Anakapalle
-
మీ సేవలు చాలు.. వెళ్లిపోండి.!
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఫారిన్ సర్వీసుపై పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులందరినీ తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ భరత్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వర్సిటీకి చేరాయి. దీంతో రాష్ట్రంలోని వేర్వేరు ఎయిడెడ్ కాలేజీల నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చిన వారంతా నేడో రేపో ఇక్కడ నుంచి రిలీవ్ కానున్నారు. ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 2023 జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసు/డిప్యుటేషన్ కింద 80 మంది అధ్యాపకులను తీసుకున్నారు. వర్సిటీ పాలక మండలి ఆమోదంతో జరిగినందున ఉన్నత విద్యామండలి అధికారులు ఇందుకు అనుమతించారు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో 40 మంది వెంటనే వెనక్కి వెళ్లిపోయారు. ఒకరు మృతి చెందగా, మరొకరు ఇటీవలే మాతృస్థానానికి వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఏయూలో పనిచేస్తున్నారు. వీసీ కీలక నిర్ణయం ఆంధ్ర యూనివర్సిటీకి ఆర్థిక భారమవుతున్న వారిని పంపించేయాల్సిందే అని వర్సిటీలోని కొంతమంది కొంతకాలంగా పట్టుబడుతున్నారు. ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్ ఇటీవల క్యాంపస్ కాలేజీల డీన్లు, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఎయిడెడ్ అధ్యాపకుల విషయంలో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారిని పంపించేయాల్సిందేనని మెజార్టీ విభాగాధిపతులు, ప్రిన్సిపాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని వర్సిటీ నుంచి రిలీవ్ చేస్తామని ఈ నెల 19న కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు నివేదించారు. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ అధ్యాపకులంతా తదుపరి పోస్టింగ్ కోసమని కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆచార్యుల కొరత తీరేదెలా.? ఏయూలో రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. వెయ్యి మందికి పైగా అధ్యాపకులు ఉండాల్సిన ఏయూలో ప్రస్తుతం రెండు వందల్లోపే రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. దీంతో ఎయిడెడ్, కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులే బోధనలో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం 38 ఎయిడెడ్ అధ్యాపకులు రిలీవ్ చేస్తే.. ఆ స్థానాలను వేరే మార్గాల్లో భర్తీ చేయాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సిద్ధమవుతున్న సమయంలో ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు వీసీ దృష్టి సారించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఏయూలో ప్రొఫెసర్ల కొరత వేళ.. ఎయిడెడ్ అధ్యాపకులకు ఉద్వాసన వీసీకి కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేఖ విద్యార్థుల చదువులపై ప్రభావం 31 నాటికి రిలీవ్ చేస్తాం ఏయూలో పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులను వెంటనే పంపించాలని కాలేజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎయిడెడ్ అధ్యాపకులను ఏయూలో కొనసాగించుకుంటారా? లేదా అని ఇటీవల డైరెక్టర్ నుంచి లేఖ వచ్చింది. దీనిపై తమ పరిధిలో నిర్ణయం తీసుకుని వారిని పంపించేస్తామని నివేదించాం. ఈ నెల 31న నాటికి ఎయిడెడ్ అధ్యాపకులందరినీ ఇక్కడ నుంచి రిలీవ్ చేస్తాం. – ఆచార్య ధనుంజయరావు, రిజిస్ట్రార్ -
‘ఉపాధి’ బకాయిలు చెల్లించండి మహాప్రభో.!
రోలుగుంట: ఉపాధి వేతన బకాయిలు తక్షణం చెల్లించాలంటూ మండలంలోని అర్ల గిరిజన పంచాయతీ శివారు లోసింగి, పనసలపాడు గ్రామాల్లో కూలీలు బుధవారం ఖాళీ క్యారేజీలతో వినూత్న నిరసన తెలిపారు. వీరికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.గోవిందరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పథకం అమలు అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల శ్రామిక కుటుంబాలకు రూ.8,500 కోట్ల మేర బకాయిలున్నాయన్నారు. దీంతో పేదలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఈ పథకం కింద పని చేసే దాదాపు 15 వేల మంది సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు అందలేదన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని వేసవి సమయంలో ఉపాధి పథకం పనులపై ఆధారపడిన పేదల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పథకం నిబంధనల మేరకు జరిగిన పనులకు 15 రోజుల్లోపు చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. ఇప్పటికై నా బకాయిలు చెల్లించాలని, లేనిపక్షంలో పీడీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఉపాధి కల్పించకుంటే మా గతేంటి?
● స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన ● కొనసాగిన అడ్మిన్ ముట్టడి.. స్వల్ప ఉద్రిక్తత ఉక్కునగరం(విశాఖ): ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నామని, ఉపాధి కల్పించకపోతే తమ కుటుంబాల గతేంటని స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండవ రోజు బుధవారం జరిగిన ఉక్కు అడ్మిన్ ముట్టడి కార్యక్రమంలో అధికారులు, పోలీసుల వద్దకు వెళ్లి కాంట్రాక్ట్ కార్మికులు తమ గోడు వెల్లబోసుకున్నారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం గేట్ల దిగ్బంధానికి కార్మికులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అడ్మిన్ భవనం వద్దకు చేరుకున్నారు. ఒకేసారి బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాస్త తోపులాట నెలకొంది. పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ కార్మికులు పోలీసు వలయాన్ని దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంత మంది కింద పడిపోయారు. దీంతో యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంత కాలం పనిచేసిన తమను తీసేస్తే తమ కుటుంబాల గతేంటని ప్రశ్నించారు. సాయంత్రం వరకు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గురు, శుక్రవారాలు కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. శుక్రవారం రీజనల్ లేబర్ కమిషన్ చర్యల అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ముట్టడిలో పాల్గొన్న నాయకులపై కేసు నమోదు ఉక్కు అడ్మిన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై స్టీల్ప్లాంట్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. స్టీల్ప్లాంట్ రాజభాష విభాగం జీఎం లలన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు వివరాలిలా ఉన్నవి. ఈనెల 20 నుంచి జరుగుతున్న స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె నేపథ్యంలో 27, 28 తేదీల్లో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేపట్టాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, కార్పొరేటర్ గంగారావు, సత్యనారాయణ, కె.ఎం.శ్రీనివాస్, సీఐటీయూ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ కార్యదర్శి నమ్మి రమణ, జి.శ్రీనివాస్, ఆర్.టి.రాజుతో పాటు సుమారు 200 కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాలు చేసి రాకపోకలు సాగించే ఉద్యోగులకు ఇబ్బందులు కల్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సినిమా థియేటర్ల ఆకస్మిక తనిఖీ
నర్సీపట్నం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు నర్సీపట్నంలో సినిమా థియేటర్లను ఆర్డీవో వి.వి.రమణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా పీవీఆర్ కాంప్లెక్స్లో ఉన్న నాలుగు థియేటర్లతో పాటు రాజు, బంగార్రాజు థియేటర్లను ఆయన తహసీల్దార్ రామారావుతో కలిసి పరిశీలించారు. టాయిలెట్లు, ఫైర్ సేఫ్టీ సౌకర్యాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధానంగా క్యాంటీన్లో ధరలను అడిగి తెలుసుకున్నారు. ధరల పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. నిబంధనల మేరకు థియేటర్లలో సౌకర్యాలు ఉన్నదీ? లేనిదీ? చూశామన్నారు. తమ పరిశీలనలో గుర్తించిన అంశాల ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఆర్డీవో తెలిపారు. ఎమ్మార్పీకి మించి తినుబండారాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆటో బోల్తా పడి 12 మందికి గాయాలు
కశింకోట: కశింకోట–పెదపాడు రోడ్డులో బుధవారం ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. టి.అర్జాపురం నుంచి అచ్యుతాపురానికి కూలీలను తీసుకెళ్తున్న ఆటో అదుపు తప్పి పక్కనున్న కాలువలోకి దూసుకుపోయి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డారు. వారిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడి చికిత్స అందించారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.లక్ష్మణరావు తెలిపారు. సీఐ అల్లు స్వామినాయుడు అనకాపల్లి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. -
అనకాపల్లిలో ఆపరేషన్ కగార్పై 2న సదస్సు
కె.కోటపాడు : సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో అనకాపల్లిలోని రోటరీ హాల్లో వచ్చేనెల 2న ఆపరేషన్ కగార్పై సదస్సు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. ఈ మేరకు కె.కోటపాడులో బుధవారం సదస్సు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో నెత్తుటి ఏరులు పారిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆపరేషన్ పేరిట మావోయిస్టులను ఏరివేసి, అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. 2005లో సల్వాజుడుం, 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో నరమేధంను సృష్టించి.. దానికి కొనసాగింపుగా ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. ఏపీతో పాటు ఐదు రాష్ట్రాల్లో 28 రకాలైన విలువైన ఖనిజాలు విస్తరించి ఉన్నాయని, ఈ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కేవలం వాటి కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చేపట్టారన్న వాదన బలంగా ఉందన్నారు. ఈ సదస్సుకు మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలని దొరబాబు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్లె దేముడుబాబు, వేచలపు కాసుబాబు, వేమల కన్నబాబు, శరగడం పరమేష్, పొంతపల్లి రామారావు, రెడ్డి అప్పలనాయుడు, వియ్యపు రాజు పాల్గొన్నారు. -
గంజాయి తరలింపుపై పోలీసుల దాడి
రోలుగుంట: కారులో గంజాయి తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ రామకృష్ణారావు, సిబ్బంది బుధవారం దాడి చేశారు. కొంతలం కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. పోలీసులను చూసి కారుతో పరారయ్యేందుకు ముగ్గురు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు దాడి చేసి, కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, కానును సీజ్ చేశారు. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందని అంచానా. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒకరు పరారైనట్టు ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన వారిలో అన్నవరం జిల్లా, మదనపల్లి మండలం, సస్పాతోట గ్రామానికి చెందిన పట్నం సురేష్(28), ఇదే మండలం, బి.కొత్తకోట గ్రామానికి చెందిన బంటుపల్లి కల్యాణ్(27), కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా కిల్కోట అంతరంగ రోడ్డుకు చెందిన వి.గౌతమ్(38) ఉన్నారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించామని ఎస్ఐ చెప్పారు. ముగ్గురు నిందితుల అరెస్ట్, ఒకరు పరారీ 20 కిలోల గంజాయి స్వాధీనం, కారు సీజ్ -
ఎన్టీఆర్కు నివాళి
తుమ్మపాల/అనకాపల్లి: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కలెక్టర్ విజయ కృష్ణన్ కలెక్టరేట్లో బుధవారం ఆయన చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య, సంక్షేమ పథకాల సంస్కరణలు తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్డీసీలు సుబ్బలక్ష్మి, కె.మనోరమ, జిల్లా గణాంకాధికారి జి.రామారావు, డీఎస్వో కె.ఎల్.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా కృష్ణారావు
అనకాపల్లి: ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ కె.కృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అల్లూరి జిల్లా డీసీహెచ్ఎస్గా, పాడేరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహించి, ఫిబ్రవరి 21న అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి ఈఎన్టీ సర్జన్గా బదిలీపై వచ్చారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆదేశాల మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. గత సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు జిల్లా ఇన్చార్జి డీసీహెచ్ఎస్గా బాధ్యతలు స్వీకరించారు. సూపరింటెండెంట్ కె.కృష్ణారావుకు ఆస్పత్రి వైద్యులు, ఉద్యోగులు అభినంద నలు తెలిపారు. -
వ్యక్తిని రక్షించి.. యువకుడు మృతి
● రేవుపోలవరంలో విషాదంఎస్.రాయవరం: రేవుపోలవరం తీరంలో సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడబోయే ప్రయత్నంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ విభీషణరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుని మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన షేక్ ఇషాక్ మదీనా వలీ (20), షేక్ అలీషాలు అదేగ్రామానికి చెందిన షేక్ అహ్మదుల్లా ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్ కోసం బుధవారం రేవుపోలవరం తీరానికి వచ్చారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సముద్రంలోకి కొట్టుకు పోతున్నట్టు గమనించారు. ఒడ్డున ఉన్న మహిళ బిగ్గరగా అరవడంతో విన్న ఇషాక్ మదీనా వలీ, అలీషాలు సముద్రంలోకి వెళ్లి ఆ వ్యక్తిని రక్షించారు. ఇంతలో రాకాసి అలలు పోటెత్తడంతో ఇషాక్మదీనావలీ కొట్టుకుపోయాడు.వెంటనే స్థానిక మత్స్యకారులు బయటకు తీసినప్పటికీ ప్రాణాలు నిలువలేదు. మృతదేహాన్ని నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ప్రైవేటు బస్సును అడ్డుకున్న ఆర్టీసీ డీఎం
నర్సీపట్నం: టూరిస్ట్ పర్మిట్తో స్టేజ్ గ్యారేజ్ సర్వీసు చేస్తున్న ప్రైవేటు బస్సును ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. ప్రతి రోజు సాయంత్రం బయలుదేరుతున్న నర్సీపట్నం–హైదరాబాద్ బస్సును బుధవారం ఆర్టీసీ డీఎం ధీరజ్, సిబ్బంది నిలిపివేశారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకుని స్టేజ్ క్యారేజ్ సర్వీసు చేస్తున్నారన్నారు. అదే విధంగా ఆన్లైన్ టికెట్ బుకింగ్ నిర్వహిస్తున్నారన్నారు. టూరిస్ట్ పర్మిట్ బస్సును స్టేజ్ క్యారేజ్ సర్వీసుగా తిప్పకూడదన్నారు. అందుకే అడ్డుకున్నామన్నారు. ఇకపై స్టేజ్ క్యారేజ్ తిప్పమని హామీ ఇవ్వడంతో వదిలిపెట్టామని డీఎం తెలిపారు. -
తీరని భూ దాహం
● బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనపు భూ సేకరణ ● పెదతీనార్లలో 518,సీహెచ్ఎల్ పురంలో 198 ఎకరాలు ● రైతులతో అధికారుల మంతనాలు ● నేరుగా కొనుగోలుకు యత్నాలు ● ఎకరాకు రూ.37 లక్షలు ఇస్తామని బేరాలు ● ససేమిరా అంటున్న రైతులు నక్కపల్లి: రాష్ట్ర ప్రభుత్వానికి భూదాహం తీరడం లేదు. బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనపు భూసేకరణ చేస్తోంది. పోనీ పరిహారం విషయంలో న్యాయం చేస్తోందా అంటే అదీ లేదు. నోటిఫికేషన్ లేకుండా నేరుగా రైతుల వద్ద నుంచే కొని వారి నోట్లో మట్టి కొట్టేందుకు కుయుక్తులు పన్నుతోంది. బుధవారం ఏపీఐఐసీ అధికారులు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణ విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వెల్లడైంది. తక్కువ భూమి సేకరించే గ్రామాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తూ, ఎక్కువ భూములు అవసరమైన చోట నేరుగా రైతుల నుంచే ల్యాండ్ పూలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. డైరెక్ట్ పర్చేజ్ అయితే రైతులకు నష్టపరిహారం తప్ప ఇతర ప్యాకేజీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. బల్క్డ్రగ్ పార్క్ విస్తరణ కోసం సీహెచ్ఎల్ పురం రెవెన్యూ పరిధిలో 198 ఎకరాలు, పెదతీనార్ల రెవెన్యూ పరిధిలో 518 ఎకరాలు భూములు కావాల్సి ఉంది. తక్కువ భూ మి ఉన్న సీహెచ్ఎల్ పురంలో భూసేకరణ కోసం తాజాగా 4 (1) నోటిఫికేషన్ విడుదల చేశారు. 500 ఎకరాలు దాటి అవసరమున్న పెదతీనార్లలో మాత్రం నోటిఫికేషన్ విడుదల చేయకుండా నేరుగా కొనుగోళ్ల పేరుతో రైతులతో మంతనాలు జరుపుతున్నారు. బల్క్డ్రగ్ పార్క్ కోసం సరిపడా భూములను గత ప్రభుత్వం కేటాయించింది. కూటమి ప్రభుత్వం పార్క్ విస్తరణ పేరుతో అదనంగా భూములు సేకరించడం పట్ల ఆయా గ్రామాల రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా యి. ఏపీఐఐసీ ద్వారా మండలంలో వేంపాడు, చందనాడ, అమలాపురం, డీఎల్ పురం, రాజయ్యపేట ల్లో ప్రభుత్వం 4500 ఎకరాలు సేకరించిన విష యం తెలిసిందే. వీటిలో గత ప్రభుత్వం 2 వేల ఎకరాలు బల్క్డ్రగ్ పార్క్కు కేటాయించింది. మిగిలిన భూములను కూటమి ప్రభు త్వం తాజాగా తెర మీదకు వచ్చిన ఆర్సిలర్ మిట్టన్ నిప్పన్ ఇండియా స్టీల్ప్లాంట్కు ఆగమేఘాల మీద కట్టబెట్టింది. రైతుల నుంచి వ్యతిరేకత బల్క్డ్రగ్ పార్క్కు సరిపడ భూములు కేటాయించినప్పటికీ పార్క్ విస్తరణ పేరుతో జానకయ్యపేట, సీహెచ్ఎల్ పురం, పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక గ్రామాల్లో మరో వెయ్యి ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బల్క్డ్రగ్ పార్క్లో చిన్న చిన్న యూనిట్లు స్థాపించే పారిశ్రామికవేత్తల కోసమే తమ నుంచి అదనంగా భూములు సేకరిస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. తాజాగా బుధవారం పెదతీనార్ల గ్రామస్తులతో ఏపీఐఐసీ ఎస్డీసీ అనిత సమావేశం నిర్వహించారు. ఈ గ్రామంలో 518 ఎకరాల భూమి అవసరమవుతోందని, బల్క్డ్రగ్ పార్క్ కోసం అదనంగా సేకరిస్తున్నామని, నేరుగా కొనుగోళ్ల పేరుతో భూములు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ గ్రామాల్లో మార్కెట్ విలువ ఎకరా రూ.15 లక్షలు ఉందని, దానిని రెట్టింపు చేసి, ఫలసాయంతో కలిపి ఎకరాకు రూ.37 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని, భూములు ఇవ్వాలని కోరారు. పెదతీనార్లలో 20 నుంచి 50 ఎకరాల భూములు కలిగిన భూస్వాములు ఎకరాకు రూ.60 లక్షలు చెల్లిస్తే భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. దీనిపై వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి కొంతమంది రైతులతో కలసి అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరు మాట్లాడుతూ పెద్ద రైతులను దృష్టిలో పెట్టుకుని భూముల ధర నిర్ణయించడానికి వీల్లేదన్నారు. ఈ భూములపై ఆధారపడి జీవించే వారికి 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, మేజర్లకు నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏర్పాటయిన రసాయన పరిశ్రమల వల్ల ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, బల్క్డ్రగ్ పార్క్ విస్తరణ కోసం అయితే భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. జానకయ్యపేట, చినతీనార్లలో రైతులు కూడా బల్క్డ్రగ్ పార్క్ విస్తరణ కోసం అయితే భూములు ఇవ్వమంటూ నిరసన తెలియజేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో భూములు ఇవ్వాల్సి వస్తే 4 (1) నోటిఫికేషన్ విడుదల చేసి 2013 భూసేకరణ చట్టప్రకారం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నష్టపరిహారం, ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ భూములపై ఆధారపడ్డ ఇతర వృత్తుల వారికి కూడా న్యాయం చేయాలన్నారు. -
వాస్తవాలు చెప్పే దమ్ము లేదా?
మహారాణిపేట (విశాఖ): టీడీపీ మంత్రుల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ల వరకు గిరిజనం గురించి అవాస్తవాలు చెబుతున్నారని, అవగాహనలేమితో మాట్లాడుతున్నారా.. లేదా నిజం చెబితే ప్రజలు ఛీకొడతారని ముందే గ్రహించి ప్రజలను తప్పుదా రి పట్టిస్తున్నారా అని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ప్రశ్నించారు. మహానాడు వేదికగా జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ చిల్లర మాట లు మాట్లాడారని ఆమె మండిపడ్డారు. విశాఖలోని జెడ్పీ బంగ్లాలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వ చ్చిన తర్వాత దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న గిరిజనుల కోసం ఏడాది కాలంలో ఒక్క సంక్షేమ పథకమైనా ప్రత్యేకంగా అమలు చేశారా.. అని ఆమె నిలదీశారు. సూపర్ సిక్స్ వాగ్దానాలను అటకెక్కించారని, కనీసం గిరిజన రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? అని ఆమె ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రతి గిరిజనుడికి సంక్షేమ క్యాలెండర్ ప్రకారం పథకాలు అందిన విషయం నిజమా కాదా? అని ఆమె అన్నారు. బాకై ్సట్ జీవోను తెచ్చింది చంద్రబాబు కాదా? గిరిజన ప్రాంతంలో ఉన్న సంపదను దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు ఆనాడు జిందాల్ కంపెనీతో ఒప్పందం చేసుకొని బాకై ్సట్ జీవోను తీసుకొచ్చిన విషయం నిజమా? కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంపై జీసీసీ చైర్మన్, ఇతర నాయకులకు అవగాహన ఉందా? లేదా? అని నిలదీశారు. బాకై ్సట్ తవ్వకాలపై తీసుకొచ్చిన 97 జీవోను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసిన విషయాన్ని ఎందుకు మరిచిపో యారని నిలదీశారు. కాల్సైట్, బాకై ్సట్, లేటరైట్ గనులను అక్రమంగా తవ్వి సంపాదన సృష్టించుకో వాలని ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు అధికారం చలాయించే విధానాన్ని రద్దు చేసింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డేనన్నారు. గత టీడీపీ ప్రభు త్వం గిరిజనతరులకు కూడా స్థానిక సంస్థల ఎన్ని కల్లో పోటీకి అవకాశం ఇస్తే.. ఆ విధానాన్ని రద్దు చేసి స్థానిక సంస్థల్లో వంద శాతంగిరిజనులే పోటీ చేసే విధానాన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చిన విషయా న్ని గుర్తు చేశారు. గిరిజనులకు మేలు చేయడం అంటే ఇది కదా అని ఆమె పేర్కొన్నారు. గిరిజన శాఖ మంత్రి మాట్లాడుతూ గిరిజనులకు ఈ డీఎస్సీలో 2000 పోస్టులు ఇస్తున్నట్లు చెప్పారని, కానీ కేవలం 1023 పోస్టులు మాత్రమే కేటాయించి, ఎందుకలా తప్పుదారి పట్టిస్తున్నారని నిలదీశారు. వైఎస్ జగన్ హయాంలో గిరిజనులకు మహర్దశ డోలి మోతల గురించి గొప్పలు చెప్పుకోవద్దని, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డోలి మోతల నివారణ కోసం ప్రత్యేకంగా కనెక్ట్ పాడేరు పేరుతో ఒక ప్రాజెక్టును అమలు చేశారన్నారు. పాడేరు డివిజన్లో 1300కు పైగా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదని గుర్తించి వాటి నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకొని, అన్నీ సిద్ధం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి తామేదో చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తోందన్నారు. గిరిజన ప్రాంతంలో వైద్య సమస్యకు ఫుల్స్టాప్ పెట్టేలా పాడేరులో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన మహనీయుడు ఎవరో చెప్పాలని, ఇటువంటి గొప్ప కార్యక్రమం చంద్రబాబునాయుడు తన 40 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా గిరిజనుల కోసం చేశారా? అని సుభద్ర నిలదీశారు. మహానాడు వేదికపై అన్నీ అబద్ధాలే.. ఏడాదిలో గిరిజన సంక్షేమానికి ఒక్క పనైనా చేశారా? కిడారి తదితర నేతల ప్రసంగాలపై నిలదీసిన జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర -
ఏషియన్ కరాటే చాంపియన్ అంజనా శ్రీవేణి
పాయకరావుపేట: పట్టణానికి చెందిన విద్యార్థి ని ధూళి అంజనా శ్రీవేణి కరాటేలో దుమ్ము రేపింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించిన 9వ ఏషియన్ గోజుర్వు కరాటే చాంపియన్షిప్లో భారతదేశం తరపున పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. ఈ అంతర్జాతీయ పోటీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజికిస్తాన్, ఫిలిప్పీన్స్, మలేషియా, నేపాల్, ఇండోనేషియా వంటి పలు ఆసియా దేశాల నుంచి సుమారు వెయ్యిమంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో అండర్–12 కేటగిరీలో పోటీ పడిన అంజనా శ్రీవేణి, తన అద్భుతమైన ప్రదర్శనతో సిల్వర్ మెడల్ను కై వసం చేసుకుని దేశానికి, రాష్ట్రానికి, పాయకరావుపేటకు గర్వకారణంగా నిలిచింది. పోటీ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆమెను తమిళనాడు కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ షీహాన్ ప్రమోష్ స్వయంగా కలిసి ఘనంగా సత్కరించారు. -
రీ–సర్వే సవరణకు ముప్పుతిప్పలు
అర్జీల గతి ఇంతేనా?● మూడుసార్లు దరఖాస్తు చేసిన రైతు ● 7 నెలలు దాటినా లభించని పరిష్కారంమునగపాక: ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా సామాన్యుల సమస్యలు తీరడం లేదు. ఈ వ్యవస్థ మొక్కుబడిగా నడుస్తోందని, తమలాంటి వారికి న్యాయం జరగడం లేదని మునగపాకకు చెందిన రైతు పీలా అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన ‘సాక్షి’కి తెలిపారు. మునగపాక పంచాయతీ కార్యాలయంలో గత ఏడాది అక్టోబర్ 19న తహసీల్దార్ ఆదిమహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో అప్పారావు రీ–సర్వేలో జరిగిన తప్పును సవరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. మూడు నెలల్లోగా సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ ఆరోజున చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అప్పారావు ఫిబ్రవరిలో రెవెన్యూ అధికారులను మరోసారి కలిసి తనకు న్యాయం జరగలేదని వారి దృష్టికి తీసుకువచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈనెల 19న కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో మరోసారి దరఖాస్తు చేశారు. అనంతరం వీఆర్వోను కలిసి తన ఫిర్యాదు గురించి వివరించారు. ప్రస్తుతం యాప్ ఓపెన్ కావడంలేదని వీఆర్వో చెబుతున్నారని, గత అక్టోబర్లో యాప్ పనిచేసిన సమయంలో తన సమస్యను పరిష్కరించి ఉంటే తన సమస్య తీరేదని అప్పారావు వాపోతున్నారు. రీ–సర్వే సవరణ కోసం తాను దరఖాస్తు చేసుకుంటే పదేపదే కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారే గాని సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారే గాని పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి తనకు తగు న్యాయం జరిగేలా చూడాలని అప్పారావు కోరుతున్నారు. -
విపత్తుల నివారణపై ప్రత్యేక చర్యలు
అనకాపల్లి: అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతమైన ప్రతిస్పందన ద్వారా ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని, విపత్తుల నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం జిల్లాలో పోలీస్శాఖ అఽధికారులతో విపత్తులపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీకేజీలు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తదితర ప్రమాదాలు సంభవించిన సమయంలో దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బంది తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగహన కల్పించినట్టు చెప్పారు. విపత్తులు సంభవించిన సమయంలో పోలీసు అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) ప్రకారం సమన్వయంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదాల తీవ్రత ఆధారంగా విధులు కేటాయిస్తూ క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ సహకారంతో అచ్యుతాపురం, పరవాడలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. విపత్తులను ఎదుర్కోడానికి అగ్నిమాపక శాఖ, వైద్య బృందాలు, ఎస్డీఆర్ఎఫ్/ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసు లు సమష్టిగా కృషిచేయాలన్నారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సహకారంతో సీఎస్ఆర్ నిధులతో పోలీసులకు అత్యాధునిక ఫైర్ సేఫ్టీ పరికరాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్, ట్రైనీ డీఎస్పీ ఎం.వి.కె.చైతన్య, సీఐలు పాల్గొన్నారు. ఎస్సీ తుహిన్ సిన్హా -
ఏఎంసీకి వ్యాపారవేత్త గుప్తా పార్థివ దేహం
అనకాపల్లి: స్థానిక ఉప్పవారివీధికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పుష్కల గ్యాస్ కంపెనీ యజమాని కె.ఎల్.ఎన్.గుప్తా (85) మంగళవారం రాత్రి అనారోగ్య కారణంగా తన స్వగృహంలో మృతి చెందారు. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుప్తా పార్థివ దేహాన్ని విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ (ఏఎంసీ)కి అందజేశారు. మృతుడి భార్య కె.అచ్యుతాంబ, మేనల్లుళ్లు విజయ్బాబు, కిరణ్ అనాటమీ హెచ్వోడీ డాక్టర్ రవీంద్ర కిషోర్కు గుప్తా మృతదేహాన్ని పరిశోధనల నిమిత్తం దానం చేశారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గూడూరు సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జూలో సీడ్ బాల్స్ తయారీ
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో జూ, గ్రీన్కై ్లమేట్ సంస్థ సంయుక్తంగా మంగళవారం సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం నిర్వహించాయి. ఎన్సీసీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సీడ్ బాల్స్ తయారు చేసి జూలోని వివిధ ప్రాంతాల్లో చల్లారు. జూ క్యూరేటర్ మంగమ్మ మాట్లాడుతూ విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అభినందనీయమన్నారు. ఏపీ ఎన్సీసీ పదమూడో బెటాలియన్ ఎల్.టి కల్నల్ నీరజ్కుమార్ మాట్లాడుతూ సామాజిక వనాల పెంపులో అందరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఎన్సీసీ డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్ట్నెంట్ కల్నల్ స్వర్నిం, సుభేదార్లు మేజర్ శ్రీనివాస్, సుహాస్సింగ్, సునీల్సింగ్ రవీంద్రసింగ్, సుహాస్ సింగ్, జూ అధికారులు, సిబ్బంది, గ్రీన్ క్లైమేట్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అంధకారంలో 5 గ్రామాలు
బుచ్చెయ్యపేట: గ్రామస్థాయిలో ఒకరిద్దరి మధ్య తలెత్తిన వ్యక్తిగత విభేదాల వల్ల ఐదు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. నిరంతర విద్యుత్ వెలుగులు కోసం లక్షలు ఖర్చు పెట్టి కొత్తగా విద్యుత్ లైన్ వేస్తే, ఒకరిద్దరు అభ్యంతరాలతో వైర్లు వేయకుండా అధికారులు వెళ్లిపోయారు. పర్యవసానంగా ఆర్నెల్లుగా ఆయా గ్రామాల ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారు. బుచ్చెయ్యపేట మండలం ఎర్రవాయి శివారులో పెదపూడి, ఫంగిడి, చిన్నయ్యపాలెం, సూర్యలక్ష్మినగర్, ఉప్పరగూడం గ్రామా లకు 24 గంటలు విద్యుత్ సరఫరాకు లైన్ ఏర్పాటు చేశారు. కొత్త లైన్ వేసి ఆరు నెలలైన నేటికీ విద్యుత్ లైన్ కలపకపోగా నిరంతర కరెంట్ అందడం లేదు. సీతయ్యపేట నుంచి పెదపూడి గ్రామం వరకు ఆర్అండ్బీ రోడ్డు పక్క నుంచి విద్యుత్ స్తంభాలు వేసి వైర్లు ఏర్పాటు చేశారు. పెదపూడి దగ్గరలో రెండు విద్యుత్ స్తంభాలను రోడ్డుకు అవతలికి మార్పు చేయాలని ఒకరిద్దరూ అడ్డుకున్నారు. రోడ్డుకు అవతల వైపు వందేళ్ల నాటి నీడనిచ్చే భారీ వృక్షాలు ఉండటంతో వాటిని నకరడం కుదరలేదు. రోడ్డుకు ఒకవైపు ఖాళీ ప్రదేశంలో స్తంభాలు వేయాలని గ్రామస్తులంతా రోడ్డు కాంట్రాక్టర్కు, విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఒకరిద్దరూ అడ్డుకున్నారన్న షాకుతో ఆరు నెలలుగా రెండు విద్యుత్ స్తంభాలు మధ్యన వైరు వేయకుండా కొత్త లైన్ కలపకుండా అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇటీవల ఏ మాత్రం గాలివాన కురిసిన గంటలు తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. కొండ ప్రదేశాల్లో ఉన్న ఈ గ్రామాలకు కరెంట్ పోవడంతో చీకట్లో విష పురుగుల బెడదతో భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో ఇక్కడ పని చేసిన లైన్మన్ రవిని ఏడాదిన్నర క్రితం బదిలీ చేశారు. ఆ తర్వాత పీపీ అగ్రహారానికి చెందిన జేఎల్ఎంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏడాది తర్వాత జేఎల్ఎం మారిపోవడంతో ఐదు గ్రామాలకు లైన్మన్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఐదు గ్రామాల్లో ఎక్కడ ఫ్యూజ్ కాలిపోయినా పరిష్కరించే దిక్కు లేదు. పంచాయతీ నుంచి డబ్బులిచ్చి ప్రైవేటు వ్యక్తితో విద్యుత్ మరమ్మతులు చేయిస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టి కొత్త లైన్ వేసినా సుమారు 800 కుటుంబాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందడం లేదని ఎర్రవాయి గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే విద్యుత్, రెవెన్యూ, పోలీస్ అధికార్లు చొరవ చూపి ఐదు గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టి, అంధకారం తొలగించాలని కోరుతున్నారు. -
భూ వివాదంలో ఘర్షణ
బుచ్చెయ్యపేట: మండలంలో శివారు గ్రామం మల్లాం భూపతిపాలెం(ఎంబీ పాలెం)లో భూమి గట్టు వివాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి విషమంగా ఉండగా అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎంబీపాలేనికి చెందిన కలం చంటమ్మ, మహాలక్ష్మిల భూములు పక్క పక్కనే ఉన్నాయి. వీరిద్దరూ భూముల గట్టు విషయమై పలుమార్లు గొడవలకు దిగారు. మంగళవారం మహాలక్ష్మి కుటుంబ సభ్యులు పొలం గట్టు వేస్తుండగా చంటమ్మ అల్లుడు అప్పాన కొండలరావు అడ్డుకున్నాడు. దీంతో ఇరువురు మధ్య గొడవ జరిగింది. ఈ దాడిలో కొండలరావు తలపై తీవ్ర గాయమై రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కుట్లు వేసి వైద్య సేవలందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.ఒకరికి తీవ్ర గాయాలు -
రిటైర్డ్ హోంగార్డుకు ఆర్థికసాయం
అనకాపల్లి : అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏపీఎస్ఈబీ సీలేరు శాఖలో డిప్యూటేషన్పై హోంగార్డుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన కె.బ్రహ్మరాజుకు రెండు జిల్లాల్లో హోంగార్డుల ఒకరోజు వేతనం రూ.4,07,965 చెక్కును ఎస్పీ తుహిన్ సిన్హా తన కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోంగార్డు బ్రహ్మరాజు తన విధులను బాధ్యతాయుతంగా సమర్ధంగా నిర్వర్తించారని, ఆయన సేవలు ప్రశంసనీయమని అన్నారు. హోంగార్డుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, విధి నిర్వహణలో మరణించినా లేదా పదవీ విరమణ పొందిన హోంగార్డులకు ఆర్థిక సహాయం అందించేందుకు, ఈ రెండు జిల్లాల్లో హోంగార్డులు స్వచ్ఛందంగా ఒక రోజు డ్యూటీ అలవెన్స్ను విరాళంగా అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కార్యాలయం సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య, జూనియర్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థి మృతి
అచ్యుతాపురం రూరల్: గత నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన సంతాడ లోహిత్కుమార్ మంగళవారం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో పూడిమడకలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే ప్రమాదంలో ఈరిగిల వివేక్ మృతి చెందడం పాఠకులకు విదితమే. ఇటీవల పదో తరగతిలో 565 మార్కులతో పాసైన విద్యార్థి లోహిత్కుమార్ రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో అతడి కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. రూ.10 లక్షలపైన అప్పులు చేసి ఖర్చు పెట్టి నెల రోజులుగా ఆస్పత్రిలో వైద్యం చేయించినా ప్రాణాలు దక్కలేదు. దాంతో చేతికందొచ్చిన కొడుకు తిరిగిరాని లోకాలకు పోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పూడిమడకలో విషాద ఛాయలు -
ముందస్తు సాగుకు సిద్ధమేనా?
