breaking news
Anakapalle
-
స్పా ముసుగులో గుట్టుగా వ్యభిచారం
విశాఖపట్నం: గాజువాకలోని ఒక స్పా సెంటర్పై గాజువాక పోలీసులు, సిటీ టాస్్కఫోర్స్ సిబ్బంది శనివారం దాడి చేశారు. అందులో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని రట్టు చేశారు. పాతగాజువాకలోని సీఎంఆర్ సెంట్రల్కు సమీపంలోని ఎస్ఎస్ థాయ్ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది గాజువాక పోలీసులతో కలిసి దాడి చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతుండటంతో స్పా సెంటర్ నిర్వాహకురాలు సహా ఒక విటుడిని అరెస్టు, ఐదు గురు బాధితులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు గాజువాక సీఐ పార్థసారధి తెలిపారు. జోన్–2 టాస్్కఫోర్స్ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఎస్ఐ భరత్, సిబ్బంది పాల్గొన్నారు. -
మా కుమారుడిది ముమ్మాటికీ హత్యే.!
దేవరాపల్లి: తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికే హత్యేనని దేవరాపల్లి మండలం కాశీపురానికి చెందిన డెక్క నవీన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. డెక్క నవీన్(23) చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన తమ కుమారుడు నవీన్ మేడ మీద నుంచి కింద పడి చనిపోయాడంటూ ఓ యువతి ఫోన్ నుంచి మరో యువకుడు ఫోన్ చేసి చెప్పడం పట్ల వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ప్రేమించిన రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన యువతితో పాటు ఆమె తల్లి, వారి బంధవులు పథకం ప్రకారం తమ కుమారుడిని తీర్థ యాత్ర పేరుతో తీసుకెళ్లి హతమార్చారని మృతుడి తల్లిదండ్రులు రాంబాబు, విజయ, చెల్లెలు రేష్మ ఆరోపించారు. నవీన్ మృతిపై నిష్పాక్షికంగా విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రేమిస్తే ఇంత దారుణంగా హతమారుస్తారా అంటూ గుండెలవిసేలా రోదించారు. తమకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. హోంమంత్రిని, ఎస్పీని, ఎమ్మెల్యేను కలిసి తమ కుమారుడి మృతిపై విచారణ చేసి న్యాయం చేయమని కోరతామని శనివారం విలేకర్లకు మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. బతుకుతెరువు కోసం అచ్యుతాపురం వలస కాశీపురానికి చెందిన నవీన్ కుటుంబం సుమారు 12 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం అచ్యుతాపురం మండలం చినపూడి గ్రామానికి వలస వెళ్లారు. నవీన్ తండ్రి రాంబాబు అక్కడ ఓప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇంటర్, ఐటీఐ చదివిన నవీన్ అథ్లెటిక్స్లో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగి రాణిస్తున్నాడు. అతను చదువుకునే సమయంలో తనతో చదివిన అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆమె మరో రాష్ట్రంలో చదువుతుండగా, నవీన్ రెండు నెలల కిందట తమ కుటుంబం నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళుతున్నానంటూ నవీన్ తన తల్లికి చెప్పి ఈ నెల 8వ తేదీ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఎప్పటికప్పుడు తల్లికి ఫోన్ చేసేవాడు. 10న ఉదయం 11 గంటల ప్రాంతంలో అరుణాచలం ఆలయానికి వెళ్లిన నవీన్ తన తల్లితో అక్కడి నుంచే వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అదే రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నవీన్కి తల్లి విజయ ఫోన్ చేయగా, చెన్నై వెళ్తున్నామంటూ చెప్పాడు. ఈ నెల 11న (గురువారం) ఉదయం తన కుమారుడు ప్రేమిస్తున్న యువతి ఫోన్తో మరో యువకుడు మాట్లాడుతూ నవీన్ మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి విజయకు చెప్పారు.కాశీపురంలో విషాదఛాయలు నవీన్ మృతితో స్వగ్రామం కాశీపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. చెన్నై నుంచి నవీన్ మృతదేహాన్ని శనివారం ఉదయం కాశీపురానికి తీసుకువచ్చారు. ఆనందపురం నుంచి నవీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు బైక్ ర్యాలీతో స్వగ్రామం తీసుకువచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భోరున విలపించిన తీరు అందర్నీ కంటనీరు పెట్టించింది. తమలాంటి కడుపు కోత మరెవ్వరికి రాకూడదంటూ మృతుడి తల్లి రోదించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అశ్రునయనాల మధ్య కాశీపురం శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. చెన్నైలో కేసు నమోదునవీన్ మృతిపై అతని మేనమామ నాళం వాసు చెన్నైలోని కె–10 కొయంబేడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య, ఆత్మహత్య అని నిర్ధారణకు వస్తామని పోలీసులు చెప్పినట్లు సమాచారం. -
యూరియా కోసం యుద్ధం
సంతబొమ్మాళి/బుచ్చెయ్యపేట/చౌడేపల్లె/సంతకవిటి/సామర్లకోట/ఎచ్చెర్ల/పిఠాపురం: కూటమి పాలనలో యూరియా అందక రైతులు యుద్ధాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న కర్షకుల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీనికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని సంత»ొమ్మాళి మండలం ఆకాశలక్కవరంలో శనివారం రైతులు తిరగబడి టీడీపీ కార్యకర్తను చితకబాదారు. వారం రోజుల కిందట వచ్చిన 110 యూరియా బస్తాలను అధికారులు పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. ఎప్పుడు పంపిణీ చేస్తారని సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను రైతులు అడుగగా సరిపడా యూరియా ఇంకా రాలేదని, పెట్టిన ఇండెంట్ మొత్తం వస్తే పంపిణీ చేస్తామని వాయిదా వేస్తూ వచ్చారు. రోజులు గడుస్తున్నా రావాల్సిన యూరియా రాలేదు. దీంతో ఇదివరకు వచ్చిన 110 బస్తాల యూరియా కోసం శనివారం రైతులు పంచాయతీ కార్యాలయం వద్ద కాపు కాశారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు అగ్రికల్చర్ అసిస్టెంట్ మృదులను గ్రామంలో ఉన్న అసిరమ్మ గుడి వద్దకు రహస్యంగా రప్పించి తమ అనుకూలమైన వారితో వేలి ముద్రలు వేయించి స్లిప్పులను తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్త కప్ప ఎర్రయ్య రైతులను బూతులు తిట్టడంతో కర్షకులు తిరగబడ్డారు. ఎర్రయ్యను చితకబాదారు. » అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో యూరియా కోసం రైతులు శనివారం తోపులాటకు దిగారు. రాజాం రైతు సేవా కేంద్రానికి 260 బస్తాల యూరియా రావడంతో రాజాం, నీలకంఠాపురం గ్రామాలకు చెందిన 500 మందికి పైగా రైతులు వచ్చారు. ఈ సందర్భంగా రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా తోపులాటకు దారితీసింది. చివరకు కొద్దిమందికే యూరియా అందడంతో మిగిలిన రైతులు నిరాశగా వెనుదిరిగారు.» చిత్తూరు జిల్లా చౌడేపల్లెలో శనివారం యూరియా కోసం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద, గ్రోమోర్ దుకాణం వద్ద రైతులు క్యూకట్టారు. రెండురోజులుగా ఎరువుల షాపుల వద్ద, వ్యవసాయాధికారి కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నా కొందరికే ఎరువులు అందాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. » విజయనగరం జిల్లా సంతకవిటిలోని కోరమాండల్ దుకాణం వద్ద శనివారం గంటల తరబడి రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఉదయం 5 గంటలకే దుకాణం వద్ద అన్నదాతలు క్యూ కట్టారు. పొందూరు–సంతకవిటి ప్రధానరోడ్డు వరకు రైతులు క్యూ కట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. » కాకినాడ జిల్లా నవర గ్రామంలోని రైతు సేవా కేంద్రం వద్ద శనివారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్లలో నిలబడలేని వారు కూలీలకు రూ.600 ఇచ్చి లైన్లలో నిలబెట్టారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ధర్మవరం గ్రామంలో శనివారం యూరియా కోసం రైతులు ఎండలో నిరీక్షించారు. » యూరియా లేక రైతులు గగ్గోలు పెడుతుంటే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ యూరియా కొరత లేదనడంపై రైతులు మండిపడ్డారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంగొల్లప్రోలు మండలం చేబ్రోలు మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. ‘ఎక్కడున్నావ్ వర్మా.. దమ్ముంటే ఇక్కడికి వచ్చి యూరియా ఇప్పించు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీకి యూరియా వచ్చిందన్న సమాచారంతో తెల్లవారుజాము నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ఏడీఏ చేతిలోని టోకెన్లను స్థానిక టీడీపీ నేత లాక్కుని కొందరు రైతులకు అందజేయడంతో మిగిలిన రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జెడ్పీటీసీ నాగలోవరాజు వచ్చి రైతులందరికీ యూరియా ఇవ్వాలని కోరారు. టోకెన్లు అందరికీ ఇచ్చేశామని ఏడీఏ బదులివ్వడంతో జెడ్పీటీసీ రైతులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి స్థానిక మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు. జెడ్పీటీసీ, మిగిలినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
జనసేనకు సర్ప్రైజ్ షాక్
సాక్షి, అనకాపల్లి: జనసేన పార్టీకి సర్ప్రైజ్ షాక్ తగిలింది. మునగపాక ఎంపీపీ మల్ల జయలక్ష్మి తిరిగి వైఎస్సార్సీపీ గూటికే చేరుకున్నారు. ధర్మశ్రీ, కన్నబాబురాజు, బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఊహించని ఈ పరిణామంపై జనసేన వర్గాలు కంగుతిన్నాయి.అభివృద్ధి కోసమే జనసేన పార్టీలో చేరాను. మా మండలాన్ని అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా కూటమి నేతలు మోసం చేశారు. పార్టీలో నన్ను అవమానాలకు గురి చేశారు. జనసేన పార్టీలో అభివృద్ధి కోరుకునేవారికి తగిన గుర్తింపు ఉండదు అని జయలక్ష్మి అన్నారామె. ఈసందర్భంగా వైఎస్సార్సీపీ కేడర్కు ఆమె క్షమాపణలు తెలియజేశారు.వైయస్ఆర్సీపీని వీడి తప్పు చేశాను, నన్ను క్షమించాలి. చేసిన తప్పును సర్దించుకోవడం కోసం మళ్లీ వైఎస్సార్సీపీలో తిరిగి జాయిన్ అయ్యాను అని ఎంపీపీ మల్ల జయలక్ష్మి తెలిపారు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఆగష్టులో మల్ల జయలక్ష్మి జనసేనలో చేరారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీకి స్థానికంగా పెద్ద దెబ్బ పడిందంటూ జనసేన శ్రేణులు సంబురాలు చేసుకోవడమూ తీవ్ర చర్చనీయాంశంగానూ మారింది. -
మద్యం కోసం కన్నతల్లినే కడతేర్చాడు
నాతవరం(అనకాపల్లి జిల్లా): మద్యం కోసం కన్నతల్లినే కడతేర్చాడు. మండలంలో వైబీ పట్నంలో మద్యం మత్తులో తల్లిని చంపిన ఘటన సంచలనంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిటికిల జోగునాయుడు, మంగ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా కొడుకు రామ్మూర్తినాయుడు మాకవరపాలెం మండలానికి చెందిన అమ్మాయిని çప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో కుమారుడు వ్యసనాలకు బానిసై మద్యం తాగడానికి డబ్బులివ్వాలంటూ ఇంట్లో తరచూ గొడవ పడేవాడు. భర్త వే«ధింపులు భరించలేక భార్య దేవి నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు కూడా పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్మూర్తినాయుడు హైదరాబాద్ వెళ్లిపోయాడు. గురువారం మరిడమ్మతల్లి పండగ కావడంతో గ్రామానికి వచ్చాడు. రాత్రి ఒంటి గంట వరకు మద్యం తాగి వైబీ పట్నంలోని తన ఇంటికి వచ్చాడు. మళ్లీ డబ్బుల కోసం తండ్రితో గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న కొడుకు పరిస్థితి గమనించిన ఆయన అక్కడి నుంచి తప్పించుకోగా, నిద్రిస్తున్న తల్లి మంగను కొట్టి డబ్బులడిగాడు. మంచం పైనుంచి కింద పడేసి పక్కనే ఉన్న పూల కుండీతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తల్లి స్పృహ తప్పి అపస్మార స్థితికి చేరుకుంది. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, శతమానం లాక్కుని పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి మంగ మరణించింది. మృతురాలి భర్త జోగునాయుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోని తీసుకున్నామని, దర్యాప్తు అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. -
అరుణాచలంలో కాశీపాలెంవాసి హత్య!
విశాఖపట్నం: పొరుగు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో దేవరాపల్లి మండలం కాశీపాలెం గ్రామానికి చెందిన డెక్క నవీన్ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం. పోలీసులు ధ్రువీకరించనప్పటికీ ఈ దుర్ఘటన జరిగినట్టు శుక్రవారం రాత్రి విస్తృతంగా ప్రచారమైంది. నవీన్ రాంబిల్లి మండలం చిన్నపూడి గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కుమార్తెతో పదో తరగతి, ఇంటర్ నుంచి అతడికి స్నేహం ఏర్పడింది. వీరి సాన్నిహిత్యం గురించి తెలిసి యువతిని చెన్నైలో చదివిస్తున్నారని, అయినా వీరి మధ్య పరిచయం కొనసాగిందని, అదే అమ్మాయి తరపు వారికి కంటగింపుగా మారిందని సమాచారం. నవీన్ వేరే కులానికి చెందినవాడు కావడం, పెద్దగా చదువుకోకపోవడం, ఆస్తి లేకపోవడంతో అమ్మాయి తల్లికి ఇష్టం లేదు. మూడు రోజుల క్రితమే అమ్మాయిని తీసుకొని తల్లి అరుణాచలం వెళ్లింది. నవీన్కి ఫోన్ చేసి వారు ఉన్న చోటుకు రప్పించారు. అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకొని ఉన్నారు. నవీన్ ఫోన్లో అసభ్యకరమైన ఫొటోలు ఉన్నట్లు గమనించి లాక్కొని చితకొట్టేశారు. అనంతరం తమతో వచ్చిన ఇద్దరు వ్యక్తులతో నవీన్ను హత్య చేసినట్లు సమాచారం. అమ్మాయిని, ఆమె తల్లిని అరుణాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. ప్రస్తుతం ఇద్దరూ అక్కడ జైల్లో ఉన్నట్లు భోగట్టా. -
‘కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్యులకు చేరాలి’
జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం తుమ్మపాల: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) మాసాంతపు సమావేశం శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. దిశ కమిటీ చైర్మన్, ఎంపీ రమేష్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, పంచకర్ల రమేష్ బాబు, బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని జిల్లా అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందేలా చూడవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉందని ఎంపీ రమేష్ అన్నారు. యూరియా పంపిణీ, సంక్షేమం, అభివృద్ధి గురించి కమిటీ సభ్యులకు కలెక్టర్ వివరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ అనకాపల్లి, యలమంచిలి రైల్వే స్టేషన్ల సాఫ్ట్ అప్గ్రెడేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ యూరియా అమ్మకం, పంపిణీలో బ్లాక్ మార్కెట్ను అరికట్టాలన్నారు. డీఆర్వో సత్యనారాయణరావు, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, ఏఎస్పీ ఎం.దేవప్రసాద్, ఆర్డీవోలు, షేక్ ఆయిషా, వి.వి.రమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీపీలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వలిసె విలాపం
మన్యం పేరు చెబితే ప్రకృతి అందాలకు నిలయమే కాకుండా పచ్చని కొండలు గుట్టల మధ్య పసుపు తివాచీ పరిచినట్లుండే వలిసె పూలు గుర్తుకు వస్తాయి. అందానికే కాకుండా మరో వైపు ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటగా వలిసెలకు గుర్తింపు ఉంది. వేరుశనగ తరువాత అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ఈ పంట విస్తీర్ణం ఏటా తగ్గిపోతుండటం పర్యాటకులకు నిరాశ కలిగిస్తోంది. పర్యాటక సీజన్లో మంచు తెరల మధ్య వన్నెలద్దే వలిసె పూలు పూర్వవైభవం కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. చింతపల్లి ఆర్ఏఆర్ఎస్లో వలిసె సాగు పరిశోధన క్షేత్రంచింతపల్లి: వలిసె సాగు జిల్లాలో పాడేరు డివిజన్లో నూనె గింజల పంటగా గిరిజనులు సాగు చేస్తున్నారు. సంప్రదాయ విత్తనాల వినియోగం, ఆకాశపందిరి కలుపు మొక్క ప్రభావం కారణంగా దిగుబడి తగ్గింది. దీంతో నిరాశకు గురవుతున్న రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపడం లేదు. ● రెండు దశాబ్దాల క్రితం 6 వేల ఎకరాలకు పైగా ఉన్న సాగు విస్తీర్ణం ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. గత రెండేళ్లలో 1500 నుంచి 1600 ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం ఇప్పుడు 1200 ఎకరాలకు తగ్గిపోయింది. కారణాలివీ.. గిరిజన రైతులు సంప్రదాయ విత్తనాలను వినియోగించడం వల్ల దిగుబడి రావడం లేదు. మరోపక్క మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. తేనెటీగలు తగ్గడం కూడా దిగుబడిపై ప్రభావం చూపిస్తోంది. రాజ్మా, వరి విత్తనాలను ప్రభుత్వం రాయితీపై అందజేయడం వల్ల ఆ పంటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడం కూడా గిరి రైతులను నిరాశ పరుస్తోంది. అనువైన రకాలు ఎత్తయిన గిరిజన ప్రాంతాల్లో సాగు చేసేందుకు అనువైన రకాలను స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. జేఎన్ఎస్–28,30, జేఎన్ఎస్–2016, 1115, కేజీఎన్ –2 రకాలు వంద నుంచి 110 రోజుల్లో దిగుబడి వస్తుంది. జేఎన్ఎస్–6 రకం 110 రోజులు, జేఎన్ఎస్–9, ఉత్కల్ నైజర్–150 రకాలు 95 నుంచి వందరోజుల్లో దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. త్వరలో చింతపల్లి నైజర్ 1,2 విత్తనాలు ఇక్కడి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వలిసెలపై ప్రత్యేకంగా జాతీయ ప్రాజెక్ట్ అమలు అవుతోంది.ఇక్కడ వేల రకాల విత్తనాలపై 2018 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా చింతపల్లి నైజర్ 1,2 రకాలు ఉన్నట్టు చింతపల్లి గుర్తించారు. వీటిపై పరిశోధనలు మరో రెండేళ్లు జరిపిన అనంతరం రైతులకు పంపిణీ చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది ఆలస్యంగా.. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునందున సాగు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏటా ఆగస్టు నెలాఖరు, సెప్టెంబర్లో సాగు మొదలు పెడతారు. నవంబర్ నుంచి పూత వస్తుంది. జనవరి నాటికి దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు సాగు చేపట్టిన పరిస్థితులు కనిపించలేదు.అగ్రీ టూరిజంలో సంకల్పించినా.. సాగు విస్తీర్ణం పెంచే చర్యల్లో భాగంగా రెండేళ్ల క్రితం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అగ్రిటూరిజంలో ఈ పంటను చేర్చారు. రైతులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే మన్యానికి శోభనిచ్చే వలిసె పూలు భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు లేకపోలేదు. వలిసె పూల మకరందాన్ని సేకరించే తేనెటీగలు పరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి, ఇది పంటల దిగుబడికి మరియు కొత్త మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. వలిసె తోటల వద్ద తేనెటీగలు చేరడం సహజమే అయినా, ఇటీవలి కాలంలో తేనెటీగల సంఖ్య తగ్గడం వల్ల దిగుబడి తగ్గి గిరిజన రైతులకు నష్టం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
యూరియా కొరతతో రైతులకు ఇబ్బందులు
గొలుగొండ: యూరియా కొరత వల్ల మండలంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ శాఖ అధికారులు సరైన సమాధానం చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ మణికుమారి అధ్యక్షతను స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పుత్తడిగైరంపేట సర్పంచ్ పత్తి రమణ, నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురాం ఎరువుల కొరతపై నిలదీశారు. వ్యవసాయశాఖ అధికారులు సరిగా స్పందించకపోవడం వల్లే ఈ సమస్య వస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు కష్టాలు చాలా ఎక్కవగా ఉన్నాయని వాపోయారు. ఎంపీపీ మణికుమారి మాట్లాడుతూ మండలంలో సాగు విస్తీర్ణం, ఎంతమేర ఎరువులు అవసరం, ఇప్పటి వరకు ఎంతమేర వచ్చాయని వ్యవసాయ అధికారులను అడిగితే సరైన సమాచారం ఇవ్వలేదని వాపోయారు. మండలంలో ఎరువుల కొరత వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గొలుగొండలో తాగునీటి సమస్య గురించి సర్పంచ్ కసిపల్లి అప్పారావు, నాగాపురం ప్రభుత్వ పాఠశాలలో సమస్యల గురించి సర్పంచ్ రఘురాం ప్రస్తావించారు. ఇన్చార్జి ఎంపీడీవో బాబూరావు, వైస్ ఎంపీపీ జక్కు నాగమణితోపాటు పలువులు పాల్గొన్నారు. -
డిసెంబరుకు అనకాపల్లి స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి
అనకాపల్లి: దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) మోహిత్ సోనాహి అనకాపల్లి రైల్వే స్టేషన్ను శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. స్టేషన్ పరిధిలో 1, 2, 3 ప్లాట్ఫారంలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పగలు, రాత్రి సమయంలో స్టేషన్ పరిధిలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని, సీసీ కెమేరాల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. స్టేషన్ అభివృద్ధి పనులు ఈ ఏడాది డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం ప్రశాంత్, సీనియర్ డీవోఎం, డి.నరేంద్రవర్మ, ఏడీఎన్ కృష్ణయ్య, అనకాపల్లి స్టేషన్ మేనేజర్ సత్యనివాస్, ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్ఐ కంటెర్ల నవీన్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మిత్రులతో వెళ్లాడు.. శవమై తేలాడు..
నర్సీపట్నం: మిత్రులతో కలిసి వెళ్లిన ఓ యువకుడు శవమై తేలాడు. తమ కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పాత సంతబయలకు చెందిన రామిశెట్టి భాస్కర్(34) ఈ నెల 8న ఇంటికి వచ్చిన ముగ్గురు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన తల్లి లక్ష్మీ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భాస్కర్ సెల్ఫోన్ సిగ్నల్స్ నాతవరం మండలం డి.ఎర్రవరం వద్ద ఉన్నట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో గాలింపు చేసినా ఫలితం లేకపోయింది. కోటవురట్ల రూట్లో జోగినాథునిపాలెం సీసీ కెమెరాల్లో ఆయన కదలికలు రికార్డు అయ్యాయి. ఆ మార్గంలో బంధువులు గాలింపు చేయగా ఆర్ అండ్ బీ రోడ్డు కల్వర్టు కింద భాస్కర్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంట పాటు నర్సీపట్నం–చింతపల్లి మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భాస్కర్ మరణంపై అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. భాస్కర్ను ఇంటి నుంచి తీసుకెళ్లిన స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించాలని నినాదాలు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. భాస్కర్ను తీసుకువెళ్లిన వ్యక్తులు స్థానికంగా లాడ్జీలో ఉన్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. -
4 రోజుల్లో చోరీ కేసు ఛేదన
నక్కపల్లి: చోరీ కేసును నాలుగు రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించిన వివరాలు ప్రకారం.. ఈ నెల 8వ తేదీన వేంపాడులో కొత్త నాగేశ్వరరావు ఇంట్లో చోరీ జరిగింది. భోజన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తాళాలు పగుల గొట్టి రూ.72 వేలు, 53 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ కుమారస్వామి ఆధ్వర్యంలో క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు సీసీఫుటేజీల ఆధారంగా డీఎల్పురం గ్రామానికి చెందిన గింజాల అప్పారావు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ క్రమంలో మధ్యవర్తుల సమక్షంలో అతడి నుంచి 27.25 గ్రాముల బంగారు చైన్, 14.78 గ్రాముల లాకెట్, 3 గ్రాముల లక్ష్మీదేవి ఉంగరం 7.86 గ్రాముల బంగారు ముద్ద, ఒక గ్రాము ఉంగరం, రూ.72 వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అరెస్టు చేశారు. ఈ సమావేశంలో సీఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు, ట్రైనీ ఎస్ఐ అంజు, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు
విశాఖ సిటీ: గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం రేంజ్ పరిధిలోని అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో డీఐజీ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ నేరాల నిరోధక చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు చేశారు. అక్రమ గంజాయి రవాణా వ్యాపారంలో పాల్గొన్న 14 మంది నేరస్తుల ఆస్తులు రూ.10,04,89,621 స్వాధీనం చేసుకోవడాన్ని అభినందించారు. ఇప్పటి వరకు 1,119 మంది గంజాయి నేరస్తుల కదలికలపై షీట్లు తెరిచినట్లు చెప్పారు. అలాగే 51 మంది నిందితులపై పీడీ చట్టం, 80 మందిపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం అమలుకు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. తరచూ గంజాయి రవాణా చేసే 368 మంది, అలాగే గంజాయితో పాటు ఇతర నేరాలలో పాల్గొన్న 370 మందిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. న్యాయస్థానాలు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్లు ఆధారంగా 341 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 కేసుల్లో 33 మంది నిందితులకు శిక్షలు పడ్డాయన్నారు. వీరిలో 24 మందికి 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయన్నారు. విశాఖపట్నం రేంజ్ పోలీసులు స్టే సేఫ్, నిదాన్, కాజ్, నాట్ గ్రిడ్ యాప్స్ ద్వారా పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడంలో కృషిని అభినందించారు. మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలు, మహిళ మిస్సింగ్ కేసులపై సమీక్షించారు. ఇటువంటి కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని చెప్పారు. రేంజ్ పరిధిలోని శాంతి భద్రతల సమస్యలపై చర్చించారు. భవిష్యత్తు కోసం తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. -
విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణ అన్యాయం
చోడవరం: విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ శనివారం తలపెట్టిన రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బి. బాబ్జి పిలుపు ఇచ్చారు. గుంటూరులో నిర్వహించే ఈ సదస్సుకు సంబంధించి వాల్ పోస్టర్లను శుక్రవారం ఆయన చోడవరంలో ఆవిష్కరించారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విద్యార్థులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్ బకాయిలు రూ. 600కోట్లు ఇప్పటి వరకూ విడుదల చేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కాలేజీల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయన్నారు. తక్షణం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ సీట్లు పూర్తిగా యాజమాన్యాలకు ఇవ్వడం అన్యాయమని, హాస్టళ్ల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు నాగదుర్గ, రాజు, నాయుడు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్లకు మద్దతుగా సైకిల్ యాత్ర
సైకిల్ యాత్ర చేస్తున్న ఆటో డ్రైవర్ అప్పలరాజుతో ఆటో డ్రైవర్లు అనకాపల్లి: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఆటో డ్రైవర్లు వ్యతిరేకం కాదని, వారికి ఉపాధి లేకుండా పోయిందని గాజువాక 86వ ఆటో యూనియన్ అధ్యక్షుడు గొలగాని అప్పలరాజు వాపోయారు. ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ గాజువాక నుంచి విజయవాడ వరకూ శుక్రవారం ఉదయం 9 గంటలకు సైకిల్ యాత్రను ప్రారంభించారు. అనకాపల్లి నెహ్రూచౌక్ బస్టాండ్ వద్దకు చేరుకున్న అప్పలరాజుకు స్థానిక ఆటోడ్రైవర్లు మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ 400 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఈ నెల 20న విజయవాడ చేరుకుంటానన్నారు. రోజుకు 50 కిలోమీటర్లు మేర సైకిల్ యాత్ర చేసి, రాత్రిళ్లు దేవాలయాల వద్ద బస చేస్తానన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్లను కలిసి వినతిపత్రం అందజేస్తానన్నారు. వాహన మిత్ర పథకం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, రోజుకు ఆటో డ్రైవర్లకు రూ.41 మాత్రమే వస్తుందన్నారు. కార్యక్రమంలో నెహ్రూచౌక్ ఆటో యూనియన్ డ్రైవర్లు బీమవరపు శ్రీను, సంతోష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఎలా.. ఎప్పుడు ఏర్పడ్డాయంటే..?
ఈ ఎర్రమట్టి దిబ్బలు సుమారు 18,500 నుంచి 20,000 సంవత్సరాల మధ్య కాలంలో ఏర్పడినట్లు భౌగోళిక చరిత్ర చెబుతోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం బంగాళాఖాతం ప్రస్తుత తీర రేఖ నుంచి కనీసం 5 నుంచి 10 కి.మీ వెనక్కి ఉండేది. తూర్పు కనుమల్లో ఖొండలైట్ శిలలు విస్తరించి ఉన్నాయి. ఈ శిలల్లో గార్నేట్, క్వార్జ్, సిల్లిమనైట్, ఫెల్డ్స్పార్, ఇనుప ఖనిజాలు విస్తారంగా ఉంటాయి. భారీ వర్షాలు పడే సమయంలో ఈ కొండల నుంచి నీటి ప్రవాహాల ద్వారా కొట్టుకొచ్చిన మట్టి పదార్థాలు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇలా వరద నీటితో పాటు తూర్పుకనుమల్లో ఉన్న ఖనిజాలు కొట్టుకొచ్చి సముద్ర తీరంలోకి ఇసుకతో కలిసిపోయి మిశ్రమంగా ఏర్పడి పేరుకున్నాయి. కొండల్లోని మట్టి, సముద్రపు ఇసుక, ఖొండలైట్ శిలల్లోని ఖనిజాలన్నీ కలిసి కాస్తా గట్టిదనాన్ని సంతరించుకోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఖనిజాల సమ్మేళనాలు ఆక్సీకరణం చెందడం వల్ల ఈ కొండలు ఎర్రగా మారిపోయాయి. ఏర్పడిన సమయంలో వీటిని ఎర్ర ఇసుక కొండలుగా పిలిచేవారు. కాలక్రమేణా ఈ గుట్టల్లో పేరుకుపోయిన మిశ్రమ అవక్షేపాల్లో వదులుగా ఉండేచోట నీటి ప్రవాహాల తాకిడితో కొట్టుకొని పోవడం వల్ల ఆ ప్రాంతం చిన్న చిన్న లోయలుగా రూపాంతరం చెందింది. క్రమంగా భారీ వర్షాల సమయంలో దాదాపు 3వేల సంవత్సరాల క్రితం వరకూ ఈ ఎర్రమట్టి దిబ్బలు నిరంతరం మార్పులు సంభవిస్తున్నాయి. -
ఇసుకే అయినా.. మట్టిదిబ్బలని...
పూర్వ కాలంలో వీటిని ఎర్ర ఇసుక కొండలుగానూ పిలిచేవారు. పాయలుగా ఏర్పడిన తర్వాత.. ఎర్రమట్టి దిబ్బలుగా పిలుస్తున్నారు. వాస్తవానికి భౌగోళిక పరంగా ఇది ఇసుక నుంచి రాయి ఏర్పడుతుంది. పొరలు పొరలుగా ఒక చోట చేరిన ఇసుక రేణువులే వేల సంవత్సరాల తర్వాత రాయిగా మారుతాయి. అలా ఒకచోట పేరుకుపోయిన ఇసుక క్రమంగా గట్టిపడటం మొదలవుతుంది. అది పూర్తి రాయిగా మారే క్రమంలో కాస్త మట్టిలా అనిపించే విధంగా మారుతుంది. ఇది ఇసుకే అయినా మట్టిలా గట్టిగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దిబ్బల్లోని ఇసుక, మట్టి ఎరుపు రంగులో ఉండటం వల్ల వీటిని ఎర్రమట్టి దిబ్బలుగా పిలవడం అలవాటైపోయింది. -
స్మార్ట్ రేషన్ కార్డులు ఎక్కడ?
సాక్షి, అనకాపల్లి: రేషన్ ప్రక్రియలో పారదర్శకత పెంచేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకున్న ‘కూటమి’ నేతలు కార్డుల పంపిణీకి వారే అడ్డంకిగా నిలిచారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్మార్ట్ కార్డుల పంపిణీని ఈనెల 10వ తేదీన ప్రారంభించాలి. కార్డులు సిద్ధమైనా జిల్లాలోని కేవలం 2 మండలాల్లో మాత్రమే పంపిణీ మొదలైంది. జిల్లావ్యాప్తంగా 24 మండలాల్లోని 1063 రేషన్ డిపోల పరిధిలో 5,32,346 రేషన్ కార్డుదారులున్నారు. కనీసం ఇంతవరకు రెండు వేల స్మార్ట్ కార్డులు కూడా పంపిణీ జరగలేదు. కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పంపిణీని ప్రారంభించాలని అధికారులకు అనధికార ఆదేశాలున్నాయి. వారు ఇదిగో అదిగో అంటూ ఆలస్యం చేయడంతో ఈ ప్రక్రియ మొదలు కాలేదు. అనకాపల్లి, యలమంచిలి తదితర ప్రాంతాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు కూడా ఇందుకు తోడయ్యాయి. మేమంటే మేమని ఒకరితో ఒకరు పోటీ పడుతూ పంపిణీకి బ్రేకులు వేస్తున్నారు. కొత్త కార్డుదారులకు నిరాశ స్మార్ట్ కార్డులు అందించకపోవడంతో కొత్తగా కార్డులు మంజూరైన 3,250 కుటుంబాలు రేషన్ అందక విలవిల్లాడుతున్నాయి. అధికారులు వీరి కోసం సరకులు రిలీజ్ చేశారు. కానీ వారి వద్ద ఎలాంటి కార్డు లేక పంపిణీ చేయలేని పరిస్థితి. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెండు మండలాల్లో హడావుడిగా ఈ ప్రక్రియ ప్రారంభించారు. మిగతా చోట్ల స్మార్ట్ ఈ–పోస్ యంత్రాలు, క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు మూలుగుతున్నాయి. కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ ‘సాక్షి’తో మాట్లాడుతూ కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల డేట్లు లేకపోవడంతో స్మార్ట్ కార్డుల పంపిణీలో జాప్యం జరగడం సరికాదని అన్నారు. తాను సీఎం కార్యాలయానికి, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ 1967కు కాల్ చేసి ఫిర్యాదు చేసిన అనంతరం రెండు మండలాల్లో శుక్రవారం తూతూ మంత్రంగా ప్రారంభించారని చెప్పారు. 10న ప్రారంభం కావాల్సిన పంపిణీ ‘కూటమి’ నేతల పెత్తనంతో ఆలస్యం కొత్త కార్డులకు నిలిచిన రేషన్ పంపిణీ ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్కు ఫిర్యాదులు కేవలం 2 మండలాల్లోనే పంపిణీ ప్రారంభం -
భావ ప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం రాజ్యాంగ విరుద్ధం
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు, టీవీలు వ్యవహరిస్తుంటాయి. పాత్రికేయులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు, ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తుంటారు. తప్పులు సరిదిద్దుకోవాలి గానీ రాసిన పత్రికపై, పాత్రికేయులపై కక్ష కడితే ఎలా? ఇటీవల సాక్షిలో ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడిన ప్రెస్మీట్ను వార్తగా రాస్తే.. ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై, సంబంధిత జర్నలిస్టుపై అక్రమ కేసు పెట్టి వేధిస్తున్నారు. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది. రాజ్యాంగం అందించిన భావ ప్రకటనా స్వేచ్ఛను అక్రమ కేసులతో పోలీసులు నిరోధించలేరు. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి వేధించే ధోరణి అవలంబిస్తోంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. – డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, మాజీ ఎంపీ, అనకాపల్లి -
అరుణాచలంలో జిల్లా వాసి హత్య!
అచ్యుతాపురం : పొరుగు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో దేవరాపల్లి మండలం కాశీపాలెం గ్రామానికి చెందిన డెక్క నవీన్ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం. పోలీసులు ధ్రువీకరించనప్పటికీ ఈ దుర్ఘటన జరిగినట్టు శుక్రవారం రాత్రి విస్తృతంగా ప్రచారమైంది. నవీన్ రాంబిల్లి మండలం చిన్నపూడి గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కుమార్తెతో పదో తరగతి, ఇంటర్ నుంచి అతడికి స్నేహం ఏర్పడింది. వీరి సాన్నిహిత్యం గురించి తెలిసి యువతిని చైన్నెలో చదివిస్తున్నారని, అయినా వీరి మధ్య పరిచయం కొనసాగిందని, అదే అమ్మాయి తరపు వారికి కంటగింపుగా మారిందని సమాచారం. నవీన్ వేరే కులానికి చెందినవాడు కావడం, పెద్దగా చదువుకోకపోవడం, ఆస్తి లేకపోవడంతో అమ్మాయి తల్లికి ఇష్టం లేదు. మూడు రోజుల క్రితమే అమ్మాయిని తీసుకొని తల్లి అరుణాచలం వెళ్లింది. నవీన్కి ఫోన్ చేసి వారు ఉన్న చోటుకు రప్పించారు. అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకొని ఉన్నారు. నవీన్ ఫోన్లో అసభ్యకరమైన ఫొటోలు ఉన్నట్లు గమనించి లాక్కొని చితకొట్టేశారు. అనంతరం తమతో వచ్చిన ఇద్దరు వ్యక్తులతో నవీన్ను హత్య చేసినట్లు సమాచారం. అమ్మాయిని, ఆమె తల్లిని అరుణాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. ప్రస్తుతం ఇద్దరూ అక్కడ జైల్లో ఉన్నట్లు భోగట్టా. -
తాచేరు డైవర్షన్ రోడ్డు పనులపై ఎందుకీ కక్ష?
