breaking news
Anakapalle
-
గంజాయి కేసులో తప్పించుకున్న నిందితుడు అరెస్ట్
కె.కోటపాడు: 2023లో గంజాయిని పాడేరు నుంచి విజయవాడకు కె.కోటపాడు మండలం మీదుగా తరలిస్తూ పోలీసుల నుండి తప్పించుకున్న వ్యక్తిని బుధవారం కె.కోటపాడు పోలీసులు పట్టుకున్నారు. ఇదే కేసులో గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి నుంచి తప్పించుకున్న వ్యక్తి సమాచారాన్ని సేకరించారు. గంజాయి కేసులో తప్పించుకున్న పల్నాడు జిల్లా మించలపాడు గ్రామానికి చెందిన నాగసాయి కోసం పోలీసులు కొద్ది రోజులుగా గాలిస్తున్నారు. నాగసాయి గత కొంత కాలంగా పరారీలో ఉంటున్నాడు. పోలీసులకు వచ్చిన విశ్వనీయ సమాచారం మేరకు బుధవారం నాగసాయిని చోడవరం బస్టాండ్ వద్ద కె.కోటపాడు పోలీసులు పట్టు కున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై కఠిన చర్యలను తీసుకుంటామని కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్ చెప్పారు. పట్టుకున్న గంజాయి ముద్దాయి నాగసాయిని చోడవరం కోర్టులో హజరుపర్చి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు.కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించిన పోలీసులు -
హోంగార్డు ఆత్మహత్య
నర్సీపట్నం: నియోజకవర్గ కేంద్రమైన నర్సీప ట్నం టౌన్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు ఎస్.అర్జున రావు(55) ఏలేరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అర్జునరావు అనారోగ్య కారణాలతో కొంతకాలంగా బాధపడుతున్నాడని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ గఫూర్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన అర్జున్రావు ఇంటి నుంచి బయటకు వచ్చాడని, బుధవారం ఉదయం వేములపూడి వద్ద ఏలేరు కాలువలో శవమై తేలాడని సీఐ తెలిపారు. అర్జునరావు ఎంతో మంది అధికారుల వద్ద పని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పారు. సీఐ, ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, రమేష్, సిబ్బంది సంతాపం తెలిపారు. అర్జున్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. -
70 లక్షల మొక్కలు సిద్ధం
కె.కోటపాడు: ఈ ఏడాది జూన్ నాటికల్లా సామాజిక వన నర్సరీల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు 70 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని సోషల్ ఫారెస్ట్ డీఎఫ్వో సోమసుందరం తెలిపారు. మండలంలో రామచంద్రపురం, కొత్తూరు, సింగన్నదొరపాలెం, పొడుగుపాలెం, ఎ.కోడూరు, బత్తివానిపాలెంలలోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను, ఎన్టీపీసీ నిధులతో గొండుపాలెం, పైడంపేట, డి.అగ్రహారం, కె.జె.పురం, పిండ్రంగి గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా పెంచుతున్న మొక్కలను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 73 వన నర్సరీల ద్వారా సరుగుడు, ఏగిస, ఫెల్టోఫారం, ఎర్రచందనం, రావి, దేవ కాంచన, మహగణి తదితర మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ధేశించిన ధరకు రైతులకు అందించనున్నట్లు తెలిపారు. గత ఏడాది వన నర్సరీల ద్వారా 35లక్షల మొక్కలను పెంచి, రైతులకు అందించగా ఈ ఏడాది మొక్కల పెంపకాన్ని రెట్టింపు చేసినట్టు చెప్పారు. కె.కోటపాడు మండలంలో వన నర్సరీలలో పెంచుతున్న మొక్కల సంరక్షణపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రశేఖర్, డీఎం వెంకటపతిరాజు, వనసేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు. -
హంస వాహనంపై శ్రీనివాసుడు
తిరువీధి సేవలు నిర్వహిస్తున్న అర్చకులు నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలో ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి హంస వాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు. అంతకు ముందుకు స్వామివారి మూలవిరాట్కు నిత్యార్చనలు అభి షేకాలు జరిపారు. అనంతర ఉత్సవ మూర్తులకు, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి, గోదాదేవి అమ్మవార్లకు నిత్యపూజలు, విష్వక్సేనపూజ చేశా రు. హంస వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని, పల్లకిలో గోదాదేవి అ మ్మవారిని ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారు. -
వైభవంగా దేవానంద స్వామీజీ ఆరాధన మహోత్సవం
● కొత్తపెంటలో వె ల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ ● తరలివచ్చిన స్వామీజీలు, సాధుసంత్దేవరాపల్లి: మండలంలోని కొత్తపెంటలో సద్గురు దేవానంద సరస్వతీ మహారాజ్(రుషికేష్) 26వ పుణ్య తిథి ఆరాధన మహోత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి. కొత్తపెంటలోని స్వామీజీ ఆశ్రమంలో రెండు రోజులుగా జరుగుతున్న ఆరాధన మహోత్సవాలు ఆఖరి రోజు బుధవారం కనుల వైభవంగా సాగాయి. దేశం నలుమూలల నుంచి స్వామీజీ భక్తులు, శిష్యులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆశ్రమ పరిసరాలు స్వామీజీ నామ స్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు, శిష్యులు దేవానంద స్వామిజీ విగ్రహాన్ని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆశ్రమ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ కళకళలాడాయి. ఉదయం నుంచి సుప్రభాతం, పతాకావిష్కరణ, నరగ సంకీర్తన, భగవద్గీత పారాయణ, సంకీర్తన తదితర పూజలు నిర్వహించారు. ప్రవచనాలతో పులకించిన భక్తజనం రుషికేష్ నుంచి పద్మనాభానంద స్వామీజీ మహరాజ్, అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు పరమాత్మనంద గిరి స్వామీజి, భీమిలి నుంచి రామకృష్ణానంద, దేవానంద ఆశ్రమం గౌరవ సలహాదారు శ్రీను సిద్ధాంతి, స్థానిక ఆశ్రమం అధ్యాత్మిక గౌరవ అధ్యక్షుడు విష్ణు దేవానంద సరస్వతీ స్వామీజీలు హాజరయ్యారు. స్వామీజీల ఆధ్యాత్మిక ప్రవచనాలతో వేలాదిగా హాజరైన భక్త జనం పులకించిపోయింది. మాజీ డిప్యూటీ సీఎం బూడి ప్రత్యేక పూజలు దేవానంద స్వామీజిని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బూడిని ఆశ్రమ నిర్వాహకులు, స్థానిక పెద్దలు ఘనంగా సత్కరించారు. స్వామీజీని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మీ, జెడ్పీటీసీ కర్రి సత్యం, స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు, రెడ్డి పైడంనాయుడు, మాజీ సర్పంచ్ రొంగలి శంకరరావు తదితరులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎస్ఐ వి.సత్యనారాయణ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026
● నవ్వి పోదురుగాక..● క్రెడిట్ చోరీలో చంద్రబాబును అనుసరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ● గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని..తామే చేశామంటూ ప్రచారం ● వైఎస్ జగన్ హయాంలో 90శాతం పూర్తయిన అభివృద్ధి పనులు ● తామే చేసినట్లుగా ప్రారంభిస్తున్న మంత్రులు, కూటమి నేతలు ● అనకాపల్లిలో రూ.30.35 కోట్లతో క్రిటికల్ కేర్ ఆస్పత్రి నిర్మాణం యథా బాబు.. తథా తమ్ముళ్లువైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగం కమిటీలో పలువురికి చోటు అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగం కమిటీలో జిల్లాకు చెందిన పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్ సెల్ సహాయ కార్యదర్శిగా గొర్లె రాజేష్(పెందురి), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా ఎం.శ్రీను(అనకాపల్లి), రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా వి.కృష్ణచైతన్య(అనకాపల్లి), రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా కలగ గున్నయ్యనాయుడు(కశింకోట), రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా దండ జ్ఞానదీప్ (అనకాపల్లి)ను నియమించారు. వారితో పాటుగా అనకాపల్లి పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా కాండ్రేగుల హైమావతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.టీడీపీ ప్రభుత్వంలో క్రెడిట్ చోరీ సంస్కృతిని చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అనుసరిస్తున్నారు. సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది అన్నట్టుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులన్నీ తామే చేసినట్టు గొప్పలు చెప్పుకొంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకోడానికి ఒక్కటి కూడా లేకపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో నిస్సిగ్గుగా వేసుకుని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సాక్షి, అనకాపల్లి: జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో సగానికి పైగా గత ప్రభుత్వంలో పూర్తవగా, మిగిలినవి 90 శాతం పూర్తి చేశారు.అయితే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లాలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేర్లను మార్చి తమ ఖాతాలో వేసుకున్న కూటమి నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వారి ప్రచారయావ పరాకాష్టకు చేరడంతో జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం అనకాపల్లిలో ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదుట రూ.30.35 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ నుంచి అన్ని అభివృద్ధి పనుల్లో క్రెడిట్ చోరీకి చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతోంది. నాడు వైఎస్ జగన్ భూమి పూజ చేసిన అదాని గూగుల్సెంటర్, నక్కపల్లి బల్క్ డ్రగ్పార్క్ తమ హయాంలోనే వచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటూ మళ్లీ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తయింది. అధికారంలో చేపట్టిన తరువాత కనీసం ఒక్క ఇటుక కూడా వేయకుండానే..గత ప్రభుత్వంలో మంజూరైన వాటికి ప్రారం భోత్సవాలు చేస్తున్నారు. అంతేకాకుండా అనకాపల్లి జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.2.3 కోట్లతో చేపట్టిన ఆర్డీవో కార్యాలయం, 2.5 కోట్లతో నిర్మాణం చేపట్టిన వీఎంఆర్డీఏ పార్కు అభివృద్ధి, నక్కపల్లిలో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన బాలికల వసతి గృహం, ఉపమాకలో రూ.40 లక్షలతో గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయాన్ని, రూ.90 లక్షలతో నిర్మాణం చేపట్టిన జిల్లా డిజిటల్ గ్రంథాలయం, రూ.6.25 కోట్లతో నిర్మాణం చేపట్టిన సామాజిక భవనాల క్రెడిట్ను కూటమి మంత్రులు చోరీ చేసి, ప్రారంభోత్సవాలు చేసి తమ హయాంలోనే నిర్మాణాలు చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కార్పొరేట్కు దీటుగా క్రిటికల్ కేర్.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, విషమ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలను అందించేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో రూ.30.35 కోట్లతో అత్యాధునిక క్రిటికల్ కేర్ను ఏర్పాటు చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలందాలనే ముందుచూపుతో నాటి అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి చొరవతో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్న్(పీఎం–ఏబీహెచ్ఐఎం)కింద క్రిటికల్ కేర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎస్సార్ నిధులు, ఎంపీ నిధులతో ట్రామాకేర్, డయాలసిస్ బ్లాక్, డాక్టర్స్ డైనింగ్ హాళ్లు (మేల్, ఫీమేల్), ఎంసీహెచ్(2 బెడ్స్), ఎల్డీఆర్, ఆల్ట్రా సౌండ్ రూం, ప్లాస్టర్ రూం, పీఎంసీ ల్యాబ్, ఎలక్ట్రికల్ రూం, డ్యూటీ డాక్టర్ ఎగ్జామినేషన్ రూం, ఎమర్జెన్సీ వార్డు, నర్సస్ రూం, ఇంజక్షన్ డ్రెస్సింగ్ రూం, ఫస్ట్ ప్లోర్లో ఐఎస్వో రూం, డైనింగ్ హాల్స్–2, ఐఎస్వో వార్డు, అత్యాధునిక ఐసీయూ, స్టాఫ్ రూం..సెకండ్ ఫ్లోర్లో హెచ్డీయూ, అనస్తీషియా రూం, ఐసీయూ, ఓపీను ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే మూడోంతులు నిర్మాణం పూర్తయింది. మరో వారం రోజుల్లో క్రిటికల్ కేర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనిని కూడా చంద్రబాబు సర్కార్ తన ఖాతాలో వేసుకునేందుకు యత్నాలు చేస్తోంది. రూ.6.25 కోట్లతో సామాజిక భవనాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి నిధులు, సీఎస్సార్ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో సగానికి పైగా, మరికొన్ని 90 శాతానికిపైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోంది. ● అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలో పూడిమడక రోడ్డు వద్ద కోల్ ఇండియా నిధులు రూ. 89.9 లక్షలతో జిల్లా గ్రంథాలయం, డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. పీఎంఎఫ్ఎం నిధులు రూ.3.7 కోట్లతో ఆర్ఏఆర్ఎస్లో ఇంక్యుబేషన్ సెంటర్ను, వల్లూరులో రూ.70 లక్షలతో సావిత్రీబాయి పూలే మహిళా సాధికార భవనం, రూ.70 లక్షలతో డాక్టర్ వైఎస్సార్ మహిళా క్రీడాకారుల వసతి ప్రాంగణం, తుమ్మపాల విద్యుత్ నగర్లో రూ.30 లక్షలతో ముదిరాజుల జిల్లా భవనం, గాంధీనగర్లో రూ.20 లక్షలతో బీసీ హాస్టల్ రీడింగ్ రూం, రూ.20 లక్షలతో ఎస్సీ హాస్టల్ రీడింగ్ రూం, శంకరం గ్రామంలో రూ.1.50 కోట్లతో 500 సిటింగ్ కెపాసిటీతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనం ఏర్పాటు చేశారు. ● చోడవరం నియోజకవర్గంలో వెంకన్నపాలెంలో రూ.20 లక్షలతో వాయిద్య కళాకారుల జిల్లా భవనం, మాడుగుల నియోజకవర్గంలో రూ.30 లక్షలతో మోదమాంబ సామాజిక భవనం, మాడుగుల పట్టణ ంలో రూ.5 లక్షలతో ఆరు సామాజిక భవనాలు, కశింకోట గ్రామంలో ఎస్సీ కాలనీలో రూ.50 లక్షలతో అంబేడ్కర్ సామాజిక భవన నిర్మాణాలు చేపట్టారు. ● పాయకరావుపేట నియోజకవర్గంలోని పాయకరావుపేట మండలం పెంటకోట వద్ద రూ.20 లక్షలతో సామాజిక భవనం, యలమంచిలి పట్టణంలో రూ.20 లక్షలతో సామాజిక భవనం, నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో కోడూరులో రూ.30 లక్షలతో సామాజిక భవనం, నర్సీపట్నం టౌన్లో రూ.20 లక్షలతో సామాజిక భవనం ఏర్పాటు చేశారు. మొత్తం అన్నీ పూర్తయ్యాయి. అయితే వీటిని కూటమి నాయకులు తమఖాతాలో వేసుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గత ప్రభుత్వంలో చేసిన వాటిలో కొన్ని అభివృద్ధి పనులు నక్కపల్లిలో రూ.3.5 కోట్లతో బాలికల వసతి గృహం రూ.5 కోట్లతో ఆర్డీవో కార్యాలయం, వీఎంఆర్డీఏ పార్కు అభివృద్ధి రూ.90 లక్షలతో జిల్లా డిజిటల్ గ్రంథాలయం, రూ.6.25 కోట్లతో సామాజిక భవనాలు వీటితో పాటు సచివాలయ భవనాలు, ఆర్బీకేలు ఇలా ఎన్నో... -
వైఎస్సార్సీపీ కమిటీలపై ప్రత్యేక దృష్టి
● జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కశింకోట: వైఎస్సార్సీపీ కమిటీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సూచించారు. మండలంలోని తేగాడ ఎస్ఆర్ గార్డెన్లో జిల్లాలోని పార్టీ ముఖ్య నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వీటిని ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలన్నారు. ఉగాదికి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను వారికి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఐక్యతతో ముందుకు సాగితే పార్టీ మరింత బలోపేతం కాగలదని చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గ కమిటీ నిర్మాణం పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసినందుకు అక్కడి పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్కు అభినందనలు తెలిపారు. వైఎస్సార్సీపీ జోన్–1 కోఆర్డినేటర్, పరిశీలకుడు హర్షవర్ధన్రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్,అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పార్టీ మండల అధ్యక్షుడు మలసాల కిషోర్ , రాష్ట్ర, జిల్లా నాయకులు, అధ్యక్షులు, మండలఅధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం
నర్సీపట్నం/గొలుగొండ: గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. బుధవారం ఆయన నర్సీపట్నం టౌన్, గొలుగొండ, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. భీమవరం చెక్పోస్టును పరిశీలించించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, నిరుపేదల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి వారికి భరోసా కల్పించాలన్నారు. నేరాలు జరిగే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి జరిగేలా చర్యలు చూడాలన్నారు. కోడి పందాలు,పేకాట, గుల్లాటలను ఆడుకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రౌడీషీటర్లు, పాతనేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నర్సీపట్నం టౌన్ సీఐ గఫూర్, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ, కృష్ణదేవిపేట ఎస్ఐలు రామారావు, రుషికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ తుహిన్ సిన్హా -
పీహెచ్సీ స్థలంలో మైదానం పనులు ప్రారంభం
● జిల్లాలో 15 మండలాల్లో మైదానాలకు నిధులు ● 14వ తేదీ కల్లా అందుబాటులోకి.. ● జిల్లా క్రీడల అధికారి శైలజ వెల్లడి నాతవరం: మండల కేంద్రం నాతవరంలోని పీహెచ్సీ ప్రాంగణంలో తలపెట్టిన క్రీడా మైదానం పనులు పోలీసు బందోబస్తు నడుమ ప్రారంభమయ్యాయి. వైఎస్సార్సీపీ, కూటమి పార్టీల మధ్య వివాదాస్పదంగా మారిన ఈ మైదానం పనులకు బుధవారం జిల్లా క్రీడా శాఖాధికారి శైలజ దగ్గరుండి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 15 మండలాల్లో క్రీడా మైదానాలను ఈ నెల 14వ తేదీలోపు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె చెప్పారు. నాతవరం పీహెచ్సీ ప్రాంగణంలోని స్థలంలో మైదానం నిర్మాణానికి కలెక్టరు విజయకృష్ణన్ స్వయంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో మైదానాల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా.. కోటవురట్ల మండలంలో మాత్రమే సాంకేతిక సమస్య కారణంగా పనులు ప్రారంభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ రాజ్శాఖ జేఈ వెంకటేశ్వరమ్మ, ఆర్ఐ నాగరాజు, మండల సర్వేయరు సత్యనారాయణ, నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి అపిరెడ్డి మాణిక్యం, టీడీపీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీ అభివృద్ధికి ఆటంకం పీహెచ్సీ స్థలంలో క్రీడా మైదానం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాప్రతినిధులు స్వయంగా కలెక్టరుకు పీజీఆర్ఎస్లో అర్జీ అందజేసినా కనీసం స్పందన లేకుండా పోయింది. ఈ పీహెచ్సీ స్థలంలో నిబంధనలు ఉల్లంఘించి కూటమి నేతలు మైదాన నిర్మాణ పనులను గత డిసెంబరు 26న ప్రారంభించారు. ఈ పనులకు పీహెచ్సీ అభివృద్ధి కమిటీ ఆమోదం గానీ, పంచాయతీ సర్పంచ్ తీర్మానం గానీ లేకుండా ఏకపక్షంగా పనులు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పనులపై మండల స్థాయి అధికారులతో పాటు డీఎం అండ్ హెచ్వోకు ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ సభ్యులు కాపారపు అప్పలనర్స, వైస్ ఎంపీపీ పైల సునీల్, నాతవరం సర్పంచ్ గొలగాని రాణీ, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు స్వయంగా ఫిర్యాదు చేశారు. గత నెల 29న పీజీఆర్ఎస్లో కలెక్టరు విజయకృష్ణన్కు కూడా ఫిర్యాదు చేశారు. పీహెచ్సీ స్థాయి 30 పడకలకు ప్రతిపాదనలు ఉందని, అది మంజూరు అయితే స్థల సమస్య వస్తుందన్నారు. మైదానం నిర్మాణానికి నాతవరంలో పలు చోట్ల ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అయినా నిబంధనలు ఉల్లంఘించి కూటమి నేతలు సూచన ప్రకారమే అధికారులు మైదానం పనులకు శ్రీకారం చుట్టారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా క్రీడా అధికారి శైలజ, ఎంపీడీవో శ్రీనివాస్, పలువురు అధికారులు పోలీసు బందోబస్తుతో కూటమి నేతలు ఆధ్వర్యంలో బుధవారం పనులు ప్రారంభించారు. ఈ విషయంపై జిల్లా క్రీడల అధికారి శైలజను వివరణ కోరగా.. కలెక్టరు ఆదేశాలతోనే పీహెచ్సీ స్థలంలో మైదానం నిర్మాణం చేపడుతున్నామన్నారు. -
200 కిలోల గంజాయి స్వాధీనం
అనకాపల్లి: మాడుగుల మండలం ఎం.కొడూరులో 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఆమె అనకాపల్లి కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు. వి.మాడుగుల పోలీస్స్టేషన్ పరిధిలో ఎస్ఐ నారాయణరావు వాహనాలు మంగళవారం తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయి బయటపడినట్టు చెప్పారు. వ్యాన్, ద్విచక్రవానాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి విజయవాడకు తీసుకుని వెళుతున్నట్లు గుర్తించామని, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పంచాయతీ వంట్లమామిడి గ్రామానికి చెందిన కొర్ర కొండబాబు, హుకుంపేట మండలం గుడా గ్రామానికి చెందిన కొమ్మ సతీష్కుమార్, అదేమండలం డప్పబంద గ్రామానికి చెందిన కొర్ర అనిల్ కుమార్ను అరెస్టు చేసినట్టు చెప్పారు. కృష్ణాజిల్లా గన్నవరం గ్రామా నికి చెందిన తడిశెట్టి దుర్గారావు పరారైనట్టు తెలిపారు. నిందితులను రిమాండ్కు పంపినట్టు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మాడుగుల సీఐ పి.పైడపునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాలపై అక్రమ కేసులా?
● ప్రభుత్వ నిర్బంధకాండపై రేపు నిరసన ● ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్రకుమార్ అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు అడిగితే రౌడీషీట్లు తెరిచి, అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయమని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్రకుమార్, వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు హేమంత్ ఆరోపించారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద కూటమి ప్రభుత్వ నిర్బంధ కాండను వ్యతిరేకించడంటూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాల పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మన రాష్ట్రంలో అమలు చేయకుండా మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పండాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు రాజకీయ నేతల గృహాల్లో ఉన్న ఆస్తులను అడగడం లేదన్నారు. రానున్న రోజుల్లో ఓటు ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.బాజ్జి, జిల్లా నాయకుడు త్రినాథ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రాజా, యూత్ లీడర్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
మాజీ డిప్యూటీ సీఎం బూడికి సన్మానం
మాడుగుల: మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును దేవరాపల్లి మండలం తారువాలో ఆకుల ఫౌండేషన్ ప్రతినిధులు సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం సన్మానించారు. అనంతరం నూతన సంవత్సర డైరీని అందజేశారు. ఈ సందర్భంగా ముత్యాలనాయుడు మాట్లాడుతూ ఆకుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాడుగుల నియోజకరవ్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైఎస్సార్సీపీ మాడుగుల పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, మాడుగుల యూత్ అధ్యక్షుడు కుక్కర శ్రీధర్, చీడికాడ మండలం యువజన విభాగం గొళ్ళవిల్లి త్రినాథస్వామి, ఆకుల ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రెవెన్యూ క్లినిక్ అర్జీలపై తక్షణ విచారణ
● సమీక్షలో తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశం తుమ్మపాల: రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, పౌర సరఫరాలపై మండల, డివిజన్ల వారీగా ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సేవల్లో సమయపాలన, పారదర్శకత ఉండాలన్నారు. రీసర్వే, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు ప్రతి రోజు క్షేత స్థాయిలో మానిటరింగ్ చేసి, జాప్యంగా చేయకుండా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలన్నారు. ఆన్లైన్ సేవలు, భూ మ్యాపింగ్, రికార్డులు అప్డేట్, మ్యుటేషన్ దరఖాస్తులు వంటి సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని పరిష్కరించాలన్నారు. లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దాలని, నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లాలో 24 మండలాలు, నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి మున్సిపాలిటీలలో జల వనరులను గుర్తించి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి, ఆర్డీవోలు షేక్ ఆయిషా, వి.వి.రమణ, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
పంచాయతీ అధికారుల అత్యుత్సాహం
తుమ్మపాల: పదేళ్ల క్రితం రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచిన అధికారులే నేడు కలెక్టర్ కారుకు అడ్డుగా ఉన్నాయని పచ్చని చెట్లను కూల్చేశారు. మండలంలో రేబాక–గోపాలపురం రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలతో రోడ్డు ఇరుకుగా తయారైందని పంచాయతీ అధికారులు దుకాణాలను వెనక్కి జరిపించారు. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా తొలగించేయడంతో అటుగా రాకపోకలు చేస్తున్న ప్రయాణికులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మండలంలో కోడూరు పంచాయతీ పరిధిలో ఎంఎస్ఎంఈ పార్క్ వద్ద ఉన్న కలెక్టర్ బంగ్లా నుంచి శంకరంలోని కలెక్టరేట్కు రేబాక –గోపాలపురం రోడ్డు మీదుగా నిత్యం రాకపోకలు చేస్తున్నారు. అసలే ఇరుగ్గా ఉండే ఈ రహదారి ఆయా గ్రామాల ప్రజల రాకపోకలతో మరింత రద్దీగా ఉంటుంది. కలెక్టర్ కారుకు దారి ఇవ్వలేదంటూ ఆరు నెలల క్రితం పలు వాహనాలపై కేసులు నమోదు, ట్రాక్టర్లను సీజ్ చేయడం, రేబాకలోని మద్యం దుకాణం వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్ కారు కూతకు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల ఓ చిరు దుకాణం వద్ద కలెక్టర్ కారుకు మరో వాహనం అడ్డంగా ఉండడంతో ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులను ఆమె హెచ్చరించారు. అందుకే పంచాయతీ అధికారుల ఆగమేఘాల మీద ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలతో పాటు చెట్లను కూడా తొలగించేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.కలెక్టర్ కారు రాకపోకల కోసం చెట్ల తొలగింపు -
పారదర్శకంగా భూముల రీ సర్వే
జిల్లా డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్ వెంకన్న దేవరాపల్లి: గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని జిల్లా డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్ ఎం.వెంకన్న తెలిపారు. మండలంలోని ముషిడిపల్లి, శంభువానిపాలెం గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేను ఆయన మంగళవారం పర్యవేక్షించారు. సర్వే జరుగుతున్న గ్రామాల్లో రైతులు తమ భూముల వివరాలను తెలియజేసి సర్వే సిబ్బందికి సహకరించాలని సూచించారు. సర్వే జరుగుతున్న గ్రామాల వివరాలను దండోరా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ముందుగా తెలియజేస్తున్నట్టు చెప్పారు. సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో తుప్పలు, డొంకలు తొలగించాలని, తద్వారా భూమి కొలతలు చేయడం సలువుగా ఉంటుందన్నారు. ఆయన వెంట మండల సర్వేయర్ జగదీష్, గ్రామ సర్వేయర్లు కేశవ, నవీన్, మణిబాబు, జానకి, మురళీ, ప్రవీణ్, కాసుబాబు తదితరులున్నారు. -
యాదవుల ఐక్యతను చాటి చెబుదాం
● స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం దక్కేలా కృషి చేద్దాం ● యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడుబర్నికాన బాబూరావుదేవరాపల్లి: యాదవులకు నామినేటెడ్ పోస్టులతో పాటు త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో సైతం సముచిత స్థానం దక్కేలా ఐక్యంగా కృషి చేద్దామని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు పిలుపునిచ్చారు. మండలంలోని రైవాడ ఎరకాలమ్మ ఆలయ ప్రాంగణంలో దేవరాపల్లి మండల యాదవ సంఘం ఆత్మీయ సమావేశం మండల అధ్యక్షుడు కోన ఈశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్యఅథితిగా హాజరైన యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు మాట్లాడుతూ జిల్లాలోని యాదవులంతా ఐక్యంగా కలిసి పనిచేయడం ద్వారానే హక్కుల సాధన సాధ్యపడుతుందన్నారు. యాదవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పిల్లల విద్యకు ఆర్థిక స్థోమత అవరోధమైతే సంఘం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. విద్యలో రాణించే యాదవ విద్యార్థులకు ఏటా రూ. 8 లక్షల విలువ చేసే స్కాలర్షిప్లు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. మాడుగుల నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడు మొల్లి సన్నిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో 30వేలకు పైబడి యాదవ సామాజిక వర్గం ఓట్లు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా ప్రాధన్యత దక్కలేదన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం లభించేలా యాదవుల ఐక్యతను చాటి చెబుదామని చెప్పారు. యాదవులను బీసీ–ఏలో చేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి బాబూరావుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తీర్మానిస్తామని పలువురు నాయకులు తెలిపారు. యాదవ సంఘం క్యాలెండర్ను జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు, నియోజకవర్గ అధ్యక్షుడు మొల్లి సన్నిబాబు తదితరుల చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కిల్లాన శ్రీనివాసరావు, కాణిపాకం వినాయక దేవస్థానం బోర్డు డైరెక్టర్ చల్లా కృష్ణవేణి నానాజీ, స్థానిక సర్పంచ్ చల్లా లక్ష్మీ నాయుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దాలిబోయిన రామగోవింద, డైరెక్టర్ బంధం అప్పలరాజు, నమ్మి బాలరాజు, కోన నాగేశ్వరరావు తదితర యాదవ సంఘం నాయుకులు పాల్గొన్నారు. -
జిల్లా పోలీస్ కార్యాలయానికి ఫార్మా కంపెనీల చేయూత
అనకాపల్లి: జిల్లాలోని మాన్కై ండ్, లుపిన్, వసుధ ఫార్మా కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధులతో జిల్లా పోలీస్ కార్యాలయానికి జనరేటర్, కంప్యూటర్ వస్తువులను కొనుగోలు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరేటర్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయంలోపాలనా పరమైన పనులు వేగవంతంగా, ఆటంకం లేకుండా సాగడానికి వీలుగా పరవాడలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. మాన్ కై ండ్ ఫార్మా సీఎస్ఆర్ నిధులతో భారీ జనరేటర్, లుపిన్, వసుధ ఫార్మా కంపెనీలు కంప్యూటర్లు, యూపీఎస్లు సమకూర్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, మాన్ కై ండ్ ఫార్మా ప్రతినిధులు రామలింగం, శ్రీనరేష్, లుపిన్ ఫార్మా ప్రతినిధులు గంగరాజు, వెంకట్, వసుధ ఫార్మా ప్రతినిధులు రామరాజు, హర్ష, ఎస్బీ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, తమలంపూడి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బాలసూర్యారావు, మల్లికార్జునరావు, రామకృష్ణారావు, మన్మథరావు, ఎస్ఐలు ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు, శిరీష, ఐటీ కోర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
నర్సీపట్నం: పట్టణంలో ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సత్యనారాయణ జనరల్ స్టోర్స్ ఎరువుల దుకాణంలో ఎంట్రీ రిజిస్టర్లో స్టాక్ వివరాల్లో లోపాలను గుర్తించారు. 1.15 టన్నుల 20–20–0–13 ఎరువులకు సంబంధించిన 23 బ్యాగ్లను విక్రయించకుండా జిల్లా వ్యవసాయ అధికారి.. షాపు యజమానికి నోటీసు జారీ చేశారు. ఎరువుల వివరాలు, ధరల బోర్డు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణాల్లో వివరాలు పక్కాగా ఉండాలని లేని పక్షంలో చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని, స్టాక్ వివరాలు, ధరలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేదిలేదన్నారు. మండలంలో గబ్బాడ లో జరిగిన పొలంపిలుస్తోంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన వ్యవసాయ సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రస్తుత రబీ సీజన్లో రైతులు పండిస్తున్న పంటల వివరాలను ఈ క్రాప్లో ఫిబ్రవరి 28లోపు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ టి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.విక్రయాలు నిలిపివేయాలంటూ జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలు -
విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి నక్కపల్లి: జాతీయరహదారిపై ఒడ్డిమెట్ట సమీపంలో సోమవా రం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలప్రకారం మండలంలో దేవవరం శివారు ఒడ్డిమెట్ట గ్రామానికి చెందిన పెట్ల గణపతి(52) దేవవరం నుంచి ఒడ్డిమెట్టకు నడిచి వెళ్తుండగా చినరామభద్రపురం, ఒడ్డిమెట్ట మధ్యలో నక్కపల్లినుంచి తునివైపు వెళ్తున్న వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గణపతి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వసతి గృహంలో సమస్యల వెల్లువ
అచ్యుతాపురం రూరల్ : ఫుడ్ కమిషన్ చైర్మన్ చిట్టా విజయ్ ప్రతాప్రెడ్డి ఆకస్మిక పర్యటన అనంతరం మోసయ్యపేట బాలుర వసతి గృహంలో పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులు అనే సమస్యలతో సతమతమవుతున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకూ 180 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఉంటూ స్థానిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. వారంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం లేదు. హాస్టల్ చుట్టు పక్కల ఎక్కడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. పౌష్టికాహారం అందక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఎవరైనా విద్యార్థులు హాస్టల్లో నాణ్యత లోపాలపై ప్రశ్నిస్తే వార్డెన్ కర్కశంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్పై గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడానికి ప్రత్యేకంగా వర్కర్లు లేకపోవడంతో వంట పని చేసే వారే రెండు పనులూ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం విద్యార్థి చేపల అభిషేక్ కడుపు నొప్పితో బాధపడుతూ స్కూల్ నుంచి హాస్టల్ వచ్చేశాడు. ఇలా తరచూ విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి హాస్టల్లో వసతుల మెరుగుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్లో హైమావతి ప్రతిభ
అచ్యుతాపురం రూరల్ : అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లోలో నునపర్తి గ్రామా నికి చెందిన జూరెడ్డి హైమావతి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బీహార్ రాష్ట్రం పాట్నాలో గత నెల 27 నుంచి 29 వరకూ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సౌత్ ఏషియన్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో భారతదేశం తరఫున హైమవతి పాల్గొని సత్తా చాటారు. ఈ సందర్భంగా ఆమెను విశాఖపట్నం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి గొంప నర్సింహమూర్తి, నునపర్తి శ్రీరామ బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ చైర్మన్ ఆర్.వి.వి.నగేష్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
శిథిల పాఠశాల భవనాన్ని కూల్చివేయాలి
చీడికాడ: శిథిలమై ప్రమాదకరంగా ఉన్న మండలంలోని నీలంపేట పాఠశాల భవనాన్ని వెంటనే కూల్చివేయాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కోరారు. మంగళవారం నీలంపేట వెళ్లిన ఆయనకు సర్పంచ్ కసిరెడ్డి సూర్యనారాయణ, గ్రామస్తులు శిథిలమైన పాఠశాల భవనం గురించి వివరించారు. దీంతో ఆయన ఆ భవనాన్ని పరిశీలించారు.అనంతరం ఎంపీడీవో హేమసుందరరావుతో ఫోన్లో మాట్లాడారు.ఈ భవనంలో చిన్న పిల్లలు ఆటలాడుతుంటారని ఎటువంటి ప్రమాదం జరగకముందే దానికి కూల్చివేయాలని సూచించారు. దీనికి స్పందించిన ఎంపీడీవో పరిశీలించి, భవనాన్ని తొలగిస్తామని చెప్పినట్లు బూడి తెలిపారు.ఎంపీడీవోకు సూచించిన మాజీ డిప్యూటీ సీఎం బూడి -
ఎంఎస్ఎంఈ కంపెనీలకు సబ్సిడీ రుణాలు
అనకాపల్లి: ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఆర్బీఐ ఆధ్వర్యంలో సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తామని ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేష్కుమార్ మహానా తెలిపారు. స్థానిక మెయిన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంఎస్ఎంఈ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్బీఐ, బ్యాంకింగ్, ఆర్థిక సమావేశ పథకాలపై అవగాహన కల్పించారు. రుణ సదుపాయాలు ఎలా పొందాలో తెలియజేశారు. అనంతరం రాజేష్కుమార్ మహానాను జిల్లా లీడ్బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ జి.ఈశ్వర్, డీఐసీ అనకాపల్లి జనరల్ మేనేజర్ ఆర్.ప్రసాద్, ఏపీ గ్రామీణ బ్యాంక్ ప్రతినిధి సతీష్ చంద్ర, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
పునరావాసం.. పరిహాసం
నక్కపల్లి: ఏపీఐఐసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం పెదబోదిగల్లం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన జరుగుతున్నాయి. దీంతో ఇక్కడకు వచ్చి ఇళ్లు నిర్మించుకునేందుకు నిర్వాసితులు ఆసక్తిచూపడం లేదు. ఫలితంగా కాలనీలో పది మంది కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఆ పనులు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. వివరాల్లోకి వెళ్తే మండలంలో చందనాడ, అమలాపురం, రాజయ్యపేట, బోయపాడు,మూలపర, వేంపాడు,డీఎల్పురం, బుచ్చిరాజుపేట, తమ్మయ్యపేట తదితర గ్రామాల పరిధిలో ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా 4,500 ఎకరాలు సేకరించింది. వీటిలో 2,000 ఎకరాలు బల్క్డ్రగ్పార్క్కోసం, 2,200 ఎకరాలను ఆర్సిలర్ మిట్టల్స్టీల్ప్లాంట్కు కేటాయించింది. దీంతో పై గ్రామాల్లో కొంతభాగాన్ని ఖాళీ చేయించాల్సి వస్తోంది. ఇలా నివాస ప్రాంతాలు కోల్పోతున్న సుమారు 734 మందిని గుర్తించారు. వీరందరికీ ఆర్ అండ్ ఆర్ప్యాకేజీ వర్తింపజేయాలి. ఐదు సెంట్ల చొప్పున ఇంటిస్థలం మంజూరు చేయడంతో పాటు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చెల్లించాలి. వీరి కోసం నక్కపల్లి పక్కన ఉన్న పెదబోదిగల్లంలో సుమారు170 ఎకరాల భూమిని కొనుగోలుచేసి, పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. ఏపీఐఐసీ వారే లేఅవుట్ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వాడుకనీరు, విద్యుత్, ఇంటింటికి కుళాయిలు, పాఠశాల, సామాజిక భవనాలు వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఈ 170 ఎకరాల్లో లేఅవుట్ వేసి ప్లాట్లుగా విభజించి నిర్వాసితులకు పంపిణీ చేశారు. అయితే లేఅవుట్లో మౌలిక సదుపాయలకల్పించే పనులు దాదాపు 6 నెలలనుంచి చేపట్టారు.. ఇవన్నీ నత్తనడకన జరుగుతున్నాయి. నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ప్యాకేజీ ఇంటిస్థలం కేటాయించడంతో నిర్వాసితులు పునరావాస కాలనీకి వెళ్లిపోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే పునరావాస కాలనీలో పనులు మాత్రం చురుగ్గా జరగడంలేదు. సీసీరోడ్లు, సీసీ డ్రైనేజీలు,ఓవర్హెడ్ట్యాంకులు, బోర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. నాలుగైదు సీసీరోడ్లు మాత్రమే పూర్తిచేశారు. పనులన్నీ పూర్తికావాలంటే మరో ఆరు నెలల పైనే పట్టే పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బోర్లు నిర్మించారు. తాగునీటిని ఉద్దండపురం వద్ద ఉన్న వాటర్గ్రిడ్నుంచి తీసుకు వస్తామని అధికారులు చెబుతున్నారు. సుమారు 15 కిలోమీటర్ల మేర పైనులైను వేసి తాగునీటిని ఈ పునరావాస కాలనీకి తరలించాల్సి ఉంటుంది. దీనికి నేషనల్ హైవే అధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది. పదేళ్లక్రితం ప్రారంభమైన వాటర్గ్రిడ్ ఇప్పటి వరకు పూర్తికాలేదు.అక్కడనుంచి నీటిని ఎలా తరలిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్ని సమస్యలు ఉన్న పునరావాలకాలనీలో ఇళ్లు నిర్మించుకుని తాము ఎలా నివసించగలమన్న సందేహాలు నిర్వాసితుల్లో తలెత్తుతున్నాయి. దీంతోఅక్కడకు వెళ్లి ఇళ్లు నిర్మించుకునేందకు వారు ఆసక్తి చూపడం లేదు. ఇళ్లకు సంబంధించి ప్లాట్లు కేటాయించి మూడు నెలలు గడుస్తున్నా ఎవరూ అక్కడకు వెళ్లి ఇంటిని నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొంతమంది టీడీపీ నాయకులు నిర్వాసితుల్లో తమ పార్టీ సానుభూతి పరులపై ఒత్తిడి తెచ్చి పునరావాస కాలనీలో ఇంటి నిర్మాణాలను ప్రారంభించారు. మొత్తం 734 మందిలో పట్టుమని పదిమందికూడా ఇళ్లనిర్మాణాలు ప్రారంభించకపోవడం గమనార్హం. వాటిలో మూడు శ్లాబ్లెవెల్లోను, మిగిలినవి పునాదుల్లోను ఉండటం విశేషం. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యలు పూర్తిగా పరిష్కరించలేదని, కాలనీలో ఎటువంటి సదుపాయాలు లేవని, కేవలం రోడ్లు డ్రైనేజీపనులే ప్రారంభమయ్యాయని, ఈ నేపథ్యంలో పునరావాస కాలనీ ఇళ్లు ఎలా నిర్మించకుంటామంటూ నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.సామాజిక అవసరాలకోసం అన్ని సదుపాయాలు కల్పించడంకుండా కాలనీలోకి వెళ్లేందుకు నిర్వాసితులు నిరాకరిస్తున్నారు. ఉన్న పళంగా తమ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోతే అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ఏమూలా సరిపోదని అప్పుచేసి ఇళ్లు నిర్మించుకునేందుకు సమయంపడుతుందని బాధితులు చెబుతున్నారు. 734 కుటుంబాలకు అవసరమైన విద్య,వైద్య, తాగునీరు సదుపాయాలు కల్పించిన తర్వాత వెళతామంటున్నారు. ఆర్అండ్ ఆర్ప్యాకేజీ కింద రూ.25లక్షలు, వివాహమైన ఆడపిల్లలకు కూడా ఆర్అండ్ ఆర్ప్యాకేజీ, ఇంటి స్థలం ఇస్తే తప్ప ఇళ్లను ఖాళీ చేయమని నిర్వాసితులు చెబుతున్నారు. సోమవారం మండల పర్యటనకు వచ్చిన రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్, హోమ్మంత్రిఅనితను కలిసి తమ నిరసన తెలియజేశారు. ఆర్ అండ్ ఆర్ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తే తప్ప ఇక్కడనుంచికదిలేది లేదని నిర్వాసితులు చెబుతున్నారు.సమస్యలు పరిష్కరించాలి పునరావాసకాలనీకివెళ్లాంటే ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలి.అలాగే కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. వి ద్యా, వైద్య సదుపాయాలుకల్పిస్తే తప్ప అక్కడకు వెళ్లే ప్రసక్తి లేదు. రోడ్లు,డ్రైనేజీల పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. తాగునీరు, వాడుక నీటిసదుపాయాలు కల్పించాలి. – తళ్ల భార్గవ్, చందనాడ నష్టపరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయం మాభూమితోపాటు ఇంటిని తీసేసేకున్నారు.నష్టపరిహారం ఇవ్వలేదు. ఖాళీ జాగాలో పశువులకోసం, పండించిన ఉత్పత్తులు నిల్వచేసుకునేందుకు షెడ్లు వేసుకున్నాం. వాటికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయబోం – గెడ్డమూరి గోవిందు, చందనాడ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం ఇళ్ల నిర్మాణాలకు ఆసక్తిచూపని లబ్ధిదారులు పది మంది మాత్రమే ముందుకొచ్చిన వైనం -