సాక్షి, అనకాపల్లి: నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో మే నెలలోనే వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్కు ఈ వర్షాలు శుభ సూచనలే అయినా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్లో జిల్లాలో వరి ఎక్కువగా సాగు చేస్తారు. సకాలంలో వరుణుడు కరుణిస్తే ఏటా జూన్ ఆరంభం నుంచే దుక్కులు చేపట్టి భూములను సిద్ధం చేసుకుంటారు. ఒకవైపు వర్షాలు ఊరిస్తున్నా.. రైతులు సాగుకు ముందుకు సాగలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందకపోవడం.. కీలకమైన సమయంలో వరుణుడు ముఖం చాటేస్తే పరిస్థితి ఏమిటన్న సందిగ్ధం వారిని డైలమాలో పడేశాయి. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో అప్పు చేసుకుని ముందడుగు వేస్తే గతేడాదిలాగే నష్టపోయే పరిస్థితి నెలకొంటుందా..? అనే అనుమానంతో రైతన్న దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నాడు. ‘అన్నదాత సుఖీభవ’ సాయాన్ని గతేడాదిలా ఈసారి కూడా ఎగ్గొడతారన్న భయం వారిని వెంటాడుతోంది. జూన్ 15 నుంచి అనువైన సమయం ఖరీఫ్లో పంటలు విత్తుకునేందుకు జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు అనువైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈసారి చాలా మండలాల్లో ముందస్తుగా భారీ వర్షాలు కురిశాయి. ఇంకా వర్షసూచన ఉందని చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించాయి. ఈ ఏడాది ఖరీఫ్ సాగు లక్ష్యం 1.50 లక్షల ఎకరాలు కాగా..వీటిలో 1.30 ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ఇప్పటికే 24,112 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 23,109 వరి విత్తనాలు, 893 పచ్చి రొట్ట విత్తనాలు, 111 అపరాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ విత్తనాలు అగ్రిల్యాబ్కు విత్తన శుద్ధికి పంపించినట్లు జేడీ వెల్లడించారు. వర్షాన్ని రైతులు వినియోగించుకుని భూమిని దున్ని, ఖరీఫ్ పైరులైన సజ్జ, కొర్ర, అపరాలు, వేరుశనగ వంటి పంటలను వేసుకోవాలని ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు చెప్పారు. ‘నైరుతి’ ప్రభావంతో తొందరగా వచ్చిన వర్షాలు ఇంకా దుక్కులు చేపట్టని రైతులు మరోవైపు పెట్టుబడి సాయం అందలేదనే బెంగ ముందస్తు వర్షాలతో చెరకుకు లాభం ప్రస్తుతం పడుతున్న ముందస్తు నైరుతి ప్రభావ వర్షాలు చెరకు పంటకు మంచిది. కానీ వరి సాగుకు అనువైనది కాదు. ఇప్పటికే దుక్కులు దున్నుకుని ఉంటే వరి సాగుకు మేలు జరిగేది. అయితే రైతు ఇంకా సన్నద్ధమవ్వలేదు. జిల్లాలో 10 శాతం కూడా దుక్కులు అవ్వలేదు. ఇప్పటివరకూ వరి నాట్లయితే ఎవరూ వేయలేదు. జూలై 15 తరువాతే ఖరీఫ్ సీజన్కు రైతులు వరినాట్లు వేస్తారు. గతేడాది ఖరీఫ్ సాగులో వరి పంట ఆలస్యంగా వేశారు. వర్షాలు తగ్గితే రైతులు దుక్కులు దున్నుకుంటే మంచింది. నేలలో వర్షపు నీరు ఇంకి వరి సాగుకు మేలు జరుగుతుంది. – జగన్నాథరావు, ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త సాయం లేకపోతే వ్యవసాయం చేయలేం.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయ రంగం కుదేలవుతుంది. 2004కు ముందు చంద్రబాబు పాలనలో కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నకు రాజన్న అండగా నిలిచారు. 2019–24లో ఆర్బీకేల ద్వారా జగనన్న విస్తృత సేవలందించి రైతు బాంధవుడిగా పేరుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది రైతులు అప్పుల ఊబిలోకి వెళ్లిపోయారు. ఈ ఏడాది ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. ఈసారి కూడా పెట్టుబడి సాయం ఇవ్వకపోతే రైతు వ్యవసాయం చేయడం మానేస్తాడు. – పోతల సత్తిబాబు, రైతు, ఆక్సాపేట గ్రామం, కోటవురట్ల మండలం -
పబ్జిగేమ్ ఆడొద్దన్నందుకు పారిపోయిన విద్యార్థి
● కుటుంబ సభ్యులకు అప్పగించిన టూటౌన్ పోలీసులు అల్లిపురం: పబ్జీ గేమ్స్ ఆడవద్దని తండ్రి మందలించడంతో యువకుడు ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు వెతికి పట్టుకుని వారికి అప్పగించారు. టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన ఐటీఐ విద్యార్థి.. పబ్జీ గేమ్స్కు బానిస కావడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న తండ్రి వెంప శివకుమార్ ఏలూరు పరిసర ప్రాంతాల్లో వెతికినా అతని ఆచూకీ తెలియరాలేదు. దీంతో నిడమర్రు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు విద్యార్థి ఒక వ్యక్తి సెల్ నుంచి తాను హైదరాబాద్లో ఉన్నట్లు తండ్రి సెల్కు మెసేజ్ పెట్టాడు. ఆ ఫోన్ నంబరు ఆధారంగా నిడమర్రు పోలీసులు సాంకేతికత ద్వారా విద్యార్థి విశాఖలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో విశాఖ చేరుకున్న తల్లిదండ్రులు టూటౌన్ పోలీసులను సంప్రదించారు. ఎస్ఐ ఎన్. సింహాచలం, హెచ్సీ టీ. శ్రీనివాసరాజు సహకారంతో సదరు విద్యార్థి కల్లుపాకల వద్ద ఉన్నట్లు గుర్తించారు. అతడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. -
క్వారీ రోడ్డు కోసం కొండనే తొలిచేస్తున్నారు
తుమ్మపాల: అనధికార మైనింగ్ రహదారిపై బవులువాడ గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ విజయకుమార్ రంగంలోకి దిగి పనులు నిలిపివేశారు. దీనిపై త్వరలో గ్రామసభ నిర్వహిస్తామని తెలిపారు. మండలంలో బవులువాడ రెవెన్యూ పరిధి రావుగోపాలరావు, జగనన్న కాలనీల వద్ద సర్వే నంబరు 70, 74, 75 కొండ మీదుగా నెల రోజులుగా చేపడుతున్న అనధికార మైనింగ్ రోడ్డును మంగళవారం ఆయన రూరల్ ఎస్సై రవికుమార్తో కలిసి పరిశీలించారు. కొండపై మూడు కిలోమీటర్ల మేర వేసిన రోడ్డు పనులు పరిశీలించి రావుగోపాలరావు కాలనీ వాసులతో మాట్లాడారు. కాలనీకి ఆనుకుని కొండపై రోడ్డు నిర్మించడం వల్ల కాలుష్యం పెరుగుదలతోపాటు బండరాళ్లు పడే అవకాశం ఉందని వాపోయారు. మార్టూరు రెవెన్యూ పరిధిలో నవీన్, రమణారెడ్డి క్వారీలకు తమ గ్రామం మీదుగా రాకపోకలు లేవని, కూటమి పార్టీ అండతో క్వారీ యాజమానులు దౌర్జన్యంగా కొండను తొలిచేస్తున్నారని ఫిర్యాదుదారులు కె.సత్తిబాబు, తదితరులు తెలిపారు. క్వారీ వాహనాల రాకపోకలకు గతంలో ఉన్న రోడ్డు వద్ద క్రమేణా నివాసాలు ఏర్పాటు కావడంతో ప్రత్యామ్నాయంగా కొండ మీదుగా రహదారి నిర్మాణానికి అంగీకారం తెలిపామని కొందరు కాలనీ వాసులు తెలిపారు. ఇరువర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న తహసీల్దారు త్వరలో గ్రామసభ నిర్వహిస్తామన్నారు. అనధికారిక రోడ్డు పనులుపై చర్యలు తీసుకోవాలని, జేసీబీలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని ఫిర్యాదుదారులు కోరగా, ప్రస్తుతానికి పనులు నిలిపివేయాలని, వాహనాలను తరలించాలని క్వారీ యాజమానులకు సూచించి వెనుతిరిగారు. ఆర్ఐ రమేష్, వీఆర్వో రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. బవులువాడ గ్రామస్తుల ఫిర్యాదుతో నిలిపివేసిన అధికారులు -
యోగాతో ఆరోగ్యం, ఆనందం
ముత్యాలమ్మపాలెం తీరంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అభ్యాసకులు పరవాడ: సాగరతీరంలో ఆనంద‘యోగ’ం.. అభ్యాసకుల ఆసనాలతో ముచ్చటైన దృశ్యం.. ప్రముఖ పర్యాటక కేంద్రమైన ముత్యాలమ్మపాలెం తీరంలో మంగళవారం కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్వర్యంలో వెయ్యి మంది యోగాసనాలు వేశారు. వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల రోజులపాటు నిర్వహిస్తున్న యోగాంధ్రలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని, యోగాను ప్రతి ఒక్కరు దినచర్యగా చేసుకోవాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో 25 మంది యోగా గురువులు, 100 మంది మాస్టర్ ట్రైనీలతో 4,500 మంది సచివాలయ సిబ్బందికి యోగాసనాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ పొందిన సచివాలయ సిబ్బంది ప్రతి గ్రామానికి వెళ్లి, రోజుకు 50 మందికి చొప్పున ఐదు రోజుల పాటు క్రమం తప్పకుండా రోజుకో యోగాసనం వేసేలా శిక్షణ ఇస్తారన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె.లావణ్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.మనోరమ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి అనిత, మండల ప్రత్యేకాధికారి సరోజిని, సర్పంచ్ చింతకాయల సుజాత, ఎంపీడీవో బి.రమేష్నాయుడు, తహసీల్దార్ ఎస్వీ అంబేడ్కర్, తదితరులు పాల్గొన్నారు. -
31 వరకు చిన్నారులకు టీకాలు
రావికమతం: జిల్లాలో ఈనెల 31వ తేదీ వరకు చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. రావికమతం పీహెచ్సీని మంగళవారం ఆయన సందర్శించారు. పీహెచ్సీలో తిరిగి రోగులతో మాట్లాడారు. పిల్లల వ్యాక్సిన్ నిల్వలు, రిఫ్రిజిరేటర్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్ను పరీశీలించారు. రికార్డులు, రిపోర్టులను తనిఖీ చేశారు. మీజిల్స్ రుబెల్లా టీకా స్పెషల్ డ్రైవ్లో భాగంగా చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి రామచంద్రరావు, అరుణాచలం, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నళిని పుష్ప, సీహెచ్వో హేమ సుందరరావు, సూపర్ వైజర్ సత్యనారాయణ, ఏఎన్ఎం రమణమ్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమాలు కనిపించవు... గోడు వినిపించదు...!!
బమ్మిడికలొద్దులో ఆగని లేటరైట్ తవ్వకాలునాతవరం : అక్రమాలు చూడం...జనం గోడు వినం...సమస్యలపై మాట్లాడం... అన్నట్టుగా ఉంది అధికారుల శైలి. గిరిజన ప్రాంతంలో జరుగుతున్న లేటరైట్ అక్రమ తవ్వకాలపై, గిరిజన సమస్యలపై స్వయంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంపై అధికారులపై ఉన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతోంది. నాతవరం మండలంలో సుందరకోట పంచాయతీ శివారు బమ్మిడికలొద్దు గ్రామంలో లేటరైట్ తవ్వకాలు కూటమి పెద్దలు కనుసన్నల్లో జరుగుతోంది. ఇక్కడ లేటరైట్ తవ్వకాలు చేయడం వలన ఈ ప్రాంత గిరిజనులకు జరుగుతున్న ఇబ్బందులపై గత నెలలో నర్సీపట్నంలో కలెక్టర్ విజయ కృష్ణన్ నిర్వహించిన పీజీఆర్ఎస్ వేదికలో స్వయంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై నేటి వరకు ఎలాంటి స్పందన లేదు, నిబంధనలు ఉల్లంఘించి కళ్ల ముందే కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రకృతి సంపద కూటమి పెద్దలు కన్నుసన్నల్లో తరలించుకుపోతుంటే అధికారులు పట్టనట్టుగా ఉండిపోయారు. కనీసం అక్కడ ఏం జరుగుతుందో క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఏ అధికారి వెళ్లిన దాఖలాలు లేవు. గిరిజనుల డిమాండ్ మేరకు మరలా ఈనెల 26వ తేదీన మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ గిరిజన పెద్దలతో కలిసి అనకాపల్లి పీజీఆర్ఎస్లో కలెక్టర్కు లేటరైట్ అక్రమ తవ్వకాలపై స్వయంగా ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుకే దిక్కు లేకపోతే సామాన్య ప్రజలు పీజీఆర్ఎస్లో ఇచ్చిన ఫిర్యాదుల పట్ల కూటమి ప్రభుత్వంలో ఏవిధంగా న్యాయం జరుగుతుందోనన్న సందేహాలుప్రజల్లో కలుగుతున్నాయి. గిరి రైతులకు పట్టాలు.. పట్టించుకోని అధికారులు మన్యంవాసులు ఎదుర్కొంటున్న కష్టాలు ఎప్పటికీ తీరడం లేదు. ఫిబ్రవరిలో కలెక్టర్ విజయ కృష్ణన్ సుందరకోట పంచాయతీ శివారు కొత్త దద్దుగుల గ్రామంలో గల గ్యాప్ ఏరియా భూముల పరిశీలనకు వచ్చారు. అప్పుడు స్ధానిక గిరిజన పెద్దగా ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి గ్యాప్ ఏరియా భూములను ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, వారందరికీ పట్టాలు ఇవ్వాలని కలెక్టర్కు విజ్ఙప్తి చేశారు. అలాగే సంక్షేమ పథకాలు తీసుకోవడానికి ఆన్లైన్ సమస్య ఉందని, సెల్ టవర్లు కొండలపై గ్రామాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఇప్పటి వరకూ గిరిజనుల సమస్యలపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా మోక్షం లేదు గత ఏడాది డిసెంబరు 24న సుందరకోట గ్రామానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో ఆయన దృష్టికి ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి గిరిజన సమస్యలు తీసుకెళ్లారు. గత ప్రభుత్వంలో సరుగుడు, సుందరకోట పంచాయతీల శివారులోని 16 గిరిజన గ్రామాల్లో పోడు భూమి వ్యవసాయం చేసుకునే 550 మందికి అప్పటి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పట్టాలు పాసుపుస్తకాలు పంపిణీ చేశామని, అర్హత ఉన్న మరో 250 మంది గిరిజనులకు పట్టాలు తయారు చేసినా ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయాయన్నారు. వాటితోపాటు ఇంకా అర్హత ఉన్న గిరిజనులు సాగు చేసే భూముల గురించి సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని స్పీకర్ను కోరారు. అయితే నెలలు గడిచినా ఇంతవరకూ ఒక్కరికై నా పట్టాలు ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ హయంలో పట్టాలు పొందిన గిరిజనులందరూ రైతు భరోసా ఆర్థిక సాయం పొందారు. అర్జీల గతి ఇంతేనా! భయపడుతున్న గిరిజన ప్రజాప్రతినిధులు గతంలో గిరిజన ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా రాజకీయాలకు అతీతంగా గిరిజనులు ఏకమై ఆందోళన చేసేవారు. ఇపుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు చూసి ఏమి చేస్తారోనన్న భయంతో గిరిజన ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదు. కళ్ల ముందే కోట్లాది రూపాయల విలువ చేసే ప్రకృతి సంపద తరలించుకుపోతున్నా ఏం చేయలేని పరిస్థితి ఉందని గిరిజన ప్రజాప్రతినిధులు అంటున్నారు. దేనికై నా కాలమే సమాధానం చెబుతుందంటూ మిన్నకుండిపోతున్నారు. వామపక్షాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజనులు, ఇలా ఎంతమంది ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పీకర్ ఇలాకాలో జరుగుతుంది కాబట్టి అధికారులు పట్టించుకోలేదని బహిరంగంగా అంటున్నారు. -
ఆదర్శనీయమైన సమాజం వీహెచ్పీ ధ్యేయం
అనకాపల్లి: నేటి యువత నైతిక, ధార్మిక విలువల తో నియమబద్ధమైన జీవితాన్ని గడపాలని, హిందూ ధర్మం పట్ల అవగాహన కలిగి ఉండాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డి.డి.నాయుడు తెలిపారు. జీవీఎంసీ విలీన గ్రామం సిరసపల్లి వద్ద చింతామణి గణపతి దత్తక్షేత్ర ఆవరణలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ‘దుర్గావాహిని’ ప్రాంత శౌర్య ప్రశిక్షణా వర్గ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 నుంచి 36 ఏళ్ల మహిళలకు వచ్చే నెల 2 వరకూ శిక్షణ ఇస్తారన్నారు. రాష్ట్రంలో 11 జిల్లాల నుంచి వీహెచ్పీ మహిళలు హాజరయ్యారన్నారు. గైనకాలజిస్టు మాధురి, వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు వేంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ వైభవం కోసం, ధర్మ పరిరక్షణ కోసం మన పూర్వీకులు ఎన్నెన్నో త్యాగాలు చేశారన్నారు. వారందరి దివ్య జీవితాలను మనం తెలుసుకుని నేటి సమాజంలో ఎదురవుతున్న సమస్యలను ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో గౌరవనీయమైన జీవనం గడిపే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. యువతి ద్వారానే ఆదర్శనీయమైన సమాజ నిర్మాణం చేయాలన్నదే వీహెచ్పీ ధ్యేయమన్నారు. రాష్ట్ర ప్రతినిధి శ్రీకాళహస్తి, రాష్ట్ర మహిళా ప్రముఖ్ టి.సునీతాదేవి, రాష్ట్ర దుర్గా వాహినీ సంయోజిక సి.హెచ్.శోభారాణి, జిల్లా కార్యదర్శి ప్రదీప్ శర్మ, జిల్లా సహ కార్యదర్శులు పూజ్యం నాగబాబు, బోడాల వేణు, జిల్లా ఉపాధ్యక్షుడు రామకొండలరావు, పట్టణ అధ్యక్షుడు నుదురుపాటి తాతాజీ, కార్యదర్శి సరిశా సింహాచలం, సహ కార్యదర్శులు రమేష్, పీలా హేమ జగదీష్ నాయుడు, ఆడారి రాజు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు పాడిగేదె మృతి
రావికమతం : రావికమతంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు పాడి గేదె మృతి చెందింది. కంఠంరెడ్డి నాయుడుకు చెందిన పాడిగేదె పాకలో ఉండగా సమీపంలో పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. తన జీవనాధారం కోల్పోవడంతో నాయుడు కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పిడుగుపడి పశువుల కాపరికి గాయాలు నాతవరం : మండలంలో లింగంపేట పంచాయతీ శివారు బుచ్చెంపేట గ్రామానికి చెందిన బొడ్డు సూరిబాబు పిడుగుపాటుకు షాక్కు గురయ్యాడు, సూరిబాబు మంగళవారం పశువులను పొలంలోకి మేతకు తీసుకెళ్లాడు. భారీ వర్షం కురవడంతో సాయంత్రం పొద్దు పోయే సమయానికి ఇంటికి పశువులను తోలుకెళ్లడానికి సిద్ధపడుతున్నాడు. వర్షం తగ్గుముఖం పడుతుందని ఎదురుచూస్తుండగా సమీపంలో చెట్టుపై పిడుగుపడింది. ఈ పిడుగుపాటుకు సూరిబాబు షాక్ కొట్టి పడిపోయాడు. సమీపంలో ఉన్న స్థానికులు గుర్తించి సూరిబాబుకు సపర్యలు చేశారు. శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో వెంటనే 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. -
మోడల్ ఎంట్రన్స్ టెస్ట్లు ఎంతో ఉపయోగకరం
విశాఖ విద్య: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మోడల్ ఎంట్రన్స్ టెస్ట్లు ఎంతో ఉపయోగకరమని విద్యాశాఖ ఆర్జేడీ బీ. విజయ భాస్కర్ అన్నారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో జూన్ 1న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న మోడల్ డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన కరపత్రాలను డీఈవో ప్రేమ్కుమార్తో కలిసి ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మెగా డీఎస్సీకి సిద్ధమయ్యే అభ్యర్థులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు ఇలాంటి మోడల్ టెస్ట్లు ఉపయోగపడతాయని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. గోపాలపట్నం జెడ్పీహెచ్ఎస్, అనకాపల్లి ఎంజీహెచ్ఎస్, నర్సీపట్నం జెడ్పీహెచ్ఎస్, అలాగే పాడేరులో మోడల్ పరీక్షల కోసం కేంద్రాలు ఏర్పాటు చేశామని పీఆర్టీయూ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు డి. గోపీనాథ్, ఎం. శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో పీఎఫ్ కార్యాలయ ఉద్యోగి మృతి
గోపాలపట్నం: మర్రిపాలెం వుడా లేఅవుట్లో సూపరిండెంట్గా పనిచేస్తున్న పి.వి. నరేష్ బాబు (60) మంగళవారం సాయంత్రం ఎన్ఏడీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సాయంత్రం పీఎఫ్ కార్యాలయం నుంచి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై పెందుర్తిలోని ఇంటికి వెళ్తుండగా ఓ కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేష్ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కేజీహెచ్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను విచారించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ సీఐ ఉమామహేశ్వరరావు నేతృత్వంలో ఎస్ఐ ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. -
సహజంగా మగ్గిన మామిడి పండ్లనే విక్రయించాలి
తుమ్మపాల: సహజ పద్ధతిలో మగ్గబెట్టిన మామిడి పండ్లను మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో ఉద్యాన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పండ్లను మగ్గబెట్టే సురక్షిత విధానాలపై రైతులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. హాని కలిగించే రసాయనాలతో మగ్గబెట్టే విధానాన్ని పూర్తిగా అరికట్టాలన్నారు. మామిడిని మగ్గబెట్టేందుకు కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే తీసుకునే చర్యల గురించి తెలియజేయాలన్నారు. ఆహార భద్రత శాఖ సిబ్బంది ఇప్పటి వరకు 26 శాంపిల్స్ సేకరించారని, ఆహార ప్రయోగశాల నివేదిక అందిన తర్వాత కార్బైడ్ వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్బైడ్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను జిల్లా పంచాయతీ శాఖ, మున్సిపల్ సిబ్బంది చిరు వ్యాపారులకు తెలియజేయాలన్నారు. మామిడి పండ్లు రవాణా చేసే వాహనాలను రవాణా శాఖాధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ, మార్కెటింగ్, మున్సిపాలిటీ, మెడికల్, హెల్త్, పంచాయతీ, హార్టికల్చర్, ట్రాన్స్పోర్ట్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇక తిరగలేను.. ప్రాణం తీసుకుంటాను..
ముగ్గురు ఆడపిల్లలతో ఉన్న తనకు రెవెన్యూ అధికారులు తీవ్ర అన్యాయం చేశారని, కాళ్లరిగేలా తిరిగినా పట్టించుకోవడం లేదని, తనకు చావే శరణ్యమంటూ కలెక్టరేట్ వద్ద మాకవరపాలెం మండలం పైడిపాలెం గ్రామానికి చెందిన జవ్వాది తాతారావు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన తన ముగ్గురు ఆడబిడ్డలతో కలెక్టరేట్ వద్దకు పురుగుల మందుతో వచ్చారు. ‘నాకు, మా అమ్మకు కలిపి గ్రామంలో 82.5 ఎకరాల భూమి ఉంది. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆన్లైన్లో 4 సెంట్లు తొలగించేశారు. వీఆర్వో, ఎమ్మార్వో, ఆర్డీవో కా ర్యాలయాలతోపాటు కలెక్టరేట్కు కూడా తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. తొ లగించిన భూమిని రీసర్వేలో తిరిగి నమోదు చేస్తా మని జిల్లా సర్వేయర్ సైతం చెప్పి చేతులు దులుపుకున్నారు. కూలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే నేను ఇక తిరగలేను. ఇక్కడే చావాలని నిర్ణయించుకున్నాను. నాతోపాటు పురుగు మందు తెస్తే పోలీసులు తనిఖీలు చేసి సంచిలో ఉన్న బాటిల్ లాక్కున్నారు’ అని చెప్పాడు. తన బిడ్డలను చూసైనా అధికారులు చలించాలని, సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరాడు. -
1 నుంచి చౌకధరల దుకాణాల్లోనే సరకుల పంపిణీ
తుమ్మపాల: ప్రభుత్వం అందించే నిత్యావసర సరకులను వచ్చే నెల 1 నుంచి చౌక ధరల దుకాణాల (రేషన్ డిపోల) ద్వారానే పంపిణీ చేయనున్నట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్వో) కె.వి.ఎల్.ఎన్.మూర్తి అన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ సరకులు పంపిణీ చేసే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జిల్లాలో 1,069 చౌక ధరల దుకాణాల ద్వారా సరకుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ లోపల కుటుంబంలోని ఎవరైనా వెళ్లి సరకులు పొందవచ్చన్నారు. చౌక ధరల దుకాణాలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 4 నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయని, ఆ సమయంలో లబ్ధిదారులు సరకులు తీసుకోవాలన్నారు. 65 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు 5వ తేదీ వరకు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల సమయంలో వారి ఇంటి వద్దకే సరకులు అందజేస్తామన్నారు. లబ్ధిదారులు రాష్ట్రంలో ఏ చౌకధరల దుకాణం నుంచైనా వారి సరకులు పొందవచ్చునన్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు వంటి ఏడు అంశాలకు సంబంధించిన సేవల కోసం ఇప్పటివరకు 21 వేల దరఖాస్తులు అందాయని చెప్పారు. పోస్టాఫీసుల్లో ఆధార్ సీడింగ్ అనకాపల్లి: తపాలశాఖ అనకాపల్లి డివిజన్ పరిధిలో ఆధార్ సీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎన్పీసీఐ లింకింగ్ లేని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) లబ్ధిదారులకు ఆధార్ సీడింగ్ ద్వారా కొత్త అకౌంట్లు తెరుస్తామని డివిజన్ తపాలశాఖ సూపరింటెండెంట్ చుక్క శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్షేమ పథకాల లబ్ధి సులువుగా జమ అయ్యేందుకు దగ్గరలో ఉన్న తపాలాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు. -
రేషన్ బండిపై ఎందుకీ కక్ష!
● ఒప్పందం ఉన్నంత వరకూ ఎండీయూలను కొనసాగించాలి ● అనాలోచిత నిర్ణయాలతో రోడ్డుపాలు చేయొద్దు ● స్థానిక ఎన్నికల్లో కూటమికి గుణపాఠం తప్పదు ● ధ్వజమెత్తిన ఎండీయూ ఆపరేటర్లు అనకాపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, ఇంటింటికీ రేషన్ ఇచ్చే వాహనాలను జూన్ 1వ తేదీ నుంచి నిలిపివేడంతో వేలాది కుటుంబాలు రోడ్డుపడే పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారని రాష్ట్ర సమైక్య ఎండీయూ ఆపరేటర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు జెట్టి శ్రీను అన్నారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎండీయూ ఆపరేటర్ల యూనియన్ ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ విజయ కృష్ణన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, కూటమి పాలనలో ఉన్న ఉద్యోగాలను తొలగించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనలో 2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, ఈ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి లభించిందని, అయితే ఈ ఏడాది మే 20న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండీయూ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి వారి పొట్ట కొట్టారని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2027 జనవరి వరకూ ఇంటింటి రేషన్ కోసం ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలని అన్నారు. ఎండీయూ వ్యవస్థను నమ్ముకుని 18,500 కుటుంబాలు వారి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ, విజయవాడ వరదలు, తిరుపతి వరదల సమయంలో ఎండీయూ అందించిన సేవలు కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు చేయకపోగా, వైఎస్సార్సీపీ పాలనలో నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాలను కూడా తొలగించడం అన్యాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. 2027 వరకూ ఎండీయూ వ్యవస్థని కొనసాగించాలి లేదా 20 నెలలకు సంబంధించిన మొత్తం బకాయిలు (నెలకు రూ.18 వేలు) చెల్లించాలన్నారు. ఈ నిరసనలో ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు కోన లక్ష్మణరావు, ఎండీయూ ఉద్యోగులు పాల్గొన్నారు. పునరాలోచన చేయాలి విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎండీయూలు అందరం అండగా నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు వేతనం రూ.52.45లక్షలు అందజేశాం. ఆ విశ్వాసం లేకుండా ఎండీయూలను విధుల నుంచి తొలగించడం అన్యాయం. రేషన్ డీలర్లు చేసిన మోసాలను దృష్టిలో పెట్టుకుని ఎండీయూ వ్యవస్థను కొనసాగించేలా ప్రభుత్వం ఆలోచించాలి. – టి.ప్రసాద్, యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు బడుగువర్గాలకు అన్యాయం 2021లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో ఇంటింటి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, చంద్రబాబు ఎండీయూలను రద్దు చేయడం అన్యాయం. –బంగారి లక్ష్మణరావు, యూనియన్ జిల్లా కార్యదర్శి, అనకాపల్లి ప్రభుత్వ తీరు దారుణం రెక్కాడితేగాని డొక్కాడని జీవితాలు మావి. ఎండీయూ వ్యవస్థ ద్వారా బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ ఇంటింటికి అందజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా వాహనాలను నిలిపివేయడం అన్యాయం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలకు అధికారం చేపట్టిన తరువాత కూటమి పాలనకు చాలా వ్యత్యాసం కనిపించింది. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే, కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు తొలగించడం అన్యాయం. –జెట్టి శ్రీను, రాష్ట్ర సమైక్య ఎండీయూ ఆపరేటర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
కలసికట్టుగా కూటమిని కూల్చాలి..
దేవరాపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు శోభా హైమావతి అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు అధ్యక్షతన పార్టీ మాడుగుల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం తారువ వైఎస్సార్ ఆడిటోరియంలో సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శోభా హైమావతి మాట్లాడుతూ జగనన్న పాలనలో ప్రతి నెలా ఒక పథకం అందేదని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా పథకాలు అమలు కాక ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. జగనన్న చేసిన మంచిని ప్రజలకు వివరించడంతోపాటు కూటమి పాలనలో అవినీతి, అక్రమాలను నిలదీసేందుకు సిద్ధం కావాలన్నారు. ఈ నెలాఖరులోగా మండల కమిటీలను, జూలై నెలాఖరుకు గ్రామ కమిటీలు, సెప్టెంబర్ నెలాఖరుకు బూత్ కమిటీల నియామకాలను ఏకాభిప్రాయంతో పూర్తిచేయాలన్నారు. విజయవాడలో త్వరలో భారీ ప్లీనరీ నిర్వహించే ఆలోచన చేస్తున్నారన్నారు. పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డుతో పాటు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సేనాపతి కొండలరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు సోలం రమేష్, జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు కె.వి.రమణ, ఎంపీపీలు చింతల బుల్లిలక్ష్మి, రెడ్డి జగన్మోహన్, తాళ్లపురెడ్డి రాజారామ్, కురచా జయమ్మ, జెడ్పీటీసీలు కర్రి సత్యం, కిముడు రమణమ్మ, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు పంచాడ సింహాచలంనాయుడు, పొలిమేర విజయలక్ష్మి, కొత్తపల్లి శ్రీనివాస్, రొంగలి సూర్యనారాయణ, ధర్మిశెట్టి స్వాతి, కిముడు చినమ్మలు, పార్టీ మండల అధ్యక్షులు బూరె బాబురావు, గొల్లవిల్లి రాజుబాబు, నాలుగు మండలాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా క్షేమానికి అలుపెరుగని పోరాటం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం మాడుగుల వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి పార్టీ మాడుగుల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం -
మరణంలోనూ వీడని స్నేహబంధం
అచ్యుతాపురం రూరల్: వారిద్దరూ మిత్రులు. ఒకే ఊరిలో నివాసం. ఒకే ఊరిలో ఉద్యోగం. ఎప్పుడూ కలిసే ఉంటారు. కలిసి మెలిసి తిరుగుతారు. అందుకే కాబోలు.. మృత్యువులోనూ వారిది వీడని బంధమే. పెదపాడు గ్రామానికి చెందిన రాయి గణేష్ (25), జనపరెడ్డి సంజీవ్ (21) సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. వీరు తిమ్మరాజుపేట నుంచి పెదపాడు స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిరుపేద వ్యవసాయ కుటుంబాలకు చెందిన ఇద్దరు యువకులు అచ్యుతాపురంలో వేర్వేరు ప్రైవేట్ కంపెనీల్లో విధులు నిర్వహిస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవారని స్థానికులు చెప్పారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాలతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుడు జనపరెడ్డి సంజీవ్ అక్క 5 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృత్యువాత పడగా, తండ్రి పాము కాటుకు గురవ్వడంతో ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమయ్యాడు. ఇక మృతుని తల్లి స్థానికంగా దినసరి కూలి పని చేసుకుంటూ కుటుంబ పోషణ చేస్తున్న సమయంలో అందివచ్చిన కొడుకు అనంతలోకాలకు చేరుకోవడంతో ఆ కుటుంబం ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి పెదపాడు గ్రామంలో అలముకున్న విషాదం -
కూటమి పాలన కుటిల రాజకీయాలకే పరిమితం
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ జగన్ పాలనలో రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించగా, కూటమి పాలనలో పచ్చ పార్టీకి చెందిన వారికి మాత్రమే వర్తింపచేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం చేయడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై పోరాటంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని తమ నాయకుడు ఇచ్చారన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో మాడుగుల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకొని మరోసారి సత్తా చాటగలిగామన్నారు. రాష్ట్రంలోనే క్రమశిక్షణకు మారుపేరుగా మాడుగుల నియోజకవర్గాన్ని జగనన్న గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. సూపర్ సిక్స్ పథకాలను గాలి కొదిలేసిన కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతోందన్నారు. -
బతికున్నాను మహాప్రభో..