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం–నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయి మూడు జిల్లాల ప్రజలు తీవ్ర రవాణా కష్టాలు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జోరు వర్షంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి విజయరామరాజుపేట తాచేరు నదిపై కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డును పరిశీలించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీతో కలిసి బీఎన్ రోడ్డు విస్తరణ కోసం రూ.110 కోట్లు మంజూరు చేయించామని అమర్నాథ్ తెలిపారు. అప్పట్లో ఈ రోడ్డు కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కావాలనే రోడ్డు పనులు చేయకుండా, కూలిన వంతెనలు కట్టకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. నెల రోజుల కిందట వర్షాలకు డైవర్షన్ రోడ్డు కోతకు గురైందన్నారు. మరమ్మతు పనులకు రూ.15 లక్షలు మంజూరు కాగా.. కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పది రోజులైనా నేటికి పనులు ప్రారంభించకపోవడంపై ఆయన మండిపడ్డారు. కావాలనే తాచేరు వంతెన, డైవర్షన్ రోడ్డు పనులపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉండగా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తూ కక్ష సాధిస్తోందని ఆరోపించారు. సంక్రాంతికి రోడ్లు బాగు ఎక్కడ? అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతి కల్లా రోడ్లన్నీ బాగు చేస్తామని గతేడాది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని అమర్నాథ్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలైనా బీఎన్ రోడ్డు బాగు పడలేదన్నారు. ఏ రోడ్డును చూసినా పెద్ద పెద్ద గోతులు, వర్షపు నీరు, మట్టి దిబ్బలతో దీవులను తలపిస్తున్నాయన్నారు. ప్రజల రవాణా కష్టాలు తీర్చడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అనకాపల్లి, విశాఖ, అల్లూరి జిల్లాల ప్రజలు బీఎన్ రోడ్డులో ఉన్న విజయరామరాజుపేట మీదగా రాకపోకలు సాగిస్తారన్నారు. డైవర్షన్ రోడ్డు గండి కారణంగా గౌరీపట్నం, తదితర ఇరుకు రోడ్ల మీదుగా రాకపోకలు సాగిస్తూ గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోతున్నారన్నారు. అయినా కూటమి నేతలు, ఆర్అండ్బీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరించడం సరికాదన్నారు. పేట డైవర్షన్ రోడ్డు మరమ్మతులు చేపట్టి రవాణా కష్టాలు తీర్చకపోతే ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు, జెడ్పీటీసీ దొండా రాంబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దనరావు, వైస్ ఎంపీపీ దొండా లలితా నారాయణమూర్తి, గొంపా చినబాబు, నాయకులు జోగా కొండబాబు, నమ్మి అప్పలరాజు, గుమ్మిడి ప్రసాద్, కోరుకొండ రమణ, ఎల్లపు విజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. అప్పుడు, ఇప్పుడు టెండర్లు దక్కించుకున్నది టీడీపీ కాంట్రాక్టర్లే పనులు పూర్తి చేయకుండా కాలయాపన మూడు జిల్లాల ప్రజల కష్టాలు కనిపించడం లేదా? వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఆగ్రహం జోరువానలో పేటలో డైవర్షన్ రోడ్డు పరిశీలన -
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రెస్ మీట్లో నాయకుడు ఇచ్చిన వార్తను ప్రచురిస్తే కేసులు పెట్టడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం ఈ రాష్ట్రంలో లేదా? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి వాస్తవాలు వెలుగులోకి తెస్తున్న సాక్షిపై వేధింపులకు పాల్పడుతోంది. రాజకీయ పార్టీ నేత ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలను రిపోర్టర్ వార్తగా రాస్తే ఎడిటర్పై కేసులు పెడతారా? భావ ప్రకటన స్వేచ్ఛను అక్రమ కేసులు, నోటీసులతో నిరోధించలేరు. రాజకీయ కక్షతో సాక్షి ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. కూటమి పాలనలో అన్ని వర్గాలను గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి నేతలకు సరైన గుణపాఠం తప్పదు. – డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఎంపీ, అరకులోయ -
ముగ్గురు జైలు సిబ్బందికి చార్జి మెమోలు
చోడవరం: సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీ లు పరారైన సంఘటనకు సంబంధించి ముగ్గురు చోడవరం సబ్జైలు అధికారులకు జైళ్లశాఖ అధికారులు గురువారం చార్జి మెమోలు జారీ చేశారు. ఈనెల 5వ తేదీన చోడవరం సబ్ జైలులో నక్కా రవికుమార్, బెజవాడ రాము అనే ఇద్దరు రిమాండ్ ఖైదీలు విధినిర్వహణలో ఉన్న జైలు వార్డర్ను సుత్తి తో తలపై కొట్టి గాయపరిచి ఆయన జేబులో ఉన్న తాళాలను తీసుకొని మెయిన్గేటు తీసుకొని పరారయిన విషయం తెలిసిందే. తర్వాత 24 గంటలు తిరగకముందే టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పరారైన ఇద్దరు ఖైదీలను పట్టుకొని అరెస్టు చేశారు. అయితే ఎంతో పగడ్బందీగా ఉన్న సబ్జైలు నుంచి ఖైదీలు ఇంత సునాయాసంగా పరారవ్వడానికి గల కారణాలపై ఎస్పీ తుహిన్సిన్హాతోపాటు జైలు శాఖ ఉన్నతాధికారులు అదే రోజు విచారణ చేశారు. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం ఉందని గుర్తించిన అధికారులు ఆ సమయంలో విధినిర్వహణలో ఉన్న జైలు సూపరింటెండెంట్ బాబూరావు, హెడ్వార్డర్ వి.వీర్రాజు, వార్డర్ ఎం.అప్పలనాయుడుకు చార్జి మెమో జారీచ ేశారు. సంఘటన జరిగిన సమయంలో ముగ్గురు వార్డర్లు లోపల, ఒక హెడ్ వార్డరు మెయిన్ గేటు దగ్గర, సబ్జైలర్ తన గదిలో విధినిర్వహణలో ఉన్నారు. ఇంత జరగడానికి విధి నిర్వహణలో ఉన్న జైలు అధికారుల నిర్లక్ష్యమే కారణమని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ జైలుశాఖ ఉన్నతాధికారులు ముగ్గురికి చార్జి మెమోలు జారీ చేశారు. వారి వివరణ అనంతరం తరుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
19 పీఎస్లకు డ్రోన్ కెమెరాలు
కె.కోటపాడు : జిల్లాలో 19 పోలీస్స్టేషన్లకు సీఎస్ఆర్ నిధులతో డ్రోన్ కెమెరాలను అందించినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా తెలిపారు. కె.కోటపాడు పోలీస్స్టేషన్ను గురువారం వార్షిక తనిఖీ నిర్వహించారు ఈ ఏడాది పోలీస్స్టేషన్లో నమోలైన కేసుల వివరాలను ఎస్ఐ ఆర్.ధనుంజయ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై నిఘాతో పాటు చోరీ ఘటనల్లో నిందితులను పట్టుకోవడానికి డ్రోన్ నిఘా వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. అలాగే గంజాయి రవాణాను అరికట్టడానికి పటిష్టమైన చెక్పోస్టు వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. గంజాయి సేవనం, బహిరంగ ప్రాంతాల్లో మద్యపానం వంటి వాటిపై 112కు సమాచారం అందించాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, కూడలిలో ట్రాఫిక్ ఇబ్బందులను చక్కదిద్దడానికి ఎస్పీ తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్, చీడికాడ, దేవరాపల్లి ఎస్ఐలు బి.సతీష్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
కళ్లు తెరవండి.. నిజం చెప్పండి
ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం మండలంలో భీమబోయినపాలెం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల.. ఇది కల కాదు.. నిజమే! అనకాపల్లి జిల్లావాసులతోపాటు సరిహద్దులోని పాడేరు నియోజకవర్గంలో కొన్ని మారుమూల గ్రామాల గిరిజనులకు ఉపయోగపడే విధంగా గత వైఎస్సార్సీపీ తలపెట్టిన బృహత్ కార్యక్రమమిది.. విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యమిచ్చిన దార్శనికుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కలల ప్రాజెక్టు ఇది. అందమైన కల కనడమే కాదు.. 50 ఎకరాల్లో 13.21 లక్షల చదరపు అడుగుల్లో రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించేందుకు 2022 డిసెంబరు 30న శంకుస్థాపన చేశారు. ఏడాది కాలంలో సగానికి పైగా దాదాపు 60 శాతం నిర్మాణ పనులు పూర్తి చేశారు. బోధనాస్పత్రి భవనంలో మూడు అంతస్తులు సిద్ధమయ్యాయి. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల భవనంలో రెండు అంతస్తులు పూర్తయ్యాయి. అదే వేగంతో నిర్మాణం జరిగితే కొద్ది నెలల్లోనే మొత్తం భవనాలు అందుబాటులోకి వచ్చేవి. కానీ కూటమి ప్రభుత్వం కుటిల బుద్ధితో పనులు నిలిపివేసింది. 15 నెలల కాలంలో అడుగు నిర్మాణం కూడా చేపట్టకపోగా.. ఆ కళాశాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి అప్పగించేందుకు కుట్రలు పన్నుతోంది. ప్రైవేట్కు ధారాదత్తం చేసేందుకు జీవో కూడా విడుదల చేసింది. పైగా నిర్మాణాలు ప్రారంభ దశలోనే ఉన్నాయంటూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. అందుకే వైఎస్సార్సీపీ నాయకులు గురువారం కళాశాల భవనాలను పరిశీలించారు. రుజువులు, సాక్ష్యాలతో వాస్తవ పరిస్థితిని బయటపెట్టారు. సాక్షి, అనకాపల్లి: ఉత్తరాంధ్ర ప్రాంతంలో 1921 సంవత్సరంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. వందేళ్ల తర్వాత ఇదే ప్రాంతంలో అనకాపల్లి, పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాడేరు మెడికల్ కళాశాల పూర్తి కావడంతో తరగతులు ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చారు. మాకవరపాలెం మండలంలోని కళాశాల భవనాలు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేవి. జిల్లాలో గల ఆరు నియోజకవర్గాల ప్రజలకు, పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి, కొయ్యూరు పరిసర ప్రాంత గిరిజన ప్రజలకు మేలు జరిగేది. కళాశాల ప్రారంభమైతే ఏటా 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చేవి. తర్వాత పీజీ వైద్య కోర్సులు రావడానికి అవకాశం ఏర్పడేది. కూటమి సర్కారు ప్రైవేటు దాహంతో ఇవన్నీ తీరని కలలా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. వైఎస్సార్సీపీ బృందం సందర్శన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతలపూడి వెంకట్రామయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, ఏరువాక సత్యారావు, తదితరులు భీమబోయినపాలెంలో సగానికిపైగా నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీని గురువారం సందర్శించారు. భవనాలు సగానికి పైగా పూర్తయ్యాయని, కూటమి సర్కారు వచ్చాక ఎక్కడి నిర్మాణాలు అక్కడ నిలిపివేయడం దారుణమన్నారు. ప్రజల యోగ క్షేమాలను పరిగణనలోకి తీసుకొని పనులు పూర్తి చేయాలన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియడం లేదంటూ విమర్శించారు. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేయడాన్ని అంగీకరించబోమన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో కలిసివచ్చే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. పార్టీ ముఖ్యనేతలు రుత్తల ఎర్రాపాత్రుడు, బోని శివరామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కె.రామకృష్ణ, ఎంపీపీలు రుత్తల సర్వేశ్వరరావు, మణికుమారి, సుర్ల రాజేశ్వరి, సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీలు అప్పలనర్స, సుర్ల వెంకట గిరిబాబు, మాకవరపాలెం, గొలుగొండ, నర్సీపట్నం రూరల్, నాతవరం మండల పార్టీ అధ్యక్షులు చిటికెల రమణ, కొరుప్రోలు ఫాణి తాంఽథారామ్, సానాపతి వెంకటరత్నం, నాగేశ్వరావు, మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం మాస్టర్ ప్లాన్పై చర్చ నర్సీపట్నం: నూతనంగా రూపొందించిన ము న్సిపాలిటీ మాస్టర్ ప్లాన్పై సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు గురువారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించా రు. 2040 నాటికి పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్టు వీఎంఆర్డీఏ ప్లానింగ్ ఆఫీసర్ అ రుణవల్లి పేర్కొన్నారు. పట్టణంలో ఇంటర్నల్ రోడ్లతోపాటు ప్రధాన రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. అబిద్ సెంటర్ నుంచి పెదబొడ్డేపల్లి, అబిద్ నుంచి చింతపల్లి, అబిద్ నుంచి కె.డి.పేట రోడ్డు వంద అడుగులకు విస్తరించాలని ప్లాన్లో పేర్కొన్నారు. దీనిపై పలువురు వ్యాపారస్తులు వారి అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్ జంపా సురేంద్ర పాల్గొన్నారు. సాక్షి, అనకాపల్లి : జాతీయ రహదారిపై సుదూర ప్రయాణం చేసే వాహనదారులు రాత్రి వేళ అలసటతో నిద్రలోకి జారుకోవడం కారణంగా తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తుహిన్ సిన్హా ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళల్లో నిద్రలేమి కారణంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు, జిల్లా జాతీయ రహదారులపై ఉన్న 9 హైవే మొబైల్ టీమ్లను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. అనకాపల్లి జిల్లా పరిధి జాతీయ రహదారి–16 పై లంకెలపాలెం నుంచి పాయకరావుపేట వరకు 80 కిలోమీటర్ల మేర తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను 9 బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ప్రతి 7 నుంచి 14 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఒక్కో పాయింట్లో ఒక మొబైల్ టీమ్ చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో మొబైల్ టీమ్లో ఒక డ్రైవర్, హెడ్ కానిస్టేబుల్ లేదా ఏఎస్ఐ ఉంటారు. వీరికి ఫస్ట్ ఎయిడ్తో పాటు ఫేస్ వాష్ కూడా శిక్షణ ఇచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత లారీలు, బస్సులు, వ్యాన్లు, కార్లు నడిపే డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి, అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని సూచిస్తున్నారు. ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకునే బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, లైటింగ్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేసి అప్రమత్తం చేస్తున్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు... చైన్నె–కోల్కతా నేషనల్ హైవే మీదుగా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హైవేకు ఇరువైపులా గ్రామాలు ఉన్నాయి. ప్రధానంగా పరవాడలో ఫార్మా కంపెనీల నుంచి షిప్ట్ల వారీగా కార్మికులు హైవేపై రాకపోకలు సాగిస్తుంటారు. ఈ సమయంలో రాత్రి వేళ ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాల్లో అధికంగా డ్రైవర్ల నిద్రమత్తు వల్లే జరుగుతున్నట్టు గుర్తించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, అర్ధరాత్రి 12 తరువాత తెల్లవారుజామున 4 గంటలలోపు అత్యధికంగా ప్రమాదాలు జరిగాయి. జిల్లా పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 60 శాతం నేషనల్ హైవేపైనే జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో వాహనం నడిపేటప్పుడు నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే వాహనాన్ని అపేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని పోలీసులు డ్రైవర్లకు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని చెబుతున్నారు. మొబైల్ టీంలు ఇలా.. అనకాపల్లి పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ ఎస్.రమేష్ పర్యవేక్షణలో మొబైల్ టీంలను దిశానిర్దేశం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా హైవేలో అనకాపల్లి (కొప్పాక–కశింకోట జంక్షన్), కశింకోట జంక్షన్–ఎనీపాలెం, యలమంచిలి (ఎనీజీపాలెం–రేగుపాలెం), యలమంచిలి (రేగుపాలెం–ధర్మవరం), ఎస్.రాయవరం, నక్కపల్లి (ఉపమాక జంక్షన్– ఉద్దండపురం), పాయకరావుపేట (ఉద్దండపురం–తాండవా జంక్షన్),సబ్బవరం (చిన్నయ్యపాలెం–మర్రిపాలెం) 7 కి.మీలు, పరవాడ (క్యాన్సర్ ఆస్పత్రి–కొప్పాక జంక్షన్)లో మొబైల్ టీంలను ఏర్పాటు చేశారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం 60 శాతం పూర్తి కావడం నిజం కాదా? 50 ఎకరాల్లో 13.21 లక్షల చ.అ. విస్తీర్ణంలో భవన సముదాయం నిర్మించడం నిజం కాదా? అందుకు రూ.500 కోట్లు మంజూరు చేయడం నిజం కాదా? పేద ప్రజలకు ఎంతో మేలు చేసే వైద్య కళాశాల, బోధనాస్పత్రులను ప్రైవేటుపరం చేయాలన్న మీ కుట్ర నిజం కాదా? నిజ నిర్ధారణ కోసం పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకుల సూటి ప్రశ్నలివి.. -
మోదీ నేతృత్వంలో దేశాభివృద్ధి
అనకాపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ అన్నారు. ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి రింగ్రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అధ్యక్షతన గురువారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ జీఎస్టీలో సంస్కరణల వల్ల ఈనెల 22 నుంచి పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయని చెప్పారు. కూటమి పాలనలో పార్టీ శ్రేణుల్లో కొంత మేరకు అసంతృప్తి ఉన్న విషయం పార్టీ దృష్టికి వచ్చిందని, స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనకాపల్లి–రాజమహేంద్రవరం ఆరు లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు త్వరలో శ్రీకారం చుడతారన్నారు. ఈనెల 14న విశాఖ రైల్వే క్రీడా మైదానంలో బీజేపీ రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. వివిధ వర్గాల వారితో చాయ్ పే చర్చ అనకాపల్లి టౌన్: స్థానిక నాలుగురోడ్ల జంక్షన్ వద్ద చాయ్ పే చర్చ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు పలు సమస్యలపై వివిధ వర్గాల వారు ఏకరువు పెట్టారు. పట్టణ నడిబొడ్డున, మున్సిపల్ స్కూల్ పక్కన్న డంపింగ్ యార్డు తక్షణమే తరలించాలన్నారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టును అనకాపల్లి వరకు పొడిగించాలన్నారు. -
ప్రెస్మీట్ కవర్ చేస్తే కేసులు పెడతారా..!
రాజకీయ పార్టీల నాయకుల స్టేట్మెంట్లు పత్రికలో పబ్లిష్ చేస్తే రిపోర్టర్లు, ఎడిటర్పై కేసులు పెడతారా..? రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)ఎ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంది. ప్రజల పక్షాన గళమెత్తుతున్న ’సాక్షి’ గొంతు నులిమే చర్య ఇది. ఏదైనా సమస్య ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి. రిజాయిండర్ ఇవ్వాలి. కానీ పత్రికలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఇలాంటి సంస్కృతికి బీజం నాటడం భవిష్యత్తులో నిజాన్ని అణగదొక్కినట్లే అవుతుంది. – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం -
మండల స్థాయిలో స్కూలు గేమ్స్కు సన్నద్ధం
కశింకోట: మండల స్థాయిలో స్కూలు గేమ్స్ పకడ్బందీగా నిర్వహించడానికి సన్నద్ధం కావాలని డీఈవో గిడ్డి అప్పారావునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో గురువారం సాయంత్రం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ నిర్వహణకు పీడీలు, హెచ్ఎంలు సమన్వయంతో వ్యవహరించి ఖో–ఖో, కబడ్డీ, వాలీబాల్, యోగా, త్రో బాల్, షటిల్ బ్యాడ్మింటన్, తదితర ఏడు ఆటలను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి తర్వాత జోన్ స్థాయిలో నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత యధావిధిగా జిల్లా, రాష్ట్ర స్థాయి ఆటలు జరుగుతాయన్నారు. జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిగా కె. మహాలక్ష్మినాయుడు, పరిపాలన కార్యదర్శిగా అచ్చయ్యమ్మలను నియమించారన్నారు. వీరిని సమావేశంలో అభినందించారు. ఉప విద్యా శాఖ అధికారి అప్పారావు నాయుడు పాల్గొన్నారు. -
గోవాడ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదుకోవాలి
చోడవరం : గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ అఖిల పక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాలు గురువారం ధర్నా నిర్వహించాయి. ఈ ఏడాది క్రషింగ్కు సంబంధించి ఇంకా ఎటువంటి ఆదేశాలు, ఫ్యాక్టరీ మిషనరీ ఓవర్హాలింగ్ పనులు చేపట్టకపోవడంతో క్రషింగ్ జరుగుతుందా..లేదా అనే ఆందోళనలో రైతులంతా ఉన్నారు. దీంతో కొద్ది రోజులుగా అఖిలపక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి పలుమార్లు ఆందోళనలు చేశాయి. అయినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో మళ్లీ రైతుసంఘాలు, కార్మికులు ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గురువారం ఫ్యాక్టరీ గేటు వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.50కోట్లు విడుదల చేసి చెరకు రైతులకు పాత బకాయిలు చెల్లించాలని, ఈ ఏడాది క్రషింగ్ సీజన్కు కావలసిన యంత్రాల ఓవర్హాలింగ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కూటమి నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీని ఆధునికీకరించాలని, ఈనెల 30వ తేదీలోగా నిర్వహించాల్సిన ఫ్యాక్టరీ మహాజనసభను సకాలంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని రక్షించుకునేందుకు అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా రైతుసంఘాలు, కార్మిక సంఘాలు తీర్మానించాయి. ఈ ఆందోళనలో ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, కార్మికసంఘం నాయకుడు శరగడం రామునాయుడు, రైతు సంఘాల ప్రతినిధులు దండుపాటి తాతారావు, తనకల జగన్, ఏడువాక శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..?
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై వేధింపులకు పాల్పడుతోంది. ఒక రాజకీయ పార్టీ నేత ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలను రిపోర్టర్ వార్తగా రాస్తే ఎడిటర్పై కేసు పెడతారా? మీడియా గొంతును నులిమేస్తారా? రాష్ట్రంలో ప్రతికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..? అక్షరాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను నోటీసులు, అక్రమ కేసులతో నిరోధించలేరు. రాజకీయ కక్షలు కార్పణ్యాలతో పత్రిక ఎడిటర్పై కేసుల నమోదు ఏమాత్రం సరికాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి డబ్బా కొట్టే పచ్చ మీడియా మాత్రమే ఉండాలా? మీ అవినీతి, అక్రమాలను ఎత్తిచూపించే ఏ మీడియా ఉండకూడదా.. అయినా మీకెందుకంత ఉలికిపాటు. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి -
ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపం
కోటవురట్ల: ఓ యువతి ఇష్టం లేని పెళ్లి చేశారని తీవ్ర మనస్తాపం చెందింది. మనసు చంపుకుని భర్తతో కాపురం చేయలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని ఆక్సాహేబుపేటలో గురువారం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన చల్లపల్లి లోవలక్ష్మి (24)కి ఇష్టం లేకపోయినా నాలుగు నెలల క్రితం ఆక్సాహేబుపేటకు చెందిన జోగిరాజుకు ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి కలతగా ఉన్న ఆమె మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో శబ్దం రావడంతో బంధువులు వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కొన ఊపిరితో కనిపించింది. ఆమెను ఉరి నుంచి తప్పించి హుటాహుటిన తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. అయితే లోవలక్ష్మి భర్త జోగిరాజు చాలా మంచి వ్యక్తి అని, అర్థం చేసుకోకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘విజయ పథం’లో కేజీబీవీలు
కశింకోట/ఎస్.రాయవరం: విజయ పథకం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల కార్యదర్శి దేవానందరెడ్డి ఆదేశించారు. కశింకోట మండలంలోని తేగాడ కేజీబీవీ, ఎస్.రాయవరం మండలంలోని తిమ్మాపురం కేజీబీవీలను గురువారం ఆయన సందర్శించారు. విజ యపథం కార్యక్రమం, విద్యా ప్రమాణా లు, రికార్డులు, విద్యార్థుల నోట్ పుస్తకాలు, స్లిప్టెస్ట్ మూల్యాంకనాలను పరిశీలించారు. టెన్త్, ఇంటర్మీడియట్లో శత శాతం ఉత్తీర్ణత సాధన కు పలు సూచనలిచ్చారు. తేగాడలో విద్యార్థులతో సహ పంక్తి భోజనం చేశారు. ప్రిన్సిపాల్ డి.చంద్రకళ, ఏజీసీడీవో సబియా సుల్తానా, వృత్తి విద్యా సమన్వయకర్త శ్రీలత, జిల్లా జీసీడీవో ఏఎస్డీ జెమిమ పాల్గొన్నారు. తిమ్మాపురంలో పాఠశాల భవన నిర్మాణం పూర్తయిన వెంటనే ప్రహరీ నిర్మాణం చేపట్టాలన్నారు. -
రాష్ట్ర స్థాయి వుషూ పోటీలకు గురుకుల విద్యార్థినులు
రాష్ట్రస్థాయి వుషూ పోటీలకు అర్హత సాధించిన విద్యార్థినులు నర్సీపట్నం: స్టేట్ స్కూల్ గేమ్స్ వుషూ పోటీలకు నర్సీపట్నం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. విశాఖలో సంస్కృతి గ్లోబ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం జరిగిన జిల్లా స్థాయి అండర్ –19 స్కూల్ గేమ్స్ వుషూ పోటీల్లో గురుకుల విద్యార్థినులు పి.దుర్గా భవాని 45 కేజీలు, బి.కావ్య 52 కేజీలు, పి.జ్యోష్ణ మేరీ 60 కేజీలు, వి.ప్రణితి 65 కేజీల విభాగాల్లో మంచి ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. పీడీ సాయి పర్యవేక్షణలో వుషూ కోచ్ వేపాడ ప్రియాంక శిక్షణలో మెడల్స్ సాధించారు. వీరిని ప్రిన్సిపాల్ రాజేశ్వరి, శాప్ కోచ్ అబ్బు అభినందించారు. -
ఉక్కుకు ఉచ్చు?
రూ.3లక్షల కోట్ల ఆస్తి భద్రత ప్రశ్నార్థకం సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న కుయుక్తులు ఉక్కు పరిశ్రమకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. సంవత్సరాలుగా ఉద్యోగ, కార్మిక సంఘాలు తమ కుటుంబాలతో కలిసి రోడ్లపై పోరాటాలు చేస్తున్నా.. కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది. ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి చకచకా పావులు కదుపుతోంది. ఖర్చుల తగ్గింపులో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో ఉద్యోగులను, వేలాది మంది కార్మికులను విడతలవారీగా విధుల నుంచి తొలగించేసింది. ఇదే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా సిబ్బందిపైనా వేటు పడింది. ఈ నేపథ్యంలో ప్లాంట్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. భారీగా తగ్గిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది దేశంలోని పార్లమెంట్, విమానాశ్రయాలు వంటి అత్యంత కీలకమైన సంస్థలకు రక్షణ కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) విశాఖ ఉక్కు కర్మాగారానికి 1983 ఆగస్టు నుంచి భద్రత కల్పిస్తోంది. రూ.3 లక్షల కోట్ల విలువైన ప్లాంట్ ఆస్తులు, యంత్రాలు, ముడి పదార్థాలను సుమారు 40 ఏళ్లుగా సుమారు 1,013 మంది సిబ్బంది కంటికి రెప్పలా కాపాడారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘డిప్లాయ్మెంట్ కాస్ట్ కటింగ్’పేరుతో యాజమాన్యం సీఐఎస్ఎఫ్ సిబ్బందిని భారీగా తగ్గించింది. మొత్తం 1013 మందిలో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు వంటి హోదాలో ఉన్న 438 మందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ప్రస్తుతం కేవలం 575 మంది సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. సిబ్బందిని తగ్గించిన తర్వాత ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయడంలో యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
ప్లాంట్ భద్రతా వ్యవస్థను బలహీనం చేశారు
స్టీల్ప్లాంట్ ఆస్తులను దొడ్డిదారిన దోచుకోవడానికి పెద్దస్థాయిలో కుట్ర జరుగుతోంది. భద్రతా వలయంలో ఉంటూ నిరంతరం రూ.వేల కోట్ల ఉత్పత్తులున్న చోట్ల బయట వాహనాల్లో వచ్చి చోరీ చేస్తే.. ప్లాంట్లో ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. కాపర్ స్టేవ్స్ ఒక్కో ప్లేట్ 1.4 టన్నుల బరువు ఉంటుంది. వాటిని ఎత్తాలంటే హైడ్రాలిక్ క్రేన్, లారీ అవసరం. అలాంటివి ఆరు కాపర్ స్టేవ్లు మాయమయ్యాయి. ఈ నేరానికి పాల్పడినవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని బదిలీ చేసి, సెక్యూరిటీని బలహీనపరిచారు. ప్రజల ఆస్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన చోట, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని బదిలీ చేసిన తర్వాత ఇంతవరకూ ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం గర్హనీయం. – అయోధ్యరామ్, కన్వీనర్, విశాఖ ఉక్కు పోరాట కమిటీ -
చంద్రబాబు కామన్ మ్యాన్ కాదు కార్పొరేట్ మ్యాన్
సాక్షి, అనకాపల్లి: ‘‘సూపర్ సిక్స్.. సూపర్ సక్సెస్’’ అంటూ అనంతపురంలో నిర్వహించిన సభలో చంద్రబాబు చెప్పుకొన్నట్లు సీఎం అంటే కామన్ మ్యాన్ కాదు.. కేపిటలిస్ట్ మ్యాన్ (పెట్టుబడిదారీ మనిషి), కార్పొరేట్ మ్యాన్.. ఆయన ఆ వర్గాలకే వత్తాసు పలుకుతారు’’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తయిన, సగానికి పైగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ కుట్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు తమ నాయకుడు వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ హయాంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో సగానికిపైగా నిర్మాణం పూర్తయిన మెడికల్ కాలేజీని గురువారం వైఎస్సార్సీపీ నేతలు మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతలపూడి వెంకట్రామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, ఏరువాక సత్యారావు, తదితరులతో కలిసి అమర్నాథ్ పరిశీలించారు. వేరొకరి పనికి క్రెడిట్ తీసుకోవడం బాబు నైజం ‘‘కూటమి ప్రభుత్వం 15 నెలల్లో రూ.1.95 లక్షల కోట్లు అప్పు చేసింది. వీటిలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన పులివెందుల మెడికల్ కాలేజీకి సీట్లు కేటాయించినా... కూటమి ప్రభుత్వం తమకి అవసరం లేదంటూ అత్యంత అన్యాయంగా లేఖ రాసింది. అయినా అనంతపురం సభలో మెడికల్ కాలేజీలు తానే తీసుకొచ్చానని చంద్రబాబు చెప్పుకొంటున్నారు. ఎవరో చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడం ఆయనకు బాగా అలవాటు’’ అని అమర్నాథ్ విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా నియంత కిమ్ తరహాలో ఆంధ్రాలో పాలన సాగిస్తున్న లోకేశ్ ఆంధ్రా కిమ్ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే వైద్యరంగంలో సంస్కరణలు ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించి రూ.8,500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని అమర్నాథ్ తెలిపారు. ‘‘ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని, ఒక్కో మెడికల్ కాలేజీకి సుమారు రూ.500 కోట్లు వెచ్చించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. విజయనగరం, మచిలీపట్నం సహా ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు నడుస్తున్నాయి. 150 చొప్పున 750 మెడికల్ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నంలో 2022 డిసెంబరు 30న అప్పటి సీఎం వైఎస్ జగన్ మెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మెడికల్ కాలేజీ మూడు, ఆసుపత్రి రెండు అంతస్థులు నిర్మాణం పూర్తయ్యాయి. హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. కూటమి సర్కారు వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు’’ అని విమర్శించారు. -
‘ఆ నిర్ణయాన్ని చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలి’
సాక్షి, నర్సీపట్నం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలు పునర్విభజన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశ్యంతో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకువచ్చారన్నారు.‘‘8500 కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఖర్చు మొదలు పెట్టారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రతి ఇంటి నుంచి ఒక డాక్టర్ను తయారు చేయాలన్నది వైఎస్ జగన్ ఆశయం’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 4500 మెడికల్ సీట్లు విద్యార్థులకు వస్తాయని ఆశించారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.నర్సీపట్నం మెడికల్ కాలేజీలో హాస్పిటల్ భవనం మూడు అంతస్తులు పూర్తి అయింది. ఈ భవనం నిర్మాణం పూర్తి చేయడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?. చంద్రబాబు కామన్ మెన్ కాదు.. క్యాపలిస్ట్ మెన్. అప్పు చేసిన 2 లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే సరిపోతుంది. పులివెందుల మెడికల్ కాలేజీకు సీట్లు వద్దని లేఖ రాశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తున్న చంద్రబాబు, నేడు మెడికల్ కాలేజీలను నేనే తెచ్చానని మాట్లాడుతున్నారు. సైకో కంటే పెద్ద పేరు చంద్రబాబు అని గూగుల్ చూపిస్తుంది. కిమ్ ఉత్తర కొరియా నియంత అయితే లోకేష్ ఏపీ నియంత’’ అంటూ గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.ప్రభుత్వ భూములు మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వడానికి మీ అబ్బ జాగీరు కాదు. పేదవాడికి రాష్ట్రంలో చోటు లేదు. వైఎస్ జగన్ పథకాలను కాపీలను కొట్టిన ఘనత చంద్రబాబుది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాటిని ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నర్సీపట్నంలో ఇప్పటికే 50 కోట్లకు పై మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఖర్చు చేశారు. స్పీకర్ అయ్యన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం బాధ్యత తీసుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
లైంగిక దాడి దోషులను కఠినంగా శిక్షించాలి
దేవరాపల్లి: విశాఖపట్నం సీతమ్మధారలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ డిమాండ్ చేశారు. దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు న్యాయం చేసి, అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కూటమి పాలనలో మహిళలు, బాలికలకు రక్షణ కొరవడిందని విమర్శించారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరపడంతో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువయ్యాయని ఆమె ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అనురాధ కోరారు. -
కేజీహెచ్ వార్డు బాయ్పై చర్యలు
మహారాణిపేట: ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కేజీహెచ్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వైద్యురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై రోజుల తరబడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులు.. ‘కేజీహెచ్లో కీచకులు’శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఉలిక్కిపడి.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డు బాయ్ శంకరరావును సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 26న గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డులో మహిళా వైద్యురాలి పట్ల వార్డు బాయ్ శంకరరావు రెండుసార్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అదే రోజు కేజీహెచ్ సూపరింటెండెంట్, ఏఎంసీ ప్రిన్సిపల్, విభాగాధిపతులతో పాటు వన్టౌన్ పోలీసులకు సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయంపై ‘సాక్షి’దినపత్రికలో కథనం వెలువడింది. దీంతో కేజీహెచ్ యాజమాన్యం తర్జనభర్జనల అనంతరం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. వెంటనే సంబంధిత ఫైల్ను తయారుచేసి, శంకరరావును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు త్వరలో సమావేశం కానున్నట్లు తెలిసింది. కాగా.. సర్జరీ విభాగంలో బాలిక తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుపై కూడా ఆస్పత్రి ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ నుంచి కేజీహెచ్కు వచ్చిన రెండు ఈ–మెయిల్స్ను ఎవరు డిలీట్ చేశారన్న దానిపై కూడా అంతర్గత విచారణ మొదలైనట్లు సమాచారం. -
23 నుంచి సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
సింహాచలం: ఈ నెల 23 నుంచి అక్టోబరు 1 వరకు సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు బుధవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఆలయంలో శ్రీ రామాయణ నవరాత్ర పారాయణం ఉంటుందన్నారు. రోజూ సాయంత్రం 5 గంటలకు చతుర్భుజ తాయారు, సువర్ణ అమ్మవార్లకు ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న సింహవల్లీ తాయారు సన్నిధిలో వీరలక్ష్మీ ఆరాధనం, 29న మూల నక్షత్రం పురస్కరించుకుని ఆయుధపూజ నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 2 విజయదశమి నాడు కొండదిగువ పూలతోటలో సాయంత్రం నుంచి జమ్మివేట ఉత్సవం, శమీపూజ జరపనున్నట్లు తెలిపారు. ఆ రోజు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి శ్రీరామాలంకారం చేసి కొండపైనుంచి మెట్ల మార్గంలో కొండ దిగువ పూలతోటకు తీసుకెళ్తామన్నారు. విజయదశమి నాడు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపై స్వామివారి దర్శనాలు లభిస్తాయన్నారు. -
బైకుపై వెళుతూ ఆగిన బస్సును ఢీకొని..
