Anakapalle
-
సమర్థంగా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ
● పీవోలు, ఏపీవోలు పారదర్శకంగా ఉండాలి ● నిబంధనలను కచ్చితంగా పాటించాలి ● తొలి విడత శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ కృష్ణన్తుమ్మపాల: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఈనెల 27న జరగనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తొలి విడత శిక్షణ తరగతులను మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీవోలు, ఏపీవోలు పూర్తి పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణలో వ్యవధి ఎక్కువగా పట్టే అవకాశం ఉన్నందున ఓపిగ్గా, సంయమనం పాటిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. చిన్నపాటి తప్పిదానికి కూడా తావు లేకుండా పోలింగ్ ప్రక్రియ జరిగేలా విధులు నిర్వర్తించాలన్నారు. పోలింగ్ ప్రక్రియ బాధ్యత మొత్తం ప్రిసైడింగ్ అధికారిదేనని, బ్యాలెట్ బాక్సులు తీసుకున్న రోజు నుంచి పోలింగ్ ముగిసి తిరిగి అప్పగించే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళి ప్రకారంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా విధులు నిర్వహించాలన్నారు. ఓటు వేయడానికి ఎన్నికల కమిషన్ అందజేసిన పెన్ను మాత్రమే వినియోగించాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ట్రైనింగ్ ప్రోగ్రాం అధికారులు డీపీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ నాగలక్ష్మి, సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ పి.జయంతి ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ ఎస్.వి.ఎస్.ఎస్.నాయుడు, డిప్యూటీ తహసీల్దార్ పి.అరుణచంద్ర ఎన్నికల నిబంధనలు, పోలింగ్ విధానం, బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై శిక్షణ అందించారు. -
సోషల్ మీడియాతో అద్భుతాలు
● యువతకు మార్గనిర్దేశం ● వివిధ వర్గాలకు అవగాహన ● ఎస్పీ తుహిన్ సిన్హా పిలుపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: సమాజాన్ని సురక్షితంగా, చట్టపరంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, సోషల్ మీడియాను ఉపయోగించి యువతను సరైన దిశలో నడిపించేందుకు కృషి చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సమావేశం నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగం నివారణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళలు బాలల హక్కులు, రోడ్డు భద్రతా నియమాలు, సైబర్ నేరాలపై విస్తృతంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. పోలీస్ శాఖ సహకారంతో ఇన్ఫ్లుయెన్సర్లు కీలక భూమిక పోషించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ బి.అప్పారావు, ట్రెయినీ డీఎస్పీ ఎం.వి.కృష్ణ చైతన్య, ఐటీ కోర్ ఎస్ఐ సురేష్బాబు తదితరులు పాల్గొన్నారు. మహిళా స్టేషన్ తనిఖీ పట్టణంలోని మహిళా పోలీస్ స్టేషన్ను మంగళవారం రాత్రి ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. మహిళలు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, రక్షణకు భద్రత చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అనంతరం ఎన్టీఆర్ ఆస్పత్రిలో డి–అడిక్షన్ సెంటర్ను సందర్శించారు. సెంటర్లో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి, చికిత్సా విధానాల గురించి వైద్యుడు కృష్ణ చైతన్యతో మాట్లాడారు. -
ఫార్మర్ రిజిస్ట్రీని తనిఖీ చేసిన కలెక్టర్
ఫార్మర్ రిజిస్ట్రీ గురించి రైతుకు వివరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ కె.కోటపాడు: రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. మేడిచర్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా రైతు రొంగలి దేముడుకు చెందిన పంట వివరాలను వ్యవసాయ, రెవెన్యూ శాఖల సిబ్బంది ఈ–పంటలో నమోదు చేశారు. ఆ వివరాలను సూపర్ చెక్లో భాగంగా ఆమె తనిఖీ చేశారు. మినుము పంట వేసిన రైతు దేముడు వివరాలు సరిపోవడంతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సాగులో ఉన్న పిల్లిపెసర, జనుము పంటల గురించి కలెక్టర్ జిల్లా వ్యవసాయాధికారి మోహన్రావును అడిగి తెలుసుకున్నారు. రైతులకు వ్యవసాయశాఖ ద్వారా అందించే రాయితీ, పంట పెట్టుబడి, దిగుబడి గురించి ఆరా తీశారు. తహసీల్దార్ రమేష్బాబు, ఎంపీడీవో సాంబశివరావు, మండల వ్యవసాయాధికారి సోమశేఖర్, ఏపీవో అప్పలరాజు, ఏఈవో లైలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
వీసీ పీఠంపై ఐఐటీ ప్రొఫెసర్
● స్థానికుడికే దక్కిన అవకాశం ● ఏయూ ఉపకులపతిగా ఆచార్య రాజశేఖర్ నియామకం ● వర్సిటీలోని ఇద్దరు ఆచార్యులకు వీసీలుగా అవకాశం ● నన్నయ వర్సిటీకి ప్రసన్న శ్రీ, కృష్ణా వర్సిటీకి రాంజీ నియామకంవిశాఖ విద్య/సింహాచలం: ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిగా ఆచార్య గంగవంశం పైడి రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ సంయుక్తంగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య రాజశేఖర్ ప్రస్తుతం ఖరగ్పూర్ ఐఐటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ఆచార్య రాజశేఖర్ది సింహాచలం. తమ ప్రాంతీయుడు ఏయూ వీసీగా నియామకం కావడం ఎంతో గర్వకారణమని రాజశేఖర్ స్నేహితులు, సన్నిహితులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర్ అడవివరం ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నారు. గ్రీన్పార్క్ సమీపంలోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియడ్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ) పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తి చేసి అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. గణితంలో ఆచార్య రాజశేఖర్ చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కుటుంబ నేపథ్యం ప్రొఫెసర్ రాజశేఖర్ తండ్రి బలరామకృష్ణ అడవివరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి సావిత్రి గృహిణి. రాజశేఖర్ సోదరుడు గిరిధర్ విశాఖ స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్నారు. రాజశేఖర్ కుమార్తె కూడా ఖరగ్పూర్ ఐఐటీలో విద్యనభ్యస్తున్నారు. 2017లో అడవివరంలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో స్థానికులు రాజశేఖర్ను ఘనంగా సత్కరించారు. రాజశేఖర్ ఏయూ వీసీగా నియామకం కావడంతో అతని స్నేహితులు పాశర్ల ప్రసాద్, టి.వి.కృష్ణంరాజు, రాజనాల సత్యారావు, వై.డి.వి ప్రసాద్, గ్రామస్తులు కర్రి అప్పలస్వామి, కొలుసు ఈశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. వీసీ శశిభూషణరావు రిలీవ్ ఏయూ ఇన్చార్జి వీసీ బాధ్యతల నుంచి ఆచార్య జి.శశిభూషణరావు మంగళవారం రిలీవ్ అయ్యారు. వర్సిటీకి నూతన వీసీని నియమించడం, ప్రస్తుత వీసీ వెంటనే రిలీవ్ కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శశిభూషణరావు వీసీ బాధ్యతల నుంచి వైదొలగి.. తన మాతృస్థానమైన వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా వెళ్లారు. దీంతో రిజిస్ట్రార్ ధనుంజయరావు పూర్తి స్థాయిలో వర్సిటీ కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్యోగ ప్రస్థానం 1997లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం 1998 నుంచి 2000 డిసెంబర్ వరకు జపాన్లోని టోక్యో యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు. 2000 డిసెంబర్ నుంచి 2002 జూన్ వరకు ఐఐటీ ఖరగ్పూర్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా సేవలందించారు. 2002 జూన్ నుంచి 2007 ఏప్రిల్ వరకు అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. అనంతరం సెలవులో ఉండి వివిధ అంశాలపై పరిశోధనలు చేశారు. 2011 నుంచి 2019 వరకు ఖరగ్పూర్ ఐఐటీలోనే ప్రొఫెసర్గా పనిచేశారు. 2019 ఆగస్టు నుంచి హెచ్ఏజీ స్కేల్తో అదే చోట ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రొఫెసర్ రాజశేఖర్ ఖరగ్పూర్ ఐఐటీ డీన్గా, జేఈఈ మెయిన్స్ను ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహించినప్పుడు చైర్మన్గా వ్యవహరించారు. -
అల్లరి చేష్టలతో భవిష్యత్తు నాశనం
నర్సీపట్నం: ఈవ్టీజింగ్, ర్యాగింగ్కు పాల్పడడం చట్టరీత్యా నేరమని, అలా చేసిన వారు శిక్షార్హులని సీనియర్ సివిల్ జడ్జి పఠాన్ షీయాజ్ ఖాన్ పేర్కొన్నారు. పట్టణంలోని పలు కాలేజీలు, పాఠశాలల్లో టౌన్ పోలీసులు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో జడ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలేజీలు, పాఠశాలలు వదిలే సమయాల్లో ఈవ్టీజింగ్, ర్యాగింగ్కు పాల్పడరాదన్నారు. ఎవరి వల్లనైనా ఇబ్బంది కలిగితే విద్యార్థినులు వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. బాలికల భద్రతకు పోక్సో చట్టం తీసుకువచ్చారని, పోక్సో కేసులో ఇరుక్కుంటే భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా స్థిరపడి కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. అల్లరి మూకల వల్ల ఇబ్బందులు తలెత్తితే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయన్నారు. ఈ అవగాహన సదస్సుల్లో సీఐ గోవిందరావు, ఎస్సైలు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈవ్టీజింగ్, ర్యాగింగ్ చట్టరీత్యా నేరం విద్యార్థినులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి సీనియర్ సివిల్ జడ్జి పఠాన్ షీయాజ్ ఖాన్ -
నిధుల సంకటం
ఎమ్మెల్సీ ఎన్నికకు● ఎన్నికల నిర్వహణకు రూ.3 కోట్ల వరకు ఖర్చు? ● పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా విడుదల కాని నిధులు ● ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్న జిల్లా యంత్రాంగం మహారాణిపేట (విశాఖ): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఎన్నికల కమిషన్ గానీ పైసా కూడా విదిల్చలేదు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని మాత్రం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుండడం గమనార్హం. దీంతో జిల్లా అధికారులు ప్రత్యామ్నా య నిధులను ఎన్నికల నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు జిల్లా అధికారులు స ర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ముగియనుంది. 27వ తేదీన పోలింగ్, వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ముద్రణ శాలలో పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తవడంతో అవి విశాఖకు చేరుకున్నాయి. వాటిని ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపించారు. వాస్తవానికి ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిధులు విడుదల చేయలేదు. దీంతో జిల్లా అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ఫండ్స్ నుంచి నిధులను మళ్లించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు రాని పక్షంలో మళ్లీ వాటిని సర్దుబాటు చేయడం అధికారులకు తలనొప్పిగా మారే అవకాశముంది. 21,555 మంది ఓటర్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయల ఎన్నికల్లో 21,555 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 12,948 మంది పురుషులు, 8,607 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4,829 మంది, విజయనగరంలో 4,937, మన్యం పార్వతీపురం మన్యంలో 2,262, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,448, విశాఖలో 5,277, అనకాపల్లి జిల్లాలో 2802 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ల కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సామగ్రి కొనుగోలు, ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. తొలి విడతగా ఎన్నికల నిర్వహణపై మంగళవారం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఈ నెల 24న మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 3న ఆంధ్రా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి కూడా నిధులు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఎన్నికల ఖర్చు రూ.3 కోట్లు! ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం రూ.3 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 123 పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లకు నిధులు అవసరం. పోలింగ్ సిబ్బంది భోజనాలు, పోలింగ్ తర్వాత టీఏ, డీఏలు కూడా చెల్లించాల్సి ఉంది. -
కల్చరల్ వర్క్షాప్లో జె.నాయుడుపాలెం ఉపాధ్యాయిని
● బోధనలో సంస్కృతీ సంప్రదాయాలను జోడించేలా శిక్షణ రోలుగుంట: మండలంలోని జె.నాయుడుపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయిని కె.వి.ఎల్.ప్రవీణ కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లో నిర్వహించిన వర్క్షాప్లో పాల్గొన్నారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఈ వర్క్షాప్ జరిగింది. ఇందుకు రాష్ట్రం నుంచి ఎంపికై న ఇద్దరిలో ప్రవీణ ఒకరు. ఈమె ఈ నెల 11న వెళ్లి అయిదు రోజులపాటు శిక్షణ పొందారు. శిక్షణానంతరం సీసీఆర్టీ డైరెక్టర్ రాజీవ్ జైన్ నుంచి ధ్రువపత్రాన్ని అందుకున్నారు. విజయవంతంగా శిక్షణ ముగించుకున్న ఆమెను హెచ్ఎం దాడిఽశెట్టి రమేష్కుమార్, ఉపాధ్యాయులు పాఠశాలలో మంగళవారం అభినందించారు. ఆమె మాట్లాడుతూ బోధనలో భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలను జోడించాలని సీసీఆర్టీ డైరెక్టర్ రాజీవ్ జైన్, డిప్యూటీ డైరెక్టర్ సందీప్ శర్మ సూచించారన్నారు. -
ప్రస్తుత వీసీకి ఆశాభంగం
ప్రస్తుత ఇన్చార్జి వీసీ శశిభూషణరావుకు ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తిస్థాయి వీసీగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరిగింది. మరో పక్క వీసీ పోస్ట్ కోసమని ప్రస్తుత రిజిస్ట్రార్ ఎన్.ధనుంజయరావు, రెక్టార్ కిశోర్బాబు తమ స్థాయిలో లాబీయింగ్ చేశారు. కానీ వీరికి అవకాశం దక్కలేదు. వర్సిటీలో కీలక పోస్టుల్లో ఉన్న వీరిని ఇక్కడ కాకుంటే, రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీలకై నా పరిగణలోకి తీసుకుంటారని అంతా భావించారు. కూటమికి చెందిన కీలక నేతలు వీరికి అభయం కూడా ఇచ్చారనే ప్రచారం సాగింది. కానీ ప్రభుత్వం నుంచి వీరికి ఆశాభంగం తప్పలేదు. -
సంక్షోభంలో వ్యవసాయ రంగం
అనకాపల్లి టౌన్: వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే జస్టిస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాల్సిందేనని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి తెలిపారు. స్థానిక వై.విజయ్కుమార్ హాల్లో మంగళవారం మాజీ శాసనసభ్యుడు కోడుగంటి గోవిందరావు 11వ వర్ధంతి సందర్భంగా ‘వ్యవసాయరంగం–పెనుసవాళ్లు’ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయరంగం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభంలో పడిందని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రైతు సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. సరళీకృత ఆర్థిక విధానాల వలన పారిశ్రామికీకరణ వలన వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం భూమిని వాడుకోవడం వలన వ్యవసాయ భూమి కనుమరుగైపోతుందన్నారు. వ్యవసాయ రంగానికి గోవిందరావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, మాకిరెడ్డి రామునాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు సన్యాసిరావు, రెడ్డిపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయడమే పరిష్కారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి -
రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక
ఎంవీపీకాలనీ: జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ పురుషుల కబడ్డీ జట్టు ఎంపికై ంది. ఈ మేరకు విశాఖ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాదరెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా 19 మంది క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించగా సెలక్షన్ కమిటీ సభ్యులు మంగళవారం 12 మందితో కూడిన తుదిజట్టును ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఎంపికై న రాష్ట్ర కబడ్డీ పురుషుల జట్టు ఒడిశాలోని కటక్ వేదికగా జరగనున్న 71వ జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కటక్లో ఈ పోటీలు జరగనున్నట్లు తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా కబడ్డీ నేషనల్ మెడలిస్ట్, విశాఖ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదరెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు సీహెచ్ పద్మరాజు, వైవీ శ్రీనివాస్లు వ్యవహరించారు. ఎంపికై న రాష్ట్ర జట్టును జి.రామకృష్ణ చౌదరి, లాలం రమేష్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్, సీనియర్ జాతీయ క్రీడాకారుడు వీవీ రమణ, సీహెచ్ పద్మరాజు తదితర క్రీడా ప్రముఖులు అభినందించారు. -
రంగురాళ్లు తవ్వుతున్న 10 మంది అరెస్ట్
చింతపల్లి (అల్లూరి జిల్లా): చింతపల్లి అటవీశాఖ సబ్ డివిజన్ పరిధిలో గల సిగనాపల్లిలో అక్రమంగా రంగురాళ్లు తవ్వుతున్న 10 మందిని అరెస్టు చేసినట్టు పెదవలస రేంజ్ అధికారి శివరంజిని తెలిపారు. జీకే వీధి మండలం సంకాడ పంచాయతీ పరిధిలో గల సిగనాపల్లి సమీపంలో కొండపై రంగురాళ్లు తవ్వకాలు జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు మంగళవారం సిబ్బందితో దాడి చేసినట్టు చెప్పారు. రంగురాళ్లు తవ్వుతున్న కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన 10 మందిని అరెస్టు చేసి, వారి నుంచి 2.2 గ్రాముల రంగురాళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రంగురాళ్ల క్వారీ వద్ద విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రొడక్షన్ వాచర్లను విధుల నుంచి తొలగించినట్టు రేంజ్ అధికారి శివరంజని తెలిపారు. ఫారెస్టు బీట్ ఆఫీసర్ గోపి, స్టైకింగ్ ఫోర్స్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
జల దృక్పథానికి జేజేలు
● ‘చెట్టుపల్లి’ విద్యార్థుల నమూనాకు ప్రాంతీయ అవార్డునర్సీపట్నం: సీపీఆర్ పర్యావరణ విద్యా కేంద్రం చైన్నె, విప్రో సంస్థ సంయుక్తంగా జాతీయస్థాయిలో నిర్వహించిన ‘సుస్థిర జీవన విధానం’ పోటీలో నర్సీపట్నం మండలం, చెట్టుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన జల దృక్పథం నమూనా ప్రాంతీయ అవార్డు సాధించింది. నిర్వాహకులు సూచించిన సుస్థిరత–నీరు, సుస్థిరత–వ్యర్ధాల నిర్వహణ, సుస్థిరత జీవవైవిధ్యం అంశాలపై తొమ్మితో తరగతి విద్యార్థిలు వెలంకాయల సాయి శివాని, పండూరి మనోజ్ కుమార్, మోక్ష మాధురి కౌశిక్ బృందం జల దృక్పథం నమూనాను రూపొందించింది. మంగళవారం అమరావతిలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, పాఠశాల విద్య అకడమిక్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి చేతుల మీదుగా విద్యార్థులు, వారికి మార్గదర్శిగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు రాజగోపాల్ ప్రశంసా పత్రం, నగదు బహుమతి అందుకున్నారు. విద్యార్థి దశ నుంచి పర్యావరణం పట్ల ఆసక్తి పెంచే కార్యక్రమాలు భవిష్యత్తు అవసరాలకు బాగా ఉపయోగపడతాయని విద్యార్థులకు దిశ నిర్దేశం చేసినట్లు ఉపాధ్యాయులు రాజగోపాల్ తెలిపారు. జల దృక్పథం నమూనా నీటి కొరతను నివారించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. 10 వేల లీటర్ల వరకు భారీ స్థాయిలో నీటిని వినియోగించే జనావాసాలు, అపార్ట్మెంట్లలో.. మురుగునీటిని మంచి నీటిగా శుభ్రపరిచే ప్రక్రియను రూ.85 వేల వ్యయంతో జల దృక్పథం కాన్సెప్ట్తో చేపట్టవచ్చని తెలిపారు. -
ఆర్గనైజ్ క్రైం కేసులో ఇద్దరు తైవాన్ వాసుల అరెస్ట్
అల్లిపురం (విశాఖ): వ్యవస్థీకృత(ఆర్గనైజ్) క్రైం కేసులో ఇద్దరు తైవాన్ వాసులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం మీడియాకు తెలిపిన వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 16న ఇల్లీగల్ పేమెంట్ గేట్ వే కేసు విచారణలో భాగంగా తైవాన్ జాతీయులైన ము–చి కోనియన్ సేంగ్ అలియాస్ సంగ్ ము–చి అలియాస్ మార్క్, హా–యున్ చాంగ్ అలియాస్ చాంగ్ హోవో–యున్ అలియాస్ మార్కోలు నగరంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్, సేన్ప్రా బే వ్యూ హోటల్లో బసచేసి అమాయకులను ఆకర్షించి, వారికి సైబర్ నేరాల్లో శిక్షణ అందించేవారు. దేశంలోని వివిధ వ్యక్తుల సాయంతో పేద, వ్యసనాలకు బానిసలైన వ్యక్తులకు డబ్బు ఆశ చూపి వివిధ బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్ ఖాతాలను తెరిచేవారు. వివిధ రకాల మొబైల్ నెట్వర్కులకు సంబంధించిన సిమ్కార్డులను తీసుకుని, దేశంలో వివిధ ప్రాంతాలలో మకాం వేసి రూ.కోట్ల లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ అజిత వేజెండ్ల సహకారంతో మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు ఇద్దరు విదేశీ నిందితులు, ఒక అంతర్ జిల్లా ముద్దాయితోపాటు 26 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. -
అంతర్జాతీయ ఓపెన్ కరాటే పోటీల్లో బంగారు పతకాలు
● 9వ తరగతి విద్యార్థి రిషిసాయి ప్రతిభమునగపాక: కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపించాడు మండలంలోని మెలిపాకకు చెందిన రిషిసాయి. 9వ తరగతి చదువుతున్న రిషిసాయి అంతర్జాతీయ ఓపెన్ కరాటే పోటీల్లో పాల్గొని రెండు బంగారు పతకాలతో పాటు బ్లాక్ బెల్ట్ సాధించాడు. సినీ నటుడు సుమన్ నుంచి మెడల్ అందుకున్నాడు. మండలంలోని మెలిపాకకు చెందిన కొత్తపల్లి ఉమాశంకర్–రాణి దంపతుల కుమారుడు రిషిసాయి విశాఖలోని భావన విద్యా నికేతన్లో 9వ తరగతి చదువుకుంటున్నాడు. చదువులో రాణించడంతో పాటు కరాటేలో శిక్షణ పొందుతున్నాడు. విశాఖ స్పోర్ట్స్ స్టేడియంలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని తన ప్రతిభ చాటాడు. రెండు బంగారు పతకాలతో పాటు బ్లాక్ బెల్ట్ను సైతం సొంతం చేసుకున్నాడు. కోచ్ ఎస్పీఎండీ నాయుడు వద్ద రిషిసాయి కరాటేలో శిక్షణ పొందుతున్నాడు. గ్రామీణ ప్రాంత బాలుడు పతకాలు, బ్లాక్ బెల్ట్ సొంతం చేసుకోవడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత
● వాంతులు, విరోచనాలతో ఒకే రోజు ఇద్దరి మృతి ● భయాందోళనలో గ్రామస్తులు ● ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ సరియాపల్లిలో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది వాంతులు,విరోచనాలతో బాధపడుతున్నారు. వాంతులు, విరోచనాలతో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన గోల్లోరి దనియా(56), సాయంత్రం ఏడాది బాలుడు కిలో వినయ్ వాంతులు,విరోచనాలతో మృతి చెందారు. ప్రసుత్తం గ్రామంలో కొర్రా విక్రత్,కొర్రా హర్షిత్,వంతాల సిద్ధాంత్,కొర్రా వసంత అనే ఏడాదిలోపు చిన్నారులతో పాటు మరికొంత మంది వాంతలు,విరోచనాలతో బాధపడుతున్నారు. చాలా మంది 10 రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. ఇటీవల కిలగాడ వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి, వైద్య సేవలు అందించినా అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులకు కంటిమీదకునుకు కరువైంది. తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని బంగారుమెట్ట సర్పంచ్ రత్న,వైఎస్సార్సీపీ మండల నేత మోహన్,సరియాపల్లి గ్రామస్తులు కోరారు.దీనిపై కిలగాడ వైద్యాధికారి రమేష్ వద్ద ప్రస్తవించగా సరియాపల్లిలో గత వారం వైద్య శిబిరం నిర్వహించామని, బుధవారం మరోసారి శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే పీహెచ్సీకి తీసుకువచ్చి వైద్య సేవలు అందిస్తామని ఆయన చెప్పారు. -
కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ
● కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ నక్కపల్లి: కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం ఆయన పలువురు కార్యకర్తలతో కలసి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇచ్చిన పిలుపు మేరకు చలో తుని కార్యక్రమానికి వెళ్లారు. తుని మున్సిపల్ కౌన్సిలర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వీసం మాట్లాడుతూ గతంలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఘోరంగా ఓడించారన్నారు. స్థానిక ఎన్నికల్లో చీత్కరించినప్పటికీ సిగ్గురాలేదన్నారు. నాలుగేళ్ల అనంతరం అధికారం ఉంది కదా అని, తగినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. తుని మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ కూడా టీడీపీ నుంచి గెలవలేదన్నారు. ఇప్పుడు అధికారం ఉంది కదా అని, కొంతమంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకుని వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని కుట్రలకు తెరలేపిందన్నారు. ప్రజాస్వామ్మాన్ని ఖూనీ చేస్తూ కూటమి ప్రభుత్వం నీతులు చెబుతోందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే వచ్చే ఏడాది జరిగే స్థానిక ఎన్నికల్లో సత్తా చూపి పదవులు దక్కించుకోవాలని హితువు పలికారు. -
మురిసేలా మిరియం
● విరగ్గాసిన కాపు ● సేకరణలో రైతులు బిజీబిజీ ● కాఫీతోటల్లో అంతరపంటగా సాగు ● 1.10లక్షల ఎకరాల్లో మిరియాల పాదులు ● గత ఏడాది 11వేల టన్నుల వ్యాపారం ● ఎకరానికి రూ.60వేల ఆదాయం సాక్షి,పాడేరు: జిల్లాలో కాఫీ తోటల్లో అంతరపంటగా గిరిజన రైతులు సాగుచేస్తున్న మిరియాల పంట విరగ్గాసింది. పాదులకు అఽధికంగా మిరియాల కాపు ఉండడంతో గిరిజన రైతులు మురిసిపోతున్నారు.నాణ్యతలో నంబర్–1గా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మన్యం మిరియాలు ఈఏడాది కూడా గిరిజన రైతులకు అధిక లాభాలు అందించనున్నాయి. కేరళ,కర్నాటక,తమిళనాడు,ఒడిశా రాష్ట్రాలలో మిరియాల పంట ఉన్నప్పటికీ అల్లూరి జిల్లాలో గిరిజనులు సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న మిరియాలే నాణ్యతలో నంబర్ వన్గా నిలుస్తున్నాయి. ఘాటు అధికంగా ఉండే మన్యం మిరియాలకు జాతీయ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. గత ఏడాది కిలో రూ.600 నుంచి రూ.700ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు. 1.10లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో 1.48 లక్షల ఎకరాల్లో ఫలసాయం ఇచ్చే కాఫీతోటలను గిరిజనులు సాగు చేస్తున్నారు. వాటిలో 1.10 లక్షల ఎకరాల్లో మిరియాల పాదులను అంతరపంటగా వేశారు.ఎకరానికి తక్కువలో చూసుకున్న 100 కిలోల ఎండు మిరియాలను రైతులు మార్కెటింగ్ చేస్తారు. ఎకరానికి రూ.60వేల నుంచి రూ.70వేల వరకు ఆదాయం లభిస్తుంది.గత ఏడాది 11వేల టన్నుల వరకు దిగుబడి వచ్చింది.ప్రైవేట్ వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో మిరియాల పాదులకు కాపు విరగ్గాసింది. దిగుబడులు మరింత పెరిగి కనీసం 12వేల టన్నుల వరకు మార్కెట్ జరుగుతుందని ఉద్యానవన,కాఫీబోర్డు,స్పైసెస్ బోర్డు అధికారులు అంచాన వేస్తున్నారు. మిరియాల సేకరణ ప్రారంభం మన్యంలో మిరియాల పంట దిగుబడి దశకు రావడంతో గిరిజన రైతులు పాదులకు ఉన్న గింజల సేకరణను ప్రారంభించారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్పైసెస్ బోర్డు,పాడేరు ఐటీడీఏలు అల్యూమినియం నిచ్చెనలను పంపిణీ చేయడంతో గిరిజన రైతులకు ఎంతో మేలు జరిగింది.వాటితోనే మిరియాలను సేకరిస్తున్న గిరిజన రైతులు వెనువెంటనే వేడినీళ్లలో నానబెట్టి ఎండు మిరియాలను తయారు చేస్తున్నారు.గింజల్లో తేమ పూర్తిగా పోయిన తరువాత గిరిజన రైతులు సంతల్లో అమ్మకాలు చేపడుతున్నారు. కిలో రూ.550 ధరతో కొనుగోళ్లు ప్రారంభం జిల్లాలో మిరియాల వ్యాపారం ప్రారంభమైంది.ప్రారంభ దశ కావడంతో వ్యాపారులు కిలో రూ.550ధరతో కొనుగోలు చేస్తున్నారు.ఈ ఏడాది కూడా మన్యం మిరియాలకు డిమాండ్ అధికంగా ఉందని పెద్ద వ్యాపారులు చెబుతున్న నేపథ్యంలో వచ్చే వారం నుంచి ధరలు పెంచి వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే కాఫీ పంట వలే మిరియాలను కూడా జీసీసీ,పాడేరు ఐటీడీఏలు కొనుగోలు చేయాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
24న సర్టిఫికెట్ కోర్సులకు ఇంటర్వ్యూ
మురళీనగర్: కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్)లో స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు. ఏడాది వ్యవధి కలిగిన పారిశ్రామిక భద్రత కోర్సులో 60 సీట్లు, 6 నెలల వ్యవధితో ఫైర్ సేఫ్టీ కోర్సు లో 30 సీట్లు, 4 నెలల వ్యవధితో ఆఫీస్ ఆటోమేషన్ కోర్సులో 20 సీట్లు, 3 నెలల వ్యవధితో కెమికల్ సూపర్వైజరీ ప్రొగ్రామ్లో 20 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్నవారు టెన్త్ పాస్/డిప్లొమా/ఇంటర్/డిగ్రీ సర్టిఫికెట్, ఆధార్, రెండేళ్ల పారిశ్రామిక అనుభవ ధ్రువీకరణపత్రం ఒరిజినల్తో పాటు ఒక సెట్ జెరాక్స్తో ఆ రోజు ఉదయం 10గంటలకు హాజరు కావాలన్నారు. -
ఏయూలో పేలవంగా వజ్రోత్సవాలు
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ జియో ఫిజిక్స్ విభాగం వజ్రోత్సవాలు పేలవంగా సాగుతున్నాయి. వర్సిటీలో జియో ఫిజిక్స్ విభాగం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో మూడు రోజుల పాటు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల నిర్వహణకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటి రోజు ప్రారంభ వేడుక డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగింది. రెండో రోజు మంగళవారం ఈ కార్యక్రమాన్ని వర్సిటీలోని జియో ఫిజిక్స్ బ్లాక్కు మార్చారు. రెండు హాళ్లలో సెమినార్లు కొనసాగేలా షెడ్యూల్ ఇచ్చారు. ఉపన్యాసాలు ఇచ్చే వారికి, ఆహూతులకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే ఒక హాల్లో మాత్రమే సెమినార్ నిర్వహించగా, రెండో హాల్ నిరుపయోగంగా వదిలేశారు. రెండో హాల్లో సెమినార్ ఇవ్వాల్సిన పలువురు విద్యావేత్తలు, విషయం తెలియక అక్కడే చాలా సేపు కూర్చున్నారు. మధ్యాహ్నం వరకు ఒకే హాల్లో సెమినార్ కొనసాగగా, దానికి కూడా పూర్తి స్థాయిలో ఆహూతులు లేక కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. సబ్జెక్టు పరంగా ఎంతో నిష్ణాతులైన వారు తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకునే సమయంలో, వీటిని సద్వినియోగం చేసుకునే రీతిలో విద్యార్థులనైనా భాగస్వాములను చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విభాగం భవనం ముందు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మధ్యాహ్నం వరకు 58 మంది మాత్రమే సందర్శించారు. మధ్యాహ్నం తరువాత ఏవీఎన్ కాలేజీ విద్యార్థులు తిలకించేందుకు వచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు త్వరలోనే జరగనున్నాయి. ఓ విభాగం నిర్వహించే వజ్రోత్సవాలే ఇలా ఉంటే.. వర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ఇంకెలా చేస్తారోనని ఆచార్యులు సైతం పెదవి విరుస్తున్నారు. -
ట్రాలర్ ఢీకొని యువకుడి దుర్మరణం