మరణించిన తన అన్న పేరుతోపాటు తన పేరునూ రేషన్ కార్డు నుంచి తొలగించారని, ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదని రాంబిల్లి మండలం అప్పన్నపాలెం గ్రామానికి చెందిన శింగంపల్లి మనోజ్కుమార్ పీజీఆర్ఎస్లో అర్జీ చేశారు. ఇప్పటికి చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చానని, ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఇటీవల ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించడంతో అలా కూడా ప్రయత్నించానని, రేషన్ కార్డు డేటాలో తన పేరు వద్ద చనిపోయినట్టు ఉందని చెప్పారు. రేషన్ కార్డు లేకపోవడంతో ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదని, తన సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నాడు. -
చట్ట పరిధిలో సమస్యలకు పరిష్కారం
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 40 అర్జీలు అందాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల సమస్యలు వింటూ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్ తదితర అంశాలపై ఫిర్యాదు వచ్చాయని చెప్పారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ఐ డి.వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. చోరీ సొత్తు ఇప్పించాలి.. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఇంటిలో కుటుంబ సమేతంగా మేడపైన నిద్రపోతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు 8.5 తులాల బంగారం ఆభరణాలు పట్టుకుపోయారు. సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి దొంగలను ఇప్పటికీ పట్టుకోలేదు. అక్కడ పోలీసుల్లో స్పందన లేకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాం. త్వరితగతిన చోరీ సొత్తు ఇప్పించాలి. – ఉడత పైడమ్మ, టెక్కలిపాలెం, సబ్బవరం మండలం స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి నాకు తల్లిదండ్రులు ఇచ్చిన 3 సెంట్ల భూమి ఉంది. 2012 డిసెంబర్ 28న నా స్థలం పక్కన ఉన్న వ్యక్తి ఆక్రమించాడు. అప్పటి నుంచి నేటి వరకూ ఎస్పీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీనిపై మునగపాక పోలీస్స్టేషన్ల్లో ఫిర్యాదు చేశాను. ఎప్పుడు పరిష్కరిస్తారో అర్థం కావడం లేదు. – చిట్టిబోయిన కన్నయ్యమ్మ, టి.సిరసపల్లి గ్రామం, మునగపాక మండలం -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: పట్టణానికి సమీపంలో పెదపల్లి హైవే కూడలి వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని యలమంచిలి పాతవీధికి చెందిన ఎడ్ల సన్యాసినాయుడు(37) దుర్మరణం పొందాడు. పట్టణంలో ఓ ఎలక్ట్రికల్ ఉపకరణాలు విక్రయించే దుకాణంలో సన్యాసినాయుడు రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. మున్సిపాలిటీ పరిధి పెదపల్లిలో ఉన్న తన అత్తవారింటికి వెళ్లడానికి పెదపల్లి హైవే కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా తుని నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సన్యాసినాయుడు నడుం భాగం నుంచి కింద శరీర భాగాలన్నీ నుజ్జయ్యాయి. దీంతో ఆయన ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అత్తవారింటికి వెళ్తుండగా ఊహించనిరీతిలో రోడ్డు ప్రమాదం ఇంటి పెద్దను మృత్యువు కబళించడంతో భార్య, పిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కలచివేసింది. భార్య కరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ సావిత్రి తెలిపారు. -
యోగాతో ఆరోగ్యవంత జీవితం
అనకాపల్లి: మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే నిత్యం యోగా చేయడం అవసరమని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక గవరపాలెం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం, అంతర్జాతీయ యోగా వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక యోగా శిబిరాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెల రోజుల పాటు నిర్వహించనున్న ‘యోగాంధ్ర–2025‘కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లా ఆయుష్ విభాగం అధికారి కె.లావణ్య, యోగా గురువులు శ్రీను, చంద్రిక, శివ, సతీష్, జగన్ తదితరుల మార్గదర్శనంలో అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు బి.మోహనరావు, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, సీఐలు టి.వి.విజయకుమర్, లక్ష్మణ్ మూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యారావు, టి.లక్ష్మి, గఫూర్, రమేష్, రామకృష్ణ, మన్మథరావు, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల సుస్థిర అభివృద్ధికి ఊతం
అచ్యుతాపురం: గ్రామాల సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఉన్నత్ భారత్ అభియాన్ ఒకటి. ఇది గ్రామీణ భారతదేశం అభివృద్ధిలో ఉన్నత విద్యా సంస్థలను భాగస్వామ్యం చేస్తుంది. సాంకేతిక పరంగా వెనకబడిన శ్రామికులు, కార్మికులు, చేతి వృత్తుల వారికి చేదోడుగా నిలిచే ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రోత్సాహకాలను ఇస్తుంది. దీంతో వనరుల్ని సద్వినియోగం చేసుకోవడం, ఆర్థిక క్రమశిక్షణ, పురోభివృద్ధికి అవసరమైన సాంకేతికను అందించడంలో విద్యార్థులు మేము సైతం అంటూ ప్రతిభ కనబరుస్తున్నారు. ఉన్నత భారత్ అభియాన్లో భాగంగా ఐఐటీ ఢిల్లీతో పాటు, అచ్యుతాపురంలో ప్రశాంతి పాలిటెక్సిక్ కళాశాల ఆరు ప్రాజెక్టులకు రూ.6 లక్షల ప్రోత్సాహకం అందుకుంది. దీనిలో భాగమైన విద్యార్థుల ప్రతిభా పాటవాలు పెరగడంతో పాటు, గ్రామీణ జీవనానికి చేదోడు వాదోడుగా నిలిచే అవకాశం దక్కుతుంది. ఐదు గ్రామాల దత్తత ప్రతి ఉన్నత విద్యా సంస్థ కనీసం ఐదు గ్రామాల్ని దత్తత తీసుకోవాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో ఉన్న చేతి వృత్తులు, వృత్తిలో సాంకేతికను జోడించే విధంగా విద్యా సంస్థలు కృషి చేయాలి. ఈ క్రమంలోనే అచ్యుతాపురం ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తంతడి, దోసూరు, దొప్పెర్ల, ఎర్రవరం, ఉప్పవరం గ్రామాల్ని ఎంపిక చేసుకున్నారు. తంతడి గ్రామంలో కుమ్మరులు మట్టి పాత్రలు తయారు చేసే విషయంలో కాలుష్య రహితంగా కుండల్ని కాల్చే పరిజ్ఞానాన్ని కళాశాల విద్యార్థులు అందించారు. సెంట్రల్ గ్లాస్, సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోల్కతా, ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల సంయుక్త ఒప్పందంతో కుమ్మరులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. దీనికి తోడు నిమ్మగడ్డి నుంచి సుగంధ నూనె, యూకలిప్టస్ సైట్రియో డొరా సుగంధ నూనె, పర్యావరణ రహిత కొబ్బరి చిప్పల బొమ్మలు, వ్యక్తిగత పరిశుభ్రత, 3 డీ ప్రింటింగ్ వస్తువులతో బుద్ధి మాంద్యం ఉన్న పిల్లలకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెంచుట వంటి అంశాలపై ప్రాజెక్టులు రూపొందించారు. ఒక్కొక్క ప్రాజెక్టుకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి పొందారు. దీనికి తోడు వందలాది మంది శ్రామికులు, రైతులకు దోహదపడే అంశాలపై అవగాహన కల్పించారు. తద్వారా గ్రామీణ జీవనంలో సుస్థిర అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. ఉన్నత్ భారత్ అభియాన్లో భాగంగా సత్ఫలితాలు శ్రామికులు, రైతులకు సాంకేతికతను అందించడంలో విద్యార్థుల ప్రతిభ 5 గ్రామాలను దత్తత తీసుకున్న ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల -
త్వరితగతిన యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు
తుమ్మపాల: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 11ను పురస్కరించుకుని యోగాను మరింత విస్తృంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి మండలాల్లో, గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో యోగాభ్యాస కార్యక్రమాలు ప్రారంభించాలన్నారు. జిల్లాలో 7 నియోజకవర్గ పర్యాటక ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం బీచ్ పర్యాటక ప్రాంతం వద్ద ఉదయం 7 గంటలకు యోగాంధ్ర కార్యక్రమన్ని ప్రారంభించనున్నామన్నారు. – యోగా గురువులు, యోగా శిక్షకులు, వలంటీర్లు, యోగా అభ్యాసకులు, సాధారణ ప్రజలు తమ పేర్లను https:// yogandhra. ap. gov. in/#/ home/ yoga& registration వైబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.లావణ్య, జిల్లా ఆయుష్ అధికారి, ఎంపీడీవోలు, నియోజకవర్గ మండల స్థాయి ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
ఉత్తమ నాటికగా ‘జనరల్ బోగీలు’
కశింకోట: ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి పోటీలో గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన సాయి ఆర్ట్స్ వారి ‘జనరల్ బోగీలు’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఇదే నాటికకు అత్యధికంగా పలు విభాగాల్లో నాలుగు బహుమతులు లభించాయి. స్థానిక గవరపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అశోక్ ఫ్రెండ్స్ క్లబ్ సాంస్కృతిక కళా పరిషత్ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా పది నాటికలను ప్రదర్శించారు. పోటీలో 9 నాటికలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటిలో ఉత్తమ ద్వితీయ, తృతీయ ప్రదర్శనలు వరుసగా విశాఖపట్నం తెలుగు కళా సమితి వారి ‘నిశ్శబ్దమా? నీ ఖరీదెంత?’, గుడివాడకు చెందిన కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారి ‘ద్వార బంధాల చంద్రయ్యనాయుడు’, స్పెషల్ జ్యూరీ ప్రదర్శన ప్రథమ, ద్వితీయంగా గుంటూరు అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ వారి ‘నాన్నా నేను వచ్చేస్తా’, హైదరాబాద్ గోవాడ ఆర్ట్స్ వారి ‘మూల్యం’ బహుమతులు గెలుచుకున్నాయి. ఉత్తమ నటునిగా పెందుర్తి డ్రమెటిక్ అసోసియేషన్ వారి ‘శిథిల జీవి’ నాటికలో అయలయ్య పాత్రధారి బీసీహెచ్ శేఖర్, ద్వితీయ ఉత్తమ నటునిగా హైదరాబాద్ గోవాడ ఆర్ట్స్ వారి ‘మూల్యం’ నాటికలో సోమ సుందర్ పాత్రధారి భాగి శివశంకర్శాస్త్రి, ఉత్తమ నటిగా గుంటూరు జిల్లా కోలకలూరు సాయి ఆర్ట్స్ వారి ‘జనరల్ బోగీలు’లో సావిత్రమ్మ పాత్రధారి సురభి ప్రభావతి, ద్వితీయ ఉత్తమ నటిగా గుంటూరు అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ వారి ‘నాన్నా నేనొచ్చేస్తా’ నాటికలో సావిత్రి పాత్రధారి ఎస్. అమృత వర్థిని, ఉత్తమ ప్రతి నాయకునిగా ‘జనరల్ బోగీలు’ నాటికలో సీఐ పాత్రధారి, సినీ,రంగస్థల నటుడు గోపరాజు విజయ్, ఉత్తమ దర్శకునిగా విశాఖపట్నం తెలుగు కళా సమితి వారి ‘నిశ్శబ్దమా? నీ ఖరీదెంత? నాటిక దర్శకుడు చలసాని కృష్ణప్రసాద్, ఉత్తమ సహాయ నటునిగా విజయవాడ గురజాడ కళామందిర్ వారి ‘ మహా ప్రస్థానంలో సింహాద్రి పాత్రధారి బి. నరేన్, ఉత్తమ సహాయ నటిగా కాకినాడ బీవీకే క్రియేషన్స్ వారి ‘తితిక్ష’ నాటికలో భారతి పాత్రధారి ఎస్. జ్యోతిరాణి, ఉత్తమ హాస్య నటుడు ‘నిశ్శబ్దమా? నీ ఖరీదెంతలో వామనరావు పాత్రధారి డి. కన్నబాబు, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా ‘ద్వారబంధాల చంద్రయ్యనాయుడు’ నాటికలో చంద్రయ్యనాయుడు పాత్రధారి సీఆర్వీఏ నరసింహారావు బహుమతులను గెలుచుకున్నారు. ఉత్తమ రచనగా జనరల్ బోగీలు నాటిక రచయిత పీటీ మాధవ్, ఉత్తమ సంగీతంగా ‘చీకటి పువ్వు’ నాటికకు అందించిన సురభి నాగరాజుకు, ఉత్తమ రంగాలంకరణ ‘తితిక్ష’ నాటికలో సురభి సంతోష్కు, ఉత్తమ ఆహార్యం (మేకప్ మెన్)గా ‘ద్వారబంధాలు చంద్రయ్యనాయుడు’లో పి. శేషగిరి, పి.వి. సత్యనారాయణ, జ్యూరీ అవార్డులుగా ‘చీకటిపువ్వు’ నాటికలో వాటికల్ సిద్దార్థ పాత్రధారి ఎన్. సూర్య, ‘నాన్నా నేనొచ్చేస్తా’లో శ్రీరాం పాత్రధారి ఎస్కె.డి. హసన్కు లభించాయి. బహుమతులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, తదితరులు అందజేశారు. సూరిశెట్టి రాము, భీమిశెట్టి వేణుగోపాలకృష్ణ, పొన్నాడ ముత్యాలరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పెంటకోట శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముగిసిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి పోటీలు -
నిరసనలతో హోరెత్తిన కలెక్టరేట్
స్పీకర్ మైనింగ్ అక్రమాలపై ఫిర్యాదు తుమ్మపాల: స్పీకర్ అయ్యన్నపాత్రుడి మైనింగ్ అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నర్సీపట్టణం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కలెక్టర్ విజయ కృష్ణన్కు ఫిర్యాదు చేశారు. కొత్త సిరిపురం నుంచి మైనింగ్ ప్రదేశానికి రహదారిని అనధికారికంగా నిర్మించి వినియోగిస్తున్నారని గణేష్ ఆరోపించారు. గతంలో పర్యావరణ అనుమతులు లేని కారణంగా ట్రిబ్యునల్ పనులను నిలిపివేసిందని, ఇప్పుడు అదే స్థలంలో మైనింగ్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయన్నారు. న్యాయవ్యవస్థ ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించి మైనింగ్ చేపడుతున్నారన్నారు. అనుమతులు లేని అన్ని మైనింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆయన కోరారు. తుమ్మపాల: తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ప్రజలు, ప్రజా సంఘాలు చేపట్టిన నిరసనలు, ధర్నాలతో కలెక్టరేట్ హోరెత్తింది. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులు నిరసన వ్యక్తం చేశారు. నేరుగా కలెక్టరేట్కు వచ్చి పదేపదే అర్జీలు సమర్పిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటు వాపోయారు. దళిత సంఘాలు, ఎండీయూ వాహనదారులు, గిడ్డంగుల హమాలీలు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి నియంత్రించారు. కలెక్టరేట్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరి వద్ద ఉన్న సంచులు, వస్తువులను తనిఖీ చేసి లోపలికి పంపించారు. ఒకరిద్దరి వద్ద అనుమానాస్పద వస్తువులు ఉండడంతో వారిని మందలించి, అర్జీతో మాత్రమే పీజీఆర్ఎస్ వేదిక వద్దకు పంపించారు. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్ అర్జీలు స్వీకరించారు. పలువురు మహిళలు ఇంటి స్థలాల మంజూరు కోసం అర్జీ అందజేసేందుకు ఉదయాన్నే వచ్చినా కలెక్టర్ దగ్గరకు వెళ్లకుండా సిబ్బంది అడ్డుకోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. డొంకాడ దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. దళితులపై దాడి జరిగి తొమ్మిది రోజులు అవుతున్నా నేటికీ నిందితులను అరెస్టు చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. దాడికి గురైన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుకు తగ్గట్టుగా ఎఫ్ఐఆర్లో సెక్షన్లు నమోదు చేయకుండా దోషులను కాపాడేలా పోలీసులు బెయిలబుల్ సెక్షన్లు వేశారని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. తక్షణమే నిష్పక్షపాత విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు రవి సిద్ధార్థ, రాజు బాబు, బి.వెంకటరమణ, ఎం.అప్పలరాజు, చిరంజీవి, లోవరాజు, దొరబాబు, రాము, అప్పారావు, కన్నారావు, శివ, ఆనందరావు, స్వర్ణ రాజు, మురళి, రాజు పాల్గొన్నారు. వివాహితులకూ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి నక్కపల్లి: మండలంలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో నిర్వాసిత కుటుంబాల్లో వివాహితులకు, మేజర్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని పలువురు నిర్వాసితులు సోమవారం జిల్లా కలెక్టర్ను కోరారు. చందనాడ, తమ్మయ్యపేట, మూలపర, అమలాపురం తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులు సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, వైఎస్సార్సీపీ జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు సూరాకాసుల గోవిందుల ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి, అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూసేకరణ సమయంలో టీడీపీ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని, నిర్వాసిత కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మగ, ఆడవారికి వివాహాలైనా ఆర్ అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారన్నారు. తాజాగా అధికారులు నిర్వహించిన గ్రామసభల్లో ప్రకటిస్తున్న లబ్ధిదారుల జాబితాల్లో వివాహాలైన మహిళల పేర్లు లేవన్నారు. డీఫారం భూముల్లో ఫల సాయానికి కూడా నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. బుచ్చిరాజుపేటలో కొత్తూరు, చందనాడలో కర్రివారి వీధి, తమ్మయ్యపేటలో తుమ్మలపేట, పాటిమీద, మూలపర, బోయపాడు, డీఎల్పురంలో వాడపేటను వేరొక చోటకు తరలిస్తున్నారన్నారు. దీంతో ఇళ్లు, నివాస ప్రాంతాలను కోల్పొతున్న వారికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం ఇంటి స్థలం, రూ.8.30 లక్షలు ఆర్థిక సాయం మాత్రమే అందిస్తామని అధికారులు చెబుతున్నారన్నారు. ఇది ఏమూలకు సరిపోదన్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన సీ్త్ర, పురుషులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింజేయాలన్నారు. ఇంటి స్థలంతో పాటు రూ.25 లక్షల ఆర్ అండ్ఆర్ ప్యాకేజీ కింద సాయం అందజేయాలని కోరారు. -
నాణెం.. చరిత్రకు సాక్ష్యం
తగరపువలస: జీవీఎంసీ ఒకటో వార్డు చిట్టివలసకు చెందిన రంగూరి గిరిధర్ ఇంట కాలచక్రంలో కరిగిపోని ఓ అపురూప నిధి ఉంది. అది బంగారం, వజ్రాలు కాదు.. వందలాది పాతకాలపు నాణేలు, పదుల సంఖ్యలో అప్పటి కరెన్సీ నోట్లు! అవును.. ఇవి చరిత్రకు సజీవ సాక్షాలు. గిరిధర్ వద్ద భద్రంగా ఉన్న ఈ నాణేలన్నీ ఒకప్పటి మన జీవన విధానానికి, ఆర్థిక వ్యవస్థకు అద్దం పడతాయి. వీటిలో అణా, ఒక పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు, ఇరవై, ఇరవై ఐదు, యాభై పైసల నాణేలున్నాయి. ఆనాటి అవసరాలకు అనుగుణంగా అల్యూమినియం, ఇత్తడి, కంచు వంటి లోహాలతో తయారైన ఈ నాణేలు చూడటానికి చిన్నవే అయినా.. అవి మోసుకొచ్చిన చరిత్ర ఆసక్తికరం. ఈ నాణేలు ఇప్పుడు చలామణిలో లేకపోవచ్చు. కానీ వాటి విలువ ఏమాత్రం తగ్గలేదని గిరిధర్ చెబుతున్నారు. నిజమే.. వీటి చారిత్రక, సాంస్కృతిక విలువ వెలకట్టలేనిది. పూర్వం చాలా మంది ఇలాంటి పాత నాణేలను ఇచ్చి వెండి వస్తువులు కొనుగోలు చేసేవారని, ఆ లెక్కన చూసుకున్నా ఇప్పటికీ ఈ లోహపు నాణేలకు విలువ ఉంటుందని కొందరు అంటుంటారు. కానీ గిరిధర్ కుటుంబానికి మాత్రం ఈ నాణేలను అలా మార్చుకోవడం ఇష్టం లేదు. వీటిని చూస్తూ మురిసిపోతుంటుంది. నాణేల వెనుక కథలు.. ఈ నాణేల వెనుక ఉన్న కథలను, అప్పటి వాటి కొనుగోలు శక్తిని తన తల్లిదండ్రులు అరుణకుమారి, ప్రసాదరావు వివరిస్తుండేవారని గిరిధర్ చెబుతున్నారు. ఒక అణాతో ఏమేమి కొనుగోల చేశాం? ఒక పైసా విలువ ఎలా ఉండేది? వంటి విషయాలు వారి మాటల్లో వింటుంటే ఆ కాలంలోకే వెళ్లినట్టు అనిపించేదని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు గిరిధర్ కూడా తన తర్వాతి తరాలకు ఈ నాణేలను చూపిస్తూ.. వాటి గొప్పతనాన్ని, మన పూర్వీకుల జీవన విధానాన్ని వివరిస్తున్నారు. ఈ నాణేల చప్పుడులో ఒకప్పటి చరిత్ర ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇత్తడితో తయారు చేసిన 20 పైసల నాణేలురెండు రకాల మెటల్తో తయారైన 10 పైసల నాణేలు -
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్లో ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన సమీర్(26) నీటిలో మునిగి చనిపోయాడు. మారికవలసకు చెందిన సమీర్కు ఈత రాదు. అయితే ఐదుగురు వ్యక్తులతో కలిసి రిజర్వాయర్లో దిగిన సమీర్ ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు తాళ్లవలస అగ్నిమాపక సిబ్బంది మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమీర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన తండ్రి ఫిర్యాదు మేరకు ఆనందపురం సీఐ వాసునాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య, కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు
మునగపాక: మండలంలోని ఒంపోలుకు చెందిన వివాహితతో పాటు రెండేళ్ల పాప కనిపించలేదంటూ అందిన ఫిర్యాదు మేరకు మునగపాక పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఒంపోలుకు చెందిన దాసరి సన్యాసినాయుడు భార్య లలిత అచ్యుతాపురం బ్రాండిక్స్లో పని చేస్తుంది. ఈ నెల 24న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు డ్యూటీకి వెళ్లిన లలిత రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో కంగారుపడి బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆదివారం సన్యాసినాయుడు మునగపాక పోలీసు స్టేషన్లో తన భార్య లలితతో పాటు రెండేళ్ల కుమార్తె రియాన్సీ కనిపించలేదని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర ర్యాలీ
కశింకోట: ఆపరేషన్ సిందూర్ను విజయవంతంగా నిర్వహించిన సైనికులకు సంఘీభావంగా కశింకోటలో మాజీ సైనికోద్యోగులు, నాయకు లు, అభిమానులు తిరంగా యాత్ర ర్యాలీని ఆదివారం నిర్వహించారు. జాతీయ పతాకాలతో స్థానిక పెద బజారు నుంచి ప్రారంభించిన ప్రదర్శన సంతబయల మీదుగా జాతీయ రహదారి కూడలి వరకు ప్రధాన పంచాయతీ రహదారి మీదుగా సాగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, మాజీ సైనికోద్యోగుల సంఘం అధ్యక్షుడు గొంతిన రమణ, నాయకులు దాసరి బాబు, సిదిరెడ్డి శ్రీనివాసరావు, ప్రగఢ నూకరాజు, శిష్టి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
నటుడిగా కొనసాగడమే ధ్యేయం
కశింకోట: జీవితాంతం నటునిగా కొనసాగడమే తన ధ్యేయమని సినీ నటుడు, టీవీ, నాటక రంగ కళాకారుడు గోపరాజు విజయ్ అన్నారు. కశింకోటలో తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీల్లో భాగంగా ‘జనరల్ బోగీలు’నాటిక ప్రదర్శనకు వచ్చిన సందర్భంగా శనివారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తాను ఒక వైపు సినిమా నటునిగా, మరో వైపు నాటక రంగ కళాకారునిగా కొనసాగుతున్నానన్నారు. నాటక రంగం నుంచే నట జీవితాన్ని ప్రారంభించానన్నారు. నాటక, సినిమా రంగాలు రెండు కళ్లులాంటివన్నారు. పలు టీవీ సీరియల్స్లో కూడా నటించానని చెప్పారు. తన తండ్రి గోపరాజు రమణ రంగ స్థల, టీవీ, సినిమా నటునిగా గుర్తింపు పొందారన్నారు. ఆయన వారసునిగా ప్రవేశించి 36 ఏళ్లగా నటునిగా కొనసాగుతున్నానన్నారు. ఇప్పటికి 20 వరకు సినిమాల్లో నటించానన్నారు. సత్యనారాయణస్వామి మహాత్మ్యం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశానని వివరించారు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సర్పంచ్గా నటించానన్నారు. బీమ్లా నాయక్, ఎఫ్–3, తదితర చిత్రాలు తనకు గుర్తింపు తెచ్చాయన్నారు. సామజవరగమన, గుంటూరు కారం, వినరో భాగ్య విష్ణు కథ, తదితర చిత్రాల్లో నటించానన్నారు. ఉత్తమ కళాకారునిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 13 నంది పురస్కారాలు, కందుకూరి పురస్కారం అందుకున్నట్టు విజయ్ తెలిపారు. సినీ, టీవీ, నాటక రంగ కళాకారుడు గోపరాజు విజయ్ -
నేల బావిలో పడి విద్యార్థి మృతి
నక్కపల్లి: మండలంలో జగన్నాథపురం గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ఆదివారం నేలబావిలో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన జగతా గంగాద్రి సాయి గణేష్(16) తమ పశువులను మేత కోసం పొలంలోకివ తీసుకెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో దాహం వేయడంతో సమీపంలో ఉన్న నేలబావి వద్దకు వెళ్లి డొక్కుతో నీరు తోడుతుండగా ప్రమాదవశాత్తూ పడిపోయాడు. సమీపంలో ఉన్న వారు గమనించి కేకలు వేసి బావిలో పడిపోయిన సాయిగణేష్ను బయటకు తీసి హుటాహుటిన నక్కపల్లి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. సాయిగణేష్ ఇటీవలే పదో తరగతి పాసయ్యాడు. ఈ ఘటనపై మృతుడు తండ్రి జగతా శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. -
మహిళల వ్యధా జీవనమే ‘శిథిల జీవి’
కశింకోట: పేద మహిళలు కుటుంబ జీవనం కోసం ధన సంపాదనకు విదేశాలు వెళ్లి చాకిరీ చేసి మోసపోతూ విగత జీవులుగా స్వదేశానికి చేరుతుండటం ఇతి వృత్తంగా ‘శిథిల జీవి’ నాటిక సాగింది. కశింకోటలోని గవరపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అశోక్ ఫ్రెండ్స్ క్లబ్ సాంస్కృతిక కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి దీన్ని ప్రదర్శించారు. ఇది ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. నాటిక మధ్యలో వర్షం కురిసి ప్రదర్శనకు దాదాపు అర్ధగంట పాటు అంత రాయం కలిగింది. ఆ తర్వాత కూడా మిగిలి ఉన్న నాటికను ప్రదర్శించాలని ఆహూతులు ఒత్తిడి చేశారు. దీంతో వాయిదా వేయాలని భావించిన కళాకారులు మిగిలిన నాటికను రసవత్తరంగా పూర్తి చేశారు. ఆహూతులు నాటికను వర్షం పడి అంతరాయం కలిగినా లెక్క చేయకుండా ఆద్యంతం వీక్షించి ఇంటి ముఖం పట్టారు. కశింకోట: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రంప విప్లవ వీరుడు ‘ద్వారబంధాల చంద్రయ్యనాయుడు’ నాటిక ఆహూతులను రంజింపజేసింది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుకు నాలుగు దశాబ్దాల పూర్వమే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి తాడిత పీడిత, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి బ్రిటిష్ వారికి, జమీందార్లకు చంద్రయ్య సింహ స్వప్నంగా మారుతాడు. అతడిని భోజనానికి పిలిచి అందులో మత్తు మందు కలిపి స్ప్రహలో లేకుండా చేసిన తర్వాత కిర్లంపూడి రోడ్లపై చిత్ర హింసలకు గురి చేసి చెట్టుకు కట్టి వేలాడదీసి చంపుతోంది. ఇది ఇతివృత్తంగా నాటికను ఆద్యంతం రక్తి కట్టించి ఆహూతులను అలరించింది. ఎక్కువ సంఖ్యలో కళాకారులు నాటికలో ప్రదర్శన నిర్వహించారు. అలరించిన అనగనగా ఒక రోజు... విశాఖపట్నం జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రచించిన ‘అనగనగా ఒక రోజు’ నాటిక చివరి ప్రదర్శన ఆహూతులను అలరించింది. రాజు దయా దాక్షిణ్యాలపై బతికే ప్రజలు అరాచక పాలనను ఎలా అంతం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదురుకుంటారు. అనుకోకుండా ఊహించని రీతిలో రాజు అవినీతిని అంతం చేస్తున్న సమయంలో అతని అంగ రక్షకులే చిత్ర వధ చేసి రాజ సింహాసనాన్ని ఆక్రమించి అధిష్టిస్తారు. అవినీతిని పునః ప్రతిష్ట చేస్తే అప్పుడు ధర్మం ఎన్ని పాదాలపై నడుస్తున్నట్లు? ఒకటా? రెండా? మూడా? నాలుగా? అని ప్రశ్నించడం నాటిక కథాంశం. -
మళ్లీ కరోనా.. జర జాగ్రత్త
అనకాపల్లి టౌన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడించిన వ్యాధి. దీని బారిన ఇంచుమించుగా ప్రతి ఒక్కరూ పడ్డారనే చెప్పొచ్చు. కొంత మంది ప్రాణాలను సైతం పోగట్టుకున్నారు. మరికొంత మంది చావు దగ్గరకు వెళ్లి ప్రాణాలతో బయట పడ్డారు. ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. అయినా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి మందస్తు హెచ్చరికలు రాలేదు. మరోవైపు అశ్రద్ధ వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ తప్పనిసరని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు కేసులు తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా కరోనా వ్యాపిస్తోంది. మూడు రోజుల క్రితం విశాఖపట్నంలో తొలి కరోనా కేసు నమోదు కాగా, తర్వాత ఒకటి, కడపలో రెండు కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే పలు దేశాలలో వైరస్ పలు వేరియంట్లతో విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పట్టణంలో యథేచ్ఛగా.. పట్టణంలో జనం యథేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రజలు వ్యాధి బారిన పడకుండా ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. ఆదివారం కావడంతో ఫిష్, చికెన్, మటన్ మార్కెట్లు కిటకిటలాడాయి. సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా తిరుగుతున్నారు. వ్యాధి లక్షణాలు.. పొడి దగ్గు, గొంతు నొప్పి, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రుచి, వాసన గుర్తించలేకపోవడం మొదలైనవి. జాగ్రత్తలు.. వ్యాధి లక్షణాలు గమనిస్తే వెంటనే సమీపంలోని ఉన్న పీహెచ్సీ, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి తెలియజేయాలి. వారి ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. చేతులపై ఉన్న హానికారక క్రిములను తొలగించుకోవడానికి శాసీ్త్రయమైన పద్ధతిలో చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి. సబ్బు నీరు, ఆల్కహాల్ శానిటైజర్లను ఉపయోగించుకొని చేతులను ఎప్పటికప్పుడు రుద్దుకోవాలి. చేతులతో ముఖం, నోరు, కళ్లు, ముక్కును తాకరాదు. బహిరంగ ప్రదేశాలలో, పని ప్రదేశాలలో తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. అత్యవసరమైతేనే ఆస్పత్రులకు వెళ్లాలి. వీలైనంత వరకు ఇంటి వద్దనే ఉండాలి. ఎక్కడా గుంపులుగా ఉండరాదు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ తప్పనిసరి ముందస్తుగా ఎన్టీఆర్ ఆస్పత్రిలో 10 బెడ్లు సిద్ధం కరోనా చికిత్సపై ప్రభుత్వం నుంచి విడుదల కాని మార్గదర్శకాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.. కరోనా కేసులు మళ్లీ వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆస్పత్రిలో ఇప్పటికే 10 బెడ్స్ను సిద్ధం చేశాం. ఆక్సిజన్ సిలెండర్లు, మందులు కూడా అందుబాటులో ఉంచాం. ముఖ్యంగా ప్రజలందరూ సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరిగా వాడాలి. ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి మార్గదర్శకాలు జారీ కాలేదు. – ఎస్.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్, ఎన్టీఆర్ వైద్యాలయం, అనకాపల్లి -
ఆటో డ్రైవర్ నిజాయితీ
రావికమతం: పోగొట్టుకున్న బంగారు ఆభరణం తిరిగి ఇచ్చిన ఆటోడ్రైవర్ శ్రీనివాస్ నిజాయితీని పలువురు అభినందించారు. కొత్తకోట శాంతి యూనియన్ సభ్యుడు, కొత్తకోట గ్రామానికి చెందిన కొప్పు శ్రీనివాస్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజు కొత్తకోట నుంచి నర్సీపట్నం ప్రయాణికులను తీసుకెళ్లి వస్తుంటారు. 16 రోజుల క్రితం నర్సీపట్నం నుంచి కొత్తకోటకు ప్రయాణికులను తీసుకెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బంగారం లాకెట్ను ఆటోలో జారవిడుకున్నాడు. చివరలో ఆటో డ్రైవర్ శ్రీనివాస్ బంగారం లాకెట్టును గుర్తించి తన వద్ద ఉంచుకున్నాడు. దీనిపై విచారణ అనంతరం చెట్టుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థినిగా నిర్ధారించుకున్నాడు. ఆమె గుంటూరులో చదువుతుండడంతో ఆదివారం యూనియున్ సభ్యులు ఆధ్వర్యంలో ఆమె తండ్రి రాముకు కొత్తకోటలో లాకెట్ను అందజేశారు. -
ఉరేసుకుని యువకుడి మృతి
ఎస్.రాయవరం:ఽ కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మవరం అగ్రహారంలో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు అందించిన వివరాల ప్రకారం.. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన మంచాల రాము(35) గత రాత్రి ధర్మవరం అగ్రహారం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకున్న చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని జేబులో ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో నిత్యం గొడవలు పడేవాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
కోళ్ల వ్యర్థాలతో రూ.కోట్లు
