Anakapalle
-
ముచ్చటపడి రాలేదు.. మూటగట్టి తెచ్చారు..
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం తన ప్రచార ఆర్భాటం కోసం విద్యార్థులను విడిచిపెట్టడం లేదు. ఆనందపురంలో మంగళవారం జరిగిన గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం జనసమీకరణకు యూత్ కలరింగ్ ఇచ్చేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా ‘గూగుల్’ శంకుస్థాపనకు వచ్చినట్లు ప్రచారం చేసుకోడానికి సాక్షాత్తు ఆంధ్రా యూనివర్సిటీనే ‘జనసమీకరణ’ కేంద్రంగా మార్చేసింది. ఇందుకోసం ఏయూ అధికారులను పావులుగా వాడుకుంది. విద్యార్థులను బలవంతంగా తరలించే బాధ్యతలను అప్పగించింది. విద్యార్థులంటే ‘క్రౌడ్’ ఫిల్లింగ్ మెటీరియలా? ముఖ్యమంత్రి శంకుస్థాపన చూసేందుకు యువత విపరీతంగా ఆసక్తి చూపిస్తోందని ప్రజలను నమ్మించడం కోసం ప్రభుత్వం పక్కా వ్యూహం రచించింది. గూగుల్ వస్తోందన్న ఆనందంతో యువత, విద్యార్థులు తండోపతండాలుగా తరలివచ్చారని కలరింగ్ ఇవ్వడం కోసం ప్రయత్నించింది. ఈ బాధ్యతలను ఆంధ్రా యూనివర్సిటీ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో ఏయూ అధికారులు తమ విధేయతను చాటుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడమే ఆలస్యం.. అధికారులు హడావుడిగా రంగంలోకి దిగారు. క్లాసులు పక్కనపెట్టేసి మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేశారు. ఏయూ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులను ఆ బస్సుల్లో ఎక్కించి ఆనందపురానికి తోలారు. విద్యార్థులను బలవంతంగా బస్సుల్లో ఎక్కించి తరలించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కంప్యూటర్ల ముందు కోడింగ్ నేర్చుకోవాల్సిన విద్యార్థులు, ఈ ఎండలో రాజకీయ ఉపన్యాసాలు వినాల్సి రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
బీసీల వర్గీకరణ మేరకు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
అనకాపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వర్గీకరణ మేరకు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకే మారిస్ అన్నారు. స్థానిక గాంధీనగరం సంఘం కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు అమలులోకి వచ్చి 33 సంవత్సరాలు కావస్తున్న నేటి వరకు యాత కులానికి చెందిన ఏ ఒక్కరు ఎంపీపీ, జెడ్పీటీసీలు పదవులు లేవన్నారు. ఉమ్మడి రిజర్వేషన్లు ఉండడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆదిపత్య బీసీ కులాలే అందలం ఎక్కుతున్నారని, సీఎం చంద్రబాబు బీసీల్లో ఉన్న కులాల నుంచి అత్యంత వెనుకబడిన 32 కులాలను గుర్తించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. 2016లో జీవో నంబర్.17 జారీ చేసినప్పటికీ నేటి అమలు కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి గుత్తుర్తి అప్పారావు, జిల్లా సభ్యుడు ఎర్ర రాము, న్యాయవాదులు ఓడిబోయిన రాంబాబు, కోశెట్టి కిషోర్ పాల్గొన్నారు. -
భయపెడుతూ.. భయపడుతూ..
తర్లువాడలో అదానీ గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన నిరసన వ్యక్తం చెయ్యకుండా ప్రజల్ని నిర్బంధించిన చంద్రబాబు ప్రభుత్వం పరిహారం చెల్లించకుండానే బలవంతపు భూ సేకరణ రైతుల సమస్యలు పరిష్కరించకుండా శంకుస్థాపన ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్న తర్లువాడ గ్రామస్థులు రైతుల నిరసన సెగకు భయపడుతూ.. భయపెడుతూ.. ప్రజాస్వామ్యాన్ని పోలీసుల నిర్బంధంలో తొక్కిపెట్టి.. రైతుల కడుపు కొట్టి.. చంద్రబాబు ప్రభుత్వం తర్లువాడలో అదానీ గూగుల్ డేటా సెంటర్కు ‘బలవంతపు’ శంకుస్థాపన కార్యక్రమాన్ని మంగళవారం కానిచ్చేసింది. నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచే చంద్రబాబు ప్రభుత్వ నైజం తర్లువాడ సాక్షిగా మరోసారి బయటపడింది. కనీసం పరిహారం చెల్లించకుండా, సాగు భూములను లాక్కొని అన్నదాతలను రోడ్డున పడేసిన సర్కారు.. వారు నిరసన తెలపకుండా గ్రామం చుట్టూ పోలీసులను మోహరించి అష్టదిగ్బంధనం చేసింది. రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వారి గొంతు నొక్కుతూ స్వ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇంతలా బరితెగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా పోలీసుల ఆంక్షలు, అరెస్టుల భయం నీడన.. ప్రజలను నిర్బంధించి చేసిన ఈ శంకుస్థాపన పాలకుల నైతిక ఓటమికి నిదర్శనంగా నిలిచింది. మరోవైపు.. శంకుస్థాపన కార్యక్రమం సాక్షిగా.. ‘కూటమి’లో విబేధాలు మరోసారి బట్టబయలయ్యాయి. జనసేన ప్రతినిధులకు ప్రాధాన్యమివ్వకపోవడంతో.. కార్యక్రమానికి హాజరుకాకుండానే వెనుదిరిగారు. –సాక్షి, విశాఖపట్నం/తగరపువలస/ ఆనందపురంబయటపడ్డ గంటా.. భరత్ విభేదాలు అంతేకాకుండా ఈ కార్యక్రమం సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్ వర్గాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గంటా శ్రీనివాసరావు వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ భరత్ ఫొటో లేకపోవడం, ఇరువురు నేతల మధ్య ఉన్న గ్యాప్ను స్పష్టం చేస్తోంది. మరోవైపు ఈ భారీ కార్యక్రమం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు సైతం కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రతకు తాళలేక, కనీసం తాగునీరు కూడా అందక పోలీసులు అవస్థలు పడటం గమనార్హం. ప్రారంభంలో 30 వేల మందితో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన ఈ భూమిపూజ కార్యక్రమం, ఇన్ని వివాదాల మధ్య, ఆశించిన స్థాయిలో కాకుండా చప్పగా ముగిసింది. ఆనందపురం మండలం తర్లువాడలో మంగళవారం జరిగిన గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ భూమిపూజ కార్యక్రమం అధికారిక వేడుక కంటే, రాజకీయ ప్రదర్శనగా మిగిలిపోవడంతో పాటు అనేక వివాదాలకు కేంద్రబిందువైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వంటి అగ్రనేతల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక తర్లువాడ గ్రామస్తులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తమ భూములను ప్రాజెక్టు కోసం ఇచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేయకుండానే భూమిపూజ చేపట్టడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులలో ఉన్న ఈ అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు ముందస్తు చర్యల పేరుతో గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు గ్రామస్తులను బయటకు రానీయకుండా నిర్బంధించడం, జాతీయ రహదారి నుంచి వ్యవసాయ భూముల వరకు ఎక్కడికక్కడ పికెటింగ్ నిర్వహించి కదలికలను ఆంక్షలకు గురిచేయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం పరిపాలనాపరమైన ప్రోటోకాల్లను సైతం పక్కన పెట్టి, పూర్తిగా అధికార పార్టీ కార్యక్రమంలా సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ప్రజాప్రతినిధులైన ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంకను, జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావును కనీసం ఆహ్వానించకపోవడం ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘనకు నిదర్శనంగా మారింది. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ బీఆర్బీ నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు తాట్రాజు అప్పారావును తప్ప చీమను కూడా గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ వైపు రానివ్వలేదు. వీరికి బదులుగా ఎలాంటి పదవుల్లో లేని మాజీ సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షుడికి ప్రాధాన్యత ఇస్తూ పాస్లు జారీ చేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అటు కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు కూడా ఈ కార్యక్రమంలో సరైన గుర్తింపు దక్కలేదనే వాదన వినిపిస్తోంది. భీమిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురిమిన రామస్వామినాయుడుకు ఆహ్వానం అందకపోవడంతో ఆయనతో పాటు వచ్చిన రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పంచకర్ల సందీప్ ఆ కార్యక్రమం నుంచి వెనుదిరిగారు. -
లారీ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం
కశింకోట : మండలంలోని బయ్యవరం వద్ద సోమవారం అర్థరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బంధువుల పెళ్లికి అగనంపూడి నుంచి బైక్పై యానాం వెళుతుండగా వెనుక నుంచి లారీ ఢీకొని వెళ్లిపోవడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడినవారిని విశాఖ కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం...అగనంపూడికి చెందిన నంబారు అజయ్ (20), ఓడూరు అఖిల్ (25) సహా మరో నలుగురు యువకులతో కలిసి మూడు బైక్లపై కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో జరిగే బంధువుల వివాహానికి సోమవారం రాత్రి బయలుదేరారు. వారు మండలంలోని బయ్యవరం రైల్వే స్టేషన్ రోడ్డు వద్దకు చేరే సరికి వారిలో ఒకరి బైక్ను వెనుక నుంచి గుర్తు తెలియని లారీ వచ్చి ఢీకొని వెళ్లిపోయింది. దీంతో అజయ్, అఖిల్ తీవ్రంగా గాయపడగా వారికి అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స జరిపించి వాహనంలో వారిని విశాఖ కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. మృతదేహాలకు కేజీహెచ్లో పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతులు చదువుకొని ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో బైక్ దెబ్బతింది. ప్రమాదానికి కారణమైన లారీని జాతీయ రహదారిపై సీసీ కెమెరాల ఫుటేజీల సహాయంతో గుర్తించి ఖమ్మం వద్ద పట్టుకొని స్వాధీనం చేసుకొని ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఎస్ఐ లక్ష్మణరావు కేసును దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ మనోజ్ కుమార్ కేసుకు సహకరించారు. చేతికి అందివస్తారనుకుంటే...అనంతలోకాలకు... ప్రమాదంలో మృతి చెందిన అఖిల్ అగనంపూడి కాలనీకి చెందిన వాడు. విశాఖ జీవీఎంసీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఓడూరి అప్పారావు, వరలక్ష్మి దంపతుల ఏకై క మగ సంతానం. మరో నలుగురు కుమార్తెలున్నారు. వారికి వివాహం అయింది. అఖిల్కు ఇంకా వివాహం కాలేదు. కశింకోట పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో, ఐటీఐ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి చేదోడుగా ఉంటాడనుకున్న కుమారుడు అఖిల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేసింది. మరో మృతుడు నంబారు అజయ్ కూడా అగనంపూడి బీసీ కాలనీకి చెందిన వాడు. తండ్రి అచ్చిబాబు తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. తల్లి లక్ష్మి గృహిణి. వీరికి ఒకే మగ సంతానం. ఆడపిల్లకు వివాహం అయింది. ఇంటర్మీడియట్ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ప్రమాదంలో లోకాన్ని వీడి వెళ్లిపోవడంతో తమ కుటుంబానికి అండ లేకుండా పోయిందని వారు రోదిస్తుండడం చూపరులను కంట తడి పెట్టించింది. ఓడూరు అఖిల్నంబారు అజయ్ -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంధన కొరత
చోడవరం : కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఇటీవల కొద్దిరోజులుగా పెట్రోల్,డీజిల్ కొరత అంటూ పలు బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టడం, మరికొన్ని బంకుల్లో ఆయిల్ కోసం వాహదారులు భారీ క్యూలైన్లలో నిలుచొని చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి, సమన్వయకర్త గుడివాడ అమర్నాధ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మంగళవారం ప్రజా సర్వే నిర్వహించారు. ఆయిల్ కృత్రిమ కొరత కారణంగా వాహనదారులు, ఆటోడ్రైవర్లు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చోడవరం బంకుల్లో వైఎస్సార్సీపీ నాయకులు నేరుగా వాహదారులతో మాట్లాడారు. ఆయిల్ కొరత వల్ల ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆయిల్ కృత్రిమ కొరత ఏర్పడిందని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చోడవరం పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, జిల్లా యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, రైతు విభాగంగా జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రీరామ్మూర్తి, నియోజకవర్గం ఆర్యవైశ్య విభాగం అధ్యక్షుడు ఉప్పల బాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు బొగ్గు శ్యామల, లీగల్ సెల్ అధ్యక్షుడు బొగ్గు చందు, మాజీ వార్డు మెంబర్లు చిటికెల నాగేష్, కందర్ప శంకర్, ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేయాలి
అనకాపల్లి: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా పారదర్శకంగా ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి ఆదేశించారు. స్థానిక న్యూకాలనీ రోటరీ హాల్లో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు, ఎరువుల డీలర్లకు యాప్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల డీలర్లు అందరూ ఎప్పటికప్పుడు రికార్డులు, ప్రదర్శన బోర్డు, ఈపాస్ మిషన్లను సరిచూసుకోవాలని, ఏపీఎఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని సూచించారు. అక్రమమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీ బృందంలో కలెక్టర్, డీఆర్వో, డీఎస్వో, డీఏవో, పోలీసు అధికారి, కంట్రోల్ బోర్డు , లేబర్ డిపార్టుమెంట్, విజిలెన్స్ అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారన్నారు. భూమి హెల్త్ కార్డు ఆధారంగా ఎరువులు పంపిణీ చేయాలన్నారు. నాణ్యతా, ధరల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
మాజీ ఎమ్మెల్యే గణేష్పై దాడి అమానుషం
నర్సీపట్నం : స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు అనుచరులైన టీడీపీ గూండాలు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్పై దాడికి పాల్పడడం అమానుషమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ను అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యేలు మలసాల భరత్కుమార్, చింతల వెంకట రామయ్య కలిసి గణేష్ కుటుంబానికి, పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర కన్వీనర్ కురసాల కన్నబాబు జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. స్పీకర్ సృష్టి క్షేత్రం పేరుతో నర్సీపట్నం పెద్ద చెరువులో చేపడుతున్న అక్రమ నిర్మాణాల వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తడం వల్ల గణేష్ కోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టు స్టే ఇచ్చినప్పటికీ ధిక్కరణకు పాల్పడుతూ చెరువులో పనులు చేస్తుండడంతో ఆ మార్గంలో వెళ్తూ మాజీ ఎమ్మెల్యే గణేష్ కారు దిగి పరిశీలించారన్నారు. ఆ సమయంలో స్పీకర్ అనుచరులైన రౌడీషీటర్లు, గంజాయి నిందితులు, కర్రలు, కత్తులు పట్టుకుని కేకలు వేస్తూ గణేష్, అతని పీఏపై దాడి చేయడాన్ని రాష్ట్రమంతా చూసిందన్నారు. రాళ్లతో కారు అద్దాలను ధ్వంసం చేసి, గణేష్పై దాడికి యత్నించడం దారుణమన్నారు. బలమైన ప్రతిపక్ష నాయకుడైన గణేష్ను నిలువరించేందుకు దాడికి పాల్పడ్డారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 మాసాల్లో 21 మంది వైఎస్సార్సీపీ నాయకులను దారుణంగా హత్య చేశారన్నారు. 710 మందిపై హత్యలు, 3,500 అక్రమ కేసులు బనాయించారన్నారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు..మా నాయకులు ఏది చేస్తే అదే రాజ్యాంగం అన్న విధానంలో చంద్రబాబు ఉన్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తుంటే హోం మంత్రి విహార యాత్రలు చేస్తున్నారన్నారు. మీ దురాగతాలను ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడతారా అని మండిపడ్డారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. పార్టీలో ఎవరికి కష్టమొచ్చినా పార్టీ అండగా నిలబడుతుందన్నారు. దాడుల సంస్కృతి సరికాదు... మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో ఆరోపణలు చేసుకోవడం సహజం, దాడులకు తెగబడే సంస్కృతి ఉత్తరాంధ్రలో ఎప్పుడూ లేదన్నారు. స్పీకర్ కనుసన్నల్లోనే గణేష్పై దాడి జరిగిందన్నారు. ఘటనపై స్పీకర్ స్పందించకపోవడమే బలమైన సంకేతాన్ని ఇస్తుందన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ నిర్మాణాలు చేపట్టడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గణేష్పై దాడికి కుట్ర చేయడం దారుణమన్నారు. ఇదే సంస్కృతి కొనసాగిస్తే స్పీకర్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు మాజీ ఎమ్మెల్యే ఉమాశఽంకర్ గణేష్పై దాడికి పాల్పడిన ధనిమిరెడ్డి మధు, కట్టా నాగు, ఇట్టంశెట్టి మల్లేశ్వరరావు, కటారి తాతబాబు, బండారు సంతోష్, చింతల గణేష్ ధనిమిరెడ్డి మల్లిబాబు, ఉప్పలపు గోవిందు మరికొంత మందిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు
● ముగ్గురు ప్రయాణికులకు గాయాలు ఎస్.రాయవరం : అడ్డురోడ్డు ప్లై ఓవర్ బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్ఐ రమేష్ అందించిన వివరాలిలా ఉన్నాయి. లంకెలపాలెం నుంచి గుంటూరు వెళుతున్న లారీ ఫ్లైఓవర్ పై ఆపి టైర్లు చెక్ చేసుకుంటుండగా విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లే ప్రైవేటు ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే హైవే మొబైల్ వాహనం ద్వారా క్షతగాత్రులను నక్కపల్లి ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో 28 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్ఐ చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
1న తెలుగు జానపద జాతర
ఆరిలోవ(విశాఖ): ఉత్తరాంధ్ర సంగీత జానపద కళా పీఠం ఆధ్వర్యంలో ఆరిలోవలో మే 1న తెలుగు జానపద జాతర పేరిట మేడే ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కళా పీఠం నిర్వాహకులు తెలిపారు. పీఠం వ్యవస్థాపకుడు భగవాన్ మాస్టార్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలకు సంబంధించిన కార్యాచరణపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేయాల్సిన జానపద కార్యక్రమాల గురించి చర్చించారు. జానపద కళల ప్రోత్సాహంలో భాగంగా ఇప్పటి తరానికి వాటిని పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఉత్సవాలకు హాజరై ఉత్తరాంధ్ర జానపద కళలను ఆదరించాల్సిందిగా కోరారు. సమావేశంలో సభ్యులు కొరికాన మోహనరావు, పి.ఐ.బాలరాజు, మధుసూధనరావు, మూర్తి, బాబూరావు, రాజు, రామకృష్ణ పాల్గొన్నారు. -
పేకాటరాయుళ్ల అరెస్టు
కోటవురట్ల : పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వచ్చిన సమాచారం మేరకు నక్కపల్లి సీఐ రామకృష్ణ ఆదేశాలతో ఎస్ఐ విజయ్కుమార్ సిబ్బందితో కలిసి గొట్టివాడ శివారున పేకాట స్థావరంపై మంగళవారం దాడి చేశారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం పక్కా సమాచారంతో దాడి చేయగా పేకాడుతూ ఐదుగురు జూదరులు పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసి వారి నుంచి రూ.2,200 నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. జూదాలు నిర్వహించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా జరిగితే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
గంజాయి నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు
పరవాడ: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల అవగాన కార్యక్రమం కొనసాగుతోంది. దీనిలో భాగంగా మండలంలోని గొర్లివానిపాలెం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీఐ మల్లికార్జునరావు మాట్లాడుతూ గ్రామాల్లో గంజాయి వినియోగం, సరఫరా మార్గాలు, సంబంధిత వ్యక్తులపై సమాచార సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి సేవించేవారిని కౌన్సెలింగ్ ద్వారా సంస్కరించి, అవసరమైతే డి–అడిక్షన్ కేంద్రాలకు పంపిస్తామని పేర్కొన్నారు. సరఫరాదారులపై ప్రత్యేక నిఘా ఉంచి, ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పునరావృత నేరస్తులపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్/హెడ్ కానిస్టేబుల్ను నియమించి నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐతో పాటు ఎస్ఐ భీమరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె
మధురవాడ: మధురవాడ చంద్రంపాలేనికి చెందిన మానిపిల్లి రామకృష్ణ (60) అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా, చిన్న కుమార్తె హేమబిందు తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమతో ఆచారాలకు భిన్నంగా తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. మంగళవారం మధ్యాహ్నం చంద్రంపాలెం శ్మశాన వాటికలో జరిగిన తండ్రి అంత్యక్రియల్లో ఆమె స్వయంగా పాడె మోశారు. అంతిమ సంస్కారాల్లో తలకొరివి పెట్టి, కొడుకు లేని లోటును తన బాధ్యతతో తీర్చుకున్నారు. తండ్రిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి రుణం తీర్చుకునే క్రమంలో ఆమె కంటతడి పెట్టిన దృశ్యం అక్కడి వారిని సైతం కన్నీరు పెట్టించింది. -
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
నిందితుడితో పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావు అనకాపల్లి : పట్టణ పోలీస్ స్టేషన్పరిధిలో ఈ ఏడాది జనవరిలో గంజాయి కేసుల్లో అప్పటి నుంచి నేటి వరకూ తప్పించుకుని(బెంగుళూరు) తిరుగుతున్న అనకాపల్లి మండలం సుబ్రమణ్యకాలనీకి చెందిన నీలగిరి హరీష్ను సోమవారం ఆర్ధరాత్రి కాలనీలో అరెస్టు చేయడం జరిగిందని పట్టణ ఎస్ఐ డి.శ్రీనివాసరావు మంగళవారం చెప్పారు. గతంలో 5 కేజీల గంజాయిని పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి కొనుగోలు చేసి తనకు తెలిసిన గాజువాకకి చెందిన ఇద్దరు వ్యక్తులకు అక్రమంగా సరఫరా చేసినట్టు నేరాన్ని హరీష్ అంగీకరించినట్లు ఎస్ఐ చెప్పారు. గంజాయి విక్రయం ద్వారా రూ.43వేలు నగదు లావాదేవీలు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విదించారన్నారు. -
30న మునగపాక ఎంపీపీ ఎన్నిక
మునగపాక : ఈ నెల 30వ తేదీన మునగపాక ఎంపీపీతో పాటు రెండు వైస్ ఎంపీపీల స్థానాలకు గాను ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో ఎం.ఉషారాణి తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలో ఒక ఎంపీపీతో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీల ఎన్నిక చేపడతామన్నారు. ఎన్నికల అధికారిగా డీఎల్డీవో మంజులావాణి వ్యవహరిస్తారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. సభ్యులు సకాలంలో హాజరై ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలన్నారు. -
డిజిటల్ ప్రయాణంలో నూతన అధ్యాయం
‘భారత్ ఏఐ శక్తి’కాంక్లేవ్లో లోకేష్ మహారాణిపేట: భారతదేశ డిజిటల్ ప్రయాణంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని, మన రాష్ట్రానికి ఇది కీలక మలుపు అని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ‘భారతదేశ ఏఐ కారిడార్ను ఉమ్మడిగా నిర్మించడం’అనే అంశంపై గూగుల్ ఆధ్వర్యంలో నోవాటెల్లో మంగళవారం జరిగిన ‘భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్’లో ఆయన మాట్లాడారు. ‘విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభం కావడం కేవలం ఒక ఆరంభం మాత్రమే కాదు, దేశ డిజిటల్ ప్రయాణంలో ఇదొక చారిత్రక ఘట్టం. నేడు మనం విశాఖ పునాదులను ఏఐ విప్లవంపై నిర్మించబోతున్నాం. విశాఖ నగరం మన దేశ భవిష్యత్తును నిర్మించబోతోందని నేను బలంగా విశ్వసిస్తున్నాను’అని తెలిపారు. 2047 నాటికి విశాఖ ఎకనమిక్ రీజియన్ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం కృత్రిమ మేధ, క్లీన్ ఎనర్జీ, మెడికల్ తయారీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్కు కేంద్రంగా మారబోతోందని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ధ్యేయమని, ఏపీతో పాటు వైజాగ్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో గూగుల్ క్లౌడ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే, 49 కంపెనీల ప్రతినిధులు, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
ఏయూ శతాబ్ది వేడుకల్లో దళిత ఎంపీకి అవమానం
వీసీపై ఏఎంఎస్, డీహెచ్పీఎస్ ఆగ్రహం సీతంపేట: ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును ఆహ్వానించి, వేదిక మీదకు పిలవకుండా అవమానపరచడం దారుణమని అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ(ఏఎంఎస్) అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు ధ్వజమెత్తారు. రామాటాకీస్ రోడ్డులోని అంబేడ్కర్ భవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గొల్ల బాబూరావు ఏయూ పూర్వ విద్యార్థి అని, ఆహ్వాన పత్రికలో పేరు ముద్రించినప్పటికీ వేదికపైకి ఆహ్వానించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ ఘటనకు ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ బాధ్యత వహించాలని, ఆయనను వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. డీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జె.వి.ప్రభాకర్ మాట్లాడుతూ.. ఘన చరిత్ర కలిగిన ఏయూ వందేళ్ల పండగ ఏ ఒక్కరికో సొంతం కాదని, ఇది కేవలం టీడీపీ కార్యక్రమంగా జరపడం సరికాదని విమర్శించారు. -
రాజా వెంకటాద్రి నాయుడుకు నివాళులు
తుమ్మపాల: స్వాతంత్య్ర సమరయోధుడు, సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు రాజా వెంకటాద్రి నాయుడు అని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వార్థరహిత సేవ, దేశభక్తి, సామాజిక న్యాయం పట్ల ఆయన చూపిన కట్టుబాటు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి విశేషమని, ప్రజలలో చైతన్యం కలిగించేందుకు చేసిన ప్రయత్నాలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో సమానత్వం, ఐక్యత, నైతిక విలువలు పెంపొందించడంలో ఇలాంటి మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ సుబ్బలక్ష్మి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇంధన సెగ..
చుక్క చమురైనా లేక...జిల్లాలో పలు చోట్ల నో స్టాక్ బోర్డులు ● ఆందోళనలో వాహనదారులు ● కొరత లేదంటూ అధికారులు ప్రకటన ● ఇంధన అక్రమ మళ్లింపు, బ్లాక్లో అమ్మే వారిపై కఠిన చర్యలంటున్న కలెక్టర్ ● జిల్లాలో 169 పెట్రోల్, డీజిల్ బంక్లు మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026బతుకు బండికిజాబ్ మేళా క్యాలెండర్ విడుదల తుమ్మపాల: జాబ్మేళాలను నిరుద్యోగ యువత ద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం జాబ్ మేళా క్యాలెండర్ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో నిర్వహించిన జాబ్ మేళాల్లో రాష్ట్రంలోనే మన జిల్లాలో అత్యధిక సంఖ్యలో నియామకాలు జరిగాయన్నారు. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ సంవత్సరం మరింత విస్తృత స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో నిర్దిష్ట తేదీల ప్రకారం మేళాలు నిర్వహిస్తారన్నారు. ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు తదితర పత్రాలతో హాజరు కావాలని సూచించారు. సాక్షి, అనకాపల్లి: గంటల తరబడి ఎదురుచూపులు..అరకొరగా ఇంధనం..కనుచూపుమేర వాహనాలు క్యూలైన్లు..ఇది సోమవారం అనకాపల్లి జిల్లాలో గల పెట్రోల్ బంకులు పరిస్థితి. జిల్లావ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. రెండు రోజులుగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పెట్రోల్ బంకులతో పాటు ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్‘ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని బంకుల్లో మాత్రమే పరిమితంగా స్టాక్ ఉండడంతో, అక్కడ కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే ఇంధన కొరత వేధించడం..రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అంటూ వాహనదారులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.169 పెట్రోల్ బంకులు ఉండగా అందులో మూడొంతుల పెట్రోల్ బంకుల్లో భారీగా క్యూలైన్లు ఉన్నాయి. జాతీయ రహదారిని అనుకుని పాయకరావుపేట నుంచి లంకెలపాలెం వరకూ ఉన్న పెట్రోల్ బంకుల్లో పరిమితి మించి డీజిల్ ఇవ్వడం లేదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి జిల్లాలో పెట్రోల్, డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కూరగాయలు, బియ్యం వంటి నిత్యావసరాల రవాణా భారమైతే సామాన్యుడి బతుకు బండి కష్టమవుతుంది. దీని ప్రభావం ఇటు రైతుపై అటూ సామాన్యులపై కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తగు చర్యలు తీసుకోకుంటే సంక్షోభానికి దారితీసే అవకాశాలున్నాయి. ఎక్కువగా డీజిల్ వినియోగం జిల్లా అధికారిక యంత్రాంగం గణాంకాల ప్రకారం అనకాపల్లి జిల్లాలోని సుమారు 169 పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి. దాదాపు 18 లక్షల లీటర్ల పెట్రోల్, 35 లక్షల లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయంటూ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నిల్వలు సాధారణ పరిస్థితుల్లో జిల్లా అవసరాలకు మరో 7 నుంచి 10 రోజులకు సరిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు 2.5 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతోంది. అదేవిధంగా రోజుకు సగటున 4.8 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లా ఒక పారిశ్రామిక హబ్ కావడంతో డీజిల్ వినియోగం చాలా ఎక్కువ ఉంటుంది. అచ్యుతాపురం ఎస్ఈజెడ్, పరవాడ ఫార్మా సిటీలలోని జనరేటర్లు, భారీ యంత్రాలు, సరుకు రవాణా వాహనాలకు ఈ ఇంధనం ప్రాణాధారంగా మారింది. దీంతో ఎక్కువగా డీజిల్ వినియోగం ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. దేవరాపల్లి: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. మండలంలోని తారువలో సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వానికి ముందు చూపు లేక పోవడమే రాష్ట్రంలో ఇంధన సంక్షోభానికి కారణమని ఆయన ఆరోపించారు. మూడు రోజులుగా రాష్ట్రంలో ఇంధన కొరతతో ప్రజలు నరకయాతన పడుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోక పోవడంతో సమస్య మరింత తీవ్రమైందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్ల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ప్రజలు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. అక్కడక్కడ బంక్లు తెరిచి ఉన్న లీటర్ పెట్రోలు, డీజిల్ కోసం మండుటెండల్లో గంటల కొద్దీ నిరీక్షణ చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పెట్రోల్ బంక్ల డీలర్లు, ప్రభుత్వం కుమ్మకై ్క రాష్ట్రంలో కృత్రిమంగా పెట్రో, డీజిల్ కొరత సృష్టించారని ఆయన ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో ఎక్కడా పెట్రోలు, డీజిల్ కొరత లేక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరతపై తమ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రిని సంప్రదిస్తే ఎక్కడా సరఫరాలో లోటు లేదని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్ లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారన్నారు. అలాంటప్పుడు పెట్రోల్, డీజిల్ కొరత ఎందుకు ఏర్పడిందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతారనే ప్రచారంతో డీలర్లు స్టాక్ను బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 70 శాతానికిపైగా బంక్లు నో స్టాక్ బోర్డులు పెట్టడమే చూస్తే ఇంధన సంక్షోభం ఏ స్థాయిలో ఉందని అర్ధమవుతుందన్నారు. కేంద్ర పెట్రోలియం రసాయనాల శాఖ మంత్రి మాత్రం తాము పెట్రోలు, డీజిల్ సరఫరా తగ్గించలేదని చెప్పడం చూస్తే ప్రభుత్వ కుట్ర ఉందని స్పష్టమవుతుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇంధన సంక్షోభంపై దృష్టి సారించి ప్రజలకు పెట్రోలు, డీజిల్ కష్టాలు తీర్చాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలోనే ఎందుకీ దుస్థితి ? మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం 30న బీసీ కమిషన్ రాకమహారాణిపేట: బీసీ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈనెల 30న విశాఖలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజా ప్రతినిధులు, సాధారణ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. డెడికేటెడ్ కమిషన్ ఆదేశాల మేరకు విచారణకు సంబంధించి విషయమై అవగాహన కలిగిన వ్యక్తులు వినతి పత్రాలు సమర్పించవచ్చు. కశింకోటలో జాతీయ రహదారిను ఆనుకుని ఉన్న ఆర్ఈసీఎస్ ఎదుట బీపీసీఎల్ పెట్రోల్ బంకులో ఆదివారం ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం నుంచి లారీకు 25 లీటర్లు మించి ఇవ్వడం లేదు. కారుకు రూ.2 వేల వరకూ, బైక్ రూ.1000 వరకూ పెట్రోల్ పోస్తున్నారు. అనకాపల్లి టౌన్లో హెచ్పీ పెట్రోల్ బంక్లో పరిమితంగా ప్రెట్రోల్, డీజిల్ పోస్తున్నారు. దీంతో వాహనదారులు క్యూ కట్టారు. పాయకరావుపేట పట్టణంలో సాయి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో పెట్రోలు ఉంది. డీజీల్ కొరత ఉంది. జాతీయ రహదారిపై నామవరం గ్రామం వద్ద గల ఇండియన్ ఆయిల్ బంక్లో ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు. పి.ఎల్ పురం వద్ద హెచ్పీ పెట్రోల్ బంక్లోనూ ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు. ఎస్.రాయవరం మండలంలో అడ్డురోడ్డులో పరిధిలో శ్రీనివాస పెట్రోల్ బంకు, హెచ్పీ పెట్రోల్ బంకులో పెట్రోలు ఉంది. డీజీల్ కొరత తీవ్రంగా ఉంది. అడ్డురోడ్డులో ఇండియన్ ఆయిల్ బంకుల్లో డీజిల్ కోసం భారీ క్యూ లైన్లు ఉన్నాయి. నక్కపల్లి మండలంలో ఒట్టిమెట్టలో ఇండియన్ ఆయిల్బంకులో ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు. నక్కపల్లిలో పోలీస్ వెల్ఫేర్ అసోషియేషన్ బంకులో బైక్కు రూ.200 పెట్రోల్, కారుకు రూ.500 డీజిల్ వరకు కొడుతున్నారు. కోటవురట్లలో హెచ్పీ పెట్రోల్ బంకులో డీజిల్ కొరత ఉంది. అదే మండలంలో జల్లురు గ్రామంలో ఉన్న భారత్ పెట్రోల్ బంక్లో డీజిల్ కొరత ఉంది. నర్సీపట్నం పట్టణం శారదానగర్లో ఇండియన్ ఆయిల్ బంక్లోనూ, చింతపల్లి రోడ్డులో ఇండియన్ బంక్లో కూడా నో స్టాక్ బోర్డులు పెట్టారు. గొలుగొండలో హెచ్పీ పెట్రోల్ బంకులో ‘నో స్టాక్’ బోర్డు పెట్టారు. చోడవరం మండలం వెంకన్నపాలెంలో పెట్రోల్ బంక్లో ‘నోస్టాక్’ బోర్డు పెట్టారు. అచ్యుతాపురంలో పూడిమడక సమీపంలో హెచ్పీ పెట్రోల్ బంకులో రూ.200 పెట్రోల్ , రూ.500 డీజిల్ మాత్రమే కొడుతున్నారు. సబ్బవరంలో ఆరిపాకలో హెచ్పీ పెట్రోల్ బంక్లో పెట్రోల్, డీజీల్ పరిమితంగా పోస్తున్నారు. పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూలైన్లు ఉన్నాయి. పారిశ్రామిక సెజ్లో వేధిస్తున్న ఇంధన కొరత పెరిగిన పెట్రోల్, డీజిల్ వినియోగం మరికొన్ని చోట్ల పరిమితంగానే పెట్రోల్, డీజిల్ ఆటోవాలాలకు తప్పని డీజిల్ కష్టాలు -
గూగుల్కు సర్కార్ దాసోహం
మద్దిలపాలెం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గూగుల్కు దాసోహమైందని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు విమర్శించారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డాక్టర్ బి.గంగారావు, వి.కృష్ణారావులతో కలిసి పిఠాపురం కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయం ఏచూరి భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం, అడవులు, వన్యప్రాణులను పణంగా పెట్టి 601.40 ఎకరాల భూమి, రూ.22 వేల కోట్ల ప్రజాధనాన్ని గూగుల్ డేటా సెంటర్కు కేటాయించారని ఆరోపించారు. పర్యావరణ, అటవీ చట్టాలను ఉల్లంఘిస్తూ అదానీ భాగస్వామ్యంతో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఈ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్ష, పరోక్షంగా 1,88,220 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా) నివేదికలో నిర్మాణ దశలో 240, కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 1,375 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని పేర్కొన్నారని చెప్పారు. -
శతాబ్ది సాక్షిగా.. రాజకీయ డబ్బా!
