breaking news
Jangaon
-
ఆర్అండ్బీ ఈఈగా బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ జిల్లా రోడ్లు, భవనాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా స్వరూపారాణి మంగళవారం పదవీబాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఈఈ కలెక్టర్ రిజ్వాన్బాషాను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. పశు సంరక్షణపై అవగాహన కల్పించాలి జనగామ రూరల్: విద్యార్థులకు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ పశు సంరక్షణ, పోషణపై అవగాహన కల్పించాలని గో సేవా విభాగం తెలంగాణ ప్రశిక్షణ ప్రముఖ్ డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో హిందూ సంస్థల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, మాధవరెడ్డి, ముక్క స్వామి, చిక్కుడు నగేష్, సత్యం, అంచూరి రమేష్, కృష్ణమూర్తి, రాంబాబు, భజరంగ్ దళ్ నగర కన్వీనర్ యామంకి రాఖేష్ తదితరులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి లింగాలఘణపురం: జీవితాలను నాశనం చేసే మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. మానసిక, శారీరక ఆరోగ్యాలపై ఏ విధంగా ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ సీతారామరాజు, ప్రిన్సిపాల్ సునీత, పారా లీగల్ వలంటీర్లు రవీందర్, జితేందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీసిన ప్రభుత్వం చిల్పూరు: ప్రభుత్వం పెన్షనర్లపై మొండి వైఖరిని కొనసాగిస్తూ వారి మనోభావాలను దెబ్బతీశారని పెన్షనర్ల సాధన పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. మండలకేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెన్షనర్లకు 15 నెలలుగా రావాల్సిన బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కొందరు సంఘం నాయకులు ఒక తప్పుడు సమాచారాన్ని సీఎంకు చేరవేయడంతోనే ఇలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచించి పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం జనగామ రూరల్: పెంబర్తి మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్ పోస్టుకు సంబంధిత పీజీ సబ్జెక్టులో 55శాతం ఉత్తీర్ణత, బోధనలో అనుభవం, యూజీసీ నెట్, సెట్, పీహెచ్డీ అర్హత గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటు ందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 4వ తేదీలోపు కళాశాలలో నేరుగా దరఖాస్తు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 70133 10928 నంబర్లో సంప్రదించాలన్నారు. -
జిల్లాలో 26.3 మిల్లీమీటర్ల వర్షం
జనగామ: జిల్లాలో గత నెల 31వ తేదీ నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షం పత్తి, వరి పంటలకు ఊపిరిపోసింది. మృగశిర కార్తె ప్రారంభమైన తర్వాత చినుకు జాడ లేకపోవడంతో పత్తి విత్తులు నేలలోనే మురికి పోగా, నారు, నాట్లు వేసిన మళ్లు పగుళ్లు పట్టే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైయింది. ఈ పరిస్థితుల్లో వరణుడి కరుణతో కొంత మేలు జరిగింది. జిల్లాలో మంగళవారం నాటికి 26.3 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షంతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకోగా, రైతులు విత్తనాల కొనుగోలుకు జనగామ బాట పట్టారు.మండలాల వారీగా వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో)మండలం వర్షపాతం బచ్చన్నపేట 48.0 జనగామ 45.5 లింగాలఘణపురం 42.5 దేవరుప్పుల 42.3 కొడకండ్ల 35.0 పాలకుర్తి 25.5 తరిగొప్పుల 23.3 నర్మెట 23.3 జఫర్గఢ్ 21.3 స్టేషన్ఘన్పూర్ 19.5 రఘునాథపల్లి 14.3 చిల్పూరు 10.3 -
సమాజ హితమే వైద్యుల ధ్యేయం
జనగామ: సమాజ హితమే ధ్యేయంగా వైద్యులు పని చేస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో మంగళవారం డాక్టర్స్ డేను పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనగామ బ్రాంచ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు రక్తదానం మరొకరికి ప్రాణం పోస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో ఐఎంఏ సహకారం అందించాలన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు మాట్లాడుతూ ఐఎంఏ ఆధ్వర్యంలో జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అ భినందనీయమన్నారు. సీనియర్ డాక్టర్ డి.లవకుమార్రెడ్డి, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.కరుణాకర్రాజు, వైద్యులు అన్వర్, ఏ.శ్రీనివాస్, కన్న పరశురాములు, కల్నల్ మాచర్ల భిక్షపతి, కృష్ణ జీవన్ బజాజ్, కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధి దేవరాజ్, డాక్టర్ సీహెచ్.రాజమౌళి, కృష్ణ, వెంకటేశ్వర్లు, కనకరాజు, తదితతరులు పాల్గొన్నారు. పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ జనగామ రూరల్/లింగాలఘణపురం: జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యక్రమం కింద మంగళవారం తమిళనాడు నుంచి సర్పంచ్లు, బ్లాక్ ప్రెసిడెంట్, అధికారులు జిల్లాకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో డీపీ ఓ స్వరూప ఆధ్వర్యంలో తడి పొడి చెత్త, పారిశుద్ధ్య నిర్వహణ, నర్సరీలో మొక్కల పెంపకం గురించి వివరించారు. అనంతరం జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, తడి పొడిచెత్త నిర్వహణ ద్వారా వస్తున్న ఆదాయం, నర్సరీలో మొక్కల పెంపకం, భూగర్భ జలాల పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం, పంటల సాగు, శానిటేషన్ నిర్వహణతో సీజనల్ వ్యాధులను అరికడుతున్న తీరును సర్పంచ్ బృందానికి వివరించారు. డాక్టర్స్డేలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
చెత్త కంపు
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuఇది రోడ్డేనా...? గిర్నిగడ్డ ప్రాంతంలో రోడ్లన్నీ చెత్తతో అపరిశుభ్రంగా మారిపోయాయి. రోజు వారి చెత్త సేకరణలో జాప్యం జరుగుతుండడంతో రహదారిపై చెత్త పేరుకుపోతుంది.నాలా పక్కనే చెత్త నిల్వ హనుమకొండ రోడ్డు దేవీ థియేటర్ సమీపంలోని ఓ నాలా పక్కనే చెత్తను నిల్వ చేస్తున్నారు. మురికి నీటిలో చెత్తను తొలగించి, వెంటనే తీసుకు వెళ్లక పోవడంతో తిరిగి అందులోనే పడిపోయే అవకాశం లేకపోలేదు. దేవీ థియేటర్ నాలా వద్ద పేరుకుపోయిన చెత్త గిర్నిగడ్డ గోదాం వద్ద చెత్తమయం వైద్య కళాశాల రూట్లో..న్యూస్రీల్ -
ఆ.. జలపాతాల సందర్శన నిషేధం
వాజేడు: గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో దండకారణ్యంలోని పలు జలపాతాల సందర్శనకు అటవీశాఖ, పోలీసుల ఆధ్వర్యంలో బ్రేకులు వేశారు. ములుగు జిల్లాలో ప్రాచుర్యం పొందని జలపాతాల సందర్శనకు పర్యాటకులు రావద్దని కోరుతూ నిషేధం విధించారు. దీంతో గుట్టల సమీపంలో ఉన్న జలపాతాలను సందర్శించడం ఇక కష్టం కానుంది. నిషేధించిన జలపాతాలు ఇవే.. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను ఆనుకుని దండకారణ్యం, కర్రె గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలపైనుంచి జాలువారుతూ వాజేడు మండలంలో మరికొన్ని జలపాతాలు ఉన్నాయి. కొంగాల సమీపంలో దుసపాటిలొద్ది, కృష్ణాపురం సమీపంలో భామనసిరి, దూలాపురం సమీపంలోని మాసన్లొద్ది, అరుణాచలపురం సమీపంలో గుండం, వెంకటాపురం(కె)లో ముత్యంధార జలపాతాలు ఉన్నాయి. ఇవి ఇంకా ప్రాచుర్యం పొందలేదు. కానీ, బొగత జలపాతం సందర్శన వచ్చే పర్యాటకులు ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ జలపాతాలను తిలకించడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. నిషేధం ఉందని తెలిసినా వెళ్తున్నారు. రక్షణ లేకపోవడంతోనే.. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది, గుండం, ముత్యం ధార, భామన సిరి జలపాతాలు నట్టడవిలో ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే చాలాదూరం అడవిలో కాలినడకన వెళ్లాలి. సెల్ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఇవి ఇంకా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందలేదు. దీంతో ఇక్కడికి అష్టకష్టాలు పడి వెళ్లిన పర్యాటకులు ప్రమాదాలకు గురైన సందర్భంలో సమాచారం బయటికి తెలిసే అవకాశం ఉండడంలేదు. దీంతో స్థానిక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ జలపాతాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు, సౌకర్యాలు లేవు. దీంతో అటవీశాఖ సిబ్బంది వీటిని నిషేధించడంతోపాటు ఇక్కడికి పర్యాటకులు వెళ్లొద్దని అటువైపు వెళ్లే దారులను బారికేడ్లు పెట్టి మూసివేశారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దొంగ దారిలో వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా ఉంచారు.తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని, పర్యాటకులు తరలి రావాలని అధికారులు కోరుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ జలపాతాన్ని పర్యాటకులు వీక్షించాలని ఆహ్వానిస్తున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా బొగత జలపాతాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికి మండలంలో సరైన వర్షం లేకపోవడంతో పూర్తిస్థాయిలో జాలువారడం లేదు.నిషేధిత జలపాతాలకు వెళ్లొద్దు దట్టమైన అటవీప్రాంతంలోని ప్రమాదకర జలపాతాల సందర్శనకు అనుమతులు లేవు. అనవసరంగా పర్యాటకులు వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ప్రమాదం జరిగితే రక్షించడానికి ఆ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరు. ఈ విషయాన్ని పర్యాటకులు గుర్తుంచుకుని మాకు సహకరించాలి. – ద్వాలియా, ఎఫ్డీఓ, వెంకటాపురం(కె))●బొగతకు రావాలంటూ పిలుపు అటవీ, పోలీస్ అధికారుల నిర్ణయం రక్షణ లేకపోవడం.. గత ప్రమాదాలే ప్రధాన కారణం దారులు మూసి.. కాపలాగా ఉన్న సిబ్బంది బొగత జలపాతానికి రావాలంటూ పిలుపు -
విద్యార్థుల భాగస్వామ్యం అవసరం
● రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి జనగామ రూరల్: బోధనలో విద్యార్థుల భాగస్వామ్యంతోనే ఆశించిన అభ్యసన సామర్థ్యాలు సాధిస్తామని పాఠశాల విద్యా రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం చౌడారంలో కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈఓ భోజన్నతో కలిసి ఆమె ఆకస్మికంగా సందర్శించారు. బోధన తీరును పరిశీలించి విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరీక్షించారు. బోధనలో కృత్యాలను వినియోగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎస్ఓ రాణి పాల్గొన్నారు. -
రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉంది..
తమ ఇంటి దారిలో మట్టిరోడ్డు ఎత్తు పల్లాలుగా ఉంది. వర్షం కురిస్తే నీరంతా ఒకేచోట చేరి రోడ్డును ముంచేస్తున్నది. ఇంటి కి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సీసీ రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుంది. – కిరణ్, శ్రీవిల్లాస్ కాలనీ శివారు కాలనీల అభివృద్ధిపై దృష్టి పెట్టండి..వికాస్నగర్, దుర్గమ్మ కాలనీ లోని అనేక ప్రాంతాల్లో నేటికీ సీసీ రోడ్ల నిర్మాణం లేదు. కనీసం డ్రెయినేజీల పనులు కూడా చేపట్టలేదు. పురపాలిక అధికారులకు ఈ కాలనీలు అంటే పట్టింపు లేదు. వీధి దీపాలు కూడా వెలగడం లేదు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మట్టిరోడ్లతో ఇబ్బంది తప్పేలా లేదు. – తొట్టె క్రిష్ణ, దుర్గమ్మకాలనీ జ్యోతినగర్ కాలనీని పట్టించుకోండిజ్యోతినగర్ ప్రధాన రోడ్డుపై సీసీ వేయాలని ఏళ్ల తరబడి విన్నవించుకుంటున్నాం. వర్షాకాలంలో రోడ్డు ఎంట్రెన్స్లో బురదమయమై మట్టి బంకలా మారడంతో జనం జారి పడుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే సీసీ రోడ్డు, డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. – వలబోజు సత్యనారాయణ, జ్యోతినగర్ -
డ్రెయినేజీల క్లీనింగ్ షురూ..
జనగామ: పట్టణంలోని డ్రెయినేజీల్లో నిండిన సిల్ట్, చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు ప్రక్రియను మున్సిపల్ అధికా రులు సోమవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో అస్తవ్యస్తంగా తయారైన పారిశుద్ధ్య పనులపై ‘కంపు కంపు’ శీర్షికన ఈనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పురపాలిక అధికారులు స్పందించారు. కమిషనర్ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అధికారి పులి శేఖర్ ఆధ్వర్యాన సాయినగర్, జ్యోతినగర్, 11, 22వ వార్డుల పరిధి హైదరాబాద్రోడ్డు ఏరియా, ఇతర ప్రాంతాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేశారు. శానిటేషన్ కార్మికులు, జేసీబీలతో నాలాలు, డ్రెయిన్లలో నిండిన మట్టి, చెత్తను తీసి డంపింగ్ యార్డుకు తరలించారు. డ్రెయినేజీల శుభ్రంతో కొంత మేరకు ఇబ్బందులు తప్పనున్నాయని, ఈ క్లీనింగ్ ప్రక్రియ నిరంతరం చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో సమస్యను అధికా రుల దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేసిన ‘సాక్షి’కి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
మట్టిరోడ్లు.. మస్తు తిప్పలు
జనగామ: జనగామ పట్టణ సమగ్రాభివృద్ధి కోసం ఏటా బడ్జెట్ పేరిట అంకెల గారెడీ తప్ప.. ఆచరణలో చూపించడం లేదు. రోజురోజుకూ విస్తరిస్తు న్న పురపాలిక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. విస్తరణకు తగినట్టుగా ప్రణాళిక రూపొందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. బాలాజీనగర్, ప్రెస్టన్ ఏరియా, బాణాపురం, జ్యోతినగర్, శ్రీ విల్లాస్ కాలనీ, 60 ఫీట్లరోడ్డు, వికాస్నగర్, దుర్గమ్మకాలనీ తదితర ప్రాంతాలు నేటికీ సీసీరోడ్డు నిర్మాణానికి నోచు కోవడం లేదు. చిన్న పాటి వర్షానికే మట్టిరోడ్లు చిత్తడిగా మారి కాలినడక కూడా సాధ్యంకాని పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడిచి పోతున్నా మట్టి రోడ్లపైనే రాకపోకలు సాగిస్తున్నారు. సుమారు 20 కిలోమీటర్ల మేర సీసీరోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. రూ.75కోట్ల మేర బడ్జెట్ అవసరం. సోమవారం పట్టణంలోని పలు కాలనీలను ‘సాక్షి’ సందర్శించిగా మట్టిరోడ్లతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వెలుగుచూశాయి. ఫై ఫొటోలో కనిపిస్తున్న వీధి ప్రెస్టన్ స్కూల్ శ్రీసాయి రెసిడెన్షి సమీప కాలనీలోనిది. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా సీసీ రోడ్డుకు మోక్షం కలగడం లేదు. చిన్నపాటి వర్షానికే వీధి గుంతల మయంగా మారిపోతుంది. వరద నీరంతా ఇళ్ల ముందే నిలిచి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొని కాలనీ వాసులు కష్టాలు పడుతున్నారు. పట్టణంలోని అనేక కాలనీల్లో పరిస్థితి ఇలానే ఉంది. ప్రధాన రోడ్డును పట్టించుకోండిబాలాజీనగర్ మూడు వార్డులకు అనుసంధానంగా ఉంటుంది. ఇక్కడ సుమారు 14వేల జనాభాకు పైగా ఉంటారు. కెనరా బ్యాంకు లైన్లో వందలాది ఇళ్లతో అటాచ్ ఉన్న ఈ కాలనీకి సీసీరోడ్డు లేకపోవడం.. మట్టిరోడ్డుతో అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధాన రహదారులు సైతం సీసీకి నోచుకోవడం లేదు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, బురద, ఉబికి వస్తున్న డ్రెయినేజీ నీటితో కాలనీ అపరి శుభ్రంగా మారిపోతున్నది. ఏళ్ల తరబడి నోచుకోని సీసీరోడ్లు కాలనీలకు వెళ్లాలంటే నరకమే పట్టణ దారులన్నీ గుంతల మయం -
అదనపు కలెక్టర్కు సత్కారం
జనగామ: రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్గా పదోన్నతి పొందిన రోహిత్సింగ్ను జనగామ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి గాదె శ్రీనివాస్, కోశాధికారి మర్యాల లక్ష్మణ్ సోమవారం శాలువాతో సత్కరించారు. అనంతరం ఏసీకి శుభాకాంక్షలు తెలిపారు.సీసీ కెమెరాల అందజేతజనగామ: జనగామ పట్టణంలో మరింత నిఘా పెంచేందుకు ది చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రూ.3.20 లక్షల విలువ చేసే సీసీ కెమెరాలతో పాటు మెటీరియల్ అందజేశారు. ఈ మేరకు సోమవారం చాంబర్ అధ్యక్షుడు పోకల లింగయ్య, కార్యవర్గ సభ్యులు.. సీసీ కెమెరాల ను ఏఎస్పీ చేతన్ నితిన్, సీఐ దామోదర్ రెడ్డికి అప్పగించారు.అప్రమత్తంగా ఉండాలిజనగామ రూరల్: డ్రగ్స్ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ ఆధ్వర్యాన సోమవారం పెంబర్తి ఉన్నత పాఠశాలలో ‘డీఏడబ్ల్యూఎన్, డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ ఫర్ ఏ డ్రగ్– ఫ్రీ ఇండియా స్కీం–2025’పై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డ్రగ్స్తో కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎం డాక్టర్ జి.నాగరాణి శేఖర్, జితేంద్ర పాల్గొన్నారు.దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ అవార్డుకు ఈనెల 13వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి మార్గదర్శకాలు, ఇతర వివరాలు పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.పనుల్లో వేగం పెంచండిజనగామ: పట్టణ సుందరీకరణ పనుల్లో మరింత వేగం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, ఏఈ మహిపాల్తో కలిసి ఆర్టీసీ బస్టాండు చౌరస్తా, హనుమకొండ రోడ్డులో ఏర్పాటు చేయనున్న సూర్య నమస్కారం స్టాచ్యూ పనులపై ఆరా తీశారు.హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంరఘునాథపల్లి: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సంఘటిత సమాజ నిర్మాణమే విశ్వహిందూ పరిషత్ లక్ష్యమని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహనకృష్ణ అన్నారు. సోమవారం వీహెచ్పీ జిల్లా సహాయ కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, పట్టణ ఉపాధ్యక్షులు తాడూరి సంతోష్రాజ్, కాసర్ల మహేందర్లతో కలిసి మండలకేంద్రంలోని ఆధ్యాత్మిక, ధార్మిక ప్రముఖులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో పడకంటి రవీందర్, ఎల్.కిషన్రావు, చింతకింది కృష్ణమూర్తి, సత్యనారాయణ, వల్లాల శివ, జంపయ్య, పోకల హరిప్రసాద్, అంబటి బాలరాజు, ఉప్పలయ్య, రోహిత్, ఉప్పలయ్య, మహేందర్ పాల్గొన్నారు. -
తిరుగుడే.. సమస్యలు తీరేదెప్పుడు..?
జనగామ రూరల్: సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేసి తిరుగుడే తప్ప వాటికి పరిష్కా రం లభించడంలేదని ప్రజలు వాపోయారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు వివిధ సమస్యలపై ప్రజలు 59 వినతులు అందజేశారు. వాటిని కలెక్టర్ రిజ్వాన్ బాషాతోపాటు అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ స్వీకరించారు. వినతులను సంబంధిత శాఖల అధికారులకు అందజేసిన కలెక్టర్.. త్వరితగతిన సమస్యలను క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, డీఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. పక్క ఫొటోలోని డి.సుశీల, కొమురయ్య వృద్ధ దంపతులది రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామం. సుశీల పేరు మీద 303బైఏ సర్వే నంబర్లో 3 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. వారికి నలుగురు ఆడపిల్లలు. ఎకరం భూమి తన పేర పట్టా చేయాలని పెద్ద కూతురు అడగ్గా సరేనన్నారు. ఆమె నమ్మించి ఉన్న భూమి మొత్తం అక్రమంగా పట్టా చేసుకుంది. ‘తమ బతుకు దెరువుకు ఆధారం లేదు.. న్యాయం చేయాలని’ వృద్ధ దంపతులు కలెక్టర్ను వేడుకున్నారు. గ్రీవెన్స్లో అర్జీదారుల ఆవేదన వివిధ సమస్యలపై 59 వినతులు స్వీకరించిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు -
లయన్స్క్లబ్ సేవలు విస్తృతం చేయాలి
స్టేషన్ఘన్పూర్: లయన్స్ క్లబ్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతం చేయాలని క్లబ్ జిల్లా గవర్నర్ కె.వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక లయన్ భవన్లో స్టేషన్ఘన్పూర్ లయన్స్క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా కోతి వేణు, కార్యదర్శిగా దుస్స నరేష్, కోశాధికారిగా కోతి అశోక్తో పాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం క్లబ్ పూర్వ అధ్యక్షుడు అంబటి కిషన్రాజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా గవర్నర్ మాట్లాడారు. స్టేషన్ఘన్పూర్ లయన్స్క్లబ్ 32 సంవత్సరాలు విశేష సేవలు అందిస్తుందని, అదే స్తూర్తితో నూతన క్లబ్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్క్లబ్ బాధ్యులు చంద్రశేఖర్ఆర్య, కేసీ జాన్బన్నీ, కన్నా పరశురాములు, రాజిరెడ్డి, అంబటి కిషన్రాజ్, జొన్నల రాజేశ్వరరావు, హరికిషన్రెడ్డి, కరుణాకర్రెడ్డి, వీటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీల్లో నూతన మెనూ..
