breaking news
Anakapalle
-
అరెస్టులు.. కేసులు.. ఉద్యమాన్ని ఆపలేవు
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంపై మత్స్యకారులు మండిపడ్డారు. ‘అరెస్టులు.. అక్రమ కేసులు ఉద్యమాన్ని ఆపలేవు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. మత్స్యకార నాయకుల్ని అరెస్టు చేయడంతో రాజయ్యపేట గ్రామం ఒక్కసారిగా వేడెక్కింది. మత్స్యకార నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడానికి నిరసిస్తూ శనివారం వందలాది మంది మత్స్యకారులు రాజయ్యపేటలో నూకతాత ఆలయం వద్ద కొనసాగుతున్న నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యమకారులపై అక్రమ కేసులా! వారం రోజుల క్రితం తుపాను షెల్టర్లో బాధితులకు భోజనాలు పెడుతుండగా తనపై దౌర్జన్యం చేశారని, కులం పేరుతో దూషించారని పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మత్స్యకార నాయకుడు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు తదితర 13 మందిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి పిక్కి తాతీలు, పిక్కి రామ్చరణ్లను నక్కపల్లిలో అరెస్టు చేశారు. దీంతో మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవు™తోంది. శనివారం ఉదయం మత్స్యకారులంతా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఉద్యమాన్ని అణగదొక్కేందుకే మత్స్యకారులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. గ్రామంలోకి వచ్చిన హోంమంత్రిని అడ్డుకోవడం, జాతీయ రహదారిని ముట్టడించడం వల్ల ప్రభుత్వం కక్షగట్టి తమపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోందన్నారు. తక్షణమే కేసులు ఎత్తివేయాలని, అరెస్టు చేసిన మత్స్యకారులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టిన ప్రభుత్వం దీక్షా శిబిరం వద్ద మత్స్యకార నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గ్రామంలో కులాల మధ్య చిచ్చుపెట్టిందని, పంచాయతీ కార్యదర్శిని పావులా వాడుకుని బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మత్స్యకారులు గోసల స్వామి, కోడ కాశీరావు, పిక్కి స్వామి, మహేష్ చేపల సోమేష్ మాట్లాడుతూ తుపాను సందర్భంగా రక్షిత భవనం వద్ద భోజనాలు పెడుతున్నారని విషయం తెలిసి గ్రామానికి చెందిన సుమారు 200 మంది వెళ్లి గ్రామస్తులందరికీ భోజనాలు పెట్టాలని కార్యదర్శిని కోరినట్టు చెప్పారు. అంతే తప్ప కార్యదర్శిపై దౌర్జన్యం చేయలేదన్నారు. జరిగిన ఘటనపై గ్రామంలో బహిరంగ విచారణ జరపాలని డీఎస్పీని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. తమపై అక్రమ కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు. భారీగా మోహరించిన పోలీసులు మత్స్యకార నాయకుల అరెస్టు నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో వందలాది మంది పోలీసులు నక్కపల్లి, రాజయ్యపేటలో మోహరించారు. నక్కపల్లి జంక్షన్, రాజయ్యపేట జంక్షన్ వద్ద గ్రామాల్లోకి వచ్చేవారిని, వాహనాలను తనిఖీ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణను రెండో రోజు కూడా గృహనిర్బంధం చేశారు. -
తక్షణమే ఇళ్లు ఖాళీ చేయలేం..
నక్కపల్లి: బల్క్ డ్రగ్పార్క్ మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం నివాస ప్రాంతాలు కోల్పోయిన వారికి పునరావాస కాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు సిమెంట్, ఐరన్, వంటి మెటీరియల్ ఉచితంగా గానీ తక్కువ ధరకు గాని ఇప్పించాలని, అలాగే ఇళ్లు ఖాళీ చేసేందుకు ఏడాది సమయం కావాలని పలువురు నిర్వాసితులు కలెక్టర్ను కోరారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ చందనాడ, అమలాపురం, బుచ్చిరాజుపేట, డీఎల్ఫురం తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ పూర్తయి నష్ట పరిహారం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించిన గ్రామాల్లో 734 మంది నిర్వాసితులను గుర్తించి వారికి పెదబోదిగల్లం వద్ద కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్వాసిత కాలనీలో ప్లాట్లు కేటాయించడం జరిగిందన్నారు. వీరందరికీ ఇళ్ల నిర్మాణం, ఐదు సెంట్ల ఇంటి స్థలం, రూ.8.90 లక్షల నగదు సాయం అందించామన్నారు. బల్క్డ్రగ్ పార్క్ పనులు, స్టీల్ప్లాంట్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాసితులంతా తమ తమ నివాస ప్రాంతాలను ఖాళీ చేసి కొత్తగా కేటాయించిన కాలనీలో ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. నవంబరు 14 నాటికి ఎంతమంది తమ ప్రాంతాలను ఖాళీ చేసి కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటారో చెప్పాలని ఆయా గ్రామాల ప్రతినిధులకు సూచించారు. దీనిపై నిర్వాసితుల తరపున తళ్ల భార్గవ్, గంటా తిరుపతిరావు, సూరాకాసుల గోవిందు, గబ్బర్సింగ్, లక్ష్మణరావు, కె.శ్రీను తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పునరావాసకాలనీలో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వారు ఇచ్చిన ఆర్థిక సాయం ఏమాత్రం సరిపోదన్నారు. సిమెంట్, ఐరన్ ఉచితంగా అందజేయాలని కోరారు. ఇంటి నిర్మాణానికి అయ్యే మెటీరియల్ ఖర్చులో 60 శాతం ప్రభుత్వం భరించాలని అన్నారు. ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయాలంటే వీలుపడదని అన్నారు. కాలనీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్లాట్లు కేటాయింపు ప్రక్రియ మాత్రమే జరిగిందని, లబ్ధిదారులకు ఇప్పటివరకు వాటిని అప్పగించలేదన్నారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, వాడుకనీరు సదుపాయం కల్పించాలన్నారు. ఇవన్నీ పూర్తిచేసిన తర్వాత ఏడాది సమయం ఇస్తే ఇళ్లు ఖాళీ చేస్తామన్నారు. నెలా, రెండునెలల్లో ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేయడం కష్టమని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణానికి ఆరుమాసాల సమయం పడుతుందన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో వివాహాలైన ఆడపిల్లలకు ఇప్పటివరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయలేదని తెలిపారు. చాలా మంది ఇళ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం చెల్లించలేదని, అలాగే నిర్వాసితుల సమస్యలు చాలా ఉన్నాయని తెలిపారు. ఇవేవీ పరిష్కరించకుండా ఇళ్లు ఖాళీ చేయాలని కోరడం సమంజసం కాదని విన్నవించారు. కలెక్టర్ విజయ్కృష్ణన్ మాట్లాడుతూ సిమెంట్, ఐరన్ హోల్సేల్ ధరలకు ఇప్పిస్తామని, అలాగే ట్రాన్స్పోర్టు ఖర్చుల నుంచి వెసులు బాటు కల్పిస్తామన్నారు. ఉచితంగా ఇప్పించడం సాధ్యం కాదన్నారు. ఇళ్లు ఖాళీ చేసే లబ్ధిదారులు వేరొక చోట అద్దెకు ఉంటే అద్దె మొత్తాన్ని చెల్లించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. నిర్వాసితులు మాత్రం వీలైనంత తొందరగా ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో గ్రామాల్లోకి వెళ్లి నిర్వాసితులతో మాట్లాడి తెలియజేస్తామని ప్రతినిధులు కలెక్టర్కు హమీ ఇచ్చారు. ఈ సమావేశంలో నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ పాల్గొన్నారు. ఏడాది సమయం కావాలి సిమెంట్, ఐరన్ తక్కువ ధరకు ఇప్పించాలి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ సమస్యలు పరిష్కరించాలి కలెక్టర్ను కోరిన నిర్వాసితులు -
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
పంట నష్ట పరిహారంలో కూటమి ప్రభుత్వం కోత పెడుతోంది. పంట నష్ట పరిహారం కోసం చేసే ఎన్యూమరేషన్ ప్రక్రియ సందర్భంగా క్షేత్ర స్థాయిలో అధికారులపై నష్టం లెక్క తగ్గించాలంటూ ఒత్తిడి తెస్తోంది. జిల్లా తుఫాన్ ప్రభావంతో 15,180 ఎకరాల్లో పంటనష్టం జరిగితే దానిలో భారీగా కోత విధించి 3,452 ఎకరాల్లో పంట నష్టం చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ జీవోలో ఇచ్చిన విధంగా 33 శాతం పంట నష్టం తీవ్రతను పరిగణించాలని ప్రకటించినా..క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేషన్ను తగ్గిస్తున్నారు. 50 శాతం పంట నష్టం ఉన్నవారినే పరిగణనలోకి తీసుకుంటుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. -
మా పొలం నష్టం నమోదు నిలిపేశారు..
తుమ్మపాల, శంకరం గ్రామాల పొలాలు కలిసే ఉంటాయి. శంకరం గ్రామంలో ఉన్న మా పొలంతో పాటు సమీపంలో ఉన్న తుమ్మపాలకు చెందిన 1.5 ఎకరాల పొలంలో సాగు చేస్తున్న వరి పంట తుపానులో పూర్తిగా మునిగిపోయింది. పక్కనే ఉన్న శంకరం పొలానికి నష్టం నా పేరుతో నమోదు చేశారు. కానీ తుమ్మపాల పొలంలో జరిగిన నష్టాన్ని మాత్రం నమోదు చేయకుండా మూడు రోజులు తిప్పించుకున్నారు. చివరకు పొలాలకు నష్టం లేదంటూ నమోదు నిలిపేశారు. – గుమ్మాల సత్తిబాబు, రైతు, శంకరం గ్రామం -
నేటి నుంచి రంజీ సమరం
విశాఖ స్పోర్ట్స్: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–ఏ లో భాగంగా ఆంధ్ర జట్టు సొంత గడ్డపై తమిళనాడుతో తలపడనుంది. నగరంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో శనివారం నుంచి ఈ నాలుగు రోజుల మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆట ప్రారంభమై, రెండు సెషన్ల అనంతరం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఎలైట్ గ్రూప్–ఏలో 8 జట్లు పోటీ పడుతుండగా, ఇప్పటికే అన్ని జట్లు మూడేసి మ్యాచ్లు ఆడాయి. ఆంధ్ర జట్టు 9 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్లో ఒడిశాపై ఇన్నింగ్స్ విజయంతో ఆంధ్ర ఉత్సాహంగా బరిలోకి దిగుతుండగా, తమిళనాడు జట్టు 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం 15 పాయింట్లతో జార్ఖండ్ అగ్రస్థానంలో ఉండగా, 13 పాయింట్లతో విదర్భ రెండో స్థానంలో ఉంది. ఆంధ్ర జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలంటే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవాల్సి ఉంటుంది. రాబోయే మ్యాచ్ల్లో ఆంధ్ర.. తమ కంటే పైన ఉన్న జార్ఖండ్, విదర్భ జట్లతోనే ఆడాల్సి ఉండటం గమనార్హం. రాణిస్తున్న భరత్ : ప్రస్తుత సీజన్లో ఆంధ్ర జట్టుకు విశాఖకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశాఖకు చెందిన రికీ బుయ్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, ఆశిష్ స్టాండ్–బైగా ఉన్నాడు. కె.ఎస్.భరత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. యూపీతో జరిగిన మ్యాచ్లో 142 పరుగులు, ఒడిశాపై 93 పరుగులు చేశాడు. వికెట్ కీపింగ్లోనూ రాణిస్తూ ఒడిశాతో మ్యాచ్లో ఐదు క్యాచ్లు పట్టాడు. అయితే రికీ బుయ్ బ్యాటింగ్లో విఫలమవుతున్నాడు. ఒడిశాపై డకౌట్ కాగా, బరోడాపై 7, యూపీపై 2 పరుగులే చేశాడు. యూపీపై మాత్రం రెండు వికెట్లు తీశాడు. శశికాంత్ ఒడిశాపై 46 పరుగులతో పాటు ఒక వికెట్ తీశాడు. బరోడా, యూపీలపై కూడా తలో వికెట్ సాధించాడు. షేక్ రషీద్ టాపార్డర్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒడిశాపై 140 సాధించి అజేయంగా నిలిచాడు. యూపీపై 136 పరుగులు చేశాడు. ఓపెనర్ అభిషేక్ మూడు ఇన్నింగ్స్లలో 127 పరుగులు చేశాడు. త్రిపురాన విజయ్ రెండు మ్యాచ్ల్లో 9 వికెట్లు, సాయితేజ 8 వికెట్లు పడగొట్టారు. ఈ రంజీ మ్యాచ్ను వీక్షించే అభిమానుల కోసం ఏసీఏ ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. గేట్ నంబర్ 15 నుంచి ప్రవేశించి, ఎం స్టాండ్లో కూర్చుని మ్యాచ్ను వీక్షించవచ్చు. కోచ్ స్టీవ్తో రికీబుయ్, తమిళనాడు కెప్టెన్ జగదీషన్తో ఆంధ్ర క్రికెటర్ -
ఆ 12 గంటలు ఏం చేశారు.?
గత ప్రభుత్వ హయాంలో ప్రగతి పథంలో కేజీహెచ్ సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్లో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కేజీహెచ్ సూపరింటెండెంట్ అమరావతిలో ఉన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ తనకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. సీఎస్ ఆర్ఎంవో, ఆర్ఎంవోలు.. ఎవరి పని వారిదే అన్నట్లుగా వదిలేశారు. ఫలితంగా రోగులు ఇబ్బందులు పడ్డారు. అప్పుడే పుట్టిన శిశువులు అవస్థలు ఎదుర్కొన్నారు. బాలింతలు బాధలనుభవించారు. వెంటిలెటర్పై చికిత్స పొందుతున్న రోగులు నరకం చూశారు. ఆక్సిజన్ అందక శ్వాస కోసం ఆపసోపాలు పడ్డారు. దాదాపు 12 గంటల పాటు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయని చీకట్లో మగ్గింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు..? దీన్నిబట్టి చూస్తే పేదల వైద్యం పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో అవగతమవుతుంది. జనరేటర్లు ఏమయ్యాయి.? ప్రస్తుతం కేజీహెచ్లో 5 జనరేటర్లు ఉన్నాయి. వాటిని అత్యవసర వైద్య విభాగాలకు మాత్రమే అన్నట్లుగా వినియోగిస్తుంటారు. భూగర్భ కేబుల్ విద్యుత్ కనెక్షన్ కట్ అవ్వడంతో అనేక వార్డులు అంధకారంలో ఉన్నాయి. భావనగర్ వార్డు, మార్చురీ, రాజేంద్రప్రసాద్ వార్డు, పిల్లలవార్డు, గైనిక్ వార్డు.. ఇలా అనేక వార్డుల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 5 జనరేటర్లు ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఈ వార్డుల్లో ముఖ్యమైన వాటికి వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కానీ కేజీహెచ్ అధికారులు అలా చేయలేదు. ఈ ఐదింటిలో రెండు జనరేటర్లు సరిగా పనిచేయడం లేదని మోంథా తుపాన్ సమయంలో గుర్తించారు. వాటిని కూడా సరిచేయలేదని తెలుస్తోంది. జనరేటర్లు అద్దెకు తీసుకోలేదెందుకు..? ఆస్పత్రిలో ఏదైనా అత్యవసరం అయినప్పుడు సొంత నిధులు ఖర్చు చేసి.. జనరేటర్లు తీసుకువచ్చేందుకు వెసులుబాటు ఉంది. కానీ కేజీహెచ్ ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోలేదు. సూపరింటెండెంట్ డా.వాణి కోర్టు పనిమీద అమరావతి వెళ్లిపోయారు. తర్వాత స్థానంలో ఉన్న అధికారులు చొరవ తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు కూడా సాయంత్రం వరకు సమాచారం ఇవ్వలేదు. జనరేటర్లు అద్దెకు తీసుకోవడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ అనుమతి ఉంటే సరిపోతుంది. కానీ దానికి కూడా ప్రయత్నించకుండా రోగుల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. అద్దెకు జనరేటర్లు ఎందుకు తీసుకోలేదంటే తమ పరిధిలో లేదంటూ తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. అధికారుల మధ్య పొరపొచ్చాలే కారణమా..? కేజీహెచ్లో ఉన్నతాధికారులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయి గ్రూపు రాజకీయాలతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే జనరేటర్లను అద్దెకు తీసుకురాలేదని కేజీహెచ్ వర్గాలు చెబుతున్నాయి. వీరి నిర్లక్ష్యం కారణంగా 12 గంటల పాటు కేజీహెచ్లో చీకట్లు కమ్ముకున్నాయి. ముఖ్యంగా పిల్లల వార్డులో చిన్నారులు, ఇంక్యుబేటర్స్లో చికిత్స పొందుతున్న నవజాతశిశువులు నరకయాతన అనుభవించారు. బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆక్సిజన్ అందక భావనగర్, రాజేంద్రనగర్ వార్డులో వెంటిలేటర్లు, ఆక్సిజన్పై చికిత్స పొందుతున్న వారంతా అవస్థలు పడ్డారు. కేజీహెచ్పై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం..! కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రేమ కురిపిస్తూ ప్రభుత్వ వైద్యంపై శీతకన్ను వేసింది. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో వైద్య సిబ్బంది నియామకాన్ని గాలికొదిలేసింది. అర్బన్ హెల్త్ సెంటర్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి. కేజీహెచ్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఓపీ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. మందులు కూడా సరిపడా సరఫరా చేయకపోవడంతో పేదలంతా బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఓవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్రపన్నుతూ.. మరోవైపు కేజీహెచ్ వంటి వైద్య శాలలపైనా నిర్లక్ష్యం వహిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగితే.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా గుండె ఆపరేషన్లు ఆగిపోయాయంటే.. పేదోడి వైద్యంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై వైఎస్సార్సీపీ విమర్శల దాడి చేస్తే మళ్లీ ఇటీవలే ఆపరేషన్లు మొదలు పెట్టారు. అర్ధరాత్రి 12 గంటలకు విద్యుత్ పునరుద్ధరణ కేజీహెచ్లో మంచినీటి పైపులైన్ నిర్వహణలో భాగంగా ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ బ్లాక్ సమీపంలో పనులు చేస్తున్న సమయంలో యూజీ కేబుల్ కట్ అయింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న తర్వాత కేబుల్ పోయిన ప్రాంతాన్ని గుర్తించి కేబుల్ను జాయింట్ కిట్ ద్వారా మరమ్మతులు చేపట్టామని ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యామ్బాబు తెలిపారు. పాడైపోయిన కేబుల్ను సరిచేసి రాత్రి 11.45 గంటలకు పనులు పూర్తి చేశామనీ.. 12 గంటల తర్వాత పూర్తి స్థాయిలో అన్ని విభాగాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ఎస్ఈ వెల్లడించారు. సెల్ఫోన్ వెలుగులో రోగులకు వైద్యంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ ప్రగతి పథంలో పరుగులు తీసింది. ఎన్నో కార్యక్రమాల ద్వారా పేదలకు అత్తుత్తమ వైద్యం అందేలా నిరంతరం కృషి చేసింది. గత ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించగా ప్రభుత్వం మారే సమయానికి రూ.60 కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయి. సీఎస్ఆర్ బ్లాక్ పూర్తిచేసి 200 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చింది. క్రిటికల్ కేర్ యూనిట్తోపాటు ఓపీ మొత్తాన్ని ఆధునికీకరణ చేపట్టింది. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఓపీ, పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియోనాటిల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కార్డియాలజీ విభాగం మొత్తం పునర్నిర్మాణం, భావనగర్ వార్డులో ఏఎంసీ యూనిట్స్, అందుబాటులోకి కేన్సర్ కేర్ యూనిట్, అందులో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసింది. ఒక్క కేజీహెచ్కే కొత్తగా 8 అంబులెన్స్లు, రోగుల సహాయకుల బస కోసం చౌల్ట్రీల ఆధునికీకరణ, కనీసం 200 మంది ఉండేలా వెయిటింగ్ హాల్స్ను తీర్చిదిద్దింది. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో అదనంగా మరో క్యాజువాలిటీని రూ.30 లక్షలతో నిర్మించింది. లేబొరేటరీ, మొబైల్ ఎక్స్రే యూనిట్, ఆల్ట్రా స్కానింగ్ సిద్ధం చేసింది. కీలకమైన కార్డియాలజీ విభాగాన్ని రూ.24 లక్షలతో ఆధునికీకరించింది. ఐసీసీయూ, ఈకో, స్టేర్ కేస్, ఏసీ సదుపాయం, 120 కేవీ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ కారణంగానే కేజీహెచ్ చరిత్రలో తొలి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. గుండె జబ్బుల నియంత్రణ కోసం స్టెమీ ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాన ద్వారాన్ని రూ.30 లక్షలతో గత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అయితే ఎన్నికల తర్వాత ఈ పనులు పూర్తయ్యాయి. కేజీహెచ్లో అంధకారంపై సర్వత్రా విమర్శలు విద్యుత్ సరఫరా లేనప్పుడు జనరేటర్లు ఎందుకు తీసుకురాలేదు.? ఉన్న జనరేటర్లు పనిచేయట్లేదని తెలిసినా చర్యలు శూన్యం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో కేజీహెచ్ అధికారుల వైఫల్యం గత వైఎస్సార్ సీపీ హయాంలో కేజీహెచ్కు కొత్త రూపు కూటమి వచ్చిన తర్వాత పేదల వైద్యంపై నిర్లక్ష్యపు పడగ -
స్కూల్ బస్సులు ఫిట్నెస్ కలిగి ఉండాలి
అనకాపల్లి: జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సుల నిర్వాహకులు రవాణాశాఖ నిబంధనలను పాటించాలని, రహదారి ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్లో నైపుణ్యం కలిగిన డ్రైవర్లు మాత్రమే స్కూల్బస్ డ్రైవర్లుగా నియమించాలని జిల్లా ఇన్ఛార్జి ఆర్టీవో ఎ.వి.రమణ అన్నారు. జీవీఎంసీ విలీనగ్రామమైన కె.ఎన్.ఆర్.పేట ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ యాజమానులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ బస్లు ఫిట్నెస్ను ఎప్పటికపుడు పరిశీలించాలన్నారు. బస్సుల్లో అత్యవసర ద్వారాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని, బస్సులను గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా నడపాలని, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన పరికరాలను బస్సుల్లో భద్రపరచాలని సూచించారు. బస్ల్లో హ్యాండ్ బ్రేక్, మెయిన్ బ్రేక్, వాహనంపై నాలుగు మూలలు అంబర్ లైట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లాలో 50 ప్రైవేట్ స్కూల్స్కు చెందిన ప్రతినిధులు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే..!
● కేజిహెచ్లో జనరేటర్లు ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ ధ్వజం దేవరాపల్లి : పేద ప్రజల ప్రాణాల పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, విశాఖ కేజిహెచ్లో విద్యుత్ సమస్యతో రోగులు పడ్డ ఇబ్బందుల పట్ల వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ అన్నారు. దేవరాపల్లి మండలం తారువలో శుక్రవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కేజిహెచ్లో అత్యవసర వైద్య సేవలందించే రాజేంద్ర ప్రసాద్, భవన్నగర్, చిన్న పిల్లల వార్డు, గైనిక్ వార్డులలో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, ఇతర రోగులు నరకయాతన అనుభవించారన్నారు. ఈ సమస్యపై కూటమి ప్రజాప్రతినిధులు సహా కూత వేటు దూరంలో ఉన్న జిల్లా కలెక్టర్ సైతం కేజిహెచ్ను సందర్శించి సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడం దారుణమన్నారు. వేలా ది మందికి వైద్య సేవలందించే ఆసుపత్రిలో కనీసం జనరేటర్లు ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు. వందేళ్ల చరిత్ర కలిగిన కేజిహెచ్లో గతంలో ఎన్నడూ ఇలాంటి దారుణ ఘటన జరగలేదని, ఇది ముమ్మాటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమేనని అన్నారు. పవర్కట్తో ఆక్సిజన్ అందక మహిళ ప్రాణాలు కోల్పోయారని, దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడ ప్రమాదాలు జరిగినా కూటమి ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను విస్మరించి ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేయడం అలవాటుగా మారిందని, ఇలాంటివి మానుకోవాలని అనురాధ హితవు పలికారు. -
కూటమి నేతల కబ్జా పర్వం
సందరయ్యపేట పంచాయతీలో జేసీబీతో చదును చేస్తున్న కొండ అనకాపల్లి టౌన్: కూటమి ప్రభుత్వంలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, కొండలను ఇష్టానుసారంగా కబ్జా చేస్తున్నారు. మండలంలోని సుందరయ్య పంచాయతీ పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్ పక్కన ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కొండను అక్రమార్కులు శుక్రవారం పట్టపగలే జేసీబీలతో తొలిచేస్తున్నారు. ప్రభుత్వ భూములను తమ భూములుగా భావిస్తూ ఇష్టానుసారంగా యంత్రాలతో తవ్వేస్తున్నారు. ఇలాంటి చర్యలను అరికట్టాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. -
చోరీ కేసులో 100 గ్రాముల సొత్తు స్వాధీనం
తాటిచెట్లపాలెం: ద్వారకా క్రైం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని గతంలోనే అరెస్టు చేయగా, అతను తాకట్టు పెట్టిన చోరీ సొత్తును తాజాగా హైదరాబాద్లో స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ద్వారకా పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ క్రైం ఇన్చార్జి అన్నెపు నరసింహమూర్తి తెలిపారు. సీతమ్మధార ఏఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న గుంటూరు విక్రమాదిత్య వర్మ తన కుటుంబంతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం జూలై 17తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని కొనితివాడకు వెళ్లారు. జూలై 20న తిరిగి వచ్చేసరికి వారి ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండడం గమనించారు. బెడ్రూంలో ఉన్న బీరువాలో ఉంచిన సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించబడినట్లు గుర్తించి వెంటనే ద్వారకా క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ద్వారకా క్రైం పోలీస్స్టేషన్ సీఐ వి. చక్రధరరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఎస్.రాజు, సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు, మాజీ జవాన్ బసవ కిరణ్కుమార్ దొంగతనం చేసినట్టు గుర్తించి, ఆగస్టు 5న మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ద్వారకానగర్ ఎస్వీటీ జంక్షన్ వద్ద అతన్ని అరెస్టు చేశారు. అతనిది శ్రీకాకుళం జిల్లా కాగా.. జ్ఞానాపురంలో నివాసం ఉంటున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత చోరీ సొత్తు గురించి పోలీసులు విచారించినా.. ఫలితం లేకపోయింది. నిరంతర విచారణ ఫలితంగా సుమారు మూడు నెలల తర్వాత నిందితుడు చోరీ సొత్తును హైదరాబాద్లో తాకట్టు పెట్టినట్లు ఒప్పుకున్నాడు. ఈ సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి, 100 గ్రాముల బంగారు ఆభరణాలను గురువారం స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. చోరీ సొత్తును రికవరీ చేసిన ద్వారకా సబ్ డివిజన్ సిబ్బందిని సీపీ, డీసీపీ క్రైమ్ అభినందించారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
కె.కోటపాడు : ఎ.కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రతిభను చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 3న విశాఖ కై లాసగిరిలోని పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన అండర్–17 విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో కె.ప్రమోదిని, 1500 మీటర్లు, 3000 మీటర్లు పరుగు పందెంలో టి.మాధురి, 1500 మీటర్ల పరుగు పందెంలో ఎల్.ఉమ సత్తా చాటారు. ఈ నెల 6న ఆనందపురం హైస్కూల్లో జరిగిన అండర్–17 కబడ్డీ పోటీల్లో కె.జాన్ ప్రతిభను చూపి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే జట్టులో సభ్యునిగా ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 22, 23 తేదీల్లో పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గోనున్నట్లు పీఈటీలు కె.చిట్టి ప్రసాద్, తమ్మునాయుడు తెలిపారు. సత్తా చాటిన విద్యార్థులను పాఠశాలలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు ఎ.శేఖర్, ఉపాధ్యాయులు బి.శివప్రసాద్, సూర్రెడ్డి బాబూరావు, పీఎంసీ కమిటీ చైర్మన్ కిల్లి సింహాచలంనాయుడు, సర్పంచ్ బొడ్డు అక్కునాయుడు, ఎంపీటీసీ లెక్కల గౌతమి అభినందించారు. దొండపూడి స్కూల్ విద్యార్థి ప్రతిభ రావికమతం: మాకవరిపాలెం మండలంలో శుక్రవారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీల్లో దొండపూడి హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొంకిపూడి కీర్తన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. కీర్తన అండర్ –14 విభాగంలో సాఫ్ట్ బాల్ విభాగంలో సత్తా చాటింది. ఈ మేరకు ఆమెను వ్యాయామ ఉపాధ్యాయుడు సిహెచ్.ఆనంద్, పాఠశాల హెచ్ఎం బి.అప్పారావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
పాఠశాలల్లో సదుపాయాల పరిశీలన
కశింకోట: టెన్త్ పరీక్షలు నిర్వహించే డీపీఎన్ జెడ్పీ హైస్కూలు, బాలికల హైస్కూళ్లను శుక్రవారం ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎ. శ్రీధర్రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో డెస్కులు, బెంచులు, విద్యుత్, తాగునీటి సదుపాయం, ఫ్యాన్లు ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు. చేశారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయ రామరాజు ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎంలు ప్రసాద్, ఎంఎస్ స్వర్ణకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉద్యమకారులపై కేసులు తగవు
నక్కపల్లి: బల్క్ డ్రగ్పార్క్కు వ్యతిరేకంగా రాజయ్యపేటలో జరుగుతున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న మత్య్సకార నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుపాను సాయం కోసం పంచాయతీ కార్యదర్శిపై దౌర్జన్యం చేశారంటూ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గ్రామానికి చెందిన పిక్కి తాతీలు, పిక్కి కోటి, రామచరణ్ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సమంజసం కాదన్నారు. బల్క్డ్రగ్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ఉద్యమకారులను భయభ్రాంతులకు గురి చేసేందుకే అట్రాసిటీ కేసుల పేరుతో అరెస్టులు చేస్తున్నారన్నారు.పారా లీగల్ వలంటీర్లకు ఇంటర్వ్యూలు నర్సీపట్నం: మండల్ లీగల్ సర్వీస్ కమిటీ పారా లీగల్ వలంటీర్ల నియామకానికి శుక్రవారం కోర్టు సముదాయంలో సీనియర్ సివిల్ జడ్జి పి.షీయాజ్ ఖాన్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న 25 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరందరినీ ఎంపిక చేసినట్టు జడ్జి ప్రకటించారు. ఈ ఇంటర్వ్యూలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మెట్టా ప్రభాకర్రావు ఉన్నారు.అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం అనకాపల్లి టౌన్ : మండలంలోని జాతీయ రహరారి కోడూరు జంక్షన్ వద్ద అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. యలమంచిలి జయబాబు పలు గ్రామాలలో సేకరించిన 12 బస్తాల్లోని 600 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
గురుకులాల్లో పార్ట్ టైం లెక్చరర్స్ తొలగింపు అన్యాయం
స్వేరో నెట్వర్క్ రాష్ట్ర కన్వీనర్ చిట్టియ్య నర్సీపట్నం: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో పని చేస్తున్న పార్ట్టైం ఉపాధ్యాయులను ప్రభుత్వం అకారణంగా తొలగించడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ స్వేరో నెట్వర్క్ రాష్ట్ర కన్వీనర్ ఎం.చిట్టియ్య పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా వెట్టిచాకిరి చేయించుకుని తొలగించడం దారుణమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరలోచన చేయాలని డిమాండ్ చేశారు. పేద వర్గాల పిల్లలు చదువుకుంటున్న ఈ గురుకులాల్లో కనీస బోధన సదుపాయాలు కల్పించడానికి పార్ట్టైం పేరిట చాలీచాలని జీతాలు చెల్లిస్తూ ఒకేసారి ఉద్యోగాల నుంచి తొలగించడం గురుకుల ఉన్నతాధికారులకు తగదన్నారు. ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీతో పారదర్శక పాలన అందిస్తున్నామని చెబుతుంటే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల సొసైటీలో కనీసం తొలగిస్తున్నామన్న విషయాన్ని తెలపకుండా ఉపాధ్యాయులను రోడ్డున పడేయడం మంచిపద్ధతి కాదన్నారు. గురుకుల అధికారులు నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేని 72 కాలేజీలలో సీనియారిటీ కలిగిన లెక్చరర్స్ని ఇన్చార్జిలుగా నియమించి వారి స్థానంలో ఆయా సబ్జెక్టులు బోధించేందుకు పార్ట్ టైం లెక్చరర్స్ని నియమించారన్నారు. కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న వీరందరినీ తొలగించారన్నారు. వీరికి రావాల్సిన మూడు నెలల జీతాలను సైతం ఇవ్వకుండా కళాశాల నుండి గెంటేసారన్నారు. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా తక్కువ జీతాలతో పని చేసిన పార్ట్ టైం ఉపాధ్యాయులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో అదుకోవాలన్నారు. -
రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొన్న బైక్
కూర్మన్నపాలెం: అగనంపూడి ముఖ్య కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. గాజువాక పైడిమాంబకాలనీకి చెందిన వల్లూరి శ్రీనివాసరావు భార్య రమణమ్మ(48) అగనంపూడిలో పాలబూత్ నిర్వహిస్తోంది. అందువల్ల అగనంపూడిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, అక్కడ కూడా నివాసం ఉంటున్నారు. రమణమ్మ తన వ్యక్తిగత పని నిమిత్తం శుక్రవారం సాయంత్రం కూర్మన్నపాలెం వెళ్లి తిరిగి వస్తున్నారు. సాయంత్రం వేళ అగనంపూడి జంక్షన్లో ఆటో దిగి రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా మునగపాక మండలం చూచుకొండకు చెందిన సారిక నాగరాజు(48) తన కుమారుడు జవహర్తో కలిసి బైక్పై గాజువాక వైపు వస్తున్నారు. ఈ క్రమంలో జంక్షన్ వద్ద ఆమెను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రమణమ్మ తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించారు. బైక్పై నుంచి కిందపడిన తండ్రీకొడుకులు నాగరాజు, జవహర్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా నాగరాజు మార్గమధ్యంలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జవహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జవహర్ వికలాంగుడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూచుకొండలో విషాదం మునగపాక: అగనంపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చూచుకొండకు చెందిన వడ్డీ వ్యాపారి సారిక నాగరాజు (51) మృత్యువాతకు గురి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగరాజు విశాఖలో వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం తన బైక్పై కుమారుడు జవహర్తో కలిసి విశాఖ వెళ్లి వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకుని తిరుగు ప్రయాణంలో అగనంపూడి వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న బాటసారిని తప్పించే క్రమంలో నాగరాజు కిందపడిపోయాడు. దీంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందగా బైక్ వెనుక కూర్చున్న కుమారుడు జవహర్కు గాయాలయ్యాయి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న నాగరాజు మృతి వార్త తెలుసుకున్న గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మృతి, ఒకరికి గాయాలు -
ఇంటింటి కుళాయిల పనులు త్వరలో పూర్తి
జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి చోడవరం: అసంపూర్తిగా ఉన్న ఇంటింటి కుళా యి పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి చెప్పారు. గోవాడ, అంబేరుపురం గ్రామా ల్లో సీఈవో నారాయణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి సందీప్, ఆర్డబ్ల్యూఎస్ డీఆర్ఈవో జె.అనిల్ కుమార్, డిప్యూటీ ఈఈ ఎ.సూర్యనారాయణ, ఏఈ సీహెచ్ నర్సింహరావుతో కూడిన అధికారుల బృందం గురువారం పర్యటించి, అసంపూర్తిగా ఉన్న జల్జీవన్ మిషన్ పథకం పనులను పరిశీలించింది. ఈసందర్భంగా గోవా డ సర్పంచ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు మాట్లాడుతూ గ్రామంలో కొన్ని ఇళ్లకుకుళాయిలు వేయకపోవడంతో గ్రామ స్తులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని, వెంటనే కుళాయిలు వేయాలని కోరారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించింది. గోవాడలో 10శాతం మేర ఇళ్లకి కుళాయిలు వేయలేదని, వాటికి త్వరలోనే వేయిస్తామని సీఈవో చెప్పారు. అంబేరుపురంలో మంచినీటి సమస్యను సర్పంచ్ కార్లె ఈశ్వరమ్మ అధికారులకు వివరించారు. రాయపురాజుపేటలో గల పంప్హౌస్ను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సీఈవో తెలిపారు. -
లారీ ఢీకొని రైతు దుర్మరణం
యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణానికి సమీపంలో కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద గురువారం రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో రైతు మృతి చెందాడు.ఎస్ రాయవరం మండలం సర్వసిద్దికి చెందిన అడబాల సాయిరాం(59), అతని అల్లుడు దాసరి గోవింద్తో కలిసి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంపై యలమంచిలి మీదుగా అనకాపల్లి వెళ్తున్నారు. కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డు నుంచి 16వ నంబరు జాతీయ రహదారికి వీరు ప్రయాణిస్తున్న బైక్ రోడ్డు దాటుతున్న సమయంలో తుని నుంచి అనకాపల్లి వైపునకు వెళ్తున్న ఏపీ27వి 7265 రిజిస్ట్రేషన్ నంబరు కలిగిన లారీ, ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ బోల్తా పడి వెనుక కూర్చున్న అడబాల సాయిరాం రోడ్డుపై పడ్డాడు. అతని శరీరంపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర రక్తగాయాలైన సాయిరాం ప్రమాదస్థలంలోనే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న మృతుడి అల్లుడు దాసరి గణేష్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. దాసరి గణేష్ ఈ ప్రాంతంలో ఆర్ఎంపీగా సేవలందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. డ్రైవర్ అధిక వేగంతో నిర్లక్ష్యంగా లారీని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. సాయిరాం మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. కాగా కొక్కిరాపల్లి హైవే కూడలి ప్రాంతంలో ఇటీవల కాలంలో ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళన వాహనచోదకుల్లో నెలకొంది. -
సర్టిఫికెట్ కోర్సుల విద్యార్థులకు పరీక్షలు
మురళీనగర్(విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్, ఇతర కాలేజీల్లో సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు వార్షిక పరీక్షలు కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రారంభమయ్యాయి. ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఫ్యాషన్ డిజైన్, ఫైర్ సేఫ్టీకి సంబంధించి కోర్సులో శిక్షణ తీసుకున్న 2024–25 బ్యాచ్ విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 8వ తేదీన పరీక్షలు ముగుస్తాయి. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్, స్టూడెంట్స్ అఫైర్స్ కోఆర్డినేటర్ ఎస్.వి.రమణ గురువారం పరీక్ష కేంద్రాన్ని సందర్శించి ఇన్విజిలేటర్లకు పలు సూచనలు చేశారు. -
బస్సు వెనుక భాగంలో పొగలు
ఆందోళనకు గురైన ప్రయాణికులు మునగపాక: మండల కేంద్రం మునగపాకలో ఓ ఆర్టీసీ బస్సు వెనుక భాగంలో అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనకాపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గురువారం ఉదయం అనకాపల్లి నుంచి రాంబిల్లి మండలం కొత్తపట్నం చేరుకుని, తిరుగు ప్రయాణంలో ప్రయాణికులతో అనకాపల్లి వస్తుండగా మునగపాక జంక్షన్ పీఏసీఎస్ ఎదురుగా వద్ద బస్సు వెనుక భాగాన టైరుకు సమీపంలో యాక్సిల్ బాగా వేడెక్కడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. గమనించిన స్థానికులు బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణికులను కిందకు దించేశారు. యాక్సిల్ వేడి టైరు తగలడంతో పొగలు రావడంతో పాటు వాసన వచ్చింది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ నుంచి ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. -
దివ్యాంగులను వేధించడం తగదు
మహారాణిపేట(విశాఖ): దివ్యాంగుల పింఛన్ల కోసం తరచూ విచారణలు నిర్వహించి, ఆస్పత్రుల చుట్టూ తిప్పడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైరపర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో వారు మాట్లాడారు. దీనిలో భాగంగా అనంతగిరి జెడ్పీటీసీ గొలుగొండ జెడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు మాట్లాడుతూ దివ్యాంగులను విచారణపేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చైర్పర్సన్ జె.సుభద్ర జోక్యం చేసుకుంటూ.. దివ్యాంగులను వేధించడం సరికాదన్నారు. కొత్తగా ఎన్ని పింఛన్లు ఇచ్చారని, వితంతు పింఛన్ల మంజూరులో జాప్యం ఎందుకవుతోందని అధికారులను ప్రశ్నించారు. గ్యాస్ రాయితీ డబ్బులు జమ కావడం లేదు గ్యాస్ సిలిండర్ రాయితీ నగదు రెండు నెలలు దాటినా ఇంకా ఖాతాల్లో జమ కాలేదని కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి ఈకేవైసీ పూర్తి చేయకపోవడం, బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానం కాకపోవడం కారణమని ఏఎస్వో కల్యాణి వివరణ ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ‘తల్లికి వందనం’పథకంలో నగదు అందరికీ వేయడం లేదని, వేసిన మొత్తంలో కోత విధిస్తున్నారని ఈర్లె అనురాధ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి మొత్తం ఇచ్చారని, ఇప్పుడు సగం ఇవ్వడం వల్ల పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. పీహెచ్సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవని, అత్యవసర మందులు కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని అనురాధ తెలిపారు. గుంతలు పూడ్చండి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, వర్షాల వల్ల గుంతలు పెరిగి ప్రయాణం కష్టంగా మారిందని గొలుగొండ జెడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గుంతలు పూడ్చడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పాడేరు, అరకు ప్రాంతాల్లోని ఆశ్రమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యంతో మరణిస్తున్నారని, పరిశుభ్రమైన నీరు ఇవ్వడం లేదని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకుని, గిరిజన విద్యార్థుల ఆరోగ్యం కాపాడాలని డిమాండ్ చేశారు. గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపులు ఎప్పుడు? గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ల లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని ఆనందపురం జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావు అన్నారు. వేములవలసలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు ఇవ్వలేదని ఆయన ప్రస్తావించారు. అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు డి.గంగరాజు సైతం గృహ నిర్మాణ బిల్లుల చెల్లింపుపై ప్రశ్నించారు. ఇళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని పేర్కొన్నారు. ఆశ కార్యకర్తల పోస్టులను రద్దు చేయండి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశ కార్యకర్తల పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని, అనర్హులకు పోస్టులు ఇచ్చారని అరకు, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు రోషిణి, గంగరాజు ఆరోపించారు. ఈ పోస్టులను తక్షణం రద్దు చేసి, మళ్లీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డీఎంహెచ్వో పాత్రపై విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రల్లో అత్యవసర మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఈర్లె అనురాధ తెలిపారు. అరకు, పాడేరుపై వివక్ష అరకు, పాడేరు నియోజకవర్గాలపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఇక్కడ మండల లెవిల్ స్టాక్ పాయింట్లను జీసీసీ నుంచి రెవెన్యూకు అప్పగించడం వంటి అదనపు పద్ధతులు పెట్టారని, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉండడం వల్లే ఈ వివక్ష చూపుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర విమర్శించారు. -
చిత్ర దర్శకుడు అనిల్
గ్రామీణ నేపథ్యంలో ‘రోలుగుంట సూరి’ సబ్బవరం: గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన రోలుగుంట సూరి చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చిత్ర దర్శకుడు అనిల్ పళ్ల తెలిపారు. సబ్బవరంలోని సీతారామ కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14న 100 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతందని, ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో హీరోగా నాగార్జున పళ్ల, హీరోయిన్లుగా ఆద్యారెడ్డి, భావన నటించినట్లు తెలిపారు. విలన్ పాత్రలో బ్రహ్మానంద రెడ్డి చక్కని ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. హీరో నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రంతో తాను హీరోగా పరిచయమవుతున్నట్లు తెలిపారు. కాగా.. ఈ చిత్ర దర్శకుడిది సబ్బవరం మండలం చినగొల్లలపాలెం. దీంతో ఇదే ప్రాంతానికి చెందిన పళ్ల తాతారావు, మల్లునాయుడులేనికి చెందిన ఆరిపాక ప్రసాద్, కె.సంతోష్ కుమార్, పళ్ల సత్యనారాయణ, రోమాల చంద్రశేఖర్ తదితరులకు ఈ చిత్రంలో అవకాశం కల్పించారు. -
బల్క్డ్రగ్ పార్క్ రద్దు చేయాలి
నక్కపల్లి: బల్క్ డ్రగ్పార్క్ను వెంటనే రద్దుచేయాలని ఏపీ రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాజయ్యపేటలో నిరాహారదీక్ష చేస్తున్న మత్స్యకారులకు గురువారం రైతుకూలీ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతుకూలీ సంఘం జిల్లాకార్యదర్శి కోన మోహన్రావు, నవయువ సమాఖ్య జిల్లాకన్వీనర్ ఎన్.భాస్కరరావు మాట్లాడుతూ 1,276 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారులు 53 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం బల్క్ డ్రగ్పార్క్ రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ ఆందోళనలో స్థానిక మత్స్యకారులు సోమేష్, స్వామి, మహేష్, బాబ్జి, అప్పలరాజు పాల్గొన్నారు. -
రోగుల హాహాకారాలు
విద్యుత్ సరఫరా లేకపోవడంతో పలు వార్డుల్లో రోగులు హాహాకారాలు పెట్టారు. గైనిక్ వార్డులో బాలింతలు, డెలివరీ కోసం లేబర్ రూమ్లో ఉన్న గర్భిణులు, పిల్లల వార్డులో బరువు, నెలతక్కువతో పుట్టిన పిల్లలు, వివిధ సమస్యలతో ఉన్న చిన్నారులు, వెంటిలేటర్ మీద ఉన్న రోగులు, ఎమర్జన్సీ వార్డుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. పిల్లల పరిస్థితి చూసిన తల్లులు.. రోగుల పరిస్థితి చూసిన వారి బంధువులు అల్లాడిపోయారు. ప్లాస్టిక్ సర్జరీ వార్డుల్లో గాయపడిన రోగులు, ఆక్సిజన్ పెట్టుకున్న రోగులు విద్యుత్ లేకపోవడంతో ఇక్కట్లకు గురయ్యారు. పిల్లలు, గైనిక్, భావనగర్, రాజేంద్రప్రసాద్ తదితర వార్డుల్లో ఫ్యాన్లు నిలిచిపోవడంతో రోగుల బంధువులు విసనకర్రలను ఆశ్రయించారు. నర్సులు రోగులకు కొవ్వొత్తుల వెలుగులోనే వైద్య సేవలు అందించారు. -
48 కిలోల గంజాయి స్వాధీనం
కశింకోట: అచ్చర్ల జంక్షన్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 48 కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నట్టు సీఐ అల్లు స్వామి నాయుడు తెలిపారు. దీనిని ఏజెన్సీ నుంచి తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం దుచ్చిర్తి గ్రామానికి చెందిన అక్కపల్లి సుధాకర్ (36)ను అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రవాణాకు వినియోగించిన కారు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎస్ఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో తమ సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారని తెలిపారు. గంజాయి పట్టుకున్న వారిని అభినందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఏయూలో తత్కాల్ విధానం రద్దు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 28 బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ తెలిపారు. కారుణ్య నియామకాల కింద 40 మంది విశ్వవిద్యాలయ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించారు. ఏయూ సెనేట్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. విద్యార్థుల సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన తత్కాల్ విధానాన్ని రద్దు చేసి, ఇకపై సాధారణ రుసుముతోనే వేగంగా సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని అమలు చేస్తామన్నారు. పాత స్పెషల్ ఎగ్జామినేషన్ స్థానంలో రెండు కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఒకే సబ్జెక్ట్లో తప్పిన విద్యార్థుల కోసం ఇనిస్టెంట్ పరీక్ష, దశాబ్ద కాలంగా పరీక్షలు రాయడానికి వేచి చూస్తున్న అభ్యర్థుల కోసం స్పెషల్ డ్రైవ్ పరీక్షకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా కెరీర్ ప్లానింగ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వీసీ వెల్లడించారు.మౌలిక వసతుల కల్పనలో భాగంగా 350 కంప్యూటర్లను త్వరలో కొనుగోలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం స్టూడెంట్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామన్నారు. సీ4ఐ4 ల్యాబ్, ఎలిమెంట్ భవనంలో ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీని త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. పూర్వోదయ పథకంలో హాస్టల్ భవనాల నిర్మాణం కోసం రూ.170 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఏయూ వైద్యశాలలో నూతనంగా వైద్యులు, కన్సల్టెంట్ వైద్యులు, ఫార్మసిస్ట్లు, నర్సింగ్ సిబ్బందిని నియమిస్తామని, అదనపు పరికరాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అలాగే బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నివారించేందుకు క్యాంపస్లో సెక్యూరిటీని మరింత పటిష్టం చేయనున్నామన్నారు. సౌత్ క్యాంపస్లో కొన్ని ద్వారాలను మూసివేస్తామన్నారు. పూర్వ విద్యార్థుల అనుసంధానం(ఆలుమ్ని ఎంగేజ్మెంట్) కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు వీసీ తెలిపారు. ఈ నెల 11న పాడేరులో ‘ఏయూ గ్రామీణ అనుసంధానం’కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్సీసీ ఆధ్వర్యంలో 1,500 క్యాడెట్లతో ఈ నెల 23న బీచ్రోడ్డు కన్వెన్షన్ సెంటర్లో భారీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఏయూ రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
చీకట్లు
కేజీహెచ్లోఅధికారుల నిర్లక్ష్యం.. రోగులకు శాపంమహారాణిపేట : ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య సంజీవని కేజీహెచ్లో గురువారం రాత్రి చీకట్లు కమ్ముకున్నాయి. ఎటుచూసినా అంధకారం అలముకుంది. పలు వార్డుల్లో రోగులు, సిబ్బంది చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ఈ దుస్థితి దాపురించింది. యూజీ కేబుల్ కట్ అయ్యి.. సరఫరా నిలిచిపోయినా కేజీహెచ్ అధికారులు రాత్రి వరకు గంటల వరకూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకుండా వదిలేశారు. ఏమైందంటే? గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మార్చురీ సమీపంలో ఓ భవన నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ భూగర్భ కేబుల్ ఉందనే హెచ్చరికలు ఉన్నా.. కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. నిర్మాణ పనులు చేస్తున్న వారినీ హెచ్చరించలేదు. ఫలితంగా యూజీ కేబుల్ విద్యుత్ వైర్లు కట్ అయ్యాయి. ఈ కేబుల్ తెగిపోవడంతో సబ్ స్టేషన్కు వెళ్లే లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు వార్డులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి వరకు స్పందన లేదు ! మధ్యాహ్నం సరఫరా నిలిచిపోయినా అధికారులు సత్వరమే స్పందించకపోవడంతో అర్ధరాత్రి వరకూ అవస్థలు పడాల్సి వచ్చింది. సాయంత్రం సమయంలో ఈపీడీసీఎల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పునరుద్ధరణ పనులు చేపట్టడం ప్రారంభించారు. సాధారణంగా యూజీ కేబుల్ వెళ్లిన మార్గంలో ఏవైనా తవ్వకాలతో కూడిన పనులు జరిగినప్పుడు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. కానీ కేజీహెచ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా రోగుల ఆరోగ్య భద్రతను గాలికొదిలేశారు. జనరేటర్లు పనిచేయడం లేదు? కేజీహెచ్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విద్యుత్ సరఫరా కోసం భారీ సామర్థ్యం ఉన్న జనరేటర్లున్నాయి. కానీ గత కొద్ది నెలలుగా ఈ జనరేటర్లు పనిచేయడం లేదు. ఇటీవల మోంథా తుఫాన్ సందర్భంగా ఉన్నతాధికారులు తనిఖీలు చేసిన సమయంలో జనరేటర్లను త్వరితగతిన సరిచేయాలని ఆదేశించారు. అయినా సదరు జనరేటర్ కాంట్రాక్టర్పై కనీస చర్యలు తీసుకోలేదు సరికదా.. వాటిని బాగుచేయమని కూడా కేజీహెచ్ అధికారులు ఆదేశించకపోవడం గమనార్హం. ఆ రోజే ప్రభుత్వం మేల్కొని జనరేటర్లను బాగుచేసి ఉంటే.. ఈ రోజున ఈ దుస్థితి వచ్చేది కాదని కేజీహెచ్ వర్గాలు చెబుతున్నాయి. జనరేటర్ల పనితీరుపై ఆరోపణలు వస్తున్నా.. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కారణంగానే యూజీ కేబుల్ కట్ అయి.. సరఫరా నిలిచిపోయినా ప్రత్యామ్నాయం చూడలేకపోయారు. కనీసం అద్దైకె నా జనరేటర్ తెచ్చి రోగులకు ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఆలోచన రాకపోవడం విడ్డూరం. అర్ధరాత్రి వరకూ కేజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర నాయుడు, ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యామ్ బాబు పర్యవేక్షణలో మరమ్మతులు చేపట్టారు. -
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ రాంబిల్లి(అచ్యుతాపురం): అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్లో పరిశ్రమల స్థాపన కోసం భూములిచ్చిన నిర్వాసితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంద ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, యలమంచిలి నియోజక వర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో కలిసి రాంబిల్లి మండలం కృష్ణపాలెంలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తామంతా కృష్ణంపాలెంలో పర్యటించినట్టు తెలిపారు. భూనిర్వాసితులకు గతంలో కేటాయించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలను మార్చకూడదని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల జాబితాను తరచూ మార్చడం సమంజసం కాదన్నారు. కృష్ణంపాలెం భూనిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేసిన తర్వాతే ఇక్కడి నుంచి తరలించాలన్నారు. స్థానికులందరికీ ఇక్కడ ఏర్పాటుచేస్తున్న పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక్క నిర్వాసితుడికి అన్యాయం జరిగినా వైఎస్సార్ సీపీ పోరాడతుందని స్పష్టం చేశారు. అనంతరం పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, అసెంబ్లీ నియోజక వర్గ సమన్వకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ కృష్ణపాలెం భూ నిర్వాసితుల కోసం పోరాడతామని తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడు పిన్నమరాజు కిశోర్, ఎంపీపీ శిరీ షా శ్రీనుబాబు, జెడ్పీటీసీ ధూళి నాగరాజు, యువజ న నాయకుడు ధూళి వెంకీ, అచ్యుతాపురం జెడ్పీటీసీ లాలం రాంబాబు, అచ్యుతాపురానికి చెందిన కోన బుజ్జి, నెట్టెం సత్యనారాయణ, నీరుకొండ వెంకట సూర్యనారాయణ, బద్ది హరిబాబు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిస్తున్న స్పీకర్
మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ధ్వజం అనకాపల్లి: వైఎస్సార్సీపీ కార్యకర్తలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అక్రమ కేసులు పెట్టిస్తూ శునకాందనం పొందుతున్నారని ఆ పార్టీ నర్సీపట్నం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ధ్వజమెత్తారు. గురువారం అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో మాకవరపాలెం, నర్సీపట్నం టౌన్ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మాకవరపాలెం మండలం బయ్యవరం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సుకల శ్రీనివాసరావు ఆ గ్రామ వీఆర్వో దగ్గరకు వెళ్లి వైఎస్సార్సీపీ ఓట్లను ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తే ...టీడీపీ నాయకుడు లాలం సీతారామతేజ దాడి చేశాడని చెప్పారు. వీఆర్వోపై స్పీకర్ ఒత్తిడి తెచ్చి మా నాయకుడు పై అక్రమ కేసు కూడా పెట్టించి, వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. మాకవరపాలెం ఎస్ఐ మా పార్టీ నాయకుడును ఇబ్బందులు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సంఘటన నవంబర్ ఒకటో తేదీన జరిగితే...2వ తేదీ రాత్రి 8 గంటలకు అంటే 33 గంటల తర్వాత కేసు పెట్టారన్నారు. అంతేకాకుండా ఫిర్యాదు చేసిన రోజు నుంచి 5 వ తేదీ వరకూ రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు మాకవరపాలెం పోలీసు స్టేషన్లో శ్రీనివాసరావును ఉంచి, వేధించారని తెలిపారు. ఈ నెల 4వ తేదీన ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీనివాసరావును మాకవరపాలెం పోలీస్ స్టేషన్ లోనే ఉంచారని, అయితే అదే రోజు పీవీఆర్ థియేటర్ ముందు వీఆర్వో, టీడీపీ నేతలపై శ్రీనివాసరావు దౌర్జన్యం చేసినట్లు మరో కేసు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారని చెప్పారు. స్టేషన్లో ఉన్న వ్యక్తి ఇంకో దగ్గరకు వెళ్లి దౌర్జ న్యం చేయడం ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. పోలీసులు రోజూ స్టేషన్కు వచ్చి డ్యూటీ చేయడం లేదని, మొబైల్ ఫోన్ ఆన్ చేసుకుని అయ్యన్నపాత్రుడు ఎవరిపై కేసు పెట్టమని చెబితే వారిపై కేసులు నమోదు చేసి వేధించడమే పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. మాకవరపాలెం, నర్సీపట్నం టౌన్ పో లీసులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కార్యాలయంలో ఉమాశంకర్ గణేష్ ఫిర్యాదు చేశారు. రానున్నది మా ప్రభుత్వం...ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి వేధి స్తున్న అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
సభ్యుల సొమ్ము ‘గోవిందా’!
సాక్షి, విశాఖపట్నం: వచ్చిన జీతంలో కొంత మొత్తం దాచుకుంటే భవిష్యత్లో ఉపయోగపడుతుందని ఉద్యోగులు భావించారు. కానీ, తాము దాచుకున్న సొమ్ములు సొసైటీ డైరెక్టర్లకు ఉపయోగపడుతున్నాయని ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగుల కో–ఆపరేటివ్ సొసైటీలో కొందరు డైరెక్టర్లు తమ చేతివాటం ప్రదర్శించారు. సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకుని, తమ జేబులు నింపేసుకున్నారు. సభ్యులకు తెలీకుండా ఒక్కొక్కరి పేరిట రూ.15 లక్షల వరకు కాజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ సర్కిల్ పరిధి సొసైటీలోని మాజీ డైరెక్టరే ఈ స్వాహా పర్వానికి మూలకారకుడనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఆడిట్కు ఫిర్యాదు చేసినా.. మేనేజ్ చేసుకుంటూ దర్జాగా సభ్యుల సొమ్ముకు కుచ్చుటోపీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈపీడీసీఎల్లో ఉద్యోగులంతా కలిసి ఓ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. విశాఖపట్నం సర్కిల్ పరిధిలో మూడు విద్యుత్ ఉద్యోగుల కో–ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్లు ఉన్నాయి. అవి విశాఖపట్నం సర్కిల్, గాజువాక, గోపాలపట్నం. ఒక్కో బ్రాంచ్ సొసైటీకి అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు ఉద్యోగుల సంఖ్యను బట్టి 7 నుంచి 9 మంది డైరెక్టర్లు ఉంటారు. ఈ బ్రాంచ్లలో గాజువాక శాఖ అతి పెద్దది. ఇందులో ఈపీడీసీఎల్తో పాటు చింతపల్లి, సీలేరులోని జెన్కో ఉద్యోగులు కూడా సభ్యులుగా ఉన్నారు. అయితే, గత నాలుగేళ్లుగా విశాఖపట్నం ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో ఉన్న సొసైటీ బ్రాంచ్ ఆఫీస్ నుంచి సభ్యుల సొమ్ములు స్వాహా అవుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బ్రాంచ్లో గతంలో డైరెక్టర్గా వ్యవహరించిన ఓ వ్యక్తి ఉద్యోగుల సొమ్ముని గుట్టుగా స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కో సభ్యుడి పేరుతో రూ.15 లక్షలకు పైగానే.! ఈపీడీసీఎల్లో సీనియర్ అసిస్టెంట్ హోదాలో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి గతంలో సొసైటీలో ఒక డైరెక్టర్గా వ్యవహరించారు. ఆ సమయంలోనే సభ్యుల పేరుతో సొమ్ములు గోవిందా.. గోవిందా అంటూ ఆరగించేసినట్లు తెలుస్తోంది. సొసైటీలో ఉన్న ఒక్కో సభ్యుడి పేరుతో సదరు డైరెక్టర్ రూ.15 లక్షలకు పైగా రుణాలు తీసుకొని, సొంతంగా వాడుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 30 మందికి పైగా సభ్యులు ఈ డైరెక్టర్ బాధితులుగా మారినట్లు సమాచారం. రుణాలు తీసుకొని ఎంచక్కా.. డైరెక్టర్ పోస్టు నుంచి తప్పుకుని ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నారు. అయితే.. ఇటీవల కొంత మంది సభ్యులు తమ డివిడెంట్లు, షేర్ క్యాపిటల్ ఫండ్స్, ఇతరత్రా ఆదా చేసిన డబ్బులు గురించి ఆరా తీస్తున్న సమయంలో అప్పటి డైరెక్టర్ బండారం ఒక్కొక్కటిగా బయటపడినట్లు సమాచారం. ఈ విషయంపై సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు కొందరు బాధిత సభ్యులు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఆర్థిక మోసం బయటకు రాకుండా గోప్యంగా ఉంచాలనీ, ఎలాగైనా కొల్లగొట్టిన సొమ్ములు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తామంటూ వారు హామీ ఇచ్చారు. సభ్యులు మాత్రం.. తమకు నమ్మకం లేదనీ, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలో ఉద్యోగాల పేరుతో మోసం సొసైటీ సభ్యుల పేరుతో రుణాలు తీసుకొని సొంత ఖాతాకు మళ్లించుకున్న సదరు మాజీ డైరెక్టర్పై గతంలోనూ అనేక ఆరోపణలున్నాయి. ఈపీడీసీఎల్ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానంటూ పదుల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేశారు. దాదాపు రూ.5 కోట్ల వరకు వసూళ్లు చేసిన డైరెక్టర్పై అప్పట్లో కేసులు నమోదవ్వడంతో.. విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. అయినా తన వక్రబుద్ధిని వదులుకోలేకపోతున్న ఆయన.. సొంత డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సొమ్మునూ వదల్లేదు. ఇలాంటి వ్యక్తికి అప్పట్లో డైరెక్టర్ పదవిని ఎందుకు కట్టబెట్టామా అంటూ సొసైటీ సభ్యులు ఇప్పుడు బాధపడుతున్నారని విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు. సొసైటీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. -
వసతి గృహంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
కె.కోటపాడు: జీనబాడు జీటీడబ్ల్యూఏ బాలికల వసతిగృహం పరిసరాల్లో పరిశుభ్రత పాటించేలా వసతిగృహ సిబ్బందికి సూచనలు చేయాలని పినకోట పీహెచ్సీ వైద్య సిబ్బందికి అల్లూరి జిల్లా మలేరియా అధికారి తులసి సూచించారు. జీనబాడు వసతిగృహనికి చెందిన ముగ్గురు విద్యార్థినులు కృష్ణవేణి, ప్రమీల, శ్రీవేణి దేవి జ్వరాలతో బుధవారం రాత్రి దేవరాపల్లి పీహెచ్సీ వైద్యం కోరకు వచ్చారు. వీరికి ప్రథమ చికిత్సను అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కె.కోటపాడు సీహెచ్సీకి తరలించారు. ఆసుపత్రిలో గురువారం ముగ్గురు విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించగా సాధారణ జ్వరాలు నివేదిక వచ్చినట్లు మలేరియా అధికారి తులసికి మలేరియా సబ్ యూనిట్ అధికారి బాబూరావు తెలిపారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు విద్యార్థినులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఎన్వీబీడీసీపీ జిల్లా కన్సల్టెంట్ శ్రీనివాస్, ఏఎంవో ఎ.జె.సత్యనారాయణ, వైద్యాధికారి వెంకటేష్ పాల్గొన్నారు. -
ఆరు లేన్లుగా జాతీయ రహదారి
నక్కపల్లి: ప్రస్తుతం నాలుగు లేన్లగా ఉన్న 16 వ నంబరు జాతీయరహదారిని ఆరులేన్లగా విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు ఈ రహదారి విస్తరణకు నేషనల్ హైవేఆథారిటీ ఆఫ్ ఇండియా రూ.3,800 కోట్లతో రూపొందించిన డీపీఆర్కు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ కూడా ఈ జాతీయరహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులు త్వరలో ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఎప్పుడో బ్రిటీష్ వారి హయాంలో కోల్కతా, చైన్నె మధ్య సింగిల్ రోడ్డుగా ఏర్పాటు చేసిన ఈ రహదారిని 30 ఏళ్ల కిందట నాలుగు లేన్లుగా విస్తరించారు. దీంతో కోల్కతా, చైన్నె మధ్య, ఆంధ్రా సరిహద్దు అయిన ఇచ్ఛాపురం నుంచి అటు తమిళనాడు సరిహద్దులో ఉన్న తడ వరకు రాకపోకలకు కొంత సులభతరమైంది. ప్రయాణ సమయం కూడా తగ్గింది. అయితే రవాణా సమయాన్ని మరింత తగ్గించడంతోపాటు, ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం నాలుగు లేన్ల రహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులు చేపట్టింది. ఇప్పటికే రాజమండ్రినుంచి విజయవాడ వరకు ఆరులేన్ల విస్తరణ పనులు పూర్తయ్యాయి. అనకాపల్లి నుంచి ఇచ్ఛాపురం వరకు సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా ఆరులేన్ల రోడ్డు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. అనకాపల్లినుంచి రాజమండ్రి మధ్య మిగిలిన పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. ఈ విస్తరణ పనుల్లో భాగంగా అనకాపల్లినుంచి తుని వరకు 68.645 కిలోమీటర్లు, కాకినాడ జిల్లాలో తుని నుంచి రాజమండ్రి సమీపంలో ఉన్న దివాన్ చెరువు వరకు (పత్తిపాడు, జగ్గంపేట,రాజానగరం మండలాలను కవర్చేస్తూ) 81 కిలోమీటర్లు, దివాన్ చెరువు నుంచి రాజమండ్రి పట్టణాన్ని కవర్చేస్తూ మరో 11 కిలోటర్ల వరకు ఆరులేన్లుగా విస్తరించనున్నారు. ఈ రహదారి విస్తరణ కోసం రూ.3,800 కోట్లలో డీటైల్ ప్రాజెక్టు రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతో ఆమోదం లభించినట్లు తెలిసింది. అనకాపల్లి, తుని సెక్షన్లో(67), అలాగే తుని రాజమండ్రి సెక్షన్ల మధ్య(103)పైప్ కల్వర్టులు, బాక్స్కల్వర్టులు, మేజర్ బ్రిడ్జిలు, మైనర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు. ఈ రెండు సెక్షన్ల మధ్య ఉన్న పాతబ్రిడ్జిలకు మైనర్, మేజర్ మరమ్మతులు కూడా చేపట్టనున్నట్లు డీపీఆర్లో పేర్కొన్నారు. అవసరమైన చోట్లకొత్త వంతెను, అప్రోచ్రోడ్లను నిర్మించనున్నట్లు తెలిసింది. వాహనాల పార్కింగ్కు స్థలం కేటాయించాలి జాతీయరహదారి పై రాకపోకలు బాగా పెరిగాయి. నాలుగులేన్లుగా ఉన్న ప్రస్తుత రోడ్డుపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రోచ్రోడ్లు, బెర్మ్లు కూడా సరిగా లేవు. ఈ రోడ్డును ఆరులైన్లుగా విస్తరిస్తే ప్రయాణ సమయం ఆదాకావడంతోపాటు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే వాహనదార్లకు నిర్వహణ ఖర్చుకూడా తగ్గుతుంది.రోడ్డువిస్తరణ సందర్భంగా వాహనాల పార్కింగ్కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి డ్రైవర్లకు విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. –పోతంశెట్టిబాబ్జి, నక్కపల్లి వ్యాపారులకు నష్టం లేకుండా చూడాలి వ్యాపారులకు నష్టం లేకుండా మండల కేంద్రం నక్కపల్లిలో ఆరులేన్ల రోడ్డు విస్తరణ చేపట్టాలి. మండల కేంద్రాన్ని నమ్ముకుని చాలా మంది చిరువ్యాపారాలు చేసుకుంటున్నారు.నక్కపల్లిలో బైపాస్ నిర్మిస్తే వీరంతా ఉపాధి కోల్పొయే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని విస్తరణ చేపట్టాలి. –ఎల్లేటిసత్తిబాబు, నక్కపల్లి తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ఖర్చు వేంపాడు టోల్ప్లాజా లెక్కల ప్రకారం అనకాపల్లి నుంచి రాజమండ్రి మధ్యలో ప్రతిరోజు అన్నిరకాల వాహనాలు కలిపి 15వేల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. జాతీయరహదారి ఆరులేన్లుగా విస్తరణపూర్తయితే, శ్రీకాకుళం నుంచి విజయవాడ, అక్కడనుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ప్రయాణ సమయం మరింత తగ్గడంతోపాటు, రోడ్డుప్రమాదాలు తగ్గేఅవకాశం ఉంది. ముఖ్యంగా అనకాపల్లి, రాజమండ్రి మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. దీంతో వాహనాలు వినియోగించే పెట్రోలు, డీజిల్, వాహనాల నిర్వహణ ఖర్చు ఆదా అవుతాయి. వాహనాల యజమానులపై ఆర్థిక భారం కొంతమేర తగ్గుతుంది. అయితే విస్తరణలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ జరపాల్సి ఉంది. ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మండల కేంద్రం నక్కపల్లి పట్టణంలో ఆరులేన్ల విస్తరణకు భూసేకరణ జరపాల్సి ఉంటుంది. బైపాస్రోడ్డు నిర్మిస్తారా, లేక ఫైఓవర్ నిర్మిస్తారా అన్న సందిగ్ధం నెలకొంది. పట్టణంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్లను, నివాస ప్రాంతాలను సేకరించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. దీంతో నక్కపల్లిలో బైపాస్ నిర్మిస్తారన్న ప్రచారం జరుగుతోంది. వెదుళ్లపాలెం నుంచి నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు గురుకుల పాఠశాల వెనుక భూసేకరణ జరిపి ఆరులైన్లు రోడ్డు నిర్మించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే కశింకోట, నర్సింగపల్లి ప్రాంతాల్లో కూడా రోడ్డుకు ఇరువైపులా ఇళ్లను, వాణిజ్య సముదాయాలను ఖాళీచేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో నాలుగు భారీ వంతెనలు అనకాపల్లి, రాజమండ్రి మధ్య విస్తరించే ఈ ఆరులేన్ల రహదారి మధ్యలో అనకాపల్లి జిల్లాలో నాలుగు మేజర్ వంతెనలు, మూడు ఫ్లైఓవర్స్, మూడు రైలు కం రోడ్డు వంతెనలు నిర్మించనున్నారని ఎన్హెచ్ఏఐ వర్గాలు ద్వారా తెలిసింది. ఈ విస్తరణ పనులు మరో మూడు నెలల్లో ప్రారంభించి, రెండేళ్లలో పూర్తిచేయనున్నట్టు సమాచారం. -
హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
ఆర్చిడ్ స్పా సెంటర్పై పోలీసుల దాడి బీచ్రోడ్డు: వీఐపీ రోడ్డు సమీపంలోని ఆర్చిడ్ వెల్నెస్ స్పా సెంటర్లో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నాయనే పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు, 3వ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ పైడయ్య తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో స్పా సెంటర్ ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ అసాంఘిక కార్యకలాపాల(వ్యభిచారం)ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడి సమయంలో ఒక గదిలో ఓ విటుడు మహిళతో ఉండగా, మరో తొమ్మిది మంది మహిళలు పక్క గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తేలింది. వీరందరినీ వ్యభిచార కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సెంటర్లో పనిచేస్తున్న కల్లూరు పవన్ కుమార్, జానా పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సెంటర్కు కాసిరెడ్డి అరుణ్ కుమార్ పేరు మీద అనుమతులు ఉండగా, థాయ్ స్పా మసాజ్ ముసుగులో డబ్బు కోసం మహిళలను లైంగిక దోపిడీకి గురిచేస్తున్నట్లు వెల్లడైంది. స్పా సెంటర్పై కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ. 7,000 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
డిఫెన్స్ మద్యంతో వ్యక్తి అరెస్ట్
నర్సీపట్నం: డిఫెన్స్ మద్యం బాటిళ్లు తరలిస్తున్న మాకవరపాలెం మండలం, వజ్రగాడ గ్రామానికి చెందిన జాజుల సత్తిబాబు(32)ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎకై ్సజ్ సీఐ కె.సునీల్కుమార్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తమయ్యపాలెం నుండి వజ్రగాడ వెళ్లే దారిలో తమ సిబ్బంది సత్తిబాబును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతని వద్ద ఉన్న బ్యాగ్లో 100 పైపర్, వ్యాట్ 69 విస్కీ, బ్లెండర్ప్రైడ్ బ్రాండ్స్ కలిగిన 3 డిఫెన్స్ మద్యం సీసాలు, 10 బడ్వైజర్ టిన్ బీర్లు ఉన్నాయి. ఇతని వద్ద నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం డిఫెన్స్ క్యాంటీన్లో కొనుగోలు చేసి నర్సీపట్నం తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు తమ విచారణ రుజువైందని సీఐ తెలిపారు. -
8 మంది పేకాటరాయుళ్లపై కేసు
యలమంచిలి రూరల్: మండలంలో పులపర్తి శివార్లులో పంటపొలాల్లో పేకాడుతున్న 8 మందిని బుధవారం యలమంచిలి రూరల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక్కడ పేకాడుతున్న సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకు వెళ్లగా 8 మంది డబ్బు ఫణంగా పెట్టి పేకాడుతున్నట్టు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.5380 స్వాధీనపర్చుకున్నారు. పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. -
● పుష్కరిణీ నమోస్తుతే..