అక్కిరెడ్డిపాలెం: ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని ట్రాలర్ రూపంలో మృత్యువు కబళించింది. షీలానగర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకయ్యపాలేనికి చెందిన మైలపల్లి మనోహర్ (24) మెరినో సంస్థలో సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా మంగళవారం నగరం నుంచి గాజువాక వైపు బైక్పై వెళ్తున్నాడు. షీలానగర్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వెనుకనే వేగంగా వస్తున్న ట్రాలర్ బైక్ను ఢీకొట్టింది. బైక్ అదుపు తప్పడంతో మనోహర్ తూలి లారీ చక్రాల కిందకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో మనోహర్ హెల్మెట్ ధరించినా.. లారీ చక్రాల కింద నలిగి హెల్మెట్ ఊడిపోయింది. తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుడిని షీలానగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మనోహర్ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మనోహర్కు తండ్రి మైలపల్లి దేముడు, తల్లి దేముడమ్మ, ఒక సోదరి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
కొబ్బరి రైతుకు ధీమా
●కొబ్బరి చెట్లకు బీమా పథకం ●ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతే పరిహారం ●ఉద్యానవన అధికారి భాను పుష్పలీలావతి మాడుగుల రూరల్: రైతుల కోసం ఎన్నో పథకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. వాటిపై అవగాహన లేకపోవడం, క్షేత్రస్థాయిలో సరైన ప్రచారం లేకపోవడంతో ఇప్పటికీ చాలామంది ప్రభుత్వ ఫలాలు పొందలేకపోతున్నారు. పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా(ఎ.ఐ.సి) అనే కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ, కొబ్బరి అభివృద్ధి బోర్డు(సీడీబీ), రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొబ్బరి చెట్లకు కలిగిన నష్టం వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులు నుంచి రైతులను ఆదుకునేందుకు కొబ్బరి చెట్ల బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ మేరకు కొబ్బరి చెట్ల బీమా పథకం(సి.పి.ఐ.ఎస్) ద్వారా కొబ్బరి రైతులు ప్రీమియం చెల్లించాలని మండల ఉద్యానవన శాఖాధికారి వి. భాను పుష్పలీలావతి పేర్కొన్నారు. దీనివల్ల పొందే ప్రయోజనాలు గురించి సాక్షికి ఆమె వివరించారు. బీమాకు వర్తించే కొబ్బరి చెట్లు... టాల్, హైబ్రిడ్, డ్వార్ప్ రకాలకు చెందిన కొబ్బరి చెట్లకు కింద పేర్కొన్న సంవత్సర మధ్యలో ఉంటే బీమా వర్తిస్తుంది. డ్వార్ప్, హైబ్రిడ్: కొబ్బరి చెట్లు 4 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. టాల్ చెట్లు 7 నుంచి 60 సంవత్సరాల వరకు వయసు చెట్లుకు బీమా ప్రీమియం చెల్లించవచ్చు. ఏ రైతు స్థలంలోనైనా కనీసం ఐదు ఆరోగ్యకరమైన చెట్లు ఉంటే బీమాకు అర్హులు. నష్టపరిహారం వర్తించే అంశాలు... తుఫాన్, వడగండ్ల వాన, సుడిగాలి, భారీ వర్షాలు, వరద ముప్పు, చీడపీడలు వల్ల చెట్లుకు నష్టం జరుగుట. ప్రమాదవశాత్తు అగ్ని లేదా మెరుపులుతో కూడిన మంటలు, భూకంపం, కొండచరియలు విరిగిపడటం, సునామీ, తీవ్ర కరువు, చెట్టు మొత్తం నష్టపోవడం వంటి వాటికి ఈ బీమా వర్తిస్తుంది. బీమాలో సబ్సిడీ... బీమా ప్రీమియంలో సబ్సిడీ కూడా ఉంటుంది. ప్రీమియంలో 50 శాతం కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 25 శాతం మాత్రమే రైతు చెల్లించాలి. రైతులు రెండు సంవత్సరాలు బీమాకు ప్రీమియంలో 7.5 శాతం రాయితీ, మూడు సంవత్సరాలు బీమాకు 12.5 శాతం రాయితీ వర్తిస్తుంది. మూడు సంవత్సరాలు కాలపరిమితికి బీమా చేసుకోవచ్చు. ఒక చెట్టుకు మూడు సంవత్సరాలకు ప్రీమియం రూ. 27.65 అయితే, సబ్సిడీ పోను రూ. 5.90 పైసలు (నాలుగు నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన చెట్లు), 16 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక చెట్టుకు మూడు సంవత్సరాలకు రూ. 40.69 పైసలు చెల్లించాల్సి ఉండగా, రైతు ప్రీమియం రూ.9.19 పైసలు చెల్లించాలి. పూర్తి వివరాలు కోసం తమ సమీపంలో రైతు సేవా కేంద్రంలో వీఏఏ లేదా వీహెచ్ఏలను సంప్రందించాలి. -
బంగారం చోరీ కేసులో నిందితుడికి రిమాండ్
మాట్లాడుతున్న రూరల్ సీఐ అశోక్కుమార్ అనకాపల్లి: దొంగతనం కేసులో తప్పించుకుని తిరుగుతున్న మండలంలో మాకవరం గ్రామానికి చెందిన గంజి మంగరావును మండలంలో మార్టూరు జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు రూరల్ సీఐ జి.అశోక్కుమార్ మంగళవారం తెలిపారు. మండలంలో పెదమాకవరం గ్రామానికి చెందిన దాసరి నారాయణరావు ఇంట్లో ఈ నెల 13న రెండు తులాలు బంగారం చోరీకి గురైనట్లు అతడి మనవరాలు కరణం రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకుని తులమున్నర బంగారంతోపాటు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోరీ చేసిన బైక్(యూనీకాన్ బైక్)ను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గంగమ్మ గలగలలు
తుపానులు కురిపించిన వరుస వానలతో జిల్లాలో భూగర్భ జలాలు మెరుగుపడ్డాయి. సగటున జిల్లా మొత్తం 0.71 మీటర్ల మేర నీటిమట్టం పెరిగింది. కొన్ని మండలాలు, ప్రాంతాల్లో అయితే ఈ పెరుగుదల గణనీయంగా ఉంది. జనవరి మాసాంతానికి భూగర్భ జల గణాంకాల శాఖ తీసిన తాజా లెక్కల ప్రకారం జలమట్టంలో పెరుగుదల నమోదైంది. జిల్లాలో దేవరాపల్లి మండలం తామరబ్బ గ్రామం వద్ద అత్యధికంగా 21.41 మీటర్ల లోతులో జలాలు ఉండగా, కశింకోట మండలం ఏఎస్ పేట గ్రామం వద్ద కేవలం 0.45 మీటర్ల లోతులోనే జలసిరి అందుబాటులో ఉన్నట్టు అధికారులు నమోదు చేశారు. యలమంచిలి రూరల్: జిల్లాలో గత మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం, నదులు, కాలువలు, నిండుగా ప్రవహించడం, చెరువులు నీటితో నిండటంతో భూగర్భ జలాలు ౖపైపెనే దొరుకుతున్నాయి. దానికితోడు డిసెంబరులో కురిసిన వర్షాలతో నీటిమట్టాలు మరింత మెరుగుపడ్డాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వర్ష రూపంలో వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసిపడుతూ భూమిలో ఇంకేలా జలసంరక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లావ్యాప్తంగా జలసంరక్షణ పనులకు ప్రాధాన్యమిచ్చారు. గ్రామాల్లో, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో వర్షపునీరు భూమిలో ఇంకేలా పెద్ద సంఖ్యలో ఇంకుడుగుంతల నిర్మాణం సైతం చేపట్టారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో భూగర్భ జలమట్టం ౖపైపెకి ఎగబాకడానికి దోహదపడింది. దీంతోపాటు వరుణుడు కరుణిస్తుండటంతో పాతాళగంగ పదిలంగా ఉంది. 2019 ఖరీఫ్ సీజన్ నుంచి ఏటా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాంతాల్లోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉంటోంది. ఈ ఏడాది జిల్లాలో 1163.2 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావడంతో భూగర్భజలాలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లా సాధారణ వర్షపాతం 997.48 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది 16.61 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా గత డిసెంబరు నెలలో తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సుమారు 10 రోజులు వర్షాలు స్థిరంగా కురిశాయి. ఒకేసారి భారీ వర్షం కాకుండా నెమ్మదిగా వర్షం కురవడం వలన వర్షపునీరు భూమిలో ఇంకే శాతం ఎక్కువగా ఉంటుందని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఈ వేసవిలో తాగు, సాగునీటి ఇబ్బందులకు ఆస్కారమే ఉండదని అధికారులు చెబుతున్నారు. జల సంరక్షణ పనులు ముమ్మరం కావాలి భూగర్భ జలాల వినియోగం 70 శాతం వరకు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉంటే ఆయా ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పరిగణిస్తారు. 90 నుంచి 100 శాతం వరకు ఉంటే అత్యంత సమస్యాత్మకమైన గ్రామాలుగా గుర్తిస్తారు. జిల్లాలో 27 శాతం మాత్రమే జలాలను వినియోగిస్తున్నారు. దీంతో సమీప భవిష్యత్తులో జిల్లావాసులకు భూగర్భ జలాల విషయంలో ఎటువంటి సమస్య వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో వర్షపు నీరు 9 శాతం మాత్రమే భూమిలోకి ఇంకుతోంది. మిగిలిన 91 శాతం వివిధ రూపాల్లో వృథా అవుతోంది. వర్షపు నీరు వృథా కాకుండా జల సంరక్షణ పనులు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉంది. జిల్లాలో కురిసిన వర్షాల ద్వారా ఉత్పన్నమైన నీటిలో 41 శాతం నీరు ఆవిరి అవుతుండగా మరో 40 శాతం నీరు వృథాగా పోతోంది. కొంత శాతం నీరు తేమగా మారుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూగర్భజలాల వృద్ధికి జల సంరక్షణ పనులు మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. యలమంచిలి మండలం పులపర్తి సమీపంలో పంట పొలంలో బోరు నుంచి ఉబికి వస్తున్న నీరు దేవరాపల్లిలో భూగర్భ జలమట్టాన్ని లెక్కగడుతున్న అధికారులువివిధ మండలాల్లో భూగర్భ జలమట్టాలు ఇలా.. మండలం నీటిమట్టం (మీటర్లలో) అనకాపల్లి 3.83 అచ్యుతాపురం 15.81 యలమంచిలి 1.37 బుచ్చెయ్యపేట 3.41 మాకవరపాలెం 2.38 చీడికాడ 1.09 చోడవరం 1.59 దేవరాపల్లి 2.93 గొలుగొండ 3.36 కె.కోటపాడు 1.84 కశింకోట 0.45 మునగపాక 2.34 నక్కపల్లి 1.92 నర్సీపట్నం 0.72 నాతవరం 2.52 పరవాడ 3.15 పాయకరావుపేట 2.21 రాంబిల్లి 0.94 రావికమతం 2.69 రోలుగుంట 1.92 ఎస్.రాయవరం 0.47 సబ్బవరం 1.91 వి.మాడుగుల 1.50 యలమంచిలి 4.99ప్రతి నెల భూగర్భజల మట్టాలను సంబంధిత అధికారులు అంచనా వేస్తారు. జిల్లాలో 81 పీజియో మీటర్లతో తీసిన లెక్కల ప్రకారం జనవరి నెలలో సగటున 4.83 మీటర్ల ఎత్తులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నట్టు తేలింది. గత ఏడాది మే నెలలో సగటున 8 మీటర్ల లోతులో భూగర్భ జలం లభించేది. గతేడాది మే నెలతో పోల్చితే ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలమట్టం 3.17 మీటర్ల్ల పైకి ఎగబాకింది. జిల్లాలో గతంతో పోలిస్తే ఈ ఏడాది భూగర్భజలాలు ఆశాజనకంగా ఉన్నాయి. కశింకోట మండలం ఏఎస్ పేటలో రాంకో సిమెంటు కర్మాగారం పరిసరాల్లో కేవలం 0.45 మీటర్లు, ఎస్.రాయవరం మండలం ఆర్.కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 0.47 మీటర్లు, నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయం వద్ద 0.72 మీటర్లు, రాంబిల్లి మండలం లాలంకోడూరు ఎస్సీ కాలనీ సామాజిక భవనం వద్ద 0.94 మీటర్ల లోతులోనే జలసిరి అందుబాటులో ఉండడం విశేషం. ఇవి కాకుండా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 12 చోట్ల 2 మీటర్లలోపే నీరు లభ్యమౌతుండటం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా బావుల నుంచి నీరు సమృద్ధిగా వస్తుండటంతో ఈ ఏడాది వ్యవసాయ, ఉద్యాన పంటల సేద్యపు పనులకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. మెరుగ్గా భూగర్భ జలాలు జిల్లాలో మూడేళ్లగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. గత డిసెంబరులో తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవడంతో భూగర్భ నీటిమట్టాలు పెరిగాయి. ఈ వేసవి మూడు నెలల్లో ఏవిధమైన ఇబ్బంది ఉండదు. గత నాలుగేళ్లలో వేసవిలో ఎటువంటి సమస్య ఎదురుకాలేదు. జిల్లా వ్యాప్తంగా నీటి లభ్యతకు ఎటువంటి సమస్య లేదు. అయినప్పటికీ భూగర్భ జలాలను వృథా చేయకుండా అవసరం మేరకు వినియోగించుకుని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. –జి.శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భ జలగణన శాఖ, అనకాపల్లి -
రిజర్వ్ బ్యాంక్ పేరుతో మోసాలు
● ముగ్గురు ముఠా సభ్యుల అరెస్ట్ ● పరారీలో ప్రధాన నిందితుడు గోపాలపట్నం: రిజర్వ్ బ్యాంక్ ద్వారా కోట్లాది రూపాయలు, విల్లాలు ఇప్పిస్తామని.. రూ.5 వేలు కడితే కోటి వరకు నజరానా వస్తుందని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను సోమవారం టాస్క్ఫోర్స్, ఎయిర్పోర్టు పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. రెండు రాష్ట్రాల్లో ఓ ముఠా రైస్ పుల్లింగ్, రిజర్వ్ బ్యాంక్ సర్టిఫికెట్లు వంటి పలు రకాల మోసాలకు పాల్పడుతోంది. ఇందులో కొందరు ముఠా సభ్యులు విశాఖలో ఉన్నట్లు సమాచారం రావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు మర్రిపాలెం వుడా లేఅవుట్ పార్క్ సమీపంలో ఒక ఇంటిపై దాడి చేశారు. విశాఖకు చెందిన లక్ష్మీ ప్రసన్న, కోటేశ్వరరావు, కాకినాడకు చెందిన శ్రీనివాస్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడైన యడ్లపల్లి నారాయణ మూర్తి పరారయ్యాడు. వీరు గతంలో పలు చోట్ల దొంగ నోట్లు చలామణి చేయడం, రూ.5వేలు, రూ.10 వేలు కడితే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. వీరు విశాఖ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలను అడ్డాగా మార్చుకుని ప్రజలను ఏమార్చుతున్నారు. కాగా.. టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులను ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. -
వ్యాన్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
కశింకోట : తాళ్లపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. అనకాపల్లి –యలమంచిలి మార్గంలో జాతీయ రహదారిపై తాళ్లపాలెం సమీపంలో మామిడివాక గెడ్డ వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తిని వ్యాన్ వేగంగా ఢీకొందన్నారు. దీంతో తల నుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. నేరేడు పండు రంగు షర్టు, నలుపు రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడన్నారు. వీఆర్వో రాయవరపు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు. -
గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం విఫలం
● ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న దేవరాపల్లి: గంజాయి నిర్మూలనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. విశాఖ సెంట్రల్ జైలు కెపాసిటీ సుమారు 1300 కాగా, అక్కడ 2వేల మంది ఖైదీలు ఉన్నారన్నారు. అందులో 1200 మందికి పైబడి గంజాయి కేసుల్లో పట్టుబడిన అమాయక గిరిజనులేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించినా క్షేత్ర స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. మాదక ద్రవ్యాల మత్తుకు యువత బానిసవుతుందని, వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచడం లేదని ఆరోపించారు. ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపడం ద్వారానే నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశ చూపి గంజాయి రవాణాలో గిరిజన యువతను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థి ‘గాదె’ విస్తృత ప్రచారం
బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న గాదె శ్రీనివాసులునాయుడు డుంబ్రిగుడ: ఎమ్మెల్సీగా మరోసారి తనను గెలిపిస్తే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలుకు కృషి చేస్తానని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ బాలుర, బాలికల, కేజీబీవీ, డుంబ్రిగుడ, అరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన ఆయా పాఠశాలల బయట ఉపాధ్యాయులతో మాట్లాడారు. కేజీబీవీలలో పని చేస్తున్న సీఆర్టీలకు మినిమం టైం స్కేల్ వర్తించేలా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా బీమా సదుపాయం కల్పించి ఉపాధ్యాయులకు వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయులకు 15 రోజుల సాధారణ సెలవులపై స్పష్టతనిచ్చి అమలయ్యేలా చూస్తామన్నారు. పీఆర్టీయూ అల్లూరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గిరి, అప్పలరాజు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, రాష్ట్ర కౌన్సిలర్ జి.గెన్ను, జల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్ష, కార్యదర్శి లక్ష్మయ్య, రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై కొరడా
● శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులుసాక్షి, విశాఖపట్నం : అవినీతి ఆరోపణలతో పాటు వేధింపులు, క్రమశిక్షణరాహిత్య ప్రవర్తన, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై ప్రభుత్వం శాఖ పరమైన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో విశాఖపట్నం–2 డివిజన్ పరిధిలోని అనకాపల్లి సర్కిల్లో విధులు నిర్వర్తించిన డివిజన్ జాయింట్ కమిషనర్ ఎం.సుధాకర్రావు, డిప్యూటీ కమిషనర్ పి.జయశంకర్, జీఎస్టీవో పి.ప్రసన్నకుమార్, ఏఈవో జమ్ము ధర్మపాల్, ఎయిర్పోర్టు సర్కిల్ ఏఈవో టి.సోమేశ్వరరావుపై ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరి అవినీతి, అధికార దుర్వినియోగంపై సీసీఎస్టీ అడిషనల్ కమిషనర్ ఎస్ఈ కృష్ణమోహన్రెడ్డి, కాకినాడ జాయింట్ కమిషనర్ జి.సుమతిని విచారణాధికారులుగా నియమించారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం.. సదరు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
20 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు
పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు చీడికాడ : అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మండలంలోని అప్పలరాజుపురం కాటా వద్ద ఆదివారం సాయంత్రం వాహనాలు తనిఖీలు నిర్వహిహిస్తుండగా తమిళనాడుకు చెందిన మహమ్మద్ అర్షప్, టి.ఏబారిన్ అనే వ్యక్తులు గంజాయితో పట్టుబడ్డారన్నారు. వీరిద్దరూ ముంచుంగుపుట్టు మండలంలో ఒక వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్టు విచారణలో తెలిసిందన్నారు. వీరిని అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. -
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్కు గడువు ఈనెల 28
తుమ్మపాల: ఈనెల 28వ తేదీలోగా ప్రభుత్వ పింఛనుదారులు తమ జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాలను (లైఫ్ సర్టిఫికెట్లు) ప్రభుత్వ ఖాజానా కార్యాలయానికి సమర్పించాలని జిల్లా ఖజానా, గణాంక అధికారి వి.ఎల్.సుభాషిణి ఒక ప్రకటనలో తెలిపారు. పింఛన్దారులు సకాలంలో పత్రాలను సమర్పించి పింఛను ఆగిపోకుండా చూసుకోవాలన్నారు. అనారోగ్య పరిస్ధితుల్లో ఉన్న పింఛనుదారులు సంబంధిత ఖజానా అధికారికి తెలియపరిస్తే నేరుగా వారు పింఛనుదారుల వద్దకు వచ్చి జీవన ప్రమాణ పత్రాలను స్వీకరిస్తారని తెలిపారు. బయోమెట్రిక్ సమస్యపై నేరుగా కార్యాలయానికి రావాల్సిందేనని తెలిపారు. -
బేడ జంగం కులస్తులకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి
అనకాపల్లి: రాష్ట్రంలో బేడ(బుడ్గ) జంగం కులస్తుల విద్యార్థులకు 17 సంవత్సరాలుగా కుల ధృవీకరణ(ఎస్సీ) పత్రాలను ప్రభుత్వం అంజేయడం లేదని, జేసీ శర్మ కమిషన్ నివేదిక ప్రకారం కుల ధృవీకరణ పత్రాలను అందజేయాలని ఏపీ బేడ(బుడ్గ) జంగం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు దుడ్డు కొండయ్య అన్నారు. స్థానిక జార్జి క్లబ్ ఆవరణలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో బేడ జంగం కలస్తుల విద్యార్థులకు ఎస్పీ కుల ధృవీకరణ పత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో అందజేసేవారని, ప్రస్తుతం అందజేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 17 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందజేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. సుప్రీంకోర్టులను ఆశ్రయించడంతో గతంలో ఉన్నట్టుగా కుల ధృవీకరణ పత్రాలను అందజేయాలని జెసీ శర్మ కమిషన్ సిఫారసలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా ఉపాధ్యక్షుడు పి.అప్పారావు, కార్యదర్శి శేర్ల అప్పారావు, సభ్యులు పాల్గొన్నారు. -
ఉపమాకలో తిరుమల దర్శన కౌంటర్
● టీటీడీ చైర్మన్ను కోరిన హోం మంత్రి అనితటీటీడీ చైర్మన్కు వినతిపత్రం ఇస్తున్న హోం మంత్రి అనిత నక్కపల్లి: టీటీడీ అనుబంధ ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల దర్శన టికెట్లు విక్రయించే కౌంటరు ఏర్పాటు చేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును హోం మంత్రి వంగలపూడి అనిత కోరారు. సోమవారం ఆమె స్థానిక నాయకులతో టీటీడీ చైర్మన్ను కలిశారు. మార్చి 10న ప్రారంభమయ్యే ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఉపమాక ఆలయాన్ని టీటీడీ దత్తత తీసుకునే సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి వివరించారు. ఆలయానికి వచ్చే ఉత్తరాంధ్ర భక్తుల కోసం ఉపమాకలో టీటీడీ ఆధ్వర్యంలో టికెట్ కౌంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విక్రయించే అవకాశం కల్పించాలని కోరారు. ఇక్కడ లడ్డూ విక్రయాలు నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపమాక కల్యాణోత్సవాలకు రావాల్సిందిగా టీటీడీ చైర్మన్ నాయుడును కోరామన్నారు. తమ ప్రతిపాదనలపై వెంటనే స్పందించిన చైర్మన్ టీటీడీ చీఫ్ ఇంజినీర్, జేఈవోలను రప్పించి ఉపమాకలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారన్నారు. హోమ్ మంత్రి వెంట టీడీపీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్, ఉపమాక దేవస్థానం మాజీ చైర్మన్లు కొప్పిశెట్టి కొండబాబు, కొప్పిశెట్టి బుజ్జి తదితరులు ఉన్నారు. -
అతివలకు అండగా ‘సఖి’
● బాధితులకు ఆశ్రయం, న్యాయసహాయం ● కౌన్సెలింగ్ ద్వారా సమస్యల పరిష్కారానికి యత్నం ● ఎస్పీ తుహిన్ సిన్హాఅనకాపల్లి: అతివలకు అండగా సఖి వన్ స్టాప్ సెంటర్ ఉంటుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఈ సెంటర్ను సోమవారం రాత్రి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైంగిక వేధింపులు, గృహ హింస, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, మహిళల అక్రమ రవాణా, సోషల్ వెబ్సైట్ల ద్వారా జరిపే నేరాలు, పనిచేసే ప్రదేశంలో మహిళలపై వేధింపులు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం తదితర ఫిర్యాదులపై మహిళలు నిర్భయంగా 181కు కాల్ చెయ్యవచ్చునని చెప్పారు. ఫిర్యాదు తీవ్రతను బట్టి సఖి కేంద్రంలో సైకో సోషల్ కౌన్సెలింగ్, లీగల్ కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సెంటర్లో పోలీసు, వైద్య, న్యాయ, మహిళా శిశు సంక్షేమ విభాగాలకు చెందిన సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. 5 నుంచి 10 రోజుల వరకు ఆశ్రయం కల్పిస్తామని, భోజనం ఇతర వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు యమున, ఈశ్వరరావు, సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఎం.వి.మంజులవాణి, నోడల్ అధికారి ఎల్.సుజాత పాల్గొన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కశింకోట: సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసు అధికారులను ఆదేశించారు. కశింకోట పోలీసు స్టేషన్ను సోమవారం ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. కేసుల పురోగతిని పరిశీలించారు. సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయని, వాటి పట్ల ప్రజలను మరింత అప్రమత్తం చేయాల్సి ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలను దాతల సహకారంతో ఏర్పాటు చేయాలన్నారు. సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్ఐ మనోజ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
కాసులిస్తేనే కరెంట్ కనెక్షన్.!
● కొత్త మీటర్ కావాలంటే విద్యుత్ అధికారుల చేయి తడపాల్సిందే.. ● కూటమి నేతలతో కలిసి బరితెగిస్తున్న ఈపీడీసీఎల్ సిబ్బంది ● కొత్త కనెక్షన్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు ● అపార్ట్మెంట్ కనెక్షన్కు రూ.50 వేలు, వ్యక్తిగత కనెక్షన్కు రూ.5 వేల వసూలు సార్.. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం.. కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం.. ఎప్పుడు వస్తుందని.. ఎవరైనా సాధారణ ప్రజలు అడిగితే.. ‘మీ లోకల్ లీడర్ నుంచి సిఫార్సు తీసుకురా.. అప్పుడే పని త్వరగా పూర్తవుతుంది. దాంతో పాటు ఎంతో కొంత సర్దుబాటు చెయ్.. మీ ఇంటికి వెలుగులు వచ్చేస్తాయి.’ – ఈపీడీసీఎల్ విశాఖపట్నం సర్కిల్ పరిధిలోని అధికారులు, సిబ్బంది చెబుతున్న మాటలు ఇవి. జోన్–1 పరిధిలో 80 అడుగుల రోడ్డు ప్రాంతానికి చెందిన ప్రసన్నకుమార్ కొత్తగా కడుతున్న గ్రూప్ హౌస్ కోసం విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేశారు. నెల రోజులైనా స్పందన రాకపోవడంతో విశాఖ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి అడగ్గా.. దిగువ స్థాయి అధికారిని సంప్రదించాలని చెప్పారు. తిరిగి తిరిగి సదరు అధికారిని అడగ్గా.. మీ లోకల్ టీడీపీ లీడర్ నుంచి ఒక్క ఫోన్ చేయించండి చాలు.. మీ పనైపోతుందని అన్నారు. లీడర్ దగ్గరికి వెళ్లి బతిమిలాడారు. అక్కడి నుంచి జోన్ సిబ్బందికి ఫోన్ వెళ్లింది. వెంటనే సదరు విద్యుత్ ఉద్యోగి ప్రత్యక్షమై.. ఫార్మాలిటీస్ ఉన్నాయంటూ లెక్క చెప్పి రూ.50 వేలు కప్పం కట్టించుకున్నారు. అంతే రెండు రోజుల్లో కొత్త కనెక్షన్ వచ్చేసింది. – ఇదీ కొంత కాలంగా ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్లో నడుస్తున్న దందా. కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే.. కచ్చితంగా ఆ ఏరియాకు చెందిన కూటమినేత నుంచి ఫోన్ రావాల్సిందే. సాక్షి, విశాఖపట్నం : ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ప్రస్తుతం 18,42,691 మంది ఎల్టీ కేటగిరీ వినియోగదారులు, 1858 హెచ్టీ కేటగిరీ వినియోగదారులున్నారు. గత ఐదేళ్ల కాలంలో కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే సులువుగా దొరికేది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. స్థానిక ఏఈ కార్యాలయంలో సంప్రదించినా.. కేటగిరీల వారీగా ఫీజులు చెల్లించేవారు. నిర్ణీత గడువులో కొత్త కనెక్షన్ మంజూరయ్యేది. 2022 నుంచి 2024 ఏప్రిల్ మధ్య కాలంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపు 80 వేల కొత్త కనెక్షన్లు పెరిగాయి. కానీ.. ఎక్కడా లంచాలకు తావులేకుండా మంజూరు చేసేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈపీడీసీఎల్ సర్కిల్ అధికారులు కమర్షియల్గా మారిపోయారు. కనెక్షన్ కావాలంటే చేయి తడపాల్సిందేనని భీష్మించుకు కూర్చుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక లైన్మెన్లు, ఏఈలు దరఖాస్తులను ప్రాసెసింగ్ చేస్తున్నా.. వాటిని ఆపాలంటూ కూటమి నేతలు హుకుం జారీ చేస్తున్నారని తెలుస్తోంది. తమ ఆదేశాలు వచ్చేంత వరకూ కొత్త దరఖాస్తుల జోలికి వెళ్లొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అందుకే విశాఖ సర్కిల్ పరిధిలో వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి నేతలతో కుమ్మక్కు! విద్యుత్ కనెక్షన్లు ఏమైనా కొత్తవి మంజూరు చేయాలంటే కచ్చితంగా తమను సంప్రదించేలా చూడాలంటూ కూటమి నేతలు విశాఖపట్నం సర్కిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏ దరఖాస్తు వచ్చినా దానిపై దృష్టి సారించడం లేదు. దరఖాస్తుదారులు వచ్చి తమ కొత్త కనెక్షన్ గురించి అడిగితే... కూటమి నేతలతో కుమ్మకై ్క అందినకాడికి దోచుకుంటూ పంచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగత కనెక్షన్కు కేటగిరీ బట్టి రూ.5 నుంచి రూ.10 వేలు.. అపార్ట్మెంట్స్, విల్లాలు, గ్రూప్హౌస్లకు విస్తీర్ణం, ఫ్లాట్లను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష కుపైగా రేటు ఫిక్స్ చేశారని తెలుస్తోంది. దీంతో ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ కచ్చితంగా అవసరం కాబట్టి.. ఎంత డిమాండ్ చేస్తే అంత చెల్లింపులు చేసి కనెక్షన్ తీసుకుంటున్నామని వినియోగదారులు వాపోతున్నారు. -
● ప్రభుత్వ భూముల ఆక్రమణపై ఫిర్యాదు చేసిన వారిపై తహసీల్దార్ మండిపాటు ● భూ ఆక్రమణదారులకు వత్తాసు ● ఆగ్రహించి ఆందోళనకు దిగిన ప్రజలు
గొలుగొండ : గొలుగొండ తహసీల్దార్ శ్రీనివాసరావు తీరుపై నాగాపురం పంచాయతీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణపై తహసీల్దార్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన నాయకులు, ప్రజలపై తహసీల్దార్ మండిపడ్డారు. మీరు ఫిర్యాదు లు ఇస్తే నేను పట్టించుకోవాలా.. నేను ఎటువంటి చర్యలు తీసుకోను? ఎం చేసుకుంటారో చేసుకోండి అని తెగేసి చెప్పడంతో హతాశులైన గ్రామస్తులు తహసీల్దార్ తీరును నిరసిస్తూ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహసీల్దార్ డౌన్..డౌన్ అని నినదించారు. నాలుగు గంటల పాటు కార్యాలయం మెట్లపై ఆందోళన చేశారు. వివరాలివీ... నాగాపురం పంచాయతీ శివారు పల్లావూరు గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ఉంది. అక్కడే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయం ఉంది. అక్కడ ప్రజలకు ఇపయోగపడే విధంగా మరో 10 సెంట్లు స్థలం ఉంది. దీనిని పల్లా దేముడు అనే వ్యక్తి ఆక్రమించాడని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని పలువురు తహసీల్దార్కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే తహసీల్దార్ వారిపై మండిపడ్డారు. మాజీ సర్పంచ్ కొలగాన రామారావు, ప్రస్తుతం సర్పంచ్ యలమంచిలి రఘురాంతోపాటు అన్ని పార్టీల నేతలు ఇక్కడకు వచ్చారు. తహసీల్దార్ ఆక్రమణదారులకు వత్తాసు పలకడంపై ఫిర్యాదుదారులు ఆందోళన చేశారు. గొలుగొండ ఎస్ఐ రామారావు వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని ఆందోళనకారులు హెచ్చరించారు. -
ఎస్ఈజెడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన
● పెడిమికొండ అటవీ ప్రాంతంతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు భూముల అన్వేషణ ● గాంధీనగరం పరిసరాల్లో పర్యటించిన అనకాపల్లి, అల్లూరి కలెక్టర్లు నాతవరం: గాంధీనగరం సమీపంలో ఎస్ఈజెడ్ ఏర్పాటు కోసం 100 ఎకరాల భూ సేకరణలో భాగంగా పెడిమికొండ అటవీ ప్రాంతాన్ని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ సోమవారం పరిశీలించారు. నర్సీపట్నం–తుని మధ్య ఆర్ అండ్ బీ రోడ్డుకు ఇరువైపుల గాంధీనగరం సమీపంలో 3 కిలోమీటర్ల వరకు పెడిమికొండ అటవీ భూములు ఉన్నాయి. ఆ భూములను అటవీశాఖ అధికారుల తో కలిసి ఇద్దరు కలెక్టర్లు స్వయంగా పరిశీలించి వా టి వివరాలను తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో కొంతమేర పెడిమికొండ నర్సరీ, మరికొంత భూ మిలో జీడిమామిడి తోట ఉందని అటవీ రేంజర్ లక్ష్మీనర్సు వివరించారు. గాంధీనగరం సమీపంలో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేస్తే తుని హైవే, విశాఖ, రాజ మండ్రి పట్టణ ప్రాంతాలకు ఎంత దూరం వస్తుందని ఇద్దరు కలెక్టర్లు ఆర్డీవో వి.వి.రమణను అడిగా రు. ఇక్కడ అటవీ భూమి ఎంత ఉందో, జిరాయితీ భూమి ఎంత ఉందో తెలుసుకున్నారు. తాండవ, ఏలేరు కాలువలు ఎంత దూరంలో ఉన్నాయని అడిగారు. ఎస్ఈజెడ్ ఏర్పాటుకు కావలసిన భూమిని రైతుల నుంచి సేకరించాలని లేదా డీపట్టా భూము లు తీసుకోగా ఇంకా అవసరమయితే పెడిమికొండ అటవీ భూమిని తీసుకోవాలని భావిస్తున్నారు. అ టవీ భూమిని తీసుకుంటే దానికి బదులుగా సుందరకోట పంచాయతీలో ఉన్న గ్యాప్ ఏరియా భూమి ఇచ్చేందుకు అటవీశాఖ అధికారులతో చర్చించారు. ఎస్ఈజెడ్ ఏర్పాటైతే.. అటవీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఇక్కడ ఎస్ఈజెడ్ నెలకొ ల్పాలని యోచిస్తున్నారు. అందుకే అల్లూరి జిల్లా కలెక్టర్ కూడా స్థల పరిశీలనకు వచ్చారు. ఏజెన్సీ నుంచి వచ్చే గిరిజన ఉత్పత్తులు, మైదాన ప్రాంత రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులు స్టాకు చేసి గిట్టుబాటు ధర లభించినప్పుడు పట్టణ ప్రాంతాలకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ పర్యటనలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో కె,ఉషశ్రీ, అటవీ సెక్షన్ అధికారి చిరంజీవి, డిప్యూ టీ తహసీల్దార్ శివ, మండల సర్వేయర్ ప్రసాద్, ఎంఈవోలు సత్యనారాయణ, కామిరెడ్డి వరహా లబాబు, ఎస్ఐ సిహెచ్.భీమరాజు పాల్గొన్నారు. -