రైతు సజీవ దహనం
రావికమతం: మండలంలోని కవగుంటలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ గిరిజన రైతు సజీవదహనమయ్యాడు. స్థానిక ఎస్ఐ రఘువర్మ, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కల్యాణం దొర(65) వ్యవసాయంతో పాటు నాటు వైద్యం చేస్తుంటాడు. ఇతని భార్య గతంలో మృతి చెందగా, ముగ్గురు కుమారులకు వివాహాలు జరిగాయి. వారంతా వేర్వేరుగా ఉంటున్నారు.భార్య మృతి చెందినప్పటి నుంచి పాకలో ఉంటూ నాటు వైద్యం చేస్తున్నాడు. రోజూ రాత్రి పెద్ద కుమారుడు ఇంటిలో భోజనం చేశాక పాక దగ్గరకు వెళ్లి నిద్రిస్తుంటాడు. సోమవారం రాత్రి కూడా పాకలోనే నిద్రించాడు. మంగళవారం తెల్లవారుజామున స్నానం కోసమని నీళ్లు మరగ బెడుతుండగా మంటలు చెలరేగి క్షణాల్లో పాక దగ్ధమైంది. కాళ్ల నొప్పులతో బాధపడుతున్న కల్యాణం దొర బయటకురాలేక మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. స్థానికులు వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో దొర పాకలో లేడని వారు భావించారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత పరిశీలించగా దొర మృతదేహం కనిపించిందని స్థానికులు తెలిపారు. అందిన సమాచారం మేరకు స్థానిక అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదు పు చేశారు. ఎస్ఐ రఘువర్మ సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరిలించారు. మృతుడి కుమారుడు రొబ్బా బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. పాకలో వేడినీరు కాస్తుండగా ప్రమాదం -
విద్యే వజ్రాయుధం
మధురవాడ/కొమ్మాది: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గురుకులాల్లో గురువారం ఉదయం అందించే ఉప్మా స్థానంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తామని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సి.హెచ్.విజయప్రతాపరెడ్డి వెల్లడించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మధురవాడ, మారికవలస, ఎండాడ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలు, జిల్లా పరిషత్ హైస్కూల్, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. భోజన నాణ్యత, వంటల తీరు, రకుల నిల్వలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. గురువారం ఉదయం పెట్టే ఉప్మా తినలేకపోతున్నామని మారికవలస గురుకుల విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఆయన, ఉప్మా బదులుగా విద్యార్థులకు ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టే యోచనలో ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్య వజ్రాయుధం లాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా నైపుణ్యాలు పెంచుకుంటే ప్రైవేట్ రంగంలోనూ అపార అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులు అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చైర్మన్కు చిన్నారుల గ్రీటింగ్స్ ఎండాడ పాఠశాల సందర్శనలో విద్యార్థులు చైర్మన్కు ఘన స్వాగతం పలికారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఫుడ్ ఈజ్ గాడ్ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులను ఆయనకు అందజేశారు. వాటిని ఆయన సంతోషంగా స్వీకరించారు. ఫుడ్ కమిషన్ సభ్యుడు సూర్యకిరణ్, డీసీఎస్వో వి.భాస్కరరావు, సివిల్ సప్లై మేనేజర్ ఎం.శ్రీలత, డీఈవో ఎన్.ప్రేమకుమార్, ఐసీడీఎస్ పీడీ కేవీ రామలక్ష్మి, ఫుడ్ సేఫ్టీ అధికారి కల్యాణ్ చక్రవర్తి, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డిప్యూటీ కంట్రోలర్ కె.టి.రవికుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ రామారావు, మధ్యాహ్న భోజనం పథకం కో–ఆర్డినేటర్ మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. మెనూ పాటించాల్సిందే.. పాఠశాలల్లో కచ్చితంగా మెనూ ప్రకారమే ఆహారం అందించాలని, పౌష్టికాహార సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని ఫుడ్ కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. ఎండాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. అలాగే రేషన్ డిపోల ద్వారా లబ్ధిదారులకు బియ్యం, పంచదార సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. సివిల్ సప్లై, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సోషల్ వెల్ఫేర్ వంటి విభాగాలు తమ కమిషన్ పరిధిలోకి వస్తాయని, ఎటువంటి సమస్యలున్నా తమను సంప్రదించవచ్చని తెలిపారు. -
104 ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ
అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చెంతకే వైద్యాన్ని చేరవేస్తున్న 104 ఉద్యోగులకు భవ్య యాజమాన్యం అన్యాయం చేస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నెహ్రూచౌక్ వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 104 వాహన ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని 104 నిర్వహణ చేపడుతున్న భవ్య యాజమాన్యానికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితిలో 104 ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 104లో విధులు నిర్వహిస్తూ 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న డ్రైవర్లకు స్లాబ్ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కు రూ.18,500 వేతనం అమలు చేయాలని ఆయన కోరారు. క్యాజువల్ లీవ్లు పునరుద్ధరించాలని, ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్, కాళ్ల తాళయ్యబాబు, 104 ఉద్యోగుల సంఘం కోశాధికారి జి.చంద్రుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీరంరెడ్డి భార్గవ్, ఉద్యోగులు జి.చంద్రుడు, భార్గవ్, చిరంజీవి, ఎం.మూర్తి, రమణ ఎం.ప్రశాంత్, కుమార్, ఎ.మధు, సతీష్, వై.వి.నాయుడు, ఎం.శ్రీను, ఎం.ప్రశాంత్కుమార్ పాల్గొన్నారు. -
ఎం.కె వల్లాపురంలో బంగారం, వెండి చోరీ
మాడుగుల: మండలంలో ఎం.కె. వల్లాపురంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో ప్రవేశించి ఐదు తులాలు బంగారం, 10 తులాల వెండి చోరీ చేశారు. ఎస్ఐ నారాయణరావు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు... గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మట్టా మహలక్ష్మి నాయుడు, భవన నిర్మాణపని చేస్తున్న ఆయన భార్య రాము తమ పనులపై బయటకు వెళ్లగా, ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని గమనించిన దొంగలు కిటికీలోంచి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 10 తులాల వెండి దొంగలించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తెలిసిన వారి అండతోనే దొంగతనం జరిగి ఉంటుందని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కోతి దాడిలో ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
రావికమతం: మండల కేంద్రం రావికమతంలో కోతుల దాడులతో విద్యార్థులు వణికిపోతున్నారు. గత నెలలో ఒకసారి హాస్టల్ విద్యార్థులపై, మరో సారి ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులపై కోతులు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం నవోదయ విద్యార్థినులపై కోతి దాడి చేయడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. మంగళవారం గెంజి వారి రామాలయా నికి సమీపంలో నవోదయ పాఠశాలలోకి కోతి ప్రవేశించి ఇద్దరు విద్యార్థినులపై దాడి చేసింది. ఈ దాడిలో రావికమతంకు చెందిన ఎస్.లోహిత, గు మ్మాళ్లపాడుకు చెందిన బుర్రకాయుల లీనా గాయపడ్టారు. వారిని పాఠశాల సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడాలని నవోదయ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ పట్నాయక్ కోరారు. -
వెనిజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఆందోళన
అనకాపల్లి: వెనిజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో–ఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్(ఇస్కాఫ్) సభ్యులు ఆందోళన చేశారు. స్థానిక మెయిన్ రోడ్డులోని సీపీఐ కార్యాలయం వద్ద ఇస్కాఫ్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించి, అనంతరం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఇస్కాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.మాధవరావు మాట్లాడుతూ అక్రమంగా అమెరికా జైలులో నిర్బంధించిన వెనిజువెలా అధ్యక్షుడు మధురోను, అతని భార్య సిలియా ఫ్లోరైస్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తూ, ఐక్యరాజ్య సమితి ప్రమేయం లేకుండా అమెరికా నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. భారత ప్రభుత్వం కూడా అమెరికా నియంతృత్వ పోకడలను ఖండించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్కాఫ్ నాయకులు దాడి శివరామ, బుద్ధ వీరు నాయుడు, బొడ్డేడ అప్పారావు, మొల్లి రమణబాబు, దొరబాబు, భద్రం, వెంకటేశ్వరరావు, మల్ల చక్రవర్తి, రామచంద్రరావు, బొండా సాయి, దక్షిణామూర్తి, రాజు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆంజనేయ వాహనంపై ఆపద్బాంధవుడు
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఆంజనేయవాహనం పై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం మూలవిరాట్కు నిత్యార్చనలు,పూజలు పూర్తిచేశారు. కొండదిగువన ఉత్సవ మూర్తులకు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం పూర్తిచేసిన తరువాత శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని ఆంజనేయవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధిసేవలు నిర్వహించారు.అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 22వపాశురాన్ని విన్నపం చేశారు. తదుపరి ప్రసాద నివేదన, తీర్థగోష్టి ప్రసాదవినియోగం జరిగాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా రాత్రితిరువీధి సేవలు నిర్వహించారు.అధ్యాపక స్వామి ద్రవిడ వేద ప్రబంధ విన్నపం చేశారు. ఈ కార్యక్రమాల్లో అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి మృతి
దేవరాపల్లి: చదవట్లేదని తండ్రి మందలించడాన్న కారణంతో గడ్డి మందు తాగిన ఓ డిగ్రీ విద్యార్థి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తెనుగుపూడి గ్రామానికి చెందిన సేనాపతి ఆనంద్(18) విశాఖపట్నంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇటీవల చదువుపై శ్రద్ధ కనబరచకపోవడంతో తండ్రి సింహాచలం మందలించినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. కొంత సమయం తర్వాత ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే దేవరాపల్లి పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆనంద్ మృతదేహాన్ని గ్రామంలోని యువకులంతా కాశీపురం నుంచి తెనుగుపూడి వరకు అశ్రునయనాల మధ్య తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
గోవాడ రైతుల అర్ధనగ్న ప్రదర్శన
చోడవరం : ఈ ఏడాది గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని, చెరకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతు సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధుల అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఫ్యాక్టరీ మెయిన్ గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసన రిలే దీక్ష శిబిరం సోమవారం 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఏపీ చెరకు రైతు సంఘం, వ్యవసాయ కూలీ సంఘం, ఏపీ రైతు సంఘం, సీపీఐ, రైతు కూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నాయకులు ఈ శిబిరంలో పాల్గొని అర్ధ నగ్నంగా నిరసన తెలిపారు. చెరకు రైతుల జీవితాలతో ఆడుకోవద్దని వారు హెచ్చరించారు. ఫ్యాక్టరీని కాపాడతామని, చెరకు రైతులకు అండగా నిలుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ పూర్తిగా మోసం చేశారని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి సాయంగా తీసురాలేకపోయారని వారు ధ్వజమెత్తారు. రైతులను మోసం చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, సీపీఎం జిల్లా ప్రతినిధి శ్రీనివాసరావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ ప్రతినిధి శానాపతి సత్యారావు, సుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయి సూరిబాబు, శరగడం రామునాయుడు, జిల్లా వ్యవసాయ కూలీ సంఘం అధ్యక్షుడు కోన మోహన్రావు, సీఐటీయూ నాయకుడు ఎస్వీనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్గానిక్ కుండ బెల్లానికి మాజీ ఉపరాష్ట్రపతి కితాబు
కశింకోట : కశింకోటలో సంఘ మిత్ర ఫార్మర్ ప్రొడ్యూసర్ సొసైటీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న ఆర్గానిక్ సుగంధ ద్రవ్య కుండ బెల్లాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు రుచి చూశారు. గుంటూరులోని కొర్నిపాడులో రైతు నేస్తం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడి సొసైటీ ఆధ్వర్యంలో తయారుచేస్తున్న కుండ బెల్లం స్టాల్ ఏర్పాటు చేసి సోమవారం ప్రదర్శించినట్టు సంఘ మిత్ర చైర్మన్ శిలపరశెట్టి చిట్టెమ్మ, ఉపాధ్యక్షుడు ఆళ్ల అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనను తిలకించిన వెంకయ్యనాయుడు అనకాపల్లి ప్రాంత బెల్లం రుచిగా ఉంటుందని, ఈ బెల్లం తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారన్నారు. సొంఠి, మిరియాలు, యాలకులు, లవంగాల వంటి సుగంధ ద్రవ్యాలను కలిపి ఆరోగ్యకరమైన ఆర్గానిక్ బెల్లాన్ని గత రెండేళ్లగా తయారు చేసి ప్రజలకు విక్రయిస్తున్నామని, దీని ప్రాధాన్యంపై ప్రదర్శనలు నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్నామని తెలియజేశామన్నారు. -
దేవరాపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం
దేవరాపల్లి: దేవరాపల్లిలో ఆదివారం రాత్రి పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అటుగా వెళ్తున్న దేవరాపల్లికి చెందిన వెలమరెడ్డి చిట్టినాయుడుపై పిచ్చి కుక్క దాడి చేసి కుడి చేయి, కుడి కాలిపై తీవ్ర గాయాలు చేసింది. వెంటనే స్థానికులు గమనించి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చేతిపై గాయానికి ఐదు కుట్లు వేశారు.దేవరాపల్లిలో వీధి కుక్కల బెడదతో పాటు పిచ్చి కుక్కల స్వైర విహారంతో స్థానిక ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిట్టినాయుడు -
ఆర్టీసీ కాంప్లెక్స్లో వృద్ధుడు మృతి
యలమంచిలి రూరల్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. బస్టాండులో వెయిటింగ్ బెంచీపై విగతజీవిగా పడివున్న వృద్ధుడ్ని గుర్తించిన కొందరు ప్రయాణికులు పట్టణ పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు వృద్ధుడు మృతి చెందినట్టు నిర్థారించుకుని మృతదేహాన్ని అనకాపల్లి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గాంధీనగరం వీఆర్వో పలక పృధ్వి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. -
అర్జీదారులకు ఉచిత వాహన సౌకర్యం
కలెక్టరేట్ నుంచి జాతీయ రహదారికి అర్జీదారులను తీసుకెళ్తున్న ఉచిత ఆటో తుమ్మపాల : వివిధ సమస్యలపై ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చే వృద్ధులు, వికలాంగులు, మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే ఉచిత వాహన సౌకర్యం ఏర్పాటు చేశారు.పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో మండలంలో శంకరం గ్రామంలో ఉన్న కలెక్టరేట్కు చేరడానికి ఆపసోపాలు పడుతున్న అర్జీదారులకు ఉచిత వాహన సౌకర్యం కలిగిస్తూ ఏడు వారాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆటో తిరుగుతుంది. జాతీయ రహదారి నుంచి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న కలెక్టరేట్కు రావాలంటే ప్రయాణ సౌకర్యం లేదు. వాహనాలు లేని వృద్ధులు, వికలాంగులు నడవలేని పరిస్థితిలో ప్రత్యేక ఆటోకు ఖర్చు చేయలేక పేదలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రతి వారం ఉచితంగా ఆటోసేవను కొనసాగిస్తున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు. -
కబ్జాదారులపై చర్యలకు వెనుకడుగు?
మాకవరపాలెం : ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వ్యక్తులపై చర్యలకు రెవెన్యూ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. అధికార టీడీపీకి చెందిన నాయకులు కావడంతోనే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని రామన్నపాలెం శివారు చినరాచపల్లి వద్ద 737 సర్వే నంబర్ పరిధిలో ఊటగెడ్డ రిజర్వాయర్కు ఆనుకుని ఫారెస్ట్, రెవెన్యూ, ఇరిగేషన్ ఆధీనంలో భూములు ఉన్నాయి. వీటిలో సుమారు 20 ఎకరాలను గతంలో టీడీపీ నాయకులు ఆక్రమించడంతో 2018లోనే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే గత నెల 24న హెచ్చరిక బోర్డు ఉండగానే ట్రాక్టర్తో దుక్కులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న ఆర్ఐ చక్రపాణి, వీఆర్వో సాంబశివరావు ఈ భూమిని పరిశీలించి ఆక్రమణలు అడ్డుకున్నారు. అనంతరం నివేదికను తహసీల్దార్ వెంకటరమణకు అందజేశారు. దీంతో ఈ భూమి ఆక్రమణకు సంబంధించి టీడీపీ నాయకులు రామన్నపాలెం మాజీ సర్పంచ్ చుక్కా పోతురాజు, అడిగర్ల శ్రీనివాసరావులపై కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. దుక్కులు చేస్తున్న ట్రాక్టర్, ఒక బైక్ను సీజ్ చేసి పోలీసులకు అప్పగించినట్టు తహసీల్దార్ చెప్పిన విషయం పత్రికల్లో సైతం వచ్చింది. ఇదంతా జరిగి 13 రోజులు కావస్తున్నా ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాలేదు. స్పీకర్ ఆదేశాలు బేఖాతరు భూకబ్జాలకు పాల్పడేవారిపై పార్టీలతో సంబంధం లేకుండా వెంటనే కేసులు పెట్టాలని స్వయంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మూడు రోజుల క్రితం నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో జరిగిన ఓ సమావేశంలో అధికారులను ఆదేశించారు. టీడీపీ వారైనా సరే వెనుకడుగు వేయకుండా కేసులు పెట్టాలని నర్సీపట్నం ఆర్డీవో, మిగిలిన మండలాల తహసీల్దార్లకు ఆదేశాలిచ్చారు. కానీ మాకవరపాలెం మండలంలో అధికారులు కబ్జాదారులపై చర్యలకు వెనుకడుగు వేస్తుండటంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
పోర్ట్లో పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ
విశాఖ సిటీ : విశాఖ పోర్ట్ అథారిటీని పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుల బృందం సోమవారం సందర్శించింది. ఈ సభ్యులకు పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి వివిధ విభాగాల అధిపతులతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఈ బృందం పోర్ట్లో పర్యటించారు. పోర్ట్ సమగ్ర కార్యకలాపాలు, చేపడుతున్న వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలను డిప్యూటీ చైర్పర్సన్ వివరించారు. పోర్ట్ మౌలిక సదుపాయాలు, సరుకు నిర్వహణ సామర్థ్యం, ఆధునీకరణ, యాంత్రీకరణ కార్యక్రమాలు, కవర్డ్ నిల్వ సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమల అవసరాల కోసం మురుగునీటి శుద్ధి కేంద్రం ద్వారా నీటి పునర్వినియోగం వంటి అంశాలపై కమిటీకి అవగాహన కల్పించారు. అదే విధంగా విశాఖ పోర్ట్ ద్వారా దిగుమతి–ఎగుమతి కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఉన్న పెట్టుబడి అవకాశాలు, సాధ్యమైన మార్గాలను తెలియజేశారు. పోర్ట్లో జరుగుతున్న కార్యకలాపాల పట్ల పార్లమెంటరీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. -
అధిక ధరకు ఎరువుల విక్రయం
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో లక్ష్మీ ట్రేడర్స్ ఎరువుల దుకాణం లైసెన్స్ను 15 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.ఆశాదేవి తెలిపారు. మండలంలోని తాళ్లపాలెంలో లక్ష్మీ ట్రేడర్స్ ప్రైవేటు ఎరువుల దుకాణాన్ని సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 1985 ఎరువుల చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఎరువులు అమ్ముతున్నట్లు గుర్తించామని ఆశాదేవి తెలిపారు. బిల్లు బుక్ను తనిఖీ చేసి, దాంట్లో ఉన్న సెల్ఫోన్ నంబర్లకు ఫోన్ చేశామన్నారు. యూరియా ఎరువు బస్తా రూ.266.50కు బదులు రూ.400 నుంచి రూ.410 వరకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. డీఏపీ ఎరువు కూడా అధిక ధరలకు అమ్ముతున్నట్లు వెల్లడైందన్నారు. కొన్ని సెల్ నెంబర్లకు కాల్ చేయగా అవి అందుబాటులో లేనట్లు, కొన్ని తప్పుగా నమోదు చేసినట్లు రుజువైందన్నారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ సహాయ సంచాలకురాలు ఎం.ఎస్.వసంత కుమారి, అనకాపల్లి సహాయ సంచాలకుడు సిహెచ్.సుబ్రహ్మణ్యం, వ్యవసాయ అధికారి ఎం.స్వప్న, జిల్లా టెక్నికల్ అధికారి ఎన్.సరోజిని పాల్గొన్నారు. -
నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కళకళలాడిన మహిళా మార్టులు..నేడు చంద్రబాబు ప్రభుత్వంలో నష్టాల బాట పడుతూ మూత పడుతున్నాయి. జిల్లాలో ఉన్న ఐదు మహిళా మార్టుల్లో ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డులో ఏర్పాటు చేసిన మహిళా మార్టు మూత పడింది. మిగిలిన మార్డుల్లో కూడా ప్రభుత
మహిళా మార్ట్... ఏదీ సపోర్ట్! సాక్షి, అనకాపల్లి : మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళా మార్ట్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. దాదాపుగా రూ.40 లక్షలతో స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్లను ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను అందజేసింది. జిల్లాలో మాడుగుల, మాకవరపుపాలెం, చోడవరం, సబ్బవరం, అనకాపల్లి, అడ్డురోడ్డులో కార్పొరేట్ తరహా పెద్ద పెద్ద మాల్స్ని తలదన్నేలా ..వాటికంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు మహిళా మార్ట్ల ద్వారా అందించింది. ఈ మార్ట్లో సభ్యత్వం పొందిన పొదుపు గ్రూపు సభ్యులకు డోర్ డెలివరీ సదుపాయం కూడా కల్పించింది. అయితే ప్రభుతం మారాక మహిళా మార్ట్లకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. మహిళా మార్టుల్లో మండుతున్న నిత్యవసర సరుకులు ధరలతో విక్రయాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.మహిళా మార్ట్ల్లో సరుకులు కొంటే ఒక సమస్య.. కొనకపోతే మరో సమస్య అన్నట్టుగా డ్వాక్రా సంఘాల సభ్యులు పరిస్థితి తయారైంది. ఈ మార్టుల్లో ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా ఉండడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులే వెనుకంజ వేస్తున్నారు. దీంతో వారికి ఈ మార్టుల్లో కొనుగోలు చేస్తేనే బ్యాంక్ రుణాలు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఖర్చులు అధికం...సబ్సిడీ శూన్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పొదుపు సంఘాల భాగస్వామ్యంతో అడ్డురోడ్డులో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ రెండు నెలల క్రితమే మూత పడింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడం, సరుకుల సబ్సిడీ అందించకపోవడంతో మూతపడుతున్నాయి. అధిక నిర్వహణ ఖర్చులు, తక్కువ అమ్మకాలు, అధిక రేట్లు, సరైన నిర్వహణ లేకపోవడం, ప్రభుత్వ నిధుల పక్కదారి పట్టడం, మహిళా సంఘాలు, వెలుగు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, మార్ట్లో పనిచేసే సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. ఒక్కో సభ్యురాలు రూ.3 వేల సరుకులు కొనాల్సిందే.. డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి డబ్బులు వసూళ్లు చేసి సుమారు రూ.40 లక్షలతో మహిళా మార్ట్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళా సభ్యురాలు నెలకు రూ.250 సరకులు కోనుగోలు చేసేవారు. బయట మార్కెట్ కంటే మహిళా మార్ట్లో తక్కువ ధరలకే ఇవ్వడంతో ఒక్కో మహిళ సుమారుగా రూ.మూడు వేల సరకులు కొనేవారు. ప్రభుత్వం మారాక మహిళా మార్టులకు ప్రోత్సాహం కరువైంది. నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో పాటు నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో మార్టులు నష్టాల బాట పట్టాయి. మహిళా మార్ట్ల్లో సరుకులు ధరలు బాగా పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. దీంతో అధికారులు, వెలుగు సిబ్బంది ఒక్కో డ్వాక్రా సభ్యురాలు కనీసం రూ.3000 సరుకులు కోనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. వారు అయిష్టంగానే పొదుపు నుంచి గ్రూపునకు రూ.30 వేలు నిత్యవసర సరుకులు కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారుల పట్ల డ్వాక్రా మహిళలు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ప్రోత్సాహం లేక నష్టాల బాట అడ్డురోడ్డులో గల మహిళా మార్ట్ను కొనసాగించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేశాం. మహిళా మార్టుల్లో మార్కెట్ రేట్లకే విక్రయాలు చేశాం. డ్వాక్రా మహిళలకు ప్రయోజనం చేయాలనే వీటిని ఏర్పాటు చేసినా..సరైన ప్రోత్సాహం లేక నష్టాల బాటపట్టాయి. కొన్నిసార్లు ఎంఆర్పీ కన్నా తక్కువగా అమ్మేందుకు మార్కెట్లో జీఎస్టీ లేని బిల్లులతో విక్రయాలు చేశాం. మహిళా మార్ట్ ఏర్పాటుకు, సరుకుల కొనుగోలుకు పెట్టుబడి డబ్బులను ప్రభుత్వానికి జమ చేశాం. ఏ ఒక్క రూపాయి కూడా పక్కదోవ పట్టలేదు. ప్రతి రూపాయిని ప్రభుత్వానికి అప్పగిస్తాం. –శివప్రసాద్, ఏపీఎం, ఎస్.రాయవరం మహిళా మార్ట్(ఫైల్) జిల్లాలో ఉన్న ఐదింట్లో ఒకటి మూత నష్టాల బాటలో మిగిలిన మార్ట్లు తగ్గిన విక్రయాలు..డ్వాక్రా మహిళలతో బలవంతంగా కొనుగోళ్లు ఒక్కో గ్రూప్ నుంచి రూ.30 వేల వరకు కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి లేదంటే బ్యాంకు రుణాలు ఇవ్వమంటూ బెదిరింపులు నాణ్యత లేని వస్తువులు.. అధిక ధరలు జిల్లాలో 39,671 స్వయం సహాయక సంఘాలుజిల్లాలో వివరాలు ఇలా.. జిల్లాలో 1,279 గ్రామ సంఘాలు 39,671 స్వయం సహాయక సంఘాలు 4,34,320 స్వయం సహాయక సభ్యులు -
చోరీ సొత్తు స్వాధీనం
ఎస్.రాయవరం : తిమ్మాపురం చర్చిలో చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు నరీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు తెలిపారు. అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తిమ్మాపురం చర్చిలో జనవరి 1న చోరీకి పాల్పడిన దొంగను పట్టుకుని అతని వద్ద నుంచి చోరీ చేసిన వస్తువులు స్వాధీనం పరచుకున్నారు. చర్చి పాస్టర్ బి.డి. కిరణ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.రాయవరం పోలీసులు దర్యాప్తు చేసి తక్కువ సమయంలో నిందితుడిని పట్టుకున్నారన్నారు. చర్చిలో వినియోగించే పబ్లిక్ అడ్రస్ ఇన్ సిస్టం, సౌండ్ మిక్సర్, లాంగ్ పియానో సుమారు రూ.లక్షా 10 వేలు విలువ గలిగిన వస్తువులు చోరీ అయినట్టు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంట సీఐ రామకృష్ణ, ఎస్ఐ విభీషణరావు ఉన్నారు. -
తప్పుడు సర్వే నంబర్తో నిషేధిత భూమి రిజిస్ట్రేషన్
డీపట్టా భూమిని ఆక్రమించేందుకు తప్పుడు సర్వే నంబర్తో చేసిన రిజిస్టర్డ్ దస్తావేజును రద్దు చేసి, ఆక్రమణదారుల నుంచి భూమిని కాపాడాలంటూ అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన డీ–పట్టాదారుడు వనమాల నాగభూషణం కోరారు. నిరుపేద దళితుడినైన తన పేరున 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం సర్వే నంబర్ 75/1లో 30 సెంట్లు డీపట్టా మంజూరు చేసిందని, అప్పటి నుంచి సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించేందుకు గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన పేరున పట్టాదారు పాసు పుస్తకం ఉన్నప్పటికి ఆన్లైన్ చేయకుండా చేసి, నా భూమికి ఆనుకుని ఉన్న మరో సర్వే నెం.75/2తో పోర్జరీ పత్రాలు సృష్టించి చేసిన రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని కోరారు. -
నిబంధనలకు పాతర.. స్టాండర్డ్స్ లేని కౌన్సిల్
డాబాగార్డెన్స్(విశాఖ): జీవీఎంసీ అక్రమాలకు అడ్డాగా మారింది. నిబంధనలను తుంగలో తొక్కి తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టడంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేయడం లేదు. తప్పు అని తెలిసినా అధికార మదంతో వరుసగా పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. దీనికి నిదర్శనమే నిబంధనలను నీళ్లొదిలి ఒక కార్పొరేటర్ భర్తకు జీవీఎంసీలో కీలక పదవి కట్టబెట్టడం. అక్కడితో ఆగకుండా కట్టుకున్న భార్యను, కన్న కొడుకును వదిలేసిన వ్యక్తిని సైతం జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించడం విశేషం. ఈ అక్రమ నియామకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే, తాము డబ్బులు పెట్టి పదవులను కొనుక్కున్నామని బహిరంగంగానే సమాధానం చెబుతుండటం గమనార్హం. అర్హత, నీతి నియమాలను పక్కన పెట్టి సాగుతున్న ఈ అక్రమ పదవుల పంపకంపై నగర ప్రజలు , పౌర సమాజం తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తోంది. కట్టుకున్న భార్యని.. కన్నకొడుకుని వదిలేసిన వ్యక్తికా? ఈ నియామకాల్లో మరో విస్తుపోయే అంశం ఏమిటంటే, నైతిక విలువలను కూడా విస్మరించడం. 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న తన భార్య విమలను, దివ్యాంగుడైన కుమారుడిని పదేళ్ల క్రితమే వదిలేసిన కారి గోవిందరాజును స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం మేయర్ చాంబర్కు వెళ్లిన విమలు తన ఆవేదనను వెలిబుచ్చింది. అయితే పీజీఆర్ఎస్లో ఫిర్యాదు తీసుకుంటానని..అక్కడ వేచి ఉండమని మేయర్ బదులిచ్చారని, అయితే తన ఫిర్యాదు తీసుకోవడానికి అక్కడ సిబ్బంది చెప్పడంతో మీడియాను ఆశ్రయించారు. కట్టుకున్న భార్యను, కన్న కొడుకును పట్టించుకోని వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఎలా పనిచేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ పదవిని తాను డబ్బులు పెట్టి కొనుక్కున్నానని తన భర్తే స్వయంగా చెప్పినట్లు ఆమె మీడియా ముందు వెల్లడించడం జీవీఎంసీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది. ముమ్మాటికీ కోర్టు ధిక్కారణే : సీనియర్ న్యాయవాది సత్యనారాయణ ఈ మొత్తం వ్యవహారంపై సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ స్పందిస్తూ.. ఇది స్పష్టంగా కోర్టు ధిక్కరణే అవుతుందని పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్లు పాటించకుండా, అఫిడవిట్కు విరుద్ధంగా తమకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. జీవీఎంసీ అధికారుల తీరుపై త్వరలోనే కంటెప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నియామకాలను రద్దు చేయాలని బాధితులు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల తూచ్ మున్సిపల్ నిబంధనల ప్రకారం కార్పొరేటర్ల కుటుంబ సభ్యులను స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా నియమించడానికి ఎటువంటి అవకాశం లేదు. 15వ వార్డు కార్పొరేటర్ భర్తకే ఆ పదవి లభించేలా చక్రం తిప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నియామకాలు గతంలో చెల్లకుండా పోయిన ఉదాహరణలు ఉన్నప్పటికీ, జీవీఎంసీలో మాత్రం అవే తప్పులను పునరావృతం చేస్తున్నారు. మరోవైపు, నగర పరిధిని 10 జోన్లకు విస్తరించినప్పటికీ, పాత పద్ధతిలోనే కేవలం 8 మంది సభ్యులను ఎంపిక చేయడం గమనార్హం. ఈ ఎంపిక ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటించలేదని, మైనార్టీలకు కనీస ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ మద్దతుదారులకు సైతం మొండిచేయి చూపడంతో ఆ వర్గం వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ల్యాండ్పూలింగ్ రైతుల నిరసన
తుమ్మపాల: ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములను తీసుకుని తమకు కేటాయించాల్సిన ప్లాట్లను నేటికీ మంజూరు చేయడం లేదని పాపయ్యపాలెం గ్రామంలో చేపడుతున్న జగనన్న కాలనీ వద్ద బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ డీ పట్టాల ద్వారా ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను గత ప్రభుత్వంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం సేకరించి తమకు ఒక్కో ఎకరానికి 18 సెంట్ల ప్లాట్లు హామీ ఇచ్చిందని, తీసుకున్న భూముల్లో కాలనీలు నిర్మాణం పూర్తి చేస్తున్నప్పటికీ తమకు మాత్రం ప్లాట్లు ఇవ్వకుండా తాత్సరం చేస్తున్నారని, అన్నారు. ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్లు జరగకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుందని, అధికారులు సీఐడీ విచారణ పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. నాలుగేళ్లగా అనేక పోరాటాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని, తమ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోరితే కేసులు పెడతామంటూ భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
గ్రావెల్ దందాపై విజిలెన్స్
అందలాపల్లి కొండపై అధికారుల తనిఖీలుఅడ్డగోలుగా అనుమతులు..? అచ్యుతాపురం : మండలంలోని కొండకర్ల–అందలాపల్లి కొండను మైనింగ్ విజిలెన్స్ బృందం సోమవారం పరిశీలించింది. సర్వే నంబర్ 136/2లో ఉన్న సుమారు 38 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కొండలో పై భాగాన 4.2 హెక్టార్ల విస్తీర్ణంలో బీవీఆర్ఎస్ కంపెనీకి గ్రావెల్ క్వారీ నిర్వహణకు అనుమతివ్వడాన్ని తప్పుపడుతూ స్థానికులు జిల్లా కలెక్టరేట్లో గత నెల 29న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు, అందలాపల్లి కొండలో గ్రావెల్ దందాపై ఈ నెల 4న సాక్షిలో వచ్చిన కథనంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఫిర్యాదుదారు శివ నుంచి వివరాలు సేకరించారు. బీవీఆర్ఎస్ కంపెనీ ప్రతినిధితో మాట్లాడారు. కొండ వద్ద జరిగిన తవ్వకాలు, క్వారీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకూ క్వారీకి కేటాయించిన స్థలం వద్ద ఎటువంటి తవ్వకాలు జరపలేదని గుర్తించారు. క్వారీకి సంబంధం లేని స్థలంలో జరిపిన తవ్వకాల గురించి బీవీఆర్ఎస్ కంపెనీని అడిగి తెలుసుకున్నారు. క్వారీ ప్రాంతానికి వెళ్లేందుకు అవసరమైన ర్యాంప్ నిర్మాణానికి రోడ్డు వేసుకుంటున్నామని కంపెనీ ప్రతినిధి తెలపడంతో రోడ్డు వేసేందుకు ఎవరు అనుమతిచ్చారని స్థానికులు ఎదురు ప్రశ్నించగా కంపెనీ ప్రతినిధి సమాధానం చెప్పలేకపోయారు. రహదారి పనుల నిమిత్తం క్వారీ కేటాయిస్తే అడ్డుకోవడం తగదని పేర్కొనగా, స్థానికులు ఆయన వాదనను ఖండించారు. స్థానికుల్ని సంప్రదించకుండా ఇక్కడ ఎవరు క్వారీ కేటాయించారని, అవసరమైతే క్వారీకి కేటాయించిన స్థలం ముందు ఆందోళన చేపడతామన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చామని, ఇక్కడి వాస్తవ స్థితిగతుల్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని విజిలెన్స్ బృందంలోని రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. విజిలెన్స్ బృందంలో రాయల్టీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, మైన్స్ ఇన్స్పెక్టర్ పైడితల్లి, వీఆర్ఓ రాంబాబు పాల్గొన్నారు. అందలాపల్లి కొండపై ఇచ్చిన క్వారీ లీజు మంజూరు అడ్డగోలుగా జరిగినట్టు తెలుస్తోంది. 5 హెక్టార్ల లోపు ఉన్న క్వారీలకు గ్రామసభ ఆమోదం అవసరం లేదనే వెసులుబాటును ఉపయోగించుకొని ఈ క్వారీ కేటాయింపు స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలియకుండా చేపట్టారు. కనీసం పంచాయతీ తీర్మానం బట్టి స్థానిక తహసీల్దార్ ఇచ్చే ఎన్ఓసీ బట్టి మైనింగ్ అధికారులు లీజు మంజూరు ప్రక్రియ మొదలుపెట్టాలి. ప్రస్తుత ఇన్ఛార్జ్ తహసీల్దార్ వరహాలును ఈ విషయమై సంప్రదించగా, గతంలో ఎన్ఓసీ పంపించి ఉండొచ్చని, తమ వద్ద దీనికి సంబంధించిన సమాచారం లేదని తెలిపారు. ప్రస్తుత వీఆర్ఓ రాంబాబు సైతం ఎన్ఓసీ గురించి తమ వద్ద సమాచారం లేదన్నారు. అనకాపల్లి–అచ్యుతాపురం రహదారి విస్తరణకు సంబంధించి తొలి దశ పూర్తి చేసేందుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో గ్రావెల్ అవసరమయ్యింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి గ్రావెల్ డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా లభించడం లేదు. దీంతో ఈ క్వారీని రోడ్డు విస్తరణకు ఉపయోగించాల్సి ఉందని బీవీఆర్ఎస్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కానీ లీజు మంజూరులో రహదారి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంతే కాకుండా కొండ పై భాగాన గ్రావెల్ తవ్వకాలకు అనుమతిచ్చారు. కొండపైకి వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేయాల్సి వస్తే పెద్ద ఎత్తున గ్రావెల్ను, బండరాళ్లన పెకిలించాల్సి ఉంది. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ర్యాంప్కు ముఫ్పై అడుగుల మేర ఎత్తులో తవ్వకాలు జరిపినట్టు అక్కడ కనిపిస్తుంది. కొండ దిగువన ఇప్పటికే భారీ స్థాయిలో గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. ఒక ఆర్అండ్బీ జేఈ బంధువు నేరుగా రంగంలోకి దిగి కొండ దిగువ భాగాన గ్రావెల్ను తవ్వేసినట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా సదరు ఆర్అండ్బీ జేఈ బంధువులు స్థానిక ప్రతినిధులతో బేరసారాలు మొదలుపెట్టారు. పర్యాటక కేంద్రంగా ఉన్న కొండకర్ల ఆవకు సమీపంలోని అందలాపల్లి కొండను క్వారీ లీజుకు కేటాయించడంలో కచ్చితంగా ఈసీ క్లియరెన్స్ పారదర్శకంగా జరగాల్సి ఉంది. కొండకు సమీపంలో కొన్ని శివారు గ్రామాలు కూడా ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన మైనింగ్ అధికారులు ఎలా లీజు కేటాయించారో అర్థం కాని ప్రశ్నగా స్థానికులు చెబుతున్నారు. -
నేటి నుంచి వైజాగ్ ఫార్మా ల్యాబ్ ఎక్స్పో
పరవాడ: విశాఖ జేఎన్ ఫార్మాసిటీలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో వైజాగ్ ఫార్మా ల్యాబ్ ఎక్స్పో నిర్వహించనున్నట్లు మ్యూచువల్లీ ఎయిడెడ్ సొసైటీ ఫర్ రిస్క్ మిటిగేషన్(ఎంఏఎస్ఆర్ఎం) కార్యదర్శి జెట్టి సుబ్బారావు తెలిపారు. సొ సైటీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డారు. ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 250 మంది ఎగ్జిబిటర్లు పాల్గొని తమ యంత్ర సామగ్రిని ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ను ఏడు వేల మంది తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. -
ప్రచారం మాది!