సింహాచలం: కార్తీక పౌర్ణమి సాయంసంధ్య.. పవిత్ర వరాహ పుష్కరిణి.. వేలాది దీపాల కాంతులతో, భక్తజన సంద్రంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శుభ ఘడియలలో.. పవిత్ర జలరాశికి పుణ్యనదీ హారతి(గంగా హారతి) సమర్పించే అపురూప ఘట్టానికి బుధవారం సింహగిరి క్షేత్రం సాక్ష్యంగా నిలిచింది. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన కొండదిగువ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి వెంకన్న ఉత్సవమూర్తులను శేషతల్పంపై ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాల నడుమ తిరువీధిగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ సిద్ధం చేసిన దివ్య వేదికపై స్వామి కొలువుదీరగా, ఆ ప్రాంతం భక్తుల నామస్మరణతో మార్మోగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం స్వామికి ద్వయ, నక్షత్ర, కుంభ హారతులను సమర్పించగా, ఆ కర్పూర కాంతుల్లో స్వామి దివ్య రూపం మరింత దేదీప్యమానంగా ప్రకాశించింది. అనంతరం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చక బృందం.. పుష్కరిణి గట్టుపై ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికల నుంచి పుష్కరిణీ నమోస్తుతే.. అంటూ వరాహ పుష్కరిణికి దివ్య నీరాజనం సమర్పించారు. ఆ హారతి వెలుగులు పవిత్ర జలంలో ప్రతిబింబిస్తుండగా, ఆ దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. అదే సమయంలో.. పుష్కరిణి గట్టున వందలాది మంది మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కోలాటాలు, భరత నాట్య ప్రదర్శనలు, హరినామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థినికి ఘన సత్కారం
నాతవరం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటల పోటీల్లో హైస్కూల్ చెందిన విద్యార్థిని ఎ.స్నేహ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం హర్షణీయమని ప్రధానోపాధ్యాయుడు కాశపు శివరాంప్రసాద్ అన్నారు. చమ్మచింత హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఎ.స్నేహ గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన పలు పోటీలలో నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపింది.ఈ విద్యార్థినిని హైస్కూల్లో బుధవారం విద్యా కమిటీ చైర్మన్, హెచ్ఎం, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. రాజ్యాంగ దినోత్సవవం సందర్భంగా ఈనెల 26వ తేదీన అమరావతి అసెంబ్లీలో స్నేహ ప్రసంగిస్తుందని తెలిపారు. -
ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదు
తుమ్మపాల: చనిపోయిన వ్యక్తి పేరున గల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు అమ్మివేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుని కుమారుడు మళ్ల సాగర్ బుధవారం జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావుకు ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ అనకాపల్లి జోన్ పరిధిలో రాజుపాలెం సర్వే నెం. 93/25, 94లో గల లే–అవుట్లో ప్లాట్ నెం.15, 16, 17 మొత్తం 956 గజాల స్థలాన్ని 1985 ఏడాదిలో మళ్ల శివ వెంకటకృష్ణ కోనుగోలు చేశారని, 2008లో ఆయన మరణించినప్పటికి 2010 ఫిబ్రవరి 1న లంకెలపాలెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో క్రయ దస్తావేజు నెం.298/2010తో మూడు ప్లాట్లను తన తండ్రి విక్రయించినట్టు ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. దీంతో తీవ్రంగా నష్టపోయిన తమకు న్యాయం చేసి మోసానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని, దొంగ దస్తావేజులు రద్దు చేయాలని కోరారు. -
ఆలయం గేటుకు తాళం వేసిన అయ్యప్ప భక్తులు
ఎస్.రాయవరం: సకాలంలో ఆలయం తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలంలోని సర్వసిద్ధి గ్రామంలో శివాలయం గేటుకు అయ్యప్ప మాలధారణ భక్తులు తాళం వేసి, అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్తీక పౌర్ణమి రోజున శివాలయం గేటుకు తాళం వేయడంతో భక్తులు కాసేపు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు,దేవదాయ శాఖ ఈవో సాంబశివరావు ఆలయానికి చేరుకుని గేటుకు వేసిన తాళాన్ని తొలగించారు. అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలని, గుడి తలుపులకు తాళాలు వేయడం మంచి పద్ధతి కాదని మందలించారు. అనంతరం ఆలయం తెరచి భక్తులకు దర్శనం కల్పించారు. అర్చకుడు పండుకి ఆలయ ఈవో మెమో ఇచ్చారు. -
ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు
నాతవరం: దైవ దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యంలోరోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రాజాన వీర సూర్య చంద్ర సహకరించారు. చెర్లోపాలెం పంచాయతీ శివారు పార్వతీపురం గ్రామానికి కొంతమంది బుధవారం కాకినాడ జిల్లా సత్యనారాయణస్వామి అన్నవరం దేవస్థానంలో జరిగే గిరి ప్రదక్షిణకు ఆటోపై బయలు దేరారు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడడంతో ఐదుగురు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వస్తున్న బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ సంఘటన స్ధలంలో కారు అపి గాయపడిన వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరిటెండెంట్తో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేశారు. బాధితులంతా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. -
17 నుంచి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే
మహారాణిపేట: జిల్లాలో ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు కుష్టు వ్యాధిని గుర్తించే కార్యక్రమం(ఎల్సీడీసీ) పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కుష్టు వ్యాధి సర్వేకు సంబంధించి కలెక్టర్ చాంబర్లో బుధవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశ కార్యకర్తలు, పురుష వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పూర్తిస్థాయి సర్వే నిర్వహించాలని సూచించారు. ఎవరికై నా తమ శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రాథమిక స్థాయిలోనే మచ్చలను గుర్తిస్తే అంగ వైకల్యం రాకుండా, ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. జిల్లా కుష్టు, క్షయ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రమేష్, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు రామారావు, నోడల్ అధికారి డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్సార్ నిధులతో కొత్త డయాలసిస్ యూనిట్లు
కేజీహెచ్లో ప్రారంభించిన జిల్లా ఇన్చార్జి మంత్రి మహారాణిపేట: ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే వైద్య సేవలను డిజిటల్ విధానంలో ప్రజలకు చేరువ చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సీఎస్సార్ కింద ఎన్టీపీసీ సమకూర్చిన రూ.2 కోట్ల ఆర్థిక సహాయంతో కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఆధునికీకరించిన హీమో డయాలసిస్ యూనిట్ను బుధవారం ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో కుప్పంలో సంజీవని పేరుతో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నామని, దశల వారీగా రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ వైద్య సేవలను చేరువ చేస్తామని చెప్పారు. కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఇప్పటికే 13 సబ్ యూనిట్లతో సేవలు అందుతున్నాయని, అదనంగా ఎన్టీపీసీ సాయంతో మరో 10 కొత్త డయాలసిస్ సబ్ యూనిట్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, ఏఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ డాక్టర్ రవిరాజు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ సంధ్యాదేవి, కేజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ, నెఫ్రాలజీ విభాగం ఇన్చార్జి హెచ్వోడీ డాక్టర్ రత్నప్రభ, కార్పొరేటర్ కొడూరు అప్పలరత్నం, ఎన్టీపీసీ ప్రతినిధులు పాత్రో, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక
దేవరాపల్లి: రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని తెనుగుపూడి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కె.కోటపాడు మండలంలో పాతవలసలో అండర్–14 విభాగంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి జి.జశ్వంత్, 9వ తరగతి విద్యార్థి సీహెచ్. అశోక్ విశేష ప్రతిభ కనబరిచి బంగారు పతకాలను కై వసం చేసుకుని, రాష్ట్ర వాలీబాల్ జట్టులో స్థానం సంపాదించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఈ నెల 27న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ ఇద్దరూ పాల్గొంటారని స్థానిక గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఎస్.విక్టర్పాల్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులతో పాటు వీరికి తర్ఫీదు ఇచ్చిన పీఈటీ తరుణ్, పీడీ ఉమామహేష్లను ప్రిన్సిపాల్ విక్టర్పాల్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఇరటా నర్సింహమూర్తి, ఉమ్మడి విశాఖ గురుకుల విద్యాలయాల సమన్వయ అధికారి (డీసీవో) గ్రేస్ అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక పాయకరావుపేట: మండలంలోని గుంటపల్లి పాఠశాల విద్యార్థిని ద్రాక్షవరపు రాణి రాష్ట్ర స్థాయి అండర్ 14 వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీ రవికుమార్ తెలిపారు. 4వ తేదీన ఎస్జీఎఫ్ అండర్ 14 వాలీబాల్ స్కూల్ గేమ్స్ కె.కోటపాడు మండలం పాతవలస పాఠశాల్లో జరిగిన ఎంపిక పోటీల్లో 8 వ తరగతి చదువుతున్న రాణి ఎంపికై నట్టు చెప్పారు. రాణిని హెచ్ఎం జి.రామారావు అభినందించారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ‘స్మార్ట్ అగ్రికల్చర్’ ఎంపిక
ఆరిలోవ: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణ భారత సైన్స్ డ్రామా పోటీల్లో భాగంగా జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని 15 ఉన్నత పాఠశాలల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారు బృందాలుగా ఏర్పడి, నాటికలను ప్రదర్శించారు. డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో స్మార్ట్ అగ్రికల్చర్ అనే అంశంపై ప్రదర్శించిన పెందుర్తి మండలం, శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బృందం విజేతగా నిలిచింది. ఈ నెల 7న గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ నాటికను ఎంపిక చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. రైతులు ఆధునికీకరణ పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించడం ఇతివృత్తంగా ఈ నాటిక సాగిందన్నారు. ఈ బృందానికి మరింతగా శిక్షణ ఇచ్చి, రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచేలా కృషి చేయాలని గైడ్ టీచర్ సీతాలక్ష్మికి సూచించారు. ఈ పోటీల్లో ఉమెన్ ఇన్ సైన్స్, డిజిటల్ ఇండియా–ఎంపవరింగ్ లైవ్స్, హైజీన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీ వంటి అంశాలపై విద్యార్థులు నాటికలు ప్రదర్శించారు. జిల్లా సైన్స్ అధికారి రాజారావు, జ్యూరీ సభ్యులు భౌతిక శాస్త్ర అధ్యాపకుడు బి.నాగేశ్వరరావు, నవరస ఆర్ట్స్ ఫౌండర్ పి.వి.రమణమూర్తి, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉత్సాహంగా జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు -
ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి మహిళకు గాయాలు
యలమంచిలి రూరల్: యలమంచిలి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో అనకాపల్లి నుంచి పాయకరావుపేట వెళ్లే అనకాపల్లి డిపోకు చెందిన ఏపీ 31టీసీ1314 పల్లెవెలుగు ఆర్డినరీ బస్సు నుంచి జారిపడి మహిళ తీవ్రంగా గాయపడింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే మహిళ బస్సు నుంచి జారిపడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వివరాలివి..రాంబిల్లి మండలం సంతపాలెం గ్రామానికి చెందిన జోరీగల అచ్చియ్యమ్మ(58) యలమంచిలి నుంచి సొంతగ్రామానికి వెళ్లేందుకు యలమంచిలి ఆర్టీసీ బస్టాండులో బస్సెక్కడానికి వచ్చింది. చదువు రాకపోవడంతో పొరపాటున పాయకరావుపేట వెళ్లే బస్సు ఎక్కింది. కాంప్లెక్సు నుంచి బస్సు బయలుదేరిన వెంటనే అచ్చియ్యమ్మ తాను ఎక్కాల్సిన బస్సు కాదని తెలుసుకుంది. ఈ క్రమంలో ఆమెను బస్సు దిగాలని కండక్టరు, డ్రైవరు చెప్పగా ఆమె దిగేందుకు ప్రయత్నించింది. అయితే డ్రైవర్ బస్సును ఆపకుండా నడపడంతో ఆమె జారిపడింది. ఆమె తల వెనుక భాగానికి రక్తగాయమైంది. బస్సు నుంచి జారిపడిన అచ్చియ్యమ్మను పట్టించుకోకుండా డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వగా అక్కడున్న ఓ విలేకరి ఫోటోలు తీయడంతో ఇది గమనించిన డ్రైవర్ బస్సును ఆపి గాయపడిన అచ్చియ్యమ్మను ఆటోలో యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. గాయపడిన మహిళకు యలమంచిలి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. ఈ ఘటనపై అనకాపల్లి డిపో మేనేజర్, డీపీటీవోలు బస్సు డ్రైవర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా యలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి రాకపోకలు సాగించే పలు బస్సులకు ఉంచుతున్న గమ్యస్థానల పేర్లతో ఉన్న బోర్డులు తికమకగా ఉంటున్నాయని, దీనివల్ల ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారని పలువురు మండిపడుతున్నారు. బస్కాంప్లెక్స్లో చదువురాని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివరించడానికి నియమించిన గైడ్ సేవలు సక్రమంగా అందేలా చూడాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. -
రోడ్ల మరమ్మతుల కోసం ఆమ్ఆద్మీ దీక్ష
చోడవరం: దెబ్బతిన్న రోడ్లన్నీ మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్లుగా మార్చుతామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ హామీని తుంగలోకి తొక్కి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ఆమ్ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనకాపల్లి –చోడవరం, వడ్డాది, కొత్తకోట, నర్సీపట్నం రోడ్డు, చోడవరం–మాడుగుల మెయిన్రోడ్డు పెద్దపెద్ద గోతులు పడి అత్యంత ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. ఈ రోడ్డును బాగుచేయాలని, రోడ్డు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమ్ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో చోడవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష బుధవారం నాటికి 9వరోజుకి చేరుకుంది. శిబిరంలో ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్ర కన్వీనర్ రమేష్కుమార్, జిల్లా కన్వీనర్ కొణతాల హరనాథబాబు, జిల్లా కార్యదర్శి బలివాడ రామసంతోష్, చోడవరం నియోజవకర్గం ఇన్ఛార్జి వేగి మహాలక్ష్మినాయుడు మహిళా అధ్యక్షురాలు శీతల్మదాన్, సోషల్ మీడియా ఇన్చార్జి పవన్కుమార్ కూర్చున్నారు. సుమారు 50 కిలోమీటర్ల మేర మెయిన్రోడ్డు అంతా పెద్దపెద్ద గోతులతో చాలా ప్రమాదకరంగా ఉందని, వర్షాలకు ఆ గోతుల్లో అనేక వాహనాలు పడి ప్రమాదాలు జరిగాయన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మరమ్మతులు చేపట్టే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని అన్నారు. -
సత్యదేవునికి భక్త నీరాజనం
డాబాగార్డెన్స్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఇసుకకొండ(బాబాజీకొండ)పై వెలసిన రమా సహిత సత్యనారాయణస్వామి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిక్కిరిసింది. ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపారాధన చేశారు. వేకువ జామున 2 గంటలకు ధ్వజస్తంభ పూజ నిర్వహించారు. వేకువజాము 2.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు స్వామి దర్శనం కల్పించారు. రూ.1,116 చెల్లించిన భక్తులతో అనివెట్టి మండపంలో ఉదయం 7 గంటలకు, 10.30 గంటలకు ప్రత్యేక వ్రతాలు చేయించారు. ఉదయం 4 గంటలకు, 6 గంటలకు, 9 గంటలకు సామూహిక వ్రతాలు జరిగాయి. భక్తుల తాకిడి దృష్ట్యా ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు అవకాశం కల్పించలేదని ఈవో రాజగోపాల్రెడ్డి తెలిపారు. పూర్ణామార్కెట్ దరి దయారామ స్వీట్ షాప్ పక్క నుంచి ఆలయానికి ఏర్పాటు చేసిన ఘాట్ రోడ్డును భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. -
ఏపీఈపీడీసీఎల్ జిల్లా సర్కిల్ కార్యాలయాలకు సొంత భవనాలు
విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ అనకాపల్లి: కొత్తజిల్లాల్లో ఏపీఈపీడీసీఎల్ జిల్లా సర్కిల్ కార్యాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. స్థానిక గవరపాలెం నిదానందొడ్డి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద జిల్లా విద్యుత్ సర్కిల్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి బుధవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లా విద్యుత్శాఖ సర్కిల్ కార్యాలయం నిర్వహిస్తున్న భవనానికి నెలకు రూ.50వేలు అద్దె చెల్లిస్తున్నట్టు చెప్పా రు. ఎంఆర్టీ, డీపీఈ, సివిల్, ఏపీటీఎస్ కార్యాలయాలు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నాయని, వాటన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్శాఖ సీఎండీ పృథ్వీతేజ్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, విద్యుత్శాఖ జిల్లా సర్కిల్ అధికారి జి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గవరపాలెంలో గల నూకాంబిక అమ్మవారి బాలాలయంలో అమ్మవారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూకాంబిక అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో 10 సబ్ స్టేషన్లకు అనుమతి కె.కోటపాడు: జిల్లాలో ఇప్పటికే 10 సబ్ స్టేషన్లకు అనుమతులను ఇచ్చినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. చౌడువాడలో రూ.3.65 కోట్లతో నిర్మించిన సబ్స్టేషన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించా రు. అనంతరం స్విచ్ను ఆన్ చేసి సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20వేల ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు సోలార్ విద్యుత్ను ఉచి తంగా సమకూర్చనున్నట్టు తెలిపారు. గ్రామంలో మంచినీటి ట్యాంక్, సీసీ రోడ్లు ప్రారంభించారు. విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభం మాడుగుల రూరల్: మండలంలోని కింతలిలో నూతనంగా నిర్మించిన 33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మండలంలో మరో విద్యుత్ ఉప కేంద్రం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. -
సహకారం పక్కదారి
విశాఖ సిటీ: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)కి అవినీతి మరకలు అంటుకున్నాయి. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇటీవల జరిగిన పదోన్నతుల వ్యవహారం బ్యాంకులో మంట పుట్టిస్తోంది. ఈ ప్రక్రియలో రూ.కోటి వరకు మామూళ్లు వసూలు చేశారన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. బ్యాంకులో అవినీతి, అక్రమాలపై ఆప్కాబ్కు ఫిర్యాదులు అందుతున్నాయి. డీసీసీబీ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్పైనే అదే పార్టీకి చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. పదోన్నతులపై దుమారం గత నెలలో డీజీఎం నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు పదోన్నతులు నిర్వహించారు. దీని కోసం పోస్టును బట్టి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కూడా పాటించలేదని బ్యాంకు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బంధువు ఈ వసూళ్లలో కీలక పాత్ర పోషించినట్లు జనసేనకు చెందిన నేతలే ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం. నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాంకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు చేస్తుండడం విశేషం. రూ.30 లక్షలు దుర్వినియోగం? గతంలో ఈ బ్యాంకుకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పర్సనల్ ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆ సమయంలో ఖర్చు రూ.3 వేలు మాత్రమే. నాలుగు నెలల క్రితం నాన్ ఆఫీషియల్ పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.30 లక్షలకు పైగా బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. కారు, దాని డీజిల్ పేరుతో రూ.లక్షలు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్యాంప్ ఆఫీస్లో ఫర్నీచర్ పేరుతో రూ.3 లక్షలు, రూ.1.8 లక్షలతో యాపిల్ డెస్క్టాప్, రూ.80 వేలతో కొత్త ల్యాప్టాప్ బలవంతంగా బ్యాంకు నిధుల నుంచి కొనిపించినట్లు సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. కేవలం లబ్ధిదారులు లంచాల వాటా ఇవ్వని కారణంగా డీసీసీబీ విశాఖ బ్రాంచ్లో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ పథకాన్ని (పీఎంఈజీఎస్ )అమలు చేయడాన్ని నిలిపివేసినట్లు సమాచారం. అలాగే స్టార్ హోటల్స్ నుంచి భోజనం పార్సిల్స్ను రప్పిస్తూ బిల్లులు బ్యాంకుకు పెడుతున్నట్లు చెవులు కొరుక్కుంటున్నారు. బ్యాంకు పరిధిలోని సహకార సంఘాలు అన్నింటి నుంచి నెలకు రూ.లక్ష మామూలు ఇవ్వాలని ఒత్తిడి తీసుకువస్తుండడంతో పాటు తమ బినామీలకు రూ.కోట్లలో రుణాలు మంజూరు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆ పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారు. రుణం పునరుద్ధరించాలంటే ఒక శాతం తక్కువ వ్యవధి రుణాలను(షార్ట్ టర్మ్ లోన్స్) తిరిగి పునరుద్ధరించే క్రమంలో రుణం మొత్తంలో ఒక శాతం కమీషన్గా తీసి పక్కన పెట్టాలని హుకుం జారీ చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆప్కాబ్ ఎండీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. బ్యాంకులో అవినీతి ఆరోపణలు, పదోన్నతుల్లో మూమూళ్ల వసూళ్లు, నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్, సీబీసీఐడీలతో దర్యాప్తు జరిపించి అక్రమంగా వసూలు చేసిన నిధులను తిరిగి బ్యాంకుకు రికవరీ చేయాలని కోరారు. -
పారిశ్రామికవేత్త?
మీలో ఎవరుచోటా నేతలు, కార్యకర్తలకు టీడీపీ బంపర్ ఆఫర్ పార్టనర్షిప్ సమ్మిట్లో ఒప్పందాల కోసం ఏర్పాట్లురండి బాబు.. రండి.. ఆలోచించిన ఆశాభంగం.. మంచితరుణం మించిన దొరకదు.. ఫైల్ పట్టుకుంటే.. పండగే.. ఒప్పందం కుదుర్చుకోండి.. భూములను దోచుకోండి.! కండువా పక్కన పెట్టు.. కొత్త పరిశ్రమ పెడుతున్నట్లు నటించు..! ఉన్న పరిశ్రమ చూపించి.. కొత్త రాయితీలు కొట్టెయ్యొచ్చు..! ఈ ఆఫర్ కేవలం రెండు రోజుల మాత్రమే.. అది కూడా ఈ నెల 14, 15 తేదీల్లోనే.! మీరు పచ్చనేత అయితే చాలు.. అర్హత పొందినట్లేనంటూ టీడీపీ నేతలు.. కొత్త సీసాలో పాత సారా పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరేళ్ల క్రితం చేసిన హడావుడికి మరోసారి శ్రీకారం చుడుతున్నారు. టీడీపీ నేతలకు ఇస్తున్న సరికొత్త బంపర్ ఆఫర్ ఏంటంటే..? సాక్షి, విశాఖపట్నం: గత టీడీపీ ప్రభుత్వం 2016, 2018లో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. ఈ రెండు సదస్సుల్లోనూ లక్షల కోట్ల రూపాయిలు పెట్టుబడులు వచ్చేశాయంటూ ఊదరగొట్టారు. భారీ పరిశ్రమలు, వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి.. ఎంవోయూలు చేసుకున్నారంటూ ఒప్పందపత్రాలు మార్చుకుంటూ పత్రికల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. తీరా చూస్తే.. లెక్కల్లోనే లక్షల కోట్లు మిగిలాయి.. ఫొటోలకే ఎంవోయూలు పరిమితమయ్యాయి. తర్వాత ఆరా తీస్తే.. టీడీపీ ప్రభుత్వం అసలు బండారం బట్టబయలైంది. సదస్సులకు అనుకున్నంత స్పందన రాకపోవడంతో.. స్థానికంగా ఉన్న వారితో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలకు సూటు, బూటు వేసి.. పారిశ్రామికవేత్తలుగా చిత్రీకరించారు. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో వందల కోట్ల రూపాయిల పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చినట్లుగా ప్రకటించేసి.. అడ్డంగా దొరికిపోయారు. చింత చచ్చినా.. పులుపు చావదన్నట్లుగా.. అబద్దాల పునాదులపై ప్రచారపటాటోపాలు నిర్వహిస్తూ.. ప్రజల సాక్షిగా అబాసుపాలవుతున్నా.. టీడీపీ మాత్రం తన వక్ర బుద్ధి వీడలేకపోతోంది. త్వరలో జరగబోయే సదస్సుకు కూడా ఇదే తరహాలో డమ్మీ పారిశ్రామికవేత్తల కోసం జాబితా తయారు చేస్తోంది. పరిశ్రమ ఉంటే చాలు.. పనైపోద్ది.! ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు అధిష్టానం టాస్క్ అప్పగించింది. తమ పరిధిలో పార్టీకి చెందిన పారిశ్రామికవేత్తలు ఎవరెవరు ఉన్నారనే జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చోటా నేతలు, కార్యకర్తల్లో ఎవరైనా రెస్టారెంట్స్, హోటల్స్, బ్రిక్స్, టైల్స్ ఇలా.. చిన్న కుటీర పరిశ్రమలు నడుపుతున్నా.. వారితో పార్టనర్ షిప్సమ్మిట్లో కొత్తగా ఒప్పందాలు చేసుకునేలా ఏర్పాట్లు నడుపుతున్నట్లు సమాచారం. ఆశించిన మేర పారిశ్రామికవేత్తలు రాకపోతే.. ఎంవోయూల సంఖ్య అధికంగా చూపించుకునేందుకు టీడీపీ తహతహలాడుతోంది. అయితే.. 2018లో ఎంవోయూలు చేసుకున్న వారికి మాత్రం ఇందులో మినహాయింపునిస్తున్నారు. మళ్లీ వారినే పిలిపిస్తే.. పరువు పోతుందన్న భయంతో కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. స్టేజ్ పైకి పిలిచేంత పరిశ్రమ సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పడంతో.. ఆ తరహా పరిశ్రమలున్న వారి వివరాలు తయారుచేస్తున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్న సదస్సుకు జనం రాకపోతే.. నవ్వులపాలవుతామన్న భయంతో మరోసారి అదే దొడ్డిదారిలో వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. భూ పందేరం కోసం టీడీపీ నేతల కొత్త ఎత్తుగడలు! సమ్మిట్ పేరుతో ఇదో యవ్వారం నడుస్తుండగా.. సందట్లో సడేమియాలా.. ఒప్పందాల పేరుతో భూ పందేరాలకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భాగస్వామ్య సదస్సులో ఎంవోయూల పేరుతో ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేసి.. వాటిని అధికారికంగా కొట్టేసేందుకు కూడా కూటమి నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ పరిధిలో ఉన్న టూరిజం భూముల్లో పర్యాటక ప్రాజెక్టులు, ఏపీఐఐసీ భూముల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లుగా సదస్సులో ఎంవోయూలు మార్చుకుంటూ.. తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు తమ అనుచరగణంతో ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 241.92 ఎకరాల టూరిజం భూములను పర్యాటక ప్రాజెక్టులకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా వందలాది ఎకరాలున్న ఏపీఐఐసీ భూములను వివిధ పరిశ్రమలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనీ.. మంచి ప్రాజెక్టులతో వస్తే భూ కేటాయింపులు రాయితీలతో ఇస్తామంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ఇదే పేరుతో మొత్తం భూములను అధికార పార్టీ నేతలు కొల్లగొట్టేందుకు సమ్మిట్ పేరుతో స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా భాగస్వామ్య సదస్సు పేరుతో భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం తెరతీయబోతోందనే ఆరోపణలు కోడై కూస్తున్నాయి. -
పేట డైవర్షన్ రోడ్డుపై నుంచి రాకపోకలు ప్రారంభం
బుచ్చెయ్యపేట: భీమునిపట్నం,నర్సీపట్నం (బీఎన్) రోడ్డులో విజయరామారాజుపేట డైవర్షన్ రోడ్డుపై నుంచి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మోంథా తుఫాన్కు విజయరామరాజుపేటలో తాచేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డు కోతకు గురైంది. దీంతో పది రోజులుగా విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి, పాడేరు, చోడవరం ప్రాంతాలకు తిరిగే ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయా యి. నెల రోజుల కిందట వర్షాలకు పేట డైవర్షన్ రోడ్డు దెబ్బతినగా అప్పట్లో అధికార్లు సిమెంట్ గొట్టాలు, గ్రావెల్ వేసి రోడ్డు ఏర్పాటు చేశారు. వేసిన రోడ్డు నెల రోజులు తిరగక ముందే వర్షాలకు మళ్లీ కోతకు గురైంది. దీంతో ఆర్అండ్బీ అధికారులు మరమ్మతులు చేసి, బుధవారం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతించారు. నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు మహారాణిపేట(విశాఖ): జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన గురువారం స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు 2వ స్థాయీ సంఘం, 10.30కు 3వ, 11కు 4వ, 11.30కు 5వ, 12కు 1వ, 7వ, 12.30 గంటలకు 6వ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా శాఖలకు సంబంధించినప్రగతి నివేదికలతో సమావేశాలకు హాజరుకావాలని అధికారులను ఆదేశించారు. -
భక్తిశ్రద్ధలతో ఫణిగిరి ప్రదక్షిణ
రాంబిల్లి(అచ్యుతాపురం): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని రాంబిల్లిలో ఫణిగిరి ప్రదక్షిణను బుధవారం ఘనంగా నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ కొండపై వెలసిన ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారిని ప్రత్యేక వాహనంపై ఊరేగించారు. తెల్లవారు జామున ధారపాలెం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ 24 కిలో మీటర్ల మేర సాగింది. శివనామ స్మరణ చేస్తూ వందలాది మంది భక్తులు నడక సాగించారు. చిన్నాపెద్దా, ముసలిముతక అన్న తేడా లేకుండా.. ఒకవైపు కాళ్లు కాలుతున్నప్పటికీ మండుటెండను లెక్కచేయకుండా భక్తి పారవశ్యంతో భారీ ఎత్తున ప్రదక్షిణలో పాల్గొన్నారు. భక్తుల సేవలో... గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు మార్గ మధ్యంలో స్థానికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు సేవలందించారు. మజ్జిగ, అల్పాహారం అందజేశారు. పలు కూడళ్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, భక్తులకు చికిత్స చేశారు. గిరి ప్రదక్షిణ సాగిన ప్రాంతాల్లో రహదారిని చదును చేయడంతో భక్తులు ఉపశమనం పొందారు. అప్పారాయుడిపాలెం జంక్షన్, కొత్తూ రు, గోకివాడ, మూలజంప, మూల కొత్తూరు, మడకపాలెం, చెర్లోపాలెం, నరేంద్రపురం, మల్లవరం, ఎర్రవరం, ఉప్పవరం, కొండకర్ల జంక్షన్, చోడపల్లి, అచ్యుతాపురం జంక్షన్, వెదురువాడ, గొర్లె ధర్మ వరం, వెంకటాపురం జంక్షన్ మీదుగా రాధామాధవ స్వామి ఆలయానికి ఊరేగింపు చేరుకుంది. భక్తులు ఆకాశ గంగ వద్ద పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు.భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఖండివరం ఉపాధి హామీ పథకం టీఏపై విచారణ
చీడికాడ: ఖండివరం ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ మోహన్రావుపై కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం గ్రామంలో ఏపీడీ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. ఖండివరంలో ఉపాధి పనులు పరిశీలించే టెక్నికల్ అసిస్టెంట్ మోహన్రావుపై గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు పీజీఆర్ఎస్లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం ఏపీడీ శ్రీనివాసరావు సచివాలయంలో ఫిర్యాదుదార్లతో పాటు మేట్లతో విచారణ చేపట్టారు. రెండేళ్లలో ఒక్క రోజు మాత్రమే టెక్నికల్ అసిస్టెంట్ పని ప్రదేశానికి వచ్చి కొలతలు తీశారని, మిగతా రోజుల్లో వీఆర్పీ(ఎఫ్ఏ)మస్తర్లు, కొలతలు తీసుకెళ్లేవారని ఖండివరం గ్రామానికి చెందిన ఉపాధి మేట్లు ఏపీడీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సచివాలయంలో తలుపులు ముసి విచారణ చేపట్టడంపై కూలీలు, గ్రామస్తులు విచారణ అధికారి శ్రీనివాసరావు, ఏపీవో గంగునాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పథకం ప్రారంభం నుంచి వీఆర్పీగా విధులు నిర్వహిస్తున్న మోసూరి ఏసుబాబును రాజకీయ దురద్దేశంతో కొంత మంది గ్రామానికి చెందిన కూటమి నాయకుల ఒత్తిడితో విధుల నుంచి తొలగించారని మండల కో–ఆప్షన్ సభ్యుడు షేకు సూర్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు ఆరోపించారు. తిరిగి ఆయనను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ఏపీడీ శ్రీనివాసరావును వివరణ కోరగా.. టెక్నికల్ అసిస్టెంట్ మోహన్రావు రెండేళ్లలో ఒక్క రోజే ఫిల్డ్కు వెళ్లి కొలతలు తీసుకున్నట్లు మేట్లు తెలియజేశారన్నారు. వీఆర్పీని సస్పెండ్ చెయ్యడంపై తనకు తెలియదన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. -
దేవాలయాలు, స్నానఘట్టాల వద్ద రక్షణ చర్యలు
తుమ్మపాల: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 5న శివాలయాలు, ప్రముఖ దేవాలయాలు, స్నానఘట్టాలు, ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి రెవెన్యూ, దేవదాయశాఖ, పోలీసు, వైద్యశాఖ, ఎంపీడీవోలతో దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. దేవాలయాల్లో ప్రజల సంఖ్యకు అనుగుణంగా క్యూలైన్లకు బారికేడ్లు, మంచినీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. సముద్ర, నదీ స్నానఘట్టాల వద్ద గజ ఈతగాళ్లను, బోట్లను సిద్ధం చేసుకోవాలని, మహిళలు బట్టలు మార్చుకోవడానికి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దేవాలయాలకు సంబంధించిన వివరాలు తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు తీసుకుని వారితో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాకుళంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని తగినంత భద్రతా ఏర్పాట్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాంబిల్లి మండలం పంచదార్ల, అనకాపల్లి మండలం సత్యనారాయణస్వామి గిరి ప్రదక్షిణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, మంచినీరు, ప్రతి మూడు కిలోమీటర్లకు వైద్య శిబిరం ఏర్పాట్లు చేయాలన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ దేవాలయాల వద్ద బందోబస్తు ఏర్పాటుకు దేవదాయ శాఖ నిర్వహిస్తున్న దేవాలయాలకు సంబంధించిన సమాచారం పోలీసు శాఖకు అందిస్తున్నారని, దానికి తగినట్టుగా పోలీసు సిబ్బందిని నియమించడం జరుగుతుందన్నారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న దేవాలయాలకు సంబంధించిన సమాచారం రావడం లేదన్నారు. ప్రతి దేవాలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి దేవాలయానికి ప్రవేశ, నిష్క్రమ మార్గాలు విడిగా ఉండాలని, నిష్క్రమణ మార్గాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలన్నారు. భోజనం, ప్రసాదం కౌంటర్లు తగినన్ని ఏర్పాటు చేయాలని, తగినంత మంది సిబ్బందిని నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బలక్ష్మి, జిల్లా ఎండోమెంటు అధికారి కె.ఎల్. సుధారాణి, గ్రామ వార్డు సచివాలయాల అధికారి మంజులవాణి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసులు పాల్గొన్నారు. -
టెట్ నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలి
తుమ్మపాల: ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూకలెక్టరేట్లో మంగళవారం డీఆర్వో సుబ్బలక్ష్మికి ఫ్యాప్టో జిల్లా నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకుడు చిన్నారావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి బోధనలో ఉన్న ఉపాధ్యాయులు టెట్ రాయాలని విద్యాశాఖ అధికారులు చెప్పడం భావ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టపరమైన మార్పులు చేయడం ద్వారా ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు ఎస్.దుర్గాప్రసాద్, ఆచంట రవి, కార్యవర్గ సభ్యులు కె.పరదేశి, సిహెచ్.నాగేశ్వరరావు, ధర్మారావు, అక్కు నాయుడు, మామిడి బాబూరావు, మధు, సింహాచలం నాయుడు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో.. వినికిడి సమస్య!
మహారాణిపేట: వినికిడి సమస్య ఉన్న రోగుల పాలిట గత వైఎసా్స్ర్ సీపీ ప్రభుత్వంలో వరంగా మారిన కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను కూటమి ప్రభుత్వం మూలకు చేర్చింది. నాలుగు మాసాలుగా ఈ పరికరాల సరఫరా లేకపోవడంతో ఈఎన్టీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియక బాధిత చిన్నారులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ కొందరు అర్హత కొల్పొయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఘనం ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రంగా ఉన్న చెవి, ముక్కు, గొంతు(ఈఎన్టీ) ప్రభుత్వ ఇక్కడ ఆస్పత్రికి ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 30–50 వరకు ఓపీ ఉంటుంది. ఇక్కడ డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో అనేక శస్త్ర చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలో చేశారు. ఒక్కో రోగి కోసం రూ.10 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలూ నిర్వహించారు. బాధిత చిన్నారులు పైసా ఖర్చు లేకుండానే వినికిడి సామర్థ్యం పొందారు. ఇప్పుడిదంతా గతం. నాలుగు నెలలుగా నిరీక్షణ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని రకాల శస్త్ర చికిత్సలకు అంతరాయం కలుగుతోంది. నాలుగు నెలలుగా వినికిడి సమస్యతో బాధపడే చిన్నారులకు నిర్వహించే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు నిలిచిపోయాయి. ఈ పరికరాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రావడం, వాటిని అమర్చేందుకు వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ పరికరాల కొనుగోలుకు అనుమతులు రాకపోవడంతో చికిత్సలు నిలిపేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 9 మంది చిన్నారులు ఈ శస్త్ర చికిత్సల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చిన్నతనంలోనే చికిత్స చేయాలి పుట్టుకతోనే చెవిటి, మూగతో బాధపడుతున్న చిన్నారులకు ఆత్యాధునిక శస్త్ర చికిత్స విధానం ఇప్పుడు ఈఎన్టీ ఆస్పత్రిలో చేస్తున్నారు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చిన్నతనంలో చేయాలి. మూడేళ్ల లోపు చిన్నారులకు ఈ శస్త్ర చికిత్స చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నాలుగేళ్లు దాటాక కొందరు, ఐదేళ్ల తర్వాత మరికొందరు గుర్తించగలుతున్నారు. చిన్నారులకు వివిధ రకాల పరీక్షలు చేసి, వారు శస్త్రచికిత్సకు అర్హులు అని నిర్ధారించేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ఈలోగా వయస్సు ఐదేళ్లు దాటిపోతే ఒక్కోసారి ఈ చికిత్స విజయవంతం కాదని వైద్యులు చెప్తున్నారు. దీంతో చాలా మంది చిన్నారుల వయస్సు దాటి పోతోందని, దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి త్వరగా అనుమతులు ఇవ్వాలని తల్లిదండ్రులు, వైద్యులు కోరుతున్నారు. శస్త్రచికిత్స కోసం నిరీక్షిస్తున్న చిన్నారులు హేమవర్షిత్, టి.కన్నారావు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పలు పథకాల పట్ల కూటమి ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోంది. పేద ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఆరోగ్యశ్రీతో ఇన్నాళ్లూ ఆటాడుకుంది. అంతకు ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు సమ్మె బాట పడితే తప్ప, వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు పుట్టుక నుంచే వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను నిలిపేసి.. తమకు ప్రజల ఆకాంక్షలేవీ కనబడవు.. వినబడవని నిరూపించుకుంటోంది. -
తుఫాన్ సాయం కొందరికే..!