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ముగిశాయి. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సోమవారం జరిగిన తుది వేడుకల్లోను స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా వినిపించాయి. ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రసంగాలు మినహా, మిగిలిన వారి మా టలన్నీ రాజకీయ వేదికను తలపించాయి. విద్యాలయాల పవిత్రతను కాపాడాల్సిన సభలో అకడమిక్ అంశాల కంటే రాజకీయ ప్రశంసల హోరు పెరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విశాఖను పాలనా రాజధానిగా వ్యతిరేకిస్తూ నగరంపై విమర్శలు చేసిన వారే, నేడు ఏయూ ఘనతను ఆకాశానికెత్తడం పలువురిని విస్మయానికి గురిచేసింది. ఆకట్టుకున్న సాంస్కృతిక, ఫొటో ప్రదర్శనలు మధ్యాహ్నం 2 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శాసీ్త్రయ నృత్యాలు, అన్నమాచార్య కీర్తనాలు అలరించాయి. విశ్వవిద్యాలయ చరిత్ర, చారిత్రక సంఘటనలను తెలిపే విధంగా ప్రధాన వేదికకు వెనుక భాగంలో ఉన్న ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా నిలిచింది. ఎగ్జిబిషన్ ప్రత్యేకతలను ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ ప్రత్యేకంగా ఉపరాష్ట్రపతి ఇతర ప్రముఖులకు వివరించారు. ఏయూ చిత్రకళా విభాగం విద్యార్థులు తయారు చేసిన అనేక శిల్పాలను ప్రదర్శనలో ఉంచారు. మూడు అవగాహన ఒప్పందాలు ఈ వేడుకల్లో మూడు అవగాహన ఒప్పందాలను చేసుకున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో ఎంవోయూ జరిగింది. ఓ.ఎక్స్.ఎం.ఐ.క్యూ తో ఏయూ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ ఏఐ సిస్టమ్ నెలకొల్పే విధంగా మరో ఒప్పందం జరిగింది. దీనిలో దాదాపు 400 కోట్లతో అభివృద్ధి చేస్తారు. అదే విధంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ(ఐఐటీఎం)తో అవగాహన కుదుర్చుకున్నారు. రూ.180 కోట్లకు సంబంధించిన మెటీరియాలజీకి సంబంధించిన పరికరాలు, మౌలిక వసతుల కల్పన చేస్తారు. భారీగా విద్యార్థుల సమీకరణ ముగింపు వేడుకలకు భారీగా విద్యార్థులను సమీకరించారు. ఏయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఆచార్యులు, నాన్టీచింగ్ స్టాఫ్తో పాటు ఏయూ గుర్తింపు కాలేజీల విద్యార్థులను తరలించారు. నగరం నుంచి మాత్రమే కాకుండా అనకాపల్లి జిల్లా నుంచి కూడా విద్యార్థులు ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా తీసుకురావడం గమనార్హం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థులను తీసుకురావాలని పలు ఏయూ గుర్తింపు కాలేజీల నిర్వాహకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ.. సభా ప్రాంగణం నిండలేదు. విద్యార్థులు వెళ్లిపోకుండా నిర్బంధం వేడుకల్లో సచిన్ ప్రసంగం తర్వాత విద్యార్థులు ప్రాంగణం నుంచి వెళ్లిపోడానికి సిద్ధమయ్యారు. అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న ప్రాంగణం వారు వెళ్లిపోతే ఖాళీ అయిపోతుందని అధికారులు గుర్తించారు. వెంటనే విద్యార్థులు వెళ్లిపోకుండా కట్టడి చేశారు. అందరి ప్రసంగాలు ముగిసేంత వరకు విద్యార్థులు బయటకు రాకుండా దారులను మూసివేశారు. అప్పటికీ కొందరు వాటిని దాటుకొని వెళ్లడానికి ప్రయత్నించగా పోలీస్ సిబ్బంది, వలంటీర్లతో అడ్డగించడం గమనార్హం. దళితుడిననే పిలిచి అవమానించారా చంద్రబాబూ.? – ఎంపీ గొల్ల బాబూరావు ఆగ్రహం విశాఖసిటీ: దళితుల పట్ల చంద్రబాబు మరోసారి నీచమైన బుద్ధిని ప్రదర్శించారని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు వ్యాఖ్యానించారు. శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం అందడంతో వేడుకలకు హాజరైతే తనని వేదికపైకి ఆహ్వానించకుండా అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఒక రాజ్యసభ సభ్యునికి ఇచ్చే మర్యాద ఇదేనా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మొదటి నుంచి దళితులంటే చిన్నచూపనీ.. ఇది కేవలం గొల్ల బాబూరావుకి జరిగిన అవమానం కాదనీ.. యావత్ దళిత జాతికి జరిగిన అవమానమని దుయ్యబట్టారు. ఏ అర్హత ఉందని డైరెక్టర్ త్రివిక్రమ్ని వేదిక పైకి ఆహ్వానించారని ప్రశ్నించారు. నాకు జరిగిన అవమానం పై రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. సచిన్ ప్రత్యేక ఆకర్షణ మద్దిలపాలెం: శతాబ్ది ఉత్సవాల్లో సచిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ముగింపు సభకు రావడం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సచిన్ సభా వేదిక వద్దకు రాగానే విద్యార్థులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. సచిన్ స్కెచ్లు వేసిన పోస్టర్లను ప్రదర్శించారు. సచిన్ ప్రసంగిస్తున్న సమయంలో కూడా సచిన్ సచిన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన చేసిన ఉత్తేజపూరిత ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు. అలాగే ఏయూలో ఫిజిక్స్ చదువుకోవడానికి వచ్చి తెలుగు సాహిత్యం వైపు ఎలా మళ్లారో సినీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో వివరిస్తూ విద్యార్థులను అలరించారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు : కలెక్టర్
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై, నల్లబజారులో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖ అధికారులు పెట్రోల్ బంకుల వద్ద నిల్వలను నిశితంగా గమనిస్తున్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులపై డీలర్లు, అసోసియేషన్ ప్రతినిధులు, బంక్ యజమానులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిలాల్లోని అన్ని పెట్రోల్ బంకుల్లో తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు అనవసరంగా భయపడకుండా, అపోహలు నమ్మకుండా సాధారణంగా ఇంధనం వినియోగించాలని సూచించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఎలాంటి జాప్యం లేకుండా ఆయిల్ ట్యాంకర్లు చేరుకునే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
భూ వివాదంలో అధికారులు న్యాయం చేయడం లేదు...
–నానేపల్లి మాణిక్యం నక్కపల్లి స్టీల్ప్లాంట్ నిర్మాణం కోసం సేకరించిన భూమిలో వారసత్వంగా వచ్చిన భూమిని నా సోదరులు నాకు తెలియకుండా ఇతరులకు విక్రయించేసారని, విచారణ చేసి న్యాయం చేయాలని కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోతుందని నక్కపల్లి మండలం దోణివాని లక్ష్మీపురం గ్రామానికి చెందిన నానేపల్లి మాణిక్యం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. వారసత్వ హక్కుగా తనకు వాటాగా వచ్చే భూమిపై నష్టపరిహారం పొందేలా అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని ప్రాథేయపడినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, భూముల్లో జరుగుతున్న రీసర్వే ఆపుతానని చెప్పిన నక్కపల్లి ఎమ్మార్వో కూడా ఇప్పుడు దాటవేస్తున్నారని, తన వద్ద భూ భూమి కాగితాలు లాక్కుని తిరిగి ఇవ్వకుండా నానా బాధలు పెడుతున్నారని వాపోయాడు. -
పాండవుల చెరువు ఆక్రమణలు తొలగించాలి
మాడుగుల రూరల్: మాడుగుల పాండవుల చెరువులో ఆక్రమణలను తొలగించి, అభివృద్ధి చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.టి. దొర డిమాండ్ చేశారు. సోమవారం వీరు ఇక్కడ చెరువును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మాడుగుల మోదమాంబ ఆలయం సమీపంలో సర్వే నంబరు 258లో 11 ఎకరాలు 60 సెంట్లు చెరువు గర్భం కలిగిన పాండవుల చెరువును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ చెరువులో సగ భాగం ఆక్రమణలు ఉన్నాయని, వాటిని తొలగించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులు కోట్లాది రూపాయల విలువ చేసే చెరువును కబ్జా చేసి, దాని నుంచి తప్పించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మానస సరోవరం పేరుతో నాబార్డు నిధులు రూ. 50 లక్షలతో కొంత మేర అభివృద్ధి చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై సోమవారం కలెక్టరుకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ సమస్యకు సంబంధించి, తహసీల్దారు, ఇతర అధికారులు జోక్యం చేసుకోని, చెరువు చుట్టూ ఆక్రమణలను తొలగించిన తర్వాత అభివృద్ధికి సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే స్థానికులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. -
అర్జీదారులకు వ్యయ ప్రయాసలు
తుమ్మపాల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు జిల్లాలో పలు మండలాల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కారం కోసం వృద్ధులు, వికలాంగులతో పాటు సాధారణ ప్రజలు వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలను అధికారుల వద్ద మొర పెట్టుకుంటున్నారు. జిల్లా అఽధికారులను కలవాలంటే గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నుంచి రెండు కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అర్జీదారులు వాపోతున్నారు. ఎండల తీవ్రత కలెక్టరేట్ ప్రాంగణంలో ఎటువంటి నీడ సౌకర్యాలు లేకపోవడంతో చెట్ల కిందే సేదతీరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వేసవిలో సౌకర్యాలు మొరుగుపరచాలని కోరుతున్నారు. అర్జీలు పునరావృతం అయితే అధికారులదే బాధ్యత... ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాని విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సమావేశ మందిరం, వీసీ హాలులో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఎస్డీసీ సుబ్బలక్ష్మి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం అయితే సంబంధిత శాఖ జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వివిధ సమస్యలపై పీజీఆర్ఎ్స్– 109 అర్జీలు, రెవెన్యూ క్లినిక్ కు 164 వినతులు మొత్తం 273 అర్జీలు నమోదైనట్టు తెలిపారు. -
అయ్యన్న అనుచరుల అరాచకం
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల అరాచకాలు పెరిగిపోతున్నాయి. న్యాయస్థానం ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీ పెద చెరువులో చేపడుతున్న సృష్టి క్షేత్రం నిర్మాణ పనులను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నర్సీపట్నం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కారు ధ్వంసం చేయడమే కాకుండా, ఆయన పీఏపై అయ్యన్న అనుచరులు, టీడీపీ రౌడీ మూకలు దాడి చేశారు. వివరాలోకి వెళితే..కోర్టు స్టే ఉన్నప్పటికీ నర్సీపట్నం పెద్ద చెరువులో అక్రమంగా జరుగుతున్న సృష్టి క్షేత్రంలో పనులను అడ్డుకునేందుకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోమవారం రాత్రి వెళ్లారు. ఎమ్మెల్యే కారు చెరువు గర్భంలోకి వెళ్లే మార్గంలో ఆపి ఉంది. ఆ సమయంలో ఆయనతో పీఏ, ఇద్దరు నాయకులు మాత్రమే ఉన్నారు. ఇంతలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరులు, టీడీపీ మూకలు పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. కారు ఎందుకు అడ్డం పెట్టావు.. అంటూ వీరంగం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే గణేష్పైకి దూసుకు వచ్చేందుకు యత్నించారు. దీంతో అప్పటికే అక్కడకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే అనుచరులు, టీడీపీ వారి మధ్య మాటల యుద్ధం నెలకొంది. టౌన్ ఎస్ఐలు రమేష్, ఉమామహేశ్వరరావు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ను కారు ఎక్కించారు. ఈ క్రమంలో టీడీపీ మూకలు రెచ్చిపోయి గణేష్ కారు అద్దాలు ధ్వంసం చేశారు. టీడీపీ వారు రెచ్చిపోయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే గణేష్ శాంతం వహించారు. పోలీసులు వారించడంతో ఇరువర్గాల వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. స్పీకర్కు నోటీసులు జారీ.. స్పీకర్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు కోర్టు ఉత్తర్వులను గౌరవించాల్సింది పోయి, ఆయన ఆదేశాలతో చెరువులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కోర్డు ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి స్టే ఉన్న చెరువు గర్భంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చట్టరీత్యా నేరమైనా సృష్టి క్షేత్రం పేరుతో అక్రమ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణాలతో రైతులకు అన్యాయం జరుగుతుండడంతో వారి అభ్యర్థన మేరకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పెద్ద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. తరుపరి విచారణను జూన్ 17వ తేదీ నాటికి వాయిదా వేసింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్తో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడికి సైతం కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ చెరువు గర్భంలో యంత్రాలు ఉండడం, ఉపాధి కూలీలతో పనులు చేయించడంపై మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇటీవల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు లేకపోగా చెరువు గర్భంలో అక్రమంగా పనులు ఏర్పాటు చేసేందుకు యంత్రాలు, మెటీరియల్ను సిద్ధం చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటే అరాచకమా..! బాధ్యతయుతమైన పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదు. కోర్టు ఉత్తర్వులను పరిగణరలోకి తీసుకుని ఆర్డీవో ఇరిగేషన్ ఈఈపై చర్యలు తీసుకోవాలని పీజీఆర్ఎస్లో ఎస్పీకి ఫిర్యాదు చేశాం. ఆర్డీవో, ఇరిగేషన్ అదేశాలతో పనులకు శ్రీకారం చుడుతున్న చెట్టుపల్లి సచివాలయం ప్రభుత్వ సర్వేయర్ శెట్టి రమణ, లైసెన్స్ సర్వేయర్ బోళెం దొర, వీఆర్ఏ చెవ్వల నరసింహమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరడం జరిగింది. అక్రమ నిర్మాణాల ద్వారా ఆయకట్టుదారుల నోటిలో మట్టి కొట్టేందుకు స్పీకర్ ప్రయత్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటే నా పీఏపై అయ్యన్నపాత్రుడు అనుచరులు, టీడీపీ రౌడీలు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా నా కారును పూర్తిగా ధ్వంసం చేశారు. –మాజీ ఎమ్మెల్యే గణేష్ -
10 ఎకరాల సరుగుడు తోట దగ్ధం
రూ. 10 లక్షల ఆస్తి నష్టం రావికమతం: మండలంలోని టి.అర్జాపురం సమీపంలో సోమవారం పదెకరాల సరుగుడు తోట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన రైతులు మడగల శ్రీను, మరిశా హేమంత్ కుమార్, మరిశా అప్పారావు, బాలరాజు, అప్పలకొండ, అద్దిపల్లి రాము, మడగల అప్పారావు, కంఠం రెడ్డి వెంకటరమణ, ఉల్గింగల రాములకు చెందిన పదెకరాల సరుగుడు తోట కాలి బూడిదైంది. దీని నష్టం విలువ రూ. 10 లక్షల ఉంటుందని అంచనా. ఈ సంఘటన ఎలా జరిగిందో తెలియదని, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని రైతులు వాపోతున్నారు. -
చోరీల కేసులో నిందితుల అరెస్టు
106.34 గ్రాముల బంగారం, 148.30 గ్రాముల వెండి స్వాధీనంఅనకాపల్లి: తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న గాజువాక మండలం వడ్లపూడి కణితి ఆర్.హెచ్.కాలనీకి చెందిన కాండ్రేగుల తోకనాథవీరసాయి శ్రీనివాస్, మేరీలను మండలంలో తుమ్మపాల పంచాయతీ ఏలేరు కాలువ వద్ద పట్టుకున్నామని డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. తమ కార్యాలయంలో సోమవారం ఆమె వివరాలు వెల్లడించారు. శ్రీనివాస్, మేరీల వద్ద నుంచి 106.340 గ్రాముల బంగారం, 148.30 గ్రాముల వెండి, రూ.3,500, రెండు సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులిద్దరూ ఈ నెల 22న పట్టణంలో గాంధీనగరం 1వ వీధిలో తాళం వేసి ఉన్న గృహంలో చోరీకి పాల్పడారని తెలిపారు. అదేరోజు పిసినికాడలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. గతంలో వీరిద్దరిపై విశాఖ, దువ్వాడ పోలీస్ స్టేషన్లో రెండు గంజాయి కేసులు, కోట్లాట కేసులు, చోడవరంలో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయన్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ జి.ప్రేమ్కుమార్, క్రైం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాల్సిందే..
అనకాపల్లి: రాష్ట్రంలో మహిళలు తలదించుకునే విధంగా తన పత్రికలో అనుచిత రాతలు రాసిన ఏబీఎన్ అధినేత రాధాకృష్ణపై సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకాడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్సీపీ శ్రేణులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికి ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఈ మేరకు స్థానిక ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మోహన్రావుకు సోమవారం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకుల ఆధ్వర్యంలో ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బొడ్డేడ మాట్లాడుతూ రాధాకృష్ణ తన పత్రికలో ఇస్టానుషారంగా రాతలు రాస్తున్నప్పటికీ సీఎం చంద్రబాబునాయుడుకు చీమకుట్టినట్లుగా లేదన్నారు. ఇంతవరకూ చర్యలు తీసుకోకుండా మహిళల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. దిగువ స్థాయి స్థాయి పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. ఎస్పీ కార్యాలయంలో న్యాయం జరగని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. యలమంచిని నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ విప్ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ రాష్ట్రంలో చెల్లెళ్లను కూడా భార్యలు కింద భావిస్తారని చెప్పడం సిగ్గుచేటన్నారు. హిందూ ధర్మంలో మహిళలను ఎంతో గొప్పగా పూజిస్తారని, అటువంటి వారిని కించపరిచే విధంగా తన పత్రికల్లో రాయడం గర్హనీయమన్నారు. మాజీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ మహిళల పట్ల, వైఎస్సార్సీపీ నాయకత్వం పట్ల, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెనుక నడిచే వారిపై అవమానపరిచే విధంగా రాతలు చేయడం దారుణమన్నారు. తెలుగుజాతి గౌరవించేలా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఎన్టీ రామారావు పాలన చేస్తే, నేటి పాలనలో మహిళలను కించపరిచే విధంగా ఏబీఎన్ రాధాకృష్ణతో తమ పత్రికలో రాయించడం సిగ్గుచేటన్నారు. పార్లమెంట్ సాక్షిగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు చేపడుతుంటే, రాష్ట్రంలో వారిని అవమానించిన రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ మాట్లాడుతూ రాధాకృష్ణకు తన ఇంట్లోనూ మహిళలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. దాన్ని మరచి తన పత్రికల్లో మహిళలను కించపరిచే విధంగా రాయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మహిళలను దైవంగా భావించే దేశంలో వారిని అవమానించడం క్షమించరాని నేరమన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి, నర్సీపట్నం నియోజకవర్గాల సమన్వయకర్తలు మలసాల భరత్కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేష్, నియోజకవర్గ పరిశీలకులు పైలా శ్రీనివాసరావు, గండి రవికుమార్, వీసం రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పరవాడ జెడ్పీటీసీ పి.సన్యాసిరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.గోవింద్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, సీనియర్ నాయకులు మళ్ల బుల్లిబాబు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం
చోడవరం: విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మోటారు సైకిలిస్టు దుర్మరణం చెందాడు. తల్లిదండ్రులకు ఏకై క ఆధారమైన కుమారుడు మృతి చెందడంతో వారు బోరున విలపించారు. మండలంలోని బీఎన్రోడ్డుపై గజపతినగరం దగ్గర సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారెన్స్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందాడు. మాడుగుల మండలం వంటర్లపాలెం గ్రామానికి చెందిన లెక్కల శ్రీనివాసు (28) అచ్యుతాపురం వద్ద లారెన్స్ కంపెనీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న కంపెనీ తన స్వగ్రామానికి దూరంగా ఉండటంతో అనకాపల్లి మండలం అల్లిఖానుడుపాలెంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ రోజూ డ్యూటీకి వెళుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి డ్యూటీ నుంచి తన స్వగ్రామమైన వంటర్లపాలెం వెళ్లి అక్కడ తల్లిదండ్రులతో గడిపి సోమవారం యధావిధిగా పనికి వెళ్లేందుకు తన మోటారు సైకిల్పై అచ్యుతాపురం బయలుదేరాడు. చోడవరం –అనకాపల్లి రోడ్డులో చోడవరం మండలం గజపతినగరం సమీపంలో తన ముందు ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న శ్రీనివాసు మోటారు సైకిల్ అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొట్టాడు. దీనితో అతనికి తీవ్ర గాయాలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. తన కన్నకొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. తమకు దిక్కెవరంటూ వారి ఆవేదన అందర్నీ కలిచివేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జోగారావు తెలిపారు. మృతిదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామన్నారు. -
లారీ ఢీకొని ఉపాధి కూలీ మృతి
మరో ఇద్దరికి గాయాలునక్కపల్లి: కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే నక్కపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు మహిళా కూలీలు సోమవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్తున్నా రు. జాతీయ రహ దారి పక్కన ఉన్న అప్రోచ్ రోడ్డుపై నడిచి వెళ్తున్న వీరిని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బద్దా సత్యవతి (45)కి తీవ్ర గాయాలై నక్కపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. చిన్న నూకమ్మ, ఏనుగుపల్లి సత్యవతిలకు తీవ్రగాయాలవడంతో ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. బాధితులను వైస్ ఎంపీపీ వీసం నానాజీ, టీడీపీ ఇన్చార్జి వెంకటేష్, కోసూరు శ్రీను, శంకర్, వీసంరాజు తదితరులు పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మురళి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న నూకమ్మ, ఏనుగుపల్లి సత్యవతి -
అంబేడ్కర్ విగ్రహ ధ్వంసంపై ఫిర్యాదు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం అంబేడ్కర్ నగర్లో ఈనెల 25న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దండ జ్ఞానదీప్, దళిత సంఘాల జిల్లా నాయకుడు ఎస్.నూకరాజు సోమవారం పట్టణ సీఐ జి.ప్రేమ్కుమార్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఎడమ నేత్రాన్ని శనివారం రాత్రి సుమారుగా 11.30 నుంచి 2 గంటల మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, దోషుల్ని తక్షణమే అరెస్టుచేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. -
గడ్డి మందు తాగి ఇద్దరు మృతి
నాతవరం: మండలంలో వెదురుపల్లి గ్రామానికి చెందిన లగుడు సన్యాసియ్య అలియాస్ ముసలియ్య (55) మద్యం మత్తులో గడ్డి మందు సేవించి మృతి చెందాడు. నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు వివరాల ప్రకారం.. వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం సాగించే సన్యాసియ్య ఆదివారం ఉదయం నుంచే మద్యం సేవిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే పనులు చూసుకుని సాయంత్రం పొలంవద్ద పాకలో దాచుకున్న మద్యం బాటిల్ తాగేందుకు వెళ్లాడు. మద్యం బాటిల్ పక్కనే ఉన్న గడ్డి మందు బాటిల్ తాగేసాడు. తాగిన కొద్ది సేపటికే అపస్మారక స్థితికి చేరడంతో గమనించిన కుటుంబీకులు వెంటనే నర్సీపట్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యులు సోమవారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఈ సంఘటనపై కేను నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలకు వివాహమైంది. అచ్యుతాపురం రూరల్: మండలంలో తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన అయినేల్లు పోతురాజు (51) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తాళలేక కుటుంబానికి భారం కాకూడదని మనస్థాపంతో ఈ నెల 18న గడ్డి మంది తాగారు. కుటుంబ సభ్యులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్లో చేర్పించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ల జిల్లా నూతన కార్యవర్గం
నాతవరం: ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న వర్కుఇన్స్పెక్టర్ల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు తాండవ డివిజన్ పరిధిలో గల కోటనందూరు సెక్షన్ కార్యాలయంలో సోమవారం జరిగాయి. రాష్ట్ర అద్యక్షుడు పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి, జిల్లా నూతన అధ్యక్షుడిగా బి.వి.నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఎస్.అప్పారావు, ఉపాధ్యక్షులుగా కె.బంగ్రారాజు, కె.సూరి అప్పారావు, కార్యదర్శిగా బి.సత్యనారాయణ, ఇతర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి ఎస్.సుబ్బరాజు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికై న జిల్లా కార్యవర్గ సంఘం సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ వర్క్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. -
కుళాయిల్లో కలుషిత నీరు..
చోడవరంలో తాగునీటికి కటకటచోడవరం: అసలే వేసవి.. ఎండలు మండిపోయి జనం దాహం..దాహం అంటున్న సమయంలో కుళాయిల ద్వారా మురుగునీరు సరఫరా కావడం ప్రజలకు మరింత ఇబ్బందులకు గురిచేసింది. పట్టణంలో పలు ప్రాంతాల్లో కుళాయిలు ద్వారా కలుషిత నీరు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యడ్లవీధి, గునిశెట్టివారి వీధి, పిల్లావారితోట, దుడ్డువీధి, చిన్నబజార్, వ్యాపారవీధి ప్రాంతాల్లో కుళాయిల ద్వారా సోమవారం కలుషిత నీరు వచ్చింది. పట్టణంలో బోర్ల ద్వారా ఉప్పునీరే వస్తుండడంతో అందరూ కుళాయిల మంచినీటిపైనే ఆధారపడే పరిస్థితి. 30వేల మంది ప్రజలు ఉన్న పంచాయతీల్లో తరుచూ అంతరాయం ఏర్పడడం, కలుషిత నీరు సరఫరా అవ్వడం జరుగుతుంది. పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
ఎస్పీ కార్యాలయానికి 54 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 54 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నా రు. భూ సమస్యలు, చీటింగ్, ఆర్థిక నేరాలు, ఉద్యోగుల పేరుతో మోసాలు, అధిక వడ్డీ ఆశచూపి నగదు కాజేయడం, ఆన్లైన్ మోసాలకు, భార్యాభర్తల మధ్య కలహాలు, వేధింపులకు సంబంధించిన అర్జీ లు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ వాహనంపై టీడీపీ గూండాల దాడి
నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ వాహనంపై టీడీపీ గుండాలు దాడి చేశారు. ఉమా శంకర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. హైకోర్టులో స్టే ఉండగా.. రాత్రిపూట నర్సీపట్నంలోని సృష్టి క్షేత్రంలో అక్రమంగా మట్టి తవ్వకం, ఇతర పనులు జరుగుతున్నాయి. వాటిని ఉమా శంకర్ పరిశీలించారు. హైకోర్టులో స్టే ఉండగా పనులు ఎలా జరుపుతున్నారని ప్రశ్నించారు.ఆయనను అడ్డుకున్న టీడీపీ గూండాలు వాగ్వివాదానికి దిగారు. హైకోర్టులో కేసు ఉండగా మట్టిని ఎలా తరలిస్తున్నారని ఉమాశంకర్ ప్రశ్నించారు. టీడీపీ గూండాల బరితెగింపును నిలదీశారు. కాగా, నర్సీపట్నంలో టీడీపీ గూండాలూ యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. మట్టి తవ్వకం, పనుల నిర్మాణంపై ఇప్పటికే ఉమా శంకర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సృష్టి క్షేత్రంపై ఫిర్యాదు చేసినప్పటికీ కలెక్టర్ పట్టించుకోలేదు. -
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,నక్కలపల్లి: అనకాపల్లి జిల్లా నక్కల పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కపల్లి గ్రామానికి చెందిన మహిళలపై ఏథర్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయాపడ్డారు.అప్రమత్తమైన స్థానికులు వీరిని అత్యవసర చికిత్స నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిచండంతో ఓ మహిళను అనకాపల్లికి చెందిన ఓ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గం మధ్యలో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నక్కపల్లి వైపు నుండి అడ్డురోడ్డు వైపు మహిళా కూలీలు నడుస్తూ వెళ్తుండగా.. వారి వెనక నుంచి ఏథర్ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
అచ్యుతాపురం రూరల్: మండలంలోని దిబ్బపాలెం పంచాయతీ మోటూరుపాలెం గ్రామానికి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.సీఐ చంద్ర శేఖర్ రావు, ఎస్ఐ సుధాకర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మోటూరుపాలెంకు చెందిన మదగాల అప్పలరాజు(46) సెజ్ కర్మాగారంలో కలాసీగా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం విధులకు హాజరు కావాలని కబురు రావడంతో బైక్పై బయలుదేరాడు. గ్రామ సమీపంలో వాహనం అదుపు తప్పడంతో కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అప్పలరాజును కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్ర శేఖర్ రావు, ఎస్ఐ సుధాకర్ చెప్పారు. -
మహనీయులను మరిచారు
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026విశాఖ సిటీ: విశ్వకళలకు నిలయమై, విశ్వవ్యాప్త ఖ్యాతిని గడించిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతజయంతి ఉత్సవాల వేళ చోటుచేసుకున్న పరిణామాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. వర్సిటీ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అధికార యంత్రాంగం ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణి ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులలో తీవ్ర అసంతృప్తిని నింపింది. అసలే ఉత్సవ వేడుకను 26 నుంచి 27కు మార్చడంపై ఉన్న అశాంతికి తోడు, దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని తుంగలో తొక్కడం విమర్శలకు తావిస్తోంది. మహనీయులను గౌరవించుకోరా? ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవిర్భావానికి, అభివృద్ధికి బాటలు వేసిన మహనీయులను గౌరవించుకోవడం ఈ ప్రాంగణంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. వ్యవస్థాపకుడు డాక్టర్ సీఆర్ రెడ్డి నుంచి మొదలుకొని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, డాక్టర్ వీఎస్ కృష్ణ, రాజా విక్రమ్ దేవ్ వర్మ వంటి ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా వర్సిటీ గతాన్ని స్మరించుకునేవారు. గతంలో వీసీలు, ఉన్నతాధికారులు అందరూ కలిసి ఈ నివాళులర్పించే కార్యక్రమాన్ని అత్యంత గౌరవప్రదంగా నిర్వహించేవారు. అయితే, ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్, రెక్టార్, రిజిస్ట్రార్లు ఈ సంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. వారి ఖ్యాతి మరిచారా..? ఏయూ మనుగడకు కారణమైన ఆ మహనీయుల త్యాగాలను, సేవలని ప్రస్తుత పాలకవర్గం విస్మరించింది. వర్సిటీ కోసం వందల ఎకరాల భూమిని దానం చేసిన రాజా విక్రమ్ దేవ్ వర్మ, ప్రత్యేక వర్సిటీ కోసం పోరాడిన సర్ సీఆర్ రెడ్డి, విశ్వవిద్యాలయ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రెండో వీసీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వారి విగ్రహాలు వ్యవస్థాపక దినోత్సవం నాడు వెలవెలబోవడం నగర వాసులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం వర్సిటీ వ్యవస్థాపకులే కాకుండా, ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ పరశురామ్ పాత్రో, డాక్టర్ సచ్చిదానందమూర్తి వంటి మహనీయులతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ, బాబూ జగ్జీవన్రామ్, సర్ ఆర్థర్ కాటన్ వంటి గొప్ప వ్యక్తుల విగ్రహాల వద్ద కూడా కనీస నివాళులు అర్పించకపోవడం పట్ల వర్సిటీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఉన్నతాధికారుల బాధ్యతారహితమైన ప్రవర్తన ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రతిష్టను, సంస్కృతిని మంటగలుపుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట వెలవెలబోతున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహంవెలవెలబోతున్న ఏయూ స్నాతకోత్సవ భవనం ఎదుట వున్న సీఆర్ రెడ్డి విగ్రహం నేడు శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు -
నేడు గవర్నర్ రాక
మహారాణిపేట: రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ విశాఖ పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించినట్లు ఆదివారం రాత్రి కాకుండా, సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు స్వాగతం పలికిన అనంతరం హోటల్కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో గవర్నర్ పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఐఎన్ఎస్ డేగాకు వెళ్లి ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలికి నొవోటెల్ హోటల్లో బస చేస్తారు. మంగళవారం సాయంత్రం గవర్నర్ విజయవాడకు బయలుదేరుతారు. విశాఖ పోర్టు మరో అరుదైన రికార్డు సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. అత్యంత భారీ పరిమాణం కలిగిన ‘ఎంవీ రెజీనా ఓల్డెన్డార్ఫ్’ అనే కార్గో నౌకను ఆదివారం విజయవంతంగా హ్యాండ్లింగ్ చేసింది. 260 మీటర్ల పొడవు, 43 మీటర్ల వెడల్పు, 14.70 మీటర్ల డ్రాఫ్ట్ కలిగిన ఈ భారీ నౌక.. ఇప్పటివరకు ఇన్నర్ హార్బర్కు వచ్చిన నౌకలన్నింటిలోనూ అతి పెద్దదిగా నిలిచింది. ఇది దక్షిణాఫ్రికాలోని రిచర్డ్స్ బే పోర్టు నుంచి స్టీమ్ కోల్తో చేరుకుంది. ఈస్ట్ క్వే–1 బెర్త్లో 1,15, 873 టన్నుల స్టీమ్ కోల్ని పోర్టు సిబ్బంది హ్యాండ్లింగ్ చేశారు. సముద్రయాన రంగంలో తనదైన ముద్ర వేస్తూ, అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడంలో వీపీఏ మరో మెట్టు ఎదిగిందని పోర్టు చైర్మన్ డా.అంగముత్తు అన్నారు. -
ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
ఏయూ శతాబ్ది ముగింపు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, వీసీ జీపీ రాజశేఖర్తో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్లో సమీక్షించారు. కార్యక్రమ షెడ్యూల్ను నిమిషాల వారీగా అమలు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఆటంకం లేకుండా జరగాలని ఆదేశించారు. అతిథులు, విద్యార్థులకు తాగునీరు, స్నాక్స్, పారిశుధ్యం, పార్కింగ్ సదుపాయాలు పక్కాగా ఉండాలని సూచించారు. వీవీఐపీల భద్రతకు అంబులెన్సులు, హెల్ప్ డెస్క్లు సిద్ధం చేయాలని ఆదేశించిన కలెక్టర్, అంతకుముందు ఏయూ ప్రాంగణం, తర్లువాడలోని ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చి, సీఎం కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పరిశీలించారు. -
వందే
ఏయూమద్దిలపాలెం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేక అతిథిగా హాజరుకానుండటంతో వేడుకలకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. వేదిక ప్రాంగణంలో సుమారు 25 వేల మంది కూర్చునేందుకు వీలుగా మూడు భారీ జర్మన్ టెంట్లతో పాటు ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు. విద్యార్థుల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభం కానుండగా, సాయంత్రం 4 గంటల నుంచి జరిగే ప్రధాన సభలో ఉపరాష్ట్రపతి, సచిన్ టెండూల్కర్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం ఏయూ భవిష్యత్ ప్రగతికి సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. సభకు హాజరయ్యే విద్యార్థులు, అతిథుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి గ్యాలరీ వద్ద మంచినీటి సదుపాయంతో పాటు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భద్రతా తనిఖీలలో భాగంగా మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన పాస్ ఉన్నవారికే లోపలికి అనుమతి ఉంటుంది. విద్యార్థులందరూ మధ్యాహ్నం 2 గంటల కల్లా ప్రాంగణానికి చేరుకోవాలని ఏయూ వీసీ ఆచార్య జీపీ. రాజశేఖర్ ఆదేశించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చేందుకు వీలుగా కూర్మన్నపాలెం, పెందుర్తి, సింహాచలం, తగరపువలస, భీమిలి మార్గాల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక ఉచిత ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. సంబంధిత పాస్లను చూపించి ఈ బస్సు సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఏయూ యాజమాన్యం సూచించింది. నేడు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలుఅల్లిపురం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నేపథ్యంలో సోమవారం నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ జంక్షన్ నుంచి మద్దిలపాలెం ఆర్చ్ వరకు రాత్రి 10 గంటల వరకు సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. వీవీఐపీల పర్యటనల సమయంలో జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిలుపుదల చేసే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. సభకు వచ్చే విద్యార్థులు, అతిథుల వాహనాల కోసం ఏయూ ప్రాంగణంలో పది ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. విద్యార్థులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని, మొబైల్ ఫోన్లు తప్ప ఇతర వస్తువులను తీసుకురావద్దని పోలీసులు సూచించారు. వేడుకలు ముగిసిన తర్వాత కూడా వచ్చిన మార్గాల్లోనే తిరుగు ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. -
షిప్పింగ్ రంగంలో బీమా సంక్షోభం
