breaking news
Anakapalle
-
తాచేరు డైవర్షన్ రోడ్డు మూసివేత
● ఉధృతంగా ప్రవహిస్తున్న నది ● రాకపోకలకు ప్రజలు తీవ్ర అవస్థలుబుచ్చెయ్యపేట: భీమునిపట్నం–నర్సీపట్నం(బీఎన్) రోడ్డులోని విజయరామరాజుపేట డైవర్షన్ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మోంథా తుపాను కారణంగా తాచేరు నది ఉధృతంగా ప్రవహించడంతో డైవర్షన్ రోడ్డు కోతకు గురైంది. వాహనాల రాకపోకలతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన ఇన్చార్జి ఎస్ఐ పి.మనోజ్కుమార్, తహసీల్దార్ లక్ష్మి, తదితరులు డైవర్షన్ రోడ్డుపై నుంచి ఎటువంటి రాకపోకలు లేకుంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీ వడ్డాది డైవర్షన్ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విశాఖ, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాడేరు, తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనచోదకులు నానా అవస్థలు పడ్డారు. కనీసం ఆటో సర్వీసులు కూడా లేకపోవడంతో అత్యవసరంగా ప్రయాణాలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల దూరం వరకు నడిచి గమ్యస్థానాలకు చేరుకున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రవాణా సదుపాయం కల్పించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.వడ్డాదిలో పూర్తిగా మునిగిపోయిన డైవర్షన్ రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీరుబుచ్చెయ్యపేట మండలం పేట తాచేరు డైవర్షన్ రోడ్డుకు అడ్డంగా రిబ్బన్లు కట్టిన పోలీసులు -
పునరావాసం.. నిరుపయోగం
అచ్యుతాపురం/మునగపాక/నాతవరం: మోంథా తుపాను పునరావాస కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. మౌలిక సదుపాయాలు కల్పించకుండానే హడావుడిగా ప్రారంభించిన కేంద్రాల్లో ఉండేందుకు నిర్వాసితులు ఉండలేక వెంటనే వెనుదిరిగారు. కేవలం ఆర్భాటాలు, గణాంకాల కోసమే ఏర్పాటు చేసిన ఈ పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. అనేక కేంద్రాల్లో విద్యుత్ లేదు. భోజనాలు సరఫరా లేదు. కనీసం మంచినీటి సౌకర్యం కల్పించలేదు. దీంతో నిర్వాసితులు ఈ కేంద్రాలపై కన్నెత్తి చూడలేదు. మోంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తీర గ్రామాల్లోనే కాకుండా ముంపు ప్రాంతాల్లో ఉండే వారిని తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం అధికారులు జిల్లాలో 76 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3902 మందిని తరలించినట్టు చెబుతున్నారు. అయితే వాటిలో వసతులు కల్పించలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. కొన్ని పునరావాస కేంద్రాల్లో పందికొక్కులు పడ్డాయి. నిర్వాసితులకు భోజనాల పేరుతో కొంత మంది అధికారులు, సిబ్బంది అడ్డంగా బొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 3,902 మందిని కేంద్రాలకు తరలించినట్లు చూపిస్తున్నప్పటికీ.. వారిలో చాలామందికి భోజనాలు అందించలేదు. వారికి ఇవ్వాల్సిన భోజనాలు ఏమయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రాలకు మరమ్మతులు, సదుపాయాలు, భోజనాలు, ఇతర వసతి సౌకర్యాల పేరుతో గట్టిగానే కొంత మంది అధికారులు, సిబ్బంది వెనకేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్వాసితులకు అందని ఆర్థిక సాయం ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లో ఉండేవారికి రూ.వెయ్యి వంతున అందజేస్తామని చేసిన ప్రకటన ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. తమకు ఇంతవరకు ఉన్నతాఽధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని మునగపాక మండలం రామగిరి వీఆర్వో సాక్షికి తెలిపారు. తుపాను ప్రభావం తగ్గడంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారంతా తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం నగదు సకాలంలో ఇవ్వకపోవడంతో అధికారులు పునరావాస కేంద్రంలో ఉన్న వారి ఆధార్ కార్డు, ఇతర చిరునామా వివరాలు తీసుకుని పంపించేస్తున్నారు. ఈవిషయంపై నాతవరం తహశీల్దార్ ఎ,వేణుగోపాల్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో ఉన్నవారి వివరాలు సేకరించామని, నివేదిక ద్వారా కలెక్టరు పంపిస్తామన్నారు. ప్రస్తుతం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని, బోజనం మాత్రమే పెట్టామన్నారు. పలుచోట్ల కాకి లెక్కలు చంద్రబాబు సర్కారు ప్రచార యావను ఆసరాగా చేసుకొని సందిట్లో సడేమియాలా పలుచోట్ల కాకి లెక్కలతో నిధులు భోంచేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న యలమంచిలి నియోజకవర్గ పరిధిలో మోంథా తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావించి ఏర్పాటు చేసిన పునరావాసం విషయంలో కాకి లెక్కలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారి నివేదికల మేరకు బుధవారం మధ్యాహ్నం నాటికి నియోజకవర్గంలో 13 పునరావాస కేంద్రాల్లో బాధితులు తలదాచుకున్నట్లు తెలిపారు. 13 పునరావాస కేంద్రాల్లో సుమారు 681 మందికి పునరావాసం కల్పించినట్లు పేర్కొన్నప్పటికీ చాలా కేంద్రాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు సాక్షి బృందాలకు కనిపించాయి. వాస్తవంగా భోజనాలు చేసిన వారి కంటే లెక్కల్లో అధికంగా చూపినట్లు తెలుస్తోంది. అచ్యుతాపురం మండలంలోని రెండు పునరావాస కేంద్రాల్లో సదుపాయాలు నామమాత్రంగానే కనిపించాయి. మోంథా తుపానుతో జిల్లాలో 76 పునరావాస కేంద్రాల ఏర్పాటు ఈ కేంద్రాలకు 3,902 మందిని తరలించినట్లు లెక్కలు విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండానే హడావుడి అనేక చోట్ల భోజనాలు కూడా ఏర్పాటు చేయని అధికారులు కొన్ని చోట్ల భోజనాలు పక్కదారి -
రిజిస్ట్రేషన్లకు విద్యుత్ కష్టాలు
విద్యుత్ సరఫరా లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్న జనం యలమంచిలి రూరల్: తుపాను ప్రభావంతో పలు చోట్ల చెట్లు నేలకొరగడంతో యలమంచిలి పట్టణం, మండలంలోని గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ముందుగా స్లాట్లు నమోదు చేసుకున్న కక్షిదారులు గంటల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించారు. బాటరీ బ్యాకప్ సరిగ్గా పనిచేయకపోవడంతో కక్షిదారులకు అవస్థలు తప్పలేదు. ఈ కార్యాలయం ద్వారా ఏటా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో ఇబ్బందులు పడుతున్నా ప్రజలు భరిస్తున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయంలో ఇబ్బంది లేకుండా జనరేటర్ సౌకర్యం కల్పించాలని కక్షిదారులు కోరుతున్నారు. -
పప్పన్నం కరువే.!
● విపత్కర పరిస్థితుల్లోనూ అందని రేషన్ కందిపప్పు ● 546 మెట్రిక్ టన్నుల సరఫరాకు ప్రభుత్వం ఎగనామంఅనకాపల్లి టౌన్: మోంథా తుపాను లాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పప్పన్నం దొరుకుతుందేమోనని ఎదురుచూసిన పేదలకు నిరాశే ఎదురైంది. పేదలు పౌష్టికాహారంగా కంది పప్పునే ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ కందిపప్పు సరఫరాను కూటమి ప్రభుత్వం నవంబర్లో కూడా నిలిపివేసింది. దీంతో జిల్లాలోని పేద లబ్ధిదారులపై కోట్లలో భారం పడుతుంది. సామాన్యుల దగ్గర నుంచి ధనవంతుడు వరకూ కందిపప్పును విరివిగా వాడుతుంటారు. అందుకే ధర ఎంతైనా కందిపప్పును కొనుగోలు చేస్తుంటారు. సామాన్యుడు మాత్రం రేషన్ డిపోల్లో లభించే కందిపప్పు కోసం ఆశగా ఎదురు చూస్తుంటాడు. కూటమి ప్రభుత్వం మాత్రం రేషన్ షాపుల్లో కందిపప్పు, రాగులు, గోధుమ పిండి సరఫరా పూర్తిగా నిలిపివేసింది. జిల్లాలో 5,37,038 మంది కార్డుదారులకు 14,99,000 యూనిట్దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెనా 7,652 మెట్రిక్ టన్నుల బియ్యం, 264 మెట్రిక్ టన్నుల పంచదార, 546 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 544 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 1628 మెట్రిక్ టన్నుల రాగులు సరఫరా చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ నిలిచిపోయాయి. పేదలకు నిత్యావసర వస్తువైన కందిపప్పును సరఫరా చేయలేని ప్రభుత్వం రాగులు, గోధుమ ఇంకేమి ఇస్తుందని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే రేషన్ షాపుల్లో పూర్తిగా కందిపప్పు సరఫరా నిలిపివేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం అర కేజీ పంచదార ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి రూ.120పైగా ఉంది. కూటమి నేతలు అధికారంలోకి రాక ముందు రేషన్ షాపులను బలోపేతం చేస్తామని, నిత్యావసరాలైన బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, రాగి పిండి తదితర వాటిని రాయితీపై అందజేస్తామని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో ఒక్క నెల కూడా సరకులు సరఫరా చేయకపోగా.. విపత్కర పరిస్థితుల్లోనూ చేతులు ఎత్తేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. -
అన్నదాత గుండెల్లో తుపాను
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025వర్షాలు తగ్గినా వదలని కన్నీళ్లు సాక్షి, అనకాపల్లి: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురిశాయి. ఈ నెల 27 నుంచి 29వ తేది వరకు సగటున 12.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. మూడు రోజుల పాటు కుండపోతగా వర్షాలు కురవడమే కాకుండా తీర ప్రాంత మండలాలైన పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట, సబ్బవరంతోపాటు కె.కోటపాడు, అనకాపల్లి, కశింకోట మండలాల్లో అధికంగా వర్షపాతం నమోదైంది. బలంగా ఈదురుగాలులు వీచడంతో పలు చోట్ల చెట్లు కూలి ఇళ్లపై పడి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఎగువ ప్రాంతం నుంచి నీరు ఎక్కువగా చేరడంతో పెద్దేరు, తాండవ, రైవాడ, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదకరంగా మారాయి. వాటి నుంచి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడం, భారీ వర్షాలకు వంతెనలపై నుంచి వాగులు, గెడ్డలు పొంగి పొర్లడంతో కల్వర్టులు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు 10,180 ఎకరాల్లో పంట దెబ్బతింది. వీటిలో 8,180 ఎకరాల్లో వరి పంట, 1500 ఎకరాల్లో చెరకు, 500 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అనకాపల్లి నియోజకవర్గంలో 2 వేల ఎకరాలు, చోడవరం నియోజకవర్గంలో 3 వేలు, యలమంచిలిలో 2 వేలు, పాయకరావుపేటలో 500, నర్సీపట్నంలో 580, మాడుగులలో 600, సబ్బవరం, పరవాడ మండలాల్లో 1000 ఎకరాల్లో పంట నీట మునిగింది. జిల్లావ్యాప్తంగా 31 విద్యుత్ స్తంభాలు ధ్వంసం అవ్వడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 210 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 13 పశువులు మృతి చెందగా.. జిల్లాలో 32 రహదారులు వరద నీటి ప్రభావంతో దెబ్బతిన్నాయి. జిల్లాలో తీర ప్రాంతం, లోతట్టు 136 గ్రామాలలో నివసిస్తున్న 3,902 మందిని గుర్తించి సురక్షితంగా 68 ప్రదేశాలలో ఏర్పాటు చేసిన 76 పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ బుధవారం నాటికి పునరావాస కేంద్రాల్లో సగం మంది కూడా లేరు. అదేవిధంగా నక్కపల్లి వీవర్స్ కాలనీలో వర్షం నీరు చేరింది. నేత కార్మికులు మగ్గాల్లోకి నీరు చేరడంతో రెండు రోజులుగా నేత నేసేందుకు ఇబ్బంది ఏర్పడిందని నేత కార్మికులు చెబుతున్నారు. మగ్గాలు తడిసిపోయాయని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు తుపాను ప్రభావంలో జిల్లాలో 150.67 కి.మీ మేర 32 ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయి. అనకాపల్లి, చోడవరం, సబ్బవరం, బుచ్చెయ్యపేట, యలమంచిలి, పరవాడ, ఎస్.రాయవరం, నక్కపల్లి, కె.కోటపాడు, నర్సీపట్నం, చీడికాడ, కశింకోట, నాతవరం, అచ్యుతాపురం మండలాల పరిధిలో రోడ్లు పాడయ్యాయి. వీటిలో ప్రధానంగా నర్సీపట్నం–భీమునిపట్నం బీఎన్ రోడ్డుపై, సబ్బవరం మండలంలో గుల్లేపల్లి–సబ్బవరం రోడ్డులో ఆదిరెడ్డిపాలెం వద్ద ఉన్న కాజ్వే పై నుంచి, కోటపాడు–పినగాడి రోడ్డులో మొగలిపురం శివార్లలో రోడ్డుపై నుంచి, ఆరిపాక–రాయపుర అగ్రహారం రోడ్డులోని పెద్దగెడ్డ బ్రిడ్జిపై నుంచి, చోడవరం–సబ్బవరం రోడ్డులోని టెక్కలిపాలెం జంక్షన్ వద్ద ప్రధాన రహదారిపై భారీగా ప్రవహించడంతో, బుచ్చెయ్యపేట మండలంలో వడ్డాది గ్రామంలో పెద్దేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డుపై నుంచి వరద నీరు అధికంగా ప్రవహించడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. రావికమతం మండలంలో తట్టబంద–రావికమతం రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. గొంప–రావికమతం రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొండకర్ల నుంచి గనపర్తి రోడ్డుల్లో ఒక కల్వర్ట్, చీడికాడలో జి.కొత్తపల్లి గ్రామంలో ఒక కల్వర్ట్ పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 380 డ్రెయిన్లు వర్షపునీటితో బ్లాక్ అయ్యాయి. ధ్వంసమైన ఇళ్లు: జిల్లావ్యాప్తంగా 210 ఇళ్లు ధ్వంసం అవ్వగా.. వాటిలో 48 పెంకుటిళ్లు, శ్లాబ్ ఇళ్లు ఉన్నాయి. 162 పాకలు, పూరి గుడిసెలు దెబ్బతిన్నాయి. కోటవురట్ల మండలం రామన్నపాలెంలో పెంకుటిల్లు కూలిపోయింది. రావికమతం మండలం టి.అర్జాపురంలో వేములపూడి రేకుల షెడ్డుపై చెట్టు పడడంతో ధ్వంసమైంది. ధర్మవరంలో రేకుల ఇంటిపై, యలమంచిలి సోమలింగపాలెంలో మరో ఇంటిపై చెట్టు కూలడంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాఠశాలల్లో పెచ్చులూడిన శ్లాబ్లు: అనకాపల్లి మండలంలో 41 ప్రభుత్వ స్కూళ్లలో శ్లాబ్లు పెచ్చులూడిపోయాయి. 48 స్కూళ్లలో గదుల్లో వర్షపు నీరు లీకై ంది. 23 స్కూళ్లలో ప్రహరీలు దెబ్బతిన్నాయి. 9 స్కూళ్లలో కిచెన్ షెడ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రోడ్డుపై పడిన భారీ వృక్షాలు: జిల్లావ్యాప్తంగా తుపాను ప్రభావంతో ఈదురుగాలులు బలంగా వీచడంతో 33 భారీ వృక్షాలు రోడ్డుపై పడిపోయా యి. ఎటువంటి ప్రాణనష్టం కలగకపోయినా..వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందిరైవాడ జలాశయం గేట్ల నుంచి విడుదలవుతున్న వరద నీరుదేవరాపల్లి: రైవాడ జలాశయం వరద గేట్లపై నుంచి నీటి విడుదలను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ మూడు రోజులపాటు సగటున 12.8 సెం.మీ వర్షపాతం ప్రమాదకరంగా జలాశయాలు.. పొంగిపొర్లుతున్న వాగులు జిల్లాలో 10,180 ఎకరాల్లో పంట నీట మునక పడిపోయిన 31 విద్యుత్ స్తంభాలు, 160 ఇళ్లు ధ్వంసం 13 పశువులు మృతి 150 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న 32 రహదారులు 76 పునరావాస కేంద్రాలకు 3902 మంది తరలింపు -
క‘న్నీళ్లు’కు పొర్లు కట్టు
ఓ మోస్తరు వర్షం పడినా వారు చివురుటాకులా వణికిపోయే వారు...తుఫాన్లు వస్తే వారి అవస్థలు చెప్పనలవికాదు... నాలుగు వైపుల నుంచి నీరు ముంచెత్తడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యేవారు... పునరావాస కేంద్రాలకు పరుగులు తీసేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఇంత పెద్ద మోంథా తుఫాన్ సమయంలో కూడా వారు హాయిగా ఇళ్లలోనే ఉన్నారు. దీనికి కారణంగా గత ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ చేసిన మేలేనని ఆ గ్రామస్తులు చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు. నాతవరం: మండలంలో వై.బి.ఆగ్రహారం మారుమూల గ్రామం. ఈ గ్రామానికి ఒకవైపు నిత్యం నీటితో నిండుగా ఉండే ఊర చెరువు, మరో పక్క కొండ గెడ్డ ఉన్నాయి. ఈ రెండే కాకుండా ఇంకో పక్క ఎగువ ప్రాంతంలో ఏలేరు కాలువ, వెర్రిగెడ్డ ఉన్నాయి. భారీ వర్షం పడినప్పుడు, తుఫాన్ల సమయంలో వీటి నీరంతా గ్రామంలోకి వచ్చేస్తుంది. ఆ సమయంలో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. తుఫాన్ల హెచ్చరికల సమయంలో అధికారులు ముందు జాగ్రత్తగా ఆ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. అలాంటిది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వీరి సుదీర్ఘ సమస్యకు మోక్షం కల్పించారు. గ్రామ సర్పంచ్ కొసూరి విజయ ఆధ్వర్యంలో గ్రామస్థులంతా కలిసి నీటి ముంపు సమస్యపై ఉమా శంకర్ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ఊర చెరువు నీరు గ్రామంలోకి రాకుండా రూ. 9 లక్షలతో పోర్లు కట్టు నిర్మించారు. తర్వాత గ్రామానికి ఎత్తులో ప్రవహించే కొండ గెడ్డ నీరు బయటకు పొర్లకుండా ఉండేందుకు పూడికతీత పనులు చేయించారు. ఖరీఫ్ ముందు కూడా ఈ పనులు చేశారు. మోంథా తుఫాన్ సమయంలో కూడా ఊర చెరువు, కొండ గెడ్డ నీరు గ్రామంలోకి రాలేదు. దీంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. గతంలో తుఫాన్ల సమయంలో కురిసే భారీ వర్షాలకు బావుల్లో తాగునీరు కలుషితమై గ్రామస్థులు ఇబ్బందులు పడేవారు. ఈ సారి ఆ సమస్య ఉత్పన్నం కాలేదు. ఏళ్లనాటి సమస్య పరిష్కరించారు తుఫాన్ల సమయంలో గ్రామాన్ని ఎప్పుడు గెడ్డల నీరు ముంచెత్తుతుందోనని భయంతో గడిపేవాళ్లం. ఊర చెరువు నీరు గ్రామంలోకి రాకుండా అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పోర్లుకట్టు నిర్మించి, చెరువును అభివృద్ధి చేశారు. అదే విధంగా కొండ గెడ్డ నీరు గ్రామంలోకి రాకుండా తాండవ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి పూడిక తీత పనులు చే యించారు. దీంతో మోంథా తుఫాన్ సమయంలో మా గ్రామంలోకి నీరు రాలేదు. అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినా...వాటి అవసరం లేకపోయింది. – కోసూరి విజయ, గ్రామ సర్పంచ్ వై,బి,ఆగ్రహరం గత ఎమ్మెల్యే గణేష్ హయాంలో వై.బి.అగ్రహారంలో పొర్లుకట్టు నిర్మాణం దీంతో మోంథా సమయంలో తప్పిన ముప్పు నీటి ముంపు లేకుండా చేసిన గత ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు -
శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు
ఎంవీపీ కాలనీ: శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పయాగానికి విశా ఖ నుంచి పువ్వులు తరలివెళ్లాయి. ఆధ్యాత్మికవేత్త హిమాన్షు ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన పూలను యాగానికి పంపించారు. బుధవారం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్ వద్దనున్న హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత టీటీడీ సలహా కమిటీ చైర్మన్ పట్టాభిరామ్ దంపతులు, మహిళా భక్తులు పూలకు సంకల్పం చేశారు. 3 వేల కలువలు, 2 వేల తామరలతోపాటు వివిధ రకాల పూలను తిరుమలకు తరలించారు. -
విశాఖ–బొబ్బిలి సెక్షన్లో భద్రతా ఆడిట్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధిలోని విశాఖపట్నం–బొబ్బిలి రైల్వే సెక్షన్లో బుధవారం సేఫ్టీ ఆడిట్ జరిగింది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన భద్రతా ఆడిట్ బృందం ఈ తనిఖీలను చేపట్టింది. ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ఉత్తమ్ ప్రకాష్ నేతృత్వంలో ఈ బృందం సెక్షన్ పరిధిలోని పలు స్టేషన్లలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. పెందుర్తి–కొత్తవలస మధ్య గల మలుపులు, కొత్తవలస స్టేషన్లో పాయింట్లు, యార్డులు, క్రాసింగ్లు, అలమండ–కోరుకొండ మధ్య నిర్మించిన ప్రధాన బ్రిడ్జిలు, బొబ్బిలి స్టేషన్లోని రిలేరూం, కోమటిపల్లి యార్డ్, ట్రాక్షన్ సబ్స్టేషన్, లెవెల్ క్రాసింగ్ గేట్, కోచింగ్ క్రూ లాబీ, విశాఖపట్నం యార్డులో యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ వ్యాన్, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, న్యూ కోచింగ్ కాంప్లెక్స్, రన్నింగ్ రూంలు, రూట్ రిలే ఇంటర్లాకింగ్ కేబిన్లను పరిశీలించింది. సీనియర్ రైల్వే అధికారుల పర్యవేక్షణలో వివిధ రైల్వే జోన్ల మధ్య ఇటువంటి ఇంటర్ జోన్ సేఫ్టీ ఆడిట్లు తరచూ జరుగుతుంటాయని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆడిట్ ప్రారంభానికి ముందు డీఆర్ఎం లలిత్ బోహ్రా డివిజన్ భద్రతా అంశాలను ఆడిట్ బృందానికి వివరించారు. తనిఖీల్లో వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎం(ఆపరేషన్స్) కె.రామారావు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ఆనంద్కుమార్ ముటట్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైల్వే సేఫ్టీ ప్రమాణాలను పరిశీలించిన నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే బృందం -
భూ ఆక్రమణలపై తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
పోలేపల్లిలో భూకబ్జాపై గ్రామస్తుల ఆగ్రహంబుచ్చెయ్యపేట: మండలంలోని పోలేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సర్వే నంబర్ 156లో 216 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇటీవల గ్రామానికి చెందిన కూటమి నేతలు పొక్లెయిన్తో ఆ భూమిని చదును చేసి సుమారు 30 ఎకరాలను ఆక్రమించి యూకలిప్టస్ మొక్కలు నాటారు. మండలానికి మంజూరైన మోడల్ స్కూల్ నిర్మాణానికి కేటయించి, శిలాఫలకం వేసిన స్థలాన్ని కూడా కూటమి నేతలు ఆక్రమించారు. ఇందులో కొంత భూమిని చైన్నెకి చెందిన వ్యక్తికి విక్రయించగా , మరికొంత భూమిని విక్రయించేందుకు బేరానికి పెట్టారు. గ్రామంలో పలువురు సెంటు భూమి లేని నిరుపేదలుండగా బడాబాబులు, కూటమి నేతలు ప్రభుత్వ భూమిని ఆక్రమించడంపై గ్రామస్తులు మండిపడ్డారు. ఇటీవల సర్పంచ్ సీతా బుజ్జితో పాటు పలువురు ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణలకు పాల్పడిన కొంతమంది సర్పంచ్ కుటుంబ సభ్యులు, సర్పంచ్కు దన్నుగా ఉన్నవారిపై ఇటీవల దౌర్జన్యం చేశారు. దీనిపై ఆగ్రహించిన గ్రామానికి చెందిన మల్లోతు జోగినాయుడు, పెంటయ్య, పర్రె శివ, గాడి చిన్న, తుంపాల అప్పారావు, సీతా జోగినాయుడు తదితరులు బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరు పేదలకు ఇళ్ల స్థలాలు, భూ పట్టాలు అందించాలని, ఇతర ప్రజా ప్రయోజనాలకు ప్రభుత్వ భూమిని వినియోగించాలని నినాదాలు చేశారు. భూ ఆక్రమణలు తొలగించాలని తహసీల్దార్ గదిని ముట్టడించారు. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఫోన్లో సమాచారం అందజేశారు. తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే గ్రామానికి వచ్చి, భూ ఆక్రమణలను తొలగిస్తామని తహసీల్దార్ లక్ష్మి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. వారం రోజుల్లో భూ ఆక్రమణలు తొలగించకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. -
ముడసర్లోవకు జలకళ
ఆరిలోవ: ముడసర్లోవ రిజర్వాయర్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. మోంథా తుపాను ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఈ రిజర్వాయర్కు జలకళ వచ్చింది. రిజర్వాయర్ చుట్టూ కంబాలకొండలు, సింహాచలం కొండలు ఉన్నాయి. మోంథా తుపాను వర్షాల వల్ల ఈ కొండల నుంచి రిజర్వాయర్లోకి 7.1 అడుగుల వరకు కొత్త నీరు చేరిందని ముడసర్లోవ నీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. తుపానుకు ముందు రిజర్వాయర్లో 157.5 అడుగుల నీరు ఉండేది. వరద నీటితో కలిసి ప్రస్తుతం నీటి మట్టం 164.6కు చేరింది. సాధారణంగా ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 170 అడుగులు. దీనిని ఓవర్ఫ్లో చేయడానికి మరో 5.4 అడుగుల నీరు మాత్రమే అవసరం. తుపాను ప్రభావంతో ఎక్కువ మొత్తంలో కొత్త నీరు చేరడంతో, ప్రస్తుతం ఆరిలోవ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.మోంథా తుపానుతో పెరిగిన నీటి మట్టం -
అధికారులు ఆదుకోవాలి
ఖరీఫ్ వర్షాలు ఆలస్యం కావడంతో ఇటీవల రెండు ఎకరాల పొలంలో నాట్లు వేశాను. ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి అయ్యింది. మోంథా తుఫాన్తో మొత్తం నీట మునిగింది. ఇప్పుడు పైనుంచి వరద నీరు పొంగుతూ వస్తుంది. ఇంకా తగ్గలేదు. పూర్తిగా పాడయ్యేలా ఉంది. అధికారులు పరిశీలించి పరిహారం ఇప్పించాలి. – కాసెపు శివ, రైతు, సర్వసిద్ధి, ఎస్.రాయవరం మండలం వ్యవసాయాన్నే నమ్ముకున్నాం తుపాన్ కారణంగా రెండు ఎకరాల్లో వరి పంట నేలకొరిగి తడిచి పోయింది. సుమారు రూ.50 వేలు పెట్టుబడులు పెట్టగా వరి కంకులు వేసి చేతికి పంట వచ్చే సమయంలో దెబ్బతింది. తిండి గింజలు దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యవసాయాన్నే నమ్ముకున్నాం. అధికారులు పంట నష్టం నమోదు చేసి ఆదుకోవాలి. –నందం శివ, ఎం.బి.పాలెం, రైతు, బుచ్చెయ్యపేట మండలం -
తుపాను బాధితులకు తక్షణం పరిహారం అందించాలి
సాక్షి, విశాఖపట్నం: మోంథా తుపాను ప్రభావంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. పంట నష్టపోయి, ఇళ్లు ధ్వంసమై కష్టాల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం తక్షణం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డితో పాటు పలువురు ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోంథా తుపాను వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. తుపాను బాధితులను పరామర్శించి, సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలందరినీ అభినందించారు. ప్రజలు ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని మరోసారి నిరూపించారంటూ ప్రశంసించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ఎస్ఈసీ సభ్యులు ఐహెచ్ ఫరూఖీ, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర, జోనల్ అనుబంధ విభాగాల అధ్యక్షులు పేర్ల విజయ్ చందర్, ద్రోణంరాజు శ్రీవత్సవ్, చెన్న జానకిరామ్, కార్పొరేటర్లు బర్కత్ అలీ, శశికళ, మహమ్మద్ ఇమ్రాన్, బిపిన్ కుమార్, జోనల్ యువజన జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, జిల్లా పార్టీ కమిటీ అధికార ప్రతినిధులు ఆల్ఫా కృష్ణ, పల్లా దుర్గ, మంచ నాగమల్లేశ్వరి, హరి కిరణ్ రెడ్డి, జిల్లా అనుబంధ కమిటీ అధ్యక్షులు బోని శివ రామ కృష్ణ, నీలి రవి, సనపల రవీందర్ భరత్, శ్రీదేవి వర్మ, శంకర్ బత్తుల ప్రసాద్, మార్కండేయులు, బొండా ఉమామహేశ్వరరావు, సకలబత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జీవీఎంసీలోకి నాలుగు మండలాలు
అల్లిపురం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) త్వరలో రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించనుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన నాలుగు మండలాలైన భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తిలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతమైంది. ప్రస్తుతం 98 వార్డులతో ఉన్న జీవీఎంసీ ఈ నాలుగు మండలాల విలీనంతో 120 వార్డులకు విస్తరించనుంది. ఈ విస్తరణతో విశాఖపట్నం భారతదేశంలో 18వ అతిపెద్ద నగరంగా కూడా గుర్తింపు పొందనుంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలను(భీమిలి, పద్మనాభం, ఆనందపురం) జీవీఎంసీలో కలపాలని అక్కడి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయగా.. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు అధికారులు పనులను వేగవంతం చేసినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా జీవీఎంసీ అధికారులు విలీనం కానున్న నాలుగు మండలాల పరిధిలోని రెవెన్యూ, గ్రామ పంచాయతీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విలీన ప్రక్రియలో ప్రభుత్వం జీవీఎంసీకి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. విలీనమయ్యే ప్రాంతాల్లోని పంట పొలాల విస్తీర్ణంపై అధికారులు ప్రత్యేకంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవసాయ భూములకు జీవీఎంసీ పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసే నాటికి, తదుపరి జీవీఎంసీ ఎన్నికల లోపు... భూ సర్వే, గృహాలు, పంట పొలాలు, దేవాలయాలు వంటి అన్ని అంశాలపై సమగ్ర జాబితాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ గ్రామ పంచాయతీల్లో గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వాటర్ సప్లై, విద్యుత్ సిబ్బంది, గుర్ఖాలను జీవీఎంసీలోకి తీసుకునేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. -
జలాశయాల్లోకి పోటెత్తిన వరదనీరు
దేవరాపల్లి: మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు జలాశయాల్లోకి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. రైవాడ జలాశయానికి భారీగా నీరు రావడంతో నాలుగు గేట్లు తెరిచి 12వేల క్యూసెక్కులను శారదానదిలో బుధవారం విడుదల చేశారు. బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో 10వేల క్యూసెక్కుల ఉన్న ఇన్ఫ్లో, మధ్యాహ్నం 12 గంటల సమయానికి 11వేల క్యూసెక్కులు, ఒంటి గంట సమయానికి 12 క్యూసెక్కులుగా పెరుగుతూ వచ్చింది. అప్రమత్తమైన జలాశయం పర్యవేక్షణ డీఈ జి. సత్యంనాయుడు తదితర ఇంజనీరింగ్ అధికార్లు ఇన్ఫ్లో ఆధారంగా స్పిల్వే గేట్లు ద్వారా శారదానదిలోకి వరదనీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కసారిగా 12వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండటంతో శారదానది ఉగ్రరూపం దాల్చింది. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 112.97 మీటర్లకు చేరుకుంది. మాడుగుల: మండలంలో పెద్దేరు జలాశయంలోకి 1600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అంతే నీటిని రెండు ప్రధాన గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దేరు పొంగి ప్రవహిస్తుండడంతో ఎల్.పొన్నవోలు, జేడీ పేట, సత్యవరం, జంపెన, వీరనారాయణం వీరవల్లి తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్దేరు జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 136.80 మీటర్లకు చేరుకుంది. జత్యవరం, జంపెన, గొటివాడ అగ్రహారం గ్రామాల వద్ద పెద్దేరుపై గల వంతెనల వద్ద సచివాయ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా రాకపోకలు సాగిస్తున్నారు. చీడికాడ: మండలంలోని కోనాం జలాశయం నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరువైనట్టు ఇన్చార్జి ఏఈ సత్యనారాయణదొర తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా బుధవారం సాయంత్రానికి 99.10 మీటర్లకు చేరుకుంది. ఇన్ఫ్లో ఒక్కసారిగా 800 క్యూసెక్కులు పెరగడంతో సాయంత్రం నుంచి ప్రధాన గేట్ల ద్వారా దిగువకు700 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ఫ్లోను బట్టి నీటి విడుదలను పెంచే అవకాశం ఉందన్నారు. నాతవరం: తాండవ రిజర్వాయర్ నుంచి స్పిల్వే గేట్ల ద్వారా నదిలోకి బుధవారం 1,230 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ప్రాజెక్టు డీఈ అనురాధ తెలిపారు.మోంథా తుఫాన్ కారణంగా తాండవ రిజర్వాయర్ నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరడంతో నీటిని విడుదల చేసినట్టు చెప్పారు. ప్రాజెక్టులో గురువారం ఉదయం నీటి మట్టాన్ని పరిశీలించి ఇన్ఫ్లోను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. తాండవ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా, బుధవారం సాయంత్రానికి 377.3 అడుగులు ఉందన్నారు ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో 1,860 క్యూసెక్కులు వస్తోందని ఆమె చెప్పారు. ఈకార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు జెఈ శ్యామ్కుమార్ వర్కు ఇన్స్పెక్టర్లు నాగబాబు, అప్పారావు పాల్గొన్నారు. -
వరి పొలాల్లో నీటిని తొలగించాలి
అనకాపల్లి: మోంథా తుఫాన్ ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉంటూ వరి పొలాల్లో నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు సూచించారు. మండలంలో తుమ్మపాలలో వరి పొలాలను శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఒకట్రెండు చోట్ల లోతట్టు ప్రాంతాలు మినహా వరి పంట ఇప్పటి వరకు నీట మునగలేదన్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో వరి పిలక దశలో ఉందన్నారు. ఈ దశలో నష్టం తక్కువగా ఉంటుందని, పూత దశలో గానీ, పొట్ట దశలో గానీ పంటకు నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. వరి పంట పాలు పోసుకునే దశలో ఉంటే, పొలంలో నీటిని కాలువల ద్వారా తొలగించి, తెగుళ్ల నివారణ కోసం వర్షాలు తగ్గిన వెంటనే ఎకరానికి 200 మిల్లీలీటర్ల ప్రొపికోనిజోల్ మందును చల్లుకోవాలన్నారు. పంట గింజ గట్టిపడే దశలో ఉంటే వర్షపునీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించి, గింజ మొలకెత్తకుండా ఐదు శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాముల ఉప్పును లీటరు నీటికి) కలిపి పంటపై పిచికారీ చేయాలన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్రావు మాట్లాడుతూ దిమిలి, కట్టుబోలు గ్రామాల్లో శారదా నది గట్టు తెగిపోకుండా ఇసుక బస్తాలతో పటిష్టపరిచే చర్యలను తీసుకున్నామన్నారు. రైతులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ డి.ఉమామహేశ్వరరావు, మండల వ్యవసాయశాఖ అధికారి సుమంత, రైతులు తదితరులు పాల్గొన్నారు.ఏడీఆర్ ముకుందరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్రావు -
మోంథాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులతో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: మోంథా తుపాను సందర్భంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్టు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. స్థానిక గాంధీనగరం ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పరిధిలో అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించి, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పోలీసు, అత్యవసర సేవలను సంప్రదించాలని ఆయన కోరారు. ప్రజలు ప్రభుత్వం, వాతావరణ శాఖ, జిల్లా పోలీసు అధికారుల అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని చెప్పారు. -
నిరుపేదలకు ఆసరా
బుచ్చెయ్యపేట: మోంథా తుపాను ప్రభావంతో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలు, బిచ్చగాళ్లకు వీఎస్సార్ ట్రస్టు అధ్యక్షుడు సత్యారావు అండగా నిలిచాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బిచ్చగాళ్లు, మతి స్థిమితం లేక రోడ్లపై తిరిగే వ్యక్తులు తినడానికి ఏమీ దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. విషయం తెలుసుకున్న పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్సార్ ట్రస్ట్ అధ్యక్షుడు వడ్డి సత్యారావు వడ్డాది, బంగారుమెట్ట, పేట రహదారుల్లో తిరిగే పలువురు పేదలు, బిచ్చగాళ్ల వద్దకు వెళ్లి వారికి రెయిన్ కోట్లు, ఆహార పొట్లాలు, మంచినీటి బోటళ్లు అందించి ఆకలిని తీర్చారు. -
జలాశయాలకు పోటెత్తిన వరద
దేవరాపల్లి: మోంథా తుపాను ప్రభావంతో జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. సోమ, మంగళవారాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి రైవాడ జలాశయంలోకి భారీగా వరదనీరు చేరింది. 3 వేలు క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. మూడు స్పిల్వే గేట్లను ఎత్తి 2,700 క్యూసెక్కుల నీటిని శారదానదిలోకి విడిచిపెడుతున్నారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 114 మీటర్లు కాగా.. ప్రస్తుతం 112.30 మీటర్లకు చేరుకుంది. ఇన్ఫ్లో పెరిగితే నీటి విడుదలను మరింత పెంచే అవకాశం ఉన్నందున శారదానది పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలాశయం డీఈ జి.సత్యంనాయుడు సూచించారు. శారదానది దాటే ప్రయత్నం, నది స్నానాలు చేయొద్దన్నారు. తామరబ్బ వద్ద బ్రిడ్జి అడుగు భాగాన్ని తాకుతూ శారదానది ఉధృతంగా ప్రవహిస్తుంది.రావికమతం: కల్యాణపులోవ జలాశయాన్ని తహసీల్దార్ అంబేడ్కర్, ఏఈ సూర్య, అధికారులు, సర్పంచ్ వంజరి గంగరాజు మంగళవారం సందర్శించారు. జలాశయం గరిష్ట నీటి మట్టం వివరాలను తహసీల్దార్ అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా మంగళవారం కూడా జలాశయం నుంవి మూడు స్పిల్వే గేట్ల ద్వారా 200 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 460 అడుగులు కాగా.. సోమవారం సాయంత్రానికి 458.01 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఎగువ పరీవాహక ప్రాంతం నుంచి ఇన్ఫ్లో ద్వారా 200 క్యూసెక్కులు వస్తోంది. అదే స్థాయిలో మూడు గేట్లు ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ సూర్య తెలిపారు. చీమలపాడు పంచాయతీ కార్యదర్శి రాజ్కుమార్, వీఆర్వో చంటి, తదితరులు పాల్గొన్నారు. తామరబ్బ బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా గెడ్డ ప్రవాహం దేవరాపల్లి: మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని గిరిజన ప్రాంతంలోని తామరబ్బ బ్రిడ్జి పైనుంచి మంగళవారం రాత్రి గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో తామరబ్బ, సమ్మెద, చింతలపూడి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తామరబ్బ బ్రిడ్జిపై నుంచి మోకాలు లోతున నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. వెంటనే స్పందించిన అధికారులు, స్థానిక సర్పంచ్లు టోకురి రామకృష్ణ, ఉప సర్పంచ్ గుమ్మడపు దేవి మహేష్, తదితర నాయకులు బ్రిడ్జికి ఇరువైపులా ట్రాక్టర్లను అడ్డం పెట్టి రాకపోకలను నిలిపివేశారు. చింతలపూడి పంచాయతీలోని సుమారు 10 గ్రామాల ప్రజలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గెడ్డ ఉధృతి తగ్గుముఖం పడితే తప్ప ఇక్కడి ప్రజలు దేవరాపల్లి వైపు, దేవరాపల్లి నుంచి చింతలపూడి వైపు వెళ్లే పరిస్థితి లేదు. సమ్మెదలోను కూడా బ్రిడ్జిని తాకుతూ గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నది.రైవాడ జలాశయం స్పిల్వే గేట్ల నుంచి శారదానదిలోకి విడుదల చేసిన వరదనీరుదేవరాపల్లి: తామరబ్బ బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న శారదా నది -
ఊళ్లూ నీళ్లూ ఏకమై..
