Jangaon
-
తల్లి ఆసరా లేనిదే నడవలేడు..
జనగామ పట్టణం గ్రేయిన్ మార్కెట్ ఏరియాకు చెందిన రావుల సత్తెమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు సంతోష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. కాళ్లు చచ్చుపడ్డాయి. తొమ్మిదేళ్ల వయసు వచ్చినా తల్లి ఆసరా లేకుండా నిలబడలేడు. ఈ పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తున్నా పింఛన్ కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నామని సత్తెమ్మ వాపోయింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. పింఛన్ మంజూరు చేస్తే కొంత ఆసరాగా ఉంటుందని సత్తెమ్మ కోరింది. నడవలేని కొడుకు ను తీసుకుని ఆమె కలెక్టరేట్కు వచ్చింది.అర్హులకు అన్యాయం చేశారు.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అర్హులతో పాటు దివ్యాంగులకు అన్యాయం చేశారని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్, గన్నోజు మధు, జోగు సురేష్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అధికారులు పంపించిన జాబితాలో తన పేరు ఉన్నా ఫైనల్ నివేదికలో కనిపించ లేదని దివ్యాంగుడు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని అర్జీలో పేర్కొన్నాడు. భూమి కోసం పదేళ్లుగా తిరుగుతున్న.. మాకు మండల కేంద్రంలో 62/8లో ఎకరం భూమి ఉంది. 2019 వరకు ఆన్లైన్లో తమ పేరు చూపించింది. ధరణి వచ్చిన తర్వాత 27 గుంటలు మాత్రమే కనిపిస్తోంది. సమస్య పరిష్కరించాలని పది సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. – ఏనుగుల శంకరయ్య, నర్మెట -
నేడే టీజీ పాలీసెట్
● జిల్లాలో మూడు సెంటర్లు ● అమలులో నిమిషం నిబంధన జనగామ: పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో అడ్మిష న్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం(నేడు) నిర్వహించే టీజీ పాలీసెట్–2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని సిద్ధిపేటరోడ్డున ఉన్న ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హైదరాబాద్రోడ్డులోని సెయింట్ మేరీ హైస్కూల్, స్టేషన్ఘన్పూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంట ర్లు కేటాయించారు. మొత్తం 1,416 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. నిమిషం నిబంధన అమలులో ఉన్నందున విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచి సెంటర్లోకి అనుమతి స్తారు. సమయం 11 గంటలు కాగానే గేట్లు క్లోజ్ చేస్తారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ఎట్టిపరి స్థితుల్లోనూ అనుమతించరని పరీక్ష డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.నర్సయ్య తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్తో పాటు హెచ్బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి. హాల్ టికెట్పై ఫొటో లేకపోతే గెజిటెడ్తో సంతకం చేయించి ఆధార్ తీసుకు రావాల్సి ఉంటుందని, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని కోఆర్డినేటర్ స్పష్టం చేశారు. వ్యాయామంతో ఆరోగ్యంపాలకుర్తి టౌన్: వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సీఐ జి.మహేదర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన 5కే రన్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పోలీసులు నిత్యం ఒత్తిడిలో పని చేస్తారని వ్యాయామంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. -
సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి
జనగామ: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల క్షేత్ర స్థాయి పరిశీలన త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటి వరకు వెరిఫికేషన్ పూర్తయినవి ఆన్లైన్లో నమోదయ్యేలా చూడాలని చెప్పారు. రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో సిబిల్ స్కోర్ వెరిఫికేషన్ పూర్తి చేసి, సంక్షేమ శాఖ అధికారులు తుది జాబితా ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల్లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని, ఈ స్థానం కొనసాగాలంటే మరో 15 రోజుల పాటు పర్యవేక్షణ నిరంతరం ఉండాలన్నారు. ప్రస్తుత వేసవిలో తాగు నీటికి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల తుది జాబితా సిద్ధం చేయాలని, నగదు చెల్లించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేయాలని అన్నారు. మీటింగ్లో అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
విద్యుత్ వినతులపై ప్రత్యేక దృష్టి●
● గ్రీవెన్స్లో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ జనగామ: విద్యుత్ వినియోగదారుల సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం గ్రీవెన్స్ నిర్వహించడంతో పాటు వినతులపై ప్రత్యే క దృష్టి సారిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ తెలిపారు. సోమవారం జిల్లా పరిధి మండలాలతో పాటు సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో వినతులు స్వీకరించారు. 2024 జూన్ 17 నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామ ని.. 426 ఫిర్యాదులు రాగా 361 పరిష్కరించినట్లు చెప్పారు. ప్రతీ సోమవారం డివిజన్, ఈఆర్వో, సబ్డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట, సర్కిల్ ఆఫీస్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తామని చెప్పారు. గ్రీవెన్స్ నిర్వహించే రోజు ఉద్యోగులు అందుబాటులో ఉండి వినియోగదారుల సమస్యలకు పరిష్కారం చూపించాలని ఆదేశించారు. -
పద్దెనిమిదేళ్లకు ఇంటికి చేరిన మహిళ
రఘునాథపల్లి : మతిస్థిమితం కోల్పోయి 18 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మండల పరిధి కన్నాయపల్లికి చెందిన మంతపురి ఎల్లమ్మ ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సోమవారం కుటుంబ సభ్యుల చెంతకు చేరింది. దేవరుప్పులకు చెందిన చింత సోమయ్య–వెంకటమ్మ దంపతుల కూతురు ఎలమ్మ ను కన్నాయపల్లికి చెందిన యాదయ్యకు ఇచ్చి వివా హం చేశారు. ఇద్దరు కుమారులు జన్మించాక మతిస్థిమితం కోల్పోయిన ఎల్లమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ కోసం కుటుబ సభ్యులు ఎక్కడ వెతికినా జాడ లభించక విసిగిపోయారు. కేరళకు వెళ్లిన ఎల్లమ్మను అక్కడి ఆకాష్ ప్రవల్ స్వచ్ఛంద సంస్థ చేరదీసి మానసిక వ్యాధి నిపుణుల వద్ద ఆరోగ్య పరీక్షలు చేయించింది. అదే స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి వాసి బాషిపెల్లి యాకయ్యతో తాను జనగామ జిల్లా కన్నాయపల్లికి చెందిన మహిళగా చెప్పుకుంది. దీంతో ఎల్లమ్మ పూర్తి వివరాలు తెలుసుకున్న యాకయ్య దేవరుప్పుల, కన్నాయపల్లి గ్రామస్తుల కు సమాచారం అందించాడు. సంస్థ ప్రతినిధులు ఎలిషాబెత్, బి.సుభాషి, జెత్రుదీ సోమవారం ఎల్లమ్మను గ్రామానికి తీసుకొచ్చి పంచాయతీ కార్యదర్శికి, కుమారుడు అరవింద్కు అప్పగించారు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో కుటుంబం చెంతకు -
అభివృద్ధి పనులు చూసి బుద్ధి తెచ్చుకోవాలి
స్టేషన్ఘన్పూర్: అదేపనిగా అసత్యపు ఆరోపణలు, విమర్శలు చేసే వారు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్లో చేపట్టిన వంద పడకల ఆస్పత్రి, బంజారా భవన్ నిర్మాణ పనులను ఆయన సోమవారం పరి శీలించారు. ముందుగా సంబంధిత శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించి అక్కడున్న అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీఓ డీఎస్ వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం మాట్లాడారు. ఎమ్మెల్యేగా ఎన్నికై న ఏడాదిలోపే సీఎంను ఒప్పించి నియోజకవర్గానికి రూ.800 కోట్ల నిధులు తీసుకువచ్చానని చెప్పారు. కళ్ల ముందు అభివృద్ధి పనులు కనిపిస్తుంటే మాజీ ఎమ్మెల్యే రాజయ్య, బీఆర్ఎస్ నాయకులు ఒక్కపైసా అభివృద్ధి జరగలేదని తప్పుడు ప్రచారం చే యడం సిగ్గుచేటన్నారు. పనులను చూసైనా కొందరికి జ్ఞానం రావడం లేదని విమర్శించారు. త్వరలో స్టేషన్ఘన్పూర్ రూపురేఖలు మారనున్నాయని, మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.70కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్రెడ్డి, కొలిపాక సతీష్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, గిరిజన శాఖ జేఈ వినీల్, ఈఈ వీరభద్రం, డీఈ ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ధాన్యం త్వరగా తరలించాలి
బచ్చన్నపేట : కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జనగామ ఆర్డీఓ గోపీరాం అన్నారు. సోమవారం మండల పరిధి పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అలాగే వివాదాస్పద భూములను పరిశీ లించారు. అనంతరం మాట్లాడుతూ భూ భారతి ద్వారా ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. భూసమస్యలు ఉన్న వారు నేరుగా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని, దళారుల వద్దకు వెళ్లకూడదని తెలిపా రు. ఆయన వెంట తహసీల్దార్ ప్రకాశ్రావు, ఎంఆర్ ఐ గోపీ, సర్వేయర్ నర్మద ఉన్నారు. -
ప్లాట్ల సమస్య పరిష్కరించండి
జిల్లా కేంద్రం హనుమకొండ రోడ్డులోని ఓ వెంచర్లోని ప్లాట్లను సుమారు 150 నుంచి 200 మంది కొనుగోలు చేసి రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసిన పలు కుటుంబాల్లో తగాదాల మూలంగా 2012లో వారు కోర్టుకు వెళ్లగా 2023లో ఆ కేసును కోర్టు కొట్టి వేసింది. అయినా హద్దు రాళ్లు తొలగించి తమను ఇబ్బంది పెడుతున్నారని కాలనీ అధ్యక్షుడు కె.నానాజీ, గొట్టం శ్రీధర్రెడ్డి, ఎల్ల స్వామి, నరసింహ, స్వప్న, లక్ష్మి, సోమశేఖర్, నోముల మహేందర్, బిక్షపతి, సునీత, హరికిషన్, పురుషోత్తం తెలిపారు. ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పించడంతో పాటు ఇంటి నిర్మాణ అనుమతులు ఇప్పించాలని కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నారు. -
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
జనగామ/జనగామ రూరల్: ‘ఆసరా లేనిదే నడవలేని కొడుక్కు పింఛన్ కోసం ఓ మాతృమూర్తి.. తలదాచుకోవడానికి నీడలేక ఇందిరమ్మ ఇల్లు మంజూ రుకు నిరుపేద మహిళ.. ఇళ్ల మంజూరులో అన్యా యం చేశారని ఓ దివ్యాంగుడు.. ఆన్లైన్లో భూమి కనిపించక పదేళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కరించడంలేదని మరో బాధితుడు’.. ఇలా.. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు వచ్చిన ప్రజలు అధికారులకు తమ గోడు చెప్పుకున్నారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా పరిష్కా రం కావడంలేదని వాపోయారు. వివిధ సమస్యలపై 47 వినతులు రాగా కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, జిల్లా స్థాయి అధికారులు స్వీకరించారు. అర్జీలు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కారం చూపించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్కు 47 వినతులు అర్జీలు పెండింగ్లో ఉండొద్దు అధికారులకు కలెక్టర్ ఆదేశం -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జనగామ: పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బతుకమ్మకుంట, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏరియా లేబర్ ఆఫీస్, చీటకోడూరులో జరుగుతున్న ఇంట్రా పైపులైన్ పనులను సోమవారం ఆయన పరిశీ లించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్కుమార్, ఏఈ మహిపాల్ పాల్గొన్నారు. ‘నైటింగేల్’కు నివాళిజనగామ: చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. వైద్య రంగంలో నర్సు వృత్తికి గౌరవం తీసుకువచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు 31 వరకు పొడిగింపుజనగామ: ప్రభుత్వం అందించే 25 శాతం రా యితో ప్లాట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అవకా శం కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ రెండు సార్లు అవకాశం ఇవ్వగా.. గడువు ముగిసినప్పటికీ.. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించింది. ప్లాట్ల యజమానులు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూ చించింది. జనగామ, స్టేషన్ఘన్పూర్ మున్సి పాలిటీలతోపాటు మండలాల పరిధిలో ఇటీవ ల గడువు ముగిసే నాటికి 13,332 అప్లికేషన్ల ఎల్ఆర్ఎస్ పూర్తి కాగా, రూ.24.67 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ‘గాలికుంటు’ నివారణే లక్ష్యంలింగాలఘణపురం: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణే లక్ష్యమని వీబీఆర్ఐ(వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) మాని ట రింగ్ ఆఫీసర్ డాక్టర్ సుధారాణి అన్నారు. సోమవారం రామచంద్రగూడెంలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. వ్యాక్సిన్ భద్రపరిచే కోల్డ్స్టోరే జీ, పశువైద్యశాలను సందర్శించారు. అనంత రం మాట్లాడుతూ గాలికుంటు నివారణకు ఏటా రెండుసార్లు వ్యాక్సినేషన్ చేస్తున్నామని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. టీకా వేయకపోతే వ్యాధి సోకిన పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గడమే కాకుండా నష్టం జరుగుతుందని చెప్పారు. జిల్లా పశువైద్యాధికారి రాధాకిషన్ మాట్లాడుతూ జిల్లాలో 1,35,000 పశువులు ఉండగా.. 87,779 పశువులకు టీకాలు వేశామన్నారు. ఉమ్మడి జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ నాగమణి, డాక్టర్లు నేహా, అనిత, భగవాన్రెడ్డి పాల్గొన్నారు. -
వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
లింగాలఘణపురం: మండలంలోని బండ్లగూడెం బండగుట్ట లక్ష్మీనర్సింహ్మస్మామి కల్యాణం వేదపండితులు కృష్ణమాచార్యుల వేదమంత్రోచ్ఛారణలతో మధ్య ఆదివారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఉత్సవ విగ్రహాలను అలంకరించి ఢోలువాయిధ్యాలతో భక్తుల నృత్యాలతో ఆటపాటలతో ఊరేగించారు. మండల కేంద్రంలోని చేనేత కార్మికులు ట్రాక్టర్పై మగ్గాన్ని ఏర్పాటు చేసుకొని ఉత్సవ మూర్తుల ఊరేగింపు కొనసాగుతుండగా మగ్గంపై పట్టువస్త్రాన్ని నేస్తూ కల్యాణోత్సవంలో లక్ష్మీనర్సింహ్మస్వామికి సమర్పించారు. కార్యక్రమ నిర్వాహకులు బండ్లగూడెంకు చెందిన వంచ మహేశ్వర్రెడ్డి, రాంరెడ్డి, మండల కేంద్రానికి చెందిన లింగాల దీపక్రెడ్డిల ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వహించారు. చేనేత కార్మికులు వంగ ఉప్పలయ్య, బింగి స్వామి, కారంపురి చంద్రయ్య, బాల్నె సత్యనారాయణ, రమేష్, యాదగిరి తదితరులు చేనేత వస్త్రాన్ని నేసి కల్యాణోత్సవంలో సమర్పించారు. 17 మంది పుణ్యదంపతులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. -
పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్
జనగామ: సర్కారు బడులకు పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్. వేసవి సెలవులు ముగిసిన వెంటనే... అడ్మిషన్ల ప్రారంభం నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం వేసవిసెలవులు కొనసాగుతున్న నేపధ్యంలో.. జూన్ 12వ తేదీ నుంచి బడులు పునఃప్రారంభం కానున్నాయి. అంతకు ముందే జిల్లాల వారీగా విద్యాశాఖ విద్యార్థుల సంఖ్య ఆధారంగా నివేదికలను పంపించగా, ప్రభుత్వం దాని ఆధారంగా పాఠ్యపుస్తకాలను జిల్లాకు పంపించింది. గత పది రోజుల క్రితమే జిల్లాకు పుస్తకాలు చేరకోగా... డీఈఓ భోజన్న ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల సమక్షంలో స్కూల్స్కు అందజేస్తున్నారు. మొదటి విడతలో 81 శాతం.. జిల్లాలో ప్రభుత్వ, లోకల్ బాడీ, గురుకులాలు కలుపుకుని 558 విద్యా సంస్థలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక 341, ప్రాథమికోన్నత 64, ఉన్నత 103, మోడల్ 8, కేజీబీవీ 12, యూఆర్ఎస్ 1, ఎయిడెడ్ 10, రెసిడెన్షియల్ 19 ఉండగా.. 45 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడిబాట కార్యక్రమంతో పాటు రెగ్యులర్గా వచ్చే కొత్త అడ్మిషన్లతో 10 నుంచి 20 శాతం మేర విద్యార్థుల సంఖ్య పెరగనుంది. 1వ తరగతి నుంచి 10 వరకు జిల్లాకు 2,14,460 పాఠ్యప్తుస్తకాలు (తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ) అవసరం ఉండగా, ఇప్పటి వరకు 1,73,730 (81శాతం) వచ్చాయి. వీటిని వీవర్స్ కాలనీ ఓల్డ్ డీఈఓ కార్యాలయ గోదాంలో నిల్వ చేశారు. ప్రైవేట్కు దీటుగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం తదితర వాటిని ప్రభుత్వ విద్యార్థులకు ప్రోత్సాహంగా అందిస్తోంది. ప్రైవేట్కు దీటుగా డిజిటల్ తరగతులు, సైన్స్ ప్రయోగాలతో ఉత్తమ బోధన చేస్తూ పేద విద్యార్థుల జీవితాలకు బంగారు భవిష్యత్ను అందిస్తుంది. ప్రస్తుతం 81శాతం మేర పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుగా, బడులు పునఃప్రారంభమయ్యే లోపు మిగతా 19 శాత పాఠ్యపుస్తకాలను కూడా రానున్నాయి. పాఠశాలలు తెరుచుకున్న తర్వాత విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఒకవేళ పుస్తకాల సంఖ్య తక్కువగా ఉంటే... పై తగతులకు వెళ్లే పిల్లల నుంచి తీసుకుని వాటిని అందించేలా ప్లాన్ చేస్తున్నారు. పాఠశాలలకు పంపిణీ 2025–26 నూతన విద్యా సంవత్సరానికి గాను సర్కారు బడుల పిల్లలకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను జిల్లాలో పలు మండలాల ఎమ్మార్సీ కార్యాలయాలకు పంపించారు. జనగామ మండలం(28,645), బచ్చన్నపేట (10,570), నర్మెట (7,77 6), దేవరుప్పుల (7,385) మొత్తంగా 54,376 రకాల పుస్తకాలను మండలాలకు పంపించారు. ఇంకా 8 మండలాలకు 1,19,354 పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ఎమ్మార్సీల నుంచి విద్యార్థుల ఇండెంట్ ప్రకారం పాఠ్యపుస్తకాలను ప్రధానోపాధ్యాయులకు అప్పగించనున్నారు.జిల్లాలో విద్యాసంస్థల వివరాలుపీఎస్ 341 యూపీఎస్ 64 ఉన్నత 103 గురుకులాలు 19 కేజీబీవీ 12 యూఆర్ఎస్ 01 మోడల్ 8 ఎయిడెడ్ 10 జిల్లాకు 2.14 లక్షలు అవసరం ఇప్పటివరకు చేరుకున్నవి 1.73 లక్షలు రెండో విడతలో వందశాతం 155 స్కూల్స్, గురుకులాలు 45 వేల మంది విద్యార్థులురెండో విడతలో పూర్తిస్థాయిలో.. సర్కారు బడులు, గురుకులాల పిల్లలకు ఉచితంగా అందించే ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను మండలాల వారీగా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకు నాలుగు మండలాలకు 54,376 పుస్తకాలను అందించాం. జిల్లాకు ప్రభుత్వం నుంచి 81 శాతం మేర పాఠ్యపుస్తకాలు రాగా, రెండో విడుతలో పూర్తి స్థాయిగా రానున్నాయి. – భోజన్న, డీఈఓ -
గ్రామాభివృద్ధే లక్ష్యం
దేవరుప్పుల: జన్మనిచ్చిన గ్రామ అభివృద్ధి లక్ష్యంగా విద్య, వైద్య రంగాల్లో ట్రస్టు పక్షాన నిరంతర తోడ్పాటు అందిస్తామని సీతారాంపురం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ అంబటి యాకన్న అన్నారు. ఆదివారం మండలంలోని సీతారాంపురం గౌడ కమ్యూనిటీ హాల్లో పగిడిపల్లి సతీష్ అధ్యక్షతన తొలుత ఇటీవల పాకిస్తాన్ సరిహద్దులో దేశం కోసం అశువులు బాసిన వీరజవానుల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకాలు అందించి తల్లిదండ్రులను సన్మానించారు. చైతన్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించి పలు సందేహాలకు నివృత్తి చేశారు. అలాగే ట్రస్టు సభ్యుడు పోరండ్ల శ్రీనివాస్ ఽఆధ్వర్యంలో అనాథ శరణాలయంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ఉపాధ్యక్షుడు డాక్టర్ హనుమాన్జీ, ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి సతీష్, కోశాధికారి ఆవుల రాజు, సంయుక్త కార్యదర్శులు బస్వ నాగరాజు, దొడ్డి రమేష్, పుప్పల సోమేశ్వర్, భాషిపాక సుధాకర్, కార్యవర్గ సభ్యులు అనంతుల శివ, పెండెం ఉపేందర్, బస్వ మల్లేషమ్ తదితరులు పాల్గొన్నారు.భూమాత రైతు సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారిగా పద్మారెడ్డిస్టేషన్ఘన్పూర్: భూమాత రైతు సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారిగా మండలంలోని తానేదార్పల్లికి చెందిన దుంపల పద్మారెడ్డిని నియమించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ సమ్మయ్యయాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు చెవుల యాదగిరి ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేజీబీవీలో డిజిటల్ క్లాస్ మానిటర్ చోరీ తరిగొప్పుల: మండలకేంద్రంలోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో గుర్తుతెలియన వ్యక్తులు శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో హాస్టల్ విద్యార్థులు వారి ఇంటికి వెళ్లిపోయారు. నైట్ వాచ్ ఉమెన్ ఉన్నప్పటికీ రాత్రివేళలో ఒంటరిగా విధులు నిర్వర్తించలేక ఉదయం సమయంలోనే విధులు నిర్వర్తించి రాత్రి సమయంలో విధుల్లో ఉండడంలేదు. ఇది గమనించిన దుండగులు శనివారం రాత్రి పాఠశాల తాళం పగులకొట్టి సీసీ కెమెరా హార్డ్డిస్క్, డిజిటల్ తరగతులు బోధించే 100 అంగుళాల ఎల్ఈడీ మానిటర్ ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం యథావిధిగా సిబ్బంది విధులకు రాగా పాఠశాల తాళం పగులగొట్టి ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ మేరకు చోరీ విషయమై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఓ తెలిపారు. -
రోడ్డుపైనే సిట్టింగ్
● సోమేశ్వర ఆలయ పరిసరాల్లో మందుబాబుల ఓపెన్ సిట్టింగ్ ● పట్టించుకోని పోలీసులు పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలో మందుబాబు లు బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. సోమేశ్వర ఆలయం, గిరిప్రదక్షిణ రోడ్డు, పంచగుళ్లు, ఆలయం ఘాట్రోడ్డు, పాల్కురికి సోమనాథుడి స్మృతివనం తదితర ప్రాంతాలు సాయంత్రం అయి తే చాలు మందుబాబులతో హడావుడిగా మారిపోతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు, వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటిబాట పట్టిన మహిళలు రోడ్డుపై మందుబాబులు సిట్టింగ్తో ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాలు జారీ చేసిన స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న స్థానిక పోలీసులు మందుబాబులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, భక్తులు, మహిళలు కోరుతున్నారు. -
తగిన గుణపాఠం చెప్పాలి
యుద్ధ విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్పై జిల్లా పౌరుల స్పందన ● పహల్గాం దాడికి రెట్టింపు చర్య జరగాల్సిందే! జనగామ: ప్రజాసమస్యలను పక్కన బెట్టి.. దేశసంపదతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. భారత్తో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న దాయాది దేశం పాకిస్తాన్పై జిల్లా ప్రజలు భగ్గున మండిపడుతున్నారు. అమెరికా మధ్య వర్తిత్వంతో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించిన మూడు గంటల వ్యవధిలో పాకిస్తాన్ భారత్పై క్షిపణి దాడులు చేయడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కుయక్తులను తిప్పకొట్టిన భారత ఆర్మీకి జేజేలు పలుకుతూ... పహల్గాం దాడికి రెట్టింపు ట్రీట్మెంట్ ఉండాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. కాల్పుల విరమణ.. పాకిస్తాన్ కవ్వింపు.. భారత్ ఎదురుదాడికి సంబంధించి ఆయా వర్గాల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.జవాన్లకు అండగా ఉంటాం.. ఉగ్రవాదం పేరుతో అమాయకులను పొట్టనబెట్టుకున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సిందూర్తో గుణపాఠం చెప్పాలి. ప్రతిసారి పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి దేశంపై దాడి చేస్తూ అమాయక ప్రజలను చంపుతున్నారు. ఇందుకు పహల్గాం ఘటనే నిదర్శనం. దేశ సరిహద్దులో పాకిస్తాన్తో పోరాడుతున్న వీర జవాన్లకు మేమంతా అండగా ఉంటాం. – తోట రమేష్, రైతు, జఫర్గఢ్ శివారు వడ్డెగూడెందీటైన సమాధానం చెప్పిన ఆర్మీ.. ఉగ్రమూకలను పెంచి పోషిస్తూ, ప్రశాంతంగా ఉన్న భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడిన పాకిస్తాన్పై ఆర్మీ యుద్ధభేరి సరైన నిర్ణయం. యుద్ధంతోనే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి తోక ముడిచింది. యుద్ధం అనేది లేకుండా శాంతి నెలకొనాలి. కానీ రెచ్చిపోతే తగిన గుణపాఠం చెప్పక తప్పదు. – గజ్జెల దామోదర్, మండలం కిరాణ వర్తక సంఘం అధ్యక్షుడు, చిల్పూరుతీవ్రవాదం లేకుండా నిర్మూలించాలి ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ అనేది మన ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగానే వ్యవహరించినట్లు అనిపిస్తుంది. మనకు ఆర్థికంగా, జననష్టం కాకుండా, పాకిస్తాన్ను ప్రపంచంలో ఒక దోషిగా, తీవ్రవాద దేశంగా అందరికీ తెలిసేటట్లు భారత ప్రభుత్వం చేసింది. కానీ అమెరికా జోక్యం చేసుకోకుంటే పీఓకేను ఆక్రమించి పాకిస్తాన్కు బుద్ధి చెప్తే బాగుండేది. – పోతుగంటి నరసయ్య, ఎంఈఓ, పాలకుర్తిశాంతిని కోరుకోవడం శుభ పరిణామం యుద్ధం నుంచి శాంతిని కోరుకోవడం శుభ పరిణామం. ఇరు దేశాలతో చర్చలు జరిపి కృషి చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అభినందనలు. మొదటగా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు మానుకోవాలి. ఉగ్ర సంస్థలను నిర్మూలన చేసి, అభివృద్ధి కోసం భారత్తో స్నేహసంబంధమైన వాతావరణం నెలకొనేలా చేసుకోవాలి. – డాక్టర్ సుగుణాకర్రాజు, దళిత రత్న, జనగామకవ్వింపు చర్యలు సహించరానివి అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో భారత దేశం, పాకిస్తాన్ సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ ఇంకా సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటం సహించరానిది. ఒప్పందం ప్రకారం యుద్ధ విరమణ, సీజ్ ఫైర్ను అమలు చేయాల్సిందే. –మంగు జయప్రకాశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, స్టేషన్ఘన్పూర్ -
కళల విశిష్టతను నలువైపులా చాటాలి
● అన్నమాచార్య అకాడమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ హన్మకొండ కల్చరల్: ఓరుగల్లు ఖ్యాతిని, కళల విశిష్టతను నలువైపులా చాటాలనే సంకల్పంతో ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అన్నమాచార్య అకాడమీ వ్యవస్థాపకులు సూత్రపు అభిషేక్ అన్నారు. అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్ సౌజన్యంతో తెలుగు వాగ్గేయకారులు, పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల 617వ జయంత్యుత్సవం, అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ వా ర్షికోత్సవం ఘనంగా నిర్వహించా రు. ఆదివారం ఉదయం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో సూత్రపు అభిషేక్ అధ్యక్షతన జరి గిన కార్యక్రమాల్లో నగరానికి చెందిన కళాకారులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన వందకుపైగా కళాకారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ప్రదర్శించిన సంగీ త, నృత్యాలు అలరించాయి. -
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
కొడుకు చెప్పగానే ఒప్పేసుకున్న తల్లి.. ఖానాపురం: దేశంపై ఎనలేని ప్రేమ.. వ్యవసాయం చేస్తూ ఇరువురు కుమారులను పెంచింది.. డిగ్రీ వరకు చదివించింది.. కుమారుడు సైన్యంలోకి వెళ్తానంటే ఒప్పుకుంది.. వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలిచింది వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ గ్రామానికి చెందిన ఎల్ది పద్మ. దేశరక్షణలో భాగస్వామి కావాలని కుమారుడు ఎలేందర్గౌడ్కు సూచించింది. మొదటి ప్రయత్నంలో సెలక్ట్ కాకపోవ డంతో కొంత నిరుత్సాహపడ్డాడు. మళ్లీ ఎలేందర్గౌడ్ను తల్లి పద్మతోపాటు అన్న మురళి ప్రోత్సహించారు. రెండో ప్రయత్నంలో ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం దేశరక్షణలో భాగంగా రాజస్థాన్లో విధులు నిర్వరిస్తున్నాడు. పాకిస్థాన్తో శనివారం వరకు జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. శత్రువులతో పోరాడాడని తల్లి సంతోషం వ్యక్తం చేసింది. న్యూస్రీల్ -
బిడ్డకు ఆశీర్వాదం
జనగామ: ‘బిడ్డా దేశం నీకోసం ఎదురు చూస్తుంది.. తుపాకీ ఎక్కుపెట్టు.. భరత మాత జోలికి వచ్చే ఉగ్రమూకల భరతం పట్టాలి’ అంటూ బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లికి చెందిన జవాన్ బేజాటి వెంకట్రెడ్డిని అతడి తల్లి నాగలక్ష్మి నిండు మనసుతో ఆశీర్వదించి సాగనంపారు. సెలవులపై గత నెల 30న స్వగ్రామానికి వచ్చిన వెంకట్రెడ్డి.. పాకిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి పిలుపు రావడంతో శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా కశ్మీర్కు బయలు దేరాడు. 2005 సంవత్సరంలో సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్స్కు ఎంపికై న వెంకట్రెడ్డికి 2007లో మొదటి పోస్టింగ్లో జమ్మూకశ్మీర్ శాంతి భద్రతల విభా గంలో బాధ్యతలు అప్పగించారు. 2009–15 వరకు అస్సాంలో విధులు నిర్వహించగా.. ఉత్తమ సేవలకు 2014లో కామెండేషన్ డిస్క్తో సత్కరించారు. 140 కోట్ల భారత ప్రజలకు కాపలా ఉండే అవకాశం మా ఇంట్లో నుంచి కొడుక్కు రావడం తల్లిగా గర్విస్తున్నానంటూ ఆనంద భాష్పాలతో నాగలక్ష్మి తనలోని సంతోషం.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
ఆర్మీబాట
అమ్మమాట.. – ఎడ్ల ఝాన్సీ, మానుకోటతల్లి వెంకటమ్మతో ఝాన్సీ(ఫైల్)దేశరక్షణకు పిల్లలను సైన్యంలోకి పంపిన ఓరుగల్లు తల్లులు ● భర్త మిలటరీలో మరణించినా.. బిడ్డలను కూడా పంపిన మరికొందరు.. ● సరిహద్దు ప్రాంతాల్లో సేవలందిస్తున్న ఉమ్మడి జిల్లా యువత ● గర్వంగా ఫీలవుతున్న మాతృమూర్తులు నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం -
సైనికులకు ఆశీర్వచనాలతో ప్రత్యేక పూజలు
జనగామ: సైనికులు, ప్రధాని మోదీకి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఆలయ ప్రధాన అర్చకులు దత్తుశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు జాతీయ జెండాతో దేశ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు చుంచు శ్రీకాంత్ మాట్లాడుతూ ఇండో–పాక యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అనుమతిస్తే సైన్యంలో చేరేందుకు తనతో పాటు కిరణ్, రాజు, వినయ్, సంతోష్ తదితరులు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు లింగాలఘణపురం: పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నా రు. శనివారం మండలంలోని జనగామ–సూర్యాపేట రోడ్డులోని కుందారం క్రాస్ రోడ్డు వద్ద పశువుల అక్రమ రవాణాను నివారించేందుకు చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను పురష్కరించుకొని ఇష్టారాజ్యంగా పశువులను అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని, పశువైద్యాధికారి ధ్రువీకరించిన పశువులను మాత్రమే తీసుకెళ్లాలన్నారు. బక్రీద్ వరకు చెక్పోస్టు 24 గంటలు పని చేస్తుందని తెలిపారు. సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై శ్రావణ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పద్మశ్రీ సమ్మయ్యకు సన్మానం దేవరుప్పుల : మండల పరిధి అప్పిరెడ్డిపల్లెకు చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత గడ్డం సమ్మయ్యను బీఆర్ఎస్ అనుబంధ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్మానించారు. శనివారం హైదరాబాద్లో ఆమె స్వగృహానికి సమ్మయ్యను మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా గ్రామీణ సాంస్కృతిక కళారంగానికి వన్నెతెచ్చేందుకు వందలాది ప్రదర్శనలు ఇచ్చిన సమ్మయ్యను ప్రశంసించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాముయాదవ్, సమ్మయ్య కుటుంబ సభ్యులు గడ్డం సోమరాజు, మురళీకృష్ణ, హిమగిరి తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రాము ఎంపిక రఘునాథపల్లి: మహారాష్ట్రలో వార్దా జిల్లా డియోలి పట్టణంలో ఈనెల 12 వరకు జరిగే 51వ జాతీయ స్థాయి జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీలకు మండలంలోని రామరాయనిబంగ్లా గ్రామానికి చెందిన సీహెచ్.రాము ఎంపికయ్యాడు. గత నెల 28న రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన పోటీల్లో రాము అత్యున్నత ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారపాక రాజయ్య శనివారం తెలిపారు. ఈ సందర్భంగా రామును అసోసియేషన్ బాధ్యులు చిట్ల ఉపేందర్రెడ్డి, గాండ్ల మల్లికార్జున్, కొయ్యడ మల్లేష్, శాగ తిరుమలేష్, ఎడ్ల శ్రీనివాస్, గొంగల్ల కుమార్, రాజశేఖర్ తదితరులు అభినందించారు. లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నిర్వహించే లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మీ–సేవ కేంద్రాల్లో ఈనెల 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంట ర్మీడియట్లో గణిత శాస్త్రం ఒక అంశంగా ఉన్నవారు, కనీసం 60శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా (సివిల్), బి.టెక్ (సివిల్) పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. -
మన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా..
వెంకటాపురం(ఎం)/ఖిలావరంగల్: ఉమ్మడి వరంగ ల్ జిల్లాలో ఈనెల14న పర్యటించనున్న ప్రపంచ అందాలభామలకు మన సంస్కృతీ సంప్రదాయాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు. మొత్తంగా 116 దేశాల సుందరీమణులు ముందుగా హనుమకొండలోని హరిత హోటల్లో కొద్దిసేపు సేదదీరాక.. వేయిస్తంభాల దేవాలయం చేరుకుని రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడినుంచి రెండు బృందాలుగా విడిపోయి.. ఒక బృందం నేరుగా ములుగు జిల్లా రామప్ప చేరుకోనుంది. మరోబృందం కాకతీయు రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు వెళ్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సుందరీమణులు హిందూ సంప్రదాయ దుస్తుల్లోనే సందర్శించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న వారికి గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం పలుకుతారు. కొమ్ముకోయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అలరిస్తారు. వివిధ పూజా, ఇతరత్రా కార్యక్రమాల తరువాత గార్డెన్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి. అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, పేరిణి నృత్య ప్రదర్శన ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాకతీయుల కళా సంస్కృతిని చాటేలా.. ఖిలావరంగల్ కోటలోని శిల్పాల ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గజ్జల రంజిత్కుమార్ నేతృత్వంలో 5 నిమిషాల నిడివిగల పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. కాకతీయుల కళా సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అందాలభామలను.. అబ్బురపరిచేలా ప్రదర్శనలు.. రామప్ప వద్ద గిరిజన, కొమ్ముకోయ నృత్యాలు ఖిలావరంగల్ కోటలో పేరిణి శివతాండవం ఏర్పాట్లు చేస్తున్న టూరిజం, జిల్లాల అధికారులు సంప్రదాయ దుస్తుల్లో రామప్పకు సుందరీమణులు -
ఇద్దరు పిల్లలను ఆర్మీలోకి ..
