breaking news
Anakapalle
-
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. 108 స్వర్ణసంపెంగలతో అష్టోత్తర పూజ జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ఘనంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. విశేషంగా గరుడసేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ విశేషంగా జరిగింది. ఆలయ బేడామండపంలో ఉదయం ఈ సేవను నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వెండి గరుడవాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. విశేష హారతులిచ్చారు. పూజలో పాల్గొన్న భక్తులను గరుడవాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. -
రైలు ఢీకొని మహిళ మృతి
యలమంచిలి రూరల్ : వివాహ వేడుకకు వస్తూ రైల్వే ట్రాక్ దాటుతున్న మహిళను గుర్తు తెలియని రైలు బండి ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో యలమంచిలి రైల్వేస్టేషన్ ఒకటో నెంబరు ప్లాట్ఫాం సమీపంలో చోటు చేసుకుంది. విశాఖపట్నం తుంగ్లాం ప్రాంతానికి చెందిన కొల్లి రమణమ్మ(55), మరో ముగ్గురు బంధువులతో కలిసి యలమంచిలి రాంనగర్లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరుకావడానికి ఆదివారం రాత్రి వచ్చారు. ఆటోలో యలమంచిలి రైల్వేస్టేషన్ వరకు వచ్చి రాంనగర్లో జరుగుతున్న వివాహ వేదిక చిరునామా సరిగ్గా తెలియకపోవడంతో తికమక పడ్డారు. చివరకు బంధువులకు ఫోన్ చేయగా రైల్వేస్టేషన్ చివర రైలు పట్టాలు దాటితే సులభంగా వివాహ వేదిక వద్దకు చేరుకోవచ్చని చెప్పారు. దీంతో మృతురాలితో పాటు ఇద్దరు మహిళలు, మనుమరాలు రైల్వే ట్రాక్ దాటుతుండగా అదే ట్రాక్పై అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు వేగంగా వస్తోంది. వారిలో ఇద్దరు రైలుపట్టాలు దాటేసరికి రైలు వస్తున్న సంగతిని చెప్పి మిగిలిన ఇద్దరినీ రావద్దని అరిచారు. ఇద్దరిలో ఒక మహిళ రైలు పట్టాల అవతల ఉండిపోగా, కొల్లి రమణమ్మ దాటే ప్రయత్నం చేసింది. అదే సమయంలో కాలి చెప్పు జారిపోవడంతో ఆమెను రైలు ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో రమణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రెప్పపాటులో ముగ్గురు మహిళలు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆనందంగా వివాహ వేడుకకు వచ్చిన రమణమ్మను రైలుబండి రూపంలో తమ కళ్ల ముందే మృత్యువు కబళించడంతో బంధువులు ఘటనా స్థలం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై డ్యూటీలో ఉన్న స్టేషన్ సిబ్బంది తుని రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మహిళ మృతి చెందిన రైల్వే ట్రాక్పై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. వివాహ వేడుకకు వస్తూ మృత్యు ఒడికి రైలు పట్టాలు దాటుతుండగా దుర్ఘటన -
18 నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
మునగపాక : నాగులాపల్లిలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర స్థాయి మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు కబడ్డీ ఆసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైంజిగ్ కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. మూడు రోజుల పాటు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫ్లడ్లైట్ల వెలుతురులో పోటీలు జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఆయన నాగులాపల్లిలో విలేకరుల సమావేశంలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్ జన్మదినం సందర్భంగా అనకాపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దొడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో చిత్తూరు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలకు సంబంధించి మహిళలు, పురుషుల జట్లు పాల్గొంటాయన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పోటీల కన్వీనర్ కె.ఎన్.వి. సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, టెక్నికల్ కమిటీ సభ్యులు ఎం.గణపతిరావు, కోచ్ శివ, కూటమి నేతలు దాడి ముసిలినాయుడు, టెక్కలి పరశురామ్, నాగేశ్వరరావు, మురళి, రాజేష్ పాల్గొన్నారు. -
అడ్డగోలు జీవోలు.. అణచివేతకు కుట్రలు!
● ఏడాదిలోనే కూటమి ప్రభుత్వానికి భయం మొదలైంది ● పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలను నిషేధిస్తూ ఇచ్చిన జీవో ప్రజాస్వామ్య విరుద్ధం ● జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగిన ఏఐఎస్ఎఫ్ బీచ్రోడ్డు: కూటమి ప్రభుత్వానికి ఏడాది కాలంలోనే భయం మొదలైందని అందుకు నిదర్శనమే పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించిందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు పి.శేఖర్ అన్నారు. ఆదివారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ పాఠశాలల్లోకి ప్రవేశం లేదని జీవో విడుదల చేయడాన్ని ఖండించారు. విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, న్యాయమైన సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పాఠశాలల్లోకి అనుమతించకపోవడం కూటమి నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా జీవోలు ఇస్తూ అణచివేతకు కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏఐఎస్ఎఫ్ నాయకులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టినా విద్యార్థులకు అండగా ఉంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
జాతీయస్థాయి పవర్లిఫ్టింగ్ పోటీల్లో శ్రీనివాస్ ఘనత
అనకాపల్లి : జాతీయ స్థాయి క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ఈనెల 2 నుంచి 7వ తేదీ వరకూ కేరళ రాష్ట్రం కోజికోడ్లో మాస్టర్స్ మహిళలు, పురుషుల పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో అనకాపల్లికి చెందిన ఎం.శ్రీనివాస్(53) మాస్టర్స్ 2 కేటగిరిలో స్క్వాట్ 145.5 కేజీలు, డెడ్ లిఫ్ట్లో 192.5 కేజీలు బరువు ఎత్తి ప్రథమస్థానం, రెండు నేషనల్ రికార్డులు, ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించారని అనకాపల్లి వేల్పులవీధి శ్రీరామదేవ వ్యాయమ జిమ్ కోచ్ వసాధి నానాజీ చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను పలువురు అభినందించారు. జాతీయ స్థాయి పవర్లిఫ్టింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన శ్రీనివాస్ -
వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు
అనకాపల్లి టౌన్ : మండలంలోని గోపాలపురం గ్రామంలో ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అదృశ్యం కేసు నమోదైంది. ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాలివి. గొర్లి నాగేశ్వరావు(28) అనే వ్యక్తికి ఆరు నెలల క్రితం తీవ్రంగా కడుపు నొప్పి వస్తుండంతో పేగు సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి నొప్పి తగ్గలేదని ఇంటిలో ఎవరితోనూ సరిగా మాట్లాడక పోవడం, ఇంటిలో అయోమయంగా ఉండేవాడన్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి నుంచి ఫోన్ తీసుకువెళ్లకుండా, తన ద్విచక్రవాహనంతో బయటకు వెళ్లి మరళా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
రెండు గ్రామాల్లో వైద్యశిబిరాలు
గొలుగొండ : జ్వరాలతో బాధపడుతున్న విప్పలపాలెం, గాదంపాలెం గ్రామాల్లో ఆదివారం వైద్య శిబిరాలు నిర్వహించి, రక్త పరీక్షలు జరిపి, 38 మందికి మందులు అందజేశారు. ‘జిల్లాకు జ్వరమొచ్చింది’ అనే శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి, సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు గ్రామాల్లో డెంగ్యూ, చికున్ గున్యాతో బాధపడుతూ 80 మంది వరకూ మంచంపట్టారు. జ్వరపీడితలకు వైద్య పరీక్షలు జరపడంతో పాటు గ్రామాల్లో దోమల నివారణకు మందు పిచికారీ చేశారు. మురుగునీరు ఉన్న ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఈవోపీఆర్డీ బాబూరావు ‘సాక్షి’కి తెలిపారు. -
ఫిరాయింపు కార్పొరేటర్లపై వేటు వేయాల్సిందే..
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాల్సిందేనని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు డిమాండ్ చేశారు. ఫిరాయింపు కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్పై సోమవారం తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న జరగనున్న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికపై ఆ పార్టీ కార్పొరేటర్లతో కె.కె.రాజు సమావేశమయ్యారు. స్టాండింగ్ కమిటీలో పోటీ చేసే కార్పొరేటర్లకు ఎన్నికలో గెలుపునకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లు వేరొక పార్టీలోకి ఫిరాయిస్తే అది ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించినట్లవుతుందన్నారు. ‘మా పార్టీ నుంచి ఫిరాయించిన 27 మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు అంశం హైకోర్టులో పెండింగ్లో ఉంది. తీర్పు వెలువడితే వారి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది. ఇలా ఫిరాయింపుదారులపై వేటు పడితేనే భవిష్యత్తులో ఎవరూ ఫిరాయించరు. ఒకవేళ ఫిరాయింపులకు పాల్పడాలనుకుంటే రాజీనామా చేసి, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి వెళ్లాలి’అని అన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఫిరాయింపు కార్పొరేటర్ల ఓటు హక్కును రద్దు చేయాలి వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లపై అనర్హత వేటు నిర్ణయం హైకోర్టులో పెండింగ్లో ఉండగా.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని డిప్యూటీ మేయర్ కె.సతీష్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాస్ ప్రశ్నించారు. తక్షణమే ఆ కార్పొరేటర్ల ఓటు హక్కును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఆ పదవిని రద్దు చేసే అధికారం చట్టబద్ధంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలోకి ఫిరాయించిన 27 మంది కార్పొరేటర్ల అనర్హత అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఆ 27 మంది ఫిరాయింపు కార్పొరేటర్లకు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఇప్పటికే నోటీసులు కూడా పంపించారని గుర్తు చేశారు. న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉండగా వారికి ఓటు హక్కు కల్పించడం నిబంధనలకు విరుద్ధమని, ఒకవేళ ఎన్నిక నిర్వహించినా అది చెల్లదని హెచ్చరించారు. అప్రజాస్వామికంగా మేయర్ ఎన్నిక పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లతో అప్రజాస్వామికంగా కొత్త మేయర్ను ఎన్నుకున్నారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికే తలవంపులు తెచ్చిన జంప్ జిలానీలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశామన్నారు. కొత్త మేయర్ బాధ్యతలు స్వీకరించి వంద రోజులు కాకముందే ఆయన పనితీరు, అక్రమాలపై నగర ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. గత మేయర్ పాలనే బాగుందని నగర ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఎన్నికల నియమ నిబంధనలను ముందుగా పోటీలో ఉన్న కార్పొరేటర్లకు తెలియజేయాలని కోరారు. సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల బరిలో ఉన్న కార్పొరేటర్లు రెయ్యి వెంకట రమణ, సాడి పద్మారెడ్డి, మహమ్మద్ ఇమ్రాన్, ఉరుకూటి రామచంద్రరావు, నక్కిల లక్ష్మి, కె.వి.శశికళ, కోడిగుడ్ల పూర్ణిమ, పల్లా అప్పలకొండ, బిపిన్ కుమార్ జైన్, గుండాపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
రేషన్ కావాలంటే 4 కిలోమీటర్లు నడవాలి
రావికమతం : మండలంలోని పి.కోట్నాబిల్లిలో గిరిజనులు సరుకులను కావిళ్లు మోస్తూ ఆదివారం వినూత్న నిరసన తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ విధానానికి కుటమి సర్కార్ మంగళం పాడడంతో రావికమతం మండలంలో పి.కొట్నాబిల్లి గ్రామ గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్లు నడిచి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోందని, సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో తలపై రేషన్ సరుకులు మూట మోస్తూ అష్టకష్టాలు పడుతున్నామని తెలిపారు. మండలంలో పి.కోట్నాబిల్లి గ్రామంలో కొండదొర తెగకు చెందిన 70 మంది కార్డుహోల్డర్స్ నివాసం ఉంటున్నారు. వీరు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి డోలవానిపాలెం గ్రామం నుంచి రేషన్ తెచ్చుకునేవారు. దీనిపై జూన్లో అధికారులకు విన్నవించగా, స్పందించిన నర్సీపట్నం ఆర్డీవో రామన్నదొరపాలెం డిపో నెంబర్ 039050 నుంచి పి.కొట్నాబిల్లి క్రియేటివిటీ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి బియ్యం సరఫరా చేయాలని సూచించారని, కానీ ఇప్పటి వరకూ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే స్టాక్ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో మండల రెవిన్యూ కార్యాలయం వద్ద భారీ ఎత్తున అందోళన చేస్తామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, గిరిజన సంఘం నాయకుడు పాడి బెన్నయ్య తదితరులు డిమాండ్ చేశారు. -
అరకు ఇక రాయగడకే!
ఆదాయాన్నిచ్చే కొరాపుట్ మార్గం కూడా రాయగడ పరిధిలోకి.. అరకు కోసం వినతులిచ్చినాపట్టించుకోని కేంద్ర ప్రభుత్వంవాల్తేరు నుంచి కొత్త డివిజన్లో చేర్చిన రైల్వే బోర్డు సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా ఊటీ అరకు ఇప్పుడు రాయగడ పరమైపోయింది. వాల్తేరు రైల్వే డివిజన్లో భాగంగా ఉన్న అరకు.. జోన్ విభజన తర్వాత కొత్త డివిజన్లో చేరుతోంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్తేరు డివిజన్ నుంచి మేజర్ భాగాలను విడదీసి రాయగడ డివిజన్లో కొంత, విశాఖ డివిజన్లో మరికొంత భాగాన్ని విలీనం చేయాలన్న తుది డీపీఆర్కూ బోర్డు ఆమోద ముద్ర వేసేసింది. ఇక గెజిట్ వచ్చేస్తే.. చారిత్రక వాల్తేరు కనుమరుగుకు.. అరకు ప్రాంతం రాయగడకు ఇక అధికారికంగా రాజముద్ర పడిపోయినట్లే. ఆదాయాన్నిచ్చే అరకు, కొరాపుట్ మార్గాలను విశాఖ డివిజన్లో ఉంచాలన్న వినతులను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రకు రిక్తహస్తాలు చూపించింది. వాల్తేరు డివిజన్ను విడదీసేసి.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాల్తేరు డివిజన్ విభజన తథ్యం అన్నట్లుగా రైల్వే బోర్డు ముందుగానే సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగా వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ రాయగడ డివిజన్కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇటీవలే వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు ప్రధాని శంకు స్థాపన చేశారు. ఇటీవలే మార్పులు చేసిన డీపీఆర్ని కూడా బోర్డు ఆమోదించేసింది. వాల్తేరును కొనసాగించాలని ఒత్తిడి తీసుకొచ్చినా దాన్ని పెడచెవిన పెట్టేసింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్త డివిజన్కు డీపీఆర్లో స్పష్టం చేసింది. 410 చ.కి.మీ మేర విశాఖ డివిజన్ సరిహద్దుల విషయంలో బోర్డు కఠినంగా వ్యవహరించింది. గుణుపూర్–తేరుబలి కొత్త లైన్ పూర్తయ్యే వరకు గుణుపూర్– పర్లాఖిముండి సెక్షన్ సహా, నౌపడ–గుణుపూర్ లైన్ని కొత్తగా ఏర్పాటవుతున్న విశాఖ డివిజన్లో ఉంచాలని ప్రతిపాదించారు. కానీ దీన్ని బోర్డు అంగీకరించలేదు. సుమారు 410 చ.కి.మీ మేర విశాఖపట్నం డివిజన్గా ఏర్పాటు కానుంది. వాల్తేరులోని మిగిలిన భాగమైన కొత్తవలస నుంచి కిరండూల్, కూనేరు–తెరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్ నుంచి కొరాపుట్ జంక్షన్, పర్లాఖిముండి నుంచి గుణుపూర్ వరకూ దాదాపు 680 కి.మీ మేర రాయగడ డివిజన్ పరిధిలోకి రాబోతోంది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ విశాఖపట్నం జోన్ నుంచి రాయగడలోకి వెళ్లిపోయింది. పార్వతీపురం సమీపంలోని కూనేరు కూడా రాయగడ డివిజన్కే ఇచ్చేశారు. కొత్తవలస నుంచి పలాస వరకు విశాఖపట్నం డివిజన్లో ఉంచారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఆంధ్రప్రదేశ్కు చెందిన స్టేషన్లన్నీ తూర్పు కోస్తా జోన్లోని ఖుర్దా డివిజన్లో ఉన్నాయి. అరకు, కోరాపుట్ లైన్ విశాఖ డివిజన్కు ఇవ్వాలని ఎన్ని ప్రతిపాదనలు పంపించినా కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసేసింది. గెజిట్ వచ్చేలోపైనా కూటమి కళ్లు తెరిస్తేనే..! తూర్పు కోస్తా రైల్వే జోన్కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ.15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.8 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టికెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్కు సొంతమవుతుంది. వాల్తేరుకు రావాల్సిన ఆదాయం దాదాపు సింహభాగం కోల్పోయినట్లే అవుతుంది. జోన్కు సంబంధించి ఇంకా గెజిట్ విడుదల కాలేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, ఎంపీలు పట్టుబట్టి.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తే విశాఖ డివిజన్కు మంచి జరిగే అవకాశం ఉంది. కానీ.. కూటమి నేతలు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. -
‘ఉచిత బస్సు’ అమలు చేస్తే మా గతేంకాను
కశింకోట: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మా గతేం కావాలని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం వల్ల ఆటో, వ్యాన్, టాక్సీ తదితర మోటారు వాహనాల మీద ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మండలంలోని నరసింగబిల్లి వద్ద జాతీయ రహదారిపై ఆటో, మోటారు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ప్రదర్శన చేశారు. కార్యక్రమానికి నాయకత్వం వహించిన సీఐటీయూ జిల్లా నాయకుడు దాకారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలు పేరుతో ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని క ల్పిస్తామని ప్రకటించారన్నారు. దీనివల్ల ఆటో, వ్యాన్, టాక్సీ తదితర మోటారు వాహనాల మీద ఆధారపడి జీవనం సాగించే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. పలువురు ఉన్నత చదువులు చదివి సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఆటో, వ్యాన్, టాక్సీలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసి వడ్డీలు కట్టలేక, సర్వీసు లేక సతమతమవుతున్నట్టు తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు, విడి భాగాల ధరలు, బీమా చలానాలు, టాక్స్లు విపరీతంగా పెరగడం, మరో పక్క పోలీసులు, ట్రాన్స్ఫోర్టు అధికారులు కేసులు బనాయిస్తుండటం వల్ల రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ము వాటికే ఖర్చు అయిపోతుందన్నారు. ఇంటి అవసరాలకు డబ్బులేక అర్ధాకలితో కుటుంబాలు అలమటించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుందని చెప్పారు. వీటిని గుర్తించి ఆటో,మోటారు కార్మికులను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. యూనియన్ నాయకులు శివశంకర్, ఎం.వర, ఎం.శ్రీను, ఎం. బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
కేజీహెచ్కు అనారోగ్యం
● వైద్యం కోసం వస్తే.. రోగులకు వ్యథలే.. ● అధికారుల మధ్య ఆధిపత్య పోరు ● ఓ పరిపాలనాధికారి పనితీరుపై విమర్శలు ● అవినీతి, వర్గ విభేదాలు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు మహారాణిపేట(విశాఖ): ఉత్తరాంధ్ర జిల్లాలకే పెద్ద దిక్కుగా ఉన్న కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) సమస్యల వలయంలో చిక్కుకుంది. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్గఢ్, అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. అయితే పెరిగిన రోగుల తాకిడికి అనుగుణంగా వైద్య సేవలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాలనా వైఫల్యం, పర్యవేక్షణ లోపం కారణంగా ఆసుపత్రిలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆసుపత్రిలో 1,187 పడకలు ఉండగా, సోమవారం నుంచి శనివారం వరకు రోజూ 1,500 నుంచి 2,200 మంది ఓపీ టికెట్లు తీసుకుంటున్నారు. వీరిలో 300 నుంచి 600 మంది వరకు ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వార్డులు, పడకల సంఖ్యను పెంచాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు శూన్యం. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా యాజమాన్యం విఫలమవుతోంది. కొన్ని చోట్ల రోగులు కుక్కలతో కలిసి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. నిర్లక్ష్యానికి కేరాఫ్గా క్యాజువాలిటీ ఆసుపత్రికే గుండెకాయ లాంటి క్యాజువాలిటీ విభాగం నిర్లక్ష్యానికి నిలయంగా మారింది. రోడ్డు ప్రమాద బాధితులు, అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనవారు ఇక్కడికి వస్తే, వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. క్షతగాత్రులు, రోగులను లోపలికి తీసుకెళ్లడానికి స్ట్రెచర్, వీల్ చైర్ కోసం కూడా బంధువులే వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి ఉంది. దీంతో క్షతగాత్రులు రక్తం కారుతూ.. బాధను ఓర్చుకుంటూ ఆటోల్లో, అంబులెన్స్ల్లో అప్పటి వరకు ఉండాల్సిన పరిస్థితి ఉంది. సిబ్బంది నిర్లక్ష్యం, విసుగు ప్రదర్శిస్తుండటంతో అత్యంత విలువైన ‘గోల్డెన్ అవర్’ వృథా అయి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. ఒకవేళ రోగి మరణిస్తే, మృతదేహాన్ని గంటల తరబడి అక్కడే స్ట్రెచర్పై వదిలేస్తున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. దుర్గంధభరితంగా వార్డులు పారిశుధ్య పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో ఆసుపత్రిలోని అనేక వార్డులు కంపుకొడుతున్నాయి. రాజేంద్రప్రసాద్ వార్డు, భవానగర్ వార్డు, గైనిక్ వార్డు, పిల్లల వార్డు, ఆర్థోపెడిక్ వార్డుల్లో మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. ఎవరైనా పర్యవేక్షణ చేస్తారంటే శుభ్రం చేస్తారు. లేదంటే పట్టించుకోరు. దీంతో అపరిశుభ్ర వాతావరణంలోనే రోగులు, వారి బంధువులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఆధిపత్య పోరు.. అవినీతి ఆరోపణలు ఆసుపత్రిలో అధికారుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఆసుపత్రిని పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ తన చాంబర్ నుంచి బయటకు రావడం గగనంలా మారింది. విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఎవరికీ అప్పగించలేదు. అడ్మినిస్ట్రేటర్గా వచ్చిన ఓ అధికారి పనితీరు మీద విమర్శలు వస్తున్నాయి. పరిపాలనను పట్టించుకోకుండా ఆస్పత్రిలో ఒక వర్గాన్ని చేతిలో పెట్టుకుని వివాదాలకు ఆజ్యం పోస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి, వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉండటంతో పాలన గాడి తప్పింది. తరచూ విద్యుత్ అంతరాయాలు, పనిచేయని ఏసీలు, ఆపరేషన్ థియేటర్ల నిర్వహణ లోపాలు, పారిశుధ్య సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారు. ఆస్పత్రికి ‘నేనే బాస్’అంటే ‘నేనే బాస్’అనే ధోరణిలో అధికారుల మధ్య నెలకొన్న పోరుతో ఇక్కడ వైద్య సేవలు, పరిపాలన అస్తవ్యస్తంగా మారాయి. వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షణ కష్టపడి ఓపీ టికెట్టు సంపాదించి సంబంధిత విభాగానికి వెళ్తే.. వైద్యుడిని సంప్రదించడానికి గంటకు పైగా సమయం పడుతోంది. క్యాజువాలిటీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ప్రసూతి, చిన్నపిల్లల వార్డు, క్రిటికల్ కేర్ విభాగం.. ఇలా ప్రతి విభాగంలోనూ వందలాది మంది రోగులు బారులుదీరి ఉంటారు. రోగులకు వైద్యం బాగానే అందిస్తున్నా.. డాక్టర్ వద్దకు చేరుకోవడానికే చాలా సమయం పడుతోంది. ఇటీవల 43 మంది వైద్యులు, 26 మంది స్టాఫ్ నర్సులు బదిలీ అయ్యారు. కొత్త నియామకాలు జరగకపోవడంతో వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది. పలు విభాగాల్లో విభాగాధిపతులు(హెచ్వోడీ) అందుబాటులో లేకపోవడంతో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో, కొన్నిచోట్ల పీజీ విద్యార్థులతో ఓపీలు నడుస్తున్నాయి. కొందరు వైద్యులు సమయానికి రాకపోవడంతో రోగులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. -
సానా రెచ్చిపోతున్నారు!
● ఎమ్మెల్యే సోదరుడి అనుచరుల గ్రావెల్ దందా ● భారీ యంత్రాలతో వెదురువాడలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు ● ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి పెద్ద ఎత్తున అక్రమంగా తరలింపు ● అడ్డుకున్న వైఎస్సార్సీపీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు, నేతలపై గూండాగిరీ ● చోద్యం చూస్తున్న ఏపీఐఐసీ, మైనింగ్, రెవెన్యూ అధికారులు ● ఏపీఐఐసీ అధికారికి రోజు వారి మామ్మూళ్లు! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. కన్నుమిన్నుకానకుండా రెచ్చిపోతున్నారు. కొండలను తవ్వి పిండి చేస్తున్నారు. చెరువులను గుల్ల చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. మామూళ్లతో అధికారుల కళ్లకు గంతలు కట్టి మరీ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల అండదండలతో రెచ్చిపోతున్నారు. అడ్డుకుంటున్న గ్రామస్తులు, వైఎస్సార్సీపీ నేతలపై గూండాగిరీకి దిగుతూ, లారీలతో ఢీకొని అడ్డు తొలగించుకునేలా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక ప్రాంతమైన అచ్యుతాపురం మండల పరిధి లో రాత్రీపగలు తేడా లేకుండా గ్రావెల్ మాఫియా రోజు రోజుకూ రెచ్చిపోతోంది. అధికారుల అండ దండలతో ఇష్టానుసారంగా గ్రావెల్ను తవ్వేస్తున్నారు. పెద్ద పెద్ద చైన్ పొక్లెయిన్లతో యథేచ్ఛగా కొండలను పిండి చేస్తున్నారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే సోదరుడు సతీష్కుమార్ అనుచరులే దందాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ శనివారం అర్ధరాత్రి వెదురువాడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్–1లో ఉన్న కొండ వద్ద నాలుగు పెద్ద పొక్లెయిన్ల (200–మిషన్ల)తో గ్రావెల్ తవ్వకాలు జరిపి, 30కి పైగా లారీలతో అక్రమంగా తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జెడ్పీ కోఆప్షన్ నర్మల్ కుమార్, మండల యువజన అధ్యక్షుడు గంగోలి శ్రీనుతో పాటు గ్రామస్తులు ఆ ప్రాంతానికి వెళ్లి లారీలను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే సోదరుడి అనుచరుడు సరోజీరావు రెచ్చిపోయారని, గూండాగిరీ చేస్తూ కుమార్ తదితరులను లారీతో తొక్కించేయాలని డ్రైవర్లను ఆదేశి స్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. ఈ తరలింపు వెనుక స్థానిక జనసేన ఎమ్మెల్యే సోదరుడు సతీష్కుమార్ అనుచరుడు కొరుప్రోలు చిన్నారావు, ఆయన సోదరుడు సరోజీరావు హస్తం ఉందని వైఎస్సార్సీపీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు కుమార్ ఆరోపించారు. గత కొంత కాలంగా ఇక్కడ పెద్ద ఎత్తున గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆ ప్రాంత వాసులు తెలిపారు. ఫిర్యాదు చేసినా.. అచ్యుతాపురం సెజ్ పరిశ్రమలను ఆనుకుని ఉన్న మడుతూరు, ఇరువాడ, యర్రవరం, ఉప్పవరం, జగన్నాథపురం, నడింపల్లి గ్రామాల్లో ఉన్న చెరువులు, కొండలను సైతం పొక్లెయిన్లతో తవ్వి గ్రావె ల్ను అక్రమంగా తరలించారు. మైనింగ్ ఏడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయా గ్రామస్తులు తెలిపారు. పోలీసుల అండదండలతో.. అచ్యుతాపురం పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే, పోలీసుల అండదండలతోనే గ్రావెల్ను అక్రమంగా తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. శనివారం రాత్రి 10 గంటలకు గ్రావెల్ తవ్వుతున్నట్టు ఫోన్ రావడంతో అక్కడికి జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు కుమార్, వైఎస్సార్సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు గంగోలి శ్రీను వెళ్లి అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే సోదరుడు సతీష్ కుమార్ అనుచరుడు కొరుప్రోలు సరోజీరావు గూండాగిరీ చేశాడని, లారీతో తొక్కించేయాలంటూ డ్రైవర్కు చెప్పి అడ్డు తొలగించేందుకు ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు హోంగార్డులు శంకరరావు, అప్పారావు ప్రేక్షకపాత్ర పోషించారే తప్ప అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిలువరించలేదని చెప్పారు. అంతే కాకుండా అడ్డుకునేందుకు వచ్చిన వారిని తమ సీఐ గారికి ఫోన్ చేయాలంటూ చెప్పి మిన్నకుండిపోయారని తెలిపారు. ఈ వ్యవహారమంతా పోలీసుల అండదండలతో సాగుతోందని వారు ఆరోపించారు. అధికారులకు ముడుపులు..! ఎటువంటి అనుమతులు.. అడ్డూ అదుపూ లేకుండా కొండలను పిండి చేస్తున్నా మైనింగ్, పోలీస్, ఏపీఐఐసీ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటు ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కలుషితం చేస్తున్నారు. కాగా మైనింగ్, పోలీస్, రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లించి మరీ గ్రావెల్ను దోచుకుంటున్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో అనుమతుల్లేకుండా ఎక్కడ పడితే అక్కడ అక్రమార్కులు కొండలను, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు. ఎవరైనా స్థానికులు అడ్డగిస్తే వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. స్థానికులెవరైనా రెవెన్యూ, మైనింగ్, పోలీసు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. నేరుగా తవ్వకం దారులకే సమాచారం ఇచ్చి నామమాత్రంగా తనిఖీలు చేయడానికి వెళ్తున్నారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అడ్డుకున్నానని లారీతో తొక్కించి చంపే యత్నం.. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రంతా భారీగా గ్రావెల్ను తరలించేస్తున్నారు. అధికారుల అండదండలతోనే గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ నెల 2వ తేదీన భారీ వాహనాలతో గ్రావెల్ తవ్వుతుంటే మేము అడ్డుకున్నాం. నాపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. లారీతో తొక్కించుకుంటూ వెళ్లాలని డ్రైవర్లను ఆదేశిస్తూ గూండాగిరీకి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ గ్రావెల్ మాఫియాను అడ్డుకుని తీరతాం. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని గతంలో చాలా సార్లు మైనింగ్, ఇతర అధికారులను ఫిర్యాదు చేశాం. కలెక్టర్ విజయకృష్ణన్, మైనింగ్ ఏడీ, పోలీసులు, రెవెన్యూ అధికారులను కూడా కోరుతాం. ఇక్కడ జరుగుతున్న అవినీతిపై మా పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, పార్టీ కేడర్ అంతా ఉద్యమం చేసైనా ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటాం. అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకూ మా పోరాటం, ఉద్యమం ఆగదు. – నర్మల్కుమార్, జెడ్పీ, కోఆప్షన్ సభ్యుడు రోజుకు 400 ట్రిప్లు.. అచ్యుతాపురం మండలం వెదురువాడ సర్వే నంబర్ 1లో గత కొన్ని రోజులుగా కూటమి ఎమ్మెల్యే సోదరుడి అనుచరులు కొండను అక్రమంగా తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారు. నాలుగు 200 చైన్ జేసీబీ మెషీన్లతో 30కి పైగా లారీలతో రోజుకు 400కు పైగా ట్రిప్లు తరలిస్తున్నారని, ఈ వ్యవహారమంతా రాత్రి పూట సాగుతోందని గ్రామస్తులు తెలిపారు. ఒక ట్రిప్కు 30 టన్నుల గ్రావెల్ చొప్పున ఒక్కో లారీతో 10 ట్రిప్ల వరకూ అక్రమంగా తరలించేస్తున్నారని తెలిపారు. సుమారు 12 వేల టన్నుల గ్రావెల్ను రోజూ అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం. సుమారు ఏడాది కాలంగా కొండకర్ల నుంచి గోకువాడ వరకు 10 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కొండ తవ్వి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువ చేసే గ్రావెల్ తరలించారని భోగట్టా. అంతే కాకుండా సమీపంలో గల ఎర్రవరం, జగన్నాథపురం, నడింపల్లి, మడుచూరు, వెంకటాపురం, చీమలాపల్లి గ్రామాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒక లారీ గ్రావెల్ను రూ.9 వేల చొప్పున విక్రయిస్తూ జేబు లు నింపుకుంటున్నారు. -
ఉత్సాహంగా న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్
అనకాపల్లి టౌన్: స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్యర్యంలో న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఉత్సాహంగా జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదులను నాలుగు టీములుగా విభజించి ఏఎంఏఎల్ కళాశాల గ్రౌండ్లో క్రికెట్ టోర్న మెంట్ నిర్వహించారు. పదోఅదనపు జిల్లా జడ్జి నరేష్, అడిషనల్ సబ్ కోర్ట్ జడ్జి రామకృష్ణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ధర్మారావు టోర్నమెంట్ను ప్రారంభించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లా హరశ్రీనివాసరావు, కార్యదర్శి బంధం రమణ, ఉపాధ్యక్షుడు సంకర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్లుగా కాబోయే భార్యాభర్తలు
వంతాల అశోక్, డొంకా అమ్మాజీరావికమతం: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించారు. వీరిలో మండలంలో కొత్త కోట్నాబిల్లి ఎస్సీ కాలనీకి చెందిన వంతాల అశోక్ 113 మార్కులు సాధించి ఏపీ ఎస్సీ కానిస్టేబుల్గా,పిల్లవానిపాలెం గ్రామానికి చెందిన డొంకా అమ్మాజీ 120 మార్కులు సాధించి సివిల్ మహిళా పోలీస్గా ఎంపికయ్యారు.ఈ యువతీ యువకులు ఇద్దరూ మేనత్త, మేనమామ పిల్లలు,ఇద్దరికీ వివాహం నిశ్చయమైంది.పది రోజుల్లో వీరి నిశ్చితార్థం కార్యక్రమం జరగనుంది. కాబోయే భార్య,భర్తలు ఒకే ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకొన్నారు. మొదటి ప్రయత్నంలోనే ఇద్దరూ కానిస్టేబుల్ కొలువులు సాధించారు. అశోక్ తల్లిదండ్రులు నూకరాజు,అప్పలరత్నం, అమ్మాజీ తల్లిదండ్రులు నూకరాజు,చింతల్లి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వివాహం చేస్తామని వారు తెలిపారు.ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం రావడంతో రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.ఇద్దరిని వారి వారి గ్రామాల్లో పలువురు అభినందించారు. -
గ్రామాల్లో వైద్య సేవల కొరత
మా గ్రామంలో గత నెల రోజులుగా ప్రతి ఇంటిలో ఇద్దరు ముగ్గురు డెంగ్యూ, చికున్ గున్యా జ్వరాల బారిన పడుతున్నారు. నాతో పాటు మా ఇంటిలో నలుగురికి జ్వరం వచ్చింది. మా పెద్ద పాపకు ఎనిమిదేళ్లు, చిన్న పాపకు ఐదేళ్లు. ఇద్దరికీ చికున్ గున్యా జ్వరం వచ్చింది. గ్రామమంతా అనారోగ్యంతో బాధపడుతుంటే మెడికల్ సిబ్బంది వచ్చి చికిత్స అందించిన దాఖలా లేదు. దోమల మందు కొట్టించమని గ్రామ సెక్రటరీని వేడుకుంటే కనీసం పట్టించుకోలేదు. – లగుడు శ్రీను, విప్పలపాలెం, గొలుగొండ మండలం -
నూతన పద్ధతులతో అధిక దిగుబడులు
మాకవరపాలెం: కాలానుగుణంగా వస్తున్న నూతన పద్ధతుల్లో రైతులు వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. మొదటి విడత అన్నదాత సుఖీభవ పథకం నగదు విడుదల నేపథ్యంలో శనివారం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 2,31,000 మంది రైతులకు ఈ పథకం లబ్ధి చేకూరినట్టు చెప్పారు. నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ పాల్గొన్నారు. అనకాపల్లిలో.. అనకాపల్లి టౌన్: స్ధానిక గుండాల జంక్షన్ వద్ద ఆర్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొన్నారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ ప్రసంగాలను వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతగా జిల్లాలో ఉన్న 2,42,536 మంది రైతుల ఖాతాల్లో 161.45 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఆర్డీవో షేక్ అయిషా, జిల్లా వ్యవసాయాధికారి మోహన్రావు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్ తదితరులు పాల్గొన్నారు. ● స్పీకర్ అయ్యన్నపాత్రుడు -
స్నేహమేరా జీవితం..