రావికమతం : మండలంలోని పిల్లవానిపాలెం దాటిన తరువాత గొంప దగ్గరలో బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనం (ఎపి 39 కువై 2649 )పై వెళ్తూ ఆర్టీసీ బస్సు (ఎపి35 జెపి 0087)ను ఢీకొట్టి కంచర్ల రామారావు(70) అనే వ్యక్తి మృతి చెందాడు. రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాలివి. బుచ్చెయ్యపేట మండలం పెదమదీన గ్రామానికి చెందిన కంచర్ల రామారావు బుధవారం సాయంత్రం గుడ్డిపలో వ్యవసాయ పనులు ముగించుకొని స్వగ్రామం పెదమదీనకు ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. అనకాపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తూ ఆగింది. దీంతో బైకుపై వెనుకగా వస్తున్న రామారావు బస్సు వెనుక బలంగా ఢీకొన్నాడు. పెద్ద శబ్ధం రావడంతో డ్రైవర్ బస్సు దిగివచ్చి చూడగా అప్పటికే రామారావు రోడ్డుపై పడి ఉన్నాడు. అతరిరి వైద్యం కోసం రావికమతంలోని ప్రైవేటు అస్పత్రికి తీసుకురాగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య పార్వతి, వివాహితులైన కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ , కండక్టర్లను అదుపులోనికి తీసుకొన్నట్టు ఎస్ఐ తెలిపారు. రామారావు మృతితో పెదమదినాలో విషాదఛాయలు అలముకున్నాయి. -
పత్రికా స్వేచ్ఛకు భంగం
జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు లేదా పరువు నష్టం దావా వేయవచ్చు. అంతేగానీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా జర్నలిస్టులపై కేసులు నమోదు చేయలేదు. ఈ విధమైన వైఖరి వల్ల జర్నలిస్టులు సరైన వార్తలు పాఠకులకు అందించలేరు. వాస్తవాలను రాయడానికి, నిజానిజాలు వెల్లడించడానికి వెనుకంజ వేసే ప్రమాదం ఉంది. జర్నలిస్టుల స్వేచ్ఛకు ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా ఆలోచన చేయాలి. – గంట్ల శ్రీనుబాబు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి -
డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు సన్మానం
నర్సీపట్నం: డీఎస్సీ–2025లో ఎంపికై న అభ్యర్థులను పీఆర్టీయూ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు మాట్లాడుతూ విద్యార్థులను ప్రయోజకులను చేసే అవకాశాన్ని కొత్త ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంకిత భావంతో పని చేసి ఉపాధ్యాయ వృత్తికి గుర్తింపు తీసుకురావాలని ఆయన సూచించారు. అనంతరం ఉపాధ్యాయులుగా ఎంపికై న 200 మందిని సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్, యూనియన్ ప్రతినిధులు రమణ, అప్పారావు, ప్రసాద్, వరహాలనాయుడు, జి.వి.రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
వడ్డాదిలో వర్ష బీభత్సం
బుచ్చెయ్యపేట: మండలంలో బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది. మేజర్ పంచాయతీ వడ్డాదిలో రెండిళ్లకు చెందిన ప్రహరీలు కూలిపోయాయి. సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో బీఎన్ రోడ్డు వద్ద వేంకటేశ్వరస్వామి ఆర్చ్ దగ్గరలో చంద్రశేఖర్ ఇంటి ప్రహరీ కూలిపోయి పక్కనే ఉన్న సయ్యపురెడ్డి శ్రీను ఇంటి ప్రహరీపై పడింది. దీంతో ఆ గోడ కూడా కూలిపోయింది. ఆయా ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. – వడ్డాది పెద్దేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహానికి నదిపై ఉన్న శిథిల వంతెనపై మళ్లీ రంధ్రం పడింది. గతంలో రంధ్రం పడి గొయ్యి పడటంతో ఆర్అండ్బీ అధికారులు గొయ్యిని పూడ్చారు. నీటి ఉధృతికి మళ్లీ వంతెన వద్ద గొయ్యి పడటంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా స్థానికులు గొయ్యి చుట్టూ రాళ్లు పేర్చి హెచ్చరికలు జారీ చేశారు. -
మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయొద్దు
అనకాపల్లి: నర్సీపట్నం(మాకవరపాలెం) సహా రాష్ట్రంలోని పది కొత్త మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) విధానంలో నిర్మించాలని విడుదల చేసిన జీవో నంబర్ 590ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా, ఆరోగ్య రంగాన్ని లాభాపేక్ష కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. మాకవరపాలెంలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు గత ప్రభుత్వ హయాంలోనే చివరి దశలో ఉన్నాయని, వీటిని పూర్తి చేసి వైద్య సేవలు వెంటనే ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య కళాశాలలు ప్రతిభకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తాయని, ప్రైవేట్ యాజమాన్యాలు సంపన్నులకే సీట్లు కేటాయిస్తాయని, వ్యాపార దృక్పథం పేద ప్రజలకు వైద్యం అందకుండా చేస్తుందన్నారు. వైద్య విద్య, ఆరోగ్యం ప్రజా హక్కులను లాభాల కోసం తాకట్టు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికే ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజుల భారం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వమే కొత్త మెడికల్ కాలేజీలను పూర్తిగా నిర్మాణం చేపట్టి, ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. -
దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయొద్దు
పంచాయతీరాజ్ అధికారుల తీరుపై జెడ్పీటీసీ సభ్యుల అసంతృప్తిమహారాణిపేట (విశాఖ): దివ్యాంగుల పింఛన్ల రీ వెరిఫికేషన్ చేసినప్పటికీ.. అర్హులైన వారందరికీ పింఛన్లు కొనసాగించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఆమె అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ 40 శాతం లోపు వైకల్యం ఉందంటూ దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి, సదరం సర్టిఫికెట్లను మళ్లీ వెరిఫికేషన్ చేస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దివ్యాంగుల పింఛన్ల విషయంలో పలు రకాలుగా వేధిస్తున్నారని, దీని వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్.. దివ్యాంగుల పింఛన్లను రద్దు చేయవద్దన్నారు. ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని, పంచాయతీల్లో ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా.. అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలోని పంచాయతీరాజ్ అధికారుల పనితీరుపై జెడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జేఈపై చర్యలు తీసుకోవాలి పరవాడలో ఇప్పటికే సీసీ రోడ్లు ఉన్న చోట మళ్లీ కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలు చేయడం, వాటికి ఆమోదం తెలిపిన తర్వాత పనులు నిలుపుదల చేయడంపై పరవాడ జెడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు అభ్యంతరం తెలిపారు. ఈ విధంగా తప్పుడు ప్రతిపాదనలు చేసిన జేఈపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ, కేజీహెచ్ సేవలపై అసంతృప్తి కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణికి ఫోన్ చేస్తే స్పందించడం లేదని కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ ఆరోపించారు. తాము సొంత పనుల కోసం ఫోన్ చేయమని, పేద రోగులకు వైద్యం కోసమే ఫోన్ చేస్తామని, అయినా అధికారి స్పందించకపోవడం దారుణమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కావడం లేదని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేద రోగులకు వైద్య సేవలు అందేలా చూడాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు కోరారు. దీనిపై విశాఖ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు స్పందిస్తూ.. ఆరోగ్యశ్రీ కింద 3,000కు పైగా ప్రొసీజర్లకు చికిత్స అందిస్తున్నామని, కార్డు ఉన్న వారందరికీ సేవలు అందుతున్నాయని తెలిపారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వా ణి మాట్లాడుతూ ఆసుపత్రిలో పూర్తి స్థాయి క్యాన్సర్ చికిత్స, గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయని, వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పీఎం–సూర్య ఘర్పై అవగాహన విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 నంబర్కు ఫోన్ చేస్తే.. 4 గంటల్లోపు సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పీఎం–సూర్య ఘర్ పథకం ద్వారా ప్రజలు విద్యుత్ బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. జెడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి, మూడు జిల్లాల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అచ్చెన్న చెరువుపై చర్చ అచ్యుతాపురం మండలంలోని యర్రవరం గ్రామంలో సర్వే నెం.147 ప్రభుత్వ చెరువులో వారం రోజులుగా జరుగుతున్న చెరువు మట్టి అక్రమ తవ్వకాలపై కో ఆప్షన్ సభ్యుడు నర్మాల కుమార్ ధ్వజమెత్తారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో యర్రవరం గ్రామంలో రెవెన్యూ అధికారులు తప్పుడు అనుమతులు ఇవ్వడంతో కోట్ల విలువైన ప్రభుత్వ చెరువు మట్టిని కూటమి నాయకులు సెజ్ పరిశ్రమలకు, వివిధ వ్యాపార సముదాయాలకు, ప్రైవేట్ లే–అవుట్లకు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. -
సాక్షి ఎడిటర్పై వేధింపులు సరికాదు
సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం, తాజాగా ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం కక్ష సాధింపులో ఓ భాగమే. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓ నేత మాట్లాడిన విషయాలను వార్తగా ప్రచురించడంపై కూడా కేసు పెట్టడం, నోటీసుల పేరిట వేధించడం సబబు కాదు. భారత రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ప్రయ త్నం చేయడం అప్రజాస్వామికం. అన్యాయాన్ని, అవినీతిని, ప్రజా సమస్యలను తన కలంతో వెలికితీయడమే జర్నలిస్టుల వృత్తి. అలాంటి పత్రికా స్వాతంత్య్రాన్ని, జర్నలిస్టుల కలాన్ని పోలీసు కేసులతో నియంత్రించాలని చూస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఏదైనా వార్త అవాస్తవమని భావిస్తే, దానికి ప్రభుత్వం వివరణ కోరాలి. కానీ కేసులు నమోదు చేయడం సరైంది కాదు. – సీహెచ్బీఎల్ స్వామి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి జిల్లా -
పెట్రోలింగ్ బైకులు.. రయ్.. రయ్
యలమంచిలి రూరల్: భారీగా పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. ప్రధాన, అంతర్గత రహదారుల్లో ఎక్కడైనా ట్రాఫిక్ స్తంభిస్తే వెంటనే అక్కడకు చేరుకుని క్రమబద్ధీకరించేందుకు పోలీసులకు సవాలుగా తయారైంది. మరోవైపు గొడవలు, అల్లర్లు, ఘర్షణలు జరిగినప్పుడు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించడం పోలీసులకు కత్తి మీద సాములా పరిణమించింది. వీటన్నింటికీ చెక్ పెట్టేలా పోలీసు శాఖ పలు ఠాణాలకు అన్ని సౌకర్యాలతో కొత్త ద్విచక్ర వాహనాలను అందజేసింది. పరవాడ పోలీసు సబ్ డివిజన్ పరిధిలో 5 పోలీస్ స్టేషన్లకు పెట్రోలింగ్ బైకులను కేటాయించారు. యలమంచిలి పట్టణం, యలమంచిలి ట్రాఫిక్, అచ్యుతాపురం, పరవాడ, సబ్బవరం ఠాణాలకు కేటాయించిన ఈ సరికొత్త వాహనాలు సంబంధిత సిబ్బందికి విధి నిర్వహణలో చాలా సౌకర్యవంతంగా, ఉపయుక్తంగా ఉన్నాయి. ఇటీవల ఆయా ఠాణాలకు అందజేసిన టీవీఎస్ అపాచీ బ్రాండ్కు చెందిన ఈ బైకులకు అనేక ప్రత్యేకతలున్నాయి. ట్రాఫిక్ స్తంభించిన సమయాల్లో, ఏవైనా రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో వేగంగా ఘటనాస్థలికి చేరుకుని, వాహనాల రద్దీని క్లియర్ చేయడానికి కొత్త వాహనాలు ఉపయోగపడుతున్నాయి. ప్రత్యేకతలు ●బైక్కు వెనుక భాగాన ఎర్రటి బుగ్గ బల్బు, బ్లూ, ఎర్ర రంగు లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతాయి. వాటి పక్కన మైక్లు ఉన్నాయి. అదే క్రమంలో సైరన్ కూడా మోగుతుంది. ట్రాఫిక్ సమస్య తలెత్తినప్పుడు మైక్ ద్వారా సూచనలు చెబుతూ పోలీసులు పరిస్థితిని క్రమబద్ధీకరిస్తున్నారు. ●ప్రమాదాలు జరిగిన ప్రాంతంలోనే బైక్ను నిలిపి ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. ●ఊరేగింపులు, ర్యాలీల సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఏయే మార్గాల్లో వెళ్లాలో మైకుల ద్వారా ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేయొచ్చు. ●ఎక్కడైనా ట్రాఫిక్ నిలిచిపోయి డయల్ 112కు ఫిర్యాదు వస్తే వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. ●పోలీసు జీపులు, పెద్ద వాహనాలు చిన్నపాటి సందుల్లో వెళ్లలేవు కాబట్టి ఈ ద్విచక్ర వాహనాలతో సులువుగా ఘటనా స్థలానికి చేరుకోవచ్చు. ●రోడ్డు ప్రమాదాల సమయంలో క్షతగాత్రులను ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ●వాహనంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన మందులు, పరికరాలతో పాటు మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు శ్వాస పరీక్షలు చేసే పరికరం కలిగిన పెట్టే కూడా ఉంది. పెట్రోలింగ్కు బాగా ఉపయోగం ఈ వాహనాలు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. గస్తీ సులభంగా ఉంటోంది. ఈ వాహనాల్లో ఇన్బిల్ట్ సైరన్ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు, అల్లర్లకు పాల్పడే వారిని చెదరగొట్టేందుకు ఉపయోగించుకోవచ్చు. తొలి విడతలో 5 పోలీస్ స్టేషన్లకు ఇచ్చాం. మరిన్ని వాహనాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని ఠాణాలకు సమకూర్చితే సంబంధిత సిబ్బందికి సౌకర్యవంతంగా ఉంటుంది. – వి.విష్ణుస్వరూప్, డీఎస్పీ, పరవాడ -
ఉత్సాహంగా ఓనం సంబరాలు
పాయకరావుపేట: ఓనం సంబరాలు శ్రీప్రకాష్ జూనియర్ కళాశాలలో బుధవారం ఘనంగా జరిగాయి. విద్యార్థినులు కేరళా సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. కేరళాలో ప్రాచుర్యం పొందిన పాటలు పాడుతూ నృత్యం చేస్తూ సందడి చేశారు. ఓనం పండగ విశిష్టతను ఓ విద్యార్థిని చక్కగా వివరించి ఆకట్టుకుంది. ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థులకు వివిధ రాష్ట్రాల ఆచార, వ్యవహారాలపై అవగాహన ఏర్పడి, మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి దోహదపడుతుందని ప్రిన్సిపాల్ భానుమూర్తి తెలిపారు. -
చావైనా.. బతుకై నా..
●ఎన్నాళ్లీ కష్టాలు? ఉరకగెడ్డ దాటాల్సిందే..తాచేరు గెడ్డపై నిర్మించిన కర్రల వంతెన మాడుగుల: మండలంలోని శంకరం పంచాయతీలో ఏడు గిరిజన గ్రామాలకు వర్షాకాలం వస్తే గండమే. బయటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే వారి బతుకు నరకమే. ఎన్నో ఏళ్ల నుంచి ఇదే దుస్థితి. ఈ గిరిజనులు మండల కేంద్రానికి రావాలన్నా, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలన్నా ఉరకగెడ్డ దాటవలసిందే. చిన్నపాటి వర్షం కురిసినా సరే గెడ్డ దాటలేని పరిస్థితులున్నాయి. అత్యవసర సమయాలలో గెడ్డ దాటాలంటే ప్రాణాలు గుప్పెట పెట్టుకుని ఈదవలసిందే. వైఎస్సార్ సీపీ హయాంలో ఈ గిరిజన గ్రామాలకు రహదారితోపాటు ఈ గెడ్డపై వంతెన నిర్మాణానికి రూ.7.20 కోట్లు మంజూరయ్యాయి. కొంత రోడ్డు పనులు కూడా జరిగాయి. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో పనులు సాగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటిపోతున్నా ఈ వంతెన ఊసెత్తలేదని ఆదివాసీ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. కర్రల వంతెనపై ప్రమాదకర ప్రయాణం తాటిపర్తి పంచాయతీ అజయ్పురం వద్ద కొండగెడ్డపై తాత్కాలికంగా కర్రల వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ వంతెనపై ప్రయాణించేటప్పుడు అదుపు తప్పితే ప్రాణాలు నీటిలో కలసి పోతున్నాయి. రెండు నెలల క్రితం సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో ఉరకగెడ్డపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆదివాసీ గిరిజనులు గెడ్డలో దిగి ఆందోళన చేపట్టారు. అయినా సరే కూటమి సర్కారులో ఎటువంటి స్పందన లేదని ఆదివాసీ గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కొత్తవలస, మామిడిపాలెం, తాడివలస, గొప్పూరు, గిరి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వారం రోజుల క్రితం అజయ్పురం గ్రామానికి చెందిన మాచమ్మ.. తాచేరు గెడ్డ కర్రల వంతెనపై కూలి పనికి వెళుతూ అదుపు తప్పి గెడ్డలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆమె మతదేహాన్ని తిరిగి గ్రామానికి తీసుకురావడానికి అదే కర్రల వంతెనపై అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. హృదయం ద్రవించిపోయే ఈ దుర్ఘటన నేపథ్యం ఏడు గిరిజన గ్రామాలతో ముడిపడి ఉంది. వర్షం వస్తే ఏడు ఆదివాసీ గ్రామాలు దిగ్బంధం తాచేరు గెడ్డపై తాత్కాలికంగా కర్రల వంతెన నిర్మాణం ఈ వంతెన నుంచే జారిపడి ఇటీవల మహిళ మృతి వంతెన నిర్మాణానికి రూ.7.20 కోట్లు మంజూరు చేసిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల కోడ్తో ఆగిన పనులు కూటమి సర్కార్ వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పట్టించుకోని వైనం వంతెన నిర్మాణం చేపట్టాలి శంకరం పంచాయతీలో ఏడు గిరిజన గ్రామాల చుట్టూరా ఉరకగెడ్డ ప్రవహిస్తోంది. వర్షాకాలంలో గెడ్డ దాటలేని పరిస్థితులున్నాయి. మా పూర్వీకుల నుంచి ఇదే పరిస్థితి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కొంతవరకు రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. వంతెన నిర్మాణం చేపట్టడానికి సిద్ధమవుతున్న సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులు నిలిచిపోయాయి. కూటమి సర్కారు వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా వంతెన ఊసెత్తలేదు. పలుసార్లు సీపీఎం నాయకులతో కలసి నిరసనలు వ్యక్తం చేసినా సరే పట్టించుకోలేదు. గర్భిణులను వర్షాకాలంలో గెడ్డ దాటించడం కష్టంగా ఉంది. –శోలం రమేష్, గిరిజన సంఘ నాయకుడు, కొత్తవలస -
రోజూ 500 క్యూసెక్కుల నీరు విడుదల
తాండవ కాలువలో నీటిని పరిశీలిస్తున్న జేఈ శ్యామ్కుమార్ నాతవరం : ఖరీఫ్ పంట సాగుకు రెండు కాలువల ద్వారా రోజు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తాండవ జేఈ శ్యామ్కుమార్ చెప్పారు. ఆయన బుధవారం రెండు జిల్లాల సరిహద్దులో శివారు ఆయకట్టు భూములకు ప్రవహిస్తున్న తాండవ ఎడమ కాలువ నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజర్వాయరులో నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 375.3 అడుగులు ఉందన్నారు. తాండవ ప్రాజెక్టు ప్రమాదస్థాయి నీటిమట్టం 380 అడుగులు, డెడ్ స్టోరేజీ నీటి మట్టం 345 అడుగులుగా పరిగణిస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు తాండవ నుంచి ఆగస్టు 10న ఆయకట్టుకు నీరు విడుదల చేశామని గుర్తు చేశారు. వర్షాలు బాగా కురవడంతో నీటిని పంట కాలువలు ద్వారా విడుదల చేసినా ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గలేదన్నారు. నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆయకట్టు రైతులు నీరు పొదుపుగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు నాతవరం సెక్షన్ వర్కు ఇన్స్పెక్టరు అప్పారావు సిబ్బంది ఉన్నారు. -
దళిత రైతుల సమస్యపై స్పీకర్ స్పందించాలి
ప్లేట్లతో నిరసన తెలుపుతున్న బాధిత రైతులు, సీపీఎం నాయకులు నర్సీపట్నం: మాకవరపాలెం, జి.కోడూరు క్వారీ బాధితుల నిరసన కార్యక్రమం 50వ రోజూ కొనసాగింది. బుధవారం సీపీఎం నాయకులు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. బాధితులతో కలిసి ఆర్డీవో కార్యాలయం వద్ద ప్లేట్లతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని రోజుల తరబడి దళిత రైతులు నిరసన చేస్తున్నా స్పీకర్ అయ్యన్నపాత్రుడు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఇప్పటికై నా స్పీకర్ స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలన్నారు. ఆర్డీవో, మైనింగ్ అధికారులు బాధిత రైతుల న్యాయమైన డిమాండ్ల పట్ల స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. క్వారీ నిర్వహణ వల్ల సాగు చేసుకుంటున్న జీడి మామిడి తోటలు నాశనమవుతున్నాయన్నారు. తక్షణమే అధికారులు స్పందించి రైతుల సమస్యను పరిష్కారం చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు, బీఎస్పీ నాయకుడు బొట్టా నాగరాజు, రైతులు అప్పారావు, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆటోలో...రక్తపు మడుగులో...
చోడవరం: వెంకన్నపాలెం–సబ్బవరం రోడ్డులో అడ్డూరు సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెనుగుపూడి నుంచి గాజువాక వెళుతున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగంగా వెళుతూ ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ కురుచా భూషణం అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వివరాల్లోకి వెళితే... చీడికాడ మండలం జైతవరం గ్రామానికి చెందిన కురచా భూషణం, కురచా నాయుడు, కురచా వరాహమూర్తి, మతల వరాహమూర్తి, కురచా శంకర్ జీవనోపాధి రీత్యా గత కొంతకాలంగా గాజువాకలో నివాసం ఉంటున్నారు. దేవరాపల్లి మండలం తెనుగుపూడి గ్రామంలో తమ బంధువుల ఇంట్లో జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి భూషణం ఆటోలో వీరంతా మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి వస్తుండగా వెంకన్నపాలెం–సబ్బవరం రోడ్డులో అడ్డూరుకు సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వీరు ప్రయాణిస్తున్న ఆటో నుజ్జునుజ్జయింది. ఆటో డ్రైవర్ భూషణం అక్కడికక్కడే మృతి చెందగా మిగతా నలుగురికి తీవ్ర గాయాలయ్యారు. వీరిలో కురచా శంకర్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్కు తీసుకువెళ్లారు. మృతుడు భూషణానికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్షతగాత్రుల్లో కురచానాయుడు విశాఖ డెయిరీలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తుండగా మిగతా వారు ఎస్ఆర్ఎంటీలో పనిచేస్తున్నారు. వీరి తల్లిదండ్రులు స్వగ్రామమైన జైతవరంలో ఉంటుండగా భార్యా పిల్లలతో కలిసి వీరంతా గాజువాకలో నివాసం ఉంటున్నారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే జైతవరం గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్టు సీఐ అప్పలరాజు చెప్పారు.గంటపాటు రోడ్డుపైనే రక్తపు మడుగులో క్షతగాత్రులు108 అంబులెన్స్ రాకపోవడంతో సుమారు గంటపాటు క్షతగాత్రులంతా రక్తపు మడుగులోనే ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడారు. బస్సు ఢీకొనడంతో ఆటో ముందుభాగం పూర్తిగా ధ్వంసమై ఆటోలో కూర్చొని గాయాలపాలైన వారంతా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అటుగా వెళుతున్న వారంతా సహాయం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ తీవ్ర రక్తస్రావంతో క్షతగాత్రులంతా ఉండటం వల్ల సాధ్యం కాలేదు. దీంతో తీవ్ర రోదనల మధ్య క్షతగాత్రులంతా రక్తపు మడుగులోనే గంటపాటు ఉండిపోయారు. వైద్యం ఆలస్యం కావడం వల్లే తలకు బలమైన గాయమై ఎక్కువ రక్తం పోయిన కురచా శంకర్ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని అక్కడి వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.సకాలంలో స్పందించిన చోడవరం పోలీసులుఫోన్ చేసి గంట అయినా 108 అంబులెన్స్ రాకపోవడంతో కొందరు చోడవరం పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలరాజుకు ఫోన్ చేశారు. ఆయన వెంటనే స్పందించి హుటాహుటిన జీపులో ఎస్ఐతోపాటు సిబ్బందిని ప్రమాద స్థలానికి పంపారు. వారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.అందుబాటులో లేని 108 అంబులెన్స్ ఒకప్పుడు ఫోన్ కొట్టిన 20 నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి చేరుకునే 108 అంబులెన్సులు ఇప్పుడు గంటలు గడిచినా రావడం లేదు. దీంతో సకాలంలో వైద్యం అందక అనేకమంది క్షతగాత్రులు మృత్యువాత పడుతున్నారు. ఇదే పరిస్థితి అడ్డూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు ఎదురైంది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టి గంటసేపయినా ఒక్క 108 అంబులెన్స్ కూడా ప్రమాదస్థలానికి రాలేదు. అక్కడ ఉన్న వారంతా ఎవరికి వారు 108 కాల్సెంటర్కు ఫోన్ చేసి ప్రమాద విషయం చెప్పినా అంబులెన్స్ మాత్రం రాలేదు. గ్రామీణ జిల్లాలో చోడవరం, మాడుగుల, అనకాపల్లి, సబ్బవరం ప్రాంతాల్లో ఉన్న 108 అంబులెన్సులన్నీ విశాఖపట్నం రిఫరల్ కేసులు తీసుకెళ్తున్నాయని, అందుకే కొంత ఆలస్యమవుతుందని కాల్సెంటర్ నుంచి సమాధానం రావడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు
నక్కపల్లి: ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ నక్కపల్లికి చెందిన వీరవెంకట రాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఖాళీ ఆటోలతో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ పథకం తమ ఉపాధిని దెబ్బ తీసిందని, బేరాలు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ వారు ఆందోళన బాట పట్టారు. నక్కపల్లి జాతీయ రహదారిపై వారపు సంత నుంచి వెదుళ్లపాలం జంక్షన్, అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఖాళీ ఆటోలతో ర్యాలీ చేశారు. ఆటోవాలాల ఆందోళనకు వైఎస్సార్సీపీ, సీపీఎం, సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆటోలకు బేరాలకు లేక నక్కపల్లి ఉపమాక రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, వారపు సంత, రాజయ్యపేట ఆటో స్టాండ్ల వద్ద రోజంతా ఖాళీగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ డ్రైవర్లు వాపోయారు. ఆటోలపై ఆధారపడ్డ మెకానిక్లు, సర్వీసింగ్ చేసేవారు, మొబైల్ రంగంలో పనిచేసేవారు సైతం ఉపాధి కోల్పోయారన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఆటోలు కొనుగోలు చేసిన వారు ఉచిత బస్సు కారణంగా ప్రైవేటు ఫైనాన్స్ వారి వద్ద తెచ్చిన అప్పులు చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ‘వాహనమిత్ర’ పథకం కింద ప్రతి ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకపోగా ఉన్న ఉపాధిని దెబ్బ తీసిందన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు బేరాలు లేక కుటుంబ జీవనానికి సైతం అల్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలని, కాని పక్షంలో ప్రతి నెలా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి ఏటా ఆటో డ్రైవర్లకు రూ.30 వేల చొప్పున చెల్లించాలన్నారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కొద్దిసేపు అక్కడ ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ నర్సింహమూర్తికి వినతి పత్రం అందజేశారు. వైస్ ఎంపీపీ వీసం నానాజీ, సీతంపాలెం ఎంపీటీసీ గొర్ల గోవిందు, ఆటో యూనియన్ నాయకులు శీరం నూకరాజు, దుర్గారావు, రాజు, తాతబాబు, కృష్ణ, నాయుడు పాల్గొన్నారు. -
ఈ రోడ్డుపై ప్రయాణం ఎలా మహాప్రభో?
రావికమతం: చినపాచిలి నుంచి టి.అర్జాపురం వర కు బీఎన్ రోడ్డు పనులు పూర్తి చేయాలని బురదలో కూర్చొని గిరిజనులు బుధవారం నిరసన తెలిపారు. కె.కొట్నాబిల్లి, గదపపాలెం, రామన్నదొరపాలెం, డోలవానిపాలెం, ఎర్రబంద గ్రామాల వారు ఏ అవసరం వచ్చినా ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలి. టి.అర్జాపురం నుంచి మాడుగుల వెళ్లే ప్రజలు కూడా దగ్గరగా ఉంటుందని ఈ రోడ్డునే ఆశ్రయిస్తారు. వైఎస్సార్ సీపీ ప్ర భుత్వం 2023 అక్టోబర్ నెలలో హై ఇంపాక్ట్ రోడ్డు నిధులు మంజూరు చేసింది. రూ.6.98 కోట్లతో 14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు 2024 జనవరిలో పనులు మొదలుపట్టారు. తరువాత ఎలక్షన్ కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్డు పనులు కొనసాగలేదు. కాంట్రాక్టర్ను ప్రశ్నించగా.. బిల్లులు అందలేదని, అందువల్లనే పనులు నిలిపివేసినట్లు తెలిపారని గిరిజనులు పేర్కొన్నారు. రోడ్డు పనులు తక్షణమే చేయాలని, లేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు, గిరిజన సంఘం నాయకులు పాడి బెన్నయ్య, ఎస్.వలసయ్య డిమాండ్ చేశారు. -
నేటి నుంచి ఉపాధ్యాయుల నిరసన వారం
బుచ్చెయ్యపేట/ఎస్.రాయవరం: ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గురువారం నుంచి నిరసన వారం చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ధర్మారావు, దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం వీరు విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. గద్దె నెక్కి 15 నెలలైనా పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు వారం రోజులపాటు రోజుకొక రీతిలో నిరసన తెలుపుతామన్నారు. పెండింగ్లో ఉన్న 4 డీఏలను తక్షణం విడుదల చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని,1 2వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, ఇతర పనులు అప్పగించకుండా ఉపాధ్యాయులను బోధనకే వినియోగించాలని, 30 శాతం ఐఆర్ ఇవ్వడంలో ప్రభుత్వం కప్పదాటు వైఖరి మానుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వారం చేపడతున్నామన్నారు. 11న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు, 12న మండల కేంద్రాల్లో నిరసన, 13, 14 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేత, 15న పాత తాలుకా కేంద్రాల వద్ద నిరసన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన, 17న ముఖ్యమంత్రి, సీఎస్లకు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా వినతులు పంపడం చేపడుతున్నామన్నారు. -
మహా సముద్రాలు సంపదకు నిలయాలు
పాయకరావుపేట: మహా సముద్రాలు సంపదకు నిలయాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్ డాక్టరు గిడుగు రామదాస్ తెలిపారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాలలో డిపార్టుమెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో సముద్ర సాంకేతిక పరిజ్ఞానంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామదాస్ హాజరై మాట్లాడుతూ మహా సముద్రాలను కాపాడుకోవాలన్నారు. సముద్రాల నుంచి వచ్చిన అపరిమితమైన వనరులు, వాటిని పొందేందుకు, అధ్యయనం చేసేందుకు ఉపయోగించే పరికరాలు, వాటి సాంకేతికతను వివరించారు. ఇటీవల సముద్రయాన్ అభియాన్ ద్వారా మత్స్య 6000 అనే జలాంతర్గామిని రూపొందించి మానవులను ఆరు వేల అడుగుల లోతుకు పంపగలిగామన్నారు. ఈ విజయంతో భారతదేశం ప్రపంచంలో ఆరో దేశంగా అవతరించిందన్నారు. ఇది దేశానికి గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రిన్సిపాల్ డాక్టరు రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై కూటమి దెబ్బ
అనకాపల్లి/తుమ్మపాల: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా జీవనోపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల గోవింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల పరిస్థితి దినదిన గండంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓలా, ఊబర్, రాపిడో, తదితర ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసి ప్రభుత్వ యాప్తో సర్వీసులు చేపట్టాలని కోరారు. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.25వేలు అందించాలన్నారు. ఇన్సూరెన్స్తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. అధిక జరిమానాలు విధించే జీవో నంబర్లు 21, 31లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి వేల్పువీధి జంక్షన్, పెరుగుబజార్ జంక్షన్, రింగ్ రోడ్డు మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకూ ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ విజయ కృష్ణన్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు కోన లక్ష్మణ, జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు మార్కండేయులు, సహాయ కార్యదర్శి సూరిశెట్టి బాపునాయుడు, నాయకులు కె.నాగరాజు, అంజి, కోరిబిల్లి రామప్పారావు, వెంకటేష్ పాల్గొన్నారు. ● పట్టణంలో పలు ఆటో యూనియన్ సంఘాలు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.వి.శ్రీనివాసరావు, రుత్తల శంకరరావు మాట్లాడుతూ ఈ నెల 18న విజయవాడలో తలపెట్టిన ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు గణపతి, శంకర్, ఎస్.కె.సుభాని, శ్రీనివాసరావు, కాళీ, రమణ, తదితరులు పాల్గొన్నారు. -
క్వారీ బాంబు పేలుళ్ల బాధితులకు భరోసా
రోలుగుంట: మండలంలో రాజన్నపేటలో క్వారీలో బ్లాస్టింగు వల్ల దెబ్బతిన్న గృహాలను, రహదారులను తహసీల్దార్ సీహెచ్ నాగమ్మ మంగళవారం పరిశీలించారు. రెండు మాసాల క్రితం శరభవరం, రాజన్నపేట సమీపంలో క్వారీలో బాంబు పేలుళ్లు చేపట్టారు. దాంతో రాజన్నపేటలో పలు గృహాలు దెబ్బతిన్నాయి. రోడ్లకు పగుళ్లు ఏర్పడి నష్టం వాటిల్లింది. ఈ సమస్యను బాధితులు మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో రాజన్నపేటలో ఈ నెల 7న బాధితులు సీపీఎం ఆధ్వర్యంలో అధికారుల తీరుకు నిరసన చేపట్టారు. దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆర్డీవో వి.వి. రమణ స్పందించి గ్రామానికి వెళ్లి సమస్య తెలుసుకోవాలని తహసీల్దార్ నాగమ్మను ఆదేశించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఆర్ఐ రామ్మూర్తితో రాజన్నపేటలో పరిశీలించారు. ఆర్డీవోకి నివేదికలు అందజేస్తానని గ్రామస్తులకు తెలియజేశారు. -
అన్నదాతల నినాదాలతో ప్రతిధ్వనించిన నర్సీపట్నం
నర్సీపట్నం: రైతులకు ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఆందోళనను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ పార్టీ నాయకులను హౌస్ అరెస్టులు చేయించింది. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, స్పెషల్పార్టీ పోలీసులు మోహరించారు. అయినప్పటికీ పార్టీ శ్రేణులు వివిధ మార్గాల్లో ఆందోళన కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా మున్సిపల్ స్టేడియంలో గాంధీ విగ్రహం, అబీద్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు మాజీ ఎమ్మెల్యే గణేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు అడ్డుకోవడం భావ్యం కాదని గణేష్ పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులు వెనక్కు తగ్గారు. ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆర్డీవో లేకపోవడంతో కార్యాలయ ఏవో సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. అయ్యన్నపాత్రుడికి తెలిసిందల్లా దోపిడీలు, దౌర్జన్యాలే.. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతుండడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, బాధ్యత గుర్తు చేసేందుకు తాము శాంతియుతంగా నిరసన చేపడితే భగ్నం చేసేందుకు ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసిందన్నారు. వ్యవసాయం గురించి తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అసలు వ్యవసాయం గురించి అయ్యన్నపాత్రుడికి ఏమి తెలుసునని గణేష్ మండిపడ్డారు. ఆయనకు తెలిసిందల్లా దోపిడీలు, దౌర్జన్యాలేనన్నారు. లేటరైట్ ద్వారా స్పీకర్ రోజుకు రూ.3 కోట్లు వెనకేసుకుంటున్నారన్నారు. రోలుగుంట క్వారీల ద్వారా నెలకు రూ.50 లక్షలు, జి.కోడూరు క్వారీ ద్వారా కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా మార్చిన విషయం తెలియలేదంటే.. జగనన్న పెట్టిన రైతు భరోసా కేంద్రాలు అయ్యన్నపాత్రుడి గుండెల్లో ఎంతగా నాటుకుపోయాయో అర్థమవుతోందన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారని స్పీకర్ అనుకుంటే సరిపోదని, గ్రామాల్లోకి వెళితే ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుస్తాయన్నారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలో 4015 టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 1500 టన్నులు సరఫరా చేశామని అధికారులే చెబుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, యూత్ వింగ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్.వరుణ్, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, పార్టీ నర్సీపట్నం మండల అధ్యక్షుడు శానపతి వెంకటరత్నం, గొలుగొండ ఎంపీపీ గజ్జలపు మణికుమారి, కౌన్సిలర్లు మాకిరెడ్డి బుల్లిదొర, సిరసపల్లి నాని, బేతిరెడ్డి రత్నం, వీరమాచినేని జగదీశ్వరి, కోఆప్షన్ సభ్యులు షేక్ రోజా, పార్టీ నాయకులు పెట్ల భద్రాచలం, వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
పోలీసు శాఖకు కొత్త అతిథి ‘రియో’
అనకాపల్లి: జిల్లాలో పోలీస్ శాఖకు కొత్త అతిథి వచ్చింది. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ 6వ బెటాలియన్లో 10 నెలల పాటు శిక్షణ పొందిన జాగిలం ‘రియో’మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సందడి చేసింది. ఈ జాగిలాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా పరిశీలించారు. బెల్జియం మలనాయిస్ జాతికి చెందిన ఈ ఆడ జాగిలం ట్రాకింగ్, పేలుడు పదార్థాలను గుర్తించడంలో శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించే జాగిలాల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 7 జాగిలాలు ఉండగా.. కొత్తగా చేరిన రియోతో వీటికి సంఖ్య మొత్తం ఎనిమిదికి చేరిందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ రిజర్వ్డ్ డీఎస్పీ పి.నాగేశ్వరరావు, సీఐ బి.రామకృష్ణ, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జి అడ్డాల ఆదినారాయణ పాల్గొన్నారు. -
విశ్రాంత హోంగార్డుకు రూ.4.04 లక్షల చెక్కు
అనకాపల్లి: హోంగార్డుల విధులు పోలీస్శాఖలో అంతర్భాగమేనని, కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో హోంగార్డుగా విధులు నిర్వహించి, ఉద్యోగ విరమణ పొందిన సీంద్రి కోమలకు రూ.4,04,890ల చెక్కును మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రిటైరైన లేదా మరణించిన హోంగార్డులకు రెండు జిల్లాల హోంగార్డులు ఒకరోజు వేతనం స్వచ్ఛందంగా అందజేస్తున్నారని చెప్పారు. సీంద్రి కోమల విధులను నిబద్ధతతో, విశ్వాసపాత్రంగా నిర్వర్తించారని, ఆమె సేవలు ప్రశంసనీయమన్నారు. ఎస్పీ కార్యాలయం పరిపాలన అధికారి సీహెచ్.తిలక్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా 5కె రెడ్ రన్
అనకాపల్లి టౌన్: పట్టణంలో ఇంటర్నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్లో భాగంగా జిల్లా స్థాయి మారథాన్ 5కె రెడ్ రన్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆర్ కృష్ణారావు ప్రారంభించారు. పూడిమడక రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ రన్లో జిల్లా వైద్య విద్యా అధికారి విభాగం సహకారంతో వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ప్రథమ, ద్వితీయ బహుమతులుగా పురుషుల్లో రామానాయుడుకు రూ.10 వేలు, వినోద్కు రూ.7 వేలు, సీ్త్రలలో వాణికి రూ.10 వేలు, దివ్యకు రూ.7వేలు చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కే రామచందర్, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ స్పందన ప్రశాంతి, డీఎండీవో చిరంజీవి, ఐసీటీసీ కౌన్సిలర్ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి స్కూల్ గేమ్స్కు ఎంపికలు
యలమంచిలి రూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఎంపికలు(అండర్–19 బాల బాలికలకు) ఈ నెల 11 నుంచి 13 వరకు వయో విభాగాల వారీగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు జూనియర్ కళాశాలల గేమ్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వీఏ పుష్పలత తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే బాల బాలికలు 2007 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించి ఉండాలి. ఓపెన్ స్కూల్, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఎంపికలకు అనర్హులు. అర్హులైన విద్యార్థులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రం, విద్యార్థి పెన్ నెంబర్, వారు చదువుతున్న కళాశాల ప్రిన్సిపాల్ జారీ చేసిన స్టడీ సర్టిఫికెట్ తమ వెంట తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 94408 85898, 99669 31556, 98854 73808, 99516 76965, 99850 65340 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు. -
● వైద్యురాలిపై వార్డు బాయ్, రోగి తల్లిపై వైద్యుడి వేధింపులు ● ఫిర్యాదు చేసినా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ● మహిళా కమిషన్ దృష్టికెళ్లినా ఫలితం శూన్యం ● కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకం?
