Anakapalle
-
గిరిజన యువతి మృతిపై పోలీసుల విచారణ
దేవరాపల్లి : మండల కేంద్రంలో సోమవారం రాత్రి అనంతగిరి మండలం కొరపర్తికి చెందిన గిరిజన యువతి దూసరి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. యువతి ఉరి వేసుకున్న గదిలో క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. దేవరాపల్లికి చెందిన యువకుడు కొల్లి లోకేష్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేయడాన్ని తట్టుకోలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతురాలి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మంళవారం స్థానిక పోలీస్స్టేషన్కు అధిక సంఖ్యలో తరలివచ్చి లక్ష్మి మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ కులానికి చెందిన యువతి కావడంతోనే సదరు యువకుడు పెళ్లికి నిరాకరించాడని, దీనిని తట్టుకోలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ తల్లిదండ్రులను ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని పోషిస్తున్న లక్ష్మి మృతితో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మాట్లాడుతూ గిరిజన యువతి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ రక్షణ చట్టం కింద పరిహారం, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారం, రెండు ఎకరాల భూమి, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కె.కోటపాడు సీహెచ్సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. -
15 కిలోల గంజాయి పట్టివేత
గంజాయిని పట్టుకున్న సెక్యూరిటీ వింగ్ (ఆర్ఐ) టీం పెందుర్తి: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని పెందుర్తి రైల్వే స్టేషన్ వద్ద సెక్యూరిటీ వింగ్(ఆర్ఐ) టీం పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పెందుర్తి ప్రాంతంలో ఆర్ఐ బృందం తనిఖీలు నిర్వహించింది. నార్కోటిక్ డాగ్ సహాయంతో రైల్వే స్టేషన్ వద్ద 4 ప్యాకెట్లలో 15 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయితో పాటు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మేడపై నుంచి పడి యువకుడు మృతి
అచ్యుతాపురం రూరల్ : ప్రమాదవశాత్తూ మేడపై నుంచి పడి అలబాని రామకృష్ణ (22) అనే యువకుడు మృతి చెందిన సంఘటన అచ్యుతాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లారస్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ అచ్యుతాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న మనోహర్ హాస్టల్లో మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో మూడో అంతస్తుపై నుంచి పడిపోవడం చుట్టుపక్కల వారు కొద్ది సేపటికి గమనించి 108 ఆంబులెన్స్ ద్వారా అచ్యుతాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 3 గంటల సమయంలో రామకృష్ణ మృతి చెందాడు. ఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ చంద్రశేఖర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
కందిపప్పు కలేనా.. రాగులు గతమేనా?
మహారాణిపేట: పేదల ఆహార భద్రతకు అండగా ఉండాల్సిన రేషన్ దుకాణాలు ఇప్పుడు అరకొర సరఫరాలతోనే సరిపెట్టుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలలు దాటినా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో నిత్యావసరాలు అందకపోవడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఎన్నికల ముందు రేషన్ ద్వారా విభిన్న నిత్యావసరాలు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం బియ్యం, పంచదారకే పరిమితమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కందిపప్పు, రాగులు పంపిణీ చేస్తూ ‘మూన్నాళ్ల ముచ్చట’గా మార్చేసిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. పిండితో సరిపెడుతున్న సర్కార్ బియ్యం, పంచదార తప్ప మరేమీ ఇవ్వకుండానే కాలం గడిపేస్తున్న చంద్రబాబు సర్కార్, తాజాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 20లకే గోధుమ పిండి ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. అయితే, గ్రామీణ ప్రజలకు ఈ సౌకర్యం లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోషకాహారం పేరిట చేస్తున్న ఈ హడావుడి, క్షేత్రస్థాయిలో కేవలం కొందరికి మాత్రమే అందుతోంది. జిల్లాలో పరిస్థితి ఇలా... డీఎస్ఓ పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి ప్రాంతాలు ఉండగా, జిల్లాలో 5.12 లక్షల తెలుపు కార్డులు, 600కు పైగా చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అయినప్పటికీ సరఫరా లోపాలు సరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఆశలు... ఇంకా నిరీక్షణలోనే.. గడప గడపకు రేషన్ అని చెప్పిన పాలకులు, ఇప్పుడు రేషన్ షాపుల్లో సరుకులకే కత్తెర వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల నేపథ్యంలో, రేషన్ దుకాణాలపై ఆధారపడే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కందిపప్పు, రాగులు వంటి అవసరమైన వస్తువులు అందకపోవడంతో పేదల భోజనంలో పోషకాహారం తగ్గిపోతోంది. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కందిపప్పు, వంటనూనె వంటి నిత్యావసరాలను పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రాగులు మున్నాళ్ల ముచ్చటే.. రాగులు మూడు కిలోలు ఇస్తామని చెప్పి చివరకు ఒక కిలోకే పరిమితం చేయడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచింది. అంతేకాకుండా రాగులు ఇచ్చినప్పుడు బియ్యం కోటాలో కోత విధించడం మరో సమస్యగా మారింది. అది కూడా జనవరి నెల వరకే ఇచ్చారు. ఈనెల రాగులకు ఇండెంట్ పెట్టలేదు. అంటే ఈ నెల ఒక్క కిలో పంపిణీ చేసే అవకాశం లేదు.రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల కోసం ఎదురు చూసే కార్డుదారులకు నిరాశే మిగులుతోంది. ఎన్నికల హామీల్లో చెప్పిన కందిపప్పు, రాగులు ఇప్పుడు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోగా, నెలల తరబడి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో అమాంతం పెరిగిన ధరల మధ్య రేషన్పై ఆధారపడే పేదలు కందిపప్పు, రాగుల కోసం కళ్లప్పగించి ఎదురుచూస్తుండటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. కందిపప్పు కోసం కళ్లప్పగింత గత ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారుడికి నెలకు ఒక కిలో కందిపప్పు అందించేవారు. ప్రస్తుతం అది గతస్మృతిగా మారింది. ఏప్రిల్లో కూడా కందిపప్పు పంపిణీ చేసే సూచనలు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి ఇండెంట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. మార్కెట్లో కందిపప్పు ధరలు రూ.150 నుంచి రూ.180 వరకు పెరగడంతో, సాధారణ ప్రజలకు కొనుగోలు భారంగా మారింది. దీంతో రేషన్ ద్వారా తక్కువ ధరకు లభించే కందిపప్పుపైనే అనేక కుటుంబాలు ఆధారపడుతున్నాయి. -
నిందితుడు రవీంద్రను ఉరితీయాలి
మహారాణిపేట: ‘నా బిడ్డను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు’అంటూ మౌనిక తండ్రి పొలిపల్లి వేణుగోపాల్ కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద తన కుమార్తె మృతదేహాన్ని చూసి ఆయన బోరున విలపించారు. తన కుమార్తెను హత్య చేసిన చింతాడ రవీంద్రను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన సమయంలో మౌనిక ఒంటిపై ఉన్న సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని వేణుగోపాల్ తెలిపారు. ఈ కేసుపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు. -
● ఈపీడీసీఎల్లో వినూత్న కార్యక్రమం ● డయల్ యువర్ సీఎండీకి వినతుల వెల్లువ ● ఫోన్ కాల్స్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: ఒక ఫోన్ నంబర్.. 8 వారాలు.. 11 జిల్లాలు.. 11 సర్కిళ్లు.. 345 ఫిర్యాదులు.. వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. మొత్తంగా వినూత్నంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రారంభించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి స్వయంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 345 ఫిర్యాదులు.. 35 పెండింగ్ ఇప్పటివరకు 8 వారాల పాటు డయల్యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు 345 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 310 ఫిర్యాదులను ఈపీడీసీఎల్ అధికారులు పరిష్కరించారు. ఫోన్లో ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఆ గ్రామానికి రావడంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా లోవోల్టేజీ సమస్యపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు 76 వరకూ లోవోల్టేజీ ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ పర్యవేక్షిస్తూ.. పరిష్కరిస్తున్నారు. 76 ఫిర్యాదుల్లో 62 పరిష్కరించారు. లోవోల్టేజీని అధిగమించేందుకు... 43 ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు మార్చారు. లోవోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 7.5 కి.మీ మేర పాత కండక్టర్లు మార్చడం విశేషం. మిస్డ్ కాల్స్పైనా దృష్టి పెడుతున్నాం.. ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ ఫిర్యాదులు తీసుకుంటున్నాం. ఒక ఫిర్యాదు తీసుకున్న సమయంలో ఏవైనా మిస్డ్ కాల్స్ ఉంటే.. 11.30 గంటల తర్వాత ఆ నంబర్లకు ఫోన్ చేసి.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. ప్రతి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు, కొత్త సర్వీస్ కనెక్షన్ జాప్యం, విద్యుత్ పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి వంటి అంశాలను నేరుగా నా దృష్టికి తీసుకురావొచ్చు. –పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ -
ఇంటి బడ్జెట్ తలకిందులు గల్ఫ్ యుద్ధం సాకుతో నిత్యావసర ధరల మంట పెరిగిన వంటనూనె, పప్పుదినుసుల ధరలు జిల్లాలో కొనసాగుతున్న గ్యాస్ ఇబ్బందులు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలోనూ పెంచుతున్న ధరలు పాఠశాలలు, హాస్టళ్లలో భోజన వంటకు ఇక్కట్లు
అనకాపల్లి: రాగల ఐదురోజులలో ఆకాశం మేఘావృతమై పొడిగా ఉంటుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్త వి.గౌరీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అర్హులకు ఓటు హక్కు కల్పించండి విశాఖ లీగల్ : విశాఖ న్యాయవాదుల సంఘం నూతన ఎన్నికలకు సంబంధించి చాలా మంది న్యాయవాదులు ఓటు హక్కును కోల్పోయారు. సరైన సమాచారం లేని కారణంగా పలువురు న్యాయవాదులు తాము చెల్లించవలసిన సభ్యత్వ రుసుము చెల్లించలేదు. ఈనెల 23లోపు సభ్యత్వ రుసుం చెల్లించాలని న్యాయవాద సంఘం గడువు విధించింది. ఈ లోపు న్యాయవాదులు క్రీడా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించడంతో పలువురు న్యాయవాదులు తమ సభ్యత్వం చెల్లించలేకపోయారు. మార్చి 23వ తేదీ లోపు సభ్యత్వ రుసుం చెల్లించలేని వారికి ఓటు హక్కు లేదని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాది పాక సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయవాదులందరికీ ఓటు హక్కు కల్పించడం కనీస ధర్మమని పేర్కొన్నారు. సభ్యత్వ రుసుము గడువు ఈనెల 6వ తేదీ వరకు పెంచాలని కోరారు. ఈ విషయంలో ఎన్నికల అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వాలని.. అవసరమైతే సర్వసభ్య సమావేశం నిర్వహించాలని సూచించారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతి నాయుడు మాట్లాడుతూ అర్హులైన అందరి న్యాయవాదులకు ఓటు హక్కు కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి, అనకాపల్లి : పశ్చిమాసియాలో నెల రోజులుగా జరుగుతున్న యుద్ధం పేద, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడి యుద్ధ మేఘాలు మన వంటింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో, ఇక్కడ అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక వైపు నిత్యవసర ధరలు పెరగడం..మరో వైపు గ్యాస్ ట్రబుల్తో జిల్లా ప్రజలు బాధపడుతున్నారు. వంట నూనె నుంచి పప్పుదినుసుల వరకూ అన్నింటిపై ఆ ప్రభావం పడింది. వంటనూనె రేట్లు పెరగడంతో వినియోగదారులు, రెస్టారెంట్లు, హోటల్స్లో, పాస్ట్ఫుడ్ సెంటర్లలో రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు పాఠశాలలు, హాస్టళ్లలో భోజన వంటకు గ్యాస్ ట్రబుల్తో ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఒక్కసారిగా పెరిగిన ధరలను చూసి షాక్కు గురవుతున్నారు. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే, మన దగ్గర ధరలు పెరగడమేమిటని ప్రశ్న ఉత్పన్నమైనా పెరిగిన రేట్లతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ఇటు ప్రభుత్వ పన్నుల పోటు, పెరుగుతున్న నిత్యావసర ధరలు.. మధ్యలో వ్యాపారుల మాయాజాలం.. వెరసి సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రేట్లు పెరగడం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ధరల పెరుగుదల గృహిణుల బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. గ్యాస్ రేట్లు పెరగడం కొరత ఏర్పడడంతో వాటికి ప్రత్యామ్నాయమైన కట్టెలు, బొగ్గులు రేట్లు కూడా గ్రామాల్లో పెరిగాయి. ధరల మంటకు కారణాలు ఇవే.. గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి అయ్యే నిత్యవసర వస్తువులు, వంట నూనె, గ్యాస్ సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. దీంతో దిగుమతులు తగ్గి మార్కెట్లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం ట్యాక్స్ ధరలు భగ్గుమనడానికి మరో కారణమైంది. పండగల సీజన్ కావడంతో మార్కెట్లో వంట నూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కృత్రిమ కొరతతో సామాన్యుల నిలువుదోపిడీ అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపి స్థానిక వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు, పాత స్టాక్ను గోదాముల్లో బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పాత స్టాక్ను సైతం పెరిగిన కొత్త ధరలకే విక్రయిస్తూ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇదే అదనుగా రిటైర్ వ్యాపారులు కిరాణా వస్తువులను కూడా పెంచారు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ కొరవడడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో రోజుకు గృహ, వాణిజ్య అవసరాల నిమిత్తం పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ 10 వేల కేజీల నూనె వినియోగం జరుగుతున్నట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 50 శాతం పామాయిల్, 40 శాతం సన్ఫ్లవర్ ఆయిల్, 10 శాతం ఇతర నూనెలు వాడుతున్నారు. అయితే పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు రూ.6 నుంచి రూ.10 పెరిగాయి.పామాయిల్లో రూ.90 –115 నుంచి రూ.120–140 వరకూ పెరిగింది.సన్ఫ్లవర్ ఆయిల్ రూ. 140–160 నుంచి రూ.166–178 వరకూ పెరిగింది. ●జిల్లాలో 300 వరకూ ఆయిల్ మిల్లులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచి, పాయకరావుపేట, చోడవరం, సబ్బవరం, ఎస్.రాయవరంలో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో వేరుశనగ, నువ్వుల నూనెలు తయారవుతాయి. ఇవి మిల్లుల ద్వారా 3 వేల కేజీలకు పైగా వినియోగం అవుతున్నాయి. జిల్లాలో పెరిగిన ధరల వివరాలు ఇలా...వంటింటికి ధరల సెగ -
పరుగు పోటీల్లో కండక్టర్ సత్తా
పద్మనాభం: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో అనంతవరం గ్రామానికి చెందిన కొండిమాని రాంబాబు అద్భుత ప్రతిభ కనబరిచారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఈ క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. విశాఖ జిల్లా తరపున 35, 45 సంవత్సరాల పురుషుల విభాగాల్లో రాంబాబు పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగు పందెం, 4x100 మీటర్ల రిలే పరుగు పందెంలో బంగారు పతకాలను సాధించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కండక్టర్గా విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తిని పలువురు అభినందించారు. -
లక్ష్యానికి మించి పన్నులు వసూలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ఆస్తి, ఖాళీ జాగా పన్నుల వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి నమోదయ్యాయి. నగరంలో 6 లక్షలకు పైగా ఆస్తి/ఖాళీ జాగా అసెస్మెంట్లు ఉండగా, 2025–26 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం రాత్రి 9 గంటల సమయానికి రూ.620.08 కోట్లు ఆస్తి పన్ను వసూలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ కారణంగా ప్రజలు, సంస్థలు భారీగా పన్నులు చెల్లించడంతో వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రూ.510.15 కోట్లు వసూలవగా, ఈసారి రూ.109.93 కోట్లు అధికంగా వచ్చింది. అదనపు కమిషనర్ (రెవెన్యూ), డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ), జోనల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేసిన కృషి ఫలితంగానే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని కమిషనర్ తెలిపారు. రాత్రి 12 గంటల వరకు అన్ని సౌకర్య కేంద్రాలు పనిచేస్తుండటంతో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడిన ప్రజలకు జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఉపాధ్యాయినుల సమస్యలపై యూటీఎఫ్ వినతి
అనకాపల్లి : మహిళా ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక స్టాఫ్ రూమ్స్, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ, ఏప్రిల్ 1న స్థానిక నెహ్రూచౌక్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహర దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చిన్నబ్బాయ్ అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో యూనియన్ ఆధ్వర్యంలో డీఈఓకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు పుస్తకాలు తీసుకురావడం, ప్రశ్నపత్రాలు తీసుకు రావడం లాంటి పనుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు తదితర సమస్యల నుంచి రక్షణార్ధం జిల్లా స్థాయిలో ఒక ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేయాలన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి జిల్లా స్థాయిలో స్ట్రెస్ మేనేజ్మెంట్ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రులను అత్తమామాలను చూసుకోవడానికి పది రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని, మహిళా ఉద్యోగులకు ఉచిత న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. -
ఆంగ్లభాష ప్రాముఖ్యత పెరుగుతోంది
అనకాపల్లి : ఆంగ్లభాష ప్రాముఖ్యత నేటి ఆధనిక ప్రపంచంలో ప్రచండ వేగంతో దూసుకుపోతుందని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో ఏపీ ఎంఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆంగ్ల అధ్యాపకుడు విల్లూరి ఉమామహేశ్వరరావు రచించిన ‘ట్రాన్స్మ్యుటేషన్ ఆఫ్ హిస్టరీ లిటరేచర్’ పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తక సాహిత్యం ద్వారా ఆంగ్ల భాషాభివృద్ధి చేసుకోవాలనుకునే వారికీ, ఆంగ్లభాష వ్యక్తీకరణని అభివృద్ధి చేసుకోదలచుకునే వ్యక్తులకు క్లుప్తంగా ఆంగ్లభాషపై మంచి పట్టు సంపాదించుకుని తనదైన శైలిలో ఆంగ్లంలో భావప్రకటన చేయదలచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుస్తక రచయిత డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతీయుల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు తదితర విషయాలను, వివిధ రకాల రచయితల రచనా పటిమను పరిగణనలోనికి తీసుకుంటూ రాసిన పుస్తకం ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు అప్పారావు, కిషోర్, సాయిరామ్. పలాసరావు(పోస్టల్ డెవలప్మెంట్ ఆఫీసర్), కాళిదాస్, టి.లక్ష్మీనాయుడు పాల్గొన్నారు. -
సురక్షిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం
అల్లిపురం: నగరంలో ప్రజల భద్రతను మెరుగుపరచడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు భాగస్వాములు కావాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కోరారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరానికి చెందిన సుమారు 35 మంది ఇన్ఫ్లూయెన్సర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ, సోషల్ మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ధైర్యం నింపడం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, చిట్ఫండ్ మోసాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించడం, హెల్మెట్ ధారణ ఆవశ్యకత, రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడం, పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన స్పీడ్ లేజర్ గన్స్ పనితీరుపై సమాచారం అందించడం తదితర అంశాలపై వీడియోలు, సందేశాల రూపంలో విస్తృత ప్రచారం కల్పించాలని సీపీ కోరారు. అనంతరం ఇన్ఫ్లూయెన్సర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్ఫ్లూయెన్సర్లకు సీపీ శంఖబ్రత బాగ్చి పిలుపు -
రూ.3 కోట్ల ప్రభుత్వ భూమికి స్కెచ్?
మధురవాడ: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అక్రమార్కులు తెగబడుతున్నారు. మధురవాడ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూమిని కొట్టేయడానికి నియోజకవర్గ ముఖ్యనేత పేరును వాడుకుంటూ దర్జాగా పనులు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూ.3 కోట్లు విలువ చేసే భూమి విశాఖ రూరల్ మండలం, మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 388 పరిసరాల్లో ఈ దందా సాగుతోంది. మధురవాడ హైవే నుంచి ఐటీ సెజ్కు వెళ్లే మార్గంలో, వికలాంగుల కాలనీ వద్ద అదానీ డేటా సెంటర్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు 500 గజాల ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం ధర బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.60 వేల వరకు పలుకుతోంది. అంటే సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పక్కా పథకం రచించారు. గతంలో అక్రమంగా నిర్మించిన షెడ్లకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలోని తుప్పలను తొలగించి, కొండ భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు. ఇంత దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమణకు తెరలేపడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణ పనుల్లో జీవీఎంసీ వాహనం ఈ కబ్జా పర్వంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూ ఆక్రమణను అడ్డుకునేందుకు వచ్చిన గ్రేడ్–2 వీఆర్వో, అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయించారు. భూమిని చదును చేస్తున్న పొక్లెయిన్ను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించేందుకు ప్రయత్నించగా.. అది జీవీఎంసీ శానిటేషన్ విభాగానికి చెందిన వాహనమని తేలడంతో విస్తుపోయారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత నుంచి ‘సదరు వ్యక్తులు మనవారే.. వదిలేయండి’అంటూ హుకుం జారీ కావడంతో అధికారి వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ఏకంగా ప్రభుత్వ వాహనాన్నే వాడటం చూస్తుంటే, ఈ వ్యవహారం ఎంతటి స్థాయి వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతుందో అర్థమవుతోంది. అసలు సూత్రధారులు ఎవరు? అసలు అక్రమార్కుల పనులకు జీవీఎంసీ వాహనాన్ని పంపిన అధికారులు ఎవరు? ఈ కబ్జా వెనుక జీవీఎంసీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.. లేక ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
రెండు బైక్ల ఢీ... ఇద్దరు యువకుల మృతి
డుంబ్రిగుడ : మండలంలోని గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్ఐ ఎల్.సురేష్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అరకులోయ మండలం మాదల పంచాయతీ తోటవలస గ్రామానికి చెందిన కిల్లో జోషప్(23) అనే గిరిజన యువకుడు బంధువుల ఇంటి నుంచి స్వగ్రామానికి బయలుదేరగా, హుకుంపేట మండల గడుగుపల్లి గ్రామానికి చెందిన మువ్వల శ్రీను(28) అనే యువకుడు తన స్నేహితుడితో చటువాలో జరుగుతున్న పండగను చూసేందుకు బయలుదేరారన్నారు. గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో కిలోమీటరు దూరంలో రాత్రి వేళ రెండు బైకులు బలంగా ఢీ కొన్నాయని చెప్పారు. సంఘటన స్థలంలోనే శ్రీను మృతి చెందగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జోషప్ అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో యండపల్లివలసలో మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. వారితో పాటు మరొకరు గాయాలతో ఉండగా ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు. మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతి చెందిన మువ్వల శ్రీను, (ఫైల్) -
దేవస్థానం సొసైటీ ఎన్నికల్లో హరి ప్యానెల్ గెలుపు
సింహాచలం: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు ప్రహ్లాదపురంలోని సొసైటీ కల్యాణమండపంలో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 206 ఓట్లకు 168 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి నిరంజన్ పట్నాయక్ తెలిపారు. 9 మంది సభ్యులకు గాను పోటీలో 14 మంది(రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం విధుల్లో నిలిచిన ఉద్యోగులు) నిలిచారు. వీరిలో డి.వి.ఎస్.రామరాజు(హరి) ప్యానెల్ విజయం సాధించింది. డి.వి.ఎస్.రామరాజు, గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సుంకర సన్యాసిరావు(తాతాజీ), టీపీఎన్ మూర్తి, వై.అప్పారావు, ముగ్గు వరహాలరావు, లంక సూరిబాబు, కోరాడ శ్రీనివాస సాయి, గెడ్డపు సన్యాసి విజయం సాధించారు. బుధవారం అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. -
స్టీల్ప్లాంట్ తల్లీ.. ఇక సెలవు
● ఓ కార్మికుడి వీడ్కోలు స్టీల్ప్లాంట్ మెయిన్ గేటు వద్ద నమస్కారం చేస్తున్న అప్పలరాజు ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారం రుణం తీర్చుకోలేనిదని స్టీల్ప్లాంట్ కార్మికుడు గొందేశి అప్పలరాజు అన్నారు. స్టీల్ప్లాంట్ రోల్షాప్ అండ్ రిపేర్ షాప్ విభాగానికి చెందిన జనరల్ ఫోర్మెన్ అప్పలరాజు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా మంగళవారం పదవీ విరమణ చేశారు. విభాగంలో సహోద్యోగుల మధ్య జరిగిన కార్యక్రమాల అనంతరం ఆయన ఇంటికి బయల్దేరారు. స్టీల్ప్లాంట్ నుంచి బయటకు వచ్చిన అప్పలరాజు ఉద్వేగానికి లోనయ్యారు. స్టీల్ప్లాంట్ మెయిన్ గేటుకు నమస్కారం చేసి కన్నీటి పర్యంతమయ్యారు. 35 ఏళ్ల తన సేవలను పూర్తి చేసుకుని వెళ్లడం బాధగా ఉందన్నారు. తన కన్న తల్లి తర్వాత తల్లి లాంటి స్టీల్ప్లాంట్ తనకు మంచి జీవితం, కుటుంబాన్ని ఇచ్చిందన్నారు. స్టీల్ప్లాంట్ రుణం తీరుకోలేనిదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సహోద్యోగులు ఆయనను ఓదార్చి ఇంటికి పంపించారు. -
ఐదు నెలలుగా విద్యుత్ మీటర్ కోసం...
సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుని చీకట్లోనే నివాసముంటున్నామని, నూతన విద్యుత్ మీటర్కు ఫీజు కట్టి ఐదు నెలలు అవుతున్నా విద్యుత్ శాఖ సిబ్బంది మీటర్ వేసి విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదని, తక్షణమే తమకు విద్యుత్ సౌకర్యం కల్పించాలంటూ మాడుగుల మండలం చింతలూరు గ్రామానికి చెందిన భార్యభర్తలు గుడేపు దుర్గాలు, లక్ష్మి పీజీఆర్ఎస్లో వినతి అందించారు. రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే తాము చీకట్లోనే నివాసముండాల్సి వస్తుందని, చుట్టుపక్కల అందరికీ అందించిన విద్యుత్ సౌకర్యం తమకు కూడా అందించి న్యాయం చేయాలని ఆమెను కోరారు. –గుడేపు లక్ష్మి -
అర్జీల్లో భూ సమస్యలే అధికం
తుమ్మపాల :సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఅర్ఎస్కు 167, రెవిన్యూ క్లినిక్లో 181 మొత్తం 348 అర్జీలు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రామ మాణి, మెప్మా పీడీ కె.సరోజిని, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మైనింగ్ అధికారులపై ఫిర్యాదు చింతలూరులో గ్రాంట్ ఆర్డర్ లేకుండా 3 వేల క్యూబిక్ మీటర్ల అక్రమ మైనింగ్పై విచారణ కోరుతూ నర్సీపట్నం మైనింగ్ అధికారులకు చేసిన ఫిర్యాదుపై ముందు తేదీలతో తప్పుడు నివేదికలు ఇచ్చి, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను ఉద్దేశపూర్వకంగా నిరాకరించడం, గ్రామస్తులను మోసం చేసి సంతకాలు సేకరించడంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాడుగుల మండలం చింతలూరుకు చెందిన మెలిపాక మణికంఠ కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 379–1లో అక్రమాలపై చేసిన ఆరు ఫిర్యాదులను నీరు గార్చడానికి మైనింగ్ అధికారులు, క్వారీ నిర్వాహకులు కలిసి నేరపూరిత చర్యలకు పాల్పడారని వారిపై చర్యలు తీసుకోవాలని, మైనింగ్ అధికారుల ప్రమేయం లేకుండా స్వతంత్ర టాస్క్ఫోర్స్ కమిటీతో పునర్విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
కౌమార దశలో గర్భధారణతో దుష్ప్రభావాలు
తుమ్మపాల : కౌమార దశలో గర్భం దాల్చడం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘కౌమార దశలో గర్భధారణ – కారణాలు, దుష్ప్రభావాలు అవగాహన‘ గోడ పత్రికలను ఆమెతో పాటు జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించడం, అనుమానాస్పద సంఘటనలపై తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి సూర్యలక్ష్మి, డీఎంహెచ్వో హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు. జీరో పావర్టీ పీ4 తొలి వార్షికోత్సవాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తిరుపతి పద్మావతీ మహిళా యూనివర్సిటీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్లో నిర్వహించారు. -
‘క్రేజీ’ స్కూళ్లు
యలమంచిలి రూరల్ : జిల్లా కేంద్రం అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, అచ్యుతాపురం, అడ్డురోడ్డు సహా జిల్లాలో దాదాపుగా అన్ని మండల కేంద్రాలు, పెద్ద పంచాయతీల్లో ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్ల దందా మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల స్థాయిలోనే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ల పేరుతో విద్యార్థులపై మితిమీరిన ఒత్తిడి పెంచుతున్నారు. తల్లిదండ్రులపై అదనపు ఫీజుల భారం మోపుతున్నారు. కార్పొరేట్ స్థాయి వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలు అంటూ రంగురంగుల బ్రోచర్లు చూపిస్తూ సామాన్య తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి యాజమాన్యాలు. తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు తమ కళ్ల ముందే నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నా మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్కు సలామ్ కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. జిల్లాలో కార్పొరేట్, కొన్ని బడా ప్రైవేటు యాజమాన్యాలు అనుమతుల్లేకపోయినా ధనదాహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నా అటువైపు అధికారులు కన్నెత్తయినా చూడడానికి సాహసించడం లేదు. నిబంధనల ప్రకారం ఎల్కేజీ, కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు అనుమతులు ఇవ్వరు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో ఈ తరగతుల నిర్వహణ నిరాటంకంగా కొనసాగిపోతోంది. విద్యాశాఖ అధికారుల తీరుతో యాజమాన్యాలు ఆడిందే ఆట..పాడిందే పాట అన్న చందంగా వాటి నిర్వహణ సాగుతోంది. సమాచారం నిల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కిండర్ గార్డెన్ స్కూళ్ల వివరాలు నమోదైన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. కార్యాలయ అధికారులు తమకు తగిన సమాచారం లేదంటున్నారు. మరోవైపు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలు బేఖాతరు చేస్తూ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నా నేటికీ ఒక్క స్కూల్పై కూడా చర్యలు చేపట్టలేదంటేనే కార్పొరేట్ యాజమాన్యాలతో వారికి ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అనుమతులు లేకుండానే ప్రైమరీ, ఉన్నత పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అనుమతుల్లేకుండా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణ పుట్టగొడుగుల్లా కిండర్ గార్డెన్ స్కూళ్లు విద్యాసంవత్సరం ముగియకుండానే అడ్మిషన్లు ప్రారంభం తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలు తనిఖీలు మరిచిన విద్యాశాఖ అధికారులు -
కోర్టు ఆదేశాలు ధిక్కరణ
చెరువు గర్భంలో మరలా పనులు చేస్తున్న దృశ్యం గొలుగొండ: మండలంలోని సీహెచ్ నాగాపురం చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేయకూడదని కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ధిక్కరించారు. మళ్లీ పనులు చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శ్మశాన వాటిక ఉంది. ఆ స్థలాన్ని వదిలేసి కూటమి నేతలు రైతులకు ఉపయోగపడే చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేస్తున్నారు. ప్రస్తుతం చెరువు గర్భంలో ఏర్పాటు చేస్తున్న శ్మశాన వాటిక పాఠశాలకు ఆనుకుని ఉండటం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతారని ప్రజలు ఆర్నెల్ల క్రితం వ్యతిరేకించారు. దీంతోపాటు రైతులు ఇబ్బందులు పడే అవకాశముందని గ్రామస్తులు, పంచాయతీ పాలకులు కోర్టును ఆశ్రయించారు. దాంతో చెరువు గర్భంలో పనులు నిలుపుదల చేయాలని నాలుగు నెలలు క్రితం కోర్టు ఎంపీడీవో, పీఆర్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు పనులు నిలుపుదల చేశారు. మళ్లీ రెండు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పనులు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి పనులు చేస్తున్న అధికారులుపై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
ఇసుక తవ్వకాలు చేస్తే క్రిమినల్ కేసులు
మాకవరపాలెం: అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని తహసీల్దార్ ముజీబ్ స్పష్టం చేశారు. సాక్షిలో సోమవారం తవ్వుకో.. అమ్ముకో శీర్షికన వచ్చిన కథనంతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. దీనిపై స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ జంగాపల్లి సర్పానదిని ఆనుకుని నిర్వహిస్తున్న తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం, ఇసుకను తరలించడం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అలాగే జీ.కోడూరు, జంగాలపల్లి గ్రామ రెవెన్యూ అధికారులను ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. ఇకపై ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేస్తే ఆ రెండు గ్రామాల వీఆర్వోలపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2న వాటర్ స్పోర్ట్స్ పోటీలు అనకాపల్లి : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు ఏప్రిల్ 2న ముత్యాలమ్మపాలెం బీచ్లో సబ్ జూనియర్–15 జూనియర్–18 బాలబాలికలకు నిర్వహించడం జరుగుతుందని సంస్థ జిల్లా అధికారి పూజారి శైలజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి సైకిలింగ్ పోటీలలో ఎంపికైన బాలబాలికలు ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ల్లడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్లు 933277778, 8125416870లను సంప్రదించాలన్నారు. -
రాయి పిక్కలు ఏరుకున్నా టాక్స్ కట్టాల్సిందేనా..?
