breaking news
Anakapalle
-
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి: వైఎస్ జగన్
విశాఖ: నగరంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం పాఠశాల విద్యార్థులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. గురువారు(అక్టోబర్ 9వ తేదీ) అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటనల సందర్భంగా కేజీహెచ్లోని పచ్చకామెర్ల బాధిత విద్యార్థులను వైఎస్ పరామర్శించారు. పచ్చకామెర్ల బారిన పడ్డ బాధిత విద్యార్థులతో వైఎస్ జగన్ మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యంపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్ బయట మీడియాతో మాట్లాడారు. మీడియాను కేజీహెచ్ ప్రాంగణంలోకి అనుమతి నిరాకరించడంతో బయట మీడియాతో మాట్లాడారు వైఎస్ జగన్. ‘170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వచ్చాయి. పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలి. స్కూళ్లు, హాస్టల్స్లో బాత్రూమ్లను శానిటేషన్ చేయాలి. ఒకే స్కూల్ నుంచి 65 మంది విద్యార్థులు కేజీహెచ్లో చేరారు. కురుపాం నుంచి 200 కి.మీ దూరంలో కేజీహెచ్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి కేసులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కలుషిత నీటి వల్లే పిల్లలకు ఈ పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. 170 మంది పిల్లలకు రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. ఇప్పటికైనా వాటర్ ప్లాంట్ను రిపేర్ చేయించాలి. పిల్లల తరఫున మేం మెడికో లీగల్ కేసు వేస్తాం. వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం అందజేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే.. పేదవారికి వైద్యం ఎలా అందుతుంది?’ -
జగన్ పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం
అనకాపల్లి జిల్లా : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనలో పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడింది. మాకవరపాలెం మెడికల్ కాలేజీలో పోలీసుల పనితీరు దారుణంగా ఉంది. ఏకంగా జగన్ కార్వాన్ మీదకు జనం ఎక్కినా పోలీసులు పట్టించుకోలేదు. జనం ఇలా కార్వాన్ మీదకు ఎక్కినా పోలీసులు మాత్రం చోద్యం చూశారు. ఈ పర్యటనలో మధ్మాహ్నం నుండి వర్షంలో తడుస్తూ వచ్చారు వైఎస్ జగన్. కార్వాన్ లోపలికి వెళ్లి దుస్తులు మార్చుకునేందుకు కూడా వైఎస్ జగన్ అవకాశం లేకుండా పోయింది. జనాన్ని అదుపు చేయకుండా వదిలేశారు ఖాకీలు. ప్రెస్మీట్ సమయంలోనూ గ్యాలరీలోకి జనాన్ని పంపారు పోలీసులు. దాంతో జగన్ మాట్లాడే సమయలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసుల కారణంగా అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. కొందరు ఖాకీలు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడింది. మరొకవైపు వైఎస్ జగన్ పర్యటన సక్సెస్ కావడంతో పార్టీ కేడర్లో ఫుల్జోష్ నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం -
‘మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే.. పేదవారికి వైద్యం ఎలా అందుతుంది?’
సాక్షి, నర్సీపట్నం: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన వైఎస్ జగన్.. చంద్రబాబు చేస్తున్న ప్రైవేటీకరణ కుట్రలను ఎండగట్టారు. తాము గతంలో పేదలకు మంచి చేస్తే.. ఈరోజు చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గత మా హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాంప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీ చేస్తే.. తట్టుకోవడం పేదవాళ్లకు అసాధ్యంఅందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చిందిఅలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు.అంతా ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా? పేదవారు దగా పడకుండా ఎలా ఆపుతారుపేదవాళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 17మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చాంనర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాంకోవిడ్ సంక్షోభంలోనూ రూ.500కోట్లు ఖర్చు చేశాం ఈ మెడికల్ కాలేజీలో పూర్తయితే 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందేదిఏడాదికి 150 మెడికల్ కాలేజీ సీట్లను అందుబాటులోకి తెచ్చాంఅలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుందిచంద్రబాబు పేదవాడికి అన్యాయం చేస్తున్నారువిజయనగరం,పాడేరు మెడికల్ కాలేజీలు క్లాసులు ప్రారంభమయ్యాయిచంద్రబాబును అడుగుతున్నాం.. చంద్రబాబు ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్ కాలేజీల పరిస్థితుల ఇవిఈ నాలుగు మెడికల్ కాలేజీ కాకా.. ఐటీడీఏ పరిధిలోని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణంలో ఉన్నాయిపలు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తయ్యియి17 మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి కనిపించింది.అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో 2023-24 క్లాసులు ప్రారంభమయ్యాయి. పేదవాళ్లు చదువుకునేందుకు, మెడిసిన్ చదివేందుకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయిఅలాంటి కోట్లాది మందికి వైద్యం,విద్య అందించే ఆధునిక దేవాలయాల్ని దగ్గరుండి చంద్రబాబు అమ్మేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారుమొత్తం మెడికల్ కాలేజీలకు ఐదేళ్లలో ఐదుకోట్లు.. ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా? చంద్రబాబుఅమరావతిలో లక్ష ఎకరాలు సేకరించి.. అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి,కరెంట్,నీళ్లు ఇవ్వడానికి మొత్తం యాభైవేల ఎకరాలు.. ఎకరాకు రెండు కోట్లు చొప్పున మొత్తం లక్షకోట్లు కావాలని చెప్పిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీలకు రూ. రూ. 4,500 కోట్లు ఖర్చు చేయలేరా?ఇప్పుడు యాభైవేల ఎకరాలు సరిపోవు.. మరో యాభైవేల ఎకరాలు కావాలని తీసుకుంటున్నారుఇలా అమరావతి మొత్తంగా లక్ష ఎకరాలు.. రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతూ.. 70వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం అని చెప్పుకుంటూ.. కోట్లాది మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు,ఉచితంగా వైద్యం అందించే మెడికల్ కాలేజీలకు..ఏడాదికి వెయ్యికోట్లు ఐదేళ్లకు ఐదువేల కోట్లు ఖర్చు పెట్టలేక.. ప్రైవేట్ పరం చేస్తున్నారా? చంద్రబాబు.అయ్యన్నపాత్రుడుకి వైఎస్ జగన్ కౌంటర్!అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాంఇందులో భాగంగా నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నేత,ఎమ్మెల్యే,స్పీకర్ చంద్రబాబులా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారుఅబద్ధాలు చెబుతూ.. తాను కూడా చంద్రబాబు కంటే నాలుగు ఆకులే ఎక్కువే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. రుజువు చేసుకుంటున్నారుదీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబుకు బుద్ధిరావాలి’ అని యాజిటేషన్ కార్యక్రమం చేస్తున్నాం. ఇదే నర్సీపట్నం నేత,స్పీకర్కు చెబుతున్నాను.. అబద్ధాలు చెప్పడం,మోసం చేయడం,ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాం.ఈమెడికల్ కాలేజీలకు జీవో ఎక్కడుందని అడుగుతారా?.. ఇదిగో జీవో నెంబర్ 204స్పీకర్ పదవిలో ఉండి జీవో నెంబర్ 204 లేదని అబద్ధాలు చెప్పినందుకు మీ పదవికి మీరు అర్హులేనా? అని ఆలోచన చేయండి. తప్పుడు మాటలు చెబుతూ.. ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబుకు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తలదించుకోవాలిఇదే పెద్దమనిషి చంద్రబాబు 2024 జూన్లో అధికారంలోకి వస్తే..సెప్టెంబర్ 3న మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో నిర్మాణాలు ఆపమని ఓ మోమో డిక్లేర్ చేశారు.వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంమెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణు వైఎస్ జగన్ పిలుపుఅక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ,సంతకాల సేకరణఅక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలునవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలునవంబర్ 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలునవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపుగవర్నర్కు నివేదన, కోటి సంతకాల పత్రాల అందజేత -
జగన్ పర్యటనలపై కక్ష సాధింపు: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను హరిస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పర్యటనలపై ప్రభుత్వ కక్ష సాధిస్తోంది. విశాఖ ఎయిర్పోర్టు మొదలుకుని ప్రతీ చోటా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. మాజీ సీఎం కాన్వాయ్ వెనుక పార్టీ నాయకుల వాహనాలను అనుమతించడం లేదు. ప్రతీ చోటా ఆంక్షలు, నియంత్రణలు పెడుతున్నారు. అనకాపల్లి నుంచి మాకవరపాలెం వరకూ ప్రజలెవ్వరినీ రానివ్వడం లేదు.ప్రజలను అడ్డుకునేందుకు దాదాపు మూడు వేల మంది పోలీసులను పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. రాజకీయ పార్టీలకు ఉండే హక్కులను హరిస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ప్రజా సమస్యలపై గలమెత్తితే సహించలేని పరిస్థితి కూటమి నేతలతో ఏర్పడింది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు అని ఘాటు విమర్శలు స్తున్నారు. -
అడుగడుగునా ఆంక్షలు
● వైఎస్ జగన్ పర్యటనలో కేవలం మూడు చోట్ల మాత్రమే జనాన్ని అనుమతిస్తామంటున్న పోలీసులు ● ఒక్కో పాయింట్ వద్ద500 మందికి మించిఉండకూడదని నిబంధనసాక్షి, అనకాపల్లి: కూటమి సర్కారుకు వణుకు పుట్టింది. మెడికల్ కాలేజీ అంశాన్ని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం వికటిస్తోందని భయం పట్టుకుంది. అందుకే నర్సీపట్నంలో వైద్య కళాశాల ఏర్పాటుకు అసలు జీవోయే విడుదల కాలేదని, నిర్మాణమే జరగలేదని వాదించిన కూటమి నేతలు.. స్వయంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రంగంలోకి దిగుతుండడంతో కలవరపడుతున్నారు. మెడికల్ కాలేజీ అంశంలో అభాసుపాలవుతామన్న ఆందోళనతోపాటు జననేతను కలిసేందుకు వచ్చే జన సంద్రాన్ని చూసి పరువు పోతుందన్న బెంగ వారిని వెంటాడుతోంది. అందుకే గురువారం వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ అవాంతరాలు కల్పిస్తున్నారు. తొలుత రోడ్ షో కుదరదు.. హెలిపాడ్కు అనుమతి కోరితే పరిశీలిస్తామన్న పోలీసు అధికారులు.. చివరకు విశాఖ ఎయిర్పోర్టు నుంచి మాకవరపాలెం మండలంలోని భీమబోయినపాలెం రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనేక ఆంక్షలతో అనుమతించారు. మూడుచోట్ల 500 మందికి మించి జనం రాకూడదు.. ఎట్టకేలకు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతించిన పోలీసులు.. కొత్త మెలికలు, కొర్రీలు పెట్టారు. భారీగా జనం తరలివస్తారని నివేదికలు ఉన్నాయని.. కార్యక్రమానికి ఎంతమంది హాజరవుతారు.. పాల్గొనే వాహనాల సంఖ్య ఎంత.. స్పష్టం చేయాలని వైఎస్సార్ సీపీ నేతలను అడుగుతున్నారు. పోలీసుల అనుమతి ప్రకారం విశాఖ ఎయిర్పోర్టు నుంచి మాకవరపాలెం మెడికల్ కళాశాల వరకు పెందుర్తి, అనకాపల్లి కొత్తూరు జంక్షన్, తాళ్లపాలెం జంక్షన్ల వద్ద మాత్రమే జనం ఉండాలి. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవకూడదని పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. అక్కడ 500 మంది మించి జనం ఉండకూడదంటూ బెదిరిస్తున్నారు. వైఎస్ జగన్పై ప్రజాభిమానాన్ని నిర్వాహకులు ఎలా లెక్కకట్టి చెప్పగలుగుతారు? తమ ప్రియతమ నాయకుడికి సమస్యలు చెప్పుకునేందుకు సామాన్య ప్రజలు వచ్చి వినతి పత్రాలు ఇస్తారు.. ఆయన తీసుకుంటారు. ఇక్కడ కూడా పోలీసు ఆంక్షలేనా అంటూ సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పర్యటనకే అనుమతి.. ఫ్లెక్సీలకు కాదు అనకాపల్లి నుంచి తాళ్లపాలెం వరకు జాతీయరహదారిని ఆనుకుని మాజీ సీఎం పర్యటన మార్గంలో ఫ్లెక్సీలు పెట్టవద్దని పోలీసులు బుధవారం ఓవరాక్షన్ చేశారు. పర్యటనకే పర్మిషన్.. ఫ్లెక్సీలకు కాదంటూ వాగ్వాదం పెట్టుకున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎదురుతిరిగి.. రోడ్డుపై ఉన్న కూటమి పార్టీల ఫ్లెక్సీలన్నీ ముందు తొలగించమని డిమాండ్ చేశారు. కూటమి పార్టీలకు ఒక న్యాయం, మాకొక న్యాయమా ఆంటూ ప్రశ్నించారు. దీంతో పోలీసులు చల్లగా జారుకున్నారు. ఇలా జిల్లాలో అనేకచోట్ల ఆటంకాలు కల్పించారు. నేతల గృహ నిర్బంధానికి సన్నాహాలు మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఈనెల 9వ తేదీన ఎవరూ వెళ్లకూడదు.. జనాన్ని తీసుకెళ్లకూడదంటూ పోలీస్స్టేషన్ల నుంచి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అనకాపల్లి టౌన్, రూరల్, కశింకోట, యలమంచిలి రూరల్, యలమంచిలి టౌన్, నర్సీపట్నం టౌన్, రూరల్, చోడవరం టౌన్ పోలీసులు వైఎస్సార్ సీపీ ద్వితీయశ్రేణి, తృతీయశ్రేణి నాయకులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు, మండల, గ్రామ స్థాయి నాయకులను హౌస్ అరెస్ట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భద్రతపై ఎస్పీ సమీక్ష మాకవరపాలెం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో భద్రతపై ఎస్పీ తుహిన్ సిన్హా సమీక్షించారు. మండలంలోని భీమబోయినపాలెం వద్ద గల మెడికల్ కళాశాల భవనాలను ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణానికి జగన్ కాన్వాయ్ చేరుకునే మార్గం, మీడియాతో మాట్లాడనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. పర్యటన సందర్భంగా భద్రతాపరంగా ఎలాంటి లోటుపాట్లు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అలాగే కళాశాల ప్రాంగణం మొత్తం డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) దేవప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, నర్పీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. -
కూటమి కత్తి!
విశాఖ సిటీ: రాష్ట్రంలో అన్ని జిల్లాలను కలుపుతూ ఒక మెడికల్ సర్క్యూట్ను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే గత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచేందుకు సిద్ధమైంది. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్న గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యాన్ని కాలరాసే పన్నాగాలు పన్నుతోంది. పేదలకు వైద్య విద్యతో పాటు.. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించేందుకు గతంలో శ్రీకారం చుడితే.. కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తోంది. పేద, బడుగు, బలహీన వర్గాలకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేయాలని కంకణం కట్టుకుంది. 2022, డిసెంబర్ 30న అప్పటి సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన చేయగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈ కళాశాల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు అండ్ కో విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.అనకాపల్లిలో ఏర్పాటు చేయకుండా అడ్డంకులురాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుడితే వాటిని అడ్డుకోవడానికి చంద్రబాబు గ్యాంగ్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. తొలి విడతలో అనకాపల్లి టౌన్లో ఏర్పాటుకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించగా.. స్థానిక టీడీపీ నేతలు న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారు. దీంతో అనకాపల్లి నుంచి నర్సీపట్నం నియోజకవర్గానికి వైద్య కళాశాలను తరలించాల్సి వచ్చింది. ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. అలాగే ఏటా 150 ఎంబీబీఎస్ సీట్లలో విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. తర్వాత పీజీ వైద్య కోర్సులు వస్తాయి. తద్వారా పీజీ వైద్య విద్యార్థులు, వారికి వైద్య విద్య బోధించే ప్రొఫెసర్లు (నిపుణులైన వైద్యులు) అందుబాటులోకి వస్తారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అక్కడే నివాసం ఉండాల్సి ఉంటుంది. దీంతో గ్రామీణ ప్రజలకు 24 గంటలూ అత్యవసర వైద్యం అందుతోంది. కానీ ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటిని కౌంటర్ చేయలేక కిందామీదా పడుతోంది. ఇది కూటమికి ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉండడంతో అసలు వైద్య కాలేజీ నిర్మాణాలే జరగలేదని మంత్రులు అబద్దాలకు తెరతీశారు.వందేళ్ల తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలఉత్తరాంధ్రలో 1921లో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. వందేళ్ల తర్వాత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నర్సీపట్నం, పాడేరుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించింది. 2022, డిసెంబర్ 30న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2025 నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో 50.15 ఎకరాల్లో 13.21 లక్షల చ.అ. విస్తీర్ణంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఏటా 150 ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ, ఇతర భవనాల నిర్మాణాలు జోరుగా సాగాయి. ఫుటింగ్ దశలో భవనాలు ఉండగా.. ఐటీడీ బ్లాక్, 24x7 బ్లాక్ స్లాబ్ వేయడం జరిగింది. మార్చురీ బ్లాక్, మెడికల్ గ్యాస్ ప్లాంట్, బయోమెడికల్ గ్యాస్ ప్లాంట్, ల్యాండరీ, ఆసుపత్రి కిచెన్ పనులు వేగంగా జరిగాయి. దాదాపు 50 శాతానికి పైగా నిర్మాణపనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కాలేజీ నిర్మాణాలకు బ్రేకులు పడ్డాయి. -
స్పీకర్ ఒత్తిడితో కట్టడికి యత్నాలు
మాకవరపాలెం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒత్తిడితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు జనం రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేష్ ఆరోపించారు. గురువారం జరగనున్న జగన్ పర్యటన నేపథ్యంలో మెడికల్ కాలేజీ వద్ద నుంచి మాట్లాడిన వీడియోను ఉమాశంకర్గణేష్ బుధవారం మీడియాకు విడుదల చేశారు. ఇప్పటికే పోలీసులు వైఎస్సార్సీపీ నేతలకు బెదిరింపులతో పాటు నోటీసులు ఇచ్చారన్నారు. నేతలపై ఆంక్షలు విధించడమే కాకుండా కళాశాల వద్దకు జనాన్ని రాకుండా ఆటో డ్రైవర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పోలీసులు ఆదేశాలు జారీ చేశారని విమర్శించారు. వైద్య కళాశాల చుట్టూ ఉన్న దారులపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల కోసం జగన్ వస్తున్నారని, వేలాది మందికి మేలు చేయడమే లక్ష్యంగా 630 పడకలతో మెడికల్ కళాశాలను మంజూరు చేశారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూడటాన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, నాయకులు ఎన్ని ఆంక్షలు విధించినా జగన్ పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
విద్యార్థుల స్థాయికి తగ్గట్లు బోధించాలి
సబ్బవరం: ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ, విద్యార్థుల స్థాయికి తగ్గట్లు బోధన చేసి, వారిని బాధ్యతాయుత పౌరులుగా తయారు చేసేందుకు కృషి చేయాలని అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో డీఎస్సీ–2025లో ఎంపికై న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. నూతన ఉపాధ్యాయులకు ఏ విధంగా శిక్షణ అందిస్తున్నారో తెలుసుకుని, బోధనలో అవలంభించాల్సిన పద్ధతులను సూచించారు. విద్యార్థుల స్థాయికి తగ్గట్లు బోధన చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో ప్రదర్శించిన టీఎల్ఎం ప్రాజెక్టులను పరిశీలించారు. ముందుగా వర్సిటీ ఉపకులపతి కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. వర్సిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దామోదరం సంజీవయ్య, మహాత్మా గాంధీ విగ్రహాలను సందర్శించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులను సూచించారు. కార్యక్రమంలో డీఈవో గిడ్డి అప్పారావునాయుడు, ఏపీసీ డాక్టర్ ఎ.అప్పలనాయుడు, అల్లూరి జిల్లా డీఈవో బ్రహ్మాజీ, ఏఎంవో కెజియా, కోర్సు డైరెక్టర్ సింహాచలం, తహసీల్దార్ బి.చిన్నికృష్ణ, ఎంఈవో రవీంద్రబాబు, ట్రైనీలు, డీఆర్పీలు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలి
మునగపాక: నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించేందుకు గురువారం వస్తున్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలకాలని ఆ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ప్రసాద్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పేదవాడు చదువుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలను గతంలో వైఎస్ జగన్ సర్కారు మంజూరు చేసిందన్నారు. వాటిలో ఇప్పటికే ఏడు కళాశాలల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. మిగతా కళాశాలల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నా రు. మాకవరపాలెం మండలంలో మెడికల్ కళాశాల నిర్మాణంలో ఉందన్నారు. అయితే ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసలు ఇక్కడ మెడికల్ కళాశాల లేదని, జీవో కూడా లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం విచారకరమని చెప్పారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు. ఇటువంటి చర్యలు సరికాదంటూ ప్రజలకు వివరించడంలో భాగంగా వైఎస్ జగన్ మాకవరపాలెం మండలంలో కళాశాలను సందర్శించేందుకు వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారని, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి, ఘన స్వాగతం పలకాలన్నారు. -
చౌడువాడ, కొత్తకోట డాక్టర్లకు కలెక్టర్ అభినందన
వైద్యులను అభినందిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: స్వచ్ఛాధ్ర–స్వర్ణాంధ్ర పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందిన చౌడువాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా స్థాయిలో ప్రథమబహుమతి పొందిన కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు కె.మాలంనాయుడు, కె.ఎం.సురేఖలను బుధవారం కలెక్టర్ విజయకృష్ణన్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హైమావతికి సూచించారు. -
పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ఏర్పాట్లపై చర్చిస్తున్న బొత్స, తలశిల రఘురామ్, మాజీ మంత్రులు మాకవరపాలెం: మెడికల్ కళాశాల భవనాలను సందర్శించేందుకు గురువారం భీమబోయినపాలెం వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రుల బృందం పరిశీలించింది. వైఎస్ జగన్ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాఽథ్, మాజీ మంత్రి విడదల రజని, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్లతో కలిసి బొత్స ఏర్పాట్లను సమీక్షించారు. పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పరిశీలకురాలు శోభా హైమావతి, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు, మండల స్థాయి నేతలు పాల్గొన్నారు. -
25వ రోజు కొనసాగిన మత్స్యకారుల ఆందోళన
నక్కపల్లి: బల్క్డ్రగ్పార్క్ను వ్యతిరేకిస్తూ రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న ఆందోళన 25వ రోజు బుధవారం కొనసాగింది. బల్క్ డ్రగ్పార్క్ను వ్యతిరేకిస్తూ తాము చేపట్టిన ఉద్యమంలో వెనుకడుగు వేసేప్రసక్తి లేదని వారు చెప్పారు. ఇతర జిల్లాల్లో వ్యతిరేకించిన ప్రమాదకర రసాయన పరిశ్రమలను మా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ప్రాణాలొడ్డయినా సరే అడ్డుకుని తీరుతామన్నారు. తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే వివిధ రాజకీయ పార్టీ నాయకులను ప్రభుత్వం పోలీసుల సాయంతో అడ్డుకుంటోందని తెలిపారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఓట్లకోసం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తామన్నారు. టీడీపీని నమ్మి రెండు వేల ఓట్ల మెజార్టీ ఇస్తే తగిన బుద్ధి చెప్పారని మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు నిరాహార దీక్షకొనసాగిస్తామని మత్స్యకారులు తెలిపారు. ఈ దీక్షలో మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు, మత్స్యకార నాయకులు మైలపల్లి సూరిబాబు, కర్రి చంద్రశేఖర్, సోమేష్, పిక్కిస్వామి, అప్పలరాజు, సూరి, కాశీ, నానాజీ మహేష్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీరుపై మహిళ ఆగ్రహం
బుచ్చెయ్యపేట: ఆర్టీసీ బస్సు డ్రైవర్ తీరును నిరసిస్తూ ఓ మహిళ వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్లో ఆర్టీసీ బస్సును రోడ్డుపై ఆపేసి ఆందోళనకు దిగింది. మాడుగులకు చెందిన ఓ మహిళ పరవాడలో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. మాడుగుల నుంచి వడ్డాది వచ్చి, వడ్డాది నుంచి తన కంపెనీ బస్సులో రోజూ విధులకు వెళ్లి వస్తుంటుంది. బుధవారం ఎప్పటిలాగే వడ్డాది రావడానికి మాడుగులలో విశాఖ–మాడుగుల ఆర్టీసీ బస్సు ఎక్కగా డ్రైవర్ ఈ బస్సు వడ్డాది వెళ్లదని చెప్పాడు. దీంతో ఆ మహిళ బస్సు దిగిపోయింది. డ్యూటీకి వెళ్లడానికి ఆలస్యమవుతోందని వడ్డాదిలో దింపమని తన భర్తను కోరింది. భర్త బైక్పై ఆమెను వడ్డాది తీసుకు వచ్చాడు. అప్పటికే మాడుగులలో ఎక్కగా దింపేసిన ఆర్టీసీ బస్సు వడ్డాది జంక్షన్లో ఉండడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను అడిగితే వడ్డాది బస్సు వెళ్లదని సమాధానం చెప్పి, ఇప్పుడు వడ్డాది జంక్షన్కు బస్సును ఎందుకు తీసికొచ్చారని డ్రైవర్ను ప్రశ్నించింది. వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్లో ఆర్టీసీ బస్సు ముందు నిలబడి నిరసనకు దిగింది.ఆమెకు మద్దతుగా ఆమె కుటుంబ సభ్యులు నిలిచారు. దీంతో పాడేరు, చోడవరం, అనకాపల్లి, మాడుగుల వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలు ట్రాఫిక్లో నిలిచిపోయాయి. అర గంటకు పైగా వాహనాలు నాలుగు రోడ్ల జంక్షన్లో ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. పలువురు అత్యవసరంగా వెళ్లాలని ఆ మహిళలను వేడుకోవడంతో ఆర్టీసీ డ్రైవర్ సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. డ్రైవర్ ఎంతకీ సారీ చెప్పకపోవడంతో నిరసన విరమించడానికి అంగీకరించలేదు. స్థానికులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో ఆ మహిళ ఎట్టకేలకు నిరసన విరమించింది. -
కట్టమంచికి అవమానం
విశాఖ సిటీ: ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏయూ పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే హాస్టళ్లలో సమస్యలు, పురుగుల భోజనం, విద్యార్థి మరణం వంటి అనేక వివాదాలు చుట్టుముట్టగా, తాజాగా స్నాతకోత్సవ వేదిక మార్పు అంశం అగ్గి రాజేస్తోంది. ఆంధ్రా యూనివర్సిటీ తొలి ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి(సీఆర్ రెడ్డి)ని అగౌరవపరిచేలా ఏయూ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వర్సిటీ వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కట్టమంచికి గౌరవార్థంగా ఏయూలో నిర్మించిన ‘కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం(కాన్వొకేషన్ హాల్)’లోనే పట్టభద్రుల పట్టాల పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. చరిత్రలో తొలిసారిగా స్నాతకోత్సవం వేదికను మార్చాలనే నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కట్టమంచి నుంచి కన్వెన్షన్ సెంటర్కు.. ఏయూలో ఈ నెల 15న 91వ, 92వ స్నాతకోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండేళ్ల పట్టభద్రులకు ఒకేసారి పట్టాలు అందించాలని నిర్ణయించారు. ఎప్పటిలాగే కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం హాల్లో కాన్వొకేషన్ జరుగుతుందని అందరూ భావించారు. అయితే.. ఈ స్నాతకోత్సవాన్ని అక్కడి నుంచి బీచ్రోడ్డులో ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్కు మార్చినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై ఏయూలో పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. స్నాతకోత్సవాన్ని ఉత్సవ రంగంలో కాకుండా వేరే చోట నిర్వహించడం కట్టమంచిని అవమానించడమే అన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో.. కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం హాల్ మరమ్మతులకు గురైందన్న సాకును అధికారులు తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు జరిగిన అన్ని స్నాతకోత్సవాలు అక్కడే జరిగాయి. తాజాగా 91వ, 92వ కాన్వొకేషన్ను నిర్వహించాలని నిర్ణయించినప్పుడు, ఈలోపే మరమ్మతులు ఎందుకు పూర్తి చేయలేదన్న ప్రశ్నలను ఏయూలో కొందరు సంధిస్తున్నారు. ఏయూ ప్రారంభం నుంచి వస్తున్న సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. ఆలస్యంగా మరమ్మతులు కట్టమంచి రామలింగారెడ్డి ఉత్సవ రంగం హాల్ మరమ్మతులకు గురైన మాట వాస్తవమే. పైన సీలింగ్ ఊడి పడే ప్రమాదం ఉంది. 91వ, 92వ కాన్వొకేషన్ నిర్వహించాలని నిర్ణయించడానికి ముందే ఈ మరమ్మతులను పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఆ పని చేయలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల ఇందులో పనిచేస్తున్న కార్మికుడొకరు పై నుంచి కిందపడి మరణించారు. దీంతో పోలీసులు తాత్కాలికంగా పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా మరమ్మతు పనులు మరింత ఆలస్యమయ్యాయి. -
కేజీహెచ్లో వద్దు.. కురుపాం వెళ్లిపోండి.!
సాక్షి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం అంతు లేని నిర్లక్ష్యం కారణంగా.. ఇప్పటికే ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వంద మందికి పైగా విద్యార్థినులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయినా ప్రభుత్వంలో కించిత్తు పశ్చాత్తాపం కనిపించలేదు. చికిత్స పొందుతున్న విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్య తను విస్మరిస్తోంది. వైద్యం అందించడంలోనూ రాజకీయం చేస్తోంది. విశాఖలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారవ్వడం..పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు వస్తున్నారని తెలుసుకున్న ప్రభుత్వం.. విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పూర్తిగా నయమవ్వకుండానే విద్యార్థినులను కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తున్నారు. బాబ్బాబూ.. పాప ఇంకా నీరసంగా ఉందయ్యా.. అని వేడుకుంటున్నా.. కేజీహెచ్లో వద్దు.. కురుపాం వెళ్లిపోండంటూ పంపించేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని ఏకల వ్య పాఠశాల, దానిని ఆనుకొని ఉన్న గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో విషజ్వరాలు ప్రబలి ఇద్దరు విద్యార్థినులు మృత్యు ఒడికి చేరుకున్నారు. 120 మందికి పైగా ఆస్పత్రుల పాలయ్యారు. వీరి లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో కురుపాం, పార్వతీపురం ఆస్పత్రుల నుంచి కేజీహెచ్కు 64 మంది విద్యార్థులను తరలించారు. ఆ సమయంలో వీరందరి ఆరోగ్యం కూడా కాస్తా విషమంగా ఉంది. ప్రతిరోజూ వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించి.. వైద్య సహాయక చర్యలపై ఆరా తీసిన తర్వాతే... విద్యార్థులకు వైద్య సేవలు ముమ్మరం చెయ్యడం ప్రారంభించారు. దీంతో పిల్లలు ఇప్పుడిప్పుడే కాస్తా కోలుకుంటున్నారు. వైఎస్ జగన్ వస్తున్నారని..! కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను గురువారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శిస్తారని తెలిసినప్పటి నుంచి కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. కురుపాం ఘటనను బాహ్య ప్రపంచానికి తెలియకుండా మాఫీ చేసేందుకు ప్రభుత్వం యత్నించినా బట్టబయలైంది. ఇక వైఎస్ జగన్ వస్తే.. జాతీయ స్థాయి ఇష్యూగా మారుతుందనే ఆందోళన ప్రభుత్వంలో కనిపించింది. దీంతో విద్యార్థినుల ఆరోగ్యంతో చెలగాటమాడేందుకు కూడా వెనుకాడటం లేదు. హోంమంత్రి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నీరసంగా ఉన్నా కనికరించకుండా విద్యార్థినులను కేజీహెచ్ నుంచి డిశ్చార్జ్ చేయ డం మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి 8 మందిని, బుధవారం రాత్రి ఆదరాబాదరాగా మరో 10 మందిని పంపించేశారు. శుక్రవారం ఉదయంలోపు మరో 10 మందిని పంపించేందుకు డిశ్చార్జ్ షీట్స్ సిద్ధం చేస్తున్నారు. పాప నీరసంతో నడవలేకపోతోంది.. రెండు రోజులు ఇక్కడ ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నా.. ఏం ఫర్వాలేదు.. మీరు కురు పాం పీహెచ్సీలో జాయిన్ అవ్వండంటూ డిశ్చార్జ్ షీట్లో రాసి మరీ పంపించేస్తుండటం దారుణం. ఆహారం విషయంలోనూ.. బాధిత విద్యార్థినుల ఆహారం విషయంలోనూ అదే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. పచ్చకామెర్లతో బాధపడుతున్న వారికి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. కానీ కేజీహెచ్లో ప్రతిరోజూ అందరికీ అందించే ఉప్మా ఇచ్చారు. హోం మంత్రి అనిత పరామర్శించిన సమయంలో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. తర్వాత నుంచి ప్రత్యేక మెనూ ఇస్తున్నారు. మొత్తానికి తమ రాజకీయం కోసం.. విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా కూటమి ప్రభుత్వం లెక్కచేయకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
జస్టిస్ గవాయ్పై దాడిని ఖండిస్తూ న్యాయవాదులు నిరసన
నర్సీపట్నం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం బెంచ్ని బాయ్ కాట్ చేసి, నిరసన తెలిపారు. ఈ ఘటన జరగటం దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కె.అప్పలనాయుడు, జనరల్ సెక్రెటరీ శివకృష్ణ, కోశాధికారి వెంకటరమణ, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయటం దుర్మార్గమైన చర్య అని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి అన్నారు. అబిద్సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని విమర్శించారనే నెపంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడి చేశారన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిపైనే దాడి జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వెనకబడిన వర్గాలపై మతోన్మాదుల దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై దాడి చేయడమంటే రాజ్యాంగంపై దాడి చేసినట్టేనన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వై.పాపారావు, గిరిజన సంఘ నాయకులు హరిప్రసాద్, తలుపులు, లోవరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సీఎం జగన్ పర్యటన ఇలా..
