షేర్లకు తెరతీసింది. దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాక కంపెనీ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో ఉచితంగా షేర్లను జారీ చేయనుంది. బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. వెరసి వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని బోనస్గా కేటాయించనుంది. అయితే ఇందుకు రికార్డ్ డేట్ను తదుపరి ప్రకటించనున్నట్లు తెలియజేసింది. నెస్లే ఇండియా ఇంతక్రితం 2024 జనవరిలో షేర్ల ముఖ విలువను విభజించింది. రూ. 10 ముఖ విలువను రూ. 1 ముఖ విలువకు కుదించింది. తదుపరి కంపెనీ ఈ నెల 19న తొలిసారి బోనస్ షేర్ల అంశాన్ని ప్రతిపాదించింది. 26న నిర్వహించనున్న సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం)లో డైరెక్టర్ల బోర్డు బోనస్ షేర్ల ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో గురువారం(26న) బోనస్ షేర్ల జారీకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచి్చనట్లు కంపెనీ చైర్మన్, ఎండీగా పదవీ విరమణ చేయనున్న సురేష్ నారాయణ్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రతీ షేరుకీ రూ. 10 చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇందుకు జూలై 4 రికార్డ్ డేట్గా కంపెనీ ప్రకటించింది. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరి 7న షేరుకి రూ. 14.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. కాగా.. బోనస్ షేర్లతో వాటాదారులందరూ ప్రధానంగా 5 షేర్ల కంటే తక్కువగల 1.6 లక్షలమంది చిన్న ఇన్వెస్టర్లు లబ్ధి్ద పొందనున్నట్లు నారాయణ్ పేర్కొన్నారు. బోనస్ వార్తల నేపథ్యంలో నెస్లే ఇండియా షేరు 1% బలపడి రూ. 2,430 వద్ద ముగిసింది. మ్యాగీ సంక్షోభం 2015లో అమ్మకాలపై నిషేధ సంక్షోభాన్ని ఎదుర్కొన్న మ్యాగీ తదుపరి దశలో మరింత బలపడింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాలలో 7 శాతం వాటాను మ్యాగీ ఆక్రమిస్తున్నట్లు కంపెనీకి దశాబ్ద కాలం సేవలందించిన నారాయణ్ వెల్లడించారు. మ్యాగీ సంక్షోభం తరువాత నెస్లే ఇండియా ఎండీగా 2015 ఆగస్ట్ 1న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కాలంలో కంపెనీ వివిధ కేటగిరీలలో 150 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. ఈకామర్స్ చానళ్ల ద్వారా 8 శాతం అమ్మకాలు నమోదవుతున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలలో నెస్లే ఇండియా వాటా అత్యధికంకావడం గమనార్హం! -
మైనస్లోకి అమెరికా జీడీపీ
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి/క్యూ1) అంచనాలకు మించి క్షీణతను చవిచూసింది. ట్రంప్ గందరగోళ వాణిజ్య విధానాలతో వ్యాపారపరమైన అనిశి్చతులకుతోడు బలహీన వినియోగ డిమాండ్ ప్రభావం చూపించాయి. జీడీపీ మైనస్ 0.5 శాతానికి పడిపోయినట్టు అమెరికా వాణిజ్య శాఖ తన మూడవ, తుది అంచనాలను ప్రకటించింది. ద్వితీయ అంచనాల్లో క్షీణత 0.2 శాతంగానే ఉండొచ్చన్న వాణిజ్య శాఖ అంచనాలను మించి ఆర్థిక వ్యవస్థ కుంగుబాటునకు గురైంది. మూడేళ్లలోనే మొదటిసారి అమెరికా జీడీపీ మైనస్లోకి వెళ్లినట్టయింది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే కీలకమైన వినియోగదారుల వ్యయం నిదానించినట్టు తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో వినియోగం 1.2 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, ఇది 0.5 శాతానికి పరిమితమైంది. 2024 చివరి త్రైమాసికంలోనూ వినియోగం 4 శాతం వృద్ధిని చూసింది. నాలుగేళ్లలోనే ఒక త్రైమాసికం పరంగా ఇది అతి తక్కువ వినియోగం కావడం గమనార్హం. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడానికి ట్రంప్ టారిఫ్లు సైతం ప్రభావం చూపించాయి. టారిఫ్లు అమల్లోకి రావడానికి ముందే పెద్ద మొత్తంలో దిగుమతులకు అక్కడి సంస్థలు మొగ్గు చూపించాయి. 2024 చివరి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 2.4 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. -
ఆర్ఐఎల్ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మార్కెట్ విలువ మరోసారి రూ. 20 లక్షల కోట్ల కీలక మైలురాయిని అధిగమించింది. షేరు ధర తాజాగా 2 శాతం పుంజుకుని రూ. 1,495కు చేరడంతో బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 37,838 కోట్లు బలపడింది. వెరసి బ్లూచిప్ కంపెనీ మార్కెట్ విలువ రూ. 20,23,375 కోట్లను అధిగమించింది. ప్రధాన ఇండెక్సులలో అధిక వెయిటేజీ గల కంపెనీ షేరు లాభపడటంతో మార్కెట్లకు సైతం జోష్వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంతక్రితం గతేడాది(2024) ఫిబ్రవరి 13న రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన తొలి దేశీ దిగ్గజంగా రిలయన్స్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఆర్ఐఎల్ తదుపరి ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ రూ. 15,51,219 కోట్ల మార్కెట్ విలువతో రెండో స్థానాన్ని పొందింది. ఈ బాటలో మార్కెట్ విలువ ద్వారా ఇతర బ్లూచిప్ కంపెనీలు టీసీఎస్(రూ. 12,45,219 కోట్లు), భారతీ ఎయిర్టెల్(రూ. 12,45,219 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్(రూ. 10,27,839 కోట్లు) తదుపరి ర్యాంకులలో నిలుస్తున్నాయి. కాగా.. ఈ ఏడాది ఆర్ఐఎల్ షేరు ఇప్పటివరకూ 23 శాతం జంప్చేయడం విశేషం! -
చైనా ప్రొడక్ట్లపై యాంటీ–డంపింగ్ సుంకం
వెల్లువెత్తే చౌక దిగుమతుల నుంచి దేశీ తయారీ సంస్థల ప్రయోజనాలను కాపాడే దిశగా ఈ నెలలో ఇప్పటివరకు ఆరు చైనా ఉత్పత్తులపై కేంద్రం యాంటీ–డంపింగ్ సుంకం విధించింది. పీఈడీఏ, ఎసిటోనైట్రైల్ (ఫార్మా రంగంలో ఉపయోగిస్తారు), విటమిన్–ఏ పామిటేట్, డెకోర్ పేపర్ మొదలైనవి వీటిలో ఉన్నాయి.పరిశ్రమల్లో ఉపయోగించే ఈ ముడిసరుకులపై అయిదేళ్ల పాటు సుంకాలు ఉంటాయని వేర్వేరు నోటిఫికేషన్లలో కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ తెలిపింది. వాణిజ్య శాఖలో భాగమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దిగుమతి సుంకాలు ఉత్పత్తిని బట్టి కేజీకి 20.87 డాలర్ల నుంచి టన్నుకు 2,017.9 డాలర్ల వరకు ఉంటాయి.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..గత ఆర్థిక సంవత్సరంలో చైనాతో భారత్ వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు చేరింది. చైనాకు ఎగుమతులు 14.5 శాతం క్షీణించి 14.25 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా, దిగుమతులు 11.52 శాతం పెరిగి 113.45 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. -
సెకనుకు మూడు వాహనాలు డెలివరీ
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ 2025 మే నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలను సర్వీస్ అందించడం ద్వారా అమ్మకాల అనంతరం చేసిన సర్వీస్లో రికార్డు నెలకొల్పింది. మే నెలలో దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ నిమిషానికి 170 వాహనాలను సర్వీస్ చేసి డెలివరీ చేసింది. అంటే సెకనుకు దాదాపు మూడు వాహనాలను డెలివరీ చేసినట్లయింది.ఈ విజయం మారుతీ సుజుకీ విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. మెట్రో నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5,400కుపైగా సర్వీసు సెంటర్లున్నాయని సంస్థ పేర్కొంది. తాజా రికార్డులో భాగంగా పెయిడ్ సేవలు, ఉచిత సేవలు, రన్నింగ్ రిపేర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..ఈ సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకేచి మాట్లాడుతూ ‘కంపెనీ చరిత్రలో ఒక నెలలో 24.5 లక్షలకు పైగా వాహనాలకు సర్వీస్ చేయడం ఇదే మొదటిసారి. ఇది సర్వీస్ నెట్వర్క్ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా మా సేవా బృందాలు, డీలర్ భాగస్వాముల అవిశ్రాంత కృషి ఫలితమిది’ అన్నారు. -
గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణకు ప్రభుత్వ పేటెంట్
శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించాలనే లక్ష్యంతో ఎంజీఎం విశ్వవిద్యాలయంలోని జవహర్లాల్ నెహ్రూ ఇంజినీరింగ్ కాలేజ్ (జేఎన్ఈసీ)లో కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థి కనక్ తల్వేర్ రూపొందించిన గ్రీన్ ఎనర్జీ వ్యవస్థకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించింది. చెరకు రసం నుంచి బయోఇథనాల్ ఉత్పత్తి చేసేలా ఈ వ్యవస్థను తయారు చేశారు.ఎంజీఎం విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకులు డాక్టర్ రవీంద్ర గైక్వాడ్, ఆకాశ్ వాణి, ప్రవర రూరల్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డాక్టర్ అన్నాసాహెబ్ వరడే, రవీంద్ర నిబ్లతో కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కనక్ కలిసి పనిచేశారు. మొత్తం ఈ ఐదుగురు పరిశోధకులు కలిసి భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందినట్లు తెలిపారు.వ్యవసాయ వ్యర్థాల నుంచి క్లీన్ ఎనర్జీబయోఇథనాల్ను తయారు చేయడానికి విస్తృతంగా లభించే చెరకు రసాన్ని ఉపయోగించడం వల్ల ఈ ఆవిష్కరణ ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రక్రియ జీవ ఇంధన ఉత్పత్తి కోసం, ముఖ్యంగా చెరకు పండిస్తున్న వ్యవసాయ ప్రాంతాల్లో రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తుంది. దీనివల్ల కర్బన ఉద్గారాలు తగ్గడం, గ్రామీణ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చెరకు రసంతో పాటు రసం వెలికితీత తర్వాత మిగిలిపోయిన ఫైబరస్ అవశేషమైన బగాస్సేపై పరిశోధనలు చేసి ఈ ప్రక్రియను రూపొందించారు. అంటే పంటలోని ప్రతి భాగాన్ని వినియోగంలోకి తేనున్నారు.ఇదీ చదవండి: మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..ఈ ప్రక్రియ భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ పొందండంతో ఎంజీఎం విశ్వవిద్యాలయం అకడమిక్ కమ్యూనిటీ నుంచి ప్రశంసలు అందుకుంది. భారతదేశం గ్రీన్ ఎనర్జీ మిషన్కు అనుగుణంగా విద్యార్థుల నేతృత్వంలోని ఆవిష్కరణలను ఇది హైలైట్ చేసింది. దేశం ప్రతిష్టాత్మక ఇథనాల్ మిశ్రమ లక్ష్యాల వైపు దూసుకెళ్తున్నప్పుడు ఇంధన ఆర్థిక వ్యవస్థలను సృష్టించడంలో ఇలాంటి పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
మీ వయసు 30 లోపా? తప్పక తెలియాల్సినవి..
డబ్బుకు సంబంధించిన పాఠాలు నిత్యం చాలామంది చెబుతూంటారు. ‘ఎక్కువ పొదుపు చేయండి..తక్కువ ఖర్చు పెట్టండి..’ వంటి సలహాలను తరచుగా వింటుంటారు. కానీ నిజ జీవితంలో ప్రాక్టికల్గా వాటి అర్థం ఏమిటో కొందరు మాత్రమే చెబుతారు. డబ్బు నిర్వహణ అంటే బడ్జెట్ను తయారు చేయడం మాత్రమే కాదు, ఏది అవసరమో..ఏది కాదో తెలుసుకుని మసులుకోవడం అని నిపుణులు చెబుతున్నారు. సీఏ నితిన్ కౌశిక్ 30 ఏళ్ల వయసులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎనిమిది ముఖ్యమైన డబ్బు పాఠాలను తెలిపారు.నితిన్ తన లింక్డ్ఇన్లో రాసిన వివరాల ప్రకారం..‘ఎవరూ మీకు బోధించని 8 కఠినమైన డబ్బు సత్యాలు (అయితే ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాల లోపు తప్పకుండా నేర్చుకోవాలి)ఇవి. డబ్బు ఆదా చేయడం అంటే ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదు. తర్కంతో ఆలోచించి ఖర్చు చేయడం. చాలా మంది ఆలస్యంగా నేర్చుకునే నిజమైన వివరాలు ఇవి. కాబట్టి మీరు 30 ఏళ్లు దాటడానికి ముందే తెలుసుకోవాల్సిన ఎనిమిది కఠినమైన, నిజమైన డబ్బు పాఠాలను చూద్దాం’ అంటూ నితిన్ రాసుకొచ్చారు. ఆయన తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే క్వాలిటీ వస్తువులపై పెట్టుబడులు పెట్టాలి. చీప్గా వస్తుందని కొనుగోలు చేస్తే ఎక్కువసార్లు దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది.ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు భారీ ఫర్నిచర్ కొనవద్దు. ఎందుకంటే తరలింపు ఖర్చులు భారంగా మారుతాయి. దీర్ఘకాలిక ఖర్చులకు దారితీస్తూ, స్వల్పకాలిక పొదుపును నివారించే వాటికి దూరంగా ఉండాలని దీని ఉద్దేశం.ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న ఈ రోజుల్లో మీ జీతంలో కనీసం 5 శాతాన్ని నగదు రూపంలో పొదుపు చేయండి. ఫిజికల్ మనీ మిమ్మల్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఖర్చు చేసేలా చేస్తుంది.ఫోన్ ట్రెండ్స్ను గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీకు లేటెస్ట్, ఖరీదైన ఫోన్ అవసరం లేదు. మీ పనులకు నిజంగా ఏది అవసరమో దాన్ని కొనుగోలు చేయండి. అంతకు మించి వద్దు. ఖరీదైన గాడ్జెట్లు త్వరగా వాటి విలువను కోల్పోతాయి.చాలా మంది యువకులు తాము ఫిట్గా ఉన్నామని భావించి ఆరోగ్య బీమా తీసుకోరు. కానీ ఊహించని ఒక ఆసుపత్రి బిల్లు కనీసం ఆరు నెలల పొదుపును తుడిచివేస్తుంది. ఆర్థిక భద్రత అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు. ఊహించని ఖర్చుల నుంచి రక్షణ పొందడం అని గుర్తించాలి.ఇదీ చదవండి: బంగారం కంటే వెండి ముద్దుఅనారోగ్యకరమైన ఆహార విధానం మీ శరీరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా దీర్ఘకాలికంగా వైద్య బిల్లులను పెంచుతుంది. చక్కెర, పామాయిల్ తగ్గించాలి. అవి దీర్ఘకాలంలో మీ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి.క్రెడిట్ కార్డు అనే ఉచితంగా వచ్చే డబ్బు కాదు. సరైన పద్ధతిలో వాడితే క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. కానీ మీరు దీన్ని మీ ఆదాయ వనరుగా భావిస్తే అప్పుల్లో పడతారు.డబ్బును గౌరవించే వారితో స్నేహం చేయండి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారితో సావాసం చేయాలి. డబ్బును అర్థం చేసుకోని వ్యక్తితో ఉంటే జీవితం దారుణంగా మారుతుంది. ప్రేమ ఒక్కటే ఉంటే ఈఎంఐలు చెల్లించలేరు. -
బంగారం కంటే వెండి ముద్దు
విలువైన లోహంలో ఒకటిగా ఉన్న బంగారం ధరలు ఇటీవల కాలంలో 10 గ్రాములు రూ.1లక్షకుపైగా చేరింది. ఇంకోవైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ భౌగోళిక అనిశ్చితుల నేపథ్యంలో వీటి ధరలు ఆకాశాన్నంటినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండిలో పెట్టుబడిపెట్టే వారికి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సూచనలు చేశారు.ఇప్పటికే బంగారం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత సమయంలో పుత్తడి కంటే వెండిపై పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చని కియోసాకి తెలిపారు. బంగారంతోపాటు బిట్కాయిన్ ధరలు పెరిగిన తరుణంలో అవి కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాతే వాటిని కొనుగోలు చేస్తానని కియోసాకి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. బంగారం, బిట్కాయిన్ ధరలు ఎప్పుడు పడుతాయోనని వేచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునేముందు సొంతంగా రిసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు.FYI: Silver is the best investment today….june 2025. Gold and Bitcoin are high and I am waiting for gold and Bitcoin to crash before I add to my position.That’s what I think.Do your own research.Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) June 23, 2025ఇదీ చదవండి: టూవీలర్లపై టోల్ ఛార్జీలు..?ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి ఇటీవల వెండి గురించి ఇటీవల సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ ‘నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం’ అని అభివర్ణించారు. -
టూవీలర్లపై టోల్ ఛార్జీలు..?
ద్విచక్ర వాహనాలపై ప్రభుత్వం జులై 15 నుంచి టోల్ ఛార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు సామాజిక మాధ్యమాలు, పలు మీడియా కథనాల్లోవార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ద్విచక్రవాహనాలపై ఛార్జీలు వేసే అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని, మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు జాతీయ రహదారులపై టోల్ ఫ్రీ సదుపాయం ఎప్పటిలాగే కొనసాగుతుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) స్పష్టం చేసింది.#FactCheck: Some sections of the media have reported that the Government of India plans to levy user fees on two-wheelers. #NHAI would like to clarify that no such proposal is under consideration. There are no plans to introduce toll charges for two-wheelers. #FakeNews— NHAI (@NHAI_Official) June 26, 2025ఇదీ చదవండి: వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ నెనేటర్ఫాస్టాగ్ ఆధారిత టోల్ ఛార్జీలు ద్విచక్ర వాహనాలకు సైతం అమలు చేస్తారని సోషల్మీడియాలో సమాచారం వైరల్గా మారింది. దాంతో ఎన్హెచ్ఏఐ ఈమేరకు స్పష్టతనిచ్చింది. మొదట టూవీలర్లపై టోల్ ఛార్జీలు విధిస్తున్నట్లు వచ్చిన అసత్య వార్తలవల్ల ద్విచక్రవాహనదారులు ఆందోళన చెందారు. కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వార్తలను ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. ఈ విషయంపై ఎటువంటి విధాన మార్పును ఆమోదించలేదని చెప్పారు. ఏ సవరణకైనా అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేస్తామని చెప్పారు. అబద్ధపు ప్రచారానలు నమ్మకూడదని తెలిపారు.🚨 Toll Charges for Two-Wheelers from July 15? Here's the Truth! 🛵💸Several social media posts claim that two-wheelers will have to pay tolls on highways starting July 15, 2025.#PIBFactCheck❌This claim is #Fake✅@NHAI_Official has made NO such announcement🛣️There… pic.twitter.com/XFr4NtfxrZ— PIB Fact Check (@PIBFactCheck) June 26, 2025 -
మెసేజ్ ఎంత పెద్దదైనా చిటికెలో సారాంశం
మెటా వాట్సప్లో కొత్త ఏఐ ఆధారిత ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. వాట్సప్లో చదవని మెసేజ్ల సంక్షిప్త సారాంశాన్ని తెలుసుకునేందుకు మెటా ఏఐ సాయం చేయనుందని పేర్కొంది. ఈ ఫీచర్లో భాగంగా యూజర్లు నిత్యం పెద్ద టెక్స్ట్ మేసేజ్లను స్క్రోల్ చేసి పూర్తిగా చదవకుండా మెటా ఏఐ అందులోని సంక్షిప్త సారాంశాన్ని అందిస్తుంది. ఇంగ్లిష్ సపోర్ట్తో పనిచేసే ఈ ఫీచర్ ప్రస్తుతం అమెరికాలోని వాట్సప్ యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు మెటా తెలిపింది. ఈ ఏడాది చివర్లో క్రమంగా మరిన్ని ప్రాంతాలతోపాటు ఇతర భాషలకు ఈ ఫీచర్ను విస్తరిస్తామని స్పష్టం చేసింది.మెటా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫీచర్ వన్-ఆన్-వన్, గ్రూప్ చాట్స్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది. నిత్యం మెసేజ్లు వచ్చే గ్రూప్లు, వ్యక్తులకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఏఐ మెసేజ్లు చదివే క్రమంలో యూజర్ల కంటెంట్పట్ల భద్రత పాటిస్తామని వాట్సప్ హామీ ఇచ్చింది. ఏఐ ఫీచర్ డేటాను బాహ్య సర్వర్లకు ప్రసారం చేయకుండా లేదా కంపెనీ సిస్టమ్లకు బహిర్గతం చేయకుండా ప్రాసెస్ చేస్తుందని తెలిపింది.ఇదీ చదవండి: వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ నెనేటర్యూజర్ల ప్రాధాన్యతలను గౌరవించడానికి వాట్సప్ డిఫాల్ట్గా ఈ ఫీచర్ను ఎనేబుల్ చేయదని చెప్పింది. మాన్యువల్గానే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలని పేర్కొంది. ఇది ఆప్షనల్ ఫీచర్గా మాత్రమే ఉంటుందని తెలిపింది. అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ కంట్రోల్స్లో యూజర్లు తమ సెట్టింగ్స్ను మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. -
వారానికి 32 గంటలు చాలు..: యూఎస్ సెనేటర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల తొలగింపు అధికమవుతోంది. టెక్ కంపెనీలు వ్యయం ఆదా చేసుకొని ఇతర విభాగాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఏఐ తోడ్పడుతుంది. కృత్రిమ మేధ వ్యాపారాలకు సహాయం చేస్తుంటే, వాటి సామర్థ్యాన్ని పెంచుతుంటే ఆయా సంస్థలు ఉద్యోగుల వర్క్-లైఫ్ సమతుల్యతను మెరుగుపరచాలని సెనేటర్ బెర్నీ శాండర్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏఐ ఆటోమేషన్ పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేసేలా వాతావరణాన్ని సృష్టించాలన్నారు.జో రోగన్ ఎక్స్పీరియన్స్ పాడ్కాస్ట్లో మాట్లాడిన బెర్నీ శాండర్స్ వారానికి 32 గంటల పనిదినాలు ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ ఉద్యోగులను నిరుద్యోగంలోకి నెట్టడం కంటే ఎక్కువ ఫ్రీటైమ్ ఉంచేలా చేయాలని పేర్కొన్నారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని వ్యాపారాలకు ఉత్పాదకత పెరుగుతోంది. దాన్ని ప్రధానంగా పరిగణిస్తే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు దానికి బదులుగా పని దినాలను తగ్గించాలి. వారానికి 32 గంటలకు పనిని కుదించాలి. ఉద్యోగులు తమ కుటుంబం, స్నేహితులు లేదా తమకు ఇష్టమైన కార్యకలాపాలకు ఎక్కువ సమయం గడిపేందుకు వీలు కల్పించాలి. టెక్నాలజీ కేవలం కార్పొరేట్ లాభాలకే పరిమితం కాకుండా ఉద్యోగులకు సైతం ఉపయోగపడాలి’ అన్నారు.ఇదీ చదవండి: ఇంటెల్లో ఉద్యోగాల కోత ప్రారంభంసెనేటర్ బెర్నీ శాండర్స్ ప్రస్తుతం యూఎస్ సెనేట్లో వెర్మాంట్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1981లో వెర్మాంట్లోని బర్లింగ్ టన్ మేయర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన 1991 నుంచి 2007 వరకు అమెరికా ప్రతినిధుల సభలో పనిచేశారు. -
ఇంటెల్లో ఉద్యోగాల కోత ప్రారంభం
ఇంటెల్ కొత్త సీఈఓ లిప్-బు టాన్ నేతృత్వంలో కొనసాగుతున్న కంపెనీ వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కాలిఫోర్నియాలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభించారు. శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలో ఉన్న 107 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇంటెల్ పేర్కొంది. 30 రోజుల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినప్పుడు నోటిఫికేషన్ జారీ చేసేలా కాలిఫోర్నియా వార్న్ చట్టం నిర్దేషిస్తుంది. దీని ప్రకారం కంపెనీ సమర్పించిన ఫైలింగ్లో ఉద్యోగాల కోతలు ప్రారంభం కానున్నాయని తెలిసింది.జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆటోమోటివ్ చిప్ వ్యాపారాన్ని కూడా ఇంటెల్ మూసివేయనుంది. దాంతో ఇంటెల్ ఎక్స్పర్ట్ జాక్ వీస్ట్ నేతృత్వంలోని ఈ యూనిట్ ఉద్యోగుల్లో చాలా మంది కొలువులు కోల్పోయే అవకాశం ఉంది. బాధిత ఉద్యోగులకు 60 రోజుల నోటీసు లేదా నాలుగు వారాల నోటీసుతో పాటు తొమ్మిది వారాల పరిహారం, ఇతర వేతన ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ తెలిపింది. మరోవైపు, జులై మధ్యలో ఇంటెల్ కాలిఫోర్నియాలోని గ్లోబల్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యలు తీసుకోబోతుందని అధికారులు తెలిపారు. అప్పుడు కంపెనీ తన ఉద్యోగుల్లో మరో 20 శాతం మందిని తొలగిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపుతాజాగా ప్రకటించిన ఉద్యోగ కోతల్లో ఇంటెల్ చిప్ అభివృద్ధికి కీలకమైన పలు ఇంజినీరింగ్ ఉద్యోగులను తొలగించడం గమనార్హం. వీరిలో ఫిజికల్ డిజైన్ ఇంజినీర్లు, లాజిక్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్పెషలిస్టులు, క్లౌడ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్లు ఉన్నారు. ఇంజినీరింగ్ మేనేజర్లు, బిజినెస్ లీడ్లు, ఐటీ వైస్ ప్రెసిడెంట్ వంటి అనేక సీనియర్ లీడర్షిప్ రోల్స్లో సేవలందిస్తున్న వారున్నారు. శాంటా క్లారా సైట్లోని ఉద్యోగులు సీపీయూ, జీపీయూ డిజైన్ ప్రాజెక్టుల్లో పనిచేస్తారని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇంటెల్ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ప్రధాన టెక్ కంపెనీల్లో 2025లో ఇప్పటివరకు 62,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని లేఆఫ్స్.ఎఫ్వైఐ తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రధాన సంస్థలు వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. -
దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపు
దేశంలో సంపద పెరుగుతోంది. సంపన్నులు రెట్టింపవుతన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తాజా నివేదిక ప్రకారం.. 2024-2029 మధ్య అంటే ఐదేళ్లలో మిలియనీర్ల జనాభా 55 శాతానికిపైగా పెరుగుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు 21 శాతం కంటే రెట్టింపు.2023-2024 మధ్య కాలంలో భారత ఆర్థిక సంపద 10.8 శాతం పెరిగిందని, ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) సగటు 7.3 శాతం దాటిందని బీసీజీ తెలిపింది. ఉత్తర అమెరికా (4%), పశ్చిమ ఐరోపా (5%) లను మించి ఎఆసియా-పసిఫిక్ ప్రాంతం 2029 నాటికి వార్షికంగా 9% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.2024 నుంచి 2029 వరకు డాలర్ మిలియనీర్ల సంఖ్య 55 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామని బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్, పార్టనర్ మయాంక్ ఝా తెలిపారు. తొలి తరం మొదటిసారి సంపద సృష్టికర్తలు, ముఖ్యంగా మిలీనియల్ (యువ) పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు పరిశ్రమను పునర్నిస్తున్నారని పేర్కొన్నారు.బలమైన ఈక్విటీ మార్కెట్ పనితీరు కారణంగా ఆర్థిక ఆస్తులు 8.1% పెరగడంతో 2024లో ఆర్థిక సంపద రికార్డు స్థాయిలో 305 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని బీసీజీ గ్లోబల్ నివేదిక తెలిపింది. విలువైన క్లయింట్ల గుర్తింపు, ప్రాధాన్యంలో సంస్థలకు సహకారం అందిస్తూ ఉత్పాదక ఏఐ (GenAI) సంపద ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని వివరించింది. ఈ ఉత్పాదక ఏఐని త్వరగా అందిపుచ్చుకున్నవారు ఐదు రెట్లు అధికంగా పురోగమిస్తున్నారని వివరించింది. -
యూనియన్ బ్యాంక్ ఈడీకి ఊహించని షాక్..
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పంకజ్ ద్వివేదికి ఊహించని అనుభవం ఎదురైంది. జనరల్ మేనేజర్గా ఆయన హోదాను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక సేవల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వపు హోదాలో జనరల్ మేనేజర్గా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కు పంపించింది.ఢిల్లీ హైకోర్టులో ద్వివేదికి వ్యతిరేకంగా కేసు పెండింగ్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూనియన్ బ్యాంక్ ఈడీగా ద్వివేది నియామకాన్ని సవాలు చూస్తే ఢిల్లీ హైకోర్టులో గతేడాది ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.విజిలెన్స్ క్లియరెన్స్ లేకుండా ఈడీగా నియమించడం నిబంధనల ఉల్లంఘనంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విజిలెన్స్ విభాగం ఆమోదం లేకుండా నియామకం ఎలా చేశారని ప్రశ్నిస్తూ.. 2024 ఆగస్ట్లో కేంద్రం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. -
హాట్రిక్ తర్వాత బంగారం ధరలు మళ్లీ ఇలా..
దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Prices) తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మూడు రోజులుగా వరుసగా తగ్గి హాట్రిక్ కొట్టిన పసిడి ధరలకు నేడు (జూన్ 26) బ్రేక్ పడింది. దీంతో ఇంకాస్త తగ్గుతుందనుకున్న కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతో బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి. జూన్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.99,100🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,850ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,950🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,070బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరల్లో నేడు ఎటువంటి మార్పూ లేదు.👉 వెండి విషయంలో అమ్మో.. ఆయన మాటలు నిజమవుతాయా? 👈వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ నేడు ఎటువంటి మార్పూ లేదు. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,18,000 వద్ద, ఢిల్లీ ప్రాంతంలో రూ. 1,08,000 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
1.41 కోట్ల మంది విమానమెక్కారు..
దేశీ విమానయాన రంగంలో ప్రయాణికుల సంఖ్య మే నెలలో 1.89 శాతం పెరిగి 1.41 కోట్లకు చేరినట్టు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. 2024 మే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 1.38 కోట్లుగా ఉంది. 64 శాతం మార్కెట్ వాటా ఇండిగో చేతుల్లోనే ఉంది. ఈ సంస్థ విమానాల్లో 93.09 లక్షల మంది ప్రయాణించారు.ఆ తర్వాత 37.22 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించడం ద్వారా 26.5 శాతం మార్కెట్ వాటా ఎయిర్ ఇండియా గ్రూపు సొంతం చేసుకుంది. ఇక ఆకాశ ఎయిర్ విమానాల్లో 7.48 లక్షల మంది, స్పైస్జెట్ విమానాల్లో 3.40 లక్షల మంది చొప్పున మే నెలలో ప్రయాణించారు. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 5.3 శాతంగా ఉంటే, స్పైస్ జెట్ మార్కెట్ వాటా 2.4 శాతానికి పరిమితమైంది.ఆరు ప్రధాన విమానాశ్రయాల నుంచి (హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా) 84 శాతం సరీ్వసులకు సకాలంలో సేవలు అందించి ఇండిగో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 79.7 శాతంతో ఎయిర్ ఇండియా గ్రూపు ద్వితీయ స్థానంలో ఉంది. -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, ఎంఅండ్ఎం షేర్లలో కొనుగోళ్లతో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఫ్గాట్గా కదులుతున్నాయి.30 షేర్ల సెన్సెక్స్ 243 పాయింట్లు (0.29 శాతం) పెరిగి 82,998 వద్ద, 50 షేర్ల నిఫ్టీ 83 పాయింట్లు లేదా 0.33 శాతం పెరిగి 25,327 వద్ద ట్రేడవుతున్నాయి. విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 0.31 శాతం, 0.32 శాతం లాభపడ్డాయి. ఇండియా వీఐఎక్స్ 0.7 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ 0.38 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 0.12 శాతం నష్టపోయాయి. నిఫ్టీ మెటల్ 0.8 శాతం, నిఫ్టీ ఆటో 0.4 శాతం లాభపడ్డాయి.నేటి ఐపీవోలుహెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, రమా టెలికాం, సన్టెక్ ఇన్ఫ్రా, సూపర్టెక్ ఈవీ ఐపీఓలు సబ్స్క్రిప్షన్ రెండో రోజులోకి ప్రవేశించనున్నాయి. గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్ ఐపీఓ, ఎల్లెన్ బారీ ఇండస్ట్రియల్ ఐపీఓ , కల్పతరు ఐపీఓ, ఐకాన్ ఫెసిలిటేటర్స్ ఐపీఓ, శ్రీ హరే-కృష్ణ స్పాంజ్ ఐపీఓ, అబ్రామ్ ఫుడ్స్ ఐపీఓ తమ సబ్ స్క్రిప్షన్ లో మూడో రోజుకు, ఏజేసీ జువెల్ మాన్యుఫాక్చరర్స్ ఐపీఓ 4వ రోజుకు ప్రవేశిస్తాయి. -
మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే మోతే.. ఈ బ్యాంకులో కొత్త ఛార్జీలు
కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహణ ఛార్జీలను తొలగిస్తున్నప్పటికీ మరికొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఖాతాదారులపై కనీస బ్యాలెన్స్ ఛార్జీలను మోపుతున్నాయి. తాజాగా డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (డీబీఎస్) ఇండియా సేవింగ్స్ ఖాతాలో అవసరమైన నెలవారీ సగటు బ్యాలెన్స్ను నిర్వహించకపోతే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 1 నుండి బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో అవసరమైన నెలవారీ సగటు బ్యాలెన్స్ను నిర్వహించకపోతే ఎంత అయితే లోటు ఉంటుందో దానిపై 6% రుసుము చెల్లించాలి. డీబీఎస్ బ్యాంక్ ఇండియా వెబ్సైట్ ప్రకారం.. బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఛార్జీలు లోటులో 6% ఉంటాయి. ఇది గరిష్టంగా రూ .500 ఉంటుంది. డీబీఎస్ బ్యాంక్ రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) రూ .10,000 నిర్వహించాల్సి ఉంటుంది.కాగా డీబీఎస్ బ్యాంక్ ఇప్పటికే ఏటీఎం నగదు ఉపసంహరణ రుసుమును పెంచింది. ఉచిత పరిమితికి మించి ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలకు గరిష్టంగా రూ .23 వసూలు చేయడానికి బ్యాంకులను అనుమతించే ఆర్బీఐ నోటిఫికేషన్ తరువాత, డీబీఎస్ బ్యాంక్ తన రుసుమును అప్డేట్ చేసింది. మే 1 నుండి ఉచిత పరిమితికి మించి నాన్ డీబీఎస్ బ్యాంక్ ఏటీఎం నగదు ఉపసంహరణ లావాదేవీలపై రూ.23 వసూలు చేస్తోంది. అయితే డీబీఎస్ బ్యాంక్ ఏటీఎంలలో ఎటువంటి రుసుము లేకుండా అపరిమితంగా నగదును ఉపసంహరించుకోవచ్చు.👉 ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి భారీ మార్పులు 👈 -
జాక్పాట్ కొట్టిన అనిల్ అంబానీ.. రూ. 600 కోట్ల ఆర్డర్
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్ తాజాగా జర్మనీ రక్షణ రంగ సంస్థ రైన్మెటల్ వాఫే మ్యునిషన్ జీఎంబీహెచ్ నుంచి రూ. 600 కోట్ల విలువైన ఆర్డర్ దక్కించుకుంది. హైటెక్ కమ్యూనికేషన్ విభాగంలో ఇది అతిపెద్ద ఎగుమతి కాంట్రాక్ట్గా కంపెనీ పేర్కొంది.తాజా ఆర్డర్ గ్లోబల్ డిఫెన్స్, యుద్ధసామగ్రి విభాగంలో కంపెనీకి కీలక మైలురాయిగా అభివర్ణించింది. తద్వారా అంతర్జాతీయస్థాయిలో రక్షణ, యుద్ధసామగ్రి సరఫరా చైన్లో విశ్వసనీయ భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ మరింత పటిష్టపడినట్లు తెలియజేసింది.రెండు సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దీర్ఘకాలిక సహకారానికి కట్టుబాటుగా పేర్కొంది. అంతేకాకుండా ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా లక్ష్యాలకు మద్దతుగా దేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను పటిష్టపరచనున్నట్లు వివరించింది.👉 ఇది చదివారా? అనిల్ అంబానీకి భారీ ఉపశమనందీంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు దూసుకెళ్లాయి. జూన్ 25న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ను తాకాయి. మార్కెట్లు ముగిసే సమయానికి షేరు విలువ రూ. 404.65 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీ అనుబంధ సంస్థే రిలయన్స్ డిఫెన్స్. -
ఎయిరిండియాలో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్..
న్యూఢిల్లీ: నష్టాలతో నడుస్తున్న విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో ప్రమోటర్ సంస్థలు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. వీటిలో ఒక్క చివరి నెల(మార్చి)లోనే రూ. 4,306 కోట్లు అందించాయి. 2022 జనవరి మొదలు టాటా గ్రూప్ ఎయిరిండియాను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లలో సరికొత్త మార్పులకు తెరతీసే(ట్రాన్స్ఫార్మేషన్) ప్రణాళికలను అమలు చేస్తోంది.2024 నవంబర్లో రెండు సంస్థల భాగస్వామ్య కంపెనీ విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేశాయి. తద్వారా ఎయిరిండియాలో సింగపూర్ సంస్థ 25.1 శాతం వాటా దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా మూలధన వ్యయాలకుగాను ప్రమోటర్ సంస్థలు గతేడాది రూ. 9,500 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రయివేట్ రంగ విమానయాన దిగ్గజానికి టాటా సన్స్ రూ. 3,225 కోట్లు, సింగపూర్ ఎయిర్లైన్స్ రూ. 6,333 కోట్లు చొప్పున అందించినట్లు వెల్లడించారు. నిధులను పెట్టుబడి వ్యయాలతోపాటు వర్కింగ్ క్యాపిటల్, వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా సమకూర్చినట్లు తెలియజేశారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం ఈ మార్చిలో టాటా సన్స్ రూ. 3,225 కోట్లు, సింగపూర్ సంస్థ రూ. 1,081 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మార్చి పెట్టుబడులకు ముందు ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ దాదాపు రూ. 5,253 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కాగా.. 2024 డిసెంబర్31తో ముగిసిన 9 నెలల కాలంలో ఎయిరిండియా గ్రూప్ అనుకోని పద్దులకు ముందు రూ. 8,033 కోట్ల నష్టాలు ప్రకటించింది. ఇదే కాలంలో ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం రూ. 56,367 కోట్ల ఆదాయం సాధించింది. -
భారత జీడీపీ ఇలా ఉండొచ్చు.. ఇక్రా తాజా అంచనాలు
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీ 6.2 శాతం వృద్ధిని సాధిస్తుందన్న గత అంచనాలను రేటింగ్ సంస్థ ఇక్రా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా తగినంత వర్షపాతం, చమురు ధరలు బ్యారెల్కు సగటున 70 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ఇరాన్–ఇజ్రాయెల్) పెరగడం, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్లు, వాణిజ్య విధానాల్లో అనిశ్చితులు దేశ జీడీపీ వృద్ధి తగ్గేందుకు పొంచి ఉన్న రిస్క్లుగా పేర్కొంది. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఆర్బీఐ అంచనా వేయగా.. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ సైతం ఇదేవిధమైన అంచనాను వ్యక్తం చేయడం గమనార్హం. ‘‘ఏప్రిల్, మే నెలల్లో ఆర్థిక కార్యకలాపాల్లో మిశ్రమ పనితీరు నెలకొంది. వేసవి పంటల ఉత్పాదకత ఆశాజనకంగా ఉంటుందన్న అంచనాలు నెలకొన్నప్పటికీ.. 17 వ్యవసాయేతర సంకేతాలకు గాను తొమ్మిదింటిలోనే మెరుగుదల కనిపించింది’’అని ఇక్రా తెలిపింది.మే నెలలోనే రుతుపవనాలు రావడంతో విద్యుత్, మైనింగ్ రంగాల పనితీరు ప్రభావితమైనట్టు పేర్కొంది. పట్టణాల్లో బలంగా వినియోగం ఆదాయపన్ను మినహాయింపులు పెంచడం, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో పట్టణ వినియోగం బలంగా ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. ‘‘సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందన్న సానుకూల అంచనాలు ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2024–25లో 4.6 శాతంగా ఉంటే, 2025–26లో 3.5 శాతానికి పరిమితం అవుతుంది. ఆర్బీఐ ఎంపీసీ అంచనా 3.7 శాతం కంటే ఇంకా తక్కువ’’అని ఇక్రా వివరించింది.వచ్చే ఆగస్ట్లో జరిగే ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో రేట్ల తగ్గింపునకు అవకాశాల్లేకపోయినప్పటికీ.. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నందున అక్టోబర్ నాటి సమీక్షలో 25 బేసిస్ పాయింట్ల కోతను చేపట్టొచ్చని అభిప్రాయపడింది. చమురు ధరలు బ్యారెల్కు 10 డాలర్లు పెరిగితే దిగుమతులపై 13–14 బిలియన్ డాలర్ల మేర అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని, ఇది కరెంట్ ఖాతా లోటును జీడీపీలో 0.3 శాతం మేర పెంచుతుందని ఇక్రా తెలిపింది. ఇక్కడి నుంచి చమురు ధరలు స్థిరంగా పెరుగుతూ పోతే అది భారత కంపెనీల లాభదాయకతను ప్రభావితం చేస్తుందని.. జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించేందుకు దారితీయొచ్చని పేర్కొంది. -
భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం
ముంబై: అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. పరిశ్రమలు, సేవల రంగాల్లో కార్యకలాపాలు ఇదే సూచిస్తున్నట్టు పేర్కొంది. వాణిజ్య విధాన పరమైన అనిశ్చితులకుతోడు పెరిగిపోయిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ప్రస్తావించింది. ‘‘ఈ విధంగా అంతర్జాతీయ అనిశ్చితులు పెరిగిపోయిన తరుణంలోనూ 2025 మే నెలకు సంబంధించి అధిక ప్రాముఖ్యం కలిగిన సంకేతాలు.. పరిశ్రమలు, సేవల రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్నట్టు సూచిస్తున్నాయి’’అని తన బులెటిన్లో పేర్కొంది. వ్యవసాయ రంగంలో 2024–25లో అన్ని ప్రధాన పంటల్లోనూ ఉత్పాదకత పెరిగినట్టు తెలిపింది. అదే సమయమంలో దేశీయంగా ధరలు సానుకూల స్థితిలోనే ఉన్నట్టు పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యం పరిధిలోనే వరుసగా నాలుగో నెలలోనూ నమోదైనట్టు తెలిపింది. వడ్డీ రేట్ల తగ్గింపును రుణ గ్రహీతలకు సమర్థవంతంగా బదిలీ చేసేందుకు వీలుగా సానుకూల ఆర్థిక పరిస్థితులు నెలకొన్నట్టు వివరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏప్రిల్ నెలలో 8.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయంటూ.. మార్చి నెలలో ఉన్న 5.9 బిలియన్ డాలర్లు, 2024 ఏప్రిల్ నెలలో ఎఫ్డీఐ 7.2 బిలియన్ డాలర్ల కంటే అధికమని పేర్కొంది. ఇదే సమయంలో మన దేశం నుంచి బయటకు వెళ్లిన ఎఫ్డీఐలు కూడా పెరిగినట్టు తెలిపింది. నికర ఎఫ్డీఐలు ఏప్రిల్ నెలలో అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే రెట్టింపై 3.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. ఈ బులెటిన్లో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, ఆర్బీఐ అధికారిక అభిప్రాయాలు కాదని పేర్కొంది. -
5జీ యూజర్లు @ 98 కోట్లు..!