●‘కూటమి’.. క్రెడిట్ చోరీ అభివృద్ధి మీది, నక్కపల్లి : పాయకరావుపేట నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లురవీంద్ర, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్టు కూటమి ప్రభుత్వ కృషి అంటూ చెప్పుకొచ్చారు. మండల కేంద్రం నక్కపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, విద్యార్థులకు సీఎస్ఆర్ పథకం కింద 200 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులతోపాటు, ఎంపీ సీఎం రమేష్ హాజరయ్యారు. ఈ సభలో మంత్రులు మాట్లాడుతూ 2014–19 మధ్యకాలంలో చంద్రబాబు, లోకేష్, అశోక్ గజపతిరాజు ఎంతో కృషి చేసి ఎయిర్పోర్టు తీసుకు వచ్చారంటూ డప్పుకొట్టారు. వాస్తవంగా ఈ భోగాపురం ఎయిర్పోర్టు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే శంకుస్థాపన జరిగింది. రైతుల నుంచి సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లింపు, విమానాశ్రయానికి శంకుస్థాపన వంటి కార్యక్రమాలు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే జరిగాయి. పనులు సైతం 2023 సెప్టెంబర్ నాటికి 8 6 శాతం పూర్తయ్యాయని ప్రస్తుతం పౌర విమానయానశాఖామంత్రిగా ఉన్న రామ్మోహన్నాయుడు ఆరు మాసాల క్రితం ఎయిర్పోర్టు పనులు పరిశీలించిన సమయంలో ప్రకటించడం గమనార్హం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరు మాసాల్లో ఈ పనులు 91 శాతం పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు. శంకుస్థాపన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సైతం 2023 నాటికి భోగాపురం ఎయిర్పోర్టు పనులు పూర్తిచేసి తీరుతామని ప్రటించడం జరిగింది. ఎయిర్పోర్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు సైతం శంకుస్థాపన కార్యక్రమంలో ఎయిర్పోర్టు రావడానికి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృషి ఎంతో ఉందని, అనుకున్న సమయానికే నిర్మాణం పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు. ఇవన్నీ ఆన్ రికార్డ్గా ఉన్నప్పటికీ కూటమి మంత్రులు మాత్రం భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదాని గూగుల్సెంటర్, విశాఖలో జరిగిన ఇండస్ట్రియల్ సమ్మిట్లు, బల్క్డ్రగ్పార్క్, మిట్టల్ స్టీల్ప్లాంట్ పనుల గురించి కూడా తమదే ఘనత అంటూ చెప్పుకోవడం గమనార్హం. మిట్టల్ స్టీల్పాంట్ ప్రతిపాదన కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. ఏడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి బల్క్డ్రగ్ పార్క్ను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించింది. రెండువేల ఎకరాల భూకేటాయింపులు కూడా అప్పుడే జరిగాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త కంపెనీల కోసం తట్టమట్టి కూడా వేయపోయినప్పటికీ గత ప్రభుత్వలోనే మంజూరైన కంపెనీలను, అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకుంటూ ప్రారంభోత్సవాలు చేసుకోవడం కూటమి నేతలకే చెల్లిందంటూ పలువురు విమర్శిస్తున్నారు. గతంలో మంజూరైన భవనాలకు ప్రారంభోత్సవాలు నియోజకవర్గ పర్యటనలో భాగంగా గత ప్రభుత్వంలో మంజూరై రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తయిన నక్కపల్లి కేజీబీవీ టైప్4 బాలికల వసతి గృహాన్ని, ఉపమాకలో రూ.40 లక్షలతో గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయాన్ని మంత్రులు ప్రారంభించారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూ రు చేశారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఽఅధ్యక్షుడు తాతయ్యబాబు, ప్రధాన కార్యదర్శి కాశీనాయడు, నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటేష్, ఆర్డీవో రమణ, మార్కెట్కమిటీ చైర్మన్ సత్యనారాయణ డీఈవో అప్పారావునాయుడు పాల్గొన్నారు. -
అప్పన్నను దర్శించుకున్న మహిళా క్రికెటర్లు, రిఫరీలు
సింహాచలం: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సోమవారం పలువురు క్రికెటర్లు, బీసీసీఐ ప్రతినిధులు దర్శించుకున్నారు. క్రికెటర్లు వి. కృతిక, నియతి లోకూర్ సహా బీసీసీఐ రిఫరీలు, అధికారులు శివశుక్లా, చేతన్ శర్మ, సుబ్రత దాస్, అభిషేక్ తోమర్, రాకేష్ కుమార్ తదితరులు స్వామివారిని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో వీరి పేరిట అర్చకులు స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. -
చోరీకి గురైన ట్రాక్టర్ పట్టివేత
రావికమతం : కొత్తకోటలో దొంగిలించిన ట్రాక్టర్ను స్వాధీనం పర్చుకొని, దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్డు చేసి, రిమాండ్కు తరిలించినట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. కొత్తకోట బి.ఎన్.రోడ్డు పక్కన ఉంచిన గుర్రాల నాగలక్ష్మి చెందిన ట్రాక్టర్ను నవంబర్ 23న రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కొత్తకోట పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపారు. సోమవారం బి.ఎన్.రోడ్డులో దొండపూడి చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పందంగా సంచరిస్తున్న కాకినాడ జిల్లా జగ్గంపేట దగ్గర నెహ్రూనగర్కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కొత్తకోటలో నాగలక్ష్మికి చెందిన ట్రాక్టర్ను దొంగిలించినట్టు వారు అంగీకరించారు. వారి చెప్పిన వివరాల మేరకు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కొత్తకోట స్టేషన్కు తీసుకొచ్చారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
బెదిరించి బంగారం అపహరించిన మహిళ అరెస్టు
బంగారం, నగదు దొంగలించిన మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు పాయకరావుపేట : మండలంలో సీతారాంపురం గ్రామానికి చెందిన మహిళ సోమవారం ఆటోలో ప్రయాణిస్తుండగా స్థానిక పెట్రోల్ బంక్ సమీపాన తన 7 తులాల బంగారం, 5 వేల నగదు అపహరణకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాడుగుల గ్రామానికి చెందిన రావుల పోచమ్మ అను మహిళ ఫిర్యాదురాలిని బెదిరించి బంగారం, నగదు తీసుకెళ్లిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొనడంతో ఆ మేరకు గాలించి నిందితురాలిని పోలీసులు పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసి, బంగారం స్వాధీనం చేసుకుని యలమంచిలి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్టు సీఐ జి.అప్పన్న తెలిపారు. -
అర్జీలపై నిర్లక్ష్యం వహించొద్దు
సొంతింటి కలను నెరవేర్చండి తమకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని కూడా నిబంధనల పేరుతో నాయకులు అడ్డుకుంటున్నారని చోడవరం మండలం అంబేరుపురం గ్రామానికి చెందిన పందిరి లక్ష్మణరావు భార్య పిల్లలతో కలిసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. తన భార్య పేరుకు బదులు తన పేరు జాబితాలో రావడంతో నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు చొరవ తీసుకుని తన సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. తుమ్మపాల: అర్జీలపై నిర్లక్ష్యం వహించవద్దని, భూసమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం 1, 2లో వేర్వేరుగా నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఎస్డీసీలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీల పరిష్కారం అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించే పీజీఆర్ఎస్కు సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిల్లోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు. పీజీఆర్ఎస్లో 155, రెవెన్యూ క్లినిక్లో 259 అర్జీలు కలిపి మొత్తం 414 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.సుబ్బలక్ష్మి, మనోరమ, రమామణి, అనిత, సీపీవో జి.రామారావు, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ పథక సంచాలకులు పూర్ణిమ దేవి, కె.సరోజినీ, శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి జి.మనోహర్, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకుడు గోపాల్రాజా పాల్గొన్నారు. -
భోగాపురం ఎయిర్పోర్టు ఘనత ముమ్మాటికీ జగన్దే
మహారాణిపేట: భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైఎస్ జగన్దేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సోమవారం మద్దిల పాలెంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్టు నిర్మాణంలో చంద్రబాబు కంట్రిబ్యూషన్ ఏమీలేదని విమర్శించారు. టీడీపీ నేతలు సిగ్గు లేకుండా భోగాపురం క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. క్రెడిట్ చోరీకి పాల్పడడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే 2019 ఎన్నికల నోటిఫికేషన్కు ముందు అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా ఎయిర్పోర్టు పనులకు శంకుస్థాపన చేశారన్నారు.భూసేకరణ, అనుమతులు, ఆర్థిక వనరులు లేకుండా ఏ రకంగా నిర్మాణం చేద్దామని అప్పట్లో బాబు శంకుస్థాపన చేశారో తెలీదని విమర్శించారు. 2019లో వైఎస్ జగన్ హయాంలోనే ఎయిర్పోర్టు కోసం భూసేకరణతోపాటు అన్ని అనుమతులు సాధించిన తర్వాతే 2023 మే 3న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని స్పష్టం చేశారు. అదేరోజు జూన్ 2026 నాటికి ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారని చెప్పారు. అందులో భాగమే ఆదివారం జరిగిన విమాన ల్యాండింగ్ ట్రయల్ రన్ అని అమర్నాథ్ స్పష్టం చేశారు. ఇదే జగన్ విజన్కి తార్కాణమన్నారు. నిర్వాసితులకూ వైఎస్సార్సీపీ హయాంలో న్యాయం చేస్తూ.. నాలుగు గ్రామాల ప్రజలకు పరిహారం, మౌలిక సదుపాయల కల్పన కోసం సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రెండుచోట్ల కాలనీలు నిరి్మంచిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా టీడీపీ నేతలు నిస్సిగ్గుగా ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడంతోపాటు ఎయిర్పోర్టు విషయంలో కట్ పేస్ట్ వీడియోలతో జగన్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రీల్స్ రామ్మోహన్ను పంపిస్తే ఆయనేమో తన ఘనతగా తాను సాధించినట్లుగా ఫీలవుతున్నారని విమర్శించారు. విజయవాడ విమానాశ్రయాన్ని ఏళ్లతరబడి కడుతున్నారని, మరి దానిని రామ్మోహన్నాయుడు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డకు తమ పేరు పెట్టుకోవడం వారికి అలవాటు అని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కుప్పంలో ఎయిర్ పోర్టు మాటేమిటి? ‘అమరావతిలో కొత్తగా ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్ నిరి్మస్తామని బాబు అంటున్నారు. ఇంకా వింటే పోర్టు కూడా కడతామని చెబుతారు. మీ సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్ స్ట్రిప్కి సంబంధించి 2019 జనవరిలో శంకుస్థాపన చేశారు. అది ప్రారంభమైందా? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోడ్ కనెక్టివిటీ ఉండాలని వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి హాజరైన కేంద్రమంత్రి గడ్కరీని ఒప్పించి ప్రకటన చేయించాం. ఈ ఘనత జగన్కే దక్కుతుంది. భోగాపురం విమానాశ్రయానికి ఆరులేన్ల జాతీయ రహదారి ఏమైపోయింది.బాబు అధికారంలోకి రాగానే మెట్రో, పోర్టు, ఎయిర్పోర్టు అని చెప్పడం పరిపాటిగా మారింది. విశాఖ మెట్రో గురించి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫీజుబులిటీ రిపోర్ట్ లేదు, మరోసారి పంపించాలని చెప్పింది. దీన్నే చంద్రబాబు 2029 ఎన్నికల వరకు తిప్పి.. ఎన్నికల ముందు టెంకాయ కొడతారు. అమరావతిలో మాత్రం ఆవకాయ్ అంటారు. ఏ ప్రాజెక్టుకైనా ముందు టెంకాయ్ నాదే అనడం బాబు అలవాటు. మంగళగిరిలో పప్పు, అమరావతిలో ఆవకాయ్.. ఆంధ్రాకు అప్పులు, చంద్రబాబు గొప్పలు తప్ప ఇంతకుమించి ఈ రెండేళ్లలో సాధించిందేమీ లేదు’ అని అమర్నాథ్ ధ్వజమెత్తారు. విజన్ అంటే జగన్.. భజన అంటే బాబు‘విజన్ అంటే జగన్, భజన అంటే చంద్రబాబు అన్న విషయం ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. పబ్లిసిటీ తప్ప మరోకటి లేదు. ఏ చానెల్ పెట్టినా బాబుకు జాకీర్ హుస్సేన్ని మించి తబలా కొట్టేవాళ్లు తయారు అయ్యారు. ఇంత డప్పు కొట్టినా.. రాష్ట్రం మాత్రం అప్పులపాలైంది. రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ రోజు జగన్కి ఇచ్చిన మాట ప్రకారం జీఎమ్మార్ సంస్థ ఈ ప్రాంత ప్రజల ఆశలను నిజం చేసింది. ఆ సంస్థకు ధన్యవాదాలు’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట రామయ్య పాల్గొన్నారు. -
హోంమంత్రి అనితకు చేదు అనుభవం
సాక్షి, అనకాపల్లి: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనిత సొంత నియోజకవర్గంలోనే మహిళలు.. ఆమెపై తిరగబడ్డారు. పలు సమస్యలపై అనితను స్థానికులు నిలదీశారు. దీంతో, అక్కడ స్వల్ప వాగ్వాదం, ఉద్రిక్తత చోటుచేసుకున్నట్టు తెలిసింది.తెలిసిన వివరాల మేరకు.. హోంమంత్రి అనిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా మంత్రులను స్థానికులు నిలదీశారు. తమ భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని మూలపేట గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ క్రమంలో నిలదీసిన మహిళలను మంత్రి అనిత కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ గందరగోళు పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
లూయిస్ బ్రెయిలీకి ఘన నివాళులు
అనకాపల్లి: స్థానిక వేల్పులవీధి టౌన్ బాలికొన్నత హైస్కూల్లో విజువల్లి ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనకాపల్లి,అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు కొరుప్రోలు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 217 వ జయంతి వేడుకల జరిగాయి. అంతకుముందు బ్రెయిలీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అంధులు అందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన శాసీ్త్రయవాది, మేధావి అయిన లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశంలో రానా కురువే గ్రామంలో జనవరి 4, 1809లో జన్మించారని తెలిపారు. తన తండ్రితో ఒకరోజు గురప్రు జీనులు తయారు చేసుకునే పదునైన జువ్వ కత్తులతో తండ్రిని అనుకరిస్తూ ప్రమాదానికి గురై రెండు కళ్లను కోల్పోయారని తెలిపారు. బ్రెయిలీ 1821 బార్బేరియన్ పాఠశాలలో చేరి 12 చుక్కల లిపితో కొంతకాలం చదువు కొనసాగించి, దానితో సంతృప్తి చెందక అనేక పరిశోధనలు చేసి దాదాపు 11 సంవత్సరాలు పరిశోధన అనంతరం 1832లో సరళ పద్ధతిలో చుక్కల లిపిని కనుగొన్నారని చెప్పారు. అంధుడై ఉండి అంధుల కోసం ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానానికి అనుకూలంగా లిపి రూపొందించబడిందంటేనే లూయిస్ బ్రెయిలీ ముందుచూపు ఎంతో అర్థమవుతుందన్నారు. అనంతరం 25 మంది అంధ నిరుద్యోగులకు దుప్పట్లను బయ్యవరం గ్రామానికి చెందిన సిద్ధ శ్రీను, అంద దివ్యాంగులకు రిటర్న్ గిఫ్ట్స్ను, కె.ఎస్.ఎస్ జి ప్రత్యూష, విశాఖకు చెందిన కె.ఆనంద్ అంధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్, పీఆర్టీయు ప్రధాన కార్యదర్శి పల్లా పోతురాజు, విజువల్లి చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పారిశెట్టి అప్పారావు, విజువల్లి చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు ఎరుకనాయుడు, విజువల్లి చాలెంజ్డ్ యూత్ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల ఆత్మీయ కలయిక
కె.కోటపాడు : 30 సంవత్సరాల కిందట ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి, వివిధ ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న వారంతా సూదివలసలో కలుసుకుని సందడి చేశారు. 1995 డీఎస్సీలో కె.కోటపాడు మండలానికి చెందిన 22 మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరు ఉద్యోగ బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. విధుల్లో చేరిన రోజులను గుర్తు చేసుకున్నారు. వీరిలో పలువురు ఉత్తమ సేవలతో పాటు సామాజిక, సేవా రంగాల్లో రాణిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన కె.కోటపాడు మండలానికి చెందిన ఎల్.వి.నారాయణరావును పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూర్రెడ్డి బాబూరావు, బొడ్డు మహేశ్వరరావు(రవి), బొడ్డు వేణు, యడ్ల గోవింద, రామరాజు, సూరిశెట్టి రామకృష్ణ, రొంగలి నాగేంద్రజోగి, కన్నూరు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు
● ఘాట్ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పద్మనాభం: పద్మనాభంలోని అనంత పద్మనాభ స్వామి ఘాట్ రోడ్డులో ఆదివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రామారావుపేటకు చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురు ఆదివారం కారులో పద్మనాభం వచ్చారు. కొండపై ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో వంద మీటర్లలో కిందనున్న అర్చకునిపాలెం రోడ్డుకు చేరుకుంటారనగా.. కారు అదుపు తప్పి కుడివైపు ఉన్న నీలగిరి తోటలోకి దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గంటి ప్రసాద్ (28) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న పి.ఆదిత్య కుమారుడు పి.హరిహరన్ పెదవిపై, అతని భార్య సుప్రియకు నడుము, కుడి భుజంపై గాయాలయ్యాయి. వీరితో పాటు పి.సాయికిరణ్, పి.అనుష్లకు కూడా గాయాలయ్యాయి. ఆదిత్య, సమన్వితకు ఎటువంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను పద్మనాభం 108 అంబులెన్సులో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీఐ సి.హెచ్.శ్రీధర్ మాట్లాడుతూ.. ఘాట్ రోడ్డులో కారు దిగుతున్నప్పుడు న్యూట్రల్లో పెట్టడం లేదా అతివేగం కారణంగా వాహనం అదుపు తప్పి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. దీనిని మోటార్ వెహికల్స్ అధికారులు నిర్ధారించాల్సి ఉందని పేర్కొన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆదివాసీలపై తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలి
బిహార్ ఎంపీ రాజారాం సింగ్ అనకాపల్లి: ఆదివాసీలపై పెట్టిన తప్పుడు క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని బిహార్లోని కరాకర్ పార్లమెంట్ సభ్యుడు(లోక్సభ) రాజా రామ్సింగ్ అన్నారు. స్థానిక న్యూకాలనీ రోటరీ హాల్లో ఆదివారం నిర్వహించిన ఆదివాసీ సంఘాల సభలో ఆయన మాట్లాడారు. తప్పుడు క్రిమినల్ కేసులపై పార్లమెంట్లో చర్చించనున్నట్టు తెలిపారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లి, బాధితులకు తక్షణ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. మానవ హక్కుల వేదిక జిల్లా నాయకుడు వి.ఎస్. కృష్ణ్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పేద ఆదివాసీల కోసం కాకుండా, ఇతర స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు చటర్జీపురం కేసు స్పష్టం చేస్తోందన్నారు. చటర్జీపురాన్ని స్వయంగా సందర్శించి, వాస్తవాలను తెలుసుకున్నట్టు తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీసు విభాగం వాస్తవాలు తెలిసినప్పటికీ ఇటువంటి కేసులు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. భారత ప్రభుత్వ గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి ఇ.ఏ.ఎస్. శర్మ పంపిన సంఘీభావ సందేశాన్ని సభలో చదివి వినిపించారు. న్యాయవాది, సామాజిక కార్యకర్త పి.ఎస్.అజయ్కుమార్పై కావాలనే పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేయడం పేద ఆదివాసీ కుటుంబాలకు తీవ్ర అన్యాయం చేసినట్టుగా ఆయన పేర్కొన్నారు. సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగత బనగరరావు మాట్లాడుతూ ఆదివాసీలపై పెట్టిన తప్పుడు కేసులు వెనక్కి తీసుకునే వరకూ తమ పార్టీ ఆదివాసీలకు అండగా నిలబడుతుందన్నారు. తప్పుడు కేసుల ద్వారా జరుగుతున్న నిరంతర వేధింపులు గ్రామాల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని, ఇది ఆదివాసీల జీవనోపాధిని, గౌరవాన్ని, పాలనపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఐ.ఆర్.గంగాధర్, ఆల్ ఇండియా కిసాన్ మహా సభ ప్రతినిధి హరనాథ్, ఆదివాసీ సంఘం జిల్లా నాయకురాలు కేదారి దేవి, సీపీఐ జిల్లా నాయకుడు రాజాన దొరబాబు, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఐకమత్యంతో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి
యలమంచిలి రూరల్ : హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలో ప్రతి ఒక్క హిందువుపై ఉందని శ్రవణ చైతన్యానంద చిన్న స్వామీజీ అభిప్రాయపడ్డారు. ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు. మున్సిపాలిటీ పరిధి సోమలింగపాలెంలో జరిగిన హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యసించారు. ప్రపంచానికి భారతదేశం విశ్వ గురువు లాంటిదన్నారు. హిందువులంతా ఐక్యంగా ఉండాలన్నారు. నేటి తరం పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించాలన్నారు. పలువురు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు హిందూ సమ్మేళనం ఆవశ్యకతను వివరించారు. దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తూ హైందవ ధర్మాన్ని కాపాడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు అందరూ మద్దతివ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. హైందవ సమాజం ప్రతి ఒక్కరి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. దేశంలో హిందువులు, హిందూ ధర్మం, విశ్వాసాలపై జరుగుతున్న దాడులపై ఉదాసీనత పనికిరాదన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యం పనిచేస్తున్న సాంస్కృతిక కళాకారులు, భజన, కోలాట గురువులను సత్కరించారు. కార్యక్రమానికి ముందు సోమలింగపాలెం గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. చిటికెల భజనలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానికులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ ఆంధ్ర ప్రాంత సంయోజకులు తిరుపతయ్య,రాష్ట్ర సేవికా సమితి ప్రాంత సహకార్యవాహిక లింగం ఉజ్వల,హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు ఏవీ రెడ్డి నాయుడు, సామాజిక సమరసత ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ శరగడం సత్యనారాయణ, యల్లపు శ్రీను, కర్రి గంగాధర్ పాల్గొన్నారు.శ్రవణ చైతన్యానంద చిన్న స్వామీజీ -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
బుచ్చెయ్యపేట: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. చెరకు కాటా వద్ద అనకాపల్లికి చెందిన ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసి, వారి నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. యలమంచిలి రూరల్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొడ్డు శ్రీనివాస్ను వరుసగా రెండోసారి నియమిస్తూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం యలమంచిలిలో ఉన్న ఆయన స్వగృహంలో ఆ పార్టీకి చెందిన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జి తనకాల అనంతరావు,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంవీఆర్ రాహుల్,దొడ్డి రవి,రావి రామసత్యం, నాగమంత్రి సాయి, సుందరపు ఈశ్వర్రావు పాల్గొన్నారు. -
అక్రమ క్వారీలో మళ్లీ తవ్వకాలు
రోలుగుంట: మండలంలోని వెదుళ్లవలసలో అధికారులు దాడులు చేసి కంప్రెసర్, కాలం చెల్లిన మెటీరియల్ సీజ్ చేసిన క్వారీలో ఆదివారం మళ్లీ యథాతథంగా తవ్వకాలు జరిపారు. క్వారీపై ఫిర్యాదు రావడంతో శుక్రవారం అధికారులు దాడులు చేసి, కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే వారి ఆదేశాలను భేఖాతరు చేస్తూ క్వారీ లీజుదారుడు ఆదివారం నుంచి మళ్లీ కార్యకలాపాలను కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన ఫిర్యాదుదారుడు బంటు రాజు కార్వీ వద్దకు వెళ్లి పరిశీలించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ క్వారీలో పనులు ప్రారంభించారని ఆరోపించారు. అధికారుల దాడులు చేయడం ఉత్తుత్తిదేనా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని ఆయన కోరారు. -
నాడు వేసిన పునాదులే..