మోంథా తుపాను జిల్లాలో బీభత్సం సృష్టించింది. రెండు రోజులుగా కుండపోతగా భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లావ్యాప్తంగా సోమవారం సగటున 78.2 మి.మీ. వర్షాలు కురవగా.. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు 101 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ఏకధాటిగా వర్షాలు కురవడంతోపాటు ఈదురుగాలులు వీచడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. వంతెనలపై నుంచి వాగులు, గెడ్డలు పొంగి పొర్లాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.సాక్షి, అనకాపల్లి: భారీ వర్షాలతో ఊళ్లూ నీళ్లూ ఏకమయ్యాయి. రెండు రోజులపాటు ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో అన్ని ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. వాగులు, గెడ్డలు, చెరువుల నుంచి నీరు పొంగిపొర్లడంతో వరిపంట నీట మునిగింది. పెద్దేరు, తాండవ, కోనాం, రైవాడ, కల్యాణపులోవ రిజర్వాయర్లలో ఎగువ ప్రాంతం నుంచి వర్షపు నీరు చేరి నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో దిగువకు నీరు విడుదల చేశారు. భీమునిపట్నం–నర్సీపట్నం బీఎన్ రోడ్డుతోపాటు జిల్లాలో పలు రోడ్లలపై గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహదారులు ప్రమాదాలకు లోనయ్యారు. చూచుకొండ, రాంబిల్లి, కొత్తూరు, పురుషోత్తపురం, బుచ్చెయ్యపేట, చిన అప్పన్నపాలెం, బోనంగి, నాయుడు పాలెం మొదలైన ప్రాంతాల్లో తీవ్రమైన గాలులు, అధిక వర్షపాతం వలన పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ప్రమాదకరంగా జలాశయాలు మోంథా తుపాను కారణంగా జలాశయాలు ప్రమాదకరంగా మారాయి. గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు స్పిల్వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ● తాండవ రిజర్వాయరు ప్రమాదస్ధాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ఎగువ ప్రాంతం నుంచి అధికంగా నీరు రావడంతో 378 అడుగులకు చేరింది. ● పెద్దేరు రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 136.60 మీటర్లుగా ఉంది. ● రైవాడ రిజర్వాయర్లో గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా.. 112.3 మీటర్లకు చేరింది. 2700 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ● కల్యాణపులోవ జలాశయం గరిష్ట నీటిమట్టం 460 అడుగులు కాగా 458.01 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీరప్రాంతం, లోతట్టు ప్రాంతాల్లోని 136 గ్రామాల్లో నివసిస్తున్న 3,930 మందిని గుర్తించి 68 ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 381 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాలో గల 5,35,492 రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేశారు. రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను ఆర్ అండ్ బీ విభాగం వారు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వారి సహకారంతో తొలగించారు. 71 మంది నిండు గర్భిణులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో 55 మంది ప్రసవించగా..16 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ● దేవరాపల్లి మండలంలో గిరిజన గ్రామాల నుంచి 97 మందిని మంగళవారం పునరావాస కేంద్రాలకు తరలించారు. ● కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో బలిఘట్టం శ్రీబ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయ కొండపై నివాసం ఉంటున్న కుటుంబాలను బలిఘట్టం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ● తుపాను కారణంగా హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, సీలేరు ప్రాంతాలకు వెళ్లే బస్సులను రద్దు చేసినట్లు నర్సీపట్నం డిపో మేనేజర్ ధీరజ్ తెలిపారు. ● నర్సీపట్నం అయ్యన్న కాలనీలో సోమిరెడ్డి రాములమ్మ అనే వృద్ధురాలు మంగళవారం విద్యుదాఘాతానికి గురైంది. గాయపడిన మహిళను సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తీసుకువెళ్లారు. ● కోటవురట్ల మండలం రామన్నపాలెంలో పైల రమణబాబుకు చెందిన పెంకుటిల్లు కొంతమేర కూలిపోయింది. కై లాసపట్నం శివారున భారీ వృక్షం మెయిన్రోడ్డుకు అడ్డుగా కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ● ఎస్.రాయవరం మండలంలో ఉప్పరాపల్లిరోడ్డు, ఎస్.రాయవరం రెల్లి కాలనీల్లో భారీ వృక్షాలు కూలడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ● చోడవరం మండలంలో గోవాడ, పీఎస్పేట, జుత్తాడ, గవరవరంతోపాటు పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ● రావికమతం మండలంలో టి.అర్జాపురంలో వేములపూడి అక్కమ్మ రేకుల షెడ్డుపై చెట్టు కూలింది.ఽథర్మవరంలో పల్లా బ్రహ్మలింగస్వామి రేకుల ఇంటిపై చెట్టు పట్టడంతో ఇల్లు ధ్వంసమైంది. ● యలమంచిలి పట్టణం రైల్వేస్టేషన్ రోడ్డులో గొల్లప్రోలు ఆస్పత్రి సమీపంలో రోడ్డుపై పెద్ద చెట్టు కొమ్మ విరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో వాహనా ల రాకపోకలకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ● అచ్యుతాపురం మండలంలో మడుతూరు, గొర్లె ధర్మవరాల్లో రెండు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కొండకర్ల నుంచి ఎం.జగన్నాథపురం వెళ్లే మార్గంలోని కల్వర్టు గోడ శిథిలమయింది. తుమ్మపాల: అనకాపల్లి మండలం శంకరంలో నీట మునిగిన వరి పొలాలు జిల్లాను ముంచేసిన ‘మోంథా’ 101 మి.మీ. సగటు వర్షపాతం ఈదురుగాలులకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు వంతెనల మీదుగా పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు రిజర్వాయర్లలో ప్రమాద స్థాయికి నీటిమట్టాలు దిగువకు నీరు విడుదల.. నీట మునిగిన పొలాలు జిల్లాలో వర్షపాతం వివరాలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 101.0 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. మండలం వర్షపాతం (మి.మీ.) సబ్బవరం 167.8 రాంబిల్లి 156.2 పరవాడ 150.4 అచ్యుతాపురం 137.8 కె.కోటపాడు 134.0 చోడవరం 126.4 మునగపాక 125.6 నక్కపల్లి 119.2 బుచ్చెయ్యపేట 112.2 ఎస్.రాయవరం 102.8 యలమంచిలి 102.8 కశింకోట 98.6 అనకాపల్లి 98.4 రావికమతం 98.2 రోలుగుంట 90.0 పాయకరావుపేట 80.6 చీడికాడ 80.2 నర్సీపట్నం 75.4 మాకవరపాలెం 72.4 కోటవురట్ల 66.8 నాతవరం 51.0 గొలుగొండ 59.8 దేవరాపల్లి 66.4 మాడుగుల 50.0 -
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిద్ధం
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడివిశాఖ సిటీ: మోంథా తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఏర్పడే అంతరాయాలను అత్యంత వేగంగా పునరుద్ధరించేందుకు ఏపీఈపీడీసీఎల్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. సంస్థ పరిధిలోని 11 జిల్లాల అధికారులను ముందుగానే అప్రమత్తం చేశామని చెప్పారు. ఇందు కోసం సుమారు 15 వేల విద్యుత్ స్తంభాలు, 950 ట్రాన్స్ఫార్మర్లు, 115 క్రేన్లు, 80 జేసీబీలు, 144 వైర్లెస్ హ్యాండ్సెట్లు, 285 పవర్సాలు, 254 పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు, మొబైల్ డీటీఆర్ రిపేర్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తుఫాను పునరుద్ధరణ చర్యలు పూర్తయ్యే వరకు ఉద్యోగుల సెలవులను రద్దు చేసినట్లు చెప్పారు. సంస్థ పరిధిలోని ఇతర జిల్లాల నుంచి సుమారు 7 వేల మంది సిబ్బంది, అవసరమైన సామగ్రిని పెద్ద ఎత్తున తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలించామన్నారు. రాష్ట్రంలోని ఇతర విద్యుత్ సంస్థల నుంచి కూడా సుమారు 2 వేల మంది సిబ్బంది సహాయక చర్యల కోసం చేరుకున్నారన్నారు. అత్యవసర సేవలైన తుఫాను సహాయక కేంద్రాలు, హాస్పిటళ్లు, మొబైల్ టవర్లు, సబ్ స్టేషన్లు వంటి వాటికి నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా స్థానిక కంట్రోల్ రూమ్ నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం 8331018762 అనకాపల్లి 9490610023 కశింకోట 8333811271 కశింకోట 8333811272 నర్సీపట్నం 9491030723 -
మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఇద్దరి ఎంపిక
అప్పలనరసయ్యకు సర్టిఫికెట్ అందిస్తున్న సీపీ అనకాపల్లి: రాష్ట్ర స్థాయి 45వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు అనకాపల్లి పట్టణానికి చెందిన విశ్రాంత ఎల్ఐసీ ఉద్యోగులు వి.అప్పలనరసయ్య, కె.అప్పలమూర్తి ఎంపికయ్యారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈ నెల 26న విశాఖలో ఎంపిక పోటీలు జరిగాయి. 800, 1500 మీటర్ల రన్నింగ్ పోటీల్లో అప్పలనర్సయ్య, జావలిన్త్రో, షార్ట్ఫుట్ పోటీల్లో కె.అప్పలమూర్తి సత్తా చాటారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వీరిని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి సర్టిఫికెట్లు అందజేసి, అభినందించారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 13, 14 తేదీల్లో గుంటూరు జిల్లా పెదమండిపూడి మండలం పలపర్రు ఎన్ఎన్ ప్రభుత్వ హైస్కూల్లో జరగనున్నాయి. -
నదీ పరీవాహక గ్రామాల్లో అప్రమత్తం
అనకాపల్లి: తుఫాన్ కారణంగా నదీ పరీవాహక గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. మండలంలో వెంకుపాలెం వెదుళ్లగెడ్డ వద్ద రహదారిపై ప్రవహిస్తున్న శారదానది నీటిని ఆయన మంగళవారం సర్పంచ్ రాపేటి నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డుపై నుంచి వెదుళ్లగెడ్డ ప్రవహిస్తున్నందున వెంకుపాలెం, కుంచంగి గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందిని పెట్టి వాహనాలు, ప్రజలు ఆ మార్గంలో వెళ్లకుండా నివారించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలను రాకపోకలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ అశోక్ కుమార్కు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎస్ బాల సూర్యారావు, రూరల్ ఎస్ఐ రవికుమార్, వెంకుపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి తుఫాన్ కారణంగా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అత్యవసరమైతే ప్రయాణాలు చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎక్స్ప్రెస్ ప్లాట్ఫాంపై ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ) అధికారి వి.ప్రవీణను కలిసి ప్రయాణికుల బస్సులపై ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ ముంపునకు గురికాకుండా కాంప్లెక్స్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ హనుపమశ్రీ, ట్రాఫిక్ మేనేజర్ గౌరీ, పట్టణ, ట్రాఫిక్ సీఐలు ప్రేమ్కుమార్, ఎం.వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.వెంకుపాలెం వెదుళ్ల గెడ్డను పరిశీలించిన ఎస్పీ తుహిన్ సిన్హా -
2400 క్యూసెక్కుల తాండవ నీరు విడుదల
నాతవరం: తాండవ రిజర్వాయర్ నుంచి స్పిల్వే గేట్ల ద్వారా నదిలోకి 2400 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నామని ఇరిగేషన్శాఖ ఈఈ బాల సూర్యం అన్నారు. తాండవ రిజర్వాయరు ప్రమాదస్ధాయి నీటి మట్టాన్ని మంగళవారం పరిశీలించారు. తాండవ రిజర్వాయరు ప్రమాదస్థాయి నీటి మట్టం 380 అడుగులు కాగా ఎగువ ప్రాంతం నుంచి అధికంగా నీరు రావడంతో ప్రాజెక్టు నీటిమట్టం 378 అడుగులకు చేరిందన్నారు. మంగళవారం సాయంత్రానికి 377,5 అడుగులు నీటి మట్టం ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో నీరు ప్రాజెక్టులోకి 1200 క్యూసెక్కులు వచ్చి చేరుతుంన్నారు. తాండవ ప్రాజెక్టు ప్రమాద స్థాయి నీటి మట్టం తగ్గేంత వరకు సిబ్బంది నిత్యం పర్యవేక్షణ ఉండాలని డీఈ అనురాధ, జేఈ శ్యామ్కుమార్ సిబ్బందికి సూచించారు. నాతవరం మండలం పరిధిలో గల ఏటవతల గామాల ప్రజలు నదిలోకి దిగరాదన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు, తుని మండలాల పరిధిలో నదీ పరివాహక గ్రామాల ప్రజలు, పశువులు నదిలోకి దిగరాదని దండోర ద్వ్రారా తెలియజేశామన్నారు. తాండవ ప్రాజెక్ట్ను నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్ఐ తారకేశ్వరరావు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణ పరిశీలించారు. -
ముందస్తు చర్యలు ఫలితాలనిచ్చాయి
తుఫాన్ ప్రత్యేకాధికారి అజయ్ జైన్ మహారాణిపేట: మోంథా తుపాను దృష్ట్యా ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలు మంచి ఫలితాలనిచ్చాయని, ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగామని తుపాను ప్రత్యేక అధికారి అజయ్ జైన్, కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. రాబోయే 12 గంటలు అత్యంత కీలకం కాబట్టి ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వీసీ హాలులో ఎంపీ శ్రీ భరత్, కలెక్టర్ హరేందిర ప్రసాద్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన అజయ్ జైన్.. మోంథా తుపాను తాజా పరిస్థితిని వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో ఒక్కో జోన్కు రెండేసి చొప్పున క్యూఆర్టీ బృందాలు పని చేస్తున్నాయని చెప్పారు. చెట్ల కొమ్మలు, డ్రెయిన్లలో పూడిక ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ములగాడ, సీతకొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, ఇతర చోట్ల రాళ్లు జారినట్లు గుర్తించామన్నారు. జిల్లాలోని 14 చెరువులు ప్రమాదకర స్థితిలో ఉన్నందున, ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. 119 చెట్లు కూలిపోగా 60 తొలగించామని, 9 విద్యుత్ స్తంభాలు పడిపోగా ఏడింటిని పునరుద్ధరించినట్లు తెలిపారు.8 గోడలు కూలిపోగా 4 చోట్ల చర్యలు చేపట్టామన్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా 35 ట్యాంకులను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ వెల్లడించారు. అత్యవసరమైతే 0891–2590100, 96669 09192, 180042 500009 హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
భయంభయంగా వాహన రాకపోకలు
బుచ్చెయ్యపేట: తుపాను వర్షాలకు మండలంలో డైవర్షన్ రోడ్లు ప్రమాదకరంగా తయారయ్యాయి. వీటిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని వాహనదారులు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. వడ్డాది మేజర్ పంచాయతీలో పెద్దేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డుపై నుంచి రేయింబవళ్లు వరదనీరు ప్రవహిస్తోంది. దాంతో రాత్రిళ్లు వేగంగా వస్తున్న వాహనదారులకు చీకట్లో నీటి ప్రవాహం కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారు. నర్సీపట్నం, చోడవరం ఆర్టీసీ బస్సులతోపాటు పాడేరు నుంచి కాకినాడ, రాజమండ్రి వరకు, విశాఖ నుంచి కొత్తకోట, బుచ్చెయ్యపేట, పెదమదీనకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, లారీలు, వ్యాన్లు ఇతర వాహనాలు నీట మునిగిన డైవర్షన్ రోడ్డుపై నుంచి ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నాయి. విజయరామరాజుపేట డైవర్షన్ రోడ్డును ఆనుకుని నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది మట్టి డైవర్షన్ రోడ్డు కావడంతో ఎప్పుడు గండిపడుతుందోనని వాహనదారులు భయపడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల తాచేరు డైవర్షన్ రోడ్డు వద్ద వడ్డాది రైతు, పేట విద్యార్థి కాలు జారి నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వేరే గత్యంతరం లేక ఈ డైవర్షన్ రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నారు. వీటి స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు.బుచ్చెయ్యపేట: వడ్డాదిలో నీటి ప్రవాహంలో వాహనదారుల ప్రయాణంపేటలో డైవర్షన్ రోడ్డును ఆనుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీరుబుచ్చెయ్యపేటలో ప్రమాదకరంగా డైవర్షన్ రోడ్లు -
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా పూజారి శైలజ
అనకాపల్లి: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా ప్రముఖ వెయిట్ లిఫ్టర్ పూజారి శైలజ బాధ్యతలు స్వీకరించారు. విశాఖలో వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా విధులు నిర్వహిస్తున్న ఆమెను సాధారణ బదిలీల్లో భాగంగా అనకాపల్లి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడాకారులను ఉన్నత స్థాయి స్థితికి తీసుకువెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో గ్రామీణ స్థాయిలో ఔత్సాహికులను గుర్తించి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతానన్నారు. పూజారి శైలజ కామన్వెల్త్ సహా పలు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందిస్తుందని, అర్హులైన క్రీడాకారులు నవంబర్ 4వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు httpr//sports.ap.gov.in, refirteration/payerrefirtration వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. -
సమయం
చేజారనీయొద్దు! మహారాణిపేట: మెదడుకు రక్తప్రసరణ ఒక్కసారిగా ఆగిపోవడం లేదా తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందకపోవడంతో నరాల సంబంధిత వ్యాధులు సోకుతాయి. అందులో కీలకమైనది బ్రెయిన్ స్ట్రోక్. రక్తనాళాలు పగలడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఇలాంటి వారికి వీలైనంత వేగంగా అత్యవసర వైద్య సేవలు అందించాలి. లేకుంటే ప్రాణం మీదకు వస్తుంది. కేజీహెచ్లోనే నెలకు 160 కేసులు కేజీహెచ్లో సగటున నెలకు సుమారు 160 స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో సుమారు 70 శాతం మంది పురుషులు, మిగిలిన వారు సీ్త్రలు. మొత్తం స్ట్రోక్లలో 17% హెమరైజ్డ్ స్ట్రోక్లు కాగా, మిగతా 83% ఇస్కిమిక్ స్ట్రోక్లేనని వైద్యులు చెప్తున్నారు. 2024 ఆగస్టు నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 14 నెలల్లో 54 మందికి థ్రాంబోలైసిస్ చేశారు. గత ఆరు మాసాల్లో ఈ రకమైన చికిత్స అవసరమైన కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మధ్య వయసు, వృద్ధ పురుషుల్లో స్ట్రోక్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరే కేసుల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య పదింతలున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలవాట్లే ప్రధాన కారణం పలు ఆహారపు అలవాట్ల వల్లే ఇలాంటి వ్యాధులు వస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రధాన ప్రమాద కారకాలు రక్తపోటు, మధుమేహం, అధిక కొవ్వు, పొగ త్రాగడం, మద్యపానం, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం వల్ల ఎక్కువ మందికి ఈ స్ట్రోక్ వస్తోంది. నిద్రలో శ్వాస ఆగడం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, దంత దోషాలు, గాలిలో కాలుష్యం, పండ్లు, కూరగాయలు తక్కువగా తినడం కూడా కారణాలే. ఈ లక్షణాలుంటే.. ముఖం వంకరగా మారడం, చేతులు బలహీనమవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం, ఎదుటివారి మాటల్ని అర్థం చేసుకోలేకపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఒక్కసారిగా చూపు తగ్గిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తే దాన్ని స్ట్రోక్గానే భావించొచ్చు. ఇలాంటి సమయంలో నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి చేరుకుని, సత్వర వైద్య సేవలు పొందితే ముప్పు తప్పించుకోవచ్చు. ఒకప్పుడు 50–60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్ మాట వినేవాళ్లం. ప్రస్తుత దురలవాట్ల కారణంగా పిల్లల్లో కూడా ఈ సమస్య చూస్తున్నాం. ఇటీవల తరచూ 20–35 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా ఈ సమస్యతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. వీటిలో 80–90 శాతం మంది సత్వర చికిత్సతో కోలుకుంటున్నా.. కొందరు స్ట్రోక్ కారణంగా పక్షవాతానికి గురై కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అక్టోబర్ 29 వరల్డ్ స్ట్రోక్ డే. ఈ ఏడాది ప్రతి నిముషం లెక్కలోకి(ఎవ్విరీ మినిట్ కౌంట్స్) థీమ్తో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముందు జాగ్రత్తలే మేలు స్ట్రోక్ నివారణకు రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడం, పొగ త్రాగకపోవడం, మద్యపానం తగ్గించడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడిని తగ్గించడం, మంచి నిద్ర అలవాటు చేసుకోవడం, గాలి కాలుష్యాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. సత్వర వైద్యంతో మేలు పక్షవాతాన్ని త్వరితగతిన గుర్తించి వైద్యం అందిస్తే కాపాడే వీలుంటుంది. ఆలస్యం జరిగితే ప్రాణాలకే ముప్పు. నూతన చికిత్సా విధానాలైన థ్రాంబోలైసిస్ లేదా థ్రాంబెక్టమీ ద్వారా మనిషి పూర్తిగా కొలుకునే అవకాశం ఉంటుంది. ఎంత వేగంగా చికిత్స అందిస్తే అంత మంచిది. – డాక్టర్ సీహెచ్ విజయ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ ఐకాన్ అలవాట్లలో మార్పు తప్పనిసరి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. అన్ని రకాల స్ట్రోక్లకు వైద్యం అందించాం. చాలా మందికి తగ్గింది. కొంత మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. ఒక సారి స్ట్రోక్ వచ్చిన వారు అలవాట్లలో మార్పు చేసుకోవాలి. – డాక్టర్ ఎస్.గోపి, న్యూరాలజీ విభాగాధిపతి, ఏఎంసీ/కేజీహెచ్ -
దొంగనోట్ల కేసులో మరో ముగ్గురి అరెస్ట్
ఎంవీపీకాలనీ: నగరంలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును ఇటీవల రట్టు చేసిన కేసులో ఎంవీపీ పోలీసులు మరో ముగ్గురు నిందితులను సోమవారం రిమాండ్కు పంపారు. ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహామూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీరామ్ అలియాస్ గుప్తాను ముందుగా అరెస్టు చేశారు. తాజాగా పాల వరప్రసాద్, కొత్త ఆనంద్, కొప్పల గంగాధర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరిలో ఇద్దరిపై రౌడీషీట్లు ఉన్నాయని, గతంలోనూ వీరు పలు నేరాలకు పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎంవీపీ, సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులను ఆయన అభినందించారు కార్యక్రమంలో ఎంవీపీ సీఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రుషికొండలో డీఐజీ పర్యటన
కొమ్మాది: తుఫాన్ నేపథ్యంలో రుషికొండ బీచ్ను డీఐజీ గోపీనాథ్ జెట్టీ, అడిషనల్ ఎస్పీ మధుసూదన్తో కలిసి సోమవారం సాయంత్రం పర్యటించారు. పర్యాటకులు బీచ్కు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులను మైరెన్ పోలీసులు అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించారు. పర్యటక ప్రాంతాల్లోని దుకాణాలు మూసివేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు తుఫాన్ గురించి అవగాహన కలిగించాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూసుకోవాలని, తీర ప్రాంతాలకు ఆనుకొని నివాసాల్లో ఉన్న మత్స్సకారులను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో మైరెన్ పోలీసులు సమన్వయంగా పనిచేసి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. -
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకాలు
చోడవరం: రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 25 నుంచి రెండ్రోజుల పాటు అనంతపురంలో 42వ రాష్ట్ర స్థాయి తైక్వాండో క్యోరుగి, ఫూమ్సే పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు బంగారు పతకాలు, ముగ్గురు రజతాలు, ఒకరు కాంస్య పతకం సాధించారు. చోడవరానికి చెందిన మిండ్రాన హేమశ్రీ రెండు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. గుద్దేటి శశివర్థన్ మూడు విభాగాల్లో బంగారు, రజతం, కాంస్య పతకాలు సాధించారు. అల్లూరి జిల్లా జి.మాడుగుల కేజీబీవీ విద్యార్థినులు పి. ప్రవళ్లిక బంగారు పతకం, కె. గోవిందమ్మ కాంస్య పతకం గెలుచుకున్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి విశాఖ జిల్లాకు ఓవరాల్ చాంపియన్షిప్ మూడో స్థానం దక్కిందని ఏపీ తైక్వాండో అసోసియేషన్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు, కోచ్ పల్లం మురళి తెలిపారు. పతకాలు సాధించిన విజేతలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరంతా ఈ నెల 31వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. విజేతలను అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులు అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఉమ్మడి జిల్లా క్రీడాకారులు -
హోంగార్డు కుటుంబానికి రూ.3.98 లక్షల అందజేత
అనకాపల్లి: నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు ఎం.సత్యనారాయణ కుటుంబానికి హోంగార్డులు రూ.3,98,610 విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో సత్యనారాయణ భార్య వెంకటలక్ష్మికి స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా హోంగార్డు అనారోగ్యంతో మృతి చెందినా, పదవీ విరమణ పొందినా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు ఒక రోజు డ్యూటీ వేతనాన్ని స్వచ్ఛందంగా అందజేస్తున్నట్టు తెలిపారు. -
పలు రైళ్లు దారి మళ్లింపు
కొన్ని దారి మళ్లింపు తాటిచెట్లపాలెం : తుఫాన్ నేపథ్యంలో విశాఖ నుంచి బయల్దేరే, విశాఖ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని రైళ్లను గమ్యం కుదించింది. అలాగే వాల్తేర్ డివిజన్ పరిధిలోని స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటుచేసింది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డీఆర్ఎం లలిత్బోహ్ర ఆయా విభాగాల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ముందుగా సుమారు 43 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించినా, సాయంత్రానికి కొన్ని రైళ్లు యథావిథిగా బయల్దేరాయి. 28న రద్దు చేసిన రైళ్లు 1)కిరండూల్–విశాఖ(18516)నైట్ ఎక్స్ప్రెస్ 2)విశాఖపట్నం–కిరండూల్(58501)పాసింజర్ 3)కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ 4)విశాఖపట్నం–కోరాపుట్(58538)పాసింజర్ 5)కోరాపుట్–విశాఖపట్నం(58537)పాసింజర్ 6)కోరాపుట్–విశాఖపట్నం(18511)ఎక్స్ప్రెస్ 7)రాజమండ్రి–విశాఖపట్నం(67285)మెము 8)విశాఖపట్నం–రాజమండ్రి(67286)మెము 9)విశాఖపట్నం–కాకినాడ(17268) ఎక్స్ప్రెస్ 10)కాకినాడ–విశాఖపట్నం(17267) ఎక్స్ప్రెస్ 11)విశాఖపట్నం–గుంటూరు(22875) డబుల్ డెక్కర్ఎక్స్ప్రెస్ 12)గుంటూరు–విశాఖపట్నం(22876) డబుల్డెక్కర్ఎక్స్ప్రెస్ 13)బ్రహ్మపూర్–విశాఖపట్నం(18525)ఎక్స్ప్రెస్ 14)విశాఖపట్నం–పలాస(67289)మెము 15)పలాస–విశాఖపట్నం(67290)మెము 16)విజయనగరం–విశాఖపట్నం(67288) మెము 17)బ్రహ్మపూర్–విశాఖపట్నం(58531)పాసింజర్ 18)విశాఖపట్నం–బ్రహ్మపూర్(58532)పాసింజర్ 19)విశాఖపట్నం–గుణుపూర్(58506) పాసింజర్ 20)గుణుపూర్–విశాఖపట్నం(58505) పాసింజర్ 21)భువనేశ్వర్–కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్ప్రెస్ 22)భువనేశ్వర్–సికింద్రాబాద్(17015)విశాఖ ఎక్స్ప్రెస్ 23)భువనేశ్వర్–పుదుచ్చేరి(20851) వీక్లీ ఎక్స్ప్రెస్ వాల్తేర్ డివిజన్ పరిధిలో ఏర్పాటుచేసిన హెల్ప్లైన్ డెస్క్లు ● విశాఖపట్నం–0891–2746330 / 2744619 ● విజయనగరం–08922–221202 ● శ్రీకాకుళం రోడ్–08942–286213 / 286245 ● దువ్వాడ– 0891–2883456 ● రాయగడ–0891–2885744 / 2885755 ● నౌపడ–0891–2885937 ● అరకు–08936–249832 ● కోరాపుట్–0891–2884318 / 2884319 ● జగదల్పూర్–0891–2884714 / 2884715 ● బొబ్బిలి–0891–2883323 / 2883325 -
లైఫ్ సైన్స్ సింపోజియం పోటీల్లో ప్రథమ స్థానం
పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్ధ స్పేసెస్ డిగ్రీ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ ప్రథమ సంవత్సర విద్యార్థినులు టి.వైష్టవి, కె.షైనీ, ఎం.రమ్య, ఎస్.శ్యామల, ఎం.శృతి, పి.శరణ్యల బృందం విశాఖ లైఫ్ సైన్స్ సింపోజియం 2025 పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ తెలిపారు. విశాఖపట్నంలో ఈ నెల 24 నుండి 26 వరకు జరిగిన బయో ఎడ్సార్బెంట్ ఫిల్టర్ సిస్టమ్ పై వారు తయారు చేసిన పరికరం పై ప్రెజెంటేషన్ ఇచ్చి ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ బయాలజీ శాస్త్రవేత్త, భారత ప్రభుత్వ శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కార గ్రహీత డాక్టర్ ఉందుర్తి నరసింహ దాస్ చేతుల మీదుగా బహుమతి, నగదు పురస్కారాన్ని అందుకున్నట్టు ఆయన తెలిపారు. టీక్యాబ్సి నిర్వహించిన ఈ పోటీల్లో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొనగా తమ విద్యార్థులు ప్రథమ స్థానం కై వసం చేసుకోవడం ఆనందదాయకమని విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె నరపింహారావు అన్నారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ డా.రామకృష్ణారెడ్డి, విద్యార్ధులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
బీఎన్ రోడ్డు గోతుల్లో ట్రాక్టర్ బోల్తా
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం– నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో పొట్టిదొరపాలెం వద్ద సోమవారం ఆయిల్పామ్ గెలల లోడ్ ట్రాక్టర్ బోల్తా పడింది. రావికమతం మండలం కింతలి నుంచి బుచ్చెయ్యపేట మండలం ఎల్బీ పురంలో పామాయిల్ ఫ్యాక్టరీకి ట్రాక్టర్పై రైతు ఆయిల్పామ్ గెలలు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో పొట్టిదొరపాలెం బస్సు షెల్టర్ దగ్గర రోడ్డు గోతుల్లో ట్రాక్టర్ తొట్టె అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్లో ఆయిల్పామ్ గెలలన్నీ రోడ్డు పక్కన బురదలో పడిపోయాయి. బోల్తా పడిన ట్రాక్టర్ను స్థానికుల సహాయంతో లేపారు. బురదలో పడిపోయిన గెలలను వర్షంలోనే ఎక్కించి ఫ్యాక్టరీకి తరలించడానికి రైతు తీవ్ర అవస్థలు పడ్డాడు. -
ట్రాన్స్లేషనల్ మెడిసిన్పై జాతీయ సదస్సు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ట్రాన్స్లేషనల్ మెడిసిన్ ఇన్ క్యాన్సర్(టీఎంసీ)–2025 జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఏయూ టీఎల్ఎన్ సభామందిరంలో ఈ సదస్సును వ్యాస్ క్యాన్సర్ రీసెర్చ్ పార్క్ సీఈవో డాక్టర్ ఎం.కులకర్ణి ప్రారంభించి, మాట్లాడారు. కేవలం ఒక ఆలోచన పూర్తిస్థాయిలో వ్యాధుల్ని నయం చేయలేదన్నారు. ఆలోచన ఔషధంగా తయారుకావడానికి మధ్య అనేక అంశాలు ముడిపడి ఉంటాయని చెప్పారు. ట్రాన్స్లేషనల్ అంకాలజీ ప్రాముఖ్యతను వివరించారు. యువత, పరిశోధకులు విశాల దృక్పథం కలిగి ఉండడం, సవాళ్లను స్వీకరించే మనస్తత్వం అలవాటు చేసుకోవడం, అర్థమెటిక్ స్కిల్స్ పెంపొందించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. వైఫల్యాల నుంచి నేర్చుకునే తత్వాన్ని కలిగి ఉండడం ఎంతో ప్రధానమన్నారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్తులో విభిన్న సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుని, సంయుక్తంగా కలిసి పనిచేసే ఆలోచన ఉందని తెలిపారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయడం జరుగుతుందన్నారు. -
తుపాను షెల్టర్లలో పోలీసులు తిష్ట
మేమెక్కడుండాలంటూ బోయపాడు మత్స్యకారుల ఆవేదన నక్కపల్లి: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన తుపాను రక్షిత భవనాల్లో పోలీసులు తిష్ట వేశారు. మండలంలో బోయపాడు తుపాను రక్షిత భవనంలో నెల రోజుల నుంచి పోలీసులు ఉంటున్నారు. ఇక్కడ బల్క్డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా రాజయ్యపేట, బోయపాడు గ్రామాల్లో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా వందలాది మంది పోలీసులను మోహరించారు. వీరిలో చాలామందికి బోయపాడు తుపాను రక్షిత భవనంలో వసతి కల్పించారు. 30 రోజుల నుంచి పోలీసులంతా తుపాను భవనంలోనే ఉన్నారు. మోంథా తుపాను కారణంగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తీరానికి అతి సమీపంలో ఉన్న బోయపాడులో వెయ్యి మంది నివసిస్తున్నారు. తుపాను తీవ్రరూపం దాలిస్తే గ్రామానికి ఇబ్బంది ఏర్పడుతుంది. కెరటాలు ఎగిసి పడి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి వస్తే గ్రామ మత్స్యకారులను తుపాను రక్షిత భవనాల్లోకే తరలించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ భవనాల్లో పోలీసులు ఉండటంలో మత్స్యకారులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను తీవ్రరూపం దాల్చి అర్ధరాత్రి సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే తల దాచుకునేందుకు ఎక్కడ వెళ్తామని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. వేరొక చోట పోలీసులకు వసతి కల్పించి మత్స్యకారులకు పునరావాసం కల్పించేందుకు తుపాను షెల్టర్లను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ విషయం తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తి వద్ద ప్రస్తావించగా, బోయపాడు తుపాను షెల్టర్లో ఉన్న పోలీసులను ఖాళీ చేయిస్తున్నామన్నారు. మత్స్యకారుల కోసం అవసరమైన గదులు పునరావాస ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్లో రజతం
తుమ్మపాల: గుంటూరులో అండర్–17 విభాగంలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మార్టూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి గనిరెడ్డి తారక్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ మేరకు స్కూల్ కమిటీ చైర్మన్ సముద్రాలు, హెచ్ఎం విజయ సోమవారం అభినందించారు. మార్టూరు గ్రామానికి చెందిన తారక్ ఇక్కడ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. వెయిట్ లిఫ్టింగ్పై ఆసక్తి మేరకు పోటీల్లో పాల్గొని విజయం సాధించాడని పీఈటీ ఎం. సూర్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక
చోడవరం: జాతీయ స్థాయి యోగా పోటీలకు చోడవరం క్రీడాకారులు ఎంపికయ్యారు. విశాఖలో రెండ్రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో చోడవరం పతంజలి యోగా కేంద్రాల క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. అండర్ –14–18 బాలికల విభాగంలో పందిరి వెన్నెలశ్రీ మొదటి స్థానం దక్కించుకుంది. బాలుర విభాగంలో గొంతిన లయవర్ధన్ ద్వితీయ స్థానం, పి. పవన్కుమార్ తృతీయ స్థానం సాధించారు. అండర్ –18–24 విభాగంలో పి. జ్యోతిక మొదటిస్థానం, ఎం. శ్రీహిత మూడో స్థానం, 28 ఏళ్ల విభాగంలో బి.అనూష్ మూడో స్థానం, పురుషుల విభాగంలో వి.రాజా, సంతోష్ నాల్గో స్థానంలో నిలిచారు. వీరంతా బాపట్లలో త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పతంజలి యోగా కేంద్రం గురువు పుల్లేటి సతీష్ తెలిపారు. విజేతలను ఉషోదయ విద్యా సంస్థల చైర్మన్ జెర్రిపోతుల రమణాజీ, యోగా కేంద్రం కమిటీ ప్రతినిధులు డాక్టర్ బంగారు కృష్ణ, రెడ్డి అప్పారావు, రవితేజ, యోగా టీచర్ బోగవిల్లి గణేష్ కొట్టాపుహరి కిరణ్ భరిణికాన మోహన్కుమార్ అభినందించారు. -
ఏసీబీ వలలో ఆర్ఐ, సచివాలయ సెక్ర టరీ
తగరపువలస: జీవీఎంసీ భీమిలి జోన్ బొగ్గురోడ్డు–2 సచివాలయ పరిధిలో చిట్టివలసకు చెందిన ఒక వ్యక్తి ఇంటిపన్ను పేరు మార్చడానికి రూ.30 వేలు లంచం తీసుకుంటూ సచివాలయ అడ్మిన్ సెక్రటరీ వై.స్వామినాయుడును ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసి స్వామినాయుడును ప్రోత్సహించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముగడ రాజును అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. తాత పేరు మీదు ఉన్న ఇంటి పన్ను తన పేరిట మార్చాలని సెప్టెంబరులో బాధితుడు సచివాలయాన్ని సందర్శించారు. తరువాత అడ్మిన్, భీమిలి జోనల్ కార్యాలయంలో ఉన్న ఆర్ఐ వద్దకు తీసుకెళ్లగా రూ.60 వేలు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా జరుగుతున్న బేరసారాల అనంతరం రూ.30 వేలు ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించి, విశాఖలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో డీఎస్పీతో సహా సీఐలు శ్రీనివాసరావు, లక్ష్మణరావు, సుప్రియ మాటు వేసి తాతా థియేటర్ డౌన్లోకి మార్చిన సచివాలయంలో బాధితుడు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. తరువాత ఆర్ఐ రాజును చిట్టివలసలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని మంగళవారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. -
రహ‘దారుణాలు’.. ఇంకెన్నాళ్లు?