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం, పెందుర్తి, సబ్బవరం–అనకాపల్లి జాతీయ రహదారి మీదుగా కొత్తూరు జంక్షన్.. అక్కడ నుంచి తాళ్లపాలెం జంక్షన్ మీదుగా మాకవరపాలెం మండలంలో భీమబోయినపాలెం మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ కళాశాలను పరిశీలించి 1.30 నుంచి 2.15 గంటల వరకు మీడియాతో మాట్లాడతారు. అనంతరం విశాఖలోని కేజీహెచ్కు 4 గంటలకు చేరుకుంటారు. కురుపాం గిరిజన ప్రభుత్వ వసతి గృహంలో అస్వస్థతకు గురై ఇక్కడ చికిత్స పొందుతున్న గిరిజన బాలికలను పరామర్శిస్తారు. అక్కడ నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు సాయంత్రం 6 గంటలకు చేరుకొని విమానంలో తిరుగుపయనమవుతారు. -
గురుకుల పాఠశాల విద్యార్థిని అదృశ్యం
నక్కపల్లి: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. పాఠశాల సిబ్బంది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన ఎం.రామతులసి దసరా సెలవులకు ఇంటి వెళ్లి మంగళవారం తిరిగి పాఠశాలకు వచ్చింది. అదే రోజు రాత్రి సుమారు పదిగంటల సమయంలో పాఠశాల గోడ దూకి బయటకు వెళ్లినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. రామతులసి ఇంటికి గాని, పాఠశాలకు గాని తిరిగి రాలేదు. పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. -
ఎన్–బ్రాండ్తో ప్రజల ప్రాణాలకు ముప్పు
బీచ్రోడ్డు (విశాఖ): రాష్ట్రంలో ‘నారా వారి సారా’, ‘ఎన్ బ్రాండ్ లిక్కర్’తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. అటువంటి కల్తీ మద్యంను తక్షణమే అరికట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆదేశాల మేరకు బుధవారం సిరిపురంలోని జిల్లా ఎకై ్సజ్ కార్యాలయం వద్ద కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాళ్లు మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పేడాడ రమణికుమారి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో లేని మద్యం కల్తీ ఉందని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం వ్యాపారాన్ని విచ్చలవిడిగా కొనసాగిస్తోందని మండిపడ్డారు. కల్తీ మద్యం వ్యాపారం చేస్తూ పట్టుబడిన టీడీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో మొదటి నుంచి ఇటువంటి కల్తీ మద్యం వ్యాపారాలు, లిక్కర్ స్కాములు సర్వసాధారణమని ఆమె ఆరోపించారు. 2014–19 మధ్యలో కూడా వేల కోట్లకు పైగా లిక్కర్ స్కామ్కు టీడీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. ప్రస్తుతం దానికి మించి లిక్కర్ స్కామ్ జరుగుతోందని, ఇటీవల పట్టుబడిన కల్తీ మద్యం తయారీ కేంద్రమే ఇందుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి స్కామ్లు లేకపోయినా.. అక్రమంగా తమ పార్టీకి చెందిన పలువురిని అరెస్టు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్నారు. అయితే న్యాయం తమ వైపే ఉంది కాబట్టి కోర్టుల ద్వారా వారు విముక్తి పొందారని రమణికుమారి గుర్తుచేశారు. మహిళల తాలి బొట్టులతో ఆటలాడుతున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లే అనురాధ, రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు రాధ, కార్పొరేటర్ శశికళ, జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి వర్మ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, నాయకులు భాను, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, తూర్పు, దక్షిణ, గాజువాక మహిళా విభాగం అధ్యక్షులు శిరీష, బంగారమ్మ, పల్లా చిన్నతల్లి, టీచర్స్ విభాగం ప్రతినిధులు కల్పన, జ్యోతి, పద్మావతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ దృష్టికి మత్స్యకారుల ఆందోళన
నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతున్న నాయకులు నక్కపల్లి: రాజయ్యపేట సమీపంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత 25 రోజులుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. బుధవారం నక్కపల్లిలోని పార్టీ కార్యాలయంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, తదితరులు విలేకర్లతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలల సందర్శనకు వస్తున్న వైఎస్ జగన్ను గురువారం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, మత్స్యకార నాయకురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, మత్స్యకార నాయకుడు ఎరిపల్లి నాగేశు తదితరులతో కలిసి, వినతిపత్రం అందజేస్తామన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల కలిగే నష్టాన్ని తమ అధినేతకు వివరించి, మద్దతు కోరతామన్నారు. మత్స్యకారుల సమస్యలపై వైఎస్ జగన్ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, మత్స్యకారులు తరలిరావాలని వారు కోరారు. -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన బెన్నవరం పంచాయతీ చిన కొత్తపాలెంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నాతవరం మండలం మన్యపురట్ల గ్రామానికి చెందిన ముత్తా రమణ (54) ఏజెన్సీలో వ్యాపార నిమిత్తం తరచూ వస్తుంటాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్వగ్రామం మన్యపురట్ల నుంచి మండలంలోని చినకొత్తపాలెం గ్రామానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో వర్షం పడుతుండగా చెట్టు కింద ఆగాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పీజీఆర్ఎస్ అర్జీలు ఆన్లైన్ తప్పనిసరి
తుమ్మపాల: డివిజన్, మండల స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి రశీదు ఇవ్వాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్, రీసర్వే, ఎంఎల్సీసీ, ఐవీఆర్ఎస్, నీటి తీరువా, కోర్టు కేసులు, సివిల్ సప్లయి, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, ఆర్వోఆర్ కోర్టు, దీపం–2 పథకం రీ పేమెంటు, ఓటరు మ్యాపింగ్ వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీదారుడితో అధికారులు స్వయంగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ భూములను సర్వే చేసి, ఆక్రమణలు గుర్తించి నోటీసులు అందజేయాలన్నారు. మండల స్థాయి సమన్వయ కమిటీకి సిఫార్సు చేసిన సివిల్ కేసులను శత శాతం పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కుటుంబ సభ్యుల మధ్య సివిల్ తగాదాలకు సంబంధించి కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారం చూపాలన్నారు. నీటి తీరువా వసూలు పెంచాలన్నారు. కోర్టు కేసులు పూర్తి చేయాలని, ప్రతి శనివారం ఆర్వోఆర్ కోర్టు నిర్వహించాలని సూచించారు. మొదటి విడత రీ సర్వే పూర్తయిందని, రెండో విడత సర్వేలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలన్నారు. మూడో విడత రీ సర్వే మొదలు పెట్టిన 30 గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులు నిర్ణయించాలని, రికార్డుల శుద్ధీకరణ చేయాలని ఆదేశించారు. రేషన్ షాపులు, బియ్యం బిల్లు, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను తహసీల్దార్లు, సివిల్ సప్లయి అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శత శాతం పూర్తి చేయాలన్నారు. దీపం పథకానికి సంబంధించి నిధుల జమలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ఓటరు జాబితాలకు సంబంధించి వెరిఫికేషన్ పూర్తి చేసిన అనంతరం ప్రతి ఓటరును మ్యాపింగ్ చేయాలన్నారు. ఫారం 6కు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఎం.జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, రెవెన్యూ డిజినల్ అధికారులు వి.వి.రమణ, షేక్ ఆయిషా, జిల్లా సప్లయి అధికారి మూర్తి, సర్వే సహాయ సంచాలకుడు గోపాలరాజ, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
జగన్ పర్యటనను ఆంక్షలతో అడ్డుకోలేరు: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఆంక్షలు పెట్టడం ఏంటీ? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ రోడ్డు మార్గాన రావడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వైఎస్ జగన్ హెలికాఫ్టర్లో వస్తే పరిశీలిస్తామని పోలీసులు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రతిపాదించిన రూట్ మ్యాప్ కాకుండా ఖాకీలు వేరే రూట్ మ్యాప్ ఇచ్చారు. విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికులను కలవకుండా కూటమి కుట్రలు పన్నుతుంది’’ అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ పర్యటనకు అనేక అడ్డంకులను కూటమి ప్రభుత్వం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ పర్యటనపై విశాఖ అనకాపల్లి జిల్లాల పోలీసులకు అనేక సార్లు సమాచారం ఇచ్చాము. జగన్కు భద్రత కల్పించమని అడిగాము. విశాఖ ఎయిర్ పోర్టు మీదగా గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి మీదగా నర్సీపట్నం వెళ్లేందుకు అనుమతి అడిగాము. రూట్ మార్చి పోలీసుకు రూట్ మ్యాప్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్ను కవలకూడదు అని రూట్ మార్చారు.ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చారు. ఎంతోమంది స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు కోల్పోయారు. ప్రజల సమస్యలు మాకు ముఖ్యం. కాబట్టి పోలీసులు అనుమతి ఇచ్చిన మార్గంలోనే వైఎస్ జగన్ వెళ్తారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చాలా ముఖ్యమైన అంశాలు. వైఎస్ జగన్ పర్యటనకు 18 నిబంధనలతో ఆంక్షలు పెట్టారు. ఎయిర్ పోర్టు, ఎన్ఏడీ, గోపాలపట్నం, పెందుర్తి, అనకాపల్లి మీదగా నర్సీపట్నం మెడికల్ కాలేజీ కి వెళ్తారు. పోలీసుల ఆంక్షలతో జగన్ పర్యటనకు వచ్చే ప్రజలను అడ్డుకోలేరు.చంద్రబాబు పర్యటనలో పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోయారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో ప్రజలు చనిపోయారు. వాటిని పోలీసులు ఎందుకు పోలీసుల లేఖలో ప్రస్తావించలేదు. కరూర్ అంశాన్ని మాత్రమే ఎందుకు ప్రస్తావించారు. చంద్రబాబు ఆదేశాలు మీద పోలీసు అధికారులు సంతకం పెట్టారు. పోలీసులు ఆంక్షలు పెట్టడం సరికాదు. వాటిపై పునరాలోచన చేయాలి’’ అని అమర్నాథ్ కోరారు.‘‘ఏ రోజు మేము జగన్ పర్యటనకు ఎంతమంది జనాలు వస్తారని చెప్పలేదు. పోలీసులు 65,000 మంది ప్రజలు వస్తారని చెప్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లక్ష మంది వస్తారని చెప్తున్నారు. పల్లా మాటల ద్వారా కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. జగన్ పర్యటనకు ఎన్ని ఆంక్షలు పెడితే అంత పెద్ద ఎత్తున ప్రజలు నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ను డైవర్ట్ చేయడం కోసం వైఎస్ జగన్ పర్యటనపై రాద్ధాంతం చేస్తున్నారు...నిన్నటి వరకు జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు. ఈ రోజు రూటు మార్చి పర్యటన చేపట్టాలని పోలీసులు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో నెలకు 1000 కోట్లు కూటమి నేతలు సంపాదించారు. 15 నెలల్లో 15 వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. అక్రమ మైనింగ్లో కూటమి నేతల ప్రమేయం ఉందని టీడీపీ నేతలే చెబుతున్నారు.’’ అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి
తుమ్మపాల: రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆమె గత సమావేశంలో చర్చించిన విషయాలపై తీసుకున్న చర్యలు, ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలుగా (బ్లాక్ స్పాట్స్) గుర్తించిన 26 ప్రాంతాల్లో తక్షణమే చర్యలు చేపట్టాలని, 15 రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత వాహనాలతో పాటు, మైనింగ్ రవాణా వాహనాలను నిత్యం పర్యవేక్షించాలని, ఓవర్ లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు, రెవెన్యూ, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలను ఐ–రాడ్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రులన్నీ రిజిస్ట్రేషను చేయించుకోవాలని, యాక్సిడెంట్ కేసులను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణ, జిల్లా రవాణా అధికారి జి.మనోహర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి హైమావతి, రోడ్లు భవనాల శాఖ ఈఈ ఎన్.సాంబశివరావు, డీఈఈ విద్యాసాగరరావు, పోలీసు, మైనింగు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. -
ఎవరికీ లేని నిబంధనలు ఉపాధ్యాయులకేనా..?
రాష్ట్రంలో ఏ శాఖలో ఉద్యోగులకు లేని నిబంధనలు ఒక్క ఉపాధ్యాయులకే ఎందుకు పెడుతున్నారో అర్థం కావడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయులపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఉపాధ్యాయులు అవసరాలు పట్టించుకోకుండా, సమస్యలు పరిష్కరించకుండా వదిలేశాయి. ఇలాంటి నిబంధనలు మాత్రం మాపై రుద్దడం మంచిదికాదు. మరో వారంలో టెట్ పరీక్ష కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దవాబ్దాలుగా ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు మళ్లీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన నిర్ణయం ఇంతవరకు ప్రకటించకపోవడం బాధాకరం. –టి.ఆర్. అంబేడ్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
ముమ్మరంగా గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం
కె.కోటపాడు: మూడు నెలలు దాటిన ప్రతి పశువుకూ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం చేపడుతున్నట్లు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. కె.కోటపాడు మండలంలో దాలివలస, సింగన్నదొరపాలెం, కె.కోటపాడు గ్రామాల్లో పశువైద్య సిబ్బంది నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం కె.కోటపాడు పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో రికార్డులు ఆయన తనిఖీ చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి డివిజన్లలో 2 లక్షల 46 వేల పశువులకు టీకాలు వేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి లక్షా 57 వేల 844 పశువులకు టీకాలు వేసినట్లు వివరించారు. సెప్టెంబర్ 15న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 15 వరకూ కొనసాగుతుందని తెలిపారు. డ్వాక్రా మహిళలకు బ్యాంక్ లింకేజీ రుణాలు.. డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా మహిళలు పశువులు కొనుగోలు చేసేందుకు బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించనున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటి వరకూ డ్వాక్రా మహిళల ద్వారా 980 పశువులు కొనుగోలు చేయించామన్నారు. ఈ రుణాలతో పెరటి కోళ్లు, గొర్రెలు, మేకలు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. పాడి రైతులకు బ్యాంక్ల ద్వారా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయిస్తున్నామని అన్నారు. తద్వారా రూ.లక్షా 60 వేల వరకూ పశుదాణా, పశు ఇన్సూరెన్స్, పశువుల షెడ్ల మరమ్మతు వంటివి చేయించుకోవచ్చన్నారు. చౌడువాడ పశువైద్యాదికారి సీహెచ్వై నాయుడు, సిబ్బంది సమీరా, ప్రవీణ్కుమార్, జగన్నాథం, తేజ, హనుమంతు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 1200 గోకులం షెడ్ల నిర్మాణం లక్ష్యం.. దేవరాపల్లి: జిల్లాలో 1200 గోకుల షెడ్ల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1062 షెడ్లకు అనుమతులు జారీ అయ్యాయని విశాఖ, అనకాపల్లి జిల్లాల పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు మండలంలోని తెనుగుపూడి, ఎ. కొత్తపల్లి పంచాయతీ శివారు సంజీవపురంలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనకాపల్లిలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం 76 శాతం, విశాఖ జిల్లాలో 71 శాతం పూర్తయిందని, మిగిలిన లక్ష్యాన్ని వారంలోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి, ఎం.అలమండ, మామిడిపల్లి పశువైద్యాధికారులు జి. గాయత్రీదేవి, కె.మంజుషారాణి, జి. ప్రియాంక తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
యువకుడి మృతదేహం లభ్యం
పాయకరావుపేట: మండలంలోని పాల్మన్పేట సముద్రతీరంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపారు. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు పి.అశోక్ సోమవారం సముద్ర స్నానం చేస్తుండగా కెరటాల తాకిడికి గల్లంతయ్యాడు. అతని మృతదేహం మంగళవారం ఉదయం పాల్మన్పేట బీచ్లోనే లభ్యమైనట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఉపాధ్యాయులకు ‘టెట్’ టెన్షన్
ఆరిలోవ: దశాబ్దాలుగా ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులను టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత అంశం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. 2010 సంవత్సరం కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన పరిస్థితి నెలకొనడంతో, రాష్ట్రంలోని ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర సందిగ్ధంలో పడ్డాయి. విద్యా హక్కు చట్టం–2010 ప్రకారం ఉపాధ్యాయ నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మేరకు, 2010 కంటే ముందు వివిధ డీఎస్సీల ద్వారా ఉద్యోగాలు పొందిన వేలాది మంది కూడా టెట్ రాయాల్సి రావడంపై వారు ఆవేదన చెందుతున్నారు. డీఎస్సీ కోసం చదివి ఉద్యోగం సాధించిన మేము ఇప్పుడు మళ్లీ అర్హత పరీక్ష రాయడమేమిటి? అంటూ ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తీర్పు ప్రభావం విశాఖ ఉమ్మడి జిల్లాలో భారీగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ యాజమాన్యాలలో సుమారు 17,000 మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల్లో మరో 12,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ టీచర్లు కూడా ఈ తీర్పు ప్రకారం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇన్ సర్వీస్లో ఉన్నవారు టెట్లో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగానికి ఇబ్బంది తప్పదు. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు తప్పనిసరిగా ఆగస్టు 31, 2027 లోపు టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలి. పదోన్నతి కావాలనుకునేవారు కూడా తప్పనిసరిగా టెట్ రాయాల్సి ఉంటుంది. రెండేళ్ల లోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని తీర్పులో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఈ కీలక సమయంలో రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం టెట్ అంశంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయుల్లో సందిగ్ధత మరింత పెరిగింది. మరోవైపు, టెట్ పరీక్షపై వారంలో నోటిఫికేషన్ విడుదల కానుందనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్దాల సర్వీస్ ఉన్నవారికి పరీక్ష రాయడం, అర్హత సాధించడం తీవ్ర సమస్యగా మారింది. అందువల్ల, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత వ్యవహారంలో మినహాయింపు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. -
మహర్షి వాల్మీకి ఆలోచనలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి/తుమ్మపాల: మహర్షి వాల్మీకి ఆలోచనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో వాల్మీకి చిత్ర పటానికి కలెక్టర్ పూలమాల వేసి అంజలి ఘటించారు. అలాగే స్థానిక ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణం ప్రపంచానికి నిత్యనూతనంగా మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. వాల్మీకి జీవితం సమానత్వం, ధర్మం, న్యాయం, శాంతి వంటి విలువలకు ప్రతీక అన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు టి.లక్ష్మి, ఎస్.బాల సూర్యరావు, ఎస్ఐ శ్రీనివాసరావు, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర, బోయ కమ్యూనిటీ నాయకులు ఆదినారాయణ, జయకృష్ణ, అంగులురి శ్రీను, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శ్రీదేవి పాల్గొన్నారు. -
టెట్పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ఇన్సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్షలకు మినహాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఐదు సంవత్సరాలు పైబడి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా రెండేళ్లలో టెట్ పరీక్ష నుంచి అర్హత సాధించాలని, లేదంటే ఉద్యోగం నుంచి తప్పుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 2010 అక్టోబరు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులంతా కచ్చితంగా టెట్ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉందన్నారు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు పదోన్నతలను, మరికొందరు పూర్తిగా ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. రెవెన్యూ, పోలీస్, వైద్యలు తదితర వృత్తుల్లో ఉన్నవారికి, ఉన్నతాధికారులకు లేని ఇన్ సర్వీస్ అర్హత ఉపాధ్యాయులకు మాత్రమే వర్తింపజేయడాన్ని తీవరంగా ఖండిస్తున్నాం. –ఇమంది పైడిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ -
సెల్ఫోన్, నగదు కోసమే హత్య
● ఇద్దరు నిందితుల అరెస్టు ● మారణాయుధం, సొత్తు స్వాధీనంసామర్లకోట/తుని రూరల్: తాగిన మైకంలో ఓ యువకుడితో గొడవపడి, అతడి వద్ద ఉన్న సెల్ఫోన్, రూ.ఐదొందల నగదు కోసం అతడిని హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తుని రూరల్ పరిధిలోని నర్సీపట్నం బస్టాండ్ వద్ద ఈ నెల రెండో తేదీ రాత్రి తుని రైల్వే ఫ్లైఓవర్ కింద (నర్సీపట్నం బస్టాండ్ వద్ద) జరిగిన గుర్తు తెలియని యువకుడి హత్య సంచలనం రేపింది. కాకినాడ జిల్లా ఎస్సీ జి.బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో నియమించిన ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హత్య కేసును ఛేదించారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు వివరాలు వెల్లడించారు. గొల్లప్రోలు మండలం కొడవలికి చెందిన బొడ్డు సురేష్, పాయకరావుపేటకు చెందిన తర్రా ప్రసాద్ చిత్తు కాగితాలు ఏరుకుంటూ, ఆ సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంటూ లేకపోవడంతో వారు ఆకతాయిలుగా తిరుగుతున్నారు. వీరిద్దరూ ఈ నెల రెండు రాత్రి బస్టాండ్ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన తానార అప్పలనాయుడు (37) బస్టాండ్ వద్దకు వచ్చాడు. నిందితుల వద్దకు వచ్చిన సమయంలో పరధ్యానంలో అప్పలనాయుడు వారిపై పడబోయాడు. దాంతో సురేష్ అతడిని తోసేయడంతో జేబులో ఉన్న విలువైన సెల్ఫోన్ కిందపడింది. చొక్కా జేబులో నగదు కనిపించింది. అతని వద్ద ఉన్న సెల్ఫోన్, నగదు కాజేసేందుకు నిందితులు కుట్ర పన్నారు. అతడి సెల్ఫోన్, నగదును నిందితులు లాక్కునే క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. సమీపంలో ఉన్న రాయి, ఇనుప రాడ్డుతో నిందితులు అప్పలనాయుడిపై దాడి చేశారు. ఇష్టానుసారంగా కొట్టిన తర్వాత రాడ్డును తుప్పల్లోకి విసిరేసి, సెల్ఫోన్, నగదు తీసుకుని పరారయ్యారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ, సంఘటనా స్థలిలో దొరికిన ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారు. మంగళవారం తుని పట్టణ శివార్లలో తచ్చాడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు వాడిన ఇనుప రాడ్డు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరు పర్చుతామన్నారు. కేసును ఛేదించిన తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, గీతారామకృష్ణ, తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచారి, తొండంగి ఎస్ఐలు జగన్మోహన్, జె.విజయబాబు, సిబ్బందిని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు. -
ఆటో, బైక్ ఢీ.. యువకుడికి గాయాలు
రావికమతం: ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొనడంతో యువకుడికి గాయాలయ్యాయి. మండలంలో గర్నికం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న పి.పోన్నవోలు పంచాయతీ కుముందానపేట గ్రామానికి చెందిన మారబోయన నాగ శ్రీను కుడి కాలు విరిగిపోయింది. నర్సీపట్నం నుంచి రావికమతం వస్తున్న ఆటో గర్నికం వద్ద బైక్ను ఢీకొట్టడంతో శ్రీను గాయపడ్డారు. క్షతగాత్రుడిని హుటాహుటిన రావికమతం పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది శ్రీనుకు ప్రథమ చిక్సిత చేసి కాలు విరిగిందని నిర్థారించి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరిలించారు. -
జీతం బకాయి కోసం కుటుంబ సమేతంగా ఆందోళన
● 29 మాసాలుగా వేతనం చెల్లించని పంచాయతీ కార్యాలయం ● న్యాయపోరాటానికి దిగిన విశ్రాంత ఉద్యోగి వెంకటరత్నంమాడుగుల రూరల్: కె.జె.పురం గ్రామ పంచాయతీ కార్యాలంలో గతంలో పని చేసిన కాలానికి జీతం ఇవ్వని కారణంగా పంచాయతీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో ఓ మాజీ ఉద్యోగి మంగళవారం అందోళన చేపట్టారు. మాడుగుల గ్రామానికి చెందిన బోండా వెంకటరత్నానికి ఆమె భర్త మరణాంతరం స్పౌజ్ కోటాలో ఉద్యోగం వచ్చింది. వెంకటరత్నం భర్త ఆనందరావు గతంలో మాడుగుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో బిల్లు కలెక్టరుగా పని చేసేవారు. 1998 సెప్టెంబరులో ఆయన మృతి చెందడంతో వెంకటరత్నానికి ఆఫీసు వాచ్వుమెన్గా ఉద్యోగం ఇచ్చారు. ఈమె కె.జె.పురం గ్రామ పంచాయతీలో 2019 డిసెంబరు 30న ఉద్యోగ విరమణ చేశారు. పంచాయతీ నిధుల కొరతతో 29 మాసాల జీతం ఆమెకు చెల్లించలేదు. సుమారు రూ. 9 లక్షలు పంచాయతీ నుంచి రావలసి ఉంది. ఈ జీతం గురించి ఉద్యోగ విరమణ చేసినప్పటి నుంచి పంచాయతీ కార్యాలయం చుట్టు తిరిగినా ఫలితం లేకపోయింది. బకాయి చెల్లించాలని అమె మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి అందోళన చేపట్టారు. ఆ సమయంలో పంచాయతీ జూనియర్ సహాయకులు, బిల్లు కలెక్టర్ వున్నారు. పంచాయతీ కార్యదర్శి చింతలూరులో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో ఉన్నారు. పంచాయతీ కార్యదర్శి నవీన్దొరతో అమె ఫోన్లో మాట్లాడారు. 5 మాసాలకు సంబంధించిన జీతాల ప్రతిపాదన పెడతామని ఫోన్లో హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించారు. -
మాజీ సీఎం జగన్ పర్యటన విజయవంతానికి పిలుపు
దేవరాపల్లి: మాకవరపాలెం మెడికల్ కాలేజీ సందర్శనకు విచ్చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు తారువలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అధినేత జగన్కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలతో పాటు పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయాలనే ఆశయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వీటిలో ఏడు కాలేజీలను పూర్తి చేశారన్నారు. నిర్మాణంలో ఉన్న కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుందని, దీంతో ఈ ప్రాంత పేద విద్యార్థులకు, ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నూతనంగా మంజూరు చేసిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలనే డిమాండ్తో నర్సీపట్నం నియోజకవర్గం, మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ సందర్శనకు మాజీ సీఎం జగన్ వస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. -
ఎగసిపడ్డ నిరసన కెరటం
హోం మంత్రికి ముందు నుయ్యి, వెనుక గొయ్యినక్కపల్లి: రాజయ్యపేటలో మత్స్యకారుల ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. 24వ రోజుకు చేరుకున్నా అదే తీవ్రతతో కొనసాగుతోంది. తమ ఉనికికి విఘాతంగా నిలిచే బల్క్డ్రగ్ పార్క్ను రద్దు చేయాలంటూ మత్స్యకారులు చేస్తున్న నిరశన దీక్షకు వివిధ ప్రజాసంఘాలు, పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా ఆదివారం ఆనందపురంలో జరిగిన ఉత్తరాంధ్ర స్థాయి వైఎస్సార్సీపీ విస్తృత సమావేశంలో బల్క్డ్రగ్ పార్క్ రద్దు చేయాలన్న ప్రస్తావన వచ్చింది. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో కూడా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎంపీలు మత్స్యకారులకు మద్దతుగా బల్క్డ్రగ్ పార్క్ ప్రస్తావన తీసుకువచ్చారు. బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ మత్స్యకారుల దీక్షకు మద్దతుగా రాజయ్యపేట వస్తుంటే ఇటీవల రాజమండ్రి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీక్షలో పాల్గొనకుండా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజును గృహనిర్బంధం చేశారు. సంఘీభావం తెలిపేందుకు సోమవారం రాజయ్యపేట బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. అదేవిధంగా మంగళవారం డీసీసీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్నను కూడా అడ్డుకొని, సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందంటూ నిలువరించారు. రోజురోజుకు తీవ్రతరం 24 రోజుల క్రితం గ్రామంలో ప్రశాంతంగా ప్రారంభమయిన దీక్ష రోజురోజుకు తీవ్రతరమైంది. నాలుగు రోజుల ఆందోళన తర్వాత పనులు అడ్డుకున్నారు. ప్రభుత్వం గానీ, స్థానిక ప్రజాప్రతినిధి, హోం మంత్రి వంగలపూడి అనిత గానీ స్పందించక పోవడంతో ఆగ్రహం చెందిన మత్స్యకారులంతా రోడ్డుపై నిప్పు పెట్టి బల్క్డ్రగ్ పార్క్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ వాహనాలను అడ్డుకున్నారు. అధికారులు చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. దీంతో దిగి వచ్చిన హోం మంత్రి మత్స్యకారులతో చర్చలు జరుపుతానని వీడియో సందేశం పంపించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రి అనిత రాజయ్యపేట వచ్చినప్పుడు మత్స్యకారులు ఆమె కాన్వాయ్ను అడ్డుకురన్నారు. గ్రామస్తులంతా కమిటీగా ఏర్పాటయి వస్తే సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్తానని మంత్రి అనిత చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని పట్టుబట్టారు. దీంతో ఆందోళన కారుల నుంచి తప్పించుకునేందుకు బల్క్డ్రగ్ పార్కు పనులు తాత్కాలికంగా నిలిపివేస్తామని, సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని ప్రకటించి అక్కడ నుంచి బయట పడ్డారు. అయితే గంగపుత్రుల ఆందోళన మాత్రం కొనసాగుతోంది. వీరి దీక్షలకు వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, జాతీయ మత్స్యకార సంఘం, సంప్రదాయ మత్స్యకార సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. నిర్బంధాలు ఎదురైనా ఆగని మత్స్యకారుల పోరాటం బల్క్డ్రగ్ పార్కు ఉద్యమానికి పెరుగుతున్న మద్దతు అండగా నిలుస్తున్న నేతలను అడ్డుకుంటున్న పోలీసులు అయినా వెల్లువలా సంఘీభావం తాజాగా వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమావేశంలో బల్క్డ్రగ్ పార్క్ నిలిపివేయాలని తీర్మానం హోం మంత్రికి ఉక్కిరిబిక్కిరిబల్క్డ్రగ్ పార్కు వ్యవహారం హోం మంత్రి వంగలపూడి అనిత మెడకు చుట్టుకుంటోంది. ఆమె పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారయింది. రెండేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రాజయ్యపేటలో హెటెరో డ్రగ్స్ వారు సముద్రంలోకి ఏర్పాటు చేస్తున్న పైపులైను వద్దంటూ మత్స్యకారులు చేసిన ఆందోళన శిబిరం వద్దకు వెళ్లి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాటి మాటలు నేడు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఈ విమర్శలతో మంత్రికి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. పనులు తాత్కాలికంగా నిలిపివేసి మత్స్యకారులను శాంతింపచేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ ఎంతో కాలం కొనసాగే అవకాశం కనిపించడం లేదు. ఇది మంత్రి స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు. కాంట్రాక్టర్ గనుక ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే పనులు తిరిగి పునః ప్రారంభమవుతాయి. దీంతో మత్స్యకారులు మరింత ఆగ్రహించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరోపక్క ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. మంత్రి గ్రామంలోకి వచ్చి వెళ్లిన తర్వాత టీడీపీకి చెందిన ముఖ్యనాయకులు నిరాహార దీక్షలో పాల్గొనేందుకు దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే మత్స్యకార యువత మాత్రం ఈ వ్యవహారంలో తాడోపేడో తేల్చుకునేందుకు, అవసరమైతే ఏ స్థాయికై నా పోరాటాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. మంత్రి గ్రామంలోకి వచ్చి వెళ్లి వారం రోజులు దాటింది. దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ఉద్యమం మాత్రం కొనసాగుతోంది. -
ఏమ్మా.. ధరలు తగ్గాయా?