నాడు వేసిన పునాదులే..నేడు అభివృద్ధి చిహ్నాలుగా తలెత్తుకు నిలుస్తున్నాయి...గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమైన సచివాలయ భవనాలు...పాఠశాల వసతి గృహాలు, సామాజిక భవనాలు నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. నాడు ప్రతిపక్షంలో ఉండగా సచివాలయ భవనాల నిర్మాణాలపై దుమ్మెత్తి పోసిన కూటమి నేతలు నేడు వాటి ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం గమనార్హం. పేరు మార్చినా గత ప్రభుత్వం నిర్మించిన భవనాల్లోనే కొనసాగించక తప్పని పరిస్దితి నెలకొంది. సచివాలయాలు అన్ని సదుపాయాలతో నిర్మించిన ఘనత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది.నక్కపల్లి: మండల కేంద్రం నక్కపల్లిలో గత ప్రభుత్వ హయాంలో మంజూరై నిర్మాణం పూర్తి చేసుకున్న కేజీబీవీ టైప్4 బాలికల వసతి గృహన్ని నేడు ప్రారంభించనున్నారు. మండల కేంద్రం నక్కపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికల వసతి కోసం గత ప్రభుత్వం సుమారు రూ.3 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8,9,10 తరగతులకు చెందిన స్థానిక విద్యార్థులకు రాత్రిపూట ఇక్కడ వసతి కల్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో చదువుకుని ఇళ్లకు వెళ్లకుండా ఈ వసతి గృహంలో ఆశ్రయం పొందొచ్చు. భోజన వసతి సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని గత వైస్సార్సీపీ ప్రభుత్వం కల్పించింది. అన్ని హంగులతో కూడిన వసతి గృహాన్ని నిర్మించేందుకు నిధులు విడుదల చేయడంతో ఉపమాక రోడ్డులో దీన్ని నిర్మించారు. నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల్లో అదనపు భవనాలు, ఆకర్షణీయమైన తరగతి గదులు, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, ఆధునిక వసతులతో కూడిన మరుగుదొడ్లు, ఆట స్థలం, డైనింగ్ హాలు నిర్మించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు ముందు చూపుతో ఉన్నత పాఠశాలల్లో చదివే స్థానిక విద్యార్థుల కోసం ఈ వసతి గృహాన్ని నిర్మించింది. అప్పటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా నేటికి ఈ భవనం పూర్తయింది. సోమవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. రూ.40 లక్షలతో సచివాలయం... ఉపమాకలో సుమారు రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని కూడా మంత్రులతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభమైన సచివాలయం పూర్తయి ఏడాదికిపైనే అవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దీన్ని ప్రారంభించలేదు. అయితే పెద్ద గ్రామమైన ఉపమాకలో సచివాలయం, సామాజిక భవనంలో సరైన వసతులు లేని చోట నిర్వహిస్తున్నారు. నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉన్న ఈ భవనాన్ని ప్రారంభించక తప్పలేదు. సచివాయాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు వృధా చేస్తున్నారని ప్రతిపక్షంలో ఉన్పప్పుడు విమర్శలు చేసిన కూటమి నేతలే ఇప్పుడు గత ప్రభుత్వ నిధులతో నిర్మించిన సచివాలయాలకు శంకుస్థాపన చేయడానికి రావడం విశేషం. పేరు మార్చినా గత ప్రభుత్వం నిర్మించిన భవనాల్లోనే కొనసాగించక తప్పని పరిస్దితి నెలకొంది. సచివాలయాలు అన్ని సదుపాయాలతో నిర్మించిన ఘనత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. ఒకనాడు పలు పంచాయతీలు నూతన భవనాలకు నోచుకోని దుస్దితి ఉండేది. శిథిల భవనాల్లోను, పెచ్చులు రాలుతున్న భవనాల్లోను పెంకుల షెడ్లలోను పంచాయతీ కార్యకలాపాలు, సమావేశాలు నిర్వహించాల్సి వచ్చేది. కార్యదర్శికి సైతం ప్రత్యేక గది లేకపోవడంతో సామాజిక భవనాల్లోను రచ్చ బండల వద్ద విధులు నిర్వహించేవారు. 2019లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అన్ని హంగులతో కూడిన సచివాలయ భవనాలను నిర్మించారు. కార్యదర్శితో సహా 12 ప్రభుత్వ శాఖల సిబ్బందిని నియమించి వారికి ప్రత్యేకంగా చాంబర్లు సైతం ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు వివిధ అవసరాల కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సచివాలయాల్లోనే అన్ని సేవలు పొందేవారు. గత ప్రభుత్వం నాటిన సచివాలయ విత్తనం నేడు మహావృక్షాలై ప్రజలకు సేవలందిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ సచివాలయాలపేరు మార్చేసి స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు అని పెట్టింది. గత ప్రభుత్వ అభివృద్ధిని సేవలను ప్రజల హృదయాల్లో నుంచి చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం వీటిని సచివాలయాలుగానే పరిగణిస్తున్నారు. అవే సచివాలయాలను కూటమి మంత్రులు సైతం ప్రారంభోత్సవాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటి ప్రభుత్వ కార్యకలాపాలకు అవే దిక్కయ్యాయని పలువురు పేర్కొంటున్నారు. నాడు అభివృద్ధి పనులకు నిధులు.. నేడు ప్రారంభోత్సవాలు జగన్ ప్రభుత్వంలో ముందుచూపుతో నిర్మించిన భవనాలు నేడు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా సేవలు -
సింహాద్రి ఎన్టీపీసీ కొత్త బాస్ ‘అయస్కాంత జెనా’
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ బిజినెస్ యూనిట్ నూతన హెడ్ ఆఫ్ ప్రాజెక్ట్గా అయస్కాంత జెనా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ 14 నెలల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా పనిచేసిన సమీర్ శర్మ ఢిల్లీలోని ఐటీ విభాగానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సికింద్రాబాద్ ఈఎన్జీజీ ప్లానింగ్ సీజీఎంగా పనిచేస్తున్న జెనా ఇక్కడకు బదిలీపై వచ్చారు. నూతన హెచ్వోపీగా బాధ్యతలు చేపట్టిన జెనాకు ప్లాంట్ అధికారులు ఘనస్వాగతం పలికారు. 1990లో ఎన్టీపీసీలో చేరిన ఆయనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టాస్క్ ఫోర్స్ కార్యకలాపాల్లో అపార అనుభవం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింహాద్రి ఎన్టీపీసీలో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ, ప్రాజెక్టును ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. -
అచ్యుతాపురం కేంద్రంగా గ్రావెల్ దందా
అచ్యుతాపురం: జిల్లాలో గ్రావెల్ దందాకు పెట్టింది పేరు యలమంచిలి నియోజకవర్గం. ఈ ప్రాంతంలో ఉన్న ఎస్ఈజడ్ పరిధిలోని నూతన కంపెనీలకు అవసరమైన గ్రావెల్ సరఫరాతో పాటు, రోడ్డు విస్తరణ పనులకు గ్రావెల్కు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో రాత్రి వేళల్లో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. ముఖ్యంగా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో గ్రావెల్ తవ్వకాలను స్థానికులు అడ్డుకుంటున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా శనివారం రాత్రంతా కొండకర్ల–అందలాపల్లి కొండ వద్ద గ్రావెల్ తవ్వేస్తున్నారని తెలుసుకున్న స్థానికులు ఆదివారం ఉదయం అడ్డుకునేందుకు తరలివెళ్లడంతో అక్కడి నుంచి వాహనదారులు ఉడాయించారు. ఈ తతంగంలో జిల్లాలోని ఆర్అండ్బీ జేఇగా పనిచేస్తున్న ఒక అధికారి బంధువు చక్రం తిప్పడం కొసమెరుపు. పర్యాటక ప్రాంతానికి పెనుముప్పు... అచ్యుతాపురం మండలంలో ఉన్న కొండకర్ల ఆవను ఎకో టూరిజంగా ప్రకటించారు. అంతే కాకుండా ఆవ సరిహద్దులో చిత్తడి నేలల అభివృద్ధి పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. సుమారు రెండు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండకర్ల–వాడ్రాపల్లి ఆవకు ఉన్న ప్రత్యేకత విదేశీ పక్షుల తాకిడి. ఆవలో సంచరించే పక్షులు సమీపంలో ఉన్న కొండల పొదల్లో రాత్రి వేళ తలదాచుకుంటాయి. అందలాపల్లి కొండపై నెమళ్లు, పక్షుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ కొండను సంరక్షించాల్సిన బాధ్యత పర్యాటక శాఖతో పాటు, రెవెన్యూ, మైనింగ్ శాఖలకు ఉంది. సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అందలాపల్లి కొండలో కొంత విస్తీర్ణాన్ని గ్రామసభ ఆమోదం లేకుండా లూజ్ సాయిల్ తవ్వకాలకు అనుమతిస్తూ లీజు మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. యంత్రాలతో తవ్వకాలు... అందలాపల్లి కొండపై కొద్ది రోజుల నుంచి యంత్రాల సాయంతో గ్రావెల్ను తవ్వుతున్నారు. రెండు పొక్లెయినర్లు, పదికి పైగా లారీల సాయంతో ఇక్కడి గ్రావెల్ను తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్న ఆర్అండ్బీ జేఈ బంధువు లీజుల హక్కులున్నాయంటూ బుకాయించడం గమనార్హం. కొండకు ఒక వైపున మంచి నీటి ట్యాంక్ ఉంది. యంత్రాల సాయంతో కొండను తవ్వడం వల్ల ఆ ప్రాంతమంతా బుగ్గిమయమైంది. కోర్టును ఆశ్రయించేందుకు స్థానికులు సన్నద్ధం.. అందలాపల్లి కొండను గ్రావెల్ తవ్వకాలకు లీజు ఇవ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై కోర్టుని ఆశ్రయించేందుకు సన్నద్ధం అవుతున్నారు. కేవలం లూజ్ సాయిల్ మాత్రమే తవ్వుకునే లీజు ఉందని, దానికి కూడా ఎటువంటి గ్రామ సభ ఆమోదం లేదని వారు చెబుతున్నారు. యంత్రాల సాయంతో బండరాళ్లను పెకిలించడం వల్ల కొండపై ఉండే పక్షులు, నెమళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయని, తద్వారా కొండకర్ల టూరిజానికి తీవ్ర విఘాతం ఏర్పడనుందని వారు వాపోతున్నారు.కొండకర్ల అందలాపల్లి కొండపై తవ్వకాలు జరిపిన ప్రాంతంవీఆర్ఓను పంపించాం..అందలాపల్లి కొండపై గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీఆర్ఓను పంపించాం. వాస్తవానికి అక్కడి ఒక జేసీబీ ఉంది. మైనింగ్ వాళ్లు కేటాయించిన స్థలంలో తవ్వకాలు జరిపితే మేం అడ్డుకోం. పరిధి దాటితే మాత్రం చర్యలుంటాయి. లీజు దారులు ఇంకా తవ్వకాలు మొదలు పెట్టలేదని చెబుతున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో అక్కడి పరిధిని పరిశీలిస్తాం. – వరహాలు, తహసీల్దార్గ్రామ సభ ఆమోదం లేదు.. అందలాపల్లి కొండపై గ్రావెల్ తవ్వకాలకు గ్రామ సభ ఆమోదం లేదు. పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది. కేవలం లూజ్ సాయిల్ తవ్వుకునేందుకు స్థానికుల ఆమోదం లేకుండా అనుమతిచ్చారు. యంత్రాలతో కొండను తవ్వేస్తున్నారు. దీనివల్ల టూరిజం ప్రాంతమైన ఆవ నుంచి వచ్చే పక్షులు, నెమళ్లు వలస వెళ్లిపోతున్నాయి. –శివ, స్థానికుడు అడ్డుకున్న కొండకర్ల–హరిపాలెం వాసులు చక్రం తిప్పుతున్న ఆర్అండ్బీ జేఈ బంధువు పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ విభాగాలు పర్యాటక ప్రాంతం కొండకర్ల ఆవకు పెనుముప్పు -
సరకు రవాణాకు ప్రత్యేక ప్రణాళికలు
సాక్షి, విశాఖపట్నం: రైల్వే వ్యవస్థలో సరకు రవాణా సజావుగా జరిగేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి.. వాటిని పక్కాగా అమలు చేసేందుకు కృషి చెయ్యాలని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్సీసీఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ అధికారుల్ని సూచించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సీఏవో అంకుష్ గుప్తా, వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా, ఇతర అధికారులతో కలిసి విశాఖలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ సరకు రవాణాలో సంస్థాగత సమన్వయాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యానికి వీలైనంత త్వరగా చేరుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా డీఎఫ్సీసీఐఎల్ వార్షిక అభివృద్ధి నివేదిక పుస్తకాన్ని ఆవిష్కరించి.. రైల్వే అధికారులకు అందించారు. అధికారులతో డీఎఫ్సీసీఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ -
ఇప్పటి రాజకీయ ధోరణులకు సరిపోను
● అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ● మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీతంపేట: వైజాగ్ బ్రాహ్మిణ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ‘కాఫీ విత్ ఉండవల్లి అరుణ్ కుమార్’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని తన రాజకీయ ప్రస్థానం, అనుభవాలు, సమకాలీన అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పన్నెండేళ్లుగా తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఉండవల్లి స్పష్టం చేశారు. మారుతున్న ఇప్పటి రాజకీయ ధోరణులకు తాను సరిపోనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఆధ్యాత్మిక అంశాలపై స్పందిస్తూ.. ‘హిందుత్వం అనేది కేవలం మతం కాదు, అది ఒక సనాతన ధర్మం. అది ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. మానవ జీవితంలో ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు భగవద్గీతలో సమాధానాలు లభిస్తాయని ఆయన తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన రాజకీయ చాతుర్యం దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. అలాగే మాజీ ఎంపీ ద్రోణంరాజు సత్యనారాయణ సేవలను కొనియాడుతూ, ఢిల్లీలో ఆయన అందరికీ అందుబాటులో ఉండేవారని, కులమతాలకు అతీతంగా ఎంతోమందికి రాజకీయ భిక్ష ప్రసాదించారని గుర్తుచేసుకున్నారు. బ్రాహ్మణులు రాజకీయంగా రాణించాలంటే తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో ద్రోణంరాజు శ్రీవాత్సవ, టీఎస్ఆర్ ప్రసాద్, చెరువు రామకోటయ్య, వేదుల హనుమంతరావు, కాళీ నరసింహం, కావూరి చరణ్ కుమార్, శ్రీరంగం దివాకర్, శంకర్ నీలు, నండూరి సుబ్రహ్మణ్యం, నరసింహమూర్తి, టీఎస్కే అరుణ్ కుమార్, రాచకొండ దశరథ రామయ్య తదితర బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు. -
నాడు వద్దన్నవే... నేడు దిక్కయ్యాయి
గత ప్రభుత్వంలో సచివాలయాలు నిర్మిస్తుంటే ప్రతిపక్ష టీడీపీ తీవ్రమైన విమర్శలు చేశారు. కోట్లు వృథా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి అవే దిక్కయ్యాయి. సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది.అన్ని రకాల సేవలు సచివాలయంలో గ్రామంలోనే పొందే అవకాశం కలిగింది. మండల కేంద్రానికి వెళ్లే బాధలు తప్పాయి.వైఎస్సార్సిపి ప్రభుత్వం ప్రారంభించిన సచివాలయ వ్యవస్ద పేరుమార్చాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల్లో మాత్రం సచివాలయాల వ్యవస్ద బలంగా నాటుకుపోయింది. పేర్లు మార్చినా సేవలను మార్చడం ఈజీ కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవస్దను మరింత బలోపేతం చేయాలి అంతే గాని నిర్వీర్యం చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. –వీసం రామకృష్ణ, నక్కపల్లి -
బాక్సింగ్ క్రీడాకారులకు అభినందన
బాక్సింగ్ క్రీడాకారులను అభినందిస్తున్న అవంతి కాలేజీ ప్రిన్సిపాల్ మోహనరావు, శాప్ కోచ్ అబ్బు నర్సీపట్నం : కాకినాడ జిల్లా, పిఠాపురంలో జరిగిన స్టేట్ సీనియర్, యూత్ ఉమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో అవంతి ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు మెడల్స్ సాధించారు. జి.సాయి 52 కేజీల విభాగంలో కాంస్య పతకం, వై.హాసిని 64 కేజీల విభాగంలో కాంస్యపతకం సాధించారు. వీరిని అవంతి కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్రావు, హెచ్వోడీ గోవింద్, శాప్ కోచ్ అబ్బు అభినందించారు. బాక్సింగ్లో మరింత శిక్షణ పొందేందుకు వీలుగా కాలేజీ ప్రిన్సిపాల్ మోహనరావు స్పోర్ట్స్ కిట్స్ను అందజేశారని కోచ్ అబ్బు తెలిపారు. -
సారా బట్టీలపై పోలీసుల విస్తృత దాడులు
స్వాధీనం చేసుకున్న బెల్లం ఊట, వంట పాత్రలతో ఎస్ఐ రాజారావు, సిబ్బంది నర్సీపట్నం: అక్రమ మద్యం, నాటు సారా నిర్మూలనే లక్ష్యంగా సీఐ ఎల్.రేవతమ్మ ఆధ్వర్యంలో ఎస్ఐ రాజారావు, సిబ్బంది మండలంలో సారా బట్టీలపై ఆదివారం విసృ్ృతతంగా దాడులు నిర్వహించారు. పాత లక్ష్మీపురం, గదబపాలెం గ్రామ శివార్లలో ఆకస్మిక సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. గ్రామ శివార్లోని జీడి తోటల్లో రహస్యంగా నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 3,200 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. సారా కాచడానికి ఉపయోగిస్తున్న డ్రమ్ములు, పాత్రలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నాటు సారా తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజారావు హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
బుచ్చెయ్యపేట : మండలంలో గల దిబ్బిడి గ్రామానికి చెందిన కూలి పెదిరెడ్ల పోతురాజు(45) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెల 26వ తేదీన సబ్బవరం వద్ద వంగలి గ్రామంలో సరుగుడు తోట నరకడానికి ద్విచక్ర వాహనంపై పోతురాజు కూలి పనులకు వెళ్లాడు. అదే రోజు కూలి పనులు ముగించుకుని తిరిగి ఇంటికొస్తుండగా చోడవరం బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ వద్ద లారస్ కంపెనీ బస్సు ఢీకొంది. పోతురాజు కాళ్లపై నుంచి బస్సు వెళ్లడంతో ఆయన రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. విశాఖ కేజిహెచ్లో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం మృతి చెందాడు. కూలి పనుల కోసం వెళ్లిన పోతురాజు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గెడ్డ పొరబోకులో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
పట్టించుకోని అధికారులు రోలుగుంట: మండలంలోని ఎం.కె.పట్నం రెవెన్యూ పరిధిలో గెడ్డ పొరంబోకు భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఎం.కె.పట్నం రెవెన్యూ పరిధి 121–3 సర్వే నంబర్లో వరాహ నదిని ఆనుకుని ఉన్న గెడ్డ పోరంబోకు భూమిలో గత నాలుగు రోజులుగా ప్లొకెయిన్తో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. పది నుంచి పదిహేను టాక్టర్ల లో లోడు చేసి గైరంపేట, బి.బి.పట్నం తదితర ప్రాంతాలకు తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. పగలురాత్రి తేడాలేకుండా మట్టి తవ్వకాలు, తరలింపు జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ సర్వే నంబరు పరిధిలో సుమారు 230 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. స్థానికంగా ఉండే కొంతమంది నాయకుల అండతోనే ఇంత దర్జాగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. టాక్టరు మట్టిలోడుకు రూ.700 నుంచి రూ.800 వరకూ వసూలు చేస్తున్నారు. వీఆర్వో వి.రాజులమ్మను సంప్రదించగా గెడ్డపోరంబోకులో తవ్వకాలు జరపకూడదని తెలిపారు. మట్టి తవ్వకాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని తెలిపారు. -
విశాఖ తీరాన ఎగసిన కార్మిక కెరటం
జగదాంబ(విశాఖ): రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్మిక లోకంతో విశాఖ నగరం జనసంద్రమైంది. సీఐటీయూ అఖిల భారత మహాసభల సందర్భంగా నిర్వహించిన భారీ ప్రదర్శనతో నగరం ఎరుపెక్కిపోయింది. జగదాంబ సెంటర్ నుంచి ఇందిరా మున్సిపల్ స్టేడియం వరకు జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది కార్మికులు పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తారు. కార్మిక చట్టాలను అమలు చేయాలి.. లేబర్ కోడ్లను రద్దు చేయాలి అంటూ చేసిన నినాదాలతో విశాఖ వీధులు హోరెత్తాయి. జీవీఎంసీ 39వ వార్డులోని ఇందిరా మున్సిపల్ క్రికెట్ స్టేడియంలో సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ కె. హేమలత అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య నాయకులు తపన్ సేన్, కరీం, గఫూర్, నర్సింగరావు, సాయిబాలు ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. 2019లో పరాజయం పాలై, 2024లో మారతానంటూ ప్రజల కాళ్లు పట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మళ్లీ పాత పద్ధతులనే అవలంబిస్తున్నాడని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో చేతులు కలిపి కార్మికులను ఉక్కుపాదంతో తొక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 50 లక్షల మంది కార్మికులకు చట్టబద్ధమైన వేతన సవరణ జరగడం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్ సౌకర్యాలు లేకపోవడం శోచనీయమ న్నారు. దేశాన్ని అమ్మడమే పనిగా పెట్టుకున్న మోదీకి చంద్రబాబు మద్దతు తెలపడం కార్మికులకు చేస్తున్న అన్యాయమని, కార్మిక మంత్రులు కేవలం దిష్టిబొమ్మల్లా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. అంగన్వాడీల సమస్యలు తీరుస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోని ఎమ్మెల్యేలను, ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిన నారా లోకేష్ను నాయకులు ప్రశ్నించారు. అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన శాఖలోని నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల కష్టాలను ఎందుకు చూడటం లేదని నిలదీశారు. మార్పు కోసం పనిచేయాల్సిన పవన్ కల్యాణ్, సనాతన ధర్మం పేరిట కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కనీస వేతన చట్టం–2026ను వెంటనే అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని సభ తీర్మానించింది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. 2025 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులకు ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12న జరగబోయే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. -
ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు
ఆత్మహత్య చేసుకునేందుకు శారదానది వద్దకు వచ్చిన నాగరత్నంతో మాట్లాడుతున్న కానిస్టేబుల్ అనకాపల్లి: శారదానదిలో పడి ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న ఓ వృద్ధురాలిని పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చింతావారి వీధికి చెందిన పల్లి నాగరత్నం(70) అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తి చెంది శారదానదిలో పడి మృతి చెందేందుకు ఆదివారం బయలుదేరింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని, కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొంత కాలంగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకునేందుకు నదివద్దకు వచ్చానని ఆమె తెలిపినట్టు పోలీసులు చెప్పారు. తారుమారు సంతకు ఏర్పాట్లు జి.మాడుగుల: సంక్రాంతి పండగ పురస్కరించుకుని జి.మాడుగులలో వెంకటరాజు ఘాట్ వద్ద పొలాల్లో నిర్వహించే తారుమారు సంత ఏర్పాట్ల పనులు ప్రారంభమయ్యాయి. వీటిని ఆదివారం మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, సర్పంచ్ కిముడు రాంబాబు, ఎంపీటీసీ మత్స్యరాస విజయకుమారి, సంత నిర్వహణ కమి టీ నాయకుడు మత్స్యరాస నాగరాజు ప్రారంభించారు. జనవరిలో తొలి మంగళవారం జరిగే ఈ తారుమారు సంత నిర్వహిస్తారు. -
సచివాలయం అద్దె చెల్లింపు
లోపూడి సచివాలయ అద్దె నగదును అందిస్తున్న సెక్రటరీ రామిరెడ్డి బుచ్చెయ్యపేట: మండలంలోని లోపూడి సచివాలయ అద్దెను అధికారులు చెల్లించారు. అద్దె చెల్లించకపోవడంతో సచివాలయానికి తాళాలు అనే శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురించిన వార్తకు మండల అధికారులు,సచివాలయ ఉద్యోగులు స్పందించారు. సచివాలయ భవన యజమాని కుటుంబ సభ్యులకు అద్దె నగదును నాయకుల సమక్షంలో సచివాలయ సెక్రటరీ రామిరెడ్డి అందజేశారు. సచివాలయానికి వేసిన తాళాలను భవన యజమాని నుంచి సచివాలయ సెక్రటరీ తిరిగి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. -
వాల్తేరు చుట్టూరాజకీయం!
● జోన్ అభివృద్ధికే గండం● శ్రీకాకుళం జిల్లా మొత్తం కొత్త జోన్లో ఉంచాలంటూ ప్రతిపాదనలు ● ఇచ్ఛాపురం సెక్షన్ని ఇవ్వబోమంటున్న ఈస్ట్కోస్ట్ జోన్ ● తేలే వరకూ గెజిట్ ఇవ్వొద్దంటూ రైల్వే బోర్డుకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి ● ఆదాయం వచ్చే కేకే లైన్ వైజాగ్కు ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ తనూజ వినతిగెజిట్కు మోకాలడ్డుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుసాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డివిజన్లో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కుంపటి రగుల్చుతోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న డివిజన్ని కొనసాగించాలంటూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంటే.. టీడీపీ ఎంపీలు మాత్రం కాలగర్భంలో కలిపేసేందుకు కుట్రపన్నుతున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు పక్క రాష్ట్రానికి అప్పగించి.. ప్రసాదం చేతులో పెడుతుంటే ఆహా ఓహో అంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలు.. తమకు రైల్వేకు అందే ఆదాయ మార్గం వద్దు.. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ గెజిట్ రాకుండా అడ్డుపడుతున్నారనే విమర్శలొస్తున్నాయి. ఇచ్ఛాపురం వరకూ విశాఖ డివిజన్లో ఉంచాలంటూ ఎంపీ రామ్మోహన్రావు పట్టుబడుతుంటే.. ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ అధికారులు దాన్ని వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. మరోవైపు డివిజన్కు, జోన్కు ఆదాయం తీసుకొచ్చే కేకే లైన్ని రాయగడలో కాకుండా విశాఖలో కొనసాగించాలంటూ అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి పట్టుబడుతున్నారు. రామ్మోహన్ రాజకీయ మనుగడ కోసం.. దక్షిణ కోస్తా జోన్లో కీలక ఆదాయ మార్గమైన కేకే లైన్ వాల్తేరు డివిజన్లో ఉండాలని ఉత్తరాంధ్రవాసులు కోరుతున్నారు. దీంతో పాటు పలాస– ఇచ్ఛాపురం సెక్షన్ కూడా ఇక్కడే ఉండాలని అడుగుతున్నారు. కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఈ విషయంలో కేవలం శ్రీకాకుళం ఎంపీగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తన భవిష్యత్తు రాజకీయ మనుగడ కోసం కేవలం పలాస– ఇచ్ఛాపురం సెక్షన్ని మాత్రమే పట్టుకొని వేలాడుతున్నారు. ఇచ్ఛాపురం వరకు దక్షిణ కోస్తా జోన్లో ఉంచాలంటూ పదే పదే కోరుతున్నారు. అది తేలే వరకూ గెజిట్ ఇవ్వొద్దని కోరినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ మాత్రం అంగీకరించడం లేదు. ఇచ్ఛాపురం సెక్షన్ వరకూ ఇవ్వాలంటే రాయగడ–నౌపడ లూప్ సెక్షన్ తమకు ఇవ్వాలంటూ షరతు విధించింది. పలు దఫాల చర్చలు విఫలమవుతూనే ఉన్నా.. రామ్మోహన్ మాత్రం తన రాజకీయ భవిష్యత్తు కోసమే తప్ప.. జోన్ అభివృద్ధి కోసం కాంక్షించకపోవడం గర్హనీయమంటూ పలువురు దుయ్యపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా ఉన్న జోన్ ఏర్పడుతున్నప్పుడు.. ఈ ప్రాంతం అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పోరాడాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలే తప్ప.. రాజకీయ స్వలాభం కోసం ఆలోచించకూడదు. ఇచ్ఛాపురం సెక్షన్ కూడా విశాఖ డివిజన్లో ఉండాల్సిందే. అదేవిధంగా ఆదాయం తీసుకొచ్చే కేకేలైన్ మొత్తం ఇక్కడే ఉంటే.. భవిష్యత్తులో జోన్ మరింత ముందుకు వెళ్తుందన్న విషయం టీడీపీ ఎంపీలు గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 2న రావాల్సిన గెజిట్.. పరిశీలనల్లో లేని విజ్ఞప్తుల వల్ల ఆగిపోయింది. ఇది బాధాకరం. కేకే లైన్ కోసం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కలిసి పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. త్వరగా జోన్కు సంబంధించిన గెజిట్ విడుదల చెయ్యాలని కోరుతున్నాం. – గుమ్మ తనూజరాణి, అరకు ఎంపీ అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాల్తేరు డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్కు వరంలాంటిది. ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ.17 వేల కోట్లు కాగా, ఇందులో రూ.10 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. దేశంలోనే సుమారు 300 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. వాల్తేరు డివిజన్ పరిధిలో ఏటా సరకు రవాణా ద్వారా వచ్చే ఆదాయమంతా.. ఇప్పుడు రాయగడ డివిజన్కు సొంతమవుతుంది. జోన్ అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా కేకే లైన్ వాల్తేరు పరిధిలో అంటే త్వరలో ఏర్పడే విశాఖ డివిజన్లో ఉండాల్సిందేనని వైఎస్సార్సీపీ ప్రతినిధులు, డివిజన్ అధికారులు చెబుతున్నారు. కేకే లైన్ లేకపోతే.. విశాఖ డివిజన్ ఆదాయం రూ.3 వేల కోట్లు కూడా దాటే అవకాశం లేదు. దీంతో కొత్త జోన్ అభివృద్ధి సక్రమంగా జరిగే సూచనలు లేవని ఆందోళన చెందుతున్నారు. దీనిని కూడా రాజకీయం కోసం చంద్రబాబు ప్రభుత్వం వాడుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బైకు చోరీ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
విలేకర్లతో మాట్లాడుతున్న సీఐ రామకృష్ణ, ఎస్ఐ విభీషణరావు ఎస్.రాయవరం: బైకు దొంగతనాల్లో కీలక నిందితుడిగా ఉంటూ ఏడాదికాలంగా తప్పించుకుని తిరుగుతున్న షబ్బీర్ అలీయాస్ బసీర్ను శనివారం అడ్డురోడ్డు ప్లైవర్ వద్ద పట్టుకున్నట్టు అడ్డురోడ్డు సీఐ ఎల్.రామకృష్ణ తెలిపారు. గత ఏడాది జనవరిలో రేవు పోలవరం గ్రామంలో రెండు బైకులు చోరీకి గురికావడంతో అప్పట్లో నమోదు చేసిన కేసులో ముగ్గురు నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి 8 బైకులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ప్రధాన నిందితుడు ఇంతవరకు తప్పించుకుని తిరిగి ఈ రోజు పట్టుబడ్డాడన్నారు. నిందితుడు బసీర్పై 35 దొంగతనం కేసులు, గంజాయి కేసు కూడా నమోదై ఉందన్నారు. ఈ మేరకు అతనిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
గొల్లపేటలో కిడ్నీ వ్యాధిపై స్క్రీనింగ్
కోటవురట్ల: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గొల్లపేటలో కిడ్నీ వ్యాధిపై స్క్రీనింగ్ నిర్వహించినట్టు డిప్యూటీ డీఎంహెచ్వో వీరజ్యోతి తెలిపారు. కోటవురట్ల శివారు గొల్లపేటలో కె.వెంకటాపురం పీహెచ్సీ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్వో మాట్లాడుతూ ఇక్కడ ఎక్కువగా కిడ్నీ కేసులు ఉన్నట్టు ఫిర్యాదు రావడంతో జిల్లా కలెక్టర్ వైద్య శిబిరం నిర్వహించి స్క్రీనింగ్ చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. గొల్లపేటలోని ప్రతి ఒక్కరి నుంచి రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయనున్నట్టు తెలిపారు. ప్రధానంగా లక్షణాలు ఉన్న వారికి ప్రిలిమినరీ పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేయనున్నట్టు తెలిపారు. గ్రామంలో 5 నుంచి 10 మంది కిడ్నీ వ్యాధి మొదటి స్టేజ్లో ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఇది ఎందుకు వచ్చిందనేది పరీక్షల ద్వారా నిర్ధారణ కానుందన్నారు. సాధారణంగా పేదలు పనిలోకి వెళ్లి అలసిపోయి నొప్పులు తగ్గేందుకు మందుల షాపులో మాత్రలు కొని వేసేసుకుంటారని ఇలా ఎక్కువగా వినియోగించడం వల్ల, నీళ్లు ఎక్కువ తాగకపోవడం వల్ల, యూరినల్ వ్యాధులు తదితర కారణాలతో కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందన్నారు. సమస్య వచ్చినపుడు పౌష్టికాహారం తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, నాన్వెజ్కు దూరంగా ఉండడం చేయాలన్నారు. రిపోర్ట్ వచ్చాక తదుపరి ఏం చర్యలు తీసుకోవాలో నిర్ధారణ చేస్తామని తెలిపారు. జెడ్పీటీసీ సిద్ధాబత్తుల ఉమాదేవి మాట్లాడుతూ గొల్లపేటలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించి జెడ్పీ సమావేశంలో సమస్యను లేవనెత్తినట్టు తెలిపారు. కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఆమె వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి పరీక్షలు చేశారని, అందులో సమస్య లేనట్టు గుర్తించారన్నారు. కె.వెంకటాపురం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ కిషోర్కుమార్ కూడా సిబ్బందితో వైద్య పరీక్షలు చేసి స్థానికులకు అవగాహన కల్పించారన్నారు. ఇంకేదైనా సమస్యపై ఈ వ్యాధి వస్తోందా? అన్న కోణంలో అన్ని పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి డాక్టర్ లక్ష్మీశ్రీనివాస్, ఎంపీడీవో చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ నాయకుడు సిద్ధాబత్తుల సత్యనారాయణ, ఉప సర్పంచ్ గవ్వా రాధాకృష్ణ, కార్యదర్శి రఘురాం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
బావిలో పడి యువకుడి మృతి
అచ్యుతాపురం రూరల్: ఏఆర్ లైఫ్ సైన్స్ పరిశ్రమ ఉద్యోగి మారం నాగరాజు (23) బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. నూకరాజు శనివారం దుప్పితూరు సచివాలయం దగ్గర్లో ఉన్న చేపల చెరువు పక్కన బావిలో ఈత కొట్టడానికి తన స్నేహితులు తెల్లి శివ ప్రసాద్, పొన్నాడ రమేష్, నెమిరెడ్డి హరిబాబు, గోవిందులతో కలిసి వెళ్లాడు. మూడున్నర గంటల సమయంలో రమేష్ నాగరాజు పనిచేస్తున్న కంపెనీకి ఫోన్ చేసి బావిలో ఈతకు దిగిన నాగరాజు కనిపించట్లేదని చెప్పాడు. దీంతో అతని బంధువు మురళీ ఫణీంద్ర వచ్చి బావి దగ్గర వెతికారు. గేలం సహాయంతో గాలించగా సాయంత్రం 5 గంటల సమయంలో నాగరాజు మృతదేహాన్ని బావిలో నుంచి వెతికి బయటకు తీసినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్రశేఖర్రావు, ఎస్ఐ వెంకటరావు తెలిపారు. -
టెండర్లకు ముసుగు.. కొటేషన్లతో దోపిడీ