అనకాపల్లి: సాధారణంగా రైల్లో కలిసే స్నేహాలు, అనుబంధాలు తాత్కాలికం అంటారు. కలిసి ప్రయాణిస్తూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్న వారు సైతం రైలు దిగిన వెంటనే ఒకరినొకరు మరచిపోతారు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతారు. కానీ వీరు అలా కాదు.. ప్రతి రోజూ ఒకే రైల్లో ప్రయాణించడం వల్ల కాబోలు వారి స్నేహాన్ని శాశ్వతం చేసుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ స్థాపించి కుటుంబ సభ్యులతో సహా అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన మాదేటి ఈశ్వరరావు వ్యాపారరీత్యా అనకాపల్లి–విశాఖ డైలీ పాసింజర్ రైల్లో నిత్యం ప్రయాణించేవారు. అలా అనకాపల్లి నుంచి విశాఖ వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు ఆయనకు ఎంతో దగ్గరైపోయారు. అలా మిత్రులైన తోటి ప్రయాణికులతో కలిసి 2000 సంవత్సరంలో బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ను ఏర్పాటు చేశారు. క్లబ్లో బుద్ద రామకృష్ణ, పెంటకోట నర్సింగరావు, కర్రి గంగాధర్, పి.ఎస్.అప్పారావుతోపాటు 60మంది స్నేహితులతో కలిసి క్లబ్ స్థాపించారు. కుటుంబ సమేతంగా సభ్యులుగా చేరారు. ప్రస్తుతం 500 కుటుంబాల వారు ఈ క్లబ్లో ఉన్నారు. వీరు ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడమే కాక అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాల వితరణ చేస్తారు. ఆస్పత్రుల్లో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేస్తారు. క్లబ్లో సభ్యుల జన్మదినాన్ని పురస్కరించుకుని వారి ఇంటికి ప్రత్యేక గిఫ్ట్ పంపిస్తారు. స్నేహితుల దినోత్సవానికి 15 రోజుల ముందుగా క్లబ్ సభ్యులకు రన్నింగ్, క్రికెట్ వంటి ఆటలు పోటీలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా స్నేహితుల దినోత్సవాన్ని స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి రహదారిలో ఉన్న సత్య గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం కుటుంబ సమేతంగా నిర్వహిస్తున్నట్టు క్లబ్ అధ్యక్షుడు బి.ఎస్.ఎం.కె.జోగినాయుడు చెప్పారు. రైలు ప్రయాణికులే సభ్యులుగా బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ ఏర్పాటు అనకాపల్లిలో 25 సంవత్సరాలుగా కొనసాగుతున్న స్నేహం -
చూడి పశువు కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు
● శస్త్రచికిత్స చేసి తొలగించిన పశువైద్యాధికారులు చూడి పశువుకు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్న పశువైద్యాధికారి శివకుమార్ బుచ్చెయ్యపేట: మండలంలో వడ్డాది ఎస్సీ కాలనీ నివాసి కోరుకొండ రాముకు చెందిన చూడి పశువు కడుపులో పెద్ద ఎత్తున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ సంచులను శస్త్ర చికి త్స ద్వారా పశువైద్యాధికారులు తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి రాముకు చెందిన చూడి పశువు 15 రోజులుగా మేత వేయడంలేదు.దీంతో పాటు కడుపు పొంగుతో బాధపడుతోంది. రాము శనివారం వడ్డాది పశువైద్యశాలకు తన పశువును తీసుకెళ్లాడు. బుచ్చెయ్యపేట పశువైద్యాధికారి డాక్టర్ పద్మజ చూడి పశువును పరీక్షించి, శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. కె.జె.పురం ఇన్చార్జి పశువైద్యాధికారి శివకుమార్ పశువుకు శస్త్ర చికిత్స నిర్వహించారు. కడుపులోంచి ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ తాడులను తొలగించారు. శస్త్ర చికిత్స చేసి పశువు ప్రాణాలు కాపాడిన పశువైద్యాధికారులకు రైతు రాము కృతజ్ఞతలు తెలిపాడు. -
ప్రజల్లోకి బాబు మోసాలు
‘బాబు ష్యూరిటీ..మోసం గ్యారెంటీ’ పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు కూటమి ప్రభుత్వం కుటిల పాలనను ఎండగడుతున్నారు. గ్రామగ్రామాన రచ్చబండ నిర్వహించి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తున్నారు. యలమంచిలి మండలం ఏటికొప్పాక, పద్మనాభరాజుపేట, బయ్యవరం, ములకలాపల్లి గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుతో కలిసి పర్యటించారు. గత 14 నెలల కాలంలో ప్రజలు ఎంత నష్టపోయిందీ వివరించారు. దీంతో పలువురు గ్రామస్థులు స్పందిస్తూ వైఎస్ జగన్ పాలనతో ప్రస్తుత కూటమి పాలనను బేరీజు వేసుకుని జగన్ పాలన ప్రయోజనాలను గుర్తు తెచ్చుకున్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ శ్రేణులు క్యూఆర్ కోడ్తో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. అనకాపల్లి పట్టణంలోని పాత బర్మాకాలనీలో వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పర్యటించారు. ఒక మోసగాడు.. వేషగాడు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. –యలమంచిలి/అనకాపల్లి -
149 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన
జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న నగరప్రజలుడాబాగార్డెన్స్ (విశాఖ): జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 149వ జయంతి పురస్కరించుకొని నగర వీధుల్లో 149 అడుగుల భారీ జాతీయ జెండాను శనివారం ప్రదర్శించారు. స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పాతనగరం నుంచి వన్టౌన్ పోలీస్ స్టేషన్ దరి రాణి బొమ్మ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ముందుగా పింగళి వెంకయ్య చిత్రపటానికి సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్, సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు, పలువురు సంస్థ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్లమెంట్లో వెంకయ్య విగ్రహాన్ని ప్రతిష్టించడంతోపాటు భారతరత్న బిరుదు ప్రకటించాలని కోరారు. టి.కృష్ణ, సీహెచ్ నూకరాజు, సీమెన్ భాష పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ధర్నాతుమ్మపాల: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ఉపాధ్యాయులకు అప్పగించిన బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే 12వ పీఆర్సీని ప్రకటించి, ఐఆర్ 30 శాతం చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయులకు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి సుధాకరరావు మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని యథావిదిగా కొనసాగించాలని కోరారు. ఎంఈవోలు గ్రేడ్–2 హెచ్ఎంలుగాను, గ్రేడ్–2 హెచ్ఎంలు ఎంఈవోలుగా మారేందుకు అవకాశం కల్పించాలన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కో–చైర్మన్ ఎ.వీహెచ్.శాస్త్రి, ఎం.జానకీరామనాయుడు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ డి.చిన్నబ్బాయి, ఎస్.దుర్గాప్రసాధ్, ఆచంట రవి, కార్యవర్గ సభ్యులు శేఖర్, ధర్మారావు, ఎం.శ్రీనివాసరావు, పరదేశి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జిల్లాకు జ్వరమొచ్చింది..
● పెరుగుతున్న డెంగ్యూ, టైఫాయిడ్ బాధితులు ● ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే ● రోగుల్లో క్రమంగా తగ్గుతున్న ప్లేట్లెట్లు ● పీహెచ్సీలలో రక్తపరీక్షల సౌకర్యం లేక గుర్తించడంలో ఆలస్యం ● ‘ఫ్యామిలీ డాక్టర్’ కనుమరుగై అనారోగ్యంతో మగ్గుతున్న పల్లెలు సాక్షి, అనకాపల్లి: జిల్లాలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున మంచాన పడుతున్నారు. ఏజెన్సీని ఆనుకొని ఉన్న మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వానికి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్న ధ్యాస కరువైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇప్పుడు కనుమరుగు కావడంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంటికే వైద్యం అందిన ఆ రోజులను తలచుకొని, ఇప్పుడు ఆస్పత్రికి వెళ్లినా చికిత్స సక్రమంగా అందని దైన్య స్థితిని చూ సి ఆవేదనకు గురవుతున్నారు. జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ ఆస్పత్రి, మూడు ఏరియా ఆస్పత్రులు, 7 సీహెచ్సీలు, 45 పీహెచ్సీలు, 9 యూపీహెచ్సీలున్నాయి. రోజువారీగా 3,600 నుంచి 3,700 వరకూ ఓపీలు నమోదవుతాయి. ఇందులో 70 శాతం జ్వరపీడితులే కావడం గమనార్హం. గత వారం రోజులుగా సీజనల్ జ్వరాలు పెరగడంతో గణనీయంగా ఓపీలు పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ ఫీవర్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైద్యశాఖ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. ప్లూయిడ్స్ కొరత ఉంది. యాంటిబయోటిక్ ఇంజక్షన్లు, మలేరియా, డెంగ్యూ మందుల కొరత కూడా ఉన్నట్లు సాక్షి పరిశీలనలో వెల్లడైంది. జ్వరాల నివారణకు ముందస్తు అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, దోమల తెరల పంపిణీ వంటి చర్యలేవీ కానరావడం లేదు. దోమల కిట్లు ఎక్కడ..? ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనకుని ఉన్న గొలుగొండ, నాతవరం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో సీజనల్ జ్వరాలు చుట్టుముడతాయని తెలిసి కూడా జిల్లా యంత్రాంగం కనీసం దోమల తెరలు కూడా పంపిణీ చేయలేదు. జిల్లాలో వందలాది ఫార్మా కంపెనీలున్నాయి. వాటి నుంచి వచ్చే సీఎస్సార్ నిధులతో గతంలో దోమల తెరలు పంపిణీ చేశారు. ఈ ఏడాది కనీసం జిల్లా ఉన్నతాధికారులు, వైద్యశాఖ అధికారులు కనీసం ఆ ఆలోచన కూడా చేసిన పాపానలేదు. ●రక్త పరీక్షల సదుపాయమూ కరువే.. అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి, నక్కపల్లి, యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రి మినహా మిగిలిన చోట్ల డెంగ్యూ నిర్ధారిత రక్త పరీక్షల సదుపాయం లేదు. ఒకవేళ పరీక్షలు చేసినా మూడు, నాలుగు రోజులపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈలోపు బాధితులకు ప్లేట్లెట్ కౌంట్ క్రమేపీ తగ్గిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యంపై నమ్మకం లేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో గొలుగొండ, నాతవరం, రోలుగుంట, రావికమతం, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నా.. సంబంధిత అధికారుల పర్యవేక్షణే కరువైంది. జిల్లాలో 30కి పైగా పీహెచ్సీల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇంజక్షన్లు, మందులు అందుబాటులో లేవు. మాడుగుల మండలంలో కె.జె.పురం, కింతలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పలుచోట్ల వైద్య సిబ్బంది కొరత కూడా వుంది. -
ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఏ ఇంట చూసినా సుస్తీ చేసిన మనుషులే కనిపిస్తున్నారు. వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో రక్తపరీక్షల సదుపాయం పూర్తి స్థాయిలో లేక ప్లేట్లెట్లు తగ్గుతున్నాయని గుర్తించేసరిక
గొలుగొండ మండలం చోద్యం సచివాలయ పరిధిలో విప్పలపాలెం గ్రామంలో డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు ప్రజలను పీడిస్తున్నాయి. ఆ గ్రామం మొత్తం జనాభా సుమారు 500 కాగా అందులో 100 మందికిపైగా డెంగ్యూ, చికున్ గున్యా, టైఫాయిడ్, మలేరియా, సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ గ్రామంలో మూడేళ్ల పాప నుంచి వృద్ధుల వరకు జ్వరాలతో బాధపడుతున్నా.. గ్రామ సచివాలయ సెక్రటరీగానీ, ఏఎన్ఎం గానీ, సమీప ఎంఎల్హెచ్పీ, గొలుగొండ, కేడీ పేట పీహెచ్సీల పరిధిలో వైద్య సిబ్బంది గానీ ఆ వైపు చూసిన పాపాన పోలేదు. కనీసం పేరాసెటిమాల్ టాబ్లెట్ ఇచ్చే నాథులు కూడా లేరు. -
సమర్థవంతంగా విద్యాబోధన
శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న డీఈవో అప్పారావు నాయుడు సబ్బవరం: శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను వినియోగించుకుని సమర్థవంతంగా విద్యాబోధన సాగించాలని ఉపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు సూచించారు. సబ్బవరం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన మొదటి విడత ఇన్ సర్వీస్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలుగు బోధన సమయంలో విద్యార్థులను ఆకట్టుకునేలా పాటలు, కథలు మొదలైన ప్రక్రియ ద్వారా బోధన సాగాలన్నారు. విద్యార్థులతో మంచిగా వ్యవహరించాలని, లేకపోతే డ్రాపౌట్ అయ్యే ప్రమాదముందన్నారు. దానికి తానే ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. జీవితాలను మలుపు తిప్పే మంచి ఉపాధ్యాయులను విద్యార్థులు చిరకాలం గుర్తుంచుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రోజెక్ట్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్.జయప్రకాష్, స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ శేషగిరి, సబ్బవరం ఎంఈవో జె.రవీంద్ర, ఏఎస్డీ జమున, ఏఎంవో కెజియో, ఆర్పీలు పాల్గొన్నారు. -
నూతన విద్యా విధానంలో అప్డేట్ కావాలి
● విశాఖ ఒకటో జోన్ ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకుడు విజయభాస్కర్ కశింకోట: నూతన విద్యా విధానానికి అనుగుణంగా మారిన సిలబస్, పరీక్షల నిర్వహణ విధానాలపై బాధ్యులైన హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు, ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలని విశాఖ ఒకటో జోన్ ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకుడు కె. విజయ భాస్కర్ తెలిపారు. స్థానిక సెయింట్ జాన్స్ స్కూలులో శనివారం జెడ్పీ పాఠశాలల హెచ్ఎంలు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, గురుకుల, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి అమలులోకి వచ్చిన అంశాలపై ప్రత్యేక అవగాహన పెంచుకోవడం ద్వారా వాటిపై పట్టు సాధించుకోవచ్చన్నారు. నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక మదింపు విధానాలతో వచ్చిన అసెస్మెంట్ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. హెచ్ఎంలు తప్పనిసరిగా ఒక సబ్జెక్టును పూర్తిగా బోధించాలన్నారు. ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా వారి విద్యా స్థాయిలను పరిశీలించాలన్నారు. డీఈవో గిడ్డి అప్పారావునాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉప విద్యా శాఖ అధికారి జొన్నాడ అప్పారావు, పరీక్షల విభాగం సహాయ సంచాలకుడు శ్రీధర్రెడ్డి, జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి సిహెచ్. సత్యనారాయణ, సీసీ వై. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు
● కశింకోటలో నలుగురు నిందితుల అరెస్టు ● 262 కిలోల గంజాయి, స్కార్పియో, స్కూటీ స్వాధీనం ● మరో ముగ్గురు పరారీ కశింకోట: ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిపోతున్న దాదాపు అరకోటి రూపాయల విలువైన 262 కిలోల గంజాయిని శనివారం కశింకోటలో పోలీసులు పట్టుకున్నారు. నలుగుర్ని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రవాణాకు వినియోగించిన స్కార్పియో, స్కూటీ, 4 సెల్ఫోన్లు, రూ.3200 స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి తమిళనాడుకు ప్యాకెట్ల రూపంలో బస్తాల్లో గంజాయి అక్రమ రవాణా అవుతుందన్న విశ్వసనీయ సమాచారం నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో స్థానిక సత్తెమ్మతల్లి మలుపు వద్ద ఎస్ఐలు కె. లక్ష్మణరావు, పి. మనోజ్కుమార్, సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో స్కూటీ, స్కార్పియో వాహనాలు అనుమానాస్పదంగా రావడం గమనించారు. పోలీసులను చూసిన వెంటనే స్కూటీపై ఇద్దరు వ్యక్తులు, కారులోని ముగ్గురు వ్యక్తులు వాహనాలను నిలిపి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. వారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం నిట్టపుట్టు గ్రామానికి చెందిన అనుగూరి కొండబాబు, కె. కోటపాడు మండలం పైడంపేట గ్రామానికి చెందిన స్కార్పియో డ్రైవర్ చిరికి రాఘవ, బండారు గణేష్, పెదబయలు మండలం బొడ్డగొంది గ్రామానికి చెందిన అనుగూరి సోమేష్కుమార్లను పోలీసు బృందం పట్టుకుంది. స్కార్పియోలో గంజాయి ఉన్నట్లు ఒప్పుకోవడంతో దాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. ఒకరు మాత్రం పరారయ్యాడు. అతన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం బొంగరం పంచాయతీ డోమలొడ్డు గ్రామస్తునిగా గుర్తించారు. ఇతడితోపాటు ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా పనికిబండ గ్రామానికి చెందిన వంతల ధనుర్జయ్, తమిళనాడుకు చెందిన రమేష్ ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. వీరిని పట్టుకోవడానికి చర్యలు కొనసాగుతున్నాయన్నారు. గంజాయి పట్టుకున్నందుకు సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్యకు నివాళి
నర్సీపట్నం: జాతీయ పతాక రూపకర్త స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 149వ జయంతిని శనివారం వైఎస్సార్సీపీ నాయకులు నిర్వహించారు. పెదబొడ్డేపల్లి పెద్ద చెరువు వైఎస్సార్ ట్యాంక్ బండ్ వద్ద పింగళి వెంకయ్య విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి భారతీయుడు ఎప్పటికి గర్వించే త్రివర్ణ పతాకాన్ని అందించిన గొప్ప మహనీయుడు పింగళి అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ మాజీ స్టేట్ డైరెక్టర్ కర్రి శ్రీనువాసరావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు షేక్ రోజా, పార్టీ నాయకులు పెట్ల అప్పలనాయుడు, యాదగిరి దాసు, కణితి వాసు, శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయ అధికారి పి.దమయంతి పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. -
తాటిచెట్టు ప్రకృతి ప్రసాదించిన కల్పతరువు. ఈ వృక్షంలోని ప్రతి భాగం వృథా కాకుండా బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతోంది. అలాంటి తాటిచెట్లు కొందరి స్వార్థ ప్రయోజనాలకు నేలకొరుగుతున్నాయి. ఈ పరిణామాలతో తాటిచెట్లు కాలక్రమేణా అంతరించి పోతున్న నేపథ్యంలో వీటి పరిరక్షణకు
రంపచోడవరం: అంతరించిపోతున్న తాటి చెట్ల పరిరక్షణకు పందిరిమామిడి డా.వైఎస్సార్ ఉద్యాన పరిశోధనస్థానం (హెచ్ఆర్ఎస్) శాస్త్రవేత్తలు విశేష కృషి చేస్తున్నారు. అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా 1993 నుంచి ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. తాటి చెట్ల నుంచి సేకరించిన నీరాపై జరిపిన పరిశోధనలు అనేక ఆహార ఉత్పత్తుల తయారీకి దోహద పడ్డాయి. తాటి పండ్ల నుంచి వచ్చే గుజ్జుతో మజా తరహాలో తయారుచేసిన పానీయం సోమవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు స్థానిక పరిశోధన స్థానంలో విక్రయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ● దేశంలో దాదాపుగా 15 కోట్ల తాటి చెట్లు ఉండగా ఒక్క మన రాష్ట్రంలో మూడున్నర కోట్లకు పైగా ఉన్నాయి. ఇక్కడ పరిశోధనల నిమిత్తం 272 రకాల చెట్లు ఉన్నాయి. వీటి నుంచి సేకరించిన నీరాతో తాటి బెల్లం, తేగల నుంచి నూక, బిస్కెట్లు, జెల్లీ వంటి సుమారు 20 రకాల ఆహార పదార్థాలను విజయవంతంగా తయారుచేశారు. తాజాగా తాటి పండు గుజ్జు నుంచి పానీయం (డ్రింక్)ను హెచ్ఆర్ఎస్ సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డా. పీసీ వెంగయ్య అభివృద్ధి చేశారు. తాటి గుజ్జులో సమపాళ్లలో నీటిని కలిపి మిక్స్ చేయడం ద్వారా ఎనర్జీ డ్రింక్ను రూపొందించారు. తాటి చెట్టు నుంచి పండు పడిన మూడు గంటల్లో సేకరించడం ద్వారా ఆరోగ్యవంతమైన గుజ్జును పొందవచ్చని శాస్త్రవేత్త వెంగయ్య తెలిపారు. పానీయం తయారు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సేకరించిన పండ్లను వేడి నీటితో శుభ్రం చేయడం వల్ల పానీయానికి అవసరమైన మంచి గుజ్జును సేకరించవచ్చు. ● ఎక్కువ మొత్తంలో లభించే తాటి గుజ్జును నిల్వ చేయడంపై హెచ్ఆర్ఎస్లో జరుగుతున్న పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. ఇక్కడి తాటి వనం నుంచి సేకరించిన తాటిపండ్ల గుజ్జును నిల్వ చేసి అధ్యయనం చేస్తున్నారు. రోజురోజుకు మార్కెట్లో తాటి ఆహార ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడడంతో గిరిజనులకు మంచి ఆదాయం వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తాటిగుజ్జులో పోషక విలువలు ఉన్నాయి. ఐరన్, అధికంగా పోటాషియం, పాస్పరస్, మినరల్స్, విటమిన్ –సీ ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైన గిరి మహిళలు తాటి నీరాతో ఉత్పత్తుల తయారీపై విస్తృత పరిశోధనలు ఇప్పటికే పలు ఆహార ఉత్పత్తులు పరిచయం తాజాగా పండు గుజ్జుతో పానీయం అందుబాటులోకి తేనున్న పందిరిమామిడి హెచ్ఆర్ఎస్ శాస్త్రవేత్తలు తాటి చెట్ల సంరక్షణతోపాటు గిరిజనులకు మంచి ఆదాయ వనరు అందుబాటులోకి పానీయంతాటి పండు గుజ్జు మంచి పోషకం. దీని ద్వారా తయారు చేసే ఆహార ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని విస్తృత పరిశోధనలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చాం. తాజాగా పానీయం (డ్రింక్) కూడా తెస్తున్నాం. తాటి ఆహార ఉత్పత్తుల తయారీపై గిరిజనులకు శిక్షణ ఇచ్చి మంచి ఆదాయం పొందేలా తీర్చిదిద్దుతాం. –డా. పీసీ వెంగయ్య, ప్రధాన శాస్త్రవేత్త, పందిరిమామిడి ఉద్యానవన పరిశోధన స్థానం -
బళ్లారి రాఘవ ప్రదర్శనలు అమోఘం
తుమ్మపాల: రచనలు, నాటకాల రూపంలో సామాజిక సమస్యలను సమర్ధంగా ప్రదర్శించి స్పష్టమైన సందేశాన్నిచ్చిన మహానుభావుడు బళ్లారి రాఘవ అని అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు కొనియాడారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు శనివారం ఎస్పీ కార్యాలయంలో బళ్లారి రాఘవ 145వ జయంతి నిర్వహించారు. ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి మాత్రమే కాకుండా, సమాజం మార్పు వైపు దారితీసే శక్తిగా కళను ఉపయోగించిన మహానుభావుడు బళ్లారి రాఘవ అని తెలిపారు. ఆయన రచనలు నేటికీ ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయన్నారు. నేటి సమాజ నిర్మాణంలో కళలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి, విలువలతో కూడిన కళా అభిరుచి యువతలో పెంపొందించాలన్నారు. డీటీసీ డీఎస్పీ బి.మోహనరావు, ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యారావు, లక్ష్మి, గఫూర్, ఎస్సైలు ప్రసాద్, సురేష్బాబు, గిరి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
దేవరాపల్లిలో ఆర్టీసీ ప్రయాణికుల నిరసన
● కృష్ణారాయుడుపేట వద్ద కల్వర్టును యుద్ధప్రాతిపదికన నిర్మించాలని డిమాండ్ దేవరాపల్లి: విజయనగరం జిల్లా వేపాడ మండలం కృష్ణారాయుడుపేట సమీపంలో కూలిన కల్వర్టును యుద్ధప్రాతిపదికన నిర్మించాలని ఆర్టీసీ ప్రయాణికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన చేపట్టారు. కృష్ణారాయుడుపేట, ఉగ్గినవలస గ్రామాల మధ్య కల్వర్టు కుంగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరాపల్లి నుంచి వయా కొత్తవలస మీదుగా విశాఖపట్నం వెళ్లే మార్గంలో ప్రతి 15 నిముషాలకు 12డీ బస్సులు రాకపోకలు సాగించేవన్నారు. ఈ నేపథ్యంలో రెండు వారాలుగా ఆర్టీసీ యాజమాన్యం కొన్ని బస్సులను బ్రిడ్జి కూలిన ప్రాంతం నుంచి, మరికొన్ని బస్సులను కె.కోటపాడు మీదుగా విశాఖపట్నానికి తిప్పుతుందన్నారు. దాంతో అటు కొత్తవలస వైపు ఇటు దేవరాపల్లి వైపు రాకపోకలు సాగించే కొత్తవలస, వేపాడు, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిలో కల్వర్టు కూలిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రజా సమస్యల పట్ల ఎంత బాధ్యతగా ఉందో అర్థమవుతుందన్నారు. ప్రయాణికులకు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మద్దతు పలికారు. రోజూ రాకపోకలు సాగించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని, వెంటనే కల్వర్టు పునర్నిర్మించి ప్రజలు కష్టాలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. -
క్లీనర్పై దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
● ఆర్థిక ఇబ్బందులతో హైవేలో చోరీలు ● పరవాడపాలెంలో పట్టుకున్న పోలీసులు కశింకోట: మండలంలోని నూతలగుంటపాలెం వద్ద జాతీయ రహదారిపై చోరీ యత్నంలో భాగంగా లారీ క్లీనర్ను కత్తితో పొడిచి గాయపర్చి పరారైన ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఇంటి సామగ్రి లోడ్తో ఒడిశాలోని పూరి వెళుతున్న లారీని గత నెల 31న ఇక్కడి నూతలగుంటపాలెం వద్ద విశ్రాంతి కోసం నిలిపారు. అక్కడ లారీ క్యాబిన్లో నిద్రిస్తున్న డ్రైవర్ మహేష్కుమార్ జేబులోని నగదు, సెల్ఫోన్ను సంచార జాతికి చెందిన పాయకరావుపేట మండలం నామవరం గ్రామానికి చెందిన కేశవ పవర్, రాహుల్ పవర్ చోరీ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కేకలు పెట్టడంతో వారు పరారయ్యారు. అదే సమయంలో మరో లారీలో నిద్రిస్తున్న క్లీనర్ శంకర్కుమార్ వద్ద నుంచి నగదు చోరీకి ప్రయత్నించగా గట్టిగా అరిచాడు. దాంతో అతని బారి నుంచి తప్పించుకునేందుకు నిందితుడు కేశవ్ తన వద్ద కత్తితో క్లీనర్ను వెనుక భాగంలో పొడిచాడు. వెంటనే మరో నిందితుడు రాహుల్తో కలిసి పారిపోయారు. ఈ విషయమై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో పరవాడపాలెం గ్రామం వద్ద నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వీరిని కోర్టుకు తరలించారు. నిందితులు సంచార జాతికి చెందిన వారు, వీరు గ్రామాల శివారులో గుడారాలు వేసుకొని ఊర్లలో పగటి వేళ తిరిగి ప్లాస్టిక్ కుర్చీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై నిద్రించే డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ వచ్చారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఇటువంటి దొంగతనాలతో వీరికి సంబంధాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. దొంగల పట్ల జాతీయ రహదారిపై వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై సత్వరమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్ఐలు లక్ష్మణరావు, మనోజ్కుమార్, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. -
డిఫెన్స్ మద్యం స్వాధీనం
డిఫెన్స్ మద్యం బాటిళ్లతో నిందితుడు, పక్కన ఎకై ్సజ్ సిబ్బంది నర్సీపట్నం: మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెం బస్టాప్ వద్ద డిఫెన్స్ మద్యం తరలిస్తున్న నిందితుడిని శనివారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. అదే మండలం వజ్రగడకు చెందిన గాజుల సత్తిబాబు(32) 14 మద్యం సీసాలను వేరే చోట అమ్మేందుకు తీసుకువెళ్తూ పట్టుబట్టాడు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు నర్సీపట్నం ఎకై ్సజ్ సీఐ కె.సునీల్ కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ వై.నాగశంకర్, గోవర్ధన్, నారాయణరావు, లావణ్య పాల్గొన్నారు. -
విశాఖలో విద్యుదాఘాతంతో కొత్తకోట వాసి మృతి
రావికమతం: విశాఖ నగరం కంచరపాలెంలో కరెంటు షాక్తో శుక్రవారం ఉదయం 8 గంటలకు రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలివి. రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన భీమరాతి రాజుబాబు(లేటు), చంద్రమ్మ రెండో కుమారుడు రమణ(41) పది సంవత్సరాల క్రితం కంచరపాలెంలో భార్య సత్యవతితో కలిసి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం నుంచి కంచరపాలెంలో ఐటీఐ జంక్షన్లోని శ్రీకుంచమాంబ వాటర్ వాస్ సర్వీసింగ్ పాయింట్లో పని చేస్తున్నారు. ఎప్పటిలాగే ఉదయం సర్వీసింగ్ సెంటర్కు వెళ్లిన రమణ వాటర్ మోటార్ స్వీచ్ ఆన్ చేస్తుండగా కరెంటు షాక్కు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీనిపై కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య సత్యవతి, కుమారులు జశ్వంత్, సుశ్చిత్ ఉన్నారు. జశ్వంత్ ఐటీఐ, సుశ్చిత్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కొత్తకోటకు తరిలించామని పోలీసులు తెలిపారు. రమణ ఆకాల మరణంతో కొత్తకోటలో విషాదఛాయలు అలముకున్నాయి. -
సింహగిరిపై లక్ష కుంకుమార్చన
సింహాచలం: శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సింహవల్లీ తాయారు అమ్మవారికి లక్ష కుంకుమార్చనను వైభవంగా నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహవల్లీ తాయారు, చతుర్బుజ తాయారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని వేదికపై ఉంచి శాస్త్రోక్తంగా ఈ పూజను చేపట్టారు. లక్ష నామాలతో అమ్మవార్లకు కుంకుమ పూజ నిర్వహించి.. విశేష హారతి ఇచ్చారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, కుంకుమ ప్రసాదం అందజేశారు. అలాగే.. సాయంత్రం అమ్మవారికి ఆలయ బేడామండపంలో తిరువీధిని ఘనంగా నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన పూజ కూడా వైభవంగా జరిగింది. శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారి సన్నిధిని అందంగా అలంకరించారు.ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధాన అర్చకుడు గొవర్తి శ్రీనివాసాచార్యులు ఈ పూజలు నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కానిస్టేబుల్ పరీక్షలో మెరిశారు
దేవరాపల్లి/చోడవరం: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో పలువురు అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించారు. దేవరాపల్లి మండలంలోని తారువకు చెందిన రాయపురెడ్డి అన్వేష్ 147 మార్కులు సాధించాడు. విశాఖ గ్రామీణ విభాగంలో బీసీ–డి కేటగిరిలో అన్వేష్కు 12వ ర్యాంక్ లభించింది. సామాన్య రైతు కుటుంబానికి చెందిన అప్పలనాయుడు, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు అన్వేష్ ఏయూలో ఎంఎస్సీ పూర్తి చేశాడు. చోడవరం యువకుడు నేమాల చంద్రశేఖర్ ఉమ్మడి విశాఖజిల్లాలో 19వ ర్యాంక్ సాధించాడు. పేద కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ తండ్రి పెయింటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మొదట్నుంచీ పోలీసు కావాల న్న ఆశయంలో ఎంబీఏ వరకూ చదివిన చంద్రశేఖర్ ప్రత్యేక కోచింగ్ తీసుకొని ఏపీ కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రతిభ చూపారు. 200మార్కులకు గాను 143మార్కు లు సాధించి జిల్లాలో 19వ ర్యాంకర్గా నిలిచారు. -
బుచ్చెయ్యపేట మండల టీడీపీలో వర్గభేదాలు
బుచ్చెయ్యపేట: వృద్ధుల పింఛన్ల పంపిణీలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. బుచ్చెయ్యపేట మండలంలో ఉన్న మేజర్ పంచాయతీ వడ్డాదికి చెందిన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుల మధ్య కొద్ది కాలంగా వర్గ విభేదాలు నడుస్తున్నాయి. శుక్రవారం స్పౌజ్ పింఛన్ల పంపిణీలో మరోసారి రెండు వర్గాల విభేదాలు బయటపడ్డాయి. మండలంలో ఉన్న 35 పంచాయతీలకు 196 స్పౌజ్ పింఛన్లు మంజూరు కాగా.. వడ్డాదికి 27 పింఛన్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు మండల కేంద్రం బుచ్చెయ్యపేటలో ఎమ్మెల్యే రాజు చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేయడానికి ఎంపీడీవో కార్యాలయం వద్ద వేదిక ఏర్పాటు చేశారు. ఒకటో తేదీ ఉదయం 9 గంటలకే పింఛన్లు పంపిణీ చేస్తారనడంతో ఉదయం 8 గంటలకే వడ్డాది పింఛన్దార్లు చేరుకున్నారు. వడ్డాది టౌన్ టీడీపీ అధ్యక్షుడు దొండా నరేష్ తన సొంత నిధులతో 22 మంది వృద్ధులను బుచ్చెయ్యపేటలో ఎమ్మెల్యే రాజు పింఛన్ల పంపిణీ చేసే వేదిక వద్దకు ఆటోలపై తీసుకొచ్చారు. ఎమ్మెల్యే రాజు వచ్చి వేదికపై ముగ్గురికి పింఛన్లు ఇచ్చి వెళ్లిపోయారు. మిగతా గ్రామాల నాయకులు, అధికారులు కలిసి లబ్ధిదారులకు పింఛన్ నగదు బట్వాడా అక్కడే చేశారు. వడ్డాదికి చెందిన వృద్ధులకు మాత్రం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయలేదు. వారికి వడ్డాది పంచాయతీ వద్ద పింఛన్ నగదు ఇస్తామని తెలిపారు. అక్కడే ఉన్న తాతయ్య వర్గానికి చెందిన నాయకులు దొండా నరేష్, తలారి శంకర్, అక్కిరెడ్డి కనక, గురుమూర్తి, వెలుగుల నాగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం బుచ్చెయ్యపేటలో కొత్తవారికి పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పి, ఇప్పుడు వడ్డాదిలో ఇస్తామనడంలో కారణమేమిటని ఎంపీడీవో భానోజీరావు, పంచాయతీ సెక్రటరీ ఈశ్వరరావుపై మండిపడ్డారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గ్రూపు రాజకీయాలకు తాము బలైపోతామని గ్రహించిన అధికారులు చేసేది లేక అక్కడే వడ్డాది లబ్ధిదారులకు కూడా పింఛన్ నగదు బట్వాడా చేశారు. కొత్త పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యే రాజు నుంచి తాతయ్యబాబుకు కబురు రాకపోవడంపై పలువురు టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. కొత్త పింఛన్ పంపిణీలో మరోసారి బహిర్గతం ఎమ్మెల్యే రాజు V/S టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు -
యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
● హెచ్పీసీఎల్–ఎస్డీఐతో ఎల్జీ ఇండియా ఒప్పందం మహారాణిపేట: యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఎల్జీ ఇండియా సీఎస్సార్ ఫౌండేషన్, హెచ్పీసీఎల్–ఎస్డీఐ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్లోని హెచ్పీసీఎల్ కార్యాలయంలో శుక్రవారం ఇరు సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా యువతకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా స్వల్ప, మధ్యకాలిక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అందిస్తారు. ఈ శిక్షణ ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, ఆవిష్కరణ సామర్థ్యం పెరుగుతాయని ఎల్జీ ఇండియా సీఎస్సార్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ గిరిజా శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి, సురక్షిత భవిష్యత్తు అందించడమే లక్ష్యమని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు, స్వయం ఉపాధి శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు ఇది తోడ్పడుతుందని వివరించారు. కార్యక్రమంలో ఎల్జీ ఇండియా గ్లోబల్ హెడ్ పాల్ క్వాన్, ఎల్జీ గ్రూప్ డైరెక్టర్ సి.కె.జియాంగ్, హెచ్పీసీఎల్–ఎస్డీఐ సీఈవో ఇంతియాజ్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు సేవల్లో ఒకే కుటుంబం -
ఎ.కొత్తపల్లిలో ప్రొటోకాల్కు తూట్లు
● కొత్త పింఛన్లపై సర్పంచ్, ఎంపీపీకి అందని సమాచారం ● టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ● వివాదాస్పదంగా మారిన సచివాలయ ఉద్యోగుల తీరుదేవరాపల్లి: మండలంలోని ఎ.కొత్తపల్లి సచివాలయం పరిధిలోని ఉద్యోగులు ప్రొటోకాల్కు తూట్లు పొడిచారు. స్థానిక సచివాలయం పరిధిలో నూతనంగా మంజూరైన వితంతు పింఛన్లపై స్థానిక సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ, స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మీకి సైతం కనీస సమాచారం ఇవ్వకుండా టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం పింఛన్ల పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్, మండల ప్రథమ పౌరురాలు ఎంపీపీకి సమాచార ఇవ్వకుండా తమ గ్రామంలో ఎలా పింఛన్లు పంపిణీ చేపడుతున్నారని ఎంపీడీవో ఎం.వి.సువర్ణరాజు దృష్టికి సర్పంచ్, ఎంపీపీ తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీడీవో, పరిపాలన అధికారి డి.వి.లక్ష్మీనారాయణ ఏ.కొత్తపల్లి సచివాలయానికి చేరుకొని స్థానిక ఉద్యోగులతో సమావేశమయ్యారు. సిబ్బందిని మందలించారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టానుషారం వ్యవహరిస్తే తదుపరి చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. మళ్లీ ప్రొటోకాల్ సమస్యలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఎంపీడీవో సర్ది చెప్పడంతో సర్పంచ్, ఎంపీపీ శాంతించారు. -
●భవభయ హారిణి.. పాప విమోచని..
శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారి దేవాలయాలు కళకళలాడాయి. ఎంతటి కష్టంలో ఉన్నా తల్లి మోము చూస్తే ప్రశాంతత కలుగుతుంది. ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అందుకే జిల్లాలోని అమ్మవారి గుడులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కె.కోటపాడులోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 10 వేల గులాబీ పువ్వులతో పుష్పార్చన జరిపారు. అనకాపల్లి గవరపాలెంలో ఉత్తరాంధ్రుల ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి బాలాలయంలో మహిళా భక్తులతో ఉచితంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గవరపాలెం సంతోషిమాత దేవాలయంలో అమ్మవారిని శాకంబరి దేవిగా ఆలయ అర్చకులు అలంకరించారు. కె.కోటపాడు/అనకాపల్లి -
బ్రిటిషర్ల సమాధుల స్థలాన్ని కాపాడండి
నర్సీపట్నం: ఆక్రమణదారుల నుంచి బ్రిటిషర్ల సమాధుల స్థలాన్ని కాపాడాలంటూ మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, తహసీల్దార్ రామారావుకు టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.త్రిమూర్తులరెడ్డి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటానికి స్ఫూర్తికి చిహ్నంగా నిలిచిన సర్వే నంబరు 9లోని 46 సెంట్ల స్థలంలో బ్రిటిష్ సైనికుల సమాధుల స్థలాన్ని కొంతమంది కబ్జా చేసి శాశ్వత భవన నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. 46 సెంట్లలో ఇప్పటికే 27 సెంట్లు ఆక్రమణకు గురైందన్నారు. మిగిలిన 19 సెంట్లలో ప్రస్తుతం నిర్మాణ పనులు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నిర్మాణాలకు ఏవిధమైన అనుమతులు లేవన్నారు. ఇటీవలో లీగల్ సెల్ చైర్మన్, పురావస్తు శాఖ సిబ్బంది స్థలాన్ని సందర్శించి, మున్సిపల్ అధికారుల సహకారంతో తుప్పులు డొంతకలతో ఉన్న స్థలాన్ని శుభ్రం చేయించారు. సమాధుల స్థలాన్ని కాపాడాల్సిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా చారిత్రక నేపథ్యం ఉన్న స్థలాలను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకుడు అడిగర్ల రాజు, తదితరులు పాల్గొన్నారు. -
గళమెత్తిన గంగపుత్రులు
నక్కపల్లి: ప్రమాదకర రసాయన పరిశ్రమల ఏర్పాటుపై గంగపుత్రులు గళమెత్తారు. రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ ఆందోళన బాట పట్టారు. శుక్రవారం రాజయ్యపేటకు చెందిన వందలాది మంది మత్స్యకారులు సారిపల్లిపాలెం జంక్షన్ నుంచి నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజుల, వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు ఎరిపల్లి నాగేష్ ఆధ్వర్యంలో కార్యాలయం వరకు వచ్చి అక్కడ ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనకు రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, సీపీఎం కేంద్రం కమిటీ సభ్యుడు కె.లోకనాథం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు, మత్స్యకారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో మూడు ప్రాంతాల్లో ఈ బల్క్ డ్రగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోందని, వాటిలో నక్కపల్లి ఒకటన్నారు. ప్రాజెక్టు రిపోర్ట్లో 1270 ఎకరాల్లో బల్క్డ్రగ్పార్క్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారని, ఇప్పటికే 2వేల ఎకరాలు కేటాయించారన్నారు. ఇది చాలదన్నట్లు జానకయ్యపేట, సీహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, గుర్రాజుపేట గ్రామాల్లో మరో 800 ఎకరాలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇన్ని వేల ఎకరాలు ఎవరి కోసం సేకరిస్తున్నారని నిలదీశారు. ఒక పక్క బల్క్ డ్రగ్ పార్క్ను రాజయ్యపేట, పరిసర గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తుంటే ఈ నెల 6న ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే కంపెనీలు ఏర్పాటు చేయబోమని గతంలో హోంమంత్రి అనిత పలు సందర్భాల్లో ప్రకటించారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఒక పక్క భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తిగా అందలేదని పోరాటాలు చేస్తుంటే మరో పక్క ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై మత్స్యకారులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలంటూ డీటీ నారాయణరావుకు వినతిపత్రం అందించారు. ఈ ఆందోళనలో ఎంపీటీసీలు లొడగల చంద్రరావు, కొల్నాటి బుజ్జి, గొర్ల గోవిందు, గంటా తిరుపతిరావు, సర్పంచ్ ముసలయ్య, రైతు నాయకులు తళ్ల భార్గవ్, గొర్లె బాబూరావు, యలమంచిలి తాతబాబు, బొంది గోవిందు, దేవర నూకరాజు, కాశీరావు, మనబాల రాజేష్, పిక్కి నూకరాజు, యజ్జల అప్పలరాజు పాల్గొన్నారు. పేనాలు తీసే కంపెనీలన్నీ మావద్దే.. పేనాలు తీసే కంపెనీలన్ని మా దగ్గరే పెడుతున్నారు. మేం బతకొద్దా. ఎం పాపం చేసామని, ఇప్పటికే కంపెనీల వల్ల సానా ఇబ్బంది పడుతున్నాం. మళ్లీ భూములు తీసుకుని ఏదో పార్క్ పెడతామంటున్నారు. మా వోళ్లంతా భయపడిపోతున్నారు, పెబుత్వం దీన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అందుకే ఆఫీస్కు వచ్చి ధర్నా సేత్తన్నం. ఆరో తేదీన జరిగే మీటింగ్ అడ్డుకుంటాం. – ఎరిపిల్లి నాగేష్, మత్స్యకారుడు మమ్మల్ని బతకనివ్వరా? మందుల కంపెనీల వల్ల సానా నట్టపోయాం. మళ్లీ కొత్త కంపెనీలు పెట్టి మమ్మల్ని బతకనివ్వరా. ఏటకు ఎల్తే సేపలు దొరకడం నేదు. కొన్ని సేపలను తింటే జబ్బులొస్తున్నాయి. కొత్తగా ఏదో కంపెనీ పెడతారంట. ఇక్కడ సానా కంపెనీలు వత్తాయి అంటన్నారు. భూములు, ఇళ్లు తీసేసుకుంటన్నారు. పెబుత్వం మమ్మల్ని ఏంసేద్దామని ఇవ్వన్ని పెడతన్నారు. అందరూ బాగానే ఉంటా, పక్కన కాపురాలు సేసే మాకే నట్టం. – పిక్కి తాతీలు, మాజీ ఎంపీటీసీ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారులు, అఖిల పక్ష నాయకులుప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలే ప్రధానం బల్క్ డ్రగ్ పార్క్ అనేది అణుబాంబు లాంటిది. ఇక్కడ వందలాది యూనిట్లు స్థాపిస్తారు. భవిష్యత్లో పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఆరోగ్యంగా జీవించే పరిస్థితి ఉండదు. ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకించిన పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నిపుణుల నివేదిక ప్రకారం బల్క్ డ్రగ్ పార్క్ చాలా ప్రమాదకరమని తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా రెడ్జోన్లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల కంటే పారిశ్రామిక వేత్తలే ముఖ్యంగా కనిపిస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకుని తీరుతాం. – కె.లోకనాథం, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు రైతులను రోడ్డున పడేస్తారా? ప్రమాదకర పరిశ్రమలను ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదనంగా భూములు తీసుకుని రైతులను రోడ్డును పడేయాలని చూస్తున్నారు. భూములు ఇవ్వమని రైతులు కరాఖండిగా చెబుతున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రైతులు, బాధితుల పక్షాన పోరాటం చేస్తాం. 6న ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాల్సిందే. – శీరం నర్సింహమూర్తి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు వేట లేక మత్స్యకారులు వలస బాట మందుల కంపెనీల వల్ల ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాం. మళ్లీ కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల మత్స్యకార గ్రామాల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి. వేట లేక ఉపాధి కోల్పొతున్నారు. ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. – గోసల కాసులమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ ధర్నా జాతీయ రహదారిపై భారీ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన 6న జరిగే ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలంటూ నినాదాలు -
పశు పోషకుల ఆర్థిక స్థితిగతులపై బ్లాంకెట్ సర్వే
కె.కోటపాడు: కె.కోటపాడు సబ్ డివిజన్ పరిధిలోని కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో పశుపోషకుల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సమాచారం సేకరించే ఉద్దేశంతో బ్లాంకెట్ సర్వే చేపట్టినట్లు పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఇ.దినేష్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన వారాడ, వి.సంతపాలెం గ్రామాల్లో పర్యటించి, బ్లాంకెట్ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామీణ, పట్టణ ప్రాంతాలల్లో పశుపోష కులు అవసరాలు, ఆదాయ వనరులు, తదితర అంశాలపై 35 ప్రశ్నలు ఆధారంగా ఈ సర్వే గత నెల 26 నుంచి ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నా రు. ఈ సర్వేలో వారాడ, వి.సంతపాలెం, పశువైద్య సహాయకురాలు సుధారాణి, మంగ పాల్గొన్నారు. -
నల్లబ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
నిరసన తెలుపుతున్న పీఆర్టీయూ నాయకులు నర్సీపట్నం: సీనియార్టీ ప్రాతిపదికన ఎంఈవో–1 పోస్టులు భర్తీ చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లా పరిషత్ హైస్కూల్(మెయిన్) వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయకుండా తక్షణమే ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలన్నారు. పీఆర్టీయూ నాయకులు అల్లు అప్పారావు, ఊరమణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వరహాలనాయుడు, రమేష్, హెచ్ఎం రత్నం పాల్గొన్నారు. వాల్తేర్ డివిజన్ రన్నింగ్ స్టాఫ్ నిరాహార దీక్ష -
పింఛన్ల పంపిణీ ప్రారంభం
నాతవరం/తుమ్మపాల: జిల్లాలో శుక్రవారం సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నాతవరం మండలం గునుపూడి గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. అనంతరం గునుపూడి హైస్కూల్ను సందర్శించి విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు, ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో కె,ఉషాశ్రీ పాల్గొన్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో పలువురు లబ్ధిదారులకు పింఛన్ నగదు అందజేశారు. డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, తహసీల్దార్ ఎం.బి.అప్పారావు, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, పాల్గొన్నారు. -
అందివస్తారనుకున్న యువకులు అనంతలోకాలకు..
● కొత్తూరు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం ● ఇద్దరు నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగుల మృతిఅనకాపల్లి టౌన్: అనకాపల్లి జాతీయ రహదారి ఏఎంఏఎల్ కాలేజ్ కొత్తూరు జంక్షన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి. మునగపాక మండలం చిన యాదగిరి పాలెం గ్రామానికి చెందిన మేడిశెట్టి వెంకట సూరి అప్పారావు (28), గొలుగొండ గ్రామానికి చెందిన బిడిజన నాగ సాయి బాలాజీ (24), గాజువాకకు సైనా రవి (28) కశింకోట మండలం తాళ్లపాలెం నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. వీరు ముగ్గురూ కొత్తూరు గ్రామంలో ఒక ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. వీరందరూ కలిసి తాళ్లపాలెంలో జరిగే శుభకార్యానికి హాజరై తిరిగి వస్తూ కొత్తూరు జంక్షన్ దాటుతుండగా వెనక నుంచి వస్తున్న వ్యాన్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట సూరి అప్పారావు అక్కడికక్కడే మృతి చెందగా, బాలాజీ హాస్పటల్కు తీసుకువెళుతుండగా మృతి చెందాడు. గాయాల పాలైన సైనా రవి ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మెలిపాకలో విషాదం మునగపాక: అందివస్తాడుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. ఒక్కగానొక్క కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగిలింది. మెలిపాకకు చెందిన మేడిశెట్టి లోవరాజు, లక్ష్మి దంపతులు వ్యవసాయం సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిగింది. కుమారుడు వెంకట సూరప్పారావు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూ వచ్చాడు. గురువారం రాత్రి తాళ్లపాలెంలో స్నేహితుని వివాహానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. -
నరకకూపాలు.. బీసీ సంక్షేమ హాస్టళ్లు
● ప్రభుత్వం కేటాయించిన రూ.145 కోట్లు తక్షణమే ఖర్చు చేయాలి ● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్తుమ్మపాల: రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రూ.145 కోట్లతో రానున్న నెల రోజుల్లో బీిసీ సంక్షేమ వసతి గృహాల్లో వసతులు కల్పించకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నాతోపాటు అవసరమైతే నిరాహారదీక్ష కూడా చేస్తామని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సౌకర్యాలపై మూడు రోజుల పరిశీలన అనంతరం పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్సీపీ స్టూడెంట్స్ విభాగం నాయకులు శుక్రవారం కలెక్టరేట్కు ర్యాలీగా వచ్చి వసతి గృహాల దీన స్ధితిగతులపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా హేమంత్ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో హాస్టళ్ల సందర్శనలో అనేక లోపాలు గుర్తించామన్నారు. బాత్రూమ్స్ లేక పిల్లలు ఆరు బయట స్నానాలు చేస్తున్నారని, రెండు నెలల క్రితం ఇచ్చిన స్కూల్ బ్యాగులు నాణ్యత లేక చిరిగిపోతున్నాయని, ఇరుకిరుకు గదుల్లో 20 నుంచి 30 మంది పిల్లలను కుక్కడంతో పడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యోగాంధ్ర పేరుతో హాస్టల్ పిల్లల్ని రోడ్లపై పడుకోబెట్టారని, రూ.300 కోట్లు అనవసర ఖర్చు చూపించారని, ఆ నిధులను వసతీ గృహాల అభివృద్ధికి ఖర్చు చేస్తే ఏసీ గదుల్లో పిల్లలకు వసతులు కల్పించవచ్చన్నారు. విద్యావ్యవస్ధను, వసతి గృహాలను నాశనం చేస్తే నారాయణ, శ్రీచైతన్య పాఠశాలలే దిక్కని ప్రజలు భావిస్తారన్న ధోరణిలో ప్రభుత్వం వ్యహరిస్తోందన్నారు. డీఆర్వో వై.సత్యనారాయణరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. పార్టీ విద్యార్థి విభాగం నియోజకవర్గాల అధ్యక్షులు రాయ్ రాజా, అప్పలనాయుడు, కిలాడ శ్రీనివాస్, పెందుర్తి నియోజకవర్గ వలంటీర్ల విభాగం అధ్యక్షుడు అవగడ్డ శ్రీనివాస్, సోషల్ మీడియా అధ్యక్షుడు శ్రీకాంత్, వివిధ విభాగాల నాయకులు నవీన్, జనపరెడ్డి శ్రీను, మురళి, మణికంఠ, వెలుగుల కిట్లు, శ్యామ్, మడక కార్తీక్, దొడ్డి సాయి పాల్గొన్నారు. -
తొలి విడత రాష్టం అందించేది రూ.5 వేలు
‘అన్నదాత సుఖీభవ’ కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అనకాపల్లి జిల్లాలో 2,31,688 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. వీరి ఖాతాల్లో మొత్తం రూ.162.17 కోట్లు జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.115.84 కోట్లు, పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం నుంచి రూ.46.33 కోట్లు విడుదల చేస్తారు. పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రూ.6 వేలు అందిస్తారు. అన్నదాత సుఖీభవ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలను మూడు విడతలుగా చెల్లిస్తుంది. మొదటి విడతలో రూ.5,000, రెండో విడతలో రూ.5,000, మూడో విడతలో రూ.4,000 చొప్పున విడుదల చేయనుంది. జిల్లాలో పెట్టుబడి సాయానికి అర్హత పొందిన రైతుల్లో ఈకేవైసీ పూర్తయిన వారు 2,37,057 మంది ఉన్నారు. మిగతా రైతులకు ఈకేవైసీ పూర్తి కావాల్సి ఉంది. అర్హత ఉన్న ప్రతి రైతుకు ‘సుఖీభవ’ అందాల్సిందే.. గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతుల కన్నా ఎక్కువగా ఈ ఏడాది లబ్ధి పొందాల్సి ఉంటుంది. కానీ 34 వేల మందికి పైగా రైతులకు కోత విధించారు. ఏ ప్రాతిపదికన కోత విధించారో వ్యవసాయ అధికారులు చెప్పాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నామమాత్రంగా అమలు చేస్తే సరిపోదు. గతేడాది పెట్టుబడి సాయం ఇస్తారనే ఆశతో అప్పులు చేసి వ్యవసాయం చేసి రైతు నష్టపోయాడు. రెండో ఏడాది కూడా అప్పు చేసిన 34 వేల మంది రైతులను ఆదుకునేది ఎవరు? అర్హత ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ ఇవ్వాల్సిందే. – వెంకన్న, రైతు సంఘం నాయకుడు● -
స్వాతంత్య్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ విజయ కృష్ణన్తుమ్మపాల: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాట్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. గత ఏడాది నిర్వహించిన మాదిరిగా పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను వేడుకలకు ఆహ్వానించి సత్కరించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్టాల్సు ఏర్పాటు చేసి శకటాల ప్రదర్శన చేయాలని పేర్కొన్నారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్) ఎల్.మోహన్రావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్ ఆయిషా, వివి రమణ, డీఈవో అప్పారావు నాయుడు, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వినోద్బాబు, ఫైర్ ఆఫీసర్లు వెంకటరమణ, మనోహర్, డీపీవో సందీప్, డీఎంహెచ్వో హైమావతి సమావేశంలో పాల్గొన్నారు. -
కేంద్రం ఉక్కు పంజా
● స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యం ● తేల్చి చెప్పేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ● కూటమి ప్రభుత్వం బండారం బట్టబయలు ● స్టీల్ప్లాంట్పై రాజ్యసభలో ఆరు ప్రశ్నలు వేసిన ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ● వాటికి ఇచ్చిన వివరణలో కేంద్రం వైఖరి వెల్లడి ● సెయిన్లో విలీనం చేసే ప్రతిపాదనే లేదని స్పష్టీకరణ ● 1,017 మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం ● మండిపడుతున్న కార్మిక వర్గాలువిశాఖ సిటీ : స్టీల్ప్లాంట్పై కూటమి ప్రభుత్వ గూడు పుఠాణి బట్టబయలైంది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం కుండబద్దలు కొట్టింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) నుంచి వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ తథ్యం అని తేల్చేసింది. పెద్దల సభలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేసిన ఆరు ప్రశ్నలకు కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. స్టీల్ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన బూటకపు మాటల బండారం బయటపడింది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించారన్న చందంగా కూటమి ప్రభుత్వం తీరు ఉంది. ఒకవైపు ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా చేసే బాధ్యత తమదని చెబుతూనే.. మరోవైపు ప్లాంట్లో వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నా చోద్యం చూస్తుండడమే దీనికి నిదర్శనం. రాజ్యసభలో సుబ్బారెడ్డి ఆరు ప్రశ్నలు స్టీల్ప్లాంట్పై రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరు ప్రశ్నలు వేశారు. ఆర్ఐఎన్ఎల్కు మూలధన పెట్టుబడి లేదా ఇతరత్రా అవసరాలకు నిధులు విడుదల చేశారా? చేస్తే ఇప్పటి వరకు ఎంత చేశారు? ఆలస్యానికి గల కారణం? పరిశ్రమలో వీఆర్ఎస్ స్కీమ్ అమలు చేయడం నిజమేనా? ఎంత మంది దానికి దరఖాస్తు చేసుకున్నారు? పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఉందా? ఉంటే ఎందుకు? సెయిల్లో విలీనం చేసే అంశం మాటేమిటి? అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విస్తుపోయే సమాధానాలు ఇచ్చారు. వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు మరోసారి ఉద్వాసన పలికేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. వీఆర్ఎస్ పేరుతో వేల మంది ఉద్యోగులను బయటకు పంపించాలని నిర్ణయించారు. ఇందుకోసం స్కీమ్ను ఇప్పటికే ప్రవేశపెట్టారు. జూన్ 15వ తేదీ వరకు వీఆర్ఎస్కు దరఖాస్తులను స్వీకరించారు. 1,017మంది ఉద్యోగులు దరఖా స్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రి తన వివరణలో పేర్కొన్నారు. ప్రైవేటీకరణపై స్పష్టీకరణ స్టీల్ప్లాంట్పై కూటమి ప్రభుత్వం ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా కేంద్రం వైఖరి మరోసారి స్పష్టమైంది. ఆర్ఐఎన్ఎల్లో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని 2021, జనవరి 27నే కేబినెట్ కమిటీ తీర్మానం చేసినట్లు కేంద్ర మంత్రి తేల్చిచెప్పారు. దీంతో ఇన్నాళ్లు కూటమి ప్రభుత్వం ప్రజలను మాయలో ఉంచి నాటకాలు ఆడినట్లు ఈ వివరణతో అర్థమవుతోంది. స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ఏళ్లుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అనేకసార్లు వేడుకున్నారు. పవన్ స్వయంగా స్టీల్ప్లాంట్ వద్ద సభలోనే పరిశ్రమ ప్రైవేటుపరం కాదంటూ ప్రగల్భాలు పలికారు. కానీ తాజాగా కేంద్రం తన వైఖరిని మరోసారి తేల్చి చెప్పడంతో సీఎం, డిప్యూటీ సీఎం ఇన్నాళ్లు చేసినవి డ్రామాలుగా తేలిపోయింది. సెయిల్లో విలీన ప్రతిపాదనే లేదు స్టీల్ప్లాంట్ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయాలని కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. దీని కోసం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపట్టాయి. కానీ అసలు ఆ ప్రతిపాదనే లేనట్లు కేంద్ర మంత్రి తేల్చేశారు. అలాగే మూలధన వ్యయం కింద కేంద్రం రూ.11,440 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు రూ.9,824 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని ఎప్పుడు విడుదల చేస్తుందో? ఆలస్యానికి గల కారణాలను మాత్రం తెలపకపోవడం గమనార్హం. -
స్పీకర్ స్పందించకపోతే నిరసన అమరావతికి..
నర్సీపట్నం: జి.కోడూరు క్వారీపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించకపోతే నిరసన అమరావతికి మారుతుందని విదసం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు పేర్కొన్నారు. మాకవరపాలెం మండలం జి.కోడూరు క్వారీని ఆయన సందర్శించి, ఆర్డీవో కార్యాలయం వద్ద బాధిత దళిత రైతులు చేస్తున్న నిరాహారదీక్ష శిబిరానికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే నెంబరు 332లో మైనింగ్ కార్యకలాపాలు దళిత రైతుల జీవనాధారాన్ని దెబ్బతిస్తున్నాయన్నారు. స్పీకర్ వెంటనే స్పందించి క్వారీ లీజు రద్దు చేయించాలన్నారు. గతంలో మైనింగ్కు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ నాయకులు క్వారీని నిర్వహించటం దారుణమన్నారు. మైనింగ్ కార్యక లాపాలకు అనుమతులు ఇచ్చే ముందు ఎన్హెచ్ఆర్సీ నిబంధనల ప్రకారం క్వారీలు వ్యవసాయ భూముల నుంచి కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలన్నారు. కానీ ఇక్కడ 5 మీట ర్ల దూరం కూడా లేదన్నారు. ఈ క్వారీ బ్లాస్టింగ్ వల్ల బూడిద జీడి, మామిడి తోటలపై పడి పంటలకు నష్టం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బొ ట్టా చిన్ని యాదవ్ నాగరాజు పాల్గొన్నారు. -
‘స్పీకర్ కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు’
నర్సీపట్నం: నర్సీపట్నం బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల స్థలంలో అక్రమ నిర్మాణాలు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కనుసన్నల్లోనే జరుగుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోన గురవయ్య యాదవ్ ఆరోపించారు. బీఎస్పీ రాష్ట్ర నాయకుడు బొట్టా నాగరాజు, కాంగ్రెస్ నాయకుడు బొంతు రమణతో కలిసి ఆయన గురువారం అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చేతిలో మరణించిన బ్రిటిష్ అధికారుల మృతదేహాలను ఖననం చేసి సమాధులు నిర్మించారన్నారు. అల్లూరి పోరాట పటిమకు స్ఫూర్తిగా ఉన్న సమాధులను పరిరక్షించకుండా నాయకులు, అధికారులు ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో భూదందా, ఇసుక, మైనింగ్ మాఫీయ దందాలు పెచ్చుమీరాయన్నారు. కోర్టు ఆర్డర్ ఉందని మున్సిపల్ కమిషనర్ నోటితో చెప్పడం కాదని, చూపించాలని డిమాండ్ చేశారు. నాయకుల అండదండలతో నిర్మాణాలను ఆగమేఘాలపై నిర్మిస్తున్నారన్నారు. నిర్మాణాలను నిలువరించాల్సిన కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. -
కూటమి పొత్తులో మొదట రాజీ పడింది నేనే
● అనకాపల్లి ఎంపీ సీటు వదులుకున్నాను ● జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అనకాపల్లి: జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి పొత్తులో రాజీపడిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశించిన మరుక్షణమే అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ నుంచి తప్పుకున్నట్లు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు అన్నారు. గురువారం స్థానిక గవరపాలెంలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి పొత్తు ధర్మమే ప్రథమ ప్రాధాన్యతగా నడుచుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి జనసేన పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, పంచకర్ల రమేష్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
● రీసర్వే పనులు సమర్థవంతంగా పూర్తి చేయాలి ● సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్ గోవిందరావు తుమ్మపాల: రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టాలని సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అడిషనల్ డైరెక్టర్ ఆర్.గోవిందరావు సూచించారు. కలెక్టరేట్లో జేసీ ఎం.జాహ్నవితో కలిసి అందరికీ ఇళ్లు, రీసర్వే, ఆక్రమిత భూ ముల క్రమబద్ధీకరణ, పీజీఆర్ఎస్, ఎస్సీ బరియల్ గ్రౌండ్స్, కుల ధ్రువీకరణ పత్రాల జారీ వంటి అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వేను వేగవంతం చేసేందుకు గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలు, మండల సర్వేయర్లు, డిప్యూ టీ తహసీల్దార్లు మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నారు. రీసర్వే ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేటు భూము ల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 2027 డిసెంబరు నాటికి భూముల రీసర్వే ప్రక్రియ పూర్తి కావాలన్న లక్ష్యంతో అందరూ పనిచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ● జిల్లాలో ప్రతి పేదవానికి సొంతిల్లు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని గోవిందరావు సూచించారు. తహసీల్దార్లు తప్పకుండా లేఅవుట్లను పరిశీలించాలన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఇంటి నిర్మాణం చేపట్టకపోతే వారికి 3 సెంట్లు మంజూరు చేయాలని కోరారు. వివాదాలు లేని ఆక్రమిత ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై ప్రజల్లో అవగాహన కల్పించి లబ్ధి చేకూర్చాలన్నారు. ఆక్రమిత ప్రభుత్వ భూమిలో ఇల్లు తప్పక నిర్మించి ఉండాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం అందరికీ మంజూరు చేయాలని చెప్పారు. భూహక్కు పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పాతది తీసుకొని కొత్తది అందించాలని సూచించారు. ఎస్సీ బరియల్ గ్రౌండ్స్ కోసం స్థలాలు పరిశీలించి మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని రెవెన్యూ వ్యవస్థ, ప్రజలకు అందిస్తున్న సేవలు, పలు అంశాలపై జేసీ పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై.సత్యనారాయణ, కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఆర్డీవో ఆయిషా, సర్వే విభాగం ఏడీ గోపాలరాజా, ల్యాండ్స్ సెక్షన్ సూపరింటెండెంట్ రత్నం, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ వాసునాయుడు, కలెక్టరేట్ ఏవో విజయకుమార్, మండల తహసీల్దార్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
అధిక ఫీజుల వసూళ్లపై డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆందోళన
యలమంచిలి రూరల్: అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వ, డిగ్రీ కళాశాల, స్థానిక తహసీల్దార్ కళాశాల ఎదుట బైటాయించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించాలని కోరారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతుగా నిలిచారు. యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం బీఎస్సీ విద్యార్థుల నుంచి ఏడాదికి రూ.14,040, బీఏ, బీకాం విద్యార్థుల నుంచి రూ.13,840 వసూలు చేస్తున్నారని, గతేడాది కంటే ఫీజులు పెంచారని, అదనంగా ట్యూషన్, యూనివర్సిటీ ఫీజులు వంటివి తమ వద్ద నుంచి వసూలు చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజుల గురించి తాము గానీ, తమ తల్లిదండ్రులు గానీ అడిగితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారని, కొన్నిసార్లు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విద్యార్థులు విలేకరుల ఎదుట ఆరోపణలు చేశారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇచ్చారన్నారు. పెంచిన ఫీజుల భారం మోయలేకపోతున్నామన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మైలపల్లి బాలాజీ మాట్లాడుతూ ఇప్పటి వరకు విద్యార్థుల వద్ద వసూలు చేస్తున్న అన్ని రకాల ఫీజులు, ఖర్చులపై ఉన్నతాధికారులు విచారణ చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. ప్రభుత్వం ఫీజులు పెంచడం, రీయింబర్స్ చేయకపోవడంతో పేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం తహసీల్దార్ వరహాలుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కృపానంద, లక్ష్మణ, కవిత, రమ్య, మహేష్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. -
‘పెన్షనర్ల సమస్యలు పట్టని ప్రభుత్వం’
యలమంచిలి రూరల్: పెన్షనర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ, నాలుగు డీఏల బకాయిలు ఊసెత్తడం లేదని పెన్షనర్ల సంఘం నాయకులు మండిపడ్డారు. పట్టణంలోని కోర్టు కూడలి వద్ద ఎన్జీవో హోంలో గురువారం సాయంత్రం యలమంచిలి తాలూక రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి సోమేశ్వర్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు వి.జగన్నాథరావు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లపై చిన్నచూపు చూస్తోందని, ఒకటో తేదీకి పెన్షన్ సొమ్ము ఖాతాల్లో జమ అయితే చాలన్నట్టుగా పరిస్థితి ఉందని సోమేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏల బకాయిల్లో కనీసం ఒకటైనా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కోరుమిల్లి సుబ్బారావు, ఎస్.అప్పారావు, జి.కుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు కె.సత్యారావు, జి.సాంబమూర్తి, పలువురు పెన్షనర్లు పాల్గొన్నారు. -
ఇదేం సాగునీటి సరఫరా?
● కాలువల పూడికతీత పనులను సకాలంలో చేపట్టడంలో అలసత్వం ● నీటి సరఫరాకు అడ్డుకట్ట వేసి పూడికతీత పనులు ● మూడు రోజులు గడుస్తున్నా పలు గ్రామాలకు అందని సాగునీరు ● రైవాడ ఆయకట్టు రైతుల పాలిట శాపంగా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం దేవరాపల్లి: ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం.. రైవాడ జలాశయం ఆయుకట్టు రైతుల పాలిట శాపంగా మారింది. జలాశయం నుంచి ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేసి మూడు రోజులు గడుస్తున్నా ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందని దుస్థితి నెలకొంది. జలాశయం పరిధిలోని పంట కాలువల్లో పూడికతీత, తుప్పలు, డొంకలు తొలగించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ పనులు సకాలంలో చేపట్టడంలో ఇరిగేషన్ అధికారులు విఫలమయ్యారు. ఖరీఫ్ పంటలకు సాగునీటిని విడుదల చేపట్టడానికి ముందుగానే ఈ పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు అడుగడుగునా అలసత్వం ప్రదర్శించడంతో అసంపూర్తిగా మిగిలాయి. అధికార టీడీపీ నాయకులు ఈ పనులు చేపట్టడంతో పనుల పర్యవేక్షణకు అధికారులు అటుగా కన్నెత్తి చూడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నీటి విడుదల తేదీని సుమారు రెండు వారాల క్రితమే ప్రకటించారు. ఈలోగా యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్లు మాత్రం నత్తనడకన చేపట్టారు. నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి పూడిక తీత పనులు రైవాడ జలాశయం నుంచి ఎడమ కాలువ ద్వారా ఖరీఫ్ సాగుకు నీటి సరఫరా కొనసాగుతుంది. అయితే పెదనందిపల్లి శివారు సత్యనారాయణపురం సమీపంలోని ఎం.అలమండ, వేచలం వైపునకు వెళ్లే బ్రాంచి చానల్స్కు సంబంధించిన మదుం ఉంది. అక్కడి నుంచి ఎం.అలమండ వైపు సాగునీరు ప్రవహిస్తుండగా వేచలం వైపు బ్రాంచి కెనాల్కు అడ్డంగా మట్టి వేసి పూడికతీత, జంగిల్స్ తొలగింపు పనులను ప్రస్తుతం చేపడుతున్నారు. దీంతో వేచలం, మామిడిపల్లి, తారువ గ్రామాల పరిధిలోని సుమారు 3 వేల ఆయకట్టుకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల పరిధిలోని నారుమడులు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నాట్లు వేసిన వరి పొలాలు నెర్రెలు బారి ఎండిపోతుండటంతో ఆయా ప్రాంతాల రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి విడుదలకు ముందుగానే ఈ పనులు చేపట్టాల్సి ఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా నీరు విడుదల చేసిన తర్వాత పనులు చేపట్టడంపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా చేనులపాలెం సమీపంలో నీరు ప్రవహిస్తున్న పంట కాలువలో జేసీబీతో పూడితతీత పనులు చేపడుతుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రవహించే నీటిలో పూడిక ఎలా వస్తుందని, ఇలా మొక్కుబడి పనులు చేపట్టడం వల్ల నిధులు వృథా తప్పా ఎవరికి ప్రయోజనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూడికతీత, జంగిల్స్ తొలగింపు పనులు మిగిలి ఉంటే తొలి దఫా నీటి విడుదల పూర్తయ్యాక చేపట్టాలి తప్పా.. ఒక చోట నీరు ప్రవహిస్తున్న కాలువలోను, మరో చోట కాలువకు నీటి సరఫరాను నిలిపి వేసి చేయడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పనులు పూర్తి కాగానే నీటి సరఫరా జలాశయం పరిధిలోని ఏడు కాలువల్లో పూడిక తీత, జంగిల్ క్లియరెన్స్కు సుమారు రూ.52 లక్షలు నిధులు మంజూరు చేశారు. ఈ పనులు సైతం దాదాపుగా పూర్తి చేశాం. వేచలం, మామిడిపల్లి, తారువ బ్రాంచి కెనాల్కు నీటి సరఫరాకు అడ్డుకట్ట వేయడం వాస్తవమే. రైతుల విజ్ఞప్తితో ఆ కాలువలో జేసీబీతో పూడిక, జంగిల్స్ తొలగింపు పనులు చేయిస్తున్నాం. పనులు పూర్తి కాగానే మూడు గ్రామాలకు సాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తాం. దేవరాపల్లి–చేనులపాలెం గ్రామాల మధ్య మేట వేయడంతో ప్రవహిస్తున్న కాలువలో జేసీబీతో తొలగింపు పనులు చేపడుతున్నాం. – జి. సత్యంనాయుడు, ఇరిగేషన్ డీఈఈ -
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి
చోడవరం: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పీడీఎస్ఓ) ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఆందోళన చేశారు. చోడవరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి మెయిన్రోడ్డుపై వినాయకుడి గుడి మీదుగా కొత్తూరు జంక్షన్ వరకూ నిరసన ర్యాలీ చేశారు. అక్కడ విద్యార్ధులంతా మానవహారం చేశారు. అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ చేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ జిల్లా అధ్యక్షుడు నందారపు భాస్కరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్మెంటు నిధులు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీలకు ఫీజుల కట్టలేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజులు కట్టలేక, సర్టిఫికెట్లు ఇవ్వక ఉన్నత చదువులకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. 117 జీఓను రద్దుచేస్తామని చెప్పిన విద్యాశాఖామంత్రి లోకేష్ ఇప్పటి వరకూ ఈ జీఓను రద్దుచేయలేదని వెంటనే రద్దుచేయాలని భాస్కరరావు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు బి.కుమార్, గణేష్, మనోజ్, వై.రాజు, రామకృష్ణ, వరహాలనాయుడు పాల్గొన్నారు. -
దళితుడిపై టీడీపీ నాయకుడి దౌర్జన్యం
ఎస్.రాయవరం: హోంమంత్రి అనిత ఇలాకాలో ఓ దళితుడిపై గోకులపాడుకు చెందిన టీడీపీ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దండోరా వేస్తుంటే తన డప్పు లాక్కున్నాడని బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోకులపాడు, గెడ్డపాలెం, తిమ్మాపురం గ్రామాలకు సాగునీటి కోసం జమ్మి, గ్రోయిన్ కాలువల్లో శ్రమదానం చేయడానికి రైతులు రావాలని దండోరా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గోకులపాడు గ్రామానికి చెందిన రైతు పెనుగొల్లుకు చెందిన దండోరా వేసే చిందాడ దాసును తీసుకువెళ్లాడు. ముందుగా గెడ్డపాలెం, తిమ్మాపురం గ్రామాల్లో గురువారం దండోరా వేసిన దాసు.. గోకులపాడు గ్రామానికి రైతు నాగేశ్వరరావుతో చేరుకున్నాడు. అది గమనించిన టీడీపీ నాయకుడు సమ్మెంగి నానాజీ దండో ఎందుకు వేస్తున్నావు, ఈ గ్రామానికి ఎందుకు వచ్చావని ప్రశ్నించి బూతులు తిట్టి, డప్పు లాక్కున్నాడని బాధితుడు ఆరోపించాడు. ఈమేరకు దాసు ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
నాణ్యమైన విద్యనందించాలి
అనకాపల్లి: విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యను అందించాలని ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మజ్జి ఆదినారాయణ అధ్యాపకులకు సూచించారు. గురువారం స్థానిక మెయిన్రోడ్డు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లాలో వివిధ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యాపకులు ఉదయం 9లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. అనంతరం ఇక్కడ కళాశాలలో తరగతుల్లోకి వెళ్లి బోధన విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ జిల్లా అధికారి మద్దిలి వినోద్బాబు, తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మజ్జి ఆదినారాయణ -
కందిపప్పుకు మంగళం!