● కొత్త జీఎస్టీ శ్లాబ్ రేట్ల అమలుపై ఆరా ● డిపార్ట్మెంటల్ స్టోర్స్లలో అధికారుల తనిఖీలు అనకాపల్లి: ఏమ్మా.. జీఎస్టీ శ్లాబ్ రేట్లు తగ్గాయి కదా... తగ్గిన ధరకే వస్తువులు ఇస్తున్నారా? ధరలు తగ్గాయన్న సమాచారం మీకు తెలుసా.. అంటూ తూనికలు, కొలతల శాఖ జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ బి.రామచంద్రయ్య పట్టణంలోని పలు డిపార్ట్మెంటల్ స్టోర్స్లలో కొనుగోలుదారులతో మాట్లాడారు. డీమార్ట్, మోర్ తదితర స్టోర్స్లలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జీఎస్టీ 2.0 అమలుకు ముందు, సెప్టెంబరు 22 తర్వాత ధరల తేడాను వినియోగదారులకు వివరించారు. షాపులవారు ముందుగా కొనుగోలు చేసిన సరకులపై కొత్త ఎంఆర్పీలను ప్రకటించాలన్నారు. వ్యాపార సంస్థలు జీఎస్టీ సవరణ తేదీకి ముందు తయారు చేసిన అమ్ముడుపోని స్టాక్పై ఉన్న ఎంఆర్పీని సవరించవచ్చని, అయితే అసలు ఎంఆర్పీ తప్పనిసరిగా చూపించాలన్నారు. కన్స్యూమర్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జీఎస్టీ సంస్కరణలు మిశ్ర మంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. తూని కలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ వేలమూర్తి రామారావు, కన్స్యూమర్ రైట్స్ సేఫ్ గార్డింగ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ, రాంబిల్లి వినియోగదారుల మండలి అధ్యక్షుడు ఎస్.నూకరాజు (రాంబిల్లి), కన్స్యూమర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నందవరపు సంజీవరావు (బుచ్చెయ్యపేట), బొడ్డేడ జగ్గప్పారావు (మునగపాక) పాల్గొన్నారు. -
జనసేనలోకి వస్తే ఎంపీపీగా కొనసాగిస్తామన్నారు
● వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి అవిశ్వాసం పెట్టారు ● పార్టీ కంటే ఎంపీపీ పదవి ముఖ్యం కాదు ● ఎంపీపీ బోదెపు గోవింద్ వెల్లడి యలమంచిలి రూరల్: జనసేనలో చేరితే ఎంపీపీ పదవిలో పూర్తి కాలం ఉంచుతామని తనపై స్థానిక జనసేన నాయకులు ఒత్తిడి తెచ్చారని, పార్టీ ఆవిర్భావం నుంచీ తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్నానని, పార్టీ కంటే ఎంపీపీ పదవి తనకు ముఖ్యం కాదని యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్ అన్నారు. ఉన్నతమైన పార్టీ పదవిని అధినేత వైఎస్ జగన్ తనకిచ్చారని, అంతకంటే ఇంకేం కావాలన్నారు. ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కౌన్సిల్ (ఎస్ఈసీ) సభ్యుడిగా నియమితులైన గోవింద్ను మంగళవారం యలమంచిలి పార్టీ కార్యాలయంలో యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంటున్నాయన్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే, కూటమి పార్టీల నాయకులు వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభపెట్టి తమ పార్టీల్లోకి అనైతికంగా చేర్చుకుంటున్నారన్నారు. గతంలో ఎప్పుడూ యలమంచిలి నియోజకవర్గంలో ఈ సంప్రదాయం లేదని, కూటమి పార్టీల నాయకులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. పదవుల కోసం పార్టీలు మారడం అత్యంత అనైతిక చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. యలమంచిలి మండల పరిషత్లో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభపెట్టి అవిశ్వాసానికి తెగబడ్డారని దుయ్యబట్టారు. ఇలాంటి అనైతిక చర్యలను ప్రజలంతా గమనిస్తున్నారని, కూటమి నాయకులకు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. -
9న జగనన్న దృష్టికి ‘గోవాడ సుగర్స్’ దుస్థితి
మాడుగుల రూరల్: ఈ నెల 9న జిల్లా పర్యటనకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి గోవాడ సుగర్ ఫ్యాక్టరీ దుస్థితిని తీసుకెళ్లనున్నట్టు చోడవ రం సీడీసీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన కె.జె.పురంలో నియోజకవర్గ మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ సూర్యనారాయణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల సందర్శనకు వస్తున్న వైఎస్ జగన్కి సుగర్ ఫ్యాక్టరీ దుస్థితిపై వినతిపత్రం అందజేస్తామన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి రూ.90 కోట్లు మంజూరు చేసి, ఆర్థికంగా ఆదుకున్న ఘనత మాజీ సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ప్రస్తుతం సభ్య రైతులకు గడిచిన క్రషింగ్లో ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకుకు పేమెంట్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభు త్వం ఉందని ఆరోపించారు. జీతాలు లేక కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల నాయకులు, రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు -
దేశంలో రక్త అవసరాన్ని తీర్చడం అంత సులభం కాదు
మంత్రి సత్యకుమార్ కొమ్మాది: సుమారు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో రక్త అవసరాలు తీర్చడం అంత సులభం కాదని, ఇలాంటి పరిస్థితుల్లో హేతుబద్ధ వినియోగం జీవన విధానం మారాలని, తద్వారా రక్త సరఫరా కొరతను అధిగమించవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘రక్తం, రక్త ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం’ అనే అంశంపై జాతీయ వర్క్షాప్ను మంగళవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. దేశంలో ఏటా అవసరమైన రక్తం సుమారు 1.5 కోట్ల యూనిట్లు అంచనా కాగా, 10–40 లక్షల యూనిట్ల కొరత ఉందని నివేదికలు చెబుతున్నాయన్నారు. రక్తం, దాని ఉత్పత్తులను హేతుబద్ధంగా వినియోగించడం అంటే సరైన సమయంలో సరైన వ్యక్తికి సరైన రక్తన్ని అందించడమేనన్నారు. ఈ వర్క్షాప్ ద్వారా రక్త వినియోగంలో శాసీ్త్రయ, మానవతా దృక్పథం రెండింటినీ సమన్వయం చేయాలని కోరారు. -
కూటమికి హై టెన్షన్
విశాఖ సిటీ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన కాకపుట్టిస్తోంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ సందర్శనకు వస్తుండడం కూటమి ప్రభుత్వంలో గుబులు రేగుతోంది. జగన్ పర్యటనతో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ కుట్ర బట్టబయలవుతుందన్న భయం వెంటాడుతోంది. దీనికి భారీ జన సందోహం తరలివచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. దీంతో ఎలాగైనా జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టించాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా జగన్ రోడ్ షోకు భద్రత ఇవ్వలేమని పోలీసు అధికారులతో చెప్పించింది. మంగళవారం విశాఖ పోలీస్ కమిషనర్, అనకాపల్లి జిల్లా ఎస్పీలతో అత్యవసర మీడియా సమావేశాలు పెట్టించింది. తమిళనాడులో జరిగిన తొక్కిసలాటను సాకుగా చూపించి జగన్ పర్యటనకు వచ్చే భారీ జన సందోహాన్ని కట్టడి చేయలేమని చేతులెత్తేసింది.సవాల్ విసిరిన అమాత్యులకే చెమటలువైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలు చేపట్టింది. వీటిలో అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో కూడా కాలేజీ నిర్మాణంలో ఉంది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగలేదని హోంమంత్రి వంగలపూడి అనిత, కాలేజీకి అనుమతి ఉంటే చూపించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే నిర్మాణం పూర్తయిన ఐదు కాలేజీలతో పాటు నిర్మాణంలో ఉన్న 12 కాలేజీల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. వైద్య కళాశాలలే లేవని బుకాయించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం బండారం బట్టబయలైంది. ఇంతలో మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీ సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 9వ తేదీన రానున్నారు. దీంతో మెడికల్ కాలేజీలపై సవాల్ విసిరిన అమాత్యులకు చెమటలు పడుతున్నాయి. జగన్ పర్యటనతో కూటమి ప్రభుత్వం అబద్దాలు బయటపడతాయన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. -
ఆంక్షలు విధించినా ఆగేది లేదు!
సాక్షి, విశాఖపట్నం : నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్ కళాశాల భవనాలను పరిశీలించడానికి ఈనెల 9వ తేదీన వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్రచేస్తోందని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు మండిపడ్డారు. ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఆగేది లేదని స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు భద్రత కల్పించాలని ఐదు రోజుల క్రితమే అనకాపల్లి ఎస్పీ, విశాఖ సీపీని కోరామని, ఇప్పటివరకూ కాలయాపన చేసిన వారు జాతీయ రహదారిపై రోడ్డు మార్గంలో వెళ్లడానికి అనుమతి లేదని ఇప్పుడు చెబుతున్నారన్నారు. విశాఖ నుంచి మాకవరపాలేనికి జాతీయ రహదారి కాకుండా ప్రత్యామ్నాయ రోడ్డు చూపించాలని అడుగుతున్నామన్నారు. అయినా పర్యటనకు తాము అనుమతి కోరలేదని.. సెక్యూరిటీ కల్పించాలని మాత్రమే అడిగామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు వస్తున్నప్పుడు మీ పర్మిషన్ ఎవరికి కావాలంటూ ధ్వజమెత్తారు. తమ నాయకుడు రోడ్డు మార్గానే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తారని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు. పోలీసులు, ప్రభుత్వం భద్రత కల్పించకపోతే వైఎస్సార్సీపీ కార్యకర్తలే భద్రత కల్పిస్తారని అన్నారు. గతంలో వైఎస్ జగన్ పలు పర్యటనల్లో హెలికాప్టర్కు అనుమతి ఇవ్వలేదని.. ఇప్పుడు హెలికాప్టర్ మీదే రావాలంటున్నారంటే.. తనతో పాటు రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు, అభిమానులకు అనుమానం వస్తోందన్నారు. వాతావరణ పరిస్థితులు కూడా సవ్యంగా లేని సమయంలో పదే పదే హెలిప్యాడ్ అనుమతి కోరండి అని చెబుతుంటే, ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందేమోనని అనుమానం ఉందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో జరిగిన సంఘటనను బూచిగా చూపించి అనుమతి ఇవ్వలేమనడం సరికాదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు 65 వేల మంది జనాలు వస్తారని పోలీసులు చెబుతుండడం చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత అర్థమవుతోందన్నారు. చంద్రబాబు పర్యటనను ఆపేస్తారా? గతంలో చంద్రబాబు ప్రచార పిచ్చికి గోదావరి పుష్కరాల్లో 29 మంది, కందుకూరిలో 9 మంది చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2027లో మళ్లీ గోదావరి పుష్కరాలు ఉన్నాయని, పుష్కరాల సమయంలో చంద్రబాబు పర్యటనను ఆపేస్తారా? అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడి నోటికి తాళాలేసేందుకు.. కళ్లు బైర్లు కమ్మి సవాల్ విసిరిన స్పీకర్ అయ్యన్న లాంటి వారి నోటికి తాళాలు వేసేందుకు, ఆయన అసత్య ప్రచారాలకు చెక్ పెట్టి.. మెడికల్ కాలేజీపై వాస్తవాలను తెలియజేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 9న నర్సీపట్నంకు వస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పర్యటనపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం పర్యటనపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. మళ్లీ తమ కుట్రలకు తెరతీసిన ప్రభుత్వ పెద్దలు.. ఎల్లుండి( గురువారం,అక్టోబర్ 9) నర్సీపట్నం పర్యటనను అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. అనకాపల్లి ఎస్పీ తువీన్ సిన్హాతో చంద్రబాబు సర్కార్ ప్రకటన చేయించారు. గతంలోనూ జగన్ పర్యటనలకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది.ప్రజల్లోకి ఎప్పుడు వెళ్లినా ఏదో సాకు చూపుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోంది. చివరికి రైతుల సమస్యలపై పోరాడినా ఆంక్షలే.. ఇప్పుడు మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్నా అడ్డంకులే పెడుతోంది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పర్యటన ఆగేది లేదని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్లి తీరుతామని స్పష్టం చేసింది.ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. రోడ్డు మార్గం గుండా వెళ్లనున్న వైఎస్ జగన్కు తమ సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ను కలవడానికి స్టీల్ ప్లాంట్ కార్మికులు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు, గోవర్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు సిద్ధమయ్యారు. బాధితులను వైఎస్ జగన్ను కలవనీయకుండా ప్రభుత్వం చేస్తోంది. పోలీస్ ఆంక్షలతో వైఎస్ జగన్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. -
యువకుడు గల్లంతు
పాయకరావుపేట: పాల్మన్పే ట సముద్ర తీరంలో స్నేహితులతో సరదాగా స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. మైరెన్ పోలీసు ఎస్ఐ డి.రత్నశేఖర్, స్థానిక ఎస్ఐ పురుషోత్తం తెలిపిన వివరాలు.. కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామం నుంచి ఆటోలో 11 మంది యువకులు సోమవారం సముద్ర స్నానాలకు వెళ్లారు. స్నానాలు చేసి ఒడ్డుకు వచ్చే క్రమంలో పి.అశోక్, దుర్గాప్రసాద్ కెరటాల తాకిడికి కొట్టుకుపోయారు. దుర్గాప్రసాద్ను స్థానికంగా ఉన్న మత్స్యకారులు రక్షించారు. అశోక్ మాత్రం సముద్రంలో గల్లంతైనట్లు ఎస్ఐలు తెలిపారు. దుర్గాప్రసాద్ను చికిత్స నిమిత్తం తుని ఆస్పత్రికి తరలించారు. అశోక్ నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లమో చదువుతున్నాడు. ఎస్ఐ పురుషోత్తం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పాయకరావుపేట పోలీసులు, మైరెన్ పోలీసులు, మత్స్యకారులు బోటు సహాయంతో సాయంత్రం 6 గంటల వరకు అశోక్ కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. -
వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
మాకవరపాలెం: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పరిశీలించారు. ఈనెల 9న మండలంలోని భీమబోయినపాలెం వద్ద గత ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాల భవనాలను జగన్మోహన్రెడ్డి పరిశీలించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పరిశీలకురాలు శోభా హైమావతిలతో కలసి అమర్నాథ్, గణేష్ మెడికల్ కళాశాల ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం భద్రత, ఇతర అంశాలపై నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మతో చర్చించారు. కళాశాల భవనాల వద్ద జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశం ఉంటుందని అమర్ డీఎస్పీకి తెలిపారు. పూర్తి వివరాలను తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు చిటికెల రమణ, పంచాయతీరాజ్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు, నియోజకవర్గంలో వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. -
యాప్రోగం
మహారాణిపేట(విశాఖ): కేజీహెచ్ అవుట్ పేషెంట్ విభాగంలో సోమవారం రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ యాప్ (ఏబీహెచ్ఏ) ద్వారా ఓపీ టికెట్ల జారీలో ఆన్లైన్ సర్వర్ సమస్య కారణంగా జాప్యం జరిగింది. సోమవారం, ముఖ్యంగా దసరా పండుగ తర్వాత కావడంతో, ఓపీకి రోగుల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం 1200 నుంచి 1300 టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్ద సోమవారం దాదాపు 1800 మందికి ఓపీలు, 80 మందికి కే–షీట్లు జారీ చేశారు. ఆరు కౌంటర్లు రోగులు, వారి బంధువులతో కిక్కిరిసిపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు రద్దీ కొనసాగింది. ‘యాప్’సోపాలు ఒకవైపు సర్వర్ సమస్యతో పాటు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అమలు చేస్తున్న ఏబీహెచ్ఏ యాప్ ద్వారా టికెట్లను జారీ చేయడంలోనూ రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులు స్మార్ట్ఫోన్ లేక, యాప్ డౌన్లోడ్ చేయలేక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. సిగ్నల్ లేకపోవడం, ఆధార్ అప్డేట్ కాకపోవడం, వేలిముద్రలు సక్రమంగా పడకపోవడం వంటి కారణాల వల్ల యాప్ డౌన్లోడ్ ప్రక్రియ ఆలస్యమై, రోగులు మరింత ఎక్కువ సమయం కౌంటర్ల వద్ద నిరీక్షిస్తున్నారు. ఆన్లైన్ సర్వర్ పనిచేయకపోవడంతో టికెట్లు జారీ నిలిచిపోయి, కౌంటర్ల వద్ద రద్దీ పెరగడంతో రోగులు, వారి బంధువులను అదుపు చేయడం సెక్యూరిటీ సిబ్బందికి కూడా కష్టమవుతోంది. -
సారా నిర్మూలనకు ‘నవోదయం’
నర్సీపట్నం: ఉమ్మడి జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా మార్చడమే ఎకై ్సజ్శాఖ ముఖ్య ఉద్దేశమని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. సోమవారం ఆయన నర్సీపట్నం వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం తీ సుకువచ్చిన నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా సా రా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నా రు. గంజాయి సాగు, రవాణా కట్టడిపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. పోలీసు, రెవెన్యూశాఖల సమన్వయంతో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. 142 బార్లకు కేవలం 68 దర ఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరోసారి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎకై ్సజ్ స్టేషన్లో సోమవారం గంజాయి కేసుల్లో పట్టుబడిన నాలుగు బైక్లను వేలం వేశారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో జీఎస్టీతో కలిపి మొత్తం రూ.15,930 ఆదాయం సమకూరింది.ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి -
బడుగులపై పిడుగుపాటు
జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతోపాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వీటి ధాటికి కె.కోటపాడు మండలంలో రైతు దుర్మరణం చెందగా, నక్కపల్లి మండలంలో రెండు గేదెలు, యలమంచిలి మండలంలో ఒక గేదె మరణించాయి. కె.కోటపాడు: మండలంలో పొడుగుపాలెం గ్రామానికి చెందిన రైతు లెక్కల జగన్నాథం(52) ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతోపాటు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఈ మృతిపై ఎ.కోడూరు పోలీసులకు మృతుడు భార్య లక్ష్మి సోమవారం ఫిర్యాదు చేసింది. పొలంలో ఉన్న సమయంలో పిడుగు పడడంతో అతడు మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కె.కోటపాడు సీహెచ్సీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహానికి అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి.లక్ష్మీనారాయణ తెలిపారు. నక్కపల్లి: మండలంలో రాజయ్యపేటలో ఆదివారం రాత్రి పిడుగు పడి రెండు గేదెలు మరణించాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఇదే సమయంలో పిడుగులు పడ్డాయి. పిడుగు పాటుకు రెండు గేదెలు అక్కడికక్కడే మరణించాయని బాధితుడు గ్రామ మత్స్యకారుడు మైలపల్లి బైరాగి వాపోయాడు. రెండు పాడి గేదెలను ఇటీవలే రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశానని, అవి మృత్యువాత పడటంతో తీవ్రంగా నష్టపోయానంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. యలమంచిలి రూరల్: మున్సిపాలిటీ పరిధి తెరువుపల్లిలో ఆదివారం రాత్రి పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. యలమంచిలిలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో రైతు తుమ్మపాల పైడికొండ తన గేదెను పశువుల పాకలో కట్టి ఉంచాడు. రాత్రి పిడుగు పడడంతో పశువుల పాక కాలిబూడిదైంది. పాకలో గేదె మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున పాక వద్ద గేదె కళేబరాన్ని చూసిన కన్నీటిపర్యంతమయ్యాడు. తనకు జీవనాధారమైన పశువు ప్రకృతి విపత్తుతో కోల్పోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. తెరువుపల్లి వార్డు కౌన్సిలర్ చిన్న శ్రీను, గ్రామ పెద్దలు రైతును ఓదార్చారు. పశుబీమా పరిహారం మంజూరయ్యేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున ఉద్యమం
9న నర్సీపట్నం వైద్య కళాశాల భవనాలను సందర్శించనున్న వైఎస్ జగన్ ● 7 నియోజకవర్గాల మీదుగా రోడ్ షోగా వెళ్లే అవకాశం ● మాజీ సీఎంను కలవనున్న స్టీల్ప్లాంట్, సుగర్ ఫ్యాక్టరీ, బల్క్డ్రగ్ పార్క్ బాధితులు ● వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు అమర్నాఽథ్, కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్ సీపీ ఉవ్వెత్తున ఉద్యమిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సోమవారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నర్సీపట్నంలో మెడికల్ కళాశాలను సందర్శించనున్నారని తెలిపారు. ఈ పర్యటన విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల మీదుగా రోడ్ షోగా సాగుతుందన్నారు. వైఎస్ జగన్ను స్టీల్ప్లాంట్, సుగర్ ఫ్యాక్టరీ, బల్క్డ్రగ్ పార్క్ బాధితులు కలవనున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ప్లాంట్పై కేంద్రం చేస్తున్న ఆలోచనలు తెలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు తన మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టంగా వెల్లడిస్తున్నా.. కూటమి పార్టీల ఎంపీలు, మంత్రులకు ఏమీ పట్టనట్లుగా ఉన్నారన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న వనరులను కూటమి నేతలు దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్సిటీలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా.. కూటమి నేత సొంత యూనివర్సిటీ కోసం నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు. విద్య, వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణే్ష్కుమార్, మళ్ల విజయప్రసాద్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడారు. -
డ్వాక్రా రుణాలు గోల్మాల్
చోడవరం: డ్వాక్రా రుణాల గోల్మాల్ వ్యవహారంపై గోవాడ ఎస్బీఐ ఎదుట బాధిత డ్వాక్రా మహిళలు సోమవారం ఆందోళనకు దిగారు. మరోవైపు పలు డ్వాక్రా సంఘాల పేరున బినామీ రుణాలు తీసుకొని మహిళలను మోసం చేశారంటూ వెలుగు శాఖలో ప నిచేస్తున్న సింహాద్రిపురం వీవోఏ వరలక్ష్మిపై చోడ వరం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. సింహాద్రిపురం పంచాయతీ పరిధిలో 15 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల నిర్వహణ కోసం వెలుగు శాఖ నుంచి వీవోఏగా వరలక్ష్మి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సబ్బవరపు కల్లాలకు చెందిన శ్రీరామ డ్వాక్రా సంఘం సభ్యులకు రూ.7.50 లక్షల రుణానికి సంబంధించి అప్పు తీర్చాలంటూ గోవాడ ఎస్బీఐ నుంచి మెసేజ్లు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వీవోఏ వరలక్ష్మిని తీసుకుని బ్యాంక్కు వెళ్లడంతో అసలు బాగోతం బయటపడింది. గతేడాది ఫిబ్రవరిలో శ్రీరామ డ్వాక్రా సంఘానికి రూ.7.50 లక్షలు, శ్రీసిద్ధి వినాయక డ్వాక్రా సంఘానికి రూ.2 లక్షలు రుణం ఇచ్చినట్టుగా గోవాడ స్టేట్ బ్యాంక్ రికార్డుల్లో ఉంది. అయితే ఆ మొత్తం సంబంధిత డ్వాక్రా గ్రూపు సభ్యుల ఖాతాల్లోకి మాత్రం జమ కాలేదు. మరి ఈ సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళ్లిందని ఆరా తీయడంతో మోసం బయటపడింది. నిబంధనల ప్రకారం డ్వాక్రా సంఘాలకు బ్యాంక్ రుణం మంజూరు చేసేటప్పుడు సంఘ సభ్యుల సంతకాలు, వారి గ్రూపు ఫొటోతో తమకు బ్యాంక్ రుణం కావాలంటూ దరఖాస్తును వెలుగు వీవోఏ, సీసీ ద్వారా బ్యాంక్కు అందజేయాలి. బ్యాంక్ అధికారుల పరిశీలన అనంతరం రుణం మంజూరు చేసి సంఘ సభ్యులను బ్యాంక్కు పిలిచి వారితో సంతకాలు చేయించుకొని మంజూరు చేసిన రుణం డబ్బును సదరు డ్వాక్రా సంఘం సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే శ్రీరామ డ్వాక్రా సంఘానికి మంజూరైన రుణం మాత్రం అలా జరగలేదు. ఈ సంఘం నుంచి గతంలో రుణం కావాలని బ్యాంక్కు దరఖాస్తు చేస్తే అప్పట్లో అధికారులు తిరస్కరించారు. ఆ పత్రాలను వీవోఏ వరలక్ష్మి తన వద్ద ఉంచుకొని సంఘ సభ్యులకు తెలియకుండా బ్యాంక్ రుణం కోసం రెండోసారి దరఖాస్తు చేసింది. బ్యాంక్ అధికారులు కూడా ఆమెతో కుమ్మకై ్క రుణం మంజూరు చేశారు. ఈ రుణం డబ్బులను కొత్తగా ఖాతాలు తెరిచి అందులో జమ చేసుకున్నారు. ఆ డబ్బులను బ్యాంక్ అధికారులు, వీవోఏ కలిసి విత్డ్రా చేసుకొని పంచుకున్నారంటూ బాధిత శ్రీరామ డ్వాక్రా సంఘం సభ్యులు ఆరోపిస్తూ సోమవారం ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారమంతా గతేడాది నవంబరు 12న జరిగింది. అప్పట్లో ఫిర్యాదు చేయగా.. ఎస్బీఐ అధికారులు, వెలుగు శాఖల అధికారులు విచారణ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమ పేరున ఇంకా బ్యాంక్ రుణం ఇచ్చినట్టుగానే రికార్డుల్లో ఉండడంతో సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వెన్నెల యోగిత, సబ్బవరపు సంధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వారు వాపోయారు. తమ సంఘాల పేరున బ్యాంక్లో రుణం లేనట్టుగా ఎన్వోసీ కావాలని పలుమార్లు గోవాడ ఎస్బీఐ అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని సభ్యులు మండిపడ్డారు. మరోసారి బ్యాంక్ ముందు బైఠాయించి తలుపులు మూసివేశారు. డ్వాక్రా మహిళల ఆందోళనతో బ్యాంక్ లావాదేవీలకు సుమారు 3 గంటల పాటు అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చోడవరం సీఐ అప్పలరాజు సిబ్బంది వచ్చి పరిస్థితిని సమీక్షించారు. బాధిత మహిళలతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. ఈ గోల్మాల్లో కీలకపాత్ర పోషించిన వెలుగు వీవోఏ వరలక్ష్మిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. మోసం సుమారు రూ.20 లక్షలు సబ్బవరపువారి కల్లాలకు చెందిన డ్వాక్రా మహిళలంతా వ్యవసాయం, కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. వీరికి బ్యాంక్కు వెళ్లే సమయం లేకపోవడంతో ప్రతి నెలా వాయిదా డబ్బులు వెలుగు వీవోఏ వరలక్ష్మికి ఇచ్చేవారు. ఆమె కొంత కాలంగా బ్యాంక్కు కట్టకుండా రూ.20 లక్షలు కాజేసిందని వారు ఆరోపించారు. -
17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి
అనకాపల్లి: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన, నిర్మిస్తున్న 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం అన్యాయమని, వాటిని ప్రభుత్వమే నడపాలని అనకాపల్లి మండల పరిషత్ సమావేశంలో తీర్మానించారు. సోమవారం జరిగిన మండల సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టిన ఎంపీపీ గొర్లి సూరిబాబు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టిందని, ఆ సంకల్పానికి ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడవడం అన్యాయమన్నారు. 17 మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు. అనకాపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం -
ఏకగ్రీవ సర్పంచ్లకు ప్రోత్సాహకాలేవీ?