స్టేషన్ఘన్పూర్: ఇప్పగూడెం గ్రామానికి చెందిన జిట్టెబోయిన రాజు, శ్రీకాంత్ భారత ఆర్మీలో సేవలు అంది స్తున్నారు. సుభద్ర, వెంకటయ్య దంపతుల కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించి వివాహం చేశారు. కాగా పిల్లలకు తల్లి చిన్నప్పటి నుంచే దేశభక్తిని నూరిపోసింది. దేశ రక్షణకు మించిన సేవ లేదని చెప్పిన మాతృమూర్తి ఆశయం మేరకు కొడుకులిద్దరూ డిగ్రీ వరకు చదివి పదేళ్ల క్రితం భారత ఆర్మీకి సెలక్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. ‘మా పిల్లలు రాజు, శ్రీకాంత్ చిన్నవయస్సు నుంచే భారత సైన్యం అంటే ఇష్టపడేవారు. ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధం ఆందోళనగా ఉంది. మా పిల్లలతోపాటు భారత ఆర్మీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నాం.’ అని తల్లి సుభద్ర తెలిపింది. -
ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలి
బచ్చన్నపేట : కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ అన్నారు. శుక్రవారం కొడవటూర్ వన నర్సరీ, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులతోపాటు ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో త్వరగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నా రు. మిల్లర్ల నుంచి ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలియ జేయాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహిచాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి బృంగి రూపాచైతన్య, ఐకేపీ సీసీ సత్యనారాయణ, ఏఈఓ రాజు పాల్గొన్నారు. -
పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జనగామ రూరల్: జిల్లాలో ఈనెల 13న నిర్వహించే పాలీసెట్–2025 అవసరమైన ఏర్పాట్లు చేశామని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.నర్సయ్య తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించే ఈ పరీక్షకు మొత్తం 1,416 మంది విద్యార్థులు హాజరుకానుండగా.. జిల్లాలో మొత్తం మూడు సెంటర్లు కేటాయించినట్లు చెప్పారు. పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 576 మంది, సెయింట్ మేరీ హైస్కూల్లో 480 మంది, స్టేషన్ ఘన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 360 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. నిమిషం నిబంధన అమలులో ఉన్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి నిర్దేశిత సమయానికి గంట ముండే రావాలని సూచించారు. విద్యార్థులు హాల్ టికెట్, బ్లాక్ పెన్సిల్తో మాత్రమే రావాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 1,416 మంది విద్యార్థులు మూడు పరీక్ష కేంద్రాలు అమలులో నిమిషం నిబంధన -
పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలకం
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ జనగామ: పట్టణ స్వచ్ఛతలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు కీలమకని, పారుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ఎలాంటి లోపాలు ఉండొద్దని, సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారు. పట్టణ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ వివరాలను త్వరగా ఆన్లైన్ చేయాలన్నారు. పట్టణంలో ట్రేడ్ లైసెన్సులు కలిగిన వారే వ్యాపారా లు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన ప్లాట్ల యజమానులకు ప్రొసీడింగ్ కాపీలను అందించాలని ఆదేశించారు. సమీక్ష అనంత రం 154 మంది పారిశుద్ధ్య కార్మికులకు రెండు జతల దుస్తులు, టవల్స్ అందజేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ ప్రసవాలు పెంచాలి
● డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్గౌడ్బచ్చన్నపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ రవీందర్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జాతీయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా అధికార విభాగం సిబ్బంది.. మహిళలు, పిల్లల చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
మనకంటూ ఓ బ్రాండ్ వచ్చేలా..
నిర్మల్, పోచంపల్లి వంటి ప్రాంతాలకు వచ్చిన ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ములుగు జిల్లాకు ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చేలా వెదురు బొంగులతో ప్రత్యేక అందాన్ని ఇచ్చే విధంగా బొమ్మలను తయారు చేయిస్తున్నాం. రామప్ప దేవాలయ సందర్శనకు వచ్చే అందాల తారలకు బహుమతులుగా ఇవ్వాలా.. స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించాలా అనేది ఆలోచిస్తున్నాం. ఇప్పటికే 30 మంది మహిళలకు 20 రోజులపాటు శిక్షణ ఇచ్చాం. వారు తయారుచేసిన బొమ్మలు చూడముచ్చటగా, సహజసిద్ధంగా ఉన్నాయి. కచ్చితంగా అందరినీ ఆకర్షిస్తాయని భావిస్తున్నాం. – రాహుల్ కిషన్ జాదవ్, డీఎఫ్ఓ, ములుగు -
సాక్షి ఎడిటర్ ఇంటిపై దాడి హేయమైన చర్య
జనగామ: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దాడి చేయడం హేయమైన చర్య అని, దీనిని వ్యతిరేకిస్తూ జనగామ జర్నలిస్టులు నిరసన తెలిపా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జనగామ జర్నలిస్టు సంఘాల ఆధర్యాన చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడు తూ.. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఏపీ పోలీసులు వ్యవహరించడం సరికాదన్నారు. ఏపీ సర్కారు తీరు మార్చుకోకపోతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వాస్తవాలను వెలికి తీసి పత్రికల్లో రాస్తే కక్షగట్టి అక్రమ కేసులు పెట్టి వేధించటం మానుకోవాని హితవు పలికారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలి స్టులు ఇర్రి మల్లారెడ్డి, సురిగల భిక్షపతి, శ్రీభాష్యం శేషాద్రి, హింగే మాధవరావు, భాస్కర్, బిట్ల మధు, బండి శ్రీనివాస్, ఉల్లెంగుల మనీ, కన్నారపు శివశంకర్, శశిధర్, నేతి ఉపేందర్, మహిపాల్రెడ్డి, గోవర్ధ నం వేణుగోపాల్, కేమెడి ఉపేందర్, చౌదరిపల్లి ఉపేందర్, యూసఫ్, పన్నీరు భానుచందర్, ఆశిష్, ఉపేందర్, మణికుమార్, బజాజ్, క్రాంతి, హరీష్, వినయ్, సాగర్, కిరణ్, నవీన్, ఓంకార్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
జనగామ రూరల్: పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండీ.షరీఫ్, ఇప్ప రాంరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం డీఈఓ భోజన్నకు విజ్ఞప్తి చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఈఓను సంఘం జిల్లా కమిటీ బాధ్యులు మర్యాదపూర్వకంగా కలిసి డీటీఎఫ్ డైరీ, జీఓల పుస్తకం అందజేశారు. ఈ కార్యక్రమంలో చొక్కయ్య, శ్రీనివాస్, యాదయ్య, శివరాం, దివాకర్రెడ్డి, జగ్గారెడ్డి, అప్సర్ తదితరులు పాల్గొన్నారు. గోవులను రక్షించాలిజనగామ: గోరక్షణ చట్టాలను అమలు చేసి గోవుల రక్షణకు పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏసీపీ పండేరే చేతన్ నితిన్కు వివిధ అంశాలతో కూడిన వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గోవధశాలలను మూసివేసి, గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరారు. టీచర్ల శిక్షణకు డీఆర్పీలు సిద్ధంగా ఉండాలివిద్యారణ్యపురి: త్వరలో జిల్లా స్థాయిలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల శిక్షణకు డిస్ట్రిక్ట్ రిసోర్స్పర్సన్ (డీఆర్పీ)లు సిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి కోరారు. ఐదురోజులుగా హనుమకొండ జిల్లా కాజీపేటలోని బాలవికాస్లో రాష్ట్రస్థాయిలో గణితం, సోషల్ స్టడీస్ జిల్లా రిసోర్స్పర్సన్ల కు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. సమావేశంలో ఎస్సీఈఆర్టీ కోర్సు కో–ఆర్డినేటర్లు ఎల్లయ్య, గణపతి, రాష్ట్ర సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం అధ్యక్షుడు రథంగాపాణిరెడ్డి పాల్గొన్నారు. రామప్పను సందర్శించిన హనుమకొండ జిల్లా జడ్జివెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటా పురం(ఎం) మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి పట్టాభి రామారావు, ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్తో కలిసి శుక్రవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ పూజారులు తీర్థప్రసాదా లు, ఆశీర్వచనం అందజేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్ వివరించగా.. రామప్ప శిల్పకళాసంపద బాగుంద ని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సై జక్కుల సతీశ్ తదితరులు ఉన్నారు. -
‘ఆపరేషన్ సిందూర్’కు సంపూర్ణ మద్దతు
జనగామ రూరల్: ఉగ్రవాదం నుంచి దేశానికి శాశ్వతంగా విముక్తి జరగాలి.. అలాగే ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను స్వాగతిస్తూ సంపూర్ణ మద్దతను తెలియజేస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ జనగామ పట్టణ 4వ మహాసభల్లో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదానికి కులం, మతం, దేశం అనే బేధం లేదని, పాకిస్థాన్ పాలకులు, ఉగ్రవాదులు ఒకరిపై ఒకరు ఆధారపడి భారత్లో నరమేధాన్ని సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను ఆసరాగా చేసుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంద ని, దానికి సరైన గుణపాఠం చెప్పాలిందేనన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే ఈదేశ పౌరులైన మావోయిస్టులను ఏరివేసేందకు ఆపరేషన్ కగార్ చేపట్టడం సరైంది కాదని, తక్షణమే దీనిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకునేదిలేదని కేంద్ర మంత్రి నియంతలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి, పాతూరి సుగుణమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు ఆది సాయన్న, ఆకుల శ్రీనివాస్, నాయకులు చొప్పరి సోమయ్య, మోతె శ్రీశైలం, చామకుర యాకూబ్, కెమిడి మల్లయ్య, గుగులోత్ సఖి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు -
అధికారులు బాధ్యతగా పనిచేయాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మున్సిపాలి టీ సమగ్రాభివృద్ధికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని తన నివాసంలో శుక్రవారం మున్సిపాలిటీ అఽధికారులు, స్థానిక నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని వ్యర్థాల సేకరణ, నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, చెత్త సేకరణ కు స్వచ్ఛ ఆటోలు, చెత్తకుండీల ఏర్పా టు, డ్రెయినేజీల శుభ్రత, పారిశుద్ధ్య కార్మికుల నియామకం తదితరాలు వెంటనే చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ట్యాంకర్లు, అదనంగా అవసరమైతే అంచనాలు సిద్ధం చేయాలని, అంతర్గత పైపులైన్లు వేయాలని చెప్పారు. విద్యుత్ సమస్య లేకుండా చూడాలని, కాలనీల్లో వీధి దీపాలు, ఇంటింటికీ మీటరు, కూడళ్లలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నా రు. మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి, ఛాగల్లులో బీటీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి గ్రామాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
వానాకాలం పంటల ప్రణాళిక ఖరారు
3.49 లక్షల ఎకరాల్లో సాగు అంచనా..జనగామ రూరల్: జిల్లాలో యాసంగి పంటలు ముగుస్తున్న క్రమంలో రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. యాసంగి సీజన్ చివరలో జిల్లాకు దేవాదుల ద్వారా నీరు రాకపోవడంతో పంటలు ఎండిపోయి చాలామంది రైతులకు నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడులు సైతం రాక ఇబ్బందులు పడ్డారు. ఈ వానాకాలంలోనైనా మంచి దిగుబడి వస్తుందనే ఆశతో ముందుకుసాగుతున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. వానాకాలంలో సుమారు 3,49,930 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అంచనా వేస్తున్నారు. అయితే గత సీజన్తో పోలిస్తే ఈసారి 40 నుంచి 50 వేల ఎకరాల్లో అదనంగా సాగయ్యే అవకాశం ఉన్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే పండ్ల తోటలు, ఇతర పంటల సాగుకు సంబంధించి ప్రణాళికను సైతం రూపొందించారు. ఈసారి వర్షాలు సైతం ముందుగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో కొంత మంది రైతులు వేసవి దుక్కులు మొదలుపెట్టారు. సీజన్ ప్రారంభం నాటికి ఎరువులు రైతులు సాగు చేసే పంటలకు అనుగుణంగా ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు, విత్తనాలు అవసరమవుతాయో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాకు సంబంధించి వివిధ రకాల ఎరువులు 95,691 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. యూరియా 26వేలు అవసరం ఉండగా ప్రస్తుతం 4 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. డీఏపీ 5వేల మెట్రిక్ టన్నులకు 790 మెట్రిక్ టన్నులు, పోటాష్ 3,529 మెట్రిక్ టన్నులకు 450, ఎస్ఎస్పీ 1,783 మెట్రిక్ టన్నులకు 590, కాంప్లెక్స్ ఎరువులు 10 వేల మెట్రిక్ టన్నులకు 2వేల మెట్రిక్ టన్నులతోపాటు ఎరువలు అందుబాటులో ఉన్నా యి. అయితే సీజన్ ప్రారంభం వరకు నెలవారీ కోటా వస్తుందని, ఆ మేరకు రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉంచుతాం.. వానాకాలం సాగుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళిక రూపొందించాం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఎరువులకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నవే కాకుండా సీజన్ ప్రారంభం వరకు నెలవారీ కోటా తెప్పించి అందుబాటులో ఉంచుతాం. జిల్లాలో ఈసారి 3లక్షల 49 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశాం. – రామారావు నాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఈ ఏడాది అత్యధికంగా వరి, పత్తికి అవకాశం అందుబాటులో 25 శాతం విత్తనాలు, ఎరువులు సీజన్ నాటికి అందించేలా అధికార యంత్రాంగం కసరత్తు దుక్కులు సిద్ధం చేసుకుంటున్న అన్నదాతలువిత్తనాల అంచనా.. ఈసారి జిల్లాలో ఎక్కువగా వరి, పత్తి సాగవుతుండగా ఇందుకు అనుగుణంగా ముందుగానే అధికారులు అవసరమయ్యే విత్తనా ల అంచనాలు సిద్ధం చేశారు. పత్తి 5లక్షల ప్యాకెట్లు, వరి 44,012 క్వింటాళ్లు, రెడ్గ్రాం 70 క్వింటాళ్లు, పల్లికాయ 50 క్వింటా ళ్లు, మొక్కజొన్న 367వేల క్వింటాళ్లు, మినుములు 1.5 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని భావిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. నకిలీ విత్తనాలతో పాటు విత్తనాలు, ఎరువుల విక్రయాలపై ఆన్లైన్ పద్ధతి, రశీదుల జారీపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. -
లక్ష్య సాధనలో ముందుండాలి
జనగామ: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్య సాధనలో ముందుండాలి.. ఇందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నా రు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పని తీరుపై గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి నెలా ప్రసూతి సేవలతో పాటు డెలివరీలు 50, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 15కు తగ్గకుండా చేయాలన్నారు. మొదటి నెల చెకప్ నుంచి గర్భిణి రిజిస్ట్రేషన్ మొదలు డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, జీరో మాతృమరణాల కోసం అంకితభావంతో పని చేయాలని చెప్పారు. ఎన్సీడీ ప్రోగ్రాంలో తప్పులు లేకుండా వివరాలను రికార్డు చేయాలని, టీబీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సబ్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న కంటిపరీక్షల వైద్య శిబిరాలు జూన్ 15లోగా పూర్తి చేయాలని అన్నారు. ఎండా కాలంలో వడ దెబ్బ నివా రణపై అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య సలహా లు ఇవ్వడంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూ చించారు. సమీక్షలో డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు, వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ వీరాంజనేయులు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ డి.రవీందర్గౌడ్, డాక్టర్ స్వర్ణకుమారి, డాక్టర్ సుధీర్, డాక్టర్ అశోక్కుమార్, డాక్టర్ కమల్హసన్ పాల్గొన్నారు. తాగునీటి ఇబ్బందులు రావొద్దు వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం మండలాల వారీగా వివిధ శాఖల అధికారులతో తాగునీటి సరఫరాపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటి సరఫరాకు సంబంధించి మోటా ర్లు, పైపులు రిపేరుకు వస్తే తమ దృష్టికి తీసుకొచ్చి మరమ్మతు చేయించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషామాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలిజనగామ రూరల్: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం కలెక్టరెట్లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ‘నషా ముక్తి అభియాన్’ కింద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం.. కంచి వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్ ఎన్జీఓ ఆధ్వర్యాన అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అటెండర్లు, ఆశ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, తిరుమల బ్యాంకు మేనే జర్ నంగునూరు చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
జూన్ లోపు పనులు పూర్తిచేయాలి
జనగామ: జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డు నుంచి జ్యోతినగర్ కాలనీ మీదుగా 3వ వార్డులో నిర్మాణం చేపట్టిన అండర్ గ్రౌండ్ నాలా పనులు జూన్లోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. వార్డు మాజీ కౌన్సిలర్ పగిడిపాటి సుధాసుగాణాకర్రాజుతో కలిసి ఆయన పనులను గురువారం పరిశీలించారు. ప్రతీ వారం వచ్చి పనులను పరిశీలిస్తానని, జాప్యం చేయొద్దని సూచించారు. లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని అన్ని మీ–సేవ కేంద్రాల్లో ఈనెల 17వ తేదీ వరకు అపప్లై చేసుకోవచ్చని, ఎంపికై న వారికి జిల్లా కేంద్రంలో 50 పని దినాలు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ గణిత శాస్త్రం అంశంగా, కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా(సివిల్), బీటెక్(సివిల్) పూర్తి చేసి ఉండాలన్నారు. 13న జాబ్ మేళాజనగామ రూరల్: జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈనెల 13న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి పి.సాహితి ఒక ప్రకటనలో తెలిపారు. వీటుసీ స్కిల్ డెవలప్మెంట్ సెంట ర్ ట్రైనింగ్ కం ప్లెస్మెంట్ కోసం ఇంటర్వ్యూ లు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న జనగామతోపాటు ఉమ్మడి వరంగల్ నిరుద్యోగ యువతీ యువకులు బయోడేటా లేదా రెస్యూమ్, విద్యార్హతల సర్టిఫికట్స్ జిరాక్స్తో ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని 8వ నంబర్ గదికి రావాలని సూచించారు. వివరాల కు సీనియర్ అసిస్టెంట్ జె.గీతను 79954 30401 నంబర్లో సంప్రదించాలన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’జనగామ రూరల్: ఆర్టీసీ జనగామ డిపోలో శుక్రవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, మద్దూరు, పాలకుర్తి మండలాల్లోని గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలతో పాటుగా సూచనలు సలహాలను ఇవ్వాలని సూచించారు. ఇందుకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 9959226050 నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు. కోర్టుకు హాజరైన పొన్నాల లక్ష్మయ్య జనగామ రూరల్: జిల్లా ఉద్యమ కేసులో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గురువారం జనగామ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం గిర్నిగడ్డ ప్రాంతంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దుర్గమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్, నాయకులు ఆకుల సతీష్, జంగిటి అంజయ్య, గురువయ్య, ఎండీ.మాజీద్, సౌడ మహేష్, యాట క్రాంతికుమార్ తదితరులున్నారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం పనితీరును మెరుగుపర్చేందుకు ‘ర్యాప్’ పథకంలో భాగంగా జిల్లాకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కేటాయించారని జిల్లా పరిశ్రమల మేనేజర్ శివకృష్ణ ఠాకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఈనెల 10 తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. -
పోస్టుమార్టం అంతా గోప్యం!
● ఎంజీఎం మార్చురీ వద్ద కమాండర్ల పేర్లు వెల్లడించని అధికారులు ● డీజీపీ వచ్చాక సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల ● ప్రత్యేక బందోబస్తుతో హెడ్క్వార్టర్స్కు మృతదేహాల తరలింపుఎంజీఎం/మామునూరు: తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులోని పేరూరు–లంకపల్లి అడవుల్లో గురువారం తెల్లవారు జామున జరిగిన పరస్పర కాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్ కమాండర్లు మందుపాతర పేలి చనిపోయారని పోలీసులు ప్రకటించారు. వారి మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు తీసుకువచ్చారు. అక్కడినుంచి మామునూరు ఏసీపీ తిరుపతి పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్లో ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు, ముగ్గురు తహసీల్దార్లు, గ్రేహౌండ్స్ అధికారులు నాలుగు గంటలపాటు రహస్యంగా పోస్టుమార్టం చేయించారు. కనీసం మార్చురీ వద్ద మృతి చెందిన పోలీసుల పేర్లు వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ తర్వాత డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నక్సలైట్ల దాడిలో గ్రే హౌండ్స్కు చెందిన కమాండర్లు వడ్ల శ్రీధర్, ఎన్.పవన్ కల్యాణ్, టి.సందీప్ చనిపోయినట్లు సాయంత్రం మీడియాకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం మృతదేహాలను చాపల్లో చుట్టి ప్రత్యేక బందోబస్తు నడుమ పోలీస్ హెడ్క్వార్టర్స్కు తరలించారు. అక్కడ కమాండర్ల మృతదేహాలకు రాష్ట్రమంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, ఏడీజీ గ్రే హౌండ్స్ స్టీపెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, సీపీ సన్ ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ నివాళులర్పించారు. కాగా, ముగ్గురు జవాన్లలో ఇద్దరు హైదరాబాద్, మరొకరు కామారెడ్డికి ప్రాంతానికి చెందిన వారు. బుల్లెట్ గాయాలతోనే మృతి.. బుల్లెట్ గాయాలతోనే జవాన్లు మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టంగా వెల్లడైంది. ల్యాండ్మైన్ పేలడంతోనే జవాన్లు చనిపోయి ఉంటే మృతదేహాలు చెల్లాచెదురయ్యేవి. కాగా, ముగ్గురు జవాన్లకు ఐదు బుల్లెట్లు దిగినట్లు తెలుస్తోంది. మెడ, పక్కటెముకలు, కడుపులోకి బుల్లెట్లు వెళ్లడంతో వారు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిపల్లికి చెందిన ఆర్ఎస్సై రణధీర్ను అత్యవసర వైద్యసేవల కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్చురీ వద్ద కనిపించని కుటుంబ సభ్యులు.. సాధారణంగా మార్చురీ వద్ద మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తుండగా వారి కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ, పోలీస్ సిబ్బంది, గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు ముగ్గురు జవాన్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పోస్టుమార్టం వద్దకు రానివ్వకుండా పోలీసు హెడ్క్వార్టర్స్కు తరలించారు. -
రోస్టర్ పద్ధతిలో పుష్కర విధులు
సరస్వతి పుష్కరాల విధుల నిర్వహణకు డ్యూటీ రోస్టర్ తయారు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.వాతావరణం జిల్లాలో ఉదయం ఎండ వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాలులు వీస్తాయి. ఉక్కపోత పెరుగుతుంది. – 10లోu● 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు ● సిగ్నల్ పడితే ఒకటిన్నర నిమిషాల నిరీక్షణ ● జంక్షన్లో వాహనదారుల అవస్థలుజనగామ: వేసవి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. 44 డిగ్రీల సెల్సిఎస్ పైచిలుకు టెంపరేచర్ నమోదవుతోంది. ఉదయం 8 గంటలకే చెమటలు కక్కిస్తు న్న సూరీడు.. 10 గంటల కల్లా భగ్గున మండిపోతున్నాడు. ఫ్యాన్ గాలి వేడెక్కి పోతుంటే.. ఏసీలు, కూలర్లు ఏమాత్రం ఉపశమనం కలిగించలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని జంక్షన్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో ద్విచక్రవాహన చోదకులు.. ప్రజలు ఎండ వేడికి డీ హైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. జనగామ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత వ్యాపార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. జనగామతో పాటు సమీప జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తుంటారు. కలెక్టరేట్కు కొందరైతే.. వ్యాపార పరంగా సరుకుల కొనుగోలుకు మరికొందరు.. ఆస్పత్రులు, బ్యాంకులు తదితర పనుల కోసం వచ్చే వారితో నిత్యం రద్దీగా ఉంటుంది. హనుమకొండ, సూర్యాపేట, హైదరాబాద్, సిద్ధిపేటరోడ్డు నుంచి వచ్చే ప్రతీ ఒక్కరు ఆర్టీసీ చౌరస్తా కూడలి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ సిగ్నల్ వద్ద రెడ్లైట్ వెలిగితే ఒకటిన్నర నిమిషాలు ఆగాలి. ఉద యం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో బైక్, సైకిల్, ఆటోలో వెళ్లే వారు ఎండ దెబ్బకు గురవుతున్నారు. బైకిస్టులు సొమ్మసిల్లి పడిపోయిన సంఘటనలున్నాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆర్టీసీ చౌరస్తా సిగ్నల్ జంక్షన్ వద్ద వాహన చోదకులు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. బస్టాండ్ ఏరియా వైపు.. -
పాడి పరిశ్రమపై నీలి నీడలు
జనగామ: కరువుకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న జనగా మలో ఓ వెలుగు వెలిగిన పాడి పరిశ్రమపై ప్రస్తు తం నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పాడి రైతులకు ప్రోత్సాహం అందించి, భరోసా కల్పించాల్సిన పాలకులు.. ఉన్న డీడీ (డిప్యూటీ డైరెక్టర్) పోస్టుకు మంగళం పాడేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. పాపిరెడ్డి పోరాటంతో పాల వెల్లువ జనగామలో పాడి పరిశ్రమ అభివృద్ధికి దివంగత మర్రి పాపిరెడ్డి చేసిన పోరాటంతో నాటి మంత్రి పొ న్నాల లక్ష్మయ్య సంపూర్ణ సహకారం అందించారు. పల్లె పల్లెన పాడిని అభివృద్ధి చేసేందుకు పాపిరెడ్డి నాటిన విత్తనం.. నేడు జిల్లా పాల వెల్లువలా మా రింది. మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు సబ్సిడీపై పాడి గేదెలు, దాణా, రుణాలు అందిస్తూ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించారు. అలాగే ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ కరువు ప్రాంతంలో పాడి పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విజయ డెయిరీ నుంచి ఉచిత పశువైద్య శిబిరాలు, పాడి గేదెలకు సబ్సిడీ రుణాలు తదితర ప్రోత్సాహకాలను నిలిపి వేశారు. రోజూ 34వేల లీటర్ల సేకరణ జిల్లాలో 5,500 మంది రైతుల నుంచి 225 విజయ పాల కేంద్రాల ద్వారా రోజువారీగా 34వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. పాల సేకరణలో రాష్ట్రంలో జనగామ 3వ స్థానంలో ఉంది. జిల్లా కేంద్రంలో 20వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పాలశీతలీకరణ కేంద్రం అందుబాటులో ఉండగా.. బచ్చన్నపేటలో 6వేలు, నర్మెట 3 వేలు, 2వేలు(రెండు), పాలకుర్తి 3వేలు, స్టేషన్ఘన్పూర్ 5వేలు, లింగాలఘణపురం 2వేలు, సింగరాజుపల్లి 2వేలు, చిల్పూరు వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న మినీ శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు ప్రతినెలా రూ.5కోట్ల వరకు చెల్లిస్తున్నారు. ప్రోత్సాహం అందిస్తే పాల సేకరణ 50వేల లీటర్లకు చేరే అవకాశం ఉంది. విజయ డెయిరీ డీడీ పోస్టు ఎత్తివేతకు రంగం సిద్ధం..? పాల సేకరణలో రాష్ట్రంలో జనగామకు గుర్తింపు రోజుకు 34 వేల లీటర్ల పాల సేకరణ ప్రోత్సాహం అందిస్తే 50వేల లీటర్లకు చేరే అవకాశంపోస్టు ఎత్తివేతకు కుట్రలు.. పాడి పరిశ్రమతో రైతులు అదనపు ఆదాయం ఆర్జిస్తున్న సమయంలో వారిని ప్రోత్సాహించా ల్సిన తరుణంలో డిప్యూటీ డైరెక్టర్(డీడీ) పోస్టును ఎత్తి వేసేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీడీ పర్యవేక్షణలో జనగామ విజయ పాల శీతలీకరణ కేంద్రం కొనసాగుతోంది. డెయిరీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఇక్కడి డీడీ పోస్టును ఉమ్మడి వరంగల్ జిల్లాకు తరలించాలనే నిర్ణయం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. అలాగే దీనిపై ఇటీవల పాడి పరిశ్రమాభివృద్ధి కమిటీలోని పలువురు హైదరాబాద్లో ఉన్నతా ధికారులతో పాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసి డీడీ పోస్టు తరలించ వద్దని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ఐదేళ్ల క్రితం పాలతో తయారు చేసే ఉత్పత్తులు, టెట్రా ప్యాకెట్ల తయారీ కేంద్రాన్ని ఇక్కడే నెలకొలిపేందుకు ప్లాన్ చేయగా.. దీనిని సైతం పక్కన పెట్టారు. డీడీ పోస్టును తరలించి పాడి పరిశ్రమను నిర్వీర్యం చేయాలని చూస్తే పాపిరెడ్డి ఆశయానికి విలువ ఉండదని రైతులు అంటున్నారు. -
డిగ్రీ పరీక్షల షెడ్యూల్ విడుదల
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీ ఒకేషనల్ తదితర కోర్సుల్లోని 2,4,6 సెమిస్టర్ల, బ్యాక్లాగ్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షల టైంటేబుల్ను గురువారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సెమిస్టర్ల వారీగా ఇలా.. ● రెండో సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 14నుంచి నిర్వహించనున్నారు. ఈనెల 14, 16, 19, 21, 23, 2 6, 28, 30 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ● నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15, 17, 20, 22, 24, 27, 29, 31, జూన్ 4వ తేదీల్లో ఉద యం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు. ● ఐదవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17, 20, 22, 24, 27, 29, 31, జూన్ 4, 10, 11, 12, 13, 16వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటాయి. ● 6వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 14, 16, 19, 21, 23, 26, 28, 30. జూన్ 3, 5, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తారు. ● మొదటి సెమిస్టర్ పరీక్షలు జూన్ 17,18, 20, 21, 23, 24, 25వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటలవరకు జరుగుతాయి. ● మూడవ సెమిస్టర్ పరీక్షలు జూన్ 16, 17, 18, 19, 20, 21, 23, 24, 25 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటాయి. 14నుంచి సెమిస్టర్ల పరీక్షలు -
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు ఇబ్బంది పడేలా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్.. మందుబాబులను హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాల ముందు, రోడ్డుపై మద్యం సేవిస్తుండటంతో వచ్చిపోయే ప్రజలు, చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్న వైనంపై ఈ నెల 4వ తేదీన సాక్షిలో ప్రత్యేక విజిట్ కథనం ప్రచురితమైంది. దీంతోపాటు పోలీసులకు పలు ఫిర్యాదులు రావడంలో సీపీ స్పందించారు. బహిరంగ మద్యపానంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పగలు, రాత్రి సమయాల్లో మద్యం దుకాణం పరిసరాలతోపాటు నిర్మానుష్య ప్రదేశాల్లో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. దీంతోపాటు నిర్మాణంలో ఉన్న భవనాలు, మనుషులు నివాసం లేని పురాతన భవనాల్లో తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. దీనిలో భాగంగానే బుధవారం రాత్రి కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 221 మంది మందుబాబులను అదుపులోకి తీసుకొని వారిపై సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా జనగామ డివిజన్ పరిధిలో 57 కేసులు నమోదు కాగా, హనుమకొండ డివిజన్ పరిధిలో 42 , ఘన్పూర్ 40, కాజీపేట 24, వర్ధన్నపేట 24, నర్సంపేట 24, వరంగల్ 10 కేసులు నమోదైనట్లు వివరించారు. మద్యం దుకాణాల పరిసరాల్లో ఎవరూ బహిరంగంగా మద్యం సేవించకుండా దుకాణ యజమానులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. సీపీ సన్ప్రీత్ సింగ్ -
ముగిసిన విద్యుత్ భద్రతా వారోత్సవాలు
జనగామ: విద్యుత్ ప్రమాదాల నివారణకు జిల్లాలో వారం రోజులుగా నిర్వహించిన భద్రతా వారోత్సవాలు ముగిశాయని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సీఎండీ వ రుణ్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు ఊరూరా భద్రతా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. టోల్ ఫ్రీ 1912, వాట్సాప్ నంబర్ 7901628348 ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో సక్సెస్ రేటు సాధించామన్నారు. ఉద్యోగుల భద్రతకు సేఫ్టీ బెల్ట్, గ్లోవ్స్, ఎర్త్ డిశ్చార్జ్ రాడ్స్, హెల్మెట్లను అందించినట్లు చెప్పారు. అవగాహన సదస్సులతో ప్రమాదాలను తగ్గించగలిగామన్నారు. ఎస్ఈ వెంట జనగామ, స్టేషన్ఘన్పూర్ డీఈలు లక్ష్మీ నారాయణరెడ్డి, రాంబాబు, టెక్నికల్ ఇంజనీర్ గణేష్, ఎంఆర్టీ డివిజనల్ ఇంజనీర్ విజయ్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ జయరాజు తదితరులు ఉన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
జనగామ రూరల్: కేంద్రం అవలంభించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రాపర్తి రాజు, సుంచు విజేందర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులకు సమ్మె నోటీసులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారని, కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాల రాయబడ్డాయన్నారు. దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నబోయిన రాజు, జోగు ప్రకాష్, మల్లేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జనగామ రూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యమని గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, దరఖాస్తుదారుల పరిశీలన ప్రక్రియపై అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏఈలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులు ఎక్కువ కాకుండా, 400 చదరపు అడుగుల తక్కువ కాకుండా నిర్మించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి నూతన పద్ధతులు ఉపయోగించాల, వాటిపై అవగాహన పెంపొందించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని, ఎప్పటికప్పుడు సర్వే చేసిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల అర్హుల ఎంపికకు చేపట్టిన సర్వేను వేగవంతం చేయాలన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద పైలట్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాల మంజూరుకు పోర్టల్లో వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపీరాం, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చైతన్య కుమార్, ఎంపీడీఓలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాల పరిశీలన లింగాలఘణపురం: మండలంలోని కొత్తపల్లిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, వనపర్తిలో రెండో విడత లబ్ధిదారుల జాబితాలో అధికారులు చేపట్టిన విచారణ ఏ విధంగా జరుపుతున్నారనే విషయాలను బుధవారం గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పూర్తి చేసుకోవాలని సూచించారు. వనపర్తిలో రెండో విడత లబ్ధిదారుల జాబితాలో అధికారులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. కలెక్టర్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్, పీడీ మాతృనాయక్, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ -
సకాలంలో లారీలను పంపించండి
● అదనపు కలెక్టర్ రోహిత్సింగ్జనగామ రూరల్: సకాలంలో లారీలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మినీ సమావేశ మందిరంలో డీసీపీ రాజ మహేంద్రనాయక్తో కలిసి ధాన్యం తరలింపుపై రైస్ మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్స్తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులను సరైన విధంగా నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగు, తదితర అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతీ కొనుగోలు కేంద్రాల వద్ద లారీలను అందుబాటులో ఉంచాలని లారీ కాంట్రాక్టర్స్ను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ సరస్వతి, డీఎం సీఎస్ హాతీరాం, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, రైస్ మిల్ల ర్లు, లారీ కాంట్రాక్టర్స్, తదితరులు పాల్గొన్నారు. -
సోమేశ్వరాలయంలో భక్తుల సందడి
