breaking news
Jangaon
-
‘విజయోస్తు’ వ్యూహం
జనగామ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గతనెల మొదటి వారం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత, మోడల్ స్కూల్స్, కేజీబీవీల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందుకు ప్రతీరోజు సాయంత్రం గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అందుకుగాను యాక్షన్ప్లాన్ రూపొందించారు. సకాలంలో సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేయనున్నారు. దీంతో పాటు కలెక్టర్ ప్రత్యేకంగా విద్యార్థులకు గైడ్ చేస్తూ ‘విజయోస్తు 2.0’తో ముందుకెళ్తున్నారు. మొదటి రోజు సాంఘిక శాస్త్రం, రెండో రోజు హిందీ, మూడోరోజు గణితం, నాలుగో రోజు ఆంగ్లం, ఐదో రోజు ఫిజికల్ సైన్స్, ఆరో రోజు సోషల్, ఏడో రోజు బయోలజీ సబ్జెక్టులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. తరగతుల నిర్వహణ ఇలా.. జిల్లావ్యాప్తంగా 102 ఉన్నత పాఠశాలలు, రెండు మోడల్ స్కూల్స్, 12 కుస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉండగా.. 6వేలకు పైగా మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. స్థానిక పరిస్థి తులకు అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణకు పక్కా ప్రణాళికలను రూపొందించారు. ఈనెల మొదటి వారం నుంచి జనవరి రెండోవారం వరకు రోజు సాయంత్రం 4:15 నుంచి 5:15గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం వార్షిక పరీక్షల వరకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రెండు పూటలా తరగతులు నిర్వహిస్తారు. అందులో రెగ్యులర్ తరగతులు బోఽ దించకుండా పునశ్చరణ, మూల్యాంకనంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రత్యేక తరగతులకు విద్యార్థులు విధిగా హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు విద్యా ప్రగతిపై విద్యార్థులతో చర్చించాలి. ప్రధానోపాధ్యాయుడు నిరంతరం పర్యవేక్షిస్తూ, చదువులో వెనుకబడిన వారిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహించాలి. వి ద్యార్థులు రాసిన జవాబులను పరిశీలించి, చర్చలతో సరిదిద్దాలి. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. అమలు ఇలా.. గతేడాది కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా చేపట్టిన విజయోస్తు ప్రణాళిక ద్వారా రాష్ట్రస్థాయిలో జిల్లా మూడోస్థానంలో నిలిచింది. ఈసారి మొదటిస్థానాన్ని చేరుకోవాలనే సంకల్పంతో అధికారులు ముందుకె ళ్తున్నారు. కలెక్టర్ ఆదేశానుసారం విజయోస్తు 2.0 ప్రణాళికను అమలుచేస్తున్నారు. జూన్ 12 నుంచే విజయోస్తు 2.0 కార్యక్రమాన్ని అన్ని ఉన్నత పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు 5 నుంచి 10 మంది విద్యార్థులను దత్తత తీసుకొని వారికో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి రోజూ సందేహాలను నివృత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నారు. అభ్యాసన దీపికలను ప్రతి విద్యార్థికి అందజేస్తున్నారు. విజయోస్తు కార్యాచరణలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రస్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా విద్యాశాఖ పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అభ్యాస దీపికలతో ఉపయోగం జిల్లాలోని పలు పాఠశాలలు పీఎంశ్రీ, సమగ్రశిక్షా అభియాన్ కింద నడుస్తున్నాయి. ఇందులో 3,622 మంది పదో తరగతి విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరికి మాత్రమే గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రాలకు సంబంధించిన తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఉన్న 16,628 అభ్యాస దీపికలు అందించారు. ఇప్పటికే బోధనకు సంబంధించి ప్రత్యేక షెడ్యూల్ తయారు చేశారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారు సులువుగా ఉత్తీర్ణులయ్యేలా అభ్యాస దీపికల ద్వారా మెరుగుపరిచేలా విద్యాశాఖ అధికారులు కృషిచేస్తున్నారు. రాష్ట్రంలో పదో తరగతిలో మొదటి స్థానమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. విజయోస్తు 2.0, అభ్యాసన కరదీపికలతో ప్ర త్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీ ర్ణత సాధించే లక్ష్యంతో సబ్జెక్టు టీచర్లు ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలి. ప్రత్యేక తరగతుల కోసం విధిగా రిజిస్టర్ నిర్వహించాలి. – కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషామండలం విద్యార్థులు బచ్చన్నపేట 562 చిల్పూర్ 280 దేవరుప్పుల 361 స్టే.ఘనపురం 962 జనగామ 1,585 కొడకండ్ల 387 లింగాల ఘణపురం 339 నర్మెట 391 పాలకుర్తి 622 రఘునాథపల్లి 435 తరిగొప్పుల 134 జఫర్గఢ్ 368 మొత్తం 6,426 పదో తరగతి ప్రత్యేక బోధనకు యాక్షన్ ప్లాన్ 2.0 కొనసాగుతున్న స్పెషల్ క్లాసులు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వందశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా ముందుకు గతేడాది రాష్ట్రస్థాయిలో 3వ స్థానం జిల్లావ్యాప్తంగా 6వేలకు పైగా పరీక్ష రాయనున్న విద్యార్థులు -
నాలుగు తరాల ‘కల్వా’ కుటుంబం
జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఐనవోలు ఆదివారం కుటుంబానుబంధాలకు వేదికై ంది. ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాలు తాతలు, అమ్మమ్మలు, కోడళ్లు, అల్లుళ్లు, కొడుకులు, కూతుళ్లు, మనవలు, మునిమనవలు ఇలా శ్రీకల్వాశ్రీ కుటుంబానికి చెందిన సుమారు 150 మంది సభ్యులు ఒకేచోట కలిశారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు అమెరికా, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఈ పుణ్యక్షేత్రానికి చేరుకున్న కుటుంబ సభ్యులు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ తాతలు, అమ్మమ్మలు, నానమ్మలకు పాదపూజ చేసి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం గోమాతకు పూజలు చేసి, ఆవును దానం చేశారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాలను బలపరచడమే కాక, చిన్నతరానికి పెద్దల విలువలు పరిచయం చేసే వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది. కుటుంబ కలయికలు తరతరాల బంధాన్ని గుర్తు చేయడంతో పాటు ప్రేమను మరింత బలపరుస్తాయని పెద్దలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐనవోలు పుణ్యక్షేత్రంలో వెల్లివెరిసిన అనుబంధం -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
బీబీనగర్, రాజాపేట: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన ఆదివారం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గర్ధాసు నర్సింహులు, మహేశ్వరి దంపతుల కుమారుడు గర్ధాసు ప్రశాంత్(32)కు జనగామ జిల్లా పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన ప్రసూన(28)తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వారు ప్రస్తుతం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లోని టెలిఫోన్ కాలనీలో ఉంటున్నారు. ప్రశాంత్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం భార్యాభర్తలు కలిసి ద్విచక్ర వాహనంపై భువనగిరి వైపు వస్తూ.. బీబీనగర్ పెద్ద చెరువు వద్ద హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి పక్కన ఆగారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మహేంద్ర థార్ వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో ప్రసూన బైక్తో పాటు చెరువులో పడిపోగా ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో పడిన ప్రసూనను బయటకు తీయగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహేంద్ర థార్ వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్ షణ్ముఖ్తో పాటు డోర్నాల భార్గవ్, కొండ సైరిత్కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గర్ధాసు ప్రశాంత్ దంపతుల మృతితో రాజాపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు యువకులకు గాయాలు బీబీనగర్లో ఘటన -
నేటి ప్రజావాణి రద్దు
జనగామ రూరల్: కలెక్టరేట్లో ఈనెల 3న(సోమవారం) జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో నష్ట ప్రభావంపై ప్రాథమిక అంచనా కోసం సర్వే చేస్తున్న కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజావాణి రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. పాలకుర్తి/దేవరుప్పుల/జఫర్గఢ్: మోంథా తుపాను ధాటికి జరిగిన పంటనష్టాన్ని అంచనా వేస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి అంబికా సోని చెప్పారు. ఆదివారం పాలకుర్తి మండలం లక్ష్మినారాయణపురం, గూడూరు, దేవరుప్పుల మండలం రామచంద్రాపురం, జఫర్గఢ్ మండలం తిడుగు, సాగరం గ్రామాల్లో తుపానుతో నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమెతో కలిసి పంట నష్టం అంచనాలో పాలకుర్తి మండలంలో వ్యవసాయ సంచాలకుడు కరుణాకర్, ఆజ్మీర పరశరామునాయక్, మండల వ్యవసాయ ఎస్.కరుణాకర్, ఏఈవోలు, జఫర్గఢ్ మండలంలో ఏడీఏ వసంత సుగుణ, ఏఓ చంద్రన్కుమార్, ఏఈఓలు రవి, కుమార్, ప్రశాంత్తో పాటు ఆయా గ్రామాల రైతులు ఉన్నారు. జనగామ రూరల్: ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను చర్చించడానికి నూతనంగా విద్యారంగంలో వస్తున్న మార్పుల దిశగా ఉపాధ్యాయులను కార్యోన్ముఖులను చేయడానికి డిసెంబర్ 28, 29తేదీల్లో జనగామ జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా మహాసభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి చెప్పారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్, రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేశ్, రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు విద్యా దేవి సదానందం, సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్, కోశాధికారి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేలాది మంది తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్లకు పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. తల్లుల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో భాగంగా గద్దెల చుట్టూ సాలహారం నిర్మాణం పనులు సాగుతుండడంతో భక్తులను పోలీస్ కమాండ్ కంట్రోల్ ద్వారా మీడియా పాయింట్ పక్కన ఉన్న గేట్ నుంచి వెళ్లి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద భోజనాలు చేశారు. -
సిండికోట రహస్యం
మద్యం షాపుల లైసెన్స్ల కొనుగోలు వెనక అసలు కథ! జనగామ: జిల్లాలో ఇటీవల మద్యం టెండర్ల లాటరీ పూర్తయ్యాక వైన్స్ వ్యాపారంలో సిండికేట్ రాజకీయాలు ఊపందుకున్నట్లు సమాచారం. లాటరీలో లక్కు తగలని పాత వ్యాపారులు, కొత్తగా లైసెన్స్ పొందిన వారితో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, వ్యాపారాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. ఈక్రమంలో రూరల్ ప్రాంతాల్లోని వైన్స్షాపులు, బెల్ట్షాపులు కలసి ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మకాలు చేసి..ప్రైవేటు కొనుగోలు సొమ్మును రికవరీ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మార్పీ కంటే అధిక వసూళ్లు? నూతన మద్యం పాలసీ విధానంలో 2025–27 రెండేళ్లకుగాను కొత్త వైన్స్షాపులు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి లాటరీలో అవకాశం రాని పాత వ్యాపారులు, కొత్తగా లైసెన్స్ పొందిన వారి నుంచి రూ.90 లక్షల నుంచి రూ.1.30 కోట్ల వరకు ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి.. ఎలా రాబట్టుకుంటారనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. రూరల్ ప్రాంతాల్లో రెండు నుంచి ఆపై వైన్స్ దుకాణాలు ఉండగా, చాలా చోట్ల సిండికేటు అవతారం ఎత్తుతారు. రెగ్యులర్ అమ్మకాలతో సంబంధం లేకుండా కేవలం బెల్ట్ దుకాణాల సేల్ కోసం సిండికేట్గా మారుతారు. మండలాల పరిధిలో అన్ని షాపులకు కలుపుకుని ఒక్కే ఒక్క దుకాణం ద్వారా బెల్ట్కు బాటిల్స్ అమ్మకాలు చేస్తారు. ఇదే సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీకి మించి బెల్ట్ దుకాణాలకు మద్యం అమ్మకాలు చేస్తారు. బెల్ట్ దుకాణాలకు ఇచ్చే ఒక్క క్వార్టర్పై రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు సైతం అనేకం. ఇక్కడ కొనుగోలు చేసిన సరుకును బెల్ట్షాపునకు తీసుకెళ్లిన తర్వాత, మరో రూ.15 కలిపి అమ్మకాలు చేస్తారు. దీంతో రూ.160 విలువైన క్వార్టర్ బాటిల్ కాస్తా, బెల్ట్ కౌంటర్లో రూ.190కి పెరుగుతుంది. చాలా మంది మద్యం ప్రియులు రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బు ను బెల్ట్ దుకాణంలో క్వార్టర్కు సుమారు 22శాతం మేర అదనంగా ఖర్చు చేసి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. బీరుపై ఎమ్మార్పీ రూ.180 ఉండగా, బెల్ట్లో మాత్రం రూ.220లకు అమ్ముతున్నారు. సిండికేట్ డీల్ వెనుక లెక్కలు రెండేళ్ల లైసెన్స్ కాలంలో బెల్ట్షాపుల ద్వారా సుమారుగా రూ.24 కోట్ల వ్యాపారం జరుగుతుందని అనుకుంటే.. ఇందులో బెల్ట్ దుకాణాల ద్వారా 6 నుంచి 7 శాతం అదనపు వసూళ్లతో దాదాపు రూ.1.20 కోట్ల లాభం రావచ్చని అంచనా వేస్తున్నారు. లాటరీలో లక్కు తగలని వ్యాపారులు, కోట్లు బేరసారాలతో కొత్త లైసెన్స్ కొనుగోలు చేసి, బెల్ట్ దుకాణాల ద్వారా అదనంగా రాబట్టే సొమ్ముతో రికవరీ చేసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మద్యం వ్యాపారంలో ఉన్న ఈ గోల్మాల్ దందాతో సాధారణ ప్రజల జేబులే గుల్ల అవుతున్నాయి. బెల్ట్ షాపులు అనధికారికంగా కొనసాగుతూ ఎమ్మార్పీపై అదనపు ధరలు వసూలు చేస్తున్నా, అధికారులు మాత్రం మౌనం వహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ప్రభుత్వం నేరుగా మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పొందుతున్నప్పటికీ, సిండికేట్ వ్యాపారాల వల్ల ప్రభుత్వ ఆదాయం కంటే ప్రైవేట్ లాభాలు ఎక్కువగా నమోదవుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. కోట్లు పెట్టి తిరిగి రాబట్టుకునే వ్యూహం బెల్ట్ దుకాణాలకు ఎమ్మార్పీకి మించి అమ్మకాలు! లాభం వ్యాపారులకు.. నష్టం మద్యం ప్రియులకుకోట్లు పెట్టి లైసెన్స్ కొంటే లాభం ఎక్కడ? అనే ప్రశ్న ఇప్పుడు జనగామ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది వ్యాపారులు ఈ కోట్లు తిరిగి రాబట్టుకోవడానికి ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజూ కష్టపడే కార్మికులు, కూలీలు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒక్క గ్లాసు మద్యం కోసం అదనంగా రూ.30 చెల్లించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ అమలులో విఫలమైతే, ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. కొత్త మద్యం దుకాణాలకు మరో నెలరోజులు మిగిలి ఉండగానే, సిండికేటు మాటాముచ్చట తెరపైకి వస్తుండడం గమనార్హం. నూతన మద్యం పాలసీ అమలు తర్వాత ప్రభుత్వ నియంత్రణ, విజిలెనన్స్ పరిశీలన అవసరమని ప్రజలు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు అంటున్నారు. -
ఘనంగా గంగబోనం ఉత్సవాలు
స్టేషన్ఘన్పూర్: డివిజన్ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ మత్తడి పోయడంతో ఘన్పూర్కు చెందిన వివిధ కులస్థుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా గంగబోనం ఉత్సవాలు నిర్వహించారు. ప్రధానంగా ముదిరాజ్లు, గౌడ కులస్థులు, కురుమల ఆధ్వర్యంలో గంగబోనం ఉత్సవాలను నిర్వహించగా అన్ని కులాలకు చెందిన కులపెద్దలు, గ్రామస్థులు హాజరయ్యారు. కురుమ కులపెద్ద ఇంటి వద్ద నుంచి గంగబోనం డప్పు చప్పుళ్లతో తీసుకురాగా అన్ని కులాలకు చెందినవారు హాజరై స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ మత్తడి వద్ద ప్రత్యేక పూజలు చేపట్టి గంగబోనాన్ని సమర్పించారు. రిజర్వాయర్ మత్తడి వద్ద, కట్ట మైసమ్మ వద్ద, ఘన్పూర్ బొడ్రాయి వద్ద యాటలను బలి ఇచ్చి ప్రత్యేక పూజలను చేపట్టారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన గంగబోనం ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యక్రమంలో ఘన్పూర్ మత్స్యసొసైటీ అధ్యక్షుడు నీల సోమన్న, కుల పెద్దలు నీల ఐలయ్య, డైరెక్టర్లు, కులపెద్దలు మునిగెల రమేశ్, గోనెల రాజు, నీల రాజు, గోనెల వెంకన్న, నీల సాంబరాజు, నక్క శ్రీను, గోనెల ఐలోని, గోనెల ఉప్పలయ్య, ఎం.ఐలోని, కె.సాంబరాజు, గట్టు ఉప్పలయ్య, బంగ్లా శ్రీను, అమరాజు రాజయ్య, గుంటి రాజయ్య, కృష్ణ, మాజీ ఎంపీటీసీలు గోనెల రాజయ్య, గోనెల ఉపేందర్, నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
పీఎంశ్రీ టీచర్లకు ప్రత్యేక ఐడీకార్డులు
జనగామ: ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ పథకం ద్వారా ప్రభుత్వ విద్యారంగంలో మరో కొత్త అడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యాప్రమాణాలను పెంచి, డిజిటల్ విద్యకు మరింత ఊతమివ్వడమే లక్ష్యంగా ఈ పథకం కొనసాగుతోంది. ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలు, స్మార్ట్ క్లాస్రూంలు, డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా, పాఠశాలలకు కొత్తరూపు ఇవ్వడానికి కేంద్రం ఇప్పటికే ప్రత్యేక లోగో, ఆకర్షణీయ రంగులతో భవనాలను రూపకల్పన చేస్తోంది. ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ సమాన గుర్తింపు, ప్రొఫెషనల్ ఐడెంటిటీ కల్పించే లక్ష్యంతో సాఫ్ట్వేర్ ఆధారిత ప్రత్యేక ఐడీ కార్డులు అందుబాటులోకి తీసుకొచ్చింది. గుర్తింపు కార్డులో సమగ్ర సమాచారం ఈ గుర్తింపు కార్డుల్లో ఉపాధ్యాయుడి ఫొటో, పేరు, పుట్టిన తేదీ, హోదా, ఉద్యోగంలో చేరిన తేదీ, ఎంప్లాయ్ ఐడీ నెంబర్, ఫోన్ నెంబర్, చిరునామా, బ్లడ్ గ్రూపు వంటి వివరాలు పొందుపరుస్తారు. కార్డులను అత్యుత్తమ పీవీసీ నాణ్యతతో తయారు చేసి ప్రత్యేక రక్షణ కవర్లతో అందించనున్నారు. విద్యా పరిపాలనలో సాంకేతికతను వినియోగించి ప్రతి ఉపాధ్యాయుడి వివరాలను డిజిటల్గా భద్రపరచే విధంగా కేంద్రం ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా రూపొందిస్తోంది. జిల్లాలో 15 పీఎం శ్రీ పాఠశాలలు ఉండగా, అందులో పనిచేసే టీచర్లకు త్వరలోనే కొత్త ఐడీకార్డులు అందజేయనున్నారు. ప్రతి కా ర్డుకు సుమారు రూ.75 ఖర్చు చేస్తుండగా, ఇందుకోసం ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. -
బంపర్ ఆఫర్!
కొత్తగా మద్యం దుకాణాలు దక్కిన వారితో వ్యాపారులు బేరసారాలు జనగామ: నూతన మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి కావడంతో.. కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్న వారికి వ్యాపారులు బంపర్ ఆఫర్ చేస్తున్నారు. నజరానా ఇస్తాం.. షాపు ఇస్తారా.. అంటూ ప్రలోభపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ 2025–27 ప్రకారం వైన్ షాపుల కేటాయింపులను ఇటీవల లాటరీ విధానంలో పూర్తి చేసింది. ఈసారి టెండర్లలో పాత మద్యం వ్యాపారులకు దురదృష్టం, కొత్త వారికి అదృష్టం కలిసి వచ్చింది. జిల్లాలో 50 మద్యం దుకాణాలకు 1,697 దరఖాస్తులు వచ్చిన విషయం విదితమే. మూడు దశాబ్ధాలుగా మద్యం వ్యాపారంపై ఆధారపడి జీవనోపాధి కొనసాగించిన చాలా మంది అనుభవజ్ఞులకు ఈసారి లాటరీలో అదృష్టం కలిసిరాలేదు. బదులుగా వ్యాపార అనుభవంలేని, వైన్స్ వ్యాపారం ఎప్పుడూ చేయని కొత్త వారికి లాటరీలో లైసెన్స్లు కేటాయించబడ్డాయి. దీంతో మద్యం మార్కెట్ మొత్తం ఒక్కసారిగా కదిలిపోయింది. కొత్త మద్యం పాలసీ అమలుతో జిల్లాలో పోటీ వాతావరణం మరింత పెరిగింది. టెండర్లతో మద్యం వ్యాపారం కొత్త దశలోకి అడుగుపెట్టింది. వైన్ షాపులు, డిస్ట్రిబ్యూటర్లు, సరఫరాదారుల మధ్య కొత్త ఒప్పందాలు కుదురుతున్నట్లు మాట్లాడుకోవడం కనిపిస్తోంది. జనగామ, పాలకుర్తి, బచ్చన్నపేట, స్టేషన్ఘన్పూర్, నెల్లుట్ల మండలాల్లో వైన్స్ డీల్స్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాత వ్యాపారులు మళ్లీ మార్కెట్లో తమ ప్రభావం కొనసాగించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కొత్తవారు లైసెన్స్ పొందగానే షాపులు అమ్మకానికి పెట్టడం, పాతవారు వాటిని బేరసారాల రూపంలో కొనుగోలు చేయడంపై ప్రభుత్వం నిశితంగా గమని స్తున్నట్లు సమాచారం. మద్యం పాలసీ ఉద్దేశాన్ని వక్రీకరించే ఈ మార్పులపై ఎకై ్సజ్ అధికారులు ఓ కన్నేస్తున్నారు. కొత్త వైన్స్ లాటరీలు జిల్లా మద్యం మార్కెట్ను పూర్తిగా కుదిపేస్తున్నాయి. లక్కు తగి లిన కొత్తవారు ఆర్థికంగా ఎదుగుతుంటే, అనుభవజ్ఞులైన పాతవారు వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త మార్గాల అన్వేషణలో ఉన్నారు. కొత్త లైసెన్స్దారులు వైన్షాపులను నిర్వహించలేని పరిస్థితుల్లో భారీ లాభాలతో మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. జిల్లాలో 50 మద్యం దుకాణాల పరిధిలో 25 వరకు కొత్తవారికి లక్కు కలిసి వచ్చింది. ఇందులో జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ పరిధిలో 8 వరకు అమ్మకానికి పెట్టగా, బచ్చన్నపేట, పాలకుర్తి, నెల్లుట్ల, కొడకండ్ల మండలాల పరిధిలో రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు డిమాండ్ పలుకుతోంది. ఇందులో బచ్చన్నపేటలో రూ.1 కోటి, పాలకుర్తిలో రూ.1.25 కోట్లు, నెల్లుట్లలో రూ.1.40 కోట్లు, జనగామ పట్టణంలో రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వైన్స్ అమ్మకాలకు డీల్ కుదుర్చుకుంటుండగా, కొడకండ్ల ప్రాంతాల్లో కూడా రూ.కోట్ల రూపాయల ఒప్పందాలు జరుగుతున్నట్లు సమాచారం. టెండర్లలో లక్కు తగిలిన కొత్త వారితో పాత వ్యాపారులు ఇప్పటికే బేరసారాలు కుదుర్చుకోవడం ప్రారంభించారు. పాతవారు తమ మార్కెట్ అనుభవం, సరఫరా వ్యవస్థను ఉపయోగించి కొత్తవారి షాపులను క్రమంగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేయత్నంలో ఉన్నారు. దశాబ్ధాలుగా మద్యం షాపులు నిర్వహిస్తూ జీవనం సాగించిన పాత వారికి ఈసారి లాటరీ ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించగా, కొత్త వారు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. బేరసారాలతో ఒప్పందం కుదుర్చుకోవడం, షాపుల విలువ పెరగడంతో లాటరీలో లక్కు కలిసి వచ్చిన వారిలో కొందరు కూర్చున్న చోటే కోటీశ్వరులుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రూ.కోట్లలో లైసెన్స్ డీల్స్ పాలకుర్తిలో అత్యధికం లాటరీలో లక్కు.. వైన్షాపులతో లక్ష్మీప్రసన్నం -
కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలి
లింగాలఘణపురం: కౌలు రైతులకు శాపంగా మారిన కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలని పత్తి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందునాయక్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలో ఇటీవల తుపానుతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తుపానుతో జిల్లా వ్యాప్తంగా సు మారు 32వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, పంటల బీమా పథకం చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పత్తి రైతు సంఘం జిల్లా కన్వీనర్ మంగ బీరయ్య, నాయకులు గండి అంజయ్య, కేశవులు, పత్తి రైతులు ఉన్నారు. 5న అఖండ జ్యోతి దర్శనంపాలకుర్తి టౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రం సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 5న నిర్వహించే అఖండజ్యోతి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చే యాలని ఈఓ సల్వాది మోహన్బాబు కోరారు. శనివారం దేవస్థానం ఆవరణలో అఖండజ్యోతి ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శబరిమలై మకరజ్యోతిని పోలిన విధంగా క్షీరాద్రి శిఖరం పాలకుర్తి సోమేశ్వర క్షేత్రంలో దక్షిణ భారతదేశంలో మూడో అతిపెద్ద అఖండ జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అఖండ జ్యోతికి అవసరమైన నూనె, వత్తులు, కర్పూరాన్ని భక్తులు ప్రచారరథానికి అందజేయాలన్నారు. ప్రచార రథాల ద్వారా ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, దేవగిరి అ నిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పాల శీతలీకరణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలిదేవరుప్పుల: విజయ పాల శీతలీకరణ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విజయ డెయిరీ డీడీ ఎన్. గోపాల్సింగ్, జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి అన్నారు. శనివారం దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెంలో 1,000 లీటర్ల సామర్థ్యం గల విజయ పాల శీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పశుసంపదతో అదనపు ఆదా యం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు లింగారెడ్డి, మేనేజర్ లక్ష్మీ, సూపర్వైజర్ వెంకట్రెడ్డి, బీఎంసీయూ చైర్మన్ గు లాం రసూల్, మండల విజయడైయిరీ చైర్మన్లు, పాడిరైతులు పాల్గొన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ బాధ్యతల స్వీకరణ ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్గా శనివారం ఈఎన్టీ వైద్యుడు హరీశ్ చంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంజీఎంలో వైద్యసేవల లోపాలపై వరుసగా వస్తున్న కథనాలపై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సూపరింటెండెంట్ కిశోర్పై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మంచిర్యాల సూపరింటెండెంట్గా కొనసాగుతున్న డాక్టర్ హరీశ్చంద్రారెడ్డిను ఎంజీఎం సూపరింటెండెంట్గా నియమిస్తూ డీఎంఈ నరేంద్రకుమార్ గత నాలుగు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను ఎంజీఎం ఆర్ఎంఓలు వసంత్కుమార్, అశ్విన్, శశికుమార్, ఏడీ శ్రీనివాస్ కలిసి అభినందనలు తెలిపారు. -
ప్రాణాలకు తెగించి.. గ్రేటర్వాసులను రక్షించి..
● వరద ప్రభావిత బాధితులకు అండగా నిలిచిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బల్దియా డీఆర్ఎఫ్ ● కీలకంగా వ్యవహరించిన కమిషనరేట్ పోలీసులు ● నిరంతర విద్యుత్ సేవల్లో ఎన్పీడీసీఎల్ అధికారులు ● వారి సేవలను ప్రశంసిస్తున్న ముంపు బాధితులు విద్యార్థినులకు ఆపన్నహస్తం..రెండేళ్ల క్రితం 2023, జూలై 27న కురిసిన వర్షానికి హంటర్రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల భవనం మొదటి అంతస్తులోకి వర్షపు నీటితోపాటు పాములు, తేళ్లు వచ్చాయి. భవనం టెర్రాస్పై బిక్కుబిక్కుమంటూ రాత్రి నుంచి ఉదయం వరకు విద్యార్థినులు వేచి చూశారు. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ సాయంతో విద్యార్థినులను రక్షించారు. ఈ ఏడాది అక్టోబర్ 29న అదే పరిస్థితి ఎదురైంది. మోంథా తుపాను కారణంగా డిగ్రీ కళాశాల భవనం పూర్తిగా జలమయమైంది. బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు సుమారు 12 గంటల పాటు విద్యార్థినులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఆపన్న హస్తం కోసం ఎదురు చూశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ సారథ్యంలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు బోట్ల సాయంతో 470 మంది విద్యార్థులను రక్షించి పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తమను రక్షించిన వారికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. సల్లగా బతకమని ఆశీర్వదించింది.. సమ్మయ్యనగర్లో ఇళ్లు, చుట్టూ భారీగా వరద నీరు నిలిచిందని అందిన సమాచారంతో వరద నీటిలోకి వెళ్లాను. ఆ ఉధృతికి నాకే భయం వేసింది. కానీ, ధైర్యం చేసుకొని ముందుకు సాగాను. ఓ మహిళను తాడు సాయంతో ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాను. ఆమె నన్ను ‘సల్లగా బతుకు’ అని ఆశీర్వదించింది. – వి.శ్రీకాంత్, డీఆర్ఎఫ్ -
వరద పోటెత్తినా.. విద్యుత్ పునరుద్ధరణ
వర్షం దంచికొడుతున్నా.. రాత్రింబవళ్లు వినియోగదారులకు కరెంట్ సరఫరాను అందించారు విద్యుత్ సిబ్బంది. నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్న సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగి కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. వరద నీటిలో వెళ్లి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కు సరఫరా నిలిపివేసి ప్రత్యామ్నా య మార్గంలో విద్యుత్ సరఫరా అందించారు. వర్షం, వరద నీటిలో స్తంభం పైకి ఎక్కుతుంటే.. కాళ్లు పట్టు కోల్పోతున్నా.. విద్యుత్ సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. -
రాజీ కేసులను పరిష్కరించుకోవాలి
జనగామ రూరల్: ఈనెల 15న నిర్వహించనున్న స్పెషల్ లోక్అదాలత్లో రాజీపడతగిన కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించా రు. క్రిమినల్ కేసులు ఎక్కువ మొత్తంలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సుచరిత, జూనియర్ సివిల్ జడ్జి శశి, సందీప, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ బండారి చేతన్ నితిన్, ఏసీపీలు, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ -
పునరుద్ధరణ పనులు చేపట్టాలి
జనగామ రూరల్: వర్షాలతో నష్టపోయిన పంటల ను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన చేసి రైతు లకు భరోసా కల్పించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మె ల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ రిజ్వాన్బాషా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన నష్టాలను అధికారులు పక్కగా అంచనా వేయాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కొట్టుకుపోయిన కల్వర్టులను వెంటనే మరమ్మతు చేపట్టాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసి నివేదికలు అందించాలన్నారు. ఈ సమావేంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్, ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కడియం, కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలో డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రాధాన్యత క్రమంలో రూ.50కోట్ల పనులను చేపట్టాలన్నారు. పంటల వివరాలను నమోదు చేయండి లింగాలఘణపురం: తుపానుతో నష్టపోయిన పంటల వివరాలను త్వరగా నమోదు చేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని వనపర్తిలో నష్టం జరిగిన వరి, పత్తి, మిర్చి పంటలను జిల్లా వ్యవసాయాధికారి అంబికాసోనితో కలిసి పరిశీలించారు. నివేది క త్వరగా అందిస్తే పరిహారం అందుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అవసరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాఖల వారీగా నివేదిక అందించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా -
పరిహారం ఇవ్వకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తాం
జనగామ: తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతీ పంటకు ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ సమావేశం హాలులో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనగా మ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో పంటల నష్టం ఎక్కువగా ఉందన్నారు. తడిసిన పత్తితో పాటు వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలన్నారు. గతంలో బీఆర్ఎస్ హ యాంలో 10శాతం నష్టపోయిన రైతులకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చామని, ప్రస్తుతం మొ త్తం నష్టపోయిన కూడా రూ.10వేల పరిహారం ఇ స్తామనడం హాస్యాస్పదమన్నారు. ఉపఎన్నిక పేరి ట రౌడీలతో ఊరేగుతున్నారని ఘాటుగా విమర్శించారు. తుపానుతో ధ్వంసమైన రోడ్లను ఈజీఎస్ పథకం ద్వారా చేస్తామనడం సరికాదన్నారు. రియ ల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో ప్రభుత్వం ప్రజల బాధను అర్థం చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారివెంట పలువురు నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యే పల్లా, మాజీ మంత్రి ఎర్రబెల్లి -
‘కల్లుగీత రణభేరి’ని విజయవంతం చేయాలి
జనగామ రూరల్: ఈనెల 28న సూర్యాపేటలో జరిగే కల్లుగీత కార్మికుల రణభేరిని విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు కుర్ర ఉప్పలయ్య అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, కల్లు గీత వృత్తి గురించి ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. గీత కార్మికులకు పెన్షన్ రూ.4 వేలు, ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని, ప్రమాద నివారణకు వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీరా తాటి,ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య మాట్లాడుతూ జిల్లా మహాసభలు ఈనెల 10వ తేదీన జనగామలో నిర్వహిస్తున్నామని, గీత సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు జొన్న గొని శ్రీనివాస్, వడ్లకొండ వెంకటేష్, మార్కా ఉపేందర్ బండపల్లి శంకరయ్య బసవగోని మహేందర్, బాల్నే ఉమాపతి, నామాల యాదగిరి, బసవగాని సమ్మయ్య, వెంకటయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానం అత్యున్నత మానవసేవ
● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జనగామ: రక్తదానం చేయడం అత్యున్నతమైన మానవసేవ అని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని నెహ్రూపార్కు రోడ్డు కామాక్షి ఫంక్షన్ హాల్లో గురువారం పట్టణ సీఐ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన రక్తదాన శిబిరాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అంతకుముందు 13వ వార్డుకు చెందిన నాయకులు మల్లిగారి రాజు 98వసారి రక్తదానం చేయగా, క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల, పలు విద్యాసంస్థల విద్యార్థులు, అటో డ్రైవర్లు, జేసీఏ కన్వీనర్ మంగళ్లపల్లి రాజు, మరో 200మంది రక్తదానం చేయగా, వారికి సర్టిఫికెట్లు, పండ్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ అబ్బయ్య, మెడికల్ కళాశాల ప్రొఫెసర్ అన్వర్, ఎస్సైలు రాజన్బాబు, భరత్, చెన్నకేశవులు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి ● వీసీలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాజనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యాబోధన అందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వీసీలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. పీఎంశ్రీ పథకం కింద పాఠశాలలకు విడుదల చేసిన నిధులను వినియోగించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆపార్ ఆధార్ సమాచారం ధ్రువీకరించాలని తెలిపారు. ఓపెన్ పాఠశాలల్లో ప్రవేశాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా నూతనంగా అమలుచేయబోయే అమ్మకు అక్షరమాల పథకం నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. -
ఆక్రమణలపై ఉక్కుపాదం
● ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు ● వరంగల్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశం● చెరువులు, నాలాల ఆక్రమణల వల్లే తరచూ నగరం ముంపు ● పది మంది స్వార్థం.. వేల ఇళ్ల మునకకు కారణం.. ● స్మార్ట్ సిటీ నిధులను సద్వినియోగం చేయండి.. ● అధికారులకు సీఎం దిశానిర్దేశం ● వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఏరియల్ సర్వే ● ముంపు కాలనీల వాసులకు పరామర్శ ● హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలో ముంపు నివారణకు శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయాలని, చెరువులు, నాలాల ఆక్రమణలు కూడా ముంపునకు కారణాలని, ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలతో జరిగిన పంటలు, ఆస్తి, ప్రాణనష్టాలపై క్షేత్రస్థాయిలో అధికారులతో జిల్లాల కలెక్టర్లు సమీక్ష నిర్వహించి ఆ నివేదికలను ప్రభుత్వానికి త్వరగా అందజేయాలని సూచించారు. చెరువులు, నాలాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలన్నారు. మోంథా తుపాను వరదలతో జరిగిన పంట, ఆస్తి, ప్రాణ నష్టాలపై శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ హాల్లో ముఖ్యమంత్రి.. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలి సి రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల కలెక్టర్లు, అధికా రులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. భారీ వర్షాలతో జరిగిన నష్టం అంచనాపై ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. పంట ఆస్తి ప్రాణ నష్టాలపై నిర్ధిష్ట నమూనాలో అంచనా వేసి నివేదికను అందజేయాలన్నారు. శాశ్వత పరిష్కారం చూడాలి.. ఆక్రమణలు తొలగించాలి.. వరంగల్ నగరం ముంపుపై శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమన్వయ లోపంతో సమస్యలు పెరుగుతున్నాయని, అన్ని విభాగాల అధికారులు కలిసి పనిచేయాలన్నారు. నాలాల కబ్జాలను తొలగించాల్సిందేనని.. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పది మంది కోసం పదివేలమందికి నష్టం జరుగుతుంటే ఉపేక్షించొద్దన్నారు. దీనిపై అధికారులు స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని, ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో ఒక కో–ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలని, వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ అనేది నిత్యకృత్యమైందని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. కాగా, హనుమకొండ, వరంగల్ జిల్లాలు, గ్రేటర్ వరంగల్లో నష్టాన్ని ముఖ్యమంత్రి, మంత్రులకు కలెక్టర్లు స్నేహ శబ రీష్, డాక్టర్ సత్యశారద, కమిషనర్ చాహత్ బాజ్పాయ్లు వివరించారు. సమీక్షలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సార య్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, నాగరాజు, రాష్ట్రస్థాయి అధికారులు, ఐజీ చంద్రశేఖర్రెడ్డి, వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్, మహబూ బాబాద్, జనగామ జిల్లాల కలెక్టర్లు అద్వైత్కుమార్ సింగ్, రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. -
బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు
రఘునాథపల్లి: వాగుల ఉధృతి సమయంలో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఇబ్రహీంపూర్, భాంజీపేట వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా వరద ప్రవాహానికి ఇబ్రహీంపూర్, భాంజీపేటలో దెబ్బతిన్న రోడ్డు, కాజ్వేలను ఆయన శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ 10 కోట్లు అవసరమని,, వెంటనే ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు వరి పంటలు పాడయ్యాయని అయా గ్రామాల్లో పలువురు బాధిత రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్చందర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, మాజీ సర్పంచ్లు కాసర్ల లక్ష్మయ్య, గ్యార అయిలయ్య, కాంగ్రెస్ నాయకులు పోకల శ్రీనివాస్, మేకల నరేందర్, తోటకూరి రమేష్, షబ్బీర్, గొరిగ రవి తదితరులు పాల్గొన్నారు. మాధారం వాగుపై బ్రిడ్జి నిర్మించండి మండలంలోని మాధారం వాగుపై బ్రిడ్జి నిర్మించాలని అయా గ్రామస్తులు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ సర్పంచ్లు గుడి రాంరెడ్డి, అరూరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పేదల బతుకుల్లో వెలుగులు పేదల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని ఎమ్మెల్యే కడియం అన్నారు. ఇందిర 41 వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మెరుగైన సేవలందించాలి
బచ్చన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మె రుగైన సేవలను అందించాలని డిప్యూటీ కలెక్టర్ తే జస్విని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అలాగే ఆసుపత్రిలోని వార్డులు, వ్యాక్సిన్ స్టోర్, ల్యాబ్ రికార్డులు, ఫార్మసీ స్టోర్, రికార్డులను పరిశీలించారు. అలా గే ఆసుపత్రిలో అందే వైద్యం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీ ఎంహెచ్ఓ శ్రీదేవి, ప్రోగ్రామ్ ఆఫీసర్ తేజ, సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, మండల వై ద్యాధికారి సృజన, డాక్టర్లు దీప్తి, అరుణ, ఉమ, ఆ దిలక్ష్మి, ప్రసన్నకృష్ణ, సిద్దిసుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ కలెక్టర్ తేజస్విని -
‘అఖండజ్యోతి’ పోస్టర్ ఆవిష్కరణ
పాలకుర్తి టౌన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 5న(బుధవారం) కార్తీక పౌర్ణమి అఖండజ్యోతి ఉత్సవాల పోస్టర్ను శుక్రవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తన నివాసంలో అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దక్షణి భారతదేశంలో మూడో అఖండజ్యోతిని శ్రీసోమేశ్వర క్షేత్రంలో క్షీరాద్రి శిఖరంపై వెలిగించనున్నామని, భారీగా భక్తులు దర్శించుకోవాలన్నారు. ఈవో సల్వాది మోహన్బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డీవీఆర్శర్మ, సిబ్బంది రమేశ్, ఓంప్రకాశ్ పాల్గొన్నారు.పటేల్ ఆశయసాధనకు మోదీ కృషిజనగామ రూరల్: సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్మోహన్రెడ్డి, బుడుగుల రమేశ్, శశిధర్రెడ్డి, ఉమారాణి, నందిరెడ్డి, నవీన్ రెడ్డి, కొంతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యకర జీవనశైలి పాటించాలిరఘునాథపల్లి: ఆరోగ్యకర జీవనశైలి పాటించాలని, ఆరోగ్య పరీక్షలు అందరికీ ఎంతో అవసరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం మండలంలోని ఖిలాషాపూర్లో హైదరాబాద్ రామంతాపూర్, ప్రభుత్వ హోమియో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వయోమిత్ర హోమియా ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వైద్యులు గీతారెడ్డి, మమత, కమలహాసన్, స్రవంతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్కిషన్, డీపీఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనగామ: మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో అందరి ఆదరాభిమానాలతోనే తనకు గుర్తింపు వచ్చిందని డీపీఆర్ఓ(జిల్లా పబ్లిక్ రిలేషన్ అధికారి) శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని టీఎన్జీఓ కార్యాలయంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు కన్నా పర్శరాములు అధ్యక్షతన జరిగిన వీడ్కోలు సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జర్నలిస్టులు, అధికారులు, కలెక్టర్లు అందించిన సహకారం ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. అనంతరం శ్రీనివాసరావు దంపతులను జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు. -
వరద ప్రభావిత బాధితులకు సీఎం పరామర్శ, భరోసా..