మహారాణిపేట: కేజీహెచ్లో కంప్యూటర్ల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఈ నెల 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘ఈ–ఫైల్’ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించిన నేపథ్యంలో కేజీహెచ్ యంత్రాంగం హడావుడిగా చేపట్టిన కంప్యూటర్ల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు సహాయ స్థాయి ఉద్యోగులు చక్రం తిప్పి, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు పిలవకుండానే కేవలం కొటేషన్ల ఆధారంగా ఈ కొనుగోళ్లు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో వాస్తవ ధర కంటే రెట్టింపు ధర చెల్లించి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడమే కాకుండా, స్వయంగా కలెక్టర్నే తప్పుదోవ పట్టించారన్న విమర్శలు వినపడుతున్నాయి. బయటపడిన బండారం ఈ–ఆఫీస్ నిర్వహణ కోసం పరిపాలనా విభాగానికి అవసరమైన సుమారు 53 కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రిని మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలకు అంటే ఒక్కొక్క సెట్ను రూ. 60 వేల నుంచి రూ. 90 వేల వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఆస్పత్రి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ సొమ్ము వెచ్చించినా, తీరా ఆ కంప్యూటర్లను అమర్చాక ‘ఈ–ఫైల్’ సాఫ్ట్వేర్ వాటిలో సక్రమంగా పనిచేయకపోవడంతో అధికారుల బండారం బయటపడింది. నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇప్పుడు ఈ–ఆఫీస్ అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వైఫల్యంపై ప్రస్తుతం కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీ వర్గాల్లో వేడివేడిగా చర్చ సాగుతోంది. చక్రం తిప్పిన ఇద్దరు ఉద్యోగులు ధరల పెంపు, నాసిరకం కంప్యూటర్ల సరఫరా, ఫైళ్లపై సంతకాలు చేయించడం వంటి వ్యవహారాల వెనుక ఉన్న ఆ ఇద్దరు ఉద్యోగుల పాత్రపై సహచర సిబ్బంది మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు ప్రశ్నించినప్పుడు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ తప్పు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం కావడమే కాకుండా, అత్యవసరమైన ఈ–ఆఫీస్ సేవలకు ఆటంకం కలిగించిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. -
వార్డు మెంబర్ కాని వ్యక్తిని ఎమ్మెల్యే చేశాం
● మాజీ ఎంపీ పప్పల ● యలమంచిలి నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సుందరపుపై తీవ్ర వ్యాఖ్యలు, సైటెర్లు సాక్షి, అనకాపల్లి: యలమంచిలి నియోజకవర్గ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. యలమంచిలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన యలమంచిలి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో జరిగిన పరిణామాలు రాజకీయ చర్చలకు దారి తీసింది. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్పై పప్పల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాధారణంగా ఇలాంటి సమన్వయ సమావేశాల్లో పార్టీ బలోపేతం, ప్రభుత్వంలో పార్టీ నాయకుల పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరగాల్సి ఉండగా, ఈ సమావేశం మాత్రం పూర్తిగా ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకున్న చేసిన విమర్శలతో సాగింది. ‘కనీసం వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తిని కూటమి పుణ్యమా అని ఎమ్మెల్యేగా గెలిపించాం. గెలిచిన తర్వాత మాత్రం మన నెత్తినే ఎక్కి కూర్చున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత టీడీపీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. అంతేకాకుండా టీడీపీ మాజీ మండల అధ్యక్షులను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుంటున్నారని, వారు గ్రామాల్లో ‘మేము ఎమ్మెల్యే మనుషులం’ అంటూ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారంటూ చలపతిరావు ఘాటుగా మాట్లాడినట్లు సమాచారం. అంతేకాకుండా ఎమ్మెల్యే మిమ్మల్ని వాడుకుంటున్నాడు అంటూ మాజీ మండల అధ్యక్షులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సమావేశంలో కలకలం రేపాయి. ఇటీవల యలమంచిలిలో ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన పిక్నిక్ అంశాన్ని కూడా పప్పల ప్రస్తావించారు. ఆ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ హాజరు కాలేదని, వెళ్లిన వారికి మాత్రం ‘రికార్డింగ్ డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్’ లభించిందంటూ సైటెర్లు వేశారు. అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను గుర్తు చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు రేపాయి. ఈ స్థాయిలో పార్టీ వేదికపైనే ఎమ్మెల్యేపై మాజీ ఎంపీ తీవ్ర విమర్శలు చేయడం పట్ల స్థానిక టీడీపీ నాయకులు షాక్కు గురయ్యారు. ఒకవైపు పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఇలాంటి అంతర్గత విభేదాలు బయటపడటం, మరోవైపు ఎమ్మెల్యే–సీనియర్ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి, యలమంచిలి నియోజకవర్గంలో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది ఆసక్తికరంగా మారింది. -
ఘనంగా తోడపెద్దు ఉత్సవం
నలభై ఏళ్ల తరువాత నిర్వహణరోలుగుంట: గ్రామశాంతి, పాడిపంటల అభివృద్ధి కోరుతూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ పోతల లక్ష్మీ రమణమ్మ ఆధ్వర్యంలో పూర్వపు సంప్రదాయాలను పాటిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ నేత పోతల లక్ష్మీ శ్రీనివాస్ తోడ పెద్దోత్సవాన్ని సుమారు నలభై ఏళ్ల తరువాత నిర్వహించారు. గతంలో ఈ గ్రామంలో తోడపెద్దు ఉండేది. అది మరణించడంతో అప్పటి నుంచి ఈ ఉత్సవ నిర్వహణ నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ గ్రామస్తుల అభిమతం మేరకు సింహాచలం దేవస్థానం నుంచి అక్కడ ఆలయ కమిటీ అనుమతితో తోడపెద్దును గ్రామానికి గురువారం తీసుకొచ్చారు. శుక్రవారం ఉత్సవరాట వేశారు. భజనలు, కోలాటం నిర్వహించారు. రాత్రంతా జాగరణ చేశారు. శనివారం వేకువ జాము నుంచి మధ్యాహ్నం వరకూ భక్తి కీర్తనలు అలపించారు. భక్తులు గోమాతను దర్శించుకొని పూజించుకున్నారు. అనంతరం నిర్వాహకులు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
నిర్లక్ష్యపు మంటలు
సాక్షి, అనకాపల్లి/ రాంబిల్లి (అచ్యుతాపురం) : రాంబిల్లి సెజ్లో లాలం కోడూరులో గల ఎస్వీఎస్ ఫార్మా సంస్థలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదం మరోసారి పరిశ్రమల్లో భద్రతను ప్రశ్నార్థకం చేసింది. భద్రతా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, యాజమాన్యాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫార్మా కంపెనీలో 8 నెలల క్రితం కూడా అగ్ని ప్రమాదం జరిగి విజయనగరానికి చెందిన ఉమామహేశ్వరరావు అనే కార్మికుడు కాలిపోయి క్షతగాత్రుడిగా మిగిలిపోయాడు. ఇప్పటికీ ఒక కన్ను, కాలు పనిచేయలేదు. ఆనాడే సేప్టీ మెజర్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పై అధికారులు చెప్పడం, పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. నాటి నుంచి నేటి వరకూ ఆ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కార్మికులను కాపాడేందుకు తగిన సేప్టీ మెజర్మెంట్స్ లేవు. కనీసం అందులో పనిచేస్తున్న 25 మంది కార్మికుల్లో కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ గానీ లేరు. ఎక్కువగా హెల్పర్లతోనే నడిపిస్తున్నట్టు అందులో పనిచేసే కార్మికులు వాపోతున్నారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ, పరిశ్రమల్లో సేఫ్టీ అంశాలు, పరికరాలపై నిత్యం తనిఖీలు చేయడం వట్టి మాటగానే మారింది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు, నాయకులు తరువాత అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పరిశ్రమలలో భద్రత, ప్రమాదాల నివారణ, రక్షణ అంశాలను జిల్లాకు చెందిన అధికారుల బృందాలు పరిశీలించి, పైఅధికారులకు నివేదికలు ఇచ్చినా వరుసగా ప్రమాదాలు జరగడంతో పారిశ్రామిక రంగ భద్రతలోని డొల్లతనం బయటపడుతుంది. రక్షణ లేని కార్మిక జీవితాలు.. ఫార్మా పరిశ్రమల్లో విధులకు వెళ్లిన కార్మికుల భద్రత గాల్లో దీపంలా మారింది. జిల్లాలో అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్ పరిధిలో పలు రసాయన పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు కూడా లేకపోవడం, సేప్టీ మెజర్స్ పాటించకపోవడం, పరిశ్రమలో శిక్షణ గల ఫైర్ సిబ్బంది లేకపోవడంతోనే అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రమాదాలకు అధిక కారణంగా నిలిచే రియాక్టర్లు బాంబుల్లా పేలుతున్నాయి. ఇక్కడ నిపుణులైన కార్మికులు పనులు చేయాల్సి ఉండగా కనీస అవగాహన లేని టెంపరరీ, కాంట్రాక్ట్ కార్మికులతో పనులు చేయిస్తున్నారు. వారు రియాక్టర్ల ఒత్తిడిని సరైన సమయంలో గుర్తించకపోవడం, కెమికల్ రియాక్షన్ను నివారించడంలో విఫలం కావడంతో పేలుళ్లు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. పరిశ్రమల్లో స్థానికుల కంటే స్థానికేతురులనే ఉద్యోగాలకు తీసుకోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రశ్నించే కార్మికులే లేకుండా పోతున్నారు. చాలా పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్స కోసం తరలించేందుకు సరైన అంబులెన్స్ లాంటి వాహన సౌకర్యాలు, వారి పరిశ్రమల్లోనే వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం జరిగి అక్కడ నుంచి నగరానికి చేరేలోపు కార్మికులు మృత్యువాత పడుతున్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే... ఫార్మా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పలువురు కార్మిక సంఘాల నాయకులు, సీఐటీయూ, సీపీఎం, సీపీఐ నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ప్రమాదాలకు కారణమైన కంపెనీపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత లేకుండా పోతుందని ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కమిటీల పేరుతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్ని ప్రమాదాలు సంభవిస్తున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా పరవాడ–అచ్యుతాపురం సెజ్ల్లో జరిగిన ప్రమాదాలపై అధికార యంత్రాంగంతో కమిటీలు వేసి విచారణ నిర్వహించారు. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలు బహిర్గతం చేసి కంపెనీ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ఉంటే నేడు ఇలాంటి ప్రమాదాలు మరలా సంభవించేవికాదని చెబుతున్నారు. కార్మికుల ప్రాణాలకేదీ రక్షణ? ఎస్వీఎస్ పరిశ్రమలో అగ్ని ప్రమాదంతో ఆందోళన ప్రమాదాల నివారణలో ప్రభుత్వం, యాజమాన్యాల అలసత్వం అచ్యుతాపురం, రాంబిల్లి సెజ్లో తరుచూ అగ్ని ప్రమాదాలు -
అతిప్రయాస మీద అదుపులోకి మంటలు
ఎస్వీఎస్ కెమెకల్ ఇండస్ట్రీస్లో శనివారం జరిగిన ప్రమాదంలో కంపెనీలో మొత్తం దాదాపు అన్ని విభాగాలు దగ్ధమైనట్టు అగ్నిమాపక నివారణ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. శనివారం సాయంత్రం 4.25 గంటలకు సెంట్రీప్యూజ్ వద్ద ఉత్ప్రేకంగా ఉపయోగించిన టొయలీన్ పేలడంతో కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ముడిసరుకుగా ఉపయోగించే సోడియం డ్రైఆకై ్సడ్, డై మిథైల్ సల్ఫేట్, టయోలిన్ సాల్వెంట్లు ఇంతటి ప్రమాద తీవ్రతకు కారణమయ్యాయి. ప్రమాద తీవ్రతతో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి.దీంతో ఎస్ఈజెడ్ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. సెంట్రిప్యూజ్ వద్ద టోలున్ సాల్వెంట్లో స్పిన్నింగ్ జరుగుతున్న సమయంలో నైట్రోజన్ లేకపోవడం కారణంగా స్పార్కింగ్ అయి అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో సంబంధిత పరిశ్రమల్లో కనీస రక్షణ చర్యలు కూడా లేకపోవడం, సేప్టీ మెజర్స్ పాటించకపోవడం, పరిశ్రమలో శిక్షణ గల ఫైర్ సిబ్బంది లేకపోవడంతోనే భారీగా మంటలు వ్యాపించాయి. మొత్తం 7 ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలు ఆర్పినా సుమారుగా 3 గంటలు పట్టాయి. జిల్లా ఫైర్ అధికారి వెంకట రమణతో పాటు ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకుడు దేవుడునాయుడు డిమాండ్ చేశారు. -
తాళపత్రాలకు నవ వైభవం
అక్షర సేద్యంలో ‘క్షీర సాగర్’ మథనం సవాళ్లను అధిగమించి సాధించిన అమృతం క్షీర సాగరాన్ని మథిస్తే అమృతం లభించినట్లుగానే, తన మనసును మథించిన క్షీర సాగర్.. తాటాకుపై అక్షరాలను లిఖించే విధానాన్ని నేటి కాలానికి అనుగుణంగా మార్చారు. పూర్వం తాటాకుపై ఘంటంతో రాసేవారు. ఆ విద్య తెలిసిన వారు ఇప్పుడు కరువవడంతో, ఆయన ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించారు. ఢిల్లీలో జరిగిన ప్రింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక లేజర్ మిషన్ను చూసిన ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేమ్ బోర్డుల తయారీకి వాడే ఆ యంత్రాన్ని తాటాకుపై అక్షరాల ముద్రణకు వీలుగా మార్పులు చేశారు. ఎన్నో ప్రయోగాల తర్వాత అత్యంత స్పష్టంగా అక్షరాలను ముద్రించడంలో విజయం సాధించారు. ప్రాచీనతకు ఆధునికత మేళవించి.... విజయనగరం జిల్లా ఎల్.కోట పరిసరాల నుంచి సేకరించిన తాటాకులను శుభ్రం చేసి, నిర్ణీత కొలతల్లో కత్తిరిస్తారు. వాటిపై లేజర్ సాయంతో ఆధ్యాత్మిక స్తోత్రాలు, శ్లోకాలు, దేవతా రూపాలను ముద్రిస్తారు. ఈ తాళపత్రాలు ఏళ్ల తరబడి పాడవకుండా పసుపు, ప్రత్యేకమైన కోటింగ్ వేస్తారు. వీటిని చూడగానే పాతకాలపు జ్ఞాపకాలు గుర్తుకు రావడమే కాకుండా, చదవడానికి ఎంతో సులువుగా ఉంటున్నాయి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం వంటి వాటిని తాళపత్రాల రూపంలో సిద్ధం చేసి అపురూప బహుమతులుగా అందిస్తున్నారు. నాటి ప్రధాని చేతుల మీదుగా అవార్డు... ప్రధాని చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ క్షీర సాగర్ ప్రతిభ కేవలం ఈ కళకే పరిమితం కాలేదు. గతంలో నేవల్ డాక్యార్డ్లో పనిచేసిన ఆయన.. వృత్తి పట్ల చూపిన అంకితభావానికి 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పాయ్ చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ అవార్డును అందుకున్నారు. అలాగే నావికాదళ అధికారుల నుంచి అనేక ప్రశంసలు పొందారు. సాహస యాత్రలు, ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి అభిరుచులతో పాటు అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. తాటాకుపై ఆహ్వాన పత్రిక మార్పు తన ఇంటి నుంచే మొదలవ్వాలని భావించిన సాగర్, తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రాలను తాటాకుపైనే ముద్రించి అతిథులను ఆశ్చర్యపరిచారు. పెళ్లికి వచ్చిన వారికి మొక్కలను బహుమతిగా ఇచ్చి ప్రకృతిపై తనకు న్న ప్రేమను చాటుకున్నారు. చివరికి తన పదవీ విరమణ రోజున కూడా 500 పండ్ల మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో తనవంతు పాత్ర పోషించారు. కనుమరుగవుతున్న తాళపత్ర కళను నేటి తరానికి చేరువ చేస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ ఆయన సాగిస్తున్న ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. నేటి డిజిటల్ యుగంలో అక్షరం కాగితంపై నుంచి తెరపైకి మారిపోయింది. పుస్తకం కంటే స్మార్ట్ఫోనే ప్రాణప్రదంగా మారిన ఈ కాలంలో మన పూర్వీకుల అపార జ్ఞాన నిధులైన తాళపత్రాల (తాటాకు గ్రంథాలు) గురించి నేటి తరానికి అసలు అవగాహనే లేదు. అపారమైన వారసత్వ సంపదగా విరాజిల్లిన ఈ తాళపత్ర కళ కనుమరుగవుతున్న తరుణంలో, దానికి ఆధునిక సొబగులు అద్ది పునర్జీవం పోస్తున్నారు నగరానికి చెందిన కేశవరాజు క్షీర సాగర్. ప్రకృతిపై మమకారం, సంస్కృతిపై గౌరవం ఆయనను ఈ వినూత్న మార్గంలో నడిపించాయి. –ఏయూక్యాంపస్ తాటాకుపై లిఖించిన గోవింద నామాలు నేటి తరానికి తెలియజేయాలని.. శతాబ్దాలుగా మన దేశంలో ఉన్న తాళపత్రాలు నేటి తరానికి తెలియజేయాలనే ప్రయత్నించా. మన సంస్కృతి, ప్రకృతితో ముడిపడిన మన జీవన విధానం నేటి యువతకు పరిచయం చేస్తున్నా.. భవిష్యత్తులో అనేక గ్రంథాలను తాళపత్రాలపై ముద్రించాలనే ఆలోచన ఉంది. మరుగున పడిపోతున్న కళను సంరక్షించడం, ఆధునికతను దానికి జోడించే చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఎంతో ఓపికతో సమయం తీసుకుని వీటిని సిద్ధం చేయాల్సి ఉంటుంది. మా కుటుంబలో జరిగే అన్ని శుభకార్యాలకు తాటాకుతో చేసిన ఆహ్వానాలు అందిస్తున్నాం. వీటిని తీసుకున్నవారు కూడా ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకుంటున్నారు. –కె. క్షీర సాగర్, అక్కయ్యపాలెం -
రికార్డులు కొట్టినా.. జీతాల్లో కోతలే..
స్టీల్ప్లాంట్లో రికార్డు ఉత్పత్తి సాధించినా దక్కని పూర్తి వేతనంఉక్కునగరం: ఉత్పత్తి ఆధారిత వేతనాలు ఎంత కాలం అంటూ స్టీల్ప్లాంట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్లో అత్యధిక ఉత్పత్తితో అనేక రికార్డులు నమోదు చేసినా పూర్తి జీతం ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2024 సెప్టెంబర్ నుంచి యాజమాన్యం ఉద్యోగుల జీతాలపై కోతలు మొదలు పెట్టింది. తద్వారా గత ఏడాది సెప్టెంబర్ నాటికి 355 శాతం జీతం పెండింగ్లో పెట్టింది. గత ఏడాదిలో అక్టోబర్, నవంబర్ నెలలో మాత్రమే నూరు శాతం చెల్లించింది. ఇక నుంచి నూరు శాతం జీతం వస్తుందని ఉద్యోగులు ఊపిరి పీల్చుకునే క్రమంలో యాజమాన్యం మరో రకంగా దాడికి పాల్పడింది. ఇకపై ఆయా విభాగాల ఉత్పత్తి ఆధారంగా మాత్రమే జీతాలు చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు షాక్కు గురయ్యారు. దీంతో కార్మిక సంఘాలు యాజమాన్యం తీరుపై రీజనల్ లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆయన కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వెంటనే ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని ఆదేశించారు. అయినప్పటికి యాజమాన్యం పట్టించుకోలేదు. ఈ రెండు నెలలు ఉత్పత్తి ఆధారంగా పర్సంటేజి జీతాలు చెల్లించడం వల్ల ఉద్యోగుల పెండింగ్ జీతాలు 380 శాతానికి చేరుకున్నాయి. డీపీఈ చెప్పినా పట్టదా.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన వేతనాలు, అలవెన్సులు, సదుపాయాలపై డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (డీపీఈ) ఆదేశాల మేరకు జరుగుతుంటాయి. గతంలో డీపీఈ ఆదేశాల మేరకే స్టీల్ప్లాంట్ క్వార్టర్ల విద్యుత్ చార్జీలను యాజమాన్యం పెంచింది. ఉత్పత్తి ఆధారిత జీతాలపై ఉక్కు యాజమాన్యం ఇచ్చిన ఆదేశాలపై ఉక్కు అధికారుల సంఘం (సీ) డీపీఈకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన డీపీఈ ఆ ఉత్తర్వులపై తమకు వివరణ ఇవ్వాలని కోరినప్పటికి ఉక్కు యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణమని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు సంస్థలో పనిచేసే ఉద్యోగుల జీతాలు లాభనష్టాలు, ఉత్పత్తితో సంబంధం ఉండదని కార్మిక చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఉత్పత్తి ఆధారంగా ఇచ్చేది ఇన్సెంటివ్, రివార్డులు మాత్రమే అనేది సర్వజనీనం. అయితే కార్మిక చట్టాలు, కార్మిక సంక్షేమంపై ఎటువంటి నమ్మకం లేని స్టీల్ప్లాంట్ యాజమాన్యం నిర్ణయాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ వ్యతిరేకించినప్పటికి డిసెంబర్ నెల జీతాన్ని కూడా ఉత్పత్తి ఆధారంగా చెల్లించడం గమనార్హం. డిసెంబర్లో ఉత్పత్తి రికార్డులు డిసెంబర్ నెలలో బ్లాస్ట్ఫర్నేస్, స్టీల్ మెల్ట్ షాప్లు ఉత్పత్తిలో పలు రికార్డులు సాధించాయి. బ్లాస్ట్ఫర్నేస్లు మూడు అత్యధికంగా హాట్ మెటల్ ఉత్పత్తి చేయగా, స్టీల్ మెల్ట్ షాప్లు అత్యధికంగా 136 హీట్లు ఉత్పత్తి చేసి గత రికార్డులను అధిగమించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డిసెంబర్ నెలలో ఆ రెండు విభాగాల్లో అత్యధిక ఉత్పత్తి జరిగినప్పటికి యాజమాన్యం కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.విభాగం నవంబర్ %జీతం డిసెంబర్ %జీతం కోక్ఓవెన్స్ 93 శాతం 96 శాతం సింటర్ ప్లాంట్ 80 శాతం 96 శాతం బ్లాస్ట్ఫర్నేస్ 83 శాతం 100 శాతం స్టీల్ మెల్ట్ షాప్ 81 శాతం 94 శాతం రోలింగ్ మిల్స్ 79 శాతం 94 శాతం మార్కెటింగ్ 84 శాతం 96 శాతం ఇతరులు 83 శాతం 96 శాతం ఎం.ఎం 66 శాతం 96 శాతం ఉత్పత్తి ఆధారిత జీతాలు అన్యాయం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యోగులకు ఉత్పత్తి ఆధారిత జీతాలు ఇవ్వడం ఉక్కు యాజమాన్యం దుర్మార్గానికి నిదర్శనం. జీతాలకు లాభనష్టాలతో పాటు ఉత్పత్తితో ఎటువంటి సంబంధం ఉండదు. ఆ విషయాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ వ్యతిరేకించినప్పటికి యాజమాన్యం ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించి పెండింగ్ జీతాలతో పాటు పూర్తి జీతాలు చెల్లించాలి. –మంత్రి రాజశేఖర్, స్టీల్ ఐఎన్టీయూసీ ఉత్పత్తి ఆధారిత వేతనాలతో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం 380 శాతానికి చేరిన పెండింగ్ జీతాలు డీపీఈ, లేబర్ కమిషనర్ ఆదేశాలు బేఖాతర్ -
వ్యసనాలకు బానిసలు కావద్దు
ఘటనపై విచారణకు ఆదేశించాం● జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సాక్షి, అనకాపల్లి: రాంబిల్లి సెజ్లో ఎస్వీఎస్ ఫార్మా పరిశ్రమలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శనివారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభించిందని, వెంటనే చర్యలు తీసుకొని మంటలను అదుపుచేసినట్టు తెలిపారు. ఈ పరిశ్రమ 2023లో స్థాపించడం జరిగిందని, ఈ పరిశ్రమంలో 25 మంది ఆన్–రోల్ ఉద్యోగులు, దాదాపు 8 మంది రోజువారీ కార్మికులు పనిచేస్తారని, ఈ ఘటన జరిగినప్పుడు 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. సెంట్రి ప్యూజ్ చివరి దశ ఆపరేషన్ సమయంలో 4–మిథైల్–2–సైనో బైఫినైల్ ఉత్పత్తిలో రియాక్షన్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని, కాగా ఈ ప్రక్రియలో ఇంటర్మీడియట్ ద్రావకం వలే ఉపయోగించే టోలున్ ద్రావకాన్ని నిర్వహిస్తుండగా మంటలు చెలరేగినట్టు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో, పని ప్రదేశంలో డైరెక్టర్ లోకేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ, రసాయన శాస్త్రవేత్త కుమార్లు కంపెనీ ఆవరణలో ఉన్న ఇతర ఉద్యోగులతో కలిసి, ఎటువంటి గాయాలు కాకుండా యూనిట్ను సురక్షితంగా తరలించారని తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. -
హక్కుల అవగాహన.. సామాజిక బాధ్యత
అనకాపల్లి: ఆహార భద్రత కమిషన్ పర్యవేక్షణకే పరిమితం కాదని, ఫిర్యాదుల పరిష్కారానికీ ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ఆహార భద్రత కమిషనన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్రెడ్డి అన్నారు. స్థానిక గవరపాలెం కన్సూమర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం ‘మేలుకో...హక్కులు తెలుసుకో – అందరి చట్టం వినియోగదారుల రక్షణ చట్టం’ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన 2013 నుంచి దేశంలో ఆహార భద్రత చట్టబద్దమైన హక్కుగా దక్కిందన్నారు. రేషన్్ సరుకులు పంపిణీలో అవకతవకలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా అందుతున్న పౌష్టికాహార పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమల్లో లోపాలను ఆహార భద్రత కమిషన్కు లిఖితపూర్వకంగా లేదా వాట్సప్ నెంబర్ 9490551117కు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. -
అశ్వవాహనంపై తిరువీధి సేవలు
అశ్వవాహనంపై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తున్న దృశ్యంనక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక పుణ్యక్షేత్రంలో వేంకటేశ్వరస్వామికి అశ్వవాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్కు నిత్యార్చనలు అభిషేకాలు పూర్తి చేశారు. కొండ దిగువన ఉత్సవమూర్తుల సన్నిధిలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం సాత్మురై వంటి కార్యక్రమాలు నిర్వహించిన తరువాత శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామిని అశ్వవాహనంపై, పల్లకిలో గోదాదేవి అమ్మవారిని ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి సన్నిధిలో తిరుప్పావై ఇరవై పాశురాన్ని విన్నపం చేశారు. తరువాత ప్రసాద నివేదన, తీర్దగోష్టి ,ప్రసాద వినియోగం జరిగాయి. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా వైష్ణవ స్వామివారితో ద్రవిడ వేద ప్రబంధం కార్యక్రమం జరిగింది. రాత్రి స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. -
అచ్చుతాపురం ఫార్మాలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, అనకాపల్లి: అచ్చుతాపురం ఎస్వీఎస్ ఫార్మాలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. పొగ దట్టంగా అలుముకుంది. కంపెనీలో సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలడంతో కార్మికులు పరుగలు తీశారు. ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదపు చేశారు. పేలుడుకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.ఎస్వీఎస్ ఫార్మా ప్రమాద సమయంలో బీ-షిఫ్ట్లో 18 మంది కార్మికులు ఉన్నారు. ఎవ్వరికీ గాయాలు కాలేదని ఫార్మా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తొలిత మంటలు వ్యాపించి.. రియాక్టర్ పేలినట్టు సమాచారం. -
ఆదుకుంటామని చెప్పి...
సభ్యరైతుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం. ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకుంటామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చి తర్వాత పట్టించుకోలేదు. రైతులు, కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి. –కాండ్రేగుల డేవిడ్, న్యాయవాది, చోడవరం బార్అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు చెరకు రైతులు, కార్మికులు, ఫ్యాక్టరీ ఇంత ఇబ్బందుల్లో ఉంటే కేన్ కమిషనర్ కనీ సం పట్టించుకోలేదు. ఫ్యాక్టరీకి వచ్చి పరిశీలన చేయ లేదు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే, ప్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వం వెంటనే సాయం చేసి, రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలి. ఫ్యాక్టరీని తిరిగి నడిపించాలి. – కె.వి.వి. భాస్కరరావు, గోవాడ సుగర్స్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు. ఫ్యాక్టరీని మూసివేసేందుకు చర్యలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిందే. ఈ ప్రాంత చెర కు రైతులకు జీవనాధారమైన గోవాడ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. రైతులు, రైతుకూలీలు, కార్మికులు, రాజకీయ పార్టీలు అంతా సమష్టిగా పోరాటం చేయా ల్సిన పరిస్థితి వచ్చింది. రైతుల ఓట్లతో గద్దెక్కి వారి మనుగడనే దెబ్బతీస్తున్న ప్రభుత్వం కళ్లు తెరిపించాలి. – కోన మోహనరావు, రైతు కూలీ సంఘం జిల్లా ప్రతినిధి -
కుక్కల దాడిలో 11 మందికి గాయాలు
రావికమతం: మండలంలోని కొత్తకోట మేజర్ పంచాయతీలో శుక్రవారం వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. వీటి దాడిలో కొత్తకోట, మర్రివలస, టి,అర్జాపురం గ్రామాలకు చెందిన 11 మంది గాయపడ్డారు. వీరిలో విద్యార్థులు, మహిళలు ఉన్నారు. మోదకొండమ్మ తల్లి గుడి రోడ్డు లైన్ నుంచి వెల్లంకి వారి వీధి వరకూ హల్చల్ చేశాయి. కొత్తకోట గ్రామానికి చెందిన వై.రాజేష్(13), జి.గోవింద్ (56), జి.వీరన్న (60), ఎం రత్నం (45), టి.అర్జాపురం గ్రామానికి చెందిన ఎం రామచందర్ (15)లను, మర్రివలస గ్రామానికి చెందిన బి. జనశ్రీ (9), ఎలిశెట్టి వరలక్ష్మి(45), పి. సునందకుమార్ (16), ఎ. రమణమ్మ (35), అమ్మిరెడ్డి కౌశిక్ (14) తదితరులపై దాడి చేసి గాయపర్చాయి. వీరిని వెంటనే కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. వీరిలో వీరన్న మినహా మిగిలిన వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరిలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. గ్రామంలో కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. పంచాయతీ అధికారులు వీటి బెడద లేకుండా నిర్మూలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ట్రూ అప్
అండ్ డౌన్ దోపిడీ కోసం..ట్రూ అప్ పేరుతో రూ.7,790.16 కోట్లు గుంజేందుకు ప్లాన్ ఏపీఈఆర్సీ పరిశీలన అనంతరం తేల్చిన లెక్కలు ● ట్రూఅప్ చార్జీలుగా వసూలు చేయాల్సింది – 0 ● ఇతర ఖర్చులు (బిల్లు బకాయిలు, రుణాలు, డిస్కౌంట్స్) రూ.3,887.28 కోట్లు ● క్యారియింగ్ కాస్ట్ రూ.2,113.24 కోట్లు ● రిటైల్ సప్లయ్ టారిఫ్ వ్యయంపై ట్రాన్స్మిషన్ లిమిటేషన్ రూ.6.49 కోట్లు ● మొత్తం ట్రూఅప్ నుంచి తొలగించాల్సిన ఖర్చులు రూ.6,007.01 కోట్లు ● 4వ కంట్రోల్ పీరియడ్లో వసూలు చేయాల్సిన ట్రూఅప్ చార్జీలు రూ.1,783.15 కోట్లు ● ప్రభుత్వమే భరించాలని చెప్పిన ట్రూ అప్ చార్జీలు రూ.1,783.15 కోట్లుసాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కమ్ల ద్వారా ప్రజల నుంచి భారీగా వసూళ్ల పర్వానికి చంద్రబాబు ప్రభుత్వం వేసిన పాచిక పారలేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో వినియోగదారుల నెత్తిన రూ.వేల కోట్లు వడ్డించేందుకు చేసిన ప్రయత్నాలకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బ్రేక్ వేసింది. ముఖ్యంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ (ఏపీఈపీడీసీఎల్) కాకిలెక్కలతో జనం జేబులకు చిల్లు పెట్టాలని చూసింది. గడిచిన ఐదేళ్లకు సంబంధించిన ఖర్చుల సర్దుబాటు(ట్రూఅప్) పేరుతో వినియోగదారుల నుంచి ఏకంగా రూ.7,790.16 కోట్లు పిండుకోవాలని భావించింది. అయితే ఏపీఈఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు లెక్కల బండారాన్ని బయటపెట్టింది. డిస్కమ్ల అడ్డగోలు ఖర్చులను ట్రూ అప్ పేరుతో జనంపై ఎలా రుద్దుతారని, ఇందులో రూ.6,007.01 కోట్లు అర్హతలేనివంటూ స్పష్టం చేసింది. మిగిలిన డబ్బులు కూడా ప్రభుత్వమే డిస్కమ్లకు చెల్లించాలని తెగేసి చెప్పింది. అంతా లోపభూయిష్ట లెక్కలు ఏపీఈపీడీసీఎల్ చూపిన లెక్కల్లో వసూలు కాని బాకీలు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద చూపిన మొత్తమే రూ.వేల కోట్లలో ఉంది. కేవలం ఇతర ఖర్చులు, వడ్డీల పేరుతో చూపిన రూ.3,887 కోట్లను ఏపీఈఆర్సీ నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. దీన్ని బట్టి సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ ఈపీడీసీఎల్లో ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంస్థ అసమర్థత, నిర్వహణ లోపాలకు అయిన ఖర్చుల్ని ‘ట్రూ–అప్’ పేరుతో జనం జేబులోంచి లాగేయాలని అనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అంచనాలకు, వాస్తవాలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈపీడీసీఎల్ విషయంలో ట్రూఅప్ పేరుతో అడిగిన రూ.7,790 కోట్లకు.. ఏపీఈఆర్సీ ఆమోదించిన రూ.1,783 కోట్లకు మధ్య ఏకంగా రూ. 6,007.01 కోట్ల వ్యత్యాసం ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో అనర్హమైన ఖర్చులను ట్రూ అప్ పేరుతో ఎందుకు క్లెయిమ్ చేసుకోవాలని ఈపీడీసీఎల్ భావించిందనే దానిపై ఈఆర్సీ మొట్టికాయలు వేసింది. అందులో అర్హత లేని ఖర్చులు రూ.6,007.01 కోట్లుగా గుర్తించిన ఏపీఈఆర్సీ మిగిలిన రూ.1,783.15 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని ఆదేశం ఇంతకీ ఈ తప్పుడు లెక్కల బాధ్యులెవరు? ఈపీడీసీఎల్ చూపించిన గణాంకాలు నాలుగో కంట్రోల్ పీరియడ్(సీపీ)లో ట్రూ అప్ చార్జీలు రూ.5,684.58 కోట్లు క్యారియింగ్ కాస్ట్ రూ.2113.24 కోట్లు మొత్తం రూ.7,797.82 కోట్లు గతంలో ఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా సర్దుబాటు చేసినవి రూ.7.65 కోట్లు మొత్తంగా ట్రూఅప్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేయాలనుకున్నది రూ.7,790.16 కోట్లు వాతలు కప్పిపుచ్చుకునేందుకు కొత్తనాటకం! ట్రూ అప్ పేరుతో జనం నెత్తిన భారం మోపాలని అనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ వాతలు పెట్టింది. రూ.6,007.01 కోట్లు అర్హతలేనివని తేల్చడంతోపాటు రూ.1,783.15 కోట్లు కూడా ప్రభుత్వమే భరించాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రూ అప్ పేరుతో ఏకంగా రూ.7,790 కోట్లను ప్రజల నుంచి వసూలు చేసి సంపద సృష్టించామని చెప్పాలనుకున్నా కుదరకపోవడంతో ఈ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం కొత్త ఎత్తుగడ మొదలు పెట్టింది. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం మొత్తం భరిస్తోందంటూ హడావుడి చేస్తోంది. దీనిపై మంత్రులు కూడా గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఏపీఈఆర్సీ ఆమోదించిన రూ.1,783 కోట్ల ట్రూ అప్ చార్జీలను ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ డబ్బులు తామే చెల్లిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. ఆ చెల్లించేది కూడా పరోక్షంగా ప్రజల పన్నుల డబ్బు నుంచే కదా అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
రైతులను నిండా ముంచారు
చెరకు రైతులను చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు నిండా ముంచారు. రైతులకు గిట్టుబాటుధర ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఫ్యాక్టరీనే మూసేశారు. కూటమి పార్టీలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలిసే గోవాడ ఫ్యాక్టరీని అమ్మేయాలని చూస్తున్నారు. అందుకే క్రషింగ్ చేయకుండా వదిలేశారు. ఉద్యమాన్ని అఖిలపక్షం అంతా కలిసి మరింత ఉధృతం చేస్తాం. –రెడ్డిపల్లి అప్పలరాజు, రైతు సంఘం నాయకుడు, సీపీఐ జిల్లా ప్రతినిధి కూటమికి మద్దతు ఇచ్చి తప్పు చేశాం గత ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చి తప్పుచేశాం. ఫ్యాక్టరీని అభివృద్ధిచేసి, చెరకు రైతులను ఆదుకుంటామని కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంతో మద్దతు ఇచ్చాం. తీరా అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని మూసేసి కార్మికులను, రైతులను రోడ్డు పాలుచేశారు. అఖిలపక్షంలో ఫ్యాక్టరీ కార్మికులంతా ఉండి పోరాటం చేస్తాం. –శరగడం రాము నాయుడు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు పవన్కల్యాణ్ పట్టించుకోలేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయాం. ఫ్యాక్టరీ సమస్యపై మా నాయకుడు పవన్కల్యాణ్కు చెప్పాం. మా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఏమీ ప్రయోజనం కలగలేదు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలిద్దరూ ఏమీ పట్టించుకోలేదు. చెరకు రైతుగా ఉండి పండిన చెరకు ఎక్కడికి పంపించాలో తెలియలేదు. ఫ్యాక్టరీ, చెరకు రైతుల కోసం ఎంతటి ఉద్యమానికై నా సిద్ధం. –జెర్రిపోతుల నానాజీ, జనసేన, చోడవరం నియోజకవర్గం ప్రతినిధి -
రాష్ట్రంలో అరాచక పాలన