చోడవరం: పెద్ద పెద్ద గోతులతో ప్రమాదకరంగా మారిన అనకాపల్లి–వయా చోడవరం, నర్సీపట్నం రోడ్డు, వడ్డాది– మాడుగుల రోడ్డును వెంటనే బాగుచేయాలని కోరుతూ ప్రజాసంఘాలు, ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు నిరశన దీక్షలకు దిగారు. చోడవరం తహసీల్ధార్ కార్యాలయం వద్ద సోమవారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ప్రభుత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు పనులు చేయకపోవడంతో సుమారు 54 కిలోమీటర్లమేర మెయిన్రోడ్డంతా పెద్దపెద్ద గోతులతో ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డు బాగుచేయాలని కోరుతూ ఇప్పటికే న్యాయవాదులు, ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించడం, పలు విధాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం, కాంట్రాక్టర్ కనీస స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రోడ్డు పనులు చేపట్టలేదు. తాత్కాలికంగా గోతులు పూడ్చినప్పటికీ నాణ్యత లేకుండా పనులు చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నూతులుగా మారి రాకపోకలు సాగించే వాహనాలు ప్రమాదాలకు లోనవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని చోడవరం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కామిరెడ్డి వెంకట్రావు ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కొణతాల హరనాఽథ్బాబు, చోడవరం ఇన్చార్జి వేగి మహాలక్ష్మినాయుడు, మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శీతల్ మదన్, సోషల్ మీడియా ఇన్చార్జి పవన్కుమార్, మాడుగుల కాంగ్రెస్ ప్రతినిధి పడాల కొండలరావు, ఎం.నారాయణరావు, త్రినాథరావు దీక్షలో కూర్చున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంపై వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పూర్తిగా గోతులతో నిండిపోవడంతో అంబులెన్స్లు సైతం సకాలంలో రోగులను, క్షతగాత్రులను తీసుకొని ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రోడ్డు నిర్మాణపనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
విఘ్నేశునికీ తప్పని తిప్పలు
ప్రముఖ పుణ్యక్షేత్రం చోడవరం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి గర్భాలయం కూడా నీట మునిగింది. స్వామివారి ప్రధానాలయం ఏనుగుబోదు చెరువు గర్భంలో ఉండటంతో భారీ వర్షాలకు చెరువు నిండిపోయింది. బుచ్చెయ్యపేట మండలంలో వడ్డాది పెద్దేరు డైవర్షన్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహించగా వరద నీటిలోనే ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర వాహనానలు రాకపోకలు సాగిస్తున్నాయి. విజయరామరాజుపేట డైవర్షన్ రోడ్డును ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. వర్షం ఎక్కువైతే విజయరామరాజుపేట డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయేలా ఉంది. దీంతో మళ్లీ బీఎన్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురైతే అక్కడ ప్రజల్ని తరలించడానికి విజయరామరాజుపేట హైస్కూల్, వడ్డాది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రిలీఫ్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. చోడవరం: గర్భగుడిలోకి వరదనీరు రావడంతో నీట మునిగినశ్రీ స్వయంభూవిఘ్నేశ్వరస్వామి -
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా రక్షణ
తుమ్మపాల: మోంథా తుపాను ప్రభావానికి లోనయ్యే తీర, నదీ పరీవాహక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా ప్రత్యేక అధికారి వి.వినయ్చంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి పలు శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. శాఖలవారీగా చేసిన ముందస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర విధులలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రతి పునరావాస కేంద్రంలో ఆహారం, మంచినీరు, కరెంటు, చిన్నపిల్లలకు పాలు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చెట్లు పడిపోతే వెంటనే తొలగించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. జలాశయాలు, చెరువులలో నీటి ప్రవాహం నిరంతరం పర్యవేక్షించాలని, గండ్లు పడేందుకు అవకాశం గల గుర్తించిన ప్రాంతాలలో తక్షణ చర్యలు తీసుకోవడానికి అవసరమైన ఇసుక బస్తాలు, ఇతర మెటీరియల్ సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా ఆస్పత్రిని సిద్ధంగా ఉంచుకోవాలని, 104, 108 వాహనాలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రత్యేకాధికారి సమావేశం అనంతరం కలెక్టర్ విజయ కృష్ణన్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు సదుపాయం లేని 62 గిరిజన గ్రామాల ప్రజలను దగ్గరలో గల మైదాన ప్రాంతానికి తరలించాలని, అక్కడ పాఠశాలలు, ఆశ్రమపాఠశాలల్లో వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని పాయకరావుపేటలోను, ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని జిల్లా కేంద్రంలోను మోహరించామని, మరొక బృందం పంపించవలసినదిగా కోరామని, వారిని అచ్యుతాపురంలో వినియోగిస్తామన్నారు. జేసీ జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు పాల్గొన్నారు. -
హరహర మహాదేవ
● ఘనంగా కార్తీక తొలి సోమవారం పూజలు ● కిటకిటలాడిన శివాలయాలు అనకాపల్లిలో కూరగాయలు మార్కెట్ వద్ద సాధువుల గుడిలో శివలింగానికి క్షీరాభిషేకం చేస్తున్న భక్తులువేల్పులవీధి కాళీవిశ్వేశ్వరాలయంలో ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేస్తున్న మహిళలు పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో తొలి సోమవారం జిల్లాలో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారు జాము నుంచే భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఉపవాస దీక్షతో పుణ్యస్నానాలు ఆచరించి, క్యూలైన్లలో నిలబడి దేవదేవుడిని దర్శించుకున్నారు. శివలింగానికి పాలధారతో అభిషేకం చేస్తూ, బిల్వదళాలతో పూజలు చేసి, తమ భక్తిని చాటుకున్నారు. పలు ఆలయాల్లో భక్తులు దీపాలు వెలిగించారు. అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. –అనకాపల్లి -
సత్ప్రవర్తనతో జీవితంలో మార్పు
నర్సీపట్నం: జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, విశాఖపట్నం సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు సోమవారం నర్సీపట్నం సబ్ జైలును సందర్శించారు. జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఖైదీలతో సమావేశమయ్యారు. నేరాలు చేసి జైలులో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారని, మీ ప్రవర్తనలో మార్పు రావాలని ఖైదీలకు సూచించారు. జైలు నుంచి బయటకు వెళ్లిన తరువాత మంచి ప్రవర్తన కలిగి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. బెయిల్ పెట్టుకునేందుకు ఆర్థిక స్థోమత లేని వారు లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. నర్సీపట్నం లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి పి.షియాజ్ ఖాన్, సీఐ జి.గోవిందరావు, తహసీల్దార్ రామారావు, అగ్రికల్చర్ ఏడీ శ్రీదేవి, ఎంఈవోలు సిహెచ్.తలుపులు, నాగేంద్ర, న్యాయవాదులు గోవర్ధన్ గిరి, ఏఎస్డబ్ల్యూవో బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
కుదిపేసిన కుండపోత
ప్రమాదకరంగా జలాశయాలు ● 36.9 మి.మీ సగటు వర్షపాతం నమోదు ● 74 పునరావాస కేంద్రాల ఏర్పాటు ● సహాయక చర్యలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ● ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రత్యేకాధికారి ● నేడు కూడా కుంభవృష్టి కురిసే అవకాశం మండలం వర్షపాతం (మి.మీ) పరవాడ 66.8 సబ్బవరం 61.2 రాంబిల్లి 55 మునగపాక 49.8 అచ్యుతాపురం 49.2 నక్కపల్లి 48.4 కె.కోటపాడు 47.4 అనకాపల్లి 47.2 యలమంచిలి 42.8 కశింకోట 41.8 చోడవరం 25.2 రావికమతం 35.2 కోటవురట్ల 23.4 చీడికాడ 25.8 ఎస్.రాయవరం 33 బుచ్చెయ్యపేట 37.2 పాయకరావుపేట 34.8 నర్సీపట్నం 25.6 మాకవరపాలెం 25.4 మాడుగుల 20.8 రోలుగుంట 31.4 నాతవరం 17.6 గొలుగొండ 21.8 దేవరాపల్లి 17.6 తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలుసాక్షి, అనకాపల్లి: మోంథా తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. రోజంతా ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో జనజీవనం స్తంభించింది. గెడ్డలు, వాగులు పొంగుతున్నాయి. పలుచోట్ల రోడ్లపై నీరు పారుతోంది. పశువుల మేతకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీర ప్రాంత మండలాలైన పరవాడ, పాయకరావుపేట, అచ్యుతాపురం, ఎస్.రాయవరం, నక్కపల్లితో పాటుగా సబ్బవరం, కె.కోటపాడు మండలాల్లో భారీగా వర్ష పాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సగటున 36.9 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా పరవాడ మండలంలో 66.8 మి.మీ వర్షం కురిసింది. అత్యల్పంగా దేవరాపల్లి మండలంలో 4.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ ప్రాంతం నుంచి వర్షపు నీరు రావడంతో జలశయాలు ప్రమాదకరంగా మారాయి. చెరువులు, వాగులు, వంకలు మురుగు డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి పల్లపు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సముద్రం కల్లోలంగా మారడంతో పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లో గల తీర ప్రాంత గ్రామాల్లో మైరెన్ పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు, సందర్శకులు సముద్రంలోనికి వెళ్లకుండా గస్తీ కాస్తున్నారు. స్పెషల్ అధికారి వినయ్చంద్ ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సూచనలు ఇస్తున్నారు. ముంపు ప్రాంతాలైన పరవాడ పెద్ద చెరువు, పి.బోనంగిలోని విద్యుత్ సబ్స్టేషన్, ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీరాలను కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ముత్యాలమ్మపాలెం తుపాను షెల్టర్లో భద్రత ఏర్పాట్లను ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం రాత్రి పరిశీలించారు. మంగళవారం రాత్రి లేదా బుధవారం తెల్లవారుజామున తుపాను కాకినాడ జిల్లాలో తీరం దాటే అవకాశం ఉన్నందున మంగళవారం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు జిల్లాలో 74 తుపాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాయకరావుపేట మండలంలో 11, నక్కపల్లిలో 10, ఎస్.రాయవరం 5, చోడవరం 4, యలమంచిలి 1, సబ్బవరం 2, పరవాడ 3, మాడుగుల 2, గొలుగొండ 1, చీడికాడ 2, మాకవరపాలెం 1, కశింకోట 2, దేవరాపల్లి 2, అచ్చుతాపురం 2, అనకాపల్లి 1, మునగపాక 3, నాతవరం 2, కె.కోటపాడు 2, రోలుగుంట 1, నర్సీపట్నం 3, బుచ్చెయ్యపేట 2, కోటవురట్ల 3, రావికమతం 4, రాంబిల్లి మండలంలో 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణి తరలింపు రావికమతం: చీమలపాడు పంచాయతీలోని గిరిజన గ్రామం నేరేడుబంద నుంచి తంబిలి రచ్చోని అనే గర్భిణిని కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు నవంబర్ 1న ప్రసవం జరిగే అవకాశం ఉందని డాక్టర్లు తేదీ చెప్పడంతో ముందు జాగ్రత్తగా డిప్యూటీ ఎంపీడీవో సీతారామస్వామి సిబ్బందితో కలిసి కొండ మీదకు వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆమెను కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వమ్మవరంలో తాటాకింటిలో నివసిస్తున్న మంజేటి సత్యవతి, గంగరాజు కుటుంబాన్ని పునరావాస కేంద్రానికి తరలించారు. తహసీల్దార్ ఎస్వీ అంబేడ్కర్, ఎంపీడీవో మహేష్ సోమవారం రాత్రి మండల కేంద్రంలో ఉండి సహాయక చర్యలు చేపట్టారు.రావికమతం: కల్యాణపులోవ జలాశయం నుంవి సోమవారం మూడు స్పిల్వే గేట్ల ద్వారా 250 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 460 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 458.30 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. ఎగువ పరీవాహక ప్రాంతం నుంచి 200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. వర్షపాతం వివరాలు (రాత్రి 8.30 గంటల వరకు) నాతవరం: తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు తాండవ రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం ఉదయం 378 అడుగులకు చేరడంతో స్పిల్వే గేట్ల ద్వారా నదిలోకి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని ప్రాజెక్టు డీఈ అనురాధ తెలిపారు. తాండవ ప్రమాదస్ధాయి నీటిమట్టం 380 అడుగులు కాగా డేడ్స్టోరేజీ నీటిమట్టం 345 అడుగులుగా పరిగణిస్తారు. తాండవ ప్రధాన కాలువ ద్వారా కేవలం 100 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేస్తున్నామన్నారు. ఇన్ఫ్లో అధికమైతే రాత్రి సమయంలో నీటి విడుదల పెరిగే అవకాశం ఉందన్నారు. తాండవ ఒడ్డున ఉన్న జాలరిపేట గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామన్నారు. ప్రాజెక్టు జేఈలు శ్యామ్కుమార్, మధుబాబు, వర్క్ఇన్స్పెక్టర్లు నాగబాబు, అప్పారావు సిబ్బంది పాల్గొన్నారు.కల్యాణపులోవ నుంచి 250 క్యూసెక్కులు.. -
ప్రమాద స్థాయిలో పెద్దేరు
మాడుగుల: పెద్దేరు జలాశయం ప్రమాద స్థాయికి చేరుకుంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 136. 20 మీటర్లకు చేరుకోవడంతో జలాశయం అధికారులు ప్రధాన గేట్ల ద్వారా 350 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దేరు, తాచేరు, గొరిగెడ్డ, పాలగెడ్డ, ఉరకగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. తుపాను ప్రభావం మరింత ఎక్కువైతే వీటికి ముంపు సమస్య ఎక్కువవుతుందని, వీరవిల్లి, గొటివాడ, అగ్రహారం, వీజేపురం, జంపెన, తదితర గ్రామాల ప్రజలు, రైతులు, అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. -
ఆహ్లాదం ఆధ్యాత్మికం చోడవరం
పవిత్ర స్నానాల రేవుగా ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయంచోడవరం: ప్రాచీన దేవాలయాలతోపాటు, ఆహ్లాదకరమైన వన సమారాధన ప్రాంతంగా చోడవరం పరిసరాలు అనేకం ప్రాచుర్యంలోకి ఉన్నాయి. ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో అంతా శివాలయాలు దర్శనం, వారాంతం అంతా వనసమరాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో అతికొద్ది ప్రాచీన దేవాయాలు, వనసమారాధన (పిక్నిక్ స్పాట్లు) కలిగిన ప్రదేశాలు ఉండగా అందులో చోడవరం పరిసర ప్రాంతాలు ఉండటం విశేషం. ఆలయాల సమాహారం.. వెంకన్నపాలెం ఆలయాల సమాహారంగా ఉన్న వెంకన్నపాలెం షిర్డిసాయిబాబా ఆలయ ప్రాంతం జిల్లాలో ప్రముఖ పిక్నిక్, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచింది. పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండే కొండలు, కోనేరు, పడమటి కొండల మధ్యలో పారే శారదానది సెలయేరు...మామిడి జీడి తోటలు సందర్శకులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మరో పక్క ఒకే చోట చిన్ని చిన్న కొండలపై షిర్డిసాయిబాబా ఆలయం, శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, అతిపురాతన కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీకృష్ణుని ఆలయాల సమాహారం ఇక్కడ ఆధ్యాత్మిక ప్రదేశంగా భక్తులకు ప్రశాంతతను కలిగిస్తుంది. పిల్లలు పెద్దలు, వృద్ధులు అంతా కలిసి ఒకేచోట ఆనందంగా గడిపేందుకు అనువుగా ఉండే ఈ ప్రాంతం ఒక పక్క ఆథ్యాత్మికంగా మరోపక్క పిక్నిక్ స్పాట్గా ఉంది. కార్తీకమాసంలో ఈ ప్రాంతం భక్తులు, సందర్శకులతో సందడిగా ఉంటుంది. రవాణా సౌకర్యం విశాఖపట్నం నుంచి చోడవరం వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సు వెంకన్నపాలెం సెంటర్లో ఆగుతుంది. అనకాపల్లి నుంచి చోడవరం వెళ్లే బస్సులు ఉన్నాయి. నర్సీపట్నం, మాడుగుల, పాడేరు నుంచి వచ్చే వారు చోడవరంలో దిగి అక్కడ నుంచి విశాఖ, అనకాపల్లి వెళ్లే బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. తురుష్కుల కాలం నాటి శివాలయం ప్రాచీన దేవాలయాల్లో చోడవరం స్వయంభూ శ్రీగౌరీశ్వరస్వామి ఆలయం ఒకటి. 260యేళ్ల కిందట చోడవరం ప్రాంతాన్ని పాలించిన మత్స్యరాజుల కాలంలో భూమిలో వెలుగుచూసిన స్వయంభూ గౌరీశ్వరస్వామి ఇక్కడ దేవుడు. తరుష్కుల రాజుల నాటికాలంలో మత్స్యరాజులపై దండెత్తినప్పుడు ఈ ఆలయాన్ని కూడా శిథిలం చేయాలని భావించి, ఆలయంలో ఉన్న స్వయంభూ గౌరీశ్వరస్వామి శివలింగాన్ని కూడా గుర్రాలతో తొక్కించి ముక్కలు చేశారనేది ప్రతీక. అందుకే ఈ స్వయంభూవుని ఆలయంలో శివలింగం ముక్కముక్కలుగా ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. ఏక శిల స్తంభాలతో రాతి మండపాలతో నిర్మించి ఉన్న ఈ స్వయంభూ గౌరీశ్వరస్వామి సందర్శకులకు మంచి అనుభూతి ఇస్తుంది. ఆలయానికి ఆనుకొని పవిత్ర కోనేరు కలిగిన శివాలయాలు జిల్లాలో నాలుగైదు ఉంటే అందులో చోడవరం స్వయంభూ గౌరీశ్వరస్వామి ఆలయం ఒకటి. ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మహాశివుడు తపస్సు చేస్తున్న విగ్రహం, అర్ధనారీశ్వరుల నిలువెత్తు విగ్రహాలు ఆలయ ముఖ ద్వారం వద్ద భక్తుల దర్శనార్ధం ఉన్నాయి. రవాణా సౌకర్యం: ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటూ విశాఖపట్నం నుంచి ప్రతి 20నిమిషాలకు బస్సు ఉంది. 300, 300సి, గాజువాక నుంచి 311 నంబర్లతోపాటు పాడేరు, మాడుగుల, వెళ్లే బస్సులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. అనకాపల్లి, నర్సీపట్నం ప్రాంతాల నుంచి కూడా నేరుగా బస్సులు ఉన్నాయి. చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో దిగి నడిచి ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. మూడు నదుల పవిత్ర సంగమం... మూడు పవిత్ర నదులు సంగమం అయ్యే ప్రదేశంలో ఉన్న ముద్దుర్తి శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయానికి 900 యేళ్లనాటి చరిత్ర ఉంది. చోడవరం మండలం ముద్దుర్తి గ్రామ శివారు నదీ పరివాహకంపై రాతికట్టడంతో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడ పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించేందుకు స్నానఘట్టాలు కూడా ఉన్నాయి. శారదా, పెద్దేరు, బొడ్డేరు నదులు ఒకే చోట కలిసి సంగమంగా ఏర్పడిన ప్రదేశంలో ఈ ఆలయం ఉండడం వల్ల సంగమేశ్వరస్వామిగా ఇక్కడి మహాలింగాన్ని పూజిస్తారు. ఇక్కడ పార్వతి, వినాయక విగ్రహాలు ఉన్నాయి. పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవలే పునర్నిర్మించారు. ఆ సమయంలో గోపుర కలశం నుంచి బయల్పడిన నాణాలపై 78 అనే సంఖ్య ఉండడాన్ని బట్టి ఈ ఆలయం అత్యంత పురాతనమైనదిగా చెబుతున్నారు. నిత్య పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్నప్పటికీ పవిత్ర కార్తీక మాసం, శివరాత్రి రోజు, కనుమ పండుగ రోజు ఇక్కడ ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. రవాణా సౌకర్యం చోడవరం–అనకాపల్లి రోడ్డులో ఉన్న ముద్దుర్తి జంక్షన్ వద్ద బస్సు దిగి అక్కడ నుంచి ఆటోలు, ఇతర వాహనాలపై సంగమేశ్వరస్వామి ఆలయానికి చేరుకునేందుకు రవాణా సౌకర్యం ఉంది. అనకాపల్లి, చోడవరం నుంచి వచ్చే భక్తులు ఆ రూట్లలో బస్సు సౌకర్యం ఉంది. విశాఖపట్నం, పాడేరు, నర్సీపట్నం నుంచి వచ్చే భక్తులు వెంకన్నపాలెం జంక్షన్ వద్ద బస్సు దిగి అక్కడ నుంచి ఆటోలపై ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయానికి చేరుకోవచ్చు. పురాతన ఆలయాలకు ప్రసిద్ధి కార్తీక వన సమారాధనలకు అనుకూలం 250 ఏళ్లనాటి శైవక్షేత్రం స్వయంభూ గౌరీశ్వరస్వామి ఆలయం పవిత్ర స్నానఘట్టంగా ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం -
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
కశింకోట: మండలంలోని బయ్యవరంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వెళుతున్న కారు బైక్ను తప్పించబోయి రోడ్డు పక్క నడిచి వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొంది. వారిలో కృష్ణ అనే వ్యక్తి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరడంతో అతనిని, గాయపడిన మరో వ్యక్తిని 108 వాహనంలో అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విజయనగరానికి చెందిన ఈ ఇద్దరు క్షతగాత్రులు బయ్యవరం ప్రైవేటు పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నారు. బార్బర్ దుకాణానికి బయ్యవరం గ్రామం వద్దకు నడిచి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టారు. -
పులపర్తి కూడలి వద్ద ట్రాక్టర్ బోల్తా
యలమంచిలి రూరల్: మండలంలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై పులపర్తి కూడలి వద్ద ఆదివారం సాయంత్రం అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ సమయంలో ట్రాక్టర్ తొట్టెలో యూరియా బస్తాలపై కొందరు రైతులు ప్రయాణిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు వారంతా రోడ్డు పక్కకు పడ్డారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ కూడలి వద్ద బయ్యవరంలో ఉన్న మైహోం సిమెంటు కర్మాగారానికి వెళ్లే భారీ వాహనాలు టర్న్ తీసుకుంటున్నాయి. రోజూ పదుల సంఖ్యలో వాహనాలు ప్రయాణించడంతో జాతీయ రహదారి అంచుల వద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఇక్కడ ప్రయాణించే వాహనాలు రోడ్డు అంచుకు వెళితే ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జాతీయ రహదారి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అధికారులు పులపర్తి కూడలి వద్ద దెబ్బతిన్న రోడ్డు అంచులకు మరమ్మతు పనులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
బ్యాటర్ల హోరు.. బౌలర్ల జోరు
న్యూజిలాండ్పై ఇంగ్లండ్ విజయం విశాఖ స్పోర్ట్స్: పీఎంపాలెంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విశాఖ గడ్డపై జరిగిన ఈ లీగ్ చివరి మ్యాచ్.. సెమీ ఫైనల్స్కు సిద్ధమవుతున్న ఇంగ్లండ్ క్రీడాకారిణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 168 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ లిన్సే స్మిత్ మూడు వికెట్లు పడగొట్టి కివీస్ను దెబ్బతీశారు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్ అమీ జోన్స్ (86 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్తో మరో 124 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా విజయం సాధించింది. భారీగా తరలివచ్చిన క్రికెట్ అభిమానులు ఇరు జట్లకు మద్దతు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించి క్రికెటర్లలో ఉత్సాహం నింపారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
చోడవరం: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలతో కలిపి వైఎస్సార్సీపీ అందోళన చేపట్టిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చోడవరం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం ప్రచార వాల్పోస్టరును ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఆనంతరం విలేకర్లతో మాట్లాడారు. పేద, మెరిట్ విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలతో కలిసి వైఎస్సార్సీపీ ఉద్యమం చేయాలని తలపెట్టిందన్నారు. ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందన్నారు. చెరకు రైతులకు జీవనాధారమైన గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మూసివేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, రైతుల బతుకులు నాశనం చేసినట్టేనని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 89 కోట్ల సాయం చేశామని, ఐదు సంవత్సరాలు నిరాటంకంగా క్రషింగ్ చేసి, రైతులకు సకాలంలో పేమెంట్లు ఇచ్చామని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాడ సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు, జెడ్పీటీసీ పోతల శ్రీనివాస్, ఎంపీపీలు యర్రంశెట్టి శ్రీనివాసరావు, గాడి కాసులమ్మ, పైలా రాజు, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేశ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు బోడ్డేడ సూర్యనారాయణ, చోడవరం పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు ముక్కా మహలక్ష్మినాయుడు, కొల్లిమెల్ల అచ్చిమినాయుడు, దొడ్డి వెంకట్రావు, శరగడం సిమ్మినాయుడు, కంచిపాటి జగన్నాథరావు పాల్గొన్నారు.మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ -
‘పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు’
ఎస్.రాయవరం: ఒక వ్యక్తిని వారాల తరబడి నిర్బంధించమని ఏచట్టంలోనూ లేదని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నక్కపల్లి రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని ఉమ్మడి విశాఖజిల్లా, తూర్పు గోదావరి జిల్లా న్యాయవాదులు బృందం ఆదివారం సందర్శించింది. ఈ క్రమంలో ధర్మవరం అగ్రహారంలో 16 రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి చాలా తప్పిదం చేస్తున్నారని, ఏ చట్టం ప్రకారం రెండు వారాల పైగా అప్పలరాజు గృహ నిర్బంధం చేశారని ప్రశ్నించారు. న్యాయపోరాటం చేస్తున్న నిరసన కారులకు రాజకీయ పార్తీలు, సంస్థలు మద్దతు ఇచ్చే హక్కు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వెంకటేశ్వరరావు, సురేష్కుమార్, చిట్టిబాబు, ఏవై మణి, బి.తులసిదాసు, పూర్ణిమ, బి.సంతోష్, లక్ష్మీ, భాస్కరాచార్యులు, రమణారావు, అప్పలరెడ్డి, సురేష్, కె.రాఘవేంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
అమెరికాలో విశాఖ వైద్యుడికి అరుదైన గౌరవం
డాక్టర్ కల్యాణ్కు రెండు పురస్కారాలు మహారాణిపేట: విశాఖపట్నానికి చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ కె.కల్యాణ్ రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆదివారం అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో.. మానసిక వైద్య విద్యారంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డులను ప్రకటించారు. 2015లో అమెరికా వెళ్లడానికి ముందు డాక్టర్ కల్యాణ్ విశాఖలోని ఒక ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన వైద్య ప్రస్థానం భారత్లోనే ప్రారంభమైందని, ఈ పురస్కారాలు కేవలం వ్యక్తిగత మైలురాయి మాత్రమే కావని పేర్కొన్నారు. విశాఖకు చెందిన వ్యక్తిగా ఈ గౌరవం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. -
మత్స్యకారులతో కలెక్టర్ చర్చలు విఫలం
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులతో కలెక్టర్ విజయకృష్ణన్ శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని మత్స్యకారులు స్పష్టంచేశారు. సముద్ర జలాలను కలుషితంచేసి, చేపల వేటకు విఘాతం కలిగించే బల్క్ డ్రగ్ పార్కును రద్దుచేయాలంటూ 41 రోజులుగా రాజయ్యపేటలో మత్స్యకారులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 15 రోజుల క్రితం వీరంతా జాతీయ రహదారిని దిగ్బంధించి నక్కపల్లిలో నాలుగు గంటలపాటు ధర్నాచేశారు. దీంతో కలెక్టర్ వచ్చి త్వరలో చర్చలు జరుపుతానని నచ్చచెప్పి అప్పట్లో ఆందోళన విరమింపజేశారు. ఈ నేపథ్యంలో.. కలెక్టర్ శుక్రవారం రాజయ్యపేట వచ్చి మత్స్యకారులతో చర్చలు జరిపారు. గ్రామస్తుల తరఫున 20 మందిని ఎంపికచేసి వారితో మాట్లాడించారు. వారంతా పరిశ్రమను రద్దుచేయాలన్నదే తమ ఏకైక డిమాండ్ అని తేల్చిచెప్పారు. బల్క్ డ్రగ్ పార్కు వస్తే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది కలెక్టర్కు వివరించారు. గతంలో ఏర్పాటుచేసిన రసాయన పరిశ్రమలవల్ల భూగర్భ జలాలు కలుషితమై క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ అనారోగ్యం పాలవుతున్నామన్నారు. దీనివల్ల ఇప్పటికే 40 మంది చనిపోయారన్నారు. తన భార్య గర్భవతి అని, పిల్లలు ఎలా పుడతారోనని బెంగగా ఉందని దైలపల్లి కృష్ణ అనే మత్స్యకారుడు ఆందోళన వ్యక్తంచేశాడు. మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయని, పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారని గోసల కామేశ్వరి అనే మహిళ కలెక్టర్కు వివరించింది. అధికారుల మాటపై నమ్మకంలేదు.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్పే విషయాలు వినాలని కలెక్టర్ వారికి సూచించగా.. అందుకు మత్స్యకారులు అంగీకరించలేదు. వారిపై నమ్మకంలేదని, వారు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆక్షేపించారు. దీంతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. రసాయన పరిశ్రమల్లో వ్యర్థ జలాలు శుద్ధిచేయకుండా వదిలేయడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై ప్రభుత్వం నిఫుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేసిందని, త్వరలోనే నివేదిక ఇస్తారన్నారు. నిబంధనలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏయే కంపెనీలు పెడతారో తెలీదని, మందుల కంపెనీలకు భూములు కేటాయించలేదన్నారు. పదేళ్ల క్రితం ప్రభుత్వం సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాలు మాత్రమే కల్పిస్తారన్నారు. ఇక్కడకు వచ్చే పరిశ్రమలపై మీతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే, బల్క్ డ్రగ్ పార్కు రద్దుచేయడమే డిమాండ్ అని స్పష్టంచేశారు.ఆంక్షలు, కేసులు ఎత్తివేయండి.. హోంమంత్రిని అడ్డుకున్నందుకు, జాతీయ రహదారిని ముట్టడించినందుకు చాలా మందిపై కేసులు నమోదుచేశారని, గ్రామంలో సెక్షన్–30 అమలుచేస్తూ ఇతరులెవరినీ గ్రామంలోకి రానీయడం లేదన్నారు. ఈ కేసులు, ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ వారు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్కు అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందని, దీనిపై తానేమీ చెప్పలేనన్నారు. మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ కలెక్టర్ సమావేశాన్ని ముగించారు. కేసులు, గ్రామంలో సెక్షన్–30 ఎత్తివేయడం గురించి కలెక్టర్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. -
బల్క్ డ్రగ్ పార్క్పై చేతులెత్తేసిన కలెక్టర్.. రాజయ్యపేట మత్స్యకారుల ఆగ్రహం
సాక్షి, పాయకరావుపేట: అనకాపల్లిలోని రాజయ్యపేట వద్ద ఉత్కంఠ నెలకొంది. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ చేతులెత్తేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఆపే నిర్ణయం మా పరిధిలో లేదని చెప్పేశారు. దీంతో, మత్స్యకారులు.. కలెక్టర్, కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. 1000 కోట్ల ప్రాజెక్టు కోసం 50,000 మందిని చంపేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. రాజయ్యపేటలో కలెక్టర్ అధ్యక్షతన ఈరోజు గ్రామసభ జరిగింది. గ్రామసభకు రాజయ్యపేట గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్క్ను ఆపాలి. బల్క్ డ్రగ్ పార్క్ను అంగీకరించం. 41 రోజులు నుంచి ఉద్యమం చేస్తున్నాం. సముద్రం మీద ఆధారపడి జీవిస్తున్నాం. మాకు సముద్రాన్ని దూరం చేయొద్దు. బల్క్ డ్రగ్ పార్క్ వలన సముద్రంలో చేపలు చనిపోతాయి. ప్రజలు రోగాలతో చనిపోతారు. బల్క్ డ్రగ్ పార్క్ను వేరే ప్రాంతానికి తరలించాలి’ అని డిమాండ్ చేశారు. గ్రామస్తులు నిరసనలు చేస్తున్న ప్రాంతంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. గ్రామసభ అనంతరం, బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ చేతులెత్తేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఆపే నిర్ణయం మా పరిధిలో లేదని చెప్పేశారు. మత్య్సకారుల అభిప్రాయాల అన్నింటిని కేంద్ర ప్రభుత్వానికి పంపుతాము. అభిప్రాయాలు అన్నిటిని వీడియో రూపంలో, పేపర్ మీద నోట్ చేసుకున్నాము.. గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పనులు జరగలేదు. రోడ్లు పనులు మాత్రమే జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో కలెక్టర్ ప్రకటనపై మత్స్యకారులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ.. కలెక్టర్ బల్క్ డ్రగ్ పార్క్ కంపెనీ కాదంటున్నారు. పార్కు అంటే కేబీఆర్, లుంబిని పార్క్ కాదు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు మాకు వద్దు.. ప్రజాభిప్రాయంలో అనుకూలంగా చెప్పింది టీడీపీ నేతలే. రాజయ్యపేట ప్రజలందరూ బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకించారు. యనమల రామకృష్ణ బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తే, రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ ప్రజలే మనుషులా, మేము మనుషులం కాదా?. శాంతియుతంగా నిరసన చేస్తున్న మాపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మాపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలి. తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. 1000 కోట్ల ప్రాజెక్టు కోసం 50,000 మందిని చంపేస్తారా? అని ప్రశ్నించారు. -
బెంగళూరు–ఖరగ్పూర్ మధ్య స్పెషల్ రైలు
తాటిచెట్లపాలెం: కేఎస్ఆర్ బెంగళూరు–ఖరగ్పూర్– కేఎస్ఆర్ బెంగళూరు మధ్య (వయా కొత్తవలస మీదుగా) వీక్లీ స్పెషల్ రైలు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. కేఎస్ఆర్ బెంగళూరు–ఖరగ్పూర్(06263) వీక్లీ స్పెషల్ రైలు ఈ నెల 29న కేఎస్ఆర్ బెంగళూరులో ఉదయం 9.50 గంటలకు బయలుదేరుతుంది. మరుసటిరోజు ఉదయం 4.28 గంటలకు కొత్తవలస చేరుకుని.. అక్కడ నుంచి 4.30 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు ఖరగ్పూర్ చేరుకుంటుంది. ఖరగ్పూర్–కేఎస్ఆర్ బెంగళూరు(06264) వీక్లీ స్పెషల్ రైలు ఈ నెల 30న ఖరగ్పూర్లో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.28 గంటలకు కొత్తవలస చేరుకుంటుంది. అక్కడ నుంచి 4.30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11.30 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరు చేరుకుంటుంది. -