ఏరియల్ సర్వే తర్వాత హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు రోడ్డుమార్గాన మొదట సమ్మయ్య నగర్కు చేరుకున్నారు. వరద ప్రభావంతో నీట మునిగిన ఇళ్లను పరిశీలించి స్థానికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జరిగిన నష్టంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసానిచ్చారు. అక్కడే నాలా వంతెన వద్ద వరదకు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరదతో జరిగిన నష్టాన్ని పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి వివరించారు. అదేవిధంగా కాపువాడలో వరద ప్రభావం బారిన పడిన బాధిత కుటుంబాలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోతన నగర్లో వరద ముంపు బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. -
రోడ్లు ఛిద్రం..ప్రయాణం నరకం
బాలాజీనగర్లో కోతకు గురైన రోడ్డుగిర్నిగడ్డలో కొట్టుకపోయిన సిమెంట్ రోడ్డు సిమెంటు రోడ్డు కొట్టుకపోయింది.. జనగామ: గిర్నిగడ్డలోని ఓ కాలనీలో రెండు రోజులుగా ఉధృతంగా ప్రవహించిన వరద కారణంగా సీసీరోడ్డు తుడుచుకు పెట్టుకుపోయింది. ఇదీ బాలాజీనగర్ రోడ్డుజనగామ: భారీ వర్షంతో జనగామ పట్టణంలోని బాలాజీనగర్కు వెళ్లే రూట్లో మట్టిరోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. రోడ్డు ఎత్తుపళ్లాలు కావడంతో ద్విచక్రవాహన చోదకులు పల్టీలు కొడుతున్నారు.జనగామ: మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ని అనేక ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ముఖ్యంగా రహదారుల పరిస్థితి దారుణంగా మారింది. భారీ వర్షాల ధాటికి అనేక రహదారులు కోతకు గురై, కొన్నిచోట్ల పూర్తిగా కొట్టుకుపోయాయి. కల్వర్టులు కుంగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీసీ, బీటీ రహదారులపై పగుళ్లు ఏర్పడి, గోతులు ఏర్పడడంతో ప్రయాణం నరకయాతనగా మారింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పల్లెపల్లెను కలిపే రహదారులు తెగిపోవడంతో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటల రవా ణా, అత్యవసర సేవలు కూడా స్తంభించిపోయే పరి స్థితి నెలకొంది. కొన్నిచోట్ల వర్షపునీరు రహదారులపై నిలిచి ప్రమాదకరంగా మారింది. రాత్రి సమయంలో ప్రయాణం చేయడం మరింత కష్టంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖలు వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రహదారుల మరమ్మతులు, కల్వర్టుల పునర్నిర్మాణం తక్షణమే చేపట్టకపోతే రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోంథా తుపానుతో కోతకు గురైన రోడ్లు పునరుద్ధరణ చర్యలు వేగంగా చేపట్టాలని ప్రజల వేడుకోలు -
రేపు ఎస్ఆర్ అకాడమీ టాలెంట్ టెస్ట్
విద్యారణ్యపురి : ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ప్రత్యేక ప్రతిభా పరీక్ష సాట్ క్యూ ఎస్ఆర్ అకాడమీ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఎస్ఆర్ అకాడమీ చైర్మన్ వరదారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ పరీక్ష ఇంటర్మీడియట్లో చేరబోయే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రం హనుమకొండలోని ఎస్ఆర్ ఎడ్యుసెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. సిలబస్ ఇలా ఉంటుందన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 10వ తరగతి స్థాయిలో మొత్తం 75 ప్రశ్నలు, ప్రతీ సబ్జెక్టుకు 25 మార్కులు ఉంటాయన్నారు. ఐఐటీ –జేఈఈ అండ్ నీట్లో కోచింగ్లో ప్రవేశం పొందే అర్హత ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ పరీక్షతో తమ ప్రతిభను నిరూపించుకోవడంతోపాటు ఉత్తమ స్కాలర్షిప్ అవకాశాలను పొందుతారన్నారు. పరీక్ష నమోదు కోసం విద్యార్థులు సమీపంలోని ఎస్ఆర్ బ్రాంచ్ లేదా 9642117378, 9154989356, 8886287456, 9154854700, 9642117330, 9642117830, 99642114698 నంబర్లలో సంప్రదించొచ్చని ఆయన తెలిపారు. -
టీజీ ఎన్పీడీసీఎల్కు రూ.10 కోట్ల నష్టం
హన్మకొండ: మోంథా తుపాను ప్రభావంతో టీజీ ఎన్పీడీసీఎల్కు దాదాపు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం హనుమకొండ డివిజన్ పరిధిలోని నీట మునిగిన గోపాల్పూర్, యాదవనగర్ సబ్ స్టేషన్లను సందర్శించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎక్కడ విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని భారీ వర్షంలోనూ రేయింబవళ్లు పని చేసి సరఫరా పునరుద్ధరించామన్నారు. ఇప్పటి వరకు నీట మునిగిన 249 ట్రాన్స్ఫార్మర్లలో 246 పునరుద్ధరించామని, నీట మునిగిన 8 సబ్ స్టేషన్లలో 6 పునరుద్ధరించా మని, మిగతా 2 సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ వి ద్యుత్ సరఫరా అందించామని వివరించారు. 33 కే వీ ఫీడర్లు 44 ప్రభావితం కాగా 44 పునరుద్ధరించా మని,11 కేవీ ఫీడర్లు 116ల్లో సమస్యలు తలెత్తగా పరిష్కరించామన్నారు. 428 స్తంభాలు దెబ్బతిన్నాయన్నారు. తరచూ నీట మునిగే సబ్ స్టేషన్లను మా ర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం హనుమకొండ 100 ఫీట్ రోడ్లోని ప్రగతి నగర్ కాలనీ, మచిలీ బజార్ సెక్షన్ కాపు వాడలో జరుగుతున్న విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ ఆపరేషన్ టి.మధుసూదన్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, హనుమకొండ డి.ఈ సాంబరెడ్డి, ఎమ్మార్టీ, కన్స్ట్రక్షన్ డీఈ దర్శన్ కుమార్, ఎ.డి.ఈ మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షంలోనూ వేగంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
గల్లంతైన యువతి మృతదేహం లభ్యం
జఫర్గఢ్: రెండు రోజుల క్రితం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కోయినాచలం గ్రామ శివారులోని బోల్లమత్తడి వద్ద వరద ఉధృతిలో గల్లంతైన యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బక్క శ్రావ్య (19), రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడెపల్లికి చెందిన బరిగెల శివకుమార్ (ప్రేమికులు) బుధవారం రాత్రి బైక్పై జఫర్గఢ్ మండలం కోనాయిచలం వస్తుండగా మార్గమధ్యలో బోల్లమత్తడి వద్ద వరద ఉధృతిలో పడ్డారు. చెట్టు కొమ్మల సాయంతో శివకుమార్ ప్రాణంతో బయటపడగా శ్రావ్య వరదలో కొట్టుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. చివరకు శుక్రవారం ఉదయం శ్రావ్య మృతదేహం నీటిపై తేలింది. గమనించిన పోలీసులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనాస్థలి వద్ద కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. -
విజిలెన్స్ అధికారులకు సహకరించాలి
హన్మకొండ: విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు అక్టోబర్ 27 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రాంతీయ నిఘా, అమలు అధికారి కార్యాలయం అడిషనల్ ఎస్పీ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్లో వివిధ ప్రభుత్వ శాఖల విజిలెన్స్ అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఆయా శాఖల అధికారులు, పౌరులు తమ బాధ్యతగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సహకరించాలన్నారు. ప్రభుత్వ శాఖలో అవకతవకలు, అవినీతి జరిగినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 14432కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేడు ఉదయం 6గంటలకు హనుమకొండ జేఎన్ఎస్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వాక్థాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొలని పిలుపునిచ్చారు. అనంతరం అధికా రులతో ప్రతిజ్ఞ చేయించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బి.మల్లయ్య, ఇన్స్పెక్టర్లు బి.అనిల్కుమార్, కిశోర్, ట్రాన్స్ కోఇన్స్పెక్టర్ ఎం.డి.షాదుల్లా, ఏఓ ఎ.శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ ఎ.గౌతం, తహసీల్దార్లు లక్ష్మణ్, భాస్కర్, ఇంజనీర్లు విద్య, శ్రీనివాస్ నాయక్, మల్సూర్, యూనియన్ బ్యాంక్ విజిలెన్స్ ఆఫీసర్ కార్తీక్, టీజీఎస్ ఆర్టీసీ, ట్రాన్స్కో, కేటీపీఎస్, సివిల్ సప్లై, జీడబ్ల్యూఎంసీ, అటవీ శాఖ, డీసీసీ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఏపీజీవీబీ, రవాణా శాఖ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రావు -
పోక్సో కేసులో యువకుడికి 25 ఏళ్లు జైలు
మహబూబాబాద్ రూరల్ : పోక్సో కేసులో నేరం రుజువుకావడంతో ఓ యువకుడికి 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి టి.దేవా కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2018 నవంబర్ 1వతేదీన రాత్రి 10 గంటలకు కనిపించకుండా పోయింది. దీంతో సదరు బాలిక తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో అదే నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసముద్రం పోలీస్ స్టేషన్లో అప్పటి ఏఎస్సై వెంకటాద్రి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా విచారణ అధికారులుగా అప్పటి ఎస్సై బి.సతీశ్, మహబూబాబాద్ రూరల్ సీఐలు లింగయ్య, వెంకటరత్నం విచారణ అధికారులుగా వ్యవహరించారు. అప్పటి రూరల్ సీఐ జె.వెంకటరత్నం.. బాలిక కనిపించకుండాపోయిన ఘటనకు సంబంధించి కేసముద్రం మండలం కల్వల శివారు వెంకట్రాం తండాకు చెందిన భూక్య శ్రీనును అరెస్ట్ చేశారు. అప్పటి డీఎస్పీ నరేశ్ కుమార్ విచారణ అనంతరం కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. సాక్షులను ప్రస్తుత డీఎస్పీ ఎన్.తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ సీఐ పి.సర్వయ్య, కోర్టు లైజనింగ్ అధికారి, ఎస్సై జీనత్ బ్రీఫింగ్ ఇవ్వగా ప్రస్తుత కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారులు అశోక్ రెడ్డి, దేవా సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ పక్షాన స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటయ్య వాదనలు వినిపించారు. నేరం రుజువుకావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ.. శ్రీనుకు 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. పనికి వెళ్లొస్తూ తిరిగిరాని లోకాలకు.. ● మొక్కజొన్న మిషన్ ట్రాలీ స్టాండ్ పైనుంచి పడి ఇద్దరు కూలీలు మృతి ● ఏనుగల్లు శివారులో ఘటన పర్వతగిరి: పనికి వెళ్లొస్తూ ఇద్దరు కూలీలు తిరిగిరాని లోకాలకు చేరారు. మొక్కజొన్న పట్టే మిషన్ ట్రాలీ స్టాండ్ పైనుంచి పడి మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు శివారు మాల్య తండాలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కథనం ప్రకారం.. మండలంలోని పంచరాయితండాకు చెందిన బానోత్ రాములు(57), బానోత్ హర్లా(48)తోపాటు మరికొంతమంది కూలీలు మొక్కజొన్న మిషన్లో పని చేయడానికి ఏనుగల్ వెళ్లారు. పని పూర్తయిన అనంతరం అదే ట్రాక్టర్(నెంబర్ ప్లేట్ లేని)కు అమర్చిన మొక్క జొన్న పట్టే మిషన్ ట్రాలీ స్టాండ్పై రాములు, హర్లా కూర్చున్నారు. ఈ క్రమంలో మాల్యాతండాకు చేరుకోగా ట్రాక్టర్కు ఉన్న బోల్డ్ ఊడడంతో ఇద్దరు కిందపడ్డారు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన హర్లా అక్కడికక్కడే మృతి చెందాడు. రాములును హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై రాములు కుమారుడు రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైప్రవీణ్ తెలిపారు. హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, తెలుగు సినీ దర్శకుడు వంగ సందీప్రెడ్డి దర్శించుకుని అమ్మవారికి పూజలు నిర్వహించుకున్నారు. అర్చకులు భద్రకాళి శేషు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. దేవాలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మయూరి రామేశ్వరరావులు.. దర్శకుడు సందీప్రెడ్డికి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. సాయంత్రం దేవాలయంలో కార్తీక దీపోత్సవం జరిగింది. -
మిన్నంటిన రోదనలు..
ఎంజీఎం/ కురవి : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితుల రోదనలు మిన్నంటాయి. చనిపోయిన వారితోపాటు చికిత్స పొందుతున్న వా రిని చూసి గుండెలవిసేలా రోదించారు. హనుమకొండ–సిద్దిపేట ప్రధాన రహదారిపై హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో గురువారం అర్ధరాత్రి పెళ్లి వాహన్నాన్ని (బొలెరో) బోర్వెల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు రెడ్డబోయిన స్వప్న(15) అక్కడికక్కడే, రెడ్డబోయిన కళమ్మ(55), శ్రీనాథ్ (7) ఎంజీఎంలో చికిత్స పొందు తూ మృతి చెందారు. మిగతా 20 మందిలో 10మంది స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని ఎంజీఎం తీసుకొచ్చారు. ఇందులో వృద్ధురాలు అనసూర్య, చిన్నారులు శివకుమా ర్, అక్షిత, సంజన, మారుతి చికిత్స పొందుతున్నా రు. మరో ఐదుగురు క్షతగాత్రులు ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా రు. దీంతో బాధితులు ఎంజీఎం ఆస్పత్రిలో తమ వారిని చూసుకుని కన్నీరుమున్నీరుగా విలపించా రు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా పాలమాకుల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కుటుంబం, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదన్పల్లికి చెందిన యువతితో కురవి లో మూడు రోజుల క్రితం వివాహం జరిపించారు. వధూవరులను తీసుకొని కుటుంబీకులు, బంధువులు బొలెరోలో తిరుగు ప్రయాణమయ్యారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారు ప్రాంతానికి చేరుకున్న సమయంలో కొందరు వాహనం దిగారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బోర్వెల్ వ్యాన్.. బొలెరోను ఢీకొంది. ఈ ఘటనలో స్వప్న అక్కడిక్కడే మృతి చెందగా, కళమ్మ, శ్రీనాథ్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదుగురు క్షతగ్రాతులు ఎంజీఎంలో, మరో ఐదుగురు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యాయం చేయాలని ధర్నా.. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ క్షతగాత్రుల బంధుమిత్రులు ఎంజీఎం ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమయానికి అక్కడికి చేరుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్కు ఘటనను వివరించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అనంతర ఎమ్మెల్యే.. వరంగల్ ఏసీపీ శుభ్రం ప్రకాశ్నారేతో కలిసి పోస్టుమార్టం గది ఉన్న మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.రోడ్డు ప్రమాద మృతులకు ఎంజీఎంలో పోస్టుమార్టం చికిత్స పొందుతున్న ఐదుగురు గుండెలవిసేలా రోదించిన బాధితులు న్యాయం చేయాలని ఆందోళన పరామర్శించిన వరంగల్ పోలీసు కమిషనర్, డోర్నకల్ ఎమ్మెల్యే క్షతగాత్రులను పరామర్శించిన వరంగల్ పోలీసు కమిషనర్..వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పరామర్శించారు. ఘటన వివరాలు తెలుసుకున్న అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
‘మోంథా’ నష్టంపై సర్కారుకు నివేదిక
జనగామ: మోంథా తుపాను కారణంగా జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో పంటలు, రహదారులు, చెరువులు, గృహాలు, జీవాలు, తదితర వాటికి సంబంధించి తీవ్ర నష్టం జరిగింది. తుపాను నష్టానికి సంబంధించి అంచనా నివేదికను సర్కారు పంపించారు. ఇంకా నష్టానికి సంబంధించి సర్వే చేస్తుండగా, వాటిని కూడా ప్రభుత్వానికి పంపించనున్నారు. అంచనా నివేదిక ఇలా... జిల్లా వ్యాప్తంగా 182 నిర్మాణాలు దెబ్బతినగా, వాటి పునరుద్ధరణ కోసం సుమారు రూ.14.13 కోట్లు అవసరమని అధికారుల నివేదికలో పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ రూ.3.22 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రూ.7.39 కోట్లు, ఆర్అండ్బీ శాఖ రూ.1.71కోట్లు, జనగామ మున్సిపల్ రూ.1.61 కోట్లు, స్టేషన్ఘన్పూర్ మున్సిపల్లో రూ.20 లక్షల మేర నష్టం ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 49 ఇళ్లు దెబ్బతినగా, రూ.9.62 లక్షలు విలువైన పశువులు, కోళ్లు చనిపోయాయి. నర్మెట, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ మండలాల్లో ఎక్కువగా ఈ నష్టం ఉన్న ట్లు పేర్కొన్నారు. వ్యవసాయ పరంగా 25,025 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా ఇందులో 8,228 మంది రైతులకు చెందిన వరి 18,320, పత్తి 6,445, మొక్కజొన్న 240ఎకరాలు నీటమునిగాయి. జనగామ మున్సిపాలిటీలో జనగామ పురపాలికలోని 30 వార్డుల్లో రహదారుల పునరుద్ధరణ కోసం రూ.141.75లక్షలు అవరమని నివేదిక పంపించారు. అలాగే 80 కల్వర్టులు, బ్రిడ్జిల పునరుద్ధరణ కోసం సుమారు మరో రూ.19.50 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణంలోని ఛాగల్, శివునిపల్లి, రైల్వే కాలనీ, బుడగ జంగాలు, మోడల్ కాలనీల్లో మొత్తం 18 కిమీ కచ్చా గ్రావెల్ రోడ్లు తీవ్రంగా దెబ్బతినగా, వీటి పునరుద్ధరణకు రూ.20 లక్షలు అవసరమని మునిసిపల్ అధికారులు నివేదించారు. మండలాల వారీగా జనగామ మండలం పరిధిలో 47 కిలోమీటర్ల రహదారులు దెబ్బతినగా రూ. 266.25 లక్షలు, తరిగొ ప్పుల మండలంలో 32.10 కిలోమీటర్ల రహదారులు దెబ్బతినడంతో రూ.48 లక్షలు, నర్మెట మండలంలో 25.55 కిలోమీటర్ల రహదారికి నష్టం జరుగగా, రూ.45.50 లక్షలే అవసరమని అంచనా నివేదికలో పేర్కొన్నారు. కలెక్టర్ నివేదికను పరిశీలించి, రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలను ఆదేశించినట్లు కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి.జిల్లాలోని నర్మెట, రఘునాథపల్లి, జఫర్గఢ్, పాలకుర్తి మండలాల పరిధిలో ఆర్అండ్బీశాఖ పరిధిలో 61.325 కిలోమీటర్ల పొడవులో రహదారులకు నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.1.71 కోట్లు అవసరమని గుర్తించారు. ఇరిగేషన్ శాఖ పరిధిలో గూడూరు, ముత్తారం, విస్నూర్, కందారం, ధర్దెపల్లి, పల్లగుట్ట, విశ్వనాథపురం, తమ్మ డపల్లి తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, వంతెనలు 16 చోట్ల పాక్షికంగా, పూర్తిగా దెబ్బతినగా, తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.24 లక్షలు, శాశ్వత మరమ్మతులకు రూ.3.22 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా జనగామ జిల్లాలోని పంచాయతీరాజ్ రహదారులు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 195.33 కిలో మీటర్ల రహదారులు నష్టపోయి, వాటి పునరుద్ధరణకు సుమారు రూ.739 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు జిల్లా అధికారులు నివేదించారు. -
ఐక్యతా భావాన్ని బలోపేతం చేయాలి
జనగామ రూరల్: యువతలో ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేయడమే సర్దార్ 150 ఐక్యతా మార్చ్ ప్రచార కార్యక్రమం ముఖ్యఉద్దేశమని మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ ద్వారా వికసిత భారత్ పాదయాత్ర నిర్వహించనుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ భగవత్ కరడ్ మాట్లాడుతూ.. వల్ల భాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం తరఫున కేంద్ర యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వశాఖ మై భారత్ ద్వారా అక్టోబర్ 6వ తేదీన సర్దార్ 150 ఐక్యతా మార్చ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. జిల్లాస్థాయి పాదయాత్రలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు ఉంటాయన్నారు. జాతీయమార్చ్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6వరకు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ సూరునేని, డీపీఆర్వో బి.పల్లవి, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేరా యువభారత్ వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ -
రైతులను ఆదుకుంటాం..
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులతో పాటు ఆస్తి నష్టపోయిన వారిని ఆదుకుంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని విస్నూరు, విష్ణుపురం ఎస్సీకాలనీలో భారీ వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల ఇండ్లను పరిశీలించారు. శానిటేషన్, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఫోన్లో అదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదిక అందించాలన్నారు. -
పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి
బచ్చన్నపేట: సమస్యలతో పోలీస్స్టేషన్కు వచ్చే వారితో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలని జనగామ ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ సూచించారు. గురువారం మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే హమీద్, హెడ్ కానిస్టేబుల్ నర్సిరెడ్డి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(డీహెచ్)తో పాటు ధర్మకంచ అర్బన్ ప్రాథమిక దవాఖానను గురువారం ఇద్దరు ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు వెంకటరమణ, తేజస్విని ఆకస్మికంగా సందర్శించారు. డీహెచ్లో డాక్టర్లు మధుకర్యాదవ్, కరుణాకర్రాజు, ఆయా విభాగాల వైద్యులు, ధర్మకంచలో డాక్టర్ శ్రీతేజ, సూపర్వైజర్ వి.రమేశ్తో కలిసి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్లు మాట్లాడారు.. ఆస్పత్రిలో అందిస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూసి అభినందించారు. 4న జిల్లాస్థాయి యువజన కళాకారుల ఎంపికజనగామ రూరల్: ఈనెల 31న నిర్వహించాల్సి న జాతీయ యువజనోత్సవాల జిల్లాస్థాయి యువకళాకారుల ఎంపికను భారీ వర్షాల కారణంగా వచ్చే నెల 4వ తేదీకి మార్చినట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి కోదండరాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని, పోటీలో పాల్గొనదలచిన అభ్యర్థులు ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. చిల్పూరు ఆలయంలో శ్రవణా నక్షత్ర హోమంచిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిఽ దిలో కార్తీక మాసం పురస్కరించుకుని గురువారం శ్రవణా నక్షత్ర హోమం, మాసకల్యాణాన్ని అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేదమంత్రాల నడుమ నిర్వహించారు. ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన పేరి లక్ష్మణ్రావు–ప్రభావతి భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. జనగామ: జనగామ డిపో బస్సులో ఓ వ్యక్తి విలువైన చెక్కును పోగొట్టుకోగా..ఆర్టీసీ అధికారులకు దానిని అప్పగించి ఓ కండక్టర్ తన నిజాయితీ చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మార్క రమేశ్ అనే వ్యక్తి ఈ నెల 29న హన్మకొండ వైపు వెళ్తున్న జనగామ డిపో బస్సులో భువనగిరిలో ఎక్కారు. జనగామలో బస్సు దిగే క్రమంలో తనవద్ద ఉన్న రూ.2.64లక్షల విలువైన చెక్కును అందులోనే మరచిపోయి దిగి వెళ్లిపోయారు. చెక్కు కండక్టర్ బి.స్వామిదాస్కు దొరకగా, డిపో మేనేజర్ స్వాతికి అప్పగించారు. ప్రయాణికుడు రమేశ్ను డిపోకు పిలిపించి గురువారం చెక్కు అందించారు. కండక్టర్ను డిపో మేనేజర్ అభినందించగా, చెక్కును తిరిగి అప్పగించిన ఆర్టీసీ అధికారులకు రమేశ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంటు మేనేజర్ హుస్సేన్, ఆఫీసు సూపరింటెండెంట్ వై.యాదమనిరావు, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వి.ప్రభాకర్ ఉన్నారు. జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు గురువారం హాల్టింగ్ కాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో రైల్వే డ్రైవర్కు పూలదండ వేసి శాలువాతో సత్కరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావుకు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ మాట్లాడుతూ.. శాతవాహన హాల్టింగ్కు కృషి చేసిన రాంచంద్రరావు, కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉడుగుల రమేశ్, మాజీ కౌన్సిలర్ మహంకాళి హరిచంద్ర గుప్తా, నాయకులు శివరాజ్ యాదవ్, కొంతం శ్రీనివాస్, కీర్తి నర్సయ్య,ఐలోని అంజిరెడ్డి పాల్గొన్నారు. -
మోంథా విధ్వంసం
● నష్టం మరింత పెరిగే అవకాశం ● పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు● 48 ఇళ్లకు పాక్షికంగా నష్టం, జీవాల మృత్యువాత ● రూ.80కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాజనగామ: మోంథా తుపాను ప్రభావం జిల్లాను కోలుకులేని దెబ్బతీసింది. కోత, సేకరణకు సిద్ధమైన వరి, పత్తి పంటలు వర్షపునీటిలో మునిగిపోయాయి. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. తడిసి తేమ పెరిగిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రయత్నిస్తున్నా, వాతావరణం సహకరించడం లేదు. రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట ఒక్క వర్షంతో వరణుడి పాలైంది. మోంథా ప్రభావంతో జరిగిన నష్టాన్ని వ్యవసాయ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్తో పాటు తదితర శాఖల అధికారులు అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. పంట నష్టం, కూలిన ఇళ్లు, రోడ్ల దెబ్బతినడం వంటి అంశాలపై అధికార బృందాలు సర్వే చేపట్టారు. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, ఇళ్లు, రోడ్లు, జీవాలు, చెరువు కట్టలు తదితర వాటిని కలుపుకుని సుమారు రూ.81 కోట్ల మేర నష్టం జరిగినట్టు ప్రాథమిక రిపోర్టు తయారు చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత నష్టం అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందులో 10 మండలాల పరిధిలో 48 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, 5 పశువులు, 10వేల కోడి పిల్లలు, 44 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 6,416 ఎకరాల్లో పత్తి, 10,131 ఎకరాల్లో వరి, 249 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. 69చోట్ల రోడ్లు కోతకు గురికాగా, 9 చెరువుల పరిధిలో కోత, బుంగలు పడ్డాయి. ప్రభుత్వం రైతులు, బాధిత కుటుంబాలకు తక్షణం పంటబీమా, ఆర్థిక సాయం అందించాలని ఆయా రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మోంథా తుపాను ప్రభావంతో జనగామ చరిత్రలోనే అత్యంత భారీ వర్షాన్ని చవిచూసింది. మొత్తం 13 గంటల పాటు నిరంతరాయంగా కురిసిన వర్షం పట్టణంతో పాటు 12 మండలాలను జలమయంగా మార్చేసింది. హైదరాబాద్ ప్రధాన రహదారిని ముంచెత్తడంతో వాహనాలు నిలిచిపోయాయి. చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో పక్కనున్న కాలనీలు నీటితో నిండిపోయాయి. ఆగకుండా కురిసిన వర్షంతో జిల్లాలోని పలుగ్రామాల్లో పెంకుటిల్లు పాక్షికంగా, పూర్తిగా కూలిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న వస్తువులు నీటిలో తడిసిపోయి, పాడైపోవడంతో బాధిత కుటుంబాలు ప్రభుత్వం సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సీజన్ ప్రారంభంలో వ ర్షాలతో చేపలు కొట్టుకుపోయిన పరిస్థితిలో మత్స్య కార్మికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రహదారులు, కల్వర్టులు నీటి ము నిగిపోయాయి. వాగులపై నీటి ప్రవాహం తగ్గకపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నేటికీ పునరుద్ధరణ కాలేదు. బచ్చన్నపేట, జనగామ, నర్మెట, రఘునాథపల్లి, లింగాలఘణపురం, పాలకుర్తి, జఫర్గఢ్ మండలాల పరిధిలోని అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం ఇబ్బందిగా మారింది. -
అప్రమత్తంగా ఉన్నాం..
జనగామ: మోంథా తుపాను ప్రభావం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో హైదరాబాద్ నుంచి గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్పరెన్స్లో మాట్లాడారు.. కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఆర్డీవోలు, వ్యవసాయ, విద్యుత్, సివిల్ సప్లై తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల వద్ద అధికారులు అలర్ట్గా ఉండాలని, మున్సిపాలిటీ పరిధిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వర్ష ప్రభావం వల్ల కలిగిన నష్టంపై వివిధ శాఖల అధికారులు క్షుణ్ణంగా క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి వెంటనే నివేదికలను సమర్పించాలన్నారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
అన్నదాతలు అధైర్యపడొద్దు
రఘునాథపల్లి: మోంథా తుపానుతో చేతికొచ్చిన పంటకు తీవ్ర నష్టం జరిగిందని, అన్నదాతలు అధైర్యపడొద్దని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి మండల కేంద్రంలోని సబ్స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై వరద ప్రవహించిన నేపథ్యంలో గురువారం కల్వర్టులను పరిశీలించారు. వరద ప్రవాహానికి అడ్డుగా నిర్మాణాలు ఏంటి.. ? నాలా కన్వర్షన్ ఎలా చేశారని ఆరా తీశారు.అలాగే నిడిగొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ ఫణికిషోర్ తదితరులు ఉన్నారు. కొనుగోళ్లకు స్పెషల్ డ్రైవ్ జనగామ రూరల్: ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, భారీ వర్షం నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోల్లు చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఆర్డీఓలు, మార్కెటింగ్, డీఆర్డీఓ, వ్యవసాయ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తదితర శాఖలకు చెందిన అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షం వల్ల పూర్తిగా తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లకు తరలించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు, లారీలు, గోనె సంచులు, కొనుగోళ్ల ప్రక్రియ మానిటరింగ్, సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ 8520991823 నంబరును సంప్రదించవచ్చునని సూచించారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
మేలుకొనేదెప్పుడు?
