breaking news
Jangaon
-
కండిషన్ వాహనాలనే వాడాలి
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ జనగామ రూరల్: మున్సిపాలిటీలో చెత్త సేకరణకు కండిషన్లో ఉన్న వాహనాలనే వినియోగించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సందర్శించి పారిశుద్ధ్య వాహనాల పనితీరును పరిశీలించారు. వాహనాల కండిషన్ ఎలా ఉంది? వాటి నిర్వహణకు చేస్తున్న ఖర్చును అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో ప్రస్తుతం 22 వాహనాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని మరో 3 ట్రాక్టర్లు, 5 ఆటో ట్రాలీలు ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించకలుగుతామని, మున్సిపల్ కమిషనర్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం పనిచేస్తున్న వాహనాల కండిషన్పై ముందుగా నివేదిక ఇవ్వాలని అదనపు కలెక్టర్ రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, ఆర్టీఓ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
మునపటి జోరుంటుందా?
జనగామ: దసరా పండుగ ముగియడంతో జిల్లాలో మద్యం టెండర్ల హడావిడి మొదలైంది. జిల్లాలో మొత్తం 50 రిటైల్ లిక్కర్ షాపులకు 2025–27 రెండేళ్లకుగానూ గత నెల 26వ తేదీన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. సద్దుల బతుకమ్మ, దసరా పండగ నేపథ్యంలో ఆశించిన మేర టెండర్లు రాలేదు. పండుగ సందడి ముగిసిపోవడంతో టెండర్దారుల్లో కదలిక వచ్చింది. జిల్లాలోని మూడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో ఇప్పటి వరకు 8 టెండర్లు రాగా, బుధవారం నుంచి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో రియల్టర్లు, వ్యాపారులతో పాటు కొత్త వ్యక్తులు ముందుకొస్తారా లేదా మునపటి జోరు ఉంటుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. రిజర్వేషన్లు కలిసి రాకుంటే స్థానిక బీసీ రిజర్వేషన్లపై బుధవారం వెలువడనున్న హైకోర్టు తీర్పు మద్యం టెండర్లపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు తారుమారైతే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు ఆశించిన నాయకుల్లో పలువురు మద్యం టెండర్ల వైపు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎకై ్సజ్ శాఖకు ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు. టెండర్లకు దూరంగా రియల్టర్లు,వ్యాపారులు? గతంలో జిల్లాలో సుమారు తొమ్మిది టీములు ఏర్పడి పెద్దఎత్తున టెండర్లు వేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఈ గ్రూపులు దాదాపు 1400ల వరకు దరఖాస్తులు సమర్పించగా, ఈసారి సగం తగ్గించే యోచనలో ఉన్నాయని తెలుస్తోంది. భారీ ఖర్చు, టెండరు ఫీజు రూ.3లక్షలకు పెంచడం కారణంగా మునుపటి టెండర్ దారుల్లో మెజార్టీగా ఈసారి దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎకై ్సజ్ శాఖ దరఖాస్తుల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో వ్యూహాలకు పదును పెడుతోంది. పాత, కొత్త టెండర్ దారులకు మద్యం సేల్ విధానం, లైసెన్స్ నిబంధనలు, లాభ నష్టాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. మద్యం షాపులపై ఆసక్తి ఉన్నవారు ఆర్థిక సన్నద్ధతతోపాటు చట్టపరమైన అవగాహన కూడా పెంచుకోవాలని ఈ శాఖ అధికారులు సూచిస్తున్నారు. 2023–2025 రెండేళ్లకు గాను జిల్లాలోని 47 వైన్స్లకు 2,356 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.47.12కోట్ల మేర ఆదాయం(నాన్ రిఫండబుల్) వచ్చింది. ఈ సారి 3 షాపులు పెరగడంతో మద్యం దుకాణాలు 50కి చేరాయి. జిల్లాలో 8 టెండర్లు దాఖలు వచ్చే రెండేళ్ల మద్యం అమ్మకాల కోసం ఎకై ్సజ్ శాఖ గత నెల 26న టెండర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 18వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. చివరి గడువు దగ్గర పడుతుండడంతో టెండర్దారులు పెద్దఎత్తున డబ్బులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. శుభ ముహూర్తం చూసుకుని తమ ఇష్టదైవమైన దేవుళ్లను పూజించి టెండర్ వేసేందుకు పాత, కొత్త వ్యక్తులు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడంతో కోట్లాది రూపాయలు భూములపై ఉండిపోయాయి. దీంతో మునుపటి జోరు ఉంటుందా లేదా అనే సందేహాలు సైతం వినిపిస్తున్నాయి. టెండర్లు పెరగకపోయినా.. గతంలో వచ్చిన సంఖ్య తగ్గకూడదనే సంకల్పంతో ఎకై ్సజ్ శాఖ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు 12 రోజుల వ్యవధిలో 8 మంది మాత్రమే టెండర్లు వేశారు. ఇందులో జనగామలో–1, పాలకుర్తి–4,, స్టేషన్ఘన్పూర్ సర్కిల్ పరిధిలో మరో–3 వచ్చాయి. టెండరు దరఖాస్తులు వేసేది ఇక్కడే రిటైల్ లిక్కర్ షాపుల లైసెన్సులు డిసెంబర్ 1, 2025 నుంచి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉండనున్నాయి. 21 సంవత్సరాలు నిండిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి దరఖాస్తుకు రూ.3లక్షలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ మొత్తం డీపీఈవో, జనగామ, సీపీఈ తెలంగాణ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులు దరఖాస్తులను జిల్లా కేంద్రం వడ్లకొండ రోడ్డు ఇరిగేషన్ క్వార్టర్స్లోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని ఏ దుకాణానికి అయినా దరఖాస్తు చేసుకోవాలనుకునే వ్యాపారులు తమ దరఖాస్తులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, కమిషనర్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో కూడా ఇవ్వొచ్చని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పించాలని, మరిన్ని వివరాల కోసం https://tgbcl.telangana.gov.in/ts/index.php/site/login లో చూసుకోవచ్చన్నారు. -
క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి కృషి
పాలకుర్తి టౌన్: క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని చర్చిలో నేషనల్ కౌన్సిల్ క్రిస్టియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రిస్టియన్లు రాజకీయంగా, సామాజికంగా ప్రగతి సాధించాలన్నదే ప్రభుత్వం ఆకాంక్ష అన్నారు. నిరుపేద పాస్టర్లకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు. కులం సర్టి ఫికెట్ల జారీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో నేషనల్ కౌన్సిల్ క్రిస్టియన్ రాష్ట కార్యదర్శి అనంతోజు రక్షిత, బక్క ఏలియా, ఈవీ థామస్, ఎన్సీసీ జనగామ జిల్లా మహిళ అధ్యక్షురాలు డాక్టర్ ప్రీతిదయాల్ తదితరులు పాల్గొన్నారు.బెస్ట్ అవైలబుల్ ఫీజులు చెల్లించండిజనగామ రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు బింగి రమేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడేళ్లుగా నిధులు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణంలోని శ్రీ అరబిందో హైస్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి నెలకొందని, తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరసింహ, పరశురాములు, యుగంధర్, వేణుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.ముత్తిరెడ్డికి పరామర్శజనగామ: జనగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సోదరుడు ముత్తిరెడ్డి కృష్ణారెడ్డి మృతి చెందగా, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మంగళవారం ఆయనను పరామర్శించారు. అంతకుముందు కృష్ణారెడ్డి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కలిసి కృష్ణారెడ్డి పాడే మోశారు.ఎప్సెట్ కౌన్సెలింగ్ షురూరామన్నపేట: బీఫార్మసీ, ఫార్మ్డీ, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్సెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ మంగళవారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైనట్లు టీజీ ఎప్సెట్ అడ్మిషన్స్ హెల్ప్లైన్ సెంటర్ కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, నిర్దిష్ట సమయానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించారు. తొలిరోజు (మంగళవారం) 313 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం నమోదు చేసుకున్నారని, ఈనెల 9వ తేదీ వరకు ఉంటుందని వివరించారు. అనంతరం ఆప్షన్ ఫ్రీజింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు http:// tgeapcetb.nic.in వెబ్సైట్ సందర్శించాలని ఆయన కోరారు.పీఓహెచ్ ఏర్పాటుకు నిధులు మంజూరుమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో వందేభారత్ రైలు మెగా మెయింటనెన్స్ పీఓహెచ్, ఆర్ఓహెచ్ ఫ్రైట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వేశాఖ రూ.908కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు రఘునాథపల్లి: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు మండల వైద్యులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆశా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. గ్రామాల్లో గర్భిణుల (ఏఎన్సీఎస్) సర్వే నిర్వహించి వారికి అవసరమైన సేవలను మెరుగుపరిచి, నిర్దేశిత లక్ష్యాలను సాధించాలన్నారు. గర్భిణులకు యోగా సాధనలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యవంతమైన గర్భధారణతో పాటు సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ పోగ్రామ్ అధికారి డాక్టర్ కమలహాసన్, వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మల్లికార్జున్, రాంకిషన్, హెచ్ఈఓ ప్రభాకర్, విష్ణువర్ధన్రెడ్డి, ఏఎన్ఎలు, ఆశాలు పాల్గొన్నారు. -
బలమున్న చోట బరి గీసి..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్తో ‘కామ్రేడ్’లు ముందుకు ● నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి... ఎంపీటీసీ, సర్పంచ్లకూ పోటీసాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపెల్లి శ్రీనివాస్రావు తదితరులు టీపీసీపీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలతో మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తులతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్లో నల్లబెల్లి (బీసీ–జనరల్)లను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లలో ఏదేని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్గఢ్ (బీసీ–జనరల్)లలో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐ పార్టీకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా బుధవారం ఉమ్మడి వరంగల్కు చెందిన సీపీఎం పార్టీ నేతలు కూడా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, వేంనరేందర్ రెడ్డిలను పొత్తుల విషయంలో కలవనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. -
యువవికాసం ఇంకెప్పుడు?
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాసం దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నెల రోజుల్లో రుణాలు ఇస్తామని దరఖాస్తులు స్వీకరించి, మండలస్థాయిలో కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి 29,367 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివిధ యూనిట్లకు వేల సంఖ్యలో దరఖాస్తులు రాగా.. అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పొందవచ్చన్న ఉద్దేశంతో ఎక్కువ మంది కేటగిరీ–4 రుణాలకే మొగ్గుచూపారు.ఆర్బీఐ నిబంధనలుగతంలో పేదలకు ఆయా పథకాల కింద రుణాలు అందించేవారు. అవసరమైతే సబ్సిడీకి మించి రుణాలు తీసుకుంటే ష్యూరిటీ కింద సంతకాలు తీసుకునేవారే తప్ప పెద్దగా బ్యాంకర్లు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ప్రస్తుతం మారిన ఆర్బీఐ నిబంధనల ప్రకారం సిబిల్ స్కోర్ ఉంటేనే రుణానికి అర్హత సాధిస్తారు.ప్రభుత్వ నిర్ణయంపైనే ఆశలుస్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగులు ఆర్థిక స్వావలంబన పొందేందుకు రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రవేశపెట్టి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే నెలలు గడుస్తున్న పథకం అమలుపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం ఇచ్చే రుణాలతో కుటుంబానికి బాసటగా నిలవడంతో పాటు ఆర్థికంగా ఎదగాలనే గ్రామీణ ప్రాంత యువతకు నిరాశే నిగిలింది. స్థానిక ఎన్నికలు సమీపించడంతో యువవికాసం పథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా సిబిల్ స్కోరును మినహాయిస్తేనే గ్రామీణ ప్రాంతంలోని ఎక్కువ మంది నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.కేటగిరీ దరఖాస్తులు యూనిట్లుఎస్సీ 8,779 3,500ఎస్టీ 3,787 1,809బీసీ 15,425 2,714ఈబీసీ 447 511ముస్లింలు 981 186క్రిస్టియన్లు 48 57షరతులు లేకుండా అందించాలిగ్రామాల్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక యువత ఇబ్బందులు పడుతోంది. ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రుణాలు మంజూరు చేయాలి. ప్రభుత్వం నిబంధనలు సడలించి వీలైనంత తొందరగా రుణాలు అందించాలి.–శానబోయిన మహిపాల్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడుయువతను ఆదుకోవాలిరాజీవ్ యువవికాసం పథకం రుణాలను త్వరితగతిన అందించి యువతను ఆదుకోవాలి. అటు ఉపాధి లేక కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలి. సిబిల్ స్కోర్, పాన్కార్డుతో సంబంధం లేకుండా ఇవ్వాలి. అర్హులైన అందరికీ అందించాలి.–యాసారపు కర్నాకర్, చౌడారం గ్రామం -
మద్యం తాగి వాహనాలు నడపొద్దు
● ఏసీపీ పండేరి చేతన్ నితిన్ బచ్చన్నపేట: మద్యం తాగి వాహనాలు నడుపరాదని, మైనర్లకు వాహనాలను ఇస్తే అందుకు తల్లిదండ్రులదే బాధ్యత అని జనగామ ఏసీపీ పండేరి చేతన్ నితిన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో వాహనాల తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాహనాల్లో రూ. 50వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని, ఒకవేళ తీసుకెళ్తున్నా సంబంధిత రశీదులను వెంట ఉంచుకోవాలన్నారు. నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
10నుంచి ధాన్యం కొనుగోళ్లు
● అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్జనగామ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని, ఈనెల 10వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. వానాకాలం పంట కొనుగోలుకు సంబంధించి డీఆర్డీఓ, డీసీఓ డీపీఎం, డీటీలు, జిల్లా, మండల, గ్రామస్థాయి సెర్ప్ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులతో మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫెరెన్స్ హల్లో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కేంద్రంలో కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లు, ప్యాడి క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
ప్రభుత్వ బడుల్లో డిజిటల్ లెర్నింగ్
జనగామ: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగంలో మరో కొత్త అడుగు పడనుంది. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానంలో పరిపూర్ణులను చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ‘ఏ బుక్ ఆఫ్ డిజిటల్ లెర్నింగ్’ అనే కొత్త పాఠ్యాంశాని(పాఠ్య ప్రణాళిక తరగతులు)కి శ్రీకారం చుట్టబోతోంది. 6 నుంచి 9వ తరగతి వరకు చదువుకుంటు న్న పిల్లలకు ఇది ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష సంయుక్త భాగస్వామ్యంతో డిజిటల్ లెర్నింగ్ బోధన కొనసాగనుంది. ఈ పాఠ్యాంశాలను సమర్థవంతంగా బోధించేందుకు ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో త్వరలో జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఈనెల 8వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇక్కడి వెసులుబాటును చూసుకుని తేదీలను ప్రకటించనున్నారు. కార్పోరేట్కు దీటుగా ప్రభుత్వ బడులు జిల్లాలో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఇక నుంచి డిజిటల్గా బోధించనున్నారు. ప్రాథమికోన్నత–64, ఉన్నత పాఠశాలలు 103 ఉండగా, వీటి పరిధిలో సుమారు 12వేల పైచిలు విద్యార్థులు ఉన్నారు. కాగా ప్రభుత్వ, స్థానిక సంస్థలు, టీజీఎంఎస్, కేజీబీవీ, టీఆర్ఈఐఎస్ పాఠశాలలలో పనిచేస్తున్న గణితం, ఇంగ్లిష్, భౌతిక, సాంఘిక శాస్త్రం బోధించే యూపీఎస్, హైస్కూల్ ఉపాధ్యాయులు 800ల వరకు ఉండగా, వీరంతా శిక్షణకు హాజరుకావాల్సి ఉంటుంది. శిక్షణలో కోడింగ్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై ప్రాక్టికల్ సెషన్లు ఉంటాయి. సకల సౌకర్యాలతో శిక్షణ కోసం ప్రతి జిల్లా లేదా డివిజన్ స్థాయిలో తగిన సదుపాయాలతో కూడిన సెంటర్లను ఎంపిక చేయాలని అందులో పేర్కొన్నారు. శిక్షణ సమయంలో టీచర్లకు కంప్యూటర్లతో కూడిన ప్రయోగశాలలు, అసౌకర్యం లేని ఇంటర్నెట్, ఆడియో విజువల్ పరికరాలు, ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్, మైక్లు, నిరంతర విద్యుత్, బ్యాకప్ సదుపాయం ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్న పాఠశాలలలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు ల్యాప్టాప్లు, అర్డు వినో కిట్స్తో శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. శిక్షణ కాలంలో టీచర్లు వారికి కేటాయించిన సెంటర్కు ఉదయం 9 గంటలకు చేరుకోనుండగా, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో వారి అటెండెన్స్ నమోదు చేస్తారు. అలాగే శిక్షణ కాలానికి సంబంధించి సర్టిఫికెట్ ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి. అక్టోబర్ 19వ తేదీ లోపు శిక్షణ పూర్తి చేసుకుని etdepttscert@gmail.com వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. బడ్జెట్ కేటాయింపులు డిజిటల్ లెర్నింగ్పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సమయంలో ప్రభుత్వం టీఏ, డీఏ ఇతర అలవెన్స్లను ఇస్తుంది. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాధికారులు సంబంధిత డీఐఈటీ ప్రిన్సిపల్స్కు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించి, కలెక్టర్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. డీఆర్పీలకు రోజు వారీగా రూ.400 గౌరవ వేతనంతో పాటు టీచర్లకు టీజీటీఏ నిబంధనల మేరకు భత్యాలను చెల్లించనున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ కోసం కసరత్తు కోడింగ్, డేటాసైన్స్, ఏఐ..అంశాలపై ప్రాక్టికల్ సెషన్లు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాల పెంపే లక్ష్యం -
పక్కా ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు
● జిల్లాలో 309 కేంద్రాలు ● అధికారులతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సమీక్షజనగామ రూరల్: గత రెండు సీజన్లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగిందని..ఈసారి కూడా పక్కా ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వానా కాలం పంట కొనుగోలుపై ఆర్డీఓ, సివిల్ సప్ప్లై, డీఆర్డీఓ, మార్కెటింగ్, మార్క్ఫెడ్, జిల్లా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయశాఖ అధికారులు, ఆర్టీఓ, గన్ని గోదాం ఇన్చార్జ్ లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్తో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26 ఖరీఫ్కు సంబంధించి జిల్లాలో 2,13,978 ఎకరాల్లో వరి పంటసాగు అయ్యిందని 5,43,057 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా కాగా 2,05,057 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు. సన్నరకం మద్దతు ధర రూ.2389లు కాగా, బోనస్ క్వింటాల్కు రూ.500 చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే దొడ్డు రకానికి రూ.2369ల మద్దతు ధర ఉందన్నారు. దొడ్డురకం ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ 116, పీఏసీఎఎస్ 82 కేంద్రాలను, అలాగే సన్నరకం ఽకొనుగోలుకు 69 ఐకేపీ, 42 పీఏసీఎస్ సెంటర్ లను మొత్తం 309 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నమన్నారు. కోడ్ పక్కాగా అమలుకావాలి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మాడల్ కోడ్ పక్కాగా అమలయ్యేలా అధికారులు విధులను నిర్వహించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి పోలీస్, రెవెన్యూ, ఎంపీడీఓ మొదలగు శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులతో తన క్యాంపు కార్యాలయం నుంచి గూగుల్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను మరొకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి..రేపటిలోగా నివేదిక ఇవ్వాలన్నారు. స.హ.చట్టంపై అవగాహన అవసరం సమాచార హక్కు చట్టంపై విస్తృత అవగాహన అవసరమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార హక్కు వారోత్సవాలను జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.ఏఎంసీలో రెండు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయండి జనగామ: వానాకాలం సీజన్లో ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు వెసులుబాటు కల్పించే విధంగా జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలో చీటకోడూరు, శామీర్పేటకు చెందిన ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను సోమవారం కోరారు. అనంతరం శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. మార్కెట్లో రెండు సెంటర్లు ప్రారంభించిన సమయంలో తాము నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతీ రైతుకు సేవ చేస్తామన్నారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఆయన వెంట డీఆర్డీవో పీడీ వసంత, ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్, సూపర్వైజర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
పెండింగ్ వేతనాలు అందించాలి
జనగామ రూరల్: నాలుగు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, పండుగలకు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని, వెంటనే వేతనాలు మంజూరు చేయాలని మోడల్ స్కూల్ సిబ్బంది జిల్లా అధ్యక్షుడు జనార్దన్ కోరారు. సోమవారం తెలంగాణ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న సిబ్బంది కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిజికల్ డైరెక్టర్ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్స్, నైట్ వాచ్మెన్లు జిల్లాలో 8 మోడల్ స్కూల్లో 32 మంది పనిచేస్తున్నారని అన్నారు. నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. నిరసనలో జిల్లా ఉపాధ్యక్షుడు గణేశ్, కోశాధికారి బాలు, రాజేశ్, వెంకటేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ సిబ్బంది నిరసన -
కలాం ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానం
లింగాలఘణపురం: మండలంలోని మోడల్ స్కూల్కు చెందిన 8మంది బాసర ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులను సోమవారం పాఠశాల ప్రిన్సిపాల్ సునిత అబ్దుల్ కలామ్ ఎక్స్లెన్స్ అవార్డులతో సన్మానించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులకు అవార్డులను అందజేస్తున్నారు. ఈ ఏడాది సాయివరుణ్, సందీప్, శివ, రిషిత, కుసుమాంజలి, భవాని, పూజ, సంజన అనే విద్యార్థులు సీట్లు సాధించగా వారిని కలాం ఎక్సలెన్స్ అవార్డులతో సన్మానించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షుడు దేవునూరి ఆనంద్, జమ్ముల వీరారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చదువుకు పేదరికం అడ్డుకాదు
స్టేషన్ఘన్పూర్: చదువుకు పేదరికం ఏమాత్రం అడ్డుకాదని, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థానాలకు చేరుకోవాలని విద్యాశాఖ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ సూచించారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లు జెడ్పీఎస్ఎస్కు చెందిన 165 మంది విద్యార్థులకు హన్మకొండ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్లను అందించారు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో హెచ్ఎం జి.కొమురయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హన్మకొండ రోటరీక్లబ్ సెక్రటరీలు ఎంవీ ఇలమురుగు, కేఎం శివకామి, స్కూల్ బ్యాగుల దాతలు ఎన్ఆర్ఐలు శ్రేయ, అభిరామ్, ఘన్పూర్ జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం సంపత్, రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ తిరుపతిరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యాశాఖ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ స్టేషన్ఘన్పూర్: మున్సిపల్, మండల పరిషత్ అధికారులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేయాలని, ప్రధానంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీల విషయమై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయశ్రీ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
డీజీపీని కలిసిన మొగుళ్ల
జనగామ: డీజీపీ శశిధర్రెడ్డిని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హెచ్డబ్ల్యూబ్ల్యూ, ఎస్కేయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజి రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరా బాద్లోని ఆయన నివాసంలో డీజీపీని కలిసి శాలువాతో సత్కరించి బొకే అందించారు.రాష్ట్ర ఉత్తమ ఇన్నోవేటివ్ అవార్డు గ్రహీతకు సన్మానంరఘునాథపల్లి: మండలంలోని వెల్ది మాడల్ స్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు కందగట్ల గణేశ్కు హైదరాబాద్కు చెందిన జటాదర ఎడ్యుకేషన్ టెక్నాలజీ వారు రాష్ట్ర ఉత్తమ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డుకు ఎంపిక చేసి సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఇటీవల ప్రదానం చేశారు. సోమవారం మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్, ఉపాధ్యాయులతో కలిసి అవార్డుగ్రహీత గణేశ్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గడ్డం జయశ్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.నక్కవానిగూడెం పీఎస్కు టీచర్!జనగామ: బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలకు తాత్కాలిక పద్ధతిలో డిప్యుటేషన్పై ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కేటాయించారు. ‘సర్దుబాటుపై జాప్యమెందుకు?’ శీర్షికన ఈ నెల 6న సాక్షిలో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. నక్కవానిగూడెం పీఎస్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లకు పదోన్నతి రావడంతో నెలరోజుల క్రితమే వెళ్లిపోయారు. తాత్కాలికంగా మరో పాఠశాల నుంచి టీచర్ను నియమించాల్సిన ఎంఈవో నిర్లక్ష్యంతో విద్యార్థులు చదువుకు దూరమైపోయారు. ఈ విషయమై విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి కథనంతో కలెక్టర్ ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స మాచారం. వెంటనే స్పందించిన ఎంఈవో అదే మండలంలోని పడమటి కేశ్వాపూర్ పీఎస్లో పనిచేస్తున్న టీచర్ ప్రియాంకను నక్కవాని గూడెం ప్రాథమిక పాఠశాలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.జాప్యంపై ఇంటెలిజెన్స్ ఆరాజిల్లాలో టీచర్ల సర్దుబాటుకు సంబంధించి సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖలో ఏం జరుగుతోందనే కోణంలో సమగ్ర సమాచారం తీసుకున్నట్లు తెలిసింది. ఆయా పాఠశాలల పరిధిలో పదోన్నతులతో ఖాళీ అయిన టీచర్ల స్థానంలో గత నెల 4వ తేదీ వరకే సర్దుబాటు చేయాల్సి ఉండగా, నిర్లక్ష్యానికి కారణాలు ఏంటనే దానిపై కూపీలాగినట్లు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది.దేవాదుల మొదటి మోటార్ ట్రయల్ రన్ సక్సెస్హసన్పర్తి : దేవాదుల ప్రాజెక్ట్–3వ దశలో భాగంగా నిర్వహించిన ట్రయన్ రన్ విజయవంతమైంది. సోమవారం మొదటి మోటారును రన్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలోని పంప్హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఐదు నెలల క్రితం రెండో మోటారు భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించారు. మూడో మోటారు ట్రయల్ రన్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.‘బెస్ట్’ నిధులు విడుదల చేయాలిజనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ పథకం నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ సెయింట్ పీటర్ హైస్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద విద్యార్థులకు చెల్లిస్తున్న స్కాలర్షిప్స్ 2022 నుంచి 2025 పెండింగ్లో ఉండడంతో తమ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి నెలకొందని వాపోయారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో 60మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
సర్దుబాటులో జాప్యమెందుకు?
జనగామ: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో జాప్యంతో విద్యార్థుల భవిష్యత్పై నీలి నీడలు అలుముకుంటున్నాయి. డీఈఓగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టినా విద్యాశాఖ పనితీరు మెరుగుపడడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు గత నెల 4వ తేదీన సర్ధుబాటు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, ఆలస్యానికి గల కారణాలు తెలియడం లేదు. ‘సాక్షి’ కథపనాలతో వెనక్కి తగ్గిన విద్యాశాఖ జిల్లాలో జూలై మాసంలో మొదటిసారి టీచర్ల సర్దు బాటు చేపట్టారు. 109 మంది ఉపాధ్యాయులను సర్దుబాటుచేయగా, దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. సర్దుబాటులో పైరవీలు, అవకతవకలపై సాక్షి దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. స్పందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా సర్దుబాటుకు తాత్కాలిక బ్రేక్ వేశారు. ఇదే సయయంలో ఆగస్టు 2, 3 వారాల్లో ఎస్జీలు, ఎస్ఏలకు పదోన్నతుల ప్రక్రియను మొదలు పెట్టారు. ప్రమోషన్ల ఖాళీల ఆధారంగా మరోసారి సర్దుబాటు చేయాలని, ఇందుకు సంబంధించి సెప్టెంబరు 4 వరకు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 87 మంది ఎస్జీలు, 19 మంది ఎస్ఏలకు పదోన్నతులు రాగా, టీచర్లు ఖాళీ అయిన బడులకు సర్దుబాటు ద్వారా భర్తీ చేయాలి. రెండోసారి చేపట్టిన సర్ధుబాటులో పైరవీలకు ఆస్కారం లేకుండా ఉండాలనే జాగ్రత్త పేద విద్యార్థుల భవిష్యత్ను ఆగం చేస్తుంది. రఘునాథపల్లి మండలం నక్కబొక్కల తండా, పాలకుర్తి మండలం కిష్టాపూర్(సింగిల్ టీచర్), బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు పదోన్నతులపై వెళ్లిపోయారు. దీంతో బడిలో పాఠాలు చెప్పేవారు లేక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఈ విషయంపై సాక్షి కథనం ప్రచురించగా.. రఘునాథపల్లి, పాలకుర్తి ఎంఈఓలు స్పందించి తాత్కాలికంగా ఆ బడులకు టీచర్లను పంపించారు. బచ్చన్నపేట ఎంఈఓ మాత్రం సీఆర్పీతో నెట్టుకొస్తూ, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్దుబాటు ముసాయిదా ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి ఎలాంటి అధికారి సంతకాలు, రాజముద్ర లేకుండా ముసాయిదా (డ్రాఫ్ట్) పేరిట ఇటీవల ఓ సర్క్యులర్ బయటకు రాగా, టీచర్ల వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో 94 మంది టీచర్లకు సంబంధించి సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 84 మందిని సొంత మండలంలోనే సర్దుబాటు చేయగా, ఆరుగురిని పక్క మండలాలకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది నిజమా..? లేక ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సరి దిద్దుకునేందుకు లీక్ ఇచ్చారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆరోపణలు వచ్చిన స్కూల్స్కు సంబంధించి సాక్షి కథనాలతో వాటి జోలికి వెళ్లలేదని ముసాయిదా జాబితాతో తెలుస్తుంది. టీచర్లు వస్తారా.. టీసీలు ఇస్తారా..? టీచర్లకు పదోన్నతులు కల్పించి నెలరోజులు గడిచిపోతున్నా సర్దుబాటు ప్రక్రియ జాప్యంపై తల్లిందండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు టీచర్లకు పదోన్నతి వచ్చింది. దీంతో ఇద్దరూ వెళ్లిపోవడంతో సీఆర్పీతో నెట్టుకొస్తున్నారు. మండలంలో ఇతర పాఠశాల నుంచి తాత్కాలికంగా టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉండగా, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీచర్లను నియమించాలని తల్లిదండ్రులు పలుమార్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు జంపయ్య, కరుణాకర్, మాధవి, ప్రతాపరెడ్డి, సత్తెమ్మ, కిష్టయ కల్యాణి, భవ్య, ఐలయ్య మాట్లాడుతూ.. ఇద్దరు ఉపాధ్యాయులు పదోన్నతిపై వెళ్తే వారి స్థానంలో మరొకరిని నియమించడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని, లేని పక్షంలో టీసీలు ఇస్తే మరో పాఠశాలలో పిల్లలను చేర్పిస్తామని తల్లిదండ్రులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయమంలో విద్యాశాఖ అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి. గడువు ముగిసి నెల రోజులు పదోన్నతులతో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ సీఆర్పీలకు బాధ్యతలు ఎంఈఓకు పట్టని విద్యార్థుల భవిష్యత్ -
దంచి కొట్టిన వాన
జనగామ: రైతులు కష్టపడి పండించిన పంటను ఆదివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం ఆగం చేసింది. వానాకాలం సీజన్ కోతలు మొదలవుతున్న నేపథ్యంలో పంట సరుకులను అమ్ముకునేందుకు రైతులు మార్కెట్ బాటపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులకు నష్టం తప్పడంలేదు. జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వేల క్వింటాళ్ల ధాన్యం, మక్క గింజలు ఆదివారం అరగంటపాటు కురిసిన భారీ వర్షంతో తడిసి ముద్దయ్యాయి.వరదకు కొట్టుకుపోయిన గింజలుజిల్లాలో వానాకాలం సీజన్ కోతలు మొదలయ్యా యి. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చే యకపోవడంతో, జిల్లా నలుమూలల నుంచి పంట ను విక్రయించేందుకు రైతులు జనగామ వ్యవసా య మార్కెట్కు వస్తున్నారు. మక్కలు, ధాన్యంలో తేమ అధికంగా ఉండడంతో రోజుల తరబడి సరుకులను కాటన్ యార్డులో ఆరబోసుకుంటున్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో కాటన్ యార్డులో ఆరబోసిన ధాన్యం, మక్కలు నీటిలో కొట్టుకుపోయాయి. గింజలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండాపోయింది. దీంతో 15 బస్తాల వరకు మక్కలు, 18 బస్తాలకు పైగా ధాన్యం కొట్టుకుపోవడంతో రెక్కల కష్టం వరద పాలైందని రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఎండ లేకపోవడంతో తడిసిన ధాన్యం గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏటా ఇదే తంతుమార్కెట్ కాటన్ యార్డులో చుట్టుపక్కల డ్రెయినేజీ సిస్టం, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంతో వర్షం కురిసిన ప్రతీసారి రైతులకు నష్టం తప్పడంలేదు. అధికారులు మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాటన్ యార్డులో డ్రెయినేజీ వ్యవస్థను నిర్మించి సీజన్కు 20 రోజుల ముందుగానే అవసరమైన టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలంలో ఆదివారం భారీవర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగిపోర్లాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో 35.4 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న పంట నేలపాలైంది. మార్కెట్కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన మక్కలు తడవడంతో రైతులు వాపోతున్నారు. ఆరపోసిన మక్కలు వరదలో కొట్టుకుపోయాయి. -
స్లాట్ బుకింగ్.. స్పాట్ సెల్లింగ్
హన్మకొండ: పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభించనుంది. కనీస మద్దతు ధర అందించడంతోపాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు, క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ‘కా పాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి రైతులు ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పంటను అమ్ముకోవాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ యాప్పై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు రైతుల మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేయించి పత్తి బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. తద్వారా పత్తి క్రయవిక్రయాలు పూర్తిగా యాప్ ద్వారానే సాగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి దాదాపు 5,23,848 ఎకరాల్లో సాగు చేశారు. స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకం.. రైతులు ‘కా పాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి అమ్ముకోగలుగుతారు. రైతులు ఏ మిల్లులో అమ్ముకుంటారో తెలుపుతూ స్లాట్ బుక్ చేయగానే తేదీ, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా సమాచారం అందిస్తారు. అదే నిర్ణీత రోజు, నిర్ణీత సమయానికి రైతు పత్తిని తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోకపోతే పత్తిని అమ్ముకోలేరు. రైతులు మూడుసార్లు స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్ను రద్దు చేసుకోకుండా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించకపోతే ఆ రైతు పేరు బ్లాక్లిస్టులోకి వెళ్తుంది. బ్లాక్ లిస్టులో నుంచి పేరు తొలగించి, తిరిగి పత్తి అమ్ముకోలాంటే సీసీఐ అధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. పత్తి క్వింటాకు రూ.8,110 మద్దతు ధర.. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ‘కా పాస్ కిసాన్’ యాప్ ద్వారా మద్దతు ధర పొందే అవకాశాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. స్మార్ట్ ఫోన్లేని రైతులు ఇతరుల స్మార్ట్ ఫోన్ నుంచి కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రైతు పాస్బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ‘కా పాస్ కిసాన్’ యాప్లో రైతు పట్టాదారు పాస్బుక్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయగానే పంట ఎంత సాగు చేశారో వివరాలు అందులో వస్తాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే చేస్తూ పంట సాగు వివరాలు నమోదు చేస్తోంది. డిజిటల్ క్రాప్ సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి దిగుబడి లెక్కిస్తారు. ఈ యాప్ ద్వారా రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. రైతులు నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది.‘కా పాస్ కిసాన్’ యాప్ను స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక ముందుగా రైతు పేరు, జండర్, పుట్టిన తేదీ, కులం. చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్, కౌలురైతు/సొంతమా అనే వివరాలు నమోదు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, రైతుకు ఉన్న మొత్తం భూమి, ఇందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వివరాలు యాప్లో నిక్షిప్తం చేయాలి. రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, పాస్బుక్, రైతు ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాలి. పత్తి విక్రయానికి ఇక ఇబ్బందులుండవ్ ప్రత్యేక యాప్ను రూపొందించిన సీసీఐ ‘కాపాస్ కిసాన్’ యాప్ ద్వారా బుకింగ్ యాప్పై వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులకు శిక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,23,848 ఎకరాల్లో పత్తి సాగుజిల్లా విస్తీర్ణం (ఎకరాలు) వరంగల్ 1,18,547హనుమకొండ 74,849మహబూబాబాద్ 85,480ములుగు20,593భూపాలపల్లి 98,260జనగామ 1,26,119 -
బీజేపీలో చేరిన హౌసింగ్ రిటైర్డ్ డీఈఈ
జనగామ రూరల్: స్టేషన్ ఘన్పూర్ రిటైర్డ్ డీఈఈ సీతా దుర్గాప్రసాద్ బీజేపీలో చేరారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల విజయానికి కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీతా శ్యామల, డాక్టర్ గుండె రాహుల్, అరుణ్ కుమార్, భూపాల రమేష్, పూర్ణచందర్, శోభ రాణి, రాంరెడ్డి, శివకుమార్, శేఖర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు. ‘ఎంపీటీసీ స్థానాల్లో అన్యాయం’ రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో జనాభా ప్రకారం కాకుండా అధికారులు అన్యాయం చేశారని ఆ గ్రామానికి చెందిన రాపోలు రామ్మూర్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో రామ్మూర్తి మాట్లాడుతూ ఎంపీటీసీల స్థానాల కేటాయింపులో 2019లో అన్యాయం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక్కో ఎంపీటీసీ స్థానానికి 1,000 నుంచి 2,400 ఓటర్లు కలిగి ఉండాలన్నారు. కంచనపల్లిలో 5,200 ఓటర్లకు కేవలం ఒకే ఎంపీటీసీ స్థానం కేటాయించి అన్యాయం చేశారన్నారు. కంచనపల్లి గ్రామానికి రెండు ఎంపీటీసీ స్థానాలు కేటాయించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును అశ్రయించినట్లు తెలిపారు. ఈ విషయమై ఈ నెల 7న హైకోర్టులో విచారణ జరుగనున్నట్లు ఆయన వివరించారు. 9 నుంచి లా సప్లిమెంటరీ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేళ్ల లాకోర్సు ఏడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్, 17న నాలుగో పేపర్, 22న ఐదో పేపర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు. -
నామినేషన్ వేసేందుకు ప్రతిపక్షాలకు భయం
రఘునాథపల్లి: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ప్రతిపక్షాల అభ్యర్థులు భ యపడే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని నిడిగొండ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ కూడా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నందున ఇతర పార్టీలను గెలిపిస్తే అభివృద్ధికి ఆ స్కారం ఉండదన్నారు. గెలిచే వారికి పార్టీ అభ్యర్థులుగా అవకాశం కల్పిస్తామన్నారు. వెన్నుపోటుదా రులను ఉపేక్షించేది లేదని, పాత, కొత్త అన్న తేడా లేకుండా పనిచేయాలని సూచించారు. బీసీలకు రిజ ర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ అడ్డుపడుతుందని, ఆ పార్టీతో ఒరిగేదేం లేదన్నారు. బాకీ కార్డు పేరిట బీఆర్ఎస్ దుష్పచారం చేస్తుందని, కాంగ్రెస్ కూడా కేసీఆర్, కేటీఆర్ల అవినీతి చిట్టాతో ప్రజల్లోకి వెళ్తుందన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. పదేళ్లుగా పాలించిన వారి అవినీతిని వివరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని ఎంపీ పిలుపుని చ్చారు. ఈ సందర్భంగా మండలాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అ ధ్యక్షుడు కొమ్మూరి ప్రతా ప్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్లు శివరాజ్యాదవ్, లావణ్య, మాజీ జెడ్పీటీసీలు జగదీష్చందర్రెడ్డి, వంశీధర్రెడ్డి, అజయ్, జిల్లా నాయకులు జయరాములు, లింగాజీ, శివకుమార్, శిరీష్ రెడ్డి, సురేష్, సంపత్, అయిలయ్య, నరేందర్, భాస్కర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు, పదవులు వరంగల్ ఎంపీ కావ్య -
రామప్పలో కోలాహలం
వెంకటాపురం(ఎం): ప్రపంచప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్ వివరించారు. వనదేవతలకు మొక్కులుఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణకట్టలో పుట్టువెంట్రుకలను సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద పూజలు చేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. -
ప్రయాణం ప్రయాసే..
