breaking news
Anakapalle
-
ఆకట్టుకున్న గుర్రపు స్వారీ పోటీలు
యలమంచిలి రూరల్: యలమంచిలి మండలం జంపపాలెంలో నూకాంబిక అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి గుర్రపు స్వారీ పందాలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను తిలకించడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. గ్రామ శివార్లలో పంట పొలాల్లో కొలువుదీరిన నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద పోటీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 12 గుర్రాలు పోటీల్లో పాల్గొనగా.. గుర్రాలన్నీ దౌడు తీశాయి. ఈ దృశ్యాలను పలువురు తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోటీల్లో యలమంచిలి మున్సిపాలిటీ సోమలింగపాలెం గ్రామానికి చెందిన యల్లపు జగదీష్ అశ్వం మొదటి స్థానాన్ని కై వసం చేసుకుంది. చోడవరం మండలం అంకంపాలెం మోదమాంబ గుర్రం రెండో స్థానం, విజయనగరం జిల్లాకు చెందిన సింగపూర్ సత్యనారాయణ గుర్రం మూడో స్థానం, అచ్యుతాపురం మండలం రామన్నపాలెంకు చెందిన చోడమాంబిక అశ్వం 4వ స్థానంలో నిలిచాయని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జంపపాలెం సర్పంచ్ దేవకినాయుడు, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, పొలమరశెట్టి వెంకట్, లోకేష్, జగది, సోమునాయుడు, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అంతకు ముందు తీర్థంలో భాగంగా భారీ అన్నసంతర్పణ నిర్వహించారు. -
అయ్యప్పస్వామి సన్నిధిలో మకరజ్యోతి ప్రదర్శన
గవరపాలెం గౌరీపంచాయత ఆలయంలో అయ్యప్పస్వామి పడిపూజ ప్రారంభిస్తున్న వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణ అనకాపల్లి: స్థానిక గవరపాలెం గౌరీ పంచాయత దేవాలయంలోని అయ్యప్పస్వామి సన్నిధిలో మకరజ్యోతి దర్శన వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. స్వామివారిని ప్రత్యేక అలంకరణలో గవరపాలెం వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పొందూరు సూర్యనారాయణ శాస్త్రి వేదమంత్రాలతో అయ్యప్ప స్వామి మూల విరాట్కు 18 రకాల పండ్ల రసాలతో అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాని గురుస్వామి మద్దాల నారాయణరావు ఆధ్వర్యంలో మకర జ్యోతి ప్రజ్వలన, పడి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీగౌరీ సేవా సంఘం మాజీ అధ్యక్షుడు మళ్ల సాంబశివరావు, అనకాపల్లి వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణ(పెదబాబు), గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు కర్రి సన్యాసినాయుడు, కార్యదర్శి బొడ్డేడ రామ సత్యనారాయణ, కోశాధికారి శరగడం జగదీష్, అయ్యప్ప స్వామి దేవాలయ కన్వీనర్ మళ్ల సూర్యప్రకాష్రావు, ఆళ్ల మహాలక్ష్మినాయుడు పాల్గొన్నారు. -
రైళ్లలో ఇక ‘హైజినిక్’ టీ, కాఫీ
తాటిచెట్లపాలెం: రైలు ప్రయాణికులకు మెరుగైన, ఆరోగ్యవంతమైన సేవలందించే దిశగా వాల్తేరు రైల్వే డివిజన్ మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా రైళ్లలో టీ, కాఫీలు అందించేందుకు సరికొత్త ఆటోమేటిక్ వెండింగ్ మెషీన్లను ప్రవేశపెట్టింది. ఈ మెషీన్లను డీఆర్ఎం లలిత్ బోహ్రా బుధవారం ప్రారంభించారు. కాగా.. రైళ్లలో వెండర్లు ఓపెన్ బకెట్లు, డిష్లలో టీ, కాఫీలను విక్రయిస్తున్నారు. దీని వల్ల పరిశుభ్రత లోపిస్తోందని, అవి చల్లగా ఉంటున్నాయని ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరిస్తూ.. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో తొలిసారిగా వాల్తేరు డివిజన్ ఈ అధునాతన మెషీన్లను ప్రవేశపెట్టారు. వీటి ద్వారా ప్రయాణికులకు ఎప్పటికప్పుడు వేడివేడిగా, రుచికరమైన టీ, కాఫీలు అందుతాయని అధికారులు తెలిపారు. సంక్రాంతి కానుకగా, పైలట్ ప్రాజెక్టు కింద ఏపీ ఎక్స్ప్రెస్లో ఈ సేవలను ప్రారంభించినట్లు డీఆర్ఎం తెలిపారు. -
అత్తారింటికి వెళుతూ..అనంతలోకాలకు..
మాకవరపాలెం : అత్తారింటికి బైక్పై వస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. నాతవరం మండలం వై.బి.అగ్రహారం గ్రామానికి చెందిన కీర్తి రాంబాబు(32) తామరం గ్రామానికి చెందిన యువతిని ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సంక్రాంతి పండగకు బైక్పై తామరం బయలుదేరాడు. మండలంలోని పెద్దమిల్లు జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఆటో ఢీకొనడంతో హెల్మెట్ లేక తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే రాంబాబును నర్సీపట్నం ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మరణించాడు. దీంతో పండగ రోజున రెండు గ్రామాల్లోని కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకుంది. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ దామోదర్నాయుడు తెలిపారు. -
మాజీ సైనికుల సేవలు మరువలేనివి
ఘనంగా 10వ సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవం మహారాణిపేట: దేశ రక్షణలో అమరులైన వీరుల త్యాగాలను స్మరిస్తూ నగరంలో 10వ సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్లోని విక్టరీ ఎట్ సీ వార్ మెమోరియల్ వద్ద వైజాగ్ నావల్ ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్(డీజీ) కె.శ్రీనివాస్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. త్రివిధ దళాలకు చెందిన సీనియర్ మాజీ సైనికులు, అధికారులతో కలిసి ఆయన అమరవీరులకు అంజలి ఘటించారు. సైనికుల నిస్వార్థ సేవను, దేశం కోసం వారు చేసిన అత్యున్నత త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. మాజీ సైనికులతో డీజీ ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. -
నేత్రపర్వంగా గోదా కల్యాణం
నక్కపల్లి : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా చివరిరోజైన బుధవారం భోగినాడు ఉపమాకలో గోదాదేవి కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. విష్ణుచిత్తుని కుమార్తె గోదాదేవి శ్రీరంగనాధున్ని వివాహమాడడం కోసం నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. నెలరోజుల పాటు చేసిన దీక్షలో తన అనుభూతులను, అనుభవాలను పాశురం రూపంలో రచించి శ్రీరంగనాదుడికి సమర్పించింది. ఈ దీక్ష భోగి పండగతో ముగిసి స్వామివారిని వివాహమాడింది. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘట్టాన్ని ఆలయ ప్రధానార్చకులు గొట్టు ముక్కల వరప్రసాద్ అర్చకస్వాములు కృష్ణమాచార్యులు, పివి శేషాచార్యులు స్వామివారి పుష్ప తోటలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం కొండపై మూలవిరాట్కు పంచామృతాభిషేకం, నిత్యార్చనలు నిర్వహించారు. కొండ దిగువన క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, స్వామివారి ఉత్సవ ఉత్సవమూర్తులకు, ఆండాళ్లమ్మవారిని అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం 30వ పాశురం విన్నపం చేసి,స్వామివారి పుష్పతోటలో గోదాదేవి కల్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత స్వామివారికి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, పరిష్యత్, రక్షాబంధనం, కల్యాణమండప బలిహరణ, యజ్ఞోపవేతధారణ, రుత్విక్వరుణ (స్వామివారికి అనువైన కన్యకోసం 8 మంది పెద్దలు వెతికే ఘట్టం) నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాద ప్రక్షాళన, కన్యాదానం, కట్నాలు, శుభ ముహూర్తం, మంగళసూత్రధారణ, ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆళ్వారు, ఎంబీరుమాళ్వారులకు తాంబూలం, సభా తాంబూలం సమర్పించారు. నీరాజన మంత్రపుష్పం అనంతరం తీర్థగోష్టి, ప్రసాద వినియోగంతో గోదాదేవి కల్యాణం ముగిసింది. అనంతరం శ్రీదేవీ భూదేవీ సమేతుడైన స్వామివారిని పుణ్యకోటి వాహనంలోనూ, అమ్మవారిని ఇత్తడి సప్పరం వాహనంలో ఉంచి తిరువీధుల్లో ఊరేగించారు. కల్యాణ కాంతులీనుతున్న స్వామివారు మాడవీధుల్లోకి రావడంతో భక్తులు, కానుకలు మొక్కుబడులు సమర్పించుకున్నారు. టీటీడీ వారు భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేసారు. ఈకార్యక్రమాల్లో అర్చక స్వాములు రాజగోపాలచార్యులు, బాగవతం గోపాలాచార్యులు, ఎన్సిహెచ్ శ్రీనివాసాచార్యులు, తరిగొండ వేంగమాంబ సాహిత్యపీఠం వ్యవస్దాపకురాలు డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి, శ్రీనివాస భక్త సమాజం సభ్యులు పాల్గొన్నారు. కల్యాణ కాంతులీనుతున్న గోదాదేవి అమ్మవారు, శ్రీరంగనాథుడు స్వామివారిని పుణ్యకోటి వాహనంలో తిరువీధి సేవ -
అర్ధరాత్రి ఆవుల తరలింపు
అడ్డుకున్న పోలీసులు స్టేషన్ ఆవరణలో ఆవులు ఉన్న వ్యానులు ఆరిలోవ(విశాఖ): విజయనగరం జిల్లా నుంచి విశాఖ నగరానికి అక్రమంగా తీసుకొస్తున్న గోవులను ఆరిలోవ పోలీసులు పట్టుకున్నారు. ఐదు వ్యానుల్లో తరలిస్తున్న 41 ఆవులను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. విజయనగరం జిల్లా గుర్ల ప్రాంతం నుంచి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదు వ్యానుల్లో ఆవులను విశాఖకు తీసుకొచ్చేందుకు బయలుదేరారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు జాతీయ రహదారిపై డెయిరీఫారం వద్ద ఆ వాహనాలను అడ్డుకున్నారు. విచారణలో భాగంగా.. వీటిని నగరంలోని ఏవీఎన్ కాలేజీ, ఆరిలోవ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. వ్యానులతో పాటు 41 ఆవులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గోవులను విజయనగరం జిల్లా గుజ్జంగివలస గోశాలకు అప్పగిస్తామని, బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
తొలిపంట
అప్పన్నకు భక్తులతో కిక్కిరిసిన సింహగిరి సింహాచలం: భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సింహగిరికి భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి, శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి తొలిపంటలను కానుకగా సమర్పించారు. వరిదుబ్బులు, బియ్యం, కూరగాయలు, నూనె, పాలు, పెరుగు, వెన్న, పంచదార, పప్పుదినుసులను భక్తిశ్రద్ధలతో స్వామికి కానుకగా ఇచ్చారు. కరువుకాటకాలు రాకుండా, ఏటా తమ పొలాలు పచ్చగా పండాలని స్వామిని వేడుకున్నారు. అలాగే, పలువురు గ్రామీణ ప్రాంతాల భక్తులు గరిడీ బృందాలతో తరలివచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి మొదలైన భక్తుల రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. ఎటుచూసినా సింహగిరి భక్తజనసంద్రంగా మారింది. దర్శన క్యూలన్నీ భక్తులతో కిక్కిరిసాయి. ప్రసాద విక్రయశాల, అన్నప్రసాదశా00లలు భక్తులతో కిటకిటలాడాయి. సింహగిరిపైన, ఘాట్రోడ్డులోనూ తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ నెలకొంది. దీని వల్ల పలుమార్లు పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నీలాద్రి గుమ్మం దగ్గర నుంచే లఘు దర్శనాన్ని కల్పించారు. -
అప్పన్న మకరవేట రేపు
సింహాచలం: కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మకరవేట(గజేంద్రమోక్షం) ఉత్సవం జరగనుంది. కొండదిగువ పూలతోటలో ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపదల్లో ఉన్నవారెవరైనా పిలిచిన వెంటనే ఏదొక రూపంలో భగవంతుడు వచ్చి రక్షిస్తాడని, మొసలి బారిన పడిన గజేంద్రుడి చరిత్రే దానికి నిదర్శనమని చాటిచెబుతూ ఏటా ఈ ఉత్సవాన్ని కనుమపండుగ రోజు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి వరదరాజస్వామి అలంకరణ చేసి శుక్రవారం సాయంత్రం సింహగిరి నుంచి కొండదిగువకి మెట్లమార్గం ద్వారా తీసుకొస్తారు. కొండదిగువ ఉన్న పూలతోటలోని ప్రధాన మండపంలో స్వామిని వేంజేపచేసి గజేంద్రమోక్షం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామిని పుష్కరిణి సత్రం వద్దకు తీసుకొచ్చి గజవాహనంపై అధిష్టిస్తారు. తదుపరి అడవివరం గ్రామ పురవీధిల్లో గజవావానంపై స్వామికి తిరువీధి నిర్వహిస్తారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని పూలతోటను ముస్తాబు చేశారు. పూలతోటలోని శ్రీకృష్ణకొలను, స్వామి వేంజేసే ప్రధాన మండపానికి విద్యుద్దీపాలంకరణ చేశారు. కాగా గజేంద్రమోక్షం ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే స్వామివారి మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి. -
రెండు బైకులు ఢీకొని ఇద్దరికి గాయాలు
రావికమతం: దొండపూడి పెద్ద చెరువు వద్ద బీఎన్ రోడ్డు మార్గంలో బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. రావికమతం మండలం జెడ్.బెన్నంవరం పంచాయతీ కిత్తంపేట గ్రామానికి చెందిన పతివాడ రవికుమార్ బైక్పై కొత్తకోట కిరాణా సామాన్ల కోసం వెళ్తున్నాడు. రావికమతం మండలం పొన్నవోలు పంచాయతీ దిబ్బలపాలేనికి చెందిన ఉరుకూటి భీమేశ్వరరావు రోలుగుంట మండలం కంచుగుమ్మల గ్రామంలో ఉన్న తన గొర్రెల మంద దగ్గర నుంచి స్వగ్రామైన దిబ్బలపాలెం వెళ్తున్నాడు. ఇద్దరూ దొండపూడి పెద్దచెరువు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. కొత్తకోట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చిక్సిత చేయించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై క్షతగాత్రుల నుంచి ఫిర్యాదు అందలేదని కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. గాయపడిన భీమేశ్వరరావు, రవికుమార్ -
ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి
● జిల్లా ప్రజలకు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు దేవరాపల్లి : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతులు నింపి, సిరి సంపదలతో తులతూగాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు ఆకాంక్షించారు. మండలంలోని తారువ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. జిల్లా ప్రజలకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆయన సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. -
సంబరాల సింహగిరి
సింహాచలం: సింహగిరిపై బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పండగ విశిష్టతను చాటుతూ, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా దేవస్థానం అధికారులు ఈ సంబరాలను నిర్వహించారు. భోగి పర్వదినాన స్వామివారిని దర్శించుకునేందుకు సింహగిరికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు సంక్రాంతి సంబరాలను కూడా తనివితీరా తిలకించారు. ఉదయం ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడ వీధిలో పెద్ద ఎత్తున వేసిన భోగిమంటను దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం భక్తులు పిడకలను భోగిమంటలో వేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈవో తిరుమలేశ్వరరావు, 98వ వార్డు కార్పొరేటర్ పి.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మాడ వీధిల్లో ఏర్పాటుచేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గొబ్బెళ్ల ముత్యాల ముగ్గులు, చెరుకు గెడల జాలువలు, ఎడ్లబండి, నాగళ్లు, పూరిగుడెసెలు, గడ్డిమోపులు, రంగులు వేసిన కుండలు, గోవులు, ఎద్దులబండి, ట్రాక్టర్ను భక్తులు తిలకించారు. జంగం దేవర, కొమ్మదాసరి, హరిదాసులు సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గంగిరెడ్ల విన్యాసాలు, కోలాటం ప్రదర్శనలను భక్తులను ఆకట్టుకున్నాయి. ధాన్యం గుట్టలవద్ద మహిళలు సందడి చేశారు. కుండల్లో పాలు పోసి పొంగించారు. బొమ్మలకొలువు ఆకట్టుకుంది. -
ఏవీ ఆనాటి సంక్రాంతులు!
రైతుల పంట చేతికొచ్చి లాభాలార్జించి..కొనుగోళ్లు, అమ్మకాలు బాగా జరిగితే వ్యాపారాల్లో లాభాలు..ఇతర వ్యక్తులు వారి పనిచేసే వృత్తుల్లో లాభాలను పొందినప్పుడు ప్రతి ఇంటికీ నిజమైన సంక్రాంతి వస్తుంది. కానీ కాంతులు తీసుకొచ్చే సంక్రాంతి పండగలో ఈ ఏడాది క్రాంతి కనుమరుగైంది. గ్రామాలకు వెన్నెముకగా ఉన్న రైతు..ప్రభుత్వం నుంచి వ్యవ‘సాయం’ అందక అప్పుల ఊబిలో కూరుకుపోయి దిగులుగా ఉన్నాడు. భారీ వర్షాలకు ఈ ఏడాది రెండుమార్లు పంట నీట మునిగింది. కానీ ప్రభుత్వం నుంచి పంట నష్టం ఇప్పటికీ రాలేదు. పంట బీమా కూడా లేకుండా పోయింది. పండిన వరి పంటను కూడా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సక్రమంగా చేపట్టకపోవడంతో ప్రైవేట్ దళారులకే అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది. రైతుతో పాటు పల్లెలో ఉన్న పేద, సామాన్య ప్రజలు సైతం సంక్షేమ పథకాలు లేక చేతుల్లో డబ్బులు ఆడక పండగ నాడు సంతోషంగా లేరు. అనకాపల్లి మండలంలో మార్టూరు గ్రామంలో సంక్రాంతి రచ్చబండ ముచ్చట్లు పరిశీలిస్తే..6 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో మూడొంతులు రైతులే... ఏ గడప తట్టినా.. మౌనమే పండగ చేసుకుంటోంది. ఏ వీధికి వెళ్లినా తీరని ఆశల పతంగులు ఎగరేసుకుంటోంది. –సాక్షి, అనకాపల్లి ●చిన్నబోయిన పెద్ద పండగ అనకాపల్లి మండలం మార్టూరు గ్రామంలో రామాలయం కూడలి వద్ద రచ్చబండ ముచ్చట్లు పెట్టిన ఆ గ్రామ రైతులు, సామాన్య ప్రజలు ఒమ్మి మధుబాబు (మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్) : అవును..సంక్రాంతి వస్తే గ్రామంలో అసలు సందడే లేదు..నా రాజకీయ చరిత్రలో ఏనాడు ఇలాంటి ప్రభుత్వంను చూడలేదు. కాలయాపనే తప్ప పేదల కోసం..రైతుల కోసం..నిరుద్యోగుల కోసం ఆలోచన చేయడంలేదు. గతంలో ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఇంటి వద్దకే రేషన్ వాహనాల ద్వారా గ్రామంలోనే సేవలు అందేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఆర్బీకేలో యూరియా వచ్చేది..మెడికల్ కళాశాలలు కడితే దానిని కూడా ఈ ప్రభుత్వం ప్రైవేట్కు అమ్మేస్తోంది. విజయవాడలో రూ.1700 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి డబ్బులున్నాయి....మెడికల్ కళాశాల కట్టడానికి, పేదలకు పెట్టుబడి సాయం, సరిపడా యూరియా అందించడానికి మాత్రం డబ్బులు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. పేదోడికి ఉచిత వైద్యం అందించడానికి కూడా ఆర్థిక స్థోమత లేదా ఈ కూటమి ప్రభుత్వానికి..! ప్రతి రోజు లాగే అనకాపల్లి మండలంలో మార్టూరు గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో రామాలయం ముందు ఉన్న అరుగుపై 12 మంది వరకూ రైతులు, సామాన్య ప్రజలు కూర్చున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో 65 ఏళ్ల వయస్సు ఉన్న తోట నరసింహారావు అనే రైతు ‘‘ సంక్రాంతి పండగ సందడి రెండేళ్లుగా క్రమేపీ మన గ్రామంలో తగ్గుతోంది’ అంటూ ఆవేదన చెందాడు.. దీంతో అక్కడ కూర్చొన్న ఆ గ్రామ రైతులు, సామాన్య ప్రజలు అతని చుట్టూ చేరారు. ఒక్కొక్కరుగా తమ మదిలోని ఆవేదన వెలిబుచ్చారు. రైతు కరణం జగ్గారావు : ‘అవుర్రా నిజమే..నా చిన్నతనం నుంచి ఏనాడు లేని విధంగా గత రెండేళ్లుగా పండగ హడావుడి పెద్దగా లేదు. నా చిన్నతనం నుంచి ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి నెలగంట ప్రారంభమైతే చాలు.. పండగ మా ఊరికి వచ్చేసినట్లే ఉండేది. కానీ గత సంక్రాంతి, ఈ సంక్రాంతి పండగకు ప్రజల దగ్గర డబ్బులు ఆడ లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతు వ్యవసాయం చేసి అప్పుల ఊబిలో కూరుకు పోయాడుర్రా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అలా ఉండేది కాదు..అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేవి. మన గ్రామంలో మూడొంతుల రైతులే కదా.. అలాంటి రైతుకు ఇపుడు పెట్టుబడి సాయం, రైతుభరోసా,, పంట బీమా ఏమీ లేవు. అవసరమైన యూరియా కూడా అందకపోవడంతో దిగుబడి తగ్గింది..ఎకరా భూమిలో నాకే నష్టం వచ్చింది..ఇక ఎలా సంక్రాంతి చేసుకుంటాను..’ దంట్ల ప్రకాష్రావు (రైతు) : నువ్వు చెప్పింది నిజమే.. ఈ రెండేళ్లలో సంక్రాంతి కళే లేకుండా పోయింది.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మనకి రైతన్న భరోసా ఇచ్చింది...కులవత్తులకు ‘ఆసరా’ ఇచ్చింది..అలాగే మహిళలకు ఆర్థిక ‘చేయూత’ అందించింది. అందుకే ఊరందరి అవసరాల్ని ఊరు తీర్చకపోయినా.. సర్కారు సాయంతో పండగకూ ప్రతి ఇల్లూ కళకళలాడేది. ఇప్పుడు ఎవర్ని అడిగినా ఏముందని పండగ చేసుకోవాలి అంటున్నారు...ఎవరో ఎందుకు మా ఇద్దరు పిల్లలు విశాఖలో రఘు ఇంజినీరింగ్ కళాశాలలోనే బీటెక్ చదువుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇద్దరికీ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో అప్పు చేసి ఒక్కరికి ఫీజు కట్టాను. మరొకరి కట్టలేదు. ఒక వైపు వ్యవసాయంలో అప్పులు..మరో వైపు పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు...! ఇంకేమి సంక్రాంతి పండగ చేసుకుంటాం.కరణం జగ్గారావు : నిజమే...నా మూడెకరాల్లో వరి పంట సాగుకు ఈ ఏడాది పెట్టుబడికి రూ.60 వేలు అయ్యింది. అన్నదాత సుఖీభవ రాలేదు..సరైన సమయంలో యూరియా అందక వేయకలేకపోయాను. దిగుబడి కూడా రాలేదు. ఈ ఏడాది కూడా నష్టమే వచ్చింది..ఒక మడి అమ్మితే గానీ వ్యవసాయం చేయలేని పరిస్థితిలో రైతు ఉన్నాడు..(కన్నీళ్లు పెట్టుకుంటూ ) ఏం చేయాలో తెలియక మా పిల్లోడిని మైనింగ్ పనుల్లో కూలీగా పంపిస్తున్నాను.. కోటిన రామారావు (రైతు): నాదీ అదే పరిస్థితి. పెట్టుబడి పెట్టలేకనే నాకున్న ఏడెకరాల భూమిలో 80 సెంట్లు మాత్రమే సాగు చేస్తున్నాను. మిగతాది కౌలుకు ఇచ్చేశాను. మూడు నెలల కిందట మా పొలంకు కావల్సి వచ్చి నేను యూరియా బస్తా కోసం కోపరేటివ్ బ్యాంక్ ముందు 12 గంటల పాటు లైన్లో నించుంటే ఒక్క యూరియా బస్తా ఇచ్చారు.. పండగ పూట ఆర్థిక ఇబ్బందులే.. పల్లె గూటిలో పైసల్లేక సందడి లేదు యూరియా కొరతతో తగ్గిన ధాన్యం సిరులు పెట్టుబడి సాయం రాక అప్పుల ఊబిలో రైతు ఫీజు రీయింబర్స్మెంట్ రాక భారంగా పిల్లల చదువులు పల్లెలో ఏ ఇంటి గడప తొక్కినా అసంతృప్తే మార్టూరు గ్రామంలో సంకురాత్రి రచ్చబండ ముచ్చట్లివీ -
రోడ్డంతా బుగ్గే...
మా ఊళ్లో ఉన్న వారు చాలా మంది బయట బాగా ఉద్యోగాలు , వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారు పండగకి కార్లలో ఇక్కడకు వచ్చేటప్పుడు మన ఊరికి సరైన రోడ్డు కూడా లేదు. మార్టూరు నుంచి తుమ్మపాల వరకూ నాలుగు కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద గోతులతో..మైనింగ్ లారీలు తిరుగుతూ క్రషర్ బుగ్గితో అద్వానంగా ఉంది. కాలేజీకి వెళ్లే పిల్లలు వర్షం పడితే గుంతల్లో పడి రోడ్డు ప్రమాదాలు కూడా అవుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు.. ఎప్పుడు రోడ్డు ఏస్తారో తెలియడం లేదు.. – బద్దె రవి, గ్రామస్తుడు -
భోగిమంటల్లో జీవోల ప్రతులు
నక్కపల్లి : గత ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రతులను బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భోగి మంటల్లో వేసి దహనం చేశారు. రాజయ్యపేట గ్రామంలో ఏఐఎస్ఎఫ్ నాయకుడు బి.బాబ్జీ ఆధ్వర్యంలో విద్యార్థులు జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య విద్యను పేదలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేసి, నూతన భవనాలను కూడా నిర్మించిందన్నారు. కొన్నిచోట్ల భవనాలు పూర్తయి తరగతులు కూడా ప్రారంభమవుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం వచ్చి, ఆ 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించి జీవో విడుదల చేసిందన్నారు. వైద్య విద్యను పేదవాడికి దూరం చేసే దారుణానికి ఒడిగట్టిందన్నారు. దేశంలో మోదీ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నట్టే రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్లు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే వైద్యకళాశాలలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నూకరాజు, దేవి, కనక,జాన్ తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పథకం పేరు మార్చొద్దు... కె.కోటపాడు : ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు వ్యతిరేకంగా సూర్రెడ్డిపాలెంలో సీపీఎం నాయకులు బుధవారం నిరసన తెలిపారు. ఉపాధి పథకం పేరు మార్పుజీవో ప్రతులను భోగి మంటల్లో వేసి కాల్చివేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి నాయుడుబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీరామ్జీ పథకం వల్ల ఉపాధి పనులకు వెళ్లే వేతనదారులకు నష్టం కలుగుతున్నట్టు తెలిపారు. ఈ పథకం నిర్వహణకు రాష్ట్రాలు 40 శాతం నిధులు వెచ్చించాలని రాష్ట్రాలపై భారం మోపిందన్నారు. రాష్ట్రాలు ఈ నిధులు వెచ్చించని సమయంలో పథకం నిర్వీర్యమయ్యే పరిస్ధితి ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు వనుము సూర్యనారాయణ, ఈర్లి ముత్యాలనాయుడు, లెక్కల నారాయణమూర్తి, లక్ష్మి, అమ్మాజి పాల్గొన్నారు. -
రేపు జిల్లా స్థాయి గుర్రపు పరుగు పోటీలు
పోస్టర్ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు ప్రసాద్ మునగపాక: ప్రతి ఒక్కరూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ కోరారు. బుధవారం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జిల్లా స్థాయి గుర్రపు పరుగు పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. శ్రీరామ అభయాంజనేయస్వామి తీర్థంలో భాగంగా నిర్వహించే పోటీలను విజయవంతం చేయాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మునగపాక నుంచి వాడ్రాపల్లికి వెళ్లే దారిలో పొలాల్లో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో పెంటకోట విజయ్, వేగి రామకృష్ణ, ఆడారి రాజు, విల్లూరి శకరమనాయుడు, మణికంఠ, ఆడారి గోవింద, భీశెట్టి ఈశ్వరరావు, దాడి మురళి, శరగడం జగన్ పాల్గొన్నారు. -
మరణంలోనూ సార్థకత
● వైద్య పరిశోధనలకు సుశీలమ్మ దేహదానం ● ఆమె భర్త కూడా అవయవ దాతే.. అనకాపల్లి : స్థానిక మెయిన్ ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారిలో ఉషాప్రేమ్ ఆస్పత్రిలో పట్టణానికి చెందిన వాసిరెడ్డి సుశీలమ్మ (91)బుధవారం అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ మృతిచెందారు. జిల్లా ఖజానాశాఖ అధికారి వి.ఎల్.సుభాషిణి అత్త అయిన వాసురెడ్డి సుశీలమ్మ నేత్రాలను విశాఖ ఐ ఆస్పత్రికి, శరీరాన్ని విశాఖ ఆంధ్రామెడికల్ కళాశాలకు అప్పగించారు. నేత్రదానం, శరీరదానాన్ని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు నంబారు నరేష్, అడ్డూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్థివదేహాన్ని ఆంధ్రమెడికల్ కళాశాలకు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా ఖజానాశాఖ అధికారి వి.ఎల్.సుభాషిణి మాట్లాడుతూ గతంలో సుశీలమ్మ భర్త వాసిరెడ్డి నారాయణరావు మృతి చెందినప్పుడు సావిత్రిబాబు పూలే ట్రస్ట్ ద్వారా పార్ధివదేహాన్ని ఆంధ్రమెడికల్ కళాశాలకు అప్పగించడంతో, ఆయన ఆవయవాలను కొంతమందికి అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల సంఘం ప్రతినిధులు గ్రంధి గాంధీ, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం పాల్గొన్నారు. -
జగన్ మళ్లీ సీఎం కావాలని...