నక్కపల్లి: ఆంధ్రప్రదేశ్లో అరాచకపాలన సాగుతోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘ జాతీయప్రధాన కార్యదర్శి వెంకట్ ఆరోపించారు.ఇటీవల పీడీయాక్ట్ కింద అరెస్టయి జైలులో ఉన్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు కుటుంబాన్ని ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారంలో శుక్రవారం ఆయన పరామర్శించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని చెప్పారు. కంపెనీల పేరుతో ఉత్తరాంధ్రలో లక్షలాది ఎకరాలు దోపిడీ చేసేందుకు చంద్రబాబు, పవన్కల్యాణ్, బీజేపీనాయకులు ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. కంపెనీలకు తాము వ్యతిరేకం కాదని, కానీ కూటమి నాయకులు వాటాల కోసమే కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేయబోయే మిట్టల్ీస్టీల్ప్లాంట్,బల్క్ డ్రగ్పార్క్లలో చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్లతోపాటు, బీజేపీ అగ్రనేతలకు వాటాలున్నాయన్నారు. ఈ కారణంగానే భూసేకరణ చట్టాలను ఉల్లంఘించి వేలాది ఎకరాలు సేకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మత్స్యకారుల తరఫున పోరాటం చేస్తున్న సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకే కలెక్టర్ ఈ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. అప్పలరా జు బయట ఉంటే మిట్టల్ స్టీల్ప్లాంట్ పనులు అడ్డుకుని బాధితులు, రైతులు, నిర్వాసితుల తరఫున పోరాటం చేస్తారనే ఉద్దేశంతోనే అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారన్నారు. చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించి వెళ్లిన మరుసటిరోజే అప్పలరాజును అరెస్టు చేశారన్నారు. మత్స్యకారులను సము ద్రంనుంచి వేరు చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. సీఎం, హోంమంత్రి బేషరుతుగా క్షమాపణలు చెప్పి అప్పలరాజుపై పెట్టిన కేసు లు ఎత్తివేసి, విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలను తెలియజేస్తామన్నారు. రాష్ట్రగవర్నర్ను కూడా కలుస్తామని చెప్పా రు.ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ నేత మిధున్, సీపీఎం మండలకన్వీనర్ రాజేష్ , సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తప్పుల తడకగా పట్టాదారు పాసు పుస్తకాలు
కశింకోట: ప్రభుత్వం రైతులకు శుక్రవారం నుంచి పంపిణీ చేస్తున్న భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలు తప్పుల తడకగా ఉన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా వందేళ్ల తర్వాత భూముల రీసర్వే నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేపట్టారు. అయితే రీసర్వేలో తప్పులు చోటు చేసుకున్నాయని, మళ్లీ సర్వే జరిపించి సవరణ చేసి అందజేయనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఏదో అడపా దడపా ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో మొక్కుబడిగా సర్వే జరిపించి గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో సర్వే చేసిన నివేదిక ఆధారంగా ఇచ్చిన పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త పుస్తకాల పంపిణీని శుక్రవారం చేపట్టింది. అవి తప్పుల తడకగా ఉండడంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. జెట్టపురెడ్డితుని రెవెన్యూ పరిధిలోని భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల్లో జెట్టపురెడ్డితుని గ్రామం పేరు తెలుగులో జెత్తపురెడ్డి తునిగా తప్పుగా పడింది. ఆంగ్లంలో మాత్రం సరిగానే ఉంది. కొందరి పేర్లు ఆంగ్లం, తెలుగులో తేడా ఉన్నాయి. గొంతిన వెంకట రమణ అని తెలుగులో సరిగానే పేరు ఉన్నా ఆంగ్లంలో మాత్రం స్పెల్లింగ్ తప్పుగా నమోదైంది. ఇలా చాలామంది రైతుల పేర్లు తప్పుగా నమోదయ్యాయి. దీనివల్ల భవిష్యత్లో రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందడానికి, రిజిస్ట్రేషన్ సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. కొన్ని పుస్తకాలపై ఆధార్, సెల్ఫోను నంబర్లను 9 అంకెలు నమోదు చేశారు. దీంతో వీటి స్థానంలో ఆధార్, సెల్ నంబర్లు సరిగా నమోదు చేసుకోవాలంటే అధికారుల చుట్టూ ఎన్నాళ్లు తిరగాల్సి వస్తుందోనని రైతులు మదన పడుతున్నారు. అలాగే భూమి విస్తీర్ణం తక్కువగా వచ్చిందని కొందరు, పుస్తకంలో చిరునామా లేదని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. వీటిని ఎలా సవరించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. తప్పులను సవరించిన తర్వాతే పాసు పుస్తకాల పంపిణీ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గ్రామ సభల్లో కొంతమందికి మాత్రమే నామ మాత్రంగా పాసు పుస్తకాలు పంపిణీ చేపట్టి మిగిలిన వారికి శనివారం అందజేస్తామని అధికారులు తెలిపారు. పాసు పుస్తకాల కోసం మళ్లీ రావలసి ఉండటంతో పనులు మానుకోవలసి వస్తుందని రైతులు ఆవేదన చెందారు. అందువల్ల గ్రామ సభ పెట్టిన రోజు వచ్చిన రైతులందరికి పాసు పుస్తకాలు అందజేయాలంటున్నారు. ఎ.ఎస్.పేట, గొబ్బూరుపాలెం, నరసాపురం, చింతలపాలెం, జెట్టపురెడ్డితుని రెవెన్యూ గ్రామాల్లో పాసు పుస్తకాలను పంపిణీ ప్రారంభించారు. తహసీల్దార్ తిరుమలరావు, స్థానిక నాయకులు వీటిని పంపిణీ చేశారు. కొంత మందికి పాసు పుస్తకాలు అందజేసి మిగిలిన రైతులకు శనివారం అందజేస్తామని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కారుణ్య నియామక పత్రం అందజేత
చంద్రశేఖర్కు కారుణ్య నియామక పత్రాన్ని అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సమాజంలో తగిన గుర్తింపు ఉంటుందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్లో హెచ్సీగా విధులు నిర్వహించిన చీమల చెలయ్య 2021లో అనారోగ్యంతో మృతి చెందాడు. అతడు కుమారుడు చంద్రశేఖర్కు స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేటర్గా నియమించారు. ఈ మేరకు కారుణ్య నియామక పత్రాన్ని శుక్రవారం ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో ఏ.ఓ సిహెచ్.తిలక్బాబు, సీనియర్ అసిస్టెంట్ భీమాబాయి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
గజవాహనంపై వెంకన్న తిరువీధి సేవ
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వర స్వామివారికి శుక్రవారం గజవాహనంపై తిరువీధిసేవలు నిర్వహించారు. ముందుగా కొండపై మూలవిరాట్కు పంచామృతాభిషేకం, నిత్యార్చనలు పూర్తిచేశారు.అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారికి, వేణుగోపాల స్వామివారికి పూజలు నిర్వహించారు. శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని గజవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలకు తీసుకెళ్లారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 17వ పాశురాన్ని విన్నపం చేశారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా వైష్ణవ స్వామి ద్రవిడ వేదపారాయణం నిర్వహించిన అనంతరం రాత్రి తిరువీధి సేవలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు,శేషాచార్యులు, పాల్గొన్నారు. -
హాస్టళ్లు, రేషన్ డిపోల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీలు
అచ్యుతాపురం రూరల్/ఎస్.రాయవరం : జిల్లాలోని పలు మండలాల్లో హాస్టళ్లు, రేషన్ డిపోల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ చిట్టా విజయ్ ప్రతాప్రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అచ్యుతాపురం మండలంలో మోసయ్యపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ చేసి, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెదురువాడ అంగన్వాడీ కేంద్రం, చోడపల్లి, అచ్యుతాపురం రేషన్డిపోలు, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్, మోసయ్యపేట, గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థు లతో మాట్లాడారు. ఎంఈవో దేవరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెంలో పాఠశాలలో సదుపాయాలపై ఆరా తీశారు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం, రేషన్ డిపోలను తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో కొన్ని సరకులు వివరాలు సక్రమంగా లేకపోవడంతో సూపర్వైజర్ని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
పండగలోగా బకాయిలు చెల్లించాల్సిందే
గోవాడ సుగర్స్ అఖిల పక్షం సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, గుడివాడ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ, వైఎస్సార్సీపీ పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, రైతు సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతులకు సంక్రాంతి పండగలోగా బకాయిలు చెల్లించాలని అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో దశలవారీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ఈ ఏడాది ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయకపోవడం, చెరకు ప్రైవేటు ఫ్యాక్టరీకి పంపడం, గత ఏడాది చెరకు బకాయిలు రైతులకు చెల్లించకపోవడం, కార్మికులకు బకాయి జీతాలు ఇవ్వడం పోవడం, ప్రభుత్వం పూర్తిగా ఫ్యాక్టరీని, చెరకు రైతులను నిర్లక్ష్యం చేయడంపై ఉద్యమానికి దిగేందుకు రాజకీయ, రైతు,కా ర్మిక సంఘాల నాయకులు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి చెరకు రైతుల కష్టాలు తెలియజేందుకు, అవసరమైతే ఆందోళనలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని చోడవరంలో శుక్రవారం నిర్వహించారు. సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మినహాయించి వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ,రైతు సంఘం, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ప్రతినిధులు, చెరకు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీని పరిరక్షించడంలో చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, ఎంపీ, జిల్లా మంత్రులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సమావేశంలో అఖిలపక్షం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ ఏడాది ఫ్యాక్టరీ మహాజనసభను కూడా నిర్వహించలేదని, గత సీజన్కు సంబంధించిన రైతుల బకాయిలు, కార్మికుల జీతభత్యాలు వెంటనే చెల్లించాలని, ఫ్యాక్టరీకి ప్రభుత్వం రూ. 50కోట్లు గ్రాంటు ఇవ్వాలని, వెంటనే క్రషింగ్ ప్రారంభించాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రైతులు కష్టాలు ఏనాడూ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే గోవాడ ఫ్యాక్టరీకి, చెరకు రైతులకు మేలు జరిగిందని చెప్పారు. ఫ్యాక్టరీని, రైతులను ఆదుకుంటామని చెప్పిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, ఎంపీ పట్టించుకోకపోవడం సిగ్గు చేటని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఫ్యాక్టరీని పరిరక్షించుకుకోవడానికి పూర్తిస్థాయిలో ఆందోళనకు రైతులంతా కలిసి దిగుతామని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం చెరకు రైతుల జీవనాధారాన్ని తుంచేసిందని, ఫ్యాక్టరీని బాగుచేస్తామని, రూ. 4వేలు గిట్టుబాటు ధర ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. చెరకు బకాయిలు వెంటనే చెల్లించాలని, లేదంటే రైతులకు, కార్మికులతో కలసి చేసే ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ చోడవరం పరిశీలకుడు దంతులూరి దిలీప్కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమానికి మద్దతిస్తాం ఫ్యాక్టరీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 24వేల మంది చెరకు రైతులు, వారిపై ఆధారపడిన 2లక్షల మంది కూలీలు, కుటుంబసభ్యులు ఇప్పుడు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం స్పందించే వరకూ ఉద్యమాన్ని చేయాలి. ఉద్యమానికి తామంతా మద్దతు ఇస్తాం. – దేవరపల్లి చంటి, బీజేపీ మండల అధ్యక్షుడు, చోడవరం ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఉద్యమం చెరకు రైతులను నిర్లక్ష్యంగా వదిలేసిన చంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టాలి. ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులు, కూలీలు ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఎంపీ, ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీని, రైతులను మోసం చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఉద్యమాన్ని చేయడానికి సిద్దం. –కొణతాల హరనాథ్, ఆమ్ఆద్మీపార్టీ జిల్లా అధ్యక్షుడు -
2 కేజీల గంజాయి పట్టివేత
● ముగ్గురు నిందితుల అరెస్టు పట్టుకున్న నిందితులతో పోలీసులు గొలుగొండ: మండలంలోని ఏటిగైరంపేట గ్రామం వద్ద రెండు కిలోల గంజాయితో నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఐ రామారావు తెలిపారు. ఏజెన్సీ నుంచి రెండు కిలోల గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. చింతపల్లి మండలానికి చెందిన నిందితులు దాసరి శ్రవంత్కుమార్(30), తుపాకుల హరీష్కుమార్(22), కొవ్యూరు సుమంత్(25)లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. కార్యక్రమంలో గొలుగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అబ్బురపర్చిన మైరెన్ ఎగ్జిబిషన్
కె.కోటపాడు: సముద్రం అంటే విద్యార్థులకు ఎంతో ఇష్టం.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే వారికి సముద్రంతోపాటు అందులో దొరికే చేపలు, వేట విధానం వంటి విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయాలను వివరించేందుకు విశాఖపట్నంలోని భారతీయ మత్స్య పరిశోధన సంస్థ(ఎఫ్.ఎస్.ఐ) ఆధ్వర్యంలో శుక్రవారం కె.కోటపాడులోని వేణు విద్యానికేతన్ పాఠశాలలో మైరెన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులకు సంబంధిత సిబ్బంది అవగాహన కల్పించారు. తొలుత మైరెన్ ఎగ్జిబిషన్ను విశాఖపట్నం మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయ ముఖ్య అధికారి సి.ధనుంజయరావు, గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి భవాని ప్రారంభించారు. ఎగ్జిబిషన్ను ఎ.కోడూరు హైస్కూల్, వేణు పాఠశాలల, సూర్యబాసర పాఠశాలలకు చెందిన 1,200 మంది విద్యార్థులు తిలకించి ఆశ్చర్యపోయారు. మత్స్య శాస్త్రవేత్త జి.వి.ఏ.ప్రసాదరావు పలు విషయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలో వెయ్యి రకాలైన మత్స్య జాతులు ఉంటాయన్నారు. రాష్ట్రంలో 1053 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంటే, విశాఖపట్నం జిల్లాలో 70 కిలోమీటర్లు ఉందని తెలిపారు. దేశంలో అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నంలో ఉందన్నారు. విశాఖపట్నంలో ఎఫ్.ఎస్.ఐ ద్వారా సముద్రంలో చేపలపై ప్రతి నెలా 20 రోజుల పాటు సర్వే చేస్తున్నట్లు వివరించారు. సముద్రంలో ఎంత లోతులో ఏయే రకాల చేపలు ఉన్నాయో గుర్తిస్తామని వివరించారు. మత్స శిఖరి, మత్స్య దర్శిని అనే రెండు రకాల షిప్ల ద్వారా సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సర్వే సమయంలో దొరికే అరుదైన సముద్రపు చేపల జాతులను తీసుకువచ్చి మ్యూజియంలో భద్రపరుస్తున్నట్లు వివరించారు. షిప్ల్లో వెళ్లే సమయంలో అనుకోకుండా నీరు వచ్చినా, అగ్ని ప్రమాదం వంటి ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నా సిబ్బంది లైఫ్ జాకెట్తోపాటు లైఫ్ బాయ్ను ధరించి ఏ విధంగాా ప్రాణాపాయం లేకుండా ఉండగలరో విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించారు. పర్యావరణ చేపల వేట పద్ధతితో పాటు సముద్ర అడుగు భాగపు మత్స్య వనరుల వేట, లాంగ్ లైన్ పద్ధతులను తెలిపారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను పడివేయడం వల్ల తాబేళ్లు మరణించే పరిస్థితులను వివిరించారు. మానవ జీవితం మనుగడకు ఆక్సిజన్ ఎంతో విలువైందన్నారు. ఈ ఆక్సిజన్ సముద్రం ద్వారా 80 శాతం వస్తే, కేవలం చెట్లు ద్వారా 20 శాతం వస్తుందని విద్యార్థులకు వివరించారు. మైరెన్ ఎగ్జిబిషన్లో చేపల వేటకు ఉపయోగించే వలలతో పాటు గేలాలను చూపించారు. కార్యక్రమంలో కెప్టెన్ వి.వి.ఎ.మూర్తి, రాముడు, ఈతా మురళీగణేష్, ఆనంద్, పంకజ్, బెవిన్ ప్రకాష్, వేణు విద్యా నికేతన్ డైరెక్టర్ బి.వి.ఎస్.వేణు, కె.కోటపాడు హైస్కూల్ హెచ్ఎం పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణలో కోల్పోయే వృక్షాలకు పునరుజ్జీవం
● చోడపల్లిలో మిషన్ పునర్వ వనం ప్రారంభించిన కలెక్టరు చోడపల్లిలో మిషన్ పునర్వ వనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ విజయ్కృష్ణన్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ అచ్యుతాపురం రూరల్: రహదారి విస్తరణలో కోల్పోతున్న భారీ వృక్షాలను కాపాడేందుకు మిషన్ పునర్వ వనం కార్యక్రమం భావితరాలకు తెలియజేయాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. మండలంలోని చోడపల్లిలో రోడ్డుకు ఇరువైపులా భారీ వృక్షాలను తొలగించి మరో సురక్షితమైన ప్రదేశంలో తిరిగి నాటేందుకు శుక్రవారం ఆమె మిషన్ పునర్వ వనం ప్రారంభించారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ మాట్లాడుతూ పర్యావరణం కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించాలన్నారు. -
పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వండి
రావికమతం: డి.పట్టాలను రద్దు చేసి సాగులో ఉన్న గిరిజనులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ వేయాలని మండలంలో కవగుంట రెవెన్యూలో గిరిజనులు డిమాండ్ శుక్రవారం చేశారు. కవగుంట రెవెన్యూలో సర్వే నంబర్ 59,61,62,63,64,88,89లలో సుమారు 90 ఎకరాలు బంజర్ భూములకు గతంలో గిరిజనులకు డి.పట్టాలు పంపిణీ చేశారు. వారు ఈ భూముల్లో జీడి,మామిడి తోటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలో చేసిన సర్వేలో సాగులో ఉన్న గిరిజనులు పేర్లు తొలిగించారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు దృషికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు చెప్పారు.ఇప్పటికై న అధికారులు స్పందించి పాస్ పుస్తకాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఆందోళన చేశారు. -
కందిపూడిలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ చించివేత
చించేసిన వైఎస్సార్సీపీ నాయకుల ఫ్లెక్సీ బుచ్చెయ్యపేట: మండలంలోని కందిపూడిలో వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫెక్ల్సీని కూటమి నేతలు చించివేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు కోట్ని అప్పారావు, సర్పంచ్ కొప్పాక గణేష్, మాజీ సర్పంచ్ తాటికొండ కనకయ్య, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు ద్వారపురెడ్డి అచ్చింనాయుడు, సుంకరి గోవింద తదితర్లు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాఽథ్,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ,మండల వైఎస్సార్సీపీ నాయకుల ఫొటోలతో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కశింకోట,బంగారుమెట్ట(కేబీ) రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే జంక్షన్లో ఆంజనేయస్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గ్రామానికి చెందిన కూటమి నేతలే చించివేశారని గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మా నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూటమి నేతలు చూడలేక చించివేశారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని కందిపూడి వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. -
35 మంది వాహన చోదకులకు జరిమానా
ద్విచక్ర వాహన చోదకులకు కౌన్సెలింగ్ ఇస్తున్న ట్రైనీ డీఎస్పీ కృష్ణచైతన్య యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణంలో ట్రైనీ డీఎస్పీ కృష్ణచైతన్య ప్రత్యేక డ్రైవ్ ద్వారా శుక్రవారం వాహనాలు తనిఖీ చేశారు. ప్రధాన రహదారిపై రద్దీగా ఉండే కూడళ్లలో పలు ద్విచక్ర వాహనాలను ఆయన తనిఖీ చేశారు.హెల్మెట్ ధరించకుండా బైకులు నడుపుతున్న 20 మందికి, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఐదుగురికి రూ.1,035 చొప్పున, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న ఇద్దరికి రూ.2,035 చొప్పున, మరో పది మందికి జరిమానా విధించారు. తనిఖీల్లో యలమంచిలి ట్రాఫిక్ ఎస్ఐ బి.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజల ముంగిటకే రెవెన్యూ సేవలు
తుమ్మపాల: రెవెన్యూ సేవలను ప్రజల ముంగిటకే అందజేస్తున్నామని, పట్టాదారు పాసుపుస్తకాలు నేరుగా రైతులకు గ్రామంలోనే పంపిణీ చేస్తున్నామని కలెక్టరు విజయ కృష్ణన్ తెలిపారు. అనకాపల్లి మండలం గోపాలపురంలో శుక్రవారం పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీ సర్వే జరిగిన 373 గ్రామాల్లో రైతులకు జారీ చేసిన 2,01,841 పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో కొత్త వాటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకూ అన్ని మండలాల్లో సచివాలయాల వద్ద షెడ్యూల్ ప్రకారం పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. రీసర్వేలో రికార్డుల తప్పులను సరిచేసి రైతులకు వారి భూములపై వివాదం లేని పూర్తి హక్కులు, భద్రత కల్పించడమే లక్ష్యంగా నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు రూపొందించినట్టు తెలిపారు. పాస్పుస్తకాల కోసం ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని తెలిపారు. రెవెన్యూ సేవలన్నింటినీ గ్రామస్థాయిలోనే అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయేషా, స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
అక్రమ క్వారీపై విజిలెన్సు దాడి
సీజ్ చేసిన కంప్రెసర్ను తహసీల్దారు కార్యాలయంలో అప్పగింత రోలుగుంట: మండలంలో అక్రమ క్వారీలుపై అందిన ఫిర్యాదు మేరకు విజయనగరం జిల్లాకు (మూడు జిల్లాలకు సంబంధించిన) విజిలెన్స్, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు సిబ్బంది శుక్రవారం దాడి చేశారు. కంప్రెసర్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా వెదుళ్లవలస, కొవ్వూరు రెవెన్యూలో అక్రమ క్వారీ నిర్వహణపై గత వారంలో కొవ్వూరు గ్రామానికి చెందిన బంటు రాజు ఫిర్యాదు చేశాడు. ఇక్కడ బ్లాస్టింగు వల్ల సమీప గ్రామాల్లో ఇళ్లకు, పశువులకు, పంటలకు జరుగుతున్న నష్టాన్ని వివరించాడు. ఈ విషయాన్ని నిర్వాహకుడికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై అధికారులు స్పందించి దాడి చేశారు. ఆ సమయంలో లీజుదారుడు లేకపోవడం, కాలం చెల్లిన ముందుగుండు, కంప్రెసర్ను గుర్తించారు. ఫిర్యాదుదారుని, మరికొంత మందిని విచారణ చేశారు. సీజ్ చేసిన కంప్రెసర్ను తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించారు. ఈ విచారణలో వీఆర్వో ఎం.నాగమణి ఉన్నారు. తహసీల్దార్ ద్వారా సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు తదుపరి చర్యల కోసం నివేదిస్తామని డిప్యూటీ తహసీల్దార్ వి.శివ వివరించారు. -
పుణ్యకోటి వాహనంపై పరంధాముడు
నక్కపల్లి : ఉపమాకలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. ఉదయం స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. తదుపరి కొండదిగువన స్వామివారి ఉత్సవ మూర్తులకు క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, గోదాదేవి అమ్మవారిని నిత్యపూజలు అర్చనలు నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. తిరుప్పావై 16వ పాశురాన్ని విన్నపం చేశారు. అనంతరం శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుణ్యకోటి వాహనంలోను, గోదాదేవి అమ్మవారిని పల్లకిలోను ఉంచి తిరువీధిసేవ నిర్వహించారు. భక్తులు కానుకలు, పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు.కొత్తసంవత్సరం సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం రద్దీగా మారింది. ముక్కోటి ఏకాదశి అనంతరం ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రాత్రిపూట కూడా స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తారు. -
బీ1 కోచ్ లెనిన్ స్టోరేజ్ నుంచే మంటలు వ్యాప్తి
యలమంచిలి రూరల్ : యలమంచిలి రైల్వేస్టేషన్ వద్ద టాటా నగర్–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలను వెలికితీసేందుకు దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి నిర్వహిస్తున్న విచారణ గురువారం రెండోరోజూ కొనసాగింది. గత నెల 29వ తేదీ అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో రైలు అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదానికి గురైంది. రైలులో బీ1, ఎం2 బోగీల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఒకరు సజీవ దహనమైన సంగతి విదితమే. రైలు యలమంచిలి రైల్వేస్టేషన్ ఒకటో నెంబరు ప్లాట్ఫాంపై ఆగినపుడు మంటలు వ్యాపించడంతో 157 మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనిపై ఉలిక్కిపడ్డ రైల్వేశాఖ ప్రమాదానికి మూల కారణాలను తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో శోధిస్తోంది. విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్(ఈటీటీసీ)లో బుధ, గురువారాల్లో సేఫ్టీ కమిషనర్ చేస్తున్న విచారణలో ప్రమాదానికి సంబంధించి పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా యలమంచిలి, నర్శింగబిల్లి రైల్వేస్టేషన్లలో ఆ సమయంలో పనిచేస్తున్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న రైల్వే సిబ్బందిని విజయవాడకు పిలిపించారు. అందుబాటులో ఉన్న కొందరు ప్రయాణికులను కూడా ప్రశ్నించి రాతపూర్వకంగా వివరాలు రాబట్టినట్టు సమాచారం. రైలు బీ1 బోగీలో లెనిన్ స్టోరేజ్ నుంచే మంటలు వ్యాప్తి చెందినట్టు ఇప్పటికే అధికారులు నిర్థారణకు వచ్చారు. అక్కడ్నుంచి ఒక్కసారిగా మంటలు ఎలా వ్యాప్తి చెందాయన్నది అంతు చిక్కడంలేదు. మానవ తప్పిదమా? సాంకేతిక కారణం వల్ల ప్రమాదం సంభవించిందా అన్నది తేల్చేందుకు ఎం1 బోగీలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు పూర్తయితే ప్రమాద కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా రైళ్లలో సగటున ఏడాదికి 8 అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. బ్రేక్ బైండింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి సాంకేతిక లోపాలతో రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగితే రైల్వేశాఖ నిపుణులు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టాటా నగర్–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో ప్యానెల్ బోర్డులు సురక్షితంగా ఉన్నట్టు ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది. ఇక మండే స్వభావం కలిగిన ప్రమాదకర వస్తువులేవైనా రైలులో ఉన్నాయా?లేక ధూమపానం కారణంగా మంటలు చెలరేగాయా?అన్నది తెలియాల్సి ఉంది. -
కొత్త వసంతం తీపిని పంచేనా..?
సాక్షి, అనకాపల్లి : అనకాపల్లి బెల్లం మార్కెట్ అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో బెల్లం కొనుగోళ్ల విషయంలో వ్యాపారులు పోటీ పడి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసేవారు. దేశంలో చాలా రాష్ట్రాలు బెల్లం తయారు చేస్తున్నప్పటికీ అనకాపల్లి బెల్లంకు మిగిలినవి సాటిరావనేది నిత్య సత్యం.. రంగు, రుచిలో ప్రత్యేకత కలిగిన అనకాపల్లి దేశంలో రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్ యార్డుగా అనకాపల్లి బెల్లం మార్కెట్ ప్రసిద్ధి చెందింది. గత పదేళ్లగా చెరకు సాగు తగ్గడం వల్ల ఉత్పత్తి, అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో సహకార సుగర్ ఫ్యాక్టరీలు మూతపడడం..సాగు ఖర్చు పెరిగిపోవడం, రైతులు స్థానికంగా అమ్మకాలు సాగిస్తుండడంతో మార్కెట్కు వచ్చే దిమ్మల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రతి ఏటా డిసెంబర్ నుంచి సీజన్లో సుమారు 45 లక్షల వరకూ బెల్లం దిమ్మలు మార్కెట్కు వచ్చేవి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతి అవుతుంది. ప్రస్తుత సీజన్లో ఇందుకు విరుద్ధంగా వరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు బెల్లం దిగుబడి గణనీయంగా పడిపోగా..ధర మరీ దారుణంగా పతనమైంది. తయారు చేసే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీత్యాలు ఏటా దెబ్బతీస్తున్నాయి. గత సీజన్లో కేవలం 7.33 లక్షల దిమ్మలు మాత్రమే మార్కెట్కు రావడం ఆందోళనకరంగా మారింది. వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అనకాపల్లి మార్కెట్లో ఇంత తక్కువ స్థాయిలో బెల్లం దిమ్మలు రావడం ఇదే తొలిసారి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక నెలలోనే 10 లక్షలు పైగా దిమ్మల అమ్మకాలు జరిగాయి. అటువంటిది ఏడాది పొడవునా 7 లక్షల దిమ్మలు రాలేదంటే మార్కెట్ ఏ విధంగా పతనమౌతుందో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్వింటాలు బెల్లంకు ఐదువేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడమే ఈ బెల్లం సంక్షోభానికి ప్రధాన కారణం అంటున్నారు చెరకు రైతులు. క్వింటాలుకు ఐదువేల రూపాయల మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తే రైతులు మళ్లీ చెరకు పంట సాగు చేసే అవకాశం ఉంది. భారీగా చెరకు సాగు జరిగితే అనకాపల్లి బెల్లం మార్కెట్ కళకళలాడే అవకాశం ఉంది. లేకుంటే అనకాపల్లి బెల్లం అనేది భవిష్యత్తులో ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. సేంద్రియ బెల్లంపై దృష్టి సారించాలి.. రెండేళ్లుగా అనకాపల్లి నుంచి ఇతర రాష్ట్రాలకు బెల్లం ఎగుమతి అయ్యే పరిస్థితి నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీంతో బెల్లం రైతులను చైతన్యపర్చేందుకు మార్కెట్ అధికారులు సైతం రంగంలో దిగుతున్నా రైతులు ఆసక్తి చూపడం లేదు. తమకు గిట్టుబాటు ధర లేదంటూ వాపోతున్నారు. అందుకే సేంద్రియ బెల్లం తయారీపై ఎక్కువ దృష్టి సారించాలని చూస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి నుంచి సేంద్రియ బెల్లం, బెల్లం ఉత్త్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సేంద్రియ బెల్లంకు గిరాకీ పెరగడంతో ఆ వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పిస్తున్నారు. గిట్టుబాటు లేక... జిల్లాలో అనకాపల్లి, కశింకోట, యలమంచిలి, మునగపాక, చోడవరం, మాడుగుల, కోటవురట్ల మండలాల్లో బెల్లం తయారు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న నాలుగు చక్కెర కర్మాగారాలు మూతపడడం.. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో చెరకు రైతులు చెరకు సాగుకు దూరంగా ఉంటున్నారు. బెల్లంకు కూడా గిట్టుబాటు ధర లేకపోవంతో పూర్తిగా సాగు తగ్గిపోయింది. జిల్లా వ్యాప్తంగా పదేళ్ల క్రితం సుమారుగా 90 వేల నుంచి 1 లక్ష ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. ఇపుడు 15 వేల ఎకరాలకు పడిపోయింది. అనకాపల్లి మార్కెట్లో నల్లబెల్లంపై ఎకై ్సజ్ శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తుండడంతో రైతులలో ఆందోళన రేకెత్తుతోంది. సహజంగా భూసారం వల్ల బెల్లం నల్లరంగులో మారుతుంది. సారా తయారీకి నల్లబెల్లం వాడుతున్నారనే కేసులు నమోదు కావడంతో వ్యాపారులు ఈ బెల్లం కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదు. గిట్టుబాటు ధర లేకపోవడంతో బెల్లం తయారీ కూడా తగ్గుముఖం పడుతూ వచ్చింది. 2023–24 సీజన్లో సగటున 100 కేజీల బెల్లం ధర రూ.3,901 ఉంటే, 2024–25 సీజన్లో రూ.3,811కు పడిపోయింది. ఖర్చులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. గత సీజన్లో 100 కేజీల బెల్లం తయారీకి 1,200 రూపాయలు ఖర్చు కాగా, ముగిసిన సీజన్లో 1,400 రూపాయలకు పెరిగింది. బెల్లం వ్యాపారులు, సిబ్బంది తగ్గారు.. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషర్ ఆగిపోవడంతో రైతులు చెరకు సాగు తగ్గించారు. దీంతో బెల్లం తయారీ కూడా తగ్గింది. గతేడాది 7.5 లక్షల బెల్లం దిమ్మలు వచ్చాయి. ఈ ఏడాది మరింత తగ్గే అవకాశం ఉంది. 2023లో అనకాపల్లి బెల్లం మార్కెట్కు 15 లక్షల దిమ్మలు వచ్చాయి. అనకాపల్లి బెల్లం మార్కెట్లో మూడు యూనియన్లు ఉన్నాయి. ఒక్కో యూనియన్లో 500 మంది కార్మికులు పనిచేసేవారు. ప్రస్తుతం కొలగాలు కళాసిలో సుమారుగా 250 మంది పని చేస్తు న్నారు. మహిళా కార్మికులు 80 నుంచి 30 మందికి తగ్గారు. గతంలో బెల్లం వ్యాపారులు 25 మంది వరకు ఉండేవారు. ప్రస్తుతం 10 మంది మాత్రమే చేస్తున్నారు. 15 మంది ఖాళీగా ఉన్నారు. – పొలిమేర శివ అప్పారావు, కార్మిక సంఘం నాయకుడు, ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ కుదేలవుతున్న బెల్లం పరిశ్రమ భారీగా తగ్గిన చెరకు ఉత్పత్తి రెండేళ్లుగా తగ్గిన బెల్లం విక్రయాలు గత సీజన్లో మార్కెట్లోకి కేవలం 7.33 లక్షలు బెల్లం దిమ్మలు చంద్రబాబు సర్కారులో గిట్టుబాటు ధర లేకపోవడమే కారణం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నెలకు 10 లక్షల బెల్లం దిమ్మల విక్రయాలు ప్రస్తుతం 100 కిలోల బెల్లం ధర రూ.3,811కు తగ్గింపు గణనీయంగా తగ్గుతున్న బెల్లం అమ్మకాలు చంద్రబాబు సర్కార్లో బెల్లం దిమ్మల అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. 2014–19లో బెల్లం మార్కెట్కు పతనం ప్రారంభమైంది. ఆ తరువాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రావడంతో కాసింత గిట్టుబాటు ధర కల్పించడం..బెల్లం తయారీ దారులకు, చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నారు. ఆ తరువాత వచ్చిన చంద్రబాబు సర్కార్లో ఇటు బెల్లం మార్కెట్, అటు చెరకు సాగు, చెరకు సాగు చేసే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చంద్రబాబు చేసిన నిర్వాకంతో పూర్తిగా చెరకు సాగు, బెల్లం తయారీ తగ్గుముఖం పట్టాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడాదికి 16.85 లక్షల దిమ్మలు అమ్ముడుపోగా.. 2024–25లో 7.52 లక్షల బెల్లం దిమ్మల అమ్మకాలు జరిగాయి. -
న్యూ ఇయర్ కిక్కు..!