యథేచ్ఛగా రవాణా యలమంచిలి రూరల్: జిల్లాలో కోడి మాంసం వ్యర్థాల వ్యాపారం అక్రమార్కులకు రూ.కోట్లు కురిపిస్తోంది. వీటి సేకరణ,అక్రమ రవాణాపై 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినా,నిత్యం ప్రత్యేక వాహనాలతో వందలాది డ్రమ్ముల కోళ్ల వ్యర్థాలను వ్యాపారులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తున్న కోడి మాంసం వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తున్నారు.చికెన్ వ్యర్థాలను మేతగా తింటున్న చేపలు తక్కువకాలంలో ఎదుగుతున్నాయి. ఈ చేపల్ని తింటున్న ప్రజలు వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా చికెన్ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో పర్యావరణానికి సైతం హానికలుగుతోంది.రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు, వీటిని రవాణా చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, వాహనాలను సీజ్ చేయాలని ఈ నెల 16న డీజీపీ కార్యాలయం నుంచి ఎస్పీలకు,ఈ నెల 21న అనకాపల్లి ఎస్పీ నుంచి జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.అయినప్పటికీ ఈ నెల 25వ తేదీన కూడా యలమంచిలి,అనకాపల్లి,అచ్యుతాపురం,నక్కపల్లి,అడ్డరోడ్డు,నర్సీపట్నం, చోడవరం,పాయకరావుపేట సహా జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు,మేజర్ పంచాయతీల నుంచి కోడి మాంసం వ్యర్థాల అక్రమ రవాణా యథేచ్ఛగా జరగడం గమనార్హం. తమ కళ్లముందే కోడి మాంసం వ్యర్థాలను డ్రమ్ముల్లో వేసి తరలించుకుపోతున్నా అధికారయంత్రాంగం పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మిగతారోజులతో పోల్చితే ఆదివారం కోడి మాంసం వ్యర్థాలు ఎక్కువగా వస్తాయి.ఇది తెలిసినా వివిధ శాఖల అధికారులు మాత్రం తమకెందుకులే అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. అక్రమ ఆర్జనకు అలవాటుపడిన వ్యాపారులు మమ్మల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు దర్జాగా వాహనాల్లో చికెన్ వ్యర్థాలను తరలించుకుపోతున్నారు. నెలకు 2వేల టన్నుల కోళ్ల దిగుమతి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సుమారు 2,100 వరకు కోడి మాంసం విక్రయ కేంద్రాలున్నాయి.నిత్యం 60 టన్నుల కోళ్లు,ఆదివారం ఒక్కరోజే 100 నుంచి 120 టన్నుల కోళ్లను చికెన్ షాపుల నిర్వాహకులు దిగుమతి చేసుకుంటున్నారు.ప్రతి నెల సుమారు 2వేల టన్నుల వరకు కోళ్లు దిగుమతి అవుతున్నాయి.చికెన్ షాపుల్లో మాంసం విక్రయించగా మిగతా చర్మం,పేగులు,కాళ్లు,ఇతర వ్యర్థాలను షాపుల నిర్వాహకుల దగ్గర్నుంచి కిలో రూ.3 నుంచి రూ.5 వరకు కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పెద్ద షాపుల నిర్వాహకుల నుంచి వ్యర్థాలను కొనుగోలు చేస్తుండగా,చిన్న దుకాణాల నిర్వాహకులు ఉచితంగానే అందజేస్తున్నారు.ఇలా సేకరించిన చికెన్ వ్యర్థాలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని చేపల చెరువుల వ్యాపారులకు కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.కొందరు చేపల చెరువుల వ్యాపారులే నేరుగా చికెన్ వ్యర్థాలను డ్రైవర్లు,సహాయకులను నియమించుకుని తరలిస్తున్నారు.ఒక కిలో కోడి మాంసం నుంచి సుమారు 250 నుంచి 300 గ్రాముల చికెన్ వ్యర్థాలు వస్తాయి.జిల్లాలో ప్రతి నెలా దిగుమతి చేసుకుంటున్న కోళ్ల ద్వారా 600 టన్నుల వరకు వ్యర్థాలు వస్తున్నాయి. వ్యాపారులు ఒకసారి వాహనంలో 9 డ్రమ్ముల వ్యర్థాలు తీసుకెళ్తున్నారు.ఒక్కో డ్రమ్ములో 150 నుంచి 200 కిలోల వరకు చికెన్ వ్యర్థాలు ఉంటున్నాయి. ఒకసారి వాహనంలో చికెన్ వ్యర్థాలను తరలిస్తే ఆ వ్యాపారికి అన్ని ఖర్చులూ మినహాయించుకుంటే రూ.18వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం వస్తోంది.ఈ లెక్కన నెలకు రవాణా అవుతున్న 2వేల టన్నుల చికెన్ వ్యర్థాలతో సుమారు రూ.60 లక్షల వరకు ఆదాయాన్ని ఈ అక్రమ వ్యాపారం ద్వారా కొందరు సంపాదిస్తున్నారు. ఏటా రూ.7 కోట్లపైనే వెనకేసుకుంటున్నారు.ప్లాస్టిక్ డ్రమ్ములో చికెన్ వ్యర్థాలు యలమంచిలిలో ఆదివారం తరలిస్తున్న కోడి మాంసం వ్యర్థాలు చేపలకు మేతగా చికెన్ వ్యర్థాలు భారీగా ఆర్జిస్తున్న అక్రమార్కులు ప్రమాదంలో ప్రజారోగ్యం,పర్యావరణం కేసులు నమోదు చేయాలని డీజీపీ,ఎస్పీ తాజా ఆదేశాలు ఫిర్యాదులున్నా పట్టించుకోని అధికారులు వ్యర్థాల రవాణా నిషేధం చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా,చేపలకు మేతగా వినియోగించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ,మత్స్య శాఖలు 2005లో జీవో ఎంఎస్ 54, 2016లో జీవో ఎంఎస్ 56లను విడుదల చేశాయి.చికెన్ వ్యర్థాల రవాణాను కట్టడి చేయడానికి మండల స్థాయిలో తహసీల్దార్ చైర్మన్గా,వీఆర్వో,రవాణా, స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సభ్యులుగా,మత్స్య అభివృద్ధి అధికారి మెంబర్ కన్వీనర్గా కమిటీని నియమించారు.అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా నిరాంటంకంగా సాగుతోంది. నెల రోజుల క్రితం కొందరు మీడియా ప్రతినిధులు యలమంచిలి పట్టణంలో చికెన్ వ్యర్థా లను తరలిస్తున్న వాహనాన్ని ఆపితే.. వాహనాన్ని ఆపే అధికారం మీకు లేదని, పోలీసులకు ఫిర్యాదు చేస్తా నని సదరు వ్యాపారి మీడియా ప్రతినిధులనే తిరిగి బెదిరించేలా మాట్లాడడం వెనుక ఆంతర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా చికెన్ వ్యర్థాలను వ్యాన్లలో తరలిస్తున్నా ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయస్థితి నెలకొంది. నిత్యం చికెన్ వ్యర్థాల వాహనాలు వెళ్తుంటే ముక్కుపుటాలు అదిరేలా వచ్చే దుర్వాసనను ప్రజలు భరించాల్సిన దుస్థితి ఉంటోంది. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు యలమంచిలి నియోజకవర్గంలో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 19న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా కలెక్టర్కు ఫిర్యాదు చేశాను.చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలించి పక్క జిల్లాల్లోని చెరువుల్లో చేపలకు మేతగా ఉపయోగిస్తున్నారు.ఇది ప్రజారోగ్యానికి చాలా హానికరం.నేనిచ్చిన ఫిర్యాదుకు జవాబుగా చర్యలు తీసుకున్నట్టు జిల్లా మత్స్యశాఖాధికారి నుంచి సమాచారం వచ్చింది. అయితే ఆదివారం యలమంచిలిలో యఽథావిధిగా చికెన్ వ్యర్థాలను తరలించారు. దీనికి సంబంధించి ఫొటోలు,వీడియోలను జిల్లా మత్స్య శాఖాధికారికి వాట్సాప్ ద్వారా పంపించాను.స్పందన లేదు.అధికారుల చర్యలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి.చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా పూర్తిగా కట్టడి చేయడానికి కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై ఉంది. – చాకలి నూకరాజు, ఆర్టీఐ కార్యకర్త,జంపపాలెం కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లాలో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటాం.అన్ని శాఖల అధికారులతో టాస్క్ఫోర్స్ కమిటీలు వేసుకుని రహదారులపై చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచుతాం.చికెన్ వ్యర్థాలను చేపలకు మేతగా వేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది.చికెన్ వ్యర్థాలతో పెరిగిన చేపలు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎస్పీతో చర్చించి చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం. – వి.ప్రసాద్, జిల్లా మత్స్యశాఖాధికారి,అనకాపల్లి డీజీపీ,ఎస్పీ ఆదేశాలు బేఖాతర్ చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా,వాటిని చెరువుల్లో చేపలకు మేతగా ఉపయోగించడాన్ని సీరియస్గా పరిగణించిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆదేశాలతో గత మార్చి నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహించి, చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాలు, అందుకు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు,నగరాల సీపీలకు ఆదేశాలు వచ్చాయి. చికెన్ వ్యర్థాలు వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు,పర్యావరణం,పరిశుభ్రత దెబ్బతింటాయని, చట్టపరమైన నిబంధనలను అతిక్రమిస్తున్న అక్రమార్కులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. చికెన్ వ్యర్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఏఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయవచ్చో స్పష్టంగా తెలియజేశారు.ఈ ఆదేశాలకు అనుగుణంగా వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ నెల 21న మెమో పంపారు. పోలీసు ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలను సైతం క్షేత్రస్థాయిలో యంత్రాంగం బేఖాతరు చేస్తోంది.ఆదివారం జిల్లా వ్యాప్తంగా చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా మామూలుగానే జరగడం దీనికి నిదర్శనం. ఇప్పటి వరకు చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న వ్యాపారులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఒక్క వాహనాన్ని కూడా అధికారులు సీజ్ చేయలేదు. పోలీసు,ఇతర శాఖల ఉన్నతాధికారుల ఆదేశాలే క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకాకపోవడంతో సామన్య ప్రజలు తమ కళ్లెదురుగా చికెన్ వ్యర్థాల రవాణా జరగడం చూస్తున్నా ఫిర్యాదు చేయడానికి సైతం వెనకాడే పరిస్థితులు ఉంటున్నాయి. -
గందరగోళంగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ
● ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు నర్సీపట్నం: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చాలా గందరగోళంగా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. నర్సీపట్నం వచ్చిన సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బదిలీలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలంటే రేషనలైజేషన్ ప్రక్రియతో ముడి పెట్టకూడదని చెప్పారు. ఒకసారి రేషన్లైజేషన్ జరిగిన తర్వాత కనీసం ఐదేళ్ల వరకు ఉపాధ్యాయులను కదపకూడదన్నారు. ఐదేళ్ల తర్వాత మాత్రమే రేషన్లైజేషన్ ప్రక్రియ జరపాలని తెలిపారు. అలా అయితేనే విద్యార్థుల సంఖ్య పెంచే అవకాశం ఉపాధ్యాయులకు కలుగుతుందని చెప్పారు. మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాలకు రెండు పాయింట్లు అదనంగా ఇవ్వాలన్నారు. 2021లో బదిలీపై వచ్చి 2025లో రేషన్లైజేషన్ గురైన ఉపాధ్యాయులకు కూడా పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వాల ని కోరారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా డీఎస్పీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు సర్వీసు పాయింట్లు ఇవ్వాలన్నారు. బదిలీలకు సంబంధించి ఆన్లైన్లో తలెత్తిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. నర్సీపట్నం మండలంలో ఫౌండేషన్ స్కూళ్లుగా ఉన్న శ్రీరాంపురం, గచ్చపు వీధి పాఠశాలలను తిరిగి బేసిక్ ప్రైమరీ పాఠశాలలుగా మార్చి, ఆ ప్రాంత విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విద్యాశాఖాధికారులను కోరారు. విలేకరుల సమావేశంలో ఉమ్మడి జిల్లా పీ ఆర్టీయూ అధ్యక్షుడు డి.గోపీనాఽథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు మడ్డు శ్రీను, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, రాష్ట్ర కార్యదర్శి జి.పి.ఎస్.నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగాయూపీఎస్సీ పరీక్షలు
మహారాణిపేట(విశాఖ): విశాఖ జిల్లాలో ఆది వారం నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (యూపీఎస్సీ)సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ప్రశాంతంగా నిర్వహించారు. ఈ పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసింది. మొత్తం 8,422 మంది విద్యార్థులకు కోసం 19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సెషన్ పరీక్షకు 8,422 మందిలో 4,523 మంది పరీక్షకు హాజరయ్యారు. రెండో సెషన్ పరీక్షకు(మధ్యాహ్నం) 8,422 మందికి 4.496 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం ఇద్దరు పరిశీలకులను నియమించారు. యూపీపీఎస్ నుంచి ఒక పరిశీలకుడుగా డైరెక్టర్ పట్నాయక్ను, రాష్ట్ర పరిశీలకులుగా సీనియర్ ఐఎస్ఎస్ అధికారి అహ్మద్ బాబు, జిల్లా కో ఆర్డినేటర్ మయూర్ అశోక్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ స్థానికంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు. -
యోగాంధ్రతో మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం
మునగపాక: యోగాంధ్ర పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి ఆరోపించారు.మండలంలోని తిమ్మరాజుపేట డావెన్సీ అంతర్జాతీయ పాఠశాలలో రెండవ రోజు జరిగిన మహిళా చైతన్య శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే యోగాంధ్ర కార్యక్రమాన్ని తెరపైకి తీసుకువస్తున్నారన్నారు.కడపలో మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి, హత్య చేస్తే సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత స్పందించకపోవడం విచారకరమన్నారు.రాష్ట్రంలో మహిళలపైనా, చిన్నారులపైనా ఇటువంటి ఘటనలు అధికంగా జరుగుతున్నా పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు ప్రభావతి మాట్లాడుతూ ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమికి గుణపాఠం తప్పదని తెలిపారు. హక్కులను కాపాడుకునేందుకు మహిళలు రాజీలేని పోరాటం చేయాలన్నారు.ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం, ప్రధాన కార్యదర్శి డి.డి. వరలక్ష్మి, ఆర్.లక్ష్మి,వాణి, జి.సుభాషిణి, సీహెచ్ మంగతాయారు, సత్యవతి,గౌరీ, సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. -
ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం తగదు
● ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మునగపాక: కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం విచారకరమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇంటింటికీ రేషన్ అందించేలా ఎండీయూ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తే, ఇప్పటి ప్రభుత్వం ఈ పథకానికి మంగళం పాడడం సరికాదన్నారు.సీఎం చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ధి ఉంటే కేరళలో మాదిరిగా 16 రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచన చేసి ఎండీయూ వ్యవస్థ కొనసాగేలా చూడాలన్నారు. గత ప్రభుత్వంలో 2027 వరకు ఒప్పందం ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు రద్దు చేయడం తగదన్నారు.ప్రజలంతా కూటమి పాలన తీరును గమనిస్తున్నారని ఆయన తెలిపారు. -
యోగాంధ్రను విజయవంతం చేయాలి
అనకాపల్లి: యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని, దీనిలో మాస్టర్ ట్రైనర్ల పాత్ర కీలకమని కలెక్టరు విజయ కృష్ణన్ అన్నారు. స్థానిక గవరపాలెం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో రెండో రోజు ఆదివారం జరిగిన యోగా మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ శిక్షణ తీసుకున్న ట్రైనర్లు గ్రామాల్లో కనీసం 50 మందికి తక్కువ కాకుండా యోగా నేర్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్లో నమోదు కావాలని, ప్రజలు పెద్దఎత్తున యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యే విధంగా అవగాహన, ప్రచారం కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యోగా చేసేవిధంగా ప్రోత్సహించాలని, యోగాతో ఆరోగ్యం లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి కె.మనోరమ, జిల్లా ఆయుష్ అధికారి కె.లావణ్య, యోగా మాస్టరు ట్రైనర్లు పాల్గొన్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్ -
అధికారుల నిర్ణయం.. విద్యార్థులకు శాపం
నర్సీపట్నం: విద్యాశాఖ అధికారుల నిర్ణయం.. విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పాఠశాలల విలీన ప్రక్రియలో భాగంగా విద్యాశాఖ అధికారుల తొందరపాటు చర్యలతో కొంత మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. ఒకే పంచాయతీలో ఒకటి నుంచి మూడు పాఠశాలలు ఉంటే వీటిని కలిపి సౌకర్యాలు ఉన్న పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీన ప్రక్రియతో నర్సీపట్నం మండలం, దుగ్గాడ పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురం గ్రామ ఎంపీపీ స్కూల్ విద్యార్థులకు శాపంగా మారింది. ఫౌండేషన్ స్కూల్గా కాకుండా బేసిక్ ప్రైమరీ స్కూల్గా కొనసాగించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడిని గ్రామస్థులు కలిశారు. స్పీకర్ ద్వారా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నారు. దుగ్గాడ పంచాయతీ పరిధిలో దుగ్గాడ, శ్రీరాంపురం ఎంపీపీఎస్ పాఠశాలలతో పాటు సమీపంలో ఉన్న పాతబయపురెడ్డిపాలెం పాఠశాలను విలీనం చేసి, దుగ్గాడ పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చేందుకు అధికారులు మొదట నిర్ణయం తీసుకున్నారు. పాతబయపురెడ్డిపాలెం స్కూల్ మున్సిపాలిటీ పరిధిలో ఉండడంతో విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. దుగ్గాడ, శ్రీరాంపురం పాఠశాలలను యథావిధంగా బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా వదిలేయవలసి ఉండగా శ్రీరాంపురం పాఠశాలను ఫౌండేషన్ స్కూల్ (1, 2 తరగతులు)గా మార్పుచేశారు. అధికారుల అనాలోచిత నిర్ణయంతో 3, 4, 5 తరగతుల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పాఠశాలలో మొత్తం 26 మంది విద్యార్థులు ఉండగా, వీరిలో 3, 4, 5 తరగతుల విద్యార్థులవారు 14 మంది ఉన్నారు. అర కిలోమీటరు దూరంలో ఉన్న దుగ్గాడ స్కూల్లో జాయిన్ చేద్దామంటే రాకపోకలు సాగించేటప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ జాయిన్ చేసినా సింగల్ టీచర్ వల్ల ఒరిగేదిలేదు. విద్యాశాఖ అధికారుల తీరుపై గ్రామస్ధులు మండిపడుతున్నారు. పాఠశాలను కాపాడుకునేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు.పాఠశాలల విలీనంతో చదువుకు అష్టకష్టాలు ఒక విధంగా పాఠశాలను ఎత్తివేయటమే.. విలీనం పేరుతో పాఠశాలను ఎత్తివేయటమే ఇది. అధికారుల తీరుతో 3వ తరగతి చదువుతున్న మా పాప గీతను ఎక్కడ జాయిన్ చేయాలో అర్ధంకాని పరిస్థితి. మిగతా పిల్లలు రోడ్డున పడ్డారు. మేమంతా వ్యవసాయ కూలీలం. ప్రైవేటు పాఠశాలల్లో చదివించుకునే ఆర్ధిక స్తోమత లేదు. ఊళ్లో ఉన్న పాఠశాలను తీసివేయటం సరికాదు. –నల్లబెల్లి రాము, శ్రీరాంపురం -
వ్యక్తిగత ఆరోగ్యంపై పోలీసులు దృష్టి సారించాలి
ఎంవీపీకాలనీ(విశాఖ): పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. విశాఖ జిల్లా ఎంవీపీ కాలనీ మెడికవర్ ఆస్పత్రిలో శనివారం పోలీస్ సిబ్బందికి ఉచిత ఆర్యోగ పరీక్షల శిబిరం నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ రోజువారి విధుల ఒత్తిడిలో పోలీసులు ఆరోగ్య సమస్యలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోషకాలతో కూడిన మితాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ దిశగా వారి కుటుంబ సభ్యులు సైతం సహకారం అందించాలన్నారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికవర్ హాస్పిటల్ సహకారంతో సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 750 మంది ఈ సేవలను వినియోగించుకున్నారన్నారు. గుండె, కిడ్నీ, మామోగ్రఫీ తదితర 13 రకాల పరీక్షలు మెడికర్ హాస్పిటల్, అచ్యుతాపురానికి చెందిన రుషిల్ డెకర్స్ సహకారంతో ఉచితంగా చేసినట్లు చెప్పా రు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ డాక్టర్ సిహెచ్.అరుణ్కుమార్, రుషిల్ డెకర్స్ వైస్ ప్రెసిడెంట్ ఎ.కె.రాయ్, అదనపు ఎస్పీలు దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీటీసీ డీఎస్సీ బి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణను పట్టించుకోని ప్రభుత్వాలు
మునగపాక: మహిళల రక్షణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా రాష్ట్ర నాయకురాలు రమాదేవి అన్నారు. మండలంలోని తిమ్మరాజుపేటలో డావెన్సీ అంతర్జాతీయ పాఠశాలలో శనివారం రాష్ట్ర యువ మహిళల శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి.అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు పలు ప్రాంతాల నుంచి మహిళలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఐద్వా రమాదేవి మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయని చెప్పారు. మహిళలంతా సంఘటితంగా ఇటువంటి సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మూడు రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డావెన్సీ అంతర్జాతీయ పాఠశాల డైరెక్టర్ రమణాజీ, సదాశివరావు,రొంగలి రాము,ఎస్.బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. -
పేదలపై కక్ష రాజకీయాలు
కోటవురట్ల: కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు డి.వి.సూర్యనారాయణరాజు ధ్వజమెత్తారు. మండలంలోని గొట్టివాడ జగనన్న కాలనీలో కట్టుమూరి అప్పారావు నిర్మించుకున్న ఇంటిని రెవెన్యూ అధికారులు పాక్షికంగా కూలగొట్టిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, పార్టీ నాయకులు శనివారం ఇల్లును పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ హోం మంత్రి అనిత ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోనే పేదలపై కక్షా రాజకీయాలు చేయడం దారుణమన్నారు. బాధితుడు స్టేటస్ కో తీసేస్తే ఇల్లు కట్టుకోవచ్చని నమ్మించి ఇప్పుడు పాక్షికంగా కూలగొట్టారని ఆరోపించారు. బాధితుడి తరపున న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ సెల్ అధ్యక్షుడు పైల రమేష్, పార్టీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ సుంకపూరుకు చెందిన టీడీపీ నేత సుమారు రూ.కోటి విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టడాలు నిర్మిస్తుంటే చోద్యం చూస్తున్నారన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ సత్యనారాయణరాజు, మాజీ ఎంపీటీసీ యల్లపు కుమారరాజా, పార్టీ గ్రామ అధ్యక్షుడు రాచపతి వెంకటరావు, నాయకులు కట్టుమూరి అప్పారావు, సుంకర గిరి, నాగేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు -
2న ‘ఆపరేషన్ కగార్ లోగుట్టు’పై జిల్లా సదస్సు
అనకాపల్లి టౌన్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ లోగుట్టు అనే అంశంపైన వచ్చే నెల 2న పట్టణంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన సదస్సు ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సదస్సుకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు వి.ఎస్. కృష్ణ, ఏపీ ఆదివాసీ సంఘం గౌరవ అధ్యక్షుడు పి.ఎస్. అజయ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు. అభ్యుదయవాదులు, విద్యావంతులు, కార్మిక, కర్షకులు హాజరవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
రోడ్డెక్కిన ఎండీయూ వాహనదారులు
కోటవురట్ల: ఎండీయూ వాహనదారులు రోడ్డెక్కా రు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తే కూటమి ప్రభుత్వం రోడ్డున పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఎండీయూ వాహనదారులు శనివారం ఆందోళన చేపట్టారు. ఎండీయూ వాహనాలను స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద నిలిపి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తమను కొనసాగించాలని నినాదాలు చేశారు. వారికి మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు డి.వి.సూర్యనారాయణరాజు సంఘీభావం తెలిపారు. అనంతరం తహసీల్దారు తిరుమలబాబుకు వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు ఇంటికే రేషన్ సరుకులు అందివ్వాలనే ఆశయంతో ఎండీయూ వాహనాలను ప్రవేశ పెట్టిందన్నారు. తద్వారా రాష్ట్రంలో 9,260 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ అమలు చేయకపోగా, గత ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పథకాలను తీసేస్తూ పేదలను ఆర్థికంగా ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. అప్పటి పథకాలను ఏదో రకంగా తీసేసి జగన్ పేరు వినపడకుండా చేయాలని కంకణం కట్టుకుందన్నారు. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనదారులకు ప్రతి నెలా 5వ తేదీలోపు రూ.21 వేలు వేతనం వారి అకౌంట్లలో జమ చేసేదన్నారు. దాంతోనే వెహికల్ ఈఎంఐ కట్టుకుని మిగిలిన డబ్బులతో కుటుంబాలను పోషించుకునేవారన్నారు. ఎండీయూ వాహనదారులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక, పది నెలలుగా వేతనాలు కూడా సక్రమంగా చెల్లించలేదన్నారు. పదో తేదీ తరువాత చెల్లించడం వల్ల చెక్ బౌన్స్ అయ్యి సిబిల్ స్కోర్ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ నెలలో తమ ప్రమేయం లేకుండానే తమ అకౌంట్లలోని వేతనంలో రూ.8 వేలు తీసేసుకుందని ఆరోపించారు. ఎప్పటిలానే ఈ పథకాన్ని కొనసాగించి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ సత్యనారాయణరాజు, వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పైల రమేష్, పార్టీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉమ్మలాడలో ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ శ్రేణులు మునగపాక: ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ సరుకులను ఇంటింటికీ సరఫరా చేస్తున్న ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని జెడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ ప్రశ్నించారు. మండలంలోని ఉమ్మలాడ జాతీయ రహదారిపై శనివారం వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. వలంటీర్ వ్యవస్థను తొలగించి వారిని మోసం చేసిందన్నారు. ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి రేషన్ అందిస్తుంటే, దాన్ని తొలగించి డిపోల వద్దకు వెళ్లి రేషన్ తీసుకునేలా పూనుకోవడం తగదన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్రెడ్డి తిరిగి సీఎం కావడం తథ్యమన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు పిల్లి అప్పారావు, ఎంపీటీసీలు మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, బొడ్డేడ బుజ్జి, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు బొడ్డేడ లిల్లి, పార్టీ నేతలు బొడ్డేడ బుజ్జి, మొల్లేటి వినోద్, మురళి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ -
డిగ్రీ ఫలితాల్లో నర్సీపట్నం విద్యార్థులకు ఫస్ట్, సెకండ్ ర్యాంకు
నర్సీపట్నం: ఏయూ డిగ్రీ ఫలితాల్లో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాంక్లు సాధించారు. బీకామ్ విద్యార్థి చీమల దుర్గాప్రసాద్ ఆంధ్రా యూనివర్సిటీ మొదటి ర్యాంక్, మరో విద్యార్థిని అనిమిరెడ్డి సత్యాహేమలత రెండో ర్యాంకు సాధించారు. వీరితోపాటు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని జూనియర్ విద్యార్థులు కళాశాలలో సౌకర్యాలను వినియోగించుకుని కష్టపడి చదివి మంచి ర్యాంక్లు సాధించాలని సూచించారు. ఫలితాలపై కామర్స్ విభాగంతో పాటు మిగిలిన అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. బీఎస్సీ విభాగంలో పాయకరావుపేట విద్యార్థినికి 2వ ర్యాంక్ పాయకరావుపేట: ఆంధ్ర విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల విద్యార్థిని మాకిరెడ్డి జయంతి బీఎస్సీ విభాగంలో యూనివర్సిటీ 2వ ర్యాంక్, జిల్లా మొదటి ర్యాంకు సాధించింది. బీబీఏ విభాగంలో నక్కా సారా జిల్లా 2వ ర్యాంకు, సయ్యుద్ గుల్ఫీషాన్, మద్దూరి కాశీ అన్నపూర్ణ జిల్లా 3వ ర్యాంక్ సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు ఎ.రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
దారీ తెన్నూ లేని పాలన!
అడుగుకో గుంత.. హామీలు గోవింద రహ‘దారి’ద్య్రం ● అవి రోడ్లు కాదు.. నరకదారులు ● సంక్రాంతి నాటికి గోతులు లేని రహదారులుగా తీర్చిదిద్దుతామనిసీఎం ప్రకటన ● నాలుగు నెలలు దాటినా అదే దుస్థితి ● వర్షాలతో చిత్తడిగా మారుతున్న రోడ్లు సాక్షి, అనకాపల్లి: గుంతలు పూడ్చడమే కాదు ఆర్ అండ్బీ, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కొన్ని చోట్ల కొత్త రోడ్లు కూడా వేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. కొత్త రోడ్ల మాట దేవుడెరుగు.. జిల్లాలో గుంతలనే పూడ్చిన పాపానపోలేదు. మూడు జిల్లా కేంద్రాలను అనుసంధానిస్తూ ఉన్న ప్రధాన రహదారి రోలుగుంట– చోడవరం రోడ్డులో అడుగుకో గుంత ఏర్పడి.. వాహనచోదకులకు ప్రాణాంతకంగా మారాయి. మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల్లోని గిరిజన గ్రామాల రహదారులు మరింత దారుణంగా ఉన్నాయి. దేవరాపల్లి నుంచి గిరిజన పంచాయతీ వాలాబు వెళ్లే రోడ్డులో సుమారు 10 కిలోమీటర్ల మేర అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడ్డాయి. 14 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి మరింత తీసికట్టుగా ఉంది. తాండవ రిజర్వాయరుకు వెళ్లే మార్గం గుంతలు గుంతలుగా అధ్వానంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హోం మంత్రి అనిత శంకుస్థాపన చేయగా ఐదు దఫాలుగా పనులు మొదలు పెట్టి ఆపేశారు. ఇందేశమ్మవాక రోడ్డుపై ప్రయాణం నరకప్రాయం. అనకాపల్లి, కశింకోట మండలాల్లో ప్రధానంగా అనకాపల్లి–మామిడిపాలెం, పాపయ్యసంతపాలెం, మార్టూరు, రేబాక, కొప్పాక, తోటాడ రోడ్డు, కుంచంగి, తగరంపూడి,వెంకుపాలెం పంచాయతీ పరిధిలో వేసిన రహదారులు నాణ్యత లేని కారణంగా పూడ్చిన రెండు నెలల్లోనే మళ్లీ గుంతలుగా దర్శనమిచ్చాయి. ‘సాక్షి’ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్టులో జిల్లాలోని రహదారులు, వాటిపై గోతులు, ఆ రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజల అవస్థలు వెలుగు చూశాయి. భారీ గోతులతో ఛిద్రమైన దేవరాపల్లి–వాలాబు రోడ్డుసీ కేటగిరి రోడ్లు టెండర్ దశలో ఉన్నాయి.. జిల్లాలో ఆర్అండ్బీ విభాగం నుంచి ఏ– కేటగిరిలో 123 పనులకు రూ.5.43 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అవి మొత్తం పూర్తయిపోయాయి. ఎన్డీబీ రోడ్లు కాకుండా మిగతావి మూడు కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరి లో అత్యవసరంగా రోడ్లకు ప్యాచ్ వర్కు చేసేవి. బీ– కేటగిరిలో స్టెచ్లు పోయిన రోడ్లు, సీ–కేటగిరిలో బాగా పాడైపోయిన రోడ్లు, ప్యాచ్ వర్క్స్తో పూర్తికానటువంటివి. ప్రస్తుతం ఏ–కేటగిరిలో మంజూరైన 123 పనులు మరమ్మతు పనులు పూర్తయ్యాయి. బీ–కేటగిరి, సీ–కేటగిరిలో ఉన్న రోడ్ల పనులు టెండర్ దశలో ఉన్నాయి. రోలుగుంట–చోడవరం రోడ్డు ఎన్డీబీ రోడ్డు. దీనికి కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. టెండర్ ప్రక్రియ అంతా గతంలోనే పూర్తయింది. – ఎస్.ఆర్.ఎన్.వి రమేష్, ఆర్ అండ్ బీ ఈఈ, అనకాపల్లి జిల్లా -
భవిష్యత్ అవసరాలు తీరేలా పథకాల రూపకల్పన
తుమ్మపాల: ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్–2047, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం స్వర్ణాంధ్ర–2047 సాధించే లక్ష్యంతో పనిచేయాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయ కృష్ణన్తో కలిసి ఆయన శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 15 శాతం ఆర్ధికాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందించాలన్నారు. జిల్లా పరిధిలో ఇప్పుడున్న సవాళ్లను అధిగమించి ‘వికసిత అనకాపల్లి జిల్లా’గా తీర్చిదిద్దాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిదినాల కల్పన, మెటీరియల్ కాంపొనెంట్లో లక్ష్యాన్ని మించి పనిచేసినందుకు అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. కేంద్ర పథకాల అమలు తీరుతోపాటు, పర్యాటక రంగం అభివృద్ధి, ఆరోగ్యం కోసం చక్కెర స్థానంలో వినియోగించే విధంగా తాటి బెల్లం, ఆర్గానిక్ బెల్లం ఉత్పత్తిలో అనకాపల్లి జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ కల్పించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయన్నారు. విస్తృత ప్రచారం కల్పించాలి స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 20 సూత్రాల అమలు కార్యక్రమం గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. గ్రామాల్లో రోడ్ల పనులు పూర్తయ్యాక సాగునీటి కాలువల లైనింగు పనులు చేపట్టాలన్నారు. జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్ల కింద నుంచి నీటి పైపులు వేయడానికి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. అనంతరం మీడియా సమావేశంలో పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, పి.వి.జి.కుమార్, మళ్ల సురేంద్ర, కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ ఈర్లె శ్రీరామ్మూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, హౌసింగు పీడీ వై.శ్రీనివాస్, డ్వామా పీడీ ఆర్. పూర్ణిమాదేవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 15 శాతం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించాలి అనకాపల్లికి తాటి బెల్లం, ఆర్గానిక్ బెల్లం బ్రాండ్ ఇమేజ్ ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ -
కూటమి నేతల చేతివాటం
ప్రమాదకరంగా ఇందేశమ్మవాక రోడ్డు గొలుగొండ: ఏఎల్ పురం నుంచి కొంకసింగి రోడ్డు మూడు కిలోమీటర్లు. ఈ రోడ్డు మరమ్మతులకు రూ.లక్షా 25 వేలు ఖర్చు చేయగా కొంతకాలానికే రోడ్డు పెచ్చులూడిపోయింది. చీడిగుమ్మల నుంచి పుత్తడిగైరంపేట రోడ్డు మరమ్మతులకు రెండు లక్షల వరకు ఖర్చు చేయగా చాలా చోట్ల మళ్లీ పాడయింది. అయ్యన్నపాలెం నుంచి కరక వరకు సుమారుగా 9 కిలోమీటర్లకు రెండు లక్షల వరకు పనులు చేయగా రోడ్డు మరమ్మతులు సరిగా జరగలేదు. గొలుగొండ నుంచి ప్రముఖ ముఖ్యక్షేత్రం దారమఠం శివాలయం రోడ్డుకు మరమ్మతులు లేక భక్తులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి: అనకాపల్లి మండలంలో గత ఏడాది డిసెంబర్లో తొమ్మిది రహదారులపై సుమారు రూ.72 లక్షలతో గోతులను పూడ్చారు. కూటమి నేతల చేతివాటంతో రెండు మాసాల్లోనే మళ్లీ గుంతలు ప్రత్యక్షమయ్యాయి. మండల పరిధిలో 50 కిలోమీటర్ల మేరకు అనకాపల్లి–మామిడిపాలెం, పాపయ్యసంతపాలెం, మార్టూరు, రేబాక, కొప్పాక, తోటాడ రోడ్డు, కుంచంగి, తగరంపూడి, వెంకుపాలెం పంచాయతీ పరిధిలో వేసిన రహదారులు ఛిన్నాభిన్నంగా ఉన్నాయి. నాతవరం: స్పీకరు అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గంలోనే రోడ్ల పరిస్థితి తీసికట్టుగా ఉంది. నాతవరం గ్రామం నుంచి తాండవ రిజర్వాయరు రోడ్డు సుమారుగా 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇది తాండవ రిజర్వాయరును మూడు మండలాలను కలిపే ప్రధాన రోడ్డు. నాతవరంతోపాటు గొలుగొండ మండలం, అల్లూరి సీతారామకాజు జిల్లాలోని కొయ్యూరు మండలానికి కూడా ఈ రహదారి ఉపయోగపడుతుంది. ఈ రోడ్డు పెద్ద గోతులు పడి ప్రమాదకంగా మారింది. ఎన్నికల సమయంలో రోడ్డుపై ఎన్నో హామీలిచ్చిన అయ్యన్నపాత్రుడు అధికారంలోకి వచ్చాక ఈ రోడ్డును పట్టించుకోలేదు.ఎస్.రాయవరం: ఇందేశమ్మవాక రోడ్డుపై భయం భయంగా ప్రయాణం సాగించాల్సి వస్తోందని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత రోడ్డు విస్తరణకు 8 నెలల క్రితం శంకుస్థాపన చేశారు. అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల మండలం రామచంద్రపురం వరకు రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంది. అప్పటినుంచి కాంట్రాక్టరు పలుమార్లు పనులు చేపట్టి నిలిపివేయడంతో రోడ్డంతా గతుకులు మయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గోతుల్లో నీరు చేరి చెరువుల్లా దర్శనమిస్తున్నాయి.ఆ రోడ్డుపై ద్విచక్ర వాహన చోదకులు పల్టీలు కొడుతున్నారు. మూన్నాళ్ల ముచ్చట -
బాబా అణు పరిశోధన కేంద్రంలో మాక్ డ్రిల్
అచ్యుతాపురం రూరల్: గడిచిన రెండు రోజులుగా బాబా అణు పరిశోధన కేంద్రంలో ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. ఎస్పీ తుహిన్ సిన్హా సూచనల మేరకు డీఎస్పీలు బి.కృష్ణ, బి.మధుసూదనరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. రాంబిల్లి సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం బార్క్లో అకస్మాత్తుగా ఎప్పుడైనా తీవ్రవాదులు దాడి చేసినప్పుడు సంసిద్ధతతో ప్రతి స్పందన వ్యూహాలను అంచనా వేయడానికి మాక్ డ్రిల్ నిర్వహించారన్నారు. ఉగ్రవాద దాడి సమయంలో పోలీస్, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశామన్నారు. బార్క్ అధికారి ఎన్విడి ప్రసాద్, ఆర్ఐ వరప్రసాద్, ఆర్ఐ రామ్మోహన్, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇంటి నుంచి పరారైన ముగ్గురు బాలురు క్షేమం
ఎస్.రాయవరం : ఇంటినుంచి పరారైన ముగ్గురు బాలురను సికింద్రాబాద్లో పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించినట్టు అడ్డురోడ్డు సీఐ ఎల్.రామకృష్ణ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివి. దార్లపూడి గ్రామానికి చెందిన గొన్నా వెంకట నితిన్ పుట్టినరోజు వేడుక చేసుకునేందుకు అదే గ్రామానికి చెందిన 6వ తరగతి చదువుతున్న స్నేహితుడు చంద్రశేఖర్తో కలిసి ఈ నెల 20న చినగుమ్ములూరు వెళ్లారు. చినగుమ్ములూరులో మరో స్నేహితుడు 8వ తరగతి చదువుతున్న గుడాల పండుతో కలిసి ట్రైన్లో విశాఖపట్నం వెళ్లారు. విశాఖ బీచ్లో కేక్ కట్ చేసుకుని పుట్టినరోజు జరుపుకొన్నారు. ఇంట్లో చెప్పకుండా వెళ్లి పోయిన నితిన్కి తండ్రి నాగేశ్వరరావు పదేపదే ఫోన్ చేసినప్పటికీ నితిన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కడ నుంచి విశాఖ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ వెళ్లారు. ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చయిపోవడంతో చేతిలో సెల్ఫోన్ అమ్మివేసి ఆ డబ్బులు కూడా ఖర్చు చేశారు. తిరిగి వచ్చేందుకు వీలుకుదరక సిక్రిందాబాద్లో ఉండిపోయారు. రెండు రోజుల పాటు తమ కుమారుడు ఆచూకీ తెలియకపోవడంతో నితిన్ తండ్రి ఎస్.రాయవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు దర్యాప్తు జరిపి మైనర్ బాలురు ముగ్గురూ సికింద్రాబాద్లో ఉన్నట్టు గుర్తించి వారిని పట్టుకున్నారు. శనివారం వారిని తల్లిదండ్రులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
అచ్యుతాపురం సైబర్ కేసు సీఐడీకి అప్పగింత!