కేజీహెచ్లో కీచకులుమహారాణిపేట (విశాఖ): కేజీహెచ్లో కీచకుల వ్యవ హారం కలకలం రేపుతోంది. రోగులు, వారి బంధువులనే కాకుండా, మహిళా వైద్యులను సైతం కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. వార్డు బాయ్ల నుంచి వైద్యుల వరకు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యురాలి పట్ల వార్డు బాయ్, చికిత్స కోసం వచ్చిన రోగి తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించడం దుమారం రేపుతోంది. ఈ ఘటనలపై బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. విశేషమేమిటంటే.. ఇటు కేజీహెచ్కు, అటు ఆంధ్రా మెడికల్ కాలేజీకి మహిళలే సారథ్యం వహిస్తున్న తరుణంలో.. ఇలాంటి ఘటనలు జరగడం, వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటనలు కేజీహెచ్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. వైద్యురాలిపై వార్డు బాయ్ అసభ్య ప్రవర్తన అనస్థీషియా విభాగానికి చెందిన ఒక వైద్యురాలు.. వారానికి రెండు రోజులు (మంగళ, శుక్రవారాలు) అధికారుల ఆదేశాల మేరకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా గత నెల 26న ఉదయం 11 గంటల సమయంలో ఆమె రోగులను చూస్తుండగా.. శంకరరావు అనే వార్డు బాయ్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒకసారి కాదు, రెండుసార్లు.. అందరి ముందు అలా ప్రవర్తించడంతో ఆ వైద్యురాలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, తమ విభాగాధిపతులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే రోజు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐకి కూడా ఫిర్యాదు చేశారు. రోగి తల్లికి వైద్యుడి వేధింపులు పరవాడ ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెను తీసుకుని కేజీహెచ్కు వచ్చారు. సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న కుమార్తె వద్ద సహాయంగా ఉంటున్న ఆ తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతను రోగితో కాకుండా ఆమె తల్లితో అనుచితంగా మాట్లాడటంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందికి గురైంది. ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగదనే అనుమానంతో.. బాధితురాలు నేరుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కోరుతూ మహిళా కమిషన్.. కేజీహెచ్ సూపరింటెండెంట్కు గత నెల 20న ఒకసారి, ఈ నెల 4న మరోసారి లేఖలు పంపింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని కమిషన్ చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మోకాలిలో కిలోన్నర కణితి తొలగింపు
నక్కపల్లి: స్థానిక 50 పడకల ఏరియా ఆస్పత్రిలో మంగళవారం అరుదైన శస్త్రచికిత్స జరిగింది. మోకాలిలో కిలోన్నర కణితిని ఆర్ధోపెడిక్ వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఉద్దండపురం గ్రామానికి చెందిన తుమ్మల రాజారావు విపరీతమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. కాలు బరువుగా ఉండటంతో నడవలేని పరిస్థితి నెలకొంది. ఇతను వైద్యం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రిలో ఆర్ధోపెడిక్ సర్జన్ డాక్టర్ రవికిరణ్ను కలిశాడు. వెంటనే ఎక్స్రే తీసి మోకాలిలో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో చేర్చుకుని శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించారు. తొలగించిన కణితి బరువు 1.50 కిలోలు ఉంటుందని డాక్టర్ తెలిపారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, రోగి పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. బాధితుడు రాజారావు మాట్లాడుతూ ఎంతోకాలం నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, ప్రైవేటు ఆస్పత్రుల వద్ద నొప్పి కోసం మందులు వాడేవాడినన్నారు. నక్కపల్లిలో ఆర్ధోపెడిక్ సర్జన్ ఉన్న విషయం తెలుసుకుని ఇక్కడకు వస్తే ఆపరేషన్ చేశారన్నారు. ఇదే కణితిని ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేసి తొలగిస్తే వేలాది రూపాయలు ఖర్చవుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. తొలిసారిగా ఇటువంటి కణితిని తొలగించినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్ రవికిరణ్ను సూపరింటెండెండ్ డాక్టర్ శిరీష, సహచర వైద్య సిబ్బంది అభినందించారు. నక్కపల్లి సీహెచ్సీలో అరుదైన శస్త్రచికిత్స -
రైతన్న కన్నెర్ర
పోలీసుల ఆంక్షల మధ్య హోరెత్తిన ‘అన్నదాత పోరు’ ● యూరియా కొరతపై కదం తొక్కిన వ్యవసాయదారులు ● ఎన్ని ఆటంకాలు కల్పించినా వైఎస్సార్సీపీ ఆందోళన సూపర్ సక్సెస్ ● అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసన ● అవసరమైనంత ఎరువులు అందించాలని అధికారులకు వినతి ప్రతి ఖరీఫ్ సీజన్కు ముందు వ్యవసాయ శాఖ ఎంత యూరియా అవసరమో అంచనా వేసుకుంటుంది. అందుకు అనుగుణంగా ప్రణాళిక తయారుచేసుకొని అమలు చేస్తుంది. వరినాట్లు వేసే సరికి ఎరువులు, విత్తనాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం కారణంగా ఇవేవీ జరగలేదు. ముఖ్యమంత్రికి ముందుచూపు ఉండాలి. మా గత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం సకాలంలో అందించాం. మా హయాంలో తీసుకున్న చర్యల వల్ల గత ఏడాది ఇబ్బంది రాలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎరువులు వాడితే పంట దిగుబడి రాదంటున్నారు. ఇక సీఎం చంద్రబాబు అయితే ఎరువులు ఇవ్వండని అడిగిన రైతులను జైల్లో వేసి, కేసులు నమోదు చేయాలంటూ భయపెడుతున్నారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి మారకుంటే వైఎస్సార్సీపీ మరింత ఉధృతంగా పోరాటం చేస్తుంది. –గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనకాపల్లిలో ఆర్డీవో కార్యాలయానికి భారీ సంఖ్యలో ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతులుయూరియా కొరతపై అన్నదాత కన్నెర్ర జేశాడు. వ్యవసాయం దండగ అన్న రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన చెందాడు. తమ సమస్యలను పట్టించుకోనందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుకే పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యం లో మంగళవారం నిర్వహించిన ‘అన్నదాత పోరు’లో రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎన్ని ఆటంకాలు పెట్టినా అదరలేదు.. బెదరలేదు. జిల్లాలోని అన్ని మండలాల్లో వేకువజాము నుంచే వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ముఖ్యమైన జిల్లా స్థాయి నాయకులను గృహ నిర్బంధం చేసి ‘అన్నదాత పోరు’ను అడ్డుకునేందుకు కూటమి సర్కార్ కుటిల ప్రయత్నాలు చేసింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా అనకాపల్లి, నర్సీపట్నంలలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. వందలాదిమంది నినాదాలతో హోరెత్తించారు. కూటమి ప్రభుత్వం 15 నెలల పాలన రైతులకు శాపంగా మారింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో, పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో కూడా యూరియా కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో సాధారణ సాగులో 70 శాతమే పంట వేశారు. దానికే ఎరువులు ఇవ్వలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు రాజుగా ఉండేవాడు. విత్తనాలు, ఎరువులు ఇంటికే డోర్ డెలివరీ చేశావాళ్లం. కూటమి నాయకులు యూరియాను బ్లాక్లో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. –ఎమ్మెల్సీ వరుదు కల్యాణి సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి, నర్సీపట్నంలలో తలపెట్టిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమం సందర్భంగా ఎమర్జెన్సీ వాతావరణం కనిపించింది. అనకాపల్లి రింగురోడ్డులో గల వైఎస్సార్సీపీ కార్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు. అన్నదాత పోరు ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 10 నుంచి 20 మంది వరకే అనుమతిస్తామని, అంతకు మించితే అరెస్ట్ చేస్తామంటూ డీఎస్పీ శ్రావణి, అనకాపల్లి టౌన్ సీఐ విజయ్కుమార్ రైతులను, పార్టీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేశారు. ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదంటూ మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్కు డీఎస్పీ నోటీసు కూడా ఇచ్చారు. అయినా ఎక్కడా రైతులు భయపడలేదు. మమ్మల్ని అరెస్ట్ చేసుకున్నా.. మాపై కేసులు పెట్టుకున్నా ర్యాలీ చేసి తీరుతాం.. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామంటూ పాదయాత్రగా బయలుదేరారు. పోలీసులు చుట్టుముట్టినా ఎక్కడా బెదరలేదు.. జంకలేదు.. రైతులకు కొరత లేకుండా యూరియా ఇవ్వాలంటూ నినాదాలు చేసుకుంటూ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ రెండు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు. అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావు పేట, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల నుంచి రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీవో షేక్ ఆయిషాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, మలసాల భరత్కుమార్, అన్నంరెడ్డి అదీప్రాజ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, మాజీ ఎంపీలు భీశెట్టి వెంకట సత్యవతి, గొడ్డేటి మాధవి, పార్టీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, రాష్ట్ర కార్యదర్శులు బొడ్డేడ ప్రసాద్, దంతులూరి దిలీప్కుమార్, మలసాల కుమార్రాజా, పైలా శ్రీనివాసరావు, అనకాపల్లి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీ రామరాజు, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జాజుల రమేష్, గవర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ బొడ్డేడ శివ, పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్, పరవాడ జెడ్పీటీసీ పీఎస్ రాజు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు హేమంత్కుమార్, నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు వడ్డాది అప్పలరాజు, సీనియర్ నాయకులు శరగడం చినఅప్పలనాయుడు, గండి రవికుమార్, బోకం రామునాయుడు, కె.ఎం నాయుడు, కోరకుండ రాఘవ, వేగి త్రినాథ్, తగరంపూడి నూకరత్నం, తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎన్ని టన్నుల యూరియా అవసరమో ప్రభుత్వానికి తెలియదా? రైతుకు అర ఎకరం ఉన్నా.. ఐదెకరాలున్నా ఒక యూరియా బస్తాయే ఇస్తున్నారు. అదెలా సరిపోతుంది. అధికారులు యూరియా కొరత లేదు, అడిగినంతా ఇస్తున్నామంటున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడాలని వారిని వేడుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడుతున్నారు. పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా.. గతేడాదిలాగే అప్పుల ఊబిలో కూరుకుపోతామేమోనని ఆవేదన చెందుతున్నారు. –బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎంరాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతులు యూరియా కావాలంటూ కదం తొక్కారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసుల ద్వారా రైతుల గొంతు నొక్కే ప్రయత్నాలు చేశారు. ఎరువుల కొరత నివారించాలి. క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలి. యూరియా కొరత ఉన్నా.. అధికారులు మాత్రం లేదంటున్నారు. ప్రైవేట్ దుకాణాల్లో టీడీపీ నేతలు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో రైతులు ఈ ఏడాది కూడా దిగుబడి రాదేమోనని భయపడుతున్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని మానుకోవాలి. రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలి. –కరణం ధర్మశ్రీ, వూజీ ప్రభుత్వ విప్ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి కూటమి పాలన... రైతులకు శాపం కూటమి పాలన... రైతులకు శాపం ఐదెకరాలున్నా ఒక బస్తాయేనా? ఐదెకరాలున్నా ఒక బస్తాయేనా? రైతుల గొంతునొక్కే ప్రయత్నం రైతుల గొంతునొక్కే ప్రయత్నం -
ఎక్కడికక్కడ అరెస్టులు.. ఆటంకాలు
నర్సీపట్నం: మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణల హౌస్ అరెస్ట్ సాక్షి, అనకాపల్లి: ఎమర్జెన్సీని తలపించేలా ‘అన్నదాత పోరు’ను అడ్డుకునేందుకు కూటమి సర్కారు కుటిల ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు మంగళవారం వేకువజాము నుంచే వైఎస్సార్సీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని గృహ నిర్బంధం చేశారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనకుండా వారిని కట్టడి చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో గృహ నిర్బంధం చేసిన వారిలో.. నక్కపల్లిలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ, అడ్డురోడ్డులో పార్టీ నక్కపల్లి మండల అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, చినదొడ్డిగల్లులో వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, కోటవురట్ల మండలం తంగేడులో మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, వైస్ ఎంపీపీ దత్తుడు సీతబాబు, జెడ్పీటీసీ సిద్దాబత్తుల ఉమాదేవి, పాముల వాకలో మండల పార్టీ అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు, పాయకరావుపేట మండలం పెంటకోటలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, నామవరంలో ఎంపీపీ ఈసరపు పార్వతి తాతారావు, జెడ్పీటీసీ లంక సూరిబాబు ఉన్నారు. అడ్డురోడ్డులో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులును ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్నానని, జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి వెళ్లక తప్పదని, పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించడంతో జోగులును మాత్రం విడిచిపెట్టారు. చోడవరం నియోజకవర్గం: పార్టీ బుచ్చెయ్యపేట మండల అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు, జెడ్పీటీసీ దొండా రాంబాబు, వడ్డాది టౌన్ అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి జోగా కొండబాబు, రోలుగుంట జెడ్పీటీసీ పోతల లక్ష్మీ రమణమ్మ, లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు, రావికమతం మండల అధ్యక్షుడు ముక్కా మహలక్ష్మినాయుడు, ఎంపీపీ పైలా రాజు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తలారి ఆదిమూర్తిలను హౌస్ అరెస్ట్ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గం: నర్సీపట్నంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, నర్సీపట్నం ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, మాకవరపాలెంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల యర్రాపాత్రుడు, ఎంపీపీ సర్వేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు చిటికెల రమణ, నాతవరం జెడ్పీటీసీ అప్పలనర్స, మండల అధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీ పైల సునీల్లను హౌస్ అరెస్ట్ చేశారు. మాడుగుల నియోజకవర్గం: కె.కోటపాడు ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల శివాజీరాజు, జేసీఎస్ కన్వీనర్, ఎంపీటీసీ ఏటుకూరి రాజేష్, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, మాడుగుల ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, వైస్ ఎంపీపీ పొలిమేర విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, దేవరాపల్లి ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడులను గృహ నిర్బంధం చేశారు. యలమంచిలి నియోజకవర్గం: ఎంపీపీ బోదెపు గోవింద్, జెడ్పీటీసీ సేనాపతి సంధ్యారాణి, ఆమె భర్త సేనాపతి రాము, అచ్యుతాపురం ఎంపీపీ కోన సంధ్య లచ్చన్నాయుడు, మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, జెడ్పీటీసీ లాలం రాములను హౌస్ అరెస్ట్ చేశారు. అనకాపల్లి నియోజకవర్గం: అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ సభ్యుడు దంతులూరి శ్రీధర్రాజు, మండల అధ్యక్షుడు మలసాల కిషోర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబులను గృహ నిర్బంధం చేశారు. మాకవరపాలెం: హౌస్ అరెస్ట్లో ఉన్న రుత్తల యర్రాపాత్రుడు గొలుగొండ : నిర్బంధంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత -
బల్క్డ్రగ్ పార్క్ ఉద్యమానికి సహకరించండి
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారుల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, ఈ ప్రాంత మంతా కాలుష్య కాసారమవుతుందని మండలంలో రాజయ్యపేట, బోయపాడు గ్రామాలకు చెందిన మత్స్యకారులు కోడ లక్ష్మణ్, పిక్కి చిట్టిబాబు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి వివరించారు. మంగళవారం వారు తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో జగన్మోహన్రెడ్డిని కలిిసి బల్క్ డ్రగ్పార్క్ వల్ల కలిగే నష్టాలను, ఈ ప్రాంత మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలు గురించి వివరించారు. స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ను కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా ఏర్పాటు చేస్తోందన్నారు. గత నెలలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మత్స్యకారులు బల్క్డ్రగ్పార్క్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. సభలో తమ అభిప్రాయాలు చెప్పకుండా పోలీసుల సాయంతో తమను సభ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకున్నారని జగన్మోహన్రెడ్డికి వివరించడం జరిగిందని, లక్ష్మణ్, చిట్టిబాబు తెలిపారు. కోస్టల్ కారిడార్ పేరుతో కెమికల్ ఫ్యాక్టరీలు, ఫిిషింగ్ హార్బర్లు, రిసార్ట్స్, టూరిజం పార్క్లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అలాగే ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపులో ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. మత్స్యకారులు చేస్తున్న ఆందోళనలకు వైఎస్సార్సీపీ తరపున సంఘీభావం ప్రకటించి గంగపుత్రుల ప్రాణాలు కాపాడాలని జగన్మోహన్రెడ్డిని కోరడం జరిగిందన్నారు. తమ సమస్యలను పూర్తిగా విన్న జగన్ సానుకూలంగా స్పందించారని, మత్స్యకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. -
క్రిటికల్ సమస్యా.. డోంట్ కేర్
హెచ్డీయూ(6 బెడ్లు), డీయూ, అనస్థీషియా రూమ్, అటెండెంట్ వెయిటింగ్, ఐసీయూ (10 బెడ్లు), ఓటీలు– 2 నంబర్లు, స్టెరిలైజేషన్, ఎలక్ట్రికల్ రూమ్, ఈక్యూఎంటీ రూమ్, ఫ్రీ అండ్ పోస్ట్ ఓపీ– 5 బెడ్లు డీఆర్ డ్యూటీ, స్టాఫ్ నర్సులు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. ఐఎస్వో రూమ్ (2 పడకలు), డైనింగ్ మెల్ –2 నంబర్లు, డీయూ, ఏఎస్వో వార్డు (6 పడకలు), క్లినికల్ టెస్ట్, ఐఎస్వో వార్డు (15 పడకలు), కౌన్సెలింగ్ రూమ్లు–2 నోస్, డౌఫింగ్, ఐసీయూ–ఐఎస్వో స్టోర్, డీఆర్ డ్యూటీ, స్టాఫ్ రూమ్, ఐఎస్వో వార్డు –2 నంబర్లు (ఒక్కొక్కటి 2 బెడ్లు), మరుగుదొడ్లు ఉంటాయి. డిలేసిస్ (4 పడకలు), డాక్టర్ రూమ్, డోనింగ్, డీయూ ఎంసీహెచ్( 2 పడకలు), ఎల్డీఆర్ (ఒక్కొక్కరికి 1 బెడ్), డోనింగ్ ఫిమేల్, ఆర్వో డయాలైజర్, అల్ట్రా సౌండ్, ప్లాస్టర్ రూమ్, పీఓసీ ల్యాబ్, ఎలక్ట్రికల్ రూమ్, డ్యూటీ డాక్టర్/ఎగ్జామినేషన్ రూమ్, ఎమర్జెన్సీ వార్డు (6 పడకలు), మైనర్ ప్రొసీజర్, నర్సుల రూమ్, ఇంజెక్షన్ డ్రెస్సింగ్ రూమ్, మరుగుదొడ్లు ఉంటాయి. రెండో అంతస్తుగ్రౌండ్ ఫ్లోర్మొదటి అంతస్తు అనకాపల్లి: పట్టణంలో క్రిటికల్ కేర్ బ్లాక్ త్వరలో అందుబాటులోకి రానుంది. జిల్లాలో అత్యధిక రసాయన పరిశ్రమలు ఉండటంతో ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలందక మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి కానున్నాయి. మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చి 24 గంటలూ వైద్య సేవలందించనున్నారు. జిల్లాలో అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి, రాంబిల్లి మండలాల్లో ఎక్కువగా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాల్లో పలువురు మృతి చెందుతున్నారు. గాయపడిన మరికొందరిని విశాఖ సిటీలో కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించే క్రమంలో కొంతమంది మార్గమధ్యంలో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో క్రిటికల్ కేర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్టయితే గాయపడిన వారికి సకాలంలో వైద్య సేవలు అందించినట్టయితే ప్రాణాలు కాపాడవచ్చు. ఈ విషయమై 2023 డిసెంబర్లో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంపీ బీవీ సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధికారులు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరగా, క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి రూ.22.5 కోట్లు విడుదల చేశారు. 2024 ఫిబ్రవరిలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదురుగా ప్రభుత్వ స్థలంలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో ప్రారంభమైన పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక పార్కింగ్ స్థలం... క్రిటికల్ కేర్ బ్లాక్కు ఎదురుగా వాహనాలు నిలుపుదల చేసేందుకు ఎక్కువగా పార్కింగ్ స్థలం ఉంది. రోగితోపాటు రోగి బంధువు ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు పూర్తవుతాయి రెండు మాసాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రానుంది. భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. ఈ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తాం. వెంటనే ఏడాదిపాటు కేంద్ర ఆరోగ్యశాఖ పర్యవేక్షణ తర్వాత రాష్ట్ర ఆరోగ్యశాఖకు అప్పగిస్తుంది. – కృష్ణారావు, సూపరింటెండెంట్, ఎన్టీఆర్ ఆస్పత్రి, అనకాపల్లిఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు ఈ నెల 30వ తేదీలోపు పూర్తవుతాయి. ఈ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేసిన వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్యం శాఖ 50 పడకలకు కావలసిన వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించినట్లయితే కేంద్ర ప్రభుత్వం రోగులకు ఉపయోగించే అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తుంది. ఏడాది పాటు వైద్యులకు, వైద్య సిబ్బందికి జీతాలు చెల్లిస్తుంది. రెండో ఏడాది నుంచి పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి వస్తుంది. చివరి దశలో 50 పడకల ఆస్పత్రి పనులు క్రిటికల్ కేర్ బ్లాక్లో 24 గంటలూ వైద్యం... క్రిటికల్ కేర్ ఆస్పత్రిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదురుగా నిర్మిస్తున్నారు. ఇక్కడ మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ బ్లాక్(ఆస్పత్రి)ను ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి అనుసంధానం చేస్తారు. క్రిటికల్ కేర్ బ్లాక్లో, డయాలసిస్ రోగులకు ప్రత్యేకంగా కొన్ని బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. గుండెపోటు, శ్వాసకోశ వైఫల్యం, తీవ్రమైన గాయాలైన వారికి ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు. 24 గంటలూ నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. -
జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
మునగపాక: మండలంలోని పాటిపల్లి మోడల్ స్కూల్కు చెందిన ఇంటర్ విద్యార్థిని వి.వినీల జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై ంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వినీల తొలి నుంచి బాల్ బ్యాడ్మింటన్లో రాణిస్తూ ఉండేది. అంతర్ జిల్లాల పోటీ ల్లో పాల్గొన్న ఆమె అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పతకం సాధించి మరింత ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి తెలిపారు. వినీలతో పాటు ఆమె కృషికి కారణమైన పీటీ మహలక్ష్మిని ఎస్ఎంసీ చైర్మన్ జోగినాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఉపాధి కూలీల వేదన.. ఖాళీ కంచాలతో నిరసన
ఆజయపురంలో ఖాళీ కంచాలతో ధర్నా చేస్తున్న గిరిజన ఉపాధి కూలీలు రావికమతం: మూడు మాసాల నుంచి ఉపాధి మామీ కూలీ చెల్లింపులు చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని చీమలపాడు పంచాయతీ పరిధిలో గల గిరిజన ఉపాధి కూలీలు సోమవారం ఖాళీ కంచాలతో ధర్నా చేశారు. నేరేడుబంద, ఆజయపురం, జీలుగలోవ గ్రామాల్లో ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు పనిచేసిన ఉపాధి కూలీలకు నగదు తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం 5 వ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఖాలీ కంచాలతో భిక్షాటన చేసి, ధర్నా నిర్వహించారు. ఉపాధి హమీ చట్టం ప్రకారం పనిచేసిన ప్రతి ఉపాధి కూలీకి పేస్లిప్లు ఇచ్చి, రెండు పూటలు పని చేయాలనే నిబంధనలు రద్దు చేయాలన్నారు. ప్రతి 15 రోజులకు ఉపాధి బకాయిలు ఇవ్వకపోవడంతో ఉపాధివేతన దారులు ఇక్కట్లు పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె. గోవిందరావు పేర్కొన్నారు. ఈ ధర్నాలో గిరిజన సంఘం నాయకులు వంతల చిరంజీవి, పాంగి సూరిబాబు, పాంగి శ్రీరామ్ పాల్గొన్నారు. -
‘అన్నదాత పోరు’కు తరలిరండి..
అనకాపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మన రాష్ట్రం వ్యవసాయంపై అధారపడి ఉందని, ఖరీఫ్ సీజన్లో రైతులకు సకాలంలో యూరియా అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు యూరియా నిల్వ చేయడం జరిగిందని, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో అన్న యూరియాను రైతులకు సకాలంలో అందజేయడం వల్ల గత ఏడాది యూరియా సమస్య లేకుండా పోయిందన్నారు. ఈ ఏడాది సీఎం చంద్రబాబు ఖరీఫ్ సీజన్ దృష్టిలో పెట్టుకుని రైతులకు సకాలంలో యూరియాను అందజేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల పక్షాన వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో కార్యాలయాలు వద్ద అన్నదాత పోరు బాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, రైతులు హాజరు కావాలని ఆయన పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, మండలపార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ -
యూరియా..ఏదయ్యా..!
ఖరీఫ్ సీజన్ ఆరంభమై మూడు నెలలైనా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉండడం లేదు. వరి నాట్లు వేసి నెల రోజులు దాటినా నేటికీ యూరియా అందక పడిగాపులు కాస్తున్నారు. పగలనక, రాత్రనక యూరియా కోసం రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. వచ్చిన కొద్దిపాటి యూరియాను రైతులకు ఒక్కో కట్ట మాత్రం అందిస్తున్నారు. మరో పక్క యూరియా రైతులందరికీ అందుబాటులో ఉందంటూ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాత ఎరువుల కోసం రోడ్డెక్కుతున్నాడు. రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. ● ఎరువులను సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలం ● పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు ● జిల్లాలో 32,321 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ● అందుబాటులో 12 వేల టన్నులు ● ఎరువుల సరఫరాలో కూటమి నేతల చేతివాటం ● రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ పోరుబాట ● నేడు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన -
అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
ఉపాధి కోసం వినతి డిగ్రీ చదువుకున్న తనకు ఉపాధి కల్పించాలని కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు దాలిబోయిన తరుణ్కుమార్ కలెక్టర్ను వేడుకున్నారు. పుట్టుకతో చర్మవ్యాధి ఉన్నప్పటికి సొంత కాళ్లపై నిలబడాలనే ఆశతో కూలీపనులు చేసుకుంటూ తల్లిదండ్రులు తనను డిగ్రీ చదివించారని, ఉద్యోగం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన చెప్పారు. దివ్యాంగుల కోటా లో ఉద్యోగం ఇప్పించాలని కోరారు. తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్)లో వచ్చిన అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, ప్రత్యేక ఉప కలెక్టర్(ఏపీఐఐసీ) అనిత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి తీసుకున్న అర్జీల గురించి వెంటనే సంబంధిత అదికారులను వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారి అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షించి, నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 232 అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయంలో 47 అర్జీల స్వీకరణ అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు 47 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్టీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు–30, కుటుంబ కలహాలు–3, మోసపూర్తి హామీ–1, వివిధ విభాగాలకు చెందినవి–13 అర్జీలు వచ్చాయని చెప్పారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ఐ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.ఇల్లు ఆక్రమణపై ఫిర్యాదు తన ఇంటిని ఆక్రమించి తప్పుడు దస్తావేజులు సృష్టించిన డి.శ్యామలపై పోర్జరీ కేసు నమోదు చేయాలని మునగపాక మండలం టి.సిరసపల్లికి చెందిన పొట్ల వీరునాయుడు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పనులు లేక కొన్నేళ్ల క్రితం కుటుంబంతో వలస పోయానని, ప్రస్తుతం కిడ్నీ సమస్యతో పనులు చేయలేక గ్రామంలో సొంతింటికి వస్తే సోదరి సముద్రాలు, ఆమె కుమార్తె శ్యామల అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తప్పుడు దస్తావేజులు చూపిస్తూ ఇబ్బందులు పెడుతున్నా రని వాపోయారు. రిజిస్ట్రార్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా.. అవి తప్పుడు దస్తావేజులని తెలిసిందని, వాటిని రద్దు చేసి పోర్జరీ కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. పీజీఆర్ఎస్లో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ జాహ్నవి క్షేత్ర స్థాయి పర్యటనతో సమస్యల పరిష్కారం అధికారులకు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం పీజీఆర్ఎస్కు 232 అర్జీలు -
నేత్రదాన ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీలు
తుమ్మపాల: నేత్రదాన అవశ్యకత, నేత్రదాన ప్రాముఖ్యతపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ విజయ కృష్ణన్, జేసి.జాహ్నవి ప్రశంస పత్రాలు అందించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో 40వ నేత్రదాన పక్షోత్సవాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థ్ధులను సోమవారం కలెక్టరేట్లోని ఆమె చాంబర్లో అభినందించారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ టి.డేవిడ్ కుమార్, బోడ మోహన్రావు, విద్యార్థులు పాల్గొన్నారు.విజేతలకు ప్రశంసాపత్రాలు -
ప్రభుత్వ వైద్య కళాశాలలపై ప్రై‘వేటు’ సిగ్గుచేటు
అనకాపల్లి: వైఎస్సార్సీపీ పాలనలో పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే, కూటమి పాలనలో మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల పీపీపీ విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.బాబ్జి అన్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీనిర్వహించి, నెహ్రూచౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 17 వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే... అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి 14 వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారని ఆయన గుర్తుచేశారు. రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో గత విద్యా సంవత్సరంలో కళాశాలలను ప్రారంభించారన్నారు. జగన్ ప్రభుత్వంలో జీవో నంబర్లు 107, 108 ఉత్తర్వుల్ని తీసుకువచ్చి నూతన మెడికల్ కళాశాలల్లో 50 శాతం ఎంబీబీఎస్ సీట్లను ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాము అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 107, 108లు 100 రోజుల్లోనే రద్దు చేసి వైద్య కళాశాలలను నూరుశాతం ప్రభుత్వ కళాశాలలుగా కొనసాగిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చాక పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి వైద్య కళాశాలలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల నష్టపోయేది విద్యార్థులు మాత్రమే కాదని, పేద వర్గాల ప్రజలు కూడా ఉచిత వైద్యానికి దూరమవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వి.రాజు, ఏఐఎస్ఎఫ్ నియోజవర్గ నాయకులు లతా, సీత, నవ్య పాల్గొన్నారు.ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ -
ఒకే రోజు అల్లుడు, మామ మృతి
మునగపాక: ఓ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. ఒకే ఇంట్లో ఒకే రోజు అల్లుడు, మామ మృతితో తీవ్ర విషాదం నింపింది. సోమవారం అనారోగ్యంతో చనిపోయిన తన మామ అంత్యక్రియలకు అవసరమైన కట్టెలు తెచ్చేందుకు పొలానికి వెళ్లిన అల్లుడు విద్యుత్ షాక్కు గురై మృత్యువాతకు గురైన ఘటన నారాయుడుపాలెంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నారాయుడుపాలెం గ్రామానికి చెందిన కొయ్య మీసాల అప్పారావు(64) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు అతని అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా అప్పారావు అల్లుడు ప్రసాదుల సన్యాసిరావు(54) అవసరమైన కట్టెలను తెచ్చేందుకు మధ్యాహ్నం స్థానికులతో కలిసి పొలానికి వెళ్లాడు. పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు ఆయన కాలికి తగలడంతో సన్యాసిరావు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన విద్యుత్ షాక్కు గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మునగపాక ఎస్ఐ పి.ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ శాఖ ఏఈ శరగడం జగదీష్.. నారాయుడుపాలెంలో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. -
జిల్లాలో పరిస్థితి ఇలా..