మోంథా తుఫాన్ సహాయంలో కూటమి ప్రభుత్వం వివక్ష చూపింది. భారీ వర్షాలు, తుఫాన్ల కారణంగా నష్టపోయిన బాధితులకు సాయం అందించే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వారం ఏర్పడ్డ మోంథా తుఫాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, నేత కార్మికులతో పాటు, ఇళ్లకు నష్టం వాటిల్లిన బాధితులకు ప్రభుత్వం 50 కిలోల బియ్యం, కిలో పంచదార, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో బంగాళ దుంపలు, కిలో ఉల్లిపాయలు గ్రామాల్లో రేషన్డిపోల ద్వారా మత్స్యకారులకు అందజేస్తోంది. అయితే మిగిలిన సామాజిక వర్గాలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గంలో తూర్పు తీర ప్రాంతం వెంబడి 18 మత్స్యకార గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 25 వేలకు పైగా మత్స్యకారులు జీవిస్తున్నారు. దాదాపు 1400కి పైగా బోట్లు తెప్పలు ఉన్నాయి. ఒక్కో తెప్పపై ఆరుగురు చొప్పున 8వేల మందికి పైగా మత్స్యకారులు వేటకు వెళ్తుంటారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేటపై ఆధార పడిన మహిళలు కూడా వివిధ గ్రామాల్లో చేపలు విక్రయించుకుంటూ జీవనోపాధి పొందుతుంటారు. తుఫాను ప్రభావిత గ్రామాల్లో రేషన్ కార్డు కలిగిన వారందరికీ ప్రభుత్వం తుఫాను సాయం కింద ఈ బియ్యాన్ని నిత్యావసర సరుకులను అందజేస్తోంది. ఇలా నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో మత్స్య కారులు, చేనేత కార్మికులు, ఇళ్లకు నష్టం వాటిల్లిన బాధితులను 13,681 మందిని గుర్తించారు. వీరికి మాత్రమే ప్రభుత్వం నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తోంది. మత్య్సకార గ్రామాల్లో కేవలం మత్స్యకారులే కాకుండా రజకులు, శెట్టి బలిజ, దళితులు, నాయి బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, యాదవులు, కాపులు, వెలమ తదితర వెనుకబడిన సామాజిక వర్గాల వారు కూడా ఉన్నారు. రేషన్ కార్డు కలిగిన ఇలాంటి వారు మరో 30వేల మందికి పైనే ఉంటారు. వీరెవరికీ రేషన్ బియ్యం, ఇతరత్రా సరుకులు అందించలేదు. తుఫాన్ వల్ల తాము కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోయామని కూలి పనులకు, వ్యవసాయ పనులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉండిపోయామని, మత్స్యకారులతోపాటు, తాము కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యామంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలపాకు, అపరాలు, కూరగాయలు, ఉద్యానవన రైతులకు కూడా ఎంతో నష్టం వాటిల్లింది. వీరెవరికీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు అందించలేదు. తమ గ్రామాల్లో ఇతర సామాజిక వర్గాల వారు కూడా నివసిస్తున్నారని, తుఫాన్ కారణంగా వారు కూడా ఎంతో నష్టపోయినా వారికి ప్రభుత్వం సాయం అందించకపోవడం సమంజసం కాదని మత్స్యకారులు కూడా ఆక్షేపిస్తున్నారు. తమతోపాటు మిగిలిన బాధితులకూ తుఫాన్ సాయం కింద నిత్యావసరాలు అందించాలని రెవెన్యూ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. చేతివృత్తులపై ఆధారపడ్డ రజకులు, నాయీ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, శెట్టిబలిజ, గుల్ల కార్మికులు, దళితులకు సాయం అందించకపోవడం దారుణమన్న వాదన వినిపిస్తోంది. తుఫాన్ సాయంలో కూడా కూటమి ప్రభుత్వం వివక్ష చూపడం పట్ల బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వంలో వివక్ష లేదు.. గత ప్రభుత్వంలో తుఫానులు సంభవించినప్పుడు కులాల వారీగా కాకుండా తుఫాను ప్రభావిత గ్రామాల్లో రేషన్కార్డు కలిగిన వారందరికీ ప్రభుత్వం తరపున సహాయం పంపిణీ చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఏడాదిపాటు బాధితులందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. తుఫాన్ సాయంలో ఎటువంటి వివక్ష లేకుండా, అన్ని సామాజిక వర్గాల వారికి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలంటూ వైఎస్సార్సీపీ నేతలు, మత్స్యకార సామాజిక వర్గాలవారు సైతం రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. మా గోడు పట్టదా... మేము కూడా మత్స్యకార గ్రామంలోనే నివసిస్తున్నాం. తుఫాను వల్ల మేము కూడా ఉపాధి కోల్పోయాం. కల్లుగీత, తాటాకులు అమ్ముకోవడం, వ్యవసాయ కూలి పనులకు వెళ్తుంటాం. వారం రోజుల పాటు గడప దాటలేదు. తుఫాను ప్రభావం కారణంగా మత్య్సకారులు మినహా ఇతర కులాల వారికి నిత్యావసరాలు ఇవ్వకపోవడం దారుణం. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఉచితంగా సరుకులు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం మాపై వివక్ష చూపించడం దారుణం. మేమేం పాపం చేశాం.. –చిట్టిమని రాంబాబు, అమలాపురం దళితులను విస్మరించడం సరికాదు.. తుఫాన్ వల్ల కేవలం ఒక వర్గం వారే నష్టపోయారని భావించడం తగదు. దళితులు కూడా నష్టపోయారు. వారం రోజుల పాటు కూలి పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు సాయం చేయకపోవడం బాధగా ఉంది. ప్రభుత్వం స్పందించి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి తుఫాన్ సాయాన్ని అందించాలి. –కుంచా సురేష్, జగన్నాథపురం మిగిలిన సామాజికవర్గాలకు మొండి చేయి -
విశాఖలో భూప్రకంపనలు
ఆరిలోవ/డాబాగార్డెన్స్/మధురవాడ/మల్కాపురం/తగరపువలస/మురళీనగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వేకువజాము 4.20 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీన్ని నిద్రలో ఉన్నవారు గుర్తించలేకపోయినా.. ఇళ్లలో సామాన్లు కిందపడిన వారు అకస్మాత్తుగా నిద్రలేచి, భయాందోళన చెందారు. ఆరిలోవ కాలనీ, టీఐసీ పాయింట్, బాలాజీనగర్, రవీంద్రనగర్, ఆదర్శనగర్, విశాలాక్షినగర్, హనుమంతవాక, మధురవాడ పరిధి శివశక్తినగర్, శారదానగర్, సాయిరాం కాలనీ, వికలాంగుల కాలనీ పరిసర కొండవాలు ప్రాంతాలు, తగరపువలస, భీమిలి, ఆనందపురం, మురళీనగర్, మాధవధార, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి మహారాణిపేట, డాబాగార్డెన్స్, ఓల్డ్సిటీ, బీచ్రోడ్డు, అల్లిపురం, జ్ఞానాపురం, మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో గుర్తించగలిగే స్థాయిలో ఈ భూ ప్రకంపనలున్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. కార్తీకమాసం పూజలు, వాకింగ్, పాలప్యాకెట్ల కోసం అప్పటికే నిద్రలేచిన ప్రజలు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో మంచాలు, కబ్ బోర్డుల నుంచి వస్తువులు దొర్లిపడ్డ చోట మరింత ఆందోళన చెందారు. తమ వారిని నిద్రలేపి మరీ కొందరు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 3 నుంచి 10 సెకన్ల పాటు ఆయా ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ప్రజలు చెప్తున్నారు ఇద్దరు మహిళలకు గాయాలు భూ ప్రకంపనల సమయంలో జీవీఎంసీ రెండోవార్డు సంతపేటలో నందిక రమణ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గేటు రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదు విశాఖలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7 మాగ్నిట్యూడ్గా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల వద్ద 10 కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు భూకంపాలు, వల్కనోలపై అధ్యయనం చేస్తున్న వల్కనో డిస్కవరీ సంస్థ వెల్లడించింది. నగరంలో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు
కె.కోటపాడు: ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో భాగంగా పాతవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను స్థానిక సర్పంచ్ జామి శ్రావణ్, ఎంపీటీసీ వర్రి రామునాయుడు ప్రారంభించారు. అండర్–14 బాల బాలికల విభాగంలో అనకాపల్లి, నర్సీపట్నం, అల్లూరి, విశాఖపట్నం, భీమిలి డివిజన్ల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడ్డారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన బాలుర, బాలికల జట్ల నుంచి 24 మందిని ఎంపిక చేయనున్నట్లు హెచ్ఎం నాగేశ్వరరావు తెలిపారు. విద్యా కమిటీ చైర్పర్సన్ జామి ఉమాదేవి, పీడీలు బి.కృష్ణ, కె.చిట్టి ప్రసాద్, తమ్మునాయుడు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు దార్లపూడి విద్యార్థులు ఎస్.రాయవరం: జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన దార్లపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్టు హెచ్ఎం జాన్మెతెషెలా మంగళవారం తెలిపారు. బాలికల ట్రిపుల్ జంప్లో పి.నాగమౌనిక, జె.తారకలక్ష్మి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వారిని వ్యాయామ ఉపాధ్యాయురాలు నిర్మల, తదితరులు అభినందించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు గాంధీనగరం విద్యార్థులు అనకాపల్లి: స్థానిక గాంధీనగరం జీవీఎంసీ హైస్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఎన్.హర్షవర్దన్, టి.లోవరాజు కబడ్డీలో రాష్ట్ర స్థాయి స్కూల్ ఫెడరేషన్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు స్థానిక స్కూల్ ఆవరణలో వారిని మంగళవారం ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం టి.సంధ్య కుమారి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ పోటీలు ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకూ కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి హెచ్.నేతాజీ, ఉపాధ్యాయుడు కె.అప్పారావు, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు పాల్గొన్నారు. -
రాంబిల్లి ఫణిగిరి గిరి ప్రదక్షిణ నేడే
రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం కొలువు ఉన్న ఫణిగిరి ప్రదక్షిణ ఈనెల 5వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తయ్యాయి. మూడు మండలాల పరిధిలో 24 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణ కార్తీక పౌర్ణమి రోజున చేపట్టనున్నారు. బుధవారం తెల్లవారుజామున భక్తులు ధార భోగాపురం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ధారపాలెం, పంచదార్ల, కొత్తూరు, గోకివాడ, మూలజంప, మడక పాలెం, చెర్లోపాలెం, నరేంద్రపురం, మల్లవరం, ఉప్పవరం, ఎర్రవరం, కొండకర్ల చోడపల్లి, అచ్యుతాపురం, వెదురువాడ, గొర్ల ధర్మవరం, వెంకటాపురం జంక్షన్ మీదుగా రాధా మాధవ స్వామి ఆలయానికి యాత్ర చేరుకోనుంది అనంతరం ఆకాశధారలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఉమా ధర్మలింగేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఇప్పటికే స్వామివారికి అవసరమైన గొడుగుకు నిధులను దాతలు సమకూర్చారు. 24 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లో భక్తులు నడిచేందుకు వీలుగా రహదారులను చదును చేసే పనులు చేపట్టారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల వైద్య సేవల నిమిత్తం అచ్యుతాపురానికి చెందిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు మూడు చోట్ల వైద్య శిబిరాలను, అంబులెన్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక మండలాల సరిహద్దుల్లో జరిగే ఈ గిరి ప్రదక్షిణకు అనకాపల్లి జిల్లాలో ప్రాధాన్యం పెరుగుతోంది. -
తాండవ స్పిల్ వే నుంచి నీటి విడుదల
నాతవరం: తాండవ జలాశయం ప్రస్తుతం నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుందని, ఎగువ ప్రాంతాల నుంచి అధికంగా వర్షం నీరు ప్రవహించడం వల్ల స్పిల్ వే గేట్ల నుంచి మిగులు నీరు విడుదల చేస్తున్నట్టు తాండవ జలాశయం డీఈఈ అనురాధ తెలిపారు. మంగళవారం నుంచి తాండవ జలాశయం నుంచి నీరు విడుదల చేయడం జరుగుతుందని, జలాశయం దిగువ ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాండవ జలాశయం గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 379కి చేరుకుందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి తాండవ జలాశయానికి ఇన్ఫ్లో ద్వారా 1430 క్యూసెక్కులు నీరు రాగా స్పిల్ వే గేట్లు ద్వారా 1237 క్యూసెక్కుల నీటిని నదిలోనికి విడిచిపెట్టడం జరుగుతుందన్నారు. దిగువన ఉన్న నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అమరావతి మాక్ అసెంబ్లీకి కాశీపురం విద్యార్థిని
దేవరాపల్లి: కాశీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని సింగంపల్లి వెంకట సాయి మేఘన అమరావతిలో జరిగే మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల, మండల, నియోజకవర్గ స్థాయిలో విద్యార్థ్ధులకు వ్యక్తృత్వ, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. మాడుగులలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీలలో వెంకట సాయి మేఘన ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.‘మేకింగ్ ఇండియా– వికసిత్ ఆంధ్రప్రదేశ్’, భారత రాజ్యాంగ ఆవశ్యకత, పౌరుల హక్కులు, విధులు తదితర అంశాలపై ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించి మాడుగుల నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీకి అర్హత సాధించింది. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలోని శాసనసభలో జరిగే మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో వెంకట సాయి మేఘన పాల్గొంటుందని స్థానిక హెచ్ఎం రాజేటి సుజాత తెలిపారు. ఎంపికై న విద్యార్ధినితో పాటు గైడ్ టీచర్ కొట్టాన రాంబాబును మండల విద్యాశాఖ అధికారులు సిహెచ్.ఉమ, వి. ఉషారాణి, హెచ్ఎం సుజాత అభినందించారు. -
ఇదేం వివక్ష!
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చీడికాడ: మోంఽఽథా తుఫాన్ పరిహారం పంపిణీలో వివక్ష తగదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ స్టేట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు అన్నారు. మంగళవారం ఆయన కోనాం శివారు గిరిజన గ్రామం గుడివాడను సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు బుచ్చయమ్మ, దేముడమ్మ, రాజులమ్మ తదితరులు బూడి వద్దకు వచ్చి తమ గోడు వినిపించారు. మోంథా తుఫాన్లో తమ ఇల్లు దెబ్బతిన్నా తమకు తక్షణ సహకారం అందించకుండా ఒక వర్గానికి చెందిన వారికే నిత్యావసర వస్తువులు అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన బూడి తహసీల్దార్ కిషోర్ లింకన్ను ఫోన్లో సంప్రదించి మరోమారు కోనాం, వి.బి.పేట పంచాయతీలోని అన్ని గిరిజన గ్రామాల్లో తుఫాన్ నష్టాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పార్టీలు, కుల, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అందించారన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి కానరాలేదన్నారు. తుఫాన్ ధాటికి ఇళ్లు దెబ్బతిని తమ ఆస్తులు నష్టపోయిన వారికి మనవత్వంతో ఆదుకోవాల్సింది పోయి కొందరికే పరిహారం అందించడం తగదన్నారు. రేషన్ సరఫరా వాహనాలను రద్దు చేయయడంతో 6 కిలోమీటర్లు దూరంలో గల కోనాం రేషన్ డిపోకి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే పరిస్థితి గిరిజనులకు కల్పించారన్నారు. వెంటనే ఆయా గ్రామాల్లో తుఫాన్ నష్టాన్ని మరోసారి పరిశీలించి బాధితులు అందరికీ న్యాయం చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీపీ కురచా జయమ్మనారాయణమూర్తి, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు కిముడు చిన్నమ్మలు, ధర్మిశెట్టి స్వాతి తదితరులున్నారు. -
ఒకేరోజు పంచారామాల సందర్శన
కార్తీకం ‘స్పెషల్’ సాక్షి, అనకాపల్లి: పవిత్రమైన కార్తీక మాసంలో భక్తులు శైవ క్షేత్రాలకు యాత్రకు వెళుతున్నారు. ప్రతి ఏటా వీరి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుంది. దీంతో భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది. ఇప్పటికే రెండు దఫాలుగా బస్సులను స్పెషల్ దర్శనానికి రవాణా చేశారు. ప్రైవేట్ సర్వీస్లు కన్నా ఏపీఎస్ఆర్టీసీ బస్సులలోనే భక్తులు ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే మూడేళ్లుగా ఆర్టీసీ కార్తీక మాసంలో శైవక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను నడిపింది. దానికి తగ్గట్లుగానే భక్తులు కూడా బస్లను బుక్ చేసుకుంటున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణంతో ఈ ఏడాది పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు బిజీగా ఉండడంతో..ఆల్ట్రా డీలక్స్ బస్సులనే శైవక్షేత్రాల ప్రత్యేక యాత్రకు కేటాయించారు. ఇందుకోసం శివాలయాలకు వెళ్లే భక్తుల కోసం పంచరామాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పా టు చేసింది. ఇప్పటికే అక్టోబర్ 28వ తేదీన, నవంబర్ 2వ తేదీన రెండు దఫాలుగా సర్వీసులను నడిపారు. ఈ సర్వీసులను కార్తీక మాసం మొత్తం నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకోసం నవంబర్ 9, 11వ తేదీల్లో కూడా ఆల్ట్రా డీలక్స్ సర్వీసులను నడుపుతుంది. ఈ ప్యాకేజీలతోపాటు వన భోజనాలు, ఆలయాల సందర్శనకు ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను కూడా ప్రకటించారు. ఆన్లైన్లో, డిపో కౌంటర్లలో టికెట్లు కార్తీక మాసంలో ఒకే రోజు పంచారామాల క్షేత్ర దర్శనం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అందుకు తగ్గట్లుగానే ఆర్టీసీ కూడా బస్సు సర్వీసులను నడుపుతుంది. ప్రతి ఆదివారం అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి బస్సులు బయలుదేరి పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి సోమవారం రాత్రి మళ్లీ ఆయా డిపోలకు చేరుకుంటాయి. టికెట్లను ఏపీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్లో, డిపో కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా బస్సును బుక్ చేసుకునే భక్తుల కోసం వారు ప్రయాణించే చోటుకు బస్సు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత బస్సుతో తగ్గిన సర్వీసులు.. కార్తీక మాసంలో పంచారామాల శైవ క్షేత్రాల యాత్రకు ఎక్కవగా బస్సులను ఆర్టీసీ నడిపేది. ఇప్పుడు ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ బస్సులు కొరత రావడంతో కేవలం ఆల్ట్రా డీలక్స్ సర్వీసులను మాత్రమే నడుపుతుంది. మూడేళ్లగా ఈ శైవక్షేత్రాల యాత్రకు భక్తులకు పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, ఆల్ట్రా ఎక్స్ప్రెస్ బస్సులను నడిపేది. కానీ ఈ ఏడాది ఈ బస్సులన్నీ రద్దీగా ఉండడంతో కేవలం ఆల్ట్రా డీలక్స్ సర్వీసులనే నడుపుతుంది. దీంతో ఆర్టీసీకి ఆదాయం తగ్గుముఖం పట్టింది. కార్తీక మాసంలోనే ఎక్కువగా ఆర్టీసీలకు లాభం వచ్చేది..ఈ ఏడాది అది కాస్త తగ్గిందని ఆర్టీసీ అధికారులు సైతం చెబుతున్నారు. ప్రతి ఆదివారం స్పెషల్.. వచ్చే ఆదివారం 09 వ తేదీ, 16వ తేదీల్లో అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి పంచరామాల పుణ్యక్షేత్రాలకు ఆల్ట్రా డీలక్స్ బస్సులు బయలుదేరుతున్నాయి. ముందుగా టికెట్స్ బుక్ చేసుకోనే భక్తులు ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లలో బుక్ చేసుకోవచ్చు. లేదంటే అనకాపల్లి డిపో సెల్నంబర్ 7382913967, నర్సీపట్నం డిపో సెల్ నంబర్ 9494811855లను సంప్రదించాలి. –వి.ప్రవీణ, ప్రజారవాణా శాఖ జిల్లా అధికారిఅనకాపల్లి డిపో నుంచి.. -
చోడవరంలో మెగా జాబ్ మేళా రేపు
మెగా జాబ్ మేళా వాల్పోస్టర్ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ జాహ్నవి తుమ్మపాల: విద్యార్హతగల ప్రతి ఒక్కరికీ ఉద్యో గం అందించాలనే లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. చోడవరంలో ఈ నెల 5న నిర్వహించనున్న జాబ్ మేళా వాల్పోస్టర్ను కలెక్టరేట్లో ఆమెతో పాటు జేసీ జాహ్నవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే మెగా జాబ్ మేళాలో 17 బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి, 1,500 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారని చెప్పా రు. టెన్త్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువతీయువకులు జాబ్మేళాకు హాజరు కావచ్చని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ ఎన్. గోవిందరావు మాట్లాడుతూ ఆసక్తి గల వారు తమ వివరాలను naipunyam.ap.gov.in వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. రిఫరెన్స్ నంబర్తో పాటుగా బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్ల జెరాక్స్లతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 94947 91935, 79811 02224 అనే ఫోన్నంబర్ల సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో ఎస్.సుబ్బలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణంపై సర్వే
భీమునిపట్నం : బీచ్రోడ్డులోని ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణం ఎంతవరకు ఉందన్న దానిపై సోమవారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారితో కలిసి ఆర్డీవో సంగీత్ మాథూర్ పర్యవేక్షణలో అధికారులు సర్వే నిర్వహించారు. ఈ ప్రాంతంలో మొత్తం 1,400 ఎకరాల మేరకు ఎర్రమట్టి దిబ్బలు విస్తీర్ణం ఉండగా ఇప్పుడు ఏవిధంగా ఉన్నాయి.. వాటి సరిహద్దులను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. ఈ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో ఎర్రమట్టిదిబ్బల సరిహద్దులు గుర్తించడం వల్ల.. ఇకపై వీటిని కూల్చివేత జరగకుండా అధికారులు తగిన చర్యలను తీసుకోవడానికి వీలవుతుంది. ఇందులో తహసీల్దారు రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి 85 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 82 అర్జీలు వచ్చాయి. అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి వారివారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగాదాలు–24, కుటుంబ కలహాలు–4, చీటింగ్ –5, ఇతర విభాగలకు చెందనవి–49 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, ఎస్ఐ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. -
వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందు కు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఎంపీడీవోలకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎంపీడీవోలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అందుకు సంబంధించిన సమాచారం సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రెండు వారాల్లో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో తాగునీటి పథకాలకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, జల్జీవన్ మిషన్ పనులు పూర్తిచేసి ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించాలన్నారు. ప్రతి మండలం, మేజరు పంచాయతీల్లో వరుసగా 25 సెంట్లు, 15 సెంట్ల స్థలాలను గుర్తించి, వాలీబాల్ కోర్టులు నిర్మించాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కార్తీక వన భోజనాలు ఏర్పా టు చేస్తున్నట్లు చెప్పారు.ప్రతి షాపులో చెత్తబుట్టను ఉంచాలన్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు విచ్చలివిడిగా రోడ్డుపై పారవేసే మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలనిఆదేశించారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్ కుమార్, డ్వామా పీడీ పూర్ణమాదేవి, గ్రామవార్డు సచివాలయాల అధికారి మంజులవాణి, ఈవోపీఆర్డీ నాగలక్ష్మి, డీపీవో సందీప్ పాల్గొన్నారు. -
అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
నర్సీపట్నం: వేదపండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, విద్యుత్ దీపాల కాంతుల నడుమ స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీనివాసుని కల్యాణంతో నర్సీపట్నం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ ఘట్టాన్ని కళ్లారా చూసి భక్తులు పారవశ్యం చెందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ స్టేడియంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కల్యాణాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో స్టేడియం ప్రాంగణం మార్మోగింది. తిరుమల శ్రీవారి అర్చక బృందం ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. స్వామివారికి అర్చన, తోమాల సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ సందర్భంగా ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతితో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. మారుమూల ప్రాంతాల్లో హైందవ ధర్మంపై ప్రచారాన్ని చేయడానికి గోవింద కల్యాణాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణం అనంతరం భక్తులకు లడ్డూతోపాటు కుంకుమ, హ్యాండ్ బుక్ అందజేశారు. స్వామి వారి కల్యాణంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, చింతకాయల విజయ్, సువర్ణ దంపతులు, కౌన్సిలర్ రాజేష్ దంపతులు, తదితరులు పాల్గొన్నారు. -
శంభో శివ శంభో
●కార్తీక దీపపు కాంతులతో శోభిల్లిన శైవక్షేత్రాలు ●భక్తిశ్రద్ధలతో రెండో సోమవారం పూజలు కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు దీప కాంతులతో శోభిల్లాయి. శివ నామస్మరణతో మార్మోగాయి. శివారాధన కోసం భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సూర్యోదయానికి ముందే భక్తులు నదులు, సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి, శివాలయాల్లో పూజలు జరిపారు. ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు, మహాన్యాస రుద్రాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. – సాక్షి, నెట్వర్క్ -
అడుగుకో గుంత.. హామీలు గోవింద
‘సంక్రాంతి నాటికి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. రాష్ట్రంలో సుమారు 22,229 కిలోమీటర్ల రోడ్లను రూ.861 కోట్లతో బాగు చేస్తాం. నవంబర్ 20 తేదీన ప్రారంభిస్తున్నా.. సంక్రాంతి పండగ తరువాత గుంతల్లేని రోడ్లుగా తీరిదిద్దుతాం.... ఇది సీఎం చంద్రబాబు 2024 నవంబర్ 2న అనకాపల్లి జిల్లాలో పరవాడలో రోడ్లు మరమ్మతుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చెప్పిన మాటలు’. రెండు రోజుల తరువాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇదే మాట చెప్పారు. వారు చెప్పిన సంక్రాంతి వెళ్లి నేటికి 11 నెలలైంది.. వారి హామీ మాత్రం అమలుకాలేదు. ఇటీవల మోంథా తుఫాన్కు ఈ గుంతలు కాస్త పెద్ద గొయ్యిలుగా మారాయి. జిల్లాలో రహదారులు అత్యంత అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. సాక్షి, అనకాపల్లి: జిల్లాలోని రోడ్లపై గుంతలు పూడ్చడమే కాదు ఆర్ అండ్ బీ, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో కొత్త రోడ్లు కూడా వేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. కొత్త రోడ్ల మాట దేవుడెరుగు.. గుంతలనే పూడ్చిన పాపానపోలేదు. మూడు జిల్లా కేంద్రాలను అనుసంధానిస్తూ ఉన్న ప్రధాన రహదారి రోలుగుంట – చోడవరం రోడ్డులో అడుగడుగునా ఉన్న గుంతలు వాహనచోదకులకు ప్రాణాంతకంగా మారాయి. మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల్లోని గిరిజన గ్రామాల రహదారులు మరీ దారుణంగా ఉన్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో జిల్లాలో ఏకై క మేజరు ప్రాజక్టు తాండవ రిజర్వాయర్కు వెళ్లే నాతవరం–తాండవ రోడ్డులో గుంతులపూడ్చలేదు. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.ఇదే కాదు నర్సీపట్నం, కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాల మీదుగా వెళ్లే నర్సీపట్నం–రేవుపోల వరం రహదారి పరిస్థితి అలాగే ఉంది. ●అనకాపల్లి, కశింకోట మండలాల్లో ప్రధానంగా అనకాపల్లి–మామిడిపాలెం, పాపయ్యసంతపాలెం, మార్టూరు, రేబాక, కొప్పాక, తోటాడ, కుంచంగి, తగరంపూడి, వెంకుపాలెం పంచాయతీ పరిధిలోని రహదారుల్లో పూడ్చిన గుంతలు అనతికాలంలోనే యథాస్థితికి చేరుకున్నాయి. అధ్వానంగా రహదారులు.. నర్సీపట్నం నుంచి రేవుపోలవరం వరకూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.7 కోట్లతో 18 కిలోమీటర్ల మేర రోడ్డు వేసింది. పెదబొడ్డేపల్లి నుంచి కోటవురట్ల మండలం రామచంద్రపురం జంక్షన్ శివారు వరకు తారురోడ్డు వేశారు. అక్కడి నుంచి ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర పనులు మిగిలిపోయాయి. ఇందేశమ్మవాక వరకు రహదారి అధ్వానంగా తయారైంది. కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఈ రోడ్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నేటికీ పనులు ప్రారంభించలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఇందేశమ్మవాక వద్ద పెద్ద గోతులు పడి దారుణంగా ఉంది. ●కై లాసపట్నం నుంచి రాజుపేట, లింగాపురం జంక్షన్ నుంచి కె.వెంకటాపురం, యండపల్లి నుంచి అన్నవరం, కొడవటిపూడి నుంచి కోదండరాంపురం గిరిజన గ్రామానికి, కె.వెంకటాపురం నుంచి తడపర్తి గ్రామానికి వెళ్లే రహదారులను నిర్మించాల్సి ఉంది. ●నక్కపల్లి మండలంలో గునిపూడి–బంగారయ్యపేట– పెంటకోట వరకూ రూ.1.40 కోట్లతో 8 కిలోమీటర్ల తారు రోడ్డు వేశారు. వేసిన మూడు నెలలకే తారు పెచ్చులూడిపోయింది. ఈ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ టీడీపీ నాయకుడే. గుంతలు పూడ్చిన అనతికాలంలోనే అనకాపల్లి మండలంలో తొమ్మిది రహదారుల్లో సుమారు 50 కిలోమీటర్ల మేర రూ.72 లక్షలతో గుంతలు పూడ్చారు. అనకాపల్లి– తుమ్మపాల, పాపయ్యసంతపాలెం, మార్టూరు, రేబాక, కొప్పాక, తోటాడ, కుంచంగి, తగరంపూడి, వెంకుపాలెం పంచాయతీ పరిధిలో రోడ్లు మళ్లీ గుంతలతో దర్శనమిస్తున్నాయి. కశింకోట మండలంలోని జి.భీమవరం నుంచి కన్నూరుపాలెం వరకు ఉన్న ఆర్అండ్బీ రోడ్డులో సుమారు ఐదు కిలోమీటర్ల మేర రూ.7 లక్షలతో గుంతలు పూడ్చారు. అవి కూడా యథాస్థితికి వచ్చేశాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిని వాహన చోదకుల పాలిట ప్రాణసంటంగా మారాయి. గంధవరం నుంచి వెంకన్నపాలెం, చోడవరం, విజయరామరాజు పేట, వడ్డాది, కోమళ్లపూడి, రావికమతం, కొత్తకోట, రోలుగుంట వరకూ బీఎన్ రోడ్డులో 48 కిలో మీటర్ల మేర గోతులు నూతుల్లా దర్శనమిస్తున్నాయి. 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్(60:40)తో రూ.112 కోట్లు మంజూరు చేశారు. టీడీపీకి చెందిన కాంట్రాక్టర్(ఎస్ఆర్ కన్స్ట్రక్షన్)కు రోడ్డు నిర్మాణ బాధ్యత అప్పగించారు. ఎన్నికలకు ముందు రూ.3 కోట్లతో కోమలపూడి నుంచి బంగారుమెట్ట వరకూ నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులు విస్తరణ పనులు చేశారు. మిగతా 44 కిలోమీటర్ల మేర రోడ్డు వేయకుండా వదిలేశారు. నిర్ణీత వ్యవధిలో రోడ్డు వేయకపోవడంతో గత ప్రభుత్వంలో ఈ కాంట్రాక్టర్ని బ్లాక్లో పెట్టడానికి సిద్ధపడ్డారు. రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ హయాంలో స్థానిక ఎమ్మెల్యే ధర్నా కూడా చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయినా ఈ రోడ్డులో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన సొంత నిధులు రూ.1.60 కోట్లతో సుమారు ఒక కిలోమీటరున్నర మేర సీసీ, బీటీ రోడ్లను వేయించారు. చోడవరం టౌన్ ప్రారంభంలో బల్క్మిల్క్ సెంటర్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకూ నిబంధనల ప్రకారం ఏడు అడుగులు విస్తరించి రోడ్డు నిర్మించారు. ఎన్నికల ముందు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోపే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైనా అలానే ఉంది. ఈ గోతుల కారణంగా ఇప్పటి వరకూ 30 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.. ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. సుమారుగా 40 మందికిపైగా క్షతగాత్రులుగా మారారు. -
ప్రాణం తీసిన వేగం
యలమంచిలి రూరల్: మితిమీరిన వేగం, ఆపై లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో రాంగ్రూట్లోకి వచ్చిన మినీ వ్యాన్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. ఈ సంఘటన యలమంచిలి సమీపంలో కొక్కిరాపల్లి ప్రేమ సమాజం దగ్గర 16వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10.20 గంటలకు చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి ఆనందంగా వెళ్తున్న ఓ కుటుంబానికి ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గాజువాకలోని శ్రీహరిపురానికి చెందిన 8 మంది (ఏపీ 39 జీఎక్స్ 3891) మినీ వ్యాన్(టాటా మేజిక్)లో కాకినాడ జిల్లా పిఠాపురంలో బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో యలమంచిలి మండలం కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మినీవ్యాన్ను ఎడమ పక్కగా రాంగ్రూట్లోకి డ్రైవర్ నడిపాడు. దాంతో అక్కడే రోడ్డు పక్క ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో పెద్ద శబ్దం రావడం, ఆటో, మినీ వ్యాన్లో ప్రయాణికులు కేకలు వేయడంతో ఒక్కసారిగా ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. మినీ వ్యాన్ ముందుభాగం నుజ్జయింది. ఆటో రోడ్డు పక్కగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా అనకాపల్లి నుంచి తుని వైపు ప్రయాణించే వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. హైవే నిర్వహణ సంస్థ సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్తో పక్కకు తొలగించారు. మితిమీరిన వేగం వల్లే ప్రమాదంగా నిర్ధారణ ప్రమాదం జరిగిన వెంటనే యలమంచిలి సీఐ ధనుంజయరావు, యలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన హైవే అంబులెన్సులు, ఇతర వాహనాల్లో ఆస్పత్రులకు తరలించారు. యలమంచిలి సీహెచ్సీ వైద్యాధికారి నిహారిక, వైద్య సిబ్బంది క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించి మెరుగైన చికిత్స అవసరమైన వారిని అంబులెన్సుల్లో అనకాపల్లి, విశాఖ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. మినీ వ్యాన్(టాటా మేజిక్) డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన గొంది పెంటయ్య, బాదంపూడి లక్ష్మి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి ప్రమాద సమయంలో ఆటోలో పది మంది, మినీ వ్యాన్లో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఆటోలో ఉన్న కశింకోట మండలం తీడ గ్రాామానికి చెందిన గొంది పెంటయ్య(56), నర్సీపట్నంలో ధర్మిరెడ్డి వీధికి చెందిన బాదంపూడి లక్ష్మి(65) చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందారు. -
అధ్యక్షా.. తాండవ రోడ్ల సంగతేంటి ?
