breaking news
Jangaon
-
పంట మార్పిడిపై దృష్టి పెట్టాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నర్మెట: రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని, రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళాను ప్రారంభించిన ఆయన మాట్లాడారు.. వరి సన్నరకంతో పాటు పప్పు దినుసులు, చిరుధాన్యాలు, జొన్న పంటలను సాగు చేయాలని, కూరగాయలు, పండ్లతోటలతో అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే డీలర్లు విక్రయించాలని, పంటలు చేతికి వచ్చేవరకు విత్తన రశీదులను రైతులు భద్రపరచుకోవాలని తెలిపారు. నర్మెట వారాంతపు సంతలో వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డును మంజూరు చేయాలని సర్పంచ్ గోపగోని శ్రీధర్ గౌడ్ కలెక్టర్ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట డీఏఓ అంబికా సోని, ఏడీఏ వసంత సుగుణ, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్, ఎంపీఓ ఉప్పుగళ్ల సంపత్ కుమార్, ఏఓ పి.మురళి బాబు, హెచ్ఓ కె.సందీప్, ఎఫ్ఓ దివ్య, ఏపీఓ రమాదేవి, ఏఈఓలు జగదీష్, అనిత, కన్నయ్య, సర్పంచ్లు, డీలర్లు, రైతులు ఉన్నారు. -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
జనగామ రూరల్: పట్టణంలోని హైదరాబాద్ మెయిన్ రోడ్డు నుంచి వెళ్లే వరద నీటి డ్రెయినేజీ పనులను మంగళవారం మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలోని ఎగువ ప్రాంతాలైన బాణాపురం, రంగప్ప చెరువు, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా, కురుమవాడ, రైల్వేస్టేషన్ ప్రాంతాల నుంచి వర్షాలు పడినప్పుడు వచ్చే వరద నీరు వల్ల హైదరాబాద్ మెయిన్ రోడ్ బాలాజీ నగర్, జ్యోతినగర్ వరదలో ముంపునకు గురి అవుతున్న పరిస్థితి ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. రూ.9.10 కోట్లతో నిర్మించనున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు ప్రారంభమైయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బూడిది జ్యోతి, మంత్రి సుమలత, పానుగంటి సువార్త, మున్సిపల్ ఏఈ అనిల్, సంబంధిత వర్క్ కాంట్రాక్టర్ దోర్నాల శశికాంత్ పాల్గొన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలి స్టేషన్ఘన్పూర్: రోగులకు మెరుగైన సేవలు అందించేలా వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి డాక్టర్ మల్లికార్జున్రావు సూచించారు. మండలంలోని ఇప్పగూడెం పీహెచ్సీని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను, ల్యాబ్ను తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందికి చెందిన రిజిష్టర్లను పరిశీలించారు. ప్రతీ రోజూ ఓపీ ఎంత ఉంటుందని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్సీలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యురాలు సాయిప్రణీత, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అశోక్, డాక్టర్ కమల్హాసన్, పీహెచ్ఎన్ రమణ, సూపర్వైజర్ సత్యం, ఎంఎల్హెచ్పీలు రమ్యకృష్ణ, రాజేశ్వరి, స్టాఫ్నర్సు లావణ్య, ఏఎన్ఎం రాజ్యలక్ష్మీ, ల్యాబ్ టెక్నీషియన్ సునీల్కుమార్ పాల్గొన్నారు. సమయపాలన పాటించండి ● డిప్యూటీ డీఎంహెచ్ఓ వాణిశ్రీ నర్మెట: సమయ పాలన పాటించి మెరుగైన వైద్యసేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ, పీఓ ఎంసీహెచ్ డాక్టర్ వాణిశ్రీ (స్టే.ఘన్పూర్ డివిజన్) సిబ్బందికి సూచించారు. స్థానిక పీహెచ్సీని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసిన ఆమె రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, మాతా శిశు సంరక్షణపై దృష్టి సారించాలని, గర్భిణులు, బాలింతల వివరాలను వంద శాతం నమోదు చేయాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విధిగా నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట వైద్యాఽధికారులు ఎట్టిరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, ముక్కా సుకన్య, మోహి సిద్దిఖి తదితరులు ఉన్నారు. రేపు తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సదస్సు కేయూ క్యాంపస్: తెలంగాణ కామర్స్ అసోసియేషన్ 7వ వార్షిక సదస్సును ఈనెల 25న కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహించనున్నారు. వర్సిటీ కాలేజీ ఆఫ్ కామర్స్, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్భారత్–47 న్యూ డైమన్షన్స్ ఇన్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ది ఎరా ఆఫ్ యాక్ట్’ అంశంపై ఈసదస్సును నిర్వహించనున్నారు. సదస్సులో కృత్రిమ మేధ ప్రభావం, వ్యాపార విశ్లేషణ, ఆర్థిక రంగం, ఫిన్టిక్ స్టార్టప్లు, మార్కెటింగ్పై చర్చలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, విశిష్ట అతిథిగా కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ప్రొఫెసర్ హెచ్.వీ స్మారకోపన్యాసం ఉంటుందని కన్వీనర్ ఫణీంద్రకుమార్, కోకన్వీనర్ బి.ప్రగతి తెలిపారు. ముగింపు సభకు రిజిస్ట్రార్ రామచంద్రం, ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఘనశ్యామ్ సోలంకి హాజరవుతారన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
● విద్యార్థులకు డీసీపీ రాజమహేంద్రనాయక్ స్టేషన్ఘన్పూర్: విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత, ఆటోడ్రైవర్లకు ‘యాంటీ డ్రగ్స్ అవేర్నెస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ జి.వేణు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడారు.. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ప్రతీ రోజూ యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారన్నారు. డ్రగ్స్కు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే 1908 టోల్ఫ్రీ నంబర్లో సమాచారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, వాలీబాల్, షటిల్, చెస్, క్యారమ్బోర్డు తదితర పోటీల్లో విజేతలకు డీసీపీ చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఏసీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు, ఎస్ఐలు రాజేష్, మనీషా, హెచ్ఎం సంపత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
జనగామ: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలోని జనగామ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ డీఈ సారయ్య, టెక్నికల్ అండ్ కన్స్ట్రక్షన్ డీఈ విజయ్, ఎస్ఏఓ శంకర్తో పాటు ఏడీఈలు, ఏఈలతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ అవసరాల దృష్ట్యా పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి, కొత్త విద్యుత్ సర్వీసులను ఆలస్యం లేకుండా విడుదల చేయాలని సూచించారు. వర్షాకాలంలో ట్రాన్స్ఫార్మర్లు తరచుగా దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఫెయిల్ అయిన వాటిని వెంటనే మార్చాలన్నారు. జిల్లాకు అవసరమైనన్ని ట్రాన్స్ఫార్మర్లు ముందుగానే స్టాక్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫీల్డ్ స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులకు విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోరాదని హెచ్చరించారు. ఎల్సీలు అడగొద్దని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ ఎల్సీలు కోరితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు సూచనలు విద్యుత్ సిబ్బందిని ఎల్సీలు అడగవద్దని కోరుతూ, విద్యుత్ తీగలు తెగిపోయి నేలపై పడిన సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ముట్టుకోరాదని, దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ విద్యుత్కు సంబంధించిన పనులను రైతులు స్వయంగా చేయకుండా, విద్యుత్ శాఖ సిబ్బందికే సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి అత్యవసర సేవలకు 1912కు సమాచారం ఇవ్వండి సమీక్షలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి -
మైనర్లకు వాహనం ఇవ్వొద్దు
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: వాహనదారులు మైనర్లకు వాహనం ఇచ్చి రోడ్డు ప్రమాదాలకు కారణమై చట్టపరమైన చిక్కుల్లో పడొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ పోలీస్ అధికారి నిరంతరం కృషి చేయడంతోపాటు, ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనదారులకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో అధికంగా మైనర్ వాహనదారులు ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్ధులతో పాటు, ఓ బాలుడు మరణించగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం మైనర్ అతి వేగంగా వాహనం నడపడమేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ముఖ్యంగా మైనర్లకు వాహనం అందజేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇలాంటి ఘటనల్లో వాహన యజమాని, మైనర్ తల్లిదండ్రులు బాధ్యులుగా చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జైలుకు తరలిస్తామని సీపీ హెచ్చరించారు. -
సూచించిన పంటలే వేయాలి
● విత్తన మేళాలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గి దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. అధికారులు సూచించిన పంటలు, వరి రకాలనే వేయాలని సూచించారు. మంగళవారం రైతు వేదికలో నిర్వహించిన విత్తనమేళా కార్యక్రమంలో ఏడు రకాల వరి విత్తనాలు, కూరగాయలు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూరగాయలు, వరి పంటలతో రైతులు దిగుబడి పెంచాలన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ, ఎంపీడీఓ వేదవతి, సర్పంచ్ విజయ, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, మల్లారెడ్డి, పులి గణేష్, ఏఓ టెక్నికల్ నిర్మల్, ఏఓ విద్యాధర్, హార్టికల్చర్ అధికారి సంతోషిణి రాణి, క్లస్టర్ అధికారి లాలు పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి కృషి పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని తెలంగాణ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో స్టోర్ రూం, భోజనశాల, వంట గది, తరగతి గదులను పరిశీలించారు. -
నార్కోటిక్స్ విస్తృత తనిఖీలు
జనగామ రూరల్: పట్టణంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా మంగళవారం ఎస్ఐలు భరత్, రతీష్, చెన్నకేశవులు, నర్సయ్య, పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం సీఐ ఆకస్మిక నార్కోటిక్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ బస్టాండ్తో పాటు పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, అనుమానిత వ్యక్తులను డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే సమాచారం అందించి సహకరించాలని కోరారు. -
కార్పొరేట్ హంగులు..డిజిటల్ పాఠాలు
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు–మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోంది. దీంతో సర్కారు బడుల్లో ప్రైవేట్, కార్పొరేట్కు దీటుగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. వేసవి సెలవుల అనంతరం ప్రారంభమైన నేపథ్యంలో స్కూళ్లలో వసతులు, బోధనా పద్ధతులు, ఫలితాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అడ్మిషన్లు పెంచే దిశగా ఉపాధ్యాయులు బడిబాట నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారు. జిల్లాలో 508 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో ప్రాథమిక 341, ప్రాథమికోన్నత 64, ఉన్నత 103, కేజీబీవీలు 12, మోడల్ 8, యూఆర్ఎస్ 1, ఎయిడెడ్ 10, రెసిడెన్షియల్ 19 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య పెంపునకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలు కల్పిస్తున్న సౌకర్యాలు వివరిస్తున్నారు. డిజిటల్ తరగతులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ పార్టీ ప్యానెల్ ద్వారా 8,9,10 తరగతుల వారికి డిజిటల్ తరగతులు నిర్వహిస్తారు. సౌకర్యవంతమైన డెస్క్ బెంచీలు, డిజిటల్, సైన్స్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. 103 హైస్కూల్స్ ఉండగా వీటిల్లో 6,443మంది విద్యార్థులు గతేడాది టెన్త్ పరీక్షలు రాయగా 6,298 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 97.66గా ఉంది. 60పైగా స్కూళ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లా పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచింది. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచడానికి విద్యాశాఖ అధికా రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు–ప్రత్యేకతలు ● ఉచిత విద్యాబోధన, పాఠ్య, నోట్ పుస్తకాలు ● ఏడాదికి రెండు జతల యూనిఫామ్ల పంపిణీ ● మధ్యాహ్న భోజనం, వారానికి మూడు రోజులు గుడ్లు ● రక్తహీనత రాకుండా వారానికి మూడురోజులు రాగిజావ, బెల్లంతో అనుబంధ ఆహారం ● రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం కింద ఆరోగ్య పరీక్షలు, ఐరన్ ఫోలిక్ యాసిడ్, డీవార్మింగ్ మాత్రల పంపిణీ ● పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, 60రోజుల పాటు స్నాక్స్ ● ఉన్నత విద్యార్హతలు, అనుభవం, సుశిక్షితులైన అధ్యాపకులతో విద్యాబోధన ● ఆత్మరక్షణకు కరాటేతోపాటు వివిధ క్రీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు బాసర ట్రిపుల్ ఐటీలో చదివేందుకు ప్రభుత్వ పాఠశాలలో (నాన్ రెసిడెన్షియల్ రూరల్ స్కూల్) చదివిన వారికి 24 మార్కుల వెయిటేజీ ఇస్తారు. ఈసారి జిల్లాకు చెందిన 21 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. 8వ తరగతి విద్యార్థులకు జాతీయస్థాయిలో ఎన్ఎమ్ఎస్ స్కాలర్షిప్ పరీక్ష రాసే అవకాశం ఉండగా ఎంపికై న వారికి ఏడాదికి రూ.12వేల చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం లభిస్తుంది. 3కి.మీపైగా దూరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నెలకు రూ.600 రవాణా భత్యం, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లభించనుంది. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ బడిలో బోధన డిజిటల్ తరగతులు.. అత్యాధునిక వసతులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు వసతుల కల్పన, విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ఉపాధ్యాయులు -
సూచించిన వరి రకాలు
జనగామ రూరల్: వానాకాలం సీజన్లో కేవలం 7 రకాల సన్నరకం వడ్లకే బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు నిరాశకు గురి కావాల్సి వస్తోంది. గతేడాది 33 రకాల సన్నాల కు బోనస్ అందజేసి ప్రస్తుతం ఏడింటికే పరిమితం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుకు గాను ఈ మేరకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ప్రభుత్వం సన్న ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500లు బోనస్ చెల్లిస్తుంది. దీంతో రైతులు అత్యధికంగా సన్నాలు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నా గతంతో పోల్చితే వాటి సంఖ్య తగ్గించడం సరైంది కాదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో ఈ సీజన్లో 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గతేడాది 2.9 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్ నుంచి వ్యవసాయశాఖ అధికారులు ఏడు రకాల సన్నాలను ప్రకటించగా వాటిలో అత్యధిక దిగుబడి, చీడపీడలను తట్టుకొనే, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకోవడంలో సమస్యలు తలెత్తున్నాయి. గతేడాది రైతులకు ఎక్కువ సంఖ్యలో విత్తనాలు అందుబాటులో ఉండడంతో అధిక దిగుబడినిచ్చే విత్తనా లను ఎంపిక చేసుకున్నారు. ఈసారి అలాంటి అవకాశం లేకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. అయితే పంట సాగు అధిక దిగుబడిపై గ్రామాల్లో రైతు వేదికల్లో విత్తన మేళాల్లో అవగాహన కల్పిస్తున్నారు. 7రకాలకు పెరిగిన డిమాండ్ ప్రభుత్వం ఏడు రకాల వరి వంగడాలకే బోనస్ ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లో ఆ విత్తనానికి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఆవసరమైన విత్తనాల కన్నా ఎక్కువగానే నిల్వలు చేసింది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ సీజన్కు సుమారు 35 వేల మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం కాగా 10 వేల వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, డిమాండ్కు సరిపడా నిల్వలు ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వివిధ వ్యాధిగ్రస్తులు వారు ముఖ్యంగా మధుమేహ బాధితులు తెలంగాణ సోనాను ఎంచుకుంటున్నారు. మార్కెట్లో అత్యధిక అదరణ పొందుతున్న సన్న బియ్యం సాంబమసూరి ఉంది. వరిసాగులో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉన్నా ఎక్కువ డిమాండ్ ఉన్న సన్నరకాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. సన్న ధాన్యం వంగడాల రకాలు ఖరారు చేసిన అధికారులు సూచించిన రకాలే వేయాలని విత్తన మేళాల్లో విస్తృత ప్రచారం రైతులకే ప్రయోజనం అంటున్న అధికారులు అన్ని రకాలకు బోనస్ ఇవ్వాలని రైతుల డిమాండ్ జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనాపంట రకం పంట కాలం(రోజులు) బీపీటీ 52004 140 నుంచి 150 జైశ్రీరాం 130 నుంచి 135 ఆర్ఎన్ఆర్ 15048 120 నుంచి 125 హెచ్ఎంటీ (సోనా) 135 నుంచి 145 కేఎన్ఎం 7715 125 నుంచి 130 (కొత్తతరం సన్నరకం) కేఎస్ఎం1638 120నుంచి 125 డబ్ల్యూజీఎల్ 44 (సిద్ధి) 140 నుంచి 145 ప్రభుత్వం రైతులు సాగు చేసే అన్ని రకాల సన్న ధాన్యానికి బోనస్ అందించాలి. సన్నాల సాగులో అదనపు పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు దిగుబడి తక్కువగా వస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన వాటికే కాకుండా ప్రభుత్వం అన్ని రకాల సన్నాలకు బోనస్ చెల్లించాలి. సూచించిన వాటినే సాగు చేయాలనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. –ఎడ్ల శ్రీనివాస్, రైతు, మరిగడి రైతులకు ఉపయోగపడే విత్తనాలు, వానాకాలంలో అధిక దిగుబడి వచ్చే సన్నరకం వంగడాలను మాత్రమే ఎంపిక చేశాం. ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి విత్తనాలు సాగుచేస్తే అమ్మకాల్లో సమస్యలు లేకుండా బోనస్ పొందే అవకాశం ఉంటుంది. చీడపీడ బాధలు లేకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ అధిక దిగుబడితో పాటు అధికాదాయం పొందే అవకాశం ఉంది. –అంబికా సోని, డీఏఓ -
కసర త్తు షురూ
జనగామ:ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం నడుం బిగించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి జిల్లాలో ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ల జాబితాను సవరించడం, అర్హులైన ప్రతీ ఒక్కరినీ చేర్చడం, డూప్లికేట్, మరణించిన వారితో పాటు వేరే చోటుకు మారిన వారి పేర్లను గుర్తించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుండగా, జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన అనంతరం అక్టోబర్ 1న తుది జాబితా వెలువరిస్తారు. జిల్లాలో 7.72 లక్షల ఓటర్లు జిల్లా (ఇతర జిల్లాల పరిధిలో ఉన్న మండలాలను కలుపుకుని)లో మొత్తం 865 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రస్తుత ఓటర్ల సంఖ్య 7,72,766గా నమోదైంది. జిల్లాలో 865 బీఎల్వోలు ఉండగా, 10 మందికి ఒక్కరు చొప్పున 86 మంది సూపర్ వైజర్లు సేవలు అందించనున్నారు. ఇంటింటికి సమాచారం సేకరించిన అనంతరం బీఎల్ఓ యాప్లో వాటిని అప్లోడ్ చేస్తారు. ప్రతీ బీఎల్ఓ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల వివరాలను సరిచూసి, కొత్త ఓట ర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, చిరునామా మార్పులు నమోదు చేయాలని అధికారులు సూచించారు. బీఎల్ఓలకు సమర్పించాల్సిన గుర్తింపు కార్డులు జనన ధృవీకరణ పత్రం, పాస్పోర్టు, విద్యార్హత సర్టిఫికెట్, శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, పారెస్ట్ రైట్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లలో ఏదైన ఒకటి బీఎల్ఓలకు అందించాలని అధికారులు సూచించారు. ‘ఎస్ఐఆర్’కు సహకరించాలిప్రత్యేక ఓటరు జాబితా సవరణకు ప్రజలు సహకరించాలి. జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారా లు పంపిణీ చేస్తారు. అర్హులకు ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హులను తొలగించడమే కార్యక్రమ ముఖ్య ఉద్ధేశ్యం. పారదర్శక, సమగ్ర ఓటరు జాబితా కోసం ఎన్నిక సంఘం చేపట్టిన ఎస్ఐఆర్–26లో ప్రజలు భాగస్వాములు కావాలి. – సందీప్ కుమార్ ఝా, కలెక్టర్షెడ్యూల్ ఇలా.. 15–06–2026 నుంచి 24–06–2026 వరకు సన్నాహాలు, శిక్షణ, ముద్రణ పనులు పూర్తి. 25–06–2026 నుంచి 24–07–2026 వరకు బూత్ లెవల్ అధికారుల ఇంటింటి సర్వే 24–07–2026 లోపు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి 31–07–2026 ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ 31–07–2026 నుంచి 30–08–2026 వరకు అభ్యంతరాల స్వీకరణ 31–08–2026 నుంచి 28–09–2026 వరకు నోటీసుల జారీ, దావాల పరిష్కారం 01–10–2026న తుది ఓటరు జాబితా ప్రచురణ ఈనెల 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఇంటింటికీ బీఎల్ఓలు జిల్లాలో 7.72 లక్షల ఓటర్లు ప్రజలు సహకరించాలి: కలెక్టర్ నియోజకవర్గాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు నియోజకవర్గం నియోజకవర్గం పోలింగ్ మొత్తం కోడ్ కేంద్రాలు ఓటర్లు జనగామ 98 278 2,50,241 స్టేషన్ఘన్పూర్ 99 291 2,60,625 పాలకుర్తి 100 296 2,61,718 మొత్తం 865 7,72,584 -
కార్యకర్తలకు అండగా ఉంటా..
మడికొండలోని ఓ కన్వెన్షన్లో బీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తలకు ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియాపై శిక్షణ కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దామని పిలుపునిచ్చారు. – హన్మకొండ● కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి కేసీఆర్ను మరోసారి సీఎం చేద్దాం ● ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొనాలి ● బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు
రఘునాథపల్లి: సాధారణంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో కనిపించే నో అడ్మిషన్ బోర్డు.. నేడు ఓ ప్రభుత్వ పాఠశాల ముందు కనిపించింది. రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరగడంతో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పాఠశాల హెచ్ఎం ఆలేటి యాదవరెడ్డి సోమవారం పాఠశాల ముందు నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేశారు. గతేడాది కూడా 185 మంది విద్యార్థుల సంఖ్య పెరగడంతో ‘మా పాఠశాలలో సీట్లు లేవని’ అడ్మిషన్స్ క్లోజ్ అని బోర్డు ఏర్పాటు చేశారు. రెండేళ్లలో అద్భుత ప్రగతి మూడేళ్లుగా పాఠశాల సాధించిన ప్రగతి ప్రైవేట్ పాఠశాలలకు సైతం ఆదర్శంగా నిలిచింది. 2024–25 విద్యా సంవత్సరం కేవలం 52 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా 2025–26 విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల కృషితో 133 మంది నూతన విద్యార్థులు చేరి, మొత్తం సంఖ్య 185కి చేరడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరం 23 మంది విద్యార్థులు వెళ్లిపోగా కొత్తగా 53 మంది విద్యార్థులు ప్రవేశం పొందడంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 215 చేరింది. హెచ్ఎం యాదవరెడ్డి మాట్లాడుతూ తరగతిలో 30 మంది విద్యార్థులు ఉంటేనే బోధన సమర్థవంతంగా సాగుతుందని, అందుకే భారమైన మనస్సుతో అడ్మిషన్లు నిలుపుదల చేయాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు సోమవారం ఎంఈఓ రఘునందర్రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్యను పెంచి హెచ్ఎం, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.ఖిలాషాపూర్ ప్రాథమిక పాఠశాల ఘనత -
ఓట్ల చోరీ కోసమే ‘సర్’
హనుమకొండ హంటర్రోడ్లోని డికన్వెన్షన్హాల్లో సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)’పై బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. – హన్మకొండ చౌరస్తా● అప్రజాస్వామ్యంగా అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది ● ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ● బీఆర్ఎస్ దోపిడీని ప్రజలు మరిచిపోరు ● టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ -
జాతీయస్థాయికి ఎంపిక
చిల్పూరు: మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అన్వర్–ఫాతిమాల కూతురు అస్మా గతేడాది రాసిన వ్యాసం జాతీయస్థాయికి ఎంపికై నట్లు పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పా ఠశాల హెచ్ఎం శ్రీనివాస్ సోమవారం తెలి పారు. 2025–26 విద్యాసంవత్సరంలో పాఠశాలలో పదో తరగతి చదివే అస్మా టాటా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫైవ్ పాయింట్స్ టు బిల్డ్ ఏ సెల్ఫ్ రిలైంట్ ఇండియా’ అనే అంశంపై రాసిన వ్యాసం జాతీయస్థాయికి ఎంపికై ందన్నారు. దీంతో విద్యార్థి అస్మాను సర్పంచ్ ఎడవెళ్లి లావణ్యమల్లారెడ్డి, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు అభినందించారు. ప్రత్యేక ఏర్పాట్లు చేయాలిజనగామ రూరల్: మొహర్రం పండుగ సందర్భంగా పట్టణంలో లైటింగ్, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత సెక్షన్ అధికారులు పట్టణంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్స్ స్కీం దరఖాస్తులను పరిశీలించాలన్నారు. అన్ని సెక్షన్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా కంప్యూటర్ల కొనుగోలు, జంతువధశాల టెండర్లు, కూరగాయల మార్కెట్ టెండర్ పనులు పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, ఆర్టీఐ దరఖాస్తులను వారం రోజులలోపు పరిష్కరించి రిపోర్టు అందజేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పేపర్ లీక్లపై శాశ్వతంగా చెక్ పెట్టాలి ● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి జనగామ: పేపర్ లీక్లకు శాశ్వతంగా చెక్ పెట్టి విద్యార్థుల భవిష్యత్ను కాపాడాలని జనగామ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకీ గూంజ్ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. జేఈఈ, నీట్, ఎస్ఎస్సీ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ వంటి పోటీ పరీక్షల కోసం లక్షలాది మంది యువత సంవత్సరాల తరబడి శ్రమిస్తున్నా, ప్రతి 1000 మందిలో కేవలం 12 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ సహా అన్ని జాతీయ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షిక దర్యాప్తు చేయడంతో పాటు పేపర్ లీక్లకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, యువతకు ఉపాధి కోసం పోరాడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రారంభించిన ఈ ఉద్యమానికి ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వంగాల కల్యాణి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉడుత రవి యాదవ్, డీసీసీ జనరల్ సెక్రటరీ ఎండి అన్వర్, అభిగౌడ్, ప్రవీణ్, మాజీద్ అప్సర్, వేముల మల్లేష్, వంగాల మల్లారెడ్డి, పిట్టల సతీష్ తదితరులు పాల్గొన్నారు. పొలంగట్టే.. బడి‘బాట’ చిల్పూరు: మండలంలోని ఫత్తేపూర్ పంచాయతీ పరిధిలోని భట్వాండతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పొలాల మధ్య ఉంది. ఈ పాఠశాలకు వెళ్లాలంటే పొలంగట్టే దీనికి దారి. పంటల సాగు లేని సమయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకున్నా.. సాగు చేస్తే పొలంగట్టు పైనుంచి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయులు వారి వాహనాలను రోడ్డు పక్కన చెట్ల కింద పెట్టి నడిచి రావాల్సిందే. ప్రస్తుతం ఈ పాఠశాలలో 10 మంది విద్యార్థులుండగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జనగామ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు అర్హులందరికీ అందించమే లక్ష్యమని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి నియోజకవర్గానికి చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని మొదటి విడతలో మంజూరైన 3,500 ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరైన నేపథ్యంలో అర్హుల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్ర క్రియలో అధికారులు సమర్థవంతంగా పని చేసి రాష్ట్రంలో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని ప్రశంసించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు లోనూ పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, జెడ్పీ సీఈఓ రంగారావు, హౌసింగ్ పీడీ మాతృనా యక్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ప్రతీ ఇంటికి బీఎల్ఓ..
జిల్లాలోని ప్రతీ ఇంటికీ బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) వెళ్లి ముందు గానే ముద్రించిన ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసి, వివరాలు సరిచూసుకుని తిరిగి సేకరించనున్నారు. పాత ఓటరు వివరాలు, కుటుంబ లింకులు, చిరునామా మార్పులు, కొత్తగా 18 ఏళ్లు నిండిన వారి నమోదు వంటి అంశాలు ఈ సర్వేలో కీలకం కానున్నాయి. ఫారం తీసుకుని తిరిగి సమర్పించకపోతే, లేదా వివరాల్లో లోపాలు ఉంటే ముసాయిదా జాబితాలో పేరు కనిపించకపోవచ్చనే ఆందోళన ఉంది. ముఖ్యంగా వలస వెళ్లిన కుటుంబాలు, అద్దె ఇళ్లలో ఉండేవారు, కొత్త ఓటర్లు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. -
వినతులు సత్వరమే పరిష్కరించాలి
జనగామ రూరల్: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీ సుకుంటుందని, దరఖాస్తులు పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రీవెన్స్లో మొత్తం 518 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, డీఆర్డీఓ భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. ● జిల్లా కేంద్రంలోని 23వ వార్డుకు చెందిన ఆర్.సంతోషిని తమకు ఎటువంటి ప్రభుత్వ పథకం అందడం లేదని ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేస్తే రాలేదని, ఇల్లు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. ● రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామానికి చెందిన జిట్టే శోభ తన 6.20 ఎకరాల భూమికి గాను పట్టా పాసుబుక్కులో 4.24 ఎకరాలు మాత్రమే నమోదైందని, ఇంకా రెండు ఎకరాల భూమి రికార్డులో నమోదు కాలేదన్నారు. ● బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లవరం బుచ్చిరెడ్డి, రెవెన్యూ పరిధిలోని తన సొంత భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని, న్యాయం చేయాలని విన్నవించారు. ● లింగాలఘణపురం మండలం చీటూర్ గ్రామానికి చెందిన ఎస్.అనూష తమది నిరుపేద కుటుంబమని, గ్రామంలోని అంగన్వాడీ సెంటర్–1లో ఆయా పోస్టు ఖాళీగా ఉందని, తనకు మంజూరు చేసి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. ● జనగామ మండలం పెందరాంచర్ల గ్రామానికి చెందిన బొంకూరి కృపాధానం తను బ్యాంక్లో తీసుకున్న పంట రుణం మాఫీ కాలేదని, న్యాయం చేయాలని వేడుకున్నారు. ● లింగాలఘణపురం మండలం కుందారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం, టిఫిన్ బిల్లులు చెల్లించాలని విన్నవించింది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజావాణిలో 518 దరఖాస్తులు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు..మున్సిపల్ శానిటేషన్ విభాగంలో తన భర్త నర్సయ్య లేబర్ కూలీగా పనిచేయగా గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మున్సిపాలిటీలో పనిచేసే ఓ వ్యక్తి తనకు జవాన్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.40లక్షలు తీసుకుని ఉద్యోగం ఇవ్వలేదు. కుటుంబం గడవటం కష్టంగా ఉంది. డబ్బులు ఇప్పించడంతో పాటు ఉపాధి కల్పించాలి. –జేరుపోతుల సుమలత, జనగామభూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారు..నాగిరెడ్డిపల్లెకు చెందిన తన భర్త గుడ్ల నర్సయ్య పేరు మీద గ్రామంలో 265.65 సర్వేనంబర్లో 10 గుంటల భూమి ఉంది. భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. రెండు ఏళ్ల క్రితం తన భర్త పేరు మీద ఉన్న భూమిని పట్టా చేయాలని చూడగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరు మీద ఉంది. సర్వే చేసి తన పేరుమీద పట్టా పాస్బుక్కు ఇవ్వాలి. – గుడ్ల ఎల్లమ్మ, నాగిరెడ్డిపల్లె, బచ్చన్నపేట -
సమాజ మార్గదర్శకులుగా ఎదగాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ జనగామ: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యార్థులు చదువుపై దృష్టి సారించి సమాజ మార్గదర్శకులుగా ఎదగాలని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ధర్మకంచ జెడ్పీహెచ్ఎస్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై జరిగిన అవగా హన కార్యక్రమంలో సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల విని యోగం యువత భవిష్యత్తు, ఆరోగ్యం, కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, ప్రతీ విద్యార్థి తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో అవగాహన కల్పించి మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు. -
లక్నవరంలో సందడి
గోవిందరావుపేట: జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు సరస్సు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా గడిపారు. లక్నవరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వేలాడే వంతెనపై నడుస్తూ సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకించారు. సెల్పీలు, ఫొటోలు దిగుతూ కుటుంబ సభ్యులు, యువత ఉత్సాహంగా గడిపారు. సరస్సు చుట్టూ విస్తరించిన పచ్చని వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సరస్సులో బోటింగ్ నిర్వహించేందుకు అవసరమైన స్థాయిలో నీటిమట్టం లేకపోవడంతో అధికారులు బోటింగ్ను నిలిపివేశారు. దీంతో బోటింగ్ కోసం ప్రత్యేకంగా వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు.లక్నవరంలోని వేలాడే వంతెనపై పర్యాటకులు -
సంపూర్ణ ఆరోగ్యానికి సంజీవని
యోగాసనాలు చేయిస్తున్న గురువు గీతేష్ బజాజ్జనగామ: యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సంజీవని అని, ప్రతిఒక్కరూ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెహ్రుపార్క్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ర్యాలీ అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మల్లిఖార్జున్రావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా గురువు గీతేష్ బజాజ్ ఆధ్వర్యంలో యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందన్నారు. యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించగా, వందలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ యోగా ద్వారా రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులలో పాటు ఇతర జీవనశైలి వ్యాధులను నియంత్రించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ కోఆర్డినేటర్, డాక్టర్ మమత, డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అశోక్, డాక్టర్ వాణి, మున్సిపల్ కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం -
ప్లాస్టిక్ రహిత పట్టణాన్ని నిర్మిద్దాం
జనగామ: జనగామ పట్టణాన్ని పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి ప్రత్యక్ష రంగంలోకి దిగారు. ప్లాస్టిక్ వినియోగం వందశాతం నిర్మూలనకు నిరంతర నిఘా ఉంటుందని ప్రకటించారు. పట్టణ సుందరీకరణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని జనగామ నుంచి పూర్తిగా తరిమేయడం ప్రతీ పౌరుడి బాధ్యతని తెలిపారు. వ్యాపార వర్గాలకు విజ్ఞప్తి ప్లాస్టిక్ రహిత పట్టణంగా నిర్మించేందుకు అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు సహకరించాలని కోరారు. హోటళ్లు, కిరాణషాపులు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్తో పాటు అన్ని దుకాణదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్ల స్థానంలో నూలు సంచులు, జనపనార బ్యాగులు, కాగితపు కవర్లు వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రూ.25వేల వరకు జరిమానా ప్లాస్టిక్ హోల్సేల్ షాపుల యజమానులను ఉద్దేశించి కమిషనర్ కీలక హెచ్చరిక జారీ చేశారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తే రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. అంతేకాకుండా సంబంధిత షాపుల లైసెన్స్లను రద్దు చేసి, 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలు ముమ్మరం నిషేధిత ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు ము న్సిపల్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందా లను ఏర్పాటు చేశామని కమిషనర్ వెల్లడించారు. ఈ బృందాలు రోజూ మార్కెట్, వ్యాపార సముదా యాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ప్లాస్టిక్ రహిత పట్టణం కోసం ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వాడకంతో కాల్వలు పూడుకుపోవడం, పశువులు చనిపోవడం, భూసారం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రజలు, వ్యాపార వర్గాలకు మున్సిపల్ అధికారుల విజ్ఞప్తి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు కమిషనర్ హెచ్చరిక పట్టణంలో ముమ్మరంగా తనిఖీలు -
సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026
‘నీట్’ ప్రశాంతం విద్యార్థులను తనిఖీ చేస్తున్న అధికారులుపరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ నంబర్ను చూసుకుంటున్న విద్యార్థులుజనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య శిబిరం వంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. జిల్లాలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 588 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 509 మంది పరీక్షకు హాజరు కాగా 79 మంది గైర్హాజరు అయ్యారు. సిద్ధిపేట రోడ్డులోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల (అటానమస్), జనగామ మండలం పెంబర్తి లోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఏబీవీ డిగ్రీ కళాశాలలో 396 మందికి గాను 339 మంది పరీక్షకు హాజరు కాగా 57 మంది గైర్హాజర్ అయ్యారు. అలాగే పెంబర్తి ఎంజేపీలో 192 మందికి గాను 170 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరు అయ్యారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ బీంశర్మ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరిగింది. విస్తృత తనిఖీలు నీట్ పరీక్షకు హాజరైయ్యే విద్యార్థులను పోలీసులు, అధికారులు తనిఖీలు చేపట్టిన తర్వాత పరీక్షా హాల్కు అనుమతినిచ్చారు. నీట్ పరీక్ష రెండవ సారి నిర్వహిస్తుండడంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా నిమిషం నిబంధన అమలులో ఉండగా ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో వెనుదిరిగి వెళ్లారు. అలాగే అశ్విని అనే విద్యార్థిని ఎంజేపీలో పరీక్ష రాయాల్సి ఉండగా ఏబీవీ డిగ్రీ కళాశాలకు వచ్చింది. విధుల్లో ఉన్న ఎస్ఐలు భారత్, సతీష్, చెన్నకేశవులు వెంటనే స్పందించి ఈ విషయాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డీసీపీ ఆలస్యం చేయకుండా పోలీస్ వాహనంలో ఎంజీపీ సెంటర్కు తరలించాలని ఆదేశించడంతో వారు సకాలంలో పరీక్ష సెంటర్కు చేర్చారు. ఏసీపీ భీమ్శర్మ, ఎస్హెచ్ఓలు సత్యనారాయణరెడ్డి, అబ్బయ్య, పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును పర్యవేక్షించారు. 79 మంది విద్యార్థులు గైర్హాజరు సమయం మించిపోవడంతో వెనుదిరిగిన ముగ్గురు విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు -
జాడలేని బిల్లు!
నెలలుగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎదురుచూపులుపక్క ఫొటోలో కనిపిస్తున్నది హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేంద్రంలో పూర్తయిన ఇందిరమ్మ ఇల్లు ఇది. లబ్ధిదారు అప్పు చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాడు. ఇల్లు పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా ఫైనల్ బిల్లు (రూ.1.50 లక్షలు) ఇంకా ఖాతాలో పడలేదు. బిల్లు ఇవ్వాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ఇది ఈ ఒక్క లబ్ధిదారుడి పరిస్థితే కాదు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని అనేక మంది లబ్ధిదారులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దఎత్తున ఇళ్లను మంజూరు చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వేలాది ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అయితే పునాది, లింటెల్, స్లాబ్ దశలు పూర్తిచేసిన లబ్ధిదారులకు బిల్లుల విడుదల ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు నిర్మాణాలు పూర్తిచేసి, గృహప్రవేశాలు కూడా చేశారు. అప్పుచేసి ఇళ్ల నిర్మాణం.. గృహప్రవేశం చేసినా చివరి బిల్లు పెండింగ్ ఇందిరమ్మ గృహ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కూలీల ఖర్చులు అధికమవడంతో ప్రభుత్వం విడుదల చేసే మొత్తానికి మించి ఖర్చు అవుతోంది. దీంతో లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులు, చిట్టీలు, బంగారు నగల తాకట్టు వంటి మార్గాలను ఆశ్రయించి ఇళ్లను పూర్తి చేస్తున్నారు. చాలామంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించినా తుది విడత బిల్లులు ఇంకా అందలేదని వాపోతున్నారు. అధికారులు నిర్మాణం పూర్తయినట్లు నమోదు చేసినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కొందరు చెల్లింపుల కోసం మూడు నుంచి ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ‘ఇందిరమ్మ’ మొదటి విడత ఇలా.. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో మొదటి విడత 42 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 35,417 ఇళ్లకు మార్క్ఔట్ చేసి నిర్మాణాలు మొదలు పెట్టారు. ఇప్పటివరకు దాదాపు 10,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిలో గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినప్పటికీ తుది బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేలాది ఇళ్లు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. గృహప్రవేశం చేసినా ఖాతాల్లో జమ చేయని ప్రభుత్వం పునాదుల నుంచి పైకప్పు వరకు అప్పులు చేసి నిర్మాణం ఉమ్మడి జిల్లాలో మొదటి విడత 42 వేల ఇళ్లు మంజూరు.. పూర్తయినవి 10,500 గృహాలుఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వివిధ దశలను బట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఆలస్యం జరడం లేదు. బిల్లుల చెల్లింపులకు మధ్య కాంట్రాక్టర్లు ఎవరూ ఉండరు. డైరెక్ట్గా బబెనిఫిషరీ అకౌంట్లో పడతాయి. అర్బన్లో ఇళ్ల నిర్మాణానికి పీఎంఏవైతో లింక్ అప్ అవడం వల్ల కేంద్రం నుంచి నిధుల విడుదల ఆలస్యం అవుతోంది. – సిద్ధార్థ్నాయక్, పీడీ, హౌసింగ్ -
యోగాతో ఒత్తిడికి చెక్
జనగామ: భారతదేశం ప్రపంచానికి అందించిన అ మూల్యమైన వరం యోగా. ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. శరీరం, మనస్సు, ఆ త్మ మధ్య సమతుల్యతను నెలకొల్పే సంపూర్ణ జీవన విధానం. నేటి వేగవంతమైన, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగా ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. యోగాభ్యాసం ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, భావోద్వేగ స్థిరత్వం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో.. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాదు మధుమేహం, రక్తపోటు, ఊ బకాయం వంటి అనేక జీవనశైలి వ్యాధులను నివా రించడంలోనూ, నియంత్రించడంలోనూ యోగా కీ లక పాత్ర పోషిస్తోంది. అందుకే అంతర్జాతీయ యో గా దినోత్సవం యోగా యొక్క విశ్వవ్యాప్త ప్రయోజనాలను గుర్తు చేస్తూ, ప్రతిఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సందేశం ఇస్తోంది. ఒక భూమి–ఒక ఆరోగ్యం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో యోగా అత్యంత శక్తివంతమైన సాధనంగా నిలుస్తోందని యోగా అభ్యాసకులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా.. యోగా దినోత్సవం పురస్కరించుకుని విద్యాసంస్థలు, యోగా శిక్షణ కేంద్రాలు, బతుకమ్మకుంటతో పాటు జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో యోగా దినో త్సవం జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లో యోగా దినోత్సవం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నేడు (ఆదివారం) ఉదయం 6.30 గంటలకు జిల్లా స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి యోగా చేసేందుకు వచ్చే అన్ని వర్గాల ప్రజల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొని యోగాభ్యాసాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లిఖార్జున్రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బజరంగ్ యోగా సంస్థాన్ ఫౌండర్ గీతేష్ బజాజ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రోజువారీగా కనీసం 30 నిమిషాలు యోగాభ్యాసం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఇంటికి యోగా సందేశం ఆరోగ్యకరమైన సమాజానికి పునాది నేడు కలెక్టరేట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం -
కేసులు సామరస్యంగా పరిష్కరించుకోవాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ జనగామ రూరల్: కక్షిదారులు తమ కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. న్యాయవాదులు, బ్యాంక్ ఆఫీసర్స్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్, చిట్ ఫండ్స్ మేనేజర్స్ కక్షిదారులతో కేసుల పరిష్కారం కోసం రాగా ప్రధాన న్యాయమూర్తి లోక్ అదాలత్ను ప్రారంభించి మాట్లాడుతూ కక్షిదారులుమ సమస్యలను పెంచుకోకుండా రాజీమార్గమే రాచమార్గమన్నారు. లోక్ అదాలత్లో 5 బెంచ్ల ద్వారా కేసులను పరిష్కరించారు. మొత్తం 1,831 కేసులకు రూ.1,17,77,475 వచ్చినట్లు వారు తెలిపారు. ఆయా బెంచ్లలో న్యాయవాదులు కె.సునీతరాణి, జి.కవిత, శశి, మేకల స్వప్న, సందీప్, జ్యోత్స్న, శివలీల, పుష్పతో పాటు డీసీపీ రాజమహేంద్రనాయక్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండ దయాకర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
మహిళల భద్రత సమాజ అభివృద్ధికి పునాది
జనగామ రూరల్: మహిళల భద్రత సమాజ అభివృద్ధికి పునాది అని, పోష్ యాక్ట్ అమలుతో మహిళలకు మరింత భద్రత ఉంటుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మహిళల పని ప్రదేశాల్లో లైంగిక వేదింపులను నిరోధించే పోష్ చట్టం అమలులో కలెక్టర్ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు శనివారం కలెక్టర్ చాంబర్లో వ్యవసాయ శాఖ అధికారుల కలిసి పూలమొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల గౌరవం, భద్రతకు జిల్లా పరిపాలన కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. సర్కారు బడిలో చేరిన ఉపాధ్యాయుడి పిల్లలుకొడకండ్ల: మండలంలోని ఏడునూతుల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సోమారపు రాములు తన ముగ్గురు పిల్లలను శనివారం స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కొడకండ్ల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రాములు తన కుమార్తెలు అర్చన (5వ), అఖిల (3వ), ధరణి(2వ) తరగతిలో చేర్పించారు. తన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలువగా గ్రామస్తులు రాములును అభినందించారు. పోటీ పరీక్షల శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షల శిక్షణకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎస్. మురళీధర్ రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీపీఎస్సీ గ్రూప్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి నాలుగు నెలల బేసిక్ ఫౌండేషన్ కోర్సును జిల్లాల్లోని అర్హులైన మైనార్టీ అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్నారన్నారు. డిగ్రీ అర్హత గల మైనార్టీ అభ్యర్థులు (ముస్లిం, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు) అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్లు జతపరచిన తమ దరఖాస్తులను హైదరాబాద్లోని తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్లో ఈనెల 25 సాయంత్రం 5 గంటల లోపు అందించాలన్నారు. పూర్తి వివరాలకు 040–23236112, 9059050062 నంబర్లో సంప్రదించాలని కోరారు. పూర్తిస్థాయి సమాచారం అందించాలినర్మెట: ఆర్టీఐ యాక్ట్ ప్రకారం వివరాలు కోరిన వ్యక్తులకు నిబంధనల మేరకు పూర్తి స్థాయిలో సమాచారం అందించాలని రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ అన్నారు. మండలకేంద్రానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త మహమ్మద్ తఫ్జిల్ నిబంధనల మేరకు వివరాలు కోరినా... సమాచారం ఇవ్వలేదంటూ దాఖలు చేసిన ద్వితీయ అప్పీల్పై విచారణ నిర్వహించగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పుష్పకుమారి, డీఈఓ సూరింటెండెంట్ హుస్సేన్ శనివారం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఫిర్యాదుదారుడు కోరిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. జవాబుదారీతనం పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం కీలక సాధనమని తఫ్జిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో సంక్షేమ పథకాలుజనగామ రూరల్: మోదీ పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి అన్నారు. శనివారం పట్టణంలోని జిల్లా కార్యాలయంలో బీజేవైఎం యువ సమ్మేళనం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో సుపరిపాలన అందిస్తున్నారని దేశభద్రత విషయంలో ఎప్పుడు రాజీ పడలేదని గుర్తు చేశారు. యువత కోసం స్కిల్ ఇండియా పేరుతో దేశంలో ఉన్న యువతకు నైపుణ్యం పెంచే విధంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కేవీఎల్ఎన్ రెడ్డి, చింతకింది సంతోష్, నవీన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ‘ఎస్ఐఆర్’ను పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ బెన్షలోమ్ పాలకుర్తి టౌన్: పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి (ఈఆర్ఓ) బెన్షలోమ్ పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ రాజకీయ పార్టీలు అన్ని పోలింగ్ కేంద్రాలకు బూత్ ఏజెంట్లను బీఎల్ఏలను వెంటనే నియమించి జాబితాలను సమర్పించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరిని ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేయించేందుకు, ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని, పేర్లు, ఫొటోలు, చిరునామాల్లో తప్పులకు ఫారం –8 ద్వారా సమర్పించుకునేలా ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ల బాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా అర్హులైన ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ప్రత్యేక సవరణ లక్ష్యమన్నారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చే క్లెయిములు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం క్షేత్రస్ధాయిలో పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నాన్నే నాకు స్ఫూర్తి
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026జీవిత సారం తెలిపే గురువు. కష్టాల్లో ధైర్యం నూరిపోసే వైద్యుడు. మన తరఫున వాదించే లాయర్. భవిష్యత్ను నిర్మించే ఇంజినీర్. నిత్యం రక్షణ కల్పించే పోలీస్. వాస్తవాలు తెలిపే జర్నలిస్ట్. ఆకలి తీర్చే రైతు. ఇలా ఎన్ని పాత్రల్లో అయినా ఒదిగిపోయే రియల్ హీరో నాన్న. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రియల్ హీరోల గురించి నేడు (ఆదివారం) ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. నేడు ఫాదర్స్ డేవరంగల్ క్రైం: ‘ఆడపిల్లలకు నాన్నే ధైర్యం. నాన్నంటే ఒక నమ్మకం. ఏదైనా సరే తనే చూసుకుంటాడనే ఒక భరోసా. ఇది ఏ ఆడపిల్లకై నా తండ్రి నుంచి స్వేచ్ఛగా లభించే చనువు. ఉద్యోగ సాధనకు మా నాన్నే స్ఫూర్తి’ అంటున్నారు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత. ఫా దర్స్డే సందర్భంగా తన తండ్రి గురించి ఆమె చెప్పిన మాటల్లోనే.. ప్రజలతో మమేకమై.. మానాన్న దార సాంబయ్య. ప్రకాశం జిల్లాలోని మట్టి గుంట గ్రామం. తెలుగు అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత గ్రూప్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా యూనిఫామ్ సర్వీస్లోకి ప్రవేశించారు. వివిధ హోదాలో పనిచేసి ఎకై ్సజ్ డీఐజీగా స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ స్ఫూర్తితో 2004–09లో సొంత నూతలపాడు (ఎస్ఎన్పాడు) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రజలతో మమేకమై వారికి సేవలందించారు. మేం నలుగురం ఆడ పిల్లలం అయినప్పటికీ ఎక్కడా మగ పిల్లలకు తీసిపోకుండా పెంచారు. ధైర్యంగా సమాజంలో ఎదిగేందుకు అవసరమైన స్వేచ్ఛ, అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా ఓనమాల నుంచి ధైర్యం, నిజాయితీని నేర్పించారు. అమ్మ పద్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడంతో క్రమశిక్షణతో కూడిన జీవితం అలవాటైంది. ఉద్యోగం, కుటుంబం, ఆర్యోగం, సేవా వీటిని సమపాళ్లలో చూడడం నాన్న నుంచి నేర్చుకున్నా. సమయం కేటాయించేవారు.. నాన్న వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించేవారు. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు వివరించేవారు. నా మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండడంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతానంటే నాన్న ప్రోత్సహించారు. ఇంట్లో నలుగురం ఆడపిల్లలం కాబట్టి అక్క పెళ్లి తర్వాత నాకు పెళ్లి చేయాల్సి వచ్చింది. నా ఇష్టానికి అనుగుణంగా పెళ్లి తర్వాత నేను చదువుకునేలా మా వారిని ఒప్పించారు. నాన్న స్ఫూర్తి, భర్త ప్రోత్సాహం ఈ రెండు నేను గ్రూప్–1 సాధించేందుకు దోహదపడ్డాయి. బాధితులకు, పేదలకు ఎలా సేవా చేయవచ్చో నాన్నను చూసి నేర్చుకున్నా. పేదలకు, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పోలీస్ శాఖ ఒక చక్కటి వేదిక. అన్యాయం జరిగిందని వచ్చే వారికి న్యాయం జరిగేలా చూసిన ప్రతీసారి నాన్నే గుర్తుకు వస్తారు. ఆయన చెప్పిన ‘సత్యమే మనల్ని కాపాడుతుంది.. సత్యం వైపు మాత్రమే ఉండాలి’ అనే మాటలు గుర్తొస్తాయి. నాకు మా నాన్నే హీరో.గెలుపు వెనుక దాగిన తండ్రి స్వేదంసాక్షితో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత -
ఉరుములు, మెరుపులు
● పాలకుర్తిలో భారీ వర్షం పాలకుర్తి టౌన్: మండలకేంద్రంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్మి వర్షం కురవడంతో వాతావరణం చల్ల బడింది. మండలకేంద్రంలోని ఓ సూపర్మార్కెట్లో ఉరుములు, మెరుపుల కారణంగా సీసీ కెమెరాల చానల్ బాక్స్లో మంటలు చెలరేగా యి. వెంటనే షాపు యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీరాములు ఆధ్వర్యంలో సిబ్బంది అ క్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అలాగే వర్షం కారణంగా సుమారు రెండు గంటలపాటు విద్యుత్ అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.రాజీవ్ చౌరస్తాలో కురుస్తున్న వర్షం -
ఎంతటి కష్టానికైన వెనకాడలేదు..
● మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డిజనగామ: ప్రతీ విజయవంతమైన వ్యక్తి వెనుక కు టుంబం నిలుస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ విజయానికి అసలైన పునాది ఒక తండ్రి త్యాగం, కష్టం. అలాంటి అరుదైన జీవిత గాథ జనగామ మున్సి పల్ కమిషనర్ చిమ్ముల రాజశేఖర్రెడ్డిది. బచ్చన్నపేట మండలకేంద్రానికి చెందిన సాధారణ రైతు మల్లారెడ్డి తన కుమారుడు ఉన్నత స్థాయికి చేరా లని కలలు కనడమే కాకుండా, ఆ కలను నిజం చేయడానికి జీవితాన్నే అర్పించారు. కుమారుడి చదువు, కుటుంబ పోషణకు తండ్రి మల్లారెడ్డి వ్యవసాయంతో పాటు ఇటుక బట్టీల్లో పనిచేయడం, పా లు అమ్మడం వంటి కష్టమైన పనులు చేశారు. కొడుకు చదువు కోసం గేదెను అమ్మిన తండ్రి రాజశేఖర్రెడ్డి జీవితంలో ఎన్నటికీ చెరగని జ్ఞాపకం ఆయన బీటెక్ చదువుకు సంబంధించినది. ఇంజినీరింగ్ చదవడానికి అవసరమైన ఖర్చు సమకూర్చేందుకు మల్లారెడ్డి కుటుంబానికి ఉన్న ఆర్థిక వనరైన ఏకై క గేదెను అమ్మేశారు. ఆ రోజు తండ్రి చేసిన త్యాగం రాజశేఖర్రెడ్డికి జీవితాంతం మరచిపోలేని పాఠమైంది. జీవితంలో కష్టపడితేనే మంచి ఫలి తం వస్తుందని తండ్రి మాటలను ఆచరణలో పెట్టా రు. చదువులో పట్టుదలతో ముందుకెళ్లి ప్రభుత్వ ఉ ద్యోగమే లక్ష్యంగా శ్రమించారు. 2014లో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. అక్కడితో ఆగకుండా మరింత ఉన్నత స్థాయికి చేరాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. గ్రూప్–1తో మున్సిపల్ కమిషనర్ స్థాయికి.. నిరంతర శ్రమ, క్రమశిక్షణ, తండ్రి ఆశీర్వాదం కలిసి రాజశేఖర్రెడ్డిని మరో మెట్టెక్కించాయి. 2025లో గ్రూప్–1 ద్వారా మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన కుమారుడు ఉన్నతాధికారిగా నిలవడం వారి కుటుంబానికి గర్వకారణమైంది. నాన్న చూపిన దారిలోనే.. తన ఉన్నత స్థాయికి కారణం తండ్రి మల్లారెడ్డి. ఆయన చూపిన దారిలోనే సమాజానికి సేవ చేయ డం, జిల్లాకు మంచి పేరు తీసుకురావడం తన జీవి త ధ్యేయం. తల్లిదండ్రుల త్యాగం, పిల్లల పట్టుదల కలిస్తే సాధారణ కుటుంబమైనా విజయం సాధించవచ్చు. – రాజశేఖర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
సర్వం సిద్ధం
జనగామ: జిల్లాలో నేడు (ఆదివారం) జరగనున్న నీట్ రీ–ఎగ్జామ్కు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 588 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. సిద్ధిపేట రోడ్డులోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల (అటానమస్), జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను లోనికి అనుమతించ బోమని అధికారులు స్పష్టం చేశారు. కాగా పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అభ్యర్థులు సూచనలను పాటించాలి నీట్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు సూచనలు పాటించాలని, ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య శిబిరం వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలన్నారు. నేడు జిల్లాలో ‘నీట్’ రీ–ఎగ్జామ్ -
కలెక్టర్..పాఠాలు
స్థానిక కస్తూర్భా బాలికల విద్యాలయాన్ని శనివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంట గది, తరగతి గదులను పరిశీలించిన అనంతరం విద్యార్థినులకు ఇంగ్లిష్, గణితంపై గంటకు పైగా బోధన చేసి వారిలోని అభ్యాస స్థాయిని పరిశీలించారు. విద్యార్థినుల భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఖాన్ అకాడమీ తరగతులు, సాంకేతిక ఆధారిత విద్యా వనులను పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. పదిహేను రోజులకు ఒకసారి మాక్ టెస్టులు నిర్వహించాలని, కార్పొరేట్ స్థాయికి దీటుగా బోధన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే ఆహార నాణ్యతలో రాజీ పడితే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట విద్యాశాఖ అధికారులు, ఎస్ఓ సునిత, ఉపాధ్యాయులు ఉన్నారు. – నర్మెట (తరిగొప్పుల) -
డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి: హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల రెండు, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శనివారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఆకళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళితో కలిసి విడుదల చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 648 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 511 మంది ఉత్తీర్ణత (79శాతం) సాధించారు. నాలుగో సెమిస్టర్లో 71 మందికి గాను 346 మంది ఉత్తీర్ణత (74శాతం) సాధించారు. ఆరో సెమిస్టర్లో 425 మందికి 397 మంది (93 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి తెలిపారు. ఈఫలితాల విడుదలలో పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారులు కొలిపాక శ్రీనివాస్, రాజిరెడ్డి, విభాగాల అధిపతులు సురేశ్బాబు, రామకృష్ణారెడ్డి, రేణుక, మాదవి, మధు, కవిత, ప్రవీణ్కుమార్, బాలరాజు, లకన్సింగ్, సునీత, మమత, లక్ష్మీకాంతం, రమారత్నమాల, సునీత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
రఘునాథ్పల్లిలో మద్యం బంద్
● 20 రోజులుగా నిలిచిన మద్యం విక్రయాలు ● భారీ జరిమానా నిర్ణయించిన జీపీ పాలకవర్గంజఫర్గఢ్: గ్రామంలో విచ్చలవిడిగా బెల్టుషాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తాగుడుకు బానిసైన పలువురి కుటుంబాల్లో నిత్యం గొడవలు జరగుతున్నాయి. ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. ఇది గమనించిన రఘునాథ్పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం రెండు నెలల క్రితం గ్రామంలో బెల్టుషాపులు లేకుండా చేయాలని నిర్ణయింది. రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి గ్రామంలో బెల్టుషాపులను నిషేధిస్తూ తీర్మానం చేసింది. దీంతో 20 రోజుల నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. రఘునాథ్పల్లిలో 3 వేలకు పైగా జనాభా 1,765 మంది ఓటర్లు ఉన్నారు. జూన్ 1 నుంచి గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించి బెల్టుషాపుల నిర్వాహకులకు నోటీసులు అందజేశారు. మద్యం విక్రయిస్తే రూ.లక్షా 25 వేల జరిమానా విధించనున్నట్లు గ్రామంలో దండోరా వేయించారు. ఎవరైనా మద్యం అమ్మినట్లుగా గుర్తించి ఆధారాలతో నిరూపిస్తే వారికి రూ.20 వేల రివార్డు ప్రకటించారు. ఎవరైనా మద్యంతాగి రోడ్లపై అల్లరి చేస్తే రూ.5 వేలు జరిమాన విధించేలా తీర్మానం చేశారు. దీంతో గ్రామంలో మద్యం విక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని ఆదర్శంగా మారుస్తాం.. జూన్ 1 నుంచి గ్రామంలో మద్యం విక్రయాలను నిషేధించాం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు సహకరిస్తున్నారు. మా పాలకవర్గం పదవిలో కొనసాగేంత వరకు గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మకాలు సాగించేది లేదు. ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.. జరిమానా విధిస్తాం. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం – ఎడ్ల వెంకటయ్య, సర్పంచ్ -
నాణ్యమైన విద్య.. మెరుగైన సౌకర్యాలు
కొడకండ్ల: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన సౌకర్యాలను కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ పర్యవేక్షించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. మండలకేంద్రంలోని కస్తూర్బా, మోడల్ స్కూల్స్ను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, పరిసరాలను పరిశీలించారు. సమస్యలుంటే నేరుగా తనకు ఫోన్ చేయాలని సూచిస్తూ తన ఫోన్ నంబర్ను వసతి గృహ ప్రాంగణాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్ చెప్పారు. విద్యార్థుల సంక్షేమానికే అన్ అకాడమీ తరగతులను ప్రారంభిస్తున్నామన్నారు. గణిత బోధనపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసిన అనంత రం మోడల్ స్కూల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జీసీడీఓ గౌసియాబేగం, తహసీల్దార్ అనీల్బాబు, ఎంపీడీఓ శంకర్, సర్పంచ్ దూలం మమతసతీష్గౌడ్, ఎంఈఓ కేజీయారాణి, ప్రిన్సిపాల్ భానుప్రసాద్, ఎస్ఓ జ్యోతి ఉన్నారు. లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలి కలెక్టర్ సందీప్కుమార్ ఝా -
ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి
● రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి జనగామ రూరల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీసీలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ.. జిల్లాలలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ, తిరిగి స్వీకరణ, తదితర అంశాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని తెలిపారు. వీసీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు చర్యలు సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.దివ్య ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్ నుంచి సెర్ప్, ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 155 మంది సిబ్బందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్నవారికి నేత్ర వైద్య పరీక్షలు, మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎరికాన్ టీపీఏ హెల్త్ ఇన్సూరెన్స్ అనుసంధానంతో యశోద హాస్పిటల్స్, మ్యాక్స్ విజన్, పాత్కై ండ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, మహమ్మద్ నూరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో భూధార్ సర్వే, భూభారతి, సాదాబైనామా, నాన్–కడాస్ట్రల్ గ్రామాల రీ–సర్వే, నక్షా కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొడకండ్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ.. భూ వివరాలు ఖచ్చితంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలని, పెండింగ్ అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని పేర్కొన్నారు. తహసీల్దార్ అనిల్ బాబు, అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలో చేరిన 52 మంది విద్యార్థులు
రఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఒకే రోజు 52 మంది విద్యార్థులు చేరారు. సర్పంచ్ తోటకూర సదానందం తన కూతురును చేర్పించడంతో గ్రామస్తులు ఆయనను అనుసరించారు. పాఠశాలలో 49 మంది విద్యార్థులుండగా, శుక్రవారం 52 మంది చేరడంతో విద్యార్థుల సంఖ్య 101కి చేరడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన సమావేశానికి ఎంఈఓ రఘునందన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించిన సర్పంచ్తోపాటు గ్రామస్తులను అభినంధించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. -
నీట్–రీ ఎగ్జామ్కు ఏర్పాట్లు
జిల్లాలో రెండు కేంద్రాలు.. 588 మంది అభ్యర్థులుజనగామ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పేపర్ లీక్ ఘటన నేపథ్యంలో ఈనెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ రీ– ఎగ్జామ్కు జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రహదారి కోర్టు ఏరియాలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏబీవీ డిగ్రీ కళాశాలలో 396 మంది, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో 192 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. రెండు కేంద్రాల్లో కలిపి మొత్తం 588 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు పరీక్ష కేంద్రంలోని ప్రతిగదికి ఇద్దరు ఇన్విజిలేటర్ల చొప్పున మొత్తం 50 మంది సిబ్బందిని నియమించారు. జిల్లా కలెక్టర్, కోఆర్డినేటర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షణలో జిల్లా కమిటీ సభ్యులు, అదనపు కలెక్టర్, డీసీపీ, సిటీ కో ఆర్డినేటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరీక్ష జరగనుంది. ఏబీవీ కళాశాల కేంద్రానికి రవీంద్రనాథ్, మహాత్మాజ్యోతిబా ఫూలే గురుకుల సెంటర్కు అనిత సూపరింటెండెంట్లుగా వ్యవహరించనున్నారు. సీసీ కెమెరాలలో నిఘా.. పరీక్షలు పూర్తిగా సీసీటీవీ నిఘాలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఒక పోస్టుకార్డు సైజు ఫొటోతోపాటు ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర గుర్తింపు కార్డులను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. అదనంగా 15 నిమిషాలు పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరగ నుంది. గతంతో పోలిస్తే పరీక్ష సమయాన్ని 15 నిమిషాలు పెంచారు. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం నిబంధన అమలులో ఉంది. సాధారణ దుస్తులతో మాత్రమే రావాలని, షూ, బెల్ట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పెన్నులను పరీక్షా కేంద్రంలోనే అందజేస్తారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఐరిస్ స్కానింగ్ నిర్వహించిన తర్వాతనే పరీక్షా గదుల్లోకి అనుమతించనున్నారు. చెవి, ముక్కు, చేతి వేళ్లకు ధరించే ఆభరణాలు, రింగులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కూలింగ్ గ్లాసులు నిషేధించారు. వర్షాకాలం కావడంతో హాల్ టికెట్ను పారదర్శక ప్లాస్టిక్ కవర్లో తీసుకురావాలని సూచించారు. వాటర్ బాటిళ్లపై స్టిక్కర్లు ఉండకూడదని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పరీక్ష నిర్వహణలో పారదర్శకత కోసం ఇన్విజిలేటర్లను సబ్జెక్టులకు సంబంధం లేని విభాగాల నుంచి ఎంపిక చేశారు. మే 3న నిర్వహించిన పరీక్షకు 566 మంది హాజరుకాగా, రీ–ఎగ్జామ్ అవకాశం కల్పించడంతో జిల్లాలో 22 మంది అదనంగా పరీక్ష రాయనున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు పరీక్ష రోజు విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు. నీట్ పరీక్ష నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించి, ఇన్విజిలేటర్లు, సిబ్బందికి నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో వెస్ట్జోన్ పోలీసుల ఆధ్వర్యంలో సెంటర్ల వద్ద 144 సెక్షన్తోపాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష సమంలో జిల్లా కేంద్రంలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేస్తారు. పరీక్ష సమయం 15 నిమిషాల పెంపు నిమిషం నిబంధన వర్తింపు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఐరిష్ స్కానింగ్ అనంతరం లోనికి అనుమతి సంప్రదాయం మినహా.. ఆభరణాలకు అనుమతి లేదు -
శనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2026
● సర్పంచ్, మహిళా సంఘాలు, వార్డు సభ్యులతో ఏర్పాటు ● రైతులకు మేలు చేసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు ● 309 కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు ● ఫార్మర్ రిజిస్ట్రీలో రాష్ట్రంలో జనగామ 3వ స్థానంజిల్లాలో సుమారు 1.80 లక్షల మంది రైతులు ఇప్పటివరకు 1.41 ÌS„ýSÌS ˘ మంది ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తిజనగామ: వానాకాలం ప్రారంభమవడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు తదితరాలపై వ్యవసాయ శాఖ నిఘా పెంచింది. ఇందులో భాగంగా బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో గ్రామస్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, వార్డుల సభ్యులతో కలిసి ‘నిగ్రానీ’ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రైతులు.. తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు, అధిక ధరల అమ్మకాలు, బ్లాక్ మార్కెట్ వంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 309 పీఏసీఎస్లు, హాకా, ఏఆర్ఎస్కేఎస్, ఓడీసీఎం, ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా నిల్వ ఉంచి విక్రయాలు కొనసాగించనున్నారు. ఏఈఓ క్లస్టర్ స్థాయి వరకు ఏర్పాటు చేసిన సెంటర్లలో యూరియా అందుబాటులో ఉంటుంది. రైతుకు ఇబ్బందులు కలుగకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏఓ, ఏఈఓలు క్షేత్రస్థాయిలో నిఘా ఉంచారు. ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీలో ప్రతీ రైతు తప్పనిసరి నమోదు చేసుకోవాలి. ఫార్మర్ ఐడీ ఉన్న రైతులు మాత్రమే యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏఈఓలు, కామన్ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా, మీసేవా కేంద్రాల్లో రుసుం చెల్లించి రిజిస్ట్రీ చేసుకోవచ్చు. ప్రక్రియ పూర్తయిన 24 గంటల్లో ఫార్మర్ ఐడీ వస్తుంది. ఒక్కసారి ఓపెన్ చేస్తే.. రెండోది 20 రోజుల తర్వాతనే.. యూరియా పంపిణీలో పారదర్శకత కోసం యాప్ ఆధారిత విధానాన్ని అమలు చేస్తున్నారు. రైతులు యాప్లో బుకింగ్ చేసుకున్న తర్వాత మొదటి విడతలో ఎకరానికి రెండు బస్తాల యూరియా పొందవచ్చు. రెండో విడత బుకింగ్ కోసం 20 రోజుల తర్వాత యాప్ తిరిగి ఓపెన్ అవుతుంది. వరి, పత్తి, మొక్కజొన్నతోపాటు ఇతర పంటలు సాగు చేసే రైతులు పంటల విస్తీర్ణానికి అనుగుణంగా యూ రి యా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో మరోమూడు రోజుల్లో యూరియా బుకింగ్ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. జిల్లాలో సుమారు 1.80 లక్షల మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 1.41 లక్షల మంది ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్నారు. ఓటీపీ అందించకపోవడంతో కొంద రి నమోదు కాలేదు. ప్రస్తుతం ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో రాష్ట్రంలో జనగామ మూడో స్థానంలో ఉంది.ఎరువుల విక్రయాలపై ‘నిగ్రానీ’ కమిటీలతో నిఘా ఎరువుల విక్రయాలపై పర్యవేక్షణ వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. హెచ్టీ కాటన్ విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. కానీ బ్లాక్ మార్కెట్లో విక్రయించే ప్రమాదం ఉంది. దీంతో గ్రామస్థాయిలో సర్పంచ్ల ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, వార్డు సభ్యులు తదితరులతో కలిపి ‘నిగ్రానీ’ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. విత్తనాలు, బ్లాక్ మార్కెట్, నిబంధనలకు విరుద్దంగా ఊర్లలో ఎరువుల విక్రయాలపై నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడడం ఈ కమిటీల బాధ్యత. యూరియాపైనే ఆధార పడొద్దు రైతులు కేవలం యూరియాపైనే ఆధారపడకుండా సమతుల్య ఎరువుల వినియోగాన్ని రైతులు అలవాటు చేసుకోవాలి. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులు ఉపయోగించి, నత్రజని, భాస్వరం, పొటాషియం సమతుల్యంగా ఉన్న ఎరువులతోపాటు అవసరమైన మేర యూరియా వాడితే సరిపోతుంది. భూమిలో తేమ ఉన్నప్పుడే సాగు పనులు చేపట్టాలి. –అంబికా సోని, డీఏఓ -
మున్సిపాలిటీ ప్రక్షాళనకు శ్రీకారం
వార్డు వారీగా కేటాయించిన అధికారుల వివరాలు..జనగామ: జనగామ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నూతన కమిషనర్ చిమ్ముల రాజశేఖర్రెడ్డి ప్రక్షాళన చర్యలకు శ్రీకారం చుట్టారు. వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ సిబ్బంది, ఇతర శాఖల అధికారుల బాధ్యతలను పునర్వ్యస్థీకరించి కొత్త విధులు అప్పగించారు. ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులు, పారిశుద్ధ్యం, ప్రజాసేవల పర్యవేక్షణలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆదేశించారు. ప్రతీ అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పురపాలిక మార్పులకు ముందడుగు.. మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, డ్రెయినేజీ వ్యవస్థ, పన్నుల వసూళ్లు తదితర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు 30 వార్డులకు ప్రత్యేకంగా వార్డు అధికారులను నియమిస్తూ కమిషనర్ రాజశేఖర్రెడ్డి స్పెషల్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రతి వార్డులో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వెంటనే పరిష్కరించడం, పరిశుభ్రత, నీటి సరఫరా, డ్రెయినేజీ, వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూళ్లు, హౌసింగ్, పట్టణ సేవల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా అధికారులకు అప్పగించారు. అలాగే ఫిర్యాదుల స్వీకరణ, సమస్యల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణ, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులను నియమించినట్లు కమిషనర్ తెలిపారు. వార్డు అధికారులు తమకు కేటాయించిన వార్డుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలని, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డు స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ నియామకాల ప్రధాన ఉద్ధేశమని కమిషనర్ చెబుతున్నారు. వార్డు ఆఫీసర్లు, శాఖల అధికారులకు కొత్త బాధ్యతలు అధికారుల పర్యవేక్షణపై నిత్యం నిఘా వార్డు స్థాయిలో సమస్యల పరిష్కారంపై కమిషనర్ దృష్టి -
ఆస్పత్రిలో వైద్య సేవలు పెంచాలి
బచ్చన్నపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను పెంచాలని, ఓపీ పెరిగేలా చూడాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి, ల్యాబ్, ఫార్మసీని, ఆన్లైన్ విధానాన్ని, మందుల స్టాక్ వివరాల రిజిస్టర్, ఆపరేషన్ థియేటర్ పరిశీలించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ఆస్పత్రిలో వెసెక్టమీ ఆపరేషన్లను పెంచాలని ఆ ఆపరేషన్లకు తానే స్వయంగా వచ్చి చేస్తానని చెప్పారు. అలాగే సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు భరోసా కల్పించాలన్నారు. రాబోవు వర్షాకాలంలో వచ్చే జబ్బుల గురించి ప్రజలకు అవగాహన కలించాలన్నారు. నీటి కలుషితం లేకుండా చూడాలని, ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించా లన్నారు. కార్యక్రమంలో ప్రోగామ్ జిల్లా అధికారులు లగిషెట్టి అశోక్కుమార్, కమలహాసన్, మండల వైద్యులు సృజన, ప్రసన్న కృష్ణ, మానస, సిద్ది సుదర్శన్రెడ్డి, సీహెచ్ఓ జంగమ్మ, సూపర్వైజర్లు, హెడ్ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్: యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్) డిగ్రీ నాలుగు, ఆరో సెమి స్టర్ పరీక్షల ఫలితాలను కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతితో కలిసి గురువారం విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 1,030 మంది విద్యార్థులు హాజరుకాగా 573 మంది విద్యార్థులు (55.63 శాతం)ఉత్తీర్ణులయ్యారు. ఆరో సెమిస్టర్ పరీక్షలకు 663 మంది హాజరుకాగా 398 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. కేయూ ఓఎస్డీ వెంకట్రాంరెడ్డి, ఓయూ మాజీ వీసీ సత్యనారాయణ, ఏవీఎస్ ప్రసా ద్, అనిల్కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రహమాన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత, వివిధ విభాగా ల అధిపతులు రుక్కిరెడ్డి ఆదిరెడ్డి, శ్రీధర్కుమార్లోథ్, భిక్షపతి, హరికుమార్, స్వామి, ప్రసాద్, చందూలాల్, జయప్రకాశ్, ప్రసాద్, రమేశ్, విజయ్కుమార్, నాగయ్య, సతీశ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
ఉన్నా.. లేనట్టే..!