జెడ్పీటీసీ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
రోలుగుంట: కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్య కేసుకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసి, గురువారం రిమాండ్కు తరలించినట్టు అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. ఆమె తెలిపిన వివరాలివి. కొయ్యూరు జెడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజుకు రోలుగుంట మండలం ఎం.కె.పట్నం రెవెన్యూ పరిధిలో గల చటర్జీపురంలో 139 సర్వే నంబర్లో 10.83 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో తుప్పలు తొలగించి, సదరు భూమిని పరిశీలించడానికి కూలీలతో కలసి ఈ నెల 20వ తేదీన జెడ్పీటీసీ అక్కడకు వెళ్లారు. ఈ స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న కొన్ని కుటుంబాలతో జెడ్పీటీసీ నూకరాజుకు చిరకాల వైరం ఉంది. నూకరాజు వస్తున్న సమాచారం తెలుసుకొని, అతనితో విరోధం ఉన్న కేదారి రాజబాబు, అతని బంధువులు కాచుకొని ఉన్నారు. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు పథకం ప్రకారం కత్తులు, కర్రలతో నూకరాజు, అతని అనుచరులపై దాడి చేశారు. మిగిలిన వారు భయభ్రాంతులకు గురై పారిపోగా, నూకరాజును చుట్టుముట్టి కత్తి, కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన జెడ్పీటీసీ నూకరాజు అక్కడికక్కడే చనిపోయారు. ఇతనితో ఉన్న మాస లోవరాజుపైనా ప్రత్యర్థులు దాడి చేయగా అతని చేతికి గాయమైంది. సమాచారం తెలుసుకున్న వెంటనే కొత్తకోట సీఐ కోటేశ్వరరావు రోలుగుంట పోలీసులతో నేరస్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించిన నిందితులు పథకం ప్రకారమే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. నిందితులను ఈ నెల 22న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కొత్తకోట సీఐ కోటేశ్వర్రావు, రోలుగుంట ఎస్ఐ సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారిని గురువారం నర్సీపట్నం కోర్టులో రిమాండు నిమిత్తం ప్రవేశపెట్టడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో కేదారి రాజబాబు, నీలాపు అప్పలనాయుడు, నీలాపు లక్ష్మణరావు, నీలాపు అన్నలనాయుడు, నీలాపు యరకన్న, కేదారి రాజేశ్వరి, ఈదెల రాజేశ్వరి ఉన్నారన్నారు. ఈ సంఘటనను ప్రోత్సహించిన, సంబంధం ఉన్న వారి గురించి కూడా విచారణ చేస్తున్నామని, ఆరోపణలు రుజువైతే వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. నూకరాజు, ప్రత్యర్థి వర్గాల పైన కూడా రెండు దఫాలు బైండోవరు కేసులు నమోదు చేశామన్నారు. జెడ్పీటీసీకి పూర్తి స్థాయిలో పోలీసులు రక్షణ కల్పించలేదన్న విమర్శలను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా భూతగాదాలు సివిల్ సమస్య కిందకు వస్తాయన్నారు. అందుకు కోర్టు ఉత్తర్వులు గాని రెవెన్యూ ఉత్తర్వులు గాని, ఎస్పీ ఉత్తర్వులు గాని ఉండాలన్నారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు తమ శాఖ ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో పనిచేసిందని, దీనిలో భాగంగానే గతంలో రెండుసార్లు గొడవలను నియంత్రించడానికి బైండోవర్ కేసులు కూడా నమోదు చేశామని వివరించారు. -
జగన్కు ఇచ్చిన మాట
విశాఖలో రెండో విడత పెట్టుబడులకు ‘రహేజా’ సంసిద్ధత ● గత ప్రభుత్వ హయాంలో ఇనార్బిట్మాల్కు శంకుస్థాపన ● 2023 ఆగస్ట్ 1న జరిగిన కార్యక్రమానికి నాటి సీఎం జగన్ హాజరు ● ఆ సభలోనే సెకండ్ ఫేజ్ పెట్టుబడులపై రహేజా హామీ ● ఈ మేరకు రూ.2,176.26 కోట్ల పెట్టుబడికి ఆసక్తి వ్యక్తీకరణ ● 9,681 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సాక్షి, విశాఖపట్నం : మహా విశాఖను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ఫలాలను అందిస్తున్నాయి. 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన, దక్షిణాదిలోనే అతి పెద్దదిగా భావిస్తున్న ఇనార్బిట్మాల్ పనులు తుది దశకు చేరుకున్నాయి. శంకుస్థాపన సమయంలో రహేజా గ్రూప్ ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటోంది. విశాఖలోనే రెండో దశలో ఐటీ బిజినెస్ పార్క్ అభివృద్ధి చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని కార్యరూపం దాల్చే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. రూ.2,172.26 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రహేజా కార్పొరేషన్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఇది పూర్తయితే 9,681 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. తుది దశకు చేరుకున్న దక్షిణాదిలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ పనులు 2023 ఆగస్ట్ 1న సాలిగ్రామపురంలో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఫేజ్–1లో భాగంగా ఇనార్బిట్ మాల్, ఐటీపార్క్ నిర్మాణానికి రహేజా గ్రూప్ రూ.600 కోట్లు వ్యయం చేస్తోంది. 6 లక్షల చదరపు అడుగుల మాల్, 4 లక్షల చదరపు అడుగుల పార్కింగ్ ప్రాంతాన్ని నిర్మిస్తోంది. 2026 నాటికి దీన్ని పూర్తి చేసేలా పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 80 శాతం వరకూ పనులు పూర్తయ్యాయి. ఇందులో 250 జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్లు, మల్టిప్లెక్స్లు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఫుడ్ కోర్టు, టెర్రస్ గార్డెన్, షాపింగ్ స్పేస్ అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి కలగనుంది. ఈ నిర్మాణాలన్నీ ’గ్రీన్ బిల్డింగ్’ ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నారు. ఇది దక్షిణాదిలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ కావడం విశేషం. ఈ శంకుస్థాపన సమయంలో రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా మాట్లాడుతూ.. రెండో దశలో భాగంగా త్వరలోనే విశాఖలో ఐటీ స్పేస్ నిర్మించి.. ఐటీ రంగంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. రూ.2,172.26 కోట్లతో ఆసక్తి వ్యక్తీకరణ 2023లో చెప్పిన విధంగానే రహేజా గ్రూప్ విశాఖలో తమ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం రూ.2,172.26 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రెండు దశల్లో మొత్తం 28.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ, అనుబంధ, వాణిజ్య కార్యకలాపాలకు అనువైన సముదాయాలు నిర్మించనుంది. మొదటి దశలో 2028 నాటికి వాణిజ్య భవనాలు, 2030 నాటికి నివాస సముదాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేయాలని రహేజా ఆసక్తి చూపిస్తోంది. ఇక రెండో దశలో భాగంగా 2031 నాటికి మిగిలిన కమర్షియల్ భవనాలు, 2035 నాటికి నివాస సముదాయాలు పూర్తి చేయనుంది. మొత్తంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీకి కట్టుబడి రహేజా సంస్థ పెట్టుబడులకు ముందుకు రావడం శుభపరిణామమని విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహా విశాఖ అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ.. ప్రఖ్యాత రహేజా గ్రూప్ విశాఖలో రెండో దశ భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. ఫేజ్–1లో భాగంగా రూ.600 కోట్లతో నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ పనులు తుది దశకు చేరుకోగా.. ఇప్పుడు దానికి అదనంగా రూ.2,172 కోట్లకు పైగా వ్యయంతో భారీ ఐటీ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ నూతన పెట్టుబడి ద్వారా 9,681 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
విశాఖ సిటీ: క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీగా లాభాలు వస్తాయని చెప్పి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టారు. బుధవారం నలుగురు బెట్టింగ్ నిర్వాహకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎక్స్చేంజ్ 666 అనే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఆ వెబ్సైట్లో డబ్బు పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశచూపిస్తూ బెట్టింగ్ రొంపిలోకి దించుతున్నట్లు గుర్తించారు. బెట్టింగ్ ఆడడంతో పాటు ఇతరులకు వారి సొంత ఐడీలు ఇస్తూ దాని ద్వారా అనేక మందిని బెట్టింగ్లో పాల్గొనేలా చేస్తున్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన మాసారపు దక్షిణామూర్తి(35), చుక్కా రఘురామ్(26)లను అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోలీసులు వీరి ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీల సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిపై నిఘా పెట్టారు.దక్షిణామూర్తి రఘురామ్ -
సాగర తీరాన మాయా ప్రపంచం
ఏయూక్యాంపస్: అడుగుపెట్టిన గదిలో ఎక్కడ ఉన్నామో తెలియకపోతే? అనంతమైన విశ్వంలో తేలియాడుతున్న అనుభూతి కలిగితే? మన కళ్లే మనల్ని మోసం చేస్తే.? విదేశాల్లో మాత్రమే కనిపించే అద్భుత మాయా ప్రపంచం ఇప్పుడు మన విశాఖ నగరానికి వచ్చేసింది. బీచ్రోడ్డులోని టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం ప్రాంగణంలోనే ఇమ్మర్సివ్ మ్యూజియం లేదా ఆర్ట్ మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. ఇది పర్యాటకులకు, ముఖ్యంగా యువతకు, పిల్లలకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఈ మ్యూజియంలో మొత్తం 8 ఇన్ఫినిటీ రూమ్స్ ఉంటాయి. ఒక్కో గది ఒక్కో ప్రత్యేకమైన థీమ్తో మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. గదిలోకి అడుగుపెట్టగానే.. ఆ గది పొడవు, వెడల్పు అంచనా వేయడం అసాధ్యం. గదికి ఆరు వైపులా (నేల, పైకప్పు, నాలుగు గోడలు) అద్దాలు ఉండటంతో.. మన కళ్లు కనికట్టుకు గురవుతాయి. ప్రతి గది ఒక ప్రత్యేక ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అద్దాల మండపం, మిర్రర్ ఇమేజ్, కెలిడోస్కోప్, రివాల్వింగ్ టన్నెల్, స్టార్ ఇన్ స్కై, అవతార్ రూమ్, రెయిన్బో కలర్, పెరల్ కర్టెన్స్ వంటి థీమ్స్..అద్భుత ఊహలోకంలోకి తీసుకెళ్లనున్నాయి. నేవీలో పని చేసి పదవీ విరమణ చేసిన రమణ కుమార్ ఈ అద్భుతానికి రూపకల్పన చేస్తున్నారు. ఆయన దుబాయ్లో ఉన్న సమయంలో అక్కడ చూసిన ఇలాంటి మ్యూజియం స్ఫూర్తితో.. ఆ సరికొత్త అనుభూతిని నగరవాసులకు, పర్యాటకులకు అందించాలనే సంకల్పంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ అద్దాల మాయా లోకం ప్రారంభమై.. సాగర తీరానికి కొత్త ఆకర్షణగా నిలవనుంది. -
శివోహం.!
గొలుగొండ: పల్లెలు కార్తీక మాస పూజలతో ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. శైవ క్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. గొలుగొండ మండలంలో ఉన్న మూడు ప్రధాన శివాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. శివ నామ స్మరణతో ఆయా ఆలయాలు మార్మోగుతున్నాయి. గొలుగొండ సమీపంలో ఉన్న దారమఠం శివాలయం, చీడిగుమ్మలలో కాశీ విశ్వేశ్వస్వామి ఆలయం, ఏఎల్పురం(కృష్ణదేవిపేట) గ్రామంలో ఉన్న నీలకంఠేశ్వరస్వామి ఆలయం కార్తీక మాస నిత్య పూజలతో విరాజిల్లుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రం ధారమఠం ప్రాచీన శైవక్షేత్రం ధారమఠం శివాలయం ఎంతో పేరొందింది. ధారకొండ దిగువన ఉన్న ఈ శివాలయం దేవదాయ శాఖ పరిధిలో ఉంది. ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి మహా శివరాత్రి వరకు భక్తుల రద్దీ ఉంటుంది. శివాలయం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, అందులో జలజలపారే సెలయేర్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. నర్సీపట్నం డివిజన్లో దారమఠం కార్తీకమాసంలో ప్రతి ఏటా సందర్శకులతో కళకళలాడుతుంటుంది. ధారకొండ శివాలయం సమీపంలో కొండల నడుమ సెలయేర్లు, జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు ఇక్కడి అందాలను చూసి మైమరిచిపోతుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కాశీ విశ్వేశ్వరస్వామి చీడిగుమ్మల వరాహనది తీరంలో ఉన్న కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఆలయం నర్సీపట్నంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాశీ విశ్వేశ్వరస్వామిని కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసిస్తుంటారు. శివమాలలకు ప్రసిద్ధి నీలకంఠేశ్వరస్వామి అల్లూరి నడయాడిన ప్రాంతం, అల్లూరి సీతారామరాజుతో నిత్యం పూజలందుకున్న స్వామి నీలకంఠేశ్వరస్వామి. కృష్ణదేవిపేట అల్లూరి పార్కు పక్కనే ఉన్న బొడ్డేరు గెడ్డకు ఆనుకొని ఈ ఆలయం ఉంది. ఇక్కడ కార్తీకమాసం, మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ ఆలయం వద్ద కార్తీక మాసంలో వందలాది మంది భక్తులు శివమాలలు ధరించి స్వామి వారి సన్నిధిలో ఉండి పూజలు చేస్తుంటారు. బొడ్డేరు గెడ్డలో స్నానాలు ఆచరించి నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా మండలంలో మూడు శివాలయాలు ఎంతో ప్రాముఖ్యతతో విరాజిల్లుతున్నాయి. -
పెరుగుతున్న ‘పెద్దేరు’
మాడుగుల రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పెద్దేరు జలాశయంలో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. గురువారం ఉదయం నుంచి జలాశయం పరిసరాల్లో కురుస్తున్న వర్షాల వల్ల జలాశయంలో నీటిమట్టం 136.50 మీటర్లకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా, కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి 380 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టాన్ని దృష్టిలో ఉంచుకొని గురువారం రాత్రి స్పిల్వే గేట్ల ద్వారా 350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని జలాశయం జేఈ సుధాకర్రెడ్డి తెలిపారు. -
డిపార్ట్మెంటల్ స్టోర్లో కాలం చెల్లిన వంట నూనె ప్యాకెట్లు
సీజ్ చేసిన జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్అనకాపల్లి టౌన్: ఆహార భద్రత నిబంధనలు అమలు చేయని వ్యాపార సంస్ధలపై కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కె.సతీష్బాబు హెచ్చరించారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు గురువారం పట్టణంలోని ప్రముఖ డిపార్ట్మెంటల్ స్టోర్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలపరిమితి ముగిసిన వంట నూనె ప్యాకెట్లు, బిస్కెట్, చాక్లెట్స్ ప్యాకెట్లను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదారులు నిశితంగా పరిశీలించాకే ప్యాకేజ్డ్ ఆహార పదార్ధాలను కొనుగోలు చేయాలన్నారు. వ్యాపార సంస్ధలు వినియోగదారులకు ఇచ్చే ప్రతి రసీదు, ఇన్వాయిస్లలో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, రిజిస్టేషన్ నెంబర్లను స్పష్టంగా ముద్రించాలన్నారు. కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ, నిబంధనలు పాటించని సంస్ధలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ పరిధిలోని నేషనల్ కన్స్యూమర్ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1915కు, ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
‘సమృద్ధి గ్రామ పంచాయతీ’కి కశింకోట ఎంపిక
కశింకోట: జిల్లాలో కశింకోట పంచాయతీని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సమృద్ధి గ్రామ పంచాయతీ’పథకాన్ని అమలు చేయడానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టి.వరప్రసాద్ తెలిపారు. కశింకోటలో గురువారం బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో సమృద్ధి గ్రామ పంచాయతీ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా బీఎస్ఎన్ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా బ్రాడ్ బ్యాండ్, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. గ్రామాల్లో మరింత మందికి ఇంటర్నెట్ సేవలను చేరువ చేసి, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి సాయపడతామన్నారు. రాష్ట్రంలోని 22 జిల్లాలోని 172 పంచాయతీల్లో 28,968 సెల్ టవర్ల ద్వారా 1,08,733 బేస్ ట్రాన్సివర్ స్టేషన్లను ఏర్పాటు చేసి 2.8 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేశామన్నారు. వీటి ద్వారా కేబుల్ సేవలు ప్రజలకు విస్తృతంగా చేరువ అవ్వడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ పథకం కింద ఆప్టికల్ కేబుల్ సేవలు చేరువ చేయడంలో భాగంగా కశింకోటను ప్రభుత్వం ఎంపిక చేసిందని, పథకం సమర్థవంతంగా అమలు కావడానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ పథకం అమలుకు డిజిటల్ యాక్సిస్ కమిటీని ఈ సందర్భంగా నియమించారు. మంత్రి జయరజని చైర్ పర్సన్గా వ్యవహరించే కమిటీలో పంచాయతీ కార్యదర్శి కన్వీనర్గాను, సభ్యులుగా పీహెచ్సీ వైద్యులు, రిటైర్డు ఎంఈవో, స్కూలు హెచ్ఎం, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఉంటారు. బీఎస్ఎన్ఎల్ విశాఖ పీజీఎం జి.ఆడమ్, ఐటీఎస్ సిహెచ్.కుశాల్ రాం, వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
యాదవ నేతపై దుర్భాషలు
సాక్షి, అనకాపల్లి: తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోన గురవయ్యపై గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బంధువు తిట్ల పురాణం హాట్ టాపిక్గా మారింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో యాదవ సామాజిక భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలని ప్రభుత్వానికి టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రాసిన లేఖను తప్పు పడుతూ యాదవ నేతలు ఘాటుగా స్పందించారు. దీంతో గురవయ్యకు ఫోన్ చేసి పల్లా శ్రీనివాసరావు బంధువు, మాజీ కౌన్సిలర్ పులిచర్ల రాజేశ్వరి విరుచుకుపడ్డారు. పత్రికల్లో రాయలేని భాషతో యాదవ నేత, ఆయన భార్యను దుర్భాషలాడుతూ.. భయపెట్టారు. దుర్భాషలాడిన పల్లా శ్రీనివాసరావు బంధువుపై గురవయ్య గురువారం అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హాకు, అనకాపల్లి టౌన్ సీఐకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీ హరిష్కుమార్ గుప్తాకు కూడా స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు కాపీ పంపించారు. వైఎస్ జగన్ మంజూరు చేసిన స్థలానికి పల్లా మోకాలడ్డు అనంతరం అనకాపల్లి ఎస్పీ కార్యాలయం సమీపంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి మేయర్ గొలగాని హరివెంకట కుమారి నేతృత్వంలో యాదవ సామాజిక భవన నిర్మాణం కోసం తామంతా స్థలం కావాలని నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరామన్నారు. యాదవ సామాజిక వర్గం అభివృద్ధి కోసం విశాఖలో ఎండాడ వద్ద 50 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ 2023 సెప్టెంబర్ 26న జీవో నెం.453 ఇచ్చారని తెలిపారు. ఆ జీవోను రద్దు చేయాలంటూ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని, ఈ విషయమై తాను పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ ద్వారా మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించినట్లు తెలిపారు. ఒకటి రెండుసార్లు నేరుగా మా యాదవ సామాజిక వర్గం పెద్దలతో ఆయనను కలవడానికి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందన్నారు. దీనిపై విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో ఉన్న యాదవ సామాజిక వరా్గానికి చెందిన వారందరికీ తెలియజేసేందుకు తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా వాట్సప్ గ్రూపుల్లో ఈ విషయం పోస్టు చేసినట్లు పేర్కొన్నారు. పల్లా శ్రీనివాసరావు బంధువు పులిచర్ల రాజేశ్వరి ఈ నెల 22వ తేదీ రాత్రి ఫోన్ చేసి.. తనను, తన భార్యను బండ బూతులు తిడుతూ తన కుటుంబాన్ని పత్రికల్లో రాయలేని భాషలో దుర్భాషలాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సంభాషణను రికార్డు చేసి పల్లా సూకరాజు అనే వ్యక్తి వాట్సప్ అకౌంటు ద్వారా మరలా అదే గ్రూపులో పోస్టు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
షాక్కు గురై యువకుడు మృతి
వ్యాన్పై పడిన విద్యుత్ తీగలు కోటవురట్ల: విద్యుత్ తీగలు వ్యాన్పై పడిన ఘటనలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలివి. కృష్ణా జిల్లా ముచ్చర్ల గ్రామానికి చెందిన మొటేపల్లి గీతాకృష్ణ(22) మండలంలోని పందూరు శివారున ఉన్న 73 హిల్స్ లేఅవుట్లో పనిచేస్తున్నాడు. లేఅవుట్లోనే నివాసం ఉంటూ నిర్వహణ పనులు చేస్తుంటాడు. గురువారం మధ్యాహ్నం లేఅవుట్ నుంచి మినీ వ్యానును నడుపుకొంటూ పందూరు వస్తుండగా మార్గం మధ్యలో సిమెంట్ విద్యుత్ స్తంభానికి వ్యాను వెనక ఉన్న గార్డ్ రాడ్ తగులుకుని స్తంభం విరిగిపోయింది. దాంతో విద్యుత్ తీగలు వ్యాన్పై పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా వ్యాన్ అంతటికీ పాకింది. ఈ విషయాన్ని గమనించని గీతాకృష్ణ డోరు తీసి కిందికి దిగుతుండగా విద్యుత్ షాక్కు గురై కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మండల కేంద్రంలోని సీహెచ్సీకి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుని మేనమామ దాసరి వెంకట మధు గోపాల్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రమేష్ తెలిపారు. -
వైన్ షాపులో చోరీ
యలమంచిలి రూరల్: పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద ప్రధాన రహదారి పక్కనున్న ఎస్కేఎంఎల్ వైన్స్లో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపు పైకప్పు రేకులు తొలగించి లోనికి ప్రవేశించారు. ముసుగులు ధరించి ఉన్న చోరులు ముందుజాగ్రత్తగా సీసీటీవీ వైర్లు కట్ చేసి, ఫుటేజీని, దుకాణం క్యాష్ కౌంటర్లో ఉంచిన రూ.20వేల నగదు, ఒక మద్యం సీసాను అపహరించుకుపోయారు. చోరీ సమాచారం అందుకున్న వెంటనే సీఐ ధనుంజయరావు,పట్టణ ఎస్సై కే సావిత్రి,సిబ్బంది మద్యం దుకాణానికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు.నిందితుల వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. రూ.20వేల నగదు, సీసీ ఫుటేజీ అపహరణ -
మా తరపున మాట్లాడేందుకు అనుమతించండి
అధికారులకు మత్స్యకారుల వినతి నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమానికి సంబంధించి మత్స్యకారుల తరపున కలెక్టర్తో మాట్లాడేందుకు వైఎస్సార్సీపీ, వామపక్ష నాయకులను అనుమతించాలని కోరుతూ రాజయ్యపేట మత్స్యకారులు గురువారం తహసీల్దార్ ఆర్.నర్సింహమూర్తి, సీఐ జూరెడ్డి మురళిలకు వినతి పత్రం ఇచ్చారు. మత్స్యకారులతో చర్చలు జరిపేందుకు శుక్రవారం కలెక్టర్ విజయ కృష్ణన్ రాజయ్యపేట వస్తున్నారు. మత్స్యకారుల తరపున కలెక్టర్తో మాట్లాడేందుకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, సీపీఐ జిల్లా నాయకుడు రాజాన దొరబాబు, గుర్రాజుపేట సర్పంచ్ దాట్ల ఉమాదేవిలతోపాటు తమ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్న అందరినీ రాజయ్యపేట వచ్చి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్, సీఐలు చెప్పారు. మత్స్యకార నాయకులు ఎం.మహేష్, సోమేష్, పిక్కి తాతీలు, ఎం.జాన్, బి.బాబ్జి, కె.కాశీరావు, రామచరణ్, ప్రసాద్ పాల్గొన్నారు. -
40వ రోజుకు చేరిన రాజయ్యపేట దీక్షలు
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 40వ రోజుకు చేరుకుంది. గురువారం వర్షంలో కూడా నిరశన దీక్ష కొనసాగించారు. శుక్రవారం కలెక్టర్ రాజయ్యపేట రానున్న నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో మోహరించిన పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మత్స్యకారులతో సమావేశమయ్యేందుకు వీలుగా ప్రత్యేకంగా బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి వేదిక వద్దకు పంపించనున్నారు. వేటకు విరామం.. ఆందోళనలో మమేకం బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాల్సిందేనన్న ఒకే ఒక్క నినాదంతో మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. నలభై రోజుల నుంచి వేటకు విరామం ప్రకటించి ఉపాధి లేక పస్తులతోనే పోరాటం కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్యలో ఏర్పాటు కాబోయే రసాయన పరిశ్రమల వల్ల ఈ ప్రాంతమంతా కలుషితమవుతుందని వారంతా భయాందోళనలు చెందుతున్నారు. రసాయన పరిశ్రమల వల్ల వెలువడే కాలుష్యంతో క్యాన్సర్, కిడ్నీ సమస్యలకు లోనై ఇప్పటికే గ్రామంలో సుమారు 30 మంది వరకు మృత్యువాత పడ్డారు. చాలామంది అనేక రుగ్మతలతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బల్క్ డ్రగ్ పేరుతో ప్రభుత్వం గ్రామం చుట్టూ పదుల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిందని, పనులు కూడా ప్రారంభమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు తీసుకునే ముందు కంపెనీల కోసమనే చెప్పారని, ఇటువంటి ప్రమాదకర మందుల కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పలేదని, అలా చెప్పి ఉంటే భూములు ఇచ్చేవాళ్లం కాదంటున్నారు. సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న తమను వేరొక ప్రాంతానికి తరలించినప్పటికీ అక్కడ బతకలేమని, తీరం వెంబడే నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటామని గంగపుత్రులు చెబుతున్నారు. శుక్రవారం కలెక్టర్ గ్రామంలోకి వస్తుండటంతో తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరిస్తారన్న ఆశాభావాన్ని మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు.నేడు చర్చల కోసం కలెక్టర్ రాక -
ప్రమాద స్థాయికి చేరువలో ‘తాండవ’
నాతవరం: తాండవ రిజర్వాయరులో నీటిమట్టం పెరుగుతోంది. తుపాను కారణంగా ఎగువ ప్రాంతం నుంచి నీరు అధికంగా రావడంతో గురువారం సాయంత్రానికి 377.6 అడుగులకు నీరు చేరింది. తాండవ ప్రాజెక్టు ప్రమాద స్ధాయి నీటిమట్టం 380 అడుగులు కాగా నీటిమట్టం 378 అడుగులకు వచ్చేసరికి హెచ్చరికలు జారీ చేస్తారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ఇన్ఫ్లోను బట్టి స్పిల్వే గేట్ల ద్వారా నదిలోకి నీరు విడుదల చేసి ప్రమాద తీవ్రతను తగ్గిస్తారు. గురువారం ఎగువ ప్రాంతం నుంచి 630 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందని, పంట కాలువల ద్వారా 550 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు జేఈ శ్యామ్కుమార్ తెలిపారు. -
రాజయ్యపేట ప్రజలకు హోంమంత్రి క్షమాపణ చెప్పాలి
సాక్షి, అనకాపల్లి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నేతలు అధికారంలోకి రాగానే ఎందుకు మాట మార్చారని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఎన్నికలకు ముందు రాజయ్యపేట గ్రామస్తులకు బల్క్ డ్రగ్ పార్కు రానివ్వబోనంటూ..మీ ఇంటి ఆడపడుచుగా మీకు మేలు చేస్తానంటూ చెప్పిన ప్రస్తుత హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.. అధికారం రాగానే ఆందోళన చేస్తున్న వారిపై కేసులు పెట్టి ఉద్యమాన్ని అణిచివేయాలని కుయుక్తులు పన్నుతున్నారంటూ మండిపడ్డారు.బల్క్ డ్రగ్ పార్కును ఆపలేకపోతే ఆమె ముక్కు నేలకు రాసి రాజయ్యపేట ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు చెప్పమంటేనే ఎన్నికలకు ముందు అలా చెప్పానని నిర్భయంగా వెల్లడించాలని హితవు ç³లికారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మత్స్యకారులకు బాసటరాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాజయ్యపేట ప్రజలకు, మత్స్యకారులకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ చలో రాజయ్యపేటకు పిలుపునిచ్చింది.శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, స్థానిక సమన్వయకర్త కంబాల జోగులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పరిశీలకులు శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలు మత్స్యకారులను కలిసి బాసటగా నిలిచారు.వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం వారిపై చేస్తున్న వేధింపులను, వారి సమస్యలను మత్స్యకారులు వివరించారు.మాజీ సీఎం వైఎస్ జగన్తోనే తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి నేతలు స్పందిస్తూ ఇటీవల నర్సీపట్నం మెడికల్ కళాశాల సందర్శనకు వచ్చిన వైఎస్ జగన్ దృష్టికి బల్క్ డ్రగ్ పార్కు సమస్యను మత్స్యకారులు తీసుకువెళ్లడం వల్లే ఆయన తమను పంపారని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనేమత్స్యకారులపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ మాఫీ చేస్తామని భరోసానిచ్చారు.‘‘ఏ ప్రాంతానికి పరిశ్రమలు వచ్చినా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.. అయితే ఆ పరిశ్రమల ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేదిలా ఉండాలి. వారిని ఒప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నదే మా పార్టీ అభిమతం’’ అని చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులపై ఎదురుదాడి తగదన్నారు. రాజయ్యపేటలో 3 వేల మంది పోలీసులను మోహరించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ చర్య అని నిరసించారు. రైతులు టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. అచ్యుతాపురం సెజ్లో కూడా ప్రజలను ఒప్పించి భూసేకరణ చేశామని, రణస్థలం, బొబ్బిలి వంటిప్రాంతాల్లోనూ ఆయా ప్రాంతాల రైతులను ఒప్పించే భూసేకరణ చేశామని పేర్కొన్నారు.మత్స్యకారులకు సమాధానం చెప్పాలి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని హోంమంత్రి అనిత యత్నిస్తున్నారని విమర్శించారు. అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమానికి మద్దతు తెలిపి ఇప్పుడు మరోలా మాట్లాడడం సరికాదన్నారు. మత్స్యకారుల అభ్యంతరాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, మత్స్యకారులు ఆందోళనకు మద్దతిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను గృహనిర్భంధం చేశారని, తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతుంటుందని చెప్పారు. -
చిరుద్యోగికి పగ్గాలు!
మహారాణిపేట : అతడు ఒక చిన్న ఉద్యోగి.. అయినా మొత్తం కార్యాలయ బాధ్యతలన్నీ అతనికే అప్పగించారు. ఆ కార్యాలయంలో ఏ ఫైల్ ముందుకు వెళ్లాలన్నా తొలుత ఈ ఉద్యోగిని ప్రసన్నం చేసుకోవాలి. అతని చెయ్యి తడిపితేనే ఫైల్ కదులుతుంది. లేదంటే ఎన్ని నెలలైనా సరే ఆ ఫైలు అక్కడే ఉంటుంది. కార్యాలయం ఉన్నతాధికారులతోపాటు కొంత మంది రెవెన్యూ ఉన్నతాధికారుల అండ ఉండడంతోనే ఆ చిరుద్యోగి మాట చెల్లుబాటు అవుతోంది. ఇది ఎక్కడో కాదు.. విశాఖ జిల్లాలోని పెదగంట్యాడ తహసీల్దార్ కార్యాలయంలో.. ఇక్కడ గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో)కి తహసీల్దార్ ఏకంగా ఇన్చార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ ప్రొసిడింగ్ కూడా జారీ చేశారు. దీనిపై ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ఫిర్యాదు కూడా నమోదైంది. చిరుద్యోగికి అందలం పెదగంట్యాడ మండలంలో క్లస్టర్–3లో వీఆర్వో దాకురి లక్ష్మీకాంతరావును ఇన్చార్జి ఆర్ఐగా తహసీల్దార్ నియమించారు. ఈ కార్యాలయంలో తహసీల్దార్తోపాటు డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, 33 మంది గ్రేడ్–2 సచివాలయ వీఆర్వోలు, ముగ్గురు గ్రేడ్–1 వీఆర్వోలు ఉన్నారు. ఇక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ను కాదని.. వీఆర్వో డి.లక్ష్మీకాంతరావును ఇన్చార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నియమిస్తూ గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన తహసీల్దార్ ప్రొసిడింగ్ ఇచ్చారు. తహసీల్దార్ విశాఖపట్నం ఆర్డీవో ద్వారా జాయింట్ కలెక్టర్కు ప్రొసిడింగ్ కాపీని పంపారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నియామకాన్ని జిల్లా కలెక్టర్ చేపడుతుంటారు. ఇక్కడ తహసీల్దార్ తనకు వత్తాసు పలికే వీఆర్వోని ఏకంగా ఇన్చార్జి ఆర్ఐగా నియమిస్తూ ప్రొసిడింగ్ ఇచ్చేశారు. ఉద్యోగిపై ఫిర్యాదుల వెల్లువ ఈ ఉద్యోగిపై ఇప్పటికే పీజీఆర్ఎస్లో ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మీద విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని విశాఖ ఆర్డీవోకు కలెక్టర్కు సూచించారు. అయినా ఈ ఫిర్యాదు మీద నేటి వరకు ఎలాంటి విచారణ చేయలేదు.. సమాధానం కూడా లేదు. అలాగే మండలంలో అనేక మంది ఫిర్యాదులు చేశారు. వాటిని పట్టించుకునే నాథుడు లేడు. దీంతో కార్యాలయంలో ఇన్చార్జి ఆర్ఐ పెత్తనం ఇంకా నడుస్తోంది. కార్యాలయంలో ఎలాంటి పనులైనా అతడు ఆమోదం పొందాల్సి ఉంటుంది.వసూళ్లకు కూడా పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. -
మొబైల్ ఫోన్ల దొంగ దొరికాడు..
పాయకరావుపేట: మొబైల్ ఫోన్ల దొంగ పోలీసులకు చిక్కాడు. ఇటీవల పట్టణంలో మొబైల్స్ను దొంగిలించిన వ్యక్తి, మరోసారి దొంగతనం చేయడానికి వచ్చి పోలీసులకు దొరికిపోయాడు. ఎస్హెచ్వో జి.అప్పన్న తెలిపిన వివరాలివి. ఈ నెల 16వ తేదీన పట్టణంలోని రాజుగారిబీడులో ఓ ఇంట్లో రెండు మొబైల్స్, ఒక ఆపిల్ ఇయర్ పాడ్స్ అపహరణకు గురయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో అదే దొంగ మరోసారి సీతారాంపురంలోని ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుడు విశాఖపట్నం, జ్ఞానాపురానికి చెందిన కోట్ల అచ్యుతరామరాజుగా పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్టు చేసి యలమంచిలి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. -
రెండు గంటల్లోనే 217 అంశాలపై చర్చ!