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, కొడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. హుండీ ఆదాయం రూ.97,143 వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ. 97,143 వచ్చినట్లు ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు 48 రోజుల ఆదాయాన్ని బుధవారం ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప్పలమ్మ టెంపుల్ ఈఓ కేకే రాములు పర్యవేక్షణలో లెక్కించారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. బెట్టింగ్లకు దూరంగా ఉండాలి: ఎమ్మెల్యేజనగామ రూరల్: యువత క్రికెట్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్టిన్ గ్రౌండ్లో ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత ఆటలతో ఉత్సాహంగా ఉంటారన్నారు. ప్రస్తుతం సమాజాన్ని డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్లు పట్టి పీడిస్తున్నాయని యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్ పాల్పడొద్దన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలు, ప్రవర్తనపై శ్రద్ధ పెట్టాలన్నారు. మార్కెట్ సిబ్బందికి డ్రెస్కోడ్ జనగామ/జనగామ రూరల్: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా డ్రెస్కోడ్ పాటించి విధులకు హాజరు కావాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ సూచించారు. బుధవారం సెక్యూరిటీ గార్డులకు నూతన యూనిఫామ్స్ను అందజేశారు. వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులు, వ్యాపారులు, ప్రజలకు కమిటీ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. మార్కెట్కి భవిష్యత్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఏఎంసీకి లాభాలు వచ్చే విధంగా ప్రణాళికలు తయారుచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సూపర్వైజర్లు బోట్ల శ్రీనివాస్, డైరెక్టర్లు బోట్ల నర్సింహారావు, బంద కుమార్, పర్శ సిద్దేశ్, అడ్తి అసోసియేషన్ అధ్యక్షుడు మాశెట్టి వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు. క్యాడ్, క్యామ్ ల్యాబ్ ఎంతో ఉపయోగకరం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సి టీలోని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజిలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్(క్యాడ్) అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ మాన్యుఫ్యాక్చరింగ్(క్యామ్) ల్యాబ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి అన్నారు. ల్యాబ్ను బుధవారం రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక డిజైన్ ప్లానింగ్తో ఏర్పాటుచేసి ల్యాబ్ మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ మాట్లాడుతూ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ రెండు విడతల్లో అందించిన కంప్యూటర్లతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు మనిషా, సాబూ, పద్మజ, రమణి, ముత్యం వంశీలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ సీహెచ్.రాధిక, అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.నేతాజీ, లైబ్రరీ అసిస్టెంట్ డాక్టర్ ఎస్.సుజాత పాల్గొన్నారు. -
నంబర్
నగదు చెల్లింపుల్లో... రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల్లో జనగామ ముందంజజనగామ: ధాన్యం కొనుగోళ్ల నగదు చెల్లింపులో జిల్లా రాష్ట్రంలోనే నంబర్ వన్గా నిలుస్తోంది. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన జిల్లాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్లో రైతుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయిస్తూ.. అన్నదాతలకు పూర్తి భరోసా కల్పించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పీఏసీఎస్, ఐకేపీ సెంటర్లు 276 (దొడ్డు, సన్నరకం) ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత నెల 19వ తేదీ వరకు వందశాతం సెంటర్లు ప్రారంభం కాగా.. కొనుగోళ్లు పట్టాలెక్కాయి. యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి కరువు నేపధ్యంలో 25 శాతం మేర పంట దిగుబడి తగ్గినట్లు అంచనా వేశారు. జిల్లాలో ప్రభుత్వ సెంటర్లు ప్రారంభం కాకముందు జనగామ వ్యవసాయ మార్కెట్తో పాటు మండల కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారం జోరుగా సాగింది. జనగామ ఏఎంసీలో 20 రోజులు పాటు రికార్డు స్థాయిలో ధాన్యం సరుకు వచ్చింది. ఒకదశలో సరకు అంచనాలకు మంచి దాటి పోవడంతో కొనుగోలు భారంగా మారింది. ప్రభుత్వ సెంటర్లను ప్రారంభించడంతో మార్కెట్కు వచ్చే సరుకు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. క్వింటా ధాన్యం ఏ గ్రేడు రూ.2,320 మద్దతు ధర ఉండడంతో.. మెజార్టీ రైతులు తమ సరుకును కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తున్నారు. ముందస్తుగా అధికారులు వేసుకున్న అంచనాలకు మించి సెంటర్లకు ధాన్యం వచ్చినప్పటికీ.. కొనుగోళ్లలో ఎక్కడా కూడా అవాంతరాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నేటికి ధాన్యం కోతలు జరుగుతుండడంతో మరో 15 రోజుల పాటు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా చివరిస్థానం.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల నగదు చెల్లింపుల్లో జిల్లా 82.24 శాతంతో మొదటి స్థానంలో నిలువగా, రెండో స్థానంలో పెద్దపల్లి జిల్లా 81.63, మూడవ స్థానంలో ఖమ్మం 78.65, నాలుగవ స్థానంలో నిజామాబాద్ 74.37, వికారాబాద్ జిల్లా 65శాతంతో చిట్ట చివర స్థానంలో నిలిచింది. ఓపీఎంఎస్లో ఎప్పటికప్పుడు.. జిల్లాలో ప్రభుత్వ ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో ఇప్పటి వరకు 16,192 మంది రైతుల వద్ద సన్న, దొడ్డు రకం ధాన్యం 80,990 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు గాను రూ.192.63 కోట్లు రైతులకు నగదు రావాల్సి ఉండగా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.127.84 కోట్ల మేర వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఇంకా రూ.64.79 కోట్లు రావాల్సి ఉంది. సెంటర్ల వారీగా కొనుగోలు చేసిన ధాన్యంలో 75,518 మెట్రిక్ టన్నుల సరుకు రైస్ మిల్లుకు తరలించగా, ఇంకా 11,030 మెట్రిక్ టన్నుల సరుకు సెంటర్లలో ఉంది. సన్న ధాన్యం 10,186 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేయగా, అసలు నగదు బ్యాంకులో జమ కాగా, రూ.500 బోనస్ రావాల్సి ఉంది. కలెక్టర్ ఆదేశాల మేరకు సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్లో వారి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఆన్లైన్ చేయడంతో రైతులకు వచ్చే నగదును త్వరగా బ్యాంకులో జమ చేయగలిగారు.జిల్లాలో ధాన్యం కొనుగోలు వివరాలు 80వేల మెట్రిక్ టన్నుల సన్న,దొడ్డు ధాన్యం కొనుగోలు రైతుల ఖాతాల్లో రూ.127 కోట్లు జమ కొనుగోళ్లపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సంతోషంలో అన్నదాతలు -
విద్యార్థులు పట్టుదలతో చదవాలి
జనగామ రూరల్: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి కలెక్టర్ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు విజయోస్తు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పది ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా మూడో స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. జిల్లాలోని 129 పాఠశాలలు వందశాతం ఫలితాలు సాధించాయన్నారు. స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్ విద్యార్థులకు ఎంతగానో దోహదపడిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అనంతరం జిల్లా రైస్ మిలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకట్నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో 23 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. సమావేశంలో డీఈఓ భోజన్న, బీసీ సంక్షేమ అధికారి రవీందర్, ఎస్సీ సంక్షేమ అధికారి విక్రమ్, డీఐఈఓ జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ–పాస్ యంత్రాలను సక్రమంగా వినియోగించాలివిత్తన డీలర్లు ఎరువులు, విత్తనాల విక్రయాల్లో ఈ–పాస్ యంత్రాలను సక్రమంగా వినియోగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో సీఐఎల్ కంపెనీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ–పాస్ యంత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 249 ఎరువుల డీలర్లకు యంత్రాల పంపిణీ చేస్తామన్నారు. లైసెన్స్ కాలపరిమితి సరిచూసుకొని అందులో చేర్చిన కంపెనీ ఉత్పత్తులను, స్టాక్లను మాత్రమే విక్రయించాలన్నారు. షాప్లో ఉన్న ఫిజికల్ స్టాక్కు, మిషన్లో పొందుపరిచిన స్టాక్కు తేడాలేకుండా ఉండాలన్నారు. అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సూచించిన ధరలకే అమ్మాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ రామరావు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వసంత సుగుణ, వ్యవసాయ సహాయ సంచాలకులు కె.నిర్మల, సీఐఎల్ ప్రతి నిధులు సజ్జన్, శ్రీధర్రెడ్డి, డీలర్లు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు అందజేత -
అపార నష్టం
అకాల వర్షం..● ఏఎంసీ ఐకేపీ సెంటర్లో తడిసిన వేలాది బస్తాల ధాన్యం ● జిల్లా వ్యాప్తంగా మామిడికి తీవ్రనష్టం ● కొనుగోలు కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం, తడిసిన బస్తాలు ● కన్నీటి పర్యంతమవుతున్న అన్నదాతలు ● తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ ● క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కలెక్టర్, ఉన్నతాధికారులుజనగామ: వరిగింజ పొట్టదశలో మొహం చాటేసిన వరణుడు, ధాన్యం అమ్ముకునే సమయంలో అకాల వర్షాలు వెంటాడుతున్నాడు. దిగుబడులు తగ్గి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్న రైతుల ఆశలను అడియాశలవుతున్నాయి. వరికోతలు ప్రారంభమైన నాటి నుంచి అడపదడపా వర్షాలు కురుస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఈ నెల 5వ తేదీ రాత్రి 9 నుంచి రెండు గంటల పాటు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో వరి, మామిడి, కూరగాయల తోటలకు తీవ్ర నష్టం జరిగింది. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి వరదకు కొట్టుకుపోయాయి. వందలాది ఎకరాల్లో మామిడి కాయలు రాలి పోగా.... విద్యుత్ శాఖకు అపార నష్టం మిగిల్చింది. ఏఎంసీ ఐకేపీ సెంటర్లో తడిసిన ధాన్యం జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన చీటకోడూరు ఐకేపీ సెంటర్లో వందలాది బస్తాల ధాన్యం తడిసి పోయింది. ఎగువ ప్రాంతం నుంచి వరదతో సుమారు 15 నుంచి 20 బస్తాల గింజలు కొట్టుకుపోయాయి. యార్డులో ధాన్యం రాశుల చుట్టూ వరద నిలిచిపోవడంతో చిన్నపాటి కుంటలను తలపించాయి. సెంటర్కు వచ్చి 10 నుంచి 20 రోజులు గడిచి పో తున్నా.. ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం, అలసత్వం చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, తహసీల్దార్ హుస్సేన్తో కలిసి ఆర్డీఓ గోపీరామ్ సెంటర్కు వచ్చి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తామని భరోసా కల్పించారు. నేలరాలిన మామిడి జిల్లాలో కురిసిన భారీ వర్షంతో వరి, మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది. సుమారు 3 వందల ఎకరాల మామిడి తోటల పరిధిలో కాయలు రాలినట్లు హార్టీకల్చర్ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. స్టేషన్ఘన్పూర్ మండలం తానేదార్పల్లి ధాన్యం కొనుగోలు సెంటర్ను రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ భాషా సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా కల్పించారు. అలాగే జిల్లాలోని మాదాపురం, సింగరాజుపల్లి, లింగాలఘణపురం, చీటూరు, పటేల్గూడెం, కుందారం, వెంకటాద్రిపేట, వడ్లకొండ, అడవికేశ్వాపూర్, తిమ్మంపేట, విస్నూరు, చెన్నూరు, మంచుప్పుల, కన్నెబోయినగూడెం తదితర గ్రామాల్లోని ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లను ఆర్డీఓ, తహసీల్దార్లు, ఉన్నతాధికారులు సందర్శించి, అక్కడి పరిస్థితిని అంచనా వేసి కలెక్టర్కు రిపోర్టు చేశారు. తరిగొప్పుల మండలం అబ్దులనాగారం, రఘునాథపల్లి, పాలకుర్తి, బచ్చన్నపేట, నర్మెట, స్టేషన్ఘన్పూర్ మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొ ట్టుకుపోగా, పలు చోట్ల మామిడికాయలు రాలి పోయాయి. నర్మెట మండలంలో ఓ రైస్ మిల్లు రేకులు ఎగిరి పోగా, గోడలు కూలిపోయాయి. జిల్లాలో వర్షపాతం వివరాలు (మి.మీలో)వర్షపు నీటిని తొలగిస్తున్న రైతుజిల్లాలో 22.4 మిల్లీ మీటర్లు వానాకాలంలో పత్తాలేని వరణుడు, 43 డిగ్రీల ఉష్ణోగ్రతల సమయంలో అకాల వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాడు. 5వ తేదీ రాత్రి జిల్లాలో 22.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైయింది. ధా న్యం తడిసి పోగా, విద్యుత్ స్తంభాలు నేలకొరి గి, కరెంటు తీగలపై చెట్ల కొమ్మలు విరిగి పడడంతో ఆ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.పాలకుర్తి(గూడూరు) 62.8 పాలకుర్తి 46.0 తరిగొప్పుల 37.3 తరిగొప్పుల(అబ్దుల్ నాగారం) 33.8 నర్మెట 33.8 జఫర్గఢ్ 31.3 దేవరుప్పుల 27.8 లింగాఘణపురం 27.3 దేవరుప్పుల 26.0 బచ్చన్నపేట 25.0 జనగామ 20.0 స్టేషన్ఘన్పూర్ 20.0 రఘునాథపల్లి 17.5 కొడకండ్ల 1.3 -
డిగ్రీ పరీక్షలపై అయోమయం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీ ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సులకు సంబంధించి 2, 4,6 సెమిస్టర్లు, బ్యాక్లాగ్ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 14వ తేదీనుంచి నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు గడువు విధించారు. అయినప్పటికీ ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు పరీక్షల విభాగానికి చెల్లించలేదు. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, అధికారులు మాత్రం ఫీజులు చెల్లించిన కళాశాలల విద్యార్థులకు మాత్రం ఈనెల 14నుంచి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు 107 కాలేజీలు ఫీజుల చెల్లింపు.. కేయూ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అటానమస్, గురుకులాలు కలిపి 292 డిగ్రీకాలేజీలు ఉన్నాయి. అందులో 217 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయి. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల నిర్వహణకు రెండు సార్లు టైంటేబుల్ను ప్రకటించి ఫీజులు చెల్లించాలని కోరారు. ఎక్కువశాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు తమకు ప్రభుత్వంనుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, అందువల్ల పరీక్షల నిర్వహణకు సహకరించబోమని బహిష్కరించారు. దీంతో యూనివర్సిటీ అధికారులు రెండు సార్లు పరీక్షలు వాయిదా వేశారు. అయినా చాలా కాలేజీలు ముందుకు రాకపోవటంతో ఈనెల 4న కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఏయే ప్రైవేట్ కాలేజీలు ఇప్పటివరకు పరీక్షల ఫీజులు చెల్లించలేదో గుర్తించారు. ఇటీవల దోస్త్ నోటిఫికేషన్.. 2025–2026 విద్యాసంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్కు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. కేయూ అధికారులు పరీక్షల ఫీజులు చెల్లించని 138 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పేర్లను దోస్త్నుంచి తొలగించారు. దీంతో ఆయా కాలేజీల్లో అడ్మిషన్లకు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం లేదు. దీంతోనైనా పరీక్ష ఫీజులు చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకువస్తాయని భావించారు. మంగళవారం పరీక్ష ఫీజు గడువు ముగిసే వరకు 138 కాలేజీల్లో 4 కాలేజీలు మాత్రమే చెల్లించాయి. మొత్తంగా అన్ని యాజమాన్యాలు కలిపి మంగళవారం వరకు 107కాలేజీలు ఫీజులు చెల్లించాయి. సెమిస్టర్ల పరీక్షలు జరిగేనా ? తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో వారు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనేది సందిగ్ధం నెలకొంది. ప్రధానంగా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులకు ఆరవ సెమిస్టర్ కీలకమైంది. ఈ పరీక్షలు జరగకుంటే వారు ఉన్నత చదువులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం వారు టీజీ ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పీజీసెట్లకు ప్రిపేరవుతున్నారు. ఆ పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ విద్యార్థులనుంచి వినిపిస్తోంది. డిగ్రీ వివిధ సెమిస్టర్ల పరీక్షలకు సుమారు 1.70లక్షలమందికిపైగా విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఫీజు రీయంబర్స్మెంటు ఫీజులు చెల్లించేందుకు ముందుకు రాకపోవడంపై కూడా విమర్శలొస్తున్నాయి. ఫీజులు చెల్లించిన కాలేజీలకే పరీక్షలు నిర్వహిస్తే, చెల్లించని కాలేజీల విద్యార్థుల పరిస్థితి ఏమిటనే చర్చ నడుస్తోంది. ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు కేయూ పరిధిలో విద్యార్థులనుంచి ఫీజులు వసూలు చేసి కూడా ఫీజు రీయంబర్స్మెంటు రాలేదని ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలు ఫీజులు చెల్లించడం లేదు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశాం. వారికి సమయం కూడా ఇచ్చాం. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు ఫీజులు చెల్లించిన అన్ని యాజమాన్యాల కాలేజీల్లో ఈ నెల14నుంచి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తాం. రెండు, మూడు రోజుల్లో హాల్టికెట్లు జారీ చేస్తాం. ఇప్పటికై నా ఫీజులు చెల్లించని కాలేజీలు ఒకటి, రెండు రోజుల్లోనైనా ఫీజులు చెల్లించి నామినల్రోల్స్ ఇవ్వాల్సింటుంది. – కె.రాజేందర్, పరీక్షల నియంత్రణాధికారి కేయూ పరిధిలో ఫీజులు చెల్లించని 138 కళాశాలలను దోస్త్నుంచి తొలగింపు వీటిలో ఎక్కువశాతం ప్రైవేట్ కాలేజీలే.. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు వాయిదా ముగిసిన ఫీజు చెల్లింపు గడువు ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు మిగతా విద్యార్థుల పరిస్థితి ఏమిటీ? -
ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
జనగామ: ప్రమాదాలపై అప్రమత్తంగా ఉంటూ పనులు చేస్తే అన్నింట్లో సక్సెస్ సాధించవచ్చని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని యశ్వంతాపూర్ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.వేణుమాధవ్ అధ్యక్షతన జరిగిన విద్యుత్ భద్రతా వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో డీసీపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. మొబైల్ ఫోన్లో వచ్చే ఆన్లైన్ యాప్లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ద్విచక్రవాహనంపై వెళ్లే సమయంలో హెల్మెట్, కారులో సీటు బెల్ట్ తప్పనిసరి అన్నారు. ఎన్పీడీసీఎల్ కమర్షియల్ డైరెక్టర్ సదర్లాల్ మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా సంస్థ ఇచ్చిన సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్, కల్నల్ భిక్షపతి, మోటివేటర్ స్వప్న, జనగామ, స్టేషన్ఘన్పూర్ డివిజనల్ ఇంజనీర్లు లక్ష్మీనారాయణరెడ్డి, రాంబాబు, టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ గణేష్, ఏఆర్టీ డీఈ విజయ్, సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ జయరాజు, జిల్లా ఏడీఈ, ఏఏఓ, ఏఈ, సబ్ ఇంజనీర్లు తదితరులు ఉన్నారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో డీసీపీ రాజమహేంద్రనాయక్ -
భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం
స్టేషన్ఘన్పూర్: భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. భూభారతి చట్టం అమలు నేపథ్యంలో జిల్లాలో పైలట్ మండలం స్టేషన్ఘన్పూర్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భాగంగా రెండో రోజు మంగళవారం మండలంలోని రాఘవాపూర్, తానేదార్పల్లి గ్రామాల్లో సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి రెండు గ్రామాల్లో సదస్సుల నిర్వహనతీరును పరిశీలించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులతో భూసమస్యలపై అవగాహన వస్తుందన్నారు. మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 13వ తేదీ వరకు సదస్సులు ఉంటాయని, భూ సమస్యలు ఉన్నవారు సదస్సులలో పాల్గొని దరఖాస్తులను సమర్పించాలన్నారు. గతంలో ప్రజలు తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం అధికారులే గ్రామాల్లోకి వచ్చి ప్రజలనుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారన్నారు. భూరికార్డుల్లో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూసమస్యలు, సర్వే నంబర్ల మిస్సింగ్, పట్టా పాసుబుక్కులు లేకపోవడం, సాదాబైనామా, హద్దుల నిర్ధారణ తదితర సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి నిర్ధేశిత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్నాయక్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ బియ్యం పారదర్శకంగా అందించాలి స్టేషన్ఘన్పూర్: రేషన్ బియ్యం పారదర్శకంగా అందించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా ఆదేశించారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని రేషన్షాపును, శివునిపల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టాక్ నిల్వలను, స్టాక్ బోర్డులు, బయోమెట్రిక్ ఈపాస్ యంత్రాలను పరిశీలించారు. ప్రజలకు పారదర్శకంగా రేషన్ అందుతుందా, పంపిణీపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అనే విషయమై క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలంలోని తానేదార్పల్లి గ్రామంలోకి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుందన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు శ్రీకాంత్, సతీష్ తదితరులున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా రెండోరోజు రాఘవాపూర్, తానేదార్పల్లిలో రెవెన్యూ సదస్సులు -
వైభవంగా అష్టదళ పాద పద్మారాధన
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మంగళవారం భక్త జనసందోహం నడుమ ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, కిరణ్మయి దంపతుల ఆధ్వర్యంలో అష్టదళ పాద పద్మారాధన పూజ వైభవంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో 108 బంగారు పుష్పాలు, వెండి పాదపద్మాలను అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామివారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, భక్తులు పాల్గొన్నారు. లారీలు రాకుంటే సమాచారమివ్వండి డీసీపీ రాజమహేంద్రనాయక్ రఘునాథపల్లి: లారీలు సకాలంలో రాకుంటే తమకు సమాచార అందించాలని, కొనుగోలు కేంద్రానికి పంపించే ఏర్పాట్లు చేస్తామని డీసీపీ రాజమహేంద్రనాయక్ తెలిపారు. మంగళవారం మండలంలోని నిడిగొండ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రికార్డులు, నిల్వ ఉన్న ధాన్యం వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలన్నారు. తూకంలో తేడా ఉండొద్దన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్ధతు ధర పొందాలన్నారు. ఆయన వెంట జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, సొసైటీ సీఈఓ అఖిల్, రైతులు మాసంపల్లి సంతోజి, నేతాజీ, పెసరు నాగరాజు తదితరులు ఉన్నారు. క్రీడలతో మానసికోల్లాసం డీఈఓ భోజన్న జనగామ రూరల్: క్రీడలతో విద్యార్థులకు శారీరక మానసిక పెరుగుదలతో పాటు నైపుణ్యాల అభివృద్ధి అవుతాయని డీఈఓ భోజన్న అన్నారు. మంగళవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో జిల్లా అవాస వేసవి క్యాంప్ను డీఈఓ భోజన్న, జీసీడీఓ గౌసియా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు. గౌసియా మాట్లాడుతూ సాంస్కృతిక, విద్యాపరమైన అంశాల్లో ప్రతిభ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రజిత, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి శిక్షణను జయప్రదం చేయాలి జనగామ రూరల్: న్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో మే 10, 11 తేదీల్లో మంచిర్యాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులకు న్యాయవాదులు హాజరై జయప్రదం చేయాలని జిల్లా నాయకులు గాజుల రవీందర్ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో శిక్షణ తరగతుల కరపత్రాలను న్యాయవాదులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తి నైపుణ్యతను పెంపొందించుకుంటేనే రాణించగలుగుతారన్నారు. ఈ శిబిరంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్, ప్లీడింగ్ అండ్ డ్రాప్టింగ్స్, నూతన చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు దండబోయిన యుగేందర్, అశోక్ వర్ధన్రెడ్డి, బద్రీనాథ్, బిట్ల గణేష్, వై.భిక్షపతి, సీహెచ్. చంద్రశేఖర్, జి.అమృత రావు, బి.మధుసూదన్, ఎండీ.జమాల్ షరీఫ్, జి.నర్శింహులు, ప్రశాంత్, రవి, కవిత, రేఖ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రతిభావంతులు
జనగామ రూరల్: ప్రభుత్వ బడుల్లోనే ఉపాధ్యాయుల కృషితో ప్రతిభావంతులైన విద్యార్థులు తయారవుతారని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులను పీఆర్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ గార్డెన్లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో మూడో స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్నారు. సీఎంతో చర్చించి పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ త్వరలో వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఏబీవీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకరాజు మాట్లాడుతూ కార్పొరేట్ కంటే ధీటుగా స్థానిక కాలేజీలు ఉత్తమ విద్యనందిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి -
ఓరుగల్లుకూ ‘గొర్రెల స్కాం’ సెగ!
సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల బాగోతంపై మళ్లీ విచారణ ఉమ్మడి వరంగల్లో కలకలంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొర్రెల పంపిణీలో అక్రమాల కేసును సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏడాది క్రితం వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీలు వేర్వేరుగా పలుకోణాల్లో విచారణ చేపట్టాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ స్థాయి మొదలు ఆ శాఖ కీలక అధికారుల వరకు సుమారు 42 మందిపై మూడు శాఖలు అభియోగాలు మోపాయి. ఇందులో ఎనిమిది మంది ఉమ్మడి వరంగల్లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. సుమారు రూ.700 నుంచి రూ.1,200 కోట్ల వరకు స్కాం జరిగినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చిన నిఘావర్గాలు.. కొందరినీ అరెస్టు చేసి.. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశాయి. ఆ కేసుల్లో ఉండి ఏడాదిలో ఉద్యోగ విరమణ చేసిన నలుగురు అధికారుల బెనిఫిట్స్ కూడా నిలిపి వేశారు. తాజాగా ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా కాంట్రాక్టర్ మొయీనొద్దీన్ దుబాయికి పరారు కావడంతో అక్కడ బ్రేక్ పడింది. తాజాగా మొయీనొద్దీన్కు సంబంధించిన ఇంటిపై దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. ఆయన దగ్గర, ఆయన ద్వారా కొనుగోలు చేసిన పలువురిని విచారణకు పిలుస్తుండటం ఆశాఖలో కలకలం రేపుతోంది. యూనిట్ల వివరాలపై ఈడీ నోటీసులు.. గొర్రెల పంపిణీలో గోల్మాల్ వ్యవహారం మనీ ల్యాండరింగ్గా భావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఆ స్కాం గుట్టు తేల్చేందుకు చివరి ప్రయత్నంగా జిల్లాల వారీగా పంపిణీ చేసిన యూనిట్ల వివరాలు కోరింది. 2017 నుంచి 2024 వరకు పంపిణీ చేసిన యూనిట్ల సమాచారం కావాలని ఈ మేరకు జిల్లా వెటర్నరీ, పశుసంవర్దకశాఖ అధికారులకు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ వివరాలు గత నెలాఖరు వరకే ఈడీకి సమర్పించాల్సి ఉండగా, కొందరు అబ్స్ట్రాక్టు మాత్రమే ఇచ్చి, మరికొందరు సంపూర్ణంగా ఇవ్వగా.. రెండు జిల్లాల నుంచి సమాచారం వెళ్లలేదని తెలిసింది. పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల వివరాలు పంపించని అధికారులు ఈనెల 10 వరకు ఇవ్వాలని మరోసారి రిమైండర్ లేఖ పంపించినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై దృష్టి ఇదిలా ఉండగా 2017 నుంచి 2024 వరకు గొర్రెల పంపిణీ పథకంలో కీలకంగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై మళ్లీ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులపై రెండు నెలల క్రితం హనుమకొండ డీవీఏహెచ్ఓ కార్యాలయంలో ఆరా తీశారు. అలాగే గతంలో అరోపణలు ఎదుర్కోవడంతో పాటు సస్పెన్షన్కు గురై తిరిగి కొలువులో చేరిన కొందరికీ హైదరాబాద్ నుంచి ఏసీబీ మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పశుసంవర్థకశాఖలో మళ్లీ కలకలం యూనిట్ల వివరాలు ఇవ్వాలని ఈడీ నోటీసులు డీవీఏహెచ్ఓలను ఆరా తీస్తున్న ‘విజిలెన్స్’ కొందరు వీఏఎస్లను విచారణకు పిలిచిన ఏసీబీ? రిటైర్ అయినా తప్పని ఎంకై ్వరీ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్పైనా పేచీ..వీటిలోనే అక్రమాల లెక్కలు.. ఉమ్మడి వరంగల్లో 2017 జూలైలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లోని గొల్ల, కురుముల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ సంఘంలో సభ్యత్వం ఉన్న వారికి రెండు విడతల్లో గొర్రెలు పంపిణీ చేశారు. మొదటి విడతలో 50 శాతం, రెండో విడతలో మరో 50 శాతం మంది చొప్పున 575 సహకార సంఘాలకు చెందిన 60 వేల మందికి మొదటి విడత(ఎ–లిస్టు)లో 49,276 యూనిట్లు పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రతి యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది కమిటీగా.. ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ చేపట్టారు. రెండో విడతలో 47,750 యూనిట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో 5,571 యూనిట్లు, వరంగల్ రూరల్లో 12,748, మహబూబాబాద్లో 11,868, భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 6,791, జనగామ జిల్లాలో 10,772 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 12,123 యూనిట్ల తర్వాత అక్రమాలు వెలుగుచూడటంతో నిలిపివేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా విచారణకు ఆదేశించడం.. ఏడాది క్రితం అంతా అయిపోయిందని భావించిన తరుణంలో రెండు రోజులుగా మళ్లీ విచారణ స్పీడందుకుంది. ఉమ్మడి వరంగల్ అక్రమాలపైన మళ్లీ నోటీసులు జారీ కావడం లాంటి పరిణామాల నేపథ్యంలో బాధ్యులైన అధికారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి కలెక్టర్ ఆయా శాఖల అధి కారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలో భాగంగా సర్వే ప్రక్రియను పర్యవేక్షించాల్సిన బాధ్యత మండల ప్రత్యేక అధికారులపై ఉందన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాబోయే 15 రోజులు కీలకమని, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, సహకార, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రతీరోజు సెంటర్లను పరిశీలించి, నివేదికను సమర్పించాలన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వేసవి కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్, ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
నేడు అవగాహన సదస్సు
జనగామ: జనగామ మండలం యశ్వంతాపూర్ శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో నేడు (మంగళవారం) విద్యుత్ భద్రతా వారోత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎన్పీడీసీ ఎల్ ఎస్ఈ వేణుమాధవ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని కట్టర్లు, ఆర్జిజియన్స్, ఓ అండ్ ఎం, ప్రొవెన్షనల్ స్టాఫ్, ఇంజ నీర్లు, యూనియన్ నాయకులు, కాంట్రాక్టర్లు, వినియోగదారులు, ప్రజా ప్రతినిధులు హా జరై సదస్సును విజయవంతం చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తాం లింగాలఘణపురం: ఉపాధ్యాయ, ఉద్యోగుల అపరిష్కృత సమస్యల సాధనకు తెలంగాణ ఉద్యోగ జేఏసీతో కలిసి పని చేస్తామని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని నెల్లుట్ల పాఠశాలలో టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు జూన్ 9వ తేదీ జరగబోయే మహాధర్నాను విజయవంతం చేస్తామని తీర్మానించినట్లు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, 2024 మార్చి నుంచి ఏర్పడిన ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీని నిర్వహించాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లచ్చుమల్ల వెంకన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దార గణేష్, జిల్లా అధ్యక్షుడు రావుల వెంకటేశ్వర్లు, తదితరులుపాల్గొన్నారు. రేపు ‘విజయోస్తు’ సన్మాన సభ జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా 3వ స్థానంలో నిలువగా.. ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ సమావేశ హాలులో విజయోస్తు సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ భోజన్న సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పది ఫలితాల్లో జిల్లాను అత్యుత్తమ స్థానంలో నిలిపిన టీచర్లు, విద్యార్థులు, ప్రతీఒక్కరికి కృతజ్ఞతగా జిల్లా విద్యాశాఖను అభినందిస్తూ జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులు, 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సత్కరించనున్నట్లు తెలిపా రు. కలెక్టర్ రిజ్వాన్ భాషా అధ్యక్షతన జరిగే కార్యాక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. అలాగే జిల్లా, మండల, మేనేజ్మెంట్, సంక్షేమ వసతి గృహాల వారీగా అత్యుత్తమ మార్కులు పొందిన 23 మంది విద్యార్థులకు సన్మానంతో పాటు సైకిళ్లను బహుమతిగా అందజేయనున్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ జనగామ రూరల్: వచ్చే విద్యాసంవత్సరానికి గాను జిల్లా కేంద్రం నుంచి మండలాలకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల పంపిణీని జిల్లా విద్యాశాఖాధికారి డి.భోజన్న సోమవారం ప్రారంభించారు. పట్టణంలోని వీవర్స్ కాలనీలోని గోదాంను సందర్శించారు. జిల్లాకు 2,14,460 రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,45,742 వచ్చాయన్నారు. ఇందులో జనగామ మండలానికి 10,510 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశామని, మిగతా మండలాలకు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. అలాగే జనగామ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు 32,938 నోటు పుస్తకాలు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠ్యపుస్తకాల మేనేజర్ సంపత్, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ వాసులను వెనక్కి పంపాలి జనగామ రూరల్: పాకిస్తాన్, బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తులను గుర్తించి వెనక్కి పంపాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రమేశ్ కోరారు. ఈ మేరకు సోమవారం బీజేపీ నాయకులతో కలిసి అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ భారత్లో నివాసం ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు తెరలేపుతున్నారన్నారు. పౌరసత్వ లేకున్నా తప్పుడు పత్రాలు సృష్టించి నివాసం ఉంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అనిల్, లద్దలూరు మహేష్, నారాయణ, లక్ష్మీనరసయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
కష్టపడిన వారికే గుర్తింపు
జనగామ: కాంగ్రెస్లో చెట్ల కింద కూర్చుని పదవులు ఇచ్చే రోజులు పోయాయని, కష్టపడిన వారికే గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన జనగామ నియోజకవర్గ ముఖ్యనాయకుల సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చెట్ల కింద కూర్చొని పలు ఇస్తే పార్టీలో మేము కూడా సస్పెండ్కు గురవుతామన్నారు. 2017 కంటే ముందు పని చేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో పని చేసిన కేడర్కు గుర్తింపు ఉంటుందన్నారు. నాయకత్వ లక్షణాలు ఉన్నవారికే మండల, గ్రామశాఖ అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి జూన్ 1 వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, అలాగే ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సంవిధాన్ బచావో పేరుతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. రేవంత్రెడ్డి రెండోసారి సీఎం కావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బైకిని లింగం యాదవ్, సిద్ధిపేట జిల్లా పరిశీలకులు మల్లాడి పవన్, ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, నాయకులు చెంచారపు శ్రీనివాస్రెడ్డి, చెంచారపు బుచ్చిరెడ్డి, బడికె ఇందిర, జక్కుల అనిత, సర్వల నర్సింగరావు, వంగాల మల్లారెడ్డి, గాదెపాక రాంచందర్, బొట్ల శ్రీనివాస్, రాముని శ్రీనివాస్, కరుణాకర్రెడ్డి, మల్లేశం, మహేందర్, తదితరులు ఉన్నారు. చెట్ల కింద కూర్చుని పదవులు ఇచ్చే రోజులు కావు అర్హత ఉన్న వారికే స్థానిక ఎన్నికల టికెట్లు జనగామ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ అద్దంకి -
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పాలకుర్తి టౌన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, ఆమార్ ఆలీఖాన్, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి ఎంపీ కావ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీకార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందంజలో ఉంచుతామన్నారు. కార్యకర్తలు పాత, కొత్త తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జనగామ, వరంగల్, మహబూబాబాద జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, భరత్చందర్రెడ్డి, అనుమాండ్ల ఝాన్సీరెడ్డి, రవళిరెడ్డి, బైకిని లింగం యాదవ్, పోట్ల నాగేశ్వర్రావు, మేడి రవిచంద్ర, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం కాగా ఈ సన్నాహక సమావేశానికి దేవరుప్పులకు చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం ఉపాధ్యక్షుడు ఉప్పుల సాయిప్రకాశ్ తన అనుచరులతో కలిసి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే టీపీసీసీ సభ్యుడు, డాక్టర్స్ సెల్ జనగామ జిల్లా కన్వీనర్ లక్ష్మీనారాయణనాయక్ను వేదికపైకి పిలవకపోవడంతో ఆయన కొంతసేపు చూసి అక్కడినుంచి వెళ్లిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య -
ఎక్కడి సమస్యలు అక్కడే..