కక్ష సాధింపులకు పాల్పడితే సహించం
నర్సీపట్నం : రాష్ట్రంలో బహుజన అధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని బహుజన ఐక్యవేదిక నాయకులు బొట్టా నాగరాజు పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు బహుజన అధికారి అయిన సీఐడీ చీఫ్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్కుమార్పై కక్ష కట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పోస్టింగ్ ఇవ్వాకుండా ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. అట్టడుగు వర్గాల సమాజం బాగుపడాలని నిరంతరం కృషి చేస్తున్న పి.వి.సునీల్ కుమార్పై కక్ష కట్టి ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు.అధికారులు రాజ్యాంగానికి లోబడి ఉద్యోగాలు చేస్తారన్నారు. అలాంటివారిని ఇబ్బందులు పెడితే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టేనన్నారు. పి.వి సునీల్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉత్తమ పోలీసు అధికారిగా ఎన్నో అవార్డులు అందుకున్నారన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ వేధింపులు ఆపి పోస్టింగ్ ఇవ్వాలన్నారు. లేని పక్షంలో బహజనులంతా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సాగిస్తామన్నారు. ఇదే ధోరణి కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక నాయకులు ఎన్.చిరంజీవి, వి.సంజీవ్ పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుధ్యం మెరుగు
గాంధీ విగ్రహం వద్ద స్వచ్ఛ భారత్పై ప్రతిజ్ఞ చేస్తున్న నాగలక్ష్మి, డీపీవో శిరీషారాణి కె.కోటపాడు : పారిశుధ్య సిబ్బంది, క్లాప్మిత్రలకు తడి, పొడి చెత్తను వేర్వేరు డస్ట్బిన్లలో వేసి ఇచ్చి పారిశుధ్యం మెరుగుకు ప్రజలు సహకరించాలని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి అన్నారు. అనకాపల్లి డివిజన్లో గల 11 మండలాల్లో గల పంచాయతీ విస్తరణాధికారులు, ఆయా మండలాల్లో ఎంపిక చేసిన పంచాయతీ కార్యదర్శిలు, క్లాప్మిత్రలకు చౌడువాడలో సోమవారం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి, శిరీషారాణి మాట్లాడుతు గ్రామాల్లో సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాల్లో వేర్వేరుగా ఉంచాలని తెలిపారు. పాడి రైతుల నుంచి సేకరించిన పేడను సంపద తయారీ కేంద్రాల్లో 70 నుంచి 80 రోజుల పాటు ఉంచిన తరువాత వర్మీగా తయారవుతుందన్నారు. ఈ ఎరువును రైతులకు కిలో గరిష్టంగా రూ.5లకు అమ్మకాలను చేపట్టడం ద్వారా పంచాయతీకి ఆదాయం లభిస్తుందన్నారు. భూమిలో వర్మీకంపోస్టు వేయడం వల్ల భూమిలో పోషక విలువలు పెరుగుతాయని, తద్వారా మంచి దిగుబడితో పాటు ఆరోగ్యకరమైన పంట లభిస్తుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమానికి హాజరైన ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, క్లాప్మిత్రలను గ్రామంలో పర్యటించి ప్రజలకు ఏ విధంగా తడి, పొడి చెత్తను వేరువేరుగా ఇవ్వాలో వివరింపజేసారు. అంతకుముందు సంపద తయారీ కేంద్రం వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాంబశివరావు, సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, పంచాయతీ కార్యదర్శి బి.సురేష్ పాల్గొన్నారు. -
పోలీసు సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
● సమీక్ష సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హాఎస్పీ కార్యాలయంలో మినిస్టీరియల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : స్థానిక ఎస్పీ కార్యాలయంలో మినిస్టీరియల్ సిబ్బందితో (సెక్షన్ వైస్) సోమవారం సమీక్ష సమావేశాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. పోలీస్ సిబ్బంది అభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ, సంక్షేమ పథకాలు, సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఉద్యోగుల్లో స్ఫూర్తిని పెంచేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని, సమర్ధంగా సేవలు అందించేందుకు తగిన మార్గదర్శకాలు, నూతన విధానాలు, సాంకేతిక వినియోగం వంటి అనేక అంశాలపై సిబ్బందితో ఎస్పీ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఏవో ఎ.రామ్కుమార్, సెక్షన్ సూపరింటెండెంట్లు కె.వి.వరలక్ష్మి, పి.శేషు, ఎన్.వి.గిరిబాబు పాల్గొన్నారు. -
శ్రీవైష్ణవ సంఘం జిల్లా అధ్యక్షునిగా నీలాచలం
అనకాపల్లి : శ్రీ భాగవతుల చాత్తాడ శ్రీవైష్ణవ సేవా సంఘం జిల్లా అధ్యక్షునిగా నీలాచలం వెంకటరమణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక గాంధీనగరం సంఘం కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా తిరుపతి గౌరసోమశేఖర్, కోశాధికారిగా సన్నిధి ఈశ్వరరావు, గౌరవాధ్యక్షునిగా ఎం.జగన్మోహన్రావుతో పాటు మరో 15మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా సంఘం గౌరవాధ్యక్షుడు ఎం.జగన్న్మోహన్రావు మాట్లాడుతూ పై కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చే స్తున్నట్టు తెలిపారు. -
కొత్త దద్దుగుల గ్రామస్తుల ఆశ్చర్యం
ఆ గ్రామం వెళ్లిన మొదటి కలెక్టరు విజయకృష్ణన్ నెల రోజుల్లో గ్యాప్ ఏరియా భూముల సర్వే గ్రామాన్ని ఆనుకుని వృధాగా ఉన్న వేలాది ఎకరాల గ్యాప్ ఏరియా భూములను కలెక్టర్ పరిశీలించారు. ఈ భూములు సర్వే చేసి రికార్డులో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. నెల రోజుల్లో గ్యాప్ ఎరియా భూములు మొత్తం సర్వే పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలని మండల సర్వేయరు ప్రసాద్ను అదేశించారు. జిల్లాల సరిహద్దు విషయంలో ప్రత్యేక దృష్టి సారించి అధునిక టెక్నాలజీ సహాయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో రమణ, నర్సీపట్నం రేంజర్ లక్ష్మి నర్సు, అటవీ సెక్షన్ అధికారి చిరంజీవి, తహసీల్దార్ ఎ.వేణుగోపాల్ పాల్గొన్నారు. మా ఊరికి కలెక్టరమ్మ వచ్చింది...నాతవరం: కొత్తదద్దుగుల గ్రామాన్ని కలెక్టరు విజయకృష్ణన్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సుందరకోట పంచాయతీ శివారు కొత్త దద్దుగుల గ్రామానికి ఒక కలెక్టరు రావడం ఇదే మొదటిసారి. దీంతో ఇక్కడి గిరిజనులు ఆశ్చర్యంగా చూశారు. గ్రామం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఏ కలెక్టరూ ఆ గ్రామానికి వచ్చిన సందర్భాలు లేవు. ఈ గ్రామం రెండు జిల్లాల సరిహద్దు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతోమండల స్థాయి అధికారులు సైతం వెళ్లిన దాఖలాలు అంతంత మాత్రమే. ఈ ప్రాంతాన్ని ‘గ్యాప్ ఏరియా’గా పరిగణిస్తారు. గ్రామంలో పరిస్థితులను స్వయంగా చూసి కలెక్టరు గిరిజనులతో మాట్లాడారు. జీవన విధానం, సంక్షేమ పథకాల అమలుతో పాటు సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం, అంగన్వాడీ కేంద్రం, తాగునీరు, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. గ్రామానికి రోడ్డు లేక గర్భిణులను వైద్యానికి తీసుకెళ్లం ఇబ్బందిగా ఉందని గిరిజనులు కలెక్టర్ వద్ద వాపోయారు. ఉపాధి హమీ పథకంలో వేసిన మట్టి రోడ్డు వర్షాలకు కోట్టుకుపోవడంతో రాకపోకలు సాగించలేక పోతున్నామన్నారు. సెల్ టవరు ఏర్పాటు చేస్తే కొండల మీద ఉన్న గిరిజన గ్రామాల ప్రజలకు ఆన్లైన్ సేవలు అందుతాయన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులందరికీ అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. పాడేరు ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం కల్పించే సదుపాయాలు ఇక్కడ తమకు అందించాలని కోరారు. గతంలో ఇచ్చేవారని ఇటీవల కాలంలో ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం జాఫ్రా పంట ఆదాయం బాగుందని, కేజీకి రూ.250లకు విక్రయాలు ప్రైవేటు వ్యాపారులు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది ఈ ఒక్క పంటే అదాయం వస్తుందన్నారు. దీంతో గిరిజనుల మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని ఎంపీడీవో కె.ఉషాశ్రీని కలెక్టర్ ఆదేశించారు. కొండల మీద ఉన్న గిరిజన గ్రామాల్లో పాఠశాలల పని తీరుపై ఎంఈవోలు సత్యనారాయణ, కామిరెడ్డి వరహాలబాబును అడిగారు. రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ నర్సీపట్నం : నర్సీపట్నం మండలం, బంగారయ్యపేటలో జరుగుతున్న భూముల రీసర్వేను జిల్లా కలెక్టర్ విజయ్కృష్ణన్ సోమవారం పరిశీలించారు. అధికారులు సర్వే చేస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇస్తున్నారా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సర్వే చేస్తున్నప్పుడు రైతులు దగ్గర ఉండి సర్వే చేయించుకోవాలన్నారు. లోటుపాట్లు లేకుండా సర్వేను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రమణ ఉన్నారు. మీరు ఫిర్యాదు చేస్తే నేను పట్టించుకోవాలా? గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ -
నెలాఖరులోగా ఆనకట్ట పూర్తి చేయాలి..
బుచ్చెయ్యపేట : మండలంలో గల మంగళాపురం ఆనకట్ట నిర్మాణ పనులను వైఎస్సార్సీపీ నాయకులు, రైతు సంఘ నాయకులు పరిశీలించారు. తొంభై శాతం పనులు పూర్తవగా మిగిలిన పనులు నెలాఖరులోగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మూడేళ్ల కిందట మంగళాపురం ఆనకట్ట భారీ వర్షాలకు దెబ్బతింది. ఆనకట్ట దిగువన ఉన్న మంగళాపురం, కుముదాంపేట, విజయరామరాజుపేట, లక్ష్మీపురం, సురవరం, నరసయ్యపేట తదితర గ్రామాలకు చెందిన వేలాది మంది రైతులకు సాగు నీరు అందలేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఆనకట్ట దెబ్బతినడంతో కోనాం రిజర్వాయర్ నీరు అందక రైతులకు తీవ్ర నష్టం జరిగేది. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు విజయరామరాజుపేట, మంగళాపురం సర్పంచ్లు ఎల్లపు విజయ్కుమార్, కంటే పద్మరేఖ వెంకట్, కోఆపరేటివ్ అధ్యక్షుడు ఎల్లపు గోవిందలు పలువురు నాయకులు, రైతులతో కలిసి సాగు నీటి కష్టాలను అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దృష్టికి తీసుకెళ్లారు. ధర్మశ్రీ కృషితో అనకాపల్లి ఎంపీ బి.వి.సత్యవతి మంగళాపురం ఆనకట్ట మరమ్మతు పనులకు తన ఎంపీ నిధుల నుంచి రూ.40 లక్షలు మంజూరు చేశారు. 2023 నవంబర్ 21వ తేదీన అప్పటి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మండల నాయకులతో కలిసి ఆనకట్ట పనులకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటికే ఆనకట్ట నిర్మాణ గోడ ఎఫ్రాన్తో పాటు రక్షణ గోడ పనులు, రాతి పేర్పు పనులు జరగ్గా వీటి నాణ్యత సామర్ాధ్యన్ని విజయరామరాజుపేట, మంగళాపురం సర్పంచ్లు విజయ్కుమార్, పద్మరేఖ వెంకట్, కోఆపరేటివ్ మాజీ అధ్యక్షుడు గోవింద, రైతు సంఘ నాయకులు సోమవారం పరిశీలించారు. 3 వేల ఎకరాలకు సాగు నీరందించే ఆనకట్ట పనులు పటిష్టంగా పూర్తి చేయాలన్నారు. ఆనకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డికి, నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ సత్యవతి,ఎమ్మెల్యే ధర్మశ్రీకి నాయకులు,రైతు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పేట ఉప సర్పంచ్ దొడ్డి జగన్నాధరావు, పీఎసీఎస్ మాజీ డైరెక్టర్ పెంటకోట కృష్ణ రైతు సంఘ నాయకులు ఎల్లపు చిరంజీవి, వేగి అప్పారావు, గాడి ప్రసాద్, మధుమంతి నాయుడు, పత్తి జగన్నాథరావు, వేగి రాజు పాల్గొన్నారు. మంగళాపురం ఆనకట్ట పనులను పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులు గత ప్రభుత్వంలో రూ.40 లక్షలు నిధులు మంజూరు -
కేర్ ఆస్పత్రిలో రోగి మృతి
ఆరిలోవ: హెల్త్సిటీలోని కేర్ ఆస్పత్రిలో ఒక రోగి మృతి చెందడం ఆందోళనకు దారి తీసింది. ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని అప్పగించడానికి రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో మృతుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలివి.. చోడవరానికి చెందిన బండి శ్రీధర్ (55) గుండెనొప్పితో బాధపడుతుండగా, ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కుటుంబ సభ్యులు హెల్త్సిటీలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. ముందుగా ఆస్పత్రికి రూ.60 వేలు చెల్లించారు. అర్ధరాత్రి 12.30 నుంచి ఒంటి గంట మధ్య సమయంలో ఐసీయూలో ఉన్న శ్రీధర్ను చూడటానికి కుటుంబ సభ్యులు వెళ్లగా.. అతను మృతి చెందినట్లు గుర్తించారు. వైద్యులను సంప్రదించగా వారు పరిశీలించి శ్రీధర్ మరణించినట్లు నిర్ధారించారు. శ్రీధర్కు రెండు శస్త్రచికిత్సలు చేశామని, వాటికి సంబంధించిన ఫీజు చెల్లించాలని వైద్యులు సూచించారు. మృతదేహాన్ని అప్పగించడానికి రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన శ్రీధర్ కుమారులు ‘గుండె జబ్బు నయం చేస్తామని చెప్పి మా నాన్నను చంపేశారు’ అంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం బంధువులకు తెలియడంతో చోడవరం నుంచి సోమవారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. మృతదేహం కోసం డబ్బులు చెల్లించమని, వెంటనే మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ కృష్ణ సిబ్బందితో కలిసి కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులు, ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ముందు చెల్లించిన రూ.60వేలతో పాటు అదనంగా రూ.1.10 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి బంధువులు అంగీకరించారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. శస్త్రచికిత్స చేసే సమయంలో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. -
నేడు రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక
ఫార్మాసిటీలో ఇద్దరు కార్మికులకు అస్వస్థత నిద్ర మాత్రల పౌడర్ ప్యాకింగ్లో ఘటనపరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని టొరెంటో పరిశ్రమలో ఆదివారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికులు పి.రామకృష్ణ, జె.బసవేశ్వరరావులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు అందించిన వివరాలు. పరిశ్రమలో నిద్ర మాత్రల తయారీకి ఉపయోగించే జోల్పిడమ్ పౌడర్ను ప్యాకింగ్ చేస్తుండగా, ఆ పౌడర్ను పీల్చడంతో స్పృహ తప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న యాజమాన్యం ఇరువురిని విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కొలుకుంటున్నారని సీఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఎంవీపీకాలనీ (విశాఖ): విశాఖ వేదికగా రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టును సోమవారం ఎంపిక చేస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జేఎస్వీ ప్రసాదరెడ్డి తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర కబడ్డీ సంఘం సెలక్షన్ కమిటీని నియమించిందని ఓ ప్రకటనలో వెల్లడించారు. కమిటీ సభ్యులుగా కబడ్డీ నేషనల్ మెడలిస్ట్ ప్రసాదరెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు సీహెచ్ పద్మరాజు, వైవీ శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం 19 మంది క్రీడాకారులకు నగరంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 12 మందిని కమిటీ తుది జట్టుకు ఎంపిక చేస్తుంది. ఈ జట్టు కటక్ వేదికగా జరగనున్న 71వ జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. -
క్రిమినల్ కేసులు బనాయించి మరీ తొలగించారు..