ఎస్.రాయవరం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2029 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మరోమారు ముఖ్యమంత్రి కావాలని అయ్యప్పమాలాధారణ భక్తులు ఎరిపల్లి జగన్నాథం, మణి వేడుకున్నారు. మండలంలోని కొత్త రేవుపోలవరం గ్రామానికి చెందిన వీరువురు జగనన్న ఫ్లెక్సీ పట్టుకుని శమరిమలై కొండ ఎక్కారు. పాయకరావుపేట నియోజకవర్గంలో కంబాల జోగులు అత్యధిక మెజార్టీతో గెలవాలని మొక్కుకున్నట్టు వారు చెప్పారు. పార్టీ కార్యకర్తలు భగవంతుని సన్నిధికి వెళ్లడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
పండగ పూట రైతులు, కార్మికులకు పస్తులు
చోడవరం : పండగ పూట కూడా పస్తులు పెట్టి ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని చెరకు రైతు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చెరకు రైతులకు వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతు, కార్మిక సంఘాల నాయకులు దీక్షా శిబిరం వద్ద అంబేడ్కర్ చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ మెయిన్గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసన రిలే దీక్ష శిబిరం గురువారం 12వ రోజుకి చేరింది. సీపీఐ, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు, ఏపీ చెరకు రైతు సంఘం, వ్యవసాయ కూలీ సంఘం, ఏపీ రైతు సంఘం ఈ శిబిరంలో పాల్గొని నిరసన తెలిపారు. సంక్రాంతి పండగ లోగా రైతులకు గతేడాది చెరకు బకాయిలు చెల్లించాలని కోరినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులు, కార్మికుల ఉసురు పోసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీని మూసివేసే ఆలోచన విరమించుకొని క్రషింగ్ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు లేక ఆకలిలో కుటుంబాలు పస్తులండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో సుగర్ ప్యాక్టరీ కార్మిక సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయి సూరిబాబు, శరగడం రామునాయుడు, జిల్లా వ్యవసాయ కూలీ సంఘం అధ్యక్షుడు కోన మోహన్రావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ శానాపతి సత్యారావు, ఏడువాక శ్రీను, వనం సూర్యనారాయణ, పోతల శ్రీరాములు ,సిఐటియూ నాయకుడు ఎస్వీనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు,నాగిరెడ్డి సత్యనారాయణ, ఆర్.దేముడునాయుడు పాల్గొన్నారు. -
క్వారీ లారీల లోడ్లతో రోడ్లు విధ్వంసం
రోలుగుంట: మండలంలో అక్రమ భారీ లోడు వాహనాలతో ఘాటీరోడ్లుగా మారుతున్న తారురోడ్ల దుస్థితిని నిరసిస్తూ సీపీఎం నాయకులు మంగళవారం చింతపల్లి –బుచ్చింపేట మార్గంలో ధర్నా నిర్వహించారు. దీనికి సారధ్యం వహించిన కె.గోవింద మాట్లాడుతూ 40 గ్రామాలకు ప్రయోజనకరంగా ఉండేందుకు గాను చింతపల్లి రోడ్డు నుంచి బుచ్చింపేట వయా వడ్డిప తారురోడ్డు నిర్మించారన్నారు. ఈ మార్గంలో అక్రమ క్వారీ నిర్వాహకులు భారీ బండరాళ్లు లోడు రవాణా చేయడం వల్ల తారురోడ్డు మట్టిరోడ్డుగా మారిపోయిందని వాపోయారు. దారి పొడవునా భారీ గోతులు ఉన్నాయని, రోజుకి వంద లారీల వరకూ రవాణా చేయడం వల్ల ఇరుకు రోడ్డులో వాహనచోదకులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ మార్గంలో గోతుల కుదుపుల్లో గర్భిణుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఈ సమస్యపై ఆర్డీవో, విజెలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమన్నారు. దుమ్ము, ధూళితో పులువురు శ్వాసకోశ వ్యాధులు బారిన పడుతున్నారని వాపోయారు. ఈ మార్గంలో క్వారీల నుంచి పూర్తిస్థాయిలో నల్లరాయి రవాణా అరికట్టి, దెబ్బతిన్న చోట బాగు చేయాలని డిమాండు చేశారు. ధర్నాలో పాంగి భాస్కరరావు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. -
గోదాదేవి కల్యాణానికి సర్వం సిద్ధం
కశింకోట వేణుగోపాలస్వామి ఆలయంలో గోదాదేవి, రంగనాథస్వామిల ఉత్సవ విగ్రహాలు , (ఇన్సెట్) ద్యాన వేంకటేశ్వరస్వామి ఆలయంలో.. కశింకోట: గోదాదేవి (ఆండాలమ్మ) కల్యాణాన్ని బుధవారం వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా దేవదాయ శాఖకు చెందిన స్థానిక రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలకు సంప్రదాయంగా, శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించనున్ననట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రేజేటి శ్రీరామాచార్యులు, అర్చకులు సీతారామాచార్యులు, మారుతి తెలిపారు. స్థానిక ధ్యాన వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ గోదాదేవి కల్యాణాన్ని నిర్వహిస్తామని అర్చకుడు రేజేటి రామచరణాచార్యులు తెలిపారు. గవరపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేశారు. -
సింహగిరి ఘాట్రోడ్డులో కారు బోల్తా
సింహాచలం : సింహగిరి ఘాట్రోడ్డులో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ సంక్రాంతి పండగ కోసం గాజువాకలోని తన ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి స్వామివారి దర్శనం కోసం సింహాచలం వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఘాట్రోడ్డు మార్గంలో కారు టైరు ఒక్కసారిగా పంచర్ కావడంతో వాహనం నియంత్రణ తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్తో పాటు కారులో ఉన్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన దేవస్థానం సిబ్బంది వారిని అంబులెన్స్లో నగరంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ కారులో ఉన్న పిల్లలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. -
పందెం బరిలో కూటమి
ప్రజల్ని చైతన్యవంతులను చేయాల్సిన ప్రజా ప్రతినిధులు జూదాలకు, మద్యానికి బానిసలుగా చేస్తూ ప్రజలపై విషం కక్కుతున్నారు. కోడి పందాలు, జూదాలు, మద్యంతో పాటు అశ్లీల నృత్యాలకు స్టేజీలు ఏర్పాటు చేసి మరీ అమాయక ప్రజల్ని ఆకట్టుకోవడానికి పాట్లు పడుతున్నారు. కూటమి నేతల అడ్డాల్లో సంక్రాంతి మూడు రోజుల్లో రూ.కోట్లల్లో చేతులు మారనున్నాయి. వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నా పోలీసులు చూసీచూడనట్లుగా ఆ వైపే వెళ్లకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. చోడిపల్లి పంచాయతీలో జూదాలకు సిద్ధం చేసిన టెంట్లు, ఎదురుగా స్టేజిసాక్షి, అనకాపల్లి/అచ్యుతాపురం రూరల్ : కూటమి ప్రభుత్వం ఏర్పడి మండలంలో టీడీపీ, జనసేన వేర్వేరుగా విడిపోయి ఒక్కో పార్టీ ఒక్కో మండలాన్ని పంచుకుని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడంలో నిమగ్నమయ్యారు. జనసేన పార్టీ స్థానిక ఎమ్మెల్యే సోదరుల అనుచరులు, నాయకులు రాంబిల్లి మండలం వెంకటాపురం కేంద్రంగా బరి ఏర్పాటు చేశారు. స్థానిక టీడీపీ ఇన్ఛార్జి అనుచరులు, టీడీపీ నాయకులు అచ్యుతాపురం మండలం చోడపల్లి పంచాయతీలో మరో బరి ఏర్పాటు చేసుకుని అక్రమ ధనార్జనకు సామాన్య ప్రజల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. అనధికారిక లేఅవుట్లో... అచ్యుతాపురంలో చోడపల్లి పంచాయతీలో అనధికారంగా వేసిన లే–అవుట్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కూటమి నాయకులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా చోడపల్లిలో ఏర్పాటు లే–అవుట్కు ఎటువంటి అనుమతులు లేకుండా రహదారులు ఏర్పాటు చేసి ప్లాట్లుగా విభజించి అమ్మకాలు చేసుకుంటూ పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇప్పుడు అదే లే–అవుట్లో కోడి పందాలు, గుల్లాట బల్లలు, పేకాట, మద్యం బెల్టు షాపులకు కూటమి నాయకులు బరి సిద్ధం చేశారు. ఒక వైపు పోలీసులు రాష్ట్రంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అనుమతులు లేవని హెచ్చరిస్తున్నప్పటికీ గ్రామ స్థాయి నాయకులు మాత్రం అధికారుల మాటలు బేఖాతరు చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయమై చోడపల్లి పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్రావును సంప్రదించగా చోడిపల్లిలో ఏర్పాటు చేసిన బరి అనధికారంగా వేసిన లే–అవుట్లోనే ఉందని, ఆ లే–అవుట్కి పంచాయతీ అనుమతులు లేవని, లే–అవుట్ సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు మాకు అందజేయలేదంటూ తెలియజేశారు. 80 ఎకరాల లేఅవుట్లో భారీ బరి..! రాంబిల్లి మండలంలో వెంకటాపురం గ్రామం సమీపంలో 80 ఎకరాల ఓ రియల్ ఎస్టేట్ లేఅవుట్లో జనసేన ఎమ్మెల్యే సోదరుల కనుసన్నుల్లోనే భారీఎత్తున జూద క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. కోడి పందాలతో పాటు లాటరీ బల్ల, గుండాట వంటి జూద క్రీడలను ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ జూద క్రీడల్లో 16 లాటరీ బల్లలను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. వీటిలో అచ్యుతాపురానికి చెందిన జనసేన పార్టీకి చెందిన నేతలకు –4, రాంబిల్లి–3, యలమంచిలి–4, మునగపాక–5 లాటరీ బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బల్లను ఏర్పాటు చేసినందుకు ముందస్తు మామ్మూళ్లు రూ.5 లక్షలు చొప్పున చెల్లించినట్లు తెలిసింది. ‘బరి’తెగిస్తే చర్యలు తప్పవు ప్రశాంతమైన వాతావరణంలో గ్రామీణ స్థాయి నుంచి సంక్రాంతి వేడుకలను నిర్వహించుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కాంతులు, ఆనందాలు నింపేలా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ పండగ నిర్వహించుకోవాలి. కోడిపందాలు, గుళ్లాటలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పండగ ముసుగులో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై 24/7 డ్రోన్ కెమెరాల ద్వారా పోలీస్ పర్యవేక్షణ ఉంటుంది.గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో నిరంతరం డ్రోన్ కెమెరా ద్వారా జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యవేక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. కోడిపందాలకు కత్తుల కట్టడం, భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహించడం, పేకాట, గుండాట, కోసు వంటి జూద క్రీడలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సంప్రదాయం పేరిట జీవహింసకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఇప్పటికే రౌడీషీట్లు తెరిచేందుకు కూడా వెనుకాడబోము. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలి.ఎక్కడైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్టతే డయల్ 100/112కు, స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలి. అటువంటి వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. – తుహిన్ సిన్హా, ఎస్పీ, అనకాపల్లి జిల్లాచోడపల్లిలో అనధికార లేఅవుట్లో టీడీపీ బరి -
16న రామగిరి తీర్థం
మునగపాక: మండలంలోని రామగిరిలోని శ్రీ కోదండ సీతారామచంద్రమూర్తి తీర్థం ఈ నెల 16న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా కనుమ పండగ రోజున తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి పలు సేవగరిడీల ప్రదర్శన అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తీర్ఖం తిలకించేందుకు సమీపంలోని చూచుకొండ, జగన్నాథపురం, గణపర్తి, మెలిపాక, చెర్లోపాలెం, మడకపాలెం తదితర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీతారామచంద్రమూర్తిని దర్శించుకుంటారు. తీర్థం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహణపై ఎస్ఐ పి.ప్రసాదరావు ఏర్పాట్లు చేస్తున్నారు. -
తెగుళ్ల కాలం... రైతులు అప్రమత్తం
అనకాపల్లి : నువ్వు సాగుచేసే రైతులు జనవరి నెలాఖరులోపు వేసుకోవాలని, విత్తేముందు ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూఫర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ సీహెచ్.ముకుందరావు సూచించారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం శాస్త్రవేత్తలతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కలుపు నివారణకు పైరు విత్తిన 2 రోజులలోపు ప్రెటిలాక్లోర్ 2.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. మొక్కజొన్నలో కలుపు నివారణకు టెంబోట్రయోన్ 115 మి.లీ. 200 లీటర్ల నీటికి కలిపి 20–25 రోజులప్పుడు పిచికారి చేయాలని, 25–30 రోజులప్పుడు 55 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలని తెలిపారు. అపరాలలో బూడి తెగులు నివారణ రాగిలో కలుపు నివారణకు విత్తిన 2 రోజులలోపు పెండిమితాలిన్ 3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని, అపరాలలో బూడిద తెగులు ఆశిస్తే నీటిలో కరిగే గంధకం పొడిని 2 గ్రా. లీటరు నీటికి చొప్పున పిచికారి చేయాలని, పల్లాకు తెగులు ఉన్న మొక్కలను పీకి వేయాలని, తెల్లదోమ నివారణకు అసిటామిప్రిడ్ 0.2 గ్రా. లీటరు నీటికి చొప్పున పిచికారి చేయాలని ఏడీఆర్ తెలిపారు. మారుకా మచ్చల పురుగు నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలని, ఉధృతి అధికంగా గమనించిన ప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. ప్లూబెండమైడ్ 0.2 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలన్నారు. వేరుశనగలో తిక్కా ఆకు తెగులు వేరుశనగలో తిక్కా ఆకు మచ్చ తెగులు నివారణకు కర్బెండాజిమ్, మాంకోజెట్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి కారిచేయాలన్నారు. వరి నాట్లు వేస్తున్న రైతులు దుమ్ములో ఎకరానికి 35 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ను వేసుకుని 21 నుంచి 25 రోజుల వయసు గల నారును చ.మీటరుకు 44 మూనలు తగ్గకుండా మూనకు 2–3 మొక్కల చొప్పున 15 ఇన్టూ 15 సెం.మీ . దూరంలో నాటుకోవాలన్నారు. వరినాటిన 3–5 రోజుల తరువాత కలుపు నివారణకు ప్రెటిలాక్లోర్ 2.0 మి.లీ లీటరు నీటికి పిచికారి చేయాలని, 15–20 రోజుల వయసుగల నాటిన వరిలో కలుపు నివారణకు బిస్ఫైరిబాక్ సోడియంను ఎకరాకు 100 మి.లీ. 200 మీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని అన్నారు. చెరకు కార్శి రైతులు వీలైనంత త్వరగా పొలాన్ని ఒకేసారి మోడి చెక్కికార్శి చేసుకోవాలని, కార్శి చేయడానికి ట్రాక్టరుతో నడిచే ష్రడ్డర్ నడపాలని, ష్రడ్డర్ నడపడం కుదరక పొతే మోళ్లు చెక్కి ఎకరాకు 1.25 టన్నుల చెరకు చెత్త పొలమంతా పలుచగా కప్పాలని తెలిపారు. చెరకు మొక్కతోటలు వేసే రైతులు చాళ్ల మధ్య 2 అడుగుల దూరం, జంటల మధ్య 4–5 అడుగుల దూరం ఉంచి నాటుకున్నప్పుడు మంచి దిగుబడులు రావడమే కాకుండా అంతర పంటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కె.వి.రమణమూర్తి, వి.గౌరీ, ఆర్.సరిత, ఎ.అలివేణి పాల్గొన్నారు. -
‘పెద్ద’ల పండగ... తీర్థాలు సంబరంగా...
చోడవరం : సంవత్సరమంతా ఎండనక, వాననక కాయకష్టం చేసి అలసిపోయే గ్రామీణ ప్రజలకు సంక్రాంతి పండగతో ఆరంభమయ్యే తీర్థ మహోత్సవాలు ఆటవిడుపును ఇస్తాయి. తీర్థాలంటే గ్రామాల్లో బంధువుల మధ్య ప్రేమానుబంధాలు కలిపే పండగలని కూడా చెప్పవచ్చు. ఆలయాలు, గ్రామదేవతల గుడిల వద్ద, పెద్దలుగా పూజించే దివంగత తల్లిదండ్రులు, తాతమామ్మలు, జాతీయ నాయకులు, అభిమాన నేతల విగ్రహాల వద్ద ఈ తీర్ధాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా భోగి పండగ నుంచి గ్రామాల్లో తీర్థాలు ప్రారంభమౌతాయి. ఆదిదేవుడైన చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేరుడి ఆలయం వద్ద జరిగే తీర్థం నుంచి చోడవరం, మాడుగుల పరిసరాలతోపాటు జిల్లా అంతటా ప్రారంభమౌతాయి. కాణిపాకం వినాయకుని తర్వాత అంతటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేరుడి ఆలయం వద్ద భోగి రోజైన బుధవారం మొదటి తీర్థంను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 50 రోజులకు పైబడి రోజుకి రెండు, మూడు గ్రామాల్లో అన్ని చోట్ల తీర్థాలు నిర్వహిస్తారు. చోడవరం, వడ్డాది, రావికమతం, కొత్తకోట, రోలుగుంట, మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, చౌడువాడ, కశింకోట, యలమంచిలి, నక్కపల్లి, రాంబిల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, అచ్యుతాపురం, తుమ్మపాల, సబ్బవరంతోపాటు అనేక పెద్ద గ్రామాల్లో ప్రముఖ దేవాలయాల వద్ద, తోడపెద్దులను కొలిచే చోట, దివంగతులైన గ్రామపెద్దలను స్మరించే చోట తీర్థాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ తీర్థాల్లో అనేక ప్రత్యేకతలు కనువిందుచేస్తాయి. గిర్రున తిప్పే రంగులరాట్నాలు, నోరూరించే పంచదార చిలుకలు గ్రామీణులకే అందుబాటులో ఉండే నెయ్యిచెక్కీలు, కర్జూరం దుఖాణాలతో పాటు పండగ వాతావరణాన్ని తీసుకువచ్చే రంగురంగుల బెలూన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆయా గ్రామాలలో నిర్వహించే ఎడ్ల బళ్లు, గుర్రం పందాల పోటీలు చిన్నాపెద్దా అందరికీ హుషారు కలిగిస్తాయి. బంధుమిత్రులను ఆహ్వానించి విందు వినోదాలతో అతిథి మర్యాదలు చేయడంతో గ్రామమంతా సందడి నెలకొంటుంది. ఈ తీర్థాల జోరు గ్రామీణులలో హుషారును నింపి కొత్త ఉత్సాహంతో తిరిగి పనీపాటల్లో పాల్గొనేలా చేస్తాయి. తెలుగువారి గ్రామీణ సంస్కృతిని విడువకుండా పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగించడం పల్లె ప్రజల ఆత్మీయతకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ ధ్వంసం
చమ్మచింతలో ధ్వంసం చేసిన ఫ్లెక్సీ నాతవరం : మండలంలో చమ్మచింత గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ యూత్ మండల జాయింట్ కార్యదర్శి సందీప్ ఆధ్వర్యంలో జననేత జన్మదినం నూతన సంవత్సర వేడుకలు సంక్రాంతి పండగ సందర్భంగా మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పోటీలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేసిన కొందరి ఫొటోలను కట్ చేయడంతో వైఎస్సార్సీపీ మండల యూత్ జాయింట్ కార్యదర్శి సందీప్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ధ్వంసం చేయడం జరిగిందని ఆరోపించారు. ఈ సంఘటనపై మండల పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఎంపీ బాబూరావును కలిసిన లక్నో ఏడీజీపీ
నక్కపల్లి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో ఏసీబీలో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ)గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ మంగళవారం విశాఖపట్నంలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని పాములవాక గ్రామానికి చెందిన సత్యనారాయణ సెకెండరీ గ్రేడ్ ఉపాద్యాయుడిగా పనిచేస్తూ సివిల్స్కు ప్రిపేర్ అయి 1996లో యూపీ ఐపీఎస్ కేడర్కు ఎంపికయ్యారు. ఆగ్రా ఏఎస్పీగా మొదటి పోస్టింగ్ పొందిన ఆయన మీరట్, ఝాన్సీ ఎస్పీగా, వారణాసి డీఐజీగా సేవలందించారు. సమర్థవంతమైన ఐపీఎస్ అధికారిగా పేరు సంపాదించుకుని ఐదేళ్లపాటు ఏపీలో డిప్యూటేషన్పై అనంతపురం రేంజ్ డీఐజీగా, ఏపీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. తర్వాత తిరిగి యూపీకి వెళ్లిపోయారు. సంక్రాంతి పండక్కి స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన విశాఖలో ఎంపీ బాబూరావును కలిశారు. తాను ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన సత్యనారాయణ ఐపీఎస్ అధికారిగా పనిచేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా బాబూరావు అన్నారు. ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జీవీ రవిరాజు, శంకర్రెడ్డి, బొడ్డేటి గంగా మహేష్, డిప్యూటీ మాజీ మేయర్ దాడి సత్యనారాయణ, పురుషోత్తం రెడ్డి, బోరా కుమార్రెడ్డి, దల్లి రామకృష్ణారెడ్డి, శివకుమార్రెడ్డి పాల్గొన్నారు. -
గంగవరం పోర్టుకు ఐసీసీ ఎన్విరాన్మెంటల్ ఎక్స్లెన్స్ అవార్డు
ఎక్స్లెన్స్ అవార్డును అందుకుంటున్న అదానీ గంగవరం పోర్టు ప్రతినిధులు పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టుకు ఐసీసీ ఎన్విరాన్మెంటల్ ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కోల్కతాలో నిర్వహించిన 19వ ఎన్విరాన్మెంట్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ప్లాటినం విభాగంలో ప్రతిష్టాత్మక అవార్డును గంగవరం పోర్టు ప్రతినిధులు మంగళవారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడేళ్లలో ఆరు జాతీయ అవార్డులు అందుకున్నామని తెలిపారు. ఈ అవార్డుతో తమ పోర్టు బాధ్యత మరింత పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోర్టు అనేక కార్యకలాపాలు చేపడుతోందని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. -
400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
బెల్లం ఊటను ధ్వంసం చేస్తున్న ఎకై ్సజ్ సిబ్బంది నర్సీపట్నం: సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామని ఎకై ్సజ్ సీఐ కె.సునీల్ కుమార్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధి గురంధరపాలెం శివారు గదబపాలెం గ్రామ జీడి, మామిడి తోటల్లో సారా బట్టీపై ఎస్సై కిరణ్కుమార్, సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. సారా తయారీకి వినియోగించే వంట పాత్రలను స్వాధీనం చేసుకున్నారు. పండగ ముసుగులో సారా తయారీ చేసినా, విక్రయించినా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. -
భవన నిర్మాణ సంక్షేమబోర్డు నిధులు ప్రచారానికా..?
రాంబిల్లి(అచ్యుతాపురం): రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు నుంచి ప్రచార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించడాన్ని అనకాపల్లి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం(సీఐటీయూ) వ్యతిరేకిస్తుందని సంఘం జిల్లా కార్యదర్శి చందక రామకృష్ణ తెలిపారు. ఆయన మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. భవన నిర్మాణ దారుల నుంచి ఒక శాతం పన్నును వసూల చేసే ప్రభుత్వం ఆ నిధుల నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి, కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్ షిప్ల రూపంలోనూ,ప్రమాద బీమా, కార్మికులకు అవసరమైన పనిముట్లను అందజేయు కార్యక్రమాలు చేపట్టాల్సింది పోయి, సంక్షేమ బోర్డు నిధులను ప్రచారానికి కేటాయించడం సరికాదని పేర్కొన్నారు. -
విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ
అనకాపల్లి : విద్యుత్ చార్జీల (టారిఫ్)పై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఈ నెల 20 నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు గొప్పు ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీఈఆర్సీ చైర్మన్ పి.వి.ఆర్.రెడ్డి గారి ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ 10.30 గంటల నుంచి ఒంటిగంట వరకు (వ్యక్తిగతంగా), రెండు గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) జరుగుతాయన్నారు. ఏపీఆర్సీ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ, ఏపీట్రాన్స్కో, ఏపీజెన్కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రతిరోజు మూడు విద్యుత్ పంపిణీ సంస్థల టారిఫ్ ఫైలింగ్కు సంబంధించిన ప్రజాభిప్రాయాలను స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అనకాపల్లి గవరపాలెం పర్యవేక్షక్ ఇంజినీరు కార్యాలయం, కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయం, కశింకోట కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయం, నర్సీపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ముందుగానే పేర్లు నమోదు చేసుకోవాలని పేర్లు నమోదు చేసుకోనివారు కూడా విద్యుత్ నియంత్రణ మండలి అనుమతితో అభిప్రాయాలు తెలియచేయవచ్చన్నారు. ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. జిల్లా పర్యవేక్షక్ ఇంజినీరు కార్యాలయం సెల్, 9440816377, కార్యనిర్వాహక ఇంజినీర్ కశింకోట సెల్. 9440816352, కార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయం, నర్సీపట్నం 9491049790 నంబర్లు ద్వారా మాట్లాడవచ్చన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారానికి httpr://www. eliveevents.com / aperc2026ను సంప్రదించాలన్నారు. -
గూడు చెదిరిన వలస పక్షులు
చిట్టివలస చెరువులో అల్పసంఖ్యాకంగా కనిపిస్తున్న పక్షులుతగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్ 1, 2 వార్డుల పరిధిలోని చిట్టివలస, చిల్లపేట గ్రామాల మధ్య 36 ఎకరాలలో విస్తరించిన చెరువు గతంలో వలస పక్షులకు ఆలవాలంగా ఉండేది. చిత్తడి నేలల రకానికి చెందిన ఈ చెరువులో పీఎం పాలేనికి చెందిన ఈస్ట్కోస్ట్ కన్జర్వేషన్ టీమ్, గ్రీన్ పా ప్రతినిధులు గతంలో 35 రకాల పక్షిజాతులను గుర్తించారు. వాటిలో నీటి కోడి, పావురాలు, కొంగలు, మునుగుడు కోడి, జెముడుకాకులు, తాటి చతకా, కుకూడు, నీటికాకులు, చిలకలు, మైనాలు, కత్తెర పిట్టలు, జకన, ఉల్లంకి పిట్టలు తదితర పక్షులు ఉండేవి. భూసారం, ఇసుక నేలలు, డ్రైనేజీ నిల్వలు, రసాయన వ్యవసాయం, నీటి పారుదల, పట్టణ వ్యర్థాలు, కాలుష్యం పక్షుల మనుగడపై ప్రభావం చూపాయి. ఇటీవల జీవీఎంసీ చెరువులో పక్షులు సంతానోత్పత్తిలో భాగమైన చెట్లు, తుప్పలు తొలగించింది. అలాగే సంగివలస అనిల్ నీరుకొండ మెడికల్ కళాశాల, ఆసుపత్రి నుంచి వ్యర్థాలు నేరుగా చెరువులో కలవడం కూడా వీటి మనుగడపై ప్రభావం చూపింది. దీంతో తగరపువలస–భీమిలి రోడ్డులో నిత్యం ప్రయాణికులు, పర్యాటకులను పలకరించే పక్షులు ఇప్పుడు పలచబడ్డాయి. ఈ చెరువును వలస పక్షులకు ఆలవాలంగా మార్చాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. -
భవన నిర్మాణ కార్మికుల నిరసన
నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న రామకృష్ణ నర్సీపట్నం: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భవన కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ సంక్షేమ బోర్డుకు సంబంధించి రూ.20 కోట్లు ప్రచారానికి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్మిక సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్, ప్రమాద బీమా, మట్టి ఖర్చులు, మెటర్నటీ బీమా, కార్మికులకు పనిముట్లు అందించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. నిరసన కార్యక్రమంలో జిల్లా నాయకులు డి.శివ తదితరులు పాల్గొన్నారు. -
వడోకాయ్ కరాటే అసోసియేషన్ కార్యదర్శిగా నగేష్
సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకుంటున్న గెడ్డ నగేష్ దేవరాపల్లి: భారత్ వడోకాయ్ కరాటే డు అసోసియేషన్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీగా దేవరాపల్లి మండలం రైవాడకు చెందిన గెడ్డం నగేష్ ఎంపికయ్యారు. భారత్ వడోకాయ్ కరాటే డు అసోసియేషన్ సౌత్ ఇండియా విభాగానికి మంగళవారం విశాఖపట్నంలో జరిగిన ఎన్నికల్లో అసోసియేషన్ సభ్యులంతా తనను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారని నగేష్ తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి తనను ఎన్నుకున్న అసోసియేషన్ ప్రెసిడెంట్ సిహెచ్.సతీష్కుమార్, అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు నగేష్ తెలిపారు. సినీ హీరో సుమన్ తల్వార్ చేతులు మీదుగా నియామక పత్రం అందుకోవడం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. కరాటే అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. -
ఉమ్మడి జిల్లాకు 36 స్వచ్ఛ రథాలు
నాతవరం : ఉమ్మడి జిల్లాలో ఈనెల 17వ తేదీన 36 స్వచ్ఛ రథాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి అన్నారు. మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. మండల పరిషత్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తర్వాత జెడ్పీటీసీ కాపారపు అప్పలనర్స, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఆయన్ని కలిసి మండలంలో గల ప్రధాన సమస్యలను వివరించారు,. ఇంతవరకు చేసిన పలు అభివృద్ధి పనులకు సకాలంలో బిల్లులు రాక ఇబ్బందులు ఉన్నాయన్నారు. అదే విధంగా మండలంలో గల ప్రధాన సమస్యలతో సిబ్బంది కొరతపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద అనకాపల్లి, రావికమతం, అచ్చుతాపురం మండలాలను ఎంపిక చేసి స్వచ్ఛ రథాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయా మండలాల్లో పని తీరు అధారంగా ఉమ్మడి జిల్లాలో మండలానికి ఒక స్వచ్ఛ రథం మంజూరు చేశామన్నారు. స్వచ్ఛ రథాలు నడపడానికి ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఒక వ్యక్తిని నియమించామన్నారు. ఆ వ్యక్తికి మండల పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నెలకు రూ.25 వేలు తక్కువ లేకుండా ఏడాదికి రూ. 3 లక్షలకు పైగా ఇవ్వడం జరుగుతుందన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకోని తాగునీటి ఎద్దడి లేకుండా గ్రామాల్లో తాగునీరు బోర్లు ముందస్తుగా మరమత్తులు చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలో పెద్ద తాగునీటి పథకాలు 47 ఉన్నాయని వాటి నిర్వహణకు ఏడాదికి రూ.20 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో లింకు రోడ్లు అభివృద్ధి చేయుట తదితర పనులు చేస్తున్నామన్నారు. నాతవరం మండలంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రధాన సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. -
అర్జీలకు సత్వర పరిష్కారం
అర్జీలు స్వీకరిస్తున్న ఆర్డీవో రమణ నర్సీపట్నం: పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆయాశాఖల అధికారులను ఆర్డీవో వి.వి.రమణ ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో తొమ్మిది అర్జీలు స్వీకరించినట్టు ఆయన తెలిపారు. సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని నర్సీపట్నం మండలం గురంధరపాలెంకు చెందిన ఎ.రాజు అర్జీ పెట్టుకున్నారు. మా భూమిని వేరే వ్యక్తి పేరున ఆన్లైన్లో నమోదు చేశారని, సరి చేయాలని కోరుతూ రావికమతం మండలం, కొత్తకోటకు చెందిన వి.రామకృష్ణ దరఖాస్తు చేసుకున్నా రు. నివాస స్థలంలో రేకుల షెడ్డు నిర్మించుకునేందుకు ఎల్పీసీ ఇవ్వాలని కోరుతూ కోటవురట్ల మండలం గొట్టివాడ గ్రామానికి చెందిన జె.కొండయ్య దరఖాస్తు చేశారు. వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారానికి వీలుకాకపోతే కారణాన్ని అర్జీదారునికి తెలియజేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆర్డీవో సూచించారు. -
జీవీఎంసీ బడ్జెట్కు స్థాయీ సంఘం ఆమోదం
డాబాగార్డెన్స్(విశాఖ): జీవీఎంసీ 2026–27 బడ్జెట్ అంచనాలపై స్థాయీ సంఘ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారని నగర మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో జీవీఎంసీ వార్షిక బడ్జెట్పై స్థాయీ సంఘం సమావేశం నిర్వహించారు. ఏ విభాగానికి ఎంత వెచ్చించారు? జమలు, ఖర్చులు, వివిధ అభివృద్ధి పనులకు ఎంత కేటాయించారో? తదితర అంశాలను సభ్యుల ముందుకు జీవీఎంసీ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి తీసుకొచ్చారు. వాటిని స్థాయీ సంఘ సభ్యులు చర్చించి ఆమోదించారు. వాటిలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి త్వరలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో సభ్యుల ఆమోదానికి పంపనున్నారు. కాగా మేయర్ పీలాకు ఇదే మొదటి బడ్జెట కాగా.. చివరి బడ్జెట్ కూడా ఇదే కావడం విశేషం. ఐదేళ్ల పాలనలో నాలుగేళ్లు వైఎస్సార్ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి స్థాయీ సంఘం చైర్పర్సన్గా బడ్జెట్ ఆమోదించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు పీఎం సత్యవేణి, డి.వి.రమణమూర్తి, ఎస్.ఎస్.వర్మ, పి.నల్లనయ్య, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి.నరేష్కుమార్, తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ ఇలా.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా సంగ్రహంగా ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు. అన్ని పద్దుల కింద జమలు రూ.3814.41 కోట్లు. ప్రారంభ నిల్వతో కలిపి మొత్తంగా జమలు రూ.4180.37 కోట్లు కాగా.. అన్ని పద్దుల కింద ఖర్చులు రూ.4047.12 కోట్లు. ముగింపు నిల్వగా రూ.133.25 కోట్లుగా నిర్ణయించారు. గారడీ అంకెలంటే ఒప్పుకునేది లేదు.. బడ్జెట్ను స్థాయీ సంఘ సభ్యుల ముందుకు చర్చకు తెచ్చే ముందు మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో గారడీ అంకెలు చూపించారని తెలపడంతో స్థాయీ సంఘ సభ్యురాలు సాడి పద్మారెడ్డి స్పందిస్తూ.. ‘మీరు ఆ విధంగా మాట్లాడడం సరికాదు. బడ్జెట్ను ఎవరు రూపొందిస్తారు.. అధికారులా? సభ్యులా? గతంలో 98 వార్డుల్లో అభివృద్ధి జరగలేదా? మీ వార్డు ఏ మేరకు అభివృద్ధి జరిగిందో మీకు తెలియదా’? అంటూ మండిపడ్డారు. ● గాజువాక, గోపాలపట్నం, పెందుర్తి తదితర విలీన ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్స్ కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని, వాటిని జీవీఎంసీ పరంగా మనం అభివృద్ధి చేయలేమా? అంటూ సభ్యుడు రాపర్తి త్రివేణి వరప్రసాదరావు ప్రశ్నించారు. ● జీవీఎంసీ పరిధిలో పార్కులు, శ్మశానవాటికలు కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారు. అంత వరకూ బాగానే ఉంది. వాటిని సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారని, సభ్యులు సాడి పద్మారెడ్డి, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు అధికారుల ముందుకు తీసుకొచ్చారు. కేర్ టేకర్స్ని నియమిస్తే వాటి సంరక్షణ ఉంటుందని సూచించారు. ● బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో చాలా చోట్ల బస్టాప్లు కోల్పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు సభ్యులు అధికారుల దృష్టికి తీసుకోచ్చారు. ● విలీన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో జీవీవీంసీ పూర్తిగా విఫలమైందని, ఇప్పటికీ మట్టి రోడ్లే ఉన్నాయని సభ్యురాలు సేనాపతి వసంత ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో స్థాయీ సంఘ సభ్యులు -
గ్రామాల్లో కానరాని హరిదాసుల సందడి
మాడుగుల: ఒకప్పుడు ఽహరిదాసులు గ్రామాలకు దిగారంటే ధనుర్మాసం వచ్చినట్లుగా భావించేవారు. నెత్తిన అక్షయ పాత్ర పెట్టుకుని హరినామ కీర్తనలు వినసొంపుగా పాడుకుంటూ గ్రామ వీధుల్లో తెల్లవారక ముందే తిరిగేవారు. వారి వెంట చిన్నారులు, పెద్దవారు తిరిగి భక్తిభావంతో సందడిగా ఉండేది. ఈ కాలంలో రైతులకు పంటలు చేతికి రావడంతో ధాన్యం, బియ్యం, కాసులు అక్షయ పాత్రలో వేసి వారి భక్తిభావం చాటుకునేవారు. ఈ విధంగా వందలాది కుటుంబాలు జీవనం సాగించేవి. అయితే హరి నామ కీర్తనలు వినేవారు లేక, మైక్సెట్లు, టీవీలు అందుబాటులోకి రావడంతోపాటు నాగరికత పెరిగిపోవడంతో వీరికి ఆదరణ తగ్గిపోయింది. దీంతో వీరు కులవృత్తులను వదిలి కంపెనీలతోపాటు ఇతర వృత్తుల్లోకి మారిపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఇదే వృత్తిని కొనసాగించే వారిలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒకప్పుడు 500 మంది ఉండేవారు. ప్రస్తుతం 150 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో సగానికిపైగా వృద్ధాప్యంలోకి చేరుకున్నారు. వీరు తెలంగాణ రాష్ట్రం భద్రాచలం పరిసర ప్రాంతాల నుంచి అనకాపల్లి, తదితర గ్రామాలకు వలసొచ్చి కార్తీక మాసం నుంచి నాలుగు నెలల పాటు ఇక్కడే ఉండి ఏప్రిల్లో శ్రీరామ నవమికి భద్రాచలం వెళ్లేవారు. అక్కడ వీరు సేకరించిన దినుసులు కొంత శ్రీరాములవారికి సమర్పించుకుని దీక్ష ముగించుకుని స్వగ్రామాలకు చేరుకుని వ్యవసాయం, తదితర వృత్తుల్లో చేరిపోతుంటారు. వీరు హరినామ కీర్తనలు పాడుకుని అక్షయ పాత్ర నెత్తిన ఉన్నంత సేపు నియమ నిబంధనలతో ఉపవాసం ఉంటారు. ఒక్కొక్క రోజు సాయంకాలం వరకు ఉపవాసంతోనే తిరుగుతారు. ఈ వృత్తిలో బతకలేక వేరే వృత్తి చేతకాక ఇంకా ఈ వృత్తినే కొనసాగుతున్న వారికి ప్రభుత్వం పింఛన్లు ఏర్పాటు చేసి హరిదాసులు కుటుంబాలను ఆదుకోవాలని వీరంతా కోరుకుంటున్నారు. -
అప్పలరాజుపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
నెహ్రూచౌక్ వద్ద ధర్నా చేస్తున్న రైతు సంఘాల నాయకులు అనకాపల్లి: రైతు సంఘం జిల్లా నాయకుడు ఎం.అప్పలరాజుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి, వెంటనే విడుదల చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ కర్రి అప్పారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరావు డిమాండ్ చేశారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద అఖిలపక్ష నాయకులు, రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా రైతు నాయకుడు ఎం.అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ యాక్ట్ నమోదు చేసి జైలులో పెట్టిందని ఆరోపించారు. గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీడీ యాక్ట్ను రైతు నాయకుడిపై ప్రయోగించడం అన్యాయ మన్నారు. విశాఖలో విద్యార్థి సంఘాల కార్యకర్తలపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం తగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్, ఏఐటీయూ జిల్లా నాయకుడు రాజాన దొరబాబు, వివిధ సంఘాల నాయకులు గండి నాయనబాబు, ఆర్.శంకరరావు, డి.డి. వరలక్ష్మి, ఎస్. బ్రహ్మాజీ, ఆర్.రాజు, ఎస్.వి.నాయుడు, కాండ్రేగుల సదా శివరావు, కాళ్ల తాళయ్య బాబు, నాగిరెడ్డి సత్యనారాయణ, సుభాషిణి, ఎ.రాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో 24 గొర్రెలు మృతి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలు, గాయపడిన లోవరాజుపాయకరావుపేట: మండలంలోని సీతారాంపురం జంక్షన్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 24 గొర్రెలు మృతి చెందాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.నాతవరం మండలం చినగొలుగొండపేటకు చెందిన బి.లోవరాజు తన 200 గొర్రెలతో రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీకొని వెళ్లిపోయింది.ఈ ప్రమాదంలో లోవరాజు గాయపడగా, 24 గొర్రెలు మరణించాయి. మరో 9 గొర్రెలకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు టోల్ గేట్ ద్వారా సమాచారం సేకరించి వాహనం ఆచూకీ తెలుసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వాహనం అలుమూరుకు చెందిందిగా గుర్తించామన్నారు. కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
రేపు సింహగిరిపై సంక్రాంతి సంబరాలు
సింహగిరిపై ఏర్పాటు చేస్తున్న పూరిళ్లు సింహాచలం: సింహగిరిపై బుధవారం ఉదయం సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ సనాతన ధర్మాన్ని, తెలుగు సంస్కృతిని, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఈ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజగోపురం ఎదురుగా ఉన్న మాడ వీధిలో ఉదయం పెద్ద ఎత్తున భోగి మంటను వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గొబ్బెమ్మలతో ముత్యాల ముగ్గులు, డూడూ బసవన్నల విన్యాసాలు, జంగమ దేవర, కొమ్మదాసరి, హరిదాసు వేషధారణలు, కపిలగోవు, కపిలగిత్త, ఎడ్లబండి, పూరిగుడెసలు, ధాన్యం గుట్టలను ప్రదర్శనలు ఏర్పాటుచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు చిన్నారులకు సామూహికంగా భోగిపళ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలాగే ముంగళవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధిలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. -
పాసు పుస్తకాల్లో తప్పులు తడకలపై రగడ
దేవరాపల్లి: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూమి పట్టాదారు పాసు పుస్తకాలు తప్పులు తడకగా ఉన్నాయని, రెవెన్యూ అధికారులను బోయిలకింతాడ సర్పంచ్ సర్పంచ్ బూరె బాబూరావు, తదితర సభ్యులు నిలదీశారు. ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి అధ్యక్షతన సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. జెడ్పీటీసీ కర్రి సత్యం తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తన పాసు పుస్తకంలో సైతం ఫొటో, ఫోన్ నంబర్ తప్పు పడిందని, ఇప్పటికే రెండు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బోయిలకింతాడ సర్పంచ్ బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు సరిచేయకుండా పాసు పుస్తకాలు పంపిణీ చేయడంతో ప్రజాధనం వృథా తప్పా, ప్రయోజనం ఏమిటని డిప్యూటీ తహసీల్దార్ కె. అప్పారావును ప్రశ్నించారు. ఈ సమయంలో పీఏసీఎస్ అధ్యక్షులు జోక్యం చేసుకోవడంతో బాబూరావు సహా సర్పంచ్లు, ఎంపీటీసీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా మర్యాదలు పాటించకుండా సభ్యులు తమ సమస్యలను సభలో లేవనెత్తుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని, ఇది ముమ్మాటికి సభ్యుల హక్కులను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరగడంతో ఒక్కసారిగా సభ రసాభాసగా మారింది. ఎంపీపీ బుల్లిలక్ష్మి జోక్యం చేసుకొని సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరొకరు మాట్లాడటం సరికాదని, కచ్చితంగా సభా మర్యాదలు పాటించాలని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. రైవాడ జలాశయంలో చేప పిల్లల విడుదలపై తనకు మత్స్యశాఖ అధికారులు కనీస సమాచారం ఇవ్వడం లేదని సర్పంచ్ చల్లా లక్ష్మి సభ దృష్టికి తీసుకువచ్చారు. గతంలో చేప పిల్లల విషయంలో తప్పుడు లెక్కలతో ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించారన్నారు. కొత్తపెంటలో మరమ్మతులకు గురైన ట్రాన్స్ఫార్మర్లను బాగు చేయాలని సర్పంచ్ రొంగలి వెంకటరావు ఎలక్ట్రికల్ ఏఈఈ కె. శంకరరావును కోరారు. పశు బీమా సొమ్ము గత కొన్నేళ్లుగా రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలంనాయుడు ప్రశ్నించారు. వైస్ ఎంపీపీలు ఉర్రూకుల గంగాభవానీ, పంచాడ సింహాచలంనాయుడు, ఎంపీడీవో ఎం.వి. సువర్ణరాజు, ఏవో డి.వి.లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఎంపీడీవోలు కిరణ్ వరప్రసాద్, పి.వి. అలవేణిమ్మ, సర్పంచ్లు చింతల సత్య వెంకటరమణ పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూములను పరిరక్షించాలి
దేవరాపల్లి: స్థానిక రెవెన్యూ పరిధిలో ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని, పరిరక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం ఆయన కళ్లకు గంతలు కట్టుకొని, ఆక్రమణ భూముల వివరాలతో కూడిన ఫ్లెక్సీ చేతపట్టి వినూత్న నిరసనకు దిగారు. దేవరాపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 281/2లో భూమికి 281/2ఏ అని రెవెన్యూ రికార్డుల్లో లేని భూములకు గతంలో అధికారులు పాసు పుస్తకాలు మంజూరు చేశారన్నారు. దీని ఆధారంగా ఆక్రమణదారుడు మరో రెండు సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి దర్జాగా సాగు చేసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దర్యాప్తు చేసి పంటలు సహా ఈ భూములన్నింటిని స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఉంచారన్నారు. ఆక్రమణదారుడు 2017లో చోడవరం కోర్టును ఆశ్రయించగా కోర్టు కొట్టేసిందన్నారు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించగా, అప్పట్లో ఫలసాయం తీసుకునేందుకు తాత్కాలికంగా ఇంటెర్మ్ ఆర్డర్ జారీ చేసిందన్నారు. ప్రస్తుతం భూముల్లో గెస్ట్ హౌస్ నిర్మించి, ఫల సహాయం అనుభవించేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై కలెక్టర్కు, తహసీల్దార్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వ భూముల్లో పంటలకు రక్షణ కల్పించి, గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై సర్వ సభ్య సమావేశంలో ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. -
మూలకొత్తూరు చెరువు హక్కులపై నిరసన
పంచాయతీల విభజనలో భాగంగా రాంబిల్లి మండలం గోకివాడ పంచాయతీలో ఉన్న మూలకొత్తూరు గ్రామానికి చెందిన సర్వే నంబరు 320లో చెరువును కూడా కేటాయించి న్యాయం చేయాలంటూ సంబంధిత గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. మూలకొత్తూరులో చెరువును గోకివాడ గ్రామానికి కేటాయించేలా చేపడుతున్న విభజనపై ఆందోళన వ్యక్తం చేశారు. పశువులకు నీటితోపాటు సాగుకు ఏకై క ఆధారంగా ఉన్న చెరువు కోసం కోర్టు కేసులు వేసి మరీ సాధించుకున్నామన్నారు. ఇప్పటికే గోకివాడ పెద్దలు చేపల పెంపకం ద్వారా చెరువును ఆధీనంలో ఉంచుకున్నారని, వాటి ఆదాయం పొందడమే కాకుండా పంటలకు సాగునీరవ్వలేదన్నారు. చివర్లో చేపల వేట తర్వాత మిగిలిన కలుషిత నీటిని మాత్రం మా గ్రామానికి వదిలి పంటలను నాశనం చేస్తున్నారని, పశువుల మృతి చెందుతున్నాయని, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి గ్రామసభ ద్వారా తుది నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని కోరారు. -
హోం మంత్రి ఇలాకాలో.. బరితెగింపు !