రికార్డ్ స్థాయిలో లిక్కర్ అమ్మకాలువిశాఖ సిటీ: విశాఖలో మందుబాబులు విశ్వరూపం చూపించారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో తెగ తాగేశారు. మూడు రోజుల్లో రూ.20 కోట్ల మేర మద్యాన్ని గుటకేసేశారు. 2025కు వీడ్కోలు పలుకుతూ కొందరు.. 2026కు స్వాగతం పలుకుతూ మరికొందరు సంబరాలు చేసుకుంటే.. మందుబాబులు మాత్రం తాగడమే ఉద్యమంలా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక రోజు ముందు నుంచే న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైపోయారు. దీంతో విశాఖలో కొత్త సంవత్సరం కళంతా వైన్షాపులు, బార్ల వద్దే కనిపించింది. దీంతో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క రోజే రూ.9.5 కోట్లు తాగేశారు.. మందుబాబులు 30వ తేదీ నుంచే తమ ఉద్యమానికి సిద్ధమైపోయారు. అందుకు తగ్గట్లుగానే వైన్షాప్, బార్ల నిర్వాహకులు భారీగా స్టాకును విడిపించి గొడౌన్లను నింపేసుకున్నారు. ఈ మద్యం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవాలని ముందుగానే నిర్ణయించింది. ఇందుకోసం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించింది. దీంతో అర్ధరాత్రి సమయాల్లో కూడా వైన్షాపులు, బార్లు మందుబాబులతో కళకళలాడుతూ కనిపించాయి. 30వ తేదీ మధ్యాహ్నం నుంచే మద్యం దుకాణాల వద్ద హడావుడి మొదలైంది. 31వ తేదీకి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగిన్నట్లు తెలుస్తోంది. గతేడాది 31, 1 తేదీల్లో మొత్తంగా రూ.12 కోట్లు మద్యం అమ్మకాలు జరగగా.. ఈసారి 31వ తేదీ ఒక్కరోజే రూ.9.5 కోట్ల మేర మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. 30, 31, 1వ తేదీల్లో మొత్తంగా రూ.20 కోట్ల మేర మద్యాన్ని తాగేశారు. మందుబాబుల హల్చల్.. నూతన సంవత్సరం వేళ నగరంలో మందుబాబులు తప్పతాగి చిందులేశారు. బహిరంగంగానే మద్యం సేవించారు. తాగిన మత్తులో రోడ్లపై బైక్లతో చక్కర్లు కొట్టారు. ఒకవైపు పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో పోలీసులు బహిరంగంగా మద్యం తాగిన 99 మందిపైన, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన 257 మందిపైన కేసులు పెట్టారు. -
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకల్లో కేక్ కట్ చేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా . చిత్రంలో అడిషనల్ ఎస్పీలు దేవప్రసాద్, ఎల్.మోహన్రావు సబ్బవరం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలసి కేక్ కట్ చేస్తున్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్ విజయకృష్ణనన్కు జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ప్రజల సహకారం, అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆమె తెలిపారు. నూతన సంవత్సరంలో జిల్లాకు శాంతి, సుభిక్షం, సమృద్ధి తీసుకురావాలని, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో కీలకమని, శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అనకాపల్లి : జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కేక్ కట్ చేసి, పోలీసు అధికారులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా ఎస్పీని జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల అధికారులు డి.విష్ణు స్వరూప్, పి. శ్రీనివాసరావు, ఎం.శ్రావణి, డీఎస్పీలు జి.ఆర్.ఆర్.మోహన్, బి.మోహనరావు, ఈ.శ్రీనివాస్, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్ఐలు కూడా ఉన్నతాధికారులను కలిసి అభినందనలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో జిల్లా పోలీసు యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఐజీకి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, విశాఖ నగర సీపీ శంఖబ్రత భాగ్చీని గురువారం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. చోడవరం : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాధ్ తన స్వగృహంలో కేక్ కట్చేసి స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. పలువురు పార్టీ నాయకులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గురుకుల పాఠశాలలో కలెక్టర్ సబ్బవరం: విద్యార్థులంతా క్రమశిక్షణ అలవరుచుకుని ఉన్నత విద్యావంతులు కావాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆకాంక్షించారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను గురువారం సందర్శించి విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే ప్రభుత్వ ఉద్యోగులంతా తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలన్నారు. గురుకుల పాఠశాలకు వచ్చిన కలెక్టర్కు స్థానిక తహసీల్దార్ బి.చిన్నికృష్ణ, ఎంపీడీవో పద్మజ తదితరులు గురుకుల అధ్యాపకులతో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, స్వాగతం పలికారు. -
అశ్రునయనాలతో రాము మృతదేహం ఊరేగింపు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాము మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తున్న దృశ్యం మునగపాక : రోడ్డు ప్రమాదంలో అశువులు బారిన యువకుడు మొల్లి రాము మృతదేహాన్ని గురువారం స్వగ్రామానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. మునగపాకకు చెందిన మొల్లి రాము అచ్యుతాపురం మండలం కొండకర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గత నెల 31వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం అనకాపల్లి వందపడకల ఆసుపత్రి నుంచి గురువారం బైక్లపై ఊరేగింపుగా మునగపాకకు తీసుకువచ్చారు. అమర్ రహే రాము అంటూ స్నేహితులు, యువకులు నినాదాలు చేసుకుంటూ మృతదేహాన్ని స్థానిక శ్మశాన వాటికకు తరలించారు. అందరితో సరదాగా గడిపే రాము మృతితో మునగపాక శోక సముద్రంలో మునిగిపోయింది. చిన్న వయస్సులో జరగరాని ఘోరం జరిగిపోయిందని రాము కుటుంబానికి పలువురు సంతాపం తెలిపారు. -
విశాఖ రేంజ్ ఐజీగా గోపీనాథ్ జట్టి బాధ్యతల స్వీకరణ
విశాఖ సిటీ: విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ జట్టి పదోన్నతి పొందారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ)గా గురువారం ఆయన రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని ఎస్పీలు తుహిన్ సిన్హా (అనకాపల్లి), అమిత్ బర్దర్ (అల్లూరి), కె.వి.మహేశ్వర్రెడ్డి (శ్రీకాకుళం), ఎస్.వి.మాధవరెడ్డి (మన్యం), ఎ.ఆర్.దామోదర్ (విజయనగరం) ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందించి పదోన్నతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారుల సమక్షంలో ఐజీ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఐజీ ఆకాంక్షించారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ చర్చకు వాయిదా అంశాలు
డాబాగార్డెన్స్: తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణల కారణంగా గతంలో వాయిదా పడిన అంశాలనే మళ్లీ ఆమోదం కోసం స్థాయీ సంఘ సమావేశం అజెండాలో చేర్చిన తీరు జీవీఎంసీలో చర్చనీయాంశమైంది. గత ఏడాది యోగా డే సందర్భంగా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్ల బిల్లుల చెల్లింపు వ్యవహారం ఇందులో ప్రధానంగా ఉంది. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఈ అంశం మరోసారి చర్చకు రానున్నాయి. మళ్లీ తెరపైకి యోగా డే బిల్లులు గత ఏడాది జూన్ 21న నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. అయితే, ఈ కార్యక్రమం ముగిసిన ఆరు నెలల తర్వాత, గత డిసెంబర్ 6న జరిగిన సమావేశంలో దాదాపు రూ.1.62 కోట్ల బిల్లుల చెల్లింపునకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పెట్టారు. ఒక్కో పోర్టబుల్ వీఐపీ టాయిలెట్ యూనిట్కు రోజుకు రూ.16,200 చొప్పున అద్దె నిర్ణయించడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. దీనిపై ‘సాక్షి’దినపత్రికలో ‘మొబైల్ టాయిలెట్ మస్కా’పేరిట కథనం కూడా ప్రచురితమైంది. గత సమావేశంలో ఈ అంశంపై స్థాయీ సంఘం సభ్యులు సాడి పద్మారెడ్డి, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వారు పట్టుబట్టడంతో మేయర్ ఆ అంశాన్ని వాయిదా వేశారు. అయితే.. ఆ విచారణ ఏమైందో, నివేదిక ఏమొచ్చిందో తెలియకుండానే.. శుక్రవారం జరిగే సమావేశంలో అవే బిల్లులను ఆమోదం కోసం అజెండాలో చేర్చడం గమనార్హం. 87 అంశాలతో సమావేశం శుక్రవారం సమావేశంలో మొత్తం 87 అంశాలు సభ్యుల ఆమోదానికి రానున్నాయి. వీటిలో అభివృద్ధి పనులు, రెవెన్యూ, సర్వీస్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరిలో ఆర్.కె.బీచ్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (ఐఎఫ్ఆర్)–2026 కోసం దాదాపు రూ.2.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జీవీఎంసీ 29వ వార్డు పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు రూ.36.36 లక్షలతో బ్లాక్ టాప్ రోడ్లు, ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోస్టల్ బ్యాటరీ తూర్పు వైపు రూ.35.30 లక్షలతో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 32వ వార్డు అల్లిపురం రోడ్డు ఉత్తరం వైపు బీటీ రోడ్డుకు రూ.36.40 లక్షలు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఫుట్పాత్లు, సెంట్రల్ డివైడర్ మరమ్మతులు, పెయింటింగ్కు రూ.25.80 లక్షలు, పోలీస్ బ్యారెక్స్ జంక్షన్ నుంచి చౌల్ట్రీ జంక్షన్ వరకు రూ.35.40 లక్షలతో బీటీ రోడ్డు, 37వ వార్డు బీచ్రోడ్డు భారత్ పెట్రోలియం బంక్ నుంచి నేవల్ క్యాంటీన్ వరకు రూ.33.50 లక్షలతో రోడ్డు పనులు, నేవల్ క్యాంటీన్ కొత్త జాలరిపేట జంక్షన్ వద్ద దెబ్బతిన్న కల్వర్టు పునర్నిర్మాణానికి రూ.27.25 లక్షలు తదితర పనులకు పరిపాలనా పరమైన ఆమోదం కోసం కమిటీ ముందుంచనున్నారు. -
పరుగులే..
పట్టించుకోకపోయినా కార్గోలోనూ పురోగతివిశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులుసాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన విశాఖపట్నం ఎయిర్పోర్టు.. ప్రయాణికుల రాకపోకల్లో ఏటా గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2024తో పోలిస్తే, 2025లో ప్రయాణికుల రాకపోకల్లో 9శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు 2022–23తో పోల్చితే 2023–24లో ఏకంగా 22 శాతం వృద్ధి నమోదైంది. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు అలసత్వం, ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కారణంగా వృద్ధి రేటులో కొంత తగ్గుదల కనిపించింది. విశాఖకు రావల్సిన అంతర్జాతీయ సర్వీసులు విజయవాడ, ఇతర రాష్ట్రాలకు తరలిపోయినా.. ఎయిర్పోర్టు అధికారులు, ఎయిర్ట్రావెల్స్ అసోసియేషన్ సమన్వయంతో విమానాశ్రయాన్ని ముందుకు నడిపించి మంచి ఫలితాలు సాధించారు. 2025లో గణనీయమైన ప్రగతి 2025లో విశాఖ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీ, మౌలిక వసతులు, భద్రత, సామాజిక బాధ్యత(సీఎస్సార్) వంటి రంగాల్లో మంచి ఫలితాలను రాబట్టింది. ప్రయాణికుల రద్దీలో 9 శాతం వృద్ధి నమోదైంది. నెలకు సగటున 2 లక్షల మంది వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు.. ఇండిగో సంక్షోభ సమస్యను వెంటనే పరిష్కరించి ఉంటే.. ప్రయాణికుల రాకపోకల వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉండేది. ఆ సమయంలో నాలుగైదు రోజుల పాటు పదుల సంఖ్యలో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు ఎయిర్పోర్టు ఘనతలివీ.. ● 2025లో సుమారు 27.55 లక్షల మంది ప్రయాణించారు. 2024లో ఈ సంఖ్య 25.21 లక్షలు ● 2025 జనవరి, నవంబర్లో రద్దీ గరిష్టంగా 2.7 లక్షలకు చేరింది. ● ప్రయాణికుల కోసం ఆధునిక బేబీ కేర్ గదులు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. ● కస్టమర్ సంతప్తి సర్వే (సీఎస్ఐ)లో 4.92/5 స్కోరు సాధించింది. ఈ స్కోరుతో జాతీయ స్థాయిలో 9వ స్థానంలో ఎయిర్పోర్టు నిలవడంగమనార్హం. అంతర్జాతీయ సర్వీసులపై రాజకీయ నిర్లక్ష్యం? అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అన్ని అర్హతలున్నా.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వైజాగ్ ఎయిర్పోర్టుకు శాపంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. 2025 మొదట్లో దుబాయ్ విమానం వైజాగ్ రాకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. తర్వాత.. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది. డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ఎయిర్పోర్టు వర్గాలు వ్యవహరించారు. ఆకాశా ఎయిర్లైన్స్ వైజాగ్ నుంచి సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నా, కేంద్ర మంత్రి చొరవ లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. చివరకు జూన్లో అబుదాబీకి వారానికి నాలుగు రోజుల సర్వీసు ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే సింగపూర్, అబుదాబీలతో పాటు దుబాయ్, వియత్నాం సర్వీసులు కూడా నడిచేవి. ఇప్పటికై నా కేంద్ర మంత్రి, ఎయిర్పోర్టు అధికారులు స్పందించి సర్వీసుల పెంపుపై దృష్టి సారించాలని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ కోరుతోంది. 2025లో విశాఖ ఎయిర్పోర్ట్ జోరు రాజకీయ సవాళ్ల నడుమ 9 శాతం వృద్ధి విశాఖ నుంచి 27 లక్షల మంది ప్రయాణం కార్గోలోనూ రికార్డులు వైజాగ్ ఎయిర్పోర్టు కార్గో టెర్మినల్లో నవంబర్ 14న సరకు రవాణా పునఃప్రారంభమైంది. సాధారణ రోజుల్లో పౌర విమానాల్లోనూ డొమెస్టిక్ కార్గో రవాణా జరిగింది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు మొత్తం 4,902.876 మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. ఇందులో ఎగుమతులు 1955.369 మెట్రిక్ టన్నులు కాగా, దిగుమతులు 2947.507 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. మార్చిలో అత్యధికంగా 593.195 మెట్రిక్ టన్నుల సరకు రవాణా జరిగింది. ప్రతి నెలా సగటున 340 మెట్రిక్ టన్నులకు పైగా సరకు హ్యాండ్లింగ్ జరిగింది. -
పాల్తేరు టీడీపీలో ఫ్లెక్సీ రగడ
కొట్లాటలో గాయపడి తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులు పాయకరావుపేట: మండలంలోని పాల్తేరు గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో టీడీపీ నాయకుల మధ్య గురువారం ఘర్షణ చోటు చేసుకుంది. రెండు గ్రూపుగా విడిపోయి కొట్లాటకు దిగారు. ఆ పార్టీ రెండు గ్రూపుల వ్యక్తులు ఫ్లెక్సీపై ఫొటోల ముద్రణ విషయంలో ఈ ఘర్షణ జరిగిందని సీఐ జి.అప్పన్న తెలిపారు. ఈ తగదాలో రెండు కుటుంబాల సభ్యులు పరస్పరం కొట్లాటకు దిగడంతో ఇరువర్గాల వ్యక్తులకు గాయాలయ్యాయన్నారు. వారంతా తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సీఐ తెలిపారు. పాల్తేరు గ్రామంలో శాంతి, భద్రతల అదుపు కోసం పెట్రోలింగ్, పికెట్ ఏర్పాటు చేశామన్నారు. ఘర్షణకు పాల్పడిన వారిపై రౌడీషీట్ తెరిచినట్టు సీఐ చెప్పారు. -
చిన్నయ్యపాలెంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు చించివేత
బుచ్చెయ్యపేట : మండలంలో పెదపూడి శివారు చిన్నయ్యపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను కూటమి నేతలు చించివేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రామానికి చెందిన మండల సోషల్ మీడియా కన్సీనర్ అయితి రాము, వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు చందక దేముడు, ఉప సర్పంచ్ ఉప్పిలి అప్పలరాజు తదితరులు గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగనన్న ఫొటోలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మండల నాయకులు ఇతర నాయకులతో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కూటమి నేతలు కక్ష సాధింపు చర్యగా ఫ్లెక్సీలను చించివేశారని నాయకులు తెలిపారు. తమ అధినాయకుడు జగనన్న కటౌట్లు చూసి ఓర్వలేకపోతున్నారని, ప్రశాంతంగా ఉన్న గ్రామంలో గొడవలు సృష్టించాలని కూటమి నేతలే ఫ్లెక్సీలను చించివేశారని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం చెందారు. పోలీసులు గ్రామంలో ఫ్లెక్సీలను చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గోకివాడ వరకృష్ణ కోరారు. -
బాల భీముడు
ఎన్టీఆర్ ఆస్పత్రిలో జన్మించిన 4.8 కిలోల మగబిడ్డతో ఆస్పత్రి వైద్యులు అనకాపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట ముత్యాలమ్మ కాలనీకి చెందిన కోసురు రూపవతి అనే మహిళ సాధారణ కాన్పులో బాలభీముడికి జన్మనిచ్చింది. 4.8 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టాడు. రూపవతికి నెలలు నిండడంతో కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కాన్పు కష్టమవ ుతుందని భావించి ఆపరేషన్కు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం తెల్లవారుజామున సాధారణ కాన్పు జరిగింది. రూపవతికి 8వ నెలలో నిర్వహించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్లో శిశువు బరువు 3 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. 9 నెలలు నిండిన అనంతరం శిశువు బరువు మరింత పెరిగినందున సిజేరియన్ తప్పదేమోనని అనుకున్నారు. వుడ్స్ కార్క్ స్క్రూ ’ (మ్యాన్అవర్) విధానంలోని మెళుకువలను పాటించి, సహజ ప్రసవం చేయగా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు, వైద్యురాలు సౌజన్య మాట్లాడుతూ ప్రసవ సమయంలో తల్లీబిడ్డలకు రిస్క్ ఎదురయ్యే ప్రమాదం ఉందని ముందుగానే గమనించి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. -
త్యాగాలు మావి... లబ్ధి వాళ్లకా
నక్కపల్లి: అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నక్కపల్లిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాను కంపెనీలకోసం భూములు ఇవ్వాలని హోంమంత్రి వంగలపూడి అనిత పదే పదే చెప్పేవారని, ఆమె మాటలు నమ్మి కంపెనీలు వస్తే మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, రాజకీయంగా, పరిపాలనా పరంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఆశతో భూములు త్యాగం చేశామని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో చివరి నిమిషంలో అన్యాయం చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. నక్కపల్లి మండల కేంద్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. బ్రిటీష్ కాలంనుంచి నక్కపల్లి తాలూకా కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచి రెవెన్యూకు సంబంధించిన ముఖ్యకార్యకలాపాలు జరుగుతుంటాయి. లోక్సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అంతా నక్కపల్లి నుంచే జరుగుతుంది. మండల వ్యవస్థ ఏర్పాటు కాకముందు నక్కపల్లి తాలూకా కేంద్రంగానే పాయకరావుపేట, ఎస్.రాయవరం నక్కపల్లి మండలాల్లో రెవెన్యూ కార్యకలాపాలు జరిగేవి. తాలూకాలకు అనుబంధంగా నక్కపల్లి, గొడిచర్ల ,పాయకరావుపేట, కోటవురట్ల, శ్రీరాంపురం ఎస్.రాయవరం ఫిర్కాలు ఉండేవి. నక్కపల్లిలో సబ్రిజిస్టార్ కార్యాలయం,ఉపఖజానా గ్రామీణ నీటి సరఫరా విభాగం డివిజన్ ఇంజినీర్ కార్యాలయం ఇక్కడే ఉండేవి. 31 పంచాయతీలు, సుమారు 65 వేలకుపైగా జనాభాకలిగిన నక్కపల్లి మండలానికి 2004నుంచి మహర్దశ పట్టింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రోత్సాహంతో నక్కపల్లిలో హెటెరో రసాయన పరిశ్రమ ఏర్పాటైంది. సుమారు 500 ఎకరాల్లో ఈ కంపెనీఏర్పాటవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. అక్కడనుంచి భూముల ధరలకు రెక్కలు రావడంతో రియ ల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అలాగే పాయకరావుపేట మండలంలో కూడా దక్కన్ కంపెనీ రావడంతో అక్కడ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. నక్కపల్లి మండలంలో ఏడు మత్స్యకార గ్రా మాలున్నాయి. కంపెనీలకు అనువైన అన్ని వనరులు ఇక్కడ ఉండటంతో ప్రభుత్వం దృష్టి నక్కపల్లి మండలంపై పడింది. 2010లో ప్రభుత్వం మండలంలో పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణకు సిద్ధమైంది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఎస్ఈజడ్ ఏర్పాటు కోసం ఏపీఐఐసీ ద్వారా 5వేల ఎకరాలను సేకరించింది. నక్కపల్లి మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, ఉపాధి, ఉద్యోగావకాశాలు కలుగుతాయన్న ఆఽశతో రైతులంతా తమ భూములను త్యాగం చేశారు. రాజకీయ, భౌగోళిక పరంగా కూడా నక్కపల్లి మండలం గుర్తింపు పొందుతుందని ప్రజలంతా ఆశపడ్డారు. తాజాగా రూ.67వేల కోట్ల వ్యయంతో ఆర్సిలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకానుంది. స్టీల్ప్లాంట్ కోసం కూడా రైతులు భూములు త్యాగం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నక్కపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూడివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన మండల ప్రజలను ఎంతో ఆనందంగా కలిగింది.ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ రెవెన్యూ డివిజన్ను అడ్డురోడ్డుకేంద్రంగా ఏర్పాటుచేయడం పట్ల మండల ప్రజలు ,రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.కంపెనీలకోసం భూములు మేము త్యాగం చేయాలి. పేరుప్రఖ్యాతలు, రెవెన్యూ డివిజన్ను మా త్రం అడ్డురోడ్డు కేంద్రంగా ఏర్పాటు చేస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అడ్డురోడ్డు అనేది రెండు గ్రామాలపరిదిలో ఉంటుందని మండల కేంద్రంగాని,మేజర్ పంచాయతీగాని కాకుండా కేవలం వాణిజ్య కేంద్రంగా ఉన్న ఇక్కడ రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తగదని పలువురువ్యాఖ్యానిస్తున్నారు. వేలా ది ఎకరాలను నక్కపల్లి మండలంనుంచి సేకరించి రైతులకు 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం ఆర్అండ్ ఆర్ప్యాకేజీ చెల్లించకుండా అన్యా యం చేశారని,కనీసం రెవెన్యూడివిజన్ అయినా ఇక్క డ ఏర్పాటు చేస్తే సంతోషించేవాళ్లమని రైతులు చెబుతున్నారు. భూములు త్యాగం చేసేది మేము,డివిజన్ కేంద్రం మాత్రంసెంటుభూమికూడా సేకరించని అడ్డురోడ్డులో ఏర్పాటు చేస్తారా అంటూ వాపోతున్నారు. అడ్డురోడ్డు కేంద్రంగా ఏర్పాటు చేయడం దారుణం నక్కపల్లి మండలంలో రైతులు పరిశ్రమల కోసం వేలాది ఎకరాలు భూములు త్యాగం చేశారు. నష్టపరిహారం విషయంలో అన్యాయం జరిగినప్పటికీ పారిశ్రామికంగా పరిపాలనా పరంగా అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డారు. నక్కపల్లి కేంద్రంగా కొత్త రెవెన్యూడివిజన్ ఏర్పాటు చేస్తున్నామంటే ఆశపడ్డారు. చివరకు నక్కపల్లికాకుండా అడ్డురోడ్డు కేంద్రంగా రెవె న్యూ డివిజన్ ఏర్పాటు చేయడం దారణం. కంపెనీల కోసం భూములు త్యాగం చేసిన రైతులను ప్రభుత్వం మోసం చేసింది. – వీసం రామకృష్ణ, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి -
ఎస్సీ, ఎసీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
తుమ్మపాల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ త్రైమాసిక సమావేశాన్ని కలెక్టర్, ఎస్పీ తుహిన్ సిన్హా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు నిర్దేశించిన సమయంలోగా చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రాయితీ రుణాలు సత్వరమే అందిస్తున్నట్టు తెలిపారు. వారికి మంజూరైన యూనిట్లను గ్రౌండింగ్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఏప్రిల్ నుంచి ఈ నెల వరకు జిల్లాలో 34 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, ఇందులో 31 కేసులకు సంబంధించి రూ.54.50 లక్షల పరిహారం మంజూరైందని చెప్పారు. త్వరలోనే మిగిలిన 3 కేసులకు సంబంధించి పరిహారం మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై. సత్యనారాయణరావు, ఆర్డీవోలు షేక్ ఆయిషా, వి.వి.రమణ, జిల్లా సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు బి.రామానందం, మంగవేణి, జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.మీనా, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీలు, డీవీఎంసీ ఎన్జీవో కమిటీ సభ్యులు పలకా రవి, టి.జయశ్రీ, ఎం.రాజు, బి.అప్పారావు పాల్గొన్నారు. -
14 మండలాల్లో క్రీడా మైదానాల నిర్మాణాలు ప్రారంభం
నాతవరం: జిల్లాలో 15 మండలాల్లో క్రీడా మైదానాల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని, 14 మండలాల్లో పనులు ప్రారంభమయ్యాయని జిల్లా క్రీడలు అధికారి పూజారి శైలజ తెలిపారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల ప్రకారం పోలీస్ మైత్రీ ఆటలు పోటీలు ఎస్ఐ వై.తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ పోటీలను బుధవారం ఆమె ప్రారంభించి, మాట్లాడారు. కోటవురట్ల మండలంలో గ్రౌండ్ స్థలం విషయంలో కోర్టుకు వెళ్లడంతో అక్కడ పనులు చేయలేదన్నారు. విద్యార్థినీవిద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు చాలా కీలకమన్నారు. భారీ స్థాయిలో ఆటలు పోటీలు ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తున్న ఎస్ఐ వై.తారకేశ్వరరావు అభినందించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్ ఎంపీడీవో శ్రీనివాస్, నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి అపిరెడ్డి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. -
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
దేవరాపల్లి: ఇంటర్ పరీక్షలకు విద్యార్థులను ప్రణాళిక ప్రకారం సిద్ధం చేస్తున్నట్టు జిల్లా ఇంటర్ బోర్డు విద్యాధికారి ఎం. వినోద్బాబు తెలిపారు. విద్యాపరంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పారు. దేవరాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం 48వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ బి. రాధ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముఖ్యఅథితిగా వినోద్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 2,862 మంది, ఫస్టియర్ విద్యార్థులు 3, 261 మంది పరీక్షలకు సిద్ధమవుతున్నారన్నారు. 2026 సంకల్పం కార్యక్రమం ద్వారా అదనపు తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. జనవరి 21 నుంచి మానవతా విలుపులపై పరీక్షలు, ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఏ,బీ,సీ గ్రేడింగ్ విధానం అమలు చేసి, సీ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధ్యాపకులకు సూచించారు. -
అడ్డురోడ్డులో ఆర్డీవో కార్యాలయం ప్రారంభం
ఎస్.రాయవరం: పాలనా వికేంద్రీకరణలో భాగంగా అడ్డురోడ్డులో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. తిమ్మాపురం సచివాలయ భవనంలో ఏర్పాటు చేసిన అడ్డురోడ్డు ఆర్డీవో కార్యాలయాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఇన్చార్జ్ ఆర్డీవోగా నర్సీనట్నం ఆర్డీవో వి.వి.రమణకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటన చేసిన రెండు రోజుల్లో సర్పంచ్ కర్రి సత్యనారాయణ సచివాలయ భవనం కేటాయించడం అభినందనీయమన్నారు.తాత్కాలికంగా పనులు ప్రారంభించేందుకు సచివాలయ భవనం అనువుగా ఉందన్నారు. ఏడు మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్లో అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఇప్పటికే పరిశ్రమలు ఉన్నాయన్నారు.త్వరలో మిట్టల్ స్టీల్ ప్లాండ్ మరో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కానుందని, అత్యంవేగంగా ఈ డివిజన్ అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని చెప్పారు. పరిశ్రమలకు భూములు కేటాయింపులతో పాటు, భూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఆర్డీవో స్థాయి అధికారి అవసరం ఉందన్నారు. అనంతరం తిమ్మాపురంలో పలువురికి కలెక్టర్ పింఛన్ నగదు అందజేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తదితరులు మాట్లాడారు. గ్రోయిన్ మరమ్మతులకు నివేదిక ఇవ్వాలి సోమిదేవ పల్లి గ్రామంలో సుమారు 10 ఏళ్లుగా మరమ్మతులకు గురై ప్రమాదకరంగా మారిన మూలపొలం గ్రోయిన్ను కలెక్టర్ విజయ్కృష్ణన్ పరిశీలించారు.గ్రోయిన్ మరమ్మతులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ రమేష్బాబు, ఎంపీడీవో మీనా కుమారి, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ సచిదేవి, సర్పంచ్ కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి సహకారం అవసరం
రికార్డులను పరిశీలిస్తున్న కుమారరాజు మాడుగుల రూరల్ : గ్రంథాలయాల అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమారరాజు అన్నారు. కె.జె.పురంలో గల శాఖా గ్రంథాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 64 గ్రంథాలయాలు ఉండగా 70 మంది సిబ్బంది నియామకాలు ఖాళీగా ఉన్నట్టు ఆయన తెలిపారు. జనవరి 2 వాడచీపురపల్లిలో నూతనంగా మంజూరైన గ్రంథాలయానికి శంకుస్థాపన చేయనున్నట్టు ఆయన తెలిపారు. రూ.180 కోట్ల గ్రంథాలయ సంస్థకు సెస్ రూపేణా వసూళ్లు కావలసి ఉందని చెప్పారు. 36 బుక్ డిపో సెంటర్లు ప్రస్తుతం పని చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
మత్తు పదార్థాలతో అనర్థాలపై అవగాహన
రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవా రం పోలీసుశాఖ ఆధ్వర్యంలోపదవ తరగతి విద్యార్థులకు ‘గంజాయి ఇతర మాదకద్రవ్యాలు ప్రభావం–సమాజంపై దుష్ఫరిణామాలు, నివారణ చర్యలపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని వారి ప్రతిభ చూపించారు. వీరిలో విజేతలుగా ఇంగ్లిష్ మీడియం విద్యార్థి కార్తీక్(ప్రథమ), మెనూ(ద్వితీయ) తెలుగు మీడియంలో ఎం.శ్రీవాణి(ప్రథమ) ఎంపికయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ రామకృష్ణారావు, హెచ్ఎం శేషగిరిరావుతో కలసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆంగ్ల టీచర్ నాగజ్యోతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పాఠశాలకు ఐడీబీఐ బ్యాంకు వితరణ
సత్యవరం రామాలయంలో ఏకాహం రోలుగుంట : మండలంలో నాలుగు పాఠశాలలకు లక్ష రూపాయల విలువ గల నాలుగు కంప్యూటర్లను నర్సీపట్నం ఐడీబీఐ బ్యాంకు వారు పాఠశాల అభివృద్ధి రీత్యా ఇవ్వాలని నిర్ణయించి బుధవారం ఎంఆర్సీ భవన్కి చేరవేశారు. వీటిలో ఒక కంప్యూటర్ను ఎంఈవో జానుప్రసాద్తో కలసి స్థానిక ఎంపీపీ పాఠశాలకు బ్యాంకు మేనేజర్ రాహుల్ పాఠశాల హెచ్ఎం ఫ్రాన్సిస్కు అందజేశారు. దీనిని డేటా అప్రేటర్ పాఠశాలలో ఇన్స్టాల్ చేసి విద్యా సంబంధమైన పాటలు, రెయిమ్స్ యాప్స్ను డౌన్లోడు చేశారు. బ్యాంకు మేనేజర్కు ఎంఈవో, హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు. -
ఎ.కొత్తపల్లిలో ఎల్ఈడీ లైట్లు ప్రారంభోత్సవం
దేవరాపల్లి : మండలంలోని ఎ.కొత్తపల్లిలో సిద్ది వినాయక ఆలయం, కోదండ రామాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ విద్యుత్ లైట్లను స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, స్థానిక సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ ప్రారంభించారు. ముందుగా పూజలు నిర్వహించిన అనంతరం స్విచ్చాన్ చేసి లైట్లు వెలిగించారు. పంచాయతీ పరిధిలోని ఇద్దరు వితంతువులకు స్థానిక సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ చేతుల మీదుగా బుధవారం పింఛన్లు పంపిణీ చేశారు. ఉప సర్పంచ్ సరువునాయుడు, పంచాయతీ వార్డు మెంబర్లు పడాల చెల్లయ్యమ్మ, కంచిపాటి నాగరాజు అమ్మ, సచివాలయం సర్వేయర్ హేమంత్, పెద్దాడ పుచ్చాలు, పెద్దినాయుడు పాల్గొన్నారు. -
ఎస్ఎంఎస్–2లో రికార్డు హీట్ల ఉత్పత్తి
ఉక్కునగరం : స్టీల్ మెల్ట్షాప్–2లో మంగళవారం ఎక్కువ హీట్లు ఉత్పత్తి చేశారు. ఉదయం ఏ షిఫ్ట్లో 20 హీట్లు, బీ షిఫ్ట్లో 26 హీట్లు, సీ షిఫ్ట్లో 30 హీట్లు వెరసి మూడు షిఫ్ట్ల్లో మొత్తం 76 హీట్లుతో గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక హీట్లు సాధించి రికార్డు ఉత్పత్తి సాధించారు. ఇంతకు ముందు 2025 ఆగస్టు 12న అత్యధికంగా 72 హీట్లు సాధించగా డిసెంబర్ 24న 73 హీట్లు సాధించి ఆ రికార్డును అధిగమించింది. ఇప్పుడు 76 హీట్లతో ఆ రికార్డును తిరగరాశారు. ఈ సందర్భంగా విభాగం ఉద్యోగులను విభాగాధిపతి, అధికారులు అభినందించారు. -
దేశ రక్షణ కోసం మరో స్వాతంత్య్ర పోరాటం అవసరం
సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ ఏయూక్యాంపస్ : దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర సమరం సాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ పేర్కొన్నారు. ‘సిటు‘ జాతీయ మహాసభలు సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ ఐదో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ ఉక్కు సహా.. దేశంలోని అన్ని వనరులనూ ఇద్దరు గుజరాతీలు అమ్మకానికి పెట్టగా.. ఇద్దరు గుజరాతీలు కొనుక్కుంటున్నారుని అన్నారు. దేశ రక్షణకు పిలుపు ఇస్తే భగత్ సింగ్లా ఉరికంబం ఎక్కడానికై నా తాను సిద్ధమేనని.. తాను ప్రజానాట్యమండలి బిడ్డనని.. ఎర్ర సినిమా తీయాలనే.. సినీ రంగాన్ని ప్రక్షాళన చేయడానికే సినీ రంగంలోకి వెళ్లానని తెలిపారు. అత్యంత శక్తిమంతమైన మాధ్యమం సినిమా రంగాన్ని కూడా ప్రజాసంఘంగా గుర్తించాలని ఆకాక్షించారు. ప్రత్యేక అతిథి ప్రొఫెసర్ కె.ఎస్.చలం మాట్లాడుతూ అదానీ, అంబానీలు దేశీయ పెట్టుబడిదారులు మాత్రమే కాదని, వారు అంతర్జాతీయ పెట్టుబడిదారులని వివరించారు. పెట్టుబడిదారీ వ్యవస్థే తనకు అవసరమైన వ్యవస్థలను సృష్టించుకుంటుందన్నారు. కార్మిక ధర్మనీతి–2025 చట్టం మనుధర్మ ప్రాతిపదికన చేసినట్లు పాలకవర్గమే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. సమస్యలపై పోరాటాలు మరింత క్రియాశీలకంగా సాగాలని ఆకాంక్షించారు. సిటు రాష్ట్ర నాయకురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ అభివృద్ధి సంక్షేమం, అచ్ఛేదిన్ అంటుంటాయంటూ.. సంపద అతి కొద్ది మంది వద్దే ఉండటమేనా అచ్ఛేదిన్ అని ప్రశ్నించారు. అంగన్వాడీ, ఆశ సిబ్బందిని కార్మికులుగా గుర్తించాలని అంతర్జాతీయ కార్మిక సంఘం సిఫార్సులనూ పట్టించుకోని ప్రభుత్వ తీరును ఖండించారు. తొలుత సిటు రాష్ట్ర నాయకులు కె.అజయ్కుమార్ స్వాగతం పలికారు. సభలో శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీ ఆవరణలో ఆటస్థలంపై విచారణలో వివక్ష
నాతవరం : ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన అధికారులే కూటమి నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తే ఇంకేం న్యాయం చేస్తారని జెడ్పీటీసీ సభ్యురాలు కాపారపు అప్పలనర్స, సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు అన్నారు. మండల కేంద్రంలో గల పీహె హెచ్సీ ప్రాంగణంలో నిబంధనలు ఉల్లంఘించి ఆటస్థలం నిర్మాణ పనులపై కలెక్టర్కు జెడ్పీటీసీ, సర్పంచ్ సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల ప్రకారం బుధవారం జిల్లా క్రీడల అధికారి పూజారి శైలజ నాతవరంలో బహిరంగ విచారణకు విచ్చేశారు. ఆట స్థలంలో నిర్మాణ పనులను పరిశీలించి ఫిర్యాదు దారులను సంఘటన స్థలానికి రప్పించారు. పీహెచ్సీ స్థలంలో ఆటస్థలం నిర్మిస్తే పీహెచ్సీ 30 పడకలు స్థాయికి పెరిగితే స్థల సమస్య వస్తుందని, గ్రౌండ్ నిర్మించేందుకు నాతవరంలో మరో చోట స్థలం ఉందని తాము చెబుతున్నా వారు పట్టించుకుండా కూటమి నేతలు చెప్పిన మాటలు విని అక్కడి నుంచి ఎంపీడీవో కార్యాలయానికి వె వెళ్లిపోయారని జెడ్పీటీసీ, సర్పంచ్, ఉపసర్పంచ్ తెలిపారు. కలెక్టర్కు ఫిర్యాదు జరుగుతుందని ఆశిస్తే విచారణకు వచ్చిన అఽఽధికారి ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ వేణుగోపాల్ ఇతర అధికారులతో పూజారి శైలజ సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అంశాలను నివేదిక ద్వారా కలెక్టర్కు పంపిస్తామన్నారు. -
అగ్నిమాపక వాహనం, రోడ్ స్వీపింగ్ మెషిన్ ప్రారంభం
విశాఖ సిటీ : విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అగ్నిమాపక కేంద్రంలో నూతనంగా సమకూర్చుకున్న రోడ్ స్వీపింగ్ మెషిన్, మల్టీపర్పస్ ఫైర్ టెండర్ను బుధవారం పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరాంజి కొరాటి ప్రారంభించారు. రూ.3.85 కోట్ల వ్యయంతో సమకూర్చుకున్న మల్టీపర్పస్ ఫైర్ టెండర్లో 6 కిలోలీటర్ల నీటి ట్యాంక్, 200 లీటర్ల ఫోమ్ కంపౌండ్, 100 కిలోల డ్రై కెమికల్ పౌడర్ (డీసీపీ), 45 కిలోల కార్బన్ డయాకై ్సడ్తో పాటు అత్యవసర పరిస్థితుల కోసం అవసరమైన ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. అలాగే రోడ్ స్వీపింగ్ మెషిన్ను పోర్ట్ పరిధిలోని అంతర్గత రహదారులపై ఏర్పడే దుమ్ము, చెత్త, స్పిల్లేజ్ను శుభ్రం చేయడానికి వినియోగించనున్నారు. రూ.4.69 కోట్ల వ్యయంతో ఈ యంత్రాన్ని కొనుగోలు చేశారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ యంత్రం గంటకు 20 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో అన్ని దిశల్లో శుభ్రపరిచే సామర్థ్యం కలిగి ఉంది. పోర్ట్ పరిసర ప్రాంతంలో దుమ్ము, కాలుష్య నియంత్రణకు ఇది మరింత దోహదపడనుంది. కార్యక్రమంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ టి.అరుణ్ ప్రసాద్, పోర్ట్ విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని మృతదేహం
అనకాపల్లి : అనకాపల్లి రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం నంబర్ 2లోని రిలేరూమ్ పక్కన గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించడం జరిగిందని దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు. మృతుని వయస్సు సుమారుగా 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటాయని, కుడి, ఏడమ చేతిపై వై.అర్జున, గీతా ప్రసాద్ అని టాటూ ఉందని, ఎత్తు సుమారు 5 అడుగుల 4 అంగుళాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగిందని ఎస్ఐ చెప్పారు. సాధువు/సన్యాసి అయి ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 7382058996ను సంప్రదించాలన్నారు. గుర్తుతెలియని మృతదేహం -
విద్యారంగ సమస్యలపై ప్రశ్నిస్తే రౌడీ షీటా?