జనగామ రూరల్: కేజీబీవీల బలోపేతానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. విద్యార్థినులు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్లు ఇటీవల చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుతున్న బాలికలకు పౌష్టికాహారం అందించి వారిని అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మెనూలో పలు మార్పులు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించనున్నారు. పెరిగిన మెస్ చార్జీలు గతంలో 6–10, ఇంటర్ విద్యార్థులకు ఒకేవిధంగా నెలకు రూ.1,225 ప్రభుత్వం అందించేది. కానీ నూతన మెనూ ప్రకారం 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,330, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,540, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.2,100 అందించనున్నారు. 12 కేజీబీవీల్లో అమలు జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో కేజీబీవీలు ఉండగా వాటిలో గతంలో 8 పాఠశాలలో ఇంటర్ విద్యను అందిస్తున్నారు. గతంలో మెనూ చార్జీలు సరిపోక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడే వారు. అన్ని సంక్షేమ హాస్టల్స్, గురుకులాలకు మెస్ చార్జీలు పెంచగా ఈ ఏడాది ప్రభుత్వం కేజీబీవీలకు పెంచడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 12 కేజీబీవీలు ఉండగా వాటిలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 2,363 విద్యార్థులు అభ్యసిస్తున్నారు. పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ గతంలో కంటే ఏడాది పదవ తరగతి 99 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే ఇంటర్ కూడా మంచి ఫలితాలు రావడంతో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో కూడా ఈ ఏడాది శిక్షణ ఇవ్వనున్నారు. నూతన మెనూ ఇదే ఉదయం: టమాట కిచిడీ, సాంబారు, బూస్ట్, పూరి, రాగి జావ, ఉప్మా, పులిహోర, వడ, బోండా, చపాతి, జీరా రైస్తో పాటు రోజుకు ఒక్కో రకమైన పండ్లు అందించాలి. ఇందులో అరటి, జామ, వాటర్ మిలన్, బొప్పాయి, సపోట వంటి పండ్లు అందించాలి. మధ్యాహ్నం: టమాట పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడక బెట్టిన గుడ్డు, చికెన్ అందించాలి. సాయంత్రం: ఉడకబెట్టిన శనగలు, కోడిగుడ్డు బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి ఇవ్వాలి. రాత్రి వేళ: వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం, సాంబారు, మజ్జిగ అందించాలి. నెలలో రెండు సార్లు మటన్, అయిదుసార్లు గుడ్లు, ప్రతీరోజు నెయ్యి అందించాలి.నూతన మెనూ ప్రకారమే.. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి నూతన మెనూ అమలు చేయాలని కేజీబీవీల ఎస్ఓలకు సూచించాం. కొత్త మెనూ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. నూతన మెనూ చార్టులు ఏర్పాటు చేయాలని సూచించాం. – గౌసియా బేగం, బాలిక విద్యాధికారి ● పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు పెరిగిన మెస్చార్జీలు జిల్లావ్యాప్తంగా 12 విద్యాలయాల్లో 2,368 మంది విద్యార్థినులు -
బ్యాంకు డిపాజిట్లు రూ.219.20 కోట్లు
రామన్నపేట : వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24 శాతం వృద్ధితో డిపాజిట్లు రూ.219.20 కోట్లకు చేరాయని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు వెల్లడించారు. నగరంలోని దేశాయిపేట రోడ్డులోని కేఆర్ గార్డెన్స్లో ఆదివారం బ్యాంక్ 29వ మహాజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు మా ట్లాడుతూ రుణాల మంజారులో 13.20 శాతం వృద్ధితో రూ154.13 కోట్లు కలిపి మొత్తం వ్యాపారం రూ.373.43 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం రూ.3.03 కోట్లు కాగా అందులో రూ.60.90 లక్షల ఆదాయపు పన్ను చెల్లించగా నికరలాభం రూ.2.22 కోట్లు అర్జించినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గోపాల్పూర్, మహబూబాబాద్, జనగాం, వడ్డేపల్లి నూతన శాఖలను ప్రారంభించనట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్ ముందడ, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్కుమార్, మహమ్మద్ గౌసొద్దీన్, ఒడితర పవన్కుమార్, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్, పోలేపాక రవికుమార్, బండారి భార్గవి, మంద స్వప్న, నామినేట్ డైరెక్టర్లు అప్పరాజు రాజేంద్రకుమార్, పుల్లూరి సుధాకర్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం.సత్యనారాయణరావు , వరంగల్, హనుమకొండ డీసీఓలు కోదండ రాములు, సంజీవరెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహన్రావు, సేల్స్ ఆఫీసర్ కె.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్కుమార్ -
నేడు పాలకుర్తికి మంత్రి పొంగులేటి
పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలో 50 పడకల సామాజిక ఆరోగ్యకేంద్రం భవన నిర్మాణానికి నేడు (సోమవారం) రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేస్తారని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రూ.17.50 కోట్ల వ్యయంతో ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు.కేంద్ర బృందం పర్యటనకొడకండ్ల: మండలంలోని ఏడునూతుల గ్రామంలో కేంద్ర స్వచ్ఛ సర్వేక్ష గ్రామీణ్ మిషన్ బృందం ఆదివారం పర్యటించింది. ఎస్ఎస్జీ రాష్ట్ర పరిశీలకులు అశోక్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ శ్రీకృష్ణలు గ్రామంలోని అంగన్వాడీ భవనం, మరుగుదొడ్లు, ఉన్నత పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించారు. బలహీన వర్గాల, గిరిజన, దళిత నివాసాలను సందర్శించి మరుగుదొడ్ల వినియోగాన్ని పరిశీలించారు. తడిపొడి చెత్త షెడ్లు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, స్వచ్ఛత, పరిశుభ్రతలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ కర్ణాకర్, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి, ఎపీఓ కుమారస్వామి, ఎంపీఓ ఇందిర, టీఎ యాకయ్య, ఎఫ్ఏ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో వృత్తి విద్యాకోర్సులుజనగామ రూరల్: విద్యార్థులకు కేవలం సాధారణ విద్యతో పాటు వృత్తి విద్య కోర్సులు ప్రవేశ పెట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో 9, 10, ఇంటర్ విద్యార్థులకు ఈ వృత్తి విద్యా కో ర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందులో శిక్షణ పొందిన వారు ఐటీ, బ్యూటీ వెల్నెస్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలో 15 పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు. మల్కాపూర్, స్టేషన్ ఘన్పూర్, ధర్మకంచ జెడ్పీహెచ్ఎస్లో మైక్రో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, డాటా ఎంట్రీ ఆపరేటర్, కేజీబీవీ చౌడారంలో బ్యూటీ థెరఫిస్టు, పాలకుర్తి జెడ్పీహెచ్ఎస్లో బ్యూటీ థెరఫిస్టు, ప్లంబింగ్, తరిగొప్పుల జెడ్పీహెచ్ఎస్లో బ్యూటిథెరఫిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్, జఫర్గఢ్ సో షల్ వెల్ఫేర్లో మిషన్ ఆపరేటర్, హోమ్ హెల్త్, కూనూర్ జెడ్పీఎస్ఎస్లో బ్యూటిథెరఫిస్టు, డా టా ఎంట్రీలో శిక్షణ ఇవ్వనున్నారు.మెడికల్ యజమానుల కమిటీ ఎన్నికజనగామ: ది జనగామ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణంలో సంఘ ఎన్నికల నేపధ్యంలో మూడు పోస్టులకు ఆసక్తి ఉన్న వారి నుంచి నామినేషన్లను కోరారు. పోటీ లేకపోవండతో కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సంఘ అధ్యక్షుడిగా బడుగు అంజనేయులు, ప్ర ధాన కార్యదర్శిగా బుక్కబాల భరద్వాజ్, కోశాధికారిగా కొలుపుల యాదగిరి ఎన్నికయ్యారు. ఎన్నికల కమిటీ సభ్యులు మేకపోతుల అంజనేయులు, లగిశెట్టి కృష్ణమూర్తి, పాము పాండరి తదితరులు పాల్గొన్నారు.తొమ్మిది కిలోల కణతి తొలగింపుజనగామ: జనగామ పట్టణం హైదరాబాద్రోడ్డులోని రవళి నర్సింగ్ హోమ్లో డాక్టర్ రాజమౌళి ఆదివారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. రఘునాథపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు. స్కానింగ్ ద్వారా పెద్ద కణతి ఉన్నట్లు నిర్ధారించుకుని, శస్త్ర చికిత్స ద్వారా 9 కిలోల బరువు ఉన్న కణతిని తొలగించారు. క్రిటికల్ ఆపరేషన్ల సమయంలో పరేషన్ చేసి, యువతి ప్రాణాలను కాపాడడంతో పా టు రికార్డు సృష్టించిన డాక్టర్ రాజమౌళిని ప లువురు అభినందించారు. శస్త్ర చికత్సలో వైద్య సిబ్బంది అలిసేరి శ్రీనివాస్, మోర్తాల ప్రభాకర్, రమేశ్ తదితరులు ఉన్నారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. కమల్ హాసన్ నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత లండన్కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆపెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
ఎన్ఎంసీ నిబంధనలు పాటించాలి
జనగామ: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు. రాష్ట్రంలోని సర్కారు మెడికల్ కళాశాలల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించి ఎన్ఎంసీ షోకాజ్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వం వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. మెడికల్ కళాశాల పరిధిలో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలతో పాటు మరింత మెరుగు పరిచేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది. శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావుతో కలిసి చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి (ఎంసీహెచ్), మెడికల్ కళాశాలను సంగీత సత్యనారాయణ సందర్శించారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఈ ఔషధలో ఎంట్రీ, సేవలపై ఆరా తీశారు. అనంతరం మెడికల్ కళాశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎంసీహెచ్, జిల్లా ఆస్పత్రి పరిధిలో మరో 72 పడకల సామర్థ్యం పెంచుకోవాలన్నారు. ప్రతి రోజు డాక్టర్ల ఫేషియల్ అటెండెన్స్ రెండు సార్లు తీసుకోవాలన్నారు. సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. థర్డ్ ఇయర్ బోధనకు తాత్కాలిక భవనం వైద్య కళాశాల మూడవ సంవత్సరం తరగతి బోధనకు ప్రస్తుతం ఉన్న రెండు లెక్చర్ గ్యాలరీల సమీపంలో తాత్కాలిక షెడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఎస్ట్మేషన్ వేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఎంఐడీసీ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా ఎంబీబీఎస్లో చేరే విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. భవన నిర్మాణ పనుల్లో వేగం పెరగాలన్నారు. కాగా కళాశాల చుట్టూ పవర్గ్రిడ్ విద్యుత్ తీగలు ఉండటంతో ఇంటర్నెట్ సమస్య వేధిస్తోందని కమిషనర్కు వైద్యులు వివరించారు. సమీక్షలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ మోహన్దాస్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లిఖార్జున్రావు, ఎంసీహెచ్ సూపరిండెంట్ డాక్టర్ మధుసూదన్రెడ్డి, ప్రొఫెసర్, మెడిసిన్ డాక్టర్ శంకర్, వైద్యులు అన్వర్, అనురాధ, శంకర్, కమలహాసన్, టీఎస్ఎంఐడీసీ కేఎస్కే ప్రసాద్, ఆర్అండ్బీ ఏఈ శ్రీధర్రెడ్డి, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. థర్డ్ ఇయర్ కోసం తాత్కాలిక భవనం మరో మూడు ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేయండి రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ -
రెవెన్యూ అదనపు కలెక్టర్ హోదా పెంపు
జనగామ: రెవెన్యూ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ హోదాను పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 33 మందికి అదనపు కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్గా పని చేస్తున్న రోహిత్ సింగ్కు ప్రభుత్వం ఇక్కడే పూర్తి స్థాయి అదనపు కలెక్టర్ హోదాను కల్పించింది. ఈ మేరకు ఏసీ రోహిత్సింగ్ను పలువురు అభినందించారు. -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
ఉన్నత లక్ష్యంతో చదవాలి
కేజీబీవీలో విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ లింగాలఘణపురం: విద్యార్థినులు ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా కోరారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాల, మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం అందజేసిన పుస్తకాలు, దుస్తులు, నోట్బుక్స్ అందాయా లేదా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గదుల శుభ్రత, వంటగదిలో ఆహార పదార్థాల నాణ్యత, మరుగుదొడ్లలను పరిశీలించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, తహసీల్దార్ రవీందర్, ఎంఈఓ విష్ణుమూర్తి, ఎంపీఓ రఘురామకృష్ణ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీత, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అన్నపూర్ణ తదితరులు ఉన్నారు. గోదావరి జలాలతో చెరువులు నింపాలి జనగామ రూరల్: గోదావరి జలాలతో జనగామ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపి రైతులకు సాగునీరు అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య అధ్యక్షతన శనివారం ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా జనగామ ప్రాంతానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, మాచర్ల సారయ్య, రామావత్ మీట్యా నాయక్, నక్క యాకయ్య, పయ్యావుల భిక్షపతి, ఉర్సుల కుమార్, బండ కింది బాలనారాయణ, తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్లో చేరడం గొప్ప అవకాశంజనగామ రూరల్: చదువును మధ్యలో నిలిపివేసిన వారు చదువుకోవడానికి ఓపెన్ స్కూల్లో చేరడం గొప్ప అవకాశమని అడల్ట్ ఎడ్యుకేషన్ లైసన్ ఆఫీసర్ విజయ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్లో సెర్ఫ్ జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వయోజన విద్యా విభాగం, విద్యాశాఖ, టాస్ సంయుక్తంగా చేపడుతున్న ఉల్లాస్, టాస్ కార్యక్రమం గురించి కోఆర్డినేటర్ శంకర్రావు వివరించారు. చదువురాని వారిని, చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి వారి చదువుకొనసాగించేలా అవగాహన కల్పించాలన్నారు. ఓపెన్ స్కూల్ ఒక వరం లాంటిదన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ వసంత, అడిషనల్ డీఆర్డీఓ నూరోద్దీన్, డీపీఓ రాజేంద్ర ప్రసాద్, ఏపీఓ జ్యోతి, సీఎంఓ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు జనగామ రూరల్: పట్టణంలోని మినీ స్టేడియం ధర్మకంచలో జిల్లా స్థాయి 10, 12, 14 సంవత్సరాల బాలబాలికల ట్రయాతలిన్ అథ్లెటిక్స్ ఎంపికలు శనివారం జరిగాయి. ఈ ఎంపికలకు 500 మంది విద్యార్థులు వివిధ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనగా 25 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జూలై 6న జేఎన్ఎస్ హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్ తెలిపారు. జిల్లా అసోసియేషన్ కోశాధికారి ఆవుల అశోక్, తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు గోర్ సింగ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి హనుమంతరావు, రంజిత్, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
చిల్పూరు: సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్ అన్నారు. మల్కాపూర్ గ్రామంలోని పీహెచ్సీని శనివారం ఆయన సందర్శించారు. ముందుగా వాఛ్యతండాలో మానిటర్ ఇమ్యునైజేషన్ను ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కమల్హాసన్, డాక్టర్ అశోక్లతో కలిసి పరిశీలించారు. వెంకటాద్రిపేటలో డెంగీ పాజిటివ్ వచ్చిన పేషంట్తో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలి పారు. గ్రామంలో చెత్త చెదారం, మురుగు నీ రు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి డెంగీ వ స్తుందని, పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం పీహెచ్సీలో డాక్టర్ కుశాలి, డాక్టర్ శ్రవణ్ ఆధ్వర్యంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది సమయ పాలన పా టించాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన మందులు అందజేయాలన్నారు. -
గ్రీన్ సిగ్నల్
జనగామ: జనగామ ప్రభుత్వ వైద్య కళాశాలలో 2025–26 నూతన వైద్య విద్యాసంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల (ఎంబీబీఎస్) పునరుద్ధరణకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణ మంజూరుకు ఎన్ఎంసీ నిబంధనలను అనుసరించి మెడికల్ కళాశాల వివరాలు, సమగ్ర డేటాను అప్లోడ్ చేయాలని 2024 నవంబర్ 1న పబ్లిక్ నోటీసు జారీ చేశారు. కళాశాలకు సంబంధించిన నిపుణులు సమర్పించిన నివేదిక ఆధారంగా లోపాలను గుర్తిస్తూ 2025 మే 3న జాతీయ వైద్య కమిషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అధ్యాపకులకు సంబంధించి తక్కువ హాజరు శాతం, 420 పడకలకు గాను 410, కాడవర్ సంఖ్య 10కి గాను 7, అందుబాటులో లేని సీటీ స్కాన్, ఎమ్మారై, మైనర్, మేజర్ ఓటీల సంఖ్య పెంచడం (ఆపరేషన్ థియేటర్లు), మృతదేహాల కొరత తదితర లోపాలు ఉన్నట్లు షోకాజ్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల వారీగా గుర్తించిన లోపాలను సరి దిద్దేందుకు వివరణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికను నిపుణుల ఉప సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రభుత్వం అందించిన నివేదిక ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (యూజీఎంఈబీ) 2025–26లో ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసిన నాలుగు నెలల లోపు లోపాలను సరిదిద్దుకోవాలని అందులో పేర్కొన్నారు. నిబంధనల మేరకు కాలపరిమితి ముగిసిన వెంటనే మెడికల్ కళాశాల నిర్వహణకు సంబంధించి వైద్య విద్య ప్రమాణాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో లోపాలు అలాగే కొనసాగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఊపిరి పీల్చుకున్న అధికారులు ఈ వైద్యవిద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్ఎంసీ చూపించిన లోపాల్లో సీటీ స్కాన్ సేవలు వారం రోజుల్లో ప్రారంభం కానుండగా మృతదేహాలకు సంబంధించి మరో నాలుగు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాకల్టీకి సంబంధించి ఖాళీ లను సైతం భర్తీ చేస్తున్నారు. అధ్యాపకుల ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ను సైతం అమలులోకి తీసుకు వస్తున్నారు. 100 ఎంబీబీఎస్ సీట్లకు గాను 15 శా తం జాతీయ స్థాయి, 85 శాతం రాష్ట్రాస్థాయిలో అ డ్మిషన్లు ఉంటాయి. ఈ విషయమై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావు మాట్లాడు తూ 2025–26 సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణకు మంజూరు వచ్చిందన్నారు. తరగతులు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.వైద్య కళాశాలకు షరతులతో కూడిన అనుమతులు ఊపిరి పీల్చుకున్న అధికారులు -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. గత జూన్ 5న కుమారుడు సాయికుమార్ను కళాశాలకు పంపేందుకు బాల్యా ద్విచక్రవాహనంపై ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
వేంకటేశ్వరస్వామి ఆలయంలో గోవింద నామస్మరణ
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం భక్త జన సందోహం మధ్య గోవింద నామస్మరణలతో అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ వైభవంగా స్వామి వారి వార కల్యాణం నిర్వహించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మిప్రసన్న, ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ధర్మకర్తలు గనగోణి రమేశ్, తాళ్లపల్లి బుచ్చయ్య, రత్నాకర్రెడ్డి, చల్ల వెంకటరమణాదేవి, గోలి రాజశేఖర్, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, మళ్లికార్జున్, మహేష్, గాదె శేఖర్, హరిశంకర్, రాజేష్, విశాల్ పాల్గొన్నారు. అనంతరం భక్తులకు హైదరాబాద్కు చెందిన అఖిల్ శర్మ– వనిత కల్యాణి, వరంగల్కు చెందిన మేర్గు నవీన్–వీణ, విశ్వతేజ దంపతులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. -
నేతన్నకు పొదుపు భరోసా
జనగామ: చేనేత రంగానికి ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు గత సర్కారు అమలు చేసిన థ్రిప్టు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ‘నేతన్న పొదుపు’ పథకంగా ముందుకు తెచ్చింది. 36 నెలల కాల పరిమితిని ప్రస్తుత ప్రభుత్వం 24 నెలలకు కుదించింది. నేత, అనుబంధ కార్మికులు చెల్లించే వాటాధనంలో సర్కారు రెండింతలు కలిపి జమచేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోంది. పథకం ద్వారా నేతన్న కుటుంబాల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడం సర్కారు ముఖ్యఉద్దేశం. జిల్లాలో 2,824 మంది కార్మికులు నేతన్న పొదుపు స్కీం ద్వారా జిల్లాలో 2,824 మంది నేత, అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 15వేల జియోట్యాగ్ మగ్గాలు, పవర్ లూమ్స్(మర మగ్గాలు) ఉన్నాయి. నేతన్న పొదుపు పథకానికి గతంలోనే కార్మికుల నుంచి సుమారు 3వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. చేనేత జౌళి శాఖ ప్రత్యేక అధికారుల బృందం అర్హత నిర్ధారణ కోసం ప్రతీ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత థర్డ్ పార్టీ సర్వే చేపట్టారు. ఇందులో తప్పిన కార్మికుల వివరాలను జిల్లా అధికారులు నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నేత కార్మికులు నేతన్న పొదుపు పథకానికి దూరంగా ఉన్నారు. అధికారులు తనిఖీకి వెళ్లిన సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లడం, శుభకార్యాల నేపథ్యంలో మగ్గాలు విప్పి అటెక్కించడంతో ప్రస్తుతం నేత వృత్తి చేయడం లేదని రికార్డులో ఎక్కించారు. తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ నేతన్న పొదుపులో అవకాశం కల్పించాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పథకం అమలు ఇలా.. నేత, అనుబంధ కార్మికులు ప్రతి నెలా తమ వేతనం నుంచి 8 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తారు. ప్రభుత్వం కార్మికుల పొదుపునకు రెండింతలు(16శాతం) కలుపుకుని 24 నెలల తర్వాత వారి ఖాతాలో జమ చేస్తుంది. నేత కార్మికులు గరిష్టంగా రూ.1,200, అనుబంధ కార్మికులు రూ.800 వాటా ధనం చెల్లిస్తారు. మరమగ్గాల కార్మికులు 8 శాతం పొదుపు చేసుకోగా, ప్రభుత్వం అంతే మొత్తంలో భరోసా కల్పిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 36 నెలల కాలపరిమితితో థ్రిఫ్టు పథకం అమలు చేయగా, సీఎం రేవంత్రెడ్డి దీనిని 24 నెలలకు కుదించి నేతన్న పొదుపు పథకంగా మార్చారు. నెలనెలా పొదుపు చేసుకునే సమయంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆలస్యం జరిగితే.. నేత కార్మికులకు మూడు నెలల వెసులుబాటు కల్పించారు. అప్పటికీ పొదుపు జమ చేసుకోని పరిస్థితుల్లో సదరు కార్మికులు ఆ పథకం జాబితా నుంచి ఆటో మేటిక్గా తొలగిపోతారు.జిల్లాలో నేతన్న పొదపు లబ్ధిదారుల వివరాలు మండలం నేత స్కీం మొత్తం కార్మికులు అర్హులు జనగామ 683 683 1,366 బచ్చన్నపేట 359 330 689 నర్మెట 23 22 45 తరిగొప్పుల 17 15 32 స్టే.ఘన్పూర్ 11 11 22 చిల్పూరు 01 01 02 జాఫర్గడ్ 01 01 02 లిం.ఘనపురం 190 178 368 ర.నాథపల్లి 32 26 58 పాలకుర్తి 08 07 15 కొడకండ్ల 03 03 06 దేవరుప్పుల 137 82 219 మొత్తం 1,465 1,359 2,824జిల్లాలో 2,824 మందికి లబ్ధి స్కీం కాలపరిమితి 24 నెలలు వీవర్ వాటా రూ.1,200 అనుబంధ కార్మికుడికి రూ.800 వాటాధనం చెల్లింపునకు మూడు నెలల వెసులుబాటు -
ధర్మకంచలో పట్టపగలే చోరీ
జనగామ: జిల్లా కేంద్రం ధర్మకంచ ప్రధాన రహదా రిలో పట్టపగలే భారీ చోరీ సంఘటన శుక్రవారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మకంచకు చెందిన అంగన్వాడీ టీచర్ మంగోలు రేణుక ఉదయం 9.30 గంటలకు సెంటర్కు వెళ్లి.. రాత్రి 7 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంది. ముఖద్వారం తలుపులు తెరిచి ఉన్నా యి. లోపలికి వెళ్లి చూడగా రెండు బీరువాలు పగుల గొట్టి ఉండడంతో వెంటనే 100 నంబర్కు డయల్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని క్లూస్ టీంలను రప్పించారు. సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి వస్తువులు(కాళ్ల కడియాలు, పట్టా గొలుసులు), రూ.60వేల నగదు అపహరణకు గురైనట్లు రేణుక తెలిపారు. కూతురు పెళ్లి కోసం భద్రపరిచిన నగలు, నగదు చోరీకి గురి కావడంతో బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపించింది. పోలీసులు విచారణ ప్రారంభించారు. 12 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాల అపహరణ రూ.60వేల నగదు కూడా.. -
నోటరీ మ్యుటేషన్లపై ఆరా..!