క్లస్టర్ విధానం రద్దు చేయాలి కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన క్లస్టర్ విధానంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాశీపురం రైతు సేవా కేంద్రాన్ని సుమారు 4 కిలోమీటర్ల దూరంలో రైవాడలో కలపడం దారుణం. దీంతో కాశీపురం పరిధిలోని రైతులంతా ఎరువులు కోసం రైవాడ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రైతులను ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలి. – దాసరి గోపి, రైతు, కాశీపురం. పంటల విస్తీర్ణం ఆధారంగా... ప్రభుత్వ ఆదేశాల మేరకు అగ్రికల్చర్, హార్టికల్చర్ పంటల విస్తీర్ణం ఆధారంగా రైతు సేవా కేంద్రాలను క్లస్టర్లుగా విభజించాం. మండలంలో 20 రైతు సేవా కేంద్రాలను 14 క్లస్టర్లుగా మార్పు చేశాం. అక్కడ సిబ్బందిని సర్దుబాటు చేశాం. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందించేలా చర్యలు చేపడుతున్నాం. ముషిడిపల్లి, కాశీపురం తదితర గ్రామాల రైతులకు క్లస్టర్లలో పంపిణీ చేయడంతో కాస్తా ఇబ్బంది పడడం వాస్తవమే. –ఎల్వై. కాంతమ్మ, మండల వ్యవసాయ అధికారి, దేవరాపల్లి ఒక్క బస్తా అయినా ఇవ్వలేదు.. దమ్ములో వేయడానికి వరి నాట్లు వేసి నెల రోజులు దాటినా యారియ అందుబాటులో లేదు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల్లో, ప్రైవేటు షాపుల్లో ఎప్పుడు వెళ్లినా యూరియా దొరికేది. ఇపుడు ప్రభుత్వ, ప్రైవేటు షాపుల్లో యూరియా దొరక్కపోతే మేం ఎక్కడికి వెళ్లి తెచ్చుకోవాలి. – బండి రాజారావు, లోపూడి రైతు, బుచ్చెయ్యపేట మండలం సాక్షి, అనకాపల్లి: రైతులకు ఈ ఖరీఫ్ సీజన్లో యూరియాను సమకూర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ముందస్తుగా ఎన్ని టన్నుల యూరియా అవసర ముంటుందో ప్రభుత్వానికి తెలిసినప్పటికీ రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమకూర్చిన ఎరువులు సమృద్ధిగా ఉండడంతో గతేడాది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినా.. రైతులకు అంత కొరత రాలేదు. కానీ ఈ ఖరీఫ్ సీజన్లో మాత్రం ఇటు పెట్టుబడి పెట్టలేక..అటు యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడతున్నారు. వరినాట్లు ప్రాథమిక దశలోనే యూరియా వేస్తే పంట ఏపుగా ఎదుగుతుంది. ఇప్పుడా యూరియానే బంగారమైపోయింది. యూరియా కోసం రైతుసేవాకేంద్రాల్లో, పీఏసీఎల్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్నా బస్తా యూరియా సంపాదించడం కష్టంగా మారింది. ఎరువు లేక పంటల్లో ఎదుగుదల లోపిస్తోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆ ఆవేదన రైతు ఒకటి తీసుకునే దగ్గర రెండు తీసుకుంటున్న పరిస్థితులున్నాయి. అది కూడా ఎక్కడైనా స్టాక్ వచ్చిందంటే తొలుత కూటమి నేతలు సగంకు పైగా దారి మళ్లిస్తున్నారు. మిగిలిన వాటిని అరకొరగా రైతులకు ఇస్తున్నారు. రైతు వేసే వరి నాట్లు ఆధారంగా రెండు మూడు కావాల్సిన వారికి కూడా ఒకటే యూరియా బస్తా ఇవ్వడంతో చాలా చోట్ల ఆగ్రహంగా మారి అన్నదాతలను రోడ్డెక్కేలా చేస్తోంది. గత నెల రోజులుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది, చాలాచోట్ల రైతులు.. ఎరువుల కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గుంపులు గుంపులుగా రహదారుల మీదకొచ్చి రాస్తారోకోలు చేశారు. క్యూలైన్లలో తోపులాటలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల సిబ్బందిపై రైతులు తిరగబడుతున్నారు. నానో యూరియాను అంటగట్టే యత్నం.. రైతులు వినియోగించే ఎరువులు, యూరియాపై కూటమి సర్కార్ దొంగాట ఆడుతోంది. సరిపడా యూరియా, ఎరువులు నిల్వలు ఉన్నాయంటూ అధికారులు పేపర్ లెక్కలే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితులకు సంబంధం లేకుండా పోయింది. పంటలు వేసిన తర్వాత యూరియా, ఇతర ఎరువులు ఎంతో అవసరం ఉంటుంది. ప్రైవేట్ దుకాణాల్లో నానో యూరియా, నానో డీఏపీల పేరిట రైతులకు అంటకట్టడానికి ఆలోచనతో కూటమి సర్కార్ యూరియాను కృత్రిమ కొరతను సృష్టిందన్న విమర్శలు వస్తున్నాయి. యూరియా సరిపడా వస్తుందని రైతులకు వ్యవసాయ అధికారులు నచ్చచెబుతున్నారు. కానీ యూరియా రాకపోవడం, సహకార సంఘాల వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. జిల్లాకు చేరిన యూరియా, డీఏపీ ఎరువులు చేరినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్ధాయిలో ఇవి చేరుకోకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కూడా నానో యూరియా అమ్మకాలు పెంచాలని, ఇటు వ్యవసాయ అధికారులకు, అటు కూటమి సర్కార్ మీద వత్తిడి తెస్తున్నారు. యూరియాను విక్రయిస్తున్న సహకార సంఘాలు, రైతు భరోసా కేంద్రాలను లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఇదే పరిస్థితిలో నానో యూరియాను కూడా కొనుగోలు చేయాలని, రైతుల నెత్తిన నానో యూరియా రుద్దడానికి వ్యవసాయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుబాట.. అనకాపల్లి జిల్లాలో యూరియా కొరతతో పలు ఇబ్బందులు గురవుతున్న రైతులకు అండగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9న అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయాల వద్ద మరో పోరాటానికి సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో యూరియా కొరతపై అనకాపల్లి ఆర్డీవో కార్యాలయాల వద్ద ‘అన్నదాత పోరుబాట’ పేరిట ఆందోళనలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. జిల్లాలో యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా రైతుల సంఘాల నాయకులు కూడా పాల్గొనాలని వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు వైఎస్సార్సీపీ తెలిపింది. అనకాపల్లి, మర్దీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. అనంతరం ఆర్డీవో కు వినతి పత్రం అందజేయనున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రైతులకు ఎరువులు, విత్తనాల సమస్య అనేది ఎక్కడా లేదన్నారు. ఈఖరీఫ్ సీజన్ లో యూరియాను రైతులకు అందించకుండా కూటమి నేతలు పక్కదారి పట్టిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ప్రధానంగా యూరియా కొరత, రైతుల సమస్యలపై పరిష్కారం కోరుతూ ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేయనున్నారు. కొన్ని ప్రైవేటు దుకాణాల్లోనే... జిల్లా వ్యాప్తంగా 98 శాతం వరినాట్లు వేశారు. ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉంది. డీఏపీ అంతంతమాత్రంగానే ఉంది. కూటమి నేతల జోక్యం కారణంగా కొత్తగా యూరియా స్టాక్ వచ్చినా వారి అనుకూల ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో రూ.400 నుంచి రూ.450 వరకూ వెచ్చించి రైతులు బ్లాక్లో కొనుగోలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేట్ దుకాణాలకే యూరియా ఇస్తున్నారు.కె.కోటపాడులో యూరియా కోసం క్యూలో ఉన్న రైతులు (ఫైల్)క్లస్టర్ విధానంతో కొత్త కష్టాలు అన్నదాత పోరుబాటజిల్లాలో ఖరీఫ్ రైతులు 2 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తారు. వీటిలో వరి 1.60 వేల ఎకరాల్లో సాగు చేస్తారు. ఈ ఖరీఫ్లో 20 వేల మెట్రిక్ టన్నులు ఎరువులు వినియోగిస్తారని అంచనా. అయితే జిల్లాలో ఇప్పటివరకూ 12 వేల మెట్రిక్ టన్నులు వరకూ యూరియా ఇచ్చారు. మరో 801 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్ఫెడ్, ప్రైవేట్ సొసైటీలు, రైతు సేవాకేంద్రాలలో అందుబాటులో ఉన్నాయి. వారం రోజుల్లో 1500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రావు వెల్లడించారు. దేవరాపల్లి: అన్నదాతలు ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల కోసం మండల కేంద్రానికి వేళ్లే అవసరం లేకుండా రైతుల చెంతనే అన్నీ అందజేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను తీసుకువచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్పు చేసి తీసుకువచ్చిన క్లస్టర్ విధానంతో అన్నదాతలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. రెండు రైతు సేవా కేంద్రాలను కలిపి క్లస్టర్గా మార్పు చేయడంతో యూరియా, విత్తనాల కోసం రైతులు పక్క ఆర్ఎస్కేలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో భారీ క్యూలైన్లలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరాపల్లి మండలంలో రైతు సేవా కేంద్రాలను 14 క్లస్టర్లుగా మార్పు చేశారు. గరిశింగి, తెనుగుపూడి ఆర్ఎస్కేలను క్లస్టర్గాను, చింతలపూడి, నాగయ్యపేటను మరో క్లస్టర్గా, ఎం.అలమండ, పెదనందిపల్లిని మరో క్లస్టర్గా విభజించారు. ఎ. కొత్తపల్లి, ముషిడిపల్లి ఆర్ఎస్కేలను క్లస్టర్గా, కాశీపురం, రైవాడను క్లస్టర్గా, దేవరాపల్లిలోని రెండు ఆర్ఎస్కేలను మరో క్లస్టర్గా ఏర్పాటు చేశారు. దీంతో ముషిడిపల్లి సచివాలయ పరిధిలోని రైతులకు ఎ.కొత్తపల్లి సచివాలయంలో, కాశీపురం రైతులకు ఎరువులు తీసుకోవాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైవాడ వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. -
విధుల్లో అంకితభావంతో గుర్తింపు
అనకాపల్లి: పోలీస్ శాఖలో అంకిత భావంతో విధులు నిర్వహించినట్టయితే మంచి గుర్తింపు వస్తుందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో సోమవారం జిల్లాలో నలుగురు ఏఎస్ఐలు ఎస్ఐలుగా పదోన్నతి పొందిన ఎం.డి.వై.మొహిద్దిన్, ఆర్.వి.రామనాయుడు, పి.శంకరరావు, ఎం.రాజారావులు ఎస్పీ తుహిన్ సిన్హాను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్ఐగా పదోన్నతి పొందిన ఎస్ఐలు జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో శాంతి భద్రతల పరిరక్షణలో విశేష కృషి చేయడం జరిగిందన్నారు. కొత్తగా పదోన్నతి పొందిన వారు పోలీస్శాఖకు మంచి గుర్తింపు తీసుకువచ్చే విధంగా విధులు నిర్వహించాలని ఎస్పీ కోరారు. -
వాహనం ఢీకొని విరిగిన విద్యుత్ స్తంభం
● దేవరాపల్లిలో రోడ్డుపై తెగిపడిన తీగలు ● అర్ధరాత్రి జనసంచారం లేక పోవడంతో తప్పిన ముప్పు విరిగిన స్తంభాన్ని, రోడ్డుపై తెగిపడిన విద్యుత్ వైర్లను తొలగిస్తున్న సిబ్బందిదేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ విద్యుత్ స్తంభం నేలకొరింది. విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు కొందరు గమనించి స్థానిక విద్యుత్ లైన్మెన్ బి.రాముకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ కూడా సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను మళ్లించి, తెగిన విద్యుత్ వైర్లను తొలగింపజేశారు. విద్యుత్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన విరిగిన స్తంభం స్థానంలో కొత్తది ఏర్పాటు చేశారు. -
సందడిగా సండేస్ ఆన్ సైకిల్స్
తాటిచెట్లపాలెం (విశాఖ): ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, ఈస్ట్కోస్ట్రైల్వేలోని వాల్తేర్ డివిజన్లో ‘సండేస్ ఆన్ సైకిల్స్’ అనే కొత్త కార్యక్రమాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా ప్రారంభించారు. ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ సందర్భంగా డీఆర్ఎం, రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు డీఆర్ఎం నివాసం నుంచి డివిజన్ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముందు, ఈస్ట్కోస్ట్రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు జ్యోత్స్నా బొహ్రా ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని డీఆర్ఎం తెలిపారు. యోగా, జుంబా, స్కిప్పింగ్ రోప్ వంటి కార్యక్రమాలను కూడా ఇందులో భాగం చేశారు. స్పోర్ట్స్ ఆఫీసర్ యం. హరనాథ్ , జనరల్ సెక్రటరీ ఎన్. ఉష ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
ఆలయాలు మూసివేత
చంద్రగ్రహణం కారణంగా దర్శనాలు బంద్ సంప్రోక్షణ అనంతరం నేటి ఉదయం 9 గంటల తర్వాత పునరుద్ధరణ సింహాచలం/నక్కపల్లి/నక్కపల్లి: సంపూర్ణ చంద్రగ్రహాణాన్ని పురస్కరించుకుని సింహాచలంతో సహా ఉమ్మడి విశాఖ జిల్లాలోని దేవాలయాలను ఆదివారం సాయంత్రం మూసివేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం ఆరాధనలు, నిత్య సేవాకాలం పూజలు నిర్వహించిన అనంతరం దర్శనాలను నిలిపివేసినట్టు ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం 9 గంటల తర్వాత మళ్లీ దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు, గరుడాద్రిపై వెలసిన స్వామివారి మూలవిరాట్ ఉన్న ఆలయం, క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి సన్నిధి, ఆండాళ్లమ్మవారి సన్నిధి కోదండ రామాలయంతోపాటు ఉపాలయాలు, బంధుర సరస్సుకు అభిముఖంగా ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు. గ్రహణ మోక్షకాలం అనంతరం సోమవారం వేకువజామున సంప్రోక్షణ కార్యక్రమాలు మొదలవుతాయి. స్వామివారికి నిత్యపూజలు, కై ంకర్యాలు నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఒడ్డిమెట్టలో కై లాసగిరిపై స్వయంభూగా వెలసిన లక్ష్మీగణపతి, నామవరంలోని స్వయంభూ రామలింగేశ్వరాలయం, కుర్తాళం పీఠాధిపతి ప్రతిష్టించిన నాడీ గణపతి ఆలయం, సీతమ్మవారి మెట్టపై ఉన్న ఉమా ధర్మలింగేశ్వరాలను కూడా మూసివేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. నిర్మానుష్యంగా సింహగిరి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సింహగిరి నిర్మానుష్యంగా మారింది. సాధారణంగా ఆదివారం రోజున భక్తులతో రద్దీగా ఉండే సింహగిరి.. గ్రహణం ప్రభావంతో వెలవెలబోయింది. గ్రహణం దృష్ట్యా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలను ఉదయం 11.30 గంటల వరకే కల్పించారు. మధ్యాహ్నం 2.25 గంటలకు ఆలయ కవాట బంధనం చేశారు. అర్చకులు ఆలయ భోగమండపం ద్వారం, రాజగోపురం తలుపులను మూసివేశారు. అంతకుముందు స్వామికి రాజభోగం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పవళింపుసేవ, పౌర్ణమి తిరువీధి, రాత్రి ఆరాధన, పవళింపు సేవలను వరసగా నిర్వహించారు. సంప్రోక్షణ అనంతరం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు సోమవారం ఉదయం 8 గంటల నుంచి తిరిగి ప్రారంభమవుతాయి. -
జూలో కూనల కనువిందు
బ్లూ గోల్డ్ మెకావ్ పిల్లకృష్ణ జింక పిల్లచౌసింగా పిల్లలు ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల సంతానోత్పత్తి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మూడు నెలల కిందట పలు జంతువులు, పక్షులు పిల్లలకు జన్మనివ్వగా, తాజాగా మరికొన్ని వన్యప్రాణులకు పిల్లలు పుట్టాయి. ఇటీవల జూలో రెండు చౌసింగాలు (ఒక మగ, ఒక ఆడ), ఒక మగ కృష్ణ జింక పిల్ల, రెండు బ్లూ గోల్డ్ మకావ్ పక్షులు జన్మించాయని జూ క్యూరేటర్ జి. మంగమ్మ ఆదివారం తెలిపారు. తల్లీపిల్లలు అన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చౌసింగా, కృష్ణ జింక పిల్లలు వాటి ఎన్క్లోజర్లలో తల్లుల చెంత ఉత్సాహంగా ఆడుకుంటూ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. -
నంబరు ప్లేటు మార్చి కోళ్ల వ్యర్థాల తరలింపు
సింహాచలం: వాహ నం నంబర్ ప్లేట్లను మార్చి కోళ్ల వ్యర్థాలను అక్రమంగా త రలిస్తున్న ఐదు వా హనాలను జీవీఎంసీ అధికారులు ఆది వారం గుర్తించారు. పాత అడవివరంలో తనిఖీలు నిర్వహించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోళ్ల వ్యర్థాల రవాణాకు జీవీఎంసీ కొన్ని ప్రత్యే క వాహనాలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. అయితే అనుమతి పొందిన వాహనాల నంబర్ ప్లేట్లను అక్రమంగా ఇతర వాహనాలకు మార్చి రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జీవీఎంసీ వెటర్నరీ అధికారి వాసు, జోన్–8 శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్, సిబ్బంది ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అసలు నంబర్ ప్లేటుపై మరో నంబర్ స్టిక్కర్ అతికించి ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో అప్రమత్తమెన అధికారులు మొత్తం ఐదు వాహనాలను తనిఖీ చేశారు. వాటిలో రెండు వాహనాలకు మాత్రమే అనుమతులు ఉండగా, మిగిలిన మూడు వాహ నాలపై అనుమానం రావడంతో వాటితో సహా మొత్తం ఐదు వాహనాలను ఆరిలోవలోని డంపింగ్ యార్డుకు తరలించి సీజ్ చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
అచ్చెన్న చెరువును కాపాడండి
అచ్యుతాపురం రూరల్: అక్రమంగా తరలించుకుపోతున్న యర్రవరం గ్రామానికి చెందిన అచ్చెన్న చెరువును కాపాడాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత గ్రామంలో ప్రభుత్వ సర్వె నెం.147లో 14 ఎకరాల అచ్చెన్న చెరువులో అక్రమంగా చొరబడి చెరువు మట్టిని తరలించుకుపోతున్న బారీ టిప్పర్ లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన సహజ సంపదను అక్రమంగా దోచుకుంటున్నారని ఆవేదన చెందారు. ఉపాధి హామీ పథకం పనులు చేసుకోవడానికి వీలు లేనంత విధంగా చెరువును నష్టపరుస్తున్నారన్నారు. రాత్రంతా నిధ్రపోకుండా గ్రామస్తులు ప్రభుత్వ చెరువు మట్టి తరలిపోకుండా అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు లారీలను అచ్యుతాపురం పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సాక్షితో మాట్లాడారు. నాలుగు రోజుల నుండి తమ గ్రామానికి చెందిన చెరువు మట్టిని అక్రమంగా తరలించారన్నారు. చెరువుపై ఆధారపడి ఉన్న 200 ఎకరాల పల్లపు పంట పొలాలు నష్టానికి గురౌతాయన్నారు. సుమారు 200 కుటుంబాలు 300 మంది అచ్చెన్న చెరువులోనే ఉపాధి హామీ పనులు చేసి ప్రతి సంవత్సరం జీవనం సాగిస్తున్నారన్నారు. పరిశ్రమలకు, వ్యాపార సముదాయాలకు, లే–అవుట్లకు, ఇంటి నిర్మాణాల్లో, ఖాళీ స్థలాల్లో ఫిల్లింగ్ చేసుకోవడానికి అనుమతులు లేకపోయినా పగలు రాత్రి అన్న తేడా లేకుండా చెరువు మట్టిని అక్రమంగా తరలించడంపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకున్న గ్రామస్తులుమట్టి అక్రమ తవ్వకాలు అరికట్టాలి గ్రామాల్లో కూటమి నాయకులు గ్రావెల్, మట్టి మాఫియాగా తయారయ్యారు. మండలంలో జరుగుతున్న అక్రమ గ్రావల్, మట్టి తవ్వకాలపై అధికారులు కూటమి నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ సంపదను దోచి పెట్టడం సరికాదు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ వనరులను కాపాడాలి. –కరణం ధర్మశ్రీ, వైఎస్ఆర్సీపీ యలమంచిలి సమన్వయకర్త -
పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తా
నర్సీపట్నం: పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని నూతనంగా నియమితులైన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తన కుటుంబానికి మొదటి నుండి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తన సతీమణి అనితకు డీసీసీబీ చైర్పర్సన్గా అవకాశం కల్పించారని, ప్రస్తుతం తనకు పార్టీ రాష్ట్రస్థాయి కమిటీలో అవకాశం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. విశాఖ సిటీలోని విశాఖ నార్త్, దక్షణ నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానన్నారు. ధర్నాను విజయవంతం చేయండి.. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులపై పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 9న ఆర్డీవో కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో ఽచేపడుతున్న ఆందోళను విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజల్లోకి తీసుకువెళ్లి కూటమి నాయకుల తీరును ఎండగట్టేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సన్యాసిపాత్రుడు -
కానరాని కీర్తికుమారి ఆచూకీ...
మునగపాక: ఉమ్మలాడ వద్ద శారదానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన కీర్తికుమారి ఆచూకీ రెండో రోజు కూడా లభ్యం కాలేదు. ఈ నెల 6 తేదీన అనకాపల్లికి చెందిన బుద్ద కీర్తికుమారి ఉమ్మలాడ శారదానదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఎస్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. సంఘటన స్థలాన్ని ఆదివారం సాయంత్రం పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్, యలమంచిలి సీఐ ధనుంజయరావు పరిశీలించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. వారి వెంట ఎస్ఐ ప్రసాదరావు పాల్గొన్నారు. కాగా కీర్తి కుమారి కుటుంబ సభ్యులు శారదానది ఒడ్డున అచేతనంగా వేచి ఉన్న దృశ్యం అందరినీ కంటతడిపెట్టింది. -
అంకంరెడ్డి జమీలు సేవలు చిరస్మరణీయం
నాతవరం: వైఎస్సార్సీపీ రాష్ట్ర సీఈసీ మాజీ సభ్యుడు దివంగత నేత అంకంరెడ్డి జమీలు వర్ధంతి ఆదివారం నాతవరంలో నిర్వహించారు. ప్రధాన కూడలి జంక్షన్లో దివంగత నేత జమీలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. తర్వాత జమీలు కుటుంబీలకుతో కలిసి నాతవరం శ్వశాన వాటికను శుభ్రం చేసి చేతి బోరు ఏర్పాటు చేసి జెడ్పీటీసీ సభ్యులు కాపారపు అప్పలనర్స, సర్పంచ్ గొలగాని రాణి, ఉప సర్పంచ్ కరక అప్పలరాజు ప్రారంభించారు. ఇక్కడ కుళాయిలు ఏర్పాటు కోసం పనులు చేస్తున్నారు. కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంకు డైరెక్టరు అంకంరెడ్డి పార్వతి, వైఎస్సార్సీపీ మండల శాఖ అద్యక్షుడు లగుడు నాగేశ్వరరావు, పామాయిల్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టరు పైల పోతురాజు, నాతవరం–1 ఎంపీటీసీ సభ్యులు కరక రేణుక నాతవరం–2 ఎంపీటీసీ సభ్యులు చెక్కా ప్రభావతి వైఎస్సార్సీపీ మండల యూత్ ఉపాధ్యక్షుడు రుత్తల నాగు, హైస్కూల్ విద్యా కమిటీ మాజీ చైర్మన్ రెడ్డి వరహాలబాబు, పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు చెక్కా జోగిరాజు, మహిళా విభాగం మండల శాఖ అధ్యక్షురాలు పోలుపర్తి రాధ, గ్రామ కమిటీ అధ్యక్షుడు లచ్చబాబు పాల్గొన్నారు. -
గంగపుత్రుల గోడు వినండి
రావికమతం: మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేక సొసైటీని ఏర్పాటు చేసి జీవనోపాధిని కల్పించాలని కోరుతూ ఆదివారం నాయుడు చెరువులో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కొత్తకోటలోని బేరా బాబూరావు, నూకరాజు, లక్ష్మణ్, మోరమెల్ల, ఇంటి నాగేశ్వరరావు కుటుంబాలకు చెందిన 18మంది మత్స్యకారులు రోలుగుంట మండలం కొమరవోలు స్వదేశీ మత్స్యకార సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నారు. గడిచిన ఐదేళ్లుగా సొసైటీ నడవట్లేదు. కల్యాణపులోవ జలాశయంలో చేపల వేట నిషేధంపై కోర్టులో కేసు నడుస్తోంది. చేపల వేట నిలిపివేయడంతో జీవనోపాధిని కోల్పోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. కొత్తకోట పరిధిలో చేపల పెంపకానికి అనువైన చెరువులు ఉన్నాయి. చెరువులో చేపల పెంపకానికి స్థానిక గ్రామ పంచాయతీ పాలకులు అనుమతులు కల్పించాలని చెప్పారు. ప్రత్యేక మత్స్యకార సొసైటీని ఏర్పాటు చేయాలని గత రెండేళ్లుగా సంబంధిత అధికారులను కోరుతున్నా స్పందించడం లేదని, దీంతో తమ జీవనోపాధి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై 2024 ఫిబ్రవరి 12న, మార్చి11న స్పందన కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. దీనిపై అప్పటి జిల్లా కలెక్టర్ విచారణ చేసి ప్రత్యేక సొసైటీ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామని తెలిపారని, 2025 ఆగస్టు 11న పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు మరోమారు వినతి పత్రం ఇచ్చామని, సొసైటీ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు మత్స్యశాఖ అధికారి జి.విజయ సమాచారం ఇచ్చారని, కానీ స్పందన లేదని ఆరోపించారు. అధికారులు తక్షణం సొసైటీ ఏర్పాటు చేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులో మత్స్యకారుల అర్ధనగ్న ప్రదర్శన -
అధికలోడుతో వెళ్తున్న టిప్పర్లు పట్టివేత
రూ.1.82 లక్షలు జరిమానా విధింపునక్కపల్లి: నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడు వేయడమే కాకుండా టోల్ఫీజును ఎగ్గొట్టేందుకు దొడ్డిదారిలో వెళ్తున్న టిప్పర్లపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. మూడు టిప్పర్లను పట్టుకుని రవాణా శాఖ అధికారులకు అప్పగించడంతో వారు ఈ మూడు లారీలకు భారీగా జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే పరవాడ నుంచి కాకినాడ, రాజమండ్రి నుంచి రాంబిల్లి వైపు పెద్ద పెద్ద బండరాళ్లు, ఫైయాష్, ఇసుక లోడుతో ఇటీవల కాలంలో నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు తిరుగుతున్నాయి. ఒక్కో టిప్పర్లో నిబంధనల ప్రకారం 40 టన్నులకు మించి లోడు వేయరాదు. కానీ ఈ ట్రిప్పర్లు 60 నుంచి 70 టన్నుల బరువుతో రాకపోకలు సాగిస్తున్నాయి. వేంపాడు టోల్ప్లాజా వద్ద వీటి బరువు పరిశీలించి అధిక ఫీజు వసూలు చేస్తున్నారు. టిప్పర్ యజమానులు టోల్ఫీజును ఎగ్గొట్లేందుకు దొడ్డిదారిని ఎంచుకున్నారు. నక్కపల్లి, ఉపమాక, చందనాడ, అమలాపురం మీదుగా వేంపాడు జాతీయ రహదారిని చేరుకుని అక్కడ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్తున్నాయి. రాజమండ్రి వైపు నుంచే వెళ్లే వాహనాలు కూడా వేంపాడు, అమలాపురం, చందనాడ, నర్సాపురం, ఉపమాక మీదుగా నక్కపల్లి చేరుకుని రాంబిల్లి వెళ్తున్నాయి. ఆదివారం ఉదయం మూడు టిప్పర్లు అధిక లోడుతో ఉపమాక మీదుగా వేంపాడు వెళ్తుండగా సీఐ కుమార స్వామి, ఎస్ఐ సన్నిబాబు దాడులు చేసి ఉపమాక వద్ద టిప్పర్లను పట్టుకున్నారు. పరిమితికి మించి లోడు వేసినట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నర్సీపట్నం ఎంవీఐకి పంపించగా మూడు లారీల్లో ఒకదానికి రూ.52 వేలు, రెండోదానికి రూ.58 వేలు, మూడో టిప్పర్కు రూ.72వేలు వెరసి మూడు టిప్పర్లకు రూ.1.82 లక్షలు పెనాల్టీ విధించినట్టు సిఐ కుమారస్వామి తెలిపారు. -
కష్టజీవుల పక్షాన ‘అన్నదాత పోరు’
దేవరాపల్లి: యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను అందజేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అనకాపల్లిలో మంగళవారం చేపట్టనున్న ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు కోరారు. యూరియా కొరతతో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. తారువలో ఆదివారం నియోజకవర్గ స్థాయిలో ‘అన్నదాత పోరు’ పోస్టర్ను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుంచి రైతులు అనకాపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం వద్దకు మంగళవారం ఉదయం 9.30 గంటలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని, రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైస్ ఎంపీపీ పంచాడ సింహాచలంనాయుడు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబూరావు, మండల యువజన అధ్యక్షుడు కర్రి సూరినాయుడు, సర్పంచ్లు నాగిరెడ్డి శఠారినాయుడు, దాసరి సంతోష్కుమార్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే..
