Anakapalle
-
కలెక్టర్ విజయకృష్ణన్
పూడిమడక రోడ్డు విస్తరణ పనులు వేగవంతం మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ పనులు వేగవంతం కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. మునగపాక కృష్ణంరాజు కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఆమె మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం లోగా బ్రిడ్జి పనులు పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణలో భూములు, గృహాలు కోల్పోయే నిర్వాసితులకు ప్రభుత్వం మెరుగైన పరిహారం అందిస్తుందన్నారు. తహసీల్దార్ ఆదిమహేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు. -
దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆధారాలు కీలకం
అనకాపల్లి: నేరాల దర్యాప్తులో ఆధునిక శాసీ్త్రయ విధానాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. స్థానిక గాంధీనగరం ఎస్ఆర్ శంకరన్ హాల్లో మంగళవారం పోలీసు, వైద్యులు, న్యాయవాదులతో నేరచరిత్రపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేరస్థలాల్లో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, నిర్వహణ, ’చైన్ ఆఫ్ కస్టడీ’ పాటించాల్సిన విధానాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్, వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్న్స్ మేనేజిమెంట్ శిక్షణ ద్వారా నిందితులకు తగిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ వర్క్షాప్లో నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, విషపదార్థాలు (టాక్సికాలజీ), డిజిటల్ ఆధారాలు, సైబర్ నేరాల పరికరాలు, ఆడియో–వీడియో ఫుటేజ్, డీఎన్ఏ, రక్త నమూనాలు, మానవ అవయవాలు వంటి ఆధారాల సేకరణ, ప్యాకింగ్, భద్రపరచే విధానంపై దృష్టి సారించి, సంబంధిత ఆధారాలతో సకాలంలో కోర్టుకు ఇవ్వడం వల్ల నిందితులకు శిక్ష పడుతుందన్నారు. అంతకుముందు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.నాగరాజు, శాసీ్త్రయ సహాయకులు ఎం.రాంబాబు, పి.వి.ఎస్.బి.చలపతి, ఇ.కిరణ్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, ఫోరెన్సిక్ వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు లక్ష్మణ్ మూర్తి, బాల సూర్యారావు, లక్ష్మి, విజయ, ఎస్ఐలు ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు పాల్గొన్నారు. -
నేడు ఆపరేషన్ అభ్యాస్
● సివిల్ మాక్ డ్రిల్కు సర్వం సిద్ధం ● అత్యవసర సమయాల్లో పౌరుల స్పందనపై అవగాహన విశాఖ సిటీ: ప్రశాంత విశాఖ యుద్ధ క్షేత్రంగా మారనుంది. వైమానిక దాడుల హెచ్చరిక సైరన్ మోత మోగనుంది. శత్రు దేశ యుద్ధ విమానాలు.. క్షిపణులు.. డ్రోన్లు దూసుకొస్తున్న వేళ.. పౌరుల ఆత్మరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ జరగనుంది. రక్షణ దళాలు, పోలీసులు, ఫైర్, రెవెన్యూ, వైద్య, ఇతర శాఖల అధికారులు.. సంక్షోభ సమయాల్లో పౌరుల ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లకుండా అనుసరించాల్సిన విధానాలను వివరించనున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి తరువాత భారత్–పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో కేంద్ర హోం శాఖ ముందస్తు చర్యలకు సిద్ధమైంది. సంక్షోభ సమయంలో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, పౌరులు తమ ప్రాణా లు ఎలా కాపాడుకోవాలన్న విషయంపై ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుధవారం వన్టౌన్ ప్రాంతం, సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ వద్ద ఈ డ్రిల్ నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. క్వీన్మెరీ పాఠశాల, ఆక్సిజన్ టవర్స్ వద్ద డ్రిల్ దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను కేంద్ర హోం శాఖ మూడు కేటగిరీలుగా విభజించింది. ఇందులో విశాఖ కేటగిరీ–2లో ఉంది. యుద్ధమే అనివార్యమైతే విశాఖను కూడా పాకిస్తాన్ టార్గెట్గా చేసుకునే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సాయంత్రం 4 గంటలకు వన్టౌన్ ప్రాంతంలో ఉన్న క్వీన్మెరీస్ పాఠశాల వద్ద, రాత్రి 7.15 గంటలకు ఆక్సిజన్ టవర్స్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించనుంది. ఆ సమయంలో నగరంలో సైరన్ మోత మోగుతుంది. వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, ఇతర స్థానిక అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుంటా రు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కలిగిస్తారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి, సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే ప్రక్రియను చేపట్టనున్నారు. సైరన్ మోగినప్పుడు పౌరులు ఎలా స్పందించాలి? విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు (బ్లాక్ అవుట్) తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స కోసం ఇళ్లలో ఉంచుకోవాల్సిన అత్యవసర వస్తువులు, మందులపై ప్రజలకు వివరించనున్నారు. నేవీ, సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో... అలాగే నేవీ, సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పాత పోస్టాఫీస్ వద్ద గల ఎస్బీఐ, కేజీహెచ్ వద్ద గల ఏఎంసీ మహిళా హాస్టల్, దొండపర్తి వద్ద గల డీఆర్ఎం ఆఫీస్, వన్టౌన్లోని రోజ్ హిల్స్, ఏయూ అవుట్ గేట్ వద్ద ఉన్న జేవీడీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఏయూ నార్త్ క్యాంపస్ వద్ద ఉదయం 10 గంటలకు ఎన్సీసీ, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ చేపట్టనున్నారు. మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించాలి మహారాణిపేట: మాక్ డ్రిల్ను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో మాక్ డ్రిల్ సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మాక్ డ్రిల్ విధివిధానాలపై వారికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. యుద్ధం జరిగితే తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. -
సింహాచలంలో సమన్వయలోపం?
ఆర్జిత సేవల రద్దుపై భక్తురాలి ఆగ్రహం సింహాచలం: వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం ఆర్జిత సేవలను రద్దు చేయడంపై ఓ భక్తురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయంలో శ్రీవైష్ణవ శ్రీరామనవమి వేడుకలను నిర్వహించినందున ఆలయ వర్గాలు మంగళవారం ఆర్జిత సేవలను నిలిపివేశాయి. ఈ విషయాన్ని భక్తులకు ముందుగా తెలియజేయడంలో ఆలయ యంత్రాంగం విఫలమైంది. సోమవారం సాయంత్రం సింహగిరిపై ఉన్న పీఆర్వో కార్యాలయానికి ఓ భక్తురాలు ఫోన్ చేసి గరుడ సేవపై వాకబు చేశారు. సిబ్బంది సేవలు ఉంటాయని సమాధానమిచ్చారు. దీంతో ఉదయం దూర ప్రాంతం నుంచి సింహగిరికి చేరుకున్న ఆమె ఆర్జిత సేవలు గురించి ఆరా తీయగా, ఈ రోజు జరగడం లేదని సిబ్బంది తెలిపారు. దీంతో వాగ్వాదానికి దిగారు. చివరకు చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగారు. ఆలయ వర్గాలకు, పీఆర్వో కార్యాలయానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆర్జిత సేవల రద్దుపై ఆలయ అధికారులు పీఆర్వో కార్యాలయానికి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. -
విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి
కశింకోట: మండలంలోని ఏఎస్ పేట శివారు గొబ్బూరుపాలెంలో మంగళవారం ఓ మహిళా రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సీఐ స్వామినాయుడు వివరాల ప్రకారం.. జెట్టపురెడ్డితునికి చెందిన చవితిన చెల్లయమ్మ (54) గొబ్బూరుపాలెం వద్ద తన చెరకు తోటకు నీరు పెట్టడానికి వెళ్లి వ్యవసాయ విద్యుత్ మోటారు స్విచ్చాన్ చేసింది. ఆ సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు రమణబాబు ఇచ్చిన ఫిర్యా దు మేరకు ఎస్ఐ కె.రమణమ్మ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెల్లయమ్మ (ఫైలు) -
మెరిసిన రావికమతం దివ్యాంగ విద్యార్థి
రావికమతం: విజయవాడలోని హీల్ ప్యారడైజ్ స్కూల్లో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్–2025 క్రీడా పోటీల్లో రావికమతం మండలం కొమిర గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగ విద్యార్థి అప్పికొండ గణేష్ సత్తా చాటాడు. వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. రాష్ట్ర సమగ్ర శిక్ష సహిత విద్యా కన్సల్టెంట్ డాక్టర్ వై.నరసింహం, హీల్ ప్యారడైజ్ స్కూల్ డైరెక్టర్ అజయ్, స్పెషల్ ఒలింపిక్ భారత కమిటీ జాతీయ స్థాయి క్రీడా నిపుణుడు రాజశేఖర్ చేతుల మీదుగా గణేష్ ప్రశంసా పత్రం, బంగారు పతకం అందుకున్నాడు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జూన్లో జరిగే జాతీయ స్థాయి దివ్యాంగుల యూనిఫైడ్ వాలీబాల్ స్పెషల్ ఒలింపిక్ భారత క్రీడా పోటీల్లో గణేష్ తలపడనున్నాడు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన మేడివాడ హైస్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మీనాయుడు, జగన్నాథనాయుడును జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు, మండల విద్యా శాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
ఏయూలో విద్యార్థులకు చోటేదీ..?
● పోటీ పరీక్షార్థులకు మొండిచేయి ● వసతి కోసం వేడుకున్నా పట్టని అధికారులు విశాఖ విద్య: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో వసతి కావాలని కోరినా.. యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వర్సిటీ వైస్ ఛాన్సలర్ను కలిసేందుకు వెళ్లిన విద్యార్థులను అనుమతించకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సలర్ చాంబర్ వద్దే విద్యార్థులు పడిగాపులు కాశారు. డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వర్సిటీ విద్యార్థులకు ఏటా వేసవి సెలవుల్లో యూనివర్సిటీలో వసతి కల్పించేవారు. కానీ ఈ సంవత్సరం వర్సిటీ వసతి గృహాలకు జీవీఎంసీ తాగునీరు రావటం లేదనే కారణంతో విద్యార్థులకు అవకాశం కల్పించకపోవటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వర్సిటీ విద్యార్థులకు వసతి కల్పిస్తామని హామీ ఇచ్చి కూడా వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాళ్లు, చీఫ్ వార్డెనన్లు చుట్టూ తిప్పించుకొని చివరకు నిరాశ మిగిల్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
కోట్లాది రూపాయల అవినీతికి భారీ స్కెచ్
దేవరాపల్లి: రాష్ట్రంలో బీసీ మహిళలకు టైలరింగ్ శిక్షణ పేరిట భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం పక్కా స్కెచ్ వేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ విమర్శించారు. తారువలో మంగళవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బీసీ మహిళలకు ఇచ్చే కుట్టు శిక్షణలో కోట్లాది రూపాయలను కొల్లగొట్టేందుకు ఈ స్కీమ్ను వాడుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. కుట్టు శిక్షణ పేరిట రూ.257 కోట్లకు టెండర్ పెట్టే విధంగా అనుకూలంగా పథకాన్ని మలుచుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపులకు సిద్ధం కావడం ఇందుకు నిదర్శనమన్నారు. -
లింగ నిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు
తుమ్మపాల: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టంపై కలెక్టరేట్లోని మంగళవారం తన చాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం 1994ను కఠినంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం లింగనిష్పత్తి వెయ్యి మంది బాలురు, 972 బాలికలుగా ఉందన్నారు. లింగ నిష్పత్తి సమానంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలన్నారు. లింగ నిష్పత్తి మండలాల వారీగా సమీక్షిస్తూ తక్కువగా ఉన్న మండలాల సీడీపీవోలు మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. బాలికలపై వివక్ష చూపకూడదని తెలిపారు. ఏ లేబొరేటరీగాని, స్కానింగ్ కేంద్రం గాని గర్భస్థ పిండం లింగాన్ని తెలిపే ఉద్దేశంతో చేయరాదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడ శిశువు అని తెలిసి గర్భస్రావాలు చేయించడం వంటి సమాచారం తెలిస్తే 102, 104 టోల్ ఫ్రీ నంబరుకు లేదా ఆన్లైన్ గ్రీవియన్స్ (pcpndt.ap.gov.i n) ద్వారా తెలియజేయాలని సూచించారు. ఆడపిల్ల విలువ కట్టలేనిదని వారి రక్షణ బాధ్యత మనదేనని అన్నారు. ఏఎన్ఎం, ఆశాలు గృహ సందర్శనాల ద్వారా ఆడపిల్లల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. నూతన వధూవరులకు, గర్భిణులకు, అత్త మామలకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శాంతిప్రభ మాట్లాడుతూ జిల్లాలో 73 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా 03 కేంద్రాలు గుర్తింపు కోసం, రెండు కేంద్రాలు రెన్యువల్ కోసం, ఒక కేంద్రం మోడిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. స్కానింగు కేంద్రాలను మూడు నెలలకు ఒకసారి తనిఖీలు చేస్తున్నామన్నారు. డెకాయ్ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోహన్రావు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ అనంతలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్వోలు బాలాజీ, కె.వి.జ్యోతి, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆడపిల్లల రక్షణ బాధ్యత మనదే డీఆర్వో సత్యనారాయణరావు -
నిశీధి వేళలో గ్రావెల్ మాఫియా అలజడి
● వెంకటాపురం కొండలోగ్రావెల్ తవ్వేందుకు యత్నం ● వాహనాలను అడ్డుకున్న స్థానికులు ● కూటమి నేతలు రంగంలోకి దిగినా తేలని పంచాయితీ ● తాత్కాలికంగా విరమించిన తవ్వకందారులు రాంబిల్లి(అచ్యుతాపురం): రాష్ట్రంలో అతి పొడవైన కొండల్లో ఒకటైన చోడపల్లి – కొత్తూరు కొండను మింగేసే ప్రయత్నమిది.. అంతా నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ ఉన్నపళంగా గ్రావెల్ మాఫియా వాలిపోయింది. అక్కడ చీకటిని చీల్చుకుంటూ వస్తున్న వెలుగుల్ని చూసి గ్రామస్తులు వెళ్లగా.. పది లారీలు, ఒక జేసీబీ కనిపించాయి. ఇక్కడ గ్రావెల్ తవ్వకాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటూ అడ్డుకున్నారు. స్థానిక కూటమి నేతలు రంగంలోకి దిగినా వారు వెనక్కి తగ్గకపోవడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురానికి ఆనుకొని కొండ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రావెల్కు ఉన్న డిమాండ్ వల్లే..? యలమంచిలి నియోజకవర్గంలో గ్రావెల్కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అటవీ శాఖ, పర్యావరణ నిబంధనల మేరకు నియోజకవర్గంలోని చాలా కొండల్లో ఎటువంటి మైనింగ్ తవ్వకాలకు అనుమతి లేదు. లే –అవుట్లకు, రహదారి విస్తరణ పనులకు, పరిశ్రమలకు, ఇతరత్రా అవసరాల కోసం గ్రావెల్ డిమాండ్ అధికంగా ఉంది. దీని దృష్ట్యా రాత్రి వేళల్లో గ్రావెల్ తవ్వి తస్కరించుకుపోతున్నారు. అది కూడా ఎటువంటి సీనరైజ్ చెల్లించకుండా, స్థానికుల్ని సంప్రదించకుండా తరలించడంతో నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాల వివాదం రాజుకూనే ఉంది. తాజాగా సోమవారం రాత్రి 10 లారీలు, ఒక పెద్ద జేసీబీ చేరుకుని గ్రావెల్ను తవ్వేందుకు సమాయత్తమయ్యారు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గ్రావెల్ వ్యవహారాలు చూసే స్థానిక కూటమి ప్రతినిధి బంధువు, ఎం.జగన్నాథపురానికి చెందిన నేత, అచ్యుతాపురానికి చెందిన నేత, రాంబిల్లికి చెందిన నేత రంగంలో దిగి స్థానికుల్ని అడ్డుకోవద్దని కోరారు. ఈ పంచాయితీ తేలకపోవడంతో తవ్వకాలను తాత్కాలికంగా ఆపేసినట్లు సమాచారం. రాత్రి వేళ జోరుగా తవ్వకాలు ప్రధానంగా రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో రాత్రిళ్లు గ్రావెల్ తవ్వకాల అలజడి రేగుతోంది. ఇటీవల కాలంలో ఎర్రవరం కొండల వద్ద, కొండకర్ల కొండల వద్ద, పాటిపల్లి కొండల వద్ద, పంచదార్ల కొండల వద్ద గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న ముఠా స్థానికుల అభ్యంతరాలు, ఫిర్యాదులతో తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా వెంకటాపురం కొండలపై దృష్టి సారించడంతో వివాదం మొదలైంది. స్థానికుల సహకారంతో సాధ్యమైనంత త్వరలోనే గ్రావెల్ తవ్వకాలు మొదలు పెట్టాలనే యోచనతో కూటమి పెద్దలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మైనింగ్ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
కుట్టు శిక్షణ పేరుతో కుంభకోణం
● బీసీ మహిళల సంక్షేమానికంటూరూ.257 కోట్లు స్వాహా చేసేందుకు కుట్ర ● కుట్టు మిషన్ విలువ మూడింతలు పెంచిన కూటమి నేతలు ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత అనకాపల్లి: బీసీ మహిళలకు టైలరింగ్ శిక్షణ పేరిట కూటమి ప్రభుత్వం రూ.257 కోట్ల అవినీతికి పాల్పడిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత విమర్శించారు. రూ.7,300లు విలువైన కుట్టు మిషన్కు రూ.23 వేలు ఖర్చు చూపించడం దారుణమని ఆమె అన్నారు. ఈ దోపిడీని ఆపాలని కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో వై.సత్యనారాయణరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం రింగ్రోడ్డులోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. లక్షమంది బీసీ మహిళలకు రూ.73 కోట్లు ఖర్చవుతుంటే, చంద్రబాబునాయుడు ప్రభుత్వం రూ.257 కోట్లు చూపించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మిగిలిన సొమ్మును పక్కదారి పట్టించారన్నారు. నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మహిళలకు అనేక సంక్షేమ పథకాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసి, అవకతవకలకు ఆస్కారం లేకుండా పాలన సాగిస్తే, నేటి కూటమి పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు. పెద్ద కంపెనీలకు టెండర్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఎల్2, ఎల్3 కంపెనీలకు టెండర్ కట్టబెట్టి కోట్లాది రూపాయలు దోచుకుంటోందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, మహిళలకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం నాయకులు నీటిపల్లి లక్ష్మి, నదియా, మరిపల్లి శోభ, ఎన్ఎస్.లక్ష్మి, ఎం. విజయలక్ష్మి, కశింకోట మండలపార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు తగరంపూడి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
దాహమో రామచంద్రా..
● అడుగడుగునా రాజకీయం.. దుర్భర ‘జల జీవనం’ ● కుళాయి కనెక్షన్ల ఏర్పాటులో రాజకీయ వివక్ష ● ప్రభుత్వం మారాక పలుచోట్ల పడకేసినపైపులైన్ పనులు ● కొన్నిచోట్ల పనులు పూర్తయినా డబ్బులిస్తేనే ఇంటికి కనెక్షన్లు ఊరూరాదాహం.. దాహం.. సాక్షి, అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నీటి కుళాయిల ఏర్పాటే లక్ష్యంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. కూటమి నేతలు తాగునీటిని కూడా రాజకీయం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పనులను రద్దు చేసి, కూటమి ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వాటికే మళ్లీ కొత్త అనుమతులు ఇస్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఇలా సుమారు 448 పనులను రద్దు చేశారు. కుళాయి కనెక్షన్ పూర్తయినా, సగం పనులు జరిగి ఆగిపోయినా అలాంటి వాటికి మామూళ్లు ఇస్తేనే కొనసాగిస్తున్నట్లు పలువురు బాధితులు వాపోతున్నారు. జల్ జీవన్ మిషన్ అమలుపై ‘సాక్షి జరిపిన గ్రౌండ్ రిపోర్ట్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. పాత పనులకు మంగళం గత ప్రభుత్వ హయాంలో మంజూరై ప్రారంభం కాని కనెక్షన్లలో దాదాపు సగానికి పైగా రద్దు చేశారు. కొత్తగా కొన్నింటిని చేర్చారు. వాటికి నిధులు ఇంకా మంజూరు కాలేదు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రతీ ఇంటికీ కుళాయి ఇవ్వాలనేదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. కానీ కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తే ఆ ఆశయం నెరవేరేలా లేదు. ఈ వేసవిలో కశింకోట, అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, యలమంచిలి, నక్కపల్లి మండలం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ● మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, కె.కోటపాడు మండలాల్లో 316 గ్రామాల్లో జల్జీవన్ మిషన్లో రూ.171 కోట్లతో 68,385 కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిలో 44,464 పూర్తయ్యాయి. ఆనందపురం నుంచి కె.కోటపాడు వెళ్లే మార్గంలో ఉన్న ఇళ్లకు మాత్రం నేటికి కుళాయిల ఏర్పాటు లేదు. అసలే వేసవికాలం కావడంతో చేతిబోర్ల వెంట నీరు అంతంత మాత్రంగానే వస్తుందని ఆయా ప్రాంతాల్లో గల మహిళలు తెలిపారు. ● అనకాపల్లి రూరల్ పరిధిలో 3 వేల కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిలో సగానికిపైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక కొన్ని పనులను రద్దు చేశారు. కొత్తగా మరికొన్ని మంజూరు చేసినా బిల్లు ఇప్పటి వరకూ రాలేదు. ● నర్సీపట్నం రూరల్, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం మండల పరిధిలో తాగునీటి సరఫరా అంతంత మాత్రంగా ఉంది. జల్జీవన్ మిషన్లో భాగంగా సుమారు 40 వేలకు పైగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిలో 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. కొన్ని పెండింగ్లో ఉన్నాయి. మరికొన్ని అసలు ప్రారంభం కాలేదు. ● యలమంచిలి నియోజకవర్గంలో సుమారు 20 వేలకు పైగా కుళాయి కనెక్షన్లు మంజూరయ్యాయి. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలు పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం కావడంతో 10 వేలకుపైగా కుళాయిలు మంజూరయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో సగానికిపైగా పూర్తయ్యాయి. కానీ పారిశ్రామిక ప్రాంతంలో గత ప్రభుత్వంలో మంజూరైన పనుల్లో కొన్ని రద్దు చేసి మరికొన్ని కొత్తగా చేర్చారు.వీటికి నిధులు మంజూరు కాలేదు. ఈ ప్రాంతమంతా కలుషితం కావడంతో ఈ ప్రాంతంలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. స్థానికంగా ఈ రెండు మండలాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా వెంటాడుతుంది. ● చోడవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రూ.137 కోట్లతో 69 వేల ఇళ్లకు ఇంటింటికీ కుళాయిలు మంజూరు చేశారు. వీటిలో సుమారు 10 వేల కనెక్షన్లు పెండింగ్లో ఉండిపోయాయి. చోడవరం టౌన్లో 5,941 ఇంటింటి కుళాయిలు ఇచ్చారు. కందర్పకాలనీ, అన్నవరం ప్రాంతాల్లో ఇంకా 400 ఇళ్లకు ఇంటింటి కుళాయిలు ఇవ్వాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ వాటిని ఏర్పాటు చేయలేదు. దీనితో ఆయా ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉంది. ఏదో అడపాదడపా వీధి కుళాయిల ద్వారా నీరు ఇస్తున్నప్పటికీ ఒక్కొక్క ఇంటికి రెండు బిందెలు నీరు కూడా రావడం లేదు. పూర్తయినవి–రద్దు చేసినవి జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలుకు కూటమి నేతల గ్రహణం -
40 కిలోల గంజాయి స్వాధీనం
● పట్టుబడిన నలుగురు నిందితులు ● వారిలో ఒక మహిళ కోటవురట్ల: ఉన్నతాధికారుల ఆదేశాలతో వాహన తనిఖీ నిర్వహించిన పోలీసులకు 40 కిలోల గంజాయి పట్టుబడింది. నక్కపల్లి సర్కిల్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలివి... మంగళవారం యండపల్లి వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారులో గంజాయిని తరలిస్తూ నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిలో ఓ యువతి కూడా ఉంది. గంజాయిని, కారును సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన షెహన్వాజ్, షహదాబ్, రుక్సానా కలిసి చింతపల్లి మండలం రేగళ్లు గ్రామానికి చెందిన రాజుబాబు సహకారంతో 40 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దాన్ని ఉత్తరప్రదేశ్కు తరలించేందుకు ప్రణాళిక చేశారు. ఇందులో భాగంగా కారులో చింతపల్లి నుంచి కోటవురట్ల మీదుగా అడ్డురోడ్డుకు వెళ్లి అక్కడి నుంచి తుని మీదుగా ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేశారు. అక్కడ గంజాయిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు ప్రణాళిక చేశారు. పోలీసుల తనిఖీలో గంజాయితోపాటు నలుగురూ పట్టుబడ్డారు. వీరిలో ఎ –1 ముద్దాయి షెహన్వాజ్ గతంలో నర్సీపట్నం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 74/21 కేసులో ఎ–3 ముద్దాయిగా ఉన్నట్టు సీఐ తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు
● ఎమ్మెల్యే, బత్తుల మధ్య వర్గపోరు ● రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల రాకతో డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే ● ఎమ్మెల్యే రాక కోసం ఎదురు చూసిన అధికారులు ● సమావేశం ఆలస్యంపై ఎంపీడీవోనునిలదీసిన సభ్యులు బుచ్చెయ్యపేట: చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మధ్యన వర్గ పోరు తార స్థాయికి చేరింది. నెల రోజుల కిందట ఎమ్మెల్యే రాజు బుచ్చెయ్యపేటలో మండల టీడీపీ కార్యకర్తల విస్త్రత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. స్ధానికంగా ఉన్న జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న తాతయ్యబాబుకు సమాచారం ఇవ్వకపోగా కటౌటులో తాతయ్యబాబు ఫొటో వేయలేదు. దీనిపై తాతయ్యబాబుతో పాటు అతని వర్గీయులు మేడివాడ రమణ, తలారి శంకర్,సయ్యపురెడ్డి మాధవరావు ఎమ్మెల్యేపై ఆగ్రహం చెందారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగే సర్వసభ్య సమావేశానికి వస్తున్నానని ఎమ్మెల్యే రాజు ముందుగానే అధికారులకు, నాయకులకు సమాచారం అందించారు. అప్పటికే రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మండల సమావేశానికి విచ్చేశారు. ఎమ్మెల్యే రాజు అనుచరులు తాతయ్యబాబు మండల సమావేశానికి వచ్చినట్టు సమాచారం అందించారు. పదిన్నరకు ప్రారంభం కావాల్సిన మండల సమావేశం మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా ఎమ్మెల్యే రాకపోవడంతో సభ ప్రారంభం కాలేదు. దీంతో పలు గ్రామాల నుంచి వచ్చిన సభ్యులు అసలు సమావేశం ఉందా లేదా అంటూ ఎంపీడీవో విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఎంపీడీవో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు గౌరవ అధ్యక్షుడిగా మండల సమావేశాన్ని నడిపించారు. టీడీపీలో గ్రూపు రాజకీయాల వల్ల ఎవరి వైపు వెళ్లాలో తెలియడం లేదంటూ సమావేశానికి వచ్చిన సర్పంచ్లు, ఎంపీటీసీలు గుసగుసలాడుకున్నారు. -
నక్కపల్లిలో ఆస్ట్రోటర్ఫ్ హాకీ కోర్టు
● వైఎస్సార్సీపీ హయాంలోనే రూ.1.60 కోట్లతో నిర్మాణం ● ప్రారంభించిన హోంమంత్రి అనిత ● నక్కపల్లికి అంతర్జాతీయ గుర్తింపునకు కృషి నక్కపల్లి: బీఎస్ హాకీ క్లబ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గత వైఎస్సార్సీపీ హయాంలో మంజూరైన రూ.1.60 కోట్లతో నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన ఆస్ట్రోటర్ఫ్ మినీ హాకీ కోర్టును మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి కోర్టు మన జిల్లాలో నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సూరిబాబు అనే ఉద్యోగి నక్కపల్లిలో హాకీ క్లబ్ను ఏర్పాటు చేసి వందలాది మందికి శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తర్ఫీదు నివ్వడం, ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు ఉద్యోగాల్లోను, స్పోర్ట్స్ స్కూళ్లలోనూ ప్రవేశాలు పొందారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్, కోచ్ రాంబాబు, ఏరియా ఆస్పత్రికి అభివృద్ధి కమిటీ సభ్యుడు కే వెంకటేష్, సర్పంచ్ రత్నకుమారి, బీఎస్ హాకీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, తాతాజీ, నాయకులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలతో ఆగిన ప్రారంభోత్సవం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇక్కడ హాకీ క్రీడా మైదానాన్ని సందర్శించిన అప్పటి కలెక్టర్ రవి పట్టన్శెట్టికి క్రీడాకారులు తమ సమస్యలను విన్నవించారు. ప్రాక్టీసు కోసం పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఆధునిక సదుపాయాలతో కూడిన కోర్టు నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సైతం ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, స్పోర్ట్స్ సెస్ నిధులు నుంచి ఆస్ట్రోటర్ఫ్ కోర్టుకు రూ.1.60 కోట్లు మంజూరు చేశారు. కోర్టు నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు శంకుస్థాపన చేశారు. కోర్టు నిర్మాణం పూర్తయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో దీన్ని ప్రారంభించలేదు. ఇంతలో ఎన్నికల రావడం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక నాయకులు, హాకీ క్లబ్ నిర్వాహకులు కోర్టుకు విద్యుత్ సరఫరా విషయాన్ని హోం మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కల్టెక్టర్తో మాట్లాడి సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.4.50 లక్షలు విద్యుత్ సరఫరా కోసం మంజూరు చేయించారు. దీంతో కోర్టు సమీపంలో ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్, హెచ్టీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి విద్యుత్ సదుపాయం కల్పించారు. తాజాగా ఆమె దీన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో నాలుగో ఆస్ట్రోటర్ఫ్ కోర్టు నక్కపల్లిలోనే.. ఇటువంటి ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు రాష్ట్రంలో నాలుగు చోట్ల మాత్రమే నిర్మించారు. ఇప్పటి వరకు కడప, పులివెందుల, కాకినాడలలో ఉన్నాయి. తాజాగా నక్కపల్లిలో నిర్మించారు. ఇటువంటి కోర్టులు అనుభవం ఉన్న ఫీల్డ్ హాకీ క్రీడాకారులకు మరిన్ని మెలకువలు నేర్పించడం కోసం ఉపయోగిస్తారు. కోర్టు నిర్మాణం ఇలా.. ఈ కోర్టును నాలుగు రకాల ముడిసరుకును ఉపయోగించి నిర్మిస్తారు. మొదటగా గ్రావెల్ వేసి ఆపైన మెటల్ గ్రౌండ్ వేస్తారు. చదునుగా చేసిన తర్వాత ఖరీదైన మొత్తటి రబ్బర్ పౌడర్ మిశ్రమంతో కలిపి తారురోడ్డు మాదిరిగా గ్రౌండ్ తయారు చేస్తారు. తుది దశకు చేరకున్న తర్వాత కృత్తిమ గడ్డితో తయారు చేయబడిన టర్ఫ్ అనే షీటును పరిచి పై పొర మీద సన్నటి ప్లాస్టిక్ వైరు ఒక పొరగా అమర్చి దీనిపై ఒక అంగుళం రబ్బరు షీటుతో పైభాగాన్నా క్రీడాకారులు ఆడేందుకు అనువుగా ఉండేలా తయారు చేస్తారు. ఇటువంటి కోర్టు ఉమ్మడి విశాఖ జిల్లాలో నక్కపల్లిలో మాత్రమే ఉంది. ఈ టర్ఫ్ కోర్టు కింద భాగంలో వాటర్ను స్ప్రే చేసేందుకు 5 హెచ్పీ మోటార్లను అమర్చారు. వాటర్ స్ప్రే చేస్తూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్టులో త్వరగా ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. ఫీల్డర్స్ వేగంగా పరిగెత్తడానికి, బంతిని నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటగాళ్లను నియంత్రించడానికి కూడా ఎక్కువ సహకరిస్తుంది. ఇటువంటి ఆస్ట్రోటర్ఫ్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేయడం వల్ల హాకీలో క్రీడాకారులు బాగా రాణిస్తారని బీఎస్ హాకీ క్లబ్ అధ్యక్షుడు బలిరెడ్డి సూరిబాబు తెలిపారు. -
సతకంపట్టు కనకదుర్గమ్మ సన్నిధిలో సినీనటి ఇంద్రజ
అనకాపల్లి: స్థానిక గవరపాలెం సతకంపట్టు కనకదుర్గ అమ్మవారిని సినీ నటి ఇంద్రజ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు పట్టణానికి వచ్చిన ఆమె కనకదుర్గమ్మను దర్శించి పూజలు చేశారు. ఇంద్రజకు ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆలయ వ్యవస్థాపకుడు పి.వి.రమణ, ఆలయ శాశ్వత చైర్మన్, నిర్వాహకుడు కాండ్రేగుల నాయుడు దంపతులు, ఆలయ అధ్యక్షుడు భీమరశెట్టి వర నూకరాజు, గౌరీ పరమేశ్వరుల ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావునాయుడు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎకరా స్థలం లీజు ఏడాదికి వెయ్యి రూపాయలేనట
● టీడీపీ కార్యాలయం పట్ల కలెక్టర్ ఔదార్యం ● నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయింపుపై సీపీఎం ధ్వజం అనకాపల్లి టౌన్: పేదల స్థలాలను కాపాడాల్సిన జిల్లా కలెక్టరే రాజకీయ పార్టీలకు వత్తాసు పలకడం ఏమిటని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం ప్రశ్నించారు. కొత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ప్రయోజనాలకు, సంక్షేమానికి కృషి చేయాల్సిన జిల్లా అధికారి టీడీపీకి స్వామి భక్తి చాటుకోవడం సిగ్గు చేటని అన్నారు. జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయానికి విలువైన కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ఎకరా ఏడాదికి వెయ్యి రూపాయలకే లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. కోర్టుకు స్థలం లేదు కానీ అధికార పార్టీకి కేటాయింపా? జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి వివిధ న్యాయస్ధానాలు ఓ ప్రెవేట్ భవనంలో నడుస్తున్నా, పట్టించుకోని కూటమి పాలకులు తెలుగుదేశం పార్టీకి మాత్రం రెండెకరాల భూమి కేటాయించుకోవడం తగదని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.ఎస్.అజయ్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత కళాశాల కోసం కట్టిన ప్రైవేట్ భవనాన్ని న్యాయస్థానాలకు అద్దెకు ఇచ్చారని, ఆ ఇరుకు గదుల్లోనే కోర్టులను నిర్వహిస్తున్నారన్నారు. స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్కు అనేకసార్లు లేఖలు రాసి, వినతిపత్రాలను ఇచ్చామని, స్థలాలు దొరకడం లేదని చెపుతూ వచ్చిన అధికారులు తెలుగుదేశం పార్టీ అడిగిన వెంటనే మంత్రివర్గంతో సంబంధం లేకుండా రూ. రెండు కోట్ల నుంచి మూడు కోట్ల విలువైన రెండు ఎకరాల స్థలాన్ని ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల అద్దెతో 33 సంవత్సరాలకు భూమిని అప్పగించారన్నారు. -
నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.34.80 లక్షలు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి హుండీల లెక్కింపు సోమవారం జరిగింది. ఏప్రిల్ 16 నుంచి మే 5వ తేదీ వరకు రూ.34,80,099 నగదు, 27,500 మిల్లీగ్రాముల బంగారం, 601 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ హుండీ పర్యవేక్షకుడు టి.సాంబశివరావు చెప్పారు. హుండీ ఆదాయాన్ని గవరపాలెం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేశామన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు), ఈవో వెంపలి రాంబాబు, కమిటీ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కుటిల సర్కారు గద్దె దిగే రోజు వస్తుంది..
మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. అమర్నాథ్ ప్రమాణ స్వీకారంతో తండ్రి తన చేతుల మీదుగా కుమారుడికి బాధ్యతలు అప్పగిస్తున్నంత ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని, త్వరలో రోడ్డెక్కి మరీ ఈ కుటిల సర్కారును గద్దె దించే రోజు వస్తుందన్నారు. కూటమి నాయకులు ఎన్నో దాడులు చేస్తున్నా.. పార్టీ శ్రేణులు ఎదురొడ్డి నిలుస్తున్నారన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. మీ అందరి ఉత్సాహం చూస్తే రానున్న స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేఎందుకు సిద్ధంగా ఉన్న సైనికుల్లా కనిపిస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల ఆంధ్ర ప్రదేశ్గా మారిందని, అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు శోభా హైమావతి మాట్లాడుతూ.. గతంలో జగనన్న పాలనలో ప్రతి పండగకు ఒక సంక్షేమ పథకం అందుకుని ప్రజలు నిజంగా పండగ చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, కన్నబాబు రాజు, కంబాల జోగులు, మలసాల భరత్కుమార్, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడారు. అరకు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్, సూర్యనారాయణరాజు, ముఖ్యనేతలు చింతకాయల సన్యాసిపాత్రుడు, ఈర్లె అనురాధ, చింతలపూడి వెంకట్రామయ్య, దంతులూరి దిలీప్ కుమార్, చిక్కాల రామారావు, రుత్తల ఎర్రాపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు ఫుల్...పరిష్కారం నిల్...