రావికమతం : గ్రావెల్, రాయి ఏదైనా తెచ్చుకోవాలంటే మైనింగ్ సిబ్బందికి డబ్బులు కట్టాల్సిందే.. లేదంటే కుదరదంటున్నారు మైనింగ్ సిబ్బంది. మండలంలో గర్నికంలో ఇంటి నిర్మాణానికి రాయి పిక్కలను తీసుకొస్తుండగా ఏఎంఆర్ సంస్థ మైనింగ్ సిబ్బంది అడ్డుకోవడంపై మహిళలు తిరగబడ్టారు. కొండ ప్రాంతంలో రాయి పిక్కలు ఏరుకొని తీసుకొస్తుండగా టాక్స్ కట్టమనడం ఎంత వరకు సమంజసం.. అంటూ మైనింగ్ కంపెనీ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ విషయమై సోమవారం గర్నికం గ్రామస్తులు, సర్పంచ్ భర్త నూకరాజు ిమైనింగ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెంధిన కొందరు మహిళలు పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. గచ్చులు చేయడానికి రాయి పిక్క అవసరం కావడంతో సమీపంలో గల మెట్ట ప్రాంతంలో చిన్న రాయి పిక్కలను పోగుచేసుకొని వాటిని ట్రాక్టర్లో వేసి తీసుకెళుతుండగా ఏఎంఆర్ మైనింగ్ సంస్థ సిబ్బంది టాక్స్ కట్టాలని అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఇస్తుంటే , రాయి పిక్కలకు ట్యాక్స్ కట్టడం ఏంటని ప్రశ్నించారు. దీంతో సర్పంచ్ భర్త నూకరాజు తదితరులు అక్కడికి చేరుకొని మైనింగ్ సంస్థను తప్పు బట్టారు. రాయి పిక్కలకు కూడా ట్యాక్స్ కట్టాలని ఉందా , ఉంటే అందుకు సంబంధించిన జీవో చూపించాలని నిలదీశారు. ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తే సామాన్యులు ఎలా బతకాలి... అని కూటమి ప్రభుత్వం సంపద సృష్టించడం అంటే ఇదేనా? అంటూ మహిళలు వాపోయారు. -
లీజు విధానం... ఆలయ భూముల ఆక్రమణలకు ఊతం
జిల్లాలో హిందు దేవాలయాల భూముల ఆక్రమణలపై విచారణ చేపట్టి భూములను రక్షించడంతో పాటు శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునఃనిర్మాణం చేయాలని బీజేపీ జనతా వారధి కోకన్వీనర్ జిల్లా ఉపాధ్యక్షుడు దొగ్గా ఈశ్వరప్రసాద్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ప్రైవేటు భూములు దేవాలయ భూముల జాబితాలో కలిసిపోయాయనే నెపంతో వందల ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించేస్తున్నారని, దీంతో పాటు 33 ఏళ్ల పాటు దేవాలయ భూముల లీజు విధానం సరైంది కాదని అధికారులు పునఃపరిశీలన చేయాలన్నారు. జీవో నెం.139ను పూర్తిగా రద్దు చేయాలని, ఆక్రమణను రెగ్యులరైజ్ చేయడం నిలిపివేయాలని, దేవాలయాల ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికే ఖర్చుచేసేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దింతో పాటు ఏళ్ల తరబడి సంచార జాతులగా నివాసముంటున్న కుటుంబాలను గుర్తించి వారికి కులధ్రువీకరణ పత్రాలు అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని మరో వినతి పత్రం అందించారు. –దొగ్గా ఈశ్వరప్రసాద్ -
అధికారుల అండతో అక్రమ రిజిస్ట్రేషన్లు
రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా కొనుగోలు చేసిన భూమిని తన పేరున కాకుండా రెవెన్యూ అధికారులు రీసర్వేలో ఇతరుల పేరున ఆన్లైన్ చేయడంతో తన భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, తక్షణమే రిజిస్ట్రేషను జరగకుండా నిలిపివేసి తన పేరున ఆన్లైన్ చేయాలంటు కశింకోట మండలం అచ్చెర్ల గ్రామానికి చెందిన కర్రి రాజేశ్వరి రెవెన్యూ క్లినిక్లో ఫిర్యాదు చేశారు. దస్తావేజు నెం.2199/2023 దిన ఉన్నప్పటికీ 2024లో జరిగిన రీసర్వేలో ఇతరుల పేరున వీఆర్వో ఆన్లైన్ చేయడం దారుణమని, తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. –కర్రి రాజేశ్వరి -
సరదా కోసం వెళ్తే.. ప్రాణం పోయింది
ఆనందపురం: గంభీరం రిజర్వాయర్లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన మలిరెడ్డి నితిన్ (20), తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్డీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మధురవాడలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న నితిన్.. మధ్యాహ్నం హాస్టల్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా తన స్నేహితులతో కలిసి ఆటోలో రిజర్వాయర్ సందర్శనకు వెళ్లాడు. స్నేహితులు ఈతకు దిగగా, నితిన్ ఒడ్డున ఉన్న సిమెంట్ గోడపై కూర్చున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అపస్మారక స్థితిలో నితిన్ను బయటకు తీసి, 108కు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నితిన్ను పరీక్షించి.. అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు, ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న మలిరెడ్డి దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. ఎస్ఐ పి.శివ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రౌడీలతో భూ ఆక్రమణకు యత్నం
పూర్వం నుంచి తమ ఆక్రమణలో ఉన్న పీడబ్ల్యూడీ భూమిలో పెంచుకున్న జీడిమామిడి, పనస చెట్లను దౌర్జన్యంగా నరికివేసి తన భూమిలోకి అక్రమంగా చొరబడి ఆక్రమించేందుకు ప్రయత్నించిన విషయమై తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, దీంతో ఆక్రమణదారులు రౌడీలతో తమపై దాడులకు దిగుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించడంతో పాటు నా భూమిని రక్షించాలంటూ అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామానికి చెందిన భార్యభర్తలు కాండ్రేగుల సత్యవతి, సూర్యారావు ఫిర్యాదు చేశారు. చెట్ల నరికివేతపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కోరారు. – కాండ్రేగుల సూర్యారావు -
చదువుకొనగ రా రమ్మని..!
విద్యా సంవత్సరం ముగియకముందే జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడం, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తూ తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నాయి. కిండర్గార్డెన్ స్కూళ్లు.. వేల కొద్దీ ఫీజులు ఫిర్యాదులొస్తే చర్యలు జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఎల్కేజీ, యూకేజీ వంటి తరగతులు నిర్వహిస్తున్నట్టు గానీ, కిండర్ గార్డెన్ స్కూళ్ల నిర్వహణపై గానీ ఫిర్యాదులొస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రైవేటు పాఠశాలలు సక్రమంగా నిర్వహించేందుకు తరచూ తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. –గిడ్డి అప్పారావు నాయుడు, డీఈవో జిల్లాలో 122 మంది ప్రైవేటు స్కూళ్లు ఉండగా వాటిలో సుమారుగా 58 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో చాలా పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక జిల్లాలో 150కి పైగా కిండర్ గార్డెన్ స్కూళ్లు ఎటువంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. ఈ స్కూళ్లు విధిగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. కానీ ఈ పాఠశాలల్లో వేలకొద్దీ ఫీజులు గుంజుతున్నారు. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా ‘ఫిర్యాదు వస్తేనే స్పందిస్తాం...’ అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవేటు, కార్పొరేటు యాజమాన్యాల ప్రలోభాలకు తలొగ్గుతున్న అధికారులు వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అధిక ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారు. అర్హత లేని టీచర్లతో తక్కువ వేతనాలకు బోధన చేయిస్తూ ఏటా రూ.కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నారు. మునగపాకలో ఇటీవల ఓ ప్రైవేటు విద్యాసంస్థ అనుమతుల్లేకుండా ముందస్తు ప్రవేశాలు చేపడుతుండడంపై ఏఐఎస్ఎఫ్ నేతలు ఆందోళన నిర్వహించారు. చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు. -
ఉరేసుకుని గిరిజన యువతి ఆత్మహత్య
దేవరాపల్లి: గిరిజన యువతి దూసరి లక్ష్మి(22) సోమవారం రాత్రి దేవరాపల్లిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు కొరపర్తి గ్రామానికి చెందిన పెంటయ్య, జమ్ములమ్మ దంపతుల ఇద్దరు కుమార్తెలు దేవరాపల్లిలో ఐదేళ్లగా నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి స్థానిక ప్రైవేటు మెడికల్ ల్యాబ్లోను, చిన్న కుమార్తె భవాని సెల్ దుకాణంలోను పని చేస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తన అక్క ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోతున్నట్లు వేరొక వ్యక్తి ఫోన్ ద్వారా తెలుసుకున్న చెల్లెలు భవాని వెంటనే తాము అద్దెకుంటున్న గదికి పరుగులు తీసింది. అప్పటికే అక్క చున్నీతో ఉరేసుకొని విగతజీవిగా ఉండటాన్ని చూసి బోరున విలపించింది. ఈమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని మృతురాలి చెల్లెలు భవాని చెప్పినట్లు తెలిసింది. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతిరాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కె.కోటపాడు సీహెచ్సీకి తరలిస్తున్నట్లు తెలిపారు. గిరిజన యువతి ఆత్మహత్యతో దేవరాపల్లిలోపాటు కొరపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఎస్పీ కార్యాలయంలో 64 ఫిర్యాదులు
ఆర్జీదారుల సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 64 ఆర్జీలు వచ్చాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు ఎస్పీ తుహిన్ సిన్హాకు వివరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చి అర్జీలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు–31, కుటుంబ కలహాలు–2, మోసపూరిత వ్యవహారాలు–5, ఇతర విభాగాలకు చెందినవి–26 వచ్చినట్టు తెలిపారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. డ్వామా పీడీ పూర్ణిమాదేవి బదిలీ తుమ్మపాల : జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా పీడీ ఆర్.పూర్ణిమాదేవిని బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారిగా ఆమెకు బదిలీ అయ్యింది. ఎండీఎంను ప్రైవేటుపరం చేయొద్దని ధర్నా రోలుగుంట: మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సోమవారం స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకురాలు కె.ప్రసన్న మాట్లాడుతూ స్మార్ట్ కిచిన్ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తోందన్నారు. ఈ పథకం కింద జిల్లాలో నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఈ పథకాన్ని కొనసాగిస్తూ నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకుడు ఈరెల్లి చిరంజీవి, ఎండీఎం మండల నాయకులు అమ్మాజి, రమ, వరహాలమ్మ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
ప్రమాద స్థలంలో లోకేష్ మృతదేహం మాకవరపాలెం: మండలంలోని తామరం వేంకటేశ్వర ఆలయ సమీపంలో శనివారం అర్ధరాత్రి లారీ ఢీకొని యువకుడి దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన చింతాడ లోకేష్(25) కశింకోట మండలం సుందరయ్యపేటలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన మోటార్ సైకిల్పై మాకవరపాలెం వైపు వస్తున్నాడు. అదే సమయంలో నర్సీపట్నం నుంచి తాళ్లపాలెం వైపు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లోకేష్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై లోకేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ దామోదర్నాయుడు ఆదివారం తెలిపారు. లారీని పట్టుకున్నామన్నారు. -
బెట్టింగ్ల ఉచ్చులో పడొద్దు
అనకాపల్లి: అత్యాశకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వాహకులపై ఆన్లైన్ బుకీలపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహిహించినా, పాల్గొన్నా ఏపీ జూద చట్టం ప్రకారం అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడవద్దన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
ఇమ్మానుయేలు సంస్థ హాస్టల్లో అగ్నిప్రమాదం
● ప్రమాద సమయంలో లేని విద్యార్థులు ● తప్పిన పెనుప్రమాదం మాకవరపాలెం: హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కొండల అగ్రహారంలో ఇమ్మానుయేలు సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉమ్మడి జిల్లాకు చెందిన 80 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా నిత్యం ఉదయం తామరంలో సంస్థకు చెందిన ఎడ్యుకేషన్ క్యాంపస్లోని స్కూల్కు బస్సుపై వెళ్లి తిరిగి సాయంత్రం హాస్టల్కు చేరుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మూడు అంతస్థులు కలిగిన హాస్టల్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో స్థానికులు గమనించిన వెంటనే స్పందించి మంటలు చెలరేగిన గదుల్లో ఎవరూ లేకపోవడంతో రెండో అంతస్థులో ఉన్న పది మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రతి ఆదివారం ఈ విద్యార్థులంతా హాస్టల్కు సమీపంలో సంస్థకు చెందిన చర్చికు వెళతారు. ఆదివారం కూడా సుమారు 70 మంది వరకు చర్చికి వెళ్లడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదే అగ్నిప్రమాదం రాత్రి వేళలో జరిగితే ఎందరో విద్యార్థులు మృత్యువాత పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరిగి నా గాయపడేవారన్నారు. ఈ సంఘటనలో హాస్టల్లో ఉన్న ఒక బైక్తోపాటు విద్యార్థుల పుస్తకాలు, బట్టలు ఉంచిన పెట్టెలు కాలిపోయాయి. విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా రు. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హాస్టల్ను పరిశీలించిన ఎంఈవో హాస్టల్ను ఎంఈవో మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా మంటలు చెలరేగిన హాస్టల్ భవనం, కాలిపోయిన విద్యార్థులు పెట్టెలను పరిశీలించారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యను తెలుసుకున్నారు. నివేదికను డీఈవోకు అందజేశామని, విద్యార్థులను ఇక్కడి నుంచి తామరంలో ఇమ్మానుయేలు సంస్థకు చెందిన మరో హాస్టల్కు తరలించామని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. -
మరణంలోనూ వీడని స్నేహం
ఉమ్మలాడ శారదానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి మునగపాక: వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు శారదానదిలో స్నానానికి వెళ్లి ఒకేసారి మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని ఉమ్మలాడలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఇక్కడ శారదానదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరూ మునిగిపోయి మృతి చెందారు. ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపిన వివరాలు ప్రకారం.. అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధి ముత్రాసు కాలనీకి చెందిన చింతా రోహిణ్కుమార్ (26), తాడి హర్షవర్దన్ (24) అనకాపల్లిలోని వేర్వేరు చోట్ల పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఇరువురు కలిసి సమీపంలోని ఉమ్మలాడ శారదానదిలో స్నానానికి వెళ్లారు. స్నానానికి వెళ్లిన ఇద్దరూ నదిలో ఒక్కసారిగా మునిగిపోయారు. గమనించిన స్థానికులు మునగపాక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి అనకాపల్లి రెండొందల ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా అందివస్తారనుకున్న కొడుకులు నదిలో మునిగిపోయి ఇలా విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
ఇదేం ‘పచ్చ’పాతం
● దేవరాపల్లి పార్కులో శిలాఫలకాల ఏర్పాటులో ప్రొటోకాల్కు తూట్లు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులకు శ్రీకారం ● శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించిన అప్పటి డిప్యూటీ సీఎం బూడి ● తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు ● శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని మూలన పడేసిన వైనం దేవరాపల్లి: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పార్కులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయకుండా మూలన పడేయడం వివాదస్పదమైంది. తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన వీఎంఆర్డీఏ అధికారులు శంకుస్థాపన శిలాఫకం ఏర్పాటులో పక్షపాత వైఖరిని ప్రదర్శించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో... స్థానిక పోలీస్స్టేషన్కు ఎదురుగా శిథిలావస్థకు చేరుకుని దశాబ్దాలుగా అధ్వానంగా ఉన్న ఇరిగేషన్ క్వార్టర్స్ను తొలగించి ఆహ్లాదకర పార్కు, యోగా భవనం, వాకింగ్ ట్రాక్ నిర్మించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సంకల్పించారు. అప్పట్లోనే వీఎంఆర్డీఏ నుంచి రూ. 75 లక్షలు మంజూరు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సగం పనులను సైతం అప్పట్లోనే పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేసింది. ఈ నెల 13న పార్క్ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్తో కలిసి ప్రారంభించారు. పైలాన్ నిర్మించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, పార్కు నిర్మాణ సమయంలో వేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని యోగా భవనంలో మూలన విడిచిపెట్టడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు కూటమి నేతల మెప్పు కోసమే ఇలా వ్యవహరించారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో పేర్లు రాయించడంలోను వీఎంఆర్డీఏ అధికారులు ప్రొటోకాల్కు తూట్లు పొడిచారు. ఎంపీపీ, జెడ్పీటీసీ పేర్లు లేకుండా చేసి ప్రొటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రొటోకాల్ పాటించకుండా పక్షపాతంగా వ్యవహరించిన వీఎంఆర్డీఏ అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
మంచినీటి కోసం గిరిజనుల అవస్థలు
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు మదనగురువులో గిరిజనులు మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటి సదుపాయం లేకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న గెడ్డలో ఊట నీరే తమకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్ స్పందించి తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చేతులు జోడించి వేడుకున్నారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి బి.టి. దొర మద్దతు పలికారు. అటవీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులను అడవి జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని సీపీఎం నాయకులు విమర్శించారు. గిరిజనులను ఉద్ధరించేందుకు అడవి బాట పట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఇక్కడ కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గెడ్డలో కలుషిత నీరు తాగడం వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ తదితర విష జ్వరాల బారినపడుతున్నారని వాపోయారు. ప్రభుత్వ పాలకులు యుద్ధప్రాతిపదికన స్పందించి మంచినీటి సదుపాయం కల్పించాలని, లేకుంటే వచ్చే నెల 2న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని బాధిత గిరిజనులు హెచ్చరించారు. కార్యక్రమంలో పాంగి కన్నయ్య, పాంగి రామన్న, మామిడి చిన్నయ్య, పాంగి పెద భీమన్న, పాంగి చిన బీరాజు, పాంగి సన్యాసమ్మ, పి. దేముడమ్మ, సూకురి లక్ష్మి, మామిడి సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలి నిరసన -
కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
ఎంవీపీకాలనీ: నగరంలోని కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఆదివారం ఎంవీపీకాలనీలోని అప్పుఘర్, వాసవానిపాలెం సాగర తీర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్లూమ్బర్గ్ ఫిలాంత్రోపీస్ 2025–2026 మేయర్స్ చాలెంజ్కు ప్రపంచవ్యాప్తంగా ఎంపికై న 24 నగరాల్లో విశాఖ ఒకటిగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ విజయం ఫలితంగా నగరంలో ‘వి–పుల్’(విశాఖ–ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్) కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున కమ్యూనిటీ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటనలో భాగంగా శివగణేష్నగర్, వాసవానిపాలెంలోని మత్స్యకారులతో మాట్లాడి, ఆయా ప్రాంతాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, కాలువల మరమ్మతులతో పాటు గ్రీన్ బెల్ట్లను అభివృద్ధి చేయాలని మత్స్యకార గ్రామాల పెద్దలు కమిషనర్కు విన్నవించారు. ‘వి–పుల్’ద్వారా ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ సిద్ధంగా ఉందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జెడ్సీ శివప్రసాద్, వైద్యాధికారి ప్రసాదరావు, పలువురు వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ -
దళితుల భూ సమస్యల పరిష్కారానికి కృషి
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు సీతారాం నర్సీపట్నం: అన్యాక్రాంతమైన దళితుల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం పేర్కొన్నారు. గొలుగొండ మండలం జోగంపేట గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి దళితల భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాండవ నిర్వాసితులమైన తమకు కోటవురట్ల మండలం పందూరు గ్రామంలో అసైన్డ్ భూములు ప్రభుత్వం ఇచ్చిందని బాధిత దళిత రైతులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువెళ్లారు. ఏ సంబంధం లేని పెత్తందారులు తమ భూముల్లో ఫలసాయాన్ని అనుభవిస్తున్నారని వాపోయారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. దీనికి సీతారాం స్పందిస్తూ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం బాలుర గురుకుల కళాశాల, పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కె.మరిడియ్య, గురుకుల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చిట్ల చతపతిరావు, తహసీల్దార్ కె.నూకరాజు, ఎంపీడీవో శ్రీనువాసరావు, ఎస్సై రామారావు, రుషికేశ్వరరావు, ఏఎస్డబ్ల్యూవో బాబూరావు, డీహెచ్పీఎస్ నాయకులు డీసీహెచ్ రాజు, డీవీఎంఎస్ సభ్యులు సహదేవుడు, ఈరెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
మరికొంతకాలం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో మూణ్నెల్ల పాటు పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమా ర్ ఒక ప్రకటనలో తెలిపారు. ● విశాఖపట్నం –షాలిమర్ (08508) స్పెషల్ రైలు ప్రతి మంగళవారం విశాఖపట్నంలో ఉదయం 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్ల వారు 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. ఈ రైలును జూన్ 30 వరకు పొడిగించారు. షాలిమర్–విశాఖపట్నం (08507) స్పెషల్ ప్రతీ బుధవారం షాలిమర్లో తెల్లవారుజాము 5గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 8.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలును జూలై 1వ తేదీ వరకు పొడిగించారు. ● సంబల్పూర్– ఈరోడ్ (08311) వీక్లీ స్పెషల్ ప్రతి బుధవారం సంబల్పూర్లో ఉదయం 11.35 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 9.32 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 10.50 గంటలకు ఈరోడ్ వెళ్తుంది. ఈ రైలును మే 27వ తేదీ వరకు పొడిగించారు. ఈరోడ్–సంబల్పూర్ (08312) వీక్లీ స్పెషల్ను మే 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ఈరోడ్లో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 1.10 గంటలకు బయల్దేరి శనివారం రాత్రి 11.15 గంటలకు సంబల్పూర్ వెళ్తుంది. ● భువనేశ్వర్–యశ్వంత్పూర్(02811) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 27వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శనివారం భువనేశ్వర్లో రాత్రి 7.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 1.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 1.55 గంటలకు బయల్దేరి సోమవారం తెల్లవారుజాము 12.15 గంటలకు యశ్వంత్పూర్ వెళ్తుంది. యశ్వంత్పూర్–భువనేశ్వర్ (02812) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి సోమవారం తెల్లవారుజాము 4.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.55గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ● యశ్వంత్పూర్–కతిహార్(06571) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 14వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి మంగళవారం యశ్వంత్పూర్లో ఉదయం 7 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజాము 5 గంటలకు విజయనగరం చేరుకుంఉటంది. అక్కడి నుంచి 5.10 గంటలకు బయల్దేరి గురువారం తెల్లవారుజాము 4.30గంటలకు కతిహార్ వెళ్తుంది. కతిహార్–యశ్వంత్పూర్ (06572) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 17వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శుక్రవారం తెల్లవారుజాము 5.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజాము 3.40 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.50 గంటలకు బయల్దేరి మరుసటిరోజుఉదయం 4గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ● ఎస్ఎంవీ బెంగళూరు–మాల్డా టౌన్(06565) స్పెషల్ రైలును జూలై 12వతేదీ వరకు పొడిగించారు. ఎస్ఎంవీ బెంగళూరులో ఈ రైలు ప్రతి ఆదివారం రాత్రి 11.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.15గంటలకు బయల్దేరి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మాల్డా టౌన్ వెళ్తుంది. మాల్డా టౌన్– ఎస్ఎంవీ బెంగళూరు(06566) స్పెషల్ను జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు బుధవారాల్లో సాయంత్రం 4గంటలకు మాల్డా టౌన్లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.33గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.35గంటలకు బయల్దేరి మరుసటిరోజు శుక్రవారం మధ్యా హ్నం 12.45 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు వెళ్తుంది. -
నేత్రపర్వంగా ఎదురు సన్నాహం
నక్కపల్లిలో ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం నక్కపల్లి: ప్రాచీన శైవక్షేత్రం ఉపమాకలో భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వరాలయంలో వార్షిక కల్యాణోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శైవాగమన సంప్రదాయం ప్రకారం కల్యాణోత్సవాలు జరిపేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా రాత్రి స్వామివారిని సప్పర వాహనంలోను, పార్వతీ దేవిని పల్లకిలో అలంకరించి కోలాట ప్రదర్శనలతో నక్కపల్లిలో మైలవరభట్ల జోగారావు ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి ఆది దంపతుల పెళ్లి చూపులు, పెళ్లిమాటల కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. అనంతరం మంచిరాజు సూర్యనారాయణ మూర్తి (సహరాపంతులు), శింగంశెట్టి నాని కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఎదుర్కోలు ఉత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెండ్లిమాట తంతు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ఉపమాక ఆలయానికి ఊరేగింపుగా తరలించారు. అర్ధరాత్రి స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు వెలవలపల్లి మహేష్, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి కొప్పిశెట్టి బుజ్జి వేదపండితులు పసర కొండ పండు, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డీవిరామారావు, శ్రీపాద ప్రణవ్రామ్ పాల్గొన్నారు. -
ఉరేసుకుని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద కాలనీకి చెందిన మామిడి వెంకటేష్(34) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. వివరాలివి. మృతుడికి బాగా మద్యం సేవించే అలవాటు ఉండడం వల్ల భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం బంధువులతో కలిసి తలుపులమ్మలోవ దర్శనానికి వెళ్లడానికి అందరూ తయారు కాగా అంతకుముందే ఉదయం వెంకటేష్ మద్యం సేవించడంతో మళ్లీ భార్యభర్తలకు చిన్న గొడవ జరిగింది. దీంతో వెంకటేష్ తలుపులమ్మలోవకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయాడు. సాయంత్రం కుటుంబసభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి పడకగదిలో చీరతో వెంకటేష్ ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. భార్య ఉమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
కార్యకర్తలే మన బలం
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026గెడ్డలో ఊట నీటిని సేకరిస్తున్న మదనగరువు గిరిజనులుఅనకాపల్లి : కార్యకర్తలే మన పార్టీకు అత్యంత బలమని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఆదివారం కశింకోట మండలం తేగాడ గ్రామంలో గల ఎస్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హాజరయ్యారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం సమావేశం ప్రారంభించారు. పార్టీ సంస్థాగత కమిటీలు జిల్లాలో పూర్తయ్యాయని, జిల్లాలో సుమారుగా 57వేల మందిని పార్టీ వివిధ కమిటీల్లో నియమించడం జరిగిందని రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు చెప్పారు. పబ్లిసిటీపై ఉన్న వ్యామోహం..పథకాల అమలుపై లేదు.. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వానికి పబ్లిసిటీ వ్యామోహం తప్ప సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని అన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండానే సూపర్ హిట్ పబ్లిసిటీ చేయించుకుంటున్న చంద్రబాబును చూసి ప్రజలు నవ్విపోతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాలో రూ. 4,600 కోట్లతో చేపట్టిన మూలపేట పోర్టు పనులు నాడే సుమారుగా 60 శాతం పూర్తి అయినా ఈ రెండేళ్ల పాలనలో పనులు నిలుపుదల చేశారన్నారు. మా ప్రభుత్వంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అమరావతితో పాటు విశాఖ, కర్నూలు అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడితే అసెంబ్లీ సమావేశాల్లో కూటమి నాయకులు అమరావతి అభివృద్ధి కోసం మాట్లాడలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ రాజధానిగా 10 సంవత్సరాలు ఉండగా, ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుఅడ్డంగా దొరికిపోవడంతో అక్కడ నుంచి పారిపోయి అమరావతికి రావడం జరిగిందన్నారు. విశాఖలో రూ.5 వేల కోట్ల ప్రభుత్వ భూమిని స్వాహా చేశారన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుతో వైఎస్సార్సీపీకే మేలు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డీనేటర్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 263 అసెంబ్లీ స్థానాలను పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, దీనివల్ల వైఎస్సార్సీపీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. నక్కపల్లి కేంద్రంగా ప్రైవేట్ స్టీల్ప్లాంట్ను వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొస్తే ఒక జూమ్కాల్ తో తానే తెచ్చినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నాడంటూ మండిపడ్డారు. అనకాపల్లి పట్టణంలో రూ.100 కోట్ల విలువైన కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూమి కూటమి నాయకులు భూమిని స్వాహా చేయాలని చూడడంతో దానిపై వైఎస్సార్సీపీ పోరాడిందన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీగా పాలన సాగుతుందన్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా పాలన చేస్తున్నారన్నారు. కేంద్రంలో మహిళలకు చట్టసభలో 30 శాతమా లేదా 33 శాతమా అనేదానిపై చర్చ జరుగుతుందన్నారు. బొడ్డేడకు ఘఽన సన్మానం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారిగా జిల్లా స్థాయి సమావేశం నిర్వహించిన సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, మలసాల భరత్కుమార్, అదీప్రాజ్, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, సూర్యనారాయణరాజు, శరగడం చిన అప్పలనాయుడు, సీఈసీ సభ్యులు బి.వి.సత్యవతి, రమణమూర్తిరాజు, కోలా గురువులు, నియోజకవర్గ పరిశీలకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, గండి రవికుమార్, పైలా శ్రీనివాసరావు, సతీష్వర్మ, దంతులూరి దిలీప్కుమార్, ఏడువాక సత్యారావు, వీసం రామకృష్ణ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ఉత్తరాంధ్ర జిల్లాల జేసీఎస్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్రెడ్డి, పార్టీ జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.సమస్యలపై పోరాటం చేయాలి : కన్నబాబు విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ మీ పరిధిలో స్థానిక ప్రజా సమస్యలు, కూటమి వైఫల్యాలపై పోరాటం చేయాలని సూచించారు. వచ్చే నెలలో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుందని, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరం సిద్ధంగా ఉండాలన్నారు. ఇటీవల మాకవరపాలెం మెడికల్ కళాశాల పరిశీలనకు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి వస్తే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, పోలీసులు అడ్డుకున్నా ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమిలో కుమ్ములాటలు ఉన్నాయని, వై.ఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి భయపడి కలిసి ఉన్నట్టు నటిస్తున్నారన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమే లక్ష్యం సంస్థాగత నిర్మాణ కమిటీల ఎంపిక దాదాపుగా పూర్తి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా సన్నద్ధంగా ఉండాలి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు -
కల్యాణ వైభోగమే..