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశం తుఫాన్ వేగంతో ముగిసింది. మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 217 అజెండా అంశాలను చర్చించి.. అందులో 213 అంశాలకు ఆమోద ముద్ర వేయడం విమర్శలకు తావిస్తోంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం.. ఆలస్యంగా 11.50కి మొదలైంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా అజెండాలోని అంశాలన్నీ పూర్తి చేసి మమా అనిపించారు. అసలు 217 అంశాలున్న అజెండాను సభ్యులకు ఒక్క రోజు ముందు ఇస్తే.. వారు ఎప్పుడు చదివారు? అంశాలపై ఎంత పట్టు సాధించారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సమావేశం మొక్కుబడిగా సాగినా.. కొన్ని కీలక అంశాలపై మాత్రం వాడివేడిగా చర్చ జరిగింది. అయితే వాటికీ పూర్తిస్థాయి సమాధానాలు లభించలేదు. విధి విధానాలేవి? స్థాయీ సంఘం విధి విధానాలు చెప్పమంటూ సభ్యురాలు సాడి పద్మారెడ్డి మూడో సారి అడిగినా అధికారుల నుంచి స్పందన కరువైంది. మేయర్ దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత కార్యదర్శి బి.వెంకటరమణ ‘ఈరోజే పంపిస్తా’నని బదులివ్వడం గమనార్హం. 8 జోన్లలో జీవీఎంసీ దుకాణాలు, సముదాయాలు, సబ్–లీజుల వివరాలు, బకాయిలపై సభ్యులు ప్రశ్నించగా.. రెండు మూడు రోజుల్లో వివరాలివ్వాలని మేయర్ అధికారులను ఆదేశించారు. నగరంలో కుక్కలు, పందుల బెడదపై సభ్యులు ఆవేదన వ్యక్తం చేయగా.. ‘చర్యలు తీసుకుంటున్నాం’అనే రొటీన్ సమాధానమే అధికారుల నుంచి వచ్చింది. స్నేక్ క్యాచర్ సస్పెన్షన్ పాములు పట్టే రొక్కం కిరణ్ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఓ సభ్యుడు ఫిర్యాదు చేయగా.. అలాంటప్పు డు అతనికి మనమెందుకు జీతం ఇవ్వాలని మేయర్ అన్నారు. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏ జోన్కు సంబంధించి ఆ జోన్ లో స్నేక్ క్యాచర్లను నియమించాలని సూచించారు. డ్రమ్ములు ఏమయ్యాయి? సింహాచలం గిరి ప్రదక్షిణకు సంబంధించి జూలై 9, 10 తేదీల్లో 120 లీటర్ల కెపాసిటీ గల 300 వాటర్ డ్రమ్ములు.. ఒక్కో డ్రమ్ము రూ.1,200 చొప్పున రూ.3,60,000లతో కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ డ్రమ్ములు ఏమయ్యాయని సభ్యులు నిలదీయగా.. పూర్తి వివరాలివ్వాలని మేయర్ ఆదేశించారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా డ్రోన్ ఆపరేటర్కు గౌరవ వేతనం(గతేడాది అక్టోబర్ 7 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 6 వరకు) నెలకు రూ.25 వేలు చొప్పున చెల్లించే అంశంపై సభ్యురాలు సాడి పద్మారెడ్డి స్పందించారు. ఏడాదిగా జీతం ఇవ్వని డ్రోన్ ఆపరేటర్ అసలు ఉన్నాడా? లేడా? అని అధికారులను ప్రశ్నించారు. ఏడాది జీతం(నెలకు రూ.25వేలు) ఒకేసారి చెల్లించే ప్రతిపాదనపై ఆమె సందేహాలు లేవనెత్తారు. కేర్ టేకర్లకు జీతాలు కట్ గాజువాక జోన్ 64వ వార్డు గంగవరంలో 11 సులభ్ కాంప్లెక్స్ల్లో పని చేస్తున్న 22 మంది కేర్ టేకర్లకు జీతభత్యాలు చెల్లించే విషయమై మేయర్ స్పందించారు. అక్కడ వారికి జీతాలిస్తే.. మిగిలిన 98 వార్డుల్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ కేర్టేకర్లందరికీ ఇవ్వాలి. ఇక నుంచి సులభ్ కాంప్లెక్స్ కేర్టేకర్లకు జీతాలిచ్చేది లేదని మేయర్ స్పష్టం చేశారు. అదనపు కార్మికులపై అభ్యంతరం డిప్యూటీ మేయర్ వార్డు(64)కు అదనంగా 15 మంది పారిశుధ్య కార్మికుల నియామకంపై సభ్యులు అభ్యంతరం తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డులకు అదనపు సిబ్బంది అవసరం ఉందని.. ఆ ఒక్క వార్డులోనే 15 మందిని అదనంగా నియమిస్తే.. మా పరిస్థితి ఏంటని మేయర్ను ప్రశ్నించారు. మీరు కూడా కమిషనర్కు లేఖ పెట్టండి. కమిషనర్ ఓకే అంటే స్థాయీ సంఘం వద్దకు వస్తుందని మేయర్ బదులిస్తూనే.. వారిని 15 రోజులు వేరే జోన్లో పనిచేయించి, పని తీరు చూశాక నిర్ణయిద్దామన్నారు. జోన్–8లో ఏరియా సిల్ట్, చెట్ల కొమ్మలు తొలగించేందుకు కనకమహాలక్ష్మీ టిప్పర్ ట్రాన్స్పోర్టుకు ఒక పొక్లెయిన్కు రోజుకి 8 గంటలు చొప్పున, గంటకు రూ.1,400 చెల్లించే విషయంపై మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీకి వాహనాలు ఉండగా, అదనంగా ప్రైవేట్ వాహనాలు ఎందుకు పెడతున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు. మొత్తంగా 217 అంశాల్లో 4 వాయిదా వేసి, 213 అంశాలకు స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది. కేవలం 130 నిమిషాల్లో 217 అంశాలను చదివి.. 213 అంశాలను చర్చించి ఎలా ఆమోదించారన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. -
ప్రతి నియోజకవర్గానికి ఒక ఇసుక స్టాక్ పాయింట్
తుమ్మపాల: సామాన్య ప్రజలకు జిల్లాలో ఇసుక కొరత లేకుండా ఉండేందుకు ప్రతి నియోజకవర్గానికి ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర భూగర్భ గనుల, ఎకై ్సజ్ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం గనులు, భూగర్భ, ఎకై ్సజ్ శాఖల పురోగతిపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్బాబు, కె. సూర్యనారాయణ రాజుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. అవసరానికి మించి ఇసుక అవసరం అయితే మరికొన్ని స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక రీచ్లలో ఎడ్లబండి, ట్రాక్టర్ల సహాయంతో వాళ్ల సొంత అవసరలకు ఇసుకను తరలించుకోవచ్చన్నారు. మద్యం విక్రయాల్లో ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరగాలన్నారు. బెల్ట్ షాపులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు మాట్లాడుతూ జిల్లాలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, తరలింపు అర్ధరాత్రి పూట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎం.జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఆర్డీఓలు షేక్ అయిషా, వివి.రమణ, గనులు, భూగర్భ శాఖ జిల్లా అధికారి ఎం.శ్రీనివాస్, జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుదీర్, నీటి పారుదల శాఖ డిఈఈ త్రినాథ్, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర బాబు, బత్తుల తాతయ్య బాబు, కె.విజయ్కుమార్ పాల్గొన్నారు. -
రీసర్వే షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలి
జేసీ ఎం.జాహ్నవి తుమ్మపాల: రీసర్వే కార్యక్రమం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని జేసీ ఎం.జాహ్నవి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ శాఖలో పలు అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడో విడత రీసర్వే లో మొత్తం 30 గ్రామాల్లో రీ సర్వే ప్రారంభించి గ్రామసరిహద్దులు నిర్ణయించి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందని, రీసర్వేపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రీ సర్వే కార్యక్రమంలో 80 సర్వే బృందాలు పని చేస్తున్నాయన్నారు. సర్వేలో ఎటువంటి ఫిర్యాదులు రాకుండా పూర్తి చేయాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై డివిజను, మండల స్థాయి కార్యక్రమంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్ చేసి రశీదు అందించాలన్నారు. ప్రభుత్వ భూముల సర్వే చేయాలని, ఎక్కడైనా ఆక్రమణలను గుర్తించినట్టయితే ఆక్రమణదారులకు నోటీసులు అందజేయాలన్నారు. మండల స్థాయి సమన్వయ కమిటీకి సిఫార్సు చేసిన సివిల్ కేసులను శతశాతం పరిష్కరించడానికి కృషి చేయాలని అన్నారు. రేషను షాపులు, బియ్యం బిల్లు, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను తహసీల్దార్లు, సివిల్ సప్లయి అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రేషన్ స్మార్ట్ కార్డులు శతశాతం పంపిణీ పూర్తి చేయాలన్నారు. దీపం పథకానికి సంబంధించి ఎవరికై నా రీపేమెంటులో సమస్య ఉంటే వెంటనే పరిష్కరించి లబ్ధిదారులందరికీ డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, రెవిన్యూ డిజినల్ అధికారులు వి.వి.రమణ, షేక్ ఆయిషా, జిల్లా సప్లయి అధికారి మూర్తి, సర్వే సహాయ సంచాలకులు గోపాలరాజ, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
వియత్నాం టూరిజంతో ఏపీ ఒప్పందం
విశాఖ సిటీ : ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ వియత్నాంలోని డానాంగ్ టూరిజం అసోసియేషన్తో ఎంవోయూ చేసుకుంది. వియత్నాంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ టూరిజం ఫోరం అసోసియేషన్ అధ్యక్షుడు కె.విజయ్మోహన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆసియా దేశాల్లో 280 మిలియన్ల బౌద్ధులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న బౌద్ధ క్షేత్రాల సందర్శనకు వారిని రప్పించేందుకు ఇది ఒక ముందడుగు అని చెప్పారు. -
కూటమివి ‘గ్యాస్’కబుర్లే
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీల్లో ఒకటైన ‘ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల’పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా మూడో విడత చెల్లింపుల్లో లబ్ధిదారులకు చుక్కలు కనబడుతున్నాయి. సిలిండర్ డెలివరీ తీసుకుని రోజులు గడుస్తున్నా.. రాయితీ డబ్బులు మాత్రం ఖాతాల్లో జమ కాకపోవడంతో మహిళలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయితీ కోసం ఎదురుచూపు విశాఖ జిల్లా గణాంకాలే ఈ పథకం అమలులోని డొల్లతనాన్ని స్పష్టం చేస్తున్నాయి. మూడో విడతలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 3,46,110 మంది లబ్ధిదారులు సిలిండర్లను డెలివరీ తీసుకున్నారు. అయితే, వీరిలో కేవలం 87 వేల మందికి మాత్రమే ఇప్పటివరకు రాయితీ సొమ్ము రూ.8.35 కోట్లు వారి ఖాతాలకు జమ అయ్యింది. అంటే సుమారు 2.59 లక్షల మంది లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బుల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఆగస్టులో ప్రారంభమైన మూడో విడత బుకింగ్లు నవంబర్ 30తో ముగియనున్నాయి. అక్టోబర్ చివరి వారం నడుస్తున్నా.. ఇంత భారీ సంఖ్యలో చెల్లింపులు నిలిచిపోవడం గమనార్హం. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు రాయితీ డబ్బుల కోసం లబ్ధిదారులు సివిల్ సప్లైస్ డీఎస్వో, ఏఎస్వో కార్యాలయాలకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఈ రోజు, రేపు అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప, స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. అనుమానాల నివృత్తి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ (1800– 2333–555) కూడా ఏమాత్రం ఉపయోగపడటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీపై నీళ్లు చల్లిన నిబంధనలు ఎన్నికల ముందు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికీ మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మెలికలు పెడుతోందని మహిళలు ధ్వజమెత్తుతున్నారు. తెలుపు రేషన్ కార్డు (రైస్ కార్డు) పనిచేస్తేనే ఉచిత గ్యాస్ అని నిబంధన పెట్టడం వల్ల మధ్యతరగతి మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి తోడు ఈకేవైసీ, ఆధార్–బ్యాంకు ఖాతా అనుసంధానం వంటి సాంకేతిక కారణాలతో చాలా మందికి రాయితీ సొమ్ము దక్కడం కష్టంగా మారింది. ఎన్ని కల ముందు ఒకలా, ఇప్పుడు మరోలా వ్యవహరించడం మోసమేనని వారు మండిపడుతున్నారు. మాటలకు, చేతలకు పొంతన ఏది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోగా డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా రాయితీ సొమ్ము జమ అవుతుందని డీఎస్వో వి.భాస్కర్ చెబుతున్నారు. కానీ, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సిలిండర్లు తీసుకున్నవారికి కూడా అక్టోబర్ చివరి నాటికి డబ్బులు పడలేదు. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయి అమలుకు మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. -
అష్ఫాకుల్లా ఖాన్ను విస్మరించడం దురదృష్టకరం
సీతంపేట: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడం దురదృష్టకరమని ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ(ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ జె.పూర్ణచంద్రరావు అన్నారు. విశాఖ ముస్లిమ్స్ కల్చరల్ అండ్ లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో బుధవారం షహీద్ అష్ఫాకుల్లా ఖాన్ 125వ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకోరి రైలు దాడిలో పాల్గొన్నందుకు అష్ఫాకుల్లా ఖాన్ను బ్రిటిష్ ప్రభుత్వం 1927 డిసెంబరు 19న ఉరి తీసిందని గుర్తుచేశారు. ఆ సమయానికి ఆయన వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే అన్నారు. భగత్సింగ్, చంద్రశేఖర ఆజాద్ లాగే దేశం కోసం పోరాటం చేసిన అష్ఫాకుల్లా ఖాన్ గురించి పెద్దగా తెలియక పోవడం మత వివక్షే కారణమన్నారు. డిసెంబరు 19న అష్ఫాకుల్లా ఖాన్ వర్ధంతిని ప్రభుత్వ తరపున నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముస్లిం ఎమ్మెల్యేలు ముగ్గురే ఉన్నారని, మన రాష్ట్రం కంటే తక్కువ ముస్లిం జనాభా ఉన్న తమిళనాడులో 9 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఏఐబీఎస్పీ ముస్లిం హక్కుల కోసం పోరాటం చేస్తుందన్నారు. ముందుగా అష్ఫాకుల్లా ఖాన్ చిత్రపటానికి నివాళులర్పించారు. విశ్రాంత సీఐ ఎలియాజ్ అహమ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ నాయకులు క్షేత్రపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు, కార్పొరేటర్ బర్కత్ ఆలీ, ప్రొఫెసర్ ఇక్బాల్, డాక్టర్ ఖాజా, తులసీదాస్, ఫసుద్ధీన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలి: మాజీ డీజీపీ -
కొత్త విద్యుత్ కనెక్షన్కు ఫిక్స్డ్ చార్జీలు
సాక్షి, విశాఖపట్నం: కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం ఇకపై ‘వన్ స్టేట్, వన్ చార్జ్’అమలు చేసేందుకు పంపిణీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. కనెక్షన్ల జారీలో ఏపీఈఆర్సీ నియమావళికి అనుగుణంగా నూతన విధానం అమలుకు ఏపీఈపీడీసీఎల్ శ్రీకారం చుట్టింది. కొత్త కనెక్షన్ పొందే విధానాన్ని మరింత సరళీకృతం చేయడంతో పాటు, కనెక్షన్ ప్రక్రియను సులభతరం చేయడం, చార్జీల అమలులో పారదర్శకతను తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇకపై ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ఒకే విధమైన, పారదర్శక చార్జీలను అమలు చేయనుంది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్లు, ఎస్టిమేట్ తయారీ అవసరం లేకుండా వేగవంతమైన సేవలు అందించడం వల్ల..వినియోగదారులు ముందుగానే కనెక్షన్ చార్జీలపై స్పష్టమైన అవగాహన పొందేందుకు వీలుంటుంది. ఈ కొత్త విధానంలో భాగంగా 150 కిలోవాట్ల వరకు ఉన్న కనెక్షన్లకు స్థిర కనెక్షన్ చార్జీలు నిర్ణయించారు. అలాగే ఒక కిలోమీటర్ పరిధిలో ఇప్పటికే విద్యుదీకరణ జరిగిన ప్రాంతాల్లో, 150 కిలోవాట్ల వరకు లోటెన్షన్ (ఎల్టీ) విద్యుత్ కనెక్షన్ అడిగే వినియోగదారులు ఈ స్థిర చార్జీలకు అర్హులని స్పష్టం చేసింది. ఒక కిలోమీటర్ దూరానికి మించి ఉన్న ప్రాంతాలకు, కొత్త లేఅవుట్ల విద్యుదీకరణకు, వ్యవసాయ, అనుబంధ కనెక్షన్లకు, అండర్ గ్రౌండ్ కేబులింగ్ అవసరమయ్యే సందర్భాల్లో ఈ చార్జీలు వర్తించవు. అయితే అప్లికేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటి ఇతర రుసుములు మాత్రం ప్రస్తుత నియమావళి ప్రకారం కొనసాగుతాయి. కేటగిరీ ఆధారంగా స్థిర చార్జీలు కొత్తగా అమలులోకి వచ్చిన విధానంలో 150 కిలోవాట్ల వరకు ఉన్న అన్ని కొత్త కనెక్షన్లకు, అదనపు లోడ్లకు కేటగిరీ ఆధారంగా స్థిర చార్జీలు నిర్ణయించారు. 20 కిలోవాట్ల వరకు (ఒక కిమీ పరిధిలో) ఉన్న కనెక్షన్లకు, గృహ వినియోగదారులకు మొదటి కిలోవాట్కు రూ.1,500, వాణిజ్య వినియోగదారులకు (మొదటి కిలోవాట్కు) రూ.1,800 చొప్పున, తర్వాత ప్రతి అదనపు కిలోవాట్కు రూ.2 వేలు చొప్పున ధరలు నిర్ణయించారు. 20 నుంచి 150 కిలోవాట్ల వరకూ ప్రతి కిలోవాట్కు రూ.12,600 చొప్పున ధర ఉండనుంది. సగటు కనెక్షన్ ఖర్చు ఆధారంగా ఈ చార్జీలు నిర్ణయించామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. ఏపీఈపీడీసీఎల్లో నూతన విధానం -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
విశాఖ సిటీ: భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపించి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రికెట్ బెట్టింగ్ విషయంలో పోలీసులు ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో మరికొంత మంది పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సాంకేతికత సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఎక్స్చేంజ్ 666 అనే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ వెబ్సైట్ ద్వారా డబ్బు పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయకులకు ఆశ చూపించి వారి జీవితాలను నాశనం చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. నిరంతరం బెట్టింగ్ ఆడడంతో పాటు ఇతరులకు కూడా ఈ బెట్టింగ్ విధానాన్ని వివరిస్తూ, తమ సొంత ఐడీ ద్వారా అనేక మందిని బెట్టింగ్లో పాల్గొనేలా చేస్తున్న నలుగురి ముఠాను గుర్తించారు. రాంబిల్లి మండలం లోవపాలెంకు చెందిన గనగళ్ల బంగార్రాజు(31) అచ్యుతాపురం మండలం దొప్పర్ల గ్రామానికి చెందిన కొరుప్రోలు పూర్ణ కిశోర్(29), పరవాడ మండలం ఫార్మా సిటీకి చెందిన మేడిశెట్టి రాజు(38), విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం భూపాలరాజపురానికి చెందిన గడిదేశి ఈశ్వరరావు(39)లను అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. వీరి ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీల సమాచారాన్ని తెలుసుకున్నారు. వారిపై నిఘా పెట్టారు. పూర్ణకిషోర్ఈశ్వరరావుమేడిశెట్టిరాజుబంగార్రాజు -
మత్స్యకారులపై ఎందుకంత కక్ష?
శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తామంతా ఇక్కడకు వచ్చామన్నారు. ఏ ప్రభుత్వమైనా కంపెనీలు ఏర్పాటు చేసేటప్పుడు స్థానికులను ఒప్పించి వారి ఆమోదంతోనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని, మీ ప్రజాప్రతినిధి, హోం మంత్రి అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చేక మరోలా మాట్లాడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే బల్క్ డ్రగ్పార్క్ పనులు ఆపేస్తామని చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చేక కంపెనీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి మత్స్యకారులపై ఎందుకంత కక్ష అని నిలదీశారు. తాము అధికారంలో ఉన్నప్పడు ఆయా ప్రాంతాల వారిని ఒప్పించి వారి ఆమోదం మేరకు సెజ్లు ఏర్పాటు చేశామన్నారు. తాము ఇక్కడకు రాజకీయం చేయడానికి రాలేదని, మత్స్యకారుల అభిప్రాయాలను గౌరవించి వారికి మద్దతు ఇవ్వడం కోసమే వచ్చామన్నారు. మీ ఊళ్లోకి మీరు రావడానికి ఆధార్ కార్డు చూపించాల్సి రావడం ఏమిటని ప్రశ్నించారు. తమ ప్రాణాలు కాపాడుకోడానికి శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మత్స్యకారులపై పోలీసులు కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక రద్దు చేస్తామని, మీరేమీ భయపడొద్దన్నారు. -
అల్పపీడనం.. అప్రమత్తం
తుమ్మపాల: అల్పపీడనంతో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అఽధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని, ప్రజలకు తెలిసేలా ఫోన్ నెంబర్లు ప్రచారం చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 08924 288888, 08924 225999, 08924 226599 కు ఫోన్ చేయాలన్నారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీ, సీహెచ్ డబ్ల్యూలతో సహా ఎవరూ ప్రధాన కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు. జిల్లాలో గుర్తించిన 125 గ్రామాల లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, స్లాబ్లు పడిపోయే అవకాశం ఉన్న భవనాలు, మట్టి ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత భవనాల్లోకి మార్చాలన్నారు. పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, ఆనకట్టలు తనిఖీ చేయాలన్నారు. రోడ్లపై చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే చెట్లను తొలగించడానికి అవసరమయ్యే పరికరాలు, అందుకు కావలసిన మెషినరీ, కట్టర్స్, జేసీబీలు సిద్ధం చేయాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మంచినీళ్లు కలుషితం కాకుండా చూడాలన్నారు. హైరిస్కు గల గర్భిణులను ముందుగా ఆస్పత్రికి తరలించాలన్నారు. విద్యుత్తు అంతరాయం ఏర్పడితే గంట సమయంలో పునరుద్ధరించేటట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజలకు కావలసిన నిత్యావసర సరకులు సేకరించి నిల్వ చేసుకోవాలని, నిర్వాసితులకు సకాలంలో పంపిణీ చేయాలన్నారు. జేసీ ఎం.జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి మూర్తి, పంచాయతీ అధికారి సందీప్ పాల్గొన్నారు. -
మత్స్యకారులకు అండగాఉంటాం
జగనన్న మాటగా చెబుతున్నాం.. వందలాదిమంది పోలీసులను దించారు.. దారులన్నీ దిగ్బంధం చేశారు.. సంఘీభావం తెలిపే నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.. రాజయ్యపేట మత్స్యకారులను ఒంటరి వాళ్లను చేసేందుకు యత్నించారు. వారం రోజులుగా అమలవుతున్న కూటమి నేతల కుటిల నీతిని తుత్తునియలు చేస్తూ వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. మేమున్నామని భరోసా ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశంతో ‘చలో రాజయ్యపేట’కు పిలుపునిచ్చి పార్టీ అగ్ర నేతలు గ్రామాన్ని సందర్శించారు. చివరి వరకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. నక్కపల్లి: మత్స్యకారులకు మద్దతుగా బుధవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘చలో రాజయ్యపేట’ విజయవంతమయింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తమకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వైఎస్సార్సీపీ నేతలకు వందలాది మంది మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ గత 39 రోజులుగా మత్స్యకారులు నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. గత నెల 9వ తేదీన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం వచ్చారు. ఈ సందర్భంగా తాళ్లపాలెం వద్ద మత్స్యకారులు కలసి తమ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ వల్ల కలిగే నష్టాలను, తాము చేస్తున్న ఆందోళనను వివరించారు. తమకు అండగా నిలవాలని కోరారు. జగన్ స్పందిస్తూ మత్స్యకారుల అభిప్రాయాలకు విరుద్ధంగా వారి ఆమోదం లేకుండా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నారు. మత్స్యకారులు చేపట్టిన ఆందోళనకు వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుందని, త్వరలోనే పార్టీ జిల్లా నేతలను రాజయ్యపేట పంపిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి సీనియర్ నేతలంతా రాజయ్యపేట తరలివచ్చారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మరో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, పాయకరావుపేట సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో నేతలంతా రాజయ్యపేట వచ్చి మత్స్యకారులకు సంఘీభావం ప్రకటించారు. రాజయ్యపేట వచ్చిన వారిలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, కన్నబాబురాజు, చెంగల వెంకటరావు, తైనాల విజయ్కుమార్, పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, సూర్యనారాయణరాజు, సీఈసీ సభ్యులు డాక్టర్ బి.వి.సత్యవతి, రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, పైల శ్రీనివాసరావు, మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కోలా గురువులు, పేర్ల విజయచందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జాన్ వెస్లీ, ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ముఖ్యనేతలు శరగడం చినఅప్పలనాయుడు, బోదెపు గోవింద్, జియ్యాని శ్రీధర్, అల్లంపల్లి రాజుబాబు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, పార్టీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, మహిళా నేతలు నాగమల్లేశ్వరి, సుందరలత, విశాఖ బోట్ ఆపరేటర్ల సంఘ అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, తదితరులు ఉన్నారు. ముందు రెచ్చగొట్టి.. తర్వాత ప్లేటు ఫిరాయించి.. పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్, రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ముందు రెచ్చగొట్టారని, అధికారంలోకి వచ్చేక కంపెనీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. మత్స్యకారులకు ఆమె క్షమాపణ చెప్పాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు విషయమై మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి పెంచడం కోసమే ఇక్కడకు వచ్చామన్నారు. మీ ప్రాణాలు కాపాడుకునేందుకు చేసే పోరాటం ఏ స్థాయికి వెళ్లినా వైఎస్సార్సీపీ మీకు అండగా ఉంటుందన్నారు. అవసరమైతే జగన్మోహన్రెడ్డి మీకు సంఘీభావం ప్రకటించేందుకు రాజయ్యపేట వస్తారన్నారు. ఆయన ఆదేశాల మేరకు మీ దగ్గరకు వచ్చాం మీ నిర్ణయమే మాకు శిరోధార్యం మీ పోరాటానికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాం మత్స్యకారులకువైఎస్సార్సీపీ నేతల భరోసా ప్రజాభీష్టం మేరకే కంపెనీలు ఏర్పాటు చేయాలని స్పష్టీకరణ చలో రాజయ్యపేట విజయవంతం భూములు తీసుకునేటప్పడు ఈ కంపెనీ పెడతామని చెప్పలేదు. ఆందోళన సేత్తే కేసులు పెడతన్నారు. నా మీద 15 కేసులు పెట్టారు. మా ఊర్లో 36 మంది మీద కేసులు పెట్టేరు. ఊరు చుట్టూ పోలీసులను పెట్టారు. అందరం ఒకే మాటమీద ఉన్నాం. అవసరమైతే చావడానికై నా సిద్ధం. –నాగేశు, మత్స్యకారుడు -
త్వరలో రాజయ్యపేటకు వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వం ఉంది ప్రజల ప్రాణాలను కాపాడడానికే గానీ తీయడానికి కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకి చేరుకుంది. బుధవారం వైఎస్సార్సీపీ బృందం వాళ్లను పరామర్శించి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్కు వివరించారు. ఆయన ఆదేశాలతోనే మేం ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి అంతేగానీ తీయకూడదు. కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎన్నికలకు ముందు బల్క్ డ్రగ్ పార్క్తో క్యాన్సర్, పిల్లలకు వైకల్యం వస్తుందని మంత్రి అనిత చెప్పారు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. అనితకు ఇది న్యాయమా?. చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి.... పరిశ్రమలకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్ వల్ల జీవితాలు నాశనం అవుతాయని ప్రజలే అంటున్నారు. అలాంటప్పుడు స్థానికుల అభీష్టానికి వ్యతిరేకంగా ఎలా ఏర్పాటు చేస్తారు?. వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?. అప్పుడు.. ఇప్పుడు.. మేం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాం. బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు కానియ్యం’’ అని అన్నారు. త్వరలో జగన్ రాక.. ‘‘మా జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. కానీ, బల్క్ డ్రగ్ పార్క్ను కట్టనివ్వం’’ అంటూ పలువురు బొత్స వద్ద వాపోయారు.ఈ సందర్భంగా మత్స్యకారులున ఉద్దేశిస్తూ బొత్స మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మీ కోరికను నెరవేరుస్తారు. ఈ పోరాటంలో కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులను.. జగన్ అధికారంలోకి వచ్చాక తొలగిస్తారు. మీతో పాటు మేము పోరాటం చేస్తాం. మీకు అండగా మేముంటాం. తప్పు చేసిన కూటమికి శిక్ష తప్పదు. మీరు చెప్పిన ప్రతి మాటను వైఎస్ జగన్ దృష్టికి వెళ్తాం. త్వరలో రాజయ్యపేటకు జగన్ వస్తారు’’ అని బొత్స తెలిపారు. పోలీసుల ఓవరాక్షన్పై..రాజయ్యపేట దీక్షాశిబిరానికి వైఎస్సార్సీపీ నేతలు వెళ్లనీయకుండా పోలీసులు ఆంక్షలను విధించారు. అయితే వాటిని దాటుకుని నేతలు అక్కడికి చేరుకున్నారు. దీనిపై బొత్స మాట్లాడుతూ.. ‘‘రాజయ్యపేట పర్యటనపై అనేక ఆంక్షలు పెట్టారు. కనీస మానవత్వం లేకుండా కూటమి వ్యవహరిస్తోంది. గ్రామస్తులను ఆధార్ కార్డులు చూపించమని అడుగుతున్నారు. ఏమైనా సంఘ విద్రోహశక్తులా?’’ అని బొత్స నిలదీశారు. -
మోసపోయాం.. జగనే న్యాయం చేయాలి: రాజయ్యపేట మత్స్యకారులు
రాజయ్యపేట మత్స్యకారులకు వైఎస్సార్సీపీ నేతల మద్దతు.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కామెంట్స్..మత్స్యకారులు వారికి జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్కు వివరించారు.వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చాము..ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను కాపాడాలి..ప్రజల ప్రాణాలు తియ్యడానికి కాదు.ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలి?.ఎన్నికలకు ముందు క్యాన్సర్, పిల్లలకు అంగవైకల్యం వస్తుందని అనిత చెప్పారుఅనితకు ఇది న్యాయమా?.ప్రజల పక్షాన ఉంటాం..బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు కానివ్వం.రాజయ్యపేట పర్యటనపై అనేక ఆంక్షలు పెట్టారు..మేము ఏమైనా సంఘ విద్రోహ శక్తులమా?రాజయ్యపేట గ్రామస్తుల ఆధార్ కార్డులు ఎందుకు అడుగుతున్నారు.వైఎస్ జగన్ మీ కోరికను నెరవేరుస్తారు.కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు మేము బాధ్యత వహిస్తాం.వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మీ మీద కేసులన్నీ తొలగిస్తారు..మానవత్వం లేకుండా కూటమి వ్యవహరిస్తోంది.మీతో పాటు మేము పోరాటం చేస్తాం..మీకు అండగా మేముంటాం.తప్పు చేసిన కూటమికి శిక్ష తప్పదు..మీరు చెప్పిన ప్రతి మాటను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తాం. కురసాల కన్నబాబు కామెంట్స్..ఎన్నికలకు ముందు అనిత ఎన్నో హామీలు ఇచ్చారు.బల్క్ డ్రగ్ పార్కు వలన క్యాన్సర్ వస్తుందని చెప్పారు..చంద్రబాబుకు ఇచ్చిన హామీలు గుర్తు ఉండవు.పేదల పక్షాన వైఎస్ జగన్ నిలుస్తారు.కూటమి ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఎత్తేస్తారు.చంద్రబాబు పెద్దల పక్షం.. వైఎస్ జగన్ పేదల పక్షం.రాజయ్యపేట రాకుండా అనేక ఆంక్షలు పెట్టారు..ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు..పోలీసులు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోమనండి.వైఎస్ జగన్ సీఎం అయ్యాక కేసులన్నీ ఎత్తివేస్తారు.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్..మీకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది.వైఎస్ జగన్ ఆదేశం మేరకు మీ దగ్గరికి వచ్చాము.రాజకీయం కోసం రాలేదు.మీకు సంఘీభావం తెలపడానికి వచ్చాము.మీ గ్రామంలోకి మీరు రావడానికి గతంలో ఎన్నడైనా ఆధార కార్డులు చూపించారా?.వందల ఏళ్ళుగా ఇక్కడే జీవిస్తున్నారు..కొన్ని రోజుల పోతే పాస్పోర్ట్ అడుగుతారుబల్క్ డ్రగ్ పార్క్కు వైఎస్సార్సీపీ వ్యతిరేకంఅనితను నమ్మి మోసపోయాం: రాజయ్యపేట మత్స్యకారులుమత్స్యకారుల ఆవేదన..వైఎస్సార్సీపీ నేతలతో మత్స్యకారులు.నమ్మించి అనిత మోసం చేసింది.బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయమని అనిత చెప్పింది.మా ఊరి ఆడపిల్ల అని చెప్పింది.అనిత నమ్మి మా గ్రామం నుంచి 2000 మెజార్టీ ఇచ్చాము.మమ్మల్ని చంపి బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయండి.మాకు జగనే న్యాయం చేయాలి.కూటమి వల్ల న్యాయం జరగదు.బల్క్ డ్రగ్ పార్క్ వలన మా జీవితాలు నాశనమవుతాయి.ఏం పాపం చేశామని మమ్మల్ని వేధిస్తున్నారు.మా ప్రాణాల పోయినా పర్వాలేదు.బల్క్ డ్రగ్ పార్కు కట్టనివ్వము. వైఎస్సార్సీపీ నేతల సంఘీభావం..రాజయ్యపేట చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకులుమత్స్యకారుల పోరాటానికి సంఘీభావం తెలిపిన వైఎస్సార్సీపీ నేతలు.మత్స్యకారులతో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, కేకే రాజు, పార్టీ నాయకులు.వైఎస్సార్సీపీ నేతలకు తమ సమస్యలను విన్నవించుకున్న మత్స్యకారులు.మత్స్యకారుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్సార్సీపీ.నర్సీపట్నం పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ని కలిసిన మత్స్యకారులు.ఉద్యమంలో పాల్గొని మత్స్యకారులకు అండగా నిలుస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు.👉పరిశ్రమల వ్యర్థాలు సముద్ర జలాలను కలుషితం చేస్తాయని, చేపల వేటపై ఆధారపడి బతుకుతున్న తమ పొట్ట కొడతాయని, తమ ఆవేదన అర్థం చేసుకోమని నెల రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. తొలి నుంచీ పార్టీ స్థానిక నేతలు ఆందోళనకారులకు మద్దతునిస్తుండగా.. అగ్ర నేతలు సైతం గ్రామానికి తరలివచ్చి సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారు.👉వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం మేరకు బుధవారం ‘చలో రాజయ్యపేట’కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కోరారు. కాసేపట్లో వైఎస్సార్సీపీ నేతలు రాజయ్యపేటకు చేరుకోనున్నారు. కాగా, బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు 39 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. వారి ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేస్తోంది. ఈ నేపథ్యంలో మత్స్యకారుల ఉద్యమానికి వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలుపనున్నారు. మరోవైపు.. రాజయ్యపేటలో పోలీసుల పహారా కొనసాగుతోంది. -
ఆరిపోయిన ఆశల దీపాలు
గాజువాక/కూర్మన్నపాలెం: దీపావళి రోజున విషాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి పాత గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ఉపాధి కోసం వలస వచ్చిన రెండు నిరుపేద కుటుంబాల ఆశలను ఛిద్రం చేసింది. వారి ఇళ్లలో చీకట్లను నింపింది. కుటుంబానికి ఆసరా అవుతారనుకున్న కుమారులు.. వారిని శోకసంద్రంలో ముంచి.. అనంత వాయువుల్లో కలిసిపోయారు. ఇదే ఘటనలో మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి.. కూర్మన్నపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్న మారేడుపల్లి అజయ్ కుమార్ (18), వెందుర్తి మనోజ్ కుమార్ (17), కె.మధు(17) ముగ్గురూ స్నేహితులు. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై నగరంలోని ఆర్కే బీచ్కు వెళ్లేందుకు బయలుదేరారు. అజయ్ బైక్ నడుపుతుండగా, మనోజ్, మధు వెనుక కూర్చున్నారు. సరిగ్గా పాతగాజువాక జంక్షన్కు వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ముగ్గురూ తుళ్లిపోయి రోడ్డుపై పడిపోయారు. ఇది గమనించిన సమీపంలోని ఆటో డ్రైవర్లు వెంటనే స్పందించి, వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అజయ్ కుమార్, మనోజ్ కుమార్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన మధును మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించిన గాజువాక ట్రాఫిక్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వలస కుటుంబాల్లో తీరని వేదన ఈ ప్రమాదం ఉపాధి కోసం సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చిన రెండు నిరుపేద కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మృతుడు అజయ్ కుమార్ స్వస్థలం చీడికాడ మండలం వరహాపురం గ్రామం. అతని తండ్రి అర్జున్ ఇటీవల కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడంతో, తల్లి లోవలక్ష్మితో కలిసి 87వ వార్డు కాశీపాలెంలో ఒక అపార్ట్మెంట్లో వాచ్మన్గా పని చేస్తున్నాడు. తల్లి కష్టాన్ని చూసిన అజయ్ ఐటీఐ చదువుతూనే, మరోవైపు కోళ్ల వ్యానులో పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నాడు. తన చెల్లి ఐశ్వర్యను ఇంటర్ చదివిస్తున్నాడు. కొడుకు ప్రయోజకుడై తమ కష్టాలు తీరుస్తాడనుకున్న ఆ తల్లికి.. అజయ్ మరణం తీరని పుత్రశోకాన్ని మిగిల్చింది. మరో మృతుడు వెందుర్తి మనోజ్ కుమార్ కుటుంబానిది కూడా ఇలాంటి దీన గాథే. ఏడేళ్ల కిందట విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగి నుంచి ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. అతని తల్లిదండ్రులు ముత్యాలు, దేముడమ్మ.. కూర్మన్నపాలెం 86వ వార్డు అశోకనగర్లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మన్గా పనిచేస్తున్నారు. మనోజ్ కుమార్ ఐటీఐ మధ్యలో ఆపేసినట్టు పోలీసులు తెలిపారు. మనోజ్కు కూడా ఒక చెల్లి ఉంది. కొడుకు మరణవార్త విని తల్లి దేముడమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. గంటల ముందు తమ కళ్లెదుట దీపావళి సంబరాల్లో పాల్గొన్న పిల్లలు.. ఒక్కసారిగా విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి రోదనలతో కూర్మన్నపాలెం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
గూగుల్ వార్
కూటమిలోనేవిశాఖ సిటీ: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1.8 లక్షల ఉద్యోగాలు రావా? జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయా? ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అనేక సవాళ్లు ఉన్నాయా? భవిష్యత్తులో విద్యుత్, నీటి సమస్య ఉత్పన్నమవుతుందా? ఇప్పటి వరకు ఐటీ, పర్యావరణ నిపుణులు సందేహాలు లెవనెత్తగా.. తాజాగా ఏపీ బీజేపీ పెద్దలు సైతం వీరితో గొంతు కలపడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. దీంతో కూటమిలో ‘గూగుల్’ వార్ మొదలైంది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం అగ్గిరాజేస్తోంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ను టీడీపీ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. కూటమి భాగస్వామ్య పార్టీ బీజేపీ దానికి చెక్పెట్టే పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తోంది. ఈ డేటా సెంటర్ ఘనతను కొట్టేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు చూస్తుంటే.. బీజేపీ ముఖ్య నేతలు తండ్రీ, కొడుకుల గాలి తీసేశారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందని చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఊదరగొడుతుంటే.. ఏపీ బీజేపీ చీఫ్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వారి బండారాన్ని బట్టబయలు చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్, విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఒకవైపు గూగుల్పై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శిస్తూనే.. మరోవైపు చంద్రబాబు, లోకేష్ చెప్పినవన్నీ అబద్ధాలే అని కొట్టిపారేసేలా మాట్లాడడం ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అన్నీ అవాస్తవాలే.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్పై వాస్తవాలను దాచి.. 1.8 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని కల్లబొల్లి మాటలు చెబుతోందని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలతో పాటు ఐటీ నిపుణులు సైతం కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ డేటా సెంటర్ కోసం మూడు ప్రాంతాల్లో 480 ఎకరాలను కేటాయించనుంది. ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో 200 ఎకరాలు, అడవివరం ప్రాంతంలో 120 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 160 ఎకరాల కేటాయింపులకు భూములను సిద్ధం చేస్తోంది. అలాగే రూ.22 వేల కోట్ల రాయితీలను ప్రకటించేయడం పట్ల అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంద. అయితే నిర్ధిష్టమైన ప్రణాళికలు లేకుండా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో విశాఖతో పాటు రాష్ట్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అనేక సందేహాలను లేవనెత్తుతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు వైఎస్సార్ సీపీ నేతలు సైతం గూగుల్ డేటా సెంటర్ ద్వారా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని, ఆ దిశగా సదరు కంపెనీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ సందేహాలకు, వైఎస్సార్ సీపీ నేతల సూచనలపై ఇప్పటి వరకు నోరుమెదపడం లేదు. ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు గూగుల్ డేటా సెంటర్పై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అనేక సవాళ్లు ఉన్నాయని మీడియా సమావేశంలోనే స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ అతి పెద్ద సమస్యగా పరిణమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పలేమని తేల్చి చెప్పారు. డేటా సెంటర్ ఏర్పాటులో అదాని కూడా భాగస్వామి అని చెప్పుకొచ్చారు. ఈ సెంటర్ హీట్ను ప్రొడ్యూస్ చేస్తుందని, విద్యుత్ వినియోగం విపరీతంగా ఉంటుందని అంగీకరించారు. గాలి, భూ కాలుష్యాన్ని అధిగమించాల్సి ఉంటుందన్నారు. అతడితో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు కూడా గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగాలపై అసలు వాస్తవాలను వెల్లగక్కారు. డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదని, దీని ద్వారా 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయనడం కరెక్ట్ కాదని తేల్చి చెప్పారు. వీరి వ్యాఖ్యలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరుకునపడింది. ఇప్పటి వరకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు, లోకేష్లు చేస్తున్న ప్రచారాలను బీజేపీ పెద్దలే తిప్పికొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ చీఫ్, ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు ఇప్పటి వరకు టీడీపీ పెద్దలు కౌంటర్ చేయలేకపోతున్నారు. కూటమి పార్టీల నేతలు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుండడం రాజకీయంగా దుమారం రేపుతోంది. టీడీపీ, బీజేపీ పరస్పర విరుద్ధ ప్రకటనలు డేటా సెంటర్పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయని అంగీకారం పర్యావరణ పరిరక్షణ అతి పెద్ద సమస్య అని వెల్లడి 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయనడం కరెక్ట్ కాదన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు బీజేపీ నేతల వ్యాఖ్యలతో ఇరకాటంలో ప్రభుత్వం -
నూకరాజు సేవలు చిరస్మరణీయం
జెడ్పీ సీఈవో నారాయణమూర్తిమహారాణిపేట: కొయ్యూరు మండలం జెడ్పీటీసీ వారా నూకరాజు అత్యంత సౌమ్యుడు, నిగర్వి, నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడని జిల్లా పరిషత్ ముఖ్య కార్వనిర్వహణాధికారి(సీఈవో) పి.నారాయణమూర్తి కొనియాడారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వారా నూకరాజు సంతాప సభ నిర్వహించారు. తొలుత నూకరాజు చిత్రపటానికి సీఈవో పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఈవో నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నూకరాజు చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్ మాట్లాడుతూ నూకరాజు మరణం జిల్లా ప్రజా పరిషత్కు తీరని లోటు అన్నారు. నూకరాజు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారులు, పరిపాలనాధికారులు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
విగ్రహం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
మాకవరపాలెం: బాబుజగ్జీవన్రామ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పిఎస్ నేతలు చిందాడ నూకేశ్వరరావు, మల్లిబాబు డిమాండ్ చేశారు. తాడపాలలో జగ్జీవన్రామ్ విగ్రహ ధ్వంసంపై మంగళవారం గ్రామస్తులతో కలసి ఎస్ఐ దామోదర్నాయుడుకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు జగ్జీవన్రామ్ విగ్రహం వద్దే ఉండడం చూసినట్టు చెప్పారు. నలుగురు వ్యక్తుల పేర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
యూరియా కోసం రైతుల కుమ్ములాట
ఎస్.రాయవరం: సైతారుపేట గ్రామంలో యూరియా కోసం రైతులు మంగళవారం కుమ్ములాడుకున్నారు. వ్యవసాయాధికారులు సాగు వేసిన రైతులకు అవసరం అయిన యూరియా సకాలంలో సరఫరా చేయకపోవడంతో ,సైతారుపేట రైతుసేవా కేంద్రానికి చేరిన యూరియా కోసం సైతారుపేట, పేటసూధిపురం రైతులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇరుగ్రామాలకు 130 చొప్పున బ్యాగులు రావడంతో వెనుక ఉన్నవారికి ఎరువు అందదన్న ఆందోళనతో తోపులాటకు దిగారు.ఈక్రమంలో పేటసూధిపురం కూటమి నాయకుడు తమ గ్రామ రైతులకు ముందుగా యూరియా ఇవ్వాలని గేటు వద్ద నిలుచుని రైతులను పంపారు. ఇది చూసి ఆగ్రహించిన రైతులు వచ్చిన ఎరువు అర్హులందరికీ పంపిణీ చేయాలని తోసుకోచ్చారు. ఇది గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆందోళన కారులను చెదరగొట్టి యూరియా పంపిణీని నిలిపివేశారు. అంతా సద్దుమణిగిన తరువాత సాయంత్రం రైతు సేవాకేంద్రం సిబ్బంది యూరియా పంపిణీ ప్రారంభించారు. అది తెలుసుకున్న రైతులు మరళా రైతు సేవా కేంద్రానికి పరుగులు తీశారు. సిబ్బంది కేవలం కూటమి నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ పంపిణీ చేస్తున్నట్టు గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిని గదిలో ఉంచి తలుపులు వేశారు. అలా చొరవ తీసుకుని తులుపు మూసింది కూడా కూటమి నాయకులు మద్దతుదారులు కావడం విశేషం. దీంతో సిబ్బంది వెనుక డోర్ నుంచి నెమ్మదిగా అక్కడనుంచి జారుకున్నారు. యూరియా స్లిప్పుల కోసం పడిగాపులు కశింకోట: మండలంలోని నూతలగుంటపాలెం, కశింకోట గ్రామాల్లో యూరియా ఎరువు కోసం రైతులు గంటల తరబడి మంగళవారం నిరీక్షించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. నూతలగుంటపాలెంలో యూరియా ఎరువు కోసం స్లిప్పులు పొందడానికి అక్కడి రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరి సుమారు రెండు గంటలు పైగా నిరీక్షించారు. ఎరువు నిల్వ అందుబాటులో ఉన్న మేరకు 250 మందికి స్లిప్పులు ఇచ్చి సమీపంలోని నరసింగబిల్లి పీఎసీఎస్ గిడ్డంగి వద్దకు బుధవారం రావాలని వ్యవసాయ సహాయకుడు రాజా కోరారు. అలాగే ఇంకా 89 మంది రైతులు మిగిలి పోగా వారిని కశింకోటలోని ప్రైవేటు డీలర్ వద్ద యూరియా తీసుకోవడానికి అనువుగా స్లిప్పులు అందజేశారు. కశింకోటలోని ప్రైవేటు డీలర్ వద్ద రైతులు స్లిప్పుల కోసం సుమారు 3 గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్లిప్పుల కోసం పేరు నమోదు చేసే మిషన్ పని చేయకపోవడంతో నిరీక్షణ తప్పలేదు. -
పండగ వేళ విషాదం..