జనగామ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో చీకటిగా మారిన రోడ్లుజనగామ: పట్టణంలోని హైదరాబాద్, హనుమకొండ, సిద్దిపేట రోడ్, నెహ్రూ పార్క్ ఏరియా, ఫ్లైఓవర్ బ్రిడ్జి, సూర్యాపేట రోడ్లపై సెంట్రల్ లైటింగ్ సిస్టం పనిచేయడం లేదు. కొన్నిచోట్ల లైట్లు పూర్తిగా వెలగకపోవడం, మరికొన్ని చోట్ల సగం మాత్రమే వెలుగుతుండగా కొన్ని డిమ్గా వెలగడంతో రాత్రివేళ రహదారులు చిమ్మచీకటిగా మారుతున్నాయి. దీంతో ఆ మార్గాల్లో వెళ్లే ప్రజలు భయాందోళనతో ప్రయాణాలను సాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మున్సిపల్ అధికారులు స్పందించి లైటింగ్ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. -
కష్టపడితేనే ఉజ్వల భవిష్యత్
● విద్యార్థుల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ రూరల్: కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం జనగామ మండలంలో చౌడారం కేజీబీవీ పాఠశాలలో ఆన్ అకాడమీ తరగతులను కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా గణితం బోధిస్తూ, గణితంపై భయం కాకుండా ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు గణితం, సైన్స్, సాంఘిక సబ్జెక్టులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రత్యేక తరగతుల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు మూడు సంవత్సరాల ప్రణాళికతో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేజీబీవీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు. చదువుతోపాటు క్రీడల్లో ప్రతి భ కనబరిచేలా సదుపాయాలు కల్పించాలన్నారు. కేజీబీవీలో బాస్కెట్ బాల్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పీఈటీకి ఆదేశాలు జారీ చేశారు. జీసీడీఓ గౌసియా బేగం పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి చిన్నారుల ఆరోగ్యాభివృద్ధి, పోషకాహార స్థితిగతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మరిగడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నమోదైన చిన్నారుల ఎత్తు, బరువులను పర్యవేక్షించి, కొలతల నమోదుపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సిబ్బంది నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అనంతరం జెడ్పీఎస్ఎస్ను సందర్శించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించి కట్టెలపొయ్యిపై కాకుండా గ్యాస్పై వంట చేయాలని ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులే విక్రయించాలి రైతు సంక్షేమానికి ఐకేపీ రైతు సేవా కేంద్రాలు ఎంతో ఉయోగకరమని.. రైతులకు నాణ్యమైన విత్తనా లు, ఎరువులు, పురుగుమందులు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జనగామ మండలం మరిగడిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐకేపీ రైతు సేవా కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఐకేపీ రైతు సేవా కేంద్రంలో విక్రయించే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు సంబంధించిన లైసెన్స్లను దుకాణంలో స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ–పాస్ యంత్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రైతులకు విక్రయాల నమోదు, బిల్లుల జారీ, స్టాక్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీడీ నూరుద్దీన్, సర్పంచ్ కర్రె పర్శరాములు అధికారులు పాల్గొన్నారు. మొక్కలు నాటి పరిరక్షించాలి జనగామ రూరల్: వన మహోత్సవంలో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలను నాటాల ని పిలుపునిచ్చారు. వివిధ శాఖల అధికారులు తమ లక్ష్యాలను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. -
మళ్లీ కొత్త డ్రెస్
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026మారనున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాం రంగు జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రెండు జతల యూనిఫాంల పంపిణీ కోసం ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మొదట రాష్ట్రస్థాయిలోనే యూనిఫాంలను కుట్టించి పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో ప్రస్తుతం జిల్లాల వారీగా విద్యాశాఖ పర్యవేక్షణలో డీఆర్డీఓ(సెర్ఫ్), పురపాలిక పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో యూనిఫాంలు కుట్టించే బాధ్యతలను అప్పగించారు. కొత్తరంగులతో యూనిఫాంలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తిక్ బ్లూ ప్యాంట్, లైట్ బ్లూ షర్ట్ తో యూనిఫాం అందించనున్నారు. సోషల్ వెల్ఫేర్, మహాత్మా జ్యోతిబా ఫూలే, కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర రెసిడెన్షియల్ విద్యాసంస్థల విద్యార్థులకు మెరూన్ రంగు యూనిఫాం(పాతవే)లు ఇవ్వనున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలతోపాటు బెల్ట్, షూస్ కూడా పంపిణీ చేయనున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు వాటితోపాటు అదనంగా మరో 15 రకాల వస్తువులు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన మెటీరియల్ సరఫరా ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. 30వేల మంది విద్యార్థులకు లబ్ధి.. జిల్లాలో ప్రభుత్వరంగ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ విద్యాసంస్థల్లో చదువుతున్న సుమారు 30 వేల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలు పంపిణీ చేయనున్నారు. రాబోయే నెల రోజు ల్లోపు విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫాంలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. యూనిఫాంల కుట్టింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు మండలాల వారీగా టైలరింగ్ పనులు చేపట్టే వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు. గతంలో విద్యార్థులకు కొలతల విషయంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ‘మేకర్ కమ్ చెకర్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. యూనిఫాం కొలతల్లో తేడాలు ఉంటే పాఠశాల స్థాయిలోనే సరిచేసి విద్యార్థులకు అందించేలా చేయనున్నారు. నేడు వర్చువల్గా ప్రారంభించన్ను సీఎం రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫాంల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి నేడు(శుక్రవారం)వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాల, గురుకులాల నుంచి 8, 9, 10 తరగతులకు చెందిన 152 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 76 మంది బాలురు, 76 మంది బాలికలు ఉన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన క్లాత్ రాగా, యూనిఫాంలను తయారు చేసి నేటికల్లా విద్యాశాఖ అధికారులకు అందిస్తారు. ఈ నెల 22 లేదా 23వ తేదీ నాటికి జిల్లాకు అవసరమైన క్లాత్ పూర్తిస్థాయిలో చేరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్థులకు మూడో జత యూనిఫాం కూడా అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. విద్యార్థులకు ఈ సారి కొత్త రంగులతో అందించే యూనిఫాంల మోడల్పీఎస్లు : 341 యూపీఎస్ : 64ఉన్నత : 103కేజీబీవీ : 12మోడల్ : 08యూఆర్ఎస్ : 01ఎయిడెడ్ : 10రెసిడెన్షియల్ : 19మొత్తం : 558జిల్లాలో విద్యాసంస్థలు ఇలా.. -
23 మంది ఎస్సైల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో 23 మంది ఎస్సైలను బదిలీ చేస్తు పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.మౌనిక సుబేదారి మహిళా పోలీస్స్టేషన్ నుంచి కాజీపేట పీఎస్, ఎస్.కిరణ్మయి సీసీఆర్బీ నుంచి హనుమకొండ భరో సా కేంద్రం, సీహెచ్ లలిత సీపీటీసీ నుంచి జనగామ భరోసా కేంద్రం, తౌటం శ్రావణి పీసీఆర్ నుంచి కేయూసీ, డి.నిహారిక పీసీఆర్ నుంచి మిల్స్కాలనీ, వి.భవాని వీఆర్ నుంచి ఇంతేజా ర్గంజ్ పీఎస్, తుమ్మ శ్రావణి వీఆర్ నుంచి మి ల్స్కాలనీ పీఎస్కు బదిలీ అయ్యారు. ఎన్.సాయిదివ్య వీఆర్ నుంచి హనుకొండ పీఎస్, కె.లక్ష్మీ వీఆర్ నుంచి సుబేదారి పీఎస్, బి.హరికృష్ణ సీపీటీసీ నుంచి సుబేదారి, సీహెచ్ రఘుపతి వీఆర్ నుంచి పరకాల పీఎస్, గోవర్ధన్ వీఆర్ నుంచి ఏనుమాముల పీఎస్, ఎస్.రాజన్బాబు వీఆర్ నుంచి నర్సంపేట పీఎస్, బి.రవీందర్ వీఆర్ నుంచి గీసుకొండ పీ ఎస్, ఎల్.కొంరెల్లి హనుమకొండ ట్రాఫిక్ నుంచి సీసీఆర్బీకి బదిలీ అయ్యారు. ఎన్.రవికిరణ్ ఇంతేజార్గంజ్ పీఎస్ నుంచి సీఎస్బీ, ఎస్. వెంకన్న సుబేదారి నుంచి సీఎస్బీ, షేక్ జాన్పాషా ధర్మసాగర్ నుంచి సీఎస్బీ, వి.నవీన్కుమార్ కాజీపేట పీఎస్ నుంచి సీఎస్బీ, బి.చందర్ టాస్క్ఫోర్స్ నుంచి సీసీఎస్, ఎం.రమేశ్ పరకాల నుంచి సీసీఆర్బీ, ఎల్.నరేశ్ మిల్స్ కాలనీ నుంచి సీసీఆర్బీ, పి.శ్రీనివాస్ను ఐనవోలు నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కార్యక్రమాన్ని తిలకించిన కలెక్టర్ జనగామ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం గుర్రంగూడ ఎకో పార్క్లో గురువారం నిర్వహించిన వనమహోత్సవాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, అధికారులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ సందీప్కుమార్ ఝా లైవ్ ద్వారా తిలకించారు. అనంతరం జిల్లాలో వన మహోత్సవాన్ని కలెక్టర్ ప్రారంభించారు. పిల్లల సంరక్షణ, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి జఫర్గఢ్: ఆశ్రమ పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్య భద్రత విషయంలో మరింత శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ కోరారు. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద ఉన్న మా ఇల్లు ప్రజాధరణ అనాథ శ్రమాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వహణ, రికార్డులు, ఇతర పత్రాలను పరిశీలించడంతోపాటు పిల్లల బాగోగులను అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లలు కష్టపడి చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి, ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు. అంతముందు అడిషనల్ కలెక్టర్ బెన్షాలోమ్.. జఫర్గఢ్ రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించడంతోపాటు కార్యాలయం వద్ద వర్షపాతం నమోదు (రెయిన్ గేజ్) కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పనులు నాణ్యతగా చేపట్టాలి జనగామ: జనగామ పట్టణం హైదరాబాద్ రోడ్డులో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా సెయింట్ మేరీస్ స్కూల్ ఏరియాలోని పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ మెచిన్ రోడ్డు నుంచి గార్లకుంట, సూర్యపేట రోడ్డు వరకు రూ.9.10కోట్లతో వరదల కాల్వ పనుల పురోగతిని పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. సెయింట్ మేరీస్ స్కూల్ వద్ద చేపట్టిన వరద నీటి కాల్వ పనులను 35 నుంచి 40 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇదే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతాచర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. -
జాడలేని చినుకు
సాక్షిప్రతినిధి, వరంగల్ : జూన్ మాసం ముగిసిపోతోంది. కాలం నెత్తిమీదకు వచ్చింది. అయినా వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం ఆకాశం వైపు ఆశగా చూస్తోంది. గత ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండకపోవడంతో సాగునీటి కొరత ఏర్పడింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూన్ 1 నుంచి 18వ తేదీ (గురువారం) వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. 70 మండలాల్లో లోటు, భారీ లోటు.. 9 మండలాల్లో సాధారణం.. సాధారణంగా జూన్ తొలి పక్షంలోనే విస్తృతంగా వర్షాలు కురిసి ఖరీఫ్ సాగు ఊపందుకోవాలి. ఈసా రి అక్కడక్కడా చిరుజల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్లో 79 మండలాలకు 43 మండలాల్లో భారీ లోటు (60 శాతం నుంచి 99 శాతం), 27 మండలాల్లో లోటు (20 శా తం నుంచి 59 శాతం), 9 మండలాల్లోనే సాధారణ (19 శాతం అధికం, 19 శాతం మైనస్) వర్షపాతం నమోదైంది. దీంతో వానాకాలం సాగు కోసం విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. తగినంత తేమ లేకపోవడంతో విత్తనాలు వేయడానికి ముందు కు రావడం లేదు. వర్షాల లేమితో వ్యవసాయ పనులు మందగిస్తున్నాయి. సా ధారణంగా ఈ సమయానికి పత్తి, మొక్కజొన్న, కంది సాగు ప్రారంభం కావా ల్సి ఉన్నా అనేక ప్రాంతాల్లో రైతులు వేచి చూస్తున్నారు. మరో వారం రోజులపాటు గణనీయమైన వర్షాలు లేకుంటే ఖరీఫ్ సాగు విస్తీర్ణంపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో ఇదీ పరిస్థితి.. ఆరు జిల్లాల్లో తొమ్మిది మండలాలు మినహా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ జిల్లాలో మొత్తం 14 మండలాల్లో ఇప్పటికీ వర్షపాతం భారీ లోటుగా ఉంది. 77.1 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా 15.6 మి.మీ.లే నమోదు కాగా 80శాతం లోటుగా ఉంది. వరంగల్ జిల్లాలో 13 మండలాలకు ఏడు మండలాల్లో లోటు , ఐదు మండలాల్లో భారీ లోటు ఉండగా, రాయపర్తి మండలంలో 74.2 మి.మీ.లకు 60.1 (19 శాతం) మి.మీ.లతో సాధారణంగా నమోదైంది. జేఎస్ భూపాలపల్లిలో 12 మండలాలకు మహాముత్తారం, కాటారం, ములుగు గణపురంలలో సాధారణ వర్షం కురవగా, నాలుగు మండలాల్లో లోటు, 5 మండలాల్లో భారీ లోటు ఉంది. జనగామలో జనగామ, దేవరుప్పులలో నార్మల్ కాగా, 10 మండలాల్లో వర్షం లోటు, భారీ లోటు ఉండగా, మహబూబాబాద్లో 18 మండలాలకు పెద్దవంగరలో సాధారణం నమోదు కాగా, నాలుగు మండలాల్లో లోటు, 13 మండలాల్లో వర్షపాతం భారీ లోటుగా ఉంది. ములుగు జిల్లాలో వెంకటాపూర్, కన్నాయుగూడెంలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, జేడీ మల్లంపల్లిలలో లోటు, వెంకటాపురం(కె)లో భారీలోటు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ ముగుస్తున్నా ఉమ్మడి జిల్లా అంతటా లోటు వర్షపాతం గతేడాది నిరాశపరిచిన వానలు.. ఈసారి కూడా అదే పరిస్థితా? 9 మండలాల్లోనే సాధారణం, 70 మండలాల్లో లోటు ఖరీఫ్ సాగు పనుల్లో జాప్యం.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన ఆకాశం వైపు ఆశగా చూపులు.. జిల్లా కురవాల్సింది కురిసింది లోటు (శాతం) హనుమకొండ 77.1 15.6 80.0 వరంగల్ 81.0 35.9 56.0 ములుగు 94.7 62.1 34.0 మహబూబాబాద్ 79.6 31.6 60.0 జయశంకర్ భూపాలపల్లి 84.3 40.7 52.0 జనగామ 70.7 32.8 54.0 -
స్ఫూర్తిదాయకం సర్పంచ్, వార్డు సభ్యులు
రఘునాథపల్లి: ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని చాటుతూ మండలంలోని గబ్బెట సర్పంచ్, వార్డు సభ్యులు తమ పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి.. గబ్బెట సర్పంచ్ కూటిగంటి ఉపేంద్ర అనిల్ తమ ఇద్దరు పిల్లలతో పాటు 9వ వార్డు, 5వ వార్డు సభ్యులు జిట్టబోయిన రమ, ముక్కెర పూలమ్మ తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పించి ప్రభుత్వ విద్యపై తమ నమ్మకాన్ని చాటుకున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల పిల్లలతో కలిసి ఒకే రోజు 25 మంది పాఠశాలలో చేరడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా హెచ్ఎం కె.సునంద అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎంఈఓ రఘునందన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులను ఎంఈఓ, హెచ్ఎం, ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి అక్షరభ్యాసం చేయించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎలిశాల యాదలక్ష్మి, ఉపాధ్యాయులు థామసమ్మ, శివకుమార్, ఉమాదేవి, విజయమేరి తదితరులు పాల్గొన్నారు. -
అటవీ విస్తీర్ణం.. రాష్ట్రంలో అగ్రస్థానం
అటవీశాఖ తాజా నివేదిక ప్రకారం వివరాలు.. సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లాల్లో ములుగు అగ్రస్థానంలో నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల పర్యావరణ సమతుల్యతకు ములుగు జిల్లా అటవీ సంపద ప్రధాన ఆధారంగా ని లుస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 71.82 శాతం అడవులతో కప్పబడి ఉండటం విశేషం. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. మరోవైపు పట్టణీకరణ, వ్యవసా య విస్తరణ కారణంగా హనుమకొండ, జనగామ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉంది. అదే వరుసలో వరంగల్ జిల్లా కూడా నిలిచింది. ములుగు ఎందుకు ప్రత్యేకమంటే.. ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి అటవీ ప్రాంతాలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. గోదావరి పరీవాహక ప్రాంతం జీవవైవిధ్యానికి కేంద్రబిందువు. పులులు, చిరుతలు, అడవి దున్నలు, అరుదైన వృక్షజాతులకు నిలయం. ఈ నేపథ్యంలో రోజురోజుకూ విస్తరిస్తున్న అడవులతో ములుగు అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా వెలుగొందుతోంది. ఇదే సమయంలో అభివృద్ధి, పట్టణీకరణ పేరిట హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో రోజురోజుకూ కలుగుతున్న అటవీ నష్టం ఆందోళన కలిగిస్తోంది. అటవీ భూముల ఆక్రమణలు, పోడు సాగు, అటవీ అగ్నిప్రమాదాలు, రహదారి ప్రాజెక్టులు వంటి కారణాలతో అటవీ సంపదపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల జాబితాలో జయశంకర్ భూ పాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలు కూడా ఉన్నాయని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ● భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోనూ గణనీయం ● అట్టడుగున జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలు ● ఉమ్మడిజిల్లాకు గ్రీన్ కవచం ములుగు అటవీ సంపద ● మూడు జిల్లాలకు పర్యావరణ గండం పర్యావరణ పరిరక్షణలో అడవులే కీలకం ఉష్ణోగ్రతల నియంత్రణ, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెంపు, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ సంపద కీలకం. అడవుల పరిరక్షణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత రక్షణ, వన్యప్రాణుల ఆవాసం, వర్షపాతం సమతుల్యత, భూగర్భ జలాల పెరుగుదల, గిరిజనుల జీవనోపాధికి ఆధారమైన అడవులు అంతరించిపోకుండా చూడాలి. – డాక్టర్ కె.పురుషోత్తం, రిటైర్డ్ డీఎఫ్ఓ, పర్యావరణ నిపుణుడు హనుమకొండములుగుమహబూబాబాద్జనగామవరంగల్భూపాలపల్లిభౌగోళిక విస్తీర్ణం (చ.కి.మీ) అటవీ విస్తీర్ణం (చ.కి.మీ) హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో బుధవారం ఉదయం 8:36 గంటలకు జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతీస్వామి చేతుల మీదుగా నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు స్వామీజీని ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతించారు. స్వామీజీ అమ్మవారికి పూజలు చేసిన అనంతరం వేదపండితులు, వేద విద్యార్థులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా అమ్మవారి గర్భాలయం ఆవరణలో నూతనంగా తయారు చేసిన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన జరిపారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఇరిగేషన్ ఎస్ఈ హరివెంకటరామ ప్రసాద్, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకృష్ణప్రసాద్, దాతలు తొట్రెడ్డి హృదయ్కుమార్రెడ్డి, అర్చన దంపతులు, జారతి వెంకటేశ్వర్లు, గోపాల విజయకుమార్, పుప్పాల శివశంకర్, మూల రాంమూర్తి, బొమ్మగాని కృష్ణమూర్తి, పురం సతీశ్కుమార్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్కుమార్రెడ్డి, పూర్ణచందర్, మోతుకూరి మయూరి రాజేశ్వర్రావు, స్రవంతి, సుగుణ, క్రాంతికుమార్, ఆంజనేయులు, శ్రీధర్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అయితా గోపీనాథ్ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ప్రజలకు ఇబ్బందులు ఉండొద్దు..
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా లింగాలఘణపురం: ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. బుధవారం లింగాలఘణపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆ కస్మిక తనిఖీ చేశారు. భూముల రిజిస్ట్రేషన్లో తహసీల్దార్ అండాలు వేలిముద్రలు సరిగా పడకపోవడంతో ఆరా తీశారు. రిజిస్ట్రేషన్ గది ప్రజలకు సౌకర్యంగా సీసీ కెమెరాల నిఘాలో ఉండాలని, రికార్డులు క్రమపద్ధతిలో అమర్చాలని, జీపీఓలు, ఆర్ఐ కూర్చునే గదులను కూడా పరిశీలించి బీరువాలు ఒకేచోట అమర్చితే గదులు సరిపోతాయన్నారు. ప్రజలు కింద కూర్చోకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే కస్తూర్బాగాంధీ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు లక్ష్యసాధనతో ముందుకు వెళ్లాలన్నారు. గణితం ప్రశ్నలు వేసి తానే స్వయంగా వివరించారు. ఆయనతో పాటు జీసీడీఓ గౌసియాబేగం, తదితరులు ఉన్నారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
నర్మెట: విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గోపగోని శ్రీధర్గౌడ్, ప్రిన్సిపాల్ పుష్పకుమారి అన్నారు. స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్యపుస్తకాలను బుధవారం అందించారు. ఇంగ్లిష్ మీడియం విద్య, అల్పాహారం, భోజనం, దుస్తులతో పాటు పలు వసతులను ప్రభుత్వం కల్పించిందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏఏపీ చైర్పర్సన్ రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జనగామ రూరల్: పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం తెలంగాణ రైజింగ్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిజిటల్ లిటరసీ కృత్రిమ మేథా అనే అంశంపై శిక్షణా కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ డాక్టర్ ఆకుల వెంకటవంశీకృష్ణ కృత్రిమ మేథా ఆవశ్యకతను వివరించి ప్రయోగాత్మకంగా సాధన చే యించారు. బి.ఎన్. సురేఖ, అనగాని శ్రీని వాస్, సంగం సంధ్య పాల్గొన్నారు. ఫిట్నెస్ లేని వాహనాల సీజ్జనగామ రూరల్: పాఠశాలలు పునఃప్రారంభమైన నేపధ్యంలో పట్టణంలో ప్రైవేట్ స్కూల్ వాహనాలను డీటీఓ ఎంఆర్ శిల్ప బుధవారం తనిఖీలు చేశారు. ఫిట్నెస్, ట్యాక్స్ లేని ఆరు వాహనాలను సీజ్ చేశారు. 11 కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన అన్ని ప్రమాణాలు పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఏఎంవీఏ శ్వేత, నవిత తదితరులు పాల్గొన్నారు. నర్మెట(తరిగొప్పుల): క్రమశిక్షణ, నిజాయితీ, సమయపాలనతో పాటు ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని వెస్ట్జోన్ డీసీసీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. తరిగొప్పుల పోలీస్ స్టేషన్ను బుధవారం ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. రికార్డులు, స్టేషన్ ప్రాంగణం, రిసెప్షన్, రికార్డుల గదులు, సీసీటీఎన్ఎస్ పని ప్రదేశాలను, ఆన్లైన్ పురోగతి, యూఐ కేసులు, పెండింగ్ కేసుల రికార్డులు పరిశీలించారు. గ్రామాల్లో పెట్రోలింగ్ను పెంచాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సీఐ ముసుకు అబ్బయ్య, ఎస్సై గుగులోతు శ్రీదేవి, సిబ్బంది ఉన్నారు. -
మత్తు.. జరిమానా మస్తు
‘గ్రేటర్’ పరిధిలో ముమ్మరంగా డ్రంకెన్డ్రైవ్ తనిఖీలువరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతీ రోజూ డ్రంకెన్డ్రైవ్ కేసులు బుక్ అవుతుండగా కోర్టులు జరిమానాలు విధించడంతోపాటు మత్తు మోతాదు పెరిగిన వాహనదారులు జైలుబాట పడుతున్నారు. కేసుల సంఖ్య చూస్తే ఓ వైపు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ మరోవైపు ప్రమాదాలు జరగకుండా పోలీసులు చేస్తున్న కట్టడి సత్ఫలితాలనిస్తోంది. ట్రైసీటి పరిధిలో రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతోంది. అదేరీతిలో మత్తులో వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైన వాహనదారులపై కేసుల నమోదు సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్డ్రైవ్ పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆరు నెలల్లో కేసులు వేలల్లో ఉండగా జరిమానా కోట్లు దాటింది. వాహనదారులు మారితేనే ప్రమాదాలు తగ్గుతాయనే కారణంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడ్డ వారికి వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలోని కౌన్సెలింగ్ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. తాగి నడపడం వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్నారు. ఆరు నెలల్లో 12,277 కేసులు.. ట్రైసిటీలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు నెలల్లో 12,277 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు ప్రధాన కూడళ్లు, జంక్షన్లు, రైల్వే స్టేషన్, బస్స్టేషన్లు, సిగ్నిల్ పాయింట్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో ఒక్కోసారి వాహనదారులు మద్యం మత్తులో పోలీసులపై తిరగబడిన ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. ట్రైసిటీలో ఆరు నెలల్లో 8 మందిపై క్రిమినల్ కేసులు పెట్టారు. వీకెండ్లో తనిఖీలు పెంచుతున్నాం.. వీకెండ్లో మందుబాబుల కోసం తనిఖీలు పెంచుతున్నాం. మత్తులో జరుగుతున్న ప్రమాదాలపై కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేస్తుంటే పోలీసులపై కొంతమంది మందుబాబులు తిరుగుబాటు చేస్తున్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. పదే పదే పట్టుబడ్డవారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మద్యం సేవించి వాహనాలను నడపొద్దు అనే నిబంధన పెట్టుకుని బయటకు రావాలి. – సత్యనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ ఆరు నెలల్లో కేసులు 12,277.. జరిమానా రూ.1.39 కోట్లు జైలుశిక్ష పడిన వాహనదారులు 230 మంది మద్యం తాగి వాహనాలు నడపొద్దంటున్న ట్రాఫిక్ పోలీసులు జైలు.. సామాజిక సేవ దొరికిన మందుబాబులకు కోర్టు జరిమానా తోపాటు 230 మందికి జైలుశిక్ష విధించింది. 33 మంది వాహనదారులను సామాజిక సేవ చేయాలని కోరు ఆదేశించింది. రెండు సార్లు పట్టుబడిన వారితోపాటు రీడింగ్ 100 దాటిన 246 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సుల రద్దు కోసం ట్రాఫిక్ పోలీసులు సిఫారసు చేశారు. వాహనాలను ఇష్టారీతిన నడిపి పట్టుబడిన సుమారు 9,749 మందికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
‘ఉపాధి’లో 4వ స్థానం
పని దినాల కల్పనలో జిల్లా ముందంజ● సగటున రోజుకు 28వేల మంది కూలీలు హాజరు ● పకడ్బందీగా ఎన్ఎంఎంఎస్ యాప్ అటెండెన్స్ ● జిల్లాలో జోరుగా ఉపాధి పనులుజనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం (వీబీ జీ రాంజీ) అమలులో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా 4వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజివిక మిషన్ గ్రామీణ) చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గడచిన రెండున్నర నెలల్లో జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలకు 11,26,123 పనిదినాలు కల్పించగా రోజు వారీగా సగటున రోజుకు 28 వేలకు పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని డీఆర్డీఏ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) అమలు చేస్తుండగా ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు విధానంలో ఇబ్బందులు పడుతున్నా.. 90 శాతం పూర్తి చేస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకుంటూ కూలీలు పనులకు హాజరవుతున్నారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం జియో ట్యాగింగ్ విధానాన్ని అమలుచేస్తోంది. ఇప్పటి వరకు పూర్తయిన పనులకు సంబంధించి జియో. ట్యాగింగ్ పూర్తి చేస్తేనే బిల్లులను మంజూరు చేస్తోంది. ఈనెల 6వ తేదీ నాటికి చేపట్టిన పనులకు కూలీలకు వేతనాలు అందించామని అధికారులు తెలుపు తున్నారు. లక్ష్యం 23 లక్షలు.. జిల్లావ్యాప్తంగా మొత్తం 23 లక్షల పని దినాలను కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 11.26 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించారు. మొత్తంగా 55 శాతం వరకు లక్ష్యాన్ని పూర్తి చేశారు. మిగతా రోజుల్లోనూ పనిదినాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రోజువారీగా రూ.250 నుంచి రూ. 307 వరకు చెల్లించాల్సి ఉండగా జిల్లాలో సగటున రూ.274 వరకు అందుతోంది. పెద్ద సంఖ్యలో పనులు చేపట్టడంలో సఫలమవుతున్న అధికారులు జియో ట్యాంగింగ్ ప్రక్రియ సైతం పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. దీంతో సకాలంలో డబ్బులు జమయ్యే అవకాశం నెలకొంది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఉపాధి పనులకు ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు. 71,723 యాక్టివ్ జాబ్కార్డులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ కుటుంబానికి వీబీజీ రా మ్ జీ పథకంలో 125 రోజులకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. జిల్లాలో 1.16 లక్షల కుటుంబాలకు జా బ్ కార్డులుండగా 2,24,748 కూలీలు ఉన్నారు. వీరి లో యాక్టివ్గా ఉన్న 71,723 జాబ్కార్డుల్లో 1,23, 913 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 50 శాతం వరకు కూలీలు పనులకు హాజరవుతున్నారు. పకడ్బందీగా చేపడుతున్నాం.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు నిర్వహిస్తున్నాం. పనులు సక్రమంగా చేపట్టడం, సకాలంలో వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైన ఇబ్బందులు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నాం. ఉపాధి పనుల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలవడం అభినందనీయం. – భాస్కర్, డీఆర్డీఓ జిల్లాలో ఉపాధి కూలీల వివరాలుజాబ్కార్డులు : 1,16,127కూలీలు : 2,24,748పనిదినాల లక్ష్యం : 23.81 లక్షలు పూర్తయిన లక్ష్యం : 11 లక్షలు సగటున కూలీల హాజరు : 28 వేలు గ్రామాల వారీగా : 117సగటు కూలీలు మొత్తం గ్రామాలు : 280 -
‘లూప్లైన్’ గుబులు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : పోలీస్శాఖలో పోస్టింగ్లు, బదిలీల వ్యవహారంపై డీజీపీ కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ అంతర్గత కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో ఏళ్ల తరబడి లాఅండ్ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, పోలీస్స్టేషన్లలో కొనసాగుతున్న అధికారుల వివరాలను పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకేచోట పనిచేస్తున్న నల్లగొండ జిల్లాలోని సైదులు అనే ఎస్ఐని ఇటీవల ఇతర విభాగాలకు డిప్యుటేషన్పై పంపగా.. క్యాన్సల్కు ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీ చేయడంపై సీరియస్ అయిన డీజీపీ అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అంశం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. లాఅండ్ఆర్డరే ముద్దు.. డిప్యుటేషన్లు వద్దు.. సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికై న అధికారి తాను సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందే ముందు హోంశాఖ పరిధిలోని పోలీస్ అనుబంధ విభాగాల్లో డిప్యుటేషన్పై పనిచేయడం తప్పనిసరి. సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) పదోన్నతి పొందే ముందు కూడా లూప్లైన్ పోస్టింగ్లో పనిచేసి ఉండాలి. ఇలా పోలీస్ మాన్యువల్ ప్రకారం ప్రతీ అధికారి ఈ నిబంధనలు అనుసరించాల్సి ఉంది. స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ/సీసీఆర్బీ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్, ఇంటలిజెన్స్, సీసీఎస్ తదితర విభాగాల్లో పని చేయాల్సి ఉంది. కానీ చాలామంది డిప్యుటేషన్లకు దూరంగా శాంతిభద్రతలు, నగర, పట్టణ ఠాణాల పోస్టింగ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేడర్లకు చెందిన 1,700 మంది డిప్యుటేషన్లకు దూరంగా కీలక పోస్టింగ్లలో కొనసాగినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. వరంగల్ కమిషనరేట్తోపాటు ఉమ్మడి జిల్లాలో వివిధ కేడర్లలో పని చేసినవారు, చేస్తున్న వారు వంద మందికిపైనే ఉంటారని చెబుతున్నారు. కొనసాగుతున్న వివరాల సేకరణ... డిప్యుటేషన్ల నిబంధన కొందరికే వర్తించగా, మరికొందరు వాటికి దూరంగా కోరుకున్నచోటే పని చేశారన్న చర్చ ఉంది. తాజాగా ఈ నిబంధన అమలుపై దృష్టిసారించిన అధికారులు.. వివిధ కేడర్లకు చెందిన వారి వివరాలు సేకరిస్తుండటం గమనార్హం. వివరాల సేకరణలో భాగంగా ప్రమోషన్కు ముందు లూప్లైన్లో పనిచేశారా? ఎన్ని సంవత్సరాలుగా ఒకే విభాగంలో కొనసాగుతున్నారు? ఒకే పట్టణం లేదా సబ్డివిజన్లో దీర్ఘకాలంగా ఉన్నారా? బదిలీల సమయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులు వినియోగించుకున్నారా? శాఖ నిర్ణయాలను సవాల్ చేసిన సందర్భాలున్నాయా? అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు ఉన్నా.. సగం మందికి ఈసారి డిప్యుటేషన్లు తప్పవన్న చర్చ జరుగుతుండగా.. ఇంతకాలం డిప్యుటేషన్లతో కాలం వెళ్లబుచ్చుతున్న మరికొందరిలో ఠాణా పోస్టింగ్లు రావచ్చన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. పోలీస్వర్గాల్లో చర్చనీయాంశంగా డీజీపీ ప్రకటన డిప్యుటేషన్లకు దూరంగా ఉన్నవారి వివరాల సేకరణ తెరపైకి లాఅండ్ఆర్డర్ పోస్టింగ్ల గుట్టు కమిషనరేట్లో సగంమంది ఈసారి లూప్లైన్కే -
పాఠశాలలు, కళాశాలల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కొలతలు
జనగామ: పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ కోసం మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కొలతలు తీసుకునే ప్రక్రియ చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల భవనాల విస్తీర్ణాన్ని నిబంధనల ప్రకారం వెరిఫై చేసి, ప్రాపర్టీ ట్యాక్స్ నిర్ధారణ కోసం అధికారులు కొలతలు నమోదు చేశారు. కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. పట్టణంలోని అన్ని విద్యాసంస్థల్లో పారదర్శకంగా పన్ను నిర్ధారణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో లోపాలు లేకుండా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. స్కూల్ బస్సుల తనిఖీజనగామ: జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో రవానాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా రవాణా అధికారి(డీటీఓ) ఎంఆర్ శిల్ప ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులు ప్రైవేటు స్కూల్ బస్సులను మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని పలు ప్రైవేటు స్కూల్ బస్సులకు జరిమానాలు విధించారు. తనిఖీల్లో ఎంవీఐ విష్ణు దీపక్, ఏఎంవీఐలు శ్వేత, నవిత పాల్గొన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఓ శిల్ప హెచ్చరించారు. రెండు బస్సుల సీజ్ పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలో స్కూల్ బస్సులను ఏఎంవీఐ శ్వేతారెడ్డి తనిఖీ చేశారు. 10కి పైగా పాఠశాలల బస్సులను ఆపి తనిఖీ చేశారు. ఇందులో ఫిట్నెస్ లేని రెండు బస్సులను సీజ్ చేశామని ఆమె వెల్లడించారు. బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలిరఘునాథపల్లి: ప్రతీ ఒక్కరు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక వృద్ధి సాధించాలని ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్ హేమలత సూచించారు. మంగళవారం మండలంలోని నిడిగొండలో జనగామ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం (ఎఫ్ఎల్సీ) ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్లో బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ బీమా పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.. కేంద్ర పభుత్యం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి, అటల్ పెన్షన్ బీమా యోజన పథకాలు, ఆడపిల్లల భవిష్యత్ కోసం ప్రవేశ పెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం, సేవింగ్స్ ఖాతాల నిర్వహణ, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంచుకోవాలన్నారు. లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ మూర్తి మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగానికి సంబంఽధించిన వివిద సేవలు, రుణ సదుపాయాల గురించి వివరించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ పరమేశ్వర్, ఫీల్డ్ ఆఫీసర్ నవీన్రెడ్డి, జనగామ ఆర్థిక ఆక్షరాస్యత కౌన్సిలర్స్ అనిల్గౌడ్, ఉదయ, ప్రమోద్, ఎస్హెచ్జీ మహిళలు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలిరఘునాథపల్లి: ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని, వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీంశర్మ సూచించారు. మంగళవారం రాత్రి మండలంలోని వెల్ది గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు..అపరిచితుల నుంచి వచ్చే ఫోన్కాల్స్, లింక్లు నమ్మ వద్దని, ఓటీపీని ఇతరులకు చెప్పవద్దన్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 హెల్ప్లైన్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై దూదిమెట్ల నరేష్, సర్పంచ్ సింగిరెడ్డి సునిత తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లపై వాహనాలు!