అనకాపల్లి టౌన్: చోడవరం సబ్ జైలులో డ్యూటీలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రిమాండ్ ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు.. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ కార్యదర్శి నక్కా రవికుమార్ (30), అనకాపల్లి జిల్లా మాడుగులలో ఓ చోరీ కేసులో నిందితుడైన బెజవాడ రాము (26) చోడవరం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. రవికుమార్, రాములకు బెయిల్ మంజూరైనప్పటికీ జామీను దొరకకపోవడం వల్ల జైలు నుంచి విడుదల కాలేదు. వీరిద్దరూ శారదా బ్యారక్లో ఉన్న మరో ఖైదీ ఏక స్వామితో సన్నిహితంగా మెలిగేవారు. ఆయన గతంలో హత్యాయత్నం తదితర కేసులలో నిందితుడు. ‘మీకు ఎప్పటికీ జామీను దొరకదు, పది సంవత్సరాల జైలు శిక్ష తప్పద’ని భయపెట్టి జైలు నుంచి తప్పించుకోవాలని ప్రేరేపించాడు. జైలు సిబ్బంది వయసు మీరినవారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారిలో కేవలం కానిస్టేబుల్ నానాజీ మాత్రమే అప్రమత్తంగా ఉంటాడని చెప్పి, నానాజీ లేని సమయంలో తప్పించుకోవాలని సూచించాడు. హెడ్ వార్డర్ వీర్రాజు రికార్డులు రాయడంలో, వంటగది పనుల్లో రవికుమార్ను ఉపయోగించుకునేవారు. బ్యారక్ గేటు తాళం వేయకుండా ఆయన నిర్లక్ష్యంగా ఉండడం నిందితులు గమనించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వంటగదిలో ఇనుప సుత్తిని తీసుకొని, శుక్రవారం హెడ్ వార్డర్ వీర్రాజుపై దాడి చేశారు. ఇతర సిబ్బందిని గార్డు గదిలో బంధించి ఏఎస్ఐ కృష్ణమూర్తి దగ్గర ఉన్న ప్రధాన గేటు తాళాలు లాక్కొని తప్పించుకున్నారు. వీరు కొత్తూరు జంక్షన్, శివాలయం ఆర్చ్, పీఎస్ పేట మార్గంలో వెళ్లి బస్సులో విశాఖ చేరుకున్నారు. పోలీసులకు దొరక్కుండా మరింత దూరం పారిపోవాలని పథకం వేసుకున్నారు. అందుకు అవసరమైన సొమ్ము సంపాదించడానికి దొంగతనం చేయాలనుకున్నారు. రిమాండ్ ఖైదీలు తప్పించుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసి వాట్సప్ గ్రూప్లు, పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. సీసీ ఫుటేజి సహాయంతో వారు విశాఖ వచ్చినట్లు గుర్తించారు. విశాఖ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, అనకాపల్లి జిల్లా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలించి, శనివారం రామ్నగర్ గొల్లలపాలెం ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో ఖైదీలు రవికుమార్, రాములను పట్టుకున్నారు. జామీను భారం తగ్గించమని న్యాయస్థానాన్ని కోరేందుకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సహాయం కోసం తాను పెట్టుకున్న అర్జీని హెడ్ వార్డర్ వీర్రాజు తొక్కి పెట్టారని, ఆ కోపంతో తాను ఆయనపై సుత్తితో దాడి చేశానని నిందితుడు రవికుమార్ వెల్లడించినట్టు ఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.శ్రావణి, చోడవరం ఎస్ఐ బి.కార్తీక్, జిల్లా సబ్ జైల్ ఇన్చార్జ్ ఆఫీసర్ డి.రాజు, తదితరులు పాల్గొన్నారు. -
తిరగని బస్సు.. ప్రయాణికులు కస్సుబుస్సు
కృష్ణారాయుడుపేట వద్ద 2 నెలల క్రితం కుంగిన కల్వర్టు ● దేవరాపల్లి నుంచి కొత్తవలస మీదుగా రాకపోకలు బంద్ ● మూడు జిల్లాల ఆర్టీసీ ప్రయాణికులకు అవస్థలు ● విశాఖ నుంచి కృష్ణారాయుడిపేట వరకే కొన్ని 12 డి బస్సు సర్వీసులు ● దేవరాపల్లి, ఆనందపురం నుంచి ఆటోల్లో చేరుకోవాల్సిన దుస్థితి ● అసలే అరకొరగా సర్వీసులు.. ఆపై సమయానికి రాని పరిస్థితి సమస్య ఇది.... దేవరాపల్లి నుంచి కొత్తవలస మీదుగా విశాఖపట్నం వెళ్లే మార్గంలో కృష్ణారాయుడుపేట సమీపంలో కల్వర్టు కుంగిపోవడంతో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో నడిచే 12 డీ, 68 డీ ఆర్టీసీ బస్సు సర్వీసులను జూలై 21 నుంచి ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. సుమారు రెండు నెలలు కావస్తున్నా కుంగిన కల్వర్టుకు మరమ్మతులు లేదా పునఃనిర్మాణ పనులు చేపట్టలేదు. దీంతో నిత్యం పదుల సంఖ్యలో బస్సులు, అధిక సంఖ్యలో ప్రయాణికులతో కళకళలాడే దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ కళాహీనంగా మారింది. దేవరాపల్లి: ఆర్టీసీ ప్రయాణికుల బస్సు కష్టాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు కుంగిన కారణంగా బస్సు సర్వీసులను నిలిపివేసి సుమారు రెండు నెలలు కావస్తున్నా సమస్యకు పరిష్కార మార్గం చూపకపోవడంతో తీవ్రంగా మండిపడుతున్నారు. వెరసి అనకాపల్లి, అల్లూరి, విజయనగరం జిల్లాలకు చెందిన వందలాదిమంది ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నరకయాతన అనుభవిస్తున్నారు. సీ్త్రశక్తి పథకం పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం బస్సులను పునరుద్ధరించడంపై దృష్టి సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అరకొర బస్సులతో మహిళలు సైతం నానా ప్రయాస పడుతున్నారు. కృష్ణారాయుడుపేట వరకే 12 డి బస్సులు విశాఖ నుంచి వచ్చే కొన్ని 12 డి బస్సులను కృష్ణారాయుడుపేట సమీపంలో కుంగిన కల్వర్టు వరకు మాత్రమే నడిపిస్తున్నారు. దీంతో కొత్తవలస వైపు వెళ్లే ప్రయాణికులు దేవరాపల్లి నుంచి కృష్ణారాయుడుపేట వరకు ఆటోల్లో చేరుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. అలాగే విశాఖపట్నం నుంచి ఆనందపురం, దేవరాపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కృష్ణారాయుడుపేట వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి ఆటోల్లో రాకపోకలు సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వాహనాదారులు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నట్లు పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యామ్నాయంగా కొన్ని 12 డి బస్ సర్వీసులను రూట్ మళ్లించి ఆనందపురం, కె.కోటపాడు, పినగాడి, పెందుర్తి మీదుగా విశాఖపట్నానికి నడుతున్నప్పటికీ ప్రయాణ సమయం అధికమవ్వడంతో ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ బస్సులైనా సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. గతంలో ప్రతి 15 నిముషాలకు 12 డి బస్సు సమయానికి రాకపోకలు సాగించి ఆర్టీసీకి అధిక ఆదాయాన్ని చేకూర్చేది. ప్రస్తుతం అసలే అరకొరగా బస్సులు నడుస్తుండగా అవి కూడా ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి దాపరించింది. సాయంత్రం ఏడు దాటితే బస్సులు రావడం గగనంగా ఉంది. దీంతో ప్రయాణికులు, ఉద్యోగులు, దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. కల్వర్టు నిర్మాణానికి జీవీఎంసీ నుంచి రూ. 90 లక్షలు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ప్రకటించి రెండు నెలలు కావస్తున్నా నేటికీ పనులు కార్యరూపం దాల్చలేదు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం సీ్త్రశక్తి పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా బస్సులు నడపకపోవడంతో ఈ ప్రాంత మహిళలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి కల్వర్టును నిర్మించడంతోపాటు గతంలో మాదిరిగా కొత్తవలస మీదుగా యథావిధిగా బస్సులు నడిపి ప్రజల ప్రయాణ కష్టాలు తీర్చాలి. –గొర్రుపోటు రమాదేవి, మహిళ, దేవరాపల్లి కల్వర్టు కుంగి రెండు నెలలైనా.. కృష్ణారాయుడుపేట సమీపంలో కూలిన కల్వర్టును తక్షణమే పునఃనిర్మించాలి. ప్రస్తుతం అరకొరగా బస్సులు నడుపుతున్నా అవి కూడా సకాలంలో రాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారిలో కల్వర్టు కుంగి సుమారు రెండు నెలలు కావస్తున్నా పట్టించుకోక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. –డి.వెంకన్న, సీపీఎం నేత, దేవరాపల్లి -
రైతులకు సంపూర్ణ స్థాయిలో యూరియా సరఫరా చేయాలి
చోడవరం: జిల్లాలో రైతులకు అవసరమైనంత యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చోడవరంలో ఏపీ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్రి అప్పారావు, జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న ఆదివారం విలేరులతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నప్పటికీ గ్రామాల్లో ఎక్కడా రైతులకు పూర్తిస్థాయిలో యూరియా ఎరువులు అందడం లేదని వారు ధ్వజమెత్తారు. జిల్లాలో 891మెట్రిక్ టన్నులుఅందుబాటులో ఉందని, మరో 1500 మెట్రిక్ టన్నులు అవసరమౌతాదని అధికారులే చెబుతున్నప్పటికీ ఆ స్థాయిలో యూరియా సరఫరా కాలేదన్నారు. అధికారిక లెక్కలు ప్రకారం ఇంత యూరియా అందుబాటులో ఉంటే ఎందుకు రైతులకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. రైతు సేవాకేంద్రాలు, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మరింత ఎక్కువ యూరియాను సరఫరా చేసి రైతులకు విక్రయించాలని వారు డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్ షాపులపై దాడులు చేయాలన్నారు. రైతులకు అవసరమైనంత యూరియా సరఫరా చేయకపోతే రైతుల నుంచి ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. -
సంఘటిత పోరాటాలకు కార్మికులంతా సిద్ధం కావాలి
చోడవరం: సంఘటిత పోరాటాలకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి. నాగేశ్వరరావు పిలుపిచ్చారు. సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియూ)13వ జిల్లా మహాసభలు చోడవరంలో రెండ్రోజులుగా జరుగుతున్నాయి. ఈ మహాసభలు ఆదివారం ముగిశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలపై అనుసరిస్తున్న వైఖరి, కార్మికుల ఉద్యమాలపై ఈ సభల్లో చర్చించారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మిక వర్గాలపై తీవ్ర దాడులకు పాల్పడుతున్నాయని, దీనిని అంతా తిప్పి కొట్టాలన్నారు. భవిష్యత్ ఉద్యమాలు మరింత తీవ్ర తరం చేయాలన్నారు. ఇప్పటికే పనిగంటలు పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడం, కాంట్రాక్టు కార్మికులను అప్కాస్ రద్దు చేసి ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులపై దాడిని ఎక్కుపెట్టిందన్నారు. అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక కార్మికుల సమస్యలపై మరింత ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫార్మా, ఎస్ఈజెడ్లలో కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేవని ప్రమాదాల నివారణలకు యజమాన్యాలు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో కార్మికులకు అండగా సీఐటీయూ ఎప్పుడూ నిలుస్తుందన్నారు. స్టీల్ప్లాంట్ ఉద్యమానికి సీఐటీయూ తన వంతు భాగస్వామ్యం అందించిందన్నారు. భవిష్యత్ పోరాటాలకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఈ మహాజనసభలో తీర్మానించారు. 28 తీర్మానాలతో కార్యదర్శి నివేదికను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో సీఐటీయు నాయకులు లోకనాథం, జి. కోటేశ్వరరావు, ఆర్. శంకరరావు, వి.వి.శ్రీనివాసరావు, ఎ.రాజు, గూనూరు వరలక్ష్మి, ఎస్.వి.నాయుడు, గనిశెట్టి సత్యనారాయణ, ప్రేమ చంద్రశేఖర్, పాల్గొన్నారు. -
ఏఎంఏఎల్ కళాశాలకు పూర్వవైభవం రావాలి
అనకాపల్లి టౌన్: ఏఎంఎఎల్ కళాశాలకు పూర్వవైభవం తీసుకురావాలనని ఏఎంఏఎల్ కళాశాలలో 1973 నుంచి 2021 వరకు చదివిన పూర్వ విద్యార్థులంతా ఆకాంక్షించారు. కళాశాల సమీపంలో ఒక ప్రెవేట్ పంక్షన్ హాల్లో పూర్వవిద్యార్థుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదికవి నన్నయ్య మాజీ వైస్ చాన్సలర్ ముర్రు ముత్యాల నాయుడును ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలకు మూల స్తంభాలు అని కొనియాడారు. ప్రభుత్వాలపై ఆధారపడకుండా ఉన్న ఈ కళాశాలలో చదువుకున్న వారు ప్రభుత్వ ఉద్యోగులుగా, వైద్యులుగా ఉన్నత స్థానాలలో స్ధిరపడ్డారని అటువంటి వారి కలయిక కళాశాల భవిష్యత్కు దోహదపడాలని సూచించారు. ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ ఇదే కళాశాలలో చదువుకున్న తాను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు టి.రఘుబాబు, కళాశాల అధ్యక్షుడు శ్రీదరాల కృష్ణ ప్రేరాజు, కరస్పాడెండ్ పెంటకోట శ్రీనివాసరావు, పూర్వ విద్యార్థులు వంకాయల శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎడాపెడా ట్రాఫిక్ చలానాలు
మునగపాక: ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులపై పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. గతంలో కన్నా పెద్ద మొత్తంలో జరిమానాలు విధించడంతో వాహన దారులు బెంబేలెత్తుతున్నారు. ఎడాపెడా ట్రాఫిక్ చలానాలు వేసేయడంతో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలపై పెదవి విరుస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారితో పాటు కూలీ పనులు చేసుకునే వారిపై పెనుభారం మోపుతున్నారంటూ వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చట్టాలు అందుబాటులోకి తీసుకురావడం తప్పులేదంటూనే జరిమానాలు భారీగా విధించడం పట్ల ప్రయాణాలు చేసే వారు విమర్శలు గుప్పిస్తున్నారు. తరుచూ వాహన తనిఖీలు వాహన నియమాలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. ప్రతిరోజూ మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూడిమడక రోడ్డులో రాకపోకలు సాగించే వాహనాలను తనిఖీ చేయడంతో పాటు రికార్డులు పరిశీలిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు ట్రాఫిక్ నియమాలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నా కొంతమంది వాహన చోదకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పోలీసులు అటువంటి వారిపై జరిమానాలు విధిస్తున్నారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా భారీ జరిమానాలు విధించడం పట్ల వాహనచోదకులు ఆవేదన చెందుతున్నారు. ప్రమాదాల నివారణకు సహకరించాలి ప్రతి వాహనదారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, రోడ్డు ప్రమా దాల నివారణకు అవగాహన కల్పిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. ప్రతి వాహనదారు తప్పనిసరిగా రికార్డులు అందుబాటులో ఉంచుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడిపినా చర్యలు తప్పవు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. –పి.ప్రసాదరావు, ఎస్ఐ, మునగపాక మోటార్ వాహన చట్టం ఈ ఏడాది మార్చి నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం జరిమానాలు ఇలా.... హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1000 సీటు బెల్ట్ లేకుండా కారు నడిపితే రూ.1000 సిగ్నల్ జంప్తో పాటు రాంగ్ రూట్లో ప్రయాణిస్తే రూ.1000 డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే రూ.10వేలతో పాటు లైసెన్స్ రద్దు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే తొలిసారిగా రూ.1000 , రెండో సారైతే రూ.10వేలు చెల్లించాలి. ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే తొలిసారిగా రూ.2వేలు, రెండో సారైతే రూ.4 వేలు చెల్లించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5వేలు జరిమానా బైక్పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1000 యూనిఫాం లేకుండా ఆటో నడిపే డ్రైవర్కు రూ.300 ద్విచక్ర వాహనం వెనుక కూర్చొన్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి. అలా లేకుంటే రూ.1000 జరిమానా చెల్లించాలి. 108 వాహనంతో పాటు అత్యవసర వాహనాలకు దారివ్వకుంటే రూ.10వేలు -
అందరికీ యూరియా అందేలా చర్యలు
కలెక్టర్ విజయ కృష్ణన్ కశింకోట: అర్హులైన రైతులందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ విజయ కృష్ణన్ చెప్పారు. వెదురుపర్తి గ్రామంలో ఆదివారం పర్యటించి అక్కడి రైతు సేవా కేంద్రంలో రైతులతో సమావేశమయ్యారు. ఎరువుల పంపిణీ జరుగుతున్న తీరును, వాటిలో ఎదురయ్యే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 1500 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువు నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో యూరియా లభ్యత కోసం ప్రతి గ్రామంలో తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో మూడు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మోతాదుకు మించి ఎరువులు వినియోగిస్తే దోమపోటు, పొడ తెగులు వంటి చీడ పీడల తాకిడి పెరిగే అవకాశం ఉందన్నారు. దీని దృష్ట్యా అధికారులు సూచించిన మేరకు యూరియా వినియోగించాలన్నారు. ఎవరైనా అధిక ధరలకు యూరియా విక్రయిస్తే సమీపంలోని మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలన్నారు. ఆర్డీవో షేక్ ఆయిషా, జిల్లా వ్యవసాయాధికారి బి.మోహనరావు, మండల ప్రత్యేక అధికారి సుభాషిణి, తహసీల్దార్ సీహెచ్.తిరుమలరావు, ఎంపీడీవో ధర్మారావు, మండల వ్యవసాయ అధికారి ఎం.స్వప్న పాల్గొన్నారు. -
అనకాపల్లి: ఖైదీల పరారీ కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
సాక్షి, అనకాపల్లి: చోడవరం జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పరారీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి కీలక వస్తున్నాయి. జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఖైదీలు పరారీ అయినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా వెల్లడించారు. ఖైదీలు తప్పించుకోవడానికి సహాయం చేసిన మరో ఖైదీపై కేసు నమోదు చేశారు.చోడవరం సబ్ జైలు నుంచి పరారైన ఖైదీలను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు ఖైదీలను విశాఖలో గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి సహకరించిన రిమాండ్ ఖైదీ ఏకస్వామిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు విచారణ చేపట్టారు.సినీ ఫక్కీలో వార్డెన్పై దాడి చేసి.. సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారైన సంగతి తెలిసిందే. ఐదుగురు జైలు వార్డర్లు, రక్షణ గేట్లు తప్పించుకుని వారు పారిపోయారు. పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో పంచాయతీ సెక్రటరీ నక్కా రవికుమార్, చోరీ కేసులో ఖైదీలుగా అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలులో ఉన్నారు. వీరిద్దర్నీ జైలులో ఖైదీలకు వంట చేయడానికి వినియోగిస్తున్నారు. రోజూలాగే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సబ్ జైలులో వంట చేసేందుకు వీరిని జైలు గదిలోంచి బయటకు తీసుకొచ్చారు. వంటకు ఉపక్రమించే సమయంలో ముగ్గురు వార్డర్లు లోపల, ఒక వార్డరు మెయిన్ గేటు వద్ద సబ్ జైలర్ తన గదిలో విధి నిర్వహణలో ఉన్నారు.ఆ సమయంలో నక్కా రవికుమార్ మెయిన్ గేటుకు లోపల గ్రిల్ గేటుకు మధ్య విధి నిర్వహణలో ఉన్న వార్డర్ వీర్రాజుపై సుత్తితో దాడి చేశాడు. అనంతరం ఆయన జేబులో ఉన్న తాళాలు లాక్కొని.. మెయిన్ గేటు తాళం తీసి పారిపోతుండటం చూసి, మరో ఖైదీ రాము కూడా పరారయ్యాడు. పారిపోతున్న వారిని పట్టుకునేందుకు జైలు వార్డర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణ మీదుగా ఖైదీ లు మెయిన్ రోడ్డుకు చేరుకుని పరారయ్యారు. అనంతగిరి మండలం బోకూరు పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఈ ఏడాది ఏప్రిల్లో పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో రవికుమార్ కు పాడేరు కోర్టు రిమాండ్ విధించించింది. బెజవాడ రాము ఈ ఏడాది జులై 23వ తేదీన మాడుగులలో దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు
యలమంచిలి రూరల్ : పట్టణానికి సమీపంలో మర్రిబంద బీపీసీఎల్ పెట్రోల్ బంక్ ఎదురుగా 16వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడ్డారు. విశాఖపట్నం కోరమాండల్ ఫెర్టిలైజర్స్లో పనిచేస్తున్న ఆర్.వంశీ భార్య సునీత, ఇద్దరు కుమారులతో విజయవాడ ఆటోనగర్లో మృతి చెందిన బంధువు కుటుంబీకులను పరామర్శించేందుకు విశాఖపట్నం నుంచి కారులో బయలుదేరారు. యలమంచిలి మండలం మర్రిబంద సమీపంలో పెట్రోల్ బంకు ఎదురుగా వచ్చేసరికి వీరు ప్రయాణిస్తున్న కారును ఒక ద్విచక్రవాహనాన్ని తప్పించడానికి అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో రోడ్డు పక్కగా ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. కారు దూసుకెళ్లిన ప్రాంతంలో ఒక కల్వర్టు కూడా ఉండడంతో కారు ముందుభాగం నుజ్జయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బ్యాగ్లు తెరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారు ఎడమవైపు భాగం దెబ్బతినడంతో ముందు సీట్లో కూర్చున్న వంశీ భార్య సునీత తలకు తీవ్ర గాయమైంది. భర్త వంశీ స్వల్పంగా గాయపడ్డారు. వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు కుమారులు గౌతమ్, మోక్షిత్ సురక్షితంగా ఉన్నారని వంశీ సాక్షికి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్సులో గాయపడిన భార్యాభర్తలిద్దర్నీ అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి అక్కడ్నుంచి విశాఖ రాంనర్ కేర్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించామన్నారు. -
బాధితురాలికి పోగొట్టుకున్న వస్తువుల అప్పగింత
అచ్యుతాపురం రూరల్ : పోగొట్టుకున్న వస్తువులను బాధితురాలికి స్థానిక పోలీసులు అందజేశారు. సీఐ నమ్మి గణేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాంబిల్లి మండలానికి చెందిన కందూరు సత్యవతి శనివారం ఉదయం 11 గంటల సమయంలో అచ్యుతాపురం కూడలిలోని జ్యూస్ షాప్ వద్ద 20 తులాల వెండి పట్టీల పర్సును పోగొట్టుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల సహాయంతో పోగొట్టుకున్న వస్తువులను గుర్తించారు. ఆమెకు పట్టీలు, ఇతర సామాన్లు అప్పగించినట్టు సీఐ తెలిపారు. సత్యవతికి పోగొట్టుకున్న వెండి వస్తువులు అందిస్తున్న సీఐ -
భవిష్యత్ పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలి
చోడవరం: సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ పోరాటం చేస్తోందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నరసింహారావు పేర్కొన్నారు. స్థానిక గంగా ఫంక్షన్ హాలులో శనివారం జిల్లా మహాసభలను ఆయన ప్రారంభించారు. అనంతరం పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులపై మోదీ ప్రభుత్వ దాడిని తిప్పి కొట్టడాన్ని కార్మిక వర్గం మరింత చైతన్యవంతంగా ముందుకు సాగాలన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ రక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటాన్ని ఆయన కొనియాడారు. జిల్లాలో కనీస వేతనాలు, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేదన్నారు. వలస కార్మిక చట్టం కోసం సీఐటీయూ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పీ–4 పేరుతో పేదలను బంగారు కుటుంబాలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ●గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఆధునికీకరించి, కార్మికులు, రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గూనురు వరలక్ష్మి సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. సహకార రంగంలో నడుస్తున్న ఏకై క సుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ ప్రాంత రైతుల భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. ప్రభుత్వం రూ.100 కోట్లు గ్రాంటుగా అందజేసి, ఆధునికీకరించి, రైతులు, కార్మికులకు రూ.30 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మహాసభల్లో అధ్యక్ష వర్గంగా కె.లోకనాథం, గూనురు వరలక్ష్మి, వి.వి.శ్రీనివాసరావు, దుర్గారాణి వ్యవహరించగా, సీఐటీయూ నాయకులు సత్తిబాబు, మళ్ల సత్యనారాయణ, ఎ.బాలకృష్ణ, జయలక్ష్మితో పాటు సీతారామ్ ఏచూరి, అచ్యుతానంద్తో పాటు ఇటీవల మృతి చెందిన కార్మిక నాయకులకు శ్రద్ధాంజలి ఘటించారు. యూనియన్ నాయకులు ఆర్.రాము, గనిశెట్టి సత్యనారాయణ, నాగశేషు, రుపాదేవి, సత్యవతి, త్రినాథు, నాగిరెడ్డి సత్యనారాయణ, ఎస్వీ నాయుడు, చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ టు అమరావతి ఆటోడ్రైవర్ పాదయాత్ర
నక్కపల్లి : ఆటోడ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్న ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ విశాఖపట్నానికి చెందిన ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీను విశాఖపట్నం నుంచి అమరావతికి పాదయాత్ర చేపట్టాడు. శనివారం నక్కపల్లి చేరుకున్న శ్రీనుకు ఆటో డ్రైవర్లు స్వాగతం పలికారు. అతనితో పాటు, కొద్ది దూరం పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా శ్రీను మాట్లాడుతూ ఎన్నో కష్టాలు వ్యయప్రయాసలు పడుతూ ప్రాణాలను ఆటోడ్రైవర్లు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. సరైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న తమపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. దీంతో మహిళలెవరూ ఆటోలో ప్రయాణించకపోవడం వల్ల పూర్తిగా ఆదాయం కోల్పోయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ పథకానికి ప్రత్యామ్నాయం అలోచించి ఆటోడ్రైవర్ల ఉపాధి దెబ్బతినకుండా చూడాలని, డ్రైవర్లను ఆదుకోవాలని కోరుతున్నాను. ఆటోడ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో విశాఖపట్నం నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేస్తున్నానన్నాడు. అడ్డురోడ్డు చేరుకున్న పాదయాత్ర ఎస్.రాయవరం: మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీను తలపెట్టిన పాదయాత్ర శనివారం ఉదయం అడ్డురోడ్డు చేరుకుంది. మండలంలో ఉన్న ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీనుకు పండ్లు, పండ్ల రసాలు అందజేశారు. పలు ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు ఆయనను సత్కరించి కొంత దూరం పాదయాత్ర చేసి సాగనంపారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, సింహాచలం, రమణ, మోహన్, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం తప్పని తిప్పలు
రావికమతం: యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉంది. డిమాండ్ తగ్గ యూరియా సకాలంలో రాకపోడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు వేసిన తరువాత వరి ఎదుగుదలకు యారియా సకాలంలో తప్పనిసరిగా వేయాలి. ఈ తరుణంలో రైతులు యారియాం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొత్తకోట పీఏసీఎస్ 12 టన్నులు యారియా మాత్రమే వచ్చింది. ఆధార్ కార్డ్, పాసుబుక్ జెరాక్స్ ఉన్న రైతుకు ఎకరానికి బస్తా మాత్రమే ఇస్తున్నారు. కొత్తకోట పీఏసీఎస్ వద్దకు యారియా కోసం రైతులు ఎక్కువగా రావడంతో రైతు సేవా కేంద్రం సిబ్బంది, సహకార సంఘం సిబ్బంది, మహిళా పోలీసుల సహాయంతో పంపిణీ చేశారు. దేవరాపల్లి: మండలంలో శనివారం బోయిలకింతాడ, ఎ.కొత్తపల్లి రైతు సేవా కేంద్రాలు, దేవరాపల్లి మన గ్రోమోర్ షాపు వద్ద పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. మన గ్రోమోర్ షాపునకు అధిక సంఖ్యలో రైతులు తరలిరావడంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసింది. కొంత మంది నుంచి మాత్రమే ఆధార్, వన్బీ ధ్రువపత్రాలు తీసుకొని, మిగతా వారు మరుసటి రోజు రావాలని అధికారులు సూచించడంపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే పనులు మానుకొని వచ్చామని, మళ్లీ ఒక్క బస్తా కోసం రావాలంటూ ప్రశ్నించారు. బోయిలకింతాడలో ఉదయం నుంచి రైతులు అధిక సంఖ్యలో ఎగబడ్డారు. ఎంత విస్తీర్ణం ఉన్నా ఒక బస్తా మాత్రమే పంపిణీ చేయడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎ.కొత్తపల్లి రైతు సేవా కేంద్రంలో ముషిడిపల్లి, కొత్తూరు ముత్యాలమ్మపాలెం, యండపల్లిపాలెం రైతులకు ఆధార్, వన్బీ ధ్రువపత్రం ఆధారంగా పోలీసుల సమక్షంలో పంపిణీ చేశారు. ఒక్క బస్తా కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడంపై పలువురు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కె.కోటపాడు : బస్తా యూరియా కోసం కె.కోటపాడు రైతు సేవా కేంద్రానికి శనివారం ఉదయం 6 గంటల నుంచే రైతులు వేచి ఉన్నారు. మండలంలో కె.కోటపాడు, గుల్లేపల్లి, మేడిచర్ల గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో 32 టన్నుల యూరియా వచ్చింది. క్యూలో ఉండి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గంటల కొద్ది వేచి ఉండాల్సి వచ్చింది. గతంలో యూరియా కోసం ఇటువంటి ఇబ్బందులు పడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
యూరియా కొరత లేకుండా చేస్తాం..
పి.కె.గూడెం పీఏసీఎస్లో రైతులతో మాట్లాడుతున్న మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్, ఏవో నాతవరం: ఖరీఫ్ సాగుకు సంబంధించి రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తామని మండల ప్రత్యేకాధికారి మంగవేణి తెలిపారు. ‘రైతుకు ఒకే ఒక బస్తా’ శీర్షికతో ఈ నెల 6న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండలంలో పి.కె.గూడెం పీఏసీఎస్ను శనివారం ఆమె తహసీల్దార్ వేణుగోపాల్, మండల వ్యవసాయాధికారి సుగుణ సందర్శించారు. యూరియా నిల్వలను పరిశీలించారు. రైతులతో సమావేశమై వరి పంట సాగుకు సంబంధించి యూరియాతో పాటు అన్ని రకాలు ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం 12 టన్నుల యూరియా సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో రామారావు, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కె.సత్యనారాయణ పాల్గొన్నారు. -
పాము కాటుతో యువకుడి మృతి
దేవరాపల్లి : మండలంలోని ఎం.అలమండ గ్రామానికి చెందిన బుడ్డ శ్రీను(28) పాము కాటుకు గురై మృతిచెందాడు. మృతుడు తండ్రి గోవింద తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీను శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి బహిర్భూమికి వెళ్లగా ఎడమ కాలిపై విష సర్పం కాటు వేసింది. పాము కాటుకు గురైన శ్రీను కేకలు వేయడంతో వెంటనే అతడి స్నేహితులు స్పందించి ద్విచక్ర వాహనంపై కె.కోటపాడు సీహెచ్సీకి తరలించారు. కాగా అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి గోవింద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ పి. సత్యనారాయణ శనివారం తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు చెల్లెలు రమ్య ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు అర్ధంతరంగా మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వర్షాకాలం కావడంలో పాము సంచరించే ప్రమాదం ఉన్నందున రాత్రి సమయాల్లో పొలాలు, బహిర్భూకి వెళ్లే సమయంలో టార్చి లైట్లు వెంట తీసుకువెళ్లాలని మండల ప్రజలకు ఎస్ఐ సత్యనారాయణ సూచించారు. -
డిప్యూటీ సీఎం పవన్ మాటల్లో నిజాయితీ కరువు
దేవరాపల్లి: గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపుతామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మాటల్లో నిజాయితీ కొరవడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న విమర్శించారు. ఈ మేరకు దేవరాపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక గిరిజన గ్రామాల్లో చేపట్టిన రోడ్డు పనులకు బిల్లులు ఇవ్వక పోగా, కొత్తగా రోడ్లు మంజూరు చేయలేదన్నారు. దేవరాపల్లి మండలంలో చింతలపూడి పంచాయతీ శివారు బోడిగరువు, నేరెళ్లపూడి రహదారి వర్షాలకు కొట్టుకుపోవడంతో గిరిజనుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. వి.మాడుగుల మండలం అజయపురం గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ కూలి పనికి వెళ్లి కట్టెల వంతెన దాటబోయి కాలు జారి గెడ్డలో పడి చనిపోయిందన్నారు. అజేయపురానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానిక గిరిజనులు పలుమార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆదివాసీ మహిళ మచ్చమ్మ చనిపోయిందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా పవన్కల్యాణ్ స్పందించి బోడిగరువు, నేరెళ్లపూడి, అజయపురంతో పాటు శంకరం పంచాయతీలోని ఏడు గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాలని వెంకన్న కోరారు. -
శారదానదిలోకి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
శారదానదిలో గాలిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం, (ఇన్సెట్) గల్లంతైనకీర్తికుమారి(ఫైల్) మునగపాక : మండలంలోని ఉమ్మలాడ శారదానదిలో శనివారం ఓ యువతి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. యువతి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ పి.ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. అనకాపల్లికి చెందిన బుద్ద కీర్తి కుమారి అనకాపల్లి బెల్లం మార్కెట్లోని వైశ్యా బ్యాంక్లో పని చేస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఆమె మునగపాక మండలం ఉమ్మలాడ శారదానదిలో దూకి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అగ్ని మాపక శాఖ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు రాత్రి 8 గంటల వరకూ వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. కాగా కీర్తికుమారి ఆత్మహత్యాయత్నంకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. -
క్రైస్తవులను మోసగించిన కూటమి ప్రభుత్వం
మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్వెస్లీ అనకాపల్లి : రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీ సెల్ని నేటి వరకూ ఏప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, వైఎస్సార్సీపీ పాలనలో ఏర్పాటు చేయడంతో కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్వెస్లీ అన్నారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పీఎస్ఎస్ జోసఫ్ అధ్యక్షతన శనివారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ జిల్లాలో 29 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనిలో క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఒక విభాగమన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో గద్దెనెక్కి క్రైస్తవులను మోసం చేసిందన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను అణచి వేయాలని చూస్తే కూటమి ప్రభుత్వానికి అంతం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సెల్ అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం అధ్యక్షులు సన్నీజేమ్స్, తిమోతి నాయుడు, బేతిరెడ్డి విజయ్ కుమార్, సువార్త రాజు, పడాల గంగరాజు, జిల్లాలో పాస్లర్లు పాల్గొన్నారు. -
ఓనం.. సుమధురం
దేవరాపల్లి : మండలంలోని కై రళి హైస్కూల్లో ఓనం పండగను సంప్రదాయబద్ధంగా శనివారం నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ ఎంకె.దినేష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మండల విద్యాశాఖ అధికారి సిహెచ్.ఉమ, ఎస్ఐ వి.సత్యనారాయణ ముఖ్యఅథితులుగా పాల్గొన్నారు. స్థానిక విద్యార్దులు, మహిళా ఉపాధ్యాయులు కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. కేరళ సంస్కృతికి అద్దం పట్టే ఓనం పండుగను పురస్కరించుకొని విద్యాలయం ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్ధిని, విద్యార్దులు కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి కేరళ గీతాలకు చేసిన నృత్య ప్రదర్శన అబ్బుర పరిచింది. విద్యార్థుల పులివేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
మరోసారి బయటపడ్డ టీడీపీ వర్గ విబేధాలు
బుచ్చెయ్యపేట: మండలంలో టీడీపీ వర్గ విబేధాలు మరోసారి బయట పడ్డాయి. భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో వడ్డాది పెద్దేరు నదిపైన, విజయరామరాజుపేట తాచేరు నదిపై కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు మరమ్మతు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబుకు తీవ్ర అవమానం జరిగింది. ఆయన రాక ముందే ఎమ్మెల్యే రాజు ఆయా పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్యబాబు సొంత గ్రామమైన వడ్డాదిలో డైవర్షన్ రోడ్డుకు ముందుగా శంకుస్థాపన చేశారు. అయితే ఆయన రాక ముందు ఎమ్మెల్యే రాజు టీడీపీ నాయకులతో కలిసి భూమి చేశారు. తరవాత వచ్చిన తాతయ్యబాబు కొబ్బరికాయ కొట్టారు. ఇద్దరూ కనీసం పలకరించుకోలేదు. విలేకరులతో మాట్లాడిన వెంటనే ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అప్పుడూ కూడా పలకరించలేదు. గత ఏడాదిన్నరగా ఎమ్మెల్యే రాజు, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల మధ్య వర్గ విబేధాలు కొనసాగుతున్నాయి. టీడీపీలో రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇప్పటికే వడ్డాదిలో తాతయ్యబాబు వెనకాల ఉన్న నాయకులందరిని ఎమ్మెల్యే రాజు తనవైపు లాక్కోని తాతయ్యబాబును ఒంటరి చేయాలని పావులు కదుపుతున్నట్లు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇటీవల తాతయ్యబాబు కుమారుడి నిశ్చితార్థానికి వెళ్లిన కొంత మంది టీడీపీ నాయకులకు ఎమ్మెల్యే రాజు స్వయంగా ఫోన్ చేసి ఎందుకు వెళ్లినట్టు నిలదీసినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే రాజు, తాతయ్యబాబుల మధ్య విబేధాలు ఏ స్థాయికి చేరాయో తెలుస్తుందని పలువురు టీడీపీ, కూటమి నేతలే చర్చించుకుంటున్నారు. ఈ శంకుస్థాపన విషయంలో ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతుందని కొంత మంది కూటమి నేతలు భావించారు. అయితే ఇప్పటికే వడ్డాది, విజయరామరాజుపేట వంతెనలు, డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయి ప్రజలు ఆగ్రహాంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో టీడీపీలో ఘర్షణలు పడితే ప్రజలు ఛీ కొడతారని ఇరువర్గాలవారు చల్లన జారుకున్నారు. వడ్డాది డైవర్షన్ రోడ్డు పనులకు రూ.8 లక్షలు, విజయరామరాజుపేట డైవర్షన్ రోడ్డు పనులకు రూ.18 లక్షలు మంజూరయ్యాయి. -
ఉద్యోగులమా..వలంటీర్లమా?
● సచివాలయ ఉద్యోగుల నిరసన మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులు యలమంచిలి రూరల్ : పట్టణంలో 10 వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గతంలో వలంటీర్లు చేసే పనులన్నింటినీ మాతో చేయిస్తున్నారని మేము ఉద్యోగులో లేక వలంటీర్లో అర్థం కావడంలేదని వారంతా వాపోయారు.వలంటీర్ల మాదిరిగా క్లస్టర్లలో లబ్ధిదారుల మ్యాపింగ్ చేయాలని ఇచ్చిన సర్క్యులర్ను తామంతా వ్యతిరేకిస్తున్నట్టు వారంతా స్పష్టంచేశారు.రాష్ట్ర వార్డు,గ్రామ సచివాలయాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు నిరసన చేపట్టామని తెలిపారు. ఇంటింటికీ తిరిగి వలంటీర్లలా అన్ని పనులు చేయాలని చూడడంతో తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని నిరసనలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజుకు వినతిపత్రం ఇచ్చారు. సచివాలయ ఉద్యోగుల నిరసనతో సచివాలయాల క్లస్టర్లలో హౌస్హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. -
అనుమతుల్లేని ల్యాబ్లపై చర్యలు
బుచ్చెయ్యపేట : జిల్లాలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్లను మూయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి హైమావతి హెచ్చరించారు. శనివారం ఆమె వడ్డాదిలో పలు ప్రైవేటు ల్యాబ్లను, ప్రభుత్వ ఆసుపత్రి, వసతి గృహాలు తనిఖీ చేశారు. వడ్డాదిలో ఉన్న పలు ప్రైవేటు ల్యాబ్ల వెళ్లి అక్కడ ల్యాబ్ టెక్నిషియన్లు చేస్తున్న టెస్టులను రికార్డులు తనిఖీ చేశారు. పదో తరగతి పాసై అనుభవం లేనివారు కూడా క్లినిక్లు ఏర్పాటు చేసి ల్యాబ్లు నిర్వహించడం, మిడిమిడి జ్ఞానంతో ఆర్ఎంపీ వైద్యులుగా, ల్యాబ్ టెక్నిషియన్లుగా చెలామణి అయిపోవడంపై ఆమె విస్తుపోయారు. అనుభవం లేకుండా క్లినిక్లు నిర్వహించడంపై ఆమె పలు క్లినిక్ల సిబ్బందిని హెచ్చరించారు. తక్షణం ల్యాబ్లు మూయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. పలువురికి కొద్దిపాటి జ్వరం వచ్చినా అవసరం లేకున్న టెస్టులు చేసి వేలాది రూపాయలు వసూలు చేయడం, పేదవారి అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని వృత్తిని వ్యాపారంగా మార్చవద్దని పలువురిపై ఆగ్రహం చెందారు. వడ్డాదిలో ఒక క్లినిక్ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఎంపీ వైద్యులతో మాట్లాడి వారు అందిస్తున్న సేవలు గురించి వాకబు చేశారు. వడ్డాదిలో వసతి గృహానికి వెళ్లి అక్కడ ఒక విద్యార్థి జ్వరంతో బాధపడగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్నట్లు తెలుసుకున్నారు. వడ్డాది ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసి రికార్డులు,ల్యాబ్ టెస్టులను పరిశీలించారు. వైద్యురాలు రమ్యదుర్గ, ఎంపీహెచ్వో మోజెస్,ల్యాబ్ టెక్నిషియన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మళ్లీ జగన్ను సీఎం చేయడమే లక్ష్యం
విశాఖ సిటీ : కూటమి ప్రభుత్వం 15 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి పేర్కొన్నారు. శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జోన్–1 మహిళ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అలాగే మహిళా విభాగాన్ని సంస్థాగతంగా పటిష్టం చేయాలని, జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోడానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తీర్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలను, ముఖ్యంగా మహిళలను నిట్టనిలువుగా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని చెప్పారు. ఎన్నికలకు ముందు అప్పటి సీఎం జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తానని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఎప్పుడూ చూడని విధంగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియాను సరఫరా చేసినప్పటికీ వాటిని టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ తరలించారని ఆరోపించారు. ప్రజలకు రూ.81 వేల కోట్ల బకాయిలు కూటమి ప్రభుత్వం రైతులకు మొదటి ఏడాది పెట్టుబడి సాయం ఎగ్గొట్టి వెన్నుపోటు పొడిచిందన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఇస్తానని చెప్పి ఒక్కో మహిళకు రూ.22,500 బాకీ పడిందని తెలిపారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు కింద ఇప్పటి వరకు రూ.45 వేలు బకాయి ఉందన్నారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వకపోగా కొత్తగా ఒక్కరికి పింఛను గానీ, రేషన్ కార్డు గానీ మంజూరు చేయలేదన్నారు. పైగా రాష్ట్రంలో 3 లక్షల మంది అర్హులైన వారి పెన్షన్ తొలగించిందని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రూ.81 వేలు బాకీ పడిందని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి 16 రకాల బస్సులు ఉంటే.. కేవలం 5 రకాల బస్సుల్లో ప్రయాణికులకు అవకాశం కల్పించారన్నారు. అలాగే ఉచితంగా మూడు సిలిండర్లు అని చెప్పి ఒకటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. మెడికల్ కాలేజీలను సైతం బినామీలకు కట్టబెట్టేందుకు ప్రైవేటుపరం చేయాలని చంద్రబాబు నిర్ణయించారని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేదు రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడి చేసేసిందని విమర్శించారు. 80 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయని, పర్మిట్ రూమ్లకు కూడా అనుమతులు ఇచ్చేశారని తెలిపారు. మద్యం కారణంగానే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతోందని, గంజాయిని హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే పండిస్తున్నారని వివరించారు. వీటిని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ తమ స్వలాభం కోసం పనిచేస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్లీ దేవుడు రావాలని ప్రార్థిస్తున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రానున్న మూడేళ్లు ప్రజల తరఫున పోరాటం చేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, విశాఖ మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి, ఉత్తరాంధ్ర మహిళా విభాగం జోన్ ఇన్చార్జి ఈర్లె అనురాధ, కార్పొరేటర్లు, జోన్–1కు చెందిన మహిళా నాయకులు, రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిలు, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు, అధిక సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిర్వీర్యం..