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రాణాధారమైన సముద్ర మార్గాలను అస్థిరపరుస్తున్నాయి. ముఖ్యంగా ఎర్ర సముద్రం, పర్షియన్ గల్ఫ్ వంటి కీలక జలసంధుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో, కార్గో షిప్స్ ప్రయాణం గాలిలో దీపంలా మారింది. ఈ అనిశ్చితి వల్ల నౌకలకు రక్షణ కల్పించాల్సిన అంతర్జాతీయ బీమా సంస్థలు వెనకడుగు వేయడం.. ఇప్పుడు ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణించే నౌకలకు బీమా రద్దు చేస్తున్నట్లు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రకటించగా.. మరికొన్ని సంస్థలు.. ఏకంగా ప్రస్తుత ప్రీమియం కంటే 100 రెట్ల వరకూ అదనంగా చెల్లిస్తేనే బీమా సౌకర్యం అందిస్తామని చెప్పడంతో సరకు రవాణా భారంగా మారిపోయింది. సాధారణ సమయాల్లో నౌక విలువలో అతి స్వల్పంగా ఉండే బీమా ప్రీమియం, ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇన్సూరెన్స్ సంస్థలు భారీగా పెంచేశాయి. ఇప్పటికే ప్రమాదకర ప్రాంతాలుగా ప్రకటించిన జలమార్గాల్లో ప్రయాణించే నౌకలకు బీమా సంస్థలు ఏడు రోజుల ముందస్తు నోటీసుతో పాత ఒప్పందాలను రద్దు చేస్తున్నాయి. నౌకల బీమాపై పడుతున్న ఈ ప్రభావం కేవలం ఓడరేవులకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజల ఇంట్లోనూ కుంపటి రగుల్చుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో ముడి చమురు, వంట నూనెలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వస్తున్నాయి. బీమా సంస్థలు రిస్క్ తీసుకోవడానికి నిరాకరించడం వల్ల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడుతోంది. ఇది పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. వార్ రిస్క్ ప్రీమియం పేరుతో.! సాధారణంగా ఓడ విలువలో 0.01 నుంచి 0.05 శాతం వరకూ బీమా ప్రీమియం ఉండేది. యుద్ధం కారణంగా.. ఈ ప్రీమియం చెల్లిస్తామని చెబుతున్నా.. ఇన్సూరెన్స్ కంపెనీలు రద్దు చేస్తున్నాయి. పైగా.. ఇప్పటికే ప్రీమియం చెల్లించినా.. వాటిని రద్దు చేస్తోంది. కొన్ని సంస్థలు మాత్రం.. కార్గో షిప్ ధరలో 3 నుంచి 7.5 శాతం వరకూ అంటే 100 నుంచి 150 రెట్లు అదనంగా ప్రీమియం చెల్లిస్తేనే బీమా ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. అంటే.. 20 వేల కంటైనర్లని తీసుకెళ్లే కార్గో షిప్ ధర రూ.1250 కోట్లు వరకూ ఉంటే.. గతంలో బీమా ఒక ప్రయాణానికి తీసుకుంటే రూ.55 లక్షల వరకూ ఉండేది. ఇప్పుడు దాని విలువ దాదాపు రూ.75 నుంచి రూ.80 కోట్లు వరకూ చెల్లించాల్సి వస్తోంది. దీంతో.. ఈ భారం మోయలేక.. చాలా కార్గోషిప్ కంపెనీలు. ప్రయాణాల్ని రద్దు చేసుకుంటున్నాయి. భారత నౌకలపై బీమా ప్రభావం ఎంత.? భారత్లో సుమారు 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతాన్ని కలిగి ఉండి, అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తోంది. మన దేశంలోని 12 ప్రధాన ఓడరేవుల ద్వారా ప్రతిరోజూ సుమారు 80 నుంచి 100 వరకు భారీ కార్గో నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మన మేజర్ పోర్టులు రికార్డు స్థాయిలో 915 మిలియన్ టన్నుల సరుకును హ్యాండిల్ చేశాయి. మన మొత్తం ఎగుమతి, దిగుమతుల్లో (ఎగ్జిమ్ కార్గో) కేవలం 5 నుంచి 7 శాతం మాత్రమే భారతీయ నౌకల ద్వారా జరుగుతోంది. మిగిలిన 93 శాతం పైగా రవాణా విదేశీ నౌకలపైనే ఆధారపడుతున్నాం. ప్రస్తుతం మన దేశంలో కోస్టల్, ఇంటర్నేషనల్ షిప్స్ కలిపి సుమారు 1,500 కిపైగా వాణిజ్య నౌకలున్నాయి. యుద్ధం కారణంగా విదేశీ కంపెనీలు బీమా దొరకక వెనక్కి తగ్గితే, మన దేశ వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. సొంత బీమా నిధి ఏర్పాటు చేసినా..! ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం తన సొంత బీమా నిధిని ఏర్పాటు చేయడం వంటి సాహసోపేతమైన అడుగులు వేస్తోంది. విదేశీ బీమా సంస్థలపై ఆధారపడకుండా, స్వదేశీ రక్షణ కవచాన్ని నిర్మించడం ద్వారా వాణిజ్య నౌకలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. రూ.12,980 కోట్లతో ‘భారత్ మైరెన్ ఇన్సూరెన్స్పూల్’ ఏర్పాటు చేసి, మన నౌకలకు భరోసా కల్పిస్తోంది. అయినప్పటికీ, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం సద్దుమణిగితే తప్ప సముద్ర వాణిజ్యం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోలేదు. అప్పటి వరకు ఈ బీమా భారం భారంగానే కొనసాగేలా కనిపిస్తోంది. -
డీజిల్ కొరతతో ఇక్కట్లు
కశింకోట: డిజిల్ కొరతతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మండలంలో జాతీయ రహదారి పొడవునా కంపెనీ ఔట్ లెట్లతోపాటు ప్రైవేటు బంకులు పదికి పైగా ఉన్నాయి. పెట్రోల్కు ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా డీజిల్కు కొరత ఏర్పడింది. దీంతో లారీకి 50 లీటర్లు, కార్లు, వ్యాన్లకు రూ.2 వేలు విలువైన డీజిల్ను మాత్రమే వేస్తున్నారు. దానికి కూడా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాహన చోదకులు వాపోతున్నారు. రాజమహేంద్రవరం నుంచి విశాఖకు రావాలంటే ఐదు గంటల సమయం పడుతుందని, అలాంటిది ఆయిల్ కొరత వల్ల, దాని కోసం మూడు బంకుల్లో నిరీక్షించడంతో పది గంటల వరకు సమయం పట్టిందని ఓ లారీ డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేశారు.నెట్ సరిగా పని చేయక బిల్లుల చెల్లింపునకు ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పారు. డిజిల్ ఆయిల్ కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
స్వామీజీల పర్యవేక్షణలో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ట
అయ్యప్ప ఆలయం ప్రారంభానికి, విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన స్వామీజీలుఏకశిల పతినెట్టంపడి అయ్యప్పస్వామిఎస్.రాయవరం: గురజాడ జన్మస్థలం ఎస్.రాయవరంలో ఉత్తరాంధ్ర ఏకశిల పతినెట్టంపడి అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7.42 గంటలకు కశింకోటకు చెందిన రేజేటి శ్రీరామాచార్యులు ఆధ్వర్యంలో విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ, శమరిమలైలో మాలికాపురత్తమ్మతల్లి ఆలయ పూజారి ఎంఎన్ రిజ్కుమార్లు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. కరళ నుంచి మేల్ శాంతి తీసుకురావడానికి డాక్టర్ ఆదిమోహన్రెడ్డి స్వామి కృషి చేసి, రిజ్కుమార్ తోపాటు 10 కేరళ పంచ వాయిద్యాలు దళం సభ్యులు కూడా కేరళ నుంచి వచ్చారు.ఈ సందర్భంగా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎస్.రాయవరంలో శ్రీ అయ్యప్పస్వామి ఆలయం ప్రారంభం, విగ్రహ ప్రతిష్ట చేపట్టడం అభినందనీయమన్నారు. శబరిమల మేల్శాంతి శ్రీ రిజికుమార్ ని తీసుకురావడం తన వంతు కృషి చేశానన్నారు. శ్రీ అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తూ గురుస్వామి హరనాథ్ సహకారం కూడా ఉందన్నారు. ఈ సందర్బంగా ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఏకశిల పతినెట్టంపడి శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నవారి పాయకరావుపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త , మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, నర్సీపట్నం డీఎస్పీ పోతు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి, అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం డైరెక్టర్ గెడ్డం బుజ్జి, మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్, మాజీ ఎంపీపీ యేజర్ల వినోధ్రాజు, యూజెఎఫ్ అధ్యక్షుడు ఎంఎన్ఆర్ వర్మ, లీడర్ దినపత్రిక సంపాదకుడు వి.వి రమణమూర్తి, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
భవిష్యత్ తరాల కోసం ‘కాల స్మృతి గుళిక’
కాలస్మృతి గుళికలో పుస్తకాలను వేస్తున్న ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్ మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భవిష్యత్ తరాలకు నేటి చరిత్రను అందించే లక్ష్యంతో.. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ‘కాల స్మృతి గుళిక’ను ఏర్పాటు చేశారు. వందేళ్ల వేడుకల సందర్భంగా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనేక చారిత్రక అంశాలను దీనిలో భద్రపరిచామని, వీటిని 50 ఏళ్ల తర్వాత తెరిచి చూసేలా ప్రణాళిక రూపొందించామని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, ఏయూ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు కె.వి.వి.రావు తెలిపారు. ఈ కాల స్మృతి గుళికను శతాబ్ది ఉద్యానవనంలో ప్రత్యేకంగా భద్రపరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం పరిపాలన భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన చారిత్రక చాయాచిత్రాల ప్రాంగణాన్ని వారు సందర్శించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టర్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్లు, తదితరులు పాల్గొన్నారు. -
1950 మందితో బందోబస్తు : సీపీ
అల్లిపురం(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు, గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమాల కోసం నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో 1,950 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎయిర్పోర్ట్ నుంచి వేదికల వరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీఐపీ ప్రాంతాల్లో బాంబు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తూ, ప్రతి విభాగానికి ఒక ఉన్నతాధికారిని పర్యవేక్షకులుగా నియమించి ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. -
సమష్టి పోరాటంతోనే సమస్యల పరిష్కారం
అచ్యుతాపురంరూరల్: విచిత్ర స్థితిలో దుప్పితూరు గ్రామ ప్రజలున్నారని, సమస్యల దిగ్బంధంలో చిక్కు కుని దుర్భరపరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని విశ్రాంత డీజీపీ జె.పూర్ణచంద్రరావు, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ (ఏఐబీసీపీ) రాష్ట్ర కోఆర్డినేటర్ బి.పరంజ్యోతి అన్నారు. ఎస్ఈజెడ్ నిర్వాసితులతో విశ్వేశ్వర బాబుస్వామి అధ్యక్షతన ఆదివారం దుప్పితూరులో జరిగిన సదస్సులో వారు ముఖ్యఅతిథులుగా మాట్లాడారు. సెజ్ ఏర్పడి 22 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ దుప్పితూరు ప్రజలకు పునరావసం కల్పించలేదని చెప్పారు.సెజ్ అభివృద్ధికి తమ భూములను అప్పగించిన రైతులు దిక్కుతోచని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. నిర్వాసితులందరూ ఏకమైపోరాడితే తప్ప సమస్య పరిస్కారం కాదన్నారు. భూసేకరణ సమయంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఆర్అండ్ఆర్ ప్యాకేజ్, కుటుంబానికి రెండు పాడి పశువులు, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని చెప్పి నేటికీ గ్రామాన్ని తరలించకుండానే గ్రామం చుట్టూ బ్రాండిక్స్ కంపెనీ ప్రహారి నిర్మాణ పనులు చేపట్టడం అన్యాయమన్నారు. ఒప్పందం ప్రకారం సేకరించిన వెయ్యి ఎకరాలకు 60వేల ఉద్యోగాలు కల్పించకపోతే ఆ భూమిని తిరిగి ఇవ్వాలన్నారు. ప్రస్తుతం బ్రాండిక్స్ పరిశ్రమలో 23వేల మంది కార్మికులు మాత్రమే విధులు నిర్వహిస్తుండటంతో 600 ఎకరాలను తిరిగి ప్రభుత్వం వెనక్కు తీసుకుని రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు పరిశ్రమల్లో వాటా దారులుగా చేసుకోవాలన్నారు. పరిశ్రమల వద్ద నిరుపయోగంగా ఉన్న భూములను వెంటనే వెనక్కి తీసుకుని రైతులకు తిరిగి అప్పగించాలని డిమాండ్ చే శారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర బీసీ మహిళా విభాగం కన్వీనర్ ఐ.పరమేశ్వరి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ లక్ష్మి, బీసీ నాయకులు బాల మహేంద్ర, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకరరావు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు, మాజీ పీఏసీఎస్ మాజీ చైర్మెన్ శెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు.విశ్రాంత డీజీపీ పూర్ణచంద్రరావు, ఏఐబీసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి -
అప్పన్న భూములకు శఠగోపం
మహారాణిపేట: సింహాచలం దేవస్థానానికి చెందిన సుమారు 160 ఎకరాల భూమిని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం లీజుకు ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అడవివరం సర్వే నంబర్ 275లో 153 ఎకరాలు, ముడసర్లోవలోని సర్వే నంబర్ 26లో మరో 7 ఎకరాలను 11 ఏళ్ల కాలానికి లీజుకు ఇస్తూ దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లీజు ద్వారా ఏటా రూ.26 కోట్ల ఆదాయం సమకూరుతుందని, ప్రతి ఐదేళ్లకు ఒకసారి లీజు మొత్తం 5 శాతం పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే ఈ నిర్ణయాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అభివృద్ధి పేరుతో ఆలయ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం సరికాదని, ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ వీహెచ్పీ అధ్యక్షుడు ఆచార్య కందర్ప విశ్వనాథ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు లేఖ రాశారు. దేవాలయాల ఆస్తులను దేవాలయ అభివృద్ధికి తప్ప, ఇతర అవసరాలకు వాడకూడదని సుప్రీంకోర్టు సహా పలు ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ భూ వివాదాల మూలాలు దశాబ్దాల నాటి పంచగ్రామాల సమస్యలో ఉన్నాయి. భీమిలి, పెందుర్తి, విశాఖ పశ్చిమ నియోజకవర్గాల్లోని అడవివరం, వేపగుంట, పురుషోత్తపురం, చీమలాపల్లి, వెంకటాపురం గ్రామాలను పంచగ్రామాలుగా పిలుస్తారు. 1901 గిల్ మెన్ రికార్డుల ప్రకారం ఈ ప్రాంతాల్లో దేవస్థానానికి 9069 ఎకరాల భూమి ఉంది. 1996లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ భూములపై దేవస్థానానికి రైత్వారీ పట్టాలు దక్కాయి. దీంతో ఏళ్లుగా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారు, సాగు చేసుకుంటున్న రైతులు ఆక్రమణదారులుగా మారారు. సుమారు 12 వేల మందికి పైగా ప్రభావితమవుతున్న ఈ అంశం ప్రస్తుతం జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్లో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, పెండింగ్లో ఉన్న పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతుండగా, ప్రభుత్వం మాత్రం అదే భూముల్లో మరోవైపు వాణిజ్య లీజులకు ప్రాధాన్యత ఇస్తుండటం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. జీవోను తక్షణం రద్దు చేయాలి ఆలయాల భూములను వాణిజ్య అవసరాలకు కేటాయించడం సరికాదు. అప్పన్న దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించిన జీవోను తక్షణమే రద్దు చేయాలి. అభివృద్ధి పేరుతో ఎవరికి పడితే వారికి ఆలయ ఆస్తులను ధారదత్తం చేయడం అప్రజాస్వామికం. ఆలయ భూముల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. – ఆచార్య కందర్ప విశ్వనాఽథ్, అధ్యక్షుడు, విశ్వహిందూ పరిషత్ విశాఖ మహానగర్ -
న్యాయదేవత విగ్రహ ఆవిష్కరణ
మద్దిలపాలెం: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఏయూ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయ ప్రక్రియలో జాప్యం జరిగితే ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. కోర్టుల్లో భారీగా పేరుకుపోయిన కేసుల సంఖ్యను తగ్గించాలని, వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.సీతా మాణిక్యం మాట్లాడుతూ.. తక్షణ న్యాయం కొన్ని సందర్భాల్లో సాధ్యం కానప్పటికీ, విచారణలో సుదీర్ఘ జాప్యాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. న్యాయపరమైన భాష సంక్లిష్టంగా ఉండకూడదని, సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా సరళంగా ఉండాలని వక్తలు పేర్కొన్నారు. ప్రొఫెసర్ కేశవరావు, ప్రొఫెసర్ ఎ.రాజేంద్ర ప్రసాద్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మహాలక్ష్మినాయుడుకు గురుబ్రహ్మ, సేవారత్న అవార్డులు
రావికమతం: మేడివాడ హైస్కూల్లో ప్రత్యేక ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న బొడ్డు మహాలక్ష్మి నాయుడు దివ్యాంగ విద్యార్థులకు చేస్తున్న సేవలను గుర్తించి మదర్ థెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిర్వహించిన గురుబ్రహ్మ ఉగాది పురస్కారం–2026, గ్లోబల్ ఫౌండేషన్ వారి సేవారత్న అవార్డులకు ఎంపికయ్యారు. మదర్ థెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఈ అవార్డుల ప్రదానోత్సవం విఽశాఖపట్నం డాబాగార్డెన్స్ ప్రెస్క్లబ్లో ఆదివారం నిర్వహించారు. మహాలక్ష్మినాయుడును ఆదివారం మదర్ థెరిసా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి, విజయనగరం జిల్లా రాజాం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు శాలువాతో సత్కరించి అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. గతంలో కూడా మహాలక్ష్మినాయుడు పలు అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు చేసిన సేవలను గుర్తించి మదర్ థెరిసా స్వచ్ఛంద సేవా సంస్థ వారు అందించిన ఈ అవార్డులను తీసుకోవడం అనందంగా ఉందన్నారు. దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, దివ్యాంగ విద్యార్థులకు మరింతగా సేవలు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. మహాలక్ష్మి నాయుడును మేడివాడ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వంకాయల రామారావు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. -
అదుపులోకి అతిసార
నక్కపల్లి: మండలంలో గొడిచర్లలో విజృంభించిన అతిసార అదుపులోకి వస్తోంది. మూడు రోజుల నుంచి గ్రామానికి చెందిన పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హైమావతి, డివిజినల్ డెవలప్మెంట్ అధికారి మంజుల వాణి, ఎంపీడీవో చలపతిరావు తదితరులు గ్రామాన్ని సందర్శించారు. వాంతులు, విరేచనాలతోబాధపడుతున్నవారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులతోపాటు, గ్రామస్తులు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో అన్నివీధుల్లో బ్లీచింగ్, ఫినాయిల్ జల్లించారు. ప్రస్తుతం గ్రామంలో అతిసార అదుపులోకి వచ్చిందని ఆదివారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఎంపీడీవో చలపతిరావు తెలిపారు. సచివాలయ సిబ్బందిని,వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ఈనెల 23నుంచి 25వ తేదీ వరకు మొత్తం 25 అతిసార కేసులు నమోదయ్యాయన్నారు.వీరంతా గొడిచర్ల పీహెచ్సీలో చికిత్స పొంది కోలుకున్నారని చెప్పారు.కుళాయినీటిని పరీక్షించారని, లోపాలు ఏమీలేవని నివేదిక వచ్చిందని అధికారులు తెలిపారు. -
పీలాపై తెలుగు తమ్ముళ్ల అసమ్మతి
● అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ ● సీనియర్ నాయకుల్ని పట్టించుకోవడం లేదంటూ ఇష్టాగోష్టిలో ఆగ్రహం తుమ్మపాల: ‘పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారు. ఒంటెద్దు పోకడలకు పోయి పార్టీని మరింత నిర్వీర్యం చేస్తున్నారు..’ అంటూ నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణపై అనకాపల్లి టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్చార్జి పదవి నుంచి తక్షణమే తొలగించాలంటూ పలువురు సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. మండలంలో తుమ్మపాల వాటర్హౌస్ మామిడితోటలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన టీడీపీ సీనియర్ నాయకులు ఇష్టాగోష్టి సమావేశంలో పీలా గోవిందపై తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు బోడి వెంకట రావు మాట్లాడుతూ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీలా గోవింద్ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పీలాను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. మాజీ మండల అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రూపులు సృష్టించి నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారని, పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలంటే తక్షణమే పీలాను మార్చాలని డిమాండ్ చేశారు. ఆయన్ను ఇన్చార్జిగా కొనసాగిస్తే పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. పార్టీ పేరు చెప్పుకుని వ్యాపారాలు చేసుకోవడమే లక్ష్యంగా పీలా పనిచేస్తున్నారన్నారు. పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకుంటే త్వరలో చలో అమరావతి– సేవ్ టీడీపీ నినాదంతో ఐదు బస్సుల్లో విజయవాడ వెళ్లి చంద్రబాబు, లోకేష్లకు ఇక్కడి పరిస్థితి తెలియజేస్తామని చెప్పారు. వేటజంగాలపాలెం మాజీ సర్పంచ్ పూడి చిన్నారావు మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉండి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నాయకులు, కార్యకర్తలను పీలా చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు. సీనియర్ నాయకులకు కనీస విలువ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. సీనియర్ నాయకుడు గూడాల సత్యనారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ పీలా దురాగతాలు, నియోజకవర్గంలో పార్టీ అనిశ్చితిపై అధినేత చంద్రబాబు, లోకేష్ దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు గొర్లి శ్రీనివాసరావు, నాయకులు మల్ల శివ నారాయణ, సారిపల్లి శ్రీనివాసరావు, తేలపు గోవిందరావు, కోడి నాగేశ్వరరావు, పట్నాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు
నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొంతమంది భక్తులు అమ్మవారి ఆలయ వద్ద వంటకాలు తయారుచేసి, నైవేద్యంగా సమర్పించి, భోజనాలు చేశారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు భక్తులకు ప్రసాదం, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ సదుపాయాలు కల్పించారు. ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ, ట్రాఫిక్ సీఐలు జి.ప్రేమ్కుమార్, ఎం.వెంకటనారాయణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇల్లు కూల్చేందుకు యత్నించిన రామునాయుడుపై ఫిర్యాదు
దేవరాపల్లి: తమ ఇంటిని కూల్చేందుకు స్థానిక టీడీపీ నేత అనుచరుడు, పంచాయతీ పారిశుధ్య కాంట్రాక్టర్ దారపురెడ్డి రామునాయుడు యత్నించాడని బాధితుడు ఆతవ ప్రసాద్, ఆయన భార్య స్థానిక పోలీస్స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. దేవరాపల్లి సచివాలయం–2 పక్కన ఉన్న తమ ఇంటిలోకి వర్షపు నీరు రాకుండా ఉండేందుకు శనివారం గోడ నిర్మిస్తుండగా పారిశుధ్య కార్మికులతో కలిసి వచ్చిన రామునాయుడు దౌర్జన్యం చేసి గునపాలతో ఇంటి ముందు నిర్మాణాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. వారం రోజుల క్రితం ఇంటికి వచ్చి రూ.50వేలు ఇవ్వాలని, లేకుంటే నిర్మాణాన్ని జరగనిచ్చేది లేదని బెదిరించాడని తెలిపారు. గత్యంతరం లేక అప్పు చేసి రూ.20 వేలు ఇచ్చామని, మిగిలిన సొమ్ము ఇవ్వక పోవడంతో దౌర్జన్యానికి దిగాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే వ్యక్తి గతంలో దేవదాయ శాఖ స్థలంలోని ఉన్న తమ షెలూన్ షాపును తొలగింపజేశాడని వాపోయారు. ఏ అధికారం లేకుండా తమ ఇంటిపై దౌర్జన్యం చేసి, బెదిరింపులకు దిగిన రామునాయుడుపై చట్ట పరమైన చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు ఆతవ ప్రసాద్, లక్ష్మి దంపతులు కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ లక్ష్మీనారాయణ ఆదివారం విచారణ చేపట్టారు. రామునాయుడుతో పాటు బాధితులను పోలీస్స్టేషన్కు పిలిచి విచారించారు. అనంతరం ప్రసాద్ ఇంటిని పరిశీలించారు. ఇరువర్గాల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్ఐ లక్ష్మీనారాయణ చెప్పారు.న్యాయం చేయాలని బాధిత నాయీ బ్రాహ్మణ కుటుంబం డిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నక్కపల్లి: జాతీయ రహదారిపై వేంపాడు పెట్రోలు బంకు ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యలమంచిలికి చెందిన పూడి వెంకటశేఖర్(39) తలుపులమ్మలోవలో అమ్మవారి దర్శనానికి బైక్పై వెళ్లాడు. తిరుగుప్రయాణంలో వేంపాడు వద్దకు రాగా పెట్రోల్ బంకులోంచి బయటకు వస్తున్న లారీని వెనుకనుంచి ఢీకొన్నాడు. దీంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించాడు. యలమంచిలి పట్టణంలో రామ్నగర్ ప్రాంతానికి చెందిన వెంకటశేఖర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ఫ్రం హోంలో ఉన్నాడు. ఇతనికి భార్య, ఏడాది వయసుగల కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. -
సింహగిరిపై రెండో విడత చందనం అరగదీత ప్రారంభం
చందనాన్ని అరగదీస్తున్న సిబ్బంది సింహాచలం : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం నుంచి రెండో విడత చందనం అరగదీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వచ్చే నెల 1న వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సమర్పించే మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) చందనాన్ని సిద్ధం చేసేందుకు ఈ ప్రక్రియను చేపట్టారు. ఉదయం అర్చకులు చందనం చెక్కలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం, సిబ్బంది అరగదీతను ప్రారంభించారు. మొదటి రోజు 48 కిలోల చందనాన్ని అరగదీశారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రేపటి నుంచి చందనం విక్రయాలు మంగళవారం నుంచి సింహగిరిపై భక్తులకు చందనం విక్రయించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈఓ జె. వెంకటరావు తెలిపారు. ఆలయ ప్రసాదాల విక్రయశాలలో ఉదయం 8 గంటల నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు తమ అధార్కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. -
అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
అనకాపల్లి: పట్టణంలోని గవరపాలెం అంబేడ్కర్ నగర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం కన్నుపై భాగాన్ని పగలగొట్టారు. ఈ విషయం తెలుసుకుని ఆదివారం ఉదయం అంబేడ్కర్నగర్ కాలనీ, గవరపాలెం ప్రజలు, దళిత సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని దోషులను తక్షణమే గుర్తించి, శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులను అరెస్టు చేయాలి అనకాపల్లి: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల సాల భరత్కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ నగర్లో విగ్రహాన్ని పరిశీలించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భరత్కుమార్ మాట్లాడుతూ గతంలో జాతీయ రహదారి ఏఎంఎల్కళాశాల కొత్తూరు జంక్షన్ వద్ద దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్రెడ్డి, సీతానగరంలో దివంగత మాజీ మంత్రి గుడివాడ గురునాథరా వు విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే దుండగులు తెగబడుతూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహానికి తన సొంత సొమ్ముతో మరమ్మతులు చేయిస్తానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, పోలీసు అధికారులు స్పందించి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండ జ్ఞానదీప్ మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు తక్షణమే పోలీసులకు లొంగిపోవాల ని హితవుపలికారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో విగ్రహాలను ధ్వంసం చేసే దుష్ట సంస్కృతి పెరిగిందని తెలిపారు. 80వ వార్డు ఇన్చార్జ్ కె.ఎం.నాయుడు మాట్లాడుతూ అంబేడ్కర్నగర్లో ప్రజలు కులమతాలకు అతీతంగా జీవిస్తున్నారని, ఇటువంటి చర్యలకు పాల్పడడం వల్ల విభేదాలు తలెత్తే పరిస్థితి ఏర్ప డుతుందన్నారు. వైఎస్సార్సీపీ 81 వార్డుఇన్చార్జ్ బి.శివ, 80వవార్డు ఎస్సీసెల్అధ్యక్షుడు జిగట గణేష్, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు దండ సిద్ధార్థ, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజు ల రమేష్, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమవతి, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, నాయకులు బి.కిషోర్,చరణ్,సూరిరాజుతదితరులు పాల్గొన్నారు. -
పయినీర్ కార్మికుల ఆందోళన విరమణ
మాకవరపాలెం: లేబర్ యాక్ట్ ప్రకారం కార్మికుల డిమాండ్లను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రాజు హామీ ఇవ్వడంతో గత ఐదు రోజులగా చేస్తున్న ఆందోళనను శనివారం విరమించి పయినీర్ కార్మికులు విధుల్లో చేరారు. 8 గంటలు మాత్రమే తమతో పనిచేయించాలని, సకాలంలో వేతనాలు చెల్లించడంతో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని మంగళవారం నుంచి విధులు బహిష్కరంచి ఆందోళన బాటపట్టారు. ఈ ఆందోళన శనివారం ఐదో రోజు కొనసాగింది. ఈ నేపథ్యంలో పరిశ్రమ హెచ్ఆర్ జీఎం ఉపేంద్రరెడ్డి పోలీసుల సమక్షంలో కార్మికులతో చర్చలు జరిపారు. అనంతరం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రాజు కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి 8 గంటల పనితోపాటు పరిశ్రమ లోపల క్యాంటీన్ సౌకర్యం కల్పించేలా చూస్తామన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ లీవ్, పే స్లిప్లు అందిచే ఏర్పాటు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్ సర్టిఫికెట్లను బట్టి అప్గ్రేడ్ చేయిస్తామన్నారు. వారం రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులంతా చర్చించుకుని విధుల్లో చేరారు. సీఐటీయూ నేతల అరెస్ట్ పయినీర్ పరిశ్రమ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతుగా నిలిచిన సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు జి.కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంకరరావు, కార్యదర్శి రాజులను పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసి, గొలుగొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం సాయంత్రం వారిని విడుదల చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరి ష్కారం కోసం మద్దతు తెలిపితే ఇలా అరెస్ట్లు చేయ డం అన్నాయమని సీఐటీయూ నాయకులు అన్నారు.అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రాజు హామీతో విధుల్లో చేరిక -
నాయీబ్రాహ్మణ కుటుంబంపై టీడీపీ నేత అనుచరుడు దౌర్జన్యం
● దేవరాపల్లిలో పారిశుధ్య కాంట్రాక్టర్ రామునాయుడు బరి తెగింపు ● పారిశుధ్య కార్మికులతో కలిసి ఇంటిని కూల్చేందుకు యత్నం ● గునపాలతో కూల్చేయండంటూ హుకుం ● కాంట్రాక్టర్పై స్థానికులు, యువకుల తిరుగుబాటు ● తమకు అనుకూలంగా లేరని నాయీబ్రాహ్మణ కుటుంబంపై కక్ష సాధింపు ● ఎండోమెంట్ స్థలంలో ఉన్న సెలూన్ షాపు అన్యాయంగా తొలగింపు ● ఆ స్థలంలో టీడీపీ నేతల అనుచరులకు కేటాయింపుదేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలో నిరుపేద నాయీబ్రాహ్మణ కుటుంబంపై శనివారం స్థాని క టీడీపీ నేత అనుచరుడు దౌర్జన్యకాండకు దిగాడు. స్థానిక పంచాయతీలో పారిశుధ్య కాంట్రాక్టర్గా పనిచేస్తున్న టీడీపీ నేత అనుచరుడు దారపురెడ్డి రామునాయుడు బరితెగించినాయీబ్రాహ్మణ కు టుంబానికి చెందిన ఇంటిని కూల్చేందుకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శ్రీకృష్ణ ఆలయానికి సమీపంలోని దేవరాపల్లి సచివాలయం–2 భవనం పక్కన నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆతవ ప్రసాద్ తన ఇంటి ముందు భాగంలో వర్షపునీరు ఇంటి లోపలికి రాకుండా నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇదే అదునుగా భావించి దారపురెడ్డి రామునాయుడు పారిశుధ్య కార్మికులతో కలిసి అక్కడికి చేరుకుని గునపాలతో తవ్వి కూల్చేయాలని హుకుం జారీ చేశాడు. తమ ఇంటిని కూల్చొద్దంటూ బాధితుడు భార్యాపిల్లలతో కలిసి ఇంటి ముందు నిలబడి వేడుకున్నా కనికరించలేదు. అక్కడితో ఆగకుండా కూలుస్తారా లేదా అంటూ పారిశుధ్య కార్మికులపై అరుపులు కేకలతో విరుచుకు పడ్డాడు. దీంతో ఇంటిని కూల్చేందుకు సిద్ధం కాగా, తమను చంపి ఇంటిని కూల్చాలంటూ బాధిత కుటుంబ సభ్యులంతా అడ్డుగా నిలిచారు. ఉద్దేశ పూర్వకంగానే కొంత కాలంగా తమపై కక్ష సాధింపులకు దిగుతున్నాడని వారు కన్నీటి పర్యంతమయ్యారు. మా ఇంటి చుట్టు పక్కల కూడా ఇదే మాదిరిగా నిర్మాణం చేసినా ఎందుకు పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు భోరున విలపించారు. అధికారులు లేకుండా సంబంధం లేని వ్యక్తి నిరుపేద కుటుంబంపై దార్జన్యానికి దిగడాన్ని చూసిన స్థానికులు, యువకులు రామునాయుడుపై తిరగబడ్డారు. ఏ అధికారంతో ఇంటిని కూల్చుతావంటూ నిలదీశారు. మాకు అధికారి ఆదేశాలు ఇచ్చారంటూ పదే పదే చెప్పడంతో ఏ అధికారి చెప్పారో ఇక్కడి రప్పించండని, అప్పటి వరకు ఇంటిపై చేయి వేస్తే ఊరుకోబోమని రామునాయుడుతో స్థానికులు వాగ్వావాదానికి దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబానికి స్థానికులంతా మద్దతుగా నిలుస్తుండటంతో వివాదం పెద్దది అవుతున్నట్లు గుర్తించిన సదరు వ్యక్తి అధికారులతో ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా కొద్ది సేపు కాలయాపన చేసి ఆ తర్వాత పారిశుధ్య కార్మికులను వెంట పెట్టుకొని అక్కడి నుంచి జారుకున్నాడు. అన్యాయంగా సెలూన్ తొలగింపు నాలుగు రోడ్ల కూడలికి సమీపంలోని దేవదాయశాఖ స్థలంలో ఉన్న ఆతవ ప్రసాద్ సెలూన్ షాపును ఇటీవల అన్యాయంగా తొలగించారు. గత 12 ఏళ్లుగా అదే స్థలంలో సెలూన్ షాపును నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తమకు అనుకూలంగా లేరన్న అనుమానంతో స్థానిక టీడీపీ నేత బాధిత కుటుంబంపై కక్ష సాధింపునకు పూనుకున్నాడు. మూడు నెలల క్రితం సెలూన్ షాపును తొలగించి ఆ స్థలాన్ని టీడీపీకి చెందిన వ్యక్తికి కేటాయించారు. దీంతో నాయీబ్రహ్మణ కుటుంబం రోడ్డున పడింది. పేదల పొట్ట కొట్టే నీచ రాజకీయాలకు దిగడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామునాయుడుపై చర్యలు తీసుకోవాలి అధికారుల ఆదేశాల లేకుండా ఇంటిని కూల్చేందుకు దౌర్జన్యానికి దిగిన పంచాయతీ పారిశుధ్య కాంట్రాక్టర్ దారపురెడ్డి రామునాయుడుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.రామునాయుడుతో వాగ్వాదానికి దిగిన స్థానికులు, ఇంటిని కూల్చొద్దంటూ కన్నీటి పర్యంతమవుతున్న బాధితులు ప్రసాద్, లక్ష్మి దంపతులుతరుచూ బెదిరింపులు రామునాయుడు తరుచూ మాపె తరచూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఇంటిలోకి వర్షపు నీరు వస్తుందని అడ్డుగా గోడ నిర్మించుకుంటున్నాం. పంచాయతీ అధికారి వచ్చి చూసి సోమవారం పంచాయతీ కార్యాలయానికి రావాలని చెప్పి వెళ్లిపోయారు. రామునాయుడు స్వీపర్లను తీసుకువచ్చి ఇంటిని కూల్చేందుకు యత్నించాడు. లంచం ఇవ్వలేదని రామునాయుడు తమపై కక్ష సాధింపులకు దిగుతున్నాడు. మూడు నెలల క్రితం తమ సెలూన్ షాపును అక్రమంగా తొలగించి మా పొట్టకొట్టాడు. ఇప్పుడు ఇంటిని కూల్చేయాలని కుట్ర పన్నాడు. రామునాయుడు బెదిరింపులు కారణంగానే తన భార్య అనారోగ్యానికి గురైంది. తనకేమి జరిగినా రామునాయుడుదే బాధ్యత. – ఆతవ ప్రసాద్, బాధితుడు, దేవరాపల్లి. ఇంటిని కూల్చాలని ఆదేశాలివ్వలేదు ఇంటిని కూల్చివేయాలని నేను ఎవ్వరికీ ఆదేశాలు ఇవ్వలేదు. గ్రామానికి చెందిన ఆతవ ప్రసాద్ ఇంటి ముందు భాగంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్నాడని స్థానికులు ఫిర్యాదు చేయడంతో శనివారం తాను పరిశీలించాను. సోమవారం పంచాయతీ కార్యాలయానికి ఇంటి పత్రాలు తీసుకురావాలని, అప్పటి వరకు నిర్మాణం చేపట్టవద్దని చెప్పాను. ఇంటిని కూల్చేయాలని పారిశుధ్య కాంట్రాక్టర్ రామునాయుడుకు గాని, పారిశుధ్య కార్మికులకు గాని తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. –కె.సుధాకర్బాబు, ఇన్చార్జి పంచాయతీ అభివృద్ధి అధికారి, దేవరాపల్లి -
హిరాకుడ్ ఎక్స్ప్రెస్ దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం(విశాఖ): పాత ఢిల్లీ డివిజన్, షాహబాద్ మార్కండ–మోహిరి స్టేషన్ల మధ్య జరుగుతున్న పలు భద్రతా పనుల నిమిత్తం మే 30, 31, జూన్ 3వ తేదీల్లో అమృత్సర్–విశాఖపట్నం(20808) హిరాకుడ్ ఎక్స్ప్రెస్ మళ్లించబడిన మార్గంలో నడుస్తుందని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆయా తేదీల్లో ఈ రైలు వయా అంబాలా కంటోన్మెంట్ జంక్షన్–షహరన్పూర్–మీరట్ సిటీ–ఘజియాబాద్– తిలక్ బ్రిడ్జి–హజరత్ నిజాముద్దీన్ల మీదుగా నడుస్తుంది. ఈ తేదీల్లో పానిపట్ జంక్షన్, న్యూఢిల్లీల మీ దుగా ఈ రైలు నడవదు. ఇవే పనుల నిమిత్తం జూన్ 5వ తేదీన విశాఖపట్నం–అమృత్సర్(20807) హిరాకుడ్ ఎక్స్ప్రెస్ ఆదర్శ్నగర్ ఢిల్లీ–ఢోలా మజ్రా పరిధిలో 80నిమిషాలుఆలస్యంగానడుస్తుందనితెలిపారు. -
హజ్ యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలి
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ నుంచి మదీనాకు వెళ్లిన 333 మంది హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ హజ్ డైరెక్టర్ మహ్మద్ ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18, 19 తేదీలలో మదీనాకు చేరుకున్న యాత్రికులకు నాలుగు రోజులైనా లగేజ్ అందకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రత్యేకంగా బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న యాత్రికుల మందులు లగేజ్లోనే ఉండిపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. కొంతమంది యాత్రికులు అదే ఎహెరామ్ దుస్తులతో పలుదినాలుగా కొనసాగాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం హజ్ యాత్రికుల లగేజ్ను ప్రత్యేక విమానాల ద్వారా సమయానికి పంపించే విధానం ఉన్నప్పటికీ, ఈసారి నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం జరిగిందని విమర్శించారు. ప్రస్తుతం లగేజ్ గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ వద్దే నిలిచిపోయిందని తెలిపారు. కేంద్ర హజ్ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మదీనాలో ఉన్న యాత్రికులకు వైద్య సేవలు అందించడంతో పాటు వారి లగేజ్ను త్వరితగతిన చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ హజ్ డైరెక్టర్ మహ్మద్ ఇమ్రాన్ -
ఇంధన సెగ!