నేను ఎటువంటి అవకతవకలకు పాల్పడకపోయినా కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే అన్యాయంగా తొలగించారు. హోంమంత్రి వంగలపూడి అనిత అప్పటి డ్వామా పీడీ సందీప్పై ఒత్తిడి తెచ్చి మరీ నాపై వేటు వేశారు. ఆయనతో మాకు ఫోన్ చేయించి రాజీనామా చేయాలని చెప్పించారు. నేను చేయనని చెప్పాను. నాపై క్రిమినల్ కేసులు పెట్టి మరీ తొలగించారు. 16 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాతోపాటు నామవరం, శ్రీరాంపురం ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా భయ పెట్టి తొలగించారు. మిగతా వారిని మరో నెల రోజుల తరువాత సాగనంపారు. నిజంగా నేను తప్పు చేస్తే.. అదే మస్తరు షీటుపై సంతకాలు చేసే ఎంపీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అధికారి, ఏపీఓ, డ్వామా పీడీ, టెక్నికల్ అసిస్టెంట్ అంద రూ తప్పు చేసినట్లే. వారిని కూడా తొలగించా లి. ఇదే వృత్తి మీద ఆధారపడి జీవించే మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. జిల్లాలో 50 మందికిపైగా మేట్లను అక్రమంగా తొలగించారు. – మేకా సోమయ్య, ఫీల్డ్ అసిస్టెంట్, ఈదటం గ్రామం, పాయకరావుపేట నియోజకవర్గం గ్రూప్లో మెజారిటీ ఉన్నా.. మేట్గా రిజిస్టర్ చేయలేదు మా గ్రూప్లో 50 మంది ఉపాధి కూలీలున్నారు. 25 మంది కన్నా ఎక్కువగా కూలీలు మద్దతుంటే మేట్గా రిజిస్టర్ చేయాలి. నాకు 30మందికి పైగా కూలీల మద్దతు ఉంది. అయినా మేట్గా రిజిస్టర్ చేయలేదు. ఇలా 7 గ్రూపుల్లో నిబంధనలకు విరుద్ధంగా మేట్లను నియమించారు. అధికారులు నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే ఉద్యమిస్తాం. – అడిగర్ల అప్పలనాయుడు, మామిడపాలెం గ్రామం, మాకవరపాలెం -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
మహారాణిపేట(విశాఖ): ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సారథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్ ఏర్పాట్లు చేస్తున్నారు. పది మంది అభ్యర్థులు తుది ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థుల పేరుతో తెలుగులో బ్యాలెట్ పత్రం రూపొందించి, ప్రింటింగ్ కోసం కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయానికి పంపారు. అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం అభ్యర్థులు నామినేషన్లో పేర్కొన్న మేరకు తొలి అక్షరం ఆధారంగా తెలుగు అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం నమూనాను తయారు చేశారు. తుది జాబితా మేరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి అదనంగా మరో పది శాతం కలిపి సుమారు 25 వేల బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఇవి ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఎన్నికల తేదీకి రెండు రోజులు ముందు వాటిని బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. 18 నుంచి తొలి విడత శిక్షణ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 18 నుంచి సిబ్బందికి, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడత శిక్షణ 24న ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరపనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి (పీవో)తోపాటు ముగ్గురు సిబ్బంది అవసరం. మొత్తం 492 మంది సిబ్బందితోపాటు అదనంగా మరో పది శాతం మందిని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. 27న జరిగే ఎన్నికలకు సిబ్బంది నియామకం 18న తొలి విడత శిక్షణ తరగతులు 25 వేల బ్యాలెట్ పత్రాల తయారీ -
తల్లి చెంతన పూరీ జగన్నాథ్
నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోదరుడు, ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తల్లి సత్యవతి అలియాస్ అమ్మాజీ వద్దకు వచ్చారు. ఇటీవల ప్రమాదానికి గురికావడంతో ఆమె చేతికి ఆపరేషన్ జరిగింది. విషయం తెలియడంతో సోదరుడు, సినీ హీరో సాయిరామ్ శంకర్తో కలిసి పూరీ జగన్నాథ్ తల్లిని చూసేందుకు ఆదివారం గణేష్ ఇంటికి చేరుకున్నారు. తల్లిని అక్కున చేర్చుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చాలా కాలం తర్వాత కుమారుడిని చూసిన తల్లి అమ్మాజీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సోదరులు గణేష్, సాయిరామ్, మరదళ్లు, పిల్లలు, తల్లితో జగన్నాథ్ సరదాగా గడిపారు. పూరీ రాకతో గణేష్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. పూరీ జగన్నాథ్ అభిమానులు, బంధువులు ఆయనను కలిసేందుకు తరలివెళ్లారు. -
చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ మృతి
మహారాణిపేట: హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న భూసరి రాజబాబు కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. గతేడాది నవంబర్లో ఏజెన్సీలోని కొయ్యూరు మండలం, బకులూరు సమీపంలో జరిగిన హత్య కేసులో రాజబాబు రెండో నిందితుడిగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని ఆరోగ్యం విషమించడంతో కేజీహెచ్కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. రాజబాబు మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి, మృతదేహాన్ని జైలు అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కేజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ మెహర్కుమార్ తెలిపారు. -
సరుగుడులో సండే సందడి
నాతవరం: సరుగుడు జలపాతం వద్ద ఆది వారం సందర్శకులతో సందడి నెలకొంది. ఎత్తయిన రెండు కొండల మధ్యలోంచి ప్రవహించే నీటిలో జలకాలు ఆడేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు. అనకాపల్లి, కాకినాడ జిల్లాల నలుమూలల నుంచి వాహనాలపై అధికంగా సందర్శకులు రావడంతో జలపాతం వద్ద ఉదయం నుంచి సాయంత్రం కోలాహలం కన్పించింది. ఆటపాటలతో సందర్శకులు కాలక్షేపం చేసి మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు చేశారు. సందర్శకులు పెద్ద ఎత్తున కార్లు, ద్విచక్ర వాహనాలపై రావడంతో సరుగుడు వెళ్లే రోడ్డులో రద్దీ కనిపించింది.యారాడలో ‘కింగ్డమ్’ కొమ్మాది: విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో పాన్ ఇండియాలో తెరకెక్కుతోన్న కింగ్డమ్ చిత్రం షూటింగ్ ఆదివారం యారాడ బీచ్లో జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ సందడి నెలకొంది. హీరో విజయ్ దేవకొండపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. న్యూస్రీల్పార్ట్టైం పీఈటీ అరెస్ట్ పోక్సో కేసు నమోదు గొలుగొండ: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన చోద్యం జెడ్పీ హైస్కూల్ మాజీ పార్టుటైం పీఈటీ కందూరు నూకరాజుపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వర్రావు తెలిపారు. ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ.. విద్యార్థినులతో పీఈటీ నూకరాజు అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించామని తెలిపారు. నూకరాజును విద్యాశాఖ అధికారు లు శనివారం విధుల నుంచి తొలగించగా.. ఆదివారం విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉపాధిలోనూ రాజకీయమే..!
ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి పనుల్లో రాజకీయ జోక్యం రోజురోజుకు పెరిగిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్పై అవినీతి ఆరోపణలు వస్తే థర్డ్ పార్టీ విచారణ, క్వాలిటీ కంట్రోల్ ఎంకై ్వరీ చేయాలి. అవినీతికి పాల్పడినట్లు స్పష్టమైతే అప్పుడు నిబంధనల ప్రకారం సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. క్రిమినల్ కేసులు బనాయించడం, అక్రమంగా తొలగించడం, బెదిరింపులకు పాల్పడి వారంతట వారే రాజీనామా చేసేలా భయపెట్టడం వంటి వాటికి పాల్పడుతున్నారు. ఎక్కువమంది కూలీలు మద్దతు ఇచ్చిన వారే మేట్గా ఉండాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా డ్వామా అధికారులు మేట్లను తొలగించి, వారికి అనుకూలమైన వారిని వేసుకుంటున్నారు. -
అప్పన్నకు రెండు శఠగోపాల బహూకరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం హరేకృష్ణ మూవ్మెంట్ సుమారు రూ.10 లక్షలు విలువ చేసే రెండు బంగారు శఠగోపాలు(వెండిపై బంగారు పూత) బహూకరించింది. గ్లోబల్ హరేకృష్ణ మూవ్మెంట్ చైర్మన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మధుపండితదాస సింహగిరికి వచ్చి శఠగోపాలను ఆలయ ఏఈవో ఆనంద్కుమార్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులకు అందజేశారు. సంస్థ సభ్యులతో కలిసి స్వామి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం తరపున అధికారులు మధుపండిత దాసకు, ఆయనతో వచ్చిన సంస్థ సభ్యులకు స్వామి దర్శనం కల్పించి ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
స్టీల్ప్లాంట్ జేఎన్ అవార్డుల ప్రదానం వాయిదా?
. ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు ఫిబ్రవరి 18న ఇచ్చే జవహర్లాల్ నెహ్రూ(జేఎన్) అవార్డుల ప్రదానం వాయిదా పడినట్టు తెలుస్తోంది. స్టీల్ప్లాంట్ కోసం అంకితభావంతో కృషి చేసే అధికారులు, కార్మికులకు ఏటా ఫిబ్రవరి 18న ఉక్కు అవిర్భావ దినోత్సవం సందర్భంగా అవార్డులిస్తారు. ఆ రోజు ఉద్యోగుల కుటుంబీకులు, ఉన్నతాధికారుల సమక్షంలో సీఎండీ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం ఆనవాయితీ. ఉక్కు అధికారులు, కార్మికులకు చెందిన గత మూడేళ్ల వార్షిక ప్రావీణ్యత రేటింగ్(ఏసీఆర్), అటెండెన్స్ తదితర ప్రమాణాలను బట్టి ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. 2023–24కు చెందిన అధికారుల ఏసీఆర్ సిద్ధం కాకపోవడమే జాప్యానికి కారణమని తెలుస్తోంది -
జనారణ్యంలోకి జింక
కొమ్మాది: ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఆహార కొరత.. దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల బోరవానిపాలెం, ఎండాడ ప్రాంతాలకు వచ్చిన రెండు జింకలు మృతి చెందగా, 10 రోజుల కిందట ఎండాడలో కుక్కల దాడిలో మరో జింక మృతి చెందింది. ఆదివారం ఓ జింక ఎండాడలోని ఓ అపార్ట్మెంట్లోకి వచ్చేసింది. కదల్లేని స్థితిలో ఉన్న జింకను స్థానికులు ప్రథమ చికిత్స అందించి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకుని.. వైద్య చికిత్స నిమిత్తం జింకను కంబాల కొండకు తరలించారు. కాగా.. కంబాల కొండలో సరైన రక్షణ లేకపోవడం వల్ల జింకలు ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయి. జింకలు వరసగా మరణిస్తున్నప్పటికీ అటవీ శాఖ, జూ సిబ్బంది పట్టించుకోవడం లేదని జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
40 ఏళ్ల తరువాత మళ్లీ కలిశారు..
అనకాపల్లి : ఏరా మిత్రమా... ఏమి చేస్తున్నావు.. బాగున్నావా.. పిల్లలు ఎలా ఉన్నారు... అంటూ ఏఎంఎఎల్ కళాశాల 1981–84 డిగ్రీ పూర్వ విద్యార్థులు ఒకరి నొకరు పలకరించుకున్నారు. 40 ఏళ్ల క్రితం కళాశాలలలో నాటి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సమేతంగా స్ధానిక రింగ్రోడ్డు సన్క్యాస్ట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సమావేశమయ్యారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వపు డిగ్రీ విద్యార్థులంతా తిరిగి ఒక్కచోట కలుసుకోవడంతో ఆనందం వెల్లివిరిసింది. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆనాటి అధ్యాపకులను గుర్తు చేసుకున్నారు. కుటుంబ సమేతంగా వివిధ రకాలైన ఆటలపోటీల్లో పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో సరిసా శ్రీనివాసరావు, కొట్టారు రంగబాబు, వేగి వెంకటరావు, కాళ్లకూరి శ్రీనివాస్, విల్లూరి రెడ్డమ్మ, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ను జయిద్దాం
ఏయూక్యాంపస్ : క్యాన్సర్పై అవగాహన పెంచుకోండి...ఆరోగ్యంగా జీవించండి అంటూ సినీనటి, లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి తాడిమల్ల నగరవాసుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆదివారం బీచ్రోడ్డులో రోహిత్ మోమోరియల్ ట్రస్ట్, రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ సంయుక్తంగా నిర్వహించిన పింక్ సఖి శారీ వాక్లో ఆమె ప్రసంగించారు. క్యాన్సర్ వస్తే జీవితం అక్కడితో ఆగిపోతుందనే అపోహ నుంచి ముందుగా బయటపడాలన్నారు. సరైన చికిత్స తీసుకుంటే ఎంతకాలమైనా జీవించవచ్చు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా తానేనని పేర్కొన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత అవసరమో గుర్తించాలని ప్రజలకు సూచించారు. మీపై ఒక కుటుంబం ఆధారపడి ఉందనే విషయం మరువకూడదన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి మహిళలకు ఉందన్నారు. క్యాన్సర్ ఎటువైపునుంచైనా, ఎవరికై నా వచ్చే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవడం, సరైన చికిత్స తీసుకోవడం, నిండైన జీవితాన్ని అనుభవించడం ఎంతో అవసరమన్నారు. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ ప్రతి ఏడాది వేలాది మంది క్యాన్సర్తో మరణిస్తున్నారన్నారు. మహిళలు అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్రజల్లో మరింత చైతన్యం, అవగాహన పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ప్రాథమిక దశల్లో క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స అందించడం, ప్రాణాలను రక్షించడం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ జి.అనంత రామ్ మాట్లాడుతూ మరింత విస్తృత అవగాహన ప్రజల్లో కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. తాము చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి సంపూర్ణ సహాయం అందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో పీసీవోడీపై వైజాగ్ వలంటీర్స్తో కలిసి అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమానికి ముందుగా యాంకర్, సినీనటి శిల్పా చక్రవర్తి వ్యాఖ్యానంతో సాగిన జుంబా డాన్స్, ఫ్యాషన్ షో ఆకట్టుకున్నాయి. పెద్దసంఖ్యలో మహిళలు, యువత, చిన్నారులు పింక్ సఖి శారీ వాక్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న రంగాలలో రాణిస్తున్న మహిళలు, క్యాన్సర్ను జయించిన వారిని వేదికపై సత్కరించారు. కార్యక్రమంలో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ మీనాక్షి అనంతరామ్, డైరెక్టర్ ప్రాజెక్ట్ (ఆర్ఎంటి) గుర్మీత్ కోహ్లి, శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఎం.డి డాక్టర్ జి.సాంబశివరావు, గురుద్వార సాఽథ్ సంగత్ అధ్యక్షుడు డాక్టర్ డి.ఎస్ ఆనంద్,ఏజ్ కేర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎన్.ఎస్ రాజు, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్, అభిజ్ఞ, హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్ వైద్యులు డాక్టర్ ఆదిత్య, మహాత్మ గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు వి.మురళీకృష్ణ, రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, డీఎంహెచ్వో డాక్టర్ జగదీశ్వరరావు పాల్గొన్నారు. పింక్ శారీ వాక్లో భాగంగా జుంబా డ్యాన్స్ చేస్తున్న మహిళలు -
యువతి అదృశ్యంపై ఫిర్యాదు
యలమంచిలి రూరల్ : పట్టణంలోని శేషుకొండ కాలనీకి చెందిన రంగాల లోవరాజు కుమార్తె రాజేశ్వరి(18) అదృశ్యమైనట్టు తండ్రి లోవరాజు ఆదివారం రాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వృత్తి రీత్యా గీత కార్మికుడైన లోవరాజు ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో కల్లు అమ్ముకునేందుకు వెళ్లాడు. అర్ధగంట తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె కనిపించలేదు. తర్వాత ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో ఆదివారం రాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ కె. సావిత్రి విలేకరులకు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదివిన రాజేశ్వరి ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటోంది. -
హరేకృష్ణ వైకుంఠంలో ఆధ్యాత్మిక శోభ
తగరపువలస : గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠం వద్ద శ్రీ రాధాకృష్ణుల విగ్రహ ప్రాణప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల సమక్షంలో వివిధ రకాల పండ్లను రాధాకృష్ణుల విగ్రహాలపై ఉంచి ఫలాధివాసం, పట్టు వస్త్రాలతో వస్త్రాధివాసం నిర్వహించారు. అనంతరం రకరకాల పుష్పాలను, హారాలను ఉంచి సయ్యనాధివాసం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రాణప్రతిష్ట, ఆరాధన గురించి పద్మ శ్రీ అవార్డు గ్రహీత మధు పండితదాస వివరించారు. కార్యక్రమంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆంధ్ర, తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస, ఇస్కాన్ బెంగళూర్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవ కేశవ ప్రభు, ఉత్తరప్రదేశ్లోని బృందావన్ చంద్రోదయ మందిరం ఉపాధ్యక్షుడు యధిష్టిర కృష్ణదాస, అహ్మదాబాద్ హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు జగన్ మోహన కృష్ణదాస, విజయవాడ అధ్యక్షుడు వంశీధర దాస, విశాఖ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస తదితరులు ప్రవచించారు. -
విశాఖలో ఐపీఎల్ పండగ
● మార్చి 24, 30న రెండు టీ–20 మ్యాచ్లు ● ఊపందుకున్న స్టేడియం ఆధునికీకరణ పనులు విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ మ్యాచ్లకు విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియం మరోసారి వేదిక కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి హోమ్ పిచ్గా వైఎస్సార్ స్టేడియాన్ని ఎంచుకోవడంతో ఆధునికీకరణ పనులు వేగవంతమయ్యాయి. మొత్తంగా స్టేడియం ఎలివేషన్ మారిపోనుండగా, కార్పొరేట్ బాక్సులు, ఆటగాళ్ల గ్రీన్ రూంల్లోనూ ఆధునిక వసతుల కల్పన చకచకా సాగిపోతోంది. స్టేడియంలోని స్టాండ్స్లో కుర్చీలను కూడా ఏసీఏ మారుస్తోంది. దీంతో వైఎస్సార్ స్టేడియం సరికొత్త రూపుతో ఈసారి ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో హోమ్ పిచ్గా విశాఖ స్టేడియాన్ని ఎంచుకుందని, ఈ సీజన్లోనూ రెండు మ్యాచ్లకు వేదిక కానుందన్నారు. మార్చి 24న డీసీతో ఎల్ఎస్జీ ఢీ ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తలపడనుంది. రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మార్చి 30న ఢిల్లీ క్యాపి టల్స్ జట్టు గత సీజన్ రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ జట్టు తరఫున స్థానిక ఆటగాడు నితీష్కుమార్ బరిలోకి దిగనుండడం విశేషం. -
జాతీయ స్థాయి అథ్లెటిక్స్లో నేవీ ఉద్యోగికి బంగారు పతకం
దేవరాపల్లి : దేవరాపల్లి మండలం రైవాడ పంచాయితీ శివారు శంభువానిపాలేనికి చెందిన నేవీ ఉద్యోగి ఉగ్గిన అప్పన్నదొర జాతీయ స్థాయి అథ్లెటిక్స్లో పోటీల్లో బంగారు పతకాన్ని సాధించారు. సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన అప్పన్నదొర రాజస్థాన్లో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో 45 సంవత్సరాల విభాగంలో 4‘‘400 రిలే పరుగు పందెంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే 4‘‘100 రిలే పరుగు పందెం, 200 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాలను సాధించారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్లో కాంస్య పతకాలను సాధించారు. అప్పన్న దొరకు ఘనంగా పౌర సన్మానం క్రీడా పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు తెచ్చిన అప్పన్నదొరను శంభువానిపాలెం గ్రామస్తులు ఆదివారం పౌర సన్మానం చేశారు. అభినందనలతో ముంచెత్తారు. అప్పన్న దొర క్రీడా స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలంటూ పౌర సన్మానంలో పాల్గొన్న పంచాయతీ పెద్దలు చల్లా నాయుడు, చల్లా నానాజీ, ఉగ్గిన దేముళ్లు స్థానిక యువతకు సూచించారు. -
లారీ ఢీకొని బతుకు ఛిద్రం
అనకాపల్లి : చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు గుణ తేజశ్వంత్(17) రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యులు భోరున విలపించారు. పట్టణంలో వేల్పులవీధికి చెందిన గుణ తేజశ్వంత్(17), విజయరామరాజుపేటకు చెందిన యర్రంశెట్టి హర్షవర్ధన్లు పట్టణంలో ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గుణ తేజశ్వంత్ శనివారం యలమంచిలి మండలం పద్మనాభపేట గ్రామంలో ఓ శుభకార్యానికి తన తల్లి యశోదతో కలిసి వెళ్లారు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకుని వారి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం కోసం జాతీయ రహదారి ఉమ్మలాడ జంక్షన్ వద్ద హాటల్కు వెళ్లి బిరియాని తీసుకుని వస్తామని చెప్పి స్నేహితులైన విజయరామరాజుపేటకు చెందిన హర్షవర్ధన్, ధనుష్లతో కలిసి రెండు ద్విచక్రవాహనాలపై హోటల్కు వెళ్లారు. హర్షవర్థన్ బైక్పై గుణ తేజశ్వంత్, హర్షవర్థన్లు బయలు దేరారు. మరో బైక్పై ధనుష్ వెళ్లిపోయాడు. ముగ్గురూ ఉమ్మలాడ జంక్షన్ వద్ద హోటల్ల్లో భోజనం చేసి, తల్లికి భోజనం పట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. జంక్షన్ వద్ద జాతీయ రహదారి దాటుతున్న సమయంలో యలమంచిలి నుంచి విశాఖ వెళుతున్న బెంజ్ లారీ గుణ తేజశ్వంత్, హర్షవర్థన్ బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తేజశ్వంత్ అక్కడిక్కడే మృతిచెందగా, హర్షవర్ధన్ తలకు తీవ్రగాయమైంది. స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, క్షతగాత్రుడు హర్షవర్ధన్కు ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై మృతుడు తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్ఐ డి.శేఖరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి మరో యువకుడికి తీవ్ర గాయాలు -
పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం
సాక్షి, అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మాసిటీలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. విష వాయువు లీక్ కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తోరెంట్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ ఘటన చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం కార్మికులను యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది.గత నెల జనవరి 25న విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో శనివారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్లో పడి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడిగా గుర్తించారు.జనవరి 21వ తేదీన ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. -
పరిహారంతో సరిపెట్టేశారు..