● కలెక్టరేట్ చుట్టూ అర్జీదారుల ప్రదక్షిణలు ● ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయని మండల స్థాయి అధికారులు ● ముప్పుతిప్పలు పెడుతున్నక్షేత్రస్థాయి సిబ్బంది ● వాపోతున్న అర్జీదారులు తుమ్మపాల : కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్లో పలువురి సమస్యలు విని తక్షణమే పరిష్కరించాలని చేస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలన ఆయా మండలాల అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్కే ఫిర్యాదు చేస్తారా... కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరిస్తారా ? అంటూ అర్జీదారుల పట్ల అధికారులు దురుసుగా మాట్లాడుతూ మరిన్ని కొర్రెలు పెడుతున్నారు. దీంతో అర్జీదారులు బెంబేలెత్తి మళ్లీ మళ్లీ కలెక్టరేట్కే పరుగులు తీస్తున్నారు. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో కూడా అలాంటి అర్జీలు అనేకం వచ్చాయి. కలెక్టరేట్ లోపలికి వెళ్లి తమ సమస్యను కలెక్టర్కు తెలిపే సౌకర్యం లేక దివ్యాంగులు షరామామూలుగానే అర్జీలతో కలెక్టరేట్ డోర్ వద్దనే వేచియుండి వచ్చిన అధికారికి అర్జీలు సమర్పించారు. సమస్యలపై కలెక్టర్కు తెలిపేందుకు వచ్చిన పలు సంఘాలవారిలో ఒక్కరికే లోనికి అనుమతించారు. మొత్తం 278 అర్జీలు వచ్చాయి.. కరెంటు, గుక్కెడు నీళ్లు ఇవ్వలేరా... స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచిన చీకటీలోనే జీవిస్తూ బతుకులు సాగిస్తున్నామని విద్యుత్ సౌకర్యం కల్పించి తమకు వెలుగులు ఇవ్వాలని కోరుతూ దేవరాపల్లి మండలం చింతలపూడి శివారు పీవీటీజీ కొక్కుల బంద, జారురాయి కొత్తవలస గ్రామాల గిరిజనులు కలెక్టరేట్ వద్ద అడ్డాకులు నెత్తిన పెట్టుకుని తమ నిరసన తెలిపారు. కరెంటు సౌకర్యం కల్పించాలంటూ అనేక మార్లు విద్యుత్ శాఖ అధికారులకు కాగితాలు పెట్టినా ఎటువంటి ప్రయోజనం లేదని, మంచినీటి సౌకర్యం లేక కలుషిత నీరే తాగుతున్నామని అన్నారు. కలెక్టరమ్మ స్పందించి తమ గ్రామాలకు కరెంటు, మంచినీరు అందించేలా చొరవ చూపాలంటూ పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. విలేకరి డబ్బు కాజేశాడు... వ్యవసాయ భూమిని ఆన్లైన్ చేస్తానని రూ.1.85 లక్షలు తీసుకుని మోసం చేసిన ఓ ప్రైవేటు సంస్థ విలేకరి పి.శ్రీమాన్ అనే వ్యక్తి నుంచి నగదు ఇప్పించాలని కోరుతూ యలమంచిలి కొత్తపేట వీధికి చెందిన శెలంశెట్టి కనకఅప్పలరాజు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. యలమంచిలిలో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆన్లైన్ చేయిస్తానని, బదులుగా తన వద్ద నుంచి నగదు తీసుకుని ఆన్లైన్ చేయించకుండా నాలుగేళ్లుగా తిప్పించుకుంటున్నాడని తెలిపారు. ఆన్లైన్ చేయకపోవడంతో నగదు ఇవ్వమని కోరగా నగదు ఇవ్వకుండా తిరిగి తనను భయపెట్టి, హింసిస్తున్నావంటూ పోలీసు కేసు పెట్టించి జైల్లో పెట్టిస్తానంటూ బెదిరిస్తున్నాడని, అతని నుంచి నగదు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. న్యాయం చేయమంటే పోలీసులతో బెదిరిస్తున్నారు... వందేళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి తమపై దాడులు చేస్తూ కొందరు నాయకులు ఉపాధి హామీ కూలీలతో చెరువును తవ్విస్తున్నారని, తమ భూమిని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ గొలుగొండ మండలం రాజుపేట గ్రామానికి చెందిన రైతులు చిపురుబిల్లి కన్నయ్య, కన్నూరు సత్యనారాయణ తమ వద్ద గల భూమి పత్రాలు, ఆధారాలతో కలెక్టర్ను కలిసి ప్రాధేయపడ్డారు. రాజుపేట గ్రామంలో సర్వే నెం.15–1బిలో 3 ఎకరాల ఇనాం భూమి తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చి సాగు చేసుకుంటున్నామని, కూటమి ప్రభుత్వంలో కొందరు నాయకులు రాజకీయ కారణాలతో తమపై కక్ష కట్టి మా ఇరువురికి చెందిన 3 ఎకరాల భూమి చెరువంటూ తమకు చెందకుండా చేస్తున్నారని, అధికార బలంతో పోలీసుల అండతో మా భూముల్లో ఉపాధి పనులు చేస్తూ చెరువు గట్టు వేస్తున్నారన్నారు. ఆక్రమణను అడ్డుకున్న తమపై పోలీసు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. అకారణంగా తమను స్టేషన్కు పిలిచి ఫోన్ లాక్కుని ఒక రోజంతా స్టేషన్లోనే ఉంచారని, పోలీసులు తాము లేని సమయంలో ఇంటికొచ్చి ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. సదరు ఈనాం భూమిపై ఈనాంకు చెందిన పంతులు గారికి తమకు మధ్య కొన్నేళ్లుగా కోర్టు కేసు కూడా నడుస్తుందంటూ వారి వద్ద ఉన్న పత్రాలతో కలెక్టర్కు వినతి అందించారు. గత వారం నర్సీపట్టణంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ అసహనానికి గురై తమపై దురుసుగా మాట్లాడుతున్నారని, సమగ్ర విచారణ చేసి రైతులుగా తమకు న్యాయం చేయమన్న కలెక్టర్ ఆదేశాలను సైతం పక్కనపెట్టి అదే రోజు తమపై పోలీసు కేసు పెట్టి తీవ్రంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘సీహెచ్వోల సమస్యలు పరిష్కరించాలి’
అనకాపల్లి టౌన్: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సిహెచ్ఓ)ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ వి.వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్ణణంలోని నెహ్రుచౌక్ స్టేట్బ్యాంక్ కార్యాలయం ఎదుట 8వ రోజు సమ్మెలో భాగంగా సిహెచ్ఓలు మెకాళ్లపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో పలువురు సీహెచ్ఓలు పాల్గొన్నారు. -
బొలేరో, ఆటో ఢీ..ఐదుగురికి గాయాలు
● గన్నవరం మెట్ట వద్ద ప్రమాదం ● తీవ్రంగా గాయపడిన ముగ్గురు వైజాగ్ తరలింపు నాతవరం: నర్సీపట్నం తుని మధ్య గన్నవరం మెట్ట వద్ద బొలోరో, ఆటో ఢీకొన్న సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎస్ఐ సిహెచ్.భీమరాజు అందించిన వివరాలివి. నాతవరం మండలం ఎంబీపట్నం గ్రామానికి చెందిన వారు కాకినాడ జిల్లాలో వివాహం సంబంధించి పెద్దలు భోజనానికి ఆటోపై వెళ్లారు. అక్కడ భోజనాలు అనంతరం తిరిగి ఆటోపై ఇంటికి వస్తుండగా నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్దకు వచ్చేసరికి నర్సీపట్నం నుంచి తుని వైపు వళ్తున్న బొలేరో వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎంబీపట్నం గ్రామానికి చెందిన సలగాల సంతోష్, ఆడ్డాల కృపానందం, పెద్దాడ మరిడియ్య, కోరుబిల్లి దుర్గ, కె.చినరాజుబాబు గాయపడ్డారు. వీరిని వెంటనే వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో సలగాన వసంతకు కుడి కాలికి, కృపానందం ముఖంపైనా, మరిడియ్యకు ఎడమ చేతికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. నాతవరం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి నర్సీపట్నం తుని అర్అండ్బీ రోడ్డుౖపై ట్రాఫిక్ను చక్కదిద్దారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ భీమరాజు తెలిపారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు
యలమంచిలి రూరల్: ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా యలమంచిలి పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయనున్నట్టు తెలియజేస్తూ మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజుకు మున్సిపల్ కార్మికులు సమ్మె నోటీసు సోమవారం అందజేశారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల్లో పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం నెలకు రూ.26వేలు చేయాలని,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలన్న పలు డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నట్టు నోటీసులో పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు గనిశెట్టి ఏసుదాసు,మున్సిపల్ వర్కర్ల సంఘం నాయకులు వై.నూకరాజు, సీహెచ్.వెంకటరమణ, సూరిబాబు పాల్గొన్నారు. -
పరిహారం కూడా దేవస్థానం సొమ్మే..!
● సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం, ఒకరికి గాయాలు ● మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు వంతున ప్రకటించిన ప్రభుత్వం ● ఇప్పుడు దేవస్థానం ఖజానా నుంచే బాధితులకు చెల్లింపులు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం మరోసారి తన బుద్ధి చూపించుకుంది. సింహాచలంలో జరిగిన విషాదానికి గల పరిహారాన్ని దేవస్థానంపై రుద్దేసింది. కొండపై గోడ కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు దేవస్థానం ఖజానా నుంచే రూ.1.78 కోట్లు చెల్లింపులు చేసింది. చందనోత్సవం రోజున సింహాచలం కొండపై గోడ కూలి ఏడుగురు భక్తులు సజీవ సమాధి కాగా, ఒకరికి గాయపడిన విషయం తెలిసిందే. ఈ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రుడికి రూ.3 లక్షలు పరిహారంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హోం మంత్రి అనిత, ఇతర మంత్రులు కూడా హామీలు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు దేవాలయం నిధులు కేటాయించడం పట్ల ఆలయ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవస్థానం ఖజానా నుంచే చెల్లింపులు చందనోత్సవం నిర్వహణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వామపక్ష, ఇతర ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యో గం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పరిహారాన్ని వెంటనే బాధిత కుటుంబాల కు అందించాలని సింహాచలం దేవస్థానం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా దేవస్థానం నిధుల నుంచే బాధితులకు చెల్లింపులు చేయాలని తేల్చి చెప్పింది. దీంతో దేవస్థానం అధికారులు ఆగమేఘాల మీద బాధితుల కు చెక్కులు పంపిణీ చేసినట్లు సమాచారం. మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున రూ.1.75 కోట్లు, క్షతగాత్రుడికి రూ.3 లక్షలు చెల్లించారు. దేవాలయం అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులు వాస్తవానికి ఘటన జరిగిన రోజున మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రభుత్వమే నేరుగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ఖజానా నుంచి పరిహారం అందిస్తుందని అందరూ భావించారు. అయితే దేవాలయం అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధుల నుంచి పరిహారం కింద బాధిత కుటుంబాలకు అందజేసింది. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండేందుకు భక్తులు దేవాలయానికి సమర్పించిన కానుకల నుంచి ఇవ్వడాన్ని ఆలయ వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. దేవాలయం అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు ఇలా పరిహారాల రూపంలో ఇచ్చుకుంటూ పోతే ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై విమర్శలు సింహాచలం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, పరిహారం చెల్లింపులపై వామపక్షాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి అసమర్థ పాలన కారణంగా జరిగిన ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు దేవస్థానం ఖజానా నుంచే పరిహారం అందించి ప్రభుత్వం తప్పించుకోడాన్ని తప్పుబడుతున్నాయి. ఇవి ప్రభుత్వ హత్యలే అని, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చందనోత్సవ నిర్వహణపై ఐదుగురు మంత్రుల కమిటీ నెల రోజుల పాటు విశాఖలోనే తిష్ట వేసి ఏర్పాట్లు చేసిన వేడుకల్లో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి మంత్రులను కూడా బాధ్యులను చేయాలని పట్టుబడుతున్నారు. దేవదాయ శాఖ నుంచి వచ్చాయి దేవదాయ శాఖ నుంచి పరిహారం కింద నిధులు కలెక్టర్ నిధికి వచ్చాయి. వాటిని మాత్రమే బాధిత కుటుంబాలకు చెల్లించాం. – ఎం.ఎన్.హరేందిరప్రసాద్, జిల్లా కలెక్టర్ -
లేటరైట్ తవ్వకాలు నిలిపివేయాలి
● గిరిజనుల హక్కులకు విఘాతం ● స్పీకర్ కల్పించుకోవాలి ● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం డిమాండ్ నాతవరం: అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలో జరుగుతున్న అక్రమ లేటరైట్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. అసనగిరి పంచాయతీ శివారు బమ్మిడికలొద్దు ప్రాంతంలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలను సోమవారం సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న లేటరైట్ తవ్వకాలను యుద్ధప్రాతిపదికన నిలుపుదల చేయకపోతే ఉద్యమిస్తామన్నారు. ఈ ప్రాంతం 1/70 యాక్టు పరిధిలో ఉందని, లేటరైట్ తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులను ఉల్లంఘించి చేస్తున్న ఈ తవ్వకాల కారణంగా అడవి బిడ్డల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. గతంలో లేటరైట్ తవ్వకాలను వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు ప్రోత్సహించడం సిగ్గు చేటన్నారు. ఇదే కొనసాగితే ఈ ప్రాంత గిరిజనులు జీవనం సాగిస్తున్న అటవీ సంపదతో పాటు జీడిమామిడి తోటలు నాశనం అవుతాయన్నారు. లేటరైట్ తవ్వకాలు ఆపకుంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రాంత గిరిజనులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యుడు అడిగర్ల రాజు, పార్టీ సీనియర్ నాయకుడు త్రిమూర్తులురెడ్డి, రాజవొమ్మంగి మండల పార్టీ కార్యదర్శి సూరిబాబు, ప్రజా నాణ్యమండలి నాయకుడు రమేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
నక్కపల్లి: ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీటీఎఫ్ ఉపాద్యాయ సంఘ ఆధ్వర్యంలో యలమంచిలి తాలూకా సంఘ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. యలమంచిలి, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు చెందిన ఉపాధ్యాయులతో ఏపీటీఎఫ్ యూనియన్ నక్కపల్లి శాఖ అధ్యక్షుడు వై.కృష్ణ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. సంఘ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటపతిరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం తగదన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలన్నారు. 12వ పీఆర్సీని తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగించాలని కోరారు. డీఎస్సీ నియామకం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నిరసన తెలియజేస్తున్నామన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక రోజు ధర్నా చేసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ ఆందోళనలో ఏపీటీఎఫ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కె.కె.ధర్మారావు, రాష్ట్ర కౌన్సిలర్లు డి. కొండలరావు, పి.గణేష్, కె.శ్రీనివాసరావు, ఐదు మండలాల సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే రామ్రహీమ్, పి.శ్రీనివాసరావు, కృష్ణ, అప్పలరాజు, సునీల్, కె.శ్రీనివాసరావు, బి.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ, కిరణ్, అప్పాజీ, బి.శ్రీనివాసరావు, ఎస్.ఫాల్గుణరావు, కిల్లాడ శ్రీనివాసరావు, పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాగజ్యోతి ప్రతిభ
రావికమతం: కొత్తకోటకు చెందిన ఉపాధ్యాయిని పి.ఎం.ఎన్.నాగజ్యోతి పాన్ ఇండియా మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి నాలుగు విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో 4వ నేషనల్ పాన్ ఇండియా మాస్టర్స్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్ –2025 పోటీలు ఈ నెల 3,4 తేదీలలో జరిగాయి. నాగజ్యోతి మహిళల విభాగంలో బెంచ్సై, స్క్వాట్, డెడ్ లిఫ్ట్ విభాగాలు మూడింట్లోనూ, ఓవరాల్ ఛాంపియన్ షిప్లోను కలిపి నాలుగు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. ఛాంపియన్షిప్ నిర్వాహక కమిటీ ప్రెసిడెంట్ దీపుదేవ్, మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ వి.ఎన్.షాజీ చేతుల మీదుగా నాగజ్యోతి అందుకున్నారు. కొత్తకోట గ్రామానికి చెందిన నాగజ్యోతి ప్రస్తుతం రోలుగుంట హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు బంగారు పతకాలు సాధించిన నాగజ్యోతి ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వాసవీ వనితా క్లబ్ సంఘం మహిళలు, గ్రామస్తులు అభినందించారు. -
ఇక సమరమే..
● హనీమూన్ సమయం ముగిసింది ● ప్రజల పక్షాన పోరాటం చేద్దాం ● రూ.వెయ్యి పింఛను పెంపు మినహా సంక్షేమం శూన్యం ● కూటమి నేతల అభివృద్ధికే లక్షల కోట్ల అప్పులు ● చంద్రబాబు ఓ మాయల మరాఠీ ● వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో శాసనమండలి విపక్ష నేత బొత్స ● పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమర్నాథ్ వాగ్దానాలు విస్మరించిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని వర్గాలకూ కష్టాలే.. హామీలన్నీ అటకెక్కాయి.. ప్రజల కష్టాలు తారస్థాయికి చేరాయి.. మాట నిలుపుకుంటారో లేదోనని ఏడాదిపాటు వేచి చూశాం.. హనీమూన్ సమయం ముగిసింది.. ఇక జనం గొంతుకై వారి పక్షాన పోరాటమే మన కర్తవ్యం.. అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్పిలుపునిచ్చారు. సాక్షి, అనకాపల్లి: పార్టీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రమాణ స్వీకారం సోమవారం అనకాపల్లిలో అట్టహాసంగా జరిగింది. రింగ్ రోడ్డులో గల పెంటకోట కన్వెన్షన్ హాల్లో పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన జరిగిన వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో అమర్నాథ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. వాటిని పార్టీ కార్యకర్తలు చప్పట్లతో ఆమోదించారు. సమావేశానికి ముందు పార్టీ నేతలందరూ వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. సమావేశానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మాయల మాంత్రికుడు.. తన అనుకూల మీడియా ద్వారా లేనిది ఉన్నట్టు చూపించి ఊహల్లో విహరించేలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తాడు.. మనమంతా అప్రమత్తంగా ఉండాలి.. ప్రజా సమస్యలను, కూటమి నేతల అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలి’ అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల హామీల అమలుకు ప్రజల తరపున పోరాటం చేసే సమయం ఆసన్నమైందన్నారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించి.. వాటి పరిష్కారానికి పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, చివరికి ఉపాధి హామీ కూలీల వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. వెయ్యి రూపాయల పెంచను పెంపు తప్ప కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిందేమీ లేదన్నారు. రూ.లక్షా 70 వేల కోట్లు అప్పు చేసి.. కూటమి నేతలు దోచుకుని తింటున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టండి.. ఆ ప్రాంతంలోని సమస్యలపై చర్చిద్దాం.. పోరాడదాం.. అన్నారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానాలు ఇవే.. మే నెలాఖరులోగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల అధ్యక్షులు, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి. జూలై 31వ తేదీలోగా గ్రామ కమిటీలు, బూత్ కమిటీలను నియమించాలి. ఆరు నెలలకొకసారి జిల్లా పార్టీ విస్తత స్థాయి సమావేశం నిర్వహించుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుందాం. ప్రతి నెలా ఒక మండలంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. -
వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు
● నియోజకవర్గాలలో జరిగే పనులు ఎమ్మెల్యేలకు తెలియాలి ● డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తుమ్మపాల: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమీక్ష మండలి (డీఆర్సీ) సమావేశానికి ఆయనతోపాటు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గాలలో జరిగే పనుల గురించి ఎమ్మెల్యేలకు తెలియజేయాలని, వారి సలహాలు, సూచనలు అమలుచేయాలన్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన రంగాలలో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పంచాయతీలకు సరఫరా చేసే బ్లీచింగ్లో కాంట్రాక్టర్ రెట్టింపు బిల్లు వసూలు చేస్తున్నాడని, తక్షణమే ఆ కాంట్రాక్టర్ను తొలగించాలని కలెక్టర్కు సూచించారు. మంచినీటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేయడానికి వీలుగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని తెలిపారు. వెహికల్ ఫిట్నెస్ సెంటర్ నర్సీపట్నంలో కూడా ఏర్పాటు చేయాలన్నారు. గోవాడ సుగర్స్ రైతులకు బకాయి చెల్లించాలి:బొత్స శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గోవాడ చక్కెర కర్మాగారం రైతులకు వెంటనే బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు, కార్మికులకు కలిపి సుమారు రూ.40 కోట్ల బకాయిలు ఉన్నాయని, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ శ్రామికులకు మార్చి 31 నుంచి వేతనాల బకాయిలు చెల్లించాలన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో ప్రసూతి వార్డులో ప్రసవానికి రూ.3 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల ఒక మహిళ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహిస్తున్న సమయంలో బంగారు చెవి దుద్దులు దొంగతనం జరిగిందని, పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ స్థానిక యువతకు పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పించడానికి వారికి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, ఎమ్మెల్యేలు సుందరపు విజయకుమార్, విశాఖ మేయర్ శ్రీనివాసరావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
హేచరీ బస్సు, ఆటో ఢీ
కోటవురట్ల: కోటవురట్ల నుంచి ఎస్.రాయవరం మండలం ధర్మవరం వెళుతున్న హెచరీకి సంబంధించిన బస్సును, అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల వస్తున్న ఆటో ఢీకొనడంతో 10 మంది గాయపడ్డారు. మండలంలోని పాత రోడ్డు జంక్షన్ దాటాక జరిగిన ఘటనలో క్షతగాత్రులను స్థానిక సీహెచ్సీకి తరలించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పి.లక్ష్మి అనే మహిళ ను మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. నర్సీపట్నంలో ఎన్.నూకరత్నం, జి.నాగపద్మ చికిత్స పొందుతుండగా కోటవురట్ల సీహెచ్సీలో కె.నాగ తేజ, డి.సోమన్న, కె.వెంకటలక్ష్మి, జి.అమ్మాణి, పి.రాజులమ్మ, ఆర్.శాంతి, వై.శ్రీనులకు ప్రఽథమ చికిత్స అందించారని ఎస్ఐ రమేష్ తెలిపారు. 10 మందికి గాయాలు -
జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యం
వైఎస్సార్సీపీ జిల్లా నూతన అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పార్టీ అధినేత తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఈ సమావేశానికి హాజరైన పార్టీ కేడర్ జోష్ చూస్తుంటే తనలో ఉత్సాహం రెట్టింపయిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు సీఎం కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఏడాదికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది.. ఇప్పుడు మన బాధ్యత మరింత పెరిగిందన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ దొర్లకుండా చూసుకుంటామని, కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. గత ఐదేళ్లలో మనం సృష్టించిన వలంటీర్ల వ్యవస్థ ప్రజలకు మేలు చేసింది కానీ వారికి పార్టీని దూరం చేసిందన్నారు. జగనన్న 2.0లో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని, ఈసారి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మాటగా మీకు చెప్పమన్నారన్నారు. సింహాచలం దుర్ఘటనలో ఏడుగురు చనిపోవడానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఇంటర్నేషనల్ మేస్త్రినంటావు కదా చంద్రబాబూ.. సింహాచలంలో ఏడడుగుల గోడనే నిర్మించలేకపోయావు.. అమరావతిని ఏమి నిర్మిస్తావు అంటూ ఎద్దేవా చేశారు. -
మంత్రుల కమిటీ సంగతేంటి?
● సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో బాధ్యులపై చర్యలు ● ఆలయ ఇన్చార్జి ఈవోతో సహా ఆరుగురు అధికారుల సస్పెన్షన్ ● కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలకు ఆదేశం ● మంత్రుల కమిటీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా చర్యల్లేవు.. ● నిజాలను గోడ వెనకే సమాధి చేసేసిన త్రిసభ్య కమిషన్ మంత్రుల కమిటీ సమయంలోనే గోడ నిర్మాణం..! కాంట్రాక్టరు చెప్పినదాని ప్రకారం చందనోత్సవానికి ఆరు రోజుల ముందే గోడ నిర్మాణం పూర్తయింది. ఏప్రిల్ 16న నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే రోజున మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడం.. దేవస్థానం అధికారులతో కొండపైనే సమావేశమై సమీక్ష నిర్వహించడం జరిగింది. అంటే గోడ నిర్మాణం గురించి మంత్రుల కమిటీ సమీక్షలో ప్రస్తావన వచ్చే ఉంటుంది. కానీ.. దాన్ని బయటికి రానివ్వకుండా అటు త్రిసభ్య కమిషన్.. ఇటు ప్రభుత్వం కప్పిపుచ్చింది. ఈ గోడ నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా కమిటీ ఏర్పాట్లు పరిశీలనకు పలుమార్లు కొండపై హడావుడి చేసింది. కానీ గోడ నిర్మాణం ఎలా జరుగుతోంది.? నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారా లేదా అనేది పరిశీలించలేదు. ఇలా ప్రతి అంశంలోనూ మంత్రుల కమిటీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వానికి, త్రిసభ్య కమిషన్కు ఏమాత్రం కనిపించకపోవడం గమనార్హం. మొత్తంగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. విషాద ఘటనలో ప్రభుత్వం తమకు, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా కేవలం అధికారులు, ఉద్యోగులపైనే చర్యలు తీసుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా తాత్కాలికంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్రిసభ్య కమిషన్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు, ఈఈ డీజీ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ కేఎస్ఎన్ మూర్తి, జేఈ కే.బాబ్జీతో పాటు ఏపీటీడీసీకి చెందిన ఈఈ కె.రమణ, డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్ఆర్ స్వామి, ఏఈ పి.మదన్మోహన్ల సస్పెన్షన్కు ఆదేశించింది. అదేవిధంగా గోడ నిర్మించిన కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా చందనోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసమంటూ ఏర్పాటు చేసిన కమిటీలో ఉంటూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు మంత్రులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తప్పంతా అధికారులు, దిగువస్థాయి సిబ్బందిదే అన్నట్లుగా వారిపైనే వేటు వేసింది. దాసుని తప్పు దండనతోనే సరి అన్నట్లుగా.. పనుల పర్యవేక్షణ అంటూ ప్రచార ఆర్భాటానికి పరిమితమై.. భక్తుల ప్రాణాలతో చెలగాటమాడిన మంత్రుల కమిటీ మీద మాత్రం ఈగ వాలనీయకుండా జాగ్రత్తపడింది. మంత్రులూ ఘటనకు బాధ్యులేగా..? మూడు రోజుల పాటు విచారణ అంటూ హడావుడి చేసిన త్రిసభ్య కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. గోడ ఎవరు కట్టారు?.. ఎందుకు కట్టారు.? దాని వెనక ఎవరు ఉన్నారు.. నిబంధనలు ఏమైనా ఉల్లంఘించారా అనే కోణాల్లో కేవలం అధికారులకు సంబంధించే విచారణ చేపట్టారే తప్ప.. మంత్రుల కోణం నుంచి కించిత్తు దర్యాప్తు చెయ్యలేదు. వాస్తవానికి చందనోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఏప్రిల్ 7వ తేదీన నలుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్తో పాటు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా అధికారులున్నారు. కమిటీ నియమించిన తర్వాత నుంచి మంత్రుల బృందం కొండపైనే నిరంతర పర్యటన, సమీక్షలంటూ హడావుడి చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించలేదు. -
శంకరంలో వ్యక్తి ఆత్మహత్య
అనకాపల్లి టౌన్: మండలంలోని శంకరం గ్రామంలో సోమవారం ఒక వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందాడని రూరల్ ఎస్ఐ జె.నాగేశ్వరావు తెలిపారు. గ్రామంలో ఒక వ్యక్తికి చెందిన మూసి ఉన్న కోళ్ల ఫారం వద్ద చింతచెట్టుకు ఉరివేసుకొని ఉండగా సమీపంలోని పిల్లలు గమనించి గ్రామ పెద్దలకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. మృతుని ఫ్యాంట్ జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా త్రిపుర రాష్ట్రానికి చెందిన జితిన్ ముండా(39)గా గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
మా భూమిలోకి మమ్మల్ని రానివ్వడం లేదు...
యువతిపై లైంగికదాడి..! కేసు నమోదులో పోలీసుల తాత్సారం.. ఎస్.రాయవరం మండలం దార్లపూడి గ్రామానికి చెందిన చుక్కా నాగమణి మాట్లాడుతూ తన స్వగృహంలో గత నెల 29న రాత్రి ఇంటిలో నిద్రిస్తుండగా తన ఇంట్లోకి అదే గ్రామానికి చెందిన పప్పల మణికంఠ చొరబడి తన కూతురు ధనలక్ష్మిపై లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ విషయం తల్లిదండ్రులకు గానీ, ఇంకేవరికై నా చెపితే చంపేస్తానని బెదిరించాడని కూతురు తెలిపిందని, తాను, భర్త మేడపై నిద్రిస్తుండగా కింద గదిలో పడుకున్న తన కూతురు సుమారు 2 గంటల సమయంలో కేకలు వేయడంతో వెంటనే వెళ్లి అతనిని బంధించి సమీప ప్రజలను పిలిచి పంచాయతీ నిర్వహించి పెళ్లి చేసుకోమని కోరగా అందుకు నిరాకరించాడని తెలిపింది. వెంటనే 30వ తేదీన స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అయితే స్టేషన్ అధికారులు ఫిర్యాదు తీసుకోవడానికి తాత్సారం చేస్తున్నారని తెలిపారు. హోంమంత్రి అనిత పీఏ ప్రోద్బలంతోనే ఫిర్యాదు స్వీకరించడంలేదని ఆమె ఆరోపించింది. రెల్లి కులస్ధులమయినందున తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, స్ధానికంగా న్యాయం జరగకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె తెలిపింది. కశింకోటకు చెందిన కాశిందేవుల నానాజీ మాట్లాడుతూ మాకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పాయకరావుపేట మండలం ఈదటం గ్రామంలో 2.5 ఎకరాలు భూమి అన్ని రికార్డులతో కలిగి ఉన్నామని తెలిపారు. ఆ భూమిలోకి వస్తుంటే భూమికి సంబంధం లేని తమ బంధువులు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇదే విషయంపై 2019 నుంచి స్పందనలో ఫిర్యాదు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. అధికారులు మారినప్పుడల్లా బంధువులు భూమిలోకి వస్తూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. తమకు న్యాయం చేయాలన్నారు. -
ఏటికొప్పాక బొమ్మల తయారీకి చేయూత
యలమంచిలి రూరల్: ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు పంచాయతీరాజ్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(పీఆర్జీఎస్ఏ) రాష్ట్ర కోఆర్డినేటర్ వినోద్ తెలిపారు. ఆయన అధికారులతో కలిసి సోమవారం ఆర్టిజెన్స్ కాలనీలో హస్త కళాకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సీవీ రాజు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీశైలపు చిన్నయాచారి, పెదపాటి శరత్, సంతోష్ కుమార్ సహా పలువురితో సమావేశమయ్యారు. లక్కబొమ్మల తయారీలో సరికొత్త మెలకువలు నేర్పించడానికి కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. తమకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కావాలని, అంకుడు కర్రల డిపోను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రంగుల ధరలు తగ్గించాలని కళాకారులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కళాకారులను ప్రోత్సహించేందుకు రూ.5 కోట్లతో కొత్త ప్రాజెక్టు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంపీడీవో కొండలరావు, ఏవో ప్రసాదరావు,ఈవోపీఆర్డీ దీపిక, ఏటికొప్పాక పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు. -
హత్య కేసు మాఫీ యత్నంపై ఎస్పీకి ఫిర్యాదు
● మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి ● కేసును వేరొక అధికారికి బదలాయించాలి ● విలేకరులతో మాజీ ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం: హత్య కేసును మాఫీ చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, కేసును నీరుగార్చేందుకు పోలీసులు సైతం వత్తాసు పలుకుతున్నారని పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోమవారం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ హత్యకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరడం జరిగిందన్నారు. ఈ ఏడాది జనవరిలో నర్సీపట్నం మండలం, వేములపూడి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు బండారు అప్పన్నపై దాడి చేసి హత మార్చారన్నారు. హత్య చేసిన వ్యక్తులకు కూటమి నాయకుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. కూటమి నాయకుల ఒత్తిడితో కేసును మాఫీ చేసేందుకు నర్సీపట్నం రూరల్ పోలీసులు చూస్తున్నారన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్ఎస్ఎస్(సస్పైసీవ్ డెత్గా కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారన్నారు. సంఘటన జరిగి నాలుగు నెలలు అవుతున్నా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. సీఐ రేవతమ్మ, ఎస్ఐ రాజారావు కేసు దర్యాప్తును తప్పుతోవ పట్టించి, కేసును క్లోజ్ చేసేందుకు చూస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. డాక్టర్ ఇచ్చిన పీఎం రిపోర్టు కూడా హత్యకు అద్దం పడుతుందన్నారు. అయినప్పటికీ పోలీసులు కేసును నీరు గారుస్తున్నారన్నారు. మృతుడు అప్పన్న శరీరంపై బలమైన గాయాలు చూస్తే ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, కావాలనే కొట్టి చంపేశారని తెలుస్తుందన్నారు. సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రమేయం ఉండడంతో కేసులో నిందితులకు సపోర్టు చేస్తున్నారని ఆరోపించారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే వేరొక ఆఫీసర్కు కేసు బదిలీ చేయాలని ఎస్పీని కోరడం జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. -
బైకును ఢీకొన్న లారీ...ఒకరికి గాయాలు
అచ్యుతాపురం రూరల్: రామన్నపాలెం గ్రామానికి చెందిన ధర్మిరెడ్డి శ్రీనివాసరావును లారీ ఢీకొనడంతో తీవ్ర రక్త స్రావమై అపస్మారక స్థితిలో ఉన్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం క్షతగాత్రుడు శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్గా విధులు నిర్వర్తించుకుని అచ్యుతాపురం కూడలి నుంచి రామన్నపాలెం తన ఇంటికి బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడి ముక్కు, నోటి నుండి తీవ్రంగా రక్త స్రావమైంది. లారీ క్షతగాత్రుని ఢీకొని ఆపకుండా వెళ్లిపోవడం గమనించిన స్థానికులు లారీని వెంబడించి పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. రోడ్డుపై పడి తలకు బలంగా గాయం కావడంతో విశాఖలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. -
‘60 అడుగుల గోడకే దిక్కులేదు.. అమరావతి కడతారా?’
సాక్షి, అనకాపల్లి: కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. అలాగే, చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనకాపల్లి జిల్లాలో సోమవారం వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, పెట్ల ఉమా శంకర్ గణేష్, వరుదు కళ్యాణి, కంబాల జోగులు, అదీప్ రాజు, కన్నబాబు రాజు, మలసాల భరత్, శోభ హైమవతి, మాజీ ఎంపీ సత్యవతి, బొడ్డెడ ప్రసాద్, కేకే రాజు, పార్టీ నేతలు హాజరయ్యారు.👉ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా వైఎస్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైఎస్సార్సీపీ ఓడిపోయింది. కూటమి పాలనలో ప్రజలకు ఏం మేలు జరిగిందో ఒకసారి ఆలోచించాలి. 11 నెలల పాలనలో ప్రజలకు చేసింది శూన్యం. 11 నెలల్లో లక్ష 50 వేల కోట్లు అప్పు చేశారు. ఇంత అప్పు చేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు.అప్పు చేసిన లక్ష 50 వేల కోట్లు ఏం చేశారో చెప్పాలి.కూటమి పాలనలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. భర్త చనిపోతేనే కొత్త పెన్షన్ భార్యకు ఇవ్వాలని జీవో ఇచ్చారు. వైఎస్ జగన్ పాలనలో అర్హులకు పెన్షన్ లు అందజేశారు. మళ్ళీ పెళ్లి అన్నట్లు అమరావతికి పున: ప్రారంభం చేశారు. అమరావతికి లక్ష కోట్లు తెచ్చుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుకు లేదా?. విశాఖ నూతన రైల్వే జోన్ ఏమైంది?. రైల్వే భవనాలు ఎందుకు నిర్మించలేదు. మూడు టీవీలు మూడు పేపర్లతో పబ్బం గడుపుతున్నారు. 99 పైసలకు ఎకరా భూమి ఇస్తున్నారు. రాష్ట్రాన్ని ఏం చేయాలని చూస్తున్నారు. సింహాచలం కొండ మీద మరణాలు సంభవించాయి. నాయకుల ప్రచార పిచ్చితో ఏడుగురు భక్తులు మరణించారు. సింహాచలంలో మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే.👉మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. టీడీపీ ఓడిపోయిన తరువాత నాలుగేళ్ల పాటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు బయటకు రాలేదు. ఆరు నెలలకే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా రోడ్డు మీదకు వస్తున్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 పాలన వస్తుంది. కార్యకర్తలకు అండగా వైఎస్ జగన్ ఉంటారు. 60 అడుగుల గోడ కట్టలేని వ్యక్తి అమరావతి కడతానని మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన భక్తులు చనిపోతున్నారు. చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారు.👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ రామరాజ్య పాలన అందించారు. కూటమి రాక్షస పాలనను తలపిస్తుంది. ఏపీని అప్పుల ఆంధ్ర ప్రదేశ్గా మార్చివేశారు. ప్రతీ కార్యకర్తకు వైఎస్ జగన్ అండగా ఉంటారు.👉కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. అమర్నాథ్కు అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం సంతోషం. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుంది. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలి. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి నాయకుడు కృషి చేయాలి.👉మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక తప్పుడు కేసులు పెడుతుంది. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కుంటున్నాము. ప్రభుత్వంపై వ్యతిరేకత మూడు నెలలకే బయట పడింది. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు..👉కన్నబాబు రాజు మాట్లాడుతూ.. కూటమిలో గొడవలు అప్పుడే మొదలయ్యాయి. 2026లో కూటమిలో చీలిక ఏర్పడుతుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎన్నడూ అమలు చేయరు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది.👉బుడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ..‘పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదు. వైఎస్ జగన్ నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేస్తారు. రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుంది. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉంది అని అన్నారు. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వివిధ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందని, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా బీజేపీ పాలన సాగుతోందని తెలిపారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న తదితర డిమాండ్లతో ఈనెల 20న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్టు చెప్పారు. మోడీ పాలనలో కార్మిక రంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు హక్కులు కోల్పోతారని చెప్పారు. రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోన మోహనరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, కూలీల జీవితాలు దుర్భరంగా మారాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు దుర్గారాణి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గూనూరు వరలక్ష్మి, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.పార్వతి, జిల్లా నాయకులు వి.వి.శ్రీనివాసరావు, ఆర్.రాము, గనిశెట్టి సత్యనారాయణ, జి.దేవుడు నాయుడు, ప్రేమ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ.. 2,865 టికెట్లు ఎవరికిచ్చారు?