రోడ్డు ప్రమాదంలో స్వీట్స్ దుకాణం యజమాని మృతి కోటవురట్ల: పండుగ వేళ ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలివి. కోటవురట్లకు చెందిన టి.భాస్కరావు(57) ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికంగా మధుర స్వీట్స్ దుకాణం నడుపుతున్న భాస్కరరావు అందరికీ చిరపరిచితుడు. ఆదివారం రాత్రి దుకాణం నుంచి సైకిల్ నడిపించుకుంటూ ఇంటికి వెళుతుండగా సాయినగర్ ఆర్చ్కు సమీపంలో నర్సీపట్నం వైపు నుంచి వేగంగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కరరావు తీవ్రంగా గాయపడగా స్థానికులు హుటాహుటిన స్థానిక సీహెచ్సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటల సమయంలో మృతిచెందారు. దీపావళి రేపు అనగా ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
ఆటో బోల్తా పడి యువకుడి మృతి
కొయ్యూరు: వంట చెరకు సేకరణను వెళ్లిన ఆటో తిరిగి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన ఆర్.కల్యాణ చక్రవర్తి అలియాస్ చిన్న(33) అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న కొయ్యూరు ఎస్ఐ కిషోర్వర్మ వెంటనే ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాదేవిపేటకు చెందిన ఎం.అప్పారావు, వి.బుచ్చియ్య, ఎం.కొండబాబు, చిన్న కలిసి మంగళవారం ఆటోలో కృష్ణాదేవిపేట నుంచి కొయ్యూరు–ఎర్రబంద రహదారిలో ఏనుగురాయి వద్దకు వెళ్లి వంట చెరకు సేకరించారు. తిరిగి వస్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో ఆటో బోల్తా పడింది. చిన్న తలకు తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మరణించారు. గాయపడిన వారిలో అప్పారావు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరూ కృష్ణాదేవిపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఒక విడత డీఏ జీవోను తక్షణం సవరించాలి
అనకాపల్లి: కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రకటించిన ఒక విడత డీఏ జీవోను తక్షణమే సవరించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ కోరారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు నేటి వరకూ నాలుగు డీఏలు బకాయిలు ఉండగా ఒక డీఏను మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వం 3.6 శాతం డీఏ ను మంజూరు చేస్తూ జీవో నంబర్ 60, 61లు విడుదల చేసిందని, ఈ జీవోలో డీఏ బకాయిలను ఉద్యోగి పదవీ విరమణ పొందిన తరువాత ఇస్తామని జీవోలు పేర్కొనడం దారుణమన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నేటి వరకూ పాలించిన ప్రభుత్వాలు ఈ రకమైన జీవోను జారీ చేయలేదన్నారు. ఉద్యోగులందరూ ఈ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోలను సవరించాలని కోరారు. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీలు ఇవ్వవలసి ఉండగా, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పాలన జరుగుతున్నప్పటికీ పీఆర్సీ కమిషన్ను నియమించడకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన 12వ పీఆర్సీని అమలు చేస్తామని హామీ ఇచ్చి, గద్దెనెక్కిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు నేటికీ పీఆర్సీని ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే పీఆర్సీ కమిషన్ నియమించి, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఆయన కోరారు. -
బీఎన్ రోడ్డు మధ్యలో కూరుకుపోయిన బస్సులు
బుచ్చెయ్యపేట: మండలంలో వడ్దాది నుంచి నర్సీపట్నం పోవు బి.ఎన్.రోడ్డులో మంగళవారం రాత్రి 8.30 గంటలకు చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలో బురదలో కూరుకు పోయింది. ఈ రహదారిలో బంగారుమెట్ట నుంచి ఎల్బీపురం మధ్య చర్చి వద్ద రహదారి మధ్యలో పెద్ద గొయ్యి ఉంది. చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ గోతిలో కూరుకునిపోవడంతో చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. నర్సీపట్నం నుంచి చోడవరం వైపు వచ్చే బస్సులు, లారీలు, ఇతర ప్రెవేటు వాహనాలు సుమారు 1 కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ రహదారి నరకం చూపిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తాత్కాలిక వసతులకే రూ. 36 లక్షలా?
డాబాగార్డెన్స్ (విశాఖ): విశాఖ ప్రపంచ యోగా ది నోత్సవం జరిగి నాలుగు నెలలు గడిచిపోయినా.. ఆ కార్యక్రమానికి సంబంధించిన ఖర్చుల బిల్లులు ఇప్పుడు ఆమోదం కోసం రావడం చర్చనీయాంశమైంది. ‘అయిపోయిన పెళ్లికి మేళాలు’అన్నట్లుగా.. జీవీఎంసీ అధికారులు కార్యక్రమం ముగిసిన నెలల తర్వాత తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి ఏర్పాట్లకు అయిన ఖర్చుల ఆమోదం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సుమారు 3 నుంచి 4 లక్షల మంది హాజరవుతారని అంచనా వేసి, జీవీఎంసీ తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, వీధిలైట్లు వంటి కనీస సదుపాయాలను కల్పించింది. ఈఈ–2 డివిజన్ పరిధిలోని జోన్–3, 4, 5లలో ఏర్పాటు చేసిన వసతి కేంద్రాలకు 20 లీటర్ల నీటి బబుల్స్, వాటర్ బాటిళ్లు, పేపర్ గ్లాసుల ద్వారా తాగునీటిని సరఫరా చేశారు. తాత్కాలిక మరుగుదొడ్లకు పీవీసీ ఫిట్టింగులతో అవుట్లెట్లు ఏర్పాటు చేయడం, తాగునీటి కోసం డ్రమ్ములు, బకెట్లు, జగ్గులు సమకూర్చడం వంటి పనులను జీవీఎంసీ అధికారులు నామినేషన్ పద్ధతిలో ఐదుగురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనుల కోసం నవీన్ ఎంటర్ప్రైజెస్కు రూ.13.85 లక్షలు, రామిశెట్టి సురేష్కు రూ.12.00 లక్షలు, ఎల్జేఆర్వీ కోటేశ్వరరావుకు రూ.4.89 లక్షలు, జి.అప్పన్నకు రూ.3.60 లక్షలు, టి.వీరారెడ్డికి రూ.1.70 లక్షలు కలిపి సుమారు రూ. 36 లక్షలు ఖర్చు చేసినట్లు చూపుతున్నారు. కేవలం తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి డ్రమ్ముల వంటి పనులకు రూ.36 లక్షలకు పైగా ఖర్చు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జరగనున్న జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నారు. నాలుగు నెలల ఆలస్యంగా వస్తున్న ఈ బిల్లులపై సభ్యులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి. నాలుగు నెలల తర్వాత యోగా డే ఖర్చులపై నేడు చర్చ -
వైభవంగా పంచరాత్ర ఉత్సవాలు
యలమంచిలి రూరల్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన యలమంచిలి పంచరాత్ర మహోత్సవాలు సోమవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఏటా దీపావళి నుంచి నాగులచవితి వరకు ఐదు రాత్రులు ఉత్సవాలను స్థానిక గవరపాలెం భూలోకమాంబ అమ్మవారు, పాతవీధి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ కమిటీలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తొలిరోజు సోమవారం అమ్మవారిని మహాలక్ష్మిగా, రెండోరోజు అమ్మవారిని బాలత్రిపురసుందరిగా అలంకరించారు. అమ్మవారితోపాటు పాతవీధి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుద్దీపాలతో సుందరంగా సెట్టింగ్లను ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ఆకట్టుకుంటున్న విద్యుద్దీపాల సెట్టింగ్లు -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్కు ఎంపిక
అనకాపల్లి టౌన్: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఏఎంఏఎల్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఏలూరులో ఈ నెల 22,23 తేదీలలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్ 19 అథ్లెటిక్స్ పోటీలకు ఎస్.తేజ, ఎల్.రమణమూర్తి, జి.నరేష్, ఎం. సిద్దు, బి.హరిణి పాల్గొంటున్నారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జయబాబు తెలిపారు. ఈ విద్యార్థులను కళాశాల యాజమాన్య అధ్యక్షుడు శ్రీధరాల కృష్ణ పేర్రాజు, కరస్పాడెంట్ పెంటకోట వెంకట రామారావు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె.వి.ఎస్ నాయుడు అభినందించారు. -
రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం
జెడ్పీటీసీకే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటి: అమర్నాథ్ నర్సీపట్నం: రాష్ట్రంలో లా అండ్ అర్డర్ పూర్తిగా విఫలమైందని, దీనికి జెడ్పీటీసీ వారా నూకరాజు హత్యే నిదర్శనమని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వచ్చి హత్యకు గురైన కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడు భార్య, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడ్పీటీసీ నూకరాజు హత్యను తాను రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. భూ వివాదానికి సంబంధించి గతంలో జెడ్పీటీసీపై దాడి చేసి, గాయపరిచారన్నారు. నాలుగు పర్యాయాలు బైండోవర్ చేసినా హత్యకు గురికావటం బాధాకరమన్నారు. రెవెన్యూ, పోలీసులు సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు.. ప్రజలు రోడ్ల మీదకు వచ్చినప్పుడు స్పందిస్తున్నారన్నారు. పరవాడలో బాలికపై హత్యాచారం, కందుకూరులో కారుతో గుద్దించిన సంఘటన శాంతిభద్రతలు విఫలమయ్యాయని చెప్పడానికి నిదర్శనాలన్నారు. హత్యతో ప్రమేయం ఉందని చెబుతున్న అజయ్కుమార్పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ నాయకులతో కలిసి ఏరియా ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత, తదితరులు ఉన్నారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ముందు గిరిజన నేతల బైఠాయింపు కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్యకు గురైన విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి చేరుకొని బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఏరియా ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించారు. జెడ్పీటీసీ కుటుంబానికి న్యాయం చేయాలని, బాధితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. హత్యకు పోలీసులు బాధ్యత వహించాలన్నారు. జెడ్పీటీసీ నూకరాజు మృతదేహానికి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, మాజీ ఎంపీ మాధవి నివాళులర్పించారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేష్ జెడ్పీటీసీ నూకరాజుకు నివాళులర్పించారు. -
‘ఆర్ఈసీఎస్’ పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బందికి బకాయిల చెల్లింపు
కశింకోట: ఆర్ఈసీఎస్కు అనుబంధంగా ఉన్న రాజీవ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బందికి ఎట్టకేలకు జీతాలు, నిర్వహణ ఖర్చులను చెల్లించారు. జీతాలు అందక రాజీవ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది గత మూడు నెలలుగా పడుతున్న ఇబ్బందిపై ‘సాక్షి’ పత్రికలో ప్రచురించిన వరుస కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఏపీఈపీడీసీఎల్ అధికారులు, కలెక్టర్ విజయ కృష్ణన్ల ఆదేశాలతో 8 నెలల జీతం బకాయిలు, ఇతర నిర్వహణ ఖర్చులను తాజాగా చెల్లించారు. దీంతో అధ్యాపక, సిబ్బంది, విద్యార్థులు మంగళవారం ఆనందం వ్యక్తం చేశారు. -
కూటమి పాలన వైఫల్యాలపై యువత గళమెత్తాలి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై గళమెత్తాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా యువజన విభాగం పోరాడాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు హాజరయ్యారు. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదీప్రాజ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల యువజన విభాగం కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. వారి సూచనలు, సలహాల మేరకు యువజన విభాగ కమిటీలను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. అంబటి శైలేష్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మండల, గ్రామ, వార్డు స్థాయిలో యువజన విభాగ కమిటీలను నవంబర్ 20 లోపు పూర్తి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలే లక్ష్యంగా మీ పరిధిలో సమస్యలు, ప్రజా సమస్యలపై పోరాడి.. వాటిని ప్రభుత్వం పరిష్కరించే వరకూ శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని తెలిపారు. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేసిందని ఆరోపించారు.విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్ ఉరుకూటి చందు మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అనుబంధ కమిటీల్లో అత్యంత ప్రధానమైనది యువ జన విభాగం.. అలాంటి విభాగంలో ఉన్న మనమందరం పార్టీ బలోపేతంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పు ల్లేటి వెంకటేష్(అనకాపల్లి), గాబడి శేఖర్(అల్లూరి), రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలిశెట్టి సురేష్ రాజ్, దొడ్డి కిరణ్, కార్యదర్శులు చింతకాయల వరుణ్, జ గుపిల్ల నరేష్, కనకాల ఈశ్వర్రావు, సత్యం నాయు డు, శివాజీ చక్రవతి, తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులకు బాసటగా..
నక్కపల్లి: జిల్లాలోని ఒక చిన్న బెస్త గ్రామంలో మొదలైన ఉద్యమం దేశంలోని మత్స్యకారులందరినీ ఏకం చేస్తోంది. బల్క్ డ్రగ్ పార్క్పై వ్యతిరేకత రోజురోజుకూ రాజుకుంటోంది. 38 రోజుల నుంచి రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతోంది. ఒక్క రాజయ్యపేట గ్రామస్తులు మాత్రమే బల్క్ డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తున్నారని, మిగిలిన గ్రామాల మత్స్యకారులు అనుకూలంగానే ఉన్నారని టీడీపీ నాయకులు, కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొడుతూ నియోజకవర్గంలో తీరప్రాంతాన్ని అనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల వారంతా ఈ ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటయితే ఒక్క రాజయ్యపేటకు మాత్రమే నష్టం వాటిల్లదని, ఎస్.రాయవరం మండలం బంగారయ్యపాలెం నుంచి పాయకరావుపేట మండలం పెంటకోట వరకు తూర్పుతీరాన్ని అనుకుని ఉన్న 18 మత్స్యకార గ్రామాలకు నష్టం వాటిల్లుతుందని, పదుల సంఖ్యలో ఏర్పాటయ్యే రసాయన పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు సముద్రంలో కలిసి మత్స్యసంపద నాశనమై సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల ఉపాధికి తీవ్రవిఘాతం కలుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల నుంచి రేవుపోలవరం, పెదతీనార్ల, చినతీనార్ల, దొండవాక, బోయపాడు, బంగారయ్యపేట, పెంటకోట గ్రామాలకు చెందిన మత్స్యకారులు సమావేశమై ఆయా గ్రామాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఒడిశాలోని పూరి, కోణార్క్లలో మత్స్యకారులు సముద్రపు ఒడ్డున ప్రత్యేకంగా గంగమ్మతల్లికి, నూకతాతకు పూజలు చేశారు. వీడియో సందేశాలను రాజయ్యపేట మత్స్యకారులకు పంపించారు. వాట్సాప్ సందేశాల ద్వారా మద్దతు తామంతా రాజయ్యపేట వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ తమను రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని, రాజయ్యపేట వెళ్లే అన్ని మార్గాల్లోను చెక్పోస్టులు ఏర్పాటు చేశారంటూ వివిధ గ్రామాల మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తాము కూడా ఉద్యమంలో పొల్గొంటామంటూ రాజయ్యపేట మత్స్యకారులకు వాట్సాప్ సందేఽశాలను పంపిస్తున్నారు. చినతీనార్లలో మత్స్యకార మహిళలు స్థానికంగా కొబ్బరి తోటల్లోకి పనుల కోసం వెళుతూ.. బల్క్ డ్రగ్ వద్దు, మత్స్యకారులే ముద్దు, రాజయ్యపేట మత్స్యకారులకు తామంతా సంఘీభావం తెలుపుతున్నామంటూ నినాదాలు చేశారు. ఎన్నాళ్లు పోలీసులను కాపలా పెడతారో చూస్తాం అంటూ పలువురు దొండవాక మత్స్యకారులు చెబుతున్నారు. బంగారయ్యపేట, రేవుపోలవరం, పెంటకోట గ్రామాలకు చెందిన మత్స్యకారులు కూడా తమ తమ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వాట్సాప్ ద్వారా సందేశాలు, తమ నిరసనలను తెలియజేశారు. పండుగనాడూ పోరాటమే.. బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు చేపట్టిన నిరాహారదీక్ష మంగళవారానికి 38వ రోజుకు చేరుకుంది. దీపావళి పండుగను సైతం మానుకుని మత్స్యకారులంతా నిరాహారదీక్ష కొనసాగించారు. ప్రాణాలకు ముప్పు కలిగించే బల్క్ డ్రగ్ పరిశ్రమలను ప్రాణాలొడ్డయినా సరే అడ్డుకుని తీరాలన్న పట్టుదలతో మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారులమా.. టెర్రరిస్టులమా.. మాపై ఎందుకంత కక్ష..? డ్రోన్ కెమెరాలు.. మఫ్టీలో పోలీసులు.. ఇంటిలిజెన్స్, ఎస్బి విభాగం వారి నిఘాతో రాజయ్యపేట భారత దేశంలో అంతర్భాగమేనా అనే సందేహం కలుగుతోందని రాజయ్యపేట మత్స్యకారులు వాపోతున్నారు. గ్రామస్తుల్లో కొంతమందిని మచ్చిక చేసుకొని, ఆందోళనకారుల వ్యూహమేమిటి? ఎవరెవరు మద్దతిస్తున్నారు?.. తదితర విషయాలను కూపీ లాగుతున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదని, తమను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్నారని మత్స్యకారులు వాపోతున్నారు. వంగలపూడి అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి పెరుగుతున్న మద్దతు పూరి, కోణార్క్లలో గంగమ్మతల్లి, నూకతాతలకు పూజలుఐక్యమవుతున్న మత్స్యకారులు -
పోలీసుల వైఫల్యంతోనే నూకరాజు హత్య: ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
సాక్షి, నర్సీపట్నం: కొయ్యూరు వైఎస్సార్సీపీ జడ్పీటీసీ నూకరాజు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పరామర్శించారు. పోలీసుల వైఫల్యంతోనే జడ్పీటీసీ నూకరాజు హత్య జరిగిందని.. నూకరాజు హత్యకు పోలీసులే బాధ్యత వహించాలని విశ్వేశ్వరరాజు అన్నారు. గతంలో నూకరాజు అనేకసార్లు తనకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు మండిపడ్డారు.ఆసుపత్రి వద్ద జడ్పీటీసీ నూకరాజు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిపి ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు పోస్ట్మార్టం చేయనివ్వమంటున్న కుటుంబ సభ్యులు.. హత్యకు ప్రోత్సహించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారుకాగా, జడ్పీటీసీ వారా నూకరాజు మృతదేహాన్ని నిన్న(సోమవారం) నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మార్చురి వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీడియోలు తీస్తున్న జర్నలిస్టుల మొబైళ్లను లాక్కున్నారు. మీడియా ప్రతినిధులపై పోలీసులు చిందులు తొక్కారు. మొబైల్ లాక్కొని వీడియోలు డిలీట్ చేసిన తర్వాత తిరిగి అప్పగించారు -
అల్లూరి జిల్లా: కొయ్యూరు వైఎస్సార్సీసీ జెడ్పీటీసీ దారుణ హత్య
అల్లూరి జిల్లా: కొయ్యూరు వైఎస్సార్సీసీ జెడ్పీటీసీ హత్యకు గురయ్యారు. జెడ్పీటీసీ వారం నూకరాజును దుండుగులు హత్య చేశారు. రోలుగుంట మండలం పెదపేట వద్ద ఈ దారుణం జరిగింది. గతంలో కూడా నూకరాజుపై ప్రత్యర్థులు దాడి చేశారు.నూకరాజు హత్యకు పోలీసులు నిర్లక్ష్యమే కారణమంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూకరాజుకు రక్షణ కల్పించడంలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. గతంలో కూడా నూకరాజుపై హత్యాయత్నం జరిగిందని.. పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని నూకరాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఎస్పీ చుట్టూ తిరిగిన తమకు న్యాయం జరగలేదన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే నూకరాజును హత్య చేశారని.. నూకరాజు కుటుంబ సభ్యులు అన్నారు. -
అవతరణ దినోత్సవంపై భేషజాలు వీడండి
మద్దిలపాలెం: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని తెలుగుదండు డిమాండ్ చేసింది. ఈ మేరకు మద్దిలపాలెం కూడలిలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆదివారం నిరసన జరిగింది. తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు ఫణిశయన సూరి నేతృత్వంలో సాహితీవేత్తలు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘ఈ ఏడాది నుంచైనా నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. తెలంగాణ విడిపోయినా, నవంబర్ 1వ తేదీ యథావిధిగా మన రాష్ట్ర అవతరణ దినోత్సవమే. దీనిపై భేషజాలకు పోకుండా అవతరణ దినోత్సవాన్ని జరిపించాలి.’అని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, అధికార భాషా సంఘం స్థానంలో మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని ఫణిశయన సూరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ప్రసాద్, చిన్న సూర్యనారాయణ, అడపా రామకృష్ణ, రాజమన్నార్, హేమ, ఉండవిల్లి సుజాత, ప్రజా గాయకుడు దేవీశ్రీ తదితర సాహితీవేత్తలు, కవులు పాల్గొన్నారు. -
భారీ వర్షానికి పొంగుతున్న ఏరులు
మాడుగుల: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దేరు, రైవాడ, కోనాం జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఖరీఫ్ వరి చేలు కూడా పొట్టదశకు చేరుకోవడంతో ఖరీఫ్ పంటలకు ఢోకాలేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఖరీఫ్ సాధారణ వరి సాగు 50 వేల ఎకరాలు కాగా ప్రస్తుతం 70 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కానీ ఎరువుల కొరతతో చేలు పనికిరాలేదని , దిగుబడులు అంతగా రావని రైతులు దిగులు చెందుతున్నారు. ఈ వర్షాలు మెట్టు సాగుకు కూడా ఉయోగపడుతుందని, రైతులు చెబుతున్నారు.జలాశయాల్లో పుష్కలంగా వరద నీరు చేరడంతో ఏరుల్లోకి వరద నీరు విడుదల చేస్తున్నారు. దీంతో రైతులు పశువులను దింపరాద, నదుల దగ్గరకు వెళ్లరాదని మాడుగుల తహసీల్దార్ రమాదేవి హెచ్చరికలు చేశారు. -
ట్రాక్టరు కింద పడి యువకుడు దుర్మరణం
కోటవురట్ల: ట్రాక్టరు బోల్తాపడి మీద పడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలివి. గొలుగొండ మండల కసిమి గ్రామానికి చెందిన చిన్ని లక్ష్మణరావు (27) మండలంలోని పాములవాకలో కుంచా కన్నబాబుకు చెందిన జీడితోటను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో జీడితోటలో దుక్కిపనులను శుక్రవారం ప్రారంభించారు. అదే గ్రామానికి చెందిన అల్లు నాగసత్య ట్రాక్టరుతో దుక్కిపనులు నిర్వహించి సాయంత్రం ఇంటికి వెళ్లిపోతుండగా అదే ట్రాక్టరుపై చిన్ని లక్ష్మణరావు కూర్చుని వెళుతుండగా నీలిగుంట సమీపంలోని తాండవా కాలువను దాటుతుండగా ట్రాక్టరు బురదలో ఇరుక్కుపోయింది. బయటకు తీసే ప్రయత్నంలో ట్రాక్టరు తిరగబడి దాని కింద చిన్ని లక్ష్మణరావు ఇరుక్కుపోయాడు. పొట్టలోకి ఇనుప రాడ్ దిగిపోవడంతో పాటు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి నర్సీపట్నం ఏరియా అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి మృతి చెందాడు. ఈ విషయమై చిన్ని లక్ష్మణరావు తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ఆరోగ్యకర జీవనానికి దిక్సూచి ఆయుర్వేదం
పాయకరావుపేట: ఆయుర్వేద వైద్యం మన పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప సంపద అని, ఆయుర్వేదం మనిషి ఆరోగ్యకరమైన జీవన విధానానికి దారిచూపే ఒక దిక్సూచి అని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ అన్నారు. ఆయుర్వేద మూల పురుషుడు ధన్వంతరి జయంతి, జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల్లో శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ అండ్ రిసెర్చ్ ట్రస్టు వ్యవస్థాపకులు సిహెచ్.కె.నరసింహారావు, రామసీత దంపతులతో వేదపండితుల శాస్త్రోక్తంగా ధన్వంతరి హోమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కన్నాలయం గోపాలన్ రవీంద్రన్, ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలు కూడా నేడు ఆయుర్వేద వైద్య ఆవశ్యకతను గుర్తించి ఆయుర్వేదానికి ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు. అనంతరం విద్యా సంస్ధల్లో ఉన్న ఆయుర్వేద వైద్యాలయాన్ని సందర్శించారు. ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఆయుర్వేద వైద్యులు కన్నాలయం గోపాలన్ రవీంద్రన్ను ఘనంగా సన్మానించారు. పుస్తకమే నిజమైన గురువు మరొక ముఖ్య అతిథి ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చరిత్ర కలిగిన మేధావుల జీవిత చరిత్రలను చదవాలని, తద్వారా మంచి క్రమశిక్షణ అలవడుతుందన్నారు. మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్, స్వామి వివేకానంద, మహ్మాతాగాంధీ, అబ్రహం లింకన్ వంటి మహానీయుల జీవిత గాథలు చదివినట్టయితే విద్యార్థులకు చదువుతోపాటు మంచి నడవడిక కలుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి కూడా విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక అలవర్చుకోవాలన్నారు. పుస్తకమే నిజమైన గురువని వి ద్యార్థులకు దిశనిర్దేశం చేశారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావును విద్యాసంస్థల కరస్పాండెంట్, సెక్రటరీ నర్సింహరావు, జాయింట్ సెక్రటరీ విజయ్ ప్రకాష్ పూలమాల వేసి, పుస్తకాలను అందించి సత్కరించారు. కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యాలయం ట్రస్టు డాక్టర్ యు.ఇందూలాల్, ఆయుర్వేద చికిత్సాలయ సలహాదారుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రధాన వైద్యులు డాక్టర్ టి.రమేష్బాబు, డాక్టర్ ఎం.ఏసయ్య, ఆయుర్వేద ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
ఎ.కోడూరు విద్యార్థులకు ఆల్రౌండ్ చాంపియన్షిప్
కె.కోటపాడు: కె.కోటపాడు హైస్కూల్లో ఈ నెల 17, 18లలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడాపోటీల్లో ఎ.కోడూరు హైస్కూల్కు చెందిన విద్యార్థినీవిద్యార్థులు ఉత్తమ ప్రతిభను చూపారు. వివిధ క్రీడల్లో బాలురు మంచి ప్రతిభను కనబర్చడంతో పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆల్ రౌండ్ చాంపియన్షిప్ అర్హతను సాధించగా, బాలికలు పలు క్రీడా విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో గర్ల్స్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ను సాధించినట్టు పీఈటీలు కె.చిట్టి ప్రసాద్, స్వామినాయుడు తెలిపారు. బాలుర విభాగంలో అండర్–17 విభాగంలో వాలీబాల్లో విన్నర్, బ్యాట్మింటన్లలో విన్నర్లుగా నిలవగా, ఖో–ఖోలో రన్నర్స్గా నిలిచారు. అండర్–14 విబాగంలో ఖో–ఖోలో విన్నర్గాను, వాలీబాల్లో రన్నర్లుగా నిలిచారు. అథ్లెటిక్స్లో అండర్–17లో 100 మీటర్లు పరుగు పందెంలో జి.తేజ మొదటి స్థానంలో నిలవగా, కె.జాన్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. 200 మీటర్ల పరుగు పందెంలో ఎం.మనోహర్ మొదటి స్థానంలోను, జి.తేజ ద్వితీయ స్థానంలో నిలిచాడు. 400 మీటర్లు పరుగు పందెంలో జి.గంగాధర్ మొదటి స్థానంలో నిలవగా, కె.జాన్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. 800 మీటర్లు పరుగు పందెంలో డి.హరీష్ ద్వితీయ స్థానంలో నిలవగా, ఎం.పూర్ణచంద్రనాయుడు తృతీయ స్థానంలో నిలిచాడు. 1500 మీటర్లు పరుగు పందెంలో డి.హరీష్ మొదటి స్థానంలో నిలవగా, పి.కుమార్ రెండవ స్థానంలో నిలిచాడు. అండర్–14 బాలుర విభాగంలో కె.మనోహర్ మొదటి స్థానంలో నిలిచాడు. 200 మీటర్ల పరుగు పందెంలో కె.మోహన్ మొదటి స్థానంలో నిలవగా, సిహెచ్.మనోహర్ ద్వితీయ స్థానంలో నిలిచారు. 400 మీటర్ల పరుగు పందెంలో వి.చంద్రకిరణ్ మొదటి స్థానంలో నిలవగా, సిహెచ్.మనోహర్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. 600 మీటర్లు పరుగు పందెంలో వి.చంద్రకిరణ్ మొదటి స్థానంలో నిలవగా జి.సాయి శంకర్ రెండో స్థానంలో నిలిచాడు. పాఠశాలకు చెందిన విద్యార్థులు మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభను చూప డం ఆనందంగా ఉందని ప్రధానోపాధ్యాయులు ఎ.శేఖర్ తెలిపి విద్యార్థులను అభినందించారు. -
అబ్బురపరిచిన యోగా విన్యాసాలు
చోడవరం: చోడవరం ఉషోదయ కాలేజీలో పతంజలి యోగా శిక్షణా కేంద్రం గురువు పుల్లేటి సతీష్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యోగాసాల పోటీలు ఆదివారం జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు, పురుషులు, సీ్త్రలు ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చారు. 8నుంచి 80 సంవత్సరాలు వయస్సు ఉన్నవారంతా పోటీల్లో పాల్గొన్నారు. మొత్తం ఎనిమిది కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహించారు. 8–14 వయస్సు విభాగంలో బాలురు 50, బాలికలు 35 మంది పాల్గొన్నారు. 14–20 విభాగం లో బాలురు 25, బాలికలు 15 మంది, 30–40 విభాగంలో పురుషులు 12, సీ్త్రలు 10 మంది, 40–50 విభాగంలో పురుషులు 10, సీ్త్రలు 8మంది, 50–60పైబడిన విభాగంలో పురుషులు 8, సీ్త్రలు ఆరుగురు పాల్గొన్నారు. ప్రధానంగా వృశ్చికాసనం, గండబెరండాసనం, కృకుటాసనం, సూర్యనమస్కారాలు ఆసనాల్లో ఎక్కువగా పోటీ జరిగింది. యోగా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, గౌరవ అధ్యక్షుడు పప్పల రమణమూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో మేలని, ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 48 మందిని జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక చేశారు. వీరంతా ఈనెల 25, 26తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ జెర్రిపోతుల రమణాజీ బహుమతులు అందజేశారు. -
దివాళీ ధోకా
విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో బాణసంచా స్టాళ్ల అనుమతుల వ్యవహారం రచ్చకు దారితీసింది. ఎప్పుడూ లేని విధంగా దుకాణాల లీజు అంశం దుమారం రేపింది. ఈ విషయంలో ఏకంగా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జోక్యం చేసుకోవడం వర్సిటీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించడం, ఆ తర్వాత అనుమతుల కోసం కలెక్టర్ ఉన్నత విద్యా శాఖకు లేఖ రాయడం, అనంతరం అనుమతులు ఇవ్వాలని అక్కడి నుంచి వీసీకి లేఖ రావడం, చివరకు 14వ తేదీ నుంచి పనులకు అనుమతులు ఇచ్చినట్లు 16న ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. అది కూడా ఏయూ వీసీ కాకుండా.. రిజిస్ట్రార్ పేరుతో అసిస్టెంట్ రిజిస్ట్రార్(అకౌంట్స్) సంతకంతో అనుమతులు ఇవ్వడం మరింత చర్చనీయాంశమైంది. కాగా.. ఏయూలోని స్టాళ్లలో సగానికి పైగా ఎటువంటి లైసెన్సులు లేకుండానే ఏర్పాటైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు ఆదివారం మధ్యాహ్నం కొంత సేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. ఉన్నత విద్యా శాఖ జోక్యం ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో బాణసంచా స్టాళ్లను ప్రతి ఏటా ఏర్పాటు చేయడం సాధారణం. దీనికి ఏయూ వీసీ అనుమతులు ఇవ్వడం సర్వసాధారణ విషయం. కానీ ఈ సారి మాత్రం స్టాళ్ల అనుమతుల అంశం గందరగోళంగా, వివాదాస్పదంగా మారింది. ఏయూ మైదానాలను, ప్రాంగణాలను ప్రైవేట్ కార్యక్రమాల కోసం అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది నెలల కిందట బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమా ఈవెంట్కు అనుమతులు ఇవ్వడం తీవ్ర దుమారం రేగింది. దీంతో అప్పటి నుంచి ప్రైవేట్ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇటీవలే క్రెడాయ్ ఒక కార్యక్రమ నిర్వహణకు ఈ మైదానాన్ని లీజుకు కోరగా.. ఇదే కారణంతో తిరస్కరించారు. అయితే.. దీపావళి సందర్భంగా ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఇంజినీరింగ్ గ్రౌండ్లో స్టాళ్ల ఏర్పాటుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. దుకాణాల కోసం మైదానాన్ని లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతర్ గార్గ్ ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్కు లేఖ రాశారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు దుకాణాల పనులకు, 18 నుంచి 20వ తేదీ వరకు అమ్మకాలకు, 21న స్టాళ్ల తొలగింపునకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనిపై వీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ 13వ తేదీ నుంచే గ్రౌండ్లో పనులు చేపట్టేశారు. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీరియస్ అయ్యారు. అనుమతులు లేకుండా ఎలా స్టాళ్లు ఏర్పాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనంతరం ఆయన అనుమతుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా శాఖకు లేఖ రాశారు. దీంతో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కార్యాలయం నుంచి ఏయూ వీసీకి లేఖ వచ్చింది. కలెక్టర్ లేఖపై సమస్యను పరిష్కరించి, 14 నుంచి అనుమతులు ఇవ్వాలని 15న లేఖ పంపించడం ఇక్కడ విశేషం. పనులు ప్రారంభించాక అనుమతులు కలెక్టర్ ఆదేశాలతో ఇంజినీరింగ్ కాలేజ్ హెలిప్యాడ్ మైదానంలో ఉన్న స్టాళ్ల పనులను తొలగించారు. రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జోక్యంతో కొత్తగా దుకాణాలను పార్కింగ్ మైదానానికి మార్చారు. ఇదిలా ఉండగా.. 15న ఉన్నత విద్యా శాఖ నుంచి లేఖ వస్తే, 16న ఏయూ అధికారులు అనుమతులు ఇచ్చారు. అది కూడా 14న పనులకు అనుమతులు ఇస్తున్నట్లు 16న ఉత్తర్వులు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రధానంగా ఈ అనుమతుల పత్రంపై ఏయూ వీసీ సంతకంతో కాకుండా, రిజిస్ట్రార్ పేరుతో అసిస్టెంట్ రిజిస్ట్రార్ (అకౌంట్స్) సంతకం ఉండడం గమనార్హం. తమ చేతికి మట్టి అంటకుండా, ఏదైనా సమస్య వస్తే దాన్ని కింది వారిపైకి నెట్టేసే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారన్న చర్చ జరుగుతోంది. అనుమతులు లేకుండా స్టాళ్లు నగరంలో అనుమతులు లేకుండా బాణసంచా నిల్వలు, వ్యాపారాలపై పోలీసులు వారం రోజులుగా వరుస దాడులతో హడావుడి చేశారు. కానీ ఏయూలో అనేక దుకాణాలు అనుమతులు లే కుండా ఏర్పాటు చేసినా పట్టించుకోలేదు. బాణసంచా విక్రయాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. కానీ ఏయూలో ఇష్టానుసారంగా వ్యాపారాలు చేస్తున్నా పోలీసులు చూసీచూడనట్లు వదిలేశారు. ఆదివారం మధ్యాహ్నం డీసీపీ, ఏసీపీలు వెళ్లి అనుమతులు లేని స్టాళ్లను వెంటనే మూసేయాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో అటువంటి వారిపై చర్య లు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసి వెళ్లిపోయారు. కానీ ఏ ఒక్కరూ పోలీసుల హెచ్చరికులు పట్టించుకోకుండా అనుమతులు లేకుండా బాణసంచా విక్రయాలు చేపట్టడం గమనార్హం. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బాణసంచా విక్రయాలు -