జనగామ: జనగామ మున్సిపల్లో జరిగిన మ్యుటేషన్ల సవరణ, సెటిల్ మెంట్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అదనపు కలెక్టర్(ఏసీ) పింకేష్కుమార్ ఆరా తీశారు. ‘సెటిల్మెంట్ కింగ్ ఎవరు’, ‘సెటిల్మెంట్పై ఇంటలిజెన్స్ ఆరా’ శీర్షికన సాక్షిలో ఇటీవల ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన అదనపు కలెక్టర్ శుక్రవారం మున్సిపాలిటీని ఆకస్మికంగా సందర్శించడంతో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. కమిషనర్ చాంబర్లో రెండున్నర గంటల పాటు రెవెన్యూ, అకౌంట్స్, పట్టణ ప్రణాళిక, శానిటేషన్, ఇంజనీరింగ్ తదితర విభాగాల వారీగా సమీక్షించారు. ఇటీవల మ్యుటేషన్ల సవరణకు సంబంధించి 22 మంది జాబితాను జతపరుస్తూ సీడీఎంఏ కమిషనర్ వెంకటేశ్వర్లుకు మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. గడిచిన ఆరు నెలల కాలంలో నోటరీ, నిర్మాణాల రెగ్యులరైజేషన్, మ్యుటేషన్ల సవరణపై సమగ్ర సమాచారంతో నివేదిక సమర్పించా లని ఆదేశించారు. ఇక నుంచి నోటరీపై ఉన్న వాటిని రెగ్యులరైజ్ చేయరాదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గతంలో చేసిన మ్యుటేషన్ల సవరణపై కూపీ లాగడంతో పాటు సదరు ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో మరింత వేగం పెంచాలని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనితీరు, వ్యవహారంపై ఎక్కువ సమయం కేటాయించినట్టు సమాచారం. సమీక్షలో మేనేజర్ రాములు, ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతోంది..? పట్టణ ప్రణాళిక సేవలపై వివరాల సేకరణ శాఖల వారీగా రెండున్నర గంటల పాటు సమీక్షించిన అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
పొదుపు పథకం బాగుంది
చేనేత వృత్తి నిరాధరణకు గురవుతున్న సమయంలో నాడు కేసీఆర్, నేడు రేవంత్రెడ్డి అమలు చేస్తున్న నేతన్న పొదుపు పథకం కింద రెట్టింపు బోనస్ కలిపి ఇవ్వడంతో ఆర్థికంగా బలపడుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ నెలకు రూ.1,200 చెల్లిస్తే మరో రూ.2,400 కలిపి మూడేళ్లకు గాను రూ.1,29,600 రెండుసార్లు తీసుకున్నాను. నాతో పాటు భార్య కూడా నెలకు రూ.600 చెల్లిస్తే, ప్రభుత్వం రూ.1,200 బోనస్తో మూడేళ్లకు రూ.64,800 ఇచ్చింది. గత ప్రభుత్వం మూడేళ్లకు బోనస్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీంను రెండేళ్లకు కుదించడంతో కార్మికులకు త్వరగా లబ్ధి చేకూరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మగ్గం నేసే కార్మికులకు చేయూత కొనసాగించడం అసరాగా నిలుస్తుంది. – చింతకింది సోమయ్య, చేనేత కార్మికుడు, కోలుకొండ(దేవరుప్పుల) -
సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
● ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం.. ఇందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిరుపేద కుటుంబాలకు ఇందిర మ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని చెప్పారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ మంజుల, డీఆర్డీఓ వసంత, ఎంపీడీఓ రాములు, కాంగ్రెస్ నాయకులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, కమ్మగాని నాగన్న, ఎండీ.నజీర్, యాకూబ్, పుల్లి గణేష్, బైరు భార్గవ్, పన్నీరు వెంకన్న, కమ్మగాని కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వేంకటేశ్వరుడికి విశేష అలంకరణ
చిల్పూరు: భూనీల సమేత శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి శుక్రవారం భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు స్వామివారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ధర్మకర్తలు గోలి రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. స్టూడెంట్ డైరీ ఆవిష్కరణజఫర్గఢ్: మండల పరిధి తిడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం రూపొందించిన స్టూడెంట్ డైరీని కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం తన కార్యాలయంలో డీఈఓ భోజన్నతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి డైరీ ఎంతగానో దోహదపడుతుందని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో డైరీని రూపొందించడం అభినందనీయమని అన్నారు. డీఈఓ భోజన్న మాట్లాడుతూ పిల్లల విద్యా ప్రగతిని తల్లిదండ్రులు తెలుసుకోవడంతో పాటు విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన పాటించేందుకు డైరీ ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్టీ జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్రెడ్డి, హెచ్ఎం సదానందం, ఉపాధ్యాయులు నవీన్రెడ్డి, శ్రవణ్కుమార్, రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలిదేవరుప్పుల : పేదరిక నిర్మూలనతోపాటు సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రూపాదేవి సూచించారు. శుక్రవారం లకావత్తండా(ఎం)లో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన నిర్వహించిన ‘పీఎం ధర్తీ అభజన్ భగీధారి అభయాన్’ ప్రత్యేక గ్రామసభలో ఆమె మాట్లాడారు. కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భారత్, వృద్ధ్ధాప్య పింఛన్లు, ఇన్సూరెన్స్ స్కీమ్స్, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీఓ సురేష్కుమార్, మండల వైద్యాధికారి రవితేజ, ఏఈఓ సనా మహావీణ్, గ్రామ ప్రత్యేక అధికారి పి.మహేష్ పాల్గొన్నారు. నాటి ‘ఎమర్జెన్సీ’ రోజులు గుర్తుకొస్తున్నాయి..జనగామ రూరల్: ఇందిరాగాంధీ పాలనలో అమలు చేసిన ఎమర్జెన్సీ.. నాటి చీకటి రోజు లు గుర్తుకొస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం భారతీయ జనతా యువమోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యాన పట్టణంలోని నెహ్రూ పార్కు వద్ద నిర్వహించిన ‘సంవిధాన్ హత్య దివస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1975లో నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ సొంత ప్రయోజనాల కోసం అంతర్గత కలహాలు అనే ఒక కుంటిసాకు చూపి ఎమర్జెన్సీ విధించి భారత పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడంతో పాటు పత్రికా స్వేచ్ఛను హరించి నిరంకుశ పాలన కొనసాగించిందన్నారు. అటల్ బిహారీ వాజేపేయి, ఎల్కే అద్వానీ, జయప్రకాశ్ నారాయణ జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికార కాంక్ష తప్ప ప్రజలపై చిత్తశుద్ధి ఏనాడూ లేదని, ఇప్పటికీ అదే ధోరణితో ప్రజల పట్ల వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజు, ఉపాధ్యక్షులు దేవరాయ ఎల్లయ్య, డాక్టర్ భిక్షపతి, మహిపాల్, నవీన్, దడిగా రవి, ఉల్లెంగుల రాజు, కీర్తి వెంకటేష్, రఫ్తార్ సింగ్, అవినాష్, రంజిత్, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఓపెన్ స్కూల్ ఓ వరం
● తెలంగాణ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి పాలకుర్తి టౌన్: ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కారణాలతో పాఠశాల స్థాయిలోనే చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ఓ వరమని ఓపెన్ స్కూల్ తెలంగాణ జాయింట్ డైరెక్టర్ ఎం.సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పాలకుర్తి మండలంలో ఓపెన్ టెన్త్, ఇంటర్లో అడ్మిషన్స్ చేయించాలని, డ్రాపౌట్ లేకుండా చూడాలని చెప్పా రు. అలాగే ఉల్లాస్ ప్రొగ్రాంలో భాగంగా నిరక్షరా స్యులను అక్షరాస్యులుగా చేసే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలికల ఎడ్యుకేషన్ ఆఫీసర్ సతిన్, అడల్ట్ ఎడ్యుకేషన్ ఏపీఓ విజయ్కుమార్రెడ్డి, టాస్ కోఆర్డినేటర్ శంకర్రావు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ రవి, హెచ్ఎంలు శోభారాణి, ఉపాధ్యాయులు ఓరుగంటి రమేష్, అశోక్, బలరాం, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
మత్తుపదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్: మత్తుపదార్థాల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. ‘డీఏడబ్ల్యూఎన్, డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ ఫర్ ఏ డ్రగ్– ఫ్రీ ఇండియా స్కీం – 2025’పై ఓబుల్కేశవపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ అమ్మేవారు స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారని, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పా రు. ఈ సందర్భంగా డ్రగ్స్తో కలిగే అనర్థాల గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు శేఖర్, జితేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు. -
వచ్చే వారమే సీటీ స్కాన్ సేవలు
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(డీహెచ్)లో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ సేవలను వచ్చే వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతకు ముందు సీటీ స్కాన్ పని తీరుకు సంబంధించి డెమోను పరిశీలించారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావుతో కలిసి జనరల్ వార్డు, ఇతర విభాగాలను సందర్శించారు. ఫిజియో థెరపీ సేవలతో పాటు బ్లడ్ బ్యాంకు నిర్వహణ, అత్యవసర సమయంలో యూనిట్లను అందించేందుకు ఏ మేర సామర్థ్యం కలిగి ఉందనే దానిపై ఆరా తీశారు. భోజన వడ్డింపుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సమయానుకూలంగా భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో ఆపరేషన్లు, జనరల్ సేవలు, డాక్టర్ల పనితీరుపై రోగులతో మాట్లాడారు. సర్కారు ఆస్పత్రిని నమ్ముకుని వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి మరింత నమ్మకం కలిగించాలని కలెక్టర్ వైద్యులు, సిబ్బందికి సూచించారు. సమయ పాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్ఎంఓ లక్ష్మీనారాయణ, డాక్టర్లు అనురాధ శంకర్, పద్మ, ప్రభ తదితరులు ఉన్నారు. ముగిసిన కేంద్ర బృందం పరిశీలనజనగామ రూరల్: జలశక్తి అభియాన్ కింద నేషనల్ వాటర్ అవార్డులో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం పర్యటన శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు కలెక్టర్ రిజ్వాన్ బాషాతో సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ భూగర్భజల సంరక్షణకు చేపట్టిన పనులు, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందన్నారు. బతుకమ్మకుంట అభివృద్ధి కూడా భూగర్భ జలాల సంరక్షణకు చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం ‘మన జిల్లా–మన నీరు’ కార్యక్రమం కింద తక్కువ ఖర్చుతో కలెక్టరెట్లో నిర్మించిన ఇంకుడు గుంతను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సభ్యులు అశ్వరావుపల్లి ఆర్ఎస్ రిజర్వాయర్, మీదికొండ చెక్డ్యాం, వెల్ది గ్రామంలో బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్, ఛాగల్లులో ఆయిల్పామ్ సాగు, నెల్లుట్లలో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ప్లాంటేషన్ నర్సరీ, రఘునాథపల్లిలో ఫీజో ఎలక్ట్రిక్ మీటర్, పాలకుర్తిలో ఫామ్ పాండ్స్, వాటర్ ట్యాంకు, పైపులైన్ నిర్మా ణాలు, కంపోస్ట్ షెడ్డు, జనగామలోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులు పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, డీఆర్డీఓ వసంత తదితరులు పాల్గొన్నారు. వైద్యులు సమయపాలన పాటించాలి డీహెచ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ప్రభుత్వం విద్యా విధ్వంస విధానాలను మానుకోవాలి
● విద్యా పరిరక్షణ కమిటీ బాధ్యులు జనగామ రూరల్: కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను మానుకోవా లని విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.లక్ష్మయ్య, ఇ.రామిరెడ్డి అన్నారు. హైదరా బాద్ ఇందిరాపార్క్ వద్ద ఈనెల 27న నిర్వహించే ధర్నా కరపత్రాలను గురువారం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కారు విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణను వేగిరం చేయడానికి నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకువ చ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసిన గత సర్కారు విధానాలనే ప్రస్తుత ప్రభు త్వం అమలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పులు అన్ని స్థాయిల్లో దళిత, ఆదివాసీ, నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు విద్యను దూరం చేసేలా ఉన్నాయ న్నారు. రాజు, అంకుశావళి, యాదగిరి, శివరాం, జి.శ్రీరామ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
చిల్పూరు: రాజకీయంగా జన్మనిచ్చిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం.. ఇందుకు తమ ప్రతీ అడుగు ఆ దిశగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మల్కాపూర్లో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనం, చిన్నసెండ్యాలలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించే రెడ్డి కమ్యూనిటీ భవన నిర్మాణాలకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ గత పాలకుల కారణంగా నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని, ఇక నుంచి ఏడాదిలో ప్రతిపక్షాల గొంతులు మూగబోయేలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. దేవునూరుగుట్టను ఎకో టూరిజంగా మారుస్తామన్నారు. స్టేషన్ఘన్పూర్లో లెదర్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, పార్టీ నాయకులు సురేష్, యశ్వంతరెడ్డి, మల్లారెడ్డి, మామిడాల లింగా రెడ్డి, వెంకట్రెడ్డి, కె.పోషయ్య, జంగం రవి, రంజిత్రెడ్డి, లక్ష్మారెడ్డి, యాదవరెడ్డి పాల్గొన్నారు. ఎంపీ కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి -
బతుకమ్మకుంట పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్
జనగామ రూరల్ : పట్టణంలోని బతుకమ్మకుంటలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువా రం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి పనులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మకుంట అభివృద్ధి పనులకు రూ.కోటి 50 లక్షల నిధులు మంజూరయ్యాయని, పంచతంత్ర థీమ్తో అభివృద్ధి చేయాలని చెప్పారు. సుందరీకరణ నేపథ్యంలో గ్రిల్స్, వ్యాయామ పరికరాలు, చిన్నారుల ఆటస్థలం, ఆట పరికరాలు, చిన్న పార్కు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు చెరువు పూడికతీత పనులు, వాకింగ్ ఏరియా, లైటింగ్, ఫెన్సింగ్, ఒక వాటర్ ట్యాంక్ పనులు పూర్తయ్యాయని, మిగతావి త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. అకాల వర్షాల వల్ల చెరువు పూడికతీత పనులు ఆలస్యం కావడంతో సివిల్ పనులు చేసేందుకు వీలు కాలేదని పేర్కొన్నారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్కుమార్, ఏఈ మహిపాల్ పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి బచ్చన్నపేట: వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండా లి.. ఇందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపరాణి సూచించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆమె గురువారం సందర్శించారు. రికార్డులను పరిశీలించిన అనంత రం పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై సూచనలు చేశారు. డీఎల్పీఓ వెంకట్రెడ్డి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్ పాల్గొన్నారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు నర్మెట: పారిశుద్ధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు.. తడి పొడిచెత్తతో తయారు చేసిన సేంద్రియ ఎరువు పంచాయతీలకు అదనపు ఆదాయం తెచ్చిపెడుతుందని ఎస్ఎస్జీ డీసీ పి.శ్రీకృష్ణ, ఎస్బీఎం డీసీ రామగుండం కరుణా కర్ అన్నారు. మండల పరిధి బొమ్మకూర్, బొమ్మకూర్తండా, రాళ్లబాయితండాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్లు, సీసీరోడ్లు, ఇంకుడుగుంతలు తదితర అభివృద్ధి పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యదర్శి సుజాతకు పలు సూచనలు చేశారు. భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు చేపట్టాలని, వృక్షసంపదను పెంచాలని చెప్పారు. అనంతరం రాళ్లబాయితండా ఎంపీపీఎస్ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడా రు. హెచ్ఎం బిర్రు ఉప్పలయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంపాలకుర్తి: గిరిజన లబ్ధిదారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన ఉండాలని హనుమకొండ, జనగామ జిల్లాల అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ బానోతు రూపాదేవి అన్నారు. మండల పరిధిలో ఎంపిక చేసిన కొండాపురం, మైలారం గ్రామాల్లో గురువారం ఎంపీడీఓ రాములు ఆధ్వర్యాన ఏర్పా టు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎంపీఓ రవిందర్, జీపీ కార్యదర్శి యూసుఫ్, మాజీ సర్పంచ్ కిషన్, లక్పతి గుగులోతు పాటిల్, కమిటీ చైర్మన్ రామ్సింగ్, ఏఈఓ కీర్తి తదితరులు పాల్గొన్నారు. బోనస్ జమచేయాలి జనగామ రూరల్: ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యానికి సంబంధించిన బోనస్ డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందునాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చందునాయక్ మాట్లాడుతూ రైతులు పండించే దొడ్డు, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం సన్న రకానికే అమలు చేస్తోందన్నారు. జిల్లాలో రైతులకు సుమారు రూ.12 కోట్ల బోనస్ డబ్బులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. రైతులు పండించే అన్ని రకాల పంటలకు బోనస్ అమలు చేయాలని, లేదంటే తహసీల్ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించా రు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, నాయకులు కర్రె రాములు, కర్ర బీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
జనగామ రూరల్ : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా యువత పోరాడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియో గం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ, విద్యా, వైద్యం, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏఎస్పీ పండరి నితిన్ చేతన్తోపాటు పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడీ టీచ ర్లు, ఆశ వర్కర్లు, మహిళలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బస్టాండ్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంత రం ర్యాలీ కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగిస్తున్న వారి వివరాలను తెల్లకాగితంపై రాసి పోస్ట్బాక్స్లో వేయాలని, ఆచూకీ తెలిపిన వారికి బహుమతులు ఇస్తామన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, జిల్లా సంక్షేమాధికారి ఫ్లోరెన్స్, డీఎంహెచ్ ఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నా రు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యాన డీఏడబ్ల్యూఎన్ డ్రగ్ ఫ్రీ ఇండియా స్కీమ్–2025పై శామీర్పేట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల కు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాలు మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటికి బానిస కావొద్దని సూచించారు. మాదకద్రవ్యాలు అమ్మేవారు చిన్న పిల్లలను టార్గెట్ చేస్తారని అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు వివరించారు. ఏ రూపంలోనైనా మత్తు పదార్థాలు ఉండవచ్చని జాగ్రత్తగా ఉండాల ని చెప్పారు. ద్విచక్ర వాహనాలపై లిఫ్ట్ ఇస్తాను అంటే బాలికలు వెళ్లకూడదని పేర్కొన్నారు. అలాగే బాల్య వివాహాలపై మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయ సు లోపు వివాహం చేసుకోవద్దని, అలా వివాహం చేసిన వారు చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం నీరజ, భీమయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
సేంద్రియ సాగును ప్రోత్సహించాలి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: సేంద్రియ వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో ని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయంతోనే మానవ మనుగడ సాధ్యమని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేలా అవగాహన కల్పించి రైతులను ప్రొత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతీ గ్రామంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చుడాలని తెలిపా రు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్, ఏడీఏ అజ్మీరా పరశురాంనాయక్, ఏఓలు శరత్చంద్ర, దివ్య, విజయ్రెడ్డి, వీరభద్రం, రామనర్సయ్య పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం
హన్మకొండ కల్చరల్: వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి సహస్ర కలశాభిషేకోత్సవం శోభాయమానంగా జరిగింది. కుడా చెర్మన్ ఇనుగాల వెంక్రటామిరెడ్డి, దేవాలయం ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం అమ్మవారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలనం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సహస్ర కళశాభిషేకం మధ్యాహ్నం ప్రారంభమైంది. భద్రకాళి పంచమూర్తులకు, శ్రీచక్రానికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని కాళీక్రమంలో అలంకరించారు. రాత్రి కామేశ్వరీనిత్యాక్రమంలో ఆవరణార్చనలు జరిపా రు. భక్తులతో దేవాలయం కిక్కిరిసిపోయింది. భద్రకాళి శరణంమమ అంటూ జయజయధ్వానాలు చేస్తూ పులకించిపోయారు. ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ శేషు భారతి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శుక్రవారం ఉదయం కపాలినీ క్రమంలో, సాయంత్రం భగమాలినిక్రమంలో పూజలు జరపనున్నారు. శాకంబరి ఉత్సవాలు ప్రారంభం -
ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్గా రాధాకృష్ణ
స్టేషన్ఘన్పూర్: స్థానిక మున్సిపాలిటీ నూతన కమి షనర్గా బండ్ల రాధాకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీ కాజీపేట సర్కిల్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న రవీందర్ ఇక్కడ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. అయి తే.. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖలో చేపట్టిన బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీ శానిటేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాధాకృష్ణను పదోన్నతిపై ఘన్పూర్ మున్సి పల్ కమిషనర్గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో నీరు, వీధిదీపాలు, పారిశుద్ధ్య సమస్యపై ప్రత్యేకంగా పనిచేస్తానని, నూతనంగా ఏర్పడిన ఈ మున్సి పాలిటీ సమగ్రాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఆరు నెలల్లో మూడో కమిషనర్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఈ ఏడాది జనవరి 27న ఏర్పడింది. మొదటి కమిషనర్గా బాధ్యత లు స్వీకరించిన కృష్ణారెడ్డి వారం రోజుల అనంత రం హైదరాబా ద్కు బదిలీపై వెళ్లారు. కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ ఇన్చార్జ్ కమిషనర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా ప్రస్తుతం రాధాకృష్ణ పూర్తి స్థాయి కమిషనర్గా వచ్చారు. నూతన కమిషనర్కు పలువురి సన్మానం కమిషనర్ రాధాకృష్ణను కాంగ్రెస్తో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అంతకు ముందు కమిషనర్.. కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆరు నెలల్లో మూడో కమిషనర్ -
గడువు మూడురోజులే..