● చందనోత్సవం టికెట్ల లెక్కల్లో భారీ తేడా ● అధికారిక లెక్కలకు, వాస్తవానికి వ్యత్యాసం ● అంతరాలయ దర్శనంపైనా విమర్శలు సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం టికెట్ల విక్రయాలు, దర్శనాల నిర్వహణకు సంబంధించి దేవస్థానం విడుదల చేసిన జాబితాలో పలు వ్యత్యాసాలు, అస్పష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ల సంఖ్య, తెల్లవారుజామున కల్పించిన అంతరాలయ దర్శనాల విషయంలో అధికారుల లెక్కలపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానం ఈవో కె. సుబ్బారావు పేరిట ఆదివారం విడుదలైన జాబితా ప్రకారం.. ఈ ఏడాది చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్లు ఆఫ్లైన్లో 15,495, ఆన్లైన్లో 7,591 కలిపి మొత్తం 23,086 విక్రయించారు. అలాగే రూ.1000 టికెట్లు ఆఫ్లైన్లో 13,803, ఆన్లైన్లో 3,999 కలిపి మొత్తం 17,802 జారీ చేశారు. రూ.1500 టికెట్లు కేవలం ఆఫ్లైన్లో 3,000 విక్రయించినట్లు పేర్కొన్నారు. వీటికి అదనంగా 496 అంతరాలయ టికెట్లుగా చూపించారు. ఈ లెక్కల ప్రకారం మొత్తంగా 44,384 టికెట్లు విక్రయించినట్లు జాబితాలో ఉంది. అయితే గత నెల 24 నుంచి 29 వరకు రోజువారీగా టికెట్ల విక్రయాల జాబితాను పరిశీలిస్తే.. మొత్తం 41,519 టికెట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొన్నారు. దీంతో దేవస్థానం విడుదల చేసిన మొత్తం లెక్కకు, రోజువారీ లెక్కలకు మధ్య 2,865 టికెట్ల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. తెల్లవారుజామున అంతరాలయ దర్శనం కేవలం 496 మందికి మాత్రమే కల్పించినట్లు అధికారులు చూపించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చందనోత్సవం రోజు ఉదయం చాలా మందిని అంతరాలయ దర్శనానికి అనుమతించినట్లు భక్తులు, స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వారి అంచనా ప్రకారం అంతరాలయ దర్శనం పొందిన వారి సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుందని అంటున్నారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించేవారు, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు మాత్రమే ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పిస్తామని దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ప్రకటించారు. తీరా ఈవో ప్రకటనకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతనే లేకుండా పోయింది. గత ఏడాదితో పోలిస్తే టికెట్ల విక్రయాలు పెరిగినట్లు దేవస్థానం పేర్కొంది. 2024లో మొత్తం 32,461 టికెట్లు విక్రయించగా, ఈ సంవత్సరం 44,384 టికెట్లు అమ్ముడైనట్లు తెలిపింది. రూ.300, రూ.1000 టికెట్లలో గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా 12,889 టికెట్లు విక్రయించామని పేర్కొంది. గత ఏడాది ఆన్లైన్లో రూ.300, రూ.1000 టికెట్లు కలిపి 8,216 విక్రయించగా, ఈ ఏడాది 11,590 అమ్ముడైనట్లు నివేదించారు. అంటే ఆన్లైన్లో 3,374 టికెట్లు అదనంగా విక్రయించామని చెబుతున్నారు. అయితే రూ.1000 టికెట్లు తొలిరోజు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, మిగతా ఏ రోజుల్లోనూ ఆ టికెట్లు లభించలేదని భక్తులు వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకత కొరవడిందని విమర్శిస్తున్నారు. -
టీడీపీకి కారుచౌకగా స్థలం కేటాయింపు తగదు
అనకాపల్లి: టీడీపీ కార్యాలయం ఏర్పాటుకు అతి తక్కువ అద్దెకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం తగదని సీపీఎం మండల కార్యదర్శి గంటా శ్రీరామ్ అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు లేవని చెప్పిన అధికారులు, మండలంలో కొత్తూరు పంచాయతీ పరిధి సర్వే నంబర్ 608/10లో జిల్లా టీడీపీ కార్యాలయం నిర్మాణానికి ఎలా స్థలాన్ని కేటాయించారని ప్రశ్నించారు. సుమారు రూ.20 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఏడాదికి రూ.2వేల అద్దె చొప్పున లీజుకు ఇవ్వడం అన్యాయమన్నారు. ఈ లీజును వెంట రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు కనీసం రెండు, మూడు సెంట్ల నివాస స్థలం ఇవ్వడానికి చేతులు రాని ప్రభుత్వం, అధికార పార్టీకి ఏ విధంగా స్థలాలను కేటాయిస్తుందని ప్రశ్నించారు. సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏంచేసిందని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బి.ఉమామహేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు కాళ్ల తేలయ్యబాబు, కనకల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
కోనాం భోగొండమ్మను దర్శించుకున్న ధర్మశ్రీ , రేగం
చీడికాడ: మండలంలోని కోనాం భోగొండమ్మను అరుకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. భోగొండమ్మ పండగ మహోత్సవంలో భాగంగా ఆయన కోనాంలో గల బంధువుల ఇంటికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే అనకాపల్లి వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఇన్చార్జి కరణం ధర్మశ్రీ, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మిలతో పాటు, వైఎస్స్రా్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ సలుగు సత్యనారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి తరలిరావాలి
దేవరాపల్లి: అనకాపల్లిలో సోమవారం జరిగే వైఎస్సార్సీపీ జిల్లా విస్త్రృత స్థాయి సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావాలని మాజీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యుడు బూడి ముత్యాలనాయుడు ఆదివారం పిలుపునిచ్చారు. అనకాపల్లి రింగ్రోడ్డులోని బెల్లం మార్కెట్ ఎదురుగా ఉన్న పెంటకోట కన్వెన్షన్ హాల్లో సోమవారం ఉదయం పది గంటల ఈ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. పార్టీ ముఖ్య నాయుకులు హాజరయ్యే ఈ సమావేశానికి అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయుకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా అమర్నాథ్ ప్రమాణ స్వీకారం
అనకాపల్లి: స్థానిక రింగ్రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్ ప్రమాణస్వీకారం చేయనున్నారని, అనంతరం పార్టీ శ్రేణులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారని ఆపార్టీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ అడ్వైజర్ కమిటీ మెంబర్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి పార్లమెంట్ ఇన్చార్జ్ కరణం ధర్మశ్రీ, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభ హైమావతి, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ పాల్గోనున్నట్టు తెలిపారు. జిల్లాలో వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరుకానున్నట్టు ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని వారు కోరారు. -
గోస్తనీ గొంతెండుతోంది
● ఇసుకాసురుల దాటికి బలైన నది ● తాత్కాలిక పరిష్కారాలతో ప్రజాధనం వృథా ● చెక్డ్యామ్ల నిర్మాణంతోనే మేలు ఇసుక తవ్వకాలతోనే ఈ పరిస్థితి గత టీడీపీ ప్రభుత్వ(2014–2019) హయాంలో గోస్తనీ నదిలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక తవ్వకాలు నది సహజ స్వరూపాన్ని దెబ్బతీశాయి. పద్మనాభం మండలం పొట్నూరు నుంచి తగరపువలస వరకు ఇసుకాసురులు నది గర్భాన్ని తోడేశారు. కోట్ల విలువైన ఇసుకను తరలించడంతో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా నేడు నదీ పరీవాహక ప్రాంతం ముళ్ల చెట్లు, గోతులతో నిండిపోయి అడవిని తలపిస్తోంది. నీటి జాడ కనిపించడమే గగనమైపోయింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాలకు జీవనాధారమైన గోస్తనీ నది నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జీవీఎంసీతో పాటు భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలు, విజయనగరం జిల్లాలోని పలు పంచాయతీల తాగునీటి అవసరాలను తీర్చే ఈ నది.. ఇసుకాసురుల దాటికి, సరైన ప్రణాళిక లోపంతో ప్రజల దాహార్తిని తీర్చలేని స్థితికి చేరుకుంది. వేసవి వచ్చిందంటే చాలు నది ఎండిపోవడం, ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడటం పరిపాటిగా మారింది. ప్రభుత్వాలు, అధికారులు కేవలం తాత్కాలిక పరిష్కారాలపై ఆధారపడుతుండటంతో ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. – తగరపువలస గోస్తనీ నది విశాఖ, విజయనగరం జిల్లాల్లోని సుమారు 5 నుంచి 6 లక్షల మంది ప్రజల రోజువారీ తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఆనందపురం మండలం బోని వద్ద నుంచి జీవీఎంసీకి, పద్మనాభం మండలం పాండ్రంగి సమీపంలోని సామియ్యవలస వద్ద నిర్మించిన ఊట బావులు, పంప్హౌస్ల ద్వారా భీమిలి జోన్కు నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా విభాగం నదీ తీరంలో బోర్లు వేసి.. ఆ నీటిని రక్షిత మంచినీటి పథకాల ట్యాంకులకు తరలించి ప్రజలకు అందిస్తోంది. వేసవి కష్టం.. తాటిపూడిపైనే భారం ప్రతి ఏటా ఏప్రిల్, మేలో గోస్తనీ నది చాలా చోట్ల ఎండిపోతుంది. దీంతో జీవీఎంసీ సహా అనేక పంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతుంది. ఆ సమయంలో వర్షాలు పడితే కొంత ఉపశమనం లభిస్తుంది. లేదంటే విజయనగరం జిల్లాలోని తాటిపూడి రిజర్వాయర్ నుంచి వచ్చే నీరే దిక్కు. ప్రస్తుతం రెండు వారాల కిందట విడుదల చేసిన నీరు నదిలో చేరినా.. అది కేవలం పది రోజులకు మాత్రమే సరిపోతుందని అంచనా వేస్తున్నారు. మరోమారు రిజర్వాయర్ నుంచి నీరు విడుదల కావడం లేదా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం జరిగితేనే తాగునీటి సమస్య నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. తాత్కాలిక కట్టలు.. రూ.లక్షలు వృథా గోస్తనీ నదిపై చెక్డ్యామ్లు నిర్మిస్తే నీటిని నిల్వ చేసుకోవచ్చని మేధావులు సూచిస్తున్నా.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. పాండ్రంగి పంచాయతీ పరిధిలో మునివానిపేట నుంచి తగరపువలస వరకు ఒక్క చెక్డ్యామ్ కూడా లేదు. గతంలో తాటితూరు వద్ద నిర్మించిన చెక్డ్యామ్ను కొందరు ధ్వంసం చేయడంతో నీరు నిలవడం లేదు. దీంతో భీమిలి జోనల్ అధికారులు ఏటా సామియ్యవలస వద్ద ఇసుక బస్తాలు, మట్టి కట్టల పేరుతో రూ.లక్షలు నదిలో కుమ్మరిస్తున్నారు. ఏప్రిల్లో ఏర్పాటు చేసే ఈ తాత్కాలిక కట్టలు.. జూన్లో వచ్చే వర్షాలకు కొట్టుకుపోతున్నాయి. శాశ్వత పరిష్కారమే శరణ్యం సామియ్యవలస, తాటితూరు, టి.నగరపాలెం వద్ద శాశ్వత చెక్డ్యామ్లు నిర్మించి, తగరపువలస వద్ద నది గట్టు ఎత్తు పెంచితే.. వర్షాకాలంలో వచ్చే నీటిని సముద్రంలో కలవకుండా నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించవచ్చని.. ఇసుక బస్తాలు, మట్టి కట్టల కోసం ఏటా చేస్తున్న వృథా ఖర్చును తగ్గించవచ్చని రెండు జిల్లాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. బోరు నీళ్లే దిక్కు? భీమిలి మున్సిపాలిటీ గతంలో ఏటా మార్చి నుంచి జూన్ వరకు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొనేది. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘నగరబాట’ కార్యక్రమంలో ఇక్కడ ప్రజల కష్టాలు చూసి.. రూ.12 కోట్లతో తాగునీటి పథకాన్ని మంజూరు చేశారు. సామియ్యవలస వద్ద పంప్హౌస్, ఆరు ఊటబావులు నిర్మించి నిరంతర నీటి సరఫరాకు మార్గం వేశారు. అయితే పాండ్రంగి, మజ్జివలస, తాటితూరు, టి.నగరపాలెం, తగరపువలస ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల ప్రభావంతో సామియ్యవలస వద్ద కూడా ఏప్రిల్, మేలో నీటి లభ్యత తగ్గిపోతోంది. ప్రస్తుతం రెండు ఊటబావులు పనిచేయకపోవడంతో ప్రత్యామ్నాయంగా రెండు బోర్లు తవ్వి నీటిని భీమిలి జోన్ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ బోర్ల నీరు తాగడానికి అనుకూలంగా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భీమిలిలోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యాసంస్థలు నదిని ఆనుకుని బోర్ల ద్వారా రోజూ వందలాది ట్యాంకర్లతో నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ అక్రమ నీటి రవాణా పలువురికి కాసులు కురిపిస్తోంది. -
భూసారం పెరిగేలా ప్రకృతి సాగు
నవధాన్యాల కిట్లు పంపిణీకి సిద్ధం కశింకోట: మండలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండిస్తున్న భూములు సారవంతం కావడానికి తొలకరి వర్షాల్లో వేసే నవ ధాన్యాలను సిద్ధం చేస్తున్నారు. మండలంలోని సుందరయ్యపేట శివారు లాలంకొత్తూరు వద్ద మండల ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రంలో సిబ్బంది సంచుల్లో నింపి రైతులకు సరఫరా చేయడానికి సిద్ధం చేశారు. కేంద్రం నిర్వహకురాలు కూండ్రపు అరుణ ఆధ్వర్యంలో ఏజెన్సీ, ఇతర ప్రాంతాల నుంచి నవ ధాన్యాలైన బొబ్బర్లు, సజ్జలు, రాగులు, ఉలవలు, కూరగాయలు, ఆకు కూరలు, పచ్చి రొట్ట విత్తనాలు, తదితర 30 రకాల విత్తనాలను సేకరించారు. ఎకరాకు 12 కిలోలు సరిపోయే విత్తనాలను కలిపి బ్యాగ్ల్లో నింపారు. 2వేల ఎకరాల్లో.. మండలంలో సుమారు 2 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలను సాగు చేస్తున్నారు. ఆయా భూముల్లో జల్లడానికి వీటిని రూ.1200కు సరఫరా చేస్తున్నారు. అలాగే తెగుళ్లు, క్రిముల నివారణకు వినియోగించే ప్రకృతి సిద్ద ద్రవ్యాలు, కషాయాలు, క్రిమి సంహారక మందులను కూడా సరఫరాకు సిద్దంగా ఉంచారు.ఈ సందర్భంగా అన్ని రకాల విత్తనాలతో అందంగా రూపొందించిన ముగ్గు అందరికి అలరించింది. నవ ధాన్యాలు నాటడానికి ఇదే అదును కావడంతో రైతులు వచ్చి విత్తనాల కిట్లను, ద్రవ్యాలను తీసుకెళుతున్నారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
లీజు రద్దు చేయాలి
కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టు, రిజిస్టర్ ఆఫీస్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ తదితర కార్యాలయాలు నేటికీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటిపై దృష్టి సారించకుండా అధికార పార్టీకి మాత్రం స్థలం కేటాయించడమేంటి?. టీడీపీ కార్యాలయానికి అత్యంత చౌకగా, చట్టవిరుద్ధంగా కలెక్టర్ స్థలం కేటాయించడం తగదు. ఈ లీజును వెంటనే రద్దు చేయాలి. పేద ప్రజలకు కనీసం రెండు సెంట్ల నివాస స్థలం ఇవ్వడానికి ముందుకురాని అధికారులు అధికార పార్టీకి ఏ విధంగా స్థలాన్ని కేటాయిస్తారు. నాన్ షెడ్యూల్ ఏరియా లో వందలాది ఎకరాలు గిరిజనులు భూములు కబ్జాలకు గురై తీవ్ర ఇబ్బందులు పడుతూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. ఆ సమస్యలపై అధికారులు దృష్టిసారించాలి. –డి. వెంకన్న, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?
● జనవరిలో దక్షిణ కోస్తా రైల్వేజోన్కు ప్రధాన మోదీ శంకుస్థాపన ● ఇంతవరకూ భూమి చదునుకు మాత్రమే పరిమితమైన పనులు ● భవన నిర్మాణాలకు మరో రెండేళ్లు పట్టే అవకాశం ● తాత్కాలిక కార్యకలాపాలకు భవనాలున్నా స్పందించని రైల్వే శాఖ ● ఇప్పట్లో జోన్ కార్యకలాపాలు ఉండవంటున్న వాల్తేరు అధికారులురాజకీయాలకు రైల్వే జోన్ బలి! కూటమి నేతల నిర్లక్ష్యం, ఒడిశా రాజకీయాలకు ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన రైల్వే జోన్ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. కనీసం తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలంటూ కూటమి ఎంపీలు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ రైల్వే మంత్రికి, బోర్డును కానీ కోరడం లేదు. శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడిచినా దీనిపై ఏ ఒక్క కూటమి ఎంపీ నోరు మెదపకపోవడం జోన్ పాలిట శాపంగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఒడిశా పావులు కదుపుతోంది. అత్యధిక ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్ను వదులుకోవడం ఇష్టం లేని ఒడిశాలోని ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్ అధికారులు తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నారు. అక్కడ రాజకీయ నేతలు కూడా వీరికి సహకరించడంతో.. రైల్వే బోర్డు ఒడిశా ఏం చెబితే అదే చేస్తోంది. ఫలితంగా విశాఖ జోన్ బలవుతూ వస్తోంది. సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును చేసే పనులకే పరిమితమైంది. భవనాలు నిర్మించేందుకు మరో రెండేళ్ల సమయం పట్టేలా కనిపిస్తోంది. తాత్కాలిక కార్యకలాపాలకు భవనాలు సిద్ధంగా ఉన్నా రైల్వే శాఖ మాత్రం ముందుకు రావడంలేదు. గతంలోనే ఇక్కడ ఉన్న భవనాల జాబితాను వాల్తేరు అధికారులు పంపించినా.. స్పందించకపోవడం చూస్తుంటే మరో రెండేళ్ల పాటు జోన్ కార్యకలాపాలు మొదలవ్వవేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు 2019లో కేంద్రం పచ్చజెండా ఊపింది. జోన్కు సంబంధించిన డీపీఆర్ని అదే ఏడాది చివర్లో ఇచ్చేసినా రాజకీయ కక్షతో ముందడుగు వేయలేదు. 2024 ఎన్నికల అనంతరం నవంబర్లో టెండర్లు ఆహ్వానించారు. జనవరిలో ప్రధాని చేతుల మీదుగా జోన్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అయినా ముడసర్లోవలో భూమి చదును చేసే పనుల్లోనే ఇంకా రైల్వే శాఖ నడిపిస్తోంది. ఈ భూములను తాము సాగుచేసుకుంటున్నామని స్థానికులు ఆందోళన చేయగా.. కూటమి నేతలు రంగంలోకి దిగి జోన్ భవనం వచ్చిన తర్వాత.. అందులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి వారిని శాంతింపజేశారు. అయినా.. ఇంకా చదును పనులే సా..గుతున్నాయి. తాత్కాలికానికి భవనాలు సిద్ధంగా ఉన్నా..! బిల్డింగ్ నిర్మాణంతో పనిలేకుండా జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తాత్కాలిక కార్యాలయంగా ప్రస్తుతం ఉన్న వాల్తేరు డీఆర్ఎం కార్యాలయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే సౌత్ కోస్ట్ జోన్ ఓఎస్డీ.. తాను సమర్పించిన జోన్ డీపీఆర్లోనూ పొందుపరిచారు. రైల్వేస్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా స్టేషన్ బయట ‘గతిశక్తి’ పథకంలో భాగంగా 4 అంతస్తుల భవనాలు రెండు నిర్మించారు. ఒక్కో అంతస్తులో 4,500 చదనపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్తో కూడా కలుపుకొంటే దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కొత్త భవనాలు ఉన్నాయి. తాత్కాలిక కార్యకలాపాలు చేపట్టేందుకు గెజిట్ విడుదల చేయాల్సి ఉన్నా బోర్డు నుంచి ఎలాంటి సూచనలు కనిపించడం లేదని వాల్తేరు అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితమే తాత్కాలిక భవనాల జాబితా పంపించామని, ఇప్పటికీ అతీగతి లేకపోవడం చూస్తే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. కూటమి ఎంపీలు, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని విశాఖవాసులు కోరుతున్నారు. జీఎం నియామకం ఎప్పుడో..? రైల్వే జోన్ కార్యకలాపాలను ప్రారంభించడానికి రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. రెండేళ్లలో జోనల్ కార్యాలయ నిర్మాణం పూర్తి చేసి, ఆ తరువాత ఆపరేషన్లు ప్రారంభిస్తామని సాకులు చెబుతోంది. ఇప్పటివరకు ప్రకటించిన రైల్వే జోన్లలో ఎక్కడా.. ఈ తరహా పరిస్థితులు కనిపించలేదు. జోన్ ప్రకటించిన తరువాత కార్యకలాపాల్ని తాత్కాలిక భవనాల్లో ప్రారంభించి.. కొత్త భవనాల నిర్మాణం అనంతరం అక్కడికి మార్చేవారు. కానీ విశాఖ జోన్ విషయంలో మాత్రం ఆది నుంచీ పూర్తి విరుద్ధంగా సాగుతోంది. కొత్త భవన నిర్మాణాలు చేపట్టిన తర్వాతే ఆపరేషన్లు ప్రారంభిస్తామంటూ రైల్వేశాఖ చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే నుంచి విడదీసిన గుంటూరు, గుంతకల్, విజయవాడ డివిజన్లను, విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ను కలిపి ‘దక్షిణ కోస్తా’ జోన్గా ప్రకటించారు. దాదాపు ఏపీ మొత్తం ఈ జోన్లోనే ఉండటంతో రాష్ట్రమంతటికీ సేవలందనున్నాయి. కొత్త రైళ్లు కావాలన్నా, రైల్వే లైన్లు కావాలన్నా జోనల్ అధికారులే ప్రతిపాదనలు పెట్టాలి. ఇది జరగాలంటే జోన్కు తొలుత జనరల్ మేనేజర్(జీఎం) నియామకం చేపట్టాలి. ఈ విషయంలోనూ బోర్డు స్పందించడం లేదు. -
బాధిత రైతుకు రూ.5 వేల సాయం
చీడికాడ: రైతుల పక్షపాతి మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అని మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ఎంపీపీ కురచా జయమ్మనారాయణమూర్తి అన్నారు. పిడుగుపడి గేదె, పెయ్యిని కోల్పోయి నష్టపోయిన మండలంలోని చినగోగాడకు చెందిన రైతు కోనేటి సత్తబాబుకు మాజీ డిప్యూటి సీఎం బూడి ముత్యాలనాయుడు ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.5వేల నగదును తమ వంతు సహకారంగా అందించారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ సీఎంగా ఉన్న రోజుల్లో రాష్ట్రంలో రైతు రాజుగా మెలిగాడని, నేడు అప్పులపాలై దిక్కుతోచని స్థితిలో పాడ్డాడన్నారు. వారి వెంట వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి స్వాతి కొండబాబు, నేతలు పుట్టా రామ్కుమార్, కొల్లి శ్రీనివాసరావు, ఎంపిటిసి కొల్లి నారాయణమూర్తి, ప్రగడసాయి, కోన సత్తిబాబు, రామారావు తదితరులున్నారు. -
నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు
అనకాపల్లి: నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే జిల్లా నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో వంటలు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, సహపంక్తి భోజనం చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఉచితంగా తాగునీరు, మజ్జిగ, ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను(గొల్లబాబు) ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాలింతలకు, చిన్నారులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు మజ్జి శ్రీనివాసరావు, కాండ్రేగుల రాజారావు, మారిశెట్టి శంకరరావు, పోలిమేర ఆనంద్, దాడి రవికుమా ర్, సూరే సతీష్, ఎర్రవరపు లక్ష్మి, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పాల్గొన్నారు. -
విద్యార్థులకు వేసవి ఉచిత క్రీడా శిక్షణ
● శిబిరానికి విశేష స్పందన ● ఆరోగ్యం, ఆత్మరక్షణ కల్పించే యోగా, తైక్వాండోపై శిక్షణ ● జిల్లాలో తైక్వాండో క్రీడకు ఐదు ప్రాంతాల్లో కేంద్రాలు ● యోగాకు చోడవరంలో శిక్షణ కేంద్రం చోడవరం: విద్యార్థులకు వేసవి సెలవులు రావడంతో వివిధ క్రీడలకు సంబంధించి ప్రారంభమైన వేసవి శిక్షణ కేంద్రాలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు ఆయా విభాగాల స్పోర్ట్స్ యూనిట్లు ఇప్పటికే అన్ని కేంద్రాల్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాయి. ఆత్మరక్షణ, ఆరోగ్య రక్షణలకు కీలకంగా మారిన తైక్వాండో, యోగా క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా కేంద్రాలు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 30 రోజుల పాటు ఈ కేంద్రాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తైక్వాండో అసోసియేషన్, చోడవరం పతంజలి యోగా కేంద్రాల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు ప్రా రంభమయ్యాయి. తైక్వాండోపై వేసవి శిక్షణ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ చాలా అవసరంగా మారింది. అందులో బాలికలకు ఆత్మరక్షణ ఎంతైనా అవసరం అని భావించి స్పోర్ట్స్ అథారిటీ ఈ వేసవి శిక్షణ తరగతుల్లో తైక్వాండో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చింది. బాల, బాలికలు కలిసి 30రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్వంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లాలో ఐదు కేంద్రాల్లో తైక్వాండో జూడో ఆత్మరక్షణ క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు పట్టినట్టు అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి తెలిపారు. చోడవరం, అనకాపల్లి పట్టణం, అనకాపల్లి గాంధీనగరం, పరవాడ, బుచ్చెయ్యపేట(వడ్డాది) ప్రాంతాల్లో వేసవి ఉచిత శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. 5 నుంచి 16 సంవత్సరాలు వయస్సు కలిగిన బాలబాలికలు ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈనెల 1 నుంచి నెలాఖరు వరకూ ఇచ్చే శిక్షణ తరగుతులకు విద్యార్థులు ఎంతో ఆసక్తితో శిక్షణ పొందుతున్నారని మురళి తెలిపారు. చోడవరంలో యోగాపై వేసవి శిక్షణ అందరికీ ఆరోగ్యాన్ని అందించే యోగాపై శిక్షణ ఇచ్చేందుకు ఈ వేసవిలో విద్యార్థులకు యోగాపై ఉచిత శిక్షణ కేంద్రాన్ని చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇక్కడి ఉషోదయ విద్యాసంస్థల ప్రాంగణంలో ఉన్న యోగా కేంద్రంలో ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని యోగా గురువు పుల్లేటి సతీష్ తెలిపారు. యోగా వల్ల విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం, శరీర సౌష్టవంతోపాటు ఏకాగ్రత లభిస్తుందన్నారు. చోడవరం ఉషోదయ కాలేజీలో ఈ వేసవి ఉచిత యోగా శిక్షణ కేంద్రాన్ని ఈనెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. -
రైలు నుంచి జారిపడి ఒకరి మృతి
మునగపాక: స్నేహితులతో కలిసి తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా తాడేపల్లిగూడెం వద్ద రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి ఉమ్మలాడ వాసి ఒకరు మృతి చెందిన సంఘటన అందరినీ కలచివేసింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఉమ్మలాడకు చెందిన కరోతి గణేష్(34) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ట్రైన్లో వస్తుండగా తాడేపల్లి గూడెం జంక్షన్ వద్దకు వచ్చే సరికి కిందికి దిగే ప్రయత్నంలో జారి కింద పడిపోవడంతో మృతిచెందారు. మృతుడు గణేష్కు భార్య, ఏడాది వయసున్న పాప ఉన్నారు. అందరితో సరదాగా ఉండే గణేష్ రైలు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియడంతో ఉమ్మలాడలో విషాదం అలముకుంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న గణేష్ రైలు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. జగనన్న వీరాభిమానిగా.. గణేష్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వీరాభిమాని. పార్టీలో చురుకై న పాత్ర పోషిస్తూ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎంతో శ్రమించే గణేష్ రైలు ప్రమాదంలో మృతి చెందడాన్ని స్థానిక పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ బలోపేతంతో పాటు జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పలు సంక్షేమ పధకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లిన గణేష్ అకాల మృతితో వారంతా విషాదంలో మునిగిపోయారు. గణేష్ కుటుంబానికి చెందిన కొందరు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయినా జగనన్నపై ఉన్న అభిమానంతో గణేష్ మాత్రం వైఎస్సార్సీపీలోనే కొనసాగారని గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మలాడలో విషాదం -
ఘనంగా భగీరథ మహర్షి జయంతి
తుమ్మపాల: భగీరథుడు దీక్షకు, సహనానికి ప్రతిరూపమని, ఎంత కష్టమైనా లెక్కచేయకుండా దివి నుంచి భువికి గంగను తీసుకువచ్చారని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో మహర్షి చిత్రపటానికి డీఆర్వో పూలమాలవేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు జీవితంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి కె.రాజేశ్వరి మాట్లాడుతూ భగీరథుడి వారసులైన ఉప్పర కులానికి చెందిన వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వారికి రుణాలు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ నూకరాజు, కలెక్టరేట్ ఇన్చార్జి ఏవో వాసునాయుడు, ఉప్పర, సగర కమ్యూనిటీ అధ్యక్షుడు నక్క పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు కలెక్టర్ అభినందన
రావికమతం: టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన మండలంలోని గర్ణికం కస్తూర్భా గాంధీ బాలకల విద్యాలయం విద్యార్థినులను కలెక్టర్ విజయ కృష్ణన్ అభినందించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించిన వర్షిత లాస్య, 567 మార్కులు సాధించిన ఇందుశ్రీ, ఇంటర్మీడియట్లో 969 మార్కులు సాధించిన టి.అశ్వనిలను అభినందించి సత్కరించారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ భానును పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు కోఆర్టినేటర్ జయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ఉపాధ్యాయుడికి అభినందన
రావికమతం : రాష్ట్ర స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్–2025 క్రీడా పోటీల్లో అనకాపల్లి జిల్లా నుంచి ఐదుగురు పిల్లలు పాల్గొని, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఇద్దరు దివ్యాంగ విద్యార్థులు ఎంపికవడంతో ఆ విద్యార్థులకు శిక్షణ అందించిన మేడివాడ హైస్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మినాయుడును కలెక్టర్ విజయ కృష్ణన్ స్పెషల్ ఒలింపిక్ భారత్ కోచ్ సర్టిఫికెట్ అందించి అభినందించారు. మహాలక్ష్మినాయుడును అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష జిల్లా సహిత విద్య సమన్యకర్త,సమగ్ర శిక్ష అధికారులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ఆయనను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. డీజిల్ అక్రమ నిల్వ స్థావరంపై దాడి అచ్యుతాపురం రూరల్: అక్రమంగా డీజిల్ నిల్వ చేసిన స్థావరంపై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నమ్మి గణేష్ శనివారం తెలిపారు. సమాచారం మేరకు నారపాక కూడలిలో కొరుపోలు సరోజారావుకు చెందిన ఖాళీ స్థలంలో మునగపాక మండలం నాగవరం గ్రామానికి చెందిన అప్పికొండ వెంకటేష్ అద్దెకు తీసుకుని ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో అక్రమంగా నిల్వ చేసిన 396 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. డీజిల్ ట్యాంకర్ (ఏపీ39టీఎన్2244) డ్రైవర్గా పని చేస్తున్న మరో వ్యక్తి అచ్యుతాపురం మండలం ఆవరాజాం గ్రామానికి చెందిన కంఠంరెడ్డి శ్రీనివాస్ ఆయిల్ తీస్తుండగా గుర్తించామన్నారు. అక్రమంగా డీజిల్ అమ్మినా కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరమని, వారికి తెలియజేసి వారిపై కేసు నమోదు చేశామన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ 28 తులాలు వెండి, నగదు తస్కరణ అనకాపల్లి: మండలంలో మామిడిపాలెం గ్రామానికి చెందిన నంబారు వెంకటరమణ గృహంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. 28 తులాల వెండి, రూ.1500 ఎత్తుకుపోయినట్లు రూరల్ పోలీస్లకు ఫిర్యాదు అందింది. హెచ్సీ కొండయ్య వివరాలు మేరకు... బాధితుడు వెంకటరమణ శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. సాయంత్రం తిరిగివచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులుగొట్టి బీరువాలోని 28 తులాలు వెండి, రూ.1500 మాయమైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. -
వరుస దొంగతనాలతో జనం బెంబేలు
అనకాపల్లి టౌన్ : పట్టణంలో మండలంలో వరుస దొంగతనాలలో ప్రజలు బెంబేలెత్తున్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న దొంగతనాలు అటు పోలీసులకు, ఇటు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో ఎక్కువగా తీర్థయాత్రలకు, బందువుల ఇళ్లకు కుటుంబమంతా వెళుతుంటారు. దీనినే ఆసరాగా చేసుకొని దొంగలు తమ పని కానిచేస్తున్నారు. పగలు రెక్కి, రాత్రి చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లను ఎంచుకొని నగదు, బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నా మండల ప్రాంతాలలో చాలా ప్రదేశాలలో సీసీ కెమెరాలు లేవు. ఒకే రోజు మూడు దొంగతనాలు.. మూడు రోజుల క్రితం జాతీయ రహదారికి ఆనుకొని ఒకే రోజు మూడు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కొండ కొప్పాక గ్రామంలో రిటైర్డ్ డాక్యార్డ్ ఉద్యోగి కుటుంబసభ్యులతో ఉంటున్నారు. వీరి బంధువులకు బాగోలేదని ఇంటికి తాళం వేసి కూర్మన్నపాలెం వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి తులం పావు బంగారు వస్తువులు, ఐదు వేల నగదు అపహరించారు. ఈ ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంటి యజమాని కూడా హైదరాబాద్ వెళ్లడంతో ఆ ఇంట్లో కూడా దొంగలు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న రెండు కేజీల వెండి, లక్ష రూపాయల నగదు దోచుకెళ్లారు. జాతీయ రహదారి ఎన్జీఓ కాలనీ సాయినగర్ ఒక ఇంటి వెనక కిటికీ పగులగొట్టి ల్యాప్ట్యాప్, కారు తాళాలు, బ్యాగ్ను అపహరించారు. ఇలా ఒకే రోజు మూడు దొంగతాలు జరగడంతో జనం బెంబేలెత్తారు. పోలీసులు నిఘా పెంచి చోరీలను అరికట్టాలని కోరుతున్నారు. వేసవి సెలవులకు వెళ్లిన వారి ఇళ్లే టార్గెట్ రాత్రి గస్తీ అంతంత మాత్రం ఊళ్లకు వెళితే సమాచారం ఇవ్వండి వేసవి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్ళిన వారు ఇంటిలో విలువైన వస్తువులు ఉంచరాదు. మందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి రిక్వెస్ట్ లెటర్ ఇస్తే ఇంటిలో ఎల్హెచ్ఎమ్ఎస్ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) ఏర్పాటు చేస్తాం. దీనివలన యజమాని సెల్ ద్వారా ఇంటిని చూసుకొనే వీలు ఉంటుంది. అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా పోలీసులు పర్యవేక్షిస్తుంటారు. ఒక వేళ అత్యవసరం మీద వెళ్లిన వారు కూడా పోలీసులకు తెలియపరిస్తే డే అండ్ నైట్ బీట్లను ఏర్పాటు చేస్తాం. – అల్లు వెంకటేశ్వరావు, పట్టణ ఎస్ఐ, క్రైం -
యువకుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం
అచ్యుతాపురం రూరల్ : మండల కేంద్రమైన అచ్యుతాపురంలో ఫ్లై–ఓవర్ నిర్మాణానికి రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన బారికేడ్ (ఇనుప రేకు) బైక్పై వెళ్తున్న ఒక యువకునిపై ఒక్కసారిగా పడడంతో బైక్తోపాటు రోడ్డుపై ఆ యువకుడు పడిపోయాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న భారీ టిప్పర్ లారీ ఒక్క క్షణం ఆలస్యంగా రావడంతో ప్రాణాలు దక్కించుకోగలిగాడని ఆ యువకునితో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫ్లై–ఓవర్ పనుల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుంటే అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజూ వేలాది వాహనాలు రాకపోకలు చేసే సెజ్ పూడిమడక రహదారిలో ట్రాఫిక్ నియంత్రణ సరిలేని కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేయకుండా వేలాది వాహనాలకు పూడిమడక రోడ్డు ఒక్కటే దిక్కవడంతో అచ్యుతాపురం గ్రామస్తులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోడ్డుపై వెళ్లడానికి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. -
ఆస్పత్రి ఆవరణలో హిజ్రా మృతి
కొయ్యూరు: మండలంలోని డౌనూరు ఆస్పత్రిలో హిజ్రా పులి కుమారస్వామి అలియాస్ ఆకాంక్ష(23) మృతిపై పోలీసులు శనివారం విచారణ చేపట్టారు. గొలుగొండ మండలం జోగంపేటకు చెందిన ఆకాంక్ష కొద్ది రోజుల నుంచి డౌనూరులో ఉంటోంది. ఆమె ఇక్కడ ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద రీతిలో మరణించారు. శనివారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన వైద్యురాలు లలిత వెంటనే కొయ్యూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వెంకటరమణ, ఎస్ఐ కిశోర్వర్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె మరణానికి డీహైడ్రేషన్ కారణం కావచ్చని అంచనాకు వచ్చారు. కారణం తెలియని మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. శుక్రవారం ఆకాంక్ష కడుపుమంటగా ఉందని డౌనూరు ఆస్పత్రికి వచ్చి గ్యాస్ట్రిక్కు సంబంధించిన రెంటాడిన్ ఇంజక్షన్ చేయించుకున్నారని తెలిపారు. తర్వాత సంతలోకి వెళ్లిపోయారన్నారు. దీని తర్వాత ఆమె అదే రోజు రాత్రి ఆస్పత్రి ఆవరణలో రోగులు కూర్చునే బల్లపై ఉండిపోయారన్నారు. శరీరం డీహైడ్రేషన్కు గురై అర్ధరాత్రి సమయంలో మరణించి ఉంటారని భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని చెప్పారు. కాగా పాడేరు నుంచి క్లూస్ టీం వచ్చి సంఘటన స్థలంలో పరిశీలించింది.కారణం తెలియని మృతిగా కేసు నమోదు -
వివాహేతర బంధానికి అడ్డని అంతం చేశారు
పిఠాపురం : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తాళి కట్టిన భర్తను ప్రియుడితో కలసి అతి కిరాతకంగా సర్జికల్ బ్లేడుతో హత్య చేసింది ఆమె. మార్చి మూడో తేదీన గొల్లప్రోలు మండలం చేబ్రోలులో 216 జాతీయ రహదారి పక్కన లభ్యమైన వ్యక్తి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కత్తిపూడి–కాకినాడ జాతీయ రహదారి పక్కన కల్వర్టు వద్ద పంట బోదెలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో పోలీసులు గుర్తించారు. చేబ్రోలు వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ మృతదేహంపై గాయాలు ఉండడంతో సీఐ జి.శ్రీనివాస్ హత్య కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షణలో ఎస్డీపీఓ దేవరాజ్ మనీష్ పాటిల్ మార్గదర్శకంలో సర్కిల్ ఎస్ఐలు నాలుగు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారన్నారు. రాష్ట్రంతో పాటు, సరిహద్దు రాష్ట్రాల మిస్సింగ్ కేసుల డేటా, హైవే సీసీ కెమెరా ఫుటేజీ, టోల్ ప్లాజా, సెల్ టవర్ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 28న అనకాపల్లి జిల్లా యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసుపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. అక్కడి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వ్యక్తి వివరాలతో ఇక్కడి లభ్యమైన మృతదేహం వివరాలు పోలి ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడు ధర్మవరం ప్రాంతానికి చెందిన తంగిళ్ల లోవరాజుగా గుర్తించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన అతని భార్య శ్యామల, భర్త బంధువు అయిన మోహన్కుమార్తో వివాహేతర సంబంధం నెరపుతూ తమకు అడ్డంగా ఉన్న భర్తను తొలగించాలని భావించింది. పథకం ప్రకారం ప్రియుడు మోహన్కుమార్, అతని స్నేహితుడు గంగాధర్, ముగ్గురూ కలిసి గత ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి లోవరాజును హత్య చేసి మృతదేహాన్ని చేబ్రోలు హైవే వద్ద పడవేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. హత్య చేయడానికి రెండు సర్జికల్ బ్లేడ్లను సిద్ధం చేసుకుని, పిల్లలు పడుకున్నాక మోహన్కుమార్, గంగాధర్ ఇంటిలోకి ప్రవేశించి లోవరాజుపై దాడి చేసి బ్లేడ్లతో పీకకోసి, గుండెల్లో పొడిచినట్టు పోలీసులు తెలిపారు. రాంబాబు అరవడానికి ప్రయత్నించగా నోట్లో గుడ్డలు కుక్కేసారని, అప్పటికీ లోవరాజు చనిపోకపోవడంతో కాలి చీలమండ కోసి రక్తం పోయేలా చేసి హత్య చేసినట్టు ఎస్పీ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కారులో తమకు పరిచయం ఉన్న ప్రాంతమైన చేబ్రోలు హైవే పక్కన పడేసి పరారయ్యారన్నారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ జి. శ్రీనివాస్, ఎస్ఐ ఎన్.రామకృష్ణ, ఎస్ఐటీ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రియుడు, అతని స్నేహితుడితో కలసి భార్య ఘాతుకం చేబ్రోలు హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుల అరెస్టు, కారు స్వాధీనం వివరాలు వెల్లడించినఎస్పీ బిందుమాధవ్ -