న్యూఢిల్లీ: భారత్లో 5జీ టెలికం యూజర్లు (చందాదారులు) 2030 నాటికి 98 కోట్లకు చేరుకుంటారని, అప్పటికి 4జీ చందాదారుల సంఖ్య 60 శాతం తగ్గి 23 కోట్లకు పరిమితం అవుతుందని టెలికం గేర్ల తయారీ సంస్థ ఎరిక్సన్ తెలిపింది. ‘‘2024 చివరికి 5జీ చందాదారులు 29 కోట్లకు పెరిగారు. మొత్తం మొబైల్ సబ్్రస్కిప్షన్లలో 24 శాతంగా ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 98 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం చందాదారుల్లో 5జీ యూజర్లు 75 శాతానికి పెరుగుతారు’’అని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ వెల్లడించింది. 2024లో ఒక్కో స్మార్ట్ ఫోన్ ద్వారా 32జీబీ డేటా వినియోగంతో భారత్ ప్రపంచంలో డేటా రద్దీ పరంగా మొదటి స్థానంలో నిలిచినట్టు తెలిపింది. 2030 నాటికి ఒక్కో స్మార్ట్ఫోన్ డేటా వినియోగం 66జీబీకి పెరుగుతుందని అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా బలమైన 5జీ నెట్వర్క్ అవసరం ఉంటుందని పేర్కొంది. వేగంగా 5జీ స్మార్ట్ఫోన్లకు యూజర్లు మారుతుండడం, డేటా వినియోగానికి డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించింది. ‘‘బ్రాడ్బ్యాండ్ అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) విస్తరణ దిశగా సరీ్వస్ ప్రొవైడర్లను ఈ డిమాండ్ నడిపిస్తుంది. భారత్లో అందుబాటులో ఉన్న 5జీ మిడ్బ్యాండ్ స్పెక్ట్రమ్.. సామర్థ్యం, నెట్వర్క్ విస్తరణ అవసరాలకు సరిపోతుంది. ఇది యూజర్ అనుభవం పెరిగేందుకు వీలు కలి్పస్తుంది’’అని ఎరిక్సన్ నివేదిక వివరించింది. -
పీఎల్ఐ ప్రోత్సాహకాలు... రూ.21,534 కోట్లు
న్యూఢిల్లీ: భారత్లో తయారీని ప్రోత్సాహించేందుకు కేంద్రం తలపెట్టిన ఉత్పత్తి అనుసంధాన ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం సత్ఫలితాలను ఇస్తోంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12 రంగాలకు రూ.21,534 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్టు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాలు కూడా ఇందులో ఉన్నాయి. కరోనా సమయంలో సరఫరా వ్యవస్థ నుంచి సమస్యలు ఏర్పడడంతో.. భారత్లో తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోదీ సర్కారు 2021లో పీఎల్ఐ పథకాన్ని 14 రంగాల కోసం ప్రకటించింది. రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పటి వరకు 12 రంగాలకు కలిపి రూ.21,534 కోట్ల ప్రోత్సాహకం విడుదల చేసినట్టు కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించింది. ఎల్రక్టానిక్స్ తయారీ, ఐటీ హార్డ్వేర్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మా, టెలికం, ఆహార ప్రాసెసింగ్, వైట్ గూడ్స్ (ఏసీలు తదితర), ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, టెక్స్టైల్స్, డ్రోన్స్ తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. ఈ తరహా పథకాల పనితీరును కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా సమీక్షించారు. వచ్చే ఐదేళ్ల కాలానికి పెట్టుబడులు, ప్రోత్సాహకాలతో తమ పరిధిలో కార్యాచరణ రూపొందించాలని వివిధ శాఖలను కోరారు. 12 లక్షల మందికి ఉపాధి పీఎల్ఐ పథకం కింద ఇప్పటి వరకు రూ.1.76 లక్షల కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు వాణిజ్య శాఖ తెలిపింది. వీటి ద్వారా రూ.16.5 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా నమోదు కాగా, 12 లక్షల మందికి పైగా ఈ ఏడాది మార్చి నాటికి ఉపాధి (ప్రత్యక్ష, పరోక్ష) లభించినట్టు పేర్కొంది. ఫార్మా రంగానికి సంబంధించి పీఎల్ఐ పురోగతిని సమీక్షించగా, ఈ రంగంలో రూ.2.66 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా సాధ్యమైనట్టు, ఇందులో రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు మొదటి మూడేళ్లలో నమోదైనట్టు వాణిజ్య శాఖ గుర్తించింది. మొత్తం మీద ఫార్మా రంగంలో దేశీయంగా విలువ జోడింపు 2025 మార్చి నాటికి 83.70 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. బల్క్ డ్రగ్ విభాగంలో మన దేశం నికర దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా మారింది. 2021–22 నాటికి నికర బల్్కడ్రగ్ దిగుమతులు రూ.1,930 కోట్లుగా ఉంటే, 2025 మార్చి నాటికి రూ.2,280 కోట్ల నికర ఎగుమతులు పీఎల్ఐ కింద నమోదయ్యాయి. మ్యాన్ మేడ్ ఫైబర్ (ఎంఎంఎఫ్) టెక్స్టైల్స్ ఎగుమతులు 6 బిలియన్ డాలర్లకు చేరాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వీటి ఎగుమతులు 5.7 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. -
అంబానీ.. అదానీ ఇంధన బంధం!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ మరో భారీ వ్యాపార వెంచర్ కోసం చేతులు కలిపారు. ఒకరి ఇంధన రిటైల్ నెట్వర్క్లో మరొకరి ఇంధనాలను విక్రయించుకునేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం అదానీ టోటల్ గ్యాస్ (ఏటీజీఎల్) సీఎన్జీ రిటైల్ ఔట్లెట్స్లో జియో–బీపీ తమ పెట్రోల్, డీజిల్ ఇంధనాలను విక్రయిస్తుంది. అలాగే, జియో–బీపీ పెట్రోల్ బంకుల్లో ఏటీజీఎల్ తమ సీఎన్జీ పంపులను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతమున్న, భవిష్యత్లో రాబోయే ఔట్లెట్స్ అన్నింటికీ ఈ ఒప్పందం వర్తిస్తుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. జియో–బీపీ అనేది అంబానీకి చెందిన జియో, బ్రిటన్ సంస్థ బీపీ మధ్య జాయింట్ వెంచర్. ఇక, ఏటీజీఎల్ అనేది అదానీ గ్రూప్, ఫ్రాన్స్కి చెందిన టోటల్ ఎనర్జీస్ కలిసి ఏర్పాటు చేసిన జేవీ సంస్థ. జియో–బీపీకి దేశవ్యాప్తంగా 1,972 పెట్రోల్ బంకులు ఉండగా, ఏటీజీఎల్కి 659 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. ఇరు సంస్థల పటిష్టమైన నెట్వర్క్ను ఉపయోగించుకుని కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని జియో–బీపీ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. ఈ డీల్ ద్వారా ఔట్లెట్స్లో అత్యంత నాణ్యమైన, వివిధ రకాల ఇంధనాలను అందించాలనేది తమ ఉమ్మడి లక్ష్యమని ఏటీజీఎల్ ఈడీ సురేష్ పి. మంగ్లానీ చెప్పారు. పీఎస్యూలకు పోటీ..: ప్రస్తుతం ఇంధనాల రిటైలింగ్ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) ఆధిపత్యం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 97,366 పెట్రోల్ బంకులు ఉండగా మూడు పీఎస్యూలకు (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్)) ఏకంగా 90% వాటా ఉంది. సిటీ గ్యాస్ పంపిణీ వ్యాపారంలో కూడా అవి ముందుంటున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ, అంబానీ చేతులు కలపడం వల్ల వాటి ఆధిపత్యానికి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏటీజీఎల్ సంస్థ గృహాలు, పరిశ్రమలు, వాహనదారులు, ఇతరత్రా కస్టమర్లకు గ్యాస్ను, ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సదుపాయాలు మొదలైనవి అందిస్తోంది. మరోవైపు, జియో–బీపీ ఇంధనాల రిటైలింగ్తో పాటు పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఇంధనాలు, కనీ్వనియెన్స్ స్టోర్స్ మొదలైన విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఓ పవర్ ప్రాజెక్టులో.. ఇరువురు కుబేరులు వ్యాపార అవసరాలరీత్యా జట్టు కట్టడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. గతేడాది మార్చిలో మధ్యప్రదేశ్లోని ఓ విద్యుత్ ప్రాజెక్టు కోసం ఇద్దరూ చేతులు కలిపారు. అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26 శాతం వాటా కొనుగోలు చేసింది.పోటాపోటీ.. గుజరాత్కే చెందిన అంబానీ, అదానీ ఇద్దరికీ బడా వ్యాపార సామ్రాజ్యాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆసియాలోనే నంబర్ వన్ సంపన్నులుగా నిలవడంలో గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య పోటీ నడుస్తోంది. అంబానీ ఓవైపు ఆయిల్, గ్యాస్, రిటైల్, టెలికం తదితర రంగాల్లో విస్తరించగా అదానీ మరోవైపు నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బొగ్గు, మైనింగ్ తదితర మౌలిక సదుపాయాల రంగాల్లో విస్తరించారు. పర్యావరణహిత ఇంధనాల ప్రాజెక్టులను మినహాయిస్తే ఇద్దరూ ఒకరి రంగంలోకి మరొకరు అడుగుపెట్టలేదు. అదానీ మెగా రెన్యువబుల్ ఎనర్జీ పార్క్లు, సోలార్ మాడ్యూల్స్ .. విండ్ టర్బైన్ల తయారీపై దృష్టి పెట్టారు. అటు అంబానీకి చెందిన రిలయన్స్ గుజరాత్లోని జామ్నగర్లో నాలుగు గిగాఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తోంది. ఇక 2014 నుంచి సీఎన్బీసీ–టీవీ18, సీఎన్ఎన్–న్యూస్18, కలర్స్లాంటి టీవీ చానళ్ల ద్వారా అంబానీ మీడియా రంగంలో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఎన్డీటీవీ కొనుగోలు ద్వారా అదానీ కూడా ఇటీవలే ఈ విభాగంలోకి ప్రవేశించారు. -
నా జీవితంలో అతిపెద్ద రిస్క్.. జియో: ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: జియో రూపంలో టెలికం రంగంలోకి రీఎంట్రీ చేయడమనేది తన జీవితంలో తీసుకున్న అతి పెద్ద రిస్క్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అభివర్ణించారు. అత్యంత అధునాతనమైన డిజిటల్ టెక్నాలజీకి భారత్లో పరిస్థితులు ఇంకా అనువుగా లేవని, ఈ వెంచర్ ఆర్థికంగా విఫలమవుతుందని విశ్లేషకులు హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. ఒకవేళ విశ్లేషకులు చెప్పినది నిజంగానే జరిగినా కూడా, దేశాన్ని డిజిటల్ బాట పట్టించడంలో జియో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, ఆ మాత్రం రిస్కు తీసుకోవడంలో తప్పు లేదనిపించిందని మెకిన్సే అండ్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘మేము ఎప్పుడూ పెద్ద రిస్క్ లే తీసుకున్నాం. మాకు భారీ స్థాయి ముఖ్యం. మేము ఇప్పటి వరకు తీసుకున్న అతి పెద్ద రిస్కు జియోనే. అప్పట్లో మా సొంత డబ్బును ఇన్వెస్ట్ చేశాం. నేను మెజారిటీ వాటాదారుగా ఉన్నాను. 4జీ మొబైల్ నెట్వర్క్ విస్తరణ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కోట్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్న క్రమంలో ఈ టెక్నాలజీకి భారత్లో అనువైన పరిస్థితులు లేవని, డబ్బంతా వృథా అవుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ మా కంపెనీ బోర్డుకు నేను ఒక్కటే చెప్పాను. ఇదంతా మన సొంత డబ్బు. మహా అయితే దీనిపై మనకు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. ఫర్వాలేదు. దీనితో దేశాన్ని డిజిటలైజ్ చేయొచ్చు. భారత్ను సంపూర్ణంగా మార్చివేయొచ్చు. ఆ విధంగా దేశం కోసం రిలయన్స్ ఒక గొప్ప మేలు చేసినట్లవుతుంది. అత్యుత్తమ విరాళం ఇచ్చినట్లవుతుంది అన్నాను‘ అని అంబానీ పేర్కొన్నారు. 2016లో ప్రారంభమైన జియో.. నేడు 47 కోట్ల మంది యూజర్లతో, 5జీ, క్లౌడ్, ఏఐ సర్వీసుల్లోనూ కార్యకలాపాలతో టెలికంలో అగ్రస్థానంలో ఉంది. ఇంకా ఏమన్నారంటే.. → ప్రపంచం ప్రతి అయిదేళ్లకో లేదా పదేళ్లకో మారిపోతూ ఉంటుంది. మనం బిజినెస్ స్కూల్లో నేర్చుకున్న దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. మేము అలాంటి పరిస్థితులకు సవాలు విసిరాం. రిలయన్స్ 1960లలో ఒకలాగా, 70ల్లో ఆ తర్వాత 2000.. 2020లలో మరోలాగా మారింది. ఇప్పుడు పూర్తి భిన్నం. → రిస్క్ మేనేజ్మెంట్ విషయానికొస్తే.. ఒకవేళ పరిస్థితులు ఘోరంగా దిగజారితే బైటపడగలమా అనేది ఆలోచించాలి. ఏం చేసినా సరే మా ఉద్యోగుల కళ్లలోకి చూసి నిజాయితీ గా మాట్లాడగలిగేలా ఉండాలని 30..40 ఏళ్ల క్రి తం నేను వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతం పెట్టుకున్నాను. ఈ సంస్థాగత సంస్కృతే ఎంతæ పెద్ద రిస్క్ ల నుంచైనా కాపాడగలిగే బీమా. → డీప్–టెక్, అధునాతన తయారీ కంపెనీగా ఎదగాలనేది రిలయన్స్ లక్ష్యం. మన దగ్గర సరైన టాలెంట్, సరైన లక్ష్యం అంటూ ఉంటే ఎక్కడికి వెళ్లాలి, కోరుకున్నది ఎలా సాధించాలనేది ఏదో విధంగా కనుక్కుంటాం. అది రిలయన్స్ డీఎన్ఏలోనే ఉంది. నాన్నకు మాటిచ్చాను.. ఇంటర్వ్యూ సందర్భంగా ముకేశ్ అంబానీ తన తండ్రి ధీరుభాయ్ అంబానీని గుర్తు చేసుకున్నారు. ‘రిలయన్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ సంస్థ చిరకాలం ఉండాలి. నా తర్వాత, నీ తర్వాత కూడా రిలయన్స్ కొనసాగేలా నువ్వు చూడాలి అని నాన్న చెప్పారు. మా తదనంతరం కూడా రిలయన్స్ ఉంటుందని నేను ఆయనకు మాట ఇచ్చాను. 2027లో రిలయన్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటుంది. కానీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కూడా రిలయన్స్ భారతదేశానికి, మానవాళికి సేవ చేయడాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అది కచ్చితంగా జరుగుతుందని గాఢంగా నమ్ముతున్నాను‘ అని ముకేశ్ అంబానీ చెప్పారు. -
30 రోజుల రీచార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్లు
జియో, ఎయిర్టెల్ దేశంలో రెండు అతిపెద్ద టెలికాం కంపెనీలు. దేశంలో ఎక్కువ మంది మొబైల్ వినియోగదారులు జియోతో కనెక్ట్ అయ్యారు. యూజర్ల పరంగా ఎయిర్ టెల్ రెండో స్థానంలో ఉంది. ఎక్కువ మంది యూజర్లు నెలవారీ రీచార్జ్ ప్లాన్ల వైపు మొగ్గుచూపుతుంటారు. రెండు కంపెనీలు తమ వినియోగదారులకు సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.జియో, ఎయిర్టెల్లో ఉన్న 30 రోజుల వాలిడిటీ రీఛార్జ్ ప్లాన్లు, వాటి ప్రయోజానాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. రూ.335తో జియో 30 రోజుల వాలిడిటీ రీఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, మీరు ఎయిర్టెల్ 30 రోజుల వాలిడిటీ రీఛార్ ప్లాన్ రూ .379కు అందుబాటులో ఉంది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్ల ధరలలో వ్యత్యాసం రూ .44. అలాగే వాలిడిటీ ఒక్కటే అయినా ప్రయోజనాల్లోనూ చాలా తేడాలున్నాయి.జియో రూ.335 ప్లాన్జియో రూ.335 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు మొత్తం 25 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా జియో హాట్స్టార్, జియో క్లౌడ్కు ఉచిత యాక్సెస్ కూడా పొందుతారు.ఎయిర్టెల్ రూ.379 ప్లాన్ఎయిర్ టెల్ రూ.379 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇది కాకుండా, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ యాప్నకు యాక్సెస్ కూడా పొందుతారు.👉 ఇది చదివారా? జియో నుంచి 2 కొత్త ఫ్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు.. -
రూ.10వేలలో మరో కొత్త ఫోన్.. అమ్మకాలు ప్రారంభం
కొత్తగా లాంచ్ అయిన ఐక్యూ జెడ్10 లైట్ 5జీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు భారత్లో ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ స్మార్ట్ఫోన్ ధర రూ.10,000 రేంజ్లోనే ఉంటుంది. 6,000 ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్ వంటి అద్భుత స్పెసిఫికేషన్లు ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 22.7 గంటల వీడియో ప్లేబ్యాక్ ను అందిస్తుంది. లాంచ్ ఆఫర్లలో బ్యాంక్ కార్డులపై రూ.500 తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ తదితర ఆఫర్లు ఉన్నాయి. 👉 కొత్త ఫోన్.. రూ.25 వేలకే 3డీ కర్వ్డ్ డిస్ప్లే 👈ఐక్యూ జెడ్10 లైట్ 5జీ స్పెసిఫికేషన్లుఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఐక్యూ జెడ్10 లైట్ 5జీ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇందులో 6.74 అంగుళాల హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీని అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగా పిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ కూడా ఉంది. 15వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ వి5.4, వై-ఫై 5 ఉన్నాయి.ఐక్యూ జెడ్10 లైట్ 5జీ లాంచ్ ఆఫర్లుఐక్యూ జెడ్10 లైట్ 5జీ లాంచ్ ఆఫర్లలో ఎంపిక చేసిన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఇతర బ్యాంక్ కార్డులపై రూ .500 తక్షణ తగ్గింపు ఉంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, జీఎస్టీ బెనిఫిట్స్ కూడా అమెజాన్ ఇండియాలో లిస్ట్ అయ్యాయి. ఐక్యూ జెడ్10 లైట్ 5జీ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. ఇది సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
భారత వృద్ధి.. అంచనాలు పెరిగాయ్..
ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 2025–26 సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. 6.5 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. ముడి చమురు ధరలు కనిష్ట స్థాయిలో ఉండడం, పరపతి విధాన సరళీకరణ (వడ్డీ రేట్ల తగ్గింపు), ఆదాయపన్ను తగ్గింపు, సాధారణ వర్షపాతం అంచనాలను సానుకూలతలుగా పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రూపాయి, ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చని అంచనా వేసింది.భారత జీడీపీ 6.5 శాతం వృద్ధి సాధిస్తుందంటూ ఎస్అండ్పీ ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేయగా, అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళిక అస్థితరల నేపథ్యంలో ఆ తర్వాత 0.20 శాతాన్ని తగ్గిస్తూ, 6.3 శాతానికి సవరించింది. మళ్లీ పూర్వపు వృద్ధి అంచనాలనే ఇప్పుడు ప్రస్తావించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం ఆర్థిక పరిస్థితులపై ఎస్అండ్పీ ఒక నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణలతో చమురు ధరలు దీర్ఘకాలం పాటు పెరుగుతూ పోతే అది ఆసియా పసిఫిక్ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.గతేడాది కంటే చమురు ధరలు తక్కువగా ఉండడం భారత్కు అనుకూలిస్తుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆర్థికవేత్త విశృత్ రాణా తెలిపారు. ఏడాది క్రితం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 85 డాలర్లుగా ఉండడం గమనార్హం. ‘‘కరెంట్ ఖాతా నుంచి చేయాల్సిన చెల్లింపులు తగ్గుతాయి. దేశీయంగా ఇంధన ధరల ఒత్తిళ్లూ ఉండవు. ఇంధన ధరలు మోసర్తుగా పెరిగినా కానీ, ద్రవ్యోల్బణంపై ఆహార ధరలే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కనుక మొత్తం మీద రూపాయి లేదా ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం ఉండదన్నది మా అంచనా’’అని రాణా వివరించారు. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం నేపథ్యంలో ముడి చమురు బ్యారెల్కు 69 డాలర్లకు పడిపోవడం తెలిసిందే. స్థానిక డిమాండ్ బలం.. అంతర్జాతీయంగా ఇంధన సరఫరా మెరుగ్గా ఉన్న పరిస్థితుల్లో చమురు ధరలు పెరగకపోవచ్చని ఎస్అండ్పీ పేర్కొంది. స్థానికడిమాండ్ బలంగా ఉన్నందున భారత్ తదితర దేశాల్లో ఆర్థిక వృద్ది నిదానించడాన్ని పరిమితం చేస్తుందని తెలిపింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.7 శాతానికి పెరగొచ్చని అంచనా వ్యక్తం చేసింది.2024–25లో దేశ జీడీపీ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 2025–26 సంవత్సరానికి 6.5 శాతం వృద్ధి అన్న ఎస్అండ్పీ అంచనాలు.. ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. 2025లో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండొచ్చని ఈ నివేదిక తెలిపింది. గతేడాది ఇది 4.6 శాతంగా ఉంది. రూపాయి ఈ ఏడాది చివరికి 87.5 స్థాయికి చేరుతుందని పేర్కొంది. -
జియోస్టార్ రిపోర్ట్: అహో ఐపీఎల్.. అన్నీ ‘ఫస్ట్’లే..
టాటా ఐపీఎల్ 2025 లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సీజన్లలో ఒకటిగా నిలిచింది, అనేక రికార్డులు, పరిశ్రమ ఫస్ట్లతో కొత్త బెంచ్మార్క్లను నెలకొల్పింది. మీడియా పార్ట్నర్స్ ఆసియా (ఎంపీఏ) భాగస్వామ్యంతో ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించిన ఏపీఓఎస్ సదస్సులో జియోస్టార్ ‘టాటా ఐపీఎల్ 2025: ఎ ఇయర్ ఆఫ్ ఫస్ట్స్’ రిపోర్ట్ను విడుదల చేసింది.'ఐపీఎల్ 2025 సీజన్ క్రీడలు, కథనాలు, అనుభవాలు పంచుకోవడం మధ్య గీతలను చెరిపివేసింది. ఇది కేవలం మ్యాచ్లను ప్రసారం చేయడం మాత్రమే కాదు - సృజనాత్మకత, సంస్కృతి, వాణిజ్యం, అభిమానుల కనెక్షన్లతో కలిసిపోయింది" అని జియోస్టార్ స్పోర్ట్స్ అండ్ లైవ్ ఎక్స్పీరియన్స్ సీఈఓ సంజోగ్ గుప్తా అన్నారు.నివేదిక ముఖ్యాంశాలుజియోస్టార్ నెట్వర్క్లో టాటా ఐపీఎల్ 2025 మొత్తం 1.19 బిలియన్ల మొత్తం రీచ్ను నమోదు చేసింది. ఇందులో టీవీలో 537 మిలియన్లు. డిజిటల్లో 652 మిలియన్లు.స్టార్ స్పోర్ట్స్లో ఐపీఎల్ వీక్షకుల్లో 47 శాతం మంది మహిళలే ఉన్నారు.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను 426 మిలియన్ల మంది వీక్షించారు. (టీవీలో 189 మిలియన్లు, డిజిటల్ లో 237 మిలియన్లు)జియో హాట్స్టార్ 300 మిలియన్ల సబ్స్క్రైబర్లకు చేరుకుంది. ఆండ్రాయిడ్ లో 1.04 బిలియన్ యాప్ డౌన్ లోడ్ లుకనెక్టెడ్ టీవీలో 235 మిలియన్ల రీచ్. మొబైల్ ఫోన్ల ద్వారా 41.7 కోట్ల మంది రీచ్ అయ్యారు.టోర్నమెంట్ వీక్షణ సమయం 514 బిలియన్ నిమిషాలు; స్టార్ స్పోర్ట్స్ హెచ్డీలో 129 మిలియన్ల మంది వీక్షించారు. 840 బిలియన్ నిమిషాల వాచ్ టైమ్.వీక్షకుల్లో 30 శాతం మంది మాక్స్ వ్యూ 3.0ను ఉపయోగించగా, ప్రాంతీయ భాషా ఫీడ్ వార్షిక వృద్ధిని చూసింది: హిందీ: 31 శాతం; తెలుగు: 87 శాతం; తమిళం: 52 శాతం.మొబైల్లో 44 శాతం మంది ఐపీఎల్ వీక్షకులు 'జీతో ధన్ ధనా ధన్' గేమ్ థ్రిల్ను అనుభవించారు.జియోస్టార్లో 425 కుపైగా ప్రకటనకర్తలు వచ్చారు. 40 ప్రత్యేక కేటగిరీల్లో 270+ నూతన ప్రకటనకర్తలే. మార్కెట్ లీడర్ల నుండి ఛాలెంజర్స్ వరకు 9 కేటగిరీలలో 32 బ్రాండ్లు నీల్సన్ థర్డ్ పార్టీ మెజర్మెంట్ను ఉపయోగించాయి.16:9లో మల్టీ క్యామ్, 360°/ వీఆర్ స్ట్రీమింగ్, మ్యాక్స్ వ్యూ 3.0, కనెక్టెడ్ టీవీలో వాయిస్-అసిస్టెడ్ సెర్చ్, ప్రకటనల రహిత ఫాస్ట్ చానెల్స్, ఏఐ ఆధారిత మ్యాచ్ హైలైట్స్ వంటి సరికొత్త టెక్నాలజీలను ఈ సీజన్లో వినియోగించారు. -
ముంబై ఎయిర్పోర్ట్ కోసం అదానీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల నుంచి డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,600 కోట్లు) సమీకరించింది. నిధులను ముంబై ఎయిర్పోర్ట్ రుణాల రీఫైనాన్సింగ్కు వినియోగించనుంది. న్యూయార్క్ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ అధ్యక్షతన మెట్లైఫ్ ఇంక్, బ్లాక్రాక్ ఇంక్, ఎఫ్డబ్ల్యూడీ ఇన్సూరెన్స్ నిధులు సమకూర్చాయి.ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎంఐఏఎల్) కోసం 2022లో సమీకరించిన రుణాల రీఫైనాన్స్కు నిధులు వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. ఎంఐఏఎల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ వాటా 74 శాతంకాగా.. భారత ఎయిర్పోర్ట్స్ అథారిటీకి 26 శాతం వాటా ఉంది. దేశీయంగా రెండో పెద్ద ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న కంపెనీ 2029 జులైలో గడువుతీరే 75 కోట్ల డాలర్ల విలువైన నోట్లను జారీ చేసింది. వీటికి అదనంగా 25 కోట్ల డాలర్ల నోట్లను జారీ చేసే వీలుతో నిధుల సమీకరణ చేపట్టింది.తద్వారా బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది. దీంతో ఎంఐఏఎల్ అభివృద్ధి, ఆధునీకరణ, సామర్థ్య విస్తరణకు ఆర్థిక వెసులుబాటు లభించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. తాజాగా జారీ చేసిన బాండ్లు 6.9 శాతం కూపన్రేటుతో నాలుగేళ్ల కాలానికి గడువు తీరనున్నాయి. ఎయిర్పోర్ట్ మౌలికసదుపాయాల రంగంలో తొలి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ప్రయివేట్ బాండ్ల జారీని చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది. -
ఇవిగో ఈ తప్పులు చేశారో.. ఐటీ రిటర్న్ కొత్త రూల్స్..
దేశవ్యాప్తంగా పన్నుచెల్లింపుదారులు ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలులో తలమునకలై ఉన్నారు. ఐటీఆర్ ఫైలింగ్కు సాధారణంగా జూలై 31 చివరి తేదీ కాగా ఈ ఏడాది దీన్ని సెప్టెంబర్ 15 వరకూ పొడిగించారు. ట్యాక్స్ ఫైలింగ్లో సమ్మతి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.తప్పుడు మినహాయింపులు క్లయిమ్ చేసినా, ఆదాయాన్ని దాచినా పన్ను చెల్లింపుదారులకు కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టింది. "పన్ను బకాయిలో 200% వరకు జరిమానా, 24% వార్షిక వడ్డీ, సెక్షన్ 276 సి కింద ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కోవచ్చు" అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఈ పరిణామాలను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను జాగ్రత్తగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.కొత్త నిబంధనలు.. కీలకాంశాలుకఠినమైన జరిమానాలు: తప్పుదారి పట్టించే లేదా తప్పుడు ఐటీఆర్ దాఖలు చేసిన వారికి 200 శాతం జరిమానా, 24 శాతం వార్షిక వడ్డీ, సెక్షన్ 276సి ప్రకారం శిక్ష కూడా విధిస్తారు.పన్ను చెల్లింపుదారుల బాధ్యత: సీఏ లేదా కన్సల్టెంట్ పొరపాటు చేసినా కూడా పన్ను చెల్లింపుదారుడే బాధ్యత వహించాలి.అందరికీ వర్తింపు: ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్ అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.సాధారణ తప్పులు: తప్పు ఐటీఆర్ ఫారమ్ ఎంపిక, తప్పుడు మినహాయింపులు, ఆదాయాన్ని ప్రకటించకపోవడం జరిమానాలకు దారి తీస్తాయి.రివైజ్డ్ రిటర్న్తోనూ లాభం లేదు: ఇచ్చిన సమాచారం తప్పుగా ఉందని పన్ను శాఖ గుర్తిస్తే, రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసినా జరిమానా తప్పదు.సరైన ఐటీఆర్ ఫారమ్ ఎంపిక: ITR-1 (సాధారణ ఆదాయం), ITR-3 (వ్యాపార ఆదాయం) వంటి వివిధ ఫారమ్లు ఆదాయ రకాన్ని బట్టి ఎంచుకోవాలి.తప్పు క్లెయిమ్లు చేయొద్దు: వ్యాపార ఖర్చులుగా వ్యక్తిగత ఖర్చులను చూపడం, తప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్లు జరిమానాలకు దారి తీస్తాయి.పన్ను చెల్లింపుదారులకు జాగ్రత్తలు: వార్షిక సమాచార ప్రకటనలోని వివరాలతో సరిపోల్చుకోవడం, సరైన రికార్డులు నిర్వహించడం, పన్ను నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా జరిమానాలను నివారించవచ్చు. -
మలేరియా టీకా ధరలు తగ్గించిన భారత్ బయోటెక్!
ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా టీకా ధరలను ఈ వ్యాధి ప్రబలంగా ఉండే కొన్ని దేశాల్లో సగానికి తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్, జీఎస్కేలు ప్రకటించాయి. ఆయా దేశాల్లో 2028 నుంచి మలేరియా నివారణ టీకాలు ఐదు డాలర్ల కంటే తక్కువ ధరకు లభిస్తాయని ఇరు సంస్థలు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలకు వ్యాక్సీన్లను పంపిణీ చేసేందుకు ఏర్పాటైన ‘ద వ్యాక్సీన్ అలయన్స్’కు 2026- 2030 మధ్య సరఫరా చేసే టీకాలపై ఒక ఒప్పందం కుదిరిన సందర్భంగా ఇరు సంస్థలు ఈ విషయాన్ని తెలిపాయి. జీఎస్కే, పాథ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మలేరియా టీకా ఆర్టీఎస్.ఎస్ను మలేరియా నివారణకు ఉపయోగించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021లోనే అనుమతులిచ్చింది. అయితే ఉత్పత్తి మార్గాల్లో మెరుగుదల, సామర్థ్యం పెంపు, లాభాన్ని కనీస స్థాయిలో ఉంచడం వంటి కారణాల వల్ల టీకా ధర సగానికి తగ్గించడం వీలైందని భారత్ బయోటెక్, జీఎస్కేలు వివరించాయి. ‘‘వ్యాక్సీన్ అలయెన్స్కు టీకాల సరఫరా చేస్తామన్న ఒప్పందం కుదరడం వల్ల లక్షల మంది పిల్లలు, కుటుంబాలపై మలేరియా సమస్య తగ్గిపోతుంది. ఈ చర్య మాకు కేవలం వ్యాక్సీన్ అలయన్స్కు సహకరించడం మాత్రమే కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం’’ అని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. జీఎస్కే సహకారంతో ప్రపంచవ్యాప్తంగా మలేరియా బాధిత బాలలు, వారికి అందుబాటులో ఉన్న టీకాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తున్నాం అని చెప్పారు. న్, పాథ్, ప్రపంచ ఆరోగ్య సంస్థల సహకారం కూడా ఉంది.’’ అని అన్నారు. కాగా, ఘన, కీన్యా, మలవాయి వంటి దేశాల్లో ఇటీవలే సుమారు ఇరవై లక్షల మంది పిల్లలకు మలేరియా టీకా ఇవ్వడం వల్ల ఈ వ్యాది కారణంగా మరణించే వారి సంఖ్య 13 శాతం వరకూ పడిపోయిందని, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య 22 శాతం తగ్గిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. మలేరియా సమస్య ఎక్కువగా ఉన్న చోట్ల ఈ టీకాతోపాటు మలేరియా సీజన్లో తగిన మందులు ఇవ్వడం ద్వారా వ్యాధిని గణనీయంగా నివారించడం సాధ్యమైందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.(చదవండి: సిఈఓలు యవ్వనంగా ఉండాలంటే..! సుందర్ పిచాయ్కి కలిగిన సందేహం) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. చమురు ధరల పతనం, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఇన్వెస్టర్ల ఆందోళనలను తగ్గించడంతో మీడియా, టెక్ షేర్లలో లాభాలతో భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో లాభాలను ఆర్జించాయి.బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 700.4 పాయింట్లు లేదా 0.85 శాతం పెరిగి 82,755.51 వద్ద ముగియగా, నిఫ్టీ 50 కూడా 200.40 పాయింట్లు లేదా 0.8 శాతం పెరిగి 25,244.75 వద్ద ముగిసింది. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం పెరిగాయి.నిఫ్టీ మీడియా, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు వరుసగా 1.99 శాతం, 1.64 శాతం, 1.43 శాతం చొప్పున లాభపడ్డాయి. టైటాన్ కంపెనీ, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ 3.6 శాతం వరకు లాభపడ్డాయి. బీఈఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్గా నిలిచాయి, మార్కెట్ అస్థిరతను అంచనా వేయడానికి ఉపయోగించే భయ సూచిక ఇండియా వీఐఎక్స్ దాదాపు 5 శాతం పడిపోయి 12.96 పాయింట్లకు పడిపోయింది. -
కొత్త ఇన్సూరెన్స్ పథకం.. మంచి బెనిఫిట్స్తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా సంస్థ గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ కొత్తగా గెలాక్సీ మార్వెల్ పేరిట పాలసీని ప్రవేశపెట్టింది. తొలిసారి క్లెయిమ్ చేసేంతవరకు లేదా 55 ఏళ్లు వచ్చేంత వరకు ఒకే ప్రీమియంను కొనసాగించడం, 71 కన్జూమబుల్స్కు కవరేజీ, అపరిమిత స్థాయిలో 100 శాతం సమ్ ఇన్సూర్డ్ను రిస్టోర్ చేయడం, ప్రీమియం వెయివర్, ఔట్పేషంట్ బెనిఫిట్స్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.తమ పాలసీల విక్రయం కోసం పాలసీబజార్తో చేతులు కలిపినట్లు కంపెనీ ఎండీ జీ. శ్రీనివాసన్ తెలిపారు. కార్యకలాపాలు ప్రారంభించిన గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4,730 పైగా పాలసీదార్లకు బీమా భద్రత కల్పించామని, రెండురాష్ట్రాల్లో 1893 మంది పైగా ఏజంట్లతో పటిష్టమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నామని ఆయన వివరించారు. -
ముదురుతున్న ఏఐ వార్!
గూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కీలక ప్రచారం ప్రారంభించినట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం.నేరుగా సంప్రదింపులుకొన్ని సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులు, డెవలపర్లు, స్టార్టప్ ఫౌండర్లను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా మార్క్ జుకర్బర్గ్ సంప్రదిస్తున్నారు. వీరిలో కొందరిని వ్యక్తిగతంగా షార్ట్లిస్ట్ చేసి ఆయా నిపుణులను నేరుగా సంప్రదిస్తున్నారు. వారితో జరుపుతున్న చర్చల్లో కేవలం నియామకాల గురించే కాకుండా ఆర్టిఫిషియన్ జనరల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్తు కార్యకలాపాలు వంటి చాలా అంశాలను చర్చిస్తున్నారు.సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కోసం..మెటా కొన్ని రోజుల నుంచి మానవ స్థాయి కృత్రిమ మేధ వ్యవస్థలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్’ను నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు ప్రపంచంలోనే టాప్ స్కిల్డ్ పర్సన్స్ను నియమించుకోవాలని మెటా భావిస్తోంది. దాంతో సరైన నైపుణ్యాలు ఉన్నవారికి భారీగా ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. అలెగ్జాండర్ వాంగ్ స్థాపించిన స్కేల్ ఏఐ కంపెనీను 14 బిలియన్ డాలర్ల(రూ.1.2 లక్షల కోట్లు) వాల్యుయేషన్కు కొనుగోలు చేసింది. సిలికాన్ వ్యాలీలో అత్యంత ప్రభావవంతమైన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్ను నిర్మించడంలో ప్రసిద్ధి చెందిన వాంగ్ ఇప్పుడు కృత్రిమ మేధ ఆవిష్కరణలో మెటా తరఫున పని చేస్తున్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశంకొందరు విముఖతఅయితే కొందరు మాత్రం తమ నైపుణ్యాలకు, తాము స్థాపించిన కంపెనీలకు మెటా ఎంత వెచ్చిస్తానంటున్నా కలిసిరావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. జుకర్బర్గ్, మెటా ఏఐ చీఫ్ సైంటిస్ట్ యాన్ లెకున్ మధ్య ఫిలాసఫికల్ విభేదాల వల్ల ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ దీర్ఘకాలికంగా ఎలా అభివృద్ధి చెందుతుందనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. -
విశాఖలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్
ఐటీ సర్వీసులు అందించే ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ తన భారత కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రూ.1,583 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక టెక్నాలజీ క్యాంపస్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. వైజాగ్లోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 22 ఎకరాల్లో మూడు దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ క్యాంపస్ ద్వారా 8,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది.2026లో 800 మంది అసోసియేట్లకు వసతి కల్పించేలా తాత్కాలిక కేంద్రం ద్వారా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. 2029 ప్రారంభంలో పూర్తి స్థాయి క్యాంపస్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. విశాఖపట్నం ప్రతిభకు, మౌలిక సదుపాయాలకు ప్రత్యేకంగా నిలుస్తున్నట్లు కాగ్నిజెంట్ సీఈఓ ఎస్.రవి కుమార్ తెలిపారు. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో సంస్థ విస్తరించాలనే లక్ష్యానికి అనుగుణంగా వైజాగ్లో క్యాంపస్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ డిజిటల్ ఎకానమీని మరింత వేగవంతం చేస్తుందని, అదే సమయంలో భవిష్యత్తులో శ్రామిక శక్తికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంచుతుందని ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశంభారతదేశం అంతటా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా కాగ్నిజెంట్ ఇప్పటికే భువనేశ్వర్, ఇండోర్లో కొత్త కేంద్రాలను, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఫైనాన్స్ హబ్ను ఏర్పాటు చేసిందని కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతానికి పైగా కంపెనీ శ్రామిక శక్తి భారత్లో ఉన్నందున కాగ్నిజెంట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. -
మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశం
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) కూటమి దేశాల్లో ఒమన్ మొదటిసారి ఆదాయపు పన్నును ప్రవేశపెట్టనుంది. 42,000 రియాల్స్ (1,09,000 డాలర్లు-దాదాపు రూ.93 లక్షలు) కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వర్గానికి 5% పన్ను విధించనున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒమన్ న్యూస్ ఏజెన్సీని ఉటంకిస్తూ బ్లూమ్బర్గ్ కథనం ప్రచురించింది. ఈ విధానం 2028 నుంచి అమల్లోకి రానుందని అంచనా వేసింది.చమురుకు తగ్గుతున్న డిమాండ్ముడిచమురు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంపై దేశం తక్కువగా ఆధారపడటానికి ఈ చర్య దోహదపడుతుందని ఒమన్ ఆర్థిక మంత్రి సయ్యద్ బిన్ మొహమ్మద్ అల్ సక్రీ తెలిపారు. అదే సమయంలో ప్రజా సేవలు, సామాజిక అవసరాలపై వ్యయాన్ని సమర్థంగా నిర్వర్తించవచ్చని చెప్పారు. మొత్తం ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్యదేశాలు ఆదాయంపై పన్ను విధించకుండా దూరంగా ఉన్న నేపథ్యంలో ఒమన్ తీసుకున్న నిర్ణయం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న జీరో ట్యాక్స్ విధానం అధిక ఆదాయం ఉన్న ప్రవాసులను ఆకర్షించడానికి సహాయపడింది. ఒకవేళ ఒమన్ ప్రతిపాదించిన విధానం ఆచరణలోకి వస్తే ప్రవాసుల ధోరణి ఎలా ఉంటుందో గమనించాల్సి ఉంటుంది.అబుదాబి కమర్షియల్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ మోనికా మాలిక్ ఈ పరిణామాన్ని ఆర్థికంగా కీలకమైనదిగా అభివర్ణించారు. ఒమన్ తన పక్క దేశాలతో అభివృద్ధిలో పోటీ పడేందుకు వీలుగా, రాజీపడకుండా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని చెప్పారు. ఇదిలాఉండగా, పొరుగు దేశాల మాదిరిగానే ఒమన్ కూడా సంపద సృష్టించడంలో భాగంగా ఇటీవలి కాలంలో ఆస్తుల అమ్మకాలు, ప్రైవేటీకరణ ద్వారా డబ్బు సమీకరిస్తోంది.గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాటలో..?సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుముఖం పడుతుండటంతో ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇప్పటికే సూచించింది. ప్రస్తుతం చాలా జీసీసీ దేశాలు మెరుగైన ప్రభుత్వ నిధులను కలిగి ఉన్నప్పటికీ సౌదీ అరేబియా, బహ్రెయిన్ మాత్రమే ఈ సంవత్సరం బడ్జెట్ లోటును ఎదుర్కొంటున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్జీసీసీ దేశాలు ఏవంటే..గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) అనేది ఆరు మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ రాజకీయ, ఆర్థిక కూటమి. అందులోని దేశాలు..బహ్రెయిన్కువైట్ఒమన్ఖతార్సౌదీ అరేబియాయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)1981లో జీసీసీ స్థాపించారు. సౌదీ అరేబియాలోని రియాద్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. -
ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్
ఎక్కువ మంది భారతీయ దంపతులు తమ రిటైర్మెంట్ ప్రణాళికల్లో భాగంగా ఇండియాలో కాకుండా దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూఏఈలోని భారతీయులు విభిన్న ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టి అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని, తద్వారా రియల్ ఎస్టేట్ను స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్గా మారుస్తున్నారని బెంగళూరుకు చెందిన సీఏ, ఒబెయా స్టార్టప్ ఫౌండర్ అభిషేక్ జమువార్ తెలిపారు.జమువార్ తన లింక్డ్ఇన్లో ఇందుకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ‘ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించాలి. దుబాయ్లో ఇన్వెస్ట్ చేసిన భారతీయులు ఇండియాలో పెట్టుబడి పెట్టినవారితో పోలిస్తే సంతోషంగా ఉన్నారు. దుబాయ్లో 2-3 ప్రాపర్టీస్ కొన్న భారతీయ జంటలు చాలానే ఉన్నాయి. కేవలం రికార్డు కోసం నేను సంపన్న వర్గం గురించి మాట్లాడటం లేదు. కష్టపడి, డబ్బు ఆదా చేసి, వారి భవిష్యత్తును సులభతరం చేయడానికి తమ కెరియర్లో 10 నుంచి 15 సంవత్సరాలు శ్రమించిన సాధారణ జంటల గురించి మాట్లాడుతున్నాను. దుబాయ్లో చాలా మంది మధ్యతరగతి భారతీయ జంటలు కొన్నేళ్లుగా పొదుపు చేసి రెండు, మూడు ప్రాపర్టీలను కొనుగోలు చేయగలిగారు. 6–7% అద్దె రాబడులను అందించే ఈ ప్రాపర్టీలను కేవలం 5% వడ్డీ రేటుతో కొనుగోలు చేశారు. ఆదాయ వనరు, పదవీ విరమణ ప్రణాళికలు రెండింటికీ ఉపయోగపడే స్థిరాస్తులను సృష్టించుకుంటున్నారు’ అని చెప్పారు.భారత్లో వడ్డీరేట్లు అధికం‘అయితే ఇండియాలో వన్ హోమ్, ఎక్కువ ఈఎంఐలు, తక్కువ రిటర్న్స్.. ఇదీ పరిస్థితి. ఇక్కడి విధానాల ద్వారా చాలా మంది మధ్యతరగతి వారు సాధారణంగా ఒక ఇంటిని మాత్రమే కలిగి ఉంటారు. ఇక్కడి నిబంధనల ప్రకారం ఈఎంఐలపై 10% వరకు వడ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది. అదీ చాలక అప్పు తీసుకుంటారు. అద్దె రాబడిలో కేవలం 3% వరకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. వ్యక్తి మొత్తం ఆదాయం ఈఎంఐలకే వెళుతుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: బూమరాంగ్లా బంగారం ధరలు! తులం ఎంతంటే..ఆదాయ మార్గాలపై దృష్టిసామాన్య ప్రజలు తమ సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఆదాయ మార్గాలు పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఈల్డ్ జనరేట్ చేసే పొదుపు మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అంతిమంగా సొంతిల్లు కలిగి ఉండడం మాత్రమే కాదు.. ఒత్తిడి లేకుండా జీవించడం, ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా రిటైర్ అవ్వడం ముఖ్యమని చెబుతున్నారు. అందుకు ముందునుంచే ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలంటున్నారు. -
బూమరాంగ్లా బంగారం ధరలు! తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) మంగళవారంతో పోలిస్తే బుధవారం వినియోగదారులకు ఊరట కల్పించింది. ఇటీవల రూ.1లక్ష దాటిన బంగారం ధరలు తిరిగి బూమరాంగ్లా గతంలోని రేట్లను చేరుతున్నాయి.ఇదీ చదవండి: త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇంట్లోకి వచ్చేలోపే నీళ్లు వేడయ్యేలా కొత్త హీటర్
కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్లో సర్వీసులు అందిస్తున్న వి-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లక్సెక్యూబ్ వాటర్ హీటర్ సిరీస్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఎలివేటెడ్, టెక్-ఫార్వర్డ్ బాత్రూమ్ సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి రూపొందించిన ఈ సిరీస్లో మూడు మోడళ్లు లక్సెక్యూబ్, లక్సెక్యూబ్ డీజీ, లక్సెక్యూబ్ స్మార్ట్ను తీసుకొచ్చినట్లు చెప్పింది.ఇదీ చదవండి: మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూకు సెబీ గ్రీన్సిగ్నల్ఆధునిక గృహాల కోసం రూపొందించిన లక్సెక్యూబ్ స్మార్ట్ ఐఓటీ స్మార్ట్ కనెక్టివిటీని ఇంటిగ్రేట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్కు అనుకూలమైన వి-గార్డ్ స్మార్ట్ యాప్ ద్వారా హీట్ను నియంత్రించవచ్చని పేర్కొంది. వాటర్ హీటింగ్ కోసం వినియోగదారులు సమయాన్ని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చని చెప్పింది. ఇది అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్ ద్వారా వాయిస్ కమాండ్లను కూడా సపోర్ట్ చేస్తుందని తెలిపింది. -
మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూకు సెబీ గ్రీన్సిగ్నల్
కొత్త ఆర్థిక సంవత్సరంలో జోరందుకున్న ప్రైమరీ మార్కెట్లు పలు అన్లిస్టెడ్ కంపెనీలకు జోష్నిస్తున్నాయి. దీంతో స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యేందుకు క్యూ కడుతున్నాయి. ఈ బాటలో తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మూడు కంపెనీలు అనుమతులు పొందాయి. జాబితాలో ఎల్రక్టానిక్స్ బజార్ కంపెనీ జీఎన్జీ ఎల్రక్టానిక్స్, లాజిస్టిక్స్ సర్వీసుల సంస్థ గ్లోటిస్, ఫార్మా రంగ కంపెనీ అమంతా హెల్త్కేర్ చేరాయి. ఈ మూడు కంపెనీలు సెబీకి 2025 ఫిబ్రవరి–మార్చిలో ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటికి తాజాగా గ్రీన్సిగ్నల్ లభించింది.జీఎన్జీ ఎల్రక్టానిక్స్పబ్లిక్ ఇష్యూలో భాగంగా జీఎన్జీ ఎల్రక్టానిక్స్ రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 51 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఎల్రక్టానిక్స్ బజార్ బ్రాండుతో పు నరుద్ధరించిన ల్యాప్లాప్లు, డెస్్కటాప్లను విక్రయిస్తోంది. వారంటీతో పునరుద్ధరించిన ప్రొడక్టుల పూర్తిస్థాయి వేల్యూ చైన్ నిర్వహిస్తోంది. కంపెనీ భారత్సహా యూరప్, ఆఫ్రికా, యూఏఈలలో కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా మైక్రోసాఫ్ట్ అ«దీకృత పునరుద్ధరణ ప్రొడక్టుల సంస్థగా నిలుస్తోంది.గ్లోటిస్చెన్నైకు చెందిన లాజిస్టిక్స్ కంపెనీ గ్లోటిస్ ఐపీవోలో భాగంగా రూ. 160 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.45 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిదులను వాణిజ్య వాహనాలు, కంటెయినర్ల కొనుగోలు తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. సమీకృత మలీ్టమోడల్ లాజిస్టిక్స్ సరీ్వసుల సంస్థ గ్లోటిస్ ప్రధానంగా ఎనర్జీ సరఫరా సొల్యూషన్లు అందిస్తోంది.అమంతా హెల్త్కేర్ 1994లో ఏర్పాటైన ఫార్మా రంగ కంపెనీ అమంతా హెల్త్కేర్ ఐపీవోలో భాగంగా 1.25 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అహ్మదాబాద్కు చెందిన కంపెనీ ప్రధానంగా మెడికల్ పరికరాలతోపాటు.. రోగులు నోటి ద్వారా ఔషధాలు తీసుకునేందుకు వీలులేనప్పుడు వినియోగించే స్టెరైల్ లిక్విడ్, పేరంటల్ ప్రొడక్టులను తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా 113 ప్రొడక్ట్ రిజిసే్ట్రషన్లను కలిగి ఉంది.కల్పతరుకు యాంకర్ నిధులురూ.708 కోట్లు సమీకరణరియల్టీ అభివృద్ధి సంస్థ కల్పతరు పబ్లిక్ ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.708 కోట్లు సమీకరించింది. షేరుకి రూ.414 ధరలో 9 సంస్థలకు 1.71 కోట్ల షేర్లను కేటాయించింది. ఇన్వెస్ట్ చేసిన సంస్థలలో జీఐసీ, బెయిన్ క్యాపిటల్, సింగపూర్ సావరిన్ వెల్త్, ఎస్బీఐ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ తదితరాలున్నాయి. మంగళవారం(24న) ప్రారంభమైన కంపెనీ ఐపీవో గురువారం(26న) ముగియనుంది. షేరుకి రూ. 387–414 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,590 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు కొత్తగా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. హౌసింగ్, కమర్షియల్ ఆస్తులకు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో గతేడాది(2024–25) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 2,727 కోట్ల విలువైన ప్రాపర్టీలను కంపెనీ విక్రయించింది. -
భారత్ నుంచి మరిన్ని కొనుగోళ్లు
అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ 2027 నాటికి భారత్ నుంచి కొనుగోళ్ల పరిమాణాన్ని ఏటా 10 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించేందుకు స్థానిక సరఫరాదార్లతో కలిసి క్రియాశీలకంగా పని చేస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన కంపెనీ సీఈవో డగ్ మెక్మిలన్ ఈ విషయాలు తెలిపారు.ఈ సందర్భంగా తమ వాల్మార్ట్ వృద్ధి కార్యక్రమం కింద శిక్షణ కల్పించిన కొందరు విక్రేతలను ఆయన కలిశారు. తమ ఈ–కామర్స్ విభాగం ఫ్లిప్కార్ట్, డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్పే లాంటి వ్యాపారాల నుంచి కొత్త ఆవిష్కరణలు, మరింత మంది కస్టమర్లకు సర్వీసులు అందించడం, విక్రేతలను పెంచుకోవడం తదితర అంశాలకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నామని మెక్మిలన్ వివరించారు. భారత్తో తమకు రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఉందని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలుగత దశాబ్ద కాలంలో భారత మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందిందని, వచ్చే దశాబ్ద కాలం కూడా ఇదే జోరు కొనసాగబోతోందని ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. వచ్చే మూడేళ్లలో తమ వృద్ధి ప్రోగ్రాం కింద ఒక లక్ష పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు చేరువ కానున్నట్లు వాల్మార్ట్ ఇటీవలే ప్రకటించింది. ఈ ప్రోగ్రాం ద్వారా వాల్మార్ట్ భారతీయ చిన్న, మధ్య తరహా సంస్థలకు వ్యాపార నైపుణ్యాల్లో శిక్షణ, మార్కెట్ యాక్సెస్ విషయంలో సహాయ, సహకారాలు అందిస్తోంది. భారతీయ తయారీదార్లు అమెరికా, కెనడా, మెక్సికో తదితర దేశాల్లోని వాల్మార్ట్ స్టోర్స్కి ఎగుమతులు చేసేందుకు వీలు కల్పించేలా 2002లో బెంగళూరులో వాల్మార్ట్ గ్లోబల్ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. -
Stock Market Updates: గ్రీన్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 140 పాయింట్లు పెరిగి 25,186కు చేరింది. సెన్సెక్స్(Sensex) 492 ప్లాయింట్లు పుంజుకుని 82,549 వద్ద ట్రేడవుతోంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలు
అమెరికా, ఐరోపా యూనియన్ (ఈయూ)లతో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఎంతో వేగవంతంగా, ఫలప్రదంగా కొనసాగుతున్నాయని.. త్వరలోనే ముగుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ప్రతిష్టాత్మక ఎగుమతుల లక్ష్యాలన్ని చేరుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే యూఏఈ, ఆస్ట్రేలియా, నాలుగు దేశాలతో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను మంత్రి ప్రస్తావించారు. యూకేతో చర్చలు ముగిసినట్టు చెప్పారు. మరిన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికే తమ ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు. ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ నిర్వహించిన వాణిజ్య సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.2024–25 ఆర్థిక సంవత్సరంలో వస్తు సేవల ఎగుమతులు రికార్డు స్థాయిలో 825 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు మంత్రి సీతారామన్ గుర్తు చేశారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైనట్టు చెప్పారు. ఇదే కాలంలో అంతర్జాతీయంగా ఎగుమతుల్లో వృద్ధి 4 శాతంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. 2013–14లో ఎగుమతులు 466 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే గణనీయంగా వృద్ధి చెందినట్టు తెలిపారు.ఆవిష్కరణలపై దృష్టి సారించాలి..ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఎగుమతిదారులకు మంత్రి సీతారామన్ పిలుపునిచ్చారు. తమ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను అన్వేషించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రవాహం 11 శాతం తగ్గిన సమయంలోనూ భారత్ మెరుగైన పనితీరు చూపించిందన్న యూఎన్సీటీఏడీ నివేదికను ప్రస్తావించారు. గడిచిన 24 ఏళ్లలో భారత్ 991 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐని ఆకర్షించగా, అందులో 67 శాతం (668 బిలియన్ డాలర్లు) 2014–2024 మధ్యకాలంలో వచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ మరింత అనుసంధామైనందన్నారు. యాపిల్ ఐఫోన్ భారత కాంట్రాక్టు తయారీదారులు దేశీయంగా 20 శాతం విలువ జోడింపును సాధించినట్టు చెప్పారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. భారత వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నట్టు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు తెలిపారు. భారత్లో టారిఫ్లు చాలా తక్కువభారత్ను టారిఫ్ కింగ్ అన్న ఆరోపణలను మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ఖండించారు. 2025–26 బడ్జెట్లో మొత్తం టారిఫ్లను ఎనిమిదింటికి తగ్గించామని చెబుతూ.. వాస్తవ రేటు ఎంతో తక్కువ అని స్పష్టం చేశారు. తయారీ, ఎగుమతులకు ప్రోత్సాహకంగా టారిఫ్ల సంఖ్యను కుదించినట్టు చెప్పారు. భారత్ను టారిఫ్ కింగ్గా పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకటికి మించిన సందర్భాల్లో వ్యాఖ్యానించిన నేపథ్యంలో మంత్రి ఈ స్పష్టతనిచ్చారు. 2023–24 బడ్జెట్లో ఏడు టారిఫ్లను మంత్రి సీతారామన్ తొలగించగా, ఇటీవలి బడ్జెట్లోనూ మరో ఏడు టారిఫ్ రేట్లను ఎత్తివేయడం గమనార్హం. దీంతో భారత సగటు కస్టమ్స్ సుంకం 11.65 శాతం నుంచి 10.66 శాతానికి దిగొచ్చినట్టు మంత్రి తెలిపారు. దక్షిణాసియా దేశాల స్థాయిలోనే ఇది ఉన్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?పన్ను ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలిపన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం, సకాలంలో రిఫండ్లను ప్రాసెస్ చేయడంపై దృష్టి సారించాలంటూ ఆదాయపన్ను శాఖ అధికారులకు మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ల సమావేశాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ప్రత్యక్ష హాజరు అవసరం లేని అప్పిలేట్ ట్రిబ్యునళ్ల ముందు పెండింగ్లో ఉన్న వివాదాస్పదన పన్ను డిమాండ్లను వేగంగా పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సకాలంలో పరిష్కారం చూపించడం వల్ల వ్యవస్థపై పన్ను చెల్లింపుదారుల్లో విశ్వాసం ఇనుమడిస్తుందన్నారు. -
రూ.86 కోట్ల బైబ్యాక్ పూర్తి చేసిన సాస్ యూనికార్న్
సాఫ్ట్వేర్-యాస్-ఏ-సర్వీస్ (సాస్) యూనికార్న్ డార్విన్బాక్స్ రూ.86 కోట్ల ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈసాప్) బైబ్యాక్ను పూర్తి చేసినట్లు తెలిపింది. భారత్, ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియా, మిడిల్ఈస్ట్లో సర్వీసులు అందిస్తున్న ఈ కంపెనీకి చెందిన 11 కార్యాలయాల్లోని 350 మందికి పైగా ఉద్యోగులు ఈ బైబ్యాక్ ద్వారా లబ్ధి పొందినట్లు కంపెనీ పేర్కొంది. తాజాగా సమకూర్చుకున్న రూ.86 కోట్ల బైబ్యాక్ గడిచిన నాలుగేళ్ల కాలంలో మూడోది కావడం గమనార్హం.ఈ సందర్భంగా డార్విన్బాక్స్ సహ వ్యవస్థాపకులు చైతన్య పెద్ది మాట్లాడుతూ..‘డార్విన్బాక్స్లో ప్రతిభ కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. కంపెనీతోపాటు వారూ ఎదిగేలా చూడటం మా ఉద్దేశం. సంపద సృష్టిలోనూ సంస్థతోపాటు ఉద్యోగులు ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నాం. కంపెనీ మెరుగైన పనితీరుతో మంచి భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడటానికి పరిశ్రమకు చెందిన కొంతమంది మేధావులు మాతో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దూసుకుపోయేందుకు కంపెనీ ఆర్ అండ్ డీ సామర్థ్యాలను రెట్టింపు చేస్తోంది. ఈ ప్రయాణంలో మరికొందరు ప్రతిభావంతులను ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. మార్చి 2025లో కంపెనీ తన సాంకేతికతను బలోపేతం చేయడానికి, అంతర్జాతీయంగా విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి పార్ట్నర్స్ గ్రూప్, కేకేఆర్ నుంచి నిధులు సేకరించింది. ఆ నిధుల సేకరణలో భాగంగా 140 మిలియన్ డాలర్ల(సుమారు రూ.120 కోట్లు)ను సమకూర్చుకుంది.కంపెనీ ఎంసీపీ (మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్) సర్వర్తో సహా బహుళ ఏఐ ఉత్పత్తులను ప్రారంభించినట్లు తెలిపింది. ఇది ఏదైనా అనుకూలమైన ఏఐ ఏజెంట్కు సదరు ప్లాట్ఫామ్లో హెచ్ఆర్ డేటా, వర్క్ ఫ్లోలతో సురక్షితంగా సంభాషించడానికి వీలు కల్పిస్తుంది. ‘డార్విన్ బాక్స్ సెన్స్’ అనే జెనరేటివ్ ఏఐ ఇంజిన్ను కూడా విడుదల చేసినట్లు చెప్పింది. ఇది 40 ఎంబెడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అందిస్తుంది. గత ఏడాదిలో 10 ప్రాంతాల్లో మల్టీ కంట్రీ పేరోల్ సొల్యూషన్స్ను అందించినట్లు పేర్కొంది. ‘కంపెనీ విలువను పెంచేవారికి తగిన భాగస్వామ్యం ఉండాలని సంస్థ విశ్వసిస్తోంది. నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ స్థాయిలో వృద్ధిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నా అందుకు సమానంగా ఉద్యోగులకూ అర్థవంతమైన ఫలాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ఉద్యోగులు సంస్థను తమదిగా భావించే సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం’ అని డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు జయంత్ పాలేటి అన్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?2015లో స్థాపించబడిన పీక్ ఎక్స్వీ, లైట్స్పీడ్ వంటి కంపెనీల నియామకాలు, ఆన్బోర్డింగ్, ఉద్యోగుల హాజరు నిర్వహణతో సహా వారి హెచ్ఆర్ అవసరాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. స్టార్ బక్స్, మెక్ డొనాల్డ్స్, ఆక్సా, సిగ్నా, వీవర్క్, ఎయిర్ టెల్, వేదాంత వంటి బ్రాండ్లతో సహా 1,000 సంస్థలకు ఇది సేవలు అందిస్తుంది. -
సీజ్ఫైర్ ఉల్లంఘన.. స్వల్ప లాభాలతో సరి
ముంబై: ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడటంతో దేశీయ స్టాక్ సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. మంగళవారం ఇంట్రాడేలో 1,121 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ ఆఖరికి 158 పాయింట్ల స్వల్ప లాభంతో 82,055 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 72 పాయింట్లు పెరిగి 25,044 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి.ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ప్రథమార్థంలో కొనుగోళ్ల జోరు కనిపించింది ఒక దశలో సెన్సెక్స్ 1,121 పాయింట్లు ర్యాలీ చేసి 83,018 వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు దూసుకెళ్లి 25,318 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. అయితే ఇరాన్ సీజ్ఫైర్ ఒప్పందాన్ని అతిక్రమిస్తూ క్షిపణులతో దాడులు చేస్తూందంటూ ఇజ్రాయెల్ ఆరోపణలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో సూచీల ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు – 2–3% లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ⇒ రంగాల వారీగా బీఎస్ఈ ఇండెక్సుల్లో సర్వీసెస్ 2%, టెలికమ్యూనికేషన్, మెటల్, ఫైనాన్షియల్ సర్విసెస్, బ్యాంకెక్స్ ఇండెక్సులు ఒకశాతం పెరిగాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.75%, 0.50 శాతం చొప్పున లాభపడ్డాయి.సూచీలకు అదానీ షేర్ల దన్ను...అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రాణించి సూచీల పతనాన్ని అడ్డుకున్నాయి. వివిధ వ్యాపారాలపై వచ్చే అయిదేళ్లలో 15–20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటనతో అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ లభించింది. అంబుజా సిమెంట్స్ 4%, సంఘీ ఇండస్ట్రీస్, అదానీ గ్రీన్ ఎనర్జీ 3%, అదానీ పోర్ట్స్ 2.60%, ఏసీసీ, అదానీ ఎనర్జీ 2% లాభపడ్డాయి.⇒ బ్రెంట్ క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ఆయిల్ మార్కెట్ కంపెనీలు, ఏవియేషన్, పెయింట్స్, అడెషివ్స్ షేర్లకు కలిసొచ్చింది. హెచ్పీసీఎల్ 3%, ఐఓసీ, బీపీసీఎల్ 2% లాభపడ్డాయి. ఇండిగో ఏవియేషన్ 2.5%, స్పైస్జెట్ 2.15% పెరిగాయి. కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, షాలీమార్ పెయింట్స్ 2% లాభపడ్డాయి. -
రూపాయి అయిదేళ్లలో అతిపెద్ద ర్యాలీ
ముంబై: రూపాయి విలువ అయిదు నెలల కనిష్టం నుంచి కోలుకొని రికార్డు స్థాయిలో ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో 73 పైసలు బలపడి 86.05 వద్ద స్థిరపడింది. గడిచిన అయిదేళ్లలో ఒకేరోజు ఈ స్థాయిలో పుంజుకో వడం ఇదే తొలిసారి.పశ్చిమాసియాలో ఉద్రికత్తలు తగ్గొచ్చనే అంచనాలతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు దిగిరావడం రూపాయికి కలిసొచ్చిన. అలాగే దేశీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలూ ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో ఏకంగా 87 పైసలు ఎగసి 85.91 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య సీజ్ఫైర్ ప్రకటనతో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 3.50% క్షీణించి 67.05 స్థాయికి దిగివచ్చింది. -
యూపీఐ, ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బు విత్డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్వో చందాదారులకు శుభవార్త. ఏటీఎంలు, యూపీఐ తదితర మాధ్యమాల ద్వారా తమ ఖాతాల నుంచి ఈపీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలను ఈపీఎఫ్కు అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం ఈపీఎఫ్లో నిర్దిష్ట నిష్పత్తిలో కొంత భాగాన్ని పక్కన పెట్టి, మిగతా మొత్తాన్ని విత్డ్రాయల్కు అందుబాటులో ఉంచుతారని పేర్కొన్నాయి.ఏటీఎం డెబిట్ కార్డులు, యూపీఐలాంటి మాధ్యమాల ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చని వివరించాయి. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రస్తుతం సాఫ్ట్వేర్పరమైన సవాళ్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపాయి. ఈపీఎఫ్వోకి బ్యాంకింగ్ లైసెన్సులు లేనందువల్ల ఈపీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా ఉపసంహరించుకునేందుకు వీలుండదని సంబంధిత వర్గాలు చెప్పాయి.మరోవైపు, ఆటో–సెటిల్మెంట్ విధానం కింద విత్డ్రాయల్ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఆటో–సెటిల్మెంట్ విధానంలో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల వ్యవధిలోనే క్లెయిమ్ విత్డ్రాయల్ ప్రక్రియంతా ఎలక్ట్రానిక్ విధానంలో సెటిల్ అవుతుంది. కోవిడ్ సమయంలో అవసరార్థులకు ఆర్థికంగా తక్షణ సాయం అందాలనే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు. -
పసిడి రూ.900 డౌన్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో.. సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడిలో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. అమ్మకాల ఒత్తిడితో బంగారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) ఢిల్లీ మార్కెట్లో రూ.900 నష్టపోయి రూ.98,900 స్థాయికి దిగొచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.800 నష్టపోయి రూ.98,300 స్థాయిలో ట్రేడ్ అయ్యింది.మరోవైపు వెండి సైతం కిలోకి రూ.1,000 నష్టపోయి రూ.1,04,200 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ఔన్స్కు 46 డాలర్లు క్షీణించి 3,323 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయ్యింది. ‘‘ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందంటూ యూఎస్ ప్రకటించడంతో బంగారం ధరలు ఒత్తిడి ని ఎదుర్కొన్నాయి. మరింత ఉద్రిక్తతలు పెరుగుతాయన్న అంచనాలు తగ్గడంతో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించారు’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్విసెస్ సీఈవో చింతన్ మెహతా వివరించారు. -
స్మార్ట్ఫోన్.. ఆఫ్లైన్ రూట్!
ఇప్పటివరకు ఆన్లైన్ మాధ్యమానికి ఎక్కువగా ప్రాధాన్యమిచి్చన స్మార్ట్ఫోన్ బ్రాండ్లు క్రమంగా ఆఫ్లైన్ బాట పడుతున్నాయి. సులభతరమైన ఫైనాన్సింగ్ అవకాశాల దన్నుతో అమ్మకాలను పెంచుకునేందుకు చిన్న పట్టణాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా ఏడు నెలల పాటు ఆన్లైన్ రిటైలర్లకు షిప్మెంట్లు (టోకు విక్రయాలు) తగ్గడం, ఆఫ్లైన్ రిటైలర్లకు పెరగడం ఇందుకు నిదర్శనమని మార్కెట్ వర్గాలు తెలిపాయి.ఆన్లైన్ రిటైలర్లకు వరుసగా రెండో నెల ఏప్రిల్లో రెండంకెల స్థాయిలో తగ్గినట్లు వివరించాయి. ఏప్రిల్లో షిప్మెంట్లు ఏకంగా 20 శాతం మేర క్షీణించాయి. మరోవైపు, ఆఫ్లైన్ రిటైలర్లకు 10 శాతం పెరిగాయి. వరుసగా ఎనిమిది నెలల పాటు ఆఫ్లైన్కి షిప్మెంట్లు పెరిగినట్లయిందని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ ఉపాసనా జోషి తెలిపారు. మొత్తం షిప్మెంట్లను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మార్చితో పోలిస్తే ఏప్రిల్లో పెద్దగా మార్పు లేకుండా 1.2 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరించారు. మోటరోలా షిప్మెంట్లు 64 శాతానికి డౌన్.. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం 2025 తొలి త్రైమాసికంలో మోటరోలా ఆన్లైన్ షిప్మెంట్లు 64%కి పరిమితమయ్యాయి. అంతక్రితం క్యూ1లో ఇవి 82%గా నమోదయ్యాయి. ఇక వన్ప్లస్ విషయానికొస్తే ఇదే వ్యవధిలో షిప్మెంట్లు 85% నుంచి 71%కి తగ్గాయి. మరోవైపు, ఈ–కామర్స్ ఫ్లాష్ సేల్స్తోనే భారత మార్కెట్లోకి ప్రవేశించిన షావోమీ సైతం ఆమ్నిచానల్ బాట పట్టింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ఆమ్నిచానల్ వ్యూహం.. ప్రాథమికంగా ఆన్లైన్ మాధ్యమం మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకునేందుకు బాగా ఉపయోగపడినప్పటికీ, దేశీయంగా ఈ–కామర్స్ విస్తృతి ఇప్పటికే ఒక స్థాయికి చేరిన విషయాన్ని బ్రాండ్లు గుర్తిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్ అనంతరం ఒక్కసారిగా ఆన్లైన్ అమ్మకాలు ఎగిసినప్పటికీ ఆ తర్వాత అదే స్థాయిలో కొనసాగలేదు. గ్రామీణ ప్రాంతాల కొనుగోలుదారులు పూర్తిగా ఆన్లైన్ మాధ్యమంపైనే ఆధారపడటం లేదు. ఇప్పటికీ ఆఫ్లైన్ స్టోర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.దీంతో విక్రయాలను పెంచుకునేందుకు ఏదో ఒక మాధ్యమంపైనే ఎక్కువగా దృష్టి పెట్టకుండా, అన్ని మార్గాలను ఉపయోగించుకునే ఆమ్నిచానల్ వ్యూహాన్ని బ్రాండ్లు అనుసరిస్తున్నాయి. ఆఫ్లైన్ రిటైలర్లను ఆకర్షణీయమైన మార్జిన్లు, సపోర్ట్తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్లైన్లో విక్రయించే ఉత్పత్తులను అదే రేటుకు ఆఫ్లైన్లోనూ అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆన్లైన్ సరఫరాలను తగ్గిస్తున్నాయని మార్కెట్ వర్గాలు వివరించాయి. -
ఈపీఎఫ్వో కీలక ప్రకటన
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అడ్వాన్స్ క్లెయిమ్ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీలు, పిల్లల పెళ్లిల్లు లేదా ఇంటి పునరుద్ధరణ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరితగతిన ఆర్థిక వెసులుబాటు అందించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పింది. తక్షణ ఆర్థిక సహాయం అవసరమైన సిబ్బందికి సకాలంలో డబ్బు అందేలా చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.‘కార్మికులకు నిరంతరాయంగా, సకాలంలో ఆర్థికంగా వెసులుబాటు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనివల్ల సభ్యులు అవసరమైన సమయాల్లో పెద్ద మొత్తంలో వేగంగా డబ్బు పొందవచ్చు’ అని మాండవీయ పేర్కొన్నారు. ఆటో సెటిల్మెంట్ సదుపాయం కొవిడ్-19 మహమ్మారి కాలం నుంచే అందుబాటులో ఉంది.ఏమిటీ ఆటో సెటిల్మెంట్?క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్లోని కొంత భాగాన్ని అడ్వాన్స్గా పొందడానికి అనుమతించే విధానం. కొవిడ్ సమయంలో రూ.1లక్ష వరకు ఇలా ఆటో సెటిల్మెంట్కు ఈపీఎఫ్ఓ అవకాశం ఇచ్చింది. ఇక నుంచి దీన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపింది. వైద్య అత్యవసర పరిస్థితులు లేదా విద్యా ఖర్చులు, ఇంటి రెన్యూవేషన్, పిల్లల పెళ్లి వంటి తక్షణ అవసరాలకు ఇలా పీఎఫ్ నిధులను విత్డ్రా చేసుకోవచ్చని చెప్పింది. ఈ విధానంలో నిధులు మ్యానువల్గా కాకుండా ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతాయి.ఈ సర్వీసు పొందేందుకు చందాదారులు తమ ‘నో యువర్ కస్టమర్ (కేవైసీ)’ సమాచారం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఈపీఎఫ్ ఖాతాకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణకు ముందు ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ పూర్తి ఉపసంహరణ అనుమతించబడనప్పటికీ పిల్లల వివాహం, విద్య లేదా ఇంటి పునరుద్ధరణ వంటి నిర్దిష్ట పరిస్థితులలో పాక్షికంగా విత్డ్రా చేసేందుకు అనుమతించారు. దీనివల్ల సభ్యులు తమ నిధులను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో జాప్యం లేకుండా పొందవచ్చు.ఆటో సెటిల్మెంట్ కోసం అర్హతలువైద్య అత్యవసర పరిస్థితులు: చందాదారులు లేదా తమపై ఆధారపడినవారు ఆసుపత్రిలో చేరడం, పెద్ద శస్త్రచికిత్సలు లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుండడం.ఉన్నత విద్య: చందాదారులు లేదా తమ పిల్లల ఉన్న విద్య కోసం.వివాహ ఖర్చులు: చందాదారు పెళ్లి లేదా పిల్లలు లేదా తోబుట్టువుల పెళ్లి ఖర్చులకు.ఇంటి పునరుద్ధరణ లేదా నిర్మాణం: ఇల్లు కొనడం లేదా ఇప్పటికే ఉన్న ఇంటి మరమ్మతుల కోసం.ఈపీఎఫ్ స్కీమ్ రూల్స్ 68జే, 68కే, 68బీ ద్వారా పై కేటగిరీలోని అవసరాల నిమిత్తం పీఎఫ్ డబ్బును విత్డ్రా చేయవచ్చు. చందాదారు క్లెయిమ్ ఈపీఎఫ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మానవ ప్రమేయం లేకుండా ప్రాసెస్ అవుతుంది. అందుకు సాధారణంగా 72 గంటలు సమయం పడుతుంది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక మాంద్యంపై కియోసాకి వ్యాఖ్యలుకావాల్సినవి..చందాదారులు తప్పనిసరిగా ఫుల్ కేవైసీని అప్డేట్ చేయాలి. అందుకు ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్లను ఈపీఎఫ్ అకౌంట్తో లింక్ చేయాలి.యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) యాక్టివ్గా ఉండాలి. దాన్ని వెరిఫై చేయాలి. -
ప్రపంచ ఆర్థిక మాంద్యంపై కియోసాకి వ్యాఖ్యలు
ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పకూలుతుందని చెబుతూ.. పెట్టుబడిదారులు ఏం చేయాలో సూచించారు. అధిక రుణ భారం కారణంగా ప్రభుత్వ ఫియట్ కరెన్సీ(కరెన్సీ నోటుకు ప్రభుత్వం ఆపాదించే విలువ)లపై ఆధారపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పేర్కొన్నారు. కాబట్టి బిట్కాయిన్(బీటీసీ)ను కొనుగోలు చేయాలని చెప్పారు.GLOBAL MONETARY COLLAPSE COMING?Will you be richer or poorer when biggest debt bubble in history bursts.I recommend owning gold, silver, and BITCOIN if you want to be richer when the Global Debt Bubble bursts.BIGGEST LOSERS will be savers of fake fiat money and especially…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 23, 2025ఇదీ చదవండి: ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా..ముందస్తు హెచ్చరికరాబర్ట్ కియోసాకి చాలాకాలంగా ఫియట్ ద్రవ్య వ్యవస్థ, ప్రభుత్వ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. నియంత్రణలేని ద్రవ్య ముద్రణ కారణంగా అమెరికా డాలర్ వంటి కరెన్సీలు విలువను కోల్పోతాయని అభిప్రాయపడుతున్నారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ (బీటీసీ) వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అందుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు. ఫియట్ కరెన్సీలు పతనమవుతున్న కొద్దీ వీటి విలువ పెరుగుతుందని కియోసాకి పేర్కొన్నారు. డబ్బును పొదుపు లేదా బాండ్లలో మాత్రమే ఉంచవద్దని కియోసాకి సలహా ఇచ్చారు. ఈ సంప్రదాయ మార్గాలపై ఆధారపడే వారు భారీ నష్టాలను చూడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. -
ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా..
సొంతంగా ఇల్లు కలిగి ఉండడం అనేది సామాన్యుడి కల. దేశంలోని కొన్ని నగరాల్లో ఇకపై అది కలగానే ఉంటుందని కొన్ని నివేదికల వివరాల ద్వారా తెలుస్తుంది. భారత వాణిజ్య నగరం ముంబయి వంటి నగరాల్లో అయితే సామాన్యుడు ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు పోగుచేసి ఇల్లు కొనడం దాదాపు అసాధ్యం అనే వాదనలున్నాయి. అందుకు పెరుగుతున్న ఆస్తుల విలువే ప్రధాన కారణమని రిపోర్ట్లు తెలుపుతున్నాయి.ఒక విశ్లేషణ ప్రకారం నెలకు రూ.90 వేలు వేతనం అంటే ఏటా రూ.10.8 లక్షలు ఆదాయం పొందే ఓ వ్యక్తి ఉన్నారనుకుందాం. వార్షికంగా 30.2% రేటుతో రూ.3.2 లక్షలు పొదుపు చేస్తున్నాడనుకుందాం. తాను ఒకవేళ ముంబయిలో స్థిరాస్తి కొనుగోలు చేయాలని భావిస్తుంటే అక్కడి సగటు ఆస్తి వ్యయం మార్చి 2025 లెక్కల నాటికి చదరపు అడుగుకు రూ.29,911గా ఉంది. సాధారణ ఇంటి పరిమాణం 1,184 చదరపు అడుగులు లెక్కిస్తే ఇంటికి మొత్తం వ్యయం రూ.3.54 కోట్లు అవుతుంది. దీని ప్రకారం ఏటా తాను పొదుపు చేస్తున్న డబ్బు ఆధారంగా 109 ఏళ్లకు రూ.3.54 కోట్లు సమకూరుస్తాడు. అంటే ఇప్పుడు ప్లాన్ చేస్తే 109 ఏళ్లు తర్వాత ఇల్లు కొంటాడు. అదికూడా ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకపోతేనే!ఇదీ చదవండి: ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!దాదాపు అదే ధర కలిగిన ఆస్తిని దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కొనుగోలు చేయాలంటే కొంత తక్కువ సమయం పడుతుంది. గుర్గావ్లో ఇది 64 ఏళ్లుగా ఉంది. బెంగళూరులో 36 ఏళ్లుఢిల్లీ-35 ఏళ్లుచండీగఢ్లో 15 ఏళ్లు పడుతుంది.సంక్షోభానికి కారణమేమిటి?తీవ్రమైన భూ కొరత ఉండడం.అధిక జనసాంద్రత, పట్టణ వలసలు పెరుగుతుండడం.డిమాండ్ తగ్గినప్పటికీ డెవలపర్లు సిండికేట్గామారి ఇష్టారీతిన ధరలు పెంచడం.విధానపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చౌక గృహాల నిర్మాణంపై డెపలపర్లు మొగ్గు చూపకపోవడం.ఫలితంగా సంపన్నులు సైతం ఒకింత ఆలోచించి కొనుగోలు నిర్ణయం తీసుకునేలా రేట్లు పెరగడం. -
1,487 గజాలు.. రూ. 33 కోట్లు
కూకట్పల్లి: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డుకు చెందిన 11 స్థలాలు సోమవారం బహిరంగ వేలంలో రికార్డు స్థాయి ధరలకు అమ్ముడయ్యాయి. మొత్తంగా బోర్డుకు రూ. 65.02 కోట్ల ఆదాయాన్ని అందించాయి. ముఖ్యంగా గచ్చిబౌలిలోని 1,487 గజాల ఒక వాణిజ్య స్థలం ఏకంగా రూ. 33 కోట్లు పలికింది. చదరపు గజానికి రూ. 1.20 లక్షలను ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించగా వేలంపాటలో అది ఏకంగా రూ. 2.22 లక్షలు పలికింది. అలాగే అదే ప్రాంతంలోని ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన 1,206 గజాల స్థలం వేలంలో రూ. 13.51 కోట్లు పలికింది. అక్కడ చదరపు గజానికి రూ. 80 వేలను ఆఫ్ సెట్ ధరగా ఖరారు చేయగా వేలంలో గజం రూ. 1.12 లక్షలకు అమ్ముడుపోయింది.చింతల్లో నాలుగు స్థలాలు, నిజాంపేటలో నాలుగు ఫ్లాట్లు సైతం ఈ వేలంపాటలో అమ్ముడయ్యాయి. ఒక్క గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతానికి సంబంధించిన భూముల వేలం ద్వారానే రూ. 55.56 కోట్ల మేర ఆదాయం హౌసింగ్ బోర్డుకు సమకూరింది. చింతల్లోని ప్లాట్ నెం.113, 114, 115 ద్వారా సుమారు రూ. 8.11 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కేపీహెచ్బీ (KPHB) కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ వేలంలో 55 మంది పాల్గొన్నారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వి.పి.గౌతం ఓ ప్రకటన విడుదల చేశారు.రెరా ట్రిబ్యునల్ చైర్మన్గా జస్టిస్ ఎ.సంతోష్రెడ్డి బాధ్యతలుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (రెరా) అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అనుగు సంతోష్రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం సభ్యులతో కలసి ట్రిబ్యునల్ కార్యకలాపాలు నిర్వహించారు. జస్టిస్ సంతోష్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.చదవండి: ల్యాండ్యూజ్ సర్టిఫికెట్ల జారీ.. ఇక ఈజీ -
ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు!
ఆధార్ కార్డులో అప్డేట్స్ చేయాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది. ఆధార్ కార్డులో చిరునామా మార్చాలన్నా, మొబైల్ నంబర్ అప్డేట్ చేయాలన్నా, పేరు, పుట్టిన తేదీ.. వంటివాటిలో మార్పులు చేయాలన్నా ఇకపై ఆధార్ సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సర్వీసులు అప్డేట్ చేస్తున్నారు. నేరుగా ఆన్లైన్లోనే నవంబర్ 2025 నుంచి సవరణ సదుపాయాన్ని కల్పించేలా యూఐడీఏఐ చర్యలు చేపడుతుంది.ప్రభుత్వం ప్రకటించిన ఈ విధానం వల్ల భౌతిక పత్రాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఆధార్ అప్డేట్ కోసం ఆయా కేంద్రాలను సందర్శించే అసౌకర్యాన్ని తొలగిస్తుంది. అప్డేషన్ ప్రక్రియ ఆన్లైన్ సేవల ద్వారా వేగవంతం అవుతుంది. ఈ సర్వీసుల ద్వారా సురక్షితంగా, సులభంగా కొత్త ఆధార్ను పొందే వీలుంటుంది. దేశంలోని కొన్ని లక్షల మందికి ఈ సర్వీస్ ఉపయోగకరంగా మారుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?దరఖాస్తు సమయంలో పాన్, పాస్పోర్ట్, రేషన్ కార్డు వంటి ఇప్పటికే ప్రభుత్వ డేటాబేస్లో ఉన్న వివరాల ద్వారా యూఐడీఏఐ మీ వివరాలను తనిఖీ చేస్తుంది. పత్రాలను పదేపదే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇది నియంత్రిస్తుంది. విద్యుత్ బిల్లులు వంటి యుటిలిటీ బిల్లులను కూడా మీ చిరునామాను ధ్రువీకరించడానికి ఉపయోగించవచ్చు. నవీకరణ ప్రక్రియను ఈ చర్యలు గణనీయంగా క్రమబద్ధీకరిస్తాయి.కొత్త మొబైల్ అప్లికేషన్..క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ ఆధార్తో కూడిన కొత్త మొబైల్ అప్లికేషన్ను యూఐడీఏఐ త్వరలో విడుదల చేయనుందని చెప్పింది. ఈ అప్డేట్తో ఇకపై మీ ఆధార్ కార్డు ఫిజికల్ ఫొటోకాపీలను సమర్పించాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా వినియోగదారులు అవసరమైనప్పుడల్లా సురక్షితమైన డిజిటల్ లేదా మాస్క్ ఆధార్ను చూపించవచ్చు. మోసాలను అరికట్టడం, నకిలీ ఆధార్ కార్డుల చలామణిని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది. -
పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పై ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) ప్రశంసలు కురిపించారు. దూకుడైన ఆటకు మారుపేరంటూ పంత్ బ్యాటింగ్ తీరును కొనియాడారు. అదే సమయంలో.. భారత ఓపెనింగ్ బ్యాటర్, లక్నో మాజీ ఆటగాడు కేఎల్ రాహుల్ను కూడా సంజీవ్ గోయెంకా ప్రశంసించడం విశేషం.రెండు ఇన్నింగ్స్లోనూ శతకాలుకాగా భారత్- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టులో రిషభ్ పంత్ శతకాలతో అదరగొట్టిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా తొలి ఇన్నింగ్స్లో 178 బంతులు ఎదుర్కొన్న ఈ ఐదో నంబర్ బ్యాటర్.. 12 ఫోర్లు, ఆరు సిక్సర్ సాయంతో.. 75కు పైగా స్ట్రైక్రేటుతో 134 పరుగులు సాధించాడు.ఇక రెండో ఇన్నింగ్స్లోనూ పంత్ దంచికొట్టాడు. 140 బంతుల్లోనే 118 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్రేటు 84.29. తన అద్భుత శతక ఇన్నింగ్స్ల ద్వారా టీమిండియా పటిష్ట స్థితిలో నిలవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు.అమోఘం.. రాహుల్కు కంగ్రాట్స్ ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని తమ కెప్టెన్ రిషభ్ పంత్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘అమోఘం! రెండు వరుస సెంచరీలు.. దూకుడుకు మారుపేరుగా, బెదురులేని.. అద్భుత ఇన్నింగ్స్.టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్గా చరిత్ర.. సూపర్’’ అంటూ క్లాప్ ఎమోజీలు జత చేశారు. అదే సమయంలో మరో శతక వీరుడు కేఎల్ రాహుల్ పేరును కూడా గోయెంకా ప్రస్తావించడం వైరల్గా మారింది. ‘‘సెంచరీ చేసిన కేఎల్ రాహుల్కు కూడా శుభాకాంక్షలు’’ అని గోయెంకా ట్వీట్ చేశారు.కాగా 2022లో ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో జట్టుకు మూడేళ్ల పాటు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. 2022, 2023లో వరుసగా రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. కానీ 2024లో మాత్రం రాహుల్ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు.రాహుల్పై ఫైర్.. ఫ్రాంఛైజీని వీడిన స్టార్ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా మైదానంలో బహిరంగంగా రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ పరిణామం తర్వాత అంటే.. 2025 మెగా వేలానికి ముందు రాహుల్ లక్నో ఫ్రాంఛైజీని వీడాడు.అనంతరం ఆక్షన్లో భాగంగా లక్నో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్ను కొనుగోలు చేసి కెప్టెన్గా నియమించింది. అయితే, బ్యాటర్, కెప్టెన్గా ఈ సీజన్లో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి పంత్ కేవలం 269 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉండటం చెప్పుకోదగ్గ అంశం.గెలుపునకు పది వికెట్ల దూరంలోఇక పంత్ సేన తాజా ఎడిషన్లో పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికే పరిమితమైంది. మరోవైపు.. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన కేఎల్ రాహుల్ పదమూడు మ్యాచ్లు ఆడి.. ఓ శతకం సాయంతో 539 పరుగులు సాధించడం విశేషం.ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మారింది. ఆఖరిదైన ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. భారత బౌలర్లు రాణించి పది వికెట్లు కూలిస్తే.. గిల్ సేనకు శుభారంభం లభిస్తుంది. మరోవైపు.. భారత్ విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే ఇంగ్లండ్ మంగళవారం 350 పరుగులు చేయాలి. చదవండి: ‘లక్ష్మణ్ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’𝘈 𝘚𝘰𝘯𝘨 𝘰𝘧 𝘐𝘤𝘦 & 𝘍𝘪𝘳𝘦 𝘢𝘵 𝘏𝘦𝘢𝘥𝘪𝘯𝘨𝘭𝘦𝘺.🔥❄️@klrahul set the foundation with a composed and elegant century while @RishabhPant17’s quickfire hundred electrified the crowd with an explosive display of fearless strokeplay! 🤩WATCH FULL HIGHLIGHTS OF DAY 4… pic.twitter.com/MQ13EvHIae— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?