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) రాయితీకి ఇచ్చిన మరో అవకాశం గడువు మూడు రోజుల్లో ముగియనుంది. ప్లాట్ల యజమానుల నుంచి అనుకున్న మేర స్పందన లేకపోవడంతో 25 శాతం రాయితీ సదుపాయాన్ని ఆరోసారి ఈనెల 30వ తేదీ వరకు గడు వు పొడిగించింది. జనగామ పురపాలికలో 2020 సంవత్సరం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు 18,095 వచ్చా యి. ఇప్పటి వరకు 2,823 మంది ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకున్నారు. 1,979 దరఖా స్తులు అండర్ ప్రాసెస్లో ఉన్నారు. ఇందులో 2,823 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఎల్ఆర్ఎస్పై ఇప్పటి వరకు పురపాలికకు రూ.6.68 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోండి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం పొడిగించిన 25 శాతం రాయితీ గడువు ఈనెల 30 వరకు ఉంది. లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) ద్వారా ఫీజు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రశాంతి, టీపీఎస్, జనగామ పురపాలిక ఈనెల 30తో ముగియనున్న ఎల్ఆర్ఎస్ 25 శాతం రాయితీ.. వచ్చిన అప్లికేషన్లు 18,095.. ఆదాయం రూ.6.68కోట్లు అండర్ ప్రాసెస్లో 1,979 దరఖాస్తులు -
ఇంకెప్పడు..?
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ(ప్రీ ప్రైమరీ) విద్యను అమలు చేస్తున్నట్లు నూతన విద్యా సంవత్సరానికి ముందుగానే ప్రకటించింది. రాష్ట్రంలో వెయ్యి ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించబోతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. దీంతో ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలు, టీచర్లు ప్రభుత్వ ఉద్దేశాన్ని ‘బడి బాట’లో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ వారి పిల్లలను ప్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించుకున్నారు. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ పీఎస్లో సుమారు 40, జనగామ మండలం యశ్వంతాపూర్లో 25, పసరమడ్లలో 25, ఇతర పాఠశాలల పరిధిలో ప్రీ ప్రైమరీ అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. అయితే ఇటీవల 210 ప్రీ ప్రైమరీ పాఠశాలల సంబంధించి విడుదల చేసిన జాబితాలో జనగామ జిల్లాకు చోటు దక్కలేదు. మిగతా పాఠశాలల్లో సైతం ఈ విద్యను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై పదిహేను రోజులు గడిచిపోతున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. సర్కారు నిర్ణయంలో ఆలస్యం జరుగుతుండడంతో తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన ఉపాధ్యాయులు సందిగ్ధంలో పడిపోయారు. ప్రీ ప్రైమరీలో నేటికీ విద్యాబోధన ప్రారంభం కాకపోవడంతో కొద్ది రోజులు వేచి చూసి తమ పిల్లలను ప్రైవేట్ కిడ్స్ స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఇలా అయితే ప్రభుత్వ పాఠశాలల పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం ఒకటో తరగతి అడ్మిషన్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే మూడు ప్రీ ప్రైమరీ.. జిల్లాలో రెండేళ్ల క్రితమే సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) స్కీంలో మూడు పాఠశాలల పరిధిలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. బచ్చన్నపేట మండలం పోచన్నపేట పీఎస్(55), కొడవటూరు పీఎస్(10), బచ్చన్నపేట పీఎస్(25)లో ఈ విద్య కొనసాగుతున్నది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు గెస్ట్ ఫ్యాకల్టీగా స్థానికంగా నివసించే నిరుద్యోగుల నుంచి అర్హత ఆధారంగా ఒక టీచర్, ఆయాను నియమించారు. టీచర్కు నెలవారీ వేతనం రూ.8వేలు, ఆయాకు రూ.6వేలతో పాటు ఏడాదికి రూ.1.50లక్షల నిధులను ఎస్ఎస్ఏ ద్వారా అందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ప్రీ ప్రైమరీ స్కూళ్లను జిల్లాలో ఏర్పాటు చేస్తే సంఖ్య ఆధారంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లభిచడంతో పాటు పేద కుటుంబాల తల్లిదండ్రులపై ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం తగ్గుతుంది. అంతే కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో ఒకటో తరగతి అడ్మిషన్లు పెరగడానికి దోహదపడుతుంది. గ్రీన్ సిగ్నల్ రాగానే..జిల్లాలో ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. అయినప్పటికీ ప్రీ ప్రైమరీ స్థాయి పిల్లలను అంగన్వాడీతో పాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించి బోధన సాగిస్తున్నాం. ప్రీ ప్రైమరీ స్థాయిలో ఆశించిన మేర అడ్మిషన్లు వచ్చాయి. ఈ విద్యకు ఎక్కడా ఆటంకం లేదు. – భోజన్న, డీఈఓ మూడింట్లో నిర్వహిస్తున్నాం..బచ్చన్నపేట మండల పరిధి మూడు పాఠశాలలో రెండు సంవత్సరాలుగా ప్రీ ప్రైమరీ స్కూ ల్స్ నడిపిస్తున్నాం. ఇందులో సు మారు 90 మంది పిల్లలు ఉన్నా రు. ప్రైవేట్కు దీటుగా ఇందులో చిన్నారుల అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నాం. – బొమ్మగాని శ్రీనివాస్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ఇదీ సర్కారు ఉద్దేశం.. ప్రీ ప్రైమరీ స్కూల్ విద్యా బోధన పిల్లల అధికారిక అభ్యసనా అనుభవంలో ప్రాథమిక దశకు కీలకంగా ఉపకరిస్తుంది. మూడు నుంచి ఐదేళ్ల వయసు చిన్నారుల కోసం ఈ విద్యకు రూపకల్పన చేశారు. ప్రీ ప్రైమరీలో పిల్లలకు అభాస్యంపై ప్రేరణ కలిగించడం, వారిలోని నైపుణ్యాలను గుర్తించే అవకాశం ఉంటుంది. చిత్రలేఖనం, కథలు చెప్పడం, ఆటలు, రంగులు, ఆకారాలు, అక్షరాలు, సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహదపడుతుంది. ఐదేళ్లు నిండక ముందే పిల్లలు సహచ ర స్నేహితులు, పెద్దలతో మాట్లాడడంలో సహాయ పడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి పునాదిగా పనిచేస్తుంది. సర్కారు స్కూళ్లలో ఒకటో తరగతిలో అడ్మిషన్ల సంఖ్య పెరగడానికి అవకాశం కలుగుతుంది. -
యువజన విభాగం కీలకంగా పనిచేయాలి
జనగామ రూరల్ : పార్టీ బలోపేతంలో యువజన విభాగం కీలకంగా పనిచేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్కు ఆయనతోపాటు రాష్ట్ర ఇన్చార్జ్ ఖలీద్ హమీద్ హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్యాదవ్ ఆధ్వర్యాన వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్రాంతి, ఉపాధ్యక్షుడు చెట్కూరి కమలాకర్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ కృష్ణన్, జనగామ, స్టేషన్ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల అధ్యక్షులు కర్క సంతోష్రెడ్డి, విజయ్, రాజేష్నాయక్, ప్రకాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి -
కేంద్రం ఒరగబెట్టిందేమీ లేదు..
స్టేషన్ఘన్పూర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లుగా ఒరగబెట్టిందేమి లేదు.. కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ చేతగాని చవట దద్దమ్మలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లో రూ.2.12కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆధునిక బిగ్ కవర్ షెడ్ను బుధవారం ప్రారంభించారు. అనంత రం ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులు, మహిళ ల పక్షపాతి అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని, రైతులకు ఉచిత కరెంటుతో పాటు ఒక ఆర్థిక సంవత్సరంలోనే 25 లక్షల మందికి రూ.20,600 కోట్ల పంటరుణాలు మాఫీ చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే బీజేపీ, ఇతర రాజకీ య పార్టీలు ఒక్కసారి ఆలోచించాలని హితవు పలి కారు. మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఎవరెన్ని చవకబారు విమర్శలు చేసినా పట్టించుకునే పనిలేదని, అభివృద్ధే తమ ఎజెండా అని అన్నారు. అనంతరం ఇందిరమ్మ మైనార్టీ మహిళా పథకం ద్వారా 13 మంది క్రిష్టియన్ మైనా ర్టీ మహిళలకు కుట్టు మిషన్లు, వివిధ గ్రామాలకు చెందిన 87 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్రెడ్డి, డీఎంఓ బి.నరేంద్ర, డీఈ ఎల్లేష్, మార్కెట్ కార్యదర్శి జన్ను భాస్కర్, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఆర్డీఓ వెంకన్న, చిల్పూరు దేవస్థాన చైర్మన్ శ్రీధర్రావు, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ప్రోత్సాహం
గురువారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2025ఉద్యాన పంటల సాగుకు–8లోuసిద్ధేశ్వరుడికి లక్ష పుష్పార్చన బచ్చన్నపేట : కొడవటూర్ స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయంలో బుధవారం స్వామివారికి లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. అమావాస్య తిథి ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా అందరికీ మంచి జరగాలని ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి తెలిపారు. ఆషాఢం ముగిసిన తర్వాత శ్రావణంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డి, ఈఓ చిందం వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓం నమఃశివాయ, మహాశివుడు, సిబ్బంది నూకల లక్ష్మీకాంత్రెడ్డి. గంగం భానుప్రకాష్రెడ్డి, బండా రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వరాలయంలో ఆరుద్రోత్సవం పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బుధవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆరుద్రోత్సవం వైభవంగా నిర్వహించారు. పంచ హారతులు, కుంభహారతి, నక్షత్ర హారతి, విశేష హారతులతో గర్భాలయం దేదీప్యమానంగా వెలుగొందింది. భక్తులు తిలకించి పులకించి పోయారు. కార్యక్రమంలో ఈఓ సల్వాది మోహన్బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్.శర్మ, దేవగిరి అనిల్కుమార్, నాగరాజు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకట య్య తదితరులు పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతీ శనివారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణకు హైదరాబాద్ సౌభాగ్యపురికి చెందిన దాతలు అంచూరి హనుమంతరావు–గీత దంపతులు రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు బుధవారం ఆలయానికి చేరుకున్న వారు ప్రత్యేక పూజల అనంతరం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ఈఓ లక్ష్మీప్రసన్న కు విరాళం అందజేశారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక రఘునాథపల్లి: జాతీయ స్థాయి కబడ్డీ చాంపియన్ షిప్–2025(అండర్–19 బాలుర, బాలికల) పోటీలకు జిల్లా నుంచి యూ.సంతోష, జశ్వంత్ ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి వై.కుమార్గౌడ్, గట్టయ్య, ఉప్పల య్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లో ఈనెల 28 నుంచి ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. అంకితభావంతో సేవలందించాలి కొడకండ్ల : వైద్యులు, సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్ అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించా రు. ఓపీ, స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల విషయమై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం లక్ష్మక్కపల్లి సబ్సెంట ర్ను సందర్శించిన డీఎంహెచ్ఓ.. ఇమ్యునైజేష న్ కార్యక్రమాన్ని పరిశీలించారు. వైద్యాధికారి హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ● పండ్లు, కూరగాయ తోటలకు సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు ● ఉచితంగా కూరగాయల నారు ● పూల తోటలకు 40, నీటి గుంటలకు 75శాతం రాయితీ ● 2025–26 ఆర్థిక సంవత్సరం రూ.48.80 లక్షల బడ్జెట్ఆయిల్పాం పంట సాగును పరిశీలిస్తున్న కలెక్టర్ రిజ్వాన్ బాషాజనగామ రూరల్: జిల్లాలో వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పాంతో పాటు పండ్లు, కూరగాయల తోటల పెంపకమే లక్ష్యంగా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ ముందుకు వెళ్తోంది. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై అవగాహన కల్పిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 3,500 ఎకరాల్లో ఆయిల్పాం సాగు లక్ష్యంగా అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తున్నారు. పండ్ల తోటల సాగు, సబ్సిడీపై నీటి కుంటల నిర్మాణం, యాంత్రీకరణ పనిముట్లు అందివ్వడానికి బడ్జెట్ కేటాయించారు. పెరుగుతున్న ఆయిల్పాం సాగు జిల్లాలో 2021 నుంచి 2025 మార్చి వరకు ఆయిల్పాం సాగు 6,963 ఎకరాల్లో చేయగా.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 3,500 ఎకరాలుగా టార్గెట్ పెట్టుకుంది. కాగా 2వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించగా, ఇప్పటి వరకు 98 ఎకరాలకు మొక్కలు పంపిణీ చేశారు. ఒక్కో మొక్కకు రూ.193 సబ్సిడీ ఇవ్వగా, రైతు రూ.20 భాగస్వామ్యంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ఆయిల్పాం దిగుబడి 3వేల ఎకరాల్లో 18వేల టన్నులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 29 మంది రైతులు 227 మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించారు. పండ్ల తోటల సాగుకు సబ్సిడీ జిల్లాలో మామిడి, నిమ్మ, జామ, సీతాఫలం, బొప్పాయ, అరటి, డ్రాగన్, అవకాడో తదితర పండ్ల తోటలు 146.50 ఎకరాల్లో సాగు లక్ష్యంగా రూ.48.80లక్షల బడ్జెట్ కేటాయించారు. రెండు సంవత్సరాల పాటు రూ.32వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీ ఇవ్వనున్నారు. 12.5 ఎకరాల్లో బంతి, చామంతి, మల్లె, లోకల్ గులాబీ యూనిట్ ధర రూ.20వేలు నిర్ణయించగా.. 40 శాతంతో రూ.8వేల సబ్సిడీ ఉంది. దుంప జాతిరకంలో 5.5 ఎకరాల్లో లిల్లీ, జర్బెర, గ్లాడియోలస్ రకానికి చెందిన పూలతోటలసాగుకు యూనిట్ ధర రూ.లక్ష కాగా.. ఇందులో రూ.40వేల రాయితీ లభిస్తుంది. అలాగే ఎకరా టమాటా, వంకాయ కూరగాయల తోటలకు రూ.8వేలు, పచ్చి మిర్చికి 6,400 మొక్కలు ఉచితంగా ఇవ్వనున్నారు. మొత్తంగా 85 ఎకరాల టార్గెట్తో రైతులను ప్రోత్సహిస్తున్నారు. అంటుకట్టిన కూరగాయల సాగు కు సంబంధించి 20 ఎకరాలు లక్ష్యం పెట్టుకు ని ఎకరాకు 2వేల వంగ మొక్కలు ఇస్తారు. ఇందుకు రైతు తన వాటాగా రూ.5వేలు డీడీ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. మామిడి తోటల పునరుద్ధరణ జిల్లాలో 20 ఎకరాల్లో పాత మామిడి తోటల పునరుద్ధరణకు ఒక్కో యూనిట్ రూ.24వేల చొప్పున 40శాతం(రూ.9,600)తో రాయితీ ఇస్తున్నారు. అలాగే 6 యూనిట్ల నీటి గుంటల(ఫాంపాండ్స్) నిర్మాణానికి ఒక్కో యూనిట్ ధర రూ.1.50లక్షల చొప్పున నిర్ణయించి 75శాతం(రూ.75వేలు) సబ్సిడీ ఇస్తారు. మల్చింగ్ విధానంతో కూరగా యల సాగుకు 2.50 ఎకరాలకు యూనిట్(ఎకరాకు) రూ.1,600 ధరతో రూ.8వేల సబ్సిడీ ప్రకటించారు. మిర్చి ఎండ బెట్టేందుకు 70 కేజీల సామర్థ్యంతో 36 యూనిట్ల సోలార్ డ్రయ్యర్లను ఒక్కో యూనిట్కు రూ.2.50లక్షల ధర ఉంది. ఇందులో జనరల్ వారికి 40శాతంతో రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీలకు 55 శాతంతో రూ.1.37లక్షల సబ్సిడీ ఇస్తున్నా రు. 8 నుంచి 11 హెచ్పీ పవర్ టిల్లర్లు 6 మంజూరు చేశారు. సన్న, చిన్న కారు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40శాతం సబ్సిడీ ఉంది. 9 పవర్ టిల్లర్లు మంజూరుకాగా.. చిన్న, సన్న, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40 శాతం రాయితీతో ఇస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 బ్రష్ కటర్లు మంజూరు కాగా, ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న, మహిళా రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40శాతం, 10 స్ప్రేయర్ పంపులకు గాను ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న, మహిళా రైతులకు 50శాతం, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆయిల్పాం సాగుపై దృష్టిజిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరం 3,500 ఎకరాల్లో ఆయిల్పాం సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 2వేల ఎకరాలు గుర్తించి 98 ఎకరా లకు మొక్కలు అందించాం. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాన్ని రైతులకు వివరిస్తున్నాం. తోటల సాగుకు ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తుతో పాటు భూమి పాస్బుక్కు నకలు, ఆధార్, బ్యాంకు ఖాతా బుక్కు, పాస్ఫొటో జత చేసి సంబంధిత ఉద్యానవన అధికారులకు అందించాలి. ఓసీ లేదా ఇతర రైతులకు 50శాతం, బీసీలకు 29శాతం, ఎస్సీ రైతులకు 15శాతం, ఎస్టీలకు 6 శాతంతో రిజర్వేషన్ల ఆధారంగా రాయితీపై మొక్కలు, తోటల సాగుకు సంబంధించి మంజూరు చేస్తాం. దరఖాస్తులు రాగానే కలెక్టర్కు పంపిస్తాం. అనంతరం సదరు అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన తర్వాత రాయితీకి ఆర్థిక పరమైన అనుమతులు పొందుతాం. – బి.శ్రీధర్రావు, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిపండ్ల తోటల పెంపకం, సబ్సిడీ వివరాలు (2025–26 సంవత్సరం ఎకరాల్లో..)● కలెక్టర్ రిజ్వాన్ బాషా న్యూస్రీల్పంట లక్ష్యం యూనిట్ ధర రాయితీ(40శాతం) మామిడి 65 రూ.80వేలు రూ.32వేలు నిమ్మ 7.50 రూ.80వేలు రూ.32వేలు జామ 10.00 రూ.80వేలు రూ.32వేలు సీతాఫలం 2.50 రూ.30వేలు రూ.12వేలు బొప్పాయి 20.00 రూ.30వేలు రూ.12వేలు డ్రాగన్ 9.00 రూ.2.70లక్షలు రూ.1.08లక్షలు అరటి 25.00 రూ.70వేలు రూ.28వేలు అవకాడో 7.50 రూ.50వేలు రూ.20వేలుఈ పంటల సాగుకు రెండు సంవత్సరాల పాటు రాయితీ ఇస్తారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తుతో పాటు మొక్కలు, ఎరువు, పురుగు మందుల బిల్లులు జత పరిచి హార్టికల్చర్ అధికారులకు అందజేయాలి. -
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
పాలకుర్తిటౌన్/కొడకండ్ల/జఫర్గఢ్: పోలీస్స్టేషన్ వచ్చి బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ అన్నారు. బుధవారం పాలకుర్తి, కొడకండ్ల, జఫర్గఢ్ పోలీస్సేష్టన్లను సందర్శించిన ఆయన పరిసరాలు, రికార్డులు, రిసెప్ష్షన్, లాకప్, మెన్ బ్యారక్ పరిశీలించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ వెస్ట్జోన్ వర్ధన్నపేట డివిజన్ పరిధి పోలీస్స్టేషన్ల అధికారుల పని తీరును పరిశీలించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని సత్వరమే నాయ్యం చేసేలా చర్యల తీసుకోవా లని ఆదేశించారు. అసాంఘిక చర్యలకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరించారు. ఆయన వెంట జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐలు జానకీరామ్రెడ్డి, శ్రీనివాస్రావు, ఎస్సైలు వపన్కుమార్, లింగారెడ్డి, యాకూబ్రెడ్డి, చింత రాజు, రామ్చరణ్ తదితరులు పాల్గొన్నారు. అంత కు ముందు శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న సీపీ.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనను అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానించి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్.శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగం నాగరాజు పాల్గొన్నారు. వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ -
జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం
జనగామ రూరల్: జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.. వివిధ శాఖల ద్వారా భూగర్భ జలాల సంరక్షణకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ‘జలశక్తి అభియాన్’ కింద నేషన ల్ వాటర్ అవార్డ్స్–2024 కోసం కేంద్రం నుంచి అధ్యయన కమిటీ సభ్యులు కేంద్ర భూగర్భ జల శాఖ సైంటిస్ట్ డాక్టర్ ఎమ్.సుధీర్కుమార్, భూగర్భ జల కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ చరణ్ బుధవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ జిల్లాలో భూగర్భజల వనరుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అశ్వరావుపల్లి, చీటకో డూరు, స్టేషన్ఘనపూర్ రిజర్వాయర్ల సామర్థ్యం, సాగు, తాగు నీటి వినియోగం గురించి తెలియజేశా రు. ఉద్యానవన పంటల సాగుకు నీటి సంరక్షణలో భాగంగా స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాల వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదిలా ఉండగా.. చేపల పెంపకం వలన సుమారు 80వేల మంది మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారని, చేపలను ఎగుమతి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, నీటిపారుదల ఎస్ఈ సుధీర్, వ్యవసాయం, ఫిషరీస్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. తాటికొండలో జలశక్తి బృందం స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామంలోని వాటర్షెడ్ పథకం కింద చేపట్టిన పనులను కలెక్టర్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి కేంద్ర జలశక్తి బృందం బాధ్యులు బుధవారం పరిశీలించారు. ముందుగా తాటికొండ రైతువేదికలో మహిళా సంఘం సభ్యులతో సమావేశమై తాగునీటి సరఫరా గురించి తెలు సుకున్నారు. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామ ని, ప్రస్తుతం వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టి ఇంటింటికీ నీరు ఇస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం గురించి అడగ్గా.. గతంలో దిగుబడి అంతంత మాత్రమే ఉండేదని, ప్రస్తుతం భూగర్భ జలాలు పెరిగి పంటల సాగు లాభసాటిగా ఉందన్నారు. ఘన్పూర్ రిజర్వాయర్ నిర్మాణంతో భూగర్భ జలా లు పెరిగి ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించా రు. తాటికొండ అటవీ ప్రాంతంలో గుట్టల పైనుంచి పడుతున్న వర్షపునీరు భూమిలోకి ఇంకడానికి కందకాలను అంచలంచెలుగా నిర్మించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, డీఏఓ రామారావునాయక్, మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్, అదనపు డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, పంచా యతీ సెక్రటరీ సత్యనారాయణ పాల్గొన్నారు. పర్యావరణంపై అవగాహన అవసరం జనగామ రూరల్: విద్యార్థులకు పర్యావరణపై అవగాహన అవసరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. నేషనల్ గ్రీన్ కోర్ తయారుచేసిన నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ పోస్టర్ను బుధవారం కలెక్టరేట్లో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘హరిత్ ద వే ఆఫ్ లైఫ్’ అనే థీమ్పై దేశవ్యాప్తంగా 1వ తరగతి నుంచి పరిశోధన విద్యార్థుల వరకు ఐదు విభాగాల్లో నిర్వహించే ఈ పోటీకి జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందని, ఎకో మిత్రమ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. హిందీ, ఇంగ్లిష్ మరిన్ని భాషల్లో క్విజ్ ఉంటుందని, విద్యార్థులతోపాటు సామాన్య పౌరులు కూడా పాల్గొనవచ్చని వివరించారు. పోటీలో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి వెంటనే ఇ–సర్టిఫికెట్ లభిస్తుందని విద్యా సంస్థలకూ ప్రత్యేక గుర్తింపు ఇస్తారని తెలిపారు. మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్జీసీ కోఆర్డినేటర్ గౌసియా బేగం, ఏఎంఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో అగ్రగామిగా నిలపాలి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ(ఎస్ఎస్జీ)–2025లో జిల్లాను అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. కలెక్టరేట్లో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఎం, ఏపీఓ, పంచాయితీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు బాగుండాలని చెప్పారు. గ్రామానికి 20 చొప్పున ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. డీపీఓ స్వరూప, డీఎల్పీఓ వెంకట్రెడ్డి, కర్ణాకర్ పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
● ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లవకుమార్ రఘునాథపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ అన్నారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ల ఆధ్వర్యంలో మండలంలోని వెల్ది మోడల్ స్కూల్ను సందర్శించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లవకుమార్ మాట్లాడుతూ మోడల్ స్కూల్లో మరమ్మతుకు నోచుకోని వాటర్ ప్యూరిఫయర్ను అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు చెల్లించాలని, వర్షాకాలం నేపధ్యంలో పాఠశాలల ఆవరణలో గడ్డి తొలగించి శుభ్రం చేయాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి, పూర్తిస్థాయిలో పుస్తకాలు అందించాలన్నారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు ఉదయ్, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆర్య, శివకృష్ణ, అరుణ్, సామరాజు తదితరులు ఉన్నారు. -
డ్రగ్స్ రహిత కమిషనరేటే లక్ష్యం
● సీపీ సన్ప్రీత్సింగ్ వరంగల్ క్రైం: డ్రగ్స్ రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్పోస్టర్లను మంగళవారం సీపీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను సమాజం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో డ్రగ్స్పై అవగాహన కల్పించడంతో పాటు, ర్యాలీలు, డ్రాయింగ్, వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా 87125 84473 నంబ ర్లో సమాచారం అందించాలని సూచించారు. కా ర్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం
జనగామ రూరల్: జిల్లా కేంద్రం స్థానిక ధర్మకంచలో జెడ్పీహెచ్ఓస్ బాయ్స్ హైస్కూల్లో సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు డీఈఓ భోజన్న పాల్గొని మాట్లాడుతూ క్రీడాస్ఫూర్తితో పోటీలు విజయవంతం చేయాలన్నారు. విద్యార్థులు డ్రగ్స్ వాడకుండా అవగాహన కల్పించాలన్నారు. డీడబ్ల్యూఓ ఫోరెన్స్, మంగళంపల్లి రాజు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకట్ రెడ్డి, ఎస్ఓ శ్రీనివాస్, సభ్యులు కౌశిక్, నల్ల రాహుల్ ప్రవీణ్, ఆసర్ల సుభాష్, నరసింహ, వెంపటి అజయ్, చిటుకుల అశోక్, దేశ్ పాండే సంస్థ ప్రతినిధులు చిన్న రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
రైతుల ఆనందమే ప్రభుత్వ ధ్యేయం
లింగాలఘణపురం: రైతు కళ్లల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ ధ్యేయమని, కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్ల రైతుభరోసాను వారి ఖాతాల్లో జమ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని బండ్లగూడెం రైతువేదికలో సీఎంతో ముఖాముఖి కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఏఓ రామారావునాయక్, రైతులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపు 25లక్షల మందికి రూ.21వేలకోట్ల రుణమాఫీ, సన్నాలకు బోనస్ అందించామన్నారు. రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ప్రతీహామీని అమలు చేసి ప్రజలకు మేలు చేయడం కోసమే సీఎం రేవంత్రెడ్డి పని చేస్తున్నారని, రైతుభరోసా అందజేసి రైతులకు పెట్టుబడిగా అందించిన సందర్భంగా నియోజకవర్గ ప్రజల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 9 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఏఓ వెంకటేశ్వర్లు, ఏఈఓలు స్పందన, శ్రీనివాసు, జనగామ మార్కెట్ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివకుమార్, మార్కెట్ డైరెక్టర్లు మోహన్, శ్రీలతారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీశైలం, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి, నాయకులు దిలీప్రెడ్డి, నాగేందర్, గణపతి, సంపత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లాలోని రైతువేదికల్లో సీఎంతో ముఖాముఖి -
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
జనగామ రూరల్: ప్రజల భాగస్వామ్యంతో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై మంత్రి కొండా సురేఖతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతీ ఇంటికి మొక్కలు అందించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఆయా గ్రామాల్లో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. అలాగే జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ వీసీలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జల సంరక్షణ అందరి బాధ్యత భూగర్భ జల సంరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. తక్కువ ఖర్చుతో ఇంకుడుగుంతల నిర్మాణం, మ్యాజిక్ సోక్ పిట్స్, ఫారమ్ పాండ్ నిర్మాణాలకు సంబంధించిన పోస్టర్ని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి కలెక్టరెట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కలెక్టరేట్లో ఇంకుడుగుంత నిర్మాణం ప్రారంభించారు. భూగర్భ జలసంరక్షణకు సహకరించాలన్నారు. ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి కావాలి దేవాదుల ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి కావా లని స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అ న్నారు. మంగళవారం దేవాదుల ఎత్తిపోతల పనుల ప్రగతిపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ అశ్వరావుపల్లి కుడి ప్రధాన కాల్వ పనులను నెల రోజులలో పూర్తి చేయాలన్నారు. పంపింగ్లో ఎలాంటి సమస్యలు లేకుండా ముందుగానే రిజర్వాయర్లు నింపి పెట్టుకోవాలన్నారు. ధర్మసాగర్ నుంచి నీటి డిస్ట్రిబ్యూషన్పై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ధర్మసాగర్, ఘన్పూర్, నవాబ్పేట, అశ్వరావుపల్లి రిజర్వాయర్లను 20 రోజుల్లో నింపాలని, ధర్మసాగర్ నార్త్, సౌత్ కెనాల్స్ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు చేరాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సీఈ అశోక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇరిగేషన్ శాఖ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. వీసీలో సీఎస్ రామకృష్ణారావు -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి
● జిల్లా గిరిజన సహాయ అధికారి రూపాదేవి పాలకుర్తి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన ఉండాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సహాయ అధికారి రూపాదేవి అన్నారు. మంగళవారం మండలంలోని కొండాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలుపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. రేషన్ కార్డులు, కుల ధృవీకరణ, కిసాన్ పథకాలు, బ్యాంకు అకౌంట్, పెన్షన్లు, ప్రధాన మంత్రి జనశ్రీ బీమా యోజన తదితర పథకాలపై అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు, పశువైద్యాధికారి అశోక్ రెడ్డి, ఏపీఓ మంజుల, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాకేష్, గణేశ్, మహేష్, సిద్దారెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు. -
శ్యామాప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలి
జనగామ రూరల్: నేటి యువత డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జి ల్లా అధ్యక్షుడు చౌడ రమేశ్ అన్నారు. మంగళవారం జనగామ పట్టణంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలి దాన్ దివాస్ పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం ‘ఒక మొక్క–అమ్మ పేరు మీద’ అనే కార్యక్రమంలో భాగంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కత్తుల లక్ష్మి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హాజరై మాట్లాడుతూప్రతిఒక్కరూ మొక్కలు నాటా ల న్నారు. కార్యక్రమంలో శివరాజ్ యాదవ్, ఎల్ల య్య, అనిల్, నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులకు దరఖాస్తుల వెల్లువ
14 1,510లింగాల ఘణపురం20 1,044జనగామ బచ్చన్నపేట 23 2,504దేవరుప్పుల 13 1,00308 1,151రెవెన్యూ సదస్సులో దరఖాస్తును పరిశీలిస్తున్న కలెక్టర్ రిజ్వాన్బాషా (ఫైల్)మండలాల వారీగా దరఖాస్తులు● భూ భారతిలో లేని ఆప్షన్లకే ఎక్కువ వినతులు●● ఇప్పటికే ఆన్లైన్ ప్రక్రియ షురూ ● సత్వర పరిష్కారానికి అధికారుల చర్యలు08 1,013నర్మెట తరిగొప్పుల గ్రామాలు దరఖాస్తులుజనగామ రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. పైలట్ ప్రాజెక్టుగా స్టేషన్ఘన్పూర్ మండలంలో దరఖాస్తుల స్వీకరణ విజయవంతం కావడంతో ఈ నెల 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు. 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతుల నుంచి వివిధ సమస్యలపై 18,929 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల సత్వర పరిష్కారానికి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. సదస్సులు ముగిసిన రోజు నుంచే ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించగా, మండల స్థాయిలో పరిష్కారానికి నోచుకోని దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపించనున్నారు. తహసీల్దార్కు కీలక బాధ్యతలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా ధరణి పోర్టల్ను తీసుకువచ్చింది. కానీ ధరణి ఆప్షన్లో తహసీల్దార్, ఆర్డీఓ, ఏసీ కోర్టు లేకపోవడం క్షేత్ర స్థాయి నుంచి కాకుండా కలెక్టర్కు హక్కులను కల్పించడంతో రైతుల కొంత మేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి ధరణి స్థానంలో భూ భారతి తీసుకువచ్చారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో తహసీల్దార్ నుంచి ఆర్డీఓలకు కీలక బాధ్యతలను అప్పగిస్తూ ఈ పోర్టల్కు రూపకల్పన చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు చిన్న చిన్న సాంకేతిక సమస్యలు కూడా ఉండకూడదనే ఉద్దేశ్యంతో మొదటగా పైలట్ గ్రామాలను ఎంపిక చేసి భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. పైలట్ గ్రామాల్లో విజయవంతం కావడంతో అన్ని గ్రామాల్లో అమలు చేశారు. ఒక్కో గ్రామంలో దరఖాస్తులు అధిక సంఖ్యలో రావడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆప్షన్లు లేని వాటికే ఎక్కువ.. జిల్లాలోని 176 రెవెన్యూ గ్రామాల పరిధిలో భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఇందులో 18,929 మంది రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. 17 మాడ్యూల్స్కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరుగగా, అత్యధికంగా ఇందులో లేని ఆప్షన్లకు 8,512 దరఖాస్తులు రావడం గమనార్హం. మిస్సింగ్ సర్వే నంబర్ 2,959, పెండింగ్ మ్యుటేషన్ (కోర్టు ఆర్డర్స్) 1,583, డీఎస్ పెండింగ్ (డిజిటల్ సైన్) 291, ఎక్స్టెంట్ 1,580, పట్టాదార్ పాస్ బుక్కులో నేమ్ చేంజ్ 142, ప్రొహిబిటెడ్ నుంచి డిలీషన్ 163, అసైండ్ ల్యాండ్ ఇష్యూస్ 388 దరఖాస్తులు వచ్చాయి. భూములను హోల్డింగ్లో ఉంచడం, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, వారసత్వం, అసైన్డ్, ఓఆర్సీ, 38–ఇ, భూ యజమాని తండ్రి పేరు, కులం, ఆధార్ నంబర్ల తప్పులు, మ్యుటేషఫన్, డిజిటల్ సంతకం, పట్టాదార్ పుస్తకాల్లో భూములు ఎక్కలేదని దరఖాస్తుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులను స్వీకరించే సమయంలో రోజు వారీగా కలెక్టర్కు నివేదించారు. కలెక్టర్ వాటిని పరిశీలన చేసి నివేదిక రూపంలో సీసీఎల్ఏకు పంపించారు. కలెక్టర్ పర్యవేక్షణలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ ఆధ్వర్యంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న ఆధ్వర్యంలో తహసీల్దార్లు రెవెన్యూ సదస్సులను విజయవంతంగా ముగించారు. రఘునాథపల్లి19 3,535చిల్పూరు12 66613 1,062స్టేషన్ఘన్పూర్16 850జఫర్గఢ్●పాలకుర్తి21 3,619కొడకండ్ల 09 972మొత్తం 176 18,929 -
ప్రైవేటీకరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
● రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందునాయక్ జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ల ప్రైవేటీకరణ చేయాలని తీసుకువచ్చిన ముసాయిదా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్బాషాకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో 2014 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు అమలు చేయడంలేదన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం తమ ఆలోచనను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాబోయో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, నాయకులు నక్క యాకయ్య, నక్క సారయ్య, మహిళా నాయకురాలు రాపర్తి రజిత పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్కు ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులా ల అభివృద్ధి అధికారి బి.విక్రమ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలని, డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ అభ్యర్థులు జూలై 7వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
డయేరియాపై అవగాహన కల్పించాలి
జనగామ రూరల్: డయేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో డయేరియా క్యాంపెయిన్– 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 31వ తేదీ వరకు చేపడుతున్న డయేరియా ప్రచారం విస్తృతంగా చేపట్టాలని, ప్రతిఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలు, సబ్ సెంటర్లు, పీహెచ్సీల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు ఓఆర్ఎస్ తాగించాలని, జింక్ టాబ్లెట్లు వాడాలన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక యాత్ర.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి విహారయాత్ర ప్యాకేజీని రూపొందించిన ప్రత్యేక యాత్ర పోస్టర్ను కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ స్వాతితో కలిసి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ప్రత్యేక యాత్ర ప్రదేశాలు చూడాలనుకునే వారికి ఐదు రూట్లో ప్రయాణించేందుకు ప్రత్యేక విహార యాత్ర టూర్ ప్యాకేజీ అవకాశం కల్పించిందన్నారు. రూట్ –1లో రంగాపురం, బీచుపల్లి, జోగులాంబ యాత్రకు పెద్దలకు రూ.1100, పిల్లలకు రూ.600, రూట్–2లో పర్ణశాల, భద్రాచలం, కిన్నెరసాని డ్యాం, మల్లూరు, బొగత, మేడారం, రామప్ప, లక్నవరం ఉందని, పెద్దలకు రూ.1300, పిల్లలకు రూ. 700 చార్జీ కేటాయించినట్లు తెలిపారు. ఇలా రూట్ –3, 4, 5లో కూడా వివిధ ప్రదేశాలు ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 7382852923, 7382852818, 9948164847, 7981951562 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎండీ హుస్సేన్, ఎస్ఎం ఎం. సమ్మయ్య, సూపరింటెండెంట్ వై.యాదమణిరావు, ఎం ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ క్రీడా సంబురాల పోస్టర్ ఆవిష్కరణ సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో తెలంగాణ క్రీడా సంబురాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ క్రీడలో గెలుపొందిన వారు మొదటి బహుమతిగా రూ.లక్ష పొందవచ్చన్నారు. యువత చెడు మార్గాన్ని వీడి, సన్మార్గంలో పయనించాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
క్రీడల్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలి
జనగామ రూరల్: యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్ కోరారు. సోమవారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉదయం నెహ్రూ పార్క్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఒలింపిక్ రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. దేశంలో క్రీడలు, క్రీడాకారులకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఈ విషయాన్ని యువత గుర్తించి క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకట్రెడ్డి, సాయిచంద్ర ఫౌండేషన్ చైర్మన్ ఇరుగు సిద్దులు, బి.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
నిర్మాణాలు సాగేదెలా?
లింగాలఘణపురం: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సాగెదెలా? అంటూ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఒక్కసారిగా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో ఇన్నాళ్లు వేచి చూసిన వ్యాపారస్తులు ఒకేసారి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఽఇసుక నుంచి మొదలుకొని సిమెంట్, స్టీలు, మేసీ్త్రల రేటు, కూలీల ధరలు పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో ఇల్లు నిర్మాణం పూర్తయ్యేనా అంటూ ఆందోళనలో పడుతున్నారు. మండలంలో మొదటి విడతగా పైలెట్ ప్రాజెక్టుగా కొత్తపల్లిలో 35 ఇళ్లు మంజూరు చేయగా రెండో విడతగా 20 పంచాయతీల్లో 370 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే 200లకు పైగా ఇళ్లను ఆయా గ్రామాల్లో మాజీ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు అట్టహాసంగా ముగ్గులు పోసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరలు ఇలా.. 400 స్క్వేర్ ఫీట్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకుంటే పునాదికి రూ.19,000, సిమెంట్ రూ.42,000, స్టీలు 800 కిలోలకు రూ.45,000, 20 ఎంఎం కంకర 4 ట్రాక్టర్లకు రూ.14,000, 40 ఎంఎం కంకర 2 ట్రాక్టర్లకు రూ.5,000, ఇసుక రవాణా చార్జీలు 8 ట్రాక్టర్లకు రూ.8,000, పునాది రాయికి 3 ట్రాక్టర్లకు, మేసీ్త్ర చార్జీలు రూ.49,000, సిమెంట్ ఇటుకల గోడ నిర్మాణానికి రూ.1,10,200, ఆర్సీసీ దర్వాజలు, కిటికీలకు (బెండ్లు) రూ.17,000, తలుపులు, కిటికీలకు (డోర్స్) రూ.23,000, స్లాబు సెంట్రింగ్ చార్జీలు రూ.27,000, గోవ చార్జీలు రూ.13,000, కాంక్రీట్ మిల్లర్ కిరాయి, ప్లాస్టరింగ్కు రూ.34,000, ఇళ్లు పూర్తైన అనంతరం కరెంట్, శానిటరీ, నీటి సరఫరా, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.66,000, కలరింగ్కు రూ.5,000 ఇలా రూ.5 లక్షలతో 400 స్క్వేర్ ఫీట్లలో ఇల్లు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం ధరలను నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో మరోలా.. ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసేందుకు మేసీ్త్రల రేటు రూ.1,35,000 లక్షలు నిర్ణయించగా ఒక్కొక్క గ్రామంలో ఒక్కోవిధంగా కొనసాగుతుంది. అందులో స్క్వేర్ ఫీటు రూ.350 నుంచి రూ.450 వరకు ఉంది. ఇసుక ట్రిప్పు రవాణా చార్జీలతో కలిపి రూ.4,500, 20 ఎంఎం కంకర రూ.3,000, 40 ఎంఎం కంకర రూ.3,500, సిమెంట్ సాధారణ రకం బస్తాకు రూ.300, స్టీలు క్వింటాకు సాధారణ రకం రూ.5,600 ఇలా ప్రతీ మెటీరియల్కు ధరలు పెరిగిపోయాయి. పిల్లర్లు రంద్రాలు తీసేందుకు జేసీబీతో ఒకదానికి రూ.800, కూలీలైతే రూ.1,200 వరకు చెల్లించాల్సి వస్తుంది. మండల స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ధరల నియంత్రణకు ఉన్న కమిటీ చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యేనా? ధరల నియంత్రణ చేసేదెవరు..? మెటీరియల్కు పెరిగిన ధరలు మేసీ్త్ర, కూలీలకు ఒక్కొక్కచోట ఒక్కో రేటు లబోదిబోమంటున్న లబ్ధిదారులు! -
విద్యార్థులు లక్ష్యాలు ఎంచుకోవాలి
● డీఈఓ భోజన్న బచ్చన్నపేట: ప్రతీ విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని చదవాలని జిల్లా విద్యాధికారి భోజన్న అన్నారు. సోమవారం మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలోని సెకండరీ పాఠశాలలో ఆదిరెడ్డి అకాడమీ చైర్మన్, కల్నల్ సి.నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో ఉత్తమ మార్కులు వచ్చిన విద్యార్థులకు బహుమతులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి ప్రోత్సాహంతో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఇర్రి వెంకట్రెడ్డి, ప్రధానోపాధ్యాయులు విజయ, బాలకిషన్రావు, సుధాకర్, ఇంద్రసేనారెడ్డి, మధుకర్రెడ్డి, ఇన్చార్జ్ గొట్టె కనుకయ్య, టీచర్లు లక్ష్మి, పావని, యాదగిరి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు. -
మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి●
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు రఘునాథపల్లి: మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ జీపీ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉమ్మగోని రాజేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు రెండు నెలలుగా నిలిచిపోయిన వేతనాలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించాలని, ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేయాలన్నారు. జీఓ 51ని సవరించాలని, కారోబార్లను బిల్ కలెక్టర్లుగా ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని రూ.15 లక్షలకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్కు అందజేశారు. ఈ సమావేశంలో జీపీ యూనియన్ నాయకులు సత్యనారాయణ, కొయ్యడ భిక్షపతి, రాపోలు రాజ్కుమార్, ఎండీ అజ్మత్, నల్ల రాజయ్య, నాగేష్, రాములు, తదితరులు పాల్గొన్నారు. -
పరిష్కారమేది..?