జనగామ రూరల్: సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కన్నీటితో వేడుకున్నా.. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోయారు. పది నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నామని పార్ట్ టైం సిబ్బంది, కుమారులు తిండి పెట్టడం లేదని వృద్ధ దంపతులు, వితంతు, దివ్యాంగ పింఛన్ రావడం లేదని, కాల్వ కింద భూమి పోతే నష్టపరిహారం రాకుండా అడ్డుకున్నారని ఇలా పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు పలువురు వినతులు సమర్పించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ ప్రజల నుంచి 60 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికై అన్ని మండలాల సంబంధిత తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తగిన చర్యలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, జిల్లా పౌరసరఫరాల అధికారిణి సరస్వతి, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీఏఓ రామారావు నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● పాలకుర్తి మండలం, ముత్తారం గ్రామానికి చెందిన కె.మంగమ్మ, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా తమ పేరు మంజూరు జాబితాలో లేదని, తమకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● దేవరుప్పుల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన తోరిపూరి రాములు తన 1.2 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని, వారిపై తగిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ● లింగాలఘణపురం మండలం, కళ్లెం గ్రామానికి చెందిన ఆరె లక్ష్మీనర్సమ్మ తమ నలుగురు కుమారులు ఆస్తి మొత్తాన్ని వారి పేరు మీద చేసుకున్నారు. ఇప్పుడు తమను పోషించడం లేదని వినతిపత్రం సమర్పించారు. ● జిల్లా కేంద్రంలోని 11వ వార్డుకు చెందిన బిర్రు మల్లేష్ 15 ఏళ్లుగా కిరాయికి ఉంటున్నారని, తనకు వీవర్స్ కాలనీలో 100 గజాల స్థలం ఉందని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి అందజేశారు. ● జనగామ పట్టణానికి చెందిన బడికే శ్రీకాంత్కు దివ్యాంగ పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని వేడుకున్నాడు.కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు సమస్యలు పరిష్కారం కావడం లేవని మండిపాటు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా గ్రీవెన్స్కు 60 వినతులుఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ నర్మెట మండలం అమ్మపురానికి చెందిన వైద్యం సునీత, భర్త రాజ్కుమార్ నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇద్దరు ఆడపిల్లలు. రోజూ జనగామకు వచ్చి హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. తమది పేద కుటుంబమని, గ్రామంలో ఇల్లు కూడా లేదని, వితంతు పెన్షన్ మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించింది.పక్క ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగుడు చిల్పూర్ మండలం శ్రీపతిపల్లికి చెందిన చెట్టబోయిన వెంకటకిష్టయ్య. ఈయనకు నలుగురు కుమారులు ఉండగా తనకున్న పది ఎకరాల భూమిని నాలుగు సమాన భాగాలుగా ఇచ్చాడు. ప్రస్తుతం చిన్న కుమారుడి ఇంటి వద్ద ఉంటున్నాడు. నలుగురు కుమారులు ఉన్నా.. తనను చూసుకోవడం లేదని, గతంలో ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే పెద్ద మనుషుల సమక్షంలో నెలకు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి గ్రామంలో తమకు ఎలాంటి ఆస్తులు లేవు. భార్యభర్తలు ఇద్దరం దివ్యాంగులం. ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకోగా అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు వచ్చాయి. దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యతగా ఇల్లు మంజూరు చేయాలి. – వాతాల యాదగిరి, దివ్యాంగుడు, నిడిగొండ నష్టపరిహారం రాకుండా అడ్డుపడుతున్నారు.. దేవాదుల కాల్వ కింద 29 గుంటల భూమి పోయింది. ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.10లక్షలు మంజూరయ్యాయి. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నారు. అధికారులు విచారణ జరిపి నష్టపరిహారం ఇప్పించాలి. – అరకల రజిత, జఫర్గఢ్ -
‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోవాలి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. సోమవారం పైలట్ మండలం స్టేషన్ఘన్పూర్లోని కొత్తపల్లి, విశ్వనాథపురం గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భాగంగా దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 13వ తేదీ వరకు సదస్సులు నిర్వహిస్తామని, రైతులు భూ సమస్యలను తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు రశీదులు అందిస్తారన్నారు. మొదట పైలట్ ప్రాజెక్టుగా స్టేషన్ఘన్పూర్ మండలంలో పూర్తి చేసి ఇక్కడి ఫీడ్ బ్యాక్తో జూన్ మొదటివారంలో జిల్లావ్యాప్తంగా చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్నాయక్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమశాతం రాగానే కొనుగోళ్లు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రం, మండలంలోని విశ్వనాథపురంలోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కొనుగోలు కేంద్రాల్లో నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, ఓపీఎంఎస్లో కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్నాయక్, తదితరులు ఉన్నారు. కొత్తపల్లి, విశ్వనాథపురంలో సదస్సులను పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా -
రైతులకు బాసటగా నిలుద్దాం
దేవరుప్పుల: గత ప్రభుత్వం పేదలకు పంచిన భూ పంపిణీ పట్టా రైతులకు అన్యాయం జరగకుండా న్యాయపరమైన రీతిలో బాసటగా నిలుద్దామని హైకోర్టు న్యాయవాది ఎండీ సాధిక్అలీ పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని చిన్నమడూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని రంబోజిగూడెం శివారులో భూపంపిణీ పట్టాలను రద్దు చేసే యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులతో కలిసి ఆందోళన చేశారు. అనంతరం ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరెంటి విజయ్ మాదిగ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తిరిగి తీసుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కోఆర్డినేటర్ కొమ్ముల సురేందర్, జనగామ జిల్లా ఇన్చార్జ్ కన్నారపు పరుశురాములు, చిన్నమడూరు గ్రామ దళిత నాయకులు మేడ సోమనర్సయ్య, పాలడుగు యాదగిరి, దుబ్బాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాది సాధిక్అలీ -
భద్రకాళి అమ్మవారికి పల్లకీసేవ
అమ్మవారి పల్లకీసేవలో ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీభద్రకాళి దేవాలయంలో అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన అమ్మవారికి నిత్య పూజలు, అలకరణ అనంతరం ఉత్సవమూర్తికి ఉదయం పల్ల కీసేవ, సాయంత్రం శేషవాహనసేవ నిర్వహించారు. మహిళలు కుంకుమపూజలు, లలితాసహస్రనామ పారాయణం చేశారు. అనంతరం అన్నదానం జరిగింది. సేవా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృసంఘం బాధ్యులు ఉభయదాతలుగా వ్య వహరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్కుమార్, డాక్టర్ లాల్కోట వెంకటాచారి, రాగిఫణి రవీంద్రాచారి, చొల్లేటి కృష్ణమాచారి, సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నారోజు సత్యమనోరమ, శశిధర్శిల్పి తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల సాధనకు సంతకాల సేకరణ
జనగామ రూరల్: ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ల సాధనకు పోరాటాలు ఉధృతం చేస్తామని, ఇందుకోసమే లక్ష సంతకాలు సేకరిస్తున్నట్లు ఎన్పీఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్ల గణేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని దుర్గమ్మ గుడి ఆవరణలో జిల్లా అధ్యక్షుడు పాముకుంట్ల చందు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. దివ్యాంగులను ఐక్యం చేసి పార్లమెంట్ వేదికగా సమస్యలను చర్చించి అనేక సమస్యలను పరిష్కారం చేసేందుకు ఎన్పీఆర్డీ కృషి చేసిందన్నారు. దివ్యాంగులకు 5శాతం ఉద్యోగాల కేటాయింపు తదితర సమస్యల సాధనకు మే 19న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మామిడాల రాజేశ్వరి, పిట్టల కుమార్, మాలోతు రాజ్ కుమార్, మోతె వెంకటమ్మ, భైరగోని మహేష్, రాజు, గోదల ఐలయ్య, జానకి, సతీష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కడవెండిలో భక్తిశ్రద్ధలతో బోనాలు
దేవరుప్పుల: మండలంలోని కడవెండిలో యాదవ సామాజిక వర్గం ఇలవేల్పు గంగాదేవి, కాటమరా జు కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి వేర్వేరుగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలను ఎర్రబెల్లి అలంకరించి దేవతమూర్తులకు ప్రదర్శనగా వెళ్లి సమర్పించారు. అలాగే ఝాన్సీరెడ్డి గంగాదేవికి కుల సాంప్రదాయాల మేరకు జలగంప మొక్కులను సమర్పించారు. ఒగ్గు కళాకారులు ఆటపాటతో దేవతమూర్తుల విశిష్టతపై ప్రదర్శనలు ఇవ్వగా శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో పెద్దగొల్ల, సారగొల్ల ప్రతినిధులు సుడిగెల కొమురయ్య, తోటకూరి మల్లయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు మారసాని శ్రీనివాస్, పీఏసీఎసీఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి, నక్క రమేష్, కాంగ్రెస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నల్ల శ్రీరామ్, తీగల దయాకర్, మాజీ సర్పంచ్ హన్మంతు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు కొర్రీలు
జనగామ: మద్దతు ధరకు ఆశపడి ప్రభుత్వ కొనుగోలు సెంటర్లకు వస్తున్న రైతులు ధాన్యం అమ్ముకోలేక చుక్కలు చూస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కన బెట్టి.. సొంత ఎజెండాను అమలు చేస్తున్నారు. సరుకులో తేమ వచ్చిన తర్వాత కొనుగోళ్లలో ఆలస్యం చేయొద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించినా పట్టించుకోవడం లేదు. కాంటా వేసిన సరుకు లిఫ్టు అయ్యే వరకు కొత్త కొనుగోళ్లు ఉండవు.. సారు వచ్చి టోకెన్ ఇచ్చే వరకు నిరీక్షణ తప్పదంటూ జనగామ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ నిర్వాహకులు అన్నదాతలను ఇబ్బందులు పెడుతున్నారు. జనగామ మండలంలోని పలు గ్రామాల రైతుల సౌకర్యం కోసం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని కాటన్ యార్డులో ప్రభుత్వ ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ను ఏర్పాటు చేశారు. జనగామతో పాటు రఘునాథపల్లి, లింగాలఘణపురం సమీప మండలాల పరిధి నుంచి సైతం రైతులు తమ సరుకును అమ్ముకునేందుకు ఇక్కడకు వస్తున్నారు. కాటన్ యార్డులో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండడంతో ధాన్యం ఆరబోసుకునేందుకు వెసలుబాటు ఉండడంతో ఈ సెంటర్కు డిమాండ్ పెరిగింది. ధాన్యం ఆరబోసుకుంటూ.. 17 తేమ శాతం వచ్చిన తర్వాత మద్దతు ధరకు అమ్ముకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. కానీ ఇక్కడే తిరకాసు పెడుతున్నారు. కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ... టోకెన్ నంబర్ ఇష్యూ, కాంటా వేయడంలో జాప్యం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించి, అమ్ముకునేందుకు వస్తే రైతులకు కనీస గౌరవం దక్కడం లేదు. సారూ తేమ శాతం వచ్చింది.. ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారంటూ సెంటర్ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో గౌరవ ప్రదంగా మాట్లాడుతుంటే... కాటన్ యార్డు ఐకేపీ సెంటర్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు రైతులు. తేమ వచ్చి వారం రోజులు ధాన్యం తిర్లేసి.. మర్లేసీ ఒకటికి రెండు సార్లు ఆరబోసి ప్రభుత్వ నిబంధనల మేరకు 17శాతం వచ్చినా... కాటన్ యార్డు ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేయడం లేదు. తేమ వచ్చి వారం గడిచినా టోకెన్ కూడా ఇవ్వడం లేదు. కాంటా వేసిన బస్తాలు లిఫ్టు చేసిన తర్వాతనే గన్నీ బ్యాగులు ఇచ్చి కొనుగోళ్లు స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు. కోపమొచ్చిన రైతులు నిలదీస్తే, ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అనే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు ధాన్యం కొనుగోలుకు అర్హత సంపాదించినా... పదిరోజులుగా సెంటర్లోనే పడిగాపులు కాస్తున్నారు. కేంద్రంలో రైతులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడుతున్నారు. కాటన్ యార్డులో దూర భారముందంటూ బస్తాకు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చినుకులు పడుతున్నా.. టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదంటున్నారు.తేమశాతం వచ్చినా కొనుగోలు చేయరు కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ తాగునీరు ఉండదు.. టార్పాలిన్లు ఇవ్వరు దూర భారమంటూ అదనపు వసూళ్లు ఇబ్బందుల్లో అన్నదాతలు -
జనగామకు తాగునీరందించాలి
జనగామ: నియోజకవర్గంలో ఆగిపోయిన దేవాదుల పెండింగ్ పనులు పూర్తి చేసి జనగామకు తాగునీరు అందించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కోరారు. శనివారం దేవన్నపేట పంపుహౌస్ వద్ద దేవాదుల మూడో దశ పనులను పరిశీలించిన అనంతరం మంత్రులను కలిసిన వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకువచ్చే పనులు 25 శాతం పూర్తయ్యాయని, మొత్తం పూర్తి చేస్తే ధర్మసాగర్ నుంచి గండిరామారం మీదుగా తపాస్పల్లి వెళ్లే భారాన్ని తగ్గించడమే కాకుండా స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి ప్రాంతాలకు కూడా నీరు ఎక్కువగా విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు. బచ్చన్నపేట, చేర్యాల ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న కెనాల్ పనులు రెండేళ్లుగా నిలిచి పోయాయని, భూసేకరణ సమయంలో కొంతమంది రైతులకు పరిహారం అందజేయగా.. మిగతావారి కారణంగా పనులు నిలిచిపోయినట్లు చెప్పారు. అలాగే జనగామ మండలం చీటకోడూరు డ్యామ్కు గోదావరి జలాలను మళ్లించి పట్టణానికి సరపడా తాగునీరు అందించాలని కోరారు. తరిగొప్పుల, చిల్పూరు, వేలేరు మండలాలకు సంబంధించి లిఫ్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటికి ఎమ్మెల్యే ‘పల్లా’ విజ్ఞప్తి -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
జనగామ రూరల్: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇందుకు ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి ఇందిరమ్మ ఇళ్లపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, పరిశీలన అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనలో భాగంగా జనగామ నియోజకవర్గంలో 13, ఘనపూర్ 17, పాలకుర్తిలో 10 మంది అధికారులు సర్వే చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు. పరిశీలన పూర్తి కాగానే అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని వెల్లడించారు. సమీక్షలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, గృహ నిర్మాణ పీడీ మాతృనాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రైతులకు యునికోడ్ కేటాయింపు ఆధార్తో దేశంలోని ప్రతీ పౌరుడికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతీ రైతుకు 11 నంబర్లతో విశిష్ట సంఖ్య (యునికోడ్) కేటాయించాలని కేంద్రం నిర్ణయించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని, రైతులు తమ భూముల వివరాలతో కూడిన సమాచారంతో ఇ–ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతున్నదన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను రైతు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఇ–ఫార్మర్ ఐడీ కేటాయిస్తారని పేర్కొన్నారు. రైతు భరోసా, రుణమాఫీ తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీకి ఏ సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఫార్మర్ ఐడీ పొందడానికి రైతులు ఆధార్, భూ యాజమాన్య పాస్బుక్, ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్ తీసుకొని సమీప వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
కోర్టుకు హాజరైన జిల్లా ఉద్యమ నాయకులు
జనగామ రూరల్: జనగామ జిల్లా సాధన ఉద్యమకారులు శనివారం కోర్టుకు హాజరయ్యారు. పోరాడి జిల్లా సాధించుకున్నామే కాని అక్రమ కేసులు తొలగించలేదని నాయకులు అన్నారు. కోర్టుకు హాజరైన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఇనుగాల ప్రభాకర్రెడ్డి, ఉపేందర్రెడ్డి, వీరేందర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, చౌడ రమేశ్, ఆకుల సతీష్, దశమతరెడ్డి, ఉడుగుల రమేశ్, కేవీఎల్.రాజు, మేడ శ్రీనివాస్, బక్క శ్రీనివాస్, హరిశ్చంద్ర ప్రసాద్, మేకల రాంప్రసాద్, గుజ్జుల నారాయణ, జగదీష్, మంగళంపల్లి రాజు, మజిత్, ఎల్లయ్య, కృష్ణ ఉన్నారు. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి జనగామ రూరల్: మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ పిలుపునిచ్చారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు రాపర్తి రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించి బ్రిటిష్ కాలం నాడు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేలా కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తోందని, ఇందుకు నిరసనగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనాలని కోరారు.అన్నబోయిన రాజు, చిట్యాల సోమన్న, బాలరాజు, మల్లేష్ రాజ్, ఐలయ్య రేణుక పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు రాలేదని అధికారుల నిలదీతలింగాలఘణపురం: మండల పరిధి జీడికల్లో అర్హులైన తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదంటూ శనివారం జీడికల్లో ఎంపీడీఓ జలేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ను పలువు రు గ్రామస్తులు జీపీ కార్యాలయం వద్ద నిలదీశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాను చివరి దశలో విచారణ జరిపేందుకు శనివారం ఎంపీడీఓ జీడికల్ గ్రామానికి వెళ్లారు. పంచా యతీ కార్యాలయం వద్ద అప్పటికే కొంత మంది గుమికూడి జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయని తెలుసుకుని అర్హులైన తమకు ఇళ్లు ఎందు కు రాలేదని మండిపడ్డారు. తమకు ఖాళీ జాగా ఉందని, అధికారులొచ్చి చూశారని, ఫొటోలు దింపారని ఇప్పుడు మాత్రం తమ పేర్లు రాలేద ని, ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని మహేందర్, బాబు, శ్రీనివాసు, నగేశ్, నిర్మల తదితరులు ఎంపీడీఓను ప్రశ్నించారు. గ్రామంలో 91 మంది అర్హులున్నారని, మొదటి విడతగా 21 మందిని ఎంపిక చేశారని, మిగిలిన అర్హులకు రెండో విడతలో వస్తాయని సమాధానం చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులను దూషించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి ఏదైనా సామరస్యపూర్వకంగా మాట్లాడుకోవాలని గొడవ చేయొద్దని చెప్పి వెళ్లారు. అప్పటికే గ్రామంలో మరో విచారణ ఉందని, ఎంపీడీఓ, కార్యదర్శి గ్రామ పంచా యతీ నుంచి వెళ్లిపోయారు. నో రిజిస్ట్రేషన్లు కాజీపేట అర్బన్ : కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం ఒక దస్తావేజు కూడా రిజిస్ట్రేషన్కు నోచుకోలేదు. విద్యుత్ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో ట్రీ కటింగ్ చేసిన నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా లేదు. దీంతోపాటు ఇంటర్నెట్వైర్లు తెగిపోవడంతో సర్వర్ పని చేయలేదు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నారు. చివరికి రిజిస్ట్రేషన్లు లేక వెనుదిరిగారు. ఇదిలా ఉండగా.. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్లకు జాయింట్–1గా పదోన్నతి లభించింది. మల్టీజోన్లో భాగంగా ఆడిట్ విభాగం సబ్ రిజిస్ట్రార్ తిరుమల్, అడక్ ప్రమోషన్లో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఆనంద్కు జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్గా పదోన్నతి లభించింది. -
ఆరున్నర గంటలు.. కీలక అంశాలు
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శనివారం హనుమకొండ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. మధ్యాహ్నం 1 గంటనుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పర్యటన కొనసాగింది. హసన్పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్హౌజ్, ధర్మసాగర్ రిజర్వాయర్, భద్రకాళి చెరువును సందర్శించారు. చివరగా హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ ● ఓరుగల్లులో మంత్రులు ఉత్తమ్, శ్రీనివాస్రెడ్డి పర్యటన ● దేవాదుల పంపుహౌజ్, రిజర్వాయర్లపై రివ్యూ... ● భద్రకాళి పూడికతీత, సుందరీకరణ పనులపై సీరియస్ ● హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ అధికారులతో భేటీ ● పెండింగ్ ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష– వివరాలు IIలోu -
ఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025
– IIలోuజనగామ: పట్టణంలో మద్యం దుకాణాలు.. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు. ఇరుకు గల్లీల్లో రోడ్లకు ఇరువైపులా మందుబాబులు వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో అటుగా వెళ్లే మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘బహిరంగ మద్యపానం–వైన్స్ ల ఎదుట సామాన్య ప్రజల ఇబ్బందులపై’ శనివా రం రాత్రి 7 గంటల నుంచి 9 వరకు ‘సాక్షి’ చేపట్టిన విజిట్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. ● బస్టాండ్ చిన్నగేటు ఏరియాలోని భువన బార్ అండ్ రెస్టారెంట్ వెనుక గల్లీ పూర్తిగా వాహనాల పార్కింగ్తో నిండిపోయింది. మధ్యలో మిగిలిన చిన్న సందు నుంచి కూరగాయల మార్కెట్, ఇతర పనుల కోసం వచ్చిన మహిళలు ఇబ్బంది పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ● రైల్వేస్టేషన్ అమ్మబావి ప్రాంతం దుర్గావైన్స్ సమీపంలో కనీసం వీధి దీపాలు సరిగా లేవు. వైన్స్కు వచ్చే వారితో పాటు అందులో మద్యం సేవించి బయటకు వెళ్లిపోయే వారితో గుండ్లగడ్డ, అంబేడ్కర్నగర్, ధర్మకంచ తదితర ప్రాంతాలకు వెళ్లే మహిళలు, సాధారణ ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ● ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలోని సింధు వైన్స్, లిక్కర్ మార్టుకు వచ్చే వారు తమ వాహనాలను రోడ్డుపైనే అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు. దీంతో సిద్దిపేట ప్రధాన రహదారిపై వెళ్లే వాహనాలతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. కూరగాయల కొనుగోలు, వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే కుటుంబాలు వైన్స్ను దాటేసి రావాలంటే భయపడి పోతున్నారు. ● సూర్యాపేట ప్రధాన రహదారిపై ఉన్న బాలాజీబార్కు వచ్చే వాహనాలతో సింగిల్ లేన్ రోడ్డు పూర్తిగా నిండిపోతోంది. ● హైదరాబాద్ రోడ్డులోని బాలాజీబార్కు వచ్చే వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం తప్పడం లేదు. తరుచూ ప్రమాదాలు సైతం జరుగుతుంటాయి. దుకాణా లు, ఆస్పత్రులకు వచ్చే మహిళలు, కుటుంబాలు భయంభయంగానే వెళ్తున్నారు. ● ఆర్టీసీ జంక్షన్లోని ఎస్ఎస్ఎస్ వైన్స్ ఎదుట ఇదే పరిస్థితి నెలకొంది. రోడ్డుపై రెండు లేన్లలో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ● ఇదిలా ఉండగా నెహ్రూపార్కు ఏరియా నుంచి 60ఫీట్ల రోడ్డు, వడ్లకొండ రూట్, ప్రెస్టన్ ఏరియా, వీవర్స్కాలనీ, పెద్ద మోరీ తదితర ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చాలా మంది మద్యం సేవిస్తూ కనిపించారు. వైన్స్, బార్లు, లిక్కర్ మార్టుల వద్ద మాత్రం పట్టణంలోని ప్రధాన రోడ్లను ఆక్రమించి వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో రాకపోకల కు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. సూర్యాపేట రోడ్డు బాలాజీబార్ వద్ద రోడ్డు సగభాగానికి వచ్చిన వాహనాల పార్కింగ్ న్యూస్రీల్మద్యం దుకాణాలు, బార్ల నిర్వహణ అస్తవ్యస్తం బహిరంగ ప్రదేశాల్లో సిట్టింగ్లు విచ్చలవిడిగా వాహనాల నిలిపివేత దారివెంట వెళ్లే మహిళలకు ఇబ్బందులు ‘సాక్షి’ విజిట్లో వెలుగులోకి సమస్యలు -
అమ్మానాన్నే నాకు ప్రేరణ..
‘మా కుటుంబం న్యాయవిద్యతో ముడిపడినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. చిన్ననాటి నుంచి న్యాయశాస్త్రాన్ని చూసి పెరిగిన నేను, ఇప్పుడు అదే కుటుంబ పరంపరలో భాగంగా న్యాయం కోసం పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉంది. ఇది నాకు బాధ్యతను గుర్తు చేస్తోంది, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న కర్తవ్యం కలిగిస్తోంది.’ అని అంటున్నారు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన దారా మేఘన. ఇటీవల వెలువడిన న్యాయశాస్త్ర ఫలితాల్లో వరంగల్ దర్గా కాజీపేటకు చెందిన మేఘన జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీనుంచి 2023 న్యాయశాస్త్రం పట్టా పొంది న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె ప్రయాణంపై ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ఎల్ఎల్బీని ఎందుకు ఎంచుకున్నారు?నేను న్యాయశాస్త్రాన్ని ఎంచుకోవడానికి కారణం మా నాన్నగారు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే న్యాయవిద్యను నా వృత్తిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. జీవితమంతా ఆయన నాకు మోటివేషన్గా నిలిచారు. మా నాన్న నల్సార్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే నాకు లా స్కూల్ వాతావరణాన్ని, విద్యార్థులను చూడగల అవకాశం కలిగింది. ఇదంతా న్యాయశాస్త్రం పట్ల నాలో ఆసక్తిని, అభిమానం పెంచింది.మీకు ప్రేరణ ఎవరు. మా తల్లిదండ్రులే నాకు ప్రేరణ. మా నాన్న న్యాయశాస్త్ర ప్రొఫెసర్, అమ్మ ఎల్ఐసీలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. వారి శ్రద్ధ, క్రమశిక్షణ నన్ను జీవితాన్ని సరిగ్గా ముందుకు నడిపించడంలో కలిసి వచ్చింది. ఏ రంగాన్ని ఎంచుకున్నా, దానికి ప్రోత్సాహం, స్వేచ్ఛను ఇచ్చారు. ఇక తమ్ముడు వంశీకృష్ణ ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచి, విద్యార్థినిగా ఎదుర్కొన్న కష్టాల్లో తోడుగా ఉన్నాడు. అలాగే, ప్రముఖ సీనియర్ అడ్వొకేట్ సి.విద్యాసాగర్ రెడ్డితో పనిచేసే అవకాశం నాకు లభించింది. ఆయననుంచి న్యాయశాస్త్రం ప్రాయోగిక అంశాల్లో మార్గదర్శనం పొందాను. ఈ రంగాన్ని ఎంపిక చేసుకోవాలని ఆయన అప్పట్లో ఇచ్చిన సలహా నా జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఇంకా, మా కళాశాల నుంచి పెద్దగా విజయాలు సాధించిన మా సీనియర్లు తరణి వేముగంటి, నేహా అగర్వాల్ విజయాలను దగ్గరగా చూసే అవకాశం లభించింది. తరణి ప్రస్తుతం సిద్దిపేటలో జూనియర్ సివిల్ జడ్జిగా, అదనపు జేఎంఎఫ్సీగా పనిచేస్తున్నారు. నేహా అగర్వాల్ డీఎస్పీ పదవిని పొందారు. వారి మాటలు నాకు దిక్సూచి చూపాయి. ఎందుకు న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. న్యాయశాస్త్రం ద్వారా న్యాయం సాధించడమే కాక సమాజానికి సేవ చేయవచ్చని నమ్మి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను మీరు ఎదుర్కొన్న సవాళ్లు.నా ప్రయాణంలో ఒత్తిడి, ఆందోళన ఎదుర్కోవాల్సి వచ్చింది. సమయం కూడా చాలా పరిమితంగా ఉండటంతో, ఆ సమయంలోనే అన్ని విభాగాలను కవర్ చేయాలన్న ఒత్తిడితో ఉన్నా. ఇదే సమయంలో, మా తమ్ముడు అమెరికాకు మాస్టర్స్ కోసం వెళ్లిపోవడం కూడా నాకు భావోద్వేగపూరితంగా కష్టంగా అనిపించింది. అయితే, నా స్నేహితులు, కుటుంబ సభ్యులు అండగా నిలిచి నా అడ్డంకులను అధిగవిుంచడంలో సహాయం చేశారు. మీ నెక్ట్స్ గోల్? ఇప్పటినుంచి నా లక్ష్యం అత్యంత నిజాయితీగా, సమగ్రతతో సేవ చేయడం. న్యాయం వేగంగా అందించడానికీ, ఆలస్యం లేకుండా ప్రజలకు న్యాయం చేసేందుకు కట్టుబడి పని చేయాలనుకుంటున్నాను. నాకు అండగా నిలిచిన తల్లిదండ్రులు, తమ్ముడికి, స్నేహితులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ విజయాన్ని నాతో కలిసి పంచుకున్న బంధువులకు కూడా ధన్యవాదాలు. -
హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
లింగాలఘణపురం: మండలంలోని జనగామ–సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల నుంచి కుందారం క్రాస్ రోడ్డు వరకు తరుచూ ప్రమాదాలు జరుగుతుండగా రూరల్ సీఐ శ్రీనివాసురెడ్డి ఆధ్వర్యాన శుక్రవారం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశా రు. నెల్లుట్ల–కుందారం క్రాస్రోడ్డు వరకు మూడు కిలోమీటర్ల దూరంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ‘డేంజర్ జోన్’ శీర్షికన గత నెల 29న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే ఎస్సై శ్రావణ్కుమార్ ఆధ్వర్యాన డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు. -
‘నీట్’కు సర్వం సిద్ధం
రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష● 582 మంది విద్యార్థులు.. రెండు సెంటర్లు ● అరగంట ముందే గేట్లు క్లోజ్ ● అడ్మిట్ కార్డు, ఐడీ ఉంటేనే అనుమతి ● సీసీ కెమెరాల నిఘా.. మూడంచెల భద్రత ● ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్జనగామ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్–2025) ఈ నెల 4న నిర్వహించడానికి జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో పరీక్ష నిర్వహణపై కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, బీఎస్ ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాని కి నిర్వహించే ఈ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెనీ(ఎన్టీఏ) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నీట్ యూజీ అధి కారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ సహాయంతో అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండు సెంటర్లు.. 582 మంది విద్యార్థులు జిల్లాలో ‘నీట్’ నిర్వహణకు రెండు సెంటర్లను కేటాయించారు. మొత్తం 582 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా.. పట్టణంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్లో 504 మంది, పెంబ ర్తి ఎంజేపీ గురుకులం సెంటర్లో 78 మంది విద్యార్థులను కేటాయించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో చీఫ్సూపరింటెండెంట్ల ఆధ్వర్యాన 49 మంది ఇన్విజిలేటర్లు ‘నీట్’ విధులు నిర్వర్తించనున్నారు. డీసీపీ రవీంద్రనాయక్ నేతృత్వంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఏ, జిల్లా అబ్జర్వర్ల పర్యవేక్షణ ఉంటుంది. బయోమెట్రిక్.. సీసీ కెమెరాల నిఘా ఎన్టీఏ పర్యవేక్షణలో సీసీ కెమెరాల నిఘా మధ్య ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించే ‘నీట్’ పరీక్ష కోసం మధ్యాహ్నం 1.30 గంటల లోపు వచ్చిన విద్యార్థులను మాత్రమే సెంటర్లోకి అనుమతిస్తారు. అడ్మిట్ కార్డు, ఐడీ కార్డు తప్పనిసరి వెంట తెచ్చుకోవాలి. విద్యార్థులు సెంటర్లోకి వెళ్లిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటికి అనుమతి లేదు పరీక్ష కేంద్రంలోకి డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్, ఇతర వాచ్లు, నిబంధనలకు లోబడిన వివిధ ఆభరణాలు, కర్చీఫ్ తదితరాలకు అనుమతి లేదు. ఇదిలా ఉండగా పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ల బాధ్యతలు, విధులపై నేడు(శనివారం) సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ల ఆధ్వర్యాన అవగాహన కల్పించి, ఐడీ కార్డులు అందజేయనున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు : కలెక్టర్ జిల్లాలో ‘నీట్’ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. సమీక్షలో ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని, విద్యార్థులు 1.30 గంటల లోపు హాజరు కావాలన్నారు. ఆ తర్వాత వచ్చిన వారిని లోనికి అనుమతించరని, అడ్మిట్, ఐడీ కార్డులు లేకుంటే పరీక్షకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అబ్జర్వర్ గౌసియాబేగం, సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సయ్య, చీఫ్ సూపరింటెండెంట్లు రవీందర్నాయక్, అనిత తదితరులు పాల్గొన్నారు.పటిష్ట బందోబస్తు: సీపీ వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో ఈనెల 4న(ఆదివారం) జరిగే నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రా ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో మొత్తం 13 పరీక్ష కేంద్రాలున్నాయని, ఇందులో వరంగల్, హనుమకొండలో 11, జనగా మలో 2 పరీక్ష కేంద్రాలున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలు, ధర్నాలు, గుంపులుగా తిరగడం నిషేధమని, పరీక్ష పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసేయాలని ఈ సందర్భంగా కోరారు. -
పంచాయతీ కార్యదర్శి అవినీతిపై విచారణ
రఘునాథపల్లి: ఇటీవల రఘునాథపల్లి జీపీ కార్యదర్శిగా పనిచేసిన కవిత రూ.9.20లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీపీఓ నాగపురి స్వరూప విచారణ చేపట్టారు. ప్రస్తుతం వెల్ది పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కమిత.. రఘునాథపల్లి కార్యదర్శిగా పనిచేసిన సమయంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల రూపంలో వసూలు చేసిన నగదును ఎస్టీఓలో జమ చేయకుండా నేరుగా ఖర్చు చేశారని, ఇది చట్టవిరుద్ధమని డీపీఓ పేర్కొన్నారు. ఖర్చు చేసే ముందు గ్రామసభ తీర్మానం తీసుకోవాల్సి ఉంటుందని, అంతేకాకుండా స్థాయికి మించి ఖర్చు చేసినట్లు వివరించారు. రూ.5వేలకు మించి ఖర్చు చేసే అధికారం కార్యదర్శికి లేదని, వసూలైన మొత్తాన్ని పంచాయతీ పను ల నిమిత్తం ఖర్చు చేసి ఆ తర్వాత బిల్లులు సడ్మిట్ చేసినట్లు చెప్పారు. ఇందులో ఏదైనా అవినీతి జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిపా రు. ఆమె వెంట ఎంపీఈఓ వెంకటేశ్వర్లు, పంచాయ తీ కార్యదర్శి బాలకిషన్ ఉన్నారు. ఈ సందర్భంగా కార్యదర్శి కవిత మాట్లాడుతూ.. తాను ఒక్క పైస కూడా దుర్వినియోగం చేయలేదని, గ్రామ సమస్య ల పరిష్కారం నిమిత్తం వసూలైన డబ్బుల నుంచి నేరుగా ఖరు చేయాల్సి వచ్చిందని వివరించారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
దేవరుప్పుల/కొండకండ్ల/పాలకుర్తి: భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ పౌరుడి నైతిక బాధ్యత అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు నిర్వహించిన ‘జై భీమ్, జై బాపు, జై సంవిధాన్’ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర శుక్రవారం దేవరుప్పుల మండలం రామరాజుపల్లి, కొడకండ్ల మండలం రామవరం, పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేడ్కర్ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ సర్కారు మతం మసుగులో దేశ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ గత పాలకుల తీరుపై అర్థరహిత విమర్శలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్, కొడకండ్ల, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ల చైర్పర్సన్లు ఆండాలు, మంజులభాస్కర్, కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు నల్లా శ్రీరామ్, పులిగిళ్ల వెంకన్న, కృష్ణ, గణేష్, నాగరాజు, రసూల్, సత్యనారాయణ, సురేష్నాయక్, రాజేష్నాయక్, యాకేష్యాదవ్, రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, హర్వీశ్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
ఆలయ అభివృద్ధికి రూ.1.50లక్షల విరాళం
స్టేషన్ఘన్పూర్: హనుమకొండకు చెందిన కానిస్టేబుల్ రఘునాయకుల రవిప్రసాద్రెడ్డి, అతడి కుమార్తె రశ్మితరెడ్డి ఆధ్వర్యాన స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండలోని శివాల యం అభివృద్ధికి రూ.1.50లక్షలు విరాళం అందజేశారు. భగవంతుడి కృపతో తన కుమార్తె రశ్మితరెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నదని, గతంలో మొక్కుకున్న విధంగా ఆలయ అభివృద్ధికి విరాళంగా శుక్రవారం ఆ మొత్తాన్ని అందజేసినట్లు రవిప్రసాద్రెడ్డి తెలి పారు. కానిస్టేబుల్ గుంజ కుమారస్వామి, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన జనగామ రూరల్: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కలెక్టరేట్లోని ప్రధాన ఈవీఎం గోదాంను కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమో దు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, నియంత్రణ పద్ధతులను తెలుసుకున్న ఆయన భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాల ని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జనగామ తమాసీల్దార్ హుస్సేన్ పాల్గొన్నారు. వేసవి క్రీడా శిక్షణను వినియోగించుకోవాలిపాలకుర్తి టౌన్: ప్రభుత్వం క్రీడాకారులను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం గూడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లా పరిధి ఏడు మండలాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని, సెలవులను వృథా చేయకుండా క్రీడలను ఆస్వాదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, ఉన్న త పాఠశాల హెచ్ఎం శైలజ, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు గోర్సింగ్, పీడీ చిట్యాల యాదగిరి, ఎస్సై పవన్కుమార్, చెరిపెల్లి యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలు లేని జిల్లా లక్ష్యం : ఎస్ఈజనగామ: విద్యుత్ ప్రమాదాలు లేని జిల్లా లక్ష్యం.. భద్రతను అందరు బాధ్యతగా తీసుకుంటే ఇది సాధ్యమని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్ అన్నారు. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం జనగామ మండలం గానుగుపహా డ్లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ అధికారులు చేపట్టిన పొలం బాట కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నద ని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు అన్ని రకాల భద్రత పరికరా లు అందించామని చెప్పారు. విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైన సమయంలో 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం విద్యుత్ ప్రమాదాల నివారణ వివరాల పోస్టర్ ను ఆవిష్కరించారు. సదస్సులో డీఈ లక్ష్మీనా రాయణ తదితరులు పాల్గొన్నారు. మెరిట్ ఆధారంగానే నియామకాలు : డీఎంహెచ్ఓ జనగామ: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యాన జాతీయ ఆరోగ్య మిషన్ స్కీంలో పలు కేటగిరీ లకు సంబంధించి ఉద్యోగ నియామకాలను మెరిట్ ఆధారంగా చేపట్టినట్లు డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు తెలిపారు. శుక్రవారం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ చిల్పూరు మండలం కృష్ణాజీగూడెంకు చెందిన మారపాక ప్రేమ్కుమార్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజ ర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా.. ఆయన కు సంబంధించి అర్హతలతో కూడిన ఎంపీహెచ్ఏ(ఎం) సర్టిఫికెట్ 2021 ఏప్రిల్తో కాలపరిమి తి ముగిసిందని, రెన్యువల్ చేయించుకుని గడువులోగా సమర్పించక పోవడంతో పరిగణలోకి తీసుకోలేదన్నారు. మెరిట్ జాబితాలో నంబ రింగ్లో ఒకటి నుంచి 11 వరకు ఉన్న అభ్యర్థు లను ఉద్యోగానికి అవసరమైన అర్హతలు లేని కారణంగా ఎంపిక చేయలేదని తెలిపారు. ప్రేమ్కుమార్కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ము గ్గురు అధికారులతో కమిటీని నియమించామ ని, పారదర్శకంగా నియామక ప్రక్రియ జరిగిన ట్లు నిర్థారించినట్లు తెలిపారు. -
ఖైదీలకు హక్కులు తెలియాలి..