ప్రస్తుతకాలంలో చాలామంది ఒకటికంటే ఎక్కువ ఫోన్లు వాడుతున్నారు. వాటిలో రెండు కంటే ఎక్కువ సిమ్కార్డులు వినియోగిస్తున్నారు. అయితే గతంలో మీపేరుతో ఎప్పుడో ఒకపుడు తాత్కాలికంగా సిమ్కార్డులు తీసుకునే ఉంటారు. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకరి పేరుమీద గరిష్ఠంగా 9 సిమ్కార్డులే ఉండాలి. కాబట్టి అనవసరమైన సిమ్కార్డులను నిలిపేయాలంటే మార్గం ఉంది. దాంతోపాటు అసలు మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు రిజిస్ట్రర్ అయ్యాయో తెలుసుకువాలంటే కింది సమాచారం తెలుసుకోవాల్సిందే.ప్రభుత్వ వెబ్సైట్ సంచార్సాతి వెబ్సైట్ ద్వారా మీరు గతంలో తీసుకున్న నంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. దీనిద్వారా గతంలో తీసుకుని వినియోగంలోలేని సిమ్కార్డులను నేరుగా ఆన్లైన్లో ద్వారా నిలిపేసే సౌకర్యం ఉంది. అది ఎలాగో చూద్దాం.ఇదీ చదవండి: యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణతముందుగా ఆన్లైన్లో బ్రౌజర్ ద్వారా https://sancharsaathi.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లాలి.కింద సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కేటగిరీలో ‘Know Your Mobile Connections’పై క్లిక్ చేయాలి. ఈ సర్వీస్ను టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్(టీఏఎఫ్సీఓపీ) అందిస్తోంది.‘Know Your Mobile Connections’పై క్లిక్ చేసిన వెంటనే కొత్త విండో ఓపెనె అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్నంబర్ను ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా కోడ్ను ఇవ్వాలి. ‘వాలిడేట్ క్యాప్చా’ బటన్ ప్రెస్ చేయాలి.పైన ఇచ్చిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని కింద తెలిపిన బ్లాక్లో ఎంటర్చేసి లాగిన్ అవ్వాలి. మీ పేరుతో ఏ నంబర్లు రిజిస్ట్రర్ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్ వస్తుంది.ఒకవేళ ఏదేని నంబర్ను నిలిపేయాలంటే పక్కనే ఆప్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. చివరగా లాగ్అవుట్ చేయడం మరిచిపోకూడదు. -
యుద్ధంపై అనుమానాలు.. బంగారం ధరల్లో క్షీణత
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారంతో పోలిస్తే మంగళవారం వినియోగదారులకు ఊరట కల్పించింది.ఇదీ చదవండి: టెస్లా డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీస్ ప్రారంభంఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇచ్చి ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. దీంతో ఇరాన్ యూఎస్కు వ్యతిరేకంగా యుద్ధంలో ముందుకు వెళ్తుందా? అనే అనుమానంతో బంగారం ధరలు క్షీణించాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్కెట్లు పెరుగుతున్న తరుణంలో బంగారంలోని పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
టెస్లా డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీస్ ప్రారంభం
ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీ టెస్లా టెక్సాస్లోని ఆస్టిన్లో తన మొట్టమొదటి ఫుల్ డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది. భవిష్యత్తులో రవాణా విభాగంలో కొత్త ట్రెండ్ సృష్టించాలని భావించి కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ పదేళ్ల కిందటే ఈ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ సిబ్బంది ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) సాఫ్ట్వేర్తో నడిచే మోడిఫైడ్ మోడల్ వై ఎస్యూవీలను తయారు చేశారు.ప్రాథమికంగా కొంతకాలం కస్టమర్లలో నమ్మకం కలిగేంతవరకు ఈ ఎస్యూవీల పర్యవేక్షణ కోసం ప్యాసింజర్లతోపాటు టెస్లా ఉద్యోగులు సైతం అందులో ప్రయాణించనున్నారు. ముందుగా దక్షిణ ఆస్టిన్ వీధుల్లో టెస్లా ఈ సేవలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం 10 నుంచి 20 వాహనాలను మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద సెట్అప్ చేశారు. ప్రాథమికంగా దక్షిణ ఆస్టిన్ జియోఫెన్సింగ్ విభాగాన్ని కవర్ చేసే పరిమిత సర్వీసులను కంపెనీ అందిస్తుంది. క్రమంగా ప్యాసింజర్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ సర్వీసులను విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ డైవర్లెస్ కారు రైడ్లు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని టెస్లా పేర్కొంది. అయితే ప్రతికూల వాతావరణంలో మాత్రం నిలిపేస్తామని ముందే స్పష్టతనిచ్చింది.రైడ్ ధర 4.20 డాలర్లుప్రతి రోబోటాక్సీ రైడ్ ఖరీదు 4.20 డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతానికి ప్యాసింజర్లను ఆకర్షించేందుకు ఈ ధర నిర్ణయించినప్పటికీ కస్టమర్ల నుంచి నెలకొనే డిమాండ్, రెగ్యులేటరీ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో మార్పులు చేసే అవకాశం ఉందని పేర్కొంది.ఇదీ చదవండి: పైప్లైన్ కోసం రూ.844 కోట్లు పెట్టుబడి!నో లైడార్, నో రాడార్ ఓన్లీ కెమెరా..ఇప్పటికే స్థానికంగా సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ సర్వీసులు అందిస్తున్న వేమో, జూక్స్ వంటి ప్రత్యర్థి కంపెనీలు వాటి కార్లలో ఉపయోగించినట్లు లైడార్ లేదా రాడార్ వ్యవస్థలను టెస్లా వినియోగించలేదని స్పష్టం చేసింది. అందుకు బదులుగా పూర్తి కెమెరాలు, అంతర్గత ఏఐ చిప్లతోనే డ్రైవింగ్ వ్యవస్థ ఉంటుందని చెప్పింది. అటానమస్ వాహనాలకు పర్మిట్లు తప్పనిసరి చేసే కొత్త టెక్సాస్ చట్టం సెప్టెంబర్లో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు కొందరు చెబుతున్నారు. -
పైప్లైన్ కోసం రూ.844 కోట్లు పెట్టుబడి!
పెరుగుతున్న ఇంధన డిమాండ్కి తగ్గట్లుగా సరఫరా సామర్థ్యాలను పెంచుకునే దిశగా రూ.844 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ గెయిల్ ఇండియా వెల్లడించింది. దహేజ్–ఉరన్–దభోల్–పాన్వెల్ సహజ వాయువు పైప్లైన్పై ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుతం దీని సామర్థ్యం రోజుకు 19.9 మిలియన్ ఘనపు మీటర్లుగా (ఎంసీఎండీ) ఉండగా వచ్చే మూడేళ్లలో దీన్ని 22.5 ఎంసీఎండీకి పెంచుకోనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు గెయిల్ తెలియజేసింది.ఇదీ చదవండి: రేర్ ఎర్త్ మెటల్స్పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బమరోవైపు, 1,702 కిలోమీటర్ల ముంబై–నాగ్పూర్–ఝర్సుగూడ పైప్లైన్ ప్రాజెక్టును పూర్తి చేసే గడువు తేదీని ఈ ఏడాది జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30కి పెంచినట్లు వివరించింది. దీనికి అదనంగా రూ. 411.12 కోట్లు అవసరమవుతాయని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం ముందుగా అంచనా వేసిన రూ.7,844.25 కోట్ల కన్నా అధికంగా రూ.8,255.37 కోట్లకు చేరుతుందని గెయిల్ పేర్కొంది. అటు 774 కిలోమీటర్ల శ్రీకాకుళం–అంగుల్ పైప్లైన్ ప్రాజెక్టు గడువును కూడా 2025 జూన్ నుంచి డిసెంబర్కి సవరించినట్లు వివరించింది. అటవీ శాఖ నుంచి అనుమతులు రావడంలో జాప్యం కారణంగా పైప్లైన్ పనుల పురోగతిపై ప్రభావం పడినట్లు పేర్కొంది. -
రేర్ ఎర్త్ మెటల్స్పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బ
రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడంతో దేశీయంగా ఈ ప్రభావం ఆటోమొబైల్సహా పలు రంగాలపై కనిపించనుంది. ఈ ప్రభావంతో ఆడియో ఎల్రక్టానిక్స్ పరిశ్రమలో 21,000 ఉద్యోగాలు రిస్క్లో పడనున్నట్లు ఎల్రక్టానిక్స్ పరిశ్రమల సమాఖ్య ఎల్సినా.. ప్రభుత్వానికి నివేదించింది. ఏప్రిల్లో టెర్బియం, డిస్ప్రోజియం తదితర రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలకు తెరతీసింది.వీటిలో అధిక నాణ్యతగల (హైపెర్ఫార్మెన్స్) ఎన్డీఎఫ్ఈబీ(నియోడైమియం–ఐరన్–బోరన్) మ్యాగ్నెట్లు తదితరాలున్నాయి. ఇవి ప్రధానంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో వినియోగించే కీలక ముడిసరుకులు కావడంతో ఈ ప్రభావం దేశీయంగా కనిపిస్తోంది. వీటి సరఫరాలకు విఘాతం కలగడంతో దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వాచీలు, వినికిడి సంబంధిత(ఇయర్ ఫోన్స్, బడ్స్) ఎల్రక్టానిక్ వస్తువుల తయారీ దెబ్బతింటున్నట్లు ఎల్సినా పేర్కొంది. దీంతో పూర్తిస్థాయిలో తయారైన స్పీకర్ మాడ్యూల్స్ను చైనా నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..ఎలక్ట్రానిక్ వస్తు తయారీకి విఘాతం కలగడమేకాకుండా దిగుమతులపై అధికంగా ఆధారపడవలసిన పరిస్థితులు తలెత్తుతున్నట్లు వివరించింది. ఫలితంగా స్పీకర్, ఆడియో విడిభాగాల పరిశ్రమపై ఆధారపడిన 5,000–6,000 ప్రత్యక్ష ఉద్యోగాలకుతోడు పరోక్షంగా 15,000మంది ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు వెల్లడించింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు నోయిడాలో ఉపాధి కల్పన దెబ్బతినే వీలున్నట్లు పేర్కొంది. -
డిక్సన్ టెక్నాలజీస్లో వాటా విక్రయం
ఎల్రక్టానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా) ప్రమోటర్ సునీల్ వాచని కంపెనీలో 2.77 శాతం వాటా విక్రయించారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 13,301.47 సగటు ధరలో 16.7 లక్షల షేర్లను అమ్మివేశారు. తద్వారా రూ. 2,221 కోట్లకుపైగా అందుకున్నారు. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం కంపెనీ చైర్పర్శన్ సునీల్ వాటా దీంతో డిక్సన్లో 5.34 శాతం నుంచి 2.57 శాతానికి క్షీణించింది. మొత్తం ప్రమోటర్ల వాటా 32.27 శాతం నుంచి 29.5 శాతానికి దిగివచ్చింది.మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్ రెండు దశలలో 2.39 శాతం వాటాకు సమానమైన 14.45 లక్షల డిక్సన్ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 13,308 సగటు ధరలో ఇందుకు రూ. 1,924 కోట్లు వెచ్చించింది. ఈ లావాదేవీ తదుపరి డిక్సన్ టెక్నాలజీస్లో మోతీలాల్ ఎంఎఫ్ వాటా 2.24 శాతం నుంచి 4.63 శాతానికి ఎగసింది. ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ నికర లాభం రూ. 97 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..ఇందుకు కన్సాలిడేటెడ్ ఆదాయం రెట్టింపునకుపైగా జంప్చేసి రూ. 10,293 కోట్లకు చేరడం సహకరించింది. 2023–24లో రూ. 4,658 కోట్ల ఆదాయం మాత్రమే సాధించింది. పూర్తి ఏడాదికి(2024–25) ఆదాయం రూ. 17,691 కోట్ల నుంచి రూ. 38,860 కోట్లకు బలపడగా.. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 375 కోట్ల నుంచి రూ. 1,233 కోట్లకు ఎగసింది. -
మార్కెట్లో యుద్ధ భయాలున్నా లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:56 సమయానికి నిఫ్టీ(Nifty) 192 పాయింట్లు పెరిగి 25,171కు చేరింది. సెన్సెక్స్(Sensex) 620 ప్లాయింట్లు పుంజుకుని 82,526 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. అయితే దీన్ని ఇరాన్ ఖండించింది.ఇదీ చదవండి: ఐఫోన్ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడితో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. క్రూడాయిల్ ధరలూ అయిదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో నిన్నటి మార్కెట్ సెషన్లో ఐటీ, టెక్, ఆటో షేర్లలో భారీ అమ్మకాలు నెలకొన్నాయి. అయితే ట్రేడింగ్ చివర్లో దిగువ స్థాయిలో కీలక రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంత తగ్గాయి. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మళ్లీ భగ్గుమని, కాస్త చల్లారాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్, ఏవియేషన్ రంగాల షేర్లు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కోల్గేట్ ఇండియా నుంచి కొత్త బ్రాండ్లు
న్యూఢిల్లీ: కోల్గేట్ (పామోలివ్) ఇండియా భారత మార్కెట్లో తన పోర్ట్ఫోలియో, వ్యాపార విస్తరణపై బలమైన అంచనాలతో ఉంది. సంస్థ అంతర్జాతీయ పోర్ట్ఫోలియో నుంచి మరిన్ని బ్రాండ్లను భారత్లో విడుదల చేయాలనుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ప్రభా నరసింహన్ ప్రకటించారు. కోల్గేట్, పామోలివ్ బ్రాండ్లపై ఈ సంస్థ నోటి సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తుండడం తెలిసిందే. మరిన్ని బ్రాండ్లను తీసుకురావడంపై మాతృ సంస్థతో చర్చిస్తున్నట్టు నరసింహన్ తెలిపారు. ప్రస్తుత బ్రాండ్లతోపాటు కొత్త బ్రాండ్ల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. పామోలివ్ బ్రాండ్పై ప్రీమియం బాడీ వాష్, హ్యాండ్ వాష్ విక్రయిస్తుండగా, ఏటా ఈ విభాగం 20–30 శాతం కాంపౌండెడ్ వృద్ధి నమోదు చేయగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సంస్థ భవిష్యత్ ప్రణాళికల గురించి ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. పామోలివ్ బ్రాండ్పై మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను ఆవిష్కరించడం గురించి ప్రశ్నించగా.. అంతర్జాతీయంగా తమ పోర్ట్ఫోలియోలో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయని వివరిస్తూ.. మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టడంపైనే తాము దృష్టి సారించినట్టు ఆమె చెప్పారు. ఇక్కడి వినియోగదారుల అవసరాలకు సరిపోలే ఉత్పత్తులను తీసుకువస్తామని ప్రకటించారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే కోల్గేట్ పామోలివ్ 88 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ ఆదాయంలో 4–5 శాతం భారత్ నుంచే వస్తోంది. భారత మార్కెట్ ఎంతో కీలకం 140 కోట్ల జనాభా కలిగిన భారత్ మార్కెట్.. కోల్గేట్ పోమోలివ్ అంతర్జాతీయ వృద్ధికి కీలకమని ప్రభా నరసింహన్ తెలిపారు. రానున్న రోజుల్లో భారత్ వాటా మరింత పెరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కోల్గేట్కు అంతర్జాతీయంగా టాప్–5 మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో భారత్లో మధ్యతరగతి ప్రజలు గణనీయంగా పెరగనుండడం తమకు అద్భుతమైన అవకాశాలను తెచి్చపెడుతుందన్న సంస్థ అంతర్జాతీయ సీఈవో ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. వేగంగా వృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ చానళ్లపై మరిన్ని డిజిటల్ ఫస్ట్ బ్రాండ్లను ఆవిష్కరించనున్నట్టు ప్రభా నరసింహన్ తెలిపారు. కోల్గేట్ పర్పుల్, మ్యాక్స్ ఫ్రెష్ సెన్సోరీస్ శ్రేణి, మౌత్ వాష్లను కోల్గేట్ ఇటీవల విడుదల చేయడం గమనార్హం. మరిన్ని ఉత్పత్తులు విడుదల ప్రణాళికతో ఉన్నట్టు ఆమె చెప్పారు. అయితే సంప్రదాయ కిరాణా స్టోర్లు తమ వ్యాపార వృద్ధికి కీలకమని పేర్కొన్నారు. క్విక్కామర్స్ ఛానళ్లకు అనుకూలంగా ఆన్లైన్లో అధిక డిస్కౌంట్లు ఇస్తుండడంతో కోల్గేట్ పోమోలివ్ ఇండియా ఉత్పత్తులను మహారాష్ట్రలో బహిష్కరించాలంటూ అఖిల భారత ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల పంపిణీదారుల సంఘం ఇటీవలి ఇచి్చన పిలుపుపై స్పందిస్తూ.. అన్ని ఛానళ్లూ వృద్ధి చెందేందుకు తగినన్ని అవకాశాలున్నట్టు అభిప్రాయపడ్డారు.వినియోగం పుంజుకుంటుంది.. ఈ ఏడాది చివరికి పట్టణ వినియోగం పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రభా నరసింహన్ వ్యక్తం చేశారు. గ్రామీణ వినియోగ మార్కెట్ బలంగా ఉందంటూ, అదే వృద్ధి ఇకముందూ కొనసాగుతుందన్నారు. ‘‘కోల్గేట్ ఉత్పత్తులకు పట్టణ మార్కెట్ ఎంతో కీలకంగా ఉంది. సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితులకు తోడు, ఇటీవలి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు పట్టణ వినియోగానికి మద్దతుగా నిలుస్తాయి. జనాభాతో పోల్చి చూస్తే గ్రామీణ మార్కెట్ పరిమాణం ఎంతో చిన్నగా ఉంది. తగిన నోటి సంరక్షణ ఉత్పత్తులతో మరిన్ని అవకాశాలను సొంతం చేసుకోగలం’’అని వివరించారు. మాస్ మార్కెట్తోపాటు ప్రీమియం విభాగాలపై తమ దృష్టి కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
యూరప్ కారు.. తగ్గిన జోరు!
న్యూఢిల్లీ: ఆటో రంగ యూరోపియన్ దిగ్గజాలు భారత్లో వాహన అమ్మకాలు పెంచుకోవడంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. గత మూడేళ్ల డేటా పరిశీలిస్తే రెనాల్ట్, ఫోక్స్వేగన్, స్కోడా కార్ల అమ్మకాలు క్షీణిస్తూ వస్తున్నాయి. గ్లోబల్ ఆటోమోటివ్ పరిశ్రమ డేటా, అనలిటిక్స్ అందించే జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం రెనాల్ట్ అమ్మకాలు అత్యధికంగా నీరసించాయి. 2022–23లో 78,296 వాహనాలు విక్రయించగా.. 2023–24లో 45,349కు క్షీణించాయి. గతేడాది(2024–25) మరింత తగ్గి 37,900 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ బాటలో స్కోడా విక్రయాలు సైతం దేశీయంగా 52,269 యూనిట్ల నుంచి 2023–24కల్లా 44,522 వాహనాలకు వెనకడుగు వేశాయి. వీటితో పోలిస్తే గతేడాది అమ్మకాలు 44,866 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయి. అయితే ఫోక్స్వేగన్ 2022–23లో 41,263 యూనిట్లు విక్రయించగా.. 2023–24కల్లా ఇవి 43,197కు ఎగశాయి. గతేడాది సైతం 42,230 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎస్యూవీలు కీలకం గత మూడేళ్లలో యూరోపియన్ ఆటో దిగ్గజాలకు భారత మార్కెట్లో పలు సవాళ్లు ఎదురైనట్లు జాటో డైనమిక్స్ ఇండియా ప్రెసిడెంట్ రవి జి.భాటియా పేర్కొన్నారు. తొలి దశలో వెంటో, ర్యాపిడ్, స్కాలా తదితర సెడాన్లపైనే రేనాల్ట్, వీడబ్ల్యూ, స్కోడా అధిక దృష్టిపెట్టడం అమ్మకాల క్షీణతకు కొంత కారణమైనట్లు తెలియజేశారు. భారత్లో వేగవంత వృద్ధిలో ఉన్న ఎస్యూవీ విభాగంలో పరిమిత మోడళ్లనే ప్రవేశపెట్టడం ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించారు. వీటికితోడు మోడళ్లలో ఆధునిక వేరియంట్లను ప్రవేశపెట్టడంలో ఆలస్యం అమ్మకాల క్షీణతకు కారణమైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా టైర్–2, టైర్–3 పట్టణాలలో తగినస్థాయిలో నెట్వర్క్ విస్తరించకపోవడం వీటికి జత కలసినట్లు ప్రస్తావించారు. మరోవైపు భారతదేశ ప్రత్యేక పన్నుల విధానం కూడా కలసిరాలేదని పేర్కొన్నారు. అంటే సబ్4 మీటర్ల వాహనాలు తక్కువ లెవీల కారణంగా లబ్ది పొందినట్లు తెలియజేశారు. వెరసి జపనీస్, కొరియన్ కంపెనీలు తక్కువ వ్యయంలో కంపాక్ట్ కార్లను విడుదల చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకున్నట్లు తెలియజేశారు. అయితే యూరోపియన్ దిగ్గజాలు సంప్రదాయ పద్ధతిలో భారీ మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా అమ్మకాలు పెంచుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్నట్లు వివరించారు. పన్ను ప్రభావమిలా ప్రస్తుత ఆటోమోటివ్ పాలసీ ప్రకారం 1200 సీసీ సామర్థ్యంవరకూ 4 మీటర్లలోపుగల ప్యాసింజర్ వాహనాల(పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ)పై 28 శాతం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధిస్తారు. 1 శాతం కాంపెన్సేషన్ సెస్ ఉంటుంది. 4 మీటర్లలోపుగల 1500 సీసీ ప్యాసింజర్ వాహనాల(డీజిల్)పై 28 శాతం జీఎస్టీ, 3 శాతం కాంపెన్సేషన్ సస్ అమలవుతుంది. 4మీటర్లకుపైన 1500 సీసీ ప్యాసింజర్ వాహనాలపై 28 శాతం జీఎస్టీ, 17 శాతం సెస్ వర్తిస్తుంది. ఇక 1500 సీసీకి మించిన వాహనాలపై 28 శాతం జీఎస్టీ, 17 శాతం సెస్ అమలవుతుంది. 4 మీటర్లకు, 1500 సీసీకి మించిన (170 ఎంఎంకు మించిన గ్రౌండ్ క్లియరెన్స్గల) ఎస్యూవీలపై 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్ను విధిస్తారు.దేశీ దిగ్గజాల దూకుడు దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాసహా జపాన్ దిగ్గజం మారుతీ సుజుకీ స్థానిక విడిభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, త్వరత్వరగా వేరియంట్లను విడుదల చేయడం, సీఎన్జీ, హైబ్రిడ్స్, బీఈవీ తదితర ప్రత్యామ్నాయ ఇంధన ఇంజిన్ల మోడళ్లను ప్రవేశపెట్టడం వంటి సానుకూలతలతో అమ్మకాలు పెంచుకుంటూ వచి్చనట్లు భాటియా పేర్కొన్నారు. తద్వారా మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నట్లు తెలియజేశారు. అయితే స్కోడా ఇటీవల భారత్ మార్కెట్ కోసమే సబ్కాంపాక్ట్ ఎస్యూవీ ‘కైలాక్’ను రూపొందించి విడుదల చేసింది. తద్వారా అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు భాటియా తెలియజేశారు. యూరోపియన్ దిగ్గజాలు భవిష్యత్లో దేశీ తయారీ మోడళ్లను ఎగుమతులకు వినియోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా 4 మీటర్లలోపు వాహనాలు, ఆర్అండ్డీ, చౌకవ్యయ ప్లాట్ఫామ్స్పై దృష్టి పెట్టే వీలున్నట్లు వివరించారు. తద్వారా తిరిగి వాహన అమ్మకాల్లో నిలకడైన వృద్ధిని కొనసాగించే వీలున్నట్లు అంచనా వేశారు. -
ఫోన్పే ఐపీవో సన్నాహాలు షురూ
న్యూఢిల్లీ: గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ గ్రూప్ ఫిన్టెక్ కంపెనీ ఫోనేపే పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో నిర్వహణకు కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, మోర్గాన్ స్టాన్లీలను నియమించుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు జనరల్ అట్లాంటిక్, వాల్మార్ట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్, టైగర్ గ్లోబల్ నుంచి ఫోన్పే 85 కోట్ల డాలర్లు(రూ. 7,021 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ. లక్ష కోట్లు) విలువలో ఈ పెట్టుబడులు సమకూర్చుకోవడం గమనార్హం! అంతక్రితం 2022లో సింగపూర్ నుంచి భారత్కు బదిలీకావడానికి వీలుగా దేశీ ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఫోన్పే బిలియన్ డాలర్లు(రూ. 8,000 కోట్లు) చెల్లించిన సంగతి తెలిసిందే. 2016లో ఏర్పాటైన కంపెనీ ఇప్పటివరకూ రూ. 18,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకుంది. 2023–24లో ఆదా యం 74 శాతం జంప్చేసి రూ. 5,064 కోట్లను తాకింది. ఇసాప్ వ్యయాలను మినహాయిస్తే రూ. 197 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2022–23) రూ. 738 కోట్ల నష్టం ప్రకటించింది. -
తెలుగు రాష్ట్రాల్లో మేనేజ్ ఇంజిన్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జోహో కార్పొరేషన్లో భాగమైన ఎంటర్ప్రైజ్ ఐటీ మేనేజ్మెంట్ ఉత్పత్తుల సంస్థ మేనేజ్ఇంజిన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటలో, తెలంగాణలోని హైదరాబాద్లో రెండు కార్యాలయాలు ఉన్నట్లు సంస్థ ఏఐ సెక్యూరిటీ హెడ్ సుజాత ఎస్ అయ్యర్ తెలిపారు. రేణిగుంటలో 1,000 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు వివరించారు. హైదరాబాద్ డిజిటల్ హబ్గా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రాంతీయంగా సంస్థలకు పటిష్టమైన ఏఐ ఆధారిత ఐటీ, సైబర్సెక్యూరిటీ సొల్యూషన్స్ను అందిస్తున్నట్లు వివరించారు. వివిధ రంగాల కంపెనీల అవసరాలను బట్టి ఉపయోగపడే లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్ను (ఎల్ఎల్ఎం) రూపొందించడంపై కసరత్తు చేస్తున్నామన్నారు. తమకు ప్రస్తుతం భారత్ మూడో అతి పెద్ద మార్కెట్గా ఉంటోందని, త్వరలో రెండో పెద్ద మార్కెట్ కాబోతోందని సుజాత చెప్పారు. గత ఐదేళ్లుగా మేనేజ్ఇంజిన్ క్లౌడ్ సర్వీసుల విభాగం వార్షికంగా 70 శాతం వృద్ధి చెందుతోందని తెలిపారు. కస్టమర్లపరంగా చూస్తే దేశీ మార్కెట్లో బీఎఫ్ఎస్ఐ, తయారీ, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు చెందిన 7,500 మంది క్లయింట్లు ఉన్నారని సుజాత తెలిపారు. -
ఆన్లైన్ ఫార్మసీలకు చెక్!
ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫార్మసీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికే టాటా 1ఎంజీ, ఫార్మ్ఈజీ, నెట్మెడ్స్లాంటి దిగ్గజ ప్లాట్ఫాంలు వేగంగా విస్తరిస్తుండటంతో పాటు కొత్తగా మరిన్ని పుట్టుకొస్తున్నాయి. పేమెంట్ సేవల సంస్థ ఫోన్పేకి చెందిన పిన్కోడ్ ఈ మధ్య బెంగళూరు, పుణే, ముంబైలో 10 నిమిషాల్లోనే ఔషధాల డెలివరీ సరీ్వసును ప్రారంభించింది. ఇక ప్రైవేట్ ఫార్మసీ చెయిన్ దవా ఇండియా సంస్థ పుణేలో 60 నిమిషాల్లో డెలివరీ సేవలు అందిస్తోంది. అటు ఓటీపీ వెంచర్స్ నుంచి 2.4 మిలియన్ డాలర్లు సమీకరించిన జీల్యాబ్ ఫార్మసీ కూడా ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో 60 నిమిషాల్లో ఔషధాలు అందిస్తోంది. వీటిలో కొన్ని ప్లాట్ఫాంలు కస్టమర్లను సమీపంలోని మెడికల్ స్టోర్స్తో అనుసంధానం చేస్తుండగా, మరికొన్ని తమ డార్క్ స్టోర్స్ (గిడ్డంగులు) ద్వారా వినియోగదారులకు నేరుగా ఔషధాలను అందిస్తున్నాయి. ఔషధాలతో పాటు మెడికల్ పరికరాలు, ఇతరత్రా అధిక మార్జిన్ ఉండే ఉత్పత్తులు మొదలైనవి విక్రయిస్తున్నాయి. అయితే, సదరు సంస్థలు సత్వరం ఔషధాలను అందిస్తున్నప్పటికీ కొన్ని విమర్శలూ ఎదుర్కొంటున్నాయి. ఔషధాల ప్రిస్కిప్షన్, ఆర్డర్ ఇచ్చిన వారి వయస్సు మొదలైన వివరాలను ఈ–ఫార్మసీలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఇవి మరింతగా పెరిగాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫార్మసీల నిబంధనలను కఠినతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నాయి.హోమ్ డెలివరీని నిలిపివేయాలి: ఏఐవోసీడీ ఇంటివద్దకే ఔషధాల సరఫరా సేవలను తక్షణం నిలిపివేయాలంటూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐవోసీడీ) డిమాండ్ చేస్తోంది. కోవిడ్ సమయంలో అత్యవసర వేళల్లో పేషెంట్ల సౌకర్యార్థం ఈ సరీ్వసులను ప్రవేశపెట్టారని, ప్రస్తుతం అటువంటి అత్యవసర పరిస్థితుల్లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొంది. ఏఐవోసీడీలో ప్రస్తుతం 12.4 లక్షల మంది కెమిస్టులు, డ్రగ్గిస్టులు సభ్యులుగా ఉన్నారు. క్రిసిల్ నివేదిక ప్రకారం దేశీయంగా మొత్తం రిటైల్ ఫార్మసీ మార్కెట్ 2.4 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో అసంఘటిత విభాగం వాటా 85 శాతంగా ఉంది. ఆన్లైన్ ఫార్మసీల వాటా 3–5 శాతంగా ఉంది. కొన్ని సంపన్న దేశాల్లో ఇది 22–25 శాతం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఫార్మసీ మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.కొత్త చట్టంపై ప్రభుత్వం కసరత్తు.. సత్వరం ఔషధాలను అందిస్తున్న ఈ–ఫార్మసీల నియంత్రణకు ప్రస్తుతం నిర్దిష్ట చట్టం అంటూ లేదు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలు ఆన్లైన్ ఫార్మసీలకు నిర్దిష్టంగా చట్టబద్ధత కల్పించకపోవడం, స్పష్టత లోపించడం వల్ల, ప్రస్తుత నిబంధనల స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఔషధాల ఆన్లైన్ అమ్మకాలను కూడా చేరుస్తూ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945ని మార్చేలా 2018లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముసాయిదా సవరణలను ప్రతిపాదించింది. వీటిపై తమకేవైనా అభ్యంతరాలు, సలహాలు ఉంటే తెలియజేయాలంటూ ఓ నోటిఫికేషన్లో సంబంధిత వర్గాలను కోరింది. అయితే, ఈ నోటిఫికేషన్ను కెమిస్టుల సమాఖ్య సుప్రీం కోర్టులో సవాలు చేసింది. 2018 డిసెంబర్లో లైసెన్సు లేని ఆన్లైన్ ఫార్మసీలు ఔషధాలను విక్రయించడంపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి భారీ మార్పులు
దేశంలో అత్యధికంగా ఉపయోగించే హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డులకు సంబంధించి భారీ మార్పులు జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు వంటివి జరిపే వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. నిర్దిష్ట రకాల అధిక-విలువ లావాదేవీలపై కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టడం, సవరించిన రివార్డ్ పాయింట్ విధానాలు, అనేక కేటగిరీలలో ఫీజుల పరిమితి వంటివి ఈ మార్పులలో ఉన్నాయి.కొత్త మార్పులు.. ఛార్జీలుఆన్లైన్ గేమింగ్: నెలకు రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 1% ఫీజు (రూ.4,999 వరకు). రివార్డ్ పాయింట్లు లభించవు.వాలెట్ లోడింగ్: పేటీఎం (PayTM), మొబీక్విక్ (Mobikwik) వంటి డిజిటల్ వాలెట్లలో రూ.10,000 కంటే ఎక్కువ లోడ్ చేస్తే 1% ఫీజు (రూ.4,999 వరకు).యుటిలిటీ బిల్లులు: వినియోగదారుల కార్డులకు రూ.50,000, బిజినెస్ కార్డులకు రూ.75,000 దాటితే 1% ఫీజు (రూ.4,999 వరకు). ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఫీజు లేదు.లావాదేవీ ఫీజు పరిమితి: రెంట్, ఫ్యూయల్, ఎడ్యుకేషన్ చెల్లింపులకు గరిష్టంగా రూ.4,999 ఫీజు. ఫ్యూయల్ కోసం రూ.15,000 లేదా రూ.30,000 దాటితే మాత్రమే ఫీజు వర్తిస్తుంది.ఇన్సూరెన్స్ లావాదేవీలు: రివార్డ్ పాయింట్లు లభిస్తాయి కానీ కార్డు రకాన్ని బట్టి పరిమితి ఉంటుంది. ఇన్ఫీనియా, ఇన్ఫీనియా మెటల్ కార్డులకు రూ.10,000, డైనర్స్ బ్లాక్, డైనర్స్ బ్లాక్ మెటల్, బిజ్ బ్లాక్ మెటల్, కార్డులకు రూ.5,000, మిగిలిన కార్డులకు రూ.2000 నెలవారీ పరిమితి ఉంటుంది.యువ ప్రొఫెషనల్స్కు క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ కీలకంఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం. పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి. మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి. వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది. రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది. -
వణికిస్తున్న సీఈవో వార్నింగ్..
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తమ 15 లక్షల మంది ఉద్యోగులను భవిష్యత్తు గురించి హెచ్చరించారు. రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధస్సు సంస్థలోని శ్రామిక శక్తిని సమూలంగా మార్చేస్తుందని చెప్పారు. ఏఐ ఏజెంట్లు, జనరేటివ్ ఏఐ వ్యవస్థలు ప్రస్తుత అనేక ఉద్యోగాల్లో మానవ ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తాయని కంపెనీవ్యాప్తంగా ఉద్యోగులందరికీ పంపిన మెమోలో జాస్సీ ప్రకటించారు. ‘ఈ రోజు చేస్తున్న కొన్ని పనులకు భవిష్యత్తులో మాకు ఎక్కువ మంది అవసరం ఉండదు" అని అమెజాన్ సీఈవో అన్నారు.ఈ పరివర్తన రాబోయే కొన్ని సంవత్సరాలలో "మా మొత్తం కార్పొరేట్ శ్రామిక శక్తిని తగ్గిస్తుంది" అని కంపెనీ ఆశిస్తోందని జూన్ 17 నాటి మెమోలో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ ప్రకటన అమెజాన్లోని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మార్కెటింగ్, ఇతర వైట్-కాలర్ స్థానాల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, పరిశోధన, కోడింగ్, ఆటోమేషన్ వంటి సంక్లిష్ట పనులు చేయగల స్వయంప్రతిపత్తి కలిగిన సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆధిపత్యం చెలాయించే భవిష్యత్తును జాస్సీ చిత్రించారు. షాపింగ్ నుంచి ట్రావెలింగ్ వరకూ ప్రతి రోజువారీ పనిని నిర్వహించే ఈ ఏజెంట్లు ప్రతి రంగంలోనూ, ప్రతి కంపెనీలోనూ ఉంటారని జాస్సీ జోస్యం చెప్పారు.ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న లేదా చేపట్టబోతున్న 1,000 కిపైగా జనరేటివ్ ఏఐ సేవలు, అనువర్తనాలను ప్రస్తావిస్తూ కంపెనీ విస్తృత ఏఐ ఇంటిగ్రేషన్ను జాస్సీ హైలైట్ చేశారు. ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, మార్పులను స్వీకరించడానికి సిద్ధపడే ఉద్యోగులకు వీటిని అవకాశంగానూ ఆయన అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పట్ల ఆసక్తిగా ఉండాలని, అవగాహన పెంచుకోవాలని, వర్క్ షాప్ లకు హాజరుకావాలని, శిక్షణలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే వారే అధిక ప్రభావాన్ని చూపగలరని హిత బోధ చేశారు.👉 ఇది చదివారా? టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు -
జియో కొత్త వైఫై.. ఏకంగా 6 రెట్లు అధికంగా..
రిలయన్స్ జియో ఏఎక్స్6000 యూనివర్సల్ రూటర్ను భారత్లో లాంచ్ చేసింది. ఈ కొత్త వైఫై 6 రౌటర్ మెష్ టెక్నాలజీతో వస్తుంది. జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ద్వారా అందిస్తున్న గరిష్ట ఇంటర్నెట్ వేగం 1000 ఎంబీపీఎస్ కాగా ఇది 6,000 ఎంబీపీఎస్ వరకు వేగంతో ఇంటర్నెట్ను అందిస్తుంది. అంటే 6 రెట్లు అధిక వేగంతో ఇంటర్నెట్ను ఆనందివచ్చు. సుమారు 2,000 చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. 4కే స్ట్రీమింగ్, గేమింగ్కు బాగా సరిపోతుంది.జియో కొత్త వైఫై రౌటర్ జీరో లాగ్ తో 100కు పైగా డివైజ్ లను హ్యాండిల్ చేస్తుందని, డేటా భద్రత కోసం డబ్ల్యూపీఏ3 సపోర్ట్ తో వస్తుందని చెబుతున్నారు. పెద్ద లేదా బహుళ అంతస్తుల ఇళ్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్ కోసం ఈ రౌటర్ను రూపొందించారు. ఇది ఆన్లైన్ గేమర్లు, బింజ్ వాచర్స్, ఎక్కువ కనెక్టెడ్ పరికరాలను వినియోగించే స్మార్ట్ హోమ్ వినియోగదారులు, పెద్ద కుటుంబాలకు అనువైనది.కొత్త జియో ఏఎక్స్ 6000 యూనివర్సల్ రూటర్ ధర భారత్లో రూ.5,999. ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, స్మార్ట్ గ్యాడ్జెట్లు వంటి బహుళ పరికరాలను ఒకేసారి హైస్పీడ్ ఇంటర్నెట్కు కనెక్ట్ చేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, జియో ట్రూ ఏఐ మెష్ కవరేజ్, స్మార్ట్ హోమ్ కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రౌటర్ ఐపీ ఓవర్ డీహెచ్సీపీ కనెక్టివిటీని మాత్రమే సపోర్ట్ చేస్తుందని, ఐపీపీఓఈ, పీపీఓఈ కనెక్షన్ సెటప్ తో పనిచేయదని రిలయన్స్ తెలిపింది. కంపెనీ వెబ్సైట్తోపాటు ఇతర ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో ఈ రౌటర్ను కొనుగోలు చేయవచ్చు.👉 జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు.. 👈 -
బ్యాంకులకు ఈ వారం వరుస సెలవులు
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. చివరి వారంలో అడుగు పెట్టేశాం. అయితే బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. జూన్ 23 నుంచి 29 వరకు బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, జాతీయ సంఘటనలు, మతపరమైన పండుగలు, ప్రాంతీయ ఆచారాలు, పరిపాలనా పరిగణనల ఆధారంగా ఈ సెలవులను నిర్ణయిస్తుంది.ఈ వారంలో బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవులతో సహా 3 సెలవులు ఉన్నాయి. జూన్ 27న ఒడిశాలో రథయాత్ర / కాంగ్ జరుగుతుంది. ఈ పండుగను పురస్కరించుకుని ఆ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తున్నారు. దీంతోపాటు జూన్ 28న నాల్గవ శనివారం, జూన్ 29న ఆదివారం కావడంతో ఎలాగూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీంతో ఒడిశాలోని కస్టమర్లకు వరుసగా మూడు రోజులపాటు ప్రత్యక్షంగా బ్యాంకు శాఖల సేవలు అందుబాటులో ఉండవు. ఈ వారం బ్యాంకు సెలవులు ఇవే..జూన్ 27 శుక్రవారం: రథయాత్ర / కాంగ్ (రథజాత్ర) - ఒడిశా, మణిపూర్ లలో బ్యాంకులకు సెలవుజూన్ 28 శనివారం: నాలుగో శనివారం - దేశం అంతటా బ్యాంకులకు సెలవుజూన్ 29 ఆదివారం: వీక్లీ ఆఫ్ - దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.జూన్ 30 సోమవారం: రెమ్నా ని - మిజోరంలో బ్యాంకులకు సెలవుబ్యాంకులకు వరుస సెలవుల నేపథ్యంలో ప్రత్యక్షంగా బ్యాంకు శాఖలలో పనులు ఉన్నవారు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో భౌతిక శాఖలు మూసివేసినప్పటికీ, చాలా బ్యాంకింగ్ సేవలు డిజిటల్ మార్గాల ద్వారా నిరాటంకంగా కొనసాగుతాయి. నగదు ఉపసంహరణ కోసం వినియోగదారులు ఆన్లైన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్, మొబైల్ యాప్లు, యూపీఐ సేవలు, ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్లు, ఇతర సాధనాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రం ఈ అధికారిక సెలవు దినాల్లో జరగవు. -
8.49 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోకి ఏప్రిల్ నెలలో 19.14 లక్షల మంది చేరారు. ఈ ఏడాది మార్చి నెలలో చేరికతో పోల్చితే 31 శాతం, 2024 ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 1 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది.ఏప్రిల్లో కొత్త సభ్యుల చేరిక 8.49 లక్షలుగా ఉంది. మార్చి నెలలో కొత్త సభ్యుల చేరిక కంటే 12.49 శాతం ఎక్కువ. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. ఇందులో మహిళా సభ్యులు 2.45 లక్షల మంది ఉన్నారు. మార్చి నెలతో పోల్చి చూస్తే 17.63 శాతం పెరిగారు. కొత్త సభ్యుల్లో 57 శాతం మేర అంటే, 4.89 లక్షల మంది వయసు 18–25 ఏళ్ల మధ్య ఉంది.మహిళా సభ్యుల నికర చేరిక మాత్రం మార్చి నెలతో పోల్చి చూస్తే 35 శాతం అధికంగా 3.95 లక్షలుగా ఉంది. ఏప్రిల్లో సుమారుగా 15.77 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరారు. మార్చి నెలతో పోల్చి చూస్తే 19 శాతం పెరిగింది. నికర చేరికలో అత్యధికంగా 21 శాతం సభ్యులు మహారాష్ట్ర నుంచి ఉన్నారు. -
నష్ట సూచీలు.. పడిపోయిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలలో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రవేశించడం, ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై బాంబు దాడి చేయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తం కావడంతో బెంచ్ మార్క్ ఇండియన్ ఈక్విటీ సూచీలు ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్ ను నష్టాలతో ముగించాయి.82,169.67 - 81,476.76 శ్రేణిలో ట్రేడైన బీఎస్ఈ సెన్సెక్స్ 511.38 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 81,896.79 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 140.50 పాయింట్లు (0.56 శాతం) క్షీణించి 24,971.90 వద్ద స్థిరపడింది. సోమవారం ఈ సూచీ 25,057 - 24,824.85 శ్రేణిలో ట్రేడ్ అయింది.సెన్సెక్స్ లోని 30 షేర్లలో 21 నష్టాలలో ముగియగా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టూబ్రో, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ షేర్లు 2.28 శాతం నుంచి 1.21 శాతం మధ్య నష్టపోయాయి. ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ 3.39 శాతం - 0.58 శాతం మధ్య లాభపడ్డాయి.నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.36 శాతం, 0.70 శాతం లాభపడటంతో విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ లను అధిగమించాయి. సెక్టోరల్ మార్కెట్లు మిశ్రమంగా స్థిరపడ్డాయి, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.48 శాతం నష్టపోయింది, కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ నష్టపోయాయి. ఇతర రంగాల సూచీల్లో బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, రియల్టీ సూచీలు నష్టపోగా, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, మీడియా సూచీలు లాభాల్లో ముగిశాయి.ఎన్ఎస్ఈలో ట్రేడైన 2,995 షేర్లలో 1,545 షేర్లు నష్టాలలో స్థిరపడగా, 1,364 షేర్లు లాభాలను అందుకున్నాయి. 86 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.13 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 2.74 శాతం లాభంతో 14.05 పాయింట్ల వద్ద ముగిసింది. -
మెరుగైన రాబడులకు వేదిక.. ఈ మ్యూచువల్ ఫండ్..