మా గ్రామంలో రోడ్డు నిర్మాణం కోసం సేకరించే జిరాయితీ భూములకు నోటిఫికేషన్ ఇచ్చారు. పరిహారం విషయంలో రైతులు వెనక్కి తగ్గకపోవడంతో మూడు పర్యాయాలు కలెక్టర్ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించి ఎట్టకేలకు రూ.60 లక్షల చొప్పున చెల్లించేందుకు అంగీకరించడంతో ఒప్పుకున్నాం. అదే సమయంలో ఆర్ కార్డులు ఇవ్వాలని కోరితే పట్టించుకోలేదు. అలాగే చెట్లకు, బోర్లకు, బావులకు పరిహారం చెల్లించలేదు. ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. దాని గురించి మాట్లాడటం లేదు. భూములు ఇచ్చిన రైతులకు చిన్న చిన్న కాంట్రాక్టు పనులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం లేదు. రాతపూర్వక హామీలు ఇవ్వడంలేదు. కేవలం పరిహారంతోనే సరిపెట్టేశారు. అలాగే రోడ్డు కోసం న్యాయంపూడి, కాగిత, గ్రామాల్లో సేకరించే 20 ఎకరాల డీఫారం ప్రభుత్వ భూములకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఎక్కువ మంది దళితులు ఉన్నారు. నేరుగా రైతులతో మంతనాలు సాగిస్తున్నారు. పరిహారం విషయంలో దళితులకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిరాయితీతో సమానంగా వారికి కూడా పరిహారం ఇవ్వాల్సిందే. –డి.శివ, రైతు, కాగిత -
‘గాదె’కు వ్యాయామ ఉపాధ్యాయుల మద్దతు
విశాఖ విద్య: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నా యుడుకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు వ్యాయా మ ఉపాధ్యాయుల అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విశాఖ, అన కాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల వ్యా యామ ఉపాధ్యాయ జిల్లా కమిటీల సమావేశం శనివారం రాత్రి పెందుర్తి సుజాతానగర్లోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. రాష్ట్ర అసోసియేషన్ సలహాదారు సుందరరావు మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడుకు ఉ త్తరాంధ్రలోని వ్యాయామ ఉపాధ్యాయ జిల్లా కమిటీలన్నీ ఏకగీవ్రంగా సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు. విశాఖ జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.అప్పలరాజు, ఎన్.లలిత్ కుమార్ ఆ ధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆరు జిల్లాల నుంచి వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యా రు. ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై తనకు అవగాహన ఉందని, తనను గెలిపిస్తే వాటి పరిష్కారం కోసం శాసనమండలి వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎస్టీయూ జిల్లా కార్యదర్శి ఇమంది పైడిరాజు మాట్లాడారు. -
పార్ట్టైం పీఈటీపై వేటు
● విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఫలితం ● చోద్యం జెడ్పీ హైస్కూల్ హెచ్ఎంకు షోకాజ్ నోటీసు గొలుగొండ: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు వచ్చిన ఆరోపణలు ప్రాథమికంగా రుజువు కావడంతో చోద్యం జెడ్పీ హైస్కూల్లో పార్ట్టైం పీఈటీగా పనిచేస్తున్న కుందూరి నూకరాజును విధుల నుంచి పూర్తిగా తొలగించారు. ఈమేరకు డీఈవో జిల్లా విద్యాశాఖ అధికారి జి.అప్పారావునాయుడు శనివారం ఉత్తర్వులిచ్చారు. విద్యార్థుల బాధ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎం శ్రీనివాస్కు షోకాజ్ నోటీసు జారీ చేశామని తెలిపారు. పూర్తి స్థాయి నివేదికను జిల్లా కలెక్టర్కు ఇస్తున్నట్లు చెప్పారు. డీఈవో విచారణ గత నెల 28న క్రీడా పోటీల కోసం పది మంది విద్యార్థులను పీఈటీ నూకరాజు తమిళనాడు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వచ్చే సమయంలో విద్యార్థినుల పట్ల ఆయన అసభ్యకరంగా ప్రవర్తించాడని శుక్రవారం వారి తల్లిదండ్రులతో కలిసి ఎంఈవోకు ఫిర్యాదులు చేసిన విషయం విదితమే. దీనిపై డీఈవో అప్పారావునాయుడు శనివారం విచారణ చేపట్టారు. ఉపాధ్యాయినుల నుంచి వివరాలు సేకరించారు. తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వివరాలు తీసుకున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి కలెక్టర్కు నివేదిక ఇచ్చి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంఈవోలు సత్యనారాయణ, ఏవీఎన్ఎస్ మూర్తి పాల్గొన్నారు. -
హెల్మెట్తో పునర్జన్మ
అనకాపల్లి: తల్లి జన్మనిస్తే, హెల్మెట్ పునర్జన్మనిస్తుందని.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక రింగ్రోడ్డు జంక్షన్ వద్ద జాతీయ రహదారి మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం జెండా ఊపి ద్విచక్ర వాహనాల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 2024 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వల్ల 313 మంది మృత్యువాత పడ్డారని, 734 మంది గాయాలపాలయ్యారని, మీ అజాగ్రత్త వల్ల కుటుంబానికి అన్యాయం చేయవద్దని ఆయన చెప్పారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారే అధికంగా మృత్యువాత పడినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్, సాగర్ సిమెంట్ వారి సీఎస్సార్ నిధుల నుంచి 75 స్టాపర్ బోర్డులను ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణ హోండా షోరూం యాజమాన్యం సీఎస్సార్ నిధు ల నుంచి 30మంది పోలీస్ సిబ్బందికి ఎస్పీ ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఆర్టీవో జి.మనోహర్, డీఎస్పీ ఎం.శ్రావణి, ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటనారాయణ, ట్రాఫిక్ సీఐ టి.వి.విజయకుమార్, ట్రైనీ డీఎస్పీ ఎం.వి.కె.చైతన్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్తలతో సురక్షిత ప్రయాణం కుటుంబానికి అన్యాయం చేయొద్దు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎస్పీ -
ఇంకుడు గుంతలకుప్రభుత్వ ప్రోత్సాహం
కె.కోటపాడు: ఇంటి పరిసరాల్లో మురుగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని డ్వామా పీడీ పూర్ణిమా దేవి అన్నారు. కె.కోటపాడు గ్రామంలో శనివా రం ఇంకుడు గుంతల నిర్మాణాలను ఆమె పరిశీలించారు. ఇంకుడు గుంతల వాడకం వలన భూగర్బ జలాలు మెరుగు పడనున్నట్లు తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టుకునే వారికి రూ.6,500లు ఇవ్వనున్నట్లు పూర్ణిమాదేవి చెప్పారు. అనంతరం కె.సంతపాలెం గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. సంపద తయారీ కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువు తయారీని చేపట్టి రైతులకు తక్కువ ధరకే అందించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఏపీడీ బి.శ్రీనివాసరావు, ఏపీవో అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాక్సింగ్లో మెడల్ సాధించిన హోంగార్డుకు సన్మానం
నర్సీపట్నం: ఇటీవల విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి మహిళా బాక్సింగ్ చాంపియన్షిప్ టోర్నమెంట్లో నింజాస్ అకాడమీలో శిక్షణ పొందిన టౌన్ పోలీసు స్టేషన్ హోంగార్డు చక్రాంతి రోహిణి కాంస్య పతకం సాధించారు. ఆమెను టౌన్ సీఐ జి.గోవిందరావు, అకాడమీ చైర్మన్ వెలగా నారాయణరావు శాలువాతో సత్కరించారు. ఆమెకు వెలగా నారాయణరావు స్పోర్ట్స్ కిట్ను అందజేశారు. తమ డిపార్టుమెంట్లో పనిచూస్తూ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో రాణించటం అభినందనీయమన్నారు. జాతీయస్థాయిలో రాణించాలని కాంక్షించారు. సన్మానించిన వారిలో కోచ్లు అబ్బు, శేఖర్ ఉన్నారు. -
శాసీ్త్రయ పద్ధతిలో చెత్త సేకరణ
● పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత ● సమష్టి కృషితోనే ఉత్తమ ఫలితాలు ● స్వచ్ఛ దివస్లో కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: చెత్త సేకరణను ఆషామాషీగా తీసుకోవద్దని, ఈ ప్రక్రియ శాసీ్త్రయ పద్ధతిలో జరగాలని, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. తుమ్మపాల గ్రామంలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తడి చెత్తను, పొడి చెత్తను విడదీసే విధానంపై అధికారులు స్థానికులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విషయంలో ప్రజలకు తగిన అవగాహన చేయాలన్నారు. ఇంటిని, పరిసరాలను, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో స్థానికుల సహకారం ఉండాలని, వారు స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామంలో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి రోడ్డుపై చెత్తకుప్పలు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దుకాణదారులు, హోటళ్ల వారు చెత్తను డస్ట్బిన్లలో వేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అందించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని, వ్యాపార సంస్థలను మూసివేయిస్తామని హెచ్చరించారు. వారం రోజులలో గ్రామంలో మొత్తం చెత్తకుప్పలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో షేక్ ఆయిషా, ఎస్డీసీ, మండల ప్రత్యేకాధికారి సుబ్బలక్ష్మి, డీపీవో ఆర్.శిరీషరాణి, జెడ్పీ డిప్యూటీ సీఈవో కె.రాజుకుమార్, ఎంపీడీవో కె.వి.నర్శింహరావు, గ్రామ వార్డు సచివాలయ అధికారి నాగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి వి.ఈశ్వరరావు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. అనకాపల్లి: ఆరోగ్యంగా జీవించాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు వచ్చే సమయంలో తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని అన్నారు. గృహాల్లోను, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో చెత్త బుట్టలను ఏర్పాటు చేసి చెత్తను అక్కడ మాత్రమే వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ బి.అప్పారావు, ఏవో రామ్కుమార్, సీఐ టి.లక్ష్మి, ఎస్ఐలు సురేష్బాబు, వెంకన్న, కామేశ్వరరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అడ్డదారిలో భూ సేకరణ
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతర్నోటిఫికేషన్ లేకుండా భూసేకరణరైతులపై కూటమి ప్రభుత్వం కుట్రనేరుగారైతులతో మంతనాలుఇలా అయితే నష్టపోతామంటున్న రైతులుప్యాకేజీ ఎగ్గొట్టేందుకే డైరెక్ట్ పర్చేజింగ్ బోదిగల్లంలో భూములు రిజిస్ట్రేషన్ జరుగుతున్నసబ్రిజిస్టార్ కార్యాలయంనక్కపల్లి: రాజయ్యపేట, చందనాడ, బోయపాడు, అమలాపురం గ్రామాల సమీపంలో ప్రభుత్వం బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తోంది. గతంలో రైతుల నుంచి సేకరించిన 4500 ఎకరాల్లో 2 వేల ఎకరాలను ఈ పార్క్ కోసం కేటాయించారు. పార్క్ నిర్మాణానికి గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఈ పార్క్ నిర్మాణంలో భాగంగా పాటిమీద, మూలపర, తమ్మయ్యపేట, రాజయ్యపేటలో కొంత నివాస ప్రాంతాలను ఖాళీ చేయించాల్సి ఉంది. ఏపీఐఐసీకి భూములు, నివాస ప్రాంతాలను ఇచ్చిన వారికి వేరొక చోట పునరావాసం కల్పించాలి. ఇలా బల్క్ డ్రగ్ పార్క్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు వెయ్యి మందికి వేరొక చోట ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలి. వీరికి పునరావాసం కోసం పెదబోదిగల్లంలో సుమారు 170 ఎకరాలను గుర్తించారు. ఈ భూములను ప్రభుత్వం డైరెక్ట్ పర్చేజింగ్ పేరుతో కొనుగోలు చేస్తోంది. కంపెనీ అవసరాలు, నిర్వాసితులకు పునరావాసం కోసం భూములు తీసుకోదలిస్తే ముందుగా 4 (1) నోటిఫికేషన్ విడుదల చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం మద్దతు ధర నిర్ణయించి, అక్కడ ఉన్న మార్కెట్ విలువకు మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ఇంటి స్థలం, మేజర్లకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రైతుల ఆమోదంతో అవార్డు పాస్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే బోదిగల్లంలో రైతులకు ఎకరాకు సుమారు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు ముట్టజెప్పాల్సి ఉంటుంది. కాని ప్రభుత్వం రైతులకు అన్యాయం తలపెడుతూ వారితో నేరుగా బేరసారాలు సాగించి ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ధరకు మీరు భూములు ఇస్తే సరే సరి.. లేకపోతే బలవంతంగా భూములు తీసేసుకుని నష్టపరిహారం కోర్టులో జమ చేస్తామని బెదిరించడంతో గత్యంతరం లేక కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. 170 ఎకరాలకు గాను సుమారు 80 ఎకరాలకు సంబంధించి రైతులు తమ అంగీకారం తెలపగా, దాదాపు 25 ఎకరాలకు పైగా భూములను ప్రభుత్వం రైతులకు నేరుగా నష్టపరిహారం చెల్లించి ఏపీఐఐసీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంది. మిగిలిన భూములను రైతులు ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. వీరిలో కొంతమంది కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కేవలం పరిహారం మాత్రమే చెల్లించి ప్యాకేజీ ఇతర సదుపాయాలు కల్పించకుండా భూములు ఇవ్వాలని ఒత్తిడి చేయడం అన్యాయమంటూ కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాలుగులైన్ల రోడ్ల నిర్మాణానికీ అదే పరిస్థితి ఏపీఐఐసీ వారు ఏర్పాటు చేసే ప్రత్యేక ఆర్థిక మండలి, బల్క్డ్రగ్పార్క్ కోసం జాతీయరహదారి కాగిత నుంచి వేంపాడు, అమలాపురం మీదుగా బోయపాడు వరకు నాలుగు లైన్ల (150 అడుగుల) రహదారిని నిర్మించాల్సి ఉంది. దీని కోసం సుమారు 60 ఎకరాల భూములు అవసరం. కాగితలో జిరాయితీ భూములకు రూ.60 లక్షల చొప్పున డైరెక్ట్ పర్జేజింగ్ విధానంలో కొనుగోలు చేసి నష్టపరిహారం చెల్లించారు. వీరి భూముల్లో ఉన్న ఫలసాయానికి ఎటువంటి పరిహారం చెల్లించలేదు. మామిడి, జీడి, కొబ్బరి చెట్లకు సంబంధించిన పరిహారం ఇంతవరకు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ఇక ఇక్కడ డీఫారం, ప్రభుత్వ భూములు కలిపి సుమారు 20 ఎకరాలు ఉంది. కాగితలో మార్కెట్ విలువ రూ.12 లక్షలు, న్యాయంపూడిలో రూ.18 లక్షలు, వేంపాడులో రూ.18 లక్షలు ఉందని అధికారులు చెబుతున్నారు. డీఫారం రైతులకు ఎకరాకు రూ.30 లక్షలు, సాగు భూములకు ఎకరాకు రూ.12 లక్షలు చెల్లిస్తామని చెబుతున్నారు. రైతులు మాత్రం డీఫారం రైతులకు కూడా జిరాయితీతో సమానంగా రూ.60 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.30 లక్షల కంటే ఎక్కువ ఇచ్చేది లేదని, పరిహారం కోర్టులో జమ చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఇక్కడ కూడా భూసేకరణ నోటిఫికేషన్ లేకుండానే భూములు తీసుకోవడం గమనార్హం. ఇలా డైరెక్ట్ పర్చేజింగ్ విధానంలో అయితే రైతులు కేవలం నష్టపరిహారంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కంపెనీల అవసరాలు, పునరావాసం కోసం సేకరించే భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, రైతులకు అన్యాయం తలపెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ముగిసిన జిల్లా స్థాయి డిగ్రీ విద్యార్థుల క్రీడా పోటీలు