చెప్పులరిగేలా తిరుగుతున్నం.. సమస్యలు పరిష్కరించండి..జనగామ రూరల్: కన్న కొడుకులు తిండి పెట్టడం లేదని, అక్రమంగా భూమిని పట్టా చేసుకున్నారని, ఏళ్ల తరబడి సాగు చేస్తున్నా.. రైతు భరోసా పడడం లేదని, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని.. ఇలా పలు సమస్యలతో ప్రజలు సోమవారం గ్రీవెన్సెల్కు వచ్చారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా వినతులు స్వీకరించారు. మొత్తం 74 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రగతి సాధించాలి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రగతి సాధించాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజాసమస్యలు సత్వరమే పరిష్కరించాలన్నారు. భూ భారతి కింద స్వీకరించిన దరఖాస్తులను వందశాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయని.. ఫర్టిలైజర్స్ కోసం రైతులు షాపులకు వస్తున్నందున.. నకిలీ విత్తనాల అమ్మకం జరగకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంత్ నాయక్, జనగామ, స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓలు గోపిరామ్, డి.ఎస్.వెంకన్న, డీఆర్డీఓ వసంత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు కొన్ని ఇలా ● రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి గ్రామానికి చెందిన సరగండ్ల రంజిత్ తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ దగ్గర ఉండి పదవ తరగతి వరకు చదువుకున్నానని, నానమ్మ కూడా ఇటీవల చనిపోవడంతో ఒంటరివాడిగా మిగిలానని, ఉన్నత విద్య చదివేందుకు అవకాశం కల్పించాలని విన్నవించాడు. ● నర్మెట మండలం సూర్యబండతండాకు చెందిన కేలోత్ అనిత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● జనగామలోని రైతులకు వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానం అవసరముందని, అందుకు నూతన వంగడాలపై అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు యాదగిరి, రామకృష్ణ, భూక్య చందు నాయక్ వినతి అందించారు. ● మున్సిపాలిటీలో హనుమకొండ రోడ్లోని సర్వే నెంబర్56 వెంచర్పై కోర్టు కేసు కొట్టివేశారని, ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతించాలని సొసైటీ అధ్యక్షుడు నానాజీ, ఇండ్ల పట్టాదారులు వీర్ రెడ్డి, నరసమ్మ తదితరులు విజ్ఞప్తి చేశారు. ● రఘునాథపల్లి మాజీ సర్పంచ్ పోకల శివకుమార్, సామాజిక కార్యకర్త ఠాకూర్గణేష్సింగ్లు అక్రమ నిర్మాణం, ఇసుక మాఫియాపై ఒకరిపైఒక్కరు ఫిర్యాదు చేసుకున్నారు. ● తమ్మడపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రజిత 20 ఏళ్ల నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నానని, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంది. గ్రీవెన్స్లో బాధితుల మొర ప్రజావాణిలో 74 అర్జీలు సమస్యలను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా అక్రమంగా పట్టా చేసుకున్నారు కోడూర్ గ్రామంలో సర్వేనంబర్ 181.1లో 4.20 ఎకరాలు, 181/2లో 4.20 ఎకరాల భూమి ఉంది. 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నాం. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమిని 2015లో అక్రమంగా పట్టా చేసుకోవడానికి ప్రయత్నించగా అడ్డుకోగా తమకు తెలవకుండా ఆన్లైన్లో అనుభవదారులో పేరు నమోదు చేసుకున్నారు. విచారణ చేసి ఆ భూమిపై పట్టా పాస్ బుక్ ఇవ్వాలని కోడూర్ గ్రామ రైతులు వేడుకున్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
జనగామ రూరల్: నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్కుమార్ అన్నారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డు, నెహ్రూపార్క్, బస్టాండ్ రోడ్డులోని వివిధ మటన్ షాపులు, చికెన్ షాపులను, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేశారు. ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్సు తీసుకొని వ్యాపారం చేసుకోవాలన్నారు. అనుమతులు లేని పలు మటన్ షాపులకు చికెన్ షాప్లకు నోటీసులు జారీ చేశారు. ఎవరైనా షాపు యజమానులు నిబంధనకు లోబడి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి కిరణ్, మున్సిపల్ శానిటరీ ఇ న్స్పెక్టర్ పులి శేఖర్, శానిటరీ జవాన్ లక్ష్మణ్, తిరుమల, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వినీల్ -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రఘునాథపల్లి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి సొంతింటి కల నెరవేరుస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. ఆదివారం మండలంలోని ఇబ్రహీంపూర్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్చందర్రెడ్డి, మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, పోకల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో పనిచేయాలి
దేవరుప్పుల: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు సమన్వయంతో పనిచేయాలని విజయ డెయిరీ జిల్లా అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కాసారపు ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నల్లకుండతండా, ధర్మగడ్డతండాల్లో మండల ప రిశీలకుడు బిల్లా సుధీర్రెడ్డి పర్యవేక్షణలో ఎంపీటీసీ క్లస్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి సారధ్యంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఇంటింటా సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరుపై పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ఉప్పల సురేష్బాబు, గణేశ్, బానోతు శ్రీను, యాద నాయక్, బోనగిరి యాకస్వామి, నల్ల యాదగిరి, కాడబోయిన వెంకన్న, బానోత్ భాస్కర్, రాజయ్యచారీ తదితరులు పాల్గొన్నారు. -
బుగులు వెంకన్నను దర్శించుకున్న డీఏఓ
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామిని ఆదివారం జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) రామారావు నాయక్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావులు స్వాగతం పలికారు. అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు గణగోని రమేష్, గోలి రాజశేఖర్, కుర్రెంల మోహన్, ఏఈవోలు వినయ్కుమార్, నర్సింహులు, యాకూబ్ తదితరులు ఉన్నారు. -
211.21
కోట్లు రూ.అన్నదాతకు అండగా పెట్టుబడి సాయం ● ఖరీఫ్ పంటలకు అందిన ఆర్థికభరోసా ● విత్తనాలు, ఎరువుల కొనుగోలు వినియోగిస్తున్న రైతులు ● ఇప్పటివరకు 1,75,563 మంది రైతులకు లబ్ధిజనగామ రూరల్: అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకాన్ని అమలుచేస్తోంది. పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా సాయాన్ని అందించి అక్కున చేర్చుకుంటుంది. ఈనెల 16వ తేదీ నుంచి ఎకరం, రెండెకరాలు, మూడెకరాల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు 1,75,563 మంది రైతుల ఖాతాల్లో రూ.211.21కోట్లు జమ అయ్యాయి. రైతులకు వానాకాలం పంట సాగులో పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం మద్దతుగా ఆర్థిక సాయం అందజేస్తుంది. నకిలీపై ఉక్కుపాదం... జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మకుండా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ పర్యవేక్షణ చేస్తున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా వ్యవసాయం, విజిలెన్స్, పోలీస్శాఖలను సమన్వయం చేసి రైతులకు నకిలీ విత్తనాలు అమ్మకుండా చర్యలు చేపట్టారు. పలుమార్లు ఫర్టిలైజర్ యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసి పలుసూచనలు చేశారు. ముందస్తు వానలతో తీవ్రనష్టం గత మే నెలలో ముందస్తుగా కురిసిన వర్షాలతో రైతులు దుక్కులు దున్ని పత్తి విత్తనాలు విత్తారు. అడపాదడపా కురిసిన వర్షాలతో కొన్ని మొలకెత్తగా కొన్ని భూమిలోనే కలిసిపోయి సరిగా మొలకెత్తలేదు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరుణులు కరుణిస్తే మళ్లీ ఆయా చెలకల్లో రెండో సారి పత్తి విత్తనాలు విత్తనున్నారు. అయితే మొదటిసారి పెట్టుబడికి రూ.వేల రూపాయలు కాగా మళ్లీ రెండో సారి కూడా విత్తనాలకు డబ్బులు అవసరం కానుంది. ప్రస్తుతం అందించిన రైతు భరోసా సకాలంలో విడుదల కావడంతో వ్యవసాయానికి సరిపడా విత్తనాలు, ఎరువులు యంత్ర పరికరాల కొనుగోలుకు ఉపయోగపడుతుందని రైతులు తెలుపుతున్నారు. అవసరానికి నిధులు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారీగా రైతు భరోసా వివరాలు మండలం రైతులు రూపాయలు (కోట్లల్లో) చిల్పూరు 12,571 14.90 స్టేషన్ఘన్పూర్ 14,085 15.57 లింగాలఘణపురం 14,386 18.08 రఘునాథపల్లి 20,077 24.76 జఫర్గఢ్ 14,609 16.39 బచ్చన్నపేట 17,431 21.77 జనగామ 15,076 17.86 నర్మెట 10,430 12.51 తరిగొప్పుల 8,048 9.77 దేవరుప్పుల 16,558 20.67 కొడకండ్ల 9,792 11.80 పాలకుర్తి 22,500 27.06 విత్తనాలు, ఎరువులకు ఉపయోగిస్తా.. 6.06 ఎకరాల భూమి ఉంది. పెట్టుబడి సాయం కింద రూ.36,900 జమ అయ్యాయి. సమయానికి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తా. పెట్టుబడికి ఎదురుచూడకుండా విత్తనాలు, ఎరువులు ఒకేసారి కొనుగోలు చేస్తా. – గండ్ల రంగయ్య, శివునిపల్లి, స్టేషన్ఘన్పూర్ సాగు అవసరాలకు ఉపయోగించుకోవాలి.. ప్రస్తుతం రైతు భరోసా డబ్బులు రైతులు సాగు అవసరాలకు ఉపయోగించుకోవాలి. జిల్లా వ్యాప్తంగా రూ.240 కోట్లు అవసరం ఉండగా ఇప్పటి వరకు రూ.211కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. – కలెక్టర్ రిజ్వాన్ బాషా●జమ -
మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పేషీకి చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వ్యాఖ్యలను.. వారి వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరుల బృందం ఆదివారం హైదరాబాద్లో నటరాజన్ను కలిశారు. ‘మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యాఖ్యలు పార్టీని, నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వారి వైఖరి, వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడి పోతున్నాం.. ఇక భరించలేం.. మేడం.. మీరు ఏదో ఒకటి తేల్చండి.. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోండి’ అంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా కామెంట్లు చేయడం, సీనియర్లని చూడకుండా పరుషపదజాలాన్ని వాడటం పార్టీ ఇమేజ్ను దిగజార్చేలా ఉందని బృందం వివరించింది. ఫిర్యాదులను స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, అన్ని కోణాల్లో పార్టీ పరంగా విచారించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి వరంగల్ కాంగ్రెస్ నాయకుల బృందం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి కొండా దంపతులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. గత ఐదారు రోజులుగా వరంగల్లో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, కొండా దంపతుల వ్యా ఖ్యలు, వైఖరిని ఆయనకు వివరించినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన మల్లు రవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో ప్రజాప్రతినిధుల బృందం వెనుతిరిగినట్లు సమాచారం. కాగా కొండా దంపతులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు లేదా ఐదుగురు సీనియర్లతో నేడో, రేపో కమిటీ వేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఇద్దరి వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడుతున్నాం.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ వ్యతిరేక ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో మీనాక్షి, మల్లు రవిలను కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ.. నేడో, రేపో అధికారిక ప్రకటన.. -
యోగాతో ఆరోగ్యం
యోగా చేస్తున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్, ఉన్నతాధికారులు, యువకులుయోగాసనాలు చేస్తున్న మాజీ కౌన్సిలర్ వాంకుడోతు అనిత, యోగా మాస్టర్లు జనగామ: మనిషి నిత్యందన జీవితంలో సంపూర్ణ ఆర్యోగానికి ప్రధాన సూత్రం యోగా అని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ధర్మకంచ స్టేడియంలో శనివారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ చేతన్ నితిన్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. యోగా దినోత్సవం పురస్కరించుకుని అన్ని శాఖల అధికారులతో పాటు ఉద్యోగులు, సిబ్బంది, యువతీయువకులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. యోగా మాస్టర్ల పర్యవేక్షణలో కలెక్టర్, డీసీపీ, ఏసీ, ఏఎస్పీ, ప్రజలు యోగాసనాలు వేశారు. మూడు గంటల పాటు జరిగిన యోగాలో మనస్సును ప్రశాంతత చేసుకుని నిమగ్నమయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగాను అలవాటు చేసుకుని క్రమం తప్పకుండా చేయాలన్నారు. కాగా మండల కేంద్రాల్లోని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, తదితరుల ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్రావు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం– మరిన్ని ఫొటోలు 9లోu -
ఉద్రిక్తత.. ఉత్కంఠ
హనుమకొండలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్రిక్తత, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి నేరుగా వరంగల్కు తీసుకు వచ్చారు. మాజీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నాయకుల ఆందోళన, పరామర్శలతో సుబేదారి పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ఆయనకు బెయిల్రావడంతో కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. – వరంగల్ క్రైంఉదయం నుంచి రాత్రివరకు సాగిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఎపిసోడ్ ● శంషాబాద్లో అరెస్ట్ చేసి హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్కు.. ● బీఆర్ఎస్, విద్యార్థి నేతల ఆందో ళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం.. ● బెయిల్ రావడంతో కార్యకర్తల ఆనందోత్సాహం– వివరాలు 8లోu -
జీపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు రాజు పాలకుర్తి: గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జీపీ యూనియన్ రాష్ట్ర నాయకుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అన్నారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో కుక్కల సోమన్న అధ్యక్షతన పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న జీపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పంచాయతీరాజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ ధర్నాలో జీపీ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న, జీపీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకన్న, నాయకులు పరంజ్యోతి, యాకన్న, కిష్టయ్య, యాదగిరి, రాజు, ఇరుగు నరసింహా, సుశీల, అరుణ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాలను నిలదీస్తే కేసులు బనాయిస్తున్నారు..
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ: అక్రమాలను నిలదీయడంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడుగునా ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, కాంగ్రెస్ నియంతృత్వానికి తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. కౌశిక్రెడ్డి అరెస్ట్ను ఖండిస్తున్నట్లు చెప్పారు. జనారణ్యంలోకి జింక తరిగొప్పుల: మండలకేంద్రం సబ్స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం అనూహ్యంగా మచ్చల జింక పరుగెత్తుతూ వచ్చి చేరింది. అడవిలో ఉండాల్సిన జింక జనంలోకి రావడంతో పలువురు ఆశ్చర్యానికి గురైయ్యారు. జనాన్ని చూసిన జింక జగ్గయ్యపేట వైపు పరుగెత్తుతూ వెళ్లిందని బీసీకాలనీ వాసులు తెలిపారు. -
సెటిల్మెంట్పై ఇంటెలిజెన్స్ ఆరా !
జనగామ: జనగామ పురపాలిక సెటిల్మెంట్లపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నాయి. ఇంటి అనుమతుల సమయంలో మధ్యవర్తిత్వం, చేతివాటంకు సంబంధించి పెత్తనం ఎవరిదనే దానిపై ఆరా తీస్తున్నారు. ‘సెటిల్మెంట్ కింగ్లు ఎవరు?’ శీర్షికన ఈ నెల 21న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం కలిగించింది. పట్టణంలో ఎక్కడా చూసినా ఈ కథనంపైనే మాట్లాడుకోవడం కనిపించింది. చేతివాటం ప్రదర్శించే కింగ్లు మాత్రం గప్చుప్ అయిపోయారు. కూపీ లాగుతున్నారు.. మెమో, షోకాజ్లతో పాటు గాడితప్పిన పురపాలికలో ఏం జరుగుతుందనే విషయమై ఇంటెలిజెన్స్ వర్గాలు కూపీ లాగుతున్నారు. సెటిల్మెంట్ కథనంపై కలెక్టర్ రిజ్వాన్ బాషా ఏసీకి ఫోన్ చేసి వాకబు చేయగా.. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, కమిషనర్ వెంకటేశ్వర్లను తన చాంబర్కు పిలుపించుకున్నట్లు తెలిసింది. దీనిపై సీడీఎంఏ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం ఉండగా... గతేడాది నుంచి జారీ చేసిన ఇంటి అనుమతుల వివరాలు, ముందస్తు గుర్తించిన ఎంక్రోచ్మెంట్ల సమాచారం పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్ తదితర విభాగాలు గత కొంత కాలంగా అనేక వివాదాలకు నెలవుగా మారింది. ఇందులో కొంతమంది తప్పులు చేసి అడ్డంగా బుకై ్కనా.. నామమాత్రపు చర్యలు తప్ప, సీరియస్ యాక్షన్ ఉండదనే విషయాన్ని పట్టణ ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. కలిసొస్తుంది ఎవరికీ? ఫుట్పాత్ వ్యాపారం, నాలాలపై చిరు వ్యాపారాలు, నూతన నిర్మాణ సమయంలో సడలింపు, అనుమతులు లేకుండా భవన నిర్మాణ పనులు ప్రారంభించడం కొంత మందికి కలిసి వస్తుందనే ఆరోపణలు నిత్యం వింటూనే ఉంటున్నాం. దిగు వ స్థాయి సిబ్బంది సైతం వార్డులు తిరుగుతూ, నిర్మాణాల్లో చిన్న చిన్న తప్పిదా లను గుర్తించి అందిన కాడికి దోచేస్తున్నారనే ప్రచారం ఉంది. స్థానికంగా కమిషనర్.. పైన అదనపు కలెక్టర్... ఆ పైన కలెక్టర్ పర్యవేక్షణ ఉన్నా... జనగామ మున్సిపల్ వ్యవహారం మొత్తం అందులో పని చేస్తున్న కొంతమంది చేతుల్లో మాత్రమే ఉందని మెజార్టీ పట్టణ ప్రజల అభిప్రాయం. ఎవరిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా మెమో, షోకాజ్లతో సరిపెట్టడం తప్ప, చర్యలు లేకపోవడంతోనే చేతివాటం మూడు పువ్వులు, ఆరు కట్టలుగా వర్థిల్లుతోందని మేధావివర్గం అంటోంది. మున్సిపల్ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వచ్చే విధంగా ఉండడంతో, ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయనే సమాచారం తెలియ వచ్చింది. పనిలో పనిగా ఏసీబీ వర్గాలు సైతం లంచాల భాగోతంలో ముందు వరుసలో ఉన్న వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. కలెక్టర్ ఫోన్..సీడీఎంఏ సీరియస్? ఇంటి అనుమతుల లెక్కలు తీస్తున్న నిఘా విభాగం ఎంక్రోచ్మెంట్లు, పర్మిషన్ లేని నిర్మాణాలపై కన్ను నెలనెలా వసూళ్లు చేసే వారి గురించి వాకబు -
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuఏటూరునాగారం అభయారణ్యంలోని కొండేటివాగుమేడారం–తాడ్వాయి మధ్యలో ఇటీవల కనిపించిన అడవి దున్న (ఫైల్) ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి అభయారణ్యాన్ని పర్యాటకులు చుట్టి వచ్చేందుకు అటవీశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్ లైఫ్ శాఖ ఆధ్వర్యంలో జంగిల్ సఫారీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులు సఫారీలో అడవులను వీక్షించేందుకు సైతం రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. త్వరలోనే జంగిల్ సఫారీ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. 17 కిలోమీటర్లు దారి.. అడవులను జంగిల్ సఫారీ ద్వారా సందర్శించేందుకు ఎస్ఎస్తాడ్వాయి హట్స్ సమీపం నుంచి కాటాపూర్ బీటీ రోడ్డు నుంచి అడవిలో 17 కిలోమీటర్ల వరకు దారి ఏర్పాటు చేశారు. దారి మధ్యలో సిమెంట్ కాజ్వేలు కూడా నిర్మించారు. అడవిలో పెద్దగుట్ట వరకు దారి ఏర్పాటు చేశారు. ఈదారి మార్గాన జంగిల్ సఫారీలో పర్యాటకులు పెద్దగుట్ట చుట్టి వచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించేలా.. హైదరాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి బొగత, లక్నవరం, రామప్ప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు దట్టమైన అడవుల్లోని ప్రకృతికి ఫిదా అవుతారు. గతంలో ఎస్ఎస్ తాడ్వాయి హట్స్లో బస చేసిన పర్యాటకులు ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ ద్వారా అడవులను చుట్టుముట్టి వచ్చేవారు. సుమారు ఐదేళ్ల క్రితం జంగిల్ సఫారీ మూలనపడింది. దీంతో అప్పటినుంచి పర్యాటకులు ఎస్ఎస్ తాడ్వాయిలోని అడవుల సందర్శన నిలిచిపోయింది. పెరుగుతున్న పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పలు ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మళ్లీ జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడవి మార్గాల్లో రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తాడ్వాయి మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలోని ఆదిమానవుల సమాధులను పర్యాటకులు, యూనివర్సిటీ విద్యార్థులు సందర్శిస్తున్నారు. అడవుల సందర్శనతో పాటు సమాధులను వీక్షించేందుకు జంగిల్ సఫారీ వాహనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వా యి నుంచి మేడారం మీదుగా ఊరట్టం ఏటూరునాగారం మండలంలోని కొండాయి వెళ్లే దారిలో మూడు కిలోమీటర్ల దూరంలో కొండేటి వాగు వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పాయింట్ వరకు జంగిల్ సఫారీ ఏర్పాటు చేస్తే మేడారానికి వచ్చే భక్తులతో పర్యాటకుల సంఖ్య పెరగనుంది.రెండు నెలల్లో అందుబాటులోకి.. ఎస్ఎస్తాడ్వాయిలోని జంగిల్ సఫారీ 60 రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. తాడ్వాయి హట్స్ నుంచి 17 కిలోమీటర్లు పెద్దగుట్ట వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా అన్ని హంగులతో అడవులను సందర్శించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. – రమేశ్, ఎఫ్డీఓ, ఏటూరునాగారంజంగిల్ సఫారీ కోసం అడవిలో వేసిన రోడ్డున్యూస్రీల్తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో త్వరలో ‘జంగిల్ సఫారీ’ అడవుల్లో 17కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణంబోన్ల నడుమ జంతువుల్ని.. డెన్ మధ్యన పులిని.. గూళ్లలో పిచ్చుకల్ని.. నిలువ నీటి తొట్లలో తాంబేళ్లను.. ఆక్వేరియంలో చేపల్ని జూ పార్క్లో చూసి మురిసిపోతాం. అలాంటిది.. దట్టమైన అడవిలో పచ్చందాల నడుమ సఫారీలో ప్రయాణిస్తూ.. వేటాడే పులిని.. చెవులకింపైన పక్షుల కిలకిలారావాల్ని.. చెంగుచెంగున పరుగెట్టే లేడికూనల్ని చూస్తూ సెల్ఫోన్లలో బంధిస్తూ పర్యాటకులు మైమరచిపోయేలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకానికి మరింత శోభ తెచ్చేలా ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్లైఫ్ అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో హాయిగా విహరించేందుకు సాగుతున్న ‘జంగిల్ సఫారీ’ ఏర్పాట్లపై ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం. –ఎస్ఎస్తాడ్వాయి ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పర్యాటకానికి మరింత శోభ -
వేంకటేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ
చిల్పూరు: భూనీలా సమేత శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి శుక్రవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు శ్రీవారికి పంచామృత చంద న హరిద్ర కుంకుమాది విలేపనములు, బహువిధ ఫల రసాదులతో అభిషేకం చేశారు. నూతన పట్టు వస్త్రాలు, పుష్పతులసీ దళాలతో స్వామివారిని అలంకరించారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తు గడువు పొడిగింపుజనగామ రూరల్: దివ్యాంగుల ఉపకరణాల దరఖాస్తు గడువు పొడిగించినట్లు జిల్లా సంక్షే మ శాఖ అధికారి ఫ్లొరెన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. వికలాంగుల సహకార సంస్థ ద్వారా జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు మంజూరు చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరం దరఖాస్తు గడువును ఈనెల 27వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అర్హులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చని, మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ‘108’ అంబులెన్స్ జిల్లా కోఆర్డినేటర్గా రాముజనగామ: 108, 102, 1962 అంబులెన్స్ల జిల్లా కోఆర్డినేటర్గా వి.రాము శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న మంద శ్రీని వాస్ హనుమకొండ జిల్లాకు బదిలీ కాగా.. జగిత్యాలలో విధులు నిర్వర్తిస్తున్న రాము ఇక్కడికి వచ్చారు. ఉద్యోగులు రాంబాబు, అనిల్, రాకేష్, రాజిరెడ్డి, రమేష్, శ్రవణ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ‘ఇన్స్పైర్ అవార్డు’ నామినేషన్పై అవగాహనజనగామ రూరల్: గణితం, సైన్స్ విభాగంలో 2025–26 సంవత్సరానికి ఇన్స్పైర్ అవార్డు పథకం నామినేషన్లపై ఈనెల 23న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఈఓ భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.00 నుంచి 1.00 గంటల వరకు టీశాట్ నెట్వర్క్(నిపుణ చానల్) ద్వారా అన్ని మేనేజ్మెంట్ల ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రత్యక్ష సంభా షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టు నిపుణులు, అధ్యాపకులు.. పాఠశాలల ఉపాధ్యాయులతోపాటు 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు అవసరమైన సూచనలు ఇస్తారని తెలిపారు. అక్షరాస్యతలో జిల్లా ముందుండాలిజనగామ రూరల్: నిరక్షరాస్యులను గుర్తించడంతో పాటు వారిని అక్షరాస్యలుగా తీర్చిదిద్ది జిల్లాను ముందువరుసలో నిలపాలని డీఈఓ భోజన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని ధర్మకంచ ఉన్నత పాఠశాలలో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్, తెలంగాణ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యాన ఉల్లాస్ యాప్పై సీఆర్పీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిరక్షరాస్యుల విషయంలో అందరికీ బాధ్యత ఉందని, అందరినీ అక్షరాస్యులుగా చేయాలని చెప్పారు. డీడీ రమే్శ్ ఉల్లాస్ యాప్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విజయ్కుమార్, శ్రీ శంకర్రావు, నాగరాజు ఎక్కస్వామి తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ స్పాట్ అడ్మిషన్లుజనగామ రూరల్: పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ కె.భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. బీస్సీ ఎంపీసీ, ఎంఎస్సీఎస్, ఎంఈసీఎస్, ఎంపీసీఎస్, బీజెడ్సీ, బీకాం సీఏ, బీఏఈపీహెచ్ కోర్సులు ఉన్నాయని, ఇంటర్ పాస్ అయి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 24లోగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవా లని సూచించారు. ఎంపికైన వారికి హాస్టల్ వసతి, యూనిఫామ్, నోట్బుక్స్, ట్రాక్ సూ ట్, బెడ్ షీట్లు, ప్రతి నెలా కాస్మొటిక్ అమౌంట్ రూ.275 అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 70133 10928, 94412 55110 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ జనగామ రూరల్: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. శుక్రవారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన డీఏడబ్ల్యూఎన్ డ్రగ్ ఫ్రీ ఇండియా స్కీమ్–2025పై జిల్లా కేంద్రం స్టేషన్ రోడ్డులోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మత్తు పదార్థాలు మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటికి బానిసలు కాకుండా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలు విక్రయించేవారు చిన్నపిల్లలను టార్గెట్ చేస్తారని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడవద్దని, చాక్లెట్లు, స్టిక్కర్ల రూపంలో మత్తు పదార్థాలు ఉండవచ్చని, జాగ్రత్తగా ఉండాల ని సూచించారు. ద్విచక్ర వాహనాలపై లిఫ్ట్ ఇస్తామంటే వెళ్లకూడదని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వి.కృష్ణమూర్తి, ఎండీ.అన్వర్, ఎన్.కనకయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వెలిశాల.. శోకసంద్రం
రవి అంతిమయాత్రలో పాల్గొన్న అభిమానులు టేకుమట్ల: మూడు దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం ఉద్యమ బాట పట్టి ఎన్కౌంటర్లో మృతిచెందిన గాజర్ల రవి అలియాస్ గణేశ్ అంత్యక్రియలు స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో శుక్రవారం ముగిశాయి. రంపచోడవరంలో గురువా రం రాత్రి పోస్టుమార్టం అనంతరం రవి పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్వగ్రామమైన వెలిశాలకు చేరుకుంది. ‘ఉద్యమాల బిడ్డా, నిను మరువదు ఈ గడ్డ’ అంటూ కవులు, కళాకారులు, ఉద్యమకారులు నివాళులర్పించారు. కాగా, రవి మృతదేహాన్ని వెలిశాలకు తీసుకొస్తున్న సమయంలో చిట్యాల, చల్లగరిగలో వాహనాన్ని ఆపి పలువురు నివాళులర్పించారు. ఎరుపెక్కిన వెలిశాల.. గాజర్ల రవి అలియాస్ గణేశ్ అంత్యక్రియల నేపథ్యంలో గ్రామంలో పెద్దఎత్తున ఎర్రజెండాలు, రవి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశా రు. ఆయన పార్థీవ దేహం వెలిశాలకు చేరుకోగా నే ఉద్యమ గీతాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన అంతిమయాత్ర కూతవేటు దూరానికే సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఉద్యమ నినాదాలు, గీతా లు, డప్పు కళాకారుల దరువులకు వెలిశాల దద్ధరిల్లింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప ఉద్యమ గీతాలు, నృత్యాలతో విప్లవానికి చావు లేదనే విధంగా ఆడి పాడారు. అంతిమయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు ఉద్యమ గీతాలు, నృత్యాలతో హోరెత్తించారు. భారీగా తరలివచ్చిన అభిమానులు గాజర్ల రవికి అంతిమ వీడ్కోలు తెలిపేందుకు మాజీ మావోయిస్టులు, ప్రజాసంఘాల నాయకులు, కవులు, గాయకులు, ప్రజలు, అభిమానులు తరలిరావడంతో వెలిశాల జన సంద్రమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునా యుడు చేపడుతున్న మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ప్రధాని నరేంద్రమోదీ, అమిత్షా కనుసన్నల్లో పని చేస్తున్నాడని భారత్ భచావో అధ్యక్షుడు, తెలంగాణ సిద్ధాంతకర్త గాదె ఇన్నయ్య, విమలక్క మండిపడ్డారు. హక్కులు సాధించుకోవాలంటే పోరాడాలని అమ్మే నేర్పిందని గాజర్ల రవి సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు అన్నారు. కష్టమున్న చోట ఎదురించి పోరాడమ ని వెలిశాల చెప్పిందని పేర్కొన్నారు. దొరలు, పెత్తందార్లు చేసే అరాచకాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం గాజర్ల కుటుంబం పోరాడిందని.. ఆ క్రమంలో పోలీసులు పెట్టిన చిత్రహింసలు వెలిశాల ప్రజలకు తెలుసన్నారు. చివరికి అన్నయ్య రవన్న మృతదేహాన్ని సైతం రంపచోడవరం ఆస్పత్రిలో చూపించకుంటే పోలీసులను ప్రశ్నిస్తేనే చూపించారని అన్నారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తీన్మార్ మల్లన్న గాజర్ల రవి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రం ఐదు గంటల వరకు వేలాది మంది నడుమ జరిగిన అంతిమయాత్ర అనంతరం గాజర్ల రవి అలియాస్ గణేశ్ చితికి సోదరుడు అశోక్ అలియాస్ ఐతు నిప్పంటించారు. మావోయిస్టు నేత గాజర్ల రవికి కన్నీటి వీడ్కోలు ఎర్రజెండాలతో ఎరుపెక్కిన గ్రామం తరలివచ్చిన ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించిన ఎమ్మెల్యే ‘గండ్ర’, ఎమ్మెల్సీలు -
సముద్రాలలో ‘డబుల్’ లొల్లి
స్టేషన్ఘన్పూర్: అర్హత ఉన్నప్పటికీ తమకు ఇందిర మ్మ ఇళ్లు రాలేదని సముద్రాల గ్రామానికి చెందిన పలువురు నిరుపేదలు గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను ఆక్రమించున్న సంఘటన శుక్రవా రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సముద్రాల గ్రామానికి 40 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరుకాగా.. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిధుల లేమితో కేవలం 10 ఇళ్ల నిర్మాణం చేపట్టి మమ అనిపించాడు. ఆ నిర్మాణా లు కూడా అసంపూర్తిగా మిగిలాయి. అధికారులు 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇంతవర కు ఇళ్లు కేటాయించలేదు. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామానికి 30 ఇళ్లు కేటాయించగా జాబితాలో సదరు పేదల పేర్లు లేకపోవడంతో గ్రామ శివారులో ఉన్న పది ఇందిరమ్మ ఇళ్లను ఆక్రమించుకున్నారు. మిగిలిన వారు ప్రభుత్వ స్థలంలో కంపచెట్లను తొలగించి గుడిసెలు వేసుకునేందకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ఈ సందర్భంగా బాధితులు భాస్కుల కుమార్, వెలిశోజు హేమలత, యాదగిరి, వెంకటలక్ష్మి, గుండె భాస్కర్ తదితరులు మాట్లాడు తూ.. అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇళ్లు రాలేదని, తమకు అప్పుడు, ఇప్పుడూ అన్యాయమే జరిగిందని వాపోయారు. ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదు.. తమకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. సమాచారం అందుకున్న తహసీల్దార్ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అందరూ సంయమనం పాటించాలని, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అర్హులకు ఇళ్లు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో బాధితులు గుండె భాస్కర్, రాజేష్, సంతోష్, అరుణ్, ఎడ్ల కుమార్, భాస్కు ల కుమార్, పూలమ్మ, వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఆక్రమించుకున్న పేదలు అనర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని ఆందోళన -
ఆరు గదులు.. మూడు బడులు
పాలకుర్తి టౌన్: మండలం పరిధి ఎల్లారాయిని తొర్రూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ మూడు దగ్గర ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం ఆరు గదుల్లో.. మూడు బడులు నడుస్తున్నాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒకే గదిలో వేర్వేరు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్న గదుల్లో రెండు శిథిలావస్థకు చేరాయి. అందులోనే విద్యార్థులు, ఉపాధ్యాయులు భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. ఆరుబయట మధ్యాహ్న భోజనం తయారీకి ఉపయోగించే కట్టెల పోయ్యి నుంచి వచ్చే పొగ క్లాస్ రూంలోకి చేరడంతో విద్యార్థులు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. ఉన్నత పాఠశాలలో 70 మంది, ప్రాథమిక పాఠశాలలో 68 విద్యార్థులు ఉన్నారు. గత ప్రభుత్వం రూ.50 లక్షలతో గ్రామానికి దూరంగా నూతన భవనం నిర్మించినా వినయోగించుకోవడం లేదు. -
కష్టపడిన వారికి సముచిత స్థానం
తరిగొప్పుల(నర్మెట): పదేళ్ల బీఆర్ఎస్ నియంతృత్వ పాలనలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి అధికా రంలోకి రావడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచి త స్థానం దక్కుతుంది.. అలాంటి వారిని గుర్తించడానికే అధిష్టానం తమను ఇక్కడికి పంపించిందని జిల్లా ఇన్చార్జ్ అబ్జర్వర్ బైకిని లింగంయాదవ్ అన్నా రు. తరిగొప్పుల, నర్మెట మండలాల పార్టీ అధ్యక్షులు వగలబోయిన యాదగిరి, లక్ష్మీనారాయణ ఆధ్వర్యాన శుక్రవారం స్థానిక కేఏఆర్ గార్డెన్స్లో ఏర్పా టు చేసిన ఉమ్మడి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయని, అందుకు జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి కృషి అభినందనీయమన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటిని నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డి, అర్జుల సుధాకర్రెడ్డి, భాగ్యలక్ష్మి, లక్ష్మి, గొల్లపల్లి కుమారస్వామి, వలబోజు శ్రీనివాస్, అర్జుల మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జ్ అబ్జర్వర్ ‘బైకిని’ -
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuపురపాలికలో ప్రతీ పనికి ఓ రేటు జనగామ: జనగామ పురపాలికలో సెటిల్మెంట్ కింగ్లు ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రతి పనికి ఓ రేటు కట్టి.. మధ్య వర్తిత్వం చేస్తూ పనులు చెక్కబెడుతున్నది ఎవరనే దానిపై గుసగుసలాడుకుంటున్నారు. గతంలో మూడేళ్లకు సంబంధించిన ఆడిట్ రిపోర్టుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆడిట్ ఫైనల్ నివేదిక బయటకు రాకుండానే కప్పేశారు. ఎంబీ రికార్డుల మాయం, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల గోల్మాల్, ఇంటి అనుమతుల సమయంలో చేతి వాటం, ఎంక్రోచ్ మెంట్లను ప్రోత్సహించడం.. ఇలా అనేక రకాల అక్రమాలకు నిలయంగా మారిన మున్సిపాలిటీ నిత్యం వార్తల్లో కనిపిస్తున్నది. అక్రమాలు వెలుగు చూసిన సమయంలో ఉన్నతాధికారులు హడావుడి చేయడం తప్ప, విచారణ చేపట్టిన పాపన పోలేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో మున్సిపల్ అనుమతి లేకుండా ఓ భవన నిర్మాణం మొదలు పెట్టినా.. పురపాలిక అధికారులు మేల్కోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజ గా మ్యుటేషన్ల జారీ, పురపాలికలో బదిలీలు, రిలీవ్ చేసే సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టిన విషయంలో కమిషనర్ వెంకటేశ్వర్లకు సీడీఎంఏ, అదనపు కలెక్టర్ మెమో, షోకాజ్ నోటీసులు జారీ చేయడం బాధ్యతారాహిత్యాన్ని ఎత్తి చూపుతోంది. మ్యుటేషన్లపై సీడీఎంఏ మెమోమ్యుటేషన్ల సవరణలో జరిగిన అవకతవకలపై సంజాయిషీ కోరుతూ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ టీకే.శ్రీదేవి జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు మెమో జారీ చేశారు. మ్యుటేషన్ సమయంలో పేరు మార్పిడిపై అంతర్గత ఆడిట్లో గుర్తించిన 22 మంది జాబితాను మెమోతో జత పరుస్తూ కమిషనర్కు పంపించారు. ఈనెల 26 వరకు దీనిపై సంజాయిషీ కోరా రు. రిజిష్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా అక్షర దోషాలు, ఇతర కరెక్షన్లకు సంబంధించి పేరు మార్పిడి పేరిట కమిషనర్ వద్ద అప్రూవల్ తీసుకు ని, అందులో ఏకంగా ఓనర్ పేరునే మార్చేస్తున్నార ని మెమోలో పేర్కొన్నారు. డాక్యుమెంట్, ఆధార్, ఎలక్ట్రిసిటీ బిల్లు, నోటరీ ఆధారంగా అడ్డగోలు మ్యుటేషన్లతో అక్రమాలకు తెరలేపుతున్నట్లు వచ్చి న ఆరోపణల నేపథ్యంలో సీడీఎం దృష్టి సారించడంతో సదరు ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైయింది. అదనపు కలెక్టర్ షోకాజ్ నోటీసు పట్టణ ప్రణాళిక విభాగంలో ఉద్యోగులను రిలీవ్ చేయడంతో పాటు సేవల విషయంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదనపు కలెక్టర్(ఏసీ) పింకేష్కుమార్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ల్లుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సరిత డిప్యూటేషన్పై నిజాంపేటకు వెళ్లే సమయంలో ఆమెను రిలీవ్ చేయగా, కమిషనర్ ఏసీకి కనీస సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న టీపీఎస్ ప్రశాంతి వారంలో శుక్ర, శనివారం ఇక్కడ, మిగతా నాలుగు రోజులు పిర్జాదీగూడలో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్లో ఎఫెక్టివ్ పని జరగడం లేదని ఏసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైన మ్యాన్ పవర్ ఉన్నప్పటికీ పట్టణ ప్రణాళిక విభాగంలో పనిజరగడం లేదని, ఎల్ఆర్ఎస్, భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతుల్లో జాప్యంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. ఇదంతా కామనే.. సీడీఎంఏ మెమో, ఏసీ షోకాజ్ నోటీసు కామనే. టీపీఎస్ సరిత ఆరోగ్యం బాగోలేదని అక్కడి నుంచి వచ్చిన లెటర్ ఆధారంగా రిలీవ్ చేసే సమయంలో ఏసీకి సమాచారం ఇవ్వలేదు. మ్యుటేషన్ సమయంలో తప్పులు దొర్లినట్లు సీడీఎంఏ నుంచి మెమో రాగా, సంజాయిషీ పంపుతాం. పురపాలిక పరిపాలన విషయంలో నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. చిన్న తప్పు జరిగినా చర్యలు తీసుకుంటున్నాం. సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం. – వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్, జనగామన్యూస్రీల్ ఇంటి అనుమతులపై అనేక ఆరోపణలు సీడీఎంఏ నుంచి మెమో.. షోకాజ్ జారీ చేసిన అదనపు కలెక్టర్ మున్సిపల్ ఉద్యోగుల్లో మొదలైన గుబులు -
అనుచిత వ్యాఖ్యలు సరికాదు●
● టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములు జనగామ: శాసన సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు సరికా ద ని టీపీసీసీ కార్యదర్శి కంచె రాములు అన్నారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని చులకన చేసేలా కొండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి, తెలంగాణ రాష్ట్రాల్లో మంత్రి, డిప్యూటీ సీఎం, నాలుగుసార్లు ఎమ్మెల్యే, రెండు పర్యాయాలు ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రజా నాయకుడిపై కొండా మురళీధర్రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హాస్టల్ వసతిని వినియోగించుకోవాలిజనగామ రూరల్: స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళా శాల అటానమస్లో ప్రవేశం పొంది స్కాలర్షిప్న కు అరులైన విద్యార్థులు హాస్టల్ వసతిని సద్విని యోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.నర్స య్య ఒక ప్రకటనలో తెలిపారు. నివాసం కళాశాల నుంచి ఐదు కిలోమీటర్లకు మించి దూరం ఉన్న బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు వసతి గృహ సౌకర్యం ఉందన్నారు. పట్టణంలోని అంబేడ్కర్నగర్, యశ్వంతాపూర్, శామీర్పేట హాస్టల్లో అవకాశం ఉందని, మరిన్ని వివరాలకు 9553571237 నంబర్లో లేదా కళాశాలలో సంప్రదించాలన్నారు. -
డ్రగ్స్పై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
జనగామ రూరల్: డ్రగ్స్పై విద్యార్థులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. గురువారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన డీఏడబ్ల్యూఎన్ డ్రగ్ ఫ్రీ ఇండియా స్కీమ్–2025పై పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జడ్జి మాట్లాడారు. మారకద్రవ్యాలు ఎలా తయారవుతాయి, అవి మనుషులపై ఎలా ప్రభావం చూపుతాయి.. వాటికి యువత ఎలా బానిసలవుతారు.. మదకద్రవ్యాలు అమ్మేవారు చిన్నపిల్లలను ఎలా టార్గెట్ చేస్తున్నారు.. వారిని ఏ విధంగా బానిసలను చేస్తున్నారు.. అనే అంశాలపై వివరించారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడొద్దని, తినే వస్తువులు ఇస్తే తీసుకోరాదని సూచించారు. మాదకద్రవ్యాలు.. చాక్లెట్లు, స్టిక్కర్లు ఏరూపంలోనైనా ఉండొచ్చని, జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. అపరిచితులు ద్విచక్ర వాహనాలపై లిఫ్ట్ ఇస్తానంటే వెళ్లొద్దని, ముఖ్యంగా బాలికలు చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. ఎంఈఓ శంకర్రెడ్డి, పీఎల్వీ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ -
అడవి నుంచి.. పుడమితల్లి ఒడికి
గాజర్ల రవి బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నేలకొరగగా నాటి ఉద్యమకారులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. నేడు అంత్యక్రియలు జరగనున్నాయి.వాతావరణం ఉదయం నుంచి చల్లని వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కలహాల కాంగ్రెస్... కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి భగ్గుమన్నాయి. అవి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. – 10లోuసమస్యల నిలయం శివునిపల్లి పీఎస్ స్టేషన్ఘన్పూర్ :శివునిపల్లి పీఎస్ సమస్యలకు నిలయంగా మారింది. మూడేళ్ల క్రితం ‘మన ఊరు–మన బడి’ కింద పనులు చేపట్టే సమయంలో ఉన్న త పాఠశాల మొదటి అంతస్తు తరగతి గదుల్లో 46 మంది ప్రాథమిక విద్యార్థులకు బోధన సాగిస్తున్నా రు. తలుపులు, కిటికీలు తొలగించి వదిలేశారు. పిల్లలు మొదటి అంతస్తుకు వెళ్లడం.. కిందికి దిగడం ప్రమాదకరంగా మారింది. మూత్రశాలలు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. చెట్ల కిందే చదువులు రఘునాథపల్లి: కుర్చపల్లి ప్రాథమిక పాఠశాలలో 46 మంది విద్యార్థులకు నలు గురు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల స్కీం కింద తరగతి గదుల స్లాబ్ తొలగించి రేకుల నిర్మాణం చేపట్టారు. ఫ్లోరింగ్ చేయకపోగా ట్యాంకు, కిటికీలకు తలుపులు బిగించలేదు. టాయిలెట్లు లేక విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. పైకప్పు రేకులు వేయడంతో ఉక్కపోత భరించలేక విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెడుతున్నారు. -