నక్కపల్లి: హైకోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాదికూడా బహిరంగంగానే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జూద క్రీడలు, కోడిపందాలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయం స్థానం ఆదేశించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం ఉండగా మా కెందుకు బెంగ అంటూ కొంత మంది కూటమి నాయకుల ఆధ్వర్యంలో పందేల కోసం ప్రత్యేక బరులు సిద్ధం చేశారు. హోంమంత్రి ఇలాకా అయిన పాయకరావుపేట నియోజకవర్గంలో కూటమిపెద్దల అండదండలతో గత ఏడాది నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల్లోని పలు ప్రాంతాల్లో భారీగా కోడిపందేలు జరిగాయి. సుమారు రూ.నాలుగు కోట్ల నుంచి రూ.ఐదు కోట్ల వరకూ చేతులు మారాయని సమాచారం. కోడిపందాలను నిర్వహించరాదని అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అధికార పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు సైతం ఈ పందేల్లో పాల్గొనడం గమనార్హం. గత ఏడాది నక్కపల్లి మండలంలో నెల్లిపూడి తదితర ప్రాంతాల్లో జరిగిన కోడిపందేల్లో అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్ కుటుంబంతో సహాపాల్గొన్నారు. ఇదంతా పోలీసులకు తెలిసే జరిగినప్పటికీ తమశాఖకు చెందిన మంత్రి నియోజకవర్గం కావడంతో పందేల వైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కోడిపందేల నిర్వహణకు మూడు రోజుల ముందే ఏర్పాట్లు చేశారు. తిమ్మాపురం, గుడివాడ, గుర్రాజుపేట, నెల్లిపూడి పరిసరప్రాంతాలు, పాయకరావుపేట, శ్రీరాంపురం తదితర ప్రాంతాల్లో మామిడి తోటల్లో పందేలు నిర్వహిస్తారు. అడ్డురోడ్డు తదితర ప్రాంతాల్లో షామియానాలు వేసి, ప్రత్యేకంగా పందేల కోసం బరులు, గుళ్లాట, ఇతర జూద క్రీడల నిర్వహణ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి రూ.5 కోట్లపైనే పందాలు కాస్తారని అంచనా. భోగి నుంచి ముక్కనుమ వరకు నాలుగు రోజుల పాటు కోట్లాది రూపాయల బెట్టింగ్లతో ఈ కోడిపందేలను నిర్వహిస్తారు. రాజకీయనాయకులు, పోలీసు అధికారులు, పాత్రికేయుల నుంచి ఇబ్బంది లేకుండా వారికి ఇవ్వాలని లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి నాయకులే ఈ పందేల ఏర్పాటులో కీలక పాత్రపోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడిపందేలను పూర్తిస్థాయిలో అరికట్టాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.ఈ ఉత్తర్వులను చంద్రబాబు ప్రభుత్వం,పోలీసు శాఖ ఏమేరకు అమలు చేస్తుందో వేచి చూడాలి.తన నియోజకవర్గంలో కోడిపందేల నిర్వహణకు కూటమి నాయకులు చేస్తున్న ఏర్పాట్లను హోంమంత్రి ఏ మేరకు నిలువరిస్తారో నని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పందేల విషయమై నక్కపల్లి సీఐ జె.మురళీ వద్ద ప్రసావించగా కోళ్ల పందేలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. పందేల నిర్వహణ చట్టవిరుద్ధమని, ఎక్కడైనా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ మేరకు హెచ్చరికలు జారీచేసినట్టు చెప్పారు. -
ఎస్పీ కార్యాలయానికి 31 అర్జీలు
ఎస్పీ కార్యాలయంలో అర్జీదారుల సమస్యలను వింటున్న అదనపు ఎస్పీ దేవప్రసాద్ అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 31 అర్జీలు వచ్చాయి. ఇక్కడ అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగాదాలు–16, కుటుంబ కలహాలు–2, మోసపూరిత వ్యవహారాలు–2, ఇతర విభాగాలకు చెందినవి–11 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఏడు రోజుల్లో అర్జీలు పరిష్కరించాలని కింద స్థాయి పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సింహాచలంలో ముగిసిన నృసింహ దీక్షలు
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దీక్షల విరమణ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. మండల దీక్ష, 32 రోజులు దీక్షలు చేపట్టిన భక్తులు, తమ శిరస్సులపై తిరుముడులను ధరించి మెట్ల మార్గం, ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. దీక్షాదారులందరికీ దేవస్థానం వారు ఉచిత అంతరాలయ దర్శనం కల్పించగా, భక్తులు స్వామివారికి మొక్కు లు చెల్లించుకుని, దీక్షలను విరమించారు. శ్రీగో కులం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద అర్చకులు శాస్త్రోక్తంగా ఈ విరమణ ప్రక్రియను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు, ఒడిశా రాష్ట్రం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సింహాద్రి మఠం గురుస్వామి కశిరెడ్డి సురేంద్ర, చందన పెరుమాళ్ పీఠం గురుస్వామి సానబోయి న రాజుల నేతృత్వంలో భక్తులు హరినామ స్మరణ చేస్తూ కొండపైకి చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు కొండ పైకి, కిందకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా, భోజన వసతి ఏర్పాటు చేశారు. స్వాతి నక్షత్రం సందర్భంగా ఆల య కల్యాణమండపంలో నిర్వహించిన శ్రీనృసింహ హోమాన్ని భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. -
అనకాపల్లి జేసీగా సూర్యతేజ
మహారాణిపేట(విశాఖ): ఐఏఎస్ అధికారుల బదిలీలు, నూతన పోస్టింగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎల క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న సూర్యతేజను అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించారు. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్.. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ అయ్యారు. 2024 జూన్ 30న జేసీగా బాధ్యతలు చేపట్టిన ఆయన, సుమారు 23 నెలల 10 రోజుల పాటు ఈ పదవిలో కొనసాగారు. 2021 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన విద్యాధరిని విశాఖ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టరు కల్పనా కుమారి.. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఆమె 2024 జూలై 24న జీసీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె స్థానంలో ప్రస్తుతం ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శోభికను జీసీసీ కొత్త ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాధరి సూర్యతేజ శోభిక -
నిర్లక్ష్యం వద్దు
అర్జీదారుల సమస్యలపై తుమ్మపాల: రెవెన్యూ క్లినిక్ ద్వారా భూ సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించనున్నట్టు, పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించి వారు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం– 1, 2లో వేర్వేరుగా నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆయనతోపాటు జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్ రాజా, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్ సుబ్బలక్ష్మి, రమామణి, మనోరమ, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారమయ్యే సమస్యలను దరఖాస్తుదారునికి తెలియజేయాలని, పరిష్కారం కాని వాటికి కారణాలు వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని తెలిపారు. ఈ వారం పీజీఆర్ఎస్లో 97, రెవెన్యూ క్లినిక్కు 220 అర్జీలు మొత్తం 317 అర్జీలు స్వీకరించామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పూర్ణిమ దేవి, కె. సరోజినీ, శచీదేవి, మనోహర్, సుధీర్ పాల్గొన్నారు. వెబ్ల్యాండ్లో తప్పుగా భూముల నమోదు బీహెచ్పీవీ సొసైటీ పేరుతో రెవెన్యూ వెబ్ల్యాండ్లో తప్పుగా నమోదైన సాగు భూములను సరిదిద్ది రైతుల పేరున చేర్చాలని అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం సర్పంచ్ సాలాపు శాంతి, గ్రామస్తులు రెవెన్యూ క్లినిక్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. మారేడుపూడి రెవెన్యూ అక్కిరెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో తప్పుగా నమోదైన రైతుల జిరాయితీ భూముల వివరాలను సవరించాలి. ప్రస్తుతం మారేడుపూడి రెవెన్యూలో చేపట్టిన రీసర్వే ప్రకారం విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. -
ఉత్సాహంగా సంప్రదాయ ఆటల పోటీలు
అనకాపల్లి: స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడల పోటీలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అంతకుముందు తాడాట, తొక్కుడుబిళ్ల, కర్రసాము, ఏడు పెంకులాట, తాడు లాగుడు, గాలిపటాలు పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారి పూజారి శైలజ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
20 నుంచి ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ ఛార్జీల అంశానికి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న టారిఫ్లపై ఈనెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండి ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. ఏపీఈఆర్సీ చైర్మన్ పీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని తిరుపతి, విజయవాడ, కర్నూలులో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఎఆర్ఆర్)పై జనవరి 20న తిరుపతిలో, 22, 23వ తేదీల్లో విజయవాడలో, 27వ తేదీన కర్నూలులో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ, ఏపీట్రాన్స్కో, ఏపీజెన్కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ ప్రతి రోజు మూడు విద్యుత్ పంపిణీ సంస్థల టారిఫ్ ఫైలింగ్కు సంబంధించిన అభిప్రాయాలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అభిప్రాయాలు చెప్పదలుచుకున్నవారు సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం(ఎస్ఈ ఆఫీస్) లేదా డివిజన్ కార్యాలయం(ఈఈ ఆఫీస్) నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. -
ఏఎంఆర్ సంస్థ అనధికార వసూళ్లు
అధికారుల అండతో సీనరేజ్ పేరుతో మైనింగ్ వాహనాలపై ఏఎంఆర్ సంస్థ చేస్తున్న అక్రమ వసూళ్లపై దాడులు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం బవులువాడకు చెందిన కె.సత్తిబాబు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. క్వారీలు, క్రషర్ల నిర్వహణతో మైనింగ్ శాఖ ద్వారా వచ్చే ప్రభుత్వాదాయానికి గండి కొట్టి సదరు సంస్థ ప్రతి మైనింగ్ వాహనాన్ని అడ్డుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది. వాహనాలకు బోగస్ బిల్లులు ఇచ్చి భారీ మోసం చేస్తున్నా మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రధాన రహదారుల కూడళ్ల వద్ద అనధికార చెక్పోస్టుల్లో ప్రైవేటు వ్యక్తులను పెట్టి వాహనాలను వెంబడించి మరీ వసూళ్లు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రైతుల కళ్లాల్లో కప్పుకునే మట్టి తరలింపులపైనా దాడులు చేస్తూ అశాంతి వాతావరణం సృష్టిస్తున్నారు. మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా అక్రమ వసూళ్లపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
200 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
బెల్లం ఊట ధ్వంసం చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్, ఎకై ్సజ్ శాఖ అధికారులు దేవరాపల్లి: మండలంలోని శంభువానిపాలెంలో సారా బట్టీలపై ఎకై ్సజ్ సీఐ కె.వి. పాపునాయుడు ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సోమవారం మెరుపు దాడులు నిర్వహించింది. ఇక్కడ గ్రామ సరిహద్దులో భారీ మొత్తంలో సారా తయారీ చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అక్కడికి చేరుకుంది. ఈ సందర్భంగా సారా బట్టీతోపాటు సారా తయారీకి సిద్ధం చేసిన 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు వారు తెలిపారు. సారా తయారుదారులపైన బెల్లం సరఫరా చేసిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో అనకాపల్లి ఎన్ఫోర్స్మెంట్ సీఐ జె. శ్రీనివాస్, చోడవరం ఎకై ్స జ్ ఎస్ఐ శేఖరం తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
సరుగుడు దుంగలు స్వాధీనం
యలమంచిలి రూరల్: యలమంచిలి అటవీశాఖ పరిధి సీతపాలెం షెల్టర్బెల్ట్ ప్రాంతం నుంచి అటవీ సంపద భారీగా తరలిపోతోంది. తుపాన్లు, వాయుగుండాల సమయంలో తీరప్రాంత రక్షణ కోసం అట వీ శాఖ ఇక్కడ పెద్ద ఎత్తున సరుగుడు చెట్లు పెంచుతోంది.కలప స్మగ్లర్లు కన్ను వీటిపై పడింది. పెద్ద ఎత్తున సరుగుడు చెట్లు అక్రమంగా నరికివేసి, రాత్రి సమయాల్లో భారీ వాహనాలతో తరలించుకుపోతున్నారు. 592 సరుగుడు దుంగలను ఒక వ్యాన్లో తరలిస్తుండగా యలమంచిలి అటవీ అధికారులు మాటువేసి ఆదివారం రాత్రి పట్టుకున్నారు.వ్యాన్తో పాటు దుంగలను యలమంచిలి తరలించి, విచారణ జరుపుతున్నారు.గతంలో కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున సరుగుడు దుంగలను తరలించుకుపోయినట్టు తెలుస్తోంది.కొద్ది నెలల క్రితం అటవీశాఖ అధికారులు స్వాధీనపరుచుకున్నప్పుడు స్వల్పజరిమానాతో సరిపెట్టడంతో కలప స్మగ్లర్లు మరింతగా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి.ఈసారైనా ఉదాసీనంగా వ్యవహరించకుండా కలప అక్రమ రవాణా చేస్తున్న నిందితులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అటవీ సంపద నరికివేత,అక్రమ రవాణాకు అడ్డుకట్టపడే అవకాశం ఉండదన్న వాదన వినిపిస్తోంది.దీనిపై యలమంచిలి సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సునీల్కుమార్ వద్ద ప్రస్తావించగా వాహనంతో కలప స్వాధీనపర్చుకున్న సంగతి వాస్తవమేనన్నారు.కింది స్థాయి అధికారుల నుంచి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని,నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని,భారీ జరిమానా విధిస్తామని యలమంచిలి ఫారెస్ట్ సెక్షన్ అధికారి రమణ తెలిపారు. -
వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వ్యవస్థాపకుడు ఈర్లె శ్రీరామూర్తి డిమాండ్ చేశారు. స్థానిక గాంధీనగరం వద్ద శంకరన్ హాల్లో ఆదివారం నిర్వహించిన జిల్లా వీఆర్వోల కార్యవర్గ సమావేశంలో క్యాలెండర్ను ఆవిష్కరించి, మాట్లాడారు. వీఆర్వోలను సింగల్ అడ్మిషన్ పద్ధతిలోకి తీసుకొచ్చే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పాలనలో వీఆర్వో వ్యవస్థను కాపాడారని ఆయన తెలిపారు. మన రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో రీ సర్వే చేస్తున్న సమయంలో వీఆర్వోకు ఒక్క రూపాయి కూడా అందజేయలేదని, వీఆర్వోలు సొంత సొమ్ముతో గ్రామాల్లో రీసర్వేల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రీ సర్వేల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తోందని, గత ప్రభుత్వంలో ఇచ్చిన పాసుపుస్తకాలకు రాజముద్ర వేసి ఇస్తోందన్నారు. వీఆర్వో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 5న విజయవాడలో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాజన సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉద్యోగులకు ప్రభుత్వం రూ.40వేల కోట్లు బకాయిపడిందని, దశల వారీగా ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని ఆయన కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చడంతో ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిపడిన నాలుగు డీఏలను సంక్రాంతిలోగా ఇవ్వాలని, కొత్త పీఆర్సీని అమలు చేసే వరకూ ఐఆర్ను ప్రకటించాలని ఆయన కోరారు. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అనుపమ, జిల్లా అధ్యక్షుడు ఎ.శశిధర్, అసోసియేట్ అధ్యక్షుడు చిన్నంనాయుడు, ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకరరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కిరాణా షాపు దగ్ధం
దగ్ధమైన కిరాణా షాపులో సామగ్రి అచ్యుతాపురం రూరల్: మండల కేంద్రం అచ్యుతాపురంలో విద్యుత్ సబ్స్టేషన్కు సమీపంలో గల ఓ కిరాణాషాప్ ఆదివారం వేకువజామున దగ్ధమైంది. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా భోగాపురం గ్రామానికి చెందిన బొడ్డు కుమారికి చెందిన షాపు కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంపై కుమారి అనుమానం వ్యక్తం చేసింది. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తి తన షాపు ఎదుట సంచరించాడని, సీపీ ఫుటేజీ లో గుర్తించామని తెలిపింది. కౌంటర్ సొరుగు లో రూ.5వేల నగదు ఉంచానని, సొరుగుతో సహా నగదు కనిపించలేదని చెప్పింది. ఈ ప్ర మాదంలో షాపులో ఉన్న రూ.2.50లక్షల విలు వైనసామగ్రి దగ్ధమైనట్టు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె తెలిపింది. -
30శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలి
అనకాపల్లి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించి, అమలు చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంపాల వెంకటరమణ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే రెండు సంవత్సరాల ఆరు నెలల కాలం పూర్తి అయ్యినందున, జూలై 2023 నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీ అమలు చేయవలసి ఉన్నందున, ఉద్యోగులు ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా, సంక్రాంతి కానుకగా తక్షణమే పీఆర్సీ కమిషన్ నియమించి మద్యంతర భృతిని ప్రకటించాలని ఆయన కోరారు. ఎన్నికల హామీతో పాటు ఇటీవల ఉద్యోగ సంఘాలకు సీఎం చంద్రబాబు మద్యంతర భృతిపై స్పష్టమైన హామీ ఇచ్చినందున, హామీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మిగిలిన నాలుగు ఐచ్చిక సెలవులు వ్యక్తిగతంగా కాకుండా గతంలో లాగా పాఠశాల మొత్తానికి ఇచ్చే విధంగా అధికారులు పునరాలోచించాలని, సీఆర్ఎంటీలు వారి సమస్యలపై ఉద్యమ కార్యాచరణ దిశగా వెళుతున్నందున ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన కోరారు. 98 ఎంటీఎస్ టీచర్లకు ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 పెంచాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎన్టీఎస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సింగంపల్లి అప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శులు పెనుమత్స కృష్ణ్ణంరాజు, వరప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షులు రాజేంద్ర కుమార్, మహిళా అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, ఆర్థిక కార్యదర్శి నూకేష్ పాల్గొన్నారు. -
మళ్లీ ఎటో..
వైజాగ్ మెట్రో..వైజాగ్ మెట్రో రైలు ప్రాజెక్టు నమూనాసాక్షి, విశాఖపట్నం : ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడమెలాగో చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఇదిగో పులి అంటూ చంద్రబాబు అంటే.. అదిగో తోక అంటూ టీడీపీ భజన బృందం హడావుడి చేయడం షరామాములుగా మారిపోయింది. డీపీఆర్కు కేంద్రం ఆమోదముద్ర వెయ్యకుండానే టెండర్లు పిలిచి.. అభాసుపాలైన ప్రభుత్వం.. చివరికి వైజాగ్ మెట్రో ప్రాజెక్టును గాల్లో దీపంలా మార్చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఫీజిబిలిటీ రిపోర్టు పూర్తై డీపీఆర్ ఆమోదం చివరి దశకు చేరుకున్న తరుణంలో.. డీపీఆర్లో మార్పులు చేస్తామంటూ చంద్రబాబు సర్కారు మోకాలడ్డింది. ఇప్పుడు గతంలో ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్టు సరిపోదని..మళ్లీ కొత్తది ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించడంతో ప్రాజెక్టు అటా.. ఇటా.. అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. మహా విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తూ.. లైట్మెట్రో ప్రాజెక్టు పట్టాలక్కెంచేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. 76 కిలోమీటర్ల మేర 4 కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయం అవుతుందని స్పష్టం చేస్తూ 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పీపీపీ విధానంలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో ప్రభుత్వాల వాటా 40 శాతం కాగా, టెండరు దక్కించుకున్న సంస్థ 60 శాతం భరించనున్నట్లు ఉత్తర్వుల్లో పొందుపరిచారు. 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ని కూడా పంపించారు. అయితే.. ప్రభుత్వం మారిపోవడం.. విశాఖను అభివృద్ధి చెయ్యడం అంతగా ఇష్టం లేనట్లు వ్యవహరిస్తున్న చంద్రబాబు.. మెట్రో ప్రాజెక్టుకి మోకాలడ్డే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మరోసారి డీపీఆర్ తయారు చేస్తామంటూ పాత డీపీఆర్ని పక్కన పడేశారు. దీంతో.. కథ మళ్లీ మొదటికొచ్చింది. అయితే పాత డీపీఆర్కే స్వల్ప మార్పులు చేసి హడావుడి చేసింది. మెట్రోని మరింత జాప్యం చేసేందుకు భూ సర్వే చెయ్యాలంటూ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. మరోసారి ఫీజిబిలిటీ పేరుతో కొర్రీ పాత డీపీఆర్నే అటు ఇటుగా మార్చేసి.. ఆలస్యంగా రాష్ట్రప్రభుత్వం సమర్పించిన డీపీఆర్ మీద కేంద్రం కొత్త కొర్రీ వేసినట్లు తెలుస్తోంది. రూ.14,309 కోట్లుతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్కు ఫీజిబిలిటీరిపోర్టు మళ్లీ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకసారి రూపొందించిన ఫీజిబిలిటీ రిపోర్టు పదేళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. విభజన హామీలో మెట్రో ప్రాజెక్టు ఉండటంతో 2014–15లో రూపొందించిన ఫీజిబిలిటీ రిపోర్టు వ్యాలిడిటీ 2025కి పూర్తయింది. దీంతో.. కొత్తగా సాధ్యాసాధ్యాల నివేదిక కచ్చితంగా ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం మరోసారి సర్వే చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. అదే.. 2024 జనవరిలో ఇచ్చిన డీపీఆర్ ఆమోదించి ఉంటే.. ఫీజిబిలిటీ రిపోర్టు మరోసారి చెయ్యాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం.. జాప్యం చెయ్యడం వల్ల.. ప్రాజెక్టు మళ్లీ మొదటికొచ్చింది. ఫ్లైఓవర్లతో సరిపెట్టేద్దామా.? మరోవైపు విశాఖలోని రద్దీ జంక్షన్లలో ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలు పెరుగుతున్నాయి. కీలకమైన కూడళ్ల వద్ద.. ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తే.. ట్రాఫిక్ ఇబ్బందులు దాదాపుగా తగ్గుతాయనే అభిప్రాయం అటు అధికారుల్లోనూ ఇటు ప్రజాప్రతినిధుల్లోనూ ఉంది. అయితే.. మెట్రో రైలుకు.. ఫ్లై ఓవర్లకు వేరువేరుగా నిర్మాణం చేయడం వల్ల ఆర్ధిక భారం పెరగడంతో పాటు రహదారుల విస్తరణ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వ పునరాలోచనలో పడింది. ఇప్పుడు దీనిపైనా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలు ప్రధాన నగరాల్లో మెట్రో నష్టాలతో నడుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం.. దాన్నే బూచిగా చూపించి.. వైజాగ్కు మెట్రో ప్రాజెక్టు లేకుండా చెయ్యాలనే కుట్రలు పన్నుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్లకు అతీగతీ లేదు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం గతేడాది జూలై 25న టెండర్లు పిలిచింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.6250 కోట్లు(జీఎస్టీ అదనం)తో టెండర్లుకు ఆహ్వానించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.11,498 కోట్లు కాగా.. మూడు కారిడార్లలో ఫేజ్ –1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్సీ టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. కాగితాలపై ఉన్న ప్రాజెక్టు నిర్మించేందుకు ఏ సంస్థా అడుగు ముందుకేసి టెండర్లలో పాల్గొనేందుకు సాహసించలేదు. దీంతో.. పనుల్ని సింగిల్ ప్యాకేజీలా కాకుండా.. ప్యాకేజీలుగా విభజించినా ఎవరు రాకపోవడంతో.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారింది. మొత్తంగా.. ఏమీ లేకుండానే.. ఏదో చేసేస్తున్నామని డప్పులు కొట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి మెట్రో షాక్ తగిలింది. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోయినా.. టెండర్ల పేరుతో అరచేతిలో మెట్రో చూపించి.. అభాసుపాలైన ప్రభుత్వం.. ఇప్పుడు ఫీజిబిలిటీ షాక్తో ఏం చెయ్యాలో పాలుపోక ఆపసోపాలు పడుతోంది. -
చెరకు బకాయిలు చెల్లించాలి
చోడవరం: ప్రభుత్వ రైతుల సమస్యలు పట్టించుకోకుండా కళ్లు మూసుకొని ఉందని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ వెంటనే ప్రారంభించాలని, చెరకు రైతులకు వెంటనే చెరకు బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతు సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమ నోటికి గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ మెయిన్గేటు వద్ద ఏర్పాటుచే సిన నిరసన రిలేదీక్ష శిభిరం ఆదివారంకు 10వరోజుకి చేరింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం, సీపీఐ, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు, వ్యవసాయ కూలీసంఘం, ఏపీ రైతు సంఘం ఈ శిబిరంలో పాల్గొని నిరసన తెలిపారు. రైతులు, రైతు కూలీలు, కార్మికులను కూటమి ప్రజాప్రతినిధులు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా ఆందోళనలు, పది రోజులుగా రిలే నిరసన దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరకు బకాయిలు రైతులకు వెంటనే చెల్లించాలని, ఈ ఏడాది ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ శానాపతి సత్యారావు, ఏడువాక శ్రీను,పీలా మహేష్, పొట్నూరు అప్పలరాజు, బీవీ నూకరాజు, శరకాన అప్పలనాయుడు, మురళికృష్ణరాజు, పాచిలి రాంబాబు, సుగర్ ప్యాక్టరీ కార్మిక సంఘ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రాయి సూరిబాబు, రామునాయుడు, జిల్లా రైతుకూలీ సంఘం అధ్యక్షుడు మోహనరావు, సీఐటీయూ నాయకుడు ఎస్వీనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, నాగిరెడ్డి సత్యనారాయణ, ఆర్.దేముడునాయుడు, వనం సూర్యనారాయణ, పోతల శ్రీరాముల పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
అనకాపల్లి: స్థానిక శారదానది ఒడ్డున శివాలయం వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్టు పట్టణ సీఐ ప్రేమ్కుమార్ ఆదివారం చెప్పారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు ఆయన చెప్పారు. స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. మృతురాలి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉందని, ఆమె వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లేవన్నారు. వివరాలు తెలిసిన వారు 91548 74714, 94907 37758 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
రోడ్డు నిర్మించాలని పొర్లుదండాలతో నిరసన
రోలుగుంట: బీఎన్ రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా జిల్లా కార్యవర్గం సభ్యుడు కె.గోవింద, నాయకులు ఆదివారం భోగాపురం కూడలి వద్ద పొర్లు దండాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గోవింద మాట్లాడుతూ బీఎన్ రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. అడుగుకో గొయ్యి ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. రోడ్డు నిర్మిస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చి, ఇప్పుడు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు పాంగి చంద్రయ్య, పాడి బన్నియ్య, పాంగి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
స్తంభాన్ని ఢీకొట్టిన కారు
ప్రమాదానికి గురైన కారు గొలుగొండ: గొలుగొండ రైస్ మిల్ సమీపంలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. దీంతో స్తంభం ధ్వంసం కావడంతో పాటు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. చిన్నయ్యపాలెంకు చెందిన వరహాలు అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం నర్సీపట్నం నుంచి చిన్నయ్యపాలెం వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు పొలం, స్తంభం ఆనుకుని ఉండడంతో స్తంభాన్ని కారు బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో వరహాలబాబుకు నిద్ర రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలుపుతున్నారు. కారు ఎయిర్బ్యాగ్లు ఓపెన్ కావడం వల్ల వరహాలబాబుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. విద్యుత్ సమస్య లేకుండా విద్యుత్శాఖ సిబ్బంది చర్యలు చేపట్టారు. -
ట్యూనా టైమ్.. సముద్రం ఇచ్చిన బహుమతి
మహారాణిపేట(విశాఖ): కూటి కోసం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. ఆదివారం భారీ సంఖ్యలో ట్యూనా చేపలు చిక్కాయి. సముద్రంలో లభించిన ఈ చేపలను మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్కు తరలించారు. వలలకు చిక్కిన ట్యూనా చేపలు ఒక్కోటి దాదాపు 10 నుంచి 20 కిలోల బరువు ఉండటంతో వారిలో ఆశలు చిగురించాయి. పెద్ద పరిమాణంలో ఉన్న ఆ చేపలను ముక్కలుగా కోసి ఎగుమతులకు అనువుగా సిద్ధం చేశారు. ట్యూనా చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ట్యూనా చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా కేరళ, చైన్నె ప్రాంతాల ప్రజలు వీటిని ఎంతో ఇష్టంగా భుజిస్తారు. 6 అడుగుల నుంచి 15 అడుగుల వరకు పెరిగే ఈ చేపలకు మంచి ధర పలుకుతుండటంతో ఫిషింగ్ హార్బర్లో సందడి నెలకొంది. చేపలను ఐస్తో నింపిన వ్యాన్లు, కంటైనర్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారు. -
7 బస్సులపై కేసుల నమోదు
గోపాలపట్నం(విశాఖ): పండగ సీజన్ను పురస్కరించుకుని రవాణా శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఏడు ప్రైవేటు బస్సులపై కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్. శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఎన్ఏడీ జంక్షన్ సమీపంలోని ఎన్ఎస్టీఎల్ వద్ద నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుల ద్వారా మొత్తం రూ.33,600 జరిమానా విధించినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ బుచ్చిరాజు, ఏఎంవీఐ పార్వతి, ఇతర రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
నాగజ్యోతికి ఉపాధ్యాయ రత్న అవార్డు
అవార్డు అందుకుంటున్న రోలుగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల టీచర్ నాగజ్యోతి రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల అంగ్ల ఉపాధ్యాయిని పి.వి.ఎన్. నాగజ్యోతి విశాఖపట్నంలో సావిత్రిబాయి పూలే ఆర్గనైజేషన్ వారి చేతుల మీదుగా ఉపాధ్యాయరత్న అవార్డు ఆదివారం అందుకున్నారు. ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యారంగంలో 27 సంవత్సరాల పాటు అంకితభావంతో పని చేస్తూ, అంతర్జాతీయ పవర్ లిఫ్టర్గా దేశానికి పలు పలు అంతర్జాతీయ పతకాలు సాధించిన వనిత అని నాగజ్యోతి అభినందించారు. అవార్డు గ్రహీత మాట్లాడుతూ ఈ అవార్డు తనకు మరింత భాధ్యత పెంచిందని. భవిష్యత్లో కూడా తన సేవలు అన్ని రంగాల్లోను విస్తరింపజేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి చెస్ టోర్నమెంట్
మాకవరపాలెం: జిల్లాస్థాయి చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. స్థానిక గ్రంథాలయంలో ఆదివారం ప్రగతి చెస్ వెల్ఫేర్ అసోసియేషన్, గౌతమి లలితకళా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కశింకోట మండలానికి చెందిన ప్రసాద్ ప్రథమ, మాకవరపాలెం గ్రామానికి చెందిన గౌరీశంకర్ ద్వితీయ, తామరం గ్రామానికి చెందిన ప్రభవ్ తృతీయ స్థానాలు సాధించారు. వీరికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లలితకళా శిక్షణ కేంద్రం కార్యదర్శి శేషగిరిరావు, సుధీర్, ఆదినారాయణ, సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పుణ్యకోటి వాహనంపై తిరువీధి
పుష్పతోటలో గోదాదేవి అమ్మవారికి పూజలుపుణ్యకోటి వాహనంలో స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తున్న అర్చకులునక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం స్వామివారి మూలవిరాట్కు నిత్యార్చనలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం కొండదిగువన ఉత్సవ మూర్తులకు నిత్యపూజలు, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, పుష్పతోటలో గోదాదేవి అమ్మవారికి విశేషపూజలు, విష్వక్సేనపూజ, పుణ్యా హవచనం సాత్మురై వంటి కార్యక్రమాలు జరి గాయి. అనంతరం శ్రీదేవీ,భూదేవీసమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారిని పుణ్యకోటివాహనంలోను, గో దాదేవిఅమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలు వైభవంగా నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 27వ పాశురాన్ని విన్నపం చేశారు. అనంతరం ప్రసాదనివేదన, తీర్థ్దగోష్టి, ప్రసాద వినియోగం నిర్వహించారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి రాత్రిపూట తిరువీధి సేవలు నిర్వహించారు. అధ్యాపక స్వామి ద్రవిడ వేద ప్రబంధం పారాయణం చేశారు. -
అప్పనంగా భూములు కట్టబెడితే చూస్తూ ఊరుకోవాలా?