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోకవర్గంలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నర్సీపట్నంలో బలిఘట్టం–తుని రోడ్డులో రెండు కిలోమీటర్ల మేర గుంతలను తూతూ మంత్రంగా పూడ్చారు. పూడ్చిన అనతి కాలంలోనే మళ్లీ గుంతలు పడ్డాయి. తీనార్ పాలెంలో గుంతల పూడ్చిన రోడ్డు కూడా ధ్వంసమైంది. గొలుగొండ మండలంలో కృష్ణదేవి పేట– కొంగ సింగి రోడ్డులో మూడు కిలోమీటర్ల గుంతలు పూడ్చారు. నాణ్యతాలోపం కారణంగా మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. చోద్యం–విప్పలపాలెం రోడ్డులో ఐదు కిలో మీటర్ల మేర గుంతలు పూడ్చనేలేదు. దారమట్టం నుంచి గొలుగుండ వరకూ ఐదున్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశారు. జోగుంపేట–సాలిక మల్లవరం 3 కిలోమీట్లర మేర రోడ్డు కాదు కదా..కనీసం గుంతలు కూడా పూడ్చలేదు. నాతవరం మండలంలో ‘నాతవరం–తాండవ’ రోడ్డు 7 కిలోమీటర్ల మేర పూర్తిగా ధ్వంసమైంది. రెండు జిల్లాల్లో 18 గ్రామాల ప్రజలు రోజూ రాకపోకలు సాగించే నాతవరం–తాండవ ఆర్అండ్బీ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడడంతో ఆర్టీసీ బస్సులను నిలిపేశారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన తాండవ రిజర్వాయర్, సరుగుడు జలపాతాలకు ఇదే రోడ్డులో వెళ్లాలి. ఎన్నికలకు ముందు నాతవరం–తాండవ మధ్య రోడ్డును వేస్తామంటూ హామీ ఇచ్చి..అధికారం చేపట్టి 16 నెలలైనా ఆ రోడ్డు వైపు పట్టించుకున్న పాపాన పోలేదంటూ స్థానికులు వాపోతున్నారు. -
చంద్రబాబు సీఎం కావడం దురదృష్టం
పాయకరావుపేట : కూటమి ప్రభుత్వానికి అన్నదాతల పట్ల చిత్తశుద్ధి లేదని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టమని వైఎస్సార్ సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మండలంలోని సత్యవరంలో మోంథా తుఫాన్ ప్రభావానికి దెబ్బతిన్న తమలపాకుల తోటలను ఆయన సోమ వారం పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తుఫాన్ కారణంగా వేలాదిఎకరాల్లో వరి పంటతో పాటు అరటి, తమలపాకుల తోటలకు నష్టం వాటిల్లిందని, నష్టాన్ని అంచనా వేయడంలో, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తుఫాన్ను అడ్డుకున్నాం, నష్టం జరగకుండా ఆపేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. ఏంసాధించారని ఎమ్మెల్యేలకు, అధికారులకు సన్మానాలు చేసుకుంటున్నారో తెలియడం లేదన్నారు. తమలపాకు సాగుకు ఎకరానికి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి, రెండు సంవత్సరాల పాటు సంరక్షించాలని చెప్పారు. మండలంలో సత్యవరం, మాసా హేబుపేట, పెదరాంభద్రపురం, అరట్లకోట గ్రామా ల్లో 300 ఎకరాల్లో తమలపాకు తోటలు నేలకొరిగాయన్నారు. మరో 200 ఎకరాల్లో తోటలు కూడా ఎందుకూ పనికిరావని చెప్పారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునే వరకూ వారి పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేసి, అండగా ఉంటుందని చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో పర్యటిస్తారని చెప్పారు. నేలకొరిగిన తమలపాకు తోటలను మాజీ మంత్రి అమర్నాఽథ్తో పాటు వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు పరిశీలించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, కె.కె.ఆర్.సుందరీలత, జెడ్పీటీసీ లంక సూరిబా బు, ఎంపీపీ ఇసరపు పార్వతీ తాతారావు, వైఎస్సార్సీపీ పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల అధ్యక్షులు గెడ్డమూరి శ్రీనివాసరావు, శీరం నర్సంహమూర్తి, ఎస్.మధువర్మ, పార్టీ మాజీ మండల అధ్యక్షులు ధనిశెట్టి బాబూరావు, సత్యవరం, మంగవరం, గోపాలపట్నం సర్పంచ్లు సకిలేటి రాము, వంగలపూడి రామారావు, పన్నీరు బాబ్జీ, సత్యవరం మాజీ సర్పంచ్ తమ్మిర్సి గంగారావు, సత్యవరం ఎంపీటీసీలు తమ్మిర్సి సత్యనారాయణ, యగదాసు శేఖర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దేవవరపు రాజేష్ ఖన్నా, సీనియర్ నాయకులు దేవవరపు వెంకటేశ్వరరావు, పెనుమత్స నాగేశ్వరరావు, కోనే పుత్రరావు, పాయకరావుపేట ఉప సర్పంచ్ జగతా భవానీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్టు
నాతవరం: గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు మండలంలోని చమ్మచింత జంక్షన్ వద్ద ఎస్సై, సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని రూ.40 వేలు విలువ చేసే ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులో తిరువూరుకు చెందిన డి.దీపక్బాబు(24), కోయంబేడుకు చెందిన ఆర్.గౌతమ్(44), తిరువూరుకు చెందిన ఎ.హరీష్(22), కాకినాడ జిల్లా తుని మండలం రేఖవానిపాలేనికి చెందిన తుమ్మ అప్పారావు(60)లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. ధారకొండలో గంజాయి కొనుగోలు చేసి తుని రైల్వే స్టేషన్ ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. -
పీజీఆర్ఎస్ అర్జీలపై నిర్లక్ష్యం తగదు
తుమ్మపాల: కలెక్టర్కు తమ సమస్య వివరిస్తే పరిష్కారం లభిస్తుందనే ఆశతో పీజీఆర్ఎస్కు వస్తున్న ప్రతి అర్జీదారుని సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక( పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఆమెతో పాటు, జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, ఇన్చార్జి డీఆర్వో ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు సూచించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని అర్జీలపై స్పష్టత ఇవ్వడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చని చెప్పారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీల స్థితిగతులను తెలుసుకోడానికి ప్రజలు టోల్ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చిని చెప్పారు. మొత్తం 292 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సందీప్, డ్వామా పీడీ పూర్ణిమ దేవి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామరావు, జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి హైమవతి, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్ రాజు తదితరులు పాల్గొన్నారు. సాగు భూమిని ఆక్రమించుకున్నారు పూర్వీకుల నుంచి జీడి తోట సాగుచేసుకుంటూ వచ్చే ఆదాయంతో జీవిస్తున్న తమ నుంచి ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని. తమకు న్యాయం చేయాలని కోరుతూ అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన పొట్నూరి భాస్కరరావు, కనకమ్మ, కొడమంచిలి చిన్నారావు పీఆర్ఆర్ఎస్లో కలెక్టర్కు పిర్యాదు చేశారు. కోడూరులో సర్వే నంబర్ 45 గల సుమారు 5 ఎకరాల ప్రభుత్వం భూమిలో మా పూర్వీకుల నుంచి జీడి తోటను సాగు చేయడంతో పాటు చాకలి దొడ్డి నిర్వహిస్తూ గ్రామస్తుల దుస్తులను ఉతికేవారమని పేర్కొన్నాడు. జీడి తోటలో ఖాళీగా ఉన్న యూకలిప్టస్ తోట వేసేందుకు తోటల వ్యాపారం చేసే పెల వరహాలు, బాబులకు భాగానికి ఇచ్చామని తెలిపాడు. ఆ భూమిని వారు ఆక్రమించుకున్నారని, దివ్యాంగుడినైన తనకు న్యాయం చేయాలని కోరాడు. ప్రభుత్వ భూమి రికార్డులు తారుమారు చేసి దొంగ పత్రాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నాడు. అక్రమ నిర్మాణాలను తొలగించాలి ఎన్హెచ్–16కి ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి, రోడ్డు ప్రమాదాలతో పాటు, ప్రభుత్వ భూమి ఆక్రమణలను నిలువరించాలని అనకాపల్లికి చెందిన కాండ్రేగుల నాగేంద్రబాబు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అనకాపల్లి –ఆనందపురం జాతీయ రహదారి విస్తరణలో కాపుశెట్టివానిపాలెం గ్రామంలోని సర్వే నంబర్ 10లో గల ప్రభుత్వ భూమిలో గల గృహాలకు నష్టపరిహారం పొందినప్పటికీ లబ్ధిదారులు మళ్లీ ఆక్రమణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డుకు అనుకుని నిర్మాణాలు చేపడుతూ క్రయవిక్రయాలు చేస్తున్నారని, అధికారులు పట్టించుకోకుండా ఆక్రమణదారులకు ఇంటిపన్ను, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. రహదారి నిర్వాహణ సంస్ధ (డీబీఎల్) సిబ్బంది ఆక్రమణదారుల నుంచి నెలవారీ మామ్మూళ్లు వసూలు చేస్తూ ఆక్రమణలకు ప్రోత్సహిస్తున్నారని, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు మేడివాడ విద్యార్థిని
రావికమతం: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని మేడివాడ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని మోపాడ భాగ్యశ్రీ ఎంపికై ంది. ఈమె విశాఖపట్నంలోని కై లాసగిరి వద్ద ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ గ్రౌండ్లో సోమవారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచింది. అండర్ –17 విభాగంలో 100, 200 మీటర్ల రన్నీంగ్తోపాటు లాంగ్జంప్లో సత్తా చాటి ప్రథమ స్థానంలో నిలిచిందని వ్యాయామ ఉపాధ్యాయులు ఎల్.మధుసూదన్, ఎస్ నారాయణరాజ్ తెలిపారు. భాగ్యశ్రీని హెచ్ఎం వి.రామారావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
పోలీసు ఆయుధాల ప్రదర్శన
అనకాపల్లి: పోలీసు అమరవీరులు విధి నిర్వహణలో చూపిన త్యాగాలకు నివాళులర్పిస్తూ, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఓపెన్హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభించారు. శాంతి భద్రతల విషయంలో పోలీస్లు ఉపయోగించే వివిధ రకాల ఆయుధాలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసులు విధులు నిర్వర్తించే సమయంలో ఉపయోగించే అత్యాధునిక ఆయుధాలు, పరికరాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు సమాజ రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తారన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఏటా పోలీస్ అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో వాడే పరికరాలు.. ఆయుధాలు పరికరాలు ఏకె–47, పిస్టల్ గ్లోక్–17, కార్బన్, ఇన్సాస్ రైఫిల్, మల్టీ గ్యాస్ గన్ లాంచర్, గ్రెనేడ్ , భద్రతా పరికరాలు రైట్ గేర్ సెట్స్, బాంబ్ డిఫ్యూజల్ పరికరాలు, నైట్ విజన్, సెర్చ్ మెటల్ డిటెక్టర్లు, కమ్యూనికేషన్ పరికరాలైనా శాటిలైట్ ఫోన్, స్కానర్, వి.హెచ్.ఎఫ్ సెట్స్, రోబో సూట్, డాగ్ స్క్వాడ్ కు చెందిన బన్నీ (మత్తు పదార్థ గుర్తింపు), రియో (ట్రాకింగ్), లక్కీ (మందుపాతర గుర్తింపు), ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం నేరస్తుల పరిశోధనలో సాక్ష్యాధారాల సేకరణ పద్ధతులు, విద్యార్థులు ఆసక్తిగా పరికరాలను పరిశీలించి, పోలీసు విభాగం పనితీరుపై ప్రశ్నలు అడిగి అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్ రావు, సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, రమేష్, గఫూర్, రామకృష్ణారావు, మన్మథరావు, అశోక్ కుమార్, ఫింగర్ ప్రింట్స్ సీఐ విజయ, ఎస్సైలు, విద్యార్థులు, పోలీస్లు తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులను సీఎం వద్దకు తీసుకెళ్తా
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేయాలని కోరుతూ 51 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న మత్స్యకారులు కమిటీగా ఏర్పడి తనతో వస్తే సీఎం చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్తానని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. సోమవారం రాజయ్యపేట మత్స్యకారులు కొంతమంది మంత్రిని కలిశారు. బల్క్ డ్రగ్ రద్దు చేయాలని, దీని వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని వాపోయారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ‘మీరంతా నావాళ్లు, మీపై ఎటువంటి కోపం లేదు. చర్చల ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, మీ సమస్య కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరంతా కమిటీగా ఏర్పడి నాతో వస్తే చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి మీ డిమాండ్లు వివరిస్తానని’ చెప్పారు. మీ మీద ఉన్న అభిమానంతోనే మీరు నన్ను ఆడ్డుకున్నా, హైవేపై ఆందోళన చేసినా ఏమీ అనలేదన్నారు. వేట లేకుండా ఎన్నాళ్లు ధర్నా చేస్తారు. మీ ప్రాంతంలో సగభాగం వరకు స్టీల్ప్లాంట్ వస్తోంది. పోర్టు నిర్మాణం జరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి, రాజకీయాలు వద్దు అభివృద్ధిపై దృష్టిసారించండి అని హితవు పలికారు. దీనిపై మత్స్యకారులు మాట్లాడుతూ కమిటీ ఏర్పాటు చేసుకుని సీఎంను కలవడానికి వస్తామని తెలిపారు. అప్పటివరకు పనులు ఆపాలని కోరారు. రాజయ్యపేట పరిధిలో పనులు జరగకుండా తాతత్కాలికంగా నిలుపుదల చేస్తాను’ అని మంత్రి హామీ ఇచ్చారు. -
బురదలో దిగి గిరిజనుల వినూత్న నిరసన
రోలుగుంట: తమ రాకపోకలకు అంతరాయంగా ఉన్న బోడిమెట్ట బురదలో దిగి గిరిజనులు వినూత్నంగా నిరసన తెలిపారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాజన్నపేట వద్ద చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కె.గోవింద మాట్లాడుతూ శరభవరం పంచాయతీ పరిధి రాజన్నపేటలో బోడిమెట్ట వద్ద నల్లరాయి క్వారీ కోసం కొత్తగా రోడ్డు నిర్మాణానికి అనుమతిచ్చారన్నారు. ఈ మార్గం బురదమయంగా మారడంతో రాజన్నపేట, వడ్డిప, గదబపాలెం, గుర్రాలబయిల, అర్ల గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందన్నారు. రాత్రిళ్లు ఈ మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు బురదలో కూరుకుపోయి పాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో 108 వాహనం వెళ్లే అవకాశం లేదన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే బురద సమస్య మెరుగుపరచి రాకపోకలు సుగమం చేయాలని కోరారు. లేకుంటే ఆందోళన దశలువారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘ నాయకులు నీలాపు శ్రీను, రమణ, చిన్ని తదితరులు పాల్గొన్నారు. -
పెద్దేరు నది వంతెనపై స్తంభించిన ట్రాఫిక్
వడ్డాది వంతెనపై ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనదారులు బుచ్చెయ్యపేట: మండలంలో వడ్డాది వద్ద పెద్దేరు నది వంతెనపై ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇటీవల తుఫాన్ వర్షాలకు ఇక్కడ డైవర్షన్ రోడ్డు కోతకు గురైంది. అప్పటి నుంచి వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో శిథిలమైన పాత వంతెనపై నుంచి రాకపోకలు సాగుతున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి వడ్డాది వంతెనపై వందలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాంతో గంటకుపైగా ట్రాఫిక్ స్తంభించింది. అదే సమయంలో వర్షం కురవడంతో వడ్డాది నాల్గు రోడ్ల జంక్షన్ నుంచి హైస్కూల్ వరకు కిలోమీటరు మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
పోలేపల్లిలో భూ ఆక్రమణల తొలగింపు
బుచ్చెయ్యపేట: మండలంలోని పోలేపల్లి గ్రామంలో భూ ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. పోలేపల్లిలో కూటమి నేతల భూ ఆక్రమణపై గత నెల 27న సాక్షిలో వచ్చిన కథనానికి స్పందించి చర్యలు తీసుకున్నారు. గ్రామానికి చెందిన సర్వే నంబర్ 156లో 216 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బుచ్చెయ్యపేటకు కిలోమీటరున్నర దూరంలో ఈ భూములుండటంతో వీటి ధరలు ఆకాన్నంటుతున్నాయి. ఇటీవల గ్రామానికి చెందిన కొంతమంది కూటమి నేతలు కళ్లు ఈ భూములపై పడ్డాయి. జేసీబీలతో తుప్పలు, డొంకలను తీయించి 30 ఎకరాలు ఆక్రమించారు. రూ.ఐదు కోట్లు విలువ గల భూమిని ఆక్రమించి యూకలిప్టస్ మొక్కలను నాటారు. ఇందులో ఐదెకరాల వరకు చైన్నెకు చెందిన వ్యక్తికి అమ్మకాలు చేపట్టి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. మరికొంత భూమిని అమ్మకాలకు పెట్టారు. దీనిపై పత్రికల్లో వార్తలు రావడంతో కూటమి నేతలు గ్రామ సర్పంచ్ సీతా బుజ్జి, మరికొంత మంది ఇళ్లపైకి వెళ్లి దూషించారు. దాంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి గత నెల 29న బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ గ్రామంలో భూ ఆక్రమణలు తొలగించాలని నినాదాలు చేశారు. తుఫాన్ ప్రభావంతో సిబ్బంది అందుబాటులో లేరని, వారం రోజుల్లో భూ ఆక్రమణలు తొలగిస్తామని తహసీల్దార్ లక్ష్మి హామీ ఇచ్చారు. సోమవారం అన్ని గ్రామాల వీఆర్ఏలు, వీఆర్వోలు, ఆర్ఐ, పోలీసులతో వెళ్లి భూ ఆక్రమణలో నాటిన మొక్కలను తొలగించారు. ఆక్రమణ భూమిలో ఇది ప్రభుత్వ భూమి అని, ఆక్రమించిన వారి శిక్షార్హులుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. -
కొబ్బరి అధరహో...
కొబ్బరి కాయకు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పెరిగింది. కొంత కాలంగా పతనమైన ధరలో దీపావళి, దసరా పండగలు, కార్తీకమాసం కారణంగా మార్పువచ్చింది. కొబ్బరి అధరహో... నక్కపల్లి: కొబ్బరి ధర అదర గొడుతోంది. దీంతో రైతులు లాభాల బాట పట్టారు. గతంలో నష్టాలను చవిచూసిన రైతులు ధరపెరగడంతో మూడు నెలల నుంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి బొండాలు, కాయల ధర ఆశాజనకంగా ఉంది. ఆరుగాలం శ్రమించి కొబ్బరి సాగు చేసిన రైతులు గతంలో నష్టాల్లో కొట్టుమిట్టాడారు. అయితే ఇటీవల కొబ్బరి ధర అమాంతం పెరిగింది. ధరపెరిగినప్పటికీ తెల్లదోమ కారణంగా దిగుబడి తగ్గిపోతోందని, ధరపెరిగిందని ఆనందించాలో, తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గుతోందని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో కొబ్బరి రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఏది ఏమైనా గడచిన మూడు నెలల నుంచి పెరిగిన ధరమాత్రం రైతులకు ఊరటనిస్తోంది, ఐదేళ్లూ అనేక ఇబ్బందులు ప్రస్తుతం ధర భారీగా పెరిగి, కొబ్బరి రైతులు సంతోషంగా ఉన్నప్పటికీ, గత ఐదేళ్లలో అనేకసార్లు ఇబ్బందులు పడ్డారు. తెల్లదోమ వల్ల దిగుబడులు తగ్గడంతో పాటు ధరల పతనంకావడం రైతుల్ని కుంగదీసింది. ప్రస్తుతం తెల్లదోమ సోకినా భారీగా ధర పెరిగింది. దీంతో తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి దీర్ఘకాలికపంట. ఏడాది పొడవునా ఫలసాయం చేతికి వస్తుంది. గ్రామీణ జిల్లాలో దాదపు 18 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాలు మరో కోనసీమగా ప్రసిద్ధిగాంచాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలున్నాయి. యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి, అచ్యుతాపురం, పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నాయి. తీరప్రాంతం వెంబడి ఉన్న ప్రాంతాల్లో రైతులు కొబ్బరి అధికంగా పండిస్తున్నారు. లక్షలాదిటన్నుల కొబ్బరి కాయలు ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఎగుమతి అవుతుంటాయి. తెగుళ్లు లేకపోతే ఎకరాకి 7,000 నుంచి 7,500 వరకూ కాయల దిగుబడి వస్తుంది. తెల్లదోమ కారణంగా ప్రస్తుతం 6,000 కాయల దిగుబడివస్తోందని ఉద్యాన వన శాఖాధికారులు, కొబ్బరి రైతులు చెబుతున్నారు. దసరా సీజన్లో భవానీ దీక్షలు చేపట్టిన వారు, అయ్యప్ప, శివ మాలలు ధరించిన వారు ఎక్కువగా కొబ్బరి కాయలు వినియోగిస్తున్నారు. పండగల సీజన్, కార్తీక మాసం కావడంతో కొబ్బరి ధర పెరిగింది. గతంలో ఒక్కో కొబ్బరి బొండాంను రైతునుంచి వ్యాపారులు రూ.10 నుంచి రూ.15లకు కొనుగోలుచేసేవారు, అలాగే ఒక్కో కొబ్బరి కాయను కనిష్టంగా రూ.8 నుంచి రూ.15 వరకూ కొనుగోలు చేసే వారు. గడచిన మూడు నెలల నుంచి రైతు వద్ద నుంచి బొండాం సైజు బట్టి ఒక్కొక్క దానిని రూ. 25 నుంచి రూ.30 వరకూ కొనుగోలు చేస్తున్నారు. కొబ్బరికాయల సైజు బట్టి రూ.25 నుంచి రూ.30 వరకూ కొనుగోలు చేస్తున్నారు. ఇదే బొండాలను బయట మార్కెట్లో రూ.40, కొబ్బరి కాయలు రూ.40 నుంచి రూ.50 వరకూ విక్రయిస్తున్నారు. ఏడాది కిందట కాయ రూ.9 నుంచి రూ.12 వరకూ కొనుగోలు చేసేవారు. ధరలు అమాంతం పెరగడం, కొబ్బరి కాయల వినియోగం కూడా ఎక్కువ కావడంతో ఇటు రైతులకు, అటు వ్యాపారులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. గతంలో కొబ్బరికాయ ధర రూ.5 వరకూ పడిపోయిన సందర్భాలున్నాయని రైతులు తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఈప్రాంతాల్లో పండించిన కొబ్బరి కాయలను బిహార్, పశ్చిమ బెంగాల్, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. కొబ్బరి తీత, తొక్క వలవడం, ప్యాకింగ్ ఎగుమతులు ఖర్చులు పోను ఒక్కొక్క కాయకు రూ.10 వరకూ మిగులుతుందని వ్యాపారులు చెబుతున్నారు. దళారుల కనుసన్నల్లో కొబ్బరి ధరను రైతులు నిర్ణయించే పరిస్థితి లేదు. కొంతమంది కమీషన్ వ్యాపారులు నిర్ణయించిన ధరకే ఇవ్వాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. పండించిన కొబ్బరిని నేరుగా అమ్ముకునే అవకాశాలు లేకపోవడంతో కమీషన్ దుకాణాలకు విక్రయించాల్సి వస్తోంది. మార్కెటింగ్ సదుపాయం లేదు... ఇంత భారీ స్థాయిలో కొబ్బరి సాగుచేస్తుంటే సరైన మార్కెటింగ్ సదుపాయంలేదు. ప్రభుత్వం తరఫున ఈప్రాంతంలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలు లేవు. దీంతో నిర్ణీత ధర అంటూ ఉండటం లేదని రైతులు చెబుతున్నారు. ధర్మవరం, కొరుప్రోలు కేంద్రంగా ఎగుమతులు.. ఎస్.రాయవరం మండలం ధర్మవరం, కొరుప్రోలు, కేంద్రాలుగా కొబ్బరి ఎక్కువగా ఎగుమతి అవుతోంది. ఎస్.రాయవరం మండలంలో కొబ్బరి వ్యాపారులు చిన్నా చితకా కలిపి సుమారు 300 మంది వరకు ఉంటారు. వీరిలో కొంతమంది రైతులే. మరికొంతమంది రైతులనుంచి కాయలు కొనుగోలుచేసి ఇతరప్రాంతాలకు ఎగుమతులు చేస్తుంటారు. ఇక్కడనుంచి రోజూ లక్ష కొబ్బరికాయలు విశాఖ, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, కోల్కతా, హైదరాబాద్, తిరుపతి, కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. నక్కపల్లి మండలంలో పెదతీనార్ల, చినతీనార్ల, డీఎల్పురం, సీహెచ్ఎల్ పురం, జానకయ్యపేట, రాజయ్యపేట, బోయపాడు, గునిపూడి, వేంపాడు, ఎస్.రాయవరం మండలంలో కొరుప్రోలు, రేవుపోలవరం, లింగరాజుపాలెం, గుడివాడ, బంగారమ్మపాలెం, సర్వసిద్ధి, వాకపాడు, పెద ఉప్పలం, బీమవరం,పెనుగొల్లు,గెడ్డపాలెం, వమ్మవరం,సైతారుపేట రాంబిల్లి మండలంలో రాంబిల్లి, దిమిలి తదితర ప్రాంతాల్లో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నాయి. కొబ్బరి ఎక్కువగా పండించే ఎస్.రాయవరం మండలంలో కొబ్బరి అనుబంధపరిశ్రమలు సుమారు 30 వరకు ఉన్నాయి. పీచు తాళ్లు ఇక్కడ తయారు చేసి ఎగుమతి చేస్తుంటారు. తొక్కతీసి విక్రయానికి సిద్ధంచేస్తున్న కొబ్బరికాయలులాభాలు ఆర్జిస్తున్న రైతులు జిల్లాలో 18వేల ఎకరాల్లో సాగు వెయ్యి కాయలు హోల్సేల్లో రూ.25 వేలు కాయ ధర రూ.40 బొండాం రూ.50 తెల్లదోమ వల్ల తగ్గుతున్న దిగుబడి ధర ఆశాజనకం ఇటీవల కొబ్బరి ధర బాగా పెరిగింది.అదే సమయంలో తెల్లదోమ వల్ల దిగుబడి కూడా తగ్గింది. అయితే ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులకు ఊరట లభిస్తోంది. ఆరు నెలల నుంచి కొబ్బరి ధర పెరుగుతోంది. ఏడాదిక్రితం కాయ సైజు బట్టి రూ.9 నుంచి రూ.12 వరకూ కొనుగోలు చేసేవారు. దసరా సీజన్లో రూ.20 వరకూ పలికింది. ఇప్పుడు రైతుల వద్దకొనుబడి రూ.25 వరకూ ఉంది. రెండు నెలల నుంచి కొబ్బరికి మంచి డిమాండ్ ఉంది. – ఐనంపూడి సురేష్ రాజు, కొబ్బరి రైతు, వేంపాడు, నక్కపల్లి మండలం కొబ్బరి ధరలు వెయ్యి వెయ్యి కాయలు బొండాలు గత ఏడాది రూ.12 వేలు రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఈ ఏడాది జనవరిలో రూ.18 వేలు రూ.20 వేలు ఈ ఏడాది దసరా తర్వాత రూ.23 వేలు రూ.25 వేల నుంచి రూ.30 వేలు -
ఏపీటీయూ గౌరవాధ్యక్షుడిగా ఎంపీ గొల్ల బాబూరావు
సీతంపేట(విశాఖ): ఆంధ్రప్రదేశ్ టీచర్స్ యూనియన్(ఏపీటీయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఏపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వై.దేముడు ఆధ్వర్యంలో ఆదివారం అక్కయ్యపాలెంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని యూనియన్ కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. విద్యారంగం, సమాజం, ఉపాధ్యాయ సమస్యలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న గొల్ల బాబూరావు యూనియన్ గౌరవాధ్యక్షుడిగా నాయకత్వం వహించేందుకు అంగీకారం తెలపడం పట్ల కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర నాయకులు, జి.దత్తాత్రేయ శర్మ, కె.బ్రహ్మారెడ్డి, కె.జె.కృపానందం, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో క్షీరాబ్ది ద్వాదశి
నక్కపల్లి: క్షీరాబ్దిద్వాదశిని మహిళలు ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశిని క్షీరాబ్దిద్వాదశి, చిలుక ద్వాదశిగా పిలుస్తారు. ఏకాదశి ఉపవాసం ఉన్న వారంతా మరుసటిరోజు ఆదివారం ద్వాదఽశినాడు సాయంత్రం తులసి మొక్కదగ్గర తులసి వ్రతం, లక్ష్మీకల్యాణం నిర్వహించారు. క్షీరసాగర మథనంలో జన్మించిన లక్ష్మీదేవిని మహావిష్ణువు దేవ దానవుల సమక్షంలో వివాహం చేసుకుంటాడు. మహావిష్ణువు తనకు అత్యంత ప్రీతికరమైన ద్వాదశినాడు తులసి బృందావనానికి వస్తాడని ప్రతీతి. సూర్యాస్తమయం అనంతరం మహిళలు తులసి కోటలో శ్రీమహావిష్ణువు ప్రతిమను ఉంచి తులసి వ్రతం ఆచరించారు. ఉసిరి దీపాలను వెలిగించారు. దీప దర్శనం వల్ల శివసాన్నిధ్యం లభిస్తుందని నమ్మకం. ఉపమాకలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో , భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభాల వద్ద ప్రత్యేక పూజలు జరిపి, దీపారాధన నిర్వహించారు. -
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం
కొయ్యూరు: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మండలంలోని చిట్టింపాడులో ఏర్పాటు చేసిన దివంగత జెడ్పీటీసీ వారా నూకరాజు సంతాపసభకు విచ్చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడారు. బడి, గుడికి వెళ్లిన వారితోపాటు బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి ప్రాణాలతో ఉంటామన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలకు భద్రత కరువవుతోందని విమర్శించారు. ఇందుకు జెడ్పీటీసీ నూకరాజు హత్యే నిదర్శనమన్నారు. ఆయన కుటుంబాన్ని త్వరలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి వద్దకు తీసుకువెళ్తామన్నారు. నూకరాజు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుదని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున రూ.ఐదు లక్షల చెక్కును అరకు ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అమర్నాథ్ అందజేశారు. ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ నూకరాజు తనను కూతురిలా చూసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడంతో తట్టుకోలేకపోతున్నామన్నారు. కొయ్యూరు మండలానికి కేటాయించే నిధులు నూకరాజు పేరిట ఇస్తామని తెలిపారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ చిట్టింపాడులో నూకరాజు జ్ఞాపకార్థం పార్కు నిర్మిస్తామన్నారు. దీనిపై జెడ్పీటీసీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు కోరితే అతని జ్ఞాపకార్థం కళా మందిరం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ నూకరాజు లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధ కలిగించిందన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ నూకరాజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమన్నారు. మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నూకరాజు లేని లోటు పార్టీకి తీరనిదన్నారు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, వైఎస్సార్సీపీ నేత బొడ్డేడ ప్రసాద్, జెడ్పీటీసీ సంఘ జిల్లా నేత దొండా రాంబాబు, ఎంపీపీలు బడుగు రమేష్, అనూషదేవి, బోయిన కుమారి, సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, బి.అప్పారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ జె.రాజులమ్మ, జల్లి బాబులు, సుధాకర్, అంబటి నూకాలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడుగుడివాడ అమర్నాథ్ కొయ్యూరు జెడ్పీటీసీ నూకరాజు సంతాప సభలో ఆవేదన పార్టీ తరఫున కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందజేత -
యువ దంపతుల ఆత్మహత్య
తాటిచెట్లపాలెం: నగరంలోని అక్కయ్యపాలెంలో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫోర్త్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భార్య అనిత, తల్లితో కలిసి సూరిశెట్టి వాసు అక్కయ్యపాలెం, దాలిరాజు సూపర్మార్కెట్ సమీపంలో ఉంటున్నారు. ఏడాది క్రితం వీరికి పెళ్లయింది. ప్రస్తుతం అనిత ఏడో నెల గర్భిణి. ఏం జరిగిందో తెలీదుగానీ ఆదివారం వీరిద్దరూ విగతజీవులయ్యారు. వాసు ఫ్యాన్ హుక్కు ఉరేసుకుని చనిపోగా, అనిత మంచం మీద చనిపోయి ఉంది. ఉదయం వాసు తల్లి ఫంక్షన్ నిమిత్తం బయటకెళ్లి సాయంత్రం తిరిగొచ్చింది. తలుపు ఎంతసేపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి, కిటీకిలో నుంచి చూసి నిర్ఘాంతపోయింది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మరణించి కనిపించడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. స్థానికంగా వాసు, అనితల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. మరోవైపు.. అనిత గర్భంలో ఉన్న బిడ్డను బతికించేందకు పోలీసులు మృతురాలిని ఆస్పత్రికి తరలించారు. ఫోర్త్టౌన్ సీఐ ఉమాకాంత్ వివరాలు సేకరిస్తున్నారు. -
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలనుపరిశీలించిన మంత్రి రవీంద్ర
చోడవరం: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం పరిశీలించారు. మోంథా తుఫాను కారణంగా చోడవరం మండలంలో పలు ప్రాంతాల్లో పంటలు మునిగిపోయాయి. వరదల్లో దెబ్బతిన్న రాయపురాజుపేట గెడ్డపై కాజ్వేలను, భోగాపురంలో కోతకు గురైన శారదానది గట్టును మంత్రి పరిశీలించారు. వీటి మరమ్మతులకు చర్యలు చేపడతానని, తుఫాన్ నష్టాలను సీఎం దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్పారు. పంట నష్టంపై వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించామని, పంటనష్టం నమోదు చేస్తామని చెప్పా రు.ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘కాశీబుగ్గ’ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
అనకాపల్లి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించగా, పలువురు క్షతగాత్రులయ్యారని, మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, మలసాల భరత్కుమార్ డిమాండ్ చేశారు. పోలీస్, ఇంటెలిన్జెన్స్ వ్యవస్థలను పటిష్టపరచడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మృతులకు నివాళులర్పిస్తూ స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ రహదారి(భీమునిగుమ్మం) అంబేడ్కర్ విగ్రహం వరకూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరవైందన్నారు. వైఎస్సార్సీపీ నేతలను అరెస్టులు చేయించేందుకే పోలీస్, ఇంటెలి జెన్స్ వ్యవస్థలను ప్రభుత్వం వినియోగిస్తోందని విమర్శించారు. తిరుపతి, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో జరిగిన సంఘటనలు మరువకముందే కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందారని తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను పటిష్టం చేసి రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. చంద్రబాబు పాలనలో ప్రతిసారీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాటాలు చేస్తే వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై కక్షపూరితంగా కేసులు పెట్టి, అరెస్టులు చేయడంఅన్యాయమని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. హిందువుల దేవాలయాలపై కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ ఘటనలు రుజువుచేస్తున్నాయని చెప్పారు. తిరుపతిలో సంఘటన జరిగిన తరువాత ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. తిరుపతి ఘటనలో బాధిత కుటుంబాలకు నేటికీ నష్టపరిహారం అందజేయలేదన్నారు. కల్తీమద్యం రాష్ట్రంలో ఏరులైపారుతున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకుండా పోయిందన్నారు. కల్తీమద్యం తయారీలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు ప్రజలకు స్పష్టంగా అర్థమైందని చెప్పారు. దీనిపై ప్రశ్నించిన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేష్ను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. నకిలీ మద్యంపై సీబీఐ దర్యాప్తుకు కూటమి నాయకులు భయపడుతున్నారని విమర్శించారు. డైవర్షన్ రాజ కీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు. రేపు కోటి సంతకాల సేకరణ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 4న అనకాపల్లి నెహ్రూచౌక్ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ సతీమణి నివేదిత, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, అనకాపల్లి, కశింకోట మండలా అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, మార్కెట్కమిటీ మాజీచైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బొడ్డేడ ప్రసా ద్, పి.డి.గాంధీ, కుండల రామకృష్ణ, బాధపు హరికృష్ణ, మునూరు శ్రీనివాసరావు, కాండ్రేగుల హైమావతి, శోభ, లక్ష్మి, కోన ఉమా పాల్గొన్నారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు బొడ్డేడ పసాద్, భరత్కుమార్ -
డ్రెడ్జింగ్ కార్పొరేషన్కు కేంద్రం ఊరట