చోడవరం రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి డిగ్రీ కళాశాల విద్యార్థుల క్రీడా పోటీలు వేడుకగా ముగిశాయి. ప్రిన్సిపాల్ పి.కిరణ్కుమార్ ప్రారంభించిన ఈ పోటీలు శుక్ర, శనివారాల్లో జరిగాయి. క్రికెట్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ప్రథమ, చోడవరం ఉషోదయ డిగ్రీ కళాశాల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. వాలీబాల్లో విద్యార్థి కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు, ఖోఖోలో ప్రభుత్వ కళాశాల, ఉషోదయ కళాశాల మొదటి రెండు స్థానాలు కై వసం చేసుకున్నాయి. వంద మీటర్ల పరుగు పందెంలో ఎస్.గాయత్రి ప్రథమ, జి.మోహిని, ఆర్.మానస ద్వితీయ స్థానాల్లో, బాలురు పరుగు పోటీలో బి.శివ, జి.సాయిదుర్గ, ఇ. మనీష్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. విజేత విద్యార్థులను ప్రిన్సిపాల్ కిరణ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఐ.వి.వి. సత్యవతి, ఎన్ఎస్ఎస్ పీవోలు డి.మాల్యాద్రి, బి.పిచ్చమ్మ, సీనియర్ ఉపన్యాసకులు సిబ్బంది అభినందించారు. -
అర్చకుడు పేరూరి చిన్నిస్వామికి స్వామి వివేకానంద అవార్డు
అనకాపల్లి టౌన్: స్థానిక భోగలింగేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు పేరూరి చిన్నిస్వామి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. దేవతామూర్తుల అలంకరణ విభాగంలో ఈ పురస్కారం అందిస్తున్నట్టు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ (హైదరాబాద్) శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 16న చిన్ని స్వామి హైదరాబాద్లో ఈ అవార్డును అందుకోనున్నారని, గత 27 సంవత్సరాలుగా స్వయంభూ భోగలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా సేవ చేసినందుకు ఈ అవార్డు వచ్చిందని ఆలయ సిబ్బంది తెలిపారు. -
ఇద్దరు నిందితులకు రిమాండ్
75 కిలోల గంజాయి స్వాధీనం రోలుగుంట: మండలంలో కొంతలం– వడిప గ్రామాల మార్గమధ్యంలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 కిలోల గంజాయిని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ రామకృష్టారావు వివరాల ప్రకారం.. మండలంలో లువ్వసింగు గ్రామానికి చెందిన కొర్రా నవీన్తోపాటు ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా చిత్రకొండ మండలం పూరణటిక్ పోదూర్ గ్రామానికి చెందిన ఖిలా సోమనాథ్ కొంతలం– వడిప గ్రామాల మధ్య జీడితోటలో 75 కిలోల గంజాయి నిల్వ ఉంచారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. గంజాయితోపాటు రెండు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని కొనుగోలు చేసి తిరుపతిలో విక్రయించడానికి సిద్ధ మవుతుండగా పట్టుబడ్డారు. దీని విలువ రూ.3.75 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల పాటు రిమాండ్ విధించారని ఎస్ఐ తెలిపారు. -
కష్టం వచ్చినప్పుడు పోరాడాలి
ఇద్దరు కుమార్తెలకు తాను ఒక ఉదాహరణగా నిలవాలని ఫర్జానా నిర్ణయించుకున్నారు. కష్టం వచ్చినపుడు పోరాడాలని, ఎప్పుడూ వెనకడుగు వెయ్యకూడదని నిర్ణయించుకుని, ఆచరణలో చూపారు. సమస్యలు జీవితంలో నిత్యం వస్తుంటాయని, పోరాటం మానకూడదంటారు ఫర్జానా. నేను గెలవాలి అనే బలమైన ఆకాంక్ష సంపూర్ణ ఆరోగ్యంతో తయారయ్యేలా చేసిందన్నారు. నేడు ఎందరో క్యాన్సర్ బాధితులకు ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయక పాఠం. ఇటీవల ఆమె బాలకృష్ణ నిర్వహించే అన్స్టాపబుల్ షోలో కూడా పాల్గొని తన జీవిత ప్రయాణాన్ని, క్యాన్సర్ను జయించిన విధానాన్ని ప్రజలతో పంచుకున్నారు. -
25లోగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి
దేవరాపల్లి: జిల్లాలోని రైతులంతా ఈ నెల 25లోగా రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి బి. మోహన్రావు సూచించారు. మండలంలోని కొత్తపెంట రైతు సేవా కేంద్రంలో ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను శనివారం ఆయన పర్యవేక్షించారు. మండలంలోని ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ ఎంత మేర పూర్తయిందని ఏవో వై. కాంతమ్మను అడిగి తెలుసుకున్నారు. మండలంలో శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రీ కోసం ప్రతీ రైతు ఆధార్, భూమి వన్బీ కాపీ, ఆధార్ లింక్తో ఉన్న ఫోన్ పట్టుకొని సమీప రైతు సేవా కేంద్రానికి వెళ్లాలని సూచించారు. రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తయిన రైతుకు ఐడీ నెంబర్ వస్తుందన్నారు. ఐడీ నెంబర్ ఉన్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, సున్నా వడ్డీ రాయితీలు, పంటల బీమా, బ్యాంక్ లోన్లు, యంత్ర పరిసరాలు తదితర పథకాలు వర్తిస్తాయన్నారు. రైతులు నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా రిజిస్ట్రీ ప్రక్రియను చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణాధికారి ఎస్. కిరణ్కుమార్, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. కొత్తపెంటలో పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి మోహన్రావు -
పెదబొడ్డేపల్లిలో భారీ చోరీ
నర్సీపట్నం: మున్సిపాలిటీలోని పెదబొడ్డేపల్లి శ్రీరామనగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. విద్యుత్ లైన్మన్ కాళ్ల రాంజీ ఇంటి తాళాలను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి బీరువాలో ఉంచిన 14 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు ఎత్తుకుపోయారు. బాధితుడు కథనం ప్రకారం.. శ్రీరామనగర్లో నివాసముంటున్న రాంజీ రోలుగుంట మండలం కొండపాలెం లైన్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. రాత్రి 10 గంటల వరకు ఇంట్లో గడిపి, పడుకునేందుకు అక్కడ సమీపంలో అత్తవారింటికి భార్యాపిల్లలతో వెళ్లారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి తలుపు గడియ విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. దీనికి ముందు పక్క పోర్షన్లో నివాసం ఉంటున్న వారు బయటకు రాకుండా తలుపు గడియ పెట్టారు. తర్వాత బాధిత ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు విరగ్గొట్టి, అందులోని మూడు తులాలు మంగళ సూత్రాలు, ఐదు ఉంగరాలు, ఆరు చైన్లు, మూడు తులాల హారం, తులం నెక్లెస్, తులం చెవిదిద్దులు, తులం బ్రాస్లైట్ మొత్తం 14 తులాల ఆభరణాలతో పాటు రూ.10 వేలు పట్టుకుపోయారు. విధులకు వెళ్లేందుకు ఉదయం వచ్చి చూసేసరికి తలుపు గడియ విరగ్గొట్టేసి ఉండటం చూసి షాక్కు గురయ్యాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా బట్టలు, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో నగలు, డబ్బు లేకపోవడంతో బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గోవిందరావు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనకాపల్లి క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. 14 తులాల బంగారు ఆభరణాలు అపహరణ -
ఏఎస్ పేట గ్రామ సచివాలయంలో చోరీ
కశింకోట: మండలంలో ఏఎస్ పేట గ్రామ సచివాలయంలో కంప్యూటర్ చోరీకి గురైంది. శుక్రవారం రాత్రి ఆగంతకులు సచివాలయ భవనం వెనుక భాగం తలుపులను బలంగా నెట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. అక్కడ ఉన్న కంప్యూటర్ సహా మూడు ఇన్వర్టర్ బ్యాటరీలను తస్కరించుకుపోయారు. ఉదయం సిబ్బంది సచివాలయానికి వెళ్లినప్పటికి లోపల వైపు గడియ వేసి మూసిన తలుపులు తెరచి ఉండటం, కంప్యూటర్, బ్యాటరీలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి సత్యారావు శనివారం తెలిపారు. వీటి ఖరీదు రూ.75 వేలు ఉంటుందన్నారు. కంప్యూటర్, 3 ఇన్వర్టర్ బ్యాటరీల తస్కరణ -
ఆనందంగా
సాగుతున్న జీవితంలో.. గృహిణిగా తన కుటుంబాన్ని, సొంత ఫిట్నెస్ సెంటర్ను నిర్వహిస్తూ ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో 2017 నుంచి చిన్నగా కష్టాలు ప్రారంభమయ్యాయి. షోల్డర్ పెయిన్తో వైద్యుల వద్దకు వెళ్లిన ఆమె ఎంఆర్ఐ లో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. వైద్యులు సర్జరీ చేశారు. ఆ ట్యూమర్ రిబ్స్లోని వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. తరువారి ఏడాది కొంత సాఫీగా సాగినా 2019లో తిరిగి తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు వైద్యులు ఆమె ఛాతీ పక్కటెముకలు రెండూ ట్యూమర్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. వైద్యులు బయాప్సీ చేసి క్యాన్సర్గా నిర్ధారించారు. -
మతి స్థిమితం లేని వ్యక్తి కత్తితో వీరంగం
మునగపాక: మండలంలోని వాడ్రాపల్లికి చెందిన మతి స్థిమితం లేని వ్యక్తి శనివారం మునగపాకలో కత్తితో వీరంగం సృష్టించాడు. దీంతో పూడిమడక రోడ్డులో రాకపోకలు సాగించేవారు భయాందోళనకు గురయ్యారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వాడ్రాపల్లికి చెందిన మతి స్థిమితం లేని వ్యక్తి మునగపాకలో చేపల అమ్మకందారులకు అడపాదడపా సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో కత్తితో హల్చల్ చేశాడు. సమాచారం మేరకు మునగపాక పోలీసులు అతడిని పట్టుకుని కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించడంతో వారు వచ్చి అతడిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. -
పెదమదీనలో అకేషియా తోటల నరికివేత
● క్వారీ లీజు పేరుతో చెట్ల తొలగింపు ● అడ్డుకున్న నాయకులు, గ్రామస్తులు ● టీడీపీ అండతో కలప తరలింపు బుచ్చెయ్యపేట: మండలంలోని పెదమదీన గ్రామంలో అకేషియా చెట్లను అక్రమంగా నరికి ట్రాక్టర్లతో తరలిస్తుండగా గ్రామస్తులు, నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ రంగరాళ్ల క్వారీకి లీజుకు తీసుకున్న భూమిలో పదేళ్లుగా ఎటువంటి పనులు చేపట్టలేదు. ఇప్పుడు క్వారీ లీజు పేరుతో కొండను ఆనుకుని ఏపుగా పెరిగిన అకేషియా చెట్లను నరికి తరలించడాన్ని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ నాయకులు, తదతరులు అడ్డుకున్నారు. కలపతో ఉన్న ట్రాక్టర్లను గ్రామ రామాలయం వద్దకు తరలించారు. కలప తరలింపునకు ఎవరు అనుమతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013లో గ్రామంలో సర్వే నంబర్ 75, 81లో 75 ఎకరాల భూమిని బీలా శ్రీనివాసరావు పేరు మీద రంగురాళ్ల క్వారీకి లీజుకు ఇచ్చారు. అప్పటి విశాఖ జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఆర్డీవో రంగయ్య, తహసీల్దార్ వసంతకుమారి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. అయితే కొంతమంది రైతులు వ్యతిరేకించినా క్వారీకి అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి క్వారీ నిర్వహణ చేపట్టలేదు. ప్రభుత్వానికి రాయల్టీని కట్టకుండా అక్రమంగా లీజుదారుడు పంచాయతీ అనుమతి లేకుండా చెట్లు నరికి తరలిస్తున్నారని సర్పంచ్ భర్త కేవీఆర్ నాయుడు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కె. అచ్చింనాయుడు, జనసేన నాయకుడు కొళ్లమల్ల నాగేశ్వరరావు, బీజేపీ నాయకుడు కోన హేమంత్, వార్డు మెంబర్లు కె. అప్పారావు, దాసి పరదేశినాయుడు, చొప్పా నూకాలు, ఎలిశెట్టి జగదీష్, కె. జోగినాయుడు, కరకపాటి రాము, మూర్తి మహేష్, జల్లూరి అప్పారావు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 30 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో చెట్లను నరికి పట్టుకుపోయారని వాపోయారు. అటవీ ప్రాంతానికి చెందిన అకేషియా చెట్ల తరలింపునకు ఎటువంటి అనుమతులు లేకుండా వందలాది ట్రాక్టర్లపై నరికి పట్టుకుపోతున్నారని, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. క్వారీ లీజుదారుడు వెనుక అధికార పార్టీ నాయకులు అండ ఉండటంతోనే అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి కలప తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై తహసీల్దార్ లక్ష్మిని వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. డిప్యూటీ తహసీల్దార్ మురళిని వివరణ కోరగా తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
వారే నా ధైర్యం
క్యాన్సర్ వచ్చిందని తెలిసిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తన వద్ద శిక్షణ తీసుకున్న ఫిట్నెస్ ట్రైనర్లు అందించిన మానసిక స్థైర్యం వ్యాధి నుంచి త్వరగా కోలుకొనేలా చేసింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా, మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగడం వలనే త్వరగా కోలుకోవడం సాధ్యపడింది. అదే సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన స్థైర్యం మరవలేనిదని ఆమె చెప్పారు. చికిత్స సమయంలో రోజుకో విధంగా శరీరం స్పందించడం, అనేక సందేహాలు రావడం జరిగేది. వీటిని వైద్యులకు వివరిస్తూ వారి సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగారు. ధైర్యం కోల్పోలేదు తొలుత కాస్త భయపడినా కొద్దిరోజుల్లోనే ఆత్మస్థైర్యంతో ధైర్యంగా చికిత్సకు వెళ్లారు. కిమో థెరపీ తీసుకున్నారు. కిమో థెరపీ పర్యవసనాలు ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలను చవిచూశారు. వాటన్నింటినీ భరిస్తూ, అధిగమిస్తూ పూర్తిస్థాయిలో చికిత్స తీసుకున్నారు. మనసునిండా మనోబలం, దైవంపై నమ్మకంతో చికిత్సకు సానుకూల ఆలోచనలతో వెళ్లారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఫిట్నెస్ జిమ్లో తన వృత్తిని యథావిధిగా కొనసాగించారు.