నేడు సింహగిరిపై నరకాసురవధ
సింహాచలం : నరకచతుర్దశిని పురస్కరించుకుని సోమవారం రాత్రి సింహగిరిపై జరిగే నరకాసురవధ ఉత్సవానికి దేవస్థానం వైదిక, అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో భాగంగా నరకాసురుడి విగ్రహాన్ని ఒక పల్లకిలోనూ, శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను మరొక పల్లకిలోనూ వేంజింపజేస్తారు. అనంతరం సింహగిరి మాడవీధిలో ఈ రెండు పల్లకీలను ఎదురెదురుగా ఉంచి, శాస్త్రోక్తంగా నరకాసుర వధ ఘట్టాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా యుద్ధ సన్నివేశాలు, నరకాసుర వధ ఘట్ట విన్నపం పూజలు జరుపుతారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దేవస్థానం డిప్యూటీ ఈవో సింగం రాధ తెలిపారు. -
చర్చలకు కలెక్టర్ కబురు
ఆదివారం గ్రామసభ నిర్వహిద్దామని ఆర్డీవోతో వర్తమానం ముందు రోజు రాత్రి 9 గంటలకు చెప్పడంతో మత్స్యకారుల అసంతృప్తిరెండు రోజుల ముందే చెప్పాలిఅప్పటికప్పుడు చెబితే చర్చలకు రాలేమన్న గంగపుత్రులు దీపావళి వెళ్లాక తేదీ నిర్ణయించమని వినతి పత్రం నక్కపల్లి: ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడు చర్చలకు రావాలంటే తమకు సాధ్యం కాదని రాజయ్యపేట మత్స్యకారులు స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా దాదాపు 35 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న మత్స్యకారులతో చర్చలు జరిపేందుకు ఆదివారం వస్తున్నట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కబురు చేశారు. దీపావళి తర్వాత రెండు రోజులు ముందుగా చెప్పి రావాలని వారు వినతి పత్రం ఇచ్చారు. గత ఆదివారం మత్స్యకారులంతా జాతీయరహదారిని ముట్టడించి నాలుగు గంటలపాటు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. 15వ తేదీన రాజయ్యపేటలో గ్రామసభ నిర్వహిస్తానని ఆ సందర్భంగా కలెక్టర్ ప్రకటించారు. అయితే ఆమె హఠాత్తుగా వ్యక్తిగత పని మీద చైన్నె వెళ్లడంతో ఆ సభ వాయిదా పడింది. శనివారం రాత్రి నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ నర్సింహమూర్తిలతో గ్రామస్తులకు వర్తమానం పంపించారు. ఆదివారం ఉదయం పది గంటలకు కలెక్టర్ వస్తున్నారని, గతంలో హామీ ఇచ్చిన మేరకు చర్చలు జరుపుతారని తెలియజేశారు. అయితే అంత అకస్మాత్తుగా చర్చలు సాధ్యం కావని మత్స్యకారులు స్పష్టం చేశారు. తమ వారంతా వివిధ పనులపై బయటకు వెళ్లిపోయారని, ముందుగా సమాచారం ఇచ్చి రావాలని తెలిపారు. ఆదివారం ఉదయాన్నే ఆర్డీవో, తహసీల్దార్, డీఎస్పీలు రాజయ్యపేట చేరుకున్నారు. ఇప్పటికే గ్రామంతోపాటు, చుట్టుపక్కల గ్రామాల్లో వెయ్యిమందికి పైగా మోహరించిన పోలీసులు కలెక్టర్ వస్తున్నారన్న సమాచారంతో మరింతమందిని రంగంలోకి దించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి పోలీసులను, స్పెషల్ పార్టీ సిబ్బందిని రప్పించారు. ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తొలుత దీక్షకు విరామం.. అనంతరం యథాతథం అప్పటికప్పుడు చర్చలు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు తొలుత ఆదివారం నిరాహార దీక్షను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కలెక్టర్ చర్చలకు వస్తానని చెప్పడంతో అసంతృప్తి చెందిన మత్స్యకారులంతా ఆదివారం నిరాహారదీక్షకు విరామం ప్రకటించారు. జెడ్పీటీసీ గోసల కాసులమ్మ ఆధ్వర్యంలో మత్స్యకార నాయకులు సోమేష్, మహేష్, కాశీరావు, సోమేశ్వరరావు, పిక్కి స్వామి, మైలపల్లి సూరిబాబు తదితరులు ఆర్డీవో వద్దకు వచ్చి వినతి పత్రం ఇచ్చారు. రాత్రికి రాత్రి వచ్చి చర్చలు అంటే కుదరదన్నారు. రెండు రోజుల ముందు సమాచారం ఇవ్వాలన్నారు. ఇతర ప్రాంతాలకు తాత్కాలికంగా వలస వెళ్లిన వారిని, వివిధ పనుల మీద వెళ్లిన వారిని తిరిగి స్వగ్రామాలకు రప్పిస్తామన్నారు. దీపావళి అనంతరం రెండు రోజుల ముందు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. తమకు సంఘీభావం తెలిపే వారిని, తమ తరపున చర్చల్లో పాల్గొనే వారిని అడ్డుకోవడానికి వీల్లేదన్నారు. వందలాది మంది పోలీసులు గ్రామం చుట్టు వలయంగా ఏర్పడ్డారని, గ్రామంలోకి ఎవరినీ రానివ్వడం లేదని, ఆధార్ కార్డు చూపిస్తే తప్ప గ్రామంలోకి అడుగు పెట్టనివ్వడం లేదన్నారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు పెట్టి మత్స్యకారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఇంతమంది పోలీసులను ఎందుకు కాపలా పెడుతున్నారని ప్రశ్నించారు. తక్షణమే గ్రామం నుంచి పోలీసులను ఖాళీ చేయించాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పనులు మొదలు పెడుతున్నారని, గతంలో హోంమంత్రి, కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు పనులు తాత్కాలికంగా నిలిపివేయాలన్నారు. కలెక్టర్తో చర్చలు పూర్తయ్యేవరకు తాము శాంతియుతంగా నిరాహార దీక్షలు కొనసాగిస్తామని, ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడమని మత్స్యకారులు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం దీక్షకు విరామం ప్రకటించిన మత్స్యకారులు మధ్యాహ్నం నుంచి యథావిధిగా ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే..! ఒకపక్క మత్స్యకారుల ఆందోళన రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మరోపక్క వైఎస్సార్సీపీ ఈనెల 22న ‘చలో రాజయ్యపేట’కు పిలుపునిచ్చింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసార కన్నబాబు పాల్గొంటారని ప్రకటించడంతో.. ప్రతిపక్ష నేతలు రాజయ్యపేట వస్తే వైఎస్సార్సీపీకి మైలేజీ పెరగడంతోపాటు ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుందని ప్రభుత్వ పెద్దలు భయపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆగమేఘాల మీద ఆదివారం మత్స్యకారులతో చర్చలు జరిపి నిరాహార దీక్షకు ముగింపు పలకాలని కలెక్టర్కు సూచించినట్లు సమాచారం. -
‘డ్యూడ్’కి అద్భుత రెస్పాన్స్
డాబాగార్డెన్స్ (విశాఖ): యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’.. దీపావళి కానుకగా విడుదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తి శ్వరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మమితా బైజు కథానాయికగా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందనతో బ్లాక్బస్టర్ సక్సెస్ను అందుకుని, హౌస్ఫుల్ కలెక్షన్లతో విజయవంతమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ‘డ్యూడ్ ’దివాళీ టూర్ను చేపట్టారు. తమ సినిమాను అద్భుతంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు విశాఖ విచ్చేసిన హీరో ప్రదీప్ రంగనాథన్.. నగరంలోని రామా టాకీస్, సంగం శరత్ థియేటర్లలో ప్రేక్షకులతో ‘డ్యూడ్ దివాళీ బ్లాస్ట్’ పేరుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమిళనాడులోనూ గత చిత్రాల కంటే ‘డ్యూడ్’కు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయని తెలిపారు. ‘నా గత చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్లు ‘డ్యూడ్’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఈ ఘన విజయానికి కారణమైన దర్శకుడికి, నిర్మాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
అనకాపల్లి: దీపావళి.. వెలుగులు విరజిమ్మే ఆనందాల పండగ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా టపాసులు కాలుస్తూ సంబరాలు జ రుపుకుంటారు. అయితే ఈ సంతోషం విషాదంగా మారకుండా ఉండాలంటే కాస్త అప్రమత్తత అవసరం. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, చిన్నపాటి అజాగ్రత్త వహించినా వెలుగుల పండగ జీవితంలో చీకట్లు నింపే ప్రమాదం ఉంది. టపాకాయలు కాల్చేటప్పుడు బిగుతుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఎల్లప్పుడూ ఇంటి బయటే ట పాసులు వెలిగించాలి. గుడిసెలు, గడ్డివాములు, పెట్రోల్ బంకులకు దూరంగా బాణసంచా వెలిగించాలి. వీరికి పండగ లేదు దీపావళి పండగ రోజూ అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపితే అగ్నిమాపక సిబ్బంది మాత్రం ఎలాంటి ప్రమాదం జరిగినా కాపాడేందు కు సంసిద్ధులై ఉంటారు. జిల్లాలో 6 ఫైర్ స్టేషన్లలో 75 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటితో పాటుగా మరో రెండు అవుట్సోర్సింగ్ ఫైర్స్టేషన్లలో 25 మంది సిబ్బంది ఉన్నారు. -
‘రైవాడ’ నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు విడుదల
దేవరాపల్లి: రైవాడ జలాశయం నుంచి మూడు స్పిల్వే గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కుల వరద నీటిని శారదా నదిలోకి విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతంలో అనంతగిరి మండలం పరిధిలో కురిసిన భారీ వర్షాల ధాటికి జలాశయంలోకి ఒక్కసారిగా భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ డీఈ జి.సత్యంనాయుడు స్పిల్వే గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా భారీ వర్షాల ధాటికి 3 వేల క్యూసెక్కుల వరదనీరు ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయంలోకి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా నీటి విడుదల పెంపు, తగ్గుదల చేస్తామని డీఈ తెలిపారు. -
గుండె నిండా స్వాభిమానం.. అదే మా ఉద్యమానికి ‘ఆధార’ం
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలో పోలీసుల వైఖరి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. గ్రామంలోకి వచ్చి వెళ్లే వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గ్రామం నుంచి బయటకు వెళ్లినప్పుడు, గ్రామంలోకి వచ్చినప్పుడు పోలీసులు అడిగే సవాలక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పడం తమ వల్ల కావడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఆధార్ చూపిస్తే తప్ప గ్రామంలోకి రానివ్వడం లేదని యువకులు చెబుతున్నారు. తనిఖీలో ప్రతిసారి ఆధార్ కార్డు చూపించడం తమ వల్ల కావడం లేదంటూ కొంతమంది యువకులు ‘బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, రాజయ్యపేట ముద్దు’ అంటూ టీ షర్ట్లు తయారు చేయించారు. వెనుక పక్క ఉద్యమ నినాదం, ముందు పక్క బనియన్ ధరించిన వ్యక్తి ఆధార్ కార్డు, ఫొటోను ముద్రించారు. వీటిని ధరించి నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. రాజయ్యపేట నుంచి బయటకు వెళ్లే సమయంలో కూడా వీటిని ధరించి వెళ్తున్నారు. పోలీసులకు ప్రత్యేకంగా ఆధార్ కార్డు చూపించే అవసరం లేకుండా తాము ధరించిన టీ షర్ట్లపై ఆధార్ కార్డు, ఫొటో, బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అనే నినాదాన్ని రాయించారు. ప్రస్తుతం రాజయ్యపేటలో ఈ టీ షర్ట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజయ్యపేటలో ప్రత్యేక ఆకర్షణగా టీ షర్ట్లు ఆధార్ కార్డు, బల్క్ డ్రగ్ ఉద్యమం ముద్రణ చెక్ పోస్టుల వద్ద ఐడెంటిటీ అడుగుతున్న పోలీసులు గుండైపెనున్న ఆధార్ ముద్రను చూపుతున్న మత్స్యకారులు -
చీకటి వెలుగుల దీపావళి
● ఈ ఏడాది కానరాని సందడి ● మందకొడిగా బాణసంచా విక్రయాలు ● డీలాపడ్డ సాధారణ మార్కెట్ సాక్షి, అనకాపల్లి: చీకట్లను పారదోలి అందరి జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి పండగ ఈ ఏడాది ప్రజలకు, వ్యాపారులకు నిరాశే మిగులుస్తోంది. నిత్యావసరాలతోపాటు అన్ని వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యుడికి దీపావళి పండగ భారంగా మారింది. ఈ ఏడాది బాణసంచా ధరలు 20 నుంచి 25 శాతం పెరగడం.. 40 శాతానికి పైగా వ్యాపారం తగ్గడంతో ఇటు వ్యాపారస్తుల్లో మరింత దిగులు మొదలైంది. దీనికి తోడుగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో చివరి క్షణం వరకు స్టాళ్లకు అనుమతి ఇవ్వకపోవడంతో వ్యాపారస్తులు మరింత మండిపడుతున్నారు. రెవెన్యూ, పోలీసు, ఫైర్ డిపార్ట్మెంట్ల వారు బాణసంచా వ్యాపారాలకు అనుమతి త్వరితగతిన ఇవ్వాలంటే ముందు కూటమి నేతల్ని ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చింది. పచ్చ నేతలు చెప్పిన వారికే పర్మిషన్లు ఇచ్చారు. ఇటు వ్యాపారం లేదు.. అటు మామూళ్లు ఇస్తే గానీ అనుమతి ఇవ్వడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. మరికొందరు వ్యాపారస్తులైతే ఈ ఏడాది వ్యాపారానికి స్వస్తి చెప్పేశారు. వ్యాపారాలు వెలగలేదు.. గతేడాది అంతంతమాత్రంగానే ఉండటంతో.. ఈసారైనా వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయని వ్యాపారులు ఆశ పెట్టుకున్నారు. కానీ.. మతాబుల్లా వెలిగిపోతాయనుకుంటే.. మబ్బు పట్టినట్లుగా డల్గా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 226 షాపులకు అనుమతులివ్వగా.. ఇందులో కూటమి నేతలకు చెందినవి, వారు సిఫార్సు చేసిన దుకాణాలే 200 వరకూ ఉంటాయని తెలుస్తోంది. అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం షాపుల్లో విక్రయాలు మొదలయ్యాయి. అనకాపల్లి పరిధిలో 5, యలమంచిలి 4, నర్సీపట్నం పరిధిలో 2 ఏర్పాటు చేశారు. అయితే.. చచ్చీ చెడీ.. ఎలాగోలా పర్మిషన్లు తీసుకున్న వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోవడంతో.. వ్యాపారాలు వెలగడం లేదు. ఆదివారం రాత్రి వరకూ అంతంత మాత్రంగానే కొనుగోళ్లు జరిగాయి. దీపావళి రోజున మధ్యాహ్నం వరకూ జరిగే కొనుగోళ్ల పైనే తమ లాభాలు ఆధారపడి ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఈపాటికే.. 70 శాతం వరకూ స్టాక్ విక్రయాలు జరిగిపోయేవనీ.. ఈసారి 40 శాతం కూడా కొనుగోళ్లు జరిగే సూచనలు కనిపించడం లేదంటున్నారు. -
జీఎస్టీ తగ్గింపును ప్రజలకు చేరువ చేయాలి
పట్టణంలో జీఎస్టీ సంబరాలను ప్రారంభిస్తున్న జాయింట్ కలెక్టర్ జాహ్నవి అనకాపల్లి టౌన్: జీఎస్టీ తగ్గింపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి సూచించారు. పట్టణంలోని మెయిన్ రోడ్లో సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్పై శనివారం అనకాపల్లి షాపింగ్ ఫెస్టివల్స్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి ఆమె రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ తగ్గించిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలను ప్రజలకు చేరువ చేయడం, వినియోగదారుల్లో సరైన అవగాహన కల్పించడం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు పొదుపులపై స్పష్టతనివ్వడం కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా స్ధానిక వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షేక్ ఆయిషా, జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి, మండల స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య అనకాపల్లి టౌన్: మండలంలోని బట్లపూడి పంచాయతీ రాయుడుపేట గ్రామంలో అనారోగ్యంతో అనుసూరి రమణ(42) అనే వ్యక్తి ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందినట్టు రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. మృతుడు భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
బల్క్ డ్రగ్ పార్క్ వ్యర్థాల విడుదలకు టెండర్లపై ఫిర్యాదు
బైక్ మీద తాటిచెట్టు పడి వ్యక్తికి తీవ్ర గాయాలు నక్కపల్లి: ఒక వైపు బల్క్ డ్రగ్ పార్క్ రద్దు కోసం పోరాటం చేస్తుంటే.. మరోవైపు అధికారులు వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసేందుకు టెండర్లు పిలవడం సమంజసం కాదంటూ పలువురు మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ, సీఆర్జడ్ అనుమతులు లేకుండా మైరెన్ అవుట్ఫాల్కు ఎలా టెండర్లు పిలుస్తారని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, మత్స్యకారుడు సోమేష్, తదితరులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ) అధికారులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఏపీఐఐసీ అధికారులు మత్స్యకారులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బల్క్ డ్రగ్ పార్క్లో ఏర్పాటయ్యే కంపెనీల నుంచి రోజుకు విడుదలయ్యే 52.72 లక్షల లీటర్ల వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసేందుకు రూ.16.81 కోట్లకు టెండర్లు పిలవడం, ఈ నెల 27వ తేదీలోగా పూర్తి చేయాలని నోటిఫికేషన్ విడుదల చేయడంపై మత్స్యకారులు మండిపడుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాతత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారని, జాతీయ రహదారి ముట్టడిస్తే రాజయ్యపేట వచ్చి చర్చలు జరరుపుతామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. కలెక్టర్ చర్చలు ఇంకా పూర్తి కాలేదని, ఈ లోగా ఏపీఐఐసీ అధికారులు టెండర్లు పిలవడం తగదన్నారు. ఒక పక్క మత్స్యకారులతో చర్చలు జరుపుతూనే మరో పక్క ప్రభుత్వం కవ్వింపు చర్యలకు దిగుతోందన్నారు. -
చిరు వ్యాపారిపైకి దూసుకొచ్చిన లారీ
పెదగంట్యాడ,(విశాఖ) : శనివారం.. తెలవారుతున్న వేళ.. ఓ చిరు వ్యాపారిపై మృత్యువు లారీ రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందగా, ఆమె మనవడు తీవ్రంగా గాయపడ్డాడు. వుడా డబుల్ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి న్యూపోర్టు ట్రాఫిక్ ఎస్ఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలివి. పెదగంట్యాడ మండలం వియ్యపువానిపాలేనికి చెందిన వియ్యపు అప్పయ్యమ్మ (48) వుడా డబుల్ రోడ్డులో కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఆమె తన దుకాణాన్ని తెరుస్తూ ఉంటుంది. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో తన మనవుడు బంధం సాకేత్(5)తో కలసి దుకాణానికి వచ్చింది. అక్కడ కొబ్బరి బొండాలు సర్దుతుండగా శ్రీకాకుళం నుంచి పెదగంట్యాడకు ఇసుక లోడుతో వస్తున్న లారీ దుకాణంపైకి దూసుకొచ్చింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆమె మనవడు సాకేత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే వియ్యపువానిపాలేనికి చెందిన అప్పయ్యమ్మ బంధువులు అక్కడకు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న న్యూపోర్టు ట్రాఫిక్ ఎస్ఐ సూర్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనకాపల్లికి చెందిన లారీ డ్రైవర్ బారా గోవింద్ (35)ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. గాయపడిన సాకేత్ స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుమారుడు వియ్యపు శ్రీను ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూర్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్వచ్ఛతా కార్యక్రమంలో కలెక్టర్ శ్రమదానం
తుమ్మపాల : ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొని శ్రమదానం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. కలెక్టరు కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో ఆమె జిల్లా అధికారులతో కలిసి శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజు కొంత సమయం కేటాయించాలన్నారు. స్వచ్ఛమైన గాలి అనే నినాదంతో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో వాహన కాలుష్యాన్ని తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రయాణాలకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించడం, విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. అనంతరం డీఆర్వో వై.సత్యనారాయణరావు అధికారులతో ‘ఒక అడుగు ముందుకు స్వచ్ఛతా వైపు’ అంటూ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లో పలు విభాగాల అధికారులు విజయ కుమార్, వాసు సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అనుసంధానంగా జిల్లా పోలీసు విభాగం ఆధ్వర్యంలో ‘వర్షాకాలంలో వరదలు, అంటువ్యాధుల నివారణ’పై శనివారం ఎస్పీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలన్నారు. అనంతరం ఎస్పీ కార్యాలయం పరిసరాలను పోలీసులు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐలు టి.లక్ష్మి, రమేష్, పోలీసులు పాల్గొన్నారు. అనకాపల్లి టౌన్: ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాల్సిన బాధ్యతను కూడా తీసుకోవాలని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు కోరారు. స్థానిక డీఈవో కార్యాలయ ఆవరణలో పరిసరాలు పరిశుభ్రం చేసి వ్యర్థాలు తొలగించారు. ముందుగా కార్యాలయ పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమన్నారు. -
క్వారీ బ్లాస్టింగ్లతో బెంబేలు
కొండ సమీపాన ఉన్న దుర్గానగర్ పాయకరావుపేట : పట్టణంలో గల దుర్గానగర్ ఏరియాలో బాంబు బ్లాస్టింగ్ల కారణంగా కాలనీవాసులు బెంబేలు చెందుతున్నారు. పోలవరం కాలువ నిర్మాణం పనుల్లో భాగంగా పట్టణంలో గల దుర్గానగర్ సమీపాన గల కొండలను తవ్వి కాలువ నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా కొండలపై రాళ్లు శిథిలం చేయడం కోసం బాంబులను ఉపయోగిస్తున్నారు. బాంబులతో కొండపై వున్న పెద్ద పెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేయడం వల్ల కొండలను ఆనుకుని పక్కనే వున్న దుర్గానగర్ వాసులు బేంబేలెత్తుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా బాంబులు పెట్టి రాళ్లను కొట్టడం కారణంగా కాలనీవాసులకు నిద్రపట్టడం లేదు.. సరికదా ఎప్పుడు ఎక్కడ మీద పడుతుందో అన్న భయంతో హడలిపోతున్నారు. రాళ్లు పేల్చేటప్పుడు ఎగిరిపడి రాళ్లు తమ ఇళ్లపై పడుతున్నాయని, ఆ సమయంలో ఎవరైనా ఇంటి బయట ఉంటే గాయాల పాలవుతున్నారని వాపోతున్నారు. దీనిపై పలుమార్లు మండల రెవెన్యూ అధికారులకు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఫలితం లేదన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు బ్లాస్టింగ్లు చేపడుతున్నారన్నారు. ఆ శబ్ధాలు తమకు గుండె దడ కలిగిస్తున్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి కొండల పై బాంబు బ్లాస్టింగ్లు చేయకుండా పొక్లెయిన్లతో పనులు చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి.. పోలవరం కాలువ నిర్మాణ పనుల కారణంగా జరిపే బాంబు బ్లాస్టింగ్లు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాళ్లు వచ్చి ఇళ్లపై పడుతున్నాయి. బ్లాస్టింగ్లు నిలిపివేసి జేసీబీలతో పనులు చేసుకోవాలని కోరుతున్నాం. –ఆకుల రామచక్రరావు, దుర్గాకాలనీ, పాయకరావుపేట బ్లాస్టింగ్లు నిలిపివేయాలి పోలవరం కాలువ నిర్మాణ పనుల్లో పెద్ద పెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేయడం కోసం బాంబులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రాళ్లు వచ్చి మా ఇళ్లపై పడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయంతో ఉన్నాం. అధికారులు స్పందించ బ్లాస్టింగ్లు నిలుపుదల చేయాలని కోరుతున్నాం. –పక్కుర్తి శ్రీనివాసరావు,దుర్గానగర్, పాయకరావుపేట -
తల్లిదండ్రులను గాయపరిచిన తనయుడు అరెస్టు
నాతవరం : తల్లిదండ్రులను గాయపరిచిన తనయుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో చెర్లోపాలెం గ్రామానికి చెందిన పెదపూడి రవికుమార్ ఈ నెల 13న తల్లిదండ్రులతో పాటు వృద్ధాప్యంలో ఉన్న తాతపై దాడికి పాల్పడినట్టు తెలిపారు. కుటుంబంలో ఆస్తి తగదాలు ఉండడంతో రవికుమార్ మద్యం సేవించి వచ్చి కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచాడన్నారు. దీంతో తల్లిదండ్రులు ఇతర కుటుంబీకులు తీవ్ర గాయాలతో నర్సీపట్నంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టామన్నారు. కేసు నమోదు చేిసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించడం జరిగిందన్నారు.ఇటీవల కాలంలో మండలంలో తల్లిదండ్రులపై మద్యం సేవించి తగదాలు పడిన కేసులు అధికంగా వస్తున్నామన్నారు. ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేస్తే కచ్చితంగా మూడు నెలలు జైలు శిక్ష పడుతుందని జరిమానా కూడా కోర్డు విధిస్తుందని, ఈ విషయాన్ని గ్రహించాలని ఎస్ఐ హెచ్చరించారు. -
సృజనాత్మకత, ప్రణాళికతో నాయకత్వ వికాసం
మద్దిలపాలెం: సృజనాత్మకత, పటిష్ట ప్రణాళిక ద్వారానే నాయకత్వ వికాసం సాధ్యమని ఐఐటీ ఖరగ్పూర్ పూర్వ ఆచార్యులు, ఆర్జీయూకేటీ వ్యవస్థాపక వీసీ ఆచార్య ఆర్వీ రాజకుమార్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆయన ‘ఒక ఆదర్శ విశ్వవిద్యాలయాన్ని సృష్టించడంలో నాయకత్వ సవాళ్లు’ అనే అంశంపై ప్రసంగించారు. నిబద్ధత, దూరదృష్టితో పనిచేయాలని సూచించారు. ఆర్జీయూకేటీల స్థాపన, పరిమిత వనరులతో అభివృద్ధి, ఎదురైన సవాళ్లను ఆయన వివరించారు. తొలి బ్యాచ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో విజయాలు సాధించడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఏయూ పూర్వ విద్యార్థి అయిన ఆచార్య రాజకుమార్ను ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ సత్కరించారు. -
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
గొలుగొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత ఆరోపించారు. శనివారం ఏఎల్పురంలో తన ఇంటి వద్ద ఆమె విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే మహిళలను దారుణంగా వేధిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. కల్తీ మద్యం తాగి చనిపోతున్న వారి కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయన్నారు. కూటమి నేతలకు డబ్బులు తప్ప ప్రజా సంక్షేమం అవసరం లేదన్నారు. కల్తీ మద్యంపై మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి జీడీ నెల్లూరులో మాట్లాడితే అదే నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే థామస్ అతి దారుణంగా వ్యాఖ్యలు చేసి అవమానించారన్నారు. కృషాలక్ష్మికి ఎమ్మెల్యే థామస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత మహిళను కించపరిచిన ఎమ్మెల్యేపై కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేవారని, అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించేవారని గుర్తు చేశారు. కూటమి పాలనలో మహిళల రక్షణపై ఆందోళన కలుగుతోందన్నారు. -
పాఠ్య పుస్తకాల సమీక్షలో నాగజ్యోతికి అవకాశం
తన ప్రజెంటేషన్ను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.కృష్ణారెడ్డికి సమర్పించిన రోలుగుంట టీచర్ నాగజ్యోతి, తదితరులు రోలుగుంట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ(ఎస్సీఈఆర్టీ)ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాల పునఃసమీక్ష కార్యక్రమం విజయవాడలోని ఎస్జే కన్వెన్సన్ సెంటర్లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగింది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వర్క్షాపులో రాష్ట్రంలో వివిధ విభాగాలకు చెందిన సబ్జెక్టు నిపుణులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల టీచర్ పీవీఎం నాగజ్యోతి కూడా పాల్గొని తన ప్రజెంటేషన్ను సమర్పించారు. ఈ వర్క్షాపు ద్వారా పాఠ్య పుస్తకాల పునః సమీక్ష, రూపకల్పనలో తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. -
అప్పన్న ఆలయ లీకేజీ పనులు పూర్తి
సింహాచలం: సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ పైకప్పు మరమ్మతు పనులు శుక్రవారంతో పూర్తయ్యాయి. వర్షాలకు ఆలయ పైకప్పు నుంచి నీరు లోపలికి చేరుతుండటంతో ఆలయంతోపాటు, ఆలయ ప్రాంగణంలోని కల్యాణమండపం, నివేదనశాల, మ్యూజియం ఉన్న భవనంలో లీకేజీలు అరికట్టేందుకు 9 నెలల కిందట శాసీ్త్రయ పద్ధతిలో పనులు ప్రారంభించారు. ఆ పనులు పూర్తికావడంతో సింహగిరిపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి పురావస్తుశాఖ డైరెక్టర్ ముణిరత్నంరెడ్డి సంబంధిత వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో తొలుత శ్రీకాళహస్తి ఆలయంలో వర్షం నీరు లీకేజీని అరికట్టే పనులు చేపట్టామన్నారు. ఆ రోజుల్లో నిర్మాణ పనులు ఎలా చేశారో అదే పద్ధతిలో శ్రీకాళహస్తి ఆలయంలో లీకేజీలను అరికట్టేందుకు పూణేకి చెందిన శ్రీవెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్(వెంకీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్)ను సంప్రదించామన్నారు. అక్కడ ఉత్తమ ఫలితాలు రావడంతో ఆ తర్వాత శ్రీశైలం ఆలయంలో పనులు చేపట్టామన్నారు. సింహాచలం ఆలయం పైకప్పు లీకేజీ పనుల విషయాన్ని ఎమ్మెల్యే గంటా సూచనలతో వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రూ.5 కోట్ల సొంత వ్యయంతో 9 నెలల్లో లీకేజీ నిర్మూలన పనులను ట్రస్ట్ పూర్తిచేసిందన్నారు. మరో 200 ఏళ్ల వరకు ఎలాంటి లీకేజీలు ఉండవన్నారు. గంటా మాట్లాడుతూ అప్పన్న ఆలయంలోకి వర్షం నీరు చేరకుండా గతంలో పలుమార్లు నివారణ పనులు జరిగినా పూర్తిగా సఫలీకృతం కాలేదన్నారు. దీంతో వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించి, పురాతన ఆలయాల నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ లీకేజీలను అరికట్టే పనుల్ని చేసిందన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, అర్చకులు, 98వ వార్డు కార్పొరేటర్ పీవీ నరసింహం, తదితరులు పాల్గొన్నారు. రూ.5 కోట్ల సొంత నిధులతో పూర్తిచేసిన పూణేకి చెందిన శ్రీవెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ -
మహాలక్ష్మినాయుడుకు రాష్ట్ర స్థాయి పురస్కారం
అవార్డు, ప్రశంసా పత్రం అందుకుంటున్న మహాలక్ష్మినాయుడు రావికమతం: మండలంలోని మేడివాడ హైస్కూల్కు చెందిన ప్రత్యేక ఉపాధ్యాయుడు బి.మహాలక్ష్మినాయుడు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. దివ్యాంగ విద్యార్థులకు అందిస్తున్న సేవలను గుర్తించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డుకు ఆయన్ను సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ ప్రతినిధులు ఎంపిక చేశారు. విజయవాడలో రాష్ట్ర సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం స్టేట్ కో–ఆర్టినేటర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.కె.అన్నపూర్ణ నుంచి ప్రశంసాపత్రం, అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సహిత విద్య సమన్వయకర్త రామకృష్ణ నాయుడు పాల్గొన్నారు. ఫీజు చెల్లించలేదని ల్యాబ్ పరీక్షలకు అనుమతించలేదుతగరపువలస : భీమిలి మండలం దాకమర్రి ఎన్ఎస్ఆర్ఐఈటీ కళాశాల యాజమాన్యం ట్యూషన్ ఫీజు చెల్లించని విద్యార్థులను ల్యాబ్ పరీక్షలకు అనుమతించలేదు. దీంతో శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గత విద్యా సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయనందున కళాశాలల యాజమాన్యాలు నిర్వహణ ఖర్చులు భరించలేక విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఆర్ఐఈటీ యాజమాన్యం విద్యార్థులు రూ.10 వేల చొప్పున చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని చెప్పడంతో కొందరు విద్యార్థులు చెల్లించారు. ఫీజు చెల్లించలేని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రాధేయపడినా యాజమాన్యం అనుమతించలేదని వాపోయారు. కళాశాలకు చెల్లించాల్సిన అన్ని రకాల ఫీజులు చెల్లించినా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంలో విఫలం కావడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్ ఖాదర్బాబాను వివరణ కోరగా ఫీజు చెల్లించని విద్యార్థులను ల్యాబ్ పరీక్షలకు అనుమతించలేదనన్నది వాస్తవం కాదన్నారు. -
యథేచ్ఛగా మెటల్ అక్రమ తరలింపు
చోడవరం: కూటమి పాలనలో దోచుకున్నవారికి దోచుకున్నంతగా అన్నట్టుగా అక్రమార్కులు కొండలను కొల్లగొడుతున్నారు. మండలంలో మైన్స్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో గోవాడ, ముద్దుర్తి, నర్సాపురం, రాయపురాజుపేట, అడ్డూరు, గంధవరం, బెన్నవోలు, ఖండిపల్లి, వెంకన్నపాలెం, ఎం. కొత్తపల్లి, దుడ్డుపాలెం గ్రామాల పరిధిలోని కొండల్లో యథేచ్ఛగా మెటల్ అక్రమ క్వారీలు నడుస్తున్నాయి. గోవాడలో ఏకంగా కొండను తవ్వేసి మెటల్ అమ్మేసుకోవడంతోపాటు రహదారులే ఏర్పాటు చేసుకుంటున్నాడో ప్రబుద్ధుడు. వాస్తవానికి ఎర్ర మెటల్ తవ్వకాలు, రవాణా చేయాలంటే ముందుగా రెవెన్యూ, మైన్స్ శాఖల అనుమతి పొందాల్సి ఉంది. కాని చోడవరం మండలంలో మాత్రం అవేమీ లేవు. స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఎవరికి తోచినంత వారు తవ్వేసుకుని తరలించుకుపోతున్నారు. పొక్లెయిన్లు, జేసీబీ యంత్రాల సాయంతో ఎక్కడికక్కడ కొండలను తవ్వేసి లారీలు, ట్రాక్టర్లపై తరలించుకుపోతున్నారు. రాత్రిళ్లు ఎక్కువగా ఇక్కడ క్వారింగ్ జరుగుతోంది. దీనికి స్థానిక అధికార పార్టీ నాయకుల సహకారం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. గోవాడలో రియల్టర్లతో కుమ్మకై ్క ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. గంధవరం, అడ్డూరు, ముద్దుర్తి, నర్సాపురం, వెంకన్నపాలెం గ్రామాల్లో రియల్టర్లు పక్కనే ఉన్న కొండల నుంచి ఎర్ర మెటల్, మట్టిని తవ్వేసి భూములను ఎత్తుచేసి ప్లాట్లు వేసి అమ్ముతున్నారు. స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సహకారంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన మండల రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంతో అక్రమ క్వారీలు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి కొండలను తవ్వేస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పలు గ్రామాల్లో టాస్క్ఫోర్స్ బృందాలంటూ మొక్కుబడిగా కమిటీలు వేసినా అవి నామమాత్రంగానే ఉన్నాయి. ఎక్కడా క్వారీ తవ్వకాలను నిరువరించడంలేదు. ఇలా అనుమతి లేకుండా కొండలను తవ్వేసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, పర్యావరణాన్ని పరిరక్షించే కొండలు, పచ్చదనం కూడా నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిపై మైన్స్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్కు ఇద్దరు ఎంపిక