● వార్ ఎఫెక్ట్..● పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విక్రయాలు ● ఆందోళనతో క్యూకడుతున్న వాహన దార్లునక్కపల్లి బంకులో స్టాక్ లేకపోవడంతో ఏర్పాటు చేసిన స్లాపర్లు పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా వంట గ్యాస్ కోసం కష్టాలు పడుతున్న ప్రజలకు ఇప్పుడు ఇంధన కష్టాలు కూడా మొదలయ్యాయి. జిల్లాలో కొన్ని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల పరిమితంగా పెట్రోల్ విక్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో డీజిల్ కూడా దొరకడం లేదు. దీంతో వాహనదారులు పెద్దసంఖ్యలో బంకుల వద్ద బారులు తీరుతున్నారు. గతంలో బంకులకు క్రెడిట్పై పెట్రోలు, డీజిల్ సరఫరా చేసిన కంపెనీలు.. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆ సౌకర్యాన్ని నిలిపివేశాయని సమాచారం. చాలాకాలంగా పెండింగ్లో ఉండిపోయిన బకాయిలు చెల్లించని బంకులకు కూడా సరఫరా ఆపేశాయని చెబుతున్నారు. దీనివల్ల కూడా కొరత ఏర్పడుతోందని తెలిసింది. నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న బంకుల్లో పెట్రోలు కొరత ఏర్పడింది.బంకుల్లో నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. వాహనాలు బంకుల్లోకి రాకుండా స్లాపర్లు ఏర్పాటు చేయడంతో వాహన యజమానుల్లో ఆందోళన మొదలైంది. నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లో 15 పెట్రోలు బంకులు ఉన్నాయి. వీటిలో డీజిల్,పెట్రోలు లేదంటూ నోస్టాక్ బోర్డులు పెట్టేశారు.మండల కేంద్రం నక్కపల్లిలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంకులో పెట్రోలు కొరత ఉందని తెలుసుకున్న వాహన యజమానులు క్యూకట్టారు. శనివారం ఉదయం డీజిల్ మాత్రమే విక్రయించారు. మధ్యాహ్నం నుంచి డీజిల్అమ్మకాలు నిలిపివేశారు. బుచ్చెయ్యపేట: మండలంలోని పలు పెట్రోల్ బంక్ల్లో శనివారం రాత్రి నుంచి పెట్రోల్,డీజిల్ అమ్మకాలు నిలిపి వేశారు. లోపూడిలో కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న బీపీసీఎల్ బంక్లో సాయంత్రం నుంచి పెట్రోల్,డీజిల్ విక్రయాలు నిలిపివేశారు. వడ్డాదిలో ఉన్న నాలుగు బంక్లతో పాటు బుచ్చెయ్యపేట,రాజాంలో ఉన్న బంకుల్లో డీజిల్ అమ్మకాలు నిలిపివేశారు. కొన్ని బంకుల్లో పెట్రోల్ అమ్మకాలు చేయగా, కొన్ని బంకుల్లో పెట్రోల్,డీజిల్ అమ్మకాలు నిలిపివేశారు. దీంతో అత్యవసరంగా వెళ్లే వాహనదార్లు తీవ్ర వస్థలకు గురయ్యారు.సాక్షి, అనకాపల్లి: జిల్లా వ్యాప్తంగా సుమారు 169 పెట్రోల్ బంకులు ఉండగా.. అందులో సగానికి పైగా జాతీయ రహదారిని అనుకుని పాయకరావుపేట నుంచి లంకెలపాలెం వరకూ ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి జిల్లాలో పెట్రోల్, డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు 2.5 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతోంది. అదేవిధంగా రోజుకు సగటున 4.8 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. అనకాపల్లి ఒక పారిశ్రామిక హబ్ కావడంతో డీజిల్ వినియోగం చాలా ఎక్కువ ఉంటుంది. అచ్యుతాపురం ఎస్ఈజెడ్, పరవాడ ఫార్మా సిటీలలోని జనరేటర్లు, భారీ యంత్రాలు, సరుకు రవాణా వాహనాలకు ఈ ఇంధనం ప్రాణాధారంగా మారింది. దీంతో ఎక్కువగా డీజిల్ వినియోగం ఉంటుంది. ధరల పెంపు భయం ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని మధ్యతరగతి ప్రజ లు బెంబేలెత్తుతున్నారు. కూరగాయలు, బియ్యం వంటి నిత్యావసరాల రవాణా భారమైతే సామాన్యుడి బతుకు బండి నడవడం కష్టమవుతుంది. అదేవిధంగా దీని ప్రభావం రైతుపై కూడా పడుతుంది. వరి కోతలు, పొలాల తయారీకి ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వినియోగం తప్పనిసరి. డీజిల్ కొరత ఏర్పడితే సాగు పనులకు ఆటంకం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొరత లేదు జిల్లాలోని సుమారు 169 బంకుల్లో కలిపి దాదాపు 18 లక్షల లీటర్ల పెట్రోల్, 35 లక్షల లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయని జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖ అధికారులు చెబతున్నారు. ఈ నిల్వలు సాధారణ పరిస్థితుల్లో జిల్లా అవసరాలకు మరో 7 నుంచి 10 రోజులకు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. చమురు సంస్థలు ప్రతిరోజూ తమ టెర్మినల్స్ నుంచి నిల్వలను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై, నల్లబజారులో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అనవసరంగా భయపడి స్టాక్ నిల్వ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.నక్కపల్లి బంకు వద్ద బారులు తీరిన కార్లుడీజిల్ కొరత... యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణం,మండలంలోని డీజిల్ కొరత వాహనదారులకు ఆందోళన కలిగిస్తోంది.రోజువారీ ఖాతాదారులకు లేదనకుండా డీజిల్ అందిస్తున్న బంకుల నిర్వాహకులు మిగిలిన వారికి పరిమితంగా మాత్రమే ఇంధనాన్ని అమ్ముతున్నారు.పట్టణంలో ఒక బంకు యజమాని మూడురోజుల క్రితమే డీజిల్ ఇండెంట్ పెట్టి దానికి అవసరమైన డబ్బుకు డీడీ చెల్లించినా ఇప్పటివరకు డీజిల్ పంపించలేదు. బైపాస్ రోడ్డులో ఉన్న మరో బంకులో రేషన్ పద్ధతిని అవలంభిస్తున్నారు.వచ్చిన వారికి 25 లీటర్ల నుంచి 50 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ ఇస్తున్నారు.ఇక పెట్రోల్ విషయంలో మాత్రం శనివారం నాటికి ఎలాంటి కొరత లేదు.అడిగినంత పెట్రోల్ వాహనదారులకు అమ్ముతున్నారు. డీజిల్ కొరత మాత్రం వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది.ఆదివారం స్టాకు రాకపోతే కొరత తీవ్రరూపం దాల్చనున్నట్టు సమాచారం. ఇంధన కొరతకు కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడంలేదని బంకుల యజమానులు చెబుతున్నారు.దీనికి యుద్ధ ప్రభావమా లేక మరేదైనా కారణమా అన్నది తెలుసుకునేందుకు బంకుల యజమానులు తంటాలు పడుతున్నారు.ఈ నెలాఖరుకు ధరలు పెరిగే అవకాశం ఉన్నందునే ప్రస్తుత కొరతకు కారణంగా కొందరు భావిస్తున్నారు. మాడుగులలో మాడుగుల: స్థానిక ఘాట్రోడ్ జంక్షన్లో ఉన్న పెట్రోల్ బంకు, జేడీపేట గ్రామం సమీపంలో ఉన్న బంకులో డీజిల్ నిండుకుంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. బైక్కు రూ.500.. కారుకు రూ.1000 అనకాపల్లి: పెట్రోల్ కొరత వార్తల నేపథ్యంలో అనకాపల్లి పట్టణ, మండల పరిధిలోని ఆరు పెట్రోల్ బంకుల్లో వాహనాలకు పరిమితంగా పెట్రోల్, డీజిల్ వేస్తున్నారు. శనివారం బైక్కు రూ.500 వరకు, కారుకు రూ.వెయ్యి వరకూ మాత్రమే పెట్రోల్ వేశారు. అంతకు మించి పెట్రోల్ వేసేందుకు పలు బంకుల సిబ్బంది నిరాకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిమితంగా పెట్రోల్ వేస్తున్నట్టు సమాచారం. జిల్లాలో పలు చోట్ల నోస్టాక్ బోర్డులు ఇంకొన్ని ప్రాంతాల్లో పరిమితంగా విక్రయాలు ఆందోళనలో వాహనదారులు కొరత లేదంటున్న అధికారులు -
బరితెగించిన గ్రావెల్ మాఫియా
● వేటజంగాలపాలెంలో ల్యాండ్ పూలింగ్ భూముల్లో అక్రమ తవ్వకాలు ● నిర్మాణంలో ఉన్న టీడీపీ కార్యాలయానికి గ్రావెల్ తరలింపు ల్యాండ్ పూలింగ్ భూముల్లో చేపడుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలు తుమ్మపాల: అనకాపల్లి మండలం వేటజంగాలపాలెం సర్వే నంబర్ 334లోని ల్యాండ్ పూలింగ్ భూముల్లో అడ్డూఅదుపు లేకుండా గ్రావెల్ దోపిడీ సాగుతోంది. టీడీపీ నేతల అండదండలతో గ్రావెల్ మాఫియా బరితెగించి భారీ యంత్రాలతో తవ్వేసి కొత్తూరులో నిర్మిస్తున్న టీడీపీ కార్యాలయానికి తరలించేస్తున్నారు. అనుమతులున్న క్వారీల ద్వారా తరలించే గ్రావెల్పై మాత్రమే సీనరేజ్ వసూలు చేయాల్సిన ఏఎంఆర్ సంస్థ సిబ్బంది అనుమతులు లేకుండా తరలిస్తున్న గ్రావెల్ టిప్పర్లకు బిల్లులు ఇస్తూ అక్రమాన్ని సక్రమం చేస్తున్నారని తెలిసింది. ల్యాండ్ పూలింగ్ భూముల్లో ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేసినప్పటికీ వాటిని బేఖాతరు చేసి మరి తవ్వకాలు చేపడుతున్నారు. స్థానికులు ఆయా శాఖల అఽధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు కనీసం స్పందించడం లేదు. గత రెండు రోజులుగా భారీ వాహ నాలతో గ్రావెల్ను తరలిస్తున్నా అధికార యంత్రాంగం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.28 నుంచి ఏపీ పీజీఈసెట్ మద్దిలపాలెం(విశాఖ): రాష్ట్రవ్యాప్తంగా ఏపీ పీజీఈసెట్–2026ను ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వర కు రెండో సెషన్ పరీక్ష ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 18 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. హాల్ టికెట్తో పాటు ఏదైనా ప్రభుత్వం గుర్తించిన గుర్తింపు కార్డు, నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్నును మాత్రమే పరీక్ష హాలులోకి అనుమతిస్తామన్నారు. వివరాల కోసం https://cetsapsche.ap.gov.in ను సందర్శించవచ్చు. -
అతిసార
విజృంభించినచికిత్స పొందుతున్న వలస కూలీ గంగరాజునక్కపల్లి: మండలంలో గొడిచర్లలో అతిసార వ్యాధి ప్రబలింది. మూడు రోజుల్లో 50 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ప్రతి ఇంటిలో ఇద్దరు ముగ్గురు చొప్పున అస్వస్థతకు గురై స్థానిక పీహెచ్సీతోపాటు, ఆర్ఎంపీల వద్ద,తుని, పాయకరావుపేటల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో నల్లల గంగాభవానీ, కె.అప్పలనర్స, కె.అప్పన్న, నల్లల విజయకుమారి, వి.అమ్మాజీ, నల్లల శివరాజు, కొటాని అప్పలనర్స, కొటానిచిన్ని, మాకిరెడ్డి వరలక్ష్మి, చిటికెల చిన్నయ్యనాయుడు, ఒడిసుల లక్ష్మి, నల్లల తేజ,నల్లల మణికంఠ, వారాది కుమారి, గొర్ల చైతన్య, జి. గంగరాజు,టి నాగమణి, నిట్ల అమ్మాజీ, వీధి నూకాలమ్మలతోపాటు, మరి కొంతమంది మంచాన పడ్డారు. ఇంట్లో ఒకరి తరు వాత ఒకరు అస్వస్థతకు గురవుతున్నట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులే కాకుండా పొట్టకూటికోసం అనకాపల్లి పరిసర ప్రాంతలనుంచి గొడిచర్ల సమీపంలో ఉన్న ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చిన గంగరాజు, అతని ఆరేళ్ల కుమారుడు మణివివేక్లకు కూడా అతిసార సోకింది, వీరు గొడిచర్ల పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. పీహెచ్సీకివచ్చిన వారికి వైద్యసేవలందిస్తున్నట్టు డాక్టర్ శ్రావణ సంధ్య తెలిపారు. తమ సిబ్బంది ద్వారా ఇంటింటా సర్వేచేయించామన్నారు. సుమారు16 మంది వాంతులు విరేచనాలతో బాధపడుతున్నట్లు గుర్తించి ఆస్పత్రికి తీసుకు వచ్చి వైద్యం అందించామన్నారు. నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపించామన్నారు. కుళాయి నీరే కారణమా? గ్రామంలో కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటిని తాగడం వల్లే వాంతులు విరేచాలు పట్టుకున్నాయని గ్రామస్తులు తెలిపారు.ఉద్దండపురం వద్ద నిర్మించిన వాటర్గ్రిడ్ ద్వారా గొడిచర్ల గ్రామానికి తాగునీరు సరఫరా అవుతోంది. గొడి చర్ల హైవేపై ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకుకు సరఫరా చేసి అక్కడనుంచి పైపుల ద్వారా గ్రామంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కుళాయిల ద్వారా వచ్చిన నీటిని తాగినప్పటినుంచి ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. కుళాయిల ద్వారా వచ్చిన నీరు ఆకుపచ్చరంగులో ఉందని, నురగలు తేలుతోందని చెప్పారు. గొడిచర్ల మెయిన్రోడ్డు, రామాలయం వీధి, ఎస్సీకాలనీ తదితర ప్రాంతాల్లో నివసించే వారే ఎక్కువగా వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. పంచాయతీ అధికారులు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకును శుభ్రం చేశారు. గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో గొడిచర్లలో అతిసార ప్రబలిన విషయం తెలుసుకున్న ఎంపీడీవో చలపతిరావు, మండల ప్రత్యేకాధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తదితరులు గ్రామాన్ని సందర్శించారు. 23వ తేదీనుంచి ఈ లక్షణాలతో బాధపడుతున్నవారి గురించి ఆరాతీశారు.నీటి శాంపిళ్లను సేకరించి గ్రామంలోనే పరీక్షలు నిర్వహించామని ఎటువంటి బ్యాక్టీరియా లేదని నివేదిక వచ్చిందని ఎంపీడీవో తెలిపారు. ఈ లక్షణాలతో చికిత్స పొందుతున్నవారు మరుసటిరోజే పనులకు వెళ్లిపోతున్నారన్నారు. ప్రస్తుతం గ్రామంలో అతిసార అదుపులో ఉందన్నారు. వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. గ్రామంలో ఇంటింటా సర్వే చేస్తున్నట్టు ఆయన తెలిపారు.24గంటలు సిబ్బందినిఅందుబాటులో ఉంచి వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గొడిచర్లలో మూడు రోజుల్లో 50 కేసులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరిక కుళాయిల ద్వారా వచ్చిన కలుషిత నీరే కారణమంటున్న బాధితులు -
AP: ప్రబలిన డయేరియా.. 50 మందికి అస్వస్థత
అనకాపల్లి: జిల్లాలో డయేరియా విజృంభించింది. నక్కపల్లి మండలం, గొడిచర్ల గ్రామంలో డయేరియా ప్రబలి 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ వాంతులు, విరేచనాలు అవుతుండడంతో గ్రామస్థలులు భయాందోళనలకు గురవుతున్నారు. పంచాయతీ కులాయి నీరు తాగిన కారణంగా డయేరియా వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు. పలువురు డయేరియా బాధితులను గ్రామస్థులు పీహెచ్సీకి తరలించారు.డయేరియా వచ్చినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరంలో నీరు తగ్గిపోకుండా ఎక్కువ ద్రవాలు తాగాలి. పరిశుభ్రత పాటించాలి, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. డయేరియా తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఓఆర్ఎస్ తరచుగా తాగాలి. ఇది శరీరానికి నీరు, ఉప్పు తిరిగి అందిస్తుంది. కొబ్బరి నీరు, సూప్, పల్చని పాలు, పండ్ల రసాలు ఉపయోగపడతాయి. కాఫీ, మద్యం, గ్యాస్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. -
స్మార్ట్ కిచెన్ పేరిట తొలగించాలని కుట్ర
నేను చోడవరం గర్ల్ హైస్కూల్లో 23 ఏళ్లుగా పనిచేస్తున్నాను. వేతనాలు ఆలస్యమైనా వంట సరుకులు అప్పు తెచ్చి మరీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. తక్షణమే స్మార్ట్ కిచెన్ విధానం తొలగించి..మా డిమాండ్లను పరిష్కరించాలి. ప్రమాద బీమాతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే తమ కుటుంబాలు వీధిన పడుతున్నాం. కేంద్రీకృత వంటశాలల పేరుతో ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తే తాము రోడ్డున పడతామని, అలాంటి ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని హెచ్చరించారు. – గూనూరు వరలక్ష్మి, మిడ్ డే మీల్స్ వంట కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కొత్త విధానంతో రోడ్డున పడతాం.. ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ కిచెన్ విధానంతో జిల్లాలో చాలా మంది పేద మహిళల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఇప్పటికే మా డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. చాలా ఏళ్లుగా పనిచేస్తున్నా. మాకు గతంలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు కలగలేదు. మేము ఇచ్చిన గడువులోగా స్మార్ట్ కిచెన్ విధానాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమిస్తాం. మా డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాలి. – శ్రీదేవి, మిడ్ డే మీల్స్ వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షరాలు -
లీకేజీతో ఏలేరు నీరు వృథా
లీకేజీ ద్వారా వృధాగా పోతున్న ఏలేరు కాలువ నీరు నాతవరం : ఏలేరు కాలువ నీరు లీకేజీలు ద్వారా నిత్యం వృఽథాగా పోతుంది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి విశాఖపట్నం స్టీల్ప్లాంటు, పలు పరిశ్రమలతో పాటు జీవీఎంసీ ప్రజలకు తాగునీరు అందించేందుకు కాలువ ద్వారా తరలిస్తున్నారు. ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి విశాఖపట్నం వరకు 154 కిలోమీటర్ల పొడవునా ఏలేరు కాలువ ఏర్పాటు చేయగా, నాతవరం మండలంలో 13 పంచాయతీల పరిధిలో 30 కిలోమీటర్ల మేర ఏలేరు కాలువ ఉంది. రాజుపేట అగ్రహారం సమీపంలో తాండవ నదిపై ఆక్వాడెక్టు నిర్మించారు. ఇక్కడ కాలువ శిథిలం కావడంతో లీకేజీ ద్వారా నీరు వృథాగా పోతుంది. అదే విధంగా గాంధీనగరం గునుపూడి పెదగొలుగొండపేట, ఎ.శరభవరం, చినగొలుగొండపేట, మన్యపురట్ల గ్రామాల వద్ద కూడా కాలువ శిథిలం కారణంగా లీకేజీ ద్వారా నీరు వృథాగా పోతుంది. నిత్యం లీకేజీ ద్వారా నీరు ప్రవహించడంతో ఏలేరు కాలువలో నీటి ప్రవాహం తగ్గిపోతుంది, ఇప్పటికై నా అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు. -
వేసవిలో చోరీలపై ప్రత్యేక నిఘా
అనకాపల్లి : వేసవి సెలవుల సమయంలో అనేక కుటుంబాలు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే నేపథ్యంలో, ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న కొన్ని చోరీ ఘటనలను దృష్టిలో ఉంచుకుని, పోలీసులు ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే దొంగతనాలను పూర్తిగా నివారించవచ్చన్నారు. గృహాల్లో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఉంచకూడదని, బ్యాంక్ లాకర్లలో భద్ర పరచుకోవాలన్నారు. లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టమ్ ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రయాణ వివరాలను నమ్మకమైన పొరుగువారికి, బంధువులకు తెలియజేయాలన్నారు. ఇంటి తలుపులు, కిటికీలు సరిగా లాక్ చేశారో లేదో నిర్ధారించుకోవాలని, అవసరమైతే ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్, అలారం వ్యవస్థలను ఉపయోగించాలన్నారు. బ్యాంకులు, ఏటీఎంలు, బంగారు దుకాణాలు హై–క్వాలిటీ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలన్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద రాత్రి సమయాల్లో సెక్యూరిటీ గార్డులను తప్పనిసరిగా నియమించాలన్నారు. అనుమానాస్పద కదలికలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో మీ సామాన్లు, నగలు జాగ్రత్తగా చూసుకోవాలని, అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోరాదన్నారు. ఇంటి బయట నిద్రించే వారు ఆభరణాలు ధరించకుండా ఉండడం మంచిదన్నారు. ఏదైనా అనుమానం, అత్యవసర పరిస్థితి ఎదురైతే తక్షణమే 100 / 112 కు కాల్ చేస్తే పోలీసులు సహాయపడతారని సూచించారు. -
పసుపు మద్దతు ధర పెంచాలి
మాడుగుల: కూటమి ప్రభుత్వం పసుపునకు మద్దతు ధర పెంచాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. శుక్రవారం తాటిపర్తి పంచాయతీ కాశీపురంలో ఉన్న పసుపు ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలించారు. పసుపు రైతులు కష్టపడితే రెండేళ్లకు పంటకు వస్తుందని, ఐటీడీఏ పరిధిలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి గిరి పసుపు రైతులకు మద్దతు ధర కల్పించాలన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయక గిరి రైతులు మధ్య దళారీ వ్యవస్థ నడుమ తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇప్పటికై నా ఇటీడీఏ అధికారులు స్పందించి గిరి రైతులుకు మద్దతు ధరలు కల్పించి న్యాయం చేయకపోతే గిరి రైతులు నుంచి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా వ్యతిరేకత వస్తుందన్నారు. పాడేరు, అరకులలో పండించే పసుపునకు దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉందన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి పాడేరులో పసుపు ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
చోడవరంలో సందడిగా వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభం
చోడవరం: కార్యకర్తలు, నాయకులు సందడి మధ్య వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గం ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యాలయాన్ని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి, ఉమ్మడి విశాఖ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రారంభించారు. చోడవరం పట్టణానికి అతి సమీపంలో ఈ కార్యాలయాన్ని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్ నిర్మించారు. పార్టీ కార్యాలయంతోపాటు అమర్నాఽథ్ నివాసం ఉండేందుకు సొంత ఇల్లు కూడా ఇదే ప్రదేశంలో నిర్మించుకున్నారు. ముందుగా అమర్నాఽథ్ తన కుటుంబసభ్యులతో నూతన గృహ ప్రవేశం చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ నియోజవర్గ కార్యాలయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యానారాయణ, ఉమ్మడి విశాఖజిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, పార్లమెంటు సభ్యురాలు తనూజరాణి, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ పాల్గొని ప్రారంభించారు. సుమారు 500 మంది ఒకే చోట సమావేశ మయ్యే విధంగా సమావేశ మందిరం, అతిఽథులకు విశ్రాంతి గదులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలు అలసట తీర్చుకునేందుకు ఒక హాలుతో పాటు అన్ని హంగులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు సమన్వయకర్తలు కె.కె.రాజు, బొడ్డేడ ప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ జల్లుపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, అన్నంరెడ్డి అదీప్రాజ్, వాసుపల్లి గణేష్, పెట్ల ఉమాశంకర్ గణేష్, కోలా గురువులు, కంబాల జోగులు, తిప్పల గురుమూర్తిరెడ్డి, శోభా హైమావతి, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయ్కుమార్, పసుపులేటి బాలరాజు, మలసాల భరత్, తిప్పల దేవాన్స్రెడ్డి, ఈర్లె అనురాధ, మొల్లి అప్పారావు, కొండా రాజీవ్, దంతులూరి దిలీప్కుమార్, పార్టీ పరిశీలకులు సతీష్వర్మ, ఏడువాక సత్యారావు, గండి రవికుమార్, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, చింతకాయల సన్యాసిపాత్రుడు, శరగడం చిన అప్పలనాయుడు, దొడ్డి కిరణ్, సులోచన, పి.వి. సురేష్, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల ప్రతినిధులు దొండా రాంబాబు, కొళ్లిమళ్ల అచ్చెంనాయుడు, గూనూరు రామచంద్రనాయుడు, పల్లా నర్సింగరావు, పందిరిశ్రీనువాసరావు, పుల్లేటి వెంకటేష్, దేవరపల్లి సత్య, నాగులాపల్లి రాంబాబు, చోడవరం నియోజకవర్గంలో నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షుడు, నాయకులు అందరూ పాల్గొంటారు. నూతనంగా నిర్మించిన చోడవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న బొత్స, కన్నబాబు, అమర్నాఽథ్, బూడి, కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్న బొత్స, కన్నబాబు, అమర్నాథ్, బూడి, ధర్మశ్రీ తదితరులు -
● స్మార్ట్ కిచెన్ పేరిట భోజన కార్మికుల ఉపాధిపై దెబ్బ! ● కార్పొరేట్ సంస్థలకు మధ్యాహ్న భోజనం నిర్వహణ అప్పగించేందుకు ప్రభుత్వం యత్నం ● రోడ్డున పడనున్న 2,400 మంది మహిళా కార్మికులు ● కలెక్టరేట్ వద్ద కార్మికుల నిరసన
నిరసనల మంటపై మిడ్డే మీల్ సాక్షి, అనకాపల్లి : రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం పేద మహిళల పొట్ట కొట్టేందుకు సిద్ధమైంది. మధ్యాహ్న భోజన పథకంలో ‘స్మార్ట్ కిచెన్’ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చి, ఏళ్ల తరబడి వంట చేస్తున్న పేద మధ్యాహ్న భోజన కార్మికులను సాగనంపేందుకు కుట్ర పన్నుతోంది. ఆధునికీకరణ ముసుగులో ఈ పథకాన్ని బడా కంపెనీలకు ధారాదత్తం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న 2,400 మంది వంట కార్మికుల భవిష్యత్తు అంధకారంలో పడనుంది. దీంతో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు శనివారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి.. అనంతరం తమ డిమండ్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. మహిళా కార్మికుల గుండెకోత.. గ్రామాల్లోని పేద, మధ్యతరగతి మహిళలు ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ గౌరవ వేతనంతో పాఠశాల విద్యార్థులకు రుచికరమైన భోజనం వండి పెడుతున్నారు. ఇప్పుడు ‘స్మార్ట్ కిచెన్’ల పేరుతో సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసి, స్థానిక మహిళలను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వారి ఉపాధిని దెబ్బతీసి, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చాలని చూస్తోంది. ‘మా కడుపు కొట్టి బడా కంపెనీలకు పెడతారా?’ అంటూ మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతపై ప్రశ్నార్థకాలు ఎక్కడో ప్రైవేట్ వంటశాలల్లో వండిన భోజనం గంటల తరబడి ప్రయాణం చేసి బాక్స్ల్లో పాఠశాలలకు చేరుకోవడంలో నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. తాజా భోజనానికి బదులు నిల్వ ఉంచిన పదార్థాలు విద్యార్థులకు పెట్టడం వల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం కంపెనీల కమీషన్ల కోసం విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కుట్రను తిప్పికొడతాం స్మార్ట్ కిచెన్ల పేరుతో తమను విధుల్లో నుంచి తొలగిస్తే సహించేది లేదని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక పరికరాలు కావాలంటే తాము పనిచేస్తున్న పాఠశాల వంటశాలల్లోనే ఏర్పాటు చేయాలని, అంతేకానీ వంట బాధ్యతలను థర్డ్ పార్టీ సంస్థలకు అప్పగించవద్దని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే కలెక్టరేట్ ముట్టడిని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే విద్యాశాఖ కార్యాలయాలను స్తంభింపజేస్తామని పిలుపునిచ్చారు. తమ ఉపాధిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికై నా సిద్ధమని వంటమ్మలు భీష్మించుక కూర్చున్నారు. అయితే, మే 1 నాటికి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో వంటలు నిలిపివేసి సమ్మెకు దిగుతామని కార్మికులు స్పష్టం చేశారు. -
బైక్ దొంగలు అరెస్ట్
నర్సీపట్నం : ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ గపూర్ కథనం ప్రకారం వివరాలివి. వరుస చోరీల నేపథ్యంలో ఎస్ఐలు రమేష్, ఉమామహేశ్వరరావు, కానిస్టేబుళ్లు నరేంద్ర, సతీష్, నానితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. ఈ బృందం నక్కపల్లి మండలం, సారపల్లిపాలెం గ్రామానికి చెందిన అనుమాను శ్రీను చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. శ్రీనుపై నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం చోరీ బైక్తో వెళ్తుండగా నర్సీపట్నం పెద్ద చెరువు సమీపంలో పట్టుకున్నారు. శ్రీనుకు పట్టణంలో పెదబొడ్డేపల్లికి చెందిన మైనర్ బాలుడు చోరీలకు సహకరిస్తున్నాడు. వీరు నర్సీపట్నంతో పాటు చింతపల్లి, కాకినాడ జిల్లాల్లో బిక్కవోలు, వంటిమామిడి పోలీసుస్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. ఈ చోరీలకు సంబంధించి అనకాపల్లి, కాకినాడ జిల్లాలో ఆయా పోలీసు స్టేషన్లలో ఇది వరకే కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి మొత్తం ఎనిమిది ద్విచక్రవాహనాలతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సంబంధిత యజమానులకు అందించనున్నట్టు సీఐ తెలిపారు. నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి శ్రీనును జైలుకు, మైనర్ బాలుడిని జువైనల్ హోంకు తరలించినట్టు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్స్పాట్ల తనిఖీలు
జాతీయ రహదారి తోటాడ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదాలపై మాట్లాడుతున్న డీఎస్పీ శ్రావణి అనకాపల్లి : అనకాపల్లి జాతీయ రహదారి పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని డీఎస్పీ ఎం.శ్రావణి అన్నారు. స్థానిక జాతీయ రహదారి తోటాడ జంక్షన్ తదితర ప్రాంతాలను శుక్రవారం ఆమె ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటరమణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రవాణాశాఖ, జాతీయ రహదారి, పోలీస్ శాఖల అధికారులతో సమక్షంలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సిగ్నిల్వ్యవస్థ, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు, హెచ్చరక బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రహదారిలో వేగాన్ని నియంత్రించేందుకు, పాదచారుల భద్రత కసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పాడి పరిశ్రమ రైతులకు లాభదాయకం
నర్సీపట్నం : పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తిని పెంచడమే పశుసంవర్ధకశాఖ ముఖ్య ఉద్దేశమని పశుసంవర్ధక/శాఖ ఏడీ డబ్ల్యూ.రాంబాబు తెలిపారు. ఈ మూడు అంశాలు వృద్ధి, అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు కృషి చేస్తున్నామని తెలిపారు. పాడి రైతులకు వ్యవసాయం కంటే పాడి పరిశ్రమ ఎంతో లాభదాయకంగా ఉంటుందన్నారు. రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారిస్తే మంచి ఆదాయం లభిస్తుందని వివరించారు. అదేవిధంగా పశువులు, కోళ్లలో సీజనల్గా వచ్చే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువుల్లో, కోళ్లలో వచ్చే అంటు వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కృత్రిమ గర్భాధారణ ద్వారా మేలు జాతి పశువులను ఉత్పత్తి చేసి రైతులకు మేలు చేకూర్చుతున్నామన్నారు. ముఖ్యంగా వేసవిలో పశువులు, గొర్రెలు, మేకలు, పందులకు సంక్రమించే వ్యాధులపై పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువైద్యుల సూచనలు మేరకు టీకాలు వేయించాలని, కోళ్ల వ్యాధుల పట్ల కూడా శ్రద్ధ చూపాలని సూచించారు. -
రైతుల సమస్యలు గాలికొదిలేసిన ప్రభుత్వం
చోడవరం : రైతులు, ప్రజల సమస్యలను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చోడవరంలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. దోచుకోవడం ప్రధానంగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనారోగ్యం నుంచి తొందరగా తేరుకోవాలన్న ఆయన ఐటీ మంత్రి, ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంతో బాగా నడుస్తున్న గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మూసివేశారని, రైతులకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.39కోట్లు రెండేళ్లుగా ఎందుకు చెల్లించలేదని బొత్స ధ్వజమెత్తారు. 24 వేల మంది చెరకు రైతుల జీవనాధారమైన గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మూసివేయడమే కాకుండా రైతుల చెరకు బకాయిల కోసం రూ.39 కోట్లు కనీసం ప్రభుత్వం ఇవ్వకపోవడం కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల ఎంతటి నిర్లక్ష్యం కనబరుస్తుందో అర్ధమౌతోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ. 89 కోట్లు సాయం చేసి రైతులను, ఫ్యాక్టరీని ఆదుకున్నామన్నారు. రైతుల బకాయిలు చెల్లించడంతో పాటు ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే వైఎస్సార్సీపీ చెరకు రైతుల తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. చెరకు బదులు మొక్కజొన్న వేయాలని సూచిస్తున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు ఆ మొక్కజొన్నకు సైతం గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆవేదన చెందుతున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గోవాడ ఫ్యాక్టరీని తెరిపించడంతోపాటు రైతులందరికీ అండగా ఉంటామని చెప్పారు. గీతం కాలేజీ అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించి, చర్యలు తీసుకోవడంలేదని, తన బంధువులకు మేలు చేయడానికే చంద్రబాబు పనిచేస్తున్నారని బొత్స ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక రైతులను, ప్రజలను పట్టించుకోకుండా, హామీలు అమలు చేయకుండా పాలన పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా విదేశీ పర్యటనలతో మంత్రులు, సీఎం జాలీగా తిరుగుతున్నారని విమర్శించారు. 2019–24 మధ్యలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో తెచ్చిన పరిశ్రమలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెచ్చినట్టు తన సొంత ప్రచార సాధనాలతో ఊకదంపుడు ప్రచారంతో గొప్పలు చెప్పుకుంటున్నారని బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత మీడియాకి సామాజిక బాధ్యత ఉందా, ఉపాధి హామీపథకంలో అందరికీ ఒకేసారి పని కల్పిస్తున్నారా, మహిళలకు సున్నా వడ్డీ ఇచ్చారా, మరి మహిళా పారిశ్రామిక వేత్తలను ఎలా తయారు చేస్తామని ప్రసంగాలు చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజలకు, రైతులకు మేలు చేసే ఏ ఒక్క పనీ చేయలేదని, విశాఖ ఇన్ఛార్జి మంత్రి ఈ జిల్లాలో ఏ ఒక్క కొత్త అభివృద్ధి పనైనా చేశారా? అని బొత్స ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయడానికి చంద్రబాబు చూస్తున్నారని, ప్రజా వైద్యాన్ని ప్రైవేటీకరిస్తే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. రెండేళ్లలో రూ.3.5లక్షల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం రూ.15 కోట్లు ప్రభుత్వ ఆస్పత్రులకు ఖర్చు చేయలేదా? అని ప్రశ్నించారు. దోపిడీకి పాల్పడడానికి చేతులు కలిపే ఏ ప్రైవేటు సంస్థను వదిలిపెట్టేలి లేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులు ప్రైవేటుకు తీసుకున్న వారిని తొలగించి, మరలా ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అప్పు తెచ్చిన రూ .3.5 లక్షల కోట్లు ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. తమ ఐదేళ్ల హయాంలో రూ. 2.8 లక్షలు అప్పుచేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లు అప్పుచేసి ప్రజలకు ఏం మంచి చేసిందన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాఽథ్, బూడి ముత్యాలనాయుడు, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. -
గ్రామాలే దేశాభివృద్ధికి పునాది
మహారాణిపేట: స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా గ్రామీణ నాయకత్వంలో వారి పాత్ర గణనీయంగా పెరిగిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 33వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు బలమైన చట్టబద్ధత లభించిందని, 1993 నుంచి గ్రామీణ స్వపరిపాలన బలోపేతం అవుతోందన్నారు. గ్రామాలే దేశాభివృద్ధికి పునాది అని, నిర్ణయాధికారాల్లో మహిళల పాత్ర మరింత పెరగాలని ఆకాంక్షించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయని ఆమె ఉద్ఘాటించారు. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి మాట్లాడుతూ.. పంచాయతీలకు 29 అంశాలపై అధికారాలు కల్పిస్తూ అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, 16వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు మరిన్ని నిధులు అందనున్నాయని వివరించారు. ‘స్వర్ణ పంచాయత్’పోర్టల్ ద్వారా పన్నుల వసూళ్లను ఆన్లైన్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. డీపీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పంచాయతీరాజ్ ఒకటని, వికసిత భారత్ లక్ష్య సాధనలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. డిప్యూటీ సీఈవో రాజ్కుమార్ మాట్లాడుతూ పారదర్శకతతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50 మంది ఉద్యోగులకు జెడ్పీ చైర్పర్సన్ ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు. -
మహిళా శక్తికి నిదర్శనం ‘వనితా వేవ్’
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బీచ్రోడ్డులో శుక్రవారం నిర్వహించిన ‘శతాబ్ది వనితా వేవ్’వాకథాన్ మహిళా శక్తిని ప్రతిబింబిస్తూ విజయవంతంగా సాగింది. ఈ కార్యక్రమాన్ని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ప్రారంభించి మాట్లాడారు. మహిళలు తమ ప్రతిభతో అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా విద్యా రంగంలో మహిళల భాగస్వామ్యం, నాయకత్వ పాత్ర పెరగడం సంతోషకరమన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపాళ్లు, డీన్లు, వార్డెన్లు, విభాగాధిపతులు వంటి కీలక బాధ్యతల్లో మహిళలు సమర్థవంతంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. కాళీమాత ఆలయం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వరకు సాగిన ఈ వాకథాన్లో పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కన్వెన్షన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శనను ఎంపీ శ్రీభరత్ వీక్షించి, విద్యార్థుల ప్రతిభను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జుంబా నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు, యోగా ఆసనాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఏయూ రెక్టర్ ఆచార్య పి.కింగ్, సమన్వయకర్త ఆచార్య ఎ.పల్లవి, తదితరులు పాల్గొన్నారు. -
6 కొత్త ప్లాట్ఫాంలతో..