వరదనీటిలో ఇబ్బంది పడుతున్న గిర్నిగడ్డ ప్రజలుపట్టణంలోని రెడ్డి స్ట్రీట్కు వెళ్లే దారిలో వరదజనగామ: అతి భారీ వర్షాలతో జనగామ పట్టణం మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. పట్టణం గుండా వెళ్లే హైదరాబాద్ ప్రధాన రహదారి, శ్రీనగర్ కాలనీ, బాలాజీ నగర్, సీఎంఆర్ కాలనీ, జ్యోతినగర్, కురుమవాడ, అమ్మబావి ప్రధాన రహదారి, గ్రేయిన్ మార్కెట్ ప్రాంతాలు వరద ముప్పుతో తల్లడిల్లుతున్నాయి. ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండడంతో వాహన రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. ఎలా వెళ్లాలో తెలియక.. రెండురోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్రోడ్డు, జ్యోతినగర్, బాలాజీనగర్, జీఎంఆర్ కాలనీ, శ్రీనగర్ కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారులను వరద ముంచెత్తడంతో దారులన్నీ మూసుకుపోయాయి. కాలనీ వాసులు తమ ఇళ్లకు ఎక్కడ నుంచి వెళ్లాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డారు. మోకాళ్ల లోతు నీటిని నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. తాత్కాలిక చర్యలతో ఏటా సమస్య పునరావృతం సమగ్ర డ్రెయినేజీ ప్రణాళికతోనే పరిష్కారం గత మూడు, నాలుగు సంవత్సరాలుగా వర్షాలు కురిసినప్పుడల్లా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు. ఇక్కడ కాలువలు, డ్రైన్లు మూసుకుపోవడం, మురుగునీరు వీధుల్లోకి రావడమన్నా కొత్తేమీ కాదు. శాశ్వత పరిష్కారంపై ఎవరూ దృష్టి సారించడం లేదు. వర్షం వచ్చిపోయిన తర్వాత కాలనీల చుట్టుపక్కల రోజుల తరబడి వరద నీరు నిలిచి ఉండడంతో దోమలు, క్రిమికీటకాలు, పాములు ఇళ్లలోకి చేరిపోతున్నాయి. వర్షం ఆగిన తర్వాత కూడా పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి రెండు మూడు రోజుల సమయం పడుతోంది. వరద ముప్పు నుంచి పట్టణాన్ని రక్షించాలంటే సమగ్ర డ్రెయినేజీ ప్రణాళిక అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
జిల్లాలో 183.5 మిల్లీమీటర్ల వర్షపాతం
మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఈ నెల29 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 183.5(18 సెంటీమీర్లు) వర్షపాతం నమోదైంది. ఇందులో పాలకుర్తి మండలం గూడూరులో అత్యధికంగా 294.8 మిల్లీ మీటర్లు కురియగా, జఫర్గఢ్లో 277.0, చిల్పూరు మండలం మల్కపూర్లో 259.0, జనగామ అర్బన్లో 225.3, పాలకుర్తిలో 221.3, నర్మెటలో 219.5, స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండలో 210.0, దేవరుప్పుల మండలం కొడకండ్లలో 204.5, తరి గొప్పులలో 195.3, జఫర్గఢ్ మండలం కూనూరులో 165.8, లింగాలఘణపురంలో 161.0, స్టేషన్ఘన్పూర్లో 158.0, రఘునాథపల్లిలో 157.8, దేవరుప్పులలో 153.0, కొడకండ్లలో 148.0, బచ్చన్నపేటలో 144.8, బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్లో 125.3, జనగామ మండలం వడ్లకొండలో 123.0, పాలకుర్తి వావిలాలలో అత్యల్పంగా 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వా తావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చీటకోడూరు రిజర్వాయర్ నాలుగు గేట్ల పరిధిలో సగం మేర పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జనగామ: జిల్లాకు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన పనులపై అదనపు కలెక్టర్లు, డీసీపీ, ఆర్డీఓలు, ఏఎస్పీ, ఏసీపీలు, మున్సి పల్ కమిషనర్లు, అన్ని శాఖలకు చెందిన జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులతో బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాలతో ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూడాలన్నారు. లో లెవల్ కాజ్ వేల వద్ద అధికారులు అలర్టుగా ఉండాలన్నారు. చెరువులు, వాగులు, రిజర్వాయర్ల వద్ద రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు వాటర్ లెవల్ మానిటరింగ్పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీల పరిధిలో లోతట్టు ప్రాంతాలు, నాలాల వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. వైద్యులు, వైద్యాధికారులు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలన్నారు. వచ్చే రెండు రోజుల వరకు ఎవరికి సెలవులు లేవ ని, ప్రతి అధికారి అందుబాటులో ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రజ లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. జిల్లాలో కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే స్పందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం (90523 08621) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా పట్టణంలోని ధర్మకంచ ఉన్నత పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర పింకేష్ కుమార్ సందర్శించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. రఘునాథపల్లి: భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. బుధవారం జనగామ డీసీపీతో కలిసి మండల కేంద్రంలోని ఆర్వీఎస్ వద్ద జాతీయ రహదారిపై నిలిచిన వర్షపు నీరును పరిశీలించారు. మండలంలో వరదల పరిస్థితిపై సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై డి.నరేష్ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలి కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
జాతీయ రహదారిపై వాగు ఉధృతి
● వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు రఘునాథపల్లి: హనుమకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిలోని రఘునాథపల్లి మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ఎదుట రహదారిపై ప్రవహిస్తున్న వాగులో ఓ ఆర్టీసీ బస్సు చిక్కుకున్న సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో హన్మకొండకు వెళ్తుంది. ఖిలాషాపూర్ పటేల్ చెరువు అలుగు ఉధృతితో జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాగులో నుంచి దాటే క్రమంలో మధ్యలో బస్సు మొరాయించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్ సిబ్బందితో వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ప్రయాణికులను క్షేమంగా బయటకు తీసుకువచ్చి పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు కోమళ్ల టోల్ ప్లాజా, నిడిగొండ వద్ద వాహనాలు నిలిపేశారు. మాజీ జెడ్పీటీసీ బొల్లం అజయ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, స్థానికులు జాతీయ రహదారిపై వాహనాలు వెళ్లకుండా వర్షంలోనే సేవలు అందించారు. వాగులో మొరాయించిన ఆర్టీసీ బస్సును జేసీబీతో బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
సోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు అర్చకులు తాంబూలం, ప్రసాదం వాయినంగా అందజేశారు. ఆలయంలో ఈఓ సల్వాది మోహన్బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు. జనగామ: తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నేడు (గురువారం) ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడు జరగాల్సిన సమ్మెటివ్ పరీక్షలను వచ్చే నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 3 నుంచి 5వ తరగతులకు ఈవీఎస్, 6, 7వ తరగతుల జనరల్ సైన్స్, 8, 9, 10వ తరగతుల సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నవంబర్ 1న నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 31 వరకు ముందుగా విడుదల చేసిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా నిర్వహించబడతాయన్నారు. కాగా రెసిడెన్షియల్ సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి మాత్రం సెలవు వర్తించదని, వారు విద్యార్థుల భద్రతతో పాటు పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. జనగామ రూరల్: జనగామ డీపీఓగా అంగరాజు నవీన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల గ్రామానికి చెందిన నవీన్ ఇటీవల గ్రూప్ – 1 అధికారిగా నియామకమయ్యారు. కాగా సీనియర్ అసిస్టెంట్ ఎస్. శ్రీకాంత్, కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జనగామ రూరల్: జనగామలో శాతవాహన రైలు హాల్టింగ్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కృషి చేశారని జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. బుధవారం జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రాంత ప్రజల ప్రయాణం కోసం శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు జనగామ రైల్వే స్టేషన్ వద్ద నిలుపుదల చేయడం అభినందనీయమన్నారు. నేటి నుంచి జనగామలో శాతవామాన నిలుపుదల ఉంటుందన్నారు. ఈసందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జి ల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమారాణి, అంజిరెడ్డి, భాగాల నవీన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జనగామ: తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయని, ఎక్కడైన తెగిన విద్యుత్ తీగలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని జనగామ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ టి.వేణు మాధవ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ విద్యుత్ భద్రత కోసం ప్రజలు తప్పనిసరిగా సూచ నలను పాటించాలన్నారు. వర్షాలు పడుతున్న సమయంలో తడిగా ఉన్న చేతులతో స్విచ్లు, మీటర్లు, ప్లగ్లు, వైర్లు తాకరాదన్నారు. గాలులతో తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపించిన వెంటనే సమీప లైన్మన్కు, లేదా 1912 టోల్ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాల సమయంలో సూచనలను పాటించడంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమన్నారు. -
అతలాకుతలం
జనగామపై పంజా విసురుతున్న మోంథా తుపాను జనగామ:గ్రెయిన్ మార్కెట్ రూట్ కల్వర్టు వద్ద ఇళ్లలోకి చేరిన వరద నీరుజనగామ: మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారు జాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మురికి కాల్వలు, ఎగువ ప్రాంతం నుంచి దూసుకువస్తున్న వరద నీటితో జనగామ పట్టణంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. హైదరాబాద్ ప్రధా న రహదారిపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్టీసీ చౌరస్తా వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో డీసీపీ రాజమహేంద్ర నాయ క్, అదనపు కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓల పర్యవేక్షణలో మోంథా ప్రభావంపై అలర్ట్గా ఉన్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో కల్వర్టులపై వరద ప్రవాహం పెరగడంతో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లగా, ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యంపై టార్పాలిన్ కవర్లు కప్పినా, పూర్తిగా తడిసి పోయాయి. హైదరాబాద్ రోడ్డుపై.. జనగామ పట్టణం హైదరాబాద్ రోడ్డుపై వరద నడుము లోతు వరకు పెరగడంతో రాకపోకలను నిలిపి వేశారు. కలెక్టర్ పరిస్థితిని సమీక్షించగా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, సీఐ సత్యనారాయణరెడ్డి అక్కడే ఉండి పర్యవేక్షించారు. శానిటేషన్ కార్మికులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించారు. లోతట్టు ప్రాంతాలైన శ్రీనగర్, జ్యోతినగర్, బాలాజీనగర్ కాలనీలను వరద ముంచెత్తింది. గ్రెయిన్ మార్కెట్ ప్రధాన రహదారి కల్వర్టుపై వరద నీరు అంతకంతకు పెరిగి పోతుండడంతో చీటకోడూరు, వీవర్స్ కాలనీ, చౌడారం, తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలి చి పోగా, కృష్ణ, మల్లేశం, చంద్రయ్య, యాదగిరి, సూర్యనారాయణ ఇళ్లు నీటమునిగాయి. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు వరద నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గానుపహాడ్ కల్వర్టు కొట్టుకుపోవడంతో ఆ మార్గాన్ని మూసివేసి, వాహనాలను ఇతర మార్గాలకు మళ్లించారు. పత్తి, వరి పంటకు నష్టం భారీ వర్షాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జనగా మ మార్కెట్లోని కాటన్ యార్డు, ఐకేపీ, పీఏసీ ఎస్ సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధా న్యం తడిసిపోకుండా అధికారులు టార్పాలిన్ కవర్లతో కప్పినా తేమ శాతం పెరగడంతో ధాన్యం నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. వందలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాగా జిల్లాలో ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు ఉదయం పాఠశాలల సమయం తర్వాత ఒక్కసారిగా వర్షం ముంచెత్తడంతో విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికి చేరే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ రోడ్డులోని ఏకశిల పబ్లిక్ స్కూల్ ఏరియాలో ఒక్కసారిగా వరద నీరు పెరిగి పోవడంతో తల్లిదండ్రులు పిల్లలను తీసుకు వెళ్లే సమయంలో నరక యాతన పడ్డారు. నిండిన చెరువులు..రిజర్వాయర్లు జిల్లాలో 770 చెరువులు ఉండగా, 303 చోట్ల మత్తడి పోస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో 75 నుంచి 100శాతం 401, 50 నుంచి75 శాతం 145, 25 నుంచి 50శాతం 66, 25 శాతం మేర 40 చెరువులకు వరద నీరు చేరడంతో జళ కళ సంతరించుకుంది. చీటకోడూరు, నవాబుపేట రిజార్వాయర్లు వందశాతం నిండగా, గండిరామవరం 81.38, బొమ్మకూరు 85.99, కన్నె బోయినగూడెం 80.41చ అశ్వరావుపల్లి 79.19, ఆర్ఎస్ ఘన్పూర్ 77.07 శాతం మేర నీటి నిల్వలు పెరిగాయి. ఆటోలో వెళ్తున్న పాఠశాల విద్యార్థులు బైక్పై పిల్లలను తీసుకెళ్తున్న కుటుంబ సభ్యుడు పత్తి, వరి పంటకు తీవ్ర నష్టం ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో తడిసిన ధాన్యం పొంగి పొర్లుతున్న వాగులు.. మత్తళ్లు దూకుతున్న చెరువులు హైదరాబాద్ రోడ్డు జలమయం గ్రెయిన్ మార్కెట్ ఏరియాలో ఇళ్లలోకి వరద నీరు నిలిచిపోయిన రాకపోకలు కలెక్టర్, పోలీసులు పర్యవేక్షణలో రక్షణ చర్యలు జిల్లాలో 16 సెంటీమీటర్ల వర్షపాతం స్టేషన్ఘన్పూర్ డివిజన్ పరిధిలోని 15, 16వ వార్డుల ఎస్సీ కాలనీల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. మున్సిపల్ అధికారులు జేసీబీ సహాయంతో నీటిని తొలగించారు. పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఓ మహిళ ఇల్లు నీటమునిగి, శిథిలావస్థకు చేరడంతో కలెక్టర్ రిజ్వాన్ బాషాకు బాధితురాలు మెసేజ్ పంపగా, వెంటనే స్పందించిన కలెక్టర్ అధికారులను పురమాయించారు. వారు ఆ మహిళను ప్రైమరీ స్కూల్కు తరలించి సాయం అందించారు. పాలకుర్తి మండల కేంద్రంలో పలు ఇళ్లలోని నీరు చేరింది. జనగామ మండలం చీటకోడూరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామపంచాయతీ సిబ్బంది, పోలీసులు వాగు పక్కన కాపలా కాస్తున్నారు. చీటకోడూరు రిజర్వాయర్ నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విదుల చేశారు. వరంగల్ ప్రధాన రహదారి రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఫ్లైఓవర్ సమీపంలో వరదకు ఓ కారు ఎగిరి పల్టీ కొట్టడంతో అందులో ఉన్న ఇద్దరికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.మండలం వర్షపాతం (మిల్లీ మీటర్లలో) పాలకుర్తి 273.8 జఫర్గఢ్ 256.5 చిల్పూరు 257.0 నర్మెట 217.3 స్టేషన్ఘన్పూర్ 207.0 తరిగొప్పుల 178.3 దేవరుప్పుల 168.3 రఘునాథపల్లి 149.5 లింగాలఘణపురం 133.3 బచ్చన్నపేట 133.0 కొడకండ్ల 125.0 జనగామ 121.0 -
ఆద్యంతం.. ఉత్కంఠ
కొందరికే సంతోషం.. ఎక్కువ మందికి నిరాశేజనగామ: కలెక్టర్ వేదికపై ఆసీనులయ్యారు.. ఎదురుగా టెండరుదారులు. ఓ టబ్బులో లాటరీ బిల్లలను వరుస క్రమంలో పేర్చారు. ఎకై ్సజ్ ఉన్నతాధికారి నెంబర్తో ఉన్న బిల్లలను డబ్బాలో వేసి అటూ ఇటూ తిప్పారు. తదుపరి క్షణం హాల్ అంతా ఉత్కంఠతో నిండిపోయింది. కలెక్టర్ డబ్బాలో చేతిని పెట్టి.. ఓ బిల్లను తీశారు. ‘ఇదిగో అదృష్టం ఎవరిదో..’ అంటూ నెంబర్ చెప్పడంతో లక్కీ భాస్కర్ ఎగిరి గంతు వేయగా..మిగతా టెండరుదారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. జిల్లాలో మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియ సోమవారం ఉత్కంఠభరిత వాతావరణంలో విజయవంతంగా పూర్తిచేశారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు నందన గార్డెన్స్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని లాటరీ ద్వారా షాపుల కేటాయింపులు చేపట్టారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, ఎకై ్సజ్ ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ లాటరీ తీశారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 50 మద్యం షాపుల కోసం 1,697 టెండర్లు దాఖలయ్యాయి. లాటరీని పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు వీడియో రికార్డింగ్తో పాటు సాంకేతిక పర్యవేక్షణ చేపట్టారు. కొత్తవారికి అదృష్టం... పాతవారికి నిరాశ జిల్లాలోని మూడు ప్రధాన గ్రూపులకు సంబంధించి 70 నుంచి 300 వరకు టెండర్లు వేయగా, కొత్తగా రంగంలోకి దిగినవారు మాత్రం 10 నుంచి 20 మందిగా గ్రూపులుగా ఏర్పడి 30 నుంచి 75 వరకు దరఖాస్తులు వేశారు. వీరిలో చాలా మందికి అదృష్టం కలసి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గతంలో టెండర్ వేసి ఫలితం దక్కని పాత వ్యాపారులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. చిన్న పెండ్యాల వైన్స్కు భారీ పోటీ చిన్న పెండ్యాల వైన్న్స్ (షాపు నెంబర్–21)కు రికార్డు స్థాయిలో 108 టెండర్లు రాగా.. ఒక్క దరఖాస్తు మాత్రమే ఎంపిక కావడంతో 107 మంది నిరాశ చెందారు. సాయికృష్ణారెడ్డి(లాటరీనెంబర్–29)కి అదృష్టం కలిసి వచ్చింది. ఎన్నో ఆశలు, ఆశయాలతో టెండర్లు వేసిన వారు ఫలితాలు తేలగానే తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. కొందరు కన్నీళ్లతో వెళ్లిపోవడం గమనార్హం. ఆనందోత్సాహాలు.. ఇదే సమయంలో కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన కొందరికీ అదృష్టం కలసి వచ్చింది. బచ్చన్నపేటకు చెందిన నల్లం వంశీ టీం రెండు టెండర్లు వేయగా, మొదటి ప్రయత్నంలోనే జనగామ షాప్–1 దక్కింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లక్కీగా అవగాశం వచ్చిన వారి ఆనందోత్సాహాలతో నందన గార్డెన్స్ ప్రాంగణం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది.చిన్నపెండ్యాల వైన్స్కు అత్యధికంగా 108 టెండర్లు, ఉత్కంఠతో ఎదురుచూపులు చిన్నపెండ్యాల షాపునకు భారీ పోటీ.. అందరి దృష్టి ఈ షాపుపైనే.. నందన గార్డెన్స్ వేదికగా కలెక్టర్ సమక్షంలో లాటరీ వీడియో పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు 50 వైన్స్లు...1,689 దరఖాస్తులులాటరీ సమయంలో టెండర్ దారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికీ అదృష్టం వరిస్తుందోనన్న ఆతృత అందరిలో కనిపించింది. కలెక్టర్ స్వయంగా డబ్బా తిప్పి నెంబర్లను తీసి ఫలితాలు ప్రకటించారు. ఒకవైపు విజేతల ముఖాల్లో ఆనందం పూస్తే, మరోవైపు లాటరీ రాని వారి కళ్లలో నిరాశ కనిపించింది. ఎటువంటి అవా ఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సత్యనారాయణరెడ్డి, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసిన తర్వాత మార్కెట్లో కొత్త కదలికలు మొదలయ్యాయి. లాటరీలో అవకాశం దక్కని బడా వ్యాపారులు లక్కీ భాస్కర్లపై దృష్టి సారిస్తున్నారు. షాపులు దక్కిన కొత్తవారిని సంప్రదిస్తూ కొనుగోలు చర్చలు మొదలుపెట్టారు. మద్యం దుకాణాలు అమ్ముకునేందుకు ముందుకు వచ్చేవారు రూ.60 లక్షల నుంచి రూ.కోటికి పైగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. భారీ డిమాండ్ ఉన్న చోట రేటు పెరిగే అవకాశం ఉన్నట్లు మాట్లాడుకుంటున్నారు. లాటరీలో అవకాశం రాని పలువురు బడా వ్యాపారులు.. మధ్యవర్తుల సహకారంతో కొత్తవారి నుంచి వైన్స్ల కొనుగోలుకు చర్చలు ప్రారంభించారు. మధ్యవర్తులు ఇరువురిని ఒప్పించి డీల్ కుదిరేలా బేరసారాలు నడిపించి.. ఎంతో కొంత కమీషన్ పుచ్చుకుంటున్నట్లు సమాచారం. బడా వ్యాపారుల రీఎంట్రీకి ప్రయత్నాలు -
సీసీఐని సద్వినియోగం చేసుకోండి
● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిల్పూరు: పత్తి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. మండలంలోని రాజవరం గ్రామశివారులో ఉన్న సిరి కాటన్ మిల్లులో సోమవారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆర్డీఓ వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పత్తి క్వింటాలుకు రూ.8,110ల మద్దతు ధరతో సీసీఐ కొనుగోలు చేస్తుందని, ఎలాంటి దళారుల బెడద లేకుండా రైతులు నేరుగా అమ్మకాలు చేయవచ్చని అన్నారు. కడియం దృష్టికి కపాస్ ఇక్కట్లు.. కపాస్ కిసాన్ యాప్తో ఇబ్బందులు ఉన్నాయంటూ ధర్మసాగర్, వేలేరు మండల రైతులు కడియం శ్రీహరి దృష్టికి తెచ్చారు. యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటే పరకాల కాటన్ మిల్లు చూపిస్తోందని, అంత దూరం తీసుక పోతే ఖర్చులు ఎక్కువ అవుతాయంటూ తెలిపారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్యరెడ్డి, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీడీఓ శంకర్ నాయక్, ఎంపీఓ మధుసూదన్, ఏఓ నజీరుద్దీన్, నాయకులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీ పోస్టులకు 6న ఇంటర్వ్యూజనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పలు కాంట్రాక్టు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ తేదీని 5 నుంచి 6వ తేదీకి మార్చినట్లు ప్రిన్సిపాల్ నాగమణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలోని ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, కాంట్రాక్ట్ బేసిస్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వచ్చే నెల 5న ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు తొలుత నిర్ణయించారు. అయితే ఆ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండడంతో 6వ తేదీకి మార్చినట్లు ఆమె పేర్కొన్నారు. -
పట్టించుకునేవారేరి ?
జనగామ రూరల్: ఏళ్ల తరబడి తిరుగుతున్నా దివ్యాంగ పింఛన్ రావడం లేదని ఓ బాధితుడు..కుమారులు తమను చూసుకోవడం లేదని ఓ తల్లిదండ్రులు.. జిల్లాలో రిజర్వాయర్లను పూర్తిచేసి ఆదుకోవాలని రైతులు.. ఇందిరమ్మ బిల్లు రావడం లేదని లబ్ధిదారులు..ఇలా పలు సమస్యలతో సోమవారం గ్రీవెన్స్సెల్కు జనాలు తరలివచ్చారు. ఈసందర్భంగా వారి నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, జిల్లా అధికారులు 71 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ట్రైనింగ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తేజస్విని, ఆర్డీఓ గోపిరామ్, డీఆర్డీఓ వసంత, కలెక్టరేట్ ఏవో, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.దరఖాస్తులు కొన్ని ఇలా..● జనగామలో నివసిస్తున్న గాడిపల్లి దయానందరెడ్డికి చెందిన భూమి రెవెన్యూ రికార్డులో తక్కువగా నమోదు అయ్యిందని, సరిచేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ● బచ్చన్నపేటకు చెందిన మార్క్ కిషన్ తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కొంతమంది ఆక్రమించుకొని ఇల్లు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని, విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ● బచ్చన్నపేట గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయస్సు గల అహ్మద్ బాబా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరారు. దరఖాస్తుల వివరాలు డీపీఓ 12, హౌజింగ్ పీడీ 14, తహసీల్దార్ పరిధిలో 28, విద్యాశాఖ 2, విద్యుత్ 3, ఇరిగేషన్ 2, మున్సిపల్ 2, ఆర్డీఓ, డీపీఓ, డీఆర్డీఏ, లేబర్ అధికారి ఒకటి చొప్పున వచ్చాయి.ఏళ్ల తరబడిగా తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు గ్రీవెన్స్లో ప్రజల మొర..71 దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశం -
ఉల్లాసంగా ఉత్కర్ష
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కాలేజీలో ఉత్కర్ష వేడుకలు రెండో రోజూ సోమవారం ఉల్లాసంగా కొనసాగాయి. ఉదయం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 40 మంది వైద్యవిద్యార్థులు రక్తదానం చేశారు. రాత్రి నిర్వహించిన కార్నివాల్ నైట్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్తో కళాశాల ప్రాంగణమంతా సందడిగా మారింది. విద్యార్థులు కాస్ప్లేలో భాగంగా సినీపాత్రలు, కార్టూన్ పాత్రలు, విభిన్న వేషధారణలతో సందడి చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, మురళీ, పుల్లయ్య పాల్గొన్నారు. -
మహిళల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: మహిళల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన వనిత టీస్టాల్లను జిల్లాలో స్వయం సహాయక సభ్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం జనగామ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వనితా టీస్టాల్ను, అలాగే కలెక్టరేట్ వద్ద మిల్క్పార్లర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణప్రాంత మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వం చేయూత అందిస్తోందన్నారు. వడ్లకొండ గ్రామంలోని ఓంసాయి సంఘ సభ్యురాలు స్రవంతి రూ.2.50లక్షలతో వనితా టీస్టాల్ను అలాగే చీటకోడూరులోని కస్తూరి స్వయం సహాయక సభ్యురాలు విజయలక్ష్మి రూ.2.50 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలతో మిల్క్పార్లర్ను ఏర్పాటు చేసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, అడిషనల్ డీఆర్డీఓ, డీపీఎంలు తదితరులు పాల్గొన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి.. జనగామ: రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావంతో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సోమవారం రైతులకు కీలక సూచనలు జారీ చేశారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని కోత, రవాణా పనులను తాత్కాలికంగా 3, 4 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే కోసిన పంటలను వర్షం బారిన పడకుండా సురక్షిత ప్రదేశాల్లో, గిడ్డంగుల్లో నిల్వ చేయాలని సూచించారు. తుఫాను సమయంలో చెట్లు, విద్యుత్ తీగలు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల వద్దకు వెళ్లరాదని సూచించారు. -
శివాలయాల్లో కార్తీక కాంతులు
జనగామ: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభమవడంతో జిల్లాలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోని మొదటి సోమవారం పురస్కరించుకుని తెల్లవారు జామునుంచే భక్తులు శివాలయయాలకు భారీగా తరలివచ్చారు. ఓం నమఃశివాయ నినాదాలతో ఆలయాలు మార్మోగాయి. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీసోమేశ్వరాలయంలో.. పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ ప్రదాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న,అర్చకులు డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
హైవేపై వ్యాపారం..జరభద్రం
వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారి జనగామ మండలం పెంబర్తి జంక్షన్ వద్ద రోడ్డుపైనే సీతాఫలాలు అమ్ముతున్నారు. వరంగల్, హైదరాబాద్ వెళ్లే వాహన చోదకులు సీతాఫలాలను కొనుగోలు చేసేందుకు కార్లను రోడ్డు మధ్యలో ఆపేస్తున్నారు. వేగంగా దూసుకొచ్చే వాహనాలతో ఏదైనా ప్రమాదం జరిగితే..బాధ్యత ఎవరిదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్హెచ్ అధికారులు నిర్లక్ష్య ధోరణితో ప్రమాదం అంచున సీతాఫల్ వ్యాపారం జరుగుతోంది. గతంలో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లపైకి భారీ వాహనాలు దూసుకొచ్చి అమాయకులు చనిపోయిన సంగతి తెలిసిందే. – జనగామ -
‘లక్కీ’ భాస్కర్లు ఎవరో?
జనగామ: మద్యం దుకాణాల కేటాయింపులపై వ్యాపారుల్లో ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. ఈనెల 27న(సోమవారం) జరుగనున్న లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిదో తేలిపోనుంది. పాత వ్యాపారులు, కొత్త ఆశావహులు ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్నారు. గతంలో చేజారిన లైసెన్స్లను తిరిగి పొందాలని లెక్కల్లో మునిగితేలుతుండగా, మరికొంత మంది దేవుళ్ల దయ కోసం ఆలయాల బాటపట్టారు. మరి కొద్దిసేపట్లో మొదలు కానున్న లక్కీ లాటరీలో తమ పేరు వినిపిస్తుందేమోనన్న ఆశతో డ్రాలో ‘లక్కీ’ తగలాలని ఆలయాల్లో ముడుపులు కట్టారు. 2025–27 సంవత్సరానికి గాను వైన్స్లను దక్కించుకునేందుకు ఒక్కొక్కరు ఒకటి నుంచి 300(టీంలుగా ఏర్పడి) వరకు దరఖాస్తులు వేయగా, సుమారు ఆరు నుంచి 10 సిండికేట్ గ్రూపులు ఏర్పడ్డాయి. జిల్లాలోని 50 మద్యం దుకాణాల కోసం 1,697దరఖాస్తులు వచ్చాయి. ఏర్పాట్లు పూర్తి.. జనగామ మండలం పెంబర్తి జంక్షన్లోని నందన గార్డెన్లో ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాల కేటాయింపులకు లక్కీ లాటరీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. టెండరుదారులు ఉదయం 9 గంట ల వరకే నందన గార్డెన్కు రావాలని అధికారులు తెలిపారు. టెండరు రశీదుతో పాటు ఎంట్రీ పాస్, గుర్తింపు పొందిన కార్డును వెంటతెచ్చుకోవాని సూచించారు. లాటరీ నిర్వహించే వేదిక వద్దకు సెల్ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి ఆధ్వర్యంలో టెండర్ దారుల సమక్షంలో డ్రా తీయనున్నారు. నేటి మద్యం షాపుల లాటరీలో దశ తిరిగేదెవరికో! అదృష్టం వరించాలని వ్యాపారుల ఆలయాల బాట 50 వైన్స్లు...1,697 దరఖాస్తులకు డ్రా నందనా గార్డెన్లో ఏర్పాట్లు పూర్తి -
తెరుచుకునే దారేది?
సగం పూర్తయినా ప్రారంభం కాని రోడ్డుజనగామ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డు జ్యోతినగర్ ప్రధాన రహదారిపై భారీ నాలా నిర్మాణం చేస్తున్నారు. నాలా నిర్మాణ సమయంలో ఈ ఏడాది ఏప్రిల్లో ఈ దారిని మూసివేశారు. దీంతో దారిలో ఉన్న వ్యాపార సముదాయాలు మూసేసుకునే పరిస్థితి ఎదురవుతోంది. రోడ్డు మధ్యలో నిర్మాణం సగం వరకు పూర్తయినప్పటికీ, మూసుకున్న దారి తెరుచుకోవడం లేదు. దీంతో కాలనీ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వ్యాపారాలు చేసుకునేవారు నష్టంతో అప్పుల పాలవుతున్నారు. నాలా ఎక్కడి వరకు... ఎక్కడ పుల్స్టాప్.. అసలు ఏ ఉద్దేశ్యంతో నిర్మిస్తున్నారని ప్రజలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. – జనగామ -
ఆరబెట్టలేక.. అమ్ముకోలేక!