అమ్మ హెల్పింగ్ హార్ట్స్కు పురస్కారం
బుచ్చెయ్యపేట : వడ్డాదికి చెందిన అమ్మ హెల్పింగ్ హార్ట్స్ సేవా సంస్థకు యంగ్ ఇండియన్ సేవా పురస్కారం అవార్డు లభించింది. వడ్డాదికి చెందిన అమ్మ హెల్పింగ్ హార్ట్స్ గత 16 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయమే కాక ఆపదలో ఉన్న వేలాది మందికి రక్తదానం చేసి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఇప్పటి వరకు పలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది యూనిట్లు రక్తాన్ని సేకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతను చైతన్య పరుస్తూ,యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగేలా పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న అమ్మ హెల్పింగ్ హార్ట్స్ సంస్థ సేవలకు గాను తెలంగాణ ప్రాంతానికి చెందిన భద్రాది యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వారు ఈ అవార్డును ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి చేతుల మీదుగా యంగ్ ఇండియన్ బ్లడ్ ఓనర్స్ క్లబ్ సభ్యులు అమ్మ హెల్పింగ్ హార్ట్స్ సభ్యులకు ఈ అవార్డును అందించారు. -
భూ సేకరణకు రైతులతో ఆర్డీఓ సమావేశం
అచ్యుతాపురం రూరల్ : దొప్పెర్ల గ్రామంలో శనివారం అనకాపల్లి ఆర్డీఓ షేక్ ఆయీషా భూ–సేకరణ విషయమై రైతులతో సమావేశమయ్యారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం తమకు ఎటువంటి ముందస్తు నోటీసులు కానీ సమాచారం లేకుండా సుమారు 13 ఎకరాల జిరాయితీ భూమి బార్క్ పరిశ్రమకు రిజిస్ట్రేషన్ చేయాలన్నారని రైతులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో మీ భూమి ఎంతైతే ఉందో దానికి వెల కట్టి రేటు నిర్ణయిస్తామన్నారని రైతులన్నారు. ఇదంతా ఒకవైపే మాట్లాడుతున్నారే తప్ప అసలు రైతు అభిప్రాయం ఏమిటని అడగలేదని రైతులు ఆవేదన చెందారు. సర్వే నంబర్లు 157, 158, 161, 162, 163గల జిరాయితీ భూమి ప్రభుత్వానికి కాకుండా బార్క్ పరిశ్రమకు ఇవ్వాలనడం ఏమిటని రైతులు ఆలోచనలో పడ్డారు. భూమి ప్రభుత్వానికి కాకుండా బార్క్ ఇవ్వాలని చెప్పడానికి అధికారులు రావడం ఏమిటని రైతులూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకవేళ భూమి ప్రభుత్వానికి అవసరమై తీసుకున్నట్టయితే రైతుల డిమాండ్ ప్రకారం డీ–పట్టాకై తే ఎకరా రూ.60లక్షలు, జిరాయితీ భూమికి రూ.2 కోట్లు, ఆర్ కార్డులు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్, ఇంటి స్థలాలతో ఒప్పందానికి చర్చలు జరిపి రైతులందరి అంగీకారంతో ప్రభుత్వానికి ఇస్తామన్నారు. ప్రజలకు అధికారులు సరైన అవగాహన కల్పించకుంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని రైతులన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వరహాలు, ఆర్ఐ ఈశ్వర్, మండల సర్వేయర్ రాధ, దొప్పెర్ల ఎంపీటీసీ పల్లి వెంకటరావు, రైతులు పల్లి శేషగిరిరావు, కొల్లి వరహాలరావు, కొల్లి సన్నిబాబు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం
చోడవరం: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని, ఆ పార్టీ నాయకులు దందాలు చేసుకోవడానికే అధికారం పనికొచ్చిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ అన్నారు.పార్టీ స్థానిక కా ర్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లి వయా చోడవరం, నర్సీపట్నం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుచేసినప్పటికీ అప్పటి కాంట్రాక్టర్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో పనులు పూర్తిస్థాయిలో చేయలేదని చెప్పారు. ఎన్నికల్లో ఇదే రోడ్డును అస్త్రంగా వాడుకొని గెలిచిన ఆపార్టీ నాయకులు ఇప్పుడు ఎందుకు ఈ రోడ్డు బాగుచేయడానికి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు.రోలుగుంట మండలంలో క్వారీల వద్ద టీడీపీ నాయకులు దందాలకు పాల్పడుతున్నారని, టన్నుకి రూ.200 చొప్పు న అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 5వతేదీన నిర్వహించనున్న వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీనిమరింత బలోపేతం చేసే దిశగా చర్చించడంతోపాటు కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఈసమావేశంలో పార్టీ జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, రైతు విభాగం అధ్యక్షుడు బొడ్డేడ సూర్యనారాయణ, ఎంపీపీలు గాడి కాసు, శ్రీనివాసరావు వైస్ ఎంపీపీలు దొండా నారాయణ మూర్తి, శరగడం నాగేశ్వరరావు, డీఆర్యూసీ సభ్యు డు బొడ్డు శ్రీరామ్మూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాఽథ్ -
మాతృ మరణాలకు కారణమయ్యే ప్రైవేట్ ఆస్పత్రులపై కేసులు
తుమ్మపాల: నిర్లక్ష్యంగా వ్యవహరించి, మాతృ మరణాలకు కారణమవుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మాతాశిశు మరణాలపై కలెక్టరేట్లో శనివారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. గత త్రైమాసికంలో సంభవించిన నాలుగు మాతృ, 29 శిశు మరణాలకు గల కారణాలను కేసుల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సరైన వైద్యం అందించకుండా మరణాలకు కారణమవుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అనుమతులు, అర్హత కలిగిన డాక్టర్లు లేకుండా వైద్యం చేసి మాతృ మరణానికి కారణమైన విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో గల శ్రీ సూర్య ఆస్పత్రి, పిల్లల కోసం వెళ్లిన వారికి చివరి వరకు వైద్యం చేసి అత్యవసర సమయంలో వైద్యం అందించకుండా బాధ్యతారహితంగా కేజీహెచ్కు రిఫర్ చేసిన ఆరాధ్య సంతాన సాఫల్య కేంద్రంపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సంఘటనలు జరిగి నెలలు కావస్తున్నా సంబంధిత ఆస్పత్రులపై నివేదికలు రూపొందించడంలో నిర్లక్ష్యం వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేట మండలం తురకలపూడి గ్రామానికి చెందిన బంగారి లావణ్య జ్వరం, వాంతులతో బాధపడుతూ విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో గల శ్రీ సూర్య ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం అత్యవసర పరిస్థితి ఏర్పడితే మెడికవర్ ఆస్పత్రికి రిఫర్ చేయగా వారు కేజీహెచ్కు రిఫర్ చేశారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె మరణించినట్టు కలెక్టర్ తెలిపారు. మాకవరపాలెంకు చెందిన గన్ని లక్ష్మి విశాఖపట్నంలో గల ఆరాధ్య సంతాన సాఫల్య కేంద్రంలో పిల్లల కోసం వైద్యం చేయించుకోగా, ఎనిమిదవ నెలలో కడుపులో బిడ్డ చనిపోయిన అత్యవసర పరిస్థితుల్లో కేజీహెచ్కు రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ మరణించినట్టు తెలిపారు. శ్రీరాంపురం పీహెచ్సీ పరిధిలో పాల్మన్పేట గ్రామంలో ఒడిశాకు చెందిన మడద లావణ్య హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ గీతం ఆస్పత్రిలో 19 రోజులు చికిత్స పొందిన అనంతరం కేజీహెచ్కు రిఫర్ చేయగా ఆమె కూడా మరణించినట్టు తెలిపారు. నక్కపల్లి పీహెచ్సీ పరిధి చినగుములూరుకు చెందిన సయ్యద్ మహబున్నిషా ప్రసవం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చేరగా అకస్మాత్తుగా పరిస్థితి విషమించి మరణించినట్టు కలెక్టర్ తెలిపారు. వైద్యులు సేవాదృక్పథంతో ప్రజలకు సేవలందించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.శాంతిప్రభ, డీసీహెచ్ఎస్. ఎస్. శ్రీనివాసరావు, డీఐవో కె.చంద్రశేఖర్, శ్రీ సూర్య ఆస్పత్రి, మెడికవర్, ఆరాధ్య సంతాన సాఫల్య కేంద్రం, గీతం ఆస్పత్రి ప్రతినిధులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. విశాఖలోని శ్రీ సూర్య ఆస్పత్రి, ఆరాధ్య సంతాన సాఫల్య కేంద్రంపై కేసులు నమోదుకు కలెక్టర్ ఆదేశం -
ఈదురు గాలులు.. వర్ష బీభత్సం
నక్కపల్లి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పెద్ద సంఖ్యలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మండల కేంద్రం నక్కపల్లితో పాటు ఉపమాక,సారిపల్లిపాలెం, బోదిగళం,మనబానవానిపాలెం, అప్పలపాయకరావుపేట తదితర ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో కూలిపోయి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.విద్యుత్ వైర్లు, స్తంభాలు రోడ్డుపైన, ఇళ్లపైన పడిపోవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. నక్కపల్లిలో ఉపమాక రోడ్డు, బండారుపేట, కొత్తపేట, రాజీవ్నగర్ కాలనీ,వీవర్స్ కాలనీ, ఎస్సీ కాలనీ,రెల్లి వీధి,ఎన్టీఆర్ బొదిగళ్లంరోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారు 30 స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎంబీస్వీచ్ కండక్టర్లు సైతం విరిగిపోయాయి.జాతీయ రహదారిపై ఉపమాక రోడ్డు ఆర్చి ఎదురుగా కండక్టర్ తెగిరోడ్డుపై పడడంతో వాహనాలు నిలిచిపోయాయి.ట్రాన్స్కో సిబ్బంది స్థానికులు సాయంతో వైర్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.ట్రాన్స్కోకు లక్షల్లో నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.ఉపమాక సబ్ స్టేషన్ నుంచి పలు గ్రామాలకు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆదివారం సాయంత్రానికి మరమ్మతులు చేపట్టి విద్యుత్ పునరుద్ధరణ చేసే అవకాశం ఉందని ట్రాన్స్ కో సిబ్బంది తెలిపారు.ప్రస్తుతం నక్కపల్లి పట్టణం అంధకారంలో ఉంది. యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణం,మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఏటికొప్పాక,పద్మనాభరాజుపేటల్లో అరటి పంటకు నష్టం వాటిల్లింది.ఫ్లెక్సీలు చిరిగి ఎగిరిపోయాయి.పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి.ఉరుములు,మెరుపులతో కురిసిన వర్షానికి ప్రజలు బెంబేలెత్తిపోయారు.యలమంచిలి పట్టణంలో పలు ప్రధాన వీధిరోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.మురుగుకాల్వలు పూడుకుపోవడం,సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే రహదారులు జలమయమవుతున్నాయి. రేగుపాలెం ముస్లిం కాలనీలో ఓ ఇంటి ముందుభాగం కూలింది. కూలిన ఇంటిని గ్రామ సర్పంచ్ రాజాన మహాలక్ష్మి,పంచాయతీ కార్యదర్శి రవి పరిశీలించారు. గాలివాన బీభత్సంతో యలమంచిలి పట్టణం సహా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కోటవురట్ల: మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో సుమారు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయం మెయిన్రోడ్డులో వర్షం కారణంగా భారీగా నీరు నిలిచిపోయింది. కై లాసపట్నంలో ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా గ్రామానికి చెందిన పేద వృద్ధ దంపతులు కుందూరు అప్పన్న, వెన్నెలమ్మలకు చెందిన పెంకుటిల్లు నేలకూలింది. కుందూరు నాగేశ్వరరావుకు చెందిన పెంకుటిల్లు పైకప్పు కొంత మేర కూలిపోయింది. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వృద్ధ దంపతులు కోరారు. మాడుగుల రూరల్ : మండలంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కె.జె.పురం జంక్షన్, ఎం.కోడూరు, వీరవల్లి అగ్రహారం తదితర ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కె.జె.పురం– దబ్బకుంటు రహదారిలో పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. కె.జె.పురం జంక్షన్లో తాటి చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఘాట్రోడ్డు జంక్షన్ దాటిన తర్వాత పాడేరు వెళ్లే రహదారిలో రెండు చెట్లు నేలకొరిగాయి. స్థానిక ఎంపీపీ టి.వి.రాజారామ్ పర్యవేక్షించి, చెట్లను తొలగించారు. కశింకోట: మండలం కేంద్రం కశింకోటలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రోడ్డు గవరపేట, గాడివీధి, స్టేట్ బ్యాంకు, పూసర్ల వీధి ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ ఉండిపోయింది.ఆర్టీసీ బస్ స్టేషన్లో గోతుల్లో భారీగా నీరు చేరింది. ఈదురు గాలుల వల్ల మామిడి కాయ లు రాలిపోయాయి. అరటి చెట్లు కూలిపోవడంతో రైతులు నష్టపోయారు. నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు విద్యుత్ సరఫరాకు అంతరాయం -
శెట్టిపాలెంలో కాఫీ పొడి తయారీ కేంద్రం
● స్థలాన్ని పరిశీలించిన గిరిజన కార్పొరేషన్ ఎండీ కల్పనాకుమారిమాకవరపాలెం: మండలంలోని శెట్టిపాలెంలో కాఫీపొడి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. గిరిజన కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న ఈ కేంద్రం కోసం గ్రామంలోని సర్వే నంబర్లు 108, 109లలో ఉన్న 12 ఎకరాల డి–పట్టాభూములను ఎంపిక చేశారు. ఈ భూములను గిరిజన కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులతో కలసి శనివారం పరిశీలించారు. మ్యాప్, రికార్డులను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, ఆదేశాలు రాగానే నిర్మాణం చేపడతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, ఇన్చార్జ్ తహసీల్దార్ రామారావు, శెట్టిపాలెం సర్పంచ్ అల్లు రామునాయుడు పాల్గొన్నారు. -
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
నర్సీపట్నం: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ప్రభుత్వం కొలువుతీరి ఏడాది కావస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలుకు నోచుకోలేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వచ్చేనెల 4వ తేదీన నర్సీపట్నంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ర్యాలీకి అనుమతి కోరుతూ పార్టీ నాయకులతో కలిసి ఆయన డీఎస్పీ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సారసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలతో మరింత మేలు చేకూరుతుందని ప్రజలు నమ్మి కూటమి ప్రభు త్వాన్ని గెలిపించి మోసపోయారని తెలిపారు. సూపర్సిక్స్లో ఒక్క పథకం కూడా అమలు కాలేదన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో నిరుద్యోగులు 10 వేల మంది ఉన్నారని, వీరందరికీ రూ. 3 వేల చొప్పున ఏడాదికి రూ.36 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి ఏడాది రూ.15వేల చొప్పున మొత్తం రూ.60.43 కోట్లు చెల్లించాలన్నారు. నియోజకవర్గంలో 42 వేల మందికి రైతు భరోసా పథకం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందజేసి ఆదుకుందన్నారు. కూటమి ప్రభుత్వం రూ. 84 కోట్లు రైతులకు అందించాల్సి ఉందని చెప్పారు. మహాశక్తి పథకంలో 19 నుంచి 59 వయస్సు కలిగిన మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ప్రకటించారని, నియోజకవర్గంలోని 90 వేల మంది మహిళలకు రూ.162 కోట్లు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. ఉచిత సిలెండర్ల పథకాన్ని అటకెక్కించారని ఆరోపించారు. ఈ ఏడాదిలో ఒక్క సిలిండర్కు మాత్రమే నగదు చెల్లించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 50 ఏళ్లు కలిగిన వారు 21 వేలు మంది ఉన్నారని, వీరందరికీ నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి సుమారు రూ.వంద కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఉచిత బస్సు ఊసేలేదన్నారు. అన్ని విధాలా ప్రజల ను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరి పించేందుకు శాంతియుత ర్యాలీ నిర్వహించను న్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎస్పీని కలిసిన వారిలో మున్సిపల్ వైస్చైర్మన్ తమరాన అప్పలనాయుడు, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, ఎంపీపీ సాగిన లక్ష్మణ్మూర్తి, మాజీఎంపీపీ రుత్తల సత్యనారాయణ, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, మాకవపాలెం, గొలుగొండ, మాకవరపాలెం మండల అధ్యక్షులు చిటికెల రమణ, లెక్కల సత్యనారాయణ, చిటికెల వెంకటరమణ, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వచ్చేనెల 4న శాంతియుత నిరసన ర్యాలీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డీఎస్పీకి వినతిపత్రం అందజేత -
లారీకి రూ.10 వేలు!
10వ తేదీలోగా పంపించాల్సిందే.. ● లేదంటే కేసులు పెడతామని హెచ్చరిక రవాణాశాఖకు సంబంధం లేని వ్యక్తి నేరుగా బెదిరింపులు డిపార్ట్మెంట్ అంటూకార్యాలయంలోనే తిష్ట సంచలనంగా ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలకు పంపిన ఆడియో సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ఈ నెల 10వ తేదీలోగా నా వద్దకు వచ్చి.. కన్ఫర్మ్ చేసుకోండి. 10వ తేదీన జాబితా సిద్ధమవుతుంది. 11వ తేదీ నుంచి ఎవరైనా పట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఫోన్ పేలు ఎవరూ చేయవద్దు’ అంటూ అనకాపల్లి జిల్లాలో అధిక లోడుతో వెళుతున్న, అనుమతి లేని వాహనాల విషయంలో వసూళ్లకు సంబంధించిన ఆడియో మెసేజ్. ఈ ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. అసలు ఏ శాఖకు సంబంధం లేని ఓ వ్యక్తి ధైర్యంగా ఆడియో మెసేజ్ ట్రాన్స్పోర్టు యాజమాన్యాలకు పంపి వసూళ్లకు తెగబడుతున్నాడంటే.. సదరు వ్యక్తికి ఎంతమేర అధికారుల నుంచి అండదండలున్నాయో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రతి నెలా లారీకి ఇంత చొప్పున అటు మైనింగ్, ఇటు ఫ్లైయాష్.. అంతేకాకుండా సెజ్లకు వెళ్లే బస్సుల యాజమాన్యాలు రవాణాశాఖ అధికారులకు పైకం చెల్లించాల్సిందే. లేకుంటే దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ వ్యవహారమంతా ఒక ప్రైవేటు వ్యక్తి ద్వారా రవాణాశాఖ అధికారులు నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి. అనకాపల్లిలో ఉంటున్న పార్థసారధి అనే వ్యక్తి ఈ ఆడియో మెసేజ్ పంపినట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తే రవాణాశాఖ అధికారులకు జిల్లా మొత్తం నుంచి వసూలు చేసి వాటాలు పంపుతున్నట్టు విమర్శలున్నాయి. రవాణాశాఖకు సంబంధం లేని సదరు వ్యక్తి.. ఎప్పటికప్పుడు రవాణాశాఖ కార్యాలయంలోనే తిష్టవేసి ఉంటున్నారని కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ యజమాన్యాలకు నేరుగా బెదిరింపులకు దిగుతున్నట్టు ఆరోపణలున్నాయి. మొత్తంగా ప్రతి నెలా రూ.కోటిన్నర మేర వసూలు చేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. అటువంటిదేమీ లేదు ఈ ఆడియోకు మా శాఖకు సంబంధం లేదు. ఎవరు పంపారో తెలియదు. అధిక లోడు, అక్రమంగా రవాణాపై మేం ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నాం. ఏప్రిల్ నెలలో 85 కేసులు రాశాం. తద్వారా అపరాధ రుసుం రూ.65 లక్షల వరకూ విధించాం. అక్రమ రవాణాపై చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. – మనోహర్, జిల్లా రవాణాశాఖ అధికారి ఇదీ వసూళ్ల లెక్క...! అనకాపల్లి జిల్లాలో సెజ్లకు ప్రతి రోజూ వందల సంఖ్యలో బస్సులు తిరుగుతుంటాయి. ఇక మైనింగ్ కూడా జోరుగా సాగుతోంది. ఈ మైనింగ్ లారీలు కూడా వందల్లో తిరుగుతున్నాయి. మరోవైపు రాంబిల్లి వద్ద నిర్మిస్తున్న నావికాదళ స్థావర పనులు సాగుతున్నాయి. ఈ పనులకు కూడా లారీలు బండరాళ్లు తరలిస్తుంటాయి. సింహాద్రి ఎన్టీపీసీకి ప్రతి రోజూ బొగ్గు లారీలతో పాటు అక్కడి నుంచి ఫ్లైయాష్ను తీసుకెళ్లే లారీలు కూడా పగలు, రాత్రీ తేడా లేకుండా తిరుగుతుంటాయి. ఇవన్నీ కూడా నిర్ణీత పరిమితి మేర లోడ్ను తీసుకుని చక్కర్లు కొట్టడం లేదు. ప్రతి వాహనం కూడా అధిక లోడుతోనే వెళుతున్నాయి. ఇదే వసూళ్లకు కేంద్రంగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ విధంగా రాంబిల్లికి నావికాదళ పనుల కోసం ప్రతి రోజూ 800 ట్రిప్పుల మేర బండరాళ్లను తీసుకెళుతున్నాయి. 800 ట్రిప్పుల నుంచి ప్రతీ నెలా రూ. 10 వేల చొప్పున రూ. 80 లక్షల మేర వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సెజ్లకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులను తరలించే వాహనాల నుంచి రూ. 2 వేల నుంచి రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇవి రూ.20 లక్షల వరకూ ఉంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్టీపీసీకి వెళ్లే బొగ్గు లారీలు.. అక్కడి నుంచి ఫ్లై యాష్ తీసుకొచ్చే లారీల నుంచి కూడా రూ.8 వేల చొప్పున ప్రతి నెలా వసూలు చేస్తున్నారు. ఇవి మరో రూ.50 లక్షల మేర ఉంటున్నట్టు సమాచారం. ఈ విధంగా వసూలు మొత్తం ప్రతీ నెలా రూ.1.5 కోట్ల మేర ఉంటుందని అంచనా. ఈ మొత్తం వ్యవహారాన్ని సదరు శాఖకు సంబంధం లేని వ్యక్తి చేస్తున్నారనే బహిరంగ విమర్శలున్నాయి. ఎవరైనా పార్థసారధి అడిగిన మేర ఇవ్వకపోతే అధికలోడుతో వాహనాలు వెళుతున్నాయని వెంటనే కేసులు నమోదవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. -
అన్నదాన సత్రం కూల్చివేతను అడ్డుకున్న భక్తులు
మాడుగుల రూరల్: మండలంలో కె.జె.పురం జంక్షన్లో సంతోషిమాత అన్నదాన సత్రం కూల్చి వేయడానికి పొక్లెయిన్తో వచ్చిన అధికారులను ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల అమ్మతల్లినాయుడు, భక్తులు శుక్రవారం అడ్డుకున్నారు. ఇక్కడ దాతల సహకారంతో ఫిబ్రవరిలో నూతన అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఆర్అండ్బీ స్థలంలో నిర్మించారని స్థానిక కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రాపేట రామకొండలరావు మార్చిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆర్అండ్బీ జేఈ సాయి శ్రీనివాస్ సూచనలతో పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి నవీన్దొర ఆలయ కమిటీ చైర్మన్కు నోటీసులు జారీ చేశారు. గత నెల 29వ తేదీలోపు ఆక్రమణలు తొలగించాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఆర్అండ్బీ జేఈ సాయి శ్రీనివాస్, ఎస్ఐ జి.నారాయణరావు, వారి సిబ్బందితోపాటు పంచాయతీ ఇన్చార్జి కార్యదర్శి, ఇతర సిబ్బంది పొక్లెయిన్తో వచ్చి ఆక్రమణలు తొలగించడానికి సిద్ధమయ్యారు. దీంతో అమ్మతల్లినాయుడు, భక్తులు ఆక్రమణలను తొలగించవద్దని అడ్డుకున్నారు. రోజూ ఎంతో మందికి అన్నదానం చేస్తున్నామని, అటువంటి దాన్ని తొలగించడం అన్యాయమని వాపోయారు. విశ్రాంత ఉపాధ్యాయుడు రామకొండలరావు ఇల్లు ఆర్అండ్బీ స్థలంలో నిర్మించారని, తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
నర్సీపట్నం: కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, గొలుగొండ, నర్సీపట్నం ఎస్సైలు రామారావు, రాజారావు, సిబ్బంది గొలుగొండ మండలం పాలకలపాడు గ్రామ శివారులో మాటు వేశారు. మారుతి ఎర్టిగా కారులో గంజాయి తీసుకొస్తుండగా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులను గమనించిన స్మగ్లర్లు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వెంటపడి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారయ్యారు. జీకే వీధి మండలం ధారకొండ పంచాయతీ దబ్బకోట గ్రామానికి కర్రి అప్పన్న(27), కర్రి రాజు(36), కర్రి దార(21)లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కారు డోర్ అరలో అర కిలో, కిలో చొప్పున 50 కిలోల గంజాయి ప్యాకెట్లను అమర్చి రవాణా చేస్తున్నారు. సిబ్బంది చాకచక్కంగా వ్యవహరించి పట్టుకున్నారు. దీని విలువ రూ.2.5 లక్షలుగా అంచనా వేశారు. ఒడిశాలోని జనపాయ గ్రామం వద్ద గంజాయి కొనుగోలు చేసి తుని తరలిస్తుండగా పట్టుబడ్డారు. కిలో రూ.5 వేలకు కొని ఇతర రాష్ట్రాల్లో రూ.25 వేలకు అమ్ముతున్నారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. గంజాయిని పట్టుకునేందుకు రిస్క్ చేసిన సిబ్బంది చిన్నారావు, బాబ్జి, త్రిమూర్తులు, సాయి, సురేష్లను అభినందించి, నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. మరొకరు పరారీ రూ.2.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం -
నూకాంబిక సేవలోప్రిన్సిపల్ సెక్రటరీ
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవర పాలెం నూకాంబిక అమ్మవారిని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ ఈ ఏడాది అమ్మవారి జాతరను రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శోభారాణి ప్రిన్సిపల్ సెక్రటరీని శాలువాతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగ శ్రీను(గొల్లబాబు), ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
బిక్కవోలు: అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు, నగలు, వస్తువు స్వాధీనం చేసుకున్నట్టు ఈస్ట్జోన్ ఇన్చార్జి డీఎస్పీ ఎం.భవ్యకిషోర్ తెలిపారు. శుక్రవారం ఆమె తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు పోలీస్ సేష్టన్ వద్ద మాట్లాడారు. ఈ ఏడాది అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తామరం గ్రామానికి చెందిన దల్లి కామిరెడ్డి, చినరాచపల్లి గ్రామానికి చెందిన కచ్చల చిరంజీవి, జంగాలపల్లి గ్రామానికి చెందిన సఖిలేటి సాయి, గిడుతూరు గ్రామానికి చెందిన వళ్లు శ్రీను జనవరి 9 తేదీన బిక్కవోలు మండలం బలభద్రపురంలో మూడు చోట్ల చోరీ యత్నం చేశారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలించిన బ్రీజా కారుపై వీరు బలభద్రపురం వచ్చారు. వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్ల చోరీతో పాటు ఏటీఎంలో దొంగతనం, నగల షాపులో చోరీ ప్రయత్నం చేశారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల సాయంతో నలుగురు ముద్దాయిల్లో ఒకరు అయిన సాయిని గుర్తించారు. అతనిని మార్చి 3వ తేదీన తుని రైల్వేస్టేషన్ వద్ద బిక్కవోలు పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యలగూడెంలో దొంగలించిన బైక్ను స్వాధీనం చేసుకొని అతనిని రిమాండ్కు పంపించారు. కచ్చల చిరంజీవి మాకవరపుపాలెం పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. మిగిలిన ఇద్దరు నిందితులు దల్లి కామిరెడ్డి, వళ్లు శ్రీనును గురువారం సాయంత్రం 4గంటలకు తుని రైల్వే స్టేషన్ వద్ద అనపర్తి సీఐ సుమంత్, ఎస్సై రవిచంద్రకుమార్ తన బృందంతో అరెస్టు చేశారు. వారిపై తూర్పుగోదావరి జిల్లాలో 3, కాకినాడ జిల్లా 11, అనకాపల్లి జిల్లా 7, ఏలూరు జిల్లా 1, శ్రీకాకుళం జిల్లా 2, విశాఖ జిల్లాలో 1 కేసులు ఉన్నాయి. వీరి నుంచి 71 గ్రాముల బంగారు వస్తువులు, 1.02 కిలోల వెండి వస్తువులు, రూ. 9,80,000 నగదుతో పాటు మూడు బైకులు, ఒక కారు, దొంగతనానికి ఉపయోగించిన వాహనాలు, గ్యాస్ కట్టర్తో పాటు రూ.41,50,000 విలువగల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రూ.41.50 లక్షల విలువ వాహనాలు, నగలు, వెండి, నగదు స్వాధీనం 25 కేసుల్లో నిందితులుగా గుర్తింపు -
హడావుడి
అతిథి గృహంలో● సర్క్యూట్ హౌస్లో రెండోరోజు విచారణ ● సింహాచలం విషాద ఘటనపై త్రిసభ్య కమిషన్ ● అర్చకుల నుంచి రెవెన్యూ సిబ్బంది వరకూ ప్రతి ఒక్కరినీ విచారించిన కమిషన్ ● మృతదేహాలు వెలికి తీసిన వారంతా సంప్రోక్షణ చేసుకోకుండానే విధుల్లోకి రావడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన అర్చకులు ● నేడు ప్రభుత్వానికి నివేదిక అందజేత సాక్షి, విశాఖపట్నం : ఊహకందని దారుణం.. సింహగిరి చరిత్రలో విషాద పేజీగా నిలిచిపోయిన చందనోత్సవం దుర్ఘటనపై ప్రాథమిక విచారణ పూర్తయింది. తొలిరోజున సింహాచలంపై సాగగా.. మలిరోజున ప్రభుత్వ అతిథి గృహం వద్ద హడావుడి కనిపించింది. అర్చకులు, వేదపండితులతో పాటు రెవెన్యూ, దేవదయ ధర్మాదాయ.. విభిన్న శాఖల అధికారులు, సిబ్బంది విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సుదీర్ఘ విచారణ సాగింది. దుర్ఘటనపై అన్ని విభాగాల నుంచి సమాచారం సేకరించిన త్రిసభ్య కమిషన్ ప్రభుత్వానికి శనివారం నివేదిక సమర్పించనుంది. సింహాచలంలో ఏటా ఒక రోజు జరిగే పవిత్ర పర్వదినం అప్పన్న నిజరూపదర్శనం.. చందనోత్సవం విషాదోత్సవంగా మారిపోయిన ఘటన నుంచి విశాఖవాసులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. దేవాలయ చరిత్రలో ఇలాంటి దురదృష్టకరమైన ఘటన జరగడం ఇదే తొలిసారి కావడంతో.. భక్తులు ఆందోళన చెందుతున్నారు. మంత్రుల నిర్లక్ష్యంతో ఏడుగురు ప్రాణాలు బలిగొన్న తర్వాత ఉలిక్కి పడిన ప్రభుత్వం.. హడావుడిగా నియమించిన త్రిసభ్య కమిషన్ రెండు రోజుల విచారణ పూర్తి చేసింది. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో.. గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టి సమగ్ర వివరాలు సేకరించింది. ఆది నుంచీ గోడ కట్టకూడదని చెప్పినా వినిపించుకోకుండా.. కట్టడం వల్లనే విషాదం చోటు చేసుకుందని అర్చకులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో.. త్రిసభ్య కమిషన్ దేవస్థాన అర్చకులను కూడా విచారించింది. మాడవీధిని ఆనుకొని రక్షణ గోడ ఉన్నప్పుడు దాని పక్కన కొత్తగా మరో గోడ కట్టడం సరికాదంటూ వైదికులు చెప్పినా పట్టించుకోలేదని కమిషన్కు చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ మహాపచారం చెయ్యడం వల్లే పెను విషాదం సంభవించిందని కూడా కమిషన్ ముందు తమ స్పందన వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మృతదేహాల వెలికితీత, శిథిలాల తొలగింపులో పాల్గొన్న సిబ్బందిని పుణ్యస్నానాలు ఆచరింపజేయకుండా, సంప్రోక్షణ చేసుకోనివ్వకుండా.. విధుల్లోకి తిరిగి చేర్చడంపైనా అర్చకులు కమిషన్ ముందు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా ప్రతి విషయంలోనూ ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరిగాయని కమిషన్కు అర్చకులు వెల్లడించారు. వరదనీటి వ్యవస్థ లేదా..? సింహాచలంలో వరద నీటిని నియంత్రించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంపై కమిషన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2018లో రూపొందించిన దేవస్థానం మాస్టర్ప్లాన్లోనూ ఈ అంశాన్ని పొందుపరచకపోవడంపై దేవస్థానం అధికారులు, వీఎంఆర్డీఏ అధికారులపైనా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండు మూడు దశాబ్దాలుగా సింహగిరిపై పడుతున్న సగటు వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని.. దానికనుగుణంగా నియంత్రించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం సరికాదని సూచించింది. కనీసం వరద నీటి నియంత్రణకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అధికారులు దృష్టి సారించకపోవడంపైనా విస్మయం చెందారు. మాస్టర్ప్లాన్లో ఉల్లంఘనలు ఉన్నట్లు కూడా ఉన్నాయని గుర్తించిన త్రిసభ్య కమిషన్... ఈ విషయంపై ఎందుకు దృష్టిసారించలేదని ఆయా శాఖల అధికారుల్ని ప్రశ్నించింది. రెండు రోజుల పాటు జరిగిన విచారణలో అన్ని శాఖల నుంచి సమగ్ర వివరాల్ని సేకరించిన కమిషన్.. శనివారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికను అనుసరించి.. ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నదానిపై నిర్ణయం తీసుకోనుంది. అయితే కేవలం చిన్న స్థాయి అధికారులపైనే ప్రతాపం చూపించి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులపై కనీస చర్యలు ఉండవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే అసలు దోషి.! ఈ ప్రమాదం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే తప్ప.. ఇంకోటి లేదన్నది ప్రతి ఒక్కరి నుంచి వినపడుతోంది. భారీస్థాయిలో భక్తులు వస్తారని, ప్రతి చందనోత్సవానికి వర్షం పడుతుందని తెలిసినా.. ఏర్పాట్లు విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు మంత్రుల కమిటీ బాధ్యతారాహిత్యం ఏడుగుర్ని పొట్టనపెట్టుకుందనీ.. వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ సీపీఎం డిమాండ్ చేస్తోంది. కేవలం.. అధికారులు, ప్రభుత్వ సిబ్బందిని బలి చెయ్యకుండా.. ఈ ప్రమాదం వెనుక ఉన్న మంత్రులపైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలంటూ ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. తప్పు మాది కాదంటే.. మాది కాదు శాఖల వారీగా విచారణ కొనసాగింది. దేవస్థాన అధికారులు, ఇంజినీర్లను తొలుత విచారించారు. గోడ నిర్మాణం, ప్రసాద్ పనుల ఆలస్యం.. మొదలైన విషయాలపై ఆరా తీశారు. అదే సమయంలో టూరిజం ఇంజినీరింగ్ అధికారులను కూడా విచారణకు హాజరవ్వమని ఆదేశించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇరు విభాగాల్ని ఒకేసారి విచారించిన కమిటీ ముందు.. గోడ నిర్మాణం, పనుల ఆలస్యం మొదలైన అంశాల్లో తప్పు మా శాఖది కాదు.. టూరిజం వాళ్లదేనని దేవస్థానం అధికారులు.. తమది కాదు.. వాళ్లదేనని టూరిజం ఇంజినీర్లు వాదించుకొని.. ఒకరిపై ఒకరు తప్పు నెట్టేసుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. దేవస్థాన ఇంజినీర్లతో పాటు టూరిజం ఇంజినీర్లది కూడా బాధ్యత ఉందని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులు కమిషన్కు నివేదించినట్లు సమాచారం. -
పుష్పయాగానికి పూలు తరలింపు
ఎంవీపీ కాలనీ (విశాఖ): తిరుపతిలోని శ్రీ కొండండరామస్వామి వారి పుష్పయాగం కోసం విశాఖ నుంచి వివిధ రకాల పూలను తరలించారు. కార్తీక దినోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన ఈ పుష్పాలను శుక్రవారం ఉదయం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్ వద్ద భక్తుల సందర్శన కోసం ఉంచారు. మహిళా భక్తులు ముందుగా పూలను అందంగా తీర్చిదిద్ది ప్యాకింగ్ చేశారు. అనంతరం సంకల్పం చేసి, శాస్త్రోక్తంగా ఈ పూలను తిరుమలకు పంపించారు. కలువలు, తామరలతో పాటు పలు రకాల పూలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్త హిమాన్షు ప్రసాద్ తెలిపారు. నగరానికి చెందిన మహిళా భక్తులు పాల్గొన్నారు. -
నేల రాలిన రైతుల ఆశలు
చోడవరం: అకాల వర్షాలతో మామిడి, జీడిమామిడి తోటల రైతుల ఆశలు ఆవిరయ్యాయి. రెండ్రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో పంట చాలా మేర దెబ్బతింది. చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో సుమారు 100 ఎకరాల్లో మామిడి, జీడిమామిడి పంటకు ఈదురుగాలుల కారణంగా నష్టం వాటిల్లింది. ఈ ఏడాది మొదట్లో పూత బాగా వచ్చినప్పటికీ వర్షాలు కురవకపోవడంతో పాటు పొగమంచు కమ్ముకుంది. మంచు వల్ల చాలా మేర పూత రాలిపోయింది. దీంతో ఆలస్యంగా పిందెలు వచ్చాయి. కనీసం ఆ పంటైనా చేతికి వస్తే పెట్టుబడులైనా దక్కుతాయని రైతులు ఆశించారు. ఇప్పుడు పక్వానికి చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షాలు మామిడి రైతులను నిండా ముంచేశాయి. గురువారం రాత్రి గాలులు వీయడంతో పక్వానికి వచ్చిన మామిడి కాయలు చాలా మేర నేలరాలిపోయాయి. తోటల్లో 20 శాతం పంట నేలరాలిపోయింది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి తోటలు లీజుకు తీసుకున్న రైతులు, సొంతంగా తోటలు కాపు కాస్తున్న వారు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలు నిండా ముంచేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి, జీడి మామిడి 100 ఎకరాల్లో పంట నష్టం -
జీవీఎంసీ నిర్వాకం.. అనధికార కట్టడం
సాక్షి, అనకాపల్లి: సామాన్యులకై తే ఒక న్యాయం.. జీవీఎంసీకై తే మరో న్యాయమా? అనుమతులు లేకుండా ఎవరైనా ఇల్లు నిర్మిస్తే అక్రమ నిర్మాణమంటూ స్వయానా జీవీఎంసీ అధికారులే కూల్చేస్తారు. మరి వారే ప్లాన్ అప్రూవల్ లేకుండా భవనం నిర్మిస్తే.. ఎవరికి చెప్పుకోవాలి? ఎవరిపై చర్యలు తీసుకోవాలి? జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలోని సుంకరమెట్ట జంక్షన్కు సమీపంలో ఎస్బీఐ కాలనీ లేఅవుట్లో జాయింట్ కలెక్టర్ నివాసముంటున్న బంగ్లా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వీఎంఆర్డీఏ లేఅవుట్లో పార్కు కోసమని 1983లో 22 సెంట్ల స్థలం కేటాయించారు. 40 ఏళ్లుగా ఉన్న ఆ స్థలంలో సుమారు రూ.1.2 కోట్లతో ఎటువంటి ప్లాన్ అప్రూవల్ లేకుండా జీవీఎంసీ ఒక బంగ్లా నిర్మించింది. అది అనకాపల్లి వచ్చినప్పుడు జీవీఎంసీ కమిషనర్ విశ్రాంతి తీసుకోవడానికి కట్టామని, ప్రస్తుతం జాయింట్ కలెక్టర్కు కేటాయించినట్లు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. అందులో ఇటీవలే జేసీ జాహ్నవి గృహప్రవేశం కూడా చేశారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన పార్కు స్థలంలో శాశ్వత నిర్మాణం ఎలా చేపట్టారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని నిర్మాణ సమయంలో సామాజిక కార్యకర్త కాండ్రేగుల వెంకటరమణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆయన ఆర్టీఐను ఆశ్రయించగా ఈ బంగ్లా నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ లేదని జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయం బదులిచ్చింది. ఈ బంగ్లా స్థలంలో యధావిధిగా పార్కు స్థలాన్ని అభివృద్ధి చేయాలని, అలా కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాన్ అప్రూవల్ లేకుండా బంగ్లా కట్టేశారు.. వీఎంఆర్డీఏ లేఅవుట్లోని 22 సెంట్ల పార్కు స్థలంలో నిర్మాణం ఆర్టీఐ దరఖాస్తుతో బట్టబయలైన ఉల్లంఘన -
విజయదశమికి నూకాంబిక నూతన ఆలయం
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణం పనులు పూర్తవుతున్నాయని, ఈ ఏడాది ఽవిజయదశమి రోజున ప్రారంభించనున్నామని దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శోభారాణి చెప్పారు. స్థానిక గవరపాలెం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అమ్మవారి కొత్త అమావాస్య నెల రోజుల జాతర అందరి సహకారంతో విజయవంతమైందన్నారు. నెలరోజులపాటు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆమె చెప్పారు. మే మాసంలో ఆదివారాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల రోజుల్లో సుమారు రూ.కోటి 16 లక్షలు ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు) మాట్లాడారు. ఆలయ ధర్మకర్తలు మజ్జి శ్రీనివాసరావు, సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర ఆనంద్, ఎర్రవరపు లక్ష్మి, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్న ఆలయంలో ఘనంగా తిరునక్షత్రం పూజలు
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విశిష్టాద్వైత స్థాపకులు భగవత్ రామానుజాచార్యుల 1008వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఏటా ఐదు రోజుల పాటు నిర్వహించే ఈ తిరునక్షత్రం పూజలు గత నెల 28న ప్రారంభమయ్యాయి. చివరి రోజైన శుక్రవారం జయంతి సందర్భంగా ఆలయ బేడామండపంలోని హంసమూలన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి, భగవత్ రామానుజాచార్యుల ఉత్సవమూర్తులతో పాటు ఆళ్వారులను వేంజింపజేశారు. అనంతరం షోడశోపచార పూజలు, విశేష హారతులు, పారాయణాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు, పారాయణదారులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రామానుజాచార్యుల తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది. -
సరుగుడు నారు.. ఇవ్వండి సారూ..