నక్కపల్లి/ఎస్రాయవరం: బలవవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.వి. శ్రీనివాసరావు ఆరోపించారు. నక్కపల్లి మండలంలో బలవంతపు భూసేకరణ, బల్క్డ్రగ్పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారుల తరపున ఉద్యమం చేస్తున్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజుపై పీడియాక్ట్ పెట్టి అరెస్టు చేసి జైలులో పెట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం అడ్డురోడ్డు జంక్షన్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూదందాలు, బలవంతపు భూసేకరణలు పెరిగిపోయాయన్నారు. పేద రైతుల నుంచి సేకరించిన భూములను ఎకరా 99 పైసలకే కారొరేట్లకు కట్టబెడతామని విద్యాశాఖా మంత్రి నారాలోకేష్ చెబుతున్నారని ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే...మా ప్రభుత్వం మా ఇష్టం అంటూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆందోళన చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో జరిగిన ఇండస్ట్రియల్ సమ్మిట్లో ఒక్కపైసా కూడా పెట్టుబడులు రాలేదన్నారు. అక్కడ కుదుర్చుకున్న ఎంవోయులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావన్నారు. ఆదానీ, అంబానీ తదితర పారిశ్రామిక వేత్తలకోసమే వేలాది ఎకరాలు భూములు సేకరిస్తున్నారని ఆరోపించారు. కంపెనీలు పెట్టకుండా, ఏ కంపెనీలు వస్తాయో చెప్పకుండా వేలాది ఎకరాలు బలవంతంగా సేకరిస్తున్నారన్నారు. నక్కపల్లి మండలంలో బలవంతపు భూసేకరణను వ్యతిరేకించడంతోపాటు, బల్క్ డ్రగ్పార్క్ను వ్యతిరేకిస్తున్న మత్స్యకారులకు అండగా నిలిచినందుకు అప్పలరాజును పీడీయాక్ట్ కింద జైలుకు పంపించారన్నారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనితల ప్రోద్బలంతోనే ఈ అరెస్టు జరిగిందన్నారు. అప్పలరాజుపై కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వంపై న్యాయపోరాటం చేయడంతోపాటు, అప్పలరాజు అక్రమ అరెస్టును రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్తామన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం మాట్లాడుతూ నక్కపల్లి మండలంలో ఐదువేల ఎకరాలు సేకరించి, రైతులకు పూర్తి స్థాయిలో నష్ట పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎం రాజేష్, అప్పలరాజు కుటుంబ సబ్యులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సీపీఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బలవంతపు భూసేకరణ కోసమే అక్రమ కేసులు చంద్రబాబు, అనిత ప్రోద్బలంతోనే అప్పలరాజు అరెస్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ధ్వజం -
సంక్రాంతి రద్దీపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి
డాబాగార్డెన్స్ (విశాఖ): సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోందని, విశాఖ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి రోజుకు సుమారు 1.50 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి(డీపీటీవో) బి.అప్పలనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక బస్సులను ఆదివారం ఆయన ఇతర అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్వారకా బస్స్టేషన్లో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగిందన్నారు. వారాంతం, పండగ సెలవులు కావడంతో గతేడాది కంటే ఈ ఏడాది రద్దీ ఎక్కువగా ఉందన్నారు. గత ఏడాది సంక్రాంతికి 1,050 బస్సులు నడపగా, ఈ ఏడాది ఆ సంఖ్యను మరింత పెంచామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రద్దీని బట్టి ఎప్పటికప్పుడు అదనపు బస్సులు నడిపే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రధానంగా శ్రీకాకుళం, రాజాం, పార్వతీపురం, పలాస, ఇచ్ఛాపురం, బొబ్బిలి, సాలూరు, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్లకు అధిక సంఖ్యలో బస్సులు నడుపుతున్నామని తెలిపారు. రెగ్యులర్ సర్వీసుల కంటే అదనంగా మరిన్ని ట్రిప్పులు పెంచామన్నారు. పండగ రద్దీ పూర్తయ్యే వరకు 10 మంది అధికారులు, 20 మంది సూపర్వైజర్లు 24 గంటల పాటు విధుల్లో ఉంటూ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. రైళ్లు, విమానాల్లో ఇతర ప్రాంతాల నుంచి విశాఖ చేరుకున్న ప్రయాణికులు.. ఇక్కడి నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు బస్టాండ్కు వస్తుండటంతో ఆదివారం రద్దీ పెరిగిందన్నారు. ఆయన వెంట డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.పద్మావతి, వర్క్ మేనేజర్ అరుణ, కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ రాజశేఖర్, డిపో మేనేజర్లు సింహాచలం, శరత్, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. విశాఖ రీజియన్ నుంచి అదనపు బస్సులు -
సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు
● అలల ఉధృతికి ఫైబర్ బోటు బోల్తా ● క్షేమంగా బయటపడిన ఆరుగురు మత్స్యకారులు ● గల్లంతైన మత్స్యకారుడి కోసం గాలింపు అచ్యుతాపురం రూరల్: పూడిమడక వద్ద సముద్రంలో మత్స్యకారుడు గనగల్ల సత్తియ్య (45) గల్లంతయ్యాడు. మైరెన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పూడిమడక గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులతో కలిసి తెల్లవారు జామున నెంబరు ఐఎన్డీఏపీవీ3ఎమ్01252 గల బోట్పై చేపల వేటకు వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి ఒడ్డుకు చేరుకునే సమయంలో మధ్యాహ్నం సుమారు 1.45 గంటలకు సముద్రపు అలల ఉధృతికి ఒక్కసారిగా ఫైబర్ బోటు బోల్తా పడింది. దీంతో నెమ్మదిగా ఆరుగురు మత్స్యకారులు బోటును సరిచేసి బోటులోకి చేరుకున్నారు. సముద్రంలో పడి గల్లంతైన సత్తియ్య ఆచూకీ తెలియలేదని తోటి మత్స్యకారులు తెలిపారు. మైరెన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు ఇన్స్పెక్టర్ ఎస్.సింహాద్రి నాయుడు తెలిపారు. అచ్యుతాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పూడిమడక తీరంలో విషాద ఛాయలు గల్లంతైన గనగల్ల సత్తియ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు అతనిపైనే ఆధారపడి ఉండడంతో పూడిమడక గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. పిల్లలు చిన్నారులు కావడంతో కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. మైరెన్ సిబ్బందితో పాటు మత్స్యకారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి గల్లంతవడంతో పూడిమడక సముద్ర తీరం అంతా విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రాణాలతో సత్తియ్య బయట పడాలని మత్స్యకారులు ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. పూడిమడక మత్స్యకార సంఘాల నాయకులు కుటుంబానికి ధైర్యం చెప్పారు. -
కత్తెర
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026సచివాలయాలకుజీవీఎంసీ బడ్జెట్పై సమావేశం నేడుడాబాగార్డెన్స్ (విశాఖ): జీవీఎంసీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రీ–బడ్జెట్పై సోమవారం స్థాయీ సంఘ సమావేశం జరగనుంది. మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో సుమారు రూ.3,750 కోట్లతో రూపొందించిన వార్షిక బడ్జెట్పై సభ్యులు చర్చిస్తారు. అవసరమైన మార్పులు, చేర్పులు చేసిన అనంతరం కౌన్సిల్ ఆమోదానికి పంపిస్తారు. సమావేశంలో ప్రధానంగా ప్రారంభ నిల్వలు, వివిధ పద్దుల కింద వచ్చే ఆదాయం, చేయాల్సిన ఖర్చులు, ముగింపు నిల్వలు, అలాగే ఏయే విభాగానికి ఎంత కేటాయించారు అనే అంశాలపై చర్చించనున్నారు. అనకాపల్లి: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేలా వైఎస్సార్సీపీ పాలనలో ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి వద్దకే చేరవేయడానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రజలు పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా ప్రజల ముంగిటకే వివిధ రకాలైన సేవలను అందించేవారు. నేటి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో సచివాలయ వ్యవస్థను దశల వారిగా నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికలను చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామ/వార్డు సచివాలయాలను తగ్గిస్తూ సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సచివాలయ పేర్లను తొలగించారు. మరికొన్ని ప్రాంతాల్లో పాత పద్ధతిలోనే సచివాలయాల వ్యవస్థను బోర్డులు లేకుండా నిర్వహిస్తున్నారు. ● గత పాలనలో సచివాలయాల్లో 11 మంది ఉద్యోగులను నియమించి ప్రభుత్వ సేవలను గ్రామీణ స్థాయి నుంచి ప్రజలకు అందజేస్తే, నేటి పాలనలో ఒక్కో సచివాలయంలో ఆరుగురు సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ● సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కొంత మంది ఏఎన్ఎంలకు పదోన్నతి కలిపిస్తూ పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో విధులు నిర్వహిస్తున్నారు. ● సచివాలయంలో ఇమ్యూనేషన్ కార్యదర్శులు జీవీఎంసీలో, పంచాయతీ రాజ్ కార్యాలయాల్లో ఇన్చార్జ్ ఏఈలుగా వెళ్లిపోయారు. ● కొంతమంది వీఆర్వోలను కలెక్టర్ కార్యాలయానికి డిప్యూటేషన్పై పంపించారు.మరికొందరు, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లిపోయారు. ● జీవీఎంసీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు విజన్ –2047 ప్రాజెక్టుకు డిప్యూటేషన్పై ఏడాది నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ● విశాఖలో నిర్వహిస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు జిల్లాలో కొంతమంది సచివాలయ ఉద్యోగులను డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. ● సచివాలయాల అడ్మిన్లు(కార్యదర్శులు) కొంతమంది జీవీఎంసీలో ఆర్ఐలుగాను, మరి కొంతమంది వివిధ ప్రభుత్వశాఖల్లో డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు ● సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సంరక్ష కార్యదర్శులను త్రిటైర్ సిస్టమ్కు బదిలీ చేశారు. ● ప్రస్తుతం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తక్కువ మంది సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసి యూఎఫ్ఎస్(యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) సర్వే చేస్తున్నారు. ● ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో సామాజిక పింఛన్లు, ఇతర కార్యక్రమాలకు వాడుకోవడంతో చాలా సమయాల్లో సచివాలయాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ● 30 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం వాటిని భర్తీ చేయలేదు. వలంటీర్లను తొలగించి వారి పనులు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. అంతటితో ఆగకుండా 30కి పైగా సర్వేల బాధ్యతలను నెత్తిన పెట్టింది. దీంతో వారు కార్యాలయాల్లో ఉండకుండా నిత్యం ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు.సంక్రాంతి వేళ అప్పన్న దర్శన వేళల్లో మార్పులు అనకాపల్లి జిల్లాలో మొత్తం గ్రామ, వార్డు సచివాలయాలు– 522 అందులో పనిచేయడానికి కావాల్సిన సిబ్బంది – 5,363 కానీ ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు – 3,824 ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యూటేషన్పై బదిలీలు, పదోన్నతులు గ్రామ, వార్డు సచివాలయాలను దశల వారీగా తగ్గించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు కొన్ని సచివాలయాల బోర్డుల తొలగింపు ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న సచివాలయ వ్యవస్థ -
డిప్యూటేషన్పై బదిలీలు అన్యాయం
14 సంవత్సరాలు సీఎంగా పాలన చేస్తున్న చంద్రబాబు గ్రామాల్లో గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయలేకపోయారు. వైఎస్సార్సీపీ పాలనలో గ్రామాల్లో ప్రభుత్వ సేవలు అందించాలని సచివాలయాలను ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 25 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. గ్రామీణ స్థాయి నుంచి సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు అందుతుంటే, చంద్రబాబు ప్రభుత్వం ఓర్వలేక, గ్రామ/వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డుగా మార్పు చేయడం అన్యాయం. సచివాలయాలు పేర్లు మార్పుచేసి, ఉద్యోగులను తగ్గించడం అవివేకం. – పి.కన్నారావు, ఎంపీటీసీ, తుమ్మపాల గ్రామం, అనకాపల్లి మండలం -
అప్పన్నను దర్శించుకున్న దర్శకుడు హరీష్ శంకర్
కప్పస్తంభానికి మొక్కుకుంటున్న హరీష్శంకర్ సింహాచలం: సింహాచల క్షేత్రంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్ దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ సంప్రదాయం ప్రకారం ఏఈవో తిరుమలేశ్వరరావు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాన్ని బహూకరించారు. -
అశ్వవాహనంపై స్వామివారికి తిరువీధి సేవలు
అశ్వవాహనంపై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తున్న అర్చకులు నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వరస్వామివారికి శనివారం అశ్వవాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష పూజలు, నిత్యార్చనలు జరిపారు. అనంతరం కొండదిగువన ఉత్సవమూర్తులకు వేణుగోపాలస్వామివారికి, గోదాదేవి అమ్మవారికి నిత్యపూజలు చేశారు. అనంతరం అశ్వవాహనంపై శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని అశ్వవాహనంపైన, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 24వ పాశురాన్ని విన్నపం చేశారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా రాత్రిపల్లకిలో స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. అధ్యాపక స్వామి ద్రవిడ వేదప్రబంధం విన్నపం చేశారు. తదుపరి ప్రసాదవి నివేదన, తీర్థగోష్టి,ప్రసాద వినియోగం జరిగాయి.ఈ కార్యక్రమాల్లో అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, శేషాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్థానం అధికారులు కూర్మేశ్వరరావు పాల్గొన్నారు. -
విశాఖలో లైట్ హౌస్ మ్యూజియం
ఏయూక్యాంపస్: దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న క్రమంలో మన మూలాలను, చరిత్రను విస్మరించకూడదని ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఎంజీఎం పార్క్ వేదికగా 3వ ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సోనోవాల్ ప్రసంగిస్తూ... మారిటైం సంస్కృతి, చరిత్రలకు లైట్ హౌస్లు సాక్ష్యాలుగా నిలుస్తాయని అభివర్ణించారు. పర్యాటక రంగాన్ని మారిటైం మౌలిక వసతులతో, మన సంస్కృతితో అనుసంధానించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. 5 వేల సంవత్సరాల కిందటే భారత్ సముద్ర వాణిజ్యంలో అగ్రగామిగా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దేశంలోని అత్యుత్తమ 20 కంటైనర్ పోర్టుల్లో విశాఖ పోర్ట్ ఒకటిగా నిలిచిందన్నారు. విశాఖ నగరంలో లైట్ హౌస్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇక్కడి ఇండియన్ మారిటైం వర్సిటీలో ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 లైట్ హౌస్లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దామని, అదనంగా మరో 25 లైట్ హౌస్లను అభివృద్ధి చేస్తామని, ఇందులో ఏపీకి చెందినవి కూడా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సోనోవాల్ తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ‘తెలుగు చాలా తీయనైన, అందమైన భాష. ఇది వినడం నాకెంతో ఇష్టం’అంటూ.. మీరంతా బాగున్నారా? అని తెలుగులో పలకరించి సభికులను ఆకట్టుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి మాట్లాడుతూ.. లైట్ హౌస్లు కేవలం కట్టడాలు కావని, అవి ఒక నమ్మకానికి ప్రతిరూపాలని అన్నారు. ప్రాచీన వాణిజ్యం, తీరప్రాంత ప్రజల అనుబంధానికి, దేశ సార్వభౌమాధికారానికి ఇవి చిహ్నాలుగా నిలుస్తాయని చెప్పారు. హెరిటేజ్ టూరిజంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను మంత్రి సోనోవాల్ వర్చువల్గా ఆవిష్కరించారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌస్ అండ్ లైట్ షిప్స్ మధ్య ఒప్పంద పత్రాలను మంత్రుల సమక్షంలో మార్చుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర ఓడరేవుల శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, అదనపు కార్యదర్శి ముఖేష్ మంగల్, లైట్హౌస్ అండ్ లైట్ షిప్స్ డైరెక్టర్ జనరల్ మురుగానందం, విశాఖ పోర్ట్ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని కోరాటి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఎండీ కెప్టెన్ దివాకర్, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కేంద్రీయ సైనిక్ బోర్డ్లతో ఐఐఏఎం ఎంవోయూ
ఎంవోయూ పత్రాలు మార్చుకుంటున్న కమోడోర్ ముత్తురామన్, డాక్టర్ సుంకరి రవీంద్ర ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీలోని ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్(ఐఐఏఎం), న్యూఢిల్లీలోని కేంద్రీయ సైనిక్ బోర్డ్(కేఎస్బీ), పశ్చిమ బెంగాల్లోని రాజ్య సైనిక్ బోర్డ్(ఆర్ఎస్బీ)లతో విద్యా అవగాహన ఒప్పందం చేసుకుంది. మిలటరీ ఉద్యోగులకు మేనేజ్మెంట్ విద్య ద్వారా శక్తివంతం చేయడంలో భాగంగా ఈ ఎంవోయూ చేసుకున్నట్లు ఐఐఏఎం బీ స్కూల్ డైరెక్టర్ జనరల్ ఆచార్య కృష్ణమోహన్ తెలిపారు. ఈ ఎంవోయూ సైనికుల విద్యానైపుణ్యం, కార్పొరేట్ మేనేజ్మెంట్ మధ్య సహకారాన్ని అందిస్తుందన్నారు. వ్యాపార వాతావరణంలో వారు రాణించడానికి అవసరమైన నైపుణ్యం, విద్యార్హతలను అదించనున్నట్లు తెలిపారు. డిఫెన్స్ ప్రోగ్రామ్స్ అడ్వైజర్ డాక్టర్ ఉజ్వల్ కుమార్ ఘటక్ మిలటరీ సిబ్బంది కోసం ఐఐఏఎం రూపొందించిన మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, అర్హత ప్రమాణాలను వివరించారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కమోడోర్ ముత్తురామన్, ఐఐఏఎం డీన్ డాక్టర్ సుంకరి రవీంద్రలు ఎంవోయూలపై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. కార్యక్రమంలో ఏయూ మాజీ వీసీ ఆచార్య నాగేశ్వరరావు, లా యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య వై.సత్యానారాయణ, గ్రూప్ కెప్టెన్ అల్లం ప్రభాకర్, కల్నల్ పార్థ ప్రతిమ్ బారిక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిలో అకేషియా చెట్ల నరికివేత
బుచ్చెయ్యపేట: మండలంలోని పెదమదీనలో ప్రభుత్వ భూమిలో అకేషియా చెట్ల నరికివేతపై శనివారం కూటమికి చెందిన ఇరువర్గాల నేతలు వాగ్వాదానికి దిగారు. తొలుత సర్పంచ్ మంగ భర్త తన వర్గంతో కలిసి ఇక్కడ చెట్లను నరికివేస్తుండగా, మరో వర్గానికి చెందిన కూటమి నేతలు అభ్యంతరం చెప్పారు. వీరి మధ్య వాగ్వాదం తలెత్తగా, రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని వారిని నిలువరించి చెట్ల నరికివేతను అడ్డుకున్నారు. గ్రామంలో సర్వే నంబర్ 81లో ఉన్న కొండ ప్రాంతంలో వంద ఎకరాలకుపైగా విస్తీర్ణంలో అకేషియా చెట్లు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో రంగురాళ్ల క్వారీకి గతంలో అనుమతిచ్చారు. అప్పటి నుంచి రంగురాళ్ల క్వారీ నిర్వహణలో కదలిక లేదు. ఇటీవల ఈ క్వారీ పనులకు ఆటంకంగా ఉందని నిర్వాహకులు అకేషియా చెట్లను నరికివేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తాజాగా క్వారీకి దగ్గరలో 25 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటనలు చేశారు. సోలార్ ఏర్పాటుకు ఇక్కడ అకేషియా చెట్లను తొలగించాలని పంచాయతీ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతంలో అకేషియా, ఇతర చెట్లను విక్రయించి పంచాయతీకి ఆదాయం సమకూర్చడానికి చర్యలు చేపట్టారు. శనివారం కొండ ప్రాంతంలో అకేషియా చెట్లను నరికి, అమ్మడానికి సర్పంచ్ మంగ భర్త కేవీఆర్ నాయుడు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామానికి చెందిన కూటమి నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి చెట్లు నరికివేతను అడ్డుకున్నారు. చెట్లు నరికి పంచాయతీకి ఆదాయం తెస్తామని సర్పంచ్ భర్త చెప్పగా, గ్రామంలో ఎవరికీ చెప్పకుండా, చెట్లను వేలం వేయకుండా ఎలా నరుకుతారని మాజీ సర్పంచ్ వియ్యపు అప్పారావు వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల వారు తోపులాటకు దిగారు. ఈ సమాచారం తెలుసుకున్న బుచ్చెయ్యపేట ఎస్ఐ శ్రీనివాసరావు ఇరువర్గాల వారిని శాంతింప చేశారు. తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లి వారిని అక్కడ నుంచి పంపించేశారు. చెట్లు నరికి సొంతంగా అమ్ముకోవడానికే చూస్తున్నారని కూటమి నేతలు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. విలువైన అకేషియా చెట్లును వేలం వేసి ప్రభుత్వానికి, పంచాయతీకి ఆదాయం సమకూరేలా చేయాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ లక్ష్మిని వివరణ కోరగా, సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అనుమతి వచ్చిందన్నారు. గ్రామస్తులు చెట్లు నరికి వేతపై గొడవలు జరుగుతున్నట్లు తెలుసుకుని ఆపేశామన్నారు. -
పట్టాదారుకు తిప్పలు
తప్పుల కుప్పలుసాక్షి, అనకాపల్లి: జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తోంది. ఎంతో ఆర్భాటంగా పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు నిండా తప్పులే దర్శనమిస్తున్నాయి. పేర్లు, సర్వే నంబర్లు తారుమారయ్యాయి. వయసు, భూమి వివరాల్లోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఆన్లైన్ డేటా అప్డేట్ కాకపోవడంతో అంతా గందరగోళంగా తయారైంది. తాజా క్రయ, విక్రయాలు (రిజిస్ట్రేషన్లు) ఈ పుస్తకాల్లో నమోదు కాకపోవడంతో భూ యజమానులు లబోదిబోమంటున్నారు. భూముల అమ్మకాలు జరిగినా, కొత్త యజమానుల పేర్లు పాస్ పుస్తకాల్లో మారలేదని పలువురు వాపోతున్నారు. తప్పులు ఉన్న విషయం తెలియక అనేక మంది వాటిని తీసుకున్న తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రింటింగ్ కూడా సరిగా లేదు. చిరునామాలు, పేర్లలో అక్షర దోషాలు, వయసులో తేడాలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పేర్లు కూడా మారిపోయాయి. ఇంకా పూర్తి కాని పంపిణీ భూ యాజమాన్య హక్కు పత్రాలు పంపిణీకి ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి శ్రీకారం చుట్టింది. కలెక్టర్, జేసీ పర్యవేక్షణలో తహసీల్దార్లు ఈ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 373 గ్రామాల్లో రీ–సర్వే పూర్తి కాగా, సుమారు 2,01,841 పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ సభల ద్వారా రైతులకు నేరుగా అందజేయాలని నిర్ణయించారు. అయితే పంపిణీ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. పుస్తకాల్లో కోకొల్లలుగా తప్పులు ఉండడంతో వాటిని తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు జాప్యంపై అసహనం సాధారణంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 45 పని దినాల్లోగా పాసు పుస్తకాలు మంజూరు చేయాల్సి ఉంది. భూ యజమానులకు పాస్తుపుకాలు చేరడానికి 100 రోజులకు పైగా పడుతోంది. దరఖాస్తు చేసిన ఏడాది తర్వాత కూడా పుస్తకాలు అందక అనేక మంది అవస్థలు పడుతున్నారు. జిల్లాలో రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈకేవైసీ చేయించుకుని రైతులకు పాసుపుస్తకాలు అందజేస్తున్నారు. తరచూ సర్వర్ మొరాయిస్తుండడం వల్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రైతులు చాలా సార్లు అధికారుల చుట్టూ తిరాగాల్సి వస్తోంది. చక్కదిద్దే పనిలో రెవెన్యూ యంత్రాంగం రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో సిద్ధం చేసిన పుస్తకాలు తప్పుల తడకగా రావడంతో, వాటిని చక్కదిద్దే పనిలో రెవెన్యూ యంత్రాంగం ఉంది. భూముల విస్తీర్ణంలో చోటు చేసుకున్న వ్యత్యాసాలు సరిచేయాలంటూ కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అధికారులు వాటిని సరిదిద్దే పనిలో పడ్డారు. క్రయవిక్రయాలు, భాగస్వామ్య పంపిణీ, గిఫ్ట్ డీడ్లు, మ్యుటేషన్లు వంటివి పూర్తయిన తరువాతే పట్టాదారు పాస్ పుస్తకాలు కోసం ధరఖాస్తు చేసుకోవాలని అప్పుడే మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. జెట్టపురెడ్డితునిలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా వందేళ్ల తర్వాత భూముల రీసర్వే నిర్వహించి, పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేపట్టారు. అయితే రీసర్వేలో తప్పులు చోటు చేసుకున్నాయని, మళ్లీ సర్వే జరిపించి సవరణ చేసి అందజేయనున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. అడపాదడపా ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో మొక్కుబడిగా సర్వే జరిపించి గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో సర్వే చేసిన నివేదిక ఆధారంగా ఇచ్చిన పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త పుస్తకాల పంపిణీ చేపట్టింది. అవి కూడా తప్పుల తడకగా మారాయి.దీనివల్ల భవిష్యత్లో రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందడానికి, రిజిస్ట్రేషన్ సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తప్పులను సరిచేసిన తర్వాత పాసు పుస్తకాల పంపిణీ చేపట్టాలని వారు కోరుతున్నారు. -
వివాహిత ఆత్మహత్య
అనారోగ్య కారణాలతో బలవన్మరణంయలమంచిలి రూరల్: రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ సహా పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వివాహిత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యలమంచిలి మునిపాలిటీ కోర్టు వీధిలో శనివారం చోటుచేసుకుంది. అప్పటివరకు తమతో మాట్లాడి నిద్రపోయిన ఆమె మానసిక వేదనతో బలవన్మరణానికి పాల్పడడంతో పండగ ముందు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. యలమంచిలి పట్టణ ఎస్ఐ కె.సావిత్రి కథనం ప్రకారం పట్టణంలో కోర్టు వీధిలో మేడిశెట్టి శ్రీనాథ్ శ్రీనివాసరావు భార్య రాధిక(40)తో కలిసి నివసిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు.పెద్ద కుమార్తె నూజివీడు ట్రిపుల్ ఐటీలో, చిన్న కుమార్తె ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. శ్రీనివాసరావు ఇదే మున్సిపాలిటీ పరిధి పెదపల్లి సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.గత కొన్నేళ్లుగా రాధిక అనారోగ్యంతో బాధపడడంతో వైద్యానికి బాగా ఖర్చవుతోంది. ఒక చేయి పనిచేయకపోవడంతో ఇంట్లో పనులు కూడా చేయలేని స్థితి ఉంటోంది. కుటుంబంపై ఆర్థిక భారం పడడంతో ఆమె మానసికంగా కుంగిపోయారు. శుక్రవారం రాత్రి పెద్ద కుమార్తెను సంక్రాంతి పండగ కోసమని నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి తండ్రి శ్రీనివాసరావు తీసుకొచ్చారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంటికొచ్చిన పెద్ద కుమార్తెతో మాట్లాడిన రాధిక అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటి బయట గడియ పెట్టి మేడపైకి వెళ్లి ఐదు బాటిళ్లతో ఉన్న పెట్రోల్ తన శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, అందరూ నిద్రపోతున్న సమయం కావడంతో రాధిక ఆత్మహత్య చేసుకున్న విషయం ఎవరూ గుర్తించలేదు. పక్కింట్లో వ్యక్తి మేడపై పొగ వస్తుండడాన్ని గమనించి చలిమంట వేసుకున్నారని తొలుత భావించారు. ఉదయం ఆరు గంటల సమయంలో మేడపై ఎవరో చనిపోయి ఉండడాన్ని వాకలి తుడుస్తున్న వృద్ధురాలు గమనించి రాధిక కుటుంబసభ్యులకు చెప్పగా ఇంట్లో రాధిక లేరని గుర్తించారు. భర్త శ్రీనివాసరావు మేడపైకి వెళ్లి పరిశీలించగా రాధిక శరీరమంతా కాలిపోయి గుర్తుపట్టలేనట్టుగా ఉంది. అయితే పక్కనున్న స్వెట్టర్, ఇతర ఆనవాళ్లు చూసి ఆత్మహత్య చేసుకున్నది తన భార్య రాధికగా ఆయన నిర్థారించుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పట్టణ ఎస్ఐ కె.సావిత్రి ఘటనా స్థలానికి వెళ్లి బలవన్మరణానికి పాల్పడిన రాధిక మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తండ్రి, ఇతర కుటుంబసభ్యులను కూడా పోలీసులు విచారించారు. తమ కుమార్తె మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని, అనారోగ్యం కారణంగా బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు తామంతా భావిస్తున్నామని పోలీసులకు తెలిపారు. శవపంచనామా, పోస్టుమార్టం అనంతరం రాధిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ తెలిపారు. -
చోరీ కేసులో ఇద్దరు మహిళల అరెస్టు
గొలుగొండ: కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్టు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ తెలిపారు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లో ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ కృష్ణదేవిపేట ఇండియన్ బ్యాంక్లో ఈనెల5వ తేదీన కృష్ణదేవిపేట గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ రూ 50 వేలు విత్డ్రా చేసినట్టు చెప్పారు. ఆమె 8వ తేదీన బ్యాగ్లో చూసే సరికి నగదు లేకపోవడంతో కృష్ణదేవిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీని పరిశీలించి, నగదు విత్డ్రా చేసిన సమయంలోనే తాడేపల్లిగూడెంకు చెందిన సంచార జాతి మహిళలైన నాగమణి, దేవిలు చోరీచేసినట్టు గుర్తించామని తెలిపారు. ఆ ఇద్దరిని అరెస్టుచేసి, వారి నుంచి నగదు రికవరీ చేసి కోర్టుకు తరలించినట్టు రూరల్ సీఐ చెప్పారు. ఎస్ఐ రుషికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రోత్సహిస్తే ఆదాయార్జనే..!