దసరా సెలవులు ముగించుకుని పట్టణ బాట పడుతున్న కుటుంబాలకు ప్రయాణంలో ప్రయాస తప్పడం లేదు. నేటి(సోమవారం) నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. 15 రోజులపాటు స్వగ్రామాల్లో ఎంజాయ్ చేసిన కుటుంబాలు ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో జనగామ ఆర్టీసీ బస్టాండ్లో రికార్డు స్థాయిలో ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసింది. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసులు నడిపించినప్పటికీ, ఒక్కో బస్సులో ఒంటికాలుపై నిలబడి 100 మందికి పైగా వెళ్లాల్సి వచ్చింది. – జనగామజనగామ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ -
– ఎస్ఎస్తాడ్వాయి
కోయల పూర్వ మూలాలు, పడిగ బొమ్మలు, పూర్వ కోయ రాజ్యాల చరిత్ర, గొట్టు గోత్రాలు (పూర్వం ప్రకృతి సమతుల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశవృక్షాలను 3 నుంచి 7 గొట్లుగా ఏర్పాటు చేసుకుని ప్రకృతిలోని జంతువులు, చెట్లు, పక్షులు, రాజ్య వ్యవస్థ సింబల్ను దైవాలుగా పంచుకున్నారు)... వీటిని మేడారం అమ్మవార్ల గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై తీర్చిదిద్దనున్నారు. ఆలయం మొత్తం కొండ గుహల్లో దొరికిన పూర్వ కోయ రాజ్యాలు నడిచిన క్రమంలో రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా వాస్తుప్రకారం రూపుదిద్దుకోనుంది. వెయ్యేళ్లు ఆదివాసీల చరిత్ర నిలిచేలా అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు. మేడారం పునర్నిర్మాణంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. ఆలయంలో రానున్న ఆర్చీలు, సాలహారంపై ఆదివాసీ చరిత్ర, ప్రకృతితో వారికున్న అనుబంధం తెలిపే బొమ్మల విశేషాలే ఈ వారం సండే స్పెషల్ కథనం. వనదేవతల గద్దెల ప్రాంగణం నమూనా చిత్రంప్రధాన ఆర్చీ ద్వారం 40 ఫీట్ల ఎత్తుతో నిర్మించనున్నారు. దీనిపై బండానీ వంశం సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశస్తుల పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి, అటు ఇటు చివరన అడవిదున్న కొమ్ములు, నెమలి ఈకలు ఏర్పాటుచేస్తారు. ఇవి ఆదివాసీల అస్థిత్వానికి రూపాలు. పక్కన రెండు వైపులా నాగులమ్మ (సమ్మక్క చెల్లెలు) పాము రూపంలో ఉంటుంది. వరుసగా కోయ సమాజంలో 6వ గొట్టు ఏనుగు, 3వ గొట్టు ఎద్దు, 4వ గొట్టు ఖడ్గమృగం, 5వ గొట్టు ఒంటి కొమ్ము దుప్పి, 7వ గొట్టు మనుబోతు, 8వ గొట్టు సమ్మక్క తల్లిని చిలకలగట్టు నుంచి తీసుకువచ్చే సిద్ధబోయిన వారి సింహాలు వరుసగా ఏర్పాటు చేస్తారు. ఇందులో మూర్తి అక్కుమ్ (తూత కొమ్ము) ప్రత్యేకం. దేవత ఈ శబ్దం ద్వారానే వస్తుంది అనేది సంకేతం. కింద పిల్లర్లపై కుడి వైపు 5వ గొట్టు తెలిపేలా 5 నిలువు గీతలు, పూజిత పక్షి పావురం, నెమలి పూజిత వృక్షం వెదురు చెట్టు, బండారి చెట్టు, 4వ గొట్టు సమ్మక్క భర్త మూలం తెలిపే 4 నిలువు గీతలు, పూజిత పక్షి సోనోడి పిట్ట, పాలపిట్ట, వృక్షం బూరుగు చెట్టు, తాబేలు ఏర్పాటు చేయనున్నారు. ఆదివాసీ మూలాలు, సంస్కృతీసంప్రదాయ చిత్రాలతో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మొత్తంగా 8 ఆర్చీలు, గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీపై 700 ఆదివాసీ చిత్రాలను ఏర్పాటుచేయనున్నారు. అమ్మవార్ల గద్దెలను కదిలించకుండా కోయ మూలాలతో అభివృద్ధి పనులను చేపట్టారు. వనదేవతల వరుస క్రమంలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు చేయనున్నారు. 300 ఫీట్ల వెడల్పు, 1000 ఫీట్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు. ఆదివాసీల గొట్టుగోత్రాల చిత్రాలుతాబేలుపై కోయరాజుల బొమ్మలుఅమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పిల్లర్లు ఫీటున్నర వెడల్పు, 8 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేస్తారు. వీటిపై 340 బొమ్మలు వేయనున్నారు. పూర్తిగా సమ్మక్క వంశం సిద్ధబోయినవారి పవిత్ర బొమ్మలతోపాటు పూజావిధానం, వారి వంశ వృక్షం ఉంటుంది. సారలమ్మ గద్దె పక్కన పిల్లర్లపై కూడా ఇదే పద్ధతిలో 342 బొమ్మలు వేస్తారు. సారలమ్మ వంశం, 3వ గొట్టు పవిత్ర బొమ్మల చిత్రాలు వేస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై 172 చొప్పున 344 బొమ్మలు, వారి వంశవృక్షం పవిత్ర బొమ్మలు వేస్తారు. పగిడిద్దరాజు – నాగులమ్మ కొడుకు జంపన్న గద్దె జంపన్న వాగు ఒడ్డున ఉంది. అక్కడే ఈ గద్దెను అభివృద్ధి చేయాలని పూజారులు నిర్ణయించారు. జంపన్న తమ్ముడైన ముయాన్న గద్దె ఏర్పాటు, వనం పోతురాజు ఇంకా కాపలాగా ఉండే పొలిమేర దేవతల ఏర్పాటును శాసీ్త్రయబద్ధంగా పూజారులు తీసుకున్నారు. ● ఎడమ వైపు పిల్లర్లపై మూడవ గొట్టు మూలం 3 నిలువు బొట్లు, త్రిభుజం రాజ్య సింబల్, సారలమ్మ కోసం స్వయంవరంలో బాణంతో కాకిని కొట్టి కాక అడమరాజు సారలమ్మను పెళ్లి చేసుకున్న మనిషితో కూడిన బాణం ఉంటుంది. కాకి బొమ్మ, సిద్ధబోయిన వంశస్తుల వడ్డే గోత్రం వృక్షం ఇప్పచెట్టు, చిలకలగట్టునుంచి దేవతను తీసుకొచ్చే సందర్భం బొమ్మలు.. ఇలా ప్రకృతిలోని జంతువులు, పక్షులు, చెట్ల చిత్రాలను ఈ ఆర్చీలో చేర్చి మేడారం జాతర అంటే ప్రకృతి జాతర అనేలా రూపుదిద్దుతారు. ● ఆలయంలోని తూర్పు ఈశాన్యం ద్వారం ద్వారా భక్తులు వెళ్తారు. ప్రధాన ద్వారం పూర్తిగా 5వ గొట్టు మూలం బొమ్మలు 25 రకాలు ఉంటాయి. వారి వంశ వృక్షం ఉంటుంది. పక్కన ద్వారం సిద్ధబోయిన కొక్కెర వారి మూల వంశవృక్షం 25 బొమ్మలతో ఉంటుంది. మరో ద్వారం తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇది పగిడిద్దరాజుది. దీనిలో 4వ గొట్టు మూలం పూర్తిగా 25 బొమ్మలతో ఉంటుంది. తాబేలు బొమ్మపై ఉన్న నలుగురు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లూరుడిని తెలుపుతుంది. సమ్మక్క భర్త కావడంతో పగిడిద్దరాజు కుడివైపున ఉంటాడు. మధ్యలో వీరి పెళ్లి చేసిన సిద్ధబోయిన వంశం వారు ఉండేలా రూపొందించారు. వెనుక భాగంలో గోవిందరాజు ద్వారం కూడా 4వ గొట్టు మూలాన్ని తెలుపుతుంది. ● ప్రధాన ద్వారం వెనుక వైపు సారలమ్మది. దీనిపై పూర్తిగా 3వ గొట్టు మూలం జంతువులు, పక్షులు వేస్తూ కాక అడమ రాజు, సారలమ్మ మూలం తీసుకున్నారు. సమ్మక్క చెల్లెలు నాగులమ్మకి పుట్ట పోసేందుకు 5 మీటర్ల ఖాళీ స్థలం వదిలేశారు. మిగతా ద్వారాలను సాధారణ కోయ మూలాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశ పురోగమన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్కుమార్ మేడారం గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై 700 ఆదివాసీ చిత్రాలు 3 నుంచి 7 గొట్ల వంశస్తుల సంస్కృతీ సంప్రదాయం పరిఢవిల్లేలా ఏర్పాటు వెయ్యేళ్లు నిలిచేలా రాతికట్టడాలు, గద్దెల ప్రాంగణం విస్తీర్ణం ఆధునికీకరణ తల్లుల గద్దెలు కదిలించకుండా నిర్మాణం మారనున్న వనదేవతల గద్దెల ప్రాంగణం రూపురేఖలు అమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు -
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు
జనగామ: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పండేరి చేతన్ నితిన్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ఏకశిల బీఈడీ, ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల(అటానమస్)ల్లో పరిశీలించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్, జనగామ మండలం డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి సంబంధించి గౌతమ్ మోడల్ స్కూల్ను వారు సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియమాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్, స్ట్రాంగ్ రూంలు ఉండాలని అధికారులకు సూచించారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్న వసతి సౌకర్యాల కల్పనకు సంబంధించి పలు సూచనలు ఇచ్చారు. పోలీస్ బందోబస్తు, రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జనగామ ఎంపీడీవో, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మైనార్టీ మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలిజనగామ రూరల్: మైనార్టీ మహిళలు అన్ని రంగాల్లో ఎదిగి ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్సీ అమీర్ఖాన్ ఆకాంక్షించారు. శనివారం పట్టణంలోని గిర్నిగడ్డ, గుండ్లగడ్డలో కాంగ్రెస్ మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జమాల్ షరీఫ్ ఆధ్వర్యంలో సీయాసాత్ హబ్ మైనార్టీ వెల్ఫేర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. ప్రతీ పేద ముస్లిం మహిళల నెలకు రూ.100 చొప్పున మైనార్టీ ఉమెన్ ఎంపవర్మెంట్ పథకంలో 5 ఏళ్లు చెల్లిస్తే 1000 మంది మహిళలతో మొత్తం రూ.60లక్షలు అవుతాయని, సీయాసాత్ హబ్ ద్వారా సంవత్సరానికి 10 లక్షలు జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో మౌలానా షకీరా హుస్సేన్, మౌలానా అబ్దుల్ రహమాన్, మౌలానా మసి ఆర్ రెహ్మాన్, రఫ్ మతీన్ అడ్వకేట్, అబ్దుల్ మన్నాన రాజీ పాల్గొన్నారు. రేపు ప్రజావాణి రద్దుజనగామ రూరల్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స ర్పంచ్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. వీరాచలరాముడి సేవలో రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ చైర్మన్లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామిని శనివారం రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ చైర్మన్, మెంబర్ ఆఫ్ సెక్రటరీ జడ్జి చిలుకమారి పంచాక్షరి, ఆయన సతీమణి కావ్యశ్రీ దర్శించుకున్నారు. వేదపండితులు భార్గవాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్రాన్ని వేదపండితులు వివరించారు. ఈఓ వంశీ, కమిటీ చైర్మన్ మూర్తి తదితరులు ఉన్నారు. జనగామ: మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో శనివారం రాత్రి పోలీసులు విస్త్రతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ స్వయంగా తనిఖీలను పర్యవేక్షించారు. ఏఎస్పీ వెంట ఎస్సైలు రాజన్ బాబు, చెన్నకేశవులు, తదితరులు ఉన్నారు. -
మెరుగైన వైద్యసేవలందించాలి
జఫర్గఢ్: ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలందించే విషయంలో వైద్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.రవీందర్నాయక్ కోరారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలను ఆయన శనివారం అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు.. ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్యసేవలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పనితీరు, డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడి రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్షించడంతో పాటు పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలందించే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ సుధీర్, డాక్టర్ శ్రీదేవి, డీఐఓ స్వర్ణకుమారి, వైద్యులు రాజమల్లు, నరేందర్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ రవీందర్నాయక్ -
దసరా కిక్కు
సర్కిల్ లిక్కర్ బీర్ల అమ్మకాలు కాటన్లు కాటన్లు (రూ.కోట్లలో) జనగామ 4,589 8,806 రూ.5.57 స్టే.ఘన్పూర్ 4,724 7,115 రూ.5.40 పాలకుర్తి 2,922 5,771 రూ.3.41 12,235 21,692 రూ.14.38 జనగామ: దసరా పండుగ సంబురం మద్యం వ్యాపారులకు కిక్కిచ్చింది. జిల్లా వ్యాప్తంగా 47 వైన్స్ షాపులు, ఐదు బార్లలో గత నెల 29వ తేదీ నుంచి ఈనెల 4వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల్లోనే 33,927 ఐఎంఎల్, బీర్ కాటన్లు అమ్ముడవగా, రూ.14.38 కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వైన్స్ షాపులు మూసివేయడంతో, 1వ తేదీన కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. చాలా మంది ముందుగానే స్టాక్ చేసుకోవడంతో మద్యం దుకాణాలు ఖాళీ అయ్యాయి. దసరా రోజున మద్యం దుకాణాలు మూసి ఉండడంతో, ప్రజలు 3వ తేదీన ‘పిల్ల దసరా’ ఉత్సవాలు ఘనంగా చేసుకున్నారు. దీంతో, గత ఆరు నెలలుగా అమ్మకాలలో నష్టపోయిన వైన్స్ వ్యాపారులకు ఈసారి దసరా మంచి ఊరట ఇచ్చింది. పండుగల సీజన్ ముగియడానికి ముందే, స్థానిక సంస్థల ఎన్నికల వేడి కూడా మద్యం వ్యాపారానికి ఊతమిచ్చింది. వివిధ రాజకీయ ఆశావహులు పార్టీ కార్యకర్తలకు విందులు ఏర్పాటు చేయడంతో కొనుగోళ్లు మరింత పెరిగాయని ఎకై ్సజ్ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి సర్కిల్ పరిధిలో 12,235 లిక్కర్, 21,692 బీర్ల కాటన్ల అమ్మకాలతో రూ.14.38కోట్ల మేర వ్యాపారం జరిగింది. నెలనెలా మద్యం అమ్మకాల టార్గెట్ చేరుకునేందుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. దసరా పేరిట రికార్డు కలెక్షన్లు పెరగడంతో ఆ శాఖ సంతోషంలో ఉండగా, వ్యాపారులకు దసరా దీవెనగా భావిస్తున్నారు. సెప్టెంబర్ చివరివారం నుంచి అమ్మకాలు బాగా పెరిగాయి. ఈనెల 1వ తేదీ నుంచి వ్యాపారులు ఊహించని విధంగా అత్యధిక అమ్మకాలు జరిగాయి. పండుగ వాతావరణం, సెలవులు, ఎన్నికల ఉత్సాహం అన్నీ కలిపి మద్యం అమ్మకాలపై ప్రభావం చూపించాయి. ఒక వైపు భక్తి, మరో వైపు మత్తు దసరా వేడుకల్లో రెండూ జిల్లాలో స్పష్టంగా కనిపించాయి. ఐదు రోజులు..రూ.14.38కోట్లకు పైగా వ్యాపారం గాంధీ జయంతితో ముందురోజే భారీ కొనుగోళ్లు మద్యం షాపుల యజమానులకు పండుగ సంబురం దసరా సెలవుల్లో ఈనెల 5 (ఆదివారం) మాత్రమే మిగిలి ఉండడంతో పండుగ సేల్ కొనసాగనుంది. ఐదురోజుల అమ్మకాల్లో సరాసరి రోజువారీగా రూ.3కోట్ల మేర మద్యం వ్యాపారం జరుగగా, ఆదివారం కూడా అదే జోరు కొనసాగుతుందని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. సెలవులు ముగించుకుని 50 శాతం మేర కుటుంబాలు స్వగ్రామాల నుంచి పట్టణాలకు బయలుదేరగా.. మరో 50శాతం మంది సొంతూరిలోనే ఉన్నారు. దసరా, పిల్ల దసరా ముగియడంతో..మిగిలి ఉన్న ఒక్క రోజు వచ్చే ఏడాది దసరా పండుగ వరకు గుర్తుండేలా దావత్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వేడుకలు ముగిశాయో లేదో..8వ తేదీన స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ రోజు సైతం అమ్మకాలు బాగానే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
గంగమ్మ ఒడికి దుర్గమ్మ
ఊరేగింపుగా బతుకమ్మకుంట అమ్మవారుబతుకమ్మకుంట అమ్మవారి నిమజ్జనం● జిల్లా వ్యాప్తంగా శోభాయాత్రలు, నిమజ్జనాలు జనగామ: విజయదశమి పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శ్రీ దేవినవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పది రోజుల పాటు భక్తుల కోలాహలంతో అమ్మవారి మండపాలు భక్తి పారవశ్యంతో నిండిపోయాయి. జనగామ, పాలకుర్తి, స్టేషన్న్ఘన్పూర్ నియోజకవర్గాల పరిధిలో 40కి పైగా అమ్మవార్లు కొలువుదీరగా, ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు, మాలలు ధరించిన భవానీమాతాలు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి శోభాయాత్రలకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. పదిరోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న అమ్మవారు పదకొండో రోజు నిమజ్జనానికి బయలుదేరగా పట్టణంలోని ప్రధాన వీధులన్నీ శోభాయమానంగా మారాయి. పట్టణంలోని శ్రీవిల్లాస్ కాలనీ టీంఎస్బీసీ, అంబేడ్కర్నగర్ 14వ వార్డు ముస్లిం మైనార్టీ కాలనీలోని శ్రీ దేవీ నవరాత్రి నిమజ్జన ఉత్సవం ఘనంగా జరిగింది. వేడుకల్లో జీవన్ గ్రీన్ హోప్ సొసైటీ చైర్మన్ దూసరి ధనలక్ష్మిశ్రీకాంత్ పాల్గొన్నారు. పాతబీటు బజారు గణేశ్ యూత్ ఫ్రెండ్స్, లక్ష్మిభాయ్కుంట, ఈ సేవా ఏరియాలోని బొడ్రాయి, గిర్నిగడ్డ హనుమాన్ టెంపుల్, ఉప్పలమ్మ ఆలయం, మూలబావి శ్రీ సీతారామచంద్రస్వామి, తదితర ఏరియాలో కొలువు దీరిన అమ్మవార్లను నిమజ్జనం చేశారు. నిమజ్జన ఊరేగింపుల్లో ఇబ్బందులు కలుకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. తహసీల్ కార్యాలయ ఆవరణలోని అమ్మవారిని ఊరేగింపు నిర్వహించి, శ్రీ సంతోషిమాత ఆలయానికి తీసుకొచ్చారు. పట్టణంలోని బొడ్రాయి వద్ద జరిగిన వేడుకల్లో స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాల్గొని పూజలు చేశారు. -
మహాత్ముడికి ఘన నివాళి
జనగామ: గాంధీ జయంతి పురస్కరించుకుని గురువారం జనగామ పట్టణంలోని కృష్ణకళామందిర్ జంక్షన్లోని గాంధీ విగ్రహానికి గురువారం కలెక్టర్ షేక్ రిజ్వాన్న్ బాషా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులతో కలిసి రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, నాయకులు బక్క శ్రీనివాస్, మంత్రి శ్రీశైలం, గాదెపాక రాంచంద్రంతో కలిసి ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య పట్టణ కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి పజ్జూరి జయహరి, బెల్దె శ్రీధర్, శివరామకృష్ణ, గట్టు శ్రీనివాస్, మిరియాల రమేశ్, దేవునూరి వెంకటేశ్వర్లు, దోస పాటి శ్రీనివాస్ తదితరులు బాపూజీకి నివా ళులర్పించారు. పిరమిడ్ స్పిర్చువల్ సీనియర్ మాస్టర్ రాజేందర్, గుంటిపల్లి మల్లికార్జున్ ఆధ్వర్యంలో మనిషి మేలుకో, జీవహింస మానుకో అనే నినాదంతో ప్రచారం, ర్యాలీ చేపట్టారు. -
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
● రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కములుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఇంచర్లలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం సమష్టిగా పనిచేయాలన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. -
భద్రకాళిభద్రేశ్వరుల కల్యాణోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవం శుక్రవారం శోభాయమానంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం పూజారులు నిత్నాహికం జరిపి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. రాత్రి శోభాయమానంగా అలంకరించిన వేదికపై జరిగిన భద్రకాళిభద్రేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వీక్షించిన వందలాది మంది భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర కార్యక్రమాల అనంతరం శతఘటాభిషేకం నిర్వహించారు. వివాహమహోత్సవాన్ని పురస్కరించుకుని భద్రేశ్వరస్వామికి ద్వితీయ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. అనంతరం వరపూజ, మధుపర్కవిధి, కాల్లుకడిగి కన్యాదానం చేయడం, మహాసంకల్పం మంగళాష్టకముల చూర్ణిక తదితర తంతు జరిపారు. వధూవరులకు జీలకర్రబెల్లం పె ట్టడం, మాంగల్యధారణ కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణం అనంతరం పుష్పయాగం చేశారు. ఆలయ ఈఓ సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు.. విజయ దశమితో దేవాలయంలో గురువారం శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఉదయం నిత్యాహ్నికం, కలశోద్వాసన జరిపి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రతీర్థోత్సవం, ధ్వజారోహణం జరిపారు. -
అంగరంగ వైభవంగా..
● జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు ● బతుకమ్మకుంటలో ఘనంగా రావణవధ ● వేలాదిగా తరలివచ్చిన ప్రజలు ● చెడుపై విజయమే దసరా: ఎమ్మెల్యే పల్లాజనగామ: జిల్లావ్యాప్తంగా ప్రజలు దసరా పండగను ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతాల్లో ఆలయాలతో పాటు ఊరికి శివారులో ఉన్న జమ్మిచెట్టు వద్దకు వెళ్లారు. శ్రీశమీ శమియతే పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుద్ధారి, రామస్య ప్రియదర్శనంశ్రీ అంటూ జమ్మిచెట్టు వద్ద పూజలు చేశారు. ఒకరికొకరు జమ్మి ఇచ్చిపుచ్చుకుని, అలైబలై చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో రాత్రి 7 గంటలకు బతుకమ్మకుంటలో జరిగిన రావణవధ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బతుకమ్మకుంటకట్టపై భారీ పది తలల రావణాసురుడి కటౌట్ ఏర్పాటు చేశారు. అంతకుముందు దుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే పల్లా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జమ్మి చెట్టువద్దకు వెళ్లారు. బతుకమ్మకుంటలో రావణవధ.. బతుకమ్మకుంటలో రావణవధ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ పర్యవేక్షణలో ఏఎస్సీ పండేరి చేతన్ నితిన్ పర్యవేక్షణలో సీఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు. గంటపాటు బాణాసంచా పేల్చగా, జిగేల్మన్న స్టార్స్ కాంతుల్లో బతుకమ్మకుంట దేదీప్యమానంగా వెలుగొందింది. వేలాదిమంది కనులారా వీక్షిస్తుండగా, కుంటకట్టపై ఏర్పాటు చేసిన రావణాసురుడి కటౌట్ను పేల్చగా, ఒక్కో తల పేలిపోతున్న ఉద్విగ్న క్షణాల మధ్య జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, బక్క శ్రీనివాస్, నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు. మంచి ఆలోచనలు, సంప్రదాయాలు విస్తరించాలి: వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా దసరా పండగ చెడుపై మంచిని కోరే సంకేతమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో మంచి ఆలోచనలు, సంప్రదాయాలు విస్తరించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్రెడ్డి, నాయకులు పోకల లింగయ్య, ముస్త్యాల దయాకర్, అనిత, పేర్ని స్వరూప, ఉల్లెంగుల సందీప్ తదితరులు ఉన్నారు. వాడవాడలా... పట్టణంలోని హెడ్పోస్టాఫీసు శ్రీ లక్ష్మిగణపతి దేవాలయం, అమ్మబావి ఉప్పలమ్మ, గుండ్లగడ్డ, పాతబీటు బజార్ శ్రీ రామలింగేశ్వర , బాణాపురం వెంటేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశ్వరస్వామి, మూలబావి శ్రీఆంజేయస్వామి, బాలాజీనగర్ ఎల్లమ్మ, శ్రీ సంతోషిమాత, గణేశ్ స్ట్రీట్ శ్రీ ఆంజనేయ, సరస్వతీ ఆలయాల్లో జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవుళ్లను చల్లంగా ఉండేలా దీవించాలని కోరుకున్నారు. గీతాశ్రమంతో పాటు పాతబీటుబజారు, గీతాశ్రమం, వీవర్స కాలనీ, జనగామ మండలం పెంబర్తిలో రావణవధ కార్యక్రమం నిర్వ హించారు. -
శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
● పంచాయతీ రిజర్వేషన్లు అమలవుతాయా.. రద్దవుతాయా? ● ఈనెల 8న కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ● ఖర్చు విషయంలో ఆశావహుల ఆచితూచి అడుగులుజనగామ: దసరా పండుగ సందడితో ఊళ్లలో వెలుగులు నిండిపోగా..గ్రామ రాజకీయాల్లో మాత్రం మరోరకం ఉత్కంఠ నెలకొంది. ఎప్పటిలాగే పండగ తర్వాత పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలవుతుందని అందరూ ఊహించినా, ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈనెల 8వ తేదీన వెలువడనున్న కోర్టు తీర్పు 42 శాతం బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తును నిర్ణయించనుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసి, 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే రిజర్వేషన్ల అమలు ఉండబోతుందా? లేక రద్దవుతాయా? అన్న సందేహాలపై ఆశావహ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రిజర్వేషన్ అనుకూలంగా ఉంటే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతారు. లేకుంటే వెనక్కి తగ్గక తప్పదనే నిర్ణయానికి ముందుగానే వచ్చేస్తున్నారు. చర్చంతా దీనిపైనే అభ్యర్థుల ఇళ్లలో పండగ శుభకార్యాల కంటే రాజకీయ లెక్కలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రజల్లోనూ ఉత్కంఠ తక్కువేం కాదు. ఎవరు సర్పంచ్, ఎవరు ఎంపీటీసీ, ఏవర్గం జెడ్పీటీసీని కై వసం చేసుకుంటుందన్న లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం అన్ని పార్టీలు సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఖర్చుకు దూరంగా నాయకులు.. ఆశావహులు తెరవెనక రాజకీయాలు నడిపిస్తూనే..రిజర్వేషన్ల ప్రకటన కోర్టు తీర్పుపై ఆధారపడి ఉండడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. డబ్బు ఖర్చు విషయంలో సైతం వెనుకంజ వేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పండగ సందర్భాల్లో డబ్బులు ఖర్చు చేస్తూ పబ్లిసిటీ చేసుకునేవారు. అయితే అవకాశాలు, రిజర్వేషన్లు మారితే జేబులు ఖాళీ అవుతాయనే ఆలోచనతో ఖర్చుకు దూరంగా ఉన్నారు. అయితే, రిజర్వేషన్ల అమలు కొనసాగి, ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ వస్తే క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై రెడీగా ఉన్నారు. రిజర్వేషన్లలో మార్పులు వస్తే గ్రామ రాజకీయ సమీకరణాలన్నీ తారుమారు అవుతాయని నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా బీసీ వర్గాల్లో అసంతృప్తి పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వేషన్లలో గందరగోళం దేవురుప్పుల మండలం గొల్లపల్లిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 200 మంది ఓటర్లు ఉంటారు. ఇక్కడ 8 వార్డులు ఉండగా, సర్పంచ్ జనరల్ కేటగిరీకి ఎంపిక చేసి, ఒక్క వార్డులో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించలేదు. నర్మెట మండలంలో సైతం వార్డుల పరిధిలో రిజర్వేషన్లు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. లింగాలఘనపురం మండలం ఏనెబావి పంచాయతీ పరిధిలో 1,2,3 వార్డుల్లో ఎస్టీలు ఉండగా, బీసీలకు రిజర్వు చేశారు. కిష్టగూడెం జీపీ 1,2 వార్డుల్లో ఎస్సీలకు రిజర్వు కాగా, ఇందులో బీసీలు, ఓసీలు మాత్రమే ఉన్నారు. 5,6వార్డుల్లో బీసీలు ఉండగా, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. జఫర్గడ్ మండల కేంద్రంలో 9,10 వార్డుల్లో బీసీ ఓటర్లు ఉండగా, ఎస్సీకి రిజర్వు చేశారు. హిమ్మత్నగర్ పంచాయతీ పరిధిలో 1,4,10 వార్డుల్లో బీసీ ఓటర్లు ఉండగా, ఎస్సీకి రిజర్వేషన్ కలిసి వచ్చింది. తిమ్మాపూర్లో 4వ వార్డులో బీసీ ఓటర్లు ఉండగా ఎస్సీకి, తమ్మడపల్లి(ఐ)లో 1, 3 వార్డుల్లో బీసీ ఓటర్లు ఉండగా ఎస్సీకి, కూనూరు పంచాయతీలో 1వ వార్డులో బీసీ, ఓసీ ఓటర్లు ఉండగా, ఇక్కడ కూడా ఎస్సీకి రిజర్వుడు చేశారు. తరిగొప్పుల మండలం పోతా రం 4వ వార్డులో ఎస్సీలు ఉండగా బీసీ, 2వ వార్డులో బీసీలు ఉండగా ఎస్సీ, అక్కరాజు పల్లిలో 2, 4 వార్డుల్లో బీసీలు ఉన్నప్పటికీ ఎస్సీ, 6, 8 వార్డుల్లో ఎస్సీలు ఉండగా బీసీ, అబ్దుల్ నాగారం 8వ వార్డులో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉండగా బీసీ, 3వ వార్డులో బీసీలు ఉండగా ఎస్సీ, సోలీపూర్లో 1, 7 వార్డుల పరిధిలో బీసీలు ఉండగా ఎస్సీ, 9, 10 వార్డుల్లో ఎస్సీలు ఉండగా బీసీ రిజర్వేషన్ కల్పించారు.పోషకాహారంతో ఆరోగ్యంఇవేం రిజర్వేషన్లు తరిగొప్పుల మండల పరిధిలో ఎంపీపీ స్థానం ఎస్టీ మహిళా రిజర్వేషన్ కాగా, 6 ఎంపీటీసీల్లో ఒక్క ఎంపీటీసీ స్థానానికి ఎస్టీ మహిళ రిజర్వు కాలేదు. మండలంలోని అంకుషాపూర్ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్గా కేటాయించారు. దీంతో ఇవేక్కడి రిజర్వేషన్లు అంటూ జనాలు ముక్కున వేలుసుకుంటున్నారు. -
శ్రీసోమేశ్వర ఆలయానికి ‘శంఖదార’ సమర్పణ
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం వెండి శంఖదారను భక్తుడు సమర్పించినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. స్వామివారి పూజాకార్యక్రమాల్లో అభిషేకం నిర్వహించడానికి హైదరాబాద్కు చెందిన భక్తుడు మెతుకు సంతోష్కుమార్, సుధ దంపతులు రూ.60,000ల విలువైన 500 గ్రాముల మిశ్రమ వెండితో శంఖదార తయారుచేయించి అందజేసినట్లు ఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల్లో జాతీయ జెండావిష్కరణ లింగాలఘణపురం: మండలంలోని వనపర్తి, నెల్లుట్ల గ్రామాల్లో దసరా పండగ సందర్భంగా గురువారం జాతీయ జెండాలను ఆవిష్కరించారు. విజయానికి సూచికగా జరుపుకొనే దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి జరుపుకోవడం ఆయా గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. అందులో వనపర్తిలో మాజీ సర్పంచ్ శ్రీధర్, ఎంపీటీసీ రాజిరెడ్డి, నాయకులు శంకరయ్య, కుమారస్వామి, సుదర్శన్రెడ్డి, మహేశ్, శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నెల్లుట్లలో చిట్ల ఉపేందర్రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. రామప్ప శిల్పకళాసంపద అద్భుతంవెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. రుద్రేశ్వరాలయంలో త్రిశూల తీర్థోత్సవంహన్మకొండ కల్చరల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం, త్రిశూలం, ఆయుధాలను పూజించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి దేవాలయంలోని ప్రాచీన కోనేరులో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం నిర్వహించారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తిని తిరిగి నిత్యపూజా కై ంకర్యాల కోసం దేవాలయంలో రుద్రేశ్వరుడిని సన్నిధిలో ప్రతిష్ఠించారు. త్రిశూల స్నానంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ జనగామ రూరల్: పండగ వేళల్లో రోడ్లపై రద్దీగా ఉంటుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. బుధవారం పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా జంక్షన్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్– హన్మకొండ, సిద్దిపేట–సూర్యాపేట రోడ్లపై తనిఖీలు నిర్వహించారు. ఆయన వెంట సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై చెన్నకేశవులు, రాజేశ్ కానిస్టేబుల్ ఉన్నారు. -
రావణవధకు సిద్ధం
శమజనగామ: జిల్లాలో దసరా సందడి నెలకొంది. పట్టణంలో వ్యాపారం జోరందుకోవడంతో రహదారులన్నీ కిక్కి రిసిపోయాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో రావణవధకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రంగు రంగుల లైటింగ్, శబ్దకాంతుల మధ్య 2న(గురువారం) సాయంత్రం శోభాయమానంగా రావణవధ జరుగనుంది. అమ్మవారి నవరాత్రులు, దసరా పండగను పురస్కరించుకుని పలువురు కుటుంబాలు బొమ్మల కొలువును ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విజయదశమి(దసరా) రోజున రాము డు రావణునిపై విజయం సాధించిన రోజుగా భావిస్తారు. రావణవధ ఉత్సవాలకు సంబంధించి పది తలల రావణాసుర విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. మధ్యాహ్నం పాలపిట్ట దర్శనం చేసుకున్న తర్వాత, సాయంత్రం బతుకమ్మకుంటలో నిర్వహించే రావణవధ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివస్తారు. రావణవధ కోసం భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పది తలల రావణాసురున్ని రెండు గంటల పాటు పేల్చేలా బాణాసంచాను సిద్ధం చేశారు. ఆలయాల ప్రత్యేక శోభ.. పాలకుర్తి సోమేశ్వరస్వామి, జీడికల్ శ్రీ సీతారా ముల ఆలయం, కొడవటూరు సిద్దులగుట్ట, చిల్పూరు బుగులోని శ్రీ వేంకటేశ్వరస్వామి, జనగామలోని బాణాపురం శ్రీ వేంకటేశ్వరాలయం, పాతబీటు బజారు శ్రీ రామ లింగేశ్వరాలయం, చీటకోడూరు పంచకోసు శ్రీరామలింగేశ్వరాలయాలు దసరా పండగకు ముస్తాబయ్యాయి. భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా పండగను పురస్కరించుకుని ఎలాంటి గొడవలు, రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు ఏసీపీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు పెద్దఎత్తున బందోబస్తు చేపట్టనున్నారు. జిల్లాలో పండుగ సందడి శమీపూజకు ఏర్పాట్లు పూర్తి ఆలయాల ప్రత్యేక శోభ బతుకమ్మకుంటలో వేడుకలకు భారీగా తరలనున్న ప్రజలు రికార్డు స్థాయిలో మద్యం, మాంసం విక్రయాలు ఆర్టీసీకి భారీ ఆదాయం.. దసరా పండగ సందర్భంగా జనగామ ఆర్టీసీకి టికెట్ కలెక్షన్లు పెరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి సుమారు లక్ష మందికి పైగా ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల ద్వారా స్వగ్రామాలకు చేరుకున్నారు. పండగతో మార్కెట్లు, బస్టా ండ్లు, పూల మార్కెట్లు, రహదారులు జనంతో సందడిగా కనిపించాయి. దసరా పండగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. -
నాలుగు కత్తులు కలిస్తేనే దసరా!