సత్వరమే ఉచితంగా ఇవ్వాలి గత ఐదేళ్లు వన నర్సరీల్లో సరుగుడు మొక్కలు పెంచి, సోషల్ ఫారెస్ట్ అధికారులు రైతులకు ఉచితంగా ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో, మే ప్రారంభంలో వర్షాలు కురవడంతో సరుగుడు నారు నాటేందుకు అనువైన పరిస్థితి నెలకొంది. దీంతో పొలంలో దుక్కులు కూడా నిర్వహించాం. వన నర్సరీల్లో సరుగుడు మొక్కలు సిద్ధంగా ఉన్నా అధికారులు పంపిణీ చేయడం లేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేవంటున్నారు. ఈ ఏడాది నర్సరీల్లో సరుగుడు నారుకు ధర నిర్ణయించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. గతంలో మాదిరిగానే ఉచితంగా సరుగుడు నారు ఇవ్వాలి. – దొగ్గ పైడంనాయుడు, రైతు, పొడుగుపాలెం ఎకరా పొలంలోసరుగుడు సాగు కొత్త అగ్రహారం గ్రామంలో గల ఎకరా పొలంలో గత ఏడాది సరుగుడు సాగును ప్రారంభించాము. వన నర్సరీలో సోషల్ ఫారెస్ట్ అధికారులు ఉచితంగా మాకు 5 వేల సరుగుడు మొక్కలను ఇచ్చారు. ఈ మొక్కలను నాటిన ఏడాదిలోగానే పంట ఆరోగ్యకరంగా ఎదిగింది. మరో మూడేళ్లలో పంట కోతదశకు చేరుకోనున్నది. పంట ప్రారంభంలోనే పెట్టుబడి ఖర్చులు అయ్యాయి. చెరకు పంటతో పోల్చితే సరుగుడుకు పెట్టుబడి చాలా తక్కువ అవుతుంది. చెరకు పంటకు సాగు ఖర్చులు పెరిగిపోవడంతోపాటు సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం సకాలంలో చెల్లింపులు జరపకపోవడం కారణంగా సరుగుడు పంటను వేయాల్సిన పరిస్థితి నెలకొంది. – యడ్ల రమణమ్మ, సరుగుడు సాగు రైతు, కొత్త అగ్రహారం ఉన్నతాధికారుల ఆదేశాలతో పంపిణీకి చర్యలు కలెక్టర్ ఆదేశాల మేరకు వన నర్సరీల్లో గల సరుగుడు మొక్కల పంపిణీని చేపట్టనున్నాం. వర్షాకాలం ప్రారంభమయ్యే జూన్ నెల నుంచి పంపిణీ చేపట్టేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. వేసవి ఉష్ణోగ్రతల కారణంగా సరుగుడు పంటకు నర్సరీల్లో ప్రతి రోజూ నీటి తడులను అందిస్తూ, మొక్క ఆరోగ్యకరంగా ఉండేటట్లు సంరక్షిస్తున్నాం. – జి.లక్ష్మణ్, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్వో ●కొత్త అగ్రహారం వన నర్సరీలో సరుగుడు నారు కె.కోటపాడు: సరుగుడు సాగుకు ఈ ఏడాది ఎప్పుడూ లేనంత ఆసక్తి పెరిగింది. చక్కెర కర్మాగారాల్లో అనుకూల పరిస్థితి లేకపోవడం, బెల్లం అమ్మకాలు కూడా మందగించడంతో ఈ ఏడాది రైతులు చెరకు బదులు సరుగుడు వైపు చూస్తున్నారు. సాధారణ పంటల సాగు ఖర్చులు పెరగడంతోపాటు మంచి మద్దతు ధర లభించకపోవడంతో కొంతకాలంగా సరుగుడు సాగుకు ఆదరణ పెరిగింది. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ లభించడంతో అందరూ ఇటే మొగ్గు చూపిస్తున్నారు. దానికి తోడు చెరకు ఎఫెక్ట్తో ఈసారి సరుగుడు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశముంది. ముఖ్యంగా కె.కోటపాడు, చీడికాడ, దేవరాపల్లి, బుచ్చెయ్యపేట, రావికమతం తదితర మండలాల్లో చెరకు పంటను సాగు చేసిన పొలాల్లో ఈ ఏడాది సరుగుడును పెంచేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. వన నర్సరీల్లో సిద్ధంగా ఉంది.. కానీ.. జిల్లాలో సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో 44 చోట్ల వన నర్సరీలు ఏర్పాటు చేశారు. ఈ వన నర్సరీల్లో సుమారు 33 లక్షల సరుగుడు నారును పెంచుతున్నారు. ఐదారు నెలల కాలం సరుగుడు నారును ఆరోగ్యకరంగా పెంచి రైతులకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. నారు ఎదిగిన తరువాత వాటిని ఎర్రమట్టి, ఎరువు వేసిన కవర్లలో ఉంచి ప్రతి రోజూ నీటి తడులను అందించి ఆరోగ్యకరంగా ఎదిగేలా చర్యలను తీసుకుంటున్నారు. ఈ వన నర్సరీల ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సన్న, చిన్నకారు రైతులతో పాటు ఉపాధి కూలీలకు ఉచితంగా సరుగుడు నారును అందించారు. ఈ ఏడాది సరుగుడు నారుకు స్వల్ప ధరను వసూలు చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. పైనుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడంతో రైతులు కోరుతున్నా సోషల్ ఫారెస్ట్ అధికారులు వన నర్సరీల్లో పెంచిన సరుగుడు నారును ఇవ్వలేకపోతున్నారు. ధర నిర్ణయించాల్సి ఉంది. వర్షాలు పడి నారు నాటాలని ఆశ పడిన రైతులు దీంతో ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇచ్చిన మాదిరీగానే ఈ ఏడాది కూడా వన నర్సరీల్లో పెంచిన సరుగుడు నారును సత్వరమే ఉచితంగా అందించాలని రైతులు కోరుతున్నారు. చెరకు పంటకు మద్దతు ధర లేకపోవడంతో సరుగుడు సాగుపై రైతుల ఆసక్తి గత ఐదేళ్లు వన నర్సరీల్లో నారు పెంచి రైతులకు ఉచితంగా అందించిన సోషల్ ఫారెస్ట్ శాఖ ఈ ఏడాది స్వల్ప ధరకు విక్రయించాలని ఉన్నతాధికారుల యోచన వారి అనుమతి కోసం ఎదురు చూస్తున్న సోషల్ ఫారెస్ట్ అధికారులు వర్షాలు కురవడంతో నారును సత్వరమే పంపిణీ చేయాలని కోరుతున్న రైతులు -
వడ్డాదిలో పశు వైద్యాధికారి కోసం నిరీక్షణ
బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాది పశువుల ఆస్పత్రి వైద్యాధికారి కోసం పాడి రైతులు శుక్రవారం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. వడ్డాదికి చెందిన గుమ్మిడి ప్రసాద్కు చెందిన గొర్రెపోతును శుక్రవారం ఉదయం కుక్కలు కరిచాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న గొర్రెను వైద్య సేవల కోసం స్థానిక ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి ఉదయం 9 గంటలకు తీసుకొచ్చారు. అప్పటికీ పశు వైద్యాధికారి విధులకు హాజరు కాలేదు. ఈలోగా పలువురు రైతులు తమ పశువులు, కుక్కలు, కోళ్లు, ఇతర మూగ జీవాలను వైద్య సేవల కోసం తీసుకొచ్చి నిరీక్షించారు. ఎట్టకేలకు ఉదయం 11.40 గంటలకు పశు వైద్యాధికారిణి విధులకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు నిరీక్షించిన రైతులు ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తరచూ విధులకు ఆలస్యంగా రావడంపై రైతులు గుమ్మిడి ప్రసాద్, గొంతిన లక్ష్మీనారాయణ, బొబ్బరి ఈశ్వరరావు తదితరులు మండిపడ్డారు. రోజూ విధులకు ఆలస్యంగా వస్తే మూగ జీవాలకు ఎలా వైద్య సేవలు అందుతాయని ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని రైతులు హెచ్చరించారు. బస్సులు సకాలంలో రాకపోవడంతో ఆలస్యమైందని వైద్యాధికారి చెప్పినా రైతులు శాంతించలేదు. సకాలంలో మూగ జీవాలకు అందని వైద్య సేవలు ఉదయం 11.40 గంటలకు వచ్చిన వైద్యాధికారిపై రైతుల ఆగ్రహం -
వృద్ధులే మనకు మార్గదర్శకులు
కశింకోట: గతానికి వర్తమానానికి వృద్ధులు వారధి లాంటి వారని, భవిష్యత్కు మార్గదర్శకులని రాష్ట్రపతి ద్రౌపది ముర్రు అన్నారు. కశింకోట మండలంలోని జి.భీమవరం గ్రామంలో పావని సొసైటీ ఫర్ ది మల్టిపుల్ హ్యాండీకాప్డ్ అండ్ స్పాస్టిక్స్ నిర్వ హించనున్న వృద్ధాశ్రమంతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ఐదు ఆశ్రమాలను శుక్రవారం రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘ఏజింగ్ విత్ డిగ్నిటీ’ కార్యక్రమం పురస్కరించుకొని రాష్ట్రపతి మీట నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎల్ఈడీ స్క్రీన్పై ప్రత్యక్షంగా వృద్ధులు, అధికారులు, స్థానికులు వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం మన దేశ సంస్కృతిలో భాగమన్నారు. నేటి పోటీతత్వం, వేగవంతమైన జీవితంలో సీనియర్ సిటిజన్ల మద్దతు, ప్రేరణ, మార్గదర్శకత్వం యువతరానికి అతి ముఖ్యమైనవన్నారు. సీనియర్ సిటిజన్లకు ఉన్న అనుభవాలు, జ్ఞానం యువతరానికి సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడతాయన్నారు. మన వృద్ధులు గౌరవంగా, చురుగ్గా జీవించేలా చూసుకోవడం మన సమష్టి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఢిల్లీలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ పోర్టల్ ప్రారంభించారు. సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ ఏడాది 15 వృద్ధాశ్రమాలు ప్రారంభోత్సవం అనంతరం ఇక్కడ జరిగిన సమావేశంలో వయో వృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ పదేళ్ల తర్వాత మొదటి సారిగా రాష్ట్రానికి ఈ ఏడాది 15 వృద్ధాశ్రమాలు మంజూరయ్యాయన్నారు. గత నెల రోజుల వ్యవధిలో లక్ష సీనియర్ సిటిజన్ కార్డులను పంపిణీ చేశామన్నారు. అవసరమైన వారు గ్రామ, వార్డు సచివాలయాల్లోగాని, వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయాల్లోగాని, ఆన్లైన్ పోర్టల్ ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఈ కార్డు వల్ల ఐదు లక్షల రూపాయల వైద్య బీమా సదుపాయం కలుగుతుందన్నారు. ఇక్కడి వృద్ధాశ్రమాన్ని రెండేళ్లపాటు స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన తర్వాత సవ్యంగా పనిచేస్తే కొనసాగిస్తామన్నారు. రెండేళ్లు జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారన్నారు. వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు ఎ.రవిప్రకాష్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు బి.అశయ్య, పావని సొసైటీ ఫర్ ది మల్టిపుల్ హ్యాండీకాప్డ్ అండ్ స్పాస్టిక్స్ నిర్వాహకురాలు డి.రజని, కార్యదర్శి ఎం.సత్యవాణి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కె.అనంతలక్ష్మి, ఎంపీడీవో వి.వి.రవికుమార్, ఈవోపీఆర్డీ ఎం.వెంకటలక్ష్మి, హెచ్డీటీ భాస్కరరావు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. వారిని కంటికి రెప్పలా చూసుకుందాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్రు జి.భీమవరంలో వర్చువల్గా వృద్ధాశ్రమం ప్రారంభం -
కేజీబీవీ విద్యార్థినులకు కలెక్టర్ అభినందన
తుమ్మపాల : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు కలెక్టర్ విజయ కృష్ణన్ అభినందనలు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశంలో ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం మంచి పరిణామమన్నారు. కేజీబీవీ విద్యాలయాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో పదో తరగతి ఫలితాలలో రెండో స్థానం, ఇంటర్మీడియట్ ఫలితాలలో మొదటిస్థానం సాధించడం అభినందనీయమని, వచ్చే సంవత్సరం కూడా మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించుటకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఎస్ఎస్ఏ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటరు ఆర్. జయప్రకాష్ జిల్లా ఫలితాలను వివరిస్తూ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలకు సంబంధించి పదో తరగతి ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం సాధించడం జరిగిందని, జిల్లాలో గల 20 పాఠశాలలకు 8 పాఠశాలలో నూరుశాతం ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడం జరిగిందన్నారు. 20 కళాశాలలకు 5 పాఠశాలలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. 550 పైగా మార్కులు సాధించిన 40 మంది పదో తర గతి విద్యార్థినులను, 950 పైగా మార్కులు సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థినులను వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఏలూరు జిల్లా అగిరిపల్లిలో గల హిల్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి ఒలింపిక్ ఆటల పోటీలలో ఉత్తమ ఫలితాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపికై నట్టు తెలిపారు. -
కేజే పురం జంక్షన్లో ఉద్రిక్తత.. అన్నదాన భవనాన్ని కూల్చేందుకు యత్నం
సాక్షి, అనకాపల్లి జిల్లా: మాడుగుల మండలం కేజే పురం జంక్షన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంతోషి మాత ఆలయం అన్నదాన భవనాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. జేసీబీ మిషన్తో సహా వచ్చిన ఆర్అండ్బీ అధికారులను అన్నదాన భవనాన్ని కూల్చవద్దంటూ భక్తులు, గ్రామస్తులు అడ్డుకున్నారు.అధికారులతో వాగ్విదానికి దిగారు. అన్నదాన భవనాన్ని కూల్చితే సహించేది లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. భక్తులు, గ్రామస్తులు ఎదురు తిరగటంతో అధికారులు వెనుదిరిగారు. -
క్లూ లేకున్నా.. కేసు ఛేదించారు
సబ్బవరం: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి నుంచి బంగారు గొలుసు చోరీ చేసిన వ్యక్తుల నుంచి చైన్ రికవరీ చేసి, కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ విష్ణు స్వరూప్ తెలిపారు. క్లూ లేకున్నా నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. సబ్బవరం పోలీస్స్టేషన్లో ఎస్ఐ సింహాచలం, దివ్యతో కలసి గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిలోని చిన్నయ్యపాలెం వద్ద చినముషిడివాడకు చెందిన శ్రీనాథ జగన్నాథం ఈ నెల 26న అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. ఆయన మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తీసుకుని వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఆ సమయంలో సబ్బవరం నుంచి పెందుర్తి వైపు ద్విచక్రవాహనంపై వెళ్లి, షాపుల వద్ద ఆగిన వారి వివరాలను సాంకేతిక సహాయంతో గుర్తించి, నిందితులను పట్టుకున్నారు. వారిని పెందుర్తి ప్రాంతానికి చెందిన సయ్యద్ నిజాముద్దీన్(25), బానుగుల నవీన్(27), పెనుమళ్ల చంద్రశేఖరరావు(45)గా గుర్తించారు. వారు సుమారు రూ.2 లక్షలకు పైగా విలువ చేసే ఆ చైన్ను బయట మార్కెట్లో రూ.1.5 లక్షలకు అమ్మేశారు. దీంతో ఆ చైన్ను రికవర్ చేసి, కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఎటువంటి క్లూ లేకపోయినా, చాకచక్యంతో కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి నుంచి గొలుసు చోరీ సాంకేతికత సహాయంతో నిందితుల గుర్తింపు రెండు తులాల గోల్డ్ చైన్ రికవరీ -
మొదటి రోజే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి
తుమ్మపాల: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సక్రమంగా, సకాలంలో పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కోడూరు పంచాయతీ ఎస్సీ కాలనీలో గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆమె లబ్ధిదారులకు పింఛన్ల నగదు అందించారు. ప్రతి నెలా పింఛను సక్రమంగా అందుతుందా, ప్రభుత్వం అందిస్తున్న పింఛను డబ్బులు పూర్తిగా అందుతున్నాయా, పింఛను అందజేస్తున్నపుడు ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెన్షన్లు అందుకున్నప్పుడు డబ్బులు సరి చూసుకోవాలన్నారు. ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పింఛను పంపిణీ వేగంగా జరగాలన్నారు. లబ్ధిదారులు పింఛన్లు పంపిణీ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి రోజే శత శాతం పంపిణీ పూర్తి జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శచీదేవి, ఎంపీడీవో నర్శింగరావు, గ్రామ సర్పంచ్ సేనాపతి లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
కొండకొప్పాకలో రెండు ఇళ్లలో చోరీ
అనకాపల్లి: జీవీఎంసీ విలీన గ్రామమైన కొండకొప్పాకలో రెండు ఇళ్లలో చోరీ జరిగినట్లు రూరల్ పోలీసులకు గురువారం ఫిర్యాదు అందింది. రూరల్ సీఐ అశోక్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొండకొప్పాక గ్రామంలో నివాసం ఉంటున్న విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఎం.సత్యనారాయణ బుధవారం గాజువాక మండలం కూర్మన్నపాలెంలో బంధువుల ఇంటికి వెళ్లి గురువారం వచ్చి చూసేసరికి ఇంట్లో తులంన్నర బంగారు ఆభరణాలు, రూ.5వేలు నగదు కనిపించలేదు. అదే గ్రామంలో విశ్రాంత హెచ్ఎం పీలా బాలగణపతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో 2 కేజీల వెండి, లక్ష నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నవతరానికి మేల్కొలుపు
జిల్లాలో మేడే వేడుకలు కార్మికులంతా ఘనంగా నిర్వహించుకున్నారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిపారు. పతాకావిష్కరణలు జరిపారు. మే డే విశిష్టతను, కార్మిక పోరాటాలను గుర్తు చేసుకున్నారు. కార్మిక హక్కులను కాపాడుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ను రద్దు చేయాలని, కార్మికులకు సరైన భద్రతా ప్రమాణాలు, శ్రమకు తగ్గ వేతనాలు అందించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కుల,మత, ప్రాంతీయ ఉన్మాదాలను విడనాడాలని నినదించారు. అనకాపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ -
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలి
సీతమ్మధార: వైద్య ఆరోగ్య శాఖలో, జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాల్గవ రోజు కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కొందరు మహిళా ఉద్యోగులు తమ చిన్న పిల్లలను ఒడిలో పట్టుకుని నిరసన తెలిపారు.ధర్నా శిబిరాన్ని సందర్శించిన సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పి.మణి మాట్లాడుతూ, ఆరోగ్య శాఖలో కీలకమైన విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. వారి పోరాటానికి సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎం.ఎస్.ఎన్ ప్రజ్ఞ, కార్యదర్శి గంట సుధ మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్ఓలను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ను పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమం తప్పకుండా ఇవ్వాలని కోరారు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ నుండి సీహెచ్వోలకు మిన హాయింపు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, బదిలీలు, ఎక్స్ గ్రేషియా, పితృత్వ సెలవులు వంటివి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జి.సుధారాణి, పి.దివ్య, బి.శ్రావణి, టి.మోషే, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీలకు చైత్రదీపిక
నర్సీపట్నం: ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు నర్సీపట్నానికి చెందిన క్రీడాకారిణి పెదిరెడ్ల చైత్రదీపిక ఎంపికై ంది. గత నెల 16 నుంచి 30వ తేదీ వరకు మొహలీ, పంజాబ్లో జరిగిన భారత ఆర్టిస్టిక్ రోలరు స్కేటింగ్ జట్టు ఎంపిక పోటీలో చైత్రదీపిక యూత్ కేటగిరి పెయిర్ స్కేటింగ్లో మెరుగైన ప్రతిభ చాటి భారత జట్టులో స్థానం సాధించింది. దక్షిణ కొరియాలో జూలై 20 నుంచి 30వ తేదీ వరకు జరిగే 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనుంది. చైత్రదీపిక తన ప్రతిభను వరుసగా మూడవసారి అంతర్జాతీయస్థాయిలో చాటేందుకు అవకాశం వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు పేరు తీసుకురానుంది. -
5న వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
అనకాపల్లి టౌన్: అనకాపల్లి రింగ్రోడ్ పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఈ నెల ఐదున ఉదయం 10 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థ్ధాయి సమావేశం జరుగుతుందని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాఽథ్ తెలిపారు. ఈ మేరకు గురువారం సమావేశం జరిగే హాల్ను పార్టీ క్యాడర్తో కలిసి పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. ముందుగా రింగ్రోడ్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశంలో ముఖ్యంగా జరిగిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం లబ్ది చేకూరలేదన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం చంద్రబాబు మార్క్ రాజకీయానికి నిదర్శనమన్నారు. అలాగే రాబోయే కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి, అందుకు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల నుంచి పార్టీ ముఖ్య కార్యకర్తలు, బూత్ కమిటీ ఏజెట్లు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. రెండు వేల మందితో నిర్వహించే ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కో– ఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మలసాల భరత్ కుమార్, అనకాపల్లి పార్లమెంట్ నియోజకర్గ సమన్వయకర్త కరణం దర్మశ్రీ, అల్లూరి జిల్లా పరిశీలకులు బోడ్డేడ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, జిల్లా కార్యదర్శి జాజుల రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్, పార్టీ సీనియర్ నాయకులు మళ్ళ బుల్లిబాబు, కె.ఎం. నాయుడు, బొడ్డేడ శివ, గండిరవి, ఉగ్గిన అప్పారావు పాల్గొన్నారు. -
జి.భీమవరంలో కేంద్ర నిధులతో వృద్ధాశ్రమం
కశింకోట: మండలంలో జి.భీమవరంలో ఉన్న వృద్ధాశ్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా శుక్రవారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు చేశారు. పావని సొసైటీ ఫర్ ది మల్టీపుల్ హ్యాండీ క్యాప్డ్ అండ్ స్పాస్టిక్స్ సంస్థ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ఈ ఆశ్రమం కొనసాగుతోంది. ఇక నుంచి ఈ ఆశ్రమం కేంద్రం నిధులతో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ నిర్వహించనుంది. ఈ ఆశ్రమంతో పాటు తమిళనాడులో వేలూరు, నాగాలాండ్, మరో రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. ఇందుకు సన్నాహాలు చేశామని, ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు బి.ఆశయ్య గురువారం విలేకరులకు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు ఎ.రవిప్రకాష్రెడ్డి, కలెక్టర్ విజయ కృష్ణన్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ల దినోత్సవాన్ని నిర్వహించి, ‘ఏజింగ్ విత్ డిగ్నిటీ’అనే ప్రత్యేక కార్యక్రమం న్యూఢిల్లీలో రాష్ట్రపతి సమక్షంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఎల్ఈడీ స్క్రీన్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. వర్చువల్గా రాష్ట్రపతితో మమేకం కావడానికి ఇక్కడ వయోవృద్ధులు రిహార్సల్స్ చేశారు. వృద్ధాశ్రమంలో 25 మంది నివాసం ఉండి సేవలు పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆశ్రమం కార్యదర్శి ఎం.సత్యవాణి ‘సాక్షి’కి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనాథలు, పాక్షిక అనాథలు, ఆర్థికంగా వెనుకబడిన వారు, కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలకు దూరమైన వారిని ఆశ్రమంలో చేర్చుకున్నామన్నారు. న్యూఢిల్లీ నుంచి నేడు వర్చువల్గా ప్రారంభించనున్న రాష్ట్రపత్రి ముర్ము -
కొంపముంచింది
కూటమి నేతల కక్కుర్తేకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పుణ్యక్షేత్రాల్లో ఎన్నడూలేని ఘోరాలు, విషాదాలు సంభవిస్తున్నాయి. భక్తుల సౌకర్యాల కంటే.. ఉత్సవ సమయంలో ఎంత ఎక్కువగా సొమ్ము చేసుకోవచ్చనే దానిపై కూటమి నేతల ఆత్రమే వీటికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోం మంత్రి దగ్గర నుంచి.. భీమిలి ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ తమ అనుచరులకు కాంట్రాక్టులు, అనుయాయులకు వీఐపీ టికెట్లు ఇప్పించుకోవడంలోనే నిమగ్నమయ్యారు. ఎంత మంది భక్తులు వస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై దృష్టిసారించలేదు. కూటమి నేతల కాసుల కక్కుర్తి ఈ దుర్ఘటనతో మరోసారి స్పష్టమైంది. సాక్షి, విశాఖపట్నం: ఊహకందని విషాదం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏడుగురి ప్రాణాల్ని బలిగొన్న దుర్ఘటనలో కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు.. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకూ వంత పాడుతున్నారు. కానీ.. కూటమి నేతల కక్కుర్తి కారణంగానే విషాదం నెలకొందని తెలుస్తోంది. కేవలం తమకు చందనోత్సవం వల్ల ఏం లాభం ఒనగూరుతుందనే దానిపైనే ఎక్కువ దృష్టి సారించారు తప్ప... సామాన్య భక్తులకు అప్పన్న దర్శనం సజావుగా జరిగేలా చూసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలి.. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చందనోత్సవాన్ని ఎలా నిర్వహించాలనేదానికి ప్రాధాన్యమివ్వలేదు. ఏర్పాట్లు చేసేందుకు వివిధ రకాల పనుల్ని కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. ఈ పనులన్నింటినీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత స్వయంగా పర్యవేక్షిస్తూ... తమకు నచ్చిన వారికే కాంట్రాక్టులు అప్పగించారు. ఏర్పాట్లన్నీ గంటా అనుచరులకే.. అదే విధంగా.. ఏర్పాట్ల టెండర్ల వ్యవహారమంతా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నడిపించినట్లు సమాచారం. టెంట్లు, లైటింగ్, ఇతర పనులకు సంబంధించిన మొత్తం టెండర్లన్నీ గంటా దగ్గరుండి మరీ అనుచరులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇలా కాంట్రాక్టుల ద్వారా అనుచరులకు లబ్ధి కలిగించేందుకు ప్రయత్నించారే తప్ప.. భక్తుల గురించి కనీసం పట్టించుకోలేదు. పోనీ ఆ పనులైనా సక్రమంగా చేపట్టారా అంటే.. దానికి కూడా అతీగతీ లేకుండా పోయింది. ఘటన జరిగిన తర్వాత.. బస్సులు కొండపైన నిలిపేయడంతో భక్తులు దిగువనే ఉండిపోయారు. అక్కడ కనీస సౌకర్యాలు అందక నరక యాతన అనుభవించారు. ఇలా.. సింహాచలంలో జరిగిన దారుణానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే అయినా.. వరుణుడిపై నెట్టేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వాటర్ బాటిళ్ల మాయాజాలం! ప్రతి చందనోత్సవానికి జీవీఎంసీ నీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేస్తుంది. దీనికి తోడుగా.. సింహాచలం దేవస్థానానికి మంచినీటి బాటిళ్లని అందించే రెగ్యులర్ కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. ప్రతి ఉత్సవానికి వీఐపీలకు 500 మిలీ బాటిల్స్ సరఫరా చేస్తుంటారు. ఈ చందనోత్సవానికి కూడా సదరు కాంట్రాక్టర్ 500 మిలీ బాటిల్స్ని లక్ష సరఫరా చేసే టెండరు అప్పగించారు. జీవీఎంసీ 20 లీటర్ల క్యాన్లు, పేపర్ గ్లాసుల్ని భారీ స్థాయిలో భక్తుల కోసం క్యూలైన్లలో, బస్ పాయింట్స్ దగ్గర, తొలి పావంచా దగ్గర ఏర్పాటు చేసింది. అయినా.. నీటి బాటిళ్లలో హోంమంత్రి మాయాజాలం ప్రదర్శించారు. అవసరం లేకపోయినా.. 250 మిలీ నీటి బాటిల్స్ కచ్చితంగా ఉండాలంటూ హుకుం జారీ చేశారు. భక్తులు లక్షన్నర వరకూ వస్తారని అంచనా వేశారు. అయినా.. 3 లక్షల బాటిల్స్ అవసరమంటూ హోంమంత్రి చెప్పడంతో దీనికి టెండర్లు పిలిచారు. ఈ టెండర్ని హోంమంత్రి ముఖ్య అనుచరుడికి అప్పగించారు. వాస్తవానికి ఈ బాటిల్స్ని 3 లక్షల వరకూ సరఫరా చేస్తామని చెప్పి టెండరు దక్కించుకున్న హోం మంత్రి అనుచరుడు.. కేవలం లక్షన్నర బాటిల్స్ మాత్రమే ఇచ్చి.. లెక్క మాత్రం 3 లక్షలుగా చూపించినట్లు తెలుస్తోంది. -
ఈసారీ కందిపప్పు లేనట్టే!
అనకాపల్లి టౌన్: జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఈ నెలలో కూడా బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేయనున్నారు. కందిపప్పును మాత్రం అడగొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కొద్ది నెలలుగా కందిపప్పు పంపిణీ చేస్తారని ఆశతో ఎదురు చూసినా కార్డుదారులకు ఈ నెల కూడా నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా 5.37 లక్షల రేషన్ కార్డుదారులకు 14.99 లక్షల మంది యూనిట్ దారులు ఉన్నారు. వీరందరూ కందిపప్పు కోసం బహిరంగ మార్కెట్ను ఆశ్రయించాల్సిదే. కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత బియ్యంతో పాటు జొన్నలు, రాగులు, పంచదార వంటి నిత్యావసర వస్తువులన్నీ ఇస్తామని ఊదరగొట్టింది. దీంతో లబ్ధిదారులందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తుండడంతో కార్డుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డిపోల ద్వారా కేజీ కందిపప్పును 67 రూపాయలకు అందజేసేవారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్పై ఊదరగొట్టారు. ప్రయోగాత్మకంగా పట్టణ ప్రాంతాలలో కేజీ 50 రూపాయలకే కందిపప్పు అందజేస్తామని ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.120 పలుకుతుంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రేషన్ ద్వారా కార్డుదారులకు కందిపప్పును పంపిణీ చేయకపోవడం వల్ల 14.99 లక్షల మందికి 120 రూపాయలు చొప్పున లెక్కిస్తే 17,98,80,000 చేతి చమురు వదులుతుందన్నమాట. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పప్పన్నం దూరం -
పలు రైళ్లకు అదనపు కోచ్లు
తాటిచెట్లపాలెం:వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లకు అదనపు కోచ్లు జతచేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ● విశాఖలో ఈ నెల 4, 11, 18, 25 తేదీల్లో బయల్దేరే విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు(08581) స్పెషల్ ఎక్స్ప్రెస్కు, తిరుగు ప్రయాణంలో బెంగళూరులో ఈ నెల 5, 12, 19, 26 తేదీల్లో బయల్దేరే ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం(08582) స్పెషల్ ఎక్స్ప్రెస్కు 1–థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ను జతచేస్తున్నారు. ● విశాఖలో ఈ నెల 6, 13, 20, 27 తేదీల్లో బయల్దేరే విశాఖపట్నం–కర్నూలు సిటీ(08545) స్పెషల్ ఎక్స్ప్రెస్కు, తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీలో ఈ నెల 7, 14, 21, 28 తేదీల్లో బయల్దేరే కర్నూలు సిటీ–విశాఖపట్నం(08546) స్పెషల్ ఎక్స్ప్రెస్కు 1–థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ను కలుపుతున్నారు. ● విశాఖలో ఈ నెల 2, 9, 16, 23, 30 తేదీల్లో బయల్దేరే విశాఖపట్నం–చర్లపల్లి(08579) స్పెషల్ ఎక్స్ప్రెస్కు, తిరుగు ప్రయాణంలో చర్లపల్లిలో ఈ నెల 3, 10, 17, 24, 31 తేదీల్లో బయల్దేరే చర్లపల్లి–విశాఖపట్నం(08580) స్పెషల్ ఎక్స్ప్రెస్కు 1–థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్ను జతచేస్తున్నారు. -
నష్టాలివీ..