ఎంవీపీకాలనీ(విశాఖ) : సీజనల్ పంటలతో కనీస ఆదాయం లభించక రైతులు భారీగా నష్టాలను చవిచూస్తున్నారు. టమాట, ఉల్లి, బంగాళాదంపలు, వంగ, మిరప వంటి సాధారణ పంటల ధరలు ఏటా సీజనల్గా పతనం కావడం వారిని ఆర్థికంగా కుంగదీస్తోంది. ఆయా పంటలను పండించేందుకు భారీగా పెట్టుబడులు పెడుతునప్పటికీ ధరల పతనం నష్టాలను తెచ్చుపెడుతోంది. ఇలాంటి పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకున్న కొందరు రైతులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. సాధారణ పంటలను పక్కనబెట్టి మార్కెట్ డిమాండ్తో పాటు ఆదాయాన్ని తెచ్చేపెట్టే పోషక పంటలవైపు దృష్టిసారిస్తున్నారు. నగర వాసులకు పోషక ఆహారాన్ని అందుబాటులోకి తెస్తూనే లాభాలను ఆర్జిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే భారీ విస్తీర్ణంలో పంటల ఉత్పత్తి చేపట్టి మరిన్ని అద్భుతాలు సాధిస్తామంటున్నారు. ప్రోత్సహిస్తే మరింత దిగుబడి మాది పెందుర్తి మండలం పెదగాడి. గత కొన్నేళ్లుగా అక్కయ్యపాలెం రైతు బజార్లో ఆర్గానిక్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు) విక్రయిస్తున్నాను. ఇతర పంటల కంటే ఈ పంట విధానం భిన్నంగా ఉంటుంది. మార్కెట్లో మంచి డిమాండ్తో పాటు ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉండటంతో మంచి ఆదాయం కూడా లభిస్తోంది. ప్రస్తుతం 220 గజాల విస్తీర్ణంలో మష్రూమ్స్ పండిస్తున్నాం. తొలుత వరిగడ్డిని నానబెట్టి తరువాత స్పాన్ (పుట్టగొడుగుల విత్తనాలు) కలిపి సంచుల్లో నింపి చీకటి ప్రదేశంలో ఉంచాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత 22 నుంచి 25 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. సరైన తేమ, గాలి ప్రసరణ ఉండాలి. ఇలా 25 రోజులు నిల్వచేసిన అనంతరం పంట లభిస్తుంది. అయితే ఈ విధానం ద్వారా ప్రస్తుతం మేము వారానికి 40 కేజీల మష్రూమ్స్ దిగుబడి తీస్తున్నాం. ఒక సీజన్లో 750 కేజీల వరకు దిగుబడి వస్తోంది. ప్రస్తుతం రైతు బజార్లో కేజీ మష్రూమ్స్ రూ.400లకు విక్రయిస్తుండగా బయట మార్కెట్లో దీని ధర కేజీ రూ.600 పైనే పలుకుతోంది. అయితే పంట సమయంలో ప్రభుత్వం రుణ సహాయంతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తే మరింత దిగుబడి సాధించే దిశగా అడుగులు వేస్తాం. – ముసల్ల నాయుడు, రైతు పెదగాడి -
భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలి
ఆరిలోవ(విశాఖ): పోలీసుల భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. విశాఖ నగరంలోని విశాలాక్షినగర్లో కై లాసగిరి వద్ద ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పోలీస్ ఆయుధాగారంలో నిల్వ ఉన్న రక్షణ పరికరాలు, వాటి నాణ్యత, రిజిస్టర్లు, మోటార్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, వాటి పనితీరు, వాటి ఫిట్నెస్, డాగ్ స్క్వాడ్, వీఐపీ సెక్యూరిటీ తదితర వాటిని పరిశీలించారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాణ్యమైన రక్షణ పరికరాల వల్ల పోలీస్ సిబ్బందికి మంచి రక్షణ ఉంటుందన్నారు. వాటిని ఉపయోగించడంలో సిబ్బందికి మెలకువలు అవసరమని, రికార్డుల నిర్వహణ సరిగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు బి.రామకృష్ణారావు, ఎల్.మన్మధరావు, బి.రమణమూర్తి, ఎం.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రైతు కార్డ్ లేనివారికీ అవకాశం
సీజనల్ పంటలే కాకుండా మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు పండించాలని రైతులకు సూచిస్తున్నాం. జిల్లా హార్టికల్చర్ విభాగం ఈ దిశగా పెద్ద ఎత్తున వారికి అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం చాలా మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు పండించి రైతు బజార్లలో విక్రయించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇలాంటి పంటలు పండించే అర్హతున్న రైతులు ఎవరైనా వారి పంటను నగర రైతు బజార్లలో విక్రయించుకునే అవకాశం కల్పిస్తాం. రైతు బజార్ కార్డ్హోల్డర్ కానప్పటికీ ఈ సేవలను వారు వినియోగించుకోవచ్చు. అవసరమైతే వారి పంటను పూర్తిస్థాయిలో పరిశీలించి వారికి రైతు బజార్లో విక్రయాల కోసం కార్డ్ మంజూరు చేయడం కూడా జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇలాంటి రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస కిరణ్, డీడీ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రోత్సాహానికి కృషిచేస్తున్నాం పోషక విలువలు, అధిక ఆదాయం లభించే పంటలు పండించే దిశగా విశాఖ రైతులను నిత్యం ప్రోత్సహిస్తున్నాం. విశాఖ గ్రామీణ జిల్లాకు సంబంధించి పద్మనాభం, భీమిలి మండలాల్లో నిత్యం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆసక్తి గల రైతులు ఇంట్లో, ఇంటి ఆవరణలో కూడా కొన్ని పంటలను పండించవచ్చు. పోషక పంటలకు తక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు అనుకూలం. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల అఽధికారుల సమన్వయంతో మన్యం రైతుల్లో అవగాహన పెంచే దిశగా కృషిచేస్తున్నాం. ఇలాంటి పంటలు పండించేందుకు ఆసక్తి గల రైతులను గుర్తించాలని ఇప్పటికే నగరంలోని రైతుబజార్ల ఈవోలకు సూచించడం జరిగింది. వారి నుంచి కూడా వివరాలు తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఇలాంటి పంటలు పండించే రైతుల ప్రోత్సాహానికి మరింత కృషి చేస్తాం. – బి.శ్యామల, ఏడీ, జిల్లా హార్టికల్చర్ విభాగం -
బ్రొకలికి మంచి డిమాండ్
మాది కోటపాడు మండలం, సంతపాలెం. మా పొలంలో పండించిన పంటలను దశాబ్దాలుగా ఎంవీపీ రైతు బజార్లో విక్రయిస్తున్నాను. సాధారణ పంటలతో ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో పాటు సీజనల్గా రైతులంతా ఒకేసారి అధికంగా ఉత్పత్తి చేస్తుండటంతో భారీగా నష్టాలను చవిచూస్తున్నాను. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొంత భిన్నంగా ముందుకు సాగాలనుకున్నాను. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న బ్రొకలిని పండించేందుకు నడుంకట్టాను. గత కొన్నేళ్లుగా నాకున్న పొలంలోని 80 సెంట్లలో బ్రొకలి పండిస్తున్నాను. మంచి దిగుబడి సాధించే దిశగా నిపుణుల సలహాలు తీసుకున్నాను. ప్రస్తుతం 80 సెంట్లలో టన్ను వరకు దిగుబడి సాధిస్తున్నాను. బ్రొకలిలో పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో వినియోదారుల నుంచి డిమాండ్ ఉంది. బయట మార్కెట్లో దీని ధర కేజీ రూ.200 ఉండగా రైతు బజార్లో రూ.80కి విక్రయిస్తున్నాం. దీని ద్వారా ఏటా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. కాలీప్లవర్ సాగుతో రూ.లక్ష ఆదాయం వస్తే, అదే విస్తీర్ణంలో బ్రొకలితో రూ.2లక్షలు ఆదాయం వస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరింత విస్తీర్ణంలో పంట సాగుచెయ్యాలని భావిస్తున్నాను. – బొట్టా అప్పారావు, రైతు సంతపాలెం -
పోర్టు ఐటీ.. వెరీ పిటీ!
సాక్షి, విశాఖపట్నం: కొద్ది నెలల కిందట వరకు మేజర్ పోర్టులతో పోటీ పడుతూ ప్రగతి పథంలో సాగిన విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ).. ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇన్చార్జి చైర్మన్ పాలన, కీలకమైన ఉన్నతాధికారుల నియామకంలో జాప్యం కారణంగా పోర్టు పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. ఇదే సమయంలో పోర్టు ఐటీ విభాగంలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయి, పరస్పర ఫిర్యాదుల పర్వం మొదలైంది. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ చైర్పర్సన్ ఐటీ విభాగం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. గాడి తప్పిన పరిపాలన విశాఖ పోర్టులో పరిపాలన గాడి తప్పింది. పాలన సాగించాల్సిన కీలక అధికారులు బదిలీ కావడంతో కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రస్తుతం పోర్టు ఇన్చార్జి చైర్మన్గా ఉన్న డా. అంగముత్తు.. తన సమయాన్ని సింహభాగం ముంబయి పోర్టు చైర్మన్ బాధ్యతలకే కేటాయిస్తున్నారు. దీంతో ఇక్కడ పర్యవేక్షణ లోపించింది. ఇటీవలే డిప్యూటీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన రోష్ని అపరాంజి, విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పోర్టు వ్యవహారాలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగంలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు బట్టబయలయ్యాయి. ఐటీ వింగ్లో పలువురు అధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని, కొందరు అధికారుల హోదాను అడ్డం పెట్టుకుని కింది స్థాయి సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పనులకు అప్రెంటిస్లు పోర్టులో అప్రెంటిస్గా చేరిన వారిని ఐటీ విభాగంలోని కొందరు అధికారులు తమ సొంత పనులకు వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరు అధికారుల మధ్య విభేదాలు ముదరడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని సమాచారం. ఓ ఐటీ అధికారి అయితే ఏకంగా ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడమే కాకుండా, వారిని బ్లాక్ మెయిల్ తెలుస్తోంది. ఇటీవల డిప్యూటీ చైర్పర్సన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ అధికారులు కాన్ఫరెన్స్ హాల్లోనే ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పోర్టు పరువు తీశారన్న విమర్శలున్నాయి. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ చైర్పర్సన్.. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఐటీ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న ఓ అధికారిని తక్షణం ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసినట్లు తెలిసింది. అయితే, సదరు అధికారి తప్పేమీ లేదని, ఐటీ విభాగం అంతా గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటున్నారని మరికొందరు వాదిస్తున్నారు. కేవలం సొంత ప్రయోజనాలపైనే దృష్టి సారించి, పోర్టు వ్యవహారాలను పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల కొరత కారణంగా ఫైళ్లు ముందుకు కదలక, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. వీలైనంత త్వరగా విభాగాధిపతులను నియమించి, పోర్టును తిరిగి గాడిలో పెట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
పొర్లు దండాలతో ‘గోవాడ’ రైతుల నిరసన
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలని కోరుతూ ఫ్యాక్టరీ వద్ద చేపట్టిన రిలే నిరసన దీక్షలు శుక్రవారానికి 8వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా పొర్లు దండాలతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫ్యాక్టరీని తెరిపించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వామపక్ష నాయకుడు రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ బకాయిలు చెల్లించకపోవడంతో పెట్టుబడులు పెట్టి చెరకు పండించిన రైతులు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గతేడాది చెరకు సరఫరా చేసినా నేటికి చెల్లింపులు చేయకపోవడం దారుణమన్నారు. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. ఫ్యాక్టరీ కార్మిక సంఘం నాయకుడు శరగడం రామునాయుడు మాట్లాడుతూ కార్మికులకు జీతాలు లేక కుటుంబాలతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ చైర్పర్సన్ అయిన జిల్లా కలెక్టర్కు రైతులు, కార్మికులు తమ సమస్యలు గురి తెలియజేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ దీక్షలో సీపీఐ మండల కార్యదర్శి సోమాదల దేవి, కోన మోహన్, శానాపతి సత్యారావు, మహిళా సమాఖ్య కార్యకర్త బొబ్బిలి దేవి, దండుపాటు తాతారావు, తనకల జగన్, రాయి సూరిబాబు, పొలిమేర వెంకటప్పారావు, మద్దాల మహాలక్ష్మినాయుడు, ఎం.మల్లేశ్వరరావు, ఎస్.మల్లేశ్వరరావు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. -
లెట్యూస్తో మంచి రాబడి
మాది అరకు నియోజకవర్గంలోని దేముడువలస. గత పదేళ్లుగా ఎంవీపీ రైతు బజార్లో కూరగాయలు విక్రయిస్తున్నాను. గత కొన్నేళ్లుగా కేబేజీ పంటను పండిస్తున్నాం. అయితే ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో నష్టాలను చవిచూస్తున్నాం. దీంతో మార్కెట్లో డిమాండ్ ఉన్న లెట్యూస్ పండించాలని నిర్ణయించాను. ఇది మంచి పోషక విలువలు ఉన్న ఆకుకూర పంట కావడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విటమిన్ ఏ, విటమిన్ కే లు పుష్కలంగా ఉండటంతో పోషకాహారం కోరుకునే వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. రెస్టారెంట్లలో శాండ్విచ్లు, సూప్లు, బర్గర్లలో కూడా విరివిగా దీన్ని వాడుతుండటంతో బయట మార్కెట్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. దీంతో 30 సెంట్లలో ఈ పంట పండించగా ఏడాదికి 1/2 టన్ను దిగుబడి వస్తోంది. రైతు బజార్లో లెట్యూస్ కేజీ ధర రూ.80కి విక్రయిస్తుండగా బయట మార్కెట్లో దీని ధర కేజీ రూ.200లకు పైగా పలుకుతోంది. దీంతో మూడేళ్లుగా పండిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాను. రానున్న రోజుల్లో మరింత విస్తీర్ణంలో లెట్యూస్ పండించి మార్కెట్ చేయాలని భావిస్తున్నాను. – పాంగి గోపినాథ్, రైతు అరకు -
24 నుంచి విశాఖ ఉత్సవ్
మహారాణిపేట(విశాఖ) : విశాఖ వైభవాన్ని చాటిచెప్పేలా ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ‘విశాఖ ఉత్సవ్’ను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. శుక్రవారం కలెక్టర్ట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు. ఇదే సమావేశంలో వర్చువల్గా భాగస్వామ్యమైన హోంమంత్రి అనిత పలు అంశాలపై సూచనలు చేశారు. వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ ఈనెల 24, 25వ తేదీల్లో అనకాపల్లి జిల్లాలో, 26 నుంచి 31వ తేదీ వరకు విశాఖ, అల్లూరి జిల్లాలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి 1న ఆదివారం కావడంతో ప్రత్యేకంగా అరకులో ఉత్సవాలను కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు సమన్వయంగా ఏర్పాట్లు చేయాలన్నారు. విశాఖలో భీమిలి, రుషికొండ, సాగర్నగర్, ఆర్కే బీచ్ తదితర ఎనిమిది ప్రాంతాల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో జనవరి చివరి నాటికి లెగసీ వేస్ట్ (పాత వ్యర్థాలు) పూర్తిగా తొలగించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్నారు. మహిళల భద్రత కోసం నగరాన్ని చీకటి ప్రాంతాలు లేని ’ఇల్యుమినేషన్ సిటీ’గా మార్చాలని సూచించినట్లు తెలిపారు. విశాఖ పోర్టు నుంచి బొగ్గు, ఇతర ముడి పదార్థాల రవాణా సమయంలో కాలుష్యం వ్యాపించకుండా.. టార్పాలిన్లతో కప్పి ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
10 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్
పట్టుబడిన గంజాయి, నిందితుడితో ఎస్ఐ సతీష్ చీడికాడ: మండలంలోని కోణాం చెక్ పోస్టు వద్ద 10 కిలోల గంజాయితో పాటు బైక్ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ బి.సతీష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి బైక్పై గంజాయిని తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కోణాం చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ మండలానికి చెందిన బుదడంగి చంటిబాబు బైక్పై పది కిలోల గంజాయి తరలిస్తున్నాడు. పోలీసులు చెక్పోస్టు వద్ద తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నిందితుడ్ని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి యలమంచిలి రూరల్: వేడి నీళ్లు మరగబెడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకున్న ప్రమాదంలో ఈ నెల 3న గాయపడిన యలమంచిలి మండలం లక్కవరం గ్రామానికి చెందిన వృద్ధురాలు తేలు రమణమ్మ(80) శుక్రవారం మృతి చెందినట్టు ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. గాయపడిన వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తుండగా అగ్ని ప్రమాదానికి గురైంది. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆమె మృతి చెందడంతో కుమారుడు తేలు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
ఆగి ఉన్న నీళ్ల ట్యాంకర్ను ఢీకొట్టిన లారీ
● లారీ క్యాబిన్లో చిక్కుకుని డ్రైవర్ మృతి ● మృతుడు నల్లగొండ జిల్లా వాసి యలమంచిలి రూరల్: హైవే డివైడర్లో మొక్కలకు నీరు పోయడానికి నిలిపి ఉంచిన ట్యాంకర్ లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. శుక్రవారం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. యలమంచిలి మండలం పులపర్తి సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైవే డివైడర్లో పెంచుతున్న మొక్కలకు నీరు పోస్తూ హైవే నిర్వహణ సంస్థకు చెందిన ట్యాంకర్ లారీ నెమ్మదిగా వెళుతోంది. ఆ సమయంలో అనకాపల్లి నుంచి తుని వైపు ప్రయాణిస్తున్న టీఎస్ యూఎఫ్6579 నంబరు గల లారీ వేగంగా వెళ్లి ట్యాంకర్ను ఢీకొంది. హెచ్చరిక కోసం పెట్టిన సూచికల బోర్డులను సైతం ఢీకొడుతూ వెళ్లి ట్యాంకర్ను ఢీకొనడంతో లారీ ముందు భాగం నుజ్జయింది. దీంతో లారీని నడుపుతున్న డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోయాడు. శరీరంలో నడుము కింద భాగాలన్నీ ముద్దయి తీవ్ర రక్తస్రావంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. లారీ క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్ను బయటకు తీసేందుకు హైవే నిర్వహణ సంస్థ సిబ్బంది, పోలీసులు సుమారు మూడు గంటలు శ్రమించినా ఫలితం లేకపోయింది. మృతి చెందిన లారీ డ్రైవర్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా తస్కనిగూడెం కు చెందిన హెచ్.వెంకటయ్య(51) గా గుర్తించారు. ట్యాంకర్ రోడ్డుపై తిరగబడగా, ఢీకొట్టిన లారీ రోడ్డు పక్కగా ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చివరకు క్రేన్ సాయంతో పాటు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందజేశారు. దీనిపై మృతుని కుటుంబీకులు వచ్చిన తర్వాత వారి వద్ద నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామన్నారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
గజవాహనంపై వెంకన్న తిరువీధి సేవలు
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వర స్వామివారికి శుక్రవారం గజవాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు. ముందుగా గరుడాద్రిపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. కొండదిగువన వేణుగోపాలస్వామికి, గోదాదేవి అమ్మవారికి నిత్యార్చనలు,విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం పూజలు నిర్వహించారు. తదుపరి శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామిని గజవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారు.అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 24వ పాశురాన్ని విన్నపం చేశారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. అర్చక స్వాములు ప్రసాదాచార్యులకు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు సాయి ఆచార్యులు పాల్గొన్నారు. తిరువీధి సేవలకు ముందు వైకుంఠనాథుడిగా స్వామివారు శేషపాన్పుపై శయనిస్తున్నట్టు అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. -
మరీ ఇంత మోసమా?
దేవరాపల్లి: రైవాడ జలాశయంలో చేప పిల్లలను అరకొరగా విడుదల చేసి, మరోమారు మోసగించేందుకు యత్నించిన మత్స్యశాఖ అధికారులపై స్థానిక వేటదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైవాడ జలాశయంలో విడుదల చేసేందుకు విజయనగరం జిల్లా తాటిపూడి నుంచి 1.50 లక్షల చేప పిల్లలను శుక్రవారం తీసుకొచ్చారు. గతంతో ఇచ్చిన హామీకి, ఇప్పుడు తీసుకొచ్చి చేపపిల్లల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో వారు మండిపడ్డారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగి, నినాదాలుచేశారు. ఈ జలాశయంలో ఐదు లక్షల చేపపిల్లలను వేస్తామని చెప్పిన అధికారులు గత ఏడాది నవంబర్లో కేవలం 50 వేల చేప పిల్లలను వేశారు. అయితే అధికారులు తమను మోసం చేశారని ఆరోపిస్తూ వేటదారులు అప్పట్లో ఆందోళన చేశారు. దీంతో మిగిలిన 4.50లక్షల చేపపిల్లలను రెండువారాల్లో జలాశయంలో వేస్తామని లిఖిత పూర్వకంగా అధికారులు హామీ ఇచ్చారు. నెలన్నర తరువాత శుక్రవారం వచ్చిన అధికారులు 1.50 లక్షల చేపపిల్లలను మాత్రమే తీసుకొచ్చారు. మరోమారు మోసం చేసేందుకు యత్నించిన అధికారులపై వేటదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మోసంపై ప్రశ్నించిన తమపై అధికారులు దురుసుగా ప్రవర్తించారని వేటదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేటదారులు, మత్స్యశాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల తీరును నిరసిస్తూ జలాశయం గట్టుపై చేపపిల్లలతో వచ్చిన వాహనం ఎదుట వేటదారులు ఆందోళనకు దిగారు. వాహనం ముందు బైఠాయించి, మత్స్యశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 4.50లక్షల చేప పిల్లలను జలాశ యంలో వేయాలని లేకుంటే, వెనక్కి తీసుకుపోవాలని భీష్మించుకు కూర్చున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే అధికారులు దురుసుగా ప్రవర్తించడాన్ని వేటదారులు తీవ్రంగా పరిగణించారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ వి.సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మత్స్యశాఖ అధికారి వి.విజయ ఫోన్లో వేటదారులతో మాట్లాడి ప్రస్తుతం తీసుకువచ్చిన పిల్లలను విడుదల చేస్తే మిగిలిన వాటిని సంక్రాంతి లోగా పంపిస్తానని హామీ ఇచ్చారు. దీంతో వేటదారులు శాంతించి, చేప పిల్లలను జలాశయంలో వేసేందుకు అంగీకరించారు. మృతి చెందిన చేప పిల్లలు జలాశయంలో వేసేందుకు తీసుకొచ్చిన చేపపిల్లలు అప్పటికే మృతి చెందినట్లు వేటదారులు గుర్తించారు. కొన్ని చేపపిల్లలు జలాశయం నీటిపై తేలియాడటంతో మరణించినట్లుగా ధ్రువీకరించారు. మృతి చెందిన చేప పిల్లలను విడుదల చేయొద్దని వేటదారులు సూచించినప్పటికీ మత్స్యశాఖ అధికార్లు పట్టించుకోలేదు. ఉదయం 10 గంటలకు వస్తాయని చెప్పి సాయంత్రం 4 గంటలకు తీసుకువచ్చారని, ఆలస్యంగా తీసుకురావడంతోనే చేప పిల్లలు చనిపోయాయని, ముమ్మాటికి అధికార్లు నిర్లక్ష్యమేనని ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వేటదారులు డిమాండ్ చేశారు. ఇలా అరకొరగా చేప పిల్లలను వేస్తే రోజంతా వేట సాగించినా కేజీ చేపలు కూడా లభించవని వారి గోడును వెల్లబోసుకున్నారు. మత్స్యశాఖ అధికారుల అలసత్వం కారణంగా రైవాడ జలాశయంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 250 కుటుంబాల వారు జీవనోపాధిని కోల్పోవలసిన దుస్థితి నెలకొందని వాపోయారు. శుక్రవారం తీసుకొచ్చిన చేప పిల్లలలో కొన్నైనా బతికి ఉంటాయని జలాశయంలో విడుదల చేశారని, అవి పూర్తిగా చనిపోయినట్లు తన దృష్టికి వచ్చిందని డీఎఫ్వో విజయ తెలిపారు. చనిపోయిన వాటితో సంబంధం లేకుండా 4 లక్షల చేప పిల్లలను జలాశయంలో విడుదల చేస్తామన్నారు. మత్స్యశాఖ అధికారులపై రైవాడ వేటదారుల మండిపాటు జలాశయంలో విడుదలకు అరకొరగా చేప పిల్లలను తేవడంపై ఆగ్రహం వాహనం ఎదుట బైఠాయించి నిరసన వేటదారులు, మత్స్యశాఖ అధికారుల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత ఉన్నతాధికారుల హామీతో శాంతించిన వేటదారులు -
నేవీ ఎమ్యునిషన్ వర్క్షాప్నకు శంకుస్థాపన
వర్క్షాప్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా సాక్షి, విశాఖపట్నం: తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి సంబంధించిన ఆయుధ సంపత్తి నిర్వహణకు అవసరమైన వర్క్షాప్ నిర్మాణానికి విశాఖలో కీలక అడుగు పడింది. ఎన్ఏడీ జంక్షన్లోని నేవల్ ఆర్మ్డ్ డిపో ఆవరణలో ఈ వర్క్షాప్ని నిర్మించేందుకు ఈఎన్సీ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ ఆపరేషన్స్ రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా శుక్రవారం శంకుస్థాపన చేశారు. భారత నౌకాదళ చరిత్రలో ఎమ్యునిషన్ వర్క్షాప్ని అత్యాధునిక భద్రత సాంకేతికతతో నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వర్క్షాప్ పూర్తయిన తర్వాత.. తూర్పు నౌకాదళంతో పాటు ఇండియన్ నేవీ భద్రతా ప్రమాణాలు, ఆయుధ సంపత్తి నిల్వ సంసిద్ధత, లాజిస్టిక్ వ్యవహారాల్లో గణనీయ మార్పులు చోటుచేసుకోనున్నాయని రియర్ అడ్మిరల్ మనోజ్ ఝా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏడీ అధికారులు పాల్గొన్నారు. -
38 రోడ్ల పనులకు రూ.113 కోట్లు
● రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తుమ్మపాల: జిల్లాలో 38 రోడ్ల పనులకు రూ.113 కోట్లు మంజూరు చేసినట్టు రోడ్లు, భవనాల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న రోడ్ల పనులను శుక్రవారం కలెక్టర్ విజయ కృష్ణన్తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీటిలో 22 పనులకు టెండర్లు పూర్తయ్యాయని, మిగిలిన పనులు టెండర్లు దశలో ఉన్నాయని చెప్పారు. ఈ పనులన్నింటినీ జూన్ నాటికి పూర్తిచేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో రూ.3వేల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ పద్ధతిలో ఈ ఏడాది రూ.20 వేల కోట్లతో రోడ్లు నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో 10,500 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పనులకు సంబంధించి అన్ని అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ముఖ్యమైన అడ్డురోడ్డు–నర్సీపట్నం, భీమిలి–నర్సీపట్నం, వడ్డాది–పాడేరు రోడ్డుపనులు పూర్తిచేయనున్నట్టు చెప్పారు. ఎండీపీ పథకం ద్వారా రూ.130 కోట్లతో చేపట్టిన 62 కిలోమీటర్ల రోడ్ల పనులను మార్చి నాటికి పూర్తిచేయనున్నట్టు తెలిపారు. ఈ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లింపులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు రూ.60 కోట్లు చెల్లించామని చెప్పారు. రూ.70 కోట్ల బకాయిలు ఈ నెలలో చెల్లిస్తామని చెప్పారు. ధ్వంసమైన రోడ్ల అభివృద్ధికి రూ.800 కోట్లు మంజూరయ్యాయన్నారు. గ్రామీణ రోడ్లలో కూడా భారీ వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో ముఖ్యమైన రహదారులను జాతీయ రహదారుల స్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు పీపీపీ పద్ధతిలో చేపట్టనున్నట్టు చెప్పారు. పనులు జరుగుతున్నప్పుడు 40 శాతం, తదుపరి 15 ఏళ్లలో 60 శాతం నిధులు దశల వారీగా చెల్లింపులు చేస్తామన్నారు. అధిక లోడు వాహనాలను నియంత్రించేందుకు ఫిబ్రవరి నుంచి టోల్ గేట్ల వద్ద ఆటోమేటిక్ లోడు పరిశీలన యంత్రాలను ఏర్పాటుచేసి, ఆర్టీజీఎస్తో అనుసంధానం చేసి జరిమానాలు విధించే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్, రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ కె.జె.ప్రభాకర్, ఈఈ ఎన్.సాంబశివరావు పాల్గొన్నారు. -
కోఢీ..తగ్గేదేలే!
శనివారం శ్రీ 10 శ్రీ జనవరి శ్రీ 2026సంక్రాంతి కోడి పందాలకు రంగం సిద్ధమైంది. కోడి పందాలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా నిర్వాహకులు మాత్రం తగ్గేదేలే అంటూ ఎప్పటి మాదిరిగానే సర్వం సిద్ధం చేశారు. బరుల వద్దే మందు, విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు రోజులు పందాలు మంచి ఆదాయ వనరుగా మారనున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లో పందాల నిర్వహణకు ఇప్పటికే పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టు సమాచారం. డిఫెన్స్ కార్యాలయానికి వెయ్యి ఎకరాల సేకరణ 16న బొజ్జన్న కొండ తీర్థం కరపత్రాలను ఆవిష్కరిస్తున్న మాజీ ఎంపీ సత్యవతి అనకాపల్లి: సంక్రాంతి సందర్భంగా మండలంలో శంకరం పంచాయతీ బొజ్జన్న కొండపై ఈ నెల 16న తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి తెలిపారు. స్థానిక వివేకానందనగర్లోని తన కార్యాలయంలో శుక్రవారం తీర్థం (బౌద్ధమేళా) కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బొజ్జన్న కొండ వద్ద లేజర్ లైటింగ్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి బొజ్జన్న కొండకు వచ్చే పర్యాటకులు ఉండేందుకు ప్రత్యేక వసతి గృహాలను నిర్మించినట్టు తెలిపారు. ప్రతి ఏడాది కనుమ రోజున పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అదే రోజు బౌద్ధ భిక్షువులు నాగపూర్, మయన్మార్, కంబోడియా నుంచి వచ్చి కొండను సందర్శించి, ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ సోషల్ సర్వీస్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు బల్లా నాగభూషణం, జిల్లా బుద్ధిస్ట్ సొసైటీ ఇండియా అధ్యక్షుడు పల్లా బాబ్జీ, అసోసియేషన్ సభ్యులు రొబ్బి మల్లేశ్వరరావు, వెంకట రమణమూర్తి, ఉడా నాగేశ్వరరావు, కాపారపు సత్యనారాయణ, మైలపల్లి నూకరాజు పాల్గొన్నారు.సాక్షి, అనకాపల్లి: బంధుమిత్రులు, గ్రామస్తులు, పెద్దలు.. పిల్లలు ఎన్నో మధుర స్మతుల.. సంస్కృతీసంప్రదాయాల నడుమ నిర్వహించుకోవాల్సిన సంక్రాంతి సంబరాలు రానురాను జూద శిబిరాలకే పరిమితమవుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో గోదావరి జిల్లాలకు దీటుగా అనకాపల్లి జిల్లాలో కోడి పందేల బరులు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో రహస్య స్థావరాల్లో చాపకింద నీరులా పందెం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో పోటాపోటీగా బరులు, ఇతర జూద క్రీడల నిర్వహణకు స్థలాలు సిద్ధం చేసుస్తున్నారు. జిల్లాలో గత ఏడాది పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, పెందుర్తి, నర్సీప ట్నంలలో బరులు ఏర్పాటు చేసి, భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో రాత్రీ పగలు అనే తేడా లేకుండా పందేలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మరో ఆడుగు ముందుకేసి కోనసీమ తరహాలో బరులతో పాటు టెంట్లు, గ్రిల్స్, మందు, విందు భోజనాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అచ్యుతాపురం మండలం రామన్నపాలెంలో బరి ఏర్పాటు చేశారు. ఈఏడాది రాంబిల్లి మండలం వెంకటాపురానికి మార్చారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లిలో గత ఏడాది నిర్వహించగా.. ఈ ఏడాదిలో ఎస్.రాయవరం మండలంలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులేమో ఏటా మాదిరిగానే కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలంటూ ప్రకటనలు జారీ చేశారు. పోలీసులు అక్కడక్కడ చిన్నాచితకా బరులను తొలగించడం.. పండగ దగ్గర పడ్డాక జిల్లాలో జూదక్రీడలే లేవనట్లు చేతులెత్తేయడం పరిపాటిగానే మారింది. మరి ఈ ఏడాది పకడ్బందీగా చర్యలు తీసుకుంటారో..లేదా గత ఏడాది మాదిరే మామ్మూళ్లు తీసుకుని చూసీ చూడనట్లు వదిలేస్తారో వేచి చూడాల్సిందే. ఒక్కో బల్లకు రూ.5 లక్షలు రాంబిల్లి మండలం వేంకటాపురంలో మూడు రోజు ల పాటు నిర్వహించే ఈ జూద క్రీడల్లో 16 లాటరీ బల్లలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వీటిలో అచ్యుతాపురానికి చెందిన జనసేన నేతలకు –4, రాంబిల్లి నేతలకు–3, యలమంచిలి నేతలకు–4, మునగపాక నేతలకు –5 లాటరీ బల్లలు కేటాయించినట్టు సమాచారం ఒక్కో బల్లను ఏర్పాటు చేసినందుకు గానూ రూ.5 లక్షల చొప్పున సుందరపు అనుచరులకు చెల్లించినట్లు తెలిసింది. పందేల నిర్వాహకులకు మద్యం, భోజనాలు అక్కడే ఏర్పా టు చేస్తున్నారు. మద్యం విక్రయించే వారు, కోడి కత్తె కట్టేవారు, కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహించేవారు కూడా వారి కొంత ముట్టజెప్పినట్టు సమాచారం. పోలీసులకు మామ్మూళ్లు ? ఈ కోడి పందేలు, జూద క్రీడలు ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గంలో ఉన్న పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పోలీసులకు రూ.30 లక్షల వరకూ మామ్మూళ్లు ఇచ్చినట్లు సమాచారం. జూద క్రీడలు ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకున్న వెంకటాపురం గ్రామంతో పాటు సమీప గ్రామ ప్రజలు, మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులను సామాన్య ప్రజలు ఈ జూద క్రీడల్లో పోగొట్టుకుంటారని, పండగ మూడు రోజులు మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరగడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని వారు వాపోతున్నారు. పండగ మూడు రోజులు డబ్బులు పెద్దఎత్తున చేతులు మారతాయనేది బహిరంగ రహస్యం. యమ గిరాకీ... జిల్లాలో కోడి పుంజులు, కోడి కత్తులు, శిక్షకులకు డిమాండ్ పెరిగింది.గత ఏడాది కంటే ఈ ఏడాది జిల్లాలో పదివేలకు పైగా పందెం పుంజులను పెంచి వాటికి శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారని అంచనా. వారంరోజులుగా వీటి అమ్మకాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. ఒక్కోజాతి పుంజును రూ.10 వేల నుంచి నుంచి రూ.20 వేల వరకూ విక్రయిస్తున్నారు. ఎక్కువగా నెమలి, డేగ, అబ్రాజు, సీతువ, కాకి, పర్లా, రసంగి, కెంకిరాయి తదితర పుంజులకు గిరాకీ ఉంది.హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా!యలమంచిలి నియోజకవర్గంలో నాలుగు మండ లాలకు గానూ రాంబిల్లి మండలంలో వెంకటాపురం గ్రామం సమీపంలో 80 ఎకరాల ఓ రియల్ ఎస్టేట్ లేఅవుట్లో భారీఎత్తున జూద క్రీడల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిగా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అక్కడ మట్టిని చదును చేసి, కార్ల పార్కింగ్కు ప్రత్యేకంగా స్థలాలు కేటాయిస్తున్నారు. జనసేనకు చెందిన సుందరపు బ్రదర్స్ అనుచరుల కనుసన్నులోనే జరగుతున్నట్లు సమాచారం. కోడి పందేలతో పాటు లాటరీ బల్ల, గుండాట వంటి జూద క్రీడలను ఏర్పాటు చేస్తున్నారు. బరి తెగిస్తున్న నిర్వాహకులు జూద క్రీడలకూ ఏర్పాట్లు మందు, విందు సైతం సిద్ధం రాంబిల్లి మండలం వెంకటాపురంలో భారీగా ఏర్పాటుకు సన్నాహాలు పోలీసులు వద్దంటున్నా పట్టని వైనం కోడిపందాలు వద్దు.. కోడిపందేల నిర్వహణ చట్టవిరుద్ధం. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు. జిల్లాల్లో వీటికి అడ్డుకట్ట వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కోడిపందేల నిర్వాహకులు, కత్తులు తయారుచేసే వారిపై, ఆడేవారిపై కూడా బైండోవర్ కేసులు నమోదుచేస్తాం. – విష్ణు స్వరూప్, పరవాడ డీఎస్పీ -
టెన్త్ ఫలితాల్లో టాప్లో నిలపడమే ధ్యేయం
● డీఈవో అప్పారావునాయుడు దేవరాపల్లి: త్వరలో జరిగే పదో తరగతి పరీక్షల్లో జిల్లాను అగ్ర స్థానంలో నిలపడమే ధ్యేయమని, కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా అందరూ సమష్టిగా పని చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి డి. అప్పారావునాయుడు తెలిపారు. మండలంలో శుక్రవారం డీఈవో సుడిగాలి పర్యటన చేసి, వివిధ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఎ. కొత్తపల్లి, ముషిడిపల్లి, ఎం. అలమండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు కె.ఎం.పాలెం, దేవరాపల్లి హరిజన కాలనీ, ముషిడిపల్లి ప్రాథమిక పాఠశాలల్లో 75 రోజుల ప్రణాళిక అమలుతీరును డీఈవో తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించడం, అసభ్య పదజాలంతో దూషించడంతో వాకపల్లి ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయిని కె.నాగమణికి షోకాజ్ నోటీస్ జారీ చేయనున్నట్లు చెప్పారు. ఎ. కొత్తపల్లి హైస్కూల్లో స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మితో కలిసి ఆయన పాఠశాలను పర్యవేక్షించారు. డీఈవో వెంట ఎంఈవో–2 వి. ఉషారాణి తదితర్లు ఉన్నారు. శత శాతం ఉత్తీర్ణతను సాధించాలి కె.కోటపాడు: పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి జి.అ ప్పారావునాయుడు తెలిపారు. ఎ.కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలను సాధించేలా తర్ఫీదు ఇవ్వాలన్నారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో పాఠశాల నిర్వహణ సమయం కంటే అదనంగా రెండు గంటల పాటు తరగతులను జరుపుతున్నట్లు స్థానిక హెచ్ఎం ఎ.శేఖర్ డీఈవోకు తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ను డీఈవో పరిశీలించారు. ఉపాధ్యాయులు సూర్రెడ్డి బాబూరావు, బొడ్డు శివప్రసాద్, పీఈటీలు కె.చిట్టిప్రసాద్, తమ్మునాయుడు పాల్గొన్నారు. -
నూకాంబిక ఆలయ హుండీ లెక్కింపు
ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్న అర్చకులు, భక్తులు అనకాపల్లి : స్థానిక గవరపాలెం దేవదాయ ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో నూకాంబిక అమ్మవారి హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం జరిగింది. అమ్మవారి 92 రోజుల హుండీ ఆదాయం రూ.37లక్షల 24వేల 747 రాగా, 05.500 మిల్లీ గ్రాముల బంగారం, ఒక కేజీ 246 గ్రాముల వెండి వచ్చినట్టు జిల్లా సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి, ఆలయ ఈవో యళ్ల శ్రీధర్, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ వసంతకుమార్ చెప్పారు. భక్తుల ద్వారా అమ్మవారి హుండీకి ఆదాయం వచ్చిందని, నగదు, బంగారం, వెండిని దేవదాయ ధర్మదాయ శాఖ గవరపాలెం యూనియన్ బ్యాంక్ ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ధర్మకర్తలు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
స్కెచ్!