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్: ఖైదీలకు తమ హక్కులు తెలియాలి.. ఈ మేరకు జైలు, జైలు బయట వివరా లతో కూడిన పోస్టర్లను అంటించాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైలును శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. జైలులో వసతులు, భోజనం, అలాగే ఖైదీల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జైలు సిబ్బందితో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలపాలని, ప్రతి ఒక్కరికీ న్యాయవాది ఉండాలని చెప్పారు. సమస్యలు ఉంటే రాసి సబ్ జైలులోని బాక్స్లో వేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఖైదీలకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో సబ్జైలు సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్యానికి మించి రుణం
మహిళల ఆర్థిక పరిపుష్టికి కృషి ● స్వయం సహాయక సంఘాలకు రుణాలు ● బ్యాంకు లింకేజీ ద్వారా రూ.532.84 కోట్లు ● సీ్త్రనిధి ద్వారా రూ.19.95 కోట్ల చెల్లింపులు ● రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచిన జిల్లాజనగామ రూరల్: స్వయం సహాయ క సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల చెల్లింపుల్లో జిల్లా అధికారులు ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక సంవత్సరం ముగియక ముందే లక్ష్యాన్ని అధిగమించి జిల్లాను రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిపారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించా లనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా స్వయం సహాయక సంఘాల కు రుణాలు మంజూరు చేస్తోంది. అవసరాల మేరకు వారికి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలతో పాటు సీ్త్రనిధి రుణాలు అందజేస్తున్నారు. మహిళలు ప్రతినెలా ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లిస్తున్నారు. లక్ష్యానికి మించి రుణాల పంపిణీ జిల్లాలో 5,777 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరం రూ.476.47 కోట్ల రుణాల పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి నెలరోజుల సమయం ఉండగానే లక్ష్యం చేరుకున్నారు. మొత్తం రూ.532.84 కోట్ల రుణాలు(111.83 శాతం) పంపిణీ చేశారు. మరోవైపు సీ్త్రనిధి ద్వారా రూ.19.95 కోట్ల రుణాలు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు రూ.20 కోట్ల రుణాలు అందజేశారు. జిల్లాలో అత్యధికంగా చిల్పూరు మండలంలో 441 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.93.92 కోట్ల రుణాలు పంపిణీ చేసి మొదటిస్థానంలో నిలిచారు. అలాగే అత్యల్పంగా తరిగొప్పుల మండలంలో 170 సంఘాలకు రూ.14.46 కోట్లు అందజేసి చివరిస్థానంలో నిలిచింది. రికవరీ ఇలా. బ్యాంకు లింకేజీ ద్వారా అందజేసిన రుణాల్లో దాదాపు రూ.50 కోట్ల వరకు మొండి బకాయిలు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సీ్త్రనిధి రుణాల్లో ఈ ఏడాదిలో రూ.20 కోట్లు రికవరీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.62 శాతం రికవరీ అయినట్లు పేర్కొన్నారు. రుణాల పంపిణీతోపాటు రికవరీ కోసం క్షేత్రస్థాయిలో ఐకేపీ సిబ్బంది నిత్యం స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ.. తీసుకున్న రుణం డబ్బులు సకాలంలో చెల్లించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు.2024–25 సంవత్సరం మండలాల వారీగా రుణ పంపిణీ వివరాలు(రూ.కోట్లలో)మండలం సంఘాలు రుణ లక్ష్యం పంపిణీ బచ్చన్నపేట 886 45.51 39.69 చిల్పూర్ 828 45.84 93.92 దేవరుప్పుల 859 48.56 35.56 స్టేషన్ఘన్పూర్ 917 44.28 51.53 జనగామ 709 36.15 51.59 కొడకండ్ల 578 25.56 42.39 లింగాలఘణపురం 818 41.31 40.14 నర్మెట 363 20.21 15.81 పాలకుర్తి 1087 54.06 46.81 రఘునాథపల్లి 1066 50.25 67.02 తరిగొప్పుల 419 24.24 14.46 జఫర్గఢ్ 748 40.50 34.46 మొత్తం 9,278 476.47 532.84రుణాలను సద్వినియోగం చేసుకోవాలి మహిళా సంఘాల సభ్యులకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.476 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు లక్ష్యానికి మించి రూ.532 కోట్ల రుణాలు అందజేశాం. రికవరీ కోసం క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం. సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. – వసంత, డీఆర్డీఓ -
సివిల్ సప్లయీస్కు ‘సీఎంఆర్‘ చిక్కులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ● హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైసుమిల్లుకు 2021–22, 2022–23 సంవత్సరాలకు కేటాయించిన సీఎంఆర్ కింద 4,310 మె.టన్నుల బియ్యానికి 1,889 మె.టన్నులు మాత్రమే సరఫరా చేశారు. సుమారు రూ.7.50 కోట్ల విలువైన బియ్యం ఎగవేయడంతో అప్పట్లో సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి బియ్యం లేకపోవడంతో కేసులు నమోదు చేసి డిఫాల్టర్ లిస్టులో చేర్చారు. ● మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో గత సీజన్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. అదే విధంగా కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించి కేసులు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద రైసుమిల్లర్లకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఈసారి డిఫాల్టర్లకు ఇవ్వొద్దని ప్రభుత్వంనుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. 20 శాతం మిల్లర్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. సివిల్ సప్లయీస్ అధికారులు వాటిపై పునరాలోచన చేస్తూ మిగతా మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నారు. ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్లో 987 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జేఎస్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పాక్షికంగా సాగుతుండగా.. మిగతా జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ధాన్యం అమ్ముకుంటున్న రైతులకు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మెనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) ద్వారా డబ్బు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నారు. దాడులు, కేసులు పెట్టినా అదే మొండివైఖరి... సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని పలు జిల్లాల్లో కొందరు రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూకుమ్మడి తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. గత రబీ సీజన్లో సీఎంఆర్ కోసం కూడా హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలోని మూడు మిల్లుల్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. వరంగల్ జిల్లాలోని ఓ మిల్లులో రూ.3.79 కోట్ల విలువైన 12,360 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు గుర్తించి కేసు పెట్టారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్లో జరిపిన తనిఖీల్లో ఆరేడు సంవత్సరాలకు సంబంధించిన రూ.201 కోట్లకు పైగా విలువైన బియ్యం బకాయి ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో ఉన్న పలువురికి నోటీసులు జారీ చేశామని, 6ఏ కేసులు కూడా నమోదు చేశామని, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు కూడ పెడతామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. రబీ సీజన్ సీఎంఆర్ ఆచితూచి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాయిల్డ్, రా రాస్ మిల్లులు 328 వరకు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాలోని మిల్లుల నుంచి బకాయిలు సుమారు లక్షా 20వేల మెట్రిక్ టన్నుల పైచిలుకు రావాల్సి ఉందని ఫైనల్గా తేల్చారు. సీఎంఆర్ బకాయి ఉన్న డిఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వరాదన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ 10.24 లక్షల మె.టన్నుల మేరకు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేసిన అధికారులు 987 కొనుగోలు కేంద్రాల కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇన్టైమ్లో సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లకే సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫాల్టర్గా ఉన్న రైసుమిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్ ఇచ్చిన మిలర్లకు తరలించడమా... లేక ఈ సీఎంఆర్ బకాయి రాబట్టుకుని అదనంగా జమానత్లు తీసుకుని వారికే ఇవ్వడమా... అన్న కోణంలో కసరత్తు చేస్తున్నారు. పెండింగ్లో గత రబీ, ఖరీఫ్ సీఎంఆర్ బియ్యం లక్ష్యానికి దూరంగా చాలామంది రైసుమిల్లర్లు గడువు పెంచినా కదలని సీఎంఆర్ బకాయి ఊపందుకున్న రబీ ధాన్యం కొనుగోళ్లు డిఫాల్టర్లకు సీఎంఆర్ ఇవ్వద్దని సర్కారు ఆదేశం.. ‘ప్రత్యామ్నాయం’పై కసరత్తు -
5 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి
● వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిజనగామ రూరల్: పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్గా తీసుకొని గ్రామాల్లో ఈనెల 5వ తేదీ నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నా రు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్మిట్టల్తో కలిసి వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించగా.. జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో పొజిషన్లో ఉన్న రైతుల దరఖాస్తులు పరిశీలించాలని, భూమి లేని నిరుపేదలు పోజిషన్లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పట్టాలు ఉండి పొజిషన్లో లేని దరఖాస్తులను కూడా పరిశీలించాలని, హైకోర్టు నుంచి అనుమతి రాగానే సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు. దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలన్నారు. గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు విక్రయిస్తే ముందు ఆ పట్టాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసినవారు భూమి లేని నిరుపేదలైతే ఎంత భూమి క్రమబద్ధీకరించాలో ప్రభుత్వం నిర్ణయిరస్తుంన్నా రు. ఈ సందర్భంగా ‘నీట్’ నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సమీక్షించారు. -
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి
● సీపీ సన్ప్రీత్సింగ్ వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేసి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులను గురువారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సన్ప్రీత్సింగ్ ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలను అందజేశారు. పదవీ విరమణ పొందిన వారిలో ఎస్సైలు యుగేందర్, రాజశేఖర్రెడ్డి, కృష్ణారావు, ఎలిషా, ఏఎస్సై కుమారస్వామి, హెడ్కానిస్టేబుల్ రాంరెడ్డి ఉన్నారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ సుదీర్ఘంగా కాలంగా పోలీస్ శాఖకు అందించిన సేవలు మరిచిపోమని తెలిపారు. భవిష్యత్లో శాఖాపరమైన సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ఏసీపీలు సురేంద్ర, నాగయ్య, అంతయ్య, ఆర్ఐలు స్పర్జన్రాజ్, సతీష్, శ్రీధర్, ఏఓ రామకృష్ణస్వామి, ఆర్ఎస్సై శ్రవణ్కుమార్ తదితరులు ఉన్నారు. నీటిని ఒడిసి పట్టాలి ● డీపీఓ స్వరూపారాణి బచ్చన్నపేట: గ్రామాల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చే నీటిని ఒడిసి పట్టాలని అందుకు.. ఇంకుడు గుంతలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి అన్నారు. గురువారం మండలంలోని నారాయణపురంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులు శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటిని భూమిలో ఇంకేలా చూస్తే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అలాగే గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలని అందుకు గ్రామస్తులు తడి, పొడి చెత్తను వేరు చేసి జీపీ ట్రాక్టర్లలో వేసేలా చూడాలన్నారు. నర్సరీల్లో వంద శాతం మొక్కలు రక్షించాలని, పార్కులలో కూడా మొక్కల్ని రక్షించాలన్నారు. గ్రామాల్లో అన్ని రకాల పన్నులు వసూలు చేస్తూ వాటి నిర్వాహణ రికార్డులను సక్రమంగా రాయాలని పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శులు పలువురు పాల్గొన్నారు. -
జిల్లాలో మండలాల వారీగా ఫలితాలు
మండలం విద్యార్థులు ఉత్తీర్ణత ఫెయిల్ శాతం బచ్చన్నపేట 557 549 8 98.56 చిల్పూరు 294 293 1 99.96 దేవరుప్పుల 361 356 5 98.61 స్టేషన్ఘన్పూర్ 890 880 10 98.88 జనగామ 1,382 1,372 20 98.56 కొడకండ్ల 359 358 1 99.72 లింగాల ఘణపురం 334 332 2 99.40 నర్మెట 368 366 2 99.46 పాలకుర్తి 668 656 12 98.20 రఘునాథపల్లి 480 473 7 98.54 తరిగొప్పుల 113 113 – 100.00 జఫర్గఢ్ 418 412 6 98.56 మొత్తం 6,224 6,160 74 98.81మొదటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పాఠశాల ప్రారంభం నుంచే విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. – రాజేందర్, ఉపాధ్యాయుడు,కొడకండ్ల2023–24 పరీక్ష రాసిన వారు: 6692ఉత్తీర్ణత: 6569బాలురు: 3076బాలికలు: 3493శాతం: 98.16ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాం.. పదో తరగతిలో జనగామ జిల్లా ఉత్తమ ర్యాంకు సాధించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా విజయోస్తు కార్యక్రమం చేపట్టి నిత్యం పర్యవేక్షించారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో టీచర్లు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించారు. స్లిప్టెస్ట్లు నిర్వహించి, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. రాష్ట్రంలో జనగామకు 3వ స్థానం దక్కేలా కలెక్టర్ చేసిన కృషి.. టీచర్ల శ్రమ విజయాన్ని ముంగిట నిలిపాయి. ఇదే స్ఫూర్తితో వచ్చే సంవత్సరం మరింత మెరుగైన ర్యాంకు కోసం కష్టపడతాం. – డి.ఓజన్న, డీఈఓ -
ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలి
చిల్పూరు: ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని వసతులు ఉన్నా.. చాలా మంది పేదలు విషయం తెలియక అనవసర ఖర్చులతో ఆపరేషన్లు చేయించుకుంటున్నారని, ఇక నుంచి ప్రభుత్వాస్పపత్రుల్లోనే కాన్పులు జరిగేలా సిబ్బంది పాటుపడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మల్కాపూర్లోని పీహెచ్సీని గురువారం మధ్యాహ్నం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ కుశాలితో మాట్లాడుతూ.. నార్మల్ డెలివరీ ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు డబ్బుల కోసం ఆపరేషన్ల పేరిట రోగుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారన్నారు. ఇక నుంచి డెలివరీకి ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వాస్పత్రుల్లోనే చేర్పించేలా చూడాలన్నారు. అనంతరం చిల్పూరు, మల్కాపూర్, రాజవరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, తహసీల్దార్ సరస్వతి, ఎంపీఓ మధుసూదన్, ఏఈఓలు నరసింహులు, వినయ్, యాకూబ్ తదితరులు ఉన్నారు. కలెక్టర్ను కలిసిన డీఈఓ జనగామ రూరల్: నూతనంగా డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన భోజన్న గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను మార్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు. ఆయన వెంట ఏపీఓ రమేశ్ ఉన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ -
కుల గణనపై ఫలించిన రాహుల్గాంధీ పోరాటం
జనగామ: దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటం ఫలించిందని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ అధినేత రాహుల్, సీఎం రేవంత్రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచిపెట్టారు. అనంతనం శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. కుల గణనతో పాటు జనగణనను వేగవంతం చేయాలన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏడాదిన్నర పాలనలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, ప్రకాశ్ యాదవ్, బన్సీ నాయక్, మోటే శ్రీనివాస్, సుధగాని కృష్ణ, తుపాకుల రాములు, మిద్దెపాక స్టాలిన్, మంతపురి ప్రకాశ్, భూష పర్వతాలు, మధు, అర్షద్, అశోక్ పాల్గొన్నారు. -
కడియం శ్రీహరిది గోబెల్స్ ప్రచారమే
చిల్పూరు: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అబివృద్ధి చేసింది తానేనంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. మండల కేంద్రంలో గురువారం మండల ఇన్చార్జ్ మాలోతు రమేశ్నాయక్ అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 15 ఏళ్లలో కడియం శ్రీహరిని ప్రజలు మర్చిపోయారని, అందుకు మాజీ సీఎం కేసీఆర్ చేసిన అబివృద్ధే కారణమన్నారు. ప్రస్తుతం ఏసమావేశంలో మాట్లాడినా తానే అబివృద్ధి చేశానని చెప్పుకుంటున్న కడియం చిల్పూరుగుట్ట కింద సమావేశం పెడదామని.. ప్రజలే తీర్పు చెబుతారని అందుకు సిద్ధమా? అని కడియం శ్రీహరికి రాజయ్య సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో తాను ఎంతో అబివృద్ధి చేశానని అందుకు నిదర్శనం శిలాఫలకాలే అన్నారు. కార్యక్రమంలో నాయకులు కేశిరెడ్డి మనోజ్రెడ్డి, రాకేశ్రెడ్డి, జనగాం యాదగిరి, నారగోని రాజు, రవిచంద్ర, రంగు హరీశ్, అరూరి రవిచంద్ర, రైతు వెంకన్న, వెంకటస్వామి, పోలు రమ తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
ఫలించిన ‘విజయోస్తు’
కోర్టు ఆదేశాలు బేఖాతర్ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు ఇచ్చినా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.– 8లోuశుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు అందజేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.– 8లోuన్యూస్రీల్ -
క్రీడలతో మానసిక వికాసం
జనగామ రూరల్: యువతకు విద్యార్థులకు క్రీడలతో మానసిక, శారీరక వికాసం కలుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌడారంలో స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో క్రీడల శాఖ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులు వేసవి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర జాతీయ స్థాయి అథెటిక్స్లో పాల్గొనేలా నైపుణ్యాలు నేర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి గంగిశెట్టి మనోజ్కుమార్, శిక్షకులు మునిగె సురేశ్, గ్రామస్తులు కర్ణాకర్, కర్ల శ్రీకాంత్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.కార్మికులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలిజనగామ రూరల్: కార్మికులు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి విక్రమ్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, వారికి సంబంధించిన చట్టాలు, ఆరోగ్య పథకాల గురించి తెలుసుకోవాలన్నారు. కార్మికులు పనిచేస్తున్న ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. లేబర్ కార్డు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు, పెయింటర్స్, చిరు వ్యాపారస్తులు, మెకానిక్లు, వడ్రంగులు, సోషల్ వర్కర్స్, ఐటీఐ విద్యార్థులు, పారా లీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు చరిష్మజఫర్గఢ్: మండలంలోని హిమ్మత్నగర్ గ్రామానికి చెందిన విద్యార్థి తాటికాయల చరిష్మ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) బాక్సింగ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ ఆర్గనైజర్ సెక్రటరీ శీలం పార్థసారధి గురువారం తెలిపారు. హిమ్మత్నగర్కు చెందిన చరిష్మ మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతోందని.. రెండేళ్ల నుంచి హైదరాబాద్లోని టీజీఎస్డబ్ల్యూఆర్ పాఠశాల బాక్సింగ్ అకాడమీలో కోచ్ కృష్ణ తాప దగ్గర ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 30 నుంచి 5వ తేదీ వరకు న్యూఢిల్లీలో ఛత్రసల్ స్టేడియంలో 68వ (ఎస్జీఎఫ్) జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈపోటీల్లోనూ ప్రతిభను కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. కాగా.. విద్యార్థిని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి, ఫిజికల్ డైరెక్టర్ పద్మ, పీఈటీ సరిత, రమేశ్, శాంసన్ అభినందించారు.‘యువ వికాసం’ పత్రాలు అందజేయాలి..జనగామ రూరల్: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు పత్రాలను సంబంధిత కార్యాలయంలో అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతం వారు మండల ప్రజాపాలన కేంద్రాల్లో, పట్టణ ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 3 వతేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలని సూచించారు. -
సీనియర్ సిటిజన్ల అపూర్వ సమ్మేళనం
జనగామ రూరల్: జనగామలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ 1977–79 బ్యాచ్ పూర్వ విద్యార్థులు గురువారం ఘట్కేసర్లోని ఓ రీసార్ట్లో కలుసుకున్నారు. 46 ఏళ్ల తర్వాత 65 ఏళ్లు దాటిన వారంతా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కష్టసుఖాలు, సాధించిన విజయాల్ని చెప్పుకున్నారు. క్లాస్ రూంలో చేసిన అల్లరి, చదువు సాగిన తీరుపై ముచ్చటించుకున్నారు. భవిష్యత్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బండిరాజుల శంకర్, అల్లాడి ఉమామహేశ్వర్, టి.సుధాకర్, సంబోజు ఆంజనేయులు, రాపాక లక్ష్మణ్, కర్కెర్ల బాలరాజు, చంద్రమోహన్, బిల్లా జనార్ధన్ రెడ్డి, కె.హరిశ్చంద్ర ప్రసాద్, లింగాల ధర్మేందర్రెడ్డి, మాదారపు సాంబమూర్తి, కొన్యాల శ్రీనివాస్రెడ్డి, పోకల వెంకటేశ్వర్లు, మంచాల కృష్ణమూర్తి, లింగాల రవీందర్ రెడ్డి, వి.శేఖర్ రావు, మహదేవుని కృష్ణమూర్తి, మంగు శ్రీనాథ్, కందుకూరి సోమనర్సయ్య, పంగ జనార్దన్ రెడ్డి, వంటేరు జయపాల్ రెడ్డి, ఎ.సోమారెడ్డి, బత్తుల ఉపేందర్, సీహెచ్.ఉమాదేవి, పెద్ది రాణి, అనూరాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల పనుల్లో వేగం పెంచండి
కాళేశ్వరం: ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి నది పుష్కరాల పనుల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరేలతో కలిసి పుష్కరాల పనులను పరిశీలించారు. ముందుగా త్రివేణిసంగమం వద్ద వీఐపీ (జ్ఞాన సరస్వతి) ఘాటు వద్ద నిర్మిస్తున్న సరస్వతి మాత విగ్రహం, ఘాటు విస్తరణ పనులు, మరుగుదొడ్లు, శ్రాద్ధమండపం నిర్మాణాలను పరిశీలించారు. మంత్రికి ఎస్పీ వీఐపీ ఘాటుకు వచ్చే రోడ్డు మ్యాపును వివరించారు. గోదావరిలో నీటిమట్టం పుష్కరాల నాటికి తగ్గుతుందా? అని ఇరిగేషన్శాఖ ఈఈ తిరుపతిరావును అడుగ్గా కొంత తగ్గుతుందని, అయితే భక్తులకు ఇబ్బంది లేదన్నారు. సరస్వతిమాత విగ్రహం బేస్ కింద రివిట్మెంట్ కరెక్ట్ ఉందా అని ఎండోమెంట్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. వీఐపీ ఘాటు వద్ద టెంట్సిటీ నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఇక్కడ టెంట్సిటీని మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నామని, జాయ్రైడ్స్ కోసం కన్నెపల్లి వద్ద కాకుండా దేవస్థానం లేదా ఘాటు పరిసరాల్లో మూడు హెలిపాడ్లు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్కు తెలిపారు.పారిశుద్ధ్యంపై దృష్టి సారించండిపుష్కరాలకు వచ్చే భక్తులకు అందంగా కనిపించాలని, వ్యర్థాలు, చెత్తచెదారం లేకుండా పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లుకు ఆదేశించారు. పుష్కరాల్లో పారిశుద్ధ్యం పెద్దపీట వేస్తుందని, ఎక్కువ సంఖ్యలో కూలీలను పెంచాలన్నారు. అలాగే ప్రధాన ఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు గోదావరిలో బండరాళ్ల తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మళ్లీ పుష్కరాల పనులు పరిశీలించేందుకు నిత్యం వస్తుంటానని, అధికారులు అందుబాటులో ఉంటూ పనులు పూర్తి చేయించాలన్నారు. అలాగే గోదావరిలో బోట్లు తిప్పేందుకు అనుమతి ఇవ్వాలని, మరిన్ని బోట్లు పెంచి గంగపుత్రులకు ఉపాధి కల్పించాలన్నారు. అనంతరం హరితహోటల్లో శాఖల వారీగా సమీక్ష చేశారు. మంత్రి వెంట సబ్కలెక్టర్ మయాంక్సింగ్, ఈఓ మహేష్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ రామచందర్రావు, ఎస్సై తమాషారెడ్డి, నాయకులు కోట రాజబాపు, మాజీ ఎంపీపీ రాణిబాయి, అశోక్, శ్రీనివాసరెడ్డి, ఎల్.రాజబాపు, శకీల్, సత్యనారాయణ, జానీ, శ్యాందేవుడా తదితరులు పాల్గొన్నారు. -
పురాతన విగ్రహం తల భాగం లభ్యం
జనగామ రూరల్: జనగామ మండల పరిధి శామీర్పేట గ్రామ శివారులోని ఆవునూరి మల్లారెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలో బుధవారం కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా ఓ పురాతన విగ్రహం తల భాగం బయటపడింది. ఇది 17వ శతాబ్దానికి చెందిన వైష్ణవ భక్తుడి శిల్పంగా తెలుస్తోందని డిస్కవరీ మ్యాన్, పురావస్తు నిపుణుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. ఇక్కడ ఒక దేవాలయం ఉన్నట్లు ప్రస్తుతం లభించిన ఈ విగ్రహం తల భాగం ఆధారంతో అవగతమవుతోందని అన్నారు. గ్రామంలో ఒక శాసనం ఉందని, దానిపై శివుడు, వినాయకుడు, సూర్యుడి విగ్రహాలు ఉన్నట్లు పేర్కొన్న ఆయన.. దీని ద్వారా ఇక్కడ త్రికూటాలయం ఉందని తెలుస్తున్నదని చెప్పారు. గ్రామంలో గతంలో డంగు సున్నంతో చేసిన పాత్రలు, సున్నపు రాయి లభించాయని వివరించారు. -
మరోసారి సత్తా చాటిన ‘తేజస్వి’
నయీంనగర్: ఎస్సెస్సీ పరీక్ష ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు గ్రేడ్ పాయింట్లతో పాటు మార్కుల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విజయదుందుభి మోగించినట్లు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి తెలిపారు. 590 మార్కులతో మేకల శ్రీనిత్య ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎ.సాయిసిరి 586 మార్కులు, బొల్లారపు గౌతమ్క్రిస్, పి.అహన్య 584, జి.రిషిక, కె.శ్రీనిధి 583, అయోషా తబుసమ్, పి.హృతిక్ రెడ్డి 581, పి.శృతిక, జి.పవన్ విదేష్, డి.సబరీష్ 580 మార్కులు సాధించారు. 579 నుంచి 570 మార్కుల వరకు 46 మంది, 569 నుంచి 560 మార్కుల వరకు 44 మంది, 559 నుంచి 550 మార్కుల వరకు 50మంది, 549 నుంచి 540 మార్కుల వరకు 61మంది విద్యార్థులు, 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 251 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్నగర్ బ్రాంచ్ల్లో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించినట్లు వివరించారు. విజయపరంపర కొనసాగించిన విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి, తల్లిదండ్రులకు పాఠశాలల ప్రిన్సిపాళ్లు పిల్లలమర్రి చంద్రశేఖర్, సంధ్య, జేపీ రావు, ఉపాధ్యాయ బృందం అభినంధనలు తెలిపారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్: గ్రామాల్లో కమ్యూనిటీ మీడియేటర్లకు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. బుధవారం లీగల్ సెల్ ఆధ్వర్యాన కోర్టు ఆవరణలో చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేసులు ఎలా పరిష్కరించాలో ముందు తెలుసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ మీడియేటర్లుగా శిక్షణ తీసుకున్న వారు 31 మంది ఉన్నారని, ఇందులో చాలామంది రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్తోపాటు వివిధ వృత్తుల్లో అనుభవం కలిగిన వారు ఉన్నట్లు పేర్కొన్నారు. వారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మొత్తంలో కేసులను పరిష్కరించాలని సూచించారు. లీగల్గా తెలియని విషయాలు ఉంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మండలం, గ్రామాల్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు ఓపెన్ చేయాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు ● ఈనెల 3వ తేదీ వరకు అవకాశం జనగామ: ఎల్ఆర్ఎస్ పథకం కింద 25 శాతం రాయితీతో ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు అవకాశం కల్పిస్తూ బుధవారం జీఓ జారీ చేసింది. మొదటి విడతలో మార్చి 31 వరకు, రెండోసారి ఏప్రిల్ 2 నుంచి 30 వరకు అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించే సమయంలో సర్వర్ డౌన్, సర్వే నంబర్లపై తగాదా లు, కోర్టు కేసుల నేపథ్యంలో ప్రోహిబిటెడ్ ఆప్షన్ ఉండడం కారణంగా రెగ్యులరైజేషన్ సమయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రామపంచా యతీ, పురపాలిక పరిధిలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తులు ఇబ్బడి, ముబ్బడిగా వచ్చినా.. అవి పెండింగ్లో ఉండడంతో మే 3వ తేదీ వరకు మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.23 కోట్ల ఆదాయం జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, 12 మండలాల పరిధిలో 12,996 దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు రూ.23.87 కోట్ల ఆదాయం ఫీజు రూపంలో ప్రభుత్వానికి వచ్చింది. ఏఎంసీ సూపర్వైజర్ సరెండర్ జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ కార్యాలయ సూపర్వైజర్ వి.నాగార్జునపై వచ్చిన పలు ఆరోపణలతో పాటు పాలకవర్గం తీర్మానం మేరకు ఆయనను హెడ్ ఆఫీస్కు సరెండర్ చేస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ బుధవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున పనిచేసే సమయంలో అతనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నాగార్జునను రాష్ట్ర మార్కెటింగ్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు వివరించారు. -
టెన్త్ ఫలితాల్లో ఎస్ఆర్ విజయభేరి
విద్యారణ్యపురి: టెన్త్ పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి తెలిపారు. సక్కరా శివప్రియ 600 మార్కులకు గాను 586, డి.దీక్షిత్రెడ్డి 586, ఎస్.మనస్విని 585, మనివర్ధన్ 584, శివచరణ్ 584, వి.హాసిని 584 మార్కులు సాధించారని వారు తెలిపారు. 580కి పైగా మార్కులు 23మందికిపైగా సాధించి తమ ప్రతిభను చాటారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూ వాటిని ఆచరణ పరుస్తూ ఒత్తిడి లేని వాతావరణంలో క్రమశిక్షణ, సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. ఎస్ఆర్ విద్యాసంస్థల్లో పోటీ పరీక్షలను ఎదుర్కొనే విధంగా ఎస్సెస్సీ విద్యార్థులకు ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైమ్ స్కూల్స్ను ప్రారంభించామన్నారు. -
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025
ఫలితాల నమోదు ఇలా.. జిల్లాలో మొత్తం 180 పాఠశాలలు ఉండగా.. అందులో ఎయిడెడ్ 93.2 శాతం, జెడ్పీ 98.11, సర్కారు స్కూళ్లు 98.80, ఆశ్రమ, మోడల్ 98.98, కేజీబీవీలు 99.07, ప్రైవేట్ 99.28, సోషల్ వెల్ఫేర్ 99.32, ట్రైబల్ వెల్ఫేర్ 99.34, బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్, మైనార్టీ పాఠశాలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. వంద శాతం ఫలితాలు సాధించిన ప్రభుత్వ స్కూళ్లు 127 ఉన్నాయి.‘పది’ ఫలితాల్లో 98.81శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రంలో జిల్లాకు మూడో స్థానం ● గత ఏడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత ● వంద శాతం సాధించిన పాఠశాలలు 127 జనగామ రూరల్: పదో తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు హవా కొనసాగించారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా 98.81 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు, మైనార్టీ, కస్తూర్బాగాంధీ, సాంఘిక సంక్షేమ, మహాత్మాజ్యోతిబా పూలే, బీసీ వెల్ఫేర్, ఆశ్రమ, ఎయిడెడ్, మోడ ల్, గిరిజన పాఠశాలలు మొత్తం 180 ఉండగా.. 6,234 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,160 మంది ఉత్తీర్ణత సాధించగా.. వీరిలో బాలు రు 2,948, బాలికలు 3,212 ఉన్నారు. 2018–19 విద్యాసంవత్సరం 97 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకుని రాష్ట్రంలో ముందంజలో ఉన్న జిల్లా గత ఏడాది 98.16 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా.. ఈసారి 3వ స్థానంలో నిలిచింది. కలెక్టర్ కృషితో మెరుగైన స్థానం పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లాను ఉత్తమంగా నిలపాలనే కలెక్టర్ రిజ్వాన్ బాషా సంకల్పం నెరవేరింది. పరీక్షలకు మూడు నెలల ముందు నుంచే ‘విజయోస్తు’ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేసే ప్రక్రియ ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, గురుకులాల్లో ఉదయం, సాయంత్రం సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థుల ను పరీక్షలకు సన్నద్ధం చేశారు. జెడ్పీ విద్యార్థుల ప్రతిభ టెన్త్ ఫలితాల్లో పట్టణంలోని ధర్మకంచ విద్యార్థులు ప్రతిభ చాటారు. మొత్తం 53 మంది విద్యార్థులకు 52 మంది ఉత్తీర్ణత సాధించారు. అవదూ త దీక్షిత 575, ఎస్.వెంకటేష్ 562, కె.ఐశ్వర్య 550 మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచారు. మైనారిటీ బాలుర జోరు జనగామ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎండీ.ఫిరోజ్ 564, కె.హర్షవర్ధన్ 563, జమీల్ 558, టి.వర్షిత్ 552, ఎం.చందు 549 మార్కులు సాధించారు. అలాగే 16 మంది విద్యార్థులకు 500లకు పైన మార్కులు వచ్చినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కర్రె కుమారస్వామి తెలిపారు. మెరిసిన ఎంజేపీ విద్యార్థులు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొత్తం 73 మంది విద్యార్థుల కు 73 మంది 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. కె.శ్రీజ 580, బి.సింధు 574, ఎన్.వర్షిత 570, ఎన్.భువనేశ్వరీ 570, బిందుశ్రీ 569, మార్కులు తెచ్చుకున్నారని ఎస్ఓ ఎం.అనిత తెలిపారు. సోషల్ వెల్ఫేర్ ప్రభంజనం జిల్లాలో అయిదు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు ఉండగా.. జఫర్గఢ్, నర్మెట, పాలకుర్తి గురుకులాలు 100 శాతం, జనగామ, స్టేషన్ఘన్పూర్ 98 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైనట్లు సమన్వయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఎం.తరుణ్ 573, పి.హేమ 571, బి.శ్రావణి 571, కె.నరేష్ 568, డి.శశాంక్ 550 మార్కులు సాధించినట్లు వివరించారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచింది. గడిచిన మూడు నెలల నుంచి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశారు. సమష్టిగా నిరంతర కృషి చేయడంతో మంచి ఫలితాలు సాధించాం. భవిషత్లో మొదటి స్థానం లక్ష్యంగా కృషి చేస్తాం. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు అభినందనలు. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ గత ఎనిమిదేళ్లలో జిల్లాలో పదోతరగతి ఉత్తీర్ణత వివరాలు శాతంలో.. సంవత్సరం బాలికలు బాలురు మొత్తం 2016–17 93.98 93.13 93.56 2017–18 88.50 88.27 88.38 2018–19 97.51 96.59 97.15 2019–20, 2021 కరోనాతో 100 శాతం ఉత్తీర్ణత 2021–22 96.01 93.39 94.72 2022–23 91.17 92.58 91.90 2023–24 98.68 97.59 98.16 2024–25 99.20 98.40 98.81అవదూత దీక్షిత/575 -
‘పది’లో షైన్ విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ: పదో తరగతి ఫలితాల్లో షైన్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ తెలిపారు. బుధవారం వెలుబడిన ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేల విద్యారంగంలో విశిష్ట సంస్థగా పేరొందిన షైన్ విద్యార్థులు జిల్లాకే తలమానికంగా నిలిచారన్నారు. షైన్ అంటే కేవలం ‘ఐఐటీ’నే కాదని అన్నిరంగాల్లో ముందుంటామని మరోసారి రూఢీ అయ్యిందన్నారు. జిల్లాలోనే తమ పాఠశాల విద్యార్థి బి.ఆదిత్య దీక్షిత్ 588 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారన్నారు. జి.జ్ఞానదీప్ 580, పి.హాసిని, మణికంఠ, రింషా జైనబ్ 579, సాయిశ్రీ 578, మణిచందన 577, కార్తీక, త్రిషిక పటేల్ 576, సంప్రీత్ 575, రాజేష్ 574 మార్కులు సాధించారన్నారు. 23 మంది విద్యార్థులు 570 మార్కులకు పైగా, 53 మంది 560 మార్కులకు పైగా, 92 మంది 550 మార్కులకు పైగా, 371 మంది 500 మార్కులకు పైగా సాధించారని తెలిపారు. వరంగల్ మహానగరంతో పాటు రాష్ట్రస్థాయిలో షైన్ విద్యార్థులు ముందువరుసలో నిలిచారన్నారు. తెలుగులో 155 మంది, హిందీలు 90 మంది, ఇంగ్లిష్లో 299 మంది, గణితంలో 242 మంది, సైన్స్లో 217 మంది, సోషల్లో 154 మంది ఏ1 గ్రేడ్ సాధించారన్నా రు. డైరెక్టర్ పి.రాజేంద్రకుమార్ మాట్లాడుతూ దే శంలోని ప్రతీ ప్రతిష్టాత్మక కళాశాలలో షైన్ విద్యార్థులున్నారని, దానికి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన కారణమన్నారు. బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు పి.రాజేంద్రకుమార్, మూగల రమ, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేష్, షైన్ ఎర్రగట్టు గుట్ట చైర్మన్ జె.శ్రీనివాస్, ప్రి న్సిపాల్లు జి.రాజ్కుమార్, పి.విశాల్, ప్రగతి రెడ్డి, కవితా రాణి, ఉపాధ్యాయుల అభినందించారు. -
గౌరవం పెరిగేలా పోలీసులు పనిచేయాలి
● పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కాజీపేట/మడికొండ: ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరిగేలా పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. బుధవారం కాజీపేట, మడికొండ పోలీస్ స్టేషన్ను సీపీ సన్ప్రీత్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్ని పరిశీలించడంతో పాటు సీసీ కెమెరా ల పనితీరు, కేసుల నమోదు, పరిష్కరానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో ఏసీపీ తిరుమల్, సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు శివకృష్ణ, నవీన్ కుమార్, లవన్కుమార్, మడికొండ ఎస్ ఎచ్ఓ కిషన్, ఎస్సై రాజ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారికి గాయాలుహసన్పర్తి: హనుమకొండ, అంబాల మార్గమధ్యలో ఎర్రగట్టు గుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. పరకాల మండలం సీతానాగారాని కి చెందిన శ్రీనివాస్, లలిత దంపతులు బుధవారం ద్విచక్ర వాహనంపై హనుమకొండ నుంచి అంబాల వైపునకు వెళ్తున్నారు. ఎర్రగట్టు గు ట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రధాన ర హదారిపై ఉన్న గేట్వాల్వ్ గుంతను ఢీకొన్నారు. దీంతో శ్రీనివాస్ దంపతులతో పాటు వారి రెండేళ్ల కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే రహదారిపై ప్రమాదకరంగా ఉన్న గేట్వాల్వ్ గుంత విషయం అధికా రుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించడంలేదని స్థానికులు వాపోతున్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ: మూడేళ్ల డిప్లామా ఇన్ హ్యాండ్లూ మ్స్, టెక్స్టైల్ టెక్నాలజీలో మొదటి, రెండవ సంవత్సరంలో ‘లేటరల్ ఎంట్రీ’ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఒడిషా రాష్ట్రం బర్గ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో 9 సీట్లకు 8+1 ఈడబ్యూస్ ప్రాతిపదికన అడ్మిషన్లకు తెలంగాణకు చెందిన టెన్త్ విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇంగ్లిష్ సబ్జెక్టుగా పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. అన్ని కేటగిరీల్లో ప్రవేశానికి వయసు 2025 జూలై 16 నాటికి 15–23 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 15–25 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. లేటరల్ ఎంట్రీకి గానూ మ్యాఽథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో 10+2లో ఉత్తీర్ణులైన వారు లేదా ఒకేషనల్ విభాగంలో 10+2 పరీక్ష పూర్తి చేసినవారు డీహెచ్, టీటీ కోర్సు(లేటరల్ ఎంట్రీ) సెకండియర్లో ప్రవేశానికి అర్హులని వివరించారు. దరఖాస్తులను జూన్ 7వ తేదీలోగా చేనేత, జౌళిశాఖ జనగామ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.ఉద్యమకారులకు అవార్డులుజనగామ : జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులకు హైదరాబాద్లో శ్రీకాంత్చారి మెమోరియల్ అవార్డ్స్–2025 బుధవా రం అందజేశారు. అవార్డులను శ్రీకాంత్చారి తల్లి శంకరమ్మ తెలంగాణ ఉద్యమ కణం, ఓయూ జేఏసీ చైర్మన్ దరువు సంస్థ నిర్వాహకురాలు అరుణ బంగారం సమక్షంలో ప్రదానం చేశారు. అవార్డు అందుకున్న వారిలో దిగోజు నర్సింహాచారి, అయిలా సోమనర్సింహాచారి. గంగాభవాని, కృష్ణ, సోమేశ్వరాచారి, సంజీవ, ప్రతాప్, సాయికిరణ్, రవి పలువురు ఉన్నారు.మైనార్టీలకు ఉచిత కోచింగ్జనగామ రూరల్: యూపీఎస్సీ సీసాట్ పరీక్ష కోసం(2025–26 విద్యా సంవత్సరం) మైనార్టీ అభ్యర్థులు ఉచిత కోచింగ్కు దరఖాసుచేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి డాక్టర్ బి.విక్రమ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా అభ్యర్థులకు 33.33 శాతం, అన్ని రిజర్వ్ కేటగిరీల్లో వికలాంగులకు 5శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్లో మొదటిసారి ప్రవేశం పొందే వారు అడ్మిషన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ అభ్యర్థులు అర్హులని, మే 1 నుంచి 24 వరకు అప్లికేషన్ల స్వీకరణ, జూన్ 5న అన్ని జిల్లా కేంద్రాల్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరీక్ష ఉంటుందని వివరించారు.రేపు ‘విజయోస్తు’ సంబరాలుజనగామ రూరల్: ‘విజయోస్తు’ కార్యక్రమంతో పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం వెలువడిన సందర్భంగా డీఈఓ రమేశ్ కలెక్టర్ను తన కార్యాలయంలో కలిసి సీట్లు పంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. విద్యా సంవత్స రం ఆరంభం నుంచే విజయోస్తు కార్యక్రమం రూపొందించి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చెప్పా రు. ఈనెల 2న ‘విజయోస్తు’ సంబరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
సాంకేతిక సమస్య రాకుండా చూడాలి
జనగామ: జిల్లాలో ఈనెల 4న నిర్వహించే 2025–నీట్ పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరులో ఎలాంటి సాంకేతిక సమస్య రాకుండా చూడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈ మేరకు బుధవారం డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి పట్టణంలోని గీతానగర్ ఏబీవీ డిగ్రీ కళాశాల, పెంబర్తి ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఐఎస్ రెసిడెన్షియల్ సెంటర్లను తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలుగా తరగతి గదుల్లో బెంచీలు, లైటింగ్, ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్స్ తదితర కనీస వసతులు కల్పించాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే ఉదయం 11 గంటల నుంచి లోనికి అనుమతించి మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేస్తామని పేర్కొన్నారు. పరీక్ష సమ యం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, విద్యార్థులు హ్యాండ్ కర్చీఫ్, మొబైల్ ఫోన్లు, వాచ్, బెల్ట్, పెన్, పెన్సిల్, రబ్బర్, శార్పనర్, ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తెచ్చుకోవద్దని, వాటికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అడ్మిట్ కార్డును వెంట తెచ్చుకునే సమయంలో వాటిపై సరైన వివరాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలని సూచించారు. వారి వెంట ఆర్డీఓ గోపీరాం, జీసీడీఓ గౌసియాబేగం, చీఫ్ సూపరింటెండెంట్లు రవీంద్రనాయక్, అనిత తదితరులు ఉన్నారు. నీట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్నీట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, పక్కన డీసీపీ, ఆర్డీఓ, ఇతర అధికారులు -
విద్యుత్ ప్రమాదాలను నివారించాలి
హన్మకొండ: విద్యుత్ ప్రమాదాలను నివారించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నా టి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం మే 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యుత్ భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్లు, కరపత్రాలను సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి, ఇన్చార్జ్ డైరెక్టర్లు, సీజీఎంలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం మే మొదటి వారంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించడంతో పాటు సిబ్బందికి, ప్రజలకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతీ సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్లో విద్యుత్ విని యోగదారులకు, రైతులకు విద్యుత్ భద్రత ప్రాముఖ్యతను వివరించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందితో సమావేశాలు నిర్వహించాలని ఎస్ఈలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశో క్ కుమార్, టి.సదర్ లాల్, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు తిరుమల్ రావు, రాజుచౌహాన్, అశోక్, బికంసింగ్, వెంకట రమణ, జాయింట్ సెక్రటరి కె.రమేష్ తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ -
శివాని విద్యాసంస్థల విజయభేరి
హసన్పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో శివాని విద్యాసంస్థలు విశ్వరూపం ప్రదర్శించాయి. పాఠశాలకు చెందిన రుద్రోజు శ్రేష్ట 577 మార్కులు, దివిజా 569, శ్రీనిత్యా 553, అంచూరి మానస 551, కుంట మనోజ్ 546, భూపతి అశ్వితారెడ్డి 545, ఽశస్త్ర రాఘశ్రీ 543, పెద్దిరెడ్డి మణిదీప్ రెడ్డి 539, ప్రణవ్ 539, దీవన్కుమార్ 538 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ కార్యక్రమంలో శివానీ విద్యాసంస్థల కరస్పాండెంట్ టి.స్వామి, డైరెక్టర్లు సురేందర్రెడ్డి, చంద్రమోహన్, రాజు, ఎన్.రమేష్, మురళీధర్, వి.సురేష్, సంతోష్రెడ్డి, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. -
సాయి కుటుంబానికి అండగా ఉంటాం
జనగామ: జనగామ పట్టణం 21వ వార్డు కుర్మవాడకు చెందిన పర్శ మల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు సాయికి మెరుగైన వైద్య పరీక్షలతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) భరోసా కల్పించింది. ‘నా కొడుకును సంపేయండి’ అంటూ ఈనెల 29న సాక్షిలో ప్రచురితమైన కథనం మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎంఓ ఆదేశాల మేరకు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఉత్తర్వులను అనుసరించి జనగామ ఆర్డీఓ గోపీరామ్, మున్సిపల్ కమిషనర్ సాయి తల్లిదండ్రులు ఉంటున్న నివాసం, ఆర్థిక పరిస్థితులపై కలెక్టర్కు రిపోర్టు చేశారు. మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న సాయిని నిమ్స్కు తరలించి, మెరుగైన వైద్య పరీక్షలు అందించే విధంగా చూడాలని కలెక్టర్కు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బాధితుడికి ఉన్న స్థలంలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా నివేదిక తయారు చేసి అందించాలని ఆదేశించారు. చదవండి: నా కొడుకును సంపేయండిరాజీవ్ యువవికాసం పథకం ద్వారా బాధిత కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా చూస్తామన్నారు. ‘సాక్షి’ చొరవతో బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుండటంతో కాలనీ వాసులు అభినందించారు. కాగా, సాయి తల్లిదండ్రులకు అండగా ఉంటామని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి హామీఇచ్చారు. అలాగే సాయి ఆరోగ్య పరిస్థితులపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరాతీశారు. సాయి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. జీరో కరెంటు, సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. జనగామలోని కుర్మవాడకు చెందినపర్శ సాయి దీన పరిస్థితి నా దృష్టికి వచ్చింది.ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రుల ఆర్ధిక పరిస్థితి పై వివరాలు తెలుసుకుని… ప్రభుత్వం వైపు నుండి చేయగలిగినసహాయ సహకారాలను అందించాలని అధికారులను ఆదేశించాను. నా ఆదేశాల మేరకు… రెవెన్యూ,… pic.twitter.com/R0vw7EIto8— Revanth Reddy (@revanth_anumula) April 29, 2025 -
వేసవి క్రీడల శిక్షణకు వేళాయె
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడల శిక్షణకు ముహూర్తం ఖరారు చేసింది. మే 1వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు అండర్ 14 విభాగంలో బాల,బాలికలకు అథ్లెటిక్స్తో పాటు వివిధ క్రీడాంశాలు వాలీబాల్, ఫుట్బాల్, మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, సాఫ్ట్ బాల్లో తర్పీదును ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 10 క్రీడా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శిక్షణ కేంద్రాలివే.. జిల్లాలోని జనగామ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (చౌడారం/అథ్లెటిక్స్), వెంకిర్యాల ఉన్నత పాఠశాల (తైక్వాండో), స్టేషన్ఘన్పూర్ విద్యా జ్యోతి డిగ్రీ కళాశాల (ఫుట్బాల్), స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాక్సింగ్), పాలకుర్తి మండలం చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సాఫ్ట్ బాల్), గూడూరు ఉన్నత పాఠశాల (వాలీబాల్), లింగాలఘణపురం మండలం వనపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (వాలీబాల్), జఫర్గఢ్, చిల్పూరు మండలం తమ్మడపల్లి(జి), మల్కపూర్, నర్మెట మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలల్లో (మార్షల్ ఆర్ట్స్)ను నేర్పిచనున్నారు. ఉదయం 6.60 నుంచి 8.30 సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రోజుకు రెండు దఫాలుగా బాల, బాలికలకు క్రీడ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ హాజరయ్యేందుకు ఆసక్తి ఉన్న బాల,బాలికలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎస్ఏటీజీఏఎస్ఈ. తెలంగాణ.జీఓవీ.ఇన్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరి రోజు బాల,బాలికలకు సర్టిఫికెట్లను అందిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలోని 10 ప్రదేశాల్లో మే 1వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం శిక్షణ ఉంటుంది. వేసవిలో క్రీడల ద్వారా శారీరక ధృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడల్లో పాల్గొనాలి. – బి.వెంకట్రెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి రేపటి నుంచి 10 పాఠశాలల్లో ప్రారంభం అండర్–14 బాల,బాలికలకు అవకాశం -
పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
జనగామ రూరల్: జిల్లాలోని ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం జనగామ మండలంలోని వెంకిర్యాల, గానుగుపహాడ్ పీఏసీఎస్ ధాన్యం సెంటర్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న సరుకును కలెక్టర్ పరిశీలించి అందులో తేమ శాతాన్ని పరిశీలించారు. రోజువారీగా కొనుగోళ్లకు సంబంధించి రిజిస్టర్లను పరిశీలించి వెంటవెంటనే ఓపీఎంఎస్లో రైతుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులను ఇబ్బందికి గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. అక్కడ నుంచి గానుగుపహాడ్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్లను పరిశీలించారు. తిరుగుప్రయాణంలో వడ్లకొండ ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలోని సఖి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అందులోని రికార్డులతో పాటు స్టాఫ్ రూం, కౌన్సెలింగ్ గదులను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ హుస్సేన్, డీటీ సీఎస్ శ్రీనివాస్, రేణుక, అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన వేగవంతం.. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి వివిధ ప్రభుత్వ పథకాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేసిన లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రాజీవ్ యువవికాసం దరఖాస్తులు కేటగిరీల వారీగా పరిశీలన చేసి సిబిల్ స్కోర్ నిమిత్తం ఆయా బ్యాంకులకు పంపించాలన్నారు. ఏఏపీ కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పీహెచ్సీల్లో ఓపీ సేవలను పెంచండి ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన వేగవంతం చేయాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా -
కష్టపడిన వారికే ప్రాధాన్యం
జనగామ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్సీ అ ద్దంకి దయాకర్, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతా ప్రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ క్రియాశీల కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. పా ర్టీలో నిజాయితీగా పని చేసిన వారికి భవిష్యత్ ఉంటుందన్నారు. సర్కారు అమలు చేస్తున్న పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీకార్యకర్త పై ఉందన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ పార్టీలోకి ముందు వచ్చామా, వెనక వచ్చా మా అన్నది ముఖ్యం కాదని, పదిమందిని కదిలించి ఓట్లు వేయించే వారే అవసరమన్నారు. ఈ సమావేశంలో జనగామ ఇన్చార్జ్ బైకానీ లింగం యాదవ్, యాదాద్రి ఇన్చార్జ్ లకావత్ ధన్వంతి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, మారుజోడు రాంబాబు, కొమ్మూరి ప్రశాంత్రెడ్డి తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎంపీ చామల ఓట్లు వేయించే వారే ముఖ్యం ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
దొంగలపై నిఘా పెట్టాలి
వరంగల్ క్రైం: చోరీ కేసుల్లో శిక్ష అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అధికారులకు సూచించారు. మార్చికి సంబంధించిన నెలవారీ నేర సమీక్షను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లను పోలీ స్స్టేషన్లకు పిలిపించడం కాకుండా, అధికారులు వా రిని వ్యక్తిగతంగా కలిసి ప్రస్తుత స్థితిగతులను ఆరా తీయాలన్నారు. పోలీస్స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, సీసీ కెమెరాల పనితీరు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేయాలని సీపీ ఆదేశించారు. మహిళా సిబ్బందిని ప్రోత్సహించడంతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని చెప్పారు. జాతీయస్థాయిలో గుర్తింపు, అవార్డులు తీసుకొచ్చే విధంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ ఉండాలని, రేయింబవళ్లు ప్రజల కోసం పనిచేసి పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే అధికారులకు అవార్డులు రివార్డులు ఉంటాయన్నారు. సమావేశంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, అంకిత్కుమార్, జనార్దన్, జనగామ ఏఎస్పీ చైతన్య, ఏఎస్పీ మనాన్భట్, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. నెలవారీ నేర సమీక్షలో సీపీ సన్ప్రీత్సింగ్ -
రిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్గా తీసుకోవాలి
పరీక్ష ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండడం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో...ఎన్ని మార్కులు వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడుతుంటారు. కానీ, పరీక్ష ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదు. అంతా పాజిటివ్గా తీసుకోవాలి. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చినా, చదివినా చదువుకు తగిన ఫలితాలు రాలేదని అతిగా స్పందించొద్దు. ఒక్క ఓటమితో తమ చదువు ముగిసిపోదు. ప్రపంచంలోని మేధావులంతా ఎక్కువ మార్కులు సాధించినవారేమీ కాదని విషయాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు కూడా ఈ దిశగా విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలి. –డాక్టర్ రాజు, మానసిక వైద్య నిపుణుడు. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: మే 4వ తేదీన జరగనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష 2025 (నీట్)కు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, సంబంధిత అధికారులతో కలిసి సమీ క్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి 582 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే రహదారి భద్రతపై జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై స్పీడ్ బ్రే కర్లు ఏర్పాటు చేయాలన్నారు. చట్టాలపై అవగాహన ఉండాలి సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ విక్రమ్ జనగామ రూరల్: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ సి.విక్రమ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని బాల సదనాన్ని ఆయన సందర్శించి జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ రూపొందించిన చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీంపై పిల్లలకు అవగాహన కల్పించారు. పిల్ల లకు ఎప్పుడు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ స్నేహభావంతో ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం పిల్లల వసతులు భోజనం, టిఫిన్స్, స్నాక్స్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. బాలికలు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.కృష్ణవేణి, బి.స్రవంతి తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల తుది జాబితా విడుదల జనగామ: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్, ఉద్యోగ నియామకానికి ఎంపికై న వివరాలను విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లిఖార్జున్ మంగళవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ద్వారా 33 పోస్టుల భ ర్తీకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం విధి తమే. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ను అధికారిక వెబ్సైట్తో పాటు కలెక్టరేట్లోని జి ల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ నోటీసు బో ర్డుపై అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశా రు. జాబితాలో అభ్యంతరాలు ఉంటే, అందుకు అవసరమైన వివరాలను జోడించి, మే 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు డీఎంహెచ్ఓ కా ర్యాలయంలో అందించాలన్నారు. కాగా ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో మే 2వ తేదీన ఉదయం 11.30 గంటలకు డీఎంహెచ్ఓ కార్యాలయానికి హాజరు కావాలన్నారు. అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలి జనగామ రూరల్: టీజీపీఎస్సీలో వసతి గృహ సంక్షేమ అధికారిగా ఎంపికై న గ్రేడ్–2 అభ్యర్థులు జోన్ 5లో కౌన్సెలింగ్కు హాజరుకావాలని న ల్లగొండ ఉపసంచాలకులు ఎన్.ప్రేమ్కరణ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. నేడు (బుధవారం) 10.30గంటలకు నల్ల గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని, అభ్యర్థులు హాజరుకావాలన్నారు. -
లక్ష్యం చేరని ఎల్ఆర్ఎస్
జనగామ: అనధికార లేఅవుట్లోని స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన 25శాతం రాయితీ గడువు పెంచినా స్థలాల క్రమద్ధీకరణ లక్ష్యం చేరలేదు. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) రాయితీ గడువు నేటితో ముగి యనుంది. మార్చి 30వ తేదీ వరకు 25 శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించగా, ఈ నెల 2వ నుంచి 30వ తేదీ వరకు రెండోసారి అవకాశం కల్పించారు. ఎల్ఆర్ఎస్ 2025–26 ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ గడువుకు నేడు (బుధవారం) ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రొసీడింగ్ కాపీలు రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర ఎల్ఆర్ఎస్ ల క్ష్యం నెరవేరడం లేదు. రెండుసార్లు అవకాశం ఇచ్చినా ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు యజమానులు ముందుకు రావడం లేదు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినా.. నేటికి ప్రొసీడింగ్ కాపీలు రాకపోవడం కూడా కొత్తగా ఫీజు చెల్లించాలనుకుంటున్న వారీపై ఎఫెక్టు కనిపిస్తోంది. 2020లో ఎల్ఆర్ఎస్ కోసం రూ.1,000తో 69,710 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 12,469 మంది మాత్రమే తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. వీటిపై రూ.22.82 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ముగియనున్న 5 శాతం రాయితీ సర్కారు ఖజానాకు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం 2025–26 (ప్రస్తుత) ఆస్తిపన్ను 100 శాతం చెల్లించిన వారికి 5 శాతం రా యితీ కల్పించింది. ఈ అవకాశం నేటితో ముగి యనుంది. జనగామ పట్టణంలో 15,609 అసెస్మెంట్లు ఉండగా, రూ.6.74కోట్ల మేర పన్ను వసూలు చేయాలని డిమాండ్ ఉంది. ఇందులో 5 శాతం రాయితీపై ఇప్పటి వరకు 2,082 మంది రూ.75లక్షల మేర చెల్లించి లబ్ధిపొందారు. కాగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు వచ్చే యజమానులకు ప్రొహిబిటెడ్ పరేషాన్ చేస్తోంది. ప్లాట్ల పంచాయితీలో ఫిర్యాదు వెళ్లిన సమయంలో సమీపంలోని అన్నింటినీ ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చారు. ప్రభుత్వం మరో అవ కాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణకు ముందుకురాని యజమానులు నేటితో ముగియనున్న గడువు జీపీ, పురపాలిక పరిధిలో రూ.22.82కోట్లు వసూళ్లుమూడు రోజుల నుంచి తిరుగుతున్న.. కళ్లెం రోడ్డులో 1989లో 250 గజాల ప్లాటు కొనుగోలు చే శా. ఎల్ఆర్ఎస్ కోసం గతంలోనే రూ.1,000 రుసుం చె ల్లించా. ప్లాటుకు సంబంధించి మిగతా డబ్బులు చెల్లించి, క్రమబద్ధీకరణ చేసుకుందామంటే ప్రొహిబిటెడ్లో ఉందంటున్నారు. అధికారులు సత్వరమే స్పందించాలి. – చిటుకుల అంజయ్య,21వ వార్డు, జనగామ -
విజయానికి నాంది
ఓటమి.. ఇటీవల విడుదలైన టెన్త్ ఫెయిల్ సినిమాలో హీరో తన గ్రామంలోని పాఠశాలలో పదో తరగతి ఫెయిలవుతాడు. ఆ తరువాత కష్టపడి చదువుతాడు. ఢిల్లీ వెళ్లి పిండిమర, టీస్టాల్ తదితర పనులు చేసుకుంటూనే సివిల్స్కు ప్రిపేరవుతాడు. ఒకటి, కాదు రెండు కాదు.. ఆరోసారి తను అనుకున్న ఐపీఎస్ సాధిస్తాడు. అతను మొదటిసారి రాలేదని కుంగిపోకుండా ‘రీస్టార్ట్’ అంటూ తన చదువు మొదలుపెట్టి చివరికి అనుకున్నది సాధిస్తాడు. ఒక్కసారి ఫెయిలైతే జీవితమే అయిపోయినట్టు కాదు ● దీన్ని అధిగమించి సక్సెస్ ఫుల్ లైఫ్తో ముందుకెళ్లొచ్చు ● పిల్లల మార్కులను పేరెంట్స్ ప్రతిష్టగా భావించొద్దు ● ఫలితం ఎలా ఉన్నా ప్రోత్సహిస్తేనే బంగారు భవిష్యత్ ● పదో తరగతి ఫలితాల వేళ మానసిక, వైద్య నిపుణుల సూచనలు జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు -
నా కొడుకును సంపేయండి
నా కొడుకు పుట్టుక నుంచేనడువలేడు..కింద కూసోలేడు. 30 ఏళ్ల వయసు వచ్చినా సంటి పిల్లగాడి లెక్క సేవలు చేయాలె. వచ్చే పింఛన్ డైపర్లకు కూడా సరిపోతలేదు. కూలికి పోతేనే కుటుంబం గడిచేది. కిరాయిఇంటికి జీరో కరెంటు బిల్లు వస్తలేదు. ఇందిరమ్మ ఇల్లుమంజూరు కాలేదు. ఏ ఆసరా లేదు. కొడుకు గోస సూడలేక పోతన్న. సాదుడు కష్టమైతంది. ఆదుకోండి.. లేదంటే కొడుకును సంపుండి..జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు కురుమవాడకు చెందిన పర్శ మల్లయ్య–లక్ష్మి దంపతులకు కుమారుడు సాయి, కూతురు ఉన్నారు. కొడుకు వయసు ప్రస్తుతం 30 సంవత్సరాలు. పుట్టుకతోనే కాళ్లు, చేతులు చచ్చుబడి పోయి కనీసం కూర్చోలేని పరిస్థితి. తండ్రి ఎంసీహెచ్లో వాటర్మెన్గా.. తల్లి సాయిబాబా ఆలయంలో కూలి చేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు. ఇద్దరూ పనికి వెళితేనే కుటుంబం గడిచేది. ఇద్దరూ పనులకు పోతే కొడుకుని ఇంట్లో ఉంచి వెళ్లాల్సిందే. ప్రభుత్వం నుంచి వచ్చే దివ్యాంగుల పింఛన్ రూ.4వేలు డైపర్లకు సైతం సరిపోవడం లేదు. మందులు, నెలవారి వైద్య ఖర్చులకు అప్పులు చేస్తున్నారు. అద్దె ఇంట్లో కాలం గడుపుతున్నారు. సర్కారు ఇచ్చే జీరో కరెంటు బిల్లుకు దరఖాస్తు చేసినా వస్తలేదు. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు పెట్టినా మంజూరు కాలేదు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు మల్లయ్య తన కొడుకును భుజాన ఎత్తుకొని వచ్చారు. ‘మేము ప్రభుత్వ పథకాలకు అర్హులం కాదా.. మంజూరు చేయకుంటే నా కొడుకును సంపేయండి’అంటూ కొడుకు సాయిని అక్కడే పడుకోబెట్టిన తల్లి లక్ష్మి అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ఎదుట బోరున విలపించింది. స్పందించిన అదనపు కలెక్టర్ సంబంధిత అ«ధికారులను పిలిచి వీరి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. -
’ఇరిగేషన్’లో ఏసీబీ గుబులు!
ఏసీబీ రంగప్రవేశం.. ఆందోళనలో ఇంజనీర్లు..సాక్షిప్రతినిధి, వరంగల్ : నీటిపారుదలశాఖలోని కొందరు ఇంజనీర్లలో మళ్లీ ఏసీబీ కలకలం మొదలైంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆందోళనలో పడ్డారు. మేడిగడ్డ మొదలుకుని కన్నెపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పలు ప్యాకేజీ పనుల్లో లొసుగులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటికే చాలామందిని విచారించిన ఆ కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు పరిధి వివిధ కేడర్ల లోని 17 మందిపై క్రిమినల్ కేసులు, 30 మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశారు. ఇదే సమయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికా రులు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించి ప్రాజెక్టు ఎండీ హరిరామ్ ఇళ్లలో సోదాలు నిర్వహించి అరెస్టు చేయడం సంచలనంగా మారింది. విచారణలతో ఉక్కిరిబిక్కిరి.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించి న మేడిగడ్డ బ్యారేజీ కుంగి, పియర్లు దెబ్బతిన్న ఘటనలో తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల సీపేజీపైనా విచారణ జరిపి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై వివరంగా నివేదించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏకంగా 17 మంది సీనియర్ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసింది. అందులో అంతా మేడిగడ్డతో సంబంధం ఉన్నవారేనని తెలిసింది. నిర్మాణంతోపాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ తదితర విభాగాల్లో పనిచేసిన ఇంజనీర్లు ఉన్నట్లు ప్రకటించారు. క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతోపాటు గతంలో ఎస్ఈగా పనిచేసిన రమణా రెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి రావు సహా 17 మంది ఉన్నారు. శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసిన 30 మందిలో వివిధ విభాగాలకు చెందిన డీఈఈ, ఏఈఈలు ఉన్నట్లు తెలిసింది. నివేదికలో ఉన్న ఇంజనీర్ల పదోన్నతులను పరిశీలనకు తీసుకోవాలా లేదా తేల్చుకోలేక ఉన్నతాధికారులు పెండింగ్లో పెట్టారు. అలాగే నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ విభాగం, నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగం ఇంజనీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి, వారిపైనా కేసులకు సిఫార్సు చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తదితరులపైనా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నా.. శాఖాపరమైన చర్యలా? క్రిమినల్ చర్యలా? అన్నది తేలలేదు. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో చిక్కుకున్న పలువురు ఇంజనీర్లు విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చర్చనీయాంశంగా ఎండీ హరిరామ్పై దాడులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇక్కడి వాళ్లే.. ఇప్పటికే 17మందిపై క్రిమినల్ కేసులు 30మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు తాజాగా ఏసీబీ దాడులకు దిగడంతో కలకలం ఆదాయానికి మించిన ఆస్తులే కారణం ఎటు నుంచి ఎటొస్తుందోనన్న ఆందోళనకాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వివాదంలో రంగంలోకి దిగిన ఏసీబీ.. ప్రాజెక్టులో ముఖ్య భూమిక పోషించిన నీటి పారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ భుక్యా హరిరామ్పై దాడులు నిర్వహించడం నీటిపారుదలశాఖను కుదిపేసింది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాల నేపథ్యంలో శుక్రవారం, శనివారం దాడులు నిర్వహించి.. శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. మొత్తం ఆయన వద్ద ప్రాథమికంగా రూ.200 కోట్ల మేరకు అక్రమాస్తులుంటాయని భావించిన ఏసీబీ ఇంకా తనిఖీలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారుల ఆస్తుల గురించి కూడా ఏసీబీ ఆరా తీస్తుందన్న ప్రచారం ఇంజనీరింగ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో ఓ వైపు కొంద రు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ విచారణలు ఎదుర్కొంటుండగా.. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల పేరిట ఏసీబీ దాడులు నిర్వహిస్తుండటంతో ఆరోపణలున్న ఇంజనీర్లలో ఆందోళన మొదలైంది. -
ఆలకించి.. ఆదేశించి
జనగామ రూరల్: ‘అనారోగ్యంతో భర్త చేనిపోయాడు. ఇద్దరు పిల్లలున్నారు. పోషణ ఇబ్బందిగా మారింది. వితంతు పింఛన్ రావడంలేదని ఓ మహిళ.. తమ తండ్రి కొనుగోలు చేసిన భూమిని కొందరు ఆక్రమించారు. న్యాయం చేయాలని ఇద్దరు రైతులు.. పక్కన ఉన్న భూమి యజమానుల కారణంగా ఆయిల్పామ్ తోటకు నిప్పంటుని నష్టపోయాను. ఆదుకోవాలని ఓ రైతు’.. ఇలా అనేక సమస్యలతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు 58 అర్జీలు రాగా.. వాటిని స్వీకరించిన అదనపు కలెక్ట ర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్.. వారి సమస్యల ను ఓపికగా విన్నారు. సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీఓ వెంకన్న, కలెక్టరేట్ ఏఓ మన్సూర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని ఇలా.. ● తన వ్యవసాయ భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కావడం లేదు.. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన మహిళా రైతు ఆలేటి ఎల్లమ్మ అర్జీ పెట్టుకుంది. ● తాను ఒంటరి మహిళను. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఏదైనా ఉపాధి కల్పించాలని రఘునాథపల్లి మండలానికి చెందిన అంబిక దరఖా స్తు చేసుకున్నది. ● తన భూమిని ఆక్రమించుకున్నారని, వారిపై చర్య తీసుకోవాలని బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లికి చెందిన నరేందర్రెడ్డి వినతి పత్రం అందజేశాడు.వితంతు పింఛన్ ఇప్పించండి ఐదేళ్ల క్రితం భర్త బత్తిని వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మృతి చెందాడు. మాకు ఇద్దరు పిల్లలు. పోషణకు ఇబ్బంది పడుతున్నా ను. గ్రామంలో కూలీ పనులు చేసి పిల్లలను చదివిస్తున్నాను. ఎలాంటి ఆస్తులు లేవు. సొంత ఇల్లు లేక అద్దెకు ఉంటున్నాను. వితంతు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – బత్తిని లత, రాఘవాపూర్(స్టేషన్ఘన్పూర్)సర్వే చేయించి భూమిని కాపాడాలి మా తండ్రి భీమగోని చంద్రయ్య 50 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఖాస్తులో ఉండగా హైదరాబాద్కు చెందిన పేర్వారం రాధిక మా పట్టా భూమిలో వారి భూమి ఉందని 1.30 గుంట లు అక్రమంగా చదువు చేసి ఆక్రమించారు. సర్వే చేయించి భూమిని కాపాడాలి. – భీమగోని ప్రవీణ్కుమార్, శ్రావణ్కుమార్, ఖిలాషాపురం(రఘునాథపల్లి)తోట కాలింది.. ఆదుకోండి రఘునాథపల్లి మండలం కోమళ్లలో 4.38 గుంటల భూమిలో మూడేళ్ల క్రితం ఆయిల్పామ్ సాగు చేసిన. తోట పక్కన ఉన్న యజమానులు వారి భూమిని చదునుచెసి కంపచెట్లను తొలగించి వారం కింద నిప్పు పెట్టారు. రెండుసార్లు మంటలు ఆర్పేసిన. ఆదివారం మధ్యాహ్నం నిప్పుపెట్టిన కంపచెట్ల నుంచి మంటలు వ్యాపించి ఆయిల్పామ్ తోట కాలిపోయింది. రూ.10లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. తోట కాలింది.. ఆదుకోండి. – బత్తోజు ఆంజనేయులు, జనగామ పట్టణంఅర్హులకు న్యాయం చేయాలి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారుల ఎంపిక సక్రమంగా జరగడంలేదు. గతంలో ఆస్తులు, ఆర్థికంగా ఉన్నవారి పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. అధికారులు విచారణ చేపట్టి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సజావుగా చేపట్టి అర్హులకు న్యాయం చేయాలి. – ముక్క కుమారస్వామి, చౌడారం (జనగామ) గ్రీవెన్స్లో ప్రజల గోడు వివిధ సమస్యలపై 58 అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్లు తక్షణమే పరిష్కరించాలని ఆదేశం -
విలువల పరిరక్షణలో కవులు ముందుండాలి
● కవి, గాయకుడు పెట్లోజు సోమేశ్వరాచారి జనగామ: మానవీయ విలువల పరిరక్షణలో కవులు ముందుండాలని కవి హృదయం సాహిత్య వేది క వ్యవస్థాపకుడు, కవి గాయకుడు పెట్లోజు సోమేశ్వరాచారి అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ జనగామ కవులు సోమవారం స్థానిక స్కాలర్ గ్రామర్ స్కూల్లో కవి హృదయం సాహిత్య వేదిక, కవులు, కళాకారుల ఐక్య వేదిక, సాధిక్ ఫౌండేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన కవి సమ్మేళనాన్ని సాధిక్ అలీ ప్రారంభించి మాట్లాడారు. సమ సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ ఐక్యతను చాటాలని కోరారు. అంతకు ముందు ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతికలగాని రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. కవులు మాన్యపు బుజేందర్, అంకాల సోమయ్య, చిలుమోజు సాయికిరణ్, రంగరాజు ప్రసాద్, కవులు, కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కృష్ణ, లగిశెట్టి ప్రభాకర్, సాంబ రాజు యాదగిరి, నక్క సురేష్, పొట్టబత్తిని భాస్కర్, గడ్డం మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూభారతి’తో భూసమస్యల పరిష్కారం
దేవరుప్పుల : భూభారతి చట్టంతో అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో తహసీల్దార్ ఆడెపు ఆండాలు అధ్యక్షతన ‘భూభారతి చట్టం–రైతుల చుట్టం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగా హన సదస్సులో ఆయన మాట్లాడారు. జఠిలమైన భూసమస్యల పరిష్కారానికి కొత్తచట్టం కార్యరూ పం దాల్చిందని, నాలుగంచెల వ్యవస్థతో భూయజమానులకు సానుకూలంగా ఉందని చెప్పారు. క్షేత్రస్థాయిలో తొలుత తహసీల్దార్, మలి విడత ఆర్డీఓ, ఆ తర్వాత కలెక్టర్ ద్వారా న్యాయం చేకూరలేదంటే అప్పీల్ వ్యవస్థను కీలకంగా వినియోగించు కోవచ్చని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే భూరికార్డుల తప్పుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, వారసత్వం తదితర మార్గాల ద్వారా సాదా బైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడానికి మార్గదర్శకాలు వచ్చాయని చెప్పా రు. గ్రామ పాలన అధికారుల పర్యవేక్షణలో ఏడాది కోసారి ఆయా గ్రామాల్లోనే భూరికార్డులు భద్రపర్చి ఉంచుతారని, తద్వారా కొనుగోలు చేసే వారికి క్లియరెన్స్ లభిస్తుందని వివరించారు. త్వరలో డిజిటల్ సర్వే ఆధారంగా నివాసిత ప్లాట్ల మాదిరి వ్యవసాయ భూముల వద్ద ఫొటోలు దిగి సరైన హద్దులతో కూడిన చిత్రపటం వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పట్టాదారు పుస్తకం ఉండి కబ్జాలో లేని.. కబ్జాలో ఉండి పట్టాదారు పుస్తకం లేని రైతులకు సముచిత న్యాయం చేయడానికి అధికార యంత్రాంగం పరిశీలిస్తుందన్నారు. జూన్ నుంచి ఊరూరా భూసమస్యలపై గ్రామ సభల్లోనే ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. సదస్సులో మండల ప్రత్యేక అధికారి శ్రీధర్రావు, నాయబ్ తహసీల్దార్ లచ్చునాయక్, ఎంపీడీఓ కె.లక్ష్మీనారాయణ, రెవెన్యూ జిల్లా సిబ్బంది శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఏడీఓ పరశురాంనాయక్, ఏఓ దివ్య, ఎంపీఓ సురేష్కుమార్, ఆర్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం ఎగుమతి సత్వరమే చేపట్టాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన నిల్వ ల ఎగుమతి సత్వరమే చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం దేవరుప్పుల మండల పరిధి సింగరాజుల్ల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన రికార్డులను పరిశీలించి కల్లాల్లో ధాన్యం దిగుమతి, ఎగుమతి వివరాలు తెలుసుకున్నారు. హమాలీల కొరత లేకుండా యుద్ధప్రాతిపదికన కాంటాలు పెట్టి ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సహకారం సంఘం సీఈఓ కృష్ణమూర్తిని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో నిర్వాహకులతో పాటు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
ఆయిల్పామ్ తోట అగ్నికి ఆహుతి
● రూ.10 లక్షల మేర నష్టం రఘునాథపల్లి: కోమళ్ల గ్రామానికి చెందిన బత్తోజు ఆంజనేయులు సాగు చేసిన ఐదెకరాల ఆయిల్పామ్ తోట ఆదివారం మధ్యాహ్నం అగ్నికి ఆహుతైంది. తోట పక్కనే ఉన్న భూముల రైతులు ఇటీవల జేసీబీతో కంపచెట్లు తొలగించి కుప్పగా వేసి నిప్పు పెట్టడంతో మంటలు ఆయిల్పామ్ తోట చుట్టూ వ్యాపించి పచ్చ ని చెట్లు కాలిపోయాయని బాధిత రైతు ఆరోపించారు. 100 నంబర్కు డయల్ చేయగా పోలీసులు చేరుకుని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దారి సక్రమంగా లేకపోవడంతో ఫైరింజన్ తోట వద్దకు చేరుకోలేక వెనుదిరిగి పోయింది. రెండున్నర సంవత్సరాల క్రితం సాగు చేసిన తోట ఆరు నెలల్లో చేతికందనున్న పంట అగ్నికి ఆహుతి కావడంతో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆంజనేయులు వాపోయాడు. ముళ్ల పొదలను తగులబెట్టిన సదరు రైతులపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్న ఆయన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఙప్తి చేశాడు. -
కట్టిపడేసిన ఆటాపాట..