హార్మోన్ల అభివృద్ధికి చేపలకు ఇంజక్షన్లు చేసేవారు..కృత్రిమ పద్ధతిలో వివిధ రకాలైన కోటీ 25 లక్షల చేప పిల్లల్ని ఉత్పత్తి చేసేవారు..జిల్లాలోని అన్ని రిజర్వాయర్లకు సరఫరా చేయడమే కాక ప్రైవేట్ వ్యక్తులకు సైతం విక్రయించే వారు..మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కరమైన చేపల ఉత్పత్తి జరిగేది..కానీ ఇప్పుడు అదంతా గతం. కిందటి ఏడాది నుంచి ఈ ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపకపో వడం, నిధులు కేటాయించకపోవడంతో తాండవ రిజర్వాయరు వద్ద ఉన్న చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి తాళం వేశారు. కేంద్ర నిధులతో వృద్ధాశ్రమం కశింకోట మండలం జి.భీమవరంలోని వృద్ధాశ్రమాన్ని న్యూఢిల్లీ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్గా శుక్రవారం ప్రారంభించనున్నారు.శుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 20258లోకూటమి నిర్లక్ష్యానికి నిదర్శనం నేను సరుగుడు సర్పంచ్గా ఉన్నప్పుడు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం వైభవాన్ని దగ్గరుండి చూశాను. జిల్లా స్థాయి అధికారులు చేప పిల్లల ఉత్పత్తిని చూసేందుకు వస్తుండేవారు. మళ్లీ ఆ రోజులు రావాలంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. సిబ్బందిని నియమించాలి. ఈ సమస్యను వచ్చే మండల సర్వసభ్య సమావేశంలో చర్చిస్తాం. – సాగిన లక్ష్మణమూర్తి, నాతవరం ఎంపీపీడిజిటల్ క్లాక్ డిజైన్కు రూ.5 లక్షల నజరానా తాటిచెట్లపాలెం (విశాఖ): రైల్వే స్టేషన్లలో సమయాన్ని చూపించే డిజిటల్ గడియారం డిజైన్ చేసేందుకు ఆసక్తి గల వారి నుంచి డిజైన్లను భారతీయ రైల్వే ఆహ్వానిస్తోంది. ఎంపిక చేసిన డిజైన్కు రూ. 5 లక్షల బహుమతి కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ అధికారులు ఒక ప్రకటన ద్వారా వివరాలు తెలిపారు. భారతీయ రైల్వే, దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్రదర్శించడానికి జాతీయ స్థాయిలో డిజిటల్ గడియారం డిజైన్ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీని మూడు విభాగాలుగా విభజించారు. నిపుణులు, కళాశాల/విశ్వవిద్యాలయ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు. ఈ మూడు విభాగాల నుంచి ఎంపిక చేసిన ఉత్తమ డిజైన్కు మొదటి బహుమతిగా రూ. 5 లక్షలు అందజేస్తారు. అలాగే ప్రతి విభాగం నుంచి ఐదుగురికి ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వనున్నారు. ఆసక్తి గలవారు తమ డిజైన్లను మే 31వ తేదీ వరకు ఆన్లైన్లో సమర్పించాలని రైల్వే అధికారులు తెలిపారు. ఎంట్రీలు అధిక రిజల్యూషన్లో ఉండాలి, వాటిపై వాటర్మార్క్లు, లోగోలు వంటివి ఏమీ ఉండకూడదు. అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జతచేయాలని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ) దిలీప్కుమార్ తెలిపారు. పాల్గొనేవారు ఎన్ని డిజైన్లనైనా పంపవచ్చు, అయితే ప్రతి డిజైన్కు సంబంధించిన వివరణ, దాని ఉద్దేశ్యం స్పష్టంగా ఉండాలని సూచించారు. పాఠశాల విభాగంలో ప్లస్ 2 వరకు చదివే విద్యార్థులు అర్హులు, వారు తమ పాఠశాల గుర్తింపు కార్డును కూడా అప్లోడ్ చేయాలి. కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులు కూడా వారి ప్రస్తుత విద్యార్థి స్థితిని తెలిపే పత్రాలను అప్లోడ్ చేయాలని తెలిపారు. నాతవరం: తాండవలో గల చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి ఒకప్పుడు ఉత్తరాంధ్రలోనే ప్రత్యేక స్థానం ఉండేది. రిజర్వాయరు దిగువ ప్రాంతంలో 1984లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్–ఆగస్టు మధ్య కాలంలో కోటి 25 లక్షలు చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. పెద్ద చేపల్లో హార్మోన్ల అభివృద్ధికి ఇంజక్షన్లు చేయడంతో వివిధ రకాలు చేప పిల్లల ఉత్పత్తి జరిగేది. ఆ పిల్లలను ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా మత్స్య సహకార సంఘాలకు సరఫరా చేసేవారు. మిగిలిన పిల్లలను జిల్లాలో ఉన్న రైవాడ, కల్యాణపులోవ, కోనాం, వరాహ, మేహాద్రిగెడ్డ, రావణాపల్లి రిజర్వాయర్లలో విడుదల చేసేవారు. చెరువుల్లో పెంచుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకు కూడా విక్రయించేవారు. అంతటి ప్రాముఖ్యం కలిగిన తాండవ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో గతేడాది నుంచి మచ్చుకై నా చేప పిల్లల్ని ఉత్పత్తి చేయడం లేదు. నిత్యం మత్స్య సహకార సంఘాల సభ్యులు, అధికారులతో కళకళలాడే ఉత్పత్తి కేంద్రంలో సిబ్బంది జాడే లేదు. ఎప్పుడు చూసినా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం మూసే ఉంటుంది. నీటి కోసం కేంద్రంలో ఏర్పాటు చేసిన బోరును ఉపయోగించకపోవడంతో పాడైంది. అడవిని తలపించేలా పెరిగిన పిచ్చి మొక్కలు బోరును కప్పేశాయి. గతంలో ఇక్కడ పని చేసిన కొంతమంది సిబ్బంది ఉద్యోగ విరమణ చేయగా మరికొందరు ఇతర ప్రదేశాలకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈ కేంద్రం నర్సీపట్నం మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ విషయంపై నర్సీపట్నం మత్స్యకార అభివృద్ధి అధికారి నాగమణిని వివరణ కోరగా చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదన్నారు. గతంలో ఉండే సిబ్బంది ప్రస్తుతం లేరన్నారు. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన చేప పిల్లలను గత ఏడాది తాండవ రిజర్వాయరులో విడుదల చేశామన్నారు. స్పీకర్ దృష్టి సారించాలి తాండవలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం శిథిలావస్థలో ఉంది. కేంద్రంలో పిల్లల ఉత్పత్తి నిలిచిపోయింది. దీనిపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దృష్టి సారించాలి. రాజకీయాలకు అతీతంగా కేంద్రం పూర్వ వైభవం కోసం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే కలెక్టరుకు ఫిర్యాదు చేస్తాను. –బాలేపల్లి వెంకటరమణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ● చేప పిల్లల ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల తాండవ రిజర్వాయర్లో చేపల వేట తగ్గిపోయింది. దీంతో వేటపై ఆధారపడి జీవించే జాలరిపేటకు చెందిన మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ● చేప పిల్లల ఉత్పత్తి లేకపోవడంతో సరకు తగ్గి ధర బాగా పెరిగింది. తాండవ బొచ్చు చేపకు భలే గిరాకీ ఉండేది. ఇక్కడ పెంచిన చేపలు ఎంతో రుచిగా ఉంటాయని పేరు. వినియోగదారులకు వివిధ రకాల నాణ్యమైన చేపలు అందకుండా పోయాయి. ● మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిపుణుల ఆధ్వర్యంలో చేపలను మనమే పెంచడం వల్ల ఆరోగ్యకరంగా ఉండేవి. విరివిగా లభించేవి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. న్యూస్రీల్గతంలో ఏటా కోటి 25 లక్షలకు పైగా పిల్లల ఉత్పత్తి ఉత్పత్తి కేంద్రం నిర్వహణ లేక శిథిలావస్థలో భవనాలు -
దాడికి పాల్పడ్డవారిపై చర్య కోరుతూ ఏఎస్పీకి ఫిర్యాదు
అనకాపల్లి: నక్కపల్లి పోలీస్స్టేషన్లో తమ కుటుంబానికి న్యాయం జరగలేదని నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామానికి చెందిన ఆవాల సురేష్, ఆవాల నాగేశ్వరరావు, చిట్టెమ్మతో పాటు మరో 30 మంది కుటుంబ సభ్యులు గురువారం ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామానికి చెందిన వెలమశెట్టి శ్రీను, సోమరాజు జయంత్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన ఆవాల సురేష్, లక్ష్మిలను తీవ్రంగా దాడి చేసి గాయపరిచారని, సురేష్ను నక్కపల్లి, లక్ష్మి (61)ని తుని ఆస్పత్రిల్లో చేర్పించడం జరిగిందన్నారు. దీనిపై 5తేదీన నక్కపల్లి పోలీస్స్టేషన్లో అవాల సురేష్ ఫిర్యాదు చేసినప్పటికీ క్షతగాత్రులకు న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మి చికిత్స పొందుతూ ఏప్రిల్ 8న మృతి చెందిందని, అప్పటి నుంచి క్షతగాత్రుల కుటుంబానికి నక్కపల్లి పోలీస్స్టేషన్లో న్యాయం జరగలేదని, తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ కార్యాలయానికి వచ్చినట్టు ఆవాల సురేష్, నాగేశ్వరరావు చెప్పారు. అడిషనల్ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. -
కొత్తపెంట కొత్తూరు పైడిమాంబ ఆలయంలో భారీ చోరీ
● ముప్పావు తులం బంగారం, మూడున్నర కేజీల వెండి అభరణాలు చోరీ ● చోరీ సొత్తు విలువ రూ. 4 లక్షలు పైమాటే. సంఘటన స్థలాన్ని సందర్శించిన సీఐ పైడపునాయుడు ● క్లూస్ టీమ్ ఆధారాల సేకరణ దేవరాపల్లి: మండలంలోని కొత్తపెంట శివారు కొత్తూరు లోని పైడిమాంబ అమ్మవారి ఆభరణాలు చోరీకి గుర య్యాయి. దొంగత నానికి సంబంధించి స్థానిక సర్పంచ్ వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామ దేవత పైడిమాంబ అమ్మవారి మెడలో ముప్పావు తులం బంగారు మంగళ సూత్రాలు, మూడున్నర కేజీల వెండితో తయారీ చేసిన కిరీటం తదితర ఆభరణాలు అమ్మవారికి అలంకరణ చేశామన్నారు. బుధవారం రాత్రి దొంగలు ఆలయ తలుపు గడియ ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడి అమ్మవారికి అలంకరించిన అభరణాలన్నింటిని దోచుకుపోయారన్నారు. వాటి విలువ సుమారు రూ. 4 లక్షలకు పైబడి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆలయం తలుపులు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించడంతో ఈ దొంగతనం విషయం వెలుగులోకి వచ్చిందని వారు తెలిపారు. చోరీ జరిగినట్టు పోలీసులకు ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కె.కోటపాడు సీఐ పైడపునాయుడు చోరీ జరిగిన ఆలయాన్ని పరిశీలించారు. అనకాపల్లికి చెందిన క్లూస్ టీమ్ను రప్పించి దొంగతనం జరిగిన ప్రాంతంలో ఆధారాలతో పాటు వేలిముద్రలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
కారు ఢీకొని జింకకు గాయాలు
కొమ్మాది (విశాఖ): బీచ్రోడ్డులో ఇందిరాగాంధీ జూపార్కు సమీపంలో నగరం నుంచి భీమిలి వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు దాటుతున్న జింకను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఓ యువకుడు గమనించి, గాయపడిన జింకను రోడ్డు పక్కకు చేర్చి నీరు తాగించాడు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టాడు. అయితే, ఇటీవల కాలంలో జింకలు తరచూ జనావాసాల్లోకి రావడం, ప్రమాదాలకు గురికావడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రమాదాల బారిన పడి మరికొన్ని జింకలు మృత్యువాత పడుతున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రాణాలను బలిగొందా...
మెట్ల నిర్మాణ ప్రణాళిక మార్పే ● పాత పద్ధతిలోనే మెట్లమార్గం నిర్మిస్తే ప్రమాదం జరిగేది కాదు ● అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యంవిషాదంతో ఉలిక్కిపడ్డ వ్యాపారులు కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్లోకి ప్రవేశించి నాలుగు రోజులు కూడా గడవకముందే, తమ ప్రాంగణంలో ఇంతటి ఘోర విషాదం చోటుచేసుకోవడంతో సింహగిరి వ్యాపారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పాదాలమ్మ–బంగారమ్మ ఆలయాల ప్రాంగణంలో తాత్కాలిక దుకాణాల్లో వ్యాపారం చేసుకుంటున్న వర్తకులను, చందనోత్సవానికి కేవలం నాలుగు రోజుల ముందు హడావుడిగా, ఇంకా పూర్తిగా సిద్ధం కాని కొత్త షాపింగ్ కాంప్లెక్స్లోకి తరలించారు. చందనోత్సవ సమయంలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం అవసరమని చెప్పడంతో వ్యాపారులు అయిష్టంగానే కొత్త షాపింగ్ కాంప్లెక్స్లోకి మారారు. తరలి వెళ్లిన కొద్ది రోజులకే తమ షాపింగ్ కాంప్లెక్స్ వద్దే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఆందోళన చెందారు. సింహగిరి చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదని, అయ్యో పాపం భక్తులంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. సింహాచలం: సింహాచలం కొండపై షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నుంచి జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త మెట్లమార్గం రూపకల్పనలో చేసిన మార్పులే ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక చందనోత్సవాల సమయంలో అదే స్థలంలో ఉన్న పాత మెట్లమార్గంలో తీవ్రమైన తోపులాటలు, అధిక రద్దీ నెలకొన్నప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, దురదృష్టవశాత్తు చరిత్రలో మొదటిసారిగా అదే ప్రదేశంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వివరాల్లోకి వెళితే, సింహగిరిపై ఉన్న బస్టాండ్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి ఉన్న మెట్లమార్గం ఇరువైపులా రెండు బ్లాక్లలో వ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. గతంలో ఈ మెట్లమార్గం నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి చేరుకునేది. చందనోత్సవం రోజుల్లో భక్తులను ఈ మార్గంలోనే వరుస క్రమంలో పంపి నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసేవారు. ప్రసాద్ స్కీమ్ కింద పాత షాపింగ్ కాంప్లెక్స్ను తొలగించి, కొత్త దుకాణాలను రెండు బ్లాక్లుగా పాత పద్ధతిలోనే నిర్మించారు.అయితే, ఈ రెండు బ్లాక్ల మధ్య నిర్మించిన కొత్త మెట్లమార్గం విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించారు. పాత ప్రణాళికలను అనుసరించకుండా, జోడు భద్రాల వద్దకు చేరుకునే మెట్లను కుడి, ఎడమ వైపులకు మళ్లించారు. మధ్యలో దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తులో నాసిరకమైన గోడను నిర్మించడంతో, ఎడమ వైపు నుంచి రూ.300 క్యూలో వెళ్తున్న భక్తులపై అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వైదిక వర్గాలు చెబుతున్నా లెక్కచేయకుండా... ఏటా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి కొండ దిగువన నాలుగు పర్యాయాలు ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి పల్లకిలో దిగువకు తీసుకువస్తారు. గతంలో జోడు భద్రాల నుంచి నేరుగా ఉన్న మెట్లమార్గం ద్వారానే ఊరేగింపు జరిగేది. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తర్వాత కూడా అదే విధంగా నిర్మించాలని పలువురు వైదిక పండితులు సూచించినప్పటికీ, అధికారులు వారి మాటలను పట్టించుకోలేదని తెలుస్తోంది. వారి నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్న విషాదానికి దారితీసింది. -
తల్లీ కుమార్తెలకు అవార్డులు
రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న పీవీఎం నాగజ్యోతి, ఆమె కుమార్తె కలగర్ల సాహితీలకు మరోసారి అవార్డులు వరించాయి. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారికి ఈ పురస్కారాలు అందించారు. విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న నాగజ్యోతికి ‘ఇంటర్నేషనల్ బెస్ట్ ఎచీవర్ అవార్డు’, క్రీడల్లో రాణిస్తున్న ఆమె కుమార్తె సాహితికి ‘భారత్ సమ్మాన్ అవార్డు’ వరించాయి. ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ వరల్డ్ వైడ్ ఫౌండేషన్ ఈ అవార్డులను అందజేసింది. -
కశింకోట వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం
కశింకోట : కశింకోటలోని పురాతన వరాహ నృసింహస్వామి ఆలయంలో భక్తులను స్వామి నిజరూప దర్శనం కనువిందు చేసింది. వైశాఖ శుద్ద తదియ పురస్కరించుకొని సింహాచలం తరహాలో భక్తులకు స్వామి నిజ రూప దర్శనం బుధవారం కల్పించా రు. స్వామికి వేకువ జామున వేద మంత్రాల నడుమ ఏడాది పొడవునా వేసిన చందనాన్ని తొల గించి నిజ రూప దర్శనాన్ని భక్తులకు కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు బ్యాచ్ల వారీగా వచ్చి స్వామికి పంచామృతాలు, పండ్లు వగైరా సమర్పించి దర్శించుకున్నారు. భక్తులు తెచ్చిన పంచామృతాలైన తేనె, పాలు, పెరుగు,నెయ్యి, పంచదార, కొబ్బరి నీళ్లు, చందనంతో వేద మంత్రోశ్చరణల నడుమ ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించా రు. పూలతో అందంగా అలంకరించారు. మధ్యాహ్నం వరకు నిజ రూప దర్శనం కల్పించ అనంతరం యధా విధిగా వేద మంత్రాల నడుమ చందనాన్ని పూశారు. మహిళలు భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకుడు అత్తిలి కోదండపాణి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి : కశింకోట–అనకాపల్లి రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని సుమారుగా 35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి బుధవారం చెప్పారు. మృతుడి ఎత్తు 5.6 అడుగులు, జుట్టు నలుపు రంగు, ఎరుపు రంగు టీషర్టు, బ్లాక్ పుల్ జీన్ఫ్యాంట్ కలిగి ఉన్నట్టు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలకు సెల్నంబర్ 7382058996 ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. -
ప్రత్యేక డీఎస్సీ కోసం ముట్టడి
సాక్షి,పాడేరు: ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు, నిరుద్యోగుల నినాదాలతో జిల్లాలో ఐటీడీఏ కార్యాలయాల ప్రాంగణాలు హోరెత్తాయి. జీవో నంబర్ 3 పునరుద్ధరించాలని, ప్రత్యేక డీఎస్సీ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ,ఆదివాసీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాల నాయకులు, నిరుద్యోగ యువకులు పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలను బుధవారం పెద్ద ఎత్తున ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్ది సేపు రోడ్లపై బైఠాయించారు. పాడేరులో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. అంతకుముందు పాడేరు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వినతిపత్రం ఇచ్చేందుకు పాడేరులో ఐటీడీఏ కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో వారంతా రోడ్డుపైనే బైఠాయించారు. నూరుశాతం ఉద్యోగాల జీవోతో పాటు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావుకు డీఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేసి, ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలని కోరారు. మే 2 నుంచి నిరవధిక మన్యం బంద్ పత్యేక డీఎస్సీ ప్రకటించి, ఆదివాసీలకు న్యాయం చేసేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని, మే 2 నుంచి నిరవధిక మన్యం బంద్ నిర్వహిస్తామని ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో అనంతగిరి జెడ్పీటీసీ డి.గంగరాజు, డీఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు కుడుముల కాంతారావు, పి.అప్పలనర్స, ఎస్.మాణిక్యం,కూడా సుబ్రహ్మణ్యం, కూడా రాధాకృష్ణ, ధర్మాన పడాల్, పి.బాలదేవ్, సురేంద్ర, హైమావతి, వల్లా సలీం, వంతాల నాగేశ్వరరావు, దాస్, సింహాద్రి, డి.పి.శంకర్, టి.కృష్ణారావు, జీవన్, కార్తీక్, ఎస్.కొండలరావు, బి.కేజీయారాణి, చిన్నస్వామి, చిన్నారి, చిరంజీవి, ప్రశాంత్కుమార్, బాలరాజు, లక్ష్మణరావు, మత్స్యరాస వెంకటరాజు, పిట్ట నరేష్తో పాటు పలు ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. రంపచోడవరం: సీఐటీయూ, ఏపీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి నిరసన ప్రదర్శన నిర్వహించి ఐటీడీఏ ఎదుట బైఠాయించారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం అధ్యక్షుడు లోతా రామారావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అరకులోయలో ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని, నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే వర్తించేలా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు వినతిపత్రం ఇచ్చేందుకు బయటకు రావాలని గిరిజన సంఘాలు కోరగా, బయటకు రావడానికి ఐటీడీఏ పీవో ఆసక్తి చూపలేదు. దీంతో ఐటీడీఏ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసు లు అడ్డుకున్నారు. ఈ సమయంలో గిరిజనులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన గిరిజన యువత రోడ్డుపై బైఠాయించడంతో మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. కొద్ది సేపటి తర్వాత పీవో కట్టా సింహాచలం బయటకు రావడంతో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వెదుళ్లు లచ్చిరెడ్డి,ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు తీగల బాబురావు, సీపీఎం నాయకులు మట్ల వాణిశ్రీ, సిరిమల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చింతూరు: స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల నాయకులు, నిరుద్యోగ యువత, డీఎస్సీ అభ్యర్థులు స్థానిక ఐటీడీఏ ఎదుట ఆందోళన చేశారు. జీవో నంబర్ 3 పై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఉన్నత చదువుల్లో అడుగుపెడుతున్న ఆదివాసీ యువత జీవోల రద్దు కారణంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఓట్లకోసం జీవోను పునరుద్ధరిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించడం తగదని, ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి ఆదివాసీ యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ కోసం ఈనెల రెండున నిర్వహిస్తున్న మన్యం బంద్ను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం వారు ఐటీడీఏ పీవో అపూర్వభరత్కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్కుమార్, సున్నం రాజులు, సీసం సురేష్, పల్లపు వెంకట్, మడివి రవితేజ, అగరం సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మూడు ఐటీడీఏల వద్ద ఆదివాసీ డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ ప్రజా సంఘాల ఆందోళన నూరుశాతం ఉద్యోగాల జీవోను వెంటనే తేవాలని డిమాండ్ -
వాహన చోదకుల కంట్లో ఫ్లైయాష్
ఎన్టీపీసీ నుంచి పరిమితికి మించి లారీల్లో అక్రమ రవాణా నక్కపల్లి : రాజమండ్రి నుంచి కొద్దినెలలుగా బండరాళ్లు రాంబిల్లి ప్రాంతాలకు భారీ లారీల్లో తరలిస్తున్నారు. 40 టన్నులకు మించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఒక్కో లారీలో 80 టన్నుల వరకు లోడు వేసి టోల్ ఫీజు నుంచి తప్పించుకునేందుకు వేంపాడు, చందనాడ, ఉపమాక మీదుగా జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఇవే లారీల్లో పరవాడ వద్ద ఉన్న ఎన్టీపీసీ నుంచి వెలువడే ఫ్లైయాష్ను తీసుకుని కాకినాడ పోర్టుకు బయలుదేరుతున్నాయి. నిత్యం సుమారు 40 నుంచి 50 టిప్పర్ లారీల్లో ఈ బూడిదను 70 నుంచి 80 టన్నుల వరకు లోడింగ్ చేసి తీసుకెళ్తున్నారు. టోల్ప్లాజా వద్ద తనిఖీలు చేసి ఓవర్ లోడ్ కారణంగా రూ.5 వేల వరకు పెనాల్టీ చెల్లిస్తే తప్ప టోల్గేట్లో నుంచి అనుమతించడం లేదు. దీంతో లారీ డ్రైవర్లు లారీలను కొద్దిదూరం వెనక్కి తీసుకెళ్లి సగం ఫ్లైయాష్ను రోడ్డుపక్కన, జాతీయరహదారి మధ్యలో అన్లోడ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే ద్విచక్రవాహన చోదకులు, ఆటోల్లోను, బస్సుల్లోను ప్రయాణించేవారి కళ్లల్లో ఈ బూడిద పడి కళ్లు మండడం, సరిగ్గా కనిపించకపోవడం నీరు కారడం వంటి సమస్యలు వస్తున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన, మధ్యలో అన్లోడ్ చేసిన బూడిద విపరీతంగా వీచే గాలుల వల్ల దుమ్ము, ధూళి కలిపి సుడిగాలి మాదిరిగా చెలరేగి, అటువైపు రాకపోకలు సాగించేవారి కళ్లల్లో పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు లారీ డ్రైవర్లు అధిక లోడుతో ఉన్న లారీలను ఉపమాక, చందనాడ, అమలాపురం, వేంపాడు మీదుగా జాతీయ రహదారిపై చేరుకుని టోల్ప్లాజా తగలకుండా వెళ్లిపోతున్నారు. ఇలా రాకపోకలు సాగించే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో వేసిన ఇరుకురోడ్ల మీదుగా వెళ్లే సమయంలో బూడిద గ్రామాల్లో వీధుల్లో పడి, ఆయా గ్రామాల వారు ఇబ్బంది పడుతున్నారు. 80 టన్నుల బరువుతో లారీలు రాకపోకలు సాగించడం వల్ల గ్రామీణ రోడ్లు శిథిలమవుతున్నాయని, ఎక్కడికక్కడ గోతులు పడుతున్నాయంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇలా అధిక లోడుతో ఫ్లైయాష్ను తీసుకుని వెళ్తున్న మూడు ట్రిప్పర్ లారీలను నక్కపల్లి సీఐ కుమారస్వామి పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ ఈ దందా ఆగడం లేదు. ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాలకు చెందిన కొందరు కూటమి పెద్దల అండదండలు ఉండడంతో పోలీసులు, రవాణా శాఖ అధికారులు వీటిపై కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి ఫ్లైయాష్ అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలని, ఎక్కడపడితే అక్కడ అన్లోడ్ చేస్తున్న లారీలపై కేసులు నమోదు చేసి వాహన చోదకుల కంటి చూపు కాపాడాలని పలువురు కోరుతున్నారు. కూటమి నేతల అండదండలు టోల్ప్లాజాల వద్ద తనిఖీలు పెనాల్టీ కట్టకుండా రోడ్లపైనే అన్ లోడింగ్ -
‘ఉల్లాస్’తో వయోజన విద్యకు ఊతం
తుమ్మపాల : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉల్లాస్’ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఉల్లాస్ కార్యక్రమంపై బుధవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉల్లాస్ పథకంపై ప్రచారం చేసి, జిల్లాకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. 2025–26 సంవత్సరానికి 24,977 మందికి వయోజన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అక్ష్యరాస్యత శాతం తక్కువగా గల మండలాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామ సచివాలయం, గ్రామీణాభివద్ధి, మహిళా శిశు సంక్షేమం, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. అంగన్వాడీలు, పాఠశాలల్లో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ, కార్మికుల్లో నిరక్షరాస్యులైన వారిని గుర్తించి ఆ సమాచారాన్ని వయోజన విద్య అధికారులకు అందజేయాలాని, వారిని ఈ పథకం ద్వారా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించే టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నా రు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య సహాయ సంచాలకుడు డి.చిన్నికృష్ణ, కమిటీ సభ్యులు డీఆర్డీఏ పీడీ శచీదేవి, జిల్లా, గ్రామ, వార్డు సచివాలయ అధికారి ఎస్.మంజులవాణి, మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ అనంతలక్ష్మి పాల్గొన్నారు. -
అడవులను తాకట్టు పెట్టొద్దు...
దేవరాపల్లి : చింతలపూడి, వేపాడ మండలం మారిక గ్రామాల మధ్యలో అదాని హైడ్రోపవర్ ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. చింతలపూడి పంచాయతీలో బుధవారం పర్యటించిన ఆయన సమ్మెదలో స్థానిక గిరిజనులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం వెంకన్న మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అడవి బాట పట్టడం అంటే అడవులను తాకట్టు పెట్టడం కాదని విమర్శించారు. గిరిజనుల బతుకులు నాశనం చేసేందుకు అడవి బాట పట్టినట్టు అర్ధమవుతుందని ఆరోపించారు. చింతలపూడి పంచాయతీలో శారదానదిపై ప్రాజెక్టులు నిర్మించి తద్వారా పంపింగ్ చేసి విజయనగరం జిల్లా వేపాడ మండలం కరకవలస పంచాయతీ శివారు మారిక గ్రామంలో 30 సర్వే నెంబర్లలో 213 ఎకరాల భూమి సేకరించి హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారన్నారు. ఈ నిర్ణయాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. గిరిజనుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎటువంటి పనులు చేపట్టినా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రైవాడ ప్రాజెక్టు జీవనదిగా ఉన్న శారదానదిపై అదాని కన్ను పడిందని ధ్వజమెత్తారు. రైవాడ ప్రాజెక్టు అదాని చేతుల్లోకి వెళ్లిపోవడంతో పాటు ఆయకట్టు భూములన్నీ బీడులుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయకట్టు రైతులు, స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక గిరిజనులు రాజకీయాలకు అతీతంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హైడ్రో పవర్ప్లాంట్ నోటిఫికేషన్ రద్దు చేయాలి సీపీఎం నేత వెంకన్న -
మేడపై నుంచి జారిపడి జవాన్ మృతి
మునగపాక : మండలంలోని మల్లవరం పంచాయతీ అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన సీఎస్ఎఫ్ జవాన్ పూసర్ల కృష్ణ (36)మేడపై నుంచి జారిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. అప్పికొండవానిపాలెం గ్రామానికి చెందిన కృష్ణ సీఎస్ఎఫ్ జవాన్గా శ్రీనగర్లో విధులు నిర్వహిస్తున్నాడు. వేసవి సెలవుల్లో భాగంగా ఇటీవల గ్రామానికి చేరుకున్న కృష్ణ మంగళవారం రాత్రి సోదరుని ఇంటి డాబాపైకి వెళ్లాడు. సెల్ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ డాబాపై నుంచి కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతనిని అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కృష్ణ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు మునగపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు కృష్ణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న కృష్ణ మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. -
కలెక్టరేట్లో బసవేశ్వరుని జయంతి వేడుక
తుమ్మపాల : లింగాయత్ సంప్రదాయాన్ని రూపొందించడంలో బసవేశ్వరుడు కీలక పాత్ర పోషించారని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. బసవేశ్వరుని జయంతి పురస్కరించుకుని కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకలో బసవేశ్వరుని చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లింగ వివక్షను వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వరుడని అన్నారు. అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం భావాలలో విప్లవాత్మక మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడు కారణమని తెలిపారు. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఇంచార్జి ఏవో వాసునాయుడు, కలెక్టరేట్ సెక్షన్ల సూపరిండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పాలిసెట్కు 94 శాతం మంది హాజరు
తుమ్మపాల/అనకాపల్లి టౌన్/నర్సీపట్నం: జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించిన పాలిసెట్కు 94 శాతం మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారని జిల్లా కో–ఆర్డినేటర్ ఐవీఎస్ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 9,049 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో బాలురు 4,974, బాలికలు 3,538 మంది హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా 23 కేంద్రాల్లో పాలిసెట్ పరీక్ష జరిగింది. అనకాపల్లిలో 14, నర్సీపట్నంలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచారు. నర్సీపట్నంలో 2,460 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 2,296 మంది హాజరయ్యారని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పరీక్ష నిర్వాహకుడు నర్సింహులు తెలిపారు. -
సింహాచలం ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమే..
● కుటుంబాలకు రూ.కోటి,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ● మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్ డాబాగార్డెన్స్/ఆరిలోవ: సింహగిరిపై గోడ కూలిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.కోటి నష్ట పరిహారంతో పాటు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. కేజీహెచ్ వద్ద మృతుల కుటుంబ సభ్యులను విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్కుమార్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, పార్టీ నాయకులు కొండా రాజీవ్గాంధీ, పేడాడ రమణికుమారి, ద్రోణంరాజు శ్రీవత్సవ్, రవిరెడ్డి, జియ్యాని శ్రీధర్, పలువురు నాయకులతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానానికి వైకుంఠ ఏకాదశి ఎంత పవిత్రమో.. సింహాచలానికి చందనోత్సవం అంత పవిత్రమని చెప్పారు. సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు భక్తులు వస్తారని తెలిసీ కూడా అవసరమైన ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. కొండవాలులో ఎంతో పటిష్టంగా నిర్మించాల్సిన రక్షణ గోడను ఫ్లైయాస్ ఇటుకలతో నిర్మించడమే గాక పెండాల్స్ను గోడకు కట్టడం.. ఫలితంగా ఏడుగురు భక్తుల ప్రాణాలు తీశారన్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ నిర్లక్ష్యం.. చేతగానితనం తేటతెల్లమైందన్నారు. భక్తులకు చేసిన ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. మృతుల కుటుంబాల రోదన అంతా ఇంతా కాదన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను కూడా రాజకీయం చేయడం దారుణమన్నారు. చనిపోయిన వారి కుటుంబానికి రూ.కోటి పరిహారం, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది ‘కూటమి’ వైఫల్యమే.. చందనోత్సవంలో ఇంతటి ఘోరం జరగడం దిగ్భ్రాంతి కలిగించిందని మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుత ఘటన నిస్సందేహంగా కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. -
బాధిత కుటుంబాలకు భరోసా
విశాఖ సిటీ: సింహాచలంలో గోడ కూలి మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వస్తున్నారన్న వార్త కూటమి ప్రజా ప్రతినిధుల్లో వణుకు పుట్టించింది. జగన్ నేరుగా కేజీహెచ్కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడతారని ముందు షెడ్యూల్ రావడంతో వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు అలెర్ట్ అయిపోయారు. కేజీహెచ్ మార్చురీ వద్ద హడావుడి చేశారు. మృతదేహాలకు వెంటనే పోస్టుమార్టం నిర్వహించాలని వైద్యాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల సంతకాలు లేకుండానే పోస్టుమార్టం చేసి తరువాత ఆ తతంగాన్ని పూర్తి చేశారు. మృతదేహాలను కేజీహెచ్ నుంచి వారి ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.50 గంటలకు విశాఖకు వచ్చారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా చంద్రంపాలెంలో ఉన్న మృతులు పిల్లా ఉమామహేశ్వరరావు, పిల్లా శైలజ కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి ఽధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకొని 7.15 గంటలకు విజయవాడకు తిరుగుపయనమయ్యారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. సాయంత్రం విశాఖకు వచ్చిన మాజీ సీఎం జగన్ నేరుగా చంద్రంపాలెంలో బాధిత కుటుంబం ఇంటికి పయనం ఆయనను విశాఖకు రానీయకుండా చేసేందుకు కూటమి విశ్వప్రయత్నాలు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహణ అయినప్పటికీ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్ -
హా.. నరహరీ
ఆర్తనాదాలతో మార్మోగిన సింహగిరి● పాలకుల నిర్లక్ష్యానికి ఏడు ప్రాణాలు బలి ● సింహాచలం చరిత్రలోనే తొలిసారి విషాదం ● మృత్యుఘోష వినకుండా.. దర్శనాలపైనే వీవీఐపీల దృష్టి ● వీఐపీ దర్శనాల కోసమే పనిచేసిన మంత్రుల కమిటీ చీకటిలో మృత్యు ఘోష బుధవారం వేకువజామున 2.22 గంటలకు ఈదురుగాలులు మొదలయ్యాయి. 2.25 గంటలకు గాలుల తీవ్రత పెరిగింది.. అప్పటికే వేలాది మంది భక్తులు క్యూల్లో దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. 2.30 గంటలకు వర్షం ప్రారంభమైంది. 2.45 గంటలకు ఈదురుగాలులతో భారీ వర్షంగా మారింది. క్యూల్లో వేల మంది భక్తులు తలదాచుకునేందుకు సరైన వసతి లేదు. రూ.300 టికెట్ క్యూల్లోని భక్తులు వర్షపు నీరు రాని చోట ఆగారు. మరికొందరు తడిసి ముద్దవుతూనే స్వామి దర్శనం కోసం ముందుకు కదిలారు. సరిగ్గా కొత్త షాపింగ్ కాంప్లెక్స్ పైభాగం నుంచి ఇంకో 100 మీటర్లు ముందుకు వెళ్తే స్వామి దర్శనం కలుగుతుంది. ఇంతలో ఊహించని విపత్తు.. సరిగ్గా 3.05 గంటలకు కొత్తగా నిర్మించిన గోడపైకి వరదనీరు వచ్చింది. దీంతో గోడ బీటలు వారింది. టెంట్ గోడపైనే ఏర్పాటు చేయడంతో ఈదురుగాలులకు కూలిపోయింది. అదే సమయంలో గోడ ఒక్కసారిగా కుప్పకూలి భక్తులపై పడింది. గోడ శిథిలాల కింద ఏడుగురు భక్తులు చిక్కుకొని మృత్యు ఒడికి చేరారు. సాక్షి, విశాఖపట్నం : నిత్యం నృసింహుని నామస్మరణతో పులకించే పవిత్ర సింహగిరి.. భక్తుల ఆర్తనాదాలతో కన్నీటి సంద్రమైంది. గోవిందా.. గోవిందా.. సింహాద్రి అప్పన్నా.. కాపాడు అని ఆ దేవ దేవుడిని వేడుకునే భక్తకోటి గొంతులే.. ప్రాణభయంతో రక్షించండి.. చచ్చిపోతున్నాం అంటూ హాహాకారాలు పెట్టాయి. సింహాద్రినాథుని నిజరూప దర్శనం కోసం వచ్చిన భక్తుల ఆశలు అక్కడికక్కడే సమాధి అయ్యాయి. స్వామి దర్శనానికి అడుగుల దూరంలో ఉండగానే.. కొందరు అనంతలోకాలకు చేరుకున్నారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఈ మహా విషాదం.. పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. కనులపండువగా జరగాల్సిన చందనోత్సవం.. ప్రభుత్వ ఘోర నిర్లక్ష్యం, మంత్రుల ప్రచార యావ, ప్రజాప్రతినిధుల సేవలో తరించిన అధికారుల చేతకానితనంతో తీరని దుఃఖాన్ని, అంతులేని వేదనను మిగిల్చింది. ఏడు నిండు ప్రాణాలను బలిగొన్న ఘోర వైఫల్యోత్సవంగా.. ఈ చందనోత్సవం చరిత్రలో నిలిచిపోతుంది. భక్తుల ప్రాణాలకు విలువేదీ? రెండు వారాలుగా ఐదుగురు మంత్రుల కమిటీ పేరుతో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. సమీక్షల మీద సమీక్షలు, పకడ్బందీ ఏర్పాట్లంటూ ప్రగల్భాలు పలికారు. కానీ.. క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యం. ఏటా చందనోత్సవం రోజు వర్షం కురవడం ఆనవాయితీ. ఈ చిన్నపాటి ముందుచూపు కూడా లేకుండా.. కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా అధికారులు, మంత్రులు ఏం చేశారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వారి దృష్టి అంతా వీఐపీ టికెట్ల పంపకాలు, ప్రచార ఆర్భాటంపైనే కేంద్రీకృతమైంది తప్ప.. సామాన్య భక్తుల సౌకర్యాలు, భద్రత పట్టలేదు. ఫలితం ఈ ఘోర విషాదం. -
5వ తేదీ నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
కె.కోటపాడు : వచ్చే నెల 5, 6, 7 తేదీలలో అనకాపల్లి జిల్లా యలమంచిలిలో సీపీఐ జిల్లా 2వ మహాసభలు జరగనున్నట్లు ఆ పార్టీ జిల్లా సమితి సభ్యుడు వేచలపు కాసుబాబు తెలిపారు. కె.కోటపాడులో మంగళవారం ఆయన విలేకరులకు తెలిపారు. ఈ సమావేశాలకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి హజరవుతారన్నారు. అనకాపల్లి జిల్లాలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆధుకుంటామని ఎన్నికల ప్రచార సమయంలో రైతులకు కూటమి నాయకులు హామీ ఇచ్చారని, అయితే ఈ ఏడాది క్రషింగ్ కూడా సక్రమంగా జరిగే పరిస్థితి ఫ్యాక్టరీలో లేకపోయిందని కాసుబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఏడాది అవుతున్నా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీపీఐ మహాసభలో గోవాడ సుగర్స్ అంశాన్ని చర్చిస్తామన్నారు. జిల్లా మహాసభలకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాసుబాబు కోరారు. -
డీఈవోకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సత్కారం
జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావు నాయుడును సత్కరిస్తున్న నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు అనకాపల్లి టౌన్ : జిల్లా పరిధిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ, ఉత్తమ ఫలితాల సాధనకు విశేష కృషి చేసిన జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడును నోబుల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం సత్కరించారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ త్వరితగతిన 10వ తరగతి సిల్బస్ పూర్తి చేయించడంలోనూ, నిర్వహించడంలోనూ ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తుంపాల వెంకటరమణ, నక్కా శ్రీనుబాబు పాల్గొన్నారు. -
పద్యమేవ జయతే..