వరంగల్: పండించిన పత్తిని మద్దతు ధరకు రైతులు అమ్ముకునే పరిస్థితులు కానరావడం లేదు. అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈదుస్థితి ఏర్పడింది. పత్తిలో 8 శాతం తేమ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 ఇస్తామని సీసీఐ వెల్లడించింది. ప్రతీ అదనపు శాతానికి రూ.81 కోత ఉంటుందని ఇప్పటికే పేర్కొంది. అది కూడా 12 శాతం వరకే. అంతకుమించితే కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆరబెడదామంటే అనువైన పరిస్థితులు లేవు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టుకోలేక, ఇంట్లో నిల్వ చేస్తే తేమ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో మార్కెట్కు తీసుకొచ్చి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. మద్దతు ధర కంటే సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తక్కువగా అమ్మడంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. స్లాట్ బుకింగ్.. పత్తి అమ్మేందుకు ఈ సీజన్ నుంచి సీసీఐ కపాస్ కిసాన్ యాప్ను అమలులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రైతులు తమ పత్తిని సీసీఐకి అమ్మాలంటే కచ్చితంగా మార్కెట్ యార్డుకు రాకముందే యాప్ ద్వారా జిన్నింగ్ మిల్లును ఎంపిక చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అందులో తేదీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే యార్డుకు రావాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మొదట పత్తి కొనుగోళ్లు వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏ, బీ కేంద్రాల్లోనే ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 60 కొనుగోలు కేంద్రాలు.. సీసీఐ నిర్దేశించిన దానికంటే పత్తిలో తేమ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో 60 సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు మార్కెటింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లాలో 28, హనుమకొండలో 3, జనగామ 15, మహబూబాబాద్ 6, భూపాలపల్లి 5, ములుగులో 3 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా సోమవారం లాంఛనంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాలతోపాటు మక్కల కొనుగోలు కేంద్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభిస్తారని వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ తెలిపారు. పత్తిలో తేమ శాతం కారణంగా మిగిలిన కేంద్రాలను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పత్తిలో తేమ 8 శాతం ఉంటే మద్దతు ధర రూ.8,110 చెల్లిస్తారు. 9 శాతం ఉంటే రూ.8,028, 10 శాతం ఉంటే రూ.7,947, 11 శాతం ఉంటే రూ.7,,866, 12 శాతం ఉంటే 7785.60 ధర చెల్లిస్తారు. 12 శాతం మించితే కొనుగోలు చేయమంటున్న సీసీఐ నేడు ఏనుమాముల మార్కెట్లో కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్న మంత్రి కొండా సురేఖ గతంలో సీసీఐ కొనుగోలు చేసిన పద్ధతితోనే రైతులకు ఇబ్బందులు ఉండవు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని సంబంధిత కేంద్రానికి తీసుకువస్తే తేమ ఎక్కువ ఉందని అంటే రైతు సరుకు వాపస్ తీసుకుపోవాల్సి వస్తుంది. దీని వల్ల రవాణా చార్జీలు అదనంగా భరించాలి. రైతు ఇష్టం ఉన్న కేంద్రంలో అమ్ముకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దేశంలో పలుచోట్ల ఈపద్ధతిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పంజాబ్లో గొడవలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిసింది. రైతు పట్టా పాస్బుక్, బ్యాంకు ఖాతాలను పరిగణనలోకి తీసుకునే కొనుగోలు చేస్తే బాగుంటుంది. – బొమ్మినేని రవీందర్రెడ్డి, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
‘చింపాంజీ’ కదిలే.. కోతులు బెదిరే
● చింపాంజీ వేషధారణతో వాడవాడకూ సిబ్బంది ● బతుకమ్మ కుంటలో ప్రయోగాత్మక ప్రారంభం ● ఇక వానరమూక ఆటకట్టు.. ● సత్ఫలితాలు వస్తే ప్రజలకు పెద్ద ఊరటజనగామ: కోతుల ఆగడాలతో విసిగిపోతున్న ప్రజలకు కొంచెం రిలీఫ్ దొరికే సమయం వచ్చింది. జనగామ మున్సిపల్ అధికారులు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. కోతుల భయాన్ని పారదోలేది కోతులే అన్నట్టు శానిటేషన్ కార్మికులకు బ్లాక్ కలర్ చింపాజీ డ్రస్ల్లో రంగంలోకి దింపి మిషన్ స్టార్ట్ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పురపాలక అధికారులు ఇటీవల విజయవంతంగా అ మలు చేసిన చింపాంజీ డ్రస్ మిషన్ను ఆదర్శంగా తీసుకుని, పట్టణంలో కూడా అమలు చేస్తున్నారు. వినూత్న విధానం.. జనగామ పట్టణంలో జనాభాతో పోటీ పడుతూ రోజురోజుకూ కోతుల సంతతి పెరుగుతోంది. ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. నెలలో పదుల సంఖ్యలో కోతులు కరిచి ఆస్పత్రి పాలవుతున్నారు. కోతల నుంచి రక్షణ కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇస్తున్నారు. వానరాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు కమిషనర్ మహేశ్వర్రెడ్డి సారథ్యంలో శనివారం నుంచి కొత్త విధానం అమలులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన బ్లాక్ కలర్ చింపాంజీ డ్రస్సులను ఆరుగురు శానిటేషన్ కార్మికులకు వేసి..కోతులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో దింపారు. ఆ డ్రస్సుల్లో కార్మికులు కనిపించగానే, కోతులు భయపడడం మొదటి రోజు కనిపించింది. మొదటగా బతుకమ్మ కుంట పరిసరాల్లో ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు. చింపాంజీ వేషధారణలో ఉన్న కార్మికుడు చుట్టూ తిరగడం ప్రారంభించగానే కొంతసేపు అక్కడ తిరిగే కోతులు ఒక్కసారిగా చెట్లెక్కి దూరంగా వెళ్లిపోయాయి. ఈ దృశ్యం చూసి స్థానికులు హమ్మయ్య అంటూ రిలాక్స్ అ య్యారు. జనగామలో ఈ కొత్త ప్రయోగం ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కోతులకు చెక్ పెట్టే ఈ వినూత్న ప్రయత్నం భవిష్యత్తులో సత్ఫలితాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే..ఆరుగురి స్థానంలో మరికొంత మందిని పెంచే విధంగా అధికారులు ముందుకు వెళ్ల నున్నారు. చింపాజీ డ్రస్సుల్లో ఉన్న కార్మికులకు భద్రతగా మరికొంత మంది అక్కడే నిఘా వేసి ఉంటారు.ప్రజలకు కోతులతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఇదొక ప్రయత్నం. యాదగిరిగుట్టలో సక్సెస్ అయిన విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తున్నాం. ఆన్న్లైన్ ద్వారా ప్రత్యేకంగా ఆరు చింపాంజీ డ్రస్సులు కొనుగోలు చేశాం. కార్మికుల భద్రత కోసం వారి వెంట మరి కొంతమంది శానిటేషన్ సిబ్బంది కూడా ఉంటారు. – మహేశ్వర్రెడ్డి, మునిసిపల్ కమిషనర్, జనగామ -
బాబోయ్..ఎలుగుబంట్లు
స్టేషన్ఘన్పూర్: మండలంలోని తాటికొండ గ్రామశివారులో రాత్రివేళల్లో ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాటికొండ నుంచి గిద్దెబండాకు వెళ్తున్న దారిలో శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులకు బోళ్ళబండ వద్ద రెండు ఎలుగుబంట్లు రోడ్డుపై వెళ్తూ కనిపించగా ఒక్కసారిగా వణికిపోయారు. కాగా వారి బైక్ లైట్ వెలుగుకు బెదిరి అవి రోడ్డుపై పరుగెడుతుండగా యువకులు తమ సెల్ఫోన్లలో వీడియోలు తీసి తాటికొండ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేశారు. అయితే తాటికొండ శివారులోని గుట్టల ప్రాంతం నుంచి ఎలుగుబంట్లు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. తాటికొండ గ్రామ శివారులోని రోడ్లపై ఎలుగుబంట్లు సంచరిస్తున్న సమాచారంతో ప్రజలు, అటువైపు వ్యవసాయ భూములు ఉన్న రైతులు భయపడుతున్నారు. రాత్రి వేళల్లో వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచనలు చేస్తున్నారు. తాటికొండ గ్రామశివారుల్లో సంచారం భయాందోళనలో ప్రజలు -
సర్దుబాటుకు సై
జనగామ: జిల్లాలో అటకెక్కిన టీచర్ల సర్దుబాటు ఎట్టకేలకు స్కూల్కు చేరింది. రెండు నెలలుగా కాలయాపన చేస్తూ ...ఎస్ఏ–1 పరీక్షలు మొదలయ్యాక సర్దుబాటుకు సంబంధించి ఉత్తర్వులను విడుదల చేశారు. సర్దుబాటు జాప్యంపై సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలతో విద్యాశాఖలో అలజడి మొదలైంది. మొదటి సర్దుబాటులో పైరవీలకు పెద్దపీట వేశారనే ఆరోపణలు సాక్షి కథనంతో వెలుగులోకి రావడంతో దానికి బ్రేక్ వేశారు. రెండోసారి సర్దుబాటు చేస్తూ ఉన్నతాధికారుల సంతకం లేకుండా డ్రాఫ్ట్ పేరిట లీకులు ఇచ్చి..ఇందు లో తప్పులేమైనా ఉన్నాయా అని ఒకటికి, రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకున్నారు. ఇందులో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్లు గుర్తించిన పలు ఉపాధ్యాయ సంఘాలు డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. సర్దుబాటు సమస్య విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారడంతో.. విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిపోయింది. ప్రభుత్వ బడుల్లో బోధనకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశ్యంతో సాక్షి ఇటీవల శ్రీఅటకెక్కిన సర్దుబాటుశ్రీ శీర్షికన ప్రచురితం చేసిన కథనం విద్యాశాఖను కుదిపివేయడంతో.. 94 మందితో కూడిన టీచర్ల జాబితాను కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం ఉత్తర్వుల కాపీని విడుదల చేశారు. ఆలస్యంతో విద్యార్థుల ఇబ్బందులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను సెప్టెంబర్ 4వ తేదీన పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ అనేక కారణాలతో రెండు నెలల పాటు కాలయాపన చేశారు. ఈ సమయంలో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతకు కారణంగా తరగతుల్లో బోధనకు అంతరాయం కలిగింది. దీంతో అక్కడక్కడా తల్లిందడ్రులు పాఠశాల ఎదుట ఆందోళనకు సైతం దిగారు. ఎట్టకేలకు సర్దుబాటు ముగియడంతో నేటి నుంచి టీచర్లపై ఒత్తిడి తగ్గనుంది. కేటగిరీ సర్దుబాటు టీచర్లు స్కూల్ అసిస్టెంట్ (సోషల్) 07 స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 03 స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్) 04 స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) 03 స్కూల్ అసిస్టెంట్ (గణితం) 02 స్కూల్ అసిస్టెంట్ (హిందీ) 01 లాంగ్వేజ్ పండిట్ (తెలుగు) 03 లాంగ్వేజ్ పండిట్ (హిందీ) 01 ఎస్జీటీ 70 94 మంది ఉపాధ్యాయుల జాబితాతో కలెక్టర్ ఉత్తర్వులు -
రోడ్ల అభివృద్ధికి రూ.120కోట్ల నిధులు మంజూరు
జఫర్గఢ్: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 120 కోట్ల 40లక్షల నిధుల మంజూరయ్యాయని సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నూకల ఐలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లయ్య, పార్టీ సీనియర్ నాయకులు అన్నెబోయిన భిక్షపతి, ఇల్లందుల శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ..ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు జఫర్గఢ్ మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేయడమే కాదు కొత్తగా రోడ్ల అభివృద్ధికి రూ.120 కోట్ల 40 లక్షల నిధులను మంజూరు చేయించారన్నారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బానోత్ రాజేష్నాయక్, కుల్లా మోహన్రావు, చిట్టిమళ్ల కృష్ణమూర్తి, ఎడ్ల వెంకటస్వామి, మారపల్లి ప్రభాకర్, జ్యోతి యాకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆసియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
జనగామ: ఆసియా ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని సెయింట్పాల్స్ హైస్కూల్లో ఆదివారం రక్తదా న శిబిరం నిర్వహించారు. ఎస్ఆర్ బ్లడ్ బ్యాంకు సెంటర్ ఆధ్వర్యంలో డెంగీ, తలసేమియా బాధితుల రక్త అవసరాలను తీర్చేందుకు ఫౌండేషన్ అధ్యక్షుడు మొహినొద్దీన్ సభ్యులు ఈశ్వర్, శివ, తౌఫిర్, షాహిద్, మెషిన్, శృతి, మహేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని డాక్టర్ సుగుణాకర్రాజు ప్రారంభించారు. రక్తదానం చేసిన 70మందికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, స్కూల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. కరాటే విజేతకు కేయూ రిజిస్ట్రార్ అభినందనలుజనగామ: గోవాలో ఇటీవల జరిగిన జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా 17జేకేఏ జాతీయస్థాయి పోటీల్లో బచ్చన్నపేట మండలం రామచంద్రాపురానికి చెందిన విద్యార్థి అన్వేష్ ప్రతిభ చాటారు. ఈమేరకు కాకతీయ యూనివర్సిటీలో ఆదివారం అన్వేష్ను వర్సిటీ రిజిస్ట్రార్ ఫ్రొఫెసర్ వి.రాంచంద్రం, రాజనీతిశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, బోర్డ్ అఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య, అధ్యాపకులు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ నాగరాజ్, పీహెచ్డీ స్కాలర్ కె.ప్రశాంత్ అభినందించారు. మాస్టర్ పులిగిల్ల సుకేష్ సమక్షంలో విద్యార్థికి సర్టిఫికెట్ ప్రదానం చేశారు. కాగా జనగామకు చెందిన మరో ఆరుగురు విద్యార్థులు ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. త్రికూటాలయంలో హెరిటేజ్వాక్ బృందం రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ త్రికూటాలయాన్ని ఆదివారం హైదరాబాద్ హెరిటేజ్వాక్ బృందం సందర్శించింది. త్రికూటాలయం చరిత్ర నేపథ్యం, పునఃనిర్మాణం అడ్డంకుల గురించి వేద పండితులు కృష్ణమాచార్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలోని త్రికూటాలయం, శివాలయంలోని చారిత్రక శిల్పాలు వాటి ప్రాముఖ్యాన్ని తెలుసుకున్నామన్నారు. పెంబర్తి హస్తకళల కేంద్రాన్ని సందర్శించి వర్క్షాపు నిర్వహించినట్లు పేర్కొన్నారు. చారిత్రాత్మక సంపద భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని బృందం సభ్యులు పేర్కొన్నారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి స్టేషన్ఘన్పూర్: కల్లుగీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరమణ డిమాండ్ చేశారు. డివిజన్ కేంద్రంలో కేజీకేఎస్ జిల్లా కమిటీ సమావేశాన్ని ఆదివారం సంఘం మండల గౌరవ అధ్యక్షుడు గట్టు రమేశ్గౌడ్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకటరమణ మాట్లాడారు.. కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పలుమార్లు సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదని ఆరోపించారు. ఎక్స్గ్రేషియా బాధితులే స్వయంగా కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు చేసినా స్పందన లేదన్నారు. కల్లుగీత కార్మికులకు వృత్తిలో భాగంగా ప్రమాదవశాత్తు మృతిచెందినా, గాయపడినా అందించే ఎక్స్గ్రేషియా, పరిహారం ఏళ్ల తరబడి పెండింగ్లో ఉందన్నారు. సాఫ్ట్ డ్రింక్లు తయారు చేసే బడా కార్పొరేట్ కంపెనీలు ప్రజల నుంచి కోట్లాది రూపాయలు దండుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో కేజీకేఎస్రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్నె వెంకటమల్లయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య, నాగన్న, జిల్లా కమిటీ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ జేఏసీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
జనగామ రూరల్: బీసీ జేఏసీ స్టీరింగ్ కమిటీని ఎన్నుకున్నట్లు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దూడల సిద్ధయ్యగౌడ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో వివిధ బీసీ కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. అడహక్ కమిటీ చైర్మన్ సెవెల్లి సంపత్, వైస్ చైర్మన్ ధర్మపురి శ్రీనివాస్, సలహాదారులుగా కల్నల్ భిక్షపతి, కంచ రాములు, మంగళంపల్లి రాజు, జాయ మల్లేష్, పండుగ హరీష్ ముదిరాజ్, కొత్తపల్లి అభినాష్, సింగిరి ప్రశాంత్ యాదవ్తో పాటు ప్రతీ కులసంఘం నుంచి ఒక ప్రతినిధిని భాగస్వామ్యం కల్పించారు. రాబోయే రోజుల్లో స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. -
కాసింత సమయం కేటాయిద్దాం..
సమాజంలో అందరూ మనలాగే ఉండరు.. సంతోషంగా బతకాలని ఉన్నా.. అందుకు అవకాశం లేని వారూ ఉన్నారు. మనతోనే సమాజంలో జీవనం సాగిస్తున్నా.. అందరిలా ఆనందం పొందడం లేదు వాళ్లు.. చుట్టూ ఎంత మంది ఉన్నా.. నా అన్న వాళ్లు లేని అనాథలు.. అమ్మానాన్నలకు దూరమైన చిన్నారులు కొందరైతే.. కన్నవారి నిరాదరణకు గురైన అమ్మానాన్నలు మరికొందరు. అసలు సమాజాన్ని చూడలేని అంధులు కొందరైతే.. సాటి మనిషి తోడుంటే తప్ప కదల్లేని దివ్యాంగులు ఇంకొందరు. ఇలా వీరంతా మనలాగే మనుషులు. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మ విశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనసులు.. ఆనందాన్ని పంచే మాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరున్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం ఇవ్వగలిగేవే.. మనం చేసే ఖర్చు.. వెచ్చించే సమయం కొంతైనా వారికి ఆనందాన్నివ్వవచ్చు. కాసింత సమయం కేటాయిద్దామనే ఆలోచనలతో ఎంతో మంది ఆశ్రమాలను సందర్శిస్తూ ఒకపూట ఆత్మీయంగా గడుపుతున్నారు. -
రూ.18.70 కోట్లు
జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి యూఐడీ నిధులుజనగామ: జనగామ పురపాలిక అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ (యూఐడీ)లో భాగంగా ప్రభుత్వం మున్సిపాలిటీకి రూ.18.70 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో పట్టణంలోని 30 వార్డుల పరిధిలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణంతో పాటు 14వ వార్డులో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చిల్డ్రన్ పార్కు పునర్నిర్మాణం చేపట్టనున్నారు. జనగామ జిల్లా కేంద్రం మున్సిపల్ అభివృద్ధికి మరో అడుగు పడింది. 30 వార్డులు, సుమారు 80 వేల పైచిలుకు జనాభాతో 19.1 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. 108 కిలో మీటర్ల డ్రెయినేజీ, 155 కిలో మీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణంతో పట్టణం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది. బాలాజీనగర్, కుర్మవాడ, సూర్యాపేట రోడ్డు, బాణాపురం, గిర్నిగడ్డలోని పలు ప్రాంతా లు, జీఎంఆర్ కాలనీ, జ్యోతినగర్ (పలు ఏరియాలు), వికాస్నగర్ తదితర ప్రాంతాల్లో సీసీరోడ్లతో పాటు డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గత కొంతకాలంగా మున్సిపాలిటీ అధికారులు పట్టణ అవసరాల దృష్ట్యా అభివృద్ధి ప్రతిపాదనలు వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 30 వార్డుల పరిధిలో 10,691 మీటర్ల సీసీరోడ్లు, 10,853 మీటర్ల డ్రెయినేజీ, చిల్డ్రన్ పార్కు పునరుద్ధరణకు రూ.18.70 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్కు సంబంధించి ప్రకటన చేయగా, నిధులు పురపాలిక ఖాతాలో జమ కావాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇందుకు సంబంధించిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి పథకాల అమలులో కాంట్రాక్టర్లకు నిధుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో టెండర్లకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పురపాలికకు వచ్చే నిధులతో చేపట్టబో యే అభివృద్ధి పనులకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. గతంలో మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినప్పటికీ ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితులు విధితమే. ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. తాజాగా నిధులు అందుబాటులోకి రాక, కాంట్రాక్టర్లు స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది. జనగామ మున్సిపాలిటీకి రాబోయే నిధులు పట్టణ భవిష్యత్కు పునాది వేయనుంది. మౌలిక వసతుల విస్తరణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. చిల్డ్రన్ పార్క్ అభివృద్ధితో పిల్లలకు వినోదం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకుంటే జనగామ పట్టణ రూపు మార్చుకునే దిశగా అడుగులు వేస్తుందనే అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ సీసీ రోడ్లు, డ్రెయినేజీలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై మురుగునీరు పారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిధుల మంజూరుతో ఆ సమస్యలకు చెక్ పడే అవకాశముంది. డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు ఉపహరించడంతో పాటు దోమల స్వైర విహారానికి చెక్ పెట్టొచ్చు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, చిల్డ్రన్ పార్కు నిర్మాణం మారనున్న పట్టణ రూపురేఖలు -
పొరపాట్లు లేకుండా చూడాలి
జనగామ రూరల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించామన్నారు. ఇందులో ఏ కేటగిరీలో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, బీ కేటగిరీలో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, సీ కేటగిరీలో 1987 నుంచి 2002 మధ్యలో జన్మించి 2025 ఓట రు జాబితాలో నమోదు కాబడిన వారు, డీ కేటగి రీలో 2002–2007 మధ్యలో జన్మించిన వారీగా విభజించడం జరిగిందన్నారు. అన్ని కేటగిరీలు క లిపి సుమారు 3.33 కోట్ల ఓటర్లను మ్యాపింగ్ చేశామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా దశల వారీగా పూర్తి చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ బెన్షలోమ్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. వీసీలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష -
చల్లంగా చూడు నాగన్న
జనగామ గీతాశ్రమంలో పూజలు చేస్తున్న భక్తులు● ఆలయాలకు పోటెత్తిన భక్తులు● జిల్లా వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు జనగామ: కార్తీక మాసం పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా భక్తులు శనివారం నాగుల చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలతో పాటు పట్టణంలోని పోచమ్మ ఆలయం, గీతాశ్రమం, బాణాపురం, గుండ్లగడ్డ, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పుట్ట వద్ద పసుపు, కుంకుమ, పూలతో పూజలు నిర్వహించి, నాగదేవతలకు పాలు పోసి ఆరాధించారు. శివాలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల ఆరాధనతో ఆలయాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు ఉపవాసంతో నాగదేవతలకు నైవేద్యాలు సమర్పించారు. -
అనాథ, వృద్ధాశ్రమాల్లో పుట్టిన, పెళ్లిరోజు వేడుకలతో సందడి
సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో భోజనాలు.. కాజీపేటలో పిల్లలకు పండ్లు అందజేస్తున్న దాతలు (ఫైల్)కాజీపేట: వారంతా మనలాగే మనుషులు. చుట్టూ అందరూ ఉన్నా..నా అనేవారు లేని వాళ్లు.. వారికి కావాల్సింది ఆప్యాయతతో పలకరించే రెండు మాటలు.. ఆత్మీయతతో చేరదీసే చేతులు.. ఆత్మవిశ్వాసంతో నడిపించే అడుగులు.. అర్థం చేసుకునే మనుషులు.. ఆనందాన్ని పంచే ఆటపాటలు.. అన్నింటినీ మించి తమకంటూ కొందరు ఉన్నారు.. అనే నమ్మకం కలిగించే వాళ్లు కావాలి. ఇవన్నీ మనం వారికి అందించగలం.. ‘మేం అనాథలం కాము’ అని వారిలో ఆనందాన్ని నింపగలం.. ఇందుకు కావాల్సిందల్లా కాసింత సమయం.. ఓపిక మాత్రమే. నగరంలోని చాలా మంది ఉద్యోగులు, వ్యాపారులు ఇటీవలి కాలంలో సేవాపథంలో ముందుకు సాగుతున్నారు. ఆదివారాన్ని ఆనందంగా గడుపుతూనే.. దాన్ని మరికొంత మందికి పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనాథలు, మానసిక దివ్యాంగులు, వృద్ధుల మధ్య పుట్టిన రోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. పండ్లు, స్నాక్స్, బ్రెడ్ ప్యాకెట్లు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. బాగున్నావా అవ్వ., ఏం చేస్తున్నావు తమ్ముడూ.. ఆరోగ్యం ఎలా ఉంది అన్న అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఒంటరి మనుషుల మోముల్లో చిరునవ్వు నింపుతున్న కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారితో ఆటాపాట.. పండ్లు.. కడుపు నిండా భోజనం ఇటీవల పెరిగిన సేవా దృక్పథం -
ఉద్యమాలను ఉధృతం చేయాలి
జనగామ రూరల్: రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను ఉధృతం చేయాలని, సీసీఐని నీరు కార్చేందుకే కపాస్ కిసాన్ యాప్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఓ పంక్షన్హాల్లో తెలంగాణ పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి నాథన్ సిఫారుసుల మేరకు పత్తికి గిట్టుబాటు ధర రూ.10,075 అమలు చేయాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. దేశంలో పండించిన పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతువ్యతిరేక విధానాలను విరమించుకోకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్లు మూఢ్ శోభన్, భూక్యా చందు నాయక్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, మంగ బీరయ్య, చిలుకూరి రాము, వాంకుడోత్ కోబల్, కనకాచారి, రామన్న, బాల్రెడ్డి, ఎర్రనాయక్, షేక్ సైదా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యుడు రంగారెడ్డి -
నాణ్యమైన భోజనం అందించాలి
జనగామ: రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని టాస్క్ఫోర్స్ టీం అధికారి బి.ప్రేమ్కుమార్ అన్నారు. శనివారం టాస్క్ఫోర్స్ బృందం జిల్లా ఆస్పత్రితో పాటు అర్బన్ పీహెచ్సీ, సెంట్రల్ మెడిసిన్ స్టోర్, లింగాలఘణపురం, రఘునాథపల్లి పీహెచ్సీల్లో తనిఖీలు చేశారు. డయాలసిస్ సెంటర్, వంట గది, సిటీస్కాన్ తదితర సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది పనితీరు, రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. అనంతరం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగంతో సమీక్షించారు. మందులు, భోజనం వడ్డింపు, ఫైర్ సేఫ్టీ తదితర సేవలపై చర్చించారు. భోజన వడ్డింపుల్లో అలసత్వం వహించరాదన్నారు. ఈ తనిఖీల్లో డాక్టర్ సయ్యద్ అహ్మద్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వినీల్, పూర్వ ఉమ్మడి జిల్లా సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఫార్మసీ ఆఫీసర్ ఉప్పు భాస్కరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లగిశెట్టి అశోక్ కుమార్, డాక్టర్ కమల్, ఫార్మసీ అధికారులు మల్లేశ్వరి, రాజేందర్ తదితరులు ఉన్నారు. మందుల కొరత రాకుండా చూడాలి ఆస్పత్రుల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు -
సైబర్, డ్రగ్స్ నేరాలపై దృష్టిసారించాలి
స్టేషన్ఘన్పూర్: సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆదేశించారు. గురువారం డివిజన్ కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్లోని ఫైళ్లు, రిజిష్టర్లను పరిశీలించారు. ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. పెండింగ్ కేసులు, మండల పరిధిలో శాంతిభద్రతలు తదితర అంశాలపై ఎస్హెచ్ఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు. స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదు అవుతున్నాయి.. స్టేషన్ పరిధిలో ఎన్ని సెక్టార్లు ఉన్నాయి, సెక్టార్ల వారీగా ఎస్ఐలు నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోని రౌడీషీటర్లు, అనుమానితులు, వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. అదేవిధంగా స్టేషన్వారీగా బ్లూకోల్ట్స్ సిబ్బంది పనితీరుతో పాటు వారు విధులు నిర్వహించే సమయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ స్టేషన్ అధికారి తప్పనిసరిగా రౌడీషీటర్ ఇళ్లను సందర్శించి వారి స్థితిగతులపై ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘన్పూర్ పట్టణ పరిధిలో పోలీస్ పెట్రోలింగ్ను నిరంతరం నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏపీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు, ఎస్ఐ వినయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఘన్పూర్ పోలీస్స్టేషన్ సందర్శనలో సీపీ సన్ప్రీత్సింగ్ -
ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలి
పాలకుర్తి టౌన్: ప్రతీ గ్రామంలో ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలుకావాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం పాలకుర్తి నియోజవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై నియోజకవర్గ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్లో ఎమ్మెల్యే నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రహదారి నిర్మాణాలు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థలు పంచాయతీ స్ధాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి మరమ్మతులు, బావుల పునరుద్ధరణ, పంచాయతీ భవనాల నిర్మాణం వంటి పనులను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. సమీక్షలో పంచాయతీరాజ్ డీఈ రామలింగాచారి, ఏఈ శ్రీనివాస్నాయక్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
పాలకుర్తిలో చిల్లర కాంటా దుకాణాలపై దాడులు
సాక్షిలో చిల్లర కాంటాల దందా పేరిట వచ్చిన కథనంపై మార్కెట్, మార్కెటింగ్ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా దాడులు చేపట్టారు. పాలకుర్తిలో ఐదు చిల్లర కాంటా దుకాణాలపై దాడులు చేశారు. ఇందులో ఐదు దుకాణాలకు నోటీసులు జారీ చేసి, ట్రేడ్ లైసెన్స్ పొందే వరకు క్రయ, విక్రయాలు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎం నరేంద్ర హెచ్చరించారు. ఇదిలాఉండగా జనగామ పట్టణంతో పాటు లింగాలఘణపురం, నెల్లుట్ల రూట్తో పాటు రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, నర్మెట తదితర మండలాలు, మేజర్ గ్రామాల పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా చిల్లర కాంటా దుకాణాలను నడిపిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారనే ప్రచారం నేపథ్యంలో అధికారులు నిఘా వేశారు. -
అటకెక్కిన సర్దుబాటు
జనగామ: జిల్లాలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ అటకెక్కింది. గత నెల 4వ తేదీకి పూర్తి కావాల్సిన సర్దుబాటు, అక్టోబర్ 23వ తేదీ దాటినా తుది దశకు రాలేదు. విద్యాశాఖలో ఇందుకు సంబంధించిన ఫైల్ ముందుకు కదలకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. మొదటి విడత సర్దుబాటులో పలువురు ఎంఈఓల అలసత్వంపై సర్వత్రా విమర్శలు రావడంతో తాత్కాలికంగా బ్రేక్ వేశారు. సబ్జెక్టు టీచర్ల కొరత.. జిల్లాలోని హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్ వంటి కీలక సబ్జెక్టుల బోధనపై ప్రభావం చూపుతోంది. పదో తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న కలెక్టర్ లక్ష్యంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ, బోధకుల కొరతతో ఆ తరగతులు సరిగా సాగడం లేదు. మరోవైపు, ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత కారణంగా విద్యార్థుల ప్రాథమికంగా నేర్చుకునే స్థాయిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మొదటి విడత సర్దుబాటులో జరిగిన అక్రమాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు, విమర్శలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో విద్యాశాఖ రెండో విడతలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించినప్పటికీ, ఈసారి కూడా పలువురు ఎంఈఓల నిర్లక్ష్యం కారణంగా సర్దుబాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదనే ప్రచారం టీచర్ల ద్వారా వినిపిస్తోంది. సర్దుబాటులో జరుగుతున్న జాప్యాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నుంచి ఎస్ఏ–1 పరీక్షలు ప్రారంభం కాబోతున్న సమయంలో విద్యార్థులపై సర్దుబాటు ఆలస్యం ప్రతికూల ప్రభావం ఎంతోకొంత ఉండక తప్పదని ఉపాధ్యాయులు అంటున్నారు. టీచర్ల కొరతను భర్తీ చేయక పోవడంతో పాఠశాలల్లో బోధనా తరగతులకు కార్యక్రమాలు సక్రమంగా సాగకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్దుబాటుపై ఉన్నతాధికారుల నిర్లక్ష్య ధోరణిపై జిల్లాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటం క్షమార్హం కాదని ప్రజలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్దుబాటు ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి, టీచర్లను పాఠశాలలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల విద్యాహక్కు, భవిష్యత్తు భద్రత కోసం టీచర్ల సర్దుబాటు వెంటనే పూర్తి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. అధికార యంత్రాంగం మేల్కొనకపోతే రాబోయే విద్యా సంవత్సరం మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆగమ్యగోచరంగా పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు నేటి నుంచి ఎస్ఏ–1 పరీక్షలు బడులు ప్రారంభమై 5 నెలలు గాడితప్పిన విద్యాశాఖ పనితీరు డీఈఓను తప్పుదారి పట్టిస్తున్నారా..! -
రాంచందర్రావు అరెస్టు అప్రజాస్వామికం
జనగామ రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. గురువారం జిల్లా పార్టీ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏవో శ్రీకాంత్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బుధవారం గోసంరక్షకుడు ప్రశాంత్పై కాల్పులు జరిపిన ఎంఐఎం గూండా ఇబ్రహీంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గోసంరక్షకుడిపై జరిగిన కాల్పుల గురించి ప్రశ్నించడానికి డీజీపీ ఆఫీస్కు వెళ్తున్న రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేశ్, రాష్ట్ర నాయకులు శివరాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఎల్లయ్య, కార్యదర్శి సతీశ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామ్ కోటి, పట్టణ అధ్యక్షుడు అనిల్, ప్రధాన కార్యదర్శులు జగదీశ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాలి పాలకుర్తి టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగల నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తుల ప్రాధాన్యం కన్నా పాఠశాలలే ముఖ్యం..
జిల్లాలో ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చిన తదుపరి ప్రాథమిక పాఠశాలలు, హైస్కూల్స్లో జాయిన్ కాకపోవడం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలను సర్దుబాటు చేయడం ద్వారా పాఠశాల వ్యవస్థను గాడిలో పెట్టవచ్చని సర్దుబాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలో సర్దుబాటుకు సంబంధించి ఒక డ్రాఫ్ట్ను కోరిన సమయంలో జిల్లా అధికారులు తమకు అందజేశారు. నిబంధనల మేరకు ముందుగా కాంప్లెక్స్ పరిధిలో సర్దుబాటు చేయాలి. తదుపరి ఒక కాంప్లెక్స్ నుంచి పక్క కాంప్లెక్స్, మిగులు ఉపాధ్యాయులు ఉంటే మండలంలో ఎక్కడికై నా, ఆ మండలంలోనే మిగులుగా ఉంటే పక్క మండలానికి పంపించాలి. పక్కనున్న మండలంలో కూడా అవసరం లేకుంటే జిల్లాలో ఎక్కడికై నా సర్దుబాటు చేయవచ్చు. సర్దుబాటు డ్రాఫ్ట్ను చూసిన తర్వాత, అందులో తగు మార్పులు, చేర్పులు చేయాల్సిందిగా మండల విద్యాధికారిని కోరాం. మేము చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని ఉత్తర్వులు వెలువడుతాయని భావిస్తున్నాం. – పి.చంద్రశేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు, టీఎస్యూటీఎఫ్ -
అక్రమాలు జరగకుండా చూడాలి
బచ్చన్నపేట: జాతీయ గ్రామీణ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరగకుండా చూడాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని అడిషనల్ డీఆర్డీఓ చంద్రశేఖర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ని ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్ పథకం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. మండలంలోని 26 గ్రామాల్లో బృంద సభ్యులు తనిఖీ చేసిన వివరాలను ప్రజావేదికలో తెలిపారు. దస్తావేజుల నిర్వహణ లేదని మస్టర్లలో అధికారులు సంతకాలు చేయకుండానే వేలల్లో బిల్లులను చెల్లించారని ఆడిట్ సిబ్బంది వివరించారు. ఆయా గ్రామాల వారీగా రికవరీ బిల్లుల వివరాలను అందించామని సంబంధిత అధికారులు తిరిగి చెల్లించాలని లేని పక్షంలో తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీఓ మమతాబాయ్, ఎంపీఓ వెంకటమల్లికార్జున్ పాల్గొన్నారు. అడిషనల్ డీఆర్డీఓ చంద్రశేఖర్ -
మద్యం షాపులకు దరఖాస్తులు 1695
జనగామ: జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం అర్ధరాత్రి ముగి సింది. మొత్తం 50 మద్యం దుకాణాలకు గాను 1,695 దరఖాస్తులు రాగా, చివరిరోజే 91 టెండర్లు వచ్చాయి. మొత్తం దరఖాస్తుల్లో జనగామ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో 583, పాలకుర్తి సర్కిల్లో 558, స్టేషన్ ఘన్ పూర్ సర్కిల్లో 554 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జనగామ మున్సిపల్ పరిధిలోని షాప్ నెంబర్–1కు 6 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం. చిన్న పెండ్యాల షాపునకు 108.. చిల్పూరు మండలం చిన్నపెండ్యాల దుకాణాని(షాప్ నెంబర్–21)కి 108 దరఖాస్తులు రావడం విశేషం. 202 3–25 రెండేళ్లకు గాను 2,492 దరఖాస్తులు రాగా, రూ.50కోట్ల మేర నాన్ రిఫండబుల్ ఎకై ్సజ్ ఫీజు వచ్చింది. ఈసారి ప్రభుత్వం ఫీజును రూ.3 లక్షలకు పెంచగా 797 దరఖాస్తులు తగ్గాయి. అయినప్పటికీ ఒక్కో టెండర్ కు మూడు లక్షలకు పెంచడంతో టెండర్లు తగ్గినా రూ.50.85 కోట్ల ఆదాయం వచ్చింది. అయినప్పటికీ టెండర్ల ప్రక్రియ ఎకై ్సజ్ అధికారులను కొంతమేర నిరాశపరిచింది. జిల్లాలోని మద్యం షాపుల కేటాయింపునకు గాను ఈ నెల 27వ తేదీన పెంబర్తి శివారులోని నందన గార్డెన్లో లక్కీ లాటరీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఎకై ్సజ్ శాఖ అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చివరి రోజే 91.. చిన్నపెండ్యాల దుకాణానికి అత్యధికం.. ఈనెల 27న లక్కీ లాటరీ -
ఆసుపత్రిలో ఓపీ పెంచాలి
బచ్చన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీలను, సాధారణ ప్రసవాలను పెంచాలని, అందుకుగానూ వైద్యులు సమయపాలన పాటించాలని డీఎంహెచ్ఓ కె.మల్లికార్జున్రావు ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అలాగే ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సంబంధించిన వ్యాధులపై నిర్లక్ష్యం చేయకూడదని, ఆయా గ్రామాల ఆశాల ద్వారా ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి సృజన, డాక్టర్లు ప్రసన్నకృష్ణ, క్రాంతి స్వరూప్, ఫార్మాసిస్ట్ బొడ్డు శ్రీనివాస్, సూపర్వైజర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు. జనగామ రూరల్: స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వివిధ రకాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నాగమణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రొఫెసర్స్ (4) పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్స్ (12) పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (13) పోస్టులు, కాంట్రాక్ట్ బేసిస్ సీనియర్ రెసిడెంట్ (23) పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 5వ తేదీన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, చంపక్హిల్స్ మాతాశిశు సంరక్షణ కేంద్రం కార్యాలయం 2వ అంతస్తు లోని ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఉదయం 10:00 నుంచి 11:00 వరకు అందజేయాలని చెప్పారు. ఆదే రోజు ఉదయం 11: 00 గంటల నుంచి 4:00 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుందని ఆయా కేటగిరీకి సంబంధించిన దరఖాస్తులు www. gmc. jangaon వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అర్హతా సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. జనగామ రూరల్: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ –17 విభాగంలో వాలీబాల్ పోటీల్లో మండలంలోని పెంబర్తి గ్రామంలోని ఎంజేపీలోని పదో తరగతి విద్యార్థి కాలేరు రాంచరణ్ ప్రతిభ చూపి ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈనెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్లోని పటాన్ చెరువు మైత్రి మినీ స్టేడియంలో ఉమ్మడి వరంగల్ జట్టు తరఫున వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈమేరకు గురువారం పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, పీఈటీ, ఉపాధ్యాయులు అభినందించారు. లింగాలఘణపురం: మాజీ ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని భారత సాంస్కృతిక మంత్రిత్వశాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో గుజరాత్లోని కెవాడియాలో జరిగే రాష్ట్రీయ ఏకతా దివస్లో ప్రదర్శన ఇవ్వడానికి జిల్లాలోని లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులు వెళ్లినట్లు ఉస్తాద్ ఒగ్గు రవి తెలిపారు. ఒగ్గుడోలు కళాప్రదర్శనకు భారత ప్రభుత్వం పక్షాన చండీశ్వర ఒగ్గుసేవా సమితికి ఆహ్వానం అందినట్లు, దీంతో కళాకారులు చౌదరిపల్లి ఉపేందర్, మరికుక్కల అశోక్, చౌదరిపల్లి ప్రశాంత్ను పంపినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నర్సింహరెడ్డి ప్రోత్సాహంతో ఒగ్గు కళాకారులు గుజరాత్కు బయలుదేరినట్లు చెప్పారు. -
నేటి నుంచి నిట్లో టెక్ ఫెస్ట్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–2 ఈనెల 24 (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. ఏటా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న టెక్ ఫెస్ట్ ఈ ఏడాది రెండు రోజులు శుక్ర, శనివారాల్లో నిర్వహించేందుకు నిర్ణయించారు. శుక్రవారం అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ మాధవీలత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెండు రోజుల పాటు మెకా వెహికిల్ ఎగ్జిబిషన్, నియాన్ క్రికెట్, కిట్ అసెంబ్లీ, సుమో వార్, డ్యాన్స్ ఓ, వరంగల్ రింగ్ వంటి వివిధ రకాల స్పాట్ లైట్, సెమినార్స్తో అలరించనుంది. కాగా, టెక్ఫెస్ట్–25లో దేశవ్యాప్త వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏడు వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు. -
నేటినుంచి పత్తి కొనుగోళ్లు
జనగామ: జిల్లాలో ఈనెల 24 (శుక్రవారం) నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ‘పత్తి రైతుకు చిల్లర దాగా–సీసీఐ కొనుగోలు కోసం ఎదురుచూపులు’ శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా మార్కెటింగ్ అధికారి బి.నరేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ మండలం ఓబుల్కేశ్వాపూర్ శ్రీ వెంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీస్లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ ప్రారంభించనున్నారు. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో 15 సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా, ఈనెల 27నుంచి రైతుల స్లాట్ బుకింగ్ ఆధారంగా వంద శాతం సెంటర్లను ప్రారంభించనున్నారు. 2025–26 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.8,110లుగా నిర్ణయించింది. 8 నుంచి 12 శాతం వరకు ఒక్కో శాతం పెరిగిన కొద్దీ ధర శాతం తగ్గుతుంది. 12శాతం కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయదు. ఈ విషయాన్ని రైతులు దృష్టిలో ఉంచుకుని పత్తిని ఇంటివద్దే ఆరబెట్టుకుని నాణ్యత ప్రమాణాలు పాటించిన తర్వాతనే సీసీఐ కేంద్రానికి తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోళ్ల సమయంలో ముందస్తు స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. పత్తి రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్లో జిన్నింగ్ మిల్లును ఎంపిక చేసుకొని, స్లాట్ బుక్ ద్వారా తేదీ ప్రకారం, తేమశాతం లేకుండా సీసీఐ సెంటర్కు వచ్చి పత్తిని అమ్ముకోవాలని సూచిస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్పై సందేహాలు ఉంటే సమీప మార్కెట్ కమిటీ లేదా విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు. రైతులు సీసీఐ కేంద్రానికి వచ్చే సమయంలో ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్బుక్, ఆధార్కు అనుసంధానించిన మొబైల్ నెంబర్ తీసుకొని రావాలని డీఎం సూచించారు. ఓబుల్ కేశ్వాపూర్ మిల్లులో కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం పాలకుర్తిలో ఐదు చిల్లర కాంటా దుకాణాలపై దాడులు నోటీసుల జారీ, మూసివేత -
తక్కువకు అమ్ముకుంటున్నాం..
ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశా.. రూ.2లక్షల వరకు పెట్టుబడి ఖర్చు చేశా..అతి, అనావృష్టితో మొదటి సేకరణలో 14 క్వింటాళ్ల దిగుబడి రాగా, సగం మేర తగ్గింది. పత్తి సేకరణ కోసం కూలీల కోసం ఎదురుచూసినా ఫలితం కనిపించడం లేదు. కుటుంబసభ్యులమంతా కలిసి సేకరణ చేస్తున్నాం. సేకరించిన పత్తిని మద్దతు ధరకు అమ్ముకుందామంటే సీసీఐ సెంటర్లను ఏర్పాటు చే యలేదు. డబ్బులు అత్యవసరమై ప్రైవేటులో రూ.5800లకు అమ్ముకోవడంతో తీవ్ర నష్టం వచ్చింది. – పోతరబోయిన ఎలేందర్, పత్తి రైతు, అంకుషాపూర్(బంజరపల్లి), తరిగొప్పుల -
రెక్కల కష్టం మిగలడం లేదు..
సీసీఐ కొనుగోలు లేకపోవడంతో అరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను అడ్డికి పావు సేరుకు అమ్ముకున్నాం. మాకున్న 2ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాం. పెట్టుబడులకు రూ.లక్ష ఖర్చు అయ్యింది. సీసీఐ సెంటర్ అందుబాటులో ఉంటే క్వింటాల్కు రూ.8వేల పైన ధర వచ్చేది. ఇప్పటి వరకు సీసీఐ సెంటర్ ప్రారంభించకపోవడంతో ప్రైవేటులో క్వింటాల్కు రూ.7వేలు ఇచ్చారు. 15క్వింటాళ్ల దిగుబడి రాగా పెట్టుబడి ఖర్చులకే సరిపోయింది. అదే సీసీఐ సెంటర్ ఉంటే మరో రూ. 20వేలు మిగిలి ఉండేది. – తోట రమేశ్,పత్తి రైతు, శివునిపల్లి, స్టేషన్ఘన్పూర్ -
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కు ఎంపిక
జనగామ రూరల్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టుకు ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ఫస్టియర్ విద్యార్థి బి.కిరణ్ ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ కిట్స్లో ఈనెల 17 నుంచి 19 వరకు జరిగిన ఫుట్బాల టోర్నమెంట్లో కిరణ్ ప్రతిభ కనబర్చి సౌత్ జోన్ పోటీలకు ఎంపికయ్యాడన్నారు. నవంబర్లో జరగనున్న టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ జట్టు తరఫున కిరణ్ పాల్గొంటాడని పేర్కొన్నారు. ఈసందర్భంగా కిరణ్ను ఫిజికల్ డైరెక్టర్ కళ్యాణి, వైస్ ప్రిన్సిపల్ బి.భవాని, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మెహర్, రాజకుమార్ అధ్యాపకులు అభినందించారు. -
పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సజావుగా జరగాలి
జనగామ రూరల్: పంట ఉత్పత్తుల కొనుగోళ్లు సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పత్తి, ధాన్యం, మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ స్పెషల్ ఆఫీసర్ యాస్మిన్ బాషా అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెనన్స్ హాల్లో వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధి కారి, సివిల్ సప్లై మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం, పత్తి కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కపాస్ కిసాన్ యాప్కు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు రైతులకు కనబడే విధంగా ఏర్పా టు చేయాలన్నారు. అంతకుముందు నూతనంగా బాధ్యతలు చేపట్టిన యాస్మిన్ బాషాను అదనపు కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలెక్టరేట్లో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ యాస్మిన్ బాషా -
ప్రసవాల సంఖ్యను పెంచాలి
జఫర్గఢ్: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచే దిశగా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి, జిల్లా ఇన్చార్జి డీసీహెచ్ఎస్ డాక్టర్ నరేందర్తో కలిసి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందితో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ.. గత నెల కేవలం రెండు ప్రసవాలే చేశారని, ఈ సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్, వైద్యలు ఆశోక్, కమల్హసన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు -
మార్మోగిన ఓంకార నాదం
బ్రహ్మముహూర్తంలో.. కార్తీక మాస పర్వదినం పురస్కరించుకుని బ్రహ్మముహూర్తంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగాభిషేకం పూజలు ఘనంగా నిర్వహించగా, ఆలయ ప్రాంగణాలు ఓం నమశ్శివాయ నినాదాలతో మార్మోగాయి. మొదటి రోజు కార్తీకమాస దర్శనం కోసం భక్తులు పెద్దసంఖ్యలో హాజరై పుణ్యస్నానం చేసి, దీపారాధనలో పాల్గొన్నారు. కార్తీకమాసంలో ఆలయాల్లో రోజు వారీగా శివునికి ప్రీతికరమైన పూజలు, వ్రతాలు, దీపదానాలు, భజన తదితర భక్తి కార్యక్రమాలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. జనగామ: సృష్టి లయకారుడైన పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం నుంచి ఆరంభమైంది. జిల్లాలోని శివాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్దులగుట్ట పుణ్యక్షేత్రం, పాలకుర్తి శ్రీసోమేశ్వరస్వామి దేవాలయం, జనగామ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం, చీటకోడూరు శ్రీ పంచకోసు రామలింగేశ్వరస్వామి ఆలయం, శ్రీ సంతోషీమాత, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర తదితర ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు పూజలు ప్రారంభించారు. శివాలయాల్లో ఘనంగా కార్తీక మాస పూజలు ప్రారంభం ఆలయాలకు పోటెత్తిన భక్తులు జనగామ నుంచి శైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు -
బ్రేకర్ సమస్యకు పరిష్కారం
బచ్చన్నపేట: మండల కేంద్రంలోని కరెంటు సబ్స్టేషన్లో బ్రేకర్ సమస్యను పరిష్కరించినట్లు ట్రాన్స్కో ఏఈ రాజ్కుమార్ తెలిపారు. సాక్షి దినపత్రికలో బచ్చన్నపేటలో కరెంట్ గోస తప్పదా.. అని ప్రచురించిన కథనానికి స్పందించిన అధికారులు బుధవారం మరమ్మతు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ.. బచ్చన్నపేట, ఎద్దుగూడెం 11 కేవీ ఫీడర్లకు సమస్య ఉండగా ప్రొటెక్షన్ వింగ్ ఏఈ జవహర్, సిబ్బందితో కలిసి బ్రేకర్లో లిండ్ సమస్యను పరిష్కరించామని, అలాగే రిలేను కూడా మార్చామన్నారు. దీంతో అంతరాయం లేకుండా నిరంతరంగా విద్యుత్ను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో లైన్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్దతు ధరతో పాటే బోనస్
రఘునాథపల్లి: ఈ ఖరీఫ్ నుంచే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు మధ్దతు ధరతో పాటు బోనస్ కలిపి ఖాతాలో జమ చేయనున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండలంలోని ఖిలాషాపూర్, మంగళిబండతండా, జాఫర్గూడెం, వెల్దిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు..కొనుగోలు చేసిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంట వెంటనే మిల్లులకు పంపాలని నిర్వాహకులకు సూచించారు. రబీ సాగు రెండో పంట కోసం ప్రతీ ఎకరాకు గోదావరి జలాలు అందించే బాధ్యత తనదని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇందిరా మహిళా శక్తి టీ స్టాల్, ఇందిరమ్మ నమూనా ఇంటిని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఆర్డీఓ గోపిరాం, డీఆర్డీఓ వసంత, డీఏఓ అంబికాసోని, తహసీల్దార్ ఫణికిషోర్, ఏడీఏ వసంత సుగుణ, ఏఓ కాకి శ్రీని వాస్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీశ్చందర్రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. యుగంధర్ కుటుంబానికి పరామర్శ మండలంలోని మండలగూడెం గ్రామానికి చెందిన గాదె యుగంధర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కడియం పార్టీ నాయకులతో కలిసి మృతుడి ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను పరామర్శించారు. జీడికల్ ఆలయంలో శాశ్వత ఏర్పాట్లు లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి శాశ్వత ప్రాతిపదికన రూ.5 నుంచి రూ.10 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వచ్చే నెల 4 నుంచి 17వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగొద్దని 10న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గుండాల వరకు మెట్లు, గుండాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, జీడికల్ గ్రామం నుంచి ఆలయానికి వచ్చే రోడ్డుపై సీసీ వేయాలని, నిత్య కై ంకర్యానికి ఆలయ సమీపంలో పూలతోటలు పెంచాలన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా పని చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, ఆర్డీఓ గోపీరామ్ను స్పెషల్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. సమీక్షలో డీపీఓ స్వరూప, డీసీపీ రాజమహేంద్రనాయక్, దేవస్థాన చైర్మన్ మూర్తి, ఈఓ వంశీ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణమంతా కలియతిరిగి సమస్యలను గుర్తించి అధికారులకు సూచనలు చేశారు.స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
పత్తి రైతుకు చిల్లర దగా
జిల్లాలో పుట్టగొడుగుల్లా చిల్లర కాంటాలుజిల్లాలో జోరుగా పత్తి సేకరణ జనగామ: జిల్లాలో పత్తి సేకరణ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం పత్తి రైతులను నిండా ముంచుతోంది. పత్తిని సేకరించి విక్రయానికి సిద్ధం చేసిన రైతులు సీసీఐ రాక కోసం ఎదురుచూస్తుండగా..అప్పులు తీర్చాల్సిన మరికొంత మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువకు అమ్ముకుంటున్నారు. దీంతో జిల్లాలోని అనేక మండలాల పరిధిలో చిల్లర కాంటాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తూ రైతులను పీల్చి పిప్పిచేస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 1.25లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అతి, అనావృష్టితో పత్తి దిగుబడి 30శాతం తగ్గిపోయింది. గత రెండు నెలలుగా అడపదడపా వర్షాలు కురుస్తుండడంతో పత్తి రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఉన్న పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో నెల రోజుల నుంచి తెల్లబంగారం సేకరణ ప్రారంభించారు. పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సీసీఐ సెంటర్లను ప్రారంభించాలని రెండు వారాలుగా కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 15 సీసీఐ కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ లభించింది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, ప్రారంభోత్సవ కార్యక్రమం ఆలస్యం కావడంతో కొనుగోలు ప్రక్రియ నేటికీ ప్రారంభం కాలేదు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా పారదర్శకత ఈసారి పత్తి కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సీసీఐ శ్రీకపాస్ కిసాన్ యాప్శ్రీను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులు తమ ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ముందుగానే దీని ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. తాము బుక్ చేసుకున్న స్లాట్ సమయానికి అనుగుణంగా 24 గంటల్లో సీసీఐ సెంటర్కు రావాల్సి ఉంటుంది. వారం రోజులకు సంబంధించిన స్లాట్లను ఒకేసారి విడుదల చేయనున్నారు. స్లాట్ రద్దు చేయాలంటే కూడా 24 గంటల ముందుగానే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. తేమ శాతంపై ఆధారపడి ధర నిర్ణయం సీసీఐ సెంటర్లలో 8 శాతం తేమ కలిగిన పత్తికి క్వింటాల్కు రూ.8,110 మద్దతు ధర చెల్లించనున్నారు. 12 శాతం వరకు తేమ ఉన్న పత్తికి క్వింటాల్కు ఒక్కో శాతానికి రూ.81.10 చొప్పున తగ్గింపుతో చివర రూ.7,785.60లకు కొనుగోలు చేస్తారు. రైతులు నష్టపోకుండా, దళారుల దందాకు అడ్డుకట్ట వేయాలంటే వెంటనే సీసీఐ సెంటర్లను ప్రారంభించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి పత్తి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, సకాలంలో ప్రారంభించాలన్నారు.సీసీఐ సెంటర్లు ప్రారంభం కాకపోవడంతో జిల్లావ్యాప్తంగా చిల్లర కాంటా వ్యాపారాలు ఎక్కడ పడితే అక్కడ పుట్టుకొస్తున్నాయి. వీటిని కొంతమంది దళారులు నడుపుతూ రైతుల్ని మోసం చేస్తున్నారు. చిల్లర కాంటాల వద్ద పత్తి క్వింటాల్ రూ.5,800 నుంచి రూ.7,000 వరకు మాత్రమే ధర పలుకుతోంది. సీసీఐ సెంటర్లు లేక రైతులు విధి లేని పరిస్థితుల్లో క్వింటాల్ పత్తికి రూ.2,300 నుంచి రూ.1,200 తక్కువకు అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేట్ కొనుగోళ్ల ద్వారా సేకరించిన పత్తిని బినామీ రైతుల పేర్లతో సీసీఐ సెంటర్లకు తరలించేందుకు కొంతమంది దళారులు తెరవెనక కథ నడిపిస్తున్నట్లు సమాచారం. చిల్లర కాంటాలను అదుపు చేయాల్సిన అధికారులు మాత్రం గప్ చుప్గా ఉండిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. మద్దతు ధర కంటే తక్కువకు అమ్మకాలు దళారుల దందాతో పత్తి రైతుల కుదేలు సీసీఐ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూపులు -
సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకోండి
లింగాలఘణపురం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సకాలంలో పనులు పూర్తి చేసుకొని బిల్లులు పొందాలని జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు. బుధవారం మండలంలోని బండ్లగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు...ఇళ్లు ఎలా నిర్మించుకుంటున్నారు..? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందా? అంటూ వివరాలను తెలుసుకున్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసుకుంటే బిల్లులు కూడ వెంటనే వస్తాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం ఇళ్లు నిర్మించుకుంటే లబ్ధిదారులపై ఎక్కువ భారం పడకుండా ఇల్లు పూర్తి చేసుకోవచ్చని సూచించారు. కలెక్టర్తో పాటు తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ, కార్యదర్శి సంతోషిమాత తదితరులు ఉన్నారు.కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
జాతర నాటికి.. పనులు పూర్తయ్యేనా?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతర సమయం దగ్గర పడుతున్నా పనులు పూర్తిచేయడంలో అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పనులపై మంత్రులు నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నా అధికారుల పనితీరులో మాత్రం మార్పు కనిపించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్వయంగా మేడారాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ విస్తరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల పునర్నిర్మాణం పనులు సాగుతున్నాయనే తప్ప తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం వంటి పనులు ఇంకా ప్రారంభం కాని పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి హడావుడిగా పనులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వరి కోతలపై ఆధారపడి ఏర్పాట్లు! పనులకు అవసరమైన భూములు ఇప్పటికీ వరిసాగులో ఉండటంతో తాత్కాలికంగా వసతులు, తాగునీటి ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలు జీఐ షీట్స్ మరుగుదొడ్ల నిర్మాణం వంటి కీలక పనులకు ఆటంకం కలగనుంది. భూముల్లో సాగు చేసిన పంట చేతికొచ్చే దశకు చేరుకుంది. ఈ పనులు పూర్తయితేనే ముందుకు సాగే పరిస్థితి ఉంది. సమీపిస్తున్న మేడారం మహాజాతర గద్దెల పునర్నిర్మాణం పనులు మినహా మొదలు కాని జాతర పనులు మంత్రులు ఆదేశించినా మారని అధికారులు తీరు -
సిద్ధేశ్వరాలయంలో ఘనంగా పూజలు
బచ్చన్నపేట : మండలంలోని కొడవటూర్లోని స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయంలో సోమవారం ఘనంగా పూజలు నిర్వహించారు. దీపావళి పండుగ కావడం, అలాగే గౌరీ వ్రతాలను నోముకున్న వారంతా ఆలయానికి రావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది. అలాగే మహిళలు ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. కార్యక్రమంలో ఈఓ చిందం వంశీ, ఆలయ ప్రధాన అర్చకులు ఓం నమఃశివాయ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అయోడిన్ ఉప్పు వాడకంపై అవగాహన ఉండాలి బచ్చన్నపేట: మనిషి జీవనానికి అత్యంత ఉపయోగకరమైన అయోడిన్ ఉప్పు వాడకంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్ఓ కె.మల్లికార్జున్రావు అన్నారు. మంగళవారం పెంబర్తి గ్రామంలోని బచ్చన్నపేట ఎంజేపీటీసీ వెల్ఫేర్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఆర్బీఎస్కే బృందం విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య పరిశీలన, వారి ఎత్తును, బరువును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో రక్తహీనత నిర్మూలనకు అనీమియా పరీక్షలపై దృష్టి సారించాలన్నారు. గ్లోబల్ అయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కళాశాలను సందర్శించామన్నారు. అయోడైజ్డ్ ఉప్పు వినియోగం తప్పనిసరి అని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ‘కపాస్’ యాప్ అమలును వెనక్కి తీసుకోవాలి జనగామ రూరల్: కపాస్ కిసాన్ యాప్ అమలు వెనక్కి తీసుకోని విరివిగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించటానికి ఈనెల 25న జిల్లా కేంద్రంలోని పూసల భవనంలో జరిగే పత్తి రైతుల రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని పట్టణంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర రూ.7,710గా నిర్ణయించింది. కానీ, నేటికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు తెరవలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ భూక్య చందు నాయక్, జిల్లా బాధ్యులు మంగ బీరయ్య, నాయకులు కర్రే రాములు, భీరయ్య తదితరులు పాల్గొన్నారు. రేపటి వరకు మద్యం దుకాణాలకు టెండర్లు జనగామ: మద్యం దుకాణాలకు 2025–2027 సంవత్సరాలకు గాను ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వడ్లకొండ రోడ్డు ఎకై ్సజ్ జిల్లా కార్యాలయంలో 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ రోడ్డు పెంబర్తిలోని నందన గార్డెన్లో మద్యం దకాణాల కేటాయింపులకు లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రోడ్డే కల్లం.. పాలకుర్తి టౌన్ : పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవటానికి కల్లాల కొరతతో ఏటా రైతులు రోడ్లనే అశ్రయిస్తున్నారు. రహదారులపై ధాన్యపు రాశులు పోయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పాలకుర్తి మండలంలో మక్కలతో పాటు వరికోత ప్రారంభం కావటంతో బమ్మెర పెద్దతండా, చెన్నూరు, వావిలాల, ముత్తారం, శాతపురం వరకు గ్రామాల రైతులు ధాన్యం ఆరబెడుతున్నారు. రహదారి పొడవునా వరి ధాన్యం, మక్కలు నిల్వ చేస్తున్నారు. రోడ్లపైనే ధాన్యం పోయడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. -
పోలీసులు ప్రాణరక్షకులు
● పోలీసు అమరులకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా నివాళిరఘునాథపల్లి: శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా విపత్తులు సంభవించినప్పుడు..ఇతరత్రా సందర్భాల్లో ప్రజల ప్రాణాలు కాపాడుతూ పోలీసులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం రఘునాథపల్లి పోలీస్స్టేషన్ ఆవరణలో అమరవీరుల స్మారక స్తూపానికి వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో కలిసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. అనంతరం నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్కుమార్ వీర మరణంపై సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండరి చేతన్కుమార్, ఏసీపీలు బీంశర్మ, అంబటి నర్సయ్య, సీఐలు ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, జానకిరాంరెడ్డి, శ్రీనివాసరావు, అబ్బయ్య, సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు దూదిమెట్ల నరేశ్, వినయ్కుమార్, శ్రవణ్, భరత్, రామారావు, నవీన్, హమీద్, చెన్నకేశవులు, రాజేష్, నగేష్, సాయిబాబు, రాజు, ఏఎస్సై బత్తిని కట్టమల్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. పౌష్టికాహారం అందించాలి.. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మండలంలోని ఖిలాషాపూర్ కస్తూర్బా పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్టాఫ్ రిజిస్టర్ను పరిశీలించి అటెండ్ అయిన టీచర్లు, లీవ్ పెట్టిన టీచర్ల వివరాలను స్పెషల్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ‘ధన్ధాన్య’ యాక్షన్ ప్లాన్ సిద్ధం జనగామ రూరల్: వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచి స్థిరమైన పద్ధతులను ప్రోత్సహిస్తూ గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వ్యవసాయ కార్యక్రమం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. కార్యక్రమ అమలుకు వివిధ శాఖల ద్వారా చేపట్టాల్సిన కార్యాచరణపై వీసీ ద్వారా సమీక్షించారు. ‘తెలంగాణ రైజింగ్’ సర్వేలో 3 లక్షల మంది రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకు ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. దేశ స్వాతంత్య్రానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల సూచించాలని, 25వ తేదీతో సర్వే ముగుస్తుందన్నారు. -
పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం
● ఘనంగా నివాళులర్పించిన డీసీపీ రాజమహేంద్రనాయక్జనగామ: సమాజ శాంతిభద్రతల కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. పోలీసు అమరవీరుల దినోత్స వం పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ జంక్షన్ అమరవీరుల స్తూపం వద్ద డీసీ పీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్, రాజన్బాబు, చెన్నకేశవులు, రాజేశ్, పోలీసు సిబ్బంది పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. డీసీపీ మాట్లాడుతూ..అమరవీరుల స్ఫూర్తి ప్రతీ పోలీసు సిబ్బందికి మార్గదర్శకం కావాలన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయస్థాయిలో అమలవుతున్న జాతీయ ఆహార భద్రత, పోషణ మిషన్(ప్యాడీ), జాతీయ నూనెగింజల మిషన్(గ్రౌండ్నట్) రైతులకు విత్తనాలను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతీ గింజకు విలువ దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, మార్కెట్ చైర్పర్సన్ లవుడ్యా మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, కమ్మగాని నాగన్న పాల్గొన్నారు. కొడకండ్ల : రైతుల సంక్షేమమే ధ్యేయంగా వినూత్న పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదికలో జాతీయ ఆహారభద్రత, పోషణ మిషన్, జాతీయ నూనెగింజల మిషన్ ద్వారా రైతులకు విత్తనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఏఓ అంబికాసోని, ఏడీఎ పర్శరామ్నాయక్, వ్యవసాయాధికారి విజయ్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ సాయికృష్ణ, డైరెక్టర్లు పాల్గొన్నారు. వారం రోజుల్లో పూర్తిచేయండి: కలెక్టర్ పాలకుర్తి మండలకేంద్రంలోని శ్రీసోమేశ్వర ఆలయం కల్యాణ మండపం పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అఽధికారులను అదేశించారు. మండల కేంద్రంలో కల్యాణ మండపాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ మొదటి వారంలో ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి, సాదాబైనామాలను పరిశీలించారు. -
నేటినుంచి కార్తీక మాస వేడుకలు
● పరమశివుడికి ప్రీతికరమైన పవిత్ర మాసం ● శివాలయాల్లో ప్రత్యేక పూజలు, దీపారాధనలు ● ముస్తాబైన ఆలయాలుజనగామ: పరమశివుడికి ప్రీతికరమైన కార్తీక మాస పర్వదిన వేడుకలు ఈనెల 22(బుధవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పవిత్ర మాసం సందర్భంగా జిల్లావ్యాప్తంగా శివాలయాలు విద్యుత్తు కాంతులతో వెలిగిపోతున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వరాలయం, పాలకుర్తి శ్రీ సోమేశ్వరస్వామి, జనగామ మండలంలోని చీటకోడూరు పంచకోసు రామలింగేశ్వర మల్లికార్జునస్వామి, పట్టణంలోని పాతబీటు బజారు శ్రీరామలింగేశ్వరస్వామి, శ్రీ సంతోషీమాత, శ్రీ చెన్నకేశ్వరస్వామి, గుండ్లగడ్డ శ్రీఉమామహేశ్వర, ఉప్పల మ్మ భవానీశంకర ఆలయం, దేవరుప్పుల, లింగాలఘనపురం, స్టేషన్న్ఘనపూర్, జఫర్గఢ్, చిల్పూరు, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి తదితర మండలాల పరిధిలోని శివాలయాల్లో కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని భక్తులు ఘనంగా పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మముహూర్తంలో.. శివాలయాల్లో తెల్లవారుజాము 4.30 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలతో పూజా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. రోజువారీగా సత్యనారాయణ వ్రతాలు, అన్నపూజలు, దీపారాధనలు, స్వామి వారి సేవా కార్యక్రమాలు జరగనున్నాయి. ఒక్కసారైనా హర హర మహాదేవా అంటూ పరమశివుని సన్నిధిలో తలవంచితే, పాపాలు హరించి పోయి పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. -
సంబురంగా దీపావళి
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025జనగామ: చీకటిని పారదోలి ఆశలు వెలిగించే దీపావళి పర్వదినాన్ని సోమవారం జిల్లావ్యాప్తంగా సంబురంగా జరుపుకున్నారు. పట్టణం, పల్లెల్లో దీపావళి పండుగ ప్రత్యేకమైన శోభ కనిపించింది. పండుగను పురస్కరించుకుని సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు లక్ష్మీదేవిని పూజించారు. వ్యాపా ర సముదాయాలు, వాణిజ్య కేంద్రాలు, ఇళ్లలో నూ ధనసమృద్ధి కలిగించే తల్లీ, అష్టైశ్వర్యాల మాతా వరమివ్వు అంటూ అమ్మవారిని కొలిచా రు. నైవేద్యాల సువాసనలు, గంధపు, చందనపు పరిమళాలు వాతావరణాన్ని భక్తిరసపూరితం చేశాయి. మార్మోగిన పటాకుల శబ్దాలు దీపావళి హారతులు, కేదారీశ్వర నోములు, లక్ష్మీపూజలను ముగించుకున్న తర్వాత రాత్రివేళల టపాసుల మోతతో ఆకాశం వెలుగులతో నిండిపోయింది. చిచ్చుబుడ్ల శబ్దాలు, రాకెట్ల మెరుపులు, భూచక్రాల సవ్వడితో చిన్నారులు మురిసిపోయారు. పటాకుల కాంతుల్లో ప్రకాశించిన జిల్లా ఈసారి కూడా ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. పోలీస్, మున్సిపల్, ఫైర్ శాఖలు పటిష్ట ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో వేడుకలు సజావుగా ముగిశాయి. ‘ఫలం’ దక్కట్లే భక్తిభావంతో లక్ష్మీపూజలు, కేదారీశ్వర వ్రతాలు విరజిమ్మిన బాణసంచా వెలుగులు -
ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక కార్యాచరణ
జనగామ రూరల్: ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతీ సీజన్లో జిల్లా యంత్రాంగం గొప్పగా కృషి చేస్తోందని, అదే స్ఫూర్తితో వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పక్కాగా కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నదాతలు ఎంతో శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాలకు వచ్చే చివరి గింజను కొనుగోలు చేసేందుకు జిల్లాలో 287 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన వరి కోతల ఆధారంగా కొనుగోలు కోసం వచ్చే ధాన్యానికి అనుగుణంగా 99 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా మిగతావి కూడా అతి త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 592 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వాటికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం పూర్తయిందన్నారు. ప్రతీ కేంద్రానికి జీపీఓలు అలాగే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులను నియమించామన్నారు. గన్నీబ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, రైతులకు కనీసం మౌలిక వసతులు, లోడింగ్ అన్ లోడింగ్లో జాప్యం రాకుండా తగు రవాణా సదుపాయాలు ప్రతీ కొనుగోలు కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధికసంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అన ంతరం భక్తులు మేడారం ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు షెడ్లలో విడిది చేసి వంటా వార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. పాకాలలో పర్యాటకుల సందడిఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వచ్చారు. పాకాల అందాలను వీక్షించి లీకేజీ నీటిలో, పార్కులో సరదాగా గడిపారు. బోటింగ్ చేస్తూ సందడి చేశారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు..
స్టేషన్ఘన్పూర్: పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి మీడియాలో ఏపీ ప్రభుత్వం పోలీసులతో సోదాలు, దా డులు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛ ను హరించడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికారంగంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న దాడి అనాగరికం. పత్రికా స్వా తంత్య్రం అత్యంత కీలకం. సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదు. – మంగు జయప్రకాశ్, టీఎస్ యూటీఎఫ్ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు, స్టేషన్ఘన్పూర్ -
గడువు పెంపు
కలిసొచ్చేనా?జనగామ: మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు ఆశించిన దానికంటే దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎకై ్సజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది. మద్యం దుకాణాల టెండర్లకు ఈనెల 18వ తేదీ వరకు గడువు ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు తక్కువగా రావడంతో ప్రభుత్వం ఈనెల 23వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇప్పటివరకు జిల్లాలో 1,587 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గత సీజన్న్లో 2,492 దరఖాస్తులు రాగా, ఈసారి 899 తక్కువగా రావడం అధికారులు ఆందోళనకు గురి చేసింది. గడువు పెంచిన నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన మద్యం దుకాణాల కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు. 20 సంఖ్య దాటని పరిస్థితి.. జిల్లాలో 50 మద్యం దుకాణాల కేటాయింపులకు టెండర్లను స్వీకరిస్తున్నారు. గతనెల 26వ తేదీ నుంచి టెండర్లను తీసుకుంటుండగా, 18వ తేదీ వరకు వరకు చివరి అవకాశం ముగిసింది. ఎకై ్సజ్ శాఖ అధికారుల అంచనాలను మద్యం వ్యాపారులు, ఉత్సాహవంతులు తలకిందులు చేశారు. దరఖాస్తులు ఎందుకు తగ్గాయి.. గతంలో ఉన్న పోటీ లేకపోవడానికి గల కారణాలను ఎకై ్సజ్ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. కొత్త పాలసీ, మద్యం డిపాజిట్ పెంపు, షాపుల సంఖ్య పెరగడం వంటి అంశాలు వ్యాపారులను వెనక్కి తగ్గించాయని చెబుతున్నారు. జిల్లాలో 11 షాపులకు 20 దరఖాస్తులు కూడా రాకపోవడం గమనార్హం. ముఖ్యంగా గౌడ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన షాపులకు చాలా తక్కువ దరఖాస్తులు రావడం అధికారులు సైతం ఆందోళనకు గురి చేస్తోంది. జనగామ మునిసిపల్ పరిధిలోని షాప్నెంబర్–1కు కేవలం 6 దరఖాస్తులు రాగా, షాపు నెంబర్–4కు 14, స్టేషన్ఘన్పూర్ 23 నెంబర్కు కేవలం 15 మాత్రమే వచ్చాయి. ఐదు రోజుల సమయం.. మద్యం దుకాణాల టెండర్ల స్వీకరణకు పెంచిన ఐదు రోజుల గడువు కలిసొచ్చేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 20వ తేదీన దీపావళి (సెలవు), 21న మంగళవారం(సగం అమావాస్య), 22న పాడ్యమి ఉండడంతో దరఖాస్తులు సమర్పించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో చివరి రోజు గురువారం 23న కొంతమేర టెండర్లు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులకు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని మద్యం దుకాణాలదారులు అంచనా వేస్తుండగా, తగ్గిన 899 వస్తాయని ఎకై ్సజ్ శాఖ గట్టి నమ్మకంతో ఉంది. గతంలో భారీగా టెండర్లు వేసిన వ్యాపారులను కలిసి టెండర్లు వేయాలని ఆ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. పనిలో పనిగా కొత్త వారి నెంబర్లను సేకరిస్తూ స్వాగతిస్తున్నట్లు సమాచారం. మద్యం వ్యాపారంలోకి నూతనంగా వచ్చే వ్యాపారులు మరింత స్పందిస్తే పోటీ కొంతమేర పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఇప్పటివరకు వచ్చిన రూ.47.79కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ, ఇది గత ఏడాది కంటే తక్కువే. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో, టెండర్ల గడువు పెంపుతో ఆదాయం కొంతమేర పెరుగుతుందనే ఆశ ఎకై ్సజ్ శాఖకు ఉంది. అయితే దీపావళి సెలవులు, వ్యాపారుల నిరుత్సాహం ఈ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. మండలం టెండర్లు జనగామ మునిసిపల్ 214 జనగామ మండలం(పెంబర్తి) 30 లిం.ఘనపురం 129 నర్మెట 61 బచ్చన్నపేట 103 చిల్పూరు 147 స్టే.ఘన్పూర్ 155 తరిగొప్పుల 54 రఘునాథపల్లి 170 పాలకుర్తి 183 కొడకండ్ల 70 జఫర్గఢ్ 133 దేవరుప్పుల 144 18వరకు వచ్చిన దరఖాస్తులు 1,587 గతంకంటే 899 తక్కువ ఇప్పటి వరకు ఆదాయం రూ.47.79కోట్లు 20 టెండర్ల కంటే తక్కువ వచ్చిన షాపులపై వాటిపై ఎకై ్సజ్ ఫోకస్ 27న లక్కీ డ్రాచిల్పూరు మండలం చిన్నపెండ్యాల షాపు నెంబర్ 21(జనరల్)కు విపరీతమైన పోటీ నెలకొంది. వరంగల్ హైవేపై వరంగల్కు దగ్గరగా ఉండడంతో ఎప్పుడూ ఈ దుకాణానికి పోటీ ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 18వ తేదీ వరకు సెంచరీ దాటి 103 దరఖాస్తులు రాగా, గడువు పెంచడంతో మరో 10 నుంచి 20 పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రఘునాథపల్లి 33 నెంబర్ (ఖిలాషాపూర్/నిడిగొండ)షాపు ఆఫ్ సెంచరీ దాటి 54 దరఖాస్తులు రాగా, దేవరుప్పుల 48 షాపునకు 51 మంది పోటీపడ్డారు. దుకాణం టెండర్లు రిజర్వేషన్ నెంబర్ 13 40 ఎస్సీ(లిం.ఘనపురం) 14 49 జనరల్(లిం.ఘనపురం) 15 40 గౌడ(లిం.ఘనపురం) 21 103 జనరల్(చిన్న పెండ్యాల) 33 54 జనరల్(రఘునాథపల్లి) 34 47 జనరల్(రఘునాథపల్లి) 45 46 జనరల్(జఫర్గఢ్) 48 51 జనరల్(దేవరుప్పుల) 49 45 గౌడ(దేవరుప్పుల) 50 48 జనరల్(దేవరుప్పుల) 01 06 జనరల్(మునిసిపల్) 02 18 గౌడ(మునిసిపల్) 04 14 గౌడ(మునిసిపల్) 06 16 గౌడ(మునిసిపల్) 23 15 గౌడ(స్టే.ఘన్పూర్) 26 15 గౌడ(స్టే.ఘన్పూర్) -
జిల్లాప్రజలకు కలెక్టర్ శుభాకాంక్షలు
జనగామ: చీకట్లను తొలగించి వెలుగును అందించే దీపావళి పండగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులను నింపే పండుగ కావాలని ఆకాంక్షించారు. కుటుంబసభ్యులందరితో కలిసి జిల్లా ప్రజలందరూ సంతోషంగా, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని కోరారు. కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి● డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్రెడ్డినర్మెట: కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నివర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్, హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు, కన్నెబోయినగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నక్కల గట్టయ్య, డైరెక్టర్లు అర్జుల సుధాకర్రెడ్డి, బోగ అంజయ్య, గోపగోని శోభారాణి, కూకట్ల చంద్రమౌళి, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీనారాయణ, సీఈఓ కొన్నె వెంకటయ్య, ప్రజ్ఞాపురం మల్లయ్య, ఐలేని కేశవరెడ్డి, శివ, పలుపార్టీల నాయకులు, హమాలీసంఘం, రైతులు పాల్గొన్నారు. మోటార్ వాహనాల చట్టాన్ని రద్దుచేయాలిజనగామ రూరల్: కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికిల్ చట్టం–2020ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ కార్యాలయంలో బూడి ద ప్రశాంత్ అధ్యక్షతన జరిగిన యూనియన్ రెండో మహాసభకు పుప్పాల శ్రీకాంత్ హజరై మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకవచ్చిన మోటార్ వెహికల్ చట్టం వల్ల ప్రభుత్వం చెప్పిన్నట్లు రోడ్డు ప్రమాదాలు తగ్గకపోగా ఇంకా పెరిగాయని ఆరోపించారు. అనంతరం 15 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా భూడిద ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా సుంచు విజేందర్, కోశాధికారిగా మహేందర్, ఉపాధ్యక్షులుగా గంధమల్ల నరసింహస్వామి, షేక్ మునివర్, మొగులయ్య తదితరులను ఎన్నుకున్నారు. -
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు. ఎడిటర్, విలేకరులపై అకారణంగా, అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. వార్తలో లోపాలుంటే ఖండన ఇవ్వాలి. ఇలా కాకుండా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం. – ఏదునూరి రాజమొగిలి, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి -
కొత్త కాంతులు..