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ఉద్యమానికి ఊపిరిలూదిన ఆట, పాటలతో సుమారు మూడు గంటల పాటు ఆటపాటలతో సభికులను కట్టిపడేశారు. పాత పాటలతో పాటు కొత్తగా కేసీఆర్ పాలన, పునఃపరిపాలనకు దోహదం చేసే తీరుపై పలువురు గాయకులు ఆలోచింపజేస్తూ జోష్ నింపారు. ఈసందర్భంగా దివంగత గాయకుడు సాయిచంద్కు కళాకారులు ఆటపాటతో ఘన నివాళులు అర్పించారు. విభిన్న సాంస్కతిక కళాకారులు తమ ప్రతిభతో తెలంగాణ ఉద్యమ తీరును చాటారు. కేసీఆర్ సభాస్థలికి వచ్చే ముందు తెలంగాణ సాధన మలి ఉద్యమంలో కేసీఆర్ పాత్ర తీరుతెన్నులు, సాధించిన తెలంగాణ పురోగతిపై బహుబలి సినిమా తరహాలో డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శన ఇచ్చారు. సభకు వచ్చిన జనం నిశ్శబ్దంగా తిలకించడం గమనార్హం. ‘‘మందెంట పోతుండే ఎలమంద... వాడు ఎవ్వాని కొడుకమ్మ ఎలమందా’’ పాటకు సభికులు ఉర్రూతలూగారు. ‘‘సారే కావాలంటున్నరే... తెలంగాణ పల్లెలల్ల.. మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్ల’’ తదితర పాటలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. సభలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సత్యవతిరాథోడ్, జి.జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, డా.బండా ప్రకాష్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్కుమార్, వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డా.టి.రాజయ్య, ధరంసోతు రెడ్యానాయక్, శంకర్నాయక్, బాల్క సుమన్, గాదరి కిషోర్, చల్లా ధర్మారెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, మాజీ ఎంపీ మాలోతు కవితతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. -
మృతులకు నివాళి అర్పించి..
మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం సభపై ఆసీనులయ్యారు. కశ్మీర్లో ఉగ్రవాదులు అమాయక దేశ బిడ్డలను దారుణంగా బలి తీసుకున్నారని.. ఇందుకు మౌనం పాటిద్దామని కేసీఆర్ పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వారంతా నిలబడి నిమిషంపాటు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును స్వాగతోపన్యాసం చేయాలని కోరారు. రజతోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ రథసారథి కేసీఆర్కు స్వాగతం పలుకుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రసంగించారు. 2013 తర్వాత జరుగుతున్న భారీ సభకు విచ్చేసిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ అధినేతలు, తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన జనానికి కూడా ఆయన స్వాగతం చెప్పారు. పహల్గాం మృతులకు సంతాపంగా మౌనం పాటిస్తున్న కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, బండా ప్రకాశ్, మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, జగదీశ్రెడ్డి తదితరులు -
దేశ ప్రగతికే ప్రధాని ‘మన్కీ బాత్’
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ జనగామ రూరల్ : దేశ ప్రగతికే ప్రధా ని ‘మన్కీ బాత్’ కార్యక్రమం చేపట్టార ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో నైపుణ్య మెళకువలు, చిన్న పరిశ్రమల స్థాపన, అలాగే రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేవిధంగా సేంద్రియ ఎరువుల వినియోగంపై, బడుగు బలహీన వర్గాలకు పారిశ్రామిక యూనిట్లు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహ న కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, నాయకులు గుజ్జుల నారాయణ, భాగాల నవీన్రెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతకింది సంతోష్, కేశపురం రవిరాజా పాల్గొన్నారు. -
తరలివచ్చిన జన ప్రవాహం..కిక్కిరిసిన సభా ప్రాంగణం
సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ప్రసంగిస్తున్న కేసీఆర్, అభివాదం చేస్తున్న కేసీఆర్ఎల్కతుర్కి క్రాస్ వద్ద జరిగిన రజతోత్సవ సభకు హాజరైన ప్రజలు, పార్టీ కార్యకర్తలుసాక్షిప్రతినిధి, వరంగల్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ సభ మినీ కుంభమేళాను తలపించింది. హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి ఎక్స్రోడ్లోని సభావేదికకు ఆదివారం మధ్యాహ్నంనుంచే వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు, కార్యకర్తలు చేరుకోవడం మొదలైంది. సాయంత్రానికి ఇసుకేస్తే రాలనంతగా జనం తరలిరాగా, సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు దీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలకు జనం ఉరకలేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్సులు చేశారు. తెలంగాణ పాటలతో గులాబీ సైనికులు, ప్రజలు ఊగిపోయారు. గులాబీ జెండాలను రెపరెపలాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఉరకలెత్తిన ఉత్సాహంతో ఊగిపోయారు. కిక్కిరిసిన జనం, బాహుబలి వేదికపై కొలువుదీరిన నేతలు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం.. గులాబీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు తల్లి వంటిది 6.59 గంటలకు మైక్ అందుకున్న కేసీఆర్.. గ్యాదరి బాలమల్లును మైక్ సౌండ్ పెంచమంటూ ప్రసంగం మొదలుపెట్టారు.. 7:57 నిమిషాలకు ప్రసంగం ముగించారు. శ్రీ సీతారాముల జీవిత చరిత్రలో అయోధ్య ప్రాశస్త్యం మాదిరిగా తెలంగాణ సాధన ఉద్యమానికి ఓరుగల్లు కన్నతల్లి వంటిదని అభివర్ణిస్తూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎగిరిన గులాబీ జెండా అంటూ.. ఈ జెండాను అనేక మంది ఎగతాళి చేసినా.. ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నిర్వహించుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రత్యేకత ఉందని.. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి రాణి రుద్రమదేవి, సమ్మక్క,సారలమ్మ స్ఫూర్తితో గులాబీ జెండా ఊపిరిలూదిందని.. ఓరుగల్లు ప్రాశస్త్యం, ఉద్యమంలో ఓరుగల్లుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసిన కేసీఆర్ కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నరయ్యింది.. ఏం చెప్పిండ్రు.. ఏం ఇస్తుండ్రు అనగానే ఏం ఇవ్వట్లేదు అని జనం పలికారు. ఇంతలో సభా వేదికకు దగ్గరగా ఉన్న పార్టీ శ్రేణుల గోలపై సహనం కోల్పోయిన కేసీఆర్ పల్లా రాజేశ్వర్రెడ్డిని పిలిచి ‘రాజేశ్వర్ వీళ్లెవరయ్యా.. మనోళ్ల వేరే వాళ్ల జర చూడు’ అన్నారు. అనంతరం కాంగ్రెస్ పరిపాలనను దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ హామీల అమలు బుట్టదాఖలు తీరుపై జనం నోట పలికిస్తూ జోష్ తెచ్చారు. తెలంగాణ ప్రాంత దేవుళ్ల మీద ఒట్టు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఉనికి కోసం బీఆర్ఎస్పై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ పాలనకు.. కాంగ్రెస్ పాలనను పోల్చుకుని చూడండీ.. మీరేమో వాళ్లకు కత్తిచ్చి.. నన్ను యుద్ధం చేయిమంటున్నారు’ అని చమత్కరించారు. వైఎస్సార్ పాలనను.. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ శాశ్వత ప్రజాసంక్షేమం కోసమని భావించి నిర్విరామంగా కొనసాగించామని కితాబిచ్చారు. సభకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు రజతోత్సవ సభను ఇంత భారీగా నిర్వహించడానికి కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్ రావులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే సభకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాహనాలతో నిండిన పార్కింగ్ స్థలాలు.. పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ తదితర జిల్లాలనుంచి వాహనాల ద్వారా వేలాదిగా తరలివచ్చారు. చింతలపల్లిలో సుమారు 1,059 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. పోలీసులతో పాటు 2,500 మంది వలంటీర్లు ట్రాఫిక్ నియంత్రణలో నిమగ్నమైనా.. వందలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరిన్ని సభా విశేషాలు -
ఉగ్రవాదాన్ని అంతమొందించాలి
పాలకుర్తి టౌన్ : ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అంతమొందించాలని మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంటా రవీందర్, డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి అన్నారు. ఉగ్రదాడులకు నిరసనగా ఆదివారం రాత్రి పాలకుర్తి మండల కేంద్రం గుడివాడ చౌరస్తా నుంచి రాజీవ్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పి తీరుతామని హెచ్చరించారు. ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన అమరుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, తండ మల్లయ్య, కిరాణ వర్తక వ్యాపార సంఘం అధ్యక్షుడు చారగొండ్ల ప్రసాద్, పన్నీరు సారంగపాణి, ఇమ్మడి అశోక్, భోనగిరి కృష్ణమూర్తి, కమ్మగాని శ్రీకాంత్, మారం రవి, గుమ్మడిరాజు సాంబయ్య పాల్గొన్నారు. కొవ్వొత్తులతో ప్రదర్శన జఫర్గఢ్ : పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతికి ఆర్యవైశ్యులు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించా రు. గాంధీ సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు అంచూరి యుగంధర్, నాయకులు దాంశెట్టి సోమన్న, ఇమ్మడి ఆశోక్, గందె సోమన్న, శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పహల్గాం మృతులకు కొవ్వొత్తులతో శాంతిర్యాలీ -
పహల్గాం మృతులకు ఆస్ట్రేలియాలో నివాళి
జనగామ: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ ఘటనలో మృతి చెందిన వారికి ఆస్ట్రేలియా ఫెడరేషన్ స్క్వేర్లో భారతీయులు నివాళులర్పించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవా లని కోరారు. కార్యక్రమంలో మెల్బోర్న్ తెలుగు సంఘం ప్రతినిధి, జనగామవాసి చింతల శ్రీని వాస్, శివకుమార్, గురుప్రీత్ వర్మ, శ్రీదుర్గా టెంపుల్ అసోసియేషన్ కార్యదర్శి ప్రదీప్శర్మ, జోషి, హర్ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 29న జాబ్ మేళా జనగామ రూరల్: కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యాన ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఈ మేళాకు అర్హత ఉన్న జనగామతోపాటు ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్తో హాజరు కావాలని జిల్లా ఉపాధికల్ప న అధికారి పి.సాహితి ఒక ప్రకటనలో తెలిపా రు. మరిన్ని వివరాలకు 7995430401 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రాపాక శ్రీశైలానికి డాక్టరేట్ దేవరుప్పుల : సమాజ రుగ్మతలను మెరుగు పర్చడమే లక్ష్యంగా సేవలందించిన సింగరాజుపల్లికి చెందిన రాపాక శ్రీశైలంకు (నాటా యూ ఎస్ఏ) హైదరాబాద్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. దళిత సామాజిక కార్యకర్త శ్రీశైలం అనియత విద్యాకేంద్రంలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ మహిళా సాధి కారత దిశగా దేవరుప్పుల, చేర్యాల, ఘన్పూర్ మండలాల మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో మమేకమైన ఆయన కులాంతర వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచాడు. హెచ్ఎస్ సీయూ కార్యనిర్వాహకులు డాక్టర్ ఆనంద్, ప్రసాద్ చేతుల మీదుగా శనివారం డాక్టరేట్ అందుకున్న శ్రీశైలం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
నాడు పిడికిలెత్తి.. నేడు ఉరకలెత్తి
● ఉద్యమ స్ఫూర్తితో ఓరుగల్లులో రజతోత్సవ సంబురం ● కాకతీయుల గడ్డపై స్వరాష్ట్ర సాధన ఉద్యమం ● ఉద్యమ పార్టీగా ఆదరణ.. 25 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు ● తెలంగాణ సాధనలో వరంగల్దే కీలక భూమిక చాకలి ఐలమ్మ పౌరుషం.. రాణి రుద్రమ వారసత్వం.. భూపతి కృష్ణమూర్తి పోరాట పటిమ. బత్తిని మొగిలయ్య అమరత్వం. జయశంకర్ సార్ మేధస్సు. కణకణమండిన కాళోజీ రచనల ఉద్వేగం. వీరందరి స్ఫూర్తితో నాడు ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఈ గడ్డపై నుంచి ఏ కార్యం మొదలు పెట్టినా విజయవంతమవుతుందన్న కేసీఆర్ నమ్మకంతో నేడు పార్టీ 25 ఏళ్ల వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ కాంగ్రెస్ ఇక ఖతమే! ● ప్రభుత్వ మోసాలు ప్రజలకు తెలిసిపోయినయ్.. ● రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలి ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు– IVలోu -
సభకు దండులా కదలాలి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దండులా కదలి రావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నా రు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సభలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ఊరూ, వాడా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్ట పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోపోరాటం తప్పదని స్పష్టం చేశారు. అంతకు ముందు సభకు హాజరయ్యే నాయకులకు స్వాగతం పలికేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. మాజీ మంత్రి హరీశ్రావుకు స్వాగతం రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్రావుకు వరంగల్–హైదరాబాద్ హైవే యశ్వంతాపూర్ జంక్షన్ వద్ద శనివారం ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి ఘన స్వాగతం పలికారు. నాయకులు తాళ్లసురేష్రెడ్డి, బాల్దె సిద్ధిలింగం, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, డాక్టర్ పగిడిపాటి సుధాసుగుణాకర్రాజు, మసిఉర్ రెహమాన్, ముస్త్యాల దయాకర్, కె.అనిల్రెడ్డి, కృష్ణ, సందీప్, హరిప్రసాద్, లక్ష్మీశ్రీశైలం, నాగరాజు పాల్గొన్నారు. -
ఎల్కతుర్తి వైపే!
దారులన్నీసాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో నేడు(ఆదివారం) నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సమీకరించే పనిలో నాయకులు తలమునకలయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల కు 10 లక్షల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను సభకు తరలించేందుకు వాహన సౌకర్యం కూడా కల్పించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలలోపు సభా ప్రాంగణానికి చేరుకునేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఏర్పడి 24 ఏళ్లు పూర్తయి 25వ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో రజతోత్సవం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఈ సభ ఎల్క తుర్తిలో నిర్వహించడం చర్చనీయాంశం కాగా.. దారులన్నీ ఎల్కతుర్తి వైపే కదులుతున్నాయి. బాహుబలి వేదిక.. తరలివస్తున్న జనం గులాబీ పార్టీ పాతికేళ్ల పండుగకు ఎల్కతుర్తి ముస్తాబైంది. చరిత్రలో నిలిచేలా నిర్వహించే ఈవేడుకల కోసం ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డులో బాహుబలి సభావేదిక సిద్ధమైంది. రజతోత్సవానికి అధినాయకత్వం ఎంచుకున్న ఎల్కతుర్తి ఎక్స్రోడ్డు సమీపంలో వేదిక నయనానందంగా రూపుదిద్దుకుంది. ఇందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీ ఆర్ పర్యవేక్షణలో 1,213 ఎకరాలను రైతుల నుంచి సమీకరించిన గులాబీ శ్రేణులు సుమారు నెల రోజులుగా శ్రమించారు. సుమారు పది లక్షల మంది హాజరయ్యే ఈ వేడుక కు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గులాబీమయం రజతోత్సవ సభతో ఎల్కతుర్తి గులాబీమయమైంది. బీఆర్ఎస్ మహాసభతో ఎల్కతుర్తి రజతోత్సవ శోభను సంతరించుకుంది. పార్టీ అధినేత కేసీఆర్, ఇతర నాయకుల కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, గులాబీ తోరణాలతో కళకళలాడుతోంది. పెద్ద వేదిక ఆపక్కనే కళాకారు ల ఆట–పాట కోసం ప్రత్యేకంగా మరో వేదిక ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వాహనాల కోసం 1,059 ఎకరాల్లో పార్కింగ్ ఇవ్వగా.. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మహాసభ ప్రాంగణంలో వాహనాలు, ప్రజలు వచ్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన గ్రీన్, రెడ్ కార్పెట్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. సభావేదిక ఏర్పాట్లలో ఆ ఆరుగురు.. గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు, సూచనలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణ లో ఆరుగురు నేతలు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితెల సతీశ్కుమార్ అవిశ్రాంతంగా శ్రమించా రు. ఎల్కతుర్తి, శివారు గ్రామాల రైతుల నుంచి భూముల హామీ పత్రాల స్వీకరణ మొదలు.. సభావేదిక ఏర్పాటు వరకు అధినేత ఆదేశాల మేరకు పని కానిచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు ఎల్కతుర్తి: సభకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ సీపీ సన్ప్రిత్సింగ్ ఇదివరకే సభా ప్రాంగణాన్ని పరిశీలించి నిర్వాహకులతో చర్చించారు. సభలో అవాంతరాలు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను నియమించారు. ఇద్దరు డీసీపీలు, మరో ఇద్దరు అడిషినల్ డీసీపీలు, ఎనిమిది మంది ఏసీపీలు, 28మంది సీఐలు, 66 మంది ఎస్సైలు, 137 మంది ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, 511మంది కానిస్టేబు ళ్లు, 200 మంది హోంగార్డులతోపాటు డిస్ట్రిక్గార్డ్స్.. మొత్తం 1,100 మంది కిపైగా పోలీసులను కేటాయించారు. హెలిపాడ్, సభాప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ క్రౌడ్ కంట్రోలింగ్ ప్రాంతాల్లో సేవలందించనున్నారు. -
ఉగ్రదాడులు అమానుషం
జనగామ రూరల్: పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి జనగామ కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఐక్యవేదిక ఆధ్వర్యాన శనివా రం పట్టణం పరిధి అంబేడ్కర్ నగర్లోని అంబేడ్క ర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పర్యాటకులపై ఉగ్రదాడులు అమానుష చర్య అని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవా లని కోరారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు జి.కృష్ణ, పానుగంటి రామమూర్తి, అయిలా సొమనర్సింహాచారి, అంబాల శివనాథ్గౌడ్, గొలుసుల నర్సయ్య, పెట్లోజు సోమేశ్వరాచారి, నక్క సురేష్, గడ్డం మనోజ్కుమార్, రమేశ్, మల్యాల జనార్ధనాచారి, చిలుమోజు సాయికిరణ్, రంగరాజు ప్రసాద్, రామచంద్రం, డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలనే నియమించాలి
● బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధయ్య జనగామ రూరల్: బీఆర్ఎస్, భారతీ య జనతా పార్టీలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలనే నియమించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధయ్య డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో పట్టణ అధ్యక్షుడు జాయ మల్లేష్ ఆధ్వర్యాన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ప్రజలకు ఆ రెండు పార్టీలు చేసిన అభివృద్ధి ఏమి లేదని, రాజ్యాధికారం రాకుండా నిలువరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని, గతంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని, పొరపాట్లను, నష్టాలను, తప్పుడు పాలసీలను ప్రజలకు తెలియ జేయాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉందన్నారు. దేశ జనాభాలో 56శాతం ఉన్న బీసీలను నిర్లక్ష్యం చేస్తూ రిజర్వేషన్లలో అన్యాయం చేసి అధికారంలోకి రాకుండా అడ్డుకున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్, రజక చైతన్య సంఘం జిల్లా నాయకుడు ఎదునూరి రవీందర్, కొలిపాక రాములు, కురుమ, యాదవ, కుమ్మరి, పద్మశాలి, బీసీ సంఘాల నాయకులు దేవర సత్యనారాయణ, చంద్ర శ్రీనివాస్, నాంపల్లి అశోక్, వల్లాల మల్లేశం, బత్తిని అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’పై అవగాహన అవసరం
జనగామ రూరల్: ‘భూ భారతి’ చట్టంపై రైతులకు అవగాహన అవసరమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం పట్టణంలోని గాయత్రి గార్డెన్లో ఈ చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహ న సదస్సులో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి మాట్లాడారు. ధరణిలో అప్పీల్ వ్యవస్థ లేక కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని, భూభారతి చట్టంలోని అప్పీల్ వ్యవస్థ ద్వారా జిల్లా పరిధిలోనే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ధరణిలో ప్రతీ దరఖాస్తు కలెక్టర్ వద్దకు వచ్చేదని, ఇప్పుడు అలా కాకుండా తహసీల్దార్, ఆర్డీఓ వద్దే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు. మే చివరి నాటికి ప్రతీ గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, విచారణ చేపట్టి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. సదస్సులో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ హుస్సేన్, రైతులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం జనగామ మండల పరిధి వడ్లకొండ, శామీర్పేట్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులకు విక్రయించి మోసపోవద్దని రైతులకు సూచించారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం పట్టణంలోని 14వ వార్డులో జరుగుతున్న అబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని వెరిఫికేషన్ టీంకు సూచించారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
జనగామ రూరల్: పెట్టుబడి దారులకు దేశ సంపదను దోచిపెడుతూ కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ పిలుపునిచ్చారు. అఖిలభారత కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో బీఆర్టీయూ అల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తోందన్నారు. సమావేశంలో ఆయా సంఘాల నాయకులు యాటాల సోమన్న, రాపర్తి రాజు, ఆకుల శ్రీనివాస్, మోటే, శ్రీశైలం, చుంచు విజేందర్, జేరిపోతుల కుమార్, ఎండీ అంజాద్ పాషా, రమాదేవి పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ -
శ్రీఽథమ్–25 వేడుకలు షురూ
హసన్పర్తి: నగర శివారులోని ఎస్సార్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సుమతిరెడ్డి మహిళా ఇంజనీరిగ్ కళాశాలలో ‘శ్రీథమ్–25’ వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి మాట్లాడారు. దేశ సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించాలన్నారు. క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని.. విద్యార్థినుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ మహేందర్, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ శ్రీవాణి, ఏఓ వేణుగోపాల్తో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు. -
రంగప్పచెరువులో వెంచర్ రాళ్ల తొలగింపు
● ‘సాక్షి’ కథనానికి స్పందన ● కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు జనగామ: జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న రంగప్ప చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో అక్రమంగా వేసిన వెంచర్(ప్లాట్లు) రాళ్లను అధికారులు శుక్రవారం తొలగించారు. ‘చెరువమ్మ.. కంట చెమ్మ’ శీర్షికన గత నెల 13న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పురపాలిక, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. రంగప్పచెరువు ఇప్పటికే 15 ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైనట్లు అంచనా వేశా రు. కబ్జా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొంతమంది పెద్ద మనుషులు ఇటీవల పాత ఇళ్లను కూల్చివేసిన మట్టితో చెరువును కప్పేస్తుండగా కాలనీ వాసులు అడ్డుకున్న విషయం తెలి సిందే. చెరువు కబ్జాపై కథనాలు ప్రచురించిన ‘సాక్షి’కి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. -
నిబంధనలు తూచ్..