సాక్షి, విశాఖపట్నం: వరుసగా మూడేళ్లు లాభాల బాటపట్టిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐఎల్).. గతేడాది నుంచి నష్టాల బారినపడింది. దీంతోపాటు షేర్ ముఖ విలువ కూడా తగ్గుముఖం పట్టింది. వరుసగా నష్టాలు వాటిల్లడంతో ఉద్యోగులు, అధికారుల్లో కలవరం మొదలైంది. నష్టాల ఊబిలో కూరుకుపోతూ 100 శాతం జీతాల చెల్లింపులపైనా భారం పడుతుండటంతో ఓ దశలో ఈక్విటీలకు వెళ్లిపోవాలని సంస్థ భావించింది. అయితే అప్పట్లో విశాఖపట్నం పోర్టు రూ.400 కోట్లు ఇచ్చి ఆదుకుంది. ఇప్పుడు డీసీఐ బాధ్యతను భుజానికెత్తుకోవాలంటూ కన్సార్టియం పోర్టులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సంస్థలో మౌలిక సదుపాయాలు, ఫ్లీట్ ఆధునికీకరణ, సామర్థ్య పెంపునకు అవసరమైన రూ.4 వేల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రం స్పష్టం చేయడంతో.. డ్రెడ్జింగ్ కార్పొరేషన్కు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఏడేళ్ల క్రితం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ను ప్రైవేట్పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసినప్పుడు.. ఉద్యోగులంతా సంఘటితమై పోరాటం సాగించారు. వీరి పోరుకు మద్దతుగా విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) నిలిచింది. మరో మూడు పోర్టులతో కలిసి డీసీఐ బాధ్యతను తన భుజస్కందాలకెత్తుకుంది. డీసీఐకు కన్సార్టియంగా విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) 19.47 శాతం, జవహర్లాల్ నెహ్రూ పోర్టు ట్రస్ట్ 18 శాతం, పారాదీప్ పోర్టు ట్రస్ట్ 18 శాతం, దీన్దయాళ్ పోర్టు ట్రస్ట్ 18 శాతం వాటాలతో డీసీఐకి బాసటగా నిలిచాయి. దీంతో ప్రైవేటీకరణ నిర్ణయం ఆగిపోయింది. ఆ తర్వాత లాభాల బాటలో పయనించింది. మూడేళ్ల క్రితం ఎండీ,సీఈవో నియమాకంలో అవకతవకలు జరిగిన విషయం వెలుగులోకి రావడం.. విజిలెన్స్ విచారణ నిర్వహించి ఎండీని తొలగించడం, తర్వాత ఆయన స్థానంలో వచ్చిన కొత్త ఎండీ పదవీకాలం ముగియడం చకచకా జరిగిపోయింది. ఇక అక్కడ నుంచి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పతనం మొదలైంది. కొత్త ఎండీ, సీఈవోని ఇంతవరకూ నియమించకుండా తాత్కాలిక బాధ్యతలు ఎండీలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. సరైన నాయకత్వం లేకపోవడం వల్లే.. డీసీఐ అప్పటి నుంచి వరుసగా నష్టాల బాట పడుతోంది. దీంతో.. సంస్థ ఆర్థిక భారం లోతుల్లో కూరుకుపోయింది. మరో ‘భారీ’ డ్రెడ్జర్ కోసం..! ఇటీవలే 12,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద డ్రెడ్జర్ షిప్ని డీసీఐ కమిషనింగ్ చేసింది. బీగల్ సిరీస్ డ్రెడ్జర్గా ‘గోదావరి’ షిప్.. డ్రెడ్జింగ్ రంగంలో సరికొత్త చరిత్రని లిఖించింది. అంతర్జాతీయ డిజైన్, సాంకేతిక భాగస్వాములతో కలిసి కొచ్చిన్ షిప్యార్డులో అధునాతన ఆటోమేషన్ సిస్టమ్స్, అత్యంత సమర్థవంతమైన డ్రెడ్జింగ్ మెకానిజంలతో దీన్ని రూపొందించారు. ప్రస్తుతం డీసీఐ దేశ వ్యాప్తంగా సుమారు 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ పనిలో 60 మిలియన్ క్యూబిక్ మీటర్లను నిర్వహిస్తోంది. ‘డ్రెడ్జ్ గోదావరి’ చేరికతో ఈ సామర్థ్యం 80 మిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగింది. అయితే ప్రపంచ డ్రెడ్జింగ్సంస్థలతో పోటీ పడాలంటే సామర్థ్యం మరింత మెరుగుపడాలనే ఉద్దేశంతో మరో భారీ డ్రెడ్జర్ కోసం డీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాబోయే కొన్ని నెలల్లో మరో 12000 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జర్ షిప్ కోసం ఆర్డర్ ఇచ్చేందుకు సన్నద్దమవుతోంది. అంతే కాకుండా.. ఒక కట్టర్ సక్షన్ డ్రెడ్జర్, ఒక వాటర్ ఇంజెక్షన్ డ్రెడ్జర్, మరో టీఎస్హెచ్డీ, డ్రాఫ్ట్ డ్రెడ్జింగ్కు, లోతట్టు జలమార్గాలు, కాలువలు మొదలైన వాటిలో డ్రెడ్జింగ్ కోసం విభిన్న సామర్థ్యాలు కలిగిన ఆరు బీవర్స్ డ్రెడ్జర్లను కూడా కొనుగోలు చేయాలని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యోచిస్తోంది. స్థిరమైన కార్యకలాపాల కొనసాగించేందుకు డిజిటల్, ఆటోమేషన్, గ్రీన్ డ్రెడ్జింగ్ టెక్నాలజీలను అందిపుచ్చుకొని ప్రపంచ డ్రెడ్జింగ్ సంస్థలతో పోటీ పడేందుకు డీసీఐ అడుగులు వేస్తోంది. కన్సార్టియంలే ఆదుకోవాలి.! డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(డీసీఐ) ఆధునికీకరణకు 4 ప్రధాన పోర్టుల కన్సార్టియం ద్వారా రూ.4,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆధునీకరణకు కేటాయించిన నిధులతో అధునాతన డ్రెడ్జర్ల కొనుగోలు, సాంకేతిక అప్గ్రేడేషన్, స్థిరమైన పద్ధతుల ద్వారా డ్రెడ్జింగ్ సామర్థ్యం పెంపొందించుకోవడం, ప్రపంచ డ్రెడ్జింగ్ సంస్థలతో పోటీ పడేలా కొత్త పద్ధతులు ఆకళింపు చేసుకోవడం.. ఇలా అన్ని విభాగాల్లోననూ డీసీఐని అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు వినియోగించుకోవాలని కేంద్రం సూచించింది. అదేవిధంగా.. డ్రెడ్జింగ్ మౌలిక సదుపాయాలు బలోపేతం చేసుకోవడం, ఫ్లీట్ ఆధునికీకరణపైనా దృష్టిసారించాలని స్పష్టం చేసింది. -
సింహగిరిపై ఘనంగా చిలుకు ద్వాదశి
సింహాచలం: సింహగిరిపై ఆదివారం చిలుకు ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) ఉత్సవం వైభవంగా జరిగింది. అనకాపల్లికి చెందిన ఆడారి నూకయ్య వంశీయులు తరలివచ్చి, తమ చేతుల మీదుగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి ఈ ఉత్సవాన్ని జరిపించారు. ఏటా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఆలయంలో చిలుకు ద్వాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశాన్ని తరతరాలుగా అనకాపల్లిలోని గవర సామాజికవర్గానికి చెందిన ఆడారి నూకయ్య వంశీయులకు దేవస్థానం కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ఆడారి నూకయ్య వంశీయులు కుటుంబ సమేతంగా చిలుకు ద్వాదశి ఉత్సవానికి సంబంధించిన పూజా ద్రవ్యాలతో వచ్చారు. సాయంత్రం ఆలయ ఆస్థాన మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలతో పాటు శయన పెరుమాళ్లు, ఆళ్వార్లకు విశేషంగా పూల అలంకరణ చేసి మండపంలో అధిష్టింపజేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, షోడశోపచార పూజలు నిర్వహించారు. స్వామి చెంతన నువ్వులు, బెల్లం, పాలను రోట్లో వేసి చెరకు గెడలతో శాస్త్రోక్తంగా దంచారు. తయారైన చిమ్మిడిని స్వామికి నైవేద్యంగా ఆరగింపు చేశారు. తదుపరి శయన పెరుమాళ్లకు బేడా తిరువీధిని కనులపండువగా నిర్వహించారు. మంగళాశాసనాన్ని విశేషంగా అందించారు. భక్తులకు చిమ్మిడి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు పవన్కుమార్ తదితరులు పూజలు నిర్వహించారు.స్వామి సేవలో ఆడారి వంశీయులు -
గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తాం
మధురవాడ: గంజాయి వ్యాపారాన్ని ఉగ్రవాదంగా భావిస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. విశాఖ సమీపంలోని కాపులుప్పాడ జీవీఎంసీ డంపింగ్ యార్డులో సుమారు రూ 5.21 కోట్లు విలువచేసే పదివేల కిలోల గంజాయి, 19 లీటర్ల హాసిస్ ఆయిల్ను దహనం చేసే కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. గంజాయిని అరికట్టడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. గంజాయి కేసుల్లో అరెస్టయినవారి ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని తెలిపారు. సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. గంజాయి కేసుల్లో 1,435 మందిని అరెస్ట్ చేశామని అందులో విశాఖకు చెందివారు 712 మంది కాగా 332 మంది పలు జిల్లాలకు చెందిన వారున్నారు. మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు ఎనిమిది చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. 14వేల వరకు సీపీ కెమెరాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయిపై 1972 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈగల్ ఐజీ రవికృష్ణ, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. -
స్టీల్ప్లాంట్లో ‘ఫ్లాగ్ ఆఫ్ ప్రైడ్’ ప్రారంభం
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగుల్లో పోటీతత్వాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఆదివారం నుంచి ‘ఫ్లాగ్ ఆఫ్ ప్రైడ్’ అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఉత్పత్తి విభాగాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విధానంలో భాగంగా ప్లాంట్లోని ఈడీ (వర్క్స్) బిల్డింగ్ ముందు తొమ్మిది జెండా స్తంభాలను ఏర్పాటు చేశారు. వీటిపై ప్రధాన విభాగాలుగా పరిగణించే ఆర్ఎంహెచ్పీ, కోక్ ఓవెన్స్, సింటర్ ప్లాంట్, బ్లాస్ట్ ఫర్నేస్, స్టీల్ మెల్ట్ షాప్–1, స్టీల్ మెల్ట్ షాప్–2, సీఆర్ఎంపీ, మిల్స్, ధర్మల్ పవర్ ప్లాంట్ పేరిట తొమ్మిది రంగుల పతాకాలను అమర్చారు. ప్రతీ రోజు యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్న విభాగం పతాకం ఎత్తులో ఎగురుతుంది. లక్ష్య శాతం ఆధారంగా ఆ పతాకం ఎత్తు స్థాయిని నిర్ణయిస్తారు. అంటే లక్ష్యాన్ని ఎంత శాతం చేరుకుంటే, పతాకం అంత ఎత్తులో ఎగురుతుంది. శనివారం ఆయా విభాగాలు సాధించిన ఉత్పత్తి సాధన ఆధారంగా ఆదివారం తొలి రోజు పతాకాలను ఏర్పాటు చేశారు. యాజమాన్యం తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఉద్యోగులు ఈ కొత్త పద్ధతి వల్ల విభాగాల మధ్య పోటీ కంటే, అనవసరమైన పరస్పర విమర్శలు పెరిగి, అది మొదటికే మోసం తీసుకువస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
అనకాపల్లి టౌన్: కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశారు. మండలంలోని తుమ్మపాల క్రీడామైదానంలో ఆదివారం ఈ ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 98 మంది బాలురు, బాలికలు పాల్గొనగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది బాలురు, 14 మంది బాలికలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి దాడి శ్యాంప్రసాద్, మహారాజ్ వ్యాయామ ఉపాధ్యాయుడు పీలా వీరు నాయుడు, క్రీడా మండలి సభ్యులు నీలకఠం, డి.బి. సత్యనారాయణ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
గాయపడిన శ్వేతనాగుకు శస్త్ర చికిత్స
ప్రాణాలు కాపాడిన వైద్యుడు సింధియా: తీవ్రంగా గాయపడిన అరుదైన, ఆరు అడుగుల శ్వేతనాగుకు శస్త్ర చికిత్స చేసి దాని ప్రాణాలను పశువైద్యుడు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. సింధియా ప్రాంతంలో ఉన్న నేవీ క్యాంటీన్లో శ్వేతనాగు కనిపించడంతో అక్కడి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించడంతో ఆయన అక్కడికి వచ్చి పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పాము పడగ భాగంలో తీవ్రంగా గాయపడి ఉండటాన్ని నాగరాజు గమనించారు. వెంటనే 40వ వార్డు పరిధి హిందూస్థాన్ షిప్యార్డ్ కాలనీలోని గాంధీగ్రామ్ పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి పశువైద్యాధికారి డాక్టర్ సిహెచ్ సునీల్ కుమార్ పామును పరీక్షించి, మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశారు. గాయానికి మొత్తం ఎనిమిది కుట్లు వేశారు. పాము తలపై ఏదైనా వాహనం ఎక్కి ఉండవచ్చని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. గాయం తగ్గిన తర్వాత పామును సురక్షితంగా అడవిలో విడిచిపెడతామని నాగరాజు తెలిపారు.గాయాలపాలైన శ్వేతనాగుకు శస్త్ర చికిత్స చేస్తున్న పశువైద్యాధికారి సునీల్కుమార్ -
ఉద్యోగుల ఐడీ కార్డులతో స్టీల్ప్లాంట్లోకి చొరబాటు
90 కిలోల ఇత్తడి, స్క్రాప్తో ఇద్దరు దొంగలు పట్టివేత ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆ ఇద్దరు దొంగలు ఉద్యోగుల గుర్తింపు కార్డులతో లోపలికి ప్రవేశించడం గమనార్హం. సీఐఎస్ఎఫ్ సిబ్బంది అందించిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడకు చెందిన తారకేశ్వరరావు, గోపి సాహూ అనే వ్యక్తులు ప్లాంట్లోని వివిధ విభాగాల నుంచి సుమారు 50 కిలోల ఇత్తడి వస్తువులు, 40 కిలోల ఇనుప స్క్రాప్ దొంగిలించి, బీసీ గేటు సమీపంలోని టవర్–3 వద్ద బయటకు విసిరేశారు. వారు దొంగలిస్తున్న పనిని అటుగా గస్తీ కాస్తున్న సీఐఎస్ఎఫ్ క్రైం బృందం గుర్తించింది. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఛేజింగ్ జరిగింది. ఎట్టకేలకు వారిని పట్టుకుని దొంగిలించిన సాత్తును స్వాధీనం చేసుకున్నారు. వారిని సోదా చేయగా.. వారి వద్ద నుంచి ఆర్ఎంహెచ్పీ, ఎస్ఎంఎస్–2 విభాగాలకు చెందిన ఉద్యోగుల అసలు గుర్తింపు కార్డులు బయటపడటంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరినీ స్టీల్ ప్లాంట్ క్రైం పోలీసులకు అప్పగించారు. క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కళా ఉత్సవ్ ఏర్పాట్లపరిశీలన
రంపచోడవరం: మారేడుమిల్లిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఏకలవ్య పాఠశాలల రాష్ట్ర స్థాయి కళాఉత్సవ్ ఏర్పాట్లను రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరణ్రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి కళా ఉత్సవ్–2025 ఈ ఏడాది మారేడుమిల్లి ఏకలవ్యలో జరుగుతున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి 5వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. గురుకుల జాయింట్ సెక్రటరీ ప్రసాద్, డీడీ రుక్మాండయ్య, ప్రిన్సిపాల్ శంకర్, తహసీల్దార్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి, మరొకరికి గాయాలు
నక్కపల్లి: మండలంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మరణించగా మరొకరు తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినరామభద్రపురం గ్రామానికి చెందిన అన్నె చిరంజీవి (31) గ్రామంలో నాలుగు రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ ప్లాస్టరింగ్ కోసం వేసిన తాత్కాలిక నిచ్చెన పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఇతన్ని తుని మమత ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మరణించాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎ్స్ఐ తెలిపారు. అదేవిధంగా పాయకరావుపేట మండలం పెదరామభద్రపురం గ్రామానికి చెందిన కూరపాటి రాజేష్ అనే వ్యక్తి ఆటోలో కూల్డ్రింక్స్ తీసుకుని పాయకరావుపేట నుంచి వేంపాడు వెళ్లేందుకు వేంపాడు జంక్షన్లో యూటర్న్ తీసుకుంటుండగా తుని వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇతను తీవ్రంగా గాయపడ్డాడు. ఇతన్ని మెరుగైన వైద్యం కోసం తుని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
చిన్నారుల ఆరోగ్యంపై నిరంతర పరిశీలన
శంకరంలో పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టరు విజయ కృష్ణన్ తుమ్మపాల: ప్రతి లబ్ధిదారుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సక్రమంగా అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. మండలంలోని శంకరం గ్రామంలో ఆమె లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు అందించారు. వారి యోగక్షేమాలతోపాటు పింఛన్ల పంపిణీ విధానంపై అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. చిన్నారులకు ఎనీమియా రాకుండా పౌష్టికాహారం సక్రమంగా అందించాలని, వారి ఆరోగ్యం నిరంతరం పరిశీలించాలన్నారు. బరువు తక్కువ గల చిన్నారులకు అదనపు పౌష్టికాహారం అందించాలన్నారు. -
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
అనకాపల్లి టౌన్: మోంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మండలంలోని తుమ్మపాల వెంకుపాలెం ప్రాంతాల్లోని నీట మునిగిన పొలాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. తుమ్మపాల వ్యవసాయాధికారులు పంట నష్టాన్ని అంచనా వేయడం, వాటిని నమోదు చేయడంలో అలసత్యం వహిస్తున్నారని ఆరోపించారు. మండలంలోని సీతానగరం, తగరంపూడి, ఊడేరు, దిబ్బపాలెం, సుందరయ్యపేట, శంకరం, గొలగాం గ్రామాల్లో అత్యధికంగా వరి, కూరగాయల పంటలు నీటమునిగాయని చెప్పారు. బొజ్జన్న కొండ నుంచి ఆవఖండం వైపు వెళ్లే కాలువకు రూ.కోటి వెచ్చించి అరకొరగా పూడికతీత పనులు చేశారని, దీనివల్ల చాలా ఎకరాలు నీటమునిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కె. లోకనాథం, జిల్లా కార్యదర్శి గంటా శ్రీరాం, ఎ.రాజు, నూకునాయుడు పాల్గొన్నారు. -
పేనాలు తీసే కంపెనీలు మాకొద్దు
నాకు బోటు ఉంది. ఆరుగురు కలిసి వేటకు వెళ్తుంటాం. కంపెనీ పెడుతున్నారని, అది వత్తేపేనాలు పోతాయని అంటున్నారు.పేనాలు కాపాడుకోవడం కోసం మూడునెలలనుంచి వేట మానేసం. నూకతాత గుడి దగ్గర ధర్నాసేత్తన్నం. పేనాలు తీసే కంపెనీలు మాకెందుకు. తాడోపేడో తేలిపోవాల. వేటకు ఎల్లకపోవడం వల్ల బతకడం కట్టంగా ఉంది.అయినా తప్పనేదు. పేనాలు ఉంటేనే కదా ఏమయిన సేయడానికి. పెబుత్వం ఇలా సేత్తాది అనుకోనేదు. అనిత వచ్చి మాకాళ్లావేల్లాపడితే ఓట్లేసి గెలిపించాం. మాకు బాగానే... తీర్చింది. – చేపల సోమేసు, మత్స్యకారుడు రాజయ్యపేట -
వడ్డాది వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
బుచ్చెయ్యపేట: ప్రసిద్ధ వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం శనివారం ఏకాదశి సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం తెల్లవారుజాము ఐదు గంటల నుంచే భక్తులు బారులు తీరారు. అనకాపల్లి, విశాఖ, అల్లూరి జిల్లాలతో పాటు పలు గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం కోసం తరలి వచ్చారు. దేవస్థానం ఈవో శర్మ,అర్చకులు శ్రీకాంతచార్యులు,రాధాకృష్ణలు వేంకటేశ్వరస్వామిని తులసీమాలలతో ప్రత్యేకంగా అలంకరించి గర్భగుడిలోను, ఉత్సవ విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గోవింద నామస్మరణతో గిరిజాంబ కొండ ఆలయ ప్రాంతం మార్మోగింది. పలు గ్రామాల్లో శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. -
ముంపులో జగనన్న కాలనీ
● కాలనీని చుట్టుముట్టిన వరదనీరు ● కాలనీ వాసుల ఇక్కట్లు మునగపాక: మోంథా తుఫాన్ ప్రభావంతో నాలుగు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు వచ్చి చేరుతోంది. వరద నీరు పోయే పరిస్థితులు లేకపోవడంతో మునగపాక జగనన్న కాలనీలో ముంపు తీవ్రత పెరిగిపోతుంది. రెండు రోజుల వ్యవధిలో కాలనీలోకి నీటి ప్రవాహం పెరిగిపోవడంతో కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీకి వచ్చే ప్రధాన రహదారిపై వరదనీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కాలనీ వాసులు పడరాని పాట్లు పడుతున్నారు. కాలనీ చుట్టూ వరదనీటి ఉధృతం ఎక్కువగా ఉండడంతో భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. మునగపాక నుంచి వాడ్రాపల్లి, పాటిపల్లికి వెళ్లే మార్గంలో వరదనీరు రోడ్డుపైకి వచ్చి చేరుతోంది. దీంతో రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడుతున్నారు. పొలాలకు వెళ్లే మహిళా రైతులు అవస్థలు పడుతున్నారు. మునగపాకకు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన రైతుల కమతాల్లోకి వరదనీరు వచ్చి చేరడంతో ఇక్కట్లు పడుతున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పి.సత్యనారాయణ జగనన్న కాలనీలో పర్యటించి పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పినా కాలనీ వాసులు అంగీకరించడం లేదు. పిల్లా పాపలతో ఇక్కడే ఉంటామని భీష్మించుకోవడంతో బాధితులకు రేషన్ సరకులను అందిస్తామని హామీ ఇచ్చారు. -
సడలని దీక్షే ఆయుధమై...
గుబులు పట్టుకుంది. వెంటనే పోరాటానికి సిద్ధపడ్డారు. 50 రోజుల నుంచి... సెప్టెంబరు 14వ తేదీనుంచి శాంతియుతంగా నిరాహారదీక్షకు కూర్చొన్నారు. ప్రభుత్వంనుంచి స్పందన రాకపోగా మత్స్యకారుల దీక్షకు సంఘీభావం ప్రకటించేవారిని అడ్డుకోవడం, ధర్నాచేస్తున్న వారిపై కేసులుపెట్టడం, గ్రామంలోకి ఎవరూ రాకుండ అడ్డుకోవడం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోంది.దీంతో ఆగ్రహంతో రగిలిపోతున్న మత్స్యకారులు 15 రోజుల క్రితం బల్క్ డ్రగ్పార్క్ పనులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలోకి చర్చలకు వచ్చిన హోమ్మంత్రిని సైతం ఆమెను ఘోరావ్ చేసి తమ నిరసనను తెలియజేశారు. ఇంతజరిగాక కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతోపాటు, తమకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వివిధ రాజకీయపార్టీ నాయకులను అడ్డుకోవడం, గృహనిర్బంధాలు చేయడాన్ని తట్టుకోలేని మత్స్యకారులంతా జాతీయరహదారిని ముట్టడించారు. నక్కపల్లిలో నాలుగు గంటల పాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దిగివచ్చిన కలెక్టర్, ఎస్పీ మత్స్యకారులతో చర్చలుజరిపారు. కలెక్టర్తో చర్చలు విఫలం.. కలెక్టర్ వచ్చి న్యాయం చేస్తారని ఆశపడిన గంగపుత్రులకు నిరాశే ఎదురయింది.ఇచ్చినమాటప్రకారం ఈనెల 24న కలెక్టర్ విజయ్కృష్ణన్ గ్రామంలోకి వచ్చి మత్స్యకారులతో చర్చలు జరిపారు. వీరంతా బల్క్ డ్రగ్పార్క్ రద్దుచేయాల్సిందేనంటూ ముక్తకంఠంతో నినదించారు. దీంతో బల్క్డ్రగ్ పార్క్ రద్దుచేయడం తన పరిధిలో లేదని, మీ డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ కలెక్టర్ చేతులెత్తేశారు. దీంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. తమ డిమాండ్ నెరవేర్చే వరకూ పస్తులతోనే పోరాటం కొనసాగిస్తామంటూ మత్స్యకారులు దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ దీక్ష ఆదివారానికి 50వ రోజుకు చేరుకుంది. -
మత్స్యకారులకు వామపక్షాలు అండగా ఉంటాయి
నిరాహారదీక్షలో మత్స్యకారులనుద్దేశించి మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్సి శ్రీనివాసరావు, మత్స్యకారులకు సంఘీభావం ప్రకటిస్తున్న వామపక్షనేతలునక్కపల్లి: మండలంలో రాజయ్యపేటలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్డ్రగ్ పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి వామపక్ష పార్టీలు అండగా ఉంటాయని సీపీఎం, సీపీఐ రాష్ట్రకార్యదర్శులు శ్రీనివాసరావు, ఈశ్వరయ్యలు తెలిపారు. మత్స్యకారుల దీక్షకు మద్దతుగా వారు శనివారం రాజయ్యపేట వచ్చారు. దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. 49 రోజులుగా మత్స్యకారులు బల్క్డ్రగ్పార్క్ను వ్యతిరేకిస్తూ పోరాడుతుంటే ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిపేరుతో ప్రమాదకర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు తీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు చేసే అభివృద్ధి అదానీ,అంబానీల కోసమేనన్నారు. రసాయన పరిశ్రమలను ఏర్పాటు చేసి సముద్రతీరాన్ని డంపింగ్యార్డ్గా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ రాజయ్యపేట వెళ్లే దారిలో అడుగడుగునా పోలీసులను మోహరించారన్నారు. ఈ గ్రామం ఏమైనా పాకిస్థాన్ సరిహద్దులో ఉందా, లేక ఇక్కడ నివశించే మత్స్యకారులు టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. హోమ్మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మత్స్యకారుల దుస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పారు. మత్స్యకారులు పోరాటం చేస్తుంటే హోమ్ మంత్రి కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం స్పందించి బల్క్ డ్రగ్ పార్క్ను రద్దుచేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న ఎంపీ సిఎం రమేష్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పోలా ఈశ్వరరావు, ఎం.ఎస్.నాగరాజు, సీపీఐ ఎంఎల్ నాయకుడు గోవిందరాజులు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం ,రాష్ట్రకార్యవర్గ సభ్యుడు ప్రభాకర్, జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, సీపీఐ నాయకులు బి.బాబ్జి, రామునాయుడు, బి.వెంకటరమణ, వెంకన్న, రావు జగ్గారావు, వెలుగుల అర్జున్, జి.సత్యనారాయణ, ప్రమీల, దేముడు నాయుడు, మత్స్యకార నాయకులు సోమేషు, పిక్కి తాతీలు, నానాజీ, కాశీ తదితరులు పాల్గొన్నారు.బల్క్డ్రగ్పార్క్ రద్దు చేయాల్సిందే రాష్ట్ర వామపక్షనేతలు శ్రీనివాసరావు, ఈశ్వరయ్య -
ధ్యాన వెంకన్నకు చందన అలంకరణ
కశింకోట: స్థానిక ధ్యాన వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారు చందన అలంకరణలో భక్తుల కు దర్శనమిచ్చారు. శనివా రం కార్తీక శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు సమర్పించిన 325 కిలోల చందనాన్ని స్వామి మూల విరాట్కు అలంకరించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించిన అలంకరణ అర్ధరాత్రి వరకు సాగింది. శనివారం వేకువ జామున విష్ణు సహస్ర నామార్చన నిర్వహించారు. వేకువజాము నుంచి రాత్రి వరకు అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్షత్ర హారతి ఇచ్చారు. అర్చకులు రేజేటి రామచరణాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. సోమవారం వరకు చందన అలంకరణలోనే స్వామి దర్శనమివ్వనున్నట్టు అర్చకులు తెలిపారు. -
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025
నాపేరు తుంపాల అప్పలనాయుడు. నాది చోడవరం మండలంలో చాకుపలి. నాకు ఉన్న 1.6 ఎకరాల్లో వరి పంట వేశా ను. తుఫాన్ ప్రభావంతో మొత్తం నీట మునిగింది. మా పొలం పక్కన గెడ్డ ఉండడంతో ఆ నీరు మా పొలంలోకి ప్రవహించింది. మూడు రోజులుగా మా పొలంలో పీకల్లోతు నీరు ఉంది. పంట పూర్తిగా నాశనమైంది. ఈ ఏడాది వరిపంటకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాను. పూర్తిగా మునిగిపోవడంతో మా కుటుంబం రోడ్డున పడినట్టే. పరిశీలనకు ఇంకా అధికారులు రాలేదు. ప్రభుత్వ సాయం అందించకపోతే నా కుటుంబానికి దిక్కే లేదు.నా పేరు మంతెన వీర్రాజు. మాది రాంబిల్లి మండలం వై.లోవ గ్రామం. నేను రెండు ఎకరాల వరి పంట వేశాను. శారదానదికి గండి పడి మొత్తం పంట మునిగిపోయింది. కూలి నాలి చేసి సంపాదిస్తున్న డబ్బులతో వరినాట్లు వేశాను. మా అబ్బాయి వ్యవసాయం చేయవద్దంటే ఈ ఏడాది పంట వేశాను. మా గ్రామం ఉప్పుటేరు ఆనుకుని ఉండడంతో భారీగా వర్షాలు పడినా, శారదా నదికి వరద వచ్చినా మొత్తం మునిగిపోతుంది. ఈ ఏడాది కష్టపడి పండించిన మొత్తం పంట మునిగిపోయింది. వ్యవసాయం చేయాలంటే భయంగాఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి.నా పేరు యల మంచిలి బొర్రయ్య. మాది చోడవరం మండలంలో చాకుపల్లి. నేను ఎకరంలో వరి పంట వేశాను. పూర్తిగా మునిగిపోయింది. తుఫాన్ తీరందాటి రెండు రోజులైనా నీరు అలాగే ఉంది. అధికారులెవ్వరూ రాలేదు. ఈ ఏడాది నా పంట మొత్తం పోయినట్లే. నా పొలంలో నీరు పోవడానికి కనీసం మూడు రోజులైనా పడుతుంది. ఇప్పటికే వరి పంట మొత్తం మునిగి కుళ్లిపోయింది. అధికారులు సాయం కోసం ఎదురుచూస్తున్నాం. నష్టపరిహారం ఇవ్వకపోతే ఆత్మహ త్యే శరణ్యం. నా పేరు ఎల్లపు పార్వతి. మాది మునగపాక గ్రామం. నేను ఎకరంలో వరి, అర ఎకరంలో చెరకు వేశాను. రూ.80 వేల పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నాను. శారదా నదికి గండి పడి మా పొలం మొత్తం మునిగిపోయింది. చెరకు పంట కొంత తేరుకున్నా..వరి పంట మొత్తం మునిగిపోయింది. మేమే కాలువ తవ్వి, నీరు బయటకు పోయేట్టు చేసుకుంటున్నాం. అధికారులెవ్వరూ రాలేదు. ఎమ్మార్వో వచ్చారు. కానీ మా పొలం వరకూ రాలేదు. రోడ్డుపై ఉన్న వాటిని చూసుకుని వెళ్లిపోయారు. మా గ్రామంలో నేను పుట్టిన తరువాత ఇంత వరద ఉధృతి రావడం ఇది రెండో సారి. హుద్హుద్ తుఫాన్లో కూడా ఇంత వరద గ్రామంలోకి రాలేదు. నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.నా పేరు బొడ్డేటి శివ అప్పారావు. మాది మునగపాక మండలం చూచుకొండ గ్రామం. నేను ఒక ఎకరంలో చెరకు, మూడు ఎకరాల్లో వరి వేశాను. రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్నాను. తుఫాన్ కారణంగా శారదానది ముంపుతో మా పంట పూర్తిగా మునిగిపోయింది. అధికారులు వచ్చి చూసి వెళ్లిపోయారు. కొంత మేర అయినా పంట కాపాడుకుందామనే ఆశతో మేమే కాలువ ఏర్పాటు చేసి నీరు బయటకు పోయేట్లు చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం ఇవ్వకపోతే అప్పులు పాలైనట్లే. మా కుటుంబం రోడ్డున పడినట్లే. నా పేరు గంటిమూడి ఈశ్వరరావు. నాది చోడవరం మండలంలో ఖండేపల్లి గ్రామం. నాకు ఉన్న అరెకరంలో వేసిన వరి పంట పూర్తిగా మునిగిపోయింది. 1001 వరి రకం వేయడంతో త్వరగా పండేసింది. పొట్టమీద ఉన్న పంట తుఫాన్ కారణంగా మొత్తం మునిగిపోయి నేలకొరిగింది. నిన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ వచ్చి చూసి ఫోటో తీసుకుని వెళ్లి పోయారు. పరిహారం ఇస్తారో...లేదో కూడా చెప్పలేదు. నేనే పొలంలో నుంచి కాలువ చేసి నీరు పోయేలా చేసుకున్నాను. ఇంకేమి చేయాలో తెలియని స్థితిలో నేలకొరిగిన పొలాన్ని కోస్తున్నాను. -
విపత్తుల నిర్వహణకు సమగ్ర ప్రణాళిక అవసరం
తుమ్మపాల: మోంథా తుపానును ఎదుర్కొన్న అనుభవాలతో భవిష్యత్తులో విపత్తుల నిర్వహణకు మరింత సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి తుపాను సమయంలో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల ఫలితాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, అధికారుల అనుభవాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాగం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగామన్నారు. అహర్నిశలు శ్రమించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని ఆమె ఆభినందించారు. విద్యుత్ శాఖ ముందుగా సిద్ధం చేసుకున్న చర్యలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం రాకుండా సిబ్బంది పని చేశారని, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గర్భిణులను ఆస్పత్రులకు తరలించి సుఖప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. అధికారుల అభిప్రాయాలు, అనుభవాల మేరకు భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తూ రోడ్డు సదుపాయం లేని గ్రామస్తులను ముందుగానే పరిసర గ్రామాలకు తరలించాలని, మొక్కలు నాటేటప్పుడు గాలివానలకు తట్టుకునే వాటినే నాటాలని, ఇళ్లలో పెంచే చెట్లు ఎత్తుగా పెరగకుండా కొమ్మలు కత్తిరించాలని, నదులు, కాలువల గట్లను పటిష్టం చేయాలని, బలహీనంగా ఉన్న గట్లను ముందుగానే గుర్తించి ఇసుక బస్తాలు వేయాలని, వర్షపు నీరు పోయేలా కాలువల్లో పూడికలు, ఆక్రమణలు తొలగించాలని అభిప్రాయపడ్డారు. పొక్లెయిన్ల వివరాలు ఎల్లప్పుడూ అధికారులు ఉంచుకోవాలన్నారు. కాలువలు పూడుకుపోవడానకి ప్రధాన కారణం ప్లాస్టిక్ వ్యర్థాలేనని చెప్పారు. ప్లాస్టిక్ నిషేధంలో అధికారులు ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్లాస్టిక్ సంచుల వినియోగం మానుకోవాలని, వస్త్ర, జ్యూట్ సంచులు వినియోగించి ఆదర్శంగా నిలవాలన్నారు.కలెక్టరు విజయ కృష్ణన్ -
ఇది.. ధృత రాష్ట్ర సర్కార్
సాక్షి, అనకాపల్లి: మోంథా తుపాన్ ప్రభావంతో రైతన్న కుదేలయ్యాడు. నాలుగు రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలకు తోడు నదులు ఉప్పొంగడంతో పంటలు మునిగిపోయాయి. జిల్లాలో వరి, చెరకుతో పాటు మొక్కజొన్న, అరటి, బొప్పాయి, కూరగాయలు, ఉద్యానవన పంటలకు తీరని నష్టం కలిగింది. జిల్లాలో తుఫాన్ ప్రభావం కన్నా..అధికారుల నిర్లక్ష్యంతో మేజర్, మైనర్ శారదా నదులకు గండి పడడంతో రైతుకు మరింత నష్టం జరిగింది. ఎక్కడ చూసినా నేలకొరిగిన వరి పనలు, పడిపోయిన చెరకు, బొప్పాయి, అరటి, మొక్కజొన్న తోటలు దర్శనమిస్తున్నాయి. కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో తుడిచి పెట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వర్ణనాతీతం. చేలను ముంచెత్తిన నీళ్లు ఇంకా బయటకు వెళ్లలేదు. ఫలితంగా పంట ఇంకా నీటిలోనే ఉంది. నీట మునిగిన, నేలకొరిగిన పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం క్షేత్ర స్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించింది. ఎక్కడ చూసినా పొలంలో నిలిచిపోయిన నీటిని తీవ్రంగా శ్రమిస్తూ బయటకు పంపుతున్న రైతులు, పడిపోయిన వరి పంటను కట్టలు కడుతున్న అన్నదాతలే కనిపించారు.తమకు జరిగిన నష్టంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తూతూ మంత్రంగా కొన్ని ప్రాంతాల్లో పరిశీలించినా..మెజారిటీ శాతం మునిగిన పంటను కనీసం చూసిన పాపానపోలేదు. జిల్లాలో పంటనష్టం అధికంగా ఉండగా..అధికారులు మాత్రం నష్టపరిహారం తగ్గించే ప్రయత్నంలో డామేజ్ తక్కువగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు రోజులగా పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి పంట కుళ్లిపోతున్నా...కనీసం అధికారులు ఆ వైపు చూడడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తుఫాన్ ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువ నష్టపోతున్నామని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట బీమా లేక ఆందోళనలో రైతు కూటమి ప్రభుత్వంలో పంట బీమా లేకపోవడం, రెండేళ్లుగా రైతులకు పెట్టుబడి సాయం అందించకపోవడంతో రైతు అప్పుల పాలయ్యాడు. అప్పు చేసి వ్యవసాయం చేస్తే విపత్తుల కారణంగా పంట మొత్తం నీళ్ల పాలైంది. ఈ ప్రభుత్వంలో గత ఏడాదిలో పెట్టుబడి సాయం అందించలేదు. ఈ ఏడాది అరకొరగా ఇచ్చినా..కనీసం ఈ ఏడాదైనా పంట చేతికొస్తుందనే ఆశతో ఉన్న రైతన్నను మోంథా తుఫాన్ నిండా ముంచేసింది. అప్పు చేసి సగటున ఒక్కో ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి వరి సాగు చేస్తున్నాడు. తుఫాన్ తీరందాటినా.. వర్షాలు తగ్గుముఖం పట్టినా..వరి పొలంలో నీరు ఇంకా అలాగే ఉంది. విపత్తుల కారణంగా పంటకు నష్టం వచ్చినా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నష్ట పరిహారం వస్తుందనే దీమా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 15 వేలకుపైగా ముంపు.. అధికారుల లెక్కలు 2 వేల ఎకరాలే.. తుఫాన్ ముంపునకు గురైంది జిల్లా వ్యాప్తంగా 15,800 ఎకరాలైతే..అధికారులు మాత్రం 2 వేల ఎకరాలే నష్టపోయినట్టు చూపిస్తున్నారు. రైతులకు ఇచ్చే నష్ట పరిహారం తగ్గించేందుకు అధికారులు కుటిల యత్నాలు చేస్తున్నారు. తుఫాన్ తగ్గి మూడు రోజులైనా నష్ట పరిహారం నమోదుచేయలేదు. వరి 12,800 ఎకరాలు, చెరకు 2 వేలు, బొప్పాయి, అపరాలు, కూరగాయలు, కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలు వేయి ఎకరాల్లో దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం కన్నా..అధికారుల నిర్లక్ష్యం కారణంగా శారదానది గట్టుకు గండి పడి అధిక నష్టం జరిగింది. శారదా నది వరద కారణంగా రాంబిల్లి మండలంలో 12 గ్రామాల పరిధిలో 5 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం రాంబిల్లి మండలంలో వై.లోవ, రజాల అగ్రహారం, కుమ్మరాపల్లి, మర్రిపాలెం, అప్పన్నపాలెం, నారాయణపురం, కట్టుబోలు, తెరువుపల్లి గ్రామాల్లో, మునగపాక మండలంలో చూచుకొండ, యాదగిరిపాలంలో వరద కాసింత తగ్గుముఖం పట్టింది. గండి పడిన చోట రాళ్ల బస్తాలను వేసి గ్రామస్తులే పూడ్చారు. మునగపాకలో శారదానది ప్రవహించే గ్రోయన్లల్లో గడ్డి తొలగించేందుకు కూడా నిధు ల్లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో గ్రామస్తులే తొలగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. మునగపాకలో ఆ గ్రామస్తులే వరద నీరు బయటకు వెళ్లేలా పనులు చేసుకుంటున్నారు. చోడవరం మండలంలో వర్షాలు తగ్గి మూడు రోజులైనా సుమారు 300 ఎకరాల్లో నీరు పీకల్లోతు ప్రవహిస్తోంది.కళ్లు మూసుకుని రైతుకష్టం చూస్తున్న కూటమి తుఫాన్ బీభత్సానికి కుదేలైన రైతన్న శారదా నదికి గండి పడడంతో రాంబిల్లిలో 5 వేల ఎకరాల ముంపు చి‘వరి’కి కన్నీళ్లు మిగిల్చిన వర్షం అప్పుచేసి సాగు చేసిన అన్నదాతకు నష్టాన్ని మిగిల్చిన విపత్తు జిల్లాలో 15,180 ఎకరాల్లో పంట మునక నష్టం రూ. 45.54 కోట్లు తూతూ మంత్రంగా పంటనష్టం పరిశీలన -
సడలని దీక్షే ఆయుధమై...