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం కేంద్రంగా అంతర్జాతీయ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ఈ కేసులో మరింత పురోగతి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కేసు అమెరికాతో పాటు వివిధ దేశాలతో ముడిపడి ఉన్నందున మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు కేసు సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో సీఐడీ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ప్రటించాల్సి ఉంది. నిందితులను పట్టుకున్న పవన్ రెసిడెన్సీని ఈ నెల 22న సీఐడీ ఎస్పీ సందర్శించినట్టు సమాచారం. కింగ్ పిన్ హైదరాబాద్ ఓల్డ్సిటీలో.. అంతర్జాతీయ పరిశ్రమలు ఉండే అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో అంతర్జాతీయ సైబర్ కార్యకలాపాలు నిర్వహించే సైబర్ డెన్కు సంబంధించి కింగ్పిన్ హైదరాబాద్ ఓల్డ్సిటీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సైబర్ కాల్ సెంటర్లో పనిచేసే ఉద్యోగులను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న ఓ వ్యక్తి ద్వారా రిక్రూట్ చేసి మ్యాన్పవర్ను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. పవన్ రెసిడెన్సీలో ఉన్న కాల్సెంటర్లో పనిచేసే ఉద్యోగుల్లో కొంత మందిని గుజరాత్ రాష్ట్రంలో రిక్రూట్ చేస్తే..మరికొందరినీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ వేదికగా రిక్రూట్ చేసి పంపించినట్లు తెలుస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలని చెప్పి ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యత ఉన్న యువతీ,యువకులను రిక్రూట్ చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో లోతైన విచారణ -
26 నుంచి సత్యసాయి ప్రేమ రథయాత్ర
దేవరాపల్లి: అనకాపల్లిలో జిల్లాలో ఈ నెల 26 నుంచి సత్యసాయి ప్రేమ రథయాత్ర నిర్వహించనున్నట్టు సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కశిరెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు దేవరాపల్లిలోని సత్యసాయి మందిరంలో శుక్రవారం మాడుగుల నియోజకవర్గ స్థాయి సత్యసాయి భక్తుల ముఖ్య సమావేశం జరిగింది. సత్యసాయి రఽథయాత్రను ఏయే మార్గాల గుండా నిర్వహించాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ రథయాత్ర దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 24న ప్రారంభమైందన్నారు. నాలుగు ప్రేమ రథాలు దేశమంతా తిరుగుతున్నాయన్నారు. ప్రతి మండలంలోని ప్రధాన మార్గాల మీదుగా ఈ యాత్ర సాగుతుందన్నారు. స్వామి రథం ఊరేగింపు నిర్వహించే మార్గంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అపూర్వ స్వాగతం పలకాలన్నారు. ఈ సమావేశంలో సత్య సాయి సేవా సంస్థల జోన్ ఇన్చార్జి సిహెచ్.వి.రవిశంకర్, సేవాదళ్ ఇన్చార్జి కన్నూరు అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ శాఖకు దివీస్ డ్రోన్లు
విశాఖ సిటీ: దివీస్ ల్యాబ్స్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విశాఖ నగర పోలీస్ శాఖకు రెండు అత్యాధునిక డ్రోన్లను అందజేసింది. ఈ డ్రోన్లను సీపీ శంఖబ్రత బాగ్చికి అందజేశారు. ఈ డ్రోన్లలో హెచ్చరికలు, సూచనలు చేసే లౌడ్స్పీకర్, డే అండ్ నైట్ విజన్ కెమెరా, 5 కిలోమీటర్ల పరిధి, 45 నిమిషాలకు పైగా ఎగిరే సమయం, డిటెక్షన్, రికగ్నిషన్, ఐడెంటిఫికేషన్, లైవ్ స్ట్రీమింగ్ కనెక్టివిటీ, సెర్చ్లైట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు దివీస్ జీఎం వై.ఎస్.కోటేశ్వరరావు, లైజన్ కన్సల్టెంట్ ఎం.ఎన్.వరహాలరెడ్డి, సీఎస్ఆర్ మేనేజర్ డి.సురేష్కుమార్ పాల్గొన్నారు. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధం
విశాఖ విద్య: ఈ నెల 25న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. నగరంలోని 19 పరీక్షా కేంద్రాల్లో 8,424 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో జామర్లు, తాగునీరు, టాయిలెట్లు వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. యూపీఎస్సీ పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, ఏమైనా సమస్యలుంటే తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ (నం. 0891–2590100, 0891–2590102) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో జరుగుతుంది. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, యూపీఎస్సీ డైరెక్టర్ పట్నాయక్ సమావేశంలో పాల్గొన్నారు. -
విభిన్న ప్రతిభావంతుడికి త్రిచక్ర వాహనం వితరణ
తుమ్మపాల: పరిశ్రమలు సేవా దృక్పథంతో సమాజ సేవకు ముందుకు రావాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. అచ్యుతపురం సెజ్లోని టొయోట్సా రేర్ ఎర్త్ జపాన్ కంపెనీ సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన త్రిచక్ర హోండా యాక్టివ్ వాహనాన్ని కలెక్టరేట్ వద్ద శుక్రవారం తూర్రి రవి అనే దివ్యాంగుడికి కంపెనీ ప్రతినిధులతో కలిసి ఆమె అందజేశారు. కలెక్టర్ వినతి మేరకు రావికమతం మండలం రోచుపణుకు గ్రామనికి చెందిన రవికి ఈ వాహనం అందించినట్టు కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సుధాకర్, కంపెనీ క్వాలిటీ కంట్రోల్ హెడ్ ఆర్.రవికుమార్ పాల్గొన్నారు . -
‘రైవాడ’ ఆధునికీకరణ తక్షణ అవసరం
దేవరాపల్లి: స్పిల్వే గేట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో రైవాడ జలాశయానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న అన్నారు. ఈ మేరకు రైవాడ జలాశయ స్పిల్వే గేట్ల ప్రాంతాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైవాడ ప్రాజెక్టు నిర్మించి సుమారు ఐదు దశాబ్దాలు కావస్తుందన్నారు. ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పును ఇరిగేషన్ అధికారులు గుర్తించి, ఆధునికీకరణ కోసం ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రపంచ బ్యాంక్ నిధులు రూ.336 కోట్లతో ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినా అతీగతీ లేదన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత కీలకమైన ప్రాజెక్టు పట్ల పాలకులు నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. ఇప్పటికై నా పాలకులు తక్షణమే స్పందించి ప్రాజెక్టు ఆధునికీకరణకు నిధులు మంజూరు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని వెంకన్న డిమాండ్ చేశారు. -
నేరచరితులపై ప్రత్యేక నిఘా పెట్టండి
అనకాపల్లి: నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ఆయా ప్రాంతాల పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని, పాత కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపర్చాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండిగ్ కేసులు, ఎన్డీపీఎస్ కేసులు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, సాధారణ మరణాలు, ఇతర కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేసుల దర్యాప్తు పురోగతిపై అధికారుల నుంచి సమగ్ర సమాచారం తీసుకొని, కేసుల ఛేదన త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. న్యాయస్థానాల్లో నేరస్తులకు శిక్ష పడేలా పటిష్ట ఆధారాలతో కేసులను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రాత్రి సమయంలో గస్తీలను ముమ్మరం చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ విస్తృతం చేయాలని, రాత్రి సమయంలో రహదారులపై తిరుగుతున్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. డయల్ 112కు వచ్చే కాల్స్కు త్వరగా స్పందించి, శిక్షణతో కూడిన టీమ్లు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు భరోసా కల్పించాలన్నారు. గంజాయి అక్రమ రవాణా పాల్పడుతున్న స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారిని డీ–అడిక్షన్ సెంటర్లలో చేర్పించేలా కుటుంబ సభ్యులను చైతన్యపరచాలన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో యాక్ట్, మహిళా చట్టాలు, సైబర్ నేరాలపై విద్యార్థులలో అవగాహన కల్పించాలన్నారు. పేకాట, కోడి పందేలు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. గ్రామాలను సందర్శించి, నేర ప్రవర్తన గల వ్యక్తుల స్థితిగతులను తెలుసుకోవాలని, ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చైతన్యపరచాలని సూచించారు. అనంతరం వివిధ కేసుల్లో పురోగతి సాధించిన 56 మంది పోలీస్ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి.ఎస్.ఎన్.వి.ప్రసాదరావు, కె.జగదీశ్వరరావు, డీఎస్పీలు బి.మోహనరావు, సీఐలు టి.వి.విజయకుమార్, పి.శ్రీనివాసరావు, ధనంజయరావు, లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, బాల సూర్యరావు, టి.లక్ష్మి, రమేష్, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా -
దళితులకు రక్షణ లేదు
దాడి జరిగి వారం గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయకపోవడం దారుణం. మంత్రి నియోజకవర్గంలో దళితులకు రక్షణ లేదు. అగ్రవర్ణాల వారు దళితులపై దాడి చేశారు. పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ప్రతి విషయంలో బాధితులు మాత్రం దళితులే. దాడులు, అత్యాచారాలు దళితులపైనే జరుగుతున్నాయి. డొంకాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉంది. తక్షణమే 14 మంది నిందితులను అరెస్టు చేయాలి. – సోనీ వుడ్, నాసా సంస్థ డైరెక్టర్ దాడి చేయడం దారుణం సెల్ఫోన్ దొంగిలిస్తే కేసు పెట్టి శిక్షించాలి. కానీ దుర్మార్గంగా కులం పేరుతో దూషిస్తూ కర్రలతో దాడి చేయడం దారుణం. ఫిర్యాదు చేస్తే బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం తగదు. దాడి చేసింది టీడీపీకి చెందిన వారు కావడంతో మంత్రి అనిత అగ్రవర్ణాల వారికి సపోర్టు చేస్తున్నారని భావిస్తున్నాం. నిందితులను అరెస్టు చేయించకుండా రాజీ చేస్తామని చెప్పడం శోచనీయం. డీఎస్పీ విచారణ పారదర్శకంగా లేదు. ముందు అరెస్టు.. తర్వాతే రాజీ చర్యలు. – జె.వి.ప్రభాకర్, డీహెచ్పీఎస్ నేత -
భగ్గుమన్న దళిత సంఘాలు
నక్కపల్లి: ఆవేదన చెందారు.. ఆగ్రహించారు.. దళితులంటే అంత చులకనా అని నిలదీశారు.. ఈ రోజుల్లో కూడా ఇదెక్కడి దారుణమని ప్రశ్నించారు.. డొంకాడ ఘటనపై పలు ప్రజా, దళిత సంఘాలు నక్కపల్లిలో శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శన ఉద్విగ్నంగా సాగింది. సాక్షాత్తూ దళితురాలైన హోం మంత్రి అనిత నియోజకవర్గంలోనే ఈ దారుణం జరగడం, ఆమె కనీసం బాధితుల పరామర్శకు రాకపోవడం వారిని కలచివేసింది. శుక్రవారం దళిత హక్కుల ఐక్యవేదిక, సీపీఎం, సీపీఐ వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది దళితులు నక్కపల్లి జాతీయరహదారిపై భారీ ర్యాలీ, ఆందోళన చేశారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్స్టేషన్ వరకు ర్యాలీ చేసి సీఐ, ఎస్ఐలను కలిసి కేసు నమోదుపై వినతిపత్రాలు అందజేశారు. ఆందోళనకు నాసా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు సోనీవుడ్, డీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకుడు, విశ్రాంత ఆర్జేడీ జేవీ ప్రభాకర్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు నాయకత్వం వహించారు. వారు మాట్లాడుతూ.. వివాహ కార్యక్రమానికి లైటింగ్ పనుల కోసం వచ్చిన 8మంది దళిత యువకులపై సెల్ఫోన్ చోరీ అభియోగం మోపారని, కులం పేరుతో దూషించి కర్రలతో దాడి చేసారన్నారు. 18వ తేదీ రాత్రి పంచాయతీకి పిలిచి లైట్లు ఆర్పేసి తెల్లవార్లు యువకులను కర్రలతో కొడుతూ వేధించారన్నారు. పోలీసులు టీడీపీకి చెందిన అగ్రవర్ణాల వారికి కొమ్ముకాస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కాకుండా, బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రాశారని ఆరోపించారు. పక్షపాత ధోరణిలో డీఎస్పీ విచారణ డీఎస్పీ చేసిన విచారణ పక్షపాతంగా సాగిందని, బాధితులను సమగ్రంగా విచారించలేదన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులంతా హోమ్ మంత్రి దగ్గరకు వెళ్తే తక్షణమే కేసులు నమోదు చేయించి అరెస్టు చేయించకపోగా గ్రామానికి వచ్చి ఇరువర్గాలతో చర్చలు జరిపి రాజీ కుదురుస్తానని చెప్పడం శోచనీయమన్నారు. అవసరమయితే నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తికి వినతి పత్రం అందజేశారు. డొంకాడ దాడి కేసు నిందితులను అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం హోం మంత్రి నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదని ఆవేదన వందలాది మందితో జాతీయ రహదారిపై భారీ ర్యాలీ చర్యలు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక -
విమ్స్లో కోవిడ్ ప్రత్యేక వార్డు
ఆరిలోవ: నగరంలో కోవిడ్ కలకలం రేపుతుండటంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో శుక్రవారం 20 పడకలతో కూడిన ప్రత్యేక కోవిడ్ వార్డును సిద్ధం చేశారు.విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు వార్డును పరిశీలించి, పడకలు, ఆక్సిజన్ యంత్రాలను తనిఖీ చేశారు. కొత్త కోవిడ్ వేరియంట్లైన జేఎన్–1, ఎల్ఎఫ్7, ఎన్బీ 1.8 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ పరీక్షల కోసం రాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, పాజిటివ్ వస్తే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపిస్తామని తెలిపారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని, సామూహిక కార్యక్రమాలలో పాల్గొనవద్దని, వృద్ధులు, గర్భిణులు ఇళ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు. మాస్కులు, శానిటైజర్లు వాడాలని కోరారు. -
నేర పరిశోధనలో నేడు మూడో నేత్రం ప్రాధాన్యం పెరిగింది. కొత్త తరహా నేరాలను సైతం సీసీ కెమెరాల సాయంతో పోలీసులు ఇట్టే ఛేదిస్తున్నారు. దీంతో బాధితులకు త్వరగా ఊరట కలగడమే కాకుండా.. నిందితుల వెన్నులో వణుకు పుడుతుంది. క్రైం రేటు తగ్గుతుంది. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఆ
సాక్షి, అనకాపల్లి: ఒక కెమెరా వందమంది పోలీసులతో సమానమని చెప్పడమే గానీ వీటి నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో, పార్లమెంట్ సభ్యుడి అధ్యక్షతన జరిగిన దిశ సమావేశంలో జిల్లావ్యాప్తంగా 2 వేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. రెండు నెలలు దాటినా ఎలాంటి పురోగతి లేదు. సీసీ కెమెరాల రూపంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా తగినన్ని ఏర్పాటు చేయకపోవడంతో జిల్లాలో నేరాల సంఖ్య అదుపులోకి రావడం లేదు. జిల్లా కేంద్రమైన అనకాపల్లి మినహా ప్రధాన పట్టణాల్లో సీసీ కెమెరాల నిఘా కరువైంది. అంతర్జాతీయ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పరవాడ–రాంబిల్లి–అచ్యుతాపురం సెజ్లో సీసీ కెమెరాలే ఏర్పాటు చేయలేదు. అక్కడ ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలే దిక్కు. సెజ్లో ప్రధాన కూడలిలో కూడా సీసీ కెమెరాలు లేకపోవడమే కాకుండా కొన్ని చోట్ల ఉన్న ప్రైవేట్ సీసీ కెమెరాలు పోలీస్ కంట్రోల్ రూం పర్యవేక్షణలో లేవు. జిల్లాలో 258 ప్రభుత్వ సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి. అందులో సగం మాత్రమే పనిచేస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం గుర్తించిన దొంగలు జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న ఇళ్లలో యథేచ్ఛగా చోరీలు చేస్తున్నారు. ప్రైవేట్ సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన జిల్లాలో ప్రధాన పట్టణాలైన అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, చోడవరంతో పాటు జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న అడ్డురోడ్డు, నక్కపల్లి, జంక్షన్ల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కాలనీలతో పాటు, అపార్ట్మెంట్లలో కూడా ఏర్పాటు చేసేలా అవగాహన కల్పించాలి. వాటిని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించాలి. సీసీ కెమెరాలు ప్రారంభించిన సమయంలో కొద్ది రోజులపాటు బాగానే పనిచేశాయి. నేరాలను నియంత్రించగలిగారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ ప్రధాన రహదారుల్లో మాత్రమే కెమెరాలు పనిచేస్తున్నాయి. పలు కాలనీల్లోనూ పనిచేయడం లేదు. ప్రైవేట్ యాజమాన్యాల వారు సహకరించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలకు ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది. రెండేళ్ల క్రితం ప్రధాన పట్టణాల్లో ప్రైవేట్ యాజమాన్యాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా పోలీసులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అవి కొనసాగితే నేరాలు తగ్గుముఖం పట్టేందుకు అవకాశం ఉంటుంది. వాహనాల వేగానికి ముకుతాడు జిల్లా వ్యాప్తంగా 258 ప్రభుత్వ సీసీ కెమెరాలుండగా... వాటిలో ఏపీ క్లౌడ్ బేస్డ్ సీసీ కెమెరాలు 158, ఏఎన్పీఆర్ (ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు 100 ఉన్నాయి. ఏఎన్పీఆర్ కెమెరాలను హైవేలలో ప్రధాన కూడళ్లలోనూ ...సిటీ ప్రధాన రహదారి కూడలిలో ఏర్పాటు చేశారు. ఇవి వాహనాల నెంబర్ ప్లేట్ని జూమ్ చేస్తుంటాయి. ఈ సీసీ కెమెరాల ద్వారా రోడ్డు ప్రమాదాల్లో తప్పించుకునే వాహనాలు, చోరీలను ఛేదించగలుగుతారు. వీటి వల్ల వాహనాల మితిమీరిన వేగానికి కళ్లెం పడుతుంది. వీటితోపాటు క్లౌడ్ బేస్డ్ సీసీ కెమెరాల సంఖ్యను పెంచాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ సీసీ కెమెరాలు దాదాపుగా 1500కి పైగా ఉన్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో కనిపించని సీసీ కెమెరాలు ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారులు ఏర్పాటు చేసిన కెమెరాలే దిక్కు ప్రభుత్వం ఏర్పాటు చేసినవి 258.. అందులో పనిచేసేవి సగమే నిఘా లేక పెరుగుతున్న నేరాలు మరిన్ని కెమెరాల ఏర్పాటుకు కృషి సీసీ కెమెరాల ద్వారా అనేక నేరాలను ఛేదించాం. ఇటీవల కిడ్నాప్నకు గురైన చిన్నారి లోహితను కూడా సీసీ కెమెరాల సాయంతోనే పట్టుకొని తల్లి వద్దకు చేర్చాం. జిల్లాలో దాదాపుగా అన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఎక్కడైనా పనిచేయనివి ఉంటే వాటిని గుర్తిస్తాం. అంతేకాకుండా పట్టణాల్లో ప్రధాన వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థల సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. అపార్ట్మెంట్లలో కూడా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాం. సీసీ కెమెరాల నిఘాతో నేరగాళ్లకు అడ్డుకట్ట వేస్తున్నాం. ఎవరూ చూడలేదు కదా అని నేరాలకు పాల్పడితే సీసీ కెమెరాల్లో బందీకాక తప్పదు. స్పీడ్ డ్రైవింగ్, చైన్స్నాచింగ్, హత్య కేసులు, ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడే వారిపై సీసీ కెమెరాలు ఎప్పుడూ నిఘా ఉంచుతాయి. పట్టణాల శివారు ప్రాంతాల్లో గల నిర్మానుష్య ప్రాంతాల్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, షాపులు, ఇతర ప్రైవేట్సంస్థల వద్ద మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. – మోహన్రావు, అడిషనల్ ఎస్పీ (క్రైం) -
ఏజెన్సీకి సాయంత్రం బస్సులు రద్దు
నర్సీపట్నం: నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు సాయంత్రం వెళ్లే బస్సులను రద్దు చేశామని డిపో మేనేజర్ ధీరజ్ తెలిపా రు. అల్లూరి జిల్లాకు సాయంత్రం 5 గంటలు దాటిన తరువాత వెళ్లే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. పోలీసుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మారుమూల గ్రామాలకు వెళ్లే నైట్ హాల్ట్ బస్సులతోపాటు విశాఖపట్నం నుంచి నర్సీపట్నం మీదుగా భద్రాచలం వెళ్లే ఆర్టీసీ నైట్ సర్వీసు రద్దు చేశామన్నారు. పరిస్థితులు చక్కబడిన తరువాత పోలీసుల ఆదేశాల మేరకు బస్సులను తిప్పుతామని మేనేజర్ తెలిపారు. -
సింహగిరిపై ఒడిశా భక్తుల సందడి
సింహాచలం: సింహగిరిపై నిత్యకల్యాణం ప్రాంగణం ఒడిశా భక్తులతో కిటకిటలాడింది. ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్నాయక్ దాస్ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి జరిపించిన నిత్యకల్యాణంలో పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలకు విశేష పూలాలంకరణ చేసి వేదికపై అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెళ్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీకాంత్నాయక్ దాస్ వింజామరతో స్వామికి సేవలందించారు. భక్తులకు స్వామి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పన్నకు నిత్యకల్యాణం జరిపించిన దాసుడు -
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలు
కశింకోట: ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న రాజీవ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో 50 శాతం విద్యుత్త్ వినియోగదారుల విద్యార్థుల కోటా సీట్లలో ప్రవేశానికి దరఖాస్తు విక్రయాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్ఈసీఎస్ ఎండీ జి.ప్రసాద్ మాట్లాడుతూ సంస్థ పరిధిలోని కశింకోట, మునగపాక, అనకాపల్లి గ్రామీణం, సబ్బవరం, పరవాడ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారుల పిల్లల సర్టిఫికెట్లు పరిశీలన జరిపిన అనంతరం దరఖాస్తులను పూరించి కళాశాల కార్యాలయంలో సమర్పించాలన్నారు. కళాశాల పనిదినాల్లో దరఖాస్తులు పొందాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఫీజు రీయింబర్స్మెంటు పథకం వర్తింపు జరుగుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్, అసోసియేట్ ప్రిన్సిపాల్ కర్రి శివ, విభాగాధిపతి గణేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పీపీ కాండ్రేగులకు ఎస్పీ అభినందన
అనకాపల్లి: వివిధ కేసుల్లో నేరస్తులకు సకాలంలో కోర్టు ద్వారా జీవిత శిక్ష పడినట్లుగా తమ వాదనలను వినిపించిన జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాండ్రేగుల జగదీశ్వరావును ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం అభినందించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులను సకాలంలో కోర్టులో హాజరు పరిచి, చార్జ్షీట్ దాఖలు చేయడంతో సమర్ధంగా వాదనలు వినిపించగలిగామని, న్యాయమూర్తులు నిందితులకు తగిన శిక్ష విధించారని తెలిపారు. -
మిస్సింగ్
ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి తియ్యని మాటలకు ప్రే‘మాయ’లో పడిపోయి ఒకరు.. వివాహేతర సంబంధంతో పిల్లలను తీసుకొని మరొకరు.. తల్లిదండ్రులు మందలించారని ఇంకొకరు.. ఇలా విశాఖలో వరుసగా మహిళల అదృశ్య సంఘటనలు కలవరం రేపుతున్నాయి. దాదాపుగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలు మాయమవుతూనే ఉన్నారు. బాలికల నుంచి వివాహితుల వరకు వయోభేదాలు లేకుండా కనిపించకుండా పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరి కోసం కుటుంబసభ్యులు.. సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మిస్సింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కేవలం నాలుగు నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. విశాఖ సిటీ: విశాఖ నగరంలో మహిళల అదృశ్యాలకు ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కనిపించకుండా పోయిన యువతుల్లో ఎక్కువ మంది ప్రేమించుకోవడం, ప్రేమికుడిని దక్కించుకోవడం కోసమే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్య వయస్కులైన మహిళలు కూడా వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాన్ని వదిలి వెళ్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో సుమారు 75 శాతం వరకు ఈ రెండు కారణాలే ఉన్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇది నగరంలో పెరుగుతున్న ఆందోళనకరమైన ధోరణిగా మారింది. 175 మంది మాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిస్సింగ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ప్రతి ఏటా 50 నుంచి 186 కేసులు వరకు రాగా.. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే 175 కేసులు నమోదవడం విశాఖ పరిస్థితికి అద్దం పడుతోంది. జనవరిలో 37, ఫిబ్రవరిలో 49, మార్చిలో 43, ఏప్రిల్లో 46 మంది అదృశ్యమయ్యారు. వీరిలో 133 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 42 మంది ఆచూకీ తెలియరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వీరు ప్రేమ, ఇతర కారణాలతో కావాలనే వెళ్లిపోయారా? లేదా ఏదైనా దురదృష్ట సంఘటన జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది. మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. పోలీసులకు సవాల్ వీరిని పట్టుకోవడం పోలీసులకు సైతం సవాలుగా మారుతోంది. కొంతమంది ఆచూకీ తెలుసుకున్నప్పటికీ.. మేజర్లు, చట్టాలు, హక్కులు పేరుతో పోలీసులకు కూడా చుక్కులు చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి కేసుల్లో అదృశ్యమైన వారి ఆచూకీని పోలీసులు గుర్తించడం మినహా వారిని కుటుంబ సభ్యులకు అప్పగించడం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతోంది. విశాఖలో పెరుగుతున్న మహిళల అదృశ్యం కేసులు 4 నెలల్లో 175 మంది మాయం ఇప్పటి వరకు 133 మంది ఆచూకీ లభ్యం మిస్టరీగానే 42 మంది మహిళల అదృశ్యం ప్రేమ, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలే కారణం -
నలుగురిని కాపాడిన లైఫ్గార్డ్స్
డాబాగార్డెన్స్: ఆర్కే బీచ్లో విషాదం తప్పింది. హైదరాబాద్కు చెందిన ఎనిమిది మంది యువకులు సరదాగా గడిపేందుకు బీచ్కు వచ్చారు. వారిలో నలుగురు సముద్రంలో మునిగిపోతూ ఉండగా జీవీఎంసీ లైఫ్గార్డ్స్ వెంటనే స్పందించి కాపాడారు. జీవీఎంసీ ఇన్చార్జి స్పోర్ట్స్ డైరెక్టర్ రాజు తెలిపిన వివరాలివి. హైదరాబాద్ నుంచి వచ్చిన షబ్బీర్, అబ్బాస్, విడ్రస్, హుస్సేన్ అనే యువకులు శుక్రవారం ఉదయం ఆర్కే బీచ్లో స్నానానికి దిగారు. అయితే సముద్ర అలల ఉధృతికి వారు నీటిలో మునిగిపోవడం గమనించిన బీచ్ లైఫ్గార్డ్స్ ధనరాజు, నవీన్, ఆనంద్, లక్ష్మణరావు, కేపీ వాసు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం వారికి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం వారిని పంపించివేశారు. -
బదిలీలతో ఎంటీఎస్ టీచర్లు బలి
విశాఖ విద్య: దశాబ్దాల పోరాటంతో కొలువు దక్కించుకున్నామనే ఆనందం మినిమమ్ టైం స్కేల్(ఎంటీఎస్)తో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎన్నో రోజులు మిగల్లేదు. కొన్నాళ్లు ఏజెన్సీలో పనిచేస్తే ఆ తర్వాత స్వగ్రామాలకు సమీపంలో పోస్టింగ్ ఇస్తామని చెబితే ఉద్యోగాల్లో చేరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారనే ఏకై క కారణంతో కూటమి ప్రభుత్వం విషం కక్కుతోంది. టీచర్ల బదిలీలకు తెరలేపిన ప్రభుత్వం, ఎంటీఎస్ టీచర్లను గాల్లోపెట్టి, వారు పనిచేస్తున్న స్థానాలను ఖాళీలుగా చూపించారు. దీంతో మళ్లీ ఎక్కడికి పోవాలో తెలియక సతమతమవుతున్నారు. న్యాయ చిక్కుల్ని పరిష్కరించి.. : న్యాయపరమైన సమస్యల్ని పరిష్కరించి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ–98 సెలక్టెడ్ అభ్యర్థులు 324 మంది, డీఎస్సీ–2008 అభ్యర్థులు 296 మందికి ఎంటీఎస్ ప్రాతిపదికన ఉద్యోగాలిచ్చారు. డీఎస్సీ–2008 వారికి మైదాన ప్రాంతంలోనే పోస్టింగ్లు ఇచ్చారు. డీఎస్సీ–98కి చెందిన 93 మందిని మైదాన ప్రాంతంలో, మిగిలిన 231 మందిని అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు కేటాయించారు. 98 డీస్సీకి చెందిన వారిలో కొందరు ఇప్పటికే రిటైర్ కూడా అయ్యారు. జీతం మినిమం.. పని మాగ్జిమం రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.32,470లు వేతనం చెల్లిస్తున్నారు. దీంతో సొంత మండలాలు, లేదా సమీప మండలాల్లోని స్కూళ్లలోనే పోస్టింగ్లు ఇవ్వాలని నాటి ప్రభుత్వం ఆదేశించింది. కానీ మైదాన ప్రాంతంలో అన్ని ఖాళీలు లేనందున చాలా మందిని ఏజెన్సీలో నియమించారు. దశల వారీగా వారిని మైదాన ప్రాంతానికి తీసుకురావాలని అప్పటి ప్రభుత్వం విద్యాశాఖాధికారులకు దిశా నిర్దేశం చేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. డీఎస్సీ–98 ఎంటీఎస్ టీచర్లను 2023లో కౌన్సిలింగ్ ద్వారా స్కూళ్లు కేటాయించారు. 2024లో ఎక్కడివారినక్కడే రెన్యువల్ చేశారు. ప్రస్తుతం టీచర్ల బదిలీల నేపథ్యంలో 620 ఎంటీఎస్ స్థానాలను ఖాళీలుగా చూపారు. దీంతో రెగ్యులర్ టీచర్లు కోరుకోగా మిగిలిన ఖాళీలు మాత్రమే వీరికి దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో బడులు తెరిచాక.. ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో తెలియని అయోమయంలో ఎంటీఎస్ టీచర్లున్నారు. ఖాళీల జాబితాలో వారు పనిచేస్తున్న స్కూళ్లు మళ్లీ ఏజెన్సీ బాట తప్పదని ఆందోళన భద్రత, కనీస అలవెన్సులకు నోచుకోని వైనం ఉమ్మడి విశాఖలో 620 మంది ఎంటీఎస్ టీచర్లు రిటైరయ్యే ముందైనా.. మాది విశాఖ జిల్లా అగనంపూడి. ఆగస్టులో రిటైర్ అయిపోతా. ముంచంగిపుట్ మండలం కెండుగుడ మండల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నా. ఈ ఏడాది పోస్టింగ్ ఎక్కడిస్తారో కూడా తెలియట్లేదు. రెండు నెలల కోసం మళ్లీ మకాం మార్చాల్సిందేనా. కనీసం.. రిటైరయ్యే ముందైనా విశాఖ జిల్లాలో పనిచేసే అవకాశం ఇవ్వాలి. – ఎం.అనిత పోస్టింగ్ ఎక్కడిస్తారో.. మా కుటుంబం ఉండేది విశాఖలోని ఎన్ఏడీ. ప్రస్తుతం అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడ మండలం పరిడి గిరిజన ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నా. లా చదివినా, ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ఇందులో చేరా. కానీ.. తీసుకొచ్చి ఏజెన్సీలో పడేశారు. ఈ ఏడాదైనా మా జిల్లాలో పోస్టింగ్ ఇస్తారని ఆశగా ఎదురుచూస్తున్నా. – దాట్ల లక్ష్మీదేవి -
ఏడాదిలోపే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత
నర్సీపట్నం: ఏడాది కాక మునుపే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి విమర్శించారు. నర్సీపట్నంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అధ్యక్షతన శుక్రవారం పార్టీ నియోజకవర్గ మండల కమిటీల ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించి, ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టాలన్నారు. గ్రామ, బూత్ కమిటీలతో 18 లక్షల మందితో జగనన్న సైన్యం తయారవుతుందన్నారు. ఈ సైన్యానికి ఐడీ కార్డులతో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ సైన్యంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇకపై పార్టీ కార్యకర్తకు సముచిత స్థానం కల్పించేందుకు జగనన్న నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మళ్లీ జగనన్నను సీఎం చేసేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నందున పార్టీ నాయకులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ నెలాఖరుకు పార్టీ అనుబంధ విభాగాల ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. మహిళా విభాగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన వారి తరఫున పోరాటంలో కార్యకర్తలు ముందుండాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వానికీ ఏడాదిలోపు ఇంత వ్యతిరేకత కనిపించలేదన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, ప్రతి మహిళకు రూ.18 వేలు ఇస్తామన్న హామీ గాలికివదిలేశారని ఆమె ధ్వజమెత్తారు. కేసులకు భయపడం.. మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో పాలన చాలా దారుణంగా ఉందన్నారు. కేసులకు భయపడే ప్రసక్తిలేదన్నారు. రానున్న రోజుల్లో పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండకడతామన్నారు. జగనన్న కంటే సంక్షేమ పథకాలు ఇంకా బాగా ఇస్తారనే ఆశతో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి ప్రజలు మోసపోయారని చెప్పారు. గ్రామ, బూత్ కమిటీల ఏర్పాటుకు పార్టీ నాయకులు కసరత్తు చేయాలన్నారు. అనంతరం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నంలో వేధింపుల పాలన కొనసాగుతుందన్నారు. పార్టీ నాయకుల ఇళ్లు కూలగొట్టించడం, మర్డర్, కిడ్నాప్ కేసులు పెట్టి పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు అమ్ముడుపోయాయన్నారు. న్యాయ వ్యవస్థ బతికి ఉండడంతో కేసులను దీటుగా ఎదుర్కొంటున్నామన్నారు. సంక్షేమ పథకాలను అటకెక్కించి, విశాఖలోని విలువైన భూములను దోచుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల యర్రాపాత్రుడు, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, ఎంపీపీలు గజ్జలపు మణికుమారి, రుత్తల సర్వేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు శానపతి వెంకటరత్నం, నాగేశ్వరరావు, చిటికెల రమణ, వివిధ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిలదీయండి ప్రభుత్వ నియంతృత్వ పోకడలపైపోరాటాలు వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు హైమావతి పిలుపు -
అనకాపల్లి: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టు
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టరయ్యింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఈ సైబర్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని.. గత రెండేళ్ల నుండి సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. నెలకి రూ.15 నుంచి 20 కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, రాజస్థానకు చెందిన ఇద్దరు ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారు. మేఘాలయ, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పనిచేస్తున్నారు. అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్ లా పేరుతో నాలుగు దశల్లో ట్రాప్ చేస్తున్నారు.3 వందల డాలర్ల నుంచి 3,000 డాలర్ల వరకు కూపన్లు ఒక్కొక్కరికి అమ్ముతున్నారు. ఇందులో 200 నుండి 250 మంది కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. మొదట వీరందరికీ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్లకు 18 లక్షల రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. పోలీసులు.. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. రూ.3 లక్షల నగదు, 300కు పైగా కంప్యూటర్స్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని.. అపార్ట్మెంట్ ఓనర్లపై కూడా విచారణ జరుపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. -
ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. బండారు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పాయకరావుపేట: ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రజల్లో తిరగలేకపోతున్నా.. సమాధానం చెప్పలేకపోతున్నా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.చోడవరం, మాడుగుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్లో ప్రస్తావించి నిధులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. మాడుగుల చోడవరం ప్రజలు టీడీపీకీ ఓటు వేయలేదా?. ప్రశ్నించే వేదిక ఇదే.. నేను ప్రెస్ మీట్ పెట్టి అడగడం లేదు. ఆరోపించడం లేదు. అందుకే మహానాడు ద్వారా మంత్రులను నియోజకవర్గం ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా’’ అంటూ బండారు వ్యాఖ్యానించారు.మరో వైపు, టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు. -
అక్రమ క్వారీలకు అండగా నాయకులు, అధికారులు
రోలుగుంట : మండలంలో అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీలపై అధికారుల జాప్యం వీడాలని చోడవరం జనసేన ఇన్చార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి అదికారిక అనుమతులు లేని క్వారీల నుంచి నిత్యం వందలాది లారీలతో బహిరంగంగానే మెటీరియల్ తరలింపు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం బాధాకరమన్నారు. అలాగే అనుమతులున్న క్వారీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నారు. ఈ క్వారీ యజమానులు చేస్తున్న అక్రమాలకు అండాదండగా ఉంటూ వారి నుంచి నిత్యం డబ్బులు వసూలు చేస్తున్న రాజకీయనాయకులు, అధికారుల కు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రభుత్వ దృిష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తెలిపారు. వారి గుట్టు వివరాలతో బయటపెడతా.. చోడవరం జనసేన ఇన్చార్జిపి.వి.ఎస్.ఎన్.రాజు -
సాగరతీరంలోఅయోధ్య రామ మందిరం
● నేటి నుంచి సందర్శకులకు అనుమతి ఏయూ క్యాంపస్: విశాఖ నగరవాసులకుసరికొత్త అనుభూతిని పంచేందుకు అయోధ్య రామ మందిరం నమూనా సిద్ధమయింది. బీచ్రోడ్డులోని పామ్బీచ్ హోటల్ పక్కన ఏర్పాటు చేసిన రామ మందిర నమూనాను గురువారం ఉదయం 8.48 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. వేదిక వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్ మాట్లాడుతూ విశాఖ వాసులకు అయోధ్య రామ మందిరం సందర్శించిన అనుభూతిన పంచేలా 90 అడుగుల ఎత్తు, 392 స్తంభాలు, 44 ద్వారాలతో నిర్మించినట్లు పేర్కొన్నారు. రెండు నెలలపాటు ప్రజల సందర్శనకు ఇది అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాలూరి శేషమాంబ, దుర్గా ప్రసాద్, బీజేపీ నాయకులు అశోక్, దిలీప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వెంకన్నకు సమర్పించిన కానుకలకు రశీదులు ఇప్పించండి
నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వామికి తాము సమర్పించిన కానుకలకు రశీదులు ఇప్పించాలని భక్తులు కోరారు. బుధవారం ఉపమాకకు చెందిన కర్రిగురువోజి, వమ్మవరానికి చెందిన శ్రీకాకుళపు బంగారు శెట్టిలు దేవస్థాన ఇన్స్పెక్టర్ కూర్వేశ్వరరావును కలిశారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన కల్యాణోత్సవాల సందర్భంగా గురువోజి పావుతులం బంగారు ఉంగరాన్ని, బంగారు శెట్టి తులం బంగారు శతమానా లను స్వామివారికి కానుకలుగా అందజేశారు. వీటిని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులకు అందజేశామన్నారు. రశీదు ఇమ్మని కోరగా కల్యాణోత్సవాల్లో బిజీగా ఉండటం వల్ల తర్వాత రశీదు ఇస్తామని మరోసారి రావాలని చెప్పారన్నారు. ఇంతవరకు రశీదులు ఇవ్వలేదన్నారు. తాము స్వామివారికి ఇచ్చినకానుకలకు రశీదులు ఇప్పించి, ఆ వస్తువులు స్వామివారికిచెందేలా చూడాలని కోరారు.దీనిపై ఇన్స్పెక్టర్ కూర్మేశ్వరరావు మాట్లాడుతూ భక్తులు తెలిపిన వివరాల ప్రకారం కానుకలు తమ వద్దకు ఇంకా రాలేదన్నారు. ఆ వస్తువులు తన వద్దకు వస్తే టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దేవస్థానం అప్రైజర్తో తనిఖీలు చేసి, దాతలు పేర్కొన్న విధంగా వస్తువుల బరువు సరిచూసి రశీదు అందజేయడం జరుగుతుందన్నారు.ఇన్స్పెక్టర్ను కలిసిన వారిలో దేవస్థానం మాజీ చైర్మన్ కొప్పిశెట్టి కొండబాబు, నాయకులు కొప్పిశెట్టి జగదీశ్వరరావు, వాసు, తోలేటి శ్రీను తదితరులు ఉన్నారు. ఉపమాక దేవాలయ ఇన్స్పెక్టర్ను కోరిన భక్తులు -
రోడ్లపై ‘బీర్ల వరద’
యలమంచిలి రూరల్: బీర్లు తరలిస్తున్న వాహనాలు మండలంలోని రెండు ప్రాంతాల్లో ప్రమాదాలకు గురవడంతో సీసాలు రోడ్లపై చెల్లాచెదురుగా పడ్డాయి. వాటిలో సగానిపైగా పగిలి.. రహదారులపై బీర్ల వరద పారింది. కింగ్ ఫిషర్ అల్ట్రా బీర్ల లోడుతో వెళ్తున్న రెండు వాహనాలు బుధవారం ప్రమాదాలకు గురయ్యాయి.ఈ రెండు ప్రమాదాలు 16వ నంబరు జాతీయ రహదారిపై యలమంచిలి మండల పరిధిలో జరిగాయి. వివరాలివి.. తండాలదిబ్బ కూడలి వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న టిప్పర్ను వెనుక నుంచి బీర్ల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో సుమారుగా 86 కేసుల్లో బీర్ల సీసాలు పగిలిపోయినట్టు యలమంచిలి ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు.పగిలిన బీర్ల సీసాల విలువ సుమారుగా రూ.రెండు లక్షలకు పైగా ఉంటుందని అంచనా.రణస్థలం బెవరేజస్ నుంచి కడప ప్రభుత్వ డిపోకు ఈ బీర్ల లోడు లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.అయితే దీనిపై యలమంచిలి రూరల్ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం, ప్రమాదానికి గురైన బీర్ల లారీ నుంచి బాగున్న సరుకును మరో లారీలోకి ఎక్కించేక్రమంలో ఎకై ్సజ్ పోలీసులు పొంతనలేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.ప్రమాదానికి గురైన కంటైననర్ లారీలో మొత్తం 1,275 బీర్ల కేసులు వెళ్తుండగా 86 కేసుల్లో సీసాలు పాడైనట్టు ఒకసారి,మొత్తం 1,270 కేసులే ఉన్నాయని,వాటిలో 95 కేసుల్లో బీర్ల సీసాలు డ్యామేజ్ అయ్యాయని మరోసారి ఎకై ్సజ్ పోలీసులు ఘటనాస్థలానికి కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులకు చెప్పడం గమనార్హం.ఇదిలా ఉండగా ప్రమాదానికి గురైన బీర్ల లారీ నుంచి సరుకును మరో లారీలోకి మార్చిన తర్వాత ఆ వాహనాన్ని మూడు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఎర్రవరం సమీపంలో ఒక పెట్రోల్ బంక్ వద్ద గంటల సేపు నిలిపి ఉంచారు.అబ్కారీ శాఖకు చెందిన బీర్ల లోడు ప్రమాదానికి గురైనపుడు ఎంత సరుకు దెబ్బతిందో నిర్థారించడానికి నిర్వహించాల్సిన పంచనామాలో నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది.అంతేకాకుండా రణస్థలంలో బీర్ల లోడుతో బయలుదేరిన లారీ ఎప్పుడు ప్రమాదానికి గురైందో ఎవరూ కచ్చితంగా చెప్పకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో బయటపడాల్సి ఉంది. పులపర్తి వద్ద బీర్ల వ్యాన్ బోల్తా యలమంచిలి మండలం పులపర్తి వద్ద బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది.యలమంచిలి నుంచి తునివైపు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో భారీగా బీర్లు,ఇతర మద్యం సీసాల లోడుకు నష్టం వాటిల్లింది.డ్యామేజ్ కాకుండా మిగిలిన సరుకును అక్కడ సిబ్బంది వేరు చేశారు.ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బీర్ల లోడుతో వెళ్తున్న రెండు వాహనాలకు ప్రమాదం తండాలదిబ్బ వద్ద ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొన్న బీర్ల లారీ పులపర్తి వద్ద మరో వ్యాన్ బోల్తా -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
కె.కోటపాడు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోతనవలస గ్రామానికి చెందిన చిరికి మనోజ్(24) బుధవారం కేజీహెచ్లో మృతిచెందాడు. మృతుడు తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎ.కోడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎ.కోడూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోతనవలస గ్రామానికి చెందిన మనోజ్ ఈ నెల 17న పోతనవలస నుంచి ఆర్.వై.అగ్రహారానికి బైక్పై బయలుదేరాడు. మార్గ మధ్యంలో రోడ్డుకు అడ్డంగా చెట్టుకొమ్మ పడి ఉండడాన్ని గమనించకుండా వెళ్లడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. మనోజ్ రోడ్డుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కె.కోటపాడులో ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్టు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. -
విశాఖలో టూరిజం సర్క్యూట్
విశాఖ సిటీ: విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం సర్క్యూట్కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో బుధవా రం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధు లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఏకరవు పెట్టారు. జీవీఎంసీ వాటర్ పైప్లైన్ పనులు పూర్తి చేయాలని, నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని, పుష్ కార్ట్లు లేకపోవడంతో పారిశుధ్య పనులకు ఇబ్బందులు, 2014లో పేదల ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం డీడీలు కట్టించుకున్న వారికి ఇళ్ల స్థలాల మంజూరు, సదుపాయాలు కల్పించాలని కోరారు. ఏకపక్ష నిర్ణయాలు వద్దు : ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతితో పాటు విశాఖపై కూడా దృష్టి పెట్టాలని చెప్పారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. కోస్టల్ కారిడార్ నుంచి భీమిలి వరకు బీచ్ కారిడార్ అభివృద్ధిపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వీకేపీసీపీఐఆర్, మాస్టర్ప్లాన్–2041, ఎంఐజీ లేఅవుట్లు, ప్రతిపాదిత లేఅవుట్లు, మాస్టర్ప్లాన్ రహదారుల నిర్మాణాలు, తీర ప్రాంత కోత ప్రాజెక్టు, కై లాసగిరి, రుషికొండ సమగ్రాభివృద్ధి, భోగాపురం నుంచి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్డు, సింహాచలం స్థలాలకు సంబంధించిన సమస్యలు, అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ వంటి అంశాలపై చర్చించారు. ఇకపై ప్రతి నెలా సమావేశం నిర్వహించి ఉత్తరాంధ్ర అభివృద్ధి పనులపై సమీక్షిస్తామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ సంపత్ కుమార్, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు హరేందిర ప్రసాద్, విజయకృష్ణన్, అంబేడ్కర్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్ష అమరావతిపైనే కాదు.. విశాఖపై కూడా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేల విజ్ఞప్తి -
పేటలో పోటాపోటీ
పాయకరావుపేట మెయిన్రోడ్డు లో ఆక్రమణలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నాయకుల అండతో ఒకరిని చూసి మరొకరు, పోటాపోటీగా ఆర్అండ్బీ స్థలాన్ని ఆక్రమించి బడ్డీలను ఏర్పాటుచేస్తున్నారు. ఆక్రమణల కారణంగా రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మెయిన్రోడ్డులో యథేచ్ఛగా ఆక్రమణలు తరచూ ట్రాఫిక్కు అంతరాయం పట్టించుకోని అధికారులు తొలుత బడ్డీల ఏర్పాటు.. తరువాత పక్కా షెడ్ల నిర్మాణం పాయకరావుపేట: నియోజకవర్గ కేంద్రమైన పాయకరావుపేటలో మెయిన్రోడ్డు ఆక్రమణదారుల చెరలో చిక్కుకుంది. పట్టణంలో తాండవ వంతెన నుంచి వై.జంక్షన్ వరకు రెండు కిలోమీటర్లు మెయిన్ రోడ్డు ఉంది. రోడ్డుకు ఇరు పక్కల స్థలాన్ని ఆక్రమించి పెద్ద ఎత్తునషెడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. ప్రతి రోజూ ఎక్కడోచోట ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో 100 అడుగులు ఉండాల్సిన రోడ్డు ఇరుకుగా మారి, నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ రోడ్డులో రెండువైపులా స్థలాలను ఆక్రమించి ఇప్పటికి సుమారు 120 బడ్డీలు, పాకలను ఏర్పాటు చేశారు. శరవేగంగా అభివృద్ధి పాయకరావుపేట పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థానికులతోపాటు, పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఉన్న రసాయన పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులంతా పాయకరావుపేటలో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. పిల్లల చదువులు, ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాలనుంచి పలువురు వచ్చి పట్ణణంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. చుట్టు పక్కల 40 గ్రామాల ప్రజలు వాణిజ్య అవసరాల కోసం నిత్యం ఇక్కడి వస్తుంటారు. దీంతో పట్టణం నిత్యం రద్దీగా ఉంటోంది. ముఖ్యంగా మెయిన్ రోడ్డుపై నిత్యం జనసంచారం ఉంటోంది. రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. పంచాయతీ స్థలాల్లోనూ పాగ ముందు నాయకుల అండతో చిన్న స్థలాన్ని ఆక్రమించి బడ్డీ ఏర్పాటు చేసి, కొద్దిరోజుల తరువాత పర్మినెంట్గా షెడ్లు వేసేస్తున్నారు. మెయిన్రోడ్డుపై రాకపోకలు సాగించేవారు రోడ్డు దిగేందుకు అడుగు జాగా కూడా ఉండడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోర్టు వివాదం కారణంగా మెయిన్ రోడ్డును విస్తరించకుండా డబుల్లైన్ రహదారిగా అభివృద్ధి చేశారు. అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు డబుల్ రోడ్డు నిర్మించేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో నిధులు విడుదల చేయించినప్పటికీ కోర్టు వివాదం కారణంగా రూ.రెండు కోట్లతో పాతరోడ్డును అభివృద్ధి చేసే పరిస్థితి ఏర్పడింది. మెయిన్రోడ్డుతోపాటు పట్టణంలో పలు ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లలో కమ్యూనిటీ అవసరాల కోసం పంచాయతీకి కేటాయించిన స్థలాలు సైతం కబ్జాకు గురయ్యాయి. వీటి గురించి పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. తరలివస్తున్న మాల్స్ పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన షాపింగ్ మాల్స్ ఇప్పుడు పాయకరావుపేట పట్టణానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. వస్త్ర దుకాణలను ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక హంగులతోకూడిన మూడు సినిమా థియేటర్లు ఉన్నాయి. మూడు జూనియర్ కళాశాలలు, రైసు మిల్లులు, మోటారు సైకిళ్లషోరూములతో పట్టణం వాణిజ్యకేంద్రంగా మారింది. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో పాయకరావుపేటలో నివాసం ఏర్పర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. మెయిన్ రోడ్డును విస్తరిస్తేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని స్థానికులు తెలిపారు.సగానికి సగం కుచించుకుపోయిన రోడ్డు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి మెయిన్రోడ్డుకు ఇరువైపులా రోజు రోజుకు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. సాయంత్రం అయితే తీవ్రమైన ట్రాఫిక్సమస్యలు ఎదుర్కొంటున్నాం. పాయకరావుపేటనుంచి తుని వెళ్లాలంటే చాలా సమయం పడుతోంది. బడ్డీలు ఏర్పాటు చేసి ఆ తరువాత పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. డబుల్లైన్గా విస్తరిస్తే తప్ప రాకపోకలు సాగించడం కష్టం. చిరువ్యాపారుల సమస్యలు పరిష్కరించి రోడ్డు విస్తరణ చేపట్టాలి. – జి.రాజశేఖర్రెడ్డి, పాయకరావుపేట -
ఏం తిని బతకాలి..!