డీజిల్ గల్లంతుకుసీసీఎస్ ప్రాజెక్టుల్లోసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ‘క్లోజ్డ్ కంపాజిషన్ సిస్టం (సీసీఎస్) ప్రాజెక్టు కోసం తాజాగా పిలిచిన టెండర్లో ఓపెన్ టిప్పర్లలో చెత్తను తరలిస్తే జీవీఎంసీ డీజిల్ను సరఫరా చేయదు.. ఉచితంగా డీజిల్ ఇవ్వమంటూ పెట్టిన నిబంధనను వెనక్కి తీసుకోకపోతే మేం దాఖలు చేసిన టెండర్ను వెనక్కి తీసుకున్నట్టు భావించండి. మేం వేసిన టెండర్ అమలులో ఉండదు’’ అంటూ సీసీఎస్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్న రాశా సంస్థ స్వయంగా గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్తో పాటు మెకానికల్ అధికారులకు గత నెలలోనే లేఖలు రాసింది. అయినప్పటికీ పనులను కట్టబెడుతూ కమిషనర్ నిర్ణయం తీసుకోవడం.. మెకానికల్ అధికారులు సదరు సంస్థకు పనులను అప్పగిస్తూ ఆదేశాలు జారీచేయడం గమనార్హం. ఈ పనులను అప్పగించడం వెనుక జీవీఎంసీ అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే జీవీఎంసీ ఖజానా నుంచి అదనపు ఆయిల్ను ఉచితంగా ఇచ్చేందుకే నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. వాస్తవానికి సీసీఎస్ ప్రాజెక్టుల ఉద్దేశమే క్లోజ్డ్ కంపాక్టర్ల ద్వారా చెత్తను తరలించడం. అయితే ఇప్పటికే ఒక క్లోజ్డ్ కంపాక్టర్ పోలీసు స్టేషన్లో మరొకటి మరమ్మతుల పేరుతో నెలల తరబడి షోరూంలో ఉంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ నుంచి ఉచితంగా ఆయిల్ను తీసుకుని కాపులుప్పాడలోని విద్యుత్ ప్లాంటుకు ఓపెన్ టిప్పర్లలో తరలిస్తున్నారు. ఈ దఫా టెండర్లలో ఓపెన్ టిప్పర్ల ద్వారా చెత్తను తరలించేందుకు వీలులేదని.. ఒకవేళ తరలిస్తే జీవీఎంసీ ఉచితంగా డీజిల్ను సరఫరా చేయదనే నిబంధన విధించారు. అయితే ఈ నిబంధన తొలగించకుంటే తాము దాఖలు చేసిన టెండర్ను పరిగణలోనికి తీసుకోవద్దంటూ స్వయంగా రాశా యాజమాన్యం లేఖ రాసింది. అయినప్పటికీ చేయాల్సిందేంటూ రెండు సీసీఎస్ ప్రాజెక్టులను సదరు సంస్థకు అప్పగించారు. అంటే ఉచితంగా డీజిల్ను ఇచ్చేందుకు జీవీఎంసీ నిర్ణయం తీసుకుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ ప్రాజెక్టు నుంచి కోట్ల రూపాయల డీజిల్ను ఉచితంగా ఇచ్చేందుకే ఈ బాగోతం నడిచిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కమిషనర్కు తెలియదా..! వాస్తవానికి సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణపై కమిషనర్ స్వయంగా సమీక్ష నిర్వహించడమే కాకుండా వీటిపై విచారణ కూడా చేపట్టారు. నిర్వహణ విషయంలో పక్కాగా ఉండాలంటూ ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో తాజా టెండర్లలో ఓపెన్ టిప్పర్ల ద్వారా చెత్త తరలించకుండా ఉండేందుకు కొన్ని నిబంధనలను చేర్చారు. అయితే, ఈ నిబంధన ఉంటే తమ టెండర్ను పరిగణలోకి తీసుకోవద్దన్న రాశా సంస్థ లేఖను సైతం పక్కనపెట్టి పనులను అప్పగించారు. ఇంతకీ ఈ విషయం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్కు వాస్తవాలు తెలియకుండా జీవీఎంసీ కిందిస్థాయి అధికారులు వ్యవహారం నడిపించారా? అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. చెత్తతోనే కాదు.. వివాదాలతో నిండిన సీసీఎస్అవినీతి కొండలు..! జీవీఎంసీ పరిధిలోని 10 జోన్ల నుంచి ప్రతీ రోజూ 1,200 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఇంటింటికీ వెళ్లి క్లాప్ వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తున్నారు. ఈ విధంగా సేకరించిన చెత్తను జీవీఎంసీ పరిధిలోని 4 సీసీఎస్ ప్రాజెక్టులకు (గాజువాక, టౌన్కొత్త రోడ్డు, చీమలాపల్లి, ముడసర్లోవ) తరలిస్తున్నారు. అక్కడి నుంచి క్లోజ్డ్ కాంపాక్టర్ల ద్వారా చెత్తను కాపులుప్పాడకు వెళ్తోంది. అయితే తరలింపు సమయంలో రోడ్లపై చెత్త పడకుండా.. కాలుష్యం లేకుండా చూసేందుకే ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. ఇందుకుగానూ జనవరి 1వ తేదీ నుంచి సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లలో జరిగిన వింతలతో ప్రాజెక్టుల వద్ద చెత్త మొత్తం గుట్టలుగుట్టలుగా పేరుకుపోయి కొండలను తలపిస్తోంది. వందల టన్నుల చెత్త పేరుకుపోతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సాహసించడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే సీసీఎస్ ప్రాజెక్టుల అసలు ఉద్దేశాన్ని కూడా పక్కనపెట్టి పనులను అప్పగించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు ఎవరికి మేలు చేసేందుకు ఈ తతంగమంతా నడిచిందనేది తేలాల్సి ఉంది. వాస్తవానికి ఇన్ని షరతులు విధించినప్పటికీ ఏమీ చూడకుండానే కమిషనర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం కాస్తా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లకుండానే వ్యవహారం నడిచిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
కేటుగాళ్లకు పండగ!
●ఆదమరిచారో జాగ్రత్త...సాక్షి, అనకాపల్లి : దృష్టి మరల్చి దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న ముఠాలు జిల్లాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో తెలుగు రాష్ట్రాలకు వచ్చే హరియాణా, యూపీకి చెందిన ‘అటెన్షన్ డైవర్షన్’ నేరస్తులు దొంగతనాలకు, చోరీలకు, దోపిడీలకు పాల్పడతారు. రెప్పపాటు సమయంలోనే మన దృష్టిని మరల్చి సొత్తు మాయం చేస్తారు. ఇలా వచ్చి..అలా కొట్టేసి ఏమి తెలియకుండానే దూరంగా మాయమవుతారంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, వస్త్ర దుకాణాల వద్ద, ట్రాఫిక్ కూడళ్లు. నిర్మానుష్య ప్రదేశాలు, ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల వద్ద వ్యక్తులను ఈ ముఠాలు టార్గెట్ చేసుకుంటారు. జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతంలో దృష్టి మరల్చి చేసే నేరాలకు అడ్డాగా ఎంచుకుంటారు. నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్లకు వచ్చే వృద్ధులు, మహిళలు, నిరక్షరాస్యులను బురిడీ కొట్టిస్తారు. బంగారం, సెల్ఫోన్ దుకాణాల వద్ద చేరతారు. దుకాణ నిర్వాహకులు ఏమరుపాటుగా ఉన్న సమయంలో వస్తువులు కొట్టేస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సంక్రాంతి. పండగ సెలవుల్లో సొంత ఊర్లకు వెళ్లే వారు తమ విలువైన సొత్తు, నివాసాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉంచుకోవాలంటూ అప్రమత్తం చేస్తున్నారు. ‘పాపిలోన్’ స్కానర్తో తనిఖీలు.. జాతీయ రహదారికి ఆనుకుని వున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పగటిపూట దొంగతనాలు చేసే పగటి దొంగలూ ఉన్నారు. రాత్రిపూట ఇంట్లో చొరబడి దోపిడీలకు పాల్పడే రేచుక్కలూ ఉన్నారు. ఇలా నేరాలకు పాల్పడి తప్పించుకునే అనుమానితులు, నిందితులను ‘పాపిలోన్’ స్కానర్ టెక్నాలజీతో, ఏఎన్పీఆర్ సీసీ కెమెరాలతో పోలీసులు పట్టేస్తున్నారు. నేర పరిశోధనలో పోలీసులకు టెక్నాలజీ తోడైతే..ఎంతటి దొంగైనా పట్టుబడాల్సిందే. నిందితుల వేలిముద్రలను ఆధారంగా ఏళ్ల క్రితం చోరీ చేసి తప్పించుకున్న దొంగను కూడా ఇట్టే పట్టేస్తారు. ఈ నేపథ్యంలో ‘అటెన్షన్ డైవర్షన్’ పాత నేరస్తులను పట్టేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని కూడళ్లలో పోలీసులు తనిఖీలను విస్తృతం చేస్తున్నారు. ఊరెళుతున్నారా..ఇల్లు జాగ్రత్త! నేరాల నియంత్రణ, దొంగతనాల అరికట్టడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు జన సందోహం ఉన్న ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఊర్లకు వెళ్లే వారు తమ ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు ఇతర విలువైన సామగ్రిని ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. పండుగకు ఊర్లకు వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించి ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఎల్హెచ్ఎస్(లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) ఏర్పాటు చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. రాత్రి గస్తీ పెట్రోలింగ్ ముమ్మరం చేసేందుకు వీలవుతుంది..ఇంటిలో చోరీలు జరగకుండా అప్రమత్తం చేస్తున్నారు. జాతీయ రహదారిని అనుకుని ఉన్న ఇళ్లనే దొంగలు ఎంచుకుంటన్నారు. జిల్లాలో ’అటెన్షన్ డైవర్షన్’ ముఠాలు.. ప్రస్తుతం జిల్లాలో ప్రజల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడే తిరుగుతున్నట్లు నిఘా సమాచారం వచ్చింది. పండగ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వస్త్ర దుకాణాలు, బంగారం దుకాణాలు, బ్యాంక్లు, ఏటీఎంల వద్ద వినియోగదారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారపు సంతలు, బ్యాంకులు, గ్రామ ఉత్సవాల వద్ద రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో ఈ ముఠాలు తిరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే ఆహారం, పానీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. బ్యాంకుల వద్ద లేదా రద్దీ ప్రదేశాల్లో ఎవరైనా మీ దుస్తులపై మురికి పడిందని చెప్పినా, డబ్బులు కింద పడ్డాయని చెప్పినా అప్రమత్తంగా ఉండాలి.‘ప్రజల రక్షణకే మా ప్రాధాన్యత. పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుంది. అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే డయల్ 100/ డయల్ 112కు సమాచారం ఇవ్వాలి. – తుహిన్ సిన్హా, ఎస్పీ, అనకాపల్లి జిల్లా సంక్రాంతి వేళ ’అటెన్షన్ డైవర్షన్’ ముఠాలు రద్దీ ప్రాంతాల్లోనే ఈ ముఠాలు టార్గెట్ వస్త్ర దుకాణాలు, బ్యాంకులు, గ్రామ ఉత్సవాల్లో చేతివాటం అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచనలు గతేడాది వివరాలు ఇలా.. జిల్లాలో 3,573 సీసీ కెమెరాలు కొత్తగా ఏర్పాటు చేశారు గతేడాదిలో సాంకేతికత సహాయంతో 41 కేసులు, వేలిముద్రలు (ఏఎఫ్ఐఎస్) ద్వారా 58 కేసులను పోలీసులు ఛేదించారు. -
కింగ్
బిర్యానీయేవిశాఖపట్నం ఇప్పుడు కేవలం స్టీల్ సిటీ మాత్రమే కాదు.. రుచుల రాజధానిగానూ మారిపోయింది. ఫుడ్ లవర్స్కు వైజాగ్ కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’వెల్లడించింది. 2025లో అక్షరాలా 13 లక్షల చికెన్ బిర్యానీలు వైజాగ్ వాసుల ఆకలి తీర్చాయంటే.. ఆ రుచికి నగరం ఎంతగా దాసోహమైందో అర్థం చేసుకోవచ్చు. పల్లె రుచులైనా, పశ్చిమ దేశాల బర్గర్లైనా.. మనసు గెలుచుకోవాలంటే అది ప్లేటులోకి రావాల్సిందేనంటూ నగరవాసులు తెగ ఆర్డర్ చేశారని స్విగ్గీ విడుదల చేసిన ‘హౌ ఇండియా స్విగ్గీడ్’నివేదిక చెబుతోంది. 2025లో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో స్విగ్గీ ద్వారా జరిగిన ఆర్డర్లకు సంబంధించి ఆసక్తికరమైన వివరాలను ఈ నివేదికలో పేర్కొంది. ఉదయం స్వదేశీ.. సాయంత్రం విదేశీ! నగర ప్రజలు ఉదయం వేళ సంప్రదాయ రుచులకు ప్రాధాన్యమిస్తే, సాయంత్రం వేళల్లో వెస్ట్రన్ స్నాక్స్పై మొగ్గు చూపారు. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్లలో దోశ అగ్రస్థానంలో నిలిచింది. 2025లో ఏకంగా 1.47 లక్షల దోశలు ఆర్డర్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో 1.43 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ నిలిచింది. ఒక్కో ఆర్డర్కు సగటున 3 ఇడ్లీలు అని లెక్కేసుకున్నా.. ఏకంగా 4.3 లక్షల ఇడ్లీలను నగర ప్రజలు ఆరగించేశారు. ఇక సాయంత్రం వేళల్లో ఏదైనా తినాలనిపిస్తే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది చికెన్ బర్గర్. రోజుకు సగటున 165 చికెన్ బర్గర్లు ఆర్డర్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చికెన్ ఫ్రై, చికెన్ నగ్గెట్స్.. ఇలా ఏది చెప్పుకున్నా విశాఖ ప్రజలు మంచి టేస్ట్ ఉన్న భోజన ప్రియులని స్విగ్గీ కితాబిచ్చింది. ఫిట్నెస్లోనూ తగ్గేదేలే! ఆహారమే కాదు, ఆరోగ్యంపైనా నగరవాసులు శ్రద్ధ చూపారు. ఫుడ్ విషయంలో ఎలా ఆరగించారో.. ఫిట్నెస్ విషయంలోనూ అదే స్థాయిలో పోటీపడ్డారు. ఏడాది పొడవునా 2.12 లక్షల హై ప్రోటీన్ ఫుడ్ ఆర్డర్లు నమోదవ్వడం విశేషం. మరోవైపు ‘ఫుడ్ ఆన్ ట్రైన్’ఫీచర్ ద్వారా నగరంలో ఆర్డర్లు ఏకంగా 171 శాతం పెరిగాయి. రైళ్లలో ప్రయాణించేవారు విశాఖ రైల్వే స్టేషన్కు వస్తూ.. తమ కోచ్, సీట్ నంబర్తో ఆర్డర్ పెట్టి మరీ ఆరగించేశారు. ఆఫీసుల్లో పనిచేసే వారు డెస్క్ ఈట్స్ ద్వారా చికెన్ పాప్కార్న్, ఇడ్లీ, మసాలా దోశలను ఎక్కువగా ఇష్టపడ్డారు. ఒకేసారి 16 పిజ్జాలు.. 28 కేకులు పార్టీలు చేసుకోవడంలోనూ వైజాగిటీస్ కొత్తదనం చాటుకుంటున్నారు. ఒకే ఆర్డర్లో రూ.17 వేల విలువ చేసే 16 పిజ్జాలు, 28 చాకోలావా కేక్స్ తెప్పించుకోవడం గమనార్హం. ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై ఆర్డర్ చేసుకున్నారంట. చాక్లెట్ కేక్స్, మ్యాంగో రసమలాయ్, గులాబ్ జామూన్లకు కూడా వైజాగ్ వాసులు ఫిదా అయిపోయారు. మొత్తంగా విశాఖ అంటే.. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’అనుకుంటివా..‘సిటీ ఆఫ్ ఫుడీస్’అని పుష్ప స్టైల్లో డైలాగ్స్ చెబుతున్నారంటూ స్విగ్గీ నివేదిక చమత్కరించింది. వైజాగ్ వాసులు బిర్యానీ ప్రియులు ఉదయం పూట వేడి వేడి దోశల పలకరింపు.. మధ్యాహ్నం వేళ ముచ్చటైన బిర్యానీ విందు.. సాయంత్రం చిరుజల్లులో చికెన్ బర్గర్ల సందడి.. అర్ధరాత్రి ఆకలికి మళ్లీ చికెన్ బిర్యానీ! సాగర కెరటాల హోరుకు, స్పైసీ బిర్యానీ హుషారు తోడైతే ఆ మజాయే వేరంటూ విశాఖ వాసులు ఫుడ్ను ఎంజాయ్ చేస్తున్నారు. – సాక్షి, విశాఖపట్నం చికెన్ బిర్యానీ భళా 2025 ఏడాదికి సంబంధించి స్విగ్గీ నివేదిక ప్రకారం.. వైజాగ్ వాసులు తిండి విషయంలో కొత్త రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ పట్ల తమకున్న అంతులేని మమకారాన్ని 13.12 లక్షల ఆర్డర్లతో చాటిచెప్పారు. ఏడాది పొడవునా ఈ స్థాయి ఆర్డర్లు నమోదయ్యాయి. విశేషమేమిటంటే.. అర్ధరాత్రి తర్వాతే ఎక్కువ మంది బిర్యానీ తినడానికి ఇష్టపడ్డారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య చికెన్ బిర్యానీ ఆర్డర్లు ఏకంగా 48 శాతం పెరిగాయి. 2024తో పోలిస్తే డిన్నర్ ఆర్డర్లలో 23 శాతం వృద్ధి నమోదైంది. -
అధిక లోడు వాహనాలపై కేసు నమోదు
కేసు నమోదైన ఇసుక లారీ అచ్యుతాపురం రూరల్ : మితి మీరిన బరువుతో రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై అచ్యుతాపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం మండలంలో పలు చోట్ల రహదారులపై మితిమీరిన బరువుతో అలాగే గూడ్స్ వ్యాన్లలో మితిమీరిన జనాన్ని తరలించిన వాహనాలపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న ఇసుక లారీపై రూ.20వేల జరిమానా విధించారు. ఇంకా అనేక వాహనాలపై కూడా జరిమానాలు వేసినట్టు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఎవరైనా పరిమితికి మించి వాహనాలు రాకపోకలు చేసినా, ట్రాఫిక్కి అంతరాయం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. -
104 ఉద్యోగుల నిరసన
మాడుగుల రూరల్ : 104 మైబెల్ మెడికల్ యూనిట్ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 మైబెల్ మెడికల్ యూనిట్ ఉద్యోగులు యూనియన్ జిల్లా అధ్యక్షుడు శీరంరెడ్డి భార్గవ్ ఆధ్వర్యంలో ముకుందపురం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఏడు మాసాల నుంచి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోగా, అనేక వేధింపులకు గురిచేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తున్న భవ్య హెల్త్ కేర్ సర్వీసు ప్రెవేటు లిమిటెడ్ సంస్ద సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్నారు. గతంలో నిర్వహణ బాధ్యతను నిర్వహించిన అరబిందో సంస్ద 104 ఉద్యోగులకు చివరి నెలల్లో చెల్లించిన జీతాల్లో ప్రతి ఉద్యోగికి రూ. 500 నుంచి రూ.2000 వరకు కోతలు విధించిదని, అనేక సంవత్సరాలు నుంచి అమలులో వున్న 15 క్యాజువల్ లీవ్లను పూర్తిగా రద్దు చేసిందని, బఫర్ సిబ్బందిని తొలగించిందని, ప్రస్తుత యాజమాన్యం ఉద్యోగ సంఘాల నాయకులకు షోకాజ్ నోటీసులు అందజేసి, సస్పెండ్ చేస్తూ ఆన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్కి పాలడుతోందని పేర్కొన్నారు. 104 ఉద్యోగుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబు సెలవులో ఉండగా, వాహన తనిఖీల్లో బాధ్యుడిని చేస్తూ గత నెల 16వ తేదీన సస్పెండ్ చేసిందన్నారు. అరబిందో చెల్లించిన చివరి నెల వేతనాలను ప్రతి ఉద్యోగికి కొనసాగించాలని, ఇప్పటి వరకు తగ్గించిన వేతనాలను బకాయిలతో సహా చెల్లించాలని, రద్దు చేసిన క్యాజువల్ లీవ్లను పునరుద్ధరించాలని, ఐదేళ్లు కాలపరిమితి పూర్తి చేసుకున్న 104 వాహన డ్రైవర్లకు నూతన స్లాబ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.18,500 వేతనం చెల్లించాలని, తొలగించిన బఫర్ సిబ్బందిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సిబ్బంది విజయ్, మనీసు, గంగాధర్, పాల్గొన్నారు.25న సమ్మెకు సిద్ధం..అనకాపల్లి: ఏపీ 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, దఫదఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపినప్పటికీ పరిష్కరించకోపవడంతో ఈనెల 25న సమ్మెకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా 108 ఉద్యోగుల సంఘం ప్రతినిధి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలో డీఎంహెచ్వో హైమావతికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవ్య సంస్థ వచ్చి నేటికి 7 నెలలు చేసుకున్నప్పటీకీ నేటికీ ఏ ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదని, ప్రతి నెలా జీతంలో తగ్గుదల జరుగుతుందని, తక్షణమే ఉద్యోగుల పే స్లిప్స్ను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతి అందజేశారు. -
రైడ్ ఫర్ రోటరీ యాత్రకు స్వాగతం
అనకాపల్లి : ప్రపంచ శాంతి కోసం మోటార్ సైకిల్పై (రైడ్ ఫర్ రోటరీ) విదేశీయుల(రోటరీ సభ్యుల బృందం 21 మంది) యాత్ర స్థానిక జాతీయ రహదారికి గురువారం చేరుకుందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు సోమసుందరం, కార్యదర్శి ప్రకాష్రావు అన్నారు. అంతర్జాతీయ అవగాహన, స్నేహభావం, ప్రపంచ శాంతిని పురస్కరించుకుని కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, రోమేనియా, నార్వే, బెల్జియం, పోలాండ్, ఆస్ట్రేలియా, డెన్మార్క్ దేశాలకు చెందిన రోటరీ బృందం మోటర్ సైకిల్ యాత్ర విశాఖ నుంచి మైసూర్కు బయలు దేరిందన్నారు. యాత్రలో పాల్గొన్న సభ్యులకు అనకాపల్లిలో ప్రసిద్ధి చెందిన సేంద్రియ చెరకు రసాన్ని అందజేశారు. పాయకరావుపేట : రైడ్ ఫర్ రోటరీ యాత్రికులు శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. శ్రీ ప్రకాష్ రోటరాక్ట్ బృందం, విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్.విజయ్ ప్రకాష్, రోటరీ గవర్నర్ డా.కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ క్లబ్, రోటరాక్ట్ బృందం వీరికి ఘన స్వాగతం పలికారు. -
ప్రభుత్వమా కళ్లు తెరిచి చూడు..!
ఫ్యాక్టరీ గేటు వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలుపుతున్న రైతు సంఘాల ప్రతినిధులు చోడవరం : ఈ ఏడాది గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని, చెరకు రైతులకు వెంటనే చెరకు బకాయిలు చెల్లించాలని కోరుతూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వ రైతుల సమస్యలు పట్టించుకోకుండా కళ్లు మూసుకొని ఉందని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఫ్యాక్టరీ మెయిన్గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసన రిలేదీక్ష శిబిరం గురువారం 7వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా సీపీఐ, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ, ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు, ఏపీ చెరకు రైతు సంఘం, వ్యవసాయ కూలీసంఘం, ఏపీ రైతు సంఘం, ఈ శిబిరంలో పాల్గొని నిరసన తెలిపారు. చెరకు రైతుల జీవితాలతో ఆడుకోవద్దని వారు హెచ్చరించారు. తమను గెలిపిస్తే ఫ్యాక్టరీని ఆదునీకరించి, చెరకు రైతులకు టన్నుకి రూ. 4వేలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి రైతులు, రైతు కూలీల, కార్మికులను కూటమి ప్రజాప్రతినిధులు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫ్యాక్టరీ క్రషింగ్ వెంటనే ప్రారంభించాలని, కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా అధ్యక్షుడు వి. శ్రీనువాసరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, ఏపీ చెరకు రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, రైతు సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ శానాపతి సత్యారావు, ఏడువాక శ్రీను, సుగర్ ప్యాక్టరీ కార్మిక సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాయి సూరిబాబు, శరగడం రామునాయుడు, జిల్లా వ్యవసాయ కూలీ సంఘం అధ్యక్షుడు కోన మోహన్రావు, సిఐటియూ నాయకుడు ఎస్.వి.నాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, నాగిరెడ్డి సత్యనారాయణ, ఆర్.దేముడునాయుడు, వనం సూర్యనారాయణ, పోతల శ్రీరాముల పాల్గొన్నారు. -
‘12వ తేదీ నుంచి హైర్ బస్సులు నిలిపివేస్తాం’
అనకాపల్లి: ప్రజా రవాణాశాఖ(ఆర్టీసీ)లో హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలు పరిష్కరించాలని, సీ్త్ర శక్తి పథకం వల్ల హైర్ బస్ ఓనర్స్ ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ ప్రతినిధి కె.శ్రీను అన్నారు. అందువల్ల ఈనెల 12 నుంచి తమ సమస్యలు పరిష్కరించే వరకూ బస్లను నిలుపుదల చేస్తామని తెలిపారు. స్థానిక ప్రజారవాణాశాఖ జిల్లా అధికారి వి.ప్రవీణకు గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రెండు కమిటీలతో సమావేశం నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, సీ్త్ర శక్తి పథకంపై ఒక్కో బస్సుకు సుమారుగా రూ.40వేలు నష్టం వస్తూంటే తూతూ మంత్రంగా కేవలం రూ.5వేలు మాత్రం నష్టం వస్తుందని సర్కులర్ ఇవ్వడం జరిగిందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గౌతమ్, కె.దేముడు, కె.జగదీష్, జి.జగ్గారావు, జె.విజయలక్ష్మి, బి.సందీప్ పాల్గొన్నారు. -
విద్యార్థి వైద్యానికి ‘మనం’ చేయూత
విద్యార్థిని కుటుంబానికి రూ.లక్ష చెక్కు అందిస్తున్న ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, సీఐ ధనుంజయరావు యలమంచిలి రూరల్: బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న పేద విద్యార్థినికి మేమున్నామంటూ యలమంచిలికి చెందిన మనం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు చికిత్స నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. రాంబిల్లి మండలం మామిడివాడ కొత్తూరు జెడ్పీ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్న కొప్పోజు పావని ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు విశాఖ కేజీహెచ్కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా వైద్యులు బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టు తెలిపారు. దీని వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని, చికిత్స చేయించాలని సూచించారు. పావని తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్థోమత లేదని, ఆర్థిక సాయం అందజేయాలని విద్యార్థిని చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయురాలు అద్దాల అనిత మనం ట్రస్టు ప్రతినిధులను కోరారు. ఈ మేరకు ట్రస్టు ప్రతినిధులు గురువారం విద్యార్థిని కుటుంబానికి మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య, సీఐ ధనుంజయరావు చేతుల మీదుగా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరునాయుడు మాస్టారు, మురుకుర్తి గోపి, పి.సురేష్, ట్రస్టు ప్రతినిధులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరినారాయణ చోడవరం: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి హరినారాయణ అన్నారు. చోడవరం చైతన్య బీఈడీ కాలేజీలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు చట్టాలపై న్యాయమూర్తి అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే చట్టాలు తెలుసుకోవడం వల్ల నేరాలకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వి.గౌరీశంకరరావు, సీఐ పి.అప్పలరాజు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చీపురపల్లి సూర్యనారాయణ, న్యాయవాది ఎం.జ్యోతి, కాలేజీ కరస్పాండెంట్ లోవరాజు పాల్గొన్నారు. -
నర్సీపట్నం ఉపాధ్యాయినికి యోగాలో గోల్డ్ మెడల్
పుదుచ్చేరి సీఎం రాఘవస్వామి చేతుల మీదుగా గోల్డ్మెడల్ అందుకుంటున్న ఉపాధ్యాయుని విజయనిర్మల నర్సీపట్నం : పుదుచ్చేరి రాష్ట్రంలో జరిగిన అంతర్జాతీయ యోగా పోటీల్లో నర్సీపట్నంకు చెందిన ఉపాధ్యాయుని విజయనిర్మల బంగారు పతకం సాధించారు. పుదుచ్చేరి స్టేట్ డిపార్టుమెంట్ ఆఫ్ టూరిజం వారు డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు అంతర్జాతీయ యోగా ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. పాయకరావుపేట ప్రభుత్వ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న, నర్సీపట్నంకు చెందిన ఉపాధ్యాయిని పి.విజయనిర్మల ఈ పోటీల్లో పాల్గొన్నారు. 40 ఏళ్ల విభాగంలో విజయనిర్మల బంగారు పతకం సాధించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాఘవస్వామి, టూరిజం మంత్రి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు. -
వివేకానందుడే ఆదర్శం
తుమ్మపాల : వివేకానందుడు అందరికీ స్ఫూర్తిదాయకుడని, ఆయన్ను స్పూర్తిగా తీసుకుని వివేకం, విజ్ఞానం, నిరంతర శ్రమతో విజయానికి బాటలు వేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు విద్యార్థులకు సూచన చేశారు. ఈ నెల 12న నిర్వహించనున్న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జాతీయ యువజన ఉత్సవాన్ని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన స్వామి వివేకానంద చిత్రపటం వద్ద నివాళులర్పించి వ్యాసరచన, పెయింటింగ్, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. రాష్ట్ర స్థాయి హై జంప్ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన రోలుగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న బి.జననిని శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రం అందించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువజన సర్వీసులు శాఖ ముఖ్యకార్య నిర్వహణ అధికారి ఎం.రమ్య మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉండాలని, సమాజ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి ఎం.వినోద్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తల్లిదంండ్రులు,సెట్వీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
24 గంటల్లోనే బంగారం దొంగ పట్టివేత
రావికమతం : చోరీ జరిగిన 24 గంటల్లోనే కొత్తకోట పోలీసులు కేసు చేధించి దొంగలను పట్టుకుని రూ.6 లక్షల విలువైన మూడున్నర తులాల బంగారు హారంను రికవరీ చేశారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జెడ్.కొత్తపట్నంకు చెందిన పైలా వెంకటలక్ష్మి ఆటోలో ప్రయాణిస్తుండగా రూ.6 లక్షల విలువైన బంగారం హారం పోగొట్టుకుంది. ఆమె మంగళవారం గ్రామానికి చెందిన మరో మహిళతో కలిసి నర్సీపట్నం స్టేట్బ్యాంక్కి వెళ్లి తాను కుదవ పెట్టిన బంగారం విడిపించుకొని చేతిసంచిలో పెట్టుకుంది. అనంతరం సంక్రాంతి పండగకు వస్త్రాలు కొనుగోలు చేసి సాయంత్రం నర్సీపట్నం పీవీఆర్ సినీమాక్స్ సెంటర్లో రావికమతానికి చెందిన ఆటో ఎక్కారు. అప్పటికే ఆటోలో మరో ఇద్దరు మహిళలు, మరో యువకుడు ఉన్నారు. యువకుడు చెట్టుపల్లిలో ఆటో దిగి వెళ్లిపోగా, ఇద్దరు మహిళలు రోలుగుంటలో దిగి వెళ్లిపోయారు. వెంకటలక్ష్మి కొత్తకోటలో ఆటో దిగి ఆటో డ్రైవర్కి డబ్బులు ఇవ్వడానికి బ్యాగ్ను తీయగా బంగారం అభరణం కనిపించలేదు. దీంతో హారం చోరీ అయిందని గ్రహించి ఆమె కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, అర్జున్, కానిస్టేబుల్ జల్లిబాబుతో కలిసి విచారణ ప్రారంభించారు. ఆటో వెళ్లిన దారిలో సీసీ కెమెరాల్లో రికార్డు అయన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఎఎన్ఆర్ కెమెరా సహాయంతో పోలీసులు బందాలుగా ఏర్పడి చాకచక్యంగా వ్యవహరించి నిఘా పెట్టారు. మాడుగుల, కొత్తవలస ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని బంగారు హారం, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్గా గుర్తించారు. చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. రికవరీ చేసిన బంగారు హారంను కోర్టు అనుమతితో బాధితురాలు వెంకటలక్ష్మికి అప్పగిస్తామని సీఐ తెలిపారు. బంగారం చోరీ కేసును 24 గంటల్లోనే ఛేదించి సొత్తు రికవరీ చేసిన కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, అర్జున్, సిబ్బంది జల్లిబాబు, సప్తగిరి తదితర సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. -
ఫ్లెమింగ్ ఫెస్టివల్లో కార్టూన్ ప్రదర్శనకు ఆహ్వానం
నాతవరం: తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఈ నెల 10, 11 తేదీల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఫ్లెమింగ్ ఫెస్టివల్లో చంటిబాబు మాస్టారు వేసిన కార్టూన్ను ప్రదర్శించనున్నారు. నాతవరం మండలం చమ్మచింత పాఠశాలలో పని చేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ కార్టూనిస్టు అంచటి చంటిబాబు పర్యావరణ సమతుల్యం, వన్యప్రాణుల పరిరక్షణ, అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యం, తదితర అంశాలు ప్రతిబింబించేలా కార్టూన్ గీశారు. ఈ ఉత్సవాల్లో కార్టూన్ ప్రదర్శించేందుకు విద్యా శాఖ ద్వారా గురువారం ఆయనకు ఆహ్వానం అందింది. దీంతో చంటిబాబును పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. ఉత్సవాల్లో ఉత్తమ కార్టూన్గా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. -
అవయవదానంపై అవగాహన పెరగాలి
చోడవరం : మనిషి మరణించిన తర్వాత కూడా జీవించి ఉండాలంటే ప్రతి ఇక్కరూ శరీర అవయవ దానం చేయాలని అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ అన్నారు. స్థానిక ఉషోదయ విద్యాసంస్థల ఆవరణలో విశ్వనాథం టైప్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శరీర అవయవదానంపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ చనిపోయిన తర్వాత శరీరాన్ని మట్టిలో బూడిదగా కలిపేయకుండా శరీర అవయవాలను దానం చేయడం ద్వారా మరి కొంత కాలం ఆ మనిషి పరోక్షంగా బతికేటట్టు ఆలోచన చేయాలన్నారు. అవయవ సమస్యలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి వారికి చనిపోయిన వారి శరీర అవయవ దానం చేయడం ద్వారా వారికి ప్రాణదానం చేసిన వారవుతారన్నారు. పుట్టిన వాడు ఎప్పుడైనా చనిపోక తప్పదని అదే వారు శరీర అవయవదానం చేస్తే మరికొంత కాలం జీవించి ఉన్నట్టేనని అన్నారు. అంతేకాకుండా మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్టు అవుతుందన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మరియాల కృష్ణారావు, నిర్వాహకుడు పసుమర్తి బాబ్జి, ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ జెర్రిపోతుల రమణాజీ, గవర్నమెంటు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్కుమార్, జి. గోవిందనాయుడుపాల్గొన్నారు. శరీర, అవయవదానం చేసిన దంపతులు తమ శరీర అవయవదానంతో కొందరికి ప్రాణదానం చేయాలన్న ఆశయంతో తమ శరీరాలను దానం చేస్తున్నామని చోడవరానికి చెందిన వృద్ధ దంపతులు పసుమర్తి సత్యనారాయణ, అన్నపూర్ణమ్మ చెప్పారు. చోడవరంలో జరిగిన అవయదానం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వారు ఈ సందర్భంగా తమ శరీర, అవయవాలను దానం ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ పత్రాలను అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీకి అందజేశారు. ఈ దంపతుల ఔదార్యానికి అంతా అభినందించారు. -
మోతాదుకు మించి ఎరువుల వినియోగం అనర్థదాయకం
మునగపాక పీఏసీఏస్ ఆవరణలోని ఎరువుల గొడౌన్లో రికార్డులు పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి మునగపాక: మోతాదుకు మించి ఎరువులు వినియోగించడం వల్ల రైతులకు నష్టాలు తప్ప ఫలితం ఉండదని వ్యవసాయ శాఖ జేడీ ఎం.ఆశాదేవి తెలిపారు. గురువారం ఆమె మునగపాక పీఏసీఎస్ ఆవరణలోని ఎరువుల గొడౌన్ను తనిఖీ చేశారు. ఎంతమేర యూరియా వచ్చింది.. ఇంత వరకు ఎంత మందికి పంపిణీ చేశారన్న వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. అనంతరం రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. యూరియా వినియోగంలో రైతులు తగు జాగ్రత్తలు వహించాలన్నారు. గడ్డికి యూరియాను ఎక్కువ మోతాదులో వేయడం ద్వారా పశువులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు నానో యూరియాపై దృష్టి సారించాలన్నారు. గత ఖరీఫ్లో అవసరం కన్నా ఎక్కువ మొత్తంలో యూరియా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రబీకి డివిజన్ పరిధిలో 15,559 టన్నుల మేర యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు సుబ్రహ్మణ్యం, మండల వ్యవసాయాధికారి సీహెచ్ జ్యోత్స్నకుమారి, వీవోఏ లలిత, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దాడి ముసిలినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ–పంట నమోదుపై దృష్టి ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి సాయం అందాలన్న తప్పనిసరిగా ఈ–పంట నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఎం.ఆశాదేవి కోరారు. ఇందుకోసం అధికారులు గ్రామాల్లోకి వచ్చే నమోదు చేసుకునే సమయంలో రైతులు అందుబాటులో ఉండాలన్నారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 6,21,580 ఎల్పీలు లక్ష్యం కాగా.. ఇంతవరకు 56 వేలకు పైగా ఈ–పంట నమోదు చేసుకున్నారన్నారు. రబీలో ఈ–పంట నమోదు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