● ఏడు నెలలుగా అందించని రాష్ట్ర ప్రభుత్వం ● 546 మెట్రిక్ టన్నుల సరఫరాకు ఎగనామం ● సామాన్యులపై రూ.45 కోట్ల భారం అనకాపల్లి టౌన్: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కందిపప్పు పంపిణీకి మంగళం పాడేసింది. గత ఏడు నెలలుగా కందిపప్పును రేషన్ డిపోల ద్వారా సరఫరాను నిలిపివేసింది. కందిపప్పు కొనుగోలుకు టెండర్లు పిలవడం ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు కనిపించడంలేదు. దీంతో జిల్లాలో ఉన్న పేదవారిపై కోట్ల రూపాయల భారం పడుతుంది. కందిపప్పు బలవర్ధకమైన ఆహార పదార్ధం. చక్కగా ప్రోటీన్ లభిస్తుంది. సామాన్యుల దగ్గర నుంచి డబ్బున్నవాడు వరకూ కందిపప్పును విరివిగా వాడుతుంటారు. సామాన్యుడు చౌకధరల దుకాణంలో లభించే కందిపప్పు కోసం ఎదురు చూస్తుంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలుగా రేషన్ షాపులలో కందిపప్పు, రాగులు, గోధుమపిండి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాగులు, గోధుముల సంగతి పక్కన పెడితే కనీసం కందిపప్పు సరఫరా చేయడంతో కూడా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నెల కూడా కందిపప్పును అడగొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 5,37,038 మంది కార్డుదారులకు 14,99,000 యూనిట్దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 7652 మెట్రిక్ టన్నుల బియ్యం, 264 మెట్రిక్ టన్నుల పంచదార, 546 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 544 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 1628 మెట్రిక్ టన్నుల రాగులు సరఫరా చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవి నిలిచిపోయాయి. కొన్ని నెలలు అరకొరగా పంపిణీ చేసిన ప్రభుత్వం ఆరు నెలలుగా పూర్తిగా నిలిపివేసింది. పేదలకు నిత్యావసర వస్తువైన కందిపప్పును సరఫరా చేయలేని ప్రభుత్వం రాగులు, గోధుమ ఇంకేమి ఇస్తుందని కార్డుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే రేషన్ షాపుల్లో పూర్తిగా కందిపప్పు నిలిపివేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం కేంద్రం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం అరకేజీ పంచదార ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి 110 నుంచి రూ.120 ఉంటుంది. కూటమి నేతలు అధికారంలోకి రాక ముందు రేషన్ షాపులను బలోపేతం చేస్తామని నిత్యావసరాలైన బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, రాగి పిండి తదితర వాటిని రాయితీపై అందజేస్తామని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక్క నెల కూడా సరుకులు సరఫరా చేయలేదేమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రజలకు మరింత సమాచారం అందించడం కోసం జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి మూర్తిని ఫోన్లో సంప్రదించాలని ప్రయత్నం చేయగా అందుబాటులోకి రావడం లేదు. -
తప్పుడు రిజిస్ట్రేషన్లపై తస్మాత్ జాగ్రత్త
కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: తప్పుడు రిజస్ట్రేషన్లపై తరచు ఫిర్యాదు లు వస్తున్నాయని, సబ్ రిజిస్ట్రార్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువా రం నిర్వహించని వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మా ట్లాడుతూ రెవెన్యూ రికార్డుల్లో ఆస్తి వివరాలు యజమానుల పేరున కాకుండా పొరపాటున వేరొకరి పేరున నమోదైతే అలాగే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఫి ర్యాదులు వస్తున్నాయని, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో ఎల్పీఎం ఆధారంగా రిజస్ట్రేషన్కు వచ్చిన ప్రతి డా క్యుమెంట్ విషయంలో లింక్, ఈసీ తప్పక చూసి పూ ర్వ యాజమాన్య హక్కులను ధ్రువీకరించుకోవాలన్నారు. జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మధరావు పాల్గొన్నారు. 2న అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాల కోసం జిల్లాలో నేటి వరకు 2,31,688 మంది రైతులను అర్హులుగా గుర్తించినట్టు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో ఈ కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద రూ.2 వేలు మొదటి విడతగా బ్యాంక్ ఖాతాలో జమ కానున్నాయన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్రావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ కె.సత్యనారాయణ పాల్గొన్నారు. శతశాతం ప్రవేశాలు కల్పించాలి జిల్లాలోని అన్ని సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో శతశాతం ప్రవేశాలు కల్పించాలని, ప్రతి రోజు పక్కాగా మెనూ అమలు చెయ్యాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీ, మోడల్ కాలేజీ, మహాత్మా జ్యోతిరావ్ పూలె వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల, మోడల్ స్కూల్స్లో సీట్ల భర్తీ, మెనూ అమలుపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు గంజాయి, మత్తు పదార్ధాలకు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత వసతిగృహ అధికారులదేనన్నారు. -
రేపు కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ధర్నా
అనకాపల్లి: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న బోధనేతర, ఆర్థిక పరమైన 18 రకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 2న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్లు సంబంధిత జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు తెలిపారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయులపై మోయలేని భారం వేసిందన్నారు. యాప్లతో ఇబ్బందుకు గురిచేయడం వల్ల విద్యార్థులకు సకాలంలో బోధన చేసేందుక సమయం సరిపోవడం లేదన్నారు. ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేసినట్లయితే నాణ్యమైన విద్యనందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి యేశపోగు సుధాకర్ రావు, డిప్యూటీ జనరల్ కార్యదర్శి ఎస్. దుర్గాప్రసాద్, ఏపీటీఎఫ్ ప్రతినిధి ఆచంట రవి, ఎస్టీయూ ప్రతినిధి వత్సవాయి శ్రీలక్ష్మి, యూటీఎఫ్ ప్రతినిధి మట్ట శ్రీనివాసరావు, ఎస్సీఎస్టీయూఎస్ఏపీ ప్రతినిధి వై.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు బండారు క్షమాపణ చెప్పాలి
● అదానీ హైడ్రో పవర్ ప్లాంట్లను రద్దు చేసినట్టు వక్రీకరించడం తగదు ● గిరిజనులను తప్పుదోవ పట్టించడం సరికాదు ● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న ధ్వజం దేవరాపల్లి: చింతలపూడి, పెదకోట ఏరియాలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్లకు ప్రభుత్వం అనుమతులు రద్దు చేసినట్టు ఈ ప్రాంత గిరిజనులు, రైవాడ ఆయకట్టు రైతులను తప్పుదోవ పట్టించేలా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రకటనలు చేయడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న విమర్శించారు. రైవాడ జలాశయం వద్ద బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మంగళవారం రైవాడ జలాశయం నీటిని విడుదల చేసిన సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ దేవరాపల్లి మండలం చింతలపూడి, అనంతగిరి మండలం పెదకోట సమీపంలో నిర్మించబోయే అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టులను ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో జారీ చేసిందని చెప్పడాన్ని ఖండించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రకటనలు చేసిన ఎమ్మెల్యే బండారు ఆయా ప్రాంతాల గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైవాడ క్యాచ్మెట్ ఏరియాలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్లకు అనుమతులు ఇచ్చి రైవాడ ఉసురు తీస్తున్నారని, దీనికి స్థానిక ఎమ్మెల్యే బండారు పూర్తి బాధ్యత వహించాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కర్రివలస, కురుకుట్టి గ్రామాల పరిధిలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్లకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ నెల 28న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే బండారు దీనిని వక్రీకరించి చింతలపూడి సమీపంలోని మారిక, పెదకోట సమీపంలోని రేగులపాలెం ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసినట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని చెప్పారు. రైవాడ జలాశయానికి ఎక్కడ నుంచి నీరు వస్తుందన్న విషయం తెలియక కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మన్యం జిల్లాలో హైడ్రో పవర్ ప్లాంట్లను రద్దు చేశారని, ఇక్కడ గిరిజనుల భవిష్యత్ అంధకారంగా మారుతున్నా ఎంపీ సి.ఎం.రమేష్, ఎమ్మెల్యే బండారు నోరుమెదపక పోవడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ పవర్ ప్రాజెక్టులు నిర్మాణం జరిగితే రైవాడ ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్నారు. -
పంజా!
రైతుల భూములపైపూలింగ్మొత్తం 1941.19 ఎకరాల సమీకరణ ● రైతులకు ఇచ్చేది 900, 450 గజాలు మాత్రమే ● అసైన్డ్ భూముల హక్కులు కల్పించేలా చేసిన వైఎస్ జగన్ ● ఇప్పుడు పూలింగ్ పేరుతో కాజేస్తున్న ప్రభుత్వం ఏయే ప్రాంతాల్లో ఎంత భూమి అంటే...! గ్రామం పేరు మండలం సర్వే ప్రతిపాదిత నంబరు ల్యాండ్పూలింగ్ విశాఖపట్నం గిడిజాల ఆనందపురం 258 309.18 గోరింట ఆనందపురం 108 198.31 శొంఠ్యాం ఆనందపురం 347పి 251.55 బి.డి.పాలెం ఆనందపురం 1 122.53 కొవ్వాడ పద్మనాభం 237 250.52 మొత్తం విస్తీర్ణం 1,132.09 విజయనగరం జిల్లా మోదవలస డెంకాడ 241, 242, 243 20.41 రావాడ భోగాపురం 64–1 5.00 మొత్తం విస్తీర్ణం 25.41 అనకాపల్లి జిల్లా అంతకాపల్లి సబ్బవరం –– 175.42 బాటజంగాలపాలెం సబ్బవరం –– 141.01 ఎ.సిరసపల్లి సబ్బవరం –– 371.75 నల్లరేగుడుపాలెం సబ్బవరం –– 27.37 పైడివాడ అగ్రహారం సబ్బవరం –– 28.14 తగరంపూడి అనకాపల్లి –– 40.00 మొత్తం విస్తీర్ణం 783.69సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేద రైతులకు భూమి దక్కాలనే ఉద్దేశంతో అసైన్డ్ భూములపై సర్వాధికారాలు కట్టబెడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్లు దాటిన అసైన్దారులకే పూర్తి హక్కులు కల్పించేలా నిషేధిత జాబితా నుంచి ఎత్తివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆదేశాలపై నిషేధాన్ని అమలుచేస్తోంది. గత ఏడాది కాలంగా ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిషేధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ నిషేధం మాటున రైతుల భూములపై పూలింగ్ పేరుతో పంజా విసిరేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు అనుగుణంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు విజయనగరం జిల్లాలను కలుపుకుని ఏకంగా 1,941.19 ఎకరాల భూమిని పూలింగ్ పేరుతో సమీకరించేందుకు విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి(వీఎంఆర్డీఏ) అధికారాలను అప్పగించింది. తద్వారా రైతులకు కేవలం 450 గజాల నుంచి 900 గజాలు మాత్రమే ఇచ్చి.. మిగిలిన భూమితో వ్యాపారం చేసేందుకు తయారవుతోంది. అంతేకాకుండా ఇప్పటికే కొందరు కూటమి నేతలు పూలింగ్ పేరుతో సమీకరించనున్న కొన్ని ముఖ్యమైన సర్వే నెంబర్లలోని రైతులతో ముందస్తు బలవంతపు ఒప్పందాలు చేసుకొని.. నామమాత్రంగా పైసలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే విమర్శలున్నాయి. భూసమీకరణ పేరుతో భూకబ్జా..! వాస్తవానికి విశాఖపట్నం సమీప ప్రాంతాల్లో భూమి ధర ఎక్కువగా ఉంది. ఎకరా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ పలుకుతోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మరింతగా ధరలు పెరుగుతున్నాయి. ఇక్కడ పేద రైతులకు అనేక ప్రాంతాల్లో గతంలో అసైన్మెంటు కమిటీల ద్వారా పట్టాలు మంజూరు చేశారు. ఆయా భూముల్లో రైతులు సాగుచేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధం ఎత్తివేయడంతో ఈ భూములను విక్రయించుకునేందుకు అవకాశం వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో పేద రైతుల భూములను కాజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసైన్ చేసిన రైతులకు దక్కేది 900 గజాలు మాత్రమేనని పేర్కొంటోంది. ఇక పదేళ్ల కంటే ఎక్కువ కాలంగా సాగు చేసుకుంటున్న రైతులకు 450 గజాల స్థలం ఇస్తామని చెబుతోంది. కన్నేసిన కూటమి నేతలు...! ల్యాండ్ పూలింగ్ వల్ల అసైన్దారులు నష్టపోనున్నారు. కేవలం 450, 900 గజాల స్థలంతో సరిపెట్టుకోవాల్సి రానుంది. ఇప్పటికే కూటమిలోని కీలక నేతలకు ఏయే ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ జరగనుందనే దానిపై పక్కా సమాచారం ఉంది. దీంతో బాగా విలువైన ప్రాంతాల్లోని సర్వే నెంబర్లలో గల రైతులతో ముందస్తుగా బెదిరింపులకు దిగి.. ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ‘మీ పట్టా భూములు మాకు అప్పగించండి... మీకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఇస్తామంటూ’ కీలక ప్రాంతాల్లోని భూములకు సంబంధించి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేతో పాటు ఒక కార్పొరేషన్ చైర్మన్, ఓ మంత్రి, ఎంపీ, చినబాబులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరకు తీసుకుని పూలింగ్ పేరుతో వచ్చే 900 గజాల స్థలాన్ని కూడా కూటమి నేతలే కాజేసేందుకు రంగం సిద్ధమైంది. రైతులకు హక్కు దక్కకుండా...! వాస్తవానికి 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అసైన్దారులకు పూర్తి స్థాయిలో వారికే హక్కులు దక్కే విధంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అందులో ఏదో జరిగిపోయిందనే రీతిలో కూటమి ప్రభుత్వం ప్రచారం చేసింది. ఇప్పటికే రెండు దఫాలుగా పలువురు అధికారులతో విచారణ కూడా చేపట్టింది. ఎలాగైనా తప్పులు ఎత్తిచూపాలనే ఉద్దేశంతో ఒత్తిడి తెచ్చి మరీ విచారణ చేపట్టింది. అయినప్పటికీ ఒక్క చిన్న తప్పు కూడా జరగలేదని తేలింది. అయినప్పటికీ విశాఖలో భూములు దోచుకున్నారంటూ విషప్రచారం చేశారు. తీరా విచారణలో తేలకపోయినప్పటికీ నిషేధాన్ని మాత్రం కొనసాగిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు భూసమీకరణ పేరుతో పేదల భూములను కాజేసేందుకు వీఎంఆర్డీఏ రూపంలో ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవేళ గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేసి ఉంటే.. రైతులకు తమకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలను విక్రయించుకునేందుకూ అవకాశం దక్కేది. ఇప్పుడు కేవలం 900, 450 గజాల స్థలానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. -
వైఎస్ జగన్ దృష్టికి నిర్వాసితుల సమస్య
● విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్కు భూములిచ్చిన రైతులు ● నేడు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం అష్టకష్టాలు ● అన్నదాతల ఆవేదన వివరించిన వైఎస్సార్సీపీ నేతలు సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ కలిశారు. బుధవారం తాడేపల్లిలో గల క్యాంప్ కార్యాలయంలో పార్టీ అధినేతను కలిసి.. విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చిన నక్కపల్లి మండలం రైతులు నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం గత ఆరు నెలలుగా ఎలా పోరాడుతున్నారో వివరించారు. 2014లో భూములు తీసుకునే సమయంలో భూసేకరణ చట్టం–2013 ప్రకారం నష్టపరిహారం, ప్యాకేజీ ఇస్తామని చెప్పి నాటి టీడీపీ ప్రభుత్వం ఎలా ఏమార్చిందో వివరించారు. ఇప్పుడు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం, అధికారులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ప్యాకేజీ కింద రూ.25 లక్షలు ఇవ్వాలని చందనాడ, మూలపార, తమ్మయ్యపేట రైతులు డిమాడ్ చేస్తూ ఏడాది నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిర్వాసితుల్లో మేజర్లకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలియజేశారు. అంతేకాకుండా బల్క్డ్రగ్ పార్క్, మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం అదనంగా మరో 3,500 ఎకరాలను సేకరించడానికి పూనుకొని, కాగిత, వేంపాడు, డి.ఎల్.పురం గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేశారని, కానీ రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించడం లేదన్నారు. అదనంగా భూములు సేకరించి కార్పొరేట్ పెద్దలకు కట్టబెట్టే యత్నాలు జరుగుతున్నాయని వివరించారు. బాధితులకు మద్దతుగా వైఎస్సార్సీపీ తరపున పాదయాత్రలు, ఆందోళనలు చేస్తున్నామని వివరించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలని, అదనపు భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తే అవసరమైతే వారి తరపున పోరాటానికి తాను కూడా హజరవుతాయని జగన్మోహన్రెడ్డి చెప్పారని వారు తెలిపారు. -
కలెక్టర్ తీరుపై దళిత రైతుల ఆవేదన
నర్సీపట్నం: కలెక్టర్ విజయ కృష్ణన్ తీరుపై మాకవరపాలెం మండలం జి.కోడూరు క్వారీ బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ అనుమతులు రద్దు చేయాలని బాధిత రైతులు ఎనిమిది రోజులుగా ఆర్డీవో కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ నర్సీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యను కలెక్టర్కు తెలియజేసేందుకు ప్లకార్డులతో నినాదాలు చేశారు. అయినా కలెక్టర్ ఆగకుండా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర నాయకులు బొట్టా నాగరాజు, దళిత నాయకులు మట్ల చంటి, కాంగ్రెస్ జిల్లా నాయకులు బొంతు రమణ మాట్లాడుతూ కలెక్టర్ రైతుల సమస్యలను పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేసినప్పటికీ కలెక్టర్ పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితుల పట్ల చులకన భావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జిల్లాలో ఏమి జరుగుతుందో కలెక్టర్కు తెలియకపోడం దారుణమన్నారు. -
డీలర్లకు గుదిబండ
● ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో తంటా ● రేషన్ లబ్ధిదారులకే కాక డీలర్లకూ అవస్థలే ● ప్రజా వ్యతిరేకతతో వృద్ధులు, వికలాంగులకు ఇంటికే సరకులు అందిస్తామన్న సర్కారు ● రవాణా చార్జీలు చెల్లించకపోవడంతో డీలర్ల గగ్గోలు నర్సీపట్నం: ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో లబ్ధిదారులతోపాటు డీలర్లు సైతం సతమతమవుతున్నారు. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వృద్ధులు, వికలాంగుల ఇళ్ల వద్దకే రేషన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. దీంతో భారం డీలర్లపై పడింది. ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీకి కొంత మంది డీలర్లు బైక్ వినియోగిస్తుండగా, ఆర్ధిక భారం తట్టుకోలేక మరికొంత మంది డీలర్లు కావిట్లో నిత్యావసర సరకులు పెట్టుకుని ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో సంబరాలు జరుపుకున్న డీలర్లు ఇంటింటికీ రేషన్ భారంతో నరకం చూస్తున్నారు. వాహనాల తొలగింపు తమ పాలిటశాపంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. డీలర్లపై ఆర్థిక భారం జిల్లాలో మొత్తం 5,35,000 రైస్ కార్డులు ఉన్నాయి. అందులో 68 వేల మంది వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 25వ తేదీ నుంచి నెలాఖరులోగా ఇంటి వద్దే డీలర్లు బియ్యం, పంచదార అందించాల్సి వస్తోంది. ప్రభుత్వం రవాణా చార్జీలు ఇవ్వకపోవడంతో ఆర్థిక భారాన్ని వారే భరిస్తున్నారు. రవాణా ఖర్చులు భరించలేక కొంతమంది డీలర్లు ఐదు కేజీల చొప్పున బియ్యం సంచుల్లో ప్యాక్ చేసి, కావిట్లో తీసుకువెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఎండీయూ వాహనాలు ఉన్నప్పుడే తమ ప్రాణం సుఖంగా ఉండేదని డీలర్లు వాపోతున్నారు. రేషన్ బియ్యం తూకం వేసేందుకు తమ సొంత ఖర్చులతో హెల్పర్ను పెట్టుకుంటున్నామని, దీని వల్ల నెలకు రూ.3 వేల వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సీఎస్డీటీ చందన రేఖను సంప్రదించగా ఇంటింటి రేషన్ పంపిణీకి ప్రభుత్వం రవాణా చార్జీలు ఇవ్వటం లేదని, ఆ బాధ్యత డీలర్లదేనని తెలిపారు. -
జ్వరాలపై అప్రమత్తం
డీఎంహెచ్వో హైమావతి నాతవరం: జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి హైమవతి ఆదేశించారు. గునుపూడి పీహెచ్సీని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి, పీహెచ్సీ పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్యం కోసం పీహెచ్సీకి వచ్చే రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, సకాలంలో వైద్యసేవలందించడమే ధ్యేయంగా అంకితభావంతో పనిచేయాలని వైద్యాధికారులు చంద్రశేఖర్, అనూష్, సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో జ్వరాల నియంత్రణకు ప్రణాళికలు రూపొందించాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పి.జగ్గంపేటలో జ్వరాలు ప్రబలినట్టు ఫిర్యాదులు రావడంతో ఆమె స్వయంగా ఆ గ్రామంలో పర్యటించి, పరిశీలించారు. అనంతరం నాతవరం పీహెచ్సీ పరిధి సరుగుడు పంచాయతీలో పర్యటించి గిరిజనులతో మాట్లాడారు. గ్రామంలో జ్వరాలు ప్రబలితే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ఇప్పటికే జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈకార్యక్రమంలో నాతవరం పీహెచ్సీ వైద్యాధికారి ప్రసన్న, వైద్య సిబ్బంది కె.వెంకటరమణ, పెలుపర్తి బైరాగి, త్రివేణి తదితరులు పాల్గొన్నారు. -
బోధనలో లోపాలుంటే చర్యలు తప్పవు
డీఈవో అప్పారావునాయుడు నర్సీపట్నం: విద్యా బోధనలో లోపాలుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావునాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ (మెయిన్)ను పరిశీలించారు. విద్యార్థుల పఠన సామర్ధ్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. నాడు–నేడు అసంపూర్తిగా నిలిచిన పాఠశాలల వివరాలను ప్రభుత్వానికి నివేదించామన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బోధన తీరుపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు రెండు పూటలా ఎఫ్ఆర్ఎస్ నమోదు చేయాలన్నారు. ఎఫ్ఆర్ఎస్ నమోదు కానీ 21 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. -
వాల్తేర్ డివిజన్ మొదటి క్వార్టర్లో 12.25 శాతం వృద్ధి
వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్ర తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్ర బుధవారం దొండపర్తిలో గల డీఆర్ఎం కార్యాలయం సమావేశ మందిరంలో సరకు రవాణా ఖాతాదారులు, వ్యాపార భాగస్వాములతో సమావేశమయ్యారు. నూతన వ్యాపార పద్ధతులు, పరస్పర సహకారం, సరైన సరకు రవాణాలో మెరుగైన పద్ధతులు, శక్తివంతమైన సమాచార వ్యవస్థ వంటి విషయాల గురించి చర్చించారు. వాల్తేర్ డివిజన్ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంతవరకు మొదటి క్వార్టర్లో 12.25 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైజాగ్ సీ పోర్ట్, గంగవరం పోర్టు, సెయిల్, వేదాంత, ఐటీఎల్, బోత్ర, హెచ్ఐక్యూ సర్వీస్, కేఆర్ అండ్ సన్స్, భూషణ్ పవర్, ఉత్కల అల్యూమినా, నాల్కో, కాంకోర్, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, ఇండియా ఫాస్పేట్ లిమిటెడ్, ఆర్సిఎల్ కంపెనీల ప్రతినిధులతో పాటు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ తన్మయ్ ముఖోపాధ్యాయ్, సీనియర్ డివిజన్ కమర్షియల్ మేనేజర్ సందీప్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
అప్పన్న సన్నిధిలో..
సింహగిరిపై వసతి కోసం భక్తులు తిప్పలు పడాల్సి వస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపై కనీసం ఒక్క రోజైనా బస చేసి, ఆధ్యాత్మిక సంతృప్తి పొందుదామంటే అందుకు వీల్లేని దుస్థితి. ఇక్కడ సామాన్య భక్తులకు అందుబాటు ధరలో ఉన్నది దేవస్థానానికి చెందిన గజపతి సత్రం మాత్రమే. అది కూడా వారాంతపు రోజులు, పర్వదినాలు, పెళ్లిళ్ల సమయంలో దొరకని పరిస్థితి. దీంతో ప్రైవేట్ హోటళ్లు, లాడ్జీల్లో బస చేసి, చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. ● అందుబాటులో ఉన్నది గజపతి సత్రం ఒక్కటే ● పెళ్లిళ్లు, ఉత్సవాలు, యాత్రా దినాల్లో గజపతి సత్రం ఫుల్ ● వీఐపీలకూ దొరకని వీఐపీ కాటేజీలు ● మరుగున పడ్డ డొనార్స్ కాటేజీ ప్రణాళిక సింహాచలం: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి సింహగిరి పైనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం. స్వామి దర్శనానికి రోజూ వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వీరిలో కుటుంబ సమేతంగా వచ్చే దూర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ. సింహగిరికి చేరుకున్నాక తాత్కాలిక బసకు గదులు దొరకడం గగనమైపోయింది. దీనికి కారణం సరిపడా కాటేజీలు సింహగిరిపై లేకపోవడమే..! సింహగిరిపై భక్తులకు సరిపడా వసతి కల్పించాలని ఇటీవల ఆలయానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి కూడా పలువురు తీసుకెళ్లారు. గజపతి సత్రం ఒక్కటే దిక్కు సింహగిరిపై ప్రస్తుతం గజపతిసత్రం ఒక్కటే భక్తుల వసతికి అందుబాటులో ఉంది. రెండు అంతస్తుల్లో ఉన్న ఈ సత్రంలో 24 ఏసీ, 24 నాన్ ఏసీ గదులున్నాయి. జీఎస్టీతో కలిపి ఏసీ అయితే రూ.1,008, నాన్ ఏసీ అయితే రూ.560 చెల్లించాలి. శని, ఆదివారాలు, యాత్రా రోజులు, పెళ్లిళ్ల సీజన్లలో ముందుగా బుక్ చేసుకునేవి ఈ గదులే. దీంతో సామాన్య భక్తులకు గదులు లభించడం కష్టతరమవుతోంది. గంటల తరబడి నిరీక్షించినా ఫలితంలేక నిరాశగా వెనుదిరగాల్సి వస్తోందని భక్తులు తరచూ వాపోతున్నారు. వీఐపీ కాటేజీల పరిస్థితీ అంతే.. సింహగిరిపై ఉన్న వీఐపీ కాటేజీల పరిస్థితి కూడా దాదాపు అంతే. ప్రస్తుతం వీఐపీ కేటగిరీకి చెందిన ప్రహ్లాద, సింహవల్లీ, రమణారెడ్డి, అన్నపూర్ణ, వీబీసీ కాటేజీలు సింహగిరిపై ఉన్నాయి. ప్రహ్లాద కాటేజీలో మూడు సూట్ రూమ్లకు కలిపి అద్దె రూ.3,920. సింహవల్లీ, రమణారెడ్డి కాటేజీల్లో రెండేసి సూట్లు ఉండగా, ఒక్కో సూట్కు రూ.1120, అన్నపూర్ణ, వీబీసీలో రెండేసి సూట్లుండగా ఒక్కో సూట్కు రూ.2,800 చెల్లించాలి. కొంచెం ఆర్థిక స్థోమత కలిగిన వారు ఆ కాటేజీల్లో బస చేద్దామంటే సవాలక్ష నిబంధనలు సతాయిస్తాయి. ఆ సమయానికి మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు, ఉన్నతాధికారుల బస చేయకపోతే, వారి సిఫార్సుతో మరెవరూ లేకపోతే తప్ప ఆ కాటేజీలు లభించవు. మరుగున పడ్డ డోనార్స్ కాటేజీ ప్రణాళిక సింహగిరిపై సాధారణ భక్తులకు, వీఐపీలకు అందుబాటులో ఉండేలా డోనార్స్ కాటేజీ నిర్మాణానికి 2008లో ప్రణాళిక చేశారు. మైక్రోటవర్కు వెళ్లే మార్గంలో ఉన్న కొండపై వీఐపీ కాటేజీల నిర్మాణానికి అప్పటి ఈవో, ప్రస్తుత దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సంకల్పించారు. డోనార్స్ కాటేజీ నిర్మాణానికి కొండపై కొంతమేర స్థలాన్ని చదును చేశారు. రామచంద్రమోహన్ బంధువే తొలి విరాళాన్ని అందించారు. ఒక్కో డోనార్కు ఒక్కో గది పేరు పెట్టి ఏడాదిలో నెల రోజులు వారికి ఉచితంగా ఆ గదిని ఇచ్చేందుకు నిర్ణయించారు. కానీ కొన్ని రోజులకే ఆ ప్రణాళిక మరుగున పడింది. వసతి సౌకర్యం పెంచాలి ఉత్తరాంధ్రలో ఎంతో పెద్ద క్షేత్రం అయిన సింహాచలానికి వచ్చే భక్తులకు వసతి సౌకర్యం పెంచాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉంది. ముఖ్యంగా కనీసం ఒకరోజైనా ఇక్కడ ఉండేలా వసతి సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. – రవితేజ, పార్వతీపురం ప్రస్తుతం అందుబాటులో ఉన్న గజపతి సత్రంఉత్సవ రోజుల్లో బుకింగ్ బంద్ సింహగిరిపై జరిగే చందనోత్సవం, వార్షిక కల్యాణోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి తదితర ప్రముఖ ఉత్సవాల రోజుల్లోనైతే భక్తులు బస కోసం ఆశలు వదులుకోవాల్సిందే. ఆయా రోజుల్లో దేవస్థానమే ముందుగా గజపతిసత్రంలోని గదులను అద్దెకు కేటాయించే ప్రక్రియని నిలిపేస్తుంది. ఆ రోజుల్లో విధులకు హాజరయ్యే పలు ప్రభుత్వ సంస్థల సిబ్బందికి, ఇతరత్రా అవసరాలకు ఆ గదులను కేటాయిస్తుంది. -
రోడ్డు కోసం యూకలిప్టస్ తోట ధ్వంసం
● పరిహారం చెల్లించాలని అడ్డుకున్న పీతపాలెం రైతులు ● చేసేది లేక వెనుదిరిగిన తహసీల్దార్, పోలీసులు తుమ్మపాల: పరిహారం చెల్లించకుండా సాగులో ఉన్న యూకలిప్టస్ తోటను పోలీసు బందోబస్తు నడుము ధ్వంసం చేయడాన్ని రైతులు అడ్డుకున్నారు. మండలంలో కోడూరు సర్వే నంబర్ 1/1 ప్రభుత్వ భూమిలో సబ్బవరం మండలం పీతపాలెం గ్రామానికి చెందిన రైతులు పూర్వం నుంచి సాగులో ఉన్నారు. సమీపంలో కలెక్టర్ బంగ్లాతో పాటు ఉన్న ఆటోనగర్, ఎంఎస్ఎంఈ పార్క్కు పీతపాలెం, పైడివానిపాలెం మీదుగా అసకపల్లి వద్ద జాతీయ రహదారికి 100 అడుగుల రోడ్డు అభివృద్ధి చేయాల్సి ఉంది. పీతపాలెం వద్ద కోడూరు రెవెన్యూ పరిధిలో రైతుల సాగులో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమి మధ్యలోంచి సుమారు 1.54 ఎకరాల్లో 100 అడుగుల వెడల్పున రోడ్డుకు ఏపీఐఐసీ కేటాయింపులు చేసింది. ఈ మేరకు మొదలుపెట్టిన పనులను కొద్ది రోజులుగా రైతులు అడ్డుకున్నారు. అయితే బుధవారం కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఎం.భాస్కర అప్పారావు, రెవెన్యూ సిబ్బంది రూరల్ పోలీసులు బందోబస్తు నడుమ బుల్డోజర్లు, పొక్లెయిన్లతో తోటను ధ్వంసం చేశారు. అనంతరం చదును చేసే పనులకు పూనుకున్నారు. రైతులు స్థానిక నాయకులతో కలిసి పనులను ఆపేశారు. నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేపడితే సహించమని రైతులు తేల్చి చెప్పడంతో పనులు నిలిపివేసి అధికారులు వెనుతిరిగారు. -
బల్క్ డ్రగ్ పార్క్పై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటాం
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో నిర్మించతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్పై ప్రజాభిప్రాయ సేకరణ రద్దుచేయాలని మత్స్యకారులు, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయణ సేకరణ నిర్వహిస్తే అడ్డుకుంటామని చెప్పారు. బల్క్ డ్రగ్పార్క్ను వ్యతిరేకిస్తూ బుధవారం రాజయ్యపేటలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు, ఎం.అప్పలరాజు , వైఎస్సార్సీపీ నాయకుడు ఎరిపల్లి నాగేశు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన ఈ బల్క్ డ్రగ్పార్క్ను ప్రజలు, మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. వచ్చే నెల ఆరోతేదీన నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను రద్దుచేయాలంటూ నినాదాలు చేశారు. కూటమిప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కంపెనీలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని చెబుతూ రైతులనుంచి వేలాది ఎకరాలు లాక్కొంటున్నారన్నారు. కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని తెలిపారు. స్కిల్డవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి, శిక్షణ ఇచ్చి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని హోంమంత్రి అనిత చెబుతున్నారని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు పునాది రాయికూడా వేయలేదని తెలిపారు. బల్క్డ్రగ్పార్క్ కోసం ఇప్పటికే రెండు వేల ఎకరాలు కేటాయించారని, అదనంగా మరో ఎనిమిది వందల ఎకరాలు కేటాయించేందుకు భూసేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రైతులకు తెలియకుండా 6ఏ నోటీసులు జారీ చేశారని తెలిపారు. ప్రజాభిప్రాయసేకరణను అడ్డుకుని తీరుతామన్నారు.ఈ ఆందోళనలో మనబాల రాజేష్, కోదండరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
అనకాపల్లి: జిల్లాలో వివిధ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, బీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బి.రామానందం తెలిపారు. స్థానిక జాతీయ రహదారి డైట్ కళాశాల ఆవరణలో జిల్లాలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది జిల్లాలో ఎస్పీ విద్యార్థులు 2,800 మంది, బీసీ విద్యార్థులు 32,000 మంది ఉన్నారని, ఈ ఏడాది కొత్తగా కళాశాలల్లో జాయిన్ అవుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.వైకుంఠరావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
అయ్యన్న తీరు అనుమానాస్పదం
● రాజ్యాంగ హోదాను ఆపహాస్యం చేస్తున్నారు ● స్పీకర్ రోడ్డెక్కి లారీలు అపడమేంటి ? ● అన్ని కంపెనీల విషయంలోనూ ఇలాగే స్పందిస్తారా ● ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం: రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు ఆ పదవి హుందాతనాన్ని దిగజార్చుతున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ శాసన సభ్యుడిగా గెలిచి, స్పీకర్ పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు రోడ్డెక్కి లారీలు ఆపడం ఏంటని ప్రశ్నించారు. పట్టుకున్న ఓవర్లోడు లారీలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించకుండా..ఓనర్లు తన వద్దకు వచ్చే వరకు వదలొద్దంటూ పోలీసులను హెచ్చరించడం మరీ హాస్యాస్పదంగా ఉందన్నారు. పొట్ట కూటి కోసం పని చేస్తున్న లారీ డ్రైవర్లు, క్లీనర్ల పట్ల స్పీకర్ నోరు పారేసుకోవడం ఆయన స్థాయికి తగదన్నారు. మాకవరపాలెం మండలంలో ఉన్న పయనీరు అల్యూమినియం కంపెనీని లక్ష్యంగా చేసుకుని ఆ కంపెనీకి ముడి సరుకు రవాణా చేస్తున్న లారీలను ఆపడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటన్నది స్పీకర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అల్యూమినియం కంపెనీకి ముడి సరుకు రవాణా చేస్తున్న లారీలను లక్ష్యంగా చేసుకుని అధిక లోడు పేరుతో ఆయన తరచూ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు, వంతెనలు దెబ్బతినకుండా ఉండాలంటే అధిక లోడ్తో వెళ్లే అన్ని వాహనాలను ఆపితే ప్రజలు హర్షిస్తారని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక విచ్చల విడిగా ఎక్కడపడితే అక్కడ మైనింగ్ జరుగుతోందని, క్వారీల నుంచి టిప్పర్లతో టన్నుల కొద్దీ రాయిని ఇదే రోడ్డులో తరలిస్తున్నారని చెప్పారు. స్పీకర్కు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. కేవలం అల్యూమినియం కంపెనీకి వెళ్తున్న లారీలను లక్ష్యంగా చేసుకుని ఆపడమనేది పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. రాత్రీపగలు అన్న తేడాలేకుండా నర్సీపట్నం మీదగా రాంబిల్లిలోని నేవల్ బేస్కు రాకపోకలు సాగిస్తున్న అధిక లోడు లారీలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నర్సీపట్నం మీదగా నిత్యం రాకపోకలు సాగిస్తున్న లారీలను స్పీకర్ ఎందుకు ఆపడం లేదన్నారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరిచే విధంగా అయ్యన్నపాత్రుడు వ్యవహరించడం రాజ్యాంగ హోదాను అపహాస్యం చేయడమేనని మాజీ ఎమ్మెల్యే గణేష్ తెలిపారు. -
ఆ గొయ్యి బలిగొంది.. వివాహ బంధాన్ని తెంచేసింది
కూర్మన్నపాలెం: ‘ఇంకొద్ది సేపట్లో ఇంటికి వస్తున్నా..’ అని చెప్పి బయలుదేరిన ఆ యువకుడి మాటలే చివరివయ్యాయి. విధులకు వెళ్లిన భర్త తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న ఆ నవ వధువుకు తీరని శోకం మిగిలింది. కళ్లెదుటే భవిష్యత్తు బంగారంగా కనిపిస్తుండగా.. రహదారిపై ఉన్న గొయ్యి ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. ఒక ఇంజినీర్ నూరేళ్ల జీవితాన్ని బలిగొంది. సినర్జీస్ సంస్థలో జూనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్న రాహుల్కు ఈ ఏడాది మేలోనే వివాహం జరిగింది. భార్య, తండ్రితో కలిసి జీవీఎంసీ 87వ వార్డు కణితికాలనీలోని వైష్ణవి అపార్టమెంట్లో నివాసం ఉంటున్నాడు. రోజూలాగే బుధవారం కూడా విధులను ముగించుకుని తన బైక్పై ఇంటికి బయలుదేరాడు. దువ్వాడ సమీపంలోని రాజీవ్నగర్ వద్ద రహదారిపై ఉన్న ఓ గొయ్యి రూపంలో మృత్యువు కాపు కాసింది. ఆ గొయ్యిని తప్పించే చిన్న ప్రయత్నంలో రాహుల్ అదుపుతప్పాడు. బైక్పై నుంచి కింద పడి.. వెనకనే వస్తున్న భారీ ట్రాలర్ చక్రాల కింద నలిగిపోయాడు. అక్కడికక్కడే కన్నుమూశాడు. కొద్ది నిమిషాల్లో ఇంట్లో ఉండాల్సిన రాహుల్.. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న దృశ్యం చూపరుల హృదయాలను కలచివేసింది. ఈ వార్త తెలియగానే ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తన కుమారుడు నేల మీద నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉన్న ఆ గొయ్యి.. ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. రాహుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ మల్లేశ్వరరావు నేతృత్వంలో ఎస్ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. టాలర్ చక్రాల కింద పడి సినర్జీస్ ఉద్యోగి మృతి -
వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
● ‘ఉల్లాస్ అక్షరాంధ్ర’ లక్ష్యం సంపూర్ణ అక్షరాస్యతే ● జిల్లాలో 2,85,398 మంది వయోజన నిరక్షరాస్యులు ● కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఉల్లాస్ అక్షరాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వయోజన విద్యాశాఖ, పారిశ్రామిక అభివృద్ధిపై వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో కలెక్టర్ మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ–2023 సర్వే ప్రకారం జిల్లాలో 2,85,398 మంది వయోజనులను నిరక్షరాస్యులుగా గుర్తించామన్నారు. మొదటి విడతగా ఈ ఏడాది 89,944 మందిని తీసుకుని అక్షరాస్యులుగా చేయడానికి ప్రణాళిక రుపొందించాలని డీఆర్డీఏ, డ్వామా, మెప్మా అధికారులను ఆదేశించారు. రానున్న మూడేళ్లలో మొత్తం 2,85,398 మందిని కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, అక్షరాస్యతలో మొదటి స్థానంలోకి జిల్లాను తీసుకురావాలని చెప్పారు. గత సంవత్సరం 24 మండలాల్లో నిరక్షరాస్యులైన డ్వాక్రా గ్రూపు మహిళలను గుర్తించి అక్షరాస్యులుగా తయారు చేశామన్నారు. ●మండల, గ్రామ స్థాయిలో వాలంటరీ టీచర్స్ను పది మంది చొప్పున కేటాయించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సంక్షేమ సహాయకులు, డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాబోయే ఆరు నెలల కాలంలో రోజూ సాయంత్రం 5 నుంచి 6.30 గంటల మధ్యలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని సూచించారు. ఆగస్టు నుంచి 2026 ఫిబ్రవరి వరకు 100 గంటల తరగతులు నిర్వహించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన చర్యలు జిల్లా పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు అవసరమైన చర్యలు సత్వరమే తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) 15వ జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏకగవాక్ష విధానం కింద గత మే 26న జరిగిన సమావేశం నుంచి ఇప్పటి వరకు 685 దరఖాస్తులు వివిధ శాఖల అనుమతి కోసం రాగా.. వాటిలో 615 దరఖాస్తులకు ఆమోదం తెలిపామన్నారు. పెండింగ్ దరఖాస్తుల అనుమతులపై వివిధ శాఖల అధికారులతో మాట్లాడాలన్నారు. జిల్లాలో 14 పరిశ్రమలకు సంబంధించిన వివిధ రాయితీల కోసం 37 దరఖాస్తులకు గాను రూ.5.92 కోట్లకు కమిటీలో ఆమోదం తెలిపామన్నారు. జిల్లాలో 43 భారీ పరిశ్రమల స్థాపనకై ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉండగా, వీటి ద్వారా రూ.2,81,760 కోట్ల పెట్టుబడితో పాటు 1,46,673 మందికి ఉపాధి కల్పనకు అవకాశాలు ఉన్నాయన్నారు. ●2024 అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 196 పరిశ్రమలకు గాను 176 పరిశ్రమలను తనిఖీలు చేశామని కలెక్టర్ వివరించారు. తనిఖీలలో వివిధ శాఖల అధికారులు ఆ పరిశ్రమలకు 485 పనితీరు మెరుగుదల సూచనలు ఇచ్చారన్నారు. ఈ సమావేశంలో వయోజన విద్య శాఖ ఉమ్మడి విశాఖ జిల్లా ఉప సంచాలకుడు ఎస్.ఎస్.వర్మ, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పి.కె.పి.ప్రసాద్, ఏపీఐఐసీ జెడ్ఎం నరసింహారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ముకుందరావు, జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా సమన్వయ అధికారి చిన్ని కృష్ణ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి నారాయణమూర్తి, డీఈవో జి.అప్పారావునాయుడు, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా, ఐసీడీఎస్ పీడీలు శచిదేవి, పూర్ణిమ దేవి, ఎన్.సరోజినీ, సూర్యకుమారి పాల్గొన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం విద్యాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విదార్థులకు విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో డిజిటల్ క్లాస్ రూంల వినియోగం పెరగాలని, ఉపాధ్యాయుల ఈ–హాజరు పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో జి.అప్పారావునాయుడు, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, 24 మండలాల ఎంఈవోలు పాల్గొన్నారు. -
జ్వరాలతో మరణిస్తున్నా పట్టించుకోరా..!
● గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి ● నాతవరం పీహెచ్సీలో రెగ్యులర్ వైద్యులను నియమించాలి ● సీపీఐ మండల కార్యదర్శి చిన్నయ్యనాయుడు నాతవరం: గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతూ మరణిస్తున్నా కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం దారుణమని మండల సీపీఐ కార్యదర్శి అంకంరెడ్డి చిన్నయ్యనాయుడు అన్నారు. ఆయన మండలంలో మంగళవారం పి.జగ్గంపేట, కొండధర్మవరం పి.కె.గూడెం, గునుపూడి నాతవరం గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు, అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో జ్వరాలు నియంత్రించాలంటే స్పీకరు అయ్యన్నపాత్రుడు దృష్టి సారించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మూడు నెలలుగా మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జ్వరాలతో ప్రజలు బాధలు పడుతున్నారన్నారు. ఇటీవల పి.జగ్గంపేట గ్రామంలో ఇద్దరు వ్యక్తులు జ్వరాలతో బాధపడుతూ మరణించారన్నారు. మరో ముగ్గురు పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. మండలం అంతా జ్వరాలతో అల్లాడిపోతుంటే నాతవరం పీహెచ్సీలో వైద్యులు లేరన్నారు. గతంలో ఇక్కడ పనిచేసే ఇద్దరు వైద్యులు వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోయారన్నారు. పీహెచ్సీలో రెగ్యులర్ వైద్యులను నియమించి గ్రామాల్లో యుద్ధప్రతిపదికన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. మండలంలో పరిస్థితులపై మా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఆందోళన చేస్తామన్నారు. -
మాజీ సీఎం జగన్ను కలిసిన బూడి
మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని కలిసిన మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఈర్లె అనురాధ దేవరాపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ముత్యాలనాయుడు పాల్గొన్నారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని ఈర్లె అనురాధతో కలిసి ఆయన ప్రత్యేకంగా కలిశారు. -
మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్త పెను సమస్య
● జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్రబీచ్రోడ్డు(విశాఖ): మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారుతోందని, ఇది చాలా విచారకరమని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం, ఏటీఎస్ఏసీ ఇండియా సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, హెల్ప్ స్వచ్ఛంధ సంస్థ, ఆంధ్రప్రదేశ్ సీఐడీ, పలు సంస్థల సమన్వయంతో రూపొందించిన ‘మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరం – ఈ దోపిడీని అంతం చేయండి’ పోస్టర్ను మంగళవారం సిరిపురంలోని జెడ్పీ చైర్మన్ క్యాంప్ ఆఫీసులో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా అక్రమ రవాణాలో పిల్లలు, మహిళలు, పేదవారు, నిరక్షరాస్యులు బాధితులుగా మారుతుండటం బాధాకరమన్నారు. చక్కని జీవితం, ఉద్యోగం, పెళ్లి పేరుతో నమ్మించి..వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాతో పాటు బాలికల అక్రమ రవాణా వ్యవస్థను రూపుమాపేందుకు తమ ఫోరం ప్రభుత్వంలోని వివిధ శాఖలతో పాటు ఈ అంశంపై పోరాటాలు చేస్తున్న రాష్ట్రంలోని 16 ప్రభుత్వేతర (ఎన్జీఓ) సంస్థలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం ప్రతినిధులు కె. ఎల్లయ్య, బి. లవకుశ, ఎం. ప్రవీణా త్రినాథ్, బి. లక్ష్మణరావు, బొడ్డేపల్లి సురేష్, ఎం. హరీష్ కుమార్ పాల్గొన్నారు. -
స్పెషల్ ఒలింపిక్ క్రీడా పోటీల్లో ప్రతిభ
రావికమతం: జాతీయ స్థాయి దివ్యాంగుల స్పెషల్ ఒలింపిక్ భారత్ బోసి బాల్ క్రీడా పోటీల్లో రావికమతం మండలం కేబీపీ అగ్రహారానికి చెందిన నక్కరాజు బాల సరస్వతి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. మానసిక విద్యార్థుల జాతీయ స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్ క్రీడా ఛాంపియన్షిప్ –2025 పోటీలు ఈ నెల 24 నుంచి 28 వరకూ చత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లోని అటల్ బిహారీ వాజ్పేయి యూనివర్శిటీ స్టేడియంలో జరిగాయి. బోసి బాల్ గేమ్ పోటీల్లో దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మేధో, నాడీ సంబంధిత వైక్యల్యం కలిగిన బాలురు, బాలికలు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్రం నుంచి ఆరుగురు బాలురు, బాలికలు పాల్గొనగా వారంతా పతకాలు సాధించారు. వారిలో రావికమతం మండలం కేపీబీ అగ్రహారానికి చెందిన బాల సరస్వతి ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహించి బోసి బాల్ గేమ్ వ్యక్తిగత విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. స్పెషల్ ఒలింపిక్ భారత్ జనరల్ సెక్రటరీ డాక్టర్ రాజశేఖర్, ఏరియా జనరల్ మేనేజర్ ప్రమోద్ తివారి, బిలాస్పూర్ అటల్ బీహారీ వాజ్పాయ్ యూనివర్శిటీ వైస్ చాన్స్లార్ చేతుల మీదుగా బాల సరస్వతి పతకం మెరిట్ సర్టిఫికెట్ను అందుకుంది. జాతీయ స్థాయిలో జరిగిన బోసి గేమ్లో ఏపీ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆరుగురు క్రీడాకారులకు కోచ్గా రావికమతం మండలం మేడివాడ జెడ్పీ హైస్కూల్ స్కూల్ ఆసిస్టెంట్, ప్రత్యేక ఉపాధ్యాయులు మహాక్ష్మినాయుడు కోచ్గా వ్యవహరించారు. బోసి బాల్ గేమ్ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి నాలుగో స్థానంలో నిలిచిన బాల సరస్వతిని కోచ్ మహాక్ష్మినాయుడును, జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నాయుక్, సహిత విద్యా సమన్వయ అధికారి రామకృష్ణ నాయుడు మంగళవారం అభినందించారు. -
ఓవర్ లోడుతో వెళ్తున్న లారీలను అడ్డగించిన స్పీకర్
అధిక లోడ్తో ఉన్న లారీలు నర్సీపట్నం: ఓవర్ లోడుతో వెళ్తున్న లారీలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా ఆపి పోలీసులకు అప్పగించారు. మంగళవారం స్పీకర్ విశాఖ నుంచి నర్సీపట్నం వస్తుండగా.. మాకవరపాలెం మండలం, రాజుపేట వద్దకు వచ్చే సరికి ఓవర్లోడ్తో వెళ్తున్న టిప్పర్లను గమనించారు. లారీలను నిలిపి.. అధిక లోడ్కు ఎవరు పర్మిషన్ ఇచ్చారని వాహనదారులను నిలదీశారు. ఆ లారీలను పోలీసు స్టేషన్లో పెట్టాలని స్పీకర్ పోలీసులను ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలతో ఎస్సై దామోదర్నాయుడు ఏడు లారీలను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించారు. -
రెవెన్యూ శాఖలో దళారుల రాజ్యం
నక్కపల్లి: రెవెన్యూ శాఖ పనితీరుపై కూటమి పార్టీలకు చెందిన ఎంపీటీసీలు ఆరోపణలు గుప్పించారు. బ్రోకర్ల ద్వారానే పనులు జరుగుతున్నాయని, తహసీల్దార్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయంటూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం నక్కపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చెందిన కాగిత ఎంపీటీసీ ఆకేటి గోవిందరావు, టీడీపీకి చెందిన డీఎల్ పురం ఎంపీటీసీ కొండ్ర కనకారావు తదితరులు మాట్లాడుతూ రెవెన్యూ కార్యాలయంలో ఏ పని జరగాలన్నా బ్రోకర్లను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. సాయంత్రం అయ్యేటప్పటికీ తహసీల్దార్ కార్యాలయం బ్రోకర్లతో నిండిపోతోందన్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులే తమ ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూ శాఖపై ఆరోపణాస్త్రాలు సంధించడంతో మిగిలిన ప్రతిపక్ష సభ్యులు విస్తుపోయారు. కీలకమైన రెవెన్యూ శాఖ పని తీరు ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ నిలదీశారు. తక్షణమే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలన్నారు. అనధికార వ్యక్తులు కార్యాలయాల్లో తిష్టవేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వీఆర్వోలు గ్రామాల్లో అందుబాటులో ఉండటం లేదని, సచివాలయాలకు వెళ్తే తాము తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్నామని సమాధానం చెబుతున్నారన్నారు. అక్కడకు వెళ్లినా కనిపించడం లేదన్నారు. ఈ అంశాలపై మండల సమావేశంలో తీర్మానం చేసి కలెక్టర్కు పంపించాలని డిమాండ్ చేశారు. వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. గ్రామాల్లో తాగునీరు సరఫరా కావడం లేదన్నారు. కాగితలో 15 రోజుల నుంచి తాగునీరు సరఫరా కావడం లేదని సర్పంచ్ పోతం శెట్టి రాజేష్ ఫిర్యాదు చేశారు. ఉద్డండపురంలో చెత్తను వేసేందుకు స్థలం కొరత ఉందని, డంపింగ్ యార్డ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సర్పంచ్ వెంకటేష్ కోరారు. ప్రతి సమావేశానికి మండల స్థాయి అధికారులు రావడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వేంపాడు ఎంపీటీసీ కుంచ మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన అంశాలను తీర్మానం చేసి తదుపరి చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు పంపిస్తామని ఎంపీపీ రత్నం తెలిపారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో సీతారామరాజు, జెడ్పీటీసీ సభ్యుడు గోసల కాసులమ్మ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ, డిప్యూటీ ఎంపీడీవో చలపతిరావు, డిప్యూటీ తహసీల్దార్ నారాయణరావు, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్లు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఏజెంట్ల ద్వారానే పనులు అవినీతికి అడ్డాగా తహసీల్దార్ కార్యాలయాలు నక్కపల్లి మండల సమావేశంలో కూటమి ఎంపీటీసీలు ధ్వజం -
దళిత రైతుల ఆందోళన స్పీకర్కు పట్టదా?
నర్సీపట్నం: రాళ్ల క్వారీని రద్దు చేయాలని ఆర్డీవో కార్యాలయం వద్ద మాకవరపాలెం మండలం జి.కోడూరు, సుభద్రయ్యపాలెం దళిత రైతులు చేస్తున్న నిరాహార దీక్ష మంగళవారానికి ఏడో రోజుకు చేరింది. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బి.పరంజ్యోతి విచ్చేసి దళిత రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా నియోజవర్గ ఎమ్మెల్యే, స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, అధికారులకు పట్టదా? అని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు చేయించి క్వారీని రద్దు చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే కొత్తవారికి క్వారీ లీజుకివ్వడం దారుణమన్నారు. ఓట్లు వేసి గెలిపించిన బహుజన వర్గాలకు చెందిన భూములకు అన్యాయం జరుగుతుంటే కనీసం స్పీకర్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ క్వారీ అనుమతులు రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రశ్నిస్తే మైనింగ్ చేస్తున్న బంగార్రాజు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర నాయకుడు బొట్టా నాగరాజు, ఐబీఎస్పీ రాష్ట్ర మహిళా కన్వీనర్ లక్ష్మి, జిల్లా మహిళా నాయకురాలు తులసి, కాంగ్రెస్ నాయకులు బొంతు రమణ, కేవీపీఎస్ నాయకులు చిరంజీవి, కొల్లు గంగాధర్, సూరిబాబు, అప్పారావు, పెంటయ్య, మారేసు, దేముడు, లోవరాజు, వంశీ, శివ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గొలుగొండ: రోడ్డు ప్రమాదంలో సోమవారం అర్ధరాత్రి ఓ యువకుడు మృతి చెందాడు. చోద్యం గ్రామానికి చెందిన పైల ప్రభాకర్(33) నర్సీపట్నం నుంచి చోద్యంకు రాత్రి 11 గంటల సమయంలో బైక్పై వెళ్తుండగా పప్పుశెట్టిపాలెం మలుపు వద్ద కుక్కను ఢీకొని కింద పడిపోయాడు. ఈ ఘటనలో ప్రభాకర్ తలకు బలమైన గాయం కావడంతో ఆ సమయంలో అటుగా వెళుతున్న కొంత మంది 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి క్షతగాత్రుడిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తరలించే ప్రయత్నంలో ఏరియా ఆస్పత్రిలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొలుగొండ ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ప్రభాకర్ -
24 కిలోల గంజాయి పట్టివేత
నక్కపల్లి: మండలంలో సారిపల్లిపాలెం సమీపంలో మంగళవారం పోలీసులు 24 కిలోల గంజాయిని పట్టుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఈ మేరకు పోలీస్స్టేషన్లో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఎస్ఐ సన్నిబాబు సారిపల్లిపాలెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనకాపల్లి నుంచి తుని వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనంఫై రెండు కాలేజీ బ్యాగులను పట్టుకుని వ్యక్తి రావడాన్ని గుర్తించారు. తనిఖీ చేయగా.. ఆయన వద్ద 24 కేజీల గంజాయి బయట పడిందని డీఎస్పీ తెలిపారు. చింతపల్లి మండలం మామిడిపాలెం గ్రామానికి చెందిన సుక్రి అర్జున్, ఇతని స్నేహితుడు రోలుగుంట మండలం పెద్దపేట గ్రామానికి చెందిన కొదమ నాగరాజుతో కలసి గంజాయి వ్యాపారం చేస్తున్నారన్నారు. వీరికి గొలుగొండ మండలం కోడులపాలెం గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి రెడ్డి నర్సింహమూర్తితో పరిచయం ఏర్పడిందని చెప్పారు. నర్సింహమూర్తికి అర్జున్ గతంలో ఒడిశా నుంచి గంజాయి తెచ్చి విక్రయించేవాడన్నారు. తాజాగా నర్సింహమూర్తి ఈయనకు ఫోన్చేసి గంజాయి కావాలని, తుని హైవే రోడ్డులో అప్పగించాలని కోరడంతో రైతుల వద్ద కొనుగోలు చేసిన 24 కిలోల గంజాయిని 12 ప్యాకేట్లలో సిద్ధం చేసి తునిలో అప్పగించేందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో అర్జున్ అంగీకరించాడన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిపై విచారణ జరుగుతోందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, గంజాయి, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అర్జున్పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ ఏడాది నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సారిపల్లిపాలెం వద్ద పట్టుబడిన 840 కిలోల గంజాయి రవాణాకు సంబంధించి కేసులో అర్జున్ ప్రధాన నిందితుడని చెప్పారు. ఈ సమావేశంలో సీఐ కుమార స్వామి, ఎస్ఐ సన్నిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారుల పిల్లల కోటాలో 93 సీట్లు భర్తీ
● ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ● ఇంకా మిగిలి ఉన్న సీట్లు 27కశింకోటలోని ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ కశింకోట: ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న రాజీవ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యుత్ వినియోగదారుల పిల్లల కోటా కింద 50 శాతం సీట్ల భర్తీకి మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. 93 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 27 సీట్లు మిగిలాయి. అనకాపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఐ.వి.ఎస్.ఎస్.శ్రీనివాసరావు, జనరల్ సెక్షన్ విభాగాధిపతి కె.గోవిందరావు, కెమిస్ట్రీ సీనియర్ లెక్చరల్ శ్రీనివాసరావు అడ్మిషన్ అధికారులుగా హాజరై కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించారు. కళాశాలలో నాలుగు బ్రాంచ్లుండగా ఎలక్ట్రానిక్స్, ఎలక్టికల్ బ్రాంచ్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. సివిల్ బ్రాంచ్లో అధికంగా 20 సీట్లు, మెకానికల్ బ్రాంచ్లో 7 సీట్లు మిగిలాయి. ఈ సీట్లను ఆగస్టు 2వ తేదీలోగా భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్ తెలిపారు. ర్యాంకు లేని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదన్నారు. వార్షిక ఫీజులు వారే చెల్లించుకోవలసి ఉంటుందన్నారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రిన్సిపాల్ శివ, జనరల్ విభాగాధిపతి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తులపై ఫిర్యాదు
తాతయ్యబాబుపై పల్లాకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్యే రాజు వర్గ సభ్యులు బుచ్చెయ్యపేట: రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుపై చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు వర్గీయులు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తాతయ్యబాబు, ఎమ్మెల్యే రాజు మధ్యన గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే బుచ్చెయ్యపేట మండలంలో ఆ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరు నిర్వహించే కార్యక్రమాల్లో మరొకరు పాల్గొనడం లేదు. ఇదే విషయమై తాతయ్యబాబు గుర్రుగా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడిగా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే రాజు తీరుపై బాహాటంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజు గ్రూపు రాజకీయాలు చేస్తున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరోకి ఫిర్యాదు వెళ్లింది. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య నడుస్తున్న రాజకీయ వైరం వల్ల తాజాగా మండలంలో వడ్డాది, బుచ్చెయ్యపేట, తురకలపూడి, విజయరామరాజుపేట, పొట్టిదొరపాలెం, బంగారుమెట్ట ఆరు కోఆపరేటివ్ సొసైటీల పర్సన్ ఇన్చార్జుల నియామకాలు నిలిచిపోయాయి. దీనిపై ఎమ్మెల్యే రాజు వర్గానికి చెందిన కొంతమంది నాయకులు మంగళవారం గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని కలిశారు. తాతయ్యబాబే గ్రూపు రాజకీయాలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. -
ఖరీఫ్ సాగుకు రైవాడ నీరు విడుదల
దేవరాపల్లి: ఖరీఫ్ పంటల కోసం రైవాడ జలాశయం నుంచి సాగునీటిని మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కె.ఎస్.ఎన్.ఎస్. రాజు మంగళవారం విడుదల చేశారు. ముందుగా రైవాడ అతిథి గృహం వద్ద వినాయకుడికి, జలాశయం వద్ద ఎరకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జలాశయం వద్ద వేదమంత్రాల నడుమ పూజలు, గంగా హారతి అనంతరం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఎడమ ప్రధాన కాలువ నుంచి 100 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ నుంచి 50 క్యూసెక్కుల నీటిని విడిచి పెట్టారు. కార్యక్రమంలో రైవాడ జలాశయం చైర్మన్ పోతల పాత్రునాయుడు, పైలా ప్రసాదరావు, ఇరిగేషన్ ఈఈ త్రినాథం, డీఈఈ జి. సత్యంనాయుడు, తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, నీటి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
గోతుల రోడ్లు కనిపించడం లేదా?
● వాటిపై తిరగండి ప్రజల కష్టాలు తెలుస్తాయి ● పారిశుధ్యం మెరుగుపర్చకపోతే చర్యలు తప్పవు ● ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులపై కలెక్టర్ విజయ కృష్ణన్ ఆగ్రహం ● వడ్డాది, ముకుందపురం గ్రామాల్లో సుడిగాలి పర్యటన బుచ్చెయ్యపేట/మాడుగుల రూరల్: ‘గోతుల రోడ్లు మీకు కనిపించడం లేదా? రెండు రోజులు వాటిపై తిరగండి ప్రజల కష్టాలు తెలుస్తాయి’ అంటూ కలెక్టర్ విజయ కృష్ణన్ ఆర్అండ్బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె బుచ్చెయ్యపేట, మాడుగుల మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో పారిశుధ్య పనులు పరిశీలించి అనంతరం పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రజలు రోడ్డెక్కి రహదారి బాగు చేయాలని గోల చేస్తున్నారు, నిధులున్నా ఎందుకు పనులు చేయడం లేదని ఆర్అండ్బీ ఈఈ సాంబశివరావు, డీఈ విద్యాసాగర్, సబ్ కాంట్రాక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. వడ్డాదిలో పారశుధ్య పనులు సక్రమంగా చేయకపోవడంపై ఎంపీడీవో భానోజీరావు, మండల పంచాయతీ అధికారి విజయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ ఈశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల వివరాలు సచివాలయ సిబ్బందిని అడగ్గా నీళ్లు నమిలారు. డేటా లేకుండా సమావేశానికి ఎందుకొచ్చారని, ప్రజల పనులంటే చులకనగా ఉందా అంటూ మండిపడ్డారు. వారం రోజుల్లో మరలా వస్తాను, సంక్రమంగా విధులు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వడ్డాదిలో తాగు నీటిపైన, విశాఖ డెయిరీ పాలకేంద్రం వద్ద కలుషిత నీరు వదిలేయడంపైన, డ్రైనేజీలు సరిగా తీయకపోవడంపైన, నకిలీ విత్తనాలు అమ్మకంపై స్థానికులు దొండా నారాయణమూర్తి, బొబ్బాది రాజు, దొండా రమేష్, కోరుకొండ రమణ, సోమేష్ తదితరులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై సంబంధిత అధికారులకు సూచించి పనులు పరిశీలించాలని ఆదేశించారు. వారం రోజుల్లో మళ్లీ వస్తా... మాడుగుల మండలం ముకుందపురంలో ఐదు రోజుల్లో పారిశుధ్యం మెరుగుపర్చకపోతే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ విజయ కృష్ణన్ హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఆమె అధికారులతో కలిసి ఇక్కడ పారిశుధ్య పనులు పరిశీలించారు. వారం రోజుల్లో మరలా గ్రామాన్ని సందర్శిస్తానని పారిశుధ్యం మెరుగుపర్చకపోతే కార్యదర్శి, ఇతర సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక మహిళలుతో మాట్లాడారు. డ్రైనేజీల్లో చెత్తా చెదరాలు వేయొద్దని, పరిసరాలు పరిశుభ్రతతో రోగాలు దరి చేరవని సూచించారు. భూ సమస్య గురించి సర్పంచ్ కర్రి గణేష్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీపీవో ఇ. సందీప్, డీపీఆర్సీ జిల్లా సమన్వయకర్త ఇ. నాగలక్ష్మి, ఉపాధి హామీ పథకం ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీవో అప్పారావు, తహసీల్దార్లు లక్ష్మి, రమాదేవి, ఏపీవో వరహాలబాబు, ఏవోలు భాస్కరరావు, ఎం. అనసూయ, ఎంపీటీసీ సభ్యురాలు దండి నాగరత్నం, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగమల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
నష్టభయం
● రైతు సేవా కేంద్రాల్లో నాసిరకమైన విత్తనాలు ● 15 రోజులైనా మొలకెత్తకపోవడంతో అన్నదాతల ఆవేదన ● విత్తనాల్లో పొల్లు, కేళీలు.. సగానికి పైగా వృథా ● ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతులు నాసిరకం.. సాక్షి, అనకాపల్లి: ఒకరు కాదు..ఇద్దరు కాదు చాలా మంది రైతులు రైతు సేవా కేంద్రాల్లో వరి విత్తనాలు తీసుకుని వరి నారు నాటకపోవడంతో మోసపోతున్నారు. ప్రభుత్వం వీటిపై శ్రద్ధ చూపించకపోవడంతోనే ఇలా జరుగుతోందంటూ రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందుగా రావడంతో అన్నదాతలు ఆనందపడ్డారు. రైతు సేవా కేంద్రాల్లో వరి విత్తనాలు తీసు కుని నారు మడులు సిద్ధం చేశారు. వరి విత్తనాలు వేశారు. అయితే వర్షాలు అనుకూలించినా సరే నాణ్యమైన విత్తనాలు రాకపోవడంతో అవి మొలకలు రాక ఖరీఫ్ కష్టాలు ఆదిలోనే ప్రారంభమయ్యాయి. రైతు సేవా కేంద్రంలో విక్రయించే వరి విత్తనాల్లో మొలక శాతాన్ని పరీక్షించకుండా నేరుగా రైతులకు విక్రయించారు. ఇప్పటికే వర్షాలు సరిగా లేక వరి ఆకుపోతలు ఆలస్యమయ్యాయి. ఇపుడు నాసిరకం వరి విత్తనాల కారణంగా వరినారు నాటకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. రైతుకు నాసిరకం విత్తనాలు సరఫరా చేసిన వారిపై వ్యవసాయ శాఖ అధికారులు చర్య లు తీసుకోవాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అగ్రి ల్యాబ్స్ నిర్వీర్యం విత్తనం మంచిదైతే పంట బావుంటుంది. పంట బావుంటే దిగుబడిపై దిగులుండదు. ఆశించిన దిగుబడులు సాధించాలంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపోకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అగ్రి ల్యాబ్స్ను తీసుకొచ్చింది. నాసిరకం, పొల్లు, కేళీ లేకుండా విత్తనాలు అగ్రిల్యాబ్లో పరీక్షించి నాణ్యమైన విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైఎస్సార్ అగ్రి ల్యాబ్లను నిర్వీర్యం చేసింది. దీంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘాల నాయకులు వాపోతున్నారు. జిల్లాలో విత్తనాల వివరాలు ఇలా.. అందులో వరి విత్తనాలు 22 వేల క్వింటాళ్లు ఇప్పటి వరకు పంపిణీ చేసినవి సుమారు 16.5 వేలు సిద్ధం చేసిన మొత్తం విత్తనాలు 23 వేల క్వింటాళ్లు -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మెరిసిన నాగజ్యోతి
రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తలపడుతున్న ఉపాధ్యాయిని నాగజ్యోతి రోలుగుంట: రోలుగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో ఈ నెల 26, 27 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. అమరావతి పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఆమె వివిధ విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించారు. సబ్ జూనియర్, జూనియర్ విభాగాలుగా నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. 74 కిలోల మాస్టర్స్ విభాగంలో స్కౌట్, బెంచ్ ప్రెస్, డెడ్లిఫ్ట్ విభాగాల్లో విజేతగా నిలిచిన నాగజ్యోతికి ఏఎంసీ డైరెక్టర్ దుగ్గిరాల, ఎంపీటీసీ మధుబాబు మూడు బంగారు పతకాలు ప్రదానం చేశారు. -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
పాయకరావుపేట : ఈ నెల 25 నుండి 27 వరకు వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్, కరీంనగర్ తెలంగాణాలో జరిగిన సీబీఎస్ఈ క్లసర్ – 7 కబడ్డీ పోటీల్లో అండర్ – 14, అండర్ – 19 విభాగాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించి, ఒక్కో జట్టు రూ.10 వేలు నగదు బహుమతిని పొందడమే కాకుండా సెప్టెంబరు 13 నుండి 16 వరకు నారాయణ వరల్డ్ స్కూల్, జముహార్, బీహార్లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా సీబీఎస్ఈ క్లస్టర్ –7 కబడ్డీ పోటీల్లో అండర్ –19 విభాగంలో శ్రీ ప్రకాష్ విద్యార్థులు బంగారు పతకాలు సాధించి ప్రథమ స్థానంలో నిలుస్తున్నారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ ఎం.అపర్ణ, కోచ్ లక్ష్మణ్, చినరాజు అభినందించారు. -
గంజాయి వ్యాపారులపై పోలీసుల దాడి
● కేసు నమోదు, ముగ్గురు అరెస్ట్ ● 60 కిలోల గంజాయి స్వాధీనం, ఒక ఆటో రెండు మొబైల్ ఫోన్లు సీజ్ రోలుగుంట : మండలంలో గంజాయి వ్యాపారం చేస్తున్న రూట్లలో స్థానిక ఎస్ఐ రామకృష్ణారావు సిబ్బందితో కలసి కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దాడి చేశారు. ఈ దాడిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలించడానికి వినియోగించిన ఆటోను సీజ్ చేశారు. మూడు బస్తాల్లో ఉన్న 60 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి. నిందితులు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం మడిమబంద గ్రామానికి చెందిన వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి రత్నంపేటలో జీడితోటలో దాచారు. అక్కడ నుంచి ఆదివారం ఆటోలో గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పోలీసు దాడుల్లో పట్టుబడ్డారు. ఆటోలో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటోని సోదా చేసి మూడు బస్తాల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రోలుగుంట మండలం రత్నంపేట గ్రామానికి చెందిన ఊడి రమణబాబు(25) (ఇతనిపై పాత కేసు ఉంది), ఆర్లి శ్రీను(29) (ఇతనిపై నాలుగు గంజాయి కేసులు ఉన్నాయి), అల్లూరి జిల్లా చింతపల్లి మండలానికి చెంది మడిమబంద గ్రామానికి చెందిన కొర్రా సూరిబాబు(53) ఉన్నారు. నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండుకు తరలించినట్టు ఎస్ఐ విలేకరులకు తెలిపారు. -
కలెక్టర్ కరుణించాలి..