కోటవురట్ల: పొట్టకూటి కోసం ఉపాధి పని చేస్తున్న కూలీల కడుపులు మాడ్చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పది వారాలుగా కూలి డబ్బులు ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎలా బతాకాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పందూరు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు బుధవారం నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన కూలీలు రోడ్డుపై బైఠాయించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ పథకం నియమ నిబంధనలను మార్చడమే కాకుండా, పది వారాలుగా కూలి డబ్బులు ఇవ్వకపోతే ఏం తిని బతుకుతారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్రాల చేతిలో ఉన్న పథకం అమలు, ఉపాధి పనుల కల్పన, అంచనా వ్యయం తదితర అంశాలు ఇకపై కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లనున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యుక్తధార యాప్ ద్వారానే ఇకపై కూలీల వేతనాలు చెల్లించనున్నారన్నారని చెప్పారు. ఇందుకోసం ప్రస్తుతం మండలానికో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. ఈ యాప్ వినియోగం ద్వారా ఇకపై రాష్ట్రాల ప్రమేయం పూర్తిగా ఉండదని, కేంద్ర ప్రభుత్వమే అన్ని పనులు పర్యవేక్షిస్తుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకుని, పాత పద్ధతిలోనే కొనసాగించాలని, వెంటనే 10 వారాల వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. -
బకాయి పడ్డ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలి
చోడవరం : మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రావలసిన బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి డిమాండ్ చేశారు. మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద చోడవరం మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న నిర్వాహకులంతా కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేశారు. తమకు గత డిసెంబరు నెల నుంచి నేటి వరకూ మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదని, బకాయి పడ్డ బిల్లులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని వరలక్ష్మి డిమాండ్ చేశారు. బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని, అప్పులకు వడ్డీలు కట్టుకోలేక చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదు నెలలుగా బిల్లులు రాకపోతే వచ్చే జూన్ నుంచి పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు ఎలా భోజనం పెట్టగలమని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతినెలా 15వ తేదీకి బిల్లులు వచ్చేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదని ఆమె ధ్వజమెత్తారు. అదే విధంగా తమ వేతనాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదని, ఇదే ఉపాధిగా నమ్ముకొని జీవిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులందరం జీతాలు రాక, బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని చెప్పారు. వెంటనే ప్రభుత్వం తమ జీతాలు, బిల్లులు చెల్లించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో సంఘ ప్రతినిధులు జి.లక్ష్మి, నారాయణమ్మ, ఎర్రయ్యమ్మ, బి. లక్ష్మి, దేముడమ్మ, సత్యవతి, దేవి పాల్గొన్నారు. మధ్యాహ్నభోజన పథకం నిర్వాహకుల డిమాండ్ ఎంఈవో కార్యాలయం వద్ద ధర్నా -
చిన్నారి కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
అనకాపల్లి టౌన్: అనకాపల్లిలో సంచలనం సృష్టించిన బాలిక రోహిత కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇన్చార్జి డీఎస్పీ బి.మోహన్రావు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ అతిథి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 15న రోహిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బాలిక ఆచూకీ కనుగొని, కిడ్నాప్ చేసిన గాజువాకకు చెందిన లక్ష్మి, ఆమె భర్త అప్పలస్వామినాయుడులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేసు దర్యాప్తులో భాగంగా లక్ష్మి ఇచ్చిన సమాచారం మేరకు లోతుగా విచారణ చేపట్టగా.. ఈ కిడ్నాప్లో మరో ముగ్గురికి సంబంధం ఉందని నిర్ధారించారు. కశింకోట మండలం ఏఎస్ పేట గ్రామానికి చెందిన గొర్లి శ్రీనివాసరావుకు పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే న్యాయపరంగా అడ్డురావడంతో అక్రమంగా ఎవరినైనా దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతో తనకున్న పరిచయాలతో అనకాపల్లి గాంధీనగర్కు చెందిన తగరంపూడి షణ్ముఖను శ్రీనివాసరావు సంప్రదించారు. ఇద్దరూ కలిసి అనకాపల్లి లోకావారి వీధికి చెందిన బోనాల దేవిని సంప్రదించగా.. పాప లేదా బాబు గానీ అప్పజెప్పుతానని, అందుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆమె చెప్పింది. అందుకు ఒప్పుకున్న శ్రీను తన బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి అడ్వాన్స్గా షణ్ముఖకు రూ.లక్ష అందజేశాడు. అనంతరం షణ్ముఖ వెళ్లి దేవికి రూ.30వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. ఆ తరువాత దేవితో ఒప్పందం కుదుర్చుకున్న గాజువాకకు చెందిన లక్ష్మి, అప్పలస్వామినాయుడు.. బాలికను కిడ్నాప్ చేసి, విక్రయించే ప్రయత్నంలో భార్యాభర్తలు పోలీసులకు దొరికిపోయారు. వీరిని ఈ నెల 17న అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మిగతా ముగ్గురిని అరెస్ట్ చేసి, షణ్ముఖ నుంచి రూ.70వేలు, శ్రీను నుంచి రూ.750 స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ విజయ్కుమార్, ఎస్ఐలు వెంకటేశ్వరావు, ఈశ్వరావు, తదితరులు పాల్గొన్నారు. -
కూటమి సర్కారు కుటిల యత్నం
అచ్యుతాపురం: అనకాపల్లి–అచ్యుతాపురం రహదారి నిర్వాసితుల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య, నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోంది. ఏ ఒక్కరికీ అంగీకారం లేని టీడీఆర్ను తెరపైకి తీసుకొచ్చి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుంది. రెండు దశాబ్దాల నుంచి నలుగుతున్న భూసేకరణకు ఎటువంటి తక్షణ పరిహారం ఇవ్వకుండా కేవలం కాగితాలు ఇచ్చి పని కానిచ్చేయాలన్న ప్రభుత్వం తీరు ఈ ప్రాంతంలోని రైతులు, నిర్వాసితుల హృదయాలను కలిచివేస్తోంది. టీడీఆర్ విషయం తేల్చకుండానే రెండు బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ పనులను ప్రారంభించి, ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. తొందరపాటెందుకు..? అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణ అంశం ఎప్పటి నుంచో నలుగుతోంది. రెండు దశాబ్దాల కాలంలో మూడు ప్రభుత్వాలు మారాయి. 9 రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో పరిహారం అందించిన తర్వాతే రోడ్డు వేయాలని ఇప్పటి వరకూ పాలకులు భావించగా.. నేటి కూటమి ప్రభుత్వం టీడీఆర్ తీసుకునే విధంగా ఎన్వోసీపై సంతకాలు చేసేందుకు సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసిన పరిహారం అంశం తేల్చకుండానే పనులు ప్రారంభించేసింది. తద్వారా బలవంతంగానైనా టీడీఆర్లను రైతులపై రుద్ది భూములను లాక్కోవాలన్న ఎత్తుగడ ఆందోళన రేకెత్తిస్తోంది. కాంట్రాక్టర్ అచ్యుతాపురం జంక్షన్లో ప్లైఓవర్ పనులు, హరిపాలెం, మునగపాక వద్ద బ్రిడ్జి పనులకు ఉపక్రమించారు. ఆర్అండ్బీ పరిధిలో ఎటువంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేని చోట రోడ్డు విస్తరణ, పక్కన డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. తద్వారా భూములివ్వని వారిని ఆత్మ రక్షణలో పడేసేలా కాంట్రాక్టర్, ప్రభుత్వం ఉన్నట్లుగా అర్థం అవుతోంది. అధికారులపైనా ఒత్తిడి..! ఈ ప్రాంతంలోని రెవెన్యూ అధికారులపై ఒక కూటమి నేత తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామ సభల్లో టీడీఆర్ల అంశంపై తీవ్ర వ్యతిరేకత రాగా.. వారిని ఒప్పించలేకపోయారంటూ రెవెన్యూ యంత్రాంగంపై ఆ నేత చిందులు తొక్కినట్టు తెలుస్తోంది. ఒక తహసీల్దార్ సెలవుపై వెళ్లడానికి కారణం ఇదేనా.. అన్న చర్చ సాగుతోంది. టీడీఆర్లపై ఇంకా స్పష్టత లేదని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలోని సిబ్బంది ఒకపక్క చెబుతుండగా.. మరోపక్క పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డుకు ఆనుకొని ఉన్న భూముల్ని కోల్పోవడం వల్ల వచ్చిన పరిహారంతో వేరొక చోట ఇల్లు కట్టుకొని స్థిరపడవచ్చన్న ఆశతో ఉన్న రైతులకు టీడీఆర్ ప్రతిపాదన అశనిపాతంగా మారింది. పరిహారంపై తేల్చకుండానే అచ్యుతాపురం – అనకాపల్లి రహదారి పనులు ప్రారంభం టీడీఆర్ బాండ్లు వద్దంటున్నా నిర్వాసితుల గోడు పట్టించుకోని వైనం ఆర్ అండ్ బీ పరిధిలో చురుగ్గా పనులు నిర్వాసితులను ఆత్మరక్షణలోపడేసే పన్నాగం ఆత్మరక్షణలో రైతులు అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణ పనులు ప్రారంభించి నిర్వాసితులపై ఒత్తిడి తేవడం దారుణం. టీడీఆర్లకు ఒప్పుకోబోమని ఇప్పటికే రైతులు చెప్పారు. పరిహారం ఇవ్వకుండా, స్పష్టత ఇవ్వకుండా పనులు మొదలు పెట్టడం ద్వారా రైతుల్ని ఆత్మ రక్షణలో పడేస్తున్నారు. చరిత్రలో ప్రజా కంటకులుగా నిలిచిపోతారు. – బి.జగన్, ఉప సర్పంచ్, తిమ్మరాజుపేట టీడీఆర్లపై ఒత్తిడి తేవడం సరికాదు అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణకు సంబంధించి నిర్వాసితులపై ఒత్తిడి తేవడం సరికాదు. ఇప్పటికే మూడు విడతలుగా గ్రామాల్లో సభలు నిర్వహించి పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పుడు టీడీఆర్లు ఇస్తామని చెప్పడం అన్యాయం. ఇది 1200–1550 మంది రైతులు, ప్రజల సమస్య. పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభించాలి. – రొంగలి రాము, సీపీఎం మండల కన్వీనర్, అచ్యుతాపురం -
రేషన్ బండిపై రాజకీయ కక్ష
దేవరాపల్లి: పేద ప్రజల అవస్థలను తొలగిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే రేషన్ వ్యవస్థను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా రద్దు చేయడం అత్యంత దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. ఈ మేరకు దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టారనే రాజకీయ దురుద్దేశంతో పేదల ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తున్న ఎండీయూల వ్యవస్థను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. పేద ప్రజలు పనులు మానుకొని రోజంతా రేషన్ డిపోల దగ్గర క్యూలో పడిగాపులు కాస్తూ అవస్థలు పడకూడదన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఎండీయూ వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. రేషన్ డిపోల ద్వారా పాత పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కోసం కూలి పనులు మానుకోవాల్సిన దుస్థితి దాపరిస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా పేదలకు నిత్యావసర సరకులు అందిస్తున్న ఎండీయూ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం ఎందుకు అంత కర్కశంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా సూపర్సిక్స్ పథకాలు అమలు చేయలేదు సరికదా.. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలతో పాటు పలు సేవలను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వేలాది మంది ఎండీయూ ఆపరేటర్లు, సహాయకుల కుటుంబాలు రోడ్డు పడతాయని బూడి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి నిర్ణయాలను మానుకోవాలని హితవు పలికారు. విప్లవాత్మక డోర్ డెలివరీ వ్యవస్థ నిలిపివేత దారుణం కూటమి ప్రభుత్వం నిర్ణయంతోప్రజలకు మళ్లీ పాట్లు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం -
జూలో ఉత్సాహంగాసమ్మర్ క్యాంప్
ఆరిలోవ (విశాఖ): ఇందిరాగాంధీ జూ పార్కులో బుధవారం పాఠశాల పిల్లలకు సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. జూ పార్కుతోపాటు జీవీఎంసీ, వైల్డ్లైఫ్ కన్సర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, గ్రీన్ పాజ్, యూత్ కన్సర్వేషన్ యాక్షన్ నెట్వర్క్ సంయుక్తంగా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాయి. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ శిబిరంలో నగరంలో పలు పాఠశాలలకు చెందిన సుమారు 30 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి రోజు వారికి పక్షుల వీక్షణ నిర్వహించారు. జూలో ఉన్న పక్షులతోపాటు లోపల సహజ వాతావరణంలో చెట్లపై తిరిగే వివిధ రకాల పక్షులను పిల్లలు తిలకించారు. వాటి గురించి జూ ఎడ్యుకేషన్ సిబ్బంది చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి.మంగమ్మ మాట్లాడుతూ పిల్లలకు వన్యప్రాణులపై అవగాహన కల్పించడానికి సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణులు, వాటి జీవిత విశేషాలు, ఆహార అలవాట్లు, పర్యావరణానికి వాటి ఉపయోగం తదితర అంశాల గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తామన్నారు. -
సింహాచలం ప్రధానార్చకుడు కన్నుమూత
సింహాచలం: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు ఇరగవరపు వెంకట రమణాచార్యులు (58) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు ఈ నెల 19న గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో మరణించారు. రమణాచార్యులు 1992లో అధ్యాపకుడిగా సింహాచలం దేవస్థానంలో ఉద్యోగంలో చేరారు. 1994లో అర్చకుడిగా, 2020లో ప్రధానార్చకుడిగా పదోన్నతి పొందారు. శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామికి జరిగే వార్షిక ఉత్సవాలు, నిత్య పూజల నిర్వహణలో రమణాచార్యులు తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ముఖ్యంగా స్వామివారి వార్షిక కల్యాణోత్సవం రోజుల్లో జరిగే ఎదురు సన్నాహోత్సవ ఘట్టంలో పూలదండలతో ఆయన చేసే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. రమణాచార్యులకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
సైబర్.. టెర్రర్
అచ్యుతాపురం అడ్డాగా అసాంఘిక కార్యకలాపాలు ● రెండో రోజు సాఫ్ట్వేర్ డీ–కోడ్ చేయడానికి ప్రత్యేక బృందాలు ● సైబర్ నేరస్తులపై కొనసాగుతున్న విచారణ ● అనుమానితులను గుర్తిస్తున్న పోలీసు అధికారులు ● భయాందోళనలో స్థానిక ప్రజలు స్థానిక పోలీస్ అధికారి సెలవు రోజునే దాడులు అచ్యుతాపురం సెజ్లో జరిగే ఆన్లైన్ ట్రాప్ అంతా స్థానిక పోలీసులకు తెలిసే జరుగుతుందా..? కొన్ని నెలలుగా ఈ మోసాలు జరుగుతున్నా పోలీసులు ఎందుకు రైడ్ చేయలేదు..? ప్రజల మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలివి. పోలీస్ ఉన్నతాధికారులకు సైతం ఈ సందేహాలు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో పేకాట డెన్లపై, ఆన్లైన్ కోడిపందేలతో పాటు పలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా.. స్థానిక పోలీస్ అధికారి, సిబ్బంది దాడులు జరిపేవారు కాదని తెలుస్తోంది. దాడులు జరిపినా ముందుగా సమాచారం లీక్ చేసేవారని ఉన్నతాధికారులు గుర్తించారు. అందుకే జిల్లా పోలీసు ఉన్నతాధికారే రంగంలోకి దిగి స్థానికంగా మరో డివిజన్ స్థాయి పోలీస్ అధికారితో కలిసి రైడింగ్కు వ్యూహరచన చేసినట్టు చెబుతున్నారు. స్థానిక పోలీసు అధికారి సెలవు రోజున ఈ దాడులు జరగడం గమనార్హం. సాక్షి, అనకాపల్లి/అచ్యుతాపురం రూరల్: పారిశ్రామికీకరణతో ప్రగతి బాట పట్టిన ప్రాంతమది.. ఇప్పుడు సైబర్ టెర్రర్తో కలవరపడుతోంది. అచ్యుతాపురానికి సమీపంలోని భోగాపురంలో మంగళవారం రాత్రి పలు అపార్ట్మెంట్లు, వాటిలోని ఫ్లాట్లపై పోలీసు దాడి ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఆన్లైన్ ట్రాపింగ్కు పాల్పడిన సైబర్ నేరగాళ్లను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్టు సమాచారం. నిందితులు వాడుతున్న సాఫ్ట్వేర్ డీ–కోడ్ చేసే ప్రయత్నంలో సంబంధిత శాఖలు నిమగ్నమై ఉన్నాయి. అచ్యుతాపురం కేంద్రంగా ఎన్నాళ్లుగా ఈ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి..? వీరి ద్వారా ఆన్లైన్ ట్రాపింగ్లో మోసపోయిన వారెందరు..? తదితర కోణాల్లో పోలీసులు అత్యంత రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ డీ–కోడ్ అయితేనే గానీ వివరాలు చెప్పలేమని పోలీసు అధికారులు తెలిపారు. 100 మందికి పైగా సైబర్ నేరగాళ్లు మంగళవారం రాత్రి భోగాపురం సమీపంలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో కార్యకలాపాలు సాగిస్తున్న 100 మందికిపైగా సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో మూడొంతుల మంది పారిపోయారు. పోలీసుల అదుపులో ఉన్న కొందరు సైబర్ నేరగాళ్ల నుంచి సమాచారం రాబడుతున్నారు. బుధవారం ఉదయం కూడా కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. భోగాపురం సమీపంలో ఉన్న పవన్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని మొత్తం 40 ఫ్లాట్లలో వీరు సైబర్ నేరాలు నడిపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో పాలుపంచుకుంటున్న వారు సమీపంలోని వివిధ అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. వీరు చాలా గోప్యత పాటించేవారని, వంటలు చేసుకోవడానికి ఉపయోగించే గ్యాస్, పాలు, ఏమైనా పార్శిళ్లు వచ్చినా కింద పెట్టేసి వెళ్లిపోవాలే తప్ప.. వారుండే ఫ్లాట్లలోకి వెళ్లనిచ్చేవారు కాదని చెబుతున్నారు. శని, ఆది వారాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా వాడుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు. వారు ఆరు నెలలుగా ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. -
ఆనంద యోగం.. ఆరోగ్య భాగ్యం
అనకాపల్లి: ఆరోగ్యమే గొప్ప సంపద అని, యోగాతో దానిని సాధించి ఆనందంగా ఉండవచ్చని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో బొజ్జన్నకొండ వద్ద ఆమె బుధవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ’విశ్వమంతా యోగాతో ఆరోగ్యం’ అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన నిర్వహించుకుంటున్నామని, ఆ నేపథ్యంలో బుధవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆమె చెప్పారు. ఇందులో పాల్గొనే వారి కోసం ప్రభుత్వం యోగాంధ్ర యాప్ రూపొందించిందని, యాప్ను అందరూ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. యోగాంధ్ర ప్రారంభ కార్యక్రమంలో అయిదు వందల మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలన్నారు. యోగా లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.బాబూరావు, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఇన్చార్జి ఆర్డీవో వై.శ్రీనివాసరావు, జిల్లా ఆయూష్ మెడికల్ అధికారి డా.శిరీష, అనకాపల్లి మెడికల్ అధికారి కె.లావణ్య, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, యోగా లైఫ్ ఫౌండేషన్ యోగా శిక్షకులు, సాధకులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
మామిడి తాండ్ర పుల్లన
మామిడి తాండ్ర తయారు చేస్తున్న దృశ్యం నక్కపల్లి : ప్రతి ఏటా మామిడి సీజన్లో ఏర్పాటయ్యే తాండ్ర తయారీ దుకాణాలు రెండేళ్ల నుంచి కానరావడం లేదు. నక్కపల్లి మండలంలో మామిడి తాండ్ర తయారీ దుకాణాలు కొన్నేళ్లుగా ఎక్కువగా ఏర్పాటు చేసేవారు. ఈ సీజన్లో నియోజకవర్గంలో పలు ప్రాంతాలతో మామిడి తాండ్ర తయారీ కానరాలేదు. నక్కపల్లి మండలంలో వేంపాడు, చినదొడ్డిగల్లు, కాగిత, రేబాక, రమణయ్యపేట, తదితర ప్రాంతాల్లో మామిడి తాండ్ర తయారీ అధికంగా జరిగేది. ఈ ప్రాంతాల్లో సుమారు 15 వరకు మామిడి తాండ్ర దుకాణాలు ఏర్పాటు చేసేవారు. మామిడి గుజ్జును తాండ్రగా తయారు చేసి స్థానికంగా విక్రయించడంతో పాటు, ఇతర ప్రాంతాలకు సుమారు 50 నుంచి 100 టన్నుల వరకు ఎగుమతి చేసేవారు. తాండ్ర తయారీపై చుట్టు పక్కల సుమారు 100 మంది వరకు ఉపాధి పొందేవారు. మరో 50 మంది వరకు తాండ్రను కాగిత టోల్ప్లాజా వద్ద కిలోల చొప్పున ప్యాక్ చేసి బస్సుల్లోను, కారుల్లోను వెళ్లేవారికి విక్రయించేవారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో సైకిళ్లపై వెళ్లి విక్రయించేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా మామిడి కాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో దాదాపు 15 వేల హెక్టార్లలో మామిడితోటలు ఉన్నాయి. చాలా తోటల్లో పూతదశలో తెగుళ్లు రావడం, పొగమంచు కారణంగా మామిడి కాయలు కాయలేదు. దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ ఏడాది మామిడి పండ్లకు గిరాకీ పెరిగింది. దిగుబడి ఎక్కువగా ఉన్న సమయంలో కలెక్టర్, సువర్ణరేఖ, నీలం, దేశవాళి, బంగినపల్లి, రసాలు వంటి రకాలను కొనుగోలు చేసి గుజ్జు చేసి తాండ్ర తయారీకి ఉపయోగించేవారు. ధరలు చూస్తే బేజారు..: మామిడి దిగుబడి తగ్గిపోవడంతో ధర కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం కలెక్టర్ మామిడి కాయలు టన్ను రూ.35 వేలు ఉంది. బంగినపల్లి రకాలయితే టన్ను రూ.40వేల వరకు ఉంది. సువర్ణరేఖ రూ. 50 వేలకు పైబడే ఉంది. దీంతో తాండ్ర తాయారీకి వెనుకడుగు వేస్తున్నారు. రసాలు, దేశవాళీ, ఇతర జాతులకు చెందిన మామిడి కాయలు సైతం టన్ను రూ.20 వేల పైబడి మాటే. అంత ధర పెట్టి కాయలను కొనడంతో పాటు ముడిసరకులు, ఇతర ఖర్చులకు గిట్టుబాటు కాదని భావించిన వ్యాపారులు ఈ ఏడాది తాండ్ర తయారీకి స్వస్తి పలికినట్టు సమాచారం. కార్మికులకు వేతనం రూ.500 నుంచి రూ. 800 వరకు చెల్లించాల్సి వస్తుంది. స్థానికంగా ఉండే కమీషన్ వ్యాపారులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన మామిడి కాయలను తాము అనుకున్న ధర రావడంతో దేశవాళీ, కలెక్టర్, ఇతర జాతులకు చెందిన రకాలను జ్యూస్ల కోసం ఎగుమతి చేస్తున్నారు. దీంతో తాండ్ర తయారీకి అవసరమైన మామిడి కాయలు అందుబాటు ధరల్లో లభించడం లేదు. ఈ ధరలకు కాయలు కొని తాండ్ర తయారు చేసినా అధిక ధరలకు విక్రయించాల్సి ఉంటుంది. దీంతో అమ్మకాలు తగ్గిపోతాయి. గత ఏడాది మామిడి తాండ్ర కిలో రూ.500 ఉంటే ఈ ఏడాది రూ. 800లకు విక్రయిస్తే తప్ప గిట్టుబాటు కాదు. పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. దీంతో నష్టాలను చవి చూడాల్సి వస్తుందని భావించి తాండ్ర తయారీకి స్వస్తి పలికినట్టు తయారీదారులు చెబుతున్నారు. తగ్గిన మామిడి దిగుబడి తాండ్ర తయారీకి వెనకడుగు పెరిగిన ముడిసరుకు, తయారీ ఖర్చులు గిట్టుబాటు కాక ఏర్పాటు కాని దుకాణాలు గిట్టుబాటు కాని తాండ్ర చిన దొడ్డిగల్లు పరిసర ప్రాంతాల్లో గతంలో ఐదు మామిడి తాండ్ర దుకాణాలు ఉండేవి. రెండేళ్ల నుంచి దిగుబడి అంతంతమాత్రంగానే ఉండడంతో ముడిసరకు ధరలు పెరిగిపోయాయి. దీంతో తాండ్ర తయారీకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక్కడ తయారు చేసిన తాండ్రను స్థానికంగా విక్రయించడంతో పాటు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే వారు. ఈ ఏడాది ఒక్క దుకాణం కూడా ఏర్పాటు కాలేదు. కూలీలు కూడా తాండ్ర తయారీ లేక ఉపాధి పనులకు, భవన నిర్మాణ పనులకు వెళ్లిపోతున్నారు. – తోటసత్తిబాబు, కమిషన్ దుకాణం నిర్వహకుడు, చినదొడ్డిగల్లు -
130 కిలోల గంజాయి పట్టివేత
● ఒకరు అరెస్టు, ముగ్గురు పరార్ చీడికాడ: కారులో అక్రమంగా తరలిస్తున్న 130 కిలోల గంజాయితో వ్యక్తిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. ఆయన మంగళవారం అందించిన వివరాలిలా ఉన్నాయి. గంజాయి అక్రమ రవాణా జరుతున్నట్టు అందిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం మండలంలోని ఖండివరం వద్ద మాటువేసి అటుగా వస్తున్న కారును అడ్డగించి తనిఖీలు నిర్వహించామన్నారు. ఆ కారులో రూ.ఆరున్నర లక్షక్షల విలువ గల 130 కిలోల గంజాయిని గుర్తించామన్నారు. గంజాయి తరలిస్తున్న మండలంలోని బైలపూడికి చెందిన కాశీ తేజను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతనితో పాటు మరో ముగ్గురు పైలేట్లుగా వ్యవహరించినట్టు తెలిపారు. వారు పరారీలో ఉన్నారని తెలిపారు. -
సారా బట్టీలపై దాడులు
ఎటపాక: నవోదయం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఎటపాక మండలంలో సారా తయారీ కేంద్రాలపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. విశాఖపట్నం ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి ఆదేశాలతో మండలంలోని పిచుకలపాడు, గుండువారిగూడెం గ్రామాల్లో ఎకై ్సజ్, సివిల్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు మంగళవారం ఆకస్మికంగా దాడులు జరిపాయి. దాడుల్లో 4500 లీటర్ల బెల్లం ఊట ,40 లీటర్ల సారా, 20 కేజిల పటిక సీజ్ చేశారు. గుండువారిగూడెం గ్రామంలో ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. సారా తయారికీ ఉపయోగించే 48 డ్రమ్ములను సామగ్రితో పాటు ధ్వంసం చేసినట్టు రంపచోడవరం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగరాహుల్ తెలిపారు. ఈ దాడుల్లో కొత్తగూడెం ఏఈఎస్ కరంచంద్, రంపచోడవరం ఏఈఎస్టీఎఫ్ సీఐ ఇంద్రజిత్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ అప్పలనాయుడు, చింతూరు ఎకై ్సజ్ ఎస్ఐ స్వామి, అనకాపల్లి సీఐ శ్రీనివాసరావు, భద్రాచలం ఎస్ఐ సీతారామరాజు, పాల్వంచ ఎస్హెచ్ఓ సరిత, ఎటపాక సీఐ కన్నపరాజు, ఇరు రాష్ట్రాల ఎన్ఫోర్స్మెంట్, సివిల్, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. 4500 లీటర్ల బెల్లం ఊట, 40 లీటర్ల సారా ధ్వంసం తయారీ సామగ్రి స్వాధీనం ఐదుగురిపై కేసు నమోదు -
బండారు అప్పన్న మృతిపై డీఎస్పీ విచారణ
నర్సీపట్నం: నర్సీపట్నం మండలం, వేములపూడిలో నవంబరు 5న చోటు చేసుకున్న బండారు అప్పన్న మృతిపై డీఎస్పీ పి.శ్రీనివాసరావు విచారణ జరిపారు. మృతుడి తండ్రి బండారు మహాలక్ష్మి, కుటుంబ సభ్యులు కేసును నీరుగార్చుతున్నారంటూ సోమ వారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ విజయకృష్ణన్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మంగళవారం మృతుడి తండ్రి మహాలక్ష్మి, కుటుంబ సభ్యులను పోలీసు స్టేషన్కు పిలిపించి విచారించారు. ముందుగా మృతుడి తండ్రిని, తరువాత కుటుంబ సభ్యులు గోవింద, చిన్ని, మంగను విడివిడిగా విచారించారు. కుమారుడుని కోల్పోయాను కేసు నీరుగార్చకుండా న్యాయం చేయాలని డీఎస్పీకి విన్నవించానని మహాలక్ష్మి తెలిపారు. కేసులో పురోగతి లేకపోవడం వల్లనే కలెక్టర్ను ఆశ్రయించానని, ఇప్పటికై నా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కత్తిగాటు, కర్రతో కొట్టినట్టు ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదమని ఎలా నమ్ముతామని అన్నారు. ఇప్పటికై నా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే దోషులు బయటపడతారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే తన కొడుకు మృతికి గల కారకులను బయటపెట్టి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీని కోరడం జరిగిందని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం
కశింకోట: మండలంలోని బయ్యవరం పాల డెయిరీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ లక్ష్మణరావు అందించిన వివరాల ప్రకారం...విశాఖపట్నం నుంచి నరసాపురం వెళుతున్న కారు, బయ్యవరం పాల డెయిరీ వద్ద అవతలి రోడ్డులోకి అకస్మాత్తుగా మలుపు తిరుగుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న బుంగా వెంకట నరసమ్మ (72) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు నరేష్, మేనకోడలు సువర్ణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజిహెచ్కు వైద్యులు సిఫారసు చేశారు. విశాఖలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నరేష్, తమ తల్లి నరసమ్మ, కుటుంబ సభ్యులు సువర్ణ, ముగ్గురు పిల్లలతో కలిసి కారులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బంధువుల ఇంటికి పెళ్లికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. నరసమ్మ మృతదేహానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయి దెబ్బతింది. తన కళ్లముందే తల్లి నరసమ్మ మృతి చెందడంతో నరేష్, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
ఆర్ఆర్ ప్యాకేజీ రూ.25 లక్షలు ఇవ్వాల్సిందే
నక్కపల్లి : ఏపీఐఐసీకి భూములిచ్చిన రైతులు, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాల్సిందేనని పలువురు రైతులు కోరారు. మంగళవారం చందనాడ, అమలాపురం, మూలపర గ్రామాల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి అర్హత సాధించిన రైతులు, నిర్వాసితుల జాబితాలు ప్రకటించేందుకు గ్రామసభ నిర్వహించారు ఆర్డీవో రమణ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో ప్రభుత్వం ప్రకటించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వివరాలను ఆర్డీవో వెల్లడించారు. ఐదు సెంట్ల ఇంటి స్థలంతో పాటు ప్యాకేజీ కింద రూ.8.30 లక్షలు నిర్ణయించడం జరిగిందన్నారు. దీనిపై రైతునాయకులు సూరాకాసుల గోవిందు,గంటా తిరుపతిరావు, తళ్ల భార్గవ్, తళ్ల అప్పలస్వామి, పెదకాపు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ చాలదన్నారు. పదేళ్ల క్రితం భూములు ఇస్తే ఇప్పుడు నష్టపరిహారం, ప్యాకేజీ చెల్లిస్తున్నారని, అప్పటికీ ఇప్పటికీ మార్కెట్ధరల్లో చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. పెళ్లికాని మహిళలకు కూడా ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. డీఫారం భూముల్లో ఉన్న చెట్లక , వ్యవసాయ బోర్లకు, బావులకు సైతం నష్టపరిహారం చెల్లించాల్సిందేనన్నారు. ప్యాకేజీ వ్యవహారం తేల్చకుండా భూములు స్వాధీనం చేసుకుని పనులు ప్రారంభించడం తగదన్నారు. తహసీల్దార్ నర్సింహమూర్తి డీటీ నారాయణరావు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. -
భంగపడ్డ గంగపుత్రులు