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. శ్రీమహా విష్ణువు అవతారమైన శ్రీవరాహ లక్ష్మీనసింహస్వామిని పెళ్లికుమారుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగా అలంకరించి నిర్వహించిన ఈ వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు. నృసింహ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కొట్నాల ఉత్సవంతో ప్రారంభం పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచే కల్యాణోత్సవ ఘట్టాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువలు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం చేపట్టారు. ముక్కోటి దేవతలను కల్యాణోత్సవానికి ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంపై గరుడాళ్వార్ చిత్రపటాన్ని అర్చకులు ఎగురవేశారు. రసవత్తరంగా ఎదురు సన్నాహోత్సవం కల్యాణ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఎదురు సన్నాహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారు వర్ణపు పల్లకీలో, అమ్మవార్లను ముత్యాల పల్లకీలో వేంచేపు చేశారు. సింహగిరి మాడ వీధుల్లో పల్లకీలను ఊరేగిస్తూ, పశ్చిమ మాడ వీధిలోని జోడు భద్రాల వద్ద ఎదురెదురుగా ఉంచారు. స్వా మి, అమ్మవార్ల వైభవాన్ని చాటిచెబుతూ సాగిన ఈ కార్యక్రమం రసవత్తరంగా సాగింది. అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఉత్సవాన్ని రక్తి కట్టించారు. పుల్లెల సత్యనారాయణ శర్మ, ముష్టి పవన్ కుమార్ శర్మ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. హోరెత్తిన రథోత్సవం సింహగిరి మాడ వీధుల్లో నిర్వహించిన రథోత్సవం కనులవిందుగా సాగింది. ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేశారు. జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథ సారథిగా వ్యవహరించగా, విశాఖ నలుమూ లల నుంచి అమ్మవారి బంధువులుగా వచ్చిన జాలర్లు రథాన్ని లాగే బాధ్యతను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తు లు రథం తాళ్లను లాగుతూ స్వామి వారిని సేవించుకున్నారు. కనులపండువగా కల్యాణోత్సవం ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రాత్రి 10.30 గంటలకు స్వామి వార్షిక కల్యాణోత్సవం ప్రారంభమైంది. రథోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను కల్యాణ ప్రాంగణంలోకి తీసుకొచ్చి, కల్యాణ వేదికపై వేంచేపు చేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకలను దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యుల పర్యవేక్షణలో అర్చక బృందం నిర్వహించారు. ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాతలు రాంభట్ల నృసింహశర్మ, శేషాచారి వ్యాఖ్యానం అందించారు. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఏర్పాట్లను పర్యవేక్షించగా, గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. నయనానందకరంగా అప్పన్న వార్షిక కల్యాణోత్సవం విశేషంగా ఎదురు సన్నాహోత్సవం పరవశించిన భక్తజనం ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లిన సింహగిరితిరువీధిలో రథోత్సవం -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మరో ఇద్దరికి గాయాలు అనకాపల్లి : అనకాపల్లి–సబ్బవరం హైవేపై రేబాక జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మైనింగ్ లారీ ఢీకొనడంతో పాటు బొలెరో డ్రైవర్ నాగరాజు(33)ను కొంత దూరం పాటు ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలో నిల్చొని ఉన్న మరో ముగ్గురు యువకులను కూడా లారీ ఢీకొంది. వీరిలో ఒకరు స్వల్పంగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు, బాధితుల కుటుంబ సభ్యులు రోడ్డుపై టెంటు వేసి ఆందోళన చేశారు. మైనింగ్ లారీల దూకుడుకు అడ్డుకట్టవేయాలని డిమాండ్ చేశారు. భరోసా ఇచ్చేంతవరకు మృతదేహాన్ని తీసేది లేదంటూ పట్టుబట్టారు. మృతుడు నాగరాజు సబ్బవరం మండలం నారపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో అనకాపల్లి మండలం కాపుశెట్టివానిపాలెం గ్రామానికి చెందిన కరణం శేషాద్రి, కరణం తేజ, కరణం బాలాజీలు గాయపడ్డారు. అనకాపల్లి రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
ప్రజా సమస్యలపై సానుకూల దృక్పథం
హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఉమ్మడి విశాఖ జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, విజయ కృష్ణన్, దినేష్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో పలు సమస్యలను సభ్యులు ఏకరవు పెట్టారు. వేసవి రీత్యా ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేయాలని, వైద్య సేవలను మరింత విస్తరించాలని, తగినంతమంది వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, విద్యుత్ కోత సమస్యలు లేకుండా చూడాలని జెడ్పీటీసీ సభ్యులు ఈర్లె అనురాధ, సామి సత్యనారాయణ,పైలా సన్యాసిరావు, దూలీ నాగరాజు కోరారు. ఈ సందర్భంగా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైరపర్సన్, కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ గుల్లేపల్లి వద్ద కల్వర్టు నిర్మించి, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని, కింతలి–జాలంపల్లి రోడ్ల పరిస్థితిని అధ్యయనం చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రోడ్లలో ఏర్పడిన గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు. ● ఎక్కడా ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు అన్నారు. ఉచిత విద్యుత్ అంటూ బిల్లులు ఇస్తున్నారని,సెల్లో బిల్లులను సభలో చూపించారు. అనకాపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఉచిత విద్యుత్ అమలు కావడం లేదని,అలాగే ఉచిత విద్యుత్ సరఫరా 9 గంటలు ఇవ్వడం లేదని అన్నారు.కానీ ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు సర్కారు గొప్పగా చెప్పుకుంటోందని విమర్శించారు ● ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత పాటించాలని, సోషల్ ఆడిట్ను పక్కాగా నిర్వహించాలని సభ్యులు కర్రి సత్యం,ఈర్లె అనురాధ కోరారు. ఉపాధి హామీ పథకంలో పనులు సక్రమంగా చేపట్టాలని మాడుగుల ఎంపీపీ రాజారామ్ కోరారు. సభ్యులు లేవనెత్తిన అంశాలను సీరియస్గా తీసుకుని వీలైనంత త్వరగా నాణ్యమైన రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ అధికారులను ఆదేశించారు. గిరిజనుల నుంచి విద్యుత్ బిల్లుల వసూళ్లు ఆపాలి గిరిజనులకు ఉచిత విద్యుత్ సౌకర్యం ఉన్నప్పటికీ బిల్లులు ఇవ్వటం సరికాదని, ఆ ప్రక్రియను సరిదిద్దాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పరిధిలోని కొత్తలోసింగి, లోసింగి, పెదగరువు, పీత్రిగెడ్డ, నీళ్లబంద గ్రామాల్లో గిరిజనులకు విద్యుత్ బిల్లులు ఇచ్చారంటూ ఆమె ప్రస్తావించారు. పునఃపరిశీలన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. Iవ పేజీ తరువాయి -
భూ సమస్యలపై వినతుల వెల్లువ
నర్సీపట్నం: ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో దళితుల భూసమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి. తాండవ నిర్వాసితులకు కోటవురట్ల మండలం పందూరు గ్రామంలో ఇచ్చిన భూములను అగ్రవర్ణాల వారు అక్రమించారని గొలుగొండ మండలం జోగంపేట గ్రామానికి చెందిన దళితులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువెళ్లారు.మా భూములను మాకు అప్పగించాలని వారు కోరారు. 1.78 సెంట్ల భూమిని వేరే కులం వారు అక్రమించి భూమిలోకి రానివ్వటం లేదని, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని గొలుగొండ మండలం కశిమి గ్రామానికి చెందిన వేమగిరి సింహాచలం అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఎకరా 81 సెంట్లు భూమి వివరాలను రికార్డుల్లో తొలగించి అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి పేరు నమోదు చేశారని ఆమె మొరపెట్టుకుంది. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డీహెచ్పీఎస్ జిల్లా నాయకులు డొక్కా రాజుబాబు కమిషన్ సభ్యులు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలను పరిష్కరించి, నివేదిక ఇవ్వాలని సభ్యులు ఆర్డీవో వి.వి.రమణకు సూచించారు. దళితుల భూములకు రక్షణ కల్పించడమే కమిషన్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య, దళిత నాయకులు చిట్ల చలపతిరావు, సహాదేవుడు తదితరులు పాల్గొన్నారు. -
మూలపేట పోర్టు పనులు సత్వరం పూర్తి చేయాలి
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నమైన మూలపేట పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం శ్రీకాకుళం జిల్లా నౌపడలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 4,361.91 కోట్లతో ప్రారంభించిన ఈ పోర్టు పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ఈ సభకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయం నుంచి నాయకులు బయలుదేరతారని ఆయన వెల్లడించారు. -
అప్పన్న కల్యాణం చూతము రారండోయ్
సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు, వైదిక వర్గాలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద జరిగే కొట్నాల ఉత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ధ్వజారోహణం, 6.30 గంటలకు ఉత్సవమూర్తులతో ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు మాడ వీధుల్లో రథోత్సవం, రాత్రి 10.30 గంటలకు ఉత్తర రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన సుందరమైన వేదికపై స్వామివారి వార్షిక కల్యాణాన్ని జరిపిస్తారు. ఈ వేడుకకు సుమారు 15 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు, వారందరికీ అన్నప్రసాదం, పంపిణీకి తలంబ్రాలు, లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన, దిగువన ఎల్ఈడీ స్క్రీన్లు, చలువ పందిళ్లు, తాగునీరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 15 షటిల్ సర్వీసులతో పాటు నగరం నలుమూలలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భద్రత కోసం 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అప్పన్న మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి, తిరిగి రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. శనివారం ఉదయం రథ కదలికలను అధికారులు శాస్త్రోక్తంగా పరిశీలించి రథోత్సవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సింహగిరిపై కల్యాణం ప్రాంగణంలో, మాడ వీధిలో, సింహగిరి బస్టాండ్, అన్నప్రసాద భవనం వద్ద, కొండదిగువ బస్టాండ్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్లు, అగ్నిమాపక శకటం అందుబాటులో ఉంచారు. దేవస్థానంలో రెగ్యులర్ సీసీ కెమెరాలతో పాటు కల్యాణోత్సవం ప్రాంగణం తదితర ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. -
గ్యాస్ బండ దొరకడం గగనమే..
● ఖాళీ సిలిండర్లతో తప్పని పడిగాపులు ● డీలర్లు బ్లాక్లో అమ్ముకుంటున్నారని వినియోగదారుల ఆరోపణ నర్సీపట్నం: వంటగ్యాస్ దొరక్క వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా సర్వర్ బిజీ వస్తోంది. గతంలో గ్యాస్ బుక్ చేస్తే 2 నుంచి 3 రోజుల్లో సిలిండరు డెలివరీ అయ్యేది. ప్రస్తుతం 20 రోజులు అవుతున్నా డెలివరీ ఇవ్వడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. ప్రధానంగా హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుతో వినియోగదారులు ఖాళీ బండలు పట్టుకుని గ్యాస్ కోసం రోడ్డు ఎక్కుతున్నారు. శనివారం రెండు లారీలతో సిలిండర్లు వచ్చినా కొందరికే గ్యాస్ లభించింది. చాలా మంది ఖాళీ సిలిండర్లతో సీబీఎం కాపౌండ్ మెయిన్రోడ్డుపై బారులు తీరారు. గ్యాస్ దొరక్క నిరాశతో వెనుదిరిగారు. గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్న బాయ్లు ఒక్కో సిలిండర్ను రూ.2 వేలుకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ఇదంతా ఏజెన్సీ నిర్వాహకుల కనుసన్నల్లోనే జరుగుతుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఏజెన్సీ నిర్వాహకులు తప్పుడు లెక్కలతో అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నారని చెబున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుచ్చెయ్యపేట: గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో గ్యాస్ బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే సిలిండర్ ఇంటికి వచ్చేది. ప్రస్తుతం బుక్ చేసిన 40 రోజుల వరకు గ్యాస్ అందని పరిస్థితి ఏర్పడింది. సింగిల్ సిలిండర్ ఉన్న వారు ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో, ఎప్పుడు బుక్ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. శనివారం వడ్డాదిలో వందలాది మంది గ్యాస్ కోసం మండుటెండలో గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చింది. ఈ నెల 19 వరకు బుక్ చేసుకున్న వారికి మాత్రమే గ్యాస్ ఇవ్వగా 20వ తేదీ తరువాత బుక్ చేసుకున్న వారికి గ్యాస్ ఇవ్వకపోవడంతో పలువురు వెనుదిరిగారు. -
అట్టహాసంగా ప్రారంభమైన ఇనార్బిట్మాల్
తాటిచెట్లపాలెం: సాలగ్రామపురంలో దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మాల్గా పేరుగాంచిన ‘ఇనార్బిట్ మాల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోహిత్ గోప్లాని, ప్రాజెక్ట్స్ అండ్ డిజైన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యూసఫ్ సయ్యద్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ హిమాంశు ధడుధాలు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు షేక్ కౌసర్ సాహిల్, యాళ్ల సత్తిబాబు, గాలిదేవర శివగంగ దుర్గా, అడ్డగుదురు ప్రణయ్ల చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం విశేషం. మాల్ ప్రారంభం సందర్భంగా మొదటి 500 మందికి ‘గోల్డెన్ టికెట్’ గిఫ్ట్లు ప్రకటించడంతో ఉదయం నుంచే నగరవాసులు భారీగా తరలివచ్చారు. జనం ఒక్కసారిగా లోపలికి రావడంతో స్వల్ప తోపులాట జరగగా, ఫోర్త్ టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలు అవుట్లెట్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నగరంలోని అతిపెద్ద మాల్ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బారులు తీరారు. -
రామతీర్థానికి అప్పన్న దేవస్థానం పట్టువస్త్రాల సమర్పణ
సింహాచలం: శ్రీరామనవమిని పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థంలో శుక్రవారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను వైదిక, అధికారులు తీసుకెళ్లారు. రామతీర్థంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సింహాచలం దేవస్థానం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు గత 11 ఏళ్ల నుంచి అందిస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా అక్కడికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం ఈవో జె.వెంకటరావు, అర్చకులు, అధికారులు తీసుకెళ్లారు. -
నేడు ‘ఎర్త్ అవర్’
రాత్రి 8.30కు విద్యుత్ దీపాలు ఆఫ్ చేయండి డాబాగార్డెన్స్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్–2026’ కార్యక్రమంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గంట పాటు అనవసరమైన విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆపివేయాలని ఆయన కోరారు. 2007లో ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్–ఇండియా’ ప్రారంభించిన ఈ ఉద్యమం, ప్రస్తుతం 190కి పైగా దేశాల్లో విస్తరించి అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా మారిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ ఉద్యమం 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషమని కమిషనర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై అవగాహన, విద్యుత్ ఆదా, జీవ వైవిధ్య పరిరక్షణే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, గృహ సముదాయాల నివాసితులు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. నివాసిత సంక్షేమ సంఘాలు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కదిలి మన భూమిని, భవిష్యత్ తరాలను కాపాడడంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. -
జీవీఎంసీ కమిషనర్తో బళ్లారి మేయర్ భేటీ
జీవీఎంసీ అభివృద్ధిని బళ్లారి ప్రతినిధులకువివరిస్తున్న కమిషనర్ కేతన్గార్గ్ డాబాగార్డెన్స్: అధ్యయన యాత్రలో భాగంగా బళ్లారి మేయర్ పి.గాదెప్ప, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జె.ఎస్. ఆంజనేయులు శుక్రవారం కమిషనర్ కేతన్ గార్గ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర సుందరీకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. విశాఖలో అమలవుతున్న ‘ఆపరేషన్ లంగ్స్’, 24 గంటల నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి ద్వారా ఆదాయం..వంటి అంశాలను కమిషనర్ వారికి వివరించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ఐవీఆర్ఎస్, టోల్ఫ్రీ నంబర్ల పనితీరును తెలియజేశారు. జీవీఎంసీ కార్యాచరణ ఇతర నగరాలకు ఆదర్శంగా ఉందని మేయర్ గాదెప్ప కొనియాడారు. త్వరలోనే బళ్లారి నుంచి ఒక ప్రత్యేక సాంకేతిక బృందాన్ని అధ్యయనం కోసం విశాఖకు పంపిస్తామని, వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బళ్లారి టౌన్ ప్లానింగ్ అధికారి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సీతారామం
లోకాభిరామం... నేత్ర పర్వంగా సీతారాముల కల్యాణం గ్రామగ్రామాన రామనామం ప్రతిధ్వనించింది...మామిడాకుల తోరణాలు మెరిసిమురిసిపోయాయి.. మందిరాలు, వీధులు కల్యాణ మండపాలుగా మారిపోయాయి... సిగ్గుమొగ్గలైన సీతమ్మ... చిరు మందహాసంతో రామయ్య ఆసీనులయ్యేవేళ ఆయా ప్రాంతాలన్నీ పరమ ధామాల్లా శోభిల్లాయి.. శ్రీరాముడు సీతారాముడిగా మారుతున్న వేళ.. సకల సుగుణాల కలబోత సీతమ్మ.. రామయ్య చెంతన చేరిన వేళ... మంగళవాయిద్యాలు కల్యాణరాగం ఆలపించాయి... వేద మంత్రాలు మిన్నంటాయి.. జై శ్రీరామ్.. జైజై సీతారామ్ అన్న జయజయ ధ్వానాల మధ్య సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న రామాలయంలో స్వామివారి కల్యాణాన్ని అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, శేషాచార్యులు ఘనంగా నిర్వహించారు. మరో భద్రాద్రిగా పేరుగాంచిన మునగపాక మండలం అరబుపాలెంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కె.కోటపాడు మండలం చిరికిపాలెంలో పిండివంటలతో సీతమ్మకు సారె సమర్పించారు. చోడవరం, నర్సీపట్నం తదితర మండలాల్లో సీతారామ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కనులారా తిలకించిన భక్తులు పరవశించిపోయారు. – సాక్షి, న్యూస్ నెట్వర్క్ సింహగిరిపై రాములోరి వేడుకఘనంగా కల్యాణోత్సవం సింహాచలం : సింహగిరిపై ఉన్న పురాతన రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కల్యాణ వేడుకను కనులారా తిలకించి భక్తిపారవశ్యంలో మునిగితేలారు. సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో విష్వక్సేనపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను దేవస్థానం స్థానాచార్యులు టీపీ రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు గిరి, కుమార్, అప్పాజి తదితరులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు కల్యాణ అక్షింతలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఏఈవోలు ఏర్పాట్లు పర్యవేక్షించారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న ముస్లింలు పెదబోదిగల్లంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం నక్కపల్లి: మతసామరస్యానికి ప్రతీకగా పెదబోదిగల్లం నిలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో సీతారామ కల్యాణోత్సవంలో హిందువులతో పాటు ముస్లింలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. 80శాతం మంది ముస్లింలు నివసించే ఈగ్రామంలో రామమందిర నిర్మాణానికి వారు కూడా విరాళాలిచ్చారు. అంతేకాకుండా శ్రీరామనవమి వేడుకలను కూడా ప్రతిఏటా ఘనంగా నిర్వహించేందుకు సహకరించడంతోపాటు సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు.శుక్రవారం కల్యాణోత్సవంలో హిందూ, ముస్లింలు భారీ ఎత్తున పాల్గొనడంతో రామాలయం కిటకిటలాడింది. ఈ గ్రామంలో రంజాన్ ఉపవాస దీక్షలను హిందువులు కూడా చేస్తారు. హలీంను హిందువులు తృప్తిగా ఆరగిస్తే.. వడపప్పు, బెల్లంపానకాన్ని రుచి చూడటానికి ముస్లింలు ఆరాటపడతారు.ప్రతిహిందువుల పండగలోను ముస్లింలు పాల్గొంటారు. ఇక్కడ శ్రీరామనవమివేడుకలేకాదు, దేవీనవరాత్రులను కూడా ఘనంగా నిర్వహిస్తారు. హిందువులు ఉరుసుల్లో మొక్కుబడులు చెల్లించుకుంటే, ముస్లింలు తూర్పుగోదావరి జిల్లాలో తలుపులమ్మతల్లిని దర్శించుకుని ముడుపులు సమర్పిస్తారు. -
సందడిగా ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
నాతవరం: పండగలు సందర్భంగా విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని ఎస్ఐ వై.తారకేశ్వరరావు కోరారు. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం నాతవరంలో అండర్ –14 విభాగంలో బాలబాలికలకు ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. బాలికల విభాగంలో గోపాలపట్నం హైస్కూల్ విద్యార్థినులు మొదటి స్థానంలో నిలిచారు. నాతవరం హైస్కూల్, శాంతినికేతన్ స్కూల్ విద్యార్థినులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో గోపాలపట్నం హైస్కూల్ విద్యార్థులు విజేతగా నిలిచారు. చోడవరం హైస్కూల్ ద్వితీయ, గొలుగొండ మండలం కృష్ణదేవిపేట స్కూల్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులతోపాటు షీల్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి అపిరెడ్డి మాణిక్యం, నాతవరం ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ జిల్లా కమిటి సభ్యుడు కరక అప్పలరాజు, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతల విజయకుమార్, వైఎస్సార్సీపీ మేధావుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు పైల పోతురాజు పాల్గొన్నారు. -
గ్యాస్ సరఫరా చేయాలని గిరిజనుల నిరసన
గ్యాస్ సరఫరా కోసం ఖాళీ కంచాలతో నిరసన తెలుపుతున్న గిరిజనులు రావికమతం: మండలంలో చీమలపాడు పంచాయతీ పరిధి గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలని కోరుతూ శుక్రవారం కల్యాణపులోవలో ఖాళీ సిలిండర్లతో ఖాళీ కంచాలు పట్టుకుని గిరిజనులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు మాట్లాడుతూ కొన్ని రోజులు నుంచి గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయలేకపోవడంతో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఆన్లైన్లో బుక్ చేసుకొని రావికమతం వస్తేనే గ్యాస్ ఇస్తామని ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వారు చెబుతున్నారని తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకుందామంటే ఏజెన్సీ గ్రామాల్లో తరుచూ సిగ్నల్ సమస్య వస్తుందన్నారు. దిగువ గ్రామాలకు వచ్చి ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకుని రావికమతం ఏజెన్సీ వద్దకు వెళ్తే నాలుగు రోజులు తర్వాత ఇస్తామని చెప్పుతున్నారని వాపోయారు. గ్యాస్ ఏజెన్సీ వారు గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. -
చెక్పోస్ట్ కార్మికుని మృతికి నష్టపరిహారం చెల్లించాలి
అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం మండలంలో మైనింగ్ను ఏఎంఆర్ సంస్థలకు అప్పగించి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైనింగ్ చెక్పోస్టులు వద్ద కార్మికులు 24 గంటలూ విధుల్లో ఉండడంతో అనారోగ్యానికి గురై మృత్యవాత పడుతున్నట్లు వాపోయారు. కార్మికుల చట్టాలను ఏఎంఆర్ సంస్థ నీరుగారుస్తుందన్నారు. మండలంలో మామిడిపాలెం ఏఎంఆర్ మైనింగ్ చెక్ పోస్ట్లో మొబైల్ స్క్వాడ్ విధుల్లో ఉండి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన తాడేపల్లి గూడెంకు చెందిన ముప్పిడి రామిరెడ్డి కుటుంబానికి సదరు సంస్థ రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే ప్రమాదంలో క్షతగాత్రుడైన కూండం గ్రామానికి చెందిన జగదీష్కు పూర్తి వైద్యం అందించాలని కోరారు. మైనింగ్ చెక్ పోస్ట్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు. ప్రాణాలకు తెగించి రేయంబవళ్లు మైనింగ్ ప్రాంతాలను చెక్ చేయడంతోపాటు నిత్యం ప్రమాదాలు గురవుతున్న వారికి ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదన్నారు. కనీస వేతనాలు అమలు కావడం లేదని, పనిగంటలు అదనంగా చేయించుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోయారు. లేబర్ అధికారులు చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో.. ఎటో?