● తెలుగు ఉపాధ్యాయుల కృషి ● మాతృభాషపై విద్యార్థులకు మమకారం పెరిగేలా కార్యక్రమాలు ● అనంతచ్చందం సహకారంతో తర్ఫీదు ● గూగుల్ లింక్ ద్వారా పద్య పోటీలు ● విజేతలకు ప్రశంసాపత్రాలు నక్కపల్లి : శాఖోపశాఖలుగా వికాసం పొందిన కావ్య ప్రక్రియలలో శతక ప్రక్రియ ఒకటి. ప్రాకృత, సంస్కృత ప్రక్రియలను అనుసరించి తెలుగు శతక రచన ఆరంభమై కాలక్రమేణ విశిష్ట సాహితీ ప్రక్రియగా రూపొందింది. ప్రాచీన కాలం నుంచి కనీవినీ ఎరుగని ఎన్నో శతక రచనలు విశిష్టమైన కవుల వివరాలు సేకరించి విద్యార్థులకు పరిచయం చేసి వారిలో పద్యపఠనం పట్ల ఆసక్తి కల్పిస్తోంది అనంతచ్చందం అనే సంస్థ. శతక పద్య పఠనంపై విద్యార్థులకు పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ వారిలో ఆసక్తి పెంచుతూ బోధన చేస్తున్నారు బోదిగల్లం జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు. ఇటీవల ఉపమాకలో శతక పద్యాలపై అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులను తీసుకెళ్లి ముఖ్య అతిథులుగా హాజరైన అష్టావధానుల్లో ఎంతో మంది నిష్ణాతులకు పరిచయం చేసి వారి సందేహాలను నివృత్తం చేయడమే కాకుండా పద్యపఠనంపై వారిలో మరింత ఆసక్తి పెరిగేలా కృషి చేశారు. ఇదే కార్యక్రమంలో పద్యపఠనంపై ప్రముఖ కవులు, అష్టావధానుల సమక్షంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆన్లైన్ పద్య పోటీలు పద్య రచనలు చేయడంలో అనంతచ్చందం, మహతి చానల్ వారి సహకారంతో పాఠశాలల్లో విద్యార్థులకు తర్ఫీదు నిస్తున్నారు. అనంతచ్చందం వారి సహకారంతో పద్యగురు తోపెళ్ల బాల సుబ్రహ్మణ్యశర్మ ఆద్వర్యంలో ప్రతి నెలా నాలుగో ఆదివారం గూగుల్ లింక్ ద్వారా ఆన్లైన్ పద్య పోటీలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు చిన్న వయసులోనే పద్య పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు మాతృభాషపై మమకారం పెంచేలా తెలుగు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గూగుల్ లింక్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు స్థానిక విద్యార్థులతోపాటు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగువారు, తెలుగు భాషపై మమకారం ఉన్న వారు పాల్గొనడం విశేషం.పద్యపోటీల్లో విజేతలకు నగదు పురస్కారం, ప్రశంసాపత్రాలు సైతం అందజేస్తున్నారు. పెదబోదిగల్లం జెడ్పీపాఠశాలలో... ఆరు మాసాలుగా పెద బోదిగల్లం జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు ఎన్.వి.ఎస్. ఆచార్యులు ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పద్య పఠనం, పద్య రచనపై మంచి తర్ఫీదునిస్తూ పోటీల్లో పాల్గొనేలా చేస్తున్నారు. రోజూ పాఠశాలలో కొంత సమయాన్ని వీరి కోసం కేటాయించడం గమనార్హం. పద్య పఠనంతో విద్యార్థుల్లో ధారణ శక్తి పెంపొందడమే కాకుండా మానసిక వికాసం, భాషపై పట్టు సాధించడానికి వీలు కలుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
ఆయుష్మాన్ సీహెచ్వోల ధర్నా
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సీహెచ్వోలు తుమ్మపాల : అనేక సమస్యలతో సతమతమవుతున్న తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పందించాలంటు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల సీహెచ్వోలు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సమస్యల పరిష్కారంపై డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలన్నారు. ప్రతి ఏటా 5 శాతం ఇంక్రిమెంట్, పని ఆధారిత ప్రోత్సాహకాలు క్రమబద్దీకరణ, ఈపీఎఫ్వో పునరుద్ధరణ, ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్వోలను మినహాయించాలన్నారు.హెచ్ఆర్ పాలసీ వెంటనే అమలు చేయాలన్నారు. రెండేళ్ల నుంచి ఉన్న జీతభత్యాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
పంట కోతలు వాయిదా వేసుకోవాలి
శాస్త్రవేత్తల సమావేశంలో మాట్లాడుతున్న ఇన్చార్జ్ ఏడీఆర్ రమణమూర్తి అనకాపల్లి : గాలులు, వర్ష సూచన ఉన్నందున, కోత దశలో ఉన్న వరి, వేరుశనగ, నువ్వుల పైరులను కోయడం వాయిదా వేసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఇన్ఛార్జ్ ఏడీఆర్ డాక్టర్ కె.వి.రమణమూర్తి అన్నారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరకులో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు పీకపురుగు ఆశించవచ్చని, నివారణకు క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మీ.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలన్నారు. చెరకులో రాగల వర్షాన్ని వినియోగించుకుని పై పాటు ఎరువును అనగా 45 రోజుల వయసు గల కార్సి చేసిన పైరులో ఎకరాకు 150 కిలోల యూరియాను 90 రోజుల వయసు గల చెరకు మొక్క తోటల్లో 75 కిలోల యూరియాను పై పాటుగా వేసుకోవాలని అన్నారు. పక్వానికి వచ్చిన అరటి గెలలను, మామిడి, బొప్పాయి వంటి పండ్లను, కూరగాయలను వెంటనే కోసి మార్కెట్కు తరలించాలని సూచించారు. అలాగే పక్వానికి వచ్చిన మిరప కాయలను వెంటనే కోసుకోవాలని సూచించారు. ఖాళీగా ఉన్న పొలాల్లో వేసవి లోతు దుక్కు చేసుకునే తరుణం ఇదేనని అన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి.భవాని, ఎ.శిరీష, పి.వి.పద్మావతి, ఎ.అలివేణి పాల్గొన్నారు. -
మేక కోసం వచ్చి మృత్యువాత
● ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ ● ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు నక్కపల్లి : మేక కోసం వచ్చి ఓ వ్యక్తి మృత్యువాత పడిన ఘటన మంగళవారం నక్కపల్లి వారపు సంత సమీపంలో జరిగింది. జాతీయరహదారిపై నక్కపల్లి వారపు సంత సమీపంలో ట్రాక్టర్ను ట్యాంకర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. సీతంపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్లో ముగ్గురు కూలీలు అడ్డురోడ్డు వెళ్తున్నారు. వారపు సంత సమీపంలో తుని నుంచి విశాఖ వెళ్తున్న ట్యాంకర్ లారీ ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకు పోయింది. ప్రమాదానికి గురైన ట్రాక్టర్ రోడ్డుపక్కన మేకను పట్టుకుని కూర్చొన్న వ్యక్తిపై బోల్తాపడడంతో సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన మామిడి సత్తిబాబు(40) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదంలో సీతంపాలెం గ్రామానికి చెందిన ప్రసాదుల భాస్కరరావు, మేకల నాగేంద్ర, మడగా శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. సారిపల్లిపాలెంలో విషాదం సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన సత్తిబాబు మేకలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజుమాదిరిగానే జాతీయరహదారి పక్కన ఉన్న పొలాల్లోకి మేకలను మేపుకోడానికి వచ్చాడు. మేకల మందలో ఒక మేక తప్పిపోయి జాతీయ రహదారి సమీపానికి రావడంతో అక్కడకు వచ్చిన సత్తిబాబు మేకను పట్టుకుని ఎండ వేడిమి తట్టుకోలేక రోడ్డుపక్కన చెట్టు నీడన కూర్చుని సేదతీరుతున్నాడు. ఇంతలో రోడ్డుపై వెళుతున్న ట్రాక్టర్ను ట్యాంకర్ లారీ ఢీకొనడం, అది సత్తిబాబుపై పడడంతో ట్రాక్టర్ కిందపడి సత్తిబాబు మృత్యువాత పడ్డాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యజమానిని కోల్పొవడంతో కుటుంబం రోడ్డున పాలైంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కుమార స్వామి తెలిపారు. బాధిత కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు తాతబాబు పరామర్శించారు. -
సారాబట్టీలపై ఎకై ్సజ్ పోలీసుల దాడులు
కె.కోటపాడు : కొత్తభూమి గ్రామంలో సారా తయారీ కేంద్రాలపై చోడవరం ఎకై ్సజ్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. చోడవరం ఎకై ్సజ్ సీఐ పాపునాయుడు ఆదేశాల మేరకు సిబ్బందితో కలిసి ఎస్ఐ శేఖరం గ్రామం శివార్లలో తనిఖీలు జరిపారు. గ్రామ శివార్లలో గల సరుగుడు తోటలో డ్రమ్ములతో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 600 లీటర్ల బెల్లం పులుపును గుర్తించి ధ్వంసం చేశారు. వీటితో పాటు 30 లీటర్ల సారాతో పాటు దమ్ము దేముడు అనే వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపినట్టు ఎస్ఐ తెలిపారు. సారా కేసుల్లో ఒకటి కంటే ఎక్కువమార్లు పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది రాంబాబు, కె.వి.నాయుడు పాల్గొన్నారు. -
లేటరైట్ పేరుతో బాకై ్సట్ దోపిడీ
నర్సీపట్నం : నాతవరం మండలం, సుందరకోట ప్రాంతంలో లేటరైట్ పేరుతో బాకై ్సట్ దోపిడీకి పాల్పడుతున్నారని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొట్టా నాగరాజు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి తవ్వకాలు ప్రారంభించారన్నారు. లేటరైట్ తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు ఆడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారన్నారు. అక్రమ మైనింగ్ వల్ల వారి జీవన మనుగడకే ప్రమాదం ఉందన్నారు. కొంత మంది దళారులు, రాజకీయ నాయకులు సహాయంతో అక్రమ మైనింగ్ జరుగుతుందన్నారు. గతంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు లేటరైట్ ముసుగులో బాకై ్సట్ తవ్వుకుపోతున్నారని ఆందోళన చేశారని గుర్తు చేశారు. గతంలో బాకై ్సట్ అయినప్పుడు ఇప్పుడు లేటరైట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. తక్షణమే అక్రమ మైనింగ్ను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. -
నేటి పాలిసెట్కు సర్వం సిద్ధం
తుమ్మపాల: ఈ నెల 30న జిల్లాలో పాలిసెట్ పరీక్ష–2025 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కో–ఆర్డినేటర్ ఐ.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. జిల్లాలో 23 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షకు మొత్తం 9,022 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రం అనకాపల్లి టౌన్లో 14, నర్సీపట్నంలో 9 కేంద్రాలలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే పరీక్షకు అభ్యర్థులు హాల్టిక్కెట్తో గంట ముందు చేరుకోవాలన్నారు. బాల్ పాయింట్ పెన్ (బ్లాక్), పెన్సిల్, ఎరేజర్, షార్పనర్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు (ట్యాబ్స్, మొబైల్ ఫోన్లు) కాలిక్యులేటర్లు, స్మార్ట్ వాచ్లకు అనుమతి లేదన్నారు. -
నేరేడు బందలో ఆరుగురికి మలేరియా జ్వరాలు
జ్వర పీడితులకు ఆర్టీడీ టెస్ట్లు చేస్తున్న మలేరియా అధికారులు రావికమతం : చీమలపాడు శివారు కొండ శిఖర గ్రామం నేరేడుబందలో ఆరుగురికి మలేరియా జ్వరాలు ఉన్నట్టు ఆర్టీడీ టెస్టులు (రక్త పరీక్షలు) ద్వారా మలేరియా అధికారులు నిర్దారించారు. నేరేడుబందలో విష జ్వరాలు ప్రబలి 13 మందికి పైగా మంచం పట్టారు. విష జ్వరాలపై మంగళవారం సబ్ యూనిట్ మలేరియా అధికారి రమణ, ఎల్.టి.మహేష్ , హెచ్.ఎస్.రమణ నేరేడుబందకు వెళ్లి జ్వరాలపై ఆరా తీశారు. జ్వరాల నిర్ధారణకు జ్వర పీడితులకు ఆర్టీడీ టెస్టు ద్వారా రక్త పరీక్షలు నిర్వహించి ఆరుగురికి మలేరియా జ్వరాలు ఉన్నట్టు నిర్ధారించారు. వారికి అవసరమైన మందులు అందచేసినట్టు మలేరియా అధికారి రమణ చెప్పారు. మలేరియా కారక దోమల నిర్మూలనకు ఇంటింటా స్ప్రేయింగ్ చేయించారు. దోమ తెరలు వాడాలని, రోజూ కాచి వడపోసిన వేడి నీటిని తాగాలని ఇళ్ల వద్ద మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గిరిజనులకు సూచించినట్టు చోడవరం సబ్ యూనిట్ మలేరియా ఆధికారి రమణ తెలిపారు. -
గుండె గు‘బిల్లు’
● కొనసాగుతున్న కరెంటు బిల్లుల దందా ● కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయంనక్కపల్లి: ఎస్సీ, ఎస్టీలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీని తుంగలోకి తొక్కడమే కాక వేలాది రూపాయల బకాయిలు కూడా చెల్లించమని కూటమి సర్కారు ఒత్తిడి చేయడం పట్ల తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు నెలకు 200 యూనిట్ల వరకు మినహాయింపు ఇచ్చి ఉచితంగా విద్యుత్ అందించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు వేలల్లో కరెంటు బిల్లులు వస్తున్నాయి. తామూ ఉచిత కరెంటు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు 200 యూనిట్ల రాయితీని అమలు చేయకపోవడమే కాక పాత బకాయిలు ఉన్నాయంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. డొంకాడలో ఏప్రిల్ నెలలో 100 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగించిన దళితులకు ట్రాన్స్కో వారు ఇచ్చిన బిల్లులు షాక్ కొట్టాయి. మే నెలలో చెల్లించాలని, కాని పక్షంలో కనెక్షన్ తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, మండల కన్వీనర్ ఎం.రాజేష్లు డొంకాడ దళిత కాలనీకి వెళ్లి బిల్లులు పరిశీలించారు. సర్వీసు నెంబరు 478లో నిమ్మల బాలయ్య 145 యూనిట్లు వాడితే రూ.9,324 బిల్లు ఇచ్చారు. సర్వీసు నెంబరు 196తో డి.పెద అప్పారావు 66 యూనిట్లు వాడితే రూ.1571లు చెల్లించాలని బిల్లు వచ్చింది. సర్వీసు నెంబరు 617తో రాములమ్మ 75 యూనిట్లు వాడితే రూ.1086లు చెల్లించాలని బిల్లు చేతికిచ్చారు. ఈ బిల్లులపై అప్పలరాజుతోపాటు వినియోగదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా కరెంటు బిల్లులు కట్టలేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీలపై బకాయిల భారం మోపకుండా చూడాలని, 200 యూనిట్ల వరకు ఉచిత పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పారావు వాడిన 66 యూనిట్లకు వచ్చిన బిల్లు -
అధికార పార్టీ నేతలకే అంతరాలయ దర్శనం!
సామాన్య భక్తులకు అల్లంతదూరం● రూ.1,000 టికెట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితీ అంతే.. ● రూ.1,500 టికెట్లన్నీ కూటమి పార్టీల నేతలకే.. ● టికెట్ల జారీలో దేవాలయ ఈవోకి దక్కని స్థానం ● కలెక్టరేట్, అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకే వ్యవహారం డమ్మీగా మారిన ఈవో..! ప్రస్తుత సింహాచలం దేవస్థానం ఈవో సెలవులో ఉండడంతో ఇన్చార్జిగా ఈవోగా కె.సుబ్బారావును ప్రభుత్వం నియమించింది. అయితే, సదరు దేవాలయ ఈవోను చందనోత్సవ వ్యవహారాల్లో నామమాత్రం చేశారనే విమర్శలున్నాయి. పాసుల జారీలో కానీ.. నిర్ణయాల్లో కానీ దేవాలయ ఈవోను డమ్మీ చేశారనే ఆరోపణలున్నాయి. పెత్తనమంతా రెవెన్యూ యంత్రాంగానిదే ఉంటోందని దేవదాయ అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. దేవాలయంలో నిరంతరంగా సేవలందించే వ్యక్తులు, సంస్థలతో పాటు ఎన్జీవోలకు కూడా టికెట్లను మంజూరు చేయాలంటే కలెక్టరేట్ నుంచి ఆదేశాలు రావాల్సిందేనని దేవాలయ అధికారులు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. కనీసం వీరికి కూడా పాసులు ఇచ్చేందుకు తమ చేతుల్లో ఏమీ లేదని దేవాలయ అధికారులు పేర్కొంటున్నట్టు సమాచారం. కలెక్టరేట్కు వెళితే కనీసం ఎవరూ తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇన్చార్జిగా ఉన్న ఈవో మరో వారం, పది రోజుల్లో వెళ్లిపోయే భావనలో ఉండటంతో.. ఆయన్ని పూర్తిగా విస్మరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా దేవాలయ అధికారులను, సిబ్బందిని నామమాత్రం చేసి అంతా కలెక్టరేట్ నుంచి, అధికార పార్టీ నేతల నుంచి వచ్చే ఆదేశాలే అమలవుతున్నాయనే విమర్శలు సింహాచలం కొండల చుట్టూ ప్రతిధ్వనిస్తుండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాధారణ భక్తులకే అప్పన్న చందనోత్సవంలో పెద్ద పీట వేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన జిల్లా యంత్రాంగం.. కేవలం వీఐపీ భక్తుల సేవలోనే తరిస్తోంది. అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించేందుకు సిద్ధమైంది. సాధారణ భక్తులు, ఆన్లైన్లో రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసిన వారికి మాత్రం అంతరాలయ దర్శనం లభించడం లేదు. కేవలం సిఫార్సులకే పెద్ద పీట వేయడం, సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనం లేకపోవడం వంటి వ్యవహారాలన్నీ.. దేవాలయ ఇన్చార్జి ఈవోని డమ్మీని చేసి కలెక్టరేట్ నుంచి నడిచాయని విమర్శలు వినిపిస్తున్నాయి. టికెట్ల జారీలో కానీ, ఏర్పాట్లలో కానీ ఈవోతో సంబంధం లేకుండా వ్యవహారాలు సాగాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మొత్తంగా ఎన్నడూ లేని విధంగా వీఐపీ భక్తులకే అంతరాలయం ద్వారా నిజరూప అప్పన్న దర్శనం లభించనుండగా.. సాధారణ భక్తులు మాత్రం దూరం నుంచే హడావుడిగా దర్శనం చేసుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఉన్నాయనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. సిఫార్సులకే పెద్ద పీట ఏడాదిలో ఒక్కరోజే లభించే అప్పన్న నిజరూప దర్శనం కోసం ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈసారి 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. అయితే టికెట్లు మాత్రం సాధారణ భక్తులకు అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలున్నాయి. ఆన్లైన్ టికెట్లను కూడా ముందుగానే అధికార పార్టీ నేతలకు అప్పగించారనే ఆరోపణలున్నాయి. ఇక వీఐపీ టికెట్లతో పాటు రూ.2,500, రూ.1,500, రూ.1000 టికెట్ల జారీలోనూ కేవలం అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్ద పీట వేశారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలు కోరినన్ని టికెట్లు జారీ చేసిన జిల్లా యంత్రాంగం.. దేవాలయంలో నిరంతరంగా సేవలందించే వ్యక్తులు, సంస్థలు పది టికెట్లు అడిగితే కేవలం ఒకటి మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించారు. తీరా ఈ టికెట్లను తీసుకునేందుకు సదరు బ్యాంకు వద్దకు వెళితే.. తమకు ఇంకా దేవస్థానం నుంచి లేఖ రాలేదనే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో దేవస్థాన అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించిన వ్యక్తులు, సంస్థలకు కూడా కనీస గౌరవ లేకుండా చేశారని వాపోతున్నారు. మొత్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారుల వ్యవహారం ఉందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
పేదరిక నిర్మూలనలో మార్గదర్శులను గుర్తించండి
తుమ్మపాల: పేదరిక నిర్మూలనకు మార్గదర్శులను గుర్తించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ‘పేదరిక నిర్మూలన–మార్గదర్శి–బంగారు కుటుంబం పీ 4 జీరో పావర్టీ’ కార్యక్రమంపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. అట్టడుగు వర్గంలో ఉన్న 20 శాతం కుటుంబాలను ఆదుకోవడం కోసం పీ 4 సర్వే ద్వారా సమాజంలో సేవా దృక్పథం కలిగిన మార్గదర్శులను గుర్తించాలన్నారు. జిల్లాలో 64,475 బంగారు కుటుంబాలను పీ 4 సర్వే ద్వారా గుర్తించామని, ఈ కుటుంబాలకు ఉన్నత స్థాయిలో ఉన్న వివిధ వర్గాల నుంచి మార్గదర్శులను ఎంచుకుని, ఈ మార్గదర్శులను బంగా రు కుటుంబంతో అనుసంధానం చెయ్యాలన్నారు. పాడి రైతుల అభివృద్ధికి కృషి పశుసంవర్ధక శాఖ పనితీరు, పురోగతిపై నిర్వహించిన త్రైమాసిక సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ పశు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పాడి రైతుల అభివృద్ధికి దోహదపడే పథకాలను ప్రజలకు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువున ఉన్న రైతుల్లో చాలామంది ఒక పశువుతో జీవనం సాగిస్తున్నారని వారి జీవన నైపుణ్యం పెంచేందుకు వెలుగు ద్వారా రెండో పశువును అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయా లని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పురోగతి, పనితీరు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గర్భిణులను ముందుగా గుర్తించి వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తం చేయాలన్నారు.● సమీక్ష సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్ -
వరి పంట వ్యర్థాల నుంచి ఇంధన తయారీ!
● అవకాశాలను పరిశీలించిన ఎస్ఏఈఎల్ సంస్థజోగారావుపేటలో స్థల పరిశీలన కశింకోట: పేరంటాలపాలెం శివారు జోగారావుపేట గ్రామంలో ఢిల్లీకి చెందిన సస్టెయినబుల్ అండ్ ఎఫోర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ (ఎస్ఎఈఎల్) సంస్థ ప్రతినిధుల బృందం సోమవారం స్థల పరిశీలన జరిపింది. సంస్థ ఉపాధ్యక్షుడు నరేంద్ర సింగ్ నాయకత్వంలోని బృందం వరి పంట వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు గల అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై వివరాలను సేకరించింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి గల అవకాశాల గురించి పరిశీలించింది. మండల వ్యవసాయ అధికారి ఎం.స్వప్న, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వెలవెలబోయిన కలెక్టరేట్
● అర్జీదారులు లేక మధ్యాహ్నం 12 గంటలకే ఖాళీ ● డీఆర్వో ఆధ్వర్యంలో అర్జీల స్వీకరణతుమ్మపాల: నర్సీపట్నంలో జరిగిన పీజీఆర్ఎస్కు కలెక్టర్ విజయ కృష్ణన్ వెళ్లిపోవడంతో అనకాపల్లి కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమం బోసిపోయింది. అర్జీదారులు అంతంతం మాత్రంగా వచ్చారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకే అధికారులు వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ వారం కూడా కలెక్టరేట్ సిబ్బంది దివ్యాంగులను లోపలికి రానీయలేదు. దీంతో వారంతా గంటల పాటు అధికారుల కోసం బయటే నిరీక్షించారు. అర్జీల్లో అధికంగా పునరావృతమయ్యాయి. అధికారులు చెప్పే సమాధానమే సమస్య పరిష్కారంగా చూపి అర్జీని ముగించేస్తున్నారని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేసున్నారు. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని పలువురు వాపోతున్నారు. త్వరితగతిన సమస్యల పరిష్కారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేందుకు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్ కార్యక్రమంలో ఆయనతో పాటు ప్రత్యేక డిప్యూటీ కలెక్టరు ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్(ఏపీఐఐసీ) మనోరమ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. విభిన్న ప్రతిభావంతుల అర్జీలను ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి నేరుగా స్వీకరించారు. తల్లి మృతికి కారకులపై విచారణకు డిమాండ్ తన తల్లి మృతికి కారణమైన వారిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరుతూ నక్కపల్లి మండలం ఉద్దండపురానికి చెందిన ఆవాల సురేష్ ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయి తీ ఉందంటూ తనను రావాలని చెప్పి సాయంత్రం 6 గంటల సమయంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన ఇంటికి వెళ్లి తల్లి అవాల లక్ష్మిని గాయపరిచారని, వైద్యం కోసం కేజీహెచ్కు తరలించినా ఫలితం లేదన్నారు. నిందితులకు సహకరిస్తున్న ఎస్హెచ్వోను బదిలీ చేసి, విచారణ చేపట్టాలని కోరారు. సోదరుడి దౌర్జన్యంపై ఫిర్యాదు పసుపు, కుంకుమ కింద తన తండ్రి రాసిచ్చిన భూమిలోకి సోదరుడు రానివ్వడం లేదంటూ కోటవురట్ల మండలం టి.జగ్గంపేటకు చెందిన దివ్యాంగురాలు వంటాకుల వేణమ్మ ఫిర్యాదు చేశారు. టి.జగ్గంపేట రెవెన్యూ సర్వే నంబర్ 73/2ఏలో కొంత భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేసినప్పటికి సోదరుడు అప్పలనాయుడు రానివ్వడం లేదన్నారు. తన తండ్రి మరణించడంతో అనాథను అయ్యానని, న్యాయం చేయాలని వేడుకున్నారు. గతేడాది కూడా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు. గతేడాదిలో మంజూరైన బిల్లు చెల్లించాలి గత ప్రభుత్వంలో మంజూరైన విలేజ్ హెల్త్ కేంద్రాన్ని నిర్మించానని, అందుకు సంబంధించిన రూ.7.5 లక్షల బిల్లును తక్షణమే చెల్లించాలని కోరుతూ సబ్బవరం మండలం మొగలిపురానికి చెందిన మొల్లి నాయుడు అర్జీ అందజేశారు. 2024 నవంబర్లో మంజూరైన బిల్లు నేటికీ చెల్లించకుండా పంచాయతీ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికి అనేక సార్లు వినతులు అందజేశానని, ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికై న అధికారులు స్పందిచి న్యాయం చేయాలని కోరారు. -
అభివృద్ధి పేరిట అరాచకాలు
●టీడీఆర్లపై కూటమి కుయుక్తులు పేరు అభివృద్ధి.. చేసేది అరాచకం.. ఇదీ కూటమి ప్రభుత్వ సిద్ధాంతం. ఎస్ఈజెడ్లో కొత్త పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేసేందుకు రెండు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణకు నిర్వాసితులను ఒప్పించాలని చూశారే గానీ నొప్పించే విధంగా ఏ ప్రభుత్వమూ ప్రయత్నించలేదు. ఇళ్లు, దుకాణాలు, పొలాలను కోల్పోయేందుకు మనసు రాక.. కాదనలేక మధనపడుతున్న బాధితుల పట్ల నేటి చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరిహారం ఇచ్చి తమ బతుకులకు ప్రత్యామ్నాయం చూపిస్తారని ఆశిస్తున్న నిర్వాసితుల మెడకు ఇప్పుడు టీడీఆర్ గుదిబండ వేలాడుతోంది. అచ్యుతాపురం: రహదారి విస్తరణ మాట విన్నప్పుడల్లా నిర్వాసితుల గుండెల్లో రాయి పడుతుంది. పరిశ్రమల స్థాపన కోసం అచ్యుతాపురం–రాంబిల్లి మండలాల్లో వేలాది ఎకరాలు ఇవ్వాల్సివచ్చింది. అంతలోనే అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణ ప్రతిపాదన వచ్చింది. సుమారు 14 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అగ్రహారం, నాగులాపల్లి, ఒంపోలు, గంగాదేవిపేట, మునగపాక, తిమ్మరాజుపేట, హరిపాలెం, కొండకర్ల, చోడపల్లి, మోసయ్యపేట గ్రామాలకు చెందిన రైతుల భూములు, ఇంటి స్థలాల మీదుగా రహదారిని విస్తరించాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 30–40 అడుగుల వెడల్పులో ఉన్న ఈ రహదారి విస్తరణ ఆవశ్యకత కచ్చితంగా ఉంది. అయితే విస్తరణ విషయంలో స్పష్టత లేకపోవడం, ఎన్ని అడుగులు విస్తరిస్తారో తెలియకపోవడంతో 1200 బాధిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడిపాయి. స్పష్టత వచ్చాక తగిన పరిహారం ఇచ్చి ఆదుకోకపోతారా అన్న ఆశతో ఉన్న వారికి కూటమి సర్కారు తీసుకొచ్చిన టెర్ట్ డిపాజిట్ రిసీట్ (టీడీఆర్) ప్రతిపాదన పెద్ద శాపంగా పరిణమించింది. దీని ప్రకారం పరిహారం ఇవ్వకుండా ప్రస్తుతం బాండ్లు ఇస్తారు. నిర్ణీత కాల వ్యవధి ముగిశాక ఆ బాండ్లపై సొమ్ము ఇస్తారు. ఈ ప్రతిపాదనతో తీవ్ర నిరాశకు లోనైన నిర్వాసితులు ఆందోళనల రూపంలో తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. రాస్తారోకోలు, బైఠాయింపులు చేపట్టి తమ వ్యతిరేకత వ్యక్తపరిచారు. వారి బాధను అర్థం చేసుకోవలసింది పోయి ప్రభుత్వం వారిని ఒప్పించడానికి సామ, దాన, భేద దండోపాయాలు ప్రదర్శిస్తోంది. ఇందుకు కూటమి పార్టీల కార్యకర్తలు అన్ని గ్రామాల్లో రంగంలోకి దిగారు. లోలోన భయం.. అందుకే ప్రలోభాల పర్వం నిజానికి అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణ ప్రతిపాదన ఇప్పటిది కాదని అందరికీ తెలుసు. అత్యంత కీలకంగా మారిన ఈ మార్గం విస్తరణ కోసం రైతుల నుంచి భూమిని ఏకాభిప్రాయంతో తీసుకోవాలంటే వారు మనస్ఫూర్తిగా ఇవ్వగలగాలి. అంటే మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం చెల్లించి రైతులకు నుంచి తీసుకోవాలి. కానీ నిధులన్నీ అమరావతి వైపు మళ్లిస్తున్నారనే ఆరోపణల మేరకు ఈ ప్రాంత నిర్వాసితులకు నేరుగా నగదు ఇవ్వకుండా టీడీఆర్లు ఇవ్వాలని నిర్ణయించారు. రావాల్సిన పరిహారం కంటే మూడో వంతు తగ్గిపోవడం, అది కూడా ఎందుకూ కొరగాకుండాపోయే టీడీఆర్లను బలవంతంగా రుద్దాలనే కుయుక్తుల మేరకు రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ మార్గ విస్తరణకు సంబంధించి రెండు చోట్ల బ్రిడ్జి నిర్మాణ పనులు, ఫ్లై ఓవర్లతో కూడిన పనులు ప్రారంభించిన తరుణంలో రైతులు భూములు ఇవ్వకుంటే పనులు ఎక్కడ ఆగిపోతాయో అన్న భయం కూటమి బడా ప్రతినిధుల్లో నెలకొంది. అందుకే తమ కార్యకర్తలను రంగంలోకి దింపి బాధితులను ప్రలోభాలను గురిచేసే పన్నాగానికి తెరలేపారు. విభజించి పాలించు అనే నినాదంతో నిర్వాసితులను విడివిడిగా కలిసి ఎన్వోసీపై సంతకం చేయాలని, వారికి కావాల్సిన ఏ ప్రభుత్వ పనైనా చేస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. వారు అంగీకరించకపోతే భయపెట్టయినా తమ పని పూర్తి చేసుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. దీంతో రైతులు మరింత మండిపడుతున్నారు. టీడీఆర్లకు వ్యతిరేకంగా తిమ్మరాజుపేటలో రోడ్డుపై ధర్నా చేస్తున్న నిర్వాసితులు (ఫైల్)సంతకం పెట్టేది లేదు మాది తిమ్మరాపుపేట. రెండు సెంట్ల స్థలం, దుకాణం ఉంది. 30 ఏళ్లుగా ఆ దుకాణం మీదే ఆధారపడి జీవిస్తున్నాను. టీడీఆర్ ప్రతిపాదన వల్ల మాకు రావాల్సిన పరిహారంలో 40 శాతమే అందుతుంది. పైగా టీడీఆర్లను ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించుకోగలం. మరోవైపు ఉపాధి పోతుంది. పరిహార నగదు ఇస్తేనే సంతకం పెడతాం. –రామారావు, తిమ్మరాజుపేట ఈ పద్ధతిని ఆమోదించం రోడ్డు వేయడం తప్పు కాదు. మాకు ఇవ్వాల్సిన పరిహారం న్యాయంగా మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలి. 36 గజాల స్థలం, దుకాణం ఉన్నాయి. ఎన్వోసీపై సంతకం పెట్టేదిలేదు. అవసరమైతే కోర్టుకై నా వెళతాం. నియోజకవర్గ ప్రజలు కష్టాలను చూసి పరిహారం ఇప్పించాలే తప్ప, ఇలాంటి పద్ధతి సరికాదు. –ఈశ్వర్ కుమార్, ఒంపోలు ● -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కోటవురట్ల: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం శివపురానికి చెందిన కొరుప్రోలు వెంకట కనక సర్వారావు(47) మాకవరపాలెం మండలం రాచపల్లి జంక్షన్లోని ఓ కిరాణా షాపులో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్వగ్రామం ఎస్.రాయవరం మండలం ఒమ్మవరం వెళ్లాడు. తిరిగి సోమవారం మధ్యాహ్నం బైక్పై వేగంగా వస్తూ రామచంద్రపురం జంక్షన్కు శివారున రోడ్డు పక్కన ఉన్న సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి భార్య నాగరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. హెల్మెట్ పెట్టుకుంటే బతికేవాడేమో.. సర్వారావు హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందినట్టు తెలుస్తోంది. అయితే మృతుడు వస్తున్న బైక్కు వెనక హెల్మెట్ లాక్ చేసి ఉంది. హెల్మెట్ను వాహనానికి పెట్టేకంటే తలకు పెట్టుకుని ఉంటే స్వల్ప గాయాలతో బయటపడేవాడని ఘటనా స్థలంలో స్థానికులు చర్చించుకున్నారు. -
● తెల్లవారుజామున 3.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభం ● సాయంత్రం 6 గంటల తర్వాత సింహగిరిపైకి అనుమతి లేదు ● రాత్రి 7 గంటలకు సింహగిరిపై క్యూల ప్రవేశ గేట్లు మూసివేత ● ప్రొటోకాల్ వీఐపీలకు ఉదయం 6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తి ● ఆ తర్వాత అందరికీ నీలాద్రిగుమ్మం న
సింహాచలం : వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని సంవత్సరమంతా చందనం మణుగుల్లో నిత్యరూపంలో దర్శనమిచ్చే సింహాద్రినాథుడి నిజరూప దర్శనం లభించే సమయం ఆసన్నమైంది. సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం బుధవారం జరగనుంది. ఏడాదిలో కేవలం ఒక్క రోజులోని కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు తరలిరానున్నారు. ఈసారి 2 లక్షల మంది భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుంటారని అంచనా వేశారు. సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తూ.. వారికి దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ హరేందిర ప్రసాద్, సింహాచలం ఈవో కె.సుబ్బారావు నేతృత్వంలో జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. వెండిబొరుగులతో చందనం ఒలుపు చందనోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు వైదిక కా ర్యక్రమాలు ప్రారంభిస్తారు. సుప్రభాతసేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విగ్గరణం, కలశారాధన చేస్తారు. అనంతరం వెండిబొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని తీసి నిజరూపభరితుడిని చేస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజుకి తొలిదర్శనం కల్పిస్తారు. 3.30 గంటల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించే రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్, టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించేవారికి దర్శనం కల్పిస్తారు. ఉదయం 6 గంటలతో అంతరాలయ దర్శనాలు పూర్తిచేస్తారు. ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనం ఉదయం 3.30 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభిస్తారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000 టికెట్ల క్యూల్లో ఉన్న వారందరికీ దర్శనాలు ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలవరకే సింహగిరిపై దర్శనాల క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామి ద ర్శ నం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా భక్తులను కొండపైకి అనుమతించరు. చందనోత్సవంలో విధులు నిర్వర్తించే పోలీసులు సామాన్య భక్తులతో మర్యాద కలిగి, అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. సామాన్య భక్తులకే పెద్దపీట బీచ్రోడ్డు: చందనోత్సవంలో సాధారణ భక్తుల దర్శనానికి తొలి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్లో ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండపైన, కింద నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్టీసీ బస్సులను మాత్రమే నడపాలని ఆదేశించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా విక్రయించే టికెట్లపై సీరియల్ నంబర్, స్కానింగ్, క్యూలను సూచించే బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సింహాచలం ప్రాంతంలోని మద్యం షాపులను మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ముసివేయాలని అధికారులకు ఆదేశించారు. -
వెల్లువెత్తిన అర్జీలు.. హోరెత్తిన నిరసనలు
కనికరించని అధికారులు పింఛన్ పునరుద్ధరణకు మూడు నెలలుగా జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు చుట్టూ తిరుగుతున్నా కనికరించటం లేదని రోలుగుంట మండలం, కొరుప్రోలు గ్రామానికి చెందిన గిరిజన వికలాంగుడు గెమ్మిలి ఆనంద్ వాపోయాడు. మరోసారి కలెక్టర్కు విన్నవించుకునేందుకు భార్య, పిల్లలతో సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చానని తెలిపాడు. గ్రామానికి రోడ్డు వేయాలని గ్రామస్తులతో కలిసి డోలీతో నిరసన తెలిపినందుకు పింఛన్ నిలిపివేశారని, పింఛన్ ఆధారంగా నలుగురు పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్న తనకు న్యాయం చేయాలని కలెక్టర్ను వేడుకున్నానని బాధితుడు తెలిపారు. గెమ్మిలి ఆనంద్ లేటరైట్ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కలెక్టర్ విజయ కృష్ణన్ను కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో నాతవరం మండలం, సుందరకోటలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలుగు రోజులుగా సాగుతున్న తవ్వకాలు కోర్టు అనుమతుల మేరకు జరుగుతున్నాయా.. లేక ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. లేటరైట్ ముసుగులో రూ.15 వేల కోట్ల విలువైన బాకై ్సట్ దోపిడీ జరుగుతుందని సీఎం చంద్రబాబునాయుడు గతంలో ఆరోపించారన్నారు. లేటరైట్ కాదు బాకై ్సట్ అన్నప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారని గణేష్ ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు అనుమతులు వస్తే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సుందరకోట బమిడకలొద్దు నుంచి మైనింగ్ లారీలతో వెళ్లాలంటే వేంబ్రిడ్జి ఉండాలన్నారు. వేయింగ్ తర్వాతే లారీలు బయటకు వెళ్లాలన్నారు. కాకినాడ జిల్లా చల్లూరు తీసుకువెళ్లి వేయింగ్ చేసి రాకంపాడు యార్డుకు తరలించటం నేరమన్నారు. రోజుకు 5 వేల టన్నుల లేటరైట్ తరలిస్తూ కేవలం వెయ్యి టన్నులకు రాయిల్టీ చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. మైనింగ్ ఇష్యూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉందన్నారు. కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ చట్టవిరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారని గణేష్ ఆరోపించారు. అధికార యంత్రాంగం మైనింగ్ విషయాన్ని నీరుగారిస్తే ఆ ప్రాంత గిరిజనులతో సమావేశమై లేటరైట్ తవ్వకాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. డోలీ మోతతో నిరసన తెలుపుతున్న డొంకాడ గిరిజనులు నర్సీపట్నం: ఈవారం నర్సీపట్నంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమం ఫలవంతమైంది. స్వయంగా కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి హాజరు కావడంతో అర్జీదారులు పోటెత్తారు. ఒక దశలో తోపులాట కూడా జరిగింది. మొత్తం 252 వినతులు అందాయి. వివిధ సమస్యలపై పలు సంఘాల వారు నిరసన ప్రదర్శనలు చేశారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గొలుగొండ మండలం, డొంకాడ గ్రామ గిరిజనులు డోలీ మోతతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పూర్తి వివరాలు 8లోలేటరైట్ ముసుగులో బాకై ్సట్ దోపిడీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే గణేష్ -
పీజీఆర్ఎస్లో నిరసనల హోరు