సచివాలయం.. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తోంది. పొమ్మనకుండా పొగపెట్టే ప్లాన్లు వేస్తోంది. ఇప్పటికే వలంటీర్లను నిర్ధాక్షణ్యంగా ఆపేసిన ప్రభుత్వం.. ఇపుడు సచివాలయం ఉద్యోగులపై పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే వస్తుంది. రేషనలైజేషన్ పేరిట సచివాలయాలను కుదించింది. ఏడాదిలోనే సొంత మండలాల్లో ఉండకూడదని కొత్త నిబంధన తీసుకొచ్చి బదిలీలు చేసింది. ఇపుడు కొత్తగా వాట్సాప్ సర్వీస్ రిజిస్ట్రేషన్లను అదనంగా రుద్ది మరింత ఒత్తిడి పెంచింది. రిజిస్ట్రేషన్ విధులను సచివాలయ ఉద్యోగులు మూకుమ్మడిగా బహిష్కరించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సాక్షి, అనకాపల్లి : సచివాలయ వ్యవస్థపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు సచివాలయ ఉద్యోగులకు శాపంగా పరిణమిస్తున్నాయి. ఈ ఉద్యోగుల విధులకు సంబంధించి నిర్దిష్టమైన విధానం లేకుండా ఎప్పటికప్పుడు తోచిన పనులు అప్పజెపుతుండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇంటింటికీ పెన్షన్ పేరుతో తిప్పుతున్న ఉద్యోగులను ఇకపై క్షేత్ర స్థాయి సర్వే వినియోగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించే బాధ్యతలను వీరికి అప్పగించారు. సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేపట్టాల్సి ఉంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పథకాల లబ్ధిదారుల్లో కోత పెట్టాలని.... ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో కోత పెట్టాలని కూటమి ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉంది. ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్లపై పడింది. అనేక మంది దివ్యాంగుల పెన్షన్లలో కోత పెట్టింది. లేచి నిలబడలేని వారి పింఛన్లు సైతం తొలగించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నెలకు మాత్రం పెన్షన్లకు తగ్గించకుండా యథావిధిగా నగదు జమ చేశారు. తర్వాత ఏం చేస్తారన్న టెన్షన్ దివ్యాంగుల్లో నెలకొంది. అలాగే మిగిలిన సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించే ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సచివాలయ ఉద్యోగుల ద్వారా పలు పథకాలు పొందుతున్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేయించాలని నిర్ణయించింది. గూగుల్ మీట్లో రహస్య సమావేశం గతంలో వలంటీర్లు ఒక క్లస్టర్కు పరిమితమై నిర్వహించిన విధులను సచివాలయ ఉద్యోగులకు ఒకటి కంటే ఎక్కువ క్లస్టర్లకు మ్యాప్ చేశారు. బలవంతంగా ఇంటింటికీ తిరిగే విధులు అప్పగిస్తున్నారు. ఇది ఇబ్బందికరంగా ఉందని పలువురు ఉద్యోగులు ఉన్నతాధికారులకు మోర పెట్టుకున్నారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది. తాజాగా శనివారం నుంచి వాట్సాప్ సర్వీస్కు సంభందించి అవగాహన.. ప్రతీ ఇంటికి బలవంతంగా సర్వీస్ నమోదు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సచివాలయ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇష్టానుసారంగా పనులు అప్పగిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రహస్యంగా ఆన్లైన్లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ గూగుల్ మీట్ ద్వారా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపుగా గంటన్నర పాటు పలు అంశాలపై చర్చించారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీవీడబ్ల్యూ ఎస్ఈజేఏసీ ముందుకు వెళ్లాలని ఎకగ్రీవంగా తీర్మానించారు. అలాగే వాట్సాప్ సర్వీస్ విధులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయ ఉద్యోగులు శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వాట్సాప్ సర్వీస్ రిజిస్ట్రేషన్ విధులు ముకుమ్మడిగా బహిష్కరించాలాంటూ నిర్ణయించుకున్నారు. సచివాలయ ఉద్యోగులపై కూటమి కక్ష సర్వే పేరిట ఇబ్బందులకు గురి సంక్షేమ పథకాలను కోత పెట్టే బాధ్యతలు అప్పగింత ఇందుకోసం ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని ఆదేశాలు తాజాగా వాట్సాప్ సర్వీసుల పేరుతో రోడ్లపై తిప్పాలని నిర్ణయం ప్రభుత్వ తీరుపై ఉద్యోగుల మండిపాటు ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ అత్యవసర సమావేశం వాట్సాప్ సర్వీస్ విధులను బహిష్కరించాలని నిర్ణయం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు -
తీర ప్రాంతాల్లో అనుమానితులపై సమాచారమివ్వండి
రాంబిల్లి(అచ్యుతాపురం) : తీర ప్రాంతాల్లో కనిపించే అనుమానిత వ్యక్తులు, విదేశీ బోట్ల కదలికల సమాచారాన్ని తమకు తెలపాలని అచ్యుతాపురం మైరెన్ సీఐ ఎస్ సింహాద్రి నాయుడు సూచించారు.రాంబిల్లి మండలంలోని వాడ రాంబిల్లిలో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన స్థానిక మత్స్యకారులతో మమేకం అయ్యారు. మత్తు పదార్థాల రవాణా వంటి కార్యకలాపాలు తీర ప్రాంతాల్లో జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. చేపల వేటకు వెళ్లిన తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. దేశ రక్షణలో తీర ప్రాంతాల మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తూ, అనుమానాస్పద కదలికల సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1093కి తెలియపరచాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమ్య, వీఆర్ఓ ఎస్.కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వి,లావణ్య, ఎస్ఐ నాగేంద్ర, నేవల్ ఇంటెలిజెన్స్ జి.అనిల్ కుమార్, కోస్టల్ సెక్యూరిటీ జగదీష్, ఎస్.జ్యోతిక, అప్పారావు, మైరెన్ ఎస్ఐ బి.రాజు, మైరెన్ సిబ్బంది పాల్గొన్నారు. -
9న కలెక్టరేట్ వద్ద ఆటో కార్మికుల ధర్నా
సమావేశంలో మాట్లాడుతున్న ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్ల నాగేశ్వరరావుఅనకాపల్లి : ఫ్రీ బస్ల వల్ల ఈనెల 15 నుంచి ఆటో కార్మికుల కుటుంబాలను రోడ్డున పాలు చేసిన కూటమి ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్ల నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 9వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక మెయిన్రోడ్డు ఫెడరేషన్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని, ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ కోసం రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో ఉపాధి అవకాశాలు కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఈనెల 15వ తేదీలోపు తమ సమస్యలు పరిష్కారం చేయకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు బాపునాయుడు, మార్కెండేయలు, నాగల వెంకటేశ్వరరావు, కూనపల్లి అప్పలరాజు, పొలమరశెట్టి అంజి, నూకరాజు వాయిబోయిన వెంకటేష్ పాల్గొన్నారు. -
దగా పడ్డ వైట్ బర్లీ రైతు
గొలుగొండ : వైట్ బర్లీ పొగాకు రైతులు దగా పడ్డారు. పంట కొనుగొళ్లు లేక నష్టపోయారు. మాట ఇచ్చిన కంపెణీలు మోసం చేశారు. ఇంటి వద్ద నిల్వ ఉంచిన పొగాకు చివరికి నాశనం కావడంతో లబోదిబో అంటున్నారు. పాలల్లో, షెడ్లల్లో దాచిన పొగాకు బేళ్లు ఎందుకు పనికిరాకుండా పోవడంతో పెట్టుబడులు నష్టపోయి కన్నీరుమున్నీరు అవుతున్నారు. 500 ఎకరాల్లో సాగు.. గొలుగొండ మండలంలో వైట్ బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు దగా పడ్డారు. వీరితో పాటు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో రైతులు అయితే చెప్పనక్కలేదు. సుమారుగా గొలుగొండ, గొలుగొండ మండలాల్లో 500 ఎకరాల్లో వైట్ బర్లీ సాగు జరగడం జరిగింది. వేసవి పొగాకు సాగుతో ఎంఎల్, ఐటీసీ కంపీలు రైతులు ప్రోత్సాహం అందించి సాగు చేయించారు. జనవరి, ఫిబ్రవరి నెలలో సాగు చేసిన రైతులు చాలా వరకు నష్టపోయారు. ఈ రెండు మండలాల్లో సాగు చేసిన రైతులు కష్టపడి పెట్టుబడులు పెట్టి అధిక దిగుబడులు పొందారు. మేనెలలో ఈ రెండు కంపెనీలు కొనుగోళ్లు ప్రారంభించారు. కొయ్యూరు మండలంలో కంఠారం, గొలుగొండ మండలంలో చోద్యం వద్ద అరకొరగా కొనుగోళ్లు చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకొన్నారు. అరకొరగా కొనుగోళ్లు... వేసవిలో సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుందని కంపెణీ యాజమాన్యం పలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. కొయ్యూరు, గొలుగొండ మండలాల్లో నీటి వనరులు ఉన్న ప్రతి చోట ఈ సాగును రైతులు ప్రారంభించారు. వ్యవసాయ మోటార్లు, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో సాగు మంచి దిగుబడులు సాధించారు. రైతులకు అవసరం అయిన ఎరువులు, నారును పై రెండు కంపెనీలు పోటాపోటీగా అందించారు. ఎకరానికి సుమారుగా రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టి పంటను మంచిగా సాధించిన రైతులకు కంపెనీలు తీవ్ర దెబ్బ కొట్టాయి. ఎంఎల్, ఐటీసీ కంపెనీలు వారికి ఎంత కావాలో అంత కొనుగోళ్లు చేసి మిగతా పొగాను వదిలేశారు. రైతులు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే బగాను బేళ్లు జాగ్రత్తగా దాచి ఉంచండి వెంటనే కొనుగోళ్లు చేస్తామని.. కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకున్నారు. కొంత మంది రైతులు పొగాకు పంటను పొలాల్లోనే వదిలేసారు. కొనుగోళ్లు చేస్తామని దగా... ఎకరానికి రూ. 50 వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులకు పంట నాశనం అవుతుంటుంటే ఏం చేయాలో అర్థం కాక లబోదిబో అంటున్నారు. మే, జూన్ వరకు పంటను కొనుగోళ్లు చేసిన కంపెనీలు త్వరలో రైతులు వద్ద ఉన్న పొగాకు కొనుగోళ్లు చేస్తామని ఉన్న పంటను జాగ్రత్తగా దాచి ఉంచాలని చెప్పి ఇప్పుడు జాడ లేకుండా పోయారు. దాచి ఉంచిన పొగాకు రంగు మారడం, ఉన్న బేళ్లు వద్ద పొగాకు తడిచిపోవడంతో పాటు ఎలకల వల్ల మరికొంత పంట నాశనమైంది. ఇలా ఈరెండు మండలాల్లో సుమారుగా రూ.రెండు కోట్ల వరకు విలువైన పంట ఉండిపోయిందని రైతులు చెబుతున్నారు. నీటి సదుపాయం ఉందని రైతులు ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది. నార్లు అందించిన కంపెనీలు చివరికి కనిపించకపోవడం చాలా బాధగా ఉందని రైతులు అంటున్నారు. రూ.లక్షల్లో నష్టపోయాం నేను రెండు ఎకరాల్లో వేసవిలో అనగా ఫిబ్రవరి నెలలో వైట్ బర్లీ సాగు చేశాను. నీటి సదుపాయం ఉండడం వల్ల పంటను బాగా పండించారు. మే నెలలో కొంతవరకు అమ్మకాలు చేయడం జరిగింది. నా చుట్టూ రైతులు నాతో పాటు కష్టపడి పండించారు. ఎంఎల్, ఐటీసీ కంపెనీలు పొగాకు నార్లుకు సరఫరా చేయడంతో అంతా ఉత్సాహంగా సాగు చేశాం. చివరికి కొంత పంట మాత్రమే కొనుగోళ్లు చేసి మిగతా పంటను జాగ్రత్తగా ఉంచాలని జులై నెలలోగా కొనుగోళ్లు చేస్తామని చెప్పారు. కానీ ఆగస్టు పూర్తయినా కొనుగోళ్లు చేయలేదు. దీనివల్ల ఇంటి వద్ద నిల్వ ఉంచి పొగాకు రంగు మారి, నాశనం అవుతోంది. దీంతో రూ.లక్షల్లో నష్టపోయాం. –సుంకర శివ, లింగంపేట రైతు రైతులు కొనుగొళ్లు లేక పంట పొలాల్లో వదిలేసిన దృశ్యం కొనుగోళ్లు చేయకపోవడంతో నిల్వ ఉండిపోయిన వైట్ బర్లీ పొగాకు బేళ్లు -
కరెంట్ సమస్య.. క్షణాల్లో పసిగట్టేలా..
సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, సమస్య ఎక్కడుందో కనుగొనడానికి సిబ్బంది క్షేత్రస్థాయిలో గంటల తరబడి శ్రమించాల్సి వచ్చేది. లోపం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, సబ్స్టేషన్కు సమాచారమిచ్చి, విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత మరమ్మతులు చేసేవారు. ఈ ప్రక్రియకు గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కానీ, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో పరిస్థితులు మారాయి. ఇప్పుడు విద్యుత్ సరఫరాలో లోపం ఎక్కడ తలెత్తిందో క్షణాల్లోనే కంప్యూటర్ స్క్రీన్పై కనిపిస్తోంది. ఆ సమాచారంతో సంబంధిత సిబ్బంది కేవలం 5 నుంచి 30 నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఇది తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో అమలు చేస్తున్న సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) వ్యవస్థతో సాధ్యమవుతోంది. విశాఖపట్నం సర్కిల్ పరిధిలో ఇప్పటికే సగానికి పైగా సబ్స్టేషన్లు స్కాడాతో అనుసంధానం కావడంతో నగరవాసులకు విద్యుత్ సమస్యలు గణనీయంగా తగ్గాయి. స్కాడా అంటే.? విద్యుత్ సరఫరా వ్యవస్థను ఒకే కేంద్రం నుంచి పర్యవేక్షిస్తూ.. సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించి, సరఫరాను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవస్థే స్కాడా. ఇది సెన్సార్లు, రిమోట్ టెర్మినల్ యూనిట్ల ద్వారా సబ్స్టేషన్లను కంట్రోల్ సెంటర్తో అనుసంధానిస్తుంది. ఆపరేషనల్ టెక్నాలజీ ద్వారా రియల్ టైమ్ డేటాను సేకరించి, వ్యవస్థను పూర్తిస్థాయిలో నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది. సాధారణంగా సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లు చేసే పనులను స్కాడా కంట్రోల్ సెంటర్ నుంచే ఆటోమేటిక్గా, రిమోట్ సెన్సార్ల సహాయంతో నిర్వహిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో... విశాఖ నగరంలో స్కాడా ఏర్పాటుకు 2013లో ప్రతిపాదనలు రాగా, 2014లో రూ.13.16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. 2015 నుంచి మొదలుపెడితే 28 సబ్స్టేషన్లను స్కాడా కంట్రోల్ స్టేషన్కు అనుసంధానం చేశారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత మరో 12 స్టేషన్లను అనుసంధానం చేయడంతో పాటు మరో 24 సబ్స్టేషన్లను స్కాడా పరిధిలోకి తీసుకొచ్చే పనులు ప్రారంభమై.. చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సబ్స్టేషన్లలోనూ స్కాడా అమలుకానుంది. విశాఖపట్నం సర్కిల్ పరిధిలో మొత్తం 130 విద్యుత్ సబ్ స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 40 స్టేషన్లు ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా పనిచేస్తున్నాయి. మరో 24 స్టేషన్లలో త్వరలోనే సేవలు మొదలుకానున్నాయి. మిగిలిన కేంద్రాలను కూడా భవిష్యత్తులో అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కంట్రోల్ సెంటర్ ఎక్కడంటే..? స్కాడా పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను పెదవాల్తేరులోని పోలమాంబ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. ఇది అత్యంత కీలకమైన, సాంకేతికతతో కూడిన కార్యాలయం కావడంతో దీనిని నియంత్రిత ప్రాంతంగా (నిషిద్ధ ప్రాంతం) పరిగణిస్తారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి నగర విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉన్నందున ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈపీడీసీఎల్ ప్రత్యేక నిపుణుల బృందం (ఈఈ, డీడీఈ, ఏఈ స్థాయి అధికారులతో పాటు 8 మంది షిఫ్ట్ ఇంజినీర్లు) ఈ కేంద్రాన్ని 24/7 పర్యవేక్షిస్తోంది. స్కాడాకు అనుసంధానించిన సబ్స్టేషన్ పరిధిలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో లోపం వస్తే, వెంటనే కంట్రోల్ రూమ్లో అలారమ్స్ మోగుతాయి. హై వోల్టేజ్, లో వోల్టేజ్ వంటి హెచ్చుతగ్గులను కూడా ఈ కేంద్రం నుంచే నియంత్రించవచ్చు. ఏ ప్రాంతానికి ఎంతసేపు విద్యుత్ సరఫరా చేశారు, ఎంతసేపు కోతలు విధించారు, లోడ్ ఎంత ఉంది వంటి సమాచారం మొత్తం రియల్ టైమ్ డేటా రూపంలో నిక్షిప్తమవుతుంది. ప్రమాదాలు తగ్గుముఖం స్కాడా కంట్రోల్ స్టేషన్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉండటంతో.. ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి. విద్యుత్ సరఫరాలో నాణ్యత ఉంటోంది. స్కాడాకి అనుసంధానం చేయడం వల్ల సరఫరాలో అంతరాయాలు గుర్తించి, పునరుద్ధరించడంలో 56 శాతం వరకు సమయం ఆదా అవుతోంది. పవర్ ట్రిప్ అయితే రియల్ టైమ్లో తెలుస్తోంది. స్క్రీన్పై నుంచే వోల్టేజ్, ఇతర అంశాల్ని నిశితంగా పరిశీలించవచ్చు. ఏ చిన్న సమస్య తలెత్తినా.. పసిగట్టగలుగుతున్నాం. గతంలో ఫీడర్ మార్పు చేసేందుకు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 2 లేదా 3 నిమిషాల్లో ఫీడర్ని మార్పు చేయగలుగుతున్నాం. గ్రామస్థాయిలో ఫీడర్ల వరకూ స్కాడా అనుసంధానం చేసేందుకు కొంత సమయం పడుతుంది. –జి.శ్యామ్బాబు, విశాఖపట్నం సర్కిల్ ఎస్ఈ ‘స్కాడా’ అనుసంధానం -
డీఎస్ఎన్ఎల్యూలో అకడమిక్ బ్లాక్ ప్రారంభం
సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్ఎన్ఎల్యూ)లో నూతనంగా నిర్మించిన అకడమిక్ బ్లాక్ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి, విశ్వవిద్యాలయ విజిటర్ జస్టిస్ పి.శ్రీనరసింహ శుక్రవారం ప్రారంభించారు. దీంతోపాటు వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహత్మాగాంఽధీ, రాజ్యాంగ పిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తొలి దళిత ముఖ్యమంత్రి, దామోదరం సంజీవయ్య విగ్రహాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వర్సిటీ సమావేశమందిరంలో వాతావరణ మార్పులు, చట్టాలు అనే అంశంపై జస్టిస్ ఇ.వెంకటేశం స్మారక ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డాక్టర్ సూర్యప్రకాశరావు, ఇన్చార్జ్ రిజిస్ట్రార్ విశ్వచంద్ర మదాసీ పాల్గొన్నారు. -
ఎరుకలమ్మకు పదోన్నతి
గొలుగొండ: కృష్ణదేవిపేట రేంజ్ పరిధిలో ఫారెస్టు బీట్ ఆఫీసర్గా పనిచేసిన ఎరుకులమ్మకు పదోన్నతి వచ్చింది. ఆమె ఫారెస్టు సెక్షన్ అధికారిగా పదోన్నతి పొందినట్లు కృష్ణదేవిపేట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు. ఇక్కడ మూడు సంవత్సరాలకు పైగా ఫారెస్టు బీట్ ఆఫీసర్గా పనిచేసిన ఎరుకులమ్మ అటవీ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోనే త్వరగా పదోన్నతి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఫారెస్టు సెక్షన్ అధికారిగా చింతపల్లిలో ఆమె విధులు నిర్వహించనున్నారు. 13 వరకు విశాఖ–బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ రద్దుతాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పెందుర్తి–సింహాచలం పరిధిలో జరుగుతున్న భద్రతా పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 6, 8, 10, 12వ తేదీల్లో విశాఖపట్నం–బ్రహ్మపూర్(18526) ఎక్స్ప్రెస్, ఈ నెల 7, 9, 11, 13వ తేదీల్లో బ్రహ్మపూర్–విశాఖపట్నం(18525) ఎక్స్ప్రెస్, ఈ నెల 7, 9, 11, 13వ తేదీల్లో విశాఖపట్నం–విజయనగరం(67287) పాసింజర్ను రద్దు చేశారు. ఈ నెల 7, 9, 11, 13వ తేదీల్లో పలాస–విశాఖపట్నం (67290) పాసింజర్ విజయనగరం వరకు మాత్రమే నడుస్తుంది. ‘బొకారో’దారి మళ్లింపు.. అదనపు హాల్ట్ సదరన్ రైల్వే, సేలం డివిజన్ పరిధిలో జరుగుతున్న భద్రతా పనుల వల్ల ఈ నెల 7న అలప్పుజ–ధన్బాద్(13352)బొకారో ఎక్స్ప్రెస్ను దారి మళ్లించినట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆ తేదీన ఈ రైలు వయా పొదనూర్ జంక్షన్–ఇరుగూర్ జంక్షన్, సేలం మీదుగా ప్రయాణిస్తుంది.ప్రయాణికుల సౌకర్యార్థం పొదనూర్లో అదనపు హాల్ట్ కూడా కల్పించారు. హిరాకుడ్ ఎక్స్ప్రెస్కు తాత్కాలిక హాల్ట్ నార్తర్న్ రైల్వే, ఢిల్లీ డివిజన్ పరిధిలోని భోద్వాల్ మజ్రిలో జరగనున్న 78వ వార్షిక అంతర్జాతీయ నిరంకారీ సంత్ సమాగం కారణంగా హిరాకుడ్ ఎక్స్ప్రెస్కు ఈ స్టేషన్లో తాత్కాలిక హాల్ట్ కల్పించారు. అక్టోబరు 19 నుంచి నవంబరు 7 వరకు ఈ తాత్కాలిక హాల్ట్ ఉంటుంది. అమృత్సర్–విశాఖపట్నం (20808) హిరాకుడ్ ఎక్స్ప్రెస్ భోద్వాల్ మజ్రి స్టేషన్కు ఉదయం 5.52 గంటలకు చేరుకుని, 5.54 గంటలకు బయలుదేరుతుంది. అలాగే, విశాఖపట్నం–అమృత్సర్ (20807) హిరాకుడ్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 3.48 గంటలకు చేరుకుని, 3.50 గంటలకు బయలుదేరుతుంది. -
మరణించి నలుగురికి వెలుగునిచ్చి..
పెందుర్తి : బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందిన ఓ వ్యక్తి నేత్రాలను దానం చేసి ఓ కుటుంబం మానవత్వం చాటుకుంది. వివరాలివి.. పెందుర్తి ఆదిత్యనగర్లో నివాసం ఉంటున్న కోరుబిల్లి శ్రీను(40) క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం రాత్రి శ్రీను ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు వెంటనే కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ క్రమంలో శ్రీను సమీప బంధువు శరగడం రాము(కర్రల రాము) చొరవతో కుటుంబ సభ్యులు శ్రీను నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు. మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు శ్రీను నేత్రాలను సేకరించారు. ఇటీవల కాలంలో విస్తృతంగా నేత్రదానం చేయిస్తున్న పెందుర్తిలోని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ స్ఫూర్తిలో తాము ఈ నేత్రదానం చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
రైతుకు ఒకే ఒక బస్తా
నాతవరం: పి.కె.గూడెం పీఏసీఎస్లో శుక్రవారం తగినంత యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ముందు రోజున ఎరువులు విక్రయిస్తామని చెప్పడంతో శుక్రవారం ఉదయం నుంచి అధిక సంఖ్యలో రైతులు చేరుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకం ఒక్కంటికీ ఒక్కబస్తాయే పంపిణీ చేశారు. పాసుపుస్తకంలో ఉన్న భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఒకే ఒక బస్తా సరఫరా చేయడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పి.కె.గూడెం పి.జగ్గంపేట గ్రామాలకు చెందిన రైతులు ఒకేసారి రావడంతో యూరియా అయిపోతుందన్న భయంతో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఒక లారీలో యూరియా 267 బస్తాలే రావడంతో తోపులాట చోటుచేసుకుంది. -
సచివాలయమా? కూటమి కార్యాలయమా?
ఉమ్మలాడలో సచివాలయ ప్రధాన గేటు ముందు కూటమి నేతల ఫ్లెక్సీలు మునగపాక: విద్య, వైద్య కేంద్రాల సమీపంలో రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఉండరాదన్న నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. అధికారంలో ఉన్నాం కదా అడిగేదెవరన్న రీతిలో నేతలు వ్యవహరిస్తున్నారు. ఉమ్మలాడలో సచివాలయం ప్రధాన గేటు ముందు కూటమి నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నెల దాటినా అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం సచివాలయానికి పలు సేవల కోసం ప్రజలు వస్తూ పోతుంటారు. స్థానికంగా ఉన్న నేతలు తమ అధినాయకుల పట్ల స్వామి భక్తుని చాటేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అధికారులు వాటిని తొలగించకపోవడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
దొంగతనాలకు పాల్పడుతున్న యువకుల అరెస్ట్
అచ్యుతాపురం రూరల్ : రెండు నెలల వ్యవధిలో మండలంలో పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామానికి చెందిన నలుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు సీఐ నమ్మి గణేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు డీఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో నియమించిన ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టి చోరీలకు పాల్పడిన నలుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో జోగన్నపాలెం, మార్టూరు, దొరైపాలెం, పైలవానిపాలెం, వెంకటాపురం గ్రామాల్లో మొత్తం ఐదు ఆలయాల హుండీలను చోరీ చేసినట్టు గుర్తించామని, వారి నుంచి రూ.7650 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈ సందర్భంగా సీఐ సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వ్యసనాలకు బానిసలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. పిల్లల నడవడికను ప్రతిక్షణం గమనించాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులెవరైనా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. వీలైనంత వరకూ వ్యక్తిగతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసులకు తెలియపరిచి ఎల్హెచ్ఎంఎస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు సుధాకర్, వెంకటరావు, సిబ్బంది బంగార్రాజు, అనిల్ పాల్గొన్నారు. -
తీవ్ర విషాదం.. ఎవరిదీ పాపం.!
మాడుగుల రూరల్: తాచేరు గెడ్డపై ఉన్న కట్టెల వంతెన మీద నుంచి నడిచి వెళ్తుండగా ఓ గిరిజన మహిళ కాలు జారి గెడ్డలో పడి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో తాటిపర్తి పంచాయతీ శివారు ఆజయపురం గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళ పాంగి మచ్చమ్మ(26) పామాయిల్ తోటలో కూలి పనికి వెళ్లింది. పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గురువారం రాత్రి తాచేరు గెడ్డలో కట్టెల వంతెన మీద నుంచి నడిచి వెళ్తుండగా కాలు జారి గెడ్డలో పడి మృతి చెందింది. ఈ గ్రామానికి వంతెన లేకపోవడంతో తాత్కాలికంగా గిరిజనులు కట్టెల వంతెన నిర్మించుకున్నారు. మచ్చమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమని రోదించారు. మృతురాలి భర్త మత్స్యరాజు శుక్రవారం ఉదయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ జి.నారాయణరావు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని శుక్రవారం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శుక్రవారం సాయంత్రం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారైలు, అత్తమామలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. గిరిజన మహిళ మృతి ప్రభుత్వానిదే బాధ్యత పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆజయపురం వెళ్లే రహదారిలో తాత్కాలిక వంతెన మీద మృతదేహంతో గిరిజనులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం ఐదో షెడ్యూల్ సాధన జిల్లా కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి, మాట్లాడుతూ ఆజయపురం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాటిపర్తి నుంచి ఆజయపురం గ్రామానికి మధ్యలో గెడ్డపై కర్రలతో కాలిబాట వంతెన నిర్మించుకున్నారని, ఈ వంతెన మీద నడుస్తూ గెడ్డలో పడి మహిళ మృతి చెందిందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. శంకరం పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. గండి వద్ద నది దాటేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు తాచేరు నదిలో తాడు సహాయంతో వెళ్తున్న గ్రామస్తులుబుచ్చెయ్యపేట: మండలంలోని భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో విజయరామరాజుపేట తాచేరు నదిలో తాడు సహాయంతో దిగి పలువురు ప్రమాదం అంచున ప్రయాణాలు చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న తాచేరు వంతెన కూలిపోగా తాత్కలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు నెల రోజుల కిందట వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో నదికి అవతల, ఇవతల పొలాలు ఉన్న విజయరామరాజుపేట రైతులు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా తీగ సహాయంతో ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. పేట రైతులకు ఏ అవసరం వచ్చినా వడ్డాది వచ్చి సరకులు కొనుగోలు, అత్యవసర సమయంలో రోగులు ఆసుపత్రికి వెళ్లడానికి, మందులు కొనుగోలు చేయడానికై తాచేరు నదిలో దిగి నీటిలో నుంచి నడిచి వెళ్తున్నారు. ఏప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. పాలకులు, అధికారులు తక్షణం కూలిన వడ్డాది, తాచేరు వంతెనలు, డైవర్షన్ రోడ్ల నిర్మాణాలు చేపట్టి రవాణా సదుపాయం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
యూరియా సరఫరాలో సర్కారు విఫలం
అనకాపల్లి: ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. స్థానిక రింగ్రోడ్డు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వ్యవసాయం పెద్ద దండగ అని భావించే సీఎం చంద్రబాబు పాలనలో మళ్లీ రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులతో నిరసన తెలియజేసి, వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ పాలనలో నాటి సీఎం వైఎస్ జగన్ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీఫ్ సీజన్కు ముందుగానే రైతులకు యూరియా తదితర ఎరువులు సరఫరా చేశారని, కూటమి పాలనలో ఆర్బీకేల పేరు మార్చారు తప్ప అన్నదాతల గురించి పట్టించుకోవడం లేదన్నారు. యూరియా సరఫరా చేయాలని రైతులు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడతామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అనకాపల్లి పట్టణంలో అన్నపూర్ణ బ్యాంక్ వద్ద రైతులు రాత్రి వరకూ పడిన ఇబ్బందులను వీడియో ద్వారా విలేకరులకు ఆయన ప్రదర్శించారు. రైతులకు కావలసిన యూరియా పీఏసీఎస్లో 30 శాతం ఉంటే, ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో 70 శాతం ఉందన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటుపరానికి కుట్ర వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేయగా.. ఇప్పుడు వాటిని పీపీపీ పద్ధతిలో చేపట్టి ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. అనకాపల్లిలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేస్తే, స్థానిక నేతలు అడ్డుకుని కోర్టులో కేసులు వేయడం వలన నర్సీపట్నం నియో జకవర్గం మాకవరపాలేనికి మార్చామన్నారు. గత పాలనలో రెండో అంతస్తు వరకూ పనులు చేయగా, కూటమి పాలన వచ్చాక పనులు నిలిచిపోయాయన్నారు. అనకాపల్లి, చోడవరం, మాడుగుల రహదా రి పరిస్థితి చూస్తే ఎందుకు గెలిపించుకున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. సుగర్ ఫ్యాక్టరీల అడ్రస్ గల్లంతు జిల్లాలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీని మూసివేసే విధంగా కూటమి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని అమర్నాథ్ విమర్శించారు. వైఎస్సార్సీపీ పాలనలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి రూ.90 కోట్లు, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీకి సుమారు రూ.40 కోట్లు ఇచ్చి ఆదుకున్నామన్నారు. ఏడాది కూటమి పాలనలో గోవాడ సుగర్స్ బకాయిలు రూ.35 కోట్లు ఉన్నాయని, చెర కు పండించే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఎమ్మెల్యేలు చెప్పడం దారుణమన్నా రు. వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు మలసాల భరత్కుమార్, అన్నపురెడ్డి అదీప్రాజు, కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, పట్టణ అ ధ్యక్షుడు జానకీరామరాజు, నియోజకవర్గ యువజ న విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ పాల్గొన్నారు. -
పట్టాల పండగ.. ఆనందం నిండుగ
విశాఖ సిటీ: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్ఎన్ఎల్యూ) పట్టభద్రుల కేరింతలతో బీచ్రోడ్డు మార్మోగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచే దేశంలో పలు రాష్ట్రాల నుంచి విశాఖలో న్యాయ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు నోవాటెల్ హోటల్లో సందడి చేశారు. శుక్రవారం హోటల్లో డీఎస్ఎన్ఎల్యూ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. గత ఐదేళ్లలో యూనివర్సిటీలో పలు కోర్సులో ఉత్తీర్ణులైన వారికి పట్టాల అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, అతిథులుగా జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ పి.నరసింహా, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హాజరయ్యా రు. అతిథుల చేతుల మీదుగా విద్యార్థులను బంగారం, వెండి పతకాలతో పాటు పట్టాలను అందజేశారు. ఇందులో 397 మంది బీఏ ఎల్ఎల్బీ, 153 మందికి ఎల్ఎల్ఎం, నలుగురికి పీహెచ్డీ, ఇద్దరికి ఎల్ఎల్డీ పట్టాలు అందించారు. అలాగే 153 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. బ్యాచ్ వారీగా విద్యార్థులు న్యాయమూర్తులతో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు తమ జీవిత అనుభవాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సందడి : కోవిడ్, ఇతరత్రా కారణాల తో గత ఐదేళ్లుగా డీఎస్ఎన్ఎల్యూ స్నాతకోత్స వం వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఐదేళ్లలో న్యా య విద్యను పూర్తి చేసిన వారు ఇప్పటికే న్యాయవాదు లుగా ప్రాక్టీసు ప్రారంభించారు. 8 నుంచి 12 బ్యాచ్లకు ఒకేసారి పట్టా లు అందించేందు కు డీఎస్ఎన్ఎల్ యూ వైస్ చాన్సల ర్ ప్రొఫెసర్ డాక్టర్ డి.సూర్యప్రకాశరావు స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. దీంతో సందడి నెలకొంది. -
ఉపాధ్యాయులపై ‘గురు’తర బాధ్యత
జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనఅనకాపల్లి టౌన్: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. స్థానిక ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి గురుపూజోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. విద్యార్థులకు అందిస్తున్న బ్యాగులు, దుస్తులపై సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటోలు ముద్రించాలని మంత్రి కోరారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ విద్యా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధనలో మార్పులను తీసుకురావాలని ఉపాధ్యాయులను కోరారు. ఉపాధ్యాయుల కృషితో 2024–25 సంవత్సరంలో రాష్ట్ర స్ధాయిలో జిల్లా ఉత్తీర్ణత శాతం 5వ స్థానానికి తెచ్చామన్నారు. ప్రతీ పాఠశాలలో యూత్ క్లబ్, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా 39 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి అనిత అవార్డులు అందజేశారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఆరుగురు, స్కూల్ అసిస్టెంట్స్ 20 మంది, ఎస్జీఎస్టీ టీచర్లు 13 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, ఆర్డీవో షేక్ ఆయిషా, జల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి అవార్డు అందుకుంటున్న ఉపాధ్యాయులు కె.సుభాష్ చంద్రబోస్ (తామరబ్బ ఎంపీయూపీ స్కూల్, దేవరాపల్లి), చంద్రశేఖర్ (వెలంకాయలపాలెం ఎంపీపీ పాఠశాల, రోలుగుంట), డి.రవి (మాకవరపాలెం ఉన్నత పాఠశాల), డీఆర్కే శాస్త్రి (నక్కపల్లి), కె.దండెంనాయుడు, (ఎంపీపీ స్కూల్, పాత వాలాబు, దేవరాపల్లి), జి.వి.రమణ (భీమవరం ఎంపీపీ స్కూల్, ఎస్.రాయవరం), ఎం.మురళీకృష్ణ (కె.కోటపాడు హైస్కూల్), ఎ.వి.రామాచార్యులు (ఎస్.రాయవరం హైస్కూల్), నిమ్మల రమ (వడ్డాది ఎంపీపీ స్కూల్) -
భక్తి శ్రద్ధలతో మిలాద్–ఉన్–నబీ
కశింకోట ప్రధాన రహదారిలో ఈద్–మిలాద్–ఉన్–నబీ ర్యాలీ కశింకోట: మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని మిలాద్–ఉన్–నబీ వేడుకను ముస్లింలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని బయ్యవరంలోని హజ్రత్ అన్నర్ మద్నీ ఔలియా దర్గా నుంచి కశింకోట వరకు ముస్లింలు సంప్రదాయంగా జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. స్థానిక నూరి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం నూరి మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ రెహమాన్ (బాబర్), పలువురు మౌల్వీలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు మానవాళికి ఆచరణీయమన్నారు. ఆయన బోధించిన శాంతి, సహనం, ఐకమత్యం, సోదరభావం వంటివి ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవనం మార్గదర్శకమన్నారు. ప్రవక్త వెలిగించిన జ్ఞాన జ్యోతి మానవ జాతికి ఒక దివ్య జ్యోతి అన్నారు. అంతా ఐక్యంగా మతసామరస్యంతో మెలిగి సకల జనుల సౌభాగ్యాన్ని కాంక్షించాలన్నారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. నూర్ మసీదు కార్యదర్శి ఎస్.ఎం.ఎం. అలీ, కమిటీ ప్రతినిధులు అబ్దుల్ ఖలీమ్ అజాద్, మౌలానా నసీం అక్తర్, ఎం.ఎ.రబ్బానీ, నూర్ నభి, ముస్తఫా ఆలం, ఫజుల్ రెహమాన్, ఐ.ఎం. షరీఫ్, సయ్యద్ సలీం, అధికంగా ముస్లింలు పాల్గొన్నారు. -
స్పీకర్కు చేతనైతే.