ప్రస్తుతం రైల్వే స్టేషన్లో 8 ప్లాట్ఫాంలు ఉండగా, తొలుత మరో రెండింటిని మాత్రమే ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, పెరుగుతున్న రైళ్ల రద్దీతో పాటు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానున్న నేపథ్యంలో, అదనపు ప్లాట్ఫాంల ఆవశ్యకతను గుర్తించిన అధికారులు వీటి సంఖ్యను 14కు పెంచారు. ఈ ప్లాట్ఫాంలు అందుబాటులోకి వస్తే.. అవుటర్లో ప్లాట్ఫాం కోసం రైళ్లు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. అలాగే, బైపాస్ మీదుగా రైళ్లను దారి మళ్లించే ఇబ్బందులు కూడా తప్పుతాయి. -
శరీర సౌష్టవ పోటీలు ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: అఖిల భారత మేజర్ పోర్టుల బాడీ బిల్డింగ్, వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలు సాలిగ్రామపురంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో గురువారం ప్రారంభమయ్యాయి. విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కొరాటి ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో విశాఖపట్నంతో పాటు చైన్నె, ముంబయి, జవహర్లాల్ నెహ్రూ, దీన్దయాల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుల జట్లు పాల్గొంటున్నాయి. -
దిబ్బిడిలో సరుగుడు తోట దగ్ధం
బుచ్చెయ్యపేట: మండలంలోని దిబ్బిడి గ్రామంలో గురువారం సాయంత్రం సరుగుడు తోట కాలిపోయింది. సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక్కడ జగ్గరాజు చెరువు దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో గాలికి అగ్గి రవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న గంప పైడిరాజుకు చెందిన సరుగుడు తోటలో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అరెకర పొలంలో సరుగుడు తోట మొత్తం కాలిపోయింది. మూడున్నరేళ్ల క్రితం వేసిన పంట చేతికంది వచ్చే సమయంలో కాలిపోవడంతో బాధిత రైతు లబోదిబోమన్నాడు. నిరుపేదనైన తనకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. -
ఫలించని పయనీర్ కార్మికుల చర్చలు
మాకవరపాలెం: పయనీర్ పరిశ్రమ కార్మికులతో యాజమాన్య ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో వరుసగా మూడో రోజు కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆందోళన కొనసాగించారు. మండలంలోని రాచపల్లి వద్ద పయనీర్ పరిశ్రమలో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు పలు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాచపల్లి, జి.కోడూరు, రామన్నపాలెం గ్రామాలకు చెందిన నాయకులు ముందుగా కార్మికులకు ఆందోళన విరమించాలని సర్ది చేప్పే ప్రయత్నం చేశారు. అయినా వారంతా ఏ మాత్రం తగ్గకుండా యాజమాన్య ప్రతినిధులు వచ్చి తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కోరారు. కంపెనీకి భూ సేకరణ సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి, ఇతర ప్రాంతాల వారికి యాజమాన్యం ఉద్యోగాలు ఇస్తోందన్నారు. తమకు మద్దతుగా నిలవకుండా కంపెనీకి అనుకూలంగా మాట్లాడటం ఏంటని ఒక దశలో నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పయినీర్ యాజమాన్య ప్రతినిధులైన ఎల్.ఎస్.రావు, తదితరులు కార్మికుల వద్దకు చేరుకుని మాట్లాడారు. ఆందోళన విరమించి పనుల్లో చేరాలన్నారు. డిమాండ్లను ఇప్పటికిప్పుడు పరిష్కరించే అవకాశం లేదన్నారు. ఇవన్నీ కంపెనీ పెద్దలకు తెలియజేస్తామన్నారు. ఈ నేపథ్యంలో చర్చలు ఫలించ లేదు. మూడో రోజు ఆందోళనకు సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు శంకర్రావు, రాజు, డివిజన్ నాయకుడు చిరంజీవి మద్దతుగా పాల్గొన్నారు. పరిశ్రమ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ దామోదర్నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
ఆలిండియా చాంపియన్షిప్ పోటీలు ప్రారంభం
పోటీలను ప్రారంభిస్తున్న పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి, పోర్టు అధికారులు సాక్షి, విశాఖపట్నం: అఖిల భారత మేజర్ పోర్టుల బాడీ బిల్డింగ్, వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలు సాలిగ్రామపురంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో గురువారం ప్రారంభమయ్యాయి. విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కొరాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో విశాఖపట్నంతో పాటు చైన్నె, ముంబయి, జవహర్లాల్ నెహ్రూ, దీన్దయాల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుల జట్లు పాల్గొంటున్నాయి. జట్ల మార్చ్ఫాస్ట్, పతాకావిష్కరణ, క్రీడాకారుల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. కార్యక్రమంలో విభాగాధిపతులు, క్రీడా విభాగ సభ్యులు పాల్గొన్నారు. -
జీవీఎంసీకి ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్ర పురపాలక పట్టాణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్కుమార్ నుంచి అవార్డు స్వీకరిస్తున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్మహారాణిపేట(విశాఖ): ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డు స్థాయి ప్రగతి సాధించినందుకు జీవీఎంసీకు రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు లభించిందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి కమిషనర్ల వర్క్షాప్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ పి.సంపత్ కుమార్ చేతుల మీదుగా అవార్డును, ప్రశంసా పత్రాన్ని స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విశాఖ నగరం ఆస్తి పన్ను చెల్లింపుల్లో అగ్రగామిగా నిలవడానికి పన్ను చెల్లింపుదారులు, ప్రజల సహకారం కీలకమని అన్నారు. 2025–26లో సుమారు రూ.510 కోట్ల వసూళ్లు నమోదై, అదనంగా రూ.60 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ విభాగం, ఫీల్డ్ సిబ్బంది సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించామని, భవిష్యత్తులో కూడా వసూళ్లను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బీసీలపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ
నక్కపల్లి: బీసీలపై సీఎం చంద్రబాబునాయుడిది సవతి తల్లి ప్రేమ అని వైఎస్సార్సీపీ జిల్లాప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గొర్ల నర్సింహమూర్తి అన్నారు. గురువారం వారు నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, ఆయన మాటలు నమ్మి బీసీలంతా ఓటేశారని చెప్పారు. గెలిచి రెండేళ్లపూర్తవుతున్నప్పటికీ ఒక్క బీసీకి కొత్తగా పింఛన్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా ఒక్క వృధ్యాప్య, వితంతు పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు.కేవలం అధికారంలోకి రావడం కోసమే సూపర్సిక్స్ పేరుతో బూటకపు హామీలు ఇచ్చారని ఆరోపించారు. బీసీలపై మొదటినుంచి చంద్రబాబు వివక్ష చూపుతున్నారని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకోసం వాడుకున్నారని చెప్పారు. రెడ్బుక్ పేరుతో బీసీలు, ఎస్సీలపై రాజకీయ దాడులు, కేసులు పెట్టి వేధించడం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే బీసీలకు సముచిత స్థానం లభించినట్టు చెప్పారు. బీసీలను డిప్యూటీ ముఖ్యమంత్రులను చేసిన ఘనత జగన్ మోహన్రెడ్డిదేనని తెలిపారు. జగనన్న ప్రభుత్వంలోనే 50 బీసీ ఉపకులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పలువురు నాయకులకు చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో నియమించి, రాజరకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ల సదుపాయం కల్పించి పోటీ చేసే అవకాశం కల్పించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు.బీసీలంటే వెనుకబడినతరగతుల వారు కాదు, పార్టీకి బ్యాక్బోన్ లాంటివారని గుర్తించిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అని అన్నారు. కూటమిప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లు వయసు నిండిన వారికి పింఛన్లు ఇవ్వాలన్నారు. ఈనెల 26న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అనంతపురంలో రాష్ట్రస్థాయి బీసీల సదస్సు జరుగుతుందని బీసీసెల్ అధ్యక్షుడు నర్సింహమూర్తి తెలిపారు. ప్రభుత్వం బీసీలపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నట్టు చెప్పారు. బీసీలంతా హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. జిల్లా పార్టీ ప్రధాన కారదర్శి, బీసీ సెల్ అధ్యక్షపదవులను నక్కపల్లి మండలానికి కేటాయించేందుకు కృషి చేసిన మాజీ మంత్రి అమర్ నాథ్, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు, సమన్వయకర్త కంబాల జోగులు,పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్లకు కృతజ్ఙతలు తెలిపారు. ఈసమావేశంలో వైఎస్సార్ిసీసీ రాష్ట్రప్రచార విభాగం సహాయ కార్యదర్శి లొడగల చంద్రరావు, రాష్ట్ర బూత్ విభాగం సహాయకార్యదర్శి గొర్ల బాబూరావు, మండల ప్రధాన కార్యదర్శి ఎరిపల్లి నాగేశు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు యలమంలిచి తాతబాబు, నాయకులు ప్రసాదుల శ్రీను, సూరిసత్తిబాబు, పల్లాచినబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
భారీ ఎయిర్ కాన్కోర్స్ ప్రత్యేక ఆకర్షణ
ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా భారీ ఎయిర్ కాన్కోర్స్ నిలవనుంది. 72 మీటర్ల వెడల్పు, 220 మీటర్ల పొడవుతో దీనిని నిర్మిస్తున్నారు. స్టేషన్ ప్లాట్ఫాంల పైభాగంలో, సహజ సిద్ధమైన కాంతి ప్రసరించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఇది స్టేషన్కు రెండు వైపులా ఉన్న ప్లాట్ఫాంలను అనుసంధానిస్తుంది. ఇక్కడ 600 మంది ప్రయాణికులు కూర్చునే వీలుండటంతో పాటు 20 వాణిజ్య దుకాణాలు కూడా రాబోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 60 లిఫ్ట్లు, 50 ఎస్కలేటర్లు, 28 ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టేషన్ పునర్నిర్మాణ ప్రాజెక్టు ఊపందుకుంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల వైపు 60 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ప్రయాణికులకు విమానాశ్రయ స్థాయి అనుభూతిని అందించడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్టేషన్ ఉత్తర, దక్షిణ దిశలైన జ్ఞానాపురం వైపు, అలాగే ప్రధాన ప్రవేశ ద్వారం భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో ప్రధాన కార్యాలయం, రిజర్వేషన్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లు ఉన్న భవనాల స్థానంలో బహుళ అంతస్తుల అత్యాధునిక నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కోటి 5 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో రెండు ప్రధాన భవనాలను నిర్మిస్తున్నారు. ప్రారంభంలో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ.. ప్రస్తుతం మాత్రం వేగంగా పుంజుకున్నాయి. అసలు ఎటువైపు ఏం అభివృద్ధి జరుగుతోందో ఓసారి పరిశీలిద్దాం.. చురుగ్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ విస్తరణ ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్ఫాంలను 14కు పెంచేలా పనులు టెర్మినల్స్ మాదిరిగా ఫ్లాట్ఫాంల నిర్మాణం ఎర్రి గెడ్డ మురుగు కాలువ దారి మళ్లింపు.. 1.50లక్షల చదరపు అడుగుల పార్కింగ్ 60కి పైగా లిఫ్ట్లు, 50 వరకు ఎస్కలేటర్ల ఏర్పాటు -
నేడు న్యాయవాదుల సంఘం ఎన్నికలు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు విశాఖ లీగల్ : విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. మొత్తం 2,174 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది ఎ.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇందుకు ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తుది ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. సీనియర్ న్యాయవాదులకు అసౌకర్యం లేకుండా వేదిక వద్ద రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కీలకమైన అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి పోస్టులకు నలుగురు చొప్పున పోటీలో ఉన్నారు. అభ్యర్థుల ప్రచారంతో కోర్టు ప్రాంగణం కోలాహాలంగా మారింది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు న్యాయవాదుల సంఘం కార్యదర్శి ఎల్.పార్వతీశ్వర నాయుడు తెలిపారు. -
కలెక్టర్పై కోర్టు దిక్కరణ కేసు నమోదు చేయాలి
నర్సీపట్నం: కలెక్టర్, ఇతర అధికారులపై కోర్టు దిక్కరణ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. కలెక్టర్, ఇరిగేషన్, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులపై పార్టీ నాయకులతో కలిసి ఆయన గురువారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సృష్టిక్షేత్రం పేరుతో నర్సీపట్నం పెద్ద చెరువులో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల నష్టం జరుగుతుందని రైతులు తన దృష్టికి తీసుకొచ్చారని, వారి తరఫున తాను హైకోర్టును ఆశ్రయించానని చెప్పారు. పెద్ద చెరవు గట్టు బలోపేతం, సుందరీకరణ పనులకు సంబంధించి కార్యాచరణను కోర్టు ముందుంచాలని, చెరువులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించిందన్నారు. తదుపరి విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేసిందని చెప్పారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అధికారులు ఉపాధి కూలీలతో గట్టు వెడల్పు పనులు చేయిస్తున్నారని తెలిపారు. కోర్టు ఉత్తర్వులను ఉపాధి కూలీల దృష్టికి తీసుకువెళ్లకుండా వారందరిని మభ్యపెట్టి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను అధికారులు గౌరవించకుండా పనులు చేయించడం దారుణమన్నారు. ప్రత్యామ్నాయంగా వేరే చోట ఉపాధి పనులు కల్పించకుండా చెరువులో పనులు చేయించడం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన కలెక్టర్ విజయ్కృష్ణన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన కలెక్టర్, ఇరిగేషన్ ఎస్ఈ, డీఈ, ఆర్డీవో, తహసీల్దార్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ఎస్పీ నిర్ణయం తరువాత అధికారుల తీరుపై కోర్టు వారిని ఆశ్రయించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే గణేష్ తెలిపారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ కోనేటి రామకృష్ణ, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ తదితరులున్నారు. -
75 వేల మంది సామర్థ్యంతో..
ప్రస్తుతం విశాఖ నుంచి నిత్యం 110 నుంచి 130 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, అందులో దాదాపు 40 రైళ్లు ఇక్కడి నుంచే బయలుదేరుతున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య 50 నుంచి 75 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్లాట్ఫాంలను టెర్మినల్ తరహాలో 650 నుంచి 1000 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. దీని వల్ల 24 కోచ్లకు పైగా ఉన్న సుదీర్ఘ రైళ్లను కూడా సులభంగా నిలిపే వీలుంటుంది. ప్రస్తుతం రోజుకు 45 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, ఆధునికీకరణ పనులు పూర్తయితే ఆ సామర్థ్యం 75 వేల నుంచి 90 వేల వరకు పెరగనుంది. -
చోడవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభం నేడు
● హాజరు కానున్న బొత్స, కన్నబాబు ప్రారంభానికి సిద్ధమైన చోడవరం వైఎస్సార్సీపీ కార్యాలయం చోడవరం: వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గం ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. చోడవరం పట్టణానికి అతి సమీపంలో ఈ కార్యాలయాన్ని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిర్మించారు. పార్టీ కార్యాలయంతోపాటు ఆయన నివాసం ఉండేందుకు సొంతిల్లు కూడా ఇదే ప్రదేశంలో నిర్మించుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అమర్నాథ్ గృహ ప్రవేశం చేస్తారు. అనంతరం వైఎస్సార్సీపీ నియోజవర్గ కార్యాలయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, విశాఖ, విజయనగరం జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రారంభిస్తారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సమన్వయకర్తలు, పార్టీ పరిశీలకులు, నియోజకవర్గ నాయకులందరూ పాల్గొననున్నారు. -
బెదిరించి తరలించినా.. సీఎం సభ వెలవెల
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలతో సామాన్య ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో రాంబిల్లి మండలంలో జరిగిన సభకు బస్సుల తరలింపుతో... దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. రాకుంటే రుణాలు మంజూరు చేయబోమని బెదిరించి భారీ ఎత్తున డ్వాక్రా సభ్యులను సభకు తరలించినా వారు చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే బయటకు వచ్చేశారు. దీంతో కుర్చీలు ఖాళీ అయిపోయాయి. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో సభకు వెళ్లినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండవేడిని భరించలేక అవస్థలకు గురయ్యారు. సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఖాళీ అయిన సభా ప్రాంగణం , (ఇన్సెట్) రెన్యూ సోలార్ ఇగాట్ వేఫర్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తున్న సీఎంసాక్షి, అనకాపల్లి/అచ్యుతాపురం రూరల్ : ‘ఎంకి పెళ్లి..సుబ్బి చావు కొచ్చింది’ అన్నట్లుగా సీఎం చంద్రబాబు బహిరంగ సభ రెండు జిల్లాల ప్రయాణికులకు అవస్థలు తెచ్చిపెట్టింది. రాంబిల్లి మండలంలో జెడ్. చింతువ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ‘రెన్యూ సోలార్ ఇన్గాట్–వేఫర్ ప్లాంట్’ను గురువారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేశారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు నుంచే అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, అనకాపల్లి డిపోలు, విశాఖలో సింహాచలం, మద్దిలపాలెం, వాల్తేరు డిపోల నుంచి 300కు పైగా ఆర్టీసీ బస్సులను సీఎం బహిరంగ సభకు జనాన్ని తరలించేందుకు గ్రామాలకు పంపించారు. దీంతో గురువారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. బస్సులు రాకపోవడంతో అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్, బస్టాండ్ల్లో ఉదయం నుంచే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మండుటెండలో రోడ్లపై గంటల తరబడి పడిగాపులు కాశారు. చివరికి దిక్కుతోచని స్థితిలో ఆటోలు,క్యాబ్ల్లో అధిక చార్జీలు చెల్లించి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడాయి ప్రసంగం మధ్యలోనే జనం ‘జంప్’ చంద్రబాబు మెప్పు పొందేందుకు వందలాది ఆర్టీసీ బస్సుల ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు జనాన్ని తరలించారు. సభకు రాకుంటే రుణాలు మంజూరు చేయబోమని డ్వాక్రా సభ్యులను బెదిరించి మరీ సీఎం బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలించారు. అనకాపల్లి, యలమంచిలి, పరవాడ, సబ్బవరం, పాయకరావు పేట నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలించారు. సభ 11.10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా..జనం రాకపోవడంతో కాసింత ఆలస్యంగా ప్రారంభమైంది. రెండు గంటల ముందే జనాన్ని తరలించడంతో ఎండ తీవ్రతకు తట్టుకోలేక..చాలా మంది సమీపంలో ఉన్న కొబ్బరి చెట్ల కింద సేదతీరారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైన 10 నిమిషాల్లోనే జనం బయటకు వెళ్లిపోతుండడంతో వారిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సభ పూర్తయ్యేవరకూ ఉండాలని కోరినా గేట్లు తోసుకుంటూ బయకు వచ్చేశారు. మిట్ట మధ్యాహ్న సమయంలో బహిరంగ సభ జరిగినా కనీస తాగునీరు, మజ్జిగను కూడా నిర్వాహకులు అందించకపోవడంతో సభకు వచ్చిన వారంతా ఎండవేడిమి తాళలేక నానా ఇబ్బందులు పడ్డారు. సభ పూర్తి కాకుండానే సభ మధ్యలోనే జనమంతా వెనుదిరిగిపోయారు. గోడు చెప్పుకోకుండా అడ్డుకున్నారు తమ సమస్యలు చెప్పుకునేందుకు జిల్లాలో పలువురు రైతులు, దివ్యాంగులు వినతి పత్రాలు అందించేందుకు వచ్చారు. అయితే చంద్రబాబును కలవనీయకుండా అడ్డుకోవడంతో గేటు బయటే వేచి చూసి వెనదిరిగారు. నక్కపల్లి మండలంలో డి.ఎల్. పురానికి చెందిన 60 ఏళ్ల దివ్యాంగుడు నానేపల్లి మాణిక్యం తన భూ సమస్యను సీఎం చంద్రబాబుకు విన్నవించుకోవాలని వెళితే కుదురదుపొన్నారు. రూ.2 కోట్లు విలువైన భూమిని నా ప్రమేయం లేకుండా అమ్మేశారని, నాకు న్యాయం చేయాలని కోరేందుకు వెళ్లానని, సీఎంను కలవడం కుదరదు పొమ్మన్నారని ఆ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బస్టాపుల్లో ప్రయాణికుల పడిగాపులుజనసమీకరణ కోసం ఆర్టీసీ బస్సుల తరలింపు చంద్రబాబు సభతో జనానికి అవస్థలు సభ ఆలస్యం.. బాబు ప్రసంగం మధ్యలోనే జనం ‘జంప్’ మత్స్యకారుల నిరసన రాంబిల్లి పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు మత్స్యకారుల నుంచి నిరసన సెగ ఎదురైంది. ఫార్మా కంపెనీలు వద్దు..మాకు జీవనోపాధి కలిగించే ఫిషింగ్ హార్బర్ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పూడిమడక గ్రామ సమీపంలో బ్లూజెట్ ఫార్మా కంపెనీ ఏర్పాటును రద్దు చేయాలి..ఫిషింగ్ హార్బర్ పనులను పున:ప్రారంభించాలి..బల్క్డ్రగ్ పార్కును వద్దు అంటూ తమ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సీఎంకు వినతిపత్రం అందజేసేందుకు వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే సీఐ చంద్రశేఖర్రావుకు మత్స్యకార నాయకులు చొడిపల్లి అప్పారావు, వాసుపల్లి శ్రీనివాసరావు, ఉమ్మడి జగన్, ఉమ్మడి అప్పారావు, మత్స్యకారులు మేరుగ చినరాజులు, చేపల శ్రీరాములు, మేరుగ అప్పలరాజు,ఏరిపిల్లి ముత్యాలు, ఏరిపిల్లి భాను వినతి అందజేశారు. అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో మత్స్యకారులు సీఎం చంద్రబాబుకు వినతి ఇచ్చేందుకు బయలుదేరగా ..పోలీసులు అడ్డుకోవడంతో ...అక్కడే నిరసన తెలియజేసి సీఐ చంద్రశే ఖర్కు వినతి పత్రం అంద జేశారు. డ్వాక్రా సభ్యులపై ‘కూటమి’ ఒత్తిడి..‘సభకు రాకపోతే రుణాలు కట్’ అంటూ బెదిరింపులు బయటకు వెళ్లేవారిని అడ్డుకున్న పోలీసులు -
50 ఏళ్ల భవిష్యత్తు ప్రణాళిక
రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఈ స్టేషన్ను కేవలం రైళ్లు వచ్చి వెళ్లే ప్రాంతంగానే కాకుండా, నగరానికే తలమానికంగా నిలిచే ఒక భారీ వాణిజ్య, రవాణా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల్లో రైల్వే కార్యాలయాలతో పాటు.. అత్యాధునిక వెయిటింగ్ హాల్స్, విశ్రాంతి గదులు, విశాలమైన వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ పనులన్నీ పూర్తయితే, విశాఖపట్నం రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన రవాణా కేంద్రంగా అవతరించి, నగర కీర్తిని దశదిశలా చాటుతుంది. – లలిత్ బోహ్రా, వాల్తేరు డీఆర్ఎం -
ప్రతి గ్రామంలో శివాలయం ఉండాలి
మాట్లాడుతున్న స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిజీ పాయకరావుపేట: గ్రామ పరిధిలో గ్రామ దేవత ఆలయం, గ్రామంలో శివాలయం ఎంతో ముఖ్యమని విశాఖ శారదా పిఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిజీ అన్నారు. మండలంలోని కుమారపురం గ్రామంలో కుమార ఉమారామలింగేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్టా మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సభలో గ్రామ దేవత, శివాలయం ఆలయాల విశిష్టతపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి హేచరీస్ చైర్మన్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, నాయకులు నీలాపు మహేష్రెడ్డి, బాలకృష్ణారెడ్డి, చిరంజీవిరెడ్డి, వెంకటరెడ్డి పెరుమాళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే ’నారి శక్తి’కి అపురూప కానుక
సాక్షి, విశాఖపట్నం: భారతీయ రైల్వేలో పురుషులతో సమానంగా, ఒక్కోసారి వారిని మించి విధుల్లో నిమగ్నమవుతున్న మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవానికి వాల్తేరు డివిజన్ పట్టం కట్టింది. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, వారికంటూ ఒక ’సొంత గూడు’ను ఏర్పాటు చేస్తూ డీఆర్ఎం లలిత్ బోహ్రా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సమస్యే పరిష్కారానికి నాంది ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో, మహిళా సిబ్బంది తమ గోప్యత, విశ్రాంతి కోసం పడుతున్న ఇబ్బందులను డీఆర్ఎం స్వయంగా తెలుసుకున్నారు. స్టేషన్లలో నిరంతరం విధుల్లో ఉండే మహిళలకు సరైన విశ్రాంతి గదులు లేకపోవడం వారి ఆరోగ్యంపై, పనితీరుపై ప్రభావం చూపుతోందని గుర్తించిన ఆయన, తక్షణమే అధికారులతో సమావేశమై ‘వుమెన్ రెస్ట్ రూమ్స్‘ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. తొలి విడతలో 5 స్టేషన్లలో.. తొలి విడతలో భాగంగా ఐదు కీలక స్టేషన్లలో విశ్రాంతి గదుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, సింహాచలం, పార్వతీపురం స్టేషన్లలో అత్యాధునిక వసతులతో కూడిన ఈ గదులను బుధవారం ప్రారంభించారు. కేవలం గదులను కేటాయించడమే కాకుండా, విధుల్లో అలసిపోయిన మహిళా ఉద్యోగులకు పూర్తిస్థాయి విశ్రాంతి లభించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ గదులలో కూర్చునేందుకు కుర్చీలు, విశ్రాంతి తీసుకోవడానికి మంచాలు, అత్యవసరమైన మరుగుదొడ్లు, స్నానపు గదులను ఏర్పాటు చేశారు. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ నిర్మించిన ఈ కేంద్రాలు మహిళా సిబ్బందికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. -
ఏ మాయో సామి!
‘త్రిశూల్’ను ప్రారంభానికి సిద్ధం చేయండి బాబు హామీ వాగ్దానాల వెల్లువ...అమలులో వెక్కిరింపు గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026జన సమీకరణకు అష్టకష్టాలు కశింకోట: జిల్లాలో రాంబిల్లి మండలంలో గురువారం జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభకు జనసమీకరణకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. కశింకోట మండలం నుంచి సుమారు 1500 మందిని తరలించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గతంలో నక్కపల్లి మండలంలో జరిగిన సీఎం చంద్రబాబు నాయుడు సభకు మండలం నుంచి 600 మందిని తరలించగా, ఇప్పుడు ఏకంగా 1500 మందికి తరలించాలని ఆదేశించడంతో అంతమందిని ఎలా తరలించాలని మల్లగుల్లాలు పడుతున్నారు. జనం తరలింపునకు మండలం నుంచి 30 బస్సులను కేటాయించినట్టు సమాచారం. డ్వాక్రా, ఉపాఽధి హామీ పథకం సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించి, జన సమీకరణకు సన్నాహాలు చేశారు. డ్వాక్రా సంఘాల సభ్యులు, ఉపాధి వేతనదారులు తదితరులను తరలించాలని ఆదేశించారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు సిబ్బంది ద్వారా సమాచారం అందించి, సమీకరిస్తున్నారు. జనాన్ని సమీకరించకపోతే ఎటువంటి ఇబ్బందులకు గురికావలసి వస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, అనకాపల్లి: హామీలివ్వడం... వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడుకు అలవాటుగా మారింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తన ప్రసంగాలలో అలవోకగా హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడం మామూలైపోయింది... 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలతో పాటు జిల్లా రైతులకు సాగు నీరు, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మాటిచ్చారు. ఆ మాటలను నమ్మిన ప్రజలను మోసం చేశారని విమర్శలు వస్తున్నాయి. రెండేళ్ల పాలన ముగిసినా చేసిందేమీ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23న రాంబిల్లిలో ఓ కొత్త ప్రాజెక్టు శంకుస్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న సందర్భంగా జిల్లాకు చేసిన వాగ్దానాలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఊసే ఎత్తలేడం లేదు పోలవరం ఎడమ కాలువ పనులు ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లయినా అతీగతీలేకుండా ఉంది. తాండవ, తుమ్మపాల, గోవాడ సుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ అడ్రస్లేకుండా పోయింది. నక్కపల్లి మండలం ఉద్దండపురంలో అసంపూర్తిగా ఉన్న వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి అలవాటు ప్రకారం మరిచిపోయారు. ఈ రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. వరాహనది, తాండవ నది గ్రోయిన్లు మరమ్మతులు, మూటకాలువ, మంగవరం గ్రోయిన్, ఆవ కాలువ ఆధునికీకరణ పనులు హామీలు నీటిపై రాతలయ్యాయి. పాయకరావుపేట, నక్కపల్లి మండాలాల పరిధి గోపాలపట్నం ఆవను ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలకు చెందిన 2,000 ఎకరాలు ముంపు బారిన పడకుండా రక్షణ గోడ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ప్రస్తావనే లేదు. ఫిషర్మెన్ కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్న హామీ గాలిలో కలిసిపోయింది. పాయకరావుపేటలో అంబేడ్కర్ ఉద్యావన పార్కు అభివృద్ధి, నర్సీపట్నంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి, అనకాపల్లి శారదానది ఒడ్డున బోట్ షికారు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్న హామీలు అతీగతీలేకుండా పోయాయి. అనకాపల్లి– అచ్యుతాపురం రోడ్డు విస్తర్ణ నిర్వాసిత రైతులకు నగదు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.ఇప్పుడు టీడీఆర్ బాండ్లను మాత్రమే ఇస్తున్నారు. ఇటీవల హైకోర్టు కూడా టీడీఆర్ బాండ్లు కాకుండా నగుదు రూపంలోనే నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. 2025 ఏడాది సంక్రాంతి లోగా గుంతలులేని రోడ్లను నిర్మాణం చేపడతానని అనకాపల్లి జిల్లాలో పరవాడలో వెన్నలపాలెంలో ‘మిషన్ ఫర్ పాట్ హోల్ ఫ్రీ ఇన్ ఏపీ’శంకుస్థాపన కార్యక్రమంలో హామీ ఇచ్చారు. జిల్లాలో ప్రధానంగా నర్సీప ట్నం–భీమిలి బీఎన్ రోడ్డు గుంతలతో అత్యంత భయకరంగా ఉంది. ఆ రోడ్డు వేయలేదు. పేదలకు రెండు సెంట్లు భూమి ఉచితంగా ఇస్తానన్న హామీ నెరవేరలేదు. 30న ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక మునగపాక: మునగపాక ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికను ఈ నెల 30 నిర్వహించనున్నారు. ఇటీవల ఎంపీపీతో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీలపై ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో ఆ పదవులకు ఈనెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఎన్నిక జరపాలని ఎన్నిక కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా పరిషత్ సీఈవోకు ఉత్తర్వులు జారీ చేసింది. -
అనకాపల్లి ఆస్పత్రికి అవినీతి జబ్బు
మహారాణిపేట(విశాఖ): జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 1 నుంచి 7వ స్థాయీ సంఘాల సమావేశాలు ఆమె అధ్యక్షతన జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, మందుల కొరతపై సభ్యులు భీశెట్టి వరాహ సత్యవతి, సోము శివ సత్యనారాయణ, కో–ఆప్షన్ సభ్యుడు పొలమరశెట్టి శివ సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తల్లి, శిశువు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసవాల సమయంలో మగబిడ్డ పుడితే రూ.1000, ఆడబిడ్డ పుడితే రూ.500 వసూలు చేస్తున్నారని, మార్చురీ వద్ద మహిళా ఉద్యోగి డబ్బుల కోసం వేధిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. ప్రహారిని కూల్చివేసిన వారిపై చర్యలేవి ? కె.కోటపాడు హైస్కూల్లో అనధికారికంగా నిర్మించిన ప్రహరీపై సభ్యురాలు ఈర్లె అనురాధ ప్రశ్నించారు. గత రెండు సమావేశాల్లో ప్రసావించిన ఎందుకుపట్టించుకోలేదని నిలదీశారు. పాత గోడను కూ ల్చివేశారని తెలిపారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సీఈవో నారాయణమూర్తి.. ఇప్పటికే కలెక్టర్కు, పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. జిల్లాలోని 349 పాఠశాలల ఆస్తులను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చైర్పర్సన్ స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా ఉపాధి హామీ కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్, నీడ వంటి వసతులు కల్పించాలని సభ్యులు కోరారు. ఫేషియల్ అటెండెన్స్ యాప్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు సభ దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో రూ.4.56 కోట్లు, విశాఖపట్నం జిల్లాలో రూ.5.69 కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.2.75 కోట్లు ఉపాధి కూలీలకు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఫేషియల్ క్యాప్చర్ ప్రక్రియలో సమయం వృథా కాకుండా చూసేందు కు, కొత్త మొబైల్ పరికరాలను అందజేయడంతో పాటు కూలీల వేతనంలో రూ.25 పెంపుదల చేయ నున్నట్లు వెల్లడించారు. రేషన్ సరుకుల నాణ్యత లోపం, తక్కువ పరిమాణంలో పంపిణీ జరగడంపై పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలకు 10 రోజుల్లోగా సరఫరా పూర్తి చేయాలని, అదనంగా పంచదార, రాగి పిండి అందించాలని సూచించారు. సామాజిక సంక్షేమ పథకాల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అందాల్సిన సబ్సిడీల విడుదలపై ఉన్న జాప్యాన్ని నివారించాలని, హాస్టళ్లలో వసతులు మెరుగుపరచాలని సభ్యులు కోరారు. ఉపాధి హామీ, నర్సరీల అభివృద్ధిలో జిల్లాలు సాధించిన ప్రగతిని అధికారులు వివరించారు. పెండింగ్ పనులను గడువులోగా పూర్తి చేసేందుకు శాఖల మధ్య సమన్వయం ఉండాలని చైర్పర్సన్ జె. సుభద్ర ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పీహెచ్సీ కేంద్రాల్లో రోగులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె. రాజ్ కుమార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రైతులకు విత్తన కిట్లు
కశింకోట: ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రత్యేకంగా తయారు చేసిన విత్తనాల కిట్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకృతి వ్యవసాయ వనరుల జిల్లా అధికారి లచ్చన్న తెలిపారు. మండలంలోని సుందరయ్యపేటలో ఉన్న బీఆర్సీ కేంద్రంలో సిద్ధం చేసిన పీఎండీఎస్ విత్తనాల కిట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో భూసారం పెంపునకు మాత్రమే పచ్చిరొట్ట విత్తనాలు, జీలుగు, పిల్లి పెసర, జనుం వంటివి సాగు చేసే వారన్నారు. ప్రస్తుతం రుతు పవనాలు రాకకు ముందే పీఎండీఎస్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రత్యేకంగా తయారు చేసిన విత్తనాల కిట్లను అందిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా వర్షాలు పడిన తర్వాత అదను సమయంలో రైతులు విత్తనాలు నాటుతారన్నారు. అయితే పీఎండీఎస్ విధానం అందుకు భిన్నంగా వర్షాలకు ముందే విత్తనాలు వేయాలని చెప్పారు. వేసవి దుక్కులతో పొలాలు సిద్ధం చేసి నవ ధాన్యాలు, ఆకు కూరలు, కూరగాయలు, అపరాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు వంటి విత్తనాలు ముందుగా జల్లాలని, వేసవిలో కురిసే అకాల వర్షాలకు అవి మొలకెత్తుతాయన్నారు. వాటిలో తొలుత ఆకు కూరలు, తర్వాత కూరగాయలు కోతకు వస్తాయని చెప్పారు. చివరగా చిరు ధాన్యాలు, అపరాలు పండుతాయన్నారు. సుందరయ్యపేట బీఆర్సీ కేంద్రంలో 250 విత్తనాల కిట్లు సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రం నిర్వాహకురాలు కూండ్రపు అరుణ, మండల ప్రకృతి వ్యవసాయం ఇన్చార్జి డి. రమణ, ఐసీఆర్పీ చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. -
అవకాశాలను అందిపుచ్చుకుంటూ యువతరం రాణించాలి
మద్దిలపాలెం: సంక్షోభాల నుంచి పరిష్కారాలను అన్వేషించాలని, వాటినే అవకాశాలుగా మలుచుకుంటూ యువతరం ముందుకు సాగాలని ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల వారోత్సవాల్లో భాగంగా ఏయూ ఇంజినీరింగ్, మహిళా ఇంజినీరింగ్ కళాశాలలు సంయుక్తంగా బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న కళాశాల స్థాయి వేడుకలను బుధవారం ముఖ్య అతిథిగా ఆయన ప్రారంభించి మాట్లాడారు. నషాముక్త్ క్యాంపస్లుగా విశ్వవిద్యాలయాలు నిలవాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా యువతలో చైతన్యం నింపాలని సూచించారు. విశ్వవిద్యాలయం నిరంతర ప్రగతి సాధించడం, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం ఎంతో ప్రధానమన్నారు. ముఖ్యంగా భారత్కు క్రూడ్ ఆయిల్, రక్షణ రంగ ఆయుధాలు, వంటనూనెలు అధికంగా దిగుమతవుతున్నాయని, వీటిని తగ్గించుకోవడం ద్వారా దేశ సంపద విదేశాలకు వెళ్లకుండా నియంత్రించడం సాధ్యపడుతుందన్నారు. తాను రాజకీయ ఓనమాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేర్చుకున్నానని, నేడు తానున్న స్థితికి ఏయూనే కారణమని తెలిపారు. వందేళ్ల ఏయూ ప్రయాణాన్ని పరిశీలిస్తే జ్ఞానం, నైతిక విలువలు, సేవ అనే మూడు సూత్రాలపై సాగిందని స్పష్టమవుతోందన్నారు. బోధన వసతులు బలోపేతం చేస్తాం ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య కె.మధుమూర్తి మాట్లాడుతూ విలువలతో ఎదగడం, సమాజానికి ఉపయుక్తంగా నిలవడం ఏయూను చూస్తే అర్థమవుతుందన్నారు. విశ్వవిద్యాలయాల్లో బోధన వసతులను బలోపేతం చేస్తామని, త్వరలో నియామక ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఎన్టీయూ ప్రెసిడెంట్స్ చైర్ ప్రొఫెసర్ ఆచార్య ఉపద్రష్ట రామమూర్తి మాట్లాడుతూ తాను ఏయూలో చదువుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. పూర్వ విద్యార్థుల ప్రగతి విశ్వవిద్యాలయానికి స్ఫూర్తిని, ఖ్యాతిని అందిస్తాయన్నారు. విశ్వవిద్యాలయం తరఫున అతిథులను సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. ఆచార్య జి.వి.ఆర్.శ్రీనివాసరావు, ఆచార్య ఎన్.చిట్టిబాబు, ఆచార్య డి.లలిత భాస్కరి, ఆచార్య బి.ప్రజ్ఞ, ఆచార్య పి.స్వప్న తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. -