స్థానిక నెహూచౌక్ వద్ద ధర్న చేస్తున్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణింద్ర కుమార్ అనకాపల్లి : విద్యార్థి, యువజన ఉద్యమాలు అణచివేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆందోళన చేస్తున్న ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై విశాఖపట్నంలో రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని ఖండిస్తున్నామని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఫణింద్రకుమార్ అన్నారు. స్థానిక నెహూచౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు, యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేస్తున్న ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై ఉద్యమాలకు సంబంధించిన పాత కేసులు తోడి నేడు విశాఖపట్నంలో ఐదుగురు విద్యార్థి యువజన నాయకులపై రౌడీషీట్ ఓపెన్ చేయడాన్ని ఖండిస్తున్నామని, వారిపై రౌడీషీట్ను తక్షణమే ఎత్తివేయాలని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే నాయకులు ఎవరూ ఉండకూడదనే రాష్ట్రంలో రెడ్బుక్ రా జ్యాంగాన్ని హిట్లర్ పరిపాలనను తలపిస్తూ రౌడీ షీట్లు , పీడీ యాక్ట్లు ద్వారా ఉద్యమాలను అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. దేశ చరిత్రలో విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవీ కూడా నిలిచిన దాఖలాలు లేవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు బాబ్జి, నాయ కులు సంతోష్,అఖిల్,రమేష్,కళ్యాణి,పూజ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
పద్మనాభం: మండలంలోని విజయానందరం జంక్షన్లో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా జామి మండలం కొత్త భీమసింగ్కు చెందిన పాండ్రంగి వెంకటేష్ (34) విజయనగరం వై జంక్షన్లో పాన్ షాపు, పార్లర్ షాపు నిర్వహిస్తున్నాడు. షాపుల నుంచి పని ముగించుకుని మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన కొత్త భీమసింగ్ వస్తుండగా మార్గంమధ్యలో విజయానందపురం జంక్షన్లో ఎస్టీ కాలనీ సమీపంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో వెంకటేష్కు కుడి చేయి విరిగిపోయింది. ముక్కులో నుంచి రక్తం వచ్చింది. స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్సు సంఘటన స్థలానికి చేరుకునేటప్పటికే వెంకటేష్ మృతి చెందాడు. మృతుడికి భార్య సత్యలత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్యలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నూతన సంవత్సర వేళ విషాదం
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకుల మృతిఅచ్యుతాపురం రూరల్ : మునగపాక మండలం పల్లవాని వీధికి చెందిన మొల్లి రాము (25) కొండకర్ల కూడలికి సమీపంలో బస్సు బైక్ డీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుదవారం ఇంటి నుండి బయలుదేరి సోలార్ పరిశ్రమకు విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో కొండకర్ల కూడలి సమీపంలోకి వచ్చే సరికి కార్మికులను తీసుకువెల్తున్న లారస్ పరిశ్రమ బస్సు, బైక్ డీకొన్న దుర్ఘటనలో మొల్లి రాము అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నట్లు పోలీసుల సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చంధ్రశేఖర్ రావు, ఎస్ఐ వెంకటరావు తెలిపారు. మృతుని కుటుంబాన్ని పరిశ్రమ, బస్సు యాజమాన్యం ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రొంగలి రాము డిమాండ్ చేసారు. మునగపాకలో విషాదం మునగపాక: కుటుంబానికి అందివస్తున్నాడనుకుంటున్న కన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని తల్లితండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. నూతన సంవత్సర వేడుకలను స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి ఘనంగా జరుపుకొందామని భావించిన ఆ యువకున్ని బస్సు మింగేసింది. దీంతో మునగపాకలో విషాదం అలముకుంది. వివరాలివి. మునగపాకకు చెందిన మొల్లి నాయుడు, వెంకటి దంపతులకు ఇద్దరు కుమారులు, నాయుడు కూలి పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. నాయుడు పెద్దకుమారుడు రాము కొంతకాలంగా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేయూతగా ఉంటున్నాడు. అందరితో సఖ్యతగా ఉండే రాము బుధవారం మధ్యాహ్నం షిప్టునకు తన బైక్పై మునగపాక నుంచి బయలుదేరి వెళుతుండగా అచ్యుతాపురం మండలం కొండకర్ల సమీపంలో ప్రధాన రహదారిపై బస్సు ఢీకొని అక్కడి కక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాము తల్లితండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఉదయం అందరితో సరదాగా గడిపిన కొడుకు అర్ధంతరంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న సమాచారం తెలియడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు అంతా సిద్దమవుతున్న తరుణంలో ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. కొంపల్లి వద్ద బస్సును తప్పించబోయి... దేవరాపల్లి : దేవరాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే రోడ్డులో కుంపల్లి కూడలి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కేఎంపాలెంకు చెందిన యువకుడు చౌడువాడ దేముడునాయుడు (26) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న అదే గ్రామానికి చెందిన గంధం మహేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణారాయుడుపేట జంక్షన్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 12డి బస్సు కుంపల్లి కూడలి చేరుకునే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తూ రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న దేముడునాయుడు తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర గాయాలతో బయటపడిన గంధం మహేష్ను కె.కోటపాడు సీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్కు తరలించారు. కాగా కేంపాలెంకు చెందిన సముద్రంనాయుడు, రమణమ్మ దంపతుల రెండో కుమారుడు దేముడునాయుడు ఇంటర్ పూర్తి చేసి తల్లిదండ్రులతో పాటు అన్నయ్య జగ్గారావుకు వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉండేవాడు. స్నేహితుడితో బయటకు వెళ్లి వస్తానని చెప్పి బుధవారం ఉదయం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత సమయం తర్వాత తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న విషాద వార్త తెలియడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కె.ఎం.పాలెంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. దేముడునాయుడు మృతి పట్ల సర్పంచ్ గంధం రామకృష్ణ సంతాపం తెలిపారు. -
బ్యాంకు ఉద్యోగుల సమస్యలపై ధర్నా
అనకాపల్లి : యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు స్థానిక మొయిన్రోడ్డు ఎస్బీఐ ఎదురుగా బుధవారం బ్యాంక్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి ఆడారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల మధ్య డిసెంబర్ 2023లో ఐదురోజుల పనిదినాల ఒప్పందం కుదించారని, కేంద్ర ప్రభుత్వం నేటికి తుది నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాండ్రేగుల హరికృష్ణ మాట్లాడుతూ రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా, స్టాకు మార్కెట్, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు వారానికి ఐదురోజులు పనిదినాలు కల్పించారని, మిగిలిన బ్యాంక్ ఉద్యోగులకు కల్పించాలని ఆయన కోరారు. బ్యాంకుల్లో సిబ్బంది నియామకాలు లేక ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారని, వివిధ విభాగాల్లో ఖాళీపోస్టులను తక్షణమే భర్తీచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ లోకల్ కార్యదర్శి మహేష్, ఉద్యోగులు డి.ఈశ్వరరావు,శ్రావణి, ప్రసాద్, నాగరాజు, మంగపతి, ఈశ్వరరావు, సతీష్, యూనియన్ బ్యాంకు ఉద్యోగులు ఆడారి గోవిందరావు, తోట శ్రీనివాసరావు, అర్షద్, అప్పారావు, రాజు గోవి, స్రవంతి, శరగడం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్లో అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీకాలనీ: క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం హాస్పటల్లో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ హాస్పటల్ ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించే విధంగా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ దేశంలో లెవల్ 3 కేటగిరి హాస్పటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు.కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యాన్ని కంట్రోల్ చేయాలి సారూ..
● ఎకై ్సజ్ జిల్లా అధికారికి ఐద్వా వినతి అనకాపల్లి: నూతన సంవత్సర వేడుకలను యువత, అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలంటే డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో మద్యం దుకాణాల్లో విక్రయాలు నిలిపివేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం అన్నారు. జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సుధీర్కు మంగళవారం ఆమేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పై తేదీల్లో మద్యం తాగి వాహనాలను దురుసుగా నడపడం, మహిళలను వేధించడం మొదలైన అనర్ధాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మద్యం విక్రయాలు నిలుపుదల చేయాలని తదితర డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి డి.వరలక్ష్మి, సహాయ కార్యదర్శులు ఆర్.లక్ష్మి, అన్నపూర్ణ, బంగారమ్మ పాల్గొన్నారు. -
పోరాడే వారంటే పాలకులకు భయం
ఏయూక్యాంపస్ : సమానత్వం కోసం పోరాడుతున్న వారిని చూసి పాలకవర్గాలు భయపడుతున్నాయని సినీ నటి రోహిణి పేర్కొన్నారు. సీఐటీయూ జాతీయ 18వ మహాసభ సందర్భంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏయూ ఎగ్జిబిషన్ మైదానంలో ‘శ్రామిక ఉత్సవ్‘ నాలుగో రోజు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సీ్త్రల పట్ల సమాజం వైఖరి మార్చుకోవాలని, వారిని సమానంగా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టుల పట్ల తనకు చాలా గౌరవభావముందన్నారు. పెరియార్, అంబేడ్కర్, కమ్యూనిస్టులు తమ భావాలతో తనను తీర్చిదిద్దారని తెలిపారు. సినీ నటిగా నాలుగు మంచి విషయాలు తన వాళ్లకు తెలపాలనేది తన ఉద్దేశమన్నారు. మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. శ్రామిక ఉత్సవ్లో సినీ నటి రోహిణి -
ఘనమైన కీర్తి.... గత చరిత్రే!
నర్సీపట్నం : గతమెంతో..ఘనమైన నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ వైభవం కోల్పోతుంది. కాలనుక్రమంలో చోటు చేసుకుంటున్న మార్పులతో డివిజన్ మరింత కుదించుకుపోతుంది. నూరేళ్ల చరిత్ర కలిగిన ఈ డివిజన్ ముక్కలు, ముక్కలు అవుతుంది. బ్రిటిష్ కాలంలో డివిజన్ పురుడు పోసుకుంది. నాటి కాలంలో ఇక్కడ రెవెన్యూ డివిజన్తో పాటు బ్రిటిష్ అధికారులు అటవీ, రహదారులు, భవనాలు, పోలీసు, వైద్యశాఖల డివిజన్ కార్యాలయాలు ఏర్పడ్డాయి. స్వాతంత్య్రం అనంతరం పంచాయతీరాజ్, తునికలు కొలతలు, విద్యుత్శాఖ డివిజన్లు ఏర్పడ్డాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కారణంగా ఈ శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. 1923లో డివిజన్ ఏర్పాటు... నర్సీపట్నం కేంద్రంగా 1923లో ఈ డివిజన్ ఏర్పాటైంది. ఈ డివిజన్ కోసం పాల్ఘాట్ సెంటర్ వద్ద మెయిన్ రోడ్డును అనుకుని సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఆనాడే సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్మించారు. అప్పట్లో ఎందరో ఆంగ్లేయులు సబ్ కలెక్టర్లుగా పని చేశారు. వారిలో స్కాట్ అనే బ్రిటిష్ అధికారి పేరు అప్పట్లో ప్రముఖంగా వినిపించేది. పరిధిలో పూర్వపు నర్సీపట్నం, యలమంచిలి, నక్కపల్లి, మాడుగుల తదితర తాలుకాలు ఉండేవి. 1987లో మండల వ్యవస్థ వచ్చింది. మండల వ్యవస్థ తరువాత నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, పాయకరావుపేట, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, రోలుగుంట, రావికమతం, మాడుగుల, చీడికాడ, బుచ్చెయ్యపేట మండలాలు ఈ డివిజన్లో ఉండేవి. ఉమ్మడి జిల్లాలో విశాఖపట్నం తరువాత నర్సీపట్నం ప్రాధాన్యత డివిజన్గా ఉండేది. ఇటు ఏజెన్సీ సరిహద్దు నుంచి అటు సముద్రతీరం వరకు అతిపెద్ద డివిజన్గా ఉండేది. నర్సీపట్నంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో పాలనా కార్యక్రమాలు బ్రిటిష్ పాలనలో ఇక్కడ నుంచే జరిగేవి. పునర్వ్యవస్థీకరణతో కుచించుకుపోయి... దశాబ్దంన్నర క్రితం ఏర్పడిన అనకాపల్లి డివిజన్తో ఈ డివిజన్ కొంత కుదించుకుపోయింది. యలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి అనకాపల్లి డివిజన్లోకి వెళ్లిపోయాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డివిజన్ల పునర్వ్యవస్థీకరణతో నర్సీపట్నం డివిజన్ పరిధి మరింత తగ్గిపోయింది. నూతన సంవత్సరం నుంచి అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ జెండా ఊపింది. దీంతో ఇప్పటి వరకు నర్సీపట్నం డివిజన్లో ఉన్న పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాలు అడ్డురోడ్డు డివిజన్లోకి వెళ్లనున్నాయి. చీడికాడ మండలాన్ని అనకాపల్లి డివిజన్లో కలుపుతూ మార్పు చేశారు. దీంతో నర్సీపట్నం విడిజన్ పరిధి ఏడు మండలాలకే పరిమితమైంది. కాలక్రమంలో మార్పులు సహజమైనప్పటికీ, ప్రాధాన్యం కోల్పోవడం స్థానికులకు కొంత ఆవేదన కలిగిస్తోంది. గణమైన కీర్తి..గతచరిత్రగానే మిగిలిపోనుంది.ఉన్నత స్థాయికి సోపానం.. ఇక్కడ సబ్ కలెక్టర్లుగా పని చేసిన వారులో కాకి మాధవరావు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ఎన్నికల కమిషనర్గా పని చేశారు.ఎ.శాంతి కుమారి తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. కాశీపాండ్యన్ కేంద్ర ఎన్నికల కమిషనర్గా పని చేశారు. నిమ్మగెడ్డ రమేష్కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పని చేశారు. బ్రిటిష్ కాలంలో ఏర్పడిన నర్సీపట్నం డివిజన్ కాలక్రమంలో తగ్గిన ప్రాభవం అడ్డురోడ్డు డివిజన్ ఏర్పాటుతో 7 మండలాలకే పరిమితం -
రంగనాథుడిగా వెంకన్న అపురూప దర్శనం
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవేంకటేశ్వరస్వామి రంగనాథుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు శయనిస్తుండగా శ్రీదేవి, భూదేవి కాళ్లు వత్తుతున్నట్లుగా అలంకరించిన రూపాన్ని చూసి భక్తులు ఆనందపరవశులయ్యారు. ఏ ఆలయంలో లేని విధంగా స్వామివారికి ఎనిమిది అలంకారాలతో, ఎనిమిది వాహనాల్లో తిరువీధి సేవలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో షడ్భుజాలతో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారికి అర్చక స్వాములు కృష్ణమాచార్యులు ఉదయం 3 గంటలకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం గుండా గరుడాద్రిపై వెలసిన మూలవిరాట్ దర్శనం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఉపమాక తరలిరావడంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడింది. కింద బేడామండపంలో గర్భాలయంలో ఉన్న స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీవారి పోటు ముందు ప్రత్యేకంగా స్టేజీ ఏర్పాటు చేసి రంగనాథునిగా అలంకరించి భక్తులకు ఉత్తర ముఖంగా దర్శనం కల్పించారు. సాయంకాలారాధనల అనంతరం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవేంకటేశ్వరస్వామిని రంగనాథునిగా అలంకరించి పుణ్యకోటి వాహనంపైన, రాజాధిరాజ వాహనంలో గోదాదేవి అమ్మవారిని, రుక్మిణీ సహిత వేణుగోపాలస్వామిని పొన్న వాహనంలోను, ఆంజనేయ వాహనంలో సీతారాములను, హంస వాహనంలో శయన పెరుమాళ్లను, లక్కగరుడ వాహనంలో చిన్నికృష్ణుని, గజవాహనంలో ప్రాకార పెరుమాళ్లను, పల్లకిలో బుల్లిరాముడిని వేంచేయింపజేసి ఉపమాక మాఢ వీధుల్లో తిరువీధి సేవలు నిర్వహించారు. ఉపమాక శ్రీనివాస భజన బృందంవారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు వాహనాల ముందు కోలాటం, భజన గీతాలు ఆలపించారు. గోదాదేవికి తిరుప్పావై 13వ పాశురాన్ని విన్నపం చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, అర్చకులు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, రాజగోపాలాచార్యులు, రామగోపాలాచార్యులు, సాయి ఆచార్యులు పూజల్లో పాల్గొన్నారు. -
రోడ్డుపై దొరికిన రూ.47 వేల నగదు
● సొంతదారుకు క్షేమంగా అప్పగింత ● యువకుడి నిజాయితీని అభినందించిన పోలీసులు యలమంచిలి రూరల్ : మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న పట్టణంలోని శతకంపట్టు ప్రాంతానికి చెందిన యల్లపు సురేష్ తనకు రోడ్డుపై దొరికిన రూ.47వేల నగదు, ఇతర వస్తువులను పోగొట్టుకున్న యువతికి పోలీసుల సమక్షంలో అందజేసి అందరి మన్ననలు పొందారు. అచ్యుతాపురం దిబ్బపాలేనికి చెందిన కూనిశెట్టి రేణుక మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అచ్యుతాపురం గ్రామీణ వికాస బ్యాంకు బ్రాంచి నుంచి రూ.47వేలు డ్రా చేసే పనిపై యలమంచిలి పట్టణానికి వచ్చారు. తిరిగి ఆటోలో వెళ్తుండగా నగదుతో ఉన్న ప్లాస్టిక్ సంచి దిమిలి రోడ్డు పాల అప్పారావు దుకాణానికి సమీపంలో జారిపడింది. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న యల్లపు సురేష్ నగదుతో ఉన్న సంచిని చూడగా అందులో నగదుతో పాటు యువతి ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం ఉన్నాయి. వాటిని అటువైపుగా వస్తున్న యలమంచిలి ట్రాఫిక్ ఏఎస్ఐ నూకరాజుకు యువకుడు అందజేశాడు. చిరునామా, వివరాల ఆధారంగా దొరికిన నగదు రేణుకకు చెందినదిగా నిర్ధారించుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం ఆ నగదును యలమంచిలి సర్కిల్ కార్యాలయంలో ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, సీఐ ధనుంజయరావు, పట్టణ ఎస్ఐ కె.సావిత్రి, యల్లపు సురేష్ల సమక్షంలో అందజేశారు. యువకుడి నిజాయితీని పోలీసు అధికారులు అభినందించారు. -
ప్రొటోకాల్పై గరంగరం
మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రొటోకాల్ అమలుపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరు కావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్(విశాఖ), విజయ కృష్ణన్(అనకాపల్లి), దినేష్ కుమార్(ఏఎస్ఆర్ జిల్లా), సీఈవో నారాయణమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు గౌరవం లేదా? వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులను పిలవడం లేదని, వారిని గౌరవించాల్సిన అవసరం లేదా అని సూరిబాబు(ఎంపీపీ, అనకాపల్లి), ఈర్లె అనురాధ(జెడ్పీటీసీ), సన్యాసి రాజు, నాగమణి, ఉమాదేవి, కర్రి సత్యం, దొండా రాంబాబు తదితరులు ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రొటోకాల్ పక్కాగా ఉండేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొత్తూరులో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు ఆరోపించారు. కె.కోటపాడు జెడ్పీటీసీ ఈర్లె అనురాధ మాట్లాడుతూ ఇటీవల తన మండలంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆహ్వానించలేదన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర ఆదేశించారు. ప్రొటోకాల్ పాటించని ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేస్తామని సీఈవో నారాయణమూర్తి తెలిపారు. పింఛన్ల ఏరివేత ఆపండి ఉమ్మడి విశాఖ జిల్లాలో పింఛన్ల ఏరివేత ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని, ఈ ఏరివేతలో అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తున్నారని గొలుగొండ ఎంపీపీ నాగమణి ఆరోపించారు. బుచ్చయ్యపేట జెడ్పీటీసీ దొండపూడి రాంబాబు మాట్లాడుతూ అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారని, అర్హులకు తొలగిస్తున్నారని మండిపడ్డారు. పల్లె రోడ్ల దుస్థితిపై సర్వత్రా గగ్గోలు వడ్డాది, చోడవరం, రోలుగుంట, నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లోని గ్రామాల్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్ వివరించారు. ఈ మార్గా ల్లో ప్రయాణించడం గగనంగా మారిందని వాపోయారు. దేవరాపల్లి మండలంలో కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం అన్నారు. కోటవురట్ల మండలంలో కూడా రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయని జెడ్పీటీసీ సభ్యురాలు ఉమాదేవి తెలిపారు. అప్పలరాజును విడుదల చేయాలి సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పెట్టిన పీడీ కేసును ఎత్తి వేయాలని పలువురు సభ్యులు కోరారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అప్పలరాజుపై పీడీ యాక్టు నమోదు చేయడం దారుణమని అనంతగిరి జెడ్పీటీసీ డి.గంగరాజు అన్నారు. ఆయనకు మద్దతుగా పలువురు వైఎస్సార్సీపీ సభ్యులు, నక్కపల్లి జెడ్పీటీసీ గోసల కుశలమ్మ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, లాలం రాంబాబు తదితరులు మాట్లాడారు. బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలుష్యంపై ఆందోళన పరవాడలో వివిధ పరిశ్రమల కారణంగా కాలుష్యం సమస్య అధికంగా ఉందని జెడ్పీటీసీ పైలా సన్యాసిరాజు అన్నారు. పలు లారీలు ఓవర్ లోడుతో వెళ్తుండడంతో రోడ్లు ఛిద్రమయ్యాయని చెప్పారు. అయినా కాలుష్య నివారణ అధికారులు, ఆర్టీవో, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అచ్యుతాపురంలో కూడా కాలుష్య సమస్య అధికంగా ఉందన్నారు. పలు ప్రాంతాల నుంచి మట్టి అక్రమ తరలింపుపై గనుల శాఖ అధికారులు సమాధానం చెప్పాలని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్ డిమాండ్ చేశారు. యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే కొనసాగించాలని నియోజకవర్గ జెడ్పీటీసీలు లాలం రాము, ధూళి నాగరాజు, శానాపతి సంధ్య, కో–జెడ్పీటీసీ నర్మాల కుమార్ కోరారు. తొలుత మునగపాక జెడ్పీటీసీ పెంటకోట సోము సత్యనారాయణ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉన్నందున కొత్త సబ్–డివిజన్ యలమంచిలికి మార్చాలన్నారు. లేకుంటే అనకాపల్లిలోనే రెవెన్యూ డివిజన్ కొససాగించాలన్నారు. అడ్డురోడ్డు కేంద్రంగా కొత్త సబ్–డివిజన్పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. ప్రొటోకాల్ అమలుపై జెడ్పీ చైర్పర్సన్ సుభ్రద, కలెక్టర్ల ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు మండలాల్లో అభివృద్ధి పనులకు ఆహ్వానం లేకపోవడంపై జెడ్పీటీసీల ఆగ్రహం బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా నినాదాలు వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యేలు, ఎంపీల గైర్హాజరుపై గుసగుసలు -
తాళ్లతో కట్టేసి.. నగలు దోచేసి.!
అల్లిపురం: ఇంటి యజమానురాలిని తాళ్లతో కట్టేసి.. 10 తులాల బంగారు ఆభరణాలు, 8 తులాల వెండి వస్తువులను దోచుకుపోయిన కేసులో తల్లీకూతుళ్లు సహా మొత్తం నలుగురు నిందితులను ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కె.లతామాధురి ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ రాత్రి 9.50 గంటల సమయంలో ధారపాలెం, బంగారుతల్లి లే–అవుట్లో నివసిస్తున్న మొండు వసంత తన ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. ఆమె లోపల గడియ పెట్టుకుని పడుకోగా, రాత్రి 10 గంటల సమయంలో కాళ్ల వద్ద ఎవరో సంచరిస్తున్నట్లు అలికిడి అయింది. వెంటనే ఆమె లేచేందుకు ప్రయత్నించగా.. ఒక వ్యక్తి ఆమె కాళ్లను గట్టిగా పట్టుకుని తాడుతో కట్టేశాడు. ఆమె అరవకుండా నోటిని అక్కడే ఉన్న లంగాతో కట్టేశారు. అనంతరం ఆమె మెడలోని 5 తులాల బంగారు పలక సరలు, నెమలి బిల్ల గల రెండు పేటల గొలుసు, చేతులకు ఉన్న 4 తులాల బంగారు గాజులు, లాకెట్తో కూడిన మరో గొలుసు, తులం బరువుగల రెండు ఉంగరాలు, 8 తులాల వెండి ఆభరణాలను బలవంతంగా తీసుకున్నారు. అనంతరం నిందితులు బయటకు వెళ్లి, తలుపులకు బయటి నుంచి గడియపెట్టి పారిపోయారు. తర్వాత బాధితురాలు అతికష్టం మీద కట్లు విప్పుకుని ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సెల్ఫోన్ టవర్ లోకేషన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దాదాపు వెయ్యి సెల్ఫోన్ల డేటాను విశ్లేషించి నిందితులను గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా రామాయణపురానికి చెందిన నెల్లి నిర్మల కుమారి, ఆమె కుమార్తె నెల్లి లిఖిత, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి (ఇందిరాకాలనీ)కి చెందిన భూపతి అభిరామ్, బి.సావరం గ్రామానికి చెందిన నల్లి మణిరత్నంలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. బంధువుల పరిచయంతో.. ప్రధాన నిందితురాలు నెల్లి నిర్మల కుమారి.. ఆరిలోవలోని బంగారుతల్లి లే–అవుట్లో నివాసం ఉంటున్న తన పెదనాన్న కుమారుడు దుర్గాప్రసాద్ ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేది. ఆ సమయంలో దుర్గాప్రసాద్ ఇంటి యజమానురాలైన వసంత మెడలో ఎక్కువ బంగారు ఆభరణాలు ఉండటం గమనించింది. తనకు ఉన్న అప్పులు తీర్చుకోవడానికి ఆమెను దోచుకోవాలని పథకం వేసింది. భీమవరం కలెక్టర్ ఆఫీస్లో క్యాంటీన్ నడుపుతున్న నిర్మల కుమారి.. తన కుమార్తె లిఖితకు, క్యాంటీన్లో పనిచేస్తున్న అభిరామ్, మణిరత్నంలకు డబ్బు ఆశ చూపించి విశాఖ తీసుకువచ్చింది. 13వ తేదీన దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. మరుసటి రోజు బాధితురాలికి ‘సెండాఫ్’చెప్పే నెపంతో నిర్మల కుమారి, లిఖిత ఆమెను బయటకు పిలిచారు. ఆ సమయంలోనే అభిరామ్, మణిరత్నం రహస్యంగా ఇంట్లోకి దూరి దాక్కున్నారు. రాత్రి బాధితురాలు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని నిద్రపోయాక, లోపల ఉన్న నిందితులు ఆమెను బంధించి చోరీకి పాల్పడ్డారు. ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన ద్వారకా సబ్ డివిజన్ క్రైం సీఐ వి.చక్రధర్, ఆరిలోవ క్రైం ఎస్ఐ ఎ.హరికృష్ణ, ఎంవీపీ క్రైం ఎస్ఐ సి.హెచ్.రామదాసు, ద్వారకా క్రైం ఎస్ఐ ఎల్. శ్రీనివాసరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రామారావు, చంద్రశేఖర్లను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అభినందించారు. -
వించ్ ప్రయాణం అమోఘం
● ఒడిశా జలవిద్యుత్ శాఖ ఉన్నతాధికారి ప్రణబ్కుమార్మంచు కొండల్లో వేడివేడి విందు ●హరితా రిసార్ట్లో ప్రత్యేక వంటకాలు ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లే వించ్ ప్రయాణం అమోఘమని ఒడిశా జలవిద్యుత్శాఖ ఆర్థిక సంచాలకుడు ప్రణబ్కుమార్ అన్నారు. ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. వించ్లో ప్రాజెక్ట్కు చేరుకున్నారు. మధురానుభూతి పొందారు. వించ్ వివరాలను ప్రాజెక్టు అధికారుల నుంచి తెలుసుకున్నారు. విద్యుత్ కేంద్రంలో జనరేటర్ల పనితీరు, విద్యుత్ ఉత్పత్తి వివరాలపై ఆరా తీశారు. శతశాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడంపై ఆయన ప్రాజెక్టు అధికారులను,సిబ్బందిని అభినందించారు. పలు రికార్డులను పరిశీలించారు. స్థానిక ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు,సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ గోవిందరాజులు, ఓహెచ్పీసీ జీఎం నిర్మల్కుమార్ ,మాచ్ఖండ్ ఈఈ సివిల్ కురేషిప్రధాన్, డిప్యూటీ ఈఈలు చంద్ర ఓబుల్రెడ్డి, వెంకటమధు,చిరంజీవి పాల్గొన్నారు. -
ముక్కోటి వైభవం
ముక్కోటి ఏకాదశి పర్వదినాన సింహగిరి భూవైకుంఠాన్ని తలపించింది. సింహాచలం గోవింద నామస్మరణతో మార్మోగింది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వైకుంఠవాసుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆ దివ్య మంగళ రూపాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి ‘గోవిందా.. గోవిందా’ అంటూ తన్మయత్వంతో పరవశించిపోయింది. ‘ఏ జన్మ పుణ్యమో ఈ అపురూప దర్శనం’ అంటూ భక్తులు ఆనందబాష్పాలతో అప్పన్న స్వామిని అర్చించారు. ● వైకుంఠవాసుడిగా సింహాద్రినాథుడు ● కనులపండువగా అప్పన్న ఉత్తరద్వార దర్శనం ● పరవశించిన భక్తజనం సింహాచలం: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఉత్తరద్వార దర్శనం కనులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడై శేషతల్పంపై కొలువుదీరిన స్వామి వారు, ఉత్తర రాజగోపురం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఏడాదిలో ఒక్క రోజు, అది కూడా కేవలం కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శన భాగ్యాన్ని పొంది భక్తులు పులకించిపోయారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే వైదికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావించారు. ఉత్సవమూర్తి అయిన గోవిందరాజ స్వామిని వైకుంఠవాసుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను మేలిముసుగులో ఉంచి శేషతల్పంపై అధిష్టింపజేసి ఆలయ బేడా మండపంలో తిరువీధి నిర్వహించారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం.. తొలుత ఆలయ ఉత్తరద్వారం వద్ద స్వామిని ఉంచి, మేలిముసుగు తొలగించారు. సంప్రదాయం ప్రకారం పూసపాటి వంశీయులకు తొలి దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామిని ఉత్తర రాజగోపురంలో ఏర్పాటుచేసిన వేదికపైకి చేర్చారు. ఉదయం 5.10 గంటల నుంచి 11.15 గంటల వరకు భక్తులకు దర్శనాన్ని అందజేశారు. ఆ తర్వాత సింహగిరి మాడవీధిలో స్వామివారి తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు సాతులూరి నరసింహాచార్యులు తదితరులు పూజల్లో పాల్గొన్నారు.గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులు వడ్డాది వేంకటేశ్వరస్వామి -
ఈ ఏడాది 5,821 కేసులు
సాక్షి, అనకాపల్లి: ఈ ఏడాదిలో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఆస్తి తగాదాలు, సోషల్ మీడియా వేధింపులు గణనీయంగా పెరిగాయి. గతేడాది 61 సైబర్ నేరాలు నమోదు కాగా.. ఈ ఏడాది 76 కేసులకు చేరాయి. సోషల్ మీడియా వేధింపుల కేసులు కూడా గతేడాది 19 కాగా.. ఈ ఏడాది 21 నమోదయ్యాయి. ఆస్తి సంబంధిత, ఆర్థిక నేరాలు గతేడాది 406 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 417 కేసులకు పెరిగాయి. మోసపూరిత కేసులు గతేడాది 131 కాగా.. ఈ ఏడాదిలో 125 నమోదయ్యాయి. నమ్మకద్రోహం కేసులు గతేడాది 18 కాగా.. ఈ ఏడాది 17 కేసులు నమోదయ్యాయి. మంగళవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘జిల్లా వార్షిక నేర నివేదిక–2025’ నేరాల గణాంకాలను, పోలీస్ శాఖ సాధించిన పురోగతిని ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. మొత్తంగా గతేడాది 2024లో 7,573 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5,821 కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. 1880 మొబైల్ ఫోన్ల రికవరీ ఈ ఏడాదిలో జరిగిన మూడు మేళాల ద్వారా రూ.3.7 కోట్ల విలువైన 1,880 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామని ఎస్పీ తెలిపారు. 128 మాదకద్రవ్యాల(ఎన్డీపీఎస్) కేసులు, 3,627 ఇతర సాధారణ కేసులు నమోదైనట్టు చెప్పారు. 128 గంజాయి కేసుల్లో 411 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.4.41 కోట్ల విలువైన 8790.88 కిలోల గంజాయిని, 7.39 లీటర్ల హషీష్ ఆయిల్, 115 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆయా కేసుల్లో ఆరుగురు గంజాయి నిందితులపై కేసులు పిట్ ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేశామన్నారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆరుగురు వ్యక్తుల ఆస్తులు రూ.1,25,22,100ను ఫ్రీజ్ చేశామన్నారు. 312 మంది గంజాయి నేరస్తులపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసినట్టు ఎస్పీ వివరించారు. లోక్ అదాలత్ ద్వారా 16,132 కేసులను పరిష్కరించామన్నారు. గంజాయి అక్రమ రవాణా, హత్య, పోక్సో కేసుల్లో 51 శాతం.. ఒక కేసులో మరణశిక్ష, 2 కేసుల్లో జీవిత ఖైదు, మరో 2 కేసుల్లో నిందితులకు 20 ఏళ్లు జైలు శిక్ష, 10 కేసుల్లో పదేళ్ల జైలు శిక్ష, 5 కేసుల్లో ఐదేళ్లు కంటే ఎక్కువగా జైలు శిక్షలు నిందితులకు విధించేలా చార్జ్షీట్ దాఖలు చేశామన్నారు. నేర శోధనలో సాంకేతిక సాయం నేర పరిశోధనలో భాగంగా సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద దహనం చేసిన మహిళా మృతదేహాన్ని గుర్తించి, 450 సీసీ కెమెరాల ఫుటేజీల ద్వా రా నిందితులను(మృతురాలి అల్లుడు, తదితరులు) 11 రోజుల్లోనే అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. కశింకోటలో ట్రాన్స్జెండర్ హత్య కేసులో నిందితుడిని కాల్ డేటా, టవర్ లోకేషన్ ఆధారంగా 24 గంటల్లోనే గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. జిల్లాలో కొత్తగా 3,573 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. సాంకేతికత సహాయంతో 41 కేసులు, వేలిముద్రల (ఏఎఫ్ఐఎస్) ద్వారా 58 కేసులు ఛేదించినట్టు చెప్పారు. 11 హత్యలు.. 291 వేధింపులు ఈ ఏడాదిలో 11 హత్యలు జరిగాయి. మహిళలపై వేధింపు కేసులు 291, మిస్సింగ్ కేసులు 316 నమోదయ్యాయి. పోక్సో కేసులు, తీవ్రమైన నేరాలు, ప్రాణహాని కలిగించే నేరాలు 417 నమోదయ్యాయి. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్రావు, డీఎస్పీలు జీఆర్ఆర్ మోహన్, ఈ.శ్రీనివాసులు, బి.మోహనరావు, ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, పరిపాలన అధికారి తిలక్బాబు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఆర్డీవో కార్యాలయప్రారంభం నేడు
ఎస్.రాయవరం: మండలంలో అడ్డురోడ్డు కేంద్రంగా సబ్ డివిజన్(ఆర్డీవో) కార్యాలయాన్ని బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ విజయ్కృష్ణన్ ప్రారంభించనున్నారు. దీనికోసం తాత్కాలికంగా తిమ్మాపురం –1 సచివాలయం భవనాన్ని ఎంపిక చేసి అధికారులు ఏర్పాట్లు చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో తిమ్మాపురం పంచాయతీ భవనంపై అదనపు సచివాలయ భవనాన్ని అన్ని హంగులతో నిర్మించారు. చంద్రబాబు ప్రభుత్వం అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బుధవారం నుంచి ఇక్కడ ఆర్డీవో అందుబాటులో ఉంటారని తహసీల్దార్ రమేష్బాబు మంగళవారం తెలిపారు. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. -
పూడిమడకను విభజించాలని వినతి
అచ్చుతాపురం రూరల్ : అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీని రెండు పంచాయతీలుగా ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. 20 వేల జనాభా ఉన్న గ్రామాన్ని పూడిమడక, కడపాలెం గ్రామ పంచాయతీలుగా విభజించాలని, అత్యధిక జనాభా కారణంగా పరిపాలన భారం పెరిగి అభివృద్ధి జరగడం లేదని తెలిపారు.కడపాలెం, కొండపాలెం, ఎస్సీ కాలనీ, పళ్ళిపేట, పెద్దురు, జాలరిపాలెం గ్రామాలు ఒకే పంచాయతీలో కొనసాగడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అధికారులు చొరవ తీసుకుని పుడిమడక ప్రజలకు మెరుగైన సేవల కొసం ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు. ఆర్డీఓ షేక్ ఆయిషాకు రెండు పంచాయితీలు కోరుతూ వినతిపత్రం అందజేస్తున్న పూడిమడక ప్రజలు