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్లుగా ఎన్నుకోబడ్డ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు మంజూరు చేయాలని కోరుతూ చీడికాడ మండలం జేబీపురం, దండిసురవరం, శిరిజాం, పెదగోగాడ, అడవి అగ్రహారం గ్రామాల సర్పంచ్లు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. తాము సర్పంచ్లుగా ఎన్నికై నాలుగేళ్ల 6 నెలలు పూర్తయినా ఇంతవరకూ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని వాపోయారు. తక్షణమే నిధులు మంజూరు చేయాలంటూ కలెక్టర్ను ఆయా గ్రామాల సర్పంచ్లు గొల్లవిల్లి చినమ్మలు, కోన అర్జున, కె.సత్యవతి, పి.అచ్చియమ్మ, సలాది లక్ష్మి కోరారు. -
వడివడిగా పోర్టు అడుగులు
సాక్షి, విశాఖపట్నం : ఈస్ట్కోస్ట్ గేట్ వే ఆఫ్ ఇండియాగా నౌకాయానంలో అంతర్జాతీయంగా ఎదుగుతున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ నేటితో 92 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఏటికేడూ ప్రగతి పథంలో పయనిస్తూ.. నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ దేశంలోని మేజర్ పోర్టులతో పోటీ పడుతూ సరికొత్త వ్యూహాల్ని అనుసరిస్తోంది. పెట్టుబడుల ప్రవాహం.. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా విస్తరణ పనులతో పోర్టు వచ్చే ఆవిర్భావ దినోత్సవానికి సరికొత్త సొబగులద్దుకోనుంది. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో.. విశాఖ పోర్టు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుంది. ఈ ఏడాది స్వచ్ఛతా అవార్డుల్లో దేశంలో ప్రథమ స్థానం సాధించింది. తొలి పాసింజర్ షిప్ జలదుర్గతో.. 1927లో విశాఖపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1933 అక్టోబర్ 7న పోర్టు నుంచి సరకు రవాణాని ప్రారంభించింది. సింథియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ తొలి పాసింజర్ షిప్ జలదుర్గని విశాఖ పోర్టుకు తీసుకొచ్చింది. అప్పటి వైస్రాయ్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విల్లింగ్ డన్ నౌకాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విశాఖపట్నం హార్బర్ను సుందరంగా తీర్చిదిద్దడంలో ఇంజనీర్లు డబ్ల్యూసీ యాష్, ఓబీ రాటెన్బరీలు ముఖ్య భూమిక పోషించారు. పోర్టుకు సమీపంలోనే స్టీల్ప్లాంట్, సెయిల్, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్ఎండీసీ, హిందూస్థాన్ షిప్యార్డు, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, హెచ్పీసీఎల్ వంటి భారీ పరిశ్రమలున్నాయి. పోర్టులో ప్రధానంగా స్టీల్, పవర్, మైనింగ్, పెట్రోలియం, ఎరువులు తదితర సరుకుల్ని నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యంత లోతైన కంటైనర్ టెర్మినల్ పోర్టులోనే ఉండటం విశేషం. సరికొత్త సంస్కరణలు గ్రీన్ పోర్టుగా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్ పవర్ప్లాంట్ని ఏర్పాటు చేసి.. పోర్టుకు అవసరమైన విద్యుత్మొత్తాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. రూఫ్టాప్ సోలార్ ద్వారా మరో 190 కిలోవాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తోంది. 2055–26 నాటికి 30 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నారు. ● ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి. ● 845 మీటర్ల పొడవు, 16 మీటర్ల సహజ సిద్దమైన లోతును కలిగి విశాఖ కంటైనర్ టెర్మినల్ కంటైనర్ ట్రాఫిక్ కు ముఖ ద్వారంలా ఉంది. ఏపీ, తెలంగాణా, చత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర జార్ఖండ్, మధ్యప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు విశాఖ కంటైనర్ టెర్మినల్ గేట్ వేగా వ్యవహరిస్తోంది. ● మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి ట్రక్ పార్కింగ్ టెర్మినల్ను 666 వాహనాల పార్కింగ్ సామర్ధ్యంతో నిర్మించింది. 84,000 టన్నుల సరుకును నిల్వ ఉంచే విధంగా కవర్డ్ స్టోరేజ్ షెడ్ నిర్మాణాలు, యార్డు నిర్మాణం పూర్తి చేసింది. ● పోర్టులోని కార్యకలాపాల్ని యాంత్రీకరించే ప్రక్రియ జోరందుకుంది. రూ.655 కోట్లతో ఈక్యూ–7, వెస్ట్ క్యూ–7, 8 బెర్త్ లను యాంత్రీకరించే పనులు పీపీపీ పద్ధతిలో చేపడుతున్నారు. ● రూ.800 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, సీఎన్జీ బంకరింగ్ స్టేషన్ నెలకొల్పేందుకు హెచ్పీసీఎల్, ఐఓసీతో ఎంవోయూ కుదుర్చుకుంది. ● రూ.276 కోట్లతో ఆయిల్ రిఫైనరీ బెర్త్–2 నిర్మాణం, అడ్వాన్స్డ్ ఫైర్ఫైటింగ్ ఫెసిలిటీ, ఆర్ఎఫ్ఐడీ గేట్ మేనేజ్మెంట్ సిస్టమ్, మోడ్రన్ పోర్టు ఆపరేటింగ్ సిస్టమ్ని ప్రారంభించారు. ● ఇటీవలే ఏడు దేశాలకు ఆతిథ్యమిస్తూ బిమ్స్టెక్–2025 కాంక్లేవ్ని విజయవంతంగా వీపీఏ నిర్వహించింది. -
ఎస్పీ కార్యాలయంలో 52 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు సోమవారం 52 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భూ సమ్యలు, కుటుంబ కలహాలుపై ఎక్కువగా అర్జీలు వచ్చాయన్నారు. భూ సమస్యలపై–32, కుటుంబ కలహాలు–5, మోసాలకు సంబంధించినవి–3, ఇతర విభాగాలివి–12 అర్జీలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పూర్తి స్థాయిలో విచారణ చేసి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్ఐలు మల్లేశ్వరరావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛాంధ్ర కల సాకారం
అనకాపల్లి టౌన్: ప్రజల సహకారంతోనే స్వచ్ఛాంధ్ర లక్ష్యం సాకారం అవుతుందని కల్టెర్ విజయ కృష్ణన్ అన్నారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సోమవారం జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో అహర్నిశలు శ్రమిస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు ప్రజలు సహకరించాలని తెలిపారు. గ్రామాలను శుభ్రంగా ఉంచడంలో గ్రామస్తుల భాగస్వామ్యం ముఖ్యమని, చెత్తను రోడ్ల మీద, కాలువలో వేయకుండా పారిశుధ్య సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్తగా విడదీసి అందజేసి వారికి సహకరించాలన్నారు. ప్రజలు తమ ఇంటితోపాటు వారు నివసిస్తున్న వీధిని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విరివిగా మొక్కలు నాటాలన్నారు. శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడారు. అనంతరం వివిధ రంగాలు, ప్రభుత్వ శాఖలకు చెందిన 45 మందికి స్వచ్ఛాంధ్ర అవార్డులు, మెమెంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణమూర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి షేక్ ఆయిషా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్ విజయ కృష్ణన్ -
విజయనగరం విజయదుందుభి
గొలుగొండ: రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో విజయనగరం విజయదుందుభి మోగించింది. అండర్–14 బాల, బాలికల విభాగాల్లో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ల్లో ఈ జిల్లా జట్లు ప్రథమ స్థానం సాధించాయి. గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామ హైస్కూల్లో ఈ నెల 4న ప్రారంభమైన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. సోమవారం నిర్వహించిన ఫైనల్లో పోటీల్లో విజయనగరం, గుంటూరు బాలురు జట్లు తలపడ్డాయి. ఇందులో 2 పాయింట్లు తేడాతో విజయనగరం జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు జట్టు ద్వితీయ స్థానానికి పరిమితమైంది. అనంతరం బాలికల పోరులో విజయనగరం, చిత్తూరు జట్లు తలపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోటీలో విజయనగరం బాలికలదే పై చేయి అయింది. ఒక పాయింటు తేడాతో విజేతగా నిలిచింది. చిత్తూరు జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా గెలుపొందిన జట్లుకు నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు, కృష్ణదేవిపేట పూర్వపు ఎస్ఐ తారకేశ్వర్రావు, సాఫ్ట్బాల్ నిర్వహణ ప్రతినిధులు రమణ, శ్రీనివాసరావు, సుమంత్రెడ్డి, సూర్య దేముడు, సతీష్, భవానీ, చంద్రమోహన్ బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో బాల, బాలికల జట్లకు ప్రథమ స్థానం -
కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణ
కోటవురట్ల: స్థానిక కుమ్మరి వీధిలో కవయిత్రి మొల్ల విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. విగ్రహాన్ని జానకి హరి వితరణ చేయగా.. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గానికి చెందిన కుమ్మరి శాలివాహన డైరెక్టర్ ఎం.విజయ కుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కవయిత్రి మొల్ల రచనలు సరళ పద్ధతిలో రమణీయంగా ఉంటాయన్నారు. మొల్ల రచించిన రామాయణం విశేష ప్రాచుర్యం పొందిందన్నారు. 16వ శతాబ్దానికి చెందిన మొల్ల 5 రోజుల్లోనే రామాయణాన్ని రచించి అబ్బురపరిచారన్నారు. కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని నిర్మాణానికి సహకరించాలని స్థానికులు విజయకుమారిని కోరారు. స్పందించిన ఆమె శాలివాహన సంఘ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జానకి హరి, జానకి శ్రీను, శాలివాహన కమిటీ జిల్లా అధ్యక్షుడు పి.అప్పలకొండ, వైస్ ప్రెసిడెంట్ శ్రీను, కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ దాసరి వెంకటరావు, ఉప సర్పంచ్ గవ్వా రాధాకృష్ణ, స్థానికులు పాల్గొన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చాలా సార్లు ప్రశ్నించాను. స్టీల్ప్లాంట్కు నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రులు చెబుతున్నా.. ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగానే కేంద్రం వైఖరి ఉందన్నారు. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉన్నారు. స్టీల్ప్లాంట్ కాపాడుకునేందుకు మనమంతా ఏకతాటిపై వచ్చి పోరాడాలి’ అని తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త బొత్స ఝాన్సీ, గాజువాక సమన్వయకర్త దేవన్రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామంటే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దేవన్రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక వైపు విశాఖ స్టీల్ప్లాంట్లో 34 విభాగాలను ప్రైవేటీకరిస్తున్నారు. మరో వైపు నుంచి వీఆర్ఎస్కు వెళ్లని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. దీనిపై నియోజకవర్గ స్థాయిలో పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఉత్తరాంధ్ర స్థాయిలో భారీగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.’ అని అభిప్రాయపడ్డారు. -
కొనసాగుతున్న నిర్బంధాలు
● 22వ రోజుకు చేరిన మత్స్యకారుల దీక్ష ● సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నేతలకు అడ్డంకులు నక్కపల్లి/ఎస్.రాయవరం: రాజయ్యపేట సమీపంలో బల్క్డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని నిలిపివేయాలని మత్స్యకారులు చేస్తున్న నిరాహారదీక్ష ఆదివారం 22వ రోజుకు చేరుకుంది. వారికి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నాయకుల నిర్బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ మత్స్యకారుల దీక్షకు మద్దతుగా రాజయ్యపేట వస్తుంటే రాజమండ్రి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీక్షలో పాల్గొనకుండా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజును ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారంలో ఇంటి వద్ద పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బల్క్డ్రగ్ పార్క్కు మద్దతుగా రాంబిల్లిలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.నక్కపల్లి: రాజయ్యపేట వస్తున్న బోడే రామ చంద్రయాదవ్ను అడ్డుకున్న పోలీసులు ఎస్.రాయవరం: ధర్మవరం అగ్రహారంలో సీపీఎం నాయకుడు అప్పలరాజు గృహ నిర్బంధం -
ఆరు పదులు... ఆనందానికి లేవు హద్దులు
● చోడపల్లిలో 1980 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయికఅచ్యుతాపురం: వారంతా ఆరు పదుల వయస్సు దాటిన వారే.. కొందరు తాతలు, మరి కొందరు ముత్తాతలయ్యారు. కొందరు విశ్రాంత జీవనం సాగిస్తున్నారు. 45 ఏళ్ల కిందట వారంతా ఒక బడిలో చదువుకున్నారు. ఆదివారం కలుకుని, బాల్యస్నేహితులను తనివితీరా చూసి, నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ ఆత్మీయ కలయికకు మండలంలోని చోడపల్లిలో చోడమాంబిక అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతం వేదికై ంది. మునగపాక ఉన్నత పాఠశాలలో 1980లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు అచ్యుతాపురం మండలంలోని చోడపల్లిలో కలుసుకుని సందడి చేశారు. 33 ఏళ్లుగా ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా వీరు కలుస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్లో ఉన్నత స్థానాల్లో ఉండి పదవీ విరమణ పొందిన వారిని సత్కరించారు.స్టీల్ ప్లాంట్, వైద్య,విద్యా శాఖల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వారంతా తమ ఉద్యోగంలో అనుభవాలు, ఇతర విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం డీఎంవో పి.సత్యనారాయణ, జీవీఎంసీ ఎంటమాలజిస్ట్ డి.సాంబమూర్తి,పీడీగా పదవీ విరమణ పొందిన పెంటకోట రాము,హరిపాలెం పీహెచ్సీ సూపర్వైజర్ ఎస్. శ్రీను,కొండకర్ల నీటి సంఘం మాజీ అధ్యక్షుడు బి.వి.రాము, అచ్యుతాపురం మాజీ జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు, ఎన్.సత్యనారాయణ, కె.పి.రావు, ఎ.వి.ఎస్.అప్పారావు, సీహెచ్ పారునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సమరభేరి
ఉత్తరాంధ్ర సమస్యలపై ● కూటమి సర్కారు వైఫల్యాలపై ఉద్యమించనున్న వైఎస్సార్సీపీ ● ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతల తీర్మానం ● ఏడు అంశాలపై ప్రజలకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం ● 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించనున్న వైఎస్ జగన్ ● విశాఖ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో భీమబోయినపాలెం చేరుకోనున్న మాజీ సీఎం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై 7 తీర్మానాలు సభాధ్యక్షత వహించిన కురసాల కన్నబాబు పార్టీ నేతల నుంచి ముఖ్యమైన సూచనలు, సలహాలు తీసుకున్నారు. అనంతరం ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 7 ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ సీపీ తీర్మానాలు చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పెట్టి వైద్య విద్యను మరింత మందికి అందుబాటులోకి తేవాలన్న సత్సంకల్పానికి కూటమి నేతలు తూట్లు పొడిచారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుపై ప్రై‘వేటు’ వేస్తున్నారు. బల్క్డ్రగ్ పార్కుతో మత్స్యకారుల నుంచి ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని గిరిజనుల వరకు అనేక విషయాల్లో అన్యాయం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ ఉత్తరాంధ్ర రైతులకు తీరని ద్రోహం తలపెట్టారు. ఇలా వివిధ వర్గాల ప్రజల బతుకులను దుర్భరం చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. ఆదివారం జరిగిన ఉత్తరాంధ్ర స్థాయి విస్తృత సమావేశంలో ఏడు అంశాలపై తీర్మానాలు చేసింది. సమావేశంలో ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఎంపీలు గొల్ల బాబూరావు, తనూజరాణి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు, అమర్నాథ్, పుష్పశ్రీవాణి, రాజన్న దొర, పార్టీ జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, మజ్జి శ్రీనివాసరావు, పరీక్షిత్ రాజు, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, మాజీ ఎంపీ బెల్లాన, మాజీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, కోలగట్లసాక్షి, విశాఖపట్నం: దిక్కులేని ప్రజల గొంతుకై .. వారి తరపున పోరాటానికి సిద్ధమై.. వాయిస్ ఫర్ ది వాయిస్లెస్గా నిలుస్తూ.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ కూటమి సర్కారుకు అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వం తప్పులు, వైఫల్యాలను ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సమరశంఖం పూరించాలని నిర్ణయించినట్టు పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆదివారం ఆనందపురంలోని పెద్దిపాలెంలో ని చెన్నాస్ కన్వెన్షన్ హాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి సమావేశం ప్రారంభించారు. ఈ సమా వేశంలో కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరొస్తుందనే భయంతో ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి 7 కాలేజీలను పూర్తి చేశారని, వాటిని కూడా ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు తన వారి చేతుల్లో పెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించిందన్నారు. ఉత్తరాంధ్ర నుంచే సమరశంఖం పూరించేందుకు ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించనున్నారని చెప్పారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడతారని వివరించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, సురేష్బాబు, కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, జెడ్పీ చైర్పర్సన్లు జె.సుభద్ర, పిరియా విజయ, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, పార్లమెంట్ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, బెల్లాన చంద్రశేఖర్, పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబూరావు, శోభా హైమావతి, సూర్యానారాయణ రాజు, మాజీ ఎంపీలు భీశెట్టి వెంకటసత్యవతి, గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్ర స్వామి, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, కన్నబాబు రాజు, తిప్పల నాగిరెడ్డి, గొర్లె కిరణ్కుమార్, తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, చెట్టి ఫాల్గుణ, పిరియా సాయిరాజు, విశ్వసరాయి కళావతి, కె.భాగ్యలక్ష్మి, చెంగల వెంకట్రావ్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, మలసాల భరత్కుమార్, పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మణరావు, కరిమి రాజేశ్వరరావు, సాడి శాంప్రసాద్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, పైల శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర మహి ళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాన్ వెస్లీ, సీఈసీ సభ్యులు కోలా గురువులు, కాయల వెంకటరెడ్డి, ఎస్ఈసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటే, మనం చేసే ప్రతీ కార్యక్రమం ప్రజల్లోకి వెళుతుందన్నారు. పెండింగ్లో ఉన్న జిల్లా, మండల కమిటీలను, గ్రామ ఇన్చార్జిల నియామకాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం అనంతరం ఉత్తరాంధ్రకు మేలు చేసిన ముఖ్యమంత్రులు వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. మూలపేట పోర్టు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వైఎస్సార్ సీపీ హయాంలోనే వచ్చాయి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, దొరికిన ప్రతీ అంశాన్ని మనం ప్రశ్నించాలి. స్థానిక అంశాలపై దృష్టి సారించాలి. యువ నాయకత్వం పార్టీ బలోపేతానికి కృషి చేసి, నాయకులుగా ఎదగాలి.’అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వరుదు కల్యాణి మాట్లాడుతూ స్థానిక కమిటీల్లో మహిళలకు సమన్వయకర్తలు ప్రాధాన్యమివ్వాలని కోరారు. స్థానిక సమస్యలపై విస్తృతంగా పోరాటం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. అరకు ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ..ప్రతీ నియోజకవర్గంలో సమన్వయకర్త సమక్షంలో నియోజకవర్గ స్థాయి సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వాటిని పరిష్కరించే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా పోరాటం చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల కేటాయింపుపై.. లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఉన్న విలువైన భూములను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కూటమి ప్రభుత్వం కట్టబెడుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి పనులకు, ట్రైబల్ ఇన్స్టిట్యూట్ కోసం భూసేకరణ చేపట్టాం. దానిపై చాలా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు లులూ వంటి అడ్రస్ లేని కార్పొరేట్ సంస్థలకు ఖరీదైన భూములను అప్పగిస్తున్నారు.’అని అన్నారు. చిరు వ్యాపారుల తొలగింపునకు వ్యతిరేకంగా.. జీవీఎంసీ పరిధిలో 42 వేల మంది చిరు వ్యాపారుల షాపులను, ఫుడ్కోర్టులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయప్రసాద్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం చిరువ్యాపారుల కుటుంబాలను రోడ్డున పడేసింది. హాకర్లకు ఏయూ స్థలంలో వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని మభ్యపెడుతున్నారు. దీన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వ్యాపారులకు న్యాయం జరిగేదాకా పోరాడుతాం.’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి, మళ్ల మాట్లాడుతూ.. ‘ చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చేసి కూటమి ప్రభుత్వం వారి పొట్టకొట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ క్రూరంగా వ్యవహరించారు. పార్టీ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.’ అని అన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులపై..
ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న వంశధార, జంఝావతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి వంటి సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ‘వంశధార రిజర్వాయర్ నుంచి ఉద్దానం ప్రాంతానికి మంచి నీటి సరఫరా ప్రాజెక్ట్కు వైఎస్సార్ సీపీ ప్రారంభించింది. పలాస నియోజకవర్గంకు పూర్తి స్థాయిలో శుద్ధ జలం అందించాం. మిగిలిన పనులు పూర్తి చేయాలి. వైఎస్సార్ సీపీ హయాంలో మూలపేట పోర్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. 1995లో ప్రారంభమైన వంశధార ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.’ అని అన్నారు. ఈ తీర్మానానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. సాగు నీరు అందకపోవడంతో అనకాపల్లి జిల్లాలో చెరకు, వరి సాగు తగ్గిపోయిందన్నారు. జిల్లాలోని ఐదు షుగర్ ఫ్యాక్టరీల్లో చోడవరం ఒకటే మిగిలిందని, దానికి కూడా కాపాడుకోలేదని పరిస్థితి నెలకొందన్నారు. -
విత్తన బంతులతో వెల్లివిరిసే పచ్చదనం
అనకాపల్లి: నేటి విత్తనాలే రేపటి మహా వృక్షాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎం.సోమసుందర్ పేర్కొన్నారు. స్థానిక సత్యనారాయణస్వామి దేవస్ధానం కొండపై నుంచి విత్తన బంతులు విసిరే కార్యక్రమం పట్టణ గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచడానికి విత్తన బంతులు విసిరే కార్యక్రమం ప్రభావంతమైన పద్ధతని, ముఖ్యంగా కొండ ప్రాంతాలలో చాలా ఉపయోగాలు ఉంటాయన్నారు. భావితరాలకు పర్యావరణపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణస్వామి దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్, క్లబ్ వ్యవస్ధాపక అధ్యక్షుడు కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ మాస్టారు, విశ్రాంత అటవీశాఖాధికారి బీరా వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన ఉపాధ్యాయులకు ఇండక్షన్ శిక్షణ
సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ‘మెగా డీఎస్సీ – 2025’ ద్వారా నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ఇండక్షన్ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సుమారు 400 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇస్తున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. శిక్షణలో భాగంగా ఆదివారం ఉపాధ్యాయులకు యోగా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. శిక్షణ సమర్థవంతంగా జరిగేందుకు పర్యవేక్షక కమిటీలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల బియ్యం స్వాధీనం
విజిలెన్సు అధికారులు పట్టుకున్న బియ్యం నాతవరం: లారీపై అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. మండలంలో నర్సీపట్నం–తుని మధ్య ఆర్అండ్బీ రోడ్డులో ఎం.బి.పట్నం పంచాయతీ శివారు ఎ.శరభవరం సమీపంలో నర్సీపట్నం వైపు నుంచి లారీపై తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నట్టు చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లఘించి తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, డి.యర్రవరం పౌరసరఫరాల గిడ్డంగికి తరలించినట్టు చెప్పారు. అక్కడ సివిల్ సప్లైడిప్యూటీ తహశీల్దార్ చందన లేఖ ఆధ్వర్యంలో తూకం వేసి, అప్పగించామన్నారు.ఈసంఘటనపై 6ఏ కేసు నమోదు చేసినట్టు డీటీ చందనలేఖ విలేకరులకు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
రావికమతం: మండలంలోని పి.పొన్నవోలు సమీపంలో బి.ఎన్.రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయే క్రమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోలుగుంట మండలం కొమరవోలుకు చెందిన బండారు మనో వరాహ వినయ్,వంటాకుల మదన్కుమార్,బండారు తేజ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై రావికమతం వైపు నుంచి స్వ గ్రామం కొమరవోలు వెళుతున్నారు.అదే సమయంలో టి.అర్జాపురానికి చెందిన ఆర్.జనార్దన్,మత్సవానిపాలెంకు చెందిన ఆదాడ సాయి ద్విచక్ర వాహనంపై మేడివాడ వైపు వెళున్నారు. పి.పొన్నవోలు దగ్గర ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు బలంగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు గాయపడ్డారు.కొమరవోలుకు చెందిన యువకులు విశాఖ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు.మత్సవానిపాలెం యువకుడు నర్సీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో, టి.అర్జాపురానికి చెందిన యువకుడు విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
నాలుగు పంచాయతీలకు స్వచ్ఛాంధ్ర అవార్డు
మునగపాక: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డుకు జిల్లాలోని నాలుగు పంచాయతీలు ఎంపికయ్యాయి. మునగపాక మండలంలోని ఒంపోలు, అనకాపల్లి మండలం మార్టూరు, అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం, నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామాల్లో శుభ్రత, చెత్త సేకరణను పరిగణనలోకి తీసుకొని, సర్వే ఫలితాలను అనుసరించి పురస్కారాలకు ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. నేడు అనకాపల్లిలో అవార్డుల బహూకరణ జిల్లాలో స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపికై న గ్రామాలకు చెందిన సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు సోమవారం -
బియ్యం సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం
నాతవరం: రేషన్ డిపోలకు బియ్యం సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోంది. దీంతో ఇటు డీలర్లకు, అటు కార్డుదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో ఆదివారం నాటికి 200 పైగా రేషన్డిపోలకు బియ్యం సరఫరా కాలేదు. నర్సీపట్నం ఎంఎల్సీ పాయింట్ పరిధిలో గల నర్సీపట్నం, గొలుగొండ, మాకవరపాలెం, రోలుగుంట, కోటవురట్ల మండలాల్లో గల 125 పైగా డిపోలకు పూర్తిగా(260 టన్నుల) బియ్యం అందలేదు. నాతవరం మండలంలో 42 రేషన్ డిపోలుండగా వీటిలో ఐదు డిపోలకు పూర్తిగా (30 టన్నుల) బియ్యం సరఫరా చేయలేదు.అరకొరగా వచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేయడంలో డీలర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. బియ్యం అందని రేషన్కార్డు దారులు వాగ్వాదాలకు దిగుతున్నారు. రావికమతం మండలానికి 140 టన్నులు, పాయకరావుపేట మండలానికి 200 టన్నులు ఇంకా సరఫరా చేయవలసి ఉంది. ప్రతి నెల 25 తేదీ నుంచే రేషన్ బియ్యాన్ని జిల్లా వ్యాప్తంగా మండలాలకు తరలిస్తుంటారు. మండలాల్లోని గోదాముల నుంచి గ్రామాల్లో రేషన్ దుకాణాలకు నేలాఖరున పంపుతారు. అయితే ఈ సారి బియ్యం సరఫరాలో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సకాలంలో బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని కార్డుదారులు కోరుతున్నారు. ఈవిషయంపై జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎంను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.రేషన్ కార్డుదారులకు పంపిణీలో జాప్యం -
‘రైవాడ’ నుంచి 1000 క్యూసెక్కుల నీరు విడుదల
దేవరాపల్లి: ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 950 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో జలాశయం స్పిల్ వే గేటు ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని శారదానదిలోకి విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 112.90 మీటర్లకు చేరుకుంది. నీటి నిల్వలతో జలాశయం నిండుకుండలా దర్శనమిస్తోంది. ఇన్ఫ్లో ఆధారంగా గేట్ల ద్వారా నీటి విడుదలను పెంచడం లేదా తగ్గించడం జరుగుతుందని, శారదానది పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలాశయం డీఈఈ జి.సత్యంనాయుడు తెలిపారు. -
పేట డైవర్షన్ రోడ్డులో ఆటోలు బోల్తా
● పలువురికి గాయాలు ● వడ్డాది పెద్దేరు వంతెనపై ట్రాఫిక్ జామ్ ● ప్రయాణికుల అవస్థలు బుచ్చెయ్యపేట: అస్తవ్యస్తంగా ఉన్న భీమునిపట్నం,నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఆదివారం విజయరామరాజుపేట తాచేరు వంతెనపై ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డుపై ఆటో బోల్తా పడగా, అందులో ప్రయాణిస్తున్న పలువురు తాచేరు నదిలో పడి, స్వల్ప గాయాలతో బయట పడ్డారు. రెండు నెలలు కిందట వర్షాలకు కొట్టుకుపోయిన తాచేరు డైవర్షన్ రోడ్డు మరమ్మతు పనులు రూ.15 లక్షలతో చేపట్టారు. సిమెంట్ పైపులు, వాటిపై గ్రావెల్ వేశారు. అయితే సరిగా రోలింగ్ చేయకుండా వదిలేశారు. పనులు పూర్తి స్థాయిలో చేయకుండానే శనివారం సాయంత్రం నుంచి వాహనాలు వెళ్లేలా బారికేడ్లు తీసివేశారు. దీంతో పలువురు వాహనదార్లు డైవర్షన్ రోడ్డుపై నుంచి రాకపోకలు సాగించారు. తాచేరు నదిపై కొత్తగా వేసిన డైవర్షన్ రోడ్డు గోతుల్లో పడి ప్రయాణికులతో వస్తున్న ఆటో బోల్తా పడింది. ప్రయాణికులు నదిలో పడిపోయారు. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో ఆటో డ్రైవర్, పలువురు ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. ఇదే ప్రదేశంలో మరో తొట్టె ఆటో బోల్తా పడింది. స్థానికుల సహకారంతో బోల్తా పడిన ప్రయాణికుల ఆటోతో పాటు గూడ్స్ ఆటోను బయటకు తీశారు. డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేయకుండానే వాహనాలను అనుమతించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల కిందట పేట డైవర్షన్ రోడ్డుపై నుంచి తాచేరు నదిలో పడిపోయి కొట్టుకుపోయి పేట గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి,వడ్డాదికి చెందిన రైతు మృతి చెందిన విషయం తెలిసిందే. వడ్డాది పెద్దేరు వంతెనపై ట్రాఫిక్ జామ్ మేజర్ పంచాయతీ వడ్డాది పెద్దేరు వంతెనపై ఆదివారం ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటరు దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం వడ్డాది సంత కావడంతో పలు గ్రామాల నుంచి వచ్చిన వ్యాపారులు, కొనుగోలుదారులతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో వడ్డాది రోడ్డు నిండిపోయింది. వడ్డాది పెద్దేరు నదిపై ఉన్న పాత బ్రిడ్జితో పాటు పక్క నుంచి వేసిన డైవర్షన్ రోడ్డుపైన ట్రాఫిక్ జామ్ అయింది. పాడేరు నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న 108 వాహనం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. స్థానికులు సాయంతో వాహనాలను పక్కకు తీయించి 108 వెళ్లేలా రహదారి కల్పించారు. ప్రతి ఆదివారం వడ్డాదిలో ట్రాఫిక్ జామ్ జరిగి, పలువురు ఇబ్బందులు పడుతున్నా పోలీసులు చర్యలు చేపట్టడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. -
ఈ–తంటా..!
యలమంచిలి రూరల్: అన్నదాతలు వ్యవసాయ సంబంధిత పథకాలు పొందాలన్నా, ఉత్పత్తులు అమ్ముకోవాలన్నా, పంటల బీమా వర్తించాలన్నా అన్నింటికీ ఈ–పంట నమోదే ప్రామాణికం. కీలకమైన ఈ ప్రక్రియను వ్యవసాయ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో చేపట్టాల్సి ఉంది. శాఖల మధ్య సమన్వయలోపం, ఈ–పంట నమోదుకు సంబంధించి మారిన కొత్త నిబంధనలు, సాంకేతిక అవరోధాల కారణంగా జిల్లాలో ఈ–పంట నమోదు మందకొడిగా సాగుతోంది. రెండుసార్లు గడువు పొడిగించినా ఉద్యాన, వ్యవసాయ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. ఈ ఏడాది జూలై మూడో వారం నుంచి ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ–పంట నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత గత నెల 30లోగా ఈ–పంట నమోదు పూర్తి చేయాలని గడువు విధించారు. ఆ తర్వాత ఈ నెల 15 వరకు గడువు పొడిగించగా, తాజాగా ఈ నెల 25లోగా పంటల నమోదు పూర్తి చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు ప్రకటించారు. అయితే జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే గడువులోగా పంట నమోదు పూర్తయ్యేలా లేదు. దీంతో అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం తీరుతో తాము నష్టపోతామన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. సవాలక్ష నిబంధనలు.. 21.8 శాతమే నమోదు జిల్లా రైతులు ఈ ఖరీఫ్లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు వ్యవసాయం, సామాజిక అటవీ సాగు కలిపి 3.51 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. రైతు పేరు, పంట, విస్తీర్ణం తదితర వివరాలను ఖాతా, సర్వే నంబర్ల వారీగా ఈ–పంట యాప్లో నమోదు చేయాలి. గతంలో సాగు చేసిన పంటల వివరాలను మాత్రమే నమోదు చేసేవారు. కానీ ఈసారి సాగులో లేని కమతాలను సైతం నమోదు చేయాలని నిబంధన కొత్తగా విధించారు. పంట సాగుచేయని పొలాల్లోనూ రైతులు ఫొటో దిగాల్సి వస్తోంది. పంటల సాగుతో పాటు బీడు భూముల వివరాలను నమోదు చేయిస్తున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో సబ్ డివిజన్ చేయకపోవడంతో జాయింట్ ఎల్పీ నంబర్లతోనే విస్తీర్ణం కనిపిస్తోంది. కొన్నిచోట్ల రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడంతో వ్యవసాయ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మారిన నిబంధనల ప్రకారం ఈసారి సర్వే నంబర్ల వారీగా జియో మ్యాపింగ్ చేసి, ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. ఈ తతంగం పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతోంది. సాంకేతిక సమస్యలతో ముందుకు కదలడం లేదు. బయోమెట్రిక్ పడని రైతులకు ఐరిస్ చేయడానికి సిగ్నల్ సమస్య వేధిస్తోంది. ఈసారి తోటల్లో గట్టు మీద పెంచే కొబ్బరి, తాటి చెట్లు, చింత, అల్లనేరేడు ఇతర రకాల చెట్లను ఈ–పంట చేయాలన్న నిబంధన విధించారు. ఇదంతా కష్టతరంగా మారినట్లు సంబంధిత ఉద్యోగులు చెబుతున్నారు. బీడు భూముల నమోదులో సవాలక్ష నిబంధనలు పొందుపరిచారు. కొత్త నిబంధనలతో జిల్లాలో ఈ–పంట నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. జిల్లాలో సాగు, బీడు భూములన్నీ కలిపి మొత్తం నమోదు చేయాల్సిన కమతాలు 17,30,843 కాగా ఇప్పటివరకు 3,77,528 మాత్రమే నమోదయ్యాయి. నమోదు శాతం 21.8 మాత్రమే. గడువు ఈ నెల 25 వరకు పొడిగించినా శతశాతం కమతాల నమోదు అసాధ్యంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు వీఏఏ, ఏవో, వీఆర్వోల వంటి క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నా ప్రభుత్వం మార్చిన కొత్త నిబంధనల కారణంగా వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వ్యవసాయం, ఉద్యానం సహా జిల్లాలో మొత్తం పంటల సాగు విస్తీర్ణం 3.51 లక్షల ఎకరాలు నమోదు చేయాల్సిన మడులు: 17,30,843 ఇప్పటివరకు నమోదు చేసినవి: 3,77,528 నమోదు శాతం: 21.8 లక్ష్యం చేరని పంట నమోదు కొత్త నిబంధనలతో క్షేత్రస్థాయి సిబ్బందికి ఇబ్బందులు మరోసారి ఈనెల 25 వరకు గడువు పొడిగింపు -
చలనం లేని ప్రభుత్వం
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం తిరగని రోజు, వెళ్లని కార్యాలయం లేదు.అయి నా ప్రభుత్వంలో చలనం లేదు. ఆరునెలల నుంచి పోరాటం చేస్తున్నా పట్టించుకోలేదు. నిర్వాసితులు సర్వం కోల్పోయి కొత్త ప్రాంతంలో నివాసముండాలంటే అన్ని సదుపాయాలు ఉండాలి. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన రూ.8.98 లక్షలు ఏ మాత్రం సరిపోదు. ప్యాకేజీ రూ.25 లక్షలు ఇవ్వాల్సిందే. కటాఫ్ తేదీ మధ్యలో వివాహమైన ఆడపిల్లలకు ప్యాకేజీ వర్తింపజేస్తేనే నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేస్తారు. – తళ్ల భార్గవ్, వైఎస్సార్సీపీ నాయకుడు, చందనాడ -
బల్క్డ్రగ్ పార్కును ఆపండి
● విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించండి ● వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం మహారాణిపేట(విశాఖ): నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, దానిని నిలిపివేయాలని, విశాఖ స్టీల్ప్లాంట్ను రక్షించాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూ రావు,పలువురు జెడ్పీటీసీలు డిమాండ్ చేశారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. బల్క్ డ్రగ్ పార్కు వల్ల మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారి ఆందోళనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజకవర్గంలో తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల ను సేవ చేశానని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్ రాష్ట్ర ప్రజల జీవనాడి అని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాను ఈ అంశా న్ని ఇప్పటికే మూడుసార్లు రాజ్యసభలో ప్రస్తావించానని, కేంద్ర ఉక్కు మంత్రి కూడా తనకు లేఖ రాశారని గుర్తుచేశారు. కేంద్రం ప్రస్తుతం సీఎం చంద్రబాబు మద్దతుపై ఆధారపడి ఉన్నందున, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఎంపీ డిమాండ్ చేశారు. జెడ్పీటీసీలు దొండా రాంబాబు, పైల సన్యాసిరాజు, పెంటకోట స్వామి సత్యనారాయణ తొలుత స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బాబూరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైర్పర్సన్ సుభద్ర ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపారు. సమావేశంలో పలు ఇతర కీలక అంశాలపై కూడా తీర్మానాలు చేశారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలకు గత ముఖ్యమంత్రి -
స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు అన ర్హుడు