పుట్టుకతోనే 90 శాతం వైకల్యం కలిగి అనేక ఇబ్బందులతో పోషించుకుంటున్న బిడ్డకు రూ.15 వేల ప్రభుత్వ పించన్ మంజూరు చేయాలని ఏడాది కాలంగా తిరుగుతున్నా అధికారులు జాలి చూపడం లేదని మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన బాలుడు పొట్ల తులసీరావు తల్లిదండ్రులు అప్పారావు దంపతులు ఆవేదన చెందారు. వ్యయప్రయాసలతో ఇంటి నుంచి బిడ్డను మోసుకొస్తున్నా కనికరించడం లేదన్నారు. ఏడాది కాలంలో మూడుసార్లు కలెక్టరేట్కు వచ్చామని, కలెక్టర్ వద్దకు నేరుగా వెళ్లనివ్వకుండా కింద నుంచే పంపించేస్తున్నారని వాపోయారు. కలెక్టర్కు బిడ్డ తండ్రి అప్పారావు అర్జీ అందించారు. మానసిక వైకల్యం ఉన్నట్టు సర్టిఫికెట్లో ఉన్నందున 15 వేల పింఛన్ రాదని చెబుతున్నారని, తమ బిడ్డ దయనీయ స్థితిని చూసైనా కలెక్టర్ కరుణించాలని వారు వేడుకుంటున్నారు. -
స్పీకర్ జోక్యం చేసుకోవాలని డప్పులతో నిరసన
● క్వారీ అనుమతులు రద్దు చేయాలని నిరసనకారుల డిమాండ్ నర్సీపట్నం: మాకవరపాలెం మండలం జి.కోడూరు నల్లరాయి క్వారీ అనుమతులు రద్దు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ క్వారీ బాధితులు చేపట్టిన దీక్షలకు సోమవారం సీపీఎం నాయకులు మద్దతు పలికారు. వినూత్న రీతిలో వంటా వార్పుతోపాటు డప్పులు వాయిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల భూముల్లో క్వారీని వెంటనే రద్దు చేయాలన్నారు. బాధితులు వారం రోజులుగా నిరాహారదీక్షలు చేస్తున్నా, ఆర్డీవో కానీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారన్నారు. నియోజకవర్గం మైనింగ్ మాఫియా చేతుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఎస్పీ రాష్ట్ర కమిటీ మెంబరు బొట్టా నాగరాజు మాట్లాడుతూ దళితుల ప్రాణాలు, భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందన్నారు. సమస్యను పట్టించుకోకపోతే బీఎస్పీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని బాధితులకు అండగా నిలిచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతు రమణ, సీపీఎం నాయకులు చిరంజీవి, బహుజన్ నాయకులు మట్ల చంటిబాబు, బాధిత రైతులు అప్పారావు, పెంటయ్య, గణేష్, సత్తిబాబు, సతీష్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
అన్నదాతల ధర్మాగ్రహం
నక్కపల్లి: తీసుకున్న భూములకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించకుండా, అదనంగా వేలాది ఎకరాల భూములు సేకరించేందుకు పూనుకున్న కూటమి ప్రభుత్వ వైఖరిపై తాడోపేడో తేల్చుకునేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. గతంలో ఇచ్చిన మాట తప్పి ప్యాకేజీ ఎగ్టొట్టే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు సర్కారు వైఖరిని నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. సోమవారం చందనాడ, అమలాపురం, పాటిమీద, మూలపర, తమ్మయ్యపేట, బోయపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులంతా భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రం నక్కపల్లి చేరుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు వంటా వార్పు నిర్వహించారు. అక్కడే భోజనాలు చేసి సాయంత్రం వరకు ఆందోళన నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడించి కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లిస్తామని నమ్మబలికి 2014లో భూసేకరణ చేశారన్నారు. అప్పట్లో చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనితలను నమ్మి రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్నారు. కేవలం పరిహారం మాత్రమే చెల్లించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళనకు నాయకత్వం వహించిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు ఎం.అప్పలరాజు, సర్పంచ్ తళ్ల భార్గవ్, ఎంపిటీసీ సభ్యుడు గంటా తిరుపతిరావు, వైఎస్సార్సీపీ జిల్లా గ్రీవెన్స్ విబాగం అధ్యక్షుడు సూరాకాసుల గోవిందు ఆరోపించారు. ఇప్పుడు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.8.90 లక్షలు చెల్లిస్తామని చెబుతున్నారన్నారని, ఇది ఏ మూలకు సరిపోదన్నారు. భూములు స్వాధీనం చేసుకున్న సమయానికి నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లుగా ఉన్న ఆడ, మగవారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. కూటమి పెద్దల కోసమే అదనపు భూసేకరణ ఇప్పటికే మండలంలో 4500 ఎకరాలు సేకరించి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం.. అదనంగా కాగిత, నెల్లిపూడి, వేంపాడు డీఎల్ పురాల్లో 2500 ఎకరాలు, సిహెచ్ఎల్ పురం, జానకయ్యపేట, పెదతీనార్ల, గుర్రాజు పేటలలో 790 ఎకరాలు అదనంగా తీసుకునేందుకు నిర్ణయించిందన్నారు. రైతుల ఆమోదం లేకుండా పత్రికల్లో 6 ఏ ప్రకటన విడుదల చేసిందన్నారు. కూటమిలో భాగస్వాములుగా ఉన్న రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు అదనంగా భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. పేదల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం అనంతరం తహసీల్దార్ నర్సింహమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు అయినంపూడి మణిరాజు, రైతులు తళ్ల అప్పలస్వామి, తాతారావు, వంకా కృష్ణ, శంకరశెట్టి చిన్నా, రామలక్ష్మి, చిన్నమ్మలు, చంటమ్మ, మనబాల రాజేష్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. గత్యంతరం లేక రోడ్డెక్కాం కంపెనీల కోసం భూములు, ఇళ్లు త్యాగం చేశాం. ఊరు ఖాళీ చేసి వేరొక చోటకు వెళ్లి బతకడం అంటే గుండె చెరువైపోతోంది. సర్వం కోల్పోయిన మాకు ప్రభుత్వం అరకొరగా పరిహారం ఇవ్వడం ఎంతవరకు సమంజసం. ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించమని ఏడాది నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గత్యంతరం లేక రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. –సూరాకాసుల రామలక్ష్మి, మూలపర ఊరు వదిలి పొమ్మంటున్నారు అప్పట్లో భూములు తీసుకు నేటప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నా రు. పిల్లలు చిన్నవయసులో ఉన్నప్పుడు భూములు ఇచ్చేశాం. పదేళ్లయింది. ఎన్నో మార్పులు జరిగాయి. ధరలు పెరిగాయి. ఇవే భూములను నమ్ముకుని జీవించాలి. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలి. ఇప్పుడు డబ్బులు తక్కువ ఇత్తామంటున్నారు. ఊరు ఖాళీ చేసి ఇంకో దగ్గరకు పొమ్మంటున్నారు. –పెంటకోట చిన్నమ్మలు, అమలాపురం తీసుకున్న భూములకు ప్యాకేజీ ఇవ్వలేదు కొత్తగా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ మాట తప్పిన చంద్రబాబు సర్కారు వంట, వార్పుతో నిరసన తెలిపిన నిర్వాసితులు, రైతులు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి -
బ్రిటిష్ సమాధుల స్ధలాన్ని పరిరక్షించండి
● ఆక్రమణలపై స్పీకర్ నోరు విప్పాలి ● సీపీఎం నాయకుల డిమాండ్ అక్రమ నిర్మాణాలను పరిశీలిస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, నాయకులు నర్సీపట్నం: బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధికారులను డిమాండ్ చేశారు. సీపీఎం బృందం ఈ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి పరిణామం జరగడం బాధాకరమన్నారు. స్పీకర్ నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అల్లూరి స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి చిహ్నంగా ఉన్న బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్రిటిష్ సమాధుల స్థలాన్ని ఆక్రమించేసి, నిర్మాణాలు చేపడుతుంటే కాపాడాల్సిన రెవెన్యూ, మున్సిపల్, పురావస్తుశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ నిర్మాణాలకు రెవెన్యూ, టౌన్ప్లానింగ్ అనుమతులు ఉన్నాయా..? ఉంటే అనుమతులు ఎవరు ఇచ్చారో స్పష్టం చేయాలన్నారు. దోషులపై చర్యలు తీసుకోవాలన డిమాండ్ చేశారు. ఆక్రమణలను పరిశీలించిన వారులో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు, సీనియర్ నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, ఈరెల్లి చిరంజీవి తదితరులు ఉన్నారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక
● జిల్లా స్థాయిలో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చోడవరం క్రీడాకారుల ఎంపిక చోడవరం : రాష్ట్రస్థాయి యోగా పోటీలకు చోడవరం క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల పరవాడ మండలంలో జరిగిన జిల్లా స్థాయి యోగాసనాల పోటీల్లో చోడవరానికి చెందిన ఒమ్మి శ్యామ్ప్రసాద్ యాదవ్, గొంతిన లయవర్థన్, పందిరి వెన్నెశ్రీ, మళ్ల శ్రీహిత, పుల్లేటి సతీష్ బంగారు పతకాలు సాధించారు. వీరు ఆగస్టు నెలలో కాకినాడలో జరగనున్న రాష్ట్రస్థాయి యోగాసనాల పోటీల్లో అనకాపల్లి జిల్లా నుంచి పాల్గొనేందుకు ఎంపికై నట్టు యోగా గురువు పుల్లేటి సతీష్ చెప్పారు. పతకాలు సాధించిన క్రీడాకారులను చోడవరం పతంజలి యోగా కేంద్రం ప్రతినిధులు అభినందించారు. -
కుట్టు శిక్షణ.. ప్రభుత్వ సొమ్ము భక్షణ
● కనీస సౌకర్యాల్లేని భవనాల్లో తూతూ మంత్రంగా శిక్షణ ● కొన్ని చోట్ల ఇరుకు గదులు, శిథిల భవనాల్లో ఏర్పాటు ● తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం లేక అవస్థలు ● ప్రభుత్వ నిధులతో ప్రైవేటు ఏజెన్సీల దోపిడీ పర్వం దేవరాపల్లి: మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకుల పాలిట వరంగా మారాయి. ఈ కేంద్రాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఆ సంస్థలు మొక్కుబడిగా కొనసాగిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కర్డ్ (సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్), సేఫ్ (సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్) ప్రైవేట్ సంస్థలు మహిళలకు శిక్షణిస్తున్నాయి. మూడు నెలల పాటు శిక్షణతో పాటు లబ్ధిదారులకు సుమారు రూ.6 వేలు విలువ చేసే కుట్టు మిషన్ ఉచితంగా అందించాలి. ఇందుకు కోసం ప్రైవేటు సంస్థలకు ఒక్కో మహిళకు రూ.21 వేలు చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ నిధులతో విశాలమై న భవనంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉండగా ఏజెన్సీ నిర్వాహుకులు మాత్రం మండలాల్లో ఖాళీగా ఉన్న శిథిల ప్రభుత్వ భవనాల్లో కుట్టు శిక్షణ కేంద్రాలను నడిపిస్తూ ప్రభుత్వ సొమ్మును లూటీ చేస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్టుగా కుట్టు మిషన్లు లేకపోవడంతో మిగిలిన వారంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. ఇరుకు గదుల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయం కల్పించలేదు. క్లాత్ కటింగ్ కోసం టేబుల్ కూడా లేకపోవడంతో మహిళలు కటిక నేలపై కూర్చొని కట్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీన్ని బట్టి ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం కేటాయించిన మొత్తంలో సగం కూడా వెచ్చించడం లేదన్న సంగతి అర్థమవుతోంది. జిల్లాలో 19 కుట్టు శిక్షణ కేంద్రాలు అనకాపల్లి జిల్లాలో 19 చోట్ల కుట్టు శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 14 కేంద్రాలు ఖాళీగా ఉన్న ప్ర భుత్వ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, అనకాపల్లి అర్బన్, కె.కోటపాడు మండలాల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభం కాలేదు. జిల్లాలో ప్రస్తుతం 2,167 మంది ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్లుగా ఆయా కేంద్రాల్లో మహిళలు శిక్షణ పొందుతున్నారు. 40 మందికి 24 మిషన్లు దేవరాపల్లి మండలంలో శిథిలావస్థలో ఉన్న పాత ఎంపీడీవో భవనంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ భవనం చిన్నపాటి వర్షానికే స్లాబ్ కారిపోతోంది. దీంతో మిషన్లు, సామగ్రి తడిసిపోతున్నాయి. కుట్టు శిక్షణకు హాజరయ్యే 40 మంది మహిళలకు ఒక్కటే మరుగుదొడ్డి ఉంది. కొన్ని ఫ్యాన్లు సైతం పని చేయకపోవడంతో ఉక్కపోతతో మహిళలు అవస్థలు పడుతున్నారు. బ్యాచ్కు 40 మంది చొప్పున హాజరవుతుండగా.. 24 మిషన్లు ఏర్పాటు చేశారు. మాడుగుల, చీడికాడ మండలాల్లోని సచివాలయ భవనాల్లో కుట్టు శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దేవరాపల్లి కేంద్రం త్వరలో మార్పు జిల్లాలో 19 కుట్టు శిక్షణ కేంద్రాల్లో 2,167 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. వీటిలో 14 కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. ఆరు కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది. దేవరాపల్లిలో కుట్టు శిక్షణ కేంద్రం సమస్య తమ దృష్టికి వచ్చింది. శిథిలమైన ప్రభుత్వ భవనంలో నుంచి మరో చోటకు మార్పు చేయాలని సంస్థ నిర్వాహుకులకు సూచించాం. రెండు, మూడు రోజుల్లో వేరొక చోటుకు మార్పు చేసేలా చర్యలు తీసుకుంటాం. – జి.పెంటోజీరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బీసీ కార్పొరేషన్, అనకాపల్లి జిల్లా వేధిస్తున్న మరుగుదొడ్డి సమస్య కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్న భవనంలో మరుగుదొడ్డి సమస్య వేధిస్తోంది. ఉదయం, మధ్యాహ్నం సుమారు 30 మందికి పైబడి మహిళలు హాజరవుతుండగా ఒకే మరుగుదొడ్డి ఉంది. అధికారులు తమ సమస్యలపై దృష్టి సారించాలి. – కోట్ని సాయికుమారి, ఎ.కొత్తపల్లి రవాణా చార్జీలు ఇవ్వాలి కుట్టు శిక్షణ కోసం సుమారు 12 కిలోమీటర్ల మేర రోజూ రాకపోకలు సాగిస్తున్నాం. ఇందు కోసం రోజుకు రూ.150 వరకు రవాణా ఇతరాత్ర ఖర్చులు అవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి దూర ప్రాంతాల నుంచి వచ్చే తమలాంటి వారికి రవాణా ఖర్చులు అందించాలి. ప్రస్తుతం శిక్షణిస్తున్న భవనం ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నాం. – తంగేటి సుగుణ, ఎన్.గజపతినగరం -
ఆరోగ్యం కోసం నిత్య వ్యాయామం
● అంతర్జాతీయ బాడీ బిల్డర్, టీమ్ ఇండియా కోచ్ శివశంకర్ అనకాపల్లి: యువత చెడుమార్గాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా కోసం నిత్యం వ్యాయామం చేయాలని అంతర్జాతీయ బాడీ బిల్డర్, టీమ్ ఇండియా కోచ్ టి.శివశంకర్ తెలిపారు. స్థానిక రింగ్రోడ్డు డాక్టర్ హిమశేఖర్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో అనకాపల్లి బాడీ బిల్డర్స్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువతకు బాడీ బిల్డింగ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ద్వారా ఆరోగ్యంగా జీవించడమే కాకుండా శరీర ఆకృతిని పెంచుకోవచ్చన్నారు. అసోసియేషన్ కార్యదర్శి శిలపరశెట్టి బాబీ మాట్లాడుతూ యువత మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూ జిమ్కు వెళ్లాలన్నారు. బాడీ బిల్డింగ్ క్రీడ వల్ల మనం ఫిట్గా ఉండటమే కాకుండా సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఒలింపిక్ వెయిట్ లిఫ్టర్ మళ్ల వెంకట మాణిక్యాలు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే విద్యతోపాటు క్రీడల్లోనూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు అమరపల్లి కృష్ణాజీ, విశాఖ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ దండా కుసుమలు మాట్లాడుతూ క్రీడలతో ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం శివశంకర్ను అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీధర్, ఎన్సీసీ అధికారి ధర్మలింగం అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు శ్రీను, చిన్న, ప్రసాద్, నరేంద్ర, తులసి, విద్యార్థులు పాల్గొన్నారు. -
టీడీఆర్ బాండ్లు వద్దే వద్దు
అనకాపల్లి టౌన్: అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులకు ఇళ్లు, దుకాణాలు, భూములకు ఒకేసారి నష్టపరిహారం చెల్లించాలని, ఆ నష్టపరిహారం టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలోనే అందించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని మునగపాక నుంచి పాదయాత్ర ద్వారా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయానికి సోమవారం చేరుకొని కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్.రాము మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామ సభల్లో టీడీఆర్ బాండ్లు వద్దని నిర్వాసితులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారని తెలిపారు. అయినా నేడు నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ భూములు కోల్పోతున్నవారందరూ పేదవారని, వారికి టీడీఆర్ బాండ్లు ఏమాత్రం ఉపయోగపడవన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలన్నారు. అలాగే ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్రభుత్వమే ఉపాధి కల్పించాలన్నారు. 100 అడుగుల తర్వాత నిర్మించుకొనే ఇళ్లకు ఎటువంటి నిబంధనలు పెట్టరాదన్నారు. రైతులను ఉద్దేశించి ఆర్డీవో షేక్ ఆయిషా మాట్లాడుతూ రైతుల భూముల విలువలో తేడాలుంటే కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, వాటిని సరిచేస్తామన్నారు. టీడీఆర్లపై రైతులు అపోహలు విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కో–కన్వీనర్ కె.రామసదాశివరావు పాల్గొన్నారు. నగదు రూపంలోనే పరిహారం అందించాలి అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితుల డిమాండ్ అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా -
అంగన్వాడీ నియామకాల్లో అవినీతి
అంగన్వాడీ నియామకాల్లో ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ సోదరుల అవినీతిపై విచారణ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం నాయకులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో ఎస్సీ రిజర్వేషన్లో వచ్చిన అంగన్వాడీ పోస్టుకు మంత్రి సునీత అర్హురాలైనా ఎంపిక చేయలేదన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇంటర్వ్యూ ప్యానల్ అవినీతికి పాల్పడి ఆమెకు అన్యాయం చేసిందన్నారు. తక్షణమే విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యే, అధికారులపై చర్యలు తీసుకోవాలని విదసం నాయకులు డాక్టర్ బూసి వెంకటరావు, బాజి ఒంకార్, గుడివాడ ప్రసాద్, బూల భాస్కరరావు కోరారు. -
భూ తగాదాలపై ఎస్పీ విభాగానికి అర్జీల వెల్లువ
అర్జీదారుల సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 45 అర్జీలు వచ్చాయి. వీటిలో 35 వరకు భూ తగాదాలపై రావడం విశేషం. అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా తెలుసుకున్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలకు వేగంగా న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అన్నారు. ప్రజా సమస్యలపై శ్రద్ధ చూపిస్తూ, న్యాయపరంగా పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ వారం వచ్చిన అర్జీల్లో భూ తగాదాలు–35, కుటుంబ కలహాలు–5, మోసాలకు సంబంధించిన ఫిర్యాదు–1, ఇతర విభాగాలకు చెందినవి–4 అర్జీలు వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్ఐ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. -
వెల్నెస్ కేంద్రం బిల్లు నిలిపివేశారు..
గత ప్రభుత్వం మంజూరు చేసిన వెల్నెస్ కేంద్రం నిర్మాణం పూర్తి చేసి ఏడాది పూర్తయిందని, ఎన్నికల అనంతరం మంజూరైన పెండింగ్ బిల్లు రూ.7,50,314లు చెల్లించకుండా టీడీపీ నేత గండి బాబ్జీ నిలిపేశారని సబ్బవరం మండలం మొగలిపురం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ యడ్ల నాయుడు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఏడాది కాలంగా కలెక్టర్, జేసీ, జిల్లా పంచాయతీ అధికారి, ఇంజినీరింగ్ అధికారులకు అనేక వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ నిరసనకు సిద్ధమవ్వగా సిబ్బంది బయటకు ఈడ్చుకెళ్లారని, తనకు బిల్లు వెంటనే చెల్లించాలంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవికి గండి బాబ్జీ భార్యపై పోటీ చేయడంతో కక్ష కట్టి కావాలనే బిల్లు నిలిపివేశారని, సర్పంచ్పై, గండి బాబ్జీపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘అంధుడినని మేనమామ మోసగించాడు’
మాట్లాడుతున్న వెంకటరమణమూర్తి డాబాగార్డెన్స్ (విశాఖ): తన అంధత్వాన్ని అడ్డు పెట్టుకుని మేనమామ గంప సత్యనారాయణమూర్తి తనను దారుణంగా మోసగించాడని నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి చెందిన బొల్లప్రగడ వెంకటరమణమూర్తి తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో బొల్లాప్రగడ అప్పన్న మోహనరావు, చంద్ర రాజ్యలక్ష్మితో కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. చెట్టుపల్లి గ్రామంలో తన పేరిట ఉన్న ఎకరా 54 సెంట్ల భూమిని మోసగించి, ఆయన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని గమనించి, కొందరు సన్నిహితులు విజయనగరం జిల్లా పాలకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 17న అన్ని ఆధారాలు సబ్రిజిస్ట్రార్కు అందజేసి భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేయించినట్టు చెప్పారు. ఈ విషయమై అమరావతిలో సీఎం, డిప్యూటీ సీఎం కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశానన్నారు. అంధుడనైన తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సత్యనారాయణమూర్తిపై చర్యలు తీసుకుని, తనకు, తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
అవే అర్జీలు.. పరిష్కారం శూన్యం
● సమస్యలు పరిష్కరించాలని పదే పదే ఫిర్యాదులు ● వాటిని పరిష్కరించకుండానే పొంతన లేని సమాధానం ● అధికారుల తీరుపై అర్జీదారుల అసహనం ● పీజీఆర్ఎస్కు ఆలస్యంగా వచ్చిన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమంపై పలువురు అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే పీజీఆర్ఎస్ అని ఒక్క పనీ పూర్తయింది లేదని వాపోతున్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు ఆలస్యంగా రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జీల పరిష్కారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఆదేశించారు. పలువురు అర్జీదారులు అర్జీ నమోదు చేసుకోకుండానే కలెక్టర్ను కలవడంతో సిబ్బంది తీరును హెచ్చరించారు. ఈ వారం మొత్తం 297 అర్జీలు నమోదయ్యాయి. రెవెన్యూ విభాగం వినతులతోపాటు తల్లికి వందనంపై ఫిర్యాదులు అందాయి. భూ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేయాలని నిరసన భూ సమస్య పరిష్కరించాలంటూ ఇప్పటికి 50 సార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేశానని, ప్రతి వారం కలెక్టరేట్కు వచ్చి విన్నవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, పొంతన లేని సమాధానాలతో చేతులు దులుపుకుంటున్నారని నక్కపల్లికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, రైల్వే బోర్డు మెంబర్ కొలనాటి అప్పారావు అసహనం వ్యక్తం చేశారు. తన పేరున ప్రభుత్వం ఇచ్చిన నాలుగెకరాల డీ పట్టాను ఇతరుల పేరున ఆన్లైన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పదే పదే ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు లేవని నక్కపల్లి మండలం ఉపమాక గ్రామానికి చెందిన కురందాసు నాగరాజు నిరాశ వ్యక్తం చేశాడు. రూ.15 వేల పింఛన్ కోసం చిన్నపాటి తప్పులు సాకుగా చూపి కలెక్టరేట్ చుట్టూ తిప్పించుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని 90 శాతం దివ్యాంగుడైన పొట్ల తులసిరామ్, అతని తండ్రి అప్పారావు వాపోయారు. -
మృతి చెందిన ఖైదీ కుటుంబానికి ఆర్థిక సహాయం
రూ.5 లక్షల చెక్కును అందిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: విశాఖపట్నం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తూ 2023 సెప్టెంబర్ 12న మరణించిన రావికమతం మండలం గుమ్మలపాడు గ్రామానికి చెందిన మామిడి అర్జున కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్ మృతుని భార్య రమణమ్మ, కుమార్తె మౌనికదేవిలకు చెక్కును అందించారు. తమది నిరుపేద కుటుంబమని, ఆర్థిక భరోసా కల్పించాలని జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ)కు అర్జీ సమర్పించడంతో ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ మెజిస్టీరియల్ విభాగ పర్యవేక్షకుడు ఎస్.వి.ఎస్.వాసునాయుడు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పతకాల పంట
చోడవరం : జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఈనెల 25 నుంచి 28 వ తేదీ వరకూ విజయవాడలో 10వ ఓపెన్ జాతీయ స్థాయి తైక్వాండో క్యోరుగి, ఫూమ్సే పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 12 మంది క్రీడాకారులు బంగారు పతకాలు, ఆరుగురు రజత పతకాలు, 13మంది కాంస్య పతకాలు సాధించారు. చోడవరం, ఆరిలోవ ప్రాంతాలకు చెందిన చుక్కల లాస్య, ఎం.రవిచంద్ర, కొల్లిపార తన్విత్ ఉదయ్, గండి కారుణ్య సందీప్, ఎ.ధనుష్, బి.రాఘవ, డి.దక్షితరెడ్డి, డి.రుద్రాక్షరెడ్డి బంగారు పతకాలు సాధించారు. వీరిలో కొల్లిపార తన్విత్ ఉదయ్ 3, గండి కారుణ్యసందీప్ 2 బంగారు పతకాలు వివిధ విభాగాల్లో సాధించారు. ఎం.శరణ్య, జి.వి.శశివర్థన్కుమార్, ఎన్. రిషితాంజలి, బి.పర్నిక అరోహి, ఎన్. కేశవర్థన్, వి.ఇషితశారద, షేక్ సభీన ఆజ్మి, జి. భరద్వాజ్, బి.కార్తీక్, జి. జాహ్నవి జయశ్రీ రజతం, కాంస్య పతకాలు సాధించినట్టు ఏపీ తైక్వాండో అసోసియేషన్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు, కోచ్ పల్లం మురళి తెలిపారు. పతకాలు సాధించిన విజేతకు అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. -
అమ్మ చనిపోతే తల్లికి వందనం ఇవ్వరంట..
మా అమ్మ చనిపోవడంతో 9వ తరగతి చదువుతున్న నాకు, ఏడో తరగతతి చదువుతున్న నా తమ్ముడికి తల్లికి వందనం నిలిపివేశారంటూ చోడవరం టౌన్లోని గాంధీనగరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి మామిడిపాక శ్రీసత్యసాయి ధనోష్ వాపోయాడు. అతడు తన తండ్రి శ్రీనివాస్తో కలిసి కలెక్టరేట్లో విన్నవించుకున్నాడు. రెండేళ్ల క్రితం తల్లి మహలక్ష్మి మృతి చెందింది. ఇటీవల తల్లికి వందనం జాబితాలో మా పేర్లు రావడంతో తండ్రి బ్యాంక్ ఖాతాకు జత చేశామని, అయినా మాకు తల్లికి వందనం రాలేదని మొరపెట్టుకున్నాడు. అధికారులు పరిశీలించి తల్లికి వందనం నగదు మంజూరు చేయాలని కోరాడు. -
డ్రోన్ల సాయం.. లాభసాటి సేద్యం
● తగ్గనున్న పెట్టుబడి ఖర్చు.. నీటి ఎద్దడిని తట్టుకోనున్న పైరు ● డ్రోన్ సహాయంతో వరి విత్తనాలు చల్లే పద్ధతికి శ్రీకారం ● ఆర్ఏఆర్ఎస్లో పరీక్షించిన శాస్త్రవేత్తలు ● చీడపీడల బాధ తగ్గుతుందని ఆశాభావం సాక్షి, అనకాపల్లి: వ్యవసాయం లాభసాటి కావాలంటే రైతులు యాంత్రీకరణ బాట పట్టాల్సిందే. ఇప్పటికే సాగులో దుక్కు, మందుల పిచికారీ వంటి పనులు యంత్రాల సాయంతో చేపడుతున్నారు. అలాగే డ్రోన్లతో వరి సహా అనేక పంటలపై పురుగు మందులు, ఎరువులు చల్లటం వంటి పనులు కూడా చేస్తున్నారు. తాజాగా వరి సాగులో నారుకు బదులు నేరుగా డ్రోన్ సాయంతో విత్తనాలు వెద చల్లే పద్ధతికి సోమవారం అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్ పరిశోధన స్థానంలో శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మారుతి డ్రోన్ సంస్థ సాంకేతిక సహకారంతో శాస్త్రవేత్తలు డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ గౌరీ, డాక్టర్ జగన్నాథరావు ఈ విధానాన్ని పరీక్షించారు. ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు పైరు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. 73 శాతం విత్తనం ఆదా ఆర్ఏఆర్ఎస్లో 21 సెంట్ల పొడి నేలలో నాలుగు నిమిషాల్లో, 15 సెంట్ల తడి నెలలో 3.2 నిమిషాల్లో డ్రోన్ ద్వారా వరి విత్తనాలు వేశారు. సగటున 3.5 మీ/సె వేగంతో డ్రోన్ టెక్నాలజీతో విత్తనాలను నాటారు. ఈ పద్ధతిలో సగటున ఎకరాకు సుమారు 9 కేజీల వరి విత్తనాలు సరిపోతున్నాయి. ఇలా విత్తనాలను విత్తడానికి డ్రోన్కు ఒక ఎకరాకు 15 నిమి షాలు పడుతుంది. అయితే 21 సెంట్ల పొడి నేలలో 1.9 కేజీల విత్తనాలు చల్లడానికి మూడు నిమిషాలు పట్టింది. ఇదే సంప్రదాయ సాగు పద్ధతిలో ఎకరాలకు 30 నుంచి 35 కేజీల వరి విత్తనాలు అవసరం ఉంటుంది. డ్రోన్ ద్వారా విత్తే పద్ధతిలో 73 శాతం వరకు వరి విత్తనాలు ఆదా అవుతున్నాయి. ఈ పద్ధతిలో పాటించాల్సిన జాగ్రత్తలు విత్తిన వెంటనే తడిపేందుకు తేలికపాటి నీటి డ్రిప్ ఉండాలి వరి నాటిన తర్వాత 7–10 రోజుల్లో మొలకల పరిస్థితిని పరిశీలించాలి పొలాన్ని సమతలంగా చేయడం చాలా ముఖ్యం విత్తనాలను వేసుకునే ముందే కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి -
కలెక్టరేట్లో పొమ్మంటే నా బాధ ఎవ్వరికీ చెప్పుకోవాలి
బయోమెట్రిక్లో వేలిముద్రలు పడటం లేదని ఆధార్ కార్డు ఇవ్వడం లేదు. కలెక్టరేట్కు వస్తే ఆధార్ కార్డు లేనిదే పీజీఆర్ఎస్లో అర్జీ నమోదు కుదరదంటూ సిబ్బంది పొమ్మంటున్నారు. నా బాధ ఇంకెవ్వరికీ చెప్పుకోవాలని పాయకరావుపేట మండలం పెదరామభద్రపురం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు పోలిన వెంకటలక్ష్మి తిరుగుముఖం పట్టింది. దివ్యాంగురాలైన ఆమెను కుటుంబ సభ్యులు వదిలేయడంతో ఒంటరిగా జీవిస్తోంది. గతంలో పింఛన్ వచ్చేదని, ఆధార్ కార్డు లేకపోవడంతో నిలిపివేసారని ఆమెతో వచ్చిన తోటి మహిళ తెలిపింది. ఆధార్ కార్డు మంజూరు చేస్తే ప్రభుత్వ పథకాలతో భరోసా దొరుకుతుందని ఆశతో వచ్చామని చెప్పింది. -
తాండవలో జాడ లేని చేపపిల్లల ఉత్పత్తి
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం తాండవ చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి గత ఏడాది జరగలేదు. ఈఏడాది నేటి వరకు అక్కడ ఏమీ కన్పించలేదు. కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈవిధంగా జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన పిల్లలు జిల్లా అంతంటా గతంలో సరఫరా చేసేవారు,. ప్రస్తుతం మనం ఇతర ప్రాంతాల్లో కొనుక్కునే పరిస్థితి వచ్చింది. – సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ నాతవరం: ఉమ్మడి జిల్లాలోనే ఏకై క చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రం తాండవలో ఈఏడాది చేప పిల్లలు ఉత్పత్తి జాడ కన్పించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ నుంచి ఆగస్టు మూడు నెలల పాటు తాండవ ఉత్పత్తి కేంద్రంలో కోటి 50లక్షల వరకు ఉత్పత్తి చేయడం జరిగేది. ఈ కేంద్రంలో పెద్ద చేపలకు ఇంజక్షన్లు చేసి కృత్రిమ గర్భోఉత్పత్తి ద్వారా వివిధ జాతుల చేప పిల్లలు కోటిన్నరకు పైగా ఉత్పత్తి చేసేవారు. వాటిని తాండవ రిజర్వాయరులో విడుదల చేసేవారు. తర్వాత జిల్లాలో కోనాం, రైవాడ, రవాణాపల్లి, కళ్యాణపులోవ తదితర రిజర్వాయర్లకు చేప పిల్లలు సరఫరా చేసేవారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు కలిగి ఉన్న మత్స్య సహకార సంఘాలకు రాయితీపై సరఫరా చేసే వారు. మిగిలిన చేప పిల్లలను నర్సీపట్నంలో గల మత్స్యకార కార్యాలయం ప్రాంగణంలో గల నీటి కుండీలలో నిల్వ చేసేవారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేటు వ్యక్తులకు చెరువులో పెంచుకునేందుకు చేప పిల్లలను విక్రయించేవారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన తాండవ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సిబ్బంది కొరత లేదా నిధుల సమస్య అనేది తెలియరాలేదు. మండలంలో తాండవలో 1986లో చేప పిల్ల లు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా జూన్, జూలై, ఆగస్టు నెలలో ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని అధిగమించి చేప పిల్లల ఉత్పత్తి చేసేవారు. గత ఏడాది ఈ కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి జరగలేదు. దీంతో ఇతర జిల్లాలో 25 లక్షలు చేప పిల్లలు కొనుగోలు చేసి వాటిని కలెక్టరు విజయకృ్ష్ణన్చేతుల మీదుగా తాండవ రిజర్వాయరులో విడుదల చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తాండవ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం భవనం శిథి లావస్థకు చేరింది. నీటి కోసం ఏర్పాటు చేసిన బోరు వాడకపోవడంతో పిచ్చి మొక్కల మధ్యలో నిరుపయోగంగా దర్శినమిస్తోంది. సిబ్బంది అప్పుడప్పుడు మాత్రమే కార్యాలయాన్ని సందర్శించడంతో తలుపులు, కిటికీలు చెదలు పట్టి శిథిలమవుతున్నాయి. తాండవలో తగ్గిన చేపల వేట గతంతో పోల్చుకుంటే తాండవ రిజర్వాయరులో చేపలు వేట గణనీయంగా తగ్గిందని మత్స్యకారులు అంటున్నారు. తాండవ రిజర్వాయరులో చేపల వేటపై ఆధారపడి నాతవరం, గొలుగొండ, కొయ్యూరు మండలాలకు చెందిన 600 నుంచి 700 మధ్య కుటుంబాలకు పైగా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. జాలారిపేట, అమ్మపేట, జోగుంపేట, పొగచెట్లపాలెం, సారిక మల్లవరం, ఆడాకుల అమ్మపేట, చోద్యం, తాండవ తదితర గ్రామాల్లో మత్స్యకారులు ఉన్నారు. వారంతా ప్రతి రోజు తాండవ రిజర్వాయరులో చేపలు వేటాడి జీవనం సాగిస్తుంటారు. గతంలో 5 నుంచి 25 కేజీల వరకు పెద్ద చేపలు పడేవి. ఇటీవల కాలంలో తాండవలో మచ్చుకై నా పెద్ద చేపల జాడ కన్పించడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాండవలో చిన్న చేపలు మాత్రమే దొరకడంతో వాటిని స్థానికంగా విక్రయిస్తున్నారు. గతంలో వలే చేపల వేట సాగకపోవడంతో మత్స్యకారులు నాగార్జున సాగర్ వంటి ప్రాంతాలకు వలసపోయారని చెబుతున్నారు. ఈ విషయంపై నర్సీపట్నం మత్స్యకార అధికారి నాగమణిని వివరణ కోరగా తాండవ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంపై దృష్టి సారించామన్నారు. తాండవ ప్రాజక్టు నుంచి నీరు కావాలని జేఈని అడిగామని త్వరలోనే చేప పిల్లలు ఉత్పత్తి చేస్తామన్నారు. గతంలో ఏటా కోటి 50 లక్షల చేప పిల్లల ఉత్పత్తి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరఫరా నేడు శిథిలావస్థలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం -
111.60 మీటర్లకురైవాడ నీటిమట్టం
దేవరాపల్లి: ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం నీటిమట్టం క్రమేపి పెరుగుతుంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 111.60 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలోకి 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశ యం నుంచి జీవీఎంసీ తాగునీరు నిమిత్తం 50 క్యూసెక్కుల నీరు విడుదల కొనసాగుతుంది. జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండడంతో నిండుకుండలా కళకళలాడుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు నీటికి ఢోకా ఉండబోదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రైవాడ ఆయుకట్టు భూముల్లో ఖరీఫ్ వరి సాగుకు దమ్ములు ముమ్మరంగా సాగుతున్నాయి. ఖరీఫ్కు ఈ నెల 29న కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుద ల చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. -
రసవత్తరంగా తైక్వాండో పోటీలు
యలమంచిలి రూరల్ : పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన 5వ జిల్లా స్థాయి తైక్వాండో సబ్ జూనియర్, మినీ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలు రసవత్తరంగా జరిగాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలుర విభాగంలో 12, బాలికల విభాగంలో 12 కేటగిరీల్లో నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. పోటీల్లో స్పారింగ్, ఇండివిడ్యువల్ ప్యాటర్స్, పవర్ బ్రేకింగ్, సెల్ఫ్ డిఫెన్స్, స్పెషల్ టెక్నిక్స్ వంటి రకరకాల ఈవెంట్లలో క్రీడాకారుల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఓ క్రీడలా కాకుండా పిల్లల్లో క్రమశిక్షణ, సమయస్ఫూర్తిని ప్రోత్సహించే విధంగా నిర్వహించిన ఈ పోటీలను పెద్ద ఎత్తున క్రీడాకారుల తల్లిదండ్రులు, స్థానిక క్రీడాకారులు వీక్షించారు. ఇలాంటి పోటీలు తైక్వాండో క్రీడ ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఉపయోగపడతాయని అనకాపల్లి యూత్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.హేమంత్కుమార్, డి. యశ్వంత్కుమార్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన పోటీల్లో పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చూపి సత్తా చాటారు. పోటీల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు త్వరలో గుంటూరులో జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారన్నారు. అంతకుముందు ఈ పోటీలను విశ్రాంత అధ్యాపకుడు ఆడారి పూరీ జగన్నాథం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తైక్వాండో పోటీల వల్ల పిల్లల్లో ఆత్మరక్షణ, ఆత్మస్థయిర్యం లాంటి మానసిక ధృడత్వం పొందే అవకాశం ఉందని ఆయన అన్నారు. తైక్వాండో కేవలం మార్షల్ క్రీడే కాకుండా ఒలింపిక్ పోటీల్లో చోటు దక్కించుకుందన్నారు. 37 మందికి బంగారు పతకాలు ఇండోర్ స్టేడియంలో జరిగిన తైక్వాండో పోటీల్లో 37 మంది బంగారు, 32 మంది రజతం, మరో 20 మంది కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు అతిథులు అభినందనలు తెలిపారు. జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.కొండబాబు, కోచ్లు ఆలీ, మితిలేష్, మణి, మోహన్, గణేష్, భాస్కర్ పోటీలను పర్యవేక్షించారు. -
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు వద్దు
అనకాపల్లి : ప్రభుత్వ ఉపాధ్యాయులను పి–4, కర్మయోగి యాప్ల నుంచి తొలగించి, విద్యార్థులకు బోధన వరకే పరిమితం చేయాలని బోధనేతర పనులను అప్పగించడం వల్ల విద్యా ప్రమాణాలు కుంటుపడతాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా ముఖ్య నేతల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు విధులు నిర్వహించే గ్రామాల్లో కుటుంబాలను కేటాయించి, దత్తత తీసుకోమని చెప్పడం, బోధనేతర పనుల కిందికే వస్తుందన్నారు. పి–4 విధానంలో ఉపాధ్యాయులకు రెండేసి కుటుంబాలను, ప్రధానోపాధ్యాయులకు ఐదు కుటుంబాలను కేటాయించి దత్తత తీసుకోమని చెప్పడం వల్ల పనిభారం పెరిగి బోధనపై దృష్టి పెట్టలేరని అన్నారు. కర్మయోగి యాప్ ను ఉపాధ్యాయులపై బలవంతంగా రుద్దుతున్నారని, యాప్లో ఆన్లైన్ కోర్స్లో 56 వీడియోలు ప్రతి ఉపాధ్యాయుడు పూర్తి చేయాలని బలవంతం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జూన్ 12 నుంచి విద్యార్థులకు సరైన బోధన చేయకుండా నిర్బంధంగా ఉపాధ్యాయులతో యాప్ల నిర్వహణ చేస్తున్న విద్యాశాఖ అధికారులు తమ వైఖరిని విడనాడాలన్నారు. రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ జీతంమీద ఆధారపడి జీవిస్తున్న ఉపాధ్యాయులకు 2 మాసాల నుంచి జీతాలు రాకుడా చేసిన విద్యాశాఖాధికారులు వైఖరిని మార్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.లక్ష్మి, గొంది చిన్నబ్బాయ్, సహాధ్యక్షులు రొంగలి అక్కునాయుడు, కార్యదర్శులు పొలిమేర చంద్రరావు, రమేష్ రావు, శేషుబాబు, సీనియర్ నాయకులు జి.కె.ఆర్ స్వామి, అలివేలు, హైమావతి, ఎల్లయ్య బాబు, మామిడి బాబూరావు, సలీం, రవి పాల్గొన్నారు. -
రైతులకు నీటి తీరువా నోటీసులు తగదు
మునగపాక: నీటి తీరువా బకాయిలు చెల్లించాలని రైతులకు ప్రభుత్వం డిమాండ్ నోటీసులు పంపడం సరికాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులకు ప్రభుత్వం నుంచి వ్యవసాయ పెట్టుబడులకు ఎటువంటి సాయం అందక అవస్థలు పడుతుంటే రెవెన్యూ అధికారులు నీటి తీరువాలు చెల్లించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆదివారం ఆయన మునగపాకలో పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సాగునీటి వనరులు అధ్వానంగా ఉన్నా రైతులకు న్యాయం చేయకుండా వారిపై భారం పడేలా నీటి తీరువా చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇంతవరకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయలేదన్నారు. ఆరు నెలల పాటు పంట పొలాలకు పుష్కలంగా నీరందించడం ద్వారా నీటి తీరువా వసూలు చేస్తుంటారన్నారు. అయితే మండలంలో అటువంటి పరిస్థితులు లేవన్నారు. సాగునీటి కాలువలు పలు చోట్ల అధ్వానంగా ఉన్నాయన్నారు. దీంతో సాగునీరు పంటలకు అందే పరిస్థితులు లేవన్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. నీటి తీరువా వసూళ్లకు సంబంధించి రైతులపై ఒత్తిడి తీసుకువస్తే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆడారి అచ్చియ్యనాయుడు, మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
డి.యర్రవరంలో సినిమా షూటింగ్ సందడి
నాతవరం: మండలంలో డి.యర్రవరం గ్రామంలో గల నల్లకొండమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించారు. డైరెక్టరు వై.ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్ర హర్షిణి మూవీస్ బ్యానర్పై ‘జాగా’ అనే తెలుగు చలన చిత్రం ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి షూటింగ్ ప్రారంభించారు. పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ములగపూడి ఎం.బెన్నవరం గ్రామాల్లో గల వ్యవసాయ భూములు, జీడిమామిడి తోటల్లో ఈ చిత్రంలో సర్పంచ్ పాత్ర వ్యవసాయదారుడి రైతులు మధ్య సంభాషణకు సంబంధించి పలు దృశ్యాలను చిత్రీకరించారు. చిత్ర ప్రధాన పాత్రధారులు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాయిగణేష్లపై ఆలయంలో షూటింగ్ ప్రారంభించి తర్వాత పలు ప్రదేశాల్లో సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు. సినిమా షూటింగ్ చూసేందుకు చుట్టు పక్కల గ్రామాలు అధిక సంఖ్యలో రావడంతో సందడి నెలకొంది. వెంకట పవన్న్కుమార్, లవకుమార్, బుజ్జి తదితర చిత్ర బృందం పాల్గొన్నారు. -
సృష్టి రహస్యాలెన్నో...!