బతికేందుకు ఆధారం చూపండి.. నా భర్త గంగరాజు పేరున ఉన్న ఐదెకరాలను కుమారుడు పేరున పాసు పుస్తకాలు చేయించుకుని అనుభవిస్తున్నాడు. నేను బతకడానికి ఏమీ ఇవ్వడం లేదు. గతంలో తహసీల్దార్, ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదు. నా కొడుకు దగ్గర ఉన్న భూమిలో రెండెకరాలైనా ఇవ్వాలని కలెక్టరు అమ్మను వేడుకున్నా. – అనిమిరెడ్డి రాజులమ్మ, బుచ్చంపేట, రోలుగుంట మండలం భూమిని సరి చేయాలి.. మాకవరపాలెం మండలం, గంగవరం రెవెన్యూ పరిధిలో 35 సెంట్లు స్థలం కొనుకున్నా. జిరాయితీ భూమిని ఆన్లైన్లో ఇనాం భూమిగా చూపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ అనేక సార్లు తిరిగినా ప్రయోజనం లేదు. ఆప్షన్ లేదని అధికారులు చెప్పుతున్నారు. కలెక్టర్ న్యాయం చేస్తారని అర్జీ పెట్టుకున్నాను. – పైల సత్యవతి, కేడీ పేట, గొలుగొండ మండలం నర్సీపట్నం: సబ్ కలెక్టర్ కార్యాలయం నిరసనలతో హోరెత్తింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్జీదారులు పోటెత్తారు. సోమవారం సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమం అర్జీదారులతో కిటకిటలాడింది. ఉదయం 10 గంటలకు రావాల్సిన కలెక్టర్ విజయ కృష్ణన్ 11.15 గంటలకు వచ్చారు. కలెక్టర్ రాక కోసం అర్జీదారులు నిరీక్షించారు. ఎట్టకేలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి వచ్చి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు మూకుమ్మడిగా రావడంతో తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని క్యూ ఏర్పాటు చేశారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు అర్జీదారులు మండుటెండలో క్యూకట్టారు. ఎండకు తాళలేక తలపై అర్జీ పేపర్లను పెట్టుకున్నారు. పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యాలయం లోపల నిరసనలు తెలిపారు. అధికారుల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టర్కు తమ గోడు విన్నవించుకునేందుకు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. గుంపుగా వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే అనుమతించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గొలుగొండ మండలం డొంకాడ గ్రామ గిరిజనులు డోలీ మోతతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సకాలంలో అర్జీలకు పరిష్కారం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి డివిజన్, మండల స్థాయి అధికారులు కచ్చితంగా హాజరు కావాలని కలెక్టరు విజయ కృష్ణన్ ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్, ఆర్డీవో వి.వి.రమణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల గురించి వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం కాని అర్జీల గురించి కారణాలను వివరంగా దరఖాస్తుదారుడికి తెలియజేస్తే అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు. మొత్తం 252 అర్జీలు నమోదు కాగా.. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 122, మున్సిపల్ 57, పోలీసు 11, ఇతర శాఖలకు సంబంధించి 62 అర్జీలు వచ్చాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో 252 అర్జీల స్వీకరణ అధికారులు విధిగా హాజరు కావాలి : కలెక్టర్ విజయ కృష్ణన్ -
రేపే అప్పన్న చందనోత్సవం
ఏర్పాట్లు ఇలా... ● అడవివరం సమీపంలోని రెండో ఘాట్రోడ్డు నుంచే బస్సులు సింహగిరికి వెళ్లేలా.. తొలి ఘాట్రోడ్డులో బస్సులు కిందకు దిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ● 30వ తేదీ తెల్లవారుజాము 3 గంటల నుంచి పాత గోశాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్ల నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే సింహగిరిపైకి భక్తులను అనుమతిస్తారు. దేవస్థానం అద్దె చెల్లించిన 51 ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా భక్తులకు రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనం, రూ.300 టికెట్ల వారికి ఆర్టీసీ బస్సులు, రూ.1000, రూ.1500 టికెట్ల వారికి మినీ బస్సులు సిద్ధం చేశారు. ● తొలిసారిగా ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తున్నారు. ఈమేరకు 1.7 లక్షల చిన్న లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. ● కొండదిగువ పాత గోశాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్, శ్రీనివాసనగర్లో లడ్డూ ప్రసాదం విక్రయిస్తారు. ఈ మేరకు 60 వేల లడ్డూలను సిద్ధం చేశారు. ● దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక దర్శన సమయం కేటాయించారు. దివ్యాంగుడితో ఒకరిని సహాయకుడిగా అనుమతిస్తారు. ● ఒకేసారి 25,300 మంది భక్తులు వేచి ఉండేలా సింహగిరిపై 37,950 వేల రన్నింగ్ ఫీట్ మేర దర్శనాల క్యూలను రూపొందించారు. ● ప్రస్తుతం ఉన్న 106 పర్మినెంట్ మరుగుదొడ్లతో పాటు అదనంగా 133 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ● స్వచ్ఛంద సంస్థలు తాగునీరు, మజ్జిగ, శీతల పానీయాలు, అల్పాహారాలు, స్నాక్స్ అందించనున్నాయి. ● దర్శనాంతరం సింహగిరిపై అన్నదాన భవనం వద్ద 60 వేల మందికి దద్దోజనం, కదంబం అన్నప్రసాదంగా అందించనున్నారు. ● కేశఖండనశాలకు కేవలం సింహగిరిపై లోవతోటప్రాంతం నుంచి మాత్రమే వెళ్లేలా ఏర్పాటు చేశారు. ● కొండపైన 8, కొండ దిగువన 7 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో 513 మంది వైద్య సిబ్బంది నాలుగు షిఫ్టుల్లో పనిచేస్తారు. 32 అంబులెన్సులు, 10 స్ట్రెచర్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు, వైద్యులు అందుబాటులో ఉంటారు. ● సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ● రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. ఇందుకోసం ఉత్తర, దక్షిణ రాజగోపురాల వద్ద ప్రత్యేకంగా బ్రిడ్జిలు ఏర్పాటుచేశారు. ● నిఘా కోసం 206 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ● చందనోత్సవంకి సంబంధించిన సమాచారం 0891–275666 నెంబర్లో తెలుసుకోవచ్చు. ● డ్యూటీ పాస్ ఉన్న వెహికల్స్ని మాత్రమే పరిమితంగా సింహగిరిపైకి అమమతిస్తారు. -
షోర్ టు షోర్ జీఎం దిలీప్ పింటోను అరెస్టు చేయాలి
అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ షోర్ టు షోర్ కంపెనీలో హెచ్ఆర్గా పని చేసిన తనపై జనరల్ మేనేజర్ దిలీప్ పింటో లైంగికంగా వేధించి, ఉద్యోగం నుంచి తొలగించిన ఘటనపై కోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ ఛత్తీష్గఢ్కు చెందిన బాధితురాలు డిమాండ్ చేశారు. నేషనల్ యునైటెడ్ ఫ్రంట్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆమె డీఆర్వోకు వినతిప్రతం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ గేటు వద్ద నిరసన చేస్తూ తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ నాయకుడు దౌలత్ రామ్ మాట్లాడుతూ నిందితుడు దిలీప్ పింటోనీ అరెస్ట్ చేయకపోవడంతో శ్రీలంకకు పారిపోయాడన్నారు. బాధితురాలికి ఉద్యోగం ఇచ్చి, పరిహారం చెల్లించాలని జాతీయ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను కలెక్టర్ అమలు చేయలేదని ఆరోపించారు. గత పదేళ్లుగా బాధితురాలు అన్యాయానికి గురవుతుందనే విషయాన్ని పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా అధికారులకు తెలియజేశామన్నారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరులు, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటలక్ష్మి, మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం కో– కన్వీనర్ రూప, భీమ్ సేన వార్ అధ్యక్షుడు చంద్రశేఖర్, జాతీయ ఎస్సీ, ఎస్టీ సంఘాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
విశాఖ రియల్టర్ ఆత్మహత్య
● ఆర్థిక ఇబ్బందులే కారణం ● సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ● మామిడిపల్లి రిసార్ట్లో ఘటనదేవరాపల్లి : విశాఖపట్నానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నడింపల్లి సత్యనారాయణరాజు(70) దేవరాపల్లి మండలం మామిడిపల్లిలోని రిసార్ట్లోని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన రాసిన సూసైడ్ నోట్ను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్చార్జి ఎస్ఐ ఆర్.ధనుంజయ్ తెలిపారు. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. విశాఖకు చెందిన సత్యనారాయణరాజు 40 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా కొంత మంది నుంచి తనకు రావలసిన బకాయిలు రూ.కోట్లలో ఉండిపోయాయి. దీంతో ఆయన తీవ్రంగా నష్టపోయారు. దేవరాపల్లి మండలం మామిడిపల్లి రిసార్ట్కు సత్యనారాయణరాజు అప్పుడప్పుడు వచ్చి ఒక్కరోజు ఉండి వెళ్లిపోయేవారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు రిసార్ట్కు వచ్చిన ఆయన మధ్యాహ్నం, రాత్రి భోజనం చేశారు. సోమవారం ఉదయం రిసార్టు మేనేజర్ రాయిశివ చూసేసరికి గది బయట ఉన్న ఊయల కొక్కానికి సత్యనారాయణరాజు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని దేవరాపల్లి పోలీసులతో పాటు మృతుని బంధువులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చనిపోయే ముందు తనకు రావలసిన బకాయిల గురించి, ఆరుగురికి విడివిడిగా రాసిన ఉత్తరాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణరాజు రిసార్ట్కు వచ్చినప్పుడల్లా తీవ్రంగా మదనపడుతూ ఏడ్చేవారని రిసార్టులో పని చేస్తున్న సిబ్బంది పోలీసులకు తెలిపారు. మృతుడు భార్య, కుమారుడు సాయి చైతన్యవర్మ అందించిన సమాచారం మేరకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఇన్చార్జి ఎస్ఐ ధనుంజయ్ తెలిపారు. -
వేగం, విశ్లేషణ..అదే విజయ రహస్యం
● సివిల్స్ విజేత సాయి మోహిని మానసరావాడ సాయి మోహిని మానసను సత్కరిస్తున్న గ్రంథాలయం సభ్యులు అనకాపల్లి టౌన్: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పునశ్చరణ, నమూనా పరీక్షలతో వేగంగా సమాధానాలు రాయడం అలవాటు చేసుకోవాలని సివిల్స్ విజేత రావాడ సాయి మోహిని మానస సూచించారు. వేగానికి విశ్లేషణ కూడా తోడైతే సివిల్స్ పరీక్షల్లో విజయానికి చేరువ కాగలుగుతామని చెప్పారు. ఇటీవల విడుదలైన సివిల్స్ పరీక్ష ఫలితాల్లో జాతీయ స్ధాయిలో 975వ ర్యాంకు సాధించిన మానసను గౌరీ గ్రంథాలయం సభ్యులు సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల్లో సమయ పాలన, వేగం కీలకమని, ఇందుకోసం అభ్యర్థి రోజుకు ఒకటి రెండు ఆన్లైన్ నమూనా పరీక్షలు రాసి స్వీయ విశ్లేషణ చేసుకోవాలని చెప్పారు. పోటీ పరీక్షల్లో ఎక్కువ ప్రశ్నలు జ్ఞాపకశక్తి ఆధారితంగానే ఉంటాయన్నారు. గ్రంథాలయ అధ్యక్ష, కార్యదర్శులు డి.నూక అప్పారావు, కాండ్రేగుల వెంకటరమణ, కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.8లో -
దివ్యాంగులకు చేయూత
అచ్యుతాపురం రూరల్: విధి చిన్నచూపు చూసిన దివ్యాంగులను సాటి మనుషులే ఆదుకోవాలని, ప్రేమాభిమానాలతో బాధ మరిచిపోయేలా చేయాలని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. కొండకర్ల ఆవకు సమీపంలో ఉన్న ఇచ్ఛా ఫౌండేషన్ను ఆయన సోమవారం సతీమణితో కలిసి సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులే తమకెందుకులే అనుకుంటున్న ప్రస్తుత సమయంలో దివ్యాంగ బాలలను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఇచ్ఛా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మధు తుగ్నైట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోయినా కేవలం దాతల సహకారంతోనే సంస్థను నడిపించడం చాలా గొప్ప విషయమన్నారు. అవకాశం ఉన్నవారు దివ్యాంగులకు అవసరమైన గృహోపకరణాలు అందివ్వాలని కోరారు. తన వంతు సహాయంగా రూ.25 వేలు ఫోన్–పే ద్వారా సంస్థకు అందజేశారు. ఈ సందర్భంగా మరికొందరు ప్రముఖులు వారి పుట్టిన రోజు, పెళ్లి రోజు సందర్భంగా సంస్థకు చెక్కులు, నగదు రూపంలో విరాళాలు అందజేశారు. ఒడిశా గవర్నర్ హరిబాబు పిలుపు -
అంగన్వాడీ కేంద్రాల పరిశీలన
అంగన్వాడీ సిబ్బందితో నాగాలాండ్ ప్రనినిధులు గొలుగొండ: నాగాలాండ్కు చెందిన ప్రతినిధుల బృందం సోమవారం పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించింది. అక్కడి పరిస్థితులు, పిల్లలకు అందుతున్న ప్రాథమిక విద్య, పౌష్టికాహార పంపిణీపై బృందం సభ్యులు అధ్యయనం చేశారు. మండలంలోని జోగంపేట–1, –2, అమ్మపేట, ఎ.ఎల్.పురం–6, పప్పుశెట్టిపాలెం అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి నివేదిక తయారు చేశారు. నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన సీడీపీవో ఎమిలాఎనతన్, సూపర్వైజర్ హెకాలి ఎప్తోమి కేంద్రాల్లోని పలు అంశాలపై అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో శ్రీగౌరి, సిబ్బంది పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
అనకాపల్లి జిల్లా: జిల్లాలోని దేవరాపల్లి రిసార్ట్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నడింపల్లి సత్యనారాయణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు విశాఖ సీతమ్మధారకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా గుర్తించారు. గత కొంతకాలంగా కుటుంబ సభ్యులు దూరంగా ఉన్న సత్యనారాయణ.. బకాయిలు ఉన్న వారికి బకాయిలు తీర్చకపోవడం వలన ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించారు. తన ఆత్మహత్యకు సంబంధించి 12 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
అనకాపల్లి : జీవీఎంసీ విలీన గ్రామమైన కొత్తూరు జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఆదివారం రాత్రి గాయపడ్డారు. స్థానికులు కథనం మేరకు వివరాలివి. కొత్తూరు గ్రామానికి చెందిన ఏలూరు వెంకటేష్ జాతీయ రహదారి రోడ్డు దాటుతున్న సమయంలో అనకాపల్లి నుంచి విశాఖ వెళుతున్న ద్విచక్రవాహనదారు వెంకటేష్ను ఢీకొట్టడంతో అతనికి ఎడమకాలు విరిగిపోయింది. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి ముక్కుకు, తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన ఇద్దరిని 108 వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి రూరల్ పోలీసులు చేరుకున్నారు. -
‘మహా బోధి విహార్ను బౌద్ధులకే అప్పగించండి’
సీతమ్మధార: బిహార్లోని మహా బోధి విహార్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా బౌద్ధులకే అప్పగించాలని ఉత్తరాంధ్ర బౌద్ధ సంఘాల ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఎల్ఐసీ బిల్డింగ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు మహా శాంతి యాత్ర నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారంతా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ మహా బోధి విహార్ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందన్నారు. అటువంటి ఈ విహార్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా బౌద్ధులకే ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బి.టి.ఎం.సి.యాక్ట్ 1949 ప్రకారం చట్టం చేసి.. అందులో నలుగురు హిందూ మహంతులు, నలుగురు బౌద్ధ భిక్షువులతో పాటు కలెక్టర్ను చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. మొత్తం 9 మంది సభ్యుల్లో ఐదుగురు హిందువులే ఉండేలా చేసి.. ఆలయ అభివృద్ధి, విధానపరమైన నిర్ణయాల్లో బౌద్ధులకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసిందని మండిపడ్డారు. ఈ ఆందోళనలో ఉత్తరాంధ్ర జిల్లాల జేఏసీ కన్వీనర్ వి.వి.దుర్గారావు, కో కన్వీనర్ బి.వి.జి.గౌతమ్, జేఏసీ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ మాటూరు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నూకాలమ్మా.. కరుణించమ్మా..
ఘనంగా గవరపాలెం నూకాంబిక నెల పండగ ముగింపు అమ్మవారికి కోడిని మొక్కుతున్న మహిళా భక్తురాలు అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు చలువు పందిళ్లు వద్ద వంటలు చేస్తున్న భక్తులు అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, గవరపాలెం నూకాంబిక అమ్మవారి నెల పండగ జాతర ముగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమలు, కోళ్లు, పొట్టేలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ ఇన్చార్జి సహాయ కమిషనర్ కె.శోభారాణి, ఈవో వెంపలి రాంబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయ సమీపంలో చలువ పందిళ్లు వద్ద వంటలు చేసుకుని అమ్మవారికి మొక్కులు తీర్చుకుని, నైవేధ్యం సమర్పించారు. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో... స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో గవరపాలెం నూకాంబిక అమ్మవారి పండగను పురస్కరించుకుని నెల రోజుల పాటు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి నెల పండగ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్, దాడి రవికుమార్, పొలిమేర ఆనంద్, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, ఎరవ్రరపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్యూలైన్ల్లో భక్తులు -
డిఫెన్స్ మద్యం కలిగిన వ్యక్తి అరెస్టు
నర్సీపట్నం : డిఫెన్స్ మద్యం కలిగిన వ్యక్తిని అరెస్టు చేశామని సీఐ కె.సునీల్ కుమార్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లి శ్రీరామనగర్ కాలనీ ఓ ఇంట్లో డిఫెన్స్ మద్యం నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వజ్రగాడ గ్రామానికి చెందిన తమరాన అప్పలనాయుడు వద్ద నుంచి 83 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అప్పలనాయుడును అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ కిరణ్కుమార్, కానిస్టేబుల్స్ లావణ్య, నాగ శంకర్, బాబూరావు, అభిషేక్ ఉన్నారని తెలిపారు. -
గతేడాది మత్స్యకార భరోసా ఎగనామం
నక్కపల్లి : కూటమి ప్రభుత్వం మత్స్యకారులను మోసం చేసిందని వైఎస్సార్సీపీ మండల శాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, పలువురు మత్స్యకార నాయకులు ఆరోపించారు. ఆదివారం వారు విలేకర్లతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలల పూర్తయిందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు వేట నిషేధం అమలైందన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా రూ.20 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చి కేవలం ఒక ఏడాదికి సంబంధించిన పరిహారం మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మత్స్యకార భరోసా రూ.4వేలు చెల్లించేవారని, జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచినట్టు గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన వెంటనే మొదటి ఏడాది నుంచే వేట నిషేధ పరిహారం మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇప్పుడు రెండేళ్ల పరిహారం చెల్లిస్తారని మత్స్యకారులంతా ఆశపడ్డారని, కూటమి ప్రభుత్వం మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 33 వేల మందికి మత్స్యకార భరోసా అందిందన్నారు. గత జగనన్న ప్రభుత్వం మత్స్యకారుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు రూ.24 కోట్లతో పాయకరావుపేట నియోజకవర్గానికి ఫిష్ ల్యాండింగ్ సెంటరు మంజూరు చేసిందన్నారు. రాజయ్యపేట వద్ద నిర్మించేందుకు స్థల పరిశీలన కూడా జరిగిందని వివరించారు. ఇది పూర్తయితే ఈ ప్రాంత మత్స్యకారులకు ఉపాధి తోపాటు, వలలు, ఇంజన్లు, మత్స్య సంపదను భద్రపరుచుకోవడం, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడేదన్నారు. ఈ ఫిష్ ల్యాండింగ్ సెంటరును ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రైవేటు స్టీల్ప్లాంటు కోసం పోర్టు నిర్మించడానికి అనుమతులు మంజూరు చేయడం సిగ్గుచేటన్నారు. అధికారం చేపట్టి 11 నెలలు గడుస్తున్నా కొత్తగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో సర్పంచ్ ఎరిపల్లి ముసలయ్య, మత్స్యకార నాయకులు ఎరిపల్లి నాగేశు,నూకరాజు, రమణ, తదితరులు పాల్గొన్నారు. వేట నిషేధ భృతిపై మత్స్యకారుల అసంతృప్తి అచ్యుతాపురం రూరల్ : వేట నిషేధ భృతిపై పూడిమడక మత్స్యకారులు అసంతృప్తిగా ఉన్నారని వైఎస్సార్సీపీ జిల్లా స్పోక్స్ పర్సన్, మత్స్యకార నాయకుడు ఉమ్మిడి జగన్ అన్నారు. మత్స్యకారులకు ఒక సంవత్సరానికి మాత్రమే వేట నిషేధ భృతి ఇచ్చి చేతులు దులుపుకొన్నారని, గతేడాది భృతి కూడా ఇవ్వకుండా అన్యాయం ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన స్థానిక మత్స్యకారులతో కలిసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేట నిషేధ భృతి రూ.20వేలు ఇస్తామని చెప్పారని, అలా గతేడాది, ఈఏడాది కలిసి రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేధ మత్స్యకారులు ప్రస్తుతం అప్పుల పాలైన దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ఈ ఏడాది భరోసా మాత్రమే విడుదల మత్స్యకారులకు కూటమి దగా వైఎస్సార్సీపీ నేతల ధ్వజం -
తెలిసినవారి పనేనా?
కూర్మన్నపాలెం: రాజీవ్నగర్లో జరిగిన దంపతుల హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. తొలుత ఈ హత్యలను దోపిడీ దొంగలే చేసి ఉంటారని పోలీసులు, స్థానికులు భావించారు. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే విదేశాల నుంచి వచ్చిన మృతుల కుమార్తె, కుమారుడు ఇంట్లోని బీరువాలను తెరిచి పరిశీలించగా.. అందులో నగదు, బంగారు నగలు చెక్కు చెదరకుండా ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల సమక్షంలోనే బీరువాలను పరిశీలించగా 30 తులాల బంగారం, రూ. 10 వేల నగదు సురక్షితంగా ఉన్నట్లు తేలింది. దీంతో ఈ హత్యలు డబ్బు లేదా ఆభరణాల కోసంజరగలేదని స్పష్టమైంది. ఈ కీలక పరిణామంతో హత్యలపై పోలీసుల దర్యాప్తు కోణం మరో మలుపు తిరిగింది. ఘటనా స్థలంలోని పరిస్థితులు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పరిశీలిస్తే.. వారికి బాగా తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వంట గదిలో కూరగాయలు కోసేందుకు ఉపయోగించే రెండు కత్తులతోనే ఈ హత్యలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇంటితో బాగా పరిచయం ఉన్న వారికే వస్తువులు ఎక్కడ ఉంటాయో తెలుస్తుందని భావిస్తున్న పోలీసులు.. ఇప్పుడు దర్యాప్తును ఆ దిశగా మళ్లించారు. దీంతో మృతుల కుటుంబంతో సన్నిహిత పరిచయాలున్న వారిని, ఇంటికి తరచుగా వచ్చిపోయే వారిని, ఆ కుటుంబ సభ్యులకు చనువుగా ఉండేవారి వివరాలను సేకరించి.. వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై నగర పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడే ఉండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్రైం పోలీసులు, అధికారులు మఫ్టీలో ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు దొరక్కపోవడంతో.. కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొలిక్కిరాని దంపతుల హత్య కేసు -
చందనోత్సవంలో సామాన్యులకే పెద్ద పీట
● హోంమంత్రి వంగలపూడి అనితసింహాచలం: ఈనెల 30న జరిగే చందనోత్సవంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అప్పన్న స్వామి నిజరూపదర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిలతో కలిసి ఆదివారం పరిశీలించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అంతరాలయ దర్శనాలు ఉదయం 3 గంటల నుంచి 6 గంటలలోపు మాత్రమే ఉంటాయన్నారు. ఉదయం 6 తర్వాత అంతరాలయ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అంతరాలయ తలుపులు మూసివేసి తాళాలు వేసుకుని దగ్గర ఉంచుకోవాలని ఆలయ వైదికులు, అధికారులకు సూచించారు. -
సింహగిరికి పోటెత్తిన భక్తజనం
సింహాచలం: గంధం అమావాస్య పురస్కరించుకుని సింహగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు, గ్రామీణ ప్రాంత భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. శనివారం రాత్రికే సింహాచలం చేరుకున్న వీరంతా ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామి ప్రతిరూపాలుగా వెంట తీసుకొచ్చిన కోలలను పుష్కరిణి గట్టుపై ఉంచి పూజలు నిర్వహించారు. వంటలు వండి, కోలలకు ఆరగింపు చేశారు. అమృత కలశాలను, పళ్లను సమర్పించారు. కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. స్నానమాచరించేందుకు తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి ప్రాంగణం అంతా కిటకిలాడింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శనక్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, గంగధార మార్గం భక్తులతో కిటకిటలాడాయి. సింహగిరికి చేరుకున్న భక్తులు సింహగిరిపై కూడా కోలలకు పూజలు నిర్వహించారు. గరిడి నృత్యాలు చేశారు. దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
కేజీబీవీల్లో రూ.8.55 కోట్లతో అదనపు భవనాలు
దేవరాపల్లి : జిల్లాలో 19 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) రూ.8.55 కోట్లతో మనబడి మన భవిష్యత్ పథకంలో అదనపు భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని సమగ్ర శిక్ష డీఈ కె.గణేష్ తెలిపారు. మండలంలోని బేతపూడి కేజీబీవీలో రూ.51.93 లక్షలతో నిర్మిస్తున్న అదనపు భవన నిర్మాణ పనులను స్థానిక ఏఈ పి.సంతోష్కుమార్తో కలిసి ఆదివారం పర్యవేక్షించారు. కాగా భవన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకంలో రూ.51.93 లక్షలు మంజూరు చేయగా, అప్పట్లో రూ.28 లక్షలకు సంబంధించి పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనబడి– మన భవిష్యత్గా పేరు మార్చి పనులను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని 12 కేజీబీవీల్లో జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.1.60 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయిని డీఈ గణేష్ తెలిపారు. బేతపూడి కేజీబీవీకి కూడా జూనియర్ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.1.60 కోట్లు నిధులు మంజూరయ్యాయని, టెండర్ సైతం పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ భవనాలలో ఆరు డార్మెటరి గదులు, రెండు టాయిలెట్లు ఉంటాయన్నారు. మనబడి– మన భవిష్యత్ పథకంలో అదనపు భవనాల నిర్మాణ పనులను వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు డీఈ తెలిపారు. నాణ్యత ప్రమాణాలు సైతం పక్కాగా పాటిస్తూ పనులు చేపడుతున్నట్టు వివరించారు. 12 కేజీబీవీల్లో జూనియర్ కళాశాల భవనాలకు నిధులు మంజూరు సమగ్ర శిక్ష డీఈ గణేష్ వెల్లడి -
సొమ్మొకరిది...సోకొకరిది..!
నక్కపల్లి : మండలంలో వేంపాడు సబ్స్టేషన్లో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో 5 మెగా వాట్ల పవర్ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుపై టీడీపీ నాయకులు పచ్చ ప్రచారానికి తెరలేపారు. రైతులకు వ్యవసాయం కోసం పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు గత ప్రభుత్వంలో మంజూరైన ఈ ట్రాన్స్ఫార్మర్ను తమ ప్రభుత్వంలో మంత్రి అనిత మంజూరు చేయించారంటూ తాజాగా రెండు రోజుల క్రితం కొబ్బరి కాయకొట్టి ప్రారంభించడం నవ్వుల పాలు చేస్తోంది. వాస్తవంగా ఈ ట్రాన్స్ఫార్మర్ను అధికారులు 15 రోజుల క్రితమే ప్రారంభించి రైతులకు పగటి పూట వ్యవసాయ అవసరాల కోసం త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... వేంపాడు సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ కొరత ఉంది. దీంతో వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు త్రీఫేజ్ సరఫరా చేయడం ఇబ్బందిగా మారింది. వారంలో మూడు రోజులు అర్ధరాత్రి , నాలుగు రోజులు పగటి పూట విద్యుత్ సరఫరా చేసేవారు. ఈ సమస్యను రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరక్టర్ వీసం రామకృష్ణ, అప్పటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ద్వారా టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ట్రాన్స్కో ఉన్నతాధికారులతో మాట్లాడి సుమారు రూ.2 కోట్ల వ్యయంతో సబ్స్టేషన్కు 5 మెగావాట్ల పవర్ ట్రాన్స్ఫార్మర్ను గత ఏడాది ఫిబ్రవరిలో మంజూరు చేయించారు. ఈ ట్రాన్స్పార్మర్ ఏర్పాటు చేసే పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ ఏడాది మార్చినాటికి పనులు పూర్తి చేశారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పూర్తయినప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోవడంతో రైతులకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పగటిపూట సరఫరా చేయడం లేదు. దీంతో రైతులు ఈ సమస్యను సాక్షి దృష్టికి తీసుకురావడంతో ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి సమయంలో త్రీఫేజ్ సరఫరా.. ఇబ్బంది పడుతున్న రైతులు అన్న శీర్షికన సాక్షి దినపత్రికలో కథనం వెలువడింది. ఈ కథనానికి స్పందించిన ట్రాన్స్కో అధికారులు పవర్ట్రాన్స్ఫార్మర్ పనులు పూర్తి చేశారు. ఏఈ మహంకాలరావు పవర్ట్రాన్స్ఫార్మర్ను ఈనెల 14న కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించి రైతులకు పగటిపూట పూర్తి స్థాయిలో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీనిపై ఈనెల 16న వేంపాడు సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు (సాక్షి కథనానికి స్పందన) అంటూ కథనం ప్రచురితమైంది. సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటై విద్యుత్ సరఫరా యథావిధిగా జరుగుతున్న తరుణంలో కొంతమంది టీడీపీ నాయకులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కూటమి ప్రభుత్వ హయాంలోనే జరిగిందంటూ రెండు రోజుల క్రితం కొబ్బరికా య కొట్టి రెండోసారి ప్రారంభోత్సవం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వైఎస్సార్సీపీ సీనియర్ నేత వీసం రామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు మణి రాజు ఆదివారం సబ్స్టేషన్లో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పవర్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేంపాడు పరిసర ప్రాంత రైతులు విద్యుత్ సరఫరాలో ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి తీసుకు రావడంతో సుబ్బారెడ్డి దృిష్టికి తీసుకెళ్లి సుమారు రూ.2 కోట్ల వ్యయంతో 5 మెగావాట్ల పవర్ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఇది మంజూరయిందని, ఏర్పాటు పనులు పూర్తి కావడానికి ఏడాది సమయం పట్టిందన్నారు. నిధులు మంజూరు ఉత్తర్వులు రావడం, పనులు ప్రారంభం కావడం అన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయని, కొంతమంది టీడీపీ నాయకులు తమ ప్రభుత్వంలోనే ట్రాన్స్ఫార్మర్ మంజూరైందంటూ గొప్పలు చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 11 నెలల కాలంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయకుండా గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను కూడా తమ ఖాతా లో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే తాము సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ వద్ద మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, ఈశ్వరరావు, చందనాడ సర్పంచ్ తళ్ల భార్గవ్, ఎంపీటీసీ తిరుపతిరావు, నెల్లిపూడి సర్పంచ్ సురేష్ వర్మ, పార్టీ మండలశాఖ మాజీ అధ్యక్షుడు పాపారావు, సీతంపాలెం ఎంపీటీసీ గోవిందు, పార్టీ నాయకులు అల్లాడ కొండ, బాబ్జి, సూరిబాబు, పిక్కి సత్తియ్య పాల్గొన్నారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుపై పచ్చ ప్రచారం గత ప్రభుత్వంలో రూ.2 కోట్లతో మంజూరు 15 రోజుల క్రితమే ప్రారంభించిన అధికారులు తాజాగా మంజూరైనట్టు మళ్లీ ప్రారంభోత్సవం చేసిన కూటమి నేతలు -
మూగవేదన
పాడి పశువులజిల్లా వ్యాప్తంగా 13 వెటర్నరీ అసిస్టెంటు (ఏడీ) కేంద్రాలు, 67 పశువైద్యశాలలు ఉన్నాయి. స్పీకర్ ఇలాకాలో 4 పశు వైద్యశాలల్లో వైద్యులు లేరు పాడి రైతును నిర్లక్ష్యం చేయరాదు.. పాడి పరిశ్రమపై అధిక శాతం రైతులు అధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పు డున్న పరిస్థితిలో వ్యవసాయం కంటే పాడిపై అధిక అదాయం వస్తుంది. పాలు ఇచ్చే పశువుకు అనారోగ్యం వస్తే సకాలంలో వైద్యం అందకపోతే ఆ రైతు తిండి తినడు.. నిద్రపోడు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. వైద్యులు లేకున్నా సహాయకులు అందుబాటులో ఉన్నా రైతు ధైర్యంగా ఉంటాడు. ఖాళీ పోస్టులు భర్తీ చేసి పాడి రైతుకు దన్నుగా ఉండాలి. – దస్తాల రాఘవేంద్రరావు, ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ రైతు గోడు చూస్తే బాధేస్తుంది పశువైద్యాధికారులు, సహాయకులు సైతం లేకపోవడం వల్ల పశువుకు ఏమీ బాగోకపోయినా మాకు ఫోన్లు చేసి రైతులు రావాలంటున్నారు. మేము కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు మాత్రమే చేస్తామన్నా రైతు వినడం లేదు. పశువుకు బాగోక పాలు తగ్గిపోయాయి. వైద్యులు లేరు అదుకోవాలంటూ రైతులు దావేదన చెందుతుంటే చాలా బాధేస్తుంది. సిబ్బంది లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – కిల్లాడ వెంకటరమణ, గోపాలమిత్రుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జిల్లేడుపూడి గ్రామం సిబ్బంది కొరత వాస్తవమే జిల్లా వ్యాప్తంగా పశువైద్యశాఖలో అధికంగా సిబ్బంది కొరత ఉందన్న మాట వాస్తవమే. పాడి రైతులకు ఇబ్బంది లేకుండా ఉన్న సిబ్బందితో పశువులకు సకాలంలో వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రభుత్వం పాడి రైతులకు కల్పించే సదుపాయాలు సకాలంలో అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. – రామ్మోహన్రావు, పశువైద్యశాఖ జేడీ నాతవరం : జిల్లా వ్యాప్తంగా 13 వెటనరీ అసిస్టెంటు(ఏడీ) కేంద్రాలు 67 పశువైద్యశాలలు ఉన్నాయి. వాటిలో కోటవురట్ల వెటర్నరీ కేంద్రంలో పోస్టు ఖాళీగా ఉంది. ఒక వెటర్నరీ అసిస్టెంటు (ఏడీ) రెండు మండలాలకు పర్యవేక్షిస్తుంటారు. అదే విధంగా 67 పశువైద్యశాలకు 60 మందే పశువైద్యాధికారులు ఉన్నారు. మిగతా ఏడు పశువైద్యశాలలకు వైద్యాధికారులు లేక కేంద్రాలు నిరూపయోగంగా దర్శనమిస్తున్నాయి, వేటర్నరీ అసిస్టెంటు కేంద్రాలు పశు వైద్యశాలలో జిల్లా వ్యాప్తంగా 114 మంది అటెండర్లు (సబ్ ఆర్టినేటర్లు) పోస్టులకు కేవలం 38 మాత్రమే పని చేస్తున్నారు. జిల్లాలో 76 పోస్టులు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో 48 వెటర్నరీ సహాయకులు పోస్టులకు కేవలం 26మంది మాత్రమే పని చేస్తున్నారు. మిగతా 22 మంది వెటర్నరీ సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రంలో పశువైద్యాధికారులు లేకున్న సహాయకులు కేంద్రంలో ఉండి సకాలంలో పశువులకు వైద్య సేవలు గతంలో అందించేవారు. అటెండర్లు అవసరమైన సంఖ్యలో లేకపోవడంతో ఏడీలు, పశువైద్యాధికారులు పని చేసే కేంద్రాల్లో వారు చేసే పనులు సైతం అక్కడ అధికారులే చేసుకునే పరిస్ధితులు నెలకొన్నాయి. పశువైద్యాశాలలు, వెటనరీ అసిస్టెంటు కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారులు తనిఖీలకు వచ్చేటప్పుడు సొంత ఖర్చుతో అటెండర్లు చేసే పనులకు స్థానికంగా పనిచేసే వారిని ెరోజు వారి కూలీకి పెట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. జిల్లాలోనే అధికంగా స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గంలోనే నలుగురు పశువైద్యాధికారుల పోస్టు లు ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో యలమంచిలి నియోజకవర్గంలో సోమలింగపాలెం, దిమిలి, నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం మండలంలో వేములపూడి, గొలుగొండ మండలంలో చోద్యం, మాకవరపాలెం మండలంలో బూరుగుపాలెం, నాతవరం మండలంలో శృంగవరం, నాతవరం పశువైద్యాశాలలకు వైద్యాధికారులు లేరు. వైద్యాధికారులతో పాటు సహాయకులు అటెండర్ల పోస్టులు సైతం ఖాళీలు ఉన్నాయి. నాతవరం గ్రామంలో పశువైద్య కేంద్రం ఎప్పుడు చూసినా మూసేసి ఉంటుంది. నర్సీపట్నం డివిజన్లో అఽధికంగా పాడి ఉత్పత్తి చేసే రైతులు నాతవరం మండలంలోనే ఉన్నారు. ఇక్కడ పశువులకు ఏ అనారోగ్యం వచ్చినా గోపాలమిత్రులపై ఆధారపడుతున్నారు. పూర్తి స్థాయి అధికారులు లేక ప్రభుత్వం పాడిరైతులకు అందించే రాయితీ విత్తనాలు, ఇతర సదుపాయాలు అందడం లేదని చెబుతున్నారు. పశువుకు ఏరోగం వచ్చిన సకాలంలో వైద్యం అందక ఇటీవల పలు గ్రామాల్లో పశువులు మరణించిన సంఘనలు ఉన్నాయి. వెటనరీ ఏడీలు ఉన్నప్పటికి క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది లేకపోవడంతో మండలాల్లో మొక్కుబడి పర్యటనలు చేసి వెళ్తుంటారు. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం పెట్టినా పశువైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆ రోజున మాత్రమే పశువులను తరలించి ఆర్భాటం చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. పశువులకు మేకలు గొర్రెలు వైద్య సేవలు సకాలంలో అందించే వారు కరువయ్యారు. జిల్లాలో 114 మంది అటెండర్లకు 38 మంది, పశువైద్య సహాయకులు 48 మందికి 26 మంది మాత్రమే ఉన్నారు67 పశువైద్యశాలలకు 60 మందే పశువైద్యాధికారులు -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● ఈపీడీసీఎల్ సీఎండీ పృధ్వీతేజ్ ఆదేశంఈపీడీసీఎల్ సీఎండీ పృధ్వీరాజ్కు స్వాగతం పలుకుతున్న అధికారులు, సిబ్బంది కశింకోట: వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పృధ్వీతేజ్ ఆదేశించారు. కశింకోటలోని ఈపీడీసీఎల్ డివిజన్ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. అధికారులు, సిబ్బందితో అభివృద్ది పనులు, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. లోడ్ అధికంగా ఉన్న చోట విద్యుత్ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఏర్పాటు చేయాలన్నారు. హెచ్చు తగ్గులు లేకుండా విద్యుత్ వినియోగం కచ్చితంగా నమోదయ్యే ఐఆర్ పోర్టు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. పరిమితికి మించి లోడ్ వినియోగిస్తున్న వినియోగదారుల నుంచి డెవలెప్మెంట్ చార్జీలు వసూలు చేసి సర్వీసులను క్రమబద్ధీకరించాలన్నారు. ఈఈ ఎస్ రామకృష్ణ, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.