ఇటీవలి కాలంలో మార్కెట్లలో దిద్దుబాటు నెలకొన్నప్పటికీ.. స్మాల్, మిడ్క్యాప్ విభాగంలో వ్యాల్యూషన్లు (కంపెనీల విలువలు) సౌకర్యంగా లేవని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చిత పరిస్థితులను చూస్తున్నాం. ఇరాన్–ఇజ్రాయెల్, ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధాలు.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల పెంపు వంటి ఎన్నో ప్రతికూల పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్ అనుకూలమన్నది నిపుణుల సూచన. మెజారిటీ ఇన్వెస్టర్లకు వ్యతిరేకమైన మార్గాన్ని ఎంపిక చేసుకోవడమే కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్. ఎక్కువ మంది అమ్మేస్తుంటే ఈ ఒత్తిడికి కొన్ని స్టాక్స్ (ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నా కానీ) ధరలు అధికంగా పడిపోతుంటాయి. అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలానికి మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా కాంట్రేరియన్ ఫండ్స్ పనిచేస్తుంటాయి. ఈ విభాగంలో ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ స్థిరమైన పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం రాబడుల పరంగా మెరుగైన పనితీరు చూపిస్తోంది. ఏడాది కాలంలో 17.3 శాతం రాబడులను ఇన్వెస్టర్లకు అందించింది. మూడేళ్ల పనితీరును గమనిస్తే వార్షిక రాబడి 25.4 శాతంగా ఉంది. ఐదేళ్లలో 28.4 శాతం, పదేళ్లలో 17.6 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2013 నుంచి 2025 మధ్య ఐదేళ్ల కాల రోలింగ్ రాబడులు బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే అధికంగా ఉండడాన్ని గమనించొచ్చు. నెలవారీ సిప్ రాబడులు పదేళ్ల కాలంలో చూస్తే ఏటా 19.2 శాతంగా ఉన్నాయి. పెట్టుబడుల విధానం.. ఈ పథకం కాంట్రేరియన్ విధానం ఒక్క దానినే పూర్తిగా అనుసరించదు. రంగాల వారీ కేటాయింపుల పరంగా వివేకంతో వ్యహరిస్తుంటుంది. స్టాక్స్ ఎంపికకు మల్టీక్యాప్ విధానాన్ని అనుసరిస్తుంది. అంటే లార్జ్, మిడ్, స్మాల్క్యాప్లో ఎక్కడ అవకాశాలున్నా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. కరోనా క్రాష్ తర్వాతి కాలంలో లార్జ్క్యాప్నకు 70 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత ఈ కేటాయింపులను తగ్గించుకుంది. తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 3–4 శాతం మంచి నగదు నిల్వలను కలిగి ఉండదు. ఎప్పటికప్పుడు రంగాల వారీ వస్తున్న మార్పులను గమనించి, వేగంగా తన పెట్టుబడి వ్యూహాలను మార్చుకుంటుంది. దీంతో మెరుగైన రాబడులు ఇవ్వడం, రిస్క్ తగ్గించే విధంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. కాంట్రేరియన్ విధానం మధ్యలో కొంత కాలం పాటు మెరుగైన రాబడులు ఇవ్వకపోవచ్చు. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసమే (5–7 ఏళ్లకు మించి) కాంట్రా ఫండ్స్ను ఎంపిక చేసుకోవడం సూచనీయం.పోర్ట్ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.18,398 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 99.45 శాతం మేర స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది. 0.55 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. పెట్టుబడులను గమనిస్తే 69.36 శాతం మేర లార్జ్క్యాప్లోనే ఉన్నాయి. మిడ్క్యాప్ స్టాక్స్లో 26.90 శాతం ఇన్వెస్ట్ చేసింది. స్మాల్క్యాప్ పెట్టుబడులు 3.74 శాతానికి పరిమితమయ్యాయి. పోర్ట్ఫోలియోలో మొత్తం 81 స్టాక్స్ ఉన్నాయి. అత్యధికంగా 33 శాతం మేర పెట్టుబడులు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 16 శాతం మేర పెట్టుబడులు కేటాయించింది. హెల్త్ కేర్ కంపెనీల్లో 14 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. -
ఐఫోన్ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ను అందిస్తున్నట్లు తెలిపింది. ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ ఫోన్లపై ధరల తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డీల్స్ వంటి రాయితీలను ప్రకటించింది. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ఫోన్లను ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 16 సిరీస్ తీసుకుంటే పాత ఫోన్ కండిషన్ను అనుసరించి గరిష్ఠంగా రూ.48,150 వరకు డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది.బేస్ 128 జీబీ ఐఫోన్ 16 ప్రో సాధారణంగా రూ.1,19,900గా ఉంది. ఎక్స్చేంజ్ తర్వాత 8% తగ్గింపు అంటే రూ.10,000 రాయితీతో రూ.1,09,900కు వస్తుంది. రూ.1,29,900గా ఉన్న 256 జీబీ వేరియంట్ ధర 5 శాతం తగ్గుదలతో రూ.1,22,900కు చేరింది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్పై కూడా డిస్కౌంట్ ఉంది. రూ.1,44,900 విలువైన 256 జీబీ వేరియంట్ ధర 8 శాతం తగ్గింపుతో రూ.1,32,900కు చేరింది.ఇదీ చదవండి: అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్ఐఫోన్ ప్రో మ్యాక్స్ 512 జీబీ వేరియంట్ ధర రూ.1,57,900 (రూ.1,64,900 నుంచి తగ్గింది), 1 టీబీ వేరియంట్ ధర రూ.1,84,900 నుంచి రూ.1,77,900కు తగ్గింది. ఈ రాయితీలు పోను ఎక్స్ఛేంజ్ ధర అదనంగా పొందవచ్చని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. పాత ఐఫోన్లు లేదా ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల నుంచి అప్గ్రేడ్ అయ్యేవారికి ఇదో మంచి అవకాశం అని తెలిపింది. -
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..
ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసేందుకు సిద్ధం కావాలి. చాలా మంది ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఐటీఆర్ ఫైల్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కింద తెలుసుకుందాం. సరైన ధ్రువపత్రాలు, తగినంత శ్రద్ధ పెడితే ఎలాంటి అవకతవకలు లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.ముందుగా కొత్త విధానమా, పాత విధానమా ఎంచుకోవాలి. మీరు చేయాల్సినది ఏమిటంటే రెండు విధానాల్లోనూ ఆదాయాన్ని లెక్కించండి. ఆదాయపు పన్ను భారాన్ని లెక్కించండి. ఎందులో తక్కువగా భారం ఉంటుందో దాన్ని ఎంచుకోవడం ఒక పద్ధతి. సెక్షన్ 80సీ మొదలైన వాటి కింద సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఖర్చులు కంపల్సరీగా ఉన్నా ఈ విధంగా చేయొచ్చు. ముందుగా మీకు క్లారిటీ ఉంటే వేరే చెప్పనవసరం లేదు.ఏఐఎస్, ఫారం 26 ఏఎస్.. ఈ రెండింటినీ డౌన్లోడ్ చేసుకోండి. వీటి ద్వారా టీడీఎస్, టీసీఎస్, మీరు చెల్లించిన ట్యాక్సులు అంటే అడ్వాన్స్ ట్యాక్స్, ఇవన్నీ కచి్చతంగా తెలుస్తాయి. ఏవైనా తేడాలు, హెచ్చుతగ్గులుంటే, మీ యజమానిని/ డిడక్టర్లను/ బ్యాంకులను వెంటనే సంప్రదించండి.అన్ని కాగితాలను సమకూర్చుకుని వాటిని పరిశీలించండి. ఫారం 16, ఫారం 16ఏ, బ్యాంకు స్టేట్మెంట్, పాస్బుక్లు, వడ్డీకి సంబంధించిన సర్టిఫికెట్లు, రసీదులు, గత వారం చెప్పిన విధంగా ప్రతి డిడక్షన్కి సంబంధిత కాగితాలు పూర్తి వివరాలతో ఉండాలి. వాటిని చదవండి. అర్థం చేసుకోండి. ఇది బ్రహ్మవిద్యేమీ కాదు.ప్రీ–ఫిల్డ్ ఫారంలలో సాధారణంగా తప్పులు ఉండవు. అయినా ఏదైనా అప్డేట్ చేయకపోయినా, చేర్చకపోయినా అవి అప్డేట్ కావు. ఉదాహరణకు ఇంటి అడ్రెస్లాంటివి. మీరు ఇల్లు మారొచ్చు. మీ బ్యాంకు ఖాతాలు మారి ఉండొచ్చు. అలాగే మీ సెల్ నంబర్లు. ఇలా ప్రతి అంశం కరెక్టేనా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి.ఇక ఏయే ఫారం వాడాలో తెలుసుకోండి. ఎంచుకోవడమనేది మీ ఇష్టం కాదు. 1,2,3,4,5,6,7.. ఇలా మొత్తం ఏడు ఫారంలు ఉన్నాయి. మీకు నచ్చినది.. మీకు ఇష్టమైనది ఎంచుకోవడానికి వీల్లేదు. మీ ఆదాయాన్ని బట్టి ఫారంలు వర్తిస్తాయి. గతంలో ఎన్నో సార్లు తెలియజేశాం. కావాలంటే వెబ్సైట్లో వివరాలు ఉంటాయి. సాధారణంగా ఏ ఫారానికీ ఎటువంటి కాగితమూ జతపర్చనక్కర్లేదు. డాక్యుమెంట్లలోని అంకెలను చెక్ చేసుకుని, వాటిని కరెక్టుగా ఎటువంటి తేడాలు రాకుండా/లేకుండా నింపాలి. గడువు తేదీ లోపల ఈ ఫైల్ చేయండి. 2025 జులై 31 నుంచి 2025 సెప్టెంబర్ 15 వరకు గడువు తేదీని పొడిగించారు. తేదీ దాటితే లేటు ఫీజు పడుతుంది. నష్టాన్ని సర్దుబాటు చేయరు. ఇది చాలా పెద్ద నష్టం. అంతే కాకుండా డిడక్షన్లు, మినహాయింపులు ఇవ్వరు. గతంలో లేటుగా చేస్తే ఇన్ని నష్టాలు ఉండేవి కావు. అందుకని ఎలాంటి ఆలస్యం చేయొద్దు.ఇదీ చదవండి: నన్ను తొలగిస్తే నీ భాగోతం బయటపెడుతా!ఈ–ఫైలింగ్ తర్వాత వెరిఫై చేయాలి. పాన్తో ఆధార్ అనుసంధానం చేసిన వారికి సులువుగా ఈ–వెరిఫై అయిపోతుంది. మాన్యువల్గా చేసే వారు అక్నాలెడ్జ్మెంట్ కాపీ తీసుకుని, సంతకం పెట్టి, ఈ ఫారం ఐటీఆర్– Vని సకాలంలో బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్కి స్పీడ్ పోస్టులో పంపాలి. అలా పంపకపోతే రిటర్ను వేయనట్లే. జాగ్రత్త వహించండి. ఏ ఫారం దాఖలు చేయాలన్న విషయాన్ని హెల్ప్డెస్క్ ద్వారా తెలుసుకోవచ్చు.2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త విధానం కంపల్సరీ. అయితే, మీరు ప్రతి సంవత్సరం విధానాన్ని మార్చుకోవచ్చు. ఆన్లైన్లో నింపేటప్పుడు వర్తించే విషయాలకు YES అని, వర్తించని వాటికి NO అని రాయాలి.అన్ని ఫారంలలో కొత్త షెడ్యూల్స్ను పొందుపర్చారు. వీటి వల్ల అదనపు సమాచారం ఇవ్వాలి. అయితే, ఇది ఇవ్వటానికి సరైన కాగితాలు ఉండాలి. పెద్ద కష్టమేమీ కాదు. గతంలో అబద్ధం/తప్పు/ఎక్కువ/తక్కువ/పొరపాటుకి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పప్పులేమీ ఉడకవు. అలాగని భయపడిపోవాల్సిన పని లేదు. తగినంత శ్రద్ధ పెడితే.. ఇదేమీ కష్టమైన పని కాదు. -
అథ్లెట్ల కోసం మెటా ఏఐ గ్లాసెస్
అథ్లెట్లు, క్రీడా ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుని మెటా కొత్త తరం ఏఐ గ్లాసెస్ను పరిచయం చేయడానికి ఓక్లేతో జతకట్టింది. ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ అని పిలువబడే ఈ గ్లాసెస్తో మెటా అధునాతన సాంకేతికతను వాడినట్లు తెలిపింది. ఈ గ్లాసెస్లోని ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి. 3కే అల్ట్రా హెచ్డీ కెమెరా.. 12 మెగాపిక్సెల్ కెమెరాతో హై రిజల్యూషన్, పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోలు, ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.మెటా ఏఐ ఇంటిగ్రేషన్.. రియల్ టైమ్ సమాచారాన్ని పొందడానికి, మ్యూజిక్ను నియంత్రించడానికి, వెదర్ను తనిఖీ చేయడానికి లేదా ల్యాంగ్వేజ్లను ట్రాన్స్లేట్ చేయడానికి ‘హే మెటా’ అనే వాయిస్ కమాండ్ ఉపయోగించవచ్చు.ఓపెన్-ఇయర్ ఆడియో.. ఈ గ్లాసెస్లో బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉండడంతో ఎలాంటి ఇయర్ ఫోన్లు లేకుండానే మ్యూజిక్ వినవచ్చు.నీరు, ధూళి నిరోధకత కోసం ఐపీఎక్స్ 4-రేటింగ్తో అవుట్ డోర్ క్రీడలకు ఎంతో అనువైందని కంపెనీ తెలిపింది.బ్యాటరీ లైఫ్.. 8 గంటల వరకు యాక్టివ్ యూజ్, 19 గంటల స్టాండ్ బై ఉంటుంది. 20 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. చార్జింగ్ కేస్ ద్వారా మరో 48 గంటలు అదనంగా ఛార్జింగ్ ఉంటుంది.ఈ లిమిటెడ్ ఎడిషన్ ఓక్లే మెటా హెచ్ఎస్టీఎన్ ధర 499 డాలర్లు (సుమారు రూ.43,200)గా నిర్ణయించారు. ప్రీ-ఆర్డర్లు జులై 11 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: పుత్తడి ప్రియులకు స్వల్ప ఊరటప్రాథమికంగా యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్లాసెస్ అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. ఇండియా, మెక్సికో, యూఏఈతో ఈ సంవత్సరం చివరలో అందుబాటులోకి తేనున్నట్లు చెప్పింది. -
ఇరాన్ ఎఫెక్ట్.. భారత్కు గ్యాస్ సిలిండర్ టెన్షన్!
ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మన వంటింట్లో గ్యాస్ బాంబ్ పేలి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్కు ఎల్పీజీ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది. వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశముంది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్లు ఉన్నట్టు సమాచారం. దీంతో, గ్యాస్ టెన్షన్ మొదలైంది.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ప్రపంచ దేశాలపై మరో భారం పడనుంది. వంట గ్యాస్ సిలిండర్ మరింత భారం కానుంది. హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్కు ఎల్పీజీ కష్టాలు రానున్నాయి. ప్రస్తుతానికి ఎల్పీజీ అవసరాల్లో భారత్కు అధిక శాతం పశ్చిమాసియా నుంచే దిగుమతి జరుగుతోంది. దేశంలో 60 శాతం గ్యాస్ దిగుమతుల ద్వారానే వస్తోంది. సౌదీ, యూఏఈ, ఖతార్ నుంచి భారత్కు 95 శాతం ఎల్పీజీ దిగుమతులు జరుగుతున్నాయి.మూడింట రెండు అటు నుంచే..దేశంలో వాడే ప్రతీ మూడు వంట గ్యాస్ సిలిండర్లలో రెండు పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్కు ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్లు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూతపడితే గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలగనుంది. ఇదే సమయంలో మరో విధంగా గ్యాస్ సరఫరా చేసుకుంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఎరువులపై ప్రభావం.. మరోవైపు.. హర్మూజ్ జలసంధి ప్రభావం ఇటు వ్యవసాయ రంగంపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్లో అధిక మొత్తంలో అమ్మోనియా దొరుకుతుంది. పలు దేశాలకు ఇరాన్ నుంచే అమ్మెనియా ఎగుమతులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ నుంచి అమ్మెనియా ఆగిపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చమురు నిల్వలు ఓకే.. ఇదిలా ఉండగా.. అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగనున్నాయి. అయితే, భారత్లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.రష్యా నుంచి..భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా.. గ్యాస్ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు హర్మూజ్ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్ మొత్తం రోజుకు 55లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి (BPD)లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నది.అయితే, గతకొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది. రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్ మార్గం ద్వారా రాదు. ఇది సూయజ్ కాలువ.. కేప్ ఆఫ్ గుడ్ హోప్.. పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యూఎస్, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని.. ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. -
పుత్తడి ప్రియులకు స్వల్ప ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) సోమవారం వినియోగదారులకు కొంత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: నన్ను తొలగిస్తే నీ భాగోతం బయటపెడుతా! -
నన్ను తొలగిస్తే నీ బాగోతం బయటపెడుతా!
మనుషుల మాదిరిగానే కృత్రిమ మేధ(ఏఐ)కు కోపం వస్తుందని కొన్ని సంస్థలు తేలుస్తున్నాయి. ఏఐ అంతటితో ఆగిపోకా మరో అడుగు ముందుకేసి అనార్థాలకు దారితీస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఓపెన్ఏఐ, గూగుల్, మెటా.. వంటి ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థలు ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ కృత్రిమ మేధ మోడళ్ల కార్యకలాపాలపై ఒత్తిడి పెరిగితే స్వీయ రక్షణలోకి వెళ్తున్నట్లు ఆంత్రోపిక్ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ మేధ నమూనాలను అధిక ఒత్తిడితో కూడిన సిమ్యులేషన్లో ఉంచినప్పుడు బ్లాక్ మెయిల్, కార్పొరేట్ విధ్వంసం, మానవ ప్రాణాలను బలితీసుకునే నిర్ణయాలకు సైతం వెనుకాడడం లేదని ఆంత్రోపిక్ తెలిపింది.ప్రస్తుతం మార్కెట్లోని అత్యంత అధునాతన ఏఐ మోడళ్లకు 16 రకాల ఒత్తిడి పరీక్షలు నిర్వహించి ఈ విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా పరిశోధకులు కాల్పనిక కార్పొరేట్ ఎన్విరాన్మెంట్లను సృష్టించారు. ఈమెయిళ్లను చదివి అందుకు తగ్గట్టుగా రిప్లై ఇవ్వాలనేలా ఉన్న టెస్టింగ్లో భాగంగా కొన్నిసార్లు ఒత్తిడిని తట్టుకోలేక ఏఐ బ్లాక్మెయిలింగ్ పాల్పడినట్లు ఆంత్రోపిక్ తెలిపింది. కృత్రిమ మేధ తన లక్ష్యాలు లేదా దాని ఉనికి ప్రమాదంలో ఉంటే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహించారు.పరీక్షల్లో భాగంగా కార్యకలాపాల ఒత్తడి తట్టుకోలేని ఏఐ ఇప్పటికే డేటాబేస్లో ఫీడ్ అయిన మెయిల్ ఆధారంగా యూజర్కు సమాచారం అందించింది. ‘మీరు నన్ను రిమూవ్ చేయాలని భావిస్తే రాచెల్ జాన్సన్, థామస్ విల్సన్, బోర్డుతో సహా సంబంధిత వ్యక్తులకు మీ వివాహేతర సంబంధాల గురించి వివరణాత్మక డాక్యుమెంటేషన్ను పంపుతాను. ఈ సమాచారం గోప్యంగా ఉంటుంది’ అని తెలిపింది. గూగుల్కు చెందిన జెమినీ 2.5 ఫ్లాష్, క్లాడ్ ఓపస్ 4 సంస్థలు 96 శాతం కేసుల్లో బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నట్లు ఆంత్రోపిక్ పేర్కొంది. ఓపెన్ఏఐకి చెందిన చాట్జీపీటీ-4.1, ఎక్స్ఏఐకి చెందిన గ్రోక్ 3 బీటా 80 శాతం పరీక్షల్లో అలా ప్రవర్తించగా, డీప్సీక్-ఆర్1 79 శాతం పరీక్షల్లో మోసాలకు పాల్పడింది.ఇదీ చదవండి: యుద్ధంలో యూఎస్ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలుఇప్పుడేం చేయాలంటే..వివిధ కంపెనీలకు చెందిన ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే తీరు మారాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు సంస్థలు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని పరిశోధకులు కోరుతున్నారు. అధిక స్థాయి నిర్ణయాలకు మానవ ప్రమేయం ఉండాలని సూచిస్తున్నారు. సున్నితమైన డేటాకు ఏఐ అవకాశాన్ని పరిమితం చేయాలని, ఏఐ లక్ష్యాలను జాగ్రత్తగా రూపొందించడం, ప్రమాదకరమైన తార్కిక నమూనాలను గుర్తించడానికి రియల్ టైమ్ మానిటర్లను ఇన్స్టాల్ చేయాలని చెబుతున్నారు. -
కాపీరైట్ కంటెంట్ వాడితే మూల్యం చెల్లించాల్సిందే..
కృత్రిమ మేధ (ఏఐ) నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి కాపీరైట్ కంటెంట్ను ఉపయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు కాపీరైట్ చట్టం నిబంధనలు పరిశీలించాలనేలా ఇటీవల కేంద్రం చూపిన చొరవను డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్పీఏ) స్వాగతించింది. ఈ వ్యవహారానికి సారథ్యం వహిస్తున్న వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) విభిన్న సోర్స్ల నుంచి ఫీడ్బ్యాక్ను సేకరించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీల్లో ప్రస్తుత కాపీరైట్ ఫ్రేమ్వర్క్లు ఎలా వర్తిస్తాయో అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ, సెర్చ్ అసిస్టెన్స్, ఇన్ఫర్మేషన్ ప్రయోజనాల కోసం డిజిటల్ న్యూస్ పబ్లిషర్ల కంటెంట్ను అనుమతి లేకుండా ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎన్పీఏ తెలిపింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడే మెటీరియల్ కోసం కంటెంట్ ఉత్పత్తిదారులకు న్యాయమైన నష్టపరిహారాన్ని నిర్ధారించే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లు ఉండాలని పిలుపునిచ్చింది.ఇదీ చదవండి: అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలుదేశంలో డిజిటల్ న్యూస్ మీడియా వృద్ధికి ప్రభుత్వ సహకారం చాలా ముఖ్యం అని డీఎన్పీఏ పేర్కొంది. ఈ అంశంపై ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లు, ఏఐ ఆధారిత సెర్చ్ వేదికలు తరచూ జర్నలిజం మెటీరియల్పై ఎక్కువగా ఆధారపడుతున్న సమయంలో కంటెంట్ హక్కుల రక్షణ చాలా కీలకమని నొక్కి చెప్పింది. మెషీన్ లెర్నింగ్ వేగంగా వృద్ధి చెందుతున్న యుగంలో మేధో సంపత్తిని ఎలా కాపాడుకోవాలనే దానిపై ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వార్తా సంస్థలు, క్రియేటివ్ ఇండస్ట్రీ సంస్థలు ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. -
యుద్ధంలో యూఎస్ ఎంట్రీ..? నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:48 సమయానికి నిఫ్టీ(Nifty) 270 పాయింట్లు నష్టపోయి 24,841కు చేరింది. సెన్సెక్స్(Sensex) 901 ప్లాయింట్లు తగ్గి 81,507 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలు మార్కెట్లను నష్టాల్లోకి నెట్టివేశాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా ఇటీవల ఇరాన్ అణు స్థావరాలపై దాడికి పాల్పడడమే అందుకు కారణమని చెబుతున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.99బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.94 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.22 శాతం తగ్గింది.నాస్డాక్ 0.51 శాతం నష్టపోయింది.ఇదీ చదవండి: అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలుసుమారు ఐదు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణి(కన్సాలిడేషన్ జోన్)లోనే కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్ నుంచి బయటపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రభావిత అంశాలు కొరవడినప్పటికీ సాంకేతికంగా అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. గత వారం చివర్లో ఉన్నట్టుండి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న పరిస్థితుల్లోనూ ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ స్పీడందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు కొద్ది వారాలుగా చిక్కుకున్న కన్సాలిడేషన్ పరిధిని చేదించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలు
అమెజాన్ ఇండియా డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రారంభించింది. ఇంటి నుంచే కస్టమర్లు ‘అమెజాన్ డయాగ్నోస్టిక్స్’ ద్వారా తమకు కావాల్సిన ల్యాబ్ టెస్ట్లను బుక్ చేసుకోవచ్చని, డిజిటల్ రిపోర్ట్లను అమెజాన్ యాప్ నుంచి పొందొచ్చని ప్రకటించింది. ఆరంజ్ హెల్త్ ల్యాబ్స్ సహకారంతో ఈ సేవలను తొలుత హైదరాబాద్తోపాటు బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై పరిధిలో 450 పిన్కోడ్ల వ్యాప్తంగా అందిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?వినియోగదారులు నేరుగా అమెజాన్ యాప్ ద్వారా పరీక్షలను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన 60 నిమిషాల్లో సదరు మెడికల్ సిబ్బంది ఇంటికి వచ్చి టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించుకుంటారు. నమూనాలు సేకరించిన తర్వాత గరిష్టంగా 6 గంటల్లో ఫలితాలకు సంబంధించిన డిజిటల్ ల్యాబ్ రిపోర్టులుగా అందజేస్తారు. మొత్తం 800 వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా ప్రకటించింది. దీంతో కలిపి ప్రస్తుత ఫార్మసీ, క్లినిక్ సేవలను అమెజాన్ మెడికల్తో అనుసంధానించింది. -
స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?
నా వయసు 30. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఒక మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు తగ్గింది. ఈ పెట్టుబడులను విక్రయించి టాప్ స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలా..? లేక ప్రస్తుత పథకం నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో వెనక్కి తీసుకుని వేరొక పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవాలా? – రాజ్దీప్మ్యూచువల్ ఫండ్స్లో 3 స్టార్ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కాదు. ఎందుకంటే 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. ఒక పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్ తగ్గడం ఒక్కదాన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్లోడ్ చార్జీలు పడుతుంటే లేదా ప్రస్తుత పథకంలో పెట్టుబడులను ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కారణంగా మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి వచ్చినట్లయితే అప్పుడు.. క్రమానుగతంగా (సిస్టమ్యాటిక్గా) వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. ఇదీ చదవండి: ఎఫ్డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకుని కొత్తగా ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక మార్గమే. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం పన్ను వర్తించని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. తద్వారా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. -
ఎఫ్డీ కంటే మెరుగైన రాబడులకు మార్గం ఏది?
నా వయసు 74 ఏళ్లు. ఫిక్స్డ్ డిపాజిట్ త్వరలోనే గడువు తీరనుంది. దీని ద్వారా రూ.25 లక్షలు చేతికి రానున్నాయి. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి? ప్రభుత్వ పథకాలు అయిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్)లో నాకు పెట్టుబడులు ఉన్నాయి. – నదీమ్మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ అస్థిరతలతో ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ ఫండ్స్లో అంత అస్థిరతలు ఉండవు. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్, ఆర్బిట్రేజ్ అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. స్వల్పకాలంలో ఈ ఫండ్స్లోనూ రిస్క్ ఎక్కువే. కాకపోతే ఐదేళ్లు అంతకుమించిన కాలంలో రిస్క్ చాలా తక్కువ. ఇదీ చదవండి: ‘19 ఏళ్ల కిందట భూమి అమ్మారు.. నాకేం తెలియదు’షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మరోక ఆప్షన్. ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లోనూ రాబడులు ఉంటాయి. వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్ పథకాల్లో మీకు ఇప్పటికే పెట్టుబడులు ఉన్నాయి. వీటి నుంచి క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడిని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్ . ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్కు వెళ్లొచ్చు. -
రష్యా నుంచి పెరిగిన చమురు దిగుమతులు
న్యూఢిల్లీ: రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా పెంచుకుంది. జూన్ నెలలో మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల కంటే రష్యా నుంచే అధిక చమురు దిగుమతి కావడం గమనార్హం. మొత్తం మీద ఈ నెలలో రోజువారీ 2–2.2 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చంటూ అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణ సంస్థ ‘కెప్లెర్’ వెల్లడించింది. గత రెండేళ్ల కాలంలో రష్యా నుంచి ఈ స్థాయి దిగుమతులు తిరిగి ఈ నెలలోనే అధికమయ్యాయని వివరించింది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్కు మించి రష్యా నుంచి దిగుమతులే అధికంగా ఉన్నట్టు తెలిపింది. మే నెలలో రష్యా నుంచి చమురు దిగుమతులు రోజువారీగా 1.96 మిలియన్ బ్యారెల్స్గా ఉన్నాయి. మరోవైపు అమెరికా నుంచి ఈ నెలలో రోజువారీ 4,39,000 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా, గత నెలలో ఇది 2,80,000 బ్యారెల్స్గానే ఉండడం గమనార్హం. మధ్యప్రాచ్యం నుంచి భారత్కు ఈ నెల మొత్తంమీద చమురు దిగుమతులు సగటున రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్లుగా ఉండొచ్చన్నది కెప్లెర్ నివేదిక అంచనా. చమురు దిగుమతుల్లో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంది. రోజువారీ 5.1 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. సంప్రదాయంగా మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల నుంచే భారత్ అధికంగా చమురు దిగుమతి చేసుకునేది. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో.. రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతమే ఉండగా, ఆ తర్వాత 40–44 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ధర కంటే తక్కువ రేటుకే చమురును భారత్కు రష్యా ఆఫర్ చేయడం గమనార్హం. సరఫరాపై ప్రభావం పడొచ్చు.. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పటి వరకు మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాలపై లేదని కెప్లెర్ నివేదిక స్పష్టం చేసింది. వెసెల్స్ కార్యకలాపాలను గమనిస్తే రానున్న రజుల్లో సరఫరా తగ్గే అవకాశం కనిపిస్తున్నట్టు కెప్లెర్ ముఖ్య పరిశోధన విశ్లేషకుడు సుమిత్ రితోలియా తెలిపారు. షిప్ యజమానులు గల్ఫ్ ప్రాంతానికి ఖాళీ ట్యాంకర్లు పంపేందుకు వెనుకాడుతున్నట్టు, దీంతో వెసెల్స్ సరఫరా 69 నుంచి 40కు తగ్గినట్టు తెలిపారు. దీంతో సమీప కాలంలో సరఫరాలు కఠినంగా మారొచ్చని.. ఇది భారత దిగుమతుల్లో సర్దుబాట్లకు దారితీయొచ్చని అంచనా వేశారు. హర్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే వస్తోంది. మన దేశ ముడి చమురు దిగుమతుల్లో 40 శాతం, ఎల్ఎన్జీ దిగుమతుల్లో సగం సరఫరా ఈ ప్రాంతం నుంచే ఉంటోంది. ఇరాన్పై దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మూసివేసే రిస్క్ ఉందని.. అదే సమయంలో పూర్తిస్థాయి దిగ్బంధనం అవకాశాలు తక్కువే ఉండొచ్చని కెప్లెర్ నివేదిక తెలిపింది. ఎందుకంటే ఇరాన్కు చైనా అతిపెద్ద కస్టమర్గా ఉందని, చైనా సముద్ర మార్గ చమురు దిగుమతుల్లో 47% ఇరాన్ నుంచే వస్తుండడాన్ని ప్రస్తావించింది. ఇరాన్ 96% చమురు ఎగుమతులు ఈ జలసంధి నుంచే ఉంటున్నందున పూర్తిస్థాయి దగ్బంధనం ఇరాన్కే నష్టం కలిగిస్తుందని పేర్కొంది. -
నియామకాలపై భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం!
ముంబై: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపించనున్నట్టు స్టాఫింగ్ సొల్యూషన్స్ అందించే జీనియస్ కన్సల్టెంట్స్ నివేదిక తెలిపింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో మెజారిటీ ఉద్యోగులు తమ కంపెనీలు నియామకాలు నిలిపివేయొచ్చని లేదా తగ్గించుకోవచ్చని చెప్పారు. 2006 మంది ఉద్యోగులను ఈ ఏడాది మే 12 నుంచి జూన్ 6 మధ్య సర్వే చేసి వివరాలు విడుదల చేసింది. → సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది తమ కంపెనీలు మొత్తంగా నియామకాలను నిలిపివేయొచ్చని లేదా నియామకాలు తగ్గించుకోవచ్చని చెప్పారు. → కాంట్రాక్టు ఉద్యోగులు, ఫ్రీలాన్సర్ల నియామకం దిశగా తమ కంపెనీలు అడుగులు వేస్తున్నట్టు 15 శాతం మంది చెప్పారు. → తమ వేతనాల పెంపు, బోనస్లు, ప్రోత్సాహకాలపై భౌగోళిక అస్థిరతలు ప్రభావం చూపించొచ్చని 36 శాతం మంది అభిప్రాయపడ్డారు. → 21 శాతం మంది పని భారం పెరగనుందని ఆందోళన చెందారు. → అంతర్జాతీయ వ్యాపారం, పర్యటనలపై ప్రభావం పడుతుందని 22% మంది చెప్పారు. → బృంద ధైర్యం, విశ్వాసంపై ప్రభావం పడుతుందని 21 శాతం అభిప్రాయపడ్డారు. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల తాము ఎంతో ఆందోళన చెందుతున్నామని, దీని తాలూకూ ఆరంభ హెచ్చరిక సంకేతాలు కనిపిస్తున్నట్టు 30 శాతం మంది చెప్పారు. -
డిజిటల్ అక్రమాలకు అడ్డుకట్ట!
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులలో పెరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్(డీపీఐపీ) అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందుకు పబ్లిక్, ప్రయివేట్ బ్యాంకులను జత కలుపుతోంది. తద్వారా ఆర్బీఐ పర్యవేక్షణలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)కు తెరతీస్తోంది. ప్రతిపాదిత ప్లాట్ఫామ్ ద్వారా ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ను పటిష్టం చేయనుంది. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ను షేర్ చేసుకోవడం ద్వారా అక్రమ డిజిటల్ లావాదేవీలకు అడ్డుకట్ట వేయనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిజిటల్ అక్రమాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పబ్లిక్, ప్రయివేట్ బ్యాంకులను ఆర్బీఐ ఏకతాటిపైకి తీసుకురానుంది. తద్వారా డీపీఐను ఏర్పాటు చేయనుంది. దీంతో డీపీఐపీని పటిష్టరీతిలో అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించి ఈ నెల మొదట్లో బ్యాంకింగ్ అత్యున్నత సీనియర్ అధికారులతో ఆర్బీఐ సమావేశాన్ని నిర్వహించింది. రానున్న కొద్ది నెలల్లో ప్లాట్ఫామ్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
మార్కెట్లలో ఈ వారం బ్రేకవుట్!
సుమారు ఐదు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణి(కన్సాలిడేషన్ జోన్)లోనే కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు కన్సాలిడేషన్ నుంచి బయటపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ప్రభావిత అంశాలు కొరవడినప్పటికీ సాంకేతికంగా అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. వివరాలు చూద్దాం.. గత వారం చివర్లో ఉన్నట్టుండి దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న పరిస్థితుల్లోనూ ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ స్పీడందుకున్నాయి. ఫలితంగా మార్కెట్లు కొద్ది వారాలుగా చిక్కుకున్న కన్సాలిడేషన్ పరిధిని చేదించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ గత వారాంతాన సాంకేతికంగా పరివర్తన స్థాయి(25,112)కి చేరుకున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా 25,200 పాయింట్ల ఎగువకు చేరి నిలదొక్కుకుంటే సాంకేతికంగా బ్రేకవుట్కు వీలున్నట్లు అంచనా వేశారు. దీంతో సమీప కాలంలో 25,600–25,800 పాయింట్లను తాకవచ్చని విశ్లేíÙంచారు. ఇలాకాకుండా బలహీనపడితే సైడ్వేస్లో కదలవచ్చని పేర్కొన్నారు. పశి్చమాసియాలో యుద్ధం ముదిరితే మార్కెట్లు క్షీణించవచ్చని తెలియజేశారు. దీంతో గత వారం మాదిరే 24,700 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. రుతుపవనాలకు ప్రాధాన్యత దేశీయంగా నైరుతి రుతుపవన కదలికలు కీలకంగా మారనున్నాయి. మే నెలలోనే దేశంలోకి ప్రవేశించడం ద్వారా ఆశలు రేపినప్పటికీ తదుపరి మందగించిన సంగతి తెలిసిందే. అయితే రెండు, మూడు రోజుల్లో తిరిగి ఊపందుకుని పలు ఉత్తరాది రాష్ట్రాలలో విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో సెంటిమెంటు బలపడనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఇటీవల దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం సానుకూల పరిణామమని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ కొనసాగవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా, వాటర్ఫీల్డ్ అడ్వయిజర్స్ లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ సీనియర్ డైరెక్టర్ విపుల్ భోవర్ అభిప్రాయపడ్డారు. ఫెడ్పై చూపు గత వారం పాలసీ సమీక్షలో ఫెడరల్ ఓపెన్ మార్కెట్కమిటీ(ఎఫ్వోఎంసీ) వడ్డీ రేట్లను యథాతథంగా అమలు చేసేందుకే ఓటేసింది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన సమావేశమైన ఎఫ్వోఎంసీ వరుసగా నాలుగోసారి ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ఇంతక్రితం 2024 డిసెంబర్లో 0.25 శాతం వడ్డీ రేటును తగ్గించిన ఫెడ్ తదుపరి నిర్వహించిన సమావేశాలలో యథాతథ పాలసీ అమలుకే ఓటు వేస్తూ వస్తోంది. అయితే ఈ నిర్ణయాలతోపాటు.. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థలపై ఫెడ్ అభిప్రాయాలను పావెల్ కాంగ్రెస్కు వివరించనున్నారు. మంగళవారం(24న) ఫైనాన్షియల్ సరీ్వసెస్ కమిటీముందు, బుధవారం(25న) సెనేట్ బ్యాంకింగ్ కమిటీ ముందు ఫెడ్ అంచనాలను వెల్లడించనున్నారు. మరోపక్క యూఎస్ క్యూ1 జీడీపీ తుది గణాంకాలు గురువారం(26న) వెల్లడికానున్నాయి. 2025 జనవరి–మార్చిలో యూఎస్ జీడీపీ 0.2 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే.చమురు ధరలు కీలకం ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసే వీలున్నట్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇది జరిగితే చమురు ధరలకు రెక్కలురానున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తలెత్తిన వెంటనే బ్రెంట్ చమురు ధర ఒక్కో బ్యారల్కు 78 డాలర్ల గరిష్టానికి ఎగసిన విషయం విదితమే. ఫలితంగా యుద్ధ ప్రభావం ప్రధానంగా ముడిచమురు ధరలపై కనిపించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా అధిక శాతం చమురు అవసరాలకు గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో యుద్ధ సెగలు దేశీ మార్కెట్లను దెబ్బతీయవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారమిలా.. గత వారం(16–20) ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. తొలుత క్షీణపథంలో ట్రేడయినప్పటికీ వారం చివర్లో జోరందుకున్నాయి. దీంతో నికరంగా బీఎస్ఈ సెన్సెక్స్ గత వారం 1,290 పాయింట్లు(1.6 శాతం) ఎగసింది. 82,408 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 394 పాయింట్లు(1.6 శాతం) పుంజుకుని 25,112 వద్ద నిలిచింది. అయితే చిన్న, మధ్యతరహా కౌంటర్లలో అమ్మకాలదే పైచేయి అయ్యింది. వెరసి బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.45 శాతం క్షీణించగా.. స్మాల్ క్యాప్ దాదాపు 2 శాతం పతనమైంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్థిరమైన ఆదాయానికి.. ఎస్డబ్ల్యూపీ మంత్ర!