ఎస్.రాయవరంలో ఆధ్యాత్మిక శోభ
ఎస్.రాయవరం: గురజాడ జన్మ స్థలమైన ఎస్.రాయవరం మరో ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందనుంది. కేరళ శబరిమలై, ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయాల తరహాలో ఎస్.రాయవరంలో ఏకశిల పతినెట్టంపడి(ఏకశిలతో 18 మెట్లు చెక్కి)తో ఆలయ నిర్మాణాన్ని ఆకర్షణీయంగా పూర్తి చేశారు. సుమారు 1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవం ఈ నెల 26న వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయ్యప్ప మాలధారణ భక్తులు ఇరుముడితో 18 మెట్లు ఎక్కి మొక్కు చెల్లించుకునే విధంగా ఏకశిలతో మెట్లు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఆలయం ప్రారంభం రోజున అయ్యప్ప మాలధారణ భక్తులు ఇరిముడి సమర్పించే ఆచారం కోసం గ్రామంలో సుమారు 70 మంది భక్తులు మాలధారణ చేశారు. వారంతా 41 రోజులు దీక్ష పూర్తి చేసుకుంటున్నారు. జిల్లా నలుమూలల నుంచి రాజకీయ పార్టీల ప్రముఖులు, విద్యావంతులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున ప్రారంభోత్సవానికి హాజరయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానాలు పంపారు. ఏకశిలతో 18 మెట్లు ప్రత్యేకం ఆలయ ధర్మకర్త ఏకశిలపై 18 మెట్లు రావాలని ప్రత్యేకంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి ఏకశిలను తీసుకువచ్చి మెట్లు చెక్కించారు. కేవలం మెట్లు ఏర్పాటుకే సుమారు రూ.9 లక్షలు ఖర్చు చేశారు. 2024 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేయగా.. రెండేళ్ల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేశారు. సుమారు 500 మందికి పైగా భక్తులు అయ్యప్ప ఆలయ నిర్మాణంలో విరాళాలు ఇచ్చి భాగస్వాములయ్యారు. -
సమష్టి కృషితో చందనోత్సవం విజయవంతం
సింహాచలం: సమష్టి కృషితో చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని, సింహాచలం దేవస్థానం ఉద్యోగులంతా అంకితభావంతో చందనోత్సం విధులు నిర్వర్తించి విజయవంతం కావడంలో ప్రముఖ పాత్ర పోషించారని ఈవో జె.వెంకటరావు అభినందించారు. దేవస్థానం ఉద్యోగుల అభినందన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చందనోత్సవం విజయవంతం కావాలని దేవస్థానంలోని ప్రతి ఉద్యోగి పట్టుదలతో పనిచేశారన్నారు. పారిశుధ్య నిర్వహణలో టాప్–3లో సింహాచలం దేవస్థానం నిలవడం గొప్ప విషయమన్నా రు. దీన్ని టాప్–1కి చేర్చాలని అభిలషించారు. ఇతర దేవస్థానాల నుంచి వచ్చిన ఉద్యోగుల సహకారం కూడా మరువలేనిదన్నారు. చందనోత్సవం స్ఫూర్తితో రానున్న జూలై 28న జరిగే గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని కూడా విజయవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగులంతా సంసిద్ధం కావాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, డిప్యూటీ కలెక్టర్ మధులత, డిప్యూటీ ఈవో సింగం రాధ, ఈఈలు రమణ, రాంబాబు, రామకృష్ణ, ఏఈవోలు రమణమూర్తి, తిరుమలేశ్వరరావు, పిల్లా శ్రీనివాసరావు, పతం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
యువతి అదృశ్యంపైఫిర్యాదు
పెందుర్తి: తన కుమార్తె అదృశ్యమైనట్లు ఓ మహిళ పెందుర్తి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జీవీఎంసీ 88 వార్డు కోటనరవలో నందిగం పద్మావతి.. తన కుమార్తె మౌనిక(27)తో కలిసి ఉంటోంది. బీ ఫార్మసీ పూర్తి చేసిన మౌనిక ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 19న తల్లి పద్మావతి మార్కెట్కు వెళ్లి తిరిగి వచ్చేసరికి కుమార్తె మౌనిక ఇంటి వద్ద లేదు. ఆందో ళనకు గురైన పద్మావతి బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసింది. అయితే తర్వా తి రోజు మౌనిక తల్లికి ఫోన్ చేసి ‘నేను చందు అనే వ్యక్తితో వెళ్లిపోతున్నాను. నా కోసం వెతకొద్దు’అని చెప్పి.. ఫోన్ ఆఫ్ చేసింది. పద్మావతి ఫిర్యాదు మేరకు సీఐ కేవీ సతీష్కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. -
బ్రహ్మండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె
● రేపటి నుంచి ఉత్సవాలకు అంకురార్పణ ● ముస్తాబైన పెందుర్తి వేంకటాద్రి పెందుర్తి: బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు పెందుర్తి వేంకటాద్రి సిద్ధమైంది. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహమాడేందుకు భూమి మీద అడుగిడిన పవిత్ర రోజు వైశాఖ శుద్ధ దశమి. అందుకే అదే రోజున ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. వేంకటాద్రి నిర్మాణానికి కూడా వైశాఖ శుద్ధ దశమి నాడే తొలి అడుగు పడింది. ఈ క్రమంలో ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించి వేంకటాద్రిపై వైశాఖ శద్ధ దశమి నాడే కల్యాణం నిర్వహిస్తారు. వెంకన్న దేవాలయంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు విష్వక్సేనపూజ, అంకురార్పణ జరుగుతుంది. రెండో రోజు శనివారం ఉదయం ధ్వజారోహణ, హోమాలు చేస్తారు. సాయంత్రం లక్ష తులసి, మల్లికా పుష్పాలతో స్వామివారికి విశేష అర్చనలు జరుగుతాయి. మూడోరోజు ఆదివారం వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా సాయంత్రం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. నాలుగో రోజు సోమవారం సాయంత్రం తిరువీధి ఉత్సవంలో భాగంగా స్వామివారి రథోత్సవం జరగనుంది. వేంకటాద్రి నుంచి పెందుర్తి పురవీధుల్లో స్వామివారు రథంపై ఊరేగుతూ చినముషిడివాడ సప్తగిరినగర్లోని అలివేలు మంగమ్మ సన్నిధి వరకు భక్తులకు ఆశీస్సులు అందిస్తారు. ఆఖరి రోజు మంగళవారం ఉదయం స్వామివారికి చక్రస్నానం, చక్రత్తాళ్వారులతో కలిసి దివ్య స్నానమాచరింపజేస్తారు. సాయంత్రం పుష్పయాగం, మహా పూర్ణాహుతి, ద్వాదశారాధన, స్వామివారికి విశేష అర్చనలు, ఊంజల్ సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈవో నీలిమ వెల్లడించారు. భక్తులంతా తరలిరావాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేంకటాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
సమన్వయంతో శతాబ్ది ఉత్సవాలు విజయవంతం
విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మహారాణిపేట(విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అందరి సమన్వయంతో విజయవంతం చేయాలని విశాఖ కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న జరగనున్న వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వీవీఐపీ, వీఐపీల పర్యటనల దృష్ట్యా ప్రోటోకాల్ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉపరాష్ట్రపతి రాకను బట్టి గార్డ్ ఆఫ్ హానర్, ముఖ్యమంత్రి పర్యటన కోసం కోస్టల్ బ్యాటరీ వద్ద హెలిప్యాడ్ను సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ లైజన్ అధికారులను నియమించాలి. వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రీన్ రూములు, తాగునీరు, అల్పాహారం వంటి వసతులు సమకూర్చాలి. విద్యార్థులు మధ్యాహ్నం 2 గంటలకే గ్యాలరీల్లో ఆసీనులయ్యేలా చూడాలి. ప్రధాన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రసారం చేయడంతో పాటు, ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రజల కోసం ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలి. నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు, ఫైర్ ఇంజన్లు, మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలి. ఎయిర్పోర్టులో రిసెప్షన్ డెస్క్ ఏర్పాటు చేయాలి.’అని కలెక్టర్ ఆదేశించారు. కాఫీ టేబుల్ బుక్ విడుదల, ఎంవోయూలపై సంతకాలు, ప్రముఖుల సన్మాన కార్యక్రమాలను ప్రణాళికాయుతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీ అధికారులు, జిల్లా యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ చారిత్రాత్మక వేడుకను విజయవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీ విజయ్ మణికంఠ, ఇన్చార్జి డీఆర్వో టి.గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
చెక్కు చెదరని ఏయూ ఫ్యాకల్టీ భవనం
మద్దిలపాలెం: విశ్వవిద్యాలయం అంటే కేవలం భవనాలే కాదు.. అక్కడ బోధించే విశిష్ట ఆచార్యులు, వారు జరిపే పరిశోధనలు, వాటి ఫలితంగా సమాజ ఉపయుక్తంగా నిలిచే ఆవిష్కరణలు. నిత్యం బోధన, పరిశోధనల్లో మునిగే ఆచార్యులకు కాస్త ఆటవిడుపుగా ఉండటానికి ఆంధ్రా యూనివర్సిటీలో దశాబ్దాల కిందట ప్రత్యేకంగా ఫ్యాకల్టీ క్లబ్ను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం 1940లో ఏయూలో ఫ్యాకల్టీ క్లబ్కు అప్పటి వీసీ సర్ కట్టమంచి రామలింగారెడ్డి శంకుస్థాపన చేసి భవనం నిర్మించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం నేటికీ చెక్కు చెదరకుండా మనకు దర్శనమిస్తోంది. దాదాపు 85 ఏళ్ల కిందట నిర్మితమైన ఈ చారిత్రక భవనం నేటికీ ఆచార్యులకు కాస్త సేదతీరడానికి ఉపయుక్తంగా నిలుస్తోంది. చుట్టూ విశాలమైన ఖాళీ స్థలంతో పాత భవనం కనిపిస్తే.. ప్రస్తుత ఫ్యాకల్టీ భవనానికి రెండు వైపులా భారీ భవంతులు వెలిశాయి. ఫ్యాకల్టీ క్లబ్కు ఒకవైపు ఆటా భవనం, డీసీఎంఎస్ విభాగం.. మరోవైపు అంజలి గెస్ట్హౌస్, అడ్వాన్స్డ్ సైన్సెస్ భవనాలు నిర్మించారు. నాడు: 1940లో ఏయూ ఫ్యాకల్టీ భవనంనేడు: ఆంధ్రా యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్ -
ఈపీడీసీఎల్లో ముగిసిన నీతి ఆయోగ్ వర్క్షాప్
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ ప్రతినిధులతో కలిసి బుధవారం విశాఖలోని ఐటీ బిల్డింగ్ కాన్ఫరెన్స్ హాల్లో నీతి ఆయోగ్ వర్క్షాప్ నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ రంగాన్ని మరింత సమర్థవంతంగా, వినియోగదారులకు అనుకూలంగా, ఆర్థికంగా, స్థిరంగా మార్చే చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నీతి ఆయోగ్ సభ్యులు రోని ఖన్నా, సుష్రూత్ హెల్వాత్కర్, వివేక్ థక్కర్, పి.అభిరామ్, డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీఎజీఎంలు, ట్రాన్స్కో అధికారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో అమలు చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు, మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుదలతో పాటు రుణ పునర్వ్యవస్థీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కూడా చర్చించారు. అన్ని విభాగాల మధ్య సమన్వయం పెంపొందిస్తూ, కార్యక్రమాల అమలుకు వర్క్స్ట్రీమ్ బాధ్యతలను ఖరారు చేసి, మానిటరింగ్ విధానం, రోడ్మ్యాప్ సిద్ధం చేయాలని, దీని అమలుకు ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్ఈలు శివరామకృష్ణ, నరసింహారావు, సీజీఎంలు వి.విజయలలిత, డి.సుమన్ కల్యాణి, బి.అశోక్ కుమార్, ఎల్.మహేంద్రనాథ్, ఎస్.రాజబాబు, ఎస్.విజయ్ప్రతాప్, ఎల్.దైవప్రసాద్, వి.జనార్ధనరావు, వి.వి.ఎస్.ఎన్.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు -
సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన
మాకవరపాలెం: తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని పయనీర్(ఆన్రాక్)అల్యూమినియం రిఫైనరీ కార్మికులు స్పష్టం చేశారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం రిఫైనరీ లోపల కార్మికులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రెండో రోజు బుధవారం సుమారు 500 మందికిపైగా కార్మికులు విధులు బహిష్కరించి మెయిన్ గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కార్మిక చట్టం మేరకు 8 గంటల పని, పనికి తగిన వేతనం, అదనపు పనిగంటలకు ఓటీ చెల్లింపు, ప్రతి ఏటా 10 శాతం ఇంక్రిమెంట్లు, కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమోషన్ల కల్పన, వీక్లీ ఆఫ్లకు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలను యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొందరు కార్మికులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్కు అందజేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఎస్ఐ దామోదర్నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నపయనీర్ యాజమాన్యం పయనీర్ యాజమాన్యం కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న కార్మికులను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కార్మికశాఖ అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
ఘనంగా రామానుజుల తిరునక్షత్రం పూజలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విశిష్టాద్వైత స్థాపకులు భగవత్ రామానుజుల తిరునక్షత్రం పూజలను ఘనంగా నిర్వహించా రు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను, భగవత్ రామానుజుల ఉత్సవమూర్తిని ఆలయ బేడామండపంలో హంసమూలన వేంజేపచేశారు. విశేషపూజలు నిర్వహించారు. దివ్య ప్రబంధ పారాయణాన్ని పఠించా రు. అనంతరం బేడా తిరువీధి నిర్వహించారు. స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ పూజలు నిర్వహించారు. విశిష్టాద్వైత స్థాపకులు భగవత్ రామానుజులు తిరునక్షత్ర పూజలను శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెంది కొండదిగువ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న రామానుజులు విగ్రహానికి అభిషేకం జరిపారు. విశేష పూజలు నిర్వహించారు. అర్చకుడు చిన్నా తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఇనుప వ్యర్థాలతో భారతదేశ చిత్రపటం
గాజువాక: స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా జీవీఎంసీ ప్రకటించిన వేస్ట్ టు వండర్ చాంపియన్షిప్ పోటీల కోసం గాజువాకకు చెందిన మహాత్మా, మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు జాగరపు శ్రీను ఇనుప వ్యర్థాలతో భారతదేశ చిత్రపటాన్ని రూపొందించారు. బ్రాండ్ వైజాగ్లో అందరూ భాగస్వాములు కావడంలో భాగంగా ఇనుప స్క్రాప్తో అందమైన శిల్పాలను తయారు చేయాలని జీవీఎంసీ పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాబ్రికేషన్ యూనిట్ను నిర్వహిస్తున్న శ్రీను సైకిల్ ఛైన్లు, స్క్వేర్ పైపులు, జీఐ షీట్లు, సైకిల్ క్రాంక్లు, రిమ్లు, 6ఎంఎం, 8 ఎంఎం వేస్ట్ రాడ్లు, బైక్ చైన్లు, చైన్ స్పాకెట్లు, ఆటో గేర్ బాక్స్ వ్యర్థాలను ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారు చేశారు. అందులో జాతీయ జెండాతోపాటు ఎద్దు, రైతు, ఆర్మీ సోల్జర్ వంటి చిత్రాలను కూడా దానికి అనుసంధానం చేశారు. ఈ చిత్రాన్ని చూసినవారు భలే ఉందే అంటూ శ్రీనును అభినందిస్తున్నారు. -
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
దేవరాపల్లి: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి కేజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మండలంలోని గ్రామానికి చెందిన ధర్మిశెటి శ్రీను (51) సోమవారం తన కల్లంలో గడ్డి మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు వెంటనే విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. గతంలో ఎద్దు పొడిచిందని, అప్పటి నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో శ్రీను బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాధలను తట్టుకోలేక మనస్తాపంతో గడ్డి మందు తాగి ఉంటాడని వారు తెలిపారు. మృతుడి భార్య రామలక్ష్మి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పైడిరాజు తెలిపారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్, డీఐజీ గోపీనాధ్ జట్టీ, ఎస్పీ తుహిన్ సిన్హా సాక్షి, అనకాపల్లి : ఈనెల 23న సీఎం చంద్రబాబు రాంబిల్లి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. మంగళవారం సాయంత్రం డీఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సమావేశానికి హాజరయ్యే ప్రజల రవాణా కోసం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా సుమారు 300 బస్సులు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఈ నెల 23న ఉదయం 7 గంటల నుంచే వివిధ పాయింట్ల నుంచి బయలుదేరనున్నాయని తెలిపారు. ముందురోజే బస్సులను నిర్ణయించిన ప్రదేశాల్లో సిద్ధంగా ఉంచనున్నట్టు తెలిపారు. సభ ప్రాంగణంలో పూర్తి ఎయిర్ కండిషనింగ్ సదుపాయం కల్పించడంతో పాటు, 150 టాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్యాలరీల్లో తాగునీరు, భోజనం, మజ్జిగ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బందిని మొబిలైజ్ చేసి, ప్రతి విభాగానికి ఇన్చార్జిలను నియమించినట్టు తెలిపారు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతాం
బీచ్రోడ్డు: మున్సిపల్ కార్మికుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మార్చికి సంబంధించిన జీతాలను నేటికీ చెల్లించకపోవడంపై కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీలోని అన్ని శాఖల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం క్లాప్ డ్రైవర్లు, లోడర్లు, శానిటరీ, యూజీడీ వర్కర్లు విధులను బహిష్కరించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. మార్చి జీతాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, అందుకే ఆందోళన బాట పట్టామని కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ సందర్భంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన, మరణించిన లేదా అనారోగ్యం పాలైన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఆప్కోస్ ద్వారా ఉపాధి కల్పించాలని విన్నవించారు. గతంలో కమిషనర్ సమక్షంలో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరుకుటి రాజు, అధ్యక్షుడు టి.నూకరాజు, నాయకుడు జి.అప్పారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు -
‘పాఠశాల స్థలం కాజేసే కుట్ర’
అంబేడ్కర్ కాలనీలోని పాఠశాలకు ఆటోలో వెళ్తూ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు దేవరాపల్లి : దేవరాపల్లి నాలుగు రోడ్ల కూడలి సమీపంలోని మెయిన్ స్కూల్ను బేసిక్ ప్రైమరీగా స్కూల్గా (1 నుంచి 5వ తరగతి వరకు బోధించే స్కూల్) మార్పు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, కూటమి నేతల దురుద్దేశంతో దశాబ్దాల చరిత్ర కలిగిన మెయిన్ స్కూల్ను మూతపడే దశకు చేర్చారని విమర్శించారు. నూతన విద్యా విధానం పేరిట 3,4,5 తరగతులను అంబేడ్కర్ కాలనీలోని పాఠశాలకు పంపించేసి మెయిన్ స్కూల్ను 1, 2 తరగతులకే పరిమితం చేశామరన్నారు. ప్రధాన కూడలికి ఆనుకొని ఉన్న రూ.కోట్లు విలువ చేసే పాఠశాల స్థలంపై అధికార పార్టీ నాయకులు కళ్లు పడ్డాయని, పిల్లలు లేరనే నెపంతో స్కూల్ మూసివేసి స్థలాన్ని కాజేసేందుకు కుట్రలు పన్నారని వెంకన్న ధ్వజమెత్తారు. అన్ని అర్హతలు ఉన్నా మెయిన్ స్కూల్ను బేసిక్ ప్రైమరీ స్కూల్గా ఉంచాలని అప్పట్లో విద్యా కమిటీ తీర్మానం చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. గ్రామ శివారులో ఉన్న అంబేడ్కర్ కాలనీలోని పాఠశాలకు వెళ్లేందుకు ఎరుకల కాలనీ, కొరుప్రోలు కల్లాల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులు రోజూ ఆటోకు రూ.20 ఇచ్చి వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ నూతన విద్యా విధానంతో మండలంలోని ఇప్పటికే పలు పాఠశాలలు మూతపడ్డాయని, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని పాఠశాలలు మూసి వేస్తే భవిష్యత్లో ప్రభుత్వ విద్య పేదలకు అందే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. -
పయినీర్ కార్మికుల ఆందోళన
మాకవరపాలెం : పయినీర్ రిఫైనరీలో పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలోని రాచపల్లి వద్ద 2008లో ఆన్రాక్ పేరుతో బాక్సయిట్ శుద్థి కర్మాగారాన్ని నిర్మించారు. ప్రస్తుతం దీనిని పయినీర్ కంపెనీగా పేరుమార్పు చేశారు. ఇందులో వేల సంఖ్యలో కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది గంటలకు బదులు 12 గంటలపాటు పని చేయించడం, పనికి తగ్గ వేతనాలు చెల్లించకపోవడంతో మంగళవారం ఈ కంపెనీలో నాలుగు సబ్ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్న 400 మందికి పైగా కార్మికులు కంపెనీ లోపల ఆందోళనకు దిగారు. కార్మిక చట్టం ప్రకారం పనిగంటలు తగ్గించడంతో పాటు ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని, గత పదేళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలనే డిమాండ్తో విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నట్టు కార్మికులు తెలిపారు. గత నాలుగు రోజులుగా తమ డిమాండ్లను యాజమాన్య పెద్దలకు తెలియ జేసేందుకు నిరసనలు తెలిపినా పట్టించుకోలేదన్నారు. అంతేకాకుండా ఇష్టం లేకపోతే మానేయండని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే ఒకేసారి కార్మికులమంతా మంగళవారం విధులను బహిష్కరించామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు బుధవారం నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. మెయిన్గేటు వద్ద ఆందోళనకు సిద్ధం కావడంతో తమను బయటకు రాకుండా అడ్డుకున్నారని కార్మికులు ఆరోపించారు. నైట్ షిఫ్ట్ పూర్తి చేసుకున్న కార్మికులను సైతం బయటకు పంపకుండా లోపలే ఉంచేశారన్నారు. అలాగే కంపెనీలోపల అనేక ప్రమాదాలు జరుగుతున్నా బయటకు పొక్కనీయకుండా గోప్యంగా ఉంచుతూ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కార్మికుల ఆందోళన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు, పీఏసీఎస్ డైరెక్టర్ అడిగర్ల రాంబాబు, టీఎన్టీయుసీ మండల అధ్యక్షుడు పైల విక్రమ్కుమార్ పయినీర్ కంపెనీ మెయిన్ గేటు వద్దకు చేరుకున్నారు. నాణ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న కార్మికులను కంపెనీ యాజమాన్యం బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. కార్మికులకు తాము మద్దతుగా ఉంటామన్నారు. ఆందోళన విషయమై కంపెనీ ప్రతినిధి ఎల్.ఎస్.రావును ఫోన్లో సంప్రదించగా తమకు ఏమీ చెప్పకుండానే కార్మికులు విధులకు వెళ్లకుండా ఆగిపోయారన్నారు. -
రంగు చూస్తే... బుట్టలో పడ్డట్టే..!
మార్కెట్లో కార్బైడ్ మామిడిపండ్లు పక్వానికి రాకుండానే మామిడిని ముగ్గిస్తున్న వ్యాపారులు రంగు చూసి మోసపోవద్దంటున్న వైద్యులు జిల్లా కేంద్రం అనకాపల్లిలోనే అఽధికంగా నిల్వలు తేడాలను గుర్తించండిలా... ●సహజంగా పండే మామిడి కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి లోపలి భాగం పరిపక్వంగా ఉంటుంది. ●కృత్రిమంగా పండే పండ్లు మొత్తం ఒకే విధమైన రంగును కలిగి ఉంటాయి. పైకి పండినట్టు కనిపించినా లోపల ఫలం రుచిలో తేడా ఉండి పుల్లదనం ఉంటుంది. ●సహజంగా పండే పండ్ల నుంచి వచ్చే వాసన ఇట్టే గుర్తించవచ్చు. కృత్రిమంగా పండించిన పండ్ల నుంచి వాసన ఏమాత్రం రాదు. ●సహజసిద్ధంగా పండించే పండ్లలో తగినంత చక్కెర శాతం ఏర్పడి తియ్యగా ఉంటాయి. ●బహిరంగ మార్కెట్లో పండ్లను కొని తినే ముందు ఉప్పు నీటిలో 20 నిమిషాలు ఉంచి తిరిగి మంచి నీటితో శుభ్రంగా కడిగి అనంతరం తొక్కను తీసి తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. తుమ్మపాల : వేసవి కాలం మొదలైతే ప్రజలందరికీ అందరికి గుర్తొచ్చేది మామిడి పండ్లే. సహజసిద్ధమైన తీపి, నోరూరించే రుచి, పోషక విలువలతో మామిడి పండు ప్రకృతి మనకు అందించిన అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మే, జూన్ నెలల్లో పూర్తిగా పక్వానికి వచ్చిన మామిడిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఏప్రిల్ నెలలోనే వ్యాపారులు లాభాపేక్షతో మామిడిపండ్లను కృత్రిమంగా మగ్గించి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. కాల్షియం కార్బైడ్ వంటి హానికర రసాయనాలను ఉపయోగించి పండ్లను వేగంగా పక్వానికి తెస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విధంగా కృత్రిమంగా మగ్గించిన మామిడి పండ్లు బయటకు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ, వాటి లోపల పూర్తిగా పండకపోవడం వల్ల రుచి తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి పండ్లు తినడం వల్ల కడుపునొప్పి, వాంతులు, చర్మ సమస్యలు, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనకాపల్లి పట్టణం, మండలంలో దాదాపు ప్రతి గ్రామంలోను మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది పూత తగ్గి భారీగా మామిడి ఉత్పత్తి తగ్గిపోయింది. అక్కడక్కడ కొంత మేర పండినా మామిడి ఆయా గ్రామాల పరిధిలోనే విక్రయాలు జరిగిపోతున్నాయి. పట్టణంలో మార్కెట్కు ఇతర ప్రాంతాల నుంచి మామిడి దిగుమతి చేసుకుని వ్యాపారులు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో డజన్ పండ్లు ప్రస్తుతం రూ.300 వరకు మార్కెట్ ధర ఉంది. ఉమ్మడి జిల్లాలో గ్రామీణ వాణిజ్య కేంద్రంగా ఉన్న అనకాపల్లిలో నిత్యం వేల సంఖ్యలో మామిడి దిగుమతి జరుగుతుంది. ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా సరఫరా జరుగుతుంది. ఈ ఏడాది ముందుగానే మామిడి పండ్లు మార్కెట్లోకి రావడంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. రంగు చూసి కాకుండా ప్రజలు పూర్తి అవగాహన కలిగి పండ్లను కొనుగోలు చేయాలని, కృత్రిమ పండ్లను గుర్తించే చిట్కాలు తెలుసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పక్వానికి వచ్చినప్పుడు..... మామిడి కాయలు పక్వానికి వచ్చిప్పుడు ప్రకృతి సిద్ధంగా వాటి నుంచి ఉత్పత్తయ్యే ఇథిలియన్ కారణంగా కాయలు పండి మంచి రంగును స్వయంగా చేకూర్చుకుంటాయి. తద్వారా వచ్చిన రుచి, పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అయితే కొంతమంది ఈ తరహా పద్ధతులకు స్వస్తి చెప్పి రసాయనాలతో మగ్గించి, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇథిలియన్ వాయువు 100 పీపీఎంలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఈ వాయువును 24 గంటలు తగిలేటట్టుగా ఐదు రోజులు కాయలను ఉంచితే సహజత్వానికి దగ్గరగా ఎటువంటి హాని లేకుండా పక్వానికి వస్తాయి. మామిడి కాయల కోత అనంతరం వంద లీటర్ల నీటికి 13 ఎం.ఎల్ ఎత్రిల్ కలిపి అందులో ముంచి ఆరబెడితే సహజత్వానికి దగ్గరగా పండుతాయి. మరింత సురక్షితంగా, సంప్రదాయబద్ధంగా పండించాలంటే ఇళ్లల్లో వరిగడ్డి వేసి కాయలను నిల్వ ఉంచడం ద్వారా పండించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కాల్షియం కార్బైడ్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, కొంతమంది వ్యాపారులు అక్రమంగా రసాయనాలను ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్ల ప్రజలు మామిడిపండ్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రంగు చూసి మోసపోవడం, సీజన్కు ముందు వచ్చే పండ్లను ఆరగించడం ఆరోగ్యకరం కాదని గుర్తించాల్సి ఉంది. తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్యం.... సంబంధిత అధికారులు మార్కెట్లపై నిరంతర తనిఖీలు నిర్వహించి కృత్రిమంగా పండ్లు మగ్గించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ఎటువంటి తనిఖీల్లేని కారణంగా యథేచ్ఛగా కృత్రిమంగా పండించిన పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇలా కృత్రిమంగా మగ్గించిన మామిడిపండ్ల విక్రయంపై కట్టడి అవసరమని, వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. నిషేధిత రసాయనాలతో ముప్పు కృత్రిమంగా కార్బైడ్ ఉపయోగించి పండించిన పండ్లు ఆరగించడం వల్ల ఆరోగ్యానికి హాని. దీనివల్ల కడుపులో అల్సర్, క్యాన్సర్తో పాటు కాలేయం, మూత్ర పిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వినియోగదారులు శ్రేష్టమైన, సహజసిద్ధంగా పండే మామిడి పండ్లను ఆరగించాలి. నిషేధిత పదార్థాలను వాడి మామిడిని పండించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. –డిడి నాయుడు, వైద్యుడు, అనకాపల్లి -
30వతేదీలోగా గ్రామీణ కమిటీలు పూర్తి చేయాలి
వివిధ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ పరిశీలకులతో మాట్లాడుతున్న హర్షవర్థన్రెడ్డి అనకాపల్లి : వైఎస్సార్సీపీ గ్రామీణస్థాయి కమిటీలను ఈనెల 30వ లోపు పూర్తిచేయాలని, ఇప్పటికే 90శాతం పూర్తి చేశారని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి (ఉత్తరాంధ్ర జిల్లాల కో–ఆర్డినేషన్) హర్షవర్ధన్రెడ్డి అన్నారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలో వివిద నియోజకవర్గ పరిశీలకులతో సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల సూచనలు మేరకు త్వరితగతిన మిగిలిని కమిటీలను పూర్తిచేయాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలని గ్రామీణ స్థాయి నుంచి ప్రజల మనస్సులో ఉందన్నారు. సంక్షేమ పథకాల రథసారథి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలన కోసం ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, వివిధ నియోజకవర్గల పార్టీ పరిశీలకులు కోలా గురువులు, దంతులూరి దిలీప్కుమార్, పైలా శ్రీనివాసరావు, చిక్కాల రామారావు, పిన్నమరాజు సతీష్వర్మ, బి.వి.సత్యవతి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్రాజా పాల్గొన్నారు. -
పంచాయతీల్లో మహిళలే నిర్ణేతలు
జిల్లాలో 644 పంచాయతీలు పురుషుల కన్నా మహిళలు అధికం మహిళా ఓటర్లు 6,32,785, పురుష ఓటర్లు 6,02,281 అనకాపల్లిలో అత్యధికం, యలమంచిలి మండలంలో అత్యల్పం ఓటర్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణసాక్షి, అనకాపల్లి : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఓటర్లలో మహిళలదే పైచేయిగా ఉంది. రానున్న పంచాయతీ ఎన్నికల కోసం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే పురుషుల కంటే సుమారు 35 వేల మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఓటరు జాబితాలను ఇటీవల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. వీటిల్లో అభ్యంతరాలు ఏమైనా ఉంటే నిర్ణీత గడువులోగా సంబంధిత పంచాయతీల కార్యదర్శులకు లిఖత రూపంలో అందజేయాల్సి వుంటుంది. జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు 24 మండలాల పరిధిలో ప్రస్తుతం 646 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 12,35,083 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,32,785 మంది మహిళలు, 6,02,281 మంది పురుషులు ఉన్నారు. మిగిలిన వారు ఇతరులు. మొత్తం మీద పురుషుల కంటే మహిళా ఓటర్లు 30,504 అధికంగా వుండడం విశేషం. నిర్ణేతలు మహిళలే! జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన నూతన ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రచురించింది. జాబితాలను పంచాయతీ కేంద్రాలు, సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఓటర్ల సంఖ్యను సూచించారు. ఈ ఓటర్ల జాబితా మేరకు జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు 24 మండలాలు, 644 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 6282 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలోని ఓటర్లు 12,35,083 మంది. వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. వీరిలో 6,32,785 మంది మహిళలు, 6,02,281 మంది పురుషులు ఉన్నారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళా ఓటర్లు 30,504 మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అత్యధికంగా అనకాపల్లి మండలంలో 81,568 మంది ఓటర్లు ఉండగా..వారిలో మహిళలు 42,138 మంది ఉండగా..39,434 మంది పురుష ఓటర్లు ఉన్నారు. తర్వాత పాయకరావుపేట మండలంలో 79,851 మంది ఓటర్లు ఉండగా అందులో 40,174 మంది మహిళలు, 39,674 మంది పురుషులు ఉన్నారు. యలమంచిలి మండలంలో అత్యల్పంగా 20,422 మందికి గానూ 9,819 మంది పురుషులు, 10,603 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 22 మండలాల్లో ఆధిక్యం.. రెండు మండలాల్లో(గొలుగొండ, చీడికాడ) పురుషులు అధికంగా ఉన్నారు. మిగతా 22 మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సంబంధించి విడుదల చేసిన ఓటర్ల జాబితాలోనూ వారిదే పైచేయి. ఈ ఓటరు జాబితాను బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అతివలకు ప్రాధాన్యం దక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలు రాజకీయ పార్టీల నుంచి అధిక వాటాను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. -
మళ్లీ చందన కవచంలో సింహాద్రినాథుడు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం వైభవంగా ముగిసింది. సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైన స్వామి నిజరూప దర్శనం, మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు కొనసాగింది. రాత్రి 7 గంటలకే క్యూల ప్రవేశ ద్వారాలను అధికారులు మూసివేసి, అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులందరికీ ఒంటి గంట వరకు దర్శనం కల్పించారు. ఒకవైపు సహస్రఘటాభిషేకం, ఇతర వైదిక క్రతువులు జరుగుతున్నా, భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పించారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు సహస్రఘటాభిషేకం పూర్తయిన అనంతరం, స్వామికి తొలి విడతగా మూడు మణుగుల(సుమారు 125 కిలోల) పచ్చి చందనాన్ని సమర్పించారు. ఆ తర్వాత చందన కవచంలో ఉన్న సింహాద్రి నాథుడికి పవళింపు సేవ నిర్వహించి, తిరిగి మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. తొలి విడత చందన సమర్పణ పూర్తవడంతో, గుమ్మడికాయ ఆకారంలో ఉన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 1.34 లక్షల మందికి దర్శనం చందనోత్సవం సందర్భంగా మొత్తం 1,34,271 మంది భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకున్నారని దేవస్థానం ఈవో జె.వెంకటరావు వెల్లడించారు. ఈ ఏడాది క్యూల పర్యవేక్షణ పటిష్టంగా ఉండటం వల్ల దర్శనాలు సాఫీగా జరిగాయని పేర్కొన్నారు. మొత్తం 46,431 టికెట్లు(రూ.300, రూ.1000, రూ.1500 ) జారీ చేయగా, స్కానింగ్ ద్వారా 37,764 టికెట్లను తనిఖీ చేశారు. భక్తుల సౌకర్యార్థం 6 పికప్ పాయింట్ల నుంచి 90 ఆర్టీసీ బస్సులను నడిపారు. ఈ బస్సులు మొత్తం 1,774 ట్రిప్పులు తిరిగాయి. ఎండ తీవ్రత దృష్ట్యా 1.30 లక్షల లీటర్ల తాగునీటిని సిద్ధం చేయగా, భక్తులు 1.24 లక్షల లీటర్ల నీటిని వినియోగించుకున్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా అందిన 23 ఫిర్యాదులను ‘జీరో పెండింగ్’విధానంలో వెంటనే పరిష్కరించామని ఈవో తెలిపారు. -
దగ్గరోడే దొంగ
నక్కపల్లి : దగ్గరోడే దొంగయ్యాడు. చుట్టంచూపునకు వచ్చి ఇంట్లో బంగారం ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న బాధితులు తమ ఇంట్లో బంగారం చోరీ జరగడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానితుడిని పట్టుకుని విచారించి అతనినుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నక్కపల్లి సీఐ జె.మురళి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ముకుందరాజుపేట గ్రామానికి చెందిన మనబాల రమణ ఈ నెల18వ తేదీన ఇంటికి తాళం వేసి శ్రీరాంపురం వైన్షాపులో పనిచేసేందుకు వెళ్లాడు. ఇతని తల్లి రేబాకలో కూలి పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉన్న బీరువా తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. బీరువాలో భద్రపరిచిన సుమారు రూ.15 లక్షలు విలువైన పదితులాల బంగారు ఆభరణాలు ( చైన్లు, ఉంగరాలు, బ్రాస్లెట్లు, చెవిదుద్దులు) చోరీ అయినట్టు గుర్తించారు. రమణ వెంటనే నక్కపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ మురళి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన కొల్లి శ్రీను (ఫిర్యాధి బందువు) చోరీ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని సీఐ తెలిపారు. 19వ తేదీన వేంపాడు టోల్ప్లాజా వద్ద నిందితుడు శ్రీనును అదుపులోకి తీసుకుని అతని నుంచి చోరీ చేసిన 10 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచడంతో రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. నిందితుడు బాధితులకు సమీప బందువు కావడం, చోరీ జరిగిన రోజు ఇతను ముకుందరాజుపేట వెళ్లడం ఇంటి వద్ద తమ బంధువులు లేకపోవడంతో చోరీకి పాల్పడినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. ఇతడు చోరీ జరిగిన రోజున గ్రామంలోకి వచ్చినట్లు చుట్టుపక్కల వారిద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతనిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు చెప్పడంతో ఆ కోణంలో విచారణ జరిపి చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించగలిగారు. -
ఎస్పీ కార్యాలయంలో 65 అర్జీలు
పీజీఆర్ఎస్లో వృద్ధురాలి సమస్యను వింటున్న అదనపు ఎస్పీ మోహన్రావు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 65 ఆర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు ఆర్జీలు స్వీకరించి, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలు వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, నేరాలు, ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