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఇప్పుడు ఆ ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశాయి. గత ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రణాళికలను పక్కనపెట్టి, కేవలం తన మార్కు కనిపించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిత్వ శాఖలు గట్టి షాక్ ఇచ్చాయి. కొత్తగా పంపిన డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపడంతో విశాఖ వాసుల మెట్రో కల మళ్లీ మొదటికి వచ్చింది. వాస్తవానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖ అభివృద్ధిని కాంక్షిస్తూ 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో లైట్ మెట్రో ప్రాజెక్టుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. రూ. 14,309 కోట్ల అంచనా వ్యయంతో, పీపీపీ విధానంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, విదేశీ డిజైన్లు, డబుల్ డెక్కర్ కారిడార్లంటూ ‘విజనరీ’ పేరుతో కొత్త డీపీఆర్ను రూపొందించారు. కేవలం 8 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్ కోసం పూర్తిస్థాయిలో ఉన్న పాత డీపీఆర్ను మార్చేయడం ఇప్పుడు విమర్శలకు దారితీసింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం ‘డబుల్ డెక్కర్ వస్తే ఇక మెట్రోతో పనేముంది?’ అని ప్రశ్నిస్తూ డీపీఆర్ను తిరస్కరించింది. ‘ఇదేం డీపీఆర్ బాబూ?’ అంటూ కేంద్రం అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సాంకేతిక అడ్డంకులు – కేంద్రం తిరస్కరణ కేంద్ర మంత్రిత్వ శాఖల విశ్లేషణ ప్రకారం.. డబుల్ డెక్కర్ కారిడార్ వల్ల నిర్మాణ సమయం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సాంద్రత, భూసేకరణ సమస్యలు ఈ కొత్త ప్రతిపాదనతో మరింత జటిలమవుతాయి. ఈ నేపథ్యంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ డబుల్ డెక్కర్ ప్రతిపాదనను తొలగించి, పాత పద్ధతిలోనే సాధ్యమయ్యే రీతిలో మరోసారి కొత్త డీపీఆర్ తయారు చేయాలని తేల్చి చెప్పింది. దీనివల్ల నెలల తరబడి కష్టపడి చేసిన కసరత్తు అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ముగింపు..మళ్లీ మొదటికే కథ! మొత్తానికి విశాఖ మెట్రో కథ ఇప్పుడు ‘మళ్లీ మొదటికి’ అన్నట్లు తయారైంది. కేంద్రం ఆదేశాల మేరకు కొత్త డీపీఆర్ తయారు చేయాలంటే మళ్లీ కొన్ని నెలల సమయం పడుతుంది. అప్పటివరకు నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ ఆగిపోవాల్సిందే. ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారినప్పుడల్లా ఇలా ప్రాజెక్టు నివేదికలు మారిపోతే, సామాన్యుడికి మెట్రో ప్రయాణం ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. డబుల్ డెక్కర్తోనే అసలు సమస్య విశాఖ మెట్రో కోసం గత ప్రభుత్వం సిద్ధం చేసిన లైట్ మెట్రో డీపీఆర్ బాగుందని కేంద్రం చెప్పినా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి పంపిన ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదనలు ఇప్పుడు ప్రాజెక్టును గందరగోళంలోకి నెట్టాయి. 12 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిశీలనకు వెళ్లిన ఈ కొత్త డీపీఆర్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా డబుల్ డెక్కర్ కారిడార్ ఉంటే మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ తగ్గిపోతుందని, ఇది ప్రాజెక్టు మనుగడకే ముప్పని కేంద్రం స్పష్టం చేసింది. ‘అసలు ఈ డీపీఆర్ మెట్రో అభివృద్ధి కోసమేనా?’ అని పలు శాఖలు సందేహాలు లేవనెత్తడంతో, ఆశలు చిగురించిన వైజాగ్ మెట్రో కథ మళ్లీ మొదటికి చేరింది. మరోసారి డీపీఆర్లో మార్పులకు..! విశాఖ మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ప్రభుత్వ ‘విజనరీ’ నిర్ణయాలు అడ్డుపడుతున్నాయి. గత ప్రభుత్వం పంపిన డీపీఆర్నే కొనసాగించి ఉంటే ఇప్పటికే పనులు ప్రారంభమయ్యేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టుబట్టి చేర్చిన 8 కి.మీ. డబుల్ డెక్కర్ కారిడార్పై కేంద్ర మంత్రిత్వ శాఖలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనివల్ల మెట్రోకు రావాల్సిన ట్రాఫిక్ దెబ్బతింటుందని కేంద్రం తేల్చిచెప్పింది. అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం కనీసం 5 కిలోమీటర్ల మేరకై నా డబుల్ డెక్కర్ ఉంచాలని పట్టుబడుతోంది. దీనిపై గత 20 రోజులుగా కేంద్ర ప్రతినిధులతో కలిసి అధికారులు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఫలితంగా మూడోసారి డీపీఆర్లో మార్పులు తప్పనిసరయ్యాయి. ఈ జాప్యం వల్ల వైజాగ్ మెట్రో ప్రాజెక్టు మరోసారి అటకెక్కినట్లయింది. ‘బాబు’ విజనరీని ఛీకొట్టిన కేంద్రం డబుల్ డెక్కర్తో ‘డబుల్’ భారం విశాఖ మెట్రో ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు ఆర్థికంగా, సాంకేతికంగా పెను సవాలుగా మారాయి. గత ప్రభుత్వం 76 కి.మీ మేర రూపొందించిన డీపీఆర్ కంటే.. ప్రస్తుత ‘డబుల్ డెక్కర్’ ప్రతిపాదన వల్ల నిర్మాణ వ్యయం కిలోమీటరుకు 30 నుంచి 40 శాతం అదనంగా పెరిగింది. ఈ భారీ బడ్జెట్ను భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సైతం నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎన్ఏడీ జంక్షన్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న ఫ్లైఓవర్ల మధ్య మళ్లీ డబుల్ డెక్కర్ నిర్మించడం అత్యంత క్లిష్టమని పేర్కొంది. పైపులైన్లు, విద్యుత్ లైన్ల మార్పిడి వల్ల కాలయాపన జరగడమే కాకుండా, మలుపుల వద్ద మెట్రో వేగం తగ్గి ప్రయాణ సమయం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ మొండి పట్టుదల వల్ల వైజాగ్ మెట్రో పట్టాలెక్కడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. -
నిద్రలో నిఘా.. ముప్పులో భద్రత
మహారాణిపేట: కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారానికి నిలయం, వేలాది కుటుంబాలకు జీవనాధారమైన విశాఖ ఫిషింగ్ హార్బర్లో భద్రత డొల్లగా మారింది. ప్రతిష్టాత్మకమైన ఈ హార్బర్లో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోంది. పోర్ట్ అథారిటీ పర్యవేక్షణ లోపం మత్స్యకారుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. అలంకారప్రాయంగా 60 కెమెరాలు హార్బర్లో నేరాల నియంత్రణ కోసం విశాఖ పోర్టు సుమారు 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే వీటిలో మెజారిటీ కెమెరాలు మరమ్మత్తులకు గురికావడం, మరికొన్నింటికి నెట్వర్క్ కనెక్షన్లు లేకపోవడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో, కీలకమైన హార్బర్లో కెమెరాలు పనిచేయకపో వడంపై మత్స్యకార వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్ నిఘా లేకపోవడంతో హార్బర్ ప్రాంతం మందుబాబులకు, గంజాయి బ్యాచ్లకు ఆవాసంగా మారింది. రాత్రి సమయాల్లో బోట్లపైనే మద్యం సేవిస్తూ ఘర్షణలకు దిగడం నిత్యకృత్యమైంది. అంతేకాకుండా, బోట్లలోని విలువైన సామాగ్రి, వేట కోసం నిల్వ ఉంచుకున్న డీజిల్ దొంగతనానికి గురవుతున్నాయి. సీసీ ఫుటేజీ అందుబాటులో లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. నిషేధ కాలం వేళ.. పెరగనున్న భయం ఫిషింగ్ హార్బర్లో కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారం జరుగుతున్నా, భద్రత విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల హార్బర్ అసాంఘిక శక్తులకు, దొంగతనాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో బోట్లపై మద్యం సేవించడం, సామగ్రిని దోచుకోవడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. వచ్చే నెల 15 నుంచి వేట నిషేధ కాలం ప్రారంభం కానుంది. ఆ సమయంలో హార్బర్ నిర్మానుషంగా మారుతుంది కాబట్టి బోట్లకు రక్షణ కల్పించడం యజమానులకు పెద్ద సవాలుగా పరిణమించనుంది. ఇప్పటికై నా విశాఖ పోర్ట్ అథారిటీ స్పందించి వెంటనే సీసీ కెమెరాలను మరమ్మతు చేయాలి. అలాగే వేట లేని సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. – వాసుపల్లి జానకీరామ్, అధ్యక్షుడు, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ (ఇండియా), ఫిషింగ్ హార్బర్లో అలంకారంగా ఉన్న సీసీ కెమెరాలు -
ఈవీఎం గొడౌన్ వద్ద అప్రమత్తంగా ఉండాలి
తుమ్మపాల: ఈవీఎం గొడౌన్ వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జేసీ శౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గొడౌన్ను గురువారం జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. తాళాలు తీయించి గొడౌన్ లోపల కూడా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీ క్రమంలో లాగ్బుక్లో సంతకం చేశారు. భద్రతా ప్రమాణాలు, లాగ్బుక్ నిర్వహణ ఇతర అంశాలపై నాయకులతో మాట్లాడారు. భద్రపరిచిన ఈవీఎంల స్థితిగతులను ఎన్నికల విభాగం అధికారులు జేసీకి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆయిషా, కలెక్టరేట్ ఏవో విజయ్కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, వి.రమేష్, మీసాల సుబ్బన్న, కె.హరినాథ్బాబు, స్థానిక రెవెన్యూ, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్ల వివరాలు పంపండి ●గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు ఏజెంట్ను నియమించి వివరాలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు కోరారు. ఈవీఎం గొడౌన్ తనిఖీ అనంతరం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల జాబితా నవీకరణ ప్రక్రియపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు విషయంలో బూత్ లెవల్ అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓటర్ల జాబితా తయారీలో సహకరించాలని కోరారు. -
విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన
పాడేరు : జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని ఐటీడీఎ పీవో, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం ఏటీడబ్ల్యూవోలు, హెచ్ఎలు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తల్లిదండ్రుల నుంచి అందిన ప్రతికూల ఫీడ్ బ్యాక్కు గల కారణాలను నిశితంగా పరిశీలిస్తామన్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్కు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. హెచ్ఎంలు జవాబుదారితనంలో విధులు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అభ్యసన వాతావరణం కల్పించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఏటీడబ్ల్యూఓలు, హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
రెండో రోజు భారత్ గ్యాస్ గోదాం వద్ద వినియోగదారుల పాట్లు
గ్యాస్ గోదాం వద్ద ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు మాడుగుల రూరల్ : భారత్ గ్యాస్ కోసం మాడుగుల సీతారామ గ్యాస్ ఏజెన్సీ వద్ద గురువారం కూడా గ్యాస్ వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో క్యూ కట్టారు. ఈ నెల 20వ తేదీకి ముందు గ్యాస్ బుక్ చేసుకున్న వారికి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. రెండు లారీల ద్వారా గ్యాస్ సిలిండర్లు రావడంతో గురువారం సుమారు 400 మందికి సిలిండర్లు పంపిణీ చేశారు. గురువారం కూడా గోదాం వద్ద తహసీల్దారు రమాదేవి, ఎస్ఐ నారాయణరావు గ్యాస్ సిలిండర్ల పంపిణీని పర్యవేక్షించారు. -
చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్ల ప్రణాళికను పరిశీలిస్తున్న కలెక్టర్, సీపీ సింహాచలం: ఏప్రిల్ 20న జరిగే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000, రూ.1500 మార్గాలను పరిశీలించి భక్తులకు తెలిసేవిధంగా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. ఉచిత దర్శనంలో వచ్చే భక్తులకు రెండు మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. క్యూలైన్లలో మంచినీరు, వాష్రూమ్స్, ఎమెర్జన్సీ ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్తర రాజగోపురం నుంచి అన్నదానం భవనానికి వెళ్లే మార్గాలను సీపీ పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కొండపై బస్ కాంప్లెక్స్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు రద్దీని క్రమబద్ధీకరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింహగింపై పార్కింగ్ ఏరియా తక్కువగా ఉండటంతో ప్రైవేటు వాహనాలను నియంత్రించాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
బొలేరో– స్కూటీ ఢీకొని ఇద్దరు మృతి
రావికమతం : స్థానిక బీఎన్రోడ్డులో గురువారం ఎదురెదురుగా వస్తున్న బొలేరో, స్కూటీ వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మైనర్ యువకులు మృతి చెందారు. మరో మైనర్ గాయపడ్డాడు. ఈ దుర్ఘటనపై ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావికమతం గ్రామానికి చేఽందిన డి.ఉదయ్కుమార్ (16), సిహెచ్.కోటేశ్వరరావు(17), ఐ.బాజ్జి(17) అనే ముగ్గురు గురువారం ఏపీ 39ఎఫ్డబ్ల్యు 4047 నంబర్ గల స్కూటీపై కొత్తకోట వైపు వెళుతుండగా అదే సమయంలో గర్నికం గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీను బొలేరో(ఏపీ39టీఎల్ 3332) వాహనంపై పాడేరు వెళుతుండగా ఎదురెదురుగా వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఉదయ్కుమార్ (పండు), కోటేశ్వరరావుల తల నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. గాయపడిన ముగ్గురినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఉదయ్కుమార్, కోటేశ్వరరావులకు తలపై బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమించగా నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయ్కుమార్ (పండు) మరణించగా, కోటేశ్వరరావును మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి కోటేశ్వరరావు మృతి చెందాడు. మరో యువకుడు బాజ్జి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బొలేరో వాహనం డ్రైవర్ శ్రీనును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. ఇద్దరు మైనర్ యువకులు మృతి చెఽందడంతో రావికమతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రోడ్డెక్కిన కాఫీ రైతులు
● కాఫీని జీసీసీ కొనుగోలు చేయాలని డిమాండ్ ● లేకుంటే ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరిక చింతపల్లి: సీజన్కు ముందు దళారులను నమ్మవద్దని, గిట్టుబాటు ధర ఇచ్చి మేమే కొంటామని చెప్పిన జీసీసీ.. ఇప్పుడు తీరా సమయం వచ్చాక ముఖం చాటేయడం ఏంటి? అంటూ కాఫీ రైతులు, గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ గురువారం చింతపల్లిలో భారీ ఆందోళన చేపట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో తొలుత చింతపల్లిలోని జీసీసీ డీఎం కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాఫీ గింజల కొనుగోలుపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేసిన అధికారులు, ఇప్పుడు అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిపివేయడం గిరిజన రైతులకు తీరని అన్యాయమని ధ్వజమెత్తారు.వెంటనే ఐటీడీఏ, జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లు ప్రారంభించకపోతే, రైతులందరితో కలిసి పాడేరు ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరించారు. అవసరమైతే రోడ్లపైనే వంటా–వార్పూ చేపట్టి నిరసన తెలియజేస్తామన్నారు.తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను జీసీసీ డీఎం, తహసీల్దార్ శంకర్రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు చిరంజీవి పడాల్, సీపీఎం నాయకులు పాంగి ధనుంజయ్, ఎంపీటీసీ సత్తిబాబు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వసుధైక కుటుంబానికి నిదర్శనం ఏయూ
మద్దిలపాలెం: ఐక్యత, వైవిధ్యమే మన బలం అని, వసుధైక కుటుంబానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నిదర్శనంగా నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ వేదికగా గురువారం నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక విభావరిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏయూకు ఉన్న ప్రతిష్టకు నిదర్శనంగానే విదేశీ విద్యార్థులంతా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని కొనియాడారు. యువతరం శాంతి, సుస్థిరతకు పాటుపడాలని సూచించారు. ఏయూ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో విద్యనందిస్తోందని ప్రశంసించారు. విభిన్న దేశాల సంస్కృతులను పంచుకుంటూ సామరస్య జీవనం సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. వర్సిటీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఇది ఒకటని తెలిపారు. కొద్ది రోజుల కిందట నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్ మాట్లాడుతూ.. ఏయూలో ప్రస్తుతం 57 దేశాలకు చెందిన 1,150 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విదేశీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. ప్రత్యేక వస్త్రధారణలతో, ఆకట్టుకునే ఆహార్యంతో తమ దేశ సంస్కృతీ సంప్రదాయాలను, నృత్య రీతులను పరిచయం చేస్తూ వారు నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. -
గ్యాస్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షణ
మాడుగుల రూరల్: గ్యాస్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామని మాడుగుల నియోజకవర్గ పౌర సరఫరాల ఉప తహసీల్దారు(సీఎస్డీటీ) కె.రవిబాబు అన్నారు. మాడుగులలోని సీతారామ భారత్ గ్యాస్ గోదామును ఆయన గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ప్రస్తుతం గోదాంలో 342 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఈ వారంలో ఆయిల్ కంపెనీల నుంచి వరుసగా మూడు రోజుల పాటు గ్యాస్ సిలిండర్లు రాకపోవడం వల్ల బ్యాక్లాగ్ ఎక్కువైపోయిందని సీఎస్డీటీ తెలిపారు. దీని వల్ల ఒకేసారి గోదాం వద్ద రద్దీ ఏర్పడిందని, గురువారం 500 మంది గ్యాస్ వినియోగదారులకు సిలిండర్లు అందించామన్నారు. రాబోయే రెండు రోజుల్లో గ్యాస్ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంనది ఆయన స్పష్టం చేశారు. ఘాట్రోడ్డు జంక్షన్లో హోటళ్ల తనిఖీ అనంతరం ఘాట్రోడ్డు జంక్షన్లోని పలు హోటళ్లను సీఎస్డీటీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోదమాంబ ఫ్యామిలీ రెస్టారెంట్లో డొమిస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దేవరాపల్లిలో కూడా హోటళ్లను తనిఖీ చేసి, రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్టు రవిబాబు తెలిపారు. -
వైఎస్సార్ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధికి బీజం
నక్కపల్లి: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే పాయకరావుపేట నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి బీజం పడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిశీలకుడు వీసం రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన నక్కపల్లిలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఘనత ముమ్మాటికీ వైఎస్సార్సీపీదేనన్నారు. దీనిపై తాము తప్పుడు ప్రచారం చేస్తున్నామని కొంతమంది టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. పాయకరావుపేట నియోజవకర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేదన్నారు. 30 ఏళ్లపాటు 1983 నుంచి 2009 వరకు, మళ్లీ 2014 – 19 వరకు టీడీపీ ఎమ్మెల్యేలే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ కాలంలో నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. చివరికి విద్యార్థుల ఉన్నత విద్య కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యేలు పనిచేశారన్నారు. ఈ ప్రాంత రైతులకు రావాల్సిన తాండవ జలాలను సైతం విడుదల చేయించలేకపోయారని విమర్శించారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టికి ఈ ప్రాంత కరువు సమస్యలు తీసుకెళ్లడంతో ఆయన స్పందించి నక్కపల్లిలో హెటెరో డ్రగ్స్, పాయకరావుపేటలో దక్కన్ కంపెనీలను ఏర్పాటు చేయించారన్నారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బహిరంగ వేదికపై చెప్పారన్నారు. విశాఖ – చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్, పరవాడలో ఫార్మాసిటీ, అచ్యుతాపురంలో సెజ్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనన్నారు. నియోజకవర్గానికి 35 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించారన్నారు. నక్కపల్లి మండలంలో ఎస్ఈజెడ్ ఏర్పాటు ప్రతిపాదనలను తీసుకొస్తే భూములు కోసం వచ్చే వారిని చెట్లకు కట్టి కొట్టాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారన్నారు. జగన్ హయాంలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత.. దావోస్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఈవో ఆదిత్య మిట్టల్ను కోరగా, నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూములను మిట్టల్ ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లిందని వీసం తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన చూపించారు. జూమ్ కాల్లో స్టీల్ ప్లాంట్ తెచ్చేశానని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూమ్ సమావేశంలోనే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలరా? అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ భూమి పూజా కార్యక్రమంలో నిర్వాసితులను కనీసం గౌరవించే ప్రయత్నం చేయలేదన్నారు. రైతుల త్యాగం వల్లే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నారు. వీసీఐసీఆర్లో నక్కపల్లిని క్లస్టర్గా చేసిన ఘతన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిదేనన్నారు. నక్కపల్లి మండలంలో సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1100 కోట్లు కేటాయించారన్నారు. నక్కపల్లి ఆస్పత్రిని 50 పడకల స్థాయికి పెంచారన్నారు. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంబాల జోగులుపై విమర్శలు చేస్తున్నారని, ప్రస్తుత ఎమ్మెల్యే, హోం మంత్రి కూడా స్థానికేతరాలన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్తామన్నారు. కంబాల జోగులను విమర్శించే అర్హత టీడీపీ చోటా నాయకులకు లేదన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, ఎంపీటీసీ గొర్ల గోవిందరాజు, సర్పంచ్ తళ్ల భార్గవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఎల్లేటి సత్యనారాయణ, స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు యలమంచిలి చందు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు, వార్డు సభ్యులు పిక్కి అప్పలరాజు, నాయకులు వంకా కృష్ణ, దమ్ము రమణ, ఎస్ చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయరూ..
రావికమతం: మండలంలో చీమలపాడు పంచాయతీ జెడ్.జోగుంపేట కేంద్రంగా ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని గురువారం గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేతులు జోడించి నిరసన తెలిపారు. చీమలపాడు పంచాయితీ పరిదిలో గల జెడ్.జోగుంపేటలో ఎంపీపీ స్కూల్ ఉంది. జెడ్.జోగుంపేట గ్రామం చుట్టు కరగెడ్డ, గంగంపేట, రొచ్చుపణుకు,పెద గరువు, రాయపాడు, నేరెడు బంద, బంగారు బందలు, అజేయపురం తదితర గ్రామాల గిరిజన విద్యార్థులు జెడ్.జోగుంపేటలో చదువుకుంటున్నారు. రోలుగుంట, రావికమతం మండలాల పరిధిలో 70 గ్రామాల గిరిజన విద్యార్థులకు జెడ్.జోగుంపేట కేంద్రంగా గిరిజన పాఠశాల ఏర్పాటు చేయాలని చోడవరం నియోజవర్గంలో ఒక్క గిరిజన ఆశ్రమ పాఠశాల కూడా లేదని, ఆశ్రమ పాఠశాల ఉంటే గిరిజన విద్యార్థులకు మేలు జరుగుతుందని, జిల్లా కలెక్టర్ స్పందించి జెడ్.జోగుంపేటలో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాంగి చంద్రయ్య,పాంగి చంపావతి,వంతల ఐలమ్మ పాల్గొన్నారు. -
కోడిపందాలు ఆడుతున్న 9 మంది అరెస్టు
పట్టుబడ్డ వ్యక్తులు, నగదు, కోళ్లు, సెల్ఫోన్లు పాయకరావుపేట : మండలంలో గల ఈదటం గ్రామ శివారులో 9 మంది వ్యక్తులు కోడి పందాలు ఆడుతున్నట్టు సీఐ జి.అప్పన్నకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ పురుషోత్తం, సిబ్బంది దాడి జరిపి పట్టుకున్నారు. వారి వద్ద రూ.3230 నగదు, 3 బతికిన కోళ్లు, 3 చనిపోయిన కోళ్లు, 9 సెల్ఫోన్లు, 5 మోటారు సైకిళ్లు సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కోడి పందాలు, రబ్బరు గుండాట, పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
వేతన సవరణ అమలు చేయకపోతే మరో ఉద్యమం
మెయిన్రోడ్డు డీసీసీబీ వద్ద ధర్నా చేస్తున్న జిల్లా సహకార ఉద్యోగులు అనకాపల్లి : జిల్లా సహకార బ్యాంక్ల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వేతన సవరణలను తక్షణమే అమలు చేయాలని బ్యాంక్ ఉద్యోగుల సంఘం మేనేజర్ రజని, అసిస్టెంట్ మేనేజర్ రత్నం అన్నారు. స్థానిక మెయిన్రోడ్డు జిల్లా సహకార బ్యాంక్ వద్ద ఉద్యోగులు గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల వేతన సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. ఉద్యోగులు నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ తగిన వేతన సవరణ జరగలేదన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వేతన సవరణ అమలు చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఫీల్డ్ ఆఫీసర్ శ్రీను, స్టాఫ్ అసిస్టెంట్లు సాయికృష్ణ, వాగ్దేవి, హేమ, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పునరావాసం కల్పించనిదే ఖాళీ చేయం
అచ్యుతాపురం రూరల్ : పునరావాసం కల్పించకుండా గ్రామం నుంచి ఖాళీ చేసేది లేదంటూ దుప్పితూరు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గురువారం దుప్పితూరు గ్రామస్తులు అఖిలపక్ష నాయకుల మద్దతుతో బ్రాండిక్స్ ఆవరణలో గ్రామానికి చెందిన చిట్టి పైడితల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆందోళన చేశారు. ఏపీఐఐసీ అధికారులు దుప్పితూరు గ్రామం మధ్యలో ప్రహరీ చుట్టూ ఉన్న నిర్వాసిత ప్రజలను ఖాళీ చేయాలని భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. గ్రామ దేవతలు, శివాలయం, శ్మశాన వాటిక, దేవదాయ భూములు, దుప్పితూరు గ్రామ ప్రజలకు పునరావాసం, ఆర్అండ్ఆర్ ప్యాకేజ్, గ్రామ కంఠంలో ఉన్న నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని తరలించకుండా ఏపీఐఐసీ అధికారులు గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. గ్రామం చుట్టూ ప్రహరీ కట్టడం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన చెందారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దుప్పితూరు గ్రామస్తుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో దుప్పితూరు సర్పంచ్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, ఇతర పార్టీ నాయకులు, దేశంశెట్టి వెంకటరమణ, దేశంశెట్టి పైడియ్యనాయుడు, గ్రామ పెద్దలు దేశంశెట్టి తాతియ్యలు, దేశంశెట్టి ఈశ్వర్రావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు శెట్టి నాగేశ్వర్రావు, శెట్టి కాసుబాబు, ప్రగడరాజు, దేశంశెట్టి కాసుబాబు, ప్రగడ ఈశ్వర్రావు, ప్రగడ కొండలరావు, మాడెం సూరి అప్పారావు పాల్గొన్నారు. -
మద్యం షాపులపై ఎకై ్సజ్ అధికారుల శీతకన్ను !
మునగపాక : వడ్డించేవాడు మనోడైతే బంతిలో అఖరిలో కూర్చొన్నా అన్నీ అందుతాయన్న సామెత అందరికీ తెలిసిందే. అలాంటి సంఘటన మునగపాకలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో పలువురు వ్యాపారులు లాటరీ ద్వారా షాపులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. మునగపాక మండలంలో ఐదు షాపులు ఉన్నాయి. వాటిలో మునగపాకలో రెండు, నాగవరం, తోటాడ, చూచుకొండ ప్రాంతాల్లో చెరొకటి షాపులు ఉన్నాయి. అయితే ఆయా షాపులకు సంబంధించిన మద్యం అనకాపల్లి గొడౌన్ను నుంచి సరఫరా అవుతుంది. ఏ దుకాణానికి ఎంతమేర మద్యం సరఫరా చేయాలన్నా ఎకై ్సజ్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో షాపు నిర్వాహకులు తమకు కావాల్సిన పలు రకాల మద్యం సీసాలను కొనుగోలు చేస్తుంటారు. ఆయా బాటిళ్లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేస్తే సంబంధిత షాపు పేరు అలాగే వెండర్ నేమ్, బాటిల్ ఎప్పుడు తయారైంది.. అలాగే గొడౌన్ పేరు వంటి వివరాలు తెలుస్తాయి. అయితే మునగపాక మెయిన్రోడ్డులోని వైన్ షాపులో చీప్ లిక్కర్పై ఉన్న క్యూఆర్ కోడ్ను తనకు అందిన సమాచారం మేర స్థానిక సాక్షి విలేకరి స్కాన్ చేస్తే ఇతర ప్రాంతానికి చెందిన వెండర్ పేరు అనగా ఎంఎల్ఎం వైన్స్ పేరు వస్తుంది. దీనిని బట్టి చూస్తే ఇతర ప్రాంతాలకు చెందిన మద్యం ఇక్కడ యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయన్నది తెటతెల్లం అవుతుంది. గురువారం రాత్రి మునగపాక మెయిన్రోడ్డులోని ఇరువైపులా ఉన్న వైన్షాపులను ఎకై ్సజ్ అధికారులు తనిఖీ నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ నాయుడును ఫోన్లో వివరణ కోరేందుకు యత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ విషయమై ఉన్నతాధికారులు తగు విచారణ చేపట్టి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
దుకాణాల్లో సబ్సిడీ గ్యాస్ వినియోగం
దేవరాపల్లి టిఫిన్ సెంటర్ల తనిఖీ చేస్తున్న సీఎస్డీటీ ఎ.రవిబాబు దేవరాపల్లి : దుకాణాల్లో సబ్సిడీ గ్యాస్ వినియోగించిన ఇద్దరు వ్యక్తులపై సివిల్ సప్లయి అధికారులు 6ఏ కేసులు నమోదు చేశారు. గ్యాస్ కొరత నేపథ్యంలో సివిల్ సప్లయి అధికారులు మండలంలో పలు హోటళ్లు, దాబా, టిఫిన్, టీ దుకాణాలపై గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కమర్షియల్ గ్యాస్కు బదులుగా డొమెస్టిక్( గృహ అవసరాల గ్యాస్) గ్యాస్ను వాడుతున్నట్టు గుర్తించారు. దేవరాపల్లిలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో టిఫిన్ సెంటర్ నిర్వాహకుడిపైన, కాశీపురంలో దాబా యజమానిపైన 6ఏ కేసులు నమోదు చేసి, రెండు సిలిండర్లను సీజ్ చేసినట్టు సివిల్ సప్లయి డిప్యూటీ తహసీల్దార్ ఎ. రవిబాబు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామని, గృహ అవసరాల గ్యాస్ను వాణిజ్య సముదాయాలలో వినియోగిస్తే క్రిమినల్ కేసులు సైతం పెట్టేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. మాడుగుల నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని, కె.కోటపాడు మండలంలో నిర్వహించిన దాడుల్లో నలుగురిపై కేసులు నమోదు చేసి, 13 సిలిండర్లను సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఆయన వెంట వీఆర్వో బి. నాగేశ్వరరావు తదితర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
పేదల ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలి
తుమ్మపాల : ప్రజల ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (బ్యాంకర్ల సమావేశం) జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదప్రజల ఆర్థిక అభ్యున్నతి కోసం చేస్తున్న పథకాలకు అనుగుణంగా ఔత్సాహికులకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. విద్యా రుణాలు, ఎంఎస్ఎంఈలకు పీఎం సూర్య ఘర్ పథకాలకు, వ్యవసాయ రుణాలు, ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కింద విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. రుణాలు అందించడంలో అన్ని బ్యాంకులు లక్ష్యాలు సాధించాలన్నారు. సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలని అన్నారు. అధికారులు, ఎస్హెచ్జి మహిళలు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణాల మంజూరులో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యా రుణాల పట్ల విద్యార్థులలో అవగాహన కలిగించి ప్రోత్సహించాలన్నారు. పీఎం సూర్యఘర్ రుణాలను పెంచాలని, తద్వారా సోలార్ విద్యుత్ వినియోగం పట్ల ప్రజలలో అవగాహన కలిగించాలన్నారు. వ్యవసాయ రుణాల మంజూరు, రెన్యువల్ సమయాల్లో రీ సర్వే వల్ల ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే రెవెన్యూ అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. అంతకుముందు నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ వార్షిక ప్రణాళిక పుస్తకాన్ని (2026–27) ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణ రావు, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ శచీదేవి, పలు బ్యాంకుల మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
చింతలూరు కొండలను కొల్లాగొడుతున్నారు..
మైనింగ్ పర్మిట్లు లేకుండానే...! వాస్తవానికి ఏదైనా క్వారీ మైనింగ్ జరపాలంటే పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత మేర మైనింగ్ చేస్తున్నది? ఎంత మొత్తం గ్రానైట్ను తరలిస్తున్నారనే విషయాన్ని పేర్కొంటూ రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధికార తెలుగుదేశం పార్టీ నేత పేరుతో ఎటువంటి మైనింగ్ పర్మిట్లు లేకుండానే సుమారు రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను తరలించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్లాస్టింగులు చేపడుతూ గ్రామ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్వారీ ఉన్న ప్రాంతానికి డీఆర్డీవో కూడా కూతవేటు దూరంలోనే ఉంది. రక్షణరంగ సంస్థకు సమీపంలో చేపడుతున్న ఈ బ్లాస్టింగులతో ఇబ్బందులు తప్పవనే ఆందోళన కూడా నెలకొంది. అర్ధరాత్రి సమయాల్లో వాహనాల సామర్థ్యానికి మించి మరీ అధిక లోడుతో భారీ గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. అయినప్పటికీ అటు పోలీసు, ఇటు రెవెన్యూ, మైనింగ్, రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. భారీ లోడ్లతో ఈ విధంగా మొత్తం రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను అక్రమంగా తరలించినట్టు మైనింగ్ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మైనింగ్ విజిలెన్స్ అధికారుల తనిఖీలో ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్టు తేలినప్పటికీ స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం ఇక్కడంతా ఏమీ జరగలేదని నివేదికలు పంపిస్తుండడం గమనార్హం. నర్సీపట్నంలోని మైనింగ్ అధికారి వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అర్ధరాత్రి సమయంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చింతలూరు నుంచి అక్రమంగా రాత్రి సమయాల్లో గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చి మరీ వ్యవహారం నడుపుతున్న సదరు టీడీపీ నేత ఆడిందే ఆట...పాడిందే పాటగా వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో ఐటీ కంపెనీ పెట్టి... ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసి అరెస్టయిన చరిత్ర కలిగిన సదరు నేత చంద్రబాబు, లోకేష్లతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు డీపీగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నట్టు విమర్శలున్నాయి. ఇప్పటివరకు అక్రమంగా భారీ గ్రానైట్ బ్లాక్లను అడ్డంగా తరలిస్తూ రూ.10 కోట్ల మేర ఆర్జించినట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ జరుపుతున్నారని, పర్మిట్లు లేకుండానే గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారంటూ దీనిపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తమ తనిఖీల ద్వారా తేల్చారు. అయితే స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం అంతా సవ్యంగానే ఉందంటూ అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నివేదికలు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమిలోని బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేస్తుండడం గమనార్హం. కూటమి ప్రభుత్వం రాకతో జిల్లాలో అక్రమాల ఘనులు చెలరేగిపోతున్నారు. అధికారపార్టీ నేతలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా అధికారులు తాళం వేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. గతంలో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను రూ.100 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత అజయ్ కొల్లా తాజాగా అనకాపల్లి జిల్లాలో మైనింగ్ డాన్గా అవతారమెత్తాడు. గ్రానైట్ బ్లాక్ల అక్రమ రవాణాతో రూ.కోట్లు కొల్లగొడుతున్నాడు. స్థానిక మైనింగ్ అధికారులు కొమ్ము కాస్తున్నారు. రూ. 100 కోట్ల మేర నిరుద్యోగులకు టోపీ అనకాపల్లి జిల్లాలో మైనింగ్ డాన్గా వ్యవహరిస్తూ అక్రమ మైనింగ్ చేపడుతున్న సదరు టీడీపీ నేత గుంటూరు నుంచి వచ్చి మరీ ఇక్కడ దౌర్జన్యం చెలాయిస్తున్నారు. ఇతరులకు చెందిన క్వారీని ఆక్రమించి మరీ అక్రమ మైనింగ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. విజ్డమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల నుంచి రూ. 100 కోట్ల మేర వసూలు చేసిన వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్టు చేయగా, ఇందులో సీఈవోగా ఉన్న అజయ్ కొల్లా కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేరకు ఈ ముఠా వసూలు చేసింది. ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ నిరుద్యోగుల జాబితాను ఇతర కంపెనీలకు విక్రయిస్తుందని కూడా విచారణలో తేలింది. అంతేకాకుండా విజ్డమ్ జాబ్స్ పేరుతో స్థాపించిన కంపెనీలోని ఉద్యోగులతోనే నిరుద్యోగులకు ఫోన్ చేయించి మీకు ఫలానా కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటూ కూడా మోసం చేసి ఆయా అభ్యర్థుల నుంచి ఇంత మొత్తం చెల్లించాలంటూ వసూళ్లకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఎంత మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసి డబ్బులు వసూలు చేస్తే, అటువంటి ఉద్యోగులకు పర్సంటేజీల రూపంలో చెల్లించే ఏర్పాటు కూడా అజయ్ కొల్లా చేయడం గమనార్హం. -
విగ్రహ ధ్వంసం కారకులపై చర్యలేవీ...