టపాసులు కొంటున్న ప్రజలుపట్టణంలో పూలు కొనుగోలు చేస్తున్న యువతులుజనగామ: కార్తీక మాసం ప్రారంభంలో వచ్చే దీపావళి వెలుగుల వేడుక. చీకట్లను తొలగించే దివ్వెల పండుగ అంటే చిన్నా,పెద్దా అందరికీ సంతోషమే. మిరుమిట్లు గొలిపే కాకరఒత్తులు, భూచక్రాలు, తారాజువ్వలతో ప్రతీ ఇంటా సందడే. టపాసుల మోతలతో జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజు ముందుగానే దీపావళి వచ్చేసింది. రైల్వేస్టేషన్ ఏరియా, పాతబీటు బజార్, నెహ్రూ పార్కు, సిద్దిపేట రోడ్డు ప్రాంతాలు వ్యాపారంతో కిటకిటలాడిపోయింది. పట్టణంలోని పలు ఫంక్షన్హాళ్లతో పాటు రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలు జనంతో సందడిగా మారాయి. సోమవారం పండుగను పురస్కరించుకుని, తెల్లవారుజాము హారతులు, రాత్రి లక్ష్మీపూజలను నిర్వహించుకోనున్న నేపథ్యంలో దీపావళి బాంబులను ఒక్కరోజు ముందుగానే కొనుగోలు చేశారు. జోరుగా వ్యాపారం.. జిల్లాలో ప్రతి ఏటా దీపావళి సీజన్న్లో రూ.125 కోట్లకుపైగా బాణసంచా వ్యాపారం జరుగుతుంది. ఇక్కడి నుంచి చుట్టుపక్కల జిల్లాలకు హోల్సేల్గా సరఫరా అవుతుంది. దీపావళి పండగను పురస్కరించుకుని పెద్ద ఎత్తున టపాసుల అమ్మకాలు జరుగుతున్నాయి. వస్త్ర, వ్యాపారం, కిరాణా సరుకులు, పూజా సామగ్రి, స్వీట్ల అమ్మకాలు పెరిగాయి. అందాల ప్రమిదలు.. పల్లెలు, పట్టణాల్లో మట్టిప్రమిదలు వివిధ ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాయి. పంచలోహాలు, వెండి, మట్టితో తయారు చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరంగా పండితులు చెబుతుంటారు. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి, మహాలక్ష్మీ దేవీని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. మట్టి ప్రమిదల అమ్మకాలు జోరుగా ఉన్నాయి. బంతిపూలకు భలే గిరాకీ.. దీపావళి పండగ నేపథ్యంలో బంతిపూలకు గిరాకీ పెరిగింది. సుదూరు ప్రాంతాల నుంచి వచ్చిన వ్యా పారులు కిలో పూలను రూ.65కు విక్రయించారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించుకోనున్న దీపావళి, లక్ష్మీపూజలు, కేదారీ వ్రతాల నోముల కోసం పూలను కొనుగోలు చేస్తున్నారు. ప్రయాణికులతో కిటకిట పండుగ కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కుటుంబాలతో జనగామ బస్టాండు కిటకిటలాడింది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ సంస్థల అదనపు బస్సులను నడిపించింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా పోలీసులు పర్యవేక్షణ చేశారు. -
మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం
నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులు, నోటీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవ కథఽనాల ద్వారా అక్రమాలను వెలికితీస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికై నా సాక్షిపై అక్రమంగా పెట్టిన కేసులు, నోటీసులను వెనక్కి తీసుకోవాలి. – గుగ్గిళ్ల పీరయ్యమాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి నెహ్రూసెంటర్: వాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షి పత్రి కపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు వేధింపులు మానుకోవాలి. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చెప్పినట్లు అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి పత్రికపై దాడులు, పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. – గుగులోత్ భీమానాయక్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ -
హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం
● టీజీఈడబ్ల్యూయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతిరెడ్డి దేవరుప్పుల: కార్మికుల హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలే శరణ్యమని టీజీఈడబ్ల్యూయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని సింగరాజుపల్లి తుమ్మగార్డెన్స్లో గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జనగామ జిల్లా 3వ మహాసభ పురస్కరించుకొమని తొలుత సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకన్నగౌడ్ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు..గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు నిత్యం గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం, వైకుంఠధామాలు, పల్లె పకృతి వనాల నిర్వహణతో పాటు పల్స్ పోలియో, ఓటరు నమోదు, ఎన్నికల నిర్వహణలాంటి ప్రభుత్వ కార్యక్రమాలలో కీలక భాగస్వామ్యులు పనిచేస్తున్నారన్నారు. . నూతన జిల్లా కమిటీ ఏకగ్రీవం.. గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రాపర్తి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బస్వ రామచంద్రంగౌడ్, కోశాధికారిగా బత్తిని వెంకన్న, ఉపాధ్యక్షులు నారోజు రామచంద్రం, పరంజ్యోతి, సహాయ కార్యదర్శిగా నూనెముంతల యాకన్న తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి. యాదమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సింగారపు రమేశ్, ప్రజానాట్యమండలి నాయకులు వెంకటరెడ్డి, ఆయా మండలాల బాధ్యులు పాల్గొన్నారు. -
నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దు
● సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి జనగామరూరల్: నిబంధనల పేరుతో అధికారులు, రైస్ మిల్లర్స్ రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా వ్యవసాయ మార్కెట్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్టీ బృందంతో శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో పాటు అధిక వర్షాలతో పంట దిగుబడి తక్కువగా వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బొట్ల శేఖర్, బోడ నరేందర్, భూక్య చందునాయక్, నాయకులు మంగ బీరయ్య, నాగరాజు, అజ్మీర సురేష్నాయక్, బీదని శ్రీను, సిలువేరు ఉపేందర్, బిర్రు విష్ణు, రామచంద్రం, కనకచారితో పాటు రైతులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే అక్కడి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికలు వారధి అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి నెట్వర్క్కేసుల నమోదు సరికాదు ములుగు రూరల్: సాక్షి కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వం దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేసే పత్రికలపై దాడులు, ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – పోలు రాజు, టీఎన్జీఓ ములుగు జిల్లా అధ్యక్షుడు దాడులను ఖండిస్తున్నాం.. జనగామ: ప్రభుత్వం చేసే మంచి, చెడులను ప్రజలకు తెలియజేస్తూ, మనకు దారి చూపించే పత్రికలపై ఏపీ సర్కార్ తీరు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. సమాజంలో పత్రికలే మార్గదర్శకంగా ఉండి మనల్ని నడిపిస్తున్నాయి. –పెండెల శ్రీనివాస్, గ్రామ పరిపాలన ఆఫీసర్ రాష్ట్ర నాయకుడు, జనగామ కక్షసాధింపు చర్యలు మానుకోవాలి నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరిస్తే సమాజానికి మేలు జరగదు. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం వల్ల సుపరిపాలన అనిపించుకోదు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. – ఎం.వివేక్, డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఏపీ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు సాక్షి దినపత్రిక, ఎడిటర్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్రెడ్డిని శనివారం కలిసి వినతిపత్రం అందించారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న లో ఓల్టేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎండీని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జఫర్గడ్, చిల్పూరు, లింగాలఘణపురం మండలాల్లో ఆపరేషన్ విభాగాలను మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎండీ నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించి నూతన సబ్స్టేషన్ల మంజూరీకి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలిజనగామరూరల్/పాలకుర్తి టౌన్: ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ.షరీఫ్, ఇప్ప రాంరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాలకుర్తి మండలకేంద్రంలో జరిగిన సమావేశంలో వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. రిటైర్డ్ ఉపాధ్యాయులకు బకాయిపడ్డ బెనిఫిట్స్ను చెల్లించడంలో ప్రభుత్వం తాత్సారం చేయడం తగదన్నారు. కేజీబీవీ పాఠశాలల్లో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇతర ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అధ్యాపక జ్వాల సంపాదక వర్గ సభ్యురాలు కళావతి, డీటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యుడు చొక్కయ్య, శ్రీనివాసులు, దూడయ్య, యాదయ్య, శివరాం తదితరులు పాల్గొన్నారు. -
జీడికల్ హుండీ ఆదాయం రూ.4.18లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి దేవాలయ ఆదాయం రూ.4,18,993లు వచ్చినట్లు ఈఓ వంశీ తెలిపారు. హుండీలో లెక్కింపులో రూ.1,20,993లు కాగా ఆలయ ప్రాంగణంలో లడ్డు, పులిహోర విక్రయానికి గాను వేలం నిర్వహించగా రూ.2,98,000 వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ భువనగిరి డివిజన్ ఇన్స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో లెక్కించారు. లడ్డు, పులిహోర విక్రయానికి వేలం నిర్వహించగా పొనగంటి సురేశ్ రూ.2,98,000లకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ మూర్తి, డైరెక్టర్లు శ్రీశైలం, వెంకన్న, సంపత్, వెంకటేశ్, ఆలయ సిబ్బంది భరత్, కొడవటూరు దేవస్థాన జూనియర్ అసిస్టెంట్ బాను, సిబ్బంది మల్లేశం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై దృష్టి సారించాలి జనగామ: మెడికల్ ఆఫీసర్లు డెంగీ, సీజనల్ వ్యాధులపై దృష్టి సారించి లార్వా, పెద్ద దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ కె.మల్లికార్జున్రావు ఆదేశించారు. జనగామ పట్టణంలోని యూపీహెచ్సీని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. యూపీఐ సెషన్ను పర్యవేక్షించి, లబ్ధిదారుల తల్లిదండ్రులతో మాట్లాడి, షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఔట్ పేషంట్లతో మాట్లాడి అందిస్తున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్స్ కమల్, వైద్యాధికారిని అనురాధ, డీవైడీఈఎంఓ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంఓగా బాధ్యతల స్వీకరణజనగామ: జనగామ మార్కెటింగ్ ఆఫీసర్ (డీఎంఓ)గా నరేంద్ర శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన బదిలీ కాగా, తిరిగి యథాస్థానికి వచ్చారు. కాగా కలెక్టర్ రిజ్వాన్ బాషాను నరేంద్ర మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు, త్వరలో పత్తి కొనుగోళ్లు తదితర వాటికి సంబంధించి దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు. నవంబర్ 5న జరిగే గిరి ప్రదక్షిణకు అదే నెల 3న హనుమకొండ జిల్లా బస్స్టేషన్ నుంచి బయలుదేరుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చార్జీ పెద్దలకు రూ.5 వేలు, పిల్లలకు రూ.3,500గా నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి సమాచారం కోసం 90634 07493, 77805 65971, 98663 73825, 99592 26047 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. రూ.1.50 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ బీసీ బంద్తో ఆర్టీసీకి నష్టం జరిగింది. బస్సులన్నీ మధ్యాహ్నం వరకు డిపోలోనే ఉండిపోవడంతో ఒక్క రోజులో రూ.1.50 కోట్ల ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీ వరంగల్ రీజియన్లో 950 బస్సులు ప్రతీరోజు 4 లక్షల కిలో మీటర్లు తిరిగి సగటున రూ.2.30 కోట్ల ఆదాయం వస్తుంది. మధ్యాహ్నం తర్వాత బస్సులు తిరిగినా ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీపావళి పండుగ సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్లాలని బస్ స్టేషన్కు వచ్చిన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. అధిక చార్జీలు చె ల్లించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. -
ముగిసిన మద్యం టెండర్లు
● జిల్లాలో 1,528 దరఖాస్తులు ● దరఖాస్తులు తగ్గినా..ఆదాయం పెరిగిందిజనగామ: జిల్లాలో ఎకై ్సజ్ టెండర్లు శనివారం రాత్రితో ముగిశాయి. గత సీజన్తో పోలిస్తే ఈసారి దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయం పెరిగింది. 2023–25 నవంబర్ 30 రెండేళ్ల సీజన్కు గాను 2,492 టెండర్లు రాగా, 2025–27 సీజన్కు సంబంధించి శనివారం రాత్రి 10 గంటల వరకు 1,528 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే అర్ధరాత్రి 12 గంటల వరకు మరో 150 దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. గతేడాది టెండర్ల ద్వారా సుమారు రూ.50 కోట్ల మేర (నాన్ రిఫండబుల్) ఫీజుల రూపంలో ఆదాయం లభించింది. ఈసారి ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచడంతో దరఖాస్తులు ఒక్కసారిగా తగ్గాయి. దీంతో ఆదాయం మాత్రం ఎకై ్సజ్ శాఖ ఆశించిన మేర సమాన స్థాయిలో నిలిచింది. జిల్లాలో మొత్తం 50 వైన్ షాపులకు గాను టెండర్ ప్రక్రియ కొనసాగింది. రాత్రి వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతూనే ఉంది. దరఖాస్తు ఫీజు పెంచడంతో చాలా మంది వ్యా పారులు, ఉత్సాహవంతులు వెనక్కి తగ్గడంతో టెండర్ల సంఖ్య పెరగనప్పటికీ, ఆదాయంలో మునుపటి లెక్కకు సరిపోతుందని అధికారులు సంతోషంలో ఉన్నారు. దీంతో ఎకై ్సజ్ శాఖ ఖజానా ‘ఫుల్’ జోష్లో ఉంది. కాగా జనగామ సర్కిల్లో 20 మద్యం దుకాణాలకు 502, స్టేషన్ఘన్పూర్ పరిధిలో 16 వైన్స్లకు 515, పాలకుర్తిలో 14 దుకాణాలకు 511 టెండర్లు వచ్చాయి. -
బీసీ బంద్ ప్రశాంతం
42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటంజనగామ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బీసీ బంద్ శనివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, సంఘాలు, విద్యార్థి సంఘాలు కలిసి బంద్కు మద్దతు తెలిపారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసి వేయగా, ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. రాజకీయ పార్టీలు, జేఏసీ, విద్యార్థి, బీసీ సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీ నాయకులు భారీ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తాలో కార్యకర్తలు రాస్తారోకో చేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నినదించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణ లో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ రెడ్డి, పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టారు. పట్టణంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గులాబీ శ్రేణులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సర్దుకుంది. అ నంతరం అన్ని రాజకీయ పార్టీలు కలిసి బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఆర్టీసీ చౌరస్తాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో.. జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా జరిగింది. ఉదయం 5 గంటలకు ఆర్టీసీ డిపోకు వెళ్లి బస్సులు బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేశారు. అనంతరం ద్విచక్ర వాహనాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని సంఘాలకు జేఏసీ నాయకుడు మంగళంపల్లి రాజు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీ పార్టీని ప్రజలు భూ స్థాపితం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. బంద్లో భాగంగా రైల్వేస్టేషన్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపి గవర్నర్ కి పంపించినప్పటికీ, జాప్యం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు అఖిల పక్ష నాయకులతో కలిసి ఆ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ, చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బంద్ కు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యంలో పట్టణంలో భా రీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మార్కె ట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, బీసీ కన్వీన ర్ సేవెల్లి సంపత్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు, ఇన్చార్జ్ బోడ సునీల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో.. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు లింగం, రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు దుర్గయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. – మరిన్ని ఫొటోలు 11లోuవివిధ మండలాల్లో బంద్ ఇలా.. స్టేషన్ఘన్పూర్లో బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం, అన్ని పార్టీల నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో, ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. దేవరుప్పుల మండల కేంద్రంలోని జనగామ, సూర్యాపేట రహదారిపై బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ, ఎమ్మార్పీఎస్, బీఎస్పీ తదితర పార్టీల ప్రతినిధులు రాస్తారోకో చేశారు. పాలకుర్తిలో బంద్ నేపధ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు రాజీవ్ చౌరస్తాలో నిరసన, బైక్ర్యాలీ నిర్వహించారు. బీసీబంద్కు బచ్చన్నపేట, నర్మెట, కొడకండ్ల, తరిగొ ప్పుల మండలాల్లోని అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. రఘునాథపల్లి, చిల్పూరు, జఫర్గఢ్, లింగాలఘణపురం,కొడకండ్ల మండలాల్లో బీసీ బంద్ విజయవంతమైంది. ఆర్టీసీ డిపోకు తాళం..ఆగిన చక్రాలు రోడ్డెక్కిన అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు, రాస్తారోకోలు డీసీపీ, ఏఎస్పీ ఆధ్వర్యంలో నిఘా -
ప్రజాస్వామ్యానికి ముప్పు..
ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే బాధ్యత జర్నలిస్టులది. ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్న వారిపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విలువలకు పెద్ద దెబ్బ. ఆంధ్రప్రదేశ్ ఇటీవల జర్నలిస్టులపై దాడులు విచారకరం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల్లో లోపాలను ప్రజల పక్షాన ప్రశ్నించినపుడు వాటిని ఫీడ్బ్యాక్గా తీసుకొని సమస్యలు పరిష్కరించి మెరుగైన పాలన అందించడం కోసం కృషి చేయాలి. ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణకు కట్టుబడి ఉండాలి. దాడుల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్య తీసుకోవాలి. ప్రతి జర్నలిస్టు నిర్భయంగా పని చేసే వాతావరణం ప్రభుత్వం కల్పించాలి. – డి.శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనగామ -
అక్రమ కేసులను ఎత్తివేయాలి..
ప్రజాసమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు వెలుగులోకి తెస్తున్న సాక్షి పత్రికలపై కేసు పెట్టడం మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు పనిచేస్తున్న పోలీసుల పని తీరును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. సాక్షి దినపత్రిక పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు చెప్పడం కూడా తప్పేనా. – లకావత్ చిరంజీవి (ఎంఏ,బీఈడీ), స్టేషన్ఘనపూర్● -
పట్ణణ అభివృద్ధికి మహర్దశ
● జీఐఎస్ ఆధారితంగా మొదటి మాస్టర్ప్లాన్కు రూపకల్పన ● సమీక్షలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జనగామ: జనగామ పట్టణ అభివృద్ధిలో మరో అడుగు పడింది. అమృత్ 2.0 పథకం కింద రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, పట్టణం (విలీనమైన గ్రామ పంచాయతీలతో సహా) కోసం సవరించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడం ప్రారంభమైంది. ఈ ప్రణాళిక ‘ఇన్–హౌస్ఙ్’ విధానంలో రూపొందించబడుతోంది. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా, జీఐఎస్ ఆధారిత మొదటి మాస్టర్ ప్లాన్న్ రూపకల్పనకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ వర్క్షాప్లో మాస్టర్ప్లాన్, ప్రణాళిక పరిధితో పాటు పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. పట్టణ భవిష్యత్ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచే ఈ మాస్టర్ప్లాన్ ద్వారా జనగామ సమగ్ర పట్టణ మౌలిక వసతులు, రహదారులు, నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, పచ్చదనం, సామాజిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వబడనుంది. కాగా ఈ ఏడాది జనవరి 14 నుంచి 24వ తేదీ వరకు మాస్టర్ప్లాన్ కోసం డ్రోన్ సర్వే నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ వివరాలు ఇవ్వండి పట్టణన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు మాస్టర్ ప్లాన్ అవసరమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి మునిసిపల్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ పంచాయతీరాజ్, ఇరిగేషన్, డీఎంహెచ్వో, అగ్రికల్చర్, మార్కెటింగ్, మెప్మా తదితర శాఖల అధికారులతో మాస్టర్ప్లాన్ మొదటి రూపకల్పనపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.. మాస్టర్ ప్లాన్ తయారీ కోసం మున్సిపల్ అధికారులు, 23 శాఖల సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రత్యేక కార్యాచరణతో విజయోస్తు 2.0 వచ్చే పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి పింకేశ్ కుమార్తో కలిసి విజయోస్తు 2.0, పదో తరగతి పరీక్షలు, డిజిటల్ లర్నింగ్ కరిక్యులం, లైబ్రరీ, తదితర అంశాలపై హెచ్ఎంలతో సమీక్షించారు. పంటల నమోదు తప్పనిసరి.. జనగామ రూరల్: పంటల నమోదు చేయించడం తప్పనిసరి అని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్మకానికి ఇది తప్పనిసరి ఆధారమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. -
బీసీబంద్కు సకలజన మద్దతు
● నేడు రైల్వేస్టేషన్ నుంచి భారీ ర్యాలీ జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 18న(శనివారం) నిర్వహించనున్న బీసీ బంద్కు అన్ని వర్గాల నుంచి అఖండ మద్దతు లభిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ను రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, అన్ని రాజకీ య పార్టీలు, నాయకులు, విద్యార్థి సంఘాలు, రైతు, కార్మిక సంఘాలు ఒకే వేదికపై గళం కలుపుతున్నాయి. 42 శాతం రిజర్వేషన్లు కల్పించా లనే నినాదంతో ప్రతి బీసీ కుటుంబం ఒక్కటై ఉద్యమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. నేడు భారీ ర్యాలీ.. బీసీ బంద్ నేపథ్యంలో పట్టణంలోని రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు బీసీ సంఘాలు ప్లాన్ చేశాయి. ప్రైవేటు విద్యా, వ్యాపార, వాణిజ్య, ఇతర సంస్థలు బంద్ పాటించనున్నాయి. ర్యాలీలతో పాటు పెద్దఎత్తున నిరసన తెలుపనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి నిఘా వేయనున్నారు. -
కోర్టుల సముదాయ నిర్మాణానికి నేడు శంకుస్థాపన
జనగామ: జిల్లా న్యాయసేవలకు కొత్త దశ ప్రారంభం కానుంది. జనగామ మండలం చంపక్హిల్స్లో 10 ఎకరాల విస్తీర్ణంలో కోర్టుల సముదాయం నిర్మాణానికి ఈనెల 18న (శనివారం) శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, జనగామ పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానుండగా, హైకోర్టు జడ్జిలు నామవరపు రాజేశ్వర్రావు, బీఆర్ మధుసూదన్రావు, సుద్దాల చలపతిరావు పాల్గొననున్నారు. 10 ఎకరాలు..రూ.81కోట్ల నిధులు జనగామ కోర్టు నూతన భవన సముదాయ నిర్మాణం కోసం చంపక్హిల్స్లో 10 ఎకరాల స్థలం కేటాయించగా, రూ.81కోట్ల నిధులు ఖర్చు చేయనున్నారు. ఇందులో 12 కోర్టుల సేవల కోసం డిజైన్ చేశారు. వీటిలో జిల్లా, పోక్సో, సీనియర్ సివిల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, అడిషినల్ జూనియర్ సివిల్ సెకెండ్ మెజిస్ట్రేట్ కోర్టులతో పాటు లోక్ అదాలత్, లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ సేవలు అందుతున్నాయి. ఇంకా ఫ్యామిలీ, ఎస్సీ,ఎస్టీ అదనపు సబ్, అడిషినల్ డిస్ట్రిక్, అదనంగా సబ్, మరో రెండు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు రావా ల్సి ఉంది. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత జిల్లాలోని వివిధ కోర్టులు ఒకేచోట ఉండేలా సదుపా యం కలగనుంది. ప్రస్తుతం సిద్దిపేట రోడ్డు గీతానగర్ ఏరియాలో కోర్టు సేవలు అందుతున్నాయి. రెండేళ్ల లోపు కోర్టు సేవలన్నీ ఒకే సముదాయంలోకి రానుండడంతో ప్రజలు, న్యాయవాదులకు, సిబ్బందికి సేవలు మరింత సౌలభ్యం కానున్నాయి. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ భవన సముదాయంలో న్యాయమూర్తుల చాంబర్లు, అడ్వకేట్ల హాల్, రికార్డు గదులు, లైబ్రరీ, మీటింగ్ హాల్, వెయిటింగ్ హాల్, పార్కింగ్ స్థలాలు వంటివి ఏర్పా టు చేయనున్నారు. జిల్లా ప్రజలు, న్యాయవాదులు ఈ ప్రాజెక్టుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులు ఒకేచోట ఉండటం వల్ల కేసుల పరిష్కారంలో వేగం పెరుగుతుందని, న్యాయసేవలు మరింత చేరువ అవుతాయని అభిప్రాయపడ్డారు. నేడు శంకుస్థాపన చంపక్హిల్స్ ప్రధాన రోడ్డుకు సమీపంలో కోర్టు సముదాయాలకు కేటాయించిన స్థలంలో నూతన భవన నిర్మాణాల కోసం శనివారం హైకోర్టు జడ్జిల చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు పోక్సో, కుటుంబ కోర్టులతో సహా 12 కోర్టుల భవన నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.హరిప్రసాద్ యాదవ్ తెలిపారు. డిస్ట్రిక్ సెషన్ జడ్జి బి.ప్రతిమ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులు స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. శంకుస్థాపన అనంతరం పసరమడ్ల శివారులోని ఉషోదయ ఫంక్షన్హాల్లో మీటింగ్ ఉంటుందన్నారు. కాగా, పోలీసులు కట్టు దిట్టమైన బందోబస్తు చేపట్టనున్నారు. చంపక్హిల్స్ 10 ఎకరాల స్థలం, రూ.81కోట్లు నిధుల కేటాయింపు నలుగురు హైకోర్టు న్యాయమూర్తుల రాక కొత్త, అదనపు కోర్టులు వచ్చే అవకాశం -
‘సాక్షి’పై కక్ష సాధింపు తగదు
జనగామ: సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు తగదని, దాడులను తిప్పికొట్టే సమయం వచ్చిందని జర్నలిస్టులు స్పష్టం చేశారు. సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతీ పాత్రికేయుడు ధైర్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం సాక్షి మీడియా ప్రతినిధులు కొత్తపల్లి కిరణ్ కుమార్, సురిగెల భిక్షపతి, నేతి ఉపేందర్, గోవర్దనం వేణుగోపాల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరస న చేపట్టారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ పాత్రికేయులు నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, ఐజేయూ రాష్ట్ర ప్రతినిధి పార్నంది వెంకటస్వామి, సీనియర్ జర్నలిస్టు కన్నా పరుశరాములు మాట్లాడుతూ.. నకిలీ మద్యం, అవినీతి, ప్రజాసమస్యలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సాక్షి దినపత్రిక ప్రతిరోజూ ప్రజాస్వా మ్య బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు. ఇలాంటి ధైర్యవంతమైన జర్నలిజాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్రపూర్వకంగా కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. ఇది కేవలం ఒక పత్రికపై కాదని, మీడియా స్వేచ్ఛపై దాడి అని అన్నారు. సాక్షిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఏపీ ప్రభుత్వం ఒత్తిడికిలోనై పనిచేస్తున్న పోలీ సుల తీరును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం జర్నలిస్టులు నిజాలను వెలుగులోకి తెచ్చే క్రమంలో కేసులు పెట్టడం ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఏ చర్యనైనా ఎదుర్కొంటామన్నారు. అలాగే సాక్షి పట్ల ఐక్యత ప్రదర్శిస్తూ, ప్రజల కోసం జర్నలిజం కొనసాగుతుందనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీభాష్యం శేషాద్రి, జమాల్ షరీఫ్, అశోక్ కుమార్, లక్ష్మణ్, ఎండబట్ల భాస్కర్, హింజ మాధవరావు, శేషత్వం ఆనంద్ కుమార్, వంగ శ్రీకాంత్రెడ్డి, కాసాని ఉపేందర్, బండి శ్రీనివాస్ రెడ్డి, చౌదర్పల్లి ఉపేందర్, శివశంకర్, తిప్పారాపు ఉపేందర్, భాను, రమేశ్, భా స్కర్, కేమెడీ ఉపేందర్, ఓరుగంటి సంతోష్, గణే శ్, మణి, వినయ్, యూసుఫ్, కిషోర్, మోహన్, మ ణి, మధు, సలీం, సురేష్, ఆశిష్, సుధాకర్, నరేష్, జయపాల్ రెడ్డి, శంకర్, బాబా, నవీన్ చారీ, రాజు, సుప్రీం, జితేందర్, శ్రీను, ఏజాజుద్దీన్ పాల్గొన్నారు. మీడియా స్వేచ్ఛపై దాడులు సరికాదు జనగామ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన -
ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావు అలియాస్ ఆశన్న
సాక్షిప్రతినిధి, వరంగల్: దండకారణ్యంలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. బుధవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట 61 మంది సహచరులతో ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు, డీకేఎస్జెడ్సీ ప్రతినిధి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ శుక్రవారం అనుచరులతో అడవిబాటను వదిలారు. 208 మంది (110 మంది మహిళలు, 98మంది పురుషులు)సహచరులతో కలిసి 153 ఆయు ధాలతో ఆయన జగదల్పూర్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఇంద్రావతి ఏరియాను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఆశన్న కార్యక్రమాలు కొనసాగించారు. ఛత్తీస్గఢ్లోని వివిధ ప్రాంతాల్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయినట్లు హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. చర్చల కోసం ప్రయత్నించి.. ఆపరేషన్ కగార్ ఉధృతం కావడం.. చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఈనేపథ్యంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామ ని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మార్చి 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక దశలో ఒకే అన్నప్పటికీ.. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా నో చెప్పారు. ఆ తర్వాత మే నెలలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చర్చలను ప్రతిపాదిస్తూ ఛత్తీస్గఢ్లోని ఓ మీడియా చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజా సంఘాలు చొర వ చూపాలని కోరారు. అయినప్పటికీ పోలీస్ కూంబింగ్ కొనసాగి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ సహా పలువురు అగ్రనాయకులు, కేడర్ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. చర్చల ప్రతిపాదనలతో ఫలితం లేదనే భావన, పలు కారణాలతో లొంగుబాటును ఎంచుకున్న కేంద్ర నాయకులు మల్లోజుల అలియాస్ అభయ్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేశ్ సహచరులు, ఆయుధాలతో సరెండర్ అయ్యారు. మావోయిస్టు నేత తాతతో కలిసి పనిచేసిన ఆశన్న 1993–94లో అన్నసాగర్ ఏరియా డిప్యూటీ కమాండర్గా, కమాండర్గా పనిచేశారు. శేషగిరిరావు అలియాస్ గోపన్నతో కలిసి పనిచేసిన ఆయన నల్లగొండ జిల్లాలోనూ కొంతకాలం దళనేతగా ఉన్నారు. ఆతర్వాత అనతి కాలంలోనే 1999లో పీపుల్స్వార్ పార్టీ నాయకత్వం యాక్షన్ టీంకు ఇన్చార్జ్గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక యాక్షన్లకు ఆశన్న నాయకత్వం వహించినట్లు పోలీసు రికార్డులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి కారును పేల్చి చంపిన ఘటనలో కీలకమని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు. 2003లో అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్ని క్లైమోర్మెన్ పేల్చిన ఘటనతోపాటు హైదరాబాద్ సంజీవరెడ్డినగర్లో ఐపీఎస్ అధికారి ఉమేశ్చంద్రను పట్టపగలే కాల్చిచంపిన ఘటనకు ఈయనే నాయకత్వం వహించినట్లు రికార్డులున్నాయి. ఆ తర్వాత నిర్బంధం పెరగడంతోపాటు ఉద్యమ నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, దండకారణ్యంలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆశన్న కేంద్ర మిలటరీ కమిషన్కు కూడా కొంతకాలం ఇన్చార్జ్గా పనిచేసినట్లు ప్రచారం ఉంది. కాగా, దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నేత వరకు ఎదిగి.. ఛత్తీస్గఢ్, సౌత్బస్తర్, మాడ్ డివిజన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన శుక్రవారం ఉద్యమ సహచరులతో కలిసి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం లక్ష్మీదేవిపేట శివారు పోలోనిపల్లి (నర్సింగాపూర్) స్వగ్రామం. తల్లి సరోజన, తండ్రి భిక్షపతిరావు, తమ్ముడు సహదేవరావు, అక్క సౌమ్య. తండ్రి భిక్షపతిరావు 2012లో గొంతు క్యాన్సర్తో మృతిచెందగా, తమ్ముడు సహదేవరావు రైల్వేశాఖలో డ్రైవర్గా పనిచేస్తూ హనుమకొండలోని గోపాల్పూర్లో స్థిరపడినట్లు బంధువులు తెలిపారు. కాగా, వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం కాజీపేటలోని సెయింట్గ్యాబ్రియల్ స్కూల్లో సెకండరీ విద్యనభ్యసించారు. భువనగిరిలో ఐటీఐ కూడా చేసిన ఆయన, కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ.. రాడికల్ స్టూడెంట్ యూనియన్కు (ఆర్ఎస్యూ) నాయకత్వం వహించారు. ఆతర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1991 నుంచి ఆర్ఎస్యూలో పని చేసి అజ్ఞాతంలోకి వెళ్లాక దళ సభ్యుడి నుంచి నాలుగున్నర దశాబ్దాల్లో కేంద్ర కమిటీ అగ్రనేత వరకు ఎదిగారు. 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి.. నాలుగున్నర దశాబ్దాలు అడవిలో.. దళసభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు ఆశన్న ఉద్యమ ప్రస్థానం -
‘కొండా’ వివాదం సమసినట్లేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్ : సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతులు, ఆమె కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదం సమసినట్లేనా.. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు.. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఏమిటి.. ఇంతకీ వివాదానికి కారణమైన మాజీ ఓఎస్డీ సుమంత్ ఎక్కడ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టిలను కలిసిన సురేఖ.. కీలకమైన కేబినెట్ మీటింగ్కు ఎందుకు వెళ్లలేదు?.. ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్టాపిక్గా మారాయి. 48 గంటలుగా తాజా రాజకీయ పరిణామాలు వరంగల్ను హీటెక్కించాయి. సుమంత్ కోసం పోలీసులు.. కలకలం రేపిన సుస్మిత వ్యాఖ్యలు.. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిల మధ్య విభేదాలు పక్కన పెడితే... మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు వెళ్లడం.. అక్కడ సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు. కొండా సురేఖ, మురళిలకు ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదే సమయంలో వరంగల్లో మీడియాతో మాట్లాడిన కొండా మురళీధర్ సీఎం రేవంత్రెడ్డితో తమకు విభేదాలు లేవని, తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారన్నారు. సుస్మిత ఎక్కడ.. ఎప్పుడు.. ఏం మాట్లాడింది తనకు తెలియదని కొట్టిపారేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు? ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు? ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతుంది? అనే అంశాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. రెండు రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గురువారం జరిగిన కీలకమైన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్టాపిక్గా మారింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మితలు.. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడ కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మీనాక్షి నటరాజన్, మహేశ్కుమార్లను కలిసిన కొండా సురేఖ.. 48 గంటల్లో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిసింది. పార్టీపరంగా, కొందరు ప్రజాప్రతినిధుల వల్ల తమకెదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మీడియాతో మాట్లాడిన సురేఖ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మీనాక్షి నటరాజన్, మహేశ్కుమార్లతో భేటీ అయిన సురేఖ, ఆ తర్వాత జరిగిన కేబినెట్ మీటింగ్కు హాజరుకాకపోవడం కొత్త వివాదానికి తెర తీసింది. అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడిన సురేఖకు వారు ఏమి భరోసా ఇచ్చారు? అక్కడినుంచి కేబినెట్ మీటింగ్కు వెళ్లాల్సిన ఆమె ఎందుకు వెళ్లలేదు? కావాలనే వెళ్లలేదా? లేక ఎవరైనా వద్దని చెప్పారా? ఈ నేపథ్యంలో కొండా దంపతులకు ఏమైన ప్రత్యేక వ్యూహం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది..? అన్న అంశాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. హీటెక్కిన వరంగల్ రాజకీయాలు మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం ‘టాస్క్ఫోర్స్’.. కలకలం రేపిన కొండా సుస్మిత వ్యాఖ్యలు సీఎం రేవంత్రెడ్డితో విభేదాలు లేవన్న కొండా మురళి కేబినెట్ మీటింగ్కు వెళ్లని మంత్రి సురేఖ.. హాట్ టాపిక్గా తాజా పరిణామాలు -
సీపీఆర్పై అవగాహన
జనగామ: జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీపీఆర్ (కార్డియో పల్మోనరీ రీసస్సిటేషన్)పై గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెడికల్ కళాశాల విద్యార్థులతో పాటు పారా మెడికల్, బోధనా సిబ్బంది కూడా పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ నాగమణి మాట్లాడుతూ.. గుండెపోటు వచ్చిన వ్యక్తులకు సమయానికి సరైన సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి చేతివాటం సాధన చేసే అవకాశం కూడా కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. రేపటి బీసీబంద్కు ‘చాంబర్’ మద్దతుజనగామ రూరల్: స్థానిక సంస్థలలో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం జనగామ జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ సేవెల్లి సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్యను కలిసి, బంద్కు మద్దతు తెలపాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంద్కు విద్యా, వ్యాపార సంస్థలు, హోటళ్లు, మద్యం దుకాణాలు సహా సమాజంలోని అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య మాట్లాడుతూ.. చాంబర్ తరఫున బీసీ బంద్కు పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. దూడల సిద్ధయ్య, జాయ మల్లేష్, పండుగ హరీశ్, మాచర్ల భిక్షపతి, పాశం శ్రీశైలం పాల్గొన్నారు.ప్రజాభిప్రాయాన్ని తెలపాలి..జనగామ: దేశం స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి 100 సంవత్సరాలు అవుతుందని దీనిపై రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ స్వాతి అన్నారు. గురువారం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్లో పలువురితో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాసర్వేలో భాగంగా పలు క్యూర్ కోడ్లను ఇచ్చారని దేశ అభివృద్ధి గురించి ఈ యాప్ ద్వారా అభిప్రాయాలను పంపించాలని, తెలంగాణ రైజింగ్–2047లో రాష్ట్ర అభివృద్ధిలో మనం భాగస్వాములు కావొచ్చని, పలు అంశాలపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మకుంట పనుల పరిశీలనజనగామ రూరల్: పట్టణంలోని బతుకమ్మకుంటలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మట్లాడుతూ..తుదిదశకు వచ్చిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ వసంత, మున్సిపల్ కమిషనర్, మెప్మా తదితర శాఖల అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు జారీ చేశారు. ● ఇప్పటికే రూ.205 కోట్లు మంజూరు చేసిన సర్కార్ సాక్షి, వరంగల్: వరంగల్ మామునూరు విమానాశ్రయం భూసేకరణకు మరో రూ.90 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిధిలో 696.14 ఎకరాలు ఉండడంతో అదనంగా కావాల్సిన 253 ఎకరాల కోసం ఈ ఏడాది జూలై 25న రూ.205 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు ఇచ్చింది. భూ పరిహారానికి అదనంగా రూ.112 కోట్లు అవసరం ఉండగా, ఇప్పుడు రూ..90 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఇప్పటివరకు భూసేకరణ కోసం రూ.295 కోట్లు మంజూరు చేసినట్లయ్యింది. సాధ్యమైనంత తొందరగా ఏఏఐకు ఆయా కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చే మార్కింగ్ నివేదికతో ఆ తర్వాత నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నారు. సత్వర న్యాయం అందించాలిహసన్పర్తి: పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. హసన్పర్తి పోలీస్స్టేషన్ను గురువారం సీపీ సందర్శించారు. ఈసందర్భంగా పోలీస్స్టేషన్ ఆవరణను పరిశీలించి స్టేషన్ పరిఽధిలోని సమస్యత్మాక గ్రామాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. -
సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర
జనగామ: జిల్లా రైతులు సాగుచేసి పండించిన పత్తిని నేరుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)సెంటర్లలో అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. సీజన్ ప్రారంభానికి ముందుగా పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సీసీఐ కార్యకలాపాలపై ఏర్పాట్లను సమీక్షిస్తూ కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్న్స్ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి మార్కెటింగ్, వ్యవసాయశాఖ, ఫైర్, వి ద్యుత్త్, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యంతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 15 పత్తి మిల్లుల పరిధిలో సీసీఐ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమీక్షలో జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, వ్యవసాయశాఖ అధికారి అంబికాసోని, లీగల్ మెట్రాలజీ అధికారి ఝాన్సీ, ఎన్పీడీసీఎల్ డీఈ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవాలి.. ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు నమ్మకం ఉంటుందని, దాన్ని కాపాడుకునే విధంగా వైద్యాధికారులు సేవలందించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. కలెక్టరేట్లో వైద్యసేవలకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా వైద్య అధికారి, పీహెచ్సీల మెడికల్ అధికారులు, సూపర్వైజర్లతో కలెక్టర్ సమీక్షించారు. రుణం మంజూరు చేయాలి.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆన్లైన్లో వెంటనే నమోదు చేసి బ్రిక్స్, సిమెంట్, యూనిట్స్ ఏర్పాటుకు స్వయం సహాయక సభ్యులకు రుణ మంజూరు చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలాశాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులతో సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్డీవో లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
కొత్తగా ఉపాధి
జనగామ రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పని కల్పించడానికి ఉద్దేశించిన గ్రామసభలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈనెల 2వ తేదీ నుంచే చేపట్టాల్సి ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి దృష్ట్యా కొత్త పనులను గుర్తించలేదు. ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో జిల్లాలో ఈ నెలలో గ్రామసభల ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనులు గుర్తించనున్నారు. మట్టి పనులను తగ్గించి ఆర్థికంగా బలోపేతమయ్యే పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ప్రధానంగా బిల్డింగులు ఇతర నిర్మాణాలను చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాలు, కిచెన్షెడ్లు, పాఠశాలలకు ప్రహరీ నిర్మాణం పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అందరి ఆమోదంతో పనులు గుర్తించాలి. జిల్లా వ్యాప్తంగా 281 గ్రామపంచాయతీలు ఉండగా అన్నింటా గ్రామసభలు నిర్వ హించడానికి ఇదివరకే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ మేరకు 58 రకాల పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరగా గ్రామసభలు పూర్తిచేసి మండల పరిషత్కు, ఆ తర్వాత జిల్లాకు పంపించి అనుమతులు తీసుకోవాలని అధికారులు తలపోస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఏడాదికి సంబంధించిన పనులు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్తగా గుర్తించిన పనులు ప్రారంభిస్తారు. ఉపాధి పథకంలో ఎక్కువగా చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతుంటారు. ఈ పనుల పేరుతో ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నాయి. కానీ ఆశించిన మేరకు ఫలితాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ పూడికతీత పనుల్లో అక్రమర్కులకు మరింత లాభం చేకూరేలా ఉంటుంది. ఉపాధి హామీ పనులపై నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్లో తరచూ ఇవి బయటపడుతున్నాయి. నిరుపేద కూలీల పేరుతో రూ.లక్షల్లో నిధులు పక్కదారిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మాణం వంటి పనులు చేపడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకుగాను ఈ పూడికతీత పనుల అంచనాల తయారీని తగ్గించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీలకు స్థానికంగా పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. జిల్లాలో 281 గ్రామాల్లో పనులు నడుస్తున్నాయి. మొత్తం 1,17,806 లక్షల జాబ్కార్డులు ఉన్నాయి. ఈ జాబ్కార్డుల్లో మొత్తం 2.31లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. యాక్టివ్ జాబ్ కార్డులు 77,788 ఉండగా వారిలో 1,28,436 మంది యాక్టివ్ కూలీలకు12,94,056 పని దినాలు కల్పించారు. జీపీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ఇసుకమేటల తొలగింపు.. ఇందిరమ్మ ఇళ్లు, పొలంపనుల్లో కూలీల సహాయం కోసం ప్రణాళిక ఆర్థికంగా బలోపేతమయ్యే పనులకే అవకాశం పనుల గుర్తింపునకు గ్రామసభల నిర్వహణ 58 రకాల ఉపాధి హామీ పనులు చేపట్టాలని నిర్ణయంగ్రామసభల్లో సీజన్లకు అనుగుణంగా ఉపాధి పనులు గుర్తిస్తారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ ఏడాది కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కూలీల సహాయాన్ని తీసుకోనున్నారు. అలాగే పంటపొలాల్లో కూలీలతో ఇసుక మేటలు తొలగించనున్నారు. వ్యవసాయ పనులు మెండుగా ఉండే రోజుల్లో కూలీలు తక్కువ సంఖ్యలో హాజరవుతుంటారు. ఆ పనులు లేని సమయంలో అధిక మందికి పనులు కల్పించేలా ప్రణాళికలు రూపొంది స్తుంటారు. జిల్లాలో కొన్నాళ్లుగా ఎక్కువగా భూగర్భజలాల పెంపునకు సంబంధించిన పనులకే ప్రాధాన్యమిస్తున్నారు. చెరువులు, కాలువలు, కుంటల్లో పూడికతీత, కాలువల్లో పిచ్చిమొక్కలు, నీటి కుంటల నిర్మాణం, కందకాల తవ్వకం, అంతర్గత మట్టి రోడ్ల నిర్మాణం, మొక్కలు, పండ్ల తోటల పెంపకం వంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు. -
దొడ్డు వడ్లకూ బోనస్ ఇవ్వాలి..