గీసుకొండ: ఆ గ్రామంలో నాలుగు కత్తులు ఒక చోట కలిస్తేనే దసరా. ఈ ఆచారం సంవత్సరాలుగా సాగుతోంది. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో నాలుగు కుటుంబాలకు చెందిన ఒక్కో కత్తి గ్రామం మధ్యలోని ‘కచ్చీర్’కు తీసుకుని వచ్చి దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గంగుల వీరయ్య కుటుంబం నుంచి ఒకటి, కొట్టె లక్ష్మయ్య కుటుంబం నుంచి ఒకటి, పోలెబోయిన వారి కుటుంబాల నుంచి రెండు కత్తులకు పూజలు చేసి ఇంటి నుంచి మందీమార్బలంతో అట్టహాసంగా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ చేసి కత్తుల(ఆయుధాల)తో సొరకాయను కట్చేసి కంకణాలు కట్టి దసరా పండుగను జరుపుకుంటారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. -
వినూత్నం.. విజయదశమి
గార్ల: దేశభక్తిని చాటుతూ దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఒకరోజు ముందు స్థానిక మసీదు సెంటర్లోని జెండా గద్దెకు రంగులు వేసి సిద్ధం చేస్తారు. నిజాం కాలంలో ప్రతీ దసరా రోజున నాటి తహసీల్దార్లు నెలవంక జెండాను ఎగురవేసేవారు. 1952లో గార్ల టౌన్ మున్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్రావు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మద్య ఘర్షణలు జరిగాయి. మెజారిటీ కౌన్సిలర్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే ఉండడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా పార్టీలకు అతీతంగా దసరా రోజు జాతీయజెండాను ఎగురవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో 1958 నుంచి మాటేడి కిషన్రావు జాతీయజెండాను ఎగురవేశారు. కొన్నేళ్ల తర్వాత గార్ల మున్సిపాలిటీని తీసేసి మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రథమ పౌరుడైన సర్పంచ్ దసరా పండుగ రోజు జాతీయజెండా ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో గార్ల మేజర్ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మంగమ్మ జాతీయజెండా ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి (దసరా)ని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలిచిన అనంతరం ఈరోజు విశిష్ట పూజలు చేస్తారు. అయితే, ఈసారి దసరా, గాంధీ జయంతి (అహింసా దినోత్సవం) ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానించారు. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పులివేషధారణ, కత్తిసాములు, విన్యాసాలు, పిట్టల దొరలు, బొమ్మల కొలువులు ఇలా ఎన్నోరకాలుగా పల్లెలు, పట్టణాల్లో సందడి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 2న (గురువారం) వినూత్నంగా నిర్వహిస్తున్న దసరా వేడుకలపై సాక్షి ప్రత్యేక కథనం..ప్రత్యేకంగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు మద్యం, మాంసాహారానికి పలువురు దూరం ఉమ్మడి జిల్లాలో నేడు దసరా పండుగ -
ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
జనగామ రూరల్: రెండు విడతలుగా నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సహకరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెనన్స్ హాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలపై అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేశ్ కుమార్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో, సంబంధిత నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..జిల్లాలోని 12 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నందున గ్రామీణ ప్రాంతాల్లోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందన్నారు. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండదన్నారు. జెడ్పీటీసీ 12 మండలాలలో 12 స్థానాలు కాగా, ఎంపీటీసీ 134 స్థానాలకు గాను 783 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అఖిలపక్ష పార్టీ ప్రతినిధుల సమావేశంలో ప్రతినిధులు కాంగ్రెస్ నుంచి బి.భాస్కర్, బీఆర్ఎస్ నుంచి రావెల రవి, సీపీఎం జోగు ప్రకాశ్, బీఎస్పీ తాండ్ర అఖిల్, బీజేపీ నుంచి జగదీశ్, జడ్పీ డిప్యూటీ సీఈవో సరిత, జిల్లా పంచాయతీ అధికారి స్వరూప, ఎన్నికల నోడల్ అధికారులు విక్రమ్ కుమార్, చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రఘు, కలెక్టర్ కార్యాలయ ఏవో శ్రీకాంత్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మారనున్న స్టేషన్ఘన్పూర్ రూపురేఖలు స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు నిధులు మంజూరు చేసిందని, రానున్న రోజుల్లో ఘన్పూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఘన్పూర్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనం, టౌన్హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాలు, జంక్షన్ అభివృద్ధి పనులు, రోడ్డు వెడల్పు తదితర పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం, తాగునీరు, సెంట్రల్ లైటింగ్ పనులను అంచనా వేసి టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
ఆందోళన కలిగిస్తోంది..
మా అమ్మాయి పెళ్లి కోసం బంగారం కొనే ఆలోచనలో ఉన్నాం. కానీ ధరలు తగ్గితే కొనాలని వాయిదా వేసుకున్నాం. అయితే ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడంతో ఇకపై తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. – చింతకింది ఉమ, గృహిణి, పాలకుర్తి బంగారం కొనలేము.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక గ్రాము బంగారం కొనలేము. వారం రోజుల కిందట నా కూతురు వివాహం చేశాను. ఐదు తులాల బంగారం కోసం రూ.5లక్షలు తీసుకుని వెళితే, నాలుగు తులాల మాత్రమే వచ్చింది. మరో 10 గ్రాములు పెండింగ్లో ఉంది. – గంధమాల కిష్టయ్య, బచ్చన్నపేట తయారీ తగ్గింది.. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో ఆభరణాలు చేయించుకునే వారి సంఖ్య తగ్గింది. గతంలో ప్రతి నెల వంద కుటుంబాలు ఆభరణాలు తయారు చేయించుకుంటే, ప్రస్తుతం పదిమందికి పడిపోయింది. చాలా మంది బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి భద్రపరుచుకుంటున్నారు. దీంతో ఆభరణాల తయారీ కార్మికులకు ఆర్థిక భరోసా దూరమవుతోంది. – నల్లనాగుల శ్రీనివాస్, జ్యువెల్లరీ వ్యాపారి, జనగామ ● -
2015 నుంచి బంగారం ధరలు(10 గ్రాములు)
24 క్యారెట్లు 22 క్యారెట్లు39,10835,849 31,39150,15128.77529,156 45,972 26,72627,44525,158 24,93122,8532015 2016 2017 2018 2019 2020 2021 2022 2023 2024 2025 -
సాదాబైనామాలను వేగంగా పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ బచ్చన్నపేట: భూభారతి చట్టంలో ఆయా గ్రామాల వారీగా వచ్చిన భూ సమస్యలను, సాదాబైనామాలను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జీపీఓలు ఎంఆర్ఐలు గ్రామాల్లో పర్యటించి భూసమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. ఎవరి ప్రలోభాలకు లొంగకూడదని చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రామానుజాచారి, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఎంఆర్ఐలు వంశీకృష్ణ, మున్వర్, సిబ్బంది యాకయ్య, జీపీఓలు పలువురు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు గురుకుల విద్యార్థి
స్టేషన్ఘన్పూర్: ఎస్జీఎఫ్ అండర్–19 విభాగంలో జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థి మారపాక గిరీశ్వర్ధన్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రఘుపతి, పీడీ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు జనగామలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ 19 ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొన్న స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవతర్సం (ఎంపీసీ) చదువుతున్న విద్యార్థి గిరీశ్వర్ధన్ ఉత్తమ ప్రతిభతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు జమ్ముకశ్మీర్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో మూడో స్థానం..చిల్పూరు: మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన గుంపుల రామ్మోహన్రెడ్డి–శిరీష కుమారుడు అశ్వతేజ్రెడ్డి జాఈయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలినట్లు జిల్లా అధ్యక్షుడు గాదెపాక అయోధ్య, ప్రదాన కార్యదర్శి నీరటి ప్రభాకర్ తెలిపారు. గ్రామానికి చెందిన అశ్వతేజ్రెడ్డి ప్రస్తుతం ఐనవోలు మండల కేంద్రంలోని పాత్ఫైండర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల జఫర్గఢ్ మండలం కూనూరు గ్రామంలో నిర్వహించిన 44వ సబ్ జూనియర్ బాల్బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అందులో భాగంగా ఈనెల 25 నుంచి 28 వరకు తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్లో నిర్వహించిన పోటీల్లో తెలంగాణ టీమ్ నుంచి పాల్గొని మూడో స్థానంలో నిలిచినట్లు కోచ్ ముచ్చ సుధాకర్రెడ్డి తెలిపారు. -
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం: ఖానాపురం మండలంలోని పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. పండుగ సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చి పాకాల మత్తడి వద్ద సందడి చేశారు. బోటింగ్ చేయడంతో పాటు లీకేజీ నీటిలో జళకాలాడుతూ ఉత్సాహంగా గడిపారు. దీంతో పాకాలలో సందడి నెలకొంది. పరవళ్లు తొక్కుతున్న పాకాల ధాన్యాగార ప్రాంతానికి ప్రధాన నీటి వనరు పాకాల. ఈ సరస్సు ఆగస్టు 15వ తేదీ నుంచి నేటి వరకు మత్తడి పోస్తోంది. సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.3 ఫీట్లు కాగా పూర్తిస్థాయిలో నిండుకొని 47 రోజులుగా మత్తడి పోస్తుంది. కురుస్తున్న వర్షాలతో సరస్సులో నిండుకుండలా ఉండటంతో మత్తడి పరవళ్లు కొనసాగుతోంది. -
ఉత్పాదకతకు ఊతం
జనగామ రూరల్: వ్యవసాయ ఉత్పాదకత పెంచి ఆర్థిక ఎదుగుదలకు కేంద్ర ప్రభుత్వం మరింత భరోసా కల్పించేందుకు ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకం ఉపయోగపడనుంది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యీకరణ, మెరుగైన నీటిపారుదల, రుణాల సులభతరం లక్ష్యంగా ఈ పథకం వ్యవసాయ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 100 జిల్లాలను గుర్తించగా ఇందులో తెలంగాణ నుంచి ఎంపికై న 4 జిల్లాల్లో జనగామ జిల్లాకు చోటు లభించింది. ఎంపికై న జిల్లాల్లో రూ.960 కోట్ల వార్షిక వ్యయంతో ఆరేళ్లపాటు ఈ పథకం అమలుకానుంది. వ్యవసాయ ఉత్పాదకత, పంటల మార్పిడి, నీటిపారుదల, నిల్వ, ఉత్పత్తుల విలువ పెంచే విధంగా ప్రాసెసింగ్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి చెందనుంది. పథకం అమలు విధానం జిల్లాల్లో ఉత్పాదకత, మౌలిక సదుపాయాలు రైతులు ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈపథకం అమలవుతోంది. 36 కేంద్ర, రాష్ట్ర పథకాల సమన్వయం చేస్తూ ఈ పథకం కింద 11 మంత్రిత్వ శాఖలు, విభాగాల కింద అమలుకానున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, మిషన్ ఆన్, ఆయిల్ పామ్, హార్టికల్చర్ మిషన్, కృషి యోజన ఉన్నాయి. జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర స్థాయి స్టీరింగ్ గ్రూపులు, జాతీయస్థాయి పర్యవేక్షణ సంస్థలతో ఈ పథకం మూడు అంచెల ద్వారా అమలవుతోంది. జిల్లా స్థాయిలో, కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ధన్ధాన్య కృషి సమితి ఏర్పాటు కానుంది. ప్రణాళికలు ఇలా.. జిల్లాస్థాయిలో బేస్ లైన్ సర్వే నిర్వహించి ఉత్పాదకత లోపాలు, నీటి వనరులు, మార్కెట్ మౌలిక సదుపాయాలు, కోల్ట్ స్టోరేజ్, రుణాల పరిస్థితి మొదలైన అంశాలను విశ్లేషణ చేసి వాటి ఆధారంగా 5 సంవత్సరాల ఫలితాల ఆధారిత కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, ప్రతి జిల్లాకు కేంద్ర నోడల్ అధికారులను నియమిస్తారు. పురోగతిని పర్యవేక్షించడం, స్థానిక బృందాలతో సమన్వయం చేసుకోనున్నారు. అన్ని కన్వర్జింగ్ పథకాల సమన్వయ అమలుకు మార్గనిర్దేశం చేస్తూ జిల్లా పురోగతిని కేంద్ర పర్యవేక్షణ పనితీరు సూచికలు ఉపయోగించి ట్రాక్ చేస్తూ పనితీరును అంచనా వేయడానికి, అంతరాలను గుర్తించి జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి నెలవారీగా సమీక్షిస్తారు. ఈ పథకం పంటల వ్యవసాయం మాత్రమే కాకుండా పండ్లు, మత్స్య సంపద, తేనెటీగల పెంపకం, పశుసంవర్ధకం, వ్యవసాయ అటవీ రంగాలపై దృష్టి పెడుతుంది. స్కేల్, టెక్నాలజీ, సంస్థాగత బలాన్ని పెంచడం ద్వారా ఈ పథకం గ్రామీణ ఉత్పాదకతలో విశేషమైన మార్పు తీసుకరానుంది. పథకం లక్ష్యాలు.. వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం సుస్థిర వ్యవసాయ పద్ధతులను విస్తరించడం పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంట కోత అనంతరం నిల్వ సదుపాయాలను బలోపేతం చేయడం మైక్రోఇరిగేషన్ వంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యవసాయ రుణాలను సులభతరం చేయడం.పీఎం ధన్ధాన్య కృషి యోజన పథకానికి జనగామ ఎంపిక పంటల వైవిధ్యీకరణ, స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం నీటిపారుదల, మౌలిక సదుపాయాల మెరుగు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు ప్రాధాన్యంసమగ్ర వ్యవసాయమే లక్ష్యం ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన పథకం కింద జనగామ జిల్లా ఎంపికై ంది. వ్యవసాయంలో అత్యంత నిరంతర నిర్మాణాత్మక సవాళ్లను పరిష్కరిస్తూ ఉత్పాదకతను పెంచడానికి, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించ డానికి, జీవనోపాధిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. – కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
బంగారం కొనుగోలు వినియోగదారులుప్రస్తుతం జనగామ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,100ల వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,12,300లు పలుకుతోంది. వెండి ధరలు కూడా అంతే వేగంగా పెరిగి కిలోకు రూ.1,50,000లకు చేరుకుంది. గడిచిన ఆరు నెలలతో పోలిస్తే ఇవి దాదాపు 40 శాతం మేర పెరిగినట్లుగా గణాంకాలు చెబుతు న్నాయి. 2024 దసరా సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.78 వేలు ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.72వేలు మాత్రమే పలికింది. వెండి కిలో రూ.94 వేల వరకు ధర పలుకగా, ఏడాదిలోపే 10 గ్రాముల బం గారం రూ.44వేలు, వెండి కిలో రూ.56 వేల వరకు పెరగడం గమనార్హం. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు.. -
నేటి రాత్రి 12గంటల వరకే మాంసం అమ్మకాలు
జనగామ: దసరా పండగ రోజు గాంధీ జయంతి రావడంతో ఈనెల 1న (బుధవారం) రాత్రి 12 గంటల వరకు జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాలు జరుగుతాయని ఆరె కటిక సంఘం జనగామ అధ్యక్షుడు కె.హరిప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నిబంధనల ప్రకారం మాంసం దుకాణాలు మూసి ఉంటాయన్నారు. గాంధీ జయంతి రోజు దసరా రావడంతో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మటన్ షాపు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దసరా పండుగకు ముందు రోజు అర్ధరాత్రి వరకు మాంసం విక్రయిస్తామన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలన్నారు. విద్యుత్ అధికారుల పొలంబాటఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ జనగామ: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న 2,083 లూజ్ లైన్లు, 191 వంగిన స్థంభాలు 2,131 మధ్య స్థంభాలను పునరుద్ధరించడం జరిగిందన్నారు. రైతులు విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైన సమయంలో టోల్ ఫ్రీ నెంబర్–1912కు కాల్ చేసి పరిష్కారం పొందవచ్చన్నారు. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఎస్టిమేట్కు సంబంధించిన మెటీరి యల్ వివరాలు, స్కెచ్లు ఇప్పుడు తెలుగులో అందజేస్తున్నామని, రైతులకు వచ్చే ఎస్ఎంహెచ్ లింక్ ద్వారా వీటిని తెలుసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చితే మోటార్ల జీవిత కాలం పెరుగుతు ందని, లో వోల్టేజి సమస్యలు తగ్గుతాయని స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయాలిపాలకుర్తి టౌన్: ఎన్నికల ప్రవర్తన నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను పక్కాగా అమలు చేయాలని జిల్లా సహకార అధికారి, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.కోదండరాములు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అన్నారు. కోడ్ను ఉల్లంగిస్తే చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో ఎంపీడీవో రవీందర్, ఏంఈఓ పోతుగంటి నర్సయ్య, ఎంపీవో వేణుమాధవ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పసునూరి నవీన్, మాచర్ల ఎల్లయ్య, సారయ్య, ఎడవెల్లి సోమయ్య, జీవై సోమయ్య, కత్తి సైదులు తదితరులు పాల్గొన్నారు. ఎంజీఎం: ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) జాతీయ ప్యానెల్లో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) నాయకులు ఘన విజయం సాధించారు. ఫైమా జాతీయ కో–చైర్మన్గా డాక్టర్ దుబ్యాల శ్రీనాథ్, జాతీయ కార్యదర్శిగా డాక్టర్ ఇస్సాక్ న్యూటన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి మద్దతు ఇచ్చిన సహచర వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిపాలకుర్తి టౌన్: పాలకుర్తి–నాంచారిమడూరు ప్రధాన రహదారిపై సిరిసన్నగూడెం శివారులోని కంబాలకుంట బస్స్టేజీ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని దర్థేపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకన్న(35) మోటర్ సైకిల్లో పెట్రోల్ పోయించుకునేందుకు మల్లంపల్లి శివారులోని పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి డీసీఎం వ్యాన్ బలంగా ఽఢీకొట్టింది. దీంతో మోటర్ సైకిల్తో పాటు కిందపడ్డ వెంకన్న తలకు తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెంకన్న భార్య పది రోజుల క్రితం ప్రసవించగా కుమారుడు జన్మించాడు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూలం పవన్కుమార్ తెలిపారు. -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలి
జనగామ రూరల్: ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని, అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల విధులు, బాధ్యతలు, నిబంధనలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు వారికి ఇచ్చిన హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా చదివి ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, నిర్వహణ ప్రక్రియలో ఏమైనా సందేహాలు, అపోహలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారిదేనని, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ సిబ్బంది నియామకం, వారికి పోలింగ్కు సంబంధించిన సామగ్రి సమకూర్చడం మొదలగు ప్రతి అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ..మ్యాన్ పవర్, బ్యాలట్, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, మాడల్ కోడ్ అఫ్ కండక్ట్, బ్యాలెట్ పేపర్ ముద్రణ తదితర ఎన్నికల నిర్వహణ బాధ్యతలను చేపట్టే నోడల్ అధికారులు తమ విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, డీప్యూటీ సీఈవో సరిత, ఎన్నికల నిర్వహణకు వివిధ అంశాలకు కేటాయించిన ఆర్వోలు, ఏఆర్వోలు, మాస్టర్ ట్రైనర్లు రామరాజ్, సురేందర్రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన ఉండాలి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
అవమానించిన చోటే..గౌరవం పొందాలని
● గ్రూప్–2లో కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగం సాధించిన శ్రావణిరఘునాథపల్లి: అవమానించబడ్డ చోటే గౌరవం పొందాలన్న కసి ఆమెను విజయతీరాలకు చేర్చింది. అంకిత భావంతో అహర్నిషలు చదివి అనుకున్నది సాధించింది రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన కౌంసాని శ్రావణి. ఆమెకు మూగ, వినికిడి సమస్యలు ఉండేవి. దీంతో అనేక అవమానాలకు గురైంది. వెక్కిరించిన వారి నోళ్లను మూయించాలంటే చదువే ఆయుధంగా భావించింది. తాజాగా టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూపు–2 ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించి కో ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉద్యోగం పొందింది. మొదట జేపీఎస్గా, ప్రస్తుతం జిల్లా కేంద్రంలో స్టాంప్ అండ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. జేపీఎస్గా పనిచేస్తున్న సమయంలో వినికిడి సమస్య కారణంగా అనేక ఇబ్బందులు పడింది. అహర్నిశలు శ్రమించి గ్రూప్–2 ఉద్యోగం సాధించింది. భర్త బాల్రెడ్డి ఎంతో అండగా నిలిచి ప్రోత్సహించారని శ్రావణి తెలిపింది. -
పూలసంబురం
అంబరాన్నంటినజిల్లావ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ ● మహిళలు, చిన్నారులతో కిక్కిరిసిపోయిన బతుకమ్మకుంట ప్రాంగణం ● ఆటాపాటలతో మురిసిన మహిళలు ● గౌరమ్మకు ఘనంగా వీడ్కోలుజనగామ: తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సద్దుల బతుకమ్మ పండుగ సంబురాలు సోమవారం అంబరాన్నంటాయి. తొమ్మిది రోజుల పాటు సంప్రదాయ రీతిలో సాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగిశాయి. జిల్లా కేంద్రంతో పాటు పాలకుర్తి, స్టేషన్న్ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల పరిధిలోని ప్రతీపల్లె పూలవనంలా మారింది. శ్రీఏమేమీ పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మశ్రీ అంటూ తాళాలతో పలికిన పాటలు గగనాన్ని తాకాయి. గ్రామాలన్నీ ఆట, పాటలతో మార్మోగిపోయాయి. చివరగా మహిళలు గౌరమ్మను గంగమ్మ ఒడికి చేరవేస్తూ వచ్చే ఏడాది మళ్లీ రావమ్మా అని ప్రార్థించారు. బతుకమ్మకుంటలో.. పట్టణంలోని బతుకమ్మకుంటలో జరిగిన సద్దుల వేడుకలకు 30 వార్డుల నుంచి మహిళలు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. బతుకమ్మకుంట విద్యుత్తు దీపాల అలంకరణ, రంగురంగుల హరివిల్లులతో దేదీప్యమానంగా వెలుగొందింది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పట్టణ నలుమూలల నుంచి పెద్ద బతుకమ్మలతో మహిళలు ఇక్కడకు చేరుకున్నారు. మహిళల పాటలు, వేలాది చప్పట్లతో బతుకమ్మకుంట భక్తి పారవశ్యంతో ఓలలాడింది. వాడవాడలా అలాగే పట్టణంలోని పాతబీటు బజారు, అంబేడ్కర్, ధర్మకంచ, బాలాజీ నగర్, శ్రీనగర్, తహసీల్ కార్యాలయం, రైల్వేస్టేషన్, జీఎంఆర్, శ్రీ విల్లాస్, హౌజింగ్ బోర్డు, జ్యోతినగర్ కాలనీలు, కుర్మవాడ, గోకుల్నగర్, హెడ్్ పోస్టాఫీసు, శ్రీ సాయిరెసిడెన్సి, చమన్ ఏరియా, గణేశ్ స్ట్రీట్, ధర్మకంచ, గుండ్లగడ్డ తదితర ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ ముగింపు సంబురాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ నిమజ్జనం.. సద్దుల వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న మహిళలు నిమజ్జనంతో బతుకమ్మకు వీడ్కోలు పలికారు. ‘ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం..’ అనుకుంటూ మహిళలు అందరూ ఒక చోట చేరి ప్రసాదం ఇచ్చి పుచ్చుకున్నారు. వేడుకల్లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు రంగు బాలలక్ష్మి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీమణి పల్లా నీలిమ, మునిసిపల్ మాజీ చైర్పర్సన్లు పోకల జమునలింగయ్య, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మహిళా మాజీ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. డీసీపీ ఆదేశాల మేరకు ఏఎస్పీ ఆద్వర్యంలో సీఐ సత్యనారాయణ రెడ్డి, ఆయా ప్రాంతాల ఏసీపీ, సీఐ, ఎస్సై, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, వేడుకలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిఘా వేశారు. -
పింఛన్లను తక్షణమే పెంచాలి
● ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్మాదిగస్టేషన్ఘన్పూర్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా సీఎం రేవంత్రెడ్డి దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతవులకు తక్షణమే పింఛన్లను పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనగామ జిల్లా ఇన్చార్జ బోడ సునీల్మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఘన్పూర్ డివిజన్కేంద్రంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్, ఎంఎస్పీ జిల్లాస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.. దివ్యాంగుల పెన్షన్ను రూ.4వేల నుంచి రూ.6వేలకు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ను రూ.2016 నుంచి రూ.4వేలకు పెంచుతానని ఎన్నికల సీఎం రేవంత్రెడ్డి చేసిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. లేనిపక్షంలో సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 6 నుంచి నవంబర్ 6వ తేదీవరకు నిర్వహించనున్న మహాదీక్షలను ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్, ఎంఎస్పీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బొట్ల మహేశ్, గాదె శ్రీధర్, గుర్రం నవీన్, గుర్రం అశోక్, సంపత్, సోమన్న, శ్రీను, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
కమిషనరేట్లో పోలీస్ అధికారుల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న డి.విశ్వేశ్వర్ గీసుకొండకు, గీసుకొండ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆకునూరి మహేందర్ పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ అ య్యారు. టాస్క్ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కె.వంశీకృష్ణ గీసుకొండ పోలీస్ స్టేషన్కు, సంగెంలో పని చేస్తున్న నరేశ్ను మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్కు, బి.రామారావు సుబేదారి నుంచి జఫర్గఢ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని నిరసన జనగామ రూరల్: తరిగొప్పుల మండలం అంకుశాపూర్ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీకి కేటాయించాలని గ్రామంలోని నాయకులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. 1957 నుంచి అన్ని కులాలకు రిజర్వేషన్ ఇచ్చారని కానీ ఎస్సీ కులానికి ఇప్పటివరకు సర్పంచ్ రిజర్వేషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ అభ్యర్థులకు రిజర్వేషన్ వచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో భిక్షపతి, నాగభూషణం కిరణ్కుమార్, పైసా ప్రేమ్కుమార్, జంజాల సంతోష్, మాచర్ల ప్రేమ్కుమార్, చిన్న మూర్తి, ప్రభుదాస్ పాల్గొన్నారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపిక జనగామ రూరల్: టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాల్లో పట్టణంలోని వికాస్ నగర్కు చెందిన గుండా అరుణాదేవి ఎంపిక అయ్యారు. గృహిణిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ఇంటి వద్ద ప్రణాళిక బద్ధంగా పోటీ పరీక్షకు సన్నద్ధమై విజయం సాధించారు. భర్త చంద్రశేఖర్ కృషి, పిల్లల ప్రోత్సాహం ఉందని ఆమె తెలిపారు. జఫర్గఢ్ నూతన ఎస్సైగా రామారావు జఫర్గఢ్: జఫర్గఢ్ నూతన ఎస్సైగా బి.రామారావును నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్గా సన్ ప్రీత్సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన ఎస్సై రామ్చరణ్ స్థానంలో సుబేదారి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రామారావును జఫర్గఢ్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. టీఏపీటీఏ జిల్లా అధ్యక్షుడిగా దిలీప్ కుమార్ పాలకుర్తి టౌన్: తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్(టీఏపీటీఏ) జిల్లా అధ్యక్షుడిగా మండల కేంద్రంలోని సుధా హైస్కూల్ ఉపాధ్యాయడు పోలాస దిలీప్కుమార్ను నియమిస్తు ఆసంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు చందర్లాల్ నాయక్ చౌహన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా దిలీప్కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కమీషన్ బకాయిలు వెంటనే చెల్లించాలి జనగామ రూరల్: జిల్లాలో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర రేషన్ డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మురళీధర్రావు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో ఏవో శ్రీకాంత్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా 330 రేషన్ షాపులు ఉన్నాయని, గత ఆరు నెలల కమీషన్ రాక డీలర్లు నానా ఇబ్బందులు పడ్తున్నారన్నారు. బకాయిలు విడుదల చేయకపోతే అక్టోబర్ నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఊటుకూరు సబ్బానీ శ్రీధర్, దేవసాని గాలయ్య, చెవ్వా శ్రీను, యాదగిరి, జయపాల్రెడ్డి, మల్లయ్య, దయాకర్, రామగల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
స్థానిక సంగ్రామం
జనగామ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత గ్రామపంచాయతీ ఎలక్షన్లను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈసీ ప్రకటనతో పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీ టెక్కింది. జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాలు ఉండగా, 12 జెడ్పీటీసీ స్థానాలు, 134 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొదటి విడత అక్టోబర్ 9, రెండో విడత 27న పోలింగ్ జరుగనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికార యంత్రాంగం ఎలక్షన్ నిర్వహణపై పూర్తి స్థాయి దృష్టి సారించింది. రెండు దశల్లో పోలింగ్.. జిల్లాలో ఎలక్షన్లు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లకు సంబంధించి వచ్చే నెల అక్టోబర్ 9వ తేదీన నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండగా, 23వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికలు 13న నామినేషన్లు, 27న పోలింగ్ జరుగనుంది. జిల్లాలోని 12 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 12 జెడ్పీటీసీలు, 134 మంది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పరిధిలో 294 పోలింగ్ లొకేషన్లు ఉండగా, 783 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొదటి దశలో 6 మండలాల పరిధిలో 70 ఎంపీటీసీలు, రెండో దశలో 6 మండలాల పరిధిలో 64 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎలక్షన్ అధికారులు, సిబ్బంది సిద్ధం.. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆర్వోలు, ఏఆర్వోలు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఏపీఓలు, ఓపీఓలకు బాధ్యతలు కేటాయించారు. పోలింగ్ సెంటర్లు సిద్ధం చేసి, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దసరా పండుగ–ఓటర్ల ప్రసన్నం.. దసరా పండుగ వాతావరణం ఈ ఎన్నికలకు ప్రత్యేక రుచిని తెచ్చింది. పండుగ వేళను దృష్టిలో ఉంచుకొని ఆశావాహులు ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతూనే... తమ వర్గాల మద్దతు బలపడేలా ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తున్నారు. కోడ్ అమలులోకి.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా స్థానిక సంస్థల ఎలక్షన్ నేపథ్యంలో జిల్లాలో కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ చేతన్ పండేరి నితిన్తో కలిసి కలెక్టరేట్ సమావేశం హాల్లో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయగా, వచ్చే నెల 9వ తేదీన నోటీసు జారీ చేస్తుందన్నారు. మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో 9వ తేదీ (చివరి తేదీ 11), రెండో విడతలో 13వ తేదీ (చివరి తేదీ15) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. మొదటి విడత అభ్యర్థుల ఫైనల్ జాబితా 15న, రెండో విడత 19న ప్రచురించడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో 23, రెండో విడత 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీలు, అభ్యర్థులు నియమావళిని పాటించాలన్నారు. జిల్లాలోని మునిసిపాలిటీల పరిధిలో ఎన్నికల కోడ్ ఉండదన్నారు. మోగిన ఎన్నికల నగారా రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లాలో రెండు విడతల్లోనే సర్పంచ్ ఎన్నికలు 12 జెడ్పీటీసీలు, 134 ఎంపీటీసీలు, 280 గ్రామపంచాయతీలు 4,01,496 మంది ఓటర్లురెండు విడతల్లోనే సర్పంచ్ ఎన్నికలు.. జిల్లాలో 280 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,534 వార్డులు, 30 వందశాతం ఎస్టీ జీపీలు ఉండగా, షెడ్యూల్డ్ ఏరియా జీపీలు 241 ఉన్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతుండగా, జిల్లాలో మాత్రం రెండో విడత నుంచి నుంచి ప్రారంభంకానున్నాయి. రెండో విడత నవంబర్ 4న, మూడో విడత 8వ తేదీన పోలింగ్ జరుగనుంది. రెండో విడతలో 7 మండలాల పరిధిలో (142 జీపీలు), మూడో విడతలో 5 మండలాల పరిధి(138 జీపీలు)లో పోలింగ్ జరుగనుంది. రెండో విడతలో జరిగే జీపీలు చిల్పూరు మండలం (17 జీపీలు, 168 వార్డులు), స్టేషన్ఘన్పూర్(15/46), జ ఫర్గడ్(21/94), రఘునాథపల్లి (36/320), లింగాలఘణపురం (21/196), నర్మెట(17/48), తరిగొప్పుల (15/126), మూడో విడతలో బచ్చన్నపేట (26/238), జనగామ(21/198), దేవరుప్పుల(32/274), పాలకుర్తి (38/33 6), కొడకండ్ల(21/190) జీపీల పరిధిలో ఎలక్షన్లు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. -
వలసవాదులం కాదు.. మూలవాసులం
నెహ్రూసెంటర్: లంబాడీలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలసవాదులుగా చిత్రీకరించేందుకు కొందరు పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని, మేము వలసవాదులం కాదు.. మూలవాసులమని గిరిజన నేతలు పేర్కొన్నారు. లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం లంబాడీల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడూ.. ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చుపెట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆదివాసీల భుజాలపై తుపాకీ పెట్టి లంబాడీలను కాల్చేలా పతకం వేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ, లంబాడీల హక్కుల కోసం కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. కొంత మంది జాతి కోసం పోరాటం చేస్తే ఫలాలు పొందుతున్నాం. లంబాడీలను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టేలా ఎవరు చేసినా.. కాలగర్భంలో కలిపేలా కలిసికట్టుగా ఉండాలి. రాజకీయ అవకాశాలు వస్తే ఒక్కతాటిపై ఉండి జాతి కోసం నిలబడాలని, ఈ ఉద్యమంలో మీతో ఉంటానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మాట్లాడుతూ.. జాతి కోసం జరుగుతున్న పోరాటంలో లంబాడీ ప్రజాప్రతినిధులు కలిసి రావాలన్నారు. రిజర్వేషన్ల కోసం, తండాలను గ్రామ పంచాయతీల కోసం పోరాటాలు చేసి సాధించుకున్నాం. పాలకులు రెచ్చగొట్టి కలిసి ఉన్న ఆదివాసీ, లంబాడీల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారన్నారు. జాతికోసం అందరూ ఐక్యమవుదాం, పార్టీలకు అతీతంగా కలిసివచ్చి రాజ్యాధికార సాధనలో ముందుండాలన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వాలపై పోరాడి హక్కులు సాధించుకోవాలే తప్ప లంబాడీలను రాజకీయం కోసం వాడుకోవాలని చూస్తే వారిని రాజకీయ భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. సేవాలాల్సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్నాయక్ మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కనబెట్టి జాతి మనుగడ సాధించేలా, రాజ్యాధికారం కోసం లంబాడీలంతా ఏకం కావాలన్నారు. హక్కులు, చట్టాలు సాధించుకునేలా పోరాటాలు సాగించాలని, రిజర్వేషన్ కాపాడుకునేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఎస్టీ జా బితా నుంచి తప్పించే కుట్రలను తిప్పికొట్టేలా ప్రతి ఒక్కరూ పోరాటాల్లో కలిసి రావాలని పిలుపుని చ్చా రు. జేఏసీ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్, వైస్ చైర్మన్ గుగులోత్ కిషన్నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో దారావత్ వెంకన్ననాయక్, బోడ లక్ష్మణ్నాయక్, గుగులోత్ భీమానాయక్, బోడ రమేష్నాయక్, డాక్టర్ రాజ్కుమార్జాదవ్, హఠ్యానాయక్, డాక్టర్ వివేక్, హరినాయక్, మంగీలాల్, గుగులోత్ రవి, చందులాల్, సిద్దునాయక్, కర్నావత్ వెంకన్న, మాలోత్ రవీందర్, లింగ్యానాయక్ ఉన్నారు. లంబాడీలు ఐకమత్యంతో రాజ్యాధికారం సాధించాలి ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు లంబాడీల ఆత్మగౌరవ సభలో నేతలు -
ఎస్సీ మహిళకు జెడ్పీ పీఠం
జనగామ: జిల్లా జెడ్పీ పీఠం ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో జిల్లా రాజకీయాల్లో కసరత్తుల ఎంపిక ఉత్కంఠ కలిగిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండు పార్టీలు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు కావడంతో సర్వత్రా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. జెడ్పీ రిజర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయించడంతో జిల్లా రాజకీయాలు పరిషత్ చుట్టూనే తిరగడంతో పాటు రాజకీయ సమీకరణాలు సైతం మారిపోయాయి. జిల్లాలో జెడ్పీ పీఠం కోసం అధికార కాంగ్రెస్ ఇప్పటికే వ్యూహరచన మొదలు పెట్టింది. స్టేషన్ఘన్పూర్ కాంగ్రెస్ ఇన్చార్జ్ సింగపురం ఇందిర లింగాలఘణపురం నుంచి జెడ్పీటీసీ బరిలో దిగుతారనే ప్రచారం వినిపిస్తోంది. జిల్లాలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే చివరకు ఇందిరనే జెడ్పీ చైర్మన్ పదవిని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఆ పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా తమకు బలమైన అభ్యర్థిని నిలబెట్టి పీఠాన్ని దక్కించుకునేందుకు అంతకన్నా రెట్టింపు కసరత్తులు చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనగామ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ రాజమౌళి, గనిపాక మహేందర్, బక్క శ్రీనివాస్ పేర్లు వినిపిస్తుండగా, బీఆర్ఎస్ నుంచి పగిడిపాటి సుధసుగుణాకర్రాజు, కొమ్ము రాజు, మరో ఇద్దరు బరిలో నిలిచేందుకు ముందుకొస్తున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. చిల్పూరు, లింగాలఘణపురం మండలాలలో కాంగ్రెస్ నుంచి ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ సింగపురం ఇందిర, గడ్డమీది సురేశ్, పాశం సురేశ్, బీఆర్ఎస్ నుంచి ఎడ్ల మహిపాల్, ఉడుగుల భాగ్యమ్మ టికెట్ రేసులో ఉన్నట్లు సమాచారం. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలై రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగితే, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు పండగ తర్వాత తమ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. రిజర్వేషన్లు ఖరారు కావడం, వీటిపై పలువురు కోర్టుకు వెళ్లడంతో రెండు పార్టీల్లో రాజకీయ వేడి పెంచుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో తొలిసారి జెడ్పీ చైర్మన్గా దివంగత పాగాల సంపత్రెడ్డి (జనరల్ కేటగిరీ) బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి జరగనున్న ఈ ఎన్నికల్లో ఎస్సీ మహిళకు పీఠం రిజర్వ్ కావడంతో దళిత మహిళా చైర్మన్ పదవిని ఎవరు వరిస్తారనే చర్చ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. రాబోయే రోజుల్లో పార్టీల అభ్యర్థుల ఎంపికలు, కూటములపై ఆధారపడి జిల్లాలో రాజకీయ సమీకరణలు ఎలా మారతాయనేది ఆసక్తిరేపుతోంది. బీజేపీ సైతం బలమైన జెడ్పీటీసీ అభ్యర్థులను బరిలో దింపేందుకు పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. సీపీఎం, సీపీఐ పార్టీలు తమ ఉనికిని చాటుకునేందుకు పక్కా ప్రణాళికలను వేస్తుండగా, స్వతంత్రులు రాజకీయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు పన్నుతుండగా..వారి కదలికలను అధికార, ప్రధాన ప్రతిపక్షం ఎప్పటికప్పుడు పసిగడుతున్నట్లు వినికిడి. చిల్పూరు, జనగామ మండలాలు ఎస్సీ జనరల్, లింగాలఘణపురం ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. మూడు మండలాల నుంచి దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళలు జెడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మూడు మండలాల పకిధిలో జెడ్పీటీసీ టికెట్ పొందిన అభ్యర్థులు జడ్పీ చైర్మన్ రేసులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో రెండు పార్టీల్లోనూ టికెట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. కాగా బచ్చన్నపేట మండలం జనరల్ కేటగిరీ, కొడకండ్ల మండలం జనరల్ మహిళ కేటగిరీగా రిజర్వ్ కావడంతో అక్కడ సైతం దళిత వర్గానికి చెందిన పలువురు నాయకులు కన్నేసినట్లు సమాచారం. అందరి చూపు ఆ మూడు మండలాల వైపు.. కాంగ్రెస్, బీఆర్ఎస్లో అభ్యర్థి ఎంపికపై కసరత్తు తెరపైకి ఆశావహులు -
సీటీఓగా శివశంకర వరప్రసాద్
జనగామ: గ్రూప్–1 ఫలితాల్లో జనగామ పట్టణానికి చెందిన తగరపు నర్సింహులు, పద్మ దంపతుల మూడో కుమారుడు తగరపు శివశంకర వరప్రసాద్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (సీటీఓ)ఎంపికయ్యారు. పట్టణంలోని సెయింట్పాల్స్ హైస్కూల్లో ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తి చేసిన వరప్రసాద్, ఏబీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీఈ చేశారు. మొదటి ప్రయత్నంలోనే నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో రాష్ట్రంలో 330వ ర్యాంకు సాధించారు. వరప్రసాద్ను తల్లిదండ్రులు, పట్టణప్రజలు అభినందించారు. -
పండగ జరుపుకునేదెలా?