అనకాపల్లి టౌన్ : మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను, అందుకు ప్రోత్సహించిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లిలో తగరంపూడి గ్రామంలో ఇటీవల ధ్వంసం చేసిన గురునాథరావు విగ్రహం వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలతో కలిసి ముత్యాలనాయుడు నిరసన తెలియజేశారు. నిరసనలో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ఆగడాలు నశించాలి..గురునాథరావు విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని నినదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు మీడియాతో మట్లాడుతూ ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, ఇప్పుడు మాజీ మంత్రి గురునాథరావు విగ్రహం ధ్వంసం వంటి చర్యలకు కూటమి నేతలు పాల్పడడం బాధాకరం అన్నారు. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయకపోవడం అన్యాయమన్నారు. కులాలకు, పార్టీలతీతంగా నాలుగు దశాబ్దాల రాజకీయ నేపఽథ్యం ఉన్న నాయకుడు..అందరికీ అభిమానపాత్రుడైన దివంగత గురునాథరావు విగ్రహం ధ్వంసం వెనుక ఉన్న వారిని ఇక్కడి స్థానిక కూటమి నాయకులు కాపాడడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు రామచంద్రరావు ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. హడావుడిగా కొందరు వ్యక్తులకు నోటీసులు ఇచ్చి ఊరుకోవడం అన్యాయమన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారిని, వారిని ప్రోత్సహించిన వారిని అరెస్ట్ చేయకపోతే భవిష్యత్ ఉద్యమ కార్యచరణను ప్రటిస్తామంటూ హెచ్చరించారు. అనకాపల్లి అసెంబ్లీ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసేవరకు తమ పోరాటం ఆగదన్నారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం చేసిన నిందితులను స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్లు ప్రోత్సహించడం తగదన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కూటమి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్రాఉ. గ్రామస్తుల సాక్షిగా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జనసేన నాయకుడు భరత్బాబును ఇంత వరకు విచారణ చేయలేదంటే కూటమి నేతల కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారని అర్ధమవుతోందన్నారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, చింతలపూడి వెంకట్రామయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, పైలా శ్రీనివాసరావు, దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగ లక్ష్మి గున్నయ్య నాయడు, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీ రామరాజు, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పార్టీ నాయకులు బొడ్డేడ శివ, కె.ఎం.నాయడు, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమావతి, ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ పాల్గొన్నారు. -
స్నాతకోత్సవం.. ప్రతిభకు పట్టం
వైభవంగా ఏయూ 91, 92వ కాన్వొకేషన్లు విద్య అనేది కొత్త ప్రయాణానికి ఆరంభం: గవర్నర్ అబ్దుల్ నజీర్మద్దిలపాలెం: కళ్లలో భవిష్యత్తుపై కోటి ఆశలు.. చేతుల్లో ఎంతో శ్రమించి సాధించిన విద్యా పట్టాలు.. వెరసి ఆ విద్యార్థుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. నిరంతర శ్రమకు దక్కిన పతకాలు, పీహెచ్డీ డిగ్రీలను సగర్వంగా చేతబూని.. తమ విజయానికి బాటలు వేసిన కుటుంబ సభ్యులతో కలిసి కెమెరాలకు చిరునవ్వులు చిందిస్తూ వారు మురిసిపోయారు. శతాబ్ది ఉత్సవాలతో వందేళ్ల వైభవాన్ని చాటుకుంటున్న ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బుధవారం ఎటు చూసినా ఈ పండగ వాతావరణమే కనిపించింది. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా.. విద్యార్థుల ఉత్సాహం, కోలాహలం నడుమ 91, 92వ సంయుక్త స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఏయూ చాన్సలర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వందేళ్ల వైభవానికి, నిరుపమాన ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రత్యేక నిదర్శనమని ఆయన కొనియాడారు. శతాబ్దకాలంగా ఏయూ విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికే గర్వకారణమన్నారు. సర్ సి.ఆర్.రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి.రామన్, సి.ఆర్.రావు వంటి మహనీయుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. డిగ్రీ సాధన అనేది విద్యా జీవితానికి ముగింపు కాదని, అదొక కొత్త ప్రయాణానికి ఆరంభమని విద్యార్థులకు సూచించారు. క్యాంపస్లో రాజకీయాలకు దూరంగా ఉండి, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సగ్గుర్తి, పతంజలి శాస్త్రిలకు డాక్టరేట్లు ప్రదానం వేడుకల్లో భాగంగా ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తికి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావజ్జల పతంజలి శాస్త్రికి గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. జియో, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ప్రొఫెసర్ పి.జగదీశ్వరరావు, ప్రొఫెసర్ సి.ఎన్.వి.సత్యనారాయణ రెడ్డిలకు బెస్ట్ రీసెర్చ్ అవార్డులు అందజేశారు. వివిధ విభాగాల నుంచి మొత్తం 17 మంది రీసెర్చ్ మెడల్స్ అందుకోగా.. 13 మంది రీసెర్చ్ ప్రైజ్లు, ఏడుగురు ఎం.ఫిల్ డిగ్రీలు, 441 మంది పీహెచ్డీ పట్టాలు తీసుకున్నారు. అలాగే 174 మందికి యూజీ పీజీ మెడల్స్, 437 మందికి యూజీ పీజీ ప్రైజులు ప్రదానం చేశారు. విశాఖతో.. ఏయూతో ఆత్మీయ అనుబంధం గౌరవ డాక్టరేట్ స్వీకరించిన అనంతరం బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణ చంద్రరావు సగ్గుర్తి ప్రసంగించారు. తన స్వస్థలమైన విశాఖపట్నంలో ఈ గౌరవం అందుకోవడం గర్వంగా ఉందన్నారు. తన కుటుంబంలో ఎనిమిది మంది ఏయూ నుంచే పట్టభద్రులయ్యారని గుర్తుచేసుకున్నారు. తన మావయ్య ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు 1984–87 మధ్య విశ్వవిద్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వేగంగా ఎదుగుతోందని, రాబోయే రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో భారత్ 7.5 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామి సంస్థగా నిలుస్తోందని, ఆస్తుల పరంగా అమెరికాలో రెండో స్థానంలో ఉండటంతో పాటు మార్కెట్ విలువ పరంగా కూడా ప్రముఖ స్థానాన్ని సంపాదించిందన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనలో ముందంజ ఆంధ్ర విశ్వవిద్యాలయం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధనలో గర్వించదగ్గ స్థాయికి చేరుకోవాలని ఏయూ ఉపకులపతి జి.పి.రాజశేఖర్ ఆకాంక్షించారు. రెండో శతాబ్దంలోకి అడుగుపెడుతున్న ఏయూ.. విజ్ఞానం, ఆవిష్కరణలతో పాటు సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వం, చాన్సలర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, ఏయూ పూర్వ వీసీలు, ఇతర యూనివర్సిటీల వీసీలు, ఏయూ రెక్టార్, రిజిస్ట్రార్, ఆచార్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి
దేవరాపల్లి: ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్కుమార్, శాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు సూచించారు. మండలంలోని మారేపల్లిలో ఆత్మ పథకం సౌజన్యంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై స్థానిక వ్యవసాయ అధికారి ఎల్.వై.కాంతమ్మ ఆధ్వర్యంలో రైతులకు రెండో రోజు బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిందె దశలో ఉన్న నువ్వు పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు 13.0.45 మల్టీ–కె, 19.19.19 పిచికారి చేయాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడాలని తెలిపారు. రైతులకు జీవామృతం తయారీ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తర్ణ అధికారి ఎస్. కిరణ్కుమార్ తదితర వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
మర్యాదపూర్వక కలయిక
దేవరాపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, అనకాపల్లి సమన్వయ కర్త మలసాల భరత్కుమార్ బుధవారం వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించినందుకు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు ముత్యాలనాయుడు చెప్పారు. -
యలమంచిలిలో భారీ చోరీ
యలమంచిలి రూరల్ : పట్టణ ఠాణా పరిధి కట్టుపాలెం చెరకు కాటా సమీపంలో కొత్తపాలెం వెళ్లే రహదారి పక్కనున్న ఓ ఇంట్లో బుధవారం భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 9 తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి వస్తువులు కాజేశారు.ఇక్కడ నివాసముంటున్న రైతు బొడ్డేటి సతీష్ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం బీరువాలో భధ్రపరిచిన సుమారు 9 తులాల బరువున్న 4 బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. బాధితుడు, ఘటనా స్థలంలో స్థానికుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం రైతు సురేష్ పొలం పని చేసుకోవడానికి వెళ్లారు.అతని భార్య యలమంచిలి పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలలో పిల్లల చదువుకు సంబంధించి వాకబు చేయడానికి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి పక్కనే ఒక ప్రదేశంలో దాచి వెళ్లారు.ఇంట్లో ఎవరూ లేరని ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు తీసుకుని ఇంట్లోకి వెళ్లి బీరువాలో దాచిన బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన భార్య బీరువా తెరిచి ఉండడం చూసి పరిశీలించగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు తెలిసింది. దీంతో బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామెవరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల మధ్యలో చోరీ జరగడాన్ని బట్టి తెలిసిన వారి పనే అయి ఉంటుందని బాధిత కుటుంబీకులు అనుమానిస్తున్నారు. సీఐ ధనుంజయరావు, పట్టణ ఎస్ఐ కె.సావిత్రి, ఏఎస్ఐ చెల్లారావు, అనకాపల్లి నుంచి క్లూస్ టీం బృందం చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. బాధిత కుటుంబీకుల నుంచి చోరీకి సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. చోరీ సమాచారాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించలేదు. ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం సభ్యులు -
స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
నర్సీపట్నం:రపభుత్వం తక్షణమే స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎంఈవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శంకరరావు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా మధ్యాహ్న భోజన కార్మికులు.. పిల్లలకు వండి పెడుతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు స్మార్ట్ కిచెన్ పేరుతో ఒకే చోట నుంచి స్కూళ్లకు క్యారేజీలు పంపాలని నిర్ణయించాయన్నారు. ఈ స్మార్ట్ కిచెన్ల వల్ల వేలాదిమంది వంట కార్మికులు ఉపాధి కోల్పోతాయరని చెప్పారు. కార్మికులందరూ ఐక్యంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పి కొట్టాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సెంట్రల్ కిచెన్ పేరుతో అక్షయపాత్ర, ఇస్కాన్, నవ ప్రయాస వంటి సంస్థలకు కట్టబెడితే నాడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించినట్టు గుర్తు చేశారు. కేసులు పెట్టి జైలుకు పంపినా ఐక్యంగా పోరాడాం దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ప్రతి మండలంలో రెండు స్మార్ట్ కిచెన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు చాలకపోయినా పిల్లలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన భోజనాన్ని కార్మికులు అందిస్తున్నారన్నారు. సమయానికి బిల్లులు రాకపోయినా అప్పులు చేసి భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భోజన పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కంకణం కట్టుకున్నాయన్నారు. ఒక్కో స్మార్ట్ కిచెన్కు ప్రభుత్వమే స్థలం ఇచ్చి, రూ.55 లక్షలతో నిర్మిస్తుందన్నారు. మనకు మాత్రం వంట షెడ్లు, పాత్రలకు నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్డే మీల్ కార్మిక సంఘం నాయకులు ఒ.నూకరాజు, సత్యవతి, ప్రసన్న, ఇ.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహ ధ్వంసం కేసు నీరుగార్చేలా పోలీసుల తీరు
అనకాపల్లి: మండలంలోని తగరంపూడిలో ఈనెల 20వ తేదీ రాత్రి మాజీ మంత్రి, దివంగత గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన జనసేన నాయకులు ధ్వంసం చేశారని, వారిని అరెస్టు చేయకుండా కేసును నీరుగాచ్చే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ కార్యాలయంలో ఆపార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మందపాటి జానకీరామరాజు, పెద్దిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురునాథరావు పార్టీలకు అతీతంగా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించారని, ఆయన మరణానంతరం తగరంపూడి గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా 2019లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రోత్సహించిన గ్రామ జనసేన ప్రధాన నాయకుడు భరత్బాబును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26 జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు, గురునాథరావు అభిమానులు విగ్రహాన్ని సందర్శించనున్నట్టు చెప్పారు. తగరంపూడి సర్పంచ్ యాదగిరి అప్పారావు ఈనెల 21న విగ్రహం వద్ద విలేకరులతో సమావేశం నిర్వహించి 15 రోజుల క్రితం గ్రామ జనసేన నాయకులు విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేసినట్టు చెప్పారని తెలిపారని, అదే సర్పంచ్ ఈనెల 24న విగ్రహాన్ని జనసేన నాయకులు తొలగించమని చెప్పలేదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్పంచ్ మాటమార్చే విధంగా కూటమి నేతలు ఒత్తిడి చేశారని ఆరోపించారు. 2004లో ఏఎంఎఎల్ కళాశాలలో దేశనాయకుల విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై పార్టీలకు అతీతంగా అప్పటి వర్తకసంఘం నాయకులు కేసులు నమోదు చేయించారని చెప్పారు. గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై కూడా పార్టీలకు ఆతీతంగా కేసు నమోదు చేయించి, అరెస్టు చేయాలని కోరారు. ఈ కేసు విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యహరించాలన్నారు. దోషులను అరెస్టు చేసేవరకూ పోరాటాలు చేస్తామన్నారు. గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తులను అరెస్టు చేయకపోతే వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కచ్చితంగా అరెస్టు చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్ మాట్లాడుతూ విగ్రహాలను ధ్వంసం చేసిన కూటమి నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అసలైన నిందితులను అరెస్టు చేయకుండా, తూతూ మంత్రంగా చిన్ననాయకులను అరెస్టు చేసే విధంగా పోలీసులు చర్యలు చేపట్టడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పార్టీ సీనియర్ నాయకుడు మళ్ల బుల్లిబాబు, 81వ వార్డు ఇన్చార్జి బొడ్డేడశివ, పట్టణ, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగులు హైమావతి, పద్మకుమారి, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మి గున్నయ్యనాయుడు, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, పార్టీ నాయకులు బుద్దిరెడ్డి దేముడుబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
శారదా నదిలో వృద్ధుడు గల్లంతు
ప్రమాద స్థలంలో గాలింపు చర్యలు చేపడుతున్న సీఐ అల్లు స్వామినాయుడు కశింకోట: మండలంలోని తేగాడ గ్రామం వద్ద శారదా నదిలో బుధవారం ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. తేగాడకు చెందిన గొంతిన లోవరాజు (60) కూలి పని కోసం గ్రామ సమీపంలోని నదిని నడిచి దాటడానికి అవతలకు వెళ్తుతుండగా మునిగిపోయి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందడంతో సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వృద్ధుడ ఆచూకీ దొరకలేదు. లోవరాజుకు భార్య సూర్యకాంతం, వివాహమైన కుమారుడు,కుమార్తె ఉన్నారు. -
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
అనకాపల్లి: క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శారీరక దారుఢ్యం చేకూరుతుందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ అన్నారు. మండలంలో ఏఎంఎఎల్ కళాశాల క్రీడామైదానంలో సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందన్నారు. అనంతరం 100, 400, 800, 1500 మీటర్ల రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్, త్రోబాల్, డిస్క్త్రో తదితర పోటీలను నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 30,31 గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. -
మూతపడిన మెప్మా కార్యాలయం
తాళాలు వేసి ఉన్న మెప్మా కార్యాలయం నర్సీపట్నం : మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లిలో ఉన్న మెప్మా కార్యాలయం బుధవారం మూతపడింది. సెలవు దినం అనుకుంటే పొరపాటే. మెప్మా సిబ్బంది కార్యాలయానికి సెలవు ప్రకటించేశారు. బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన మెప్మా సిబ్బంది రోజంతా డుమ్మా కొట్టారు. ఒక్కరు కూడా కార్యాలయంలో లేకుండా తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఈ కార్యాలయం ఇరుకు సందులో మారుమూలన ఉండడం వల్ల మెప్మా సిబ్బందికి కలిసొచ్చింది. దీంతో కార్యాలయం ఎప్పుడు తెరిచి ఉంటుందో తెలియని పరిస్థితి. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన మహిళలు తాళాలు వేసి ఉండడంతో వెనుదిరిగారని చుట్టుపక్కలవారు తెలిపారు. సీవో లేకపోతే కనీసం సిబ్బంది అయినా కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. కానీ కార్యాలయానికి తాళాలు వేసేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మెప్మా సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మెప్మా సిబ్బంది దర్జాగా తాళాలు వేసుకుని వెళ్లిపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మెప్మా కోఆర్డినేటర్ రమాదేవిని వివరణ కోరగా యలమంచిలిలో జరిగిన పీడీ రివ్యూ మీటింగ్కు వెళ్లామని, ఈ విషయాన్ని కమిషనర్ దృష్టిలో పెట్టామని ఆమె తెలిపారు. -
సమష్టి కృషితోనే గంజాయి, డ్రగ్స్ నియంత్రణ
తుమ్మపాల : డ్రగ్స్, గంజాయి సమస్యను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాదకద్రవ్యాలు, గంజాయి నియంత్రణ, నార్కో కో– ఆర్డినేషన్ సెంటర్ అవగాహన కార్యక్రమాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి ఆమె జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గల ఎన్టీఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో డీ–అడిక్షన్ సెంటర్ పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అక్రమంగా టొబాకో ఉత్పత్తులు సరఫరా చేస్తున్న వారిపై టాక్స్, ఫుడ్ సేఫ్టీ, పోలీస్, ఈగల్ ఇతర శాఖలు కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్కి సంబంధించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కమిటీలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు. విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేసి, విద్యార్థులకు అవగాహన కల్పించాలని, పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, గంజాయి వినియోగం, విక్రయాలపై వెంటనే సమాచారం అందించాలని అన్నారు. రైల్వేస్టేషన్, రైళ్లలో, బస్టాండ్లలో నిరంతరం గస్తీ నిర్వహించాలని పోలీస్, ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో క్రమం తప్పక నషా ముక్త్ భారత్ కార్యక్రమాలను చేపట్టాలని, ప్రతి హాస్టల్లో డ్రగ్స్ గంజాయిపై అవగహన కల్పించాలని, పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆన్లైన్ ద్వారా అక్రమంగా ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ ఆర్డర్ చేసి విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జిల్లాలో పోలీస్, ఎకై ్సజ్ శాఖలు సమన్వయంతో తనిఖీలు చేపట్టి రోజువారీగా కేసులు నమోదు చేస్తున్నాయని తెలిపారు. నర్సీపట్నం మండలం డౌనూరు, వి.మాడుగుల మండలం తాడిపర్తి, చిడికాడ మండలం కోనాం, డౌనూరు, కేడీపేట మండలం భీమవరం, దేవరపల్లి మండలం శ్రీరాంపురం ప్రాంతాల్లో శాశ్వత చెక్పోస్టులు ఏర్పాటు చేసి, జిల్లా వ్యాప్తంగా 38 వాహన తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 158 కేసులు నమోదై, 492 మందిని అరెస్ట్ చేసి, 9,726 కిలోల గంజాయి, 145 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్, డీఆర్వో వై.సత్యనారాయణరావు, జిల్లా రవాణా, ప్రజా రవాణా, వ్యవసాయ, విద్యా, అటవీ, వెనుకబడిన, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓ షేక్ అయిషా, డీఎస్పీ ఎం.శ్రావణి, రైల్వే, జీఆర్పి, ఈగల్ శాఖల పోలీసులు పాల్గొన్నారు. -
అన్నదాతల్లో సోలార్ పవర్రీ
రైతులకు ఆ భూమే ఆధారం... కాయకష్టంతో పంటలు పండించి కుటుంబాలను పోషించుకుంటున్నారు... ఇప్పుడా భూముల్లో పీఎం సుకుమ్ పథకంలో భాగంగా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. చీడికాడ మండలంలోని నాలుగు గ్రామాల్లో సర్వే, భూ సేకరణ చేస్తున్నారు. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్లాంట్ ఏర్పాటుకు తమ భూములిచ్చే ప్రసక్తే లేదని కరాఖండీగా చెబుతున్నా... వివిధ కారణాలు చెబుతూ అధికారులు సర్వే చేస్తుండడంతో రైతుల్లో గుబులు రేపుతోంది. సాక్షి, అనకాపల్లి: జిల్లాలో చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాల్లో 262 ఎకరాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కోసం రెవెన్యూ అధికారులు భూసేకరణ చేపట్టారు. గత నెల రోజుల్లో చీడికాడ మండలంలో బైలపూడి, ఎ.అగ్రహారం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలను రైతులు అడ్డుకున్నారు. అంతేకాకుండా తమ భూములు ఇచ్చేది లేదంటూ గ్రామసభల్లో, పీజీఆర్ఎస్లో రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పూర్వం నుంచి సాగులో ఉన్న పంట భూములకు ప్రభుత్వం డీ– పట్టాలు అందించింది. వాటిలో వరి, వేరుశనగ, అపరాలు, కందులు, ఆయిల్పామ్ సాగుచేస్తున్నారు. పంటలు పండే భూములను ప్రాజెక్టు కోసమంటూ తీసుకుంటే..మాకు జీవనాధారం ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై అన్నదాతల ఆగ్రహం ఇటీవల భూముల సర్వే నిర్వహించేందుకు వచ్చిన అధికారులను చీడికాడ మండలంలో బైలపూడి, ఎ.అగ్రహారం గ్రామాల్లో రైతులు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్లో వినతి పత్రాలు అందించినా మా ప్రమేయం లేకుండా సర్వే నిర్వహించేందుకు ఎందుకు వచ్చారంటూ నిలదీశారు. అయితే ఎటువంటి సమాధానం చెప్పకుండా మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. జిల్లాలో విద్యుత్ అదనపులోడ్ను అధిగమించేందుకు ‘ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్(పీఎం–కుసుమ్)’ ప్రాజెక్టులో భాగంగా మెగా ఇంజినీరింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నారు. అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే విద్యుత్ వినియోగం అధికంగా ఉండడంతో ఈ సమస్యను అధిగమించడానికి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. మెగా ఇంజినీరింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుకు జిల్లాలో చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాల్లో 262 ఎకరాల్లో డీ పట్టా భూములు గుర్తించారు. వీటిలో చీడికాడ మండలంలోని 162 ఎకరాల్లో సర్వే చేస్తూ, గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఐదు గ్రామాల్లో : చీడికాడ మండలంలో జి.కొత్తపల్లిలో సర్వే నం 166, 167లో 40 ఎకరాలు, అడవిల అగ్రహారంలో సర్వే నంబర్ 63లో 55 ఎకరాలు,బైర్లపూడిలో సర్వే నంబర్ 122లో 60 ఎకరాలు, చిన్న గోగాడలో సర్వే నంబర్ 2లో 70 ఎకరాలు, బుచ్చెయ్యపేట మండలంలో కోమలపూడి గ్రామంలో 37 ఎకరాల డీ పట్టా భూములను గుర్తించి, పవర్ప్లాంట్కు కేటాయించనున్నారు. అయితే సోలార్ పవర్ ప్లాంట్ కోసం తమ పొట్ట కొట్టవద్దని ఆయా గ్రామాల రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. భూములిచ్చే ప్రసక్తే లేదని గ్రామసభల్లో కరాఖండీగా చెప్పడంతో పాటు సర్వేకు వచ్చిన సిబ్బంది అడ్డుకున్నారు. పీజీఆర్ఎస్లో కూడా అర్జీలు అందజేశారు. ఇంతలా రైతులు వ్యతిరేకిస్తున్నా అధికారులు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక కారణం చెబుతూ భూముల సర్వేకు యత్నిస్తున్నారు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చీడికాడ మండలంలో సర్వే ప్రాజెక్టుకు పంట పొలాలు ఇచ్చేది లేదంటున్న రైతులు గ్రామసభల్లో తహసీల్దార్కు వినతి పత్రాలు అందజేత -
సర్కారు గ్యాస్ కబుర్లు... జనం తిప్పలు
ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న జనం మాడుగులలో ఖాళీ సిలిండర్లతో గ్యాస్ గోదాం వద్ద క్యూ బుక్ చేసినా రోజుల తరబడి వేచి ఉండాల్సిందే.. మారుమూల గ్రామాల ప్రజలకు మరిన్ని తిప్పలు మాడుగుల రూరల్ : వినియోగదారులకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. మాడుగుల హైస్కూలు సమీపంలో గల సీతారామ భారత్ గ్యాస్ గోదాం వద్ద బుధవారం వందలాది మంది వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీ ఎదుట క్యూ కట్టారు. ఒకవైపు గ్యాస్ కొరత లేదని బుక్ చేసుకున్న వారికి గ్యాస్ అందజేస్తామని ప్రభుత్వం చెబుతుండగా, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గ్యాస్ దొరుకుతుందా లేదా అన్న ఆదుర్దాతో మహిళలు, యువకులు గంటల తరబడి క్యూలో నిల్చుని నానా అవస్దలు పడ్డారు. ఈ నెల 20 వ తేదీలోపు గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదార్లకే గ్యాస్ బండలు పంపిణీ చేస్తామని స్థానిక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వారికి తేల్చి చెప్పారు. కానీ భవిష్యత్తులో గ్యాస్ దొరకదనే ఆందోళన ప్రజల్లో నెలకొనడంతో అందరూ ఒక్కసారిగా గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సుమారు 500 మంది వినియోగదారులు బుధవారం ఒక్కరోజే ఉదయం నుంచి ఖాళీ సిలిండర్లతో రోడ్డు మీద క్యూ కట్టారు. ఒకేసారి వినియోగదారులు వందలాది మంది భారత్ గ్యాస్ గోదాం వద్దకు రావడంతో ఎటువంటి గొడవలు జరగకుండా ఎస్ఐ జి.నారాయణరావు, సిబ్బంది వచ్చి వారిని క్యూలో పెట్టారు. 300 గ్యాస్ సిలిండర్లు బుధవారం పంపిణీ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. 20 వ తేదీ తర్వాత గ్యాస్ బుక్ చేసుకున్న వారికి టోకెన్లు అందజేసి, గ్యాస్ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు. మండలంలో మారుమూల గ్రామాల ప్రజలకు మరిన్ని తిప్పలు తప్పడం లేదు. వారంతా ఖాలీ సిలిండర్లను ఆటోలు, బైక్లు మీద తీసుకుని వచ్చి గంటల తరబడి వేచి ఉన్నా గ్యాస్ దొరక్క పోవడంతో ఉసూరుమని ఇంటిముఖం పట్టారు. ఐదు రోజులుగా గ్యాస్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నామని క్యూలోని మహిళలు, వృద్ధులు తమ కష్టాలు ఏకరువు పెట్టారు.రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులతో పాటు, కనీసం గ్యాస్ కూడా అందించలేని స్దితిలో ఉందని పలువురు మహిళలు మండిపడ్డారు. గ్యాస్ కష్టాలు తీర్చాలి... రాష్టంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యావసర ధరలు పెంచారు. దీనికి తోడు ప్రజలకు అతి ముఖ్యమైన గ్యాస్ కూడా సకాలంలో అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత పరిస్థితిలో గ్యాస్ వినియోగదారులు అందరికీ గ్యాస్ సిలిండర్లు అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ గ్యాస్ అందించాలి. –శోలం రమేశ్, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు, శంకరం గ్రామ సర్పంచ్, మాడుగుల మండలం -
ఆ భూములే జీవనాధారం
నాకు ఎకరం డి–పట్టా భూమి ఉంది. ఇది తాతల నుంచి సంక్రమించిన భూమి. యూకలిప్టస్ తోట వేశాను. ఈ భూమే నా కుటుంబానికి జీవనాధారం. ఇప్పుడు ఆ భూమి తీసేసుకుంటే ఎలా బతకాలి. మా నుంచి భూమి తీసుకుంటే మాకు ఆత్మహత్యే గతి. – గుంపాన పెద్ద సత్యారావు, అడవి అగ్రహారం భూములిచ్చేది లేదు.. మేం నలుగురు అన్నదమ్ములం. మాకు మొత్తం 3 ఎకరాల భూమి ఉంది. తాతల నుంచి వచ్చిన భూమి ఇది. అపరాలు పండిస్తాం. ఇప్పుడు సోలార్ ప్రాజెక్టు అంటూ లాక్కొనేందుకు యత్నిస్తే ఎలా బతకాలి. మా కుటుంబంతో పాటు మా సోదరుల కుటుంబం కూడా రోడ్డున పడతాయి. సాగు చేస్తున్న భూములు ఇచ్చేది లేదు. –గొల్లవిల్లి రమేష్ నాయుడు, నిర్వాసిత రైతు. -
ఖాళీ బండల మోత
నర్సీపట్టం : పట్టణంలో ఇంటింటికీ గ్యాస్ రాకపోవడంతో ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. గంటల కొద్ది వేచి ఉంటున్నారు. సిలిండర్ల లోడు వచ్చాక సమాచారం ఇస్తామని చెబుతూ ఏజెన్సీల నిర్వాహకులు వారిని తిప్పి పంపుతున్నారు. సిలిండర్లు డెలివరీ చేసినట్టు మెసెజ్ వచ్చిందని, గ్యాస్ మాత్రం డెలివరీ చేయలేదని వినియోగదారులు అంటున్నారు. గ్యాస్ సమస్యల పరిష్కారానికి ఉదయం 8 నుంచి రాత్రి గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు పని చేయడం లేదని చెబుతున్నారు. గ్యాస్ కొరత ప్రభావం శుభకార్యాలపైనా పడింది. బయట మార్కెట్లో బ్లాక్లో రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు ఉందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. -
వడ్డాదిలో రోడ్డెక్కిన విభేదాలు
వడ్డాదిలో రోడ్డు వేయకుండా నేలపై బైఠాయించిన బత్తుల వర్గీయులు వడ్డాదిలో గొడవ పడుతున్న ఇరువర్గాలను చెదరగొడుతున్న పోలీసులు బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాది టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వడ్డాదిలో సిమెంట్ రోడ్ల ఏర్పాటులో ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు వర్గీయుల మధ్య తార స్థాయికి వర్గ విభేదాలు చేరాయి. రోడ్డు వేయాలని ఎమ్మెల్యే రాజు వర్గీయులు, మాకు సమాచారం లేకుండా రోడ్లు ఎలా వేస్తారు అంటూ తాతయ్యబాబు వర్గీయులు భీష్మించి తోపులాటకు దిగారు. వడ్డాదిలో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.55 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నెల 22న ఎమ్మెల్యే రాజు రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తన సొంత గ్రామంలోనే తనకు చెప్పకుండా సిమ్మెంట్ రోడ్ల శంకుస్ధాపన కార్యక్రమం చేయడంపై తాతయ్యబాబుతో పాటు అతని వర్గీయులు ఆగ్రహం చెందారు. బుధవారం సిమెంట్ రోడ్డు వేయడానికి కూలీలు రాగా తాతయ్యబాబు వర్గీయులు దొండా నరేష్, రమేష్, కన్నబాబు, శంకర్, గురుమూర్తి, సయ్యపురెడ్డి మాధవరావు, ముత్యాల సూరిబాబు అడ్డుకున్నారు. రోడ్డు వేసి తీరుతామని ఎమ్మెల్యే వర్గీయులు దొండా సన్యాసిరావు, దొండా గిరిబాబు, శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, కుబిరెడ్డి వెంకటరావు, వీర్ల సురేష్, అదట్రా రమేష్, ఈఽశ్వరరావు, సింగంపల్లి రమేష్ తదితరులు అడ్డు తగిలారు. దీంతో ఇరువర్గాల మధ్యన తీవ్ర వాగ్వాదం జరిగి కొట్లాటకు దిగబోయారు. దీంతో బుచ్చెయ్యపేట ఎస్ఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో వచ్చి ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో లేనపుడు నాలుగేళ్లు పార్టీ గురించి పట్టించుకోని ఎమ్మెల్యే రాజు ఈ రోజు వడ్డాదిలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నాడని తాతయ్యబాబు వర్గీయులు ఆగ్రహం చెందగా, నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే పనులు అడ్డుకోవడమేంటని ఎమ్మెల్యే రాజు వర్గీయులు ఎదురు తిరిగారు. మోదకొండమ్మ ఆలయ చైర్మన్ దొండా గిరిబాబు స్వయంగా ఇసుక మోసి రోడ్డు వేయండని కోరగా, హౌసింగ్ బోర్డు చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చే వరకు రోడ్డు వేయొద్దని గ్రామ టౌన్ టీడీపీ అధ్యక్షుడు దొండా నరేష్ ఎదురు తిరిగారు. సుమారు 15 మంది పోలీసులతో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు పనులు చేపట్టకుండానే కూలీలు వెళ్లిపోవడంతో ఇరువర్గాల వారు వెనుదిరిగారు. రాత్రికి గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నామినేషన్ల ప్రక్రియ పూర్తి
నామినేషన్లు వేస్తున్న న్యాయవాదులు విశాఖ లీగల్ : న్యాయవాదుల సంఘం వార్షిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు నాలుగేసి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ పూర్తయిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 28వ తేదీన ప్రకటిస్తారు. ఏప్రిల్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి ఎ.ప్రభాకర్రెడ్డి తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికల నియమాలు పాటిస్తూ ప్రచారం కొనసాగించాలని కోరారు. -
లివిటిపుట్టులో కార్డన్ సెర్చ్ ఆపరేషన్