పంచాయతీ అధికారుల అత్యుత్సాహం
తుమ్మపాల: పదేళ్ల క్రితం రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచిన అధికారులే నేడు కలెక్టర్ కారుకు అడ్డుగా ఉన్నాయని పచ్చని చెట్లను కూల్చేశారు. మండలంలో రేబాక–గోపాలపురం రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలతో రోడ్డు ఇరుకుగా తయారైందని పంచాయతీ అధికారులు దుకాణాలను వెనక్కి జరిపించారు. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూడా తొలగించేయడంతో అటుగా రాకపోకలు చేస్తున్న ప్రయాణికులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మండలంలో కోడూరు పంచాయతీ పరిధిలో ఎంఎస్ఎంఈ పార్క్ వద్ద ఉన్న కలెక్టర్ బంగ్లా నుంచి శంకరంలోని కలెక్టరేట్కు రేబాక –గోపాలపురం రోడ్డు మీదుగా నిత్యం రాకపోకలు చేస్తున్నారు. అసలే ఇరుగ్గా ఉండే ఈ రహదారి ఆయా గ్రామాల ప్రజల రాకపోకలతో మరింత రద్దీగా ఉంటుంది. కలెక్టర్ కారుకు దారి ఇవ్వలేదంటూ ఆరు నెలల క్రితం పలు వాహనాలపై కేసులు నమోదు, ట్రాక్టర్లను సీజ్ చేయడం, రేబాకలోని మద్యం దుకాణం వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలపై కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్ కారు కూతకు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల ఓ చిరు దుకాణం వద్ద కలెక్టర్ కారుకు మరో వాహనం అడ్డంగా ఉండడంతో ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులను ఆమె హెచ్చరించారు. అందుకే పంచాయతీ అధికారుల ఆగమేఘాల మీద ఈ రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలతో పాటు చెట్లను కూడా తొలగించేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.కలెక్టర్ కారు రాకపోకల కోసం చెట్ల తొలగింపు -
200 కిలోల గంజాయి స్వాధీనం
అనకాపల్లి: మాడుగుల మండలం ఎం.కొడూరులో 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఆమె అనకాపల్లి కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు. వి.మాడుగుల పోలీస్స్టేషన్ పరిధిలో ఎస్ఐ నారాయణరావు వాహనాలు మంగళవారం తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయి బయటపడినట్టు చెప్పారు. వ్యాన్, ద్విచక్రవానాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి విజయవాడకు తీసుకుని వెళుతున్నట్లు గుర్తించామని, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పంచాయతీ వంట్లమామిడి గ్రామానికి చెందిన కొర్ర కొండబాబు, హుకుంపేట మండలం గుడా గ్రామానికి చెందిన కొమ్మ సతీష్కుమార్, అదేమండలం డప్పబంద గ్రామానికి చెందిన కొర్ర అనిల్ కుమార్ను అరెస్టు చేసినట్టు చెప్పారు. కృష్ణాజిల్లా గన్నవరం గ్రామా నికి చెందిన తడిశెట్టి దుర్గారావు పరారైనట్టు తెలిపారు. నిందితులను రిమాండ్కు పంపినట్టు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మాడుగుల సీఐ పి.పైడపునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2026
● నవ్వి పోదురుగాక..● క్రెడిట్ చోరీలో చంద్రబాబును అనుసరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ● గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని..తామే చేశామంటూ ప్రచారం ● వైఎస్ జగన్ హయాంలో 90శాతం పూర్తయిన అభివృద్ధి పనులు ● తామే చేసినట్లుగా ప్రారంభిస్తున్న మంత్రులు, కూటమి నేతలు ● అనకాపల్లిలో రూ.30.35 కోట్లతో క్రిటికల్ కేర్ ఆస్పత్రి నిర్మాణం యథా బాబు.. తథా తమ్ముళ్లువైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగం కమిటీలో పలువురికి చోటు అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగం కమిటీలో జిల్లాకు చెందిన పలువురికి చోటు కల్పించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్ సెల్ సహాయ కార్యదర్శిగా గొర్లె రాజేష్(పెందురి), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా ఎం.శ్రీను(అనకాపల్లి), రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా వి.కృష్ణచైతన్య(అనకాపల్లి), రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా కలగ గున్నయ్యనాయుడు(కశింకోట), రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా దండ జ్ఞానదీప్ (అనకాపల్లి)ను నియమించారు. వారితో పాటుగా అనకాపల్లి పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా కాండ్రేగుల హైమావతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.టీడీపీ ప్రభుత్వంలో క్రెడిట్ చోరీ సంస్కృతిని చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అనుసరిస్తున్నారు. సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది అన్నట్టుగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులన్నీ తామే చేసినట్టు గొప్పలు చెప్పుకొంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకోడానికి ఒక్కటి కూడా లేకపోవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో నిస్సిగ్గుగా వేసుకుని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సాక్షి, అనకాపల్లి: జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో సగానికి పైగా గత ప్రభుత్వంలో పూర్తవగా, మిగిలినవి 90 శాతం పూర్తి చేశారు.అయితే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లాలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేర్లను మార్చి తమ ఖాతాలో వేసుకున్న కూటమి నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వారి ప్రచారయావ పరాకాష్టకు చేరడంతో జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం అనకాపల్లిలో ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదుట రూ.30.35 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ నుంచి అన్ని అభివృద్ధి పనుల్లో క్రెడిట్ చోరీకి చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతోంది. నాడు వైఎస్ జగన్ భూమి పూజ చేసిన అదాని గూగుల్సెంటర్, నక్కపల్లి బల్క్ డ్రగ్పార్క్ తమ హయాంలోనే వచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటూ మళ్లీ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తయింది. అధికారంలో చేపట్టిన తరువాత కనీసం ఒక్క ఇటుక కూడా వేయకుండానే..గత ప్రభుత్వంలో మంజూరైన వాటికి ప్రారం భోత్సవాలు చేస్తున్నారు. అంతేకాకుండా అనకాపల్లి జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.2.3 కోట్లతో చేపట్టిన ఆర్డీవో కార్యాలయం, 2.5 కోట్లతో నిర్మాణం చేపట్టిన వీఎంఆర్డీఏ పార్కు అభివృద్ధి, నక్కపల్లిలో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన బాలికల వసతి గృహం, ఉపమాకలో రూ.40 లక్షలతో గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయాన్ని, రూ.90 లక్షలతో నిర్మాణం చేపట్టిన జిల్లా డిజిటల్ గ్రంథాలయం, రూ.6.25 కోట్లతో నిర్మాణం చేపట్టిన సామాజిక భవనాల క్రెడిట్ను కూటమి మంత్రులు చోరీ చేసి, ప్రారంభోత్సవాలు చేసి తమ హయాంలోనే నిర్మాణాలు చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కార్పొరేట్కు దీటుగా క్రిటికల్ కేర్.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, విషమ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలను అందించేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో రూ.30.35 కోట్లతో అత్యాధునిక క్రిటికల్ కేర్ను ఏర్పాటు చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలందాలనే ముందుచూపుతో నాటి అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి చొరవతో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్న్(పీఎం–ఏబీహెచ్ఐఎం)కింద క్రిటికల్ కేర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎస్సార్ నిధులు, ఎంపీ నిధులతో ట్రామాకేర్, డయాలసిస్ బ్లాక్, డాక్టర్స్ డైనింగ్ హాళ్లు (మేల్, ఫీమేల్), ఎంసీహెచ్(2 బెడ్స్), ఎల్డీఆర్, ఆల్ట్రా సౌండ్ రూం, ప్లాస్టర్ రూం, పీఎంసీ ల్యాబ్, ఎలక్ట్రికల్ రూం, డ్యూటీ డాక్టర్ ఎగ్జామినేషన్ రూం, ఎమర్జెన్సీ వార్డు, నర్సస్ రూం, ఇంజక్షన్ డ్రెస్సింగ్ రూం, ఫస్ట్ ప్లోర్లో ఐఎస్వో రూం, డైనింగ్ హాల్స్–2, ఐఎస్వో వార్డు, అత్యాధునిక ఐసీయూ, స్టాఫ్ రూం..సెకండ్ ఫ్లోర్లో హెచ్డీయూ, అనస్తీషియా రూం, ఐసీయూ, ఓపీను ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే మూడోంతులు నిర్మాణం పూర్తయింది. మరో వారం రోజుల్లో క్రిటికల్ కేర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనిని కూడా చంద్రబాబు సర్కార్ తన ఖాతాలో వేసుకునేందుకు యత్నాలు చేస్తోంది. రూ.6.25 కోట్లతో సామాజిక భవనాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి నిధులు, సీఎస్సార్ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో సగానికి పైగా, మరికొన్ని 90 శాతానికిపైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తయ్యాయి. వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోంది. ● అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలో పూడిమడక రోడ్డు వద్ద కోల్ ఇండియా నిధులు రూ. 89.9 లక్షలతో జిల్లా గ్రంథాలయం, డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. పీఎంఎఫ్ఎం నిధులు రూ.3.7 కోట్లతో ఆర్ఏఆర్ఎస్లో ఇంక్యుబేషన్ సెంటర్ను, వల్లూరులో రూ.70 లక్షలతో సావిత్రీబాయి పూలే మహిళా సాధికార భవనం, రూ.70 లక్షలతో డాక్టర్ వైఎస్సార్ మహిళా క్రీడాకారుల వసతి ప్రాంగణం, తుమ్మపాల విద్యుత్ నగర్లో రూ.30 లక్షలతో ముదిరాజుల జిల్లా భవనం, గాంధీనగర్లో రూ.20 లక్షలతో బీసీ హాస్టల్ రీడింగ్ రూం, రూ.20 లక్షలతో ఎస్సీ హాస్టల్ రీడింగ్ రూం, శంకరం గ్రామంలో రూ.1.50 కోట్లతో 500 సిటింగ్ కెపాసిటీతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనం ఏర్పాటు చేశారు. ● చోడవరం నియోజకవర్గంలో వెంకన్నపాలెంలో రూ.20 లక్షలతో వాయిద్య కళాకారుల జిల్లా భవనం, మాడుగుల నియోజకవర్గంలో రూ.30 లక్షలతో మోదమాంబ సామాజిక భవనం, మాడుగుల పట్టణ ంలో రూ.5 లక్షలతో ఆరు సామాజిక భవనాలు, కశింకోట గ్రామంలో ఎస్సీ కాలనీలో రూ.50 లక్షలతో అంబేడ్కర్ సామాజిక భవన నిర్మాణాలు చేపట్టారు. ● పాయకరావుపేట నియోజకవర్గంలోని పాయకరావుపేట మండలం పెంటకోట వద్ద రూ.20 లక్షలతో సామాజిక భవనం, యలమంచిలి పట్టణంలో రూ.20 లక్షలతో సామాజిక భవనం, నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలో కోడూరులో రూ.30 లక్షలతో సామాజిక భవనం, నర్సీపట్నం టౌన్లో రూ.20 లక్షలతో సామాజిక భవనం ఏర్పాటు చేశారు. మొత్తం అన్నీ పూర్తయ్యాయి. అయితే వీటిని కూటమి నాయకులు తమఖాతాలో వేసుకోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గత ప్రభుత్వంలో చేసిన వాటిలో కొన్ని అభివృద్ధి పనులు నక్కపల్లిలో రూ.3.5 కోట్లతో బాలికల వసతి గృహం రూ.5 కోట్లతో ఆర్డీవో కార్యాలయం, వీఎంఆర్డీఏ పార్కు అభివృద్ధి రూ.90 లక్షలతో జిల్లా డిజిటల్ గ్రంథాలయం, రూ.6.25 కోట్లతో సామాజిక భవనాలు వీటితో పాటు సచివాలయ భవనాలు, ఆర్బీకేలు ఇలా ఎన్నో... -
గంజాయి కేసులో తప్పించుకున్న నిందితుడు అరెస్ట్
కె.కోటపాడు: 2023లో గంజాయిని పాడేరు నుంచి విజయవాడకు కె.కోటపాడు మండలం మీదుగా తరలిస్తూ పోలీసుల నుండి తప్పించుకున్న వ్యక్తిని బుధవారం కె.కోటపాడు పోలీసులు పట్టుకున్నారు. ఇదే కేసులో గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి నుంచి తప్పించుకున్న వ్యక్తి సమాచారాన్ని సేకరించారు. గంజాయి కేసులో తప్పించుకున్న పల్నాడు జిల్లా మించలపాడు గ్రామానికి చెందిన నాగసాయి కోసం పోలీసులు కొద్ది రోజులుగా గాలిస్తున్నారు. నాగసాయి గత కొంత కాలంగా పరారీలో ఉంటున్నాడు. పోలీసులకు వచ్చిన విశ్వనీయ సమాచారం మేరకు బుధవారం నాగసాయిని చోడవరం బస్టాండ్ వద్ద కె.కోటపాడు పోలీసులు పట్టు కున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై కఠిన చర్యలను తీసుకుంటామని కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్ చెప్పారు. పట్టుకున్న గంజాయి ముద్దాయి నాగసాయిని చోడవరం కోర్టులో హజరుపర్చి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు.కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించిన పోలీసులు -
వైఎస్సార్సీపీ కమిటీలపై ప్రత్యేక దృష్టి
● జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కశింకోట: వైఎస్సార్సీపీ కమిటీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సూచించారు. మండలంలోని తేగాడ ఎస్ఆర్ గార్డెన్లో జిల్లాలోని పార్టీ ముఖ్య నాయకులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వీటిని ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలన్నారు. ఉగాదికి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను వారికి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఐక్యతతో ముందుకు సాగితే పార్టీ మరింత బలోపేతం కాగలదని చెప్పారు. నర్సీపట్నం నియోజకవర్గ కమిటీ నిర్మాణం పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసినందుకు అక్కడి పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్కు అభినందనలు తెలిపారు. వైఎస్సార్సీపీ జోన్–1 కోఆర్డినేటర్, పరిశీలకుడు హర్షవర్ధన్రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్,అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పార్టీ మండల అధ్యక్షుడు మలసాల కిషోర్ , రాష్ట్ర, జిల్లా నాయకులు, అధ్యక్షులు, మండలఅధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
70 లక్షల మొక్కలు సిద్ధం
కె.కోటపాడు: ఈ ఏడాది జూన్ నాటికల్లా సామాజిక వన నర్సరీల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు 70 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని సోషల్ ఫారెస్ట్ డీఎఫ్వో సోమసుందరం తెలిపారు. మండలంలో రామచంద్రపురం, కొత్తూరు, సింగన్నదొరపాలెం, పొడుగుపాలెం, ఎ.కోడూరు, బత్తివానిపాలెంలలోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను, ఎన్టీపీసీ నిధులతో గొండుపాలెం, పైడంపేట, డి.అగ్రహారం, కె.జె.పురం, పిండ్రంగి గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా పెంచుతున్న మొక్కలను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 73 వన నర్సరీల ద్వారా సరుగుడు, ఏగిస, ఫెల్టోఫారం, ఎర్రచందనం, రావి, దేవ కాంచన, మహగణి తదితర మొక్కలను పెంచుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ధేశించిన ధరకు రైతులకు అందించనున్నట్లు తెలిపారు. గత ఏడాది వన నర్సరీల ద్వారా 35లక్షల మొక్కలను పెంచి, రైతులకు అందించగా ఈ ఏడాది మొక్కల పెంపకాన్ని రెట్టింపు చేసినట్టు చెప్పారు. కె.కోటపాడు మండలంలో వన నర్సరీలలో పెంచుతున్న మొక్కల సంరక్షణపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రశేఖర్, డీఎం వెంకటపతిరాజు, వనసేవకుడు చిరికి గోవింద పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాలపై అక్రమ కేసులా?
● ప్రభుత్వ నిర్బంధకాండపై రేపు నిరసన ● ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్రకుమార్ అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు అడిగితే రౌడీషీట్లు తెరిచి, అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయమని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్రకుమార్, వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు హేమంత్ ఆరోపించారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద కూటమి ప్రభుత్వ నిర్బంధ కాండను వ్యతిరేకించడంటూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమాల పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మన రాష్ట్రంలో అమలు చేయకుండా మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పండాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు రాజకీయ నేతల గృహాల్లో ఉన్న ఆస్తులను అడగడం లేదన్నారు. రానున్న రోజుల్లో ఓటు ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.బాజ్జి, జిల్లా నాయకుడు త్రినాథ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రాజా, యూత్ లీడర్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
పీహెచ్సీ స్థలంలో మైదానం పనులు ప్రారంభం
● జిల్లాలో 15 మండలాల్లో మైదానాలకు నిధులు ● 14వ తేదీ కల్లా అందుబాటులోకి.. ● జిల్లా క్రీడల అధికారి శైలజ వెల్లడి నాతవరం: మండల కేంద్రం నాతవరంలోని పీహెచ్సీ ప్రాంగణంలో తలపెట్టిన క్రీడా మైదానం పనులు పోలీసు బందోబస్తు నడుమ ప్రారంభమయ్యాయి. వైఎస్సార్సీపీ, కూటమి పార్టీల మధ్య వివాదాస్పదంగా మారిన ఈ మైదానం పనులకు బుధవారం జిల్లా క్రీడా శాఖాధికారి శైలజ దగ్గరుండి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 15 మండలాల్లో క్రీడా మైదానాలను ఈ నెల 14వ తేదీలోపు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె చెప్పారు. నాతవరం పీహెచ్సీ ప్రాంగణంలోని స్థలంలో మైదానం నిర్మాణానికి కలెక్టరు విజయకృష్ణన్ స్వయంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో మైదానాల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా.. కోటవురట్ల మండలంలో మాత్రమే సాంకేతిక సమస్య కారణంగా పనులు ప్రారంభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ రాజ్శాఖ జేఈ వెంకటేశ్వరమ్మ, ఆర్ఐ నాగరాజు, మండల సర్వేయరు సత్యనారాయణ, నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి అపిరెడ్డి మాణిక్యం, టీడీపీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీ అభివృద్ధికి ఆటంకం పీహెచ్సీ స్థలంలో క్రీడా మైదానం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాప్రతినిధులు స్వయంగా కలెక్టరుకు పీజీఆర్ఎస్లో అర్జీ అందజేసినా కనీసం స్పందన లేకుండా పోయింది. ఈ పీహెచ్సీ స్థలంలో నిబంధనలు ఉల్లంఘించి కూటమి నేతలు మైదాన నిర్మాణ పనులను గత డిసెంబరు 26న ప్రారంభించారు. ఈ పనులకు పీహెచ్సీ అభివృద్ధి కమిటీ ఆమోదం గానీ, పంచాయతీ సర్పంచ్ తీర్మానం గానీ లేకుండా ఏకపక్షంగా పనులు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పనులపై మండల స్థాయి అధికారులతో పాటు డీఎం అండ్ హెచ్వోకు ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ సభ్యులు కాపారపు అప్పలనర్స, వైస్ ఎంపీపీ పైల సునీల్, నాతవరం సర్పంచ్ గొలగాని రాణీ, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు స్వయంగా ఫిర్యాదు చేశారు. గత నెల 29న పీజీఆర్ఎస్లో కలెక్టరు విజయకృష్ణన్కు కూడా ఫిర్యాదు చేశారు. పీహెచ్సీ స్థాయి 30 పడకలకు ప్రతిపాదనలు ఉందని, అది మంజూరు అయితే స్థల సమస్య వస్తుందన్నారు. మైదానం నిర్మాణానికి నాతవరంలో పలు చోట్ల ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అయినా నిబంధనలు ఉల్లంఘించి కూటమి నేతలు సూచన ప్రకారమే అధికారులు మైదానం పనులకు శ్రీకారం చుట్టారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా క్రీడా అధికారి శైలజ, ఎంపీడీవో శ్రీనివాస్, పలువురు అధికారులు పోలీసు బందోబస్తుతో కూటమి నేతలు ఆధ్వర్యంలో బుధవారం పనులు ప్రారంభించారు. ఈ విషయంపై జిల్లా క్రీడల అధికారి శైలజను వివరణ కోరగా.. కలెక్టరు ఆదేశాలతోనే పీహెచ్సీ స్థలంలో మైదానం నిర్మాణం చేపడుతున్నామన్నారు. -
మాజీ డిప్యూటీ సీఎం బూడికి సన్మానం
మాడుగుల: మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడును దేవరాపల్లి మండలం తారువాలో ఆకుల ఫౌండేషన్ ప్రతినిధులు సంస్థ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం సన్మానించారు. అనంతరం నూతన సంవత్సర డైరీని అందజేశారు. ఈ సందర్భంగా ముత్యాలనాయుడు మాట్లాడుతూ ఆకుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాడుగుల నియోజకరవ్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైఎస్సార్సీపీ మాడుగుల పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, మాడుగుల యూత్ అధ్యక్షుడు కుక్కర శ్రీధర్, చీడికాడ మండలం యువజన విభాగం గొళ్ళవిల్లి త్రినాథస్వామి, ఆకుల ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
హంస వాహనంపై శ్రీనివాసుడు
తిరువీధి సేవలు నిర్వహిస్తున్న అర్చకులు నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలో ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి హంస వాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు. అంతకు ముందుకు స్వామివారి మూలవిరాట్కు నిత్యార్చనలు అభి షేకాలు జరిపారు. అనంతర ఉత్సవ మూర్తులకు, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి, గోదాదేవి అమ్మవార్లకు నిత్యపూజలు, విష్వక్సేనపూజ చేశా రు. హంస వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని, పల్లకిలో గోదాదేవి అ మ్మవారిని ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారు. -
గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం
నర్సీపట్నం/గొలుగొండ: గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. బుధవారం ఆయన నర్సీపట్నం టౌన్, గొలుగొండ, కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. భీమవరం చెక్పోస్టును పరిశీలించించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, నిరుపేదల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి వారికి భరోసా కల్పించాలన్నారు. నేరాలు జరిగే ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి జరిగేలా చర్యలు చూడాలన్నారు. కోడి పందాలు,పేకాట, గుల్లాటలను ఆడుకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రౌడీషీటర్లు, పాతనేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నర్సీపట్నం టౌన్ సీఐ గఫూర్, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ, కృష్ణదేవిపేట ఎస్ఐలు రామారావు, రుషికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ తుహిన్ సిన్హా -
వైభవంగా దేవానంద స్వామీజీ ఆరాధన మహోత్సవం
● కొత్తపెంటలో వె ల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ ● తరలివచ్చిన స్వామీజీలు, సాధుసంత్దేవరాపల్లి: మండలంలోని కొత్తపెంటలో సద్గురు దేవానంద సరస్వతీ మహారాజ్(రుషికేష్) 26వ పుణ్య తిథి ఆరాధన మహోత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి. కొత్తపెంటలోని స్వామీజీ ఆశ్రమంలో రెండు రోజులుగా జరుగుతున్న ఆరాధన మహోత్సవాలు ఆఖరి రోజు బుధవారం కనుల వైభవంగా సాగాయి. దేశం నలుమూలల నుంచి స్వామీజీ భక్తులు, శిష్యులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆశ్రమ పరిసరాలు స్వామీజీ నామ స్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు, శిష్యులు దేవానంద స్వామిజీ విగ్రహాన్ని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆశ్రమ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ కళకళలాడాయి. ఉదయం నుంచి సుప్రభాతం, పతాకావిష్కరణ, నరగ సంకీర్తన, భగవద్గీత పారాయణ, సంకీర్తన తదితర పూజలు నిర్వహించారు. ప్రవచనాలతో పులకించిన భక్తజనం రుషికేష్ నుంచి పద్మనాభానంద స్వామీజీ మహరాజ్, అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు పరమాత్మనంద గిరి స్వామీజి, భీమిలి నుంచి రామకృష్ణానంద, దేవానంద ఆశ్రమం గౌరవ సలహాదారు శ్రీను సిద్ధాంతి, స్థానిక ఆశ్రమం అధ్యాత్మిక గౌరవ అధ్యక్షుడు విష్ణు దేవానంద సరస్వతీ స్వామీజీలు హాజరయ్యారు. స్వామీజీల ఆధ్యాత్మిక ప్రవచనాలతో వేలాదిగా హాజరైన భక్త జనం పులకించిపోయింది. మాజీ డిప్యూటీ సీఎం బూడి ప్రత్యేక పూజలు దేవానంద స్వామీజిని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బూడిని ఆశ్రమ నిర్వాహకులు, స్థానిక పెద్దలు ఘనంగా సత్కరించారు. స్వామీజీని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మీ, జెడ్పీటీసీ కర్రి సత్యం, స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు, రెడ్డి పైడంనాయుడు, మాజీ సర్పంచ్ రొంగలి శంకరరావు తదితరులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎస్ఐ వి.సత్యనారాయణ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
హోంగార్డు ఆత్మహత్య
నర్సీపట్నం: నియోజకవర్గ కేంద్రమైన నర్సీప ట్నం టౌన్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు ఎస్.అర్జున రావు(55) ఏలేరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అర్జునరావు అనారోగ్య కారణాలతో కొంతకాలంగా బాధపడుతున్నాడని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని సీఐ గఫూర్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన అర్జున్రావు ఇంటి నుంచి బయటకు వచ్చాడని, బుధవారం ఉదయం వేములపూడి వద్ద ఏలేరు కాలువలో శవమై తేలాడని సీఐ తెలిపారు. అర్జునరావు ఎంతో మంది అధికారుల వద్ద పని చేసి మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పారు. సీఐ, ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, రమేష్, సిబ్బంది సంతాపం తెలిపారు. అర్జున్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. -
రెవెన్యూ క్లినిక్ అర్జీలపై తక్షణ విచారణ
● సమీక్షలో తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశం తుమ్మపాల: రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, పౌర సరఫరాలపై మండల, డివిజన్ల వారీగా ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సేవల్లో సమయపాలన, పారదర్శకత ఉండాలన్నారు. రీసర్వే, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు ప్రతి రోజు క్షేత స్థాయిలో మానిటరింగ్ చేసి, జాప్యంగా చేయకుండా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలన్నారు. ఆన్లైన్ సేవలు, భూ మ్యాపింగ్, రికార్డులు అప్డేట్, మ్యుటేషన్ దరఖాస్తులు వంటి సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని పరిష్కరించాలన్నారు. లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దాలని, నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లాలో 24 మండలాలు, నర్సీపట్నం, అనకాపల్లి, యలమంచిలి మున్సిపాలిటీలలో జల వనరులను గుర్తించి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి, ఆర్డీవోలు షేక్ ఆయిషా, వి.వి.రమణ, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు సజీవ దహనం
రావికమతం: మండలంలోని కవగుంటలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ గిరిజన రైతు సజీవదహనమయ్యాడు. స్థానిక ఎస్ఐ రఘువర్మ, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కల్యాణం దొర(65) వ్యవసాయంతో పాటు నాటు వైద్యం చేస్తుంటాడు. ఇతని భార్య గతంలో మృతి చెందగా, ముగ్గురు కుమారులకు వివాహాలు జరిగాయి. వారంతా వేర్వేరుగా ఉంటున్నారు.భార్య మృతి చెందినప్పటి నుంచి పాకలో ఉంటూ నాటు వైద్యం చేస్తున్నాడు. రోజూ రాత్రి పెద్ద కుమారుడు ఇంటిలో భోజనం చేశాక పాక దగ్గరకు వెళ్లి నిద్రిస్తుంటాడు. సోమవారం రాత్రి కూడా పాకలోనే నిద్రించాడు. మంగళవారం తెల్లవారుజామున స్నానం కోసమని నీళ్లు మరగ బెడుతుండగా మంటలు చెలరేగి క్షణాల్లో పాక దగ్ధమైంది. కాళ్ల నొప్పులతో బాధపడుతున్న కల్యాణం దొర బయటకురాలేక మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. స్థానికులు వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో దొర పాకలో లేడని వారు భావించారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత పరిశీలించగా దొర మృతదేహం కనిపించిందని స్థానికులు తెలిపారు. అందిన సమాచారం మేరకు స్థానిక అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదు పు చేశారు. ఎస్ఐ రఘువర్మ సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరిలించారు. మృతుడి కుమారుడు రొబ్బా బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. పాకలో వేడినీరు కాస్తుండగా ప్రమాదం -
అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్లో హైమావతి ప్రతిభ
అచ్యుతాపురం రూరల్ : అంతర్జాతీయ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లోలో నునపర్తి గ్రామా నికి చెందిన జూరెడ్డి హైమావతి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బీహార్ రాష్ట్రం పాట్నాలో గత నెల 27 నుంచి 29 వరకూ బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సౌత్ ఏషియన్ బాల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీల్లో భారతదేశం తరఫున హైమవతి పాల్గొని సత్తా చాటారు. ఈ సందర్భంగా ఆమెను విశాఖపట్నం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి గొంప నర్సింహమూర్తి, నునపర్తి శ్రీరామ బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ చైర్మన్ ఆర్.వి.వి.నగేష్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
యాదవుల ఐక్యతను చాటి చెబుదాం
● స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం దక్కేలా కృషి చేద్దాం ● యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడుబర్నికాన బాబూరావుదేవరాపల్లి: యాదవులకు నామినేటెడ్ పోస్టులతో పాటు త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో సైతం సముచిత స్థానం దక్కేలా ఐక్యంగా కృషి చేద్దామని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు పిలుపునిచ్చారు. మండలంలోని రైవాడ ఎరకాలమ్మ ఆలయ ప్రాంగణంలో దేవరాపల్లి మండల యాదవ సంఘం ఆత్మీయ సమావేశం మండల అధ్యక్షుడు కోన ఈశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్యఅథితిగా హాజరైన యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు మాట్లాడుతూ జిల్లాలోని యాదవులంతా ఐక్యంగా కలిసి పనిచేయడం ద్వారానే హక్కుల సాధన సాధ్యపడుతుందన్నారు. యాదవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పిల్లల విద్యకు ఆర్థిక స్థోమత అవరోధమైతే సంఘం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. విద్యలో రాణించే యాదవ విద్యార్థులకు ఏటా రూ. 8 లక్షల విలువ చేసే స్కాలర్షిప్లు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. మాడుగుల నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడు మొల్లి సన్నిబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో 30వేలకు పైబడి యాదవ సామాజిక వర్గం ఓట్లు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా ప్రాధన్యత దక్కలేదన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం లభించేలా యాదవుల ఐక్యతను చాటి చెబుదామని చెప్పారు. యాదవులను బీసీ–ఏలో చేర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి బాబూరావుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తీర్మానిస్తామని పలువురు నాయకులు తెలిపారు. యాదవ సంఘం క్యాలెండర్ను జిల్లా అధ్యక్షుడు బర్నికాన బాబూరావు, నియోజకవర్గ అధ్యక్షుడు మొల్లి సన్నిబాబు తదితరుల చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కిల్లాన శ్రీనివాసరావు, కాణిపాకం వినాయక దేవస్థానం బోర్డు డైరెక్టర్ చల్లా కృష్ణవేణి నానాజీ, స్థానిక సర్పంచ్ చల్లా లక్ష్మీ నాయుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దాలిబోయిన రామగోవింద, డైరెక్టర్ బంధం అప్పలరాజు, నమ్మి బాలరాజు, కోన నాగేశ్వరరావు తదితర యాదవ సంఘం నాయుకులు పాల్గొన్నారు. -
ఆంజనేయ వాహనంపై ఆపద్బాంధవుడు
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఆంజనేయవాహనం పై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం మూలవిరాట్కు నిత్యార్చనలు,పూజలు పూర్తిచేశారు. కొండదిగువన ఉత్సవ మూర్తులకు విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం పూర్తిచేసిన తరువాత శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని ఆంజనేయవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధిసేవలు నిర్వహించారు.అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 22వపాశురాన్ని విన్నపం చేశారు. తదుపరి ప్రసాద నివేదన, తీర్థగోష్టి ప్రసాదవినియోగం జరిగాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా రాత్రితిరువీధి సేవలు నిర్వహించారు.అధ్యాపక స్వామి ద్రవిడ వేద ప్రబంధ విన్నపం చేశారు. ఈ కార్యక్రమాల్లో అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా పోలీస్ కార్యాలయానికి ఫార్మా కంపెనీల చేయూత
అనకాపల్లి: జిల్లాలోని మాన్కై ండ్, లుపిన్, వసుధ ఫార్మా కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధులతో జిల్లా పోలీస్ కార్యాలయానికి జనరేటర్, కంప్యూటర్ వస్తువులను కొనుగోలు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరేటర్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కార్యాలయంలోపాలనా పరమైన పనులు వేగవంతంగా, ఆటంకం లేకుండా సాగడానికి వీలుగా పరవాడలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. మాన్ కై ండ్ ఫార్మా సీఎస్ఆర్ నిధులతో భారీ జనరేటర్, లుపిన్, వసుధ ఫార్మా కంపెనీలు కంప్యూటర్లు, యూపీఎస్లు సమకూర్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, మాన్ కై ండ్ ఫార్మా ప్రతినిధులు రామలింగం, శ్రీనరేష్, లుపిన్ ఫార్మా ప్రతినిధులు గంగరాజు, వెంకట్, వసుధ ఫార్మా ప్రతినిధులు రామరాజు, హర్ష, ఎస్బీ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, తమలంపూడి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బాలసూర్యారావు, మల్లికార్జునరావు, రామకృష్ణారావు, మన్మథరావు, ఎస్ఐలు ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు, శిరీష, ఐటీ కోర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