జనగామ: నాలుగు నెలలుగా వేతనాలు లేక పస్తులు పడుతున్న జనగామ చంపక్హిల్స్ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ఆల సర్వీసెస్ కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సద్దులు, దసరా పండగ సందర్భంగా చేతిలో చిల్లిగవ్వ లేక సంబురాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెల కొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం కార్మికులు ఎంసీహెచ్ ఎదుట తమ ఆవేదన వెలిబుచ్చారు. పండగ సమయంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా, కుటుంబాలతో కలిసి ఆనందంగా గడిపేందుకు వేతనాలు విడుదల చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్, కలెక్టర్ దృష్టికి సైతం తీసుకువెళ్లామ న్నారు. 80 మంది కార్మికులకు సంబంధించి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంసీహెచ్ ఎదుట కార్మికుల ఆవేదన -
విశ్రాంత ఉద్యోగుల సంఘం ఎన్నిక
జనగామ: జనగామ యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఎన్.మహేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో మాజీ జిల్లా అధ్యక్షుడు రామన్న, మాజీ రాష్ట్ర బాధ్యులు వి.యాదవరెడ్డి, సీనియర్ సభ్యులు టి.మల్లికార్జున్, బి.శంకరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జనగామ యూనిట్ నూతన అధ్యక్షుడిగా కసిరెడ్డి మహబూబ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగదీశ్వరాచారి, ఆర్థ్కి కార్యదర్శి హుస్సేన్ రియాజుల్లా, అసోసియేట్ అధ్యక్షుడు వి.విజయ్కుమార్, ఉపాధ్యక్షుడు అజం అలీ, మహిళా ఉపాధ్యక్షురాలు జి.ఉమాదేవి, సంయుక్త కార్యద్శి టి.జ్ఞానేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.లక్ష్మణ్, ప్రచార కార్యదర్శి బి.కృష్ణమూర్తి, జిల్లా కౌన్సిలర్లు జి.రమాదేవి, ఎం.నిరంజన్రెడ్డి, వి.విమలాదేవి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చాడ వెంకట్రెడ్డి, సీహెచ్ రవీందర్రెడ్డి, కె.బాలయ్య, సీతారామారావు, రాజయ్య, సిద్దిమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు భరోసా కల్పించాలి
వరంగల్ క్రైం: పదోన్నతులతో బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన ఎం.సాంబరెడ్డి, పి.జైపాల్, పి.లక్ష్మారెడ్డి, డి.వెంకటేశ్వర్లు, ఎం.సాంబయ్య, కె.వెంకన్న, డి.సమ్మిరెడ్డి, ఎం.లక్ష్మీనారాయణ, పి.శ్రీనివాస్ రాజు, ఎస్.సదయ్య ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను అలంకరించి అభినందనలు తెలిపారు. అనంతరం సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసులు భరోసా, నమ్మకాన్ని కలిగించాలన్నారు.జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్కు ఎంపికజనగామ రూరల్: ఈనెల 25 నుంచి 27తేదీ వరకు హైదరాబాద్లో జరిగిన 69వ ఎస్జీఎఫ్ టోర్నమెంట్ చాంపియన్షిప్ పోటీల్లో పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకులం విద్యార్థి పర్వతం విక్రమ్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్కు ఎంపిక అయ్యాడని కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ నర్సింహులుగౌడ్ అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి విక్రమ్ను కోచ్ లింగ్యానాయక్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎ.కిషన్, పీఈటీ వేణు, అధ్యాపకుడు వేణుమాధవ్ అభినందించారు. వచ్చే నెల 5నుంచి 8వ తేదీ వరకు జమ్మూకశ్మీర్లో జాతీయస్థాయి ఫుట్బాల్ క్రీడల్లో విక్రమ్ పాల్గొననున్నాడు. భగత్సింగ్ స్ఫూర్తితో పోరాటాలుజనగామ రూరల్: భగత్సింగ్ స్ఫూర్తితో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం యువత పోరాటాలకు సిద్ధం కావాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.తిరుపతి పిలుపునిచ్చారు. అదివారం జిల్లా అధ్యక్షుడు ధర్మబిక్షం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. అహర్నిశలు కష్టపడి చదువుకున్న చదువుకు ఉపాధి దొరకక యువత చెడు మార్గాలకు, వ్యసనాలకు బానిసలు అవుతున్నారన్నారు. దేశంలో కులమత ప్రాంత రాజకీయాలు పెరిగిపోయాయని, అందుకే స్వచ్ఛమైన రాజకీయాల కోసం ఉద్యమించాలన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా బానోత్ ధర్మబిక్షం, కార్యదర్శిగా బొడ నరేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పంతం సాయిప్రసాద్, ఉపాధ్యక్షులుగా నిరేటి సంపత్, చింతకింది అజయ్, సహాయ కార్యదర్శిగా పోత్కునురి కనకచారి తదితరులు ఎన్నికయ్యారు. -
గ్రూప్–2లో సత్తాచాటారు..
గ్రూప్–2 ఫలితాల్లో జిల్లా అభ్యర్థులు సత్తాచాటారు. ఆదివారం టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో పలువురు కొలువులు సాధించారు. సామాన్య కుటుంబాలకు చెందిన అభ్యర్థులు అహర్నిశలు కష్టపడి, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరడంపై అభినందనలు వెల్లువెత్తాయి. పాలకుర్తి టౌన్: మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన కూటికంటి శివ డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో 25వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం శివ మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విజయం తన తల్లిదండ్రుల కుటికంటి లక్ష్మీ, వెంకన్న ప్రోత్సాహం వల్లే లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జనగామ: మండలంలోని బానాజీపేట గ్రామానికి చెందిన ఆకుల నాగరాజు, కొలుపుల మదన్మోహన్ గ్రూపు –2లో సత్తా చాటారు. ఆకుల నాగరాజు బచ్చన్నపేట మండల ఏఎస్ఓగా విధులు నిర్వహిస్తూ గ్రూపు–2లో అసిస్టెంట్ ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. కొలుపుల మదన్మోహన్ మొదటి ప్రయత్నంలోనే గ్రూపు–2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ)గా ఎంపికయ్యారు. గ్రామం నుంచి ఇద్దరు గ్రూపు–2లో ఉద్యోగాలు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు,మదన్ మోహన్ఎకై ్సజ్ ఎస్ఐగా సివిల్ సప్లై ఉద్యోగి.. జనగామ రూరల్: మండలంలోని సిద్దెంకి గ్రా మానికి చెందిన సుంకరి శ్రీనివాస్రెడ్డి, నిర్మల కు మారుడు సుంకరి కేదా రేశ్వర్రెడ్డి ఆదివారం విడుదల చేసిన గ్రూప్– 2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్ఐగా ఉద్యోగం సాధించారు. గతంలో గ్రూప్–4లో సివిల్ సప్లైలో ఉద్యోగం సాధించి విధులు నిర్వహిస్తున్నారు. అలాగే గ్రూప్–3లో స్టేట్ 10వ ర్యాంక్ సాధించారు.సింగరేణి ఉద్యోగి.. బీసీ వెల్ఫేర్ అధికారిగా జనగామ: మండలంలోని వడ్లకొండకు చెందిన పన్నీరు లక్ష్మణ్ కుమారుడు అమర్నాథ్ బీసీ వెల్ఫేర్ అధికారిగా ఉద్యోగం సంపాదించారు. గ్రూప్–4లో ఉద్యోగం సంపాదించి సింగరేణిలో పనిచేస్తున్న అమరనాథ్, కష్టపడి చదువుకుని గ్రూప్–2 ఉద్యోగం సాధించారు. పేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు కొడుకుపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడని అమర్నాథ్ను గ్రామస్థులతో పాటు స్నేహితులు అభినందించారు.ఏఆర్ ఎస్సై నుంచి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా జనగామ: రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పుల్ల రవి–పద్మ దంపతుల చిన్న కుమారుడు పుల్ల సాయిచరణ్గౌడ్ గ్రూపు–2లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో ఎస్సై (ఏఆర్)గా విధులు నిర్వహిస్తూ గ్రూపు–2లో ఫలితాల్లో స్టేట్ 92 ర్యాంక్ సాఽధించి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (గెజిటెడ్) ఉద్యోగం సాధించారు. ఆయన సోదరుడు సాయికిరణ్ సైతం మంచిర్యాల బెటాలియన్లో ఎస్సైగా విధులు నిర్వహించడం విశేషం. తన సోదరుడు, తల్లిదండ్రులు, భార్య అక్షిత ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడినట్లు సాయి చరణ్గౌడ్ తెలిపారు. -
కొత్త సమీకరణాలు
జనగామ: జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశం హాల్లో ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్, జనగామ, స్టేషన్ఘన్పూర్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పూర్తి చేశారు. రిజర్వేషన్లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడడంతో ఆశావహుల్లో సంతోషం వెల్లివిరియగా, చాన్స్ మిస్సైన వారు మాత్రం నిరుత్సాహంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా వార్డుల రిజర్వేషన్లను జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. లాటరీ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఊహించని పరిణామం ఎన్నో ఏళ్లుగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ పదవులకు ఎదురుచూస్తున్న ఆశావహులకు రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో తీవ్ర నిరాశ నెలకొంది. కొన్ని చోట్ల రిజర్వేషన్లు మహిళలకు కేటాయించడంతో పురుష అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. సర్పంచ్ పదవి వస్తుందని గత రెండు, మూడేళ్లుగా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి, రిజర్వేషన్ల రూపంలో అవకాశం కోల్పోవడంతో, కలిసొచ్చే వాటికి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో రాజకీయ పటాన్ని మలుపు తిప్పనున్నాయి. రిజర్వేషన్లు కలిసొచ్చిన ఆశావహులు జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ బరిలో అడుగేస్తున్నారు. తమ తమ ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల ఆశీస్సులతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పల్లెల్లో ఎన్నికల జోష్ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెలు, పట్టణాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. పల్లెల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపైనే చర్చించుకుంటున్నారు. పోటీలోకి దిగబోయే నాయకులు టికెట్ కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడమే కాకుండా, కేడర్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఆయా రాజకీయ పార్టీల్లో వర్గపోరు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సామాన్య ఓటర్లు కూడా రాబోయే ఎన్నికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గెలుపే లక్ష్యంగా.. స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రాబల్యం ఉన్న గ్రామాలు, మండలాల్లో తమ బలమైన అభ్యర్థులను సిద్ధం చేస్తుండగా, బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో తన ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నంలో ఉంది. గ్రామ స్థాయిలో మంచి పేరు, పలుకుబడి ఉన్న ముఖాలను, యువతను రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నాయి. వామపక్షాలు సైతం గతంలో సహకరించిన పార్టీలను కలుపుకుని అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వ్యూహం చేస్తున్నట్లు సమాచారం. సవాల్ విసురుతోన్న స్వతంత్రులు స్థానికంలో స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ అభ్యర్థులకే పోటీగా నిలిచి తమ స్థానిక ప్రభావాన్ని చూపించాలనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ప్రభావం, సామాజిక వర్గ సమీకరణాలను నమ్ముకుని గెలుపు దిశగా దూసుకెళ్లాలని స్వతంత్రులు ప్లాన్ చేస్తున్నారు. ప్రధాన పార్టీల్లో టికెట్ రాని వారు సైతం ఇండిపెండెంట్గా బరిలో నిలిచేందుకు ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో అభ్యర్థుల ఎంపిక, కూటముల ప్రయత్నాలు, అంతర్గత అసంతృప్తులు ఎలా పరిణమిస్తాయన్నదే ఎన్నికల ఫలితాలను నిర్ణయించనుంది. రిజర్వేషన్ల ప్రకటన రాజ్యాంగ విరుద్ధం ఓటు బ్యాంకు కోసం 2024 సంవత్సరం కులగణన ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించ డం రాజ్యాంగ విరుద్ధం. ఈసారి ఎస్సీ, ఎస్టీలను రాజకీయంగా సమాధి చేసే ప్రయత్నం చేశారు. రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయం కోసం కొట్లాడుతాం. – బానోతు రాంకోటి, బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడుహీటెక్కుతున్న రాజకీయాలు జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్ల అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా విడుదలైన రిజర్వేషన్ జాబితాలో ఊహించని మార్పులు చోటుచేసుకోవడంతో రాజకీయ నేతలు మాత్రమే కాకుండా గ్రామ స్థాయిలో ప్రజలంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లతో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ జనాభా కలిగిన జీపీల్లో జనరల్ రిజర్వేషన్ చేయడం సిగ్గుచేటన్నారు. ‘స్థానిక’ రిజర్వేషన్లపై ఊహించని మార్పులు ఆశావహుల ఆశలను నీరు గార్చిన రిజర్వేషన్లు గ్రామాల్లో ఎన్నికల జోష్ పట్టుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు సవాల్ విసురుతోన్న స్వతంత్రులు -
అన్నదాతలకు అండగా ఉంటాం
డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం మండలకేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని తక్కువ వర్షపాతం నమోదు కావడంతో చెరువులు కుంటలు నిండలేదన్నారు. ప్రస్తుతం గోదావరి జలాలతో అన్ని చెరువులను నింపుతున్నామన్నారు. త్వరలో జరగబోవు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగిటి విద్యానాథ్, మసూద్, హరిబాబు, పిన్నింటి కావ్యశ్రీ, నారాయణరెడ్డి, శ్రీనివాస్, స్వామి, రాములు, కృష్ణ, రమేష్, ఆగయ్య, పలువురు పాల్గొన్నారు. వ్యాపారులు భద్రత ప్రమాణాలు పాటించాలి జనగామ రూరల్: వ్యాపారులు ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ప్రధానమంత్రి లోక్ కల్యాణ్ మేళ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పట్టణ ఆహార పదార్థాలను విక్రయించే వీధి విక్రయదారుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ, నిల్వ, రవాణా, విక్రయ ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ శైలజ, జిల్లా కోఆర్డినేటర్ రమేష్ నాయక్, పట్టణ కోఆర్డినేటర్ వాణిశ్రీ, ఆర్గనైజర్లు తిరుమల, షాహిన్, డేటా ఆపరేటర్ రేణుక, వ్యాపారులు పాల్గొన్నారు. అక్టోబర్ 2న మాంసం అమ్మకాలు నిషేధం జనగామ: అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని జనగామ పట్టణంలో మాంసం (మటన్, చికెన్) విక్రయాలను నిషేధించినట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి తెలిపారు. శనివారం కమిషనర్ మాట్లాడుతూ 2వ తేదీన జీవహింస చేయరాదని, చికెన్, మటన్ దుకాణాలను మూసి వేయాలన్నారు. తమ ఆదేశాలను దిక్కరించి అమ్మకాలు చేస్తే 2019 యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముగిసిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలు జనగామ: జిల్లా కేంద్రం సోషల్ వెల్ఫేర్ గురుకులంలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ 69వ అండర్ 19 ఫుట్బాల్ టోర్నమెంట్ చాంపియన్ షిప్ పోటీలు శనివారంతో ముగిశాయి. రాష్ట్రంలోని ఆయా జిల్లా నుంచి వచ్చిన టీంలు హోరా హోరీగా తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ (ప్రథమ), మహబూబ్నగర్ (ద్వితీయ), వరంగల్(తృతీయ) స్థానంలో నిలిచి సత్తా చాటుకున్నాయి. వచ్చే నెల 5 నుంచి 10వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్లో జరిగే జాతీయ స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని నిర్వాహకులు అజ్మీరా కిషన్ నాయక్ తెలిపారు. గురుకులం ప్రిన్సిపాల్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో కోచ్, నిర్వాహకులు, సహాయకులు మనోజ్ కుమార్, ఏ.కిషన్ తదితరులు ఉన్నారు. తెలంగాణ వసతి గృహ అధికారుల ఫోరం ఎన్నికజనగామ: తెలంగాణ వసతి గృహ అధికారుల ఫోరం ఎన్నికలు శనివారం టీఎన్జీవోస్ కార్యాలయంలో జిల్లా జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ యూ నియన్ అధ్యక్షుడు ఖాజా షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫోరం అధ్యక్షుడిగా చింత రాంనర్సయ్య, కార్యదర్శిగా మల్లు, కోశాధికారిగా ఎండీ మొయిన్, అసోసియేట్ ప్రెసిడెంట్గా దే వేందర్, ఉపాధ్యక్షులుగా యాకయ్య, అనిల్, తి రుమల, జాయింట్ సెక్రటరీలుగా సృజన, అని త, నిర్మల, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మహేందర్, పబ్లిసిటీ సెక్రటరీగా వెంకటేష్తోపాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
పోరాట యోధుడు లక్ష్మణ్ బాపూజీ
● ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్జనగామ రూరల్: తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని వదిలేసి తొలి పోరాటయోధుడిగా గుర్తింపు పొందిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్ షాలోమ్తో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనటమే కాకుండా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడని, కులవృత్తులను ప్రోత్సహించారని వారి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, పోపా జిల్లా అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఏలే జనార్దన్, కార్యదర్శి బత్తిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మదాసు ఎల్లయ్య, డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి, నాయకులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని శుక్రవారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డీపీఓ సూపరింటెండెంట్ వసంతకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి నారోజు రామచంద్రం, జిల్లా కోశాధికారి బస్వ రామచంద్రం మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సిబ్బందికి 3 నెలల బకాయి వేతనాలు చెల్లించాలన్నారు. తక్షణమే చెల్లించకుంటే పండగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా గ్రామగ్రామాన ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. జీవో నెం.51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు పి.వెంకటేశ్వర్లు ఎస్.కర్ణాకర్, పి.మల్లేశ్, బి.బాల నరసయ్య, కళమ్మ ,సైదమ్మ, రమ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికుల ధర్నా -
సౌత్జోన్ అథ్లెటిక్స్లో ఏబీవీ విద్యార్థికి రజతం
జనగామ రూరల్: గుంటూరు జిల్లాలోని నా గార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించిన 36వ సౌత్ జోన్ అథ్లెటిక్స్లో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)కు చెందిన బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న జి.సునీల్కుమార్ 18 ఏళ్ల షాట్పుట్ వి భాగంలో రజత పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ టి.కళ్యాణి, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది సునీల్ను ఘనంగా సన్మానించారు. మద్యం దుకాణాల టెండర్లు ప్రారంభంజనగామ: జిల్లాలో 2025–27 నూతన మద్యం పాలసీ నిబంధనల మేరకు దుకాణాల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి అనిత తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 50 మద్యం దుకాణాలకు టెండర్లకు పిలవడం జరుగుతుందన్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామన్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షలు చలాన్ రూపంలో చెల్లించాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు జిల్లా ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అక్టోబర్ 23వ తేదీన ఉదయం 11 గంటలకు మద్యం దుకాణాల కేటాయింపుల కోసం లాటరీ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందన్నారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు–ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ కంజర్ల వసుంధర జనగామ రూరల్: సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ కంజర్ల వసుంధర అన్నారు. శుక్రవారం ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృష్ణఆదిత్య ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని ధర్మకంచలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ నాముని పావనికుమారి అధ్యక్షతన మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళాశాలల అభివృద్ధికి కమిషనర్ నిధులు మంజూరు చేశారని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ ఝెలా శ్రీకాంత్రెడ్డి. స్పోర్ట్స్ ఇన్చార్జ్ మరిపెల్ల రవిప్రసాద్, వేముల శేఖర్, మహమ్మద్ అఫ్జల్, డాక్టర్ వస్కుల శ్రీనివాస్, రజిత తదితరులు పాల్గొన్నారు. పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలిజనగామ: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పత్తిపంట సాగులో సస్యరక్షణ చర్యలు చేపట్టి కాపాడుకోవాలని భువనగిరి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.అనిల్ కుమార్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ డి.శ్రీలత సూచించారు. శుక్రవారం జనగామలో వారు మాట్లాడుతూ.. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా భూమిలో తేమ అధికమై, పంటలో పూత, కాయలు రాలడం కనిపిస్తున్నట్లు గుర్తించామన్నారు. వర్షాలు ఆగిన వెంటనే పై పాటుగా ఎకరానికి 2 కిలోల 13–0–45తో పాటు 400 గ్రాముల సూక్ష్మ పోషకాల మిశ్రమం కలిపి పిచికారీ చేయాలన్నారు. అధిక తేమతో కాయకుళ్లు తెగులు వ్యాపించే అవకాశం ఉందని, దీని నివారణకు ఎకరానికి 600 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ను 20 గ్రాముల ప్లాంటామైసిన్తో కలిపి పిచికారీ చేస్తే సరిపోతుందన్నారు. ఉధృతిని బట్టి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు ఇలా చేస్తే నష్టం ఉండదన్నారు. ఆకులపై గోధుమ మచ్చల నివారణ కోసం ఎకరానికి 200 మి.లీ. ప్రోపికొనజోల్ పిచికారీ చేసుకోవాలన్నా రు. ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేస్తే సరిపోతుందన్నారు. -
నేడు ఏడొద్దుల బతుకమ్మ
దేవరుప్పుల: ఊరుకు అరిష్టం రావడంతో పెద్దమడూరు, ధర్మగడ్డలో సద్దుల బతుకమ్మ కాస్త ఏడొద్దుల బతుకమ్మగా మారింది. నిజాం కాలం కంటే ముందు ఈ రెండు గ్రామాలు నల్లగొండ జిల్లాలో ఉండేవి. సద్దుల బతుకమ్మ రోజు పలు వాడల్లో నిప్పంటుకొని నివాసిత గుడిసెలు కాలిపోయాయి. దీంతో ఊరుకు అరిష్టమని మరుసటి ఏడాది నుంచి ఏడో రోజే సద్దుల బతుకమ్మను ఆడి నిమజ్జనం చేసేలా నిర్ణయించారు. అప్పటి నుంచి ఇదే ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడి కోడళ్లు, ఇంటి ఆడబిడ్డలు కలిసి ఆడడం, 9వ రోజు తిరిగి ఇక్కడి కోడళ్లు పుట్టినిల్లు, ఇక్కడి కూతుర్లు మెట్టినింట్లోకి వెళ్లి అక్కడ సద్దుల బతుకమ్మ ఆడే అరుదైన అవకాశం లభిస్తోంది. ఎడొద్దుల బతుకమ్మ వేడుకలకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ధర్మగడ్డ, పెద్దమడూరులో ముందే సద్దులు -
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి..
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి వివిధ కుల సంఘాల నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహారావు, సహాయ బీసీ సంక్షేమాధికారి బి.రవీందర్, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మదార్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షుడు ఎదునూరి నరేశ్, డాక్టర్ కల్నల్ భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ శివరాజ్ యాదవ్, దిశ సభ్యులు శ్రీనివాస్, ఆర్టీఏ సభ్యులు అభి గౌడ్ , రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ఉపేందర్, లింగాలగణపురం మండల రజక సంఘం అధ్యక్షుడు రాజు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల బాలరాజు, గీత కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు వెంకటమల్లయ్య పాల్గొన్నారు. -
ఊరెళ్తే చెప్పండి!
జనగామ: సద్దుల బతుకమ్మ, దసరా పండగ సమయంలో ఊరెళ్లే సమయంలో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నిఘా ఉంటుందని వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. పండగ సమయంలో ప్రజలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజల ప్రశ్నలకు డీసీపీ సమాధానం ఇచ్చారు. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచిదన్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరించిన సమయంలో 100కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. సైబర్లో మోసపోయిన సమయంలో గంట లోపు (గోల్డెన్ అవర్) 1930కి ఫోన్ చేస్తే, మొత్తానికి మొత్తం డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన వాటిపై నిత్యం ఫోకస్ ఉంటుందన్నారు. పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పోలీసు శాఖ శక్తి వంచన లేకుండా పని చేస్తోందన్నారు. 33 మందికి డీసీపీ సమాధానం చెప్పగా, మరో 60 వరకు మిస్డ్కాల్స్ వచ్చాయి. ప్రశ్న: పండగల వేళ గస్తీ పెంచుతున్నారా..బెల్ట్ షాపులపై చర్యలు తీసుకుంటున్నారా..? – నారోజు రామేశ్వరాచారి, జనగామ, వడ్డెపల్లి యాకంరెడ్డి, బచ్చన్నపేట, యాకస్వామి, రామవరం,కొడకండ్ల, కాట సుధాకర్, జఫర్గడ్, పులి ధనుంజయ్గౌడ్, ఉప్పుగల్, జఫర్గడ్, డీసీపీ: సద్దులు, దసరా పండగ సమయంలో బతుకమ్మకుంట వద్ద నిఘా పకడ్బందీగా ఉంటుంది. ఊరికి వెళ్లే సమయంలో విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచిది. గ్రామాల్లో పోలీసు గస్తీ పెంచుతాం. ఈవ్టీజర్లకు కౌన్సిలింగ్ ఇస్తాం. బెల్ట్ దుకాణాల నిర్వహణపై ఎకై ్సజ్ శాఖకు సమాచారం ఇస్తాం. ప్రశ్న: నవరాత్రుల పేరిట లక్కీ డ్రాతో మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారా..? – రేపాల అశోక్, పాలకుర్తి డీసీపీ: లక్కీ డ్రా పేరిట మోసం చేసే వారిపై ఆరా తీస్తాం. ఈ విషయమై చర్యల కోసం ఎస్సైకి చెబుతాం. ప్రశ్న: నెహ్రూపార్కు వద్ద వేగ నియంత్రణ, సిగ్నల్ ఏర్పాటు చేయాలి, ట్రిపుల్, ర్యాష్ డ్రైవింగ్ న్రియంత్రించాలి..మైనర్ల డ్రైవింగ్పై కుల సంఘాలతో సమావేశం పెడుతారా..? – గట్టు అమర్నాథ్, ఎల్ఐసీ అధికారి, ఎండీ రియాజ్, జనగామ, రవీంద్రచారి, పోచన్నపేట, బచ్చన్నపేట, జంగిటి సిద్దులు, బచ్చన్నపేట, రాపెల్లి వెంకటేశ్, ఎన్జీవో, బచ్చన్నపేటడీసీపీ: నెహ్రూపార్కు వద్ద ప్రస్తుతం ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ట్రిపుల్, ర్యాష్ డ్రైవింగ్పై నిఘా మరింత పెంచుతాం. మైనర్, యూత్ ర్యాష్ డ్రైవింగ్పై తనిఖీలు పెంచి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం.చెరువుల వద్ద భద్రత విషయమై రెవెన్యూ శాఖకు సమాచారం ఇస్తాం. కులసంఘాలతో సమావేశ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ప్రశ్న: సైబర్లో మోసపోతే ఎలా? – ఈగ కృష్ణమూర్తి కూనూరు, జఫర్గడ్ డీసీపీ: సైబర్లో మోసపోతే గోల్డెన్ అవర్ ఉంటుంది. మోసపోయిన గంటలో 1930కి కాల్ చేసి సమాచారం అందిస్తే, మొత్తానికి మొత్తం డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుంది. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. వాట్సాప్లో వచ్చే ఎపిక్ లింకులను ఓపెన్ చేయొద్దు. ప్రశ్న: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై చర్యలు తీసుకుంటున్నారా.. ఆటోల్లో సౌండ్ కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు.. దసరా సమయంలో ఉద్యోగులకు డ్రెస్కోడ్ అమలుచేస్తారా?.. – దరావత్ రాజేశ్ నాయక్, మైదం చెరువు తండా, కొడకండ్ల, సారంగపాణి, జఫర్గడ్, తాటికాయల అశోక్, మాజీ సర్పంచ్, ఇమ్మత్నగర్, జఫర్గడ్డీసీపీ: డ్రంకెన్ డ్రైవ్ మరింత పెంచుతాం. దీంతో తిరుమలగిరి, ఈదుల పర్రెతండా పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అరికడుతాం. ఓపెన్ ఏరి యాలో మద్యం తాగితే కేసులు నమోదు చేస్తాం. డ్రెస్కోడ్ విషయంలో కలెక్టర్కు వివరిస్తాం. అటోల సౌండ్ సిస్టం విషయమై రోడ్డు ట్రాన్స్పోర్టు అధికారులకు సైతం సమాచారం ఇస్తాం. ప్రశ్న: బెల్ట్ షాపుల్లో అమ్మకాలు.. అనాథాశ్రమాలకు డొనేషన్లు నియంత్రణకు ఏం చేస్తారు..?డ్రగ్స్ క్యాంపెయిన్లను నిర్వహిస్తున్నారా..? – బంగ్ల శ్రీనివాస్గౌడ్, స్టేషన్ఘన్పూర్, దుంపల సంపత్, పాలకుర్తి, అన్వర్, జనగామ, విద్యాసాగర్, కొన్నె, బచ్చన్నపేటడీసీపీ: బెల్ట్ షాపుల నిర్వహణపై ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అనాథలకు డొనేషన్ పేరిట తిరిగేవారు ముందస్తుగా పోలీస్ స్టేషన్, మునిసిపల్ అనుమతులు తీసుకునేలా చూస్తాం. కలెక్టర్, పోలీసు శాఖ సంయుక్తంగా డ్రగ్స్ నిర్మూలన కోసం అవెర్నెస్ క్యాంపులు, ర్యాలీలు చేపడుతున్నాం. బ్లాక్ టీషర్టు వేసుకుని వచ్చే సమయంలో రహస్యంగా వీడియో తీయండి. పక్కా సమాచారం ఇస్తే పోలీసులు నిఘా ఉంచుతారు. ప్రశ్న: అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెడుతున్నారా? గ్రామాల్లో యువకులతో కమిటీ వేసే ఆలోచన ఉందా? – సందీప్కుమార్, జనగామ, ధర్మకంచ మినీస్టేడియం, ఏదునూరి వీరన్న, లింగాలఘణపురం డీసీపీ: అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే 100కు డయల్ చేయాలి. వీలైతే సీక్రెట్గా వీడియో తీసి మాకు పంపించండి. పోలీసు టూ వీలర్ వెహికిల్కు సైరన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. గ్రామాల పరిధిలో యువకులతో కమిటీలు వేసి నిఘా పెంచే ఆలోచనను పరిగణలోకి తీసుకుంటాం. ప్రశ్న: శ్రీ సోమేశ్వర ఆలయ గుట్ట చుట్టూ మద్యం తాగేవారిపై చర్యలు? – కామారపు సునీల్, పాలకుర్తి డీసీపీ: గుట్టచుట్టూ ఇలాంటి కార్యక్రమాలు జరుగకుండా పోలీసుశాఖ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఎవరైనా మద్యం తాగుతున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆర్బీఎఫ్ సంస్థకు సంబంధించి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి విచారణ చేస్తాం. ప్రశ్న: పెట్రోలింగ్ పెంచుతారా..బ్యాటరీల చోరీలపై చర్యలు తీసుకుంటున్నారా? – కాసుల శ్రీనివాస్, శ్రీనగర్ కాలనీ, జనగామ, జమాల్షరీఫ్, న్యాయవాది, జనగామ, బోరెం నరేందర్రెడ్డి, పెద్దమడూరు, దేవరుప్పుల డీసీపీ: ప్రతిరోజు నైట్ పెట్రోలింగ్ ఉంటుంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు కాలనీ పెద్దలు ముందుకు రావాలి. గిర్నిగడ్డ ప్రాంతంలో రాత్రి పెట్రోలింగ్ పెంచుతాం. అనుమానితులు కనిపిస్తే 100కు డయల్ చేయండి. గతంలో చోరీకి గురైన బ్యాటరీల గురించి పీఎస్లో ఫిర్యాదు చేయండి. ప్రశ్న: పండగకు ఊరెళితే ఏం చేయాలి? చైన్స్నాచింగ్లపై చర్యలు తీసుకుంటున్నారా? – శంకర్, కొర్రతండా, గానుగుపహాడ్, జనగామ, అజహరొద్దీన్, జనగామ, రొడ్రిక్ రాజు,జనగామ డీసీపీ: పండగకు ఊరెళ్లే సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సైకి సమాచారం ఇవ్వండి. ఇంటి పరిసర ప్రాంతంలో పోలీసు నిఘా ఉంటుంది. పట్టణంలో 150 కెమెరాల ద్వారా నిఘా ఉంది. విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచింది. పెట్రోలింగ్ రెగ్యులర్గా ఉంటుంది. పట్టణంలో చాలా వరకు చోరీలు, చైన్ స్నాచింగ్లు తగ్గుముఖం పట్టాయి. ప్రతిచోట నిఘా ఉంది. దానిని రెట్టింపు చేస్తాం. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో పెట్టుకుంటే మంచిది 100 డయల్ను సద్వినియోగం చేసుకోండి సద్దులు, దసరా పండగ సమయంలో పటిష్ట బందోబస్తు ‘సాక్షి’ ఫోన్ ఇన్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ -
మహాకవులకు నిలయం పాలకుర్తి
పాలకుర్తి టౌన్: తెలుగు సాహిత్య చరిత్రలో పాలకుర్తి ఓ మహోన్నత స్ధానాన్ని సంపాదించిందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు, సాహితీవేత్త డాక్టర్ రాపోలు సత్యనారాయణ ఇంట్లో మీడియాతో మాట్లాడారు.. పాలకుర్తి నేల నిజమైన మహాకవుల నిలయం అని, ఈ నేలలో పుట్టిన మహనీయులు తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారని అన్నారు. పాల్కురికి సోమనాథుడు తన బసవపురాణంతో సమాజంలో సమానత్వం సందేశం చాటారని, బమ్మెర పోతన తన ఆధ్యాత్మిక గాఽథలో ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా చిలిచారని, వాల్మీకి తన సృష్టితో ధర్మాన్ని ప్రతిష్టించాడని అన్నారు. స్థానిక యువత ఈ వారసత్వాన్ని ఆదర్శంగా తీసుకొని తమ ప్రతిభను పెంపొందించుకోవాలన్నారు. ఈనేల సాహిత్య వారసత్వాన్ని రక్షించడం కోసం సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ కృషి అభినందనీయం అన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న -
నిధుల సమీకరణ..!