నర్సీపట్నం: స్పీకర్ అయ్యన్నపాత్రుడికి చేతనైతే నర్సీపట్నం మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం కాకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మేలు చేకూరాలనే ఆలోచనతో నాటి సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాల మంజూరు చేశారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఏపీలో 11 మెడికల్ కళాశాలలు ఉండగా మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేశారన్నారు. సుమారు రూ.500 కోట్లతో 630 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టారన్నారు. నిర్మాణం పూర్తయి ఈ కళాశాల ప్రారంభమైతే 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడమే కాక వేలాది మందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేవన్నారు. మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేయడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమన్నారు. ఈ మెడికల్ కళాశాల ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన కళాశాలలో వైద్య ఖర్చులు చెల్లించుకునే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. నర్సీపట్నం మెడికల్ కళాశాల ప్రైవేటుపరం అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ ప్రాంత ప్రజలకు ద్రోహం చేసినవారవుతారన్నారు. చేతనైతే మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించేలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
దోపిడీ
గబ్బర్సింగ్ గ్రావెల్ఆయన జనసేనలో చోటా మోటా నాయకుడు. తమ నాయకుడిపై వీరాభిమానంతో తన పేరుకు గబ్బర్సింగ్ను తోకగా తగిలించుకున్నాడు. ఈ ప్రాంతంలో ఆ పేరుతోనే సుపరిచితుడు. ఉప సర్పంచ్గా కూడా వ్యవహరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతని అక్రమాలు తార స్థాయికి చేరాయి. నక్కపల్లి మండలంలో కంపెనీల కోసం ఏపీఐఐసీ వారు సేకరించిన భూముల్లో గ్రావెల్ తవ్వకాల్లో ఆరితేరిపోయాడు. నక్కపల్లి: కొండలు, గుట్టలు కావేవీ అక్రమాలకు అనర్హం.. అన్న రీతిలో ఆ నాయకుడు వ్యవహరిస్తున్నాడు. బల్క్డ్రగ్ పార్క్ పనులు అతనికి వరంగా మారాయి. అధికారుల అండతో అందినంత కొల్లగొట్టేస్తున్నాడు. ప్రభుత్వం చందనాడ, అమలాపురం, వేంపాడు, డీఎల్ పురం, రాజయ్యపేట, బోయపాడు, మూలపర, పాటిమీద గ్రామాల్లో 4500 ఎకరాలను సేకరించింది. వీటిలో బల్క్డ్రగ్ పార్క్ కోసం 2 వేల ఎకరాలు, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం 2 వేల ఎకరాలు కేటాయించింది. బల్క్డ్రగ్ పార్క్కు ప్రభుత్వం ఇంటర్నల్ రోడ్డు, డ్రెయినేజీలు, కల్వర్టులు, మినీ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జాతీయ రహదారి నుంచి తమ్మయ్యపేట వరకు రూ.24 కోట్లతో 80 అడుగుల రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ పనులకు ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులకు గ్రావెల్ అవసరం ఉంది. ఏపీఐఐసీ పరిధిలో కొండలు, గ్రావెల్ పుష్కలంగా అందుబాటులో ఉంది. ఏపీఐఐసీ పరిధిలో ఉన్న ఒక గ్రామానికి ఉప సర్పంచ్గా వ్యవహరిస్తున్న ఈ గబ్బర్సింగ్ కూటమి ప్రభుత్వ పెద్దలతో తనకున్న పరిచయాలు, పరపతిని ఉపయోగించి ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తవ్వి ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నిబంధనలు బేఖాతర్ నిబంధనల ప్రకారం మైనింగ్ అధికారుల అనుమతితోనే గ్రావెల్ తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. అయితే మౌలిక సదుపాయలు కల్పించే పనులకు గ్రావెల్ సరఫరా చేస్తున్నానంటూ గబ్బర్సింగ్ ఇక్కడ గ్రావెల్ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాడు. పొక్లెయిన్లతో తవ్వేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కంపెనీలకు ప్రతిరోజు వందలాది టిప్పర్లలో గ్రావెల్ సరఫరా చేస్తున్నాడు. ఏపీఐఐసీ ముసుగులో గ్రావెల్ అమ్మేసుకుంటున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకండా కూటమి ప్రభుత్వ అండదండలతో ఇతను చేస్తున్న అరాచకాలను అడ్డుకునే సాహసం ఏ అధికారి చేయడం లేదు. నిత్యం లక్షలాది రూపాయల ఆదాయం పొందుతున్న ఇతగాడు, తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగం కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా సమర్పించుకుంటున్నాడు. ఇళ్ల నిర్మాణాలకు, సొంత అవసరాలకు ఎవరైనా ట్రాక్టర్ గ్రావెల్ పట్టుకెళ్తే దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, రెవెన్యూ మైనింగ్ అధికారులు గబ్బర్ సింగ్ చేస్తున్న గ్రావెల్ దోపిడీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని చుట్టుపక్కల గ్రామాల వారు ఆరోపిస్తున్నారు. అధికారుల అండదండలు గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవాల్సిన కొంతమంది అధికారులు సైతం అక్రమాల్లో భాగస్వాములవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కీలక శాఖల్లో ఉన్నతాధికారిగా ఉన్న ఒక వ్యక్తి రెండు టిప్పర్లను ఈ గ్రావెల్ తరలింపు కోసం లీజు పద్ధతిలో ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వద్ద ఉంచినట్లు చెప్పుకుంటున్నారు. కూటమి నేతలు, కీలక ప్రభుత్వ శాఖల అండదండలతోనే గబ్బర్సింగ్ గ్రావెల్ దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమలాపురం, మూలపర, డీఎల్ పురం కొండల నుంచి రేయింబవళ్లు యంత్రాలను ఏర్పాటు చేసి వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. గతంలో పలు పర్యాయాలు కూటమి నేతల్లో వచ్చిన పంపకాల తేడా వల్ల ఒకరి వాహనాలను ఒకరు పట్టించుకుని కేసులు నమోదు చేయించుకోవడం, హోం మంత్రి వద్ద పంచాయతీ పెట్టడం జరిగింది. మనలో మనకు ఐక్యత లేకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఒక అవగాహనకు వచ్చి ట్రిప్పుకు ఇంత అని బేరం కుదుర్చుకుని గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసుకోకుండా రాజీ పడ్డారని భోగట్టా. ఈ వ్యవహారంలో అధికారులకు సైతం మామూళ్లు భారీగానే అందుతున్నాయి. ఉచితంగా లభించే గ్రావెల్ను టిప్పర్ ధర రూ.10 వేలుగా నిర్ణయించి సమీపంలో ఉన్న కంపెనీలకు, ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారికి విక్రయించి కోట్లు గడిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో గబ్బర్సింగ్ వేంపాడు రెవెన్యూలో క్షత్రియులకు చెందిన 7 ఎకరాల జిరాయితీ మిగులు భూమిని తన పలుకుబడిని ఉపయోగించుకుని రికార్డులు తారుమారు చేసి ఆన్లైన్లో నమోదు చేయించాడు. తర్వాత ఇదే భూమిని కొనుగోలు చేసి తన పేరున మార్చేసుకున్నాడు. ఏపీఐఐసీ నుంచి నష్టపరిహారం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను తెలుసుకున్న అసలు హక్కుదార్లు లబోదిబోమంటూ కలెక్టర్, హోం మంత్రి, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో పెండింగ్లో ఉంది. ఏపీఐఐసీ భూముల్లో ఖనిజ సంపద లూటీ చేస్తున్న జనసేన నాయకుడు కూటమి పెద్దల అండదండలతో కారిడార్ భూముల్లో తవ్వకాలు పవన్ వీరాభిమానినంటూ గబ్బర్ సింగ్ పేరు నిత్యం వందలాది లారీల్లో తరలింపు రోజుకు లక్షల్లో అక్రమ సంపాదన -
‘రైతుల ఇబ్బందులు.. సీఎం మాట్లాడే బాష ఇదేనా?’
అనకాపల్లి: ఏపీలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంతో కూటమి సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈనెల తొమ్మిదో తేదీన వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. అన్ని ఆర్డీవో కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతి పత్రం సమర్పించనున్నట్టు చెప్పారు.అనకాపల్లి వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుడూ..‘సైన్స్ కన్నా ముందు వ్యవసాయమే విజ్ఞానమని రైతు చాటి చెప్పాడు. అలాంటి రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు విత్తనం, ఎరువులు అందలేదనే మాట ఎప్పుడూ లేదు. రైతులకు ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం పని చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాం. 15వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను వైఎస్ జగన్ తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రైతుల కోసం వైఎస్సార్సీపీ పోరాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నాడు. ఎవరైనా రైతుల కోసం మాట్లాడితే వారిని బెదిరిస్తున్నారు. ఎన్ని ఎకరాల పొలం ఉన్న వారికైనా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. రైతుల అవసరాలను ప్రభుత్వం గుర్తించాలి. సీజన్కి సిద్ధంగా ఉండాలి. సీజన్ అయ్యాక యూరియా ఇస్తానంటే ఎవరికీ కావాలి. ఎవరైనా మాట్లాడితే జైలులో వేస్తానని సీఎం అంటున్నారు. సీఎం మాట్లాడే బాష ఇదేనా?. గతంలో అన్నీ అందుబాటులో పెట్టాం కాబట్టి గతేడాది ఇలాంటి సమస్య రాలేదు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు. -
చోడవరంలో వైభవంగా ముగిసిన నవరాత్రి ఉత్సవాలు
చోడవరం: స్వయంభూ పుణ్య క్షేత్రాల్లో కాణిపాకం తర్వాత ఒకటైన చోడవరం శ్రీస్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు సంబరంగా సాగాయి. గురువారం ముగింపు రోజున స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఆలయంతో పాటు స్వామివారిని, గర్భగుడి ప్రాంగణాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వెండి, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాల అలంకరణలో స్వామి కనువిందుగా దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు కొడమంచిలి చలపతిరావు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేశారు. అనంతరం పండిత ఆశీర్వచనం, లడ్డూ వేలం నిర్వహించారు. రాత్రి నిర్వహించిన స్వామివారికి తిరువీధోత్సవం కనుల పండువగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన మూషిక వాహనంపై ఉత్సవ మూర్తులను ఉంచి ఊరేగించారు. ఎమ్మెల్యే రాజు, ట్రస్ట్ బోర్డు కమిటీ చైర్మన్ పసుమర్తి సాంబశివరావు, దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. -
మేయర్పై గరం.. గరం
డాబాగార్డెన్స్: నగర మేయర్ పీలా శ్రీనివాసరావు వ్యవహారశైలిపై సొంత పార్టీ కార్పొరేటర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని, అధికారులతోనూ సమన్వయం పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. దీనికి నిదర్శనంగా గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని చూపుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సెక్షన్ 97ఏ ప్రకారం కొత్తగా ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ తొలి సమావేశం కమిషనర్ నిర్ణయం ప్రకారం నిర్వహించాలి. కానీ మేయర్ కార్యాలయం ఈ నిబంధనను పక్కనపెట్టి, కార్యదర్శి సంతకంతో ఒకరోజు ముందు మాత్రమే అజెండాను సభ్యులకు పంపింది. దీనివల్ల అజెండాలోని అంశాలను పరిశీలించడానికి తగినంత సమయం దొరకలేదని సభ్యులు మండిపడుతున్నారు. మేయర్ ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని, ఇది మంచిది కాదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కమిషనర్కు వినతి: పైన పేర్కొన్న విషయమై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్, జీవీఎంసీ స్థాయీ సంఘం సభ్యురాలు సాడి పద్మారెడ్డి మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్గార్గ్కు వినతి పత్రం అందజేశారు. సమావేశ నోటీసు రద్దు చేయాలని, స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిబంధనల ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని ఆమె అభ్యర్థించారు. పలు అభివృద్ధి పనులకు ఆమోదం: స్థాయీ సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు. 198 అంశాలు అజెండాలో పొందుపరచగా, సభ్యులు చర్చించిన అనంతరం 194 అంశాలు ఆమోదించారు. 4 అంశాలు వాయిదా వేశారు. సమావేశంలో సభ్యులు కొణతాల నీలిమ, గంకల కవిత, దాడి వేంకటరామేశ్వరరావు, మొల్లి హేమలత, సేనాపతి వసంత, గేదెల లావణ్య, మాదంశెట్టి చిన్నతల్లి, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు, మొల్లి ముత్యాలు, సాడి పద్మారెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఇలా అయితే ర్యాంకు వెళ్లిపోవడం ఖాయం పారిశుధ్య నిర్వహణపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2025–26 సంవత్సరానికి 49.66 లక్షల అంచనా వ్యయంతో కొబ్బరి చీపుర్ల కొనుగోలు ప్రతిపాదన చర్చకు వచ్చినప్పుడు సభ్యులు అధికారులను నిలదీశారు. సభ్యురాలు సాడి పద్మారెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు చీపుర్లు వంటి ఉపకరణాలు అందజేసే ముందు స్థానిక కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో సభ్యుడు రాపర్తి త్రివేణి వరప్రసాదరావు మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. స్వచ్ఛభారత్ ర్యాంకింగ్లో జీవీఎంసీ 9వ ర్యాంకుకు పడిపోయిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ర్యాంకు 90కి పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఈ అంశాన్ని దాట వేశారు.. ఏయూ ప్రాంగణాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రైవేట్ కార్మికులకు చెల్లింపుల అంశంపై స్టాండింగ్ కమిటీలో చర్చ జరిగింది. ఈ అంశాన్ని సభ్యురాలు సాడి పద్మారెడ్డి లేవనెత్తారు. మే 12న ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ, ఏయూ గ్రౌండ్స్లో మూడు షిఫ్టుల్లో 900 మంది ప్రైవేట్ కార్మికులను రోజువారీ వేతనం రూ. 549 చొప్పున నియమించడంపై ఆమె ప్రశ్నించారు. అసలు ఏయూ ప్రాంగణాల్లో జీవీఎంసీ పారిశుధ్య పనులను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, మేయర్ పీలా శ్రీనివాసరావు ‘తర్వాత చర్చిద్దాం’ అంటూ ఆ అంశాన్ని దాటవేశారు. దీంతో పద్మారెడ్డితో పాటు ఇతర సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
అనకాపల్లికి చేరుకున్న ఆటోడ్రైవర్ పాదయాత్ర
అనకాపల్లి: సీ్త్రశక్తి పథకంలో భాగంగా మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీను ఈ నెల 2న విశాఖ నుంచి విజయవాడకు తలపెట్టిన పాదయాత్ర గురువారం స్థానిక నెహ్రూచౌక్కు చేరుకుంది. ఆయనకు ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పెదిరెడ్ల నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు కోన లక్ష్మణ సంఘీభావం తెలియజేశారు. పాదయాత్ర ఈ నెల 20న విజయవాడ చేరుకుంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరిబిల్లి జగదీష్, సహాయ కార్యదర్శి సూరిశెట్టి బాబునాయుడు, సభ్యులు పాల్గొన్నారు. -
దేవరాపల్లిలో యూరియా పంపిణీపై ఆరా తీసిన డీఏవో, ఆర్డీవో
దేవరాపల్లి: యూరియా కోసం రైతులు గంటల కొద్దీ నిరీక్షించి తీవ్ర ఇబ్బందులు పడ్డారని పత్రికల్లో వచ్చిన కథనాలపై జిల్లా కలెక్టర్ స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహన్రావు, అనకాపల్లి ఆర్డీవో ఆయిషా దేవరాపల్లిలో గురువారం పర్యటించారు. దేవరాపల్లి రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీపై స్థానిక వ్యవసాయ అధికారి, సిబ్బందిని ఆరా తీశారు. ఎరువుల పంపిణీకి సంబంధించిన రికార్డులను, స్టాక్ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రావు మాట్లాడుతూ దేవరాపల్లి మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో ఖరీఫ్ వరి నాట్లు పూర్తయ్యాయని, ఇప్పటి వరకు 540 మెట్రిక్ టన్నులు యూరియా అందించామన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికార్ల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేస్తామని, యూరియా స్టాక్ పాయింట్ వద్ద రెవెన్యూ సిబ్బందిని ఉంచుతామన్నారు. వీరి వెంట మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణి, తహసీల్దార్ పి.లక్ష్మీదేవి, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి ఎల్.వై. కాంతమ్మ, ఏఈవో ఎస్.కిరణ్కుమార్ తదితర అధికార్లు, సిబ్బంది ఉన్నారు. -
నిమజ్జనోత్సవంలో అప్రమత్తత అవసరం
ఎస్పీ కార్యాలయంలో వినాయకునికి ప్రత్యేక పూజలు చేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జిల్లాలో జరుగుతున్నాయని, గణేష్ నిమజ్జన సమయంలో కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుహిన్ సిన్హా కోరారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఆయన గురువారం ప్రత్యేక పూజలు చేసి, అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏవో సీహెచ్.తిలక్బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీ పి.నాగేశ్వరరావు, సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బాల సూర్యరారావు, మన్మధరావు, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
పదేళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మరోసారి అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కానుంది. 2026 ఫిబ్రవరిలో భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026 విన్యాసాలను నిర్వహించనుంది. దాదాపు పదేళ్ల తర్వాత విశాఖలో జరుగుతున్న ఈ యుద్ధ నౌకల ప్రదర్శన కోసం దాదాపు 145 దేశాలను ఆహ్వానించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే చైనాను ఆహ్వానించాలా వద్దా అనే విషయంపై ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నాయి. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ.. గతంలో 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించింది. అలాగే 2024లోనూ రికార్డు స్థాయిలో మిలాన్ విన్యాసాలు జరిగాయి. ఇప్పుడు ఈ అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనతో విశాఖ ప్రాముఖ్యత మరింత పెరగనుంది. ఏమిటీ ఫ్లీట్ రివ్యూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో ఎదురుదాడికి దిగగల సత్తా చాటేందుకు నావికాదళ విన్యాసాలు ప్రపంచదేశాలకు చాటేందుకు నిర్దేశించినవే ఫ్లీట్ రివ్యూలు. భారత సుప్రీం కమాండర్ అయిన దేశాధ్యక్షుని సమక్షంలో ఈ విన్యాసాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే భారత్ 2001లో ముంబైలోనూ 2016లో విశాఖలో ఐఎఫ్ఆర్ని నిర్వహించిన అనుభవం ఉంది. ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు వేదికగా విశాఖ నిలుస్తోంది. ప్రపంచానికే నాగరికత నేర్పిన దేశంలో తొలి టైడల్ డాక్ని భారత్ నిర్మించింది. చంద్రగుప్త కాలం నుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర పేర్కొంటున్నది. నాటినుంచి నేటి అణుజలాంతర్గాముల నిర్మాణంలోనూ స్వయంచాలితంగా ఎదిగిన భారత్ ప్రపంచదేశాలను ఆకర్షిస్తూనే ఉంది. అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనతో మరోసారి ప్రపంచదేశాల దృష్టి విశాఖ తీరంవైపు సాగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 24 వరకూ ఐఎఫ్ఆర్తో పాటు మిలాన్–2026ని విశాఖలో నిర్వహించనున్నారు. తొలిసారి 25.. మూడోసారి 145 2001లో భారత్లో తొలిసారి ముంబైలో ఐఎఫ్ఆర్ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్ఆర్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో 145 దేశాలకు ఆహ్వానం పంపించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు ఇండియన్ నేవీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ టాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్, గ్రీన్టగ్స్ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి. చైనాని పిలవాలా.. వద్దా.? ఇటీవల చైనాతో చర్చలు జరిగిన నేపథ్యంలో..ఐఎఫ్ఆర్కు చైనాను ఆహ్వానించాలా వద్దా అనే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్చలు జరుపుతోంది. 2016లో నిర్వహించిన ఐఎఫ్ఆర్కు చైనాని ఆహ్వానించగా రెండు యుద్ధ నౌకలు, ఓ జలాంతర్గామి విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఈసారి ఆహ్వానం అందించాలా వద్దా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తోందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ భారత్లో జరిగే ఏ విన్యాసాలకు పాక్ని ఆహ్వానించలేదు. రాబోతున్న ఐఎఫ్ఆర్, మిలాన్–2026కి కూడా ఆహ్వానం లేదని రక్షణ వర్గాలు తెగేసి చెబుతున్నాయి. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలకు చెందిన దేశాలు ఐఎఫ్ఆర్లో భాగస్వామ్యం కాబోతున్నాయి. -
ఉపాధ్యాయులే జీవిత మార్గదర్శకులు
అనకాపల్లి టౌన్: ప్రతి విద్యార్థి తమ ఉపాధ్యాయులను జీవిత మార్గదర్శకులుగా చూడాలని దివంగత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు, సుదీక్ష గ్రూప్ సీఎండీ డాక్టర్ సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. స్ధానిక డైట్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గురువు చూపే దారే సరైన గమ్యం అనే భావన ఉండాలన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి జ్ఞానం, దేశ సేవ వంటి ఆదర్శాలు మనకు ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తాయన్నారు. రాధాకృష్ణన్ తమ కుటుంబానికే కాకుండా దేశానికే గర్వకారణంగా నిలిచారన్నారు. కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
అచ్చెన్న చెరువు మట్టిపై ‘కూటమి’ కన్ను.!
అచ్యుతాపురం రూరల్: యర్రవరం పంచాయతీలోని అచ్చెన్న చెరువులో మట్టిపై కూటమి నాయకుల కన్ను పడింది. సర్వే నంబరు 147లోని సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో మట్టిని యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టపగలే భారీ టిప్పర్లు, పొక్లెయిన్ల సహాయంతో ప్రభుత్వ చెరువులో మట్టిని తవ్వి తరలించుకుపోతున్నారు. సమీప పొలాల్లో భూమిని ఎత్తు చేసుకోవడానికని చెప్పి చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతి తీసుకుని కొల్లగొడుతున్నారు. గురువారం ఈ చెరువు నుంచి మట్టిని తీసుకెళ్లి కొండకర్ల ఆవకు సమీపంలోని ఓ ప్రైవేట్ స్థలంలో ఫిల్లింగ్ చేయడంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే భారీ టిప్పర్లతో ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో నిర్మిస్తున్న పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, ప్రైవేట్ లేఅవుట్లు ఎత్తు చేసుకోవడానికి మట్టిని తరలించి అక్రమ ధనార్జన చేస్తున్నారని మండిపడ్డారు. అధికార కూటమి నాయకులు అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని గ్రామంలోని సహజ వనరులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు మొదలు.. చెరువులో మట్టి తరలింపు విషయాన్ని ప్రశ్నిస్తున్న గ్రామస్తులపై అధికారం అండతో కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. యర్రవరానికి చెందిన కొల్లేటి చిన్నారావు గ్రామంలో టీషాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. గ్రామం నుంచి అక్రమంగా తరలిపోతున్న మట్టి కారణంగా గ్రామానికి హాని కలుగుతుందన్న ఆవేదనతో ఆయన అడ్డుచెప్పారు. దీంతో చిన్నారావుపై కక్ష గట్టారు. టీ షాపు రోడ్డు మీదకు వచ్చిందని, తొలగించాలంటూ రెవెన్యూ సిబ్బందితో బెదిరింపులకు పాల్పడ్డారు. మట్టి బయటకు తరలించుకుపోవడంతో చుట్టు పక్కల ఉన్న తమ గ్రామానికి చెందిన భూములను అభివృద్ధి చేసుకోవడానికి మట్టి దొరక్క రైతులు ఇబ్బందులకు గురవుతారని చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి చెరువు మట్టి అక్రమ తరలింపులో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ డీఈ సాయి ప్రశాంతిని వివరణ కోరగా కేవలం పొలాల్లో భూమిని ఎత్తు చేసుకోవడానికి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఇర్రిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పొందిన అనుమతికి, చేస్తున్న పనికి వ్యత్యాసం ఉండడంతో విచారణ చేపడతామన్నారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
కశింకోట: భూమి బదిలీ (మ్యుటేషన్) కోసం రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ వీఆర్వో గన్నమరాజు సూర్యకృష్ణ పృధ్వీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. విశాఖ రేంజి ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. కశింకోట మండలం జెట్టపురెడ్డితుని శివారు నరసింగబిల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు తమ తల్లి పేరిట ఉన్న 2.10 ఎకరాల భూమిని తమ పేరిట బదిలీ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని గత నెలలో దరఖాస్తు చేశారు. రైతు ఊడి నాగేశ్వరరావు చేసిన ఈ దరఖాస్తును పరిశీలించిన వీఆర్వో గన్నమరాజు సూర్యకృష్ణ పృధ్వీ రూ.40 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేమని నాగేశ్వరరావు చెప్పగా.. చివరకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు విశాఖ రేంజి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రైతు నుంచి వీఆర్వో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. వీఆర్వోను అరెస్టు చేశామని, శుక్రవారం అతడిని విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. -
నేడు గురు పూజోత్సవం
అనకాపల్లి టౌన్: పట్టణంలోని గుండాలవీధి ఎస్.ఆర్. శంకరన్ హాల్లో జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా విధ్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. మండలంలోని కొప్పాక జెడ్పీ పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ నిర్వహణ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ విజయ కృష్ణన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారని, జల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. అనంతరం గురుపూజోత్సవ కార్యక్రమాల బ్రోచర్ను విడుదల చేశారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి పొన్నాడ అప్పారావు, సహాయ కమిషనర్ శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, రామలింగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల సరఫరాలో కూటమి ప్రభుత్వం విఫలం
● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దేవరాపల్లి: రాష్ట్రంలో రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయడంలో కూటమి ప్రభు త్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలం తారువలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పంటల సాగు విస్తీర్ణం ఆధారంగా సీజన్ ప్రారంభంలోనే అవసరమైన ఎరువుల సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతుల పాలిట శాపంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతులు గంటల తరబడి భారీ క్యూలైన్లో నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్లు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు అవసరమైన యూరియాను పుష్కలంగా సర ఫరా చేశామన్నారు. రోజంతా పనులు మానుకొని పడిగాపులు కాస్తే ఎంత విస్తీర్ణం ఉన్నా, బస్తా యూరియా ఇస్తుండటం దారుణమన్నా రు. రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తూ పో రాడుతుండటంతో కూటమి ప్రభుత్వం ఇ ప్పు డు పరుగులు పెడుతుందని, ముందుగా ప్రణాళిక బద్ధంగా వ్యవహరించి ఉంటే ఇబ్బందులు తప్పేవని తీవ్రంగా మండిపడ్డారు. -
రక్త కన్నీరు
అనకాపల్లి టౌన్: స్కూల్లో టీచర్స్ డే వేడుకలు.. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు చెప్పడానికి పూలు తీసుకొని బయల్దేరారు ఆకాష్, అనీష. వారిద్దరూ కవల పిల్లలు. తాను టీచర్ వేషం వేస్తానని చీర కట్టుకొని తయారైంది అనీష. తాము చదువుతున్న ఏఎంఏఏ హైస్కూల్కు ఆటోలో బయలుదేరారు. కొద్ది నిమిషాల్లోనే విధి వక్రించింది. మార్గంమధ్యలో కృష్ణాపురం వద్ద పంది అడ్డం రావడంతో ఆటో డ్రైవర్కు స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. వారి వాహనం బోల్తా పడి ఆటోలో ఉన్న ఆకాష్ (14) అక్కడిక్కడే మృతి చెందగా, చెల్లెలు అనీష కాలికి తీవ్ర గాయమయింది. ఆటోలో ప్రయాణిస్తున్న మ రో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన అనీషాను వెంటనే ఎన్టీఆర్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అన్న చెల్లెలు ఇద్దరూ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఆకాష్ తండ్రి స్థానిక జేఎంజే హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. కోటి ఆశలకు ఆలంబనగా ఉన్న తమ కుమారుడిని విగ త జీవిగా చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఆకాష్ కళ్లు సజీవం అంత దుఃఖంలోనూ ఆకాష్ తల్లిదండ్రులు ఆదర్శంగా నిలిచారు. తమ కుమారుడి నేత్రాలను దానం చేశారు. ఒకపక్క కన్నీరు మున్నీరవుతూనే బాధ్యత గా ఆలోచించారు. తమ చిన్నారి మరణించినా కళ్ల ను సజీవంగా నిలిపారు. చుట్టుపక్కల గ్రామస్తుల ఆందోళన పంది ఆటోకు అడ్డంగా రావడంతో ప్రమాదం జరిగిన నేపథ్యంలో మృతుని స్వగ్రామమైన రామాపురం చుట్టుపక్కల గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. విచ్చలవిడిగా తిరుగుతున్న పందులే ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆగ్రహిస్తూ రామాపురం రోడ్పై బైఠాయించి నిరసన తెలిపారు. -
ఉపమాక వెంకన్న ఆభరణాలు భద్రం
రుషికొండ ఆలయంలో ఆభరణాలను లెక్కిస్తున్న టీటీడీ ఇన్వెంటరీ సిబ్బంది నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. స్వామివారికి వెలకట్టలేని వజ్రవైఢూర్యాలు, స్వర్ణాభరణాలు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటిని భధ్రతా కారణాల రీత్యా విశాఖ సబ్ ట్రెజరీలో ఉంచారు. ఏటా వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం టీటీడీ చీఫ్ అకౌంట్ ఆఫీసరు వెంకటరమణ ఇన్వెంటరీ సూపరింటెండెంట్ ముని చెంగలరాయుడుల ఆధ్వర్యంలో టీటీడీ ఇన్వెంటరీ సిబ్బంది రుషికొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి ఆభరణాలను లెక్కించారు. సబ్ ట్రెజరీల్లో భద్రపరచిన ఆభరణాల ప్రాప్తికి రికార్డుల ప్రకారం ఉన్నాయా అనేది ఆడిట్ నిర్వహించారు. అన్ని ఆభరణాలను పూర్తిగా పరిశీలించి జీఎస్టీతో కూడిన రశీదు, ధర్మకాటా రశీదులతోపాటు, దాతలు స్వామివారికి సమర్పించే ఆభరణాలకు సంబంధించి ముందుగానే తగిన వివరాలను తెలియజేస్తూ లేఖను సమర్పించాల్సి ఉంటుందని ఇన్వెంటరీ అధికారులు చెప్పారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆడిటర్ వై గురుప్రసాద్, రుషికొండ దేవస్థానం ఏవో ఎస్ జగన్మోహనాచార్యులు, సూపరింటెండెంట్ వెంకటరమణ, అప్రైజర్ ఎన్ మునిశేఖరాచారి, ఉపమాక దేవస్థానం ఇన్స్పెక్టర్ కూర్మేశ్వరరావు, దేవస్థాన ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు పాల్గొన్నారు. -
ఉత్తమ అధ్యాపకుడిగా వడ్డాది ప్రిన్సిపాల్
నర్సీపట్నం/బుచ్చెయ్యపేట: వడ్డాది ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి.చిన్నా రావు రాష్ట్ర ఉత్తమ అధ్యాప కుడు పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రభుత్వం ప్రక టించిన రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులలో ప్రిన్సిపాల్ చిన్నారావు ఉన్నారు. నర్సీపట్నం ప్రభుత్వ జూ నియర్ కళాశాలలో ఇంగ్లిష్ అధ్యాపకులుగా ఆయన గతంలో సేవలందించారు. ఇన్చార్జి ప్రి న్సిపాల్గా కూడా పనిచేశారు. ఇటీవల పదోన్నతిపై వడ్డాది జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. ఇంగ్లిష్లో నూటికి నూ రు శాతం ఉత్తీర్ణత సాధనకు కృషి చేశారు. విద్యార్థులు స్టేట్ అవార్డులు సాధించడానికి తర్ఫీదు ఇచ్చారు. ఆయన కృషికి ఫలితంగా ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికయ్యారు. -
చదివిన చోటే బోధకుడిగా..
మాడుగుల మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల మాడుగుల రూరల్: ఉన్నత స్థాయిలో స్థిరపడిన తర్వాత మనం చదువుకున్న పాఠశాలలో అడుగుపెడితే ఒక్కసారిగా రెక్కలు వచ్చిన పక్షిలా బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాం. ఆనాటి అనుభూతులు ఎన్నెన్నో కళ్ల ముందు కదలాడుతుంటాయి. అప్పుడు పొందే ఆనందం వర్ణనాతీతం. ఇక్కడే ఉండిపోతే ఎంతో బాగుణ్ను అనిపిస్తుంది. అదే అక్కడే పనిచేసే అవకాశం లభిస్తే ఎగిరి గంతేస్తాం.. అటువంటి అరుదైన అవకాశం పొందిన మాడుగులకు చెందిన సిరిపిల్లి నాగ వెంకట దేవి సూర్యనారాయణ మాస్టారు తాను చదువుకున్న పాఠశాలలోనే ప్రధానోపాధ్యాయుడిగా అడుగుపెట్టారు. ఆయన 1998 డీఎస్సీలో ఎంపికై హుకుంపేట మండలం బంగారుమెట్టలో ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించారు. ప్రస్తుతం మాడుగుల నడిబొడ్డున 114 సంవత్సరాలు చరిత్ర కలిగిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (గెడ్డబడి) విధులు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి బాటలో పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (గెడ్డబడి )లో 2021 జనవరి 16న హెచ్ఎంగా చేరిన నాటికి ఇక్కడ 34 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ఆయన కృషితో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 144కు పెరిగింది. ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆయన చొరవతో పాఠశాలను వాసవీ క్లబ్ దత్తత తీసుకుంది. ఆరోహణ ట్రైబుల్ వెల్ఫేర్ సొసైటీ, మన్యం జ్యోతి సేవా సంఘం, భారత నిర్మాణ సేవా ట్రస్టు వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ ఏడాది జూన్ 12 వరకు హెచ్ఎంగా చేసిన ఆయన ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా గతంలో సాగరం కాలనీ ఎంపీపీ పాఠశాలల్లో పనిచేసేటప్పుడు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, నోట్ పుస్తకాలు, పాలు వంటివి పంపిణీ చేయించారు. చింతలూరు పాఠశాలలో అక్కడ క్వారీ యాజమాన్యం సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2019లో చింతలూరు పాఠశాలలో పనిచేసేటప్పుడు ఆయనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. వీరనారాయణం పాఠశాలలో పనిచేసేటప్పుడు మండల స్థాయి అవార్డు పొందారు. తన బోధన, బోధనేతర కార్యక్రమా లతో ఆదర్శంగా నిలిచారు. -
నాకొద్దు బాబోయ్
● దీర్ఘకాలిక సెలవులో అనకాపల్లి తహసీల్దార్ ● అధికారులపై పెరుగుతున్న రాజకీయ పెత్తనం ● నిబంధనలకు విరుద్ధంగా తాము చెప్పిందే చేయాలంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ● ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవుపై వెళ్లిన తహసీల్దార్ మీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవు పెట్టేశారురాజకీయ పెత్తనం పెరగడంతో అధికారులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి భయపడుతున్నారు. ఒత్తిళ్లు భరించలేక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. మ్యుటేషన్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు తాను చెప్పినట్టు జారీ చేయాలని ఒక మాజీ ఎమ్మెల్యే.. రోడ్డు విస్తరణ నిర్వాసితుల్లో తాను చెప్పిన పేర్లు చేర్చమని మరో మాజీ ఎమ్మెల్యే బలవంతపెట్టడంతో నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులు చేయలేక అనకాపల్లి తహసీల్దార్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఈ ఉద్యోగం సాక్షి, అనకాపల్లి: అది సాక్షాత్తూ కలెక్టర్ కొలువుదీరిన జిల్లా కేంద్రం.. తమ సిబ్బంది సాధకబాధకాలు ప్రత్యక్షంగా కనిపించడంతో జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించడం, అండగా నిలవడం సర్వసాధారణం. కానీ అనకాపల్లిలో మాత్రం తహసీల్దార్ అంతటి అధికారి ఒత్తిళ్లు భరించలేక సెలవును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులపై రాజకీయ పెత్తనం పెరిగిందనడానికి తాజా ఉదాహరణ. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా బెదిరింపులకు పాల్పడుతూ టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెవెన్యూ శాఖలో వివాదస్పదమైన భూ లిటిగేషన్ పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్లకు సంబంధించి అక్రమాలకు సహకరించడం లేదంటూ నేరుగా తహసీల్దార్పైనే టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాను చెప్పిన ఈ పనులు చేయాలని అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే తహసీల్దార్పై ఇటీవల రెండు వారాలుగా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా చేస్తే తన ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని, చేయలేనని తహసీల్దార్ అప్పారావు చెప్పినట్టు తెలిసింది. దీనికి ఆ మాజీ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయి నానా దుర్భాషలాడారు. ప్రస్తుతం విశాఖ టీడీపీలో జిల్లా స్థాయి పదవిని అనుభవిస్తున్న పెందుర్తి నియోజకవర్గానికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కూడా అనకాపల్లి తహసీల్దార్పై మరో విషయంలో ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అనకాపల్లి మండలంలోని కోడూరు గ్రామంలో లే అవుట్ నెం.4కు సంబంధించి 100 అడుగుల రోడ్డు విస్తరణ జరుగుతోంది. భూములు కోల్పోయిన లబ్ధిదారుల జాబితాలో తాను సిఫార్సు చేసిన వారి పేర్లు పొందుపరచాలని మాజీ ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. దీనికి నిబంధనలకు అనుగుణంగా ఉంటే చేస్తామని లేదంటే కుదరదని తహసీల్దార్ తోసిపుచ్చారు. గతంలో సర్వే నెంబర్.20లో ఇలానే జరిగిందని, మీరెందుకు ఇవ్వరంటూ ప్రశ్నించి.. మాజీ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయి ‘నీ అంతు చూస్తా.. చేయలేకపోతే సెలవు పెట్టేసి వెళ్లిపో’ అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. దీనికి కలత చెందిన తహసీల్దార్ అప్పారావు సన్నిహితుల వద్ద బోరున విలపించినట్టు సమాచారం. ఎందుకొచ్చిన గొడవ.. రావడమే భయంతో వచ్చాను.. ఇక్కడ నుంచి పోవడం శ్రేయస్కరమని ఆయన సెలవు పెట్టేసి వెళ్లిపోయినట్లు రెవెన్యూ అధికారుల చర్చించుకుంటున్నారు. 41 రోజుల నరకం తహసీల్దార్ ఎం.బి.అప్పారావును జూన్ నెల 6వ తేదీన అనకాపల్లికి బదిలీ చేశారు. అనకాపల్లిలో విధులు నిర్వహించడం కష్టమని భావించిన అప్పారావు విధుల్లో చేరకుండా 37 రోజులపాటు నిరీక్షించి తప్పనిసరి పరిస్థితుల్లో జూలై 17న బాధ్యతలు స్వీకరించారు. 41 రోజుల పాటు పనిచేసిన అప్పారావు అధికార టీడీపీ చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల హూంకరింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఆగస్టు 28న నెలరోజుల పాటు దీర్ఘకాలిక సెలవు పెట్టారు. అందరికీ హడలే.. అనకాపల్లిలో నెల రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్ కుమారస్వామి నియమితులై.. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే పదోన్నతిపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి నెల రోజులపాటు డిప్యూటీ తహసీల్దార్ లేరు. ఆ పోస్టు ఖాళీగా ఉండగానే ఆగస్టు 28న తహసీల్దార్ కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయమంతా ఖాళీ అయిపోయింది. సమస్యలపై వచ్చిన వారు సమస్య తీరకుండానే వెనుదిరుగుతున్నారు. ఈ నెల 2వ తేదీన కొత్త డిప్యూటీ తహసీల్దార్ను నియమించారు. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయి తహసీల్దార్ను నియమించలేదు. భూ సమస్యలు, రికార్డ్ ఆఫ్ రైట్స్ కాపీలు, పాసుబుక్లు, కుల, ఆదాయ, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. కొత్త భూ సర్వేలకు సంబంధించి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అనంతరం మ్యుటేషన్ ప్రక్రియ ఆగిపోయింది. పూర్తిస్థాయి ఎమ్మార్వో లేకపోవడంతో పెండింగ్లో పెట్టేస్తున్నారు. ఇక కింది స్థాయి ఉద్యోగులు తమకెందుకు రిస్క్ అంటూ గమ్మున ఉంటున్నారు. పాయకరావుపేట డీటీ ఇక్కడకు బదిలీపై వచ్చినప్పటికీ ఆయన కూడా లోలోపల భయం భయంగానే పనిచేస్తున్నారు. కింది స్థాయి అధికారులు, ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన ఉన్నతాధికారులు మౌనంగా చూసీ చూడనట్టు వ్యవహరించడం తగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.