జనగామ రూరల్: దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జనగామ మండలంలోని ఎర్రగొల్లపహాడ్, గానుగుపహాడ్, పెద్దపహాడ్, వడ్లకొండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, పీఏసీఎస్ సీఈవో భాస్కర్రెడ్డి, బూరెడ్డి ప్రమోద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళారులను ఆశ్రయించొద్దు.. నర్మెట/తరిగొప్పుల: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. నర్మెట మండలం హన్మంతాపురం, తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
ఒక్కరోజే 133 మద్యం టెండర్లు
జనగామ: జిల్లా ఎకై ్సజ్ శాఖలో చివరి నిమిషంలో టెండర్ల ప్రక్రియ జోరందుకుంది. రెండు రోజుల వరకు నిశ్శబ్దంగా ఉన్న మద్యం షాపుల టెండర్లకు ఒక్కసారిగా దరఖాస్తుల వెల్లువ కనిపించింది. గురువారం ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 133 దరఖాస్తులు స్వీకరించడంతో అధికారులు కొంతమేర ఊపరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు పెద్దగా స్పందన కనిపించకపోవడంతో ఎకై ్సజ్ శాఖ ఆందోళన చెందగా, చివరి రోజుల్లో వ్యాపారులు ముందుకు వస్తుండడంతో అధికారుల ముందస్తు అంచనాకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. చివరి రోజులైన శుక్ర, శుక్ర, శనివారాల్లో ఇదే ఉత్సాహం కొనసాగుతుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. జిల్లాలో ఈ నెల 15వ తేదీ వరకు 92 టెండర్లు రాగా, 16వ తేదీన ఒక్కరోజే 133 దాఖలయ్యాయి. దీంతో మొత్తం దరఖాస్తులు 225కు చేరుకున్నాయి. నేడు, రేపు భారీగా పెరిగే అవకాశం -
రైతుల సంక్షేమమే లక్ష్యం
స్టేషన్ఘన్పూర్: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం రేవంత్రెడ్డి రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. గురువారం మండలంలోని నమిలిగొండ గ్రామంలో, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశాల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు.. రైతులు దళారుల వద్ద మోసపోవద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వసంత, డీఏఓ అంబికాసోని, ఏడీఏ వసంత సుగుణ, డీసీఓ కోదండరాం, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మరింత అంతరం!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది.. మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయా.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ దంపతుల నడుమ అగాధం పెరిగిపోయిందా.. మేడారం టెండర్లపై ఇటీవల కాలంలో కొండా మురళి హైకమాండ్కు ఫిర్యాదు చేశారన్న ప్రచారం మరింత గ్యాప్ను పెంచిందా.. వరంగల్ రాజకీయాలపై పార్టీ, ప్రభుత్వం దృష్టి సారించిందా.. అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు తాజా ఉదాహరణలుగా చెబుతున్నారు. రోజురోజుకూ చినికి చినికి గాలివానగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విబేధాలపై ఇటు అధిష్టానం.. అటు ప్రభుత్వం సీరియస్గా స్పందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య రోజురోజుకూ అంతరం పెరుగుతోంది. రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఎమ్మెల్యేపై చేసిన బాడీ షేమింగ్ వ్యాఖ్యలు దుమారమే రేపాయి. ఆ తర్వాత తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొండా దంపతులపై కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానం వరకు వెళ్లారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావులు టీపీసీసీ చీఫ్, సీఎంలకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశంపై టీపీసీసీ క్రమశిక్షణ సంఘం కొండా సురేఖ, కొండా మురళీధర్రావులతో మాట్లాడింది. టీపీసీసీ చీఫ్, సీఎంల జోక్యంతో సద్దుమణిగినట్లే అనిపించినా.. అంతర్గతంగా ఇంకా రగులుతూనే ఉంది. ఇదే సమయంలో మేడారం సమ్మక్క–సారలమ్మల గద్దెల పునరుద్ధరణ, ఇతర అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై కొండా మురళి ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ప్రచారంపై సంప్రదించిన మీడియా ప్రతినిధులతో ‘నేను ఇంట్లోనే ఉన్నాను.. ఎవరిని కలవలేదు, ఫిర్యాదులు కూడా చేయలేదు’ అని మురళి స్పష్టం చేశారు. ఇవన్ని జరుగుతున్న సమయంలోనే మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్పై ప్రభుత్వం వేటు వేయడం, బుధవారం హనుమకొండకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కలవకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అధికారుల మితిమీరినతనంపై చర్యల్లో భాగంగా ప్రభుత్వం.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పరిధిలోని ఇద్దరు అధికారులపై వేటు వేసింది. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తూర్పులో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నాయకుల బర్త్డే వేడుకలు జరపడం.. ఏ హోదా లేకున్నా ఎస్కార్టు ఇవ్వడంతోపాటు ఇతర కారణాలను చూపుతూ ఆయనపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. నందిరాంనాయక్ స్థానంలో ఐపీఎస్ అధికారి శుభం ప్రకాశ్ నాగర్లేకు ఏసీపీ బాధ్యతలు ఇచ్చారు. తాజాగా మంత్రి సురేఖ పేషీలో ఓఎస్డీగా పనిచేసే సుమంత్ను అ పదవినుంచి ప్రభుత్వం మంగళవారం తప్పించింది. 2023 డిసెంబర్నుంచి ఈ పదవీ బాధ్యతలు చూస్తున్న సుమంత్ అభివృద్ధి పనుల్లో మితిమీరిన జోక్యం.. ఇటీవల మేడారం పనుల వివాదానికి కూడా కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా సీఎం విచారణకు ఆదేశించి.. ఆరోపణలు నిజమేనని తేలడంతో వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలు కొండా దంపతులు ప్రమేయం లేకుండా జరిగాయన్న ప్రచారం ఉండగా.. బుధవారం సీఎం పర్యటనకు హాజరు కాకపోవడంపైనా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. చాలా ఏళ్లుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కొండా దంపతులకున్న రాజకీయ విబేధాలు, వైరం కారణంగానే సీఎం పర్యటనకు సురేఖ దూరంగా ఉన్నారని వారి అనుచరులు చెబుతున్నారు. కాగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న అంతర్గత విభేధాలు, కుమ్ములాటలకు చెక్ పెట్టే దిశగా పార్టీ, ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐదారు రోజుల్లో సమగ్ర నివేదికలు ఇవ్వాలన్న ఆదేశాల మేరకు నిఘావర్గాలు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఓరుగల్లు కాంగ్రెస్లో తారస్థాయికి మంత్రుల మధ్య విబేధాలు వైరల్గా మారిన మంత్రి పొంగులేటిపై ఫిర్యాదుల ప్రచారం వివాదాస్పదంగా కొండా దంపతుల వ్యాఖ్యలు... సీరియస్గా తీసుకుంటున్న ప్రభుత్వం మొన్న ఏసీపీ, నేడు ఓఎస్డీ.. వేటు వేయడంపై దుమారం ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా కొండా దంపతులు జిల్లా రాజకీయాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా...? -
నేడు ఆర్టీసీ ‘డయల్ యువర్ డీఎం’
జనగామ: జనగామ ఆర్టీసీ డిపోలో ఈనెల 16న (గురువారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ స్వాతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి డయల యువర్ డీఎం ద్వారా సమస్యలతో పాటుగా సూచనలు, సలహాలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే డయల్ యువర్ డీఎం ప్రోగ్రాంలో–99592 26050 ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలన్నారు. జనగామ: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో ఖాళీగా(మిగిలిన) ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తుల చేసుకోవాలని గురుకులాల జిల్లా సమన్వయాధికారి పి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం కామన్ ఎంట్రెన్స్ వీజీటీ సీఈటీ–2025 రాసిన వారితో పాటు రాయనివారు కూడా అర్హులుగా పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతుల్లో ప్రవేశం కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బ్యాక్లాగ్ వేకెన్సీ ఎగ్జామ్ బీఎల్వీ సీఈటీ–2025 రాసిన వారితో పాటు రాయని వారు కూడా అర్హులన్నారు. ఎంట్రెన్స్ రాసిన ఎగ్జామ్ హాల్ టికెట్ (పరీక్ష రాసిన వారు), ర్యాంక్ కార్డ్ (పరీక్ష రాసిన వారు), కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (పరీక్ష రాసిన వారు, రాయని వారు) వీటిని వెంట తెచ్చువాలన్నారు. ఆసక్తి గల వి ద్యార్థులు ఈనెల 16, 17 తేదీల్లో సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తును జనగామ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో సమర్పించాలన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. పరీక్ష రాసిన పిల్లలు అందుబాటులో లేని పక్షంలో పరీక్ష రాయని వారికి కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలిజనగామ రూరల్: రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ అధ్యక్షుడు బి.లక్ష్మయ్య డిమాండ్ చేశారు. బుధవారం సాధన కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 నెలల నుంచి బకాయిలు చెల్లించకుండా జాప్యం చేయడం వల్ల రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందిపడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది పెన్షన్దారులు అప్పుల బాధలకు కుంగిపోయి చనిపోయారన్నారు. కార్యక్రమంలో అంబటి రాజయ్య, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి మాదిగలకు ఇవ్వాలిజనగామ: కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్ష పదవి ఈసారి మాదిగలకు కేటాయించి సముచితమైన స్థానం కల్పించాలని కోరుతూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్కు జనగామ పట్టణ మాదిగ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మెయిల్ ద్వారా వినతి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పిస్తామని మీనాక్షి నటరాజన్ ప్రకటించడం స్వాగతిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ మాదిగ సంఘం అధ్యక్షుడు ఉడుగుల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి గాదెపాక రామచందర్, కోశాధికారి మల్లిగారి మధు, వ్యవసాయక మార్కెట్ డైరెక్టర్ బొట్ల నర్సింగరావు, జేరుపోతుల కుమార్, బొట్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థికి బంగారు పతకంజనగామ రూరల్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పట్టణంలోని మైనారిటీ జూనియర్ కళాశాల బాలుర–1లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కార్తీక్ బంగారు పతకం కై వసం చేసుకున్నాడు. ఈసందర్భంగా బుధవారం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా విద్యార్థి కార్తీక్ను, పీడీ రాజుకు అభినందనలు తెలిపారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 69వ ఎస్జీఎఫ్ఐ పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకం అందుకున్నాడు. అలాగే జిల్లా మైనారిటీ అధికారి విక్రంకుమార్, కళాశాల ప్రిన్సిపల్ అనిల్ బాబు అభినందించారు. -
మిగిలింది మూడు రోజులే!
జనగామ: జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ ఊహించని విధంగా మందగమనం దిశగా సాగుతోంది. టెండర్ దాఖలు గడువు ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నా, ఇప్పటివరకు జిల్లాలో టెండర్ల సంఖ్య నామమాత్రంగానే ఉంది. గత సీజన్న్లో సుమారు 2,500 వరకు టెండర్లు దాఖలైన చోట, ఈసారి 100 దాటలేని పరిస్థితి ఎకై ్సజ్ శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. టెండర్ ఫీజు పెంపు ప్రభావం టెండర్ ఫీజు రూ.3 లక్షలకు పెంచడం మద్యం వ్యాపారులకు పెద్ద అడ్డంకిగా మారింది. గతంలో ఫీజు తక్కువగా ఉండటంతో చిన్నస్థాయి వ్యాపారులు, స్థానిక పెట్టుబడిదారులు కూడా పోటీలో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు భారీ మొత్తంలో డిపాజిట్ పెట్టాల్సి రావడంతో చాలామంది వెనక్కి తగ్గారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిన నేపథ్యంలో లిక్కర్ వ్యాపారంలోనూ పెట్టుబడి పెట్టాలంటే ఆలోచిస్తున్నారు. తగ్గిన వైన్స్ అమ్మకాలు జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే, చాలా చోట్ల వైన్స్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలు, వ్యయ నియంత్రణ, ఆర్థిక మందగమనం వంటి అంశాలు అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితిలో కొత్త లైసెన్సుల కోసం ముందుకు వచ్చే వ్యాపారులు తగ్గిపోవడం సహజమేనంటూ విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. టెండర్దారులకు ఫోన్లు చేస్తున్న అధికారులు టెండర్లు దాఖలు చేయడం తగ్గిపోవడంతో ఎకై ్సజ్ శాఖ అధికారులు స్వయంగా పాత టెండర్దారులకు ఫోన్న్లు చేసి దరఖాస్తులు వేయమని అభ్యర్థిస్తున్నట్లు సమాచారం. జిల్లాస్థాయిలో కూడా శాఖ అధి కారులు మద్యం వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూ టెండర్లో పాల్గొనే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ వ్యాపారుల ఎంట్రీ ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది టెండర్ దారులు తెలంగాణ మార్కెట్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో లైసెన్సింగ్ విధానం కొంత సాఫీగా ఉండటం, కొన్ని పట్టణాల్లో వ్యాపార అవకాశాలు మెరు గ్గా కనిపించడం కారణంతో ఉత్సాహంగా ఉన్నట్లు ప్రచారం జరు గుతుంది. ఏపీలోని బడా వ్యాపారులు ఎంట్రీ అవుతున్నారనే ప్రచారం నేపథ్యంలో స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గత సీజన్ ఉత్సాహం కనిపించడం లేదు గత సీజన్లో మద్యం దుకాణాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో షాపునకు పదికిపైగా టెండర్లు వేశారు. కానీ ఈసారి ఆ ఉత్సాహం కనిపించడం లేదు. వడ్డీరేట్లు పెరగడం, అనేక చోట్ల లిక్కర్ విక్రయాలే తగ్గడం, రియల్ ఎస్టేట్ మందగమనం అనేక కారణాలతో టెండర్లపై ప్రభావం చూపిస్తోందని మాట్లాడుకోవడం గమనార్హం. మున్సిపాలిటీల్లో నిబంధనలు సడలింపు పురపాలిక(మున్సిపల్) పరిధిలో మద్యం దుకాణాలకు సంబంధించిన నిబంధనలకు ఎకై ్సజ్ శాఖ అధికారులు సడలించారు. మున్సిపల్ లిమి ట్స్లో వైన్స్ ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు. గతంలో వార్డు నెంబర్ల ఆధారంగా లక్కీ లాటరీలో వచ్చిన విధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు. నిబంధనల సడలింపు వ్యాపారులకు కొంత ఉపశమనం కలిగించే పరిణామం. ఇదిలా ఉండగా చలాన్లో సైతం జిల్లా పేరు తీసి వేయడంతో ఒక్క చలాన్తో రాష్ట్రంలో ఎక్కడైనా వేసుకునే అవకాశం కల్పించారు.జిల్లాలో 50 మద్యం దుకాణాలకుగాను టెండర్లను స్వీకరిస్తున్నారు. గతనెల 26వ తేదీన ఇందుకు సంబంధించిన నోటిఫికేసన్ విడుదల కాగా, ఈనెల 18వ తేదీతో గడువు ముగియనుంది. 2023–25 సంవత్సరంలో జిల్లాలో 2,492 దరఖాస్తులు రాగా, రూ.50కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఈసారి జరిగే 2025–27 రెండేళ్ల కాలపరిమితిలో టెండర్లలో 3వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎకై ్సజ్ శాఖ అంచనాలు వేసుకుంది. టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసి 20 రోజులు గడిచిపోతున్నా, జిల్లాలో కేవలం 83 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో జనగామ సర్కిల్లో 38, స్టేషన్ఘన్పూర్లో 27, పాలకుర్తిలో 18 మంది టెండర్లు దాఖలు చేశారు. పాలకుర్తి–5, జనగామ–10, స్టేషన్ ఘన్పూర్లో ని–8 దుకాణాలకు ఇంకా బోనీ కాలేదు. టెండరుదారులు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.మద్యం దుకాణాలకు మూడు రోజులు సమయమే ఉండడంతో చివరి నిమిషాల్లో భారీగా టెండర్లు వచ్చే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. చాలామంది వ్యాపారులకు చివరి రోజుల్లోనే టెండర్లు వేయడం ఆనవాయితీ. గతంలోనూ అలానే జరిగిందని జిల్లా ఎకై ్సజ్ అధికారులు అంటున్నారు. ప్రస్తుత టెండర్ల మందగమనం ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద సవాలుగా మారింది. మద్యం టెండర్లు ప్రభుత్వం ఆదాయానికి ముఖ్యమైన వనరు కావడంతో, చివరి మూడురోజుల్లో వ్యాపారులు ముందుకు రావాలని అధికారులు ఎదురుచూస్తున్నారు. సర్కిల్ దుకాణాలు టెండర్లు జనగామ 20 38 స్టే.ఘన్పూర్ 16 27 పాలకుర్తి 14 18 మొత్తం 50 83 ఇప్పటివరకూ నామమాత్రంగానే మద్యం టెండర్లు ఎకై ్సజ్ శాఖ అధికారుల్లో టెన్షన్ పాత వ్యాపారులు, ఉత్సాహవంతులకు ఫోన్లు -
ఆలయాల భూములను కాపాడాలి
–10లోuనర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మకు బుధవారం సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పీజీఆర్ గార్డెన్లో మాత యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా సీఎంతోపాటు మంత్రులు, ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముందుగా కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు చల్లి మాధవరెడ్డిని పరామర్శించారు. అంతకుముందు సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ జనగామ రూరల్: ఆలయాల భూములను కాపాడాలని భక్తులకు మెరుగైన సదుపాయాలను కల్పించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. బుధవారం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన ఆలయాలపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎండోమెంట్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావుతో కలిసి దేవస్థానాల చైర్మన్లు, ఈఓ, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో గల ఆరు దేవస్థానాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. జీడికల్ రామచంద్రస్వామి, చిల్పూర్ బుగులు వెంకటేశ్వరస్వామి, స్టేషన్ ఘన్పూర్ తిరుమలనాథస్వామి, నవాబ్పేట కోదండరామస్వామి, చిన్నపెండ్యాల లక్ష్మీనరసింహస్వామి, జఫర్గడ్ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను పర్యవేక్షించాలన్నారు. నవంబర్ 10వ తేదీన జరిగే జీడికల్ లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణాన్ని పురస్కరించుకొని తగు ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులు ఉండేందుకు మౌలిక సదుపాయాలు రూమ్ లను నిర్మించాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. దేవాలయాల భూములను త్వరగా సర్వే చేిసి ఎండోమెంట్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని హద్దులను ఏర్పాటు చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి.. జిల్లా కేంద్రంలోని గ్రీన్ మార్కెట్ లోపల పత్తి యార్డు కోసం నిర్మించిన స్థలంలో రెండు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందూనాయక్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. గతంలో మార్కెట్ యార్డు బయట ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం వల్ల రైతుల ధాన్యాన్ని పెద్దఎత్తున దొంగలు ఎత్తుకెళ్లడం జరిగిందన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
జీవాలకు టీకా రక్ష
జనగామ రూరల్: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం 6 నెలలకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో పశువైద్య బృందాలు ప్రతీ గ్రామాన్ని సందర్శించి, 3 నెలల వయస్సు దాటిన గేదె జాతి, గోజాతి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వనున్నారు. ఏటా చలికాలంలో పశువులకు వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈనేపథ్యంలో పశుసంవర్ధక శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, పశువులకు టీకాలు వేయించాలని అధికారులు సూచిస్తున్నారు. లక్షణాలు ఇవి..నివారణ ఇలా.. గాలికుంటు వ్యాధిలో గేదెలు, ఆవులకు వైరస్ సోకుతుంది. వ్యాధి సోకిన పశువులు బక్కచిక్కి అల్సర్ బారినపడతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదాలు, నాలుకతో పాటు కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. మేత, నీళ్లు సరిగా తీసుకోవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈనేపథ్యంలో వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించాలి. పుండ్లను పొటాషియం పర్మాం గనేట్ లేదా నార్మల్ సైలెన్ వాటర్తో శుభ్రంచేయాలి. రెండోసారి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు యాంటీబయాటిక్స్ మందులు, వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి బీ కాంప్లెక్స్ మందులు వాడాలి. అలాగే గాలికుంటు వ్యాధిపై నిర్లక్ష్యం వహించకుండా పశుసంవర్ధక శాఖ వైద్యుల మేరకు క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువులను ఇతర పశువులతో కలిసి ఒకేచోట ఉంచొద్దు. వారానికి ఒకసారి కొట్టంలో సున్నం చల్లి క్రిమికీటకాల నివారణకు చర్యలు చేపట్టాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాతే తాగాలి. ఒకవేళ పశువు చనిపోతే గోతిలో బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలని పశువైద్యులు సూచిస్తున్నారు. గ్రామాల్లో గాలికుంటు నివారణ టీకాలు నెలరోజులపాటు కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యుల సూచన జిల్లా వ్యాప్తంగా 1,45,000 పశువులుజిల్లాలో నాలుగు ఏరియా పశువైద్యశాలలు ఉండగా 23 ప్రాథమిక పశువైద్యశాలలు ఉన్నాయి. 20 సబ్సెంటర్లు ఉన్నాయి. ఆవులు 73,482, గేదెలు 75,029 ఉన్నాయి. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమతో ఆర్థికంగా బలపడుతున్న రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏటా రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని 36 మండల టీంలు, 100 మందికి పైగా సిబ్బంది ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నారు. గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు టీకాలు వేస్తారు. రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 14 వరకు అన్ని గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు వేస్తాం. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా పశువైద్య సిబ్బందికి సమాచారం అందించాలి. – ప్రాంతీయ పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు దేవేందర్ -
ప్రజాప్రభుత్వంలోనే రైతులకు మేలు
● ఏఎంసీలో ఐకేపీ సెంటర్లను ప్రారంభించిన చైర్మన్ శివరాజ్యాదవ్ జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో చీటకోడూరు, శామీర్పేట గ్రామాలకు చెందిన రెండు ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ప్రారంభించారు. ‘ఆరుగాలం వరద పాలు–భారీ వర్షంతో మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన మక్కలు, ధాన్యం’ శీర్షికన సాక్షిలో ప్ర చురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం యార్డులో సెంటర్లను ప్రారంభించిన అనంతరం శివరాజ్ మాట్లాడారు.. వ్యవసాయ మార్కెట్ యార్డులో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కోసం రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, ఏడీఈ అపర్ణ, ఏపీఎం శంకరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు నామాల శ్రీనివాస్, బొట్ల నర్సింగరావు, రమేశ్ యాదవ్, బండ కుమార్, రవీందర్, పర్ష సిద్దేశ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, రైతు నాయకులు చందూనాయక్ పాల్గొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
జనగామ: జిల్లాలో సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని రైతుల సాగుకు ఊతమిచ్చి పంటల ఉత్పత్తిని పెంచేందుకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. మంగళవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పలు సమస్యలపై వినతి చేశారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని తరిగొప్పుల మినీ లిఫ్ట్–1 పనులకు సంబంధించిన పైప్లైన్ పనులు పూర్తైనప్పటికీ, మరిన్ని చెరువులకు అనుసంధానం చేసే విధంగా పైపులైన్ల నిర్మాణం చేపట్టాలన్నారు. అంతే కాకుండా పంపుహౌస్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి రైతులకు సాగు నీటిని అందించాలని మంత్రిని కోరినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగలోపు పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. దేవాదుల 8వ ప్యాకేజీలో తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, చేర్యాల(మండల పరిధిలో కాలువలు), కన్నెబోయినగూడెం రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, జనగామ మండలాల్లో అసంపూర్తిగా ఉన్న కాల్వలను పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. జనగామ నియోజకవర్గంలో 12 చెరువులకు అత్యవసర మరమ్మతులు అవసరం పడ్డాయని, వాటి పునరుద్ధరణ పనులు సత్వరమే చేపట్టడానికి నిధులను విడుదల చేయాలని మంత్రిని కోరడం జరిగిందన్నారు. మల్లన్న సాగర్ నుంచి తపాస్పల్లి గ్రావిటీ కాలువ పనులను పునరుద్ధరించాలని వినతిలో పేర్కొన్నట్లు తెలిపారు. తమ వినతికి సంబంధించి అన్ని పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వాగులకు అడ్డంగా చెక్ డ్యాంలతో పాటు చీటకోడూరు రిజర్వాయర్ గేట్లు, పెంబర్తి పెద్ద చెరువు, ఎల్లంల ఏనె చెరువు శాశ్వత పునరుద్ధరణ, జనగామ మండలం పెద్దపహాడ్ పెరుమాండ్ల చెరువు, మరిగడి, తరిగొప్పుల మండలం చింతల చెరువు, అంకుశాపూర్, నాగుల చెరువు, కర్షక కుంట(నర్మెట), బయ్యన్న చెరువు (ఎమర్జెన్సీ రిపేర్) పునరుద్ధరణ పనులకు రూ.7.13 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదన కాపీలను ఎమ్మెల్యే మంత్రికి అందించారు. సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ను కోరిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జనగామ: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, బోధనా నాణ్యత, విద్యార్థులు నేర్చుకునే స్థాయిని అంచనా వేసేందుకు టీచర్లతో కూడిన కొత్త ప్యానెల్ తనిఖీ బృందాల ఏర్పాటుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు పంపించారు. బోధనా నాణ్య త, రికార్డులు, విద్యార్థుల ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. దీంతో సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాల అంచనా, బాధ్యతాయుత బోధనతో విద్య మరింత బలపడే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తనిఖీలు ఎలా.. జిల్లాలో ప్రతీ మూడు నెలలకోసారి 150 పాఠశాలలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇందులో 100 ప్రాథమిక, ప్రాథమికోన్నత, 50 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనిఖీల్లో బోధన, విద్యార్థుల హాజరు, మౌలిక సదుపాయాలు, విద్యా ఫలితాలు, శుభ్రత, పాఠశాల రికార్డులు, పాఠ్య ప్రణాళిక అమలు, డిజిటల్ క్లాస్ తరగతుల వినియోగం వంటి అంశాలు సమగ్రంగా పరిశీలించాలి. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో టీచర్లతో కూడిన కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రాథమిక పాఠశాలల్లో.. జిల్లాలో 343(పీఎస్), 64(ప్రాథమికోన్నత), 103 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమా రు 29, 500 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిధిలో ప్రధానోపాధ్యాయుడు(నోడల్ అధికారి), ఇద్దరు ఎస్జీటీలు సభ్యులుగా ఉంటారు. ప్రాథమికోన్నత బడుల్లో స్కూల్ అసిస్టెంట్(నోడల్ అధికారి), ప్రధానోపాధ్యాయుడు, ఒక ఎస్జీటీ సభ్యులుగా ఉంటారు. ఉన్నత పాఠశాలల్లో గెజిటెడ్ హెడ్మాస్టర్(నోడల్ అధికారి), ఏడుగురు సబ్జెక్టు టీచర్లు, ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సభ్యులుగా పర్యవేక్షణ చేయను న్నారు. తనిఖీ అధికారుల పర్యవేక్షణ కోసం షరతులు.. తనిఖీ బృందాల్లో పనిచేసే టీచర్ల అర్హతలపై కఠిన నియమావళి విధించారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే తనిఖీ అధికారులకు ఈ షరతులు తప్పనిసరి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కనీసం 10 ఏళ్ల బోధన అనుభవం కలిగి ఉండడంతో పాటు డిజిటల్ అక్షరాస్యత, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పక ఉండాలి. సదరు టీచర్లపై విధి నిర్వహణలో క్రమశిక్షణా చర్యలు లేని ఉత్తమ వ్యక్తిగా ఉండాలి. బోధనా నాణ్యతపై ఆసక్తి, మానవతా దృక్పథం కలిగి ఉండి, ఆయా శిక్షణా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఉండాలి. పాఠశాల తనిఖీ బృందాల ఎంపికను కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నేతృత్వంలో చేపడతారు. తనిఖీ బృందాలకు ఎంపికై న ఉపాధ్యాయులు పూర్తి సమయం పనిచేయాల్సి ఉంటుంది. కమిటీల ఏర్పాటుతో పాఠశాలల్లో బోధన తరగతులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి. విద్యా నాణ్యత పెంపునకు పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు తనిఖీ అధికారులుగా ఉపాధ్యాయులకే బాధ్యతలు అదనపు పనిభారం మోపడం సరికాదంటున్న ఉపాధ్యాయులు బోధనా సమయం తగ్గి విద్యార్థులకు నష్టమని అభ్యంతరం -
బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.24.30 కోట్లు
పాలకుర్తి టౌన్: పాలకుర్తి నియోజకవర్గంలోని గిరిజన తండాలు, గూడేలలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.24.30 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలిసి నియోజకవర్గ గిరిజన ప్రాంతాల అభివృద్ధి అంశాలపై ప్రతిపాదనలు అందజేశారు. బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.24.30 కోట్ల విలువైన ప్రభుత్వ జీఓ ఉత్తర్వులను మంత్రి లక్ష్మణ్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి అందజేశారు. గతంలో రూ.6కోట్లు కలిపి ఇప్పటివరకు రూ.30.30 కోట్ల నిధులను మంజూరు చేసినందుకు మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డికి మంజూరు జీఓ అందించిన మంత్రి అడ్లూరి -
వరంగల్కు నేడు సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంనుంచి డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ హెలిపాడ్కు బయలుదేరుతారు. 12.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.00 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్కు చేరుకుంటారు. అక్కడినుంచి 1.05 గంటలకు కాజీపేట ప్రశాంత్నగర్లోని పీజీఆర్ గార్డెన్స్కు చేరుకుంటారు. 1.15 – 1.45 గంటల వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించి ఆయన తల్లి ‘మాతృయజ్ఞం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు పీజీఆర్ గార్డెన్నుంచి బయలుదేరి 2.00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం తీసుకో వాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీపీవెంట జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, ఏసీపీలు పింగిళి ప్రశాంత్రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండకు 2 గంటలకు తిరుగు పయనం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించనున్న సీఎం -
డిజిటల్ లిటరసీతో బోధన సులువు
● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాజనగామ రూరల్: విద్యారంగాన్ని మరింత బలో పేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం అవసరమ ని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు డిజిట ల్ విద్యపై అవగాహన పొందాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న ఏకశిల బీఈడీ కళాశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో డిజిటల్ లిటరసీపై ఫిజిక్స్ ఉపాధ్యాయులకు మూడు రోజులపా టు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.. మారుతున్న సమాజా నికి అనుగుణంగా విద్యా బోధన కూడా మారా ల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ విద్యకు పాఠశాలల్లో కంప్యూటర్లు ఉన్నాయని, పాఠశాలల్లో ఏ ర్పాటు చేసిన ఐఎఫ్బీ డిజిటల్ ప్యానెల్స్ కూడా విని యోగించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఏఎమ్ఓ శ్రీనివాస్, మాస్టర్ ట్రైనీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనుల పరిశీలన మండలంలోని పెంబర్తి గ్రామం వద్ద రూ.5కోట్లతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో కలిసి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..నిర్మాణ పనులు వేగవంతంగా జరగాలని జాప్యం తగదన్నారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంజిత్ తదితరులు ఉన్నారు. -
పరిష్కారమేది?