మాజీ ఎమ్మెల్యే గణేష్నర్సీపట్నం: స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు అనర్హుడని, క్వాలిటీస్ గురించి మాట్లాడే అర్హత అయ్యన్నపాత్రుడికి లేదని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. వైఎస్ జగన్పై విమర్శలు చేయడం సరికాదని, అదే స్థాయిలో తామూ విమర్శలు చేయాల్సి వస్తుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 17 నెలల కాలంలో రూ.83 వేల కోట్లు అప్పు చేస్తే, కూటమి ప్రభుత్వం 17 నెలల కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. అప్పులతో రాష్ట్రాన్ని దివాలా తీయించి సీఎం ఎవరైనా ఉన్నారంటే అదే చంద్రబాబే అన్న విషయాన్ని స్పీకర్ గ్రహించాలన్నారు. స్పీకర్గా అయ్యన్నపాత్రుడుకు ఏవిధమైన క్వాలిటీస్ ఉన్నాయని గణేష్ ప్రశ్నించారు. నడిరోడ్డుపై మున్సిపల్ కమిషనర్, డీఈ ని, రావికమతం మండలంలో పోలీసులను, అన్రాక్ లారీల డ్రైవర్లను బూతులు తిట్టడమేనా స్పీకర్ క్వాలిటీస్ అని ఎద్దేవా చేశారు. నోరు విప్పితే బూతులు మాట్లాడే అయ్యన్నపాత్రుడు క్వాలిటీస్ గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిన వారిని అరెస్టు చేయాలని స్పీకర్ ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ బూతులు తిడితే అరెస్టు చేయరా అని గణేష్ పోలీసులను ప్రశ్నించారు. స్పీకర్ బూతులు తిట్టవచ్చని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుపై జీవో లేదని ప్రజలను నమ్మించేందుకు స్పీకర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. మెడికల్ కాలేజీపై స్పీకర్కు అవగాహన లేదని చెప్పారు. చేతనైతే మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం కాకుండా చూడాలన్నారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి, వైద్య విద్యతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీల్లో నర్సీపట్నం ఒకటని తెలిపారు. రూ.500 కోట్లతో 600 పడకలతో నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. పీపీపీ విధానంలో ఈ కాలేజీని పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం 28 రోజుల క్రితం ప్రత్యేక జీవో ఇచ్చిన విషయం స్పీకర్కు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022 ఆగస్టు 8న జీవోను జారీ చేసిందన్నారు. కాలేజీని ప్రైవేటు పరం చేసి, ఈ ప్రాంత పేద ప్రజలను దోపిడీ చేసేందుకు స్పీకర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుడు ప్రచారం మానుకుని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని గణేష్ హితువు పలికారు. ఈ సమావేశంలో మాకవరపాలెం మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పార్టీ మాకవరం పాలెం మండల అధ్యక్షుడు చిటికెల రమణ, పార్టీ నాయకులు రుత్తల శ్రీనివాస్, బొడ్డు గోవిందరావు పాల్గొన్నారు. -
నిర్వాసితుల వేదన... అరణ్య రోదన
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025విశాఖ–చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్నిర్మాణంలో భాగంగా ఏపీఐఐసీకి భూములు, నివాస ప్రాంతాలు ఇచ్చిన నిర్వాసితుల వేదన అరణ్య రోదనగా మారుతోంది. సమస్యలు పరిష్కరించకుండానే గ్రామాలను ఖాళీ చేయించి, 745 మందిని తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరో పక్క పునరావాస కాలనీలో కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు. దీంతో తమ డిమాండ్లు నెరవేర్చి, పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే తాము ఇక్కడ నుంచి కదులుతామని పలు గ్రామాల ప్రజలు ఖరాఖండీగా చెబుతున్నారు. మరో పక్క ఇప్పటికే బల్క్డ్రగ్ పార్క్ పనులు ప్రారంభం కాగా, మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులు త్వరలో ప్రారంభం కానుండడంతో ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.డీఎస్పీ కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే గణేష్, పార్టీ నాయకులునర్సీపట్నం: మాకవరపాలెం మండలం, భీమబోయినపాలెంలోని మెడికల్ కాలేజీని పరిశీలించేందుకు ఈ నెల 9వ తేదీన మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రానున్నారని, ఆ పర్యటనలో బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందజేశారు. పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు, షెడ్యూల్ త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు. గణేష్ వెంట వైఎస్సార్సీపీ మాకవరపాలెం మండల అధ్యక్షుడు చిటికెల రమణ, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పార్టీ నాయకులు మాకిరెడ్డి బుల్లిదొర, బొడ్డు గోవిందరా వు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు, రుత్తల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నా పట్టని ప్రభుత్వం డిమాండ్లు తీర్చకుండానే పునరావాసానికి తరలించేందుకు చర్యలు 745 మందిని ఖాళీ చేయించేందుకు సన్నాహాలు ససేమిరా అంటున్న పలు గ్రామాల ప్రజలు అధికారులు మల్లగుల్లాలు -
చంద్రబాబు పథకాలన్నీ కాపీ పేస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో కలిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. సొంతంగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను, పొరుగు రాష్ట్రాల పథకాలను ఆయన కాపీ పేస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నామని వారు స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి నేతలు ఉత్తరాంధ్ర వనరులను కొల్లగొడుతున్నారని, విశాఖలో సదస్సులు నిర్వహించి, పెట్టుబడులను మాత్రం అమరావతికి తరలిస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై ఉన్న ప్రేమతో చంద్రబాబు ఉత్తరాంధ్రపై వివక్ష చూపుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి బాట పట్టిన ఉత్తరాంధ్ర.. నేటి కూటమి పాలనలో భ్రష్టుపట్టిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారని, వాటిలో పది కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అమర్నాథ్, కేకే రాజు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వైద్య కళాశాలను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తారని వారు వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య పాల్గొన్నారు. స్పీకర్ అయ్యన్నవి అర్థం లేని మాటలు స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు అనర్హుడని అమర్నాథ్, కేకే రాజు అన్నారు. ‘అయ్యన్నలో కనీసం ఒక్క మంచి లక్షణం కూడా లేదు. అబద్దాలు, అర్థం లేని మాటలు మాట్లాడటం ఆయన నైజం’ అని విమర్శించారు. నేడు వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు ఆనందపురం మండలం పెద్దిపాలెంలోని చెన్నా కన్వెన్షన్ సెంటర్లో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు అమర్నాథ్, కేకే రాజు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ జి.తనూజారాణి, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరవుతారని తెలిపారు. ఏర్పాట్ల పరిశీలన తగరపువలస: పెద్దిపాలెంలోని చెన్నా ఫంక్షన్హాలులో ఆదివారం జరిగే వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లను శనివారం విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, పార్టమెంట్ ప్రధాన కార్యదర్శి తైనాల విజయకుమార్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పరిశీలించారు. జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావు, ఎంపీపీ దంతులూరి వాసురాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గండ్రెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బంక సత్యం, మజ్జి వెంకటరావు, షిణగం దామోదరరావు, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు షిణగం రాంబాబు, రౌతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన ఉపాధ్యాయులు
నర్సీపట్నం: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శనివారం జిల్లా వ్యాప్తంగా కదం తొక్కారు. న ర్సీపట్నంలో సీబీఎం కాంపౌండ్ నుంచి పెదబొడ్డేపల్లి జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీని ఉద్దేశించి జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ వై.సుధాకరావు, నర్సీపట్నంశాఖ నాయకులు పడాల అప్పారావు, ఎం.చిట్టియ్య, జానకీరామ్నాయుడు, డి.నూకరాజు, కె.సత్యనారాయణ, ఆర్.వి.దొర మాట్లాడుతూ నాలుగు డీఎలను మంజూరు చేయాలని, 30 శాతం ఐఆర్ వెంటనే మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఆరు మండలాల నుంచి వంద మంది ఉపాధ్యాయులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.చోడవరంలో ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ చోడవరం: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చోడవరం మెయిన్రోడ్డులో కాలేజీ జంక్షన్ నుంచి కొత్తూరు వరకూ మోటారు సైకిళ్లపైన ర్యాలీ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, రావలసిన అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా ఇప్పటి వరకూ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని ఫ్యాప్టో ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమరాన త్రినాథరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు మైచర్ల మహాలక్ష్మీనాయుడు, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆర్. చిరంజీవి, కె. మల్లేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు గొల్లు శ్రీనివాసరావు, యూటీఎఫ్ ప్రతినిధులు పొలిమేర చంద్రరావు, జేపీఎస్ కృష్ణ, ఎస్టీ,ఎస్సీ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధి నందికోళ్ల దేముడు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు పి. సూర్యప్రకాష్, కామాక వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.చోడవరంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు నర్సీపట్నంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు -
డిమాండ్లు తీర్చాలి
పునరావాసకాలనీకి వెళ్లాలంటే ముందు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయం తేల్చాలి. తాము డిమాండ్ చేస్తున్న విధంగా రూ.25 లక్షల చొప్పున చెల్లించాలి. వివాహమైన ఆడప్లిలలను లబ్ధిదారుల జాబితాలో చేర్చాలి. అర్హులైన నిర్వాసితులకు ఇంటిస్థలం, ఆర్ అండ్ ఆర్ప్యాకేజీ ఇవ్వాలి.పశువుల షెడ్లకు, సాగుదారులకు నష్టపరిహారం చెల్లించాలి. పునరావాస కాలనీలో నివాసానికి యోగ్యంగా ఉండేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించాలి. – గెడ్డమూరి గోవిందు, నిర్వాసితుడు, తమ్మయ్యపేట -
బల్క్డ్రగ్ పార్కును ఆపండి
వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని, కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల బకాయిలు చెల్లించాలి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల బకాయిలను తక్షణం విడుదల చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుండా రైతులకు మొక్కజొన్న వేయమని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని చైర్పర్సన్ ఆమోదించారు. అనంతగిరిలో హైడ్రో ప్రాజెక్టు వద్దు అనంతగిరిలో హైడ్రో ప్రాజెక్టును నిలుపుదల చేయాలని జెడ్పీటీసీ సభ్యులు గంగరాజు, చెట్టి రోష్మిణి డిమాండ్ చేశారు. అల్లూరి కలెక్టర్, ఎస్పీలు దగ్గరుండి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించడం విచారించదగిన విషయమన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. సెప్టెంబర్ 5న గిరిజన బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగితే ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కలెక్టర్కు ఆ బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. హోంమంత్రి సొంత జిల్లాలో లైంగిక దాడులు జరుగుతున్నా.. చర్యలు తీసుకునే వారు లేరని ఆరోపించారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం ఎంత జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఏం చేసిందో చెప్పాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. యూరియా సరఫరా చేయడంలోనూ కూటమి విఫలమైందని ఆమె మండిపడ్డారు. -
గిరిసీమలో నో సిగ్నల్
నాతవరం: గిరిజన గ్రామాల్లో సెల్టవర్లు ఏర్పాటుపై అధికారులు, ప్రజాప్రతినిధుల హామీలు గాలి మూటలుగానే మిగిలాయి. దాంతో ప్రభుత్వ సేవలందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2022లో సరుగుడు, సుందరకోట పంచాయతీల్లో పర్యటించిన అప్పటి కలెక్టరు రవి పట్టాన్శెట్టికి, ఇటీవల సుందరకోట పంచాయతీలో గ్యాప్ ఏరియా భూములు పరిశీలనకు వచ్చిన కలెక్టరు విజయకృష్ణన్కు గతేడాది నవంబరులో సుందరకోట సభలో స్పీకరు అయ్యన్నపాత్రుడుకు సెల్ టవర్లు లేక పడే బాధలను మొరపెట్టుకున్నారు. ఇంతవరకూ వీరిచ్చిన హామీలు నెరవేరలేదని వాపోతున్నారు. సరుగుడులో బీఎస్ఎన్ఎల్ టవరు తరుచూ మొరాయిస్తుండటంతో సిగ్నల్స్ రాక ఆన్లైన్ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఒక్కొక్క రోజు గంటలకొద్దీ సిగ్నల్స్ రావడం లేదు. దాంతో ఇక్కడ గ్రామ సచివాలయంలో సకాలంలో పౌర సేవలు అందడం లేదు. ఈ సెల్ టవరు ద్వారా సరుగుడు, సుందరకోట పంచాయతీల పరిధిలో 16 శివారు గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. పింఛన్లతోపాటు నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు అందించాలన్నా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. స్పీకర్ హామీకి అతీగతీ లేదు.. గతేడాది నవంబరు 24వ తేదీన సుందరకోట గ్రామ సభలో అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు దృష్టికి 16 గ్రామాల గిరిజనులు రాజకీయాలకు అతీతంగా ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో తీసుకెళ్లారు. ఇతర గిరిజన గ్రామాల్లో అదనంగా మరో మూడు టవర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలే కాకుండా ప్రైవేటు కార్యక్రమాలు సైతం టవరు పని చేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. దానికి స్పందించి సెల్ టవర్ ఏర్పాటుకు హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. సరుగుడు గ్రామ సచివాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదులు వేదికలో ప్రజలు అర్జీలు సమర్పిస్తున్నారు. వీటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే సిగ్నిల్ అందక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కొండలపై ఉన్న 16 గిరిజన గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, రామన్నపాలెంలో గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ పరమైన సేవలు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి సెల్ టవరు పని చేసేలా చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. మా బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలి నేను గత కలెక్టరు రవి పట్టాన్శెట్టికి ప్రస్తుత కలెక్టరు విజయ కృష్ణన్కు సెల్ టవర్ల విషయమై విన్నవించాను. గత ఏడాది నవంబరులో స్పీకరు అయ్యన్నపాత్రుడు సుందరకోట గ్రామానికి వచ్చినప్పుడు సెల్ టవర్లు లేక గిరిజనులు పడుతున్న బాధలు వివరించాను. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలంటే సాంకేతిక అవాంతరాలు ఎదురవుతున్నాయి. సాంకేతిక సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేటికీ పట్టించుకోలేదు. ఇక మేము ఈ సమస్య ఇంకెవ్వరికి చెప్పుకోవాలి. – సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ, నాతవరం సెల్ టవర్ల ఏర్పాటుపై నెరవేరని స్పీకరు అయ్యన్న హామీ ఇద్దరు కలెక్టర్లకు విన్నవించినా నిరాశే సరుగుడులో మొరాయిస్తున్న బీఎస్ఎన్ఎల్ టవరు 16 గ్రామాల గిరిజనులకు అందని ప్రభుత్వ సేవలు -
పాటిపల్లి ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ సందర్శన
మునగపాక: మండలంలోని పాటిపల్లిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను శనివారం జిల్లా టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు సందర్శించారు. కేంద్రం ద్వారా అందుతున్న రోజువారీ సేవలతో పాటు మాతా శిశు సేవలను, రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు,కిషోర్ బాలికల గృహాలను సందర్శించారు. బృందం సభ్యులు కె.జగదీష్, జిల్లా గణాంకాధికారి ఎ.రామచంద్రరావు, డేటా మేనేజర్ జనార్దన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకుంటూ వైద్యుల సూచన మేరకు మందులు వేసుకోవాలని తెలిపారు. కిల్కారీ సేవలపై అవగాహన కల్పించారు. సీహెచ్వో దేవకాంత, సూపర్వైజర్లు వీఎస్ఎం లక్ష్మి,ఎం.నాగేశ్వరరావు, ఎంఎల్హెచ్పీలు యామిని, దీన, వినీల, దుర్గ పాల్గొన్నారు. -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు ప్రారంభోత్సవంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుగొలుగొండ: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, అప్పుడే మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. గొలుగొండ మండలం ఏఎల్పురం(కృష్ణదేవిపేట) హైస్కూల్లో రాష్ట్ర స్థాయి జూనియర్ 12వ సాఫ్ట్బాల్ పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. ముందుగా రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలను వచ్చిన జట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ అండర్–14 విభాగం పోటీల్లో 416 మంది బాలబాలికలు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు నడియాడిన ఈ ప్రాంతంలో ఇటువంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామన్నారు. ప్రస్తుతం క్రీడలపై చిన్నచూపు ఉందని, ఇకనుంచి పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి తనవంతు సాయంగా రూ.50 వేలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఏఎస్పీ దేవిప్రసాద్, నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు, నిర్వాహకులు రమణ, శ్రీనివాసరావు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, సర్పంచ్ లోచల సుజాత పాల్గొన్నారు. -
‘ఆటో డ్రైవర్ల సేవలో’ ప్రారంభం
పథకం ప్రారంభోత్సవంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ విజయకృష్ణన్ నర్సీపట్నం: ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని స్థానిక మార్కెట్యార్డ్లో శనివారం ప్రారంభించారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, జిల్లా రవాణా శాఖ అధికారి మనోహర్, ఆర్డీవో వెంకట రమణ పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథథకం చెక్కును స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 13,753 మంది డ్రైవర్లకు సుమారు రూ. 20.62 కోట్లు లబ్ధి చేకూరింది. జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ప్రతి ఆటో సోదరుడు సంతోషంగా ఉండాలనే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ విజయకృష్ణను మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న నగదును సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. -
సహకార వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి
స్పీకర్ అయ్యన్నపాత్రుడు చోడవరం: సహకార వ్యవస్థపై అధ్యక్షులంతా పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులందరికీ జిల్లాస్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని చోడవరంలో శుక్రవారం నిర్వహించారు. డీసీసీబీ చైర్పర్సన్ కోన తాతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంఘాన్ని లాభాల్లో నడిపించే విధంగా పనిచేయాలన్నారు. ఎక్కువగా రైతుల భాగస్వామ్యం ఈ సంఘాల్లో ఉంటుంది కాబట్టి వారికి అన్ని విధాలుగా సేవలు అందించాలన్నారు. చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కెఎస్ఎన్ఎస్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, డీసీసీబీ జీఎం వర్మ, తదితరులు పాల్గొన్నారు. -
రౌడీయిజం చేస్తే ఉపేక్షించం
● అనకాపల్లి డీఎస్పీ శ్రావణి హెచ్చరిక ● దేవరాపల్లిలో రెండు వర్గాల మధ్య కొట్లాటపై విచారణ ● 10 మందిపై కేసులు నమోదుదేవరాపల్లి: ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అల్లర్లు సృష్టించాలని చూస్తే రౌడీషీట్లు తెరుస్తామని అనకాపల్లి డిఎస్పీ ఎం. శ్రావణి హెచ్చరించారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం చేయాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దేవరాపల్లిలో గురువారం రాత్రి వాట్సాప్ చాటింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాదం రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీసింది. పోలీసులు సకాలంలో స్పందించి ఇరు వర్గాలను చెదరగొట్టి వివాదాన్ని తాత్కాలికంగా సద్దుమణిగించారు. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు స్థానిక పోలీస్స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు డీఎస్పీ ఎం. శ్రావణి శుక్రవారం దేవరాపల్లి పోలీస్స్టేషన్కు వచ్చారు. ఇరువర్గాల వారిని స్టేషన్కు పిలిపించి ఘర్షణకు దారి తీసిన కారణాలపై ఆరా తీసి, వారిని గట్టిగా మందలించారు. ఒక వర్గానికి చెందిన కిలపర్తి భాస్కరరావు సహా ఐదుగురి పైన, మరో వర్గమైన వరదపురెడ్డి సింహాచలంనాయుడు సహా ఐదుగురి పై కేసులు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇరువర్గాలకు చెందిన 10 మందిని తహసీల్దార్ వద్ద బైండోవర్ చేయాలని ఎస్ఐని ఆదేశించినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఆమె వెంట ఎ.కోడూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ తదితర్లు ఉన్నారు. -
విద్యుత్ షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం
రావికమతం: మండలంలోని చినపాచిలి పంచాయతీ శివారు మత్స్యపురంలో గురువారం విద్యుత్ షార్ట్సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామంలో ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న మామిడి దేవుడు అనే వ్యక్తి ఇంటిలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. మంటలతో పాటు దట్టంగా పొగ వ్యాపించింది. కొందరు యువకులు సాహసించి ఇంటిలో గ్యాస్ సిలిండర్ను బయటకు తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఫ్రిజ్, టీవీ, ఫ్యాన్లు, స్టౌ, వంట ప్రాతలు దగ్ధమయ్యాయి.అందిన సమాచారం మేరకు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి, మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో రూ.లక్ష ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. -
ఘనంగా భగీరథమ్మ మహోత్సవాల ముగింపు
● ఆకట్టుకున్న గంగాహారతి ● వైభవంగా శూలాల మహోత్సవం ● దీపాలంకరణతో వెలుగులు అచ్యుతాపురం: మండలంలోని హరిపాలెం అందలాపల్లిలో భగీరథమ్మ దసరా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. భగీరథమ్మ కొండ ఆధ్మాత్మిక సందడితో దేదీప్యమానంగా వెలుగులీనింది.గురువారం అమ్మవారు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు.సాయంత్రంలో భక్తులు శూలాలు ధరించి ఊరేగింపు నిర్వహించారు. అగ్నిగుండం తొక్కిన తర్వాత భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆవకాలువ మదుంపై నిర్వహించిన గంగాహారతి ఆకట్టుకుంది. పలు చోట్ల అమ్మవారి ఉత్సవాలు... దసరా మహోత్సవాలను పురస్కరించుకుని హరిపాలెంలో శూలాల మహోత్సవం ఘనంగా జరిగింది.తిమ్మరాజుపేటలో భక్తులు శూలాలు ధరించి ఉత్సవంలో పాల్గొన్నారు.అచ్యుతాపురంతో పాటు జగన్నాథపురం తదితర గ్రామాల్లో దసరా ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
వృత్తి సవాళ్లపై అవగాహన ఉండాలి
సబ్బవరం: వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంతో పాటు, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే అంశాలపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉండాలని ఆర్జేడీ విజయభాస్కర్ శుక్రవారం తెలిపారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో డీఎస్సీ–2025లో ఎంపికై న నూతన ఉపాధ్యాయులందరికీ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. విశాఖ ఉమ్మడి జిల్లాకు చెందిన కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడంతో పాటు, వృత్తిపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ 8 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జేడీ విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణను ఉపాధ్యాయులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పనిచేసే గ్రామానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి జి. అప్పారావు నాయుడు, ఉప విద్యాశాఖాధికారి అప్పారావు, అకడమిక్ మానిటరింగ్ అధికారి కెజియా తదితరులు పాల్గొన్నారు. మధురవాడలో.. మధురవాడ: కొత్తగా విధుల్లో చేరబోతున్న ఉపాధ్యాయులు తాము పొందుతున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్ సూచించారు. మధురవాడ ఐటీ సెజ్లో డీఎస్సీ–2025 ద్వారా ఎంపికై న ఉపాధ్యాయుల కోసం 8 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘ఇండక్షన్ ట్రైనింగ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని 360 మంది ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రేమకుమార్, భీమిలి డైట్ ప్రిన్సిపాల్ ఎల్. సుధాకర్ పాల్గొన్నారు. -
చిక్కుడుపాలెం శివాలయంలో శుభలేఖ సుధాకర్ పూజలు
నాతవరం: మండలంలో చిక్కుడుపాలెంలో వెలిసిన శివ శక్తి భూగర్భ శివాలయంలో గురువారం సినీనటుడు శుభలేఖ సుధాకర్ ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి సందర్భంగా ఆయన ఈ శివాలయాన్ని సందర్శించి, ఇక్కడ శివలింగాలకు స్వయంగా అభిషేకం చేశారు. అనంతరం శుభలేఖ సుధాకర్ను ఆలయ నిర్మాణ కర్త కె.ఎస్.ఎన్. శర్మ ఘనంగా సత్కరించారు.ఈసందర్భంగా శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఇంతటి గొప్ప శివాలయం నిర్మించడం విశేషమన్నారు. భూగర్భంలో ప్రతిష్టించిన శివలింగాలను చూసి చాలా ఆనందం కలిగిందని చెప్పారు. శుభలేఖ సుధాకర్ను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. పలువురు ఆయనతో ఫొటోలు తీసుకున్నారు. -
అటవీశాఖలో ధనదాహం
నర్సీపట్నం: టేకు కలప పట్టివేతలో అటవీ సిబ్బంది ధనదాహం కలకలం రేపుతోంది. నర్సీపట్నంలో అటవీ సిబ్బంది అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన విషయం అజ్ఞాత వ్యక్తి సమాచారంతో వెలుగులోకి వచ్చింది. ‘సాక్షి’కి లభించిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం గత నెల 17వ తేదీన కోటవురట్ల మండలం, యండపల్లి సమీపంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న టేకు కలపను రేంజర్ రాజేశ్వరరావు సమక్షంలో అటవీ సిబ్బంది పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేసి రేంజ్ కార్యాలయంలో ఉన్న కలప డిపోకు తరలించారు. మిల్లులో కోసిన దుంగలకు ఒక రేటు, చెక్కుడు దుంగలకు వేరే రేటు ఉంటుంది. పట్టుబడింది మిల్లులో కోసిన దుంగలైతే రికార్డులో చెక్కుడు దుంగలుగా చూపించారు. విలువ తక్కువ చూపి రూ.79,848 మాత్రమే అపరాధ రుసుం విధించారు. నిబంధనల ప్రకారం పట్టుకున్న కలప విలువకు ఐదింతర జరిమానా విధించాలి. ఈ వ్యవహారంలో రూ.50 వేల వరకు చేతులు మారినట్టు తెలిసింది. ఇదే విషయం ఓ అజ్ఞాత వ్యక్తి రాష్ట్ర అటవీశాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. పట్టుకున్న కలపను పరిశీలించి రూ.లక్షా 7 వేల అపరాధ రుసుం విధించారు. రూ.30 వేలకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో ఎవరిపై వేటు పడుతుందోనని అటవీ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. డీఎఫ్వో శామ్యూల్ను సంప్రదించగా ఈ విషయం తన దృష్టిలో ఉందని, సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉందని తెలిపారు. పట్టుకున్న టేకు విలువ తగ్గించి చూపిన సిబ్బంది జరిమానా తక్కువ విధించడంతో అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు రంగంలోకి ఫ్లయింగ్ స్క్వాడ్.. మరో రూ.30 వేల ఫైన్ విధింపు అటవీశాఖలో కలకలం రేపుతున్న అవినీతి బాగోతం -
యూరియా కోసం పడిగాపులు
● వేకువజాము నుంచే నిరీక్షించినా దక్కని ఫలితం ● కొద్ది సేపటికే సరకు పూర్తవడంతో అన్నదాతలకు నిరాశకె.కోటపాడు: వేకువజాము నుంచే వేచి ఉన్నా యూరియా లభించకపోవడంతో రైతులు నిరాశగా వెనుదిరిగారు. చౌడువాడ గ్రామంలో గల రైతు సేవా కేంద్రం వద్ద శుక్రవారం యూరియా పంపిణీ జరుగుతుందన్న సమాచారంతో వేకువజామునే రైతు సేవా కేంద్రం వద్దకు రైతులు చేరుకున్నారు. రైతు సేవా కేంద్రం వద్ద రైతుల పాస్ పుస్తకాలు జెరాక్స్లతోపాటు ఆధార్కార్డులను లైన్లో ఉంచి వ్యవసాయశాఖ అధికారులు వచ్చేంత వరకూ వేచి ఉన్నారు. తీరా రైతు సేవా కేంద్రానికి వచ్చిన 12 టన్నుల యూరియా కోసం సుమారు 600 మంది రైతులు పోటీ పడ్డారు. తీరా ప్రారంభించిన కొద్ది సేపటికే సరకు పూర్తయ్యింది. దీంతో యూరియా దక్కని రైతులు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్ధితి ఏర్పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఏసీఎస్ల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇచ్చేవారని రైతులు గుర్తు చేసుకున్నారు. చౌడువాడ రెండు సచివాలయాల పరిధిలో గల చౌడువాడ, గరుగుబిల్లి, మల్లంపాలెం, పాచిలవానిపాలెం గ్రామాల్లో పంటల సాగును వ్యవసాయశాఖ అధికారులు పరిగణనలోనికి తీసుకొని త్వరితగతిన యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
స్వచ్ఛత మెరిసి.. చౌడువాడ మురిసి
చౌడువాడలోని చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రంకె.కోటపాడు: స్వచ్ఛతతో ఆ గ్రామం మెరిసింది... రాష్ట్రస్థాయిలో అవార్డుకు ఎంపిక కావడంతో ఆ పల్లె మురిసిపోయింది. మండలంలోని మేజర్ పంచాయతీ అయిన చౌడువాడ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ గ్రామ అవార్డుకు ఎంపికై ంది. రాష్ట్రంలో మొత్తం ఆరు గ్రామ పంచాయతీలను స్వచ్ఛ గ్రామ పంచాయతీలకు ఎంపిక చేయగా వీటిలో చౌడువాడ ఒకటి. గ్రామంలో పరిశుభ్రతకు పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తీసుకుంటున్న చర్యల ఫలితంగా రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డు లభించడం పట్ల గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెల్లతెల్లవారుతుండగానే... గ్రామ పంచాయతీలో ఆరుగురు క్లాప్మిత్రలు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఉదయం ఆరు గంటలకే గ్రామాల్లో గల ప్రధాన వీధుల్లో చెత్త సేకరణను చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ వీధిలో ఇళ్లకు వెళ్లి వారికి పంచాయతీ అందించిన డస్ట్బిన్లలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి గ్రామ శివారున గల చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి తరలిస్తున్నారు. తద్వారా గ్రామంలో గల ప్రధాన వీధుల్లో అపారిశుధ్య సమస్య లేకుండా అధికారులు చర్యలను తీసుకుంటున్నారు. సంపద తయారీ కేంద్రంలో వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేస్తూ తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకూ 1,500 కిలోల ఎరువును విక్రయించగా రూ.7,500లు ఆదాయం పంచాయతీకి లభించింది. ప్లాస్టిక్ వ్యర్థాలు, అట్టపెట్టెలను సేకరించి విక్రయించగా పంచాయతీకి మరో రూ.4వేల ఆదాయం వచ్చింది. రాష్ట్ర స్థాయి అధికారుల పరిశీలన చౌడువాడ గ్రామాన్ని గత నెల 19న రాష్ట్ర స్థాయి అధికారులు పరిశీలించారు. వీధుల్లో పారిశుధ్యం, గ్రామస్తులు తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి క్లాప్మిత్రలకు అందించే విధానాన్ని గమనించారు.ఇళ్ల పరిసరాల్లో కిచెన్గార్డెన్ల నిర్వహణను పరిశీలించారు. సంపద తయారీ కేంద్రం నిర్వహణ, పరిశుభ్రత తదితర అంశాలను గుర్తించిన అధికారులు చౌడువాడ గ్రామాన్ని ఉత్తమ స్వచ్ఛ గ్రామంగా ఎంపిక చేశారు. రోజూ ఇన్లైన్ క్లోరినేషన్ చౌడువాడలో ఎనిమిది తాగునీటి పథకాలున్నాయి. ప్రతి రోజూ పథకాలకు నీరు వచ్చే సమయాల్లోనే ఇన్లైన్ క్లోరినేషన్ కార్యక్రమం జరిగేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారు. తద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒక సారి ఈ తాగునీటి పథకాలను శుభ్రపరుస్తున్నారు. గ్రామంలో 2,400 ఇళ్లు ఉండగా, 7,373 మంది జనాభా నివస్తున్నారు. ఈ ఏడాది 90 శాతం ప్రజలు ఇంటి పన్నులు చెల్లించారు. బాధ్యత పెరిగింది రాష్ట్ర స్థాయిలో చౌడువాడ స్వచ్ఛ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. దీంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. క్లాప్మిత్ర, గ్రీన్మిత్ర, పంచాయతీ పాలకవర్గ, గ్రామ పెద్దలు పారిశుధ్యం మెరుగుకు సహకారం అందిస్తున్నారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఇన్లైన్ క్లోరినేషన్ జరిగేలా చర్యలు తీసుకున్నాం. –పి.సురేష్బాబు, పంచాయతీ కార్యదర్శి, చౌడువాడ ఆనందంగా ఉంది చౌడువాడ రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ పంచాయతీగా ఎంపిక కావడంలో అందరి సహకారం ఉంది. ఉదయం 6 గంటల నుంచే చెత్త సేకరణ ప్రారంభమవుతుంది. ప్రజలు, పంచాయతీ పాలక వర్గ సభ్యుల సూచనల మేరకు పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ అవార్డును ఈ నెల 6న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్వీకరించనున్నాం. –దాడి ఎరుకునాయుడు, సర్పంచ్, చౌడువాడ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ పంచాయతీగా ఎంపిక ఈ నెల 6న విజయవాడలో అవార్డు అందుకోనున్న సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి -
బతికుండగానే చంపేశారు
బుచ్చెయ్యపేట: బతికుండగానే మృతి చెందినట్లు రేషన్ కార్డులో ఓ ఆటో డ్రైవర్ పేరు తొలగించారు. దీంతో ప్రభుత్వం నుంచి అందే రేషన్ బియ్యంతోపాటు వాహనమిత్ర పథకం అందకుండా పోయింది. బుచ్చెయ్యపేట మండలం ఎల్.శింగవరం గ్రామానికి చెందిన వేపాడ సురేష్కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు. సురేష్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరి రేషన్ కార్డులో మొత్తం ఐదుగురు కుటుంబ సభ్యులుండగా ప్రతి నెలా 25 కేజీల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పొందుతున్నారు. గత నెల వీరికి 20 కేజీల బియ్యం మాత్రమే రావడంతో సాంకేతిక లోపం అని ఊరుకున్నారు. ప్రభుత్వం దసరాకు వాహనమిత్ర పథకం అందిస్తుందని 10 రోజుల కిందట సచివాలయానికి వెళ్లి సురేష్ దరఖాస్తు చేసుకున్నాడు. వాహనమిత్ర పథకం అందించే లిస్టులో సురేష్ పేరు రాకపోవడంతో అక్కడ సచివాలయ సిబ్బందిని నిలదీశాడు. నీవు మృతి చెందినట్లు ఆన్లైన్లో చూపిస్తుందని, రేషన్ కార్డులో నీ పేరు లేదని చెప్పడంతో బాధితుడు సురేష్ విస్తుపోయాడు. వాహనమిత్ర పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే అసలు నీవు బతికే లేవు, పథకం ఎలా వస్తుందని సచివాలయ సిబ్బంది ప్రశ్నించడంతో సురేష్కు ఏం చేయాలో తెలీక తల పట్టుకున్నాడు. కొంతమంది అధికారుల తప్పిదం వల్ల తనకు రేషన్ బియ్యంతో పాటు ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయని వాపోయాడు. తక్షణం తన పేరు రేషన్ కార్డులో నమోదు చేసి ఆదుకోవాలని కోరుతున్నాడు. దీనిపై తహసీల్దార్ లక్ష్మిని వివరణ కోరగా బాధిత కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు తీసుకొని వస్తే జిల్లా పౌర సరఫరాల అధికారి దృష్టికి తీసికెళ్లి న్యాయం జరిగేలా చూస్తానన్నారు.మృతి చెందినట్లు రేషన్ కార్డులో పేరు తొలగింపు -
పూర్ణాహుతితో ముగిసిన బ్రహోత్సవాలు
జమ్మిచెట్టుకు పూజలు నిర్వహిస్తున్న అర్చకులుస్వామివారి ఉంగరం తీశారని భక్తుల విచారణ నక్కపల్లి: ఉపమాక శ్రీకల్కి వేంకటేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగిన వార్షిక బ్రహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో విజయదశమి పురస్కరించుకుని గురువారం శమీ పూజ, మహా పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా జరిగింది. చూర్ణోత్సవం, దర్పణ సేవ జరిగిన తర్వాత స్వామి వినోదోత్సవం నిర్వహించారు. స్వామివారి ఉంగరం పోయిందని భక్తులను విచారించడం, వారు అవాక్కవ్వడం, చివరకు స్వామివారి పాదాల వద్ద ఉంగరం పడి ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకోవడం వినోదంగా సాగింది. బంధుర సరస్సు వద్ద భక్తుల గోవింద నామస్మరణల మధ్య సుదర్శన పెరుమాళ్లతో చక్రవారీ స్నానం నిర్వహించారు. వాతావరణం అనూకూలించకపోవడంతో శమీ పూజను ఆలయంలోనే ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవళింపు సేవను పునఃప్రారంభం చేశారు. పది రోజులపాటు జరిగిన స్వామివారి బ్రహోత్సవాలు గురువారం రాత్రితో సంపూర్ణమయ్యాయని ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్ ఆచార్యులు చెప్పారు. -
మోదకొండమ్మ ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభం
మాడుగుల: స్థానిక మోదకొండమ్మ ఆలయంలో గురువారం ప్రేమ విహారి సినిమా షూటింగ్ ప్రారంభించారు. మాదల ప్రొడక్షన్ నంబరు 2 పేరు మీద ప్రారంభించిన సినిమా తొలి షాట్కు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనాధు శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు. చిత్రం వివరాలను యూనిట్ సభ్యులు స్థానిక విలేకరులకు తెలిపారు. పూర్తి ప్రేమకథా చిత్రమైన ఈ సినిమాలో హీరోగా మలయాళం నటుడు కన్నా, హీరోయిన్గా గెహజీ నటిస్తున్నారు. డైరెక్టరుగా అశోక్రాజు, నిర్మాతగా ప్రియ మాదల వ్యవహరిస్తున్నారు. సంగీతం ప్రియేష్ సమకూరుస్తున్నారు. చీడికాడ గ్రామానికి చెందిన గండి గోపి సపోర్టింగ్ యాక్టర్గా నటిస్తున్నారు. గండి గోపి పర్యవేక్షణలో ఈ చిత్రం షూటింగ్ జరుపుతున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందు ఆలయంలో అమ్మవారికి నటీనటులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు ఇతర కమిటీ సభ్యులు దంగేటి సూర్యారావు, దేవరాపల్లి శ్రీనివాసరావు, భీమరశెట్టి పైడియ్యనాయుడు, వేమన గోవింద, జోన్నపల్లి రమేశ్, పాలకుర్తి క్రాంతి, కొప్పోజు రాజు, ధర్మిశెట్టి సూరిబాబు, మాజీ జెడ్పీటీసీ బి.భవానీ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయితో వ్యక్తి అరెస్టు
గంజాయి నిందితుడితో ఎస్ఐ తారకేశ్వరరావు నాతవరం: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని నాతవరం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్ఐ వై.తారకేశ్వరరావు శుక్రవారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో తాండవ జంక్షన్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సమయంలో నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా బ్యాగ్లో ఉన్న గంజాయి బయటపడింది. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన బీజీల్దేవ్ప్రసాద్ను అరెస్టు చేసి, రెండు కిలోల 8 గ్రామాల గంజాయి, ఒక సెల్ పోన్ స్వాఽఽధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.15వేలు ఉంటుందని చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. -
నూకాంబిక సేవలో కలెక్టర్లు
అనకాపల్లి: దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని గురువారం అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్, ఎస్.దినేష్ కుమార్, హరేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. తొలుత వీరికి దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూర్ణాహుతి హోమం, అవభృత స్నానం, శమీ వృక్షపూజలు చేయించారు. అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఉద్యోగులు పాల్గొన్నారు. -
జూలో సందడిగా వన్యప్రాణి వారోత్సవాలు
ఆరిలోవ(విశాఖ): ఇందిరా గాంధీ జూ పార్కులో గురువారం వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభమయ్యా యి. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా, మొదటి రోజు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ‘తేనెటీగలు, పక్షులు, సీతాకోక చిలుకలు, సముద్ర జీవ వైవిధ్యం – మనం’ –‘మానవ – ఏనుగు సంఘర్షణ’ వంటి అంశాలపై ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు, వివిధ వయసుల వారు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వన్యప్రాణులపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జూ క్యూరేటర్ జి. మంగమ్మ ఈ సందర్భంగా తెలిపారు. జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
క్షమించు మహాత్మా..!