‘ప్రభుత్వ నిబంధనలతో సంబంధం లేదు.. మేము నిర్ణయించిన ప్రకారమే కొనుగోలు చేస్తాం.. ధాన్యం లిఫ్టు అయ్యే వరకు గన్నీ బ్యాగులు ఇచ్చుడు లేదు’.. జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ నిర్వాహకుల తీరుతో ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. తేమ 17 శాతం వచ్చినా కొంటలేరు.. మద్దతు ధరకు అమ్ముకునేందుకు నాలుగు రోజుల కింద 200 బస్తాల వడ్లు ఇక్కడికి తెచ్చినం. నిలువ నీడ లేదు. కనీసం తాగడానికి నీళ్లు లేవు. ధాన్యంలో 17 శాతం తేమ వచ్చినా కొంట లేరు. సెంటర్ నిర్వాహకులు పొద్దున కాకుండా సాయంత్రం చూసి తేమ ఎక్కువ ఉందని అంటున్నారు.జనగామ: యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ శాఖలకు చెందిన దొడ్డు, సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు 276 ఏర్పాటు చేశా రు. పట్టణ పరిధి, జనగామ మండలంలోని రైతుల సౌకర్యార్థం వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో చీటకోడూరు ఐకేపీ సెంటర్ ప్రారంభించారు. అయితే లింగాలఘణపురం, రఘునాథపల్లి తదితర మండలాల నుంచి కూడా రైతులు ఇక్కడికి ధాన్యం తీసుకువస్తున్నారు. దీంతో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాటన్ యార్డులో 25వేల బస్తాలకు పైగా ధాన్యం నిల్వలు పేరుకు పోయాయి. కొనుగోళ్లలో జాప్యం కారణంగా ఐదు నుంచి 15 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. తేమ 17 శాతం ఉన్నా కొనుగోళ్లలో జాప్యం..! ప్రభుత్వం 17 శాతం తేమ ఉన్న ధాన్యం క్వింటాకు రూ.2,320 చొప్పున కొనుగోలు చేసేలా నిబంధనలు విధించింది. ఈ సెంటర్లో మాత్రం 16 శాతం తేమ ఉండాల్సిదేనని షరతులు పెడుతున్నారు. ఇదేంటని రైతులు అడిగితే అట్లయితెనే కొంటాం అంటూ బుకాయించడంతో రెండు రోజుల క్రితం నిర్వాహకులను నిలదీయడంతో.. సమస్య పైఅధి కారుల వరకు వెళ్లింది. అయినా వారి తీరు మారకపోవడంతో రోజుల తరబడి రైతులు ధాన్యం ఆరబోసుకుంటూ నిరీక్షిస్తున్నారు. ‘17 శాతం తేమ వచ్చినా కొనుగోలు చేయడంలేదు.. ఒక వేళ కొనుగోలు చేసినా.. నిల్వ ఉన్న బస్తాలు రైస్ మిల్లులకు తరలించే వరకు గన్నీ బ్యాగులు ఇవ్వడంలేదు’ అని పలువురు రైతులు వాపోయారు. ఇప్పటి వరకు ఈ సెంటర్లో 2,818 మంది రైతుల నుంచి 37,821 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా.. 36,421 బ్యాగుల ధాన్యం రైస్ మిల్లులకు తరలించారు.– ఎలబోయిన సమ్మక్క, మహిళా రైతు, చీటకోడూరు(జనగామ)15 రోజుల క్రితం ధాన్యం తెచ్చాం.. మద్దతు ధరకు అమ్ముకోవడానికి 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి 460 బస్తాల ధాన్యం తెచ్చాం. తేమ 16 శాతం ఉంటేనే కొంటామని నిర్వాహకులు మెలిక పెట్టారు. దీంతో చాలాసార్లు ఆరబోయగా తేమ 17 శాతం వచ్చింది. బైక్ పెట్రోలు, భోజనం, ఆరబోసేందుకు కూలీల ఖర్చు రోజుకు రూ.500 అవుతోంది. శుక్రవారం కొంటామని చెప్పిన నిర్వాహకులు.. ముందు కొన్న ధాన్యం లిఫ్టు అయ్యేవరకు గన్నీ బ్యాగులు ఇవ్వమన్నారు. – బండారు తిరుపతి, రైతు, చీటకోడూరుతేమ 17 కాదు.. 16 శాతం ఉంటేనే కొంటాం ఉన్న స్టాక్ తరలించాకే గన్నీ బ్యాగులిస్తామని మెలిక ఐకేపీ ధాన్యం సేకరణ కేంద్రంలో నిర్వాహకుల ఇష్టారాజ్యం రోజుల తరబడి రైతులకు తప్పని నిరీక్షణ -
చిన్న పిల్లల్లో హీట్ స్ట్రోక్
– డాక్టర్ సుధాకర్, పిడియాట్రిషన్ ఎంజీఎం : హీట్ స్ట్రోక్ (ఎండదెబ్బ) వల్ల ఎండాకాలంలో పిల్లలు బాగా ఇబ్బందులు పడుతుంటారు. ఎక్కువగా ఎండలో తిరిగేవారు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఇంటి ఆవరణలో ఎండలో, ఆట స్థలంలో తిరిగే పిల్లలకు ఎక్కువగా హీట్ స్ట్రోక్కు గురవుతారు. హీట్ స్ట్రోక్ లక్షణాలు.. ● శరీరం బాగా వేడెక్కడం. వాంతులు, విరోచనాలతో శరీరంలో నీటిశాతం పడిపోతుంది ● పిల్లలకు మూత్రం సరిగ్గా రాకపోవడం, ఎర్రగా రావడం. ఎండలో తిరిగే పిల్లలు తొందరగా అలిసిపోవడం, తలనొప్పి, శరీరంలో నొప్పులు, నరాల బలహీనత , తీవ్ర అస్వస్థతతో కోమాలోకి వెళ్తారు. ● పసిపిల్లలు డల్గా ఉంటారు. బరువు తగ్గడం, పాలు సరిగ్గా తాగకపోవడంలాంటి లక్షణాలు ఉంటాయి. ● అందుకే పిల్లలు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. ● పిల్లలు ఎక్కువగా నీళ్లు తాగాలి. ఓఆర్ఎస్ తాగించాలి. ● వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరింపజేయాలి. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
జనగామ రూరల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బి.ప్రతిమను శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా మార్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు.ప్రభుత్వం నుంచి వేతనాలు చెల్లించాలిలింగాలఘణపురం: తమ పేర్లు ఆన్లైన్లో నమోదు చేసి వేతనాలు ప్రభుత్వం నుంచి చెల్లించాలని నాన్ మల్టీపర్పస్ గ్రామ పంచాయ తీ సిబ్బంది హైదరాబాద్ ప్రజాభవన్లో శుక్ర వారం వినతి పత్రం అందజేశారు. మండల పరిధి 21 జీపీల్లో 102 మంది పంచాయతీ సిబ్బంది పని చేస్తుండగా అందులో 79 మంది ని మాత్రమే మల్టీపర్పస్ వర్కర్లుగా గుర్తించి ఆన్లైన్లో పేర్లు నమోదు చేసి ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తున్నారు. మిగిలిన 33 మంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో జీపీ తీర్మానం మేరకు విధుల్లోకి తీసుకున్న తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇట్టబోయిన మహేందర్, చింతల కనకరాజు, వెంకటేశ్, యాదగిరి, మల్లేశ్, నర్సయ్య తదితరులు ఉన్నారు.ఆర్టీసీ క్యూఆర్ కోడ్ కీ చెయిన్ల పంపిణీజనగామ: ఆర్టీసీ సేవలకు సంబంధించి కొత్తగా వినియోగంలోకి తెచ్చిన క్యూఆర్ కోడ్తో కూడి న కీచేయిన్లను జనగామ డిపో మేనేజర్ స్వాతి, ఆఫీస్ సూపరింటెండెంట్ యాదమణిరావు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవినాశ్ ఆధ్వర్యాన శుక్రవారం జిల్లా అధికారులకు అందజేశారు. స్కానర్ ఓపెన్ చేసి ఆర్టీసీ యాప్ల ద్వారా అందే సేవల గురించి వివరించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్, డీఆర్డీఓ వసంత, సీఐ దామోదర్రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ కరుణ పాల్గొన్నారు.పాకిస్తానీలపై ఎస్బీ ఆరాజనగామ: పహల్గాం టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్పై నిషేధాజ్ఞలు కొనసాగుతున్న తరుణంలో.. ఆ దేశానికి చెంది న వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అనే కోణంలో జిల్లా స్పెషల్ బ్రాంచ్ వర్గాలు శుక్రవారం ఆరా తీశాయి. పట్టణంతో పాటు ఆయా మండలాల పరిధిలో పోలీసులు, నిఘావర్గాలు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో పట్టణంలో ఇద్దరు పాకిస్తాన్కు చెందిన వారు ఉండగా.. గతంలోనే వెళ్లిపోయినట్లు తెలిసింది.మే 17న కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలుజనగామ రూరల్: జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మే 17న నిర్వహిస్తున్న ట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మెరుగు బాలరా జు ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి పదవులకు జరిగే ఈ ఎన్నికల కు రిటర్నింగ్ అధికారులుగా కాముని శ్రీనివాస్ బాబు, లగిశెట్టి కృష్ణమూర్తి వ్యవహరిస్తారని పేర్కొన్నారు. సూర్యాపేట రోడ్డులోని కెమిస్ట్ భవనంలో జరిగే ఈ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేఎన్ ఫార్మసీలో మే 15న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు స్వీకరిస్తారని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ 16న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఎన్నికలు 17న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని వివరించారు.మందుల కొరత ఉండొద్దు..జనగామ: ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్, రాష్ట్ర పారా మెడికల్ బోర్డు సెక్రెటరీ, టాస్క్ఫోర్స్ అధికారి బి.ప్రేమ్కుమార్ అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో శుక్రవారం ప్రేమ్కుమార్ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ బృదం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ముందుగా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, లింగాలఘణపురం, రఘునాథపల్లి పీహెచ్సీ, జనగామ అర్బన్ హెల్త్ సెంటర్లను తనిఖీ చేశారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్కు సరఫరా చేస్తున్న మందులు, నిల్వలను పరిశీలించారు. ప్రేమ్కుమార్ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ఈ–ఔషధి తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పారు. విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలో సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు డాక్టర్ సయ్యద్ అహ్మ ద్, డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్రా వు, ఉమ్మడి జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఇన్చార్జ్ భాస్కరరావు, జనగామ సీఎంఎస్ ఫార్మసీ అధికారి మల్లేశ్వరి, రాజేందర్, డాక్టర్లు శ్రీతేజ, అశోక్, కమలహాసన్ తదితరులు ఉన్నారు. -
సాహితీ యాత్రకు ఘన స్వాగతం
పాలకుర్తి టౌన్: పాలమూరు జిల్లా తెలుగు పండిత సమూహం ఆధ్వర్యాన చేపట్టిన ‘సాహితీ యాత్ర’కు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తక మండలి సభ్యుడు, కవి పండితుడు పల్లెర్ల రామమోహన్రావు నేతృత్వాన 23 మంది కవులు, పండితులు, ఉపాధ్యాయులు చేపట్టిన పాలకుర్తి సాహితీ యాత్ర–2025 శుక్రవారం ఇక్కడికి చేరుకుంది. సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, మార్గం లక్ష్మీనారాయణ, పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపకులు మన్యాపు భూజేంద్ స్వాగతం పలికారు. అనంతరం యాత్ర బృందం పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన జన్మస్థలాలు, సోమనాథుడి స్మారక కేంద్రం, సోతన దున్నిన పోలాలు, ఆయన తల్లి లక్కమాంబ పేరుమీద ఏర్పడిన లక్క సముద్రం చెరువును, గూడూరులో 900 సంవత్సరాల శాసనాన్ని, పాలకుర్తి సమీపాన వాల్మీకి మహర్షి నడయాడిన నేల వల్మిడిని సందర్శించారు. ఈ సందర్భంగా పాలమూరు కవులను సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, కట్ట గిరిజారమణ శర్మ, అనిత, సిద్ధాంతి రాజశేఖరశర్మ, తిరపతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ ఇంట్లో ఎర్త్ వైరింగ్ ఏర్పాటుచేసుకోవాలి
– కూరాకుల పాల్, ఎలక్ట్రీషియన్ నెహ్రూసెంటర్: ఇళ్లలో వినియోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వాడుకునే ఫ్రిజ్, టీవీ, ఏసీ, కూలర్, ఫ్యాన్, వంటి వాటిని పిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి. దీంతో పాటు వేసవిలో విద్యుత్ సరఫరా, అంతరాలు జరిగినప్పుడు, వడ గాలుల వల్ల విద్యుత్ వైర్లు తెగినప్పుడు వాటిని సరి చేసుకునే వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించొద్దు. సొంతంగా ఎలక్ట్రీషియన్ పనులు చేయవద్దు. అకాల వర్షాల కారణంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఎలక్ట్రానిక్ వస్తువులను కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించకూడదు. ఇంట్లో వస్తువులను ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా ఎర్త్ వైరింగ్ చేయాలి. చార్జింగ్ తీసిన తర్వాత ఫోన్ వినియోగించుకోవాలి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడితే మంచి క్వాలిటీ కలి గిన విద్యుత్ వైర్లను వినియోగించాలి. ఇంటి ఆవరణలో ఇనుప తీగలతో దండాలు కట్టుకోవద్దు. దీని వల్ల విద్యుత్ ప్ర మాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే మెకానిక్, ఎలక్ట్రీషియన్కు చూపించాలి. -
మలేరియా నిర్మూలనకు కృషి చేయాలి
జనగామ రూరల్: మలేరియా నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గ్రామ స్థాయిలో పరిసరాల పరిశుభ్ర త పాటించడంతోపాటు నీటి గుంతల నిర్వహణ, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ కంటేయినర్లు తదితరా లను ఇష్టానుసారంగా వేయకుండా ప్రజలకు వివరించాలని చెప్పారు. దోమ కాటు నుంచి రక్షణ, దోమలతో వచ్చే వ్యాధులకు సకాలంలో చికిత్స అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా మలేరియా నివారణకు కృషి చేసిన సిబ్బంది టి.రవీందర్, ఫీల్డ్ వర్కర్ ముస్తఫా, అలివేలు మంగ, యాదలక్ష్మి తది తరులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్ర మంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్, డాక్టర్ కమల్హాసన్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక వేగంగా చేపట్టాలి జనగామ రూరల్: నిబంధనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేంగంగా చేపట్టా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించా రు. ఈనెల 29లోగా వెరిఫికేషన్ పూర్తి చేసి మే 2న జీపీల్లో అర్హుల జాబితా ప్రదర్శించాలన్నారు. సమా వేశంలో స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపీరాం, హోసింగ్ పీడీ మాతృనాయక్, మున్సిప ల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
మిర్చి రైతులకు మెరుగైన ధర ఇవ్వాలి
● జేడీఎం ఉప్పుల శ్రీనివాస్ వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులకు నాణ్యత ప్రకారం మెరుగైన ధరల్ని ఇచ్చేందుకు వ్యాపారులు కృషి చేయాలని వరంగల్ జేడీఎం ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మార్కెట్ ప్రధాన కార్యాలయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, మిర్చి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో మిర్చి ధరలపై సుధీర్ఘంగా చర్చించారు. తేజ రకం మిర్చిని జిల్లాలోని రైతులు ఖమ్మం మార్కెట్కు తరలించడంపై అధికారులు స్పందించి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కొద్దిరోజులుగా తేజ రకం మిర్చి ధరలు వరంగల్, ఖమ్మం మార్కెట్లో వ్యత్యాసం ఎక్కువగా ఉందని, రైతుల నుంచి వచ్చిన ఆరోపణలను వ్యాపారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి నంబర్–1 క్వాలిటీ వెళ్తుందని, ఇక్కడికి 2, 3 రకం వస్తున్నందున ఈపరిస్థితులున్నట్లు వ్యాపారులు చెప్పారు. ఖమ్మం మార్కెట్ నుంచి తెచ్చిన షాంపిళ్లను వారి ముందు పెట్టి వరంగల్కు వచ్చిన మిర్చి ఒకేలా ఉన్నా ఎందుకు ధరల్లో వత్యాసం ఉందని ప్రశ్నించినట్లు తెలిసింది. దీనికి వ్యాపారులు ఘాటు తక్కువ ఉందని, కలర్ తక్కువ ఉందని వివిధ కారణాలు చెప్పినా.. అధికారులు సంతృప్తి చెందలేదని తెలిసింది. వరంగల్ మార్కెట్కు వచ్చే మిర్చికి నాణ్యతా ప్రమాణాల ప్రకారం.. మెరుగైన ధరలు చెల్లించేలా చాంబర్ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జేడీఎం సూచించారు. సోమవారం నుంచి ఈసమస్యను పరిష్కరించేందుకు సహకారం అందిస్తామని వ్యాపారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. సమావేశంలో మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి జి.రెడ్డి, చాంబర్ ప్రతినిధులు బొమ్మినేని రవీందర్రెడ్డి, వేద ప్రకాశ్, రాజు కరాణి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావొద్దు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: రైతుల నుంచి సేకరించే ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావొద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి ఆర్డీఓలు, డీఆర్డీఓ, సివిల్ సప్లయ్ అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు తేమ శాతం రాగానే ధాన్యం కొనుగోలు చేసి మిల్లుకు తరలించాలని, తేమ 17 శాతం వచ్చి ధాన్యం కొనుగోలు చేయని, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఓపీఎంఎస్లో నమోదు చేయకపోయినా చర్యలు తప్పవన్నారు. అలాగే కొనుగోలు ప్రక్రియకు సంబంధించి రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలని చెప్పారు. ఎండల తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బైక్ నడుపుతుండగానే మంటలుజనగామ: జనగామ జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్రోడ్డున పోలీస్టేషన్కు కూతవేటు దూరంలో నడుపుతున్న బైక్ నుంచి మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం జరిగింది. సూర్యపేటరోడ్డుకు చెందిన ఓ వ్యక్తి బైక్పై రైల్వేస్టేషన్కు వెళ్లే సమయంలో రన్నింగ్లోనే పెట్రోలు ట్యాంకు నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో సదరు వ్యక్తి బైక్ను వదిలి పక్కకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికులు వెంటనే బకెట్లలో నీటిని తీసుకువచ్చి మంటలు ఆర్పేయగా, అప్పటికే సగం కాలిపోయింది. ఈ ఘటన ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి జనగామ రూరల్: జాతీయ రహదారి – 365బి నిర్మాణంలో ప్లాటు కోల్పోతున్న నిర్వాసితులకు సర్వే రిపోర్టు ప్రకటించి గజానికి రూ.15 వేలు పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ చట్టం మేరకు సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, నిర్వాసితులు వేమునూరు రాజేంద్రప్రసాద్, గూడెల్లి కృష్ణారెడ్డి, బిర్రు స్వప్న, గంగుల భూపాల్ రెడ్డి, ఉప్పరి విజయ్, గంగుల అనంతరెడ్డి, గంగుల తిరుపతిరెడ్డి, బి.విశ్వనాథం, నల్ల యాదగిరి, ఎండీ.సలీం, శ్రీనివాస్, రాజశేఖర్, ఎం.చంద్రారెడ్డి, పి.శ్రీలత, బి.చంద్రయ్య, నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
పర్యావరణ ప్రేమికుడు ‘అంజి’
‘మొక్కలు నాటి సంరక్షించుకుందాం.. కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం’ అనే నినాదంతో మహబూబాబాద్ జిల్లా ఈదులపూసపల్లి శివారు దర్గాతండాకు చెందిన ఆటో డ్రైవర్ భూక్యా అంజి పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాడు. అంజి ఓ వైపు ఆటో నడుపుతూ.. మరో వైపు వ్యవసాయం ఆధారంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోడ్డుపక్కన ఎండుతున్న మొక్కలు, ఎడారిగా మారుతున్న ఆటవీ ప్రాంతాలను చూసి చలించిపోయిన అతను పచ్చదనంపై ప్రజల్లో అవగాహన పెంచాలనే ఆలోచనతో తన ఆటోకు వివిధ రకాల మొక్కలను ఏర్పాటు చేసుకుని బయలుదేరాడు. శుక్రవారం జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో అంజిని ‘సాక్షి’ పలకరించగా.. ‘ప్రకృతిని నాశనం చేస్తున్నారు.. ఏళ్ల నాటి మహావృక్షాలు నేలకొరిగి పోతున్నాయి.. మొక్కలు నాటడం తప్ప సంరక్షించడంలేదు’.. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. – జనగామ -
మూగజీవాలకు తాగునీరు అందిద్దాం
– నాగ ప్రసాద్, పశువైద్యాధికారి, బచ్చన్నపేట జనగామ: వేసవి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరిగాయి. ఎక్కడా కుళాయిలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రభుత్వంతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలి. కుక్కలు, పక్షులు గొంతెండి మృత్యువాత పడకుండా ఇంటి ఆవరణ, భవనాల ముందు, ప్రధాన కూడళ్లలో నీటితొట్లు ఏర్పాటు చేసి ఎప్పుడూ తాగునీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పక్షులకు ఇంటిదాబా పైన తొట్టిలాంటి మట్టిపాత్రలు ఉంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నీటిని పోస్తూ ఉండాలి. వాటికి దాహం వేసిన సమయంలో అలవాటుగా రోజూ అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటాయి. వరంగల్ మహానగరంలో అయితే బల్దియా ఆధ్వర్యంలో సుమారు 300 చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగే అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో ఏర్పాటుచేస్తే మంచిది. గ్రామాల్లో రోడ్ల వెంట గతంలో నీటితొట్లు ఏర్పాటుచేశారు. వాటిని శుభ్రం చేసి గ్రామ పంచాయతీవారు నీటిని నింపి పెట్టాలి. -
దేశం.. ఎల్కతుర్తి వైపు చూస్తోంది
ఎల్కతుర్తి: దేశం.. ఎల్కతుర్తి వైపు చూస్తోందని, ఈనెల 27న పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ రాజకీయ పార్టీ సమావేశం కాదని, రాష్ట్ర ప్రజలందరి పండుగ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు చింతలపల్లి సమీపంలో రజతోత్సవ సభ ఏర్పాట్లను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి సభ ఏర్పాట్లు పరిశీలించారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 50 వేల మంది తరలివస్తారని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వెల్లడించారు. పరిశీలించిన వారిలో పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు పేర్యాల రవీందర్రావు ఉన్నారు. నేతల తాకిడి.. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నేతలు పరిశీలించారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాజ్యాసభ సభ్యులు మద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, ఉమ్మడి ఖమ్మం నుంచి రేగా కాంతారావు, హరిప్రియ, కామారెడ్డి నుంచి జాజుల సురేందర్ తదితర నేతలు సభాస్థలికి రాగా వారికి ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితెల సతీశ్కుమార్, నాగుర్ల వెంకన్న ఏనుగుల రాకేశ్రెడ్డి తదితరులు సభా ప్రాంగణంలో ఏర్పాట్ల గురించి తెలిపారు. వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలను చూపించారు. దండులా కదిలిరావాలి.. రజతోత్సవ సభకు ప్రజలు దండులా కదిలి రావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాకు కేటాయించిన పార్కింగ్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభాస్థలి పరిశీలన -
కలిసికట్టుగా ముందుకు సాగుదాం
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బచ్చన్నపేట : నియోజకవర్గ అభవృద్ధికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ ముందస్తు ప్రణాళిక వేసుకుందామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతోందని, ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో గురువారం మండల కేంద్రంలోని శ్రీనిధి గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రజతోత్సవ సభకు ప్రజలను సమాయత్తం చేయాలని, గ్రామానికో వాహనాన్ని పంపించడంతో పాటు ఇన్చార్జ్లను నియమించాలని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీ ఎస్ చైర్మన్ పులిగిళ్ల పూర్ణచందర్, నాయకులు ఇర్రి రమణారెడ్డి, బొడిగం చెంద్రారెడ్డి, గంగం సతీష్రె డ్డి, బావండ్ల కృష్ణంరాజు, మద్దికుంట రాధ, కొండి వెంకట్రెడ్డి, చల్ల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
డీసీసీలకు కొత్త సారథులు
‘స్థానికం’ కంటే ముందే సంస్థాగతం.. దృష్టి సారించిన అధిష్టానం సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంస్థాగత కమిటీలపై దృష్టి సారించింది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. అంతకుముందే సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 20వ తేదీలోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీ కమిటీలు వేసేందుకు జిల్లాకు ఇద్దరు చొప్పున టీపీసీసీ పరిశీలకులను నియమించింది. ఇందులో ప్రస్తుత డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కూడా ఉండగా.. ఒక జిల్లాకు చెందిన వారిని మరో జిల్లాకు నియమించారు. కాగా, మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి కావాలన్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పరిశీలకులు పని మొదలు పెట్టారు. నేటి(శుక్రవారం)నుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలకు శ్రీకారం చుట్టనుండగా.. ఇదే సమయంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారు మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు. మే 20 టార్గెట్గా సమావేశాలు.. జిల్లా కమిటీ అధ్యక్షులుగా సీనియర్లను ఎంపిక చేసేందుకు టీపీసీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఇద్దరు నాయకుల చొప్పున పరిశీలకులను బుధవారం నియమించింది. ఈ క్రమంలో ఇతర జిల్లాలకు చెందిన 12 మందిని ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు.. ఈ ఆరు జిల్లాలకు చెందిన పలువురు సీనియర్లను ఇతర జిల్లాలకు పరిశీలకులుగా నియమించారు. జనగామ జిల్లాకు అద్దంకి దయాకర్, లింగంయాదవ్, మహబూబాబాద్కు పొట్ల నాగేశ్వర్రావు, కూచన రవళిరెడ్డి, హనుమకొండకు కె.వినయ్కుమార్ రెడ్డి, ఎండీ.అహ్మద్, వరంగల్కు అమీర్ అలీఖాన్, ఎం.రవిచంద్ర, జయశంకర్ భూపాలపల్లికి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, లింగాజీ, ములుగుకు కొండేటి మల్లయ్య, కై లాష్లు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. శుక్రవారంనుంచి ఈ నెల 30 వరకు జిల్లాస్థాయి, మే 4–10 వరకు శాసనసభ స్థాయి, మే 13 నుంచి మండల స్థాయి సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వచ్చే నెల 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగేలా పరిశీలకులు చూడాల్సి ఉంది. డీసీసీ పీఠం కోసం పోటాపోటీ.. ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న డీసీసీలకు ముహూర్తం ఖరారు కావడంతో ఆశావహులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న వారిలో ఎందరినీ మళ్లీ కొనసాగిస్తారు? ఎక్కడెక్కడ కొత్తవారికి అవకాశం కల్పిస్తారు? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆరు జిల్లాలనుంచి కొత్తగా ఆశిస్తున్న 24 మంది పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ● హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్ (బట్టి శ్రీనివాస్), ఈవీ శ్రీనివాస్ రావు, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాష్రెడ్డి ఎవరిని ప్రతిపాదిస్తారన్న చర్చ జరుగుతోంది. ● వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగిస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్న చర్చ జరుగుతుండగా.. ఇక్కడినుంచి ప్రధానంగా నలుగురి పేర్లు వినిపిస్తున్నాయి. గోపాల నవీన్ రాజ్, నమిండ్ల శ్రీనివాస్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కూచన రవళి రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు అయిత ప్రకాష్రెడ్డి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తుండడంతో ఇక్కడ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది. మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు వినిపిస్తుండగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రతిపాదించిన వారికి పీఠం దక్కనుంది. ● మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, ఇక్కడ కొత్తవారిని నియమించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక్కడినుంచి అధిష్టానం దృష్టికి ఐదుగురి పేర్లు వెళ్లినట్లు చెబుతున్నారు. హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి, మాన్సానిపల్లి లింగాజీల పేర్లు ప్రచారంలో ఉండగా.. ఇక్కడి ఎంపికలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డిలు కీలకం కానున్నారు. ● ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోకే ఖాయమన్న ప్రచారం ఉంది. ఒకవేళ ఆయనను తప్పిస్తే మంత్రి ధనసరి అనసూయ సీతక్క కుమారుడు సూర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ● మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తు తం ఉన్న జె.భరత్చంద్రా రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడినుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాథ కూడా ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే డోర్నకల్, మహబూబా బాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్లతోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. ?? వచ్చే నెల 20 నాటికి జిల్లా కమిటీలు.. పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆదేశం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలకు కొత్త అధ్యక్షులు నేటినుంచి జిల్లాల్లో డీసీసీ సమావేశాలు... ఆరు జిల్లాలనుంచి టీపీసీసీ దృష్టికి కొత్తగా 20 మంది పేర్లు అధ్యక్ష పదవి కోసం పావులు కదుపుతున్న ఆశావహులు -
సర్కారు స్కూళ్లలోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్
జనగామ రూరల్: సర్కారు స్కూళ్లలోనే విద్యార్థుల కు బంగారు భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలి తాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన కొడకండ్ల టీజీఆర్ఎస్–జేసీ విద్యార్థినులను గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ఫలితాలు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షల్లో విద్యార్థినులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ తమ్మి దిలీప్కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
పేదల కడుపు నింపడమే ధ్యేయం
జఫర్గఢ్: పేదల కడుపు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకం అమలు చేస్తోంద ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రేగడితండాలోని బానోత్ కిషన్నాయక్ ఇంట్లో కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలసి ఎమ్మెల్యే సన్న బియ్యంతో వండిన భోజనాన్ని గురువారం వారి కుటుంబ సభ్యులతో భుజించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ధనికులు తినే సన్న బియ్యాన్ని పేదలకు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందన్నారు. అనంతరం అల్వార్బండతండాలో ఈనెల 16న సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేసిన శిలాఫలాకాన్ని కలెక్టర్తో కలసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి రాధాకిషన్, తహసీల్దార్ శంకరయ్య, ఎంపీడీఓ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ట్రేడ్ లైసెన్స్ పొందాకే వ్యాపారం చేయాలి
అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ జనగామ: ట్రేడ్ లైసెన్స్ పొందిన తర్వాతే వ్యాపారస్తులు బిజినెస్ నిర్వహించాలని అదన పు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. గురువారం జనగామ మున్సిపాలిటీ పరిధిలోని పలు దుకాణాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన మహేంద్ర షోరూంకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్ తదితర నిబంధనల వివరాలు సేకరించారు. ఓ షోరూం కొలతలను లెక్కించి ఫీజుకు సంబంధించి ఫైనల్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే కాలపరిమితి ముగిసిన వాణిజ్య లైసెన్స్లను వెంటనే పునరుద్ధరించు కోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో నివాసానికి అనుకూలంగా లేని, శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించా లని పేర్కొన్నారు. తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి న్యాయవాదుల నిరసనజనగామ రూరల్: పహల్గాం ఘటనకు నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దండెబోయిన హరిప్రసాద్యాదవ్ ఆధ్వర్యాన గురువారం న్యాయవాదులు నిధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చౌరస్తాలో హరిప్రసాద్ మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్లో శాంతి వాతావరణం ఏర్పడి అభివృద్ధి చెందుతుంటే టెర్రరిస్టులు కేవలం హిందువుల ను టార్గెట్ చేసి అతి కిరాతకంగా కాల్చిచంపడం దారుణమన్నారు. ఉగ్రవాదుల చర్యలను కేంద్రం తుదముట్టించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ప్రసాద్రావు, సుదీరంజన్, రాంగోపాల్, శ్రీరాం శ్రీనివాస్, ఇంగి అశోక్, రామకృష్ణ, సునీతరాణి, ఉపేంద ర్, చందు, గాజుల రవీందర్ పాల్గొన్నారు. టెక్స్టైల్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులు.. జనగామ రూరల్: హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ మూడేళ్ల కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి పి.చౌడేశ్వరీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్ సబ్జెక్టుగా పదో తరగతి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై, వయసు 15–23 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలు 15–25 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో 10+2 పరీక్షలో ఉత్తీర్ణులైన వారు లేదా ఒకేషనల్ విభాగంలో 10+2 పరీక్ష పూర్తి చేసినవారు రెండో సంవత్సరంలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ, ఫస్ట్ ఫ్లోర్, రైట్ వింగ్, పీఎస్ఆర్ తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్– 500004 చిరునామాకు పోస్టు ద్వారా మే 15వ తేదీ లోగా చేరేలా పంపించాలన్నారు. మరిన్ని వివరాలకు హిమజాకుమార్ను 9030079242 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సాహితీ యాత్రకు ఘనస్వాగతం జనగామ రూరల్: తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి క్షేత్రాన్ని, పోతన జన్మస్థలమైన బొమ్మెర గ్రామాన్ని సందర్శించేందుకు పాలమూరు నుంచి పాలకుర్తి వెళ్తున్న 24 మంది సాహితీమూర్తులు, పండితులు, కవులు, రచయితలకు కలెక్టరేట్ వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యాన కవులు కళాకారులుగురువారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాహితీ యాత్రలో పాల్గొన్న పలువురు కవులు మాట్లాడుతూ గొప్ప కవులు జన్మించిన నేల.. చైతన్య పురిటిగడ్డ జనగామ అని పేర్కొన్నారు. ఈ యాత్రలో సాహితీవేత్త, కవి డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, తెలుగు భాషా ఉపాధ్యాయుడు పల్లెర్ల రామ్మోహనరావు, కవులు సిద్ధాంతి రాజశేఖరశర్మ, బలరాంగౌడ్, గిరిజారమణ, అనితకుమారి, నీరజ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన ఆర్టీసీ బస్సుల అద్దె
జనగామ: ఆర్టీసీ బస్సుల అద్దె(కిలోమీటర్ చార్జీలు) తగ్గిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో వివాహాది శుభకార్యాల సమయంలో సామా న్య, పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. ప్రైవేట్ నుంచి పోటీని తట్టుకుని మార్కెట్లో నిలదొక్కుకునేందుకు సంస్థ ఈ చర్యలు చేపట్టింది. జనగామ డిపో పరిధిలో 42 రూట్ల లో రోజువారీగా ప్రయాణికులకు సేవలందిస్తూనే వివాహాది శుభకార్యాలు, విహార యాత్రలకు బస్సులను అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని గడిస్తోంది. ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోండి శుభకార్యాలు, విహార యాత్రలకు ఆర్టీసీ బస్సుల అద్దె సేవలను సద్వినియోగం చేసుకోవాలి. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులకు గతంలో ఉన్న కిలోమీటరు చార్జీల్లో కొంత తగ్గించాం. విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. సురక్షిత ప్రయాణం, క్షేమంగా గమ్యానికి చేర్చడం మా లక్ష్యం. – స్వాతి, జనగామ డిపో మేనేజర్ఆర్టీసీ బస్సుల అద్దె చార్జీలు (కిలో మీటరుకు) బస్సు కేటగిరీలు సీట్లు గతంలో ప్రస్తుతం పల్లె వెలుగు 55 రూ.68 రూ.57 పల్లె వెలుగు 59 రూ.69 రూ.61 ఎక్స్ప్రెస్ 50 రూ.69 రూ.62 ఎక్స్ప్రెస్ 55 రూ.69 రూ.68 డీలక్స్ 40 రూ.65 రూ.57 -
తీవ్రవాదాన్ని తుదముట్టించాలి
జనగామ: ‘పహల్గాం’ ఘటనలు పునరావృతం కావొద్దు.. అమాయకులను పొట్టనపెట్టుకున్న టెర్రరిస్టులను వదిలిపెట్టొద్దు.. తీవ్రవాదాన్ని తుదముట్టించాలని డిమాండ్ చేస్తూ టీఎస్యూ టీఎఫ్, ముస్లింలు, ఐఎంఏ(వైద్యులు) ఆధ్వర్యాన గురువా రం రాత్రి జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. నెహ్రూపార్కు నుంచి ఆర్టీసీ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కశ్మీర్ దుర్ఘట నను ముస్లింలు ముక్తకంఠంతో ఖండించారు. పర్యాటకులే లక్ష్యంగా అమాయకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని అన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రావు, ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, కృష్ణ, కనకయ్య, ఆగయ్య, ముస్లిం ప్రతినిధులు అడ్వకేట్ జమాల్ షరీఫ్, మహమ్మద్ అబ్దుల్ఖాదర్, మసిఉర్ రెహమాన్, ఎండీ.జావీద్, ఎండీ.బాసిత్, ఎండీ రషీన్, ఎండీ.షకీల్, రషీద్, అంకుశావలి, తహసీన్ సికిందర్, గులాం, సలీం, బాబా, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్లు బాలాజీ, రాజమౌళి, శ్రీకాంత్, కల్నల్ భిక్షపతి, శ్రీనివాస్, రజిని, స్వప్న తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్, ముస్లింలు, ఐఎంఏ ఆధ్వర్యాన కొవ్వొతుల ర్యాలీ -
హజ్ యాత్రికులు ఆరోగ్య సూత్రాలు పాటించాలి
జనగామ: హజ్ యాత్రికులు ఆరోగ్య సూత్రాలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు అన్నారు. అర్బన్ పీహెచ్సీలో వైద్యారోగ్య శాఖ, హజ్ సొసైటీ ఆధ్వర్యాన గురువారం సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు జహీరుద్దీన్ అధ్యక్షతన హజ్ యాత్రికులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీకా శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మక్కా వాతావరణం అత్యంత వేడిగా ఉండడంతో యాత్రికులు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకుంటూ.. జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శ్వాస కోశ వ్యాధులు రాకుండా మాస్కులు ధరించి అంటు వ్యాధుల బారిన పడకుండా చేతులను శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు సమయానికి మందులు వేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి హజ్యాత్రకు వెళ్లే ముగ్గురు యాత్రికులకు టీకాలు వేసి ఐడీ కార్డులు అందజేశారు. కార్యక్రమంలో జనగామ హజ్ కమిటీ అధ్యక్షుడు ముజ్తహిదొద్దీన్, కార్యదర్శి జహీరుద్దీన్, డాక్టర్ శ్రీతేజ, డాక్టర్ ఇంజమామ్అలీ, రిటైర్డ్ సీహెచ్ఓ రెహమాన్, సీహెచ్ఓ జయపాల్రెడ్డి, ఎంపీహెచ్ఈఓ ప్రభాకర్, మేరాజ్ ఉర్రెహ్మాన్, మసిఉ ర్ రెహాన్జాకీర్, హఫీజ్, జలీల్, ఖలీముద్దీన్, నూరుద్దీన్, రషీదా పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు -
గ్రాఫ్ పడిపోతోంది
జనగామ: ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యావ్యస్థపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారుతోంది. 2022 నుంచి నేటి వరకు ఉత్తీర్ణత శాతం పడిపోవడమే ఇందుకు నిదర్శనం. తరగతి గదిలో అధ్యాపకులు చెప్పే బోధన అర్థం కావడం లేదా.. లేక విద్యార్థుల్లోనే లోపం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా పదో తరగతి వార్షిక పరీక్షల సమయంలో మూడు నెలల ముందుగానే ప్రత్యేక తరగతులతో సన్నద్ధం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇంటర్ మీడియట్కు వచ్చే సరికి విద్యార్థులను పట్టించుకోవడంలేదు. ఫలితంగా కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడంతో అంతా ప్రైవేట్ వైపు వెళ్తున్నారు. తగ్గుతున్న ఉత్తీర్ణత శాతం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల కళాశాలలు 57 ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా ప్రభుత్వ ఇంట ర్ మీడియట్ కాలేజీల పరిధిలో ఈసారి ఆశించిన ఉత్తీర్ణత శాతం నమోదు కాలేదు. ఏడు జూనియర్ కాలేజీలు, ఎంజేపీ, సోషల్ వెల్ఫేర్, మోడల్, మైనా ర్టీ కాలేజీల పరిధిలో ఫస్టియర్, సెకండియర్, ఒకేషనల్(ప్రైవేట్) విభాగంలో 7,924 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,450 మంది ఉత్తీర్ణత(64.35 శాతం) సాధించినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 5 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఫస్టియర్లో 298 మంది విద్యార్థులకు 148 మంది (49.66శాతం), సెకండియర్లో 293 మందికి 202 మంది ఉత్తీర్ణత(68.94శాతం) సాధించారు. ఇక ఎంజేపీ గురుకులాల విషయానికి వస్తే అత్యుత్తమంగా 89.8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూనియర్ కళశాలల్లో మాత్రం ఉత్తీర్ణత దారుణంగా పడిపోయింది. ఫస్టియర్లో జఫర్గఢ్ 17.5 శాతం, సెకండియర్ 23.97 శాతం, స్టేషన్ఘన్పూర్ ఫస్టియర్ 11.24, సెకండియర్ 25.79, జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్టియర్ 19.35, సెకండియర్ 20.95 శాతం పాస్ అయ్యారు. ఇదిలా ఉండగా.. 2022లో 77.93, 2023లో 63.70, 202 4లో 62.44, 2025లో 64.35శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో గడిచిన మూడేళ్ల ఫలితాలను పరిశీలిస్తే.. జూని యర్ కళాశాలల ప్రగతి ఒక్కోమెట్టు పడిపోతున్న విషయం అర్థమవుతోంది. 2025–26 విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.జిల్లాలో గడిచిన నాలుగేళ్లుగా నమోదైన ఇంటర్ ఫలితాల వివరాలు(శాతంలో..)77.9364.3562.44 63.70 2022 2023 2024 2025 2022 నుంచి తగ్గుతున్న ఇంటర్ ఉత్తీర్ణత శాతం విద్యాబోధనపై కొరవడిన పర్యవేక్షణ -
ప్రధాన న్యాయమూర్తిగా ప్రతిమ బాధ్యతల స్వీకరణ
జనగామ రూరల్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా డి.ప్రతిమ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగామలో పనిచేసిన డి.రవీంద్రశర్మ హైకోర్టుకు బదిలీ కాగా కరీంనగర్ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న ప్రతిమ ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జిలు సి.విక్రమ్, సుచరిత, జూనియర్ సివిల్ జడ్జిలు జి.శశి, కె.సందీప జిల్లా కోర్టులో ఆమెకు మొక్క అందజేసి స్వాగతం పలికారు. జనగా మ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.హరిప్రసాద్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇమ్యునైజేషన్ లక్ష్యం చేరుకోవాలిజనగామ: జిల్లాలో ఇమ్యునైజేషన్ నూరుశాతం లక్ష్యం చేరుకోవాలి.. ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు అన్నారు. ఆరోగ్య కార్యాక్రమాలపై బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు, వైద్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇమ్యునైజేషన్ సెషన్లు, ఆరోగ్య సూచిక డేటాలను ఎప్పటికప్పుడు యూ–విన్, ఎంసీహెచ్ కిట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. శశక్త్ పోర్టల్లో ఏబీహెచ్ఏ ఐడీ లింకేజీ వందశాతం నమోదు చేయాలని సూచించారు. పీహెచ్సీల్లో కల్పించే సదుపాయాలను మహిళలకు వివరించి డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పా రు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్ల శాతంలో 3, 4వ చెకప్ ల ఫాలోఅప్లు పెంచడానికి వైద్య సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ముఖ్యంగా గర్భస్రావ మరణాలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అనంతరం కుక్క, పాము కాటుకు గురైన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య సహాయం తదితర వివరాలతో రూపొందించిన పోస్టర్ ఆవిష్కరించారు. పనుల్లో వేగం పెంచండిజనగామ: పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల ను పరిశీలించారు. రంగప్పచెరువు నుంచి హైదరాబాద్ ప్రధాన రహదారి మీదుగా గార్లకుంటకు వరద నీటిని మళ్లించేందుకు సెయింట్ మేరీస్ స్కూల్కు వెళ్లే దారిలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అప్పటి వరకు ప్రధాన హైవేపై వన్వే రాక పోకలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దయా నిలయం ఏరియాలో నిర్మాణం చేపట్టిన వెజ్, నాన్ వెజ్ మోడల్ మార్కెట్ పనులను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్కుమార్, ఏఈ మహిపాల్ పాల్గొన్నారు. టీపీసీసీ జిల్లా అబ్జర్వర్లుగా అద్దంకి, బైకిని..జనగామ: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా అబ్జర్వర్ల ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రతినిధి, తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్.. జిల్లాకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బైకిని లింగంయాదవ్లను అబ్జర్వర్లుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధి ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ లోని అన్ని కేడర్లు, అనుబంధ సంఘాలు, ప్రజాప్రతినిధులు, మాజీలు ఇలా ప్రతి ఒక్కరి నీ అబ్జర్వర్లు సమన్వయం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా జనగామకు చెంది న ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతి యాదాద్రి భువనగిరి జిల్లా అబ్జర్వర్గా నియమితులయ్యారు. ఉద్యోగుల సమస్యలపై సంఘటిత పోరాటంబచ్చన్నపేట : జీపీ ఉద్యోగులు ఎదుర్కొంటు న్న సమస్యలపై సంఘటితంగా పోరాడుతామ ని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ అన్నారు. బుధవా రం స్థానిక జీపీ కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ఉద్యోగ కార్మికులు ఏకం కావాలన్నారు. తేలుకంటి మురళి, కొమురెళ్లి శ్రీనివాస్, కాళ్ల ప్రభాకర్, గొల్లపల్లి బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.