మద్యం షాపులకు పెద్దమొత్తంలో దరఖాస్తులకు ప్లాన్సాక్షి ప్రతినిధి, వరంగల్: ● 2023–25 సంవత్సరానికి జరిగిన టెండర్లలో హనుమకొండ చెందిన ఓ మద్యం వ్యాపారి కొందరిని కలుపుకుని ట్రైసిటీతోపాటు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పలువురి పేర్లపై 600 (రూ. 12 కోట్లు ఖర్చు చేసి) దరఖాస్తులు వేశా రు. మొ త్తంగా ఆ కూటమి.. 32 దుకాణా లను (లక్కీ డ్రా, గుడ్విల్ పద్ధతిన) కై వసం చేసుకుంది. ● జేఎస్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఓ మద్యం వ్యాపారి గత ఆబ్కారీ సీజన్లో హనుమకొండ, పరకాల, రేగొండ తదితర ప్రాంతాల్లో మొత్తం 70 వైన్షాపుల కోసం దరఖాస్తు చేశారు. ఒక్కో రూ.2 లక్షల చొప్పున రూ.1.40 కోట్లు దరఖాస్తుల ఖర్చు కాగా.. రెండు లక్కీడ్రాలో రాగా, ఒకటి గుడ్విల్ ఇచ్చి సొంతం చేసుకున్నారు. ... ఈసారి కూడా మద్యంషాపుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అమ్ముడు పోతాయని ఆబ్కారీశాఖ భావిస్తోంది. గతేడాది ఉమ్మడి వరంగల్లో 294 వైన్స్ (ఏ–4)షాపులకు 15,926 దరఖాస్తులు దాఖలయ్యాయి. అప్పుడు దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. 15,926 దరఖాస్తులపైన రూ.318.52 కోట్లు నాన్ రిఫండబుల్గా ఆబ్కారీశాఖకు ఆదాయం సమకూరింది. ఈసారి ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ, సింగిల్ విండో, మున్సిపల్ తదితర స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు సమ్మక్క–సారలమ్మల జాతర కూడా ఉంది. ఈ లెక్కన ఈసారి దరఖాస్తుల సంఖ్య 20 వేల వరకు పెరిగే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. ఈ దుకాణాలపైన ప్రత్యేక గురి.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా అత్యధికంగా విక్రయాలు జరిగే వైన్షాపులపై వ్యాపారుల సిండికేట్ గురిపెట్టింది. పాత వ్యాపారులతోపాటు కొత్తగా ఈ దందాలోకి దిగేవారు అధికారులను సంప్రదించి ఓ జాబితా తయారు చేసుకున్నట్లు సిండికేట్ వర్గాల సమాచారం. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లుగా ప్రతీ సంవత్సరం రూ.2,250 కోట్ల నుంచి రూ.2,590 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ మూడేళ్లలో అత్యధికంగా విక్రయాలు జరిగిన షాపులకు ఈసారి ఎక్కువ దరఖాస్తులు పడే అవకాశం ఉంది. కాగా గతంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని ఓ వైన్స్ ఒక్క ఏడాదిలో రూ.61.04 కోట్లు, హనుమకొండ సిటీ హంటర్రోడ్లోని ఓ వైన్స్ అత్యధికంగా రూ.38.21 కోట్ల మద్యం విక్రయాలు జరిపింది. మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా తొర్రూరులోని ఓ వైన్స్ రూ.14.33 కోట్ల మద్యం విక్రయాలు జరిపింది. తొర్రూరులోనే మరో మరో వైన్స్ రూ.6.5 కోట్లు, కమలాపూర్ మండల కేంద్రంలోని ఓ వైన్స్లో రూ.6,39,82,000ల విక్రయాలు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్ రూ.9.35 కోట్ల మద్యం విక్రయించగా, పాలకుర్తిలోని వైన్స్లో రూ.14.19 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అలాగే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో మరో ఎనిమిది, భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం, చిట్యాలలతోపాటు ఆరు, ములుగు జిల్లాలో ఏటూరునాగారం, ములుగు, మేడారం, పస్రాలతో పాటు మేడారం రూట్లోని అన్ని షాపులలో విక్రయాలు బాగా జరుగుతాయి. మొత్తం 294 షాపులలో 150 దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు పడుతాయని భావిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మద్యం దందావైపు ‘రియల్’ వ్యాపారులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మద్యం దందావైపు చూస్తున్నారు. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ నేపథ్యంలో 2023–25 నుంచే కొందరు లిక్కర్ వ్యాపారంలో అడుగు పెట్టారు. ఈసారి ఇప్పుడున్న వ్యాపారులకు తోడు తాము సైతం అదృష్టం పరీక్షించుకునేందుకు సన్నద్ధం అవుతున్నారు. 2025–27 సంవత్సరానికి శుక్రవారంనుంచి టెండర్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో టెండర్లలో వైన్స్ (ఏ–4)షాపులు అత్యధికంగా దక్కించుకునేందుకు మద్యం వ్యాపారులతో కలిసి ‘సిండికేట్’ అవుతున్నారు. మరోవైపు కొందరు రాజకీయ నాయకుల బినామీలు కూడా ఈసారి పెద్దసంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే మద్యం వ్యాపారంలో పేరుగాంచిన వ్యాపారులే మళ్లీ అత్యధిక దుకాణాలు దక్కించుకునేందుకు గ్రూపులుగా ఏర్పడుతున్నారు. నిర్ణీత సమయంలో షెడ్యూల్స్ దాఖలు చేయడంతోపాటు టెండర్ల ద్వారా ‘లక్కీ’ వరిస్తే సరి.. లేదా దుకాణాలు దక్కే కొత్తోళ్లకు రూ.లక్షల గుడ్విల్ ఇచ్చి కై వసం చేసుకునేందుకు ఇప్పటినుంచి నిధులు సమీకరిస్తున్నారు. పాత మద్యం వ్యాపారులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. రాజకీయ నేతల బినామీలు.. ఇలా పోటాపోటీగా టెండర్లకు సిద్ధమవుతుండటం వైన్షాపులకు ఈసారి భలే గిరాకీ ఉండబోతుంది. మద్యం దందాలో ‘రియల్‘ వ్యాపారులు రంగంలోకి రాజకీయ నేతల బినామీలు అత్యధికంగా షాపులు దక్కించుకోవడమే లక్ష్యంగా ‘సిండికేట్’ ఉమ్మడి వరంగల్లో 294 షాపులు.. ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ -
మోదీతోనే దేశ సమగ్ర అభివృద్ధి
స్టేషన్ఘన్పూర్: కేంద్రంలో బీజేపీ పాలనలో ప్రధాని నరేంద్రమోదీ ద్వారానే దేశ సమగ్ర అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్రెడ్డి అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జీఎస్టీపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅ తిథిగా హాజరైన కిశోర్రెడ్డి మాట్లాడారు.. జీఎస్టీ తగ్గించడం సర్వత్రా హర్షణీయమన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఐకాన్ అని బీజేపీ నేత, మాజీ మంత్రి విజయరామారావు ఆరోపించారు. రాజ్యాంగంపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, నాయకులు ఇనుగాల యుగేందర్రెడ్డి, సట్ల వెంకటరమణ, బూర్ల విష్ణు, ఆరూరి జయప్రకాశ్, శశిధర్రెడ్డి, గంటె ఉపేందర్, నవీన్, చట్ల సురేశ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి కిశోర్రెడ్డి -
మైనారిటీ మహిళలకు భరోసా
జనగామ రూరల్: మైనారిటీల అభ్యున్నతి కోసం, వారు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మైనారిటీ మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించడానికి రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘రేవంతన్నకా సహారా మిస్కీన్ లే’ పేరుతో వచ్చిన పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన, అట్టడుగు సముదాయాల సామాజిక ఉద్ధరణకు దోహదపడతాయి. ఈనెల 19న సెక్రటేరియేట్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం రూ.30 కోట్ల బడ్జెట్తో అమలు చేసే ఈ పథకాలకు దరఖాస్తులు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 6 వరకు టీజీవోబీఎమ్ ఎమ్ ఎస్ ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకంతో లబ్ధి ఒంటరి మహిళలకు రూ.50 వేల ఆర్థిక సాయం రేవంతన్న కా సహారా మిస్కీన్ లే కింద రూ.లక్ష గ్రాంట్ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థిక ఎదుగుదలకు ఈ పథకాలు ఉపయోగపడనున్నాయి. జిల్లాలో అర్హులైన మైనారిటీలు దరఖాస్తు చేసుకోవాలి. –జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి బి.విక్రమ్కుమార్ -
డీసీపీతో నేడు ఫోన్ ఇన్
జనగామ: సాక్షి ఆధ్వర్యంలో నేడు(శుక్రవా రం) వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఫోన్ ఇన్లో బతుకమ్మ, దసరా పండుగల వేళ దూరప్రయాణాలు, రాత్రి ప్రయాణాలు, సెన్సిబుల్ డ్రింకింగ్, సొంత ఊళ్లకు వెళ్లేవారు ఇళ్లలో చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీసీపీతో మాట్లాడవచ్చు. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రింది ఫోన్ నంబర్ కు కాల్ చేసి మాట్లాడాలి. -
జేఎస్జేబీలో జిల్లాకు రూ.కోటి నజరానా
జనగామ: జల సంరక్షణలో సామూహిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ అద్భుత ఫలితాలు సాధించినందుకు గాను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఎంపిక చేయగా, జనగామ జిల్లాకు రూ.కోటి నజరానా ప్రకటించింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మే వరకు నిర్వహించిన జలసంచయ్–జన భాగీదార్(జేఎస్జేబీ 1.0) ప్రోగ్రాంలో జల రీచార్జ్ నిర్మాణాల(సోక్పిట్స్, రూఫ్టాప్ వర్షపు నీరు సేకరణ, బోర్వెల్ రీచార్జ్, చెక్డ్యాంలు, సబ్సర్ఫేస్ డైక్స్, ఫార్మ్ పాండ్స్, ఫర్కోలేషన్ ట్యాంకులు)ను పూర్తి చేసి, వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనివలన వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీచార్జ్ బలోపేతమైనట్లు కేంద్రం గుర్తించి, నీటి సంరక్షణ కోసం కృషి చేసిన వారికి జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చింది. జిల్లాలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు శాఖలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వామ్యులు కావడంతో 12 మండలాల పరిధిలో 30,569 ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టి, జాతీయ స్థాయిలో నగదు పురస్కారానికి జనగామ ఎంపికై ంది. జిల్లా అవార్డుల్లో జనగామకు రూ.కోటి నజరానా ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో సాధించిన ఈ విజయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ప్రశంసించింది. జాతీయ స్థాయిలో జనగామకు ఉత్తమ బహుమతి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అభినందించారు కలెక్టర్ చొరవ..30,569 ఇంకుడు గుంతల నిర్మాణం ప్రశంసలు కురిపించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ -
క్రీడారంగంలో రాణించాలి
జనగామ: విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో సైతం రాణించి దేశ ప్రతిష్టను నిలబెట్టే విధంగా కష్టపడాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులంలో గురువారం 69వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ 19 విభాగంలో జరిగిన ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఇన్చార్జ్ కలెక్టర్ ప్రారంభించారు. సోషల్ వెల్ఫేర్ ప్రి న్సిపల్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన క్రీడాపోటీల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, జ్యోతి ప్ర జ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ముని సిపల్ కమిషనర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ కల్నల్ భిక్షపతి, జిల్లా ఫుట్బాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అజ్మీరా కిషన్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్ల ఉపేందర్రెడ్డి, కార్యదర్శి రాజయ్య, మహేంద్రవర్మ, టీజీపేట అధ్యక్షుడు కోర్సింగ్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, కోచ్లు పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ శ్రమదానం చేయాలి.. జనగామ రూరల్: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. 17వ స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమం అమలులో భాగంగా గురువారం మండలంలోని శామీర్పేట్ గ్రామంలో ఏక్ దిన్ ఏ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమం పురస్కరించుకొని శ్రమదాన కార్యక్రమం ప్రారంభించి స్వ యంగా పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ పండాల్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి స్వరూప, జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్ కరుణాకర్, జిల్లా అదనపు పీడీ చంద్రశేఖర్, ఇన్చార్జ్ ఎంపీడీవో సంపత్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ ఇంటర్ డిస్ట్రిక్ ఫుట్బాల్ పోటీలు ప్రారంభం -
చట్టాలపై అవగాహన ఉండాలి
జనగామ రూరల్: విద్యార్థులకు రాజ్యాంగం, చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని ఏకశిలా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని దేశంలోని ప్రతి పౌరుడు తెలుసుకొని అనుసరించాలని, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు అని అన్నారు. ప్రాథమిక విధులు, బాధ్యతలు గురించి తప్పకుండా తెలుసుకోవాలని అలాగే పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎ. మల్లికార్జునరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ జి.నళిని కుమారి, డైరెక్టర్ బి.నాగరాజు, బి.శేఖర్, పి.జితేంద్ర పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మచ్చుపహాడ్ విద్యార్థి
నర్మెట: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మచ్చుపహాడ్కు చెందిన గజ్జెల్లి జీవన్ ఎంపికయ్యాడు. నిజామాబాద్ ము ప్కాల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సెలక్షన్స్లో పాల్గొని ఎంపికై న జీవన్ జనగామ ఏకశిలా ఒకేషనల్ జూని యర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. రెండోసారి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో మచ్చుపహాడ్ స్పోర్ట్స్ అధ్యక్షుడు కాసు కనకరాజు, గ్రామస్థులు గురువారం అభినందించారు. ఈసందర్భంగా జిల్లా కబడ్డీ అసోషియేషన్ కార్యదర్శి గట్టయ్య, మండల అధ్యక్షుడు గుండేటి రాంచందర్, కార్యదర్శి కొంపెల్లి అంబేడ్కర్, సభ్యులు గొల్లపల్లి రాజు, వినోద్ , వేణు హర్షం వ్యక్తం చేశారు. -
క్రీస్తుజ్యోతిలో బతుకమ్మ సంబురాలు
జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం బతుకమ్మ సంబురాలను జరుపుకున్నారు. బతుకమ్మల ను తీర్చిదిద్ది కళాశాల ఆవరణలో సాయంత్రం నుంచి రాత్రి వరకు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డి.విజయపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా సంప్రదాయ, ఆచార వ్యవహారాలను సైతం గౌరవించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, అధ్యాపకులు స్వప్న, సంతోశాకుమారి, స్వర్ణ, సరితా, మాలతి, గీత, విద్యార్థినులు పాల్గొన్నారు. -
‘బెస్ట్ అవైలబుల్’ బిల్లులు విడుదల చేయాలి
జనగామ రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బిల్లులు విడుదల చేసి తమ పిల్లల చదువులకు సహకరించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరా రు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్కు వినతిపత్రం అందజేశారు. దేవరుప్పుల మండలంలోని కడవెండి సెయింట్ జాన్ బ్రిట్టో హైస్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 2017 సంవత్సరం అడ్మిషన్లు ఇచ్చారు. కానీ 2021 నుంచి 2025 ఈరోజు వరకు నిధులు విడుదల కాలేదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. భూసమస్యల పరిష్కారానికి చర్యలు.. జనగామ రూరల్: భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అన్నారు. గురువారం స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లిలో చేపడుతున్న సాదాబైనామా, భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను ఆకస్మికంగా సందర్శించి అసైన్డ్ భూములు 22–ఏను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్కు వినతి -
నేటినుంచి మద్యం టెండర్లు
జనగామ: జిల్లాలో నూతన మద్యం దుకాణాల టెండరు ప్రక్రియ మొదలుకానుంది. వైన్స్ల కేటాయింపులో రిజర్వేషన్ల ప్రాసెస్ గురువారం పూర్తికాగా, ఈనెల 26 (శుక్రవారం) నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఎకై ్సజ్ శాఖ సన్నద్ధమవుతోంది. ప్రస్తుత దుకాణాల కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ చివరి వారంతో ముగియనుండగా, ప్రభుత్వం ముందస్తుగా కొత్త టెండర్లను ఆహ్వానిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 47 మద్యం దుకాణాలు ఉండగా, ఈసారి మరో మూడు కొత్త దుకాణాలు పెరగడంతో మొత్తం సంఖ్య 50కి చేరింది. వీటిలో ఎస్టీ వర్గానికి 1, ఎస్సీ సామాజిక వర్గానికి 5, గౌడ కులస్థుల కు 13, జనరల్ కేటగిరీ(ఓపెన్) విభాగంలో 31 మ ద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించా రు. దీంతో ప్రస్తుత వైన్స్ యజమానులతో పాటు కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఆయా వర్గాల వారు టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ నూతన మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ల కోసం గురువారం కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి అనిత, ఏఈఎస్ ప్రవీణ్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ అధికారులతో కలిసి ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ పర్యవేక్షణలో మద్యం దుకాణాల రిజర్వేషన్ల కోసం లక్కీ లాటరీ నిర్వ హించారు. జిల్లాలో 50 మద్యం షాపులకు గాను 19 షాపులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందులో గౌడ సామాజిక వర్గానికి–13(15 శాతం), ఎస్సీ సామాజిక వర్గానికి–5(10 శాతం), ఎస్టీ సామాజిక వర్గానికి–1(5శాతం) మద్యం దుకాణాలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. జనరల్కు–31 (74శాతం) కేటాయించారు. గౌడ కేటగిరీలో జిల్లాలోని మునిసిపల్తో పాటు మండలాల వారీగా మద్యం దుకాణాల వారీగా నెంబర్లు కేటాయించగా, ఏరియాలతో సహా గెజిట్లో పొందుపరిచారు. రిటైల్ దుకాణాలకు ఎకై ్సజ్ ట్యాక్స్ జనాభా ప్రాతిపదికన లిక్కర్ దుకాణాలకు ఎకై ్సజ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో రూ.50లక్షలు, రూ.55లక్షలు, రూ.60 లక్షల స్లాబులు ఉన్నాయి. 5వేల జనాభా కలిగిన ఊర్లకు రూ.50లక్షలు, 5వేల నుంచి 50వేల వరకు రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష వరకు రూ.60లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 2025–27 రెండేళ్ల కాలపరిమితి సమయంలో ఆరు సమాన వాయిదాలతో ఎకై ్సజ్ పన్ను చెల్లించాలి. మండలం వెన్స్లు జనరల్ గౌడ ఎస్సీ ఎస్టీ జనగామ 11 06 04 01 – మునిసిపల్ పెంబర్తి 01 01 – – – లింగాలఘణపురం, 03 01 01 01 – ( నెల్లుట్ల ) నర్మెట 02 01 01 – – బచ్చన్నపేట 03 02 01 – – చిల్పూరు 01 01 – – – (చిన్న పెండ్యాల) చిల్పూరు 01 – – 01 – (కరుణాపురం) స్టే.ఘన్పూర్ 08 05 02 – 01 తరిగొప్పుల 02 01 01 – – రఘునాథపల్లి 04 02 – 02 – పాలకుర్తి 05 03 02 – – కొడకండ్ల 03 03 – – – జఫర్గడ్ 03 03 – – – దేవరుప్పుల 03 02 01 – – మొత్తం 50 31 13 05 01నూతన మద్యం పాలసీలో లైసెన్స్ అప్లికేషన్ ఫీజు 50శాతం పెంచుతూ రూ.3లక్షలు నిర్ణయించారు. లైసెన్స్ కోసం ఇచ్చే డబ్బులను తిరిగి చెల్లించరు. నూతన లైసెన్స్ కాలపరిమితి 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. జిల్లాలోని జనగామ పట్టణం, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ పరిధిలో మూడు మద్యం దుకాణాలు కొత్తగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు రికా ర్డు స్థాయిలో పెరగడంతో ఉమ్మడి జిల్లా పరిధిలో మూతబడేందుకు సిద్ధంగా ఉన్న మూడింటిని ఇక్కడకు కేటాయించారు. లాటరీ కార్యక్రమంలో జిల్లా ట్రైబల్ అధికారి ప్రేమకళ, బీసీ వెల్ఫేర్ అధికారి ఎన్.ఎల్. నర్సింహారావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి.విక్రమ్, ఎకై ్సజ్ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. వచ్చే నెల 18 వరకు గడువు.. 23న వైన్స్ల కేటాయింపు లైసెన్స్ అప్లికేషన్ ఫీజు రూ.3లక్షలు కలెక్టరేట్లో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి -
‘స్థానిక’ రిజర్వేషన్లపై ఉత్కంఠ
జనగామ: స్థానిక సంస్థల ఎన్నికల (ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యులు) ప్రక్రియపై రాజకీయ వర్గాలు, ఆశావహుల దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారి రిజర్వేషన్ల అంశం ప్రధాన చర్చగా మారింది. ప్రాథమిక దశ(ప్రిలిమినరీ)లో అధికార యంత్రాంగం రిజర్వేషన్ల కసరత్తును ప్రారంభించగా, అభ్యర్థులలో టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వం ఇప్పటికే 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదల కావాల్సి ఉంది. అయితే, జీవో వెలువడకపోవడంతో అధికారులు తాత్కాలికంగా సర్వేలు, గణాంకాలను సేకరించడం, గత ఎన్నికల రిజర్వేషన్ల స్థితిని పరిశీలించడం వంటి పనులను చేపట్టారు. ఒకసారి గైడ్లైన్న్స్ విడుదలైతే పూర్తిస్థాయిలో రిజర్వేషన్ల ప్రక్రియ ముందుకు సాగనుంది. ఈసారి రిజర్వేషన్లు రొ టేషన్ పద్ధతిలో అమలుకానున్నాయి. అంటే, గత ఎన్నికల్లో ఒక నిర్దిష్ట వర్గానికి కేటాయించిన స్థానాలు ఈసారి ఇతర వర్గాలకు వెళ్లే పద్ధతి రూపొందించనున్నారు. దీంతో అనేక గ్రామాలు, వార్డుల్లో పోటీ చేయాలని కలలు కంటున్న ఆశావహులు ఏ వర్గానికి రిజర్వేషన్ వస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గతంలో సాధారణంగా ఉన్న సీట్లు ఈసారి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కిందకు వచ్చే అవకాశముంది. అదే విధంగా రిజర్వ్ అయిన స్థానాలు ఈసారి సాధారణ వర్గానికి వెళ్లే పరిస్థితులు ఏర్పడవచ్చు. రిజర్వేషన్లే కీలకం ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మొదట రిజర్వేషన్ల జాబితా కీలక మలుపు కానుంది. ఎందుకంటే ఎవరి గ్రామంలో, ఎవరి వార్డులో పోటీ చేసే అవకాశం దీనిపైనే ఆధారపడుతుంది. స్థానిక రాజకీయ సమీకరణాలు కూడా రిజర్వేషన్ల ప్రకటనతోనే స్పష్టతకు వస్తాయి. ప్రస్తుతం కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే సమాచారంతో గ్రామాల్లో ఒక్కసారిగా ఎలక్షన్ వాతావరణం నెలకొంది. ప్రతి మండల పరిధిలో గ్రామాలు, వార్డుల జనాభా గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి గైడ్లైన్న్స్ అందిన వెంటనే తుది రిజర్వేషన్ ప్రక్రియ పట్టాలెక్కనుంది. మొత్తానికి, జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మొదటి అడుగు రిజర్వేషన్ల ప్రక్రియతోనే ప్రారంభ మవుతోంది. ఈ నెల 29వ తేదీ వరకు 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన క్లారిటీ ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 280 జీపీలు..12 మండలాలు జిల్లాలో 12 మండలాల పరిధిలో 280 గ్రామ పంచాయతీలు, రెండు మునిసిపాలిటీలు ఉన్నాయి. 2,534 వార్డులు ఉండగా, 134 మంది ఎంపీటీసీలు ఉన్నాయి. వీటి పరిధిలో 4లక్షల ఓటర్లు ఉన్నారు. 42 శాతం ప్రత్యేక జీవో కోసం ఎదురుచూపులు అధికార యంత్రాంగం కసరత్తు -
నాణ్యతగా
నిరంతరం..సబ్స్టేషన్ నిర్మాణ పనులకు సంబంధించి చర్చిస్తున్న ఉన్నతాధికారులు● మూడు చోట్ల స్థల కేటాయింపుల్లో జాప్యం● ఫీడర్లపై తగ్గనున్న భారం ● లో ఓల్టేజీ సమస్యలకు పరిష్కారం ● రూ.22.50కోట్లు మంజూరు జనగామ: జిల్లాలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో తొమ్మిది 33/11కేవీ సబ్స్టేషన్లకు మంజూరు ఇచ్చింది. ఇప్పటికే అనేక చోట్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతుండగా, మరికొన్ని చోట్ల స్థల కేటాయింపులు పూర్తి కావాల్సి ఉంది. నూతన సబ్స్టేషన్ల సేవలు ప్రారంభం కాగానే గ్రామాల పరిధిలో తరచూ ఎదురవుతున్న లో ఓల్టేజీ సమస్యకు పరిష్కారం లభించనుంది. దీంతోపాటు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి అవకాశం కలుగుతుంది. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 33/11కేవీ సబ్స్టేషన్లు 78 ఉన్నాయి. 9 సబ్స్టేషన్లు అందుబా టులోకి వస్తే 87కు పెరగనున్నాయి. 132/33 కేవీ –12, 220/132 కేవీ–1, 400 కేవీ–1 సామర్థ్యం కలిగిన సబ్ స్టేషన్లు ఉన్నాయి. గృహ, వాణిజ్య, ఇండస్ట్రియల్, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ, స్ట్రీట్, స్కూల్స్, టెంపుల్స్ తదితర కనెక్షన్లు 2, 96, 779 ఉన్నాయి. జిల్లాలో కొత్తగా తొమ్మిది 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేశారు. జిల్లాలో కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం కోసం రూ.22.50 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను వినియోగిస్తూ ఆధునిక సాంకేతికతతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీంతో విద్యు త్ పంపిణీ నాణ్యత మెరుగుపడటమే కాకుండా, వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, గృహాల అవసరాలకు సరిపడే విద్యుత్ అందుబాటులోకి రానుంది. దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామంలో 220/132 కేవీ సబ్స్టేషన్ నిర్మాణపనులు కొద్దిరో జుల్లో పట్టాలెక్కనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే 15 ఎకరాల భూమి కేటాయింపు పూర్తికాగా, హద్దులు నిర్ణయించి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అతి పెద్ద సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకుంటే సమీపంలోని మండలాలకు మరింత నాణ్యమైన, కోతలు లేని విద్యుత్ సరఫరా అందించవచ్చు. భారీ లోడ్లను కూడా సులభంగా మోహరించగల సామర్థ్యం ఈ సబ్స్టేషన్కు ఉండబోతోంది. బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల కేటా యింపుల్లో జాప్యం జరుగుతోంది. సబ్స్టేషన్కు భూమి కేటాయింపుపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు. ఈ సమస్యను జఠిలం చేస్తే ఊరికి వచ్చే సబ్స్టేషన్ను మరోచోటకు మళ్లించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాలకుర్తి మండలంలోని మల్లంపల్లి, ముత్తారం గ్రామాల్లో సబ్స్టేషన్ల కోసం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే నిర్మాణం మొదలయ్యేలోపు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. స్థల సమీకరణ సమయంలో సమస్య ఉత్పన్నం కావడంతో పనులు ప్రారంభించలేకపోతున్నారు. అధికారులు ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకు తున్నారు. జిల్లాలోని చిల్పూరు మండలం కొండాపూర్, జఫర్గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం కుర్చపల్లి మూడ గ్రామాల్లో 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పనులు 50శాతం వరకు పూర్తయ్యాయి. కొండాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో కొండాపూర్, శ్రీపతిపల్లి, కొమ్ముగుట్ట, లింగంపల్లి (సగం) ఫీడర్లు బదిలీ కానుండడంతో విద్యుత్తులో మరింత నాణ్యత పెరగనుంది. సాగరం సబ్స్టేషన్కు సాగరం, తిగుడు, కొనాయచలం, కుర్చపల్లి సబ్స్టేషన్కు అనుసంధానంగా ఇప్పగూడెం, రాఘవాపురం, గోవర్ధనగిరి గ్రామాల పరిధిలోని సగం ఫీడర్లు కలువనున్నాయి. లింగంపల్లి, పత్తేషాపూర్ 33 /11కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులకు టెండరు పూర్తి కాగా, జనగామ మండలం వడ్లకొండ సబ్స్టేషన్ పనులకు సంబంధించి టెండరు స్టేజీలో ఉంది. విద్యుత్ సబ్ స్టేషన్లు పూర్తయ్యాక జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఓల్టేజీ సమస్యలు తగ్గి, నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది. వ్యవసాయం, గృహ వినియోగం, చిన్నతరహా పరిశ్రమలకు ఊరట కలిగించే విషయం. -
డీసీపీతో ఫోన్ ఇన్
జనగామ: సాక్షి ఆధ్వర్యంలో రేపు(శుక్రవా రం) వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. ఫోన్ ఇన్లో బతుకమ్మ, దసరా పండుగల వేళ దూరప్రయాణాలు, రాత్రి ప్రయాణాలు, సెన్సిబుల్ డ్రింకింగ్, సొంత ఊళ్లకు వెళ్లేవారు ఇళ్లలో చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీసీపీతో మాట్లాడవచ్చు. ఈ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్రింది ఫోన్ నంబర్ కు కాల్ చేసి మాట్లాడాలి. -
పండగ పూట ఇల్లు జాగ్రత్త!
జనగామ: బతుకమ్మ, దసరా పండగ సమయంలో ఇంటికి తాళాలు వేసి సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీతో పాటు ఆయా వార్డుల్లో పోలీసులు మైక్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేశ్, తదితరులు వార్డుల్లోని ప్రధాన కూడళ్లలో జనాన్ని పోగు చేసి జాగ్రత్తలు సూచించారు. ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం అందించాలని, వార్డులో కొత్త, అనుమానిత వ్యక్తులు సంచరించిన సమయంలో తమకు వెంటనే సమాచారం అందించాలని నరేశ్ కోరారు. -
‘ప్రీప్రైమరీ’ మరింత బలోపేతం
జనగామ రూరల్: ప్రీప్రైమరీ విద్య మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. జిల్లాలోని 12 మండలాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈనేపథ్యంలో పాఠశాలల్లో బోధకులు, ఆయాలుగా రెండు పోస్టులు మంజూరు చేశారు. అంగన్వాడీలో కేవలం పౌష్టికాహారంతో పాటు ఆటాపాటలతో విద్యాబోధన చేసేవారు. అంగన్వాడీలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి కేంద్రాల్లోని చిన్నారులను ఆకట్టుకునే విధంగా వసతుల కల్పనకు పెద్దపేట వేసింది. ఈ మేరకు కేంద్రాలకు రకరకాల పరికరాలు, రంగురంగుల మ్యాట్లు, టేబుళ్లు పం పిణీ చేసింది. కేంద్రాల్లో ప్రీ స్కూల్ విద్యావిధానాన్ని మెరుగుపరిచే దిశగా మాతా, శిశు సంక్షేమశాఖ కృషి చేస్తోంది. జిల్లాలోని 12 మండలాల్లో మంజూరు అయిన 12 అంగన్వాడీ కేంద్రాలకు బోధకులు, ఆయా పోస్టులు మంజూరు చేసింది. బోధకులు 12, ఆయాలు 12 పోస్టులు మొత్తం 24 పోస్టులు తాత్కాలిక పద్ధతిలో పోస్టులు భర్తీ చేయనుంది. అర్హతలు ఫ్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కు కనీస అర్హతగా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. బాల్యవిద్య లేదా ప్రాథమిక బోధనలో అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందని, బోధనలో పూర్వ అనుభవం కలవారికి, వితంతువులకు ప్రత్యేక వెయిటేజ్ ఉంటుంది. ఆయా పోస్ట్కు కనీస విద్యార్హత ఏడో తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలని, జిల్లాలోని సంబంధిత మండలానికి చెందిన గ్రామపంచాయతీ పరిధిలో నివాసం కలిగి స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు 18 సంవత్సరం నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుందన్నారు. నియామకాలు పూర్తిగా తాత్కాలికమని, గౌరవ వేతనంగా ప్రతి విద్యాసంవత్సరానికి 10 నెలలు మాత్రమే చెల్లించడం జరుగుతుందన్నారు. బోధకులకు 8వేలు, ఆయాలకు 6వేలు గౌరవ వేతనం ఉంటుంది. 24 నుంచి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి దరఖాస్తులను అక్టోబర్ 4వ తేదీ వరకు స్వీకరిస్తారు. పాలకుర్తి: ఎంపీపీఎస్ పాలకుర్తి–2 ఎంపీపీఎస్ గూడూర్–2 దేవరుప్పుల: ఎంపీపీఎస్ సింగరాజుపల్లి –2, ఎంపీపీఎస్ కోలుకొండ–2 రఘునాథపల్లి: ఎంపీపీఎస్ కంచనపల్లి –2, ఎంపీపీఎస్ ఖిళాషాపురం–2 జనగామ: ఎంపీయూపీఎస్ యశ్వాంతాపూర్ –2, జనగామ పట్టణంలోని ఎంపీపీఎస్ రాజీ వ్నగర్ కాలనీ–2, ఎంపీపీఎస్ పసరమడ్ల–2 స్టేషన్ ఘన్పూర్: ఎంపీపీఎస్ స్టేషన్ఘన్పూర్ –2 జఫర్ఘడ్ : ఎంపీపీఎస్ తమ్మడపల్లి జీ–2 కోడకండ్ల : ఎంపీపీఎస్ కొడకండ్ల –2. 12 పాఠశాలలకు బోధకులు, ఆయా పోస్టులు మంజూరు తాత్కాలిక పద్ధతిలో నియామకం -
ప్రజల సహకారం అవసరం
జిల్లాలో కొత్తగా చేపట్టిన 33/11కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ముఖ్యంగా స్థల కేటాయింపు, లైన్ అనుసంధానం, తదితర అంశాల్లో ప్రజల సహకారం అవసరం. సాల్వాపూర్ గ్రామంలో స్థల కేటాయింపు ఇంకా జరగలేదు. మల్లంపల్లి, ముత్తారంలో టెండరు పూర్తికాగా, స్థల సమస్య వచ్చింది. మిగతా చోట్ల సబ్స్టేషన్ నిర్మాణ పనులు ఆయా దశల్లో ఉన్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే విద్యుత్లో మరింత నాణ్యత పెరుగుతుంది. – టి.వేణుమాధవ్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, జనగామ -
క్రీడల్లోనూ రాణించాలి
జనగామ రూరల్: విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం సోషల్ వాయిస్ ఫౌండేషన్ అధ్వర్యంలో పట్టణంలోని స్థానిక మినీ స్టేడియంలో ఫౌండేషన్ అధ్యక్షుడు మంగళంపల్లి రాజు అధ్యక్షతన మార్షల్ ఆర్ట్స్ పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిస అయితే వారి భవిష్యత్తు పాడవడమే కాకుండా కుటుంబం కూడా రోడ్డున పడుతుందని హెచ్చరించారు. విద్యార్థులు, యువత జాగ్రత్తగా ఉండాలని, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. 150 మంది క్రీడాకారులు కరాటే, కుంగ్ ఫూ, బాక్సింగ్, తైక్వాండో పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యులు అభిగౌడ్, డైరెక్టర్ సముద్రాల దేవిప్రసాద్, మాస్టర్లు సారయ్య, విక్రమ్, సంతోష్, అబ్బాస్, వినోద్ సభ్యులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
సీసీఐ కొనుగోళ్లలో అక్రమాలు అరికట్టాలి
జనగామ రూరల్: జిల్లా పరిధిలోని రైతుల పత్తి పంటను మాత్రమే కొనుగోలు చేయాలని, సీసీఐ, కాటన్ మిల్లుల కొనుగోలు కేంద్రాల్లో అవినీతి, అక్రమాలు అరికట్టాలని తెలంగాణ రైతు సంఘం పట్టణ కార్యదర్శి మంగ బీరయ్య కోరారు. బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏఓ శ్రీకాంత్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా బీరయ్య మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం 16 పత్తి కాటన్ మిల్లులు ఉన్నాయని రెతులు తమ పత్తి విక్రయించడానికి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్లను కలెక్టర్ ఆధ్వర్యంలో నియమించాలని, సాఫ్ట్వేర్ కాంట్రాక్టులు పారదర్శకంగా ఉండాలన్నారు. మిల్లర్లు రైతుల నుంచి 2శాతం కమీషన్ వసూలు చేస్తే వెంటనే మిల్లుల లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాండ్ర ఆనందం, కరే బీరయ్య పాల్గొన్నారు. -
మినీ లెదర్పార్క్ వినియోగంలోకి తెచ్చేందుకు కృషి
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్లో నిరుపయోగంగా ఉన్న మినీ లెదర్పార్కుకు వినియోగంలోకి తీసుకువచ్చేలా కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగిరి ప్రీతమ్ హామీ ఇచ్చారు. బుధవారం భూపాలపల్లిలో జరిగే దళిత సదస్సుకు వెళ్తున్న ఆయనకు డివిజన్కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ చేపూరి చిరంజీవి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రీతమ్ స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేలా ప్రత్యేక చొరవతో పనిచేస్తానన్నారు. మండలంలోని సముద్రాల, పాంనూర్, నమిలిగొండ గ్రామాల్లోని నిరుపేదలకు దాదాపు 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఇండ్ల పట్టాలు అందించినా ఇప్పటికీ ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని, అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు అందించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కార్పొరేషన్ చైర్మన్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గుర్రం నవీన్, గాదె శ్రీధర్, నలిమెల నాగరాజు, చాడ ఏలియా, సంపత్, జీవన్, యాకస్వామి, రాజశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగిరి ప్రీతమ్ -
దాండియా పవిత్రత కాపాడాలి
జనగామ: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమాలను పవిత్రంగా నిర్వహించుకోవాలని విశ్వహిందూపరిషత్, బజరంగ్దళ్ జిల్లా ఉపాధ్యక్షులు బచ్చు బాలనారాయణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమ్మవారికి ప్రతీ నిత్యం సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తూ, సంస్కృతిని నృత్యాలు చేయడం దాండియా ఉద్దేశ్యమన్నారు. ప్రస్తుత సమయంలో కొంతమంది నిర్వాహకులు దీనిని ఈవెంట్ మేనేజ్మెంట్ తరహాలో వాణిజ్యపరంగా చేపట్టడం క్షమించరానిదన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట బౌన్సర్ల రూపంలో ఇతర మతస్తులు ప్రవేశించి అమ్మాయిలపై అసభ్యకర చేష్టలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది లవ్ జిహాద్ వంటి దుష్ప్రవర్తనలకు దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వేడుకల్లో చిన్ని తప్పిదం జరిగినా, విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దాండియా ఈవెంట్లపై పోలీ సులు నిఘా ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని కోరారు. బచ్చన్నపేట: మండలంలోని కట్కూర్ గ్రామానికి చెందిన కరుణారెడ్డికి బుధవారం జేఎన్టీయూ యునివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. కరుణారెడ్డి జెఎన్టీయూ యూనివర్సిటీలో కెమిస్ట్రీలో ఫుల్టైం పరిశోధన చేసి ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లికేషన్స్లో ప్రచురణ పొంది పీహెచ్డీ ఽథీసెస్ సమర్పించారు. మూల్యాంకన అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి డాక్టరేట్కు అర్హత సాధించారు. 2014లో ఆమె భర్త కరుణాకర్రెడ్డి కూడా ఇదే యునివర్సిటీలో గణిత శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. భార్యాభర్తలు ఇద్దరూ డాక్టరేట్ సాధించడంపై గ్రామస్తులు అభినందించారు. పాలకుర్తి: మండలంలోని చెన్నూరు జెడ్పీ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు చిలువేరు రేవతి, మంచాల అంజలి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం పుస్కూరి రమేశ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 25,26,27 తేదీల్లో నిజామాబాద్ జిల్లా మక్తల్ మండలంలో కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఎంపికై న విద్యార్థులను, వారికి సహకరించిన ఫిజికల్ డైరక్టర్ కొడిశాల అశోక్ను ఉపాధ్యాయులు శ్రీనివాస్, శోభ, శ్రీహరి, ఉమారాణి, వెంకటేశ్, క్రాంతి కుమార్ అభినందించారు.ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎ.ప్రవీణ్ను వీఆర్కు బదిలీ చేయగా.. ప్రస్తుతం సీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్న కె.శ్రీధర్రావును ధర్మసాగర్ పోలీస్స్టేషన్కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆటోమేటిక్ ఓల్టేజ్ రెగ్యులేటర్లు వాడాలి
జనగామ: జిల్లాలో విద్యుత్ వినియోగించే హెచ్టీ వినియోగదారులు ఆటోమేటిక్ ఓల్టేజ్ రెగ్యులేటర్లు వినియోగించాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. జిల్లా కేంద్రం డివిజన్ కార్యాలయంలో బుధవారం ఎస్ఈ ఆధ్వర్యంలో హెచ్టీ వినియోగదారులతో సమావేశం నిర్వహించారు. ఎస్ఈ మాట్లాడుతూ.. హెచ్టీ కస్టమర్లు తప్పకుండా యూనిటీ పవర్ ఫ్యాక్టర్ను మెయింటెన్ చేయాలని సూచించారు. వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరాను అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఎస్ఏవో జయరాజు, ఏడీఈ తదితరులు పాల్గొన్నారు. హెచ్టీ వినియోగదారులతో ఎస్ఈ సమావేశం -
ఆర్టీసీ ప్రయాణికులకు లక్కీ డ్రా
జనగామ: దసరా పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ సంస్థ ప్రయాణికుల కోసం ప్రత్యేక లక్కీడ్రా స్కీం నిర్వహిస్తోందని జనగామ డిపో మేనేజర్ ఎస్.స్వాతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఆర్టీసీ సెమీడీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తమ టికెట్పై పేరు, ఫోన్ నెంబర్, చిరునామా రాసి సంబంధిత బస్టాండ్లో ఏర్పాటు చేసిన బాక్స్లలో వేయాలన్నారు. అక్టోబర్ 8న సాయంత్రం 4 గంటలకు ఆయా ప్రాంతీయ కార్యాలయాల్లో జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించబడుతుందన్నారు. ప్రతీ ప్రాంతం నుంచి ముగ్గురు విజేతలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ.15వేలు, మూడో బహుమతి రూ.10 వేలు నగదు రూపంలో అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ స్వాతి సూచించారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జఫర్గఢ్: ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న జాతీయ స్థాయి బాడ్మింటన్ పోటీలకు కూనూరు, ఉప్పుగల్ గ్రామాలకు చెందిన విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం పీడీ ఆకుల సాయికుమార్ మాట్లాడుతూ చవనబోయిన పూజశ్రీ, సుతారి రిషిత అనే పదో తరగతి విద్యార్థినులు ఇటీవల కూనూర్లో జరి గిన రాష్ట్రస్థాయి బాల్ బాడ్మింటన్ పోటీల్లో జి ల్లా జట్టు తరఫున పాల్గొని ప్రతిభకను కనబర్చి జా తీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. హెచ్ ఎం ఎండీ పర్వేజ్, జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదెపాక అయోధ్య, రాజిరెడ్డి, తదితరులు విద్యార్థినులు అభినందించారు. -
మత్తళ్లు పోస్తున్న చెరువులు
● చీటకోడూరు రిజర్వాయర్ నాలుగు గేట్లు ఎత్తిన ఇరిగేషన్ అధికారులుజనగామ: అల్పపీడన ప్రభావంతో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా వ్యాప్తంగా జలకళ సంతరించుకుంది. ఈ నెల 22వ తేదీ నుంచి మంగళవారం సాయంత్రం వరకు జిల్లాలో 31.7 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. జనగామ మండలం గానుగుపహాడ్, వడ్లకొండ ఆనం చెరువు సమీపంలోని గుట్టల ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో జనగామ చీటకోడూరు డ్యాం ఫుల్ ట్యాంక్ లెవల్కు చేరుకుంది. డ్యాం కెపాసిటీ 389 అడుగులు కాగా (0.3 టీఎంసీ సామర్థ్యం), అంతకు మించి వరద రావడంతో నీరు డ్యాం గేట్లపై నుంచి దూకాయి. సమాచారం అందుకున్న ఇరిగేషన్ డీఈ రవి కుమార్, ఏఈఈ కమలాకర్తో కలిసి సీఈ ఆర్.సుధీర్ డ్యాం వద్దకు చేరుకుని ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద తీవ్రతను అంచనా వేసి, నాలుగు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. చీటకొడూరు, యశ్వంతాపూర్ వాగుల మీదుగా లింగాలఘణపురం మండలం నుంచి పాలకుర్తి వరకు విస్తరించిన వాగులన్నీ నిండుకుండలా మారనున్నాయి. జిల్లాలో 770 చెరువులు ఉండగా, 100 శాతం 341 చోట్ల నిండగా, 157 చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. -
సామాన్యులకు ఊరట!