శిథిల పాఠశాల భవనాన్ని కూల్చివేయాలి
చీడికాడ: శిథిలమై ప్రమాదకరంగా ఉన్న మండలంలోని నీలంపేట పాఠశాల భవనాన్ని వెంటనే కూల్చివేయాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కోరారు. మంగళవారం నీలంపేట వెళ్లిన ఆయనకు సర్పంచ్ కసిరెడ్డి సూర్యనారాయణ, గ్రామస్తులు శిథిలమైన పాఠశాల భవనం గురించి వివరించారు. దీంతో ఆయన ఆ భవనాన్ని పరిశీలించారు.అనంతరం ఎంపీడీవో హేమసుందరరావుతో ఫోన్లో మాట్లాడారు.ఈ భవనంలో చిన్న పిల్లలు ఆటలాడుతుంటారని ఎటువంటి ప్రమాదం జరగకముందే దానికి కూల్చివేయాలని సూచించారు. దీనికి స్పందించిన ఎంపీడీవో పరిశీలించి, భవనాన్ని తొలగిస్తామని చెప్పినట్లు బూడి తెలిపారు.ఎంపీడీవోకు సూచించిన మాజీ డిప్యూటీ సీఎం బూడి -
కోతి దాడిలో ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
రావికమతం: మండల కేంద్రం రావికమతంలో కోతుల దాడులతో విద్యార్థులు వణికిపోతున్నారు. గత నెలలో ఒకసారి హాస్టల్ విద్యార్థులపై, మరో సారి ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులపై కోతులు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం నవోదయ విద్యార్థినులపై కోతి దాడి చేయడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. మంగళవారం గెంజి వారి రామాలయా నికి సమీపంలో నవోదయ పాఠశాలలోకి కోతి ప్రవేశించి ఇద్దరు విద్యార్థినులపై దాడి చేసింది. ఈ దాడిలో రావికమతంకు చెందిన ఎస్.లోహిత, గు మ్మాళ్లపాడుకు చెందిన బుర్రకాయుల లీనా గాయపడ్టారు. వారిని పాఠశాల సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడాలని నవోదయ స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ పట్నాయక్ కోరారు. -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
నర్సీపట్నం: పట్టణంలో ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సత్యనారాయణ జనరల్ స్టోర్స్ ఎరువుల దుకాణంలో ఎంట్రీ రిజిస్టర్లో స్టాక్ వివరాల్లో లోపాలను గుర్తించారు. 1.15 టన్నుల 20–20–0–13 ఎరువులకు సంబంధించిన 23 బ్యాగ్లను విక్రయించకుండా జిల్లా వ్యవసాయ అధికారి.. షాపు యజమానికి నోటీసు జారీ చేశారు. ఎరువుల వివరాలు, ధరల బోర్డు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణాల్లో వివరాలు పక్కాగా ఉండాలని లేని పక్షంలో చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని, స్టాక్ వివరాలు, ధరలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేదిలేదన్నారు. మండలంలో గబ్బాడ లో జరిగిన పొలంపిలుస్తోంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన వ్యవసాయ సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రస్తుత రబీ సీజన్లో రైతులు పండిస్తున్న పంటల వివరాలను ఈ క్రాప్లో ఫిబ్రవరి 28లోపు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ టి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.విక్రయాలు నిలిపివేయాలంటూ జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాలు -
వసతి గృహంలో సమస్యల వెల్లువ
అచ్యుతాపురం రూరల్ : ఫుడ్ కమిషన్ చైర్మన్ చిట్టా విజయ్ ప్రతాప్రెడ్డి ఆకస్మిక పర్యటన అనంతరం మోసయ్యపేట బాలుర వసతి గృహంలో పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థులు అనే సమస్యలతో సతమతమవుతున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకూ 180 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఉంటూ స్థానిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. వారంలో మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం లేదు. హాస్టల్ చుట్టు పక్కల ఎక్కడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. పౌష్టికాహారం అందక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఎవరైనా విద్యార్థులు హాస్టల్లో నాణ్యత లోపాలపై ప్రశ్నిస్తే వార్డెన్ కర్కశంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హాస్టల్ వార్డెన్పై గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మరుగుదొడ్లు పరిశుభ్రం చేయడానికి ప్రత్యేకంగా వర్కర్లు లేకపోవడంతో వంట పని చేసే వారే రెండు పనులూ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం విద్యార్థి చేపల అభిషేక్ కడుపు నొప్పితో బాధపడుతూ స్కూల్ నుంచి హాస్టల్ వచ్చేశాడు. ఇలా తరచూ విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి హాస్టల్లో వసతుల మెరుగుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పునరావాసం.. పరిహాసం
నక్కపల్లి: ఏపీఐఐసీ నిర్వాసితుల కోసం ప్రభుత్వం పెదబోదిగల్లం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాల పనులు నత్తనడకన జరుగుతున్నాయి. దీంతో ఇక్కడకు వచ్చి ఇళ్లు నిర్మించుకునేందుకు నిర్వాసితులు ఆసక్తిచూపడం లేదు. ఫలితంగా కాలనీలో పది మంది కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ఆ పనులు కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. వివరాల్లోకి వెళ్తే మండలంలో చందనాడ, అమలాపురం, రాజయ్యపేట, బోయపాడు,మూలపర, వేంపాడు,డీఎల్పురం, బుచ్చిరాజుపేట, తమ్మయ్యపేట తదితర గ్రామాల పరిధిలో ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా 4,500 ఎకరాలు సేకరించింది. వీటిలో 2,000 ఎకరాలు బల్క్డ్రగ్పార్క్కోసం, 2,200 ఎకరాలను ఆర్సిలర్ మిట్టల్స్టీల్ప్లాంట్కు కేటాయించింది. దీంతో పై గ్రామాల్లో కొంతభాగాన్ని ఖాళీ చేయించాల్సి వస్తోంది. ఇలా నివాస ప్రాంతాలు కోల్పోతున్న సుమారు 734 మందిని గుర్తించారు. వీరందరికీ ఆర్ అండ్ ఆర్ప్యాకేజీ వర్తింపజేయాలి. ఐదు సెంట్ల చొప్పున ఇంటిస్థలం మంజూరు చేయడంతో పాటు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చెల్లించాలి. వీరి కోసం నక్కపల్లి పక్కన ఉన్న పెదబోదిగల్లంలో సుమారు170 ఎకరాల భూమిని కొనుగోలుచేసి, పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు. ఏపీఐఐసీ వారే లేఅవుట్ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వాడుకనీరు, విద్యుత్, ఇంటింటికి కుళాయిలు, పాఠశాల, సామాజిక భవనాలు వంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఈ 170 ఎకరాల్లో లేఅవుట్ వేసి ప్లాట్లుగా విభజించి నిర్వాసితులకు పంపిణీ చేశారు. అయితే లేఅవుట్లో మౌలిక సదుపాయలకల్పించే పనులు దాదాపు 6 నెలలనుంచి చేపట్టారు.. ఇవన్నీ నత్తనడకన జరుగుతున్నాయి. నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ప్యాకేజీ ఇంటిస్థలం కేటాయించడంతో నిర్వాసితులు పునరావాస కాలనీకి వెళ్లిపోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అయితే పునరావాస కాలనీలో పనులు మాత్రం చురుగ్గా జరగడంలేదు. సీసీరోడ్లు, సీసీ డ్రైనేజీలు,ఓవర్హెడ్ట్యాంకులు, బోర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. నాలుగైదు సీసీరోడ్లు మాత్రమే పూర్తిచేశారు. పనులన్నీ పూర్తికావాలంటే మరో ఆరు నెలల పైనే పట్టే పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బోర్లు నిర్మించారు. తాగునీటిని ఉద్దండపురం వద్ద ఉన్న వాటర్గ్రిడ్నుంచి తీసుకు వస్తామని అధికారులు చెబుతున్నారు. సుమారు 15 కిలోమీటర్ల మేర పైనులైను వేసి తాగునీటిని ఈ పునరావాస కాలనీకి తరలించాల్సి ఉంటుంది. దీనికి నేషనల్ హైవే అధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది. పదేళ్లక్రితం ప్రారంభమైన వాటర్గ్రిడ్ ఇప్పటి వరకు పూర్తికాలేదు.అక్కడనుంచి నీటిని ఎలా తరలిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్ని సమస్యలు ఉన్న పునరావాలకాలనీలో ఇళ్లు నిర్మించుకుని తాము ఎలా నివసించగలమన్న సందేహాలు నిర్వాసితుల్లో తలెత్తుతున్నాయి. దీంతోఅక్కడకు వెళ్లి ఇళ్లు నిర్మించుకునేందకు వారు ఆసక్తి చూపడం లేదు. ఇళ్లకు సంబంధించి ప్లాట్లు కేటాయించి మూడు నెలలు గడుస్తున్నా ఎవరూ అక్కడకు వెళ్లి ఇంటిని నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొంతమంది టీడీపీ నాయకులు నిర్వాసితుల్లో తమ పార్టీ సానుభూతి పరులపై ఒత్తిడి తెచ్చి పునరావాస కాలనీలో ఇంటి నిర్మాణాలను ప్రారంభించారు. మొత్తం 734 మందిలో పట్టుమని పదిమందికూడా ఇళ్లనిర్మాణాలు ప్రారంభించకపోవడం గమనార్హం. వాటిలో మూడు శ్లాబ్లెవెల్లోను, మిగిలినవి పునాదుల్లోను ఉండటం విశేషం. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యలు పూర్తిగా పరిష్కరించలేదని, కాలనీలో ఎటువంటి సదుపాయాలు లేవని, కేవలం రోడ్లు డ్రైనేజీపనులే ప్రారంభమయ్యాయని, ఈ నేపథ్యంలో పునరావాస కాలనీ ఇళ్లు ఎలా నిర్మించకుంటామంటూ నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.సామాజిక అవసరాలకోసం అన్ని సదుపాయాలు కల్పించడంకుండా కాలనీలోకి వెళ్లేందుకు నిర్వాసితులు నిరాకరిస్తున్నారు. ఉన్న పళంగా తమ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోతే అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ఏమూలా సరిపోదని అప్పుచేసి ఇళ్లు నిర్మించుకునేందుకు సమయంపడుతుందని బాధితులు చెబుతున్నారు. 734 కుటుంబాలకు అవసరమైన విద్య,వైద్య, తాగునీరు సదుపాయాలు కల్పించిన తర్వాత వెళతామంటున్నారు. ఆర్అండ్ ఆర్ప్యాకేజీ కింద రూ.25లక్షలు, వివాహమైన ఆడపిల్లలకు కూడా ఆర్అండ్ ఆర్ప్యాకేజీ, ఇంటి స్థలం ఇస్తే తప్ప ఇళ్లను ఖాళీ చేయమని నిర్వాసితులు చెబుతున్నారు. సోమవారం మండల పర్యటనకు వచ్చిన రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్, హోమ్మంత్రిఅనితను కలిసి తమ నిరసన తెలియజేశారు. ఆర్ అండ్ ఆర్ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తే తప్ప ఇక్కడనుంచికదిలేది లేదని నిర్వాసితులు చెబుతున్నారు.సమస్యలు పరిష్కరించాలి పునరావాసకాలనీకివెళ్లాంటే ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలి.అలాగే కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. వి ద్యా, వైద్య సదుపాయాలుకల్పిస్తే తప్ప అక్కడకు వెళ్లే ప్రసక్తి లేదు. రోడ్లు,డ్రైనేజీల పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. తాగునీరు, వాడుక నీటిసదుపాయాలు కల్పించాలి. – తళ్ల భార్గవ్, చందనాడ నష్టపరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయం మాభూమితోపాటు ఇంటిని తీసేసేకున్నారు.నష్టపరిహారం ఇవ్వలేదు. ఖాళీ జాగాలో పశువులకోసం, పండించిన ఉత్పత్తులు నిల్వచేసుకునేందుకు షెడ్లు వేసుకున్నాం. వాటికి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా ఖాళీ చేయబోం – గెడ్డమూరి గోవిందు, చందనాడ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం ఇళ్ల నిర్మాణాలకు ఆసక్తిచూపని లబ్ధిదారులు పది మంది మాత్రమే ముందుకొచ్చిన వైనం -
వెనిజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఆందోళన
అనకాపల్లి: వెనిజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో–ఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్(ఇస్కాఫ్) సభ్యులు ఆందోళన చేశారు. స్థానిక మెయిన్ రోడ్డులోని సీపీఐ కార్యాలయం వద్ద ఇస్కాఫ్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించి, అనంతరం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఇస్కాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.మాధవరావు మాట్లాడుతూ అక్రమంగా అమెరికా జైలులో నిర్బంధించిన వెనిజువెలా అధ్యక్షుడు మధురోను, అతని భార్య సిలియా ఫ్లోరైస్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘిస్తూ, ఐక్యరాజ్య సమితి ప్రమేయం లేకుండా అమెరికా నియంతృత్వ ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. భారత ప్రభుత్వం కూడా అమెరికా నియంతృత్వ పోకడలను ఖండించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇస్కాఫ్ నాయకులు దాడి శివరామ, బుద్ధ వీరు నాయుడు, బొడ్డేడ అప్పారావు, మొల్లి రమణబాబు, దొరబాబు, భద్రం, వెంకటేశ్వరరావు, మల్ల చక్రవర్తి, రామచంద్రరావు, బొండా సాయి, దక్షిణామూర్తి, రాజు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి నక్కపల్లి: జాతీయరహదారిపై ఒడ్డిమెట్ట సమీపంలో సోమవా రం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలప్రకారం మండలంలో దేవవరం శివారు ఒడ్డిమెట్ట గ్రామానికి చెందిన పెట్ల గణపతి(52) దేవవరం నుంచి ఒడ్డిమెట్టకు నడిచి వెళ్తుండగా చినరామభద్రపురం, ఒడ్డిమెట్ట మధ్యలో నక్కపల్లినుంచి తునివైపు వెళ్తున్న వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గణపతి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యే వజ్రాయుధం
మధురవాడ/కొమ్మాది: విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గురుకులాల్లో గురువారం ఉదయం అందించే ఉప్మా స్థానంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తామని ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ సి.హెచ్.విజయప్రతాపరెడ్డి వెల్లడించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మధురవాడ, మారికవలస, ఎండాడ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలు, జిల్లా పరిషత్ హైస్కూల్, గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. భోజన నాణ్యత, వంటల తీరు, రకుల నిల్వలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. గురువారం ఉదయం పెట్టే ఉప్మా తినలేకపోతున్నామని మారికవలస గురుకుల విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఆయన, ఉప్మా బదులుగా విద్యార్థులకు ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టే యోచనలో ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. విద్య వజ్రాయుధం లాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాకుండా నైపుణ్యాలు పెంచుకుంటే ప్రైవేట్ రంగంలోనూ అపార అవకాశాలు ఉంటాయన్నారు. విద్యార్థులు అవినీతి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చైర్మన్కు చిన్నారుల గ్రీటింగ్స్ ఎండాడ పాఠశాల సందర్శనలో విద్యార్థులు చైర్మన్కు ఘన స్వాగతం పలికారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఫుడ్ ఈజ్ గాడ్ అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులను ఆయనకు అందజేశారు. వాటిని ఆయన సంతోషంగా స్వీకరించారు. ఫుడ్ కమిషన్ సభ్యుడు సూర్యకిరణ్, డీసీఎస్వో వి.భాస్కరరావు, సివిల్ సప్లై మేనేజర్ ఎం.శ్రీలత, డీఈవో ఎన్.ప్రేమకుమార్, ఐసీడీఎస్ పీడీ కేవీ రామలక్ష్మి, ఫుడ్ సేఫ్టీ అధికారి కల్యాణ్ చక్రవర్తి, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డిప్యూటీ కంట్రోలర్ కె.టి.రవికుమార్, సోషల్ వెల్ఫేర్ డీడీ రామారావు, మధ్యాహ్న భోజనం పథకం కో–ఆర్డినేటర్ మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. మెనూ పాటించాల్సిందే.. పాఠశాలల్లో కచ్చితంగా మెనూ ప్రకారమే ఆహారం అందించాలని, పౌష్టికాహార సరఫరాలో ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని ఫుడ్ కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. ఎండాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. అలాగే రేషన్ డిపోల ద్వారా లబ్ధిదారులకు బియ్యం, పంచదార సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. సివిల్ సప్లై, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సోషల్ వెల్ఫేర్ వంటి విభాగాలు తమ కమిషన్ పరిధిలోకి వస్తాయని, ఎటువంటి సమస్యలున్నా తమను సంప్రదించవచ్చని తెలిపారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి మృతి
దేవరాపల్లి: చదవట్లేదని తండ్రి మందలించడాన్న కారణంతో గడ్డి మందు తాగిన ఓ డిగ్రీ విద్యార్థి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తెనుగుపూడి గ్రామానికి చెందిన సేనాపతి ఆనంద్(18) విశాఖపట్నంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. ఇటీవల చదువుపై శ్రద్ధ కనబరచకపోవడంతో తండ్రి సింహాచలం మందలించినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనంద్ ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. కొంత సమయం తర్వాత ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే దేవరాపల్లి పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆనంద్ మృతదేహాన్ని గ్రామంలోని యువకులంతా కాశీపురం నుంచి తెనుగుపూడి వరకు అశ్రునయనాల మధ్య తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఎం.కె వల్లాపురంలో బంగారం, వెండి చోరీ
మాడుగుల: మండలంలో ఎం.కె. వల్లాపురంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో ప్రవేశించి ఐదు తులాలు బంగారం, 10 తులాల వెండి చోరీ చేశారు. ఎస్ఐ నారాయణరావు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు... గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మట్టా మహలక్ష్మి నాయుడు, భవన నిర్మాణపని చేస్తున్న ఆయన భార్య రాము తమ పనులపై బయటకు వెళ్లగా, ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని గమనించిన దొంగలు కిటికీలోంచి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 10 తులాల వెండి దొంగలించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తెలిసిన వారి అండతోనే దొంగతనం జరిగి ఉంటుందని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
104 ఉద్యోగుల కొవ్వొత్తుల ర్యాలీ
అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చెంతకే వైద్యాన్ని చేరవేస్తున్న 104 ఉద్యోగులకు భవ్య యాజమాన్యం అన్యాయం చేస్తుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నెహ్రూచౌక్ వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 104 వాహన ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని 104 నిర్వహణ చేపడుతున్న భవ్య యాజమాన్యానికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. తప్పనిసరి పరిస్థితిలో 104 ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 104లో విధులు నిర్వహిస్తూ 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న డ్రైవర్లకు స్లాబ్ అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కు రూ.18,500 వేతనం అమలు చేయాలని ఆయన కోరారు. క్యాజువల్ లీవ్లు పునరుద్ధరించాలని, ప్రభుత్వ సెలవులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్, కాళ్ల తాళయ్యబాబు, 104 ఉద్యోగుల సంఘం కోశాధికారి జి.చంద్రుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీరంరెడ్డి భార్గవ్, ఉద్యోగులు జి.చంద్రుడు, భార్గవ్, చిరంజీవి, ఎం.మూర్తి, రమణ ఎం.ప్రశాంత్, కుమార్, ఎ.మధు, సతీష్, వై.వి.నాయుడు, ఎం.శ్రీను, ఎం.ప్రశాంత్కుమార్ పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ కంపెనీలకు సబ్సిడీ రుణాలు
అనకాపల్లి: ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఆర్బీఐ ఆధ్వర్యంలో సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తామని ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేష్కుమార్ మహానా తెలిపారు. స్థానిక మెయిన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎంఎస్ఎంఈ కంపెనీ ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్బీఐ, బ్యాంకింగ్, ఆర్థిక సమావేశ పథకాలపై అవగాహన కల్పించారు. రుణ సదుపాయాలు ఎలా పొందాలో తెలియజేశారు. అనంతరం రాజేష్కుమార్ మహానాను జిల్లా లీడ్బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ జి.ఈశ్వర్, డీఐసీ అనకాపల్లి జనరల్ మేనేజర్ ఆర్.ప్రసాద్, ఏపీ గ్రామీణ బ్యాంక్ ప్రతినిధి సతీష్ చంద్ర, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
పారదర్శకంగా భూముల రీ సర్వే
జిల్లా డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్ వెంకన్న దేవరాపల్లి: గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని జిల్లా డిప్యూటీ సర్వే ఆఫ్ ఇన్స్పెక్టర్ ఎం.వెంకన్న తెలిపారు. మండలంలోని ముషిడిపల్లి, శంభువానిపాలెం గ్రామాల్లో జరుగుతున్న రీసర్వేను ఆయన మంగళవారం పర్యవేక్షించారు. సర్వే జరుగుతున్న గ్రామాల్లో రైతులు తమ భూముల వివరాలను తెలియజేసి సర్వే సిబ్బందికి సహకరించాలని సూచించారు. సర్వే జరుగుతున్న గ్రామాల వివరాలను దండోరా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ముందుగా తెలియజేస్తున్నట్టు చెప్పారు. సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో తుప్పలు, డొంకలు తొలగించాలని, తద్వారా భూమి కొలతలు చేయడం సలువుగా ఉంటుందన్నారు. ఆయన వెంట మండల సర్వేయర్ జగదీష్, గ్రామ సర్వేయర్లు కేశవ, నవీన్, మణిబాబు, జానకి, మురళీ, ప్రవీణ్, కాసుబాబు తదితరులున్నారు. -
చోరీకి గురైన ట్రాక్టర్ పట్టివేత
రావికమతం : కొత్తకోటలో దొంగిలించిన ట్రాక్టర్ను స్వాధీనం పర్చుకొని, దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్డు చేసి, రిమాండ్కు తరిలించినట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. కొత్తకోట బి.ఎన్.రోడ్డు పక్కన ఉంచిన గుర్రాల నాగలక్ష్మి చెందిన ట్రాక్టర్ను నవంబర్ 23న రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దీనిపై నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కొత్తకోట పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపారు. సోమవారం బి.ఎన్.రోడ్డులో దొండపూడి చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పందంగా సంచరిస్తున్న కాకినాడ జిల్లా జగ్గంపేట దగ్గర నెహ్రూనగర్కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కొత్తకోటలో నాగలక్ష్మికి చెందిన ట్రాక్టర్ను దొంగిలించినట్టు వారు అంగీకరించారు. వారి చెప్పిన వివరాల మేరకు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని కొత్తకోట స్టేషన్కు తీసుకొచ్చారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
గ్రావెల్ దందాపై విజిలెన్స్
అందలాపల్లి కొండపై అధికారుల తనిఖీలుఅడ్డగోలుగా అనుమతులు..? అచ్యుతాపురం : మండలంలోని కొండకర్ల–అందలాపల్లి కొండను మైనింగ్ విజిలెన్స్ బృందం సోమవారం పరిశీలించింది. సర్వే నంబర్ 136/2లో ఉన్న సుమారు 38 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కొండలో పై భాగాన 4.2 హెక్టార్ల విస్తీర్ణంలో బీవీఆర్ఎస్ కంపెనీకి గ్రావెల్ క్వారీ నిర్వహణకు అనుమతివ్వడాన్ని తప్పుపడుతూ స్థానికులు జిల్లా కలెక్టరేట్లో గత నెల 29న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు, అందలాపల్లి కొండలో గ్రావెల్ దందాపై ఈ నెల 4న సాక్షిలో వచ్చిన కథనంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఫిర్యాదుదారు శివ నుంచి వివరాలు సేకరించారు. బీవీఆర్ఎస్ కంపెనీ ప్రతినిధితో మాట్లాడారు. కొండ వద్ద జరిగిన తవ్వకాలు, క్వారీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకూ క్వారీకి కేటాయించిన స్థలం వద్ద ఎటువంటి తవ్వకాలు జరపలేదని గుర్తించారు. క్వారీకి సంబంధం లేని స్థలంలో జరిపిన తవ్వకాల గురించి బీవీఆర్ఎస్ కంపెనీని అడిగి తెలుసుకున్నారు. క్వారీ ప్రాంతానికి వెళ్లేందుకు అవసరమైన ర్యాంప్ నిర్మాణానికి రోడ్డు వేసుకుంటున్నామని కంపెనీ ప్రతినిధి తెలపడంతో రోడ్డు వేసేందుకు ఎవరు అనుమతిచ్చారని స్థానికులు ఎదురు ప్రశ్నించగా కంపెనీ ప్రతినిధి సమాధానం చెప్పలేకపోయారు. రహదారి పనుల నిమిత్తం క్వారీ కేటాయిస్తే అడ్డుకోవడం తగదని పేర్కొనగా, స్థానికులు ఆయన వాదనను ఖండించారు. స్థానికుల్ని సంప్రదించకుండా ఇక్కడ ఎవరు క్వారీ కేటాయించారని, అవసరమైతే క్వారీకి కేటాయించిన స్థలం ముందు ఆందోళన చేపడతామన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చామని, ఇక్కడి వాస్తవ స్థితిగతుల్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని విజిలెన్స్ బృందంలోని రాయల్టీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. విజిలెన్స్ బృందంలో రాయల్టీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, మైన్స్ ఇన్స్పెక్టర్ పైడితల్లి, వీఆర్ఓ రాంబాబు పాల్గొన్నారు. అందలాపల్లి కొండపై ఇచ్చిన క్వారీ లీజు మంజూరు అడ్డగోలుగా జరిగినట్టు తెలుస్తోంది. 5 హెక్టార్ల లోపు ఉన్న క్వారీలకు గ్రామసభ ఆమోదం అవసరం లేదనే వెసులుబాటును ఉపయోగించుకొని ఈ క్వారీ కేటాయింపు స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలియకుండా చేపట్టారు. కనీసం పంచాయతీ తీర్మానం బట్టి స్థానిక తహసీల్దార్ ఇచ్చే ఎన్ఓసీ బట్టి మైనింగ్ అధికారులు లీజు మంజూరు ప్రక్రియ మొదలుపెట్టాలి. ప్రస్తుత ఇన్ఛార్జ్ తహసీల్దార్ వరహాలును ఈ విషయమై సంప్రదించగా, గతంలో ఎన్ఓసీ పంపించి ఉండొచ్చని, తమ వద్ద దీనికి సంబంధించిన సమాచారం లేదని తెలిపారు. ప్రస్తుత వీఆర్ఓ రాంబాబు సైతం ఎన్ఓసీ గురించి తమ వద్ద సమాచారం లేదన్నారు. అనకాపల్లి–అచ్యుతాపురం రహదారి విస్తరణకు సంబంధించి తొలి దశ పూర్తి చేసేందుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో గ్రావెల్ అవసరమయ్యింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి గ్రావెల్ డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా లభించడం లేదు. దీంతో ఈ క్వారీని రోడ్డు విస్తరణకు ఉపయోగించాల్సి ఉందని బీవీఆర్ఎస్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కానీ లీజు మంజూరులో రహదారి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంతే కాకుండా కొండ పై భాగాన గ్రావెల్ తవ్వకాలకు అనుమతిచ్చారు. కొండపైకి వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేయాల్సి వస్తే పెద్ద ఎత్తున గ్రావెల్ను, బండరాళ్లన పెకిలించాల్సి ఉంది. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ర్యాంప్కు ముఫ్పై అడుగుల మేర ఎత్తులో తవ్వకాలు జరిపినట్టు అక్కడ కనిపిస్తుంది. కొండ దిగువన ఇప్పటికే భారీ స్థాయిలో గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. ఒక ఆర్అండ్బీ జేఈ బంధువు నేరుగా రంగంలోకి దిగి కొండ దిగువ భాగాన గ్రావెల్ను తవ్వేసినట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా సదరు ఆర్అండ్బీ జేఈ బంధువులు స్థానిక ప్రతినిధులతో బేరసారాలు మొదలుపెట్టారు. పర్యాటక కేంద్రంగా ఉన్న కొండకర్ల ఆవకు సమీపంలోని అందలాపల్లి కొండను క్వారీ లీజుకు కేటాయించడంలో కచ్చితంగా ఈసీ క్లియరెన్స్ పారదర్శకంగా జరగాల్సి ఉంది. కొండకు సమీపంలో కొన్ని శివారు గ్రామాలు కూడా ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన మైనింగ్ అధికారులు ఎలా లీజు కేటాయించారో అర్థం కాని ప్రశ్నగా స్థానికులు చెబుతున్నారు. -
నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కళకళలాడిన మహిళా మార్టులు..నేడు చంద్రబాబు ప్రభుత్వంలో నష్టాల బాట పడుతూ మూత పడుతున్నాయి. జిల్లాలో ఉన్న ఐదు మహిళా మార్టుల్లో ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డులో ఏర్పాటు చేసిన మహిళా మార్టు మూత పడింది. మిగిలిన మార్డుల్లో కూడా ప్రభుత
మహిళా మార్ట్... ఏదీ సపోర్ట్! సాక్షి, అనకాపల్లి : మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళా మార్ట్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. దాదాపుగా రూ.40 లక్షలతో స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్లను ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను అందజేసింది. జిల్లాలో మాడుగుల, మాకవరపుపాలెం, చోడవరం, సబ్బవరం, అనకాపల్లి, అడ్డురోడ్డులో కార్పొరేట్ తరహా పెద్ద పెద్ద మాల్స్ని తలదన్నేలా ..వాటికంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు మహిళా మార్ట్ల ద్వారా అందించింది. ఈ మార్ట్లో సభ్యత్వం పొందిన పొదుపు గ్రూపు సభ్యులకు డోర్ డెలివరీ సదుపాయం కూడా కల్పించింది. అయితే ప్రభుతం మారాక మహిళా మార్ట్లకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. మహిళా మార్టుల్లో మండుతున్న నిత్యవసర సరుకులు ధరలతో విక్రయాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.మహిళా మార్ట్ల్లో సరుకులు కొంటే ఒక సమస్య.. కొనకపోతే మరో సమస్య అన్నట్టుగా డ్వాక్రా సంఘాల సభ్యులు పరిస్థితి తయారైంది. ఈ మార్టుల్లో ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా ఉండడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులే వెనుకంజ వేస్తున్నారు. దీంతో వారికి ఈ మార్టుల్లో కొనుగోలు చేస్తేనే బ్యాంక్ రుణాలు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఖర్చులు అధికం...సబ్సిడీ శూన్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పొదుపు సంఘాల భాగస్వామ్యంతో అడ్డురోడ్డులో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ రెండు నెలల క్రితమే మూత పడింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడం, సరుకుల సబ్సిడీ అందించకపోవడంతో మూతపడుతున్నాయి. అధిక నిర్వహణ ఖర్చులు, తక్కువ అమ్మకాలు, అధిక రేట్లు, సరైన నిర్వహణ లేకపోవడం, ప్రభుత్వ నిధుల పక్కదారి పట్టడం, మహిళా సంఘాలు, వెలుగు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, మార్ట్లో పనిచేసే సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. ఒక్కో సభ్యురాలు రూ.3 వేల సరుకులు కొనాల్సిందే.. డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి డబ్బులు వసూళ్లు చేసి సుమారు రూ.40 లక్షలతో మహిళా మార్ట్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళా సభ్యురాలు నెలకు రూ.250 సరకులు కోనుగోలు చేసేవారు. బయట మార్కెట్ కంటే మహిళా మార్ట్లో తక్కువ ధరలకే ఇవ్వడంతో ఒక్కో మహిళ సుమారుగా రూ.మూడు వేల సరకులు కొనేవారు. ప్రభుత్వం మారాక మహిళా మార్టులకు ప్రోత్సాహం కరువైంది. నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో పాటు నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో మార్టులు నష్టాల బాట పట్టాయి. మహిళా మార్ట్ల్లో సరుకులు ధరలు బాగా పెరగడంతో కొనుగోళ్లు తగ్గాయి. దీంతో అధికారులు, వెలుగు సిబ్బంది ఒక్కో డ్వాక్రా సభ్యురాలు కనీసం రూ.3000 సరుకులు కోనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. వారు అయిష్టంగానే పొదుపు నుంచి గ్రూపునకు రూ.30 వేలు నిత్యవసర సరుకులు కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారుల పట్ల డ్వాక్రా మహిళలు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ప్రోత్సాహం లేక నష్టాల బాట అడ్డురోడ్డులో గల మహిళా మార్ట్ను కొనసాగించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేశాం. మహిళా మార్టుల్లో మార్కెట్ రేట్లకే విక్రయాలు చేశాం. డ్వాక్రా మహిళలకు ప్రయోజనం చేయాలనే వీటిని ఏర్పాటు చేసినా..సరైన ప్రోత్సాహం లేక నష్టాల బాటపట్టాయి. కొన్నిసార్లు ఎంఆర్పీ కన్నా తక్కువగా అమ్మేందుకు మార్కెట్లో జీఎస్టీ లేని బిల్లులతో విక్రయాలు చేశాం. మహిళా మార్ట్ ఏర్పాటుకు, సరుకుల కొనుగోలుకు పెట్టుబడి డబ్బులను ప్రభుత్వానికి జమ చేశాం. ఏ ఒక్క రూపాయి కూడా పక్కదోవ పట్టలేదు. ప్రతి రూపాయిని ప్రభుత్వానికి అప్పగిస్తాం. –శివప్రసాద్, ఏపీఎం, ఎస్.రాయవరం మహిళా మార్ట్(ఫైల్) జిల్లాలో ఉన్న ఐదింట్లో ఒకటి మూత నష్టాల బాటలో మిగిలిన మార్ట్లు తగ్గిన విక్రయాలు..డ్వాక్రా మహిళలతో బలవంతంగా కొనుగోళ్లు ఒక్కో గ్రూప్ నుంచి రూ.30 వేల వరకు కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి లేదంటే బ్యాంకు రుణాలు ఇవ్వమంటూ బెదిరింపులు నాణ్యత లేని వస్తువులు.. అధిక ధరలు జిల్లాలో 39,671 స్వయం సహాయక సంఘాలుజిల్లాలో వివరాలు ఇలా.. జిల్లాలో 1,279 గ్రామ సంఘాలు 39,671 స్వయం సహాయక సంఘాలు 4,34,320 స్వయం సహాయక సభ్యులు -
ల్యాండ్పూలింగ్ రైతుల నిరసన
తుమ్మపాల: ల్యాండ్ పూలింగ్ ద్వారా తమ భూములను తీసుకుని తమకు కేటాయించాల్సిన ప్లాట్లను నేటికీ మంజూరు చేయడం లేదని పాపయ్యపాలెం గ్రామంలో చేపడుతున్న జగనన్న కాలనీ వద్ద బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ డీ పట్టాల ద్వారా ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను గత ప్రభుత్వంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం సేకరించి తమకు ఒక్కో ఎకరానికి 18 సెంట్ల ప్లాట్లు హామీ ఇచ్చిందని, తీసుకున్న భూముల్లో కాలనీలు నిర్మాణం పూర్తి చేస్తున్నప్పటికీ తమకు మాత్రం ప్లాట్లు ఇవ్వకుండా తాత్సరం చేస్తున్నారని, అన్నారు. ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్లు జరగకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుందని, అధికారులు సీఐడీ విచారణ పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. నాలుగేళ్లగా అనేక పోరాటాలు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని, తమ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోరితే కేసులు పెడతామంటూ భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