డుంబ్రిగుడ: మండలంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టు గ్రామంలో మంగళవారం స్థానిక పోలీసులు డ్రోన్ కెమెరాతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి గృహాన్ని తనిఖీ చేసి, స్థానిక కుటుంబాలతో మాట్లాడారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితుల వివరాలను పోలీసులు సేకరించారు.గంజాయి వంటి మత్తు పదార్థాల సాగు, రవాణా వంటి నేరాలకు ఎవరూ పాల్పడకూడదని, అటువంటి వారికి సహకరించవద్దని పోలీసులు హెచ్చరించారు. పాత నేరస్తులు మళ్లీ పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.2018లో లివిటిపుట్టు సమీపంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో, ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.లివిటిపుట్టులో ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తున్న పోలీసులు డ్రోన్ నిఘాలో లివిటిపుట్టు గ్రామం గ్రామాన్ని చుట్టముట్టిన పోలీసులు -
విద్యా సామగ్రి పంపిణీ
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని పరమసింగవరం గ్రామ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు పవన్ అండగా నిలుస్తున్నారు. మంగళవారం నర్సీపట్నం శ్రీ గణేష్ అకాడమి ఆర్థిక సహకారంతో పాఠశాలలోని 70 మంది గిరిజన విద్యార్థులకు పలకలు, పెన్సిల్ బాక్సులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.పరమసింగవరం పాఠశాలకు ఉపాధ్యాయుడిగా వచ్చిన పవన్, ఇక్కడి గిరిజన పిల్లల దీన స్థితిని చూసి చలించిపోయారు. వెంటనే స్పందించి యలమంచిలిలోని ఒక వస్త్ర దుకాణ యాజమాన్యంతో మాట్లాడి, సుమారు 100 మంది విద్యార్థులకు రెండేసి జతల దుస్తులను అందజేశారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా, గ్రామానికి అవసరమైన రహదారి సౌకర్యం, పాఠశాల భవన నిర్మాణం, విద్యుత్ సరఫరా వంటి సమస్యల పరిష్కారానికి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పారదర్శకంగా జనగణన
డాబాగార్డెన్స్(విశాఖ): జనగణన (2027) ప్రక్రియను ఫీల్డ్ ట్రైనర్లు బాధ్యతాయుతంగా నిర్వహించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ఆదేశించారు. మద్దిలపాలెంలోని డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ కళాశాలలో మంగళవారం సెన్సస్–2027 ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. దేశంలో తొలిసారిగా జనగణనను డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నందున, డేటా నమోదులో ఎటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని వివరించారు. తొలి దశలో 2026 మే 1 నుంచి మే 30 వరకు ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియ జరుగుతుందన్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కల సేకరణ కొనసాగుతుందని వివరించారు. సుమారు 16 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్వో శేష శైలజ మాట్లాడుతూ.. జనగణన అనేది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, ఇది ఒక చట్టబద్ధమైన విధి అని గుర్తుచేశారు. దేశాభివృద్ధికి, భవిష్యత్తు ప్రణాళికల రచనకు ఈ గణాంకాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నందున, అన్ని వివరాలను పారదర్శకంగా, కచ్చితత్వంతో సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో సెన్సస్ జాయింట్ డైరెక్టర్ దయాసాగర్, కళాశాల ప్రిన్సిపాల్ విజయబాబు, మాస్టర్ ట్రైనర్ జి.నాగార్జునరావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వోద్యోగులను మోసం చేయడం అన్యాయం
అనకాపల్లి: సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ అమలు చేయకపోవడం అన్యాయమని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ విమర్శించారు. మంగళవారం స్థానిక నెహ్రూచౌక్ వద్ద యూటీఎఫ్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ అమలు, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు వంటి వాటిపై ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల అండదండలతో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన పీఆర్సీ చైర్మన్ డాక్టర్.మన్మోహన్ సింగ్ తన బాధ్యతలకు రాజీనామా చేసి ఏడాదిన్నర కావస్తున్నా నూతన చైర్మన్ను నియమించకుండా తాత్సారం చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలను ఆరు నెలల్లోగా చెల్లిస్తామని చెప్పి రూ. 9 వేల కోట్లను మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుందన్నారు. ఇంకా రూ.30 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై స్పష్టత లేదన్నారు. వీటిని ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డీఏలు సకాలంలో చెల్లించకపోతే ఉద్యోగులు ఎలా జీవిస్తారని ప్రతిపక్ష హోదాలో గగ్గోలు పెట్టిన కూటమి పెద్దలు ఇప్పుడు నాలుగు డీఏలను చెల్లించకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ విధానంలో మార్పు రాకపోతే ఇక పోరాటం తప్పదన్నారు. కొత్త పీఆర్సీ అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లోనూ అదే నెల 15 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర రాజధానిలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే 28వ తేదీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చి ముట్టడిస్తామన్నారు. అంతకుముందు ఏపీ ఎన్జీవోఎస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పీలా రవికుమార్, ప్రధాన కార్యదర్శి డి. శేషుకుమార్, ఖజానా శాఖ సంఘ నాయకులు డి. ఆనంద్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు గుత్తుల సూర్యప్రకాష్, వైరాల రమేష్ రావు, ఆడిట్ కమిటీ కన్వీనర్ బైలపూడి దేముడునాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం
సాక్షి, విశాఖపట్నం : ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందితో పాటు ప్రతి ఒక్క ఉద్యోగి సంసిద్ధంగా ఉండాలని విశాఖ పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ కె.రోష్ని అపరంజి సూచించారు. 55వ జాతీయ భద్రతా దినోత్సవం–డాక్ సేఫ్టీ వారోత్సవాల ముగింపు వేడుకలు పోర్టు అథారిటీ పరిపాలన భవనంలోని శ్రీ సాంబమూర్తి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించారు. ఈనెల 4 నుంచి 10 వరకు నిర్వహించిన ఈ వారోత్సవాల్లో భాగంగా భద్రతపై అవగాహన, అత్యవసర పరిస్థితుల ఎదుర్కొనే సంసిద్ధతపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పోర్టు చైర్మన్ డా. అంగముత్తు హాజరుకాగా.. సేఫ్టీ కమిటీ చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘డిజిటల్ డాక్ సేఫ్టీ ట్రైనింగ్ పోస్టర్ని ఆవిష్కరించారు. చీఫ్ విజిలెన్స్ అధికారి టి.అరుణ్ ప్రసాద్, చీఫ్ ఇంజినీర్ శ్రీరామచంద్రమూర్తి, సెక్రటరీ ఎం.శంకర్బాబు, సీఎంఈ రామ్ప్రసాద్తో పాటు వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, టెర్మినల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోర్టు కార్యకలాపాల్లో ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించేందుకు అందరూ తమ సంసిద్ధతను చాటుతూ ప్రతిజ్ఞ చేశారు. -
సామాన్య భక్తులకే పెద్దపీట
మహారాణిపేట: సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ సింహాచలం చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని, ఆ దిశగా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టికెట్ల జారీ ప్రక్రియలోనూ, ఇతర ఏర్పాట్లలోనూ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏప్రిల్ 17వ తేదీ నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని, ఈ లోగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వివరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000, రూ.1,500 టికెట్ల వారికి విడివిడిగా క్యూలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయని, 3 గంటలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తొలి దర్శనం చేసుకుంటారని తెలిపారు. 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తుల రవాణా కోసం 50 ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రత్యేక టికెట్లు కొన్న వారి కోసం మరో 30 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గందరగోళం లేకుండా టికెట్ల జారీ ఉండాలి దర్శన టికెట్ల జారీలో గందరగోళం లేకుండా చూడాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. టికెట్ల అమ్మకం సమయం, ఆన్లైన్ లభ్యత, విక్రయ కేంద్రాల వివరాలను ముందుగానే భక్తులకు తెలియజేయాలన్నారు. నకిలీ టికెట్లు రాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే యంత్రాలను సిద్ధం చేసుకోవాలని, ఎండ లేదా వాన కురిసినా భక్తులకు ఇబ్బంది కలగకుండా షెడ్లు నిర్మించాలని కోరారు. భద్రతపై ప్రత్యేక నిఘా భద్రతా పరంగా విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని, క్రేన్లు, పొక్లెయిన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు(వర్చువల్ విధానంలో), జేసీ విద్యాధరి, ఈవో జె.వెంకటరావు, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, విశాఖ ఆర్డీవో సుధాసాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పాడేరులో భారీ వర్షం
పాడేరు : ఎండ వేడి, ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పట్టణవాసులకు మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి కురిసిన భారీ వర్షంతో సేదతీరారు. పాడేరు పరిసర ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా విభిన్న వాతావరణం చోటుచేసుకుంటోంది. ఉదయం పూట దట్టంగా పొగమంచు కురుస్తోంది. ఉదయం 9గంటల తరువాత ఎండ ప్రభావం కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం పూట ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక్కసారిగా మొదలైన వర్షం సుమారు గంటపాటు దంచికొట్టింది. పాడేరు పరసర ప్రాంతాల్లో ఒకే రోజు మూడు విభిన్న వాతావరణాన్ని స్థానికులు ఆస్వాదిస్తున్నారు. సీలేరులో ఉరుములు, మెరుపులతో.. సీలేరు: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఒడిశా, పోలవరం సరిహద్దుల్లో వాతావరణం ప్రతిరోజూ విభిన్నంగా మారుతోంది. గత వారం రోజులుగా ఏదో ఒక సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సుమారు గంటపాటు కురవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
వాలాబులో జీడి తోటల పరిశీలన
జీడి రైతులతో మాట్లాడుతున్న ఉద్యాన శాఖ అధికారి కిరణ్మయి దేవరాపల్లి: మండలంలోని వాలాబు పంచాయతీలోని పలు గ్రామాల్లో ఉద్యానశాఖ అధికారి కిరణ్మయి, గరిశింగి సచివాలయ హార్టికల్చర్ అసిస్టెంట్ శరత్కుమార్ మంగళవారం పర్యటించారు. ఇక్కడ మంచు, తెగుళ్లు, అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతిని పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని సోమవారం గిరిజన రైతులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపిన విషయం విదితమే. దీనిపై ఉద్యానవన శాఖ అధికారులు స్పందించారు. దెబ్బతిన్న జీడి పంటలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించిన నష్ట నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. సీపీఎం మండల కార్యదర్శి బీటీ దొర, జీడి రైతులు బలిజ నాగేశ్వరరావు, కధల రాము, కూడ దేముడు, సోమల కృష్ణ, దుప్పి సోమయ్య, పంది రాజు పాల్గొన్నారు. -
క్రెడిట్ చోర్ ఘనుడు చంద్రబాబు
నక్కపల్లి: రాష్ట్రానికి మిట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు తెలిపారు. దీన్ని తన ఖాతాలో వేసుకుంటూ డప్పా కొట్టుకుంటున్న చంద్రబాబును మించిన క్రెడిట్ చోర్ ఘనుడు లేరన్నారు. మంగళవారం అడ్డురోడ్డులో విలేకరుల సమావేశంలో జోగులు మాట్లాడుతూ 2022లో దావోస్ పర్యటనలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డిని మిట్టల్ గ్రూపు ఇండియా సీఈవో ఆదిత్య మిట్టల్ కలిసి రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఎంవోయూ కుదుర్చుకున్నారన్నారు. ఈ విషయం అప్పట్లో పలు జాతీయ ప్రసార మాధ్యమాల్లో వచ్చిందన్నారు. దీన్ని కప్పిపుచ్చుతూ స్టీల్ ప్లాంట్ ఘనత తమ ప్రభుత్వానిదేనని కూటమి నాయకులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భూములను సేకరించి నిర్వాసితులను, రైతులను అనాథలుగా వదిలేశారన్నారు. 2013 భూసేకరణ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్వాసితులు ఆందోళన చేస్తే, కేవలం రూ.9 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. మిట్టల్ కంపెనీ వారు స్టీల్ ప్లాంట్ పెడుతుంటే టీడీపీ వాళ్లు నానా హడావిడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ చంద్రబాబు కుటుంబం కంపెనీ పెడుతున్నట్లుగా హంగామా చేశారని ఎద్దేవా చేశారు. మిట్టల్ సోమ్ముతో జల్సాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి జనాలను తరలించేందుకు వందలాది ఆర్టీసీ బస్సులను ఉపయోగించడం దారుణమన్నారు. దాంతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా ఉందన్నారు. భూములు త్యాగం చేసిన నిర్వాసితులను భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానించకుండా ఘోరంగా అవమానించారని ఆరోపించారు. బహిరంగ సభ కేవలం టీడీపీ ప్రచార సభగా మార్చేశారన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు వీవీఐపీ పాసులు ఇచ్చుకుని వారితోనే సభ మమ అనిపించారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను సైతం స్టేజ్పైకి ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించడం దారుణమన్నారు. అనంతరం నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమానర్ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, దత్తుడు సీతబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, ఎంపీపీ పార్వతి తాతారావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరాకాసుల గోవిందు, జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, పాయకరావుపేట మండలాధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాస్, మండల మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సుందర లత, ఎస్. రాయవరం మండల శాఖ అధ్యక్షుడు మధువర్మ, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వంగలపూడి రామారావు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు కాకర వెంకటరావు, యువజన విభాగం అధ్యక్షుడు పోచిన నాగేశ్వరరావు, పాయకరావుపేట ఉప సర్పంచ్ జగతా భవానీ శ్రీనివాస్, నూకినాయుడు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ను తొలగించడంతో ధర్నా
డిపో గేటు వద్ద ధర్నా చేస్తున్న అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు అనకాపల్లి: ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ)లో చిన్నపాటి రోడ్డు ప్రమాదాలకు శాఖ డ్రైవర్లను బాధ్యులుగా చేస్తూ విధులు నుంచి తొలగించడం అన్యాయమని ఏపీ పీటీడీ నేషనల్ మజ్ధూర్ యూనిటీ అసోసియేషన్ డిపో అధ్యక్షుడు ఎ.నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక డిపో గ్యారేజీ గేటు వద్ద మంగళవారం తెల్లవారుజామున డిపోలో డ్రైవర్ కె.శ్రీనుపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఆగ్రహిస్తూ యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ డ్రైవర్ శ్రీనును తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. 1/2019 సర్క్యులర్కు విరుద్ధంగా డిపో అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
● మరో ఇద్దరికి స్వల్ప గాయాలు ● కేజీహెచ్కు తరలింపు కొయ్యూరు: మండలంలోని రామరాజుపాలెం వంతెన సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..శరభన్నపాలెంకు చెందిన ఉల్లి హరికృష్ణ, రవితేజతో కలిసి కృష్ణదేవిపేట నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. రామరాజుపాలెం వంతెన వద్దకు వచ్చేసరికి, నడింపాలెంకు చెందిన పాంగి బెన్నస్వామి నడుచుకుంటూ వెళ్తుండగా హరికృష్ణ బైక్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బెన్నస్వామి కాలు విరిగింది. నియంత్రణ కోల్పోయి బైక్ పైనుంచి కింద పడటంతో హరికృష్ణకు తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. బైక్ వెనుక కూర్చున్న రవితేజకు స్వల్ప గాయాలయ్యాయి.క్షతగాత్రులను తొలుత నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొబ్బరి చెట్టుపై నుంచి జారిపడి యువకుడి మృతి
రోలుగుంట : కొబ్బరిచెట్టు పై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమరవోలు గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నక్కా శ్యామ్(20) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం కొబ్బరికాయలు తీసేందుకు చెట్టెక్కి ప్రమాదవశాత్తూ కిందపడి గాయపడ్డాడు. వెంటనే కుటుంబీకులు విశాఖ కేజీహెచ్కు చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మృతి చెందాడు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు ఎస్ఐ రామకృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి తండ్రి దేముడు, తల్లి రాజేశ్వరి, చెల్లి కుమారి ఉన్నారు. -
తలనీలాల ద్వారా రూ. 15.55 కోట్లు ఆదాయం
తలనీలాల వేలం నిర్వహిస్తున్న దేవస్థానం ఈవో, అధికారులు సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి తలనీలాల వేలం ద్వారా భారీ ఆదాయం సమకూరింది. 2026–27 సంవత్సరానికి గాను రూ.15 కోట్లు 55 లక్షల 50 వేలు వచ్చింది. దేవస్థానంలో ఏడాది కాలపరిమితికి గాను తలనీలాల ద్వారా ఇంతపెద్ద మొత్తంలో రావడం ఇదే ప్రథమం. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు రెండేళ్ల కాలపరిమితికి తలనీలాలను సేకరించే హక్కులను కేటాయించేందుకు మంగళవారం దేవస్థానం ఈవో జె.వెంకటరావు ఆధ్వర్యంలో బహిరంగ వేలం, సీల్డ్ టెండర్ ప్రక్రియ నిర్వహించారు. తమిళనాడుకు చెందిన ’దురై ఎంటర్ప్రైజెస్’ సంస్థ షీల్డ్ టెండర్ ద్వారా ఈ హక్కును దక్కించుకుంది. ఈ ఒప్పందం 2026 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు (రెండేళ్ల పాటు) అమల్లో ఉంటుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తలనీలాల ఆదాయం రూ.10.13 కోట్లుగా ఉండగా, ఈసారి అది దాదాపు 50 శాతం పైగా పెరగడం విశేషం. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ, ఏఈవోలు రమణమూర్తి, రమేష్బాబు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. -
మామిడి రైతుకు గుండె కోత
చోడవరం : ఈదురుగాలులు బీభత్సం, తుఫాన్ భారీ వర్షాలతో మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ ఏడాది మామిడి పంటకు కోలుకోలేని దెబ్బతగిలింది. సరిగ్గా కాయ దిగుబడి సమయంలోనే పంటకు తీవ్రనష్టం కలిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, ఈదురు గాలులకు పక్వానికి వచ్చిన మామిడి కాయ నేలరాలింది. జిల్లాలో సుమారు 1000 ఎకరాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మామిడి కాయలు చాలా మేర నేలరాలిపోయాయి. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేట, యలమంచిలి నియోజవకర్గాల్లో సుమారు లక్షా 50వేల ఎకరాల్లో మామిడి, జీడిమామిడి సాగు జరుగుతోంది. పంట ఇప్పుడే కాయదశకు వచ్చింది. ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు మామిడి పండును ఎగుమతి చేస్తుంటారు. దీనితో ఏటా మామిడి పంటపై ఆధారపడి సుమారు లక్ష కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ పరిస్థితిలో గాలివానలకు చేతికందిన పంట నేలరాలడంతో రైతులు, లీజుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాయలు నేలమీద పడి చిదికిపోవడం వల్ల అమ్మకానికి పనికిరాని పరిస్థితి ఏర్పడింది. అసలే ఈ ఏడాది ఆలస్యంగా పూత రావడం, ప్రస్తుతం కేవలం 40శాతం మాత్రమే కాయ నిలబడింది. అదికూడా ప్రస్తుతం కాయ దశకు చేరుకుంటుంది. పండిన పంటలో 30 శాతం గాలివానల బారిన పడడంతో రైతులు చాలా నష్టపోయారు. ఈ నేలరాలిన కాయలు బహిరంగ మార్కెట్లో తక్కువ ధరలకు తెగనమ్ముకొంటున్నారు. అడ్డూరు, నర్సాపురం, వి.సంతపాలెం, చోడవరం, గొల్లలపాలెం, రోలుగుంట, రాంబిల్లి, యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, నాతవరం, నర్సీపట్నం తదితర ప్రాంతాల నుంచి రైతు బజార్లకు రాలు కాయ భారీగా వచ్చింది. గుట్టలు పోసినంత పంట రాలిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సరిగ్గా ఏప్రిల్, మే, జూన్ నెలలోనే మామిడి దిగుబడి, పండ్ల ఎగుమతి జోరుగా సాగుతుంది. ఇలాంటి సమయంలో గాలివానతో మామిడి రైతు గుండె దిగాలు పడింది. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
5 రోజుల పాటు తేలికపాటి వర్షాలు
మాట్లాడుతున్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ ముకుందరావు అనకాపల్లి టౌన్: జిల్లాలో ఈ నెల 25 నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ సిహెచ్. ముకుందరావు తెలిపారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం సమావేశ మందిరంలో వ్యవసాయాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వర్షాలను వినియోగించుకొని చిరుపొట్ట దశలో ఉన్న వరి పైరులో ఎకరాకు 35 కిలోల యూరియా, 20 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ వేసుకోవాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు నువ్వుల్లో రసం పీల్చు పురుగులు ఆశించే అవకాశం ఉందన్నారు. నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీ గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. చెరకు ముచ్చేలు నాటిన 3 రోజుల లోపు కలుపు నివారణకు అట్రాజిన్ 2 కిలోలు 20 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. చెరకు పైరులో తొలి దశలో ఆశించే పీక పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే క్లొరాంట్రినిలిప్రోల్ 0.3 మిల్లీ గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల మామిడి పిందె రాలుతుందన్నారు. నివారణకు నాప్తాలిన్ అసిటిక్ ఆసిడ్ 2 మిల్లీగ్రాములను 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. సమావేశంలో డాక్టర్ కె.వి.రమణమూర్తి, డాక్టర్ డి. ఆదిలక్ష్మి, డాక్టర్ గౌరీ తదితరులు పాల్గొన్నారు. -
మూడు క్షయ రహిత గ్రామాలకు అవార్డులు
అవార్డులు అందుకుంటున్న డాక్టర్ చరిష్మ, సిబ్బంది మాకవరపాలెం : మండలంలో మూడు క్షయ రహిత గ్రామాలకు అవార్డులు లభించాయి. గత మూడేళ్లుగా ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాకపోవడంతో టీబీ శ్రీ కార్యక్రమంలో భాగంగా బూరుగుపాలెం పీహెచ్సీ పధిలోని జి.గంగవరం, పడాలపాలెం, మాకవరపాలెం పీహెచ్సీ పరిధిలో జడ్.గంగవరం గ్రామాలను క్షయ రహిత గ్రామాలుగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అనకాపల్లిలో నిర్వహించిన టీబీ దినోత్సవంలో డీఎంహెచ్వో హైమావతి, టీబీ నివారణ అధికారి స్వప్న, డిప్యూటీ డీఎంహెచ్వో ఎస్తేరురాణి వైద్యాధికారులు చరిష్మ, సీతారామలక్ష్మితో పాటు ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, ఆశ కార్యకర్తలు, కార్యదర్శులకు గోల్డ్, బ్రోన్జ్ అవార్డులు అందించారు. 28న జెడ్పీ సర్వసభ్య సమావేశం మహారాణిపేట (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 28న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన అన్ని శాఖల అధికారులు తమ పరిధి లోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పూర్తి నివేదికలతో హాజరుకావాలని సీఈవో సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఉన్నతాధికారులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఉమ్మడి విశాఖ జిల్లా
అసెంబ్లీ నియోజక వర్గాలుఆశావహుల్లో కొత్త జోష్ ఉమ్మడి విశాఖలో కొత్తగా 6–7 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం సీట్ల సంఖ్య 21 నుంచి 22కు పెరిగే అవకాశం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాజకీయ ముఖచిత్రం త్వరలోనే పూర్తిగా మారిపోనుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 15 నియోజకవర్గాల సంఖ్య 21 నుంచి 22కు చేరుకోనుంది. అంటే కొత్తగా 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ ఆశావహుల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. ఇప్పటివరకు అవకాశం కోసం ఎదురు చూసిన నాయకులకు ఇది గోల్డెన్ ఛాన్స్గా మారగా, కొత్త తరం నేతలకు రాజకీయ ప్రవేశానికి మార్గం సుగమమవుతోంది. అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అంటూ తమ గళాన్ని వినిపించాలన్న కలలు కనే వారికి ఈ పునర్విభజన ప్రక్రియ కొత్త ఆశలు, అవకాశాలు తెరచి పెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త సమీకరణలు పాయకరావుపేటలో అధిక ఓటర్ల సంఖ్య కారణంగా అది రెండు నియోజకవర్గాలుగా విడిపోయే అవకాశం ఉంది. యలమంచిలి, అనకాపల్లి పరిధిలో కొత్తగా ‘అనకాపల్లి రూరల్’ నియోజకవర్గం కూడా తెరపైకి రావొచ్చు. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మార్పులు తప్పవు. నర్సీపట్నంలోని కొన్ని గ్రామాలు కలిపి... పాడేరు, అరకు నియోజకవర్గాలను పునర్విభజించి.. కొత్తగా ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో ఉన్న పరవాడ, చింతపల్లి నియోజకవర్గాలు మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రాధాన్యం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాతినిధ్యం పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ఒక ఎస్సీ (పాయకరావుపేట), రెండు ఎస్టీ (అరకు, పాడేరు) స్థానాలకు అదనంగా.. మరో ఎస్సీ, మరో ఎస్టీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ద్వితీయశ్రేణి నేతల జోరు సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అధ్యక్షా.. అని పిలిపించుకోవాలని తపించే రాజకీయ నేతలకు కేంద్రం నిర్ణయం ఒక వరంగా మారింది. నియోజకవర్గాల హద్దులు మారనుండటంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. పునర్విభజనతో మారనున్న ఉమ్మడి విశాఖ జిల్లా ముఖచిత్రం పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని సీట్లు 2029 సమరానికి ఇప్పుడే మొదలైన లెక్కలు ఓట్ల సంఖ్యను బట్టి విభజన పునర్విభజన ప్రక్రియ 2011 జనాభా లెక్కల ఆధారంగా సాగనున్నా.. ప్రధానంగా ఓటర్ల సంఖ్యే కీలక ప్రమాణంగా మారనుంది. ఒక నియోజకవర్గంలో సుమారు 1.6 లక్షల ఓటర్ల పరిమితి ఉండేలా రూపకల్పన జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ తూర్పు, ఉత్తర నియోజకవర్గాలు కూడా ఇదే బాటలో నడవొచ్చు. ఈ నియోజకవర్గాల్లో కూడా 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 3 లక్షలకు దాటే అవకాశం ఉంది. అలాగే నగరంలో కొత్తగా ‘విశాఖ సెంట్రల్’ నియోజకవర్గం ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయి. తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల నుంచి కొన్ని వార్డులు కలిపి దీనిని రూపొందించే అవకాశం ఉంది. -
రైతులపై స్పీకర్ వేధింపులు
నర్సీపట్నం: పెద్ద చెరువు ఆక్రమణపై ప్రశ్నించిన రైతులపై స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు వేధింపులకు పాల్పడడం సరికాదని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్పీకర్ నిరంకుశ నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చెరువులో అక్రమ నిర్మాణాలపై ఆయకట్టు రైతులు తన దృష్టికి తెస్తే, వారందరిపై స్పీకర్ వేధింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇరిగేషన్ భూమిని ఆక్రమించారంటూ సుర్ల బెన్నయ్యనాయుడు సాగు చేసుకుంటున్న సరుగుడు తోటను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేసి, హద్దులు వేశారన్నారు. బలిఘట్టం 18వ వార్డు వైఎస్సార్సీపీ వార్డు ఇన్చార్జి సుర్ల నాయుడు ఇళ్లు ఇరిగేషన్ కాలువలో ఉందని రెవెన్యూ అధికారులు మార్కింగ్ ఇచ్చారన్నారు. స్పీకర్ ఆదేశాలతో తహసీల్దార్ రామారావు ఈ విధంగా రైతులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు. కనీసం ఆయకట్టు రైతులను సంప్రదించకుండా స్పీకర్ సొంత జాగీరులా చెరువు గర్భం రూపురేఖలు మార్చేస్తుంటే రైతులు ప్రశ్నించడంలో తప్పు ఏముందన్నారు. రాజ్యాంగ పదవీలో ఉన్న స్పీకర్ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. తహసీల్దార్, ఆర్డీవో, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు చెరువులో ఏమి జరుగుతుందో కనపడడం లేదా అని ప్రశ్నించారు. నిజమైన శివ భక్తుడువైతే స్థలం కొని 108 అడుగుల శివపార్వతుల విగ్రహన్ని ప్రతిష్టిస్తే సంతోషిస్తామన్నారు. ఇదే చెరువు స్థలంలో ఆటోనగర్ పెడతామని అయ్యన్నపాత్రుడు ప్రకటించారన్నారు. ఈ విషయంపై కోర్టు స్టే ఇచ్చిందన్నారు. ఆటోనగర్ ఏమైందో స్పీకర్ సమాధానం చెప్పాలన్నారు. స్పీకర్, ఆయన తనయుడు విజయ్ లేటరైట్, రోలుగుంట క్వారీల పేరుతో రూ.వందల కోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కూటమి నాయకుల పేరుతో లేటరైట్ను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రూ.వందల కోట్లు దోచి పెడుతున్ననందున తనకు రాజ్యసభ సీటు వస్తోందని, అప్పుడు వైఎస్సార్సీపీ నాయకులను గడగడలాడిస్తానని స్పీకర్ తనయుడు ప్రగల్భాలు పలకడం హేయమన్నారు. ఇలాంటి వ్యక్తికి రాజ్యసీటు ఇస్తే ప్రభుత్వ పెద్దలకు లేటరైట్ ముసుగులో రూ.వందల కోట్లు ముడుతున్నాయన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. స్పీకర్కు చిత్తశుద్ధి ఉంటే బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో శివపార్వతుల విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంతోపాటు ఆ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నాతవరం మండలంలో గుడి కడుతుంటే ఇదే స్పీకర్ కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలపై ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ పాల్గొన్నారు. -
బాధితుల గొంతునొక్కి..మిట్టల్ ఉక్కు భూమిపూజ
● పలువురు గృహ నిర్బంధం ● రాజయ్యపేటలో మిట్టల్ స్టీల్ప్లాంట్కు భూమిపూజ ● విధులన్నీ పక్కన పెట్టి సభ ఏర్పాట్లలో అధికారులు ● బస్సులన్నీ బహిరంగ సభకే ● పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులునక్కపల్లి : నక్కపల్లి మండలం రాజయ్యపేట, చందనాడ సమీపంలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి సోమవారం భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అఽధికార యంత్రాంగాన్ని పూర్తిగా వాడుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. ప్రభుత్వ శాఖల సిబ్బంది అంతా తమ విధులను పక్కన పెట్టి భూమి పూజ, బహిరంగ సభకు జన సమీకరణలోనే నిమగ్నమయ్యారు. ఇందుకు ఆర్టీసీ బస్సులను అధిక సంఖ్యలో కేటాయించింది. బస్సులన్నీ భూమిపూజ కార్యక్రమానికి కేటాయించడంతో పదోతరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, ఇతర ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం మండుటెండలో పాయకరావుపేట, నక్కపల్లి, అడ్డురోడ్డు తదితర ప్రాంతాల్లో ప్రయాణికులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రొటోకాల్ ఉల్లంఘన స్టీల్ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందలేదు. భూములు సేకరించిన గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులకు ఆహ్వానపత్రాలు వాట్సాప్ల ద్వారానే పంపించారు. వారిని కనీసం స్టేజి మీదకు పిలిచే ప్రయత్నం కూడా చేయకపోవడంతో విమర్శలు తలెత్తాయి. కూటమిలో పాసుల గోల.. బహిరంగ సభ వద్దకు వెళ్లేందుకు వీవీఐపీ, వీఐపీ పాస్లు వేల సంఖ్యలో జారీ చేశారు. ఈ పాసుల్లో ఎక్కువ టీడీపీ కార్యకర్తలు, నాయకులకే ఇచ్చారని, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ఇవ్వలేదంటూ ఆయా పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ సభకు వెళ్లే అన్ని మార్గాల్లో వందల సంఖ్యలో టీడీపీ నాయకులు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. వాటిలో కూడా బీజేపీ, జనసేన నాయకులకు తగినంత ప్రాధాన్యం ఇవ్వలేదు. టీడీపీ నాయకులే గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రాలు పంపిణీ చేశారు. సభ పూర్తి కాకుండానే వెళ్లిపోతున్న ప్రజలునిర్వాసితులపై ఆంక్షలు స్టీల్ప్లాంట్ నిర్మాణానికి భూములు త్యాగం చేసిన నిర్వాసితులను కూటమి ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది. భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కింది. డీ ఫారం రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వలేదు. నివాస ప్రాంతాలు ఖాళీ చేసిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసింది. బాధితులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు కోరితే కేవలం రూ.8.98 లక్షలు చొప్పున మాత్రమే ఇచ్చింది. ఈ సమస్యలపై భూమిపూజ సందర్భంగా బాధితుల తరపున గళం వినిపించకుండా కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బహిరంగ సభ వేదిక వద్దకు ప్రతిపక్ష పార్టీ నాయకులు, బాధితుల తరపున పోరాటం చేస్తున్న వారినెవరినీ రాకుండా అడ్డుకుంది. నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న సీపీఎం, సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ నాయకులను గృహనిర్బంధం చేసింది. సీపీఎం జిల్లా కార్యదర్సి ఎం.అప్పలరాజు, మండల కన్వీనర్ ఎం.రాజేష్లను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులను కాపలా ఉంచింది. మత్స్యకారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతున్న మత్స్యకారులను రాజయ్యపేటలోనే గృహనిర్బంధం చేశారు. -
ఆదుకోకుంటే ఉరితాళ్లే గతి...