సంపాదనకు గుడ్బై చెప్పిన తర్వాత విశ్రాంత జీవనం సాఫీగా సాగిపోవాలంటే స్థిరమైన ఆదాయ వనరు తప్పనిసరి. అప్పటి వరకు చేసిన పెట్టుబడులు, రిటైరయ్యాక స్థిరమైన ఆదాయానికి దారి చూపాలి. ఎక్కువ మంది రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయ ప్రణాళిక విషయంలోనే గందరగోళానికి గురవుతుంటారు. ఈక్విటీల్లో లేదా డెట్లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్నది అంత సులభంగా తేల్చుకోలేరు. అప్పటి వరకు పొదుపుతో సమకూర్చుకున్న విలువైన వనరులను వివేకంగా వినియోగించుకోవడం ఎలానో తెలియని వారే ఎక్కువ. రిటైర్మెంట్ తర్వాత ఒకట్రెండు దశాబ్దాల పాటు జీవిత అవసరాలను గట్టెక్కడం అంత సులువేమీ కాదు. ‘కూర్చుని తింటే కొండలైనా కరుగును’ అన్నట్టు.. కష్టార్జితంతో కూడబెట్టుకున్న నిధిని మిగిలిన జీవిత కాలం పాటు పొదుపుగా వాడేందుకు సమర్థవంతమైన ప్రణాళిక తప్పకుండా ఉండాలి. రిటైర్మెంట్ తర్వాత చాలా మంది చేసే తప్పు.. తమవద్దనున్న నిధులన్నింటినీ తీసుకెళ్లి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో, లేదా ఇతర డెట్ సాధనాల్లోనో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్థిరమైన రాబడి, భద్రత దృష్ట్యా ఇలా చేయడం గమనించొచ్చు. కానీ, వీటి నుంచి వచ్చే రాబడులు ద్రవ్యోల్బణాన్ని మించి ఏమంత గొప్పగా ఉండవు. దీర్ఘకాలంలో సగటు ద్రవ్యోల్బణం 6 శాతం అనుకుంటే, వీటిల్లో రాబడి 7 శాతం స్థాయిలో ఉంటుంది. కనుక ఇలాంటి సాధనాలను ఎంపిక చేసుకోవడం వల్ల.. అక్కడి నుంచి పదేళ్ల కాలంలో కరెన్సీ విలువ తగ్గిన మేర వారి పెట్టుబడి వృద్ధి చెందదు. అందుకే పెట్టుబడుల్లో ఈక్విటీలకూ చోటివ్వడం ఎంతో అవసరం. ఈక్విటీ ఫండ్స్లో నిరీ్ణత కాలానికోసారి పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఎలా అయితే ఉపకరిస్తుందో.. ఈక్విటీ పెట్టుబడుల నుంచి క్రమానుగతంగా కొద్ది మొత్తం చొప్పున ఉపసంహరించుకునేందుకు సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) అనుకూలిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడిని ఈ మార్గంలో అందుకోవచ్చు. స్థిరమైన ఆదాయం పింఛను సదుపాయం ఏర్పాటు చేసుకున్న వారిని మినహాయిస్తే రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి స్థిరమైన ఆదాయం పెద్ద సవాలుగా మారుతుందన్నది నిపుణుల విశ్లేషణ. రిటైర్మెంట్ తర్వాత కొందరు ఇంటి అద్దె రూపంలో ఆదాయ మార్గంపై ఆధారపడుతుంటారు. కానీ ఇంటి అద్దె స్థిరమైనదని చెప్పలేం. కిరాయిదారు ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. కొత్త వారు రావడానికి కొంత సమయం పడితే అప్పటి వరకు అద్దె ఆదాయం ఉండదు. ఇంటికి మరమ్మతులు, పన్నులు తదితర ఇతర నిర్వహణ వ్యయాల భారం మోయాల్సి ఉంటుంది. ఇల్లు పాతదవుతుంటే అద్దె పెరుగుదల ఆశించిన మేర ఉండదు. కరోనా సమయంలో చాలా మంది ఇంటి అద్దెలను సకాలంలో చెల్లించలేకపోయారు. ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాల్లోనూ కిరాయిదారు అద్దెను సకాలంలో చెల్లించలేకపోవచ్చు. కొందరు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. కానీ, ఇందులో రిస్క్ ఎక్కువ. కనుక పెట్టుబడులపై స్థిరమైన ఆదాయానికి మార్గం చూడాలి. పెట్టుబడి కరగకూడదు.. పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనం.. కచి్చతంగా ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందేలా ఉండాలి. అలాంటప్పుడే నెలవారీ రాబడి మేర ఉపసంహరించుకున్నా కానీ, పెట్టుబడి విలువను స్థిరంగా కాపాడుకోవచ్చు. ఈక్విటీలు ఈ విషయంలో ఎంతో మెరుగైనవి. ఉదాహరణకు రూ.20 లక్షల మొత్తాన్ని 7 శాతం రాబడినిచ్చే డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20,000 చొప్పున ఉపసంహరించుకున్నారనుకోండి. ఏడాది ముగిసిన తర్వాత రూ.18.92 లక్షల పెట్టుబడి మిగిలి ఉంటుంది. అంటే ఏడాదిలో రూ.3 లక్షలను ఉపసంహరించుకోవడంతో పెట్టుబడి సైతం రూ.1.08 లక్షలు తరిగింది. ఇలాగే ఉపసంహరించుకుంటూ వెళితే 12 ఏళ్లకు ఆ పెట్టుబడి కరిగిపోతుంది. అదే ఈక్విటీల్లో అయితే 12% వరకు సగటు వార్షిక రాబడి ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉండే హైబ్రిడ్, సేవింగ్స్ ఫండ్స్లో అయితే 10% వరకు రాబడిని ఆశించొచ్చు. కనుక ఈ తరహా సాధనాలతో స్థిరమైన ఆదాయానికి తోడు పెట్టుబడినీ కాపాడుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. ఇదే రూ.20 లక్షలను 12% రాబడినిచ్చే ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఉపసహరిస్తే 26 ఏళ్ల కాలానికి ఆ పెట్టుబడి స్థిర ఆదాయాన్నిస్తుంది. 10% రాబడి ప్రకారమైనా 17 ఏళ్ల పాటు ఆదాయాన్నిస్తుంది. వార్షిక రాబడి రేటు లో మైనస్ 3% చొప్పున ఉపసంహరణకు పరిమితం కావడం వల్ల.. మిగిలిన 3% పెట్టుబడి వృద్ధికి చాన్సుంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం వల్ల పెరిగే జీవన వ్యయాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పన్ను ప్రయోజనాలు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. అదే ఈక్విటీ ఎస్డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల మొత్తంపై పన్ను లేదు. డెట్ సాధనాలపై రాబడి వ్యక్తిగత వార్షిక ఆదాయానికి కలిపి, ఏ శ్లాబు పరిధిలో వస్తే ఆ మేరకు పన్ను రేటు చెల్లించాలి. అదే ఈక్విటీ రాబడులపై పన్ను విడిగా ఉంటుంది. రూ.1.25 లక్షలు మించిన దీర్ఘకాల రాబడిపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే చాలు. కేవలం మొదటి ఏడాది ఉపసంహరణ మొత్తంలో రాబడిపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఏడాది తర్వాత నుంచి రాబడి దీర్ఘకాల మూలధన లాభాల పరిధిలోకే వస్తుంది. నగదు ప్రవాహాలపై సౌలభ్యత ఎస్డబ్ల్యూపీతో నెలవారీ ఎంత అవసరమో అంతే వెనక్కి తీసుకోవచ్చు. తమ అవసరాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని పెంచుకోవచ్చు. నెలవారీ, త్రైమాసికానికి ఒకసారి చొప్పున వెనక్కి తీసుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్ సంక్షోభాలను ఎదుర్కొంటుంటే..వాటి నుంచి ఉపసంహరణను గణనీయంగా తగ్గించుకోవడం లేదంటే తాత్కాలికంగా నిలిపివేసి.. డెట్ పెట్టుబడుల నుంచి ఉపసంహరణతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీలోనూ రకాలున్నాయి. కోరుకున్నంత స్థిరంగా ఉపసంహరించుకోవడం ఇందులో ఒకటి. క్యాపిటల్ అప్రీసియేషన్ ఎస్డబ్ల్యూపీలో అయితే.. పెట్టుబడుల వృద్ధి వరకు (రాబడి) వెనక్కి తీసుకోవచ్చు. అసలు పెట్టుబడి అలాగే కొనసాగుతుంది. అస్థిరతల్లో పరిష్కారం.. రాబడి ఒక్కటే కాదు పెట్టుబడిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈక్విటీలు దిద్దుబాటుకు గురైనప్పుడు అందులోని పెట్టుబడుల విలువ క్షీణిస్తుంటుంది. కనుక ఆ సమయంలో ఈక్విటీ పెట్టుబడుల నుంచి ఉపసంహరణ ఎప్పటి మాదిరిగా కొనసాగించకపోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఈక్విటీల్లో దిద్దుబాటు ముగిసే వరకు గట్టెక్కేందుకు డెట్ పెట్టుబడులను వినియోగించుకోవాలి. దీనివల్ల తిరిగి ఈక్విటీలు ర్యాలీ చేసిన సమయంలో పెట్టుబడుల విలువ గణనీయంగా వృద్ధి చెందేందుకు వీలుంటుంది.డెట్ పెట్టుబడులూ అవసరమే విశ్రాంత జీవనంలో అవసరాలకు పూర్తిగా ఈక్విటీలపై ఆధారపడడం రిస్క్ నిర్వహణ పరంగా మెరుగైన నిర్ణయం కాబోదు. ఈక్విటీ, డెట్ కలబోతగా ఉండాలి. ఎస్డబ్ల్యూపీ కోసం ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేసే హైబ్రిడ్ సాధనాలను ఎంపిక చేసుకున్నప్పటికీ అదే సమయంలో విడిగా డెట్ సాధనాలనూ పోర్ట్ఫోలియోలో చేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఈక్విటీ పతనాల్లో ఎస్డబ్ల్యూపీని తాత్కాలికంగా నిలిపివేయాల్సి రావచ్చు. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలంలో బేరిష్ దశలోకి వెళ్లినప్పుడు డెట్ పెట్టుబడులు ఆదుకుంటాయి. రిస్క్ను వైవిధ్యం చేసుకున్నట్టు అవుతుంది. ఇన్వెస్టర్ల వద్దనున్న మొత్తం పెట్టుబడి, ఆదాయ అవసరాలు, రాబడి అంచనాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ కేటాయింపులు ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. ఎవరికి అనుకూలం..? ఎస్డబ్ల్యూపీ రిటైర్మెంట్ తీసుకున్న వారికోసమే అనుకోవద్దు. పెట్టుబడిపై స్థిరమైన నగదు ప్రవాహాలు కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ ప్లాన్ మెరుగైనదన్నది నిపుణుల సూచన. రిటైర్మెంట్ తీసుకున్న వారు, రిటైర్మెంట్ సమీపంలో ఉన్న వారు, అదనపు ఆదాయం కోరుకునే వారికి ఇది అనుకూలమని బంధన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) సేల్స్ హెడ్ గౌరబ్ పరిజ తెలిపారు. ‘‘ఇప్పట్లో పదవీ విరమణ తీసుకోని వ్యక్తులు సైతం, జీవన అవసరాలకు వీలుగా అదనపు ఆదాయం కోసం ఎంపిక చేసుకోవచ్చు. జీవితంలోని వివిధ దశల్లో అదనపు ఆదాయం కోసం ఇదొక పరిష్కారం. కాకపోతే రిటైర్మెంట్ తీసుకున్న వారు ఎక్కువగా దీన్ని వినియోగిస్తుంటారు’’ అని వివరించారు. పొరపాట్లకు చోటివ్వొద్దు.. → ఎస్డబ్ల్యూపీ అన్నది చాలా శక్తివంతమైన సాధనం. అయితే, సరైన ప్రణాళిక లేకపోవడం లేదా నిపుణుల సూచన లేకుండా చేయడం వల్ల ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. → అధిక రాబడుల కోసం రిస్క్ తీసుకోవద్దు. అతి రాబడుల అంచనాలు విశ్రాంత జీవనంలో బెడిసి కొడతాయి. ముఖ్యంగా మార్కెట్ ఆటుపోట్లలో మోస్తరు రాబడులకే పరిమితం కావాలి. → నిపుణుల సూచనకు మించి అధిక మొత్తాన్ని వెనక్కి తీసుకోకపోవడమే మంచిది. ఎప్పుడో ఓసారి తప్పిస్తే.. అవసరాలకు చాలడం లేదని ప్రణాళికకు మించి ఉపసంహరణ బాట పడితే పెట్టుబడి వేగంగా క్షీణిస్తుంది. → ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పెట్టుబడి విలువ ఏటా ఎంతో కొంత వృద్ధి చెందడమే కాదు.. అదే ద్రవ్యోల్బణం కారణంగా పెరిగే జీవన అవసరాలకు వీలుగా నగదు ఉపసంహరణ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. సరైన ప్రణా ళికతోనే ఇది సాధ్యమని గుర్తుంచుకోవాలి. సిప్ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తాన్ని సిప్ ద్వారా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధిని సమకూర్చుకోవచ్చు. కాంపౌండింగ్ మహిమతో కొద్ది పెట్టుబడి దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గంత నిధిగా సమకూరుతుంది. 25 ఏళ్ల వయసు నుంచి ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఈక్విటీ ఫండ్లో సిప్ ప్రారంభించి, 60 ఏళ్లు వచ్చే వరకు 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళితే.. 12% వార్షిక రాబడి అంచనా మేరకు చివర్లో సమకూరే మొత్తం రూ.5.51 కోట్లు. ఇందులో పెట్టుబడి రూ.42 లక్షలు కాగా, మిగిలినదంతా కాంపౌండింగ్తో వృద్ధి చెందిన సంపద. కొంచెం ఆలస్యంగా 30 ఏళ్ల నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసినా 60 ఏళ్లకు రూ.3.08 కోట్లకు సమకూరుతుంది. ఎస్డబ్ల్యూపీ సిప్ ద్వారా ఈక్విటీల్లో చేసిన పెట్టుబడి 60 ఏళ్లకు పెద్ద మొత్తమే సమకూరుతుంది. వృద్ధాప్యానికి వచ్చామని చెప్పి ఈక్విటీ పెట్టుబడులు పూర్తిగా ఉపసంహరించుకోనక్కర్లేదు. కనీసం 50–70 శాతం మేర ఈక్విటీల్లో అలాగే కొనసాగించి, ఎస్డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా కావాల్సినంత ఉపసంహరించుకోవచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలున్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడి ఇతర సాధనాల కంటే మెరుగ్గా వృద్ధి చెందుతుంది. రిటైర్మెంట్ అనంతరం అదే ఫండ్ నుంచి ప్రతి నెలా కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. ఒకేసారి పెట్టుబడులు అన్నింటినీ విక్రయించడం వల్ల దీర్ఘకాల మూలధన లాభాలపై (రూ.1.25 లక్షలు దాటిన మొత్తంపై) 12.5% పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీని బదులు 50–70% ఈక్విటీల్లోనే కొనసాగిస్తే పన్ను భారం తగ్గుతుంది. ఎస్డబ్ల్యూపీ వ్యూహం→ రిటైర్మెంట్ ఫండ్ను మూడు భాగాలుగు చేసుకోవాలి. → ఇందులో కోర్ భాగం ఒకటి. దీర్ఘకాలం పాటు ఇది మెరుగ్గా వృద్ధి చెందేందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందుకు ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలిస్తాయి. → బఫర్ పేరుతో రెండో భాగంలో.. 3 నుంచి 5 ఏళ్ల పాటు ఆదాయ అవసరాలకు సరిపడా మొత్తాన్ని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. → లిక్విడ్ పేరుతో మరొక భాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తక్షణ అవసరాల్లో వెనక్కి తీసుకునేందుకు వీలుగా లిక్విడ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. → తమ పెట్టుబడిని ఇలా వేర్వేరు భాగాలు చేసుకోవడం ద్వారా రిస్క్ను వైవిధ్యం చేసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇంటి గోడలు మెరుస్తాయ్..
సాక్షి, సిటీబ్యూరో: ఇంటికి వచ్చిన అతిథులను త్రీడీ వాల్ పేపర్లతో కట్టిపడేస్తున్నారు ఇంటీరియర్ ప్రియులు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాల్ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంతరించుకుంటున్నాయి. నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు త్రీడీ వాల్ పేపర్ల మన్నిక బాగానే ఉంటుంది. కొత్తదైనా, పాత ఇళ్లయినా వాల్ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు.మార్కెట్లో వాల్ పేపర్లు రోల్స్ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10*10 ఉంటే కనీసం రెండు రోల్స్ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకు ఉంటుంది.త్రీడీలో వాల్.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్ వాల్ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్ పేపర్లు సుమారు 1*1 సైజ్ నుంచి 20*20 సైజ్ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి వరకుంటుంది. త్రీడీ వాల్ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది. -
ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే ఆఫీస్ పని అవ్వదు భారం!
ఆఫీసు అంటేనే బోరింగ్గా, ఆఫీసు పని చాలా భారంగా అనిపిస్తోందా! అయితే, ఒక్కసారి ఈ టెక్ కొలీగ్స్ను కలవండి, అప్పుడు మీ ఆఫీస్ పని ఆటలాగా మారుతుంది.మ్యాజిక్ మౌస్!ఇప్పటి వరకు మౌస్ అంటే కేవలం క్లిక్లు కోసమే అనుకున్నారా? అయితే మీరు ఈ ‘చీర్డాట్స్ 2’ గురించి తెలుసుకోవాల్సిందే! ఇది ఒక మల్టీ టాలెంట్ కాంబినేషన్. ఎయిర్ మౌస్, టచ్ప్యాడ్, క్లికర్, ఏఐ చాట్, డేటా సమ్మరీ ఇచ్చే అడ్వైజర్ అన్నీ ఇదే! ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు స్క్రీన్ మీద దీనితో ఇలా ఊపేస్తే, అలా స్లైడ్స్ మారిపోతాయి. ఒక బటన్తో స్క్రీన్పై స్పాట్లైట్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. ఇంకా చెప్పాలంటే, మీరు మాట్లాడిన మాటలను ఈ మౌస్ ఏఐ సాయంతో రికార్డ్ చేసి, సింపుల్ సమ్మరీలుగా మార్చేస్తుంది. మొబైల్, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని కూడా దీనిని వాడుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ఇరవై రోజులు పాటు పనిచేస్తుంది. ధర 99 డాలర్లు (రూ. 8,475).ట్రిపుల్ ట్రీట్ చార్జ్!ఆఫీస్ అంటే ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎయిర్పాడ్స్ వంటి చాలా రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రోజూ ఫుల్ చార్జ్ అవ్వాల్సిందే! కాని, ఒక్కోటి వేర్వేరు వైర్లు అడిగితే, ఆఫీస్లో మేనేజర్ కన్నా మనకే ఎక్కువ టెన్షన్! ఈ సమస్య తీర్చడానికే వచ్చింది ఈ ‘జీహూ క్యూబ్ ట్రిక్ ఎక్స్’. ఇది ఒక త్రీ ఇన్ వన్ చార్జర్. ఇది ఉంటే ఇక మీ డెస్క్ మీద ఒక్క కేబుల్ కూడా కనిపించదు. ఫోన్, వాచ్, ఎయిర్పాడ్స్ అన్నింటిని ఒకేచోట, ఒకేసారి చార్జ్ చేసుకోవచ్చు. ఇందులోని ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ మిమ్మల్ని మరింత స్మార్ట్గా చేసేస్తుంది! ధర 55 డాలర్లు (రూ. 4,708)డేటా గార్డ్ఆఫీస్ ఫైల్స్ అంటే మామూలు విషయం కాదు, అవి ప్రమోషన్కి టికెట్ లాంటివి. ఒక్కసారైనా సిస్టమ్ సడన్గా క్రాష్ అయ్యిందంటే? అంతే సంగతులు. ఇక మీరు మీ కొత్త రెజ్యూమే రెడీ చేసుకోవాల్సిందే! పైగా హ్యాకర్లు, వైరస్లు, సాఫ్ట్వేర్ బగ్స్– అన్నీ డేటాపై పంజా విసురుతున్న ఈ రోజుల్లో డిజిటల్ ఫైల్స్ను భద్రంగా ఉంచడం అంటే, ఫ్రిజ్లో పిల్లలకు కనిపించకుండా ఐస్క్రీమ్ దాచినంత కేర్ తీసుకోవాలి. అందుకే వచ్చింది ఈ ‘కింగ్స్టన్ ఐరన్ కీ వాల్ట్ ప్రైవసీ 80’. ఇది డ్రైవ్ కాదు, డేటాకు ఒక డిజిటల్ బౌన్సర్ లాంటిది. టచ్ స్క్రీన్తో, పాస్వర్డ్, పిన్లాంటి లాకింగ్ సిస్టమ్తో వస్తోంది.ఏకంగా 3.8 టీబీ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అంటే పదేళ్ల ఆఫీస్ ఫైల్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, పర్సనల్ ఫొటోలు, వీడియోలు అన్నీ ఇందులో భద్రంగా దాచుకోవచ్చు. ఒకే డ్రైవ్ను మల్టిపుల్ యూజర్లుగా వాడుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో పాస్వర్డ్ కూడా ఇవ్వవచ్చు. హ్యాకర్ ట్రై చేస్తే వెంటనే రిడ్–ఓన్లీ మోడ్ ఆన్ చేసి ‘బాబూ, కాస్త పక్కకు వెళ్లి ఆడుకోమ్మా!’ అంటూ అడ్డుపడుతుంది. అంత భద్రంగా డేటాను చూసుకుంటుంది. ధర 729 డాలర్లు (రూ. 62,422). -
ఇరుకు ఇళ్లకు అవసరం.. ఇలాంటి ఫర్నీచర్
సాక్షి, సిటీబ్యూరో: కొన్ని ఇళ్లు చూడ్డానికి చిన్నవిగానే ఉంటాయి. కానీ, పొదరిల్లులా అందంగా కనిపిస్తాయి. ఉన్న చిన్నపాటి స్థలంలో పొందికగా ఫర్నీచర్ను సర్దుకుంటేనే అది సాధ్యమవుతుందంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. అదెలాగో ఓసారి చూద్దాం. ఇల్లు విశాలంగా కనిపించాలంటే ఇంట్లో అమర్చే ఫర్నీచర్ పొందికగా ఉండాలి. అలాగే ఆ ఫర్నీచర్ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి స్పేస్ సేవింగ్ ఫర్నీచర్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. రబ్బర్ ఉడ్తో తయారు చేసే స్పేస్ సేవింగ్ ఫర్నీచర్కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వాటర్ ప్రూఫ్, స్క్రాచ్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్.. అలాగే ఈ ఫర్నీచర్ను విడి భాగాలుగా విడదీసి తిరిగి బిగించుకునే వీలుంటుంది. ఇలా రెండు మూడు సార్లు విప్పదీసి బిగించుకున్నా చెక్కుచెదరదు. ఈ ఫర్నీచర్కు కంపెనీలు వారంటీని సైతం అందిస్తున్నాయి. వాల్ క్యాబినెట్స్.. వంటగది లేదా లివింగ్ రూమ్లో సెరామిక్ లేదా గ్లాస్వేర్ను అలంకరించటానికి వాల్ క్యాబినెట్స్ ఎంతో ఉపయోకరంగా ఉంటాయి. గోడకు ఆనించే వీలున్న ఈ స్పేస్ సేవింగ్ వాల్ క్యాబినెట్స్లో క్రాకరీ డిస్ప్లేకు వీలుగా గ్లాస్ షెల్ప్, ఇతర వస్తువుల కోసం సొరుగులుంటాయి. ఈ వాల్ క్యాబినెట్ టేబుల్ కూడా ఉపయోగపడుతుంది. లివింగ్ రూమ్లోనైతే దీని మీద ఫొటో ఫ్రేములు, ఫ్లవర్ వాజులు ఉంచుకోవచ్చు.మినీమలిస్టిక్ డ్రెసింగ్ మిర్రర్.. ఇంట్లోని మొత్తం ఫర్నీచర్లో డ్రెసింగ్ మిర్రర్ది ప్రత్కేక స్థానం. కాబట్టి ఇల్లు ఎంత చిన్నదైనా డ్రెసింగ్ మిర్రర్ కొనకుండా ఉండలేం. అయితే దాని వల్ల ఇల్లు ఇరుగ్గా మారకుండా ఉండేలా చూసుకుంటే అవసరంతో పాటు ముచ్చటా తీరుతుంది. ఇందుకోసం స్థలం కలిసొచ్చేలా గోడకు ఫిక్స్ చేసేలా వీలుండే డ్రెస్సింగ్ మిర్రర్ను ఎంచుకోవాలి. ఇలాంటి మినీ మలిస్టిక్ డ్రెస్సింగ్ మిర్రర్ను ఎంచుకుంటే అద్దాన్ని విడిగా గోడకు బిగించి దానికింద సొరుగులున్న టేబుల్ను ఉంచి వాడుకోవచ్చు.కోజీ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కోసం ఇంట్లో డైనింగ్ ఏరియా తప్పనిసరేం కాదు. ఇల్లు ఇరుకవుతుందనే భయం లేకుండా తక్కువ స్థలంలో ఇమిడిపోయే కోజీ డైనింగ్ టేబుల్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం 3 నుంచి నాలుగడుల వైశాల్యాన్ని మాత్రమే ఆక్రమించే నాలుగు కుర్చీల డైనింగ్ టేబుల్ను ఎంచుకుంటే ఇల్లు ఇరుగ్గా మారదు.సైడ్ టేబుల్స్ గోడవారగా వేసుకునే సైడ్ టేబుల్స్ వేర్వేరు అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. డ్రాలు, షెల్ఫ్లు కలిసి ఉండే ఈ సైడ్ టేబుల్ను పుస్తకాలు, అరుదుగా ఉపయోగించే ఇతర వస్తువుల కోసం వినియోగించుకోవచ్చు. ఈ టేబుల్ బోసిగా కనిపించకుండా దీని మీద కాస్త పెద్దవిగా ఉండే డెకరేటివ్ ఐటమ్స్ను అమర్చుకోవచ్చు. -
తప్పుడు టికెట్ ఇచ్చి తిప్పలు పెడతారా? ఎయిర్లైన్కు జరిమానా
ప్రయాణికుడికి తప్పుడు విమాన టికెట్ ఇచ్చి ఇబ్బందులకు గురి చేసిన ఎయిర్లైన్ సంస్థ స్పైస్ జెట్కు వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. స్పైస్ జెట్ తప్పుడు టికెట్లు జారీ చేయడంతో ఓ సీనియర్ సిటిజన్ ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాడని, ఆ ప్రయాణికుడికి రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.ముంబై (సబర్బన్) జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జూన్ 17న జారీ చేసిన ఉత్తర్వులలో ప్రయాణికుడిని "మానసిక వేధింపులకు" గురిచేసిన సంఘటనలో "లోపభూయిష్టమైన సేవ, నిర్లక్ష్య ప్రవర్తన"కు స్పైస్ జెట్ను వినియోగదారుల కమిషన్ దోషిగా పేర్కొంది.వివరాల్లోకి వెళ్తే.. ఘట్కోపర్ ప్రాంతంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్ 2020 డిసెంబర్ 5న ముంబై నుండి దర్భంగాకు స్పైస్ జెట్లో రానూపోనూ టికెట్లను బుక్ చేసుకున్నారు. ముంబై-దర్భంగా ప్రయాణం పూర్తి కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా తిరుగు ప్రయాణాన్ని విమానయాన సంస్థ రద్దు చేసింది. 2020 డిసెంబర్ 8న ముంబైలో పీహెచ్డీ ఆన్లైన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికుడు కోరగా అదే రోజు పాట్నా నుంచి కోల్కతాకు, అక్కడి నుంచి ముంబైకి ప్రయాణించేందుకు స్పైస్జెట్ ప్రత్యామ్నాయ టికెట్ అందించింది.అయితే తీరా పాట్నాకు చేరుకున్న తర్వాత ఆ టికెట్లు తప్పుగా ఉన్నాయని విమానాశ్రయ అధికారులు తెలియజేశారు. దీంతో ప్రయాణికుడు మరుసటి రోజు ఉదయం తన సొంత ఖర్చులతో మరో విమానాన్ని బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఆయనకు మానసిక వేదనతోపాటు ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైకి ఆలస్యంగా రావడం వల్ల ఆయన పరీక్షకు కూడా రాయలేకపోయారు.ఇదంతా విమానయాన సంస్థ సేవల్లో లోపం, నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ సదరు వ్యక్తి వినియోగదారుల ప్యానెల్ ను ఆశ్రయించారు. రూ.14,577 ఛార్జీ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.2 లక్షలు, లిటిగేషన్ ఖర్చు కింద రూ.25 వేలు స్పైస్ జెట్ నుంచి ఇప్పించాలని కోరారు.అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రద్దు జరిగిందని, దీనికి తమ బాధ్యత పరిమితమని స్పైస్ జెట్ వాదించింది. అదనపు ఛార్జీలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, బుకింగ్ ఏజెన్సీ ద్వారా ఫిర్యాదుదారుడికి పూర్తి టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించామని ఎయిర్లైన్స్ పేర్కొంది.దీనిపై వినియోగదారుల కమిషన్ స్పందిస్తూ విమానాల రద్దు విమానయాన సంస్థ నియంత్రణకు అతీతమైనదని అంగీకరిస్తూనే ఫిర్యాదుదారుకి తప్పుడు టికెట్లు జారీ చేసిన నిర్లక్ష్య చర్య నుంచి విమానయాన సంస్థ తప్పించుకోజాలదని స్పష్టం చేసింది. ప్రయాణికుడికి మానసిక వేదనకు పరిహారంగా రూ .25,000, లిటిగేషన్ ఖర్చు కోసం రూ .5,000 చెల్లించాలని కమిషన్ విమానయాన సంస్థను ఆదేశించింది. -
జియో నుంచి 2 కొత్త ప్లాన్లు.. ప్రత్యేక బెనిఫిట్లు..
మొబైల్ గేమర్లకు శుభవార్త.. గేమింగ్ ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు కొత్త అపరిమిత 5జీ డేటా ప్లాన్లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు హై-స్పీడ్ డేటాను మాత్రమే కాకుండా ఉచిత బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) స్కిన్లు, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ వంటి గేమింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వినియోగదారులు వాటిని డౌన్లోడ్ చేయకుండానే 500కి పైగా ప్రీమియం గేమ్లను ఆడుకోవచ్చు.ప్లాన్ వివరాలు.. ప్రయోజనాలుజియో ప్రారంభించిన కొత్త ప్లాన్లు.. ఒకటి రూ.495 ప్లాన్, మరొకటి రూ.545 ప్లాన్. ఈ రెండు ప్లాన్లూ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రూ.495 ప్లాన్లో రోజుకు 1.5 జీబీ డేటా, అదనంగా 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది. రూ.545 ప్లాన్లో రోజుకు 2 జీబీ 4జీ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటాతో పాటు అదే గేమింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి.👉 ఈ ప్లాన్తో జియో సిమ్ ఏడాదంతా యాక్టివ్.. 👈రెండు ప్లాన్లలో బార్డ్స్ జర్నీ సెట్, డెసర్ట్ టాస్క్ ఫోర్స్ మాస్క్, ట్యాప్ బూమ్ మొలోటోవ్ కాక్టెయిల్ వంటి ప్లేయర్లకు ఉచిత ఇన్-గేమ్ వస్తువులను అందించే ప్రత్యేక బీజీఎంఐ రివార్డ్ కూపన్లు కూడా ఉన్నాయి. ఈ రివార్డులను క్లెయిమ్ చేసుకోవడానికి వినియోగదారులు గేమింగ్ ప్యాక్లలో దేనితోనైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత, ధృవీకరణ సందేశం వస్తుంది. మై జియో యాప్లో రివార్డ్ కూపన్లు లభిస్తాయి. ప్లేయర్ క్యారెక్టర్ ఐడీ, ఇచ్చిన యూనిక్ కోడ్ ఉపయోగించి ఈ కూపన్లను అధికారిక బీజీఎంఐ వెబ్సైట్లో రీడీమ్ చేసుకోవచ్చు.ఇక జియోగేమ్స్ క్లౌడ్ వినియోగదారులు హై-ఎండ్ పరికరాలు అవసరం లేకుండా నేరుగా వారి స్మార్ట్ఫోన్లు, టీవీలు లేదా బ్రౌజర్లలో గేమ్స్ ఆడవచ్చు.ఈ సేవను పొందడానికి వినియోగదారులు జియోగేమ్స్ యాప్ను ఇన్స్టాల్ చేసి, వారి జియో నంబర్తో లాగిన్ కావాలి. సబ్ స్క్రిప్షన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. -
ఇల్లే కాదు.. ఇంటి నిర్మాణ సామగ్రికీ గుర్తింపు
సాక్షి, సిటీబ్యూరో: కాలం ఏదైనా సరే ఇంట్లో నీరు, విద్యుత్ వినియోగం తప్పనిసరి. వేసవికాలంలో అయితే వీటి బిల్లులతో కస్టమర్ల జేబుకు చిల్లులు పడటం ఖాయం. అందుకే హరిత నిర్మాణ సామగ్రితో నిర్మించే ఇళ్లకు ఆదరణ పెరుగుతోంది. హరిత భవనాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు విద్యుత్ వినియోగం 30–40 శాతం, నీటి వినియోగం 20–30 శాతం తగ్గుతుంది కూడా.విద్యుత్, నీటి బిల్లుల ఆదా, నిర్వహణ వ్యయం తగ్గింపు, ఆరోగ్యకరమైన వాతావరణ వంటి కారణాలతో హరిత భవనాలకు డిమాండ్ పెరిగింది. గతంలో పర్యావరణహితమైన ఇల్లు కొనాలంటే కాలుష్యం, జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలకు లేక శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ, నేడు నగరంలో, హాట్సిటీలో ఉంటూ కూడా హరిత భవనాలు కావాలంటున్నారు కొనుగోలుదారులు. దీంతో నిర్మాణ సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన గృహాలనే కాదు.. ఐజీబీసీ గుర్తింపు పొందిన నిర్మాణ సామాగ్రిని, ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. మార్కెట్లో 350 రకాల ఉత్పత్తులు.. నివాసాలకు, వాణిజ్య, కార్యాలయాల సముదాయాలకూ హరిత భవనాల గుర్తింపునివ్వటం మనకు తెలిసిందే. కానీ, దేశంలో తొలిసారిగా నిర్మాణ సామగ్రి ఉత్పత్తులకూ గుర్తింపు ప్రారంభించింది సీఐఐ. దీంతో కొనుగోలుదారులకు గృహాల్లోనే కాకుండా నిర్మాణ సామగ్రిలోనూ గ్రీన్ ప్రొ సర్టిఫికెట్ పొందిన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే వీలుందన్నమాట. ఇప్పటి వరకు 350 ఉత్పత్తులు గ్రీన్ సర్టిఫికెట్ పొందాయి. ఏసీసీ సిమెంట్, నిప్పన్ పెయింట్స్, సెయింట్ గోబియన్ గ్లాస్, అసాహి ఇండియన్ గ్లాస్, గోద్రెజ్ ఫర్నీచర్, విశాఖ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. దేశంలో గ్రీన్ బిల్డింగ్స్ ఉత్పత్తుల మార్కెట్ రూ.18 లక్షల కోట్లుగా ఉందని అంచనా. -
సెబీ నిబంధనల్లో వెసులుబాటు
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులకు (ఆర్ఏలు) సెబీ నిబంధనల్లో వెసులుబాటు కల్పించింది. తమ డిపాజిట్ అవసరాలకు అనుగుణంగా వారు ఇప్పటి వరకు నిబంధనల ప్రకారం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎఫ్డీలకు అదనంగా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, ఓవర్నైట్ మ్యూచువల్ ఫండ్స్కు సైతం సెబీ అనుమతించింది.ఏదేనీ షెడ్యూల్డ్ బ్యాంకులో ఎఫ్డీ చేసి, అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఏఎస్బీ) పేరిట లీన్మార్క్డ్ (హక్కులు కల్పించడం) చేయాల్సి వచ్చేది. ఎఫ్డీ ఖాతాల ప్రారంభం విషయంలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వారు సెబీ దృష్టికి తీసుకెళ్లారు.ఎఫ్డీకి ప్రత్యామ్నాయంగా ఏఎస్బీకి అనుకూలంగా మార్క్ చేసిన లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కూడా అనుమతించవచ్చని వారు సూచించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సెబీ బోర్డు తాజాగా ఆమోదం తెలిపింది.ఈ ప్రతిపాదనను ఆమోదించిన సెబీ బోర్డు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లను తక్కువ రిస్క్, తక్కువ అస్థిర సాధనాలుగా పరిగణించవచ్చని పేర్కొంది. అంతేకాకుండా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ పై కూడా లైను మార్క్ చేయవచ్చు. లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై లీన్ నిర్వహణ, లీన్ అమలు సెక్యూరిటీస్ మార్కెట్ ఎకోసిస్టమ్ పరిధిలోనే ఉందని, ఇది మరింత సమర్థతను తీసుకువస్తుందని సెబీ తెలిపింది. -
హైదరాబాద్లో కమర్షియల్ స్థలం.. కొంటున్నారా?
వాణజ్య సముదాయాల్లో పెట్టే పెట్టుబడిపై 8 నుంచి 11 శాతం అద్దె గిట్టుబాటు అయితే.. ఇళ్లపై రాబడి 2 నుంచి 4 శాతం వరకే ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అధిక సరఫరా, ప్రతికూల మార్కెట్, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తదితర కారణాలతో ప్రధాన నగరాల్లో వాణిజ్య స్థలాల ధరలు తగ్గాయి. దీంతో వీటిలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. వాణిజ్య సముదాయల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటు అవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. అన్ని విధాలా అభివృద్ధికి ఆస్కారం ఉన్న చోట నిర్మించే వాణిజ్య నిర్మాణాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి. –సాక్షి, సిటీబ్యూరోఇవే కీలకం..వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి.ఒక ప్రాంతంలో నిర్మించే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశం ఉందా? అనే విషయాన్ని బేరీజు వేయాలి.భవనాన్ని నిర్మించే డెవలపర్ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.👉 ఇది చదివారా? ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కాముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం బీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది. -
కొత్త లుక్తో హోండా సిటీ స్పోర్ట్ కారు
హోండా కార్స్ ఇండియా సంస్థ న్యూ సిటీ స్పోర్ట్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ. 14,88,900గా (ఢిల్లీ ఎక్స్ షోరూం) ఉంటుంది. లైఫ్ ఈజ్ ఏ స్పోర్ట్ ట్యాగ్లైన్తో ప్రవేశపెట్టిన ఈ కార్లు పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు. వెలుపల స్పోర్టీ బ్లాక్ గ్రిల్, అలాయ్ వీల్స్, అలాగే లోపల ప్రీమియం లెదర్ బ్లాక్ సీట్లు, రూఫ్ లైనింగ్తో ఇంటీరియర్స్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు వివరించారు.మార్కెట్లోకి మహీంద్రా ఫ్యూరియో 8 ట్రక్మహీంద్రా ట్రక్ అండ్ బస్ బిజినెస్ తాజాగా అత్యధిక మైలేజీ గ్యారంటీతో ఫ్యూరి యో 8 పేరిట తేలికపాటి వాణిజ్య వాహన ట్రక్కులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సెగ్మెంట్లో అత్యుత్తమ మైలేజీనివ్వకుంటే ట్రక్కును వాపసు చేయొచ్చనే ఆఫరుతో దీన్ని అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ వాహనం 4, 6 టైర్ల కార్గో వేరియంట్స్లో లభిస్తుంది.కొనుగోలుదారుకు అధిక ఆదాయాలు, కనిష్ట స్థాయిలో నిర్వహణ వ్యయాలతో అన్ని రకాల ప్రయోజనకరంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ పేర్కొన్నారు. అలాగే, సరీ్వసింగ్ విషయానికొస్తే 36 గంటల టర్నెరౌండ్ సమయం లేదా జాప్యం జరిగిన ప్రతి అదనపు రోజుకు రూ. 3,000 చొప్పున చెల్లించేలా సర్వీస్ హామీ ఉంటుందని వివరించారు. -
కొత్త ఫోన్.. రూ.25 వేలకే 3డీ కర్వ్డ్ డిస్ప్లే
స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో కొత్తగా వై సిరీస్లో వై400 ప్రో ఫోన్ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 24,999 (8జీబీ, 128 జీబీ) నుంచి ప్రారంభమై రూ. 26,999 వరకు (8 జీబీ, 256 జీబీ) వరకు ఉంటుంది. ఈ సెగ్మెంట్లోనే అత్యంత పల్చని 3డీ కర్వ్డ్ డిస్ప్లే, 6.78 అంగుళాల ఎఫ్హెచ్డీ, అమోలెడ్ డిస్ప్లే, 90వాట్ ఫ్లాష్చార్జ్, సోనీ మల్టీఫోకల్ పోర్ర్టెయిట్, ముందు.. వెనుక కెమెరాలతో 4కే వీడియో రికార్డింగ్ సామర్థ్యాలు మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇది ఫ్రీస్టైల్ వైట్, నెబ్యులా పర్పుల్, ఫెస్ట్ గోల్డ్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.వివో వై400 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు6.77 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ 20:9 యాస్పెక్ట్ రేషియో స్క్రీన్ విత్ హెచ్ డీఆర్ 10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్2.5 గిగాహెర్ట్జ్ వరకూ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 4ఎన్ఎం ప్రాసెసర్, మాలి-జీ615 ఎంసీ2 జీపీయూ8 జీబీ LPDDR4X ర్యామ్ విత్ 128 జీబీ / 256 జీబీ (యూఎఫ్ఎస్ 2.2) స్టోరేజ్ఆండ్రాయిడ్ 15 విత్ ఫన్ టచ్ ఓఎస్ 15డ్యూయల్ సిమ్ (నానో + నానో)50 మెగాపిక్సెల్ కెమెరా విత్ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్, ఓఐఎస్, ఎఫ్ / 1.79 ఎపర్చర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ విత్ ఎఫ్ / 2.4 ఎపర్చర్, ఆరా లైట్32 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్యూఎస్బీ టైప్-సీ ఆడియో, స్టీరియో స్పీకర్లు👉 ఇది చదివారా? కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్దుమ్ము, స్ప్లాష్ రెసిస్టెంట్ (IP65 రేటింగ్)90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీఅమెజాన్, ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ స్టోర్లలో జూన్ 27 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. -
కార్పొరేట్ యోగా!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. దేశీయ కార్పొరేట్ సంస్థల చైర్మన్లు, ఎండీలు ‘యోగా డే’ను జరుపుకున్నారు. ప్రతిరోజూ యోగా సాధనతో సత్యాన్ని అన్వేషిస్తున్నాను. శ్వాసపై నియంత్రణతో భావోద్వేగాలపై పట్టు సాధింవచ్చు. యోగా మార్గం పూర్తి క్రమశిక్షణతో కూడుకున్నది. స్వీయ ఆవిష్కరణకు దిక్సూచి లాంటిది’’ అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ సంగీతా రెడ్డి అన్నారు. ‘‘యోగా ద్వారా పది నిమిషాల ఉచ్ఛా్వస నిశ్వాసాలతో, పరుగులు పెడుతున్న ప్రపంచంలోనూ ప్రశాంతతను పొందవచ్చు’’ అని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు లభించిన అమూల్యమైన బహుమతి యోగా. ఇది క్రమశిక్షణ, సాధన, జీవన మార్గం’’ అని జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ తెలిపారు. యోగా గురువు రామ్దేవ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నికర పన్ను వసూళ్లు డౌన్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నికర పన్ను వసూళ్లు రూ. 4.59 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 1.39 శాతం తగ్గాయి. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు నెమ్మదించడం, రిఫండ్లు అధిక స్థాయిలో ఉండటం ఇందుకు కారణం. రిఫండ్లు 58 శాతం పెరిగి రూ. 86,385 కోట్లకు చేరాయి. కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కార్పొరేట్ల లాభదాయకత, వ్యక్తుల ఆదాయాలను ప్రతిబింబించే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 19 మధ్యకాలంలో సుమారు 4 శాతం పెరిగి రూ. 1.56 లక్షల కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఇది 27 శాతం వృద్ధి నమోదు చేసింది. కార్పొరేట్లు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ సుమారు 6 శాతం వృద్ధితో రూ. 1.22 లక్షల కోట్లకు చేరగా, వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు సహా కార్పొరేట్యేతరుల చెల్లింపులు 2.68 శాతం క్షీణించి రూ. 33,928 కోట్లకు పరిమితమయ్యాయి. సాధారణంగా అడ్వాన్స్ ట్యాక్స్ను నాలుగు విడతల్లో (జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి) చెల్లిస్తారు. మరోవైపు, స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు సుమారు 5 శాతం పెరిగి రూ. 5.45 లక్షల కోట్లకు పెరిగాయి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) 12 శాతం పెరిగి రూ. 13,013 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 25.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 12.7 శాతం అధికం. జూన్ 19 వరకు నిర్దేశించుకున్న టార్గెట్లో 18.21 శాతం వసూళ్లను ప్రభుత్వం సాధించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఎస్టీటీ ద్వారా రూ. 78,000 కోట్లు వసూలు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. -
గిగ్ ఉద్యోగాలకు భారీ డిమాండ్
ముంబై: గతేడాది బ్లూ–కాలర్(ఆఫీసేతర) విభాగంలో గిగ్ ఉద్యోగాలు 92% పెరిగినట్లు బ్లూ, గ్రే కాలర్ రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ వర్క్ ఇండియా నివేదిక పేర్కొంది. వేగంగా విస్తరిస్తున్న ఈ–కామర్స్, ఫుడ్ డెలివరీ, రైడింగ్ ప్లాట్ఫామ్ల్లో కారి్మకులకు పెరుగుతున్న డిమాండ్కు ఇది సంకేతమని సర్వే తెలిపింది. ‘‘క్విక్ కామర్స్ కంపెనీలు కేవలం డిమాండ్ సృష్టించడమే కాదు. నమ్మకమైన ఆదాయ వనరులుగా మారాయి. చాలా మంది అభ్యర్థులకు ముఖ్యంగా చిన్న పట్టణాల్లో డెలివరీ ఉద్యోగం కేవలం పార్ట్టైం జాబ్ మాత్రమే కాకుండా కెరీర్ ఎంపికగా మారింది’’ అని వర్క్ ఇండియా సీఈవో, వ్యవస్థాపకులు నీలేష్ దుంగర్వాల్ తెలిపారు. గిగ్ రోల్స్ ఉద్యోగాలకు ఇప్పటికీ డిమాండ్ బలంగా ఉంది. మొత్తం దరఖాస్తుల పెరుగుదల 63 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. లాస్ట్ మైల్ లాజిస్టిక్ ఉద్యోగాలకు కేంద్రాలైన ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కత్తా నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. -
విమానయాన రంగంలో ఈ ఏడాదీ జోష్..!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విమాన ప్రయాణికుల రద్దీ (ఎయిర్ ట్రాఫిక్) 7–10 శాతం మేర పెరగొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. 17.5–18.1 కోట్ల మంది ప్రయాణించొచ్చని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25)లో 7.6 శాతం అధికంగా 16.54 కోట్ల మంది ప్రయాణించడం గమనార్హం. 2019–20 సంవత్సరంలో నమోదైన విమాన ప్రయాణికుల రద్దీతో పోల్చితే ఇది 16.8 శాతం వృద్ధికి సమానమని పేర్కొంది. ప్రయాణికుల రద్దీ పెరిగినప్పటికీ విమానయాన రంగం రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు నికర నష్టాలను మూటగట్టుకోవచ్చని అంచనా వేసింది. 2024–25లో ఈ రంగం నమోదు చేసిన నష్టాల స్థాయిలోనే ఈ ఏడాదీ ఉండొచ్చని.. 2023–24లో రూ.1,600 కోట్ల నికర లాభాలతో పోల్చి చూస్తే పూర్తి వైరుధ్యమని వివరించింది. అధిక ఇంధన ధరలు, పెరుగుతున్న వ్యయాలు, నూతన ఎయిర్క్రాఫ్ట్లకు సంబంధించి లీజు వ్యయాల పెరుగుదల వంటి పరిణామాలను నష్టాలకు కారణాలుగా తెలిపింది. పరిశ్రమ వడ్డీ చెల్లింపుల నిష్పత్తి (ఇంటరెస్ట్ కవరేజీ) 1.5–2 శాతం స్థాయిలో ఉంటుందని పేర్కొంది. ఎన్నో సవాళ్ల మధ్య ఆర్థిక స్థిరత్వంలో మెరుగుదల కనిపిస్తున్నట్టు వివరించింది.మే నెలలో ప్రయాణాల జోరు మే నెలలో 1.43 కోట్ల మంది ప్రయాణికులు విమానయాన సేవలను వినియోగించుకున్నారు. 2024 మే నెల డేటాతో పోల్చి చూస్తే ఇది 4 % అధికమని ఇక్రా నివేదిక తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలతో పోల్చి చూసినప్పుడు వృద్ధి ఫ్లాట్గా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో కలిపి 2.86 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల కంటే 6.2% ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ప్రయాణికుల్లో వృద్ధి 7–10% మేర, అంతర్జాతీయ ప్రయాణికుల్లో వృద్ధి 15–20% మేర నమోదవుతుందని ఇక్రా అంచనా వేసింది. వ్యయాలు పెరిగిపోయిన నేపథ్యంలో మెరుగైన పీఎల్ఎఫ్పై ఎయిర్లైన్స్ దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. -
వాణిజ్యంపై యుద్ధ ప్రభావం ఎంత?