సెల్లార్లలో వ్యాపారాలు జనగామ: పార్కింగ్ కోసం నిర్మించిన సెల్లార్లు జిల్లా కేంద్రంలో వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. బ్యాంకులు, షోరూంలు, వాణిజ్య సముదాయాల్లో నిబంధనలకు విరుద్ధంగా గోదాములు, దుకాణాలు, డ్యాన్స్ స్కూల్స్, ఇంటర్నెట్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. దీంతో రోడ్లపైనే వాహనాల పార్కింగ్ పెరిగి ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. గతంలో అగ్నిప్రమాదాలు జరిగిన అనుభవాలు ఉన్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా సెల్లార్ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ ప్రాంతంతో పాటు స్వర్ణ కళామందిర్ పరిసరాల్లోని పలు బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, రెండు నుంచి మూడు అంతస్తుల భవనాల్లో పార్కింగ్ కోసం నిర్మించిన సెల్లార్లలో ప్రస్తుతం వివిధ వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ రోడ్డు ప్రాంతంలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫ్లైవుడ్ దుకాణాలు, వాహనాల షోరూంలకు చెందిన భవనాల్లో కూడా సెల్లార్లను గోదాములుగా, సరుకుల నిల్వ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. అలాగే బాలాజీనగర్ గల్లీలోని ప్రధాన రహదారిపై ఉన్న పలు బ్యాంకులు, అపార్ట్మెంట్ల సెల్లార్లలో ప్రైవేట్ సంస్థలు, డ్యాన్స్ స్కూల్స్, ఇంటర్నెట్ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పార్కింగ్ కోసం ఉద్దేశించిన స్థలాలు పూర్తిగా వాణిజ్య అవసరాలకు మళ్లిపోవడంతో వాహనదారులు తమ కార్లు, ద్విచక్ర వాహనాలను రోడ్లపైనే నిలిపివేయాల్సి వస్తోంది. దీంతో ఎస్బీఐ పరిసరాలు, బాలాజీనగర్, హైదరాబాద్ రోడ్డు, స్వర్ణ కళామందిర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా పండుగలు, సెలవు దినాలు, వ్యాపార రద్దీ సమయాల్లో వాహనాలు రోడ్డు పక్కన వరుసగా నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక వాహనం నిలిచిపోతే మరో వాహనం ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విజయ షాపింగ్ మాల్తో పాటు మరికొన్ని వాణిజ్య భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించి ఆస్తి నష్టం జరిగిన ఘటనలు పట్టణ ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. అప్పుడు సెల్లార్ల వినియోగంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి మళ్లీ యథాస్థితికే వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న సెల్లార్లు వందకు పైగా ఉండొచ్చని అంచనా. భవన యజమానులు అధిక అద్దెల ఆశతో సెల్లార్లను వ్యాపార సంస్థలకు కేటాయిస్తుండగా, పార్కింగ్ సదుపాయం లేక వాహనదారులు రోడ్లపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో పోలీసులు వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. అయితే పార్కింగ్ స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న భవన యజమానులు, వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవాలా లేక రోడ్లపై వాహనాలు నిలిపే వాహనదారులపైనా జరిమానాలు విధించాలా అనే అంశంపై పట్టణంలో చర్చ జరుగుతోంది. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో జరుగుతున్న వ్యాపారాలపై అధికారులు వెంటనే దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని పట్ట ణ ప్రజలు కోరుతున్నారు. భవన నిర్మాణ నిబంధనల ప్రకారం 750 నుంచి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన భవనాలకు ఒక సెల్లార్, 1,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం ఉన్న భవనాలకు రెండో అంతస్థులో సెల్లార్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సెల్లార్లు పూర్తిగా వాహనాల పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించాలి. అయితే పట్టణంలోని పలు వాణిజ్య భవనాలు, బ్యాంకులు, అపార్ట్మెంట్లలో ఈ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సంబంధిత పురపాలక అధికారులు భవనాల విస్తీర్ణం, అనుమతులు, సెల్లార్ల వినియోగంపై క్షేత్రస్థాయిలో కొలతలు వేసి తనిఖీలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలకు కష్టాలు బ్యాంకులు, షోరూంలు, దుకాణాల కింద పొంచి ఉన్న ప్రమాదం గతంలో అగ్నిప్రమాదాలు జరిగినా పట్టించుకోని యజమానులు నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్భవన నిర్మాణ నిబంధనల ప్రకారం 750 నుంచి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న భవనాలకు ఒక సెల్లార్, 1,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం ఉన్న భవనాలకు అవసరమైన మేర అదనపు పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. సెల్లార్లను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. పట్టణంలో సెల్లార్ల వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించిన భవన యజమానులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తాం. -
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: జిల్లాలోని పెంబర్తి మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కళా శాల ప్రిన్సిపల్ కె.భాగ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ ఎంపీసీ, ఎమ్ఎస్సీఎస్, ఎమ్ఈసీఎస్, ఎమ్పీసీఎస్, బీజెడ్సీ,, బీకామ్ సీఏ, బీఏ (ఈపీహెచ్) కోర్సులు ఉన్నాయని తెలిపారు. ఇంటర్ పా స్ అయిన ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 17 నుంచి 19లోపు కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్ వసతి, తదితర సౌకర్యాలు ఉంటాయన్నారు. వివరా లకు 70133 10928, 93472 13549 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
మోగనున్న మంగళవాయిద్యాలు
● నేటినుంచి శుభముహూర్తాలు ● జిల్లాకు పెళ్లికళ ● గృహ ప్రవేశాలకు ఏర్పాట్లుజనగామ: గత నెల 14వ తేదీ నుంచి నిలిచిపోయిన శుభముహూర్తాలు నేటి (బుధ వారం) నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు కుటుంబాలు ఏర్పాట్లలో నిగ్నమయ్యాయి. ముహూర్తాలు లేక మందగించిన ఫంక్షన్హాళ్లు, పురోహితులు, భాజా భజంత్రీలు, డెకరేషన్, క్యాటరింగ్ తదితర అనుబంధ వ్యాపారాలు మళ్లీ కళకళలాడనున్నాయి. జూలై 8వ తేదీ వరకు 10 శు భ ముహూర్తాలు ఉండడంతో జిల్లాలో పండగ సందడి మొదలైంది. నేటి నుంచి.. ఈనెల 17వ తేదీ నుంచి వచ్చే నెల జూలై 8వ తేదీ వరకు శుభముహూర్తాలు అందుబాటులో ఉన్నాయని పట్టణంలోని బతుకమ్మకుంట విజయదుర్గా మాత ఆలయ ప్రధాన పూజారి ఆరాధ్య శర్మ తెలిపారు. జూన్ 19, 24, 25, 26 తేదీలతో పాటు జూలై 1, 2, 3, 4, 5, 8 తేదీల్లో వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే జూలై 8 తర్వాత మళ్లీ శుభముహూర్తాలకు విరామం ఉండగా, ఆగస్టు 16వ తేదీ నుంచి తిరిగి శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు ప్రారంభమవుతాయని వేద పండితులు పేర్కొన్నారు. -
చల్లబడని సూరీడు..
జనగామ: జిల్లాలో వారం రోజులుగా వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలు తీవ్రంగా మండుతుండగా, ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మే నెలలో నమోదైన ఎండలతో పోలిస్తే ప్రస్తుతం ఉక్కపోత అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. భానుడి నిప్పులు పగటిపూట భానుడు నిప్పులు చెరుగుతుండగా, సాయంత్రం సమయానికి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే వర్షం పడిన కొద్దిసేపటికే మళ్లీ వేడి, ఉక్కపోత ప్రారంభమవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో తరచూ చోటుచేసుకుంటున్న ఈ మార్పులు చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం పెరగడం వల్ల డీ హైడ్రేషన్, తలనొప్పి, అలసట, కడుపు నొప్పి, జ్వరం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నెల 12వ తేదీ తర్వాత ఎండలు తగ్గినట్టే కనిపించినప్పటికీ, 14, 15, 16 తేదీల్లో ఒక్కసారిగా తీవ్రత పెరిగాయి. దీంతో ఫుట్పాత్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ఎండలు, ఉక్కపోత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పొద్దంతా భగభగలు.. సాయంత్రం కారుమబ్బులు వాతావరణంలో వింత మార్పులు అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు -
ఉపాధి నిధులతో పల్లెల అభివృద్ధి
జనగామ: నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.91లక్షలతో18 అభివృద్ధి పనుల ప్రతిపాదనలను తయారు చేసి కలెక్టర్, డీపీసీకి సమర్పించినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 10 విద్యాసంస్థలకు రక్షణ గోడలు, ఎస్సీ కాలనీలు, గిరి జన తండాల్లో 7 అంతర్గత సీసీ రోడ్లు, ఒక అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేపట్టడం వల్ల స్థానికంగా 4,500 పైగా పని దినాలు పెరుగుతాయన్నారు. పరిపాలనా అనుమతులు వచ్చిన రూ.40 లక్షల పనులకు త్వరలో టెండర్లు పిలిచి వర్షాకాలం తర్వాత పనులు ప్రారంభిస్తారన్నారు. మిగతా ప్రతిపాదనలకు అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులను కోరినట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి
జనగామ రూరల్: విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, అలాగే పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మంగళవారం జనగామ మండలంలోని ఓబుల్కేశవాపూర్ జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాల, అంగన్న్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యా కార్యక్రమాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హాజరు, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించి, ప్రతీ విద్యార్థికి పుస్తకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువులు, లక్ష్యాలు, అభిరుచుల గురించి అడిగి తెలుసుకున్నారు. ‘సర్’ విజయవంతానికి బీఎల్ఓల పాత్ర కీలకం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవల్ అధికారుల పాత్ర (బీఎల్ఓలు) కీలకం అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్లు (రఘునాథపల్లి, చిల్పూర్ తహసీల్దార్లు) పవర్ పాయింట్ ప్రజెంటేష న్ ద్వారా క్షుణ్ణంగా శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఐఆర్ ప్రక్రియపై వాల్పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరాం, కిరణ్ ప్రకాష్, తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
వెల్లువెత్తిన వినతులు
జనగామ: జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంపై ప్రజల్లో విశ్వాసం రోజు రోజుకూ పెరుగుతోంది. తమ సమస్యలు అధికారుల దృష్టికి చేరి న్యాయం జరుగుతుందనే నమ్మకంతో జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి సైతం వందలాది మంది ప్రజలు గ్రీవెన్స్కు తరలివస్తున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రతీ వినతిని స్వయంగా స్వీకరిస్తూ, సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తుండడంతో గ్రీవెన్స్ ప్రజల ఆశలకు నమ్మకంగా మారుతోంది. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాల్లో జరిగిన గ్రీవెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని, ప్రజలతో అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతీ దరఖాస్తును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు. కాగా, గ్రీవెన్స్లో 532 దరఖాస్తులు వచ్చాయి. భూ వివాదాలు, రహదారుల సమస్యలు, గృహ నిర్మాణ అనుమతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాభివృద్ధి, విద్యాసంస్థల సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ వినతులను సమర్పించారు. రఘునాథపల్లి మండలం కోమళ్ల గ్రామస్థులు కర్ణాలకుంట చెరువు కట్టపై ముళ్ల చెట్లను తొలగించి శ్మశానవాటిక స్థలాన్ని రక్షించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్ గ్రీవెన్స్కు తరలివచ్చిన అర్జీదారులు ఒక్కరోజే 532 వినతులు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం -
పోలియోరహిత జిల్లా లక్ష్యంగా కృషి
జనగామ రూరల్: పోలియో రహిత జిల్లా లక్ష్యంగా కృషి చేయాలని, అందుకు సమగ్ర కార్యాచరణ, పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 0–5 సంవత్సరాల వయసు గల 33,651 మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయాలన్నారు. 277 మంది వలస పిల్లలను కూడా గుర్తించి టీకా వేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ మల్లికా ర్జునరావు, విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, డీపీఓ వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జాతీయ రహదారులపై భద్రతకు చర్యలు జాతీయ రహదారులపై భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణభద్రతే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గోవర్ధనగిరి జంక్షన్ వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, ప్రమాదాల నివారణకు అవసరమైన శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాల బస్సుల ఫిట్నెస్ పరీక్షలను త్వరగా పూర్తి చేయాలని, డ్రైవర్తో పాటు కండక్టర్ కూడా ఉండాలని, ప్రతీ బస్సులో సీసీ కెమెరాలు ఉండాలన్నారు. ఇన్చార్జ్ ఆర్అండ్బీ ఈఈ సరిత, ఎకై ్సజ్ అధికారి అనిత, డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, నేషనల్ హైవేస్ అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలను నియంత్రించాలి మత్తు పదార్థాల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల నియంత్రణపై ఎకై ్సజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వారంలోగా వనమహోత్సవం పూర్తి చేయాలి వారంలోగా వనమహోత్సవం పూర్తి చేయాలని, సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ తదితర అంశాల మీద ఎంపీడీఓలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల మంజూరుకు సంబంధించి తనిఖీని వారంలోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రంగారావు, విద్యుత్ శాఖ ఎస్ఈ సంపత్ రెడ్డి, ఇన్చార్జ్ డీపీఓ వెంకట్ రెడ్డి, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అమ్మ పేరుతో మొక్కను నాటండి పర్యావరణ పరిరక్షణ, హరితహారం విస్తరణకు అమ్మ పేరుతో మొక్కను నాటాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కారప్స్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్ 2026’ జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీకి సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి సందీప్ కుమార్ ఝా ఆవిష్కరించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ఇంగ్లిష్ టీచర్ మాకొద్దు
● ఉపాధ్యాయురాలి వ్యవహారశైలిపై గ్రామస్తుల నిరసన ● నష్కల్ పాఠశాలలో పునఃప్రారంభం రోజే గొడవ చిల్పూరు: మండలంలోని నష్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభం రోజే ఇంగ్లిష్ టీచర్ తమకు వద్దంటూ పాఠశాల ఆవరణలో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఈనెల 11వ తేదీన బడిబాట కార్యక్రమంలో భాగంగా హెచ్ఎం శ్రీదేవి ఆదేశాలతో ఉపాధ్యాయులు ఇంటింటి సర్వే చేపట్టారు. ఈక్రమంలో ఇదే పాఠశాలలో 8వ తరగతి చదివే ఓ విద్యార్థిని ఇంగ్లిష్ టీచర్ జ్యోతిలక్ష్మికి కనిపించింది. దీంతో విద్యార్ధినిని పక్కకు తీసుకెళ్లి ‘నీకు అమ్మనాన్నలు లేరని, ఎవరికీ పుట్టావో తెలియదు’ అని వింత ప్రశ్నలు వేసి వెళ్లి పోయింది. దీంతో ఆ బాలిక మనస్తాపంతో నిద్రహారాలు మాని తన తల్లిదండ్రులు ఎవరో చెప్పాలంటూ తనను సాకుతున్న వారితో గొడవ చేసింది. దీంతో వారు ‘నీకు ఎవరో తప్పు చెప్పారు.. మేమే నీ తల్లిదండ్రులం’ అని చెప్పినా వినలేదు. ఈ విషయాన్ని సర్పంచ్ శాతబోయిన రాజు, ఉప సర్పంచ్ అరూరి మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. వారు బాలిక వద్దకు వచ్చి ‘నీకు ఎవరు అలా చెప్పారు..’ అని అడగడంతో ఇంగ్లిష్ టీచర్ పేరు చెప్పింది. సోమవారం ఉదయం పాఠశాల సమయంలో బాలికతోపాటు సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు పాఠశాలకు వెళ్లే ముందు ఎస్సై సిరిపురం నవీన్కుమార్, ఎంఈఓ దాసరి గోవర్ధన్కు సమాచారం ఇచ్చి వెళ్లారు. హెచ్ఎం శ్రీదేవితో మాట్లాడుతుండగానే ఒక్కసారిగా ‘నా మీద ఆరోపణలు చేయడానికి వచ్చారా?..’అంటూ ఆవేశంతో టేబుల్పై ఉన్న పుస్తకాలను గ్రామస్తుల మీదకు విసురుతూ దుర్భాషలాడింది. దీంతో గ్రామస్తుల పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆదేశాలతో ఎంఈఓ పాఠశాలకు వెళ్లి విచారణ చేస్తున్న సమయంలోనూ టీచర్ అలాగే ప్రవర్తించడంతో ఆమె భర్త ఆమెకు ఆరోగ్యం బాగాలేదని సమాధానం చెపుతూ వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎంఈఓ మాట్లాడుతూ.. ఆమె పాఠశాలలో ప్రవర్తించిన తీరు బాగాలేదంటూ కలెక్టర్కు వివరించారు. పూర్తి ఆదేశాలు వచ్చే వరకు ఆ టీచర్కు సెలవు ఇచ్చారు. -
హాజరు..అంతంతే!
జనగామ: వేసవి సెలవుల అనంతరం సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత బడులు తెరుచుకోవడంతో గ్రామాలు, పట్టణాల్లో విద్యాలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పాఠశాలలను మామిడి, ఆరటి తోరణాలు, పూల అలంకరణలు, గ్రీన్ కార్పెట్లతో అందంగా ముస్తాబు చేసిన ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందిస్తూ ఘనంగా స్వాగతం పలి కారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, సౌకర్యాలపై ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విభాగాల్లో మొత్తం 508 పాఠశాలలు, 42 వసతి గృహాలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాల పంపిణీ మొదటి రోజు బడికి వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి నూతన యూనిఫాంలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఎక్కువ మంది విద్యార్థులు పాత వాటితోనే వచ్చారు. ఇంటింటికీ బడిబాట బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రుల ను కలిశారు. ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరు తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎఫ్ఆర్ఎస్ హాజరులో సాంకేతిక ఇబ్బందులు పాఠశాలల పునఃప్రారంభం రోజున ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) హాజరు నమోదులో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జిల్లాలో సుమారు 2,900 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, వారిలో 800ల మందికి ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు కాకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిపై వెంటనే స్పందించిన విద్యాశాఖ అధికారులు సంబంధిత ఉపాధ్యాయులకు వాట్సాప్ ద్వారా సూచనలు జారీ చేసి, ప్రత్యామ్నాయ లింక్ ద్వారా హాజరు నమోదును పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో కొందరు విద్యార్థుల హాజరు నమోదులో కూడా ఎఫ్ఆర్ఎస్ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. గ్యాస్ పొయ్యిలపైనే మధ్యాహ్నం భోజనం మధ్యాహ్న భోజన పథక నిర్వహణపై కూడా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని పాఠశాలల్లో గ్యాస్ పొయ్యిలపైనే వంట చేయాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యా అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు 80 శాతం పాఠశాలల్లో గ్యాస్పై వంట నిర్వహించారు. అమావాస్య ఎఫెక్ట్.. అమావాస్య ప్రభావం మొదటి రోజు హాజరుపై స్పష్టంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల హాజరు శాతం 30 శాతం కూడా దాటలేదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కొన్ని పాఠశాలల్లో కేవలం ఒకటి నుంచి రెండు శాతం మంది విద్యార్థులే హాజరయ్యారు. అమావాస్య రోజున పిల్లలను బడికి పంపేందుకు చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మరిన్ని ఫొటోలు 8లో.. అమావాస్య ప్రభావమే కారణం పలుచోట్ల విద్యార్థులకు పూలతో ఘన స్వాగతం ఎఫ్ఆర్ఎస్లో సాంకేతిక సమస్యలు -
పనిచేసే పాఠశాలలోనే కుమారుడిని చేర్పించి..
బచ్చన్నపేట: తాను పనిచేసే పాఠశాలలో తమ బాబును చేర్పించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రభావతి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభావతి–మల్లేశం దంపతులు జనగామలో నివాసముంటున్నారు. ప్రభావతి మండలంలోని ఇటుకాలపల్లి హైస్కూల్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. భర్త మల్లేశం ఏయూ స్మాల్ ఫైనాన్స్లో ఆర్ఎంగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు ఉమేష్ చంద్ర జనగామ గీతాంజలి పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేశాడు. కాగా ఉమేష్ చంద్రను తాను పనిచేస్తున్న ఇటుకాలపల్లి హైస్కూల్లో పదో తరగతిలో చేర్పించారు. ప్రభావతిని ఎంఈఓ ఇర్రి వెంకట్రెడ్డి, ఉపాధ్యాయులు జీవరత్నం, విష్ణు, శ్రీనివాస్, సంతోష్, ఆదేష్, ఐజాక్, ముస్తాఫా అభినందించారు. -
ప్రతిభావంతులకు ‘ఉపకారం’
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఆర్థిక స్థోమత లేక ఉన్నత చదువులు మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రతిభ ఉండి భవిష్యత్లో గొప్ప అవకాశాలు అందుకుని ఉన్నతంగా స్థిరపడడానికి అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ పేద విద్యార్థులకు భరోసా ఇస్తోంది. కేవలం ప్రభుత్వ డిగ్రీ, గురుకుల కళాశాలల్లో చదువుకునే వారికి ఈ అవకాశం లభి స్తోంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు మెరిట్ ఆధారంగా ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.30వేలు, మూడేళ్లకు రూ.90వేలు ప్రేమ్జీ సంస్థ అందిస్తోంది. 18 మంది గిరిజన విద్యార్థినులు ఎంపిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల ప్రతిభను గుర్తించిన అజీమ్ ప్రేమ్జీ యాజమాన్యం ప్రోత్సాహక స్కాలర్షిప్ అందిస్తుండగా జనగామ పట్టణంలోని తెలంగాణ గిరిజన (మహిళ) సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు 18 మంది విశేష ప్రతిభ కనబరిచి అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ అందించే స్కాలర్షిప్కు ఎంపికయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. సంధ్యారాణి విద్యార్థినులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కళాశాల నుంచి అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్కు 18 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. ప్రతిభ ఉండి కష్టపడి చదువుకోవాలని తపన ఉండే ప్రతీ విద్యార్థికి ప్రోత్సాహంగా ఉంటుంది. విద్యార్థినులు భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకోవాలి. దీనివల్ల కళాశాలకు మరింత పేరు ప్రతిష్టలు లభించాయన్నారు. – ప్రిన్సిపాల్ జి.సంధ్యారాణి పేద విద్యార్థులకు అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ భరోసా ప్రభుత్వ డిగ్రీ, గురుకుల కళాశాల విద్యార్థినులకు అవకాశం గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ నుంచి 18మంది ఎంపిక ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.30వేలు -
దారి చూపించండి..
ఫై ఫొటోలో కనిపిస్తున్న వారంతా రైతులు. వీరిది బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామం. గ్రామంలోని ప్రభుత్వ బడి నుంచి లద్నూరుకు వెళ్లే రూట్లో సుమారు 100 మంది రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే దారి ఉంది. ఈ రూట్లో 500 ఎకరాల వరకు వ్యవసాయ పొలాలు ఉంటాయి. కొంత కాలంగా దారి మూసివేయడంతో పొలాల వద్దకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతోందని గ్రీవెన్స్కు వచ్చి కలెక్టర్కు వినతి చేశారు. 100ఏళ్ల నుంచి ఉన్న బాట లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దారి చూపించాలని కలెక్టర్ వద్దకు వచ్చిన బండనాగారం రైతులు -
జేత్యాతండా పాఠశాలలో ఒక్కరూ రాలే
స్టేషన్ఘన్పూర్: మండలంలోని చంద్రుతండా గ్రామ పంచాయతీ శివారు జేత్యాతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు ఒక్కరు కూడా హాజరుకాలేదు. వాస్తవానికి గత విద్యాసంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ముగ్గురు కాగా ఒక విద్యార్థి గత విద్యాసంవత్సరం ఐదో తరగతి పూర్తి చేశాడు. దాంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య ఇద్దరే. అందులో ఒక్కరు రెండో తరగతి, మరొకరు నాలుగో తరగతి. అయితే ఆ ఇద్దరిలో ఎవరూ పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థుల హాజరు సున్నా అయ్యింది. ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు సీహెచ్.రమేశ్ సాయంత్రం వరకు పాఠశాలలో ఒక్కరే ఉండి వెళ్లాల్సి వచ్చింది. తండాకు చెందిన ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తుండగా జేత్యతండా పాఠశాల ఇప్పుడో అప్పుడో మూతపడే దుస్థితి నెలకొంది. కేయూ ఫిజిక్స్ విభాగం బీఓఎస్గా నరేందర్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఆ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్ను నియమిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ వరలక్ష్మి పదవీకాలం పూర్తికావడంతో ఆమెస్థానంలో నరేందర్ను నియమించారు. ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు నరేందర్కు వీసీ కె.ప్రతాప్రెడ్డి ఉత్తర్వులు అందించారు. సోషియాలజీ బీఓఎస్గా స్వర్ణలత కాకతీయ యూనివర్సిటీలోని సోషియాలజీ విభాగం బీఓఎస్గా ఆ విభాగం ప్రొఫెసర్ ఎం.స్వర్ణలతను నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్గా బాధ్యతలను నిర్వర్తించిన ప్రొఫెసర్ అయిలయ్య నుంచి ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆమె ఆ విభాగం అధిపతిగా కూడా కొనసాగుతున్నారు. హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో మూడు రోజులపాటు జరగనున్న ధ్వజస్తంభ ప్రతిష్ఠామహోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని అనంతరం పూర్వంగవిధి, యాగశాల ప్రవేశం చేశారు. సర్వతోభద్రమండల రచన, దేవతాహ్వానం, మూలమంత్రనుష్టాన హోమాలు, కుటీర హోమం, జలాధివాసం చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎస్ఈ ఇరిగేషన్ హరివెంకటరామ ప్రసాద్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
హోటళ్లపై మున్సిపల్ టాస్క్ఫోర్స్ దాడులు
జనగామ: జిల్లా కేంద్రంలోని హోటళ్లు, బిర్యానీ పా యింట్లు, టీస్టాల్స్, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలపై సోమవారం మున్సిపల్ టాస్క్ఫోర్స్ బృందం ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఫుడ్ సేఫ్టీ ఇన్న్స్పెక్టర్ వినీల్, మున్సిపల్ అధికారులు పులి శేఖర్, గొర్రె కుమార్, నిఖిల్రెడ్డి తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు. పలు హోటళ్లలో కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లోపాలు, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని చర్యలు చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్ర మాణాలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. నిబంధనలు పాటించని హో టళ్లకు ఒక్కో సంస్థపై రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ఇందులో అక్షయ హోటల్, రెడ్ బకెట్, ఎలైట్ మిలటరీ హోటల్, టీ ప్యాలెస్, కేకే ఫాస్ట్ఫుడ్, శ్రీమాతా హోటల్, ఎస్ఆర్ఎం హోటల్లకు ఒక్కోదానికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70వేల జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.70వేల జరిమానాలు -
అక్కడో నియంత.. ఇక్కడో నియంత
హన్మకొండ: హైదరాబాద్లో నియంత రేవంత్ ఉంటే.. ఇక్కడో మరో నియంత ఉన్నాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. అక్కడ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతుంటే ఇక్కడ మరోలా పేదల ఇళ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల పిల్లలకు స్కాలర్షిప్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం, ఎస్ఐఆర్పై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన హరీశ్రావు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి ఇది కీలకమవుతుందని, ఇందుకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తుంచుకుంటామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ భద్రకాళి దేవస్థానం సమీపంలోని చెరబండరాజు కాలనీవాసులపై అమానుషంగా దాడి చేశారని, దాడిని ఖండించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్యెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు. నాయకులు లింగంపల్లి కిషన్రావు, వద్దిరాజు గణేష్, మర్రి యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తలు కష్టపడాలి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు -
వానాకాలం.. కరెంట్తో జాగ్రత్త!
జనగామ: వర్షాకాలంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో చెట్లు, కొమ్మలు విద్యుత్ తీగలపై పడే ప్రమాదం ఉంటుంది. తెగిపడిన తీగలు, ఒరిగిన స్తంభాలు, ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్లు కనిపిస్తే వెంటనే 1912 టోల్ఫ్రీ నంబర్కు లేదా సమీప అధికారులకు సమాచారం ఇవ్వాలి. తడిసిన స్తంభాలు, స్విఛ్ బోర్డులు, వేలాడుతున్న తీగలను తాకకుండా, బట్టలు ఆరేసేందుకు ప్లాస్టిక్ దండెలను మాత్రమే వాడాలి. రేకులు, మెటల్ గేట్లకు వైర్లు తాకకుండా చూసుకోవాలి. రైతులు మోటార్లు, పైపులు తడిగా ఉన్నప్పుడు ముట్టుకోవద్దని, స్టార్టర్లకు సరైన ఎర్తింగ్ ఉండేలా చూసుకోవాలి. నాణ్యమైన సర్వీస్ వైర్లు, ఐఎస్ఐ మార్క్ పరికరాలు వాడాలి. సూచనలు పాటించాలి ఇనుప కూలర్లు ఆన్్లో ఉన్న సమయంలో నీటిని పోయరాదు. ప్లాస్టిక్ కూలర్లు మేలు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, ఏబీ స్విఛ్లు ఆపరేట్ చేయడం నిషేధం. షాక్ తగిలితే చేతులతో తాకకుండా కర్రతో వేరు చేయాలి. తీగల కింద టెంట్లు, జెండా గద్దెలు కట్టవద్దు. దేవుళ్ల విగ్రహాలు తరలించేటప్పుడు లైన్లకు తాకకుండా జాగ్రత్త పడాలి. అడవి పందుల బారి నుంచి పంటలను రక్షించేందుకు కరెంట్ ఫెన్సింగ్ చట్టరీత్యా నేరం. అత్యవసర సేవలు వినియోగదారులు–8712481489 వాట్సాప్ చాట్బాట్ ద్వారా సేవలు పొందవచ్చు. సబ్ డివిజన్ స్థాయిలో జీపీఆర్ఎస్ కలిగిన ఎమర్జెన్సీ రీస్టోరేషన్ వాహనాలను సిద్ధంగా ఉంచి, సమస్య తలెత్తిన వెంటనే బృందాలను పంపి పరిష్కరిస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచనలు పాటించాలంటున్న అధికారులు 8712481489 వాట్సాప్ చాట్బాట్ ద్వారా సేవలు -
‘సర్’ పేరుతో ఓట్లను తొలగిస్తే ఊరుకోం
పాలకుర్తి టౌన్(దేవరుప్పుల): ‘సర్’ పేరుతో అసలైన ఓటర్లను తొలిగిస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై దేవరుప్పల మండలంలోని కోలుకొండ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్ధాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈసందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. ఈనెల 15 నుంచి జూలై 31 వరకు అన్ని పోలింగ్ బూత్ స్ధాయిలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటును కాపాడడం దేశసేవగా భావించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ అడ్డుకున్నా కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయమన్నారు. అన్నారు. 100 సీట్లతో బీఆర్ఎస్ ఆధికారంలోకి వస్తుందన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్గా మార్చేందుకు నిధులు తీసుకువచ్చిన ఘనత ఎర్రబెల్లికే దక్కుతుందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. కడియం శ్రీహరి బీఆర్ఎస్లో గెలిచి సిగ్గులేకుండా జై కాంగ్రెస్ నినాదాలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్లా సుందర్రాంరెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వై.సతీష్రెడ్డి, మోటివేషనల్ స్పీకర్ శ్రీపాదరామ్, గాంధీనాయక్, తీగల దయాకర్గౌడ్, బస్వ మల్లేషం, కోతి ప్రవీణ్ కుమార్, పసునూరి నవీన్, జరపులు బాలు నాయక్, శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతులకు న్యాయం నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
సోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2026
జిల్లాలో విద్యాసంస్థల సమాచారం జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ విభాగాల్లో మొత్తం 508 పాఠశాలలు, 42 వసతి గృహాలు ఉన్నాయి. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 341, ప్రాథమికోన్నత పాఠశాలలు 64, ఉన్నత పాఠశాలలు 103 ఉన్నాయి. అదేవిధంగా కేజీబీవీలు 12, మోడల్ స్కూల్స్ 8, యూఆర్ఎస్ 1, ఎయిడెడ్ పాఠశాలలు 10, రెసిడెన్షియల్ పాఠశాలలు 19 కొనసాగుతున్నాయి. వీటితో పాటు మైనార్టీ పాఠశాలలు 2, ఆశ్రమ పాఠశాలలు 2, బీసీ గురుకులాలు 9, సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు 5 ఉన్నాయి. జిల్లాలో ఎస్సీ 17, బీసీ వసతి 18, ఎస్టీ వసతి గృహాలు 7 ఉన్నాయి. యూనిఫామ్స్పై సందిగ్ధత, పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల కోసం సుమారు 60 వేల జతల యూనిఫామ్స్ అవసరం కాగా, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సరఫరా కాలేదు. పాఠశాల ప్రారంభం రోజు 50 మంది బాలురు, 50 మంది బాలికలు కలిపి మొత్తం 100 మందికి యూనిఫామ్స్ ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, ఏ పాఠశాలలో పంపిణీ చేస్తారనే సమాచారం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు విద్యాసంస్థల ప్రారంభం రోజు విద్యార్థులకు 2,06,460 పాఠ్యపుస్తకాలు, 2,44,123 నోట్ బుక్స్ పంపి ణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.● వేసవి సెలవుల జ్ఞాపకాల మూటతో మళ్లీ బడికి ● విద్యార్థులతో కళకళలాడనున్న తరగతి గదులు -
అమావాస్య సెంటిమెంటు!
జనగామ/రఘునాథపల్లి: ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 14 వరకు ప్రభుత్వం విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. నేడు(సోమవారం)బడులు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు అమావాస్య కావడంతో పాటు మరుసటి రోజు మంగళవారం కావడంతో తల్లిదండ్రులు పిల్లలను పంపేందుకు వెనుకాడుతున్నారు. మొదటి రోజు విద్యార్థుల హాజరు తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో వేదపండితులు సైతం అమావాస్య రోజు నూతన కార్యక్రమాలు వద్దని సూచిస్తున్నారు. దీంతో సంప్రదాయాలను పాటిస్తూ 50 రోజుల సెలవుల తర్వాత పిల్లలను అమావాస్య రోజు తరగతులకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. 17వ తేదీ బుధవారం నుంచి పాఠశాలలకు విద్యార్థుల హాజరు పూర్తిస్థాయిలో పెరిగే అవకాశం ఉంది. క్రీడలతో నాయకత్వ లక్షణాలుజనగామ: క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ తెలిపారు. జనగామ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రెస్టన్ గ్రౌండ్లో గత వారం రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. అనంతరం జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలు, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రికెట్ గ్రౌండ్ ఏర్పా టు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ రామగళ్ల విజయ్, ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ బక్క ప్రవీణ్, క్రీడాకారులు, కోచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏటీసీకి స్థల పరిశీలనజనగామ రూరల్: జిల్లాకు మంజూరైన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) నిర్మాణానికి సంబంధించి జనగామ మండలంలోని పసరమడ్ల గ్రామంలో రెండు ఎకరాల భూమిని అధికారికంగా గుర్తించి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీ11సీ)కు అప్పగించారు. ఆదివారం రెవెన్యూ, సర్వే అధికారులతో స్థల పరిశీలన నిర్వహించి భూమి హద్దులను నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏటీసీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రామానందం మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించడంతో పాటు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువత స్వయం ఉపాధి దిశగా సొంత సంస్థలు స్థాపించుకునే అవకాశం లభించనుంది. సంబంధిత భూమిని టీజీ11సీ అధికారులకు అప్పగిస్తారని, ఏటీసీ నిర్మాణ పనులకు త్వరతగతిన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నాగరత్న సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బిర్రు ఇస్తారి, రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు పాల్గొన్నారు. హేమాచల క్షేత్రంలో భక్తుల సందడిమంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. -
కొత్త పుస్తకాలు వస్తాయన్న సంతోషం..
మా చిన్నతనంలో ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వెళ్లేవాళ్లం. పాఠశాల ప్రారంభానికి వారం రోజుల ముందే మా తల్లిదండ్రులు సిద్ధం చేసేవారు. చదువుతో పాటు ఆటలకు ప్రత్యేక పీరియడ్ ఉండేది. అలాగే ప్రతీ రోజు పాఠశాల చివరిలో 4గంటల తర్వాత ఒక దేశభక్తి గేయం వినిపించేవారు. నాడు ప్రైవేట్ పాఠశాలలు లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాల్సి ఉంది. – డాక్టర్ నామోజు బాలాచారి, కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ, ఓబుల్కేశవాపూర్, జనగామ సర్పంచ్ నుంచి పట్వారీ వరకు ఓకే పాఠశాల గ్రామం ఉండే పాఠశాలలో సర్పంచ్ పిల్లలతో పాటు పట్వారీ వరకు, ప్రతీ ఒక్కరి పిల్లలు ఒకే పాఠశాలలో చదివేవారు. తరతమ్య భేదాలు ఉండేవి కావు. 7వ తరగతి వరకు వడ్లకొండలో చదివాను. తల్లిదండ్రుల సహకారంతో ఉన్నతంగా చదివా. ఓయూ వీసీగా పని చేసే అవకాశం లభించింది. – డి. రవీందర్ యాదవ్, మాజీ వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ, వడ్లకొండ, జనగామ -
నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
ఎంత టెక్నాలజీ వచ్చినా.. ఎన్ని యుగాలు గడిచినా.. ఈ సృష్టిలో సృష్టించలేనిది.. ఏ కృత్రిమ మేధా తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. అంతటి విలువైన రక్తం.. ప్రాణాపాయస్థితిలో దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆపద సమయాల్లో అది పంచుతూ రక్తబాంధవులుగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లావాసులు. వారి స్ఫూర్తికి అక్షరరూపమిస్తూ.. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని కోరుతూ నేడు (ఆదివారం) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. ● అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు ● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న యువత కాశిబుగ్గ: వరంగల్ మట్టెవాడకు చెందిన తోట రాజేశ్వర్రావు ఇప్పటివరకు 134 సార్లు రక్తదానం చేశారు. ఆర్య సమాజ్ కార్యకర్తగా, ఫొటోగ్రాఫర్గా జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వర్రావుకు ప్రస్తుతం 52 ఏళ్లు. ఆయన 18వ ఏట నుంచి రక్తదానం చేస్తున్నారు. ఈ నెల 14న(నేడు) ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా.. 135వ సారి ఆదివారం ఎంజీఎంలో ఆయన రక్తదానం చేయనున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని, క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని రాజేశ్వర్రావు అంటున్నారు. విద్యార్థులు, యూత్, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి రక్తదానంపై అవగాహన పెంచుతూ రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. -
మరెవరూ చనిపోవద్దని..
జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది. అప్పటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 99 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టారు. ఒకసారి తన క్లాస్మేట్ అక్కకు ఆపరేషన్ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమైతే, రైలెక్కి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. ఆమె ప్రాణాలు కాపాడిన ఘటనను తాను మాటల్లో వర్ణించలేనని గుర్తు చేశారు రాజు. ఆయన సేవలను గుర్తించి జూన్ 2న స్వచ్ఛంద సంస్థలు అవార్డులు, ప్రశంసపత్రాలతో సన్మానించాయి. -
ప్రత్యేక టెట్ నిర్వహించాలి
జనగామ రూరల్: ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులతో సమానంగా టెట్ నిర్వహించాలని తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం (టీపీయూఎస్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చల్లా తిరుపతిరెడ్డి, అంకం సతీష్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో రౌండ్ టెబుల్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 30 వేల మందికి పైగా ఉపాధ్యాయులు టెట్ అర్హత లేకపోవడంతో ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి పాలకుర్తి టౌన్: పోలీసులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని పోలీస్సేష్టన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, సేష్టన్ నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతిని పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బంది తో మాట్లాడుతూ పోలీస్శాఖ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రజలు అందించే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. సీఐ జానకిరామ్రెడ్డి, ఎస్సై దూ డలం పవన్కుమర్, సిబ్బంది పాల్గొన్నారు. ఏఓపై కఠిన చర్యలకు ఆదేశాలు జనగామ: వ్యవసాయ శాఖలో మహిళా ఉద్యోగుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఏఓ విజయ్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాల జారీ చేశారు. ఇప్పటికే ఏఓ లైంగిక వేధింపులు నిరోధించే పోష్ చట్టం 2013 కింద అరెస్ట్ అయి జైలులో ఉండగా, ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. అనుమతి లేకుండా ఫొటోలు తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటి ఘటన రెండోసారి కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సదరు ఏఓపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదుతో పాటు చట్టపరంగా కేసు నమోదు చేయగా, బాధిత మహిళా ఉద్యోగులకు న్యాయం చేశారు. ఈ ఘటనతో వ్యవసాయ శాఖలో చాలా ఏళ్లుగా ఒకే కార్యాలయంలో ఉన్న ఏఓలను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్లో మరెవరు ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా, మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించిన కలెక్టర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
ముమ్మర ప్రచారం
● అడ్మిషన్ల కోసం అధ్యాపకుల ఇంటింటి ప్రచారం ● గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం ● డిజిటల్ బోధనపై ప్రత్యేక దృష్టి ● జిల్లా వ్యాప్తంగా 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుజనగామ రూరల్: జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు అధ్యాపకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలతో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో కల్పించే సౌకర్యాలు, మెరుగైన విద్య గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, డిజిటల్ తరగతులు, అనుభవం గల అధ్యాపకులతో బోధన, మధ్యాహ్న భోజన వసతులను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో జిల్లాలో 6,443 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగా 6,292 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో చాలామంది ఇంటర్ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు నేరుగా లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. జిల్లాలో మొత్తం 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా అన్ని కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ పలు కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పెరిగిన ఉత్తీర్ణత శాతం ఇంటర్లో గతేడాది ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా 22వ స్థానంలో ఉండగా అధ్యాపకుల కృషితో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి డిజిటల్ బోధనతో అవగాహన కల్పిస్తూ ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. ఈ విద్యాసంవత్సరం మధ్యాహ్న భో జనం అమలైతే డ్రాప్ అవుట్స్ తగ్గి ఉత్తీర్ణత శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. తరగతులు షురూ ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జూన్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మొదటి దశలో ప్రవేశాలు పొందారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు : 16ప్రైవేట్ : 13ప్రభుత్వ : 7కేజీబీవీలు : 12ఆదర్శపాఠశాలలు : 8మొత్తం సీట్లు : 6,100జిల్లాలో జూనియర్ కళాశాలల వివరాలు -
అవగాహన కల్పిస్తూ..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బోరునర్సాపురం గ్రామానికి చెందిన కోడెల నరేశ్ జ్వాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. ఆయన 2017 నుంచి 2025 వరకు 17సార్లు రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతగా నిలవాలని యువతకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో పలుమార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి వెయ్యికిపైగా మందితో రక్తదానం చేయించారు. ఎక్కడైనా రక్తం కావాలని తెలిసిన వెంటనే స్పందించి అవసరమైన వారికి రక్తదానం చేసేలా నిత్యం స్పందిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. -
16 ఏళ్లు.. 15 వేల యూనిట్లు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక సేవకుడు వేముల శంకర్ రక్తదాతలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 23 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన నిర్వహిస్తున్న ఐటీ మాస్టర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ, మిరాకిల్ వలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈశిబిరాల ద్వారా ఇప్పటివరకు సుమారు 15 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించేలా కృషి చేశారు. రక్తదానం మహాదానమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వేముల శంకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యువతలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు. -
మన బడి బస్సులు భద్రమేనా?
జనగామ: నూతన విద్యాసంవత్సరం పునఃప్రారంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్నా.. 14 వేల మంది చిన్నారుల ప్రాణాలను మోసే స్కూల్ బస్సుల భద్రత మాత్రం ఇంకా ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తోంది. 215 బస్సులకు గాను 40 బస్సులు ఇప్పటికీ ధ్రువీకరణకు నోచుకోలేదు. బడులకు సెలవులు ఇచ్చే సమయంలోనే రవాణాశాఖ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఫిట్నెనెస్ చేయించుకోవాలనే సమాచారం పంపించింది. రోజులవారీగా ఫిట్నెస్ కోసం జిల్లా రవాణాశాఖ అధికారులు సైతం కబురు పంపించారు. అయినప్పటికీ నాలుగు పదుల బస్సులకు ఫిట్నెస్ పెండింగ్లో ఉంది. ఈ నెల 14వ తేదీ ఆదివారం సెలవు కాగా, 15వ తేదీన విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఫిట్నెస్, రవాణాశాఖ నిబంధనల్లో కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. లెక్కలు చెప్పే నిజం.. జిల్లాలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రతీ ఐదు బస్సుల్లో ఒకటి ప్రమాణాలకు విరుద్ధంగా నడుస్తోందన్న ఆరోపణలు లేకపోలేదు. ఫిట్నెస్కు రవాణా శాఖ జూన్ 15ను ఆఖరి గడువుగా ప్రకటించినా, గత అనుభవాల దృష్ట్యా చివరి నిమిషంలో హడావుడిగా సర్టిఫికెట్లు తీసుకునే సంస్కృతి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. తనిఖీల్లో పట్టుబడితే జరిమానా అనే హెచ్చరిక కేవలం కాగితాలకే పరిమితమైతే, మూల్యం మాత్రం పిల్లలు చెల్లించాల్సి వస్తుంది. పెరిగిన రిస్క్.. జనగామ, స్టేషన్ఘనన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లోని సుమారు ప్రైవేట్కు చెందిన 90 స్కూళ్లు ఉన్నాయి. ఈ బస్సులు మండలాల హద్దులు దాటి రాష్ట్ర, జాతీయ రహదారులపై తిరుగుతున్నాయి. హనుమకొండ నుంచి వచ్చే కార్పొరేట్ బస్సులతో కలిపితే ఈ నెట్వర్క్ మరింత విస్తరించింది. ఎక్కువ దూరం ప్రయాణించే కొద్దీ జాగ్రత్తలు రెట్టింపు అవుతాయి. ఫిట్నెస్ లేని బస్సు 50 కిలో మీటర్ల దూరం పిల్లలతో వెళ్లడమంటే, ప్రతిరోజూ ప్రమాదాన్ని ఆహ్వానించడమే. ఇంజిన్ కండీషన్ ఒక్కటే కాదు.. రివర్స్ తీసుకునే సమయంలో అటెండర్ లేక చిన్నారులు మృతి చెందిన ఘటనలు జిల్లాలో నమోదయ్యాయి. ఫిట్నెస్ అంటే కేవలం ఇంజిన్ కండిషన్ కాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బస్సుకు పసుపు రంగు, సీసీ కెమెరాలు, జీపీఎస్, అత్యవసర ద్వారాలు, అగ్నిమాపక పరికరం, ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరి. డ్రైవర్కు 5 ఏళ్ల అనుభవంతో పాటు ప్రతీ బస్సులో అటెండర్ ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో చాలా బస్సుల్లో అటెండర్లే ఉండరు. ఇది నిబంధనల ఉల్లంఘనే కాదు, నిర్లక్ష్యానికి దారితీసే పరిస్థితి. ముందున్న కార్యాచరణ ఏంటి? జూన్ 15 తర్వాత ఫిట్నెస్ లేని బస్సును వెంటనే సీజ్ చేయాలి. జిల్లా స్థాయిలో రవాణా, విద్య, పోలీస్ శాఖలతో స్కూల్ బస్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రతీ మూడు నెలలకోసారి తనిఖీలు చేయాలి. ఉల్లంఘనలకు పాల్పడే స్కూళ్ల గుర్తింపు రద్దు చేసేంత కఠినంగా వ్యవహరిస్తేనే మార్పు వస్తుంది. పిల్లల చదువు కోసం వేసే ప్రతీ అడుగు భద్రంగా ఉండాలి. వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం..ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు ఫిట్నెస్, రవాణాశాఖ నిబంధనలు లేకుండా రోడ్డెక్కితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తాం. జిల్లాలో మిగిలిపోయిన ప్రైవేట్ స్కూల్ బస్సులను వెంటనే ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవాలి. 15వ తేదీ నుంచి తమతో పాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తారు. స్కూల్స్ పునఃప్రారంభమయ్యే సమయంలో పిట్నెస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బస్సులు రోడ్డెక్కరాదు. – ఎం.విష్ణువర్ధన్రెడ్డి, ఎంవీఐ, జనగామ జిల్లాలో ఫిట్నెస్కు దూరంగా 40 బస్సులు 14 వేల మంది చిన్నారుల ప్రయాణం రేపటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం ఫిట్నెస్ లేకుంటే వాహనాలు సీజ్, భారీ జరిమానాలు సీసీ కెమెరా, జీపీఎస్, అత్యవసర ద్వారం తప్పనిసరి ఫీజులు లక్షల్లో, నిర్వహణ ఖర్చు తక్కువ -
గాలివాన బీభత్సం
● ఉరుములు, మెరుపులతో వర్షం ● విరిగిన విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన చెట్లు ● పలుచోట్ల తడిసిన ధాన్యం బస్తాలుజఫర్గఢ్/పాలకుర్తి టౌన్/బచ్చన్నపేట: జిల్లాలో శుక్రవారం సాయంత్రం పలు మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. జఫర్గఢ్ మండలంలోని తమ్మడపల్లి (జి), ఓబులాపూర్ గ్రామాల్లో వడగండ్ల వర్షంతో పాటు బలమైన ఈదురుగాలుల మూలంగా విద్యుత్ స్తంభాలు విరగడంతో పాటు చెట్లు నేలకొరిగాయి. దీంతో గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు ఇళ్ల పైకప్పు రేకులు సైతం గాలికి ఎగిరిపడ్డాయి. పాలకుర్తి మండలంలో సాయంత్రం 5 గంటలకు ఒక్కసారిగా మబ్బులు కమ్మి వర్షం పడింది. పలు ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. మండలంలోని తొర్రూరు(జె)గ్రామంలో కొనుగోళ్లు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. దయాకర్రావు మాట్లాడుతూ..తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. -
సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్తో విచారణ జరిపించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో జరుగుతున్న రూ.వేలకోట్ల అవినీతి అక్రమాలపై సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్తో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో.. సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సింగరేణిలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని వివరించారు. తెలంగాణకు సింగరేణి అమూల్యమైన సంపద అని, 137 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. గతంలో లాభాలు, ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న సంస్థ ప్రస్తుతం జీతాల చెల్లింపుల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితికి చేరుకుందన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరుతో టెండర్ల వ్యవస్థలో కొత్త నిబంధనలు తీసుకువచ్చి కొందరికి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మైనస్కు వెళ్లిన ఓబీ టెండర్లు ప్రస్తుతం అదనపు ధరలకు కేటాయిస్తున్నారని, దీనివల్ల సింగరేణికి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. బొగ్గు నిల్వల్లో భారీ వ్యత్యాసాలు.. బొగ్గు నిల్వల లెక్కల్లో కూడా భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, లక్షల టన్నుల బొగ్గు మాయమైనప్పటికీ అధికారులు స్పందించడం లేదన్నారు. భూపాలపల్లి బొగ్గు బాయి మీద 3లక్షల మెట్రికల్ టన్నుల బొగ్గు లేదని, 40లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదన్నారు. మూతపడిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ వద్ద 1.81లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్స్ప్లోజివ్స్ కొనుగోళ్లలో మార్కెట్ ధర రూ.37వేలు ఉంటే అధిక ధరలు రూ.44వేలకు కొనుగోలు చేసి కోట్లాది రూపాయల నష్టం కలిగించారని ఆరోపించారు. డీజిల్ కొనుగోళ్లను ప్రభుత్వ సంస్థలనుంచి కాకుండా ప్రైవేట్ వ్యవస్థలకు అప్పగించడం ద్వారా అదనపు ఆర్థికభారం మోపుతున్నారని విమర్శించారు. వీటన్నింటిలో నిజాలు తేలాలంటే సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధు, పెద్ది సుదర్శన్రెడ్డి, నాయకులు టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, వాసుదేవరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు–2 సందర్శించేందుకు వెళ్లిన హరీశ్రావు, నాయకులను అనుమతి లేదని సింగరేణి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగగా, ఉన్నతాధికారులను అనుమతి తీసుకుని రావాలని చెప్పడంతో బీఆర్ఎస్నాయకులు వెనక్కి వచ్చారు. రెండున్నరేళ్లలో సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్ టెండర్లలో కొందరికే లబ్ధి చేకూరేలా నూతన నిబంధనలు సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు -
తొలివానకే పత్తి విత్తనాలు పెట్టొద్దు
ప్రశ్న: పత్తి రైతులు ఎప్పుడు విత్తనాలు వేసుకోవాలి? జవాబు: పత్తి రైతులు తొందరపడి తొలి వానకే విత్తనాలు వేయవద్దు. రెండు, మూడు వర్షాలు పడేవరకు ఆగాలి. మొదటి వర్షంతో భూమిలోని వేడి వెళ్లిపోతుంది. తదుపరి వర్షం కురిసిన అనంతరం పత్తి విత్తనాలు వేయాలి. జూలై 15వ తేదీవరకు విత్తనాలు వేసుకోవచ్చు. వర్షాలు ఆలస్యం అయితే 50 మి.మీ కంటే ఎక్కువ వర్షం వచ్చిన తర్వాతనే విత్తనాలు వేయాలి. జూన్ చివరి వరకు వర్షాలు రాకపోతే మధ్యకాలిక రకాలను ఎంచుకోవాలి. జూలై తర్వాత ఆలస్యంగా విత్తడం తగ్గించాలి. ప్ర: పత్తిపంట సాగుపై ఎల్నినో తుఫాన్ ప్రభావం ఉంటుందా?జ: ఎల్నినో పరిస్థితుల్లో పత్తిసాగులో తేమ సంరక్షణ, హెచ్డీపీఎస్ పద్ధతి, సమతుల్య ఎరువుల వినియోగం, గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు పాటిస్తే తక్కువ వర్షపాతంలోనూ మంచి దిగుబడి సాధించవచ్చు. ప్ర: పత్తి రైతులు ఏరకం విత్తనాలు ఎంచుకుంటే మంచిది? జ: మధ్యకాలిక (130 నుంచి 150 రోజులు పంటకాలం ఉండే వైరెటీలు) బీటీ పత్తి హైబ్రిడ్లను ఎంపిక చేసుకోవాలి. తక్కువ నీటిని తట్టుకునే రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువ కాలం ఉండే హైబ్రిడ్లను నివారించాలి. మొక్కలు పెట్టే సాంద్రతను రెట్టింపుచేయాలి. సాధారణంగా పత్తి రైతులు ఎకరాకు 2 నుంచి 3 ప్యాకెట్ల విత్తనాలు వేస్తారు. అలా కాకుండా ఎకరాకు ఆరు ప్యాకెట్లను పెంచాలి. అంటే మొక్కకు మొక్కకు మధ్య దూరం తగ్గించి మొక్కల సాంద్రతను పెంచాలి. మొక్కల మధ్య దూరం 20 సెం.మీ, వరుసల మధ్య దూరం 90 సెం.మీ ఉండాలి. దాంతో పంట ఒకేసారి కాపునకు వస్తుంది. త్వరగా పంట అయిపోవడంతో గులాబీరంగు పురుగు సమస్య రాదు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● డీసీపీ రాజమహేంద్ర నాయక్ జనగామ రూరల్: ట్రాఫిక్ నిబంధనలు ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని శ్రీఉమామహేశ్వరస్వామి దేవాలయంలో శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, పెన్నుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా బ్లాక్బోర్డుపై విద్యార్థులకు విద్యతోపాటు, ట్రాఫిక్ రూల్స్ బోధించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యాన్ని వివరించారు. కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు సాంబమూర్తి శర్మ, శివాజీ ఫౌండేషన్ సభ్యులు ప్రభాకర్, సిరిపురం వినయ్, మామిడాల భరత్, హర్షిత్, శీలం గణేష్, వినీత్, సాయి తేజ, ములుగు ఆకర్ష, పంతం సాయి ప్రసాద్,సందీప్, వినీత్, దిలీప్, కిరణ్, శ్రీకాంత్ భక్తులు పాల్గొన్నారు. -
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
పాలకుర్తి టౌన్: గ్రామస్తుల సహకారంతో తిరుమలగిని ఆదర్శ పంచాయతీగా తీర్చిద్దేందుకు కృషి చేస్తామని బాలవికాస సీనియర్ కోఆర్డినేటర్ ఈదురి వసంత అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో ఆదర్శ గ్రామ నిర్మాణ పథంపై గ్రామసభ సర్పంచ్ చెరిపెల్లి మమత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సమన్వయంతో పర్యావరణం, మంచినీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, మహిళా సంఘాల, డిజిటల్ అవగాహన తదితర అంశాలపై 8 కమిటీలను ఏర్పాటు చేశారు. అనంతరం సమన్వయ గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా కూటికంటి రాజును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్లు రాజ్కుమార్, వినయ్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ పొన్నం రాజు, మహిళ సంఘాల అధ్యక్షురాలు బక్క రమ, సీఏలు పుష్ప, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాడి రైతుల అభివృద్ధికి మరింత కృషిజనగామ రూరల్: జిల్లాలో పాడి రైతుల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని నాబార్డ్ ఏజీఎం ఉదయ భాస్కర్ అన్నారు. శుక్రవారం జిల్లా విజయ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రంలో డీసీసీ బ్యాంక్ ద్వారా మైక్రో ఏటీఎం మిషన్న్లు పెద్దపహాడ్, సిద్దంకి, పెద్దరామచర్ల, బచ్చన్నపేట, నాగిరెడ్డిపల్లి ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక నాణ్యమైన పాలు జనగామ డెయిరీ నుంచే వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డెయిరీ ఉప సంచాలకుడు ఎన్.గోపాల్ సింగ్, పాల ఉత్పత్తిదారుల జిల్లా ఉపాధ్యక్షుడు దామెర నాగరాజు, మేనేజర్ నరేష్, స్టేషన్ ఘన్పూర్ మేనేజర్ లింగారెడ్డి, జనగామ డీసీసీ బ్యాంక్ మేనేజర్ కె.శ్రీనివాస్, కార్యదర్శి సూపర్వైజర్లు శ్రీనివాస్ రెడ్డి, విజయ్, శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు. ‘బెస్ట్ అవైలబుల్’కు దరఖాస్తుల ఆహ్వానం జనగామ రూరల్: జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు 2026–27 సంవత్సరానికి గాను 1వ తరగతికి (15), 5వ తరగతి(37)లలో మిగిలిన సీట్ల కోసం బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాలఅభివృద్ధి అధికారి విక్రమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలి పారు. సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సెయింట్ థామస్ స్కూల్ ఇంగ్లిష్ మీడియం శివునిపల్లి, స్టేషన్ ఘన్పూర్(డే స్కాలర్, రెసిడెన్షియల్), సిద్ధార్థ విద్యాలయం, ఇంగ్లిష్ మీడియం పాలకుర్తి (డే స్కాలర్), జాన్బ్రిటో హైస్కూల్ ఇంగ్లిష్ మీడి యం, కడవెండి (డే స్కాలర్, రెసిడెన్షియల్), సెయింట్ పీటర్ ఫౌండేషన్ హైస్కూ ల్ ఇంగ్లిష్ మీడియం నిడిగొండ (డే స్కాలర్, రెసిడెన్షియల్) ఉన్నాయి. వినియోగదారులకు ఇబ్బందులు కలగొద్దుజనగామ రూరల్: విద్యుత్ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, సమస్యల షరిష్కారానికి కృషి చేయాలని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్–1) చైర్మన్ వేణుగోపాలచారి అధికారులకు సూచించారు. శుక్రవారం గానుగుపహడ్ సబ్స్టేషన్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జనగామ, బచ్చన్నపేట మండలాలోని పలు గ్రామాల ప్రజలు రైతులు పాల్గొని వినతులు అందజేశారు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చటం, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, తదితర సమస్యలపై అందించిన ఫిర్యాదులపై అధికారులు వివరించారు. ఈకార్యక్రమంలో డీఈ, ఏడీ, ఏఈ తదితరులు పాల్గొన్నారు. -
చదివి, రాసి..లెక్కగట్టి!
జనగామ: రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ఇతర గుర్తింపు పొందిన పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం నైపుణ్యాలను మరింత బలోపేతం చేసేందుకు 2026–27 విద్యా సంవత్సరంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను సమర్థంగా అభివృద్ధి చేసుకునేలా పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. నాలుగు సబ్జెక్టుల్లో ఎఫ్ఎల్ఎన్ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, గణిత సబ్జెక్టుల్లో ఎఫ్ఎల్ఎన్కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ తరగతికి నెలవారీ ఫోకస్ కంపిటెన్సీలను (ఎంఎఫ్సీఎస్)నిర్దేశించి వాటి ఆధారంగా బోధన కొనసాగించనున్నారు. అలాగే గణితం, తెలుగు, ఇంగ్లిష్ విషయాల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత ఏఎక్స్ఎల్ సహాయక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. వారానికి రెండుసార్లు, ఒక్కోసారి 20 నిమిషాల పాటు ప్రత్యేక అభ్యాస సెషన్లు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం సమర్థవంతమైన అమలుకు జిల్లా, మండల, పాఠశాల స్థాయిల్లో ఎఫ్ఎల్ఎన్సెల్లను ఏర్పాటు చేయనున్నారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన టీచర్ హ్యాండ్బుక్స్, మైక్రో కంపిటెన్సీలు, బోధనా ప్రణాళికలను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యార్థుల అభ్యాస పురోగతిని అంచనా వేయడానికి జూలై 1 నుంచి 10 వరకు బేస్లైన్ అంచనా, నవంబర్ 20 నుంచి 30 వరకు మధ్యంతర అంచనా, 2027 మార్చి 7 నుంచి 17 వరకు తుది అంచనాలను నిర్వహించనున్నారు. పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించాలి ప్రతీ ఎఫ్ఎల్ఎన్ పాఠం అనంతరం విద్యార్థులు వర్క్షీట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు వెంటనే మూల్యాంకనం చేసి అవసరమైన విద్యా సహాయాన్ని అందించాలి. మల్టీ లెవల్ తరగతుల్లో టీచర్ సపోర్ట్ గ్రూపులు, పీర్ సపోర్ట్ గ్రూపుల ద్వారా పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అదనపు శిక్షణ విద్యలో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక పరిహార బోధన కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. ప్రతీ రోజు పాఠశాల అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు తెలుగు ఉర్దూ, ఇంగ్లిష్, గణితంలో అదనపు శిక్షణ ఇవ్వనున్నారు. డీఈఓ, ఎంఈఓలతో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అకడమిక్ మానిటరింగ్ బృందాలు పాఠశాలలను సందర్శించి పర్యవేక్షించనున్నాయి. ప్రతీ నెల సమీక్ష సమావేశాలు ప్రతీ నెల 20వ తేదీన పాఠశాల స్థాయి, 27న మండల స్థాయి, 28న జిల్లా స్థాయి, 29న రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. అదనంగా ప్రతీ రోజు కనీసం 30 నిమిషాల పాటు లైబ్రరీ పీరియడ్ నిర్వహించి విద్యార్థుల్లో పఠనా నైపుణ్యాలను పెంపొందించనున్నారు. మూడో తరగతి పూర్తయ్యే నాటికి ప్రతీ విద్యార్థి ప్రాథమిక పఠన, రచన, గణిత సామర్థ్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా విద్యాశాఖ భావిస్తోంది. ప్రాథమిక విద్య బలోపేతానికి కొత్త కార్యాచరణ చిన్నారుల అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి ఎఫ్ఎల్ఎన్ కొనసాగించాలని విద్యాశాఖ ఆదేశాలు ఏఐ ఆధారిత ఏఎక్స్ఎల్ సహాయం నెలనెలా సమీక్షలతో ఎఫ్ఎల్ఏ కార్యక్రమంపై నిఘాఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం సమాచారం అంశం వివరాలు తరగతులు 1 నుంచి 5వ తరగతి అమలు చేసే సబ్జెక్టులు తెలుగు,ఉర్దూ, ఇంగ్లిష్, గణితం ఫోకస్ విధానం నెలవారీ ఫోకస్ కంపిటెన్సీలు ఏఎక్స్ఎల్ కార్యక్రమం వెనుకబడిన విద్యార్థులకు ఏఐ ఆధారిత సహాయం ఏఎక్స్ఎల్ సెషన్లు వారానికి 2 సార్లు, 20 నిమిషాలు ఎఫ్ఎల్ఎన్ సెల్లు జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో బోధనా వనరులు ఎస్సీఈఆర్టీ టీచర్ హ్యాండ్బుక్స్ మల్టీ లెవల్ తరగతులు టీచర్, పీర్ సపోర్ట్ గ్రూపులు పరిహార బోధన రోజూ సాయంత్రం 3–4 గంటల వరకు పర్యవేక్షణ డీఈఓ, ఎంఈవీ, అకడమిక్ మానిటరింగ్ బృందాలు లైబ్రరీ పీరియడ్ రోజూ కనీసం 30 నిమిషాలు ప్రధాన లక్ష్యం 3వ తరగతి ముగిసే నాటికి పూర్తి అక్షరాస్యత -
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
స్టేషన్ఘన్పూర్: డివిజన్కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియ, తూకం, రవాణా తదితర అంశాలను పరిశీలించారు. కౌన్సిలర్లు పొన్న రవి, తోకల అనూషరాజు, గుర్రం హైమ రమేశ్, గుర్రం హరినాధ్, తోకల అనూషరాజు, సంగీతరమేశ్, క్రిష్ణవేణి, పొన్నం స్వరూప రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
విత్తు సమయం..మెళకువలు అవసరం
21 రోజుల్లో నాటువేస్తే అధిక దిగుబడివానాకాలం సాగుకు సమయం అసన్నమైంది. అక్కడక్కడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఏ పంట సాగుచేయాలో ఇప్పటికే రైతులు ఓ అంచనాకు వచ్చారు. జిల్లాలో వానాకాలం ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు వేస్తుంటారు. ఎల్నినో ఏర్పడే అవకాశాలున్నందున రైతులకు పంటల సాగులో వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. లింగాల ఘణపురం మండల వ్యవసాయాధికారి ఎస్కే నజీరుద్దీన్, స్టేషన్ఘన్పూర్ ఏఓ సింగారపు కరుణాకర్, బచ్చన్నపేట ఏఓ శరత్చంద్ర సాక్షి ఇంటర్వ్యూలో వానాకాలం సాగుపై కీలకమైన సూచనలు, సలహాలు అందించారు. –లింగాలఘణపురం, స్టేషన్ ఘన్పూర్, బచ్చన్నపేట వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధం వరి, పత్తి, మొక్కజొన్న పంటలపై వ్యవసాయాధికారుల సూచనలు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో అన్నదాతలకు అవగాహనప్రశ్న: ఖరీఫ్లో ఏ విధమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి? జవాబు: తక్కువ కాలంలో పంట చేతికొచ్చే దొడ్డురకం ఐఆర్–64, ఎంటీయూ 1010, కేఎన్ఎం–118 సన్నరకాల్లో బీపీటీ, ఆర్ఎన్ఆర్, ఎహెచ్ఎంటీ, జైశ్రీరామ్, కేఎన్ఎం 1,638, వరంగల్ 44, వరంగల్ 962, జేజీఎల్ 1,798 రకాలు ఎంపిక చేసుకోవచ్చు. ప్రశ్న: నారు పోసిన ఎన్ని రోజుల్లో నాట్లు వేసుకోవాలి?జ: 21 రోజుల్లో నాట్లు వేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. నెల రోజులు దాటకుండా వేసుకోవడం మంచిది. ప్రశ్న: ఈసారి యూరియా పంపిణీ ఎలా ఉంటుంది.?జ: మొబైల్ యాప్తోనే అందజేస్తారు. ఎకరానికి రెండు బస్తాలను అందజేస్తారు. ఏ ఎరువులైన భవిష్యత్తులో ఫార్మర్ రిజిస్ట్రీ ఉంటేనే అందజేస్తారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు చేయించుకోవాలి. ఎరువుల కొరత నేపథ్యంలో నానో యూరియా, నానో డీఏపీపై దృష్టి పెట్టాలి. ప్రశ్న: చౌడు నేలల్లో వరి సాగుకు ఏ విధమైన పద్ధతులు అవలంబించాలి?జ: జిప్సమ్ వేసుకొని నీటిని తొలగించే పద్ధతితో చౌడు తీసేయడం, జీలుగ, జనుము, పిల్లి పెసర వేసుకొని నెల రోజుల తర్వాత రోటవేటర్తో పొలంలోనే దున్ని నాట్లు వేస్తే మంచిది. ప్రశ్న: ఎప్పటి వరకు వరి నాట్లు చేసుకోవాలి.? జ: ఆగస్టు 15 వరకు నాట్లు వేసుకుంటే మంచిది. ఈసారి ఎల్నినో కారణంగా వర్షపాతం తక్కువగా ఉంటుందని అంటున్నారు. వరి సగానికి తగ్గించాలి. ఆరుతడి పంటలపై దృష్టి పెడితే మంచిది. -
గెస్ట్ అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కొడకండ్ల: మండల కేంద్రంలోని కస్తూర్బాలో ఎంఎల్టీ కోర్సు బోధించేందుకు గెస్ట్ అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఎస్ఓ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో కోరారు. బీఈడీలో ఇంగ్లిష్ మెథడాలజీ కలిగి ఉండి ఎంఎస్సీ మైక్రోబయాలజీ పీజీ అర్హత కలిగి ఉన్న వారు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు బోధించాల్సి ఉంటుందని, అసక్తి కలిగిన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు డెమో నిర్వహించి ఎంపిక చేస్తామని, నెలకు గౌరవ వేతనం రూ.22వేలు ఉంటుందని, వివరాల కోసం 95057 98098, 99084 13707 నంబర్లకు ఫోన్ చేయవచ్చని ఆమె సూచించారు. నేడు ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా జనగామ రూరల్: రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 12న(శుక్రవారం) నిర్వహించనున్నట్లు ఆహార భద్రత అధికారి సీహెచ్ వినీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. కలెక్టరేట్ రూమ్ నెంబర్ ఏ2లో ఉద యం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారని ఆహార వ్యాపార నిర్వాహకులు సద్వినియోగం చేసుకొని ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ రిజిస్ట్రేషన్లు పొందడం, రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఆహార భద్రత అధికారి: 7306335795, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్: 9985820544 నంబర్లలో సంప్రదించాలని కోరారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం రఘునాథపల్లి: మండల కేంద్రానికి చెందిన తాళ్లపల్లి రాజ్కుమార్ ఇటీవల మృతిచెందగా అతడి కుటుంబానికి మిత్రులు అండగా నిలి చారు. రాజ్కుమార్ కుటుంబం ఎదుర్కొంటు న్న క్లిష్ట పరిస్థితులను గుర్తించి హనుమకొండకు చెందిన ఫార్మా ఫ్రెండ్స్ మిత్ర బృందం గురువారం రూ.1,03,000ల ఆర్థిక సాయం అందించింది. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి ప్రకటించింది. 14న జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఈ నెల 14న కల్నల్ సంతోశ్బాబు స్మారక ఓపెన్ టు ఆల్ చదరంగం ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను హనుమకొండ రెడ్డి కాలనీలోని మాస్టర్జీ వికాస్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అండర్–10, 12, 14 బాలబాలికల విభాగం నుంచి ఇద్దరి చొప్పున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జూలై 11, 12 తేదీల్లో హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ స్థాయి రాపిడ్ రేటింగ్ చదరంగ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు మొబైల్ 90595 22986 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ ఆర్ఎంగా కిషన్రావు హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్)గా టి.కిషన్రావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేస్తున్న పి.మహేశ్ హైదరాబాద్కు బదిలీ కాగా, ఆయన స్థానంలో టి.కిషన్రావు వచ్చారు. గురువారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కిషన్రావును డిపో మేనేజర్లు, కార్యాలయం సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ కాశిబుగ్గ: వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్గా డాక్టర్ కె.రవిశేఖర్రావును నియమించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఆప్తాల్మజీ విభాగం (నేత్ర వైద్య విభాగం) హెచ్ఓడీగా పనిచేసిన ఆయన బదిలీపై వరంగల్కు వచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన డాక్టర్ భరత్కుమార్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు బదిలీ అయ్యారు. -
ఎవరి జేబుల్లోకి
శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2026‘దిక్సూచి’ సొమ్ము జనగామ: విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు కోసం రూపొందించిన దిక్సూచి పుస్తకాల వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడే అధ్యయన సామగ్రి పేరుతో జిల్లాలో రూ.46.50 లక్షల భారీ మొత్తంలో నిధులు వెచ్చించినట్టు రికార్డులు చూపుతున్నప్పటికీ, పుస్తకాలు మాత్రం విద్యార్థుల చేతికి చేరలేదు. అవసరానికి మించి ఆర్డర్లు, నిబంధనల ఉల్లంఘన, అనుమానాస్పద చెల్లింపులు, అధికారు ల పాత్రపై ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చాయి. తాజాగా నమోదైన కేసుతో దర్యాప్తు ముందుకు సాగుతుండగా, నిధుల వినియోగం, నిర్ణయాల వెనుక ఉన్న బాధ్యులు, అక్రమాల పరిమాణం ఏమిటన్న అంశాలపై అధికా ర యంత్రాంగం లోతుగా విచారణ చేపట్టింది. సంబంధిత అధికారులపై కేసు నమోదవగా, పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. ముందుగానే అక్రమాలకు ప్లాన్ చేశారా? పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో అప్పటి జిల్లా పాలనాధికారుల ఆదేశాల మేరకు ‘దిక్సూచి‘ పుస్తకాల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు, జవాబులు, మార్గదర్శక సమాచారాన్ని అందించేలా పుస్తకాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. అయితే పరీక్షల సమయం ముగిసే వరకు పుస్తకాలు విద్యార్థులకు అందించలేదు. ఈ వ్యవహారంలో అత్యంత అనుమానాస్పద అంశం ఏమిటంటే, జిల్లాలో సుమారు 4,635 మంది పదో తరగతి విద్యార్థులు మాత్రమే ఉండగా, 15 వేల పుస్తకాల ముద్రణకు ఆర్డర్ ఇచ్చినట్లు రికార్డు చూపించారు. అవసరానికి మించి పుస్తకాల సంఖ్యను చూపించడం ద్వారా ముందుగానే అక్రమాలకు ప్రణాళిక రూపొందించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకెంతమంది ఉన్నారు ప్రభుత్వ నిధులతో ఇంత పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేపట్టే సమయంలో టెండర్ ప్రక్రియ నిర్వహించడం, సంబంధిత శాఖల అనుమతులు పొందడం, అధికారిక నోటు సిద్ధం చేయడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో అలాంటి విధానాలు సక్రమంగా అనుసరించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుస్తకాలు ముద్రించకుండానే ఖర్చు చూపించి నిధులు దుర్వినియోగం చేశారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ కేసులో అప్పటి కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్ కీలకపాత్ర పోషించగా, ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మరో ఇద్దరి ప్రమేయం ఉండగా, ఇంకా ఎంతమంది ఉన్నారనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. మొదలైన పోలీసుల దర్యాప్తు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ శాఖల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. విద్యాశాఖలో జరిగిన ఈ భారీ అక్రమాలపై లోతైన విచా రణకు ఆదేశించారు. ఇప్పటికే పోలీసు దర్యాప్తు ప్రారంభమవగా, నిధుల విడుదల నుంచి ఖర్చు వరకు ప్రతీ అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రింట్కాని పుస్తకాలకు ప్రభుత్వ నిధులు మొదలైన పోలీసుల విచారణ కీలకపాత్రలో అప్పటి కలెక్టరేట్ ఏఓ టెండర్లు లేకుండానే..అడ్డగోలు దోపిడీ చర్చనీయాంశంగా మారిన గత అధికారుల తీరు -
పారదర్శక పాలనకు కొత్త దిశ
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జిల్లా విద్యాశాఖలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించి, వాటిని ఒక్కొక్కటిగా వెలికితీస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేసిన వారెవరైనా చట్టపరమైన చర్య ల నుంచి తప్పించుకోలేరనే సందేశాన్ని జిల్లా యంత్రాంగానికి స్పష్టంగా తెలియజేస్తున్నారు. విద్యాశాఖలో వెలుగు చూసిన ’దిక్సూచి’ కెరీర్ గైడెన్స్ కార్యక్రమం సంబంధించి రూ.46.50 లక్షలు దిగమింగిన తిమింగలాల భరతం పట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. –బుర్ర రమేశ్, రాష్ట్ర కార్యదర్శి, ప్రధానోపాధ్యాయుల సంఘం -
జాతీయ అడ్వెంచర్ క్యాంపునకు ఏబీవీ విద్యార్థి
జనగామ రూరల్: ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న 10వ బెటాలియన్ ఎన్న్సీసీ విద్యార్థి సీహెచ్ మైపాల్ జాతీయ అడ్వెంచర్ క్యాంప్నకు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న విద్యార్థికి ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తర కాశిలోని నెహ్రూ ఇన్న్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. కాగా, ఎన్సీసీ కెడెట్లకు భారత సైన్యంలో అగ్నివీర్ ద్వారా డైరెక్ట్ ప్రవేశ అవకాశాలు లభించడంతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈసందర్భంగా విద్యార్థి మైపాల్ను ప్రిన్సిపాల్, ఎన్సీసీ ఆఫీసర్ టి.కల్యాణి, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
అధిక యూరియాతో నష్టమే
● పంటకు, నేలకు, మనుషులకు హానికరం ● వ్యవసాయ శాస్త్రవేత్త అనిల్ కుమార్జనగామ: యూరియా అధికంగా వాడడం వల్ల పంటకు, నేలకు, మనుషులకు హానికరమని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ బి.అనిల్ కుమార్ హెచ్చరించారు. 46శాతం నత్రజని కలిగిన యూరియాను శాస్త్రవేత్తల సిఫారసు మేరకు మాత్రమే వాడాలని సూచించారు. గురువారం ఆయన ‘సాక్షి’కి వెల్లడించిన విషయాల ప్రకారం.. పంటపై దుష్ప్రభావాలు ● పంటకు పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువ అవుతుంది. ● మొక్కలు బలహీనపడి గాలికి, వర్షాలకు తట్టుకోలేక ఒరిగిపోతాయి. వరి వంటి పంటలు గాలికి త్వరగా పడిపోతాయి. ● మొక్కలు అధికంగా ఆకులు మాత్రమే పెంచి దిగుబడి, రుచి, నిల్వ సామర్థ్యం, మార్కెట్ నాణ్యత తగ్గుతుంది. నేలపై ప్రభావం ● నేలలో జింక్, ఐరన్, సల్ఫర్ వంటి సూక్ష్మపోషకాల లోపం ఏర్పడి భూమి గట్టిపడి నీరు చొరబడే సామర్థ్యం తగ్గుతుంది. ● భూసారం క్రమంగా తగ్గి దీర్ఘకాలంలో భూమి చౌడు భూమిగా మారే ప్రమాదం ఉంది. ● నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి. రైతుకు, ఆరోగ్యానికి నష్టం ●ఎరువుల ఖర్చు పెరిగి రైతుకు లాభం తగ్గుతుంది. ● పండ్లు, కూరగాయలు, ధాన్యాల్లో నైట్రేట్ మోతాదు పెరిగి ఆరోగ్య సమస్యలు రావొచ్చు. ● మనుషుల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయాలు శాస్త్రవేత్తల సిఫారసు మేరకు మాత్రమే యూరియా వాడాలి. పచ్చిరొట్ట ఎరువులు, జీవామృతం, సేంద్రియ ఎరువులు, నేల పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం ఉత్తమం. ఫాస్ఫరస్ (భాస్వరం) ప్రధాన ప్రయోజనాలు: పంటల్లో వేర్ల పెరుగుదల నుంచి గింజల నాణ్యత వరకు ఫాస్ఫరస్ (భాస్వరం) కీలకపాత్ర పోషిస్తుంది. భాస్వరం వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను ఎన్నో ఉన్నాయి. ఫాస్ఫరస్ వేర్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మొక్కల వేర్ల వ్యవస్థ బలంగా, లోతుగా పెరిగేందుకు దోహదపడుతుంది. మొక్కల ప్రారంభ ఎదుగుదలకు సహాయపడుతుంది. నాటిన తొలిదశలో మొక్కలు వేగంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. పూత, పిందె ఏర్పాటును పెంచుతుంది. పంటలో పూత, పిందె ఎక్కువగా వచ్చే లా చేస్తుంది. గింజల నాణ్యత, దిగుబడిని మెరుగుపరుస్తుంది. గింజలు బాగా నిండి, నాణ్యతతో పాటు మొత్తం దిగుబడి పెరుగుతుంది. పంట త్వరగా పరిపక్వానికి రావడంలో సహాయపడుతుంది. పంట సకాలంలో కోతకు వస్తుంది. రైతులు నేల పరీక్ష ఆధారంగా, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు ఫాస్ఫరస్ ఎరువులను వాడాలి. -
బాలికలదే హవా..
● ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల జనగామ రూరల్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,600 మంది విద్యార్థులు హాజరు కాగా ఇందులో 2,362 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలికలదే హవా కొనసాగింది. సెకండియర్ జనరల్ బాలురులు 593 మంది పరీక్ష రాయగా 387 మంది ఉత్తీర్ణత సాధించి 65.25 శాతం నమోదైంది. బాలికలు 238 మంది పరీక్షలకు హాజరు కాగా 238 మంది ఉత్తీర్ణత సాధించి 65.21 శాతంగా నిలిచారు. మొత్తం 958 మందికి 625 మంది ఉత్తీర్ణత సాధించగా 65.24శాతం నమోదైంది. ఫస్టియర్ జనరల్లో బాలురు 864 మంది పరీక్షలు రాయగా 494 మంది ఉత్తీర్ణత సాధించగా 57.18శాతంగా ఉన్నారు. బాలికలు 1,103 మంది పరీక్షలకు హాజరు కాగా ఇందులో 825 మంది ఉత్తీర్ణత సాధించి 74.80 శాతంగా ఉంది. మొత్తం 1,967 మందికి గాను 1,319 మంది ఉత్తీర్ణత సాధించగా 67.06 శాతం ఉంది. అలాగే సెకండియర్ ఒకేషనల్లో బాలురు 223 మంది పరీక్షలకు హాజరుకాగా 116 మంది ఉత్తీర్ణత సాధించారు. 52.02 శాతంగా నమోదైంది. బాలికలు 79 మందికి 66 మంది ఉత్తీర్ణత సాధించగా 54 శాతంగా ఉంది. మొత్తం 302 మందికి 182 మంది ఉత్తీర్ణత సాధించగా 60.26 శాతం ఉంది. ఫస్టియర్ ఒకేషనల్లో బాలురు 230 మందికి గాను 123 మంది ఉత్తీర్ణత సాధించగా 53.48 శాతంగా ఉంది. బాలికలు 143 మందికి 113 మంది ఉత్తీర్ణత సాధించగా 79.02 శాతంగా నమోదైంది. మొత్తం 373 మంది పరీక్ష రాయగా 236 మంది ఉత్తీర్ణత సాధించారు. 63.27 శాతంగా ఉంది. ఉత్తీర్ణత శాతాలు ఇవే..సెకండియర్ (జనరల్) : 65.24 బాలురు : 65.25 బాలికలు : 65.21 ఫస్టియర్ (జనరల్) : 67.06 బాలురు : 57.18 బాలికలు : 74.80 సెకండియర్ (ఒకేషనల్) : 60.26 ఫస్టియర్ (ఒకేషనల్) : 63.27 -
‘సిరాజ్’ రాక చిన్నబోయారు!
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం నిర్వహించిన వరంగల్ వారియర్స్ జట్టు పరిచయ కార్యక్రమం స్థానిక క్రికెట్ అభిమానుల్లో నిరాశ మిగిల్చింది. ఇంటర్నేషనల్ బౌలర్, హైదరాబాదీ యువ క్రికెటర్, వరంగల్ వారియర్స్ జట్టు కెప్టెన్ మహ్మద్ సిరాజుద్దీన్ వస్తున్నాడన్న సమాచారంతో ఎంతో ఉత్సాహంతో వచ్చిన అభిమానులు తీరా ఆయన రాకపోవడంతో చిన్నబుచ్చుకున్నారు. సుమారు మూడు గంటల నిరీక్షణ తర్వాత ఆన్లైన్ స్క్రీన్లో మహ్మద్ సిరాజ్ అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవలేదన్నారు. బీసీసీఐ ఆమోదంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొదటిసారిగా టీజీ–20 నిర్వహించడం క్రీడాకారులకు చక్కటి అవకాశమని అన్నారు. కాగా, నెట్వర్క్ సమస్యతో కేవలం నాలుగు నిమిషాలపాటు అదీ అస్పష్టంగా మాట్లాడడం అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. నెల వేతనం అందజేస్తా : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వరంగల్ వారియర్స్ జట్టు పరిచయ వేదికకు ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఫ్రాంచైజ్ యాజ మాన్యంతో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీ–20 టోర్నమెంటులో విజేతలుగా నిలిచివస్తే తన నెల జీతం అందిస్తానని ప్రకటించారు. సుబేదారిలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో శాశ్వత క్రికెట్ కోచింగ్ క్యాంపు ఏర్పాటుకు కలెక్టర్తో మాట్లాడి అనుమతి ఇప్పిస్తానని అన్నారు. ఈ వేదికపై నగర క్రీడా ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఒక రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్ వారియర్స్ సహ–యజమానులు వరుణ్ జూపల్లి, ఫణి చిట్నేని, ధీరజ్ ఇందురు, కాంగ్రెస్ యువ నాయకుడు విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు. చివరగా ఆన్లైన్ స్క్రీన్పై సిరాజ్ పలకరింపు మూడు గంటలు నిరీక్షించిన అభిమానులు నిరుత్సాహంగా ‘మీట్ యువర్ వరంగల్ వారియర్స్’ -
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు
● పక్కాగా డ్రై డే నిర్వహించాలి ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ రూరల్: వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గురువారం కలెక్టరేట్లో సీజనల్ వ్యాధుల నియంత్రణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వ్యాధుల కేసులు పెరిగే అవకాశాలు ఉన్నందున ముందస్తు నివారణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. జ్వరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతీ గ్రామంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించి, అనుమానిత కేసులను గుర్తించి వెంటనే వైద్యసేవలు అందించాలని తెలిపారు. దోమల పెరుగుదలను అరికట్టేందుకు ఫాగింగ్, ఆయిల్బాల్స్ వినియోగం, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి మల్లికార్జున రావు, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం, డీఆర్డీఓ భాస్కర్, విద్యాశాఖ ఇన్చార్జ్ ఏడీ శ్రీనివాస్, ఇన్చార్జ్ డీపీఓ వెంకట్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యత పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పచ్చదనాన్ని పెంపొందించడానికి వన మహోత్సవం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వన మహోత్సవంపై వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మున్సిపల్ శాఖ, వివిధ సంక్షేమ శాఖలు వ్యవసాయ, విద్యా, తదితర శాఖల ఆధ్వర్యంలో మొత్తం 25,92,100 మొక్కలను నాటేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్డీఓ భాస్కర్, డీపీఓ వెంకట్ రెడ్డి, ఎకై ్సజ్ ఎస్పీ అనిత, ఎఫ్ఆర్ఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు మంజూరైన 5,755 ఇళ్లకు గాను 87.5 శాతంతో 5,037 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తి అయిందని తెలిపారు. -
ప్రతీ ఊరికి బస్సు వెళ్లాలి
● జిల్లా కేంద్రంలోని డిపోను పరిశీలించిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ● బస్టాండ్ సౌకర్యాలు, కమర్షియల్ కాంప్లెంక్స్పై సమీక్షజనగామ: జిల్లా పరిధిలోని ప్రతీ గ్రామానికి ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసులను నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జనగామ ఆర్టీసీ డిపోను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గురువారం పరిశీలించారు. డిపో మేనేజర్ ఉషతో కలిసి బస్టాండ్లోని ప్లాట్ఫారాలు, ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, ఇటీవల నిర్మించిన నూతన ప్లాట్ఫారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గాయని ఓ మహిళ చెప్పగా, ఎండీ నాగిరెడ్డి ఆమెకు రెండు చేతులా నమస్కరించి ఆప్యాయతను చాటుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనగామ డిపో పరిధిలో ప్రతి రోజూ సుమారు 60 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్ఫారాల విస్తరణ, అదనపు మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టామని, ఇంకా అవసరమైన సౌకర్యాలపై సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. పట్టణంలో ప్రస్తుతం ప్రత్యేక లోకల్ బస్సు అవసరం లేదని భావిస్తున్నామని, అవసరమైతే డిపో మేనేజర్ను సంప్రదించడం ద్వారా అదనపు బస్స్టాప్ల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం బస్టాండ్ కమర్షియల్ కాంప్లెక్స్, ప్లాట్ఫారాల పరిస్థితి, బస్టాండ్ విస్తీర్ణం, ప్రవేశ మార్గాలు, భవిష్యత్తులో వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే అవకాశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బస్టాండ్లో ప్రస్తుతం 120 దుకాణాలు ఉన్నాయని అధికారులు ఎండీ దృష్టికి తీసుకు రాగా, కొత్త దుకాణాల నిర్మాణానికి హెడ్ ఆఫీస్ అనుమతి తప్పనిసరిగా అవసరమని సూచించారు. కాగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని సీఐ సత్యనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. -
మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి
జనగామ: మైనారిటీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మైనారిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ మైనారిటీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్ష పదవికి అర్హులైన నాయకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఆసక్తి గల నాయకులు రెండు రోజుల్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణరెడ్డి, ఆర్టీఏ సభ్యుడు అభిగౌడ్, బడికె ఇందిర, టీపీసీసీ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జమాల్ షరీఫ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాఫర్ షరీఫ్, డీసీసీ నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి -
నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ
జనగామ: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న మాంగల్య ఫంక్షన్ హాల్లో బుధవారం ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)కి ప్రతీ ఏడాది సుమారు 3 శాతం మేర నష్టం జరుగుతోందన్నారు. రాష్ట్రంలోనే ప్రతి సంవత్సరం సుమారు 8 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, దీంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్, సీటుబెల్ట్లు ప్రాణాలను కాపాడే సాధనాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాటిని వినియోగించాలని సూచించారు. అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పోలీసు శాఖ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు, కట్టుదిట్టమైన అమలు చర్యల ఫలితంగా నాలుగైదు నెలలుగా ప్రమాదాల సంఖ్య తగ్గుతోందన్నారు. వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా విలువైనవని గుర్తుంచుకోవాలని సూచించారు. వినూత్న అవగాహన పోలీసు శాఖ నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం ప్రజలను ఆలోచింపజేసింది. వీడియోలు, నాటక ప్రదర్శన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఉత్తమ ఆర్టీసీ, పోలీసు డ్రైవర్లకు ఆపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసపత్రాలు అందించారు. అలాగే లయన్స్ క్లబ్ ప్రతినిధులు జైన్ రమేశ్, అఖిల భారత మార్వాడీ యువమంచ్ జనగామ శాఖ గీతేష్ బజాజ్ ఆద్వర్యంలో ఉచిత కళ్లద్దాలను ఆపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, డాక్టర్ కల్నల్ భిక్షపతి, డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్ రావు, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, సీఐ సత్యనాయణరెడ్డి, వేణు, అబ్బయ్య గౌడ్, ఎస్సైలు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, యువకులు, యువజన సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అరైవ్–అలైవ్ కార్యక్రమంలో అపరేషన్స్ డీజీపీ అనిల్ కుమార్ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం -
పచ్చదనం, పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి
బచ్చన్నపేట: ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పచ్చదనం, పారిశుధ్యంపై దృష్టి సారించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని రామచంద్రపురంలో నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చేపట్టాలన్నారు. పైపులైన్లకు మరమ్మతులు, నీటి ట్యాంకులను శుభ్రం చేయించాలన్నారు. గ్రామానికి చెందిన బాలమణి అనే మహిళ భర్త సంవత్సరం క్రితం చనిపోయారని తనకు పింఛన్ మంజూరు చేయాలని వేడుకోగా.. వారం లోపల ఆర్థిక సహాయం అందేలా తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, ఎంపీడీఓ లావణ్య, సర్పంచ్ బొందుగుల వినోద్కుమార్, ఉప సర్పంచ్ రవీందర్రెడ్డి, అధికారులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
వార్డు అభివృద్ధికి సహకరించండి
జనగామ రూరల్: పట్టణంలోని మూడో వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు సీసీ అంతర్గత రోడ్లు, హైమాస్ట్ లైట్లతో పాటు గార్లకుంటను పార్కుగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి బుధవారం హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, బొట్ల శేఖర్, బూడిది గోపి, జోగు ప్రకాష్, సుంచు విజేందర్, గుండు శశిరేఖ, భానోతు ధర్మభిక్షం నాయక్తో కలిసి 3వ వార్డు కౌన్సిలర్ బూడిది జ్యోతి వినతి చేశారు. 3వ వార్డు దిగువ లోతట్టు ప్రాంతంగా ఉండడంతో వర్షాకాలంలో ఇబ్బందికరంగా మారిందన్నారు. స్పెషల్ ప్యాకేజీ ద్వారా మోడల్ కాలనీగా వార్డును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.5కోట్ల నిధులు మంజూరు చేయించాలని వారు కోరారు. అలాగే జిల్లా కేంద్రం మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నెంబర్లు వేసి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మంత్రి పొంగులేటిని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి వినతి చేశారు. -
జిల్లాకు మంజూరైన యూనిట్లు, సబ్సిడీ సమాచారం
అంశం లక్ష్యం/యూనిట్లు సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ అవసరానుసారం ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, చిన్న,సన్నకారు రైతులకు 80 శాతం, ఇతరులకు 90 శాతం స్ప్రింక్లర్లు అన్ని వర్గాలు 65 శాతం సబ్సిడీ తేనెటీగల పెంపకం 50 పెట్టెల యూనిట్ 50 శాతం సబ్సిడీ ఫామ్పాండ్ 8 యూనిట్లు యూనిట్కు రూ.90,000 పందిరి కూరగాయలు 150 యూనిట్లు 50–60శాతం వరకు సబ్సిడీ వెదురు మొక్కలు 5 ఎకరాలలోపు రైతులకు ఉచితం -
వేగంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణపనులు
● పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి జఫర్గఢ్: ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. మండలంలోని కోనాయిచలం రెవెన్యూ గ్రామ పరిధిలో దుర్గ్యనాయక్తండా సమీపంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్తో కలసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్ర స్థాయిలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వా రా 2,600 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించనున్నామన్నారు. ఈ పాఠశాలను బాలికలకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది ఖరీఫ్కు సాగునీరు
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో మరమ్మతుల పూర్తి చేసి వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్కు సాగునీరందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి మంత్రి ఉత్తమ్ ప్రత్యేక హెలికాప్టర్లో బుధవారం మధ్యాహ్నం 2.15గంటలకు మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడినుంచి కాన్వాయ్లో బ్యారేజీ దిగువకు వెళ్లారు. పుణేకు చెందిన సైంటిస్టులు, ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో మాట్లాడి పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. అక్కడి నుంచి బ్యారేజీ ఎగువన యాగశాల వద్ద ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు. ముందుగా కల్నల్ పరిక్షీత్ మెహ్రా బ్యారేజీల్లో జరుగుతున్న పరీక్షలను ఒక్కొక్కటిగా వీడియోలు, ఫొటోల ఆధారంగా వివరించారు. రాత్రిపగలు పరీక్షలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూపీఆర్ల ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్లనే కుంగినట్లు తెలిపారు. కారణాలను లోతుగా విశ్లేషణ చేసేందుకు సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలతో పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. భారత సైన్యంలో అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ముందుకుపోతున్నట్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ గుర్తించిన స్కౌర్ డెప్త్, కట్–ఆఫ్ డెప్త్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, ఎనర్జీ డిసిప్లేషన్, గేట్ల నిర్వహణ వంటి కీలక అంశాలపై సమగ్ర అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టులను తిరిగి సురక్షితంగా, సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఇరిగేషన్ సెక్రెటరీ శ్రీధర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఈ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి గంటపాటు మేడిగడ్డ బ్యారేజీలో పర్యటన.. పరిశోధనల తనిఖీ మూడు బ్యారేజీల్లోని పరీక్షల వివరాలు వెల్లడి -
ఘన్పూర్ డిప్యూటీ డీఎంహెచ్ఓగా వాణిశ్రీ
స్టేషన్ఘన్పూర్: డిప్యూటీ డీఎంహెచ్ఓగా, మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారిగా డాక్టర్ వాణిశ్రీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఘన్పూర్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్ఓగా పనిచేస్తున్న డాక్టర్ సుధీర్కుమార్ సాధారణ బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓగా వెళ్లారు. ఆయన స్థానంలో పెద్దపల్లి జిల్లాలో మాతాశిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ వాణిశ్రీ బదిలీపై స్టేషన్ఘన్పూర్కు వచ్చారు. ఈ మేరకు ఆమెకు పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు శ్రీవాణి, హస్న, అజయ్కుమార్, సీహెచ్ఓ జయపాల్రెడ్డి, సూపర్వైజర్ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. నేడు వాహనాల వేలంరఘునాథపల్లి: మండలంలోని పోలీస్స్టేషన్ పరిధి కంచనపల్లి గ్రామానికి చెందిన అమృతం అంజయ్యపై 2023లో అనుమతులు లేకుండా బెల్ట్షాపు నిర్వహించినందుకు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న టీవీఎస్ ఎక్సెల్ టీఎస్ 27ఎఫ్1522, ప్యాసింజర్ ఆటో ఏపీ 36 ఎక్స్ 4749 వాహనాలను డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ వరంగల్ ఆదేశాల మేరకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జనగామ ఎకై ్సజ్ అధికారి ఆధ్వర్యంలో రఘునాథపల్లి పోలీస్స్టేషన్ అవరణలో వేలం నిర్వహించనున్నట్లు అసక్తి గలవారు వేలంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై సూచించారు. రేపు విద్యుత్ వినియోగదారుల సమావేశం జనగామ రూరల్: జనగామ మండలంలోని గానుగుపహడ్ సబ్స్టేషన్ అవరణలో ఈ నెల 12న విద్యుత్ వినియోగదారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్ పర్సన్ ఎన్వీ వేణుగోపాలచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో జనగామ, బచ్చన్నపేట మండలాలకు సంబంధించిన విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ట్రాన్ఫార్మర్లు మార్చడం, ఓల్టేజీ హెచ్చుతగ్గులు, మీటర్లు మార్చడం తదితర అంశాలపై చర్చించడంతో పాటు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేయవచ్చునన్నారు. హెల్త్ వర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్గా డాక్టర్ వందన కాశిబుగ్గ: వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం ఎగ్జామినేషన్ కంట్రోలర్గా డాక్టర్ వందన బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆమె పరిపాలన భవనంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాదపూర్వకంగా చాన్స్లర్ డాక్టర్ రమేశ్రెడ్డిని కలిసి పూలమొక్క అందజేశారు. కాగా, ఇంతకుముందు బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ మల్లేశ్వర్ నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లేశ్వర్ను వీసీ డాక్టర్ రమేశ్రెడ్డితో పాటు పలువురు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు. ముగిసిన జిల్లాస్థాయి చదరంగ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో హనుమకొండ రెడ్డికాలనీలో గల వికాస్ మాస్టర్జీ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్–09 చదరంగ పోటీలు బుధవారం సాయంత్రం ముగిశాయి. బాలుర విభాగంలో జక్కం గౌరిక్ సాయి, బైరి దేవాన్స్ రెడ్డి, అనిశెట్టి అద్విత్, లావడియా అక్షత్ చౌహన్, బాలికల విభాగంలో భగవత్ రీతిగా, ఎం.విక్షిత, రేపాక ఆరాధ్యరెడ్డి, సంహిత విజేతలుగా నిలిచారు. వీరు జూన్, 14, 15, 16 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కన్నా తెలిపారు. కాగా, విజేతలకు మాస్టర్జీ గ్రూప్ ఆఫ్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ లావణ్య బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆర్బిటర్లు ప్రేమ్ సాగర్, రజనీకాంత్, పవన్, తదితరులు పాల్గొన్నారు. -
సొంత భవనాల్లేని పల్లె దవాఖానాలు
లింగాలఘణపురం: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యంపై అటు ప్రజాప్రతినిధులకు గాని ఇటు అధికారులకు గాని పట్టింపులేకుండా పోయింది. నిత్యం ప్రజలకు సేవ చేసే పల్లె దవాఖానాలు, ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ఏళ్ల తరబడిగా పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. స్థలం అందుబాటులో ఉన్న కొన్ని గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. అయితే ఆ నిధులు మంజూరైనా బిల్లుల చెల్లింపు జాప్యం కారణంతో ఆ భవన నిర్మాణాల జోలికి కూడా వెళ్లడంలేదని తెలుస్తోంది. దీంతో అరకొర వసతుల నడుమ వైద్యసేవలు అందిస్తున్నారు. 2019లో ప్రారంభం.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2019లో 5 వేల జనాభాకు ఒక(పల్లె దవాఖాన) ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా విస్తరించి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు అందించేందుకు క్వాలిఫైడ్ వైద్యున్ని నియమించి సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లల వ్యాక్సినేషన్, వృద్ధులకు బీపీ, షుగర్ వ్యాధుల మందుల పంపిణీ, వీటితో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం వంటి సేవలను అందిస్తున్నారు. ఇలా మండలంలో నాలుగైదు పల్లె దవాఖానలుగా మిగిలిన గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలను కొనసాగిస్తూ మండల కేంద్రాల్లోని పీహెచ్సీ, సీహెచ్సీలకు అనుసంధానం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 104 ఆరోగ్య ఉప కేంద్రాల్లో 42 సబ్ సెంటర్లు, 62 పల్లె దవాఖానలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ భవనాలు కేవలం 21 మాత్రమే ఉండగా మిగిలిన 83 ప్రైవేట్ భవనాలు, దాతల ఇళ్లలో కొనసాగుతున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే పల్లె దవాఖానలు, ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలపై చిన్నచూపు ఏ విధంగా ఉందో తెలుస్తోంది. బీపీ మందులు కరువు.. స్థానిక పీహెచ్సీలో సాధారణ బీపీ మందుల కొరత ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని రకాల కాంబినేషన్ బీపీ, షుగర్ మందులు అందుబాటులో ఉండడంలేదని రోగులు చెబుతున్నారు. ఈ విషయంపై మండల వైద్యాధికారి ఉదయ్కిరణ్ను వివరణ కోరగా కొద్ది రోజులుగా కొన్ని రకాల బీపీ మందులు అందుబాటులో లేవని తాము పీహెచ్సీ నుంచి ఇండెంట్ పెడుతున్నా..అక్కడ లేకపోవడంతో పంపించడంలేదని, జిల్లాలోనే లేవని తెలిసిందని వివరించారు. పాఠశాలలు, పంచాయితీ ఆఫీసుల్లో నిర్వహణ అరకొర వసతుల మధ్య వైద్యం అందేదెలా? -
ఉద్యానం..ప్రోత్సాహం
ఎంఐడీహెచ్ కింద రైతులకు లక్షల రూపాయల సబ్సిడీమల్చింగ్ విధానంలో సాగుజనగామ: జిల్లాలో ఉద్యానవన పంటల విస్తరణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ (ఎంఐడీహెచ్) రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద మామిడి, నిమ్మ, అరటి, బొప్పాయి, డ్రాగన్ఫ్రూట్, అవకాడో వంటి తోటల సాగుతో పాటు డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, తేనెటీగల పెంపకం, పందిరి కూరగాయల సాగు, నీటికుంటల ఏర్పాటుకు సబ్సిడీలు మంజూరు చేస్తున్నారు. జిల్లాకు కేటాయింపులు జిల్లాకు ఈ ఏడాది 30 హెక్టార్ల మామిడి, 10 హెక్టార్ల అరటి, 12 హెక్టార్ల బొప్పాయి, 5 హెక్టార్ల నిమ్మ, ఒక హెక్టారు డ్రాగన్ఫ్రూట్, ఒక హెక్టారు అవకాడో, 6 హెక్టార్ల ఉల్లిగడ్డ సాగు లక్ష్యాలు కేటాయించారు. మామిడి, నిమ్మ, జామ తోటలకు హెక్టారుకు రూ.48 వేల చొప్పున 50 శాతం సబ్సిడీ అందిస్తుండగా, అరటికి రూ.42 వేలు, బొప్పాయికి రూ.18 వేలు, డ్రాగన్ఫ్రూట్కు రూ.1.62 లక్షలు, అవకాడోకు రూ.30 వేల సబ్సిడీ అందనుంది. రైతులు ముందుగా పూర్తి ఖర్చుతో తోటలను ఏర్పాటు చేసుకుని, అనంతరం ధ్రువీకరణ పూర్తయ్యాక సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. పాసుబుక్ యూనిట్గా ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు ప్రయోజనం కల్పిస్తున్నారు. సబ్సిడీ కోసం పాసుబుక్, ఆధార్, ఫొటో, బ్యాంకు ఖాతా వివరాలను ఉద్యానవన శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ముందుకొస్తున్న రైతులు.. జిల్లాలో ఇప్పటి వరకు డ్రిప్ కోసం 200 ఎకరాలకు దరఖాస్తులు రావడం రైతుల ఆసక్తిని సూచిస్తోంది. పంటల రక్షణతో పాటు అదనపు ఆదాయం కోసం వెదురు మొక్కలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మామిడి, నిమ్మ, అరటి తోటలు, మల్చింగ్, తేనెటీగల పెంపకం, ఫామ్పాండ్ల కోసం దరఖాస్తులు రావడంతో ఉద్యాన పంటల సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతున్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు వెల్లడిం చారు. మామిడి నుంచి డ్రాగన్ ఫ్రూట్ వరకు తోటల సాగుకు ప్రభుత్వ అండ డ్రిప్, మల్చింగ్, తేనెటీగల పెంపకం, నీటి కుంటలకు రాయితీ ఉద్యానవన శాఖ పథకాలపై పెరుగుతున్న ఆసక్తిసద్వినియోగం చేసుకోండిరాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా రైతులకు అనేక రకాల సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న రైతులు తమ పాసుబుక్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో సమీప ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యాన పంటల సాగు ద్వారా ఆదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలి. – రవికాంత్, జిల్లా ఉద్యానవన అధికారి -
తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర
నర్మెట (తరిగొప్పుల): నాటు కోడి కూర వివా దం చివరికి తండ్రి ప్రాణం తీసింది. జన గామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జంగిలి రమేష్ (42) నాటుకోడిని తెచ్చి కోస్తా.. కూర వండమని మంగళవారం రాత్రి భార్య అనూషకు తెలి పాడు. ఇప్పటికే చేపల కూర వండాను.. రాత్రి పది దాటింది ఇప్పుడు వద్దు అని భర్తకు నచ్చచెప్పినా వినిపించుకోకుండా బూతులు తిట్టసాగాడు. ఈ క్రమంలో అమ్మను ఎందుకు తిడుతున్నావని కొడుకు గణేశ్ అడ్డుతగిలాడు. కోపంతో కుమారుడిని సైతం బూతులు తిట్టడంతో ఆగ్రహావేశానికిలోనైన గణేష్ పక్కనే ఉన్న రోకలిబండతో తండ్రి తలపై బాదాడు. తీవ్ర గాయమవడంతో స్థానికులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. రమేష్ సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గుగులోతు శ్రీదేవి తెలిపారు. -
కళాశాలల ఎంపికలో జాగ్రత్త
● నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ కాజీపేట అర్బన్: విద్యార్థులు కళాశాలల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో మంగళవారం విద్యార్థులు సందడి చేశారు. జోసా–26 (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓపెన్హౌస్ కార్యక్రమాన్ని నిట్ డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. నిట్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, మిగతా ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్లో తప్పులు చేయకుండా వివిధ కళాశాలలపై అవగాహన కల్పించేందుకు ఓపెన్హౌస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
లాక్ష్ ఫౌండేషన్తో ఆర్ట్స్ కళాశాల ఎంఓయూ
కేయూ క్యాంపస్: బెంగళూరుకు చెందిన లాక్ష్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థతో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఎంఓయూతో వివిధ కంపెనీలతో నేరుగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎల్.జితేందర్ తెలిపారు. లాక్ష్ ఫౌండేషన్ సహకారంతో కెరీర్ మార్గదర్శక శిబిరాలు, పరిశ్రమల ఆధారిత అభ్యసన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. లా ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ప్లేస్మెంట్ మేనేజర్ వైద్యం రవికుమార్, సీనియర్ మేనేజర్ సునీల్ నుంచి కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ఒప్పంద పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రహమాన్, సాయిచరణ్, గిరిప్రసాద్, రమేశ్ పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి
● డీసీపీ రాజమహేంద్ర నాయక్ జనగామ రూరల్: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీలర్లు నడుచుకోవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. మంగళవారం ఇనన్పుట్ డీలర్ల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. డీలర్ల వద్ద ఉన్న ఇ–పాస్ స్టాక్ను భౌతిక నిల్వలతో గ్రౌండ్ నిల్వలను పరిశీలించింది. డీసీపీ మాట్లాడుతూ.. వ్యవసాయ ఇనన్పుట్ల విక్రయాల్లో నిబంధనల అమలు, స్టాక్ల పారదర్శకత ఉండాలన్నారు. తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, సీఐ సత్యనారాయణరెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాధిక, జనగామ, వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్ పాల్గొన్నారు. -
తుదిదశకు ‘ఇన్వెస్టిగేషన్’
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్లలో పరిశోధన (ఇన్వెస్టిగేషన్) పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటిి వరకు 70శాతానికి పైగా పరీక్షలు పూర్తయ్యాయి. సుందిళ్ల బరాజ్లో మొత్తం 75 పరీక్షలకు 69 పూర్తికాగా.. అన్నారంలో 66కు 58 పూర్తయ్యాయి. మేడిగడ్డలో 85కు 73 జీపీఆర్ పరీక్షలు పూర్తయ్యాయి. బరాజ్లలో పరీక్షలను నీటిపారుదల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతోపాటు టీం స్థితిగతులను సమీక్షిస్తూ పనుల్లో వేగిరం పెంచుతున్నారు. మిగిలిన పరీక్షలు ఈనెల 20వరకు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. నేడు మంత్రి పరిశీలన.. సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి బరాజ్లలో పరీక్షలు తుది దశకు చేరడంతో బుధవారం మద్యాహ్నం 12.45గంటలకు మేడిగడ్డ బరాజ్కు ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు రానున్నారు. బరాజ్ వద్దనే రెండు గంటల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసి తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సాగుతున్న పరీక్షలు నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
మాది ప్రజాప్రభుత్వం
చిల్పూరు/జఫర్గఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్రెడ్డి, చిల్పూర్ ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్టేషన్ఘన్పూర్ ప్రాంతం ఒకప్పుడు వలసలకు కేరాఫ్గా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు, రిజ ర్వాయర్ల ద్వారా పంటలకు నీరు అందడం, పెరిగిన వ్యవసాయ పంప్సెట్ల వల్ల పంట దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం పెరిగి వలసలు తగ్గాయన్నారు. ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాల న్నా, ఇతర అవసరాలకూ విద్యుత్ అవసరమని, అందుకు విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు పల్లగుట్ట గ్రామంలో రూ.60.62 కోట్లతో చేపట్టిన 4 విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్ల శంకుస్థాపనల శిలాఫలకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సభ ప్రాంగణంలో ఏర్పా టు చేసిన మహిళా శక్తి ఎరువుల షాపులు, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.3.5 కోట్ల విలువైన సీ్త్రనిధి చెక్కులు అందజేశారు. 107 స్వయం సహాయక సంఘాల మహిళలకు సీ్త్ర నిధు రుణాల కింద రూ.3.07కోట్లు, బ్యాంక్ లింకేజీ కింద 407 స్వయం సహాయక సంఘాలకు రూ.32.89కోట్ల విలువైన చెక్కులను మహిళలకు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ కుట్ర: ఎంపీ కావ్య ఓటు హక్కుపై ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. 10 ఏళ్లుగా అబివృద్ధిలో చీకట్లో మగ్గిపోయిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం కడియం నాయకత్వంలో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కడియం వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. రఘునాథపల్లిలో ఉన్న 132/ 33 కేవీ సబ్ స్టేషన్ను 220/133 కేవీ సబ్ స్టేషన్గా అప్గ్రేడ్ చేయాలని, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. సాగునీటి వసతులతో ఘన్పూర్లో వలసలు తగ్గాయి పల్లగుట్ట సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.60.62కోట్లతో 4 సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన -
ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొత్తం సీట్లు 690
జనగామ: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ (అటానమస్) కళాశాల 2026–27 విద్యా సంవత్సరంలో రికార్డు స్థాయిలో అడ్మిషన్ల లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. విద్యా ప్రమాణాలు, ఆధునిక మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులు, స్కాలర్షిప్లు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలతో విద్యార్థులకు బంగారు భవిష్యత్ను అందిస్తోంది. ప్రస్తుతం కళాశాలలో మొత్తం 720 సీట్లకు అవకాశం ఉండగా, మొదటి రెండు విడతల అడ్మిషన్లలోనే గణనీయమైన స్పందన లభించింది. ముఖ్యంగా ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన బీకాం (బ్యాంకింగ్, ఫైనాన్న్స్ అండ్ ఇన్సూరెన్స్, బీఎఫ్ఎస్ఐ), బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు 188 అడ్మిషన్లు కాగా, బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులో 45 శాతం, బీకాం బీఎఫ్ఎస్ఐలో 50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఈ కోర్సులపై ఆసక్తి చూపుతున్నట్లు కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్తగా అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ఓరియెంటేషన్ నిర్వహించారు. కొత్త కోర్సుల్లో ప్రత్యేక ప్రయోజనాలు బీఎస్సీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, బీకాం బీఎఫ్ఎస్ఐ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు పరిశ్రమలతో అనుసంధానమైన అప్రెంటిస్షిప్ అవకాశాలు లభిస్తాయి. శిక్షణ కాలంలో విద్యార్థులు నెలకు సుమారు రూ.15 వేల వరకు స్టైఫండ్ పొందే అవకాశం ఉంది. ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం కళాశాలలోని టీఎస్కేసీ ఆధ్వర్యంలో రెగ్యులర్గా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మెగా జాబ్ మేళాల్లో పలువురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పతకాలు సాధించడం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం కళాశాల ప్రతిష్టను మరింత పెంచుతోంది. స్కాలర్షిప్లతో ఆర్థిక వెసులుబాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రతిభ కనబరిచిన బాలికలకు అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్కాలర్షిప్ అందుతోంది. ఎంపికైన విద్యార్థినులకు నెలకు రూ.30వేల చొప్పున మూడు సంవత్సరాలపాటు మొత్తం రూ.90వేల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ తదితర కేటగిరీల్లో రిజర్వేషన్ల ఆధారంగా ఇక్కడ సెలెక్టు చేసి పంపించగా, ఫౌండేషన్ నుంచి అర్హత కలిగిన విద్యార్థినులను గుర్తించి పేర్ల జాబితాను వెల్లడిస్తారు. అడ్మిషన్ల కోసం విస్త్రత ప్రచారం అడ్మిషన్ల పెంపు కోసం ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో అధ్యాపక బృందం జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ, మోడల్, జ్యోతిబాఫూలే, గురుకుల వి ద్యాసంస్థలతో పాటు ప్రైవేటు పిల్లల వద్దకు వెళ్తూ అడ్మిషన్లపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో హాస్టల్ సౌకర్యం కల్పించేందుకు కళాశాల యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మూడో విడతకు సిద్ధం మొదటి రెండు విడతల అడ్మిషన్లు పూర్తికాగా, మూడో విడత రిజిస్ట్రేషన్లు ఈ నెల 15 వరకు కొనసాగనున్నాయి. 16న వెబ్ ఆప్షన్లు, 20న సీట్ల కేటాయింపు జరగనుంది. 30 వేలకుపైగా పుస్తకాలతో గ్రంథాలయం 12 కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీ కంప్యూటర్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రయోగశాలలు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, టీఎస్కేసీ విభాగాలు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ క్రీడా సదుపాయాలు పర్యావరణ క్లబ్, సామాజిక సేవా కార్యక్రమాలుకళాశాల ప్రత్యేకతలు :కోర్సుల వారీగా అడ్మిషన్ల పరిస్థితి 720 సీట్ల భర్తీ లక్ష్యంతో ముందుకు ఈ నెల 15 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్న ప్రిన్సిపాల్, ఆధ్యాపక బృందంప్రస్తుత అడ్మిషన్లుఖాళీలుకోర్సు మొత్తం ప్రస్తుత ఖాళీలు సీట్లు అడ్మిషన్లుబీఏ (తెలుగు, 180 32 148 ఇంగ్లిష్ మీడియం) బీకాం 150 48 102 (కంప్యూటర్ అప్లికేషన్) బీఎస్సీ లైఫ్ సైన్సెస్ 120 23 97 బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ 120 38 82 బీకాం(బీఎస్ఎఫ్ఐ) 60 30 30 బీఎస్సీ 60 27 33 హెల్త్కేర్ మేనేజ్మెంట్ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ (అటానమస్) కళాశాలకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టిన బీకాం(బీఎఫ్ఎస్ఐ), బీఎస్సీ హెల్త్కేర్ మేనేజ్ మెంట్ కోర్సులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి. – శ్రీనివాస్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల -
ఆర్టీసీ సేవల్లో మహిళా భాగస్వామ్యం
జనగామ: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం ముందడుగుగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలు స్థిరమైన ఆదాయ వనరులను పొందడంతో పాటు నిర్వహణ సామర్థ్యాలను పెంపొందించుకునే అవకాశం లభిస్తోంది. స్వల్ప పెట్టుబడి.. స్థిర ఆదాయం జిల్లాలోని 12 మండల సమాఖ్యలతో పాటు జిల్లా సమాఖ్యకు కలిపి మొత్తం 13 బస్సులను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో బస్సు కొనుగోలుకు సుమారు రూ.36 లక్షల వ్యయం కాగా, అందులో ప్రభుత్వం రూ.30 లక్షలు భరిస్తుండగా, సంబంధిత సమాఖ్య రూ.6 లక్షలు మాత్రమే పెట్టుబడిగా సమకూరుస్తోంది. ఈ బస్సులను ఆర్టీసీ సంస్థ నిర్వహణలో నడిపిస్తూ, మహిళా సమాఖ్యలకు ప్రతీ నెల రూ.69,468 చొప్పున చెల్లించనుంది. 84 నెలల కాలంలో ఒక్కో బస్సుకు దాదాపు రూ.58.80 లక్షల మేర ఆదాయం మహిళా సంఘాలకు లభించనుంది. స్వల్ప పెట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే ఈ విధానం మహిళా సంఘాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో కీలకంగా మారనుంది. ప్రభుత్వం రూ.30 లక్షల సబ్సిడీ అందించగా, మహిళా సమాఖ్యలు కేవలం రూ.6 లక్షల పెట్టుబడితోనే గణనీయమైన లాభాలను పొందే అవకాశం ఉంది. పెట్టుబడిపై అధిక రాబడి లభించడం వల్ల మహిళల్లో వ్యాపార దృక్పథం పెంపొందడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి. 84 నెలల కాలపరిమితి ముగిసిన వెంటనే బస్సును ఆర్టీసీ స్వాధీనం చేసుకుంటుంది. హైదరాబాద్ తరలిన లబ్ధిదారులు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేశారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు అదనపు డీఆర్డీఓ నూరోద్దీన్(సెర్ప్) ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు 13 బస్సులతో భారీ సంఖ్యలో హైదరాబాద్ తరలివెళ్లారు. మహిళల భద్రత దృష్ట్యా పోలీసు, వైద్య, ఇతర అధికరారుల బృందాలు వెంట వెళ్లాయి. ఈ పథకం మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు మాత్రమే కాకుండా గ్రామీణ మహిళల్లో నాయకత్వ లక్షణాలు, ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు పెంపొందించేందుకు దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మహిళా సంఘాలకు బస్సుల నిర్వహణ బాధ్యత జిల్లాలో 12 సమాఖ్యలకు 13 బస్సులు హైదరాబాద్లో అందించిన సీఎం రేవంత్ -
ప్రతీ ఓటు ముఖ్యమే
జనగామ రూరల్: ప్రతీ ఓటు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని, పార్టీ సంస్థాగత బలోపేతం, ఓటరు జాబితాల పటిష్ట నిర్వహణకు ప్రతీ కార్యకర్త, బీఎల్ఏ(బూత్ లెవల్ ఏజెంట్) కృషి చేయాలని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు లకావత్ ధన్వంతి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామాల్లో నాయకుల గెలుపునకు బీఎల్ఏలు ఎంతో కీలకమన్నారు. దొంగ ఓట్లు వేయకుండా వ్యక్తుల గుర్తింపునకు ఏజెంట్ పనిచేస్తారని, దొంగ ఓట్లపై కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. కొమ్మూరి ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు, బీఎల్లు మరింత కృషి చేయాలన్నారు. ఈనెల 21 నుంచి ప్రారంభం అయ్యే ‘సర్’ ప్రక్రియలో బీఎల్ఓలతో కార్యకర్తలు నిత్యం అందుబాటులో ఉండి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. ఈ సర్వేలోనే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా లేదో తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, ట్రైనర్ డా.రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి, కౌన్సిలర్లు లోకమంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఉడుత రవి, చెంచారపు కరుణాకర్ రెడ్డి, అనిత, సుమలత, రజిని, సర్పంచ్లు మల్లేష్, సత్యనారాయణ రెడ్డి, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి బీఎల్ఏలు కృషి చేయాలి బీఎల్ఏలకు శిక్షణలో ఎంపీ చామల, కొమ్మూరి ప్రతాప్రెడ్డి -
యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేయాలి
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో యంగ్ ఇండియా స్కూల్, కాకతీయ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని మంగళవారం నాగరత్న సేవా సంఘం అధ్యక్షుడు బిర్రు ఇస్తారి హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చెన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కళాశాలల మంజూరు విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. స్పోర్ట్స్కోటాలో పారాస్పోర్ట్స్ క్రీడాకారులను చేర్చాలి జనగామ: స్పోర్ట్స్ కోటాలో పారాస్పోర్ట్స్ క్రీడాకారులను చేర్చాలని పారా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాధ్యక్షురాలు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ జనగామ జనరల్ సెక్రటరీ మాచర్ల కృష్ణవేణి కో రారు. మంగళవారం ఆమె జిల్లా కేంద్రంలో మాట్లాడారు.. నూతన పాలసీ వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ పారాస్పోర్ట్స్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించకపోవడం బాధాకరమన్నారు. హైకోర్టు 2023లో ఇచ్చిన తీర్పుకు రెండు శాతం పారాస్పోర్ట్స్ క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. పాఠశాలల కుదింపు ఉపసంహరించుకోవాలి జనగామ రూరల్: పాఠశాలల కుదింపు ఆలోచనలను ఉపసంహరించుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉమాపతి భవన్లో జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా డి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. రేషనలైజేషన్ ద్వారా 27 వేల ప్రభుత్వ పాఠశాలను 4 వేల పాఠశాలకు కుదించడం వల్ల పేదలు విద్యకు దూరమవుతారన్నారు. ప్రజలకు విద్యను దూరం చేస్తామంటే పాఠశాలల పరిరక్షణ కోసం ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంఘటితమై పోరాడాలని తెలిపారు. బి.లక్ష్మ య్య, కుర్రంల యాదగిరి, అంకుషావలి, వజ్రయ్య, తోటరాజు, రాజారెడ్డి, లక్ష్మణ్ జి, వెంకన్న ,రాజేంద్ర కుమార్, మల్లారెడ్డి ,కనకయ్య, శ్రీహరి, దూడల రమేశ్, శ్రీనివాస్, ఖాసిం, వసంత, రామచంద్రం పాల్గొన్నారు ప్రకృతి పరిరక్షణకు ట్రెక్కింగ్ ఊతం రఘునాథపల్లి: ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రఘునాథపల్లి దొడ్గిగుట్టపై ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ అవగాహన పెంపొందించడం, యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రకృతి ప్రేమికులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ట్రెక్కింగ్ ప్రకృతి పరిరక్షణకు ఊతమన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భాస్కర్, రమేశ్, జావేద్, హుస్సేన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శోభారాణి, బీట్ ఆఫీ సర్లు రమేష్, రవి, అంజయ్య పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్గా ఉష జనగామ: జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్గా ఎం.ఉషను నియమిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్.స్వాతి హైదరాబాద్ చెంగిచెర్ల డిపోకు బదిలీ కాగా, షాద్నగర్లో పని చేస్తున్న ఉషకు ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చారు. కరపత్రం ఆవిష్కరణ హన్మకొండ కల్చరల్: వరంగల్ రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే 17వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు– 2026 కరపత్రాన్ని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్, ఐక్యవేదిక పరపతి సంఘం సభ్యుల సహకారంతో ఈ నెల 12, 13, 14వ తేదీల్లో కాళోజీ కళాక్షేత్రంలో ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనున్నారు. -
‘నీట్’కు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: ఈనెల 21న నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నీట్పై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, జిల్లాలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీ డిగ్రీ కళాశాలలో 396 మంది, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో 192మందితో కలిపి మొత్తం 588 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 వరకు ఉంటుందన్నారు. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలన్నారు. సమీక్ష సమావేశంలో నీట్ కో–ఆర్డినేటర్ ఏబీవీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ రవీంద్ర నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
సభాస్థలిని పరిశీలించిన కడియం
చిల్పూరు: మండలంలోని పల్లగుట్ట గ్రామానికి మంగళవారం డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క రానున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. పల్లగుట్ట గ్రామంలో సోమవారం ఉదయం కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి, ఘన్పూర్ ఆపరేషన్ ఏడీఈ రణధీర్రెడ్డి, చిల్పూరు ఏఈ సురేష్ తదితర అధికారులతో కలిసి ఆయన సభాస్థలిని పరిశీలించారు. అనంతరం కడియం మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.60.62 కోట్ల విలువైన నాలుగు సబ్ స్టేషన్ల ప్రారంభం, 3 సబ్ స్టేషన్లకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కాగా, నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో ఇళ్లపై నుంచి 33/11 కేవీ లైన్లు వెళ్లాయని ఈవిషయంలో గృహ యజమానులు ట్రాన్స్కో వారిని అడిగితే లైన్ షిఫ్టింగ్కు జీపీ నుంచి డబ్బులు చెల్లిస్తే సరిచేస్తామన్నారని ఆ సమస్యతో పాటు, రఘునాథపల్లి మండల కేంద్రంలో ఉన్న 132/33 కేవీ సబ్ స్టేషన్ను 220/132 కేవీ సబ్ స్టేషన్గా అప్గ్రేడ్ చేస్తే 7 మండలాల్లో విద్యుత్ సమస్య ఉండదని దీన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీదర్రావు, పల్లగుట్ట గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, శాతబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు..భూసమస్యలు
జనగామ రూరల్: కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్కు అర్జీదారులు పోటెత్తారు. ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ 510 దరఖాస్తులు స్వీకరించారు. గ్రీవెన్స్లో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్లో డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చినకోట్యానాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని ఇలా.. ● పాలకుర్తి గూడూరు గ్రామానికి చెందిన కాసోజు భీష్మాచారి తనకు పుట్టుకతో పోలియోతో రెండు కాళ్లు పోయాయని, వచ్చే పెన్షన్తో అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నానని, మూడు చక్రాల స్కూటీ అందించాలని వేడుకున్నారు. ● తరిగొప్పుల మండలానికి చెందిన మామిడాల కల్పన, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గుర్తించి, ఆర్థిక సహాయం అందజేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ● జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామానికి చెందిన శానబోయిన తిరుమలేష్, సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ప్రజాపాలనలో దరఖాస్తు చేసినా కూడా మొదటి విడతలో ఇల్లు రాలేదని, రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ● లింగాల ఘణపురం మండలం జీడికల్ గ్రామానికి చెందిన నల్ల నాగమణి, నిరుపేద కుటుంబానికి చెందినవారమని, అద్దె ఇట్లో ఉంటు కాలం వెల్లదిస్తున్నామని ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరని విన్నవించారు. ● జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన మారగోని లక్ష్మి, చిన్న పెంకుటిల్లు కూలిపోయే దశలో ఉందని, తనకు ఎవరూ లేరని, వితంతువు ఒంటరి మహిళనని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● దేవరుప్పుల మండలానికి చెందిన గునుపాక నవీన్, తన ఒక ఎకరం 20 గుంటల భూమికి సంబంధించి పట్టా పాస్ బుక్ ఇప్పించాలని అధికారుల చుట్టు తిరిగిన ఫలితం లేదని తనకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టరేట్ గ్రీవెన్స్లో అధిక అర్జీలు ఇవే సమస్యల పరిష్కరించాలంటూ తరలివచ్చిన ప్రజలు 510 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్, అధికారులుచనిపోయానని చెప్పి భూమి కాజేశారు మాది ఆగాపేట గ్రామం. మా తండ్రి బొక్క ప్రకాశం పేరు మీద సర్వేనంబర్ 521బై 45,46,47,48 లో 2.36 గుంటల తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇనాం భూమి ఉంది. గ్రామానికి చెందిన కొంతమంది తాను చనిపోయాయని, తనకు వారసులు ఎవరూ లేరని భూమి గ్రామ పంచాయతీకి అప్పగించాలని పత్రం ఉందంటూ భూమిని కాజేయాలని చూస్తున్నారు. ఏళ్ల తరబడి భూమిపై జీవిస్తున్నా. నాకు న్యాయం చేయాలి. –బొక్క సుధాకర్, ఆగాపేట, నర్మెట -
మహిళలే పవర్ ఓనర్లు!
రఘునాథపల్లి: జిల్లాలోని పాలకుర్తి మండలం వావిలాల, రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామాలు మహిళల ఆర్థిక సాధికారతకు ఆదర్శంగా నిలవబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం కింద సమాఖ్యల ఆధ్వర్యంలో ఒక మెగావాట్ సామర్థ్యంతో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అశ్వరావుపల్లిలోని 33/11 కేవీ సబ్స్టేషన్ సమీపంలో ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టుకు గత నెల 27న భూమిపూజ చేయగా, వావిలాలలో నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు పునరుత్పాదక ఇంధన రంగంలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పర్యవేక్షణలో ఆ ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్వనిరెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చొరవతో ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. త్రైపాక్షిక ఒప్పందంతో ముందడుగు ఈ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), టీజీ రెడ్కో, టీజీ డిస్కమ్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. 25 సంవత్సరాల కాల పరిమితితో ఈ ప్రాజెక్టులు కొనసాగనున్నాయి. రూ. 2.97 కోట్ల వ్యయంతో ఒక్కో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 10 శాతం వాటాగా రూ.29.70లక్షలు మండల సమాఖ్య, చాకలి ఐలమ్మ జిల్లా సమాఖ్య సమకూర్చనున్నాయి. రాష్ట్ర పభుత్వం సబ్సిడీ రూపంలో రూ.కోటి రాయితీ అందించనుండగా, మిగిలిన మొత్తాన్ని సెర్ప్ ద్వారా బ్యాంకు రుణంగా సమకూర్చనున్నారు. మహిళలకు స్థిరమైన ఆదాయం ఒక్కో ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 4 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఒక్క యూనిట్కు రూ.3.15 చొప్పున విక్రయించడం ద్వారా నెలకు రూ.4లక్షల చొప్పున ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బ్యాంకు రుణాలు, నిర్వహణ ఖర్చులు చెల్లించిన తర్వాత సంఘాలకు, సమాఖ్యలకు స్థిరమైన ఆదాయం వస్తుంది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ప్లాంట్లు జిల్లాలో వావిలాల, అశ్వరావుపల్లిలో ఏర్పాటు కొనసాగుతున్న నిర్మాణ పనులు ఒక్కో ప్లాంట్కు రూ.2.97 కోట్లు.. దీర్ఘకాలిక, స్థిర ఆదాయంతో ఆర్థిక స్వావలంబన -
8 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీఆర్లో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లను వివిధ విభాగాలకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో కె.ప్రవీణ్ కుమార్ హనుమకొండ ట్రాఫిక్, సుబ్బారెడ్డి టాస్క్ఫోర్స్, దేవేందర్ టాస్క్ఫోర్స్, దామోదర్రెడ్డి సీసీఆర్బీ, చేరాలు ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్, ఎ.రమేశ్ ఏహెచ్టీయూ, ఎ.ప్రవీణ్కుమార్ పీసీఆర్, కమాండ్ కంట్రోల్ అదనపు బాధ్యతలు అప్పగించారు. నేడు బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ జనగామ: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నేడు (మంగళవారం) ఉంటుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పసరమడ్ల గ్రామం ఉషోదయ కన్వెన్షన్ హాల్ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ముఖ్యఅతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి వస్తున్నారని, ఈ శిక్షణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్స్ ట్రైనర్ రాజశేఖర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ముఖ్య నాయకులు పాల్గొంటారన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. దివ్యాంగులకు ట్రై స్రైకిళ్లు అందజేత జనగామ రూరల్: జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ మండల పరిధిలోని సముద్రాల గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఈగ పారిజాతం, కొడకండ్ల మండలం నరసింగపురం గ్రామానికి చెందిన జేడీ చంద్రకళ తమ జీవనోపాధి కోసం బ్యాటరీ ట్రై సైకిల్ అందించాలని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతిపత్రాలు సమర్పించారు. కలెక్టర్ వెంటనే అదనపు కలెక్టర్ వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి బెన్షాలోమ్కు వారి అర్హతలు పరిశీలించి ఇద్దరు లబ్ధిదారులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు మంజూరు చేసి అందజేశారు. మానవత్వం చాటుకున్న కలెక్టర్ జనగామ: కొండాపూర్ ఎర్రకుంట తండాకు చెందిన దివ్యాంగుడు బానోత్ రాములు పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెంటనే స్పందించి వీల్చైర్ అందజేశారు. ఈసందర్భంగా రాములు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. కేఎంసీ ప్రిన్సిపాల్గా మోహన్దాస్ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు షురూ -
నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
4 సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపనజనగామ, జఫర్గఢ్, చిల్పూర్: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఈనెల 9 (మంగళవారం) డిప్యూటీ సీఎం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 4 సబ్స్టేషన్లకు ప్రారంభోత్సవం, మరో 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ తదితరులు హాజరుకానున్నారు. ప్రారంభం కానున్న సబ్స్టేషన్లు.. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలో రూ. 43.92 కోట్లతో నిర్మించిన 132/ 33కేవీ పీచర సబ్స్టేషన్ ద్వా రా వేలేరు, చిల్పూర్, ధర్మసాగర్ మండలాల్లోని 43,142 మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందనుంది. అంతేకాకుండా ఘన్పూర్, నర్మెట, ఎల్కుర్తి, వడ్డేపల్లి సబ్స్టేషన్లపై లోడ్ తగ్గనుంది. దీంతో పాటు చిల్పూర్ మండలం కొండాపూర్ 33/11 కేవీ, జఫర్గఢ్ మండలం సాగరం 33/11కేవీ, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి 33/ 11కేవీ సబ్స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ 4 సబ్స్టేషన్ల ద్వారా 7,832 మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. శంకుస్థాపన చేయనున్న సబ్స్టేషన్లు.. చిల్పూర్ మండలంలోని లింగంపల్లి రూ.2.81 కోట్లు, పల్లగుట్ట రూ.3.25 కోట్లు, నష్కల్ రూ.3.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మూడు 33/11కేవీ సబ్స్టేషన్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వీటి ద్వారా లింగంపల్లి, కొండాపూర్, శ్రీపతిపల్లి, మల్కాపూర్, కృష్ణాజి గూడెం, తాటికొండ, వంగాలపల్లి, నష్కల్ సహా 9,864 మంది వినియోగదారులకు లో ఓల్టేజీ సమస్య తీరనుంది. నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేసేందుకు మొత్తం రూ.60.62 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
తీరనున్న ‘సాగు’బాధలు
స్టేషన్ఘన్పూర్: మండలంలో పాంనూర్ గ్రామంలోని బంజరుకాల్వ పనులు దాదాపు మూడు దశాబ్దాలుగా మరమ్మతుకు నోచుకోకపోవడంతో సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు, పాలకులు మారినా పాంనూర్ బంజరుమాటు తీరని సమస్యగా మిగలడంతో రైతులు అరిగోస పడుతున్నారు. అయితే ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బంజరుకాల్వ అభివృద్ధి కోసం రూ. కోటి 92లక్షల 70వేలు నిధులు మంజూరు చేయించారు. ఎట్టకేలకు కష్టాలకు చెక్.. బంజరుకాల్వకు ఎమ్మెల్యే చొరవతో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఎట్టకేలకు పాంనూర్తో పాటు చిల్పూరు, జఫర్గఢ్ మండలాల రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఘన్పూర్ రిజర్వాయర్ పూర్తయి అక్కడి నుంచి దాదాపు 17ఏళ్లుగా సాగునీరు వస్తున్నా బంజరుకాల్వ శిథిలమై పూడుకపోవడంతో రైతులకు సాగునీరు రావడం లేదు. బంజరుకాల్వను మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకొస్తే మొత్తంగా వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో 550ఎకరాలు పాంనూర్, 250 ఎకరాలు చిల్పూరు మండలం నష్కల్, 250 ఎకరాలు జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామాలకు సాగునీరు అందుతుంది. రెండునెలల క్రితం గ్రామంలో జరిగిన ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరుకాగా పలువురు బంజరుకాల్వ సమస్యపై సభ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో బంజరుకాల్వను 31కిలోమీటర్ల పొడవుతో సీసీ ఉపయోగించి నిర్మాణం చేయనున్నారు. అదేవిధంగా కాల్వ ద్వారా వచ్చే సాగునీటిని రైతులు వినియోగించుకునేలా కాల్వపైన గేటువాల్వులతో కూడిన 8 తూములను ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి పనులు పూర్తయితే దాదాపు వెయ్యి ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందనుంది. రెండు పంటలకు నీళ్లు బంజరుమాటు పనులతో దాదాపు వెయ్యి ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందుతుంది. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే కడియంకు గ్రామస్థులు, రైతులందరం రుణపడి ఉంటాం. –పోలెపల్లి సంపత్రెడ్డి, సర్పంచ్, పాంనూర్ త్వరలో పనులు ప్రారంభిస్తాం.. బంజరుకాల్వ సమస్యపై రైతులు, గ్రామస్థులు గతంలో నా దృష్టికి తీసుకొచ్చారు. సమస్యపై పూర్తి అవగాహనతో గ్రామస్థులు, రైతుల కోరిక మేరకు సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించా. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. –ఎమ్మెల్యే కడియం శ్రీహరి బంజరుకాల్వ మరమ్మతులకు రూ.1.92 కోట్లు నిధుల మంజూరు వెయ్యి ఎకరాలకు సాగునీరు మూడు మండలాల రైతులకు ప్రయోజనం -
చెరువుల చెంత ‘మృగశిర’ సందడి
జనగామ: నేటి(సోమవారం)మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపల విక్రయాలు భారీగా జరిగాయి. మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విశ్వాసం కొనసాగుతుండటంతో ప్రజలు ఉదయం నుంచే చేపల మార్కెట్లకు తరలివచ్చారు. దీంతో చెరు వులు, చేపల దుకాణాలు, తాత్కాలిక చేపల విక్ర య కేంద్రాలు కొనుగోలు దారులతో కిటకిటలా డాయి. మరోవైపు హైదరాబాద్లో ప్రతీ ఏడాది పంపిణీ చేసే చేప మందు కోసం జిల్లా నుంచి అనేక మంది వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉబ్బసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందనే నమ్మకంతో వేలాది మంది చేపమందు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్టేషన్ ఘన్పూర్లో.. స్టేషన్ఘన్పూర్: నేడు మృగశిర కార్తె ఉండగా ఆదివారం స్టేషన్ఘన్పూర్, శివునిపల్లితో పాటు పలు గ్రామాల్లో చెరువుల వద్ద ముందస్తు మృగశిరకార్తె సందడి నెలకొంది. ఆయా గ్రామాల చెరువుల వద్ద చేపలు పట్టేవారు, చేపలు కొనుగోలు చేసి తీసుకునే వాళ్ళతో సందడి నెలకొంది. సాధారణంగా కిలో రూ.150లకు విక్రయించే తెల్లచేపను మృగశిర కార్తె సందర్భంగా రూ.200లకు విక్రయించారు. -
కేయూ బాటనీ విభాగం అధిపతిగా మమత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ బాటనీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మమతను నియమిస్తూ (తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు) రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆమె ఈనెల 6న బాధ్యతలను స్వీకరించారు. ప్రొఫెసర్ లలితాకుమారి ఇప్పటివరకు బాటనీ విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె పదవీ కాలం ముగియగా మళ్లీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ అధికారులు కొనసాగించడం లేదు. దీంతో మమతను బాటనీ విభాగం అధిపతిగా నియమించారు. -
వేసవి సెలవులు మరో మూడురోజులు
● 15న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పునఃప్రారంభం ● పాఠశాల రీఓపెనింగ్పై విద్యాశాఖ ఉత్తర్వులు జారీజనగామ: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పునఃప్రారంభ తేదీని రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటగా 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా, వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని 15న ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రెండో శని, ఆదివారం కారణంగా నిర్ణయం ఈనెల 13న రెండో శనివారం, 14న ఆదివారం రావడంతో పాఠశాలలను 12న ప్రారంభించడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని పలు వర్గాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో వేసవి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడిగించింది. పునః ప్రారంభం వాయిదా కారణంగా ఏర్పడే విద్యా సమయ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అకడమిక్ క్యాలెండర్లో నిర్దేశించిన బోధనా దినాలను పూర్తి చేసేందుకు జూలై 11న వచ్చే రెండో శనివారాన్ని సాధారణ పనిదినంగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆ రోజు పాఠశాలలన్నీ సాధారణ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాలల పునఃప్రారంభానికి సన్నద్ధం పాఠశాలల పునఃప్రారంభానికి మరో ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విద్యార్థులకు వేసవి సెలవులు మరో మూడు రోజులు పొడిగించినప్పటికీ ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటి నుంచే బాధ్యతలు ప్రారంభం కానున్నాయి. పాఠశాల భవనాలకు రంగులు వేయడం, ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించడం, పరిశుభ్రత చర్యలు చేపట్టడం, డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్లను తనిఖీ చేసి సిద్ధంగా ఉంచడం వంటి పనులు చేపట్టనున్నారు. -
హైదరాబాద్ మారథాన్లో జిల్లా వాకర్లు
జనగామ: హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఆదివారం జరిగిన మారథాన్న్ కార్యక్రమానికి జిల్లా వాకర్లు తరలివెళ్లారు. జిల్లా నుంచి అడ్వొకేట్ పానుగంటి శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యం, ఫిట్నెస్, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ మారథాన్ నిర్వహించినట్లు తెలిపారు. యువతలో ఫిట్నెస్పై ఆసక్తి పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కీర్తి వీరేందర్, మరాఠీ శ్రీశైలం, కుమారస్వామి, శ్రీనివాస్, ఉమేష్, మల్లికార్జునచారి, కసాబు రమేష్, బూరెల రామకృష్ణ, కానిస్టేబుళ్లు శాడ పోచయ్య, కోల భానుచందర్ ఉన్నారు. -
ఫిట్నెస్పై కదలట్లే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేలాది మంది విద్యార్థులు మళ్లీ బడి బస్సులు, వ్యాన్లలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థుల ప్రాణ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అనేక ప్రైవేట్ పాఠశాలల బస్సులు, వ్యాన్లు ఫిట్నెస్ చేయించుకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 33.43 శాతం బస్సులు ఇంకా సామర్థ్య పరీక్షలు నిర్ధారణ (ఫిట్నెస్) సర్టిఫికెట్లు పొందలేదు. సోమవారం (జూన్ 1) నాటికి 820 బస్సులు ఫిట్నెస్కు దూరంగా ఉన్నాయి. ఫిట్నెస్ నత్తనడకపై సాక్షి కథనం.. స్కూల్ బస్సుల ఫిట్నెస్ నత్తనడకన నడుస్తోందని ‘సాక్షి’ వారం కిందటే కథనం రూపంలో అధికారులు దృష్టికి తీసుకెళ్లింది. వారిలో పెద్ద కదలిక లేకపోవడం, ఇటు స్కూల్ యాజమాన్యాలు కూడా మాములుగా తీసుకోవడంతో వారం రోజుల్లో 125 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేశారు. ఇంకా 693 బస్సులకు బీమా, పర్మిట్లు, కాలుష్య ధ్రువీకరణ పత్రాలు సైతం నవీకరించకపోయినా అధికారులు కఠిన చర్యలకు కదలడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తనిఖీలు, చర్యలు ఇంకెప్పుడు..? హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో వందలాది ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కువభాగం విద్యార్థుల రవాణాకు బస్సులు, వ్యాన్లు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు ఈ వాహనాలపై ఆధారపడుతున్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రవాణా శాఖ, పోలీసులు, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలి. కానీ పాఠశాలలు తెరుచుకునే సమయం దగ్గరపడుతున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృత స్థాయిలో తనిఖీలు జరగలేదని తెలుస్తోంది. రవాణాశాఖ గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్లో మొత్తం 2,079 స్కూల్ బస్సులు, వ్యాన్లు ఉంటే.. శనివారం నాటికి 1,386 వాహనాలకే సామర్థ్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేశారు. 693 బస్సులకు ఇంకా ఫిట్నెస్ నిర్వహించలేదు. హనుమకొండ జిల్లాలో 348, వరంగల్లో 172, మహబూబాబాద్లో 43, జనగామలో 75, జేఎస్ భూపాలపల్లిలో 28, ములుగులో 27 బస్సులు ఫిట్నెస్కు దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, గతేడాది తనిఖీల్లో అరిగిపోయిన టైర్లు, పని చేయని ఎమర్జెన్సీ డోర్లు, గడువు ముగిసిన ఫైర్ ఎక్స్టింగ్విస్టర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం, సీట్లకు మించి విద్యార్థులను ఎక్కించడం, జీపీఎస్ పరికరాలు పనిచేయకపోవడం, స్పీడ్ గవర్నర్లు లేకపోవడం వంటి ప్రధాన లోపాలను గుర్తించి సరిచేశారు. ఈసారి 693 బస్సులు ఇంకా ఫిట్నెస్కు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఫిట్నెస్ లేకుండా పాఠశాల బస్సులు రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్తోపాటు డ్రైవర్ తప్పని సరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. క్లీనర్తోపాటు మిగతా నిబంధనలు కచ్చితంగా పాటించాలి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవద్దు. – నాగలక్ష్మి, ఎంవీఐ, హనుమకొండ గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా నడుపుతున్నారుకొన్ని పాఠశాలల నిర్వాహకులు ఫిట్నెస్ లేని బస్సులను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతున్నారు. ఇక్కడ తనిఖీలు ఎక్కువ జరగవని, ఎవరూ పట్టించుకోరని నడుపుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే అధికారులు తనిఖీలు నిర్వహించాలి. – నద్దునూరి నాగరాజు, పేరెంట్ సీరియస్గా తీసుకోని స్కూళ్ల యాజమాన్యాలు, అధికారులు ఉమ్మడి జిల్లాలో 2,079 స్కూల్ బస్సులకు 1,386కే సామర్థ్య పరీక్షలు వారంలో 125 బస్సులకే ఫిట్నెస్.. ఇంకా ఫిట్నెస్ లేనివి 33.43 శాతం వారం రోజుల్లో తెరుచుకోనున్న స్కూళ్లు.. తనిఖీలు, చర్యలపై మీనమేషాలుఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలా... స్కూల్ బస్సులు : 2,079 ఫిట్నెస్ చేసినవి : 1,386 చేయించుకోనివి : 693 -
రూ.81.35లక్షలు
కొత్త వాల్యుయేషన్లో జిల్లాలోనే అత్యధికం పట్టణంలోని సూర్యాపేట రోడ్డుజనగామ: జిల్లాలో భూముల మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. పాలకుర్తిలో ఎకరం వ్యవసాయ భూమి అత్యధికంగా రూ.81.35లక్షలు, కొడకండ్లలో అత్యల్పంగా రూ.18.37లక్షలుగా నిర్ణయించారు. జనగామ పట్టణంలో గజం ధర రికార్డు స్థాయిలో రూ.43,300లకు పెరిగింది. కొత్త వాల్యుయేషన్ ధరలు ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులు, మండల కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాల్లో అత్యధిక పెరుగుదల నమోదైంది. పట్టణ ప్రాంతాలతో పా టు గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. పట్టణంలో.. జనగామ పట్టణంలో హనుమకొండ–బస్టాండ్ రోడ్డుతో పాటు చౌరస్తా, కలెక్టర్ రోడ్, సూర్యాపేట మెయిన్ రోడ్ ప్రాంతాల్లో(2–7, 2–9, 6–1, 6–2, 6–3 ఇంటి నంబర్ల పరిధిలో) గజం ధరలు భారీగా పెరిగాయి. గతంలో రూ.24,700లుగా ఉన్న విలువ కొన్ని ప్రాంతాల్లో రూ.43,300లకు చేరుకుంది. మరోవైపు రంగప్ప చెరువు, వడ్లకొండ రోడ్, వీవర్స్ కాలనీ, ఇందిరమ్మ నగర్, సంజయ్ నగర్, ధర్మకంచ తదితర ప్రాంతాల్లో గజం ధర రూ.3,200లతో పరిమిత స్థాయిలో పెంచారు. మండలాల వారీగా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా నుంచి జనగామ, తొర్రూరు, తిరుమలగిరి, స్టేషన్ ఘన్పూర్ రూట్ల పరిధిలో వ్యవసాయ భూములకు జిల్లాలోనే అత్యధికంగా ఎకరానికి రూ.81.35 లక్షల మార్కెట్ విలువ నిర్ణయించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఏరియా, ప్రధాన రహదారుల వెంట గజం ధరను రూ.10,200 వరకు పెంచారు. దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం, సింగరాజుపల్లి, ధరావత్ తండా, సీతారాంపురం, మన్పహాడ్, గొల్లపల్లి గ్రామాల పరిధిలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భూముల విలువ ఎకరానికి రూ.80 లక్షలకు చేరింది. జఫర్గఢ్ మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాల్లో ఎకరానికి రూ.70.13 లక్షల మార్కెట్ విలువ నిర్ణయించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని కొడవటూరు కమాన్ సమీపంలో భూముల విలువ ఎకరానికి రూ.69.88 లక్షలకు పెరిగింది. రఘునాథపల్లి మండలంలో హైదరాబాద్–హనుమకొండ జాతీ య రహదారి వెంట భూముల ధరలు ఎకరానికి రూ.50 లక్షల వరకు పెరిగాయి. నర్మెట మండలంలో జనగామ–హుస్నాబాద్ ప్రధాన రహదారి వెంట ఉన్న భూములకు కూడా ఎకరానికి రూ.50 లక్షల వరకు వాల్యుయేషన్ నిర్ణయించారు. చిల్పూ రు మండలంలోని చిన్నపెండ్యాల, నష్కల్, వంగాలపల్లి ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి రూ.25.20 లక్షలకు చేరింది. కొడకండ్ల మండలంలో జనగామ–సూర్యాపేట హైవే వెంట ఎకరానికి రూ.18.37 లక్షల విలువ నిర్ణయిం చగా, సబ్రిజిస్ట్రార్ పరిధిలోని ప్రధాన రహదారుల వెంట గజం ధర రూ.4,200లకు పెరిగింది. లింగాలఘన్పూర్ మండలంలో జనగామ–సూర్యాపేట రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములకు అత్యధికంగా రూ.8.21 లక్షలు, కనిష్టంగా రూ.2.81 లక్షల వాల్యుయేషన్ నిర్ణయించారు. స్టేషన్ ఘన్పూర్ మండలంలోని కొత్తపల్లి క్రాస్రోడ్, పల్లగుట్ట క్రాస్రోడ్, జాతీయ రహదారి పరిధిలో భూముల విలువ ఎకరానికి రూ.11.50 లక్షలకు పెరిగింది. బస్టాండ్ ప్రాంతంలో గజం ధర రూ.8,700లకు చేరగా, రంగారాయగూడెం, కోమటిగూడెం గ్రామాల్లో కనిష్టంగా రూ.1,300 విలువ నిర్ణయించారు. జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్, మరిగడి, అడవికేశ్వాపూర్, పెద్దరామన్చర్ల, ఓబుల్కేశ్వాపూర్, సిద్దెంకి గ్రామాల్లో రూ.2.50లక్షల వాల్యుయేషన్కు పెరగగా, జనగామ లోకల్, పెంబర్తి, శామీర్పేటలో రూ.65లక్షల వరకు పెరిగింది. కొత్త వాల్యుయేషన్ అమలుతో జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలపై ప్రభావం పడనుండగా, ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది. రూ.25.20 లక్షలురూ.69.88 లక్షలురూ.18.37 లక్షలురూ.70.13 లక్షలురూ.81.35 లక్షలురూ.50 లక్షలురూ.80 లక్షలురూ.65 లక్షలుజనగామ నర్మెటకొడకండ్ల చిల్పూరురఘునాథపల్లి పాలకుర్తిదేవరుప్పుల -
ఓట్ల తొలగింపునకు కేంద్రం కుట్ర
రఘునాథపల్లి: ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్ష అనుకూల ఓట్లు తొలగించే కుట్ర చేస్తుందని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. శనివారం మండలంలోని నిడిగొండ సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన స్టేషన్ఘన్పూర్ కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్స్ శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. అర్హులైన ఒక్కరూ ఓటు హక్కు కొల్పోకుండా బూత్ స్థాయిలో ఇన్చార్జ్లుగా ఉండే కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటరు జాబితా సవరణ జరిగిన మూడు రాష్ట్రాల్లో ముగ్గురు సీఎంలు ఓడిపోయారని వెల్లడించారు. ఈ నెల 9న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టివిక్రమార్క నియోజకవర్గంలో ఏడు సబ్స్టేషన్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపసలు చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్నాయక్, నియోజకవర్గ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీనివాస్, ట్రేనర్ రాజశేఖర్రెడ్డి, డీసీసీ అధ్యక్షులు లకావత్ దన్వంతి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, రాంబాబు, వినయ్కుమార్, లావణ్య, నాయకులు పాల్గొన్నారు. ఎంపీ కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి
స్టేషన్ఘన్పూర్: ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు చదువుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అని స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీమ్శర్మ అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో హనీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నీల రాకేష్ ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శనివారం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఏసీపీ హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. రోజురోజుకు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో హనీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నీల వెంకటేశ్వర్లు, డైరెక్టర్ నీల రాకేష్, కంప్యూటర్ ట్రైనర్స్ సంధ్య, చందర్, పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక జనగామ రూరల్: పట్టణంలోని స్థానిక ధర్మకంచ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ ఎంపికకు సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 11, 12 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో జరిగే 12వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి ఆవుల అశోక్, నిర్వహణ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, రంజిత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా సహకార అధికారిగా బాధ్యతల స్వీకరణ జనగామ: జిల్లా సహకార అధికారిగా కె.అరుణ బాధ్యతలను స్వీకరించారు. శనివారం ఆమె సాక్షితో మాట్లాడారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పాము జాతులపై అవగాహన ఉండాలి బచ్చన్నపేట: ప్రతిఒక్కరూ పాము జాతులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి భాస్కర్ అన్నారు. శనివారం మండలంలోని పోచన్నపేట గ్రామంలోని సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు, గ్రామస్తులకు సరీసృపాల అవగాహన సదస్సు, ప్రత్యక్ష ప్రదర్శనను సర్పంచ్ ఎండీ. ఫిరోజ్ఖాన్ అధ్యక్షతన అటవీ శాఖ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించారు. పాములను ప్రత్యక్షంగా చూపిస్తూ ప్రజల్లో ఉన్న భయాలను తొలగించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ మన ప్రాంతంలో కనిపించే నాగుపాము, కట్లపాము, పొడపాము విషమున్నవని, జెర్రిపోతు, నీటిపాము విషం లేనివన్నారు. పొరపాటున పాము కాటుకు గురైతే కంగారు పడకుండా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి యాంటీ–వెనమ్ ఇంజెక్షన్ తీసుకో వ డం మంచిదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు జావీద్ హుస్సేన్, రమేష్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్రెడ్డి, బీట్ ఆఫీసర్లు ధర్మరాజ్, రమేష్ పాల్గొన్నారు. కాజీపేట మీదుగా ప్రత్యేక రైలు కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ప్రయాణికుల సౌకర్యార్థం బిలాస్పూర్–బెంగళూరు కాంట్ మధ్య వేసవి ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈనెల 12న బిలాస్పూర్–బెంగళూరు కాంట్ (08263) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ మరుసటి రోజు కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈరైలుకు భత్పర, రాయ్పూర్, దుర్గ్, వా డ్స, కాగజ్నగర్, మంచిర్యాల, కాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, మంత్రాలయం రోడ్డు తదితర స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. -
లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ జనగామ రూరల్: జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా పోలీసు అధికారులు చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలోని సమావేశ హాల్లో ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్త్పై జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ పడ తగిన క్రిమినల్ కాంపౌండ్ కేసులను త్వరగా పరిష్కరించుకునే విధంగా కోర్టుకు సహకరించాలన్నారు. అన్ని పోలీస్స్టేషన్లో పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కారంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి, జూనియర్ సివిల్ జడ్జి జి శశి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సందీప్, ఏసీపీ నర్సయ్య, సీఐలు, ఎస్సై తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
● వీసీలో సీఎస్ రామకృష్ణారావుజనగామ రూరల్: రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని, ఈనెల 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న మండల మహిళా సమాఖ్య ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం ధాన్యం కొనుగోళ్లు, ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో మండల మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సుల పంపిణీ కార్యక్రమానికి జిల్లాల్లోని అన్ని బస్సులు ఆయా మండలాల నుంచి మహిళా సంఘాల సభ్యులు సాయంత్రం 4 గంటల లోపు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్కి చేరుకునే విధంగా చూడాలన్నారు. మహిళలకు మార్గమధ్యలో భోజనాలు, తాగు నీరు, మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వీసీలో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, డీసీఓ కరుణ, ఏసీపీ భీం శర్మ, అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, రవాణా విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, రైతులు పండించే ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేసి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. సమావేశంలో డీసీఓ కరుణ, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, డీఎం హతిరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శిల్ప, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, తదితరులు పాల్గొన్నారు. బస్సుల ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలి ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంతర్రెడ్డి మహిళా మండల సమాఖ్యలకు బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 9వ తేదీన హైదరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభకు జిల్లా నుంచి మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ బస్సుల్లో సకాలంలో చేరే విధంగా చూడాలన్నారు. డీఆర్డీఓ భాస్కర్, ఏపీడీ నూరుద్దీన్, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన డీఈఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ డైట్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ)లో ప్రవేశాలకు సెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ శనివారం ముగిసింది. వీరు ఈ నెల 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని హనుమకొండ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ బి.రంగయ్యనాయుడు కోరారు. అధికారిక వెబ్సైట్ https://deecet.cdse.telangana.gov.inలో కళాశాలలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఏదైనా పొరపాటు జరిగితే 9న సవరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 14న మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉంటాయని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు డైట్ కళాశాలల్లో ఈనెల 17వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించి రిపోర్టు చేయాలని కోరారు. నూతన విద్యాసంవత్సరం జూలై 1వతేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. -
ముంచుకొస్తున్న ఎల్నినో ముప్పు!