50వ రోజు చేరుకున్న మత్స్యకారుల పోరు● బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా మహోద్యమం ● 3 నెలల నుంచి వేటకు దూరం ● పస్తులతోనే ఉద్యమంభవిష్యత్తు కోసం.. గంగపుత్రులు సాగిస్తున్న మహా పోరాటమిది.. నమ్మిన నాయకుల నయవంచనపై సాగిస్తున్న అలుపెరుగని సమరమిది. బల్క్డ్రగ్స్ పార్క్కు వ్యతిరేకంగా ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసేందుకు సిద్ధమై ఎగరేసిన తిరుగుబాటు బావుట ఇది. పాలకుల దుర్మార్గాలు, పోలీసుల అణచివేతలు.. అవమానాలు ఇలా ఎన్ని వచ్చినా, ఏమి చేసినా సడలకుండా సాగుతున్న ఉద్యమం ఆదివారం నాటికి 50వ రోజుకు చేరుకుంది. నక్కపల్లి: గంగమ్మతల్లిని నమ్ముకుని జీవిస్తున్న గంగపుత్రులు వారు. వేటతప్ప వేరే పని చేతకాదు వారికి.. అటుపోట్ల జీవితం వారిది... సముద్రాన్ని నమ్ముకుని తెల్లవారు జామునరెండు గంటలకు ప్రాణాలకు తెగించి వేటకు బయలు దేరతారు. సాయంత్రం 3 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. ఇంటికి చేరే వరకు కూడా నమ్మకం ఉండదు. వేటకు వెళ్లిన వారికోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాచేలా ఒడ్డున ఎదురు చూస్తుంటారు. ఇలా సాఫీగా సాగిపోతున్న రాజయ్యపేట మత్స్యకారులను బల్క్డ్రగ్ భూతం వెంటాడుతోంది. మత్స్యకారుల జీవితాలకు ముప్పు కలిగించే ప్రమాదకర రసాయన పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. ప్రజాభిప్రాయసేకరణలో వ్యతిరేకించినప్పటికీ పెడచెవిన పెట్టింది. మత్స్యకారులు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా బల్క్డ్రగ్పార్క్ పనులు ప్రారంభించింది. 3 నెలలుగా వేటకు వెళ్లకుండా.. గత్యంతరం లేని మత్స్యకారులు తమ ప్రాణాలను, ఉపాధిని కాపాడు కోవడం కోసం దాదాపు 3 నెలలనుంచి వేటకు వెళ్లడం మానుకున్నారు. 50 రోజులనుంచి బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా నిరాహారదీక్షలు చేస్తున్నారు. వేట మానుకుని పస్తులతోనే ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తున్నారు. తుఫాన్లను సైతం లెక్క చేయకుండా... వర్షాల్లో తడుస్తూనే తమ నిరసన తెలియజేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అయిన వంగలపూడి అనిత తమను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారని, కష్టాల్లో పట్టించుకోవడం లేదని, ప్రమాదకర కంపెనీలకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారంటూ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా నాలుగు నెలలే వేట... ఏడాదిలో వీరు పట్టుమని నాలుగు నెలలు మాత్రమే వేటకు వెళ్తారు. వివిధ కారణాల వల్ల మిగిలిన ఎనిమిది నెలలు వేటకు వెళ్లే పరిస్థితి ఉండదు. దీనికితోడు సెప్టెంబరు నుంచి మార్చి నెలవరకు సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. ఈప్రాంతంలో కెరటాల ఉధృతి అధికంగా ఉంటుంది. ఇక్కడ వేటసాగిస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇటువంటి పరిస్థితుల్లో పొట్టకూటి కోసం వారు ఉన్న ఊరిని కన్నవారిని, కడపున పుట్టిన వారిని వదులుకుని తాత్కాలికంగా వలసలు పోతుంటారు. ఇలా ఆరు మాసాల పాటు ఇతర ప్రాంతాలకు వేటకోసం వెళతారు. రాజయ్యపేటలో సుమారు 10 వేల మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో అతి పెద్ద గ్రామం ఇదే. సుమారు 250 తెప్పలు బోట్లు ఉన్నాయి. ఒక్కొక్క బోటుపై ఆరుగురు ప్రతిరోజు వేటకు వెళ్తుంటారు.గడచిన 15 ఏళ్లనుంచి తీరప్రాంతాల వెంబడి ఏర్పాటయిన రసాయన పరిశ్రమల వల్ల మత్స్యసంపద నాశనమవుతోంది. మత్స్యకారుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కంపెనీ పరిసర ప్రాంతాల్లో నివసించేవారు పలు రుగ్మతలు, ప్రమాదకర వ్యాధులతో బాధపడుతున్నారు. వెంటాడుతున్న బల్క్ డ్రగ్ భూతం... మూలిగే నక్కపై తాటికాయపడినట్టు బల్క్డ్రగ్పార్క్ ప్రతిపాదన వీరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వినాయక చవితి వెళ్లి తర్వాత మత్స్యకారులంతా తాత్కాలికంగా వలసలు వెళ్తుంటారు. ఆరు నెలలు ఇతరప్రాంతాల్లో వేట చేసుకుని తిరిగి ఉగాది నాటికి స్వగ్రామాలకు చేరుకుంటారు. రెండు మూడు రోజుల్లో వలసలకు బయలు దేరుతామనుకున్న సమయంలో బల్క్ డ్రగ్పనులు ఊపందుకోవడంతో మత్స్యకారుల్లో -
అవినీతి రహిత సమాజానికి కృషి
మాట్లాడుతున్న న్యాయమూర్తి నరేష్ అనకాపల్లి: అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పదో అదనపు న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంఘం జిల్లా చైర్మన్ వి.నరేష్ అన్నారు. స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సమాజంలో మంచి,చేడులు రెండూ ఉంటాయని చెడును విడిచిపెట్టి మంచిపై దృష్టి సాధించాలన్నారు. భావితరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి వ్యక్తి సమాజం కోసం తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు జి.రామకృష్ణ జి.ధర్మరావు, ఎ.రమేష్, నికిత సెంగర్, విశాఖ ఉమ్మడి జిల్లా విజిలెన్స్ అధికారి ఎ.వి.ఎస్.ఎస్.రామిరెడ్డి, గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
జన జాతీయ గౌరవ్ దివస్ వేడుకలు ప్రారంభం
తుమ్మపాల: ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధుడు, జానపద నాయకుడు బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టరు విజయ కృష్ణన్ కోరారు. ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు జరిగే జన జాతీయ గౌరవ్ దివస్ వేడుకలను కలెక్టరేట్లో శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం బిర్సా ముండా, ఇతర గిరిజన నాయకుల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారి జ్ఞాపకార్థం కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిర్సా ముండా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో జీవించాలన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటయోధునిగా బిర్సా ముండాపై గౌరవంతో ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం జన జాతీయ గౌరవ్ దివస్గా ప్రతి సంవత్సరం జరుపుతోందన్నారు. ఈ నెల 15 వరకు నిర్వహించనున్న జాతీయ గౌరవ్ దివస్ వేడుకల్లో భాగంగా మొక్కలు నాటడం, ప్రభుత్వం ఆదివాసీలకు కల్పిస్తున్న పథకాలపై ప్రచారం, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో వ్యాసరచన, ఆటల పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 15న జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించనున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగవేణి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి విజయకుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
యుద్ధప్రాతిపదికన గండి పూడ్చివేత పనులు
– కలెక్టరు విజయ కృష్ణన్ సాక్షి, అనకాపల్లి: రాంబిల్లి మండలంలో రజాల అగ్రహారం ప్రాంతంలో మేజరు శారదా నది గట్టు తెగిన ప్రాంతంలో గండిపూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు కలెక్టరు విజయ కృష్ణన్ తెలిపారు. గండిపూడ్చివేత పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు ఆమె చెప్పారు. మోంథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు రైవాడ జలాశయం నుంచి అత్యధికంగా 14 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో శారదానది ప్రవాహం పెరిగి గట్టు తెగిపోయిందని, దీంతో సుమారు 200 మీటర్లు గండిపడి పరిసర గ్రామాల్లోకి నీరు ప్రవేశించిందని చెప్పారు. పంటపొలాలు నీటమునిగిపోయాయని, పొలాల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడామని తెలిపారు. గండి పడిన ప్రాంతాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారని, హోం శాఖ మంత్రి ఆదేశాల మేరకు గండి పడిన ప్రదేశంలో రూ.2.50 కోట్లతో రక్షణగోడ నిర్మాణానికి నీటి పారుదల శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ముంపునకు గురైన గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి నిర్వాసితులకు వసతి ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన సహాయం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. -
జిల్లాలో 50 ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలు
కశింకోట: జిల్లాలో ఇప్పటి వరకూ 50 ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు అధికారి సీహెచ్. లచ్చన్న కోరారు. మండలంలోని సుందరయ్యపేట శివారు ఆనందపురం, సింగవరం, చెరకాం, మోసయ్యపేట, తాళ్లపాలెం, బంగారయ్యపేట గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఆనందపురం కేంద్రాన్ని లచ్చన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు కషాయాలు, ద్రావణాలు, ఎరువులు, నవ ధాన్యాలు వనరుల కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారి ద్వారా గ్రామాల్లో వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విభాగానికి చెందిన ఎన్ ఎఫ్ ఎలు రామ గోవింద, చిన్న, నాగమణి, డివిజన్ ఎమ్టీ నాయుడు బాబు, మండల వనరుల కేంద్రం నిర్వాహకురాలు కూండ్రపు అరుణ, ఎల్– 1 సాయిరాం, ఎల్–2 వెంకటలక్ష్మి, సుందరయ్యపేట సర్పంచ్ బండారు శ్రీనివాస్, స్థానిక నాయకులు రెడ్డి సూర్యనారాయణ, చిన్ని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పటేల్ దేశభక్తి ఆదర్శప్రాయం
అనకాపల్లి: దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారని, ఆయన చూపిన దేశభక్తి మనందరికీ ఆదర్శమని అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్రావు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివాస్) నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువత పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, రమేష్, మన్మథరావు, ఎస్ఐలు రమణయ్య, ప్రసాద్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
పాక్షికంగా దెబ్బతిన్న పాఠశాల భవనాలు
రోలుగుంట: మోంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు మండలంలో పలు పాఠశాలల భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎంఈవోలు – 1, 2 జాను ప్రసాద్, పి.జగ్గారావు శుక్రవారం ఆయా పాఠశాలలను సందర్శించారు. హెచ్ఎంలతో కలసి దెబ్బతిన్న భవనాలను పరిశీలించి నివేదిక తయారు చేసుకున్నారు. వీటి పునర్నిర్మాణానికి నిధుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు ఎంఈవోలు తెలిపారు. గుర్రంపేట, కె.నాయుడుపాలెం, వెలంకాయలపాలెం, వై.బి.పట్నం, పెవపేట, దిబ్బలపాలెం, బి.బి.పట్నం, గంగవరం, రొంగలపాలెం, కుసుర్లపూడి, గడబపాలెం, జె.నాయుడుపాలెం, కె.అడ్డసరం గ్రామాల్లో పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. రొంగలపాలెంలో దెబ్బతిన్న పాఠశాల భవనం స్లాబ్ -
సీతయ్యపేట హైస్కూల్కు కరెంటు కష్టాలు
సీతయ్యపేట హైస్కూల్ వద్ద ఒరిగిపోయిన విద్యుత్ స్తంభం బుచ్చెయ్యపేట: మండలంలో సీతయ్యపేట హైస్కూల్కు కరెంటు కష్టాలు ఎదురయ్యాయి. తుపాను ప్రభావంతో వీచిన గాలులకు ఇక్కడ స్కూలుకు వెళ్లే రహదారిలో విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. స్థానికుల సమాచారంతో ఆ శాఖ అధికారులు అప్రమత్తమై గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాంతో హైస్కూల్కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శుక్రవారం హైస్కూల్లో మోటారు పనిచేయలేదు. మధ్యాహ్న భోజనాలు తయారీకి, మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సరఫరా లేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. అధికారులు తక్షణమే స్తంభాన్ని సరిచేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పుస్తక మహోత్సవం ప్రారంభం
అనకాపల్లి టౌన్: పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం పెరుగుతుందని వ్యాపారవేత్త కోరుకొండ బుచ్చిరాజు తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పుస్తక మహోత్సవాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పుస్తక ప్రియులకు అనుభూతిని కలిగించే విధంగా ఎక్కడా దొరకని పుస్తకాలు ఈ మహోత్సవంలో చూడవచ్చన్నారు. పుస్తక మహోత్సవ కన్వీనర్ ఉమామహేశ్వరావు మాట్లాడుతూ ఈ నెల ఏడో తేదీ వరకు పుస్తక మహోత్సవం కొనసాగుతుందన్నారు. ఈ ప్రదర్శనలో లక్షకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో భాగంగా సాహిత్య సంభాషణలు, విద్యార్థులకు పుస్తకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ట్రెజరీ అధికారి వీఎల్ సుభాషిణి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
కె.కోటపాడు: మండలంలో చౌడువాడకు చెందిన బంటు అప్పలనాయుడు(32) మృతదేహం శుక్రవారం మారపురెడ్డి కళ్లాల వద్ద చిట్టిగెడ్డలో లభ్యమైంది. గత నెల 28న తెల్లవారుజామున చిట్టిగెడ్డ వైపు పశువులను తోలుకెళ్లాడు. అక్కడ నుంచి పశువులు ఇంటికి వచ్చేశాయి. అప్పలనాయుడు తిరిగి రాలేదు. దాంతో ఆందోళన చెందిన అతడి తల్లి గౌరమ్మ ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్న చిట్టిగెడ్డలో కొట్టుకుపోయి ఉండొచ్చన్న అనుమానంతో కె.కోటపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 29న ఎస్ఐ ధనుంజయ్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలను, ఫైర్ సిబ్బందిని రప్పించి గెడ్డలో గాలించారు. జాడ లేకపోవడంతో వెనుదిరిగారు. శుక్రవారం ఉదయానికి చిట్టిగెడ్డ నీటి ఉధృతి తగ్గడంతో గ్రామ శివారు మారపురెడ్డి కళ్లాల వద్ద గెడ్డ పొదల్లో చిక్కుకున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. అక్కడకు చేరుకున్న మృతుడు తల్లి, భార్య, ఇద్దరు కుమారులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి కె.కోటపాడు సీహెచ్సీలో పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.అప్పలనాయుడు(ఫైల్), గెడ్డ పొదల్లో చిక్కుకున్న మృతదేహం -
విద్యుత్ షాక్తో వార్డు సభ్యురాలి మృతి
మునగపాక: మండలంలోని మడకపాలెం పంచాయతీలో వార్డు సభ్యురాలు లగిశెట్టి సన్యాసమ్మ(55) విద్యుత్ షాక్కు గురై శుక్రవారం మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మడకపాలెం గ్రామానికి చెందిన లగిశెటి అప్పలనాయుడు, సన్యాసమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఆమె పొలం పనులు ముగించుకుని తన ఇంటికి వస్తుండగా, మార్గమధ్యలో తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని రోదించారు. అప్పటివరకు తనతో ఉన్న భార్య విద్యుత్ షాక్కు గురై మృతిచెందడాన్ని భర్త జీర్ణించుకోలేకపోతున్నాడు. మృతదేహాన్ని మునగపాక పోలీసులు అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. ఆమె మృతికి పాలకవర్గ సభ్యులు సంతాపం ప్రకటించారు. -
నేలమట్టమైన వరి పంట
దేవరాపల్లి: మోంథా తుఫాన్ అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చింది. తుఫాన్ ధాటికి మండలంలోని వేచలం, చిననందిపల్లి, ఎ. కొత్తపల్లి, రైవాడ, కొండకొడాబు తదితర గ్రామాల్లో వరి పంట కొంతమేర నీటి ముంపునకు గురి కాగా, మరికొంత పూర్తిగా నేలమట్టమైంది. దీంతో పంట చేతికందే సమయంలో నీటి పాలు కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట కంటి ముందే వర్షార్పణం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నేలమట్టమైన పంటను చూసి కన్నీరు పెట్టుకుంటున్న దయనీయ పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అన్నదాతలను ఎంత మేర ఆదుకుంటుందో చూడాల్సి ఉంది. పంట నేలపాలు కావడంతో అన్నదాతల ఆవేదన -
70 కిలోల గంజాయి స్వాధీనం
కశింకోట: స్థానిక పోలీసులు శుక్రవారం 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఏడు సెల్ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలు... ముందుగా అందిన సమాచారం మేరకు స్థానిక విల్లా ప్రాంతంలో జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో వచ్చిన ఆటోను పరిశీలించగా గంజాయి బయటపడింది. 35 ప్యాకెట్లలో 70 కిలోల గంజాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కుమార్, కొర్రా సత్తిబాబు, పాంగి ధర్మరాజు, కొర్రా బొంజిబాబు, సిందేరి జక్రయ్య, సేనాపలి మాణిక్యంలను అరెస్టు చేసినట్టు సీఐ చెప్పా రు. వారి నుంచి ఏడు సెల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో హెచ్సీ జి.మధుబాబు, పీసీలు ఎల్.రాజశేఖర్, డి.గోపి, బి.ఉమామహేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, వై.లక్ష్మణ్, బి. మహేశ్వరరావు, కె.బ్రహ్మాజీ, జె. కృష్ణ, పాల్గొన్నారు. -
రేడియాలజీ సదస్సు ప్రారంభం
మహారాణిపేట: శుక్రవారం గీతం మెడికల్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్ ఆఫ్ ఇండియా రేడియాలజికల్ ఇమేజింగ్ అసోసియేషన్ (ఏపీఐఆర్ఐఏ) ఆధ్వర్యంలో మూడు రోజుల సదస్సు మొదలైంది. మొదటి రోజు ఫీటల్ రేడియాలజీపై ప్రత్యేక వర్క్షాప్ జరిగింది. సుమారు 100 మంది రేడియాలజిస్టులు పాల్గొన్నారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ కృష్ణ మూడు నెలల గర్భధారణ దశలో భ్రూణ వ్యాధులను ఎలా గుర్తించాలో తెలిపారు. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శిల్పా సతర్కర్ ఆరు నెలల గర్భిణుల స్కానింగ్ పద్ధతులను వివరించారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ భవాహరణ్ ఫీటల్ ప్రొసీజర్స్ను ప్రదర్శించారు. సిమ్యులేషన్ ఆధారిత సూదితో ఫీటల్ ఇంటర్వెన్షన్ శిక్షణ ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఏపీఐఆర్ఐఏ రాష్ట్ర అధ్యక్షుడు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వి.సురేష్, నిర్వాహక కార్యదర్శి, ఏపీ ఐఆర్ఐఏ నిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, కేజీహెచ్ రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ బుజ్జిబాబు, ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ వర్మ (అపోలో ఆస్పత్రి) తదితరులు పాల్గొన్నారు. -
జల దిగ్బంధం
వరద నీటిలో యాదగిరిపాలెంమునగపాక: తీరం దాటి శాంతించింది అనుకున్న మోంథా తుపాను మండలంలోని యాదగిరిపాలేన్ని ముంచేసింది. గ్రామస్తులు గురువారం తెల్లవారుజాము నుంచి జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. అధికారుల ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా శారదానదిలో నీటి తీవ్రత రోజురోజుకు పెరిగిపోయింది. ఈ కారణంగా లోతట్టు గ్రామమైన మెలిపాక శివారు యాదగిరిపాలెంలోకి తెల్లవారుజామున 4 గంటలకు వరదనీరు వచ్చి చేరడంతో గ్రామస్తులంతా ఆందోళనకు గురయ్యారు. ప్రధాన రహదారిపైకి వరదనీరు రావడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేకుండాపోయాయి. వర్షా కాలంలో లోతట్టు ప్రాంతాలైన గణపర్తి, చూచుకొండ, మెలిపాక, యాదగిరిపాలెం తదితర గ్రామాలకు వరద ముప్పు ఉంటుంది. కూటమి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ముంపు సమస్య తలెత్తిందంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన పంట పొలాలు ముగినిపోవడంతో పాటు పలు ఇళ్ల ముందు వరద నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది. గురువారం సాయంత్రం మళ్లీ భారీ వర్షం కురుస్తుండడంతో భయం గుప్పిట్లో ప్రజలు జీవనం సాగిస్తున్నారు. మండల ప్రత్యేకాధికారి రహీంతో పాటు మండల స్థాయి అధికారులు వరద తీవ్రతను అంచనా వేస్తూ ప్రజలు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు చేపట్టారు. వరద బాధితుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యాదగిరిపాలెం పొలాల్లోకి వరదనీరు వచ్చి చేరడంతో రైతులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గణపర్తి వద్ద శారదానది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ గ్రామస్తులు కూడా కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
ముంచెత్తిన వరద.. అల్లాడిన ప్రాణాలు
సాక్షి, అనకాపల్లి/అచ్యుతాపురం రూరల్: మోంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు శారదానది ఉప్పొంగింది. రాత్రి వేళ సమీప వై.లోవ గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. శారదానది అనకాపల్లి, కశింకోట, మునగపాక, యలమంచిలి మండలాల మీదుగా ప్రవహించి రాంబిల్లి మండలం వై.లోవ గ్రామ సమీపంలో ఉన్న ఉప్పటేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది. అయితే శారదానది సముద్రంలో కలుస్తున్న ప్రాంతంలో నేవెల్ బేస్ రక్షణ గోడ(ఎన్ఏవోబీ) నిర్మాణం చేపట్టడం, అక్కడ ఏర్పాటు చేసిన ఇనుక జాలీల కారణంగా నదిలో కొట్టుకొచ్చిన వ్యర్థాలు నీటి ప్రవాహానికి అడ్డుగా నిలిచిపోవడంతో వై.లోవ గ్రామం వద్ద గండి ఏర్పడింది. ఇది కాస్త పెద్దదై సమీప పంట పొలాలు, ఆక్వా చెరువులోకి వరద ముంచెత్తింది. దీంతో వేలాది ఎకరాలు, వందలాది ఆక్వా చెరువులు నీట మునగగా.. వరద నీరు వై.లోవ గ్రామంలోకి చొచ్చుకుపోయింది. రెండు రోజులుగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాగునీరు, భోజన వసతులను అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం కలెక్టర్ విజయకృష్ణన్, స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి చూసి వెళ్లిపోయారే తప్ప తమ బాగోగులు చూడలేదంటూ వై.లోవ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు, వర్షాలు సంభవించినప్పుడు చుట్టం చూపుగా చూసి వెళ్లిపోవడం కాదని, తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ఏటా వరదలు వచ్చినప్పుడు గ్రామంలో ఇద్దరు, ముగ్గురు శారదానది ప్రవాహంలో కొట్టుకుపోయి మృత్యువాత పడుతున్నారని వాపోయారు. గ్రామానికి ఓ వైపు నేవెల్ బేస్ రక్షణ గోడ నిర్మాణం చేపట్టడం కారణంగా పశువులకు పశుగ్రాస కొరత ఏర్పడిందని మండిపడ్డారు. -
నీట మునిగిన చూచుకొండ–గణపర్తి బ్రిడ్జి
●రాకపోకలకు అంతరాయంచూచుకొండ–గణపర్తి గ్రామాల నడుమ బ్రిడ్జిపైకి వచ్చి చేరుతున్న వరదనీరు, (ఇన్సెట్) చూచుకొండలో వరద తీవ్రతను అడిగి తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్ సిన్హా మునగపాక: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని చూచుకొండ–గణపర్తి గ్రామాల నడుమ రోలుగెడ్డపై నిర్మించిన బ్రిడ్జిపై వరదనీరు వచ్చి చేరింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ మార్గం గుండా మండల కేంద్రమైన మునగపాక, అలాగే అచ్యుతాపురం, యలమంచిలి పట్టణాలకు పలు పనులపై రాకపోకలు సాగిస్తుంటారు. అయితే గురువారం తెల్లవారుజాము నుంచి బ్రిడ్జిపైకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎస్పీ తుహిన్ సిన్హా గురువారం స్వయంగా పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాదగిరిపాలెం ప్రజలు ఇళ్ల నుంచి అత్యవసరమైతేనే రావాలన్నారు. గణపర్తి వద్ద శారదానది ఉధృతిని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక అధికారులను ఆదేశించారు. -
వరద బీభత్సం
వైఫల్యానికి మూల్యం.. రాంబిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆశ్రయం పొందినముంపు గ్రామాల బాధితులు రాంబిల్లి మండలంలో రజాల అగ్రహారం వద్ద నీట మునిగిన వరి పంట అష్ట దిగ్భంధనంలో వై.లోవ శారదా నదికి రెండో వైపున్న కలవలాపల్లి, వై.లోవ గ్రామాల్లోకి శారదా నది నుంచి వచ్చిన వరద నీటితో తమ పుట్టీలు, వలలు కొట్టుకుపోయాయని స్థానికులు చేసిన ఫిర్యాదుకు స్పందన లేకపోయింది. భవిష్యత్ అవసరాల కోసం నేవల్ బేస్ తీసుకున్న కొండల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం వై.లోవ ముంపు తీవ్రత పెరిగేందుకు కారణం అయ్యింది. వై.లోవ పరిధిలో నిరాశ్రయులైన 30 కుటుంబాలను రాంబిల్లి పునరావాసానికి గురువారం తరలించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్కు సహకరిస్తున్న అఽధికారులు గ్రామాల తరలింపు, పునరావాసం, నదుల గట్ల పటిష్టత, అప్రమత్తతపై శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. వరద వల్ల ఐదు వేల ఎకరాలు నీట మునగగా..1056 ఎకరాలు మాత్రమే ముంపునకు గురయ్యాయని జిల్లా స్థాయి అధికారి సెలవివ్వడం గమనార్హం. -
తక్షణం పంట నష్టపరిహారం అందించాలి
బుచ్చియ్యపేట: జిల్లా వ్యాప్తంగా నీట మునిగిన ఐదు వేల ఎకరాల పంటకు తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ అన్నారు. స్థానిక వడ్డాది, విజయరామరాజుపేట జంక్షన్ల వద్ద తుఫాన్ కారణంగా నీటిమునిగిన పంటలను పరిశీలించి, విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. మండలంలో వడ్డాది,విజయరామరాజు పేట బ్రిడ్జి కొట్టుకు పోవడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనబడుతుందన్నారు. కంటి తుడుపుగా మరమ్మతులు చేస్తున్నారని, దీనివల్ల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు. గుంతలు లేని రోడ్లు నిర్మిస్తామమని అధికారంలోకి వచ్చారని కానీ ఎక్కడా రోడ్లు నిర్మించలేదని విమర్శించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దొండ రాంబాబు, మండలపార్టీ అధ్యక్షుడు కె.అచ్చంనాయుడు, సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కోవెల జనార్థనరావు, వైస్ ఎంపీపీలు దొండ లలిత నారాయణమూర్తి, గొంప చిన్నబాబు, ఎంపీటీసీ కొరుకొండ రమణ, నాయకులు జోగా కొండబాబు పాల్గొన్నారు. -
కాకి లెక్కలొద్దు... తుఫాన్ బాధితులందరినీ ఆదుకోవాలి
అనకాపల్లి : మోంథా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రజానీకం వివరాలను గ్రామాల వారీగా సేకరించి శాసీ్త్రయమైన పద్ధతిలో నష్టపరిహారం చెల్లించాలని, ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు లేకుండా ఏర్పాటు చేయడం అన్యాయమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం తెలిపారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు రోజుల నుంచి మోంథా వల్ల పంట భూములకు, దళితులు, గిరిజనులు, వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులకు తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి పప్పు, బియ్యం, పంచదార, నూనె, దుంపలు ఇస్తామని ప్రకటించి నేటికీ అందజేయలేదన్నారు. జిల్లాలో అన్ని విధాలుగా నష్టపోయిన ప్రజలకు సహాయ, సహకారాలు, నిత్యావసర సరుకులు అందించాలని, ప్రభుత్వ అధికారులు కాకిలెక్కలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకొని పంటనష్టం అంచనా వేయాలని, గృహాలు కూలిపోయిన వారికి మరలా గృహాలు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలన్నారు. పంటలు నీటమునిగిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, వర్షాల కారణంగా గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీలు, కాలువలు పూడికపోయాయని, యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలని, అంటు వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు, కాలువలు, కూలిన బ్రిడ్జిలకు అంచనా వేసి నిధులు కేటాయించి వెంటనే పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. -
● ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయిన అధికారులు ● కొరవడిన అప్రమత్తత, సన్నద్ధత
శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఎంత కష్టం: రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు చిన్నారులతో ఓ మహిళ అవస్థ.. వై.లోవ గ్రామం నుంచి వరద బాధితులను ఈ కేంద్రానికి తరలించారు.. రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలో మేజర్, మైనర్ శారదా నదులకు బుధవారం అర్ధరాత్రి గండిపడింది. బుధవారం తుపాను తీవ్రత తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ముందున్న గండాన్ని అంచనా వేయలేకపోయారు. వారి అలసత్వానికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రైవాడ జలాశయం నుంచి భారీ ఎత్తున నీటిని విడుదల చేసిన అధికారులు.. అందుకు తగ్గట్టుగా ప్రభావిత ప్రాంతాలను అప్రమత్తం చేయలేకపోయారు. సముద్రతీరానికి ఆనుకొని ఉన్న రాంబిల్లితోపాటు, యలమంచిలి, అచ్యుతాపురం, మునగపాక, కశింకోట మండలాలకు ఆనుకొని ఉన్న శారదా నదీ ప్రవాహ ప్రాంతాల్లో పరిస్థితి చేజారుతుందని గతంలో అప్రమత్తం అయ్యేవారు. కానీ ఇప్పుడు రాంబిల్లి, మునగపాక మండలాల్లో మారుతున్న పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోయారు. తదనుగుణంగానే మునగపాక మండలంలోని యాదగిరిపాలెం వరద ముంపులోకి వెళ్లిపోయింది. రాంబిల్లి మండలంలోని నారాయణపురం వద్ద మైనర్ శారదా నదికి గండిపడటంతో ఆ ప్రాంత పరిసరాలన్నీ నీటి దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. మేజర్ శారదా నదికి రజాల అగ్రహారం, కొప్పుగొండుపాలెం పరిసరాల్లో గండి పడటంతో సుమారు రెండు వేల ఎకరాలకు పైగా పంట భూములు ,చేపల చెరువులు వరదమయం అయ్యాయి. శారదా నదికి గండి పడిన వైపు ఉన్న మర్రిపాలెం, కట్టబోలు, మురకాడ, తెరువుపల్లి, దిమిలి, నారాయణపురం గ్రామాల పరిధిలోని పంటంతా నీటి పాలవ్వడంతో గురువారం రాత్రి ఎలా గడుస్తుందోనన్న ఆందోళన నెలకొంది. అప్రమత్తమై ఉంటే.. మైనర్ శారదా నది గట్లు బలహీనంగా ఉన్నాయని అప్పటికే రైతులు ఇసుక బస్తాలు వేసుకొని గట్లను పటిష్టం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో అధికార గణం అప్రమత్తమై ఉంటే కాస్త నష్ట తీవ్రత తగ్గి ఉండేది. నారాయణపురం కెనరా బ్యాంక్ వద్ద పడిన గండి, రజాల అగ్రహారం పరిధిలోని మేజర్ శారదా నదికి పడిన గండితో అధికారుల్లో కలవరం మొదలయ్యింది. సహాయక చర్యలు చేపట్టాల్సిన కొందరు సిబ్బంది దిమిలి పరిసరాల్లో వాహనాల్లో సేద తీరినట్లు కొందరు గుర్తించారు. కొత్తూరు వద్ద నిమ్మతోటలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. -
భయం గుప్పెట్లో..