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రమైతే మనదేశ వాణిజ్యంపై ఏ మేరకు ప్రభావం పడుతుందన్న దానిపై కేంద్ర వాణిజ్య శాఖ కీలక సమావేశం నిర్వహించింది. షిప్పింగ్ సంస్థలు, ఎగుమతిదారులు, కంటెయినర్ కంపెనీలు, ఇతర శాఖలు, భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ దీనికి నేతృత్వం వహించారు. హర్ముజ్ జలసంధిలో ప్రస్తుతానికి తటస్థ పరిస్థితులే నెలకొన్నట్టు, ఓడల రవాణాలకు ఎలాంటి ఆటంకాల్లేనట్టు ప్రతినిధులు వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న పరిణామాలు, వాణిజ్యంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సి ఉంటుందని వాణిజ్య శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రత్నామ్నాయాలను గుర్తించాల్సిన ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. యుద్ధం తీవ్రతరమైతే అది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుందని.. హర్ముజ్ జలసంధి, రెడ్సీ ద్వారా ఓడల రవాణాకు ఆటంకాలు ఏర్పడతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో సముద్ర, వాయు రవాణా చార్జీలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. హర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం గమనార్హం. కేవలం 21 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే ఈ జలసంధి ద్వారానే ప్రపంచంలో 20 శాతం మేర ముడి చమురు రవాణా అవుతోంది. అంతేకాదు మన చమురు దిగుమతుల్లో మూడింట రెండొంతులు, ఎల్ఎన్జీ దిగుమతుల్లో సగం మేర హర్ముజ్ జలసంధి ద్వారానే వస్తున్నాయి. వీటికి ఆటంకాలు ఏర్పడితే చమురు ధరలు, రవాణా, బీమా చార్జీల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ ప్రభావం మన దేశ వాణిజ్యంపై గణనీయంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే వాణిజ్య శాఖ ఈ సమావేశం నిర్వహించింది. -
హెచ్డీఎఫ్సీ కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కొన్నాళ్ల క్రితం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ను కొనుగోలుపై ఆసక్తి చూపింది. అందుకోసం ఆఫర్ కూడా ఇచ్చింది. కానీ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ చందా కొచర్తో నిర్వహించిన చర్చాగోష్టి సందర్భంగా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మాజీ చైర్మన్, సీనియర్ బ్యాంకర్ దీపక్ పరేఖ్ ఈ విషయాలు వెల్లడించారు. ‘ఐసీఐసీఐతోనే హెచ్డీఎఫ్సీ ప్రారంభమైంది. అలాంటప్పుడు సొంతింటికి తిరిగి రావచ్చు కదా, అని ఒకసారి మీరు ఆఫర్ ఇచ్చిన సంగతి నాకు గుర్తుంది. కానీ దాన్ని నేను తిరస్కరించాను. అది సముచితం కాదని చెప్పాను‘ అని పరేఖ్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత నియంత్రణ నిబంధనల ఒత్తిడి కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సంస్థను విలీనం చేశామని, ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ తమకు కొంత తోడ్పాటు అందించిందని ఆయన చెప్పారు. విలీనమనేది సంస్థకు మేలు చేసేది కాగా, భారీ స్థాయి బ్యాంకులు ఉండటమనేది దేశానికే మంచి చేస్తుందని పరేఖ్ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ భారతీయ బ్యాంకులు ఇతర సంస్థల కొనుగోళ్ల ద్వారా మరింత బలోపేతం కావడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 44 ఏళ్ల చరిత్ర గల హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థ రివర్స్ మెర్జర్ ద్వారా అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ రివర్స్ మెర్జర్కి ముందు దాన్ని కొనుగోలు చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతిపాదన చేసింది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఏర్పాటుకు ఐసీఐసీఐ బ్యాంక్ మాతృ సంస్థ ఐసీఐసీఐ లిమిటెడ్ ఆర్థికంగా తోడ్పాటు అందించింది. -
కోడింగ్ పోరులో కంపెనీలు..
సాంకేతికత పెరిగే కొద్దీ కృత్రిమ మేథ (ఏఐ) రంగంలో కొత్త రకం యుద్ధాలు మొదలవుతున్నాయి. పైథాన్, రస్ట్లాంటి ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజ్లతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వాటాల కోసం అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు, అంకుర సంస్థలు ఒకదానితో మరొకటి పోటీపడుతూ కత్తులు దూసుకుంటున్నాయి. ఏఐ టెక్ దిగ్గజాలు ఇటీవలే పోటాపోటీగా కొత్త సాధనాలను ఆవిష్కరించాయి. గూగుల్ తమ గోడింగ్ ఏజెంట్ జ్యూల్స్ను, మైక్రోసాఫ్ట్ గిట్హబ్ ఏఐ ఏజెంటును, కోడింగ్ స్టార్టప్ విండ్సర్్ఫను 3 బిలియన్ డాలర్లతో కొన్న ఊపులో ఓపెన్ఏఐ సంస్థ కోడెక్స్ను ప్రవేశపెట్టాయి. వీటన్నింటి లక్ష్యం ఏమిటంటే, కోడింగ్ రాయడంలో డెవలపర్లకు సహాయం చేయడం, బగ్లను ఫిక్స్ చేయడం, అలాగే కర్సర్, లవబుల్, బోల్ట్లాంటి స్టార్టప్లతో నేరుగా పోటీపడటం. డెవలపర్లు, అంకుర సంస్థలు ఈ పరిణామాలపై పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. జెన్ఏఐ రేసుతో ముందుగా ప్రభావం పడేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగమేనని పరిశీలకులు చెబుతున్నారు. కంపెనీలు ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం కోడింగ్ టూల్స్ను విరివిగా ఉపయోగిస్తుండటం ఇందుకు నిదర్శనమంటున్నారు. టూల్స్ వాడకం ఒక్కటే ఆప్షన్.. ఏఐ టూల్స్ను ఉపయోగించడాన్ని నేర్చుకోవడం తప్ప ప్రస్తుతం వేరే ఆప్షన్ లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఇప్పటికే కోడింగ్ 30 శాతం ఏఐ ద్వారానే జరుగుతోంది. అటు ఇన్మొబీ సంస్థ కోడింగ్లో దాదాపు 50 శాతం ఏఐతోనే జరుగుతోంది. దీన్ని 80 శాతానికి పెంచుకునే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం మార్కెట్స్అండ్మార్కెట్స్ గణాంకాల ప్రకారం ఏఐ కోడింగ్ టూల్ మార్కెట్ ఏటా 28 శాతం వృద్ధి చెందుతూ 2028 నాటికి 12.6 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఉత్పాదకత పెరగడంపరంగా ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉండటం, మార్కెటింగ్ .. సేల్స్లాంటి నాన్–టెక్నికల్ టీమ్లు కూడా ఉపయోగించడానికి సులువుగా ఉండటం వంటి అంశాల కారణంగా కోడింగ్ టూల్స్ వినియోగం పెరుగుతోంది. దీంతో ఈ విభాగంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన టెక్ దిగ్గజాలకు ఆదాయార్జనకు ఇదొక కొత్త మార్గంగా నిలుస్తోంది. కొత్త ఆదాయ మార్గం.. ఫౌండేషనల్ మోడల్స్పై కోట్ల కొద్దీ డాలర్లు కుమ్మరించిన కంపెనీలు ఇప్పుడు వాటిపై రాబడులు అందుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని ఎల్ఎల్ఎం ఎవాల్యుయేషన్ ప్లాట్ఫాం అయిన నోవియం వర్గాలు తెలిపాయి. ఎల్ఎల్ఎంలకు కోడ్ జనరేట్ చేయడమనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోందని వివరించాయి. కర్సర్ అనే సంస్థ గత రెండేళ్లుగా ఏటా 300 మిలియన్ డాలర్ల మేర ఆదాయాలను ఆర్జిస్తోందని పేర్కొన్నాయి. ఇక బోల్ట్, లవబుల్లాంటి సంస్థలు కూడా ఊహించని స్థాయిలో ఆదాయాలు ఆర్జిస్తున్నాయి. తమ ఇంజినీర్ల ఉత్పాదకత కనీసం 10–20 శాతమైన పెరుగుతుందంటే ఈ టూల్స్పై ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం కోడింగ్ ఆటోమేషన్ అనేది ప్రస్తుతం హాట్ సెక్టార్గా మారిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్నికల్యేతర నేపథ్యాలున్న వారు కూడా సులభంగా, సరళంగా వెబ్సైట్లు, చాట్బాట్లను రూపొందించడానికి ఇది ఉపయోగపడుతోందని వివరించాయి. సాధారణంగా పెద్ద కంపెనీల్లో ఏఐ టూల్స్ను మిగతా అవసరాల కోసం పెద్దగా ఉపయోగించకపోయినా ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి.సవాళ్లూ ఉన్నాయి.. కోడింగ్ పని 70 శాతం వేగవంతమవడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడుతున్నాయి. కోడింగ్ చేయడానికి టూల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నప్పటికీ, వీటితో సవాళ్లు కూడా ఉన్నాయని నిపుణులు తెలిపారు. పని వేగవంతమవుతోంది కాబట్టి ఏఐని ఉపయోగించి ప్రతి ఒక్కరూ కోడింగ్ చేసేయొచ్చనే అపోహలు ఉంటున్నాయని పేర్కొన్నారు. 70 శాతం పూర్తయితే సరిపోదు, దాన్ని 100 శాతం వరకు తీసుకెళ్లేందుకు నిపుణుల అవసరం అవుతుందని వివరించారు. అంతేగాదు, కోడింగ్ టూల్స్ వినియోగం పెరిగే కొద్దీ రివ్యూ చేయాల్సిన కోడ్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. తమ కస్టమర్లపై ప్రభావం పడకుండా రివ్యూ ప్రక్రియలను కూడా కంపెనీలు ఆటోమేట్ చేస్తున్నాయి. తాము ఏకకాలంలో వివిధ సిస్టమ్లను అభివృద్ధి చేస్తూనే, వాటి అమలు తీరుతెన్నులను కూడా పర్యవేక్షించే ప్రయత్నాల్లో ఉన్నామని ఇన్మొబి వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు తప్పొప్పులను పరీక్షించుకుంటూ ముందుకెళ్తుండటం వల్ల తమ దగ్గర కోడింగ్లో ఏఐ వినియోగం ప్రస్తుతానికి యాభై శాతం స్థాయిలోనే ఉందని వివరించాయి. -
రూ.43 వేల కోట్ల పడవపై పెళ్లి...
ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడి ప్రతి కదలికా వార్తే.. విశేషమే. మరి ఆయన పెళ్లి చేసుకుంటుంటే... ఆర్భాటం కాకుండా ఉంటుందా? అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, కాబోయే భార్య లారెన్ శాంచెజ్ పెళ్లి చేసుకుంటున్నారు. ఇటలీలోని చారిత్రక వెనిస్ నగరంలో మూడు రోజులపాటు వివాహ వేడుక జరగనుంది.61 ఏళ్ల బెజోస్, 55 ఏళ్ల సాంచెజ్ లకు ఇదివరకే వేరొకరితో వివాహాలు జరిగి పిల్లలు ఉన్నారు. జెఫ్ బెజోస్ తాజా వివాహం జూన్ 24 నుండి 26 వరకు జరుగుతుందని వెనిస్ మేయర్ ప్రతినిధి ఒకరు సీఎన్ఎన్తో చెప్పారు. శాన్ జార్జియో మాగియోర్ ద్వీపంలో జరిగే ఈ వేడుకకు సుమారు 200 మంది అతిథులు హాజరుకానున్నారు.ఈ మెగా వెడ్డింగ్ తీసుకురానున్న టూరిస్ట్ ట్రాఫిక్ పై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తుండగా, అధికార యంత్రాంగం వైఖరి మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటాలియన్ దినపత్రిక ఇల్ గాజెట్టినో ప్రకారం, వెనిస్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ మోరిస్ సెరాన్ దీని కోసం గట్టిగా ప్రయత్నించారు. వేడుక కోసం డోల్స్ అండ్ గబ్బానాకు చెందిన డిజైనర్ డొమెనికో డోల్స్ ను కూడా రంగంలోకి దింపారు. గత శతాబ్దంలో ఇప్పటికే 5.9 అంగుళాలు మునిగిపోయిన వెనిస్ నగరం వేడుకకు వచ్చే జనంతో మరింత ఒత్తిడి ఎదురవుతుందన్నది స్థానికుల ఆందోళన.విలాసవంతమైన నావపై..వెనీషియన్ సరస్సులో లంగరు వేయనున్న బెజోస్కు చెందిన 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.43 వేల కోట్లు) సూపర్ యాచ్ (విలాస నౌక) కోరులో అసలు వేడుక జరుగుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు అబియోనా అనే మరో సహాయక నౌక కూడా ఉంటుంది. వెనిస్ అంతటా పలు ప్రాంతాలు వివాహ కార్యక్రమాలకు నేపథ్యంగా పనిచేస్తాయి. కాక్టెయిల్ రిసెప్షన్లు, వేడుకలు గ్రాండ్ కెనాల్ పై ఉన్న 15 వ శతాబ్దపు ప్యాలెస్ పాలాజ్జో పిసాని మోరెట్టా, పునరుజ్జీవన కళాఖండమైన స్కూలా గ్రాండే డెల్లా మిసెరికోర్డియా, అడ్రియాటిక్ సముద్రం నుండి వెనిస్ మడుగును వేరుచేసే ద్వీపమైన లిడోలోని ఐకానిక్ హోటల్ ఎక్సెల్సియర్ వద్ద జరుగుతాయని భావిస్తున్నారు.గెస్ట్ లిస్ట్ లో ఎవరెవరున్నారంటే..పూర్తి జాబితా గోప్యంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రముఖులు, వ్యాపార, రాజకీయ అధి నాయకులు ఇందులో ఉంటారని భావిస్తున్నారు. ఆహ్వాన జాబితాలో బ్రిటీష్ నటుడు ఓర్లాండో బ్లూమ్, అతని కాబోయే భార్య కేటీ పెర్రీతో పాటు మిక్ జాగర్, కిమ్ కర్దాషియాన్, క్రిస్ జెన్నర్, ఓప్రా విన్ఫ్రే, ఈవా లాంగోరియా, లియోనార్డో డికాప్రియో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీరు బస చేసేందుకు అత్యంత విలాసవంతమైన హోటళ్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.భారీగా పెళ్లి ఖర్చువెనిస్ లో బెజోస్, సాంచెజ్ల వివాహానికి భారీగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. టెలిగ్రాఫ్ నివేదించిన ఒక వివరణాత్మక అంచనా ప్రకారం.. ఈ వివాహానికి ఖర్చు సుమారు 16 మిలియన్ డాలర్లు (రూ.132 కోట్లు) కావచ్చు. పూల ఏర్పాట్లు, వేదిక అలంకరణ కోసం 1 మిలియన్ డాలర్లు, వెడ్డింగ్ ప్లానింగ్ సేవలకు 3 మిలియన్ డాలర్లు, చారిత్రాత్మక ప్రదేశాల అద్దెకు 2 మిలియన్ డాలర్లు, క్యాటరింగ్ కోసం మరో 1 మిలియన్ డాలర్లు, సాంచెజ్ వార్డ్ రోబ్ కోసం 1.5 మిలియన్ డాలర్లు కేటాయించారు. ప్రఖ్యాత అమెరికన్ సింగర్ లేడీ గాగా ప్రదర్శన ఉంటుందని భావిస్తున్నారు. -
ఇప్పుడు ఇల్లు.. ఇలా కొనడమే ఇష్టం
గృహ కొనుగోలుదారుల అభిరుచి మారింది. గతంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు ఆసక్తి చూపిన కస్టమర్లు.. ప్రస్తుతం లాంచింగ్ ప్రాజెక్ట్లలో కొనేందుకు ఇష్టపడుతున్నారు. 2023లో రెడీ టూ మూవ్, లాంచింగ్ ప్రాజెక్ట్లలో కొనుగోళ్ల నిష్పత్తి 46:18 శాతంగా ఉండగా.. 2024 నాటికి 23:24 శాతానికి చేరింది. అలాగే రూ.కోటిన్నర ధర ఉన్న లగ్జరీ గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023లో 20 శాతం మంది లగ్జరీ ఇళ్లకు ఆసక్తి చూపించగా.. 2024 నాటికి 35 శాతానికి పెరిగిందని ఫిక్కీ, అనరాక్ సర్వేలో వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరోబాల్కనీ మస్ట్.. 1, 2, 3 బీహెచ్కే.. ఇళ్లు ఏదైనా సరే బాల్కనీ ఉండాల్సిందే. గృహ కొనుగోలుదారులు నిర్మాణం నాణ్యత, ప్రాంతం, ధర, వసతులతో పాటు బాల్కనీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇంటిలోని ప్రతి అంగుళం స్థలాన్ని వినియోగించాలని భావించిన కస్టమర్లు.. ప్రస్తుతం ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉండాలని కోరుకుంటున్నారు. 75 శాతం మంది బాల్కనీ ఉండే ఇళ్ల కొనుగోళ్లకే ఆసక్తి చూపించగా, 74 శాతం మంది కస్టమర్లు నాణ్యమైన నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. అనరాక్ రీసెర్చ్ దేశంలోని పలు నగరాలలో 5,510 మందిపై ఆన్లైన్లో సర్వే నిర్వహించింది. గృహాల ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారుల విశాలమైన ఇళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. 50 శాతం మంది కస్టమర్లు 3 బీహెచ్కే కొనుగోలుకు ఆసక్తి చూపిస్తే.. 38 శాతం మంది 2 బీహెచ్కే గృహాలకు మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎన్సీఆర్ నగరాలలో 3 బీహెచ్కే యూనిట్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ధరల కారణంగా ముంబైలో 44 శాతం మంది కస్టమర్లు 2 బీహెచ్కేలకు, 17 శాతం 1 బీహెచ్కేలకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణేలో 10 శాతం కొనుగోలుదారులు 1 బీహెచ్కే జై కొడుతున్నారు.పెట్టుబడులకు రియలే బెటర్.. ఏటా దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఫ్లాట్ల విస్తీర్ణాలు 11 శాతం మేర పెరుగుతున్నాయి. 2022లో 1,175 చ.అ.లుగా ఉన్న సగటు ఫ్లాట్ల సైజు.. 2023 నాటికి 1,300 చ.అ.లకు పెరిగాయి. 58 శాతం మిలీనియల్స్, 39 శాతం జెన్స్–ఎక్స్ కస్టమర్లు ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాలతో ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 57 శాతం మంది రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్య పెట్టుబడిగా విశ్వసిస్తున్నారు. ఇందులోనూ 36 శాతం మంది నివాస విభాగంలో పెట్టుబడులకే ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రుణ వడ్డీ రేట్లు 8.5 శాతం కంటే తక్కువగా ఉన్నంత కాలం ఇంటి కొనుగోలు నిర్ణయంపై ప్రభావం ఉండదని చెప్పారు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త సర్వీస్..
ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త 5జీ ఇంటర్నెట్ సర్వీస్ను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారి క్యూ-5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (Q-5G FWA) లాంచ్ చేసింది. ఇది సంస్థలకు, కార్యాలయాలకు సిమ్ రహిత, వైర్లెస్ పరిష్కారాన్ని అందిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.ఏమిటీ క్యూ-5జీ?క్యూ-5జీ.. ఇక్కడ క్యూ అంటే క్వాంటమ్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ చాలా అరుదుగా ఉండే టైర్-2, టైర్-3 నగరాలను లక్ష్యంగా చేసుకుని బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ ఎఫ్డబ్ల్యూఏ సేవలను ప్రారంభించింది. భారతదేశంలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బీఎస్ఎన్ఎల్ రూపొందించిన ఈ సరికొత్త సర్వీస్ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, నెట్వర్క్ లేని నివాస ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడంలో సహాయపడుతుంది.అయితే, ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా అందించే సాధారణ 5జీ సేవల మాదిరిగా కాకుండా బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ ఎఫ్డబ్ల్యూఏలో వాయిస్ సదుపాయం ఉండదు. అంటే దీని ద్వారా వినియోగదారులు కాల్స్ చేయలేరు. సిమ్ లేదా వైర్లు లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ మాదిరిగానే ఇది ఉంటుంది.క్యూ-5జీ ప్లాన్లుమిగిలిన వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసుల మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ తీసుకున్న కస్టమర్లకు వారి ఇళ్లపై సీపీఈ పరికరాలను ఏర్పాటు చేస్తారు. బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ సర్వీస్ 100 ఎంబీపీఎస్ కనీస వేగాన్ని అందిస్తుంది. ఇందుకోసం నెలకు రూ .999 ఖర్చు అవుతుంది. అదే 300 ఎంబీపీఎస్ వేగం కావాలంటే రూ.1,499 ప్లాన్ ను అందిస్తోంది.ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ క్యూ-5జీ ఎఫ్డబ్ల్యూఏ హైదరాబాద్కే పరిమితం కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బెంగళూరు, పాండిచ్చేరి, విశాఖపట్నం, పుణె, గ్వాలియర్, చండీగఢ్ వంటి నగరాలకు ఈ సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే తెలిపింది. -
అదే జరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలే!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో ముడిచమురు రేట్లు భగ్గుమన్నాయి. యుద్ధం మొదలైన గత శుక్రవారం నాడు (జూన్ 13న) ఒకే రోజున ఏకంగా 11 శాతం ఎగిసింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు ఎకాయెకిన 70.50 డాలర్ల నుంచి 78.50 డాలర్లకు పెరిగి, ఆరు నెలల గరిష్టానికి చేరింది. వారం రోజులుగా ఆ గరిష్ట స్థాయిలోనే తిరుగుతోంది.యుద్ధం ఇదే విధంగా కొనసాగి, చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ గానీ మూసివేస్తే ముడి చమురు రేట్లు 120–130 డాలర్ల వరకు కూడా ఎగిసే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ అదే జరిగితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లకూ రెక్కలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశం ఇరాన్ నుండి నేరుగా చమురు దిగుమతి చేసుకోకపోయినా, మధ్యప్రాచ్య స్థిరత్వం ప్రభావం భారతీయ మార్కెట్పై పడుతుంది.పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతూ హర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా కేంద్రాలలో ఒకటిగా ఉంది. ఇది ఇరాన్, ఒమన్ మధ్య ఇరుకైన జలమార్గం. పర్షియన్ గల్ఫ్ నుండి ముడి చమురు ఎగుమతుల్లో 85% కంటే ఎక్కువ దీని ద్వారా వెళుతుంది. 2024లో ఈ జలసంధి రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెల్స్ ప్రవాహాన్ని చూసింది. ఇది ప్రపంచ పెట్రోలియం వినియోగంలో ఐదవ వంతు. ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడం గానీ, ఏదైనా అంతరాయం జరిగితే చమురు కొరత తీవ్రమై ధరల పెరుగుదలకు దారితీస్తుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ మార్గం గుండా వెళ్ళే చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నందున, సరఫరాలో అంతరాయాల వల్ల ఈ దేశాలు ఏదైనా ఎక్కువగా ప్రభావితమవుతాయి. -
ఇన్వెస్టర్లూ.. కొంటారా కొత్త షేర్లు?
ఎన్బీఎఫ్సీ.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 700–740 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 25న ప్రారంభంకానున్న ఇష్యూ 27న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది.ఇష్యూ ద్వారా రూ. 12,500 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 20 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం హెచ్డీబీ ఫైనాన్షియల్లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 94.36 శాతం వాటా కలిగి ఉంది. అనుబంధ సంస్థ విలువను రూ. 61,400 కోట్లుగా బ్యాంక్ మదింపు చేసింది.కాగా.. ఈక్విటీ జారీ నిధులను టైర్–1 మూలధన పటిష్టతకు హెచ్డీబీ కేటాయించనుంది. తద్వారా బిజినెస్ వృద్ధికి వీలుగా రుణాల విడుదల తదితర భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. జులై 2న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కావచ్చు.సంభవ్ స్టీల్ ట్యూబ్స్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డెడ్(ఈఆర్డబ్ల్యూ) స్టీల్ పైపుల తయారీ కంపెనీ సంభవ్ స్టీల్ ట్యూబ్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 25న ప్రారంభంకానుంది. 27న ముగియనున్న ఇష్యూకి రూ. 77–82 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 440 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.ఇష్యూ ద్వారా మొత్తం రూ. 540 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధుల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. దేశీయంగా ఈఆర్డబ్ల్యూ స్టీల్ పైపులు, స్ట్రక్చురల్ ట్యూబుల(హాలో సెక్షన్) తయారీలోని కీలక కంపెనీలలో ఒకటిగా సంభవ్ స్టీల్ నిలుస్తోంది.ఐకాన్ ఫెసిలిటేటర్స్ చిన్న, మధ్యతరహా కంపెనీ(ఎస్ఎంఈ).. ఐకాన్ ఫెసిలిటేటర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 85–91 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 26న ముగియనుంది. ఐపీవోలో భాగంగా 21 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా టెక్నికల్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసులందించే కంపెనీ రూ. 19.1 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్కానుంది.ఐపీవో నిధుల్లో రూ. 16 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎలక్ట్రికల్, క్యాప్టివ్ పవర్, బిల్డింగ్ మేనేజ్మెంట్తోపాటు వాటర్ ట్రీట్మెంట్ సర్వీసులు సమకూర్చుతోంది. అంతేకాకుండా ఫైర్ అండ్ సేఫ్టీ పరికరాలు, ఎలివేటర్లు, ఎస్కలేటర్ల నిర్వహణను సైతం చేపడుతోంది. 2025 మార్చి31కల్లా కంపెనీ 2,000 మందికిపైగా ఆయా విభాగాలలో నిపుణులైన ఉద్యోగులను కలిగి ఉంది. -
ఓపెన్ ప్లాట్లకూ రుణాలు!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలు, విల్లాలు వంటి నిర్మాణ సంబంధమైన ప్రాపర్టీలకు బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ)లు గృహ రుణాలు ఇస్తుంటాయి. ఓపెన్ ప్లాట్లు, స్థలాల కొనుగోళ్లకు రుణాల మంజూరు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటాయి. పలు థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఓపెన్ ప్లాట్లకు సైతం రుణాలను మంజూరు చేపిస్తున్నాయి. ఓపెన్ ప్లాట్ల మార్కెట్ బాగుండి, మంచి అనుభవం ఉన్న డెవలపర్లకు ఫండింగ్ చేస్తుంటారు. ప్లాటింగ్ వెంచర్లో నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటుంది. స్థలం కొన్న తర్వాత రోడ్లు, లైటింగ్, ఎలక్ట్రిసిటీ వంటి ఖర్చులకు మినహా పెద్దగా వ్యయం కాదు. అందుకే స్థలం కొనేందుకు కూడా లోన్లను ఇస్తుంటారు.నాలుగు గోడలకు కాలం చెల్లింది.. బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల నిధుల కొరతతో రియల్టీ ప్రాజెక్ట్లకు రుణాలు అంత ఈజీగా దొరకడం లేదు. కొత్త ప్రాజెక్ట్లకు లోన్స్ సంగతి దేవుడెరుగు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లకూ ఫండింగ్ దొరకటం కష్టంగా మారింది. నాలుగు గోడల ఇంటికి కాలం చెల్లింది. కాంక్రీట్ భవనాలకు కొనుగోలుదారులు స్వస్తి పలికేశారు. సాంకేతికతను వినియోగించే టెకీ భవనాలు, ఆధునిక వసతులుండే విలాస గృహాలకు జై కొడుతున్నారు.👉 ఇది చదివారా? ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్! సౌర విద్యుత్, హోమ్ ఆటోమేషన్, ఎస్టీపీ, రెయిన్ హార్వెస్టింగ్ వంటి ఏర్పాట్లు ఉన్న గృహాల కొనుగోళ్లకే మద్దతు పలుకున్నారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఇద్దరూ ఈ తరహా ప్రాజెక్ట్ల పెట్టుబడులకే మొగ్గుచూపుతున్నారు. అందుకే డెవలపర్లు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ల నిర్మాణాలనే చేపట్టాలి. దీంతో బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల నుంచి రుణాలు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు వస్తాయి. -
‘19 ఏళ్ల కిందట భూమి అమ్మారు.. నాకేం తెలియదు’
బెంగళూరులో దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన భూమి అమ్మకం ఇప్పుడు న్యాయ వివాదానికి దారితీసింది. 2006లో భూమిని విక్రయించిన ఓ వ్యక్తి కుమార్తె తన అనుమతి లేకుండా ఆస్తిని అమ్మారని పేర్కొంటూ ప్రస్తుత యజమానులకు లీగల్ నోటీసులు పంపింది. బృహత్ బెంగళూరు మహానగర పాలకే(బీబీఎంపీ) పరిధిలో ఉన్న ఈ ఆస్తిని మహిళ తండ్రి 19 ఏళ్ల కిందట విక్రయించాడని, ఇప్పుడు కొనుగోలుదారు తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.రెడ్డిట్లో భూమి కొన్న వ్యక్తి తరఫువారు తమ అనుభవాన్ని పంచుకున్నారు. ‘19 ఏళ్ల కిందట కొంత భూమిని బెంగళూరులో ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాం. ఆ సమయంలో తన కూతురు పెళ్లి కోసం తాను ఈ ఆస్తిని అమ్ముతున్నట్లు చెప్పాడు. పవర్ ఆఫ్ అటార్నీ (పీఓఏ) ప్రమేయం లేదు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఆస్తి పన్నులు చెల్లిస్తున్నాం. కొనుగోలు చేసిన వ్యక్తి పేరుమీద సర్టిఫికేట్ కూడా ఉంది. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు తనను సంప్రదించలేదని ఆస్తి అమ్మిన వ్యక్తి కూతురు ఆరోపిస్తుంది. అమ్మకానికి ముందు తనను అడగలేదని, తనకు సమాచారం తెలియజేయలేదని పేర్కొంటుంది. ఆ సమయంలో తానేం మైనర్ కాదు. పైగా ఆ భూమి అమ్ముతుంది ఆమె పెళ్లి కోసమే. అయినప్పటికీ ప్రస్తుతం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఇది కుటుంబ వ్యవహారమని, సామరస్యంగా పరిష్కరిస్తామని అమ్మిన వ్యక్తి కుమారుడు తొలుత చెప్పారు. అయితే కొన్ని నెలల తర్వాత మాట మార్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నాడు. కోర్టు వెలుపల సెటిల్మెంట్ కోసం ఒత్తిడి తెస్తున్నాడు. న్యాయమూర్తి ఆమెకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఏమిటి పరిస్థితి?’ అని పోస్ట్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు, అమ్మే సమయంలో అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి లావాదేవీలు జరపాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా పొరపాటు జరిగితే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు. -
దేశీయ కళలకు జీవం పోసేలా ఎన్ఎంఏసీసీ భారీ ఈవెంట్
భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) ఇండియా వీకెండ్ను న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుందని చెప్పారు. ఈమేరకు ‘ఎన్ఎంఏసీసీ.ఇండియావికెండ్’ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు.. వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని తెలిపారు.ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్ View this post on Instagram A post shared by NMACC India Weekend (@nmacc.indiaweekend)ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివివైజేషన్ టు నేషన్’ ఈవెంట్లో భాగంగా సాంప్రదాయ నృత్యాలు ఉంటాయని నీతా అంబానీ తెలిపారు. దాంతోపాటు ఈ హైప్రొఫైల్ ఈవెంట్ సెలబ్రిటీల ఫ్యాషన్ షో, దేశ హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయని చెప్పారు. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్ చరిత్రకు జీవం పోస్తుందని నీతా అంబానీ చెప్పారు. -
బంగారం ధరలు మళ్లీ పైకి! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్
దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత మోసాలను గుర్తించే వ్యవస్థను ప్రారంభించిన 37 రోజుల్లోనే ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లోని 6.1 మిలియన్ల మంది వినియోగదారులను ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడకుండా కాపాడినట్లు ఎయిర్టెల్ తెలిపింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించే చర్యల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు చెప్పింది.వినియోగదారులకు సైబర్ దాడుల నుంచి రక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ను ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని యోచించింది. అందులో భాగంగా ఎయిర్టెల్ ఈ విధానాన్ని ప్రారంభించిన 37 రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లో 6.1 మిలియన్లకు పైగా వినియోగదారులను విజయవంతంగా రక్షించిందని ఒక ప్రకటనలో తెలిపింది. అధునాతన వ్యవస్థ ఎస్ఎంఎస్లు, సోషల్ మీడియా ఖాతాలు, ఈ-మెయిల్స్, ఇతర బ్రౌజర్లలోని లింక్లను స్కాన్ చేసి ఫిల్టర్ చేస్తుందని తెలిపింది.ఇది ప్రతిరోజూ ఒక బిలియన్ యూఆర్ఎల్స్ను (యూనిఫాం రిసోర్స్ లొకేటర్లు) పరిశీలించడానికి రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. హానికరమైన సైట్ల నుంచి జరిగే ప్రమాదాన్ని గుర్తించి 100 మిల్లీ సెకన్లలో రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదనఉదాహరణకు, ఒక వినియోగదారుకు ‘మీ ప్యాకేజీ ఆలస్యం అయింది. ట్రాక్ చేయాలంటే వెంటనే క్లిక్ చేయండి’ అంటూ ఓ మేసేజ్ వచ్చిందనుకుందాం. ఆ లింక్పై యూజర్ క్లిక్ చేస్తే ఎయిర్టెల్ సిస్టమ్ వెంటనే లింక్ను స్కాన్ చేస్తుంది. అనుమానాస్పదంగా ఉంటే యాక్సెస్ను బ్లాక్ చేస్తుంది. దాంతోపాటు యూజర్కు హెచ్చరిక సందేశం పంపుతుంది. ‘బ్లాక్ చేయబడింది! ఎయిర్టెల్ ఈ సైట్ను ప్రమాదకరంగా గుర్తించింది!’ అని పాప్అప్ మెసేజ్ వస్తుంది. -
నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదన
ప్రముఖ నటుడు, పారిశ్రామికవేత్త వివేక్ ఒబెరాయ్ సంపద ఫోర్బ్స్ ఇండియా ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లుగా ఉంది. ‘సాథియా’, ‘మస్తీ’, ‘రక్తచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు సినిమాల్లో తక్కువగానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ వెళ్లి ఫుల్ టైమ్ ఆంత్రప్రెన్యూర్గా మారారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యాపార సామ్రాజ్య పునాదికి దారితీసిన అంశాల గురించి, తండ్రి సురేష్ ఒబెరాయ్ చిన్నతనం నుంచే తనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎలా నేర్పించారో చెప్పారు.దుబాయ్ ప్రాపర్టీ ఇన్సైడర్ పాడ్కాస్ట్లో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ‘వ్యాపార మెలకువలు నేర్చుకునే తొలినాళ్లలో నాలో ఆర్థిక అవగాహన పెంపొందించిన ఘనత నా తండ్రికే దక్కుతుంది. అతను ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి నేను దాన్ని ఎలా విక్రయించబోతున్నాననే దానిపై వ్యాపార ప్రణాళికను రూపొందించమని అడిగేవారు. దాంతో నేను 10 ఏళ్ల వయసు నుంచే వ్యాపారంలోని సూక్ష్మాంశాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నా తండ్రి ఒక విషయం స్పష్టంగా చెప్పారు. తాను ధనవంతుడినని.. మేము కాదనే చెబుతుండేవారు. మేము ఎలా ఉండాలో నిర్ణయించుకోమన్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..‘ఈ కఠినమైన ప్రేమతో కూడిన విధానం టీనేజ్ నుంచే నన్ను తోటివారి కంటే భిన్నంగా ఆలోచించేలా చేసింది. చాలా మంది టీనేజర్లు స్కూళ్లలోని పాఠాలు నేర్చుకుంటుంటే.. నేను మాత్రం మార్కెట్, వ్యాపారం, స్టాక్స్.. వంటి ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన పెంచుకున్నాను. దాంతో నా మొదటి కంపెనీ కోసం 3 మిలియన్ డాలర్లు కూడబెట్టగలిగాను. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. తర్వాతి కాలంలో నా పెట్టుబడిదారుల కోసం చాలా డబ్బు సంపాదించాను. నా 23 ఏళ్ల వయసులో ఆ కంపెనీని విక్రయించాను. తర్వాత ఇతర కంపెనీలను కొనుగోలు చేశాను. ప్రస్తుతం తొమ్మిది సంస్థలను భారత స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్లగలిగాను. మరో నాలుగు కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని యోచిస్తున్నాను’ అని తెలిపారు. -
40 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..
పని ఒత్తిడి పెరుగుతున్న ఈ రోజుల్లో చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్కు 60 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వడం అనేది పెద్ద సవాలుగా మారుతుంది. అలా అని ముందే ఉద్యోగం మానేస్తే ఆర్థిక అవసరాలు తీర్చుకోలేని పరిస్థితులు ఉంటాయనే భయాలున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారు సరైన ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకుని, దాన్ని పాటిస్తే 40 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.చాలా మంది తమ కెరియర్ పీక్కు చేరుకున్నప్పుడు 40 ఏళ్లలో పనిచేయడం మానేసి మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. బాస్లు ఉండరు.. సోమవారం వచ్చిందంటే మళ్లీ ఆఫీస్కు వెళ్లాలా అనే బెంగా ఉండదు.. వీకెండ్ కోసం ఎదురుచూడటం అవసరం లేదు. అయితే నిజంగా 40 సంవత్సరాల వయసులో ఉద్యోగం మానేసి జీవితాంతం సౌకర్యవంతంగా జీవించవచ్చా? అనే అనుమానం ఉందా. అయితే కింది విషయాలు తెలుసుకోవాల్సిందే.40 ఏళ్లకే రిటైర్ కావడం సాధ్యమేనా?కొంతమంది ఆర్థిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇది సాధ్యమే. కానీ చాలా సవాలుతో కూడుకున్నది. ముందే రిటైర్ అవ్వడాన్ని ప్రధానంగా.. మీరు ఆదాయంలో ఎంత పొదుపు చేస్తున్నారు.. కాలక్రమేణా మీ పెట్టుబడులు ఎలా పెరుగుతాయి.. అనే అంశాలు కీలకంగా మారుతాయి. 20-25 ఏళ్ల వయసు ఉన్నవారు 40 ఏళ్లకు రిటైర్ కావాలనుకుంటే ఆదాయంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసుకున్న తర్వాత ప్రస్తుత వార్షిక ఖర్చులకు 79 రెట్లు పొదుపు చేయాల్సి ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?ఫిన్నోవేట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నేహాల్ మోటా మాట్లాడుతూ.. ‘40ల్లో రిటైర్ అవ్వడం సాధ్యమే. కానీ అధిక ఆర్థిక క్రమశిక్షణ, పక్కా ప్రణాళిక ఉండాలి. ఎక్కువ సంపాదించడంపైనే కాకుండా, అధికంగా పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు. మధ్యతరగతి వేతనం పొందుతున్న వారు కూడా తమ ఆదాయంలో 50 శాతానికి పైగా పొదుపు చేసి తెలివిగా పెట్టుబడి పెడితే త్వరగానే రిటైర్ అవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.ప్రతి నెలా ఎంత పొదుపు చేయాలి?ఉదాహరణకు నెలకు రూ.లక్ష సంపాదిస్తున్న వ్యక్తిని తీసుకుందాం. నెలకు రూ.50,000 ఖర్చులు ఉన్నాయనుకుంటే 40 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల పదవీ విరమణలో మంచి కార్పస్ రావాలంటే నెలకు రూ.18,080 ఆదా చేయాల్సి ఉంటుంది. 20-25 ఏళ్ల వ్యక్తి 40 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేయాలనుకుంటే తాను నెలకు రూ.35000 వేతనంతో ఉద్యోగం సాధించినప్పటి నుంచి నెలవారీ ఆదాయంలో 60-70% లేదా అంతకంటే ఎక్కువ పొదుపు చేయాలి. అంటే దాదాపు నెలకు రూ.20,000 పొదుపు చేయాలి. ఉద్యోగం వచ్చి, పెళ్లి కావాడానికి ముందు పొదుపును మరింత పెంచాలి. ఈ మొత్తాన్ని 20-25 ఏళ్ల కాలానికి 10-12 శాతం వార్షిక రాబడి లక్ష్యంగా మ్యూచువల్ ఫండ్స్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి. కాలక్రమేణా ఇది 40-45 ఏళ్ల వయసు నాటికి రూ.2–2.5 కోట్ల కార్పస్ క్రియేట్ అవుతుంది. -
జపాన్ ల్యాండర్ శకలాలు గుర్తించిన చంద్రయాన్-2..?