25 నుంచి రిలే నిరాహార దీక్షలు
అనకాపల్లి: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, 12వ పీఆర్సీని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా ప్రధాన కార్యదర్శి యేళపోగు సుధాకర్రావు, ఏపీటీఎఫ్ 257 జిల్లా ఫ్యాప్టో చైర్మన్ బోయిన చిన్నారావు డిమాండ్ చేశారు. స్థానిక ఫ్యాప్టో కార్యాలయలో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25, 26, 27 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మలిదశ పోరాటానికి ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గం చర్యలు చేపట్టిందన్నారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు కావస్తున్నా 12వ పీఆర్సీ కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కొత్త పీఆర్సీ అమలు చేసేవరకూ 30 శాతం మధ్యంతర భృతిని మే నెల నుంచి అమలు చేయాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్లతో దీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 27న జిల్లా ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు వి.శ్రీలక్ష్మీ, వై.శ్రీనివాసరావు, కెవిఆర్.శేషు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దళితులు ఐకమత్యంగా ఉండాలి
అచ్యుతాపురం రూరల్: దళితులు ఐకమత్యంగా, మహిళలు చైతన్యవంతంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రజా ప్రతినిధి మంచా నాగ మల్లేశ్వరి కోరారు. గుబ్బల నూకరాజు ఆధ్వర్యంలో మండలంలో పెదపాడు గ్రామంలో డాక్టర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె ఘనంగా నివాళిలర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమాజంలో గుర్తింపు తీసుకురావడంలో అంబేడ్కర్ చేసిన కృషి మరువ లేనిదన్నారు. ముఖ్యంంగా మహిళలు చదువుకున్నట్టయితే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందన్నారు. ఏదైనా సాధించాలంటే చదువు అత్యంత అవసరమన్నారు. యువత చైతన్య వంతులై ఉండాలని, నాయకుల ప్రలోభాలకు లోనవకుండా గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులది, లేదంటే సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు తీసుకువచ్చిన అంబేడ్కర్ ఫొటోని మాత్రమే మొబైల్ వాట్సాప్ డీపీలో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ భవనం అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు, మాజీ జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు, న్యాయవాది తట్టా పెంటయ్యనాయుడు, అనకాపల్లి జిల్లా డీవీఎంసీ మాజీ సభ్యుడు రేబాక మధుబాబు, వైఎస్సార్సీపీ మండల ఎస్సీ సెల్ అద్యక్షుడు తట్టా రాజు, బీలా అప్పారావు, పెదపాడు అంబేడ్కర్ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
భవిత విద్యను బలోపేతం చేయాలి
అనకాపల్లి : సహిత విద్యా విభాగం ప్రత్యేక మాడ్యూల్స్ ఉపయోగించి బోధిస్తూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు సమష్టిగా కలిసి సహిత విద్యను బలోపేతం చేయాలని జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణనాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కొప్పాక డీఈవో కార్యాలయంలో డీఈవో గిడ్డి అప్పారావునాయుడుకు సోమవారం ప్రత్యేక బోధన పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 24 మండలాల్లో పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు, ఎంఈవోలకు , భవితా కేంద్రాల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ,దివ్యాంగ విద్యార్థులకు ఏడు రకాల ప్రత్యేక మాడ్యూల్స్ మొత్తంగా 1347 మాడ్యూల్స్ ఉన్నాయన్నారు. ప్రత్యేక మాడ్యూల్స్ ద్వారా సవర్ణాత్మక బోధనకు తోడు విద్యార్థులో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించడమే కాక గుణాత్మకత, సాంకేతికతతో కూడిన నూతన విద్యా బోధన ద్వారా మరింత అభ్యున్నతిని సాధించేలా చేయవచ్చు అన్నారు. ప్రత్యేక మాడ్యూల్ విధానం సహిత విద్యలో మరింత ప్రగతికి దోహదపడుతుందని, నిర్దేశిత లక్ష్య సాధనకు, పిల్లల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర పర్యవేక్షణ అధికారి బి.మహాలక్ష్మినాయుడు పాల్గొన్నారు. -
సుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలి
అనకాపల్లి : జిల్లాలో తాండవ, ఏటి కొప్పాక, తుమ్మపాల, గోవాడ షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వాలు మూసివేయడం అన్యాయమని, ఫ్యాక్టరీలను ఆధునికీకరించి, రైతులు, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జిల్లా వ్యవసాయ సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతాంగం ఏ పంటలు పండించాలో అర్థం కాక వేల ఎకరాల భూములు బీడుగా ఖాళీగా ఉంచడం జరుగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జిల్లాలో గల షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించి, ఆధునికీకరించి నడిపిస్తామని జిల్లాలో రైతులను, కార్మికులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని తక్షణమే అమలుచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికీ మూత పడ్డ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం జిల్లా రైతాంగాన్ని, కార్మికులను మోసం చేయడమే అవుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, నాయకులు గండి నాయన బాబు, శివ, ఎస్.వి.నాయుడు, బ్రహ్మాజీ, సత్యనారాయణ, జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారుల అసహనం
తుమ్మపాల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో ప్రజలు గంటల కొద్దీ క్యూలైన్లలోనే వేచి ఉండాల్సి వచ్చింది. రాంబిల్లిలో సీఎం మీటింగ్ పేరుతో కలెక్టర్తోపాటు జేసీ, డీఆర్వో ముఖ్య అధికారులెవ్వరు కలెక్టరేట్లో లేకుండా పోయారు. దాంతో అర్జీలు తీసుకోవడంలో జాప్యంతో అర్జీదారులు అసహనం వ్యక్తం చేశారు. మండుటెండలో సైతం దూరప్రాంతాల నుంచి ప్రయాణించి కలెక్టరేట్కు చేరుకుంటే అర్జీల విభజన, నమోదు కోసం కింద, మొదటి అంతస్తుల్లో పదేపదే గంటల పాటు నిలబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోపక్క దొడ్డిదారుల్లో కొందరు అర్జీలను అధికారుల వద్దకు తీసుకెళ్లడంతో కలెక్టరేట్లో కేకలు, అరుపుల మోతమోగింది. పదేపదే ఫిర్యాదులు చేస్తున్న అధికారులకు రవ్వంతా కూడా జాలి చూపడం లేదని, సమస్యపై పీజీఆర్ఎస్లో పెట్టినందుకు క్షేత్రస్థాయి అఽధికారులు పగబెడుతున్నారని, సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని అర్జీదారులు వాపోతున్నారు. 2024 ఏడాది నుంచి భూసమస్యపై ప్రతి నెలా అర్జీ చేస్తున్నా అఽధికారులు పట్టించుకోవడం లేదని ఎంఎల్సీ పేరుతో చాలా కాలంగా తిప్పుతున్నారని, సమస్యను పరిష్కరించకుండా అక్రమణదారులకు అండగా అధికారులు నిలుస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా కలెక్టరేట్ పరిసరాల్లో అర్జీదారులకు నీడలేక చెట్లే కింద సేద తీరాల్సి వచ్చింది. పీజీఆర్ఎస్–131, రెవెన్యూ క్లినిక్ –123 అర్జీలు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కేఆర్ఆర్సీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్. రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో ఆమెతోపాటు మరో డిప్యూటి కలెక్టర్ రామమణి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వారం పీజీఆర్ఎస్–131, రెవెన్యూ క్లినిక్–123లో మొత్తం 254 అర్జీలు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మంగవేణి, జిల్లా నైపుణ్యం అభివృద్ధి అధికారి గోవిందరావు, జిల్లా చేనేత అధికారి యశ్వంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. క్రిస్టియన్లోకి మారిన వారికి కుల ధ్రువీకరణ నిలిపివేయాలని నిరసన సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా దళితులుగా ఉంటూ క్రిస్టియన్లుగా మారిన వారికి ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ నిలిపివేయడంతోపాటు దళితవాడల్లో అనధికారికంగా ఏర్పాటవుతున్న చర్చిలపై చర్యలు తీసుకుని దళిత హిందువుల హక్కులను కాపాడాలంటూ హిందూ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపకుడు బోని గణేష్, జిల్లా అధ్యక్షుడు మైలపల్లి పోతురాజు మాట్లాడుతూ దళిత వాడల్లో క్రైస్తవ మతాన్ని తీసుకొని ప్రార్థనలు చేస్తూ హిందు దళితులను అవమానిస్తూ, దాడులు చేస్తూ, తప్పుడు కేసులు పెడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తున్న క్రైస్తవుల నుంచి రక్షణ కల్పించాలన్నారు. మిడిమిడి జ్ఞానంతో పాస్టర్లుగా అవతారమెత్తి అమాయక ప్రజలను మతం మారుస్తున్నందున చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేని చర్చిలను తొలగించి, రాజ్యంగం ద్వారా నిజమైన (హిందూ, బౌద్ధులు, సిక్కులు) జీవన విధానం కొనసాగుతున్న వారికి మాత్రమే రిజర్వేషన్ పొందే హక్కు కొనసాగించాలన్నారు. దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా కోర్టులు స్పష్టమైన తీర్పులు ఇస్తున్నా పట్టించుకోకుండా తహసీల్దార్లు వారికి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం నిలిపివేయాలన్నారు. క్రైస్తువులుగా మారిన వారిని గుర్తించి వారికిచ్చిన ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను తక్షణమే రద్దు చేయాలని పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించారు. 22ఏలో చేర్చిన జిరాయితీ భూమిని తొలగించాలని వినతి ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం తప్పుగా నిషేధిత జాబితా (22ఏ)లో చేర్చిన జిరాయితీ భూమిని తొలగించి న్యాయం చేయాలంటూ గాజువాకలోని కర్ణంవానిపాలెంకు చెందిన కరణంరెడ్డి నరసింగరావు పీజీఆర్ఎస్లో వినతి అందించారు. అనకాపల్లి ఆవఖడం సర్వే నంబరు 1549/1లో 60 సెంట్లుగా ఉన్న భూమిని సర్వే నంబరు 1549లో చేర్చి నిషేధిత జాబితాలో నమోదైందన్నారు. ఈ మేరకు గతంలో ఫిర్యాదు చేయగా, ఆర్డీవో, జీవీఎంసీ జోనల్ కమిషనర్, తహసీల్దార్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి 1549/1గా సర్వే నివేదికను మంజూరు చేసినప్పటికి 22(ఏ) జాబితాలో నుంచి మాత్రం తొలగించలేదన్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ప్రకారం విచారణ చేపట్టి న్యాయం చేయాలని అధికారులను కోరారు. పంట కాలువల్లో మురుగుపై ఫిర్యాదు చేస్తే చర్యలు శూన్యం పంట కాలువల్లో మురుగు రాకుండా చేయుటకు ఫిర్యాదు తీసుకొస్తే ఆన్లైన్లో సర్వే అధికారులకు ఎండార్స్ చేసి ముగించేశారంటూ చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన కోనేటి లక్ష్మి కలెక్టరేట్ అధికారులను ప్రశ్నించింది. జగనన్న కాలనీ గృహాల మురుగునీరు సాగునీటి కాలువలో కలిసిపోవడంతో పొలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నిరోజుల క్రితం కలెక్టరేట్కు వస్తే సంబంధం లేని సర్వే శాఖకు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆమె వాపోయింది. ఈ మేరకు సోమవారం మరలా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. మురుగు కారణంగా నివాసంతోపాటు పంట పొలాలు పూర్తిగా పాడవుతున్నాయని, పంచాయతీలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని కలెక్టరమ్మ స్పందించి న్యాయం చేయాలని కోరింది. ఫోర్జరీ పత్రాలతో దళిత ఆదివాసీల భూముల ఆక్రమణకు యత్నం ఫోర్జరీ పత్రాలతో వారసత్వ హక్కులు సృష్టించి దళిత, ఆదివాసీలు సాగు భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారికి అండగా నిలిచిన తహసీల్దారు, అక్రమణదారుడు ఆర్.చంద్రశేఖర్రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సీపీఐఎంఎల్ లిబరేషన్, ఏపీ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో దళిత, ఆదివాసీలు భారీ ధర్నా చేశారు. రోలుగుంట మండలం అడ్డసారం దువ్వూరి సూర్య ప్రకాశం పేరుతో భూమిలో దళిత బహుజన ఆదివాసీ పేదలు దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. సాగుదారులుగా దళితులు పేరున రెవెన్యూ రికార్డులు నమోదై ఉన్నప్పటికి వారికి న్యాయం చేయకుండా అధికారులు అక్రమణదారులతో కుమ్మక్తె యలమంచిలికి చెందిన ఓ వ్యక్తి సూర్యప్రకాశం దత్తత పుత్రిడినంటూ ఫోర్జరీ పత్రాలతో వచ్చి కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ ఘటనపై జరిగిన వివాదంలో జాయింట్ కలెక్టర్ గ్రామసభ నిర్వహించి అక్రమాలు గుర్తించారు. నేటికి వివాదం జరుగుతున్నప్పటికి సదరు భూమి రికార్డులు ఆన్లైన్లో పేర్లు మార్చి సాగులో ఉన్న దళిత, బహుజన ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
దేవరాపల్లి : వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్టు ఆ సంఘం నాయుకులు సోమవారం తెలిపారు. దేవరాపల్లిలో జరిగిన జిల్లా మహాసభలలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయుకులు ఎం. అప్పలరాజు, గండి నాయన్బాబు పర్యవేక్షణలో 21 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా యం. సత్యన్నారాయణ, కార్యదర్శిగా డి.వెంకన్నను ఎన్నుకున్నారు. ఆఫీస్ బేరర్స్గా కె. గోవిందరావు, కె.భవానీ, ఇరటా నర్సింహమూర్తి, బిటి. దొర, వి. సూరిబాబును ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కార్యదర్శిగా ఎన్నికై న వెంకన్న మాట్లాడుతూ జిల్లా మహా సభలలో తీర్మానం చేసిన తీర్మాణాలపై పోరాటం సాగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. జిల్లా మహాసభలను విజయంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో
బుచ్చెయ్యపేట : భూమి ఆన్లైన్ మ్యుటేషన్కు రూ.లక్షా యాభై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు వీఆర్వో పట్టుబడ్డాడు. బుచ్చెయ్యపేట మండలం పి.భీమవరానికి చెందిన వీఆర్వో పోతల శంకరరావు ఓ వ్యక్తి కొనుగోలు చేసిన రెండున్నర ఎకరాల భూమి ఆన్లైన్ మ్యుటేషన్ చేయడానికి రూ.లక్షా యాభై వేలు డిమాండ్ చేశాడు. దీంతో కొనుగోలుదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం భూమి కొనుగోలుదారుడు నుండి పి భీమవరం సచివాలయంలో లక్షా యాభై వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యేండెడ్గా వీఆర్వోను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీలు హర్షిత, రమణమూర్తిలు విలేకరులకు వివరాలు తెలిపారు. పి.భీమవరం సచివాలయం పరిధిలో రెండున్నర ఎకరాలు భూమిని ఒక వ్యక్తి కొనుగోలు చేశాడని, అయితే రీ సర్వేలో భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి కాకుండా విక్రయించిన రైతు పేరుపై ఆన్లైన్ చేశారన్నారు. దీంతో కొనుగోలుదారు ఆ భూమిని తన పేరున ఆన్లైన్ మ్యుటేషన్ చేయాలని వీఆర్వోని సంప్రదించగా, అతను ఆన్లైన్ మ్యూటేషన్కు రూ.లక్షా యాభై వేలు లంచం డిమాండ్ చేశాడన్నారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులని ఆశ్రయించాడన్నారు. పి.భీమవరం సచివాలయంలో భూమి కొనుగోలుదారు నుంచి రూ.లక్షా యాభై వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం వీఆర్వోను పట్టుకున్నామన్నారు. గతంలో కూడా రెండు చోట్ల ఇతను లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడన్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064కు గాని తమకి నేరుగా గానీ ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదుదారు వివరాలను గుట్టుగా ఉంచుతామన్నారు. -
జేఈఈలో మోనిష్ ప్రతిభ
పాయకరావుపేట : సోమవారం ప్రకటించిన జెఈఈ మెయిన్స్ ఫలితాలలో శ్రీ ప్రకాష్ విద్యార్ధి ప్రతిభ చూపినట్టు శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వివిఎస్ఎస్ భానుమూర్తి తెలిపారు. జె.మోనిష్ కుమార్ ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరీలో 77 వ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 513 వ ర్యాంకు సాధించి అగ్రగామిగా నిలిచాడని, పి.పండు పిడబ్ల్యూ బిడి విభాగంలో 252వ ర్యాంకు సాధించాడని తెలిపారు. తమ కళాశాలలో ఇస్తున్న ఇంటిగ్రేటెడ్ ఐఐటీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థి ఈ ప్రతిభ కనబరిచాడని ఆయన తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదండ్రులు తదితరులు అభినందనలు తెలిపారు. -
కలెక్టరేట్లో బసవేశ్వరుని జయంతి
బసవేశ్వరుని చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి తుమ్మపాల : లింగాయత్ సంప్రదాయాన్ని రూపొందించడంలో బసవేశ్వరుడు కీలక పాత్ర పోషించారని కెఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.వి.ఎస్ సుబ్బలక్ష్మి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం 895వ బసవేశ్వరుని జయంతి సందర్భంగా ఆమె బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగ వివక్షను వ్యతిరేకించిన అభ్యుదయ వాది మహాత్మ బసవేశ్వరుడన్నారు. హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో బసవేశ్వరుడు ఒక్కరని, ఇతనిని బసవన్న, బసవుడు, విశ్వ గురువని పిలుస్తున్నారన్నారు. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమయ్యిందని, దేవుడికి ప్రజలకు మధ్య పూజారులు అవసరం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యం అని చాటి చెప్పారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే రీతిగా వచనాలు రాశారని తెలిపారు. -
స్పేసెస్ డిగ్రీ కళాశాలకు పురస్కారాలు
స్పేసెస్ డిగ్రీ కళాశాల ప్రతిభకు గుర్తింపుగా అవార్డు అందిస్తున్న అతిథులు పాయకరావుపేట: స్పేసెస్ డిగ్రీ కళాశాలకు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి అరుదైన గౌరవం దక్కిందని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ పనితీరు కనబర్చిన ఏయూ పరిధిలోని 306 కళాశాలల్లో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)ను ఉత్తమ కళాశాలగా ఎంపిక చేశారన్నారు. ఈ నెల 18న విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ జి.పి. రాజశేఖర్, ఏపీ ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, విజ్ఞాన్ సంస్థల చైర్మన్ లావు రత్తయ్యల నుంచి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రామకృష్ణారెడ్డి పురస్కారం అందుకున్నారన్నారు. స్పేసెస్ డిగ్రీ కళాశాల నుంచి ఉత్తమ కళాశాల అధ్యాపకుడిగా డాక్టర్ అరుణ్ కుమార్ త్రిపాఠి, ఉత్తమ పూర్వ విద్యార్థిగా రాజస్థాన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ టి.శివప్రసాద్, ఉత్తమ విద్యార్థిగా టి.శ్వేత పురస్కారాలు అందుకున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత సిహెచ్ నరసింహారావు, కళాశాల అధ్యాపక బృందం, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
భక్తులకు అష్టకష్టాలు
పెందుర్తి/ఆరిలోవ: చందనోత్సవ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ పెద్దల మితిమీరిన జోక్యం.. అధికార యంత్రాంగం సమన్వయలోపం వెరసి వేలాది భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. రద్దీ లేని సమయంలో తీరుబడిగా ఉన్న అధికారులు.. అసలు సమయం వచ్చేసరికి ఓ దశలో పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భక్తులు సోమవారం సాయంత్రం పడరాని పాట్లు పడ్డారు. రవాణా వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పడంతో వేలాది మంది భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. మెట్ల మార్గం.. ఘాట్ రోడ్లు మీదుగా కిలో మీటర్ల మేర కొండ ఎక్కి అంత్యంత గందరగోళ పరిస్థితుల్లో స్వామి దర్శనం చేసుకున్నారు. ఉదయం ప్రశాంతం.. సాయంత్రం గందరగోళం దాదాపు 2 లక్షల మంది భక్తులు చందనోత్సవం సందర్భంగా స్వామి నిజరూప దర్శనానికి వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే సోమవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దీ ఓ మాదిరిగా ఉండడంతో ఏర్పాట్ల లోపాలు అంతగా కనిపించలేదు. కానీ సాయంత్రం 3 గంటల తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రెండు మూడు గంటల వ్యవధిలో వేలాది భక్తులు కొండ దిగువకు చేరుకోవడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. దీంతో బస్సులు మందకోడిగా కదిలాయి. ఈ క్రమంలో పోలీసులను, ఆర్టీసీ అధికారులను పలు చోట్ల భక్తులు తీవ్రస్థాయిలో నిలదీశారు. చాలామంది భక్తులు పరిస్థితిని గమనించి మెట్ల మార్గం, ఘాట్ రోడ్లు వెంబడి ఆపసోపాలు పడుతూ నడుస్తూ క్యూలైన్లకు చేరుకున్నారు. పోలీసులందరూ వీఐపీలే.. చందనోత్సవం వేళ మరోసారి పోలీసుల తీరు విమర్శలపాలైంది. కిందిస్థాయి నుంచి అధికారుల వరకు వందలాది మంది పోలీసులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో రూ.1500 క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. వారి వద్ద పాస్లు లేకపోయినా సమయం చూసుకుని పోలీస్ అధికారులు వారిని క్యూలైన్లలోకి పంపడం గమనార్హం. ఓ రకంగా చెప్పాలంటే టికెట్లు లేకపోయినా పోలీసులంతా సపరివార కుటుంబ సమేతంగా వీఐపీ హోదాలో దర్శనం చేసుకున్నారు. కాళ్లు కాలి అవస్థలు : స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు చెప్పులు విడిచిపెట్టడంతో ఎండ తీవ్రతకు తీవ్ర అవస్థలు పడ్డారు. కేవలం కొన్నిచోట్ల మాత్రమే మ్యాట్ వేయడంతో మిగిలిన చోట్ల నడిచిన భక్తులంతా పాదాలు మంటలు పుట్టి ఇబ్బందులు పడ్డారు. అయితే భక్తుల అవస్థలు చూసి కంటితుపుడు చర్యగా జీవీఎంసీ అధికారులు ట్యాంకర్లతో నీటిని రోడ్లుపై వేసినా అవి కొన్ని నిమిషాల్లోనే ఎండకు ఆవిరైపోయాయి. మూసిన మెట్ల దారి: అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు మెట్ల మార్గాన్ని మూసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సుల కొరత కొండపైకి వెళ్లేందుకు కేవలం ఆర్టీసీ బస్సులే దిక్కు కావడంతో భక్తులు ఫుట్బోర్డులపై వేలాడుతూ ప్రయాణించారు. బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. భయంతో వెనుదిరిగాం.. సాయంత్రం అయితే దర్శనం చేసుకోవచ్చని వచ్చాం. కానీ బస్లు కదలకపోవడంతో పరిస్థితి బాలేదని గమనించాం. భయంతో ఇంటికి వెనుదిరిగాం. రవాణా వ్యవస్థ సరిగా నడపలేదు. – దొరబాబు, భక్తుడు తొలిసారి వచ్చాను.. దర్శన భాగ్యం లేదు.. తొలిసారి అప్పన్నస్వామి నిజరూప దర్శనం చేసుకుందామని వచ్చాను. కానీ బస్ ఎక్కే పరిస్థితి లేదు. బస్టాండ్లో భక్తుల నియంత్రణ కూడా లేదు. బస్లో ప్రయాణం చేసేందుకు మూడు గంటలు వేచి ఉన్నాను. కానీ కుదరకపోవడంతో స్వామి దర్శనం లేకుండానే ఇంటికి వెళ్లిపోతున్నాను. – కల్యాణి, భక్తురాలు, కూర్మన్నపాలెం -
దివ్య దర్శనం
భవ్య రూపంఅప్పన్న నిజరూప దర్శనంతో పరవశించిన భక్తులు తెల్లవారుజాము 3.20 నుంచి ఉచిత, రూ.300 దర్శనం ప్రారంభంసింహాచలం : వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. సంవత్సరంలో ఒక్కరోజే కలిగే స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి భక్తిరసంలో మునిగిపోయారు. చందనపు పొరల నుంచి వెలుగుచూసిన స్వామివారిని కళ్లారా చూసిన భక్తులు ఆధ్యాత్మికానందంలో తేలిపోయారు. శాస్త్రోక్తంగా చందనం విసర్జన పాంచరాత్ర ఆగమశాస్త్ర విధానాలను అనుసరించి ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సుప్రభాతసేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, పంచకలశారాధన వంటి విశిష్ట పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వెండి బొరుగులతో స్వామివారిపై ఉన్న పన్నెండు మణుగుల చందనాన్ని శ్రద్ధగా తొలగించి, నిజరూపంలో స్వామివారిని దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు. తొలిదర్శనం అనంతరం భక్తులకు దర్శనాలు తెల్లవారుజాము 2.20 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు స్వామివారిని తొలిగా దర్శించుకున్నారు. తెల్లవారుజాము 3.20 గంటల నుంచి ఉచిత దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శనం భక్తులకు కల్పించారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేశారు. అప్పటివరకు క్యూల్లో వేచి ఉన్న భక్తులకు దర్శనాలు కల్పించారు. విశేషంగా సహస్ర ఘటాభిషేకం రాత్రి జరిగిన సహస్ర ఘటాభిషేకం ఆధ్యాత్మికోత్సాహాన్ని మరింత పెంచింది. త్రిదండి చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో గంగధార నుంచి తీసుకు వచ్చిన వెయ్యి కలశాల పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అదేవిధంగా 108 వెండి కలశాలతో పంచామృతాలు, ఔషధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి విశేష పూజలు చేశారు. అనంతరం తొలివిడతగా మూడు మణుగులు(సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని సమర్పించి స్వామి వారిని మళ్లీ నిత్యరూపంలో అలంకరించారు. అహోబిల రామానుజజీయర్, దేవనాఽఽథ్ జీయర్ స్వామి పాల్గొన్నారు. దర్శించుకున్న ప్రముఖులు: స్వామి నిజరూప దర్శనాన్ని పలువురు ప్రముఖులు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు శ్రీభరత్, సి.ఎం.రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్, విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, కాకినాడ కలెక్టర్ హరేందిరప్రసాద్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, జేసీ విద్యాధరి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. నీలాద్రిగుమ్మం వద్ద హడావుడిసమయం దాటినా అంతరాలయ దర్శనాలుసింహాచలం: చందనోత్సవం వేళ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద సోమవారం తెల్లవారుజామున హడావుడి చోటుచేసుకుంది. తెల్లవారుజాము 2.20 గంటల సమయంలో తొలిదర్శనం చేసుకునేందుకు అశోక్గజపతిరాజు వచ్చేసరికే చాలామంది ఆలయ ధ్వజస్తంభం ప్రాంగణంలో ఉన్నారు. ఆయన దర్శనం చేసుకోగానే హోంమంత్రి అనిత దర్శనం చేసుకున్నారు. అప్పటికే రూ.1500 టికెట్ కల్గిన ప్రముఖులకు అంతరాలయ దర్శనం ప్రారంభించారు. ఈ తరుణంలోనే నీలాద్రిగుమ్మం వద్ద పెద్ద ఎత్తున తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఎంతకీ క్యూ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. రూ.1500 టికెట్పై వచ్చే ప్రముఖులకు తెల్లవారుజాము 3.30 నుంచి 5 గంటల వరకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని అధికారులు ముందుగా ప్రకటించినా.. ఆ సమయం దాటినా కూడా కొందరు ప్రముఖులు రావడంతో వారికి అంతరాలయ దర్శనం కల్పించారు. విశాఖ ఎంపీ భరత్ ఉదయం 5.13 గంటల సమయంలో అంతరాలయ దర్శనానికి వెళ్లడం విశేషం. ఆ తర్వాత మరికొందరు ప్రముఖలు దర్శనం చేసుకున్న తర్వాత ఉదయం 5.40 గంటల సమయంలో అంతరాలయం దర్శనాలు నిలుపుచేశారు. నీలాద్రిగుమ్మం వద్ద నెలకొన్న హడావుడితో అప్పటికే ప్రారంభమైన ఉచిత దర్శనం, రూ.300 దర్శనం భక్తులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. నీలాద్రిగుమ్మం వద్దే ఎక్కువ మంది పోలీసులు కూడా విధులు నిర్వర్తించడంతో దేవస్థానం ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోయారు. మరోపక్క నీలాద్రిగుమ్మం వద్దే ఉన్న రాష్ట్ర మంత్రి ఒకరు తమవాళ్లను ఇష్టానుసారంగా దర్శనానికి పంపించడం విశేషం. పోలీసుల దర్శనాలు కూడా అధికంగా చోటుచేసుకున్నాయి. పట్టు వస్త్రాల సమర్పణ చందనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి వంగలపూడి అనిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరి కూడా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం కొనసాగుతూ వస్తోంది. కూటమి నేతలకే ప్రోటోకాల్ దర్శనం సైడ్ లైట్స్ ఉచిత దర్శనం, రూ.300 దర్శనంల క్యూల్లోకి భక్తులు ఆదివారం రాత్రి నుంచే చేరుకున్నారు. ఉచిత దర్శనం రెండు క్యూలుగా ఏర్పాటు చేసినా నిరంతరం రెండు లైన్లు భక్తులతో రద్దీగానే ఉన్నాయి. దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సీసీ మోనిటర్లో ఎప్పటికప్పుడు క్యూల రద్దీని గమనిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. మధ్యాహ్నం నుంచి క్యూల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో క్యూలు పలుమార్లు ముందుకు కదల్లేదు. దేవస్థానం ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు వాహనాన్ని టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతమేర వాగ్వాదం చోటుచేసుకుంది. సాయంత్రానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగా ప్రకటించిన విధంగా సాయంత్రం 6 గంటల నుంచే కొండపైకి బస్సులను నిలుపుదల చేశారు. రాత్రి 7 గంటలకే క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేశారు. ఈసారి 1.25 లక్ష మంది స్వామిని దర్శించుకున్నట్లు అంచనా. తెల్లవారు 2.12 గంటలకు కేశఖండనశాల వద్ద 30 ఏళ్ల మహిళ స్పృహ తిరిగి పడిపోయారు. రూ.300 క్యూలైన్లో మధ్యాహ్నం 1.10 సమయంలో ఎండ తీవ్రతకు పలువురు స్పృహ కోల్పోయారు. సాక్షి, విశాఖపట్నం: వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం వేళ యంత్రాంగం వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. ఏడాదికి ఒక్కసారి లభించే నిజరూప దర్శనం కోసం వచ్చిన వేలాది మంది సామాన్య భక్తులు అధికారుల అతి జాగ్రత్త, సమన్వయ లోపం కారణంగా అల్లాడిపోయారు. ఉదయం 3 నుంచి 6 గంటల వరకే ప్రోటోకాల్ దర్శనమని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సాయంత్రం వరకు కూటమి ప్రజాప్రతినిధులు, వారి బంధుమిత్రులు, అధికారుల కుటుంబ సభ్యులే ప్రోటోకాల్ పేరుతో దర్శనాలు చేసుకున్నారు. దీనివల్ల రూ.1000, రూ.1500 టికెట్లు కొన్న భక్తులు కూడా 4 నుంచి 5 గంటల పాటు క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. -
ఎనిమిది మంది జూదరుల అరెస్టు
కోటవురట్ల: మండలంలోని పాములవాకలో కాయిన్ గేమ్ ఆడుతున్న ఎనిమిది మందిని ఆదివారం అరెస్టు చేసినట్టు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడిచేయగా ఎనిమిది కాయిన్ గేమ్ ఆడుతూ పట్టుబడినట్టు చెప్పారు. వారిని అరెస్టు చేసి, రూ.9,200 స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, పేకాట, కోడి పందాలు, కాయిన్ గేమ్ వంటి జూదాలు ఆడినా చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. పేకాటరాయుళ్లకు అరదండాలు బుచ్చెయ్యపేట: మండలంలోని సీతయ్యపేట శివారులో తోటల వద్ద పేకాట స్థావరంపై దాడి చేసి, ఏడుగురుని అరెస్టు చేసినట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.31,400 స్వాధీనం చేసికుని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. -
తప్పిన ఘోర ప్రమాదం
నక్కపల్లి: మండల కేంద్రం నక్కపల్లి వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. భువనేశ్వర్ నుంచి చైన్నె వెళ్తున్న బస్సు డీవైడర్ను ఢీకొని హైవే నుంచి ఐదు అడుగుల లోతున ఉన్న కాలువలో బోల్తాపడింది. ప్రయాణికులందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే భువనేశ్వర్నుంచి చైన్నె వెళ్తున్న షామోలి ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో జాతీయరహదారిపై నక్కపల్లి ఎస్సీ కాలనీ ఎదురుగా ఉన్న ఎస్సీ హాస్టల్ వద్ద డివైడర్ను ఢీకొని కాలువలోకి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బస్సు విద్యుత్ తీగలను తాకుతూ వెళ్లి బోల్తాపడింది.ఈ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంవల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్, 35 మంది ప్రయాణికులు కలిపి మొత్తం 38 మంది ఉన్నారు. తెల్లవారు జామున అందరూ గాఢ నిద్రలోఉన్న సమయంలో బస్సు బోల్తాపడటంతో ఏం జరిగిందో తెలియక ప్రయాణకులు పెద్దపెట్టున కేకలు వేశారు. పెద్దగా శబ్దం రావడంతో స్థానికులు వెంటనే మేల్కొని ప్రమాదం జరిగిన ప్రాంతానికి పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు సీఐ జె.మురళి, ఎస్ఐ సన్నిబాబు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కున్నవారిని బయటకు తీశారు. వీరంతా భువనేశ్వర్ నుంచి చైన్నె, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రమాదంలో ఐదుగురికి ఓ మోస్తరు గాయాలుకాగా, మరో పది మందికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడినవారిలో భువనేశ్వర్కు చెందిన బస్సు డ్రైవర్ చైతన్య, ఉద్దండపురానికి చెందిన డ్రైవర్ గణపతి, ఉద్దండపురానికి చెందిన క్లీనర్ రామాల రామకృష్ణ, ప్రయాణికులు ఉమామహేశ్వరరావు, సిపుల్, నిర్మల్కుమార్, మునిస్వామి, మోహన్ లోకేష్లున్నారు. వీరిలో మునిస్వామి, మోహన్ లోకేష్లను విశాఖ తరలించారు. మిగిలిన ముగ్గురితో పాటు స్వల్పగాయాలకు గురైన ప్రయాణికులను నక్కపల్లి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు రద్దుచేసుకుని వెనక్కి వెళ్లిపోయారు. మరికొంతమంది చైన్నె వెళ్లేందుకు సిద్ధపడటంతో ట్రావెల్స్ వారు ఏర్పాటు చేసిన మరో బస్సులో బయలుదేరారు. బోల్తాపడిన బస్సును పొక్లెయిన్ల సాయంతో బయటకుతీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మురళీ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ నిద్రలో ఉన్న సమయంలో బస్సు బోల్తాపడిందని చెప్పారు. పెద్దగా శబ్దం రావడంతో మెలకువ వచ్చిందన్నారు. లేచి చూసేసరికి కాలవలో పడి ఉందని చెప్పారు. చాలా భయం వేసిందని, ఇంతలో స్థానికులు, పోలీసులు వచ్చి ఒక్కొక్కరినీ బయటకు తీశారని తెలిపారు. చిన్నపాటి గాయాలు మినహా ఎవరికీ ఏమీ కాలేదని మేం చాలా అదృష్టవంతులమని చెప్పారు. -
సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు విఫలం
దేవరాపల్లి: పేదల పక్షాన ఎర్ర జెండా నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. దేవరాపల్లి ఉషోదయ కాన్సెప్ట్ స్కూల్ ఆవరణలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహా సభలు జిల్లా అధ్యక్షుడు వి.సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం ఘనంగా జరిగాయి. సభా వేదిక వద్ద ముందుగా పుచ్చపల్లి సుందరయ్య, ఏచూరి సీతారాం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో హాజరైన రైతులు, కార్మికులను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు స్థలం ఇస్తానని హామీ ఇచ్చి దళిత, గిరిజనుల భూములు లాక్కోవడం జరుగుతుందన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో వేలాది ఎకరాల భూములను పేద రైతుల నుంచి లాక్కోని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం ఎర్ర జెండా కృషితో వచ్చిందేనని, దీనిని నిర్వీర్యం చేసేందుకు పేరు మార్చి కూలీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు ఫేస్ యాప్ను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని ఈ నెల 20న విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రాగా మారుస్తానని చంద్రబాబు డబ్బా కొడుతున్నారని, ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎర్ర జెండా నాయకులు పోటీ చేయాలన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాలో నాలుగు సుగర్ ఫ్యాక్టరీలు మూసివేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జిల్లాలోని నాన్ షెడ్యూల్ మండలాలను ఐదో షెడ్యూల్ మార్చాలని డిమాండ్ చేస్తూ మహా సభలో తీర్మానం చేస్తున్నామని ప్రకటించారు. జీడి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, పోడు ఫారెస్టు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆక్రమణలకు గురైన పేదల భూములు తిరిగి ఇవ్వాలని, ఉపాధి హామీ పట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని మహాసభలలో తీర్మానం చేశారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, రైతు సంఘం నాయుకులు గండి నాయన్బాబు, బి.టి.దొర, ఇరటా నర్సింహమూర్తి, గోవింద, కె. భవానీ, డి.శంకర్, సిహెచ్.దేముడు, గాడి ప్రసాద్, ఎం.ఎర్రునాయుడు, జె. ఈశ్వరరావు.వి.దొంగబాబు, నండా సన్నిబాబు, కె.నాయుడు, కె.దేముడు, సిహెచ్. చినదేముడు, జన్ని దేముడు పాల్గొన్నారు. -
నిజరూప దర్శనానికి వేళాయె