వచ్చుడు.. ఇచ్చుడేజనగామ రూరల్: ఏళ్ల తరబడి సాగులో ఉండగా అక్రమంగా పట్టా చేసుకున్నారని, సదరం సర్టిఫికెట్ ఉన్న ఏళ్ల తరబడి పెన్షన్కు ఎదురుచూస్తున్నామని, సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు ఇప్పించాలని పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ 38 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ఈ సందర్భంగా పలువురు వాపోయారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ..గ్రీవెన్స్లో ఇచ్చిన దరఖాస్తులు అధికారులు పరిశీలించి పరిష్కరించాలని అదేశించారు. కార్యక్రమంలో జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీఓలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డీఆర్డీఓ వసంత, గృహనిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తులు ఇలా.. ● జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన ముక్క రాజయ్య తన తండ్రి పేరుతో ఉన్న భూమి సర్వే నెంబర్ 10/ 79 లోని 1.20 ఎకరం మల్ల భూమిని వారసత్వంగా పట్టా మార్పిడి చేసి ఇవ్వాలని కోరారు. ● బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన తాలిరెడ్డి మధుసూదన్రెడ్డి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 202లో పూర్వీకుల నుంచి సంక్రమించిన 1.10 ఎకరంలో భూమికి రైతుభరోసా అందుతోందని, తన భూమి లేదని, భూమికి హద్దులు చూపించి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ● లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన నడిగోటి సోమయ్యకు చెందిన సర్వే నెంబర్ 263 పట్టా భూమిలో 25 ఎకరాల భూమి ఉందని, 1938లో వర్షపు నీరు చెరువుకు వెళ్లేందుకు నీటిపారుదల శాఖ పంట కాల్వ నిర్మించింది. ప్రస్తుతం శివరాత్రి ఐలయ్య అనే వ్యక్తి దౌర్జన్యంగా కనీలు పాతి వర్షపు నీరు చెరువుకు వెళ్లకుండా అడ్డుకొని పంట కాల్వను పూడ్చి వేయడంతో తన భూమిలో నీరు నిలుస్తున్నదని అధికారులు తగు చర్య తీసుకోవాలని కలెక్టర్కు వినతి అందజేశారు. ● బచ్చన్నపేట మండలం కేసిరెడ్డి పల్లె గ్రామం 380 సర్వే నెంబర్లో తాతలు, తండ్రుల నాటి నుంచి వస్తున్న 8 ఎకరాల 18 గంటల భూమి నుండి తమకు ఎటువంటి సమాచారం లేకుండా, సంతకాలు లేకుండా గ్రామానికి చెందిన మరో వ్యక్తి పేరు మీదుగా ఒక ఎకరం రెండు గుంటల భూమిని మార్పిడి చేశారని ఇమ్మడి యాకంరెడ్డి వినతిపత్రం అందించారు. ఈ మార్పిడి ఎలా జరిగిందో అడిన సమాధానం చేప్పడం లేదని విచారణ జరిపించి సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ● స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో ఎక్కడ సీసీ రోడ్లు లేవని, అభివృద్దికి దూరంగా ఉందని కత్తు రాజు వినతిపత్రం అందించారు. ముఖ్యంగా ముక్తుంకుంట కట్ట కింద ఉన్న 500 మీటర్ల మట్టిదారి పూర్తిగా శిథిలావస్థలో ఉందని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ● జఫర్గఢ్ మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్సీగా విధులు నిర్వహిస్తున్నానని, కాగా గత మే నెలలతో ఆనారోగ్యంతో నెల రోజులు లీవులో ఉన్నానని, వేతనాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని ఎం. రాజమణి వాపోయింది. 5 నెలల నుంచి వేతనాల రాక కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నామని, తమకు వేతనాలు వచ్చేలా చూడాలని కలెక్టర్కు వినతి అందజేశారు. కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలి జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి పసరవడ్లలో 5 ఎకరాల స్థలం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర నాలుగు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయగా జిల్లాకు మాత్రం మంజూరు కాలేదు. జిల్లాలోని నిరుపేద విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి. విద్యాసంస్థలకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలి. –బిర్రు ఇస్తారి, వ్యవస్థాపక అధ్యక్షుడు, నాగరత్న సేవా సంఘం కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామంటూ దరఖాస్తుదారుల ఆవేదన ప్రజావాణిలో 38 దరఖాస్తులు స్వీకరణ విజ్ఞప్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
సీజేఐపై దాడికి యత్నించిన వ్యక్తిపై చర్య తీసుకోవాలి
● ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాజనగామ రూరల్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రముఖ న్యాయవాది సాదిక్ అలీ, రాగళ్ల శ్రీహరి, గద్దల కిషోర్, సందేన రవీందర్, జేరిపోతుల సుధాకర్, బొట్ల మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలలో మూడో బ్యాచ్ షురూ
జనగామ: జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మూడో బ్యాచ్ మొదటి సంవత్సరం తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి ఆధ్వర్యంలో హెచ్ఓడీల పర్యవేక్షణలో తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. 97 మంది విద్యార్థులు హాజరు.. మెడికల్ కళాశాలలో 100 సీట్లకు అనుమతి లభించగా, ప్రస్తుతం రాష్ట్ర, జాతీయ కోటాలో 97 మంది విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా చేరారు. ఇంకా 3 సీట్లు పెండింగ్లో ఉండగా, తదుపరి 3వ విడత కౌన్సెలింగ్లో ఆ స్థానాలు కూడా భర్తీ అయ్యే అవకాశముందని కళాశాల అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీహెచ్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, హెచ్ఓడీలు, డాక్టర్లు గోపాల్రావు, మధుసూన్రెడ్డి, అన్వర్, విశ్వనాథ్, శంకర్, పద్మిని, శకుంతల తదితరులు ఉన్నారు. -
కష్టపడిన వారికే ‘డీసీసీ’
జనగామ: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఐదేళ్లుగా కష్టపడి పనిచేసిన వారికే మాత్రమే డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులను స్వీకరించామని ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ అన్నా రు. టీపీసీసీ ఆదేశాల మేరకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చివరిరోజు సోమవారం జనగామ మండలం పసరమడ్ల శివారు ఉషోదయ కన్వెన్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభిప్రాయ సేకరణలో టీపీసీసీ పరిశీలకులు ఎండీ అవేజ్, అరుణ్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం దేబాసిస్ పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, పాలకుర్తి ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డితో పాటు మొత్తంగా 30 మందికి దరఖాస్తులు చేసుకున్నారన్నారు. స్టేషన్ఘన్పూర్ ఇన్చార్జ్ సింగపురం ఇందిర మాత్రం తనతో ఫోన్లో మాట్లాడడం జరిగిందన్నారు. డీసీసీ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరితో ముఖాముఖి మాట్లాడడంతో పాటు 1500 మందికి పైగా సూచనలు వినడం జరిగిందన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో దస్వీకరించిన దరఖాస్తుల్లో ఆరింటిని మాత్రమే ఏఐసీసీకి పంపిస్తామన్నారు. అధినేత రాహుల్గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సోని యాగాంధీ, సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ నేతృత్వంలో కొత్త డీసీసీని ఎన్నుకుంటారన్నారు. ప్రత్యేక సమావేశం డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న నాయకులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వ్యక్తిగత అభిప్రాయాలను సేకరించారు. జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణానికి అవసరమైన నాయకత్వ ఎంపికపై పరిశీలకులు సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో యువ నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, డీసీసీగా అప్లికేషన్ చేసుకున్న వారితో పాటు నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, కంచె రాములు, ఎర్రమల్ల సుధాకర్, డాక్టర్ రాజమౌళి, ఆలేటి సిద్దిరాములు, జమాల్ షరీఫ్, ఉడుత రవి, చింతకింది మల్లేశం, కరుణాకర్రెడ్డి, బడికె ఇందిర, వంగాల కళ్యాణి, చెంచారపు బుచ్చిరెడ్డి, పిన్నంటి నారాయణరెడ్డి, గుండ శ్రీధర్రెడ్డి తదితరులు ఉన్నారు. అధ్యక్ష పదవి కోసం 30మంది దరఖాస్తు దరఖాస్తు చేసుకున్నవారిలో కొమ్మూరి, ఝాన్సీరెడ్డి, ఇందిర ‘సంఘటన్ సృజన్ అభియాన్’లో ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ -
ఘనంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి చక్రతీర్థం
జఫర్గఢ్: మండల కేంద్రంలో పడమర కొండ దిగువన ఉన్న శ్రీలక్ష్మీనర్సింహ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా సోమవారం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి భక్తులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు వెంకటాచార్యులు, కృష్ణమాచార్యులు, శ్రీనివాసచార్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు. కాగా రాత్రి సమయంలో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించనున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు పర్యవేక్షించాలి ● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలుపై అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా చూడాలన్నారు. సమీక్షలో ఆర్డీఓలు గోపి రామ్, డీఎస్ వెంకన్న, డీఆర్డీఓ వసంత, అధికారులు పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన తప్పనిసరి.. కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్)పై అవగాహన తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె. మల్లికార్జున్రావు ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్స్తో అవగాహన నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..సీపీఆర్ పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. ఎలక్ట్రానిక్ కాంటాల పరిశీలన స్టేషన్ఘన్పూర్: ప్రస్తుత వానాకాలం సీజన్కుగానూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అందించనున్న ఎలక్ట్రానిక్ కాంటాలను స్థానిక వ్యవసాయ మార్కెట్లోని గోదాంలో జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి ఝాన్సీ సోమవారం తనిఖీ చేశారు. గోదాంలోని కాంటాలను ఒక్కొక్కటిగా 20 కిలోల బాటు తూకం వేసి చెక్ చేశారు. సరిగ్గా పనిచేయని వాటిని పక్కకు పెడుతూ సరిగ్గా ఉన్నవాటిని మార్కెట్ సిబ్బందిచే సీల్ చేయించారు. జర్నలిజంలో నూతన పాఠ్యప్రణాళికకు ఆమోదం కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్సైన్స్ కాలేజీలోని జర్నలిజం విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. గూగుల్మీట్లో ఆ విభాగాధిపతి డాక్టర్ ఆదిరెడ్డి అధ్యక్షతన వివిధ యూనివర్సిటీల నుంచి పలువురు ప్రొఫెసర్లు పాల్గొని మాట్లాడారు. ఈసమావేశంలో బీఏ జర్నలిజం మొదటి, ద్వితీయ సంవత్సరం సెమిస్టర్లకు సంబంధించి 2025–26 విద్యాసంవత్సరానికి పాఠ్యప్రణాళికను రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకత్వంలో సరికొత్త సిలబస్ రూపకల్పన చేసి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమకాలీన మీడియా ధోరణులు, కమ్యూనికేషన్ టెక్నాలజీలు, జర్నలిజం రంగంలో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుని సిలబస్ రూపొందించినట్లు జర్నలిజం విభాగాధిపతి ఆర్.ఆదిరెడ్డి తెలిపారు. ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతుల ఉత్తర్వులుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో 2010లో నియమితులైన 24మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కెరీర్ అడ్వాన్స్మెంటు స్కీం (క్యాస్ ) పదోన్నతుల (8000 యాన్యువల్ గ్రేడ్ పే) ఉత్తర్వులను సోమవారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం జారీచేశారు. త్వరలోనే వీరికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించనున్నారు. వీరు కొంతకాలం క్రితమే దరఖాస్తు కూడా చేశారు. -
మద్దతు ధరకే అమ్ముకోవాలి
● ధాన్యం పండించడంలో పంజాబ్ను మించుతున్న తెలంగాణ ● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బచ్చన్నపేట: వరి ధాన్యం పండించడంలో దేశంలో పంజాబ్ను తెలంగాణ మించుతోందని, ఆరుగాలాలు కష్టించి పనిచేసి పండించిన ధాన్యాన్ని అన్నదాతలు మద్దతు ధరకు అమ్ముకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలో ఐకేపీ, మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులను రాజు చేయడమే లక్ష్యంగా గత 9 సంవత్సరాలుగా కృషి చేస్తున్నామన్నారు. గత సంవత్సరంలో విక్రయించిన సన్న ధాన్యానికి ఇంకా బోనస్ డబ్బులను ఇవ్వలేదన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఎక్కువగా అన్నదాతలు దొడ్డురకం వడ్లనే పండిస్తారని, వాటికి కూడా బోనస్ను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, తహసీల్దార్ రామానుజాచారి, ఏపీఎం రవి, సీఈఓ కాశ బాలస్వామి, నాయకులు పూర్ణచందర్, కొండి వెంకట్రెడ్డి, గంగం సతీష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీహబ్ ప్రతినిధులతో జూమ్ మీటింగ్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ నుంచి వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం హైదరాబాద్లోని టీ హాబ్ ప్రతినిధులతో జూమ్మీటింగ్ నిర్వహించారు. టీహబ్, కెహబ్ ఎంఓయూలో భాగంగా పొందుపర్చాల్సిన అంశాలు, ఇరు పక్షాల బాధ్యతలు, విద్యార్థులకు అందించాల్సిన నైపుణ్యాల శిక్షణలు, వాటిలో భాగస్వాములు, వారి బాధ్యతలపై చర్చించారు. -
ఆరుగాలం..వరదపాలు
మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2025జనగామ: ఊహించకుండా వచ్చిన భారీ వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కల్లాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వేలాది ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. వరద నీరు మార్కెట్ ప్రాంగణంలోకి చేరి ధాన్యం చుట్టూ చేరడంతో పదుల సంఖ్యలో బస్తాలు కొట్టుకుపోయాయి. పైనుంచి వచ్చిన ప్రవాహం పెరగడంతో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి. ప్రభుత్వ ఐకేపీ సెంటర్లను ప్రారంభించడంలో జాప్యం చేయడంతో రైతులకు భారీగా నష్టం తప్పలేదు. మద్దతు ధర కోసం ఆశపడి నిరీక్షిస్తే మొదటికే మోసం వచ్చేలా చేసింది. ఆగమాగం.. జిల్లాలో సోమవారం తెల్లవారుజాము కురిసిన భారీ వర్షం రైతులను కోలుకోలేకుండా చేసింది. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ధాన్యం, మక్కలతో కాటన్ యార్డుతో పాటు కల్లాలు, కవర్ షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రైవేటు కొనుగోళ్లు యథావిధిగా జరుగుతుండగా, ప్రభుత్వ సెంటర్ల ప్రారంభోత్సవంలో జాప్యం జరుగుతోంది. రైతులు తమ పంట ఉత్పత్తులకు మద్దతు ధర కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. సెంటర్లను ప్రారంభించడంలో జాప్యం చేయడంతో పాటు రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వడంలో మా ర్కెట్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో తెల్లవారుజాము ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో కాటన్ యార్డులో ఉన్న ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. వరదకు పదుల సంఖ్యలో బస్తాలు కొట్టుకుపోగా, వేలాది బస్తాలు తడిసిపోయాయి. మార్కెట్ నుంచి ఇచ్చిన టార్పాలిన్ కవర్లన్నీ చిరిగిపోయి ఉండడంతో రైతులు స్వయంగా ఇంటి నుంచి తెచ్చుకున్న కవర్లను కప్పి కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ధాన్యం రాశుల చుట్టూ వరద నీరు చేరడంతో.. నీటిని మళ్లించేందుకు రైతులు గంటల తరబడి కష్టపడ్డారు. పెద్దఎత్తున ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నష్టం అంచనా వేయాలి.. మార్కెట్ కాటన్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యానికి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 30 బస్తాలకుపైగా కొట్టుకుపోగా, 2 వేల బస్తాలకు పైగా తడిసిపోయాయి. దీంతో నష్టం అంచనా వేయాల్సి ఉంది. నీటిలో తేలియాడే పంటతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తడిసిన సరుకును ఆరబెట్టినా మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అధికారులు దీనిని సీరియస్గా తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. పంట రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు. భారీ వర్షంతో మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యం, మక్కలు తడిసిన ముద్దయిన వేలాది బస్తాల ధాన్యం వరదలోనే ధాన్యం రాశులు కన్నీరు మున్నీరవుతున్న రైతులు కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యమే కారణమంటూ ఆవేదనవందల బస్తాలు తడిచాయి.. ఆరు రోజుల క్రితం మద్దతు ధరకు అమ్ముకునేందుకు 500 బస్తాల ధాన్యంతో మార్కెట్ కాటన్ యార్డుకు వచ్చాము. 10 బస్తాల ధాన్యం కొట్టుకుపోగా, 400బ్యాగులకు పైగా తడిసిపోయాయి. టార్పాలిన్ ఇంటి నుంచే తెచ్చుకున్నాం. మార్కెట్ సిబ్బంది ఇచ్చిన కవర్లు పనికి రావు. మళ్లీ ఆరబోసుకుంటున్నాం. – గాజుల కట్టయ్య, రైతు, చౌడారంఆరేడు బస్తాలు కొట్టుకుపోయాయి.. ప్రభుత్వ సెంటర్ ప్రారంభిస్తారని చెబితే, 300 బస్తాల ధాన్యం తీసుకుని మార్కెట్ కాటన్ యార్డుకు ఐదు రోజుల క్రితమే వచ్చాము. నేటికీ సెంటర్ ప్రారంభం కాలేదు. అకాల వర్షంతో 60 బస్తాలకు పైగా తడిసిపోగా, ఆరేడు బస్తాలు కొట్టుకుపోయాయి. –కూరాకుల శోభ, మహిళా రైతు, మరిగడిప్రభుత్వం ఆదుకోవాలి..400 బస్తాల ధాన్యం మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చా.. ఇందులో 300 బస్తాల వరకు తడిసిపోగా, 10 బస్తాల వరకు కొట్టుకుపోయాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందించి మమ్మల్ని ఆదుకోవాలి. –చెరుకూరి రాములు, రైతు, చౌడారం -
కొనుగోళ్లకు సిద్ధం
జనగామ రూరల్: వానాకాలం సీజన్కు సంబంధించి వరికోతలు ప్రారంభమయ్యాయి. ముందస్తు సాగు చేసిన వారు వారం నుంచే కోతలు ప్రారంభించారు. ఈనేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. జిల్లా వ్యాప్తంగా 309 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. కాగా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాల మేరకు జనగామ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా ఈనెల 13 (సోమవారం) నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 2,13,978 ఎకరాల్లో వరి పంట సాగుకాగా.. 5,43,057 టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేస్తున్నారు. 2,05,057 టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సన్న రకానికి మద్దతు ధర రూ.2,389లు, బోనస్గా క్వింటాల్కు రూ.500, అలాగే దొడ్డు రకానికి రూ.2,369 మద్దతు ధర లభించనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని పంట కొనుగోలుకు సంబంధించి డీఆర్డీఓ, డీసీఓ డీపీఎం, డీటీలు, జిల్లా, మండల, గ్రామ స్థాయి సెర్ప్ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులతో ఇప్పటికే కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కొనుగోలు చేసిన ధాన్యంపై వచ్చే కమీషన్ నుంచి రైతులు తాగడానికి మంచినీరు, టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలి. అలాగే ప్యాడీ సెంటర్లను శుభ్రంగా ఉండాలి. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ప్రతీరోజు ట్యాబ్ ఎంట్రీ చేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించేలా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు అవసరాలకు అనుగుణంగా లారీలు, హమాలీలను సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గత రెండు సీజన్లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఈసారి కూడా పక్కా ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను అదేశించారు. వానాకాలం పంట కొనుగోలుపై ఆర్డీఓ, సివిల్ సప్ప్లై, డీఆర్డీఓ, మార్కెటింగ్, మార్క్ఫెడ్, జిల్లా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్టీఓ, గన్నీ గోదాం ఇన్చార్జ్లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్లు అందరూ సమన్వయంతో పనిచేస్తే కొనుగోళ్లు సజావుగా సాగుతాయి. ప్రతి కేంద్రంలో కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీన ర్లు, వేయింగ్ యంత్రాలు, టార్ఫాలిన్ మొదలగు వసతులు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 309 కేంద్రాల ఏర్పాటు సన్నరకం, దొడ్డు రకం వేర్వేరుగా కొనుగోలు ఇప్పటికే జిల్లాలో ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించేలా ప్రణాళికజిల్లాలో ఏర్పాటు చేస్తున్న 309 కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలకే పెద్దపీట వేశారు. ఐకేపీ, పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. కేంద్రాల్లో ఎప్పటికప్పు డు ధాన్యం సేకరణ వివరాలను వ్యవసాయశాఖ సేకరించాలి. ధాన్యం పూర్తి వివరాలు ప్రతీరోజు నమోదు చేయాలి. కొనుగోలు రవాణా, డ్రై మిషన్, ప్యాడీ క్లీనర్స్, వేయింగ్ మిషన్లు, తేమ శాతం, ఆటోమెటిక్ జాలి మిషన్లు, ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు వచ్చాయి. సివిల్ సప్లై శాఖ ద్వారా కేంద్రాల్లో గన్నీసంచులు సిద్ధం చేసుకుంటున్నారు.దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు –198 ఐకేపీ – 116 పీఏసీఎస్లు – 82 సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలు – 101 ఐకేపీ – 69 పీఏసీఎస్లు – 42 మొత్తం కేంద్రాలు – 309జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా 309 సెంటర్లను ఎంపిక చేశాం. కేంద్రాల వద్ద టోల్ ఫ్రీ నెంబర్ను ప్రదర్శిస్తాం. అవసరమైన మేర గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి. తేమ శాతం చూసుకొని నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. – అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ -
కార్యకర్తల అభిప్రాయంతోనే డీసీసీ ఎన్నిక
పాలకుర్తి టౌన్: కార్యకర్తల అభిప్రాయ సేకరణతోనే డీసీసీ ఎన్నిక ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ అన్నారు. డీసీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమం పేరిట ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, ఎండీ అఫిజ్, శ్రీకాంత్యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో స్థానిక నాయకులతోనే నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులో ఉన్న నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మురి ప్రతాప్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు లకావత్ లక్ష్మీనారాయణనాయక్, కొమ్మురి ప్రశాంత్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, ఎర్రబెల్లి రాఘవరావు, గంగు కృష్ణమూర్తి, కుమారస్వామి, శ్రీరాములు నాయకుల పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఝాన్సీరెడ్డి దరఖాస్తు జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి దరఖాస్తును నియోజకవర్గ నాయకులు ఏఐసీసీ అబ్జర్వర్ పట్నాయక్, టీపీసీసీ పరిశీలకులకు అందజేశారు. ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ -
బీసీలకు 42 శాతం
రిజర్వేషన్ల పేటెంట్ సీఎందేస్టేషన్ఘన్పూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పక అమలుచేయాల్సిన పరిస్థితి త్వరలోనే వస్తుందని, ఎప్పటికై నా బీసీ రిజర్వేషన్ల పేటెంట్ సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం నియోజకవర్గస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి అతిధులుగా హాజరైన ఏఐసీసీ పరిశీలకులు దేబాసిస్ పట్నాయక్, టీపీసీసీ పరిశీలకులు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, ఎండీ అఫిజ్, శ్రీకాంత్యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి ముందుగా మీడియా సమావేశంలో కడియం మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి సీఎం రేవంత్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నాయన్నారు. ఆసక్తి ఉన్నవారు నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చు: ఏఐసీసీ పరిశీలకుడు పట్నాయక్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం అర్హత, ఆసక్తి ఉన్నవారందరూ నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసీసీ పరిశీలకులు దేబాసిస్ పట్నాయక్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీశ్రెడ్డి, శివరాజ్యాదవ్, నాయకులు బెలిదె వెంకన్న, బేతి జయపాల్రెడ్డి, కనకం గణేశ్, అంబటి కిషన్రాజ్, నాగరబోయిన శ్రీరాములు, రజాక్యాదవ్, కొలిపాక సతీశ్తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
రైతు కుటుంబానికి న్యాయం చేయాలి
స్టేషన్ఘన్పూర్: మండలంలోని పాంనూర్ గ్రామంలో వ్యవసాయ భూమి వద్ద విద్యుదాఘాతంతో శనివారం మృతిచెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు, బంధువులు ఆదివారం ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన, జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. పాంనూర్ గ్రామానికి చెందిన కోట వాసు అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం శనివారం తన వ్యవసాయభూమి వద్దకు వెళ్లి పొలంలో తెగి పడి ఉన్న విద్యుత్ ఎల్టీ లైన్ తీగతో విద్యుదాఘాతంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే వాసు మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుడి భార్య, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం స్టేషన్ఘన్పూర్ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం సబ్స్టేషన్ ఎదుట ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రైతు కుటుంబానికి న్యాయం చేయాలని, విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినదించారు. దాదాపు మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైతు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా సంబంధిత అధికారులు రాకపోవడం గమనార్హం. కాగా విషయం తెలుసుకున్న ఏసీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు, ఎస్ఐలు వినయ్కుమార్, రాజేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబీకులకు, గ్రామస్తులకు నచ్చజెప్పారు. వారు ససేమిరా వినకపోవడంతో విద్యుత్శాఖ అధికారులతో ఫోన్తో మాట్లాడించారు. మృతిచెందిన రైతు కుటుంబానికి విద్యుత్శాఖ నుంచి న్యాయం చేస్తామని, ఏమైనా ఉంటే వారిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సర్దిచెప్పడంతో ఎట్టకేలకు రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబ సభ్యులు, పాంనూర్ గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతు వాసు మృతిచెందాడని ఆరోపించారు. గతంలో పలుమార్లు విద్యుత్ తీగల సమస్యపై ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడుతున్న ఏసీపీ భీమ్శర్మ జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతు బంధువులు, గ్రామస్తులు స్టేషన్ ఘన్పూర్లో కుటుంబసభ్యులు, గ్రామస్తుల రాస్తారోకో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే చనిపోయాడని ఆరోపిస్తూ ఆందోళన -
కారాఘోరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది.● జనగామ సబ్జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు సబ్జైలులో సహజ మరణాలకు అనా రోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబు తున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పోలీసు కస్టడీలో గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్జైలు ఖైదీ ఆత్మహత్య -
కల్యాణం..కమనీయం
కనులపండువగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి వివాహా మహోత్సవం ● వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు ● సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపుజఫర్గఢ్ : మండల కేంద్రంలో శ్రీవేల్పుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణమహోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలుత వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ కల్యాణమహోత్సవాన్ని భక్తులు కనులార తిలకించి భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. ఈ వేడుకలను తిలకించిన అనంతరం భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి మొక్కులను సమర్పించారు. ఈసందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం సమయంలో గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. మంగళవాయిద్యాలు, ఆటపాటలు, మహిళల కోలాటాల నృత్యాల మధ్య పలు పురవీధుల గుండా స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు వెంకటాచా ర్యులు, శ్రీనివాసచార్యులు, కృష్ణమాచార్యులతో పాటు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా చివరి రోజు శాంతిహోమం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. -
‘ధన్ ధాన్య కృషి యోజన’తో ఒరిగేదేమి లేదు
జనగామ రూరల్: పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకంతో రైతులకు ఒరిగేదేమిలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం పీఎం చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పథకం ప్రారంభం కాగా ఎమ్మెల్యే వీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ రెండు పథకాలతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. కొత్తగా ఏ పథకం తీసుకురాకుండా ఇప్పటికే ఉన్న పథకాల నిధులను కలిపి చూపిస్తున్నారని విమర్శించారు. కిసాన్ యోజన పేరుతో ఇప్పటివరకు రూ. 3 లక్షల కోట్లను ఇచ్చామని కేంద్రం చెబుతున్నా.. వాస్తవంగా రైతుల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. 72 లక్షల మంది రైతులకు రూ.72 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
అంబరాన్నంటిన జిల్లా ఆవిర్భావ వేడుకలు
జనగామ: జిల్లా ఆవిర్భవించి 10 ఏళ్ల వసంతంలోకి అడుగిడుతున్న వేళ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో సోషల్ వాయిస్ ఫౌండేషన్ ప్రతినిధి మంగళ్లపల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఆవిర్భావ దినో త్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజ య్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పసునూరి రవీందర్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అంతకు ముందు ఆర్టీసీ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసి, ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాజ య్య మాట్లాడుతూ జిల్లా కోసం ఘన్పూర్ ప్రజలు గొప్ప పోరాటం చేశారన్నారు. ఉద్యమకారులు డాక్టర్ రాజమౌళి, మేడ శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్, రెడ్డి రత్నాకర్రెడ్డి, జి.కృష్ణ, పెట్లోజు సో మేశ్వర్, పిట్టల సురేష్, మాజీద్, ఆలేటి సిద్ధిరాములు తదితరులను సత్కరించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ సమాజ మనుగడ సంస్కృతికి మూలాధారమన్నారు. జనగామ కవులు రచించిన వంద కవితల సాగుబాటు కవిత్వ సంకలనం ఆవి ష్కరించారు. రచయితలు, కవులు కళాకారులను సత్కరించి, జ్ఞాపికలను అందించారు. జరసం అధ్యక్షుడు నక్క సురేష్, మనోజ్ కుమార్ ఉన్నారు. -
అభివృద్ధి జాడేది?
నిధులు రావు.. అప్పులు పుట్టవుజనగామ: గ్రామపంచాయతీలకు రెండేళ్లుగా నిధులు లేక జేబు ఖర్చుతో నడిపించే దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో గ్రామీణ పరిపాలన క్రమక్రమంగా చతికిల బడిపోతుంది. జీపీ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో పల్లెల్లో అభివృద్ధి పనుల జాడ లేకుండా పోయింది. 2024 ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగియడంతో అన్ని పంచాయతీలు స్పెషల్ పాలన కిందకు వెళ్లాయి. ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవడం, ఆ తర్వాత హైకోర్టు స్టే రావడంతో గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు లేకుండా పంచాయతీల పాలనకు స్పీడ్ బ్రేకర్లు పడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, కనీస మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నుంచి వచ్చే 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే ఎస్ఎఫ్సీ (స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్) బడ్జెట్ పంచాయతీలకు ప్రాణాధారం లాంటివి. జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నెలనెల రూ.65 కోట్లు, ఎస్ఎఫ్సీ ద్వారా ప్రతీ సంవత్సరం రూ.8 కోట్లు రావాల్సి ఉంది. ఇలా రెండేళ్ల కాలానికి రూ.810 కోట్ల మేర నిధులకు గ్రహణం పట్టింది. రెండేళ్లుగా పాలక మండలి లేకపోవడంతో ఈ రెండు వనరులు ఆగిపోయాయి. దీంతో పంచాయతీల పని తీరు పూర్తిగా క్షీణించింది. నిధుల లేమితో మౌలిక వసతుల పనులు ఆగిపోగా, శానిటేషన్, వీధి లైట్లు, నీటి సరఫరా వంటి ప్రాథమిక సేవలు సైతం కష్టసాధ్యమయ్యాయి. జిల్లాలోనే సుమారు 280 గ్రామపంచాయతీలు, 2,534 వార్డులు, సుమారు 5.40 లక్షల జనాభా ఉన్నారు. ఒక మేజర్ పంచాయతీ పరిధిలో రోజు వారీగా కనీసం రూ.3 వేలు, మైనర్ పంచాయతీలకు రూ.15వందల వరకు ఖర్చు అవుతోంది. కానీ ప్రస్తుతం పంచాయతీ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా మిగిలి ఉండకపోవడంతో నల్లా పన్నులతో పాటు కార్యదర్శులు అప్పులు చేసి తమ సొంత ఖర్చుతో వ్యవహారాలు నెట్టుకువస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా నిధులు రాలేదు, చెత్త సేకరణకు వాహనం డీజిల్ ఖర్చు చేయాలంటే కూడా జేబులోంచి ఖర్చు చేస్తున్నాం, బిల్లులు రాయించుకున్నా చెల్లింపులు లేవు. సర్పంచ్ లేకపోవడంతో నిర్ణయాలు కూడా ఆలస్యం అవుతున్నాయంటూ ఓ పంచాయతీ సెక్రటరీ ఆవేదనకు గురయ్యారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే కారణంగా కొత్త ప్రజాప్రతినిధులు రావడం మరికొంత ఆలస్యం కానుంది. ఈ పరిస్థితుల్లో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిధుల లేమితో శానిటేషన్ అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రజాప్రతినిధులు లేని పాలనతో గ్రామీణ అభివృద్ధి కేవలం పేపర్పైనే మిగిలిపోయిందనే అభిప్రాయాలను మెజార్టీ ప్రజలు భావిస్తున్నారు. సర్పంచ్లు లేని పాలనలో సేవలకు ఆటంకం జీపీలకు నిధులు రాక రెండేళ్లు జిల్లాకు రూ.810 కోట్ల మేర పెండింగ్ జీపీలు వార్డులు జనాభా (సుమారు) 280 2,534 5.40లక్షలు -
రోజు వారీ నిర్వహణ ఎలా?
గ్రామాల్లో ప్రజాప్రతినిధి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి న ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి జరగడం లేదు. పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేస్తూ అత్యవసర పనులు చేయిస్తున్నారు. సర్కారు నుంచి రూపాయి రావడం లేదు. కనీసం చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లలో డీజిల్ పోసేందుకు కూడా జీపీల్లో డబ్బులు లేవు. – లకావత్ చిరంజీవి, స్టేషన్ఘన్పూర్●నారాయణపురం పంచాయతీకి రెండేళ్లుగా నిధులు రావడం లేదు. ఊరిలో కనీస వసతి సౌకర్యాలకు ఇప్పటి వరకు వీధిలైట్ల నిర్వహణ, డీజిల్, తాగునీటి పైపుల మరమ్మతు, బోరు మోటార్ల రిపేరు తదితర వాటి కోసం రూ.1.50 లక్షల వరకు సొంతంగా ఖర్చు చేశా. – దేవి ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, బచ్చన్నపేట