దేవరాపల్లి : మంచు తెగుళ్లు, అకాల వర్షానికి నష్టపోయిన జీడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వాలాబు పంచాయతీలో గిరిజన జీడి రైతులు అర్ధనగ్న ప్రదర్శనలో మెడకు ఉరి తాళ్లు బిగించుకొని వినూత్న నిరసన కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర మద్దతు ప్రకటించారు. ఈ ఏడాది అకాల వర్షాలు, మంచుతో జీడి పంటలు పూర్తిగా నాశనమయ్యాయని, జీడి పంటపై ఆధారపడిన రైతులంతా అప్పులు పాలయ్యారన్నారు. ఎకరా జీడి పంటకు రూ. 30 వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అరకొరగా దిగుబడి వచ్చే జీడి పిక్కలకు కేజీకి రూ. 200 చొప్పున మద్దతు ధర ప్రకటించి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పంటల బీమా ప్రభుత్వమే ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యానవన అధికారులు మొద్దు నిద్ర వీడి గ్రామాల్లో జీడి పంట నష్టాన్ని గుర్తించాలని హితవు పలికారు. నిరసనలో సిహెచ్.లక్ష్మణ, కాకి ఈశ్వరరావు, కె.సుధాకర్, సిహెచ్.చినదేముడు, బి.నాగేశ్వరరావు, ఈ.గోపాలుడు తదితరులు, గిరిజన జీడి రైతులు పాల్గొన్నారు. -
టమాటా రైతు కన్నీరు
గొలుగొండ: మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా టమాటా రైతుల పరిస్థితి తయారైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధర పతనం కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్న తరుణంలో అకాల వర్షాలు ఉన్న పంటను దెబ్బతీశాయి. దాంతో రైతు వద్ద కిలో రెండు రూపాయల ధర లేకపోవడంతో వీటిని సేకరించకుండా పొలంలోనే వదిలేస్తున్నారు. 300 ఎకరాల్లో సాగు గొలుగొండ మండలంలో లింగంపేట, జోగుంపేట, గొలుగొండ, సాలికమల్లవరం, ఏఎల్పురం ప్రాంతాల్లో 300 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఈ నెలలోనూ ధరలు పతనం కావడం ఇదే తొలిసారిగా రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ.40 నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడలు పెడితే కనీసం ఇప్పుడున్న ధరలు ప్రకారం రూ.5 వేలు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలంలో కాయలు మార్కెట్లో 30 కేజీల టమాటా రూ.60కు ధర రావడంతో కనీసం టమాటా ఏరే కూలీల ఖర్చు రావడం లేదని వాపోతున్నారు. దీంతో కష్టపడి సేకరించి మార్కెట్కు తరలించే ప్రయత్నంలో రైతులు విసిగివేసారి కాయలు ఏరకుండానే పొలంలో వదిలేస్తున్నారు. కనీసం వీటి ధరలు పెరుగుతాయని ఆశ కూడా లేదని చెబుతున్నారు. కోసిన కాయలకు ధరలు లేకపోవడంతో కొన్ని చోట్ల పొలం వద్దే పారేస్తున్నారు. మూడు రోజుల నుంచి అకాల వర్షాలు ధరలు లేవని ఆందోళన చెందుతున్న రైతులు అకాల వర్షాలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మూడు రోజులుగా వర్షాలు కురవడంతో కాయలకు మచ్చలు రావడంతోపాటు టమాటా పంట కుళ్లిపోయి చనిపోతోందని వాపోతున్నారు. ఒక వైపు ధరలు లేకపోగా, మరోవైపు వర్షాలు పంట నష్టం వాటిల్లిందని తీవ్ర ఆవేదన చెందున్నారు. ఇంత కష్టంలో కనీసం ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తే ఎంతో కొంతమేలు జరిగేదని చెబుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టమాటా గిట్టుబాటు లేక... మాడుగుల : టమాటా పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం మాడుగుల వారపు సంతకు శంకరం, తాటిపర్తి తదితర గ్రామాలు నుంచి రైతులు పెద్ద ఎత్తున టమాటాలు తీసుకు వచ్చారు. కనీసం కిలో రూ.4 కూడా ధర రాలేదు. దీంతో కొంత మంది రైతులు సంతలో టమాటాలు వదిలి వెళ్లిపోయారు.మూడు నెలలు క్రితం కిలో రూ.50 నుంచి రూ.70 వరకు ధరలు పలికేవి. ప్రస్తుతం ధరలు కుదేలు అవడంతో టమాటా రైతులు కనీసం కూలి అయినా గిట్టుబాటు లేదని ఆవేదన చెందుతున్నారు. -
దేశాభివృద్ధిలో నాణ్యమైన ఉపాధి కీలకం
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు మహేంద్ర దేవ్ మద్దిలపాలెం: దేశాభివృద్ధిలో నాణ్యమైన ఉపాధి కల్పన కీలకమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఐడీఎస్–ఏపీ చైర్మన్ ఆచార్య ఎస్. మహేంద్ర దేవ్ అన్నారు. ఆచార్య రొక్కం రాధాకృష్ణ నాలుగవ స్మారక ఉపన్యాస కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్య అతిథిగా హాజరైన మహేంద్ర దేవ్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి విలువ ఆధారిత చర్యలు తోడవాలని, ఎగుమతులు పెరిగితేనే జీడీపీ వృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మానవ మూలధనం, సాంకేతికత, యువత నైపుణ్యాలు, మహిళల భాగస్వామ్యం దేశ ప్రగతికి దోహదపడతాయని ఆయన వివరించారు. మరో వక్త, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విశ్రాంత ఆచార్యులు దువ్వూరు నరసింహారెడ్డి ‘భారత వ్యవసాయ స్థితి– సవాళ్లు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. భూగర్భ జలాల మితిమీరిన వినియోగం, సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, పర్యావరణహిత వ్యవసాయం ద్వారానే రైతులకు సరైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలోని ఒడిదుడుకులను అధిగమించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఐడీఎస్–ఏపీ సంచాలకులు ఆచార్య ఎస్. గాలబ్ సంస్థ పరిశోధనల గురించి వివరించగా, యూపీఎస్సీ పూర్వ చైర్మన్ ఆచార్య ఎస్.ఆర్. హషీం అధ్యక్షోపన్యాసం చేశారు. చివరగా అతిథులను ఘనంగా సత్కరించారు. -
స్మార్ట్ కిచెన్కు వ్యతిరేకంగా ధర్నా
మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న మిడ్డేమీల్ కార్మికులు, సీఐటీయూ నాయకులు నర్సీపట్నం: స్మార్ట్ కిచెన్స్ నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ స్టేడియంలోని గాంధీ విగ్రహం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మంది మహిళలు భోజన పథకంలో పని చేస్తున్నారన్నారు. పారితోషికాలు ఇవ్వకపోయినా పని చేశారన్నారు. ముందస్తు పెట్టుబడి పెట్టి పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారన్నారు. డొక్కా సీతమ్మ వంటి వారి పేరు పెట్టి నేడు పథకాన్ని ప్రైవేటుపరం చేయటం ఎంతవరకు సమంజసమన్నారు. పేద పిల్లలకు పెట్టే ఆహారంపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందన్నారు. కార్మికులు అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఐక్యంగా ఎదుర్కొవాలని కోరారు. కార్యక్రమంలో మిడ్డే మీల్ నాయకులు కె.ప్రసన్న, సత్యవతి, చిన్నతల్లి, నూకరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, ఇ.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
చందనోత్సవానికి పక్కాగా వైద్య ఏర్పాట్లు
మహారాణిపేట: వచ్చే నెల 20న జరగనున్న సింహాచలం చందనోత్సవానికి పటిష్టమైన వైద్య ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. సోమవారం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవం కోసం మూడు షిఫ్టుల్లో 304 మంది సిబ్బందిని డిప్యుటేషన్పై నియమిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం 90 అంబులెన్సులు, కొండపై 6 పడకల తాత్కాలిక ఆసుపత్రులు, 24 గంటల కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసర సేవల కోసం అపోలో, కేజీహెచ్, విక్టోరియా ఆస్పత్రులను రెఫరల్ ఆస్పత్రులుగా గుర్తించామన్నారు. ఈ ఏర్పాట్లకు ప్రైవేటు ఆస్పత్రులు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో నోడల్ అధికారి డాక్టర్ ఉమావతి, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
కొంతకాలం ఓపిక పట్టండి..
కేంద్ర మంత్రులకు వినతిపత్రం అందజేస్తున్న కార్మిక నాయకులు ఉక్కునగరం: కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వచ్చారు.. స్టీల్ప్లాంట్ను చూశారు.. సమస్యలు విన్నారు.. అన్నింటికీ ఓపిక పట్టాలని చెప్పి వెళ్లిపోయారు. ఇదీ సోమవారం కేంద్ర మంత్రుల పర్యటన స్థూల సారాంశం. నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రులు శనివారం రాత్రి స్టీల్ప్లాంట్లో బస చేశారు. ఉన్నత యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. వారి పర్యటనతో తమ పెండింగ్ జీతాలు, ప్రతీ నెలా పూర్తి జీతం, ఆర్థిక ప్రయోజనాల పునరుద్ధరణ జరుగుతుందని ఉద్యోగులు ఆశపడ్డారు. అయితే వారు ఎటువంటి హామీ ఇవ్వకుండా కొంత కాలం ఓపిక పట్టండి అంటూ చెప్పి ఉద్యోగులను నిరాశలో ముంచెత్తారు. కార్మిక సంఘాల నాయకులతో సమావేశం పర్యటనలో భాగంగా మధ్యాహ్నం మంత్రులు కార్మిక సంఘాలు, ఉక్కు అధికారుల సంఘం (సీ), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రతీ నెలా పూర్తి జీతాలు చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికుల ఆధార్ బ్లాక్ తొలగించాలని, ప్లాంట్ పూర్తి స్థాయిలో నడపడానికి ఆరవ బ్యాటరీ నిర్మించాలని, సింటర్ ప్లాంట్ సామర్థ్యం పెంచాలని నాయకులు కోరారు. దీనిపై కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ గత ఏడాదిలో ఉక్కు ఉద్యోగులు చేసిన కృషి అభినందనీయమని, ఊహించిన దాని కన్నా అధికంగా ఉత్పత్తి సామర్థ్యం చూపారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో రెండో ప్యాకేజీ ఇచ్చే అంశం ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో ఉందన్నారు. కొద్దికాలం ఓపిక పడితే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. సమావేశంలో అఖిపక్ష నాయకులు పాల్గొన్నారు. -
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు మోసం
వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రకటించిన ‘జాబ్ క్యాలెండర్’ నిరుద్యోగులను మోసం చేయడమేనని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి రామచంద్రరావు మండిపడ్డారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది ఖాళీలు ఉండగా, కేవలం 10,060 పోస్టులను అక్టోబర్ వరకు విడతల వారీగా భర్తీ చేస్తామనడం యువతను తప్పుదోవ పట్టించడమేనన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3,000 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వం లక్షకు పైగా బాకీ ఉందన్నారు. గత జగన్ ప్రభుత్వంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయడమే కాకుండా, సచివాలయ, వలంటీర్ వ్యవస్థల ద్వారా ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 1.72 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనకల ఈశ్వర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుజ్జు దీరజ్ కుమార్, ఉత్తర నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మువ్వల సంతోష్ కుమార్, దక్షిణ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు తాడి రవితేజ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి చంద్రమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల సంఘం ఎన్నికల సందడి
విశాఖ లీగల్ : నగర న్యాయవాదుల సంఘం ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. ఎన్నికల అధికారి ఏ. ప్రభాకర్ రెడ్డికి పలువురు అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లను దాఖ లు చేశారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది శిష్ష్లా శ్రీనివాసమూర్తి (వాసు) అధ్యక్ష పదవికి తొలి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా తాను పోటీ చేస్తున్నానని, తోటి న్యాయవాదులందరూ సహకరించాలని కోరారు. శ్రీనివాసమూర్తితో పాటు కార్యదర్శి పదవికి ఒమ్మి వెంకట సుధాకర్, మహిళా ప్రతినిధిగా పీలా మహాలక్ష్మి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కోర్టు ఆవరణలో ఎన్నికల సందడి నెలకొంది. -
సీఎం సభకు బస్సుల మళ్లింపు..
నర్సీపట్నం: ఆర్టీసీ ప్రయాణికులకు 2014 టీడీపీ పాలన నాటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నక్కపల్లిలో సీఎం చంద్రబాబునాయుడు బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను రద్దు చేసి, సభకు జనాలను తరించేందుకు మళ్లించారు. డిపోకు చెందిన వంద బస్సుల్లో సగానికి పైగా సీఎం సభకు మళ్లించడంతో ప్రయాణికులు గమ్యస్థానాలను చేరేందుకు నానా ఇక్కట్లకు గురయ్యారు. బస్సులు రావని ఆర్టీసీ సిబ్బంది మైక్లో చెప్పినప్పటికీ వస్తాయనే ఆశతో కాంప్లెక్స్లో ప్రయాణికులు గంటలకొద్దీ నిరీక్షణ చేశారు. విజయవాడ, రాజమండ్రి కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు వరుసగా సెలవులు రావడంతో ఇంటికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు నరకం చూశారు. తల్లిదండ్రులు ప్రైవేటు వాహనాలను పెట్టి కాలేజీలకు పంపించారు. ఇదే అదునుగా ప్రైవేటు వాహనదారులు రెట్టింపు చార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. కూలీ పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు కాంప్లెక్స్లో దిగారు. బస్సులు లేకపోవడంతో మూటలు మోసుకుని ఆటోల కోసం మెయిన్ రోడ్డుపైకి వచ్చి నిరీక్షణ చేశారు. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రావడంతో సామాన్య ప్రజలు బస్సులు కోసం పడరాని పాట్లు పడ్డారు. -
మండలి స్పీకర్ దృష్టికి కూటమి నేతల ఆగడాలు
చోడవరం : అధికార కూటమి నేతలు చేస్తున్న ఆగడాలను శాసనమండలి స్పీకర్ మోషన్రాజుకి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ చోడవరం సమన్వయకర్త అమర్నాథ్ వివరించారు. వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా ఇటీవల నియమితులైన అమర్నాఽథ్ ఆ జిల్లా పర్యటనలో భాగంగా భీమవరంలో శాసనమండలి స్పీకర్ మోషన్రాజును సోమవారం కలిశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, ఆగడాల గురించి స్పీకర్కు వివరించారు. శాసనమండలిలో ఈ విషయాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు అమర్నాఽథ్ తెలిపారు. ఆయనతోపాటు సోషల్మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా నర్సింగరావు, వైస్ ఎంపీపీ బైన ఈశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శులు దొడ్డి వెంకట్రావు, ఓరుగంటి నెహ్రూ జిల్లా బీసీసెల్ ఉపాధ్యక్షుడు మొల్లి సోమునాయుడు, యూత్ జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, మండల యూత్ అధ్యక్షుడు పల్లా ధనాజీ, బీసీసెల్ ప్రతినిధి పల్లా మోహన్కృష్ణ, నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు బూరా బాలాజీ, తదితరులున్నారు. మర్యాద పూర్వక కలయిక పాయకరావుపేట: శాసనమండలి సభాపతి కొయ్యే మోషేన్రాజును వైఎస్సార్సీపీ నేతలు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోషేన్రాజును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, పెందుర్తి నియోజకవర్గ పరిశీలకుడు చిక్కాల రామారావు సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత పైల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నార్త్జోన్, సెంట్రల్జోన్ జట్ల విజయం
సౌత్,నార్త్ జోన్ల మధ్య మ్యాచ్ విశాఖ స్పోర్ట్స్ : నగరంలో ప్రారంభమైన ఆల్ ఇండియా జోనల్ ఫిజికల్లీ డిసేబుల్డ్ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు విజయాలతో ఖాతా తెరిచాయి. సోమవారం ఏసీఏ ఆపరేషన్స్ జీఎం ఎం.ఎస్. కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. తొలి మ్యాచ్లో నార్త్ జోన్ 186 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో సౌత్ జోన్ 168 పరుగులకే పరిమితమైంది. మరో మ్యాచ్లో సెంట్రల్ జోన్ 252 పరుగుల భారీ స్కోరు సాధించగా (కేధార్నాథ్ 96), వెస్ట్ జోన్ కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్టేడియం మేనేజర్ జె.కె.ఎం. రాజు, మాజీ కెప్టెన్ గురుదాస్ రౌత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘మలబార్’లో శృతిహాసన్ మెరుపులు
బీచ్రోడ్: నగరంలోని వీఐపీ రోడ్డులో ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతనంగా ఏర్పాటు చేసిన భారీ షోరూంను సోమవారం సినీ నటి శృతి హాసన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శృతి హాసన్ మాట్లాడుతూ దేశంలో నాణ్యమైన, నమ్మకమైన బంగారు, వజ్రాభరణాలకు మలబార్ సంస్థ పెట్టింది పేరన్నారు. విశాఖ వంటి కీలక మార్కెట్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, సంప్రదాయ, ఆధునిక డిజైన్ల కలయికతో ఈ అతిపెద్ద షోరూంను అందుబాటులోకి తీసుకురావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. సంస్థ ఇండియా ఆపరేషన్స్ హెడ్ ఆషీర్ మాట్లాడుతూ.. విశాఖ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక కలెక్షన్లను ప్రదర్శిస్తున్నామన్నారు. ప్రస్తుతం షోరూంలో ‘బిగ్ బ్రిలియంట్ సేల్’ నడుస్తోందని, ఇందులో భాగంగా బంగారం, అన్కట్ రత్నాల ఆభరణాల తరుగుపై 40శాతం, వజ్రాల విలువపై 30శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. పాత బంగారం మార్పిడిపై ఎటువంటి తరుగు లేకుండా గరిష్ట విలువను అందిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో మలబార్ ప్రతినిధులు సిరాజ్, రాకేష్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
మరణంలోనూ నలుగురికి పునర్జన్మ
బీచ్రోడ్డు : పెను విషాదంలోనూ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగి ధర్మాల మాధవరావు (57) అవయవాలను దానం చేసి, ఆయన కుటుంబ సభ్యులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. ఈనెల 20న గాజువాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాధవరావు తలకు తీవ్ర గాయమైంది. నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జీవన్ దాన్ ప్రతినిధుల అవగాహనతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో ఆయన శరీరం నుంచి లివర్, కిడ్నీ, రెండు కళ్లను సేకరించి, ప్రోటోకాల్ ప్రకారం సీనియారిటీ లిస్టులో ఉన్న బాధితులకు కేటాయించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అవయవ దాతలకు గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలన్న ప్రభుత్వ జీవో (నం. 95) ప్రకారం.. మాధవరావు పార్థివ దేహానికి పోలీస్ బ్యాండ్తో ఘనంగా నివాళులర్పించారు. సీపీ శంఖబ్రత బాగ్చి, జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె. రాంబాబు స్వయంగా విచ్చేసి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చిన మాధవరావు కుటుంబాన్ని అభినందించారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, దాతలకు ప్రభుత్వ గౌరవం దక్కడం శుభపరిణామమని పేర్కొన్నారు. -
సీఎంకు మత్స్యకారుల నిరసన సెగ
రాజయ్యపేటలో ఆందోళన చేస్తున్న మత్య్సకారులు నక్కపల్లి: రాజయ్యపేట సమీపంలో బల్క్ డ్రగ్పార్క్ ఏర్పాటు చేయబోమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చి మాట తప్పారంటూ గ్రామానికి చెందిన మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. సోమవారం గ్రామంలో మైలపల్లి మహేష్, సోమేష్ ఆధ్వర్యంలో పలువురు మత్య్సకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. తమ గ్రామంలో బల్క్డ్రగ్పార్క్ ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ 76 రోజుల పాటు ఆందోళన, నిరాహార దీక్ష చేశామన్నారు. ప్రభుత్వం తమను చర్చలకు పిలవడంతో తాళ్లపాలెం వద్ద సీఎం చంద్రబాబుని గ్రామస్తులంతా కలిశామన్నారు. మీ గ్రామ పరిధిలో బల్క్డ్రగ్పార్క్ ఏర్పాటు చేయబోమని, మీరు కోరిన అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇది జరిగి 93 రోజులు గడుస్తున్నా ఒక్క అభివృద్ధి పని చేపట్టకపోగా బల్క్డ్రగ్పార్క్ పనులు యథావిధిగా జరుగుతున్నాయని తెలిపారు. తమకు అండగా నిలిచిన వారిపై పీడీయాక్ట్ ప్రయోగించి నెలల తరబడి జైల్లో పెడుతున్నారన్నారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు. -
ఏసీబీ వలలో లంచావతారం
సీతంపేట: అతనో ప్రభుత్వ సేవకుడు.. ప్రజలకు అండగా ఉండాల్సిన స్థానంలో ఉన్నాడు. కానీ కళ్లు మూసుకుపోయి కక్కుర్తితో ’చేయి’ చాచాడు. ఐదు సచివాలయాలు కొలువై ఉన్న ఆ ప్రాంగణంలో, వందలాది మంది కళ్లెదుటే ఏమాత్రం భయం లేకుండా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతడే జీవీఎంసీ 26వ వార్డు పరిధి అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి సమీపంలోని లలితానగర్ సచివాలయం (125) వార్డు ఎడ్యుకేషన్ కమ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్. అసలేం జరిగిందంటే? లలితానగర్కు చెందిన ద్వారపురెడ్డి గంగరాజ్యం తన కుమారుడు గణేష్ పేరుపై ఉన్న స్థిరాస్తిని సెటిల్మెంట్ డీడ్ రూపంలో నమోదు చేయించేందుకు లలితానగర్ (125) సచివాలయంలో సంప్రదించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పైలా రాజేష్ మొదట రూ.90 వేల లంచం డిమాండ్ చేయగా, చివరికి రూ.80 వేల వద్ద ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడానికి ఇష్టపడని గణేష్ నేరు గా ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి మార్గదర్శకత్వంలో ప్రణాళిక రచించి.. సోమవారం మధ్యా హ్నం కార్యాలయంలోనే రాజేష్కు నగదు అందజేసే సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ‘దర్జాగా’ టేబుల్పై డబ్బులు ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. రాజేష్ ఎలాంటి భయం లేకుండా తీసుకున్న లంచాన్ని టేబుల్పై బహిరంగంగా ఉంచి, దానిపై బ్యాగ్ పెట్టడం. అక్కడే ఐదు సచివాలయాలు, పనిచేస్తున్న సిబ్బంది, ప్రజలు ఉండగా కూడా ఇలా ధైర్యంగా లంచం తీసుకోవడం చూసి ఏసీబీ అధికారులు సైతం విస్తుపోయారు. ప్రజల్లో ఆగ్రహం ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతుండడం ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ‘ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదు, వ్యవస్థలోని లోపాలకు నిదర్శనం’ అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి చర్యలు పట్టుబడిన పైలా రాజేష్ను ఆరిలోవ పోలీస్ స్టేషన్కు తరలించి, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, హర్షిత, సీఐలు శ్రీనివాస్, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. అవినీతిపై ఫిర్యాదు ఇలా? ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. -
ఇగో పాలిటిక్స్
’ఇనార్బిట్’ చుట్టూపూర్తిగా జగన్ ముద్రేనని.. ఇనార్బిట్ మాల్ ప్రారంభానికి ప్రభుత్వం దూరంటీడీపీ ఎమ్మెల్యేలూ హాజరవ్వకూడదంటూ హుకుం చివరికి పోర్టు చైర్మన్ డా.అంగముత్తు చేతుల మీదుగా ప్రారంభోత్సవం 2023 ఆగస్ట్ 1న వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా మాల్కు శంకుస్థాపన శరవేగంగా పనులు పూర్తి చేసి అద్భుతంగా నిర్మించిన రహేజా గ్రూప్సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యమని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ప్రభుత్వ అసలు రంగు విశాఖ ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవం వేళ బయటపడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుపై ఆయన ముద్ర చెరిగిపోలేదన్న కక్షతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలోనే అతిపెద్దదైన ఈ మాల్ పనులు గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టు క్రెడిట్ ఎక్కడ జగన్కు దక్కుతుందోనన్న భయంతోనే విశాఖలోనే ఉన్న లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని చర్చ జరుగుతోంది. నగరాభివృద్ధి కంటే రాజకీయ వైషమ్యాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. అభివృద్ధిపై ‘చిన్నచూపు’.. లోకేష్ అక్కసు! రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే వేదికను ప్రోత్సహించాల్సింది పోయి, దాన్ని చిన్నచూపు చూడటం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను గ్లోబల్ సిటీగా మారుస్తామని ప్రగల్భాలు పలికే లోకేష్.. కేవలం రాజకీయ వైరంతోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం చూస్తుంటే, అభివద్ధి కంటే రాజకీయ స్వలాభం కోసమే ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాకపోవడంతో సోమవారం విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు చేతుల మీదుగా ఇనార్బిట్ మాల్ను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో మాల్ అందుబాటులోకి రానుంది. కార్యక్రమానికి రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోషిణి అపరాంజి కోరాటి మాత్రమే హాజరయ్యారు. గత ప్రాజెక్టులపై వివక్ష ఈ మాల్ ద్వారా సుమారు 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఎన్నికల ముందు ‘జాబ్ క్యాలెండర్’ అంటూ ఊదరగొట్టిన లోకేష్, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థల పట్ల ఇలాంటి వివక్ష చూపడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది నిరుద్యోగులను వంచించడమే అంటూ నిరుద్యోగులు పెదవి విరస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరు పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే ధోరణితో ప్రభుత్వం ఉంటే.. పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్నాయి. -
‘చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు’
అనకాపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై రాజయ్యపేట మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చంద్రబాబు నిలువునా మోసం చేశారంటూ మండిపడుతున్నారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం జరగదని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట చంద్రబాబు నిలబెట్టుకోలేదని విమర్శించారు. బల్క్ డ్రగ్ పార్క్ వద్దని 76 రోజుల పాటు ఉద్యమం చేశామని, బల్క్ డ్రగ్ పార్కపై చంద్రబాబు ప్రకటన చేయాలన్నారు. తమకు చంద్రబాబు హామీ ఇచ్చి 93 రోజులైందని, అయినా ఇప్పటికీ బల్క్ డ్రగ్ పార్క్ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. బల్క్ డ్రగ్ పార్క్పై చంద్రబాబు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు మత్స్యకారులు. -
పక్షులకు ఆహారం, ఆశ్రయం ఏర్పాటు చేయాలి
అనకాపల్లి: వేసవి కాలంలో ప్రకృతి ప్రేమకు నిదర్శనంగా దేవాలయాల్లో పక్షులకు ఆహారం, నీరు, ఆశ్రయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎన్.సోమసుందర్ అన్నారు. గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణ, మండల పరిధిలో పలు దేవాలయాల్లో పక్షుల కోసం ధాన్యపు కుంచులు, తాగునీరు పాత్రలు, గూళ్లు కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి మనిషి బాధ్యత. ప్రకృతి ఉంటేనే మనిషి జీవనం కొనసాగుతుందన్నారు. గ్రీన్ క్లబ్ గత 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పక్షుల మనుగడ కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షుడు ఆడారి కిషోర్కుమార్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో గ్రీన్ క్లబ్ చేస్తున్న కృషి మరవలేనిదన్నారు. గవరపాలెం గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు కర్రి సన్యాసి నాయుడు మాట్లాడుతూ ప్రజల నిర్లక్ష్యం కారణంగా పర్యావరణం, నీటి వనరులు కలుషితం కాకూడదన్నారు. అంతకుముందు గ్రీన్ క్లబ్ సభ్యులు గాంధీనగర్లోని వేంకటేశ్వర స్వామి ఆలయం, వేల్పులవీధి కాశీ విశ్వేశ్వర ఆలయం, గవరపాలెం భోగలింగేశ్వర స్వామి దేవస్థానం, గౌరీ సేవా సంఘం దేవాలయం, సుంకరమెట్ట జంక్షన్లో సూర్యనారాయణ స్వామి దేవస్థానం, సంతోషి మాత దేవస్థానంలో పక్షుల కోసం ధాన్యపు కుంచులు, తాగునీటి పాత్రలు, గూళ్లు ఏర్పాటు చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్, భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ సత్యనారాయణ, విశ్రాంత అటవీ శాఖ రేంజర్ అధికారి బీర వినోద్ కుమార్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
జిహ్వకో రుచి.. దేశానికో శైలి
సాగర తీరాన ‘ప్రపంచ’ విందు ఏయూలో 40 దేశాల రుచుల హంగామామద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేళ బీచ్ రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ ప్రపంచ వంటకాలకు వేదికై ంది. అంతర్జాతీయ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘ఫీస్ట్ ఫెస్ట్’ నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందించింది. 40 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు 38 స్టాళ్లలో తమ దేశ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయగా, ఏయూ ఫుడ్ సైన్స్ విభాగం విద్యార్థులు మరో 18 స్టాళ్లలో భారతీయ స్వదేశీ రుచులను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ కెప్టెన్ ఎస్. దివాకర్, ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్తో కలిసి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఇథియోపియా సంప్రదాయ కాఫీ, ఆఫ్గన్ ‘కాబూలి పలావ్’, జోర్డాన్ షవర్మ, నేపాల్ మోమోస్ వంటి వంటకాలు ఆహార ప్రియులను విశేషంగా ఆకర్షించాయి. వీటితో పాటు కొమరూన్ ఇగుసి సూప్, కాంబోడియా చేపల వంటకాలు, భూటాన్ శాకాహార రుచులు విదేశీ సంస్కృతిని ప్రతిబింబించాయి. ‘థింక్ గ్లోబల్.. యాక్ట్ లోకల్’ అనే నినాదంతో విభిన్న దేశాల ఆహారపు అలవాట్లను ఒకే చోట చేర్చడం అభినందనీయమని కెప్టెన్ దివాకర్ కొనియాడారు. ఏయూ వీసీ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు తమ సంప్రదాయ వస్త్రధారణలో వంటకాలను వడ్డించడం ద్వారా తమ దేశ వారసత్వాన్ని పరిచయం చేశారని తెలిపారు. ఈ నెల 26న విదేశీ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమాన్ని అంతర్జాతీయ విద్యార్థుల విభాగం డీన్ ఆచార్య ఎస్.పాల్ డగ్లస్, అసోసియేట్ డీన్లు ఆచార్య యుగంధర్, ఆచార్య విజయశాంతి, ఆచార్య విజయమోహన్ సమన్వయంతో సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, పాలక మండలి సభ్యులు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. ఫీస్ట్ఫెస్ట్లో పాల్గొన్న ఏయూ వీసీ -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
● విశేషంగా స్వర్ణపుష్పార్చన ● శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం ● ఘనంగా గరుడసేవసింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చనని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలోవేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం: శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెళ్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు. ఘనంగా గరుడసేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడ హవనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతులు అందజేశారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
మాకవరపాలెం: మండలంలోని తామరంలో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. దువ్వూరి బాలకృష్ణమూర్తి మెమోరియల్ పేరుతో ప్రగతి చెస్ అకాడమీ ఆధ్వర్యంలో తామరం ఇమ్మానుయేలు క్యాంపస్లో ఆదివారం 3వ రాష్ట్రస్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు ఎంతో రసవత్తరంగా సాగాయి. ఈ పోటీల్లో అనకాపల్లి జిల్లాకు చెందిన బి.సాకేత్ ప్రథమ, విశాఖ జిల్లాకు చెందిన జె.నాగరాజు ద్వితీయ, అనకాపల్లి జిల్లాకు చెందిన ఎం.నూకరాజు తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. వీరికి ప్రథమ బహుమతిగా రూ.8,000, ద్వితీయ రూ.5,000, తృతీయ రూ.4,000 నగదుతోపాటు మరో 30 మందికి ప్రోత్సాహక బహుమతులుగా రూ.60 వేలను నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మానుయేలు సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్రాయ్, హౌసింగ్ కార్పొరేషన్ రిటైర్డ్ డీఈఈ చలపతిరావు, ప్రగతి చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు సుధీర్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, గౌతమి లలిత కళా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకుడు రంగరాజు పాల్గొన్నారు. -
ఆలయాలను రక్షించుకునే బాధ్యత హిందువులదే..