సింహాచలేశునిసింహాచలం: సింహగిరిపై అవతరించిన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ వేళయింది. వైశాఖ శుద్ధ తదియని పురస్కరించుకుని స్వామివారు సోమవారం తన నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించనున్నారు. ఏడాదంతా చందన రూపుడి(నిత్యరూపం)గా కనిపించే స్వామి మణుగుల చందనం నుంచి బయటకు వచ్చి, నిజరూపంతో దర్శనమివ్వనున్నారు. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి, స్వామివారిపై ఉన్న చందనాన్ని ఒలిచి నిజరూప భరితుడిని చేస్తారు. వేకువజాము 3 గంటలకు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజుకు తొలి దర్శనం కల్పిస్తారు. 3.30 గంటల నుంచి భక్తులకు ఉచిత, రూ.300 దర్శనాలు ప్రారంభిస్తారు. రాత్రి 8 గంటల నుంచి సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారు. సింహగిరిపై గంగధార నుంచి శ్రీవైష్ణవస్వాములు కలశాలతో తీసుకొచ్చిన నీటితో స్వామివారి నిజరూపానికి అభిషేకం నిర్వహిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకం, విశేష పూజల అనంతరం తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమ ర్పించి, మళ్లీ నిత్యరూపభరితున్ని చేస్తారు. నిజరూప స్వామికి ధరింపజేసే శిరోచందనం, హృదయచందనాన్ని వైదికులు ఇప్పటికే సిద్ధం చేశారు. పటిష్ట ఏర్పాట్లు ఈసారి చందనోత్సవానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా. ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000,రూ.1,500ల దర్శనం టికెట్ల క్యూలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. టికెట్లపై పొందుపరిచిన సమయాల(స్లాట్ల) ప్రకారం దర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి 7 గంటలలోపు మాత్రమే క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు సింహగిరి పైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. దర్శనానంతరం దక్షిణ రాజగోపురం ద్వారా బయటకు వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు. ఈ మేరకు 40 గ్రాముల లడ్డూలను లక్షా 50 వేలు సిద్ధం చేశారు. చందనోత్సవం సందర్భంగా విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఆధ్వర్యంలో 2,300 మందితో పోలీస్ బందోబస్తు, సింహగిరిపై కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. డ్రోన్ సాంకేతికను వినియోగిస్తున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత చందనోత్సవం ఏర్పాట్లను ఆదివారం హోంమంత్రి అనిత పరిశీలించారు. దర్శనాల క్యూలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సాఫీగా జరిగేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత చందనోత్సవ అనుభవాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నామని పోలీస్ అధికారులు హోంమత్రికి తెలియజేశారు. మంత్రి వెంట దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, ఈవో జె.వెంకటరావు, డీసీపీ–2 మేరీ ప్రశాంతి తదితరులు ఉన్నారు. ఉదయం 3.30 నుంచి ఉచిత, రూ.300 దర్శనం రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాల మూసివేత రాత్రి 8 నుంచి సహస్ర ఘటాభిషేకం, తొలి విడత చందన సమర్పణ -
కె.కోటపాడు హైస్కూల్ పాత ప్రహరీ కూల్చివేత
కె.కోటపాడు: మండల కేంద్రం కె.కోటపాడులోని హైస్కూల్ పాత ప్రహరీని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం కూల్చివేశారు. పాఠశాలకు సెలవు కావడంతో అదును చూసుకుని కూల్చివేశారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత ప్రహరీ ఉంటుండగా..పాఠశాల తరగతి భవనాలకు సమీపంలోనే నూతన ప్రహరీని నిర్మించారు. పాత ప్రహరీని ప్రస్తుతం తొలగించేందుకు కుట్ర జరుగుతోందని, దీని వల్ల పాఠశాల స్థలం కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధకు శనివారం రాత్రి పలువురు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆమె కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, విద్యాశాఖ ఉన్నతాధికారులకు శనివారమే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం పాత ప్రహరీని కూల్చివేయడంతో గ్రామస్తులు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు హెచ్ఎం ఫిర్యాదు పాఠశాల పాత ప్రహరీని గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ఉదయం కూల్చివేశారని పాఠశాల హెచ్ఎం ఎస్.వి.పద్మావతి కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్కు లిఖిత పూర్వకంగా ఆదివారం ఫిర్యాదు చేశారు. పాత ప్రహరీని కూల్చివేసిన సమాచారాన్ని పాఠశాలకు చెందిన వాచ్మెన్ రాంబాబు తనకు ఫోన్ ద్వారా ఇచ్చినట్టు ఆమె తెలిపారు. వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పాటు కె.కోటపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు హెచ్ఎం స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్.ఐ ధనుంజయ్ చెప్పారు. కూల్చివేత టీడీపీ నాయకుల పనే .. పాత ప్రహరీని గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులే కూల్చివేశారని వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సింగంపల్లి మురళీమోహన్, పాఠశాల పూర్వ విద్యార్థి డోకల అప్పలనాయుడు ఆరోపించారు. పాఠశాలకు చెందిన స్థలంలో షాపులను నిర్మించి, తమ బినామీలకు అప్పగించేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రూ.10 కోట్లకు పైబడి విలువ గల హైస్కూల్ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలను తీసుకోవాలని పాఠశాల వద్ద వీరు నినాదాలు చేశారు. ఇప్పటికై నా పాఠశాలకు చెందిన స్థలాన్ని ఏ విధంగా రక్షించనున్నారో అధికారులు తెలియజేసి గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనలను తొలగించాలని మురళీమోహన్, అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కణితి సాయికుమార్, లగుడు దేముడుబాబు, మేడపురెడ్డి త్రిమూర్తులు, కె.శివ పాల్గొన్నారు. -
వడదెబ్బ లక్షణాలు, జాగ్రత్తలు
మాడుగుల రూరల్: వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిది. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లేటప్పుడు లేత రంగులో ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. తలకు టోపీ లేదా గొడుగు వాడడం మంచిది. ఈ సందర్భంగా వడదెబ్బకు గురైన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు గురించి కె.జె.పురం పీహెచ్సీ వైద్యాధికారి ఎల్.వి.ఎస్.ఎస్. ప్రసాదుపాత్రుడు పలు సూచనలు చేశారు. వడదెబ్బ తగిలినప్పుడు చెయ్యవలిసినవి: శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం, వడదెబ్బ బారిన పడిన వ్యక్తిని వెంటనే నీడలోకి లేదా ఎ.సి. ఉన్న గదిలోకి మార్చాలి. తడి గుడ్డతో శరీరాన్ని తుడిస్తూ ఫ్యాన్ కింద ఉంచాలి. వీలైతే ఐస్ ప్యాక్ మెడ, చంకలు, గజ్జల భాగంలో ఉంచితే త్వరగా వడ దెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. స్పృహలో ఉంటే నీళ్లు, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, లేదా మజ్జిగ తాగించాలి. ఒక వేళ బాధితుడు స్పృహ కోల్పోతే నోటి ద్వారా ఏమి ఇవ్వకూడదు. గాలి తగేలా బిగుతుగా ఉన్న దుస్తులను కొద్ది మేర సడలించాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి విపరీతమైన జ్వరం, మూర్చ, స్పృహ తప్పడం వంటివి జరిగితే ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆస్పత్రికి తరలించాలి. దాహం వెయ్యకపోయినా సరే ప్రతి గంటకు ఒక సారి నీళ్లు తాగించాలి. కోలుకుంటున్న సమయంలో కాఫీ, టీ, ఆల్కహాల్కు దూరంగా ఉంచాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి జ్వరం వస్తే పారాసెటమెల్ లేదా ఆస్పిరెన్ వంటివి సొంతంగా వాడకూడదు. ఇవి కొన్నిసార్లు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తాయి. కేవలం వైద్యులు సలహా మేరకు మందులు వాడాలి. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ సోకకుండా ఉండవచ్చు. ఏప్రిల్, మే, జూన్ మొదటివారం వరకు వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రతలు తీసుకోవాలని ప్రజలకు వైద్యాధికారి ప్రసాదుపాత్రుడు సూచించారు. -
తండ్రి కళ్ల ముందే కుమారుడి దుర్మరణం
రణస్థలం: రణస్థలం జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు వదిలేస్తుంటే.. ఏమీ చేయలేక ఆ తండ్రి విలపించిన తీరు స్థానికులను కంటపడి పెట్టించింది. జేఆర్ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. విశాఖలోని మాల్కాపురంలో నివాసం ఉంటున్న పంది దీనబంధు, తన కుమారుడు ప్రేమ్కుమార్(15)తో కలిసి ఆదివారం స్కూటీపై శ్రీకాకుళం వచ్చారు. అక్కడ జరిగిన డిఫెన్స్ ఎంట్రన్స్ పరీక్షకు ప్రేమ్కుమార్ హాజరయ్యాడు. పరీక్ష ముగిసిన అనంతరం ఇద్దరూ స్కూటీపై తిరిగి విశాఖపట్నం బయలుదేరారు. సాయంత్రం 4 గంటల సమయంలో రణస్థలం టౌన్ వద్దకు రాగానే, ఒక లారీని ఓవర్టేక్ చేయబోతుండగా వీరి వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న దీనబంధు రోడ్డుకు ఒకవైపు తుళ్లిపోగా, వెనుక కూర్చున్నప్రేమ్కుమార్ మాత్రం ప్రమాదవశాత్తూ లారీ చక్రాల కిందకు పడిపోయాడు. లారీ వెనుక చక్రం తల పైనుంచి వెళ్లడంతో ప్రేమ్కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. దీనబంధు మాల్కాపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బురద రామచంద్రాపురం పంచాయతీ శేఖరపురం. దీనబంధుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాద స్థలంలో లారీ కింద ఉన్న మృతుడు ప్రేమ్ కుమార్, రోదిస్తున్న తండ్రి దీనబంధు -
చెరువుల్లో మట్టి జలగలు
నర్సీపట్నం: చెరువులు కొంతమంది కూటమి నేతల ధనదాహానికి కరిగిపోతున్నాయి. అధికార యంత్రాంగం అండతో కొందరు ఇష్టమొచ్చినట్లు మట్టిని తరలిస్తూ అడిగే వారెవరంటూ రెచ్చిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెరువు గర్భాల్లో మట్టి కూటమి నేతలకు వరంగా మారింది. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో మట్టి దందా యథేచ్చగా సాగుతోంది. నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం తదితర ప్రాంతాల్లో రాత్రీ పగలు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా లోతుగా తవ్వకాలు చేస్తూ యథేచ్ఛగా తరలించేస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బయపురెడ్డిపాలెం రాయపురాజు చెరువు, అమలాపురం చెరువుల్లో పొక్లెయిన్లతో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువు గర్భాల్లో లోతుగా మట్టిని తవ్వడంతో ప్రమాదకరమైన గోతులేర్పడుతున్నాయని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ పరిధిలో వందలాది చెరువులు సాటునీటి మట్టి తవ్వకాలతో రూపాన్ని కోల్పోతున్నాయి. ఇంతజరుగుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. పరిసర ప్రాంతాలకు ఒక ట్రక్కు మట్టి తరలిస్తే రూ.వెయ్యి నుంచి రూ.1500 చొప్పున వసూలు చేస్తున్నారు. తనిఖీలు మరిచిన రవాణాశాఖ.. ట్రాక్టరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వ్యవసాయం, వాణిజ్య అవసరాల బట్టి పసుపు, తెలుపు నంబర్ ప్లేట్లు కేటాయిస్తారు. మట్టి తరలిస్తున్న వాటిలో సగానికిపైగా ట్రాక్టర్లకు నంబర్ ప్లేట్లు కనిపించడం లేదు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన రవాణాశాఖాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలోనే విచారణ చేస్తున్నారే తప్ప వాహనాల తనిఖీలు చేపట్టడం లేదు. వాహనదారులకు సరైన లైసెన్స్లు కూడా ఉండడం లేదు. వాహనంతో పాటు వాహనదారుడుకి సరైన పత్రాలులేకున్నా మట్టి వ్యాపారాలు మాత్రంగా జోరుగానే రవాణా చేస్తున్నారు. తెలుపు నంబరు ప్లేట్ ఉండే వాహనాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు తీసుకునే అధికారం ఉన్నా పట్టించుకోవటం లేదనే విమర్శలున్నాయి. -
యాంటాసిడ్ల అతివాడకం.. అనర్థాలకు మూలం
మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ నిష్టల శ్రీనివాస్ మహారాణిపేట: చాతీలో మంట, కడుపులో అసౌకర్యం, గ్యాస్ సమస్యలు రాగానే చాలామంది వెంటనే వేసుకునేవి యాంటాసిడ్ మాత్రలు. తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే ఈ మాత్రలు చాలా మందికి రోజువారీ అలవాటుగా మారిపోయాయి. అయితే.. వైద్యుల సలహా, పర్యవేక్షణ లేకుండా వీటిని దీర్ఘకాలం పాటు వాడటం ఆరోగ్యానికి తీవ్ర హానికరమని మెడికవర్ హాస్పిటల్స్కు చెందిన ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపాటాలజిస్ట్ డాక్టర్ నిష్టల శ్రీనివాస్ హెచ్చరిస్తున్నారు. వరల్డ్ లివర్ డే పురస్కరించుకుని ఆదివారం ఆయన మాట్లాడారు. ‘యాంటాసిడ్లను వైద్యుల సూచన మేరకు, సరైన మోతాదులో, పరిమిత కాలం పాటు వాడితే ప్రయోజనకరమే. కానీ, వాటిని నిర్లక్ష్యంగా దీర్ఘకాలం పాటు వాడటమే అసలు సమస్య. దీనివల్ల పోషకాల లోపం, రక్తహీనత, ఎముకల బలహీనత వంటి ఎన్నో కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. గ్యాస్ లేదా ఎసిడిటీ సమస్యలు వేధిస్తున్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా, సరైన సమయంలో నిపుణులైన వైద్యులను సంప్రదించాలి.’అని సూచించారు. నిరంతర అలసట, కండరాల నొప్పులు, తల తిరగడం, గుండె దడ, చేతులు లేదా కాళ్లు మొద్దుబారడం, విపరీతంగా జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. మెడికవర్ ఆసుపత్రుల్లోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన చికిత్సలు అందిస్తున్నామని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. 1000కి పైగా నిపుణులైన వైద్యులతో ఆంధ్రప్రదేశ్తో పాటు పలు నగరాల్లో మెడికవర్ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. -
గ్రావెల్ గద్దలు
ఏపీఐఐసీ భూముల్లో బోదిగల్లం వద్ద ఏిపీఐఐిసీ భూముల్లో పొక్లెయిన్తో తవ్వుతున్న గ్రావెల్ తవ్వకాలు జరిపే ప్రాంతంలో ట్రాక్టర్,పొక్లెయిన్ల యజమానులునక్కపల్లి: కొందరు కూటమి నేతలు అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏపీఐఐసీ భూముల్లో ఉన్న గ్రావెల్ను అక్రమంగా తవ్వేస్తున్నారు. రాత్రిపూట నాలుగైదు పొక్లెయిన్లతో తవ్వించి పదుల సంఖ్యలోని ట్రాక్టర్లలో తరలించుకుపోతున్నారు. రోజుకు 300 ట్రిప్పుల పైనే గ్రావెల్ను ట్రాక్టర్లపై ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు.నిర్వాసితుల కోసం ఈ గ్రావెల్ను తరలిస్తున్నామని చెబుతూ సమీపంలో ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారులకు, కంపెనీలకు విక్రయించి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన పునరావాస కాలనీలో ఇళ్లు నిర్మించుకుంటున్న నిర్వాసితులు పునాదుల్లోకి మట్టి తెచ్చుకుంటే పట్టుకుని కేసులు నమోదు చేసి ముక్కుపిండి అపరాధ రుసుం వసూలు చేస్తున్న మైనింగ్అధికారులు, ఏంఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఈ గ్రావెల్ తవ్వకాలపై కన్నెత్తి చూడకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ, పోలీసు అధికారుల సైతం ఈ గ్రావెల్ తరలింపుపై చూసీచూడనట్టు ఉంటున్నా రని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. స్టీల్ప్లాంట్, బల్క్ డ్రగ్పార్క్ కోసం నివాసప్రాంతా లు కోల్పోయిన వారికి పునరావాస కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం పెదబోదిగల్లం వద్ద ప్రైవేటు వ్యక్తుల నుంచి 160 ఎకరాలను ఏపీఐఐసీ ద్వారా కొనుగోలు చేసింది. ఇక్కడ కొంతభూమిలో లేఅవుట్లు ఏర్పాటు చేసి 735 మందికి ఐదుసెంట్ల చొప్పున ఇంటి స్థలం కేటాయించింది. మిగిలిన భూములు ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో అపారమైన గ్రావెల్ ఉంది. కొంత మంది అక్రమార్కులు, కూటమినాయకులు ఈ భూముల్లో రాత్రిపూట పొక్లెయిన్లతో గ్రావెల్ను తవ్వేస్తున్నారు. నిర్వాసితులకే సరఫరా చేస్తున్నామని చెబుతూ బయట వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ను దోచేస్తున్న నాయకులు, ట్రాక్టర్ల యజమానులపై సంబంధిత శాఖల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కూటమి పెద్దల అండదండలతో గ్రావెల్ దందా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. శనివారం రాత్రి నుంచి తెల్లవార్లూ ఐదు పొక్లెయిన్లతో పునరావాసకాలనీకి సమీపంలో ఉన్న ఏపీఐఐసీ భూముల్లో గ్రావెల్ తవ్వేసి 10ట్రాక్టర్లతో తరలించుకుపోయారు. హోంమంత్రి అనుచరులమని చెప్పుకొంటున్న ట్రాక్టర్లు కలిగినవారే ఈ గ్రావెల్ను తవ్వేస్తున్నారని, కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఏఎంఆర్ ప్రతినిధుల రుబాబు ప్రభుత్వం ఇచ్చిన నిధులతో తాము ఇళ్లు నిర్మించుకుని పునాదిలోకి ట్రాక్టర్ మట్టి తెచ్చుకుంటే మైనింగ్, ఏఎంఆర్ సంస్థ సిబ్బంది వచ్చి కేసులు నమోదు చేసి పెనాల్టీ విధిస్తున్నా రని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. తమ ట్రాక్టర్లను పట్టుకుని అనుమతులు చూపించాలని, కానిపక్షంలో మంత్రికి సన్నిహితంగా ఉండే వారెవరితోనైనా ఫోన్ చేయిస్తే వదిలేస్తామని ఏఎంఆర్ ప్రతినిధులు చెబుతున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. ఈ సంస్థ ప్రతినిధులమని చెప్పుకుంటున్నవారి వద్ద ఎటువంటి గుర్తింపుకార్డులు లేవన్నారు. వారు అసలు సిబ్బందో నకిలీయో కూడా తెలియడం లేదన్నారు.కంపెనీల కోసం ఇళ్లను ఖాళీ చేయించారని సొంత ఊళ్లనుంచి మమ్మల్ని తరిమేశారని, వేరొక చోట ఇల్లు నిర్మించుకోడానికి సిద్ధపడి పునాదుల్లోకి తట్టెడు మట్టికూడా వేసుకోకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమనివారు వాపోతున్నారు. గ్రావెల్ మాఫియా వద్దే గ్రావెల్ కొనుగోలు చేయాలని సొంతంగా తాము తెచ్చుకోడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం కళ్ల ముందే పదుల సంఖ్యలో ట్రాక్టర్లపై తరలించుకుపోతుంటే సిబ్బంది పట్టించుకోవడం లేదంటున్నారు. ఎవరైనా నిలదీస్తే మంత్రికి చెప్పి నీసంగతి తేలుస్తామంటూ బెదిరిస్తున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. ఇళ్లనిర్మాణ దారులకు గ్రావెల్,ఇసుక ఉచితమని ఒక ప్రభుత్వం చెబుతూనే మరో పక్క ఏఎంఆర్, మైనింగ్ శాఖ ద్వారా సీనరేజ్ పేరుతో ట్రాక్టర్నుంచి రూ.400నుంచి రూ.1000 వసూలు చేస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టీడీఆర్ బాండ్లు వద్దు
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన తమకు టీడీఆర్ బాండ్లు కాకుండా పరిహారాన్ని నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమచేయాల్సిందేనని నిర్వాసితులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పరిహారాన్ని టీడీఆర్ల రూపంలో ఇస్తామనుకుంటే తామంతా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమంటూ తెలిపారు. స్థానిక పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో మునగపాక, అచ్యుతాపురం మండలాల పరిధిలోని పూడిమడక రోడ్డువిస్తరణ బాధితులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఒంగోలులో ఇటీవల టీడీఆర్ బాండ్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిందని, ఆమేరకు కోర్టును ఆశ్రయించాలని నిర్ణ యం తీసుకున్నారు. ఇందుకు నిర్వాసితులంతా ఒకే మాటపై ఉండాలని తీర్మానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు,నిర్వాసితులు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ హయాంలో పూడిమడక రోడ్డుకు బీజం పడిందన్నారు. రహదారి విస్తరణకు అందరూ అంగీకరించారని తెలిపారు. పరిహారాన్ని నేరుగా అకౌంట్లో జమచేస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు టీడీఆర్లు ఇస్తామంటూ ప్రకటించడం తగదని తెలిపారు. సాగునీటి కాలువలకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా మూసివేసే చర్యలు సరికాదన్నారు. సమావేశంలో నిర్వాసితులు ఆడారి గణపతి అచ్చియ్యనాయుడు, భీముని వెంకటేశ్వరరావు,కాండ్రేగుల జగ్గారావు,డాక్టర్ డి.డి. నాయుడు,మళ్ల సూరప్పారావు, దొడ్డి వరహా, పొలమరశెట్టి అప్పలనాయుడు, శరగడం జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. -
సమరసత కృషితో చిన్నారులకు ఆధ్యాత్మిక వికాసం
అనకాపల్లి: నేటి పోటీ ప్రపంచంలో పిల్లలకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ఆధ్యాత్మిక, నైతిక విలువలు ఎంతో అవసరమని బ్రాండిక్స్ భారతీయ భాగస్వామి దొరస్వామి అన్నారు. స్థానిక శ్రీరామ్నగర్ మాధవ సదన్లో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో ఉత్తమ గుణగణాలను పెంపొందించేందుకు సమరసత సేవా ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవల విషయంపై ఆయన వివరించారు. సాంకేతికత పెరిగిన ఈ కాలంలో మన సంస్కృతిని, సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి విష్ణు మాట్లాడుతూ సామాజిక సమరసత సాధించడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల దేవాలయాల్లో నిర్వహిస్తున్న బాలవికాస్ కేంద్రాల ద్వారా పేద వర్గాల పిల్లలకు క్రమశిక్షణ, దేశభక్తి, ధార్మిక విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి
దేవరాపల్లి: మండలంలోని కొత్తూరు ముత్యాలమ్మపాలెంలో వృద్ధుడు తమరాన అప్పారావు(77) అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కె.ఎం.పాలెం గ్రామానికి చెందిన అప్పారావు సంతానం లేకపోవడంతో మానసిక వేదనతో బాధపడుతూ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలోనే గతంలోను రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పట్లో కుటుంబ సభ్యులు గమనించి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కాగా ఆదివారం తెల్లవారుజామున పొలానికి వెళ్తున్నట్లు భార్య అచ్చియ్యమ్మకు చెప్పి అప్పారావు ఇంటి నుంచి బయలుదేరాడు. పొలంలో నోటి నుంచి నురగ కారుతూ అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు గమనించి వెంటనే 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. విషపదార్థం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిపైన తమకు అనుమానం లేదని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే సరైన వివరాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ చెప్పారు. -
పైలట్ ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు
పైలట్ ప్రాజెక్టు ప్రదేశంలో ఇసుక తవ్వకాలు నాతవరం: స్పీకర్ ఇలాకాలో కూటమి నేతలు అండతో తాండవ నదిలో ఇష్టానుసారంగా ఇసుక తోడేస్తున్నారు. పర్యవసానంగా ఇక్కడ తాగునీటి పైలట్ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. దాంతో 20 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే ఈ ప్రాజెక్టు భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మండలంలో గుమ్మడిగొండ పంచాయతీ శివారు చిక్కుడుపాలెం వద్ద తాండవ నదిలో నిర్మించిన పైలట్ ప్రాజె?క్టు పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మండలంలో అనంత పద్మనాభపురం, ఎం.బి.పట్నం మన్యపురట్ల, గన్నవరం పంచాయతీల్లోని పలు గ్రామాల్లో ఫోరైడ్ సమస్య ఉంది. దీనిపై దృష్టి సారించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాండవ నదిలో పైలట్ ప్రాజెక్టు నిర్మించి పైపులైను ద్వారా పదేళ్లుగా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టుపై ఆధారపడి రాజుపేట అగ్రహారం, లింగంపేట, మన్యపురట్ల, కొత్త రామచంద్రపురం, ఉప్పరగూడెం, గన్నవరం, నాయుడుపాలెం, వి.బి.అగ్రహారం, వై.బి. అగ్రహారం, మాసయ్యపేట, వై.బి.పట్నం, బుచ్చెంపేట, ఎ.శరభవరం, ఎం.బి.పట్నం తదితర గ్రామాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇసుక తవ్వుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇదే అవకాశం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చిక్కుడుపాలెం వద్ద తాండవ నదిలో పైలట్ ప్రాజెక్టు సమీపంలో ఇసుక తవ్వేస్తున్నారు. ఇక్కడ పైలట్ ప్రాజెక్టు చుట్టూ ఇసుక తవ్వకాలు చేయరాదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు హెచ్చరించారు. వారి మాటలు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా ఇసుక తవ్వేస్తుండటంతో ప్రాజెక్టు ప్రమాదాన్ని గ్రహించిన సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల వేసిన కంచె తొలగించి తవ్వకాలు మైనింగ్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సంయుక్తంగా నదిలో ప్రాజెక్టును పరిశీలించారు. ఇసుక తవ్వకాలు ఇదే విధంగాా కొనసాగితే ప్రాజెక్టుకు ప్రమాదం జరుగుతుందని నిర్ధారించారు. ప్రాజెక్టు సమీపంలో తవ్వకాలు జరగకుండా ఉండేందుకు దారిలో ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయకుండా హెచ్చరికలు చేశారు. అప్పట్లో కొన్ని రోజుల పాటు ఇక్కడ తవ్వకాలు చేయకుండా మానేశారు. ఆ తర్వాత కంచెను తీసేసి మరలా తవ్వకాలు మొదలు పెట్టారు. ఉచిత ఇసుక పేరుతో కూటమి నేతలే దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. ఉచిత ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు బ్యానర్లు మచ్చుకై నా కనిపించకపోవడం గమనార్హం. ఈ విధంగా నిబంధనలు పాటించకుండా రేయింబవళ్లు ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఈ ప్రాంతం స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలో ఉండడంతో అధికారులు భయపడి చోద్యం చూస్తున్నారు. అధికారులు దృష్టి సారించాలి తాండవ నదిలో ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. నదిలో తవ్వకాలు వల్ల పైలట్ ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లి వేలాది మంది ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడుతుంది. అనధికార తవ్వకాలపై చర్యలు తీసుకునేందుకు భయపడితే అధికారులు ప్రజల నమ్మకం కోల్పోతారు. –ఎ.చిన్నంనాయుడు, సీపీఐ మండల కార్యదర్శి -
నూకాంబికను దర్శించుకున్న నటి శ్రీలక్ష్మి
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని ఆదివారం నటి శ్రీలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో గవిరెడ్డి శ్రీనివాస్సారథ్యంలో తెరకెక్కిస్తున్న ‘చీన్ టపాక్ డుం డుం‘ చిత్రంలో ప్రధానమైన పాత్రలో నటించేందుకు ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. అమ్మవారిని మొదటి సారిగా దర్శించుకోవడం ఎంతోఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నాగచైతన్య అఖిల్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎస్. భానుచందర్, సభ్యుడు షేక్ రియాజ్, ఆలయ కమిటీ డైరెక్టర్లు పొలిమేర ఆనంద్ కుమార్, దాడి రవికుమార్, కాండ్రేగుల రాజు తదితరులు పాల్గొన్నారు. -
మొగ్గలో తుంచేస్తున్నారు!
జగనన్న దార్శనికత.. మత్స్యకారులకు భరోసా● వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.351.1 కోట్లతో మొగలో ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం ● 30 ఎకరాలు భూ కేటాయింపు, సర్వే, టెండర్ ప్రక్రియ పూర్తి ● నిర్మాణం పూర్తయితే ఏటా 28,700 టన్నుల మత్స్య సంపద ● జిల్లాలో 16,400 మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి ● ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి ● అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఆ ఊసే ఎత్తని చంద్రబాబు ప్రభుత్వం ● కార్పొరేట్ శక్తులకు తీరాన్ని కట్టబెట్టే కుట్ర! ● ఆగితే సమరం తప్పదని మత్స్యకారుల హెచ్చరికపూడిమడక వద్ద తీరంసాక్షి, అనకాపల్లి: ఇటు విశాఖ హార్బర్... అటు ఒడిశా పారాదీప్... మధ్యలో దాదాపు 200 కిలోమీటర్ల మేర ఎక్కడా ఫిషింగ్ హార్బర్ లేదు. తుపానులు, విపత్తులు వచ్చిన సందర్భాల్లో బోట్లను సురక్షితంగా హార్బర్కు తీసుకువచ్చేందుకు మత్స్యకారులు నరకం చూడాల్సిన పరిస్థితి. జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎక్కువగా ఒడిశా వైపు వేటకు వెళతారు. విశాఖలోనే దాదాపు 700కి పైగా మెకనైజ్డ్ బోట్లు, 3వేల ఫైబర్ బోట్లు, 400 చిన్న పడవలు ఉండటంతో అక్కడి హార్బర్ సామర్థ్యం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సమీపాన మొగ ప్రాంతంలో రూ.393 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఈ ఫిషింగ్ హార్బర్కు కూటమి ప్రభుత్వంలో ‘చంద్ర’ గ్రహణం పట్టింది. మత్స్యకారుల ఆశలపై నీళ్లు చల్లింది. ఉత్తరాంధ్ర తీరంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి సొంత గడ్డపైనే గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పూడిమడక ఫిషింగ్ హార్బర్’ నేడు పాలకుల నిర్లక్ష్యానికి, కక్షసాధింపు రాజకీయాలకు సజీవ సాక్ష్యంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా అడుగులు పడి, వేల కోట్లతో తీర ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేలా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు, చంద్రబాబు ప్రభుత్వం రాకతో ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిపోయింది. వేలాది మంది మత్స్యకారుల కలల సాకారం దిశగా అడుగులు వేయాల్సిన పాలకులు, నేడు కాలయాపన చేస్తూ వారి కడుపు కొడుతున్నారు. గంగపుత్రుల గోడు పట్టదా? పూడిమడక హార్బర్ పూర్తయితే దాదాపు 1,000 మెకనైజ్డ్ బోట్లు ఇక్కడ లంగరు వేసే అవకాశం ఉండేది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా ఉపాధి లభించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. హార్బర్ నిర్మాణం ఆగిపోవడంతో వేట కోసం మత్స్యకారులు మళ్లీ గుజరాత్, ముంబై, చైన్నె వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. తమ సొంత ప్రాంతంలోనే హార్బర్ వస్తుందని ఆశపడిన గంగపుత్రులకు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. ‘సొంత ఊర్లో పని దొరుకుతుందని ఆశపడ్డాం, కానీ ఈ ప్రభుత్వం మా నోటికాడి కూడు తీసేస్తోంది‘ అని అనుకోలేదని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమరం తప్పదని మత్స్యకారుల హెచ్చరిక ‘జగనన్న హయాంలో హార్బర్ పనులు చూసి మా కష్టాలు తీరుతాయని ఆశ పడ్డాం. కానీ ఇప్పుడు పనులు ఆగిపోవడం చూస్తుంటే మా బతుకులతో ఆడుకుంటున్నారనిపిస్తోంది’ అని పూడిమడక వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పూడిమడక హార్బర్ పనులను యుద్ధ ప్రాతిపదికన పునఃప్రారంభించకపోతే, రాబోయే రోజుల్లో తీర ప్రాంతమంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మత్స్యకార నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తన మొండివైఖరిని వీడి, రాజకీయాలకు అతీతంగా పూడిమడక హార్బర్ నిర్మాణాన్ని పూర్తి చేసి, ఉత్తరాంధ్ర గంగపుత్రులను ఆదుకోవాలి. లేదంటే గంగమ్మ తల్లి సాక్షిగా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని వారు చెబుతున్నారు. విశాఖ హార్బర్పై తగ్గనున్న భారం.. పూడిమడకలో హార్బర్ నిర్మాణం పూర్తయితే.. విశాఖ ఫిషింగ్ హార్బర్పై భారం తగ్గనుంది. చాలా వరకూ బోట్లు.. ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. కేవలం పూడిమడక మాత్రమే కాకుండా.. పాయకరావుపేట, ఎస్.రాయవరం, రాంబిల్లి, పరవాడ ప్రాంత మత్స్యకారులకు కూడా చాలా ప్రయోజనాలు కలగనున్నాయి.కార్పొరేట్ శక్తులకు తీరాన్ని కట్టబెట్టే కుట్ర? అభివృద్ధి ముసుగులో ఈ ప్రాంతాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం హార్బర్ పనులను కావాలనే తొక్కిపెడుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జువ్వలదిన్నె వంటి హార్బర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్న ఈ ప్రభుత్వం, పూడిమడకను కూడా అదే బాటలో నడిపించి మత్స్యకారులను కూలీలుగా మార్చాలని చూస్తోందని విమర్శలు వస్తున్నాయి. తీర ప్రాంత సంపదను పచ్చ చొక్కాల నేతలకు దోచిపెట్టడమే లక్ష్యంగా పాలన సాగుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి.మత్స్యకారుల కష్టాలను కళ్లారా చూసిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ిఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. వేట కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్తూ, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూ, అనాథలుగా మారుతున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10 కొత్త ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే అచ్యుతాపురం మండలంలోని పూడిమడక సమీపంలో మొగ వద్ద సుమారు రూ.393 కోట్ల అంచనా వ్యయంతో భారీ ఫిషింగ్ హార్బర్కు పచ్చజెండా ఊపారు. ఢిల్లీకి చెందిన వాప్కోస్ (వాటర్ అండ్ పవర్ కన్సెల్టెన్సీ సర్వీసెస్ లిమిటెట్) సంస్థ సర్వే చేసి ఇక్కడి ప్రాంతం హార్బర్ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. దీంతో నిధుల కేటాయింపు, భూసేకరణ పనులు, పర్యావరణ అనుమతులన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చకచకా జరిగిపోయాయి. జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో 18 వేల మందికిపైగా జనాభా ఉండగా. 16,400 మంది చేపలవేటపైనే జీవనం సాగిస్తున్నారు. ఈ హార్బర్నిర్మాణం తర్వాత మత్స్యకారులతో పాటు వివిధ వృత్తులకు చెందిన ఐదువేల కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. ఈ గ్రామ పరిధిలో మొత్తం 340 రిజిస్టర్ బోటులున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని హార్బర్ కోసం ఎంపిక చేశారు. ఇక్కడ నిర్మించనున్న హార్బర్లో 930 బోట్లు నిలిపేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందించారు. 700 వరకూ 9 మీటర్ల మోటరైజ్డ్ బోట్లు, 200 వరకూ 18 మీటర్ల మెకనైజ్డ్ బోట్లు, 30కి పైగా 24 మీటర్ల టూనా లాంగ్ లైనర్లను ఇక్కడి నుంచి ఆపరేట్ చేసే అవకాశం కలగనుంది. ఏడాదికి 28వేల టన్నుల వరకూ మత్స్య సంపద నిర్వహణ సామర్థ్యం ఉండేలా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఏర్పాటుచేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం మారగానే మత్స్యకారుల తల రాత కూడా మారిపోయింది. చంద్రబాబు నేతత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హార్బర్ ఊసే ఎత్తడం లేదు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ తరలింపు
అడ్డుకున్న ఆయకట్టుదారులు నర్సీపట్నం : పంటలకు మట్టే ఆధారం..ఇదే మట్టి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బయపురెడ్డిపాలెం గ్రామంలోని రాయపురాజు చెరువులో మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి నేత ఇటుకల బట్టీకి చెరువులోని మట్టిని కొద్దిరోజులుగా పొక్లెయిన్తో తవ్వి సుమారు 12 ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. యథేచ్ఛగా ఈ దందా సాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఇళ్లు నిర్మించుకునేందుకు మట్టి దొరక్క సామాన్యులు అనేక ఆగచాట్లు పడుతున్నారు. ఇదే సందర్భంగా కూటమి నేతలు మాత్రం పెద్ద ఎత్తున చెరువు గర్భంలోని మట్టిని కొల్లగొడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బయపురెడ్డిపాలెం మాజీ కౌన్సిలర్, వైఎస్సార్సీపీ నాయకుడు బయపురెడ్డి చినబాబు, కొంత మంది ఆయకట్టు రైతులు చెరువులో నుంచి మట్టిని తరలిస్తున్న ట్రాకర్లను అడ్డుకున్నారు. చెరువు గర్భంలో మట్టిని తీస్తున్న పొక్లెయిన్ను నిలుపుదల చేశారు. అక్కడ నుండే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు మాజీ కౌన్సిలర్ ఫోన్ చేశారు. గంటల తరబడి వాహనాలను నిలుపుదల చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు. మట్టి తరలిస్తున్న కూటమి నాయకులకు, చినబాబుకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మట్టి తరలించాలంటే ముందుగా ఇరిగేషన్శాఖ అధికారుల అనుమతులు పొందాలి, కమర్షియల్కు అవసరాలకు మట్టిని వినియోగించకూడదు. ఈ నిబంధనలు తుంగలో తొక్కి ఇటుక బట్టిలకు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మట్టి దందాపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని మాజీ కౌన్సిలర్ చినబాబు పేర్కొన్నారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ రామన్నపాత్రుడుని వివరణ కోరగా చెరువులోని మట్టిని తీసుకువెళ్లాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. ఆ చెరువులో మట్టిని తవ్వేందుకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఏఈ తెలిపారు. -
రైల్వే స్టేషన్లో కూలిన షెడ్
● ముగ్గురు సిబ్బందికి స్వల్పగాయాలు అనకాపల్లి: స్థానిక రైల్వే స్టేషన్ల్లో శనివారం పెద్ద ప్రమాదం తప్పింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణంలో ఉన్న షెడ్ ఒక్కసారిగా కుప్పకూలింది. మూడో నంబర్ ప్లాట్ఫారంపై ఫుట్పాత్ బ్రిడ్జికు సమీపంలో నూతనంగా చిన్నపాటి షెడ్ నిర్మిస్తున్న సమయంలో ఆరో పిల్లర్పై గడ్డర్ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పడిపోయింది. అక్కడే కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు కోటేశ్వరరావు, వాసు, సునీల్కు స్వల్పగాయాలయ్యాయి. కోటేశ్వరరావుకు కాలిపై పెద్దగాయం తగలడంతో హుటాహుటిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి రైల్వే అధికారులు తరలించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. స్టేషన్ అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే షెడ్ కూలిపోయిందని ప్రయాణికులు తెలిపారు. షెడ్ నిర్మిస్తున్న సమయంలో కాంట్రాక్టర్, రైల్వే అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించకపోవడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఆ సయంలో రైలు రాకపోవడం, ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న షెడ్ కూలిపోవడంతో మూడో నంబర్ ప్లాట్ఫారంపై ఉన్న హెచ్డీ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయడం వల్ల పెద్దప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లను ఒకటో నంబర్ ప్లాట్ఫారంపై నుంచి పంపించడంతో, కొన్ని రైళ్లు ఆలస్యంగా వెళ్లడంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే హెచ్డీ విద్యుత్ ఉద్యోగుల సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన మరమ్మతులు చేశారు. ఈ విషయంపై రైల్వే ఉన్నతాధికారులను సంప్రదించగా సమాధానాన్ని దాటవేశారు. -
వైఎస్సార్సీపీ ఫ్లెక్సీల చించివేత
ఎస్.రాయవరం: మండలంలోని దార్లపూడి, చినగుమ్ములూరు గ్రామాల్లో వైఎస్సార్సీసీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పేరిచర్ల శ్రీపతిరాజు ఆదివారం ఉదయం అమెరికా నుంచి స్వగ్రామం గుడివాడ రానుండడంతో పార్టీ అభిమానులు ఆయనకు స్వాగతం పలుకుతూ అడ్డురోడ్డు,గుడివాడ, చినగుమ్ములూరు, దార్లపూడిలలో శుక్రవారం రాత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చినగుమ్ములూరు,దార్లపూడి గ్రామాల్లో ఫ్లెక్సీలను కొందరు బేడుతో కోసివేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ నాయకుడు కోరెడ్డి బాబి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకుని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు.