జనగామ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా జీఎస్టీ సంస్కరణలు పేద, మధ్య తరగతి, చిరు ఉ ద్యోగ కుటుంబాలకు ఊరట కలిగించాయి. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబ్లు అమలులో ఉండగా, కొత్త విధానంతో ఇప్పుడు 5 నుంచి 18 శాతం వరకు ఒకే శ్లాబ్లను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో వినియోగదారులు, వ్యాపారులు, రైతులు, గృహిణులు, విద్యార్థులు, యువత లాంటి అన్ని వర్గాలకు భారీగా లాభం చేకూరనుంది. రెండు శ్లాబ్లు మాత్రమే.. జీఎస్టీపై కేంద్రం కొత్త నిర్ణయం అమలులోకి రావడంతో కార్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. కుక్కర్, టీవీల ధరలు తగ్గడంతో సామాన్యులు సైతం సులభంగా కొనుగోలు చేయగలిగే అవకాశం లభిస్తోంది. ఈ మార్పు చిన్న ఉద్యోగులు, కూలీలు, స్వయం ఉపాధి చేసుకునే వర్గాలకు ఉపశమనం కలిగించనుందని ఆర్థికనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలాలపై మా త్రం 40 శాతం పన్ను కొనసాగింపుపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జోరందుకోనున్న వ్యాపారాలు.. జీఎస్టీ కొత్త విధానాలతో వ్యాపారాలు జోరందుకోనుండగా... సామాన్యుపై ఆర్థిక భారం తగ్గనుంది. టీవీలపై గతంలో ఉన్న 28 శాతం జీఎస్టీ నుంచి 18 శాతానికి కుదించడంతో 34 నుంచి 65 ఇంచుల సైజులో ఉన్న టీవీలపై రూ. 4 వేల నుంచి రూ.6 వేల వరకు ధరలు తగ్గాయి. ఏసీలపై 18 శాతానికి మార్చడంతో టన్నున్నర నుంచి రెండు టన్నుల కెపాసిటీ ఏసీలపై రూ.5వేల నుంచి రూ.9వేల వరకు ధరలు దిగొచ్చాయి. 12 శాతం ఉన్న ప్రెషర్ కుక్కర్ 5 శాతం జీఎస్టీకి చేరుకోవడంతో రూ.200 నుంచి రూ.400 వరకు తగ్గాయి. ద్విచక్రవాహనా లపై 28 శాతం జీఎస్టీ ఉండగా, ప్రస్తుతం 18 శాతానికి తీసుకు రాగా 125 సీసీ నుంచి 155 సీసీ వరకు రూ.9వేల నుంచి రూ.17వేల వరకు తగ్గిముఖం పట్టడంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. జీఎస్టీ తగ్గుముఖంతో అన్ని వర్గాల ప్రజలకు ప్ర యోజనం చేకూరే విధంగా ఉంది. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంతోషం టీవీ, కార్లు, బైక్లపై ధరలు తగ్గుముఖం చిరు ఉద్యోగులపై తగ్గిన ఆర్థికభారం పెరిగిన వ్యాపారం జీఎస్టీకి తోడు షోరూంల ఆఫర్ -
సరికొత్త మేడారం..!
వనదేవతల ప్రాంగణం విస్తరణ, పునర్నిర్మాణానికి శ్రీకారం సభకు వచ్చిన మహిళలతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి మేడారంలో అభివృద్ధి పనులు పరిశీలిస్తున్న సీఎం రేవంత్రెడ్డిములుగు: తెలంగాణ కుంభమేళా, వనదేవతల జన జాతర మేడారం రూపుమారనుంది. సమ్మక్క,సారలమ్మ ప్రాంగణాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన మాస్టర్ప్లాన్ను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. వచ్చే జనవరిలో జరిగే మహాజాతరకు శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.150 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనుల పరిశీలనకు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి మేడారం సందర్శించారు. తల్లుల దర్శనం, మొక్కుల చెల్లింపు, పనుల పరిశీలన, బహిరంగ సభలో ప్రసంగం మొత్తంగా ఆయన పర్యటన మేడారంలో 2.04 గంటలపాటు కొనసాగింది. సీఎంతోపాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, మహబూబాబాద్, వరంగల్ ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు ఉన్నారు. జాతర ప్రాశస్త్యం గుర్తుండి పోయేలా ప్రణాళిక: మంత్రి ధనసరి సీతక్క జాతర ప్రాశస్త్యం అనేక శతాబ్దాలు గుర్తుండి పోయేలా ప్రణాళిక రూపొందించి మేడారంలో అభివృద్ధి పనులు చేయనున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరమే మేడారం ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని స్వయంగా ముఖ్యమంత్రితో చర్చించాం. సీఎం సానుకూలంగా స్పందించి అభివృద్ధి ప్రణాళి కలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి తల్లుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గద్దెల విస్తరణ విషయంలో అనేక అపోహలు ఉన్న నేపథ్యంలో నిర్మాణం ఏ విధంగా జరగాలని, గిరిజనుల ఆచార సంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడడం కోసం సీఎం స్వయంగా మన ప్రాంతానికి రావడం సంతోషంగా ఉంది. మాస్టర్ప్లాన్ను విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి సమ్మక్క, సారలమ్మకు మొక్కుల సమర్పణ అభివృద్ధి పనులు పరిశీలించి మంత్రులకు సూచనలు గిరిజన సంప్రదాయాల ప్రకారమే పనులు సాగుతాయని స్పష్టీకరణ రెండు గంటలపాటు సాగిన ముఖ్యమంత్రి పర్యటన –ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారం ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రజల ఆత్మీయత, భక్తి, సంప్రదాయాలకు ప్రతీక. వన దేవతల ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో అందరి అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క–సారలమ్మ ఆలయం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలి. -
‘బతుకమ్మ’ ఆటస్థలాల్లో ఏర్పాట్లు చేయాలి
● ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్కుమార్ జనగామ రూరల్: జిల్లాలోని బతుకమ్మ ఆటస్థలా లను ముందుగా గుర్తించి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. మంగళవారం బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించేందుకు జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులకు విధులు కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మకుంట, రంగప్ప చెరువు ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేపట్టాలని పో లీస్శాఖ అధికారులకు సూచించారు. జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారిని నోడల్ అధికారిగా ప్రత్యేక బాధ్యతలు కేటాయించారు. స్టేషన్ఘన్ఫూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో కూడా సంబంధిత అధికారులతో సహాయ సహకారాలు తీసుకొని బతుకమ్మ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొలగిస్తూ బ్లీచింగ్ చల్లించాలన్నారు. ఆట స్థలాల వద్ద వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, చెరువు వద్ద లోతట్టు ప్రాంతాలకు చిన్నారులు, మహిళలు వెళ్లకుండా భారీకేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని బతుకమ్మ కుంటలో జెడ్పీసీఈఓ మాధురిషాతో కలిసి మొక్కలు నాటారు. పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు మొక్కలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీధర్ రావు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోడల్ మార్కెట్ పనులు వేగవంతం చేయాలి పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో సుమారు రూ.6 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మోడల్ మార్కెట్ భవన నిర్మాణ పనులను ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అతి సమీపంలో ఉండాలనే ఉద్దేశంతో చేపట్టిన మోడల్ మార్కెట్ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఏఎంసీలో నిధుల విడుదలపై విచారణ
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్లో నిధుల విడుదల, సీసీఐ కేంద్రాల్లో పని చేసిన ఆపరేటర్ల వేతనాల చెల్లింపులో వచ్చిన ఆరోపణల నేపధ్యంలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ మార్కెటింగ్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వి.పద్మావతి ఆధ్వర్యంలో మంగళవారం జనగామ వ్యవసాయ మార్కెట్లో విచారణ జరిపారు. గతంలో పని చేసిన కార్యదర్శితో పాటు ప్రస్తుత అధికారిని వేర్వేరుగా విచారించి వివరాలను సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.10 లక్షలు డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నిధులు డ్రా చేసుకున్నప్పటికీ, నిబంధనలు అడ్డురావడంతో ఉన్నతాధికారులు గత కార్యదర్శిని సస్పెండ్ చేశారు. దీనిపై సదరు అధికారి అప్పీళుకు వెళ్లడంతో మరోసారి విచారణ చేపట్టారు. గత సీజన్లో పత్తి కొనుగోళ్లు చేసే సమయంలో 10 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు సీసీఐ కేంద్రాల్లో పని చేశారు. వీరు తాత్కాలిక పద్ధతిలో నాలుగు నెలల పాటు పనిచేశారు. వీరికి రూ.5.17లక్షల వేతనాలు ప్రభుత్వం నుంచి విడుదల కాగా గతంలో పని చేసిన కార్యదర్శి వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో ఇందుకు సంబంధించి సదరు అధికారిని పిలిపించి విచారణ చేపట్టారు. ఈ నివేదికను రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు అందజేస్తామని పద్మావతి తెలిపారు. -
వెయ్యేళ్లు నిలబడేలా మేడారం పనులు
ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి : సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారాన్ని వెయ్యేళ్లు నిలబడేలా అభివృద్ధి పనులు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, మాస్టర్ప్లాన్ ఆవిష్కరణ కోసం మంగళవారం సీఎం రేవంత్రెడ్డి మేడారం వస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం ములుగులో మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా ఎన్నికల ముందు 2023 ఫిబ్రవరి 7న మేడారంలో సమ్మక్క, సారలమ్మ దీవెనలు తీసుకొని సీఎం రేవంత్రెడ్డి పాదయాత్ర ప్రారంభించారని తెలిపారు. 2024లో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నుంచి ఎన్నికల భేరి మోగించి రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. మేడారానికి మంజూరైన రూ.150 కోట్ల నిధులతో మూడు నెలల్లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నట్లు వివరించారు. భక్తులకు అనుగుణంగా, పూజారుల విశ్వాసాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భక్తితో, విశ్వాసంతోనే గద్దెల ప్రాంగణం చుట్టూ సాలాహారం నిర్మిస్తున్నట్లు తెలిపారు. అమ్మవార్లను దర్శించుకునే సమయంలో తొక్కిసలాటలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో కొంతమంది తప్పిపోతున్నారని అలాంటి ఘటనలు జరగకుండా అందరి అభిప్రాయం మేరకు గద్దెల ప్రాంతాన్ని గ్రానైట్తో తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. రూ.15 కోట్లతో జంపన్న వాగు నుంచి మేడారం గద్దెల వరకు రహదారిని విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రూ.5కోట్లతో జంపన్నవాగుకు ఇరువైపులా గ్రీనరీతోపాటు వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రదేశాలైన రామప్ప, లక్నవరం, మేడారం జాతర ప్రత్యేకతలు తెలుపుతూ వాటి కళాత్మకతను పర్యాటకులకు తెలియజేసే విధంగా గట్టమ్మ నుంచి మేడారం వరకు ఉన్న జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ఉన్నారు. పనుల పరిశీలన, మాస్టర్ప్లాన్ ఆవిష్కరణకు నేడు మేడారం రానున్న సీఎం రేవంత్రెడ్డి భక్తులు, పూజారుల విశ్వాసాలకు అనుగుణంగా గద్దెల ప్రాంతం అభివృద్ధి రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్కమేడారంలో ఏర్పాట్ల పరిశీలన.. మేడారాన్ని సోమవారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో కలిసి మంత్రి సీతక్క పరీశీలించారు. సమ్మక్క సారలమ్మ దేవతలను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి మేడారంలో శంకుస్థాపన, పరిశీలించే పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ పర్యటనకు జిల్లాలోని అన్ని మండలాలనుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సీతక్క పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, ఈఓ వీరస్వామి, ఏపీఓ వసంతరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
క్రీడలతో నాయకత్వ లక్షణాలు
● ఏసీపీ భీమ్శర్మ స్టేషన్ఘన్పూర్: క్రీడల ద్వారా విద్యార్థుల్లో దేహదారుఢ్యం, మానసికోల్లాసంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఏసీపీ భీమ్శర్మ అన్నారు. ఈనెల 24న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ షూటింగ్బాల్ పోటీలకు ఎంపికై న జనగామ జిల్లా జూనియర్ బాలబాలికల జట్లకు చెందిన 24 మంది విద్యార్థులకు సోమవారం క్రీడాదుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో షూటింగ్బాల్ అసోసియేషన్ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్, ఉపాధ్యక్షులు పీడీలు దేవ్సింగ్, యాదగిరి, సాంబన్న, పీఈటీలు మహాలక్ష్మీ, రాజు, సుధాకర్, అజయ్, సాంబరాజు, నరేశ్, మధుసూదన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుకు మేలుచేసేలా..!
పత్తి కొనుగోళ్లు ఇక సులభతరం, పారదర్శకంజిల్లాలోని సీసీఐ సెంటర్లో పత్తి కొనుగోళ్లు(ఫైల్)జనగామ: జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. పత్తి అమ్ముకునే సమయంలో రైతులకు మరింత సులభతరం, పారదర్శకత కల్పించేందుకు నూతన విధానాలు ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పత్తి సాగు విస్తీర్ణం, మార్కెట్ సెంటర్ల ఏర్పాట్లు, సాంకేతికత వినియోగం తదితర అంశాలపై రాష్ట్రస్థాయి మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. జిల్లాలో 16 సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సెంటర్ల కోసం జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, మరో వారం రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. అక్టోబర్ 3వ వారంలో కొనుగోళ్లు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు ప్రాంతాలు..16 కొనుగోలు కేంద్రాలు జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల మండలాల పరిధిలో పత్తి కొనుగోళ్ల కోసం 16 సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జనగామ నియోజకవర్గంలో 11, స్టేషన్ఘన్పూర్ పరిధిలో 3, పాలకుర్తి నియోజకవర్గంలో 2 అవసరమున్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా.. వానాకాలం సీజన్లో సాగుచేసిన పత్తిని అమ్ముకునే సమయంలో రైతులు సీసీఐ సెంటర్ల వద్ద ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కపాస్ కిసాన్ యాప్ సేవలను మరింత పటిష్టం చేయనున్నారు. రైతులు యాప్లో ముందుగానే స్లాట్ బుక్ చేసుకునే విధానం ప్రవేశపెట్టనున్నారు. స్మార్ట్ఫోన్లోని ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. రైతు ఫోన్ నెంబర్తో లాగిన్ చేసుకుని, అందులో వచ్చిన ఓటీపీతో రిజిష్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్, పట్టాదార్ పాసుబుక్కు, బ్యాంకు ఖాతా నెంబర్లతో పాటు పత్తి సాగు ఎన్ని ఎకరాల్లో చేశారనే వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత సీసీఐ సెంటర్ల ద్వారా పత్తిని అమ్ముకునేందుకు యాప్ ద్వారా ముందస్తు స్లాట్ బుకింగ్ చేసుకుంటే, అక్కడకు వెళ్లి నిరీక్షించే పని ఉండదు. దీని ద్వారా రైతులు నిర్ణీత సమయానికి తమ పత్తిని విక్రయించే అవకాశం కలుగుతుంది. దీంతో పాటు యాప్లో బ్యాంకులో నగదు జమకు సంబంధించి చూసుకోవచ్చు. ప్రైవేటు ఏజెన్సీకి డేటా ఎంట్రీ.. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న 16 సీసీఐ కేంద్రాల్లో ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో మార్కెటింగ్ శాఖ ఉంది. గతంలో వ్యవసాయ మార్కెట్ల పరిధిలో పనిచేసే వారి సేవలను వినియోగించుకునేవారు. పత్తి కొనుగోలు సమయంలో లావాదేవీల రికార్డింగ్లో పొరపాట్లు లేకుండా ఉండేందుకు కలెక్టర్ నేతృత్వంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల బాధ్యతలను ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించేందుకు సీసీఐ కసరత్తు చేస్తోంది. సాంకేతిక లోపాల వల్ల గతంలో ఎదురైన ఇబ్బందులు ఈసారి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఏఎంసీల్లో పనిచేసే వారికే ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన సైతం ఉందని సమాచారం. సొంత జిల్లా వరకే పరిమితం...? కొనుగోళ్లలో అక్రమాలు, అవకతవకలకు చెక్ పెట్టేందుకు ఏ జిల్లాకు ఆ జిల్లా పత్తి మాత్రమే కొనుగోలు చేసేలా సీసీఐ కొత్త నిబంధనలు తీసుకురావాలనే ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నిబంధన అమలు చేస్తే పొరుగు జిల్లాల రైతులు తమ పత్తిని మరోచోట విక్రయించే పరిస్థితి ఉండదు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ప్రైవేటు మార్కెట్ పోటీ తగ్గి, రైతులకు నష్టమవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో మార్కెటింగ్ శాఖ, సీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. జిల్లాలో 1.30లక్షల ఎకరాల పత్తి సాగు జిల్లాలో వానాకాలం సీజన్లో 1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ప్రస్తుత సమయంలో పంట ఎదుగుదల బాగానే ఉంది. రైతులకు మంచి ధర రావాలంటే పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలపై అధికారులు అవగాహన కల్పించనున్నారు. పత్తి క్వింటాల్కు ఏగ్రేడ్ రూ.8,110 మద్దతు ధర కల్పిస్తుండగా, 12 శాతం తేమ ఉన్న సరుకుకు రూ.7,710 ఇవ్వనున్నారు. ఇలా 8 నుంచి 12 శాతం వరకు మద్దతు ధర లభించనుంది. కానీ ఈసారి మద్దతు ధర 14 శాతానికి పెంచాలనే డిమాండ్ ఉంది. ఒక్కో శాతం తేమ పెరిగిన కొద్ది మద్దతు ధరలో రూ.81.10 తగ్గిస్తారు. సాంకేతికత వినియోగం సానుకూలమే అయినా, కొత్త నిబంధనలు రైతులకు ఇబ్బంది కలిగించకూడదని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొత్త విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు సౌలభ్యం కలిగించాలనుకుంటున్నప్పటికీ, నిబంధనలపై ఉన్న సందేహాలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్తగా స్లాట్ బుకింగ్ విధానం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న సీసీఐ జిల్లాలో 16 సెంటర్లకు అధికారుల ప్రతిపాదనలు 1.26 లక్షల ఎకరాల్లో పత్తిసాగుగత సీజన్లో.. గత సీజన్లో జిల్లాలో సుమారు 7.50లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. పత్తి కొనుగోళ్ల సమయంలో అక్రమాలు జరిగానే ఆరోపణల నేపథ్యంలో అప్పటి కార్యదర్శిని సస్పెండ్ చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిపై వేటు పడింది. ప్రస్తుత సీజన్లో వ్యవసాయ శాఖ పత్తి సాగు వివరాలు, రైతుల పేర్లు, తదితర సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలి. పట్టాదార్ పాస్బుక్కు ఆధారంగా ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి చొప్పున రైతు సీసీఐలో అమ్ముకునే నిబంధన ఉంది. అంతకు మించి దిగుబడి వస్తే ప్రైవేటులో అ మ్ముకోవాల్సిందే. ఈ నిబంధన సడలించాలని రైతులు కోరుతున్నారు. -
తహసీల్దార్ కార్యాలయం వద్ద..
మహంకాళి దేవాలయంలో అమ్మవారికి పూజలు చేస్తున్న భవాని భక్తులుశ్రీ విల్లాస్ కాలనీలో మండపంలో అమ్మవారికి పూజలు..బొడ్రాయి సెంటర్ వద్ద అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులుజిల్లా కేంద్రం తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని శ్రీ లక్ష్మీగణపతి ఆలయంలో 45 ఏట శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. శ్రీ సంతోషిమాత ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలు, బాజాభజంత్రీల నడుమ పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. వందలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. బతుకమ్మకుంట శ్రీ విజయ దుర్గామాత, మహంకాళీ ఆలయంలో భక్తులు భవానీ మాత మాలలను ధరించారు. రైల్వే స్టేషన్ ఏరియా ఉప్పలమ్మ, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో అమ్మ వారిని బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. శ్రీ విల్లాస్ కాలనీలో అమ్మవారి వేడుకలను అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. -
హైవేల నిర్మాణ పనులు వేగవంతం కావాలి
జనగామ రూరల్: జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపాలన్నారు. రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగకుండా భూసేకరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదన్నారు. వీసీలో ఆర్డీవో గోపిరామ్, ఆర్అండ్బీ ఈఈ స్వరూపారాణి, మైనింగ్ అధికారి విజయ్ కుమార్, ఎఫ్ఆర్వో కొండల్రెడ్డి, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు. భూసేకరణ ప్రక్రియలో జాప్యం చేయొద్దు వీసీలో కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశం -
వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ
కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి హన్మకొండ/కాజీపేట రూరల్: వరంగల్ మహానగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని దిల్కుశ్ అతిథి గృహంలో బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని జిల్లాకు చెందిన విశ్రాంత పోస్టల్ ఉద్యోగులు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ భూనిర్వాసితులు కలిశారు. వరంగల్కు కేంద్ర ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ మంజూరు చేసినందుకు విశ్రాంత పోస్టల్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని రైతులు వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని, వెల్నెస్ సెంటర్ సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని విశ్రాంత ఉద్యోగులకు హామీ ఇచ్చారు. త్వరలో కాజీపేట రైల్వే పరంగా శుభవార్త తెలుపుతామని మంత్రి అన్నారని రైల్వే జేఏసీ కన్వీనర్ రాఘవేందర్ తెలిపారు. జనగామ రూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరిపాలన కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని మాత్రమే రద్దు చేశామని ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. లింగాలఘణపురం: ఏపీలో ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ పత్రికపై, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతుకను ఎవరూ ఆపలేరని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్తా అన్నారు. ఆదివారం మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీసులు, కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, అంతటితో ఆగకుండా సాక్షి మీడియాపై కూడా దాడులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం అవుతారని అన్నారు. టెట్పై ఆందోళన అవసరం లేదు విద్యారణ్యపురి: టెట్పై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైతే స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) నుంచి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భీమనాధుని రవి అన్నారు. ఆదివారం హనుమకొండలోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐదేళ్లకు మించి సర్వీస్ ఉన్న అందరూ టెట్ పాస్ కావాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్సీటీఈ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాల్ని అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా కామగోని రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేమునూరి రాంబాబు, జిల్లా ఆర్థిక కార్యదర్శిగా దానం శివకోటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
నేటినుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
జనగామ: దసరా పండగలో భాగంగా ఏటా నిర్వహించే శ్రీదేవీ దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాల కోసం జిల్లాలో నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. శక్తి స్వరూపిణి అమ్మవారి వేడుకలకు మండపాలు ముస్తాబయ్యాయి. మండపాలు విద్యుత్తు దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. అమ్మవారి నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగాయి. 10 ఫీట్ల నుంచి 20 ఫీట్ల ఎత్తులో ఉన్న విగ్రహాలను నిర్వహకులు కొనుగోలు చేశారు. ఈసారి 11 రోజుల పాటు దుర్గామాత ఉత్సవాలను నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్ కార్యాలయ ఏరియా, పాతబీటు బజార్, అంబేడ్కర్నగర్, వీవర్స్ కాలనీ, రెడ్డి స్ట్రీట్ (సుభాష్ బొమ్మ), అంబేడ్కర్ చౌరస్తా, గిర్నిగడ్డ, బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గా మాత ఆలయంతో పాటు జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజక వర్గాల కేంద్రాల పరిధిలో శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవోపేతంగా జరిపించేందుకు ఉత్సవ కమిటీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 45 ఏళ్లుగా శ్రీదేవి దుర్గామాత ఉత్సవాలు జిల్లాకేంద్రంలోని శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో 45 ఏళ్లుగా శ్రీ దేవీ దుర్గామాత ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సుల కోసం జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు వస్తారు. ప్రతి రోజు హోమాలు, కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో విలసిల్లుతుంది. 1981లో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు నేటితో 45వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాయి. చివరిరోజు రథసేవ (ఊరేగింపు)తో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. శ్రీసోమేశ్వరాలయంలో.. పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న తెలిపారు. 22న శ్రీబాలాత్రిపురసుందరీదేవిగా, 23న శ్రీగాయత్రీదేవి, 24న అన్నపూర్ణదేవి, 25న శ్రీకాత్యాయనీ దేవి, 26న శ్రీమహాలక్ష్మీదేవి, 27న శ్రీలలితా త్రిపుర సుందరిదేవి, 28న శ్రీమహాచండీదేవి, 29న శ్రీసరస్వతి దేవి, 30న శ్రీదుర్గాదేవి, ఆక్టోబర్ 1న శ్రీమహిషాసురమర్ధినీ దేవి, 2న శ్రీరాజరాజేశ్వరీదేవిగా చండిక అమ్మవారి అలంకరణ ఉంటుందని పేర్కొన్నారు. విజయదశమి సందర్భంగా మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం శమీ పూజతో ఉత్సవాలు ముగిస్తాయని తెలిపారు. జిల్లాలో ముస్తాబైన మండపాలు శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో 45 ఏళ్లుగా ఉత్సవాలు -
ఆర్థిక భరోసా ఏది?
నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న కులాంతర వివాహం చేసుకున్న జంటలుఉమ్మడి జిల్లాలో పెండింగ్ దరఖాస్తులు జిల్లా దరఖాస్తులు వరంగల్ 148 హనుమకొండ 133 జనగామ 180 మహబూబాబాద్ 139 ములుగు 97 భూపాలపల్లి 93 మొత్తం 790సాక్షి, వరంగల్: ఆదర్శ వివాహం చేసుకున్న దంపతులకు రావాల్సిన ఆర్థిక భరోసా నాలుగేళ్లుగా రాకపోవడంతో కులాంతర వివాహం చేసుకున్న వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2021 మే నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 791 జంటలకు సహాయం అందకపోవడంతో ఎప్పుడెప్పుడూ వస్తుందా.. అని నిరీక్షిస్తున్నారు. జిల్లాల షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారుల కార్యాలయానికి వారు వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అర్హులైన ప్రతిఒక్కరికి రూ.2.50 లక్షల బాండ్ను దంపతుల జాయింట్ బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తూ వారి ఉపాధికి బాటలు వేసేలా చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇంకోవైపు ఈ పథకానికి సంబంధించి అధికారులు సరైన అవగాహన కలిగించకపోవడంతో చాలా మంది ఆర్థిక ప్రోత్సాహానికి దరఖాస్తు చేయడం లేదనే విమర్శలున్నాయి. అయితే కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక భరోసా అందిస్తున్నా.. తెలియక చాలా మంది దూరంగా ఉండిపోతున్నారు.. నిధులు వస్తేనే.. కొన్నేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్న వారికి ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా రూ.10 వేలు అందించేవారు. ఆ తర్వాత నగదును రూ.50 వేలకు పెంచారు. 2019 నుంచి ఆ మొత్తాన్ని ఏకంగా రూ.2.50 లక్షలకు పెంచి బాండ్ రూపంలో దంపతులకు అందిస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని దంపతుల ఉమ్మడి ఖాతాలో మూడేళ్లపాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. మూడేళ్ల తర్వాత నగదును తీసుకొని ఆర్థికంగా ఎదగడానికి వారు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఆర్థిక భరోసా అందాలంటే దంపతుల్లో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ వర్గం, మరొకరు ఇతర వర్గానికి చెందినవారై ఉండాలి. అలాగే వివాహమైన జంట వార్షిక ఆదాయం రూ.ఐదు లక్షల కన్నా తక్కువగా ఉండాలి. వివాహ ధ్రువీకరణ పత్రం, దంపతుల ఫొటోలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, దంపతుల బ్యాంక్ జాయింట్ అకౌంట్, ఆధార్, రేషన్ కార్డు తదితర వివరాలతో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పిస్తే వాటిని పరిశీలించి అర్హులైన జంటలను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికై న జంటలు 2021 మే నుంచి ఎదురుచూస్తున్నారు. ‘మాకు 2022లో కులాంతర వివాహం జరిగింది. ఈ పథకానికి అవసరమైన అన్నీ పత్రాలు సమర్పించాం. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు మాకు ఆర్థిక భరోసా అందలేదు’అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆదర్శ వివాహం ఆర్థిక భరోసా విషయమై వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మీని సంప్రదిస్తే...ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాలి. అవీ విడుదల కాగానే దరఖాస్తు చేసిన జంటల్లో అర్హులైన వారికి ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేస్తామని సమాధానమిచ్చారు. రూ.2.50 లక్షల బాండ్ను డిపాజిట్ చేయడం ద్వారా ఉపాధివైపు ప్రేరణ ఆదర్శ వివాహాలను ప్రోత్సహించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చర్యలు నిధులు లేకపోవడంతో నీరుగారిపోతున్న ప్రభుత్వ లక్ష్యాలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు -
కళాసంపదను ముందుతరాలకు అందించాలి
నర్మెట: కళాసంపదను ముందుతరాలకు అందించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురానికి చెందిన ప్రఖాత్య కొయ్యబొమ్మల కళాకారుడు కీ.శే.మోతే జగన్నాథం అమూల్యమైన కళను గుర్తిస్తూ బిట్స్ పిలానీ (హైదరాబాద్) వారు జగన్నాథం సతీమణి మోతె ఉప్పలమ్మ, కుమారుడు కనకయ్య, నర్సయ్య, శ్రీనివాస్, బృందం సభ్యులు కొండయ్య, వీరయ్య, ఐలయ్య, యాదగిరి, మీనయ్య, శంకర్, రవి బృందాన్ని ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఎంపవరింగ్ లైవ్లీహుడ్స్, హానరింగ్ ఎక్సలెన్స్ నిర్వహించిన ఆశా గీతాంజలి 2025 కార్యక్రమంలో అమ్మఒడి నా తెలంగాణా రాయపూడి నాగేంద్ర రచించిన పుస్తకావిష్కరణలో బృదం బొమ్మలాటలను ప్రదర్శించి పలువురి మెప్పుపొందారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, సింగరేణి కాలరీస్ సీఎండీ బలరాం, బిట్స్ పిలానీ డైరెక్టర్ ప్రొఫెసర్ ముఖర్జీ, డీన్ ప్రొ. యోగీశ్వరిని, ప్రొ. ఎం. పాండురంగారావు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు పేరాల శేఖర్రావు, ప్రజాప్రతినిధులు పైడి రాకేశ్రెడ్డి, కోవ లక్ష్మి, పల్వాయి హరీశ్ బాబు, ఆదివాసీ కళాకారులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్వర్మ కొయ్యబొమ్మల కళాకారులకు సన్మానం -
90 రోజుల్లోనే అభివృద్ధి పనులు
ఎస్ఎస్తాడ్వాయి: 90 రోజుల్లోనే మేడారంలో అభివృద్ధి పనులు పూర్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈనెల 23న(మంగళవారం) మేడారానికి వస్తున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనను జిల్లా అధికారులు, పూజారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కోరారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి సీతక్క మేడారంలోని ఐటీడీఏ గెస్ట్హౌస్లో కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, జిల్లా ఉన్నతాధికారులతో పాటు సమ్మక్క–సారలమ్మ పూజారులతో మంత్రి సీతక్క ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 12 గంటలకు సీఎం మేడారానికి చేరుకుని తొలుత అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మాస్టర్ ప్లాన్ డిజైన్ పూజారులతో కలిసి సీఎం ఎల్ఈడీ స్క్రీన్పై ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. సీఎం పర్యటన మరుసటి రోజు నుంచి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 90 రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా యుద్ధ ప్రాతిపదికన సాగుతాయని, ఈ పనుల్లో 2వేల మంది పాల్గొనున్నట్లు వివరించారు. వనదేవతలపై సీఎం రేవంత్రెడ్డికి ఉన్న భక్తి విశ్వాసంతో మేడారం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఆయన ప్రత్యేక దృష్టిసారించి జాతరకు ముందుస్తుగా మేడారానికి వస్తున్నారని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
పల్లె పల్లె పూలసంద్రం
ఘనంగా మొదలైన పూలపండుగ ● మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుక ● అంబరాన్నంటిన ఆడపడుచుల సంబురం ● డీజే పాటలతో మార్మోగిన ఊరూవాడజనగామ: రాష్ట్ర పండగ బతుకమ్మ వేడుకలకు ఆడబిడ్డలు స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంతో పాటు 12 మండలాల పరిధిలో ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తీరొక్కపూలు పోగేసి తీర్చిదిద్దిన బతుకమ్మలతో సాయంత్రం సంధ్యావేళ అన్ని గ్రామాలు ఆధ్యాత్మిక తన్మయత్వంతో నిండిపోయాయి. యువతులు, మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. మండలాల పరిధిలో చెరువుల వద్ద ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేసి, ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. జనగామలోని రంగప్ప చెరువు, బతుకమ్మ కుంట, పాలకుర్తి ఊరచెరువు, స్టేషన్ఘన్పూర్లోని దేవాదుల రిజర్వాయర్ తదితర ప్రాంతాల వద్ద బతుకమ్మ సంబురాలను నిర్వహించి, అక్కడే నిమజ్జనం చేశారు. ఆడపడుచుల ఆటాపాట.. సంస్కృతి, సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ పండగతో కొత్తకళ సంతరించుకుంది. మహిళలు, యువతులు కొత్తబట్టలు ధరించి, గౌరమ్మగా భావించే బతుకమ్మలను చేతపట్టుకుని ఆటలాడేందుకు బయలుదేరారు. బతుకమ్మ సంబురాలతో జనగామ పురవీధులు శోభాయానమయ్యాయి. ఆర్టీసీ చౌరస్తా నుంచి సూర్యాపేట రోడ్డు మీదుగా బతుకమ్మకుంట వరకు మహిళలు బారులు తీరారు. ధర్మకంచ, గిర్నిగడ్డ, పాతబీటు బజారు, గ్రేయిన్ మార్కెట్, తహసీల్ కార్యాలయం, కుర్మవాడ, బాణాపురం, గణే ష్ స్ట్రీట్, వీవర్స్ కాలనీ, శ్రీ రామలింగేశ్వరస్వామి టెంపుల్, జీఎంఆర్ కాలలనీ, జ్యోతినగర్, గుండ్లగడ్డ, హౌజింగ్బోర్డు, అంబేడ్కర్నగర్, భవానీనగర్, శివాలయం, శ్రీవిల్లాస్, బాలాజీ, సాయినగర్, శ్రీ సాయి రెసిడెన్సీ, గీతానగర్, ప్రధాన కూడళ్లలో మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు బతుకమ్మ సంబురాలను జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేసే సమయంలో మహిహిళలు గౌరమ్మను ఇచ్చి పుచ్చుకుంటూ శ్రీశ్రీలక్ష్మీ నీమహిమలూ గౌరమ్మ, చిత్రమైతోచునమ్మా, భారతీ సతివయ్యూ బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవీవై, పరమేశురాణివై, శ్రీలక్ష్మీవయ్యూ గౌరమ్మ, భార్యవైతివి, ముక్కోటి దేవతలు.. శ్రీఅంటూ గౌరీదేవి స్తోత్రం పాడి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్ పర్యవేక్షణలో సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. సూర్యాపేట, సిద్దిపేట, హైదరాబాద్, వరంగల్ రోడ్డుపై ఇంటర్ సెప్టార్, బ్లూకోర్టు, క్రైం పోలీసులు అడుగడుగునా నిఘా ఉంచారు. వరుణుడి ఆటంకం.. బతుకమ్మ సంబురాల సమయంలో ఒక్కసారిగా జోరు వర్షం కురియడంతో మహిళలు ఇబ్బంది పడ్డారు. ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో మునిసిపల కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా, సుమారు 2వేల మంది మహిళలు సంబురాల్లో పాల్గొన్నారు. -
పూల సింగిడి
నేడు ఎంగిలిపూల బతుకమ్మ పండుగజనగామ: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అతిపెద్ద పండుగ బతుకమ్మ. నేడు ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా తంగేడు, గునుడు, చామంతి పూల అమ్మకాలు జోరందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పూలను తీసుకువచ్చిన కార్మికులు వాటితో ఉపాధి పొందుతున్నారు. వస్త్ర దుకాణాలు, రంగుల షాపులు మహిళలతో కిక్కిరిసి పోయాయి. నేటి నుంచి ఆరంభమయ్యే బతుకమ్మ వేడుకల సందర్భంగా నేల చామంతి, తంగేడు, గునుడు, గడ్డిపూలను సేకరించేందుకు చిన్నారులు అడవిబాట పట్టారు. అమ్మో చామంతి... ఈసారి బతుకమ్మ వేడుకలకు పూలు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. బంతిపూలు కిలో రూ.100 పలుకుతుండగా, చామంతికి డిమాండ్ బాగా పెరిగింది. కిలో పూలు రూ.550 ఉండగా, పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారింది. అటవీ ప్రాంతాల్లో తంగేడు చెట్లు కను మరుగుకావడంతో మార్కెట్లో రూ.100కు మూడు కట్టలు మాత్రమే ఇస్తున్నారు. ఆర్టీసీకి ఫుల్జోష్ నేటి నుంచి బతుకమ్మ పండుగతో పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రారంభమవుతుండటంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరి పోయింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో పాలకుర్తి బస్టాండ్ పనులు అసంపూర్తిగా ఉండడంతో ప్రయాణికులు వానలో తడుస్తూ, ఎండలో ఎండుతూ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉప్పల్, హనుమకొండ తదితర రూట్లలో నడిపించే స్పెషల్ బస్సు సర్వీసుల్లో టికెట్ చార్జీలు పెంచి తీసుకుంటున్నారు. సిద్దిపేట, నెహ్రూపార్కు, ఆర్టీసీ చౌరస్తాలో రోడ్డులో ట్రాఫిక్ పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నారు. బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ జోరందుకున్న పూల అమ్మకాలు -
ధాన్యం కొనుగోళ్లకు
సమాయత్తంజనగామ: వానాకాలం సీజన్ ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ శాఖల ఆధ్వర్యంలో 309 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఐకేపీ 185 (11 సన్నాలు), పీఏసీఎస్ 124 (198 దొడ్డు రకం) పరిధిలో ఉంటాయి. ఈ సీజన్లో జిల్లాలో 2.05 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరగనుందని ముందస్తు అంచనా వేశారు. ఇందుకు సంబంధించి 40 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ప్రస్తుతం జిల్లాలో 9 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన గన్నీల కోసం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసేలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 2.13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వచ్చే నెల అక్టోబర్ మాసం మొదటి వారం నుంచి కోతలు మొదలు కానున్నాయి. ఈసారి యూరియా కష్టాలు రావడంతో కొంతమేర దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత సాగు అంచనా మేరకు 4 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో కొంతమేర ప్రైవేట్ ద్వారా విక్రయాలు జరుగగా, ప్రభుత్వం 2.05లక్షల టన్నులు కొనుగోలు చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికలను తయారు చేసుకున్నారు. కేంద్రం ఈసారి వరి ధాన్యానికి మద్దతు ధర పెంచింది. క్వింటా ఏ గ్రేడ్ ధర రూ.2,389, కామన్కు రూ.2,369 మద్దతు ధర ఇవ్వనున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం తేమ కొలిచే యంత్రాలు 365, ఎలక్ట్రానిక్ కాంటాలు 352, టార్పాలిన్లు 6,853 ఉండగా, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు 179 అవసరముండగా, 122 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, నాణ్యత నియంత్రణ, నిల్వ, రవాణా సౌకర్యాలకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు, సాంకేతిక సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ధాన్యం రవాణా కోసం లారీ కాంట్రాక్టర్తో సంప్రదింపులు జరుపుతుండగా, మిల్లర్లతో సైతం చర్చలు కొనసాగుతున్నాయి. రైతులు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్మే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ముందుగానే స్పష్టం చేసింది. వేర్వేరుగా దొడ్డు, సన్నరకం కేంద్రాలు 2.05 లక్షల టన్నుల కొనుగోళ్లు అంచనా గన్నీ బ్యాగుల కోసం ప్రభుత్వానికి నివేదికఐకేపీ సెంటర్లు:185 పీఏసీఎస్ సెంటర్లు:124 కొనుగోళ్ల అంచనా : 2.05 లక్షల టన్నులు గన్నీ బ్యాగుల అవసరం: 40లక్షలువానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వచ్చే నెల అక్టోబర్ 15వ తేదీ నుంచి కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతులు మద్దతు ధరపై ధాన్యం అమ్మేందుకు వీలుగా స్పష్టమైన షెడ్యూల్ను గ్రామ, మండల స్థాయిల్లో వెల్లడించనున్నారు. ఈ క్రమంలో రైతులు ముందుగానే తమ పంటను తగిన తేమ స్థాయిలో ఆరబెట్టి, కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుల శ్రమ వృథా కాకుండా, వారికి మద్దతు ధర చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు భరోసా ఇస్తున్నారు. ఈసారి జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ పరిధిలో 309 ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. గత యాసంగి సీజన్ కంటే 22 సెంటర్లు పెరిగాయి. సెంటర్ల పరిధిలో గన్నీ బ్యాగుల కొరత రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత నాణ్యమైన సేవలను అందించే విధంగా ప్లాన్ చేస్తున్నాం. -
వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
లింగాలఘణపురం:స్వస్థ్నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామీణ మహిళలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ మ ల్లికార్జున్రావు కోరారు. శనివా రం మండల కేంద్రంలోని పీహెచ్సీలో జరుగుతున్న కార్యక్రమాన్ని పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 రోజుల పాటు వచ్చే అక్టోబర్ 1వ తేదీ వరకు జరిగే ఈ ప్రోగ్రాంలో పీహెచ్సీకి ఆయా విభాగాల ప్రత్యేక వైద్యులు వచ్చి సేవలు అందిస్తారన్నారు. ఆస్పత్రి సిబ్బంది కూడా గ్రామీణ మహిళలకు సేవలు అందేవిధంగా చూడాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ, గైనకాలజిస్టు డాక్టర్ శ్రీదేవి గర్భిణులకు, సీ్త్రలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి స్వర్ణలత, వైద్య సిబ్బంది ఉన్నారు. -
అడుగడుగునా నిఘా
జనగామ: బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా పట్టణంలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ (ఐపీఎస్) పండేరి చేతన్ నితిన్ అన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆదేశాల మేరకు నర్మెట సీఐ అబ్బయ్యగౌడ్, ఎస్సైలు భరత్, నగేష్, చెన్నకేశవులు ఆధ్వర్యంలో శనివారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. నాలుగు రోడ్ల జంక్షన్లో పోలీసులు వలయాకారంగా బందోబస్తు చేపట్టి, వాహన పత్రాలతో పాటు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లను నిర్వహించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ పండగ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే సమయంలో మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామన్నారు. బతుకమ్మ, దసరా పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు, నిఘా ఉంచుతున్నారన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
స్టేషన్ఘన్పూర్: పదే పదే చెప్తున్నా, ఇవే నా చివరి ఎన్నికలు.. నియోజకవర్గ అభివృద్ధే నా ప్రధాన ఎజెండా.. చిలిపి చేష్టలు లేవు, చిల్లర పనులు చేయను అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యపై ఘాటైన విమర్శలు చేశారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని రైతు వేదికలో రెవెన్యూశాఖ వారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం పాల్గొని మాట్లాడారు. రాజకీయ విలువలు లేకుండా నీచ రాజకీయాలు చేస్తున్నారని, వ్యక్తిగత దూషణలే కాకుండా కుటుంబ సభ్యులపై దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలు తల ఎత్తుకునేలా అభివృద్ధి చేస్తానన్నారు. కాగా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి రూ.1025 కోట్ల అభివృద్ధి పనులు తీసుకువచ్చానన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాపై ఉన్న నమ్మకంతో అడిగిందే తడువుగా నిధులు అందిస్తున్నారని, సీఎంకు రుణపడి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల నరేందర్రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఓ చంద్రన్కుమార్, నాయకులు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, అంబటి కిషన్రాజు, పోగుల సారంగపాణి, బూర్ల శంకర్, కొలిపాక సతీష్ తదితరులు పాల్గొన్నారు. చిలిపి చేష్టలు లేవు.. చిల్లర పనులు చేయను ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
విద్యావ్యవస్థలో పటిష్టమైన చర్యలు చేపట్టాలి
జనగామ రూరల్: విద్యావ్యవస్థలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా అధికారులను ఆదేశించారు. శని వారం కలెక్టరేట్లో విద్యావ్యవస్థ పటిష్టతకు తీసుకుంటున్న చర్యలను హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ అధికారి, ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్ కు మార్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యవంతులుగా ఉంటేనే విద్యపై దృష్టి పెడతారని, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని ప్రతీ రోజు అధికారులు పర్యవేక్షిస్తూ ఫొటోలు అప్ లోడ్ చేయాలన్నారు. 9, 10, ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకొని ప్రతిరోజు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేసి ప్రతీ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయిస్తామని, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాల పంపిణీ, విద్యార్థులకు యూనిఫామ్ అందించామన్నారు. నిరంతరం మధ్యాహ్న భోజ నానికి వినియోగించే కూరగాయలు, గుడ్లు, పప్పు వంటి సామగ్రి నాణ్యతను పరిశీలిస్తున్నామన్నారు. ఈ వీసీలో ఏఎంఓ శ్రీనివాస్, జిల్లా బాలికల పరిరక్షణ అధికారిణి గౌసియా బేగం, శ్రీకాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు జిల్లాలోని దుద్దేడలో 365 బి జాతీయ రహదారి పనులు సాఫీగా కొనసాగుతున్నాయని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జాతీయ రహదారుల పనుల ప్రగతిపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వీసీలో సమీక్షించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై 51శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ వీసీలో ఆర్డీఓ గోపిరామ్, జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో యూరియా నిల్వలను సమృద్ధిగా ఉన్న ట్లు ఇన్చార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సమన్వయంతో అన్ని మండలా ల్లో యూరియా నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో మొ త్తం 1,000 మెట్రిక్ టన్నులకుపైగా యూరియా నిల్వలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రతీ మండలానికి తగిన కోటా కేటాయించామని, రైతులు తమకు కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేట్ షాపుల ద్వారా యూరియా పొందవచ్చన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, మండల స్థాయి సిబ్బంది, సహకార సంఘాలు సమన్వయంతో పని చేయాలన్నారు. వీసీలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా -
హామీలను నెరవేర్చాలి
పాలకుర్తి టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉద్యమకారుల చైతన్య యాత్రలో భాగంగా మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనతంరం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమకారుల హామీల అమలుకు వెంటనే కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. 250 గజాల ఇంటి స్థలం, రూ. 25 వేల పెన్షన్, ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలన్నారు. ఉచిత బస్సు, ఆరోగ్యకార్డులు, సంక్షేమ పథకాల్లో 20 శాతం కోటా కేటాయించాలన్నారు. హామీల అమలుకు అక్టోబర్ 26న హైదరాబాద్ ఇందిరపార్క్లో జరిగే ఉద్యమకారుల సభను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నందగిరి రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి నలమాస రమేశ్, నియోజకవర్గ కన్వీనర్ సంగీ వెంకన్నయాదవ్, మండల అధ్యక్షుడు అనుమల అంజిరావు, గుగులోతు రాములు నాయక్, తిరుపతిరెడ్డి, యాకయ్యగౌడ్, రాజు, దండయ్య, మార్కేండయ్య, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ -
అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యం
పాలకుర్తి టౌన్: అక్రమ కేసులతో మీడియాను అణచివేయడం అసాధ్యమని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ సిద్దిపేట జి ల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్గుప్తా అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జగదీశ్వర్గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి మీడియా ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులను ప్రపంచ ఆర్యవైశ్య మహా సభ తీవ్రంగా ఖండిస్తుందని, వెంటనే కేసులను ఉ పసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘సాక్షి’ ఎడిటర్పై ఏపీ సర్కారు అక్రమ కేసులను ఎత్తివేయాలి సోమేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు తడక జగదీశ్వర్గుప్తా -
ఫోన్లు కొంటే బిల్లులు తీసుకోండి
జనగామ: ప్రజలు కొత్త ఫోన్లను కొనుగోలు చేసే సమయంలో బిల్లులను తీసుకుని భద్రపరుచుకోవాలని వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్తో కలిసి డీసీపీ పాల్గొన్నారు. జిల్లాలోని మండలాల వారీగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన సుమారు రూ.10లక్షల విలువ చేసే 52 ఫోన్లను డీసీపీ చేతుల మీదుగా యజమానులకు అందజేశారు. డీసీపీ మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు తక్కువ ధరకు విక్రయించే మొబైల్స్ కొని మోసపోవద్దని సూచించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు వందలాది మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందన్నారు. దసరా సెలవుల నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కుటుంబాలు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ భీంశర్మ, నర్సయ్య, అంబటి నర్సయ్య, సీఐలు దామోదర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అబ్బయ్య, వేణు, జానకీరాంరెడ్డి, శ్రీనివాసరావు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. సైబర్ క్రైం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి డీసీపీ రాజమహేంద్ర నాయక్ 52 మొబైల్స్ రికవరీ, బాధితులకు అందజేత -
రెండో పంటకు సాగునీరు
● యూరియా కొరత లేకుండా చూడాలి ● జిల్లా అధికారులతో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షజనగామ రూరల్: జిల్లాలోని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రెండో పంటకు సాగునీరు, యూరియా కొరత లేకుండా అందిస్తామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నీటిపారుదల పనులు, యూరియా పంపిణీపై ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ సుధీర్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం నీరు ఒక చుక్క వృథా కాకూడదని అధికారులకు సూచించారు. జిల్లాలో యూరియా పంపిణీకి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ప్రశంసించారు. సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సుహాసిని, ఆర్డీవోలు గోపిరామ్ డీఎస్ వెంకన్న, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ తహసీల్దార్లు, ఇంజనీరింగ్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
షాపింగ్..సందడి
జనగామ: తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ బతుకమ్మ సమీపిస్తుండడంతో జిల్లాకేంద్రంలోని దుకాణాల్లో సందడి నెలకొంది. మహిళలు, యువతులు కొత్త బట్టలు, బంగారు నగలు, అలంకార వస్తువుల కొనుగోళ్లలో మునిగిపోయారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య కేంద్రాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నెల 21వ తేదీన బతుకమ్మ పండుగ ప్రారంభం కానుండడంతో పల్లెలు, పట్టణాలు కోలాహాలంగా మారనున్నాయి. ప్రత్యేక ఆఫర్లు ప్రతి ఏటా దసరా, బతుకమ్మ సీజన్న్లోనే వ్యాపారులకు అధిక ఆదాయం వస్తుంది. ఈసారి కూడా చీరలు, సంప్రదాయ దుస్తులు, డిజైనర్ బట్టలకు పెద్దఎత్తున డిమాండ్ పెరిగింది. ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లతో వస్త్ర వ్యాపారులు వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా వన్గ్రామ్ గోల్డ్కు డిమాండ్ పెరిగింది. కొత్త ఆభరణాలతో పండుగను జరుపుకోవాలని మహిళలు ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ధరలు దూరం చేస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధరలు రూ.1.10 లక్షలకు పైగా పెరగడంతో మహిళలు వన్గ్రామ్ గోల్డ్ ఆభరణాల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. పండుగకు ముందుగానే బిజినెస్ ఊపందుకోవడంతో వ్యాపార వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలో జోరందుకున్న ‘బతుకమ్మ’ కొనుగోళ్లు కిటకిటలాడుతున్న కంగన్హాల్స్, బట్టల దుకాణాలు వన్గ్రామ్ గోల్డ్కు పెరిగిన గిరాకీ -
పబ్లిక్ ప్లీడర్గా నక్క సంధ్యారాణి
జనగామ రూరల్: జనగామ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషనన్స్ జెడ్జీస్ కోర్టు గవర్నమెంట్ ప్లీడర్గా జనగామ పట్టణానికి చెందిన నక్క సంధ్యారాణి శుక్రవారం నియమితులయ్యారు. హనుమకొండలోని ఆదర్శ లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తిచేసి 2009నుంచి న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నారు. కాగా తన నియామకానికి సహకరించిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, సీఎం ముఖ్యసలహాదారు వేం నరేందర్రెడ్డికి సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి కల్పించండి సారూ.. తరిగొప్పుల: తన భర్త 7 సంవత్సరాల క్రితం చనిపోయాడని, ఇద్దరు పిల్లలు, ఇంటిపోషణ కష్టంగా ఉందని, తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ మండలంలోని అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన గోరంతల అన్నపూర్ణ సీఎం ప్రజావాణి ఇన్చార్జ్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డిని శుక్రవారం కలసి వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఆయన పదో తరగతి వరకు చదువుకున్న అన్నపూర్ణకు అంగన్వాడీ టీచర్గా అవకాశం కల్పించారు. ఇల్లు లేని ఆమెకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని కలెక్టర్కు ప్రతిపాదించారు. బొడ్డెమ్మ..బొడ్డెమ్మా కోల్.. దేవరుప్పుల: మండల కేంద్రంలో బొడ్డెమ్మ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. స్థానిక బస్స్టేజీ కాలనీలో శుక్రవారం రాత్రి మహిళలు, చిన్నారులు బొడ్డెమ్మను ఘనంగా ఆడారు. బొడ్డెమ్మ విశిష్టతను నేటి యువతులకు తెలియజేసేలా మహిళలు గత వారం నుంచి జానపద నృత్యాలు, కోలాటాలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. రోగుల ఇబ్బందులు పట్టించుకోరా? జనగామ రూరల్: జిల్లా ఆసుపత్రిలో డెంగీ, మలేరియా వ్యాధులతో రోగులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాథుడులేడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ విమర్శించారు. శుక్రవారం జిల్లా ఆసుపత్రిని సందర్శించి వైద్యసేవలపై రోగులతో మాట్లాడారు.. ఏరియా హాస్పిటల్ వ్యాధిగ్రస్తులతో నిండిపోయిందని, బెడ్లు సరిపోక రోగులకు బయట వార్డులోనే వైద్యం చేస్తున్నారని ఆరోపించారు. రోగులకు మెరుగైన చికిత్స అందించి, నాణ్యమైన మందులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొమ్మకంటి అనీల్, ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీశ్, కేశపురం రవిరాజ్, తోకల హరీశ్, చంద్రయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. జానపద కళలను ప్రోత్సహించాలి దేవరుప్పుల: రాష్ట్రంలోని అన్నిరకాల జానపద కళారంగాలను ఎలాంటి వివక్ష లేకుండా ప్రోత్సహించాలని తెలంగాణ జానపద కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మహాంకాళి శ్రవణ్కుమార్, వర్కింగ్ స్టేట్ ప్రెసిడెంట్ గడ్డం హిమగిరి(అప్పిరెడ్డిపల్లె) ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లో ఇటీవల నూతనంగా నియమితులైన తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహరెడ్డిని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై చైతన్య ప్రదర్శనలకు 15 రోజుల లోపే పారితోషికం, చనిపోయిన ప్రతీ కళాకారుడి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఆరేగంటి పుల్లారావు, తాండ్ర అంబేడ్కర్, అందుగుల శ్రీను, శంకర్ పాల్గొన్నారు. -
ఆ 5 శాఖలు...!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు ముమ్మరమైనా.. కొందరు అధికారులు, ఉద్యోగుల్లో మార్పు లేదు. లంచం.. లంచం.. లంచం.. ఈ పదం కొన్ని శాఖల్లో సర్వసాధారణంగా మారింది. అవసరం కొద్ది లంచం ఇవ్వడం.. అధికారులు తీసుకోవడం అనివార్యంగా మారుతోంది. హద్దులు దాటి అధికంగా డిమాండ్ చేసినప్పుడు... బాధితులు ఏసీబీని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో పలువురు అధికారులు ఏసీబీకి చిక్కుతుండడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా రెవెన్యూ, రవాణా, పోలీసు, రిజిస్ట్రేషన్, విద్యుత్శాఖల్లో పెచ్చుమీరిన అవినీతి కొందరికీ శాపంగా మారింది. కాళేశ్వరం వివాదం తర్వాత నీటిపారుదలశాఖలో పనిచేసే అధికారులు కొందరు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో కటకటాల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఉమ్మడి వరంగల్లో అవినీతి, అక్రమాలు యథాతధంగా కొనసాగుతూనే ఉన్నాయి. వరుస ఘటనలు.. తీరుమారని అధికారులు... ఉమ్మడి వరంగల్లో వరుసగా కొందరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు. మరికొందరు ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదులతో దాడులకు గురవుతున్నారు. ఆగస్టులో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి, అక్రమాస్తులను గుర్తించారు. ఫిబ్రవరిలో వరంగల్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, సోదాలు నిర్వహించారు. అంతకుముందు ఇరిగేషన్ డిపార్టుమెంట్లో ఈఈగా పని చేస్తున్న నూనె శ్రీధర్పైన ఏసీబీ దాడులు నిర్వహించి రూ.200 కోట్ల వరకు ఆస్తులను గుర్తించినట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ జగదీశ్ ఓ బెల్లం వ్యాపారానికి సంబంధించి రూ.4లక్షలు డిమాండ్ చేసి లంచం తీసుకున్న కేసులో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలోని ఏఈ రమేశ్, ఆయన అసిస్టెంట్ రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ కేసు నుంచి నిందితులను తప్పించేందుకు లంచం తీసుకున్న పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్నను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం రూ.19,200లు మహబూబాబాద్ సబ్ రిజిష్ట్రార్ తస్లీమా మహమ్మద్ను అప్పట్లో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించి అక్రమాస్తులను గుర్తించారు. విద్యుత్శాఖ హైదరాబాద్లో పనిచేసే ఏడీఈ అంబేద్కర్పై ఏసీబీ దాడులు, వెల్లడైన అక్రమాస్తుల నేపథ్యంలో ఆశాఖ అధికారులపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఉమ్మడి వరంగల్లో వరుసగా ఏసీబీ దాడులు, కేసులు అవుతున్నా ఆ ఐదు శాఖల్లోని కొందరు అధికారుల్లో మార్పు రాకపోవడంపై చర్చ జరుగుతోంది. అవినీతి పరులపై ఆరా.. అవినీతి, అక్రమార్కులపై ఏసీబీ దూకుడు పెంచడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్, విద్యుత్శాఖలతో పాటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, ‘కుడా’లలోని పలు విభాగాల్లో కొందరు అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ పనికి ఓ రేటును ఫిక్స్ చేసి మధ్యవర్తుల ద్వారా వసూలు చేస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని కొందరు పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లపైన భూదందాలు, సెటిల్మెంట్ల పేరిట భారీగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల కోసం భూసేకరణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పేరిట రెవెన్యూ అధికారుల వసూళ్లు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వ, అసైన్డ్, ఎఫ్టీఎల్ స్థలాలు, ఎల్ఆర్ఎస్ లేని నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తూ భారీగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల కొందరు సబ్ రిజిస్ట్రార్లపై ఉన్నాయి. అదే విధంగా విద్యుత్శాఖలో కొందరు అధికారులు బినామీలను పెట్టుకుని కాంట్రాక్టులు చేస్తుండడంతో పాటు విద్యుత్ కనెక్షన్లు, సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో లంచాలు డిమాండ్ చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. రవాణాశాఖ హనుమకొండ, వరంగల్ డీటీఓ కార్యాలయాల్లో హద్దుల దాటిన అవినీతిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా ఏసీబీ అధికారులు మౌనం వహించడంపై చర్చ జరుగుతోంది. జీడబ్ల్యూఎంసీ, కుడాలలో కొందరు అవినీతి అధికారులపై బాధితులు ఏసీబీని సంప్రదించినట్లు చెప్తున్నారు. ఏదేమైనా ఏసీబీ దూకుడుతో రోజురోజుకూ అవినీతికి పాల్పడే వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. అవినీతి ఆరోపణల్లో ముందు వరుస తీరు మారని పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రవాణా, విద్యుత్ శాఖలు ఏసీబీకి చిక్కుతున్నా వీడని ఆయా శాఖల అధికారుల కక్కుర్తి కాసుల కోసం అడ్డదారులు.. అక్రమార్జనే ధ్యేయంగా పనులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వీరిపైనే అధిక ఫిర్యాదులు నీటిపారుదలశాఖ అధికారులపైనా పెరిగిన దాడులు -
టెక్నాలజీ ఉపయోగించి బోధించాలి
● జిల్లాస్థాయి టీఎల్ఎం మేళాలో ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్జనగామ రూరల్: విద్యార్థుల అభ్యసన ప్రగతికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి ఉత్తమ బోధన చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక సాయిరాం కన్వెన్షన్ హాల్లో జిల్లాస్థాయి టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్) మేళాలో నిర్వహించారు. జిల్లాలోని 12 మండలాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుచుకున్న ఉపాధ్యాయులు జిల్లాస్థాయిలో వాటిని ఎగ్జిబిట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ హాజరై ఎగ్జిబిట్లను పరిశీలించారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ప్రతీ మండలానికి పది చొప్పున మొత్తం 120 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఇన్చార్జ్ ఏఎంవో శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు రఘుజీ, డా.వెంకటేశం, రాజపాల్రెడ్డి, సుధాకర్, రాజేంద్రకుమార్, ఉపాధ్యాయులు వసంత, పద్మ, హిమబిందు, రాంబాబు పాల్గొనగా.. అనిత, దుర్గాప్రసాద్ ,నరసింహారావు,ఝాన్సీ లక్ష్మీ భాయ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మెరుగైన వైద్యసేవలందించాలి.. నిరుపేదలకు వైద్యసేవలు అందించడంపై వైద్యులు బాధ్యతగా వ్యవహరిస్తూ మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. మండలంలోని ఓబుల్కేశావాపూర్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఇన్చార్జ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా పీహెచ్సీలో ప్రముఖ డెంటల్ డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లినిక్ను పరిశీలించారు. ఎస్ఎన్ఎస్పీఏ స్పెషాలిటీ ఓపీ సేవలు ప్రతీ గ్రామంలో అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లావైద్యాధికారి మల్లికార్జునరావు, వైద్యులు పాల్గొన్నారు. -
లోపాలు లేని బిల్లింగ్ విధానం
ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) విధానంతో లోపాలు లేని బిల్లింగ్ విధానాన్ని అమలుచేసేందుకు ఇది చక్కగా దోహదపడుతుంది. హెచ్టీ విద్యుత్ బిల్లుల జారీలో మాన్యువల్తో వచ్చే సమస్యలను అధిగమిస్తాం. సర్కిల్ పరిధిలో అధిక సామర్థ్యం గల విద్యుత్తును పరిశ్రమలకు ముందుగా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల పరిధిలో 197 పరిశ్రమలు ఉండగా, నెలవారీ బిల్లుల డిమాండ్ రూ.12కోట్ల మేర ఉంటుంది. ఏఎంఆర్తో స్మార్ట్ మీటరింగ్ వ్యస్థత బలోపేతం కానుంది. ఈ విధానాన్ని ఎప్పటికప్పుడు డీఈ, ఏఈలు పర్యవేక్షిస్తారు. పరిశ్రమలు, ఇతర అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలనే సంకల్పంతో సంస్థ ముందుకెళ్తోంది. – టి.వేణుమాధవ్, ఎస్ఈ, ఎన్పీడీసీల్, జనగామ సర్కిల్ -
రైల్వేస్టేషన్లో స్వచ్ఛతా హీ సేవా
జనగామ రూరల్: సికింద్రాబాద్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ డీఓసీ ఆదేశాల మేరకు జనగామ రైల్వే స్టేషన్లో శుక్రవారం ‘స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం’ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ మాస్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ..దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ భారత్ ఽనిర్వహిస్తుందని అందులో భాగంగా ప్రత్యేక కార్యక్రమం, వాక్థాన్ నిర్వహించగా, ‘శ్రమదానంలో ఒక రోజు, ఒక గంట, అందరం కలసి..’అనే కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో ప్రశాంత్, ఏలియా, జోగు భాస్కర్, నక్క తిరుపతి, హాఫిజ్, క్లర్క్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
మూత ఎట్ల తీయల్నో!