వేష నిషేధ భృతి మంజూరులో అవకతవకలు ‘‘అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీ పరిధిలో అర్హత ఉన్న 300 మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి రాలేదు. మొత్తం 367 బోట్లు రిజిస్టర్ అయినవి ఉన్నాయి. ప్రతీ బోటుకు ఆరుగురు ఉంటారు. అందులో ఐదుగురు అర్హులకు మాత్రమే భృతి వచ్చింది. ఆరో వ్యక్తిగా కూటమి నేతలు తమకు అనుకూలమైన వ్యక్తి పేరును నమోదు చేసుకున్నారు. ఇలా అర్హత ఉండి రాని వారు.. వాడమొదల తాతారావు (బోట్ నెం.ఏపీ–వీ3–ఎండీ–120), మడ్డు మత్తురాజు (బోట్ నెం.ఏపీ–వీ3–ఎండీ–120), తెడ్డు అప్పన్న (బోట్ నెం.ఏపీ–వీ3–ఎండీ–159), కంబాల మౌళి (ఏపీ–వీ3–ఎండీ–120), వాడమొదల సత్తియ్య (ఏపీ–వీ3–ఎండీ–61), వాడమొదల నూకరాజు(ఏపీ–వీ3–ఎండీ–1688)’’ ● పూడిమడకకు చెందిన కౌవిరి బాపయ్య అనే మత్స్యకారుడికి ఒక్క సెంటు భూమి కూడా లేదు. కానీ ఆయనకు 80 ఎకరాల భూమి ఉన్నట్లు చూపించి నిషేధ భృతి ఆపేశారు. ఎందుకు రాలేదని సచివాలయ ఉద్యోగులను అడిగితే నీ పేరు మీద 80 ఎకరాలున్నట్లు చూపిస్తోందని చెప్పే సరికి బాపయ్య ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా మంది అర్హులైన మత్స్యకారులకు ఏదో ఒక కారణం చూపించి నిరాకరించారు. సాక్షి, అనకాపల్లి: మత్స్యకారుల సేవలో.. అని పేరు పెట్టారు. చివరకు వారి కడుపు కొట్టారు. అధికారంలోకి వచ్చాక తొలి సంవత్సరం వేట నిషేధ భృతి ఎలాగూ ఇవ్వలేదు. కనీసం రెండో సంవత్సరమైనా పద్ధతిగా ఇచ్చారా.. అంటే అదీ లేదు. భృతి అందుకున్న లబ్ధిదారుల వివరాలు సేకరిస్తే కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎందరో అనర్హులు లబ్ధి పొందినట్టు తేటతెల్లమయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ‘మత్స్యకార భరోసా’ పొందిన వారిలో అర్హత ఉన్న సుమారు 2 వేల మందికి ఈసారి భృతి అందలేదు. ఒక్కో బోటులో అర్హత లేని కూటమి పార్టీల అనుకూల మత్స్యకారులకు భరోసా కల్పించారు. వేట మీదే ఆధారపడి జీవించే గిరిపుత్రులకు అన్యాయం చేశారు. దీనిపై కలెక్టర్కు, జిల్లా మత్స్యకార అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. వేట నిషేధ కాలంలో అప్పులు చేసి, కాలం గడుపుతామని, భృతి మంజూరులో రాజకీయం చేసి తమ కడుపు కొట్టడం అన్యాయమని గంగపుత్రులు వాపోతున్నారు. తీరంలో ఉన్న ఆరు మండలాల పరిధిలోని 31 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 12,644 మత్స్య కుటుంబాలు కేవలం చేపల వేట, విక్రయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కూటమికి అనుకూలంగా ఉన్నవారికే భృతి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు వేట నిషేధ భృతి మొక్కుబడిగా అందించేవారు. రూ.5 వేల చొప్పున నిషేధం ముగిసిన చాలా కాలానికి ఇచ్చేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక భృతిని రూ.10 వేలకు పెంచడమే కాక ఠంఛనుగా వేట నిషేధ సమయంలో అందించేవారు. కూటమి పార్టీలు ఆ పరిహారాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా.. దాన్ని మొదటి ఏడాది విస్మరించారు. రెండో ఏడాది ఇచ్చినా తీరని అన్యాయం చేశారు. రీసర్వే పేరిట అర్హులను తొలగించి, తమకు అనుకూలంగా ఉన్నవారికి లబ్ధి చేకూర్చారు. అర్హత ఉన్నవారిని కాదని అనర్హులకు నిషేధ భృతి గత లబ్ధిదారుల్లో కొందరికి నిలిపివేత బోటులో వేటకెళ్లే మత్స్యకారుల బృందంలో ఒకరిద్దరి పేర్లు కూటమి నేతలకు అనుకూలురవే జిల్లా వ్యాప్తంగా 1580 మందిమత్స్యకారులకు నిలిచిపోయిన భృతి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంఉద్యమిస్తాం.. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వానికి మత్స్యకారుల ఓట్లే కావాలి.. వారి సమస్యలు, వెతలు వినపడవు. వేట నిషేధ భృతి మొదటి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాదిలో జిల్లాలో సుమారుగా 1500 మందికి అందలేదు. ఎన్నికల్లో కూటమి పార్టీలకే మత్స్యకారులు ఎక్కువగా ఓట్లు వేశారు. నమ్మిన వారిని మోసం చేయడం తగదు. అర్హులకు వేట నిషేధ భృతి అందకపోతే ఉద్యమానికై నా సిద్ధమే. – చోడిపల్లి శ్రీనివాసరావు, మాజీ మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్చేదు వాస్తవాలు 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 11,500 మంది మత్స్యకారులకు నిషేధ భృతి అందించారు. 2024లో కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా కల్పించలేదు. 2025లో జిల్లాలో నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లో 11,544 మందికి రూ.23.28 కోట్లు భృతి అందించారు. వీరు కాకుండా అర్హత ఉన్న సుమారుగా 1580 మందికి మత్స్యకారులు వేట నిషేధ భృతి రాలేదు. వీరిలో అచ్యుతాపురం మండలంలో 400 మంది మత్స్యకారులు, రాంబిల్లి, పరవాడ మండల పరిధిలో 200 మంది, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలో 400 మందికి పైగా మత్స్యకారులు ఉన్నారు. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని, కార్లు, భూములు ఉన్నాయని లేకపోయినా ఉన్నట్లు చూపించి సుమారు 500 మంది మత్స్యకారులను అనర్హులుగా పక్కన పెట్టారు. పేదవారితో రాజకీయమా? అర్హత ఉన్న మత్స్యకారులందరికీ నిషేధ భృతి ఇవ్వాలి. వేటకెళ్లే వారెవరో.. వెళ్లని వారెవరో సచివాలయంలో ఉన్న అధికారులకు తెలియదా..? వారికి అన్నీ తెలిసే స్థానిక కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వేటకెళితేగానీ పూటగడవని మత్స్యకారులున్నారు. అలాంటి వారికి ఇవ్వాల్సిన భృతిని కూడా నిలిపివేసి రాజకీయాలు చేస్తున్నారు. – ఉమ్మిడి జగన్, మత్స్యకార నాయకుడు, పూడిమడక బోటుకు రెండు అనధికార పేర్లు.. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి బోటుకు ఒకటి లేదా రెండు అనర్హుల పేర్లు చేర్చారు. వారికి నిషేధ భృతి ఇచ్చారు. ఈ అవకతవకల్లో స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ ఉద్యోగులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. మత్స్యకార భరోసాకు అర్హత ఉన్న సూరాడ కోదండరాం అనే బోట్ ఓనర్కు కూడా భృతి రాలేదు. అధికారులు పరిశీలించి అర్హులైన అందరికీ భృతి అందించాలి. – వాసుపల్లి శ్రీనివాసరావు, మత్స్యకారుడు, పూడిమడక టెక్నికల్ సమస్య కారణంగా కొందరికి రాలేదు వేట నిషేధ భృతి అర్హత ఉన్న ప్రతీ మత్స్యకారుడికీ ప్రభుత్వం అందించింది. చిన్నపాటి టెక్నికల్ సమస్య కారణంగా కొందరికి రాలేదని మా వరకూ వినతులు వచ్చాయి. అర్హత ఉండి భృతి రాని వారందరి నుంచి దరఖాస్తులు కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అందిస్తాం. – ప్రసాదరావు, మత్స్యకార జిల్లా జేడీ -
ఉప మేయర్గా దల్లి ఏకగ్రీవం
డాబాగార్డెన్స్ (విశాఖ): జీవీఎంసీ ఉప మేయర్గా కూటమి తరఫున జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియకు ప్రిసైడింగ్ అధికారిగా జేసీ మయూర్ అశోక్ వ్యవహరించారు. గోవిందరెడ్డి పేరును టీడీపీ నుంచి పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, బీజేపీ నుంచి ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ప్రతిపాదించారు. పోటీ లేకపోవడంతో ఎన్నికల అధికారి గోవిందరెడ్డికి నియామక పత్రం అందించారు. అనంతరం ప్రమాణస్వీకారం చేయించారు. ముందు జాగ్రత్త! ఉప మేయర్ ఎన్నికలో సోమవారం నాటి సీన్ రిపీట్ కారాదని జాగ్రత్త పడ్డారు. అసంతృప్త సభ్యుల్ని ముందుగానే రప్పించి మేయర్ చాంబర్లో కూర్చోబెట్టారు. మేయర్ పీలా శ్రీనివాసరావు తన చాంబర్ నుంచి లిస్ట్ ప్రకారం టిక్ పెట్టి మరీ సభ్యుల్ని కౌన్సిల్ హాల్లోకి పంపారు. ముందు రోజు డుమ్మాకొట్టిన వారికి బుజ్జగింపులు, తాయిళాలు అందినట్లు సమాచారం. యాదవ, కాపులకు వెన్నుపోటు జీవీఎంసీ మేయర్, ఉప మేయర్ ఎన్నికల్లో యాదవ, కాపు సామాజిక వర్గాలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆ సామాజిక వర్గ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మేయర్గా గొలగాని హరివెంకట కుమారి(యాదవ), ఉప మేయర్గా జియ్యాని శ్రీధర్(కాపు)లకు అవకాశం ఇచ్చారు. కౌన్సిల్లో బలం లేకపోయినా దొడ్డిదారిన వారిని దించేసిన కూటమి నేతలు, విశాఖలో కూటమి మనుగడకు కారణమైన ఈ రెండు వర్గాలను విస్మరించడంపై ఆయా సామాజిక వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. -
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
అనకాపల్లి: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న దేవరాపల్లి మండలం ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన చౌడువాడ దేముడునాయుడిని మార్టూరు గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. తమ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మార్టూరు జంక్షన్ వద్ద ఇటీవల కాలంలో వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిగా గుర్తించామన్నారు. ఇతని వద్ద మొత్తం 5 కేసులలో చోరీకి గురైన 7.5 తులాల బంగారం, 28 తులాల వెండి వస్తువులు, కెనాన్ కెమెరా, రూ.1,500లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ.8 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ, పగటి వేళ దొంగతనాలకు పాల్పడేవాడని ఆయన పేర్కొన్నారు. చిన్నతనంలోనే తండ్రి మృతి చెందడంతో నిందితుడు జులాయిగా తిరుగుతూ, చెడు వ్యసనాలకు బానిసై, ఆన్లైన్ బెట్టింగ్ వంటి చర్యలకు లోనై తన స్నేహితులతో కలసి ఈ చోరీలకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. అనంతరం ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ప్రశంసాపత్రాలతో అభినందించారు. నర్సీపట్నం టౌన్ పీఎస్ పరిధిలో... నర్సీపట్నంలోని శారదానగర్లో ఒంటరిగా నివసిస్తున్న రాళ్లపల్లి వెంకట లక్ష్మి గృహంలో ఈనెల 16న చొరబడి, ఆమైపె దాడి చేసి, బంగారు, వెండి ఆభరణాలను అపహరించిన అదే గ్రామానికి చెందిన ఉలబాల విజయకుమార్, కెళ్ల సతీష్, పత్రి నారాయణమ్మలను నర్సీపట్నం మండలం బలిఘట్టం టి–జంక్షన్ వద్ద అరెస్టు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు ఆభరణాలు 10 తులాలు, బంగారు గొలుసు 3 తులాలు, బంగారు గాజులు 7 తులాలు, బంగారు ఉంగరం తులం, వెండి దీపం కుందులు 19.370 తులాలు ముగ్గురు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో ఎస్పీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (క్రైమ్) ఎల్.మోహనరావు, అనకాపల్లి ఇన్చార్జ్ డీఎస్పీ బి.మోహనరావు, అనకాపల్లి రూరల్ సీఐ జి.అశోక్కుమార్, రూరల్ ఎస్ఐ జి.రవికుమార్, సెంట్రల్ క్రైం పోలీస్ స్టేషన్ సీఐ అప్పలనాయుడు, ఎస్ఐలు పి.రమేష్, చోడవరం సీఐ పి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. పట్టపగలే చోరీలు నలుగురు నిందితుల అరెస్టు 7.5 తులాల బంగారం, 28 తులాల వెండి వస్తువులు స్వాధీనం -
● తల్లీబిడ్డ అవస్థలు
అమ్మ అయిన ఆ సంతోషం కళ్లల్లో నిండాలి. పసిబిడ్డను అక్కున చేర్చుకొని, ప్రభుత్వ వాహనంలో సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. కానీ తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల సమ్మె ఆ ఆశలపై నీళ్లు చల్లింది. వాహనాలు నిలిచిపోవడంతో బాలింతల అవస్థలు పడ్డారు. మంగళవారం కేజీహెచ్లో డిశ్చార్జ్ అయిన చోడవరం ఎడ్లవీధికి చెందిన సౌందర్య జ్యోతికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. బిడ్డతో ఆటోలో ఇంటికి వెళుతున్న ఈ దృశ్యం, సమ్మె కారణంగా సాధారణ పౌరులు ఎదుర్కొంటున్న కష్టాలకు అద్దం పట్టింది. సౌందర్య జ్యోతి ఒక్కరే కాదు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లాల్సిన ఎంతో మంది తల్లులు, పసిబిడ్డలతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి ఆశలకు భంగం కలిగి, ప్రభుత్వ సేవలు అందక, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. –మహారాణిపేట/ –ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
డొంకాడ దాడిపై డీఎస్పీ విచారణ
నక్కపల్లి: డొంకాడలో దళితులపై తెలుగుదేశంపార్టీకి చెందిన అగ్రవర్ణాలు దాడి చేసిన ఘటనపై మంగళవారం నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు గ్రామంలో విచారణ నిర్వహించారు. వివాహ సమయంలో పెళ్లికొడుకు సెల్ఫోన్ కనిపించకపోవడంతో దానిని మైక్, లైటింగ్ ఏర్పాటు చేసిన దళిత యువకులే తీశారంటూ పెళ్లికొడుకుతోపాటు అగ్రవర్ణాలకు చెందిన పలువురు వ్యక్తులు కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టిన సంగతి తెలిసిందే. అగ్రవర్ణాల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమపై దాడి చేసి కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ బాధితులు సోమవారం నక్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు డొంకాడకు చెందిన సుమారు 14 మంది అగ్రవర్ణాల వారిపై పలు సెక్షన్లతో కూడిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబులు మంగళవారం ఘటనా స్థలానికి, ఎస్సీ కాలనీకి వెళ్లి బాధితులను విచారించారు. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఫిర్యాదు చేసిన వారితోపాటు, దాడిలో గాయపడిన వారి నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. విచారణను వీడియో చిత్రీకరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గ్రామంలో అగ్రవర్ణాల వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇలా ఒకసారి దాడి చేస్తే పెద్దల సమక్షంలో రాజీ పడ్డామన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే సెల్ఫోన్ చోరీ అభియోగం మోపి దాడికి తెగబడ్డారన్నారు. గ్రామపెద్దల సమక్షంలోనే దాడి జరిగిందని వాపోయారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. బాధితులకు ధైర్యం చెప్పి మరోసారి బుధవారం విచారణకు వస్తామన్నారు. ఇరువర్గాల వారు సంయమనం పాటించాలన్నారు. న్యాయం జరగకపోతే ఉద్యమం ఉధృతం గ్రామంలో డీఎస్పీ విచారణ అనంతరం దళిత సంఘాల ప్రతినిధులు, బాధితులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బూర్తి ఏసయ్య, దళిత నాయకుడు రాజేష్, కూరపాటి అప్పారావు, మాజీ ఎంపీటీసీ విది కుమారి కన్నారావు, కుంచా రమణ, వీది సత్యనారాయణ, నొక్కి అప్పారావు, నాసా సంస్థ ప్రతినిధి శాంతికుమారి తదితరులు మాట్లాడుతూ పథకం ప్రకారం టీడీపీ నాయకులు దళితులపై దాడులకు తెగబడ్డారన్నారు. గొడవ జరుగుతున్న సమయంలో సర్దిచెప్పేందుకు వచ్చిన మరికొంతమంది దళితులను గ్రామ పెద్దల సమక్షంలోనే దాడి చేసి గాయపరిచారన్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. 8 మంది దళిత యువకులపై దాడి చేసిన 14 మంది పేర్లతో కూడిన ఫిర్యాదును పోలీసులకు అందజేశామన్నారు. దాడి చేసిన వారిలో కొంతమంది పేర్లు ఎఫ్ఐఆర్ నుంచి తప్పించే ప్రయత్నాలు, కేసును నీరుగార్చే కుట్ర జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. నిందితులను కాపాడేందుకు కొంతమంది టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం వచ్చిందని, అదే గనుక జరిగితే దళిత సంఘాలన్నీ ఏకమై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాయని బూర్తి ఏసయ్య తెలిపారు. దళితుల నుంచి వాంగ్మూలం నమోదు కేసును నీరు గార్చే కుట్ర జరుగుతోందనిబాధితుల అనుమానం -
నాలుగు నెలలుగా పస్తులు
అనకాపల్లి: ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత బాలింతలను వారి పసికందులతో సహా క్షేమంగా ఇంటికి చేరుస్తున్నామని, ఎంతో బాధ్యత గల విధులు నిర్వహిస్తున్న తమను పస్తులతో ఉంచడం తగదని 102 తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు అన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఒకరోజు సమ్మె నిర్వహించారు. నెహ్రూచౌక్ వద్ద నిరసన ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కనీస వేతనాలు అమలు చేయడం లేదని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4 మాసాలుగా జీతాలు లేక అప్పులు చేసి కుటుంబాన్ని పోషించే పరిస్థితి ఏర్పడిందని, నేషనల్ హెల్త్ మిషన్ కల్పించుకోవాలన్నారు. యూనియన్ జిల్లా నాయకులు నర్సింగరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జీతాలు చెల్లించక తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల అవస్థలు ఒక రోజు సమ్మెతో నిరసన బాట పట్టిన బాధితులు -
పెంటకోట తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
పాయకరావుపేట: పెంటకోట తీరంలో సోమవారం సాయంత్రం సముద్ర స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చి ఇలా గల్లంతు కావడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాయకరావుపేట పట్టణం పాత హరిజనవాడకు చెందిన గంపల తరీష్(17) ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈయన స్నేహితుడు రాజవొమ్మంగికి చెందిన పిల్లి అభిలాష్(19) హైదరాబాద్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ పట్టణంలోని బంధువుల ఇంట్లో సోమవారం జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో పెంటకోట సముద్ర తీరానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. స్నానం చేస్తుండగా అభిలాష్ సముద్రంలో మునిగిపోతుండగా.. తరీష్ గమనించాడు. స్నేహితుడిని రక్షించే ప్రయత్నంలో తరీష్ కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మైరెన్ పోలీసులు, స్థానిక పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అయినా విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం మళ్లీ గాలింపు చేపడతామని ఎస్ఐ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ దళాలతో కూడా గాలింపు చర్యలు చేపడతామన్నారు. ఇద్దరు విద్యార్ధులు శుభకార్యానికి వచ్చి, సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతు అవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
అర్జీల పరిష్కారం తూచ్..
తుమ్మపాల: అర్జీదారులపై అధికారులకు కరుణే లేదు.. సమస్యలు పరిష్కరిస్తారని గంపెడాశతో వస్తే కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారే గానీ పట్టించుకోవడం లేదు.. అని కలెక్టరేట్కు వచ్చిన పలువురు అర్జీదారులు తమ ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు తమ గోడును విన్నవించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి అనేక మంది తరలివచ్చారు. వ్యయ ప్రయాసలకోర్చి మండుటెండను సైతం లెక్కచేయకుండా వచ్చినప్పటికి సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడం లేదని, విధుల్లో భాగంగా ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ ద్వారా అర్జీలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. ఇప్పటికే అనేక సార్లు వచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు చెంది పురుగులు మందులు, పెట్రోల్ వంటి ప్రాణాంతక పదార్థాలు వెంట తెచ్చుకుని అధికారులు, కలెక్టరేట్ పరిసరాలలో ఆత్మహత్యా యత్నాలతోపాటు పలు రకాల నిరసనలకు తెగిస్తున్నారు. ఆలస్యంగా పీజీఆర్ఎస్... ● పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించాల్సి ఉన్నప్పటికి అధికారుల రాక ఆలస్యమవడంతో అర్జీదారులు కొంత సమయం క్యూలోనే వేచి ఉండాల్సి వచ్చింది. ● యలమంచిలి 10వ వార్డు సచివాలయం పరిధిలో అర్హత ఉండి పింఛన్లు మంజూరు కావడం లేదంటూ 40 మందికిపైగా అర్హులు కలెక్టర్ను ఆశ్రయించారు. ఇటీవల ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పింఛన్ల పథకంలో అర్హులుగా తమను చేర్చాలని అర్జీలు అందజేశారు. ● పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీలను కలెక్టర్ విజయ కృష్ణన్, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్డీసీ సుబ్బలక్ష్మి స్వీకరించారు. మొత్తం 370 అర్జీలు నమోదయ్యాయి. దివ్యాంగులకు ఉచితంగా ఇల్లు కట్టివ్వాలి నిరుపేదలైన అనేక మంది దివ్యాంగులకు ప్రభుత్వమే కాలనీ నిర్మించి ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇల్లుతోపాటు కరెంటు, నీరు, తదితర సౌకర్యాలు కల్పించాలని శ్రీరామ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు విన్నవించారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పథకాలు అమలు చేయాలి నెలకు రూ.13 వేల జీతంతో జీవించే తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పథకాలు కట్ చేసి మరింత నిరుపేదలను చేస్తున్నారని జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు వాపోయారు. నెలకు రూ.30 వేలకుపైగా జీతం పొందుతున్న ప్రైవేటు ఉద్యోగులకు అన్ని పథకాలు వర్తించినట్లే తమకు అమలు చేసి ఆదుకోవాలని కలెక్టర్ను కోరారు. కరెంటు, మంచినీళ్లూ ఇవ్వండయ్యా.. ప్రభుత్వ ఆర్థిక సాయంతో సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. ఊర్లో అందరికి ఇంటింటి కుళాయిలు వేశారు. మా ఇంటికి మాత్రం వేయలేదు. దూరం నుంచి బిందెలతో నీరు తెచ్చుకోవడం కష్టంగా ఉంది. కరెంటు మీటరు కోసం రూ.1,800 చెల్లించినప్పటికి కనెక్షన్ ఇవ్వలేదు. న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో కలెక్టర్కు మొరపెట్టుకున్నా – పల్లా అర్జునమ్మ, తురకలపూడి, బుచ్చెయ్యపేట మండలం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో మా మొర వినడం లేదు పలుమార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు కార్యాలయాల చుట్టూ తిరగలేక చస్తున్నాం అర్జీదారుల ఆవేదన, అసహనం -
గొర్రెల మంద పంపకాల్లో వివాదం
కశింకోట: గొర్రెల మంద పంపకాల విషయమై ఇరువర్గాల మధ్య ఏర్పడిన వివాదంలో వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మండలంలోని ఉగ్గినపాలెంలో కలకలం రేపింది. సీఐ అల్లు స్వామినాయుడు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం... గొర్రెల మంద పంపకాల విషయమై గ్రామానికి చెందిన పక్కుర్తి అప్పలనాయుడు (65), కుమారుడు, అతని తమ్ముడుకు ఒమ్మి నూకరాజు, కుమారుడు ఒమ్మి శ్రీను మధ్య ఆదివారం వివాదం ఏర్పడింది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దాంతో రాత్రి 9.30 గంటల సమయంలో కోపోద్రిక్తులైన నిందితులు నూకరాజు, శ్రీను అప్పలనాయుడుపై కర్రలతో దాడి చేశారు. కింద పడవేసి కాళ్లతో పొట్ట భాగంలో తొక్కుతూ తీవ్రంగా గాయపర్చారు. అయితే కొన ఊపిరితో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు అక్కడ వైద్యుడు ధ్రువీకరించారు. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడానికి గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఉగ్గినపాలెంలో వృద్ధుడి దారుణ హత్య -
కొడుకు చూడలేదు.. పురుగుల మందు తాగి చచ్చిపోతా
అయ్యా.. నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను పెంచి పెద్ద చేస్తే, ఈ రోజు ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నాడు. నన్ను నానా చిత్రవధ చేస్తున్నాడు. వాడి నుంచి నాకు రక్షణ కల్పించాలని ఐదేళ్లుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా.. ఇప్పటికి ముగ్గురు ఎస్సైలు మారారు. నా సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఈ రోజు న్యాయం చేయకపోతే చచ్చిపోదామని పురుగులు మందు డబ్బాతో కలెక్టరేట్కు వచ్చానని ఎస్.రాయవరం మండలం వేమగిరి గ్రామానికి చెందిన వృద్ధురాలు వై.సరోజమ్మ కన్నీరుమున్నీరైంది. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పోలీసులు తనిఖీల్లో పురుగుల మందు డబ్బా గుర్తించి ఆమెను బయటకు తీసుకొచ్చి ఎస్.రాయవరం పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడికి పంపించారు. అయితే ఎస్.రాయవరం ఎస్సై కూడా న్యాయం చేయడం లేదని, కలెక్టర్ కళ్లెదుటే పురుగుల మందు తాగి చచ్చిపోతానంటూ వృద్ధురాలు రోదించింది. -
వడ్డాది టీడీపీ అధ్యక్షుడి ఎన్నికలో వర్గ విభేదాలు
బుచ్చెయ్యపేట : ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మధ్య వర్గ విభేదాల ప్రభావం ఇపుడు వడ్డాది టీడీపీ అధ్యక్షుడు పదవిపై పడింది. ఇటీవల గ్రామ టీడీపీ అధ్యక్షుని ఎన్నికల్లో భాగంగా గ్రామ టీడీపీ నాయకులు వడ్డాదిలో మీటింగ్ పెట్టారు. రెండేళ్లుగా టౌన్ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మేనల్లుడు దొండా నరేష్ను తిరిగి టౌన్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అనంతరం కమిటీ మెంబర్లు తీర్మానం కాపీని మండల టీడీపీ గౌరవ అధ్యక్షుడు తమరాన దాసుకు, ఎమ్మెల్యే రాజుకు అందించారు. వడ్డాది టౌన్ అధ్యక్షుడిగా ఎన్నికై న నరేష్ ఎమ్మెల్యే రాజును కలిసి ఎన్నికై న విషయాన్ని తెలపగా ఎమ్మెల్యే అతనిని అభినందించారు. ఇదే పదవి నరేష్కు కాకుండా తాతయ్యబాబు బావమరిది గ్రామదేవత మోదకొండమ్మ ఆలయ కమిటీ చైర్మన్ దొండా గిరిబాబుకు ఇవ్వాలని మాజీ ఉప సర్పంచ్ సయ్యపురెడ్డి శ్రీనివాసరావు, మండల యాదవ సంఘం అధ్యక్షుడు శింగంపల్లి రమేష్, నాయకుడు శ్యామ్ తదితరులు తీర్మానం చేసి ఎమ్మెల్యే రాజును కలిసి దరఖాస్తు అందించారు. అప్పటికే నరేష్ను టౌన్ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించిన విషయం ఎమ్మెల్యేకు తెలిసినా ఆ విషయాన్ని రెండో వర్గానికి చెప్పకుండా వారి నుంచి దరఖాస్తు తీసుకోవడంపై పలువురు టీడీపీ నాయకులు ఆగ్రహం చెందుతున్నారు. స్వయాన తాతయ్యబాబు మేనల్లుడు దొండా నరేష్, బావమరిది దొండా గిరిబాబు వడ్డాది టౌన్ అధ్యక్షుడి పదవికి పోటీ పడడం వెనక ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరి బయట పడిందని అంటున్నారు. సోమవారం చోడవరంలో నియోజకవర్గ మినీ మహానాడు జరిగినా వడ్డాది టౌన్ అధ్యక్షుడి పేరు మాత్రం ఎమ్మెల్యే ప్రకటించలేదు. వేంకటేశ్వరస్వామి దేవస్ధానం మాజీ చైర్మన్ సయ్యపురెడ్డి మాధవరావు, కోవెల అప్పనదొర జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ మేడివాడ రమణ, మాజీ వార్డుమెంబర్, తలారి శంకర్,నాయకులు ముత్యాల సూరిబాబు తదితరులు నరేష్నే వడ్డాది టౌన్ అధ్యక్షుడిగా నియమించాలని పట్టుబడగా, మరో వర్గం గిరిబాబుకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యే రాజు ఎవరిని ఎంపిక చేస్తారోనని ఎదురు చూస్తున్నారు. -
ఏపీఐఐసీ భూముల్లో.. కూటమి గద్దలు
గ్రావెల్ దందాలో హోం మంత్రి అనుచరులు నియోజకవర్గంలో ఎక్కడైనా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపితే సహించేది లేదని హోం మంత్రి అనిత ప్రకటించినప్పటికీ ఆమె ఆనుచరులుగా చెప్పుకుంటున్న వారే గ్రావెల్ దందాలకు పాల్పడటం గమనార్హం. నిత్యం వందలాది ట్రాక్టర్లపై తరలించి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. యథేచ్ఛగా గ్రావెల్, ఇసుక తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ మైనింగ్, ఏపీఐఐసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని పరిశ్రమలకు భూములు ఇచ్చిన రైతులు చెబుతున్నారు. ఎవరైనా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే హోం మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నారయి. బదిలీ చేయిస్తాం, అవసరమైతే భౌతిక దాడులకు పాల్పడతామంటూ హెచ్చరించడం వల్లే అధికారులు కూటమి నాయకుల దందాను అరికట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సీఐ కుమార స్వామి వద్ద ప్రస్తావించగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లు రెవెన్యూ సిబ్బంది నుంచి ఫిర్యాదు వచ్చిందన్నారు. ట్రాక్టర్ల పట్టుకుని అప్పగించ లేదన్నారు. కొన్ని వాహనాల నంబర్లు, నంబర్లు లేని ట్రాక్టర్ల వివరాలు ఇచ్చారన్నారు. వాహనాలను తమకు అప్పగిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. నక్కపల్లి: సహజ వనరుల దోపిడీలో కూటమి నాయకులకు హద్దు అదుపు లేకుండా పోతోంది. పరిశ్రమల కోసం ఏపీఐఐసీ వారు సేకరించిన భూముల్లో గద్దల్లా వాలిపోయి జేసీబీలతో వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను తవ్వేస్తూ ట్రాక్టర్లపై తరలించి అమ్ముకుంటున్నారు. నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక్క ట్రాక్టర్ గ్రావెల్ తవ్వినా సరే సహించేది లేదని, దాడులు చేసి కేసులు నమోదు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఇచ్చిన ఆదేశాలను వారు బేఖాతరు చేస్తున్నారు. మంత్రి ఆదేశాలను పక్కన పెట్టేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రావెల్ దందా కొనసాగిస్తున్నారు. అడ్డుకుంటున్న అధికారులను మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీ వారు చందనాడ, అమలాపురం, రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, బోయపాడు తదితర గ్రామాల్లో ఐదు వేల ఎకరాలను సేకరించింది. నష్టపరిహారం, ప్యాకేజీ చెల్లింపు ప్రక్రియ పూర్తిచేసి భూములను స్వాధీనం చేసుకుంది. ఈ భూములను బల్క్డ్రగ్ పార్క్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ల కోసం కేటాయించింది. పరిశ్రమలు స్థాపించే ప్రాంతాల్లో ఏపీఐఐసీ వారు మౌలిక సదుపాయాల కల్పించే పనులు ప్రారంభించారు. రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. పనులు చేసే సంస్థలకు గ్రావెల్, ఇసుక అవసరం ఉంది. దీంతో ఉపమాక, నీలకుండీలు, చందనాడ గ్రామాలకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు ఏపీఐఐసీ వారు సేకరించిన భూముల్లో కొండలు, ఇసుక దిబ్బల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతి లేకుండా జేసీబీలను ఏర్పాటు చేసి రాత్రి సమయాల్లో వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను తవ్వేస్తున్నారు. ఇలా తవ్విన గ్రావెల్ను నంబర్లు లేని ట్రాక్టర్లపై తరలించి సమీపంలో ఉన్న రసాయన పరిశ్రమలకు, ఇళ్లు, రోడ్లు నిర్మించే వారికి, మౌలిక సదుపాయాలు కల్పించే కాంట్రాక్టర్లకు విక్రయిస్తున్నారు. 15 రోజులుగా జరుగుతున్న ఈ దందా వెనుక మంత్రి అనుచరులమంటూ చెప్పుకు తిరిగే టీడీపీ నాయకుల అండదండలతోపాటు, వారికే చెందిన జేసీబీలు, ట్రాక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది రెండు రోజు క్రితం రాత్రి సమయాల్లో దాడులు చేసి గ్రావెల్ తవ్వుతున్న జేసీబీలు, ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటి నంబర్లను నమోదు చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రెవెన్యూ వారిచ్చిన నంబర్ల ఆధారంగా పట్టుబడ్డ వాహనాలను సీజ్ చేయడం కేసులు నమోదు చేయకుండా కొంతమంది కూటమి నాయకులు పైరవీలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. జేసీబీలతో రాత్రిపూట గ్రావెల్ తవ్వకాలు నంబర్లు లేని వాహనాల్లో అక్రమంగా తరలింపు హోం మంత్రి ఆదేశాలు బేఖాతరు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ వర్గాలు కేసులు నమోదు చేయకుండా కూటమి నేతల ప్రయత్నాలు ఏపీఐఐసీ భూముల్లో జేసీబీతో గ్రావెల్ తవ్వుతున్న దృశ్యం -
చక్కెర ఫ్యాక్టరీలను ఎపుడు తెరిపిస్తారు ఎంపీగారూ!
కోటవురట్ల : జిల్లాలో మూతపడిన నాలుగు చక్కెర కర్మాగారాలను ఎపుడు తెరిపిస్తారో ఎంపీ సీఎం రమేష్ ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్.సత్యనారాయణరాజు ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ సీఎం రమేష్ ఎన్నికల ముందు ఎన్నో హామీ లు కురిపించారని, అందు లో తాండవ, ఏటికొప్పాక, గోవాడ, తుంపాల చక్కెర కర్మాగారాలను తెరిపించి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతామని కూటమి తరపున హామీ ఇచ్చారన్నారు. ప్రతి చిన్న విషయానికి ఎంతో హడావుడి చేసే ఎంపీ రమేష్ రైతుల కష్టాల పట్ల ఎందుకు స్పందించడంలేదో తెలపాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా సీఎం రమేష్ చక్కెర ఫ్యాక్టరీలను ఒక్కరోజు కూడా సందర్శించిన పాపాన పోలేదన్నారు. గోవాడ చక్కెర కర్మాగారంలో చెరకు రైతులు అనేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరై రోడ్డెక్కి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపినా ప్రభుత్వానికి పట్టలేదని విమర్శించారు. నాలుగు ఫ్యాక్టరీలను తెరిపించి చెరకుసాగులో అత్యధిక దిగుబడులు వచ్చేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. అధిక దిగుబడిని ఇచ్చే కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన చెరకు దవ్వను తెప్పించి ఇక్కడి రైతులకు సరఫరా చేయాలన్నారు. అంతేకాకుండా వరి, చెరకు పంటలను ప్రోత్సహించేలా ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణరాజు -
కేసు తేలేదాకా..అభివృద్ధి ఎలా..?