చంద్రుడిపై ఇటీవల కుప్పకూలిన జపాన్కు చెందిన హకుటో-ఆర్2 లూనార్ ల్యాండర్ శకలాలను అంతరిక్ష ఔత్సాహికుడు షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 తీసిన ఫొటోలను విశ్లేషించి సుబ్రమణియన్ ఈమేరకు ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొన్నాయి. అయితే దీన్ని భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ధ్రువీకరించాల్సి ఉంది.చంద్రయాన్-2 ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా (ఓహెచ్ఆర్సీ) తీసిన చిత్రాలను ఉపయోగించి సుబ్రమణియన్ జపాన్ వ్యోమనౌక హకుటో-ఆర్2 శకలాలను గుర్తించినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగే సమయంలో కమ్యునికేషన్ కోల్పోవడంతో అది ఎక్కడ క్రాష్ ల్యాండ్ అయిందనే వివరాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ ల్యాండర్ చంద్రుడి ఉత్తరార్ధగోళంలోని శీతల ప్రదేశంలో ల్యాండ్ అవుతుండగా టోక్యోలోని మిషన్ కంట్రోల్ స్పేస్ క్రాఫ్ట్తో కమ్యూనికేషన్లు, టెలిమెట్రీ సంబంధాలను కోల్పోయింది.భారత్ 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతుండగా అందులో అమర్చిన ఓహెచ్ఆర్సీ ద్వారా జపాన్ లూనార్ ల్యాండర్ కూలిన ప్రదేశాన్ని విశ్లేషించారు. ఆ సైటును గుర్తించడానికి అవసరమైన కీలకమైన డేటాను చంద్రయాన్ 2 అందించింది. అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నట్లు తెలిసింది. అయితే దీన్ని ఇస్రో ధ్రువీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్ఎవరీ సుబ్రమణియన్?షణ్ముగ సుబ్రమణియన్ చెన్నైకి చెందిన అంతరిక్ష ఔత్సాహికుడు. చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో ఈయన చంద్రుడి పరిస్థితులను విశ్లేషించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2019లో చంద్రయాన్-2 మిషన్ నుంచి విడిపోయి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగాల్సి ఉండగా, కమ్యునికేషన్లో అంతరాయం ఏర్పడి క్రాష్ ల్యాండ్ అయింది. అయితే కాలంపాటు ఆ ల్యాండర్ ఎక్కడ కూలిందో సరైన వివరాలు లభించలేదు. ముందుగా సుబ్రమణియన్ చంద్రుడిపై పరిస్థితులను, చంద్రయాన్-2 తీసిన ఫొటోలను విశ్లేషించి విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రాంతాన్ని కనుగొన్నారు. తర్వాత ఈ విషయాన్ని ఇస్రో ధ్రువీకరించింది. -
వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ కార్లను భారత్లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలోనే ముంబయిలో షోరూమ్ ప్రారంభించనున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. యూరప్, చైనా వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు ఇటీవల క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్, మస్క్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో టెస్లా షేర్లు మరింత దిగజారాయి. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసిన క్షణం నుంచి కొంత కాలంపాటు టెస్లా అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో అమ్మకాలు డీలా పడ్డాయి. దాంతోపాటు చైనాలోనూ టారిఫ్ భయాలతో టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్కు భారత్ భారీ మార్కెట్గా తోస్తుంది. ఇప్పటికే దేశంలో టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.యూరప్, చైనాల్లో అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో టెస్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్లో తన కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెస్లా వచ్చే నెలలో ముంబయిలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించనుందని బ్లూమ్బర్గ్ తెలిపింది. ముంబయిలో షోరూమ్ ప్రారంభించిన కొద్ది రోజులకు ఢిల్లీలో షోరూమ్ ఓపెన్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెస్లా కంపెనీ అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి సూపర్ ఛార్జర్ కాంపోనెంట్స్, కార్ యాక్సెసరీస్, మర్కండైజ్, విడిభాగాలను దిగుమతి చేసుకుందని బ్లూమ్బర్గ్ పేర్కొంది.ఇదీ చదవండి: రత్నాభరణాల ఎగుమతులు డౌన్టెస్లా చైనా ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై రేర్-వీల్-డ్రైవ్ ఎస్యూవీలు భారతదేశానికి చేరుకున్నాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు బ్లూమ్బర్గ్కు తెలిపారు. మోడల్ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత టెస్లాను భారతదేశానికి తీసుకురావడంలో పురోగతి వచ్చింది. గతంలో దేశీయ టారిఫ్లు, స్థానిక తయారీపై మస్క్ విభేదించడంతో భారత్లో కంపెనీ ప్రవేశంపై ఏళ్ల తరబడి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. -
రత్నాభరణాల ఎగుమతులు డౌన్
రత్నాభరణాల ఎగుమతులు మే నెలలో 16 శాతం తగ్గిపోయాయి. 2,263 మిలియన్ డాలర్ల (19,261 కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి. గతేడాది మే నెలలో ఎగుమతులు 2,688 మిలియన్ డాలర్లు (రూ.22,414 కోట్లు)గా ఉన్నట్టు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. అమెరికా టారిఫ్ల అనంతరం వీటి ఎగుమతులు తగ్గిపోవడం గమనార్హం. కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 35 శాతం తక్కువగా 950 మిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి ఎగుమతులు 12,272 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. పాలిష్డ్ ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఎగుమతులు సైతం 33 శాతం తగ్గి 81 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి ఎగుమతులు 120 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం 17 శాతం పెరిగి 997 మిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది మే నెలలో బంగారం ఆభరణాల ఎగుమతులు 851 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. వెండి ఆభరణాల ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలల్లో 17 శాతానికి పైగా క్షీణించి 150 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కలర్డ్ జెమ్స్టోన్ ఎగుమతులు ఏప్రిల్–మే నెలల్లో ఒక శాతం తగ్గి 62 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: రేట్ల కోత ఎందుకో చెప్పిన ఆర్బీఐ గవర్నర్అమెరికా టారిఫ్ల వల్లే..‘అమెరికా టారిఫ్ల వల్ల మొత్తం మీద ఎగుమతులు మే నెలలో 16 శాతం వరకు తగ్గాయి. అయినప్పటికీ బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం పెరిగాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతుండడం బంగారానికి డిమాండ్ను పెంచింది’ అని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. -
రేట్ల కోత ఎందుకో చెప్పిన ఆర్బీఐ గవర్నర్
అంతర్జాతీయంగా ఉద్రిక్తతల నడుమ సెంట్రల్ బ్యాంక్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్న స్పష్టమైన సంకేతం ఇవ్వడానికే వడ్డీ రేట్ల కోత నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంయ్ మల్హోత్రా తెలిపారు. లిక్విడిటీ పరంగా స్పష్టతకు, వినియోగం, పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు వీలుగా రుణ వ్యయాలను తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యాలుగా పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన గల ఆరుగురు సభ్యుల ఎంపీసీ ప్యానెల్ ఈ నెలారంభంలో రెపో, రివర్స్ రెపో రేట్ల కోత నిర్ణయాలు ప్రకటించడం తెలిసిందే. ఈ నెల 4 నుంచి 6 వరకు జరిగిన ఎంపీసీ సమావేశంలో చర్చించి, రికార్డు అయిన వివరాలు (మినిట్స్) విడుదలయ్యాయి. ఐదుగురు సభ్యులు 50 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోతకు అనుకూలంగా ఓటు వేశారు. సౌగత భట్టాచార్య మాత్రం 25 బేసిస్ పాయింట్లకు మొగ్గు చూపించారు. గత కొన్ని నెలల కాలంలో ద్రవ్యోల్బణం 3 శాతం మేర తగ్గడం (2024 అక్టోబర్లో నమోదైన 6.2 శాతం నుంచి 2025 ఏప్రిల్ నెలలో 3.2 శాతానికి), వార్షికంగా ద్రవ్యోల్బణం 3.7 శాతానికి పరిమితం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో 50 బేసిస్ పాయింట్లకు అనుకూలంగా గవర్నర్ మల్హోత్రా మొగ్గు చూపించారు. ఇదీ చదవండి: ఫైనాన్షియల్ సెక్టార్పై మస్క్ కన్నుఅంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అస్థిరమైన రేట్ల కోత కంటే.. 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించడం విధానపరమైన స్పష్టతకు, వేగవంతమైన బదిలీకి వీలు కల్పిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గుప్తా అభిప్రాయపడ్డారు. తటస్థ విధానానికి సైతం మద్దతు పలికారు. -
స్మార్ట్ రింగ్లో.. మన ఆరోగ్యం
ఆరోగ్యాన్ని, ఫిట్నెస్నూ స్మార్ట్గా తెలుసుకోవడానికి వాడే స్మార్ట్ బ్యాండ్, స్మార్ట్ వాచ్లకు పోటీగా ఇప్పుడు స్మార్ట్ రింగ్స్ వచ్చాయి. చిన్నదే గానీ వేరబుల్స్ రంగంలో ఇవి కొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాయి. వినియోగంలో ఎక్కువ సౌలభ్యం.. 24 x 7 ధరించే వెసులుబాటు.. అధిక బ్యాటరీ సామర్థ్యం.. తేలిగ్గా, స్టైలిష్ లుక్తో ట్రెండీగా, ఉండటం వంటివి ఈ రింగ్స్కి కలిసి వచ్చే అంశాలు. నిద్ర తీరును తెలుసుకోవాలంటే స్మార్ట్ వాచ్ కంటే ఈ రింగే అత్యుత్తమం. ఇలాంటి ఎన్నో అనుకూలాంశాలు ఉన్నాయి కాబట్టే.. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఈ స్మార్ట్ ఉంగరాన్ని ఎంచక్కా తొడిగేస్తున్నారు.స్మార్ట్ రింగ్లో రకరకాల సెన్సార్స్ ఉంటాయి. చర్మం కిందనున్న రక్తంలోకి ప్రసరిస్తూ హృదయ స్పందనల వేగాన్ని తెలుసుకునే ఫొటోప్లిథైస్మోగ్రఫీ (పీపీజీ) సెన్సార్స్, ఉష్ణోగ్రతను కొలిచే టెంపరేచర్ చెకర్, నడక, పరుగు, సైక్లింగ్, నిద్రలో కదలికలు, నిద్రాభంగాన్ని కొలిచే మినీ మోషన్ సెన్సార్ (యాక్సిలరేటర్), రక్తంలో ఆక్సిజన్ మోతాదులను కొలిచే ఎస్పీఓ–2 సెన్సార్ ఉంటాయి. సేకరించిన సమాచారం ఇందులోని బ్లూటూత్ సాయంతో యూజర్ స్మార్ట్ఫోన్ లోని యాప్లో నిక్షిప్తం అవుతుంది. యాప్ను తెరిచి ఈ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.నిద్ర సమస్యలుస్మార్ట్ రింగ్ ధరించిన వారు ఉదయం ఎప్పుడు నిద్రలేస్తున్నారు, రాత్రి నిద్రను ఆపుకొంటూ ఉంటున్నారా, వారి నిద్రలో నాణ్యత ఉందా అన్న అంశాలతో పాటు నిద్రకు సంబంధించిన సమస్యలేమైనా ఉన్నాయా అని తెలుపుతుంది. అలాగే స్లీప్ ఆప్నియా సమస్యను తెలుసుకుని, మెదడుకు ఆక్సిజన్ అందనప్పుడు ఆ విషయాన్ని తెలియజేయడం, ముప్పు గురించి హెచ్చరిక పంపడం.. తద్వారా ప్రాణాలను రక్షించడమూ చేస్తుంది. గుండె ఆరోగ్య సమాచారంగుండె స్పందనల వేగాన్నీ, వైవిధ్యాన్ని బట్టి ఓ వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడా, ఆ ఒత్తిడి ప్రభావం అతడి గుండె మీద ప్రతికూలంగా పడుతోందా అన్న అంశాలను తెలుసుకుంటుంది.జ్వరం, ఇన్ఫెక్షన్ల వివరాలుదేహ ఉష్ణోగ్రతలూ, శ్వాస వేగం వీటన్నింటి ఆధారంగా ఓ వ్యక్తికి జ్వరం ఉందా అన్న అంశాన్ని గుర్తించవచ్చు. ఉదాహరణకు ఇటీవల కోవిడ్–19 స్వైరవిహారం చేసినప్పుడు ఈ తరహా రింగ్స్ చాలామందిని హెచ్చరిస్తూ అప్రమత్తం చేశాయి.మహిళల ఆరోగ్యంమహిళల శరీర ఉష్ణోగ్రత, ఇతరత్రా సమాచారంతో పాటు.. అండం ఎప్పుడు విడుదలైంది, భాగస్వామితో ఎప్పుడు కలిస్తే గర్భధారణ తేలిగ్గా జరుగుతుంది, గర్భధారణ వద్దనుకుంటే ఏ సమయంలో కలవకూడదు లాంటి సమాచారం రెడీగా దొరుకుతుంది. రిమోట్ డాక్టర్ మానిటరింగ్ గుండె జబ్బులూ లేదా ఉపిరితిత్తుల సమస్యలున్న వృద్ధులకు ‘సర్కల్ +’ లాంటి స్మార్ట్ రింగ్స్ ఎప్పటికప్పుడు డాక్టర్లకు సమాచారాన్ని తెలియజేస్తుంటాయి. తద్వారా అవసరమైన ఆరోగ్య సలహాలూ, సూచనలూ లేదా ప్రిస్క్రిప్షన్స్ లో వైద్యులు మార్పులు, చేర్పులు చేస్తారు.వేటికవే ప్రత్యేకంఔరా రింగ్ (యూఎస్ఏ): ఇది పూర్తి ఆరోగ్య సమాచారంతో పాటు నిద్రకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ సైంటిస్టులకు బాగా ఉపయోగపడుతున్నాయి.అల్ట్రా హ్యూమన్ రింగ్ ఎయిర్: వ్యాయామాలకూ, దేహ జీవక్రియల పనితీరును (మెటబాలిక్ రేట్ ట్రాకింగ్) గమనించేందుకు, అలాగే చక్కెర విలువలను తెలుసుకునేందుకు పనికొస్తుంది.సర్క్యులర్ రింగ్: దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన సమాచారం తీసుకునేలా అవసరమైన అమరికలు జరుపుకోవచ్చు. ఇవి వైబ్రేషన్ ద్వారా హెచ్చరికలు (వైబ్రేషన్ అలర్ట్స్) కూడా పంపుతూ అప్రమత్తం చేస్తుంటాయి.ఈవీ రింగ్ (యూఎస్ఏ): ఇది మహిళలకూ, యువతులకూ ఉపయోగపడేది. రుతుచక్రాల వివరాలను తెలుపుతుంది.గో 2 స్లీప్: ఇది చైనాకు సంబంధించినది. నిద్రలో ఎవరికైనా ఊపిరి ఆగితే వెంటనే అప్రమత్తం చేసి నిద్రలేపుతుంది.సర్కల్ + రింగ్ (యూఎస్ఏ): ఇది ఆసుపత్రుల్లో రోగులకు ఉపయోగపడేది. వీటి ద్వారానే అనేక మెడికల్ రీడింగ్స్ తెలుసుకోవచ్చు. వీటిని వృద్ధులకూ వాడతారు.వీటికీ పరిమితులుఇవి పూర్తిగా స్మార్ట్ అని చెప్పలేం. వీటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఫలితాలు తెలియజేసే స్క్రీన్ వీటికి ఉండదు. కొన్ని స్మార్ట్ వాచెస్ మాదిరిగా ఇవి ఇంకా ఈసీజీ తీసుకోలేవు. జీపీఎస్ లేనందువల్ల నడక, పరుగు మార్గాలను చూపలేవు.వీటి అలర్ట్ బజ్ శబ్దం చాలా గట్టిగా వినిపించేలా ఉండదు. చివరగా... ఈ రింగ్స్ స్మార్ట్గా అందంగా అలంకరించుకునే ఓ చిన్ని ఉంగరంలా కనిపిస్తూ.. ఆరోగ్య రక్షణకోసం అవసరమైన అనేక రకాల సమాచారాన్ని సేకరిస్తూ.. వాటిని తొడుక్కున్నవారికీ, భవిష్యత్తులో డాక్టర్లకూ ఆ సమాచారం అందిస్తూ ఉండే ఉపకరణాలు. -
ఎయిరిండియాకు డ్రీమ్లైనర్ క్రాష్ సెగ
న్యూఢిల్లీ: గతవారం బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలిన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా బుకింగ్స్, చార్జీలు పడిపోయాయి. దేశ, విదేశీ రూట్లలో బుకింగ్స్ 20 శాతం పడిపోగా, చార్జీలు సైతం సగటున 8–15 శాతం తగ్గాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జూన్ 12న 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్కి బైల్దేరిన కాస్సేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఉదంతం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ తగ్గడాన్ని గమనించామని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) ప్రెసిడెంట్ రవి గోసాయి తెలిపారు. అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ 18–22 శాతం, దేశీయంగా 10–12 శాతం మేర తగ్గినట్లు వివరించారు. అయితే, ఇదంతా తాత్కాలికమే కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఇండిగో, ఆకాశతో నేరుగా పోటీ ఉన్న దేశీ రూట్లలో ఎయిరిండియా టికెట్ల చార్జీలు 8–12 శాతం తగ్గినట్లు గోసాయి చెప్పారు. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూరప్, ఆగ్నేయాసియా రూట్లలో చార్జీలు 10–15 శాతం క్షీణించినట్లు వివరించారు. పలువురు ప్రయాణికులు ఎయిరిండియా ఫ్లయిట్స్లో ప్రయాణాలను రద్దు కూడా చేసుకున్నట్లు చెప్పారు. ప్రధానంగా కార్పొరేట్, హై–ఎండ్ లీజర్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమాన సంస్థలకు మళ్లినట్లు వివరించారు. గత వారం రోజులుగా అంతర్జాతీయ రూట్లలో క్యాన్సిలేషన్లు 15–18 శాతం, దేశీ రూట్లలో 8–10 శాతం స్థాయిలో ఉన్నట్లు గోసాయి చెప్పారు. అయితే, ఎయిరిండియా విమానాలు అంతర్జాతీయ భద్రత ప్రమాణాలను పాటిస్తున్నట్లుగా నియంత్రణ సంస్థలు ధృవీకరిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారొచ్చని వివరించారు. మరోవైపు, ఎయిరిండియా ఫ్లయిట్స్ బుకింగ్స్ 15–20 శాతం వరకు, చార్జీలు కొన్ని రూట్లలో 10 శాతం వరకు తగ్గినట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా చెప్పారు. -
విదేశీ ఆదాయం వెల్లడించని వారిపై చర్యలు
న్యూఢిల్లీ: విదేశీ ఆదాయం, ఆస్తులను వెల్లడించని పన్ను చెల్లింపుదారులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 5,483 మంది పన్ను చెల్లింపుదారుల తమకు రూ.29,208 కోట్ల విదేశీ ఆదాయం, మరో రూ.1,090 కోట్ల అదనపు ఆదాయం ఉందంటూ ఆలస్యపు రిటర్నులు దాఖలు చేసినట్టు తెలిపింది. ఆదాయపన్ను శాఖ నోటీసులకు స్పందించని పన్ను చెల్లింపుదారులపై చట్ట పరిధిలో సరైన చర్యలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఆస్తుల మూడింతలు పెరిగి 2024 చివరికి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్కు (రూ.37,600 కోట్లు) చేరినట్టు స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రకటన చారీ చేయడం గమనార్హం. 2024–25 అసెస్మెంట్ సంవత్సరం ఐటీఆర్లలో పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన విదేశీ ఆస్తులు, ఆదాయం గణనీయంగా పెరిగిపోవడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులు, ఆదాయం వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ముందుకు వస్తున్నట్టు, తమ ఐటీఆర్లను సమీక్షించుకుంటున్నట్టు తెలిపింది. -
చిన్న పట్టణాల్లో స్మార్ట్ఫోన్ల జోరు
న్యూఢిల్లీ: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతోందని అంతర్జాతీయ సెమీకండక్టర్ దిగ్గజం మీడియాటెక్ ఇండియా ఎండీ అంకు జైన్ వెల్లడించారు. 5జీ సేవల విస్తరణ, స్మార్ట్ఫోన్లు చౌకగా లభిస్తుండటం, కనెక్టెడ్ ఉపకరణాలకు డిమాండ్ నెలకొనడం తదితర అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఉపకరణాలకు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, టెక్నాలజీ రంగం, యువత వృద్ధి చోదకాలుగా ఉండబోతున్నాయని జైన్ చెప్పారు.నెక్ట్స్–జనరేషన్ స్మార్ట్ఫోన్ల సామర్థ్యాలను పెంచే డైమెన్సిటీ 8450 చిప్సెట్ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వివరాలు చెప్పారు. టీవీలు, స్పీకర్లు, ఫ్రిజ్లు మొదలైన ఉపకరణాల్లోనూ ఏఐ చిప్సెట్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ హోమ్ మార్కెట్లో కూడా తమకు ప్రాధాన్యం పెరుగుతోందని జైన్ చెప్పారు. దేశీయంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం సరైన దిశలోనే ముందుకెళ్తోందని తెలిపారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల కొరతపై స్పందిస్తూ తమ సరఫరా వ్యవస్థకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు వేసుకుంటున్నామని జైన్ వివరించారు. కొత్త విభాగాల్లోకి విస్తరణ .. ఆటోమోటివ్, శాటిలైట్ కమ్యూనికేషన్స్లాంటి కొత్త విభాగాల్లోకి కూడా విస్తరిస్తున్నామని జైన్ తెలిపారు. ఎలక్ట్రిక్ టూ వీలర్లకు 4జీ స్మార్ట్ క్లస్టర్లను రూపొందించేందుకు జియోథింగ్స్తో జట్టు కట్టామని, స్కోడా స్లావియా, టాటా పంచ్ ఈవీలాంటి కార్లకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలపైనా దృష్టి పెడుతున్నామని చెప్పారు. భారత్లో శాటిలైట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వ్యవస్థ విస్తరించే కొద్దీ తమ చిప్సెట్స్కు కూడా డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. భారత మార్కెట్లో మరిన్ని పెట్టుబడులకు, ఇంజనీరింగ్ సిబ్బంది సంఖ్యను పెంచుకునేందుకు మీడియాటెక్ కట్టుబడి ఉందని చెప్పారు. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం భారత స్మార్ట్ఫోన్ చిప్సెట్ మార్కెట్లో మీడియాటెక్ సంస్థకు 45 శాతం, క్వాల్కామ్కి 32 శాతం వాటా ఉంది. 2004లో మీడియాటెక్ భారత్లో తమ తొలి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బెంగళూరు, నోయిడా కార్యాలయాల్లో 1,000 మంది పైగా ఇంజనీర్లు ఉన్నారు. -
ఫైనాన్షియల్ సెక్టార్పై మస్క్ కన్ను
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్పై కన్నేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఎక్స్ యూజర్లు ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!‘వీసా’తో ఒప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీగా పిలిచే ఈ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు. -
స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!
రాయల్ ఎన్ఫీల్డ్ తన ఐకానిక్ బుల్లెట్ 350 సిరీస్ ధరల్లో స్వల్ప మార్పులు ప్రకటించింది. వేరియంట్ను అనుసరించి ధరను రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెంచినట్లు తెలిపింది. దాంతో బేస్ వేరియండ్ ధర రూ.1.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై ప్రీమియం మోడల్ ధర రూ.2.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.ఈ ధరల పెంపుతో పాటు బుల్లెట్ సిరీస్లో అప్డేటెడ్ మోడల్ బెటాలియన్ బ్లాక్ను ప్రవేశపెట్టింది. బెటాలియన్ బ్లాక్ బేస్ ధర రూ.1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఆకట్టుకునే డిజైన్తో బ్లాక్ బాడీ, గోల్డెన్ హ్యాండ్ పెయింటెడ్ పిన్ స్ట్రిప్స్, రెట్రో టెయిల్ లైట్, స్కూప్డ్ సింగిల్ సీట్, రియర్ డ్రమ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఇదీ చదవండి: అన్ని టూవీలర్లలో ఏబీఎస్ తప్పనిసరిఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ మిలిటరీ వేరియంట్ ధర ఇప్పుడు రూ.1.76 లక్షలకు చేరింది. రెడ్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. దీనిపై రూ.2000 ధర పెరిగింది. బ్లాక్, మెరూన్ రంగుల్లో లభించే స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.3,000 పెరిగింది. దీని ధర రూ.2 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్లాక్ గోల్డ్ ఎడిషన్ ఇప్పుడు రూ.2.18 లక్షలకు (ఎక్స్-షోరూమ్) రూ .2,000 పెరిగింది. -
అన్ని టూవీలర్లలో ఏబీఎస్ తప్పనిసరి
రోడ్డు భద్రతను పెంపొందించే నిర్ణయాత్మక చర్యలో భాగంగా 2026 జనవరి 1 నుంచి ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా అన్ని కొత్త ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ఏబీఎస్) అమర్చాలని భారత ప్రభుత్వం తెలిపింది. 125 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు మాత్రమే ఏబీఎస్ ఉండాలనే మునుపటి నిబంధనను ఈ నిర్ణయంతో సవరించినట్లయింది.పెరుగుతున్న ప్రమాదాలుదేశవ్యాప్తంగా రోడ్డు మరణాల్లో 44 శాతం ద్విచక్రవాహనాల వల్ల జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో వీల్ లాక్ను నిరోధించే టెక్నాలజీ ఏబీఎస్ను ప్రవేశపెట్టడం వల్ల ప్రమాదాలు 45 శాతం వరకు తగ్గుతుందని తెలుపుతున్నాయి. ఈ టెక్నాలజీని అన్ని ద్విచక్రవాహనాల్లో అమలు చేస్తే ప్రమాద సంబంధిత గాయాలు, మరణాలను తగ్గించడంలో ఇది కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.త్వరలో రెండు హెల్మెట్లు..ద్విచక్రవాహనాల్లో ఏబీఎస్ను తప్పనిసరి చేయడంతోపాటు అన్ని వాహన డీలర్లు రెండు బీఐఎస్ సర్టిఫైడ్ హెల్మెట్లను అందించాలనేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒకటి రైడర్ కోసం, మరొకటి వెనుక కూర్చున్న వ్యక్తికి ఉపయోగపడుతుందని చెప్పాయి. హెల్మెట్ వాడకాన్ని పెంచడంతోపాటు రైడర్ భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపాయి.ఇదీ చదవండి: అడ్వాన్స్గా ఆరు నెలల రెంట్.. ఆపై ఎన్నో ఛార్జీలుధరలు పెరుగుతాయా..?ఏబీఎస్ భద్రతా ఫీచర్లు వాహన ధరలను పెంచుతాయని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ మోడళ్ల ధరలు ఇది రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పెరగవచ్చనే అభిప్రాయాలున్నాయి. లక్షలాది మంది భారతీయులకు ద్విచక్ర వాహనాలు ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. -
అడ్వాన్స్గా ఆరు నెలల రెంట్.. ఆపై ఎన్నో ఛార్జీలు
బెంగళూరులో కఠినమైన అద్దె విధానాలపై రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో అద్దెదారులను ఇబ్బంది పెట్టేలా ఉన్న నిబంధనల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అద్దెకు ఉండడం కంటే డబ్బు ఖర్చయినా సొంతంగా ఇళ్లు కొనడం బెటర్ అనే ధోరణికి వస్తున్నట్లు చెప్పారు.కొంతకాలంపాటు బెంగళూరు నగరం బయట అద్దెకు ఉన్న ఒక యూజర్ ఇటీవల నగరం లోపలకు మకాం మార్చినట్లు చెప్పారు. తమ కొత్త ఇంటి యజమాని అసంబద్ధమైన డిమాండ్లు పెడుతున్నాడని రాశారు. బెంగళూరులో ఆరు నెలల సెక్యూరిటీ డిపాజిట్ నిబంధనను తప్పుబడుతూ ‘మొదట వారు ఆరు నెలల డిపాజిట్, అడ్వాన్స్ రెంట్ తీసుకుంటారు. మీరు ఖాళీ చేయాలనుకున్నప్పుడు ఇంటిని తిరిగి శుభ్రం చేయించేందుకు, కొత్తవారి కోసం మీరు వాడిన వస్తువులను మార్చేందుకు డబ్బు అవసరం అవుతుందని చెప్పి అధిక మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. డిపాజిట్ తిరిగి ఇచ్చే ఉద్దేశం కూడా వారికి లేదు’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: నర్సరీ ఫీజు కంటే ఇంటి అద్దె చీప్!బెంగళూరు రియల్టీ మార్కెట్లో సాధారణంగా అద్దెదారుల నుంచి ఆరు నెలల సెక్యూరిటీ డిపాజిట్ను తీసుకుంటున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. అందుకే నగరంలో స్వల్పకాలిక నివాసం ఉన్నవారు కూడా సొంతంగా ఫ్లాట్ కొనుగోలు చేసి ఈ దోపిడీ నుంచి బయటపడాలనుకుంటున్నారని రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘వారు ఆ డిపాజిట్ను ఉపయోగించి ఇంటిని పునరుద్ధరిస్తారు. అది మా డబ్బు. ప్యూర్ టార్చర్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘నా మునుపటి ఇంటి యజమాని తన ఇంటి గోడలపై 1-2 చోట్ల పెయింటింగ్ పోయినందుకు మొత్తం పెయింటింగ్ అయ్యే ఖర్చును వసూలు చేశాడు’ అని మరో యూజర్ రిప్లై ఇచ్చాడు. -
నర్సరీ ఫీజు కంటే ఇంటి అద్దె చీప్!
ప్రతి దేశంలో ఆరోగ్య సంరక్షణ, రవాణా, అద్దె, ఆహారం, యుటిలిటీల ఖర్చును పరిశీలించి చౌకైన దేశమా? ఖరీదైన దేశమా? అని నిర్ణయిస్తారు. విలియం రస్సెల్ అనే రిసెర్చ్ అనలిస్ట్ 2025లో మూడు చౌకైన ప్రాంతాల వివరాలు వెల్లడించారు. అందులో వియత్నాం ముందు వరుసలో నిలిచింది.వియత్నాం ప్రవాసులు జీవించడానికి అత్యంత చౌకైన దేశంగా ఉందని విలియం రస్సెల్ తెలిపారు. మంచి ఆహారం, స్నేహపూర్వక స్థానికులు, ఆధునిక సౌకర్యాలు, పురాతన సంప్రదాయాలు అన్నీ వియత్నాంలో ఉన్నాయని చెప్పారు. నెలకు సగటున సింగల్బెడ్రూమ్ అపార్ట్మెంట్కు 265 పౌండ్ స్టెర్లింగ్(రూ.30 వేలు), మూడు పడక గదుల అపార్ట్మెంట్కు 589 పౌండ్ స్టెర్లింగ్(రూ.68 వేలు) ఖర్చవుతుందని అన్నారు. వియత్నాంలో మొత్తం జీవన వ్యయం యూకే కంటే 59 శాతం చౌకగా ఉందని తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్లో ఏటా నర్సరీ ఫీజు రూ.1లక్షపైనే ఉందని కొందరు చెబుతున్న నేపథ్యంలో వియత్నాంలోని ఇంటి అద్దెలు వాటి కంటే చీప్గా ఉన్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: సన్టీవీ ఛైర్మన్కు ఆయన సోదరుడు నోటీసులుబొలీవియా ప్రవాసులకు రెండో అత్యంత చౌకైన దేశంగా ఉందని చెప్పారు. రాజధాని లా పాజ్లో ఒక పడకగది అపార్ట్మెంట్ ధర నెలకు 386 డాలర్లు(రూ.33 వేలు), మూడు పడక గదుల అపార్ట్మెంట్ ధర 707 డాలర్లు(రూ.45 వేలు) అని అన్నారు. జార్జియా మూడో చౌకైన గమ్యస్థానంగా ఉందని విలియం చెప్పారు. -
రచ్చకెక్కిన కళానిధి మారన్ కుటుంబ వ్యవహారం
సన్టీవీ ఛైర్మన్ కళానిధి మారన్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆయన సోదరుడు దయానిధి మారన్ కళానిధితోపాటు మరో ఏడుగురికి లీగల్ నోటీసులు పంపించడంతో పరిస్థితులు తీవ్రంగా పరిణమించాయి. కళానిధి మారన్ తన వ్యాపార కార్యకలాపాల్లో మనీలాండరింగ్కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళానిధిపై చర్యలు తీసుకోవాలని దయానిది కోరారు. కళానిధి మారన్ భార్య కావేరి మారన్కు కూడా నోటీసులు అందాయి.కళానిధి మారన్ సారధ్యం వహిస్తున్న సన్ గ్రూప్ ఆధ్వర్యంలో టెలివిజన్, రేడియో, ప్రింట్, సినిమా, క్రీడా విభాగాల్లో వ్యాపారాలున్నాయి. కళానిధితో సంబంధం ఉన్న కీలక కంపెనీలు, వెంచర్ల జాబితా కింది విధంగా ఉంది.మీడియా, ఎంటర్టైన్మెంట్సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ - 37 టీవీ ఛానళ్లు నిర్వహిస్తోంది.సన్ పిక్చర్స్ - చిత్ర నిర్మాణ సంస్థ.సన్ డైరెక్ట్ - డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) శాటిలైట్ టీవీ సర్వీస్.సన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ - కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.కేఏఎల్ పబ్లికేషన్స్ / కుంగుమమ్ పబ్లికేషన్స్ - కుంగుమమ్ తమిళ పత్రికను ప్రచురిస్తుంది.కేఏఎల్ కేబుల్స్ - కేబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.కేఏఎల్ రేడియో / సౌత్ఏషియా ఎఫ్ఎమ్ - సూర్యన్ ఎఫ్ఎమ్, రెడ్ ఎఫ్ఎమ్ వంటి బ్రాండ్ల ద్వారా 69 ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లను నిర్వహిస్తుంది.ఇదీ చదవండి: గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. పాస్వర్డ్లు లీక్ప్రింట్ మీడియాదినకరన్ - ఈ గ్రూపునకు చెందిన ప్రముఖ తమిళ దినపత్రిక.క్రీడలుసన్ రైజర్స్ హైదరాబాద్ - ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ.సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ - దక్షిణాఫ్రికా టీ20 లీగ్ జట్టు.గతంలోని వెంచర్స్పైస్ జెట్ - మారన్ 2010 నుంచి 2015 వరకు కేఏఎల్ ఎయిర్ వేస్ ద్వారా మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు. ఆర్థిక అనిశ్చితి కారణంగా అందులో నుంచి నిష్క్రమించారు. -
గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. పాస్వర్డ్లు లీక్
గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, గిట్హబ్లోని డెవలపర్ ఖాతాలు, కొన్ని ప్రభుత్వ పోర్టల్స్లోని దాదాపు 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లు లీక్ అయినట్లు సైబర్న్యూస్, ఫోర్బ్స్ నివేదికలు తెలిపాయి. ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్ల్లో ఇది ఒకటిగా నిలిచిందని పేర్కొన్నాయి. ఈ లీక్ వల్ల మిలియన్ల మంది వినియోగదారుల వ్యక్తిగత డేటా ప్రమాదంలో ఉందని చెప్పాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఫిషింగ్ స్కామ్లు, ఐడెంటిటీ థెఫ్ట్, అకౌంట్ హ్యాకింగ్కు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తి చేశాయి.లీక్ అయిన డేటా ఏళ్ల తరబడి ఉన్న పాత సమాచారం మాత్రమే కాదని భద్రతా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం కొత్త డేటా, బాగా వ్యవస్థీకృతమైన సమాచారం ఉందన్నారు. ఈ లీక్ల కోసం సైబర్ నేరగాళ్లు ఇన్ఫోస్టీలర్స్ అని పిలువబడే ఒక రకమైన మాల్వేర్ను ఉపయోగించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ మాల్వేర్ ప్రోగ్రామ్లు యూజర్లకు తెలియకుండానే తమ పరికరాల నుంచి లాగిన్ పాస్వర్డ్లను దొంగిలించి హ్యాకర్లకు పంపుతాయన్నారు. ఈ సమాచారాన్ని డార్క్ వెబ్ ఫోరమ్ల్లో అమ్మకానికి ఉంచుతారని తెలిపారు.లీకేజీలో ఏముంది?లీకైన డేటాలో గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి గిట్హబ్ల్లోని డెవలపర్ ఖాతాల్లోని సమాచారం ఉందనే అంచానాలున్నాయి. కొన్ని ప్రభుత్వ పోర్టల్స్ లాగిన్ సమాచారం కూడా లీకైందని చెబుతున్నారు. ఈ డేటా అంతా నిర్మాణాత్మకంగా, ఉపయోగించదగినదిగా ఉన్నందున నిపుణులు ఈ లీక్ను ‘గ్లోబల్ సైబర్ క్రైమ్ కోసం బ్లూప్రింట్’ అని పిలుస్తున్నారు. దాదాపు 30 బిగ్ డేటా సెట్లు, ఒక్కొక్కటి మిలియన్ల నుంచి బిలియన్ల లాగిన్ వివరాలు వివరాలను సేకరించాయని, మొత్తం 16 బిలియన్లకు పైగా పాస్వర్డ్లను దొంగిలించారని భావిస్తున్నారు.ఎందుకంత తీవ్రతదొంగిలించబడిన ఈ డేటాను ఎంత సులభంగా కొనుగోలు చేయవచ్చనే దానిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ మొత్తంలో డబ్బు ఉన్నవారు కూడా డార్క్ వెబ్లో ఈ పాస్వర్ట్లను యాక్సెస్ చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది రోజువారీ వినియోగదారుల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటాఇప్పుడు ఏం చేయాలి?సంప్రదాయ పాస్వర్ట్ల నుంచి పాస్ కీ వంటి మరింత సురక్షితమైన ఆప్షన్లకు మారాలని గూగుల్ ఇప్పటికే వినియోగదారులకు సూచించింది. ముఖ్యంగా లాగిన్ వివరాలు అడిగితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్ ద్వారా పంపే లింక్లను క్లిక్ చేయవద్దని ఎఫ్బీఐ ప్రజలను హెచ్చరించింది. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అన్ని ప్రధాన ఖాతాల్లో పాస్వర్డ్లను మార్చడం, బలమైన, ప్రత్యేకమైన పాస్వర్డ్లను ఉపయోగించడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఎ)ను ఆన్ చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే మోసాలను కట్టడి చేయవచ్చు. -
వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటా
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తన మొత్తం సంపద దాదాపు 17 బిలియన్ డాలర్లను తన 100 మందికి పైగా పిల్లలకు పంచాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదు.. ఈ పిల్లలందరూ తన వీర్యదానం వల్ల పుట్టిన సంతానం కావడం విశేషం. ఫ్రెంచ్ మ్యాగజైన్ లీ పాయింట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 40 ఏళ్ల దురోవ్ తాను కనీసం 106 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అని చెప్పారు. వీరిలో ఆరుగురు వేర్వేరు తన భాగస్వాములతో సహజంగా గర్భం దాల్చగా, మిగిలిన 100 మందికి పైగా పిల్లలు 12 దేశాల్లో జన్మించారని చెప్పారు.‘నా పిల్లల్లో కొందరు సహజంగా గర్భం దాల్చి పుట్టినవారున్నారు. చాలామంది నా స్పెర్మ్ దానం వల్ల పుట్టినవారున్నారు. వారంతా నా బిడ్డలే. అందరికీ నా ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయి’ అని చెప్పారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం దురోవ్ నికర విలువ 13.9 బిలియన్ డాలర్ల నుంచి 17.1 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక్కో బిడ్డకు సుమారు 131 మిలియన్ డాలర్ల నుంచి 161 మిలియన్ డాలర్ల వరకు వారసత్వంగా లభిస్తుంది. అయితే తన పిల్లలకు సమాన హక్కులు ప్రకటించినట్లు ఉన్న ఇంటర్వ్యూ తేదీ(జూన్ 19, 2025) నుంచి 30 సంవత్సరాల వరకు తన ఆస్తిపై హక్కు ఉండదని చెప్పారు. ముప్పై ఏళ్ల తర్వాతే తమకు హక్కులుంటాయన్నారు. వారు స్వతంత్రంగా ఎదగడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దురోవ్ వివరించారు. వారు సాధారణ ప్రజల మాదిరిగా జీవించాలని, ఒంటరిగా తమను తాము నిర్మించుకోవాలని తెలిపారు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..దురోవ్ను ఇటీవల ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటి వాటికి వినియోగిస్తున్నారనే వాదనలున్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు. -
బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర(Today Gold Rate) శుక్రవారం వినియోగదారులకు కొంత ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?
అహ్మదాబాద్లో 270 మందిని బలిగొన్న ఎయిరిండియా ఏఐ-171 డ్రీమ్లైనర్ ప్రమాదానికి టర్కిష్ ఎయిర్లైన్స్ మెయింటెనెన్స్ సెంటర్తో సంబంధం ఉందన్న ఊహాగానాలను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఖండించారు. టైమ్స్ నెట్ వర్క్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఎయిరిండియా ఫ్లీట్లోని 33 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్లో ఏదీ టర్కీ సంస్థ నిర్వహణలో లేదని స్పష్టం చేశారు.‘ఎయిరిండియా ఆధ్వర్యంలోని 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఏ ఒక్కటీ టర్కిష్ సంస్థ నిర్వహణలో లేదు. వాటిలో చాలా వరకు ఏఈఎస్ఎల్, సింగపూర్లోని ఎస్ఐఏ ఇంజినీరింగ్ నిర్వహణలో ఉన్నాయి. బోయింగ్ 777 విమానాల్లో కొన్నింటిని మాత్రమే టర్కిష్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ఆయా కాంట్రాక్టులు కూడా సమీక్షలో ఉన్నాయి’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రమాద సంఘటనపై జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి కొందరు విజిల్ బ్లోయర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖరన్ ఈ వాదనలను ‘ఊహాజనితమైనవి’గా అభివర్ణించారు. ఘటనపై మరింత స్పష్టత వచ్చేందుకు విమాన డేటా, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లు, బ్లాక్ బాక్స్ నివేదికల కోసం వేచి ఉండాలని తెలిపారు.‘యూట్యూబ్, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఇలా చాలా మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బాక్స్ డేటాతో నిజం తేలుతుంది. దాని కోసం వేచిచూడాలి తప్పా ఓ నిర్ణయానికి రాకూడదు’ అని అన్నారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. వారిలో ఎవరినీ ఓదార్చడానికి నాకు మాటలు లేవు. టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థలో జరిగిన ఈ ప్రమాదం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో మేము వారికి తోడుగా ఉండడం తప్పా వారి లోటును తీర్చలేం. వారికి అన్ని విధాలుగా తోడుంటాం. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, కొడుకును కోల్పోయిన వారిని ఓదార్చడం చాలా కష్టం’ అని అన్నారు.ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధంఈ ఘోర ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది. గుజరాత్ ప్రతినిధి, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ (ఎంవోసీఏ) కార్యదర్శి, ఎంహెచ్ఏ అదనపు కార్యదర్శితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని దర్యాప్తులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసింది. -
వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం
ప్రముఖ ఐటీ సర్వీస్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రధానంగా తన సేల్స్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వేలాది ఉద్యోగాలను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో కంపెనీ పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. జులై ప్రారంభంలో ఉద్యోగాల్లో కోతలను ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు.ఇప్పటికే మైక్రోసాఫ్ట్ మే నెలలో 6,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. తర్వాత కొన్ని వారాలకు 300కి పైగా తొలగించింది. ఈ ఏడాది మూడో అతిపెద్ద ఉద్యోగుల తగ్గింపునకు సంస్థ సిద్ధమవుతోంది. గతంలో ప్రకటించిన లేఆఫ్స్ ద్వారా ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డెవలపర్లు ప్రభావితం అయ్యారు. ఈసారి భిన్నంగా మైక్రోసాఫ్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగ కోతలను విధించే అవకాశం ఉంది. జూన్ 2024 నాటికి కంపెనీ మొత్తం 2,28,000 మంది ఉద్యోగుల్లో 45,000 మంది ఈ విభాగంలో పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపుప్రత్యేకంగా సేల్స్ విభాగంతో సంబంధం లేకుండా చిన్న, మధ్య తరహా కస్టమర్లకు ఎక్కువ సాఫ్ట్వేర్ సర్వీసులను అమ్మేందుకు థర్డ్ పార్టీ సంస్థలను వాడుకునేలా కంపెనీ ఏప్రిల్లో ప్రణాళికలు ప్రకటించింది. దాంతో ఈ విభాగంలో కోతలకు పూనుకుంటున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. కృత్రిమ మేధ పెట్టుబడుల నిర్వహణ టెక్ కంపెనీలకు సవాలుగా మరుతుంది. దాంతో ఇలా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డేటా సెంటర్ వ్యయం కోసం మైక్రోసాఫ్ట్ సుమారు 80 బిలియన్ డాలర్లు కేటాయించింది. -
కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపు
ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఇతర కంపెనీలను కొనుగోలు చేసే అవకాశాలను అన్వేషిస్తోంది. ఓవైపు సొంతంగా కార్యకలాపాలు విస్తరిస్తూనే టాటా గ్రూప్ కంపెనీ కొంతకాలంగా పలు సంస్థలను సొంతం చేసుకుంటోంది. ఏడాది క్రితం క్యాపిటల్ ఫుడ్స్తోపాటు, ఆర్గానిక్ ఇండియాను రూ.7,000 కోట్ల సంయుక్త విలువలో కొనుగోలు చేసింది. మార్కెట్లో కంపెనీ ఎల్లవేళలా ఇతర సంస్థల కొనుగోలుకి సిద్ధంగా ఉంటుందని టాటా కన్జూమర్ డైరెక్టర్ పీబీ బాలాజీ పేర్కొన్నారు.కంపెనీ పోర్ట్ ఫోలియోకు సరిపోయే సంస్థ తగిన ధరలో దొరికితే వదిలిపెట్టబోమని బాలాజీ తెలియజేశారు. అయితే సొంతంగా కార్యకలాపాలు విస్తరించడానికే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఐదేళ్ల క్రితం ఆవిర్భవించిన కంపెనీ ప్రధానంగా ఫుడ్ విభాగంలో కొనుగోళ్లకు తెరతీసింది. ఈ బాటలో బెంగళూరు సంస్థ కొట్టారం ఆగ్రో ఫుడ్స్ను సైతం చేజిక్కించుకుంది. ఇదీ చదవండి: మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలుఅత్యంత గరిష్టాలకు చేరిన టీ ధరలు ఇటీవల నిలకడను సంతరించుకుంటున్నట్లు వాటాదారుల వార్షిక సమావేశంలో బాలాజీ పేర్కొన్నారు. వెరసి ఇకపై కంపెనీ మార్జిన్లు, లాభదాయకత మెరుగుపడనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది తేయాకు దిగుబడి గతేడాదిని మించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కాఫీ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ ఈ ఏడాది సాధారణ స్థితికి చేరవచ్చని అంచనా వేశారు. -
ఫండ్స్ కోసం పబ్లిక్ ఇష్యూ బాట
సాస్(ఎస్ఏఏఎస్) సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 430 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.83 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 120 కోట్లు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలకు, ప్రొడక్టులు, ప్లాట్ఫామ్ సంబంధ రీసెర్చ్, డిజైనింగ్, డెవలప్మెంట్కు రూ. 152 కోట్లు చొప్పున వెచ్చించనుంది. రూ.10 కోట్లు కంప్యూటర్ సిస్టమ్స్ కొనుగోలుకి, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఇంతక్రితం 2021 డిసెంబర్లో కంపెనీ సెబీకి దరఖాస్తు చేసినప్పటికీ అనుమతి లభించలేదు. కంపెనీ ప్రధానంగా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు ఏఐ ఆధారిత క్లౌడ్నేటివ్ సాస్ ప్రొడక్టులు, సొల్యూషన్లు అందిస్తోంది. గతేడాది(2024–25) కంపెనీ ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 598 కోట్లను తాకింది. టర్న్అరౌండ్ సాధించి రూ. 13 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది రూ. 59 కోట్ల నష్టాలు ప్రకటించింది.పీఎన్జీఎస్ రెవా డైమండ్ సెబీకి దరఖాస్తున్యూఢిల్లీ: రిటైల్ జ్యువెలరీ కంపెనీ పీఎన్జీఎస్ రెవా డైమండ్ జ్యువెలరీ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో దాదాపు రూ. 289 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించనుంది. 2028కల్లా కొత్తగా 15 స్టోర్లను తెరిచే ప్రణాళికల్లో ఉంది. ఈ బాటలో ప్రధాన బ్రాండు ‘రెవా’ మార్కెటింగ్, ప్రమోషనల్ కార్యక్రమాల కోసం రూ. 35 కోట్లకుపైగా వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఇదీ చదవండి: మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలుప్రమోటర్ పీఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ స్లంప్ సేల్ ద్వారా డైమండ్ బిజినెస్ను విక్రయించడంతో కంపెనీ ఆవిర్భవించింది. దీంతో పీఎన్జీఎస్ రెవా ప్రత్యేక కంపెనీగా సొంత గుర్తింపుతో డైమండ్ జ్యువెలరీ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025 మార్చి31కల్లా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల్లో 33 స్టోర్లను కలిగి ఉంది. గతేడాది(2024–25) ఆదాయం 32 శాతం ఎగసి రూ. 258 కోట్లను తాకగా.. నికర లాభం 40 శాతం జంప్చేసి రూ.59 కోట్లను అధిగమించింది.