కోతికి మందు బాటిల్ దొరికింది..అందులో ఏముందో..దాని మూత ఎట్ల తీయల్నో తెలియక కిందామీదా పడింది. గురువారం జనగామ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఓ వ్యక్తి బైక్లో మద్యం బాటిల్ ఉండగా..దాన్ని వానరం దొరకపట్టుకుంది. బాటిల్ను కౌగిలించుకుంటూ.. దాన్ని ఓపెన్ చేయడానికి విఫలయత్నం చేసింది. ఆ వైపుగా కోతిచేష్టలను చూస్తున్న బైక్ యజమాని మాత్రం బాటిల్ ఎక్కడ పగులుతుందోనని ఆందోళన చెందాడు. చివరకు వానరం మద్యం బాటిల్ను అక్కడే వదిలేసి చెట్ట్టెక్కి కూర్చుంది. దీంతో బైక్ యజమాని బాటిల్ సేఫ్.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. –జనగామ -
రేపు ఎస్జీఎఫ్ఐ ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ పోటీల ఎంపిక
జనగామ: జిల్లా కేంద్రంలో హన్మకొండ రోడ్డులోని సాంఘిక గురుకులంలో ఈ నెల 20వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలో 19 సంవత్సరాల కళాశాల బాలుర ఫుట్బాల్ క్రీడాపోటీల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని క్రీడల కన్వీనర్, పీడీ అజ్మీరా కిషన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ కళాశాల నుంచి ఐదుగురు క్రీడాకారులు మాత్రమే పాల్గొనాలన్నారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఈ నెలచివరి వారంలో రాష్ట్ర స్థాయిలో జరిగే ఫుట్బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. 20వ తేదీన ఉదయం 10 గంటలలోపు ఒరిజినల్ 10వ తరగతి మెమో, సాంఘిక గురుకులంలో ఉండాల ని, ఒరిజినల్ ఆధార్ కార్డుతో అందుబాటులో ఉండి, పేర్లను నమోదుచేసుకోవాలన్నారు. మ రిన్ని వివరాల కోసం 83749 10159, 98490 59284 నెంబర్లలో సంప్రదించాలన్నారు.సీపీఐ ఆల్ఇండియా మహాసభ ప్రతినిధుల ఎంపికజనగామ రూరల్: పంజాబ్ రాష్ట్ర రాజధాని చండీగర్లో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు సీపీఐ అఖిలభారత 24వ మహాసభ ప్రతినిధులుగా జిల్లా నుంచి పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి, సహాయ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి వారు కృతజ్ఞత తెలిపారు. దేశంలో జరుగుతున్న రాజకీయ అస్థిర పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీల అవసరం, ప్రాధాన్యం గురించి ప్రజల్లో ఏదైతే చర్చించుకుంటున్నారో దానికి అనుకూలంగా మహాసభలో చర్చిస్తామని రాజారెడ్డి చెప్పారు. జనగామ: జనగామ సబ్కోర్టు అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా(ఏపీపీ) పట్టణానికి చెందిన బండ శ్రీనివాస్ నియమితులయ్యారు. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన, 2011 నుంచి న్యాయవాది వృత్తిలో ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, యశస్వినీరెడ్డి, సీఎం సలహాదారులు వేం నరేందర్రెడ్డికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కవులపై వ్యాసరచన పోటీలుజనగామ రూరల్: రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో హైస్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిరికొండ కుమారస్వామి, శ్రీనివాసాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని కవులు బమ్మెర పోతన, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు, సుద్దాల హనుమంతు, వట్టికోట ఆళ్వార్స్వామి, వానమామలై వరదాచార్యులు, సురవరం ప్రతాపరెడ్డి, పాకాల యశోదారెడ్డి, బోయ జంగయ్య, సి.నారాయణరెడ్డి వంటి కవులపై జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. జిల్లాస్థాయిలో ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపిస్తామన్నారు. అక్టోబర్ 6వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాసాలను జిల్లా స్థాయికి పంపించాలని తెలియజేశారు. ఆసక్తి గల వారు 99897 24110 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని సూచించారు. యూరియా పంపిణీ పరిశీలనస్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ డివిజన్కేంద్రంలో గురువారం యూరియా బస్తాల పంపిణీని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న హాకా సెంటర్ను, హాకా గోదాంను ఆయన సందర్శించారు. సెంటర్లో ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు. అనంతరం హాకా సెంటర్ నిర్వాహకులతో, వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ రైతులకు సక్రమంగా యూరియా పంపిణీ చేయాలని సూచించారు. ఆయన వెంట ఏసీపీ భీమ్శర్మ, సీఐ జి.వేణు తదితరులు ఉన్నారు. -
క్రిస్టియన్ల అభివృద్ధికి చర్యలు
జనగామ రూరల్: క్రిస్టియన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటోందని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో క్రిస్టియన్ ప్రజల సమస్యలపై జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్లతో కలిసి పాస్టర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేద క్రిస్టియన్ సోదరులకు అందే విధంగా ప్రతీ ఆదివారం చర్చిలలో తెలియజేయాలని సూచించారు. పాస్టర్లు కోరిన విధంగా ప్రధాన సమస్యలపై దృష్టిపెట్టి ముందుగా ప్రతీ నియోజకవర్గంలో శ్మశాన వాటిక, కమ్యూనిటీ హల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చర్చి నిర్మాణాలకు అనుమతులు, కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుకు ప్రభుత్వ నిబంధనల మేరకు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో జనాభా లెక్కల ప్రకారం సుమారు 6వేలు క్రిస్టియన్లు ఉన్నారన్నారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజక వర్గాలలో బరియల్ గ్రౌండ్కు చర్యలు తీసుకుంటామని, మున్సిపాలిటీలలో కమ్యూనిటీ హాల్స్ కేటాయించామని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమాధికారి బి.విక్రమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొక్కడన్ -
అన్నింటికన్నా ఆరోగ్యమే మిన్న
బచ్చన్నపేట: అన్నింటికన్నా ఆరోగ్యమే మిన్నా అని అందుకుగానూ గ్రామాల్లోని వీధులను, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని సెకండరీ పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో 600 మంది విద్యార్థులతో కలిసి శ్రమదానం చేసి మొక్కలను నాటారు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛతాహీ సేవా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత పక్షోత్సవాలను చేపడుతూ గ్రామాల్లో పారిశుధ్ధ్యంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతీరోజు పాఠశాలలో విద్యార్థులకు పలు పోటీలను నిర్వహిస్తూ, గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులను అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి, మండల విద్యాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ రామానుజాచారి, ఎంపీడీఓ మమతాబాయ్, ఎంపీఓ వెంకటమల్లికార్జున్ ,డీసీ ఎస్బీఎం కర్ణాకర్, పంచాయతీ కార్యదర్శి అనిల్రాజ్, చక్రధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది కలగొద్దు రైతులకు సరిపడా యూరియా నిల్వలను ఉంచాలని వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాములలో గల యూరియా బస్తాల నిల్వలను పరిశీలించారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇళ్ల గురించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి లింగాలఘణపురం: విద్యార్థులు ప్రయోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ను పరిశీలించారు. అందులోని పరికరాలు, వాటిని వినియోగిస్తున్న తీరును తెలుసుకున్నారు. ప్రిన్సిపా ల్ సునిత, ఎంఈఓ విష్ణుమూర్తి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తిచేయాలి జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్లు వేగవంతంగా పూర్తిచేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై గూగుల్ మీట్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో 28,975 ఇందిరమ్మ ఇళ్లు చేపట్టడం జరిగిందన్నారు. ఈనెల 30లోపు నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి వంద శాతం ప్రగతి సాధించాలన్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ మాతృనాయక్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, సెక్రటరీలు పాల్గొన్నారు. పదిలో ప్రథమ స్థానంలో నిలవాలి పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలవాలని, విద్యార్థుల హాజరు 100శాతం నమోదు చేయాలని అలాగే పుస్తకాలు, యూనిఫాం పంపిణీ పూర్తి చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో పాఠశాలల ప్రగతిపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. దిక్సూచి ప్రోగ్రాంలోని ప్రతీ అంశంపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా కృషి చేయాలన్నారు. అక్టోబర్ నుంచి మధ్యాహ్న భోజన పథకం ఆన్లైన్ కానున్నదని అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 19, 20 తేదీల్లో ప్రతి ఎంఈఓ, ప్రధాన ఉపాధ్యాయులు కనీసం మూడు స్కూళ్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ ఏడీ మూర్తి, ఏఎంఓ శ్రీనివాస్, జిల్లా బాలికల పరిరక్షణ అధికారి గౌసియా బేగమ్, నాగరాజు,శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్కుమార్ -
రాష్ట్రపతి నిలయంలో గబ్బెట విద్యార్థులు
రఘునాథపల్లి: మండలంలోని గబ్బెట ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు గురువారం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. విజ్ఙాన సముపార్జనలో భాగంగా చారిత్రాత్మకమైన రాష్ట్రపతి నిలయాన్ని తిలకించడంలో విద్యార్థులు అసక్తిని కనబరిచారు. ఈ సందర్భంగా హెచ్ఎం సునంద మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న అభివృద్ధి సముపార్జనతో పాటు విద్యార్థులకు చారిత్రాత్మక, భౌగోళికమైన అంశాలపై అవగాహన ఎంతో అవసరమని, అందుకే రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకుమార్, ఉమాదేవి, జయ, సీఆర్పీ జ్యోతి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రేణుక, వీఓఏ రుక్సానా, ఎల్లమ్మ తదితరులు ఉన్నారు. -
జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు
● రైతులు ఆందోళన చెందవద్దు ● డీఏఓ అంబికా సోని జనగామ: జిల్లాలో వానాకాలం సీజన్లో పంటలకు సరిపడా యూరి యా ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయాధికారి అంబికా సోని అన్నారు. గురువారం ఆమె మా ట్లాడుతూ.. జిల్లాలోని 403.26 టన్నుల యూరియా సహకార సంఘాలు, ప్రైవేట్ కేంద్రాల వద్ద ఉందన్నారు. బచ్చన్నపేటలో 41.40 మెట్రిక్ టన్నులు, చిల్పూర్లో 48.98, దేవరుప్పులలో 20.00, స్టేషన్ ఘనపూర్లో 25.00, జనగామలో 44.00, కొడకండ్లలో 15.00, లింగాలఘణపురంలో 37.00, నర్మెటలో 27.88, పాలకుర్తిలో 25.00, రఘునాథపల్లిలో 56.00, తరిగొప్పులలో 28.00, జఫర్గడ్లో 35 టన్నుల నిల్వలు ఉన్నట్లు, సీజన్లో ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నామన్నారు. యూరియా వినియోగం ఎక్కువగా వరి పంటలోనే ఉంటుందన్నారు. జిల్లాలోని గ్రామాల వారీగా కేటాయించిన కేంద్రాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని, పంట దశను బట్టి రెండో లేదా మూడో మోతాదులో చల్లుకుని పంట ఉత్పత్తి పెరిగేలా చూసుకోవాలని డీఏఓ తెలిపారు. -
నిద్రాహారాలు అక్కడే..
● యూరియా కోసం అర్ధరాత్రి నుంచి క్యూలో రైతులు ● సొసైటీ గోదాం వద్దే నిద్ర, భోజనంపాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం సొసైటీ గోదాం వద్ద అర్ధరాత్రి నుంచి రైతులు క్యూలో ఉంటున్నారు. టోకెన్ల కోసం క్యూలైన్లో చెప్పులు, రాళ్లు పెట్టి అక్కడే నిద్రపోతున్నారు. తెల్లవారుజామున అక్కడికే భోజనం తెప్పించుకుని తింటున్నారు. గురువారం 244 బస్తాల యూరియా రాగా 800 మంది రైతులు బారులు తీరురారు. చివరికీ ఒక్క రైతుకు ఒక్క బస్తా చొప్పున 244 మందికి యూరియా అందజేశారు. మిగిలిన రైతులకు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకొని పేర్లు నమోదు చేసుకున్నారు. వారికి మరో దఫా అందించనున్నారు. -
‘వేటా’ బతుకమ్మ వేడుకలకు ఆహ్వానం
దేవరుప్పుల: అమెరికా కాలిఫోర్నియాలో వెటా ఆధ్వర్యంలో తలపెట్టిన బతుకమ్మ వేడుకలకు రాష్ట్రమంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్కకు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, వేటా వ్యవస్థాపక అధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి గురువారం హైదరాబాద్లో కలిసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా అమెరికాలో కాలిఫోర్నియా విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఝాన్సీరెడ్డితోపాటు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను విదేశాల్లోనూ వేటా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని, బతుకమ్మ వైభవాన్ని చాటుతామని తెలిపారు. వారితో పాటు భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఉన్నారు. -
ఉపాధ్యాయుడిని తిరిగి రప్పించండి
బచ్చన్నపేట: మండలంలోని చిన్నరామన్చర్లలో పనిచేసి డిప్యుటేషన్సై వెళ్లిన ఉపాధ్యాయుడు శ్రీని వాస్రెడ్డిని తిరిగి వెనక్కి రప్పించాలంటూ బుధవారం పాఠశాల ఎదుట గ్రామస్తులు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడంతో పాటు అభివృద్ధికి శ్రీనివాస్రెడ్డి బాటలు వేశారని, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తిరిగి రప్పించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నాయకులు, తల్లిదండ్రులు గంధమల మనోహర్, బుర్రి సుధాకర్, ఆజం తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఎదుట గ్రామస్తుల ధర్నా -
రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీలకు ఎంపిక
జఫర్గఢ్: మండలంలోని తమ్మడపల్లి(జి), తిడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు గాదె శ్రీజ, చెన్నూరి అంజలి రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆయా పాఠశాలల ప్ర ధానోపాధ్యాయులు సీతారామయ్య, దామెరకొండ సదానందం, పాఠశాలల పీఈటీలు శిరంశేట్టి శ్రీధర్, గోపు నరేశ్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వీరు ఈ నెల 22, 23, 24 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. పాలకుర్తి పాఠశాల విద్యార్థి.. పాలకుర్తి టౌన్: రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థి ఎల్లబోయిన చరణ్ ఎంపికై నట్లు బుధవారం ప్రధానోపాధ్యాయురాలు పాయం శోభారాణి, ఫిజికల్ డైరెక్టర్ మామిండ్ల సోమ్మల్లు తెలిపారు. గాదె శ్రీజతో ప్రధానోపాధ్యాయులు, పీఈటీ. చరణ్ను అభినందిస్తున్న హెచ్ఎం శోభారాణి -
స్వచ్ఛతా హీ సేవా షురూ..
జనగామ: దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని బుధవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రారంభించారు. ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీవో గోపీరామ్, డీఆర్డీవో పీడీ వసంత, జెడ్పీసీఈఓ మాధురీ షా, డిప్యూటీ సీఈఓ సరితతో కలిసి విప్ సెల్ఫీ ఫొటోతో విప్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, డీఈ లక్ష్మినారాయణరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పురపాలిక ఆధ్వర్యంలో.. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం పురస్కరించుకుని జనగామ పురపాలిక కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉద్యోగులు, సిబ్బంది, శానిటేషన్ కార్మికుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో స్వచ్ఛత నెలకొలిపేందుకు అంకిత భావంతో పని చేస్తామని ఉద్యోగులు, పురపాలిక చేసే కార్యక్రమంలో భాగస్వామ్యులుగా ఉంటామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. -
మహిళలకు ఆరోగ్య భద్రత
జనగామ: కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మహిళల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విప్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రోగ్రాం ఆవిష్కరించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ పద్ధతిలో లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి విప్ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పుట్టబోయే శిశువుల సంపూర్ణ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, కాబోయే తల్లులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శిశు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి, సేవలు ప్రారంభించాయన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తున్నారనే భావనతో ప్రభుత్వం బుధవారం నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 15 రోజులు పాటు ప్రతి వైద్యకేంద్రంలోనూ నిరంతరం సేవలందించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజు వైద్య నిపుణుల పర్యవేక్షణలో సేవలు కొనసాగుతాయన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులు ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చేందుకు తీసుకోవలసిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ, పౌష్టికాహారానికి సంబంధించి స్టాల్స్ ప్రదర్శించారు. ఐదు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో మాధురి షా, ఆర్డీవో గోపిరామ్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఫ్లోరెనన్స్, ప్రొఫెసర్, డాక్టర్ గోపాల్రావు, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్రెడ్డి, ఎంసీహెచ్ిపీఓ డాక్టర్ అశోక్ కుమార్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, ఆర్డీఏ మెంబర్ అభిగౌడ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సుధీర్, డాక్టర్లు స్వర్ణకుమారి, అజయ్, కమల్, గర్భిణులు, మహిళలు పాల్గొన్నారు. ఎంసీహెచ్లో స్వస్థనారీ స్వశక్త్ పరివార్ అభియాన్ను ప్రారంభించిన విప్ అయిలయ్య అక్టోబర్ 2వరకు ప్రతీ వైద్యకేంద్రంలోనూ నిరంతర సేవలు: ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్గత ప్రభుత్వ స్టిక్కర్పై ఆగ్రహంజనగామ: జనగామ ఎంసీహెచ్లో స్వస్థనారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో బుధవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య గత ప్రభుత్వం సర్జికల్ ప్యాకెట్పై ముద్రించిన స్టిక్కర్ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు ఏర్పాటు చేసిన చాంబర్ను పరిశీలించే క్రమంలో నాటి సర్కారు పేరిట ఉన్న స్టిక్కర్ను విప్ గమనించారు. ఇదేంటని ఆగ్రహం వ్యక్తం చేయడంతో..అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వెంటనే దానిని తొలగించారు. మెడికల్ ప్యాకెట్లపై గత ప్రభుత్వ స్టిక్కర్లు ఉన్నా..ఎందుకు పరిశీలించలేదని, మొదటి తప్పుగా వదిలేస్తున్నామన్నారు. మరోసారి రిపీట్ కావద్దన్నారు. -
త్యాగఫలం!
పోరాటయోధుల వేడుకలకు హాజరైన నాయకులు, ప్రజలు, అధికారులుజాతీయ జెండాను ఎగురవేసి, సెల్యూట్ చేస్తున్న విప్ అయిలయ్యజనగామ: ఎందరో పోరాట యోధుల బలిదానంతోనే మనమంతా స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. జనగామ కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం జరిగిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి ఇన్చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ విప్ అయిలయ్యకు ఘన స్వాగతం పలికారు. ముందుగా బీర్ల అయిలయ్య అమర వీరుల స్థూపానికి నివాళులర్పించి, జాతీయ జెండా ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల విధ్వంసం తర్వాత సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనతో స్వేచ్ఛగా బతుకుతున్నామన్నారు. నిజాం పాలన నుంచి విముక్తి పొంది 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామన్నారు. సంక్షేమంతో పాటు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేస్తూ కోటీశ్వరులను చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి కంకణబద్ధులై పనిచేస్తున్నారన్నారు. విద్యలో ఆదర్శం.. జాతీయ స్థాయిలో జరిగిన న్యాస్లో మొదటి 50 జిల్లాల జాబితాలో జనగామ జిల్లాకు ఉత్తమ చోటు దక్కగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్వన్గా నిలిచి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పుర స్కరించుకుని హైదరాబాద్ శిల్పకళా వేదికలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా అవార్డులను అందుకోవడం జిల్లాకే గర్వకారణమన్నారు. అలాగే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రత్యేక చొరవ తీసుకుని దిక్సూచి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సుహాసిని, జెడ్పీ సీఈవో మాధురీ షా, ఆర్డీవో గోపీరామ్, తహసీల్దార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రంలో మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని అందించే మహాలక్ష్మి పథకంతో జిల్లాలో ఇప్పటివరకు రూ.2కోట్ల47లక్షల విలువైన ప్రయాణఖర్చు ఆదా కాగా, దీనిని ప్రభుత్వమే భరించిందని ప్రభుత్వ విప్ తెలిపారు. నిరుపేదలకు సొంత ఇంటికలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 55, 998ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. న్యాస్లో జనగామ జిల్లా జాతీయ స్థాయిలో ఉత్తమంగా నిలువడం అభినందనీయమన్నారు. గృహజ్యోతి స్కీం ద్వారా జిల్లాలో 14లక్షల59వేల470 జీరో బిల్లులు జారీ చేయగా, 92వేల774 కుటుంబాలు రూ.42 కోట్ల జీరో బిల్లులు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల సంక్షోభం తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన ఆడపడుచులను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ లక్ష్యం ప్రజాపాలన వేడుకల్లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు -
యూరియా కోసం రాస్తారోకో
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఘన్పూర్–పాలకుర్తి రోడ్డుపై యూరియా బస్తాల కోసం రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. శివునిపల్లి ఆగ్రోస్ సెంటర్ వద్దకు యూరియా స్టాక్ వస్తుందనే సమాచారంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో చేరుకుని క్యూలో నిల్చున్నారు. మధ్యాహ్నం వరకు స్టాక్ రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. కాగా మధ్యాహ్న సమయంలో ఆగ్రోస్ సెంటర్కు రావాల్సిన 266 బస్తాల లోడ్ గోదాంకు వెళ్తుండగా గుర్తించిన రైతులు వెంటనే యూరియా బస్తాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండలో క్యూలో నిల్చున్నా ఒక్క యూరియా బస్తా దొరకడం లేదని, రైతుల సమస్యలు అధికారులు, పాలకులకు పట్టడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. కాగా విషయం తెలుసుకున్న ఏఓ చంద్రన్కుమార్ శివునిపల్లి ఆగ్రోస్ సెంటర్కు చేరుకుని రాస్తారోకో చేస్తున్న రైతులకు నచ్చజెప్పారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్యలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. -
పూర్వ విద్యార్థులు సహకారం అందించాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలలో చదువుకొని వివిధ దేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల కృషిని అభినందిస్తూ, వర్సిటీ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు సహకారం అందించాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి కోరారు. అమెరికాలోని అట్లాంటాలో ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించగా బుధవారం వీసీ ప్రతాప్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సెలబ్రెట్ అండ్ కంట్రిబ్యూట్ అనే థీమ్తో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సమూహాలు యూనివర్సిటీ గ్లోబల్ భాగస్వా్ామ్యనికి రావాలని కోరారు. అల్యుమ్ని గోల్డెన్జూబ్లీ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అమెరికా సంయుక్తరాష్ట్రాల విశ్వవిద్యాలయ ఫార్మసీ చాప్టర్, కేయూ ఫార్మసీ విభాగం పూర్వవిద్యార్థి డాక్టర్ సాంబారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పరుచూరితో పాటుగా పూర్వవిద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి -
కృత్రిమమేధ.. కీలకపాత్ర
విద్యారణ్యపురి : వ్యవసాయం, ఫార్మా, వ్యాపార, వాణిజ్య తదితర రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) కీలకపాత్ర పోషిస్తోందని కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. బుధవారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీఅండ్ పీజీ కళాశాలలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీ షేపింగ్ ది లాండ్స్కేప్ ఆఫ్ కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సులో హైదరాబాద్ ఎంజెల్స్ సీఈఓ, ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ రత్నాకర్ సామవేదం కీలక ఉపన్యాసం చేశారు. అనంతరం అతిథులు సావనీర్ను ఆవిష్కరించారు. పలువురు పరిశోధన పత్రాలు సమర్పించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, సదస్సు కన్వీనర్ డాక్టర్ రాజిరెడ్డి, కేయూ ప్రొఫెసర్ పి.అమరవేణి, కామర్స్ విభాగం అధిపతి డాక్టర్ సారంగపాణి, హుస్నాబాద్ కాలేజీ ప్రిన్సిపాల్ భిక్షపతి, అధ్యాపకులు పాల్గొన్నారు. కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ -
భూసమస్యలను వేగంగా పరిష్కరించాలి
జనగామ రూరల్: భూసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ సెక్రటరీ లోకేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ సెక్రెటరీ సాదాబైనామా పరిష్కారం, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..సాదాబైనా మాకు సంబంధించి భూములు కొన్నవారికి, అమ్మినవారికి నోటీసులు ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సాదాబైనామా రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..సాదాబైనామాలలో 33 వేల దరఖాస్తులు రాబోయే రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని తదనుగుణంగా అధికా రులకు అదేశాలు ఇచ్చామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి సుహాసిని, జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీఓలు గోపిరామ్, డీఎస్.వెంకన్న, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ మన్నెంకొండ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వీసీలో రాష్ట్ర రెవెన్యూ సెక్రటరీ లోకేశ్ కుమార్ -
సేవా కార్యక్రమాలను చేపట్టాలి
బచ్చన్నపేట: ప్రభుత్వ ఆదేశానుసారం మండలంలోని పలు గ్రామాల్లో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోనీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పలువురు అధికా రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాలను చేపట్టాలన్నా రు. పోషణ్ అభియాన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రోజువారీ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఎంపీడీఓ మమతాబాయ్, మండల వ్యవసాయ అధికారి విద్యాకర్రెడ్డి, మండల వైద్యాధికారి సృజన, ఎంపీఓ వెంకటమల్లికార్జున్, పలు శాఖల ఏఈలు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఓరుగల్లులో రణనినాదం
భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం ఆనాడు ప్రజలు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. దొరలు, దేశ్ముఖ్లను గడగడలాడించి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో నిజాం పాపపు పాలనకు చరమగీతం పాడారు. రాక్షస రజాకార్ల అరాచకాలను ఎండగట్టారు. పంటను పాలకులు లాక్కుంటే మహిళలు వేటకొడవళ్లతో తరిమికొట్టారు. ఈ నేల నుంచి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యతోపాటు అనేక మంది అమరులయ్యారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఉద్యమాలు, వీరోచిత పోరాటంపై (సెప్టెంబర్ 17 సందర్భంగా) ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.పరకాల: పరకాల పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సాయుధ పోరాటంలో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు 1947 సెప్టెంబర్ 2న అనేక గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. అప్పటికే ఇక్కడ నిజాం పోలీసులు మకాం వేశారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది అమరులయ్యారు. రజాకారులు వెంటాడి 180 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చిచంపారు. చంద్రగిరి గు ట్టలను కేంద్రంగా చేసుకుని సా యుధ పోరాటం జరిపారు. మరో జలియన్వాలాబాగ్ ఘటనను కళ్లకు కట్టినట్లు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, చెన్నమనేని విద్యాసాగర్రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున వందలాది విగ్రహాలను తయారు చేయించారు. పరకాల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రెండేళ్లుగా శ్రమించి 2003 సెప్టెంబర్ 17 ఆ విగ్రహాలతో ఏర్పాటు చేసిన అమరధామాన్ని ఆయన ప్రారంభించారు.చరిత్రకు సాక్ష్యం ‘జనగామ రైల్వేస్టేషన్జనగామ: దొరల ఆగడాలకు చరమగీతం పాడింది జనగామ రైల్వేస్టేషన్. విస్నూరు దొర లష్కర్ (సికింద్రాబాద్)కు పారిపోయే ప్రయత్నంలో సాయుధ పోరాట యోధులు మట్టుబెట్టి తమ వీరత్వాన్ని చాటుకున్నారు. విస్నూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి కొడుకు బాబు దొర అరాచకాలు మితిమీరిపోయాయి. 1947లో సవారు కచ్చురంలో నలుగురు విప్లవకారుల కాళ్లు, చేతులను కట్టేసి తన గూండాలతో గడ్డివాములో తలదాచుకుని తెల్లవారు జామున 4 గంటల వరకు లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చేరుకున్నాడు. ఊరి శివారున ఉన్న ఈత చెట్ల సమీపంలో ముగ్గురిని చంపేశాడు. ఇందులో ఓ ఉద్యమకారుడు చాకచక్యంగా తప్పించుకుని, కుందారం గ్రామానికి చేరుకుని జరిగిన ఘటనను స్థానికులకు వివరించాడు. దీంతో పదివేల మందికిపైగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దొర పోలీస్ స్టేషన్లో తలదాచుకుని రైల్వేస్టేషన్ సమీపంలోని పాత ఎస్బీహెచ్ ఆవరణలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విప్లవ యోధుడు గబ్బెట తిరుమల్రెడ్డి నాయకత్వంలో జాటోత్ దరాగ్యనాయక్, మరికొందరు విప్లవకారులు నాటి రైల్వే వ్యాగన్ ఏరియాలో దొర రాకకోసం ఎదురు చూశారు. పట్టాలపై ఆగిఉన్న గూడ్స్ రైలు కింది నుంచి దాటుకుంటూ వ్యాగన్ పాయింట్ మర్రిచెట్టు కిందకు రాగానే దరాగ్యనాయక్.. దొర మెడపై మొదటి వేటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విప్లవకారులు దొరను చిత్రహింసలు పెట్టి చంపేశారు. అనంతరం ప్రజలు సంబురాలు చేసుకున్నారు. దొరకు చరమగీతం పలికిన రైల్వేస్టేషన్ నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.పోలీసు ఉద్యోగం వదిలి..మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన రేగూరి చంద్రారెడ్డి నాడు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేశారు. పోలీసు ఉద్యోగం మానేసి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పరకాల కేంద్రంగా సాయుధ పోరాటం చేసిన యోధుల్లో చివరగా మిగిలిన.. ఆయన ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. -
పేద విద్యార్థులకు ‘ఉపకారం’
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులు సహకరించక ఎంతో మంది పేద విద్యార్థులు మధ్యలోనే చదువులను ఆపేస్తున్నా రు. విద్యార్థులకు ప్రతిభ సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలు వెంటాడడంతో తల్లిదండ్రులు మధ్యలోనే చదువు మాన్పించి తమకు అండగా ఉండేందుకు ఇంటి పనులు, కూలీపనులకు తీసుకెళ్తున్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా నేటి పరిస్థితుల్లో విద్యకు దూరం కాకుండా ఉండేందుకు వారికి అండగా కేంద్రప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈపథకం వల్ల ప్రతిభ ఉండి చదువుకు దూరమయ్యే విద్యార్థులకు ఉన్నత చదువుల కు తోడ్పాటు అందించనుంది. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి అర్హత పరీక్ష ప్రకటనను ఇటీవల విడుదల చేసింది. అన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించింది. నవంబర్ 23న జిల్లా వ్యాప్తంగా పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉండాల్సిన అర్హతలు.. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడోతరగతి పరీక్షలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులుంటే సరిపోతుంది. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠ శాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండి చదివేవారు ఈపరీక్షకు అర్హులు కాదు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 ఫీజు చెల్లించాలి. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ధ్రువీకరిస్తూ బోనఫైడ్ ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్ష ల్లోపు ఉండాలి. దరఖాస్తు విధానం ఇలా.. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా కేంద్రంలో ఉన్న డీఈఓ కార్యాలయానికి అందజేయాలి. ముందుగా అన్లైన్లో దరఖాస్తు ఫారాలను తీసుకుని వివరాలు పూరించాక వాటితో పాటు ఓసీ, బీసీ, మైనార్టీలు అయితే రూ.100 , ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు అయితే రూ.50 డీడీ తీసీ జిల్లా కార్యాలయంలో అందజేయాలి. దేశవ్యాప్తంగా నవంబర్ 23న నిర్వహించే ఈపరీక్షకు మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఉపాధ్యాయులు చొరవ చూపాలి..పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు ఇలాంటి పరీక్షలు రాయించేందుకు చొరవ చూపాలి. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలను ప్రోత్సహిస్తే ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 103 ఉన్నత పాఠశాల్లో 8వ తరగతి చదువుతున్న వారు అర్హులు. 7వ తరగతిలో 55 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వారికి 50 శాతం ఉంటే సరిపోతుంది. మొత్తం 6 వేలకు పైగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతారు. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్తో ఆర్థిక భరోసా అర్హత సాధిస్తే ఏడాదికి రూ.12వేలు 9నుంచి–12వ తరగతుల వరకు నేరుగా ఖాతాల్లో జమ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 6.. నవంబర్ 23న పరీక్ష గ్రామీణ విద్యార్థుల్లో డ్రాపవుట్లను తగ్గించడమే లక్ష్యంపరీక్ష విధానం.. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మెంటల్ ఎబిలిటీ (ఎంఏటీ), స్కాలాస్టిక్ ఎబిలిటీ (ఎస్ఏటీ), ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించిన గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 180 మార్కుల పరీక్షలో ప్రశ్నపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్– ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్న పరీక్ష, నంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, కోడింగ్, డీకోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ సంబంధించిన అంశాలు ఉంటాయి. పార్ట్–బీలో ఏడు, 8వ తరగతికి సంబంధించి 30 ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. వాటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 35, సాంఘిక శాస్త్రం 35మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. -
అతివల ఆరోగ్యానికి నవశకం
జనగామ: మహిళల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకం స్వస్థా నారీ సశక్త్ పరివార్ అభియాన్. బుధవారం(నేటి) నుంచి సేవలు అందుబాటులో రానున్నాయి. వచ్చేనెల 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. మారుతున్న జీవనశైలి, వాతావరణ ప్రభావాలతో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లను అధిగమించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రాం ముందుకుసాగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకంలో శిబిరాలను ఏర్పాట్లు చేస్తున్నారు. విప్ చేతుల మీదుగా.. జనగామ చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చేతుల మీదుగా స్వస్థానారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వచ్చే నెల 2వ తేదీ చివరి రోజు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ప్రత్యేక వైద్య సేవలు ఇవే.. స్వస్థానారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రోగ్రాంలో నేత్ర, దంత, చెవి, ముక్కు, గొంతు, ప్రసూతి, మానసిక ఆరోగ్య, బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, రక్తహీనత వంటి వైద్య పరీక్షలు చేస్తారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రత్యేక వైద్య పరీక్షల ద్వారా రోగనిర్ధాణ చేసి, అవసరమైన మందులను ఉచితంగా అక్కడే అందిస్తారు. 0–5 సంవత్సరాల చిన్నారులకు టీకాలు సైతం వేస్తారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 15 ఆరోగ్య, 3 సామాజిక, 62 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, రోజువారీగా 1,300వరకు ఓపీ సేవలు ఉంటాయి. అలాగే బస్తీ దవాఖానాలు, జనరల్ ఆసుపత్రుల్లో సైతం ఉచిత వైద్యం కొనసాగుతుంది. ప్రతిరోజూ 6 వైద్య శిబిరాలు.. ప్రతిరోజూ జిల్లాలో ఆరు వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. మహిళలతో పాటు చిన్నారులకు కూడా పరీక్షలు చేస్తారు. పౌష్టికాహార లోపాలు గల చిన్నారులను న్యూట్రీషన్ రిహాబిలిటేషన్ సెంటర్కు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ప్రతీ మహిళ, కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. నేడు ప్రభుత్వ విప్ బీర్ల చేతుల మీదుగా స్వస్థానారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభం ఎంసీహెచ్లో ఏర్పాట్లు పూర్తిచేసిన వైద్య ఆరోగ్య శాఖ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వైద్యపరీక్షలు, మందులు -
సర్వం సిద్ధం
● కలెక్టరేట్ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి ● జాతీయ జెండా ఆవిష్కరించనున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జనగామ: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని సర్వం సిద్ధం చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేడుకలకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. 9.48గంటలకు వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ వేదిక ప్రాంగణం చేరుకుంటారు. 9.58 నిమిషాలకు రానున్న విప్ బీర్ల అయిలయ్యకు అదనపు కలెక్టర్లు స్వాగతం పలుకుతారు. 10 గంటలకు విప్ జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం, జాతీయ గీతం ఆలపిస్తారు. 10.02 గంటలకు పోలీసుల గౌరవ వందనం, 10.15 వరకు చీఫ్గెస్ట్ ప్రసంగంతో ముగుస్తుంది. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ.. కలెక్టరెట్ ప్రాంగణంలో జరిగే ప్రజాపాలన దినోత్సవ వేడుకల నేపథ్యంలో పడక్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సమీక్షలో జనగామ ఆర్డీవో గోపిరామ్, మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
● అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ జనగామ రూరల్: పర్యావరణాన్ని సంరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓజోన్ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు. కాగా జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు బ్రాండ్ అంబాసిడర్గా గౌసియా బేగంను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర హరితదల డైరెక్టర్ ప్రసన్నకుమార్ నియమక పత్రం అందజేశారని గౌసియా బేగంను అదనపు కలెక్టర్ అభినందించారు. డీసీపీ రాజామహేంద్రనాయక్, అర్డీవో గోపిరామ్ పాల్గొన్నారు. పకడ్బందీగా ప్రశ్నపత్రాల రూపకల్పన ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్, డీఈఓ పింకేశ్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఉమ్మడి పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఎస్ఏ–1 ప్రశ్నపత్రాల తయారీతో పాటు ధ్రువీకరణ, నిర్ధారణ అంశాలపై సమావేశం నిర్వహించారు. పరీక్షల కార్యదర్శి ఎ.చంద్రబాను, రామరాజు పాల్గొన్నారు. -
సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర
జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీనర్సింహరావు కొడకండ్ల: విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజ అభివృద్ధి కీలకపాత్ర పోషించేది ఉపాధ్యాయులేనని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మండల ప్రత్యేక అధికారి ఎన్.లక్ష్మీనర్సింహరావు కొని యాడారు. మంగళవారం మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 18 మంది, జిల్లా స్థాయిలో ఎంపికై న ఏడుగురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎంపీడీఓ నాగశేషాద్రిసూ రి, ఎంఈఓ గ్రేస్కేజియారాణి, ప్రిన్సిపాళ్లు దిలీప్కుమార్, భానుప్రసాద్, రవీందర్ పాల్గొన్నారు. -
సోమేశ్వరాలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ‘ఆరుద్రోత్సవం’ కార్యక్రమం మేళతాళాలు, అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య మంగళవారం మహావైభవోపేతంగా జరిగింది. పంచ హరతులు, గర్భాలయ దీపోత్సవం నిర్వహించారు. ఆరుద్రోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని కనులారా తిలకించారు. ఆలయ ఈవో సల్వాది మోహన్బాబు, ఆలయ ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, అర్చకులు డీవీఆర్శర్మ, అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, భక్తులు పాల్గొన్నారు. పట్టాలెక్కిన టీచర్ల సర్దుబాటు వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి జనగామ: టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పట్టాలెక్కింది. టీచర్ల పదోన్నతులతో ఖాళీ అయిన బడులతో పాటు పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి, తక్కువ ఉన్న ఉపాధ్యాయుల స్థానంలో వర్క్ అడ్జెస్ట్మెంటు చేయాల్సి ఉంటుంది. సుమారు 80 మంది టీచర్ల వరకు సర్దుబాటు జరుగుతుందని అంచనా. ఈ మేరకు ఇటీవల సాక్షిలో ‘పట్టాలెక్కని టీచర్ల సర్దుబాటు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఈవో పింకేశ్ కుమార్ మంగళవారం స్పందించారు. సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైందని, వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఈసారి జరిగే సర్దుబాటులో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా ఉండేలా చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. సర్దుబాటు జాప్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షూటింగ్బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక స్టేషన్ఘన్పూర్: రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీలకు ఘన్పూర్ హోలీక్రాస్ స్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థి యాట ఆనంద్, చిల్పూరు మండలం రాజవరం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు ఎడ్ల సన్నీ, ఎడ్ల సింధు ఎంపికై నట్లు షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఘన్పూర్ డివిజన్కేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి షూటింగ్బాల్ క్రీడల ఎంపిక పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన ముగ్గురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 22, 23, 24వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను షూటింగ్బాల్ అసోసియేషన్ బాధ్యులు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు అభినందించారు. -
విజయ డెయిరీదే అగ్రస్థానం
జనగామ రూరల్: పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పాల సేకరణలో జనగామ పాడి రైతుల కృషి అభినందనీయమని రాష్ట్రంలోనే పాల సేకరణలో విజయ డెయిరీదే అగ్రస్థానమని విజయ పాల డెయిరీ రాష్ట్ర చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని విజయ డెయిరీలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్రెడ్డి మాట్లాడుతూ.. 2014లో విజయ డెయిరీ ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు మన ప్రాంతంలో రైతుల నుంచి సేకరణ తక్కువగా ఉండేదన్నారు. ప్రస్తుతం 4.5 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా అమ్మకాలు బాగా తగ్గాయని ముఖ్యమంత్రి చొరవతో ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో లక్ష లీటర్లు విక్రయిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా విజయ ఉత్పత్తులను విక్రయించేలా పాడి రైతులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో మాట్లాడే మొదటి అవకాశం వచ్చినప్పుడు తాను జనగామ పాల రైతుల కోసం మాత్రమే మాట్లాడానని గుర్తుచేశారు. అంతకుముందు మండలంలోని సిద్దెంకి గ్రామంలో పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాడిరైతులకు ప్రోత్సాహకంగా బోనస్ కింద లక్ష రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో విజయ పాల డెయిరీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, జీఎమ్ మల్లయ్య, మధుసూదన్రావు, డీడీ గోపాల్సింగ్, జిల్లా అధ్యక్షుడు ధర్మారెడ్డి, మేనేజర్లు హరికృష్ణ, లింగారెడ్డి, నరేశ్, పాడి రైతులు పాల్గొన్నారు. పాలసేకరణలో జనగామ పాడి రైతుల కృషి అభినందనీయం విజయ పాల డెయిరీ రాష్ట్ర చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పల్లా