రాంబిల్లి(అచ్యుతాపురం): ఎవరో ఒక్కరు చేసిన ఫిర్యాదుకు నాలుగు గ్రామాల ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. తక్షణమే తమ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలని, సాంకేతికంగా అవరోధంగా ఉన్న కోర్టు కేసులు పరిష్కరించాలని రాంబిల్లి మండలానికి చెందిన అప్పారాయుడిపాలెం, భోగాపురం ప్రజలు జిల్లా కలెక్టర్ను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా సోమవారం కోరారు. వివరాలివి... టీడీపీ నేత నిర్వాకం వల్లే.. రాంబిల్లి మండలం పంచదార్ల పంచాయతీ పరిధిలో పంచదార్ల, ధారపాలెం, భోగాపురం, అప్పారాయుడిపాలెం ఉండేవి. ఆయా గ్రామాల ఓటర్ల సంఖ్య సుమారు 2,500. ఈ నాలుగు గ్రామాల్ని పరిపాలన సౌలభ్యం కోసం రెండు పంచాయతీలు చేయాలని నిర్ణయించారు. భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా పంచదార్ల,ఽ ధారపాలెం గ్రామాల్ని ఒక పంచాయితీగా, అప్పారాయుడిపాలెం, భోగాపురం గ్రామాల్ని ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించి గ్రామ సభలు నిర్వహించారు. అప్పారాయుడిపాలెం గ్రామం పంచదార్లకు 3 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆర్అండ్బీ శాఖ ధృవీకరించింది. గ్రామసభ ఆమోదాన్ని పరిగణిస్తూ అభ్యంతరాలుంటే పది రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని పంచాయతీ విస్తరణాధికారి విభాగం సూచించింది. అయితే ఈ ప్రతిపాదనలు రుచించని వారు అప్పట్లో కోర్టుని ఆశ్రయించారు. దీనిలో టీడీపీ నేత హస్తముందనేది స్థానికుల ఆవేదన. దీంతో 2020 నుంచి నాలుగు గ్రామాల్లో ముఖ్య పంచాయతీకి పాలకులు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు నాలుగు గ్రామాలకు కలిపి సుమారు రూ. 56 లక్షలు ఆగిపోయాయి. రోడ్లు, మంచి నీటి సరఫరా, పారిశుధ్యం పడకేశాయి. నాలుగేళ్లు గడిచినా తమ గ్రామాల ఏర్పాటుకు సంబంధించిన కేసు పెండింగ్లో ఉన్నందున ఎన్నికలు జరగలేదని, వెంటనే కోర్టు కేసుల్ని పరిష్కరించాలని ఆయా గ్రామాలకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్ ద్వారా మొరపెట్టుకున్నారు. సందిగ్ధంలో నాలుగు గ్రామాలు 2020 తర్వాత జరగని స్థానిక ఎన్నికలు విడుదల కాని 15వ ఆర్థిక సంఘం నిధులు తమ సమస్య పరిష్కరించాలనిపీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతి -
ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల సమస్యలు సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, చీటింగ్, భూ సమస్యలపై అర్జీలు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, ఎస్ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంఅనకాపల్లి టౌన్: జిల్లాలోని 19 కేంద్రాల్లో సోమవారం జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షకు 601 మంది విద్యార్థులకు గాను 411 మంది హాజరయ్యారని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో మూడు కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 65 మందికి గాను 50 మంది, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షకు 143 మందికిగాను 118 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 22 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశామని, ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. -
దళిత వాడలను పంచాయతీలు చేయాలి
నర్సీపట్నం: ప్రతి దళిత వాడను పంచాయతీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అంబేడ్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.వి.సునీల్ కుమార్ (ఐపీఎస్) పేర్కొన్నారు. మిషన్ సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త గుడబండి నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో నర్సీపట్నం మండలం ఓఎల్పురంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సునీల్కుమార్ ప్రారంభించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడగటం లేదని, కొన్ని వందల ఏళ్లుగా అధికారానికి దూరంగా అణగదొక్కబడుతున్న జాతి కోసం దళిత వాడలను పంచాయతీలు చేయాలని కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో వెయ్యి జనాభా దాటిన దళితవాడలు మూడు వేలు వరకు ఉన్నాయన్నారు. వీటిన్నింటిని పంచాయతీలు చేయాలన్నదే ప్రధాన డిమాండ్ అన్నారు. ఏటా బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు రూ.20 వేల కోట్లు చూపిస్తున్నారన్నారు. ఈ నిధుల్లో రూ.6 వేల కోట్లు ఇస్తే దళితవాడ పంచాయతీకి రూ.2 కోట్లు వస్తుందన్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా అణిచి వేయబడి అధికారానికి దూరంగా ఉన్న జాతికోసం బాధపడాలన్నారు. అనంతరం విగ్రహ దాత నాగేశ్వరరావును సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, ఏఐఎం రాష్ట్ర నాయకుడు శ్రీను, డీసీసీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న, గ్రామ సర్పంచ్ బంటు నాగరాజు, మాల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మరిడియ్య, జనసేన నాయకులు అద్దెపల్లి గణేష్, భూసి వెంకటరావు, దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు చిట్ల చలపతిరావు, పెదపూడి ప్రభుదాసు, ఉపాధ్యాయుడు ఊడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సునీల్ కుమార్ -
కూటమిలోడిప్యూటీ చిచ్చు
● జనసేనకు డిప్యూటీ మేయర్ కేటాయింపుపైససేమిరా అంటున్న టీడీపీ నేతలు ● 22 రోజుల క్రితం ఉన్న ఐక్యత ‘కౌన్సిల్ సాక్షిగా’ భగ్నం ● కూటమి పార్టీల్లో బయటపడ్డ లుకలుకలు డాబాగార్డెన్స్ (విశాఖ): ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనేది నానుడి. దీనికి తగ్గట్టుగానే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ, జనసేన మధ్య చిచ్చురేపింది. మొన్నటి మేయర్ ఎన్నిక వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇరుపార్టీల నేతల్లో అసహనం వ్యక్తమైంది. ఇన్నాళ్లూ కూటమి పార్టీలంతా ఒక్కటేనని బయటకు చెబుతున్నా.. ఈ ఎన్నిక సందర్భంగా లుకలుకలు బయటపడ్డాయి. సంఖ్యాబలం ఉండి కూడా కోరం లేక సమావేశం వాయిదా పడిందంటే.. ఐక్యత ఎంత మేర ఉందో అర్థమవుతోంది. మేయర్గా పీలా శ్రీనివాసరావును కూటమి సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సమయంలోనే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. టీడీపీ ఆశావాహులు మాత్రం గత వారం రోజులుగా ఈ పదవి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ తనకే పదవి వచ్చేలా చూడాలంటూ శతవిధాలా ప్రయత్నాలు చేశారు. అయితే జనసేన పార్టీకే డిప్యూటీ మేయర్ పదవి కేటాయించారు. ఆ పార్టీకి చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డికి ఆ పార్టీ నేతలు బీ ఫారం అందజేశారు. కారాలు మిరియాలు జనసేనకు చెందిన దల్లి గోవిందరెడ్డికి బీ ఫారం ఇవ్వడంతో టీడీపీ కార్పొరేటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించారు. మంగళవారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో భేటీ అయిన టీడీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. హోటల్ నుంచి ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు వేరే చోటికి వెళ్లిపోయారు. ఓ వర్గం టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరైనా.. కోరానికి సరిపడా సభ్యులు లేకపోవడంతో జనసేన ఆశలు ఆవిరైనట్టయింది. దీంతో ఇరు పార్టీల నేతలు కారాలు మిరియాలు నూరుకున్నారు. జంప్ జిలానీలు డీలా..స్వార్థ రాజకీయాలు, డబ్బు లకు అమ్ముడుపోయి వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన కార్పొరేటర్లు, ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు వారు ఆశించినట్టు సాగకపోవడంతో తెల్ల మొహాలు వేసినట్టయింది. ఎందుకు పార్టీని వీడామని మధనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఎంత తేడా..! గత నెల 28న మేయర్ ఎన్నిక నిర్వహించారు. కుట్రలు, కుతంత్రాలతో నిర్వహించిన ఎన్నికలో పీలా శ్రీనివాస్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 22 రోజుల తర్వాత నిర్వహించిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో కూటమి పార్టీల్లో లుకలుకలు బయటపడ్డాయి. కేవలం అధికారం కోసం ఏర్పడిన పొత్తు కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. దల్లిపై ఎన్ని ఫిర్యాదులో.. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇటీవలే వైఎస్సార్ సీపీ నుంచి జనసేనలో చేరిన పలువురు కార్పొరేటర్లు.. తొలి నుంచి జనసేన పార్టీలో ఉన్న దల్లి గోవిందరెడ్డిపై అధిష్టానానికి పలు ఫిర్యాదులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దల్లి గోవిందరెడ్డి గుట్కా వ్యాపారితో అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారంటూ ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అవి అవాస్తవమని తెలియడంతో పార్టీ అధిష్టానం దల్లి గోవిందరెడ్డికే డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపింది. బీ ఫారం అందజేయడంతో ఆ పార్టీలో చేరిన వారంతా కంగుతిన్నట్టయింది. టీడీపీలో ముసలం పెట్టిందే వీరే.. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు ముసలం పెట్టారని ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు బాహాటంగా అంటున్నారు. మేయర్ గంధం శ్రీనివాస్కు, వెలగపూడి యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మంగవేణికి, గంటా భీమిలి నియోజకవర్గం యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ మొల్లి హేమలతకు హామీ ఇచ్చి వారిలో ఆశలు రేకెత్తించారనే ఆరోపణలు భగ్గుమంటున్నాయి. -
‘అన్నదాత’కు ఆపసోపాలు
కశింకోట: అన్నదాత సుఖీభవ పథకంలో నమోదు చేసుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా భూముల రీ–సర్వేలో కొందరి ఆధార్, సెల్ నంబర్ తదితర వివరాలను నమోదు చేయపోవడం, మరికొందరికి తప్పుగా నమోదు చేయడం, భూముల వివరాలు, పేర్లలో తప్పులు చోటు చేసుకోవడం రైతులను కష్టాల పాలు చేస్తోంది. తప్పులు సరిచేసుకోవడం రైతుల బాధ్యతని అధికారులు చెబుతుండడంతో వ్యవసాయ, తహసీల్దార్ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పని ఒత్తిడి పేరుతో అధికారులు, సిబ్బంది రైతుల పట్ల అసహనం వ్యక్తం చేస్తుండడంతో పాటు సకాలంలో పనులు జరగక నానా అవస్థలు పడుతున్నారు. పథకంలో చేరేందుకు ఈ నెల 20వ తేదీ ఆఖరు రోజు. గడువు నేటితో ముగుస్తున్నా సుఖీభవ పథకంలో నమోదైన వారి సంఖ్య జిల్లాలో 25 శాతం కూడా లేదు. కొత్త జాబితా తయారీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద ఏటా రూ.13,500 అందించే వారు. ఈ పథకం స్థానంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు వివరాల సేకరణ చేపట్టింది. ప్రభుత్వ సిబ్బంది సుఖీభవ పథకానికి అర్హులను గుర్తించడానికి రైతుల నుంచి డేటా సేకరిస్తున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న జాబితా ఆధారంగా రైతుల పట్టాదారు పాసు పుస్తకం నకలు, లేదా 1బి, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్లను సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా రైతుల జాబితాలో ఉన్న మేరకు రికార్డులను సరిపోల్చి మరో జాబితాను తయారు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆధార్ కార్డు నంబర్, సెల్ ఫోన్ నంబర్లు రీ–సర్వే రికార్డులకు అనుసంధానం కాకపోవడం, రైతుల పేర్లు తప్పుగా నమోదు కావడంతో సుఖీభవ పథకం నమోదుకు రైతు సేవా కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారు. రికార్డులను సవరించుకోవాలని తహసీల్దార్, వీఆర్వోల వద్దకు పంపుతున్నారు. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికే ఈ క్లిష్టమైన ప్రక్రియను ప్రవేశపెట్టారని రైతులు ఆందోళన చెందుతున్నారు. 50 వేల మంది మాత్రమే నమోదు గతంలో రైతు భరోసా కింద జిల్లాలో 2.30 లక్షల మంది వరకు లబ్ధి పొందారు. వీరిలో ఇప్పటి వరకు 50 వేలు పైబడి మాత్రమే నమోదు అయినట్లు అధికారిక సమాచారం. ఇంకా కౌలు రైతులకు కౌలుదారి కార్డులు ఇవ్వలేదు. వారిని కూడా నమోదు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నమోదు గడువు పొడిగించగలరని అధికారులు పేర్కొంటున్నారు. రికార్డులు సవ్యంగా ఉన్న జాబితాను విజయవాడ కమిషనర్కు ఆన్లైన్లో నివేదిస్తే దాన్ని పరిశీలించి అక్కడ తుది జాబితాను రూపొందించి రైతు సేవా కేంద్రాలకు పంపుతారని, దీంతో అర్హుల ఫేషియల్తో ఈకేవైసీ చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇది జరగడానికి సమయం కూడా ఎక్కువ పడుతుందని, వచ్చే నెలలో ఈ ప్రక్రియ పూర్తి కాగలదంటున్నారు. భూముల రీ–సర్వే పరిగణన అన్నదాత సుఖీభవ పథకానికి భూముల రీ–సర్వే డేటాను పరిగణనలోకి తీసుకుంటున్నారు. జిల్లాలో 64 శాతం గ్రామాల్లో రీ– సర్వే పూర్తయిందని సమాచారం. రీ–సర్వే జరగని గ్రామాల్లో మాత్రం పాత పట్టాదారు పాసు పుస్తకాల డేటాను ఆధారంగా తీసుకుని పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రీ–సర్వేలో భూముల విభజన, పంపకాలు జరగడం వల్ల న్యాయంగా లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సి ఉంది. రీ సర్వే భూ పత్రాల్లో ఆధార్, సెల్ నంబర్లు నమోదులో నిర్లక్ష్యం ఇది రైతుల బాధ్యత అంటున్న అధికారులు అన్నదాత సుఖీభవ నమోదుకు తిరస్కరణ దరఖాస్తుకు నేడు ఆఖరి రోజు 25 శాతం కూడా లేని నమోదు రికార్డుల సవరణకు రెవెన్యూ, సచివాలయ, వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది భూమి వివరాలతో ఆధార్ సంఖ్య అనుసంధానం కాలేదు. దీంతో అన్నదాత సుఖీభవ పథకంలో నమోదుకు వ్యవసాయ శాఖ సిబ్బంది తిరస్కరించారు. సచివాలయం, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి సవరించుకోవాలని సూచించారు. సచివాలయం, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. రీ–సర్వే సమయంలో ఆధార్ సంఖ్య నమోదు చేయకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నాం. – ముక్కా సత్తిబాబు, రైతు, వెదురుపర్తి గ్రామం 25 శాతం రైతుల రికార్డులు సరిపోల్చాం అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లాలో 25 శాతం మంది రైతుల రికార్డులను సరిపోల్చాం. ఇంకా 75 శాతం వరకు రికార్డులు సరిపోల్చాల్సి ఉంది. దీనివల్ల పథకానికి నమోదుకు గడువు పెరగగలదు. ఆధార్, సెల్ఫోన్ నంబర్లు అనుసంధానం కాకపోవడం, పేర్లు తప్పులు పడటం తదితర వాటిని సవరించేందుకు తహసీల్దార్, వీఆర్వోల వద్దకు సిఫారసు చేస్తున్నాం. కౌలు రైతులకు ఈ పథకం వర్తింపునకు ఇంకా కార్డులు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 2.30 లక్షల మంది వరకు ఈ పథకానికి లబ్ధిదారులు ఉంటారని అంచనా. – బి.మోహనరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, అనకాపల్లి -
వైస్ ఎంపీపీలు ఏకగ్రీవం
వైఎస్సార్సీపీ కై వసం దేవరాపల్లిలో పంచాడ సింహాచలంనాయుడు.. దేవరాపల్లి: వైస్ ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచాడ సింహాచలంనాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఎస్.మంజులవాణి సమక్షంలో వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరిగింది. మండలంలోని 17 ఎంపీటీసీలకు గాను 12 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. సింహాచలంనాయుడు పేరునును ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి ప్రతిపాదించగా, ఎం.అలమండ ఎంపీటీసీ పోతల వెంకటరావు బలపరిచారు. ఎంపీటీసీలు సింహాచలంనాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. మాడుగులలో విజయలక్ష్మి.. మాడుగుల: స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం వైస్ ఎంపీపీ–1 ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 21 మంది ఎంపీటీసీలకు గాను 15 మంది ఎన్నికలో పాల్గొన్నారు. మాడుగుల ఒకటవ సిగ్మెంట్లో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీగా కొనసాగుతున్న పొలిమేర విజయలక్ష్మిని 15 మంది ఎంపీటీసీలు చేతులెత్తి వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ప్రిసైడింగ్ అధికారి కె.వీరన్ననాయుడు నియామక పత్రం అందజేసి విజయలక్ష్మి చేత రిజిస్టర్లో సంతకం చేయించి, ప్రమాణ స్వీకారం చేయించారు. -
దొంగ నోట్ల ఉచ్చులో వ్యాపారులు
నర్సీపట్నం: దొంగ నోట్లు కలకలం రేపుతున్నాయి. చిరు వ్యాపారులు తెలియక తీసుకుని తరువాత లబోదిబోమంటున్నారు. మూడు రోజుల కిందట పెద్ద బొడ్డేపల్లి ఆర్డీవో బంగ్లాకు సమీపంలోని పండ్ల దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తి రూ.500 నకిలీ నోటుతో పండ్లు కొనుగోలు చేశాడు. ఆ వ్యాపారి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా ఆ నోటు నకిలీదిగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. ● తాజా సోమవారం మున్సిపాలిటీ కొత్తవీధిలో నివాసం ఉంటూ కొత్తకోటలో ప్రభుత్వ టీచర్గా పని చేస్తున్న సాంబశివ దొంగ నోట్లతో ఉన్న సంచిని నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సాంబశివ తన భార్యను ఊరు పంపించేందుకు బైక్ పై నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్కు తీసుకొచ్చారు. బస్సెక్కించి వచ్చే సరికి బైక్పై సంచి ఉంది. అందులో పాత జీన్ ప్యాంటు, ఒక షర్ట్తో పాటు రెండు కొత్త రూ.500 నకిలీ నోట్ల కట్టలు ఉన్నాయి. కంగారు పడిన టీచర్ 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన సూచన మేరకు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో నోట్ల కట్టలతో కూడిన సంచిని అప్పగించారు. ఇవి అమెజాన్ చిల్ట్రన్ బ్యాంక్ నుంచి రప్పించినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.1000 అసలు నోట్లు చెల్లిస్తే పదివేల రూపాయలు 500 నోట్ల కట్లను పంపిస్తున్నారు. ఒక్కోసారి ఈ నకిలీ 500 నోట్ల కట్టలకు ఆఫర్స్ పెడుతున్నారు. ఒకప్పుడు మిషన్ల ద్వారా దొంగ నోట్లు ప్రింటింగ్ చేసి చలామణి చేసేవారు. ఇప్పుడు అమెజాన్ నోట్లు.. దొంగ నోట్ల చలామణి చేసే వ్యక్తులకు ఒక వరంగా మారాయి. చిల్ట్రన్ బ్యాంక్ పేరుతో కార్పొరేట్ దిగ్గజ కంపెనీ అమెజాన్ ద్వారా పంపిణీ అవుతున్న 500 నోట్ల కట్టల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితమే నర్సీపట్నం పోలీసు స్టేషన్లో రైస్ పుల్లింగ్ కేసులో 10 లక్షల అమెజాన్ చిల్ట్రన్ బ్యాంక్కు చెందిన దొంగ నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఇటీవల నర్సీపట్నం దుకాణాల వద్ద కూడా ఈ నకిలీ 500 నోట్లు వెలుగు చూశాయి. అసలు, నకిలీ నోట్లకు తేడా తెలియని చిరు వ్యాపారులు మోసపోతున్నారు. మూడు రోజుల కిందట పెద్ద బొడ్డేపల్లిలో వెలుగులోకి.. తాజాగా దొంగ నోట్లను పోలీస్ స్టేషన్లో అప్పగించిన ఓ టీచర్ -
జనసేనకు టీడీపీ జెల్ల
● పొత్తు ధర్మం విస్మరించి ఎన్నికకు డుమ్మా కొట్టిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు ● ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే కూడా గైర్హాజరు ● కోరంకు 56 మంది అవసరం కాగా 54 మంది హాజరు ● నేటికి ఎన్నిక వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి ప్రకటన డాబాగార్డెన్స్ (విశాఖ): జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికలో జనసేనకు మిత్రపక్షమైన టీడీపీ జెల్ల కొట్టింది. పొత్తు ధర్మం మరిచి డిప్యూటీ మేయర్ కుర్చీ కోసం కుయుక్తులు పన్నింది. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించగా.. సోమవారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి పలువురు టీడీపీ ఆశావాహులు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ మంగళవారం నాటికి సమావేశం వాయిదా వేశారు. ముందస్తు సమాచారం మేరకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కావల్సి ఉంది. ఆ సమయానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, ఆ పార్టీ కార్పొరేటర్ కవితతోపాటు సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, సీపీఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ హాజరయ్యారు. 11.10 గంటలకు జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్బాబు కౌన్సిల్కు వచ్చారు. 11.15 గంటలకు జనసేనకు చెందిన 14 మంది కార్పొరేటర్లు సమావేశ మందిరానికి చేరుకున్నారు. 11.20 గంటలకు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వచ్చారు. 11.30 గంటలకు కాకి గోవిందరెడ్డి మినహా టీడీపీ కార్పొరేటర్లు ఎవరూ హాజరు కాలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్ 11.40 గంటలకు కౌన్సిల్ హాల్లోకి అడుగుపెట్టారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ 11.53 గంటలకు సమావేశానికి హాజరయ్యారు. వచ్చిన వెంటనే ఎంత మంది సభ్యులు వచ్చారో లెక్కించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికకు 56 మంది అవసరం కాగా 54 మందే హాజరయ్యారని.. కోరం తగ్గట్టు సభ్యులు లేరని గుర్తించారు. దీంతో సమావేశాన్ని మంగళవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
నా కొడుకును చంపేశారు..
● రోడ్డు ప్రమాదమంటున్నారు ● కలెక్టరమ్మ న్యాయం చేయాలి ● పీజీఆర్ఎస్లో వృద్ధుడి ని‘వేదన’ తుమ్మపాల: రాజకీయ ప్రలోభాలతో హత్యకు గురైన తన కుమారుడి మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి కేసు నీరుగార్చుతున్నారని నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామానికి చెందిన బండారు మహలక్ష్మి వాపోయారు. ఈ కేసు దర్యాప్తును రీ ఓపెన్ చేయమని పోలీసులను ఆదేశించాలని కలెక్టర్ విజయ కృష్ణన్కు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తప్పుగా నమోదు చేసిన క్రైం నంబరు 5/2025ను రీఓపెన్ చేసి హత్య కోణంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి 11న రాత్రి 11 గంటల సమయంలో శరీరంపై అనేక గాయాలతో రక్తపు మడుగులో తన కుమారుడు బండారు అప్పన్న కనిపించాడని, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ అధికారులు హత్య అని చెప్పారని పేర్కొన్నారు. హంతకులను గుర్తించి జైలుకు పంపిస్తామని చెప్పిన పోలీసులు నేటికీ దర్యాప్తులో పురోగతి సాధించలేదన్నారు. ఎవరినీ అరెస్టు చేయకపోవడంతో పోలీసులను సంప్రదించగా, మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి గురై తన కుమారుడు మరణించినట్లు తానే స్టేట్మెంట్ ఇచ్చినట్లు పోలీసులు రాశారని తెలిపారు. తన కుమారుడికి మద్యం అలవాటు లేదని, హత్య జరిగిందని స్పష్టంగా చెప్పినా పోలీసులు తప్పుడు స్టేట్మెంట్ రాయడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ఐదు నెలలుగా కేసును నీరుగార్చి గాలికొదిలేశారని, ఈ హత్య వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందన్నారు. తక్షణమే కేసును రీ ఓపెన్ చేసి తన కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్ను ఆయన కోరారు. త్వరితగతిన లక్ష్యాలు పూర్తి చేయండి: కలెక్టర్ తుమ్మపాల: వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో ఆమె సోమవా రం సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సర్వే, సంపద తయారీ కేంద్రాలు, డ్వామా, హౌసింగ్, సూర్యఘర్, పంచాయతీ రాజ్లో పలు అంశాల పురోగతిపై ఆమె మాట్లాడారు. వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. బోర్ల మరమ్మతులకు అవసరమైన విడిభాగాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న వర్క్ ఫ్రం హోమ్, మనమిత్ర సేవలు, పిల్లల ఆధార్ నమోదు, ఈకేవైసీ వంటి సర్వేలను తక్షణం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోనికి తీసుకురావాలన్నారు. పన్నుల వసూలు రెండు రోజు ల్లో పూర్తి చేయాలన్నారు. ఫారం ఫాండ్స్, పశువుల నీటి తొట్టెల నిర్మాణం తక్షణం చేపట్టాలన్నారు. ఉద్యాన శాఖ ద్వారా మొక్కల పెంపకానికి భూమిని గుర్తించాలన్నారు. -
చౌడువాడలో ‘బీట్ ది హీట్’ కార్యక్రమం
కె.కోటపాడు : స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బీట్ ది హీట్ ప్రోగ్రాం నిర్వహించారు. చౌడువాడ పీహెచ్సీ ఆధ్వర్యంలో సచివాలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్సీ ఆవరణలో కమ్యూనిటీ సోప్ పిట్కు శంకుస్థాపన చేశారు. పక్షులు నీరు తాగడానికి, ఆహారం అందించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాన్ని డ్వామా పీడీ పూర్ణిమాదేవి ప్రారంభించారు. గ్రామంలో 20 మందికి పక్షులకు నీళ్లు పెట్టడానికి మట్టి పాత్రలు పంపిణీ చేఽశారు. గ్రామ పరిశుధ్య సిబ్బందిని సత్కరించి బియ్యంతో పాటు కిరాణా సామాగ్రిని అందజేశారు. సర్పంచ్ చలివేంద్రం ప్రారంభించి మజ్జిగను ఉచితంగా అందజేశారు. ఎంపీపీ సూర్యనారాయణ,ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్ రమేష్బాబు, డిప్యుటీ ఎంపీడీవో రమణి, సర్పంచ్ ఎరువునాయడు, ఎంపీటీసీ అప్పలరాజు, పంచాయతీకార్యదర్శి సురేష్బాబు, గుమస్తా అప్పారావు పాల్గొన్నారు. -
ఉపాధి నిధులతో సమృద్ధిగా పనులు
నాతవరం : ఉపాధి హామీ పథకంలో ఉపాధితో పాటు అనేక అభివృద్ధి పనులు చేసుకోవచ్చునని మండల ప్రత్యేకాధికారి నాగశిరీష అన్నారు. మండలంలో శనివారం స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా మర్రిపాలెం పంచాయతీ శివారు పొట్టిపాలెం గిరిజన గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన కంపోస్టు గుంతలను ప్రారంభించారు. పచ్చదనం పర్యవరణంలో భాగంగా మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకంలో ఈ గ్రామంలో రైతులు కూలీలు చేస్తున్న కంపోస్టు గుంతలను స్వయంగా పరిశీలించి కూలీలతో మాట్లాడారు. పొట్టిపాలెం గ్రామంలో రైతులకు కూలీలకు ఉపయోగపడే పనులకు గ్రామసభలో తీర్మానం చేసి అమలు చేసే బాధ్యత తీసుకోవాలని ఏపీవోకు సూచించారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ, ఏపీవో దాసరి కొండాజీ, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణ, డి.యర్రవరం సర్పంచ్ సత్యవతి, వెర్రిగెడ్డ రిజర్వాయరు కమిటి చైర్మన్ స్వామినాయుడు, మర్రిపాలెం పెద్ద చెరువు నీటి సంఘం చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
మొక్కల పెంపకం అందరి బాధ్యత
జాతీయ జెండాలతో ర్యాలీ చోడవరం: భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తూ చోడవరంలో అన్నివర్గాల ప్రజలు మెయిన్రోడ్డుపై శనివారం జాతీయజెండాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో భారత సైన్యం చేస్తున్న ఎటువంటి యుద్ధానికై నా ప్రజల మద్దతు పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. కె.కోటపాడు : మొక్కలను ప్రతి ఒక్కరూ నాటి పెంచడాన్ని బాధ్యతగా గుర్తించాలని వారాడ సర్పంచ్ గొర్రుపోటు సౌజన్య అన్నారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం హీట్ ది బీట్ కార్యక్రమాన్ని జరిపారు. ఉపాధి కూలీలతో కలిసి గ్రామంలో మొక్కలను నాటారు. పంచాయతీ కార్యదర్శి బి.సరోజిని మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా మంచినీటిని ఎక్కువగా తీసుకోవాల కోరారు.వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ వైసీపీలో క్రియాశీలక కార్యకర్తగా వ్యవహరిస్తున్న శశి శనివారం మృతి చెందాడు. ఆనారోగ్యం బారిన పడడంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యం పొందుతూ మృతి చెందారు. శశి అకాల మరణాన్ని పార్టీ శ్రేణులు, జీర్ణించుకోలేకపోతున్నారు. -
మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
మాడుగుల : స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో పంచాయతీ వారు ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కళావతి, మాజీ సర్పంచ్ సూర్యారావు, ఉపసర్పంచ్ వరహాలు, మార్కెట్ కమిటీ చైర్మన్ అప్పలరాజు ఎంపీడీవో అప్పారావు పాల్గొన్నారు. జిల్లా స్థాయి భజన పోటీలు మాడుగుల రూరల్ : కేజేపురం జంక్షన్లో కల్యాణ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా ఈనెల 31న పెళ్లిరాట కార్యక్రమం నిర్వహిస్తారు. వచ్చే నెల 5న పుట్ట మట్టితో పూజలు, 6న కల్యాణోత్సవం, జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. ఉపాధి పనుల్లో నాణ్యత పాటించాలి రోలుగుంట : పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రభుత్వం ఇస్తున్న పూర్తి కూలి పొందాలని ఉపాధి కూలీలకు మండల ప్రత్యేకాధికారి మనోహర్ సూచించారు. మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా పలు గ్రామాల్లో జరుగుతన్న ఉపాధి పనులను ఆయన ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావుతో కలిసి సందర్శించారు. ‘రైతులందరికీ అన్నదాత సుఖీభవ’ నర్సీపట్నం: అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సహాయం కింద అందజేస్తుందని నర్సీపట్నం వ్యవసాయశాఖ ఏడీఏ శ్రీదేవి తెలిపారు. వెబ్ల్యాండ్ ఆర్ఓఎఫ్ఆర్లో ఉన్న రైతుల వివరాలను రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. రైతులు తమ భూమి ఉన్న గ్రామంలో రైతు సేవ కేంద్రాన్ని సంప్రదించి వీలైనంత తొందరగా వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ప్రకృతి సేద్యంపై దృష్టి సారించండి మాకవరపాలెం : ప్రకృతి సేద్యంపై రైతులు దృష్టి సారించాలని, ఈ విధానాన్ని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోందని మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్రావు సూచించారు. గిడుతూరులో శనివారం రైతులతో వ్యవసాయ, ప్రకృతి సేద్య అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం రైతులతో ర్యాలీ నిర్వహించి, నవధాన్య విత్తనాలను పంపిణీ చేశారు. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యత -
ఉద్యోగాలు లేక మత్స్యవేటకు...
పరిశ్రమల వ్యర్థ రసాయనాల కారణంగా సముద్రం కాలుష్యం అవడంతో మత్స్య సంపద కోల్పోతున్నాం. యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో, అలవాటు లేని యువకులు కొంత మంది జీవనోపాధి కోసం మత్స్య వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకోగా, పిల్లలు స్థిరపడలేకపోవడం వారిని ఎంతో బాధిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టి మత్స్యకార యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతున్నాను. –ఉమ్మిడి జగన్, పూడిమడక మత్స్యకార నాయకుడు -
పెద్దేరు కాలువ వద్ద తప్పిన ప్రమాదం
బుచ్చెయ్యపేట : మేజర్ పంచాయతీ వడ్డాదిలో ప్రమాదం తప్పింది. శనివారం వడ్డాది ఎస్సీ కాలనీ నుంచి పెద్దేరు నది సిమెంట్ రోడ్డు మీదగా జంక్షన్కు వస్తున్న కారు అదుపు తప్పింది. శివాలయం, సచివాలయానికి వెళ్లే దారి మళ్లింపులో కారు వెనక చక్రం సిమెంటు రోడ్డు అంచు దిగి పెద్దేరు కాలువలోకి ఒరిగింది. ఏ మాత్రం కారు అదుపు తప్పిన పెద్దేరు కస్పా కాలువలోకి కారు పడిపోయి ప్రమాదం జరిగేది. స్థానికులు కారును లేపి సిమెంట్ రోడ్డుపై పెట్టడంతో ప్రమాదం తప్పింది. ఇరుకు రోడ్డులో కార్లు ఇతర వాహనాలు రాకుండా పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య
ఎస్.రాయవరం : గ్రామదేవత పండక్కి తన భర్త అత్తవారింటికి రాలేదని మనస్థాపంతో ధోని మాధవి (25) పుట్టింట్లో ఫ్యానుకు ఉరి బిగించుకుని శనివారం మృతి చెందింది. ఎస్ఐ విభీషణరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తరేవుపోలవరం గ్రామానికి చెందిన ధోని మాధవికి అదే గ్రామానికి చెందిన నాగార్జునతో 7 నెలల క్రితం వివాహం జరిగింది. ఇటీవల మంగళవారం గ్రామంలో బంగారమ్మతల్లి జాతర జరిగింది. ఆ రోజున భర్త నాగార్జునను ఆహ్వానించగా పండక్కి రాలేదు. అప్పటినుంచి మనస్థాపానికి గురైన మాధవి శనివారం పుట్టింట్లో ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చున్నీతో ఉరి బిగించుకుని మృతి చెందింది. భార్యభర్తల మధ్య ఎటువంఇ వివాదాలు లేవని, అన్యోన్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారని చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
స్థానికులకు ఉద్యోగాలివ్వడం లేదు...
భూములు, ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు, స్థానికులకు, మత్స్యకారులకు చట్ట ప్రకారం ఉపాధి కల్పించాలి. ఏయే పరిశ్రమల్లో స్థానికులకు ఎంత మందికి ఉపాధి కల్పించారో పరిశ్రమ బయట బోర్డు పెట్టాలి. పరిశ్రమలోపల ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించట్లేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికై నా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల అభ్యున్నతికి పాటు పడేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. –రొంగలి రాము, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు -
పరిసరాల పరిశుభ్రత పాటించాలి
దేవరాపల్లి : ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణి సూచించారు. దేవరాపల్లిలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో మానహారంగా ఏర్పడి, ప్రతిజ్ఞ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణి, ఎంపీడీవో సువర్ణరాజు చీపర్లతో చెత్త ఊడ్చారు. ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందశారు. సచివాలయం–1 వద్ద జరిగిన సమావేశంలో వేసవి ఎండ తీవ్రత నేపథ్యంలో వడ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కల్పించారు. బోయిలకింతాడలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, సర్పంచ్ బాబురావు ఆధ్వర్యంలో సచివాలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. మాకవరపాలెం: గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు అన్నారు. మండలంలోని గిడుతూరులో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం వీధుల్లో చెత్తను తొలగించడంతోపాటు ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం : మున్సిపాలిటీలో స్వర్ణాంద్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్, ఆర్డీవో వి.వి.రమణ, కౌన్సిలర్లు సిహెచ్.పద్మావతి, కమిషనర్ జంపా సురేంద్ర, జిల్లా అదనపు వైద్యాధికారి జ్యోతి, మెప్మా, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. వీరంతా ర్యాలీ నిర్వహించి చెత్తను రోడ్లపై వేయకుండా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని నినాదాలు చేశారు. కౌన్సిలర్ పద్మావతి అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. బుచ్చెయ్యపేట : గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ సిబ్బంది కృషి చేయాలని మండల ప్రత్యేకాధికారి గోపాల్,ఎంపీడీవో విజయలక్మి తెలిపారు. శనివారం గ్రీవెన్స్లో భాగంగా దిబ్బిడిలో పర్యటించారు. అంగన్వాడీ కేంద్రం, సచివాయాలం, సంపద కేంద్రం, నీటి తొట్టెలను,గ్రామ వార్డులను తనిఖీ చేశారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండడమే కాక అపరిశుభ్ర వాతావరణం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు వివరించారు. ఎండాకాలం అవడంతో ముఖ్య కూడల్లో చలి వేంద్రాలు, నీటి తొట్టెలో పశువులకు నీళ్లు ఉండేలా చూడాలన్నారు. ఎమ్మార్సీ భవనం వద్ద పారిశుధ్య చర్యలు రోలుగుంట : మండలంలో గ్రామాల్లో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో గల విద్యాశాఖ మండల వనురుల కేంద్రం వద్ద ఎంఈవోలు జాను ప్రసాద్, జాగ్గారావు సిబ్బందితో కలిసి భవన్ చుట్టూ చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను ేతొలగించారు. ఆవరణలో గల పిచ్చి మొక్కలు తొలగించి కార్యాలయాన్ని సుందరంగా తయారు చేశారు. సీఆర్పీలు సతీష్, చిరంజీవి పాల్గొన్నారు. -
దేవరాపల్లి వైస్ ఎంపీపీ అభ్యర్థిగా సింహాచలంనాయుడు
దేవరాపల్లి : మండల పరిషత్ వైస్ ఎంపీపీ అభ్యర్ధిగా వైఎస్సార్సీపీ తరుపున మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచాడ సింహాచలంనాయుడును ఎంపిక చేసినట్లు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు తారువలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులంతా శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీటీసీ సభ్యులంతా ఏకగ్రీవంగా పంచాడ సింహాచలంనాయుడును వైస్ ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం బూడి మాట్లాడుతూ 19న జరిగే వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియలో ఎంపీటీసీ సభ్యులంతా పాల్గొని సింహాచలంనాయుడుకు మద్దతు పలికి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ అభ్యర్థిగా ఎంపికై న పంచాడ సింహాచలంనాయుడును పలువురు అభినందించారు. కాగా గతంలో వైస్ ఎంపీపీ–1 పనిచేసిన చింతల బుల్లిలక్ష్మి ఇటీవల జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఉప ఎన్నికల్లో ఎంపీపీగా గెలుపొందడంతో వైస్ ఎంపీపీ పదవి ఖాళీ ఏర్పడింది. దీంతో వైస్ ఎంపీపీ పదవికి ఈ నెల 19 ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపఽథ్యంలోనే మండల పరిషత్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉండడంతో వైఎస్సార్సీపీ తరపున పంచాడ సింహాచలంనాయుడు వైస్ ఎంపీపీగా గెలుపు అనివార్యం కానుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైస్ ఎంపీపీ–2 ఉర్రూకుల గంగాభవానీ, కోఆప్షన్ మెంబర్ దండే జాన్ విక్టర్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, యువజన విభాగం అధ్యక్షుడు కర్రి సూరినాయుడు, మండల బిసి సెల్ అధ్యక్షుడు కిల్లాన శ్రీనువాస్ యాదవ్, ఎంపీటీసీ సభ్యులు, పలువురు సర్పంచ్లు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ విప్ జారీ దేవరాపల్లి మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నికకు సంభందించి వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. ఈ మేరకు వైస్ ఎంపీపీ–1 ఈ నెల 19న ఎన్నిక నిర్వహించనున్న నేపధ్యంలో తమ పార్టీ ఎంపీటీసీలకు వైఎస్సార్సీపీ తరపున ఆ పార్టీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు విప్ జారీ చేశారు. వైఎస్సార్సీపీ తరుపున వైస్ ఎంపీపీ అభ్యర్థి మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు పంచాడ సింహాచలంనాయుడును ప్రతిపాదిస్తూ వైఎస్సార్సీపీ తరుపున బీ ఫారం పత్రాన్ని మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి,, జెడ్పీటీసీ కర్రి సత్యం శనివారం ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ఎస్.మంజులవాణికి శనివారం అందజేశారు. ప్రకటించిన మాజీ డిప్యూటీ సీఎం బూడి