మహారాణిపేట (విశాఖ): పిల్లలు లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని, సరోగసీ (అద్దె గర్భం), ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) కేంద్రాలు భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. మాతృత్వపు ఆనందాన్ని అందిస్తున్న ఈ పద్ధతులను కొన్ని సంస్థలు సొమ్ము చేసుకునే మార్గంగా చూస్తూ మహిళల నుంచి అడ్డగోలుగా డబ్బు దోచుకుంటున్నాయి. గతంలో ఐవీఎఫ్ కేంద్రాలు ఇష్టానుసారం సరోగసీని ఉపయోగించుకుని డబ్బులు దండుకున్నాయని అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. నగరంలోని ‘సృష్టి ఐవీఎఫ్’ సెంటర్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సరోగసీ, ఐవీఎఫ్ సేవలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించి నియంత్రిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు పొంది మాత్రమే ఈ కేంద్రాలను నడపాలి. జిల్లాలో 41 ఐవీఎఫ్, 9 సరోగసీ కేంద్రాలు సహా మొత్తం 50 కేంద్రాలు పనిచేస్తున్నట్లు సమాచారం టెస్ట్ ట్యూబ్ బేబీ సహజ పద్ధతిలో గర్భధారణ కానివారికి లేదా పురుషులలో వీర్య కణాల నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు వైద్యులు ఐవీఎఫ్ పద్ధతిని సూచిస్తారు. సరోగసీ, ఐవీఎఫ్ కేంద్రాల్లో ఏఆర్టీ (అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ) బ్యాంక్, ఎల్–1, ఎల్–2 విభాగాలు ఉంటాయి. వీటి కోసం వరుసగా రూ. 50వేలు, రూ.50వేలు, రూ. 2 లక్షలు డిపాజిట్/డీడీ సమర్పించాలి. దరఖాస్తుతో పాటు సదుపాయాలు, వైద్యుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సమర్పించాలి. కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు కలెక్టర్ అధ్యక్షతన సరోగసీ, ఐవీఎఫ్ పర్యవేక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. వీటిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రసూతి, పిల్లల వైద్య విభాగాల అధిపతులు, పోలీసు కమిషనర్, సెషన్స్ జడ్జి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖ గైనకాలజిస్టులు సభ్యులుగా ఉంటారు. సరోగసీకి కలెక్టర్, ఐవీఎఫ్కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ‘సృష్టి’ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జిల్లా పరిషత్ సమీపంలోని ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్’ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ కేంద్రం 2018 నుంచి 2023 వరకు డీఎంహెచ్వో కార్యాలయంలో నమోదైంది. ఆ తర్వాత ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే అనధికారికంగా నడుస్తోంది. డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రంపై విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లలో కేసులు నమోదయ్యాయి. మేనేజర్ కల్యాణికి ఇందులో కీలక పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత నెలలో ఈ కేంద్రంలో డెలివరీ అయిన మగబిడ్డ విషయంలో అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకువచ్చి సరోగసీ ద్వారా పుట్టినట్లు దంపతులను నమ్మించారు. ఢిల్లీకి చెందిన గర్భిణిని విమానంలో విశాఖకు తీసుకొచ్చి డెలివరీ చేయించారని పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రత గతంలో కోట్లాది రూపాయల దందా చేసి, ఒక బిడ్డను రూ.30 లక్షలకు విక్రయించారని పోలీసులు చెబుతున్నారు. అక్రమ వసూళ్లు, పర్యవేక్షణ లోపం నగరంలో ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఒక కేసు నుంచి రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఎక్కువగా ఉన్నవారి నుంచి వివిధ రకాల ఫీజుల పేరుతో దోచుకుంటున్నారు. వివాహం జరిగి చాలా ఏళ్లు పిల్లలు లేని తల్లుల నుంచి పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు చేస్తున్నారు. దీనికి ఎలాంటి బిల్లులు, లెక్కలు ఉండటం లేదు. ఈ కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొరవడుతోందని స్పష్టమవుతోంది. నమోదు తప్పనిసరి సరోగసీ, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సేవలందించే కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే నమోదు కోసం నిర్దేశించిన రుసుములను సకాలంలో చెల్లించాలి. రుసుము చెల్లింపులో జాప్యం చేసే దరఖాస్తులను తిరస్కరిస్తాం. అనుమతులు పొందిన తర్వాత మాత్రమే సరోగసీ, ఐవీఎఫ్ ప్రక్రియలను ప్రారంభించాలి. ప్రస్తుతం దరఖాస్తు చేసుకోని ఏఆర్టీ సెంటర్లను కూడా సీజ్ చేస్తాం. అటువంటి సెంటర్లకు నోటీసులు జారీ చేసి, వారి సేవలను నిలుపుదల చేసి, ప్రీ–కాన్సెప్షన్ అండ్ ప్రీ–నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994 కింద కఠిన చర్యలు తీసుకుంటాం –డాక్టర్ పి.జగదీశ్వరరావు, డీఎంహెచ్వో ఐవీఎఫ్లో కలకలం పిల్లలు లేని దంపతులే లక్ష్యం భారీగా వసూళ్ల పర్వం లోపించిన వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఐవీఎఫ్ సెంటర్లు -
చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా
అనకాపల్లి : స్థానిక జాతీయ రహదారి డైట్ కళాశాల వద్ద పట్టణ పోలీసులు ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖ ఉమ్మడి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు 5 బోలేరో వాహనాలలో చేపల మేత, చికెన్ వ్యర్థాలు రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. విశాఖలో ఎన్ఏడీ, అక్కయ్యపాలెం, ఇతర ప్రాంతాల నుంచి వ్యర్థాలను సేకరించి తీసుకువెళుతున్నారని పోలీసులు తెలిపారు. వాహన డ్రైవర్లు బడపాటి నాగబాబు, జయమంగళ సత్యనారాయణ, బుడుమూరు బాలాసుబ్రహ్మణ్యం, మేడిశెట్టి నూకరాజు, బద్ది నాగ సత్యనారాయణలను అదుపులోనికి తీసుకుని అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రధర్కు అప్పగించారు. పట్టుకున్న వ్యర్థాలను విశాఖ కాపులుప్పాడలో డంపింగ్యార్డులో పూడ్చి, ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయడం జరుగుతుందని జోనల్ కమిషనర్ తెలిపారు. -
జిల్లా హెచ్ఎంల సంఘం నూతన కార్యవర్గం
అనకాపల్లి : జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షునిగా ఎ.వి.హెచ్.శాస్త్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక గవరపాలెం గౌరీ గ్రంథాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆళ్ల శేఖర్, కోశాధికారిగా నాగేంద్ర, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎం.ఎస్.ప్రసాద్, కె.ఆర్.ఎస్.నాయుడు, ఎ.వరహామూర్తి ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకుడిగా సంఘం రాష్ట్ర కోశాధికారి సి.వి.వి.సత్యనారాయణ వ్యవహరించారు. పై కమిటీ ఎన్నిక రెండు సంవత్సరాలు ఉంటుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి పొన్నాడ అప్పారావు, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ పి.శ్రీధర్రెడ్డి, జిల్లా కామన్ పరీక్షల బోర్డు చైర్మన్లు సిహెచ్.సత్యనారాయణ, సాయిబాబా పాల్గొన్నారు. అనంతరం 2024 జనవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకూ 30 మంది హెచ్ఎంలు పదవీ విరమణ చేసిన హెచ్ఎంలను సంఘం సభ్యులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు పాల్గొన్నారు. -
బదిలీ ఉపాధ్యాయులకు జీతాలు విడుదల చేయాలి
ఎస్.రాయవరం: బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాలు తక్షణమే విడుదల చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.కె.ఎల్.ఎన్.ధర్మారావు, ఎస్.దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. అడ్డురోడ్డులో ఆదివారం వారు స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బదిలీలు నిర్వహించి నెల రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. జూలై నెల జీతాలు కూడా ఇదే వంకతో ఆలస్యం చేసే అవకాశం ఉందన్నారు. వేలాదిమంది ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. బదిలీ అయినా రిలీవర్ లేరన్న వంకతో ఉపాధ్యాయులను అక్కడే ఉంచేస్తున్నారని, వారిని వెంటనే ట్రాన్స్ఫర్ అయిన స్థానాలకు పంపాలన్నారు. -
బహిరంగంగా బరితెగింపు
నర్సీపట్నం: పట్టణం నడిబొడ్డున ఉన్న బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల ప్రదేశంలో మెయిన్ రోడ్డు ను అనుకుని బహిరంగంగా అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారు. ఇది పురావస్తు శాఖకు చెందిన భూమి అంటూ.. ప్రధాన రోడ్డు వైపు కట్టిన ఆకుపచ్చని మ్యాట్ని శనివారం మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. అయితే యథావిధిగా మళ్లీ పరదాను కట్టి ఆదివారం పక్కా భవనాల నిర్మాణం కోసం పిల్లర్స్ వేయటం మొదలు పెట్టారు. ఇది పురావస్తుశాఖ స్థలం అంటూ హడావుడి చేసిన అధికారులెవరూ ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. వాస్తవంగా ప్రస్తుతం నిర్మాణా లు చేస్తున్న వారంతా మూడు దశాబ్ధాలకు పైగా ఈ ప్రదేశంలో దుకాణాలు నిర్మించుకుని జీవనం సాగించేవారు. ప్రధాన రోడ్డు విస్తరణ సమయంలో వీరంతా స్వచ్ఛందంగా దుకాణాలను తొలగించగా, ఇదే స్థలంలో ఉన్న మరో దుకాణదారుడు ఆర్థిక స్తోమతు ఉండడంతో దుకాణం తొలగించకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల అప్పట్లో రోడ్డు విస్తరణ పూర్తికాలేదు. పరిరక్షించాలని పిటిషన్ అల్లూరి సీతారామరాజు పోరాటానికి చిహ్నంగా ఉన్న బ్రిటిష్ సైనికాధికారులు లియోనెల్ నెవెల్లీ హైటర్, క్రిస్టోఫర్ విలియం స్కాట్ కవర్ట్ల సమాధుల స్థలాన్ని పరిరక్షించాలని అల్లూరి సీతారామరాజు స్మారక కమిటీ కన్వీనర్ పి.వి.సత్యనారాయణరావు కోర్టులో పిటిషన్ వేశారు. స్పందించిన సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్ అధికారులతో కలిసి బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల స్థలాన్ని ఈ నెల 10న క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. చాలా వరకు స్థలం అక్రమణకు గురైందని, పురావస్తుశాఖకు చెందినదిగా 2011లోనే నోటిపై చేసినా, స్థలాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. నిధులు లేకపోవటం వల్ల పరిరక్షణ చర్యలు తీసుకోలేకపోయామని పురావస్తుశాఖ సహాయ సంచాలకులు ఫల్గుణరావు న్యాయమూర్తికి వివరించారు. స్థలం అన్యాక్రాంతం కాకుండా తాత్కాలికంగా రక్షణ చర్యలైనా చేపట్టాలని జడ్జి మున్సిపల్ కమిషనర్కు సూచించారు. ఇది జరిగిన రెండు వారాలకు దుకాణదారులు స్థలం చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టి పక్కా దుకాణాల నిర్మాణానికి పూనుకున్నారు. న్యాయమూర్తి ముందు స్థల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్న పురావస్తు, రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు ఆదివారం సెలవు దినం పేరుతో మొహం చాటేశారు. అనుమతులు లేకుండా ఏ చిన్న నిర్మాణం చేపట్టినా ఇట్టే వాలిపోయే టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం కానరాలేదు. పరదా మాటున చకచకా నిర్మాణం బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల పరిరక్షణకు విఘాతం కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం -
తగ్గేదేలే..
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఆదివారం జరిగిన అంతర జిల్లాల పారా అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక క్రీడా స్ఫూర్తికి వేదికై ంది. జూనియర్, సబ్–జూనియర్ విభాగాల్లో దాదాపు 70 మంది దివ్యాంగ బాలబాలికలు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా 11–13 అంశాల పరుగు విభాగంలో సహాయకుల తోడుతో ట్రాక్లో పరుగెత్తుతూ ‘తగ్గేదేలే’ అంటూ వారు చూపిన సంకల్పం అందరినీ ఆకట్టుకుంది. ఫీల్డ్ ఈవెంట్లలో, ముఖ్యంగా త్రోస్ అంశాల్లో కూడా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. బధిరులు, మేధో వైకల్యం గల బాలబాలికలు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాలుపంచుకున్నారు. -
కష్టపడినా... కడుపు నిండదు
సాక్షి, అనకాపల్లి: ఇంట్లో ఎవరికై నా అనారోగ్యం సోకి మంచాన పడితే సొంత మనుషులే సేవ చేయలేని రోజులివి. అన్నీ మంచం మీదే చేయాల్సి వస్తే మరింత యాతన. అలాంటి రోగులను కూడా సొంత మనుషుల కంటే మిన్నగా చూసుకునే బడుగుజీవులు వారు. బతుకుతెరువు కోసం దుర్భరమైన.. క్లిష్టమైన వృత్తిలో కొనసాగుతున్నారు. వారికిచ్చే వేతనాలు అంతంతమాత్రమే. ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు, రోగుల సంరక్షకుల దుస్థితి ఇది. విధులకు తగ్గ వేతనం ఏదీ? రోగులకు అమ్మలా అన్నం తినిపిస్తారు. వేళకు మందులిస్తారు. దగ్గరుండి బాత్రూమ్కు తీసుకెళ్తారు. రోగులు వాంతులు.. మల మూత్రాదులు చేస్తే శుభ్రం చేస్తారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచుతారు. వాడి పడేసిన సిరంజిలు, ఇంజక్షన్లు తదితర ప్రమాదకరమైన బయో వ్యర్థాలు బయటికి తరలిస్తారు. ఇలా నెలలో 30 రోజులూ గైర్హాజరీ లేకుండా పనిచేస్తే.. వారికిచ్చే వేతనం కోతలు పోనూ కేవలం తొమ్మిది.. పది వేల రూపాయలు. ఇలా జిల్లా ఆస్పత్రి, ఒక ఏరియా ఆస్పత్రి, ఆరు సీహెచ్సీలలో పనిచేసే 165 కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు జీతాలు లేక పలు ఇబ్బందులకు లోనవుతున్నాయి. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా వారి జీతంలో సగం కూడా అందడం లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ఇలా.. ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో టెండర్లు పిలిచినప్పుడు నెలకు రూ.16 వేలు (ఈఎస్ఐ, పీఎఫ్ పోను) ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నాడు. యలమంచిలి, నక్కపల్లి, కోటవురట్ల, మాడుగుల, చోడవరం, కె.కోటపాడు సీహెచ్సీలలో అయితే ఇచ్చేది రూ.9 వేలే. అది కూడా మూడు నెలల జీతాలు నిలిపివేశారు. కార్మికులు సమ్మె చేస్తే వెయ్యి పెంచుతున్నారు. మిగిలిన రూ.6 వేలు కాంట్రాక్టర్ జేబులోకి వెళ్తున్నాయనే ఆరోపణలు. ఈ విషయాన్ని కార్మిక సంఘాలు కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా స్పందన లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈఎస్ఐ, పీఎఫ్ విషయానికొస్తే 12 శాతం సిబ్బంది జీతానికి యజమాని 12 శాతం కలిపి పీఎఫ్కు జమ చేయాలి. కానీ మొత్తం 24 శాతం సిబ్బంది నుంచే కలెక్ట్ చేసినా.. పీఎఫ్కి సక్రమంగా కట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో 30 మంది పారిశుధ్య కార్మికులు, 25 మంది సెక్యురిటీ సిబ్బంది పనిచేస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో 20 మంది పారిశుధ్య కార్మికులు, 10 మంది సెక్యురిటీ సిబ్బంది ఉన్నారు. ఆరు సీహెచ్సీలలో కాంట్రాక్ట్ కార్మికులు 80 మంది పనిచేస్తున్నారు. దీనావస్థలో ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు చాలీచాలని జీతంతో నిత్యం వెతలే.. నెలకు రూ.16 వేలు వేతనమని చెప్పి.. రూ.9 వేలే ఇస్తున్న కాంట్రాక్టర్ 3 నెలలుగా వేతన బకాయిలు 165 మంది కార్మికుల ఆకలి కేకలు కలెక్టర్ దృష్టి సారించాలి ప్రభుత్వం మారినప్పుడల్లా కార్మికులను తొలగించే ప్రక్రియను మానుకోవాలి. నెల మొత్తం సెలవు లేకుండా పనిచేస్తే రూ.10 వేల జీతం వస్తుంది. అది కూడా మూడు నెలలకొకసారి ఇస్తున్నారు. డ్యూటీ సమయం కన్నా.. అదనంగా మూడు నుంచి నాలుగు గంటల పాటు డ్యూటీ చేయించుకుంటున్నారు. టాయిలెట్ల క్లీనింగ్కు ఫినైల్, తుడవడానికి చీపుళ్లు కూడా అరకొరగానే ఇస్తున్నారు. ఎవరైనా అడిగితే రాజకీయ నాయకుల పేర్లతో వారిని తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు. కొంతమందిని ఇప్పటికే తొలగించారు. ఎన్టీఆర్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ౖచైర్పర్సన్గా ఉన్న కలెక్టర్ గారు ఆస్పత్రిపై దృష్టి సారించాలి. – కోన లక్ష్మణ్, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఏపీఐఐసీ భూముల్లో కూటమి దోపిడీ.!
నక్కపల్లి: విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కంపెనీల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి నాయకుల దోపిడీకి అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఈ దందా వెనుక నిర్వాసిత గ్రామాల్లోని ఓ సర్పంచ్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ మద్దతుతో గెలిచి ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఈ సర్పంచ్ దగ్గరుండి ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. లారీ గ్రావెల్ లోడుకు రూ.1000 చొప్పున సర్పంచ్ వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఇలా వసూలు చేసిన మొత్తంలో సగం తనకి, మిగతా సగం మండల స్థాయి నాయకుడికి ఇస్తున్నానని ప్రచారం కూడా చేస్తున్నాడని ఆయా గ్రామాల్లో చెప్పుకుంటున్నారు. విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ప్రభుత్వం చందనాడ, అమలాపురం, వేంపాడు, డీఎల్పురం, రాజయ్యపేట గ్రామాల్లో వేలాది ఎకరాలు సేకరించింది. ఈ భూముల్లో విలువైన ఖనిజ సంపద ఉంది. సముద్రపు ఇసుకతో పాట, నాణ్యమైన గ్రావెల్ లభిస్తోంది. మంచి ధర లభించే గ్రావెల్ కొండలు సైతం ఉన్నాయి. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో బల్క్ డ్రగ్ పార్క్ పనులు చేపట్టారు. దీని కోసం పరిహారం చెల్లించిన భూముల నుంచి గ్రావెల్ తవ్వుకుని రోడ్డు పనుల కోసం వినియోగిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కూటమిలో ఉన్న సర్పంచ్ తమ గ్రామానికి పక్కనే ఉన్న చందనాడ సర్వే నంబరు 83లో ఉన్న గ్రావెల్ను రోజూ పొక్లెయిన్ల సాయంతో తవ్వించి పృధ్వీ అనే కాంట్రాక్ట్ సంస్థకు తరలిస్తున్నారు. భారీ టిప్పర్లతో సమీపంలో ఉన్న కంపెనీలకు, ఏపీఐఐసీలో రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చందనాడ గ్రామస్తులు తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో రెండు రోజుల పాటు తవ్వకాలు ఆపేశారు. ప్రస్తుతం యథావిధిగా తవ్వకాలు సాగుతున్నట్టు తెలిసింది. నిత్యం పర్యటిస్తున్నా.. కనిపించని తవ్వకాలు నిత్యం వందలాది లారీల్లో గ్రావెల్ను తరలించేస్తున్నా ఏపీఐఐసీ అధికారులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. మండల స్థాయి అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికార పార్టీ నాయకులకు ఆ సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించడం, అదనపు భూసేకరణ కోసం ప్రతిరోజు అధికారులు ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నా ఈ అక్రమ తవ్వకాలు కనిపించకపోవడం గమనార్హం. ఒకరిద్దరు అధికారులు టిప్పర్లను కొనుగోలు చేసి ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న పనుల వద్ద గ్రావెల్ తరలింపునకు లీజుకు ఇచ్చినట్లు సమాచారం. కారిడార్ భూముల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోకపోతే ఆయా ప్రాంతాలకు తామే వెళ్లి అడ్డుకుంటామని మరోవైపు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు వీసం రామకృష్ణ హెచ్చరించారు. పరిహారం చెల్లించిన భూములను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుని కాపలా పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికై నా గ్రావెల్ దందాకు అడ్డుకట్ట వేయాలని నిర్వాసిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రాత్రి పూట యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు ప్రతి లారీ లోడు నుంచి రూ.1000 వసూలు చేస్తున్న ఓ సర్పంచ్ అటువైపు కన్నెత్తి చూడని అధికారులు -
‘వీరమల్లు’కు రూల్స్ వర్తించవా?
● రోడ్డుకు అడ్డుగా పవన్ కల్యాణ్ కటౌట్ అనకాపల్లి టౌన్: పట్టణంలోని రామచంద్ర థియేటర్ జంక్షన్లో హరిహర వీర మల్లు సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు సినీ హీరో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కటౌట్తో ఏర్పాటు చేసిన ట్రాలీ బండి రోడ్డుకు అడ్డంగా ఉంది. దీనిని ఈ నెల 24న సినిమా రిలీజ్ సందర్భంగా ఊరేగింపుతో తీసుకువచ్చి వదిలేశారు. ఐదు రోజులుగా రోడ్డుకు అడ్డుగా ఉన్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ఈ కటౌట్ వల్ల అటువైపుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సెంటర్లో నిత్యం పండ్ల బళ్లు పెట్టుకొని పలువురు చిరువ్యాపారులు జీవనోపాధి పొందుతుంటారు. సామాన్యుడిపై జులుం ప్రదర్శించే ట్రాఫిక్ పోలీసులు రోడ్డుకు అడ్డుగా అభిమానులు ఏర్పాటు చేసిన వాహనాన్ని ఎందుకు తొలగించడం లేదని జనం విమర్శిస్తున్నారు. -
వైఎస్సార్ విగ్రహం పాక్షిక ధ్వంసం
అనకాపల్లి: జాతీయ రహదారిపై కొత్తూరు పంచాయతీ పరిధిలోని ఏఎంఏఎల్ కళాశాల జంక్షన్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం దుండగుల దాడిలో పాక్షికంగా ధ్వంసమైంది. శనివారం అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్ విగ్రహం కుడి కన్నును పాక్షికంగా పగలగొట్టారు. విషయం తెలుసుకున్న కొత్తూరు పంచాయతీ సర్పంచ్ సప్పారపు లక్ష్మీ ప్రసన్న, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆదివారం ఉదయం విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జానకీరామరాజు మాట్లాడుతూ.. వైఎస్సార్ మరణానంతరం కొత్తూరు ప్రజలు 2010లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఇన్నాళ్ల తర్వాత స్థానికుల మనోభావాలు దెబ్బతినే విధంగా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. విగ్రహాలను కూల్చే సంస్కృతి అనకాపల్లి నియోజకవర్గంలో లేదని, ఇందుకు కారకులైన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ సప్పారపు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ 2010 సెప్టెంబర్ 2న వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఆయన అభిమానుల మనోభావాలను దెబ్బతీయాలనుకోవడం సరికాదన్నారు. వెంటనే విగ్రహానికి మరమ్మతులు చేపట్టి, నాయకులు పూలమాలలు వేసి వైఎస్సార్కు నివాళులర్పించారు. అనంతరం విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు పట్టణ సీఐ టి.వి.విజయకుమార్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, 80వ వార్డు ఇన్చార్జ్ కె.ఎం.నాయుడు, నూకాంబిక అమ్మవారి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, గవర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బొడ్డేడ శివ, కొత్తూరు ఎంపీటీసీ మురుగుతి సంతోష్కుమారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు కొత్తూరు పంచాయతీ ఏఎంఎఎల్ కళాశాల జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్న ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ టి.వి.విజయకుమార్, ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు తెలిపారు. వారు ఘటనా స్థలాన్ని సందర్శించి, సమీపంలోని సీసీ పుటేజీ పరిశీలించారు. ఉల్లింగల శ్రీను, ఒక మైనర్ మద్యం తాగిన మైకంలో గొడవ పడ్డారని, మైనర్ ఉల్లింగల శ్రీనుపై రాయి విసరడంతో వైఎస్సార్ విగ్రహానికి తగిలి పెచ్చులు ఊడిపోయిందని సీఐ టి.వి.విజయకుమార్ చెప్పారు. వీరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఆవేదన చెందిన అభిమానులు వెంటనే విగ్రహానికి మరమ్మతులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన క్వారీ లారీ
అనకాపల్లి టౌన్: పట్టణంలో పోలీసుల సాక్షిగా త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే నాలుగు రోడ్ల జంక్షన్కు మెయిన్ రోడ్డు మీదుగా చేరుకున్న క్వారీ లారీ మహిళను ఢీ కొంది. ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు తిరిగే క్రమంలో ఆమెను ఢీకొట్టి 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. వెంటనే స్థానికులు పెద్దగా కేకలు వేసి లారీ డ్రైవర్కు సైగ చేయగా ఆపాడు. ఈలోగా అక్కడే ఉన్న పట్టణ సీఐ విజయ్కుమార్ స్పందించి మహిళా కానిస్టేబుళ్ల సహాయంతో ఎన్టీఆర్ ఆస్పత్రికి క్షతగాత్రురాలిని తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. వాస్తవానికి ఈ ప్రమాదం జరిగిన కొద్ది సేపటికి ముందు కార్గిల్ విజయోత్సవ ర్యాలీ జరిగింది. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. అందువల్ల నెమ్మదిగా క్వారీ లారీ వెళ్లిందని, లేకపోతే స్పీడుగా వెళ్తే ప్రాణాలు పోయేవని పలువురు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా వేళ కాని వేళలో మెయిన్ రోడ్డు మీదుగా క్వారీ లారీ ఎలా వచ్చిందని, ఇది ఎవరిదని వదిలేశారంటూ బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై ఫిర్యాదు చేయకుండా బాధితురాలితో రాజీకి చేసుకున్నట్టు సమాచారం. -
రానున్న 15 రోజులు వరినాట్లకు కీలకం
అనకాపల్లి: ఖరీఫ్ సీజన్లో మే, జూన్ నెలల్లో ఆశించని వర్షాలు కురిసినప్పటికీ వరినాట్లు పూర్తి చేసేందుకు రాబోయే పక్షం రోజులు కీలకమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు తెలిపారు. స్థానిక ఆర్ఏఆర్ఏస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన టి అండ్ వి వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. మే, జూన్ నెలల్లో జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు పడ్డాయన్నారు. జులైలో సాధారణ వర్షపాతంలో సగం నమోదైన కారణంగా వరినాట్లు వేసుకోవడానికి వాతావరణం అనుకూలంగా లేదని పేర్కొన్నారు. రానున్న 15 రోజుల్లో ఆశించిన వర్షాలు కురిస్తే రైతులు వరినాట్లు వేసుకునేందుకు అనువుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రతినిధి శ్రీధర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ కె.వి.రమణమూరి, ఆదిలక్ష్మి, విశాలాక్షి, డి.ఉమామహేశ్వరరావు, సబ్ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పదోన్నతి అంటే మరింత బాధ్యత
● ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: పోలీస్ శాఖలో పదోన్నతి అనేది గౌరవం మాత్రమే కాదని, మరింత బాధ్యత పెరిగినట్టు అని ఎస్పీ తుహిన్సిన్హా తెలిపారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పని చేస్తున్న 1990 బ్యాచ్ హెడ్ కానిస్టేబుళ్లు 25 మంది ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారి కార్యాలయంలో శుక్రవారం వీరితో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐగా పదోన్నతి కల్పించడం జిల్లా పోలీసు శాఖ గర్వపడుతుందన్నారు. వీరిలో 16 మందిని అనకాపల్లి జిల్లా పోలీస్ యూనిట్కు, 9 మందిని అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయించామన్నారు. కొత్త హోదాలో మరింత నిబద్ధతతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. పనితీరును నిరంతరం మెరుగుపరుచుకుంటూ పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ బీమా భాయ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణతో దళితల ఐక్యతపై కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న రత్నాకర్ నర్సీపట్నం: దళితల ఐక్యతను దెబ్బతీసేందకే ఎస్సీ వర్గీకరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చినట్టు నేషనల్ ప్రిసెసెంట్ ఫర్ మాల మహానాడు అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ ఆరోపించారు. ఆయన శనివారం నర్సీపట్నంలో మాట్లాడారు. దేశంలో ఎస్సీలో 1108 కులాలుండగా వాటి మధ్య చిచ్చురేపేందుకు ఎస్సీ వర్గీకరణ చేయడం కోసం మోదీ, చంద్రబాబు, రేవంత్రెడ్డి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా మాలలు అంతా ఐక్యంగా పోరాటాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రేమ్బాబు, కుండ్రు కల్యాణ్, నెల్లి సూరిబాబు,నాని పాల్గొన్నారు. -
బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాలు చెల్లించాలి
అనకాపల్లి: ఉపాధ్యాయులు బదిలీలు పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా జూన్, జూలై నెలల జీతాలు నేటికీ ప్రభుత్వం చెల్లించలేదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ విలీనగ్రామమైన కొత్తూరు డీఈవో కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బదిలీలు జరిగి రెండు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడానికి కావలసిన ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు. జిల్లాలో సుమారు ఎనిమిది వందల మంది ఉపాధ్యాయులు జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. పొజిషన్ ఐడీలు కోసం ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబునాయుడు సంతకం చేయాలని, సంతకం ఎప్పుడవుతుందో తెలియదన్నారు. జూన్ నెలలో బదిలీలు పొందిన ఉపాధ్యాయుల జాబితాను విద్యాశాఖ అధికారులు జనవరి నెలలోనే సిద్ధం చేసినప్పటికీ, వారి జీతాల కోసం ఏర్పాట్లు చేయక పోవడం ఉన్నతాధికారుల నిర్లక్ష్యమేఅన్నారు. జిల్లా సహాధ్యక్షులు రొంగలి అక్కు నాయుడు మాట్లాడుతూ బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కంటే కూటమి ప్రభుత్వ హయాంలోనే ఉపాధ్యాయులు ఎక్కువ సమయాన్ని బోధనేతర పనులకు కేటాయించవలసి వస్తుందని విమర్శించారు. ఉపాధ్యాయులకు చదువు చెప్పే కార్యక్రమం తప్ప ఏ బోదనతర కార్యక్రమాలు అప్పాజెప్పకూడదని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు గుత్తుల సూర్యప్రకాష్, శేషు కుమార్, రమేష్ రావు, సీనియర్ నాయకులు జి.కె.ఆర్ స్వామి, అలమేలు , ఎల్లయ్య బాబు, ఉప్పాడ రాము, మామిడి బాబురావు, రవి, ఆశ, నూతన్, శివశ్రీ, సత్యవేణి, ఈశ్వర్, జగన్, దినకర్, అర్జున్, పీటర్ పాల్, వెంకట్, గణేష్ చంద్ర తదితరుల పాల్గొన్నారు. -
‘అమ్మ పేరిట ఒక మొక్క’తో మానవ సంబంధాలు వృద్ధి
అనకాపల్లి: మానవ సంబంధాల పెంపుదలకు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో మొక్కలు నాటాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆఫ్ ఇండియా సీనియర్ ఆడిటర్ కె.ఎన్.రాజు అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక మెయిన్రోడ్డు జీవీఎంసీ పెద్ద హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో శనివారం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరిట ఒక మొక్క) కార్యక్రమం క్యాంపెయిన్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడానికి ప్రోత్సహించాలని, ఈ కార్యక్రమం తల్లులు అందించే సంరక్షణ, వృద్ధికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. జీవవైవిధ్యానికి దోహదపడే మొక్కలను మాత్రమే నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు మాతృభక్తి, పర్యావరణం పట్ల ప్రేమ కలుగుతుందని ఆయన చెప్పారు. ‘అమ్మ పేరిట ఒక మొక్క’ అనేది ప్రేమ, బాధ్యత, భవిష్యత్ పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచే మార్గమవుతుందన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గొర్లి మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యులు కాండ్రేగుల వెంకటరమణ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.కుసుమావతి, అధ్యాపకులు కె.వి.ఎస్.ప్రభాకర్, వై.ఎల్.అక్షయ, విద్యార్థులు పాల్గొన్నారు. -
దళిత రైతుల నిరాహార దీక్ష
● ఆర్డీవో కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమం నర్సీపట్నం: మాకవరపాలెం మండలం జి.కోడూరులోని సర్వే నంబర్ 332లో క్వారీని వెంటనే మూసి చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా బహుజన పార్టీ రాష్ట్ర నాయకుడు బొట్టా నాగరాజు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద శనివారం 4వ రోజు నిరాహార దీక్ష కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ నాలుగు రోజులు నుంచి దళితలు నిరాహార దీక్షలు చేస్తున్నా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.మైనింగ్ మాఫీయా కారణంగా దళిత రైతులకు జీవనాధారమైన భూముల్లో దుమ్మధూళి రావడం వల్ల పంటలు నాశనం అవుతున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే అనేకమార్లు అధికారులు దృష్టికి తీసుకువచ్చినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈవిషయంలో అధికారులు స్పందన చూసి సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేయనున్నట్టు చెప్పారు. దీక్షా శిబిరం వద్ద శనివారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చిరంజీవి,మల్లేస్,అప్పారావు, లోవరాజు , పెంటయ్య, సతీష్ తదితర్లు పాల్గొన్నారు. -
అలనాటి వివాహ వైభవం
బుచ్చెయ్యపేట: పెళ్లి అనేది ఒక మధుర జ్ఞాపకం.. దాని కోసం నేటి యువత తమ అభిరుచి ఆలోచనలకు తగ్గట్టుగా వేడుక చేసుకుంటోంది. చైన్నెలో ఓ జంట సాగరం గర్భంలో వివాహం చేసుకోగా, పంజాబ్లో మరో జంట పంట పొలాల్లో పెళ్లి వేడుక చేసుకుంది. ఇక శుభలేఖల నుంచి ఇతర సారె, సరంజామా వరకు వినూత్న పద్ధతులతో ఆకట్టుకుంటున్నారు. ఇదే కోవలో బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలెంలో శనివారం జరిగిన పెళ్లి వేడుక అలనాటి వివాహ వైభవాన్ని తలపించింది. హైటెక్ యుగంలో ఖరీదైన కార్లలో ఊరేగుతున్న వధువులకు భిన్నంగా ఓ వధువు ఎడ్లబండిపై వరుడి ఇంటికి వచ్చి ఆశ్చర్యపరిచింది. రవాణా సదుపాయాల్లేని పూర్వ రోజుల్లో ఎడ్లబళ్లు, గుర్రపు జట్కాలపై పెళ్లికుమార్తెతోపాటు సారెను పెళ్లింటికి సాగనంపేవారు. అదే పద్ధతితో పెళ్లి కుమార్తె లావణ్యను పది ఎడ్లబళ్లతో పలు గ్రామాల మీదుగా ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం వరుడితో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఊరేగింపు చేశారు. పొట్టిదొరపాలేనికి చెందిన కోఆపరేటివ్ సెక్రటరీ దరిమిశెట్టి మహాదేముడు కుమారుడు మోహనకృష్ణ రవితేజనాయడుకు రావికమతం మండలం మరుపాక మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు పండూరి సత్తిబాబు కుమార్తె లావణ్యకు జరిపించిన ఈ వివాహ వేడుక పలువురిని ఆకట్టుకుంది. పెళ్లికుమార్తె లావణ్య ప్రస్తుత గ్రామ సర్పంచ్ కాగా, ఇటీవల బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేయడం గమనార్హం. ఈ వేడుకలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి గుడివాడ అమర్నాథ్ పాల్గొని పూర్వకాలం వివాహ వేడుకను ఈతరం యువతకు చూపించావు అంటూ పెళ్లి కుమార్తెను అభినందించారు. వధూవరులిద్దరిని బుచ్చెయ్యపేట, రావికమతం మండల నాయకులతో కలిసి ఆశీర్వదించారు. -