యలమంచిలి రూరల్: సంపూర్ణ మద్యనిషేధం కోసం పరితపించిన గాంధీ జయంతి రోజున ప్రతి ఏటా మద్యం విక్రయాలను ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈసారి గాంధీ జయంతి దసరా రోజున రావడంతో జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు పేరుకే మూతపడ్డాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం అనుమతి ఉన్న మద్యం దుకాణాల నుంచి అనుబంధంగా ఉన్న బెల్టు షాపులకు కావాల్సినన్ని మద్యం కేసులను తరలించి నిల్వ చేశారు. ఆ తర్వాత బెల్టు దుకాణాల ద్వారా అక్రమంగా మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. బుధవారం మద్యం దుకాణాలు మూతపడిన సమయం నుంచి గురువారం రోజంతా, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు నిరాటంకంగా బ్లాక్లో అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేపట్టారు. ఇదంతా తమ కళ్లముందే జరుగుతున్నా అబ్కారీ, పోలీసు శాఖల అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో లిక్కర్ దందా మూడు సీసాలు.. ఆరు గ్లాసులుగా కొనసాగింది. కూటమి నేతలు, బెల్టు షాపుల నిర్వాహకులు, యంత్రాంగం మూకుమ్మడిగా గాంధీ జయంతి రోజున మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. బహిరంగంగా మద్యం విక్రయాలను చేపట్టారు. బాటిల్కు రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు గాంధీజయంతి సందర్భంగా అధికారికంగా మద్యం దుకాణాలు, బార్లు మూ సివేయడంతో దీన్ని ఆసరాగా చేసుకున్న బెల్టు షాపుల నిర్వాహకులు ధరలు పెంచి అమ్ముకున్నారు. ఒక బీర్కు రూ.50 నుంచి రూ.100, లిక్కర్ విషయానికొస్తే ఒక క్వార్టర్ బాటిల్కు రూ.50 నుంచి రూ.70 వరకు, ఒక హాఫ్నకు రూ.100, ఫుల్ బాటిల్పై రూ.200 వరకు అమ్మారు. కొన్ని చోట్ల మద్యం ప్రియుల అవసరం, డిమాండ్ను బట్టి ధర మరింత పెంచి అమ్ముకున్నట్టు తెలిసింది. బెల్టు షాపుల నిర్వాహకులు రెండ్రోజుల్లో బాగా లాభపడినట్టు తెలుస్తోంది. ఇబ్బడిముబ్బడిగా బెల్టుషాపులు బెల్టు షాపుల బెండు తీసేవారే కరువయ్యారు. పర్మిట్ రూముల వైపు అసలు చూడడమేలేదు. జిల్లావ్యాప్తంగా 158 మద్యం షాపులు, 10కి పైగా బార్లు ఉన్నాయి. బెల్టు షాపుల సంఖ్య రెండు వేలకు పైమాటే. వీటిలో ఎక్కువ మద్యం షాపులు కూటమి నేతలు, వారి అనుచరులవే కావడంతో నిబంధనలు గాలికిపోయాయి. ఏ సమయంలోనైనా మద్యం దొరుకుతోంది. దీంతో జిల్లా మద్యం మత్తులో జోగుతోంది. గ్రామానికి కనీసం రెండు, కొన్ని చోట్ల నాలుగైదు, పట్టణాల్లో పదుల సంఖ్యలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బహిరంగంగా వేలం పాటలు నిర్వహించి మరీ బెల్టు దుకాణాలను నిర్వహిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు అప్పుడప్పుడు నామమాత్రంగా తనిఖీ లు చేస్తున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. యలమంచిలి పట్టణం, మండలంలో బెల్టుషాపుల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఆర్టీ సీ కాంప్లెక్స్ సమీపంలో, సైతారుపేట రోడ్డు, దిమిలిరోడ్డు పెంకుల ఫ్యాక్టరీ ఏరియా, రాంనగర్, ధ ర్మవరం సహా పలు ప్రాంతాల్లో కొన్నిచోట్ల బడ్డీ కొ ట్లు, కిరాణా షాపులు, కూరగాయల దుకాణాల ముసుగులో బెల్టు షాపులు నిర్వహిస్తూ మద్యం అధిక ధరలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. పులపర్తిలో హైవే కూడలిలోనే రెండు బెల్టు షాపులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో నిత్యం వాహనాల డ్రైవర్లు, సమీపంలో యువకు లు మద్యం కొనుగోలు చేస్తున్నారు. గురువారం గాంధీజయంతి రోజున పట్టణంలో బెల్టుషాపుల వద్ద మద్యం విక్రయాలు జరిగాయి. గురువారం జిల్లాలో 7 కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి వి.సుధీర్ తెలిపారు. గాంధీ జయంతి నాడు యథేచ్ఛగా మద్యం విక్రయాలు జిల్లావ్యాప్తంగా బెల్టు షాపులు, ప్రైవేటు వ్యక్తుల అమ్మకాలు బ్లాక్లో బాటిల్పై రూ.50 నుంచి రూ.100 వరకు బాదుడు లిక్కర్ దందాను చోద్యం చూసిన ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు -
కొత్త బైక్ సరదా తీరకుండానే మృత్యు ఒడికి..
యలమంచిలి రూరల్: దసరా సందర్భంగా ముచ్చటపడి కొనుగోలు చేసిన కొత్త ద్విచక్రవాహనమే ఆ యువకుడి పాలిట మృత్యువు శకటంగా మారింది.కొత్త వాహనానికి పూజ చేసి పక్క గ్రామంలో ఉన్న స్నేహితుడి వద్దకు వెళ్లేందుకు బయలుదేరిన యువకుడు ఊహించని విధంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. రాంబిల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బత్తిని చంద్రశేఖర్(21) దసరా పండగ సందర్భంగా బైక్ను కొనుగోలు చేశాడు.గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పక్కనున్న కట్టుపాలెంలో స్నేహితుడి వద్దకు వెళ్లేందుకు బయలుదేరిన చంద్రశేఖర్ కట్టుపాలెం గ్రామం సమీపంలో రోడ్డు పక్కనున్న ఓ చెట్టును ఢీకొన్నాడు.ఈ ప్రమాదంలో యువకుడి తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించిగా ప్రథమ చికిత్స చేసి, పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్టు యలమంచిలి పట్టణ ఎస్ఐ కె. సావిత్రి తెలిపారు.మృతుడి పెదనాన్న బత్తిన నాగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆమె తెలిపారు. పండగవేళ మృతుడి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. -
గాంధీ మార్గం అనుసరణీయం
తుమ్మపాల: అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని, ఆయన మార్గం అనుసరణీయమని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. గాంధీ జయంతి, దేశ రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్శాస్త్రి జయంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుపరిపాలన ద్వారా గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా గాంధీ కలలు కన్నారని, ఆయన ఆశయాలను నిజం చేయాలన్నారు. లాల్ బహదూర్శాస్త్రి రైతులకు అందించిన సేవలను కొనియాడారు. డీఆర్వో వై.త్యనారాయణరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ ఖరీఫ్ 2025–26లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయి ధాన్యం సేకరణ సమన్వయ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవితో కలిసి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్లో ధాన్యం తేమ శాతాన్ని అనుసరించి క్వింటాకు సాధారణ ధర రూ.2,369, గ్రేడ్ ఏ రకం రూ.2,389 చొప్పున ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ముందే గ్రామ స్థాయిలో ఈ–పంట, ఈ–కేవైసీ నమోదు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 63 క్లస్టర్ రైతు సేవ కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి అనకాపల్లి: విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాల నిమజ్జనం భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని కల్టెకర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జేసీ జాహ్నవి, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి పోలీసు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, మత్స్యశాఖ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తీరప్రాంత మండల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.కలెక్టర్ విజయ కృష్ణన్ -
ప్రై‘వేటు’ వేయడమే చంద్రబాబు విధానం
● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం ● ఐదు పూర్తయ్యాయి.. మిగిలినవి చివరి దశలో ఉన్నాయి ● వాటిని ప్రైవేటుపరం చేయడమే నారా వారి లక్ష్యం ● కూటమి కుటిల యత్నాలను అడ్డుకుంటాం ● 9న అనకాపల్లి జిల్లాకు మాజీ సీఎం వైఎస్ జగన్ ● మాకవరపాలెం మెడికల్ కాలేజీ సందర్శన ● వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు వెల్లడి ● ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రులు అమర్నాథ్, ముత్యాలనాయుడులతో కలిసి స్థల పరిశీలనసాక్షి, అనకాపల్లి/మాకవరపాలెం: ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడమే నారా వారి పాలనంటూ వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలు పూర్తికాగా.. మిగిలినవి సగానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత నిర్మాణాలను కొనసాగించకపోగా.. వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేందుకు అన్ని కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఈనెల 9న మాకవరపాలెం మండలంలో గల భీమబోయినపాలెంలో మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వం మెడికల్ కళాశాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించనున్నారన్నారు. పర్యటించే ప్రాంతాల పరిశీలన మాజీ సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం శుక్రవారం జగన్మోహన్రెడ్డి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. కురసాల కన్నబాబుతోపాటు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల పార్టీ అధ్యక్షులు అమర్నాథ్, కేకే రాజు, మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఉన్నారు. అనంతరం అనకాపల్లి వెళ్లి అక్కడి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. -
9న అనకాపల్లికి వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ(Narsipatnam Medical College)ని సందర్శించి.. జరిగిన పనులను పరిశీలిస్తారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజిల నిర్మాణం ఒక చరిత్ర. కానీ, విద్యా వైద్యాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఏకంగా అందులో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. తన అనునాయులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారు. తద్వారా జగన్కు మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది... చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు. కళ్లుండి కబోదుల్లా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న అవగాహనతో మాట్లాడాలి. ఆయన మెడికల్ కాలేజీని సందర్శిస్తే నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుంది. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగకపోతే ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలపై ప్రజలు చీ అంటున్నారు. అయినా ఆయన సిగ్గు తెచ్చుకోవడం లేదు. కేవలం జగన్ మీద కక్ష సాధింపు చర్యతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు అని అన్నారు. మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు 11 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉండేవి. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. పేదవాడికి ఆధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజీను వైఎస్ జగన్ సందర్శిస్తారు. .. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యను చంద్రబాబు దూరం చేశారు. మెడికల్ విద్య చదివే విద్యార్థులకు నేడు మెడికల్ సీట్లును దూరం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే మెడికల్ కాలేజిల ఐదు వేల కోట్లు ఖర్చు మీద పెట్టలేరా. విద్యా వైద్యంతోపాటు అన్ని రంగాలను చంద్రబాబు ప్రవేటిపరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది’’ అని అమర్నాథ్ అన్నారు. -
అమర్ను కలిసిన రాజయ్యపేట మత్స్యకారులు
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేటలో చేపట్టిన దీక్షకు మద్దతు తెలపాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను మత్స్యకారులు కోరారు. ఈ మేరకు బుధవారం నక్కపల్లి మండలం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సీరం నర్సింగమూర్తి, ఉపాధ్యక్షుడు నాగేష్ ఆధ్వర్యంలో రాజయ్యపేట మత్స్యకార సంఘం పెద్దలు.. అమర్నాథ్ను గాజువాక సమీప మిందిలో కలిసి వినతి పత్రం అందజేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని కోరారు. నిరాహార దీక్షకు మద్దతు రాజయ్యపేటలో మత్స్యకారుల దీక్షకు 33 గ్రామాల సంఘాల అధ్యక్షుడు చొక్కా అప్పారావు మద్దతు ప్రకటించారు. బుధవారం శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం స్పందించి బల్క్ డ్రగ్స్ పార్క్ను రద్దు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 33 సంఘాల నాయకులు యజ్జల సూరిబాబు, యజ్జల రాజు, బోదిన నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, నాయకులు పిక్కి తాతీలు, గోసల సోమేశ్వరరావు, చొక్కా కాశీ, చేపల సోమేశ్, ఎం.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్ కంపెనీకి వినియోగదారుల కమిషన్ షాక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఫార్మా ఉద్యోగి మృతి -
మహాలక్ష్మిగా కనకమహాలక్ష్మి
డాబాగార్డెన్స్(విశాఖ): శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు భక్తులను మహాలక్ష్మి అలంకరణలో కటాక్షించారు. పలు రకాల తాజా కూరగాయలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించి వేదపండితులు శాస్త్రోక్తంగా సహస్రనామాచార్చన నిర్వహించారు. నగరానికి చెందిన భక్తులు ఒ.నరేష్కుమార్, రాధిక కుటుంబ సభ్యులు రూ.45 వేలు చెల్లించి పూజలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గురువారం అమ్మవారు స్వర్ణకవచాలంకరణలో దర్శనమివ్వనున్నారని, 108 స్వర్ణపుష్పాలతో ప్రత్యేక పుష్పార్చన నిర్వహిస్తామని ఈవో శోభారాణి తెలిపారు. పద్మావతిగా కన్యకాపరమేశ్వరి డాబాగార్డెన్స్: పాతనగరం కురుపాం మార్కెట్ సమీపంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు బుధవారం కన్యకాపరమేశ్వరి పద్మావతిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన ప్రధాన అర్చకుడు ఆర్బీబీ కుమార్శర్మచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన వాసవీ కనకదుర్గాదేవికి ప్రత్యేక కుంకుమ పూజలు, హోమం చేశారు. సత్యవతి, వెంకటేశ్వర సుందరకాండ గ్రూప్చే సుందరకాండ గానం భక్తులను అలరించింది. గురువారం కన్యకాపరమేశ్వరి విజయదుర్గాదేవిగా దర్శనమివ్వనున్నట్టు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. -
భలే మందుస్తు ఏర్పాట్లు
దసరా వచ్చిందంటే చాలు... చాలామందికి మందు, ముక్క లేకుండా పండగ అస్సలు మొదలైనట్టే కాదు.. ఈ రెండూ ఉంటేనే ఆ రోజుకి అసలు ‘జోష్’ వచ్చినట్టు. ఈ ఏడాది అసలు ట్విస్ట్ ఏంటంటే... దసరా పండగ సరిగ్గా గాంధీ జయంతి రోజునే వచ్చింది. ‘నియమం’ ప్రకారం, ఈ శుభదినాన ప్రభుత్వం మద్యం దుకాణాలు, మాంసం దుకాణాలు రెండింటికీ సెలవు ప్రకటించింది. అంటే పండగ రోజున మందు బాబుల ‘హోమ్ డెలివరీ’కి కూడా దారి లేదన్నమాట..‘ఏం? పండగని ఆపేస్తారా? మా ఆనందాన్ని ఆపగలరా?’ అంటూ మద్యం ప్రియులు రంగంలోకి దిగారు. గురువారం షాపులు మూతపడతాయని తెలియగానే, బుధవారాన్ని వాళ్లు ‘అంతర్జాతీయ అత్యవసర నిల్వల దినోత్సవం’ గా మార్చేశారు. వైన్షాపుల ముందు క్యూ చూస్తే, అంతా తమ ఇళ్లలో కనీసం నెల రోజులకు సరిపడా ‘ద్రవ్య నిల్వలు’ పెట్టుకోవడానికి వచ్చినట్టు అనిపించింది. వీళ్ల ప్రణాళిక చూసి చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. వైన్షాపుల ముందు గుమిగూడిన జనాన్ని చూసి, పక్కన ఉన్నవాళ్లంతా దసరా జోష్ అంటే ఇదే కదా.. అంటూ చమత్కరించారు. ఇక మాంసం దుకాణాల వద్ద రద్దీ అయితే ఇంకో లెవల్..మటన్, చికెన్ ముక్కలు కొని, పావడకుండా ఉండేందుకు ‘ఐస్ క్యూబ్ ప్లానింగ్’ ఎలా చేయాలో ఒకరికొకరు సలహాలు ఇచ్చుకున్నారు. ‘ముక్కను ఫ్రిజ్లో దాచడం ఒక కళ, దాన్ని సేఫ్గా పండగ రోజు వరకూ ఉంచడం ఒక విజ్ఞానం’ అంటూ డిస్కషన్లు పెట్టుకున్నారు. –సీతంపేట(విశాఖ) -
నేడు అప్పన్న జమ్మివేట
సింహాచలం: విజయదశమిని పురస్కరించుకుని గురువారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జమ్మివేట ఉత్సవం జరగనుంది. కొండదిగువ పూలతోటలో జరిగే ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి రామాలంకారం చేసి మధ్యాహ్నం 3.30 గంటలకు సింహగిరి నుంచి కొండదిగువకు మెట్లమార్గంలో తీసుకెళ్తారు. కొండదిగువ పూలతోటలో ఉన్న మండపంలో స్వామిని వేంజేయించి విశేషంగా పూజ లు నిర్వహిస్తారు. పూలతోటలోనే ఉన్న జమ్మిచెట్టు వద్ద శమీపూజ నిర్వహిస్తారు. తదుపరి, స్వామికి అడవివరం గ్రామ పురవీధుల్లో అశ్వవాహనంపై తిరువీధి నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. గోపాలపట్నం పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. జమ్మివేట ఉత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం 6 గంటల వరకు సింహగిరిపై స్వామివారి మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు పూలతోటను పెద్ద ఎత్తున ముస్తాబు చేశారు.శమీ పూజ అనంతరం అశ్వవాహనంపై తిరువీధి -
● పెదగాడిలో యూరియా రగడ ● జీఎస్టీ ప్రచారానికి వస్తే యూరియా ఇస్తామన్న కూటమి నాయకులు ● అనంతరం యూరియా ఇవ్వకుండా వెనక్కి పంపిన వైనం ● అధికారులు, నాయకుల తీరుపై మండిపడ్డ మొగలిపురం రైతులు
యూరియా ఎర పెందుర్తి: అధికార కూటమి నాయకులు ప్రచార యావతో యూరియాను ఎరగా చూపించి మోసం చేయడంతో ఒక గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంపై అవగాహన సదస్సు కోసం బుధవారం పెందుర్తి మండలం పెదగాడి రైతు సేవా కేంద్రం వద్ద చేపట్టిన కార్యక్రమంలో ఈ వివాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై అవగాహన సదస్సు, ర్యాలీ కోసం పెదగాడి, పినగాడితో పాటు, పినగాడి రెవెన్యూ పరిధిలో భూములు ఉన్న సబ్బవరం మండలం మొగలిపురానికి చెందిన రైతులను కూటమి నాయకులు ఆహ్వానించారు. సదస్సు, ర్యాలీకి వచ్చిన ప్రతీ రైతుకు యూరియా ఇస్తామని నాయకులు నమ్మబలికారు. అసలే యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్న మొగలిపురం రైతులు, ఈ హామీతో సదస్సుకు ఉత్సాహంగా హాజరయ్యారు. తీరా జీఎస్టీపై ప్రచారం పూర్తయిన తరువాత, పెదగాడికి చెందిన కూటమి నాయకులు తమకు నచ్చిన కొందరి పేర్లను అధికారులకు చెప్పి, వారికి మాత్రమే యూరియా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మొగలిపురం రైతులకు పెదగాడి క్లస్టర్లో యూరియా ఇవ్వలేమని అధికారులు తేల్చిచెప్పారు. రైతులు..అధికారుల మధ్య వాగ్వాదం దీంతో రైతులు, అధికారుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మండలం పరంగా సబ్బవరం అయినప్పటికీ, తమ భూములు పినగాడి రెవెన్యూలోనే ఉన్నాయని రైతులు వివరించారు. పినగాడి రెవెన్యూ పరిధిలో ఉన్నవారికి ఇస్తామని చెప్పి, అదే ప్రాంతంలో భూములు ఉన్న తమకు ఎరువు ఇవ్వకపోవడమేంటని నిలదీశారు. అదే సమయంలో యూరియా నిల్వలు కూడా అయిపోవడంతో చేసేది లేక, కూటమి నాయకుల తీరుపై తీవ్రంగా మండిపడుతూ మొగలిపురం రైతులు వెనుదిరిగారు. ‘యూరియా సరిపడా అందించడంలో విఫలమై, చివరకు చిన్నపాటి ప్రచారానికి మాయమాటలు చెప్పి మమ్మల్ని తరలించారు. ఇలా ఉసూరుమనిపించడం తగదు’ అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని వారు స్పష్టం చేశారు. -
ఏఆర్కే బార్లో మద్యం అక్రమ నిల్వలు
యలమంచిలి రూరల్: పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనున్న ఏఆర్కే బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం అక్రమ నిల్వలను యలమంచిలి ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బార్కు సంబంధంలేని నంబర్లతో ఉన్న 10 మద్యం సీసాల కేసులు, 8 బీరు సీసాల కేసులను గుర్తించినట్టు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి వి.సుధీర్ తెలిపారు. ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది బార్లో తనిఖీలు చేయగా అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయన్నారు. పట్టుబడిన మద్యం బాటిళ్లలో వివిధ బ్రాండ్లు ఉండడంతో ఒక్కో బ్రాండ్కు ఒకటి చొప్పున శాంపిళ్లను రసాయన విశ్లేషణ నిమిత్తం ప్రయోగశాలకు పంపించినట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై యలమంచిలి అబ్కారీ శాఖ స్టేషన్లో క్రైం నెంబరు 69/2005తో కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి ఈ బార్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు స్టేషన్కు చెందిన బొలెరో వాహనంలో మద్యం సీసాలు, బీర్లను తీసుకెళ్లారు. అయితే ఈ విషయం బుధవారం సాయంత్రం వరకు మీడియాకు తెలీకుండా రహస్యంగా ఉంచడం పలు విమర్శలకు తావిచ్చింది. -
ఆస్పత్రి భవనం ప్రారంభం సరే.. వసతులేవి?