యలమంచిలి రూరల్: మోంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు శారదానది మహోగ్రరూపం దాల్చింది. బుధవారం సాయంత్రం నుంచి నదిలో ప్రవాహ ఉధృతి క్రమంగా పెరిగి గురువారం ఉదయానికి ఉప్పొంగి ప్రవహించింది. నదిలో నీటి ప్రవాహ ఉధృతికి గట్లు బలహీనంగా ఉన్న చోట్ల గండ్లు పడ్డాయి. యలమంచిలి, రాంబిల్లి మండలాల సరిహద్దులో నారాయణపురం వద్ద గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మైనర్ శారదానదికి గండి పడడంతో సమీపంలో నివాస గృహాలు, వరి పొలాలు నీట మునిగాయి. సాయంత్రానికి వరి పొలాలు చెరువును తలపించాయి. యలమంచిలి–గాజువాక రోడ్డులో నారాయణపురం వద్ద మైనర్ శారదా వంతెన పైనుంచి సుమారు 5 అడుగుల ఎత్తులో ప్రవహించడంతో ఆ మార్గం మీదుగా రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. సోమలింగపాలెం, తెరువుపల్లి వద్ద శారదానది గట్లు బలహీనంగా ఉండి గండ్లు పడే అవకాశం ఉన్న చోట్ల రైతులే స్వయంగా ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. శారదానది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే ముందు జాగ్రత్తగా పలుచోట్ల రైతులు తమ పశువులను ఎత్తైన ప్రదేశంలోకి తరలించారు. శారదానది శాంతించాలని రైతులు నదీమతల్లికి పూజలు చేస్తున్నారు. -
గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
దేవరాపల్లి: తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టినందున గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపర్చడంపై అధికారులు దృష్టి సారించాలని ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి అన్నారు. మండలంలోని వాకపల్లి గ్రామంలో స్థానిక ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, డీఎల్డీవో ఎస్.మంజులవాణి తదితరులతో కలిసి ఆయన గురువారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని రక్షిత మంచినీటి పథకం, చెత్త సంపద కేంద్రాలను పరిశీలించారు. వీధుల్లో పర్యటించి పారిశుధ్య పరిస్థితిని పర్యవేక్షించారు. రక్షిత మంచినీటి పథకాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచడంతో పాటు క్లోరినేషన్ చేసేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సువర్ణరాజును ఆదేశించారు. క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయడం ద్వారా అంటు రోగాలు ప్రబలకుండా నిరోధించవచ్చునన్నారు. ప్రతి ఇంటి వారు తడి, పొడి చెత్తను హరిత రాయబారులకు అందించేలా వారిలో అవగాహన పెంచాలని స్థానిక ప్రభుత్వ ఉద్యోగులకు సూచించారు. చాలా మంది చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారని, దీంతో కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన ఆయన పంచాయతీ కార్యదర్శులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపై నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీఎల్డీవో, మండల ప్రత్యేక అధికారి ఎస్.మంజులవాణి, ఎంపీడీవో సువర్ణరాజు, డిప్యూటీ ఎంపీడీవో కిరణ్ వరప్రసాద్, పరిపాలన అధికారి లక్ష్మీనారాయణ, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ కె.చంద్రశేఖర్, వెలుగు ఏపీఎం ఎస్. ప్రభాకర్, స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ త్రినాథ్, సర్పంచ్ భుగత రాజేశ్వరీ వెంకటరావు, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ పాల్గొన్నారు. -
వరదనీటిలో స్వయంభూ లింగం
●ముంపునకు గురైన వామలింగేశ్వర ఆలయం వరదనీటితో నిండిన వామలింగేశ్వర ఆలయం, (ఇన్సెట్) నీట మునిగిన స్వయంభూ లింగం మాకవరపాలెం: పెద్దమిల్లు జంక్షన్లో ఉన్న వామలింగేశ్వరాలయం వరద నీటిలో చిక్కుకుంది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి ఆలయంలో లోపలకు భారీగా నీరు చేరింది. ఆలయ ఆవరణే కాకుండా గర్భగుడిలో ఉన్న స్వయంభూ లింగం సైతం నీట మునిగింది. దీంతో కార్తీక మాసంలో జరిగే నిత్య పూజలకు అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాలు కురిసినపుడల్లా ఆలయం పక్కనే ఉన్న జంగం గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్షాలకు ఈ గెడ్డ నుంచి వెళ్లే వరదనీటి కారణంగా ఈ ఆలయం ముంపునకు గురైంది. చాలాకాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రాజాంలో ఘనంగా మరిడిమాండ పండగ
బుచ్చెయ్యపేట : మండలంలో గల ప్రసిద్ధి గాంచిన రాజాం మరిడిమాంబ పండగను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే గురువారం నాడు అమ్మవారి పండగను నిర్వహించడం ఆనవాయితీ. రాజాం, నీలకంఠాపురం,తైపురం మూడు గ్రామాల ప్రజలు సంయుక్తంగా అమ్మవారి పండగను ఘనంగా నిర్వహిస్తారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు. చైన్నెకు చెందిన భక్తుడు దామోదర్ రూ,500, 200, 100 నోట్లు 35 వేలతో తయారు చేసిన కరెన్సీ నోట్ల దండను అమ్మవారికి వేసి మొక్కు తీర్చుకున్నాడు. జోరు వాన కురుస్తున్నా మూడు గ్రామాల ప్రజలతో పాటు పలు గ్రామాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని అలరించాయి. -
పునరావాసంలో ప్రభుత్వం విఫలం
మునగపాక: ముంపు ప్రాంతాల్లో పునరావాసం కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, పార్టీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు. గురువారం వారు మునగపాక, రాంబిల్లి మండలాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం మునగపాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మోంఽథా తుపాను తీవ్రత గురించి ముందుగానే తెలిసినా అందుకు అనువుగా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పునరావాస కేంద్రాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. రాంబిల్లి, మునగపాక మండలాల్లో పలు చోట్ల పంట పొలాలు ముంపునకు గురైతే అధికారులు ఇచ్చిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. యాదగిరిపాలెంలో ముంపు తీవ్రత ఉంటుందని గ్రహించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విచారకరమన్నారు. ప్రభుత్వం ఊకదంపుడు ప్రచారం చేయడమే తప్ప రైతులను గాని, బాధితులను గాని ఆదుకోవడంలో శ్రద్ధ చూపించలేదన్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటన తుపాను కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలైన యాదగిరిపాలెం, గణపర్తి, చూచుకొండ గ్రామాల్లో గురువారం వైఎస్సార్సీపీ నేతలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్లు పర్యటించారు. ముంపు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటా ఇదే సమస్య తలెత్తుతున్నా అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడం సరికాదన్నారు. వారి వెంట మునగపాక, రాంబిల్లి మండలాల జెడ్పీటీసీలు పెంటకోట స్వామి సత్యనారాయణ, దూలి నాగరాజు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు ఆడారి అచ్చియ్యనాయుడు, పిన్నమరాజు కిషోర్రాజు, సర్పంచ్లు చదరం గణేష్నాయుడు, అయినంపూడి విజయభాస్కరరాజు, దొడ్డి సూరప్పారావు, ఎంపీటీసీ కాండ్రేగుల కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తాండవకు మరింత పెరుగుతున్న వరద నీరు
నాతవరం : తాండవ రిజర్వాయరులోకి ఇన్ఫ్లో నీరు పెరగడంతో రాత్రికి ఏ సమయంలోనైనా స్పిల్ వే గేట్ల ద్వారా నదిలోకి నీటిని విడుదలను పెంచే అవకాశం ఉందని ప్రాజెక్ట్ డీఈ ఆనురాధ అన్నారు. ఆమె గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ మోంథా తుఫాన్ ప్రారంభం నుంచి తాండవ రిజర్వాయర్ ప్రమాద స్థాయి నీటి మట్టాన్ని నివారించేందుకు నాలుగు రోజులుగా స్పిల్ వే గేట్ల ద్వారా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. తాండవ ప్రాజెక్టు ప్రమాద స్థాయిని బట్టి 350 క్యూసెక్కులు, తర్వాత రోజు 2400 క్యూసెక్కులు, రెండు రోజులుగా 1230 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 377.4 అడుగులు దాటలేదన్నారు. గురువారం ఉదయం నుంచి ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో 2900 క్యూసెక్కులు అధికంగా నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందన్నారు. దీంతో ప్రాజెక్ట్లో నీటిమట్టం గురువారం సాయంత్రానికి 378 అడుగులకు పెరిగిందన్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ఇన్ ఫ్లో నీటిని బట్టి ప్రాజెక్టు ప్రమాదం దృష్టిలో పెట్టుకుని స్పిల్వే గేట్ల ద్వారా నదిలోకి మరింత నీటిని రాత్రికి విడుదల చేసే అవకాశముందన్నారు. తాండవ ప్రాజెక్ట్ ప్రమాద స్థాయి నీటి మట్టం 380 అడుగులు అన్నారు. తాండవ నదిలోకి రాత్రి వేళల్లో దిగరాదని నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలకు దండోరా ద్వారా తెలియజేశామన్నారు. -
కొట్టుకుపోయిన పేట డైవర్షన్ రోడ్డు
బుచ్చెయ్యపేట: మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము ఐదు గంటల నుంచి ఏకధాటిగా కుంభవృష్టి కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునగగా పలు ఇళ్లల్లోకి వరద నీరు పొంగి ప్రవహించింది. బీఎన్ రోడ్డులో విజయరామరాజుపేట తాచేరు డైవర్షన్ రోడ్డు కోతకు గురై గండి పడింది. వడ్డాది పెద్దేరు నదిపై డైవర్షన్ రోడ్డు పూర్తిగా నీట మునిగి కోతకు గురైంది. రాజాం, సీతయ్యపేట రోడ్డులో అప్పలనాయుడు చెరువులో నీరు పొంగి రోడ్డుపై ప్రవహించింది. రాజాం వద్ద నీటి ప్రవాహంలో బైక్పై వెళుతున్న యువకులు అదుపు తప్పి నీటిలో పడిపోగా ప్రమాదం తప్పింది. పోలీసులు నీటి ప్రవాహంలోకి వెళ్లకుండా ట్రాఫిక్ను నిలిపివేశారు. పలువురు వాహనదార్లు, పాదచారులు నీటిలో నుంచి వెళ్లడానికి తీవ్ర అవస్ధలు పడ్డారు. పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పంట పొలాల్లో చేరిన వరద నీరు బయటకు పోయేలా రైతులు పొలం గట్లకు గండి కొడుతున్నారు. -
శారద ఉగ్రరూపం
సాక్షి, అనకాపల్లి: మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలతో శారదానది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి 9,056 క్యూసెక్కుల నీరు రైవాడ రిజర్వాయర్లోకి చేరడంతో..అధికారులు ముందస్తు ప్రణాళిక లేకుండా ఒక్కసారిగా 9,705 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో శారదానది ఉప్పొంగింది. అనకాపల్లి, కశింకోట, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి మండలాల్లో దాన్ని ప్రభావం చూపించింది. సుమారుగా ఐదు మండలాల పరిధిలో 20 గ్రామాలపై ప్రభావం చూపించింది. సుమారుగా 5 వేల ఎకరాల వరి పంట, 500 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆక్వా రైతుల సాగును ముంచేసింది. వై.లోవ గ్రామంలో పడిన గండి 7 గ్రామాల ముంపునకు కారణమైంది. వై.లోవ, రజాల అగ్రహారం, కుమ్మరాపల్లి, మర్రిపాలెం, అప్పన్నపాలెం, కట్టుబోలు, తెరువుపల్లి, మురకాడ, నారాయణపాలెం, చిన్నపాలెం, కొత్తూరు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మునగపాక మండలంలో చూచుకొండ, యాదగిరిపాలెంలో కిలోమీటరన్నర మేర శారదానది గట్టు వరకూ గురువారం వేకువ జామునే వరద పొంగింది. రాంబిల్లి మండలంలో సుమారుగా 1912 మందిని రాంబిల్లిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. 5 వేల ఎకరాల వరి పంట నీట మునిగింది. అదేవిధంగా గురువారం కూడా రైవాడ జలశయం నుంచి మరో 5,075 క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో రాత్రికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నటధికారులు అంచనా వేస్తున్నారు. కుటుంబాన్ని కాపాడిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను ప్రభావంతో శారదానది పరివాహక ప్రాంతంలో రాంబిల్లి మండలంలో కొత్తురు సమీపంలో జలాశయం మద్యలో పామాయిల్ తోట వద్ద ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు నీటిలో చిక్కుకున్నారు. కె.ప్రసాద్, సువార్త, చందులను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడారు. వారు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముంపు బాధితులకు పూర్తి సహాయ సహకారాలు : కలెక్టర్ రాంబిల్లి, మునగపాక మండలాల్లో శారదానది పరీవాహక ప్రాంతాల్లో కలెక్టర్ విజయ కృష్ణన్ పర్యటించారు. నీట మునిగిన గ్రామాల ప్రజలతో మాట్లాడి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
కార్యదర్శిపై దౌర్జన్యం చేసిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్
నక్కపల్లి : మోంఽథా తుఫాన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న రాజయ్యపేట కార్యదర్శి కాకర సత్యంపై దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది గురువారం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే తుఫాను సహాయక చర్యల్లో భాగంగా రాజయ్యపేట తుఫాన్ రక్షిత భవనంలో కార్యదర్శి సత్యం మరికొంతమంది సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నారు. ఈ సందర్భంగా బుధవారం గ్రామానికి చెందిన పిక్కి తాతయ్యలు, పిక్కి కోటి అలియాస్ రామచరణ్ తదితరులు వచ్చి కార్యదర్శిపై దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు. తుఫాన్ కేంద్రంలో గ్రామస్తులందరికీ భోజన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారన్నారు. అయితే ప్రభుత్వం కేవలం ముంపునకు గురైన వారిని, తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి మాత్రమే భోజన వసతి కల్పించాలని సూచించిందని, గ్రామస్తులందరికీ భోజనాలు కల్పించడం సాధ్యం కాదని చెప్పినప్పటికీ వినకుండా కార్యదర్శితో పాటు మిగిలిన సిబ్బందిని 3 గంటల పాటు నిర్బంధించారని అన్నారు. ఇలా అయితే గ్రామాల్లో విధులు నిర్వర్తించడం కష్టమన్నారు. తుఫాన్ సమయంలో విధి నిర్వహణలో ఉన్న తమపై దౌర్జన్యం చేసి నిర్బంధించిన గ్రామస్తులపై కేసు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాధిత ఉద్యోగులతో పాటు, వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఎంపీడీవో, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు, వీరంతా పోలీసుస్టేషన్కు వెళ్లి సీఐ మురళికి ఫిర్యాదు చేశారు. కార్యదర్శి, మహిళా పోలీస్, మరో సచివాలయ ఉద్యోగిపై దౌర్జన్యం చేసి నిర్బంధించిన పిక్కి తాతీయలు, పిక్కి కోటి, మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు సీఐ మురళి తెలిపారు. -
తాచేరు డైవర్షన్ రోడ్డు మూసివేత
● ఉధృతంగా ప్రవహిస్తున్న నది ● రాకపోకలకు ప్రజలు తీవ్ర అవస్థలుబుచ్చెయ్యపేట: భీమునిపట్నం–నర్సీపట్నం(బీఎన్) రోడ్డులోని విజయరామరాజుపేట డైవర్షన్ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మోంథా తుపాను కారణంగా తాచేరు నది ఉధృతంగా ప్రవహించడంతో డైవర్షన్ రోడ్డు కోతకు గురైంది. వాహనాల రాకపోకలతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన ఇన్చార్జి ఎస్ఐ పి.మనోజ్కుమార్, తహసీల్దార్ లక్ష్మి, తదితరులు డైవర్షన్ రోడ్డుపై నుంచి ఎటువంటి రాకపోకలు లేకుంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీ వడ్డాది డైవర్షన్ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో విశాఖ, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాడేరు, తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనచోదకులు నానా అవస్థలు పడ్డారు. కనీసం ఆటో సర్వీసులు కూడా లేకపోవడంతో అత్యవసరంగా ప్రయాణాలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల దూరం వరకు నడిచి గమ్యస్థానాలకు చేరుకున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రవాణా సదుపాయం కల్పించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.వడ్డాదిలో పూర్తిగా మునిగిపోయిన డైవర్షన్ రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీరుబుచ్చెయ్యపేట మండలం పేట తాచేరు డైవర్షన్ రోడ్డుకు అడ్డంగా రిబ్బన్లు కట్టిన పోలీసులు -
పునరావాసం.. నిరుపయోగం
అచ్యుతాపురం/మునగపాక/నాతవరం: మోంథా తుపాను పునరావాస కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. మౌలిక సదుపాయాలు కల్పించకుండానే హడావుడిగా ప్రారంభించిన కేంద్రాల్లో ఉండేందుకు నిర్వాసితులు ఉండలేక వెంటనే వెనుదిరిగారు. కేవలం ఆర్భాటాలు, గణాంకాల కోసమే ఏర్పాటు చేసిన ఈ పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులను పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. అనేక కేంద్రాల్లో విద్యుత్ లేదు. భోజనాలు సరఫరా లేదు. కనీసం మంచినీటి సౌకర్యం కల్పించలేదు. దీంతో నిర్వాసితులు ఈ కేంద్రాలపై కన్నెత్తి చూడలేదు. మోంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తీర గ్రామాల్లోనే కాకుండా ముంపు ప్రాంతాల్లో ఉండే వారిని తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం అధికారులు జిల్లాలో 76 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3902 మందిని తరలించినట్టు చెబుతున్నారు. అయితే వాటిలో వసతులు కల్పించలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. కొన్ని పునరావాస కేంద్రాల్లో పందికొక్కులు పడ్డాయి. నిర్వాసితులకు భోజనాల పేరుతో కొంత మంది అధికారులు, సిబ్బంది అడ్డంగా బొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 3,902 మందిని కేంద్రాలకు తరలించినట్లు చూపిస్తున్నప్పటికీ.. వారిలో చాలామందికి భోజనాలు అందించలేదు. వారికి ఇవ్వాల్సిన భోజనాలు ఏమయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేంద్రాలకు మరమ్మతులు, సదుపాయాలు, భోజనాలు, ఇతర వసతి సౌకర్యాల పేరుతో గట్టిగానే కొంత మంది అధికారులు, సిబ్బంది వెనకేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్వాసితులకు అందని ఆర్థిక సాయం ప్రభుత్వం పునరావాస కేంద్రాల్లో ఉండేవారికి రూ.వెయ్యి వంతున అందజేస్తామని చేసిన ప్రకటన ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. తమకు ఇంతవరకు ఉన్నతాఽధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని మునగపాక మండలం రామగిరి వీఆర్వో సాక్షికి తెలిపారు. తుపాను ప్రభావం తగ్గడంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న వారంతా తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం నగదు సకాలంలో ఇవ్వకపోవడంతో అధికారులు పునరావాస కేంద్రంలో ఉన్న వారి ఆధార్ కార్డు, ఇతర చిరునామా వివరాలు తీసుకుని పంపించేస్తున్నారు. ఈవిషయంపై నాతవరం తహశీల్దార్ ఎ,వేణుగోపాల్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో ఉన్నవారి వివరాలు సేకరించామని, నివేదిక ద్వారా కలెక్టరు పంపిస్తామన్నారు. ప్రస్తుతం ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని, బోజనం మాత్రమే పెట్టామన్నారు. పలుచోట్ల కాకి లెక్కలు చంద్రబాబు సర్కారు ప్రచార యావను ఆసరాగా చేసుకొని సందిట్లో సడేమియాలా పలుచోట్ల కాకి లెక్కలతో నిధులు భోంచేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న యలమంచిలి నియోజకవర్గ పరిధిలో మోంథా తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావించి ఏర్పాటు చేసిన పునరావాసం విషయంలో కాకి లెక్కలు కనిపిస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారి నివేదికల మేరకు బుధవారం మధ్యాహ్నం నాటికి నియోజకవర్గంలో 13 పునరావాస కేంద్రాల్లో బాధితులు తలదాచుకున్నట్లు తెలిపారు. 13 పునరావాస కేంద్రాల్లో సుమారు 681 మందికి పునరావాసం కల్పించినట్లు పేర్కొన్నప్పటికీ చాలా కేంద్రాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు సాక్షి బృందాలకు కనిపించాయి. వాస్తవంగా భోజనాలు చేసిన వారి కంటే లెక్కల్లో అధికంగా చూపినట్లు తెలుస్తోంది. అచ్యుతాపురం మండలంలోని రెండు పునరావాస కేంద్రాల్లో సదుపాయాలు నామమాత్రంగానే కనిపించాయి. మోంథా తుపానుతో జిల్లాలో 76 పునరావాస కేంద్రాల ఏర్పాటు ఈ కేంద్రాలకు 3,902 మందిని తరలించినట్లు లెక్కలు విద్యుత్, మౌలిక సదుపాయాలు లేకుండానే హడావుడి అనేక చోట్ల భోజనాలు కూడా ఏర్పాటు చేయని అధికారులు కొన్ని చోట్ల భోజనాలు పక్కదారి -
రిజిస్ట్రేషన్లకు విద్యుత్ కష్టాలు
విద్యుత్ సరఫరా లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్న జనం యలమంచిలి రూరల్: తుపాను ప్రభావంతో పలు చోట్ల చెట్లు నేలకొరగడంతో యలమంచిలి పట్టణం, మండలంలోని గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ముందుగా స్లాట్లు నమోదు చేసుకున్న కక్షిదారులు గంటల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించారు. బాటరీ బ్యాకప్ సరిగ్గా పనిచేయకపోవడంతో కక్షిదారులకు అవస్థలు తప్పలేదు. ఈ కార్యాలయం ద్వారా ఏటా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో ఇబ్బందులు పడుతున్నా ప్రజలు భరిస్తున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయంలో ఇబ్బంది లేకుండా జనరేటర్ సౌకర్యం కల్పించాలని కక్షిదారులు కోరుతున్నారు. -
పప్పన్నం కరువే.!
● విపత్కర పరిస్థితుల్లోనూ అందని రేషన్ కందిపప్పు ● 546 మెట్రిక్ టన్నుల సరఫరాకు ప్రభుత్వం ఎగనామంఅనకాపల్లి టౌన్: మోంథా తుపాను లాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పప్పన్నం దొరుకుతుందేమోనని ఎదురుచూసిన పేదలకు నిరాశే ఎదురైంది. పేదలు పౌష్టికాహారంగా కంది పప్పునే ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఈ కందిపప్పు సరఫరాను కూటమి ప్రభుత్వం నవంబర్లో కూడా నిలిపివేసింది. దీంతో జిల్లాలోని పేద లబ్ధిదారులపై కోట్లలో భారం పడుతుంది. సామాన్యుల దగ్గర నుంచి ధనవంతుడు వరకూ కందిపప్పును విరివిగా వాడుతుంటారు. అందుకే ధర ఎంతైనా కందిపప్పును కొనుగోలు చేస్తుంటారు. సామాన్యుడు మాత్రం రేషన్ డిపోల్లో లభించే కందిపప్పు కోసం ఆశగా ఎదురు చూస్తుంటాడు. కూటమి ప్రభుత్వం మాత్రం రేషన్ షాపుల్లో కందిపప్పు, రాగులు, గోధుమ పిండి సరఫరా పూర్తిగా నిలిపివేసింది. జిల్లాలో 5,37,038 మంది కార్డుదారులకు 14,99,000 యూనిట్దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెనా 7,652 మెట్రిక్ టన్నుల బియ్యం, 264 మెట్రిక్ టన్నుల పంచదార, 546 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 544 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 1628 మెట్రిక్ టన్నుల రాగులు సరఫరా చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ నిలిచిపోయాయి. పేదలకు నిత్యావసర వస్తువైన కందిపప్పును సరఫరా చేయలేని ప్రభుత్వం రాగులు, గోధుమ ఇంకేమి ఇస్తుందని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే రేషన్ షాపుల్లో పూర్తిగా కందిపప్పు సరఫరా నిలిపివేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం అర కేజీ పంచదార ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి రూ.120పైగా ఉంది. కూటమి నేతలు అధికారంలోకి రాక ముందు రేషన్ షాపులను బలోపేతం చేస్తామని, నిత్యావసరాలైన బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, రాగి పిండి తదితర వాటిని రాయితీపై అందజేస్తామని ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో ఒక్క నెల కూడా సరకులు సరఫరా చేయకపోగా.. విపత్కర పరిస్థితుల్లోనూ చేతులు ఎత్తేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. -
అన్నదాత గుండెల్లో తుపాను
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025వర్షాలు తగ్గినా వదలని కన్నీళ్లు సాక్షి, అనకాపల్లి: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురిశాయి. ఈ నెల 27 నుంచి 29వ తేది వరకు సగటున 12.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. మూడు రోజుల పాటు కుండపోతగా వర్షాలు కురవడమే కాకుండా తీర ప్రాంత మండలాలైన పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట, సబ్బవరంతోపాటు కె.కోటపాడు, అనకాపల్లి, కశింకోట మండలాల్లో అధికంగా వర్షపాతం నమోదైంది. బలంగా ఈదురుగాలులు వీచడంతో పలు చోట్ల చెట్లు కూలి ఇళ్లపై పడి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఎగువ ప్రాంతం నుంచి నీరు ఎక్కువగా చేరడంతో పెద్దేరు, తాండవ, రైవాడ, కోనాం, కల్యాణపులోవ రిజర్వాయర్లు ప్రమాదకరంగా మారాయి. వాటి నుంచి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడం, భారీ వర్షాలకు వంతెనలపై నుంచి వాగులు, గెడ్డలు పొంగి పొర్లడంతో కల్వర్టులు దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు 10,180 ఎకరాల్లో పంట దెబ్బతింది. వీటిలో 8,180 ఎకరాల్లో వరి పంట, 1500 ఎకరాల్లో చెరకు, 500 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అనకాపల్లి నియోజకవర్గంలో 2 వేల ఎకరాలు, చోడవరం నియోజకవర్గంలో 3 వేలు, యలమంచిలిలో 2 వేలు, పాయకరావుపేటలో 500, నర్సీపట్నంలో 580, మాడుగులలో 600, సబ్బవరం, పరవాడ మండలాల్లో 1000 ఎకరాల్లో పంట నీట మునిగింది. జిల్లావ్యాప్తంగా 31 విద్యుత్ స్తంభాలు ధ్వంసం అవ్వడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 210 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 13 పశువులు మృతి చెందగా.. జిల్లాలో 32 రహదారులు వరద నీటి ప్రభావంతో దెబ్బతిన్నాయి. జిల్లాలో తీర ప్రాంతం, లోతట్టు 136 గ్రామాలలో నివసిస్తున్న 3,902 మందిని గుర్తించి సురక్షితంగా 68 ప్రదేశాలలో ఏర్పాటు చేసిన 76 పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ బుధవారం నాటికి పునరావాస కేంద్రాల్లో సగం మంది కూడా లేరు. అదేవిధంగా నక్కపల్లి వీవర్స్ కాలనీలో వర్షం నీరు చేరింది. నేత కార్మికులు మగ్గాల్లోకి నీరు చేరడంతో రెండు రోజులుగా నేత నేసేందుకు ఇబ్బంది ఏర్పడిందని నేత కార్మికులు చెబుతున్నారు. మగ్గాలు తడిసిపోయాయని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు తుపాను ప్రభావంలో జిల్లాలో 150.67 కి.మీ మేర 32 ఆర్ అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయి. అనకాపల్లి, చోడవరం, సబ్బవరం, బుచ్చెయ్యపేట, యలమంచిలి, పరవాడ, ఎస్.రాయవరం, నక్కపల్లి, కె.కోటపాడు, నర్సీపట్నం, చీడికాడ, కశింకోట, నాతవరం, అచ్యుతాపురం మండలాల పరిధిలో రోడ్లు పాడయ్యాయి. వీటిలో ప్రధానంగా నర్సీపట్నం–భీమునిపట్నం బీఎన్ రోడ్డుపై, సబ్బవరం మండలంలో గుల్లేపల్లి–సబ్బవరం రోడ్డులో ఆదిరెడ్డిపాలెం వద్ద ఉన్న కాజ్వే పై నుంచి, కోటపాడు–పినగాడి రోడ్డులో మొగలిపురం శివార్లలో రోడ్డుపై నుంచి, ఆరిపాక–రాయపుర అగ్రహారం రోడ్డులోని పెద్దగెడ్డ బ్రిడ్జిపై నుంచి, చోడవరం–సబ్బవరం రోడ్డులోని టెక్కలిపాలెం జంక్షన్ వద్ద ప్రధాన రహదారిపై భారీగా ప్రవహించడంతో, బుచ్చెయ్యపేట మండలంలో వడ్డాది గ్రామంలో పెద్దేరు నదిపై ఉన్న డైవర్షన్ రోడ్డుపై నుంచి వరద నీరు అధికంగా ప్రవహించడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. రావికమతం మండలంలో తట్టబంద–రావికమతం రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. గొంప–రావికమతం రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొండకర్ల నుంచి గనపర్తి రోడ్డుల్లో ఒక కల్వర్ట్, చీడికాడలో జి.కొత్తపల్లి గ్రామంలో ఒక కల్వర్ట్ పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 380 డ్రెయిన్లు వర్షపునీటితో బ్లాక్ అయ్యాయి. ధ్వంసమైన ఇళ్లు: జిల్లావ్యాప్తంగా 210 ఇళ్లు ధ్వంసం అవ్వగా.. వాటిలో 48 పెంకుటిళ్లు, శ్లాబ్ ఇళ్లు ఉన్నాయి. 162 పాకలు, పూరి గుడిసెలు దెబ్బతిన్నాయి. కోటవురట్ల మండలం రామన్నపాలెంలో పెంకుటిల్లు కూలిపోయింది. రావికమతం మండలం టి.అర్జాపురంలో వేములపూడి రేకుల షెడ్డుపై చెట్టు పడడంతో ధ్వంసమైంది. ధర్మవరంలో రేకుల ఇంటిపై, యలమంచిలి సోమలింగపాలెంలో మరో ఇంటిపై చెట్టు కూలడంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాఠశాలల్లో పెచ్చులూడిన శ్లాబ్లు: అనకాపల్లి మండలంలో 41 ప్రభుత్వ స్కూళ్లలో శ్లాబ్లు పెచ్చులూడిపోయాయి. 48 స్కూళ్లలో గదుల్లో వర్షపు నీరు లీకై ంది. 23 స్కూళ్లలో ప్రహరీలు దెబ్బతిన్నాయి. 9 స్కూళ్లలో కిచెన్ షెడ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రోడ్డుపై పడిన భారీ వృక్షాలు: జిల్లావ్యాప్తంగా తుపాను ప్రభావంతో ఈదురుగాలులు బలంగా వీచడంతో 33 భారీ వృక్షాలు రోడ్డుపై పడిపోయా యి. ఎటువంటి ప్రాణనష్టం కలగకపోయినా..వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందిరైవాడ జలాశయం గేట్ల నుంచి విడుదలవుతున్న వరద నీరుదేవరాపల్లి: రైవాడ జలాశయం వరద గేట్లపై నుంచి నీటి విడుదలను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ మూడు రోజులపాటు సగటున 12.8 సెం.మీ వర్షపాతం ప్రమాదకరంగా జలాశయాలు.. పొంగిపొర్లుతున్న వాగులు జిల్లాలో 10,180 ఎకరాల్లో పంట నీట మునక పడిపోయిన 31 విద్యుత్ స్తంభాలు, 160 ఇళ్లు ధ్వంసం 13 పశువులు మృతి 150 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న 32 రహదారులు 76 పునరావాస కేంద్రాలకు 3902 మంది తరలింపు -
క‘న్నీళ్లు’కు పొర్లు కట్టు
ఓ మోస్తరు వర్షం పడినా వారు చివురుటాకులా వణికిపోయే వారు...తుఫాన్లు వస్తే వారి అవస్థలు చెప్పనలవికాదు... నాలుగు వైపుల నుంచి నీరు ముంచెత్తడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యేవారు... పునరావాస కేంద్రాలకు పరుగులు తీసేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఇంత పెద్ద మోంథా తుఫాన్ సమయంలో కూడా వారు హాయిగా ఇళ్లలోనే ఉన్నారు. దీనికి కారణంగా గత ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ చేసిన మేలేనని ఆ గ్రామస్తులు చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు. నాతవరం: మండలంలో వై.బి.ఆగ్రహారం మారుమూల గ్రామం. ఈ గ్రామానికి ఒకవైపు నిత్యం నీటితో నిండుగా ఉండే ఊర చెరువు, మరో పక్క కొండ గెడ్డ ఉన్నాయి. ఈ రెండే కాకుండా ఇంకో పక్క ఎగువ ప్రాంతంలో ఏలేరు కాలువ, వెర్రిగెడ్డ ఉన్నాయి. భారీ వర్షం పడినప్పుడు, తుఫాన్ల సమయంలో వీటి నీరంతా గ్రామంలోకి వచ్చేస్తుంది. ఆ సమయంలో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. తుఫాన్ల హెచ్చరికల సమయంలో అధికారులు ముందు జాగ్రత్తగా ఆ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. అలాంటిది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వీరి సుదీర్ఘ సమస్యకు మోక్షం కల్పించారు. గ్రామ సర్పంచ్ కొసూరి విజయ ఆధ్వర్యంలో గ్రామస్థులంతా కలిసి నీటి ముంపు సమస్యపై ఉమా శంకర్ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ఊర చెరువు నీరు గ్రామంలోకి రాకుండా రూ. 9 లక్షలతో పోర్లు కట్టు నిర్మించారు. తర్వాత గ్రామానికి ఎత్తులో ప్రవహించే కొండ గెడ్డ నీరు బయటకు పొర్లకుండా ఉండేందుకు పూడికతీత పనులు చేయించారు. ఖరీఫ్ ముందు కూడా ఈ పనులు చేశారు. మోంథా తుఫాన్ సమయంలో కూడా ఊర చెరువు, కొండ గెడ్డ నీరు గ్రామంలోకి రాలేదు. దీంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. గతంలో తుఫాన్ల సమయంలో కురిసే భారీ వర్షాలకు బావుల్లో తాగునీరు కలుషితమై గ్రామస్థులు ఇబ్బందులు పడేవారు. ఈ సారి ఆ సమస్య ఉత్పన్నం కాలేదు. ఏళ్లనాటి సమస్య పరిష్కరించారు తుఫాన్ల సమయంలో గ్రామాన్ని ఎప్పుడు గెడ్డల నీరు ముంచెత్తుతుందోనని భయంతో గడిపేవాళ్లం. ఊర చెరువు నీరు గ్రామంలోకి రాకుండా అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పోర్లుకట్టు నిర్మించి, చెరువును అభివృద్ధి చేశారు. అదే విధంగా కొండ గెడ్డ నీరు గ్రామంలోకి రాకుండా తాండవ ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి పూడిక తీత పనులు చే యించారు. దీంతో మోంథా తుఫాన్ సమయంలో మా గ్రామంలోకి నీరు రాలేదు. అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినా...వాటి అవసరం లేకపోయింది. – కోసూరి విజయ, గ్రామ సర్పంచ్ వై,బి,ఆగ్రహరం గత ఎమ్మెల్యే గణేష్ హయాంలో వై.బి.అగ్రహారంలో పొర్లుకట్టు నిర్మాణం దీంతో మోంథా సమయంలో తప్పిన ముప్పు నీటి ముంపు లేకుండా చేసిన గత ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు -
శ్రీవారి పుష్పయాగానికి పువ్వుల తరలింపు
ఎంవీపీ కాలనీ: శ్రీ వేంకటేశ్వరస్వామి పుష్పయాగానికి విశా ఖ నుంచి పువ్వులు తరలివెళ్లాయి. ఆధ్యాత్మికవేత్త హిమాన్షు ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన పూలను యాగానికి పంపించారు. బుధవారం ఎంవీపీ కాలనీలోని టీటీడీ ఈ–దర్శనం కౌంటర్ వద్దనున్న హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత టీటీడీ సలహా కమిటీ చైర్మన్ పట్టాభిరామ్ దంపతులు, మహిళా భక్తులు పూలకు సంకల్పం చేశారు. 3 వేల కలువలు, 2 వేల తామరలతోపాటు వివిధ రకాల పూలను తిరుమలకు తరలించారు. -
విశాఖ–బొబ్బిలి సెక్షన్లో భద్రతా ఆడిట్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధిలోని విశాఖపట్నం–బొబ్బిలి రైల్వే సెక్షన్లో బుధవారం సేఫ్టీ ఆడిట్ జరిగింది. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేకు చెందిన భద్రతా ఆడిట్ బృందం ఈ తనిఖీలను చేపట్టింది. ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ఉత్తమ్ ప్రకాష్ నేతృత్వంలో ఈ బృందం సెక్షన్ పరిధిలోని పలు స్టేషన్లలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించింది. పెందుర్తి–కొత్తవలస మధ్య గల మలుపులు, కొత్తవలస స్టేషన్లో పాయింట్లు, యార్డులు, క్రాసింగ్లు, అలమండ–కోరుకొండ మధ్య నిర్మించిన ప్రధాన బ్రిడ్జిలు, బొబ్బిలి స్టేషన్లోని రిలేరూం, కోమటిపల్లి యార్డ్, ట్రాక్షన్ సబ్స్టేషన్, లెవెల్ క్రాసింగ్ గేట్, కోచింగ్ క్రూ లాబీ, విశాఖపట్నం యార్డులో యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్మెంట్ వ్యాన్, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, న్యూ కోచింగ్ కాంప్లెక్స్, రన్నింగ్ రూంలు, రూట్ రిలే ఇంటర్లాకింగ్ కేబిన్లను పరిశీలించింది. సీనియర్ రైల్వే అధికారుల పర్యవేక్షణలో వివిధ రైల్వే జోన్ల మధ్య ఇటువంటి ఇంటర్ జోన్ సేఫ్టీ ఆడిట్లు తరచూ జరుగుతుంటాయని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆడిట్ ప్రారంభానికి ముందు డీఆర్ఎం లలిత్ బోహ్రా డివిజన్ భద్రతా అంశాలను ఆడిట్ బృందానికి వివరించారు. తనిఖీల్లో వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎం(ఆపరేషన్స్) కె.రామారావు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ఆనంద్కుమార్ ముటట్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైల్వే సేఫ్టీ ప్రమాణాలను పరిశీలించిన నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే బృందం -
భూ ఆక్రమణలపై తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
పోలేపల్లిలో భూకబ్జాపై గ్రామస్తుల ఆగ్రహంబుచ్చెయ్యపేట: మండలంలోని పోలేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సర్వే నంబర్ 156లో 216 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇటీవల గ్రామానికి చెందిన కూటమి నేతలు పొక్లెయిన్తో ఆ భూమిని చదును చేసి సుమారు 30 ఎకరాలను ఆక్రమించి యూకలిప్టస్ మొక్కలు నాటారు. మండలానికి మంజూరైన మోడల్ స్కూల్ నిర్మాణానికి కేటయించి, శిలాఫలకం వేసిన స్థలాన్ని కూడా కూటమి నేతలు ఆక్రమించారు. ఇందులో కొంత భూమిని చైన్నెకి చెందిన వ్యక్తికి విక్రయించగా , మరికొంత భూమిని విక్రయించేందుకు బేరానికి పెట్టారు. గ్రామంలో పలువురు సెంటు భూమి లేని నిరుపేదలుండగా బడాబాబులు, కూటమి నేతలు ప్రభుత్వ భూమిని ఆక్రమించడంపై గ్రామస్తులు మండిపడ్డారు. ఇటీవల సర్పంచ్ సీతా బుజ్జితో పాటు పలువురు ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణలకు పాల్పడిన కొంతమంది సర్పంచ్ కుటుంబ సభ్యులు, సర్పంచ్కు దన్నుగా ఉన్నవారిపై ఇటీవల దౌర్జన్యం చేశారు. దీనిపై ఆగ్రహించిన గ్రామానికి చెందిన మల్లోతు జోగినాయుడు, పెంటయ్య, పర్రె శివ, గాడి చిన్న, తుంపాల అప్పారావు, సీతా జోగినాయుడు తదితరులు బుచ్చెయ్యపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరు పేదలకు ఇళ్ల స్థలాలు, భూ పట్టాలు అందించాలని, ఇతర ప్రజా ప్రయోజనాలకు ప్రభుత్వ భూమిని వినియోగించాలని నినాదాలు చేశారు. భూ ఆక్రమణలు తొలగించాలని తహసీల్దార్ గదిని ముట్టడించారు. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఫోన్లో సమాచారం అందజేశారు. తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే గ్రామానికి వచ్చి, భూ ఆక్రమణలను తొలగిస్తామని తహసీల్దార్ లక్ష్మి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. వారం రోజుల్లో భూ ఆక్రమణలు తొలగించకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. -
ముడసర్లోవకు జలకళ
ఆరిలోవ: ముడసర్లోవ రిజర్వాయర్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. మోంథా తుపాను ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఈ రిజర్వాయర్కు జలకళ వచ్చింది. రిజర్వాయర్ చుట్టూ కంబాలకొండలు, సింహాచలం కొండలు ఉన్నాయి. మోంథా తుపాను వర్షాల వల్ల ఈ కొండల నుంచి రిజర్వాయర్లోకి 7.1 అడుగుల వరకు కొత్త నీరు చేరిందని ముడసర్లోవ నీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. తుపానుకు ముందు రిజర్వాయర్లో 157.5 అడుగుల నీరు ఉండేది. వరద నీటితో కలిసి ప్రస్తుతం నీటి మట్టం 164.6కు చేరింది. సాధారణంగా ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 170 అడుగులు. దీనిని ఓవర్ఫ్లో చేయడానికి మరో 5.4 అడుగుల నీరు మాత్రమే అవసరం. తుపాను ప్రభావంతో ఎక్కువ మొత్తంలో కొత్త నీరు చేరడంతో, ప్రస్తుతం ఆరిలోవ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.మోంథా తుపానుతో పెరిగిన నీటి మట్టం -
అధికారులు ఆదుకోవాలి
ఖరీఫ్ వర్షాలు ఆలస్యం కావడంతో ఇటీవల రెండు ఎకరాల పొలంలో నాట్లు వేశాను. ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి అయ్యింది. మోంథా తుఫాన్తో మొత్తం నీట మునిగింది. ఇప్పుడు పైనుంచి వరద నీరు పొంగుతూ వస్తుంది. ఇంకా తగ్గలేదు. పూర్తిగా పాడయ్యేలా ఉంది. అధికారులు పరిశీలించి పరిహారం ఇప్పించాలి. – కాసెపు శివ, రైతు, సర్వసిద్ధి, ఎస్.రాయవరం మండలం వ్యవసాయాన్నే నమ్ముకున్నాం తుపాన్ కారణంగా రెండు ఎకరాల్లో వరి పంట నేలకొరిగి తడిచి పోయింది. సుమారు రూ.50 వేలు పెట్టుబడులు పెట్టగా వరి కంకులు వేసి చేతికి పంట వచ్చే సమయంలో దెబ్బతింది. తిండి గింజలు దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యవసాయాన్నే నమ్ముకున్నాం. అధికారులు పంట నష్టం నమోదు చేసి ఆదుకోవాలి. –నందం శివ, ఎం.బి.పాలెం, రైతు, బుచ్చెయ్యపేట మండలం -
తుపాను బాధితులకు తక్షణం పరిహారం అందించాలి
సాక్షి, విశాఖపట్నం: మోంథా తుపాను ప్రభావంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. పంట నష్టపోయి, ఇళ్లు ధ్వంసమై కష్టాల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం తక్షణం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్రెడ్డితో పాటు పలువురు ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోంథా తుపాను వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. తుపాను బాధితులను పరామర్శించి, సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలందరినీ అభినందించారు. ప్రజలు ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని మరోసారి నిరూపించారంటూ ప్రశంసించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ఎస్ఈసీ సభ్యులు ఐహెచ్ ఫరూఖీ, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర, జోనల్ అనుబంధ విభాగాల అధ్యక్షులు పేర్ల విజయ్ చందర్, ద్రోణంరాజు శ్రీవత్సవ్, చెన్న జానకిరామ్, కార్పొరేటర్లు బర్కత్ అలీ, శశికళ, మహమ్మద్ ఇమ్రాన్, బిపిన్ కుమార్, జోనల్ యువజన జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, జిల్లా పార్టీ కమిటీ అధికార ప్రతినిధులు ఆల్ఫా కృష్ణ, పల్లా దుర్గ, మంచ నాగమల్లేశ్వరి, హరి కిరణ్ రెడ్డి, జిల్లా అనుబంధ కమిటీ అధ్యక్షులు బోని శివ రామ కృష్ణ, నీలి రవి, సనపల రవీందర్ భరత్, శ్రీదేవి వర్మ, శంకర్ బత్తుల ప్రసాద్, మార్కండేయులు, బొండా ఉమామహేశ్వరరావు, సకలబత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