ఆర్మీ ర్యాలీ, హాకీ టోర్నమెంట్కు విరాళం
కలెక్టర్ షణ్మోహన్కు చెక్ అందజేస్తున్న విజయ ప్రకాష్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆగస్టులో నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, హాకీ జాతీయ జూనియర్ మహిళా టోర్నమెంట్కు ఽశ్రీప్రకాష్ విద్యా సంస్థలు రూ.2 లక్షల విరాళం అందించాయి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు ఆయన చాంబర్లో శ్రీప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సీహెచ్ విజయ ప్రకాష్ శనివారం చెక్ అందజేశారు. శ్రీప్రకాష్ యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలకు సహకారం అందించడం సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. -
ఢిల్లీ పంద్రాగస్టు వేడుకలకు సర్పంచ్ ప్రశాంతికి ఆహ్వానం
ఎస్.రాయవరం : ఢిల్లీలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు ఆహ్వానం అందుకున్న పెట్టుగోళ్లపల్లి సర్పంచ్ అల్లు వెంకట ప్రశాంతికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దినందుకు ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చిందని సర్పంచ్ వెంకట ప్రశాంతి తెలిపారు. పెట్టుగోళ్లపల్లి గ్రామంలో ఐదు దశాబ్దాలుగా అల్లువారి కుటుంబం నుంచి సర్పంచ్లుగా సేవలందించి గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర వహించారు. 2021లో తాను సర్పంచ్గా ఎన్నికై అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్టు అల్లు ప్రశాంతి తెలిపారు. గ్రామంలో ప్రకృతి వ్యసాయంలో శిక్షణ ఇవ్వడంతో సుమారు 70 ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు రూ.23 లక్షలతో, ప్రస్తుత ప్రభుత్వంలో ఎస్ఎస్ఏ నుంచి రూ.15 లక్షలతో ప్రహరీ, ఎస్డీఎఫ్ గ్రాంటు రూ.3 లక్షలతో ఆడిటోరియం వంటి నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ఢిల్లీ స్థాయిలో గుర్తింపు రావడం చాలా సంతోషకరంగా ఉందని, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. -
ప్లాస్టిక్ వినియోగంతో అనర్థాలు
● కలెక్టర్ విజయ కృష్ణన్ చెత్త సేకరణ రిక్షాలు పంపిణీ చేస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే సుందరపు అచ్యుతాపురం: ప్లాస్టిక్ వినియోగంతో ఎన్నో అనర్థాలు సంభవిస్తున్నాయని, అందువల్ల ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించడానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చెత్త సేకరణకు 40 మూడు చక్రాల రిక్షాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమన్నారు. అందరూ వస్త్ర సంచులను వినియోగించాలని సూచించారు. తద్వారా సింగిల్ యాజ్డ్ పాలిథిన్ కవర్ల వినియోగాన్ని నివారించవచ్చని తెలిపారు.కోహెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌజన్యంతో ఈ రిక్షాలను ఆయా గ్రామాలకు సమకూర్చారు.ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మాట్లాడుతూ ఎం.జగన్నాథపురం వంటి కొండవాలు ప్రాంతాల్లో చెత్తసేకరణకు ఎలక్ట్రానిక్ ఆటోలు అవసరముంటుందన్నారు. -
ఏడాదైనా రాని కొత్త పింఛన్లు
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా వృద్ధులకు,దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో డిప్యూటీ సీఈవో రాజ్కుమార్,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవరాపల్లి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం మాట్లాడుతూ కొత్త పింఛన్ల కోసం ఎంతో మంది అర్హులైన వృద్ధులు,దివ్యాంగులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. దీని వల్ల ఎంతో మంది అర్హులైన అవ్వాతాతలు,దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వారికి ఇప్పటి వరకు ఎంతమందికి పింఛన్లు ఇచ్చారో తెలియజేయాలని కోరారు.కూటమి సర్కార్ అధికారం చేపట్టి ఏడాది అయినా ఇంకా కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం ఏంటిని ప్రశ్నించారు. గొలుగొండ జెడ్పీటీసీ గిరిబాబు మాట్లాడుతూ తక్షణం పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఎస్సీ, బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాల ని దేవరాపల్లి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం కోరారు. అందుబాటులో ఉండని 108 వాహనాలు అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 108 వాహనాలు సక్రమంగా పనిచేయడం లేదని, రోగులకు అందుబాటులో ఉండడం లేదని సభ్యులు అవేదన వ్యక్తం చేశారు. కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ 108 వాహనాలు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో గైనిక్ సేవలు సక్రమంగా లేవని సభ్యురాలు సత్యవతి తెలిపారు. జెడ్పీటీసీ సభ్యుల ఆవేదన జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశాలు -
సంక్షోభ హాస్టళ్లు
● సమస్యలకు నిలయాలుగా సంక్షేమ హాస్టళ్లు ● గురుకుల, కేజీబీవీ,మోడల్,బీసీ, ఎస్సీ,ఎస్టీ వసతిగృహాల్లో కనీస సౌకర్యాలు కరువు ● శిథిలమైన భవనంలో, పెచ్చులూడిన గదుల్లోనే వసతి గృహాల నిర్వహణ ● తలుపులు లేని బాత్ రూంలు,మరుగుదొడ్లతో ఇక్కట్లు6126 930 39 10142232 824ఈ చిత్రంలో కనిపిస్తున్నది నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహం. ఈ హాస్టల్లో సౌకర్యాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పందించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో గత ఏడాది అక్టోబర్లో మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్ నియోజకవర్గంలోని పలు వసతిగృహాలను పరిశీలించారు. అప్పుడు నర్సీపట్నం ఎస్సీ బాలికల వసతి గృహంలో మరుగుదొడ్లు సౌకర్యం లేని విషయాన్ని గమనించారు. అప్పటికి ఒక్క మరుగుదొడ్డి మాత్రమే నిర్వహణలో ఉంది. ఇదే విషయం ఆయన ఉన్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అప్పట్లో ఈ విషయంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని మిగతా వసతిగృహాలతో పాటు ఇక్కడ వసతిగృహంలో సమస్యలపై తీసుకోబోయే చర్యలు గురించి సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి స్వయంగా వివరణ ఇచ్చారు. అయితే ఇదొక్కటే కాకుండా జిల్లా వ్యాప్తంగా వసతి గృహాలను అధికార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే చాలా సమస్యలు బయట పడతాయి. కనీస సదుపాయాలు లేక వసతి గృహాల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వస్తాయి. సాక్షి,అనకాపల్లి/నర్సీపట్నం/నక్కపల్లి/పాయకరావుపేట/మాడుగుల/మాడుగుల రూరల్/కోటవురట్ల/గొలుగొండ : శిథిలమైన భవనాలు..చాలీచాలని గదులు..తిరగని ఫ్యాన్లు..విరిగిన తలుపులు..పెచ్చులూడిన శ్లాబులు..పూర్తిస్థాయిలో మెయింట్నెన్స్లేని మరుగుదొడ్లు..తాగునీటికీ తప్పని ఇబ్బందులు..ఇలా ఒకటి కాదు రెండు కాదు జిల్లాలో గల హాస్టళ్లలో సమస్యల జాబితా ఏకంగా చాంతాడంత ఉంది. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నరకయాతన పడుతున్నారు. ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి విజిట్లో విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం, అశ్రద్ధ అడుగడుగునా స్పష్టంగా కనిపించింది. జిల్లాలో మొత్తం 97 వసతి గృహాలున్నాయి. ఏ సంక్షేమ హాస్టల్ను చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు దర్శనమిస్తున్నాయి. అరకొర వసతి, గాడి తప్పిన నిర్వహణతో దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాత్రి వేళలో దోమల బెడద ఎక్కువగా ఉంది. దోమల తెరలు లేవు..కనీసం దుప్పట్లు సైతం సరఫరా చేయని దుస్థితి కనిపించింది. కొన్ని హాస్టళ్ల బాత్ రూంలు, మరుదుదొడ్లకు తలుపులు లేకపోవడంతో చిన్నారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మినరల్ ప్లాంట్లు మరమ్మతులకు గురవడంతో విద్యార్థులు మోటార్నీళ్లే తాగుతున్నారు. మరుగుదొడ్ల పరిస్థితి మరీ ఘోరం ఉంది. రన్నింగ్ వాటర్ సదుపాయం లేకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. నర్సీపట్నంలో.. నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ బాలికల వసతిగృహంలో విద్యార్థినుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా వసతులు పెరగలేదు. దాదాపు ఐదు దశబ్దాల క్రితం ఈ వసతిగృహాన్ని నిర్మించారు. 120 మంది విద్యార్థినులు ఉండేందుకు వీలుగా ఈ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం 228 మంది విద్యార్థినులు ఇక్కడ ఉంటున్నారు. వీరిలో ఉన్నత పాఠశాల విద్యార్థినులు 170 మంది కాగా, 58 మంది ఇంటర్, డిగ్రీ విద్యార్థినులు. కాలేజీ విద్యార్థినుల వసతిగృహం ప్రత్యేకంగా నిర్వహించాల్సి ఉంది. సర్దుబాటు పేరుతో కాలేజీ విద్యార్థినులకు కూడా ఇక్కడే వసతి కల్పిస్తున్నారు. వసతి గృహంలో పది మరుగుదొడ్లు, పది స్నానాల గదులు ఉన్నాయి. పరిమితమైన వీటిలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. ఇటీవలే వీటిన్నింటికి మరమ్మతులు పూర్తి చేశారు. అయినప్పటికీ మూడు మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో వినియోగించడం లేదు. వసతిగృహం మొత్తం మీద నివాస గదులు ఏడు ఉన్నాయి. ఒక్కో గదిలో 10 నుంచి 15 మంది ఉండాల్సి ఉండగా 30 మంది వరకు ఉంటున్నారు. ●గొలుగొండ మండలంలో ఏపీ బాలయోగి గురుకుల కళాశాల వసతి గృహంలో డార్మెటరీ మరమ్మతులకు గురికావవంతో ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. మొత్తం 390 మంది విద్యార్థులున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో... పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో గోడిచర్ల బీసీ హాస్టల్లో 64 మంది విద్యార్థులు ఉన్నారు. శిథిలావస్థకు చేరిన ఈ హాస్టల్ భవనం కూల డానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు కూలిపోతుందోనన్న భయంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. నిర్మించిన 11 ఏళ్లకే శిథిలావస్థకు చేరుకుంది. మరుగుదొడ్లు తలుపులు ఊడిపోయాయి. మంచాలు లేకపోవడంతో విద్యార్థులు కటిక నేల మీద పడుకోవలసి దుస్థితి ఉంది. గదుల్లో ఫ్యాన్లు సరిగ్గా తిరగడం లేదు. హాస్టల్ ఆవరణ అంతా అధ్వానంగా ఉంది. ప్రహారీ , తాగు నీటి సదుపాయం లేవు ప్రస్తుతం కోటవురట్ల హాస్టల్ వార్డెన్ ను 10 రోజుల క్రితం ఇంచార్జ్ గా నియమించారు. ●పాయకరావుపేటలో బీసీ బాయ్స్ కళాశాల హాస్టల్లో 71 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా నేల మీద పడుకుంటున్నారు. ఎస్సీ బాయ్స్ హాస్టల్లో 58 మంది విద్యార్థులున్నారు. వీరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ●కోటవురట్ల మండలంలో గల సమగ్ర బాలుర వసతి గృహంలో విద్యార్థులకు మంచాలు అందుబాటులో లేవు. నేలపైనే దుప్పట్లు వేసుకుని పడుకుంటున్నారు. టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి. కిటికీల డోర్లు చెదపట్టి దారుణంగా ఉన్నాయి. బాత్ రూంలకు తలుపులు సరిగ్గా లేవు. మాడుగుల నియోజకవర్గంలో ●మాడుగుల బీసీ జూనియర్ డిగ్రీ బాలికల వసతి గృహం అద్దె ఇంటిలో కొనసాగుతోంది. ఇక్కడ ఉంటున్న సుమారు 75 మంది విద్యార్థినులు ఇరుకు గదుల్లో ఇక్కట్లకుగురవుతూ సర్దుకోవలసి వస్తోంది. ●అద్దె ఇంటిలో నిర్వహిస్తున్న మాడుగుల జూనియర్, డిగ్రీ కళాశాల ఎస్టీ బాలికలు వసతి గృహంలో కనీస వసతులు లేవు. ఇక్కడ వందమంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. కేవలం మూడు మరుదుదొడ్లు మాత్రమే ఉండగా వాటిలో ఒకటి శిథిలమైపోయింది. మిగిలిన రెండు మరుగుదొడ్లకు తలుపులు సక్రమంగా లేవు. మరుగుదొడ్లు సరిపడక ఇక్కడ విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు భోజనశాల వద్ద బురద మయంగా మారుతుండడంతో విద్యార్థినులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మాడుగులలో బీసీ బాలుర వసతి గృహం భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు భయంగాభయంగా ఉంటున్నారు.ఇక్కడ 6 నుంచి 10 వ తరగతికి చెందిన 50 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. దుప్పట్లు, రగ్గులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. చోడవరం నియోజకవర్గంలో చోడవరం: మండలంలో గాంధీగ్రామంలో ఎస్సీ బాలుర వసతిగృహానికి, చోడవరం ఎస్సీ గర్ల్స్ కాలేజీ హాస్టల్ భవనాలకు మరమ్మతు పనులు కొంతమేర చేశారు. గోవాడ బీసీ బాలుర హాస్టల్ను ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్నారు. తగిన సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. చోడవరం ఎస్టీ కాలేజీ బాలికల హాస్టల్కు సొంత భవనం లేకపోవడంతో అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు. చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులకు ఈ ఏడాది ఇంకా రగ్గులు సరఫరా చేయలేదు. వడ్డాది ఎస్సీ బాలుర హాస్టల్లో వాటర్ ఫిల్టర్, ఇన్వర్టర్ లేదు. దీనివల్ల కరెంటు లేని సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోలుగుంట బీసీ హాస్టల్ ఆవరణంలో మురికి నీరు నిల్వ ఉండి పోతోంది. భవనం కూడా పాతదికావడంతో కొద్దిపాటి వర్షానికే కొన్ని గదుల్లోని నీరు కారిపోతోంది. ●కశింకోటలోని వసతి గృహాల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులకు మంచాలు లేక కటిక నేల మీద నిద్రించాల్సిన పరిస్థితిని ఉంది. వీరికి బెడ్ షీట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఇంటి వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు. పది మరుగుదొడ్లు వినియోగంలో ఉండగా మరో నాలుగు నిరూపయోగంగా ఉన్నాయి. బాత్రూమ్లు లేకపోవడంతో ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసినప్పటికి అవి చాలా కాలంగా పని చేయడం లేదు. బీసీ వెల్ఫేర్ కళాశాల వసతి గృహాలుప్రీమెట్రిక్ బీసీ వెల్ఫేర్ వసతి గృహాలు వీటిలో బాలురుబాలికలుజిల్లాలో వసతి గృహాలు వివరాలు ఇలా..ఈ రెండింటిలో బాలురు బాలికల వసతి గృహాలువీటిలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు ఎస్సీ వెల్ఫేర్ వసతి గృహాలుకేజీబీవీలుపోస్టు మెట్రిక్ -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోడ్ల దుస్థితి
● చోడవరం రోడ్ల దుస్థితిపై కోర్టుకు నివేదించిన ప్రభుత్వ అధికారులు ● రోడ్డు కాంట్రాక్టర్, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్కు నోటీసు జారీచేసేందుకు కోర్టు ఆదేశం ● వచ్చే నెల 23న మరోసారి హాజరుకావాలన్న 9వ ఏడీజే కోర్టు ● వివరాలు వెల్లండించిన పిటిషనర్ తరపు న్యాయవాది డేవిడ్ చోడవరం : రోడ్లు బాగుచేయాలంటూ న్యాయవాదులు వేసిన పిటిషన్పై కోర్టు ముందు ఆర్అండ్బీ జిల్లా అధికారులు శనివారం హాజరయ్యారు. సబ్బవరం నుంచి వయా చోడవరం, వడ్డాది, కొత్తకోట,రోలుగుంట మీదుగా మెయిన్రోడ్డు (బీఎన్రోడ్డు), అనకాపల్లి–మాడుగుల ఆర్అండ్బీ రోడ్లు చాలా అధ్వానంగా గోతులు పడి ఉన్నాయని, వీటిని ఎందుకు బాగుచేయించలేదో తెలపాలంటూ ఈనెల 7వతేదీన చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టులో చోడవరానికి చెందిన న్యాయవాదులు అన్నాబత్తుల భరత్ భూషణ్, భూపతిరాజు పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కలెక్టర్తోపాటు ఏడుగురు మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేయగా, వారు శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. కలెక్టర్ తరఫున ఆర్అండ్బీ ఈఈ సాంబశివరావు, ఏఈ సత్యప్రసాద్ హాజరయ్యారు. ఈ పిటీషన్కు సంబంధించి వివరాలను పిటీషనర్ తరపున న్యాయవాది, చోడవరం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్ విలేకరులకు వెల్లడించారు. ఈ రెండు రోడ్లు ఎందుకు బాగుచేయాలేదన్న విషయమై ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిబంధనలు ప్రకారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని డేవిడ్ చెప్పారు. ప్రజలకు కల్పించవలసిన ప్రాథమిక సదుపాయాలు సెక్షన్ 12ను అనుసరించి పిటిషన్ వేయడం జరిగిందన్నారు. చాలా యేళ్లుగా ఈ రోడ్లకు నిర్వహణ పనులు చేపట్టకపోడం వల్ల బాగా దెబ్బతిన్నాయని, ప్రస్తుతం పెద్దపెద్ద గోతులు పూడ్చే పనులు చేపట్టామని అధికారులు కోర్టుకు వివరించారన్నారు. పూర్తిగా గోతులన్నీ పూడ్చడానికి చర్యలు చేపట్టామని వారు చెప్పినట్టు న్యాయవాది డేవిడ్ చెప్పారు. గోతులు పూడ్చడంతోపాటు పూర్తిస్థాయి రోడ్డును వేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టారని లీగల్ అథారిటీ వారు ప్రశ్నించారన్నారు. రోడ్డు కాంట్రాక్టర్ ఎ.అశ్వంత్ అనే వ్యక్తి నిర్లక్ష్యం వల్లే రోడ్లు సకాలంలో వేయలేకపోయామని అధికారులు తెలిపారని న్యాయవాది చెప్పారు. ఈ కాంట్రాక్టర్తో పనిచేయించే అధికారం తమకు లేదని, ఎన్డీబీ ప్రాజెక్టు పనులు పరిశీలిస్తున్న చీఫ్ ఇంజినీర్కు మాత్రమే అధికారం ఉంటుందని జిల్లా అధికారులు చెప్పడంతో సదరు కాంట్రాక్టర్, చీఫ్ ఇంజినీర్ (విజయవాడ) వ్యక్తిగతంగా ఆగస్టు 23వతేదీన కోర్టుకు హాజరుకావాలని అథారిటీ చైర్మన్ అదేశించారని న్యాయవాది చెప్పారు. వీరికి నోటీసులు వెంటనే పంపాలని సిబ్బందిని కోర్టు ఆదేశించిదన్నారు. వీరి సమాధానాన్ని బట్టి రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అవసరమైతే హైకోర్టుకు కూడా వెళతామని పిటీషనర్ తరపు న్యాయవాది డేవిడ్ చెప్పారు. -
6ఏ నోటీసులపై భగ్గుమన్న రైతులు
నక్కపల్లి: రైతుల ఆమోదం లేకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం బల్్కడ్రగ్ పార్కుకు అదనపు భూ సేకరణ చేపట్టడంపై రైతులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జానకయ్యపేట, సీహెచ్ఎల్పురం గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్కు కోసం అదనంగా 197 ఎకరాల భూమిని సేకరించడానికి మేలో ప్రభుత్వం 6ఏ నోటీసు ప్రకటన విడుదలచేసి అభ్యంతరాలు తెలపాలని పేర్కొంది. అయితే, భూములిచ్చేది లేదంటూ రైతులు పలుమార్లు నిరసన తెలిపినా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంపై వారంతా రగిలిపోతున్నారు.ఈ నేపథ్యంలో.. శనివారం వైఎస్సార్సీపీ, సీపీఎంల మద్దతుతో రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఇప్పటికే ప్రభుత్వం రెండు వేల ఎకరాలను బల్క్డ్రగ్ పార్కు కోసం కేటాయిస్తే మరో 700 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం దుర్మార్గమన్నారు. ఇందులో 197 ఎకరాలు జానకయ్యపేట, సీహెచ్ఎల్పురం రెవెన్యూ పరిధిలో తీసుకోవడానికి పత్రికా ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ సందర్భంగా.. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ.. రైతులను బెదిరించి భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.జజిల్లాలో ఎక్కడాలేని విధంగా హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న నక్కపల్లి మండలంలోనే వేల ఎకరాల భూసేకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఎకరా, రెండెకరాల భూములు కలిగిన రైతులు కంపెనీలకు భూములిచ్చేస్తే వాటిపై వచ్చే తక్కువ పరిహారంతో ఎలా బతుకుతారని వారు ప్రశ్నించారు. రైతులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. వచ్చేనెల 6న జరిగే ప్రజాభిప్రాయ సేకరణను సైతం అడ్డుకుని నిరసన తెలియజేస్తామని వారు స్పష్టంచేశారు. పలువురు టీడీపీ నేతలు కూడా భూములు ఇవ్వబోమంటూ తహశీల్దార్కు లిఖితపూర్వకంగా తెలిపారు. -
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ధర్నా
కోర్టు వద్ద ధర్నా చేస్తున్న న్యాయవాదులు అనకాపల్లి: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఎదుట శుక్రవారం న్యాయవాదులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. స్థానిక కోర్టులో సమస్యలను పరిష్కరించాలని, మహిళలకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయాలని, అనకాపల్లి కోర్టుకు పర్మినెంట్ భవనాన్ని నిర్మించాలని తదితర డిమాండ్లతో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో అనకాపల్లి బార్ అధ్యక్షుడు పిల్లా హరశ్రీనివాసరావు, కార్యదర్శి బంధం రమణ, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
వైజాగ్ మెట్రోకి టెండర్లు
● ఫేజ్–1లో 46.23 కిమీకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ● డీపీఆర్కు కేంద్రం ఆమోదం తెలపకుండానే టెండర్లు పిలవడంపై విమర్శలు ● కేంద్రం నిధులు ఇస్తుందా లేదా అనేదానిపైనా నీలినీడలు ● గొప్పల కోసమే కూటమి ప్రభుత్వం టెండర్ల హడావిడి ● వీఎంఆర్డీఏ నిధులు మెట్రోకి మళ్లించే ప్రయత్నం ● ఇప్పటికే ఆదాయం లేక కునారిల్లుతున్న వీఎంఆర్డీఏ ● తాజా నిర్ణయంతో మరింత ఆర్థిక భారం డీపీఆర్ ఆమోదం లేకుండా టెండరు.. నిధుల్లేకుండా హడావుడిసాక్షి, విశాఖపట్నం: డీపీఆర్కు ఆమోదం చెప్పలేదు.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి విదిల్చలేదు.. భూ సేకరణకు కూడా అడుగు పడలేదు.. కనీసం మా వంతు సహకారం అందిస్తామన్న హామీ కూడా రాలేదు. కానీ.. కూటమి ప్రభుత్వం ప్రచారం కోసం హడావిడి ప్రారంభించేసింది. రూపాయి లేదు.. డీపీఆర్ లేదు.. కొడుకు పేరు వైజాగ్ మెట్రో అన్నట్లుగా.. ప్రజల్ని మభ్య పెట్టేందుకు వైజాగ్ మెట్రో నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఫేజ్–1లో 46.23 కిమీ నిర్మించేందుకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్సీ) దాదాపు రూ.6500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికే రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. కానీ.. 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లతో కూడిన 46.23 కిమీ మెట్రో ప్రాజెక్టు అగ్రిమెంట్ అయిన 30 నెలల్లో పూర్తి చేసెయ్యాలంటూ నిబంధనలు విధించింది. ఈ ప్రాజెక్టు కోసం వీఎంఆర్డీఏని ఆర్థికంగా బలి చేసేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.6250 కోట్లు(జీఎస్టీ అదనం)తో టెండర్లుకు శుక్రవారం ఆహ్వానించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.11,498 కోట్లు కాగా..మూడు కారిడార్లలో ఫేజ్ –1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్సీ టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పనుల్ని మూడేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాలని టెండర్ షెడ్యూలులో పేర్కొన్నారు. టెండర్ సమర్పించిన 180 రోజుల వరకూ బిడ్ వ్యాలిడిటీ ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ లో చేపట్టనున్నారు. తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర చేపట్టనుండగా.. ఇందులో మొత్తం 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఇందులో 20.16 కి.మీ డబుల్ డెక్కర్ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ వరకూ పై వంతెనలు నిర్మిస్తారు. కొమ్మాది– స్టీల్ప్లాంట్, గురుద్వారా–పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం–చినవాల్తేరు కారిడార్లలో తొలి దశ కింద మెట్రోకు ప్రణాళిక చేశారు. కొమ్మాది–స్టీల్ప్లాంట్ మధ్య ఏర్పాటు చేసే 34.40 కిలోమీటర్ల కారిడార్లో డబుల్ డెక్కర్ ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కిమీ మేర రెండో కారిడార్ను నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్ప్లాంటు మధ్య మరొక కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. 30 నెలల్లో పూర్తి చెయ్యాలంట.. ఈ నెల 28న ఏపీ ఈప్రొక్యూర్మెంట్లో టెండర్లు పెట్టనున్నారు. సెప్టెంబర్ 12న టెండర్లు ఓపెన్ చెయ్యనున్నారు. అనంతరం వడపోత తర్వాత.. టెండర్ దక్కించుకున్న సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. ఆ తర్వాత 30 నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలని షరతు విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కిలోమీటర్ ఫ్లైఓవర్ పూర్తి చేసేందుకు రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. కానీ.. కూటమి ప్రభుత్వం మాత్రం 46 కిమీ మెట్రో ప్రాజెక్టు రెండున్నరేళ్లలోనే పూర్తి చేసెయ్యాలని చెప్పడం చూస్తే.. ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టి.. ప్రచారం కోసమేనన్నట్లుగా అర్థమవుతోంది. అదేవిధంగా.. డబుల్ డెక్కర్ నాలుగు లైన్ల ఫ్లై ఓవర్ని కూడా 24 నెలల్లో పూర్తి చేసేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక్క అడుగు కూడా పడకుండానే..! ఒక ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ని కేంద్రం ఆమోదించాలి.. నిధులు చూపించిన తర్వాతే.. టెండర్లకు వెళ్తుంటారు. కానీ.. వైజాగ్ మెట్రో విషయంలో మాత్రం తిమ్మిని బమ్మి చేసేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ డీపీఆర్ని ఆమోదించి.. కేంద్రానికి పంపించింది. నెల రోజుల క్రితం కూటమి ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి.. డీపీఆర్ అమోదించాలని కోరారు. కానీ.. ఇంతవరకూ డీపీఆర్ని ఆమోదించలేదు. అంతే కాదు.. విభజన చట్టంలో భాగంగా.. మెట్రోకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. కానీ.. ఇంతవరకూ మెట్రో కోసం నిధులు మంజూరు చేస్తామని కేంద్రం ప్రకటించలేదు. రెండు ఫేజ్లలో మెట్రో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 99.75 ఎకరాల భూసేకరణ చేపట్టాలి. ఇది కూడా సర్వే జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. భూసేకరణ ప్రక్రియ మాత్రం జరగలేదు. ఇన్ని అడ్డంకులు ఉన్నా.. టెండర్లు పిలిచి.. రెండున్నరేళ్లలో పూర్తి చేసేస్తామంటూ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటించడం హాస్యాస్పదం. వీఎంఆర్డీఏపై ‘ఆర్థిక’ భారం.! సంపద సృష్టించే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ బాకాలు ఊదిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అప్పుల మూటని రాష్ట్రం నెత్తిన పెట్టేశారు. ఇప్పుడు.. తన ప్రచారయావ కోసం మరోసారి వీఎంఆర్డీఏని బలి చేసేందుకు కుట్రపన్నుతున్నారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో వీఎంఆర్డీఏ(అప్పటి వుడా) ఆస్తుల్ని విక్రయించి.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి.. విశాఖకు రిక్త హస్తాలు చూపించారు. ఇప్పుడు.. మరోసారి వీఎంఆర్డీఏపై ‘ఆర్థిక’ భారం మోపేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. అంతంత మాత్రం ఆదాయంతో కొట్టుమిట్టాడుతున్న వీఎంఆర్డీఏ నుంచి రూ.4,101 కోట్లు తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి వీఎంఆర్డీఏ వార్షిక బడ్జెట్ కేవలం రూ.1000 కోట్లు మాత్రమే. ఆదాయం లేక.. తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే నానా యాతన పడుతున్న సమయంలో.. మొత్తం ఆస్తులు అమ్మేసి.. మెట్రోకి పెట్టాలని కూటమి సర్కారు హుకుం జారీ చేసేసింది. దీంతో.. భారీ మొత్తాన్ని ఎలా భరించాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోయినా.. టెండర్ల పేరుతో అరచేతిలో మెట్రో చూపించేందుకు కూటమి సర్కారు సిద్ధమవడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు. -
‘అన్యాయంగా భూమి రిజిస్ట్రేషన్ రద్దు చేశారు’
డాబాగార్డెన్స్ (విశాఖ): అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం గంటి కొర్లం ప్రాంతంలో తనకు చెందిన ఎకరా 54 సెంట్ల భూమిని తనకు తెలియకుండా విజయనగరం జిల్లా పాలకొండ సబ్ రిజిస్ట్రార్ అన్యాయంగా రిజిస్ట్రేషన్ రద్దు చేశారని బాధితుడు గంప సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన అనుమతి లేకుండా విజయనగరం జిల్లా పాలకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి బొల్లాప్రగడ వెంకటరమణమూర్తి అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపారు. సుమారు పదేళ్ల కిందట తన బావమరిది బొల్లాప్రగడ వెంకటరమణమూర్తి తన పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేశాడని తెలిపారు. అయితే ఇటీవల చెప్పుడు మాటలు విని తనను అకారణంగా ధ్వేషిస్తూ తనపై ఫిర్యాదులు చేస్తున్నారని, ఇదే విషయంలో జనసేన నాయకునిగా చెప్పుకు తిరుగుతున్న అడ్డుపల్లి గణేష్ గత మే 29న తన భూమిలో 50 మందితో కలిసి వచ్చి తనను చంపేస్తామని, భూమి తనకు వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరించి భయబ్రాంతులకు గురి చేశారన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పలుమార్లు తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి తనను, తన కుటుంబ సభ్యులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ సుమారు 20 మంది రౌడీలతో తన ఇంటికి వచ్చి బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఇదే విషయమై ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. అయినప్పటికి తనకు ఎటువంటి న్యాయం జరగలేదని, జనసేన నేతగా చెప్పుకుంటున్న అడ్డుపల్లి గణేష్ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఇప్పటికై నా అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరారు. పాలకొండ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకుని, అన్యాయంగా రద్దు చేసిన తన భూమిని తనకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో గంప గోవిందరాజు, సంతోష్కుమార్ పాల్గొన్నారు. -
చెట్లు మాయం చేసిన వారిపై కేసు పెట్టాలి
● పోలీసు స్టేషన్లో వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు నర్సీపట్నం : ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చిటికెల రమణ, వివిధ విభాగాల పార్టీ నాయకులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీమబోయినపాలెం, శెట్టిపాలెం పంచాయతీ పరిధి నర్సీపట్నం నుండి అనకాపల్లి పోవు అర్అండ్బి రోడ్డుకి ఇరువైపులా ఉన్న వందేళ్లు వయస్సు కలిగిన భారీ వృక్షాలను అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మకై చెట్లు నరికేసి రాత్రికి రాత్రే తరలించుకుపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులకు భయపడి పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు ఫిర్యాదు చేయలేదన్నారు. చెట్లు మాయమవడానికి కారణమైన అధికారపార్టీ నాయకులు, అర్అండ్బీ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.40 లక్షల విలువైన చెట్లను అక్రమంగా తరలించుకుపోయారని తక్షణమే కేసులు పెట్టాలని కోరారు. -
ఒత్తిడి లేని జీవనానికి ధ్యానం
పాయకరావుపేట: ఒత్తిడి లేని జీవనానికి ధ్యానం అవసరమని యోగద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు స్వామిశ్రీ స్మరణానంద గిరి తెలియజేశారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఆయన ఉద్బోధించారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు ఏకాగ్రత పెంపొందించుకోవడానికి ధ్యానం ఒక మార్గమని సూచించారు. ధ్యాన సాధనను ఎలా లోతుగా చేసుకోవాలో వివరించారు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా యోగా, ధ్యానం ద్వారా మనసులో ఉండే భయాలు తొలగిపోతాయన్నారు. అజ్ఞానం అనే అంధకారం తొలగించుకోవడానికి ధ్యానం ఒక మార్గమన్నారు. నిద్ర ద్వారా వచ్చే విశ్రాంతి, శక్తి కన్నా ధ్యానం ద్వారా ఎక్కువ విశ్రాంతి పొందుతామన్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి అనునిత్యం పుస్తక పఠనం తప్పనిసరి అని సూచించారు. కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ప్రకాష్, యోగద సత్సంగ ధ్యాన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎం గోదాముల వద్ద అప్రమత్తత అవసరం
రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఈవీఎం గోదాములను తనిఖీ చేస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: ఈవీఎం గోదాముల వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. నెలవారీ తనిఖీలో భాగంగా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోదాములను శుక్రవారం ఉదయం ఆమె డీఆర్వో వై.సత్యనారాయణరావు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలిసి తనిఖీ చేశారు. గోదాముల వద్ద పరిస్థితులతో పాటు సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. లాగ్ బుక్ నిర్వహణ ఇతర అంశాలపై రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యకమంలో ఆర్డీవో షేక్ ఆయిషా, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆర్.వెంకటరమణ, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి.నాయుడు, రాజకీయ పార్టీల నేతలు జాజుల రమేష్, బి.శ్రీనివాసరావు, ఉగ్గిన అప్పారావు, కె.వి.మారియో, కె.హరినాథబాబు, ఆర్.శంకరరావు, విద్యుత్ శాఖ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.