మాడుగుల: వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మించిన మాడుగుల సీహెచ్సీ భవనాన్ని మౌలిక వసతులు కల్పించకుండా ప్రారంభించడంపై మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తప్పుబట్టారు. ఈ మేరకు బుధవారం స్థానిక 30 పడకల నూతన ఆస్పత్రి భవనంలోని వార్డులతో పాటు ఆపరేషన్ ఘియేటర్ను ఆయన సందర్శించారు. అనంతరం బూడి విలేకరులతో మాట్లాడుతూ సీహెచ్సీ భవనం పనులు దాదాపు 90 శాతం 2024లో ఎన్నికల ముందే పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం కూటమి ప్రజాప్రతినిధులు ఆస్పత్రి భవనం ప్రారంభించడమే కాదని, దానిలో మౌలిక వసతుల కల్పనతో పాటు డిప్యూటేషన్పై వెళ్లిన వైద్యులను తిరిగి తీసుకువచ్చి నిరుపేద గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే ప్లాంట్లను పరిశీలించి మందులు, వైద్యం అందించే తీరును వైద్యాధికారి బి.చంద్రశేఖర్ను ఆయన అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న కె.కోటపాడు సీహెచ్సీకి రూ. 5.60 కోట్లు, మాడుగుల సీహెచ్సీకి రూ. 5.29 కోట్లు తమ హయాంలో మంజూరు చేశామన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పాత సీహెచ్సీ భవనానికి కనీసం మరమ్మతులు చేపట్టలేదని విమర్శించారు. కూటమి ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు అప్గ్రేడ్ చేసి మౌలిక వసతులు కల్పించాలన్నారు. పాత ఆస్పత్రి భవనంలో మార్చురీ విభాగం ఏర్పాటు చేస్తామని వైద్యులు సూచించడం బాగుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాళ్ళపురెడ్డి వెంకట రాజారామ్, మాజీ ఎంపీపీ వేమవరపు రామధర్మజ, వైస్ ఎంపీపీ కొత్తపల్లి శ్రీనివాస్, సర్పంచ్ ఎడ్ల కళావతి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కోఆప్సన్ మెంబరు షేక్ ఉన్నీషా, ఉప సర్పంచ్ జవ్వాది వరహాలు, తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7గంటల నుంచి స్వామికి సహస్రనామార్చన విశేషంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. 1001నామాలతో స్వామికి అర్చన జరిపారు. విశేషంగా హారతులు ఇచ్చారు. భక్తులకు తులసి ప్రసాదాన్ని అందజేశారు. ఘనంగా నిత్యకల్యాణం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం నిత్యకల్యాణం ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి,శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30గంటల నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, అక్షింతలు, ప్రసాదం అందజేశారు. -
వైద్యుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
● డీఎంహెచ్వో డా.హైమావతి కశింకోట: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయంగా వైద్యులను నియమించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.హైమావతి తెలిపారు. కశింకోట పీహెచ్సీని బుధవారం ఆమె సందర్శించి, వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కశింకోట పీహెచ్సీలో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు మానసను తాత్కాలికంగా నియమించామని, ప్రజలు ఇబ్బంది పడకుండా వైద్యుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వృద్ధులతో సమావేశమై ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి వయో వందన కార్డును 70 ఏళ్లు నిండినవారు పొందాలన్నారు. ఎన్టీఆర్ ఆస్పత్రికి అత్యవసర కేసులు అనకాపల్లి: పీహెచ్సీ వైద్యుల సమ్మె నేపథ్యంలో అత్యవసర కేసులను ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించాలని జిల్లా యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ (స్టేటస్టికల్) అధికారి రామచంద్రరావు వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన బుధవారం తరగంపూడి పీహెచ్సీని సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. -
ఏయూ దూర విద్య..అక్రమాల అడ్డా
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వ విద్యాలయం దూర విద్యకు చెదలు పట్టింది. అధికారుల హస్తలాఘవానికి కేంద్రంగా మారిపోయింది. పరీక్షా కేంద్రాల పేరుతో అక్రమాలకు అడ్డాగా తయారైంది. ఏయూ దూర విద్య పరీక్షా కేంద్రాల వ్యవహారం ఇపుడు హాట్ టాపిక్గా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది చేతివాటం కారణంగా ఎగ్జామినేషన్ సెంటర్లు హద్దులు దాటి ప్రైవేటు చేతికి వెళ్లిపోయాయి. ఈ ప్రైవేటు సెంటర్లు ఒక పేరుతో అనుమతి పొంది మరోచోట పరీక్షలు నిర్వహిస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రధానంగా ఈ పరీక్షల నిర్వహణపై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అనధికార కేంద్రాలు మాస్ కాపీయింగ్కు నిలయాలుగా మారిపోయాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే దూర విద్య పరీక్షా కేంద్రాలు నిర్వహించాలని ఏయూ పాలకులు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కొన్ని లొసుగులతో ఇప్పటికీ ప్రైవేటుకే పెద్ద పీట వేస్తున్నారు. సెంటర్కు రూ.2 నుంచి రూ.5 లక్షలు ఏయూ పరీక్షా కేంద్రాలను ఇష్టానుసారంగా ప్రైవేటుకు అప్పగించేశారు. ప్రైవేటు సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగిన సందర్భాలు అనేకమున్నాయి. అయినప్పటికీ పరిధి దాటి అనంతపురం, కర్నూలు, నంద్యాల, హైదరాబాద్లలో కూడా ప్రైవేటు విద్యా కేంద్రాలకు పరీక్షా కేంద్రాల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసేశారు. ఇటువంటి సెంటర్లపై ఎన్ని ఫిర్యాదు వచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి సెంటర్ నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకుని అనుమతులు మంజూరు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత వాటి పర్యవేక్షణ మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ప్రైవేటు కేంద్రాలు రద్దు చేయాలని నిర్ణయించినా.. ఏయూ దూర విద్య పరీక్షల నిర్వహణపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రైవేటు పరీక్షా కేంద్రాల అనుమతులు రద్దు చేయాలని రెండేళ్ల క్రితమే ఏయూ అధికారులు నిర్ణయించారు. కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఈ పరీక్షలను నిర్వహించాలని భావించారు. కానీ అధికారుల బదిలీలు.. సిబ్బంది చేతివాటం.. ప్రైవేటు మామూళ్లతో ఇప్పటి వరకు ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. ఇప్పటికీ ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలు ప్రైవేటు సెంటర్లలో నిర్వహిస్తూనే ఉన్నారు. గత నిర్ణయాలను మాత్రం అమలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఆదాయం పోతుందన్న కారణంగానే ప్రైవేటు సెంటర్లను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాస్ కాపీయింగ్కు కేంద్రాలుగా... ఏయూ దూర విద్య పరీక్షా కేంద్రాలుగా ఉన్న కొన్ని ప్రైవేటు సెంటర్లు అనధికారికంగా మరికొన్ని చోట్ల ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలను నిర్వహించి అక్కడ విద్యార్థులతో పరీక్షలు రాయించి వాటిని అనుమతి పొందిన కేంద్రాల్లో నిర్వహించినట్లు చూపిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. గత నెల 12వ తేదీ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇదే తరహాలో అనధికారికంగా పరీక్షలు నిర్వహించిన ట్లు సమాచారం. మరికొంత మంది ఇతర జిల్లాల్లో అనధికారికంగా పరీక్షలు రాయించి ఉత్తరాంధ్రలో ప్రభుత్వ విద్యా సంస్థలో ఉన్న కేంద్రాల్లో పరీక్షలు రాసినట్లు చూపిస్తున్నారని, ఇందుకు దూర విద్యా విభాగం సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
విజయవాడలో రేపు వైద్యుల ఆమరణ నిరాహార దీక్ష
ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపడుతున్న పీహెచ్సీ వైద్యులుఅనకాపల్లి: తమ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, శుక్రవారం విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమైనట్టు ఏపీ ప్రైమరీ హెల్త్ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎస్తేర్ రాణీ, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ క్రీడా మైదానం వరకూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతేడాది పీహెచ్సీ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ నేటి వరకూ అమలు చేయకపోవడం దారుణమన్నారు. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వి.సునీల్కుమార్, వాణిజగదీశ్వరీ, వినోద్, వెంకటేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
మారిన జీఎస్టీ ప్రకారం బిల్లులు ఇవ్వాలి
నర్సీపట్నం: ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించిందని, అందుకు అనుగుణంగా ధరలు తగ్గించి, వ్యాపారులు బిల్లు ఇవ్వాలని నర్సీపట్నం లీటల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ డి.అనురాధ అన్నారు. మండలంలో వేములపూడి గ్రామంలో బుధవారం వర్తకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారిన జీఎస్టీ స్లాబ్లకు అనుగుణంగా బిల్లింగ్ సాఫ్ట్వేర్ను మార్పు చేసుకోవాలన్నారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మినట్టు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. నర్సీపట్నంలోని ఒకరిద్దరు హోల్సేల్ వ్యాపారస్తుల వద్ద నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నామని, మారిన జీఎస్టీతో కొన్న వాటికి బిల్లు అడిగినప్పటికీ ఇవ్వటం లేదని రిటైల్ వ్యాపారులు అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. హోల్సేల్, సూపర్ మార్కెట్, రిటైల్ వర్తకులు ఎవరైనా అమ్మిన ప్రతి వస్తువుకు మారిన జీఎస్టీ స్లాబ్ల ప్రకారం బిల్లు ఇవ్వాలని ఆమె స్పష్టం చేశా రు. ఎవరైనా అధిక ధరలకు అమ్మితే వెంటనే ఫిర్యా దు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
మెడికల్ షాపుల్లో తనిఖీలు
మహారాణిపేట: జీఎస్టీ తగ్గింపు ధరలను మెడికల్ షాపులు ఎక్కడా అమలు చేయకపోవడంపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించారు. జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. విజయకుమార్ ఆధ్వర్యంలో బుధవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని మెడికల్ షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. మహారాణిపేట, మధురవాడ, ఎంవీపీ కాలనీ, ఆరిలోవ, గాజువాక, చిన్నగంట్యాడ, కుర్మన్నపాలెం, అనకాపల్లి, కశింకోట వంటి ప్రాంతాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు దాడులు చేశారు. మొత్తం 43 మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టారు. సాక్షిలో కథనం రాగానే కొన్ని షాపులు జీఎస్టీ తగ్గింపు ధరలను తెలియజేసే సైన్ బోర్డులను ప్రదర్శించాయి. అసిస్టెంట్ డైరెక్టర్ విజయకుమార్ స్వయంగా పెదవాల్తేరు, చిన్నవాల్తేరు ఏరియాల్లోని 11 షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ షాపుల్లో ఎక్కడా జీఎస్టీ ధరల బోర్డులు ఏర్పాటు చేయకపోవడాన్ని గమనించారు. తక్షణమే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన డ్రగ్గిస్టులను ఆదేశించారు. జీఎస్టీ నిబంధనలతో మాత్రమే మందులను విక్రయించాలని మెడికల్ షాపుల యజమానులను ఆదేశించారు. మందులను కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా జీఎస్టీ సైన్ బోర్డులు లేకపోయినా, జీఎస్టీ తగ్గింపు ధరలకు అమ్మకాలు జరగకపోయినా డీఆర్సీ నంబర్ 863233 0909కు గాని, లేదా dca-grams@ap.gov.inకు ఫిర్యాదు చేయాలని కోరారు. -
భారీ వర్ష సూచన
తుమ్మపాల: వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ఆమె మండల అధికారులతో కలెక్టరేట్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమెతోపాటు ఎస్పీ తుహిన్ సిన్హా, జేసీ జాహ్నవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఒకటి, రెండు గంటలలో సరిచేయాలని, రోడ్లపై చెట్లు పడిపోతే వాటిని వెంటనే తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని చెప్పారు. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ, సాగునీటి పారుదల శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జలాశయాలలో పూర్తిస్థాయి నిల్వ సామర్ధ్యం పాటించాలని, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జలాశయాలు, చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా రక్షణ కల్పించవలసిన బాధ్యత నీటిపారుదల శాఖ అధికారులదేనన్నారు. నిమజ్జనాల్లో జాగ్రత్త దసరా ఉత్సవాలు పూర్తికానున్న నేపథ్యంలో అమ్మవారి విగ్రహాల నిమజ్జనాలు ప్రశాంతంగా, ఎటువంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తీరప్రాంత మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గజ ఈతగాళ్లను నియమించాలని, బోట్లను సిద్ధం చేసుకోవాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఆర్డీవో షేక్ ఆయిషా, తదితరులు పాల్గొన్నారు.జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ -
దివ్యాంగుడికి బియ్యం పంపిణీ
బుచ్చెయ్యపేట: మండలంలో రాజాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు మరిశా సన్యాసినాయుడికి అధికారులు ఇంటి వద్దే రేషన్ బియ్యం అందించారు. రెండు కళ్లూ లేని సన్యాసినాయుడు, 80 ఏళ్ల వృద్ధురాలైన అతని తల్లికి రెండు నెలలుగా రేషన్ సరకులు అందడం లేదు. రేషన్ డీలర్ ఇంటికి తీసికొచ్చి రేషన్ సరకులు పంపిణీ చేయకపోవడంపై అధికార్లకు దివ్యాంగుడు సన్యాసినాయుడు సోమవారం ఫిర్యాదు చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాలతో తహసీల్దార్ లక్ష్మి మంగళవారం వీఆర్వో అఖిల్ ద్వారా సన్యాసినాయుడికి, అతని తల్లికి రేషన్ బియ్యం, సరుకులు అందించారు. సన్యాసినాయుడు తల్లి వయస్సు రేషన్ కార్డులో తక్కువగా నమోదవడంతో ఆమె వయస్సు మార్పు చేయిస్తామని తహసీల్దార్ తెలిపారు. -
సింహాచలం దేవస్థానానికి బ్యాటరీ కారు అందజేత
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ బ్యాటరీ కారును వితరణగా అందజేసింది.సుమారు రూ. 8 లక్షలు విలువ చేసే ఈ బ్యాటరీ కారును సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఎమ్వో శంకర్ సుబ్రహ్మణ్యం సింహగిరిపై దేవస్థానం అధికారులకు అందజేశారు. అనంతరం దేవస్థానం అర్చకులు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఏఈవో తిరుమలేశ్వరరావు, అధికారులు, కోరమాండల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గతమెంతో ఘనం.. నేడు జ్ఞాపకం
మాడుగుల కోట.. దసరా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించిన సంస్థానం. గుర్రపు స్వారీ చేసి, కత్తి తిప్పే సాహసవీరులకు.. వేడుకలకు శోభ చేకూర్చే కళాకారులకు ఆలవాలం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడి సందడిని ఆస్వాదించేవారు. కథలు కథలుగా చెప్పుకునేవారు. కానీ అదంతా గత వైభవం.. గతించి‘పోయిన’ బంగారు కాలం. ఇప్పుడవన్నీ జ్ఞాపకాలుగా మిగిలాయి. కానీ ఇప్పటికీ దసరా వేడుకల్లో నాటి చిహ్నాలు కనిపిస్తున్నాయి.మాడుగుల: మాడుగుల కోట ఒకనాటి జయపూర్ సంస్థానంలోనిది. విజయదశమి వేడుకలకు వేదికగా నిలిచింది. మహరాజుల కాలంలో దేశ విదేశాల నుంచి కళాకారులు వచ్చేవారు. ఇతర రాజవంశాలకు చెందిన యువరాజులు వచ్చి ఇక్కడ కోట ప్రాంగణంలో నిర్వహించే చిత్ర విచిత్ర కత్తి, కర్ర సాములు, గుర్రపు పందాలు తిలకించేవారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. యుద్ధాలలో వాడే ఆయుధాలతో జమ్మి చెట్టు నరికి దేవీ తల్లీ ఆలయంలో పూజలు నిర్వహించేవారు. ఇలా నిర్వహించడం వలన యుద్ధాలలో విజయం వరిస్తుందని అప్పటి మహరాజుల నమ్మకం. యుద్ధ విద్యల్లో తర్ఫీదు పొందడానికి మాడుగుల పట్టణంలో కోట చుట్టూ రా జగన్నసావిడి, రాజులు సావిడీలతోపాటు ఐదు సావిడులు ఉండేవి. నాటి సంప్రదాయాలను సివిల్, ఆర్టీసీ, ఆటో మోటారు యూనియన్ వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. బస్సు యజమానులతో పాటు వాటిలో పనిచేసే డ్రైవర్లు పుప్పాల నారాయణమూర్తి, దేవరాపల్లి నారాయణ, ఇల్లపు గంగునాయుడు, బోర కాళిదాసు నేడు కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఎస్పీఎల్ రమణ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు కొనసాగాయి. అతని అనంతరం కుక్కర మోదకొండ, ద్రాక్షారపు త్రినాథ్లు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ర్టీసీ, ఆటో మోటార్ యూనియన్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అదే సంప్రదాయాలతో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తొలుత పాత బస్టాండ్లో దేవీ తల్లి తాటాకుల పాకలో కొలువై ఉండేది. అంచలంచెలుగా ఆలయంతోపాటు మండపాల నిర్మాణం చేపట్టారు. అలనాటి మాడుగుల మహరాజులు యుద్ధాలలో వాడిన కత్తులను ఈనాటికీ తహసీల్దార్ కార్యాలయంలో భద్రపరిచారు. దసరా రోజు వాటిని శుభ్రపరిచి దేవీ ఆలయంలో పూజలు అనంతరం కోట మీదుగా సంబరాలు చేసుకుంటూ తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి చేరుస్తారు. బంగారు, వెండి ఆభరణాలతో వెలిగిపోతున్న మాడుగులలోని దేవీ తల్లివంశపారంపర్యంగా కత్తిసాము మాడుగుల దసరా ఉత్సవాలలో మహరాజుల కాలం నుంచి మా ముత్తాతలు, తాతలు, తండ్రుల నుంచి కత్తి సాము కర్ర, సాములు ప్రదర్శనలు ఇస్తున్నాము. యుద్ధాలలో విజయం సాధించే విధంగా తర్ఫీదు ఇచ్చేవారని మా తాతలు చెబుతుండేవారు. ప్రస్తుతం ఐదుగురుం మాత్రమే ఉన్నాము. ఆనాటి రాజులు వాడిన కత్తులతోనే సాము తిప్పుతున్నాము. –ఆది చినరాజబాబు, కత్తి సాము కళాకారుడు, మాడుగుల మాడుగుల సంస్థానంలో దసరా వేడుకలకు ఎంతో విశిష్టత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సందర్శకులు తిలకించిన చరిత్ర నాటి సందడి కనుమరుగైనా నేటికీ కొనసాగుతున్న సంప్రదాయాలు సివిల్, ఆర్టీసీ, ఆటో మోటారు యూనియన్ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు -
నక్కపల్లిలో స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ల పర్యటన
నక్కపల్లి హాకీ క్లబ్లో క్రీడాకారులతో మాట్లాడుతున్న స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్లు నక్కపల్లి: ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్లు ఎం.వి.రమణారావు, పేరం రవీంద్రనాథ్, కొవ్వాసు జగదీశ్వరీ బృందం సభ్యులు మంగళవారం నక్కపల్లిలో పర్యటించారు. ఇక్కడున్న హాకీ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడాకారులకు మెరుగైన శిక్షణకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామన్నారు. నక్కపల్లిలో హాకీ క్రీడాకారులకు అద్భుతమైన శిక్షణ ఇస్తున్న కోచ్లను అభినందిస్తున్నామన్నారు. అనంతరం బీఎస్ హాకీ క్లబ్ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు. క్లబ్ ఫౌండర్ బలిరెడ్డి సూరిబాబు, అధ్యక్షుడు చిన్న అప్పారావు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ, మాజీ సీనియర్ క్రీడాకారుడు రామచంద్రరావు, కోచ్ రాంబాబు, నానాజీ, శ్రీను, రంజిత్ పాల్గొన్నారు. -
తల్లిని మించిన తనయ సాహితి
రోలుగుంట: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ పీవీఎం నాగజ్యోతి, ఆమె కుమార్తె సాహస బాలిక అవార్డు గ్రహీత సాహితీలను నర్సీపట్నంలోని వాసవీ క్లబ్ రీజినల్ కాన్ఫరెన్స్లో క్లబ్ రీజినల్ చైర్మన్ వెలగా నారాయణ దంపతులు ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ నాగజ్యోతికి రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఆమె కుమార్తె సాహితీ తల్లిని మించిన తనయగా స్విమ్మింగ్లో అనేక పురస్కారాలు పొందారన్నారు. రేవు పోలవరంలో తీరంలో ఒక వ్యక్తి ప్రాణాలు కాిపాడి సాహస బాలిక అవార్డు పొందడం ఆర్యవైశ్య వర్గానికే గర్వకారణమన్నారు. వాసవీ క్లబ్ అభివృద్ధికి తాము అన్ని రకాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు తెలిపారు. -
తోడపెద్దుకు కన్నీటి వీడ్కోలు
మునగపాక: నందీశ్వరుడిగా.. సింహాద్రప్పన్నగా ఆరాధించే తోడపెద్దు సోమవారం రాత్రి కన్నుమూసింది. మునగపాకలో ఆడారి జగ్గప్పకు చెందిన ఈ తోడపెద్దు అనారోగ్యానికి గురైంది. కొద్ది రోజులుగా వైద్య సేవలందించినా ఫలితం లేకుండా పోయింది. మునగపాక ఆస్పత్రి రోడ్డు నుంచి గ్రామంలో పలు సేవ గరిడీలతో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ ఊరేగింపు యాత్రలో గ్రామస్తులు గోవిందా..గోవిందా అంటూ నామస్మరణతో తోడపెద్దుకు చేతులు జోడించి దండాలు పెడుతూ కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం నందీశ్వర కళా ప్రాంగణం దరి పాన్పు చేపట్టారు. -
పోగొట్టుకున్న మొబైల్ అందజేత
నాతవరం: ఆర్టీసీ బస్సు ప్రయాణంలో పోగొట్టుకున్న మొబైల్ను స్థానిక పోలీసు స్టేషన్లో బాధితురాలికి అందజేసినట్టు ఎస్ఐ వై. తారకేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... నాతవరం గ్రామానికి చెందిన లక్కోజు మాధవి తన పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో నర్సీపట్నం వెళ్తుండగా రూ. 25 వేలు విలువ చేసే మొబైల్ను పోగొట్టుకుంది. ఈ విషయమై వెంటనే ఆమె నాతవరం ఎస్ఐకు సమాచారం ఇచ్చింది. నాతవరం క్రైమ్ కానిస్టేబుల్ పి.కిశోర్ అనకాపల్లి జిల్లా పోలీసు టెక్నికల్ టీమ్తో కలిసి పోగొట్టుకున్న మొబైల్ ప్రాంతాన్ని గుర్తించారు. బాధితురాలు అన్నయ్య దుర్గాప్రసాద్తో కలిసి కాకినాడ జిల్లా తుని మండలం నందిపూడిలో ఒక వ్యక్తి నుంచి మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. దాన్ని బాధితురాలికి అప్పగించారు. గంటల వ్యవధిలో మొబైల్ను గుర్తించి స్వాధీనం చేసుకున్న క్రైమ్ కానిస్టేబుల్ కిశోర్ను ఎస్ఐ అభినందించారు. -
అంతరించిపోయిన గుర్రాల సంత
దసరా రోజున మాడుగులలో గుర్రాల సంత జరిగేది. దేశంలో హంపీ విజయనగరం తర్వాత మాడుగులలోనే గుర్రాల సంత జరిగేది. యుద్ధానికి పనికి వచ్చే కావ్వాడ్, సుడేధార్ రేస్ తదితర ఖరీదైన గుర్రాలు మాడుగులకు వచ్చేవి. రాజుల పాలన ముగిసినా సరే అదే సంప్రదాయంతో గుర్రాల క్రయ విక్రయాలు జరిగేవి. దసరా ముందు మూడు రోజు వెనుక రెండు రోజులు ఐదు రోజులు సంత జరిగేది. బరువులు మోసే గుర్రాలు వేలాది సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవి. విశాఖ ఏజెన్సీకి రహదారులు లేని సమయంలో వీటిని ఏజెన్సీ పంటలను దిగువకు తరలించడానికి వినియోగించేవారు. రోడ్లు నిర్మించి, బస్సులు ఇతర వాహనాలు అందుబాటులోకి రావడంతో గుర్రాల వాడకం తగ్గిపోయింది. గత మూడేళ్ల నుంచి గుర్రాల సంత జరగడం లేదు. -
రేపటి నుంచి వన్యప్రాణి వారోత్సవాలు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో గురువారం నుంచి 8 వరకు వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు క్యూరేటర్ జి. మంగమ్మ మంగళవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు, ప్రజల కోసం వివిధ పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో బర్డ్వాక్, ఫొటోగ్రఫీ, రేఖాచిత్ర పోటీలు, ప్రసంగ పోటీలు వంటివి ఉన్నాయి. పోటీల్లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు, విజేతలకు బహుమతులు అందజేస్తారు. మరిన్ని వివరాల కోసం జూ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 78936 32900 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు. -
అంబేడ్కర్ ‘స్మృతి’ని చెరిపేస్తారా?
● రాష్ట్రాన్ని అమ్మేస్తారా? ● కూటమి తీరుపై వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం ● మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్అనకాపల్లి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, దళితులపై దాడులు, విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే యత్నాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా కమిటీ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ విభాగం నియోజకవర్గ సీనియర్ నాయకుడు దండ జ్ఞానదీప్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జంక్షన్లో డాక్టర్ బి.అర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు, వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వలన పేద విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో విజయవాడలో డాక్టర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, స్మృతివనాన్ని నిర్మిస్తే ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కూటమి ప్రభుత్వం ధారాదత్తం చేయడం అన్యాయమన్నారు. పేద విద్యార్థులకు మెడికల్ విద్యను అందించాలని రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణం ప్రారంభించగా.. 7 మెడికల్ కళాశాలలు అందుబాటులోనికి వచ్చాయని, మిగిలిన 10 మెడికల్ కళాశాలలు 80 శాతం పనులు పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పీపీపీ పేరిట మెడికల్ కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తే, కాసులకు కక్కుర్తిపడి సీఎం చంద్రబాబునాయుడు ఈ రంగాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అన్యాయమన్నారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పిల్లి అప్పారావు మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వలన రిజర్వేషన్ సౌకర్యాలు అందవని, ఎస్సీ కులస్తులు మెడికల్ విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు పాలనలో దళిత కులస్తులకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల ఎస్సీ సెల్ అధ్యక్షులు పెట్ల నాగేశ్వరరావు, వంగలపూడి గణేష్, మంద రాము, 80, 84 వార్డు ఇన్చార్జ్లు కె.ఎం.నాయుడు, కోరుకొండ రాఘవ, పార్టీ సీనియర్ నాయకులు బొడ్డేడ శివ, కొణతాల మురళీకృష్ణ, హైమావతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
వాణిజ్యాన్ని గాలికొదిలేశారు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అత్యధిక ఆదాయాన్ని అందించే రెండో డివిజన్. చంద్రబాబు పదే పదే ఆర్థిక రాజధాని నగరమని చెప్పే ప్రాంతం.. దీనికి తోడు.. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల అమలు కసరత్తులు.. ఇలా.. నిరంతర పనిభారం ఉన్న డివిజన్పై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది. అత్యంత కీలకమైన వాణిజ్య పన్నుల డివిజన్ ప్రధాన కార్యాలయంలో ప్రధాన పోస్టుల భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మూడు నెలలుగా.. ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో కార్యాలయంలో జాయింట్ కమిషనర్ సహా ప్రతి ఒక్కరిపైనా పనిభారం పెరిగిపోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు విశాఖ డివిజన్ పరిధిలోకి వస్తాయి. విశాఖ జిల్లాని మొత్తం 8 సర్కిల్స్గా విభజించి జీఎస్టీ వసూలు చేసేవారు. విశాఖ మహా నగర పరిధిలో మొత్తం 7 సర్కిల్స్, రూరల్ జిల్లాలోని మండలాలన్నీ కలిపి ఒక సర్కిల్ (అనకాపల్లి) మొత్తం 8 సర్కిల్స్ పరిధిలో 42 వేల మంది డీలర్స్ నుంచి పన్ను వసూళ్లు జరిగేవి. అయితే విశాఖ జిల్లాను మూడు జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. ఈ నేపథ్యంలో డివిజన్లో ఉన్న ఎనిమిది సర్కిల్స్ని 14 సర్కిల్స్గా విభజించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తాన్ని ఒక సర్కిల్గా ఏర్పాటు చేసి దీనికి పాడేరు సర్కిల్ అని పేరుని సూచించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాను రెండు సర్కిల్స్గా విభజించారు. ఒకటి అనకాపల్లి సర్కిల్, రెండు అచ్యుతాపురం సర్కిల్గా నామకరణం చేశారు. ఇక మిగిలిన విశాఖ జిల్లాను మొత్తం 11 సర్కిల్స్గా విభజించారు. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో ఉన్న వార్డులతో పాటు జిల్లా పరిధిలో ఉన్న ఆనందపురం, భీమిలి మండలాల్ని కలుపుకొని విభజన చేపట్టారు. కొత్తగా భీమిలి, మాధవధార, ఎయిర్పోర్టు సర్కిల్ని ఏర్పాటు చేశారు. వీటికితోడుగా గాజువాక, సిరిపురం, కురుపాం, డాబాగార్డెన్స్, ద్వారకానగర్, సిరిపురం, చినవాల్తేరు, స్టీల్ప్లాంట్ సర్కిల్స్గా విభజించారు. ప్రస్తుతం ఉన్న గాజువాక సర్కిల్ని గాజువాక, ఎయిర్పోర్టుగా విభజించారు. ప్రతి సర్కిల్ నుంచి దాదాపు సమాన ఆదాయం వచ్చేలా సర్దుబాటు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకూ అధికారుల నియామకాలు సక్రమంగా నిర్వహించారు. కూటమి వచ్చిన తర్వాత డివిజన్ని గాలికొదిలేసింది. ఏడాదికి పైగా ముక్కుతూ మూలుగుతూ..డివిజన్ విభజన సమయంలో జాయింట్ కమిషనర్ పోస్టులను రెండుగా విభజించారు. జేసీ–1గా ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023లో జేసీ–1గా ఓ.ఆనంద్ వ్యవహరించారు. జేసీ–2గా సుధాకర్ విధులు నిర్వర్తించారు. ఆనంద్ని 2024 ఎన్నికల తర్వాత బదిలీ అయ్యారు. అప్పటి నుంచి రెగ్యులర్ జాయింట్ కమిషనర్ను నియమించలేదు. జేసీ–2గా సుధాకర్ స్థానంలో కిరణ్కుమార్ని నియమించారు. మూడు నెలల క్రితం జేసీ–2గా కిరణ్కుమార్ స్థానంలో శేషాద్రిని నియమించారు. కానీ.. జేసీ–1 నియామకం విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఇప్పటి వరకూ జేసీ–1తో పాటు ఆయన విభాగంలో పనిచేసే మిగిలిన అదికారుల నియామకంపైనా కూటమి ప్రభుత్వం శీతకన్ను వేసింది. జేసీ–1తో పాటు.. డిప్యూటీ కమిషనర్–1, డిప్యూటీ కమిషనర్–2, నలుగురు అసిస్టెంట్ కమిషనర్లు(సీటీవోలు) పోస్టుల్లో విధులు నిర్వర్తించిన వారిని మూడు నెలల క్రితం బదిలీ చేసి వారి స్థానాల్ని ఇంతవరకూ భర్తీ చెయ్యలేదు. దీంతో జేసీ–1 పరిధిలో ఉన్న ఐదుగురు అధికారులు నిర్వర్తించే విధులన్నీ ఒకే అధికారిపై భారం పడింది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ కార్యాలయంలో ఫైళ్లు భారంగా కదులుతున్నాయి. జీఎస్టీ సంస్కరణలు వచ్చిన తర్వాత పని ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో జేసీ–2తో పాటు ఇతర విభాగాల్లో ఉన్న అందరు ఉద్యోగులు నిరంతరం పనిచెయ్యాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగులకు వారాంతపు సెలవులు కూడా లేకుండా పనిచేస్తున్నారనీ.. వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చెయ్యాలని అసోసియేషన్లు ప్రభుత్వానికి పదే పదే నివేదించినా ఎలాంటి స్పందన లేదు. దీంతో.. అతి పెద్ద డివిజన్లో పనుల నిర్వహణ ఒత్తిడితో ఉద్యోగులు, అధికారులు సతమతమవుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి.. తక్షణమే అధికారుల పోస్టులు భర్తీ చెయ్యాలని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నా
అనకాపల్లి టౌన్: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వచ్చేనెల 7న విజయవాడ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో ధర్నా నిర్వహించనున్నట్టు ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు చందోలు వెంకటేశ్వరులు తెలిపారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన ఎఫ్ఏపీటీవో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించాలని, మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు చేయాలని, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఆర్థిక బకాయిల చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా తమ సమస్యలు పరిష్కరించలేదని చెప్పారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతూనే రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంఽధించిన ఏ ఒక్క సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించలేదన్నారు. ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన రూ. 30వేల కోట్ల బకాయిల రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరినప్పటికీ ఇంతవరకూ స్పందన లేదన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించవలసిన గ్రాట్యూటీ తదితరాలను కూడా చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని చెప్పారు. ప్లస్ టు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ఫ్యాప్టో చైర్మన్ బోయిన చిన్నారావు మాట్లాడుతూ కారుణ్య నియామకాల్లో జాప్యం వల్ల మరణించిన ఉద్యోగుల వారసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పదించి ఉపాధ్యాయ సంఘాలతో విద్యా రంగ, ఆర్థిక సమస్యలపై చర్చించి పరిష్కరించాలని కోరారు. అనంతరం పోరుబాట ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కో చైర్మన్ ఆళ్ళ శేఖర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్.దుర్గాప్రసాద్, కార్యవర్గ సభ్యులు ఎ.వి.హెచ్. శాస్త్రి, మట్ట శ్రీనివాసరావు, జె.రాజేష్, వై.శ్రీనివాసారావు తదితరులు పాల్గొన్నారు. -
బల్క్ డ్రగ్స్ పార్క్పై తగ్గేదేలే..
రద్దు చేసే వరకూ దీక్షలు కొనసాగిస్తామన్న గంగపుత్రులునక్కపల్లి: బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేసే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని మత్స్యకారులు ఘంటాపథంగా చెప్పారు. రాజయ్యపేటలో వీరు చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 17వ రోజుకు చేరుకున్నాయి. వీరి దీక్షలకు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. వారితో పాటు నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, పార్టీ మండలాధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, సీపీఎం జిల్లా నాయకుడు ఎం అప్పలరాజు దీక్ష చేశారు. అనంతరం నాయకులు, మత్స్యకారులు మాట్లాడుతూ రెండు వారాలుకుపైగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పనులు అడ్డుకుంటే హోంమంత్రి స్పందించారన్నారు. ఉప్పాడలో దివీస్ కంపెనీ, రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పెడుతూ గంగపుత్రులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ప్రాణాలకు హానీ కలిగించే కంపెనీ కాకినాడ జిల్లాలో అడ్డుకుంటే, రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చిన అనిత బల్క్ డ్రగ్స్ పార్క్ను వ్యతిరేకిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక కంపెనీలకు అనుకూలంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. సోమవారం గ్రామంలో చర్చలు కోసం వచ్చిన అనితకు తమ వైఖరి స్పష్టం చేశామన్నారు. కమిటీ ఏర్పాటు చేస్తాం, సీఎంతో మాట్లాడుతామంటే కుదరదన్నారు. బల్క్ డ్రగ్స్ పార్క్ రద్దు చేయాలని ప్రకటన చేసే వరకు దీక్ష ఆగదన్నారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గంగపుత్రుల సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. కూటమి నాయకులుకు మత్స్యకారుల ఓట్లు కావాలని, ప్రాణాలు అక్కర్లేదా అని మండిపడ్డారు. మండలంలో ఎక్కడా లేనివిధంగా రాజయ్యపేటలో టీడీపీకి రెండు వేల మెజారిటీ ఇస్తే, తమ గ్రామస్తుల ప్రాణాలకే ముప్పు తెచ్చే కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. తమ డిమాండ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే వరకు పనులు ఆపిస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారని, అయినప్పటికీ ఇసుక లారీలు రావడంతో ఆగ్రహం చెందిన ఆందోళన కారులు వాటిని అడ్డుకున్నారన్నారు. మత్స్యకారులు దీక్షను మాజీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కంబాల జోగులును కోరగా సానుకూలంగా స్పందించారు. మత్స్యకారుల దీక్షపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒక ప్రకటన చేయాలని జోగులు కోరారు. వైఎస్సార్ సీపీ నాయకులు ధనిశెట్టి బాబూరావు, దగ్గుపల్లి సాయిబాబా, జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, సూరకాసులు గోవిందు, పన్నీరు బాబ్జి, గొర్ల గోవిందు, ఎం.అప్పలరాజు, ఎరిపల్లి నగేష్, ముసలయ్య, మహేష్, పిక్కి తాతీలు, గెడ్డమూరి శ్రీను, సోమేష్, నూకరాజు, అప్పలరాజు పైడితల్లి, బాబూరావు, పాల్గొన్నారు. -
అమ్మో.. బస్సు ఎక్కలేం!
సాక్షి, అనకాపల్లి/అనకాపల్లి టౌన్: దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల తాకిడి పెరగడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో బస్టాండ్లు రద్దీగా మారాయి. ప్రస్తుతం ఉన్న ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను ప్రత్యేక సర్వీసుల కింద హైదరాబాద్, విజయవాడకు నడపడంతో లోకల్ సర్వీస్ బస్సులు మరింత రద్దీగా మారాయి. మరోవైపు సీ్త్రశక్తి పథకం అమలు తర్వాత మహిళా ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు అదనపు బస్సు సర్వీసులను నడపడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి శాపంగా మారింది. మహిళలు ఉచిత పథకం ద్వారా ప్రయాణించడానికి వేచి ఉన్నా .. బస్సులు రద్దీగా ఉండడంతో ప్రైవేట్ వాహనాల్లోనే డబ్బులు చెల్లించుకుని వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. దసరా పండగ సందర్భంగా ప్రైవేట్ బస్సులు, వాహనాల్లో టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. అయినా తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ సర్వీసుల్లోనే ప్రయాణికులు వెళ్తున్నారు. అరకొర బస్సులతో అవస్థలు అనకాపల్లి నుంచి ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం, గాజువాక ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే గ్రామీణ ప్రాంతాలైన పాయకరావుపేట, చోడవరం, దేవరాపల్లి, మాడుగుల, రావికమతం, తంతడి, పూడిమాడక, వై.లోవ, వెంకటాపురం తదితర గ్రామాల నుంచి అనకాపల్లికి నిత్యం ప్రజలు ప్రయాణిస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే సమీపంలోని బైపాస్ రోడ్కు వెళ్లి ఎక్స్ప్రెస్ బస్సులను అందుకుంటారు. అరకొర బస్సు సర్వీసులతో ఇప్పటికే అవస్థలు పడుతున్న ప్రయాణికులకు ఇక దసరా పండగకు ఊరెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. బస్సులో సీటు దొరికిందంటే లాటరీ తగిలినట్టు ఫీలైపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పండగ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో పిల్లలతో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సు ప్రయాణం ఉచితం కావడంతో మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. అయితే సరిపడా బస్సు సర్వీసులు లేకపోవడంతో సీట్ల కోసం ఫీట్లు తప్పడం లేదు. నిల్చునే ప్రయాణాలు సాగిస్తున్నారు. గమ్యస్థానాలకు చేరాలని మహిళలు సైతం ఫుట్పాత్లపైనే ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు. జిల్లాలో బస్సు సర్వీసుల వివరాలు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంకు సూపర్ లగ్జరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సులను ప్రత్యేక సర్వీసులుగా మార్చారు. అనకాపల్లి డిపోలో 90 బస్సులు ఉన్నాయి. ఎక్స్ప్రెస్లు 4, మెట్రో ఎక్స్ప్రెస్లు 18, సిటీ ఆర్డనరీ 4, పల్లెవెలుగు 64 బస్సులున్నాయి. దసరా సందర్భంగా అనకాపల్లి నుంచి 20 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. వీటిని పాయకరావుపేట, చోడవరం, నర్సీపట్నం, విజయనగరం మార్గాల్లో నడుపుతున్నారు. నర్సీపట్నం డిపోకు కూడా అదనంగా 20 స్పెషల్ సర్వీసులు పెంచారు. ఇందులో విశాఖ–నర్సీపట్నం 10, విజయవాడకు–2, హైదరాబాద్–1, మిగిలిన 7 బస్సులు లోకల్ సర్సీసులకు కేటాయించారు. దీనిపై ఆర్టీసీ అనకాపల్లి డిపో అధికారి ప్రవీణను సంప్రదించగా.. దసరా నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. రద్దీకి తగ్గట్టు ప్రత్యేక సర్వీసులను పెంచామని చెప్పారు. ముందస్తుగా బుక్ చేసుకుంటే భవానీ భక్తులకు ఎక్స్ప్రెస్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో అందుకు తగ్గట్టు బస్సులను సర్దుబాటు చేస్తున్నామన్నారు. ఆర్టీసీపై దసరా ప్రభావం రద్దీకి తగ్గట్టు బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు ప్రమాదకరంగా ఫుట్బోర్డు ప్రయాణాలుగంటల తరబడి నిరీక్షించాల్సిందే దసరా పండగ నేపథ్యంలో బస్సులు కిటకిటలాడుతున్నాయి. బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. రద్దీ పెరిగిపోవడంతో బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయి. బస్సు ఎక్కే సమయంలో కూడా తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. దసరా వరకు పోలీసుల సమక్షంలో క్యూలో బస్ ఎక్కే విధంగా ఏర్పాట్లు చేయాలి. – ఆర్.మంగనాయుడు, కొత్తపేట ప్రైవేట్ సర్సీసులే దిక్కు.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులు లేకపోవడంతో సొంత గ్రామాలకు వెళ్లాలంటే ప్రైవేట్ సర్వీసులే దిక్కవుతున్నాయి. ఆటోలు, టాటా మేజిక్, ఇతర సర్వీసుల డ్రైవర్లు డబుల్ చార్జీలు వసూళ్లు చేస్తున్నారు. అదనపు సర్సీసులను నడుపుతున్నట్టు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా బస్సులు నడపాలి. – గొనగాన చిన్నోడు, తట్టబంద -
సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యుల ధర్నా
అనకాపల్లి: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్సీ) విధులు నిర్వహిస్తున్న వైద్యుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యుల అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు వి.కనక అప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదుట మంగళవారం అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పీహెచ్సీ వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైమ్ బాండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు బేసిక్ పే 50 శాతం ట్రైబుల్ అలవెన్స్ మంజూరు చేయాలని కోరారు. నోషనల్ ఇన్క్రిమెట్స్ మంజూరు చేయాలని, చంద్రన్న సంచార చికిత్స ప్రొగ్రామ్ కింద వైద్యులకు రూ.5 వేలు అలవెన్స్ అందజేయాలని, నేటివిట్, అర్బన్ ఎలిజిబిలిటీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వినోద్, వెంకటేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీ
యాచకుడు దుర్మరణం మర్రిబంద హైవే కూడలి సమీపంలో యాచకుడు మృతదేహం యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద హైవే కూడలికి సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని యాచకుడు మృతి చెందాడు. ఈ కూడలిలో ఫ్లిప్కార్ట్ కార్యాలయం వద్ద 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న బిచ్చగాడు నడిచి వెళ్తుండగా, అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్లే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రేగుపాలెం వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు యలమంచిలి పట్టణ ఎస్సై కే సావిత్రి తెలిపారు. -
అనిత ‘గాలి’ మాటలు.. మళ్లీ రోడ్డెక్కిన మత్స్యకారులు
సాక్షి, అనకాపల్లి జిల్లా: బల్క్ డ్రగ్ వ్యతిరేక ఆందోళనలతో మత్స్యకారులు మరోసారి రోడ్డెక్కారు. బల్క్ డ్రగ్ కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళనకు దిగారు. రోడ్ల నిర్మాణం కోసం వచ్చిన లారీని మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ కంపెనీ నిర్మిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పనులు జరగవని హొంమంత్రి ప్రకటించిన మరుసటి రోజే లారీలో ఇసుక తీసుకుని రావడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నక్కపల్లి మండలం రాజయ్యపేట మత్స్యకారులు హోంమంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్ని అడ్డగించిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరుగుతున్న బల్క్డ్రగ్ పార్కు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా మత్స్య కారులు ఆందోళన చేపట్టారు. అయితే, దీనిపై చర్చిచేందుకు హోంమంత్రి నిన్న (సెప్టెంబర్ 29, సోమవారం) గ్రామానికి వచ్చారు. పనులు నిలిపివేస్తున్నట్టు హోం మంత్రి ప్రకటించారు. కానీ ఇవాళ లారీలో ఇసుక రావడంతో మత్స్యకారులు మండిపడ్డారు. -
‘తాచేరు’ మరణాలు ప్రభుత్వ హత్యలే
● పేట డైవర్షన్ రోడ్డు, మిగిలిన రోడ్లు బాగు చేయకపోతే ప్రజా ఉద్యయం ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ బుచ్చెయ్యపేట: తాచేరు నదిలో కాలుజారి కొట్టుకుపోయి ఇద్దరి మృతికి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇటీవల భీమునిపట్నం, నర్సీపట్నం (బీఎన్) ఆర్అండ్బీ రోడ్డులో విజయరామరాజు పేట వద్ద వర్షాలకు కోతకు గురైన తాచేరు డైవర్షన్ రోడ్డు నదిలో కాలు జారి వడ్డాదికి చెందిన రైతు కాళ్ల సుబ్బారావు, పేట గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి ఆడారి రోహిత్ కుటుంబ సభ్యులను ఆయ న స్థానిక నాయకులతో కలిసి సోమవారం పరామ ర్శించారు. స్ధానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ డైవర్షన్ రోడ్డు దెబ్బతినడం వల్ల విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్ల క్ష్యం వహించిందన్నారు. రోడ్డును రెండు నెలల పాటు బాగు చేయకపోవడంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి, వ్యవసాయ చేసుకుంటున్న రైతు రైతు తాచేరు నదిలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారన్నారు. పోయిన ప్రాణాలను ఈ ప్రభుత్వం తీసుకురాగలదా? అని ప్రశ్నించారు. ఇవి ముమ్మా టికీ ప్రభుత్వ హత్యలేనని, బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని అన్నారు. విజయరామరాజుపేట తాచేరు డైవర్షన్ రోడ్డును బాగుచేయాలని తమ పార్టీ తరపున నాయకులతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో డైవర్షన్ రోడ్డు పనులు చేపట్టారన్నారు. పేట, వడ్డాది వంతెనలతో పాటు దెబ్బతిన్న బీఎన్ రోడ్డు, ఆర్టీ రోడ్డు, వడ్డా ది నుంచి ఘాట్రోడ్డుకు వెళ్లే రోడ్డు పనులు చేపట్టకపోతే ప్రజలతో కలిసి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జెడ్పీటీసీ దొండా రాంబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దనరావు, వైస్ ఎంపీపీలు దొండా లలితా నారాయణమూర్తి, గొంపా చినబాబు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
విశాఖ– అరకు కార్వాన్ వాహనం రెడీ
మహారాణిపేట (విశాఖ): పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ నుంచి అరకు వరకు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో నడపనున్న కార్వాన్ వాహనాన్ని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సోమవారం కలెక్టరేట్ వద్ద సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆర్.డి. కల్యాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె. మాధవి, డివిజనల్ మేనేజర్ జగదీష్ కలిసి కలెక్టర్కు కార్వాన్ వాహనం ప్రత్యేకతలను వివరించారు. ఈ ప్రత్యేక వాహనాన్ని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. -
రేషన్ సరకుల కోసం 12 కి.మీ. నడవాలా?