జనగామ: వానాకాలం సాగు సీజన్లో ‘ఎల్నినో’ ముప్పు రైతులను కలవరపెడుతోంది. ఈ ఏడాది తక్కువ వర్షపాతం సూచన ఉన్న నేపద్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. వర్షపాతం లోటు ఉన్న సమయంలో సాగు చేసే క్రమంలో పంటల ఎంపిక కీలకంగా ఉంటుంది. ఎల్నినో ప్రభావం ఈ వానాకాలం పంటలపై పడనున్నట్లు వ్యవసాయ శాఖ హెచ్చరిస్తోంది. ఎల్నినోతో ఏమి జరుగుతుంది? ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశంతో పాటు వేడి తరంగాలు పెరిగి, భూగర్భ జలాల రీచార్జ్ పడిపోయే ప్రమాదం ఉంది. వానాకాలం పంటలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చని భావిస్తోంది. అలాగే పంటల దిగుబడులు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ రైతులను అలర్ట్ చేస్తోంది. జూన్ మాసంలో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై, ఆగస్టులో పొడి జల్లులు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు రైతులు కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు తదితర వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి చేపట్టాలని కోరుతున్నారు. జూలై 15వ తేదీ వరకు సరిపడా వర్షాలు లేకపోతే 125 రోజుల లోపు పండే స్వ ల్పకాలిక వరి రకాలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. వ్యవసాయశాఖ సూచనలు పాటిస్తూ.. వర్షాల పరిస్థితిని గమనించి విత్తనాలు వేయండి. ఒకే పంటపై ఆధారపడ వద్దు. పంట మార్పిడి చేయాలి. తక్కువ కాలంలో పండే రకాలను ఎంచుకోవాలి. నీటి సంరక్షణ చర్యలు చేపట్టి, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తే దిగుబడులు పెంచుకోవచ్చు. పత్తి విత్తన ధరలు ఇలా.. 2026–27 వానాకాలం సీజన్కు సంబంధించి పత్తి విత్తన ధరలను ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ధరలు నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. 475 గ్రాముల బీజీ–1 రకం ఒక ప్యాకెట్కు గరిష్ట ధర రూ.635, బీజీ–2 రకం గరిష్ట ధర రూ.901గా ఖరారు చేశారు. అలాగే హెచ్టీ పత్తి సాగుకు అనుమతి లేదని, ఈ రకం పత్తి విత్తనాల ఉత్పత్తి, విక్రయం, సాగు పూర్తిగా నిషేధమని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వరిలో సన్న రకాలు.. వానాకాలం సాగుకు అనువైన సన్న వరి రకాలను వ్యవసాయ శాఖ సూచించింది. పీజేటీఏయూ నోటిఫికేషన్ ఆధారంగా తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048/మధు మేహగ్రస్తులకు అనుకూలం), కునా రం వరి–2 (కేఎన్ఎం 1638, రాజేంద్రనగర్ వరి–4 (ఆర్ఎన్ఆర్ 21278/వాలిపోకుండా తట్టుకునే సామర్థ్యం ఉంది) రకాలు వానాకాలంతో పాటు యాసంగికి కూడా అనుకూలమని పేర్కొంది. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు.. అనుమతి పొందిన లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయడంతో పాటు బిల్లులు తీసుకోవాలి. అనుమతి లేని విత్తనాలను అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు ఉంటాయి. నకిలీ, హెచ్టీ రకం, ఇతర లైసెన్స్ లేని పత్తి విత్తనాలను అమ్మినా, సరఫరా చేసినా వెంటనే వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలి. ఈ ఏడాది లోటు వర్షపాతం సూచన పంటల ఎంపికలో ‘అప్రమత్తత’ తప్పనిసరి ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహనవరి 2.13లక్షలు పత్తి 1.30లక్షలు మొక్కజొన్న 13వేలు -
విద్యాసంస్థల పరిధిలో మత్తు పదార్థాల విక్రయాల నిరోధానికి పోలీసుల కార్యాచరణ
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026మరికొద్ది రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రీఓపెనింగ్కు సిద్ధమవుతున్నాయి. స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లోని పాన్షాపులు, ఇతర దుకాణాలు స్టూడెంట్లను చెడు అలవాట్ల వైపు మళ్లిస్తున్నాయనే ఆందోళనల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక స్థితిపై అవగాహన పెంచుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.ఎవరైనా విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్మితే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ –2003, మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే జస్టిస్ జువైనల్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్) యాక్ట్ 77, 2015 ప్రకారం కేసులు పెడతారు. జైలుకు పంపడంతోపాటు జరిమానా విధించవచ్చు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం
● రైతులకు రూ.363.41 కోట్లు చెల్లింపు జనగామ: వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు తరలింపు ప్రక్రియ వేగంగా సాగుతోందని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ హథీరామ్ శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం తరలింపులో జాప్యంపై ఇటీవల సాక్షిలో జనగామ, కొడకండ్ల, రఘునాథపల్లి మండలాల నుంచి ప్రచురితమైన కథనాలకు సివిల్ సప్లయీస్ డీఎం స్పందించారు. ఇప్పటి వరకు రైతుల నుంచి 2,01,745 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో 1,93,484 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించామన్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.363.41 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. కేవలం 8,261 మెట్రిక్ టన్నులు (4శాతం) మాత్రమే ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉందన్నారు. రఘునాథపల్లి, కొడకండ్ల, నర్మెట మండలాల్లో మిగిలిన నిల్వలను తరలించేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు అదనపు వాహనాలు రంగంలోకి దింపినట్లు చెప్పారు. వర్ష సూచనల నేపథ్యంలో రెండు మూ డు రోజుల్లో మిగిలిన కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుకు సాగుతున్నామన్నారు. -
తక్కువ కాలపరిమితి పంటలే అనుకూలం..
దేశం, రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్నినో ప్రభావం అధికంగా కనిపిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణ వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుని వర్షపాతం తీరు ప్రభావితమవుతోంది. ఫలితంగా వర్షాలు సమానంగా కురవకుండా విరామాలు ఏర్పడే అవకాశం ఉంది. దీంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలకు సాగునీరు అందించడం కష్టమవుతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ కాలపరిమితి కలిగిన పంటలను ఎంపిక చేసుకోవాలి. జిల్లాలో నల్లరేగడి, ఎర్రచెలక భూములు అధికంగా ఉన్నందున ఎర్రచెలక భూముల్లో ఆరుతడి పంటలు అనుకూలం. అడవుల నరికివేత, పారిశ్రామిక, వాహన కాలుష్యం పెరగడం కూడా వాతావరణ మార్పులకు కారణమవుతోంది. – డాక్టర్ బి.అనిల్ కుమార్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం● -
తపాలా శాఖ పథకాలతో ఆర్థిక ప్రగతి
రఘునాథపల్లి: భారతీయ తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ రకాల పొదుపు, బీమా పథకాలు, బ్యాంకింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శివాజీ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని వెల్ది గ్రామంలో సర్పంచ్ సింగిరెడ్డి సునితాశ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రొగ్రామ్(డీసీడీపీ)లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. తపాలా శాఖ ద్వారా మహిళలు, చిన్నారులు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న పొదుపు పథకాలు, బీమా పథకాలు, అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ద్వారా అందిస్తున్న బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా వెల్ది గ్రామాన్ని సంపూర్ణ బీమా యోజన గ్రామంగా ప్రకటించారు. సమావేశంలో పోస్టల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ రవి, విద్యాశాఖాధికారి రఘునందన్రెడ్డి, ఉప సర్పంచ్ ఎడ్ల బాలరాజు, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్కుమార్, బ్రాంచ్ పోస్ట్మాస్టర్ బిర్రు శంకర్, మెయిల్ ఓవర్సీ చీమలపాటి భాస్కర్, పోస్ట్ మాస్టర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వర్షాలతో రైతులు నష్టపోకుండా చూడాలి
జనగామ రూరల్: వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా అవసరమైన వాహనాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులు ఆందోళన చెందకుండా రవాణా వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. జిల్లాలో కురిసిన వర్షం నేపథ్యంలో తడిచిన ధాన్యం బస్తాల వివరాలను తెలుసుకొని, క్షేత్రస్థాయిలో పరిశీలించి, తడిచిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. డీఆర్డీఓ భాస్కర్, డీసీఓ కరుణ, డీపీఓ వెంకట్ రెడ్డి, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శిల్ప, వ్యవసాయ అధికారి అంబికా సోనీ పాల్గొన్నారు. కొనుగోళ్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి రఘునాథపల్లి: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా రాత్రి, పగలు పని చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని అశ్వరావుపల్లి, వెల్ది, ఖిలాషాపూర్, మండలగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కోమళ్ల టోల్ప్లాజా వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ రాజేష్రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం రవాణా వేగవంతం చేయాలి చిల్పూరు: ధాన్యం రవాణాను వేగవంతం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని చిల్పూరు, రాజవరం, నష్కల్ గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆయన వెంట ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ విజయ్ కుమార్, ఐకేపీ ఏపీఎం పిట్టల నరేందర్ ఉన్నారు. రైతులు ఆందోళన చెందొద్దు.. నర్మెట: రైతులకు అండగా ఉంటామని ఆందోళన చెందవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భరోసా ఇచ్చారు. మండల కేంద్రంతో పాటు మచ్చుపహాడ్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకట రామానుజాచార్యులు, ఏఓ బుర్ర మమత, ఆర్ఐ సింగారపు సాయిబాబ, పీఏసీఎస్ సీఈఓ కొన్నె వెంకటయ్య తదితరులు ఉన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
వార్డుల్లో సమస్యలు పరిష్కరించండి
జనగామ: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో హాలులో శుక్రవారం చైర్పర్సన్ కడకంచి బాలమణి అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ సాధారణ సమావేశంలో వార్డు సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రజాఅవసరాలపై కౌన్సిలర్లు విస్త్రతంగా చర్చించారు. ఇందులో 28 సాధారణ ఎజెండా అంశాలు, 3 టేబుల్ ఎజెండా అంశాలు కలిపి మొత్తం 31 అంశాలను కౌన్సిల్ ముందుంచగా, వాటిలో 29 అంశాలను ఆమోదించి, 2 అంశాలను వాయిదా వేశారు. సమావేశంలో ఒక్కో వార్డు కౌన్సిలర్ తమ పరిధిలోని సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కార చర్య లు చేపట్టాలని కోరారు. సమస్యల ఏకరువు.. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కుక్కల బెడద, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పెన్షన్ల పంపిణీతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని 6వ వార్డు కౌన్సిలర్ బాలభరద్వాజ్ కోరారు. 9వ వార్డులో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం కొనసాగుతోందని కౌన్సిలర్ గునిగంటి వెన్నెల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 18వ వార్డులో డ్రెయినేజీ, తాగునీటి సమస్యలు, రోడ్ల అభివృద్ధి, వార్డులో అంగన్న్వాడీ సంఘాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు, మున్సిపల్ ఆధీనంలోని మినీ స్టేడియంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కౌన్సిలర్ గోపగోని సుగుణాకర్గౌడ్ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డ్రెయినేజీ, వరద నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని 3వ వార్డు సీపీఎం కౌన్సిలర్ బూడిద జ్యోతిగోపి కోరారు. బాలాజీనగర్, జ్యోతినగర్, హైదరాబాద్ మెయిన్రోడ్ ప్రాంతాలు స్వల్ప వర్షానికే జలమయం అవుతున్నాయని తెలిపారు. 3వ వార్డు నుంచే ఎక్కువగా మున్సిపాలిటీకి అధిక ఆదాయం వస్తు న్నందున రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మేం చెబుతున్నాం..మీరు నిధులు ఇవ్వండి 21వ వార్డులో విద్యుత్ స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయని, వర్షాకాలానికి ముందే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ మామిడాల రజితరాజు కోరారు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, మున్సిపల్ కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. 11వ వార్డులో డ్రెయినేజీ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్ ఎనగందుల అనూషకృష్ణ చెప్పారు. 25వ వార్డులో గాంధీ కమ్యూనిటీ ప్లేస్లో లైబ్రరీ, మహిళా సమావేశాల కోసం భవన నిర్మాణానికి అంచనాలు పూర్తయ్యాయని, అవసరమైన నిధులు కేటాయించాలని కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్గౌడ్ కోరారు. నెహ్రూ పార్క్ ప్రాంతంలో పార్క్ లేకపోవడంతో ఆ స్థలానికి నెహ్రూ సెంటర్ లేదా వినాయక సెంటర్గా పేరు మార్పు చేయాలని ప్రతిపాదించారు. 1వ వార్డులో సిబ్బంది కొరత, కుక్కలు, కోతులు బెడదతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని కౌన్సిలర్ సజ్జ దుర్గా ప్రసాద్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. 26 వార్డులో వీధి కుక్కలు, డ్రెయినేజీ సమస్యలపై దృష్టిసారించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను నుంచి విముక్తి కలిగించాలని కౌన్సిలర్ సేవెల్లి మధు కోరారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు త మ తమ వార్డుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రెయినేజీలు, వరద నివారణ, ప్రజా సమస్యల పరిష్కారంపై విస్త్రృతంగా చర్చించగా, సంబంధిత అంశాలపై అధికారులు చర్యలు చేపట్టాలని కౌన్సిల్ సూచించింది. వార్డుల అవృద్ధిపై ప్రత్యేక ఫోకస్ ఉందని చైర్పర్సన్ బాలమణి తెలిపారు. సమావేశంలో కమిషనర్ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న చైర్పర్సన్ బాలమణి, పక్కన కమిషనర్, మాట్లాడుతున్న కౌన్సిలర్ బూడిద జ్యోతిగోపి కౌన్సిల్ సమావేశంలో గళం విప్పిన కౌన్సిలర్లు డ్రెయినేజీలు, పారిశుద్ధ్య నిర్వహణపై నిలదీత పట్టణ సమస్యలపై మూడు గంటల పాటు చర్చ -
అప్పుడే.. బాగుండె!
నాడు ఎంజీఎంలో విజయవంతంగా హార్ట్ సర్జరీలుకాశిబుగ్గ: నాడు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి విధులు నిర్వర్తించిన సమయంలో హృద్రోగుల వెతలు తీరాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఆస్పత్రిలో కార్డియో థోరాసిక్ సర్జరీ యూనిట్ ద్వారా రెగ్యులర్గా గుండె జబ్బులకు చికిత్స చేసేవారు. ముఖ్యంగా యూనిట్కు హెడ్గా ఉన్న డాక్టర్ అమరవాది ప్రభాకర్ 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి పేరు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్డియో థోరాసిక్ సర్జరీ యూనిట్ నామ్కే వాస్తేగా పనిచేస్తోంది. కనీసం డాక్టర్ అమరవాదిని స్ఫూర్తిగా తీసుకుని ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తారని ఆశించిన హృద్రోగులకు నిరాశ మిగిల్చింది. లక్షలాది రూపాయల పరికరాలు, ఫ్యాకల్టీ ఉన్నా హార్ట్ సర్జరీల జోలికి వెళ్లడం లేదు. దీంతో పేద రోగులు డబ్బులు పెట్టి ప్రైవేట్కు వెళ్తున్నారు. ఫ్యాకల్టీ ఉన్నా.. గతంలో ఎంజీఎంలో ఉన్న కార్డియో థోరాసిక్ యూనిట్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మార్చారు. ఈ యూనిట్ నామమాత్రంగా కొనసాగుతోంది. ఫ్యాకల్టీ ఉన్నా అధికారులు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్డియో థోరాసిక్ యూనిట్లో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక ఫర్ఫ్యూజనిస్టు ఉన్నారు. వీరితో బైపాస్ సర్జరీలు చేయించే అవకాశమున్నా ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా ఏసీ సెంట్రల్ సిస్టం లేకపోవడంతో సర్జరీలు చేయడం లేదని తెలుస్తోంది. డాక్టర్ అమరవాదికి నాటి సీఎం ప్రశంసలు.. 2004 నుంచి 2007 వరకు డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి ఎంజీఎంలో కార్డియో థోరాసిక్ సర్జన్గా విధులు నిర్వర్తించారు. నాడు కార్డియాలజీతో పాటు కార్డియో థోరాసిక్ యూనిట్లు పనిచేశాయి. ముఖ్యంగా 2004లో ఎంజీఎం చరిత్రలో తొలిసారి వరంగల్కు చెందిన రమ్య అనే యువతికి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. నాలుగేళ్ల కాలంలో పలువురికి సర్జరీలు, ముఖ్యంగా పిల్లలకు కూడా ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంజీఎం వచ్చిన సమయంలో డాక్టర్ అమరవాదిని మెచ్చుకున్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక్కడినుంచే ప్రకటించినట్లు చెబుతున్నారు. కాగా డాక్టర్ అమరవాది ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తూ ఆన్లైన్ ద్వారా గుండె సంబంధ వ్యాధులకు సలహాలు ఇస్తున్నారు.● హనుమకొండ డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ శివాజీ కొన్నేళ్లుగా ఆగిన శస్త్రచికిత్సలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ నిలిచిన సేవలు 2004, మే 24న తొలిసారి ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్ అమరవాది ఆధ్వర్యంలో కొనసాగిన ఆపరేషన్లు -
మొక్కలతోనే పర్యావరణ రక్షణ
జనగామ రూరల్: మొక్కలతోనే పర్యావరణ రక్షణ సాధ్యమవుతుందని సీనియర్ సివిల్ జడ్జి శంకరం శ్రీదేవి అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. వర్షాకాలంలో విరివిగా మొక్కలు నాటాలని అలాగే వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శశి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, జనగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండ దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుసేవలు సద్వినియోగం చేసుకోవాలిపాలకుర్తి టౌన్(దేవరుప్పుల): రైతులు డీసీసీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మె ల్యే యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంకు శాఖను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా అమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు విస్తరించడం ద్వారా రైతులకు మరింత ప్రయోజ నం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ సీఈఓ వజీర్ సల్తాన్, మేనేజర్ చుక్క గణేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, ఏఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్రెడ్డి, దేవరుప్పుల, కామారెడ్డిగూడెం సర్పంచ్లు పెద్ది కృష్ణమూర్తి, చింత రవి, విజయ డెయిరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి, తోటకూరి పాండు, పీఎసీఎస్ సీఈఓ కృష్ణమూర్తి, ఆయా గ్రామాల డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాన్–టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో 2026–27 విద్యాసంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న నాన్–టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్, విద్యాశాఖాధికారి సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకౌంటెంట్ – 1 పోస్టుకు కామర్స్లో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. ట్యాలీ, సాఫ్ట్వేర్ వినియోగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని, వేతనం రూ.14,300 ఉంటుందన్నారు. అలాగే అసిస్టెంట్ కుక్ – 1 పోస్టుకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని, వంట నైపుణ్యాలను నిర్ధారించేందుకు డెమో ఉంటుందన్నా రు. వీరికి నెలవారీ వేతనం రూ.9,750 ఉంటుందన్నారు. అటెండర్ – 1 పోస్టుకు 10వ త రగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని, వీరికి వేతనం రూ.9,750 ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత పత్రాల జిరాక్స్ ప్రతులతో ఈనెల 9వ తేదీ సాయంత్రం 5.గంటల లోపు జనగామ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9849628441 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. రైతుల కష్టం చూడలేక..రఘునాథపల్లి: వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి అధికారులు, పోలీసులు స్పందించారు. వాహనాల కొరతతో ధాన్యం తరలింపు జాప్యం అవుతుండడంతో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. శుక్రవారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నమత, ఎస్సై దూదిమెట్ల నరేష్ సిబ్బందితో కలిసి వర్షంలోనే హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై ఇసుక తరలింపునకు వెళ్తున్న లారీలను ఆపి కొనుగోలు కేంద్రాలకు తరలించారు. లారీ డ్రైవర్లు కొనుగోలు కేంద్రాలకు వెళ్లేందుకు ససేమిరా అనడంతో మరి కొందరు డ్రైవర్లతో పాటు వాహన యజమానులతో వారు మాట్లాడి.. ధాన్యం తరలింపునకు వెళ్లేలా ఒప్పించారు. దీంతో మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు ధాన్యం తరలింపునకు వెళ్లాయి. -
అంగన్వాడీలకు 15వరకు సెలవులు
జనగామ: తీవ్రమైన ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల వేసవి సెలవులను ఈ నెల15వ తేదీ వరకు పొడిగించింది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతిఓజా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 12 నుంచి బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభం రాష్ట్ర సర్కారు అంగన్వాడీల సెలవులను పెంచడంతో పాటు ఈ నెల 12 వ తేదీ నుంచి అంగన్వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ పిల్లలకు ఉప్మా లేదా కిచిడితో పాటు పాలు అందించనున్నారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించే క్రమంలో జిల్లాలోనూ చిన్నారులకు బలవర్ధకమైన, పౌష్టికాహారం అ ందనుంది. జిల్లాలో 695 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు 10,906 మంది, 3నుంచి 6 సంవత్సరాల వయసు గల 10,364 మంది చిన్నారులు ఉన్నారు. వీటి పరిధిలో 21,270 మంది పిల్లలు అంగన్వాడీలకు వస్తుండగా, నూతన విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య మరింత పెరగనుంది. సెలవులు పొడిగించిన నేపథ్యంలో లబ్ధిదారులకు వేడి భోజనానికి బదులుగా టేక్ హోమ్ రేషన్ అందించాలని ప్రభుత్వం డీడబ్ల్యూఓలను ఆదేశించింది. జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు 14వ తేదీ వరకు సరిపడా ఎగ్స్, ఫుడ్ ఐటెమ్స్, ఇతర వస్తువులను చిన్నారుల తల్లిదండ్రులకు అందించనున్నారు. సరుకులను అందించే సమయంలో ఫొటో క్యాప్చర్ చేస్తారు. ఈ నెల 15న కేంద్రాలు తెరిచిన వెంటనే మధ్యాహ్న భోజనం, పాలు, గుడ్లు యథావిధిగా అందించనుండగా, బ్రేక్ఫాస్ట్ పథకం సైతం త్వరలోనే ప్రారంభించనున్నారు. దీంతో పిల్లల ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఖాళీ పోస్టులను త్వరగా భర్తీ చేస్తే పథకం లక్ష్యం నెరవేరుతుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం 21వేల మంది చిన్నారులకు ఊరట చిన్నారుల ఇంటికే ఆహార సరుకులు -
‘రైతు సేవా కేంద్రాలు’
జనగామ: మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళా సంఘాలను వ్యాపార రంగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ‘మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధిసంస్థ (డీఆర్డీఏ) సెర్ప్, వ్యవసాయ శాఖల సమన్వయంతో క్లస్టర్ల వారీగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలకు ప్రత్యేక బ్రాండ్, లోగోను రూపొందించారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఒకే తరహా బోర్డు, ఒకే విధమైన షాపు అనే కాన్సెప్ట్తో ముందుకు సాగుతున్నారు. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున ఏర్పాటు చేసి, ఆయా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏఈఓ) అప్పగించారు. ప్రస్తుతం జిల్లాలో 62 క్లస్టర్ల పరిధిలో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గ్రామ ఐక్య సంఘాల తీర్మానాల మేరకు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించారు. ఈ కేంద్రాలకు అవసరమైన లైసెన్సుల ప్రక్రియ పూర్తి కాగా, అనేక చోట్ల ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు, రైతు సేవలకు సంబంధించిన వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉండనున్నాయి. ఈ కేంద్రాలను నిర్వహించే మహిళలకు వ్యాపార నిర్వహణ, కంపెనీల ప్రతినిధులతో వ్యవహరించే విధానం, రైతులతో సంబంధాలు మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. అలాగే గ్రామైక్య సంఘాల ద్వారా ఎంపికై న మహిళలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఒక్కో కేంద్రం ద్వారా యజమాని మహిళతో పాటు మరో ఇద్దరికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటివరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం మండల లేదా జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు 62 క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు గ్రామ స్థాయిలోనే సేవలు అందనున్నాయి. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ పథకాలు కూడా ఈ కేంద్రాల ద్వారానే రైతులకు చేరే అవకాశం ఉంది. మట్టి పరీక్షలు, పంట మార్పిడి, కాలానుగుణంగా సాగు విధానాలపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. డీఆర్డీఏ–సెర్ప్, వ్యవసాయ శాఖల నుంచి ఈ కేంద్రాలకు నిరంతర సాంకేతిక సహకారం అందనుంది. నాణ్యమైన ఉత్పత్తులు, విశ్వసనీయ సేవలు అందించే కేంద్రాలుగా మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహిళా సంఘాలను చిన్న స్థాయి పొదుపు, రుణాల కార్యకలాపాల నుంచి పెద్దఎత్తున వ్యాపార రంగంలోకి తీసుకువెళ్లే ఈ నిర్ణయం రాష్ట్రానికి జిల్లాను రోల్ మోడల్గా నిలబెట్టనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలను కోటీశ్వరులు చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి కలెక్టర్ ముందుచూపుతో మహిళా సంఘాల అభ్యున్నతి కోసం చేపట్టిన రైతు సేవా కేంద్రాల ఏర్పాటు గొప్ప నిర్ణయంగా మహిళలు అభిప్రాయపడుతున్నారు. మండలం కేంద్రాల సంఖ్య బచ్చన్నపేట 07 చిల్పూరు 04 దేవరుప్పుల 05 స్టేషన్ఘన్పూర్ 05 కొడకండ్ల 03 పాలకుర్తి 07 రఘునాథపల్లి 08 జనగామ 07 లిం.ఘణపురం 04 జఫర్గఢ్ 05 తరిగొప్పుల 03 నర్మెట 04 -
ఆర్థికంగా ఎదుగుతాం
ఇప్పగూడెం గ్రామానికి చెందిన జై హనుమాన్ వీఓ మహిళా సంఘ సభ్యురాలు పోలాసు రాధిక, బీఎస్సీ కెమిస్ట్రీ విద్యార్హతతో మహిళా శక్తి రైతు సేవా కేంద్రం నిర్వహించే అవకాశం పొందారు. కలెక్టర్ సహకారంతో ఎలాంటి లైసెన్స్ ఫీజు లేకుండా కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళా సంఘం ద్వారా రూ.5 లక్షల రుణం తీసుకుని రైతు సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాల రైతులకు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారం ద్వారా ఆదాయం పొందుతూ రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం తనకు స్వయం ఉపాధి కల్పించిందని పేర్కొంటూ కలెక్టర్కు రాధిక కృతజ్ఞతలు తెలిపారు. -
పాపతో బంధం.. వీడ్కోలు వేళ భావోద్వేగం
జనగామ: తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఓ పసికందుకు వైద్యులే అమ్మానాన్నలుగా మారి 72 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడిన మానవీయ ఘటన జనగామ చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తీర్చిదిద్దిన వైద్యులు గురువారం శిశుగృహకు అప్పగించారు. ఈ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. లింగాలఘనపురం మండలం (ఏపీ వసల కూలీలు) కళ్లెం గ్రామానికి చెందిన తిక్కవరపు పద్మ, నరేశ్ దంపతులు ఇటుక బట్టీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అనావిుకను శిశుగృహ సిబ్బందికి అప్పగిస్తున్న వైద్యులు ఈ ఏడాది మార్చి 23న పద్మ ఐదో సంతానంగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. కేవలం 1.24 కిలోల బరువు, చిన్న ఆరోగ్య సమస్యలతో జన్మించిన ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఎస్ఎసీయూలో ఇన్నాళ్లు చికిత్స అందించారు. అయితే ఆడపిల్ల కావడం, అత్యల్ప బరువుతో జన్మించడం వంటి కారణాలతో డెలివరీ జరిగిన వారం రోజులకే తల్లిదండ్రులు పాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం ఆధ్వర్యంలో, డిప్యూటీ సూపరింటెండెంట్ మధుసూధన్రెడ్డి పర్యవేక్షణలో వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆ చిన్నారికి అండగా నిలిచారు. పాపకు ‘అనావిుక’ అని పేరు పెట్టి నెల బర్త్డే వేడుకలతోపాటు మినీ బారసాల కార్యక్రమం కూడా నిర్వహించారు. పూర్తిగా ఆరోగ్యవంతురాలిగా మారడంతో డాక్టర్ మధుసూధన్రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో గురువారం హనుమకొండ శిశు గృహకుప్రత్యేక వాహనంలో తరలించారు.భావోద్వేగంఅయితే ఆ క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. 72 రోజులుగా తమ చేతుల్లో పెరిగిన చిన్నారిని పంపించే సమయంలో వైద్యులు, సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు. పేగుబంధం లేకపోయినా ప్రేమతో పెంచిన అనావిుకకు వీడ్కోలు పలుకుతూ వారు చూపిన ఆప్యాయత అందరినీ కదిలించింది. పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!