మాట్లాడుతున్న సుబ్బరాజు సమావేశానికి హాజరైన హిందువులు అనకాపల్లి : రాజకీయ నాయకుల ప్రమేయం వల్లనే హిందూ దేవాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, హిందూ దేవాలయాల భూములను పరిరక్షించుకునే బాధ్యత హిందువులకే అప్పగించాలని వక్త భూపతిరాజు సుబ్బరాజు అన్నారు. స్థానిక వివేకానంద పంక్షన్ హాల్లో విశ్వహిందూ పరిషత్–హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టంపై ఆదివారం అవగాహన కార్యక్రమం వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.డి.నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలపై ప్రభుత్వ రాజకీయ నాయకుల పెత్తనం ఉండరాదని, హిందూ దేవాలయాల భూములను కాపాడవలసిన బాధ్యత హిందువులపై ఉందన్నారు. కార్యక్రమంలో స్వామీజీలు నరసింహాచారి, రాళ్లపల్లి పాపీశర్మ, డాక్టర్ విష్ణుమూర్తి, వీహెచ్సీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపేటి రామకొండలరావు, కటకం లక్ష్మణరావు, సహా కార్యదర్శి పీలా హేమ జగదీష్ నాయుడు, కోశాధికారి రమేష్, అనకాపల్లి అధ్యక్షుడు నుదురుపాటి తాతాజీ, ప్రాంత తొలి సభ్యుడు శ్రీకాళహస్తి పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ భూములు అదానీకి కేటాయిస్తే ప్రతిఘటన
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం మద్దిలపాలెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టు ట్రస్టులను దెబ్బతీసి అదానీకి అప్పగించాలని చూస్తున్నా యని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం విమర్శించారు. ఆదివారం ఏచూరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్కు చెందిన 1167 ఎకరాల భూమిని అదానీ హస్తగతం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గంగవరం పోర్టును అదానీకి విక్రయించిన ప్రభుత్వం, ఇప్పుడు ప్లాంట్ భూములను కూడా ఆయనకే కట్టబెట్టాలని చూడటం అన్యాయమన్నారు. అదానీ డేటా సెంటర్ భూములే ఇంకా వినియోగంలోకి రాకముందే, పార్టనర్షిప్ పేరుతో గూగుల్ డేటా సెంటర్ భూములను కూడా అదానీ పొందేలా ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. నక్కపల్లిలోని ప్రైవేటు మిట్టల్ స్టీల్కు సొంత గనులు కేటాయిస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం నిరాకరించడం విచారకరమన్నారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 7.5 మిలియన్ టన్నులకు పెంచేందుకు రూ.10 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కేఎస్వీ కుమార్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాటం ఏప్రిల్ 2 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కార్మిక సంఘాల జెఎసితో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు డాక్టర్ బి. గంగారావు, వి. కృష్ణారావు పాల్గొన్నారు. -
న్యాయవాద వృత్తి పూలబాట కాదు
విశాఖ లీగల్ : సమాజంలో న్యాయవాద వృత్తి అత్యంత కీలకమైందని, అయితే ఇది పూలబాట కాదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలో విశాఖ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో రాణించాలంటే నిరంతర శ్రమ, అంకితభావం తప్ప వేరే మార్గం లేదని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే విజయం సొంతమవుతుందని పేర్కొన్నారు. మరో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మాట్లాడుతూ.. నిరంతర అధ్యయనం ద్వారానే వృత్తిలో ఎదగడం సాధ్యమని తెలిపారు. నిత్యం కేసులతో బిజీగా ఉండే న్యాయమూర్తులు, న్యాయవాదులకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు మంచి ఆటవిడుపును ఇస్తాయని, మానసిక ఉల్లాసానికి ఇవి ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు న్యాయమూర్తులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి లాలం పార్వతి నాయుడు, క్రీడా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ -
తోటాడలో అగ్ని ప్రమాదం
చికెన్ సెంటర్లో మంటలు మునగపాక: మండలంలోని తోటాడలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో చికెన్ షాపు దగ్ధమైంది. తోటాడ సెంటర్లో అనపర్తి లోవరాజు చికెన్ షాపు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. షాపులోని గ్యాస్ సిలిండల్ లీక్ కావడంతో మంటలు చెలరేగి షాపు కాలిపోయింది. ఈ ప్రమాదంలో విధ్యుత్ మీటర్తో పాటు కాటా, 20 కోళ్లు ఆగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.30వేల ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. -
కన్నీరే దిక్కు
సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026మిట్టల్ ఉక్కు..నేటి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు తుమ్మపాల: కలెక్టరేట్తో పాటు జిల్లాలో అన్ని మండల, డివిజన్ స్థాయిల్లో ఈ నెల 23వ తేదీ సోమవారం నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నక్కపల్లి మండలంలో ఆర్సెలార్ మిట్టల్–నిప్పన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జరగనున్న భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. శంకుస్థాపన ఏర్పాట్ల పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైందని, అందువల్ల పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఈ నెల 30న యథావిధిగా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.నక్కపల్లి: తరతరాలనుంచి సంక్రమించిన భూములను నమ్ముకుని జీవిస్తున్న రైతులు, నిర్వాసితుల నోట్లో ప్రభుత్వం మట్టికొట్టింది... మిట్టల్ ప్రయోజనాల కోసం వారి జీవితాలను పణంగా పెట్టింది... స్టీల్ప్లాంట్ కోసం కేటాయించిన భూముల్లో నివాసం ఉంటున్న వారిని ఉన్న పళంగా బలవంతంగా ఖాళీ చేయించింది... కట్టుబట్టలతో పునరావాస కాలనీలకు తరలిపోవాలని హుకుం జారీ చేయడంతో పాటు పూర్వీకుల నుంచి నివాసం ఉంటున్న ఇళ్లను నేలమట్టం చేసింది. గూడు చెదిరి నిర్వాసితులు చెట్టుకొకరుపుట్టకొకరు మాదిరిగా చెదిరిపోయారు. దీంతో తమకు కన్నీరే దిక్కయిందని నిర్వాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్సిలర్మిట్టల్స్టీల్ప్లాంట్ ప్రయోజనాల కోసం ప్రభుత్వం రైతులకు, నిర్వాసితులకు అన్యాయం చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూసేకరణ సమయంలో ఇస్తానన్న హామీలు అమలు చేయకుండా మోసం చేసిందంటూ నిర్వాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చందనాడ, తమ్మయ్యపేట, మూలపర్ర, బోయపాడు, అమలాపురం బుచ్చిరాజుపేట గ్రామాల పరిధిలో సుమారు 735 మంది నిర్వాసితులను గుర్తించింది. వీరంతా తాము నివసించే ఇళ్లు, ఇంటి స్థలాలు, పశువుల పాకలను స్టీల్ప్లాంట్ కోసం త్యాగం చేశారు. ఆర్ అండ్ ఆర్ప్యాకేజీ కింద రూ.25లక్షలు, ఇంటి స్థలం ఇవ్వాలన్నది నిర్వాసితుల డిమాండ్. గతంలో నిర్వాసితుల కోరిన కోరికలునెరవేరుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. ఇంటి స్థలం, ఆర్ అండ్ ఆర్ప్యాకేజీ కేవలం కింద రూ.8.98లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొంది. శంకుస్థాపన కోసం బలవంతంగా ఖాళీ... స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సమయం దగ్గరపడుతుండటంతో జిల్లా యంత్రాంగం అంతా ఈ గ్రామాల్లో తిష్టవేసి బలవంతంగా నిర్వాసితులను ఖాళీ చేయించింది. అధికారులనుంచి వచ్చిన ఒత్తిళ్లు తట్టుకోలేక బాధితులంతా ఊళ్లు వదిలేసి పోవాల్సి వచ్చింది. నిర్వాసితుల ఖాతాల్లో రూ.8.98లక్షల చొప్పున జమ చేయడంతో గత్యంతరం లేక బాధితులంతా ఉన్న ఊరిని కట్టుకున్న ఇళ్లను వదిలి, పాడిపశువులను అమ్మేసుకుని కట్టుబట్టలతో పునరావాస కాలనీలకు పరుగులు తీశారు. తీరా వెళితే అక్కడ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఆడబిడ్డలకు అన్యాయం... భూసేకరణ సమయానికి వివాహం కాని ఆడబిడ్డలకు ఆర్ అండ్ఆర్ప్యాకేజీ ఇస్తామని చెప్పిప్రభుత్వం మోసం చేసిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివాహం అయిన ఆడపిల్లలకు పైసా కూడా ప్యాకేజీ ఇవ్వలేదు. దీంతో వారంతా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. వారి వేదన అరణ్యరోదనే అవుతోంది. ఒక పక్క స్టీల్ప్లాంట్ శంకుస్థాపన పేరుతో అధికార పార్టీనాయకులు హడావుడిచేస్తుంటే మరో పక్క సర్వం కోల్పోయి నిర్వాసితులు పునరావాస కాలనీలో అలోలక్ష్మణా అంటూ భవిష్యత్ను తలచుకుని కన్నీటి పర్యంత మవుతున్నారు.పెరిగిన ధరల కారణంగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో ఇల్లుకట్టుకునే స్థోమత లేదని వాపోతున్నారు. రేకుల షెడ్లు, పాకల్లోనే కాలక్షేపం చేస్తామని వారు చెబుతున్నారు.నిర్వాసితులు ఇల్లునిర్మించుకుంటే సిమెంట్, ఐరన్ తక్కువ ధరలకు ఇప్పిస్తామని అధికారులు ప్రకటించారు.అదీ కూడా అమలు చేయలేదు. తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వేరొక చోట అద్దెకు ఉంటే నెలకు రూ.5వేలు చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారని అదికూడా పూర్తిగా అమలు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.ఎలా బతకాలో తెలియడం లేదు మా ఇళ్లు, భూములు స్టీల్ప్లాంట్కోసం తీసేసుకున్నారు. 30సెంట్ల భూమికి డబ్బులిస్తే ఆ డబ్బుతో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాం. సర్వంకోల్పోయాం.తరతరాలుగా నమ్ముకున్న భూతల్లినుంచి మమ్మల్ని వేరు చేశారు. ఇంటి నిర్మాణం కోసం కేవలం తొమ్మిది లక్షలు ఇచ్చారు.తొలగించిన ఇంటికి రూ.3లక్షలు ఇచ్చారు.ప్రస్తుత పరిస్థితిలో ఇల్లుకట్టుకోడానికి ఈ డబ్బు ఏమూలా చాలదు. ఏం చేయాలో తోచడం లేదు. కాటికి కాలు చాచిన వయసులో ఉన్న ఊరికి, భూములకు దూరమైపోయాం. ఎలా బతకాలో తెలియడం లేదు.పాడిపశువులను కూడా అమ్మేసుకున్నాం. – మడుగుల రమణ,తుమ్మలపేటప్రభుత్వం అన్యాయం చేసింది ప్యాకేజీ విషయంలోప్రభుత్వం అన్యాయం చేసింది. ఆడపిల్లలకు పైసా ఇవ్వలేదు. కట్టుబట్టలతో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయాం. ఏం చేయాలో ఎలా బతకాలో తోచడం లేదు. పశువులను సైతం అమ్మేసుకున్నాం. ప్రభుత్వం ఇచ్చిన సాయం ఇల్లునిర్మించుకోడానికి చాలదు. భవిష్యత్ తలచుకుంటే భయం వేస్తోంది. – మడగల గోవిందు, నిర్వాసితుడు గూడు చెదిరింది...గోడు మిగిలింది స్టీల్ప్లాంట్ శంకుస్థాపన పేరుతో ఇళ్లు కూల్చివేత కట్టుబట్టలతో పునరావాస కాలనీకి బాధితులు షెడ్లలోనే కాపురం పాడిపశువులను అమ్మేసుకుని ఉపాధి కోసం ఎదురు చూపులు -
నేడు ‘డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీ’
సాక్షి, విశాఖపట్నం : డిస్కమ్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో నేడు ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ప్రకటించారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్ పాడేరు, రాజమహేంద్రవరం, కాకినాడ, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు 8688400499 ఫోన్ నంబర్ ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సీఎండీ పృథ్వీతేజ్ విజ్ఞప్తి చేశారు. -
గిరిజనులకు విద్యుత్ బిల్లుల ‘షాక్’
● రూ.వేలల్లో వస్తుండడంతో ఆందోళన ● నిరసన వ్యక్తం చేసిన ఆదివాసీలు రోలుగుంట: ఉచిత విద్యుత్పై చంద్రబాబు సర్కార్ మోసంతో గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. గత ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేయగా, కూటమి సర్కార్ బలవంతపు వసూళ్లకు దిగుగుతూ వేలల్లో బిల్లులు పంపిస్తోంది. మండలంలో పలు గ్రామాల్లో గిరిజనులకు విద్యుత్ బిల్లులు షాక్ ఇస్తున్నాయి. దీంతో ఎలా కట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. వేలల్లో వచ్చి న బిల్లులు చూపిస్తూ ఆదివారం పలు గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. మండలంలో అర్ల పంచాయతీ శివారు కొత్తలోసింగి, లోసింగి,పెదగరువు,పీత్రిగెడ్డ,నీళ్లబంద తదితర గ్రామాల్లో 62 పీటీజీ గొందు ఆదివాసీ కుటుంబాలు పెంకులు, మట్టిగోడలతో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయి. వారికి గత ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శిఖరాగ్ర గ్రామాల్లో విద్యుత్ బిల్లులు తీయడం మొదలెట్టారు. అధిక మొత్తంలో బిల్లులు పంపుతూ, చెల్లించకపోతే సరఫరా కట్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారని పలు గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రిజ్లు, ఏసీలు లేవు, రెండు బల్బులు మాత్రమే వినియోగించుకుంటున్నాం, వర్షం పడితే మా గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది, మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదని వారు చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం 60 యూనిట్లు మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు అధిక మొత్తంలో బిల్లులు వచ్చాయని, చెల్లించకపోతే లైను కట్ చేస్తామని బెదిరిస్తున్నారని పలు గ్రామాల గిరిజనులు వాపోయారు. బిల్లులపై పరిశీలించి పునఃసమీక్షించాలని లేకుంటే కాగడాలతో ఆందోళన చేస్తామని లోసింగి, కొత్తలోసింగి, పీత్రిగెడ్డ గ్రామాలకు చెందిన కిలో నరసయ్య, కిలో రుక్మి, కిలో మహేష్, సీపీఎం కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు హెచ్చరించారు. -
రేకులషెడ్లలోనే కాపురాలు..
పునరావాస కాలనీలో ఇల్లుకట్టుకునే స్థోమత లేక షెడ్డువేసుకున్న నిర్వాసితుడు రమణ కుటుంబంప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సరిపడక చాలా మంది తమకు కేటాయించిన స్థలాల్లో చిన్నపూరిపాకలు, రేకుల షెడ్లు వేసుకుని కాపురాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. స్థోమత కలిగిన వారు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పాడిపశువులను సైతం అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంత ఊళ్లలో అయితే తమ పొలాల్లో ఆవులు,గెదేలు, గొర్రెలు మేకలను మేపుకొంటూ కాలక్షేపం చేయడంతోపాటు, వాటి ద్వారా ఆదాయం సంపాదించుకుని ఉపాధి పొందేవారు. ఉన్న భూములన్నీ ప్రభుత్వం తీసేసుకుని పునరావాసకాలనీలకు పంపేయడంతో అక్కడ పశువులను మేపుకొనేందుకు పొలాలు లేవని, చేసేదేమీలేక పాడిపశువులను అమ్మేసుకోవాల్సి వచ్చిందంటూ రైతులు కన్నీటి పర్యంత మవుతున్నారు. -
నేడు చోడమాంబిక అమ్మవారి మెరుపుల జాతర
అచ్యుతాపురం రూరల్: ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రసిద్ధి చెందిన మండలంలోని చోడపల్లిలో చోడమాంబిక అమ్మవారి మెరుపులు పుట్టుక జాతర మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ జాతరలో భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారు. అమ్మవారితో పాటు ఈ ఉత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున కొండపై వచ్చే మెరుపులను భక్తులు దర్శించుకుంటారు. మెరుపులు అమ్మవారికి ప్రతిరూపాలుగా భావిస్తారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అచ్యుతాపురం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. అనకాపల్లి నుంచి వచ్చే వాహనాలను కొండకర్ల మీదుగా మడుతూరుకు, అచ్యుతాపురం నుంచి వచ్చే వాహనాలను మడుతూరు కూడలి నుంచి కొండకర్ల మీదుగా మళ్లించనున్నారు. పండగ సందర్భంగా ఎస్టీడీఎల్ రోడ్డు మీదుగా చోడపల్లి వైపునకు వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నట్టు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. -
స్టీల్ప్లాంట్కు రూ.లక్షలకోట్ల రాయితీలు.. నిర్వాసితులకు అన్యాయం
నక్కపల్లి: మిట్టల్ స్టీల్ప్లాంట్కు ప్రభుత్వం రూ.లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ నిర్వాసితులకు మాత్రం నోట్లో మట్టికొట్టిందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు ఆరోపించారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతోమాట్లాడుతూ మొదటి విడతలో రూ.80వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని చెబుతూ రూ.40వేల కోట్ల రాయితీలు ప్రకటించడం దారుణమన్నారు. 2,200 ఎకరాలకు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయింపు ఇచ్చారన్నారు.అలాగే 15 ఏళ్లపాటు జీఎస్టీ మినహాయింపు, 15 ఏళ్లపాటు విద్యుత్ను యూనిట్కు ఒక్కరూపాయికే ఇవ్వడంకంపెనీకి కావాల్సిన నీటిని కిలోలీటరును కేవలం యాభైపైసలకు ఇవ్వడం విడ్డూరమన్నారు. ఎకరా కోటిరూపాయలు విలువ చేసే భూములను రూ.51లక్షలకే కట్టబెట్టారని చెప్పారు.ప్రైవేటు స్టీల్ప్లాంట్కు లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ భూములు,నివాస ప్రాంతాలు త్యాగం చేసిన వారికి మాత్రం నోట్లో మట్టికొట్టి, అరకొరగా పరిహారం చెల్లించడం దుర్మార్గమని తెలిపారు.వివాహం అయిన ఆడపిల్లలకు ఇప్పటి వరకు ఆర్ అండ్ ఆర్ప్యాకేజీ ఇవ్వలేదన్నారు.రూ.25లక్షలు ప్యాకేజీ ఇవ్వాలని నిర్వాసితులు కోరితే కేవలం రూ.8.98 లక్షలు మాత్రమే చెల్లించారన్నారు.ఈ సమావేశంలో నాయకులు ఎం.రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలి
అనకాపల్లి: మాజీ మంత్రి, దివంగత నాయకుడు గుడివాడ గురునాథరావు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేశారని, గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. తన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతమైన జిల్లాలో కొంతమంది దుండగులు అల్లర్లు సృష్టించేందుకు ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడడం అన్యాయమన్నారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. గురునాథరావు అభిమానులు అనకాపల్లి మండలం తగరంపూడిలో 2019లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈనెల 20వ తేదీ అర్ధరాత్రి కొందరు ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించి ఉంటారని చెప్పారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు గురునాథరావు అభిమానులు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతర్ జాతీయ పవర్లిఫ్టింగ్ పోటీలకు నాగజ్యోతి ఎంపికరోలుగుంట: హర్యానా రాష్ట్రం సోనిపట్లో ఆది వారం నాచురల్ స్ట్రాంగ్ పవర్ లిప్టింగ్ ఫెడరేషన్(ఎన్ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీల్లో రోలుగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచర్ పి.వి.ఎం.నాగ జ్యోతి ప్రతిభ చూపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో మన రాష్ట్రం నుంచి పాల్గొన్న నాగజ్యోతి ప్రతిభ చూపి, అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి 25 వరకూ పోలెండు దేశంలో పాబియాయనీస్ నగరంలో జరగనున్న ప్రపంచ లిప్టింగు చాంపియన్షప్ పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొంటారు. జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం వి.శేషగిరిరావు, సహచర ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
2047 నాటికి విశాఖ నీటి అవసరం 726 మిలియన్ లీటర్లు
డాబాగార్డెన్స్: వేసవి కాలంలో నీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని, నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ నగర పరిపాలనకు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆయన నగర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నగరానికి రోజుకు సుమారు 400 మిలియన్ లీటర్ల నీటి అవసరం ఉండగా, పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో 2047 నాటికి ఈ అవసరం 726 మిలియన్ లీటర్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. నగరానికి దీర్ఘకాలిక నీటి భద్రత కల్పించేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా అంతర్జాతీయ సంస్థలైన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగపూర్ వాటర్ సెంటర్, పీయూబీ (సింగపూర్), ఐఎస్ఎఫ్ (ఆస్ట్రేలియా) వంటి సంస్థల సాంకేతిక సహకారంతో సమగ్ర వాటర్ సెక్యూరిటీ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ ప్రణాళిక ద్వారా నీటి వనరులను శాసీ్త్రయంగా అంచనా వేయడమే కాకుండా, వినియోగించిన నీటి శుద్ధి, పునర్వినియోగం, భూగర్భ జలాల సంరక్షణ, ఆధునిక సాంకేతికతతో నీటి వృథాను అరికట్టడం వంటి అంశాలకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన వివరించారు. -
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
నక్కపల్లి : ఈనెల 23న నక్కపల్లి మండలం తమ్మయ్యపేటలో జరిగే స్టీల్ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లతోపాటు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొనే బహిరంగ సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి శనివారం అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రూట్మ్యాప్, ట్రయల్రన్ హెలీప్యాడ్ నిర్మాణం, వీవీఐపిలు ప్రయాణించే రూట్లకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాటు చేసిన బందోబస్తు గురించి వివరించారు. బందోబస్తు కోసం వచ్చిన సిబ్బందికి తగు సూచనలు చేశారు. అలాగే బందోబస్తు ఏర్పాట్లపై హోంమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ శాఖల మంత్రితోపాటు, కేంద్రమంత్రులు, రామ్మోహన్నాయుడు, శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్ , హెచ్డి కుమార స్వామి గౌడ తదితరులు పాల్గొంటారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాన్య ప్రజల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
విగ్రహాలపై అక్కసు
● కొనసాగుతున్న కూటమి నేతల ‘అరాచక’ పర్వం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్ విగ్రహాలపై దాడులు ● వైఎస్సార్ లాన్, వ్యూ పాయింట్ వద్ద ధ్వంసరచన ● తాజాగా గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి ● తీవ్రంగా స్పందించిన వైఎస్సార్సీపీ ● 48 గంటల్లో దోషులను శిక్షించాలని డిమాండ్ పేరు వింటే వణుకుఅనకాపల్లి మండలం తగరంపూడిలో గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగలు ఇటీవల పెందుర్తిలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగిస్తున్న దృశ్యంఉమ్మడి విశాఖ జిల్లాలో విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరుతో ఉన్న విగ్రహాలు, స్థలాలు లక్ష్యంగా మారడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైఎస్సార్ పేరు వినగానే కూటమి నేతల్లో అసహనం వ్యక్తమవుతోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల గుండెల్లో చెరిగిపోని ఆ మహానేత జ్ఞాపకాలను ఇలా చెరిపేయాలని ప్రయత్నించడం దురుద్దేశపూరితమని ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఈ ఆందోళనలకు బలం చేకూరుస్తున్నాయి. ఫిల్మ్నగర్ క్లబ్లో అధికారికంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ లాన్ బోర్డును తొలగించడం మొదలుకుని, జీవీఎంసీ తీర్మానంతో ఏర్పాటైన వైఎస్సార్ వ్యూ పాయింట్ వద్ద పేరు చెరిపే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అక్కడితో ఆగకుండా, పెందుర్తి వద్ద రోడ్డు విస్తరణ పేరుతో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించే యత్నం జరిగింది. స్థానిక నేతల ప్రతిఘటనతో ఆ ప్రయత్నం విఫలమైంది. తాజాగా అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ రాక్షసకాండపై వైఎస్సార్సీపీ గర్జించింది. 48 గంటల్లో నిందితులను పట్టుకోకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తామని ‘అల్టిమేటం’ జారీ చేసింది. -
బీజేపీలో చేరిన వ్యాపారవేత్త ఎంవీఆర్
ఎంవీపీకాలనీ : అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎంవీఆర్) భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. శనివారం విశాఖ లాసన్స్ బే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో ఆయనకు పార్టీ కండువా కప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంవీఆర్తో పాటు మరో 100 మందికి పైగా ఆయని అనుచరులు శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లాలో వ్యాపారవేత్తగా ఎంవీఆర్కు మంచి గుర్తింపు ఉందని, ఆయన పార్టీలో చేరడం జిల్లా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని ఈ సందర్భంగా మాధవ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అద్భుతమైన పాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా ఎంవీఆర్ , ఆయన అనుచరులు కృషిచేయాలని, పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని సూచించారు. ఎంవీఆర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వంతో పాటు ఆయన ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనకు ఆకర్షితుడై బీజేపీలో చేరినట్టు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
● పొలాల్లోకి చేరిన నీరు ● నేలరాలిన జీడి, మామిడి కాయలు ● దెబ్బతిన్న కూరగాయల పంటలు
బుచ్చెయ్యపేట : మండలంలో కురిసిన భారీ వర్షానికి మినుము,పెసర,నువ్వులు,జనుము ఇతర పంటలు దెబ్బతిన్నాయి. బుచ్చెయ్యపేట,దిబ్బిడి, భీమవరం,ఎల్.బి.పురం,బంగారుమెట్ట,లోపూడి,శింగవరం,పీడీ పాలెం తదితర గ్రామాల్లో నువ్వు,జనుము చేలు నేలకొరిగాయి. పొలాల్లోకి నీరు చేరడంతో పంట కుళ్లిపోయి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. పొలాల్లో ఆరబెట్టిన మినుము,పెసర చేలు తడిసిపోయాయి. దీంతో వాటిని రక్షించుకునేందుకు అన్నదాతలు శ్రమిస్తున్నారు. ఈదురు గాలులకు పలు గ్రామాల్లో జీడి,మామిడి కాయలు నేల రాలాయి. టమాటా,వంగ,మిరప,బీర,బెండ తదితర కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడడంతో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దేవరాపల్లి: మండలంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం దంచి కొట్టింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈదురు గాలుల ధాటికి స్థానిక కుమ్మరి వీధిలో అప్పారావు అనే వ్యక్తి ఇంటిపై కొబ్బరి చెట్టు విరిగిపడింది. దీంతో డాబా పిట్ట గోడ పాక్షింగా దెబ్బతింది. మండల వ్యాప్తంగా పలు చోట్ల విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 5 గంటల నుంచి విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సరఫరాను పునరుద్ధరించే పనుల్లో విద్యుత్ సిబ్బంది నిమగ్నమయ్యారు. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాల్లో భారీగా నీరు చేరింది.జీడి, మామిడి, టమాటా తదితర పంటలకు నష్టం వాటిల్లింది. సరుగుడు, పామాయిల్ ఇతరాత్ర పంటలకు ఈ వర్షం వల్ల మేలు జరిగింది. మాడుగుల, మాడుగుల రూరల్: మండలంలో కురిసిన భారీ వర్షానికి సుమారు 4 వేల ఎకరాల్లో జను ము, నువ్వులు, పొద్దుతిరుగుడు,పెసర, మినుము, పిల్లి పెసర, బొబ్బర్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు బోరుమంటున్నారు. చింత కాయలు నేల రాలి పాడైపోయాయి. కె.జె.పురం, ముకుందపురం, వంటర్లపాలెం, ఎం.కోటపాడు, వల్లాపురం, మాడుగుల, పప్పుచెట్టి చెరువు, వీరవల్లి, వీరనారాయణం, చింతలూరు, గాదిరాయి తదితర గ్రామాల్లో అపరాలు పంటకు నష్టం వాటిల్లింది. అరటిచెట్లు నేలకొరిగాయి. మామిడి, జీడిమామిడి పిందెలు నేలరాలాయి. ఈదురు గాలులకు వరికుప్పలు, గడ్డివాములు ఎగిరిపోయాయి. కూలిన భారీ వృక్షం కోటవురట్ల: ఈదురు గాలులు, భారీ వర్షానికి యండపల్లి మెయిన్రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది. శుక్రవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మెయిన్రోడ్డును ఆనుకుని ఉన్న భారీ చింత చెట్టు శనివారం తెల్లవారు జామున వేళ్లతో సహా నేలకొరిగింది. దీంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. తెల్లవారు జాము సమయం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే విద్యుత్ శాఖసిబ్బంది సరఫరాను నిలుపుదల చేశారు. చెట్టు రోడ్డుకు అడ్డుగా కూలిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రధాన రహదారి కావడంతో శనివారం వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేయడంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయించాల్సివచ్చింది. వేరే రహదారిలో ఆటోల్లో రాకపోకలు సాగించారు. -
22కిలోల గంజాయి స్వాధీనం
రావికమతం: మండలంలో దొండపూడి చెక్పోస్టు వద్ద శనివారం 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు బ్యాగుల్లో గంజాయిని తరిలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు దొండపూడి చెక్పోస్టు వద్ద శనివారం వాహనాలను తనిఖీ చేసినట్టు చెప్పారు. ఈ సమయంలో ఇద్దరు నిందితులు రెండు బ్యాగులు వదిలి పారిపోతుండగా సిబ్బందితో వారిని వెంబడించినట్టు ఎస్ఐ తెలిపారు. ఒక్క వ్యక్తిని పట్టుకున్నామని, మరో నిందితుడు పరారయ్యాడని చెప్పారు. రెండు లగేజీ బ్యాగ్ల్లో తనిఖీ చేసి 22 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి నుంచి రెండు జతల బంగారం ఆభరణాలు,రూ. 1000 నగదు,రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడు నెల్లూరు జిల్లా నాయుడు పేటకు చెందిన వ్యక్తి అని, ఇప్పటికే అల్లూరి జిల్లా సీలేరు,నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసు స్టేషన్లలో గంజాయి కేసులు,రోలుగుంట పోలీస్ స్టేషన్లో బంగారం చోరీ కేసు ఉన్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి చోడవరం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ తరలించామని, పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ చెప్పారు.