దేవరాపల్లి: చింతలపూడి పంచాయతీలో ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేయాలని స్థానిక గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ చింతలపూడి, సమ్మెద, వంతెవానిపాలెం గిరిజనులు సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం పీజీఆర్ఎస్లో స్థానిక తహసీల్దార్ పి.లక్ష్మీదేవికి వినతిపత్రం అందజేశారు. వీరి ఆందోళనకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ తామరబ్బ, చింతలపూడి పంచాయతీలకు కొన్నేళ్లుగా తామరబ్బ పంచాయతీ పరిధిలోని ముకుందపురంలోని రేషన్ డిపోలో సరకులు పంపిణీ చేస్తుండడంతో చింతలపూడి పంచాయతీలోని 12 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వంతెవానిపాలెం, బోడిగరువు, నేరెళ్లపూడి గ్రామాలకు సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉంటుందని, ప్రతి నెలా సరకుల కోసం కాలి నడకన వెళ్లి నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే అంశంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ విచారణ జరిపి చింతలపూడి పంచాయతీలో ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికై నా కలెక్టర్ జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి.శ్రీను, ఎం. ఎర్రునాయుడు, డి.దేవి, డి.ఉమ, వి.వెంకటేష్, టి.రాములమ్మ, కె.గౌరునాయుడు తదితర గిరిజనులు, మహిళలు పాల్గొన్నారు.చింతలపూడిలో డిపో ఏర్పాటు చేయాలని గిరిజనుల ఆందోళన -
అనధికారిక లేఅవుట్లతో పంట భూములకు నష్టం
అనధికారిక లేఅవుట్లతో వర్షపునీరు నిలిచిపోయి పంటలు మునిగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తుమ్మపాలకు చెందిన టీడీపీ, సీపీఎం నాయకులు, రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. తుమ్మపాల సర్వే నంబర్లు 39, 316, 317లలో భూములు ఉన్న టి.అప్పారావు అనే ఆసామి తన భూమిలో అనధికార లేఅవుట్ వేసి వర్షపునీరు శారదానదిలోకి ప్రవహించకుండా రాతి గోడలు నిర్మించారని కలెక్టర్ దృష్టికి వారు తీసుకెళ్లారు. దీంతో ఎగువన ఉన్న రైతుల భూముల్లో నీరు నిలిచిపోయి పంటలు మునిగిపోతున్నాయని వాపోయారు. మండల రెవెన్యూ, పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని బాధిత రైతులు చెప్పారు. సుమారు 370 ఎకరాల్లో పంట నష్టం జరుగుతుందని, కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బొడ్డపాటి చినరాజారావు, గొంతిని గంగాజలం, ఎస్.రాజు, పీలా బుజ్జి, గంగిరెడ్ల రమణ, బొడ్డపాటి అప్పలనాయుడు, మహిళలు పాల్గొన్నారు. -
వేర్వేరు చోట్ల నీటిలో జారిపడి ఇద్దరి మృతి
● తెనుగుపూడిలో చెరువులో మునిగి టెన్త్ విద్యార్థి ● బోయిలకింతాడలో శారదానదిలో పడి మరో వ్యక్తి ● రెండు ఘటనలపై పోలీసుల దర్యాప్తుదేవరాపల్లి: మండలంలో సోమవారం వేర్వేరు చోట్ల నీటిలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెనుగుపూడికి చెందిన పదో తరగతి విద్యార్థి పెనగంటి మోహన్రావు(15), అతని స్నేహితుడు రొంగలి హేమంత్తో కలిసి వారి కళ్లాలకు సమీపంలో తారురోడ్డుకు ఆనుకొని ఉన్న రాజు చెరువు దగ్గరకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మోహన్రావు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగిపోయాడు. హేమంత్ కేకలు వేయడంతో స్థానికులు కొందరు చెరువులో దిగి బాలుడు ఆచూకీ కోసం గాలించారు. నీటిలో మునిగిన బాలుడిని బయటకు తీయగా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్ సిబ్బంది వైద్య పరీక్షలు జరిపి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఇంటి నుంచి వెళ్లిన గంటల వ్యవధిలోనే ఒక్కగానొక్క కొడుకు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు రమణ, దేవి గుండెలవిసేలా రోదించారు. మృతుడి తండ్రి రమణ ఫిర్యాదు మేరకు దేవరాపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● మండలంలోని బోయిలకింతాడలో భర్నికాన అప్పలరాజు(35) సోమవారం ఉదయం శారదానదికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారిపడి నదిలో మునిగి మృతిచెందాడు. మృతుడికి భార్య రత్నం, నవీన్, ఝాన్సీ పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య, స్థానిక విద్యా కమిటీ చైర్పర్సన్ రత్నం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పైడిరాజు తెలిపారు. ఈ రెండు గ్రామాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. -
‘జూనియర్ అథ్లెటిక్స్’ చాంపియన్ విశాఖ
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో విశాఖ అథ్లెట్లు బి.ఇషానా, కె.ఆర్.వి.ఎం.కుమార్, బి.శైలజ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి వ్యక్తిగత చాంప్లుగా నిలిచారు. ఈ పోటీల్లో విశాఖ జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ను కూడా కై వసం చేసుకుంది. సోమవారంతో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ముగిసిన ఈ పోటీలను సబ్జూనియర్ (అండర్–14, 16), యూత్ (అండర్–18), జూనియర్ (అండర్–20) బాలబాలికల విభాగాల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో నిర్వహించారు. బాలికల అండర్–14 విభాగంలో ఇషానా, అండర్–18 విభాగంలో శైలజ, బాలుర అండర్–16 విభాగంలో కుమార్ తమ విభాగాల్లో వ్యక్తిగత చాంపియన్షిప్లు సాధించారు. అలాగే విశాఖ జిల్లా జట్టు 269 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్షిప్ను గెలుచుకుంది. బాలుర చాంపియన్షిప్ను 156 పాయింట్లతో విశాఖ కై వసం చేసుకోగా, బాలికల చాంపియన్షిప్ను 113 పాయింట్లతో సాధించింది. -
ఆకలి తీర్చని ని‘బంధనాలు’
బుచ్చెయ్యపేట: రెండు కళ్లు లేని తనకు, వృద్ధురాలైన తన తల్లికి రెండు నెలలుగా రేషన్ బియ్యం, సరకులు ఇంటికి అందించకపోవడంపై రాజాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు నడిపల్లి సన్యాసినాయుడు సోమవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. పుట్టుకతోనే రెండు కళ్లు లేని తనకు, 80 ఏళ్లు వయస్సు కలిగిన తన తల్లికి రెండు నెలలుగా గ్రామానికి చెందిన రేషన్ డీలరు ఇంటికొచ్చి సరకులు ఇవ్వక పస్తులుంటున్నామని ఆయన తహసీల్దార్కు ఇచ్చిన అర్జీలో ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగుల ఇంటికెళ్లి నిత్యావసర వస్తువులు అందించాలని ప్రభుత్వం చెబుతున్నా తమ గ్రామ రేషన్ డీలర్ అమలు చేయడం లేదని వాపోయారు. గత నెలలో కూడా రేషన్ సరకులు ఇవ్వకపోవడంతో తహసీల్దార్కు ఫిర్యాదు చేశానని, అయినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని తహసీల్దార్కు నేరుగా, కలెక్టర్, సీఎం, డిప్యూటీ సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రిలకు పోస్టులో ఫిర్యాదు చేశానన్నారు. తహసీల్దార్ లక్ష్మిని దీనిపై వివరణ కోరగా దివ్యాంగుడైన సన్యాసిరావుది సింగిల్ కార్డు కాదని, ఇతని కార్డులో అతని తల్లి పేరు కూడా ఉందని, ఆమె వయస్సు 65 సంవత్సరాలుగా రేషన్ కార్డులో నమోదైందని, అందువల్ల లిస్టులో పేరు రాకపోవడంతో డీలరు ఇంటికెళ్లి సరకులు అందించలేదన్నారు. తల్లి వయస్సు మార్పు చేయించి ఇంటికే రేషన్ సరకులు అందేలా చూస్తామన్నారు.దివ్యాంగుడు, అతని 80 ఏళ్ల తల్లికి అందని రేషన్ -
కట్టలు తెగిన ఆగ్రహం
● గంగపుత్రుల వీరావేశం ● హోంమంత్రికి నిరసన సెగ ● వాహనం అడ్డగించిన మహిళలు ● నిలువరించలేకపోయిన పోలీసులు ● బల్క్డ్రగ్ పార్కు రద్దుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో శాంతించిన మత్స్యకారులు ● శుష్క వాగ్దానాలు వద్దని, పనులు ఆపితేనే మాట్లాడతామని స్పష్టీకరణనక్కపల్లి: తమ జీవితాలను నాశనం చేసే బల్క్డ్రగ్ పార్క్ ఏర్పాటును నిరసిస్తూ మత్స్యకారులు చేస్తున్న నిరాహార దీక్ష రెండు వారాలుగా కొనసాగుతోంది. ఉద్యమం తీవ్రతరమై వేలాదిమంది మత్స్యకారులు రోడ్డెక్కి ఆందోళన కొనసాగిస్తున్నారు. పనులు మానుకుని కుటుంబాలతో సహా నిరసన దీక్షలో పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో మత్స్యకారులతో మాట్లాడేందుకు రాజయ్యపేట వచ్చిన హోంమంత్రి అనితకు నిరసన సెగ అంటుకుంది. ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న మత్స్యకారులను అడ్డుకోవడం పోలీసుల తరం కాలేదు. మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని ముందుకు వెళ్లకుండా వేలాదిగా తరలివచ్చిన మత్స్యకారులు అడ్డుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి బల్క్డ్రగ్ పార్క్ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు పట్టుకున్న రోప్వేలు మత్స్యకారులను ఏమాత్రం నిలువరించలేకపోయాయి. భారీగా మోహరించిన పోలీసులు మత్స్యకారులను ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. తీవ్ర వాగ్వాదాల మధ్య మత్స్యకారులను శాంతింపచేసేందుకు హోంమంత్రి తీవ్ర ప్రయత్నం చేశారు. తొలుత అధికారాన్ని ఉపయోగించి పోలీసులతో మత్స్యకారులను భయపెట్టేందుకు ప్రయత్నించినా వారు లెక్కచేయకపోగా ఆగ్రహంతో మరింత రగిలిపోయారు. చివరకు మీ నాయకులతోనే కమిటీ వేసి న్యాయం చేస్తానని, బల్క్డ్రగ్ పార్కును రద్దు చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కొద్దిగా శాంతించిన మత్స్యకారులు వాహనానికి దారి ఇచ్చారు. ఆమె మాట్లాడేందుకు వీలుగా స్టేజ్ వరకు దారి ఇచ్చారు. పనులు ఆపితేనే మాట్లాడతాం.. హోంమంత్రి అనిత వేదికపై నుంచి మాట్లాడుతూ.. మీ అందరూ కొలిచే నూకతాత సాక్షిగా చెబుతున్నా, బల్క్డ్రగ్ పార్కును రద్దు చేసి సమస్యను పరిష్కారం చేసేందుకు హామీ ఇస్తున్నానని చెప్పారు. ఇందు కోసం మీ గ్రామం నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే వారిని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళతానని హామీ ఇచ్చారు. తనను నమ్మాలని దసరా పండుగ అయిన వెంటనే కమిటీ సభ్యులతో డిప్యూటీ సీఎం, సీఎంలతో చర్చలు జరిపించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే బల్క్డ్రగ్ పార్కు రద్దు గురించి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తమ నిరాహార దీక్ష కొనసాగుతుందని మత్స్యకారులు ముక్తకంఠంతో నినదించారు. బూటకపు హామీలు కాదని తక్షణమే పనులు ఆపాలని నినాదాలు చేశారు. కమిటీలు వేయాల్సిన పనిలేదని, డిప్యూటీ సీఎం, సీఎంలను కలిసే పనేలేదని తెగేసి చెప్పారు. మోసం చేసి తమ దీక్షను విరమింపజేయాలని చూస్తే సహించమన్నారు. చర్చలు జరిగేంత వరకు పనులను ఆపాలని నినాదాలు చేశారు. ఆమె పట్టించుకోకపోవడంతో హోం మంత్రి అనిత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. -
పీలా...ఢీలా
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశం మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు, బీజేపీ కార్పొరేటర్ గంకల కవిత మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికై ంది. సమావేశానికి కమిషనర్ వస్తారని మేయర్ చెప్పగా, ‘కమిషనర్ ఊర్లో లేరని మీకు తెలియదా? లేక తెలిసీ అడుగుతున్నారా?’ అంటూ కవిత నిలదీశారు. దీనికి మేయర్ స్పందిస్తూ మీరు కూర్చోండి. ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకుందాం అనడంతో వివాదం మరింత రాజుకుంది. మీతో మాకు పర్సనల్ ఏముంటాయని ప్రశ్నించారు. మీరు మేయర్గా కాకుండా కేవలం చైర్మన్గా మాత్రమే వచ్చారు. మేము కూడా ప్రజలతో ఎన్నికయ్యాం. సమావేశం సోమవారం అయితే మాకు ఆదివారం చెబుతారా? మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనికి పీలా శ్రీనివాసరావు ఇది అత్యవసర సమావేశం. ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చు అని బదులిచ్చారు. అంతేకాకుండా, స్థాయీ సంఘంలో మీకు స్థానం కల్పించింది నేను, నా పార్టీ నుంచి మీకు అవకాశం ఇచ్చాను అని మేయర్ తీవ్రంగా మండిపడ్డారు. మీరు మాకు క్లాసులు చెబుతారా? మీ వ్యవహార శైలి బాగాలేదు అంటూ కవిత..మేయర్పై విరుచుకుపడ్డారు. జిరాయితీ భూమికి ప్లానింగ్ ఎలా? శానాపతి వసంత మాట్లాడుతూ జిరాయితీ భూమికి అధికారులు ప్లానింగ్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దానికి చైర్మన్ స్పందిస్తూ, సంబంధిత అధికారులు లేరు, ఆ విషయం వదిలేయండి.. అని చెప్పగా, సభ్యురాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కూడా నేను స్థాయీ సంఘంలో ఉన్నాను, అప్పుడు అధికారులంతా అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు అధికారులు లేకపోతే ఎలా? అని మేయర్ను ప్రశ్నించారు. బంజరు భూమిలో రోడ్డు వేయగలమా అని ప్రశ్నిస్తూ, దీనిపై విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు ఎక్కడ? అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా, వార్డుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ లేదని అధికారులు చెబుతున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారు. నవంబర్లో జరిగే సదస్సుకు రూ. 40 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ‘నగరాభివృద్ధి, సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. కానీ మా వార్డుల పరిస్థితి ఏమిటి? మరో నాలుగైదు నెలల్లో పదవీకాలం ముగుస్తుంది, తిరిగి ఎన్నికలకు వెళ్లాలంటే మేము చేసిన అభివృద్ధి చూపించాలా వద్దా?’ అని ప్రశ్నించారు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా తాము విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అంశాలకు సభ్యుల ఆమోదం ఈ తీవ్ర చర్చలు, నిరసనల అనంతరం, సమావేశంలో చర్చకు వచ్చిన 91 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. వీటిలో ముఖ్యంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు–2025కు సంబంధించిన అంశాలున్నాయి. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ. 27.60 కోట్ల అంచనా వ్యయంతో నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు, రూ. 5.3 కోట్ల అంచనా వ్యయంతో ఇతర ఇంజినీరింగ్ పనులకు సభ్యులు ఆమోదం తెలిపారని చెప్పారు. ప్రజా ఆరోగ్య విభాగానికి సంబంధించి పారిశుధ్య కార్మికుల జీతాలకు కూడా ఆమోదం లభించిందని తెలిపారు. సమావేశంలో ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, జోన్–1 జోనల్ కమిషనర్ ఇప్పినాయుడు, 6వ జోన్ జోనల్ కమిషనర్ విజయశంకర్, పర్యవేక్షక ఇంజినీర్లు సంపత్కుమార్, రాయల్బాబు, గోవిందరావు, కె.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇం.ఇనీర్లు, ఏఎమ్వోహెచ్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సభ్యురాలి ఆగ్రహం సమావేశం ప్రారంభానికి ముందు వైఎస్సార్ సీపీ సభ్యురాలు సాడి పద్మారెడ్డి కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ముఖ్యంగా సెక్రటరీ మేయర్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. స్థాయీ సంఘం సమావేశాల విధివిధానాలు ఏమిటో తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమావేశం ఉందని సోమవారం ఉదయం తనకు ఫోన్ చేసి చెప్పారని, అజెండా అంశాలు చదవడానికి కూడా సమయం ఇవ్వలేదని ఆమె అన్నారు. గత సమావేశంలో అడిగినా ఇప్పటివరకు విధివిధానాలు తనకు ఇవ్వలేదని ఆరోపించారు. తమ వార్డులు, జోన్లలో చేపట్టే ఏ కార్యక్రమమైనా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను కోరారు. ‘స్థాయీ సంఘం’లో రచ్చ రచ్చ మేయర్పై గుర్రుమన్న కూటమి భాగస్వామి బీజేపీ కార్పొరేటర్ పర్సనల్గా మాట్లాడుకుందామన్న మేయర్.. మీతో మాకు పర్సనల్ ఏంటి? అని నిలదీసిన వైనం సొంత సభ్యులతోనే మేయర్కు చుక్కెదురు విలీన గ్రామాలకు అన్యాయం? మరో సభ్యుడు మొల్లి ముత్యాలు జీవీఎంసీ పరిధిలోని విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తారు. ’జీవీఎంసీ అంటే కేవలం నగరం మాత్రమే కాదు, విలీన గ్రామాలూ ఉన్నాయి. కేవలం నగరంలోనే సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడితే విలీన గ్రామాలను ఎందుకు కలుపుకున్నట్లు? అని ఆయన ప్రశ్నించారు. శ్మశాన వాటికలకు కూడా రక్షణ లేకుండా పోయిందని, అభివృద్ధి పనులు అడిగితే బడ్జెట్ లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్లో జరిగే సదస్సుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి మాత్రం బడ్జెట్ ఉంటుందా అని ఆయన దుయ్యబట్టారు. -
సేంద్రియ ఉత్పత్తులను వినియోగించండి
తుమ్మపాల: రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగా పండించే సేంద్రియ పంటల ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అమృతపాల ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ–(సబ్బవరం) ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయోత్పత్తుల స్టాల్ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిమితికి మించి రసాయన ఎరువుల వాడకం, ఆ ఉత్పత్తుల వినియోగం వల్ల పర్యావరణం, మనిషి ఆరో గ్యం ప్రభావితమవుతున్నాయన్నారు. సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు మార్కెంటింగ్ సదుపాయం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవ సాయ అధికారి మోహనరావును ఆదేశించారు. -
అర్జీలకు సకాలంలో పరిష్కారం
● కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం ● పీజీఆర్ఎస్కు 232 అర్జీలు తుమ్మపాల: పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు సకాలంలో సరైన పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. మొత్తం 232 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ శాఖ 128, పంచాయతీ రాజ్ 23, పోలీస్ 17, పలు శాఖలకు మిగిలిన అర్జీలు నమోదయ్యాయి. కూటమి అరాచకాలపై ఫిర్యాదుల వెల్లువ కూటమి నాయకుల అక్రమాలతో తీవ్ర ఇబ్బందులకు గురైన పలువురు బాధితులు కలెక్టరేట్కు వచ్చి నిరసన తెలిపారు. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు పలు గ్రామాల ప్రజలు తరలివచ్చి కూటమి నాయకుల అనధికారక వ్యవహారాలపై ఫిర్యాదులు చేశారు. ఏడాది కాలంగా గ్రామాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని, కంపెనీల పేరుతో బాధితులకు చెల్లించే నష్టపరిహార జాబితాల్లో అనర్హులైన కూటమి నాయకుల పేర్లు చేర్చేసి అర్హులను తొలగిస్తున్నారని పలువురు ధ్వజమెత్తారు. అధికారులు కూడా కూటమి నాయకుల తొత్తులుగా మారుతున్నారంటూ కలెక్టరేట్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. నిర్వాసితులకు రైల్వేలో ఉద్యోగమివ్వాలి రాజుపాలెం రైల్వే వంతెన నిర్మాణంలో భాగంగా భూమి, భవనం కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వ మార్కెట్ విలువకు ఐదు రెట్లు నష్టపరిహారంతో పాటు నిరుద్యోగులైన తమ పిల్లలకు రైల్వేలో ఉద్యోగం అవకాశం కల్పించాలంటూ జీవీఎంసీ విలీన గ్రామం కె.ఎన్.ఆర్.పేటకు చెందిన బాధితుడు గైపూరి భాస్కరరావు కలెక్టర్ను వేడుకున్నారు. కష్టాలు పడి నిర్మించుకున్న ఇంటికి నామమాత్రపు నష్టపరిహారం చెల్లించి తమను రోడ్డున పడేసే ప్రయత్నాలకు అంగీకరించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం పునరాలోచన చేసి భూములు కోల్పోతున్న రైతులకు చదరపు గజాల్లో విలువ కట్టి నష్టపరిహారం చెల్లించాలని, తమకు మరో చోట పునరావాసం కల్పించాలని కోరారు. ఆర్టీసీలో ప్రత్యేక సీట్ల కోసం వినతి అనకాపల్లి: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ప్రత్యేక సీట్లు కేటాయించి, రాయితీలు కల్పించాలని జిల్లా వయో వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కాండ్రేగుల అప్పారావు కోరారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ విజయకృష్ణన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సీ్త్రశక్తి పథకం అమలు చేయడం వల్ల వృద్ధులకు బస్సుల్లో సీట్లు లేకుండాపోయాయన్నారు. వృద్ధులకు ప్రత్యేక సీట్లు, ప్రయాణంలో 25 శాతం రాయితీ కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఎస్పీ కార్యాలయానికి 32 అర్జీలు ఆర్జీదారుల సమస్య వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హాఅనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు 32 అర్జీలు అందాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. భూతగాదాలు–18, కుటుంబ కలహాలు–2, మోసాలకు సంబంధించి–2, వివిధ విభాగాలకు చెందినవి–10 అర్జీలు వచ్చాయన్నారు. చట్ట పరిధిలో ఉన్న అర్జీలకు 7 రోజుల్లో పరిష్కరించాలని దిగువ స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
బొమ్మల కొలువు.. సంస్కృతికి నెలవు
సాంకేతికత ఎంత పెరిగినా.. కృత్రిమ మేధతో అద్భుతాలు చేస్తున్నా.. అంతరిక్షానికి వెళ్లొచ్చినా కొన్ని సంప్రదాయాలు ఎప్పటికీ పాతబడవు.. చూడ్డానికీ బాగుంటాయి.. ఆనందాన్నీ ఇస్తాయి. అలాంటిదే దసరా బొమ్మల కొలువు.. మన సంస్కృతీ, సంప్రదాయాలను సజీవంగా నిలుపుతున్న కళాత్మకమైన అందమైన వేదిక. యలమంచిలి రూరల్: జిల్లా అంతటా దసరా వేడుకలు సరదాగా సాగుతున్నాయి. బొమ్మల కొలువులు ముచ్చట గొలుపుతున్నాయి. యలమంచిలి పట్టణంలోని ఓరుగంటివారి వీధిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సుసర్ల భాగ్యలక్ష్మి, సూర్యప్రకాష్ దంపతులు తమ ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంటోంది. గత ఆరేళ్లుగా వీరు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఐదు వరుసల్లో సుమారు వెయ్యికి పైగా బొమ్మలతో పెట్టిన బొమ్మల కొలువు చూడ్డానికి గృహిణులు, పిల్లలు, విద్యార్థులు ఉపాధ్యాయ దంపతుల ఇంటికి వెళ్తున్నారు. అలాగే రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో ప్రముఖ పురోహితుడు కొట్ర దీక్షితులు ఇంట్లో గత 10 సంవత్సరాలుగా దసరా పండుగకు బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. దీక్షితులు భార్య సూర్య గాయత్రి ప్రత్యేక శ్రద్ధతో బొమ్మల కొలువు తీర్చిదిద్దుతున్నారు. పురాణేతి హాసాల్లో కనిపించే దేవతల ప్రతిమలు, నవ దుర్గలు, త్రిమూర్తులు, హనుమ, లక్ష్మణ సమేత సీతారాములు, శ్రీనివాసకల్యాణ ఘట్టాలు, రాధాకృష్ణులు, గుడి, గ్రామం, వివాహ క్రతువు, సహపంక్తి భోజనం ఇలా.. వివిధ రకాల బొమ్మల్ని ఇక్కడ కొలువులో ఉంచారు. ఎన్నెన్నో బొమ్మలు బొమ్మల కొలువులో దేవుళ్ల బొమ్మలు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కనువిందు చేస్తున్నాయి. పంచాంగం బ్రాహ్మణుడు, పచారీకొట్టు వ్యాపారి, ఆవు దూడ, జంతువులు, పక్షులు, గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే బొమ్మలు ఇలా ఎన్నో రకాల బొమ్మలను కళాత్మకంగా అమర్చారు. ప్రతి ఏటా కొత్త బొమ్మలను జత పరుస్తున్నామని, మన సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా చేయడమే బొమ్మల కొలువు లక్ష్యమని ఏటికొప్పాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుసర్ల భాగ్యలక్ష్మి చెప్పారు. బొమ్మల కొలువు దసరా, దీపావళి, సంక్రాంతి పర్వదినాల్లో ఏర్పాటు చేయడం పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన సంస్కృతిలో భాగమని తెలుగు అధ్యాపకురాలు కొట్ర సూర్య గాయత్రి చెప్పారు. ఈ కాలం పిల్లలకు బొమ్మల కొలువు ద్వారా సులువుగా మన సంప్రదాయాల గురించి వివరించవచ్చన్నారు. -
ఏరియా ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరం
నర్సీపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయని, అందులో భాగంగానే మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ శిబిరాల్లో మహిళలకు అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారన్నారు. ఆయుష్మాన్– వయోవందన కార్డు ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి ఏడాదికి రూ.5 లక్షలు విలువైన వైద్య సేవలతోపాటు పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు. ఏరియా ఆస్పత్రిలో రూ.2.10 కోట్లతో వెయిటింగ్ హాల్స్ నిర్మించనున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఓపీ నమోదులో జాప్యం జరుగుతున్నందున అదనంగా మరో మూడు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. గర్భిణులకు నిర్వహించిన సీమంతంలో పాల్గొన్నారు. ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ రామారావు, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వీరజ్యోతి, ఆస్పత్రి సూపరిండెంటెంట్ సుధాశారద, హా స్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు సిహెచ్. పద్మావతి, జెడ్పీటీసీ రమణమ్మ పాల్గొన్నారు. -
చివరి మజిలీకి ఎన్ని కష్టాలో..
పెద్దేరు నది నీటిలో నుంచి మృతదేహాన్ని మోసుకెళ్తున్న కుటుంబ సభ్యులు బుచ్చెయ్యపేట: మండలంలో వడ్డాది మేజర్ పంచాయతీలో మృతదేహాన్ని ఖననం చేయడానికి బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. సోమవారం వడ్డాదిలో కొత్తూరుకు చెందిన ముత్యాల గణేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. దళితులు, దేవాంగులు, స్వర్ణకారు లు, కమ్మర్లకు చెందిన శ్మశానవాటిక ఇక్కడ మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఎస్సీ బాలుర వసతి గృహం ఎదురుగా పెద్దేరు నది ఒడ్డున ఉంది. గతంలో పెద్దేరు కస్పా కాలువపై సిమెంట్ గొట్టాలు పరిచి రోడ్డు వేశారు. ఈ రోడ్డుపై వెళ్లి మృతదేహాలను ఖననం చేసేవారు. ఇటీవల వర్షాలకు సిమెంట్ గొట్టాల రోడ్డు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. నడుం లోతు నీటి లో నుంచి అతికష్టం మీద శ్మశాన వాటిక వరకు మృతదేహాన్ని మోసుకెళ్లి ఖననం చేశారు. ఇప్పటికై నా శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని బాగు చేయడమే కాక వేరే దగ్గర తమ కులాల వారు అంత్యక్రియల నిర్వహణకు స్థలం కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వం అరాచకాలతో అన్యాయానికి, వేధింపులకు గురవుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ అండగా నిలుస్తుందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. తారువలో సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, బాధితులందరికీ అండగా నిలిచేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ను అందుబాటులోకి తెచ్చారన్నారు. ఈ డిజిటల్ బుక్లో దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడే వారి పేర్లతో పాటు బాధితుల వివరాలను, జరిగిన నష్టాన్ని పొందుపరిచేందుకు వీలుంటుందన్నారు. ప్రతి కార్యకర్త ఈ బుక్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేధింపులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలంనాయుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు కె.వి.రమణ, పార్టీ మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, యువజన విభాగం అధ్యక్షుడు కర్రి సూరినాయుడు, ఉపాధ్యక్షుడు బండారు దేముడునాయుడు, ప్రధాన కార్యదర్శి గూడెపు రాము, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు గంగవంశం సంతోష్, ఎంపీటీసీ పోతల వెంకటరావు పాల్గొన్నారు. అన్యాయానికి గురైన వైఎస్సార్సీపీ శ్రేణులు సద్వినియోగం చేసుకోవాలి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తారువలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