కశింకోట: రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్కు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో శుక్రవారం జిల్లా సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఇందులో విశేష ప్రతిభ ప్రదర్శించిన మాడుగల మండలం కేజేపురానికి చెందిన మళ్ల గౌతమి ప్రథమ, కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూలు విద్యార్థిని జి. లిప్షా ద్వితీయ స్థానం పొందారు. వీరికి జ్ఞాపికతోపాటు ప్రతిభా ధ్రువపత్రాలను అందజేశారు. వీరు ఈ నెల 18న విజయవాడలో రాష్ట్ర స్థాయి సెమినార్కు హాజరు కానున్నారు. డీఈవో గిడ్డి అప్పారావునాయుడు, ఉప విద్యా శాఖ అధికారి పొన్నాడ అప్పారావు అభినందనలు తెలిపారు. ఇటువంటి సెమినార్లు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తాయన్నారు. జిల్లా సైన్స్ అధికారి దాడి కాళిదాసు మాట్లాడుతూ సంప్రదాయ ఫిజిక్స్ నుంచి క్వాంటం ఫిజిక్స్కు మారుతున్న తరుణంలో అంతే వేగంతో అభివృద్ధి జరిగి ఫలాలు అందరికి అందగలవన్నారు. సెమినార్కు జ్యూరీ సభ్యులుగా ఏఎంఏఎల్ కళాశాల ఉప ప్రిన్సిపాల్ బి. నిరంజన్ కుమార్, డీవీఎన్ కళాశాల అధ్యాపకురాలు ఎన్. భాగ్యలక్ష్మి వ్యవహరించారు. ఎంఈవోలు కేఎస్ఎన్ మూర్తి, సురేష్ కుమార్, జిల్లాలో మండలానికి ఇద్దరు వంతున 34 మంది విద్యార్థులు, గైడ్ టీచర్లు హాజరయ్యారు. -
ఉద్యోగుల గ్రీవెన్స్కు 11 అర్జీలు
పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్పీ తుహిన్ సిన్హా ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటున్న జేసీ జాహ్నవి తుమ్మపాల: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ప్రత్యేక గ్రీవెన్స్లో ఆమెతో పాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయమైన, అవకాశం ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. మొత్తం 11 మంది ఉద్యోగులు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. రెవెన్యూ శాఖ–3, వైద్య ఆరోగ్య శాఖ– 2, ఖజానా శాఖ, గ్రామీణ అభివృద్ధి, సర్వే, ల్యాండ్ సెటిల్మెంట్, విద్యా శాఖ, వెనకబడిన తరగతుల శాఖ, మున్సిపల్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ పరిపాలన అధికారి విజయ్ కుమార్, పీజీఆర్ఎస్ సెల్ పర్యవేక్షకుడు సురేష్ నాయుడు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. అనకాపల్లి: స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలపై ఎస్పీ తుహిన్ సిన్హాకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రాధాన్యమని, సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. సిబ్బంది నుంచి మొత్తం 8 అర్జీలు అందాయన్నారు. -
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
అనకాపల్లి: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని విద్యుత్ కాంట్రాక్ట్, కార్మిక, ఉద్యోగుల యూనియన్ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ, యునైటెడ్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక గవరపాలెం విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని, కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసిన కార్మికులకు నేరు విద్యుత్ సంస్థ జీతాలు చెల్లించాలని తదిదర డిమాండ్లతో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి.చంద్రశేఖర్, ఆర్.సత్యారావు, కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం ఎదురు చూపులు
కశింకోటలో ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం వేచి ఉన్న రైతులు కశింకోట: యూరియా అరకొర సరఫరాతో రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనక తప్పలేదు. శుక్రవారం స్థానిక ప్రైవేటు ఎరువుల డీలర్ దుకాణం వద్ద గంటల తరబడి బారులు తీరారు. ప్రస్తుతం ఎదుగుదల, పొట్ట దశలో వరి పంట ఉంది. కొందరు ఆలస్యంగా నాట్లు వేశారు. ఈ నేపథ్యంలో యూరియా తప్పనిసరిగా వేయాల్సి ఉంది. లేదంటే పెరుగుదల ఉండదు. యూరియా ఇవ్వనున్నట్లు తెలియడంతో రైతులు ఎరువు కోసం దుకాణం వద్ద ఉదయం నుంచి బారులు తీరారు. అరకొరగా తక్కువ నిల్వ ఉన్న మేరకు సరఫరా చేశారు. మిగిలిన వారికి ఈ నెల 22న రావాలని, ఆ రోజుకి మళ్లీ యూరియా రానుందని డీలర్ పేర్కొని వెనక్కి పంపించి వేశారు. దీంతో కశింకోటతోపాటు ఏనుగుతుని, ఇతర గ్రామాల నుంచి వచ్చిన రైతులు యూరియా కష్టాలు ఎన్నాళ్లకు తీరేనో అంటూ తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. -
పాత్రికేయులు
భగ్గుమన్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వ వేధింపులకు నిరసన డాబాగార్డెన్స్ (విశాఖ)/అనకాపల్లి/నర్సీపట్నం: ‘సాక్షి’ మీడియా సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ జర్నలిస్టులు భగ్గుమన్నారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’ గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నంతోపాటు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని మండలాల్లో వివిధ జర్నలిస్ట్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నకిలీ మద్యం దందాను వెలుగులోకి తెచ్చినందుకు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి, నెల్లూరు బ్యూరో ఇన్చార్జ్కి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. నిరసనలో భాగంగా పాత్రికేయులు చేతులకు సంకెళ్లు వేసుకుని, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ‘కూటమి నిరంకుశ పాలన నశించాలి’, ‘అక్షరంపై దాడి సిగ్గు సిగ్గు’, ‘పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లా?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియాపై అణచివేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమని, ఇలాంటి చర్యల ద్వారా జర్నలిజాన్ని భయపెట్టలేరని హెచ్చరించారు. ప్రభుత్వం తన దాష్టీకాన్ని ఆపి, పత్రికా స్వేచ్ఛను గౌరవించాలని డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకుడు ఎంఆర్ఎన్ వర్మ, ఏపీడబ్ల్యూజే నాయకుడు, పి.నారాయణ్, జాతీయ జర్నలిస్ట్ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబుతోపాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనకాపల్లిలో.. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించి, ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ డివిజినల్ అధికారి షేక్ ఆయిషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియో జిల్లా కార్యదర్శి ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మళ్ల భాస్కరరావులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. పత్రికల్లో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ప్రచురితమైతే అధికారులు ఖండన ఇవ్వాలే గానీ కక్షపూరితంగా పోలీసులను కార్యాలయాలకు మీదకు పంపడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రతిఘటన తప్పదన్నారు. అనకాపల్లి ప్రెస్ క్లబ్ కార్యదర్శి భీమరశెట్టి గణేష్, ఎలక్ట్రానిక్ మీడియో అనకాపల్లి అధ్యక్షుడు సీహెచ్ సర్వారావు, వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులు బుద్ద రమణాజీ, కొండలరావు, పి.వీరబాబు, మంత్రి నారాయణమూర్తి, ఆళ్ల రామచంద్రరావు, గంగాధర్, బుదిరెడ్డి మధుసూదనరావు, పెంటకోట సత్యనారాయణ, పెద్దాడ నాయుడు, యడ్ల రామకృష్ణ, బోసు, బొద్దపు కిరణ్, బొడ్డేడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ డీఆర్వోకు కలెక్టర్ క్లాస్?
మహారాణిపేట: విశాఖ ఆర్డీవో శ్రీలేఖ రాసిన లేఖ వ్యవహారంపై ‘రెవెన్యూలో శ్రీలేఖ కలకలం’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా రెవెన్యూ శాఖలో ప్రకంపనలు సృష్టించింది. ఉన్నతాధికారుల మధ్య కోల్డ్వార్ వెలుగులోకి రావడంతో రెవెన్యూ, నిఘా వర్గాల ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి.. ఏం జరుగుతోందని ఆరా తీశారు. జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్ శుక్రవారం హుటాహుటిన కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను కలిశారు. ఈ అంశంపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో డీఆర్వో తీరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఆయనకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వివాదంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు కూడా స్పందించారు. కలెక్టర్ను కలిసి, శాఖ ప్రతిష్టకు భంగం కలగకుండా తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని, అనవసర రాద్ధాంతం చేయవద్దని కలెక్టర్ వారికి సూచించినట్లు సమాచారం. -
తాటాకిల్లు దగ్ధం
మాకవరపాలెం: మండలంలోని జి.కోడూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ తాటాకిల్లు దగ్ధమైంది. గ్రామంలోని దళితవాడలో నివాసం ఉంటున్న ఉలంపర్తి అప్పయ్యమ్మ, బాబూరావులకు చెందిన ఇల్లు శుక్రవారం మధ్యాహ్నం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటిలోపల ఉన్న ధాన్యం, వెండి, బంగారు వస్తువులు, ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. రూ.లక్షకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దగ్ధమైన ఇంటిని తహసీల్దార్ వెంకటరమణ పరిశీలించారు. ఆయన, గ్రామస్తులు కలిసి బాధితులకు గ్యాస్ సిలిండర్, స్టవ్, రూ.20 వేల నగదు, దుస్తులు, 50 కిలోల బియ్యం అందజేశారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ఆర్టీసీ బస్సు ఢీ.. నవ వధువు మృతి భర్తకు తీవ్ర గాయాలు కూర్మన్నపాలెం: కూర్మన్నపాలెం కూడలి వద్ద శుక్రవారం తెల్లవారుజామున మృత్యువు కాపు కాసింది. పైళ్లె ఏడాదైన జంట స్కూటీపై ప్రయాణిస్తుండగా.. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు వారి జీవితాలపై కబళించింది. నిండు నూరేళ్ల దాంపత్యం ఒక్క క్షణంలోనే విషాదంగా ముగిసింది. కూర్మన్నపాలెం ముఖ్య కూడలి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పెదగంట్యాడ మండలానికి చెందిన వియ్యపు ఉమాదేవి(22) మృతి చెందగా, ఆమె భర్త పైడిరాజు గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి దువ్వాడ పోలీసులు అందించిన వివరాలివి.. విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న వియ్యపు పైడిరాజు, తన తల్లిదండ్రులు, భార్యతో కలిసి పెదగంట్యాడ మండలం సీతానగరంలో నివాసం ఉంటున్నాడు. అనకాపల్లి మండలం కొత్తూరులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాల్సి ఉండడంతో శుక్రవారం తెల్లవారుజామున భార్య ఉమాదేవితో కలిసి స్కూటీపై ఇంటి వద్ద బయలుదేరాడు. కూర్మన్నపాలెం కూడలికి సమీపిస్తున్న సమయంలో.. సింథియా నుంచి చోడవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారి స్కూటీని బలంగా ఢీకొంది. దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న ఉమాదేవి కుడి వైపునకు, పైడిరాజు ఎడమ వైపునకు పడిపోయారు. ఉమాదేవిపై నుంచి బస్సు చక్రాలు దూసుకుపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పైడిరాజుకు నడుము భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఉమాదేవికి, పైడిరాజుకు వివాహం జరిగి ఏడాది కావస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఉమాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. సీతానగరంలో విషాదచాయలు పెదగంట్యాడ: ఉమాదేవి దుర్మరణంతో సీతానగరంలో విషాదచాయలు అలుముకున్నాయి. పెళ్లాయిన ఏడాదికే ఆమెను మృతువు బస్సు రూపంలో కబళించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోగతి
●డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ హరప్రసాద్ మద్దిలపాలెం : శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోగతి సాధిస్తోందని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.వి.హర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎన్ఎస్టీఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అకడమిక్ కాన్ఫరెన్స్–2025ను శుక్రవారం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన పలు సాంకేతికతలు సమర్ధవంతంగా వినియోగించి సత్ఫలితాలను సాధించిన విధానాన్ని వివరించారు. డీఆర్డీవో సమిష్టిగా విశ్వవిద్యాలయాలు సాంకేతిక విద్యాసంస్థలతో కలసి పరిశోధనలు నిర్వహించే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 100 విద్యాసంస్థలకు చెందిన 500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో భాగస్వామ్యం అయ్యారన్నారు. నీటిలోపల లోతైన ప్రదేశంలో సమాచారాన్ని సంగ్రహించి, విశ్లేషించే నూతన వ్యవస్థలు, స్టైల్త్ టెక్నాలజీ, సెన్సార్లు వంటివి దేశీయంగా అభివృద్ధి చేయడం, వినియోగించడం జరుగుతోందని తెలిపారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ సాంకేతికతలో స్వీయ వికాసం కలిగి ఉండాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల నుంచి నూతన ప్రొజెక్టర్ టామ్సేజ్ సాంకేతికతలను అభివృద్ధి చేసే దిశగా పరిశోధనలో పెరగాలని సూచించారు. ఐడీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ మను కోరుల్లా వర్చువల్ విధానంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో 100 పేటెంట్లు సాధించడం లక్ష్యంగా కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ అబ్రహం వర్గీస్, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిభూషణరావు, కార్యక్రమ సమన్వయకర్త ఆచార్య టి.వి.కె భానుప్రకాష్, ఏఐఓ, ఎన్ఎస్టీఎల్ శాస్త్రవేత్త విఎప్ సాజీ, డిప్యూటి శాస్త్రవేత్త టి.వేణుగోపాలరావు, డీఆర్డీవో శాస్త్రవేత్తలు తదితరులు ప్రసంగించారు. -
పల్లె పండగ.. బిల్లులకు నిరీక్షణ
సాక్షి, అనకాపల్లి: తొలి విడత ‘పల్లె పండగ’ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. గతేడాది అక్టోబర్లో తలపెట్టిన పల్లె పండగ పనులకు సంబంధించి బిల్లులు ఇప్పటికీ విడుదల కాలేదు. తాజాగా రెండో విడత పల్లె పండగ పనులకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడం కాంట్రాక్టర్లకు మింగుడు పడడం లేదు. జిల్లాలో తొలి విడతలో చేపట్టిన పనుల బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సగం పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆ నిధులు ఎప్పుడొస్తాయా? అని కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. గతేడాది అక్టోబర్ 14వ తేదీ నుంచి ‘పల్లె పండగ’పేరిట గ్రామాల్లో సభలు నిర్వహించి సీసీ రోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు వినతులు స్వీకరించారు. తొలి విడతలో పూర్తయిన పనుల బిల్లులు అధికారులు అప్లోడ్ చేశారు. నెలలు గడుస్తున్నా నిధులు విడుదల కాలేదు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు అసంపూర్తిగానే పనులు నిలిపివేశారు. రూ.11 కోట్లు మాత్రమే విడుదల జిల్లాలో 166 కిలోమీటర్ల పొడవున 1,354 రోడ్ల నిర్మాణ పనులకు రూ.143 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు బిల్లులు అప్లోడ్ చేశారు. ఇంత వరకు రూ.11 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.132 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత సంవత్సరం నవంబరు నుంచి ‘పల్లె పండగ’ పేరుతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, రోడ్లు మరమ్మతులు వంటి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద 189 కిలోమీటర్ల పొడవు గల 1,734 రోడ్డు నిర్మాణ పనులు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో ఈ పనులు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కాబట్టి బిల్లులు త్వరగా మంజూరవుతాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు పోటీపడి మరీ గ్రామాల్లో పనులు చేపట్టారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి జిల్లాలో 166 కిలోమీటర్ల పరిధిలో 1,354 రోడ్డు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. వీటికి సంబంధించి రూ.143 కోట్లు విడుదల చేయాలంటూ ఉపాధి హామీ పథకం వెబ్సైట్లో బిల్లులు అప్లోడ్ చేశారు. మార్చి నెలాఖరు నాటికి నిధులు విడుదల కావాల్సి ఉంది. కానీ అక్టోబర్ నెల కూడా వచ్చేసింది. ఇంకా నిధులు విడుదల కాలేకపోవడంతో కాంట్రాక్టర్ మిగిలిన పనులు నిలిపివేశారు. పనులు పూర్తి చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు వేడుకుంటున్నా బిల్లులు విడుదలైతేనే పనులు చేపడతామని కరాఖండిగా కాంట్రాక్టర్లు చెప్పేశారు. ముఖం చాటేసిన కాంట్రాక్టర్లు కూటమి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ‘పల్లె పండగ’ పనులు చేయడానికి పోటీ పడ్డారు. బిల్లులు రాకపోవడంతో మిగిలిన పనులు పూర్తి చేయకుండా కాంట్రాకర్లు ముఖం చాటేశారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని పెండింగ్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పనులు కుంటుపడతాయి. పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదికపెండింగ్ బిల్లుల విషయాన్ని పీఆర్ ఈఈ వద్ద ప్రస్తావించగా.. రోడ్ల పనులు ఒకింత నెమ్మదిగా జరుగుతున్న మాట వాస్తవమేనని, అయితే పూర్తిగా నిలిచిపోలేదన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. త్వరలో నిధులు విడుదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మూడో విడత రీసర్వేకు 30 గ్రామాల గుర్తింపు
నాతవరం: జిల్లాలో భూ రీసర్వే చేయడానికి మూడో విడతలో 30 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశామని సర్వే ఏడీ గోపాలరాజు చెప్పారు. ఆయన గురువారం రాజుపేట అగ్రహారం గ్రామంలో రీసర్వేను పరిశీలించారు. ఈ గ్రామంలో ఇంతవరకు చేసిన రీసర్వేపై రైతులతో మాట్లాడారు, అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద మండలానికి ఒక రెవెన్యూ గ్రామం చొప్పున 24 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామన్నారు. రెండో విడతలో 30 గ్రామాల్లో రీసర్వే చేపట్టామని, ఈనెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. మూడో విడతలో రీసర్వేకు ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో ముందుగా తహసీల్దార్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. తహసీల్దార్ వేణుగోపాల్, నర్సీపట్నం డివిజన్ సర్వే ఇన్స్పెక్టర్ ఎల్.బంగారుదేవి, మండల సర్వేయరు సత్యనారాయణ, ఆర్ఐ నాగరాజు, సచివాలయ సర్వేయరు విజయకుమార్, సిబ్బంది రైతులు పాల్గొన్నారు. -
గ్రావెల్ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్ దాడులు
సాక్షి, అనకాపల్లి: గ్రావెల్ అక్రమ తవ్వకాలపై మైనింగ్, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు బుధ, గురువారాల్లో దాడులు చేశారు. రాంబిల్లి మండలం చినపూడి గ్రామంలో షిర్డీ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు చేసి, అక్కడున్న వాహనాలను సీజ్ చేశారు. ఎంత ఏరియాలో గ్రావెల్ తవ్వకాలు జరిగాయో ఆ ప్రదేశాన్ని కొలతలు వేసిన చినపూడి వీఆర్వో కేసు నమోదు చేసి జరిమానా వేశారు. తవ్వకాలు జరిగే చోట ఉన్న ఆరు టిప్పర్ లారీలు, రెండు పొక్లెయిన్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకుని, రాంబిల్లి రెవెన్యూ సిబ్బందికి మైనింగ్ అధికారులు అప్పగించారు. -
మర్రిపాలెం రైల్వేస్టేషన్లో 4 కిలోల గంజాయి స్వాధీనం
తాటిచెట్లపాలెం(విశాఖ): మర్రిపాలెం రైల్వే స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా.. గురువారం ఉదయం మర్రిపాలెం రైల్వే స్టేషన్లోని పలు రైళ్లలో రైల్వే భద్రతా దళం సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. కర్ణాటకకు చెందిన సలీం పాషా, అమ్ముకుట్టి, నిషాదేవిలు కర్ణాటకకు అక్రమంగా గంజాయిని రవాణా చేయడం గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.20 వేల విలువైన 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం వీరిని గవర్నమెంట్ రైల్వే పోలీసులకు అప్పగించినట్లు మర్రిపాలెం ఆర్పీఎఫ్ సిబ్బంది తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచినట్లు చెప్పారు. -
ఎస్సీ,ఎస్టీ కేసుపై డీఎస్పీ విచారణ
విచారణ జరుపుతున్న డీఎస్పీ శ్రావణి రోలుగుంట: మండలం కె.నాయుడు పాలెం గ్రామానికి చెందిన ఇద్దరిపై ఎస్సీఎస్టీ కేసు నమోదైంది. దీనిపై గురువారం డీఎస్పీ ఎం.శ్రావణి స్థానిక ఎస్ఐ రామకృష్ణారావుతో కలసి గ్రామంలో విచారణ జరిపారు. ఈ నెల 14 తేదీ రాత్రి ఇదే గ్రామానికి చెందిన రాయిపురెడ్డి ప్రసాద్, గుములూరి రమణబాబులు తనను కులంపేరుతో దూషించి, కర్రతో దాడి చేశారని గ్రామానికి చెందిన ఉడతపల్లి సత్తిబాబు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి సాక్షులను విచారించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఉందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఏయూ పరువు పాయే..!
విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ మరో వివాదం రాజుకుంటోంది. ఏయూలో బాణసంచా దుకాణాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ జోక్యం చేసుకోవడం అగ్గి రాజేస్తోంది. ఏయూ వీసీ అనుమతులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా తాత్కాలిక స్టాళ్ల అనుమతులకు ఉన్నత విద్యా శాఖ లేఖ రాయడం హాట్ టాపిక్గా మారింది. ఇది వైస్ చాన్సలర్ పరువు తీయడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం విశ్వవిద్యాలయ అధికార, ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కల్పించుకోవడం వెనుక ఆంతర్యమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఏయూ నుంచి అనుమతులు రాకముందే స్టాళ్ల ఏర్పాటు పనులు చేపట్టడంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో అధికార వర్గాల్లో ప్రకంపనలు రేగాయి. దీనిపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీరియస్ అయినట్లు సమాచారం. ఉన్నత విద్యా శాఖ జోక్యంపై చర్చ సాధారణంగా ఏయూలో కార్యక్రమాల నిర్వహణకు ఏయూ సమావేశ మందిరాలు, మైదానాలు లీజుకు ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. ఎవరైనా కార్యక్రమం నిర్వహణకు దరఖాస్తు చేసుకొని నిర్ణీత రుసుము చెల్లిస్తే.. ఏయూ వీసీ అనుమతులు ఇస్తుంటారు. గతంలో ప్రైవేటు కార్యక్రమాలకు కూడా అనుమతులు ఇచ్చేవారు. అయితే ఏయూ రాజకీయ వేదికగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రైవేటు కార్యక్రమానికి ఏయూ, దానికి సంబంధించిన మైదానాల్లో అనుమతులు మంజూరు చేసే అవకాశం లేదు. దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయాలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్లో స్టాళ్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తోంది. దీనిపై ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ హెలీప్యాడ్ గ్రౌండ్ను లీజుకు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ స్వయంగా ఏయూ వీసికి లేఖ రాశారు. దీనిపై ఏయూ వీసీ నిర్ణయం తీసుకోకముందే పనులు జరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ అనుమతుల విషయంలో నేరుగా ఉన్నత విద్యా శాఖ జోక్యం చేసుకోవడం ఇపుడు వర్సటీలో చర్చకు దారితీసింది. ఏయూ వీసీ నిర్ణయం తీసుకోవాల్సిన్న సర్వసాధారణ విషయంలో రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కల్పించుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు అధికార వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఏయూ వీసీని అవమానించడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 21వ తేదీ వరకు అనుమతులు కలెక్టర్ హరేందిర ప్రసాద్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఏయూ ఇంజినీరింగ్ హెలీప్యాడ్ గ్రౌండ్ లేదా దాని ఎదురుగా ఉన్న పార్కింగ్ మైదానాన్ని తాత్కాలిక స్టాళ్ల ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలని ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి కార్యాలయం నుంచి ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్కు లేఖ వచ్చింది. ఈ నెల 15న ఈ లేఖ రాగా వెంటనే ఏయూ వీసీ కూడా అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కానీ 14వ తేదీ నుంచి అనుమతులు కోరినట్లు ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆయన అనుమతులకు ముందే ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ పార్కింగ్ మైదానంలో మళ్లీ పనులు ప్రారంభించేయడం విషయం. ప్రస్తుతం అనుమతులు ఉండడంతో పనులు జరుగుతున్నాయి. ‘కూటమి’ జోక్యంతో వివాదం ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ హెలిప్యాడ్ మైదానంలో స్టాళ్ల ఏర్పాటు కోసం అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ రాజశేఖర్కు లేఖ రాశారు. దీనిపై ఏయూ వీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనుమతులు ఇవ్వకముందే గ్రౌండ్లో స్టాళ్ల ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. దీనిపై సాక్షి ‘ఏయూ–జీవీఎంసీ మధ్య దివాళీ ట్రేడ్ ఫైర్’ అంటూ కథనం ప్రచురించింది. దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఏ శాఖ నుంచి అనుమతులు రాకముందే, ఏయూ వీసీ గ్రౌండ్ను లీజుకు ఇవ్వకముందే పనులు చేపట్టడంపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీరియస్ అయ్యారు. వెంటనే ఆ పనులను ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కూటమి ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. జిల్లా అధికారులతో పాటు ఏయూ వీసీతో కూడా మాట్లాడి అనుమతులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. సదరు ప్రజాప్రతినిధి అనుచరులే ఈ మందుగుండు స్టాళ్ల పేరుతో దందాకు తెరతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో స్టాల్ను రూ.1.5 లక్షలకు బేరం పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఏయూ గ్రౌండ్లో దుకాణాలను ఏర్పాటు చేయించాలని ప్రజాప్రతినిధి గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. -
వైజాగ్ హాఫ్ మారథాన్కు భారీ స్పందన
ఏయూ క్యాంపస్: వైజాగ్ ట్రైల్ రన్నింగ్ అసోసియేషన్.. వైజాగ్ హాఫ్ మారథాన్ 2025 బీచ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో 2 వేల మందికి పైగా పాల్గొన్నారు. మారథాన్లో హాఫ్ మారథాన్ (21.1 కి.మీ), 10 కి.మీ పరుగు, 5 కి.మీ ఫన్ రన్ ఉన్నాయి. ఆర్కే బీచ్ నుంచి రుషికొండ మీదుగా ఈ మారథాన్ను నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. అనంతరం కమిషనర్ రన్లో పాల్గొన్న వారిని అభినందించారు. డిసెంబర్ 6, 7 తేదీల్లో పాడేరులో 100 కిలోమీటర్లు రన్ కూడా పెడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు www.vtra.run వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. -
అనంతుని పవిత్రోత్సవాలు ప్రారంభం
పాత సంత స్థలంలో మేదిని మాతకు పూజలు నిర్వహిస్తున్న వేద పండితులు పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవ స్వామి ఆలయంలో గురువారం రాత్రి వేద పండితుల వేద మంత్రోచ్ఛారణాల నడుమ పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం వంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి కుంతీ మాధవ స్వామి ఆలయంలోని చక్ర పెరుమాళ్లను పల్లకిలో పాత సంత స్థలం వద్దకు పల్లకీలో తోడ్కొని వచ్చారు. ఇక్కడ మేదిని మాతకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తాలాడ పద్మనాభం, కంటుబోతు ఎర్నాయుడు, మొకర అప్పలనాయుడు, తాలాడ పైడిరాజు, అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. -
ఆందోళనకు టీడీపీ దూరం.. ఊరి సమస్యలోనూ రాజకీయమే!
రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంది. ప్రారంభంలో గ్రామస్తుల ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది టీడీపీ నాయకులు ఆందోళనలో పాల్గొన్నప్పటీకి హోంమంత్రిని అడ్డుకున్న తర్వాత టీడీపీ నాయకులు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారు. మిగిలిన మత్స్యకారులు మాత్రమే ఆందోళన కొనసాగిస్తున్నారు. మత్స్యకారులంతా గ్రామం కోసం, ప్రాణాల కోసం పోరాటం చేస్తుంటే రాజకీయ కారణాలతో టీడీపీ నాయకులు ముఖం చాటేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది టీడీపీ నాయకుల పేర్లు, వారి ఫొటోలు, బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు టీవీల్లో, పత్రికల్లో రావడంతో.. మన ప్రభుత్వమే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే మీరెలా నిరాహారదీక్ష శిబిరంలో కూర్చుంటారని పార్టీ పెద్దలు చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. -
స్నేహితుడిని పరామర్శించి వస్తూ మృత్యువాత
గోపాలపట్నం (విశాఖ): చేతికి అందివచ్చి.. ఇంటికి అండగా ఉంటున్న కొడుకు మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆరు నెలల కిందట చెల్లెలి పెళ్లి చేసి మురిసిన అన్నయ్య.. ఈ రోజు కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోయాడు. ఒక స్నేహితుడిని పరామర్శించి వస్తున్న ఆ యువకుడిని మృత్యువు రోడ్డు రూపంలో కబళించింది. వేపగుంటలో ఉంటున్న స్నేహితుడికి తేలు కుట్టిందని తెలిసి పరామర్శించేందుకు బుధవారం రాత్రి వెళ్లిన బొడ్డేడ వంశీ (24) తిరిగి ఇంటికి వస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారిపై ఈ దారుణం చోటుచేసుకుంది. అక్కయ్యపాలెంలో నివాసముంటున్న వంశీ స్వస్థలం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చేమలాపల్లి. ట్రావెల్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తన ద్విచక్రవాహనంపై వేపగుంట నుంచి వస్తుండగా.. ఆర్అండ్బీ జంక్షన్ సమీపంలో వెనుకనే అతివేగంగా వస్తున్న లారీ అతన్ని ఢీకొట్టింది. ఈ ధాటికి అదుపుతప్పిన వంశీ లారీ చక్రాల కింద పడి నలిగిపోయాడు. లారీ అతన్ని సుమారు 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో వంశీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కుటుంబానికి అండగా ఉంటున్న కుమారుడు అకాల మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తండ్రి రామకృష్ణ లారెన్స్ సంస్థలో హౌస్ కీపర్గా పనిచేస్తున్నారు. బుద్ధిమంతుడైన కొడుకు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక వారు పడుతున్న వేదన అక్కడివారిని సైతం కంటతడి పెట్టించింది. ఆరు నెలల కిందటే వంశీ తన చెల్లెలు కావ్యకు అన్నీ తానై వివాహం జరిపించాడు. ఆ తీపి జ్ఞాపకాలు ఇంకా మరువకముందే.. అన్న మరణవార్త విన్న కావ్య కన్నీటి పర్యంతమైంది. తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. -
పాత కక్షతోనే వివాహిత హత్య
తాటిచెట్లపాలెం (విశాఖ): అక్కయ్యపాలెంలోని నందగిరినగర్లో బుధవారం సాయంత్రం జరిగిన కావల శ్రావణసంధ్య అలియాస్ సోని(38) దారుణ హత్యకు పాత గొడవలే కారణమని ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి గురువారం వెల్లడించారు. ఈ కేసు వివరాలను ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. శ్రావణ సంధ్యకు 9 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భర్త మణికంఠతో మనస్పర్ధల కారణంగా విడిపోయి, గత ఏడేళ్లుగా తన ఇద్దరు పిల్లలతో కలిసి నందగిరినగర్లో నివసిస్తోంది. మణికంఠ ప్రస్తుతం రాయగడలో ఉంటున్నాడు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. నిందితుడు శ్రీను(కార్పెంటర్) కూడా అదే ప్రాంతంలో, తన సోదరుడి ఇంట్లో నివసిస్తున్నాడు. సుమారు 8 నెలల కిందట శ్రీను..శ్రావణసంధ్య స్కూటీని డామేజ్ చేయడంతో, ఆమె ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పుడు పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చినా, శ్రీను ఆమైపె పగ పెంచుకున్నాడు. దీనికితోడు శ్రీను తరచుగా మరొక అమ్మాయితో మాట్లాడడాన్ని గమనించిన శ్రావణసంధ్య, అతడిని హెచ్చరించినట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం మళ్లీ వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న శ్రీను.. కోపం పెరిగి, కార్పెంటరీ పనుల కోసం ఉపయోగించే పదునైన కత్తి తో శ్రావణసంధ్య మెడపై తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆమె సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతురాలి సోదరి దేవి సంతోషికుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. హత్య అనంతరం శ్రీను తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. ఫోర్త్టౌన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ఉమాకాంత్ తన బృందంతో మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న ఫోర్త్టౌన్ పోలీసులను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ–1 మేరి ప్రశాంతి అభినందించారు.