ముగిసిన ‘బడిబాట’
జనగామ: సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెంచుకునేందుకు ఈనెల 6న ప్రారంభించిన జయశంకర్ ‘బడిబాట’ గురువారంతో ముగిసింది. జిల్లాలో 14 రోజులపాటు ‘బడిబాట’ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు డీఈఓ భోజన్న నాయకత్వంలో టీచర్లు ఇంటింటికీ వెళ్లారు. గ్రామ సభల నుంచి మొదలు చివరి రోజు క్రీడా పోటీలతో ముగింపు పలికారు. జిల్లాలో నూతన అడ్మిషన్లు 2,605 వరకు రాగా, ఇందులో రఘునాథపల్లి మండలం 490 మంది పిల్లలతో టాప్లో నిలువగా, రెండో స్థానంలో జనగామ–445, కొడకండ్ల 83 మందితో చిట్ట చివర స్థానంలో నిలిచింది. కాగా మరో నెల పాటు కొత్త అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పండుగ వాతావరణంలో నర్మెట్ట మండలం మాన్సింగ్ తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, టెన్నికాయిట్, స్కిప్పింగ్ తదితర పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం పగిడిపల్లి దామోదర్, ఉపాధ్యాయులు రావుల రామ్మోహన్రెడ్డి, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు. ‘బడిబాట’లో చేరిన పిల్లల వివరాలుమండలం కొత్త అడ్మిషన్లు బచ్చన్నపేట 148 చిల్పూరు 125 దేవరుప్పుల 218 స్టేషన్ఘన్పూర్ 160 జనగామ 445 కొడకండ్ల 83 లింగాలఘణపురం 130 నర్మెట 146 పాలకుర్తి 216 రఘునాథపల్లి 490 తరిగొప్పుల 110 జఫర్గఢ్ 334 కొత్తగా 2,605 మంది విద్యార్థుల చేరిక రఘునాథపల్లి టాప్.. చివరలో కొడకండ్ల రోజువారీగా మరింత మంది చేరే అవకాశం -
‘భూభారతి’ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
జనగామ రూరల్: ‘భూభారతి’ దరఖాస్తులను అధికారులు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భూభారతి, జాతీయ కుటుంబ లబ్ధి పథకం(ఎన్ఎఫ్బీఎస్) సన్న బియ్యం, బీఎల్ఓలకు శిక్షణ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి దరఖాస్తుల విషయంలో వాస్తవాలను పరిగణలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పారు. సర్వే నంబర్ మిస్ మ్యాచ్ అయితే నోటీసు ఇవ్వాలని సూచించారు. సాదాబైనామా, అసైన్డ్ లాండ్లను దశల వారీగా పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో జాతీయ కుటుంబ లబ్ధి పథకానికి వచ్చిన దరఖాస్తులను మండలాల వారీగా విభజించి నివేదిక అందించాలని సూచించారు. సన్న బియ్యం పంపిణీ వేగంగా చేపట్టేందుకు డీలర్లతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చేందుకు మండల స్థాయిలో అనువైన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, డీఎస్ వెంకన్న, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంతు నాయక్, జిల్లా సివిల్ సప్లయీస్ డీఎం హతిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక వనరుగా ఇందిరా మహిళా శక్తి పథకం బచ్చన్నపేట: రాష్ట్రంలో కోటి మంది మహిళా మణులను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇంది రా మహిళా శక్తి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.. ఈ పథకం మహిళలకు ఆర్థిక వనరుగా దోహదపడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. బచ్చన్నపేట మండలం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన వనిత టీ స్టాల్ను ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులకు మంజూరైన యూనిట్లను ప్రారంభిస్తామని చెప్పా రు. ఎస్హెచ్జీ సభ్యురాలుగా కొనసాగుతున్న పోచన్నపేటకు చెందిన రేణుక రచన మహిళా సమాఖ్య ద్వారా రూ.2 లక్షలు ఋణం పొంది వనిత టీ స్టాల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిమాండ్కు తగినట్టుగా వ్యపారం పెంచుకోవాలని సూచించారు. డీఆర్డీఓ వసంత, మండల స్పెషల్ అధికారి రామారావు నాయక్, ఎంపీడీఓ మల్లికార్జు న్, డీటీ ఫణికుమార్ పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
అనుమతిలేని వెంచర్లపై చర్య తీసుకోవాలి
తరిగొప్పుల: గ్రామపంచాయతీ పరిధిలో లే ఆవుట్ వెంచర్లు ఏర్పాటు చేస్తే గ్రామపంచాయతీ అనుమ తి తప్పకుండా తీసుకోవాలి.. లేదంటే ఆయా వెంచ ర్ల యజమానులకు నోటీసులు జారీ చేసి చర్య తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూప స్పష్టం చేశారు. పల్లెప్రగతి యాప్ తనిఖీ లో భాగంగా గురువారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి రికా ర్డులను పరిశీలించారు. భవన నిర్మాణ అనుమతులు ఎలా ఇస్తున్నారని తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాల ని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. డీపీఓ నాగపురి స్వరూప -
వృత్తి నైపుణ్యం సాధించాలి
వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు అప్పగించిన పనుల్లో రాణించాలంటే వృత్తిలో నైపుణ్యం సాధించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. యూనిట్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డ్యూటీ మీట్లో విభాగాల వారీగా రాణించిన కమిషనరేట్ పరిధి పోలీసులను జోనల్ స్థాయిలో నిర్వహించే మీట్కు ఎంపిక చేయనున్న ట్లు తెలిపారు. ఈఏడాది రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ పోటీలను వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు వృత్తి నైపుణ్యం సాధించడం ద్వారా నేరస్తులను త్వరగా గుర్తించడంతో పాటు, ప్రజలకు సత్వరమే న్యాయం అందించగలమని చెప్పారు. కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, అంకిత్ కుమార్, రాజమహేంద్రనాయక్ అదనపు డీసీపీ రవి, సురేశ్కుమార్, ప్రభాకర్రావు, బోనాల కిషన్తో పాటు, జోనల్కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీపీ సన్ ప్రీత్ సింగ్ -
శిథిల గదులు.. చదువులు ఆగం
విరిగిన తలుపులు.. ఊడిపోయే కుళాయిలు ● పైకప్పులకు రేకులు.. సపోర్టుగా కర్రలు ● క్వాలిటీ కంట్రోల్ లేకుండానే బిల్లుల చెల్లింపు ● ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పనులపై పర్యవేక్షణ కరువు ● ఆదరణ లేక మూతపడిన పాఠశాలలు ● ‘సాక్షి’ విజిట్లో వెలుగులోకి అనేక సమస్యలుపడిపోయిన పాఠశాల గ్రేడ్ దేవరుప్పుల: మున్పహాడ్ ప్రాథమికోన్నత పాఠశా ల నేడు ప్రాథమిక స్థాయికి పడిపోయింది. స్కూల్ లో ఏడుగురు పిల్లలే ఉన్నారు. పాత గదుల్లోనే బోధిస్తున్నారు. వదిలేసిన నూతన గదులు అసాంఘిక కార్యక్రమాలకు కేంద్ర బిందువయ్యాయి. ‘ప్రైవేట్’పై మోజుతోనే.. సకల సౌకర్యాలతో ప్రభుత్వం ఉచి త విద్య అందిస్తున్నా పిల్లలను ప్రైవే ట్ స్కూళ్లకు పంపుతున్నారు. దీంతో సర్కారు చదువు దెబ్బతింటోంది. – జ్ఞానానంద కీర్తి, టీచర్, మన్పహాడ్టాయిలెట్లు లేని తిమ్మంపేట పాఠశాల జాఫర్గడ్: తిమ్మంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాయిలెట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. కొన్నేళ్లుగా విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి. దీనికి తోడు తరగతి గదుల తలుపులు, కిటికీలు దెబ్బతినడంతో భద్రత లేకుండా పోయింది. వరండా, తరగతి గదుల్లోని బండలు కుంగిపోయాయి. భవనం పైపెచ్చులు ఊడి పోతున్నాయి. ప్రహరీ సైతం పలుచోట్ల కూలిపోయింది. దీంతో పాఠశాల మందుబాబులకు అడ్డగా మారింది. టాయిలెట్లు నిర్మించాలి తమ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలి. బయటకు వెళ్లాల్సి వస్తుంది. పాఠశాల తరగతి గదులకు తలుపులు, కిటికీలు లేవు. ప్రహరీ పలుచోట్ల కూలింది. ఈ సమస్యలు పరిష్కరించాలి. – కడబోయిన హరిప్రసాద్, 10వ తరగతిజనగామ: ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని గాలికి వదిలేశారు.. ‘అమ్మ ఆదర్శ పాఠశాలల’ పేరిట కొత్త స్కీం తీసుకువచ్చి పాత పనులు పట్టించుకోకుండా.. కొత్త నిర్మాణాలపై దృష్టి సారించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు మట్టిపాలు కాగా.. కాంగ్రెస్ సర్కారు తెచ్చిన పథకం కాంట్రాక్టర్లకు వరంగా మారింది. టాయిలెట్ల తలుపులు ఇప్పుడే విరిగి పోతుంటే.. ట్యాపులు ముట్టుకుంటే ఊడిపోయేలా ఉన్నాయి. భవనాల పైపెచ్చులు ఊడిపోయి.. ప్రహరీలు కూలిపోయి కొన్ని బడులు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 508 ఉండగా, సుమారు 32వేల మంది చదువుకుంటున్నారు. విద్యార్థులు లేక సుమారు 65 పాఠశాలలు మూతపడగా ఒకటో తరగతి చదువుకునే పిల్లలు సుదూర ప్రాంతాలకు నడిచి వెళ్లే పరిస్థితి నెలకొంది. గురువారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ‘సాక్షి’ విజిట్ చేయగా అనేక సమ్యలు వెలుగులోకి వచ్చాయి. ఒకటో తరగతి ఎలా.. బచ్చన్నపేట: సదాశివపేట ప్రాథమిక పాఠశాలలో ఇంతకు ముందు 20 మంది విద్యార్థులు చదువుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపించడంతో ఈ స్కూల్ను మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఒకటో తరగతి చదివే పిల్లలను తల్లిదండ్రులు రోజూ మండల కేంద్రానికి తీసుకురావడం, సాయంత్రం తీసుకువెళ్లడం ఇబ్బందిగా మారింది. ఆటో అద్దె ఏడాదికి రూ.30వేలు ముగ్గురు కూతుళ్లను మండల కేంద్రంలోని పాఠశాలకు పంపించేందుకు ఆటో అద్దె ఏడాదికి రూ.30వేలు చెల్లిస్తున్నాను. గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కూడా లేదు. వ్యవసాయంపై ఆధారడే మా కుటుంబం ఆటో అద్దె చెల్లించడం పెద్ద కష్టంగా మారింది. ఒక టీచర్.. ఇద్దరు పిల్లలు స్టేషన్ఘన్పూర్: చంద్రుతండా(జైత్యాతండా) జీపీ పరిధి ఎంపీపీఎస్ పాఠశాలలో 3, 5వ తరగతి సంబంధించి ఒక్కో విద్యార్థి ఉన్నారు. హెచ్ఎం సీహెచ్.రమేశ్ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ మోజులో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపకపోవడంతో ఆ పాఠశాల పరిస్థితి ‘ఒక్క టీచర్.. ఇద్దరు స్టూడెంట్స్’ అన్న చందంగా మారింది. ఇదిలా ఉండగా.. చంద్రుతండా జీపీ పరిధిలో ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడితో నడిచిన మాన్సింగ్తండా పాఠశాల గత విద్యాసంవత్సరం మూతపడింది. అసంపూర్తి చదువులు కొడకండ్ల: కడగుట్టతండా ప్రాథమిక పాఠశాలలో 13 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉన్నారు. పిల్లల సంఖ్య తక్కువగా ఉండడంతో ఒక టీచర్ను మేఘ్యతండా పీఎస్కు డిప్యూటేషన్పై పంపించా రు. ‘మన ఊరు – మనబడి’ కింద రూ.20 లక్షల నిధులు మంజూరు కాగా, పాత భవనాన్ని తొలగించి కొత్త తరగతి గదుల కోసం స్లాబ్ వేసి చేతులు దులుపుకున్నారు. -
ఆస్పత్రి నుంచే ప్రజా సమస్యలపై ఆరా ..
జనగామ: ఎర్రవెల్లి ఫాంహౌస్లో జారిపడి గాయపడిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రజాసమస్యలపై ఆరా తీస్తున్నారు. గురువారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు లను పరిశీలించి సంతకాలు చేశారు. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకు ముందు ఆస్పత్రిలో పల్లాను మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పరామర్శించారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గూడూరు గ్రామంలో రూ.49 లక్షలతో చేపట్టిన మసీదు ప్రహరీ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమార స్వామి, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎం.డీ మదార్, గ్రామ అధ్యక్షుడు దేవేందర్, సేవాదళ్ రాష్ట్ర నాయకుడు గుగ్గిళ్ల ఆదినారాయణ, మాజీ సర్పంచ్ మాచర్ల పుల్లయ్య, ఎండీ.అబ్బాస్అలీ, ఎండీ.సలీం, శంషొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలిజనగామ రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో ఈనెల 21న ఉదయం 7 గంటలకు నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి సూచించారు. యోగాపై అవగాహన అవసరమని, ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా మంచి సాధనమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత జనగామ పట్టణమే లక్ష్యం జనగామ: ప్లాస్టిక్ రహిత జనగామ పట్టణమే లక్ష్యమని, ఇందులో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం అవసరమని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాణిజ్య, వ్యాపార, పరిశ్రలు, గృహ, గృహేతర అన్ని వర్గాల ప్రజలు ప్రమాదకరమైన ప్లాస్టిక్ ను వినియోగించొద్దని సూచించారు. ప్లాస్టిక్(అన్ని రకాలు) విక్రయించిన వారికి రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించనున్నట్లు కమిషనర్ తెలిపారు. అవసరమైతే దుకాణాన్ని సీజ్ చేసి, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రం ద్వారా 2026 సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ కోచింగ్ నిమిత్తం ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి బి.రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 100 మంది ప్రతిభావంతులను జూలై 12న నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తామ ని చెప్పారు. మరో 50 మందిని గతంలో సివిల్ సర్వీసెస్(ప్రీలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత పత్రాలతో నేరుగా టీజీ బీసీ స్టడీ సర్కిల్, రోడ్ నంబర్ 8, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్ 500059 అడ్రస్కు జూలై 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశం పొందిన వారికి బోర్డింగ్, రవాణా సౌకర్యం నిమిత్తం నెలకు రూ.5,000 స్టైఫండ్, రూ.5,000 బుక్ ఫండ్ ఒకసారి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రంథాలయ సదుపాయం కల్పిస్తారని, మరిన్ని వివరాలకు 040–29303130, 04024071178, 7780359322, హనుమకొండ 0870–2571192 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
బస్పాస్లపై బాదుడు
గత ఏడాది జారీ చేసిన పాస్ల వివరాలు: స్టూడెంట్ పాస్లు : 12,022దివ్యాంగులు : 2,316సీజనల్ : 784డయాలసిస్ : 34టోల్ పరిధిలో స్టూడెంట్ పాస్ ధరల పెంపు ● జనరల్, స్టూడెంట్లపై అదనపు భారం ● ధరలు తగ్గించాలని డిమాండ్జనగామ: స్టూడెంట్, సీజనల్(జనరల్) పాస్లతో పాటు సామాన్యులపై ఆర్టీసీ పెను భారం మోపింది. పెరిగిన టోల్ చార్జీల భారం విద్యార్థులపై పడుతుండగా.. జనరల్ పాస్లపై మోత మోగించారు. 2025 –26 నూతన విద్యా సంవత్సరం నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. ధరల పెంపునకు సంబంధించి ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన రాలేదు. జనగామ డిపో పరిధిలో సుమారు 42రూట్లు ఉండగా, రోజు వారీగా 55వేల మంది ప్రయాణం చేస్తుంటారు. సీజనల్, స్టూడెంట్లపై అదనపు భారం రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం, జనరల్, స్టూడెంట్ పాస్ల చార్జీలు పెంచింది. 2024–25 సంవత్సరంలో జనగామ డిపో నుంచి దాదాపు 15,156 జనరల్, స్టూడెంట్, దివ్యాంగులు, డయాలసిస్ పేషెంట్లకు పాస్లు జారీ చేశారు. ఇందులో స్టూడెంట్స్ 12,022, దివ్యాంగులు 2,316, జనరల్ 784, డయాలసిస్ పేషెంట్లు 34 మంది ఉన్నారు. దివ్యాంగులకు 50 శాతం రాయితీ ఇస్తుండగా.. డయాలసిస్ చేయించుకునే వారికి ఉచి త ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రస్తుతం నూ తన విద్యాసంవత్సరంలో వాటిని రెన్యువల్ చేసుకో వాల్సి ఉంటుంది. టోల్ పరిధిలో స్టూడెంట్ పాస్ల ధరలు పెంచుతుండగా, జనరల్ మాత్రం సుమారు రూ.500 నుంచి రూ.600 వరకు పెరిగాయి. స్టూడెంట్ పాస్ల ధరలు ఎలా అంటే.. స్టూడెంట్ మంత్లీ పాస్లకు సంబంధించి పెరిగిన ధరలు ఆన్లైన్లో అప్డేట్ కాలేదు. విద్యా సంస్థల్లో నూతన అడ్మిషన్ లేదా పాత విద్యార్థికి సంబంధించి పాఠశాల/కళాశాల నుంచి ఐడీ, ఎంఆర్ నంబర్తో ఆర్టీసీ బస్పాస్ కౌంటర్ వద్దకు స్టాంప్తో ఉన్న లెటర్ తీసుకెళ్లాలి. నెలవారీ పాస్ అప్లై చేసుకునే సమయంలో రూట్ వారీగా ఆన్లైన్లో కనిపించే పెరిగిన బస్పాస్ చార్జీల ఆధారంగా పాస్ జారీ అవుతుంది. బస్పాస్ చార్జీలు తగ్గించాలి స్టేషన్ఘన్పూర్ నుంచి రోజూ జిల్లా కేంద్రంలోని ఏకశిల ఐటీఐకి చదువుకునేందుకు వస్తాను. నెలవారీ బస్పాస్ ధర గత నెల రూ.375 ఉండేది. ప్రస్తుతం ధర పెంచడంలో అదనపు భారం తప్పదు. ప్రభుత్వ విద్యార్థులపై ఆర్థిక భారం మోపడం సరైంది కాదు. పెంచిన పాస్ల ధరలు తగ్గించాలి. – భూక్యా ఆర్య, ఏకశిల ఐటీఐ, స్టేషన్ఘన్పూర్ ధరలు పెరిగాయి.. క్లారిటీ రావాలి జనరల్, స్టూడెంట్ బస్పాస్ల ధరలు పెరిగిన మాట వాస్తవం. జనరల్ పాస్లు ఇష్యూ చేస్తుండగా, స్టూడెంట్లకు మాత్రం కళాశాల లేదా పాఠశాల నుంచి తీసుకువచ్చిన ధ్రువీకరణ పత్రం ఆధారంగా జారీ చేస్తాం. విద్యార్థి బయోడేటాతో ఆన్లైన్లో చూసిన తర్వాతే ఆ రూట్లో మంత్లీ పాస్ ధర ఎంత అనే విషయం కనిపిస్తుంది. – ఎస్.స్వాతి, డిపో మేనేజర్, జనగామజనగామ నుంచి నెలవారీగా పెరిగిన జనరల్ పాస్ల చార్జీలు మండలం పాత చార్జీ పెరిగిన చార్జీ కిలోమీటర్లు బచ్చన్నపేట రూ.850 రూ.1,250 20 నర్మెట రూ.850 రూ.1,250 20 స్టేషన్ఘన్పూర్ రూ.1,750 రూ.2,250 25 పాలకుర్తి రూ.1,250 రూ.1,650 35 సిద్దిపేట రూ.2,950 రూ.3,450 60 ఉప్పల్ రూ.4,150 రూ.4,650 80కిలోమీటర్ల వారీగా పెరిగిన బస్పాస్ చార్జీలుకి.మీ. స్టూడెంట్ పెరిగిన చార్జీ పాత చార్జీ 4 రూ.150 రూ.225 8 రూ.200 రూ.300 12 రూ.300 రూ.450 18 రూ.390 రూ.585 22 రూ.450 రూ.675 -
గ్రామాల అభివృద్ధికి సర్కారు కృషి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి: గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండలంలోని వావిలాల, మల్లంపల్లి, దర్దెపల్లి, ఈరవెన్ను, శాతాపురం గ్రామాల్లో రూ.95 లక్షల సీఆర్ఆర్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన అనంత రం ఆమె మాట్లాడారు. ప్రతి గ్రామంలో అంతర్గత రహదారులు ఏర్పాటు చేసి ప్రగతికి బాటలు వేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి సొంతింటి కల సాకారం చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ లావుడ్య మంజుల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగా ని కుమారస్వామి, నాయకులు చిలువేరు కృష్ణమూర్తి, ఎర్రబెల్లి రాఘవరావు, యాకాంతరావు, పులి గణేష్, ఎండీ.మదార్, బిర్రు సోమేశ్వర్, జలగం కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వేయర్లు శిక్షణను వినియోగించుకోవాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: సర్వేయర్లు రాణించాలంటే శిక్షణను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్ట ర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం జనగామ మండలం యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ శిబిరాన్ని డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మన్యంకొండతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేయర్ల కొరత ఉందని, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారు తప్పనిసరిగా రాణిస్తారని చెప్పారు. రెవెన్యూ శాఖలో ఎల్ఆర్ఎస్, మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్, జియోగ్రఫీ సర్వీసెస్, జీఎస్ మ్యాపింగ్ వాటిల్లో సర్వేయర్ల ఆవశ్యకత ఉన్నందున భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్ పరంగా కూడా సర్వేయర్లకు మంచి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. థియరీ అనంతరం కళాశాల పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో సర్వేయర్లకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్ పరిశీలించారు. -
సర్కారు స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణ
దేవరుప్పుల : ప్రభుత్వం తలపెట్టిన ‘బడిబాట’.. మెరుగవుతున్న మౌలిక వసతులు.. అర్హత కలిగిన ఉపాధ్యాయులతో బోధనపై నమ్మకం.. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది. మండల పరిధి మాధాపురం ప్రభుత్వ పాఠశాలలో గత ఏడాది 27 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది గ్రామ విద్యావంతుల భాగస్వామ్యంతో ఆ సంఖ్య ఏకంగా 54 మందికి చేరారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చడంతో గిరిజన ఆవాస ప్రాంత తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పాఠశాల హెచ్ఎం నల్ల లలిత తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సూర్జిత్, జీవన్, అంగన్వాడీ టీచర్లు విజయ, రజిత, పేరెంట్స్ సతీష్, నరేష్, మహేష్, సంపత్, లింగస్వామి, వినోద్, బిచ్చా, యాకు, మల్లేష్, రమేశ్, నవీన్, యాకన్న, శ్రీను, కుమారస్వామి, శంకర్ పాల్గొన్నారు. -
నేనూ సర్కారు స్కూల్లోనే చదివా..
● అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ లింగాలఘణపురం: నేనూ సర్కారు స్కూల్లోనే చదివి నేడు ఐఏఎస్ స్థాయికి ఎదిగానని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ అన్నారు. బుధవారం నేలపోగుల గ్రామంలోని రత్నమాల కేసరి(ఎంపీయూపీఎస్) పాఠశాలలో ప్రిప్రైమరీ తరగతులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ సకల సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఎన్ఆర్ఐ లక్ష్మీనారాయణ, ఎంఈఓ విష్ణుమూర్తి, హెడ్మాస్టర్ నవీన్కుమార్ పాల్గొన్నారు. అనంతరం అనదనపు కలెక్టర్ కుందా రం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ‘ఆదర్శ’ పాఠశాల పనులు పూర్తిచేయాలి జనగామ రూరల్: అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. పట్టణంలోని కోర్టు వద్ద ఉన్న బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్లో చేపట్టిన పనులను విద్య, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. అధికారులు పెండింగ్లో ఉన్న పనులు పరిశీలించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ నుంచి వర్చువల్ విచారణ
● పాల్గొన్న మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జనగామ: ఢిల్లీ నుంచి బుధవారం వర్చువల్గా నిర్వహించిన విచారణలో జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావు ఆధ్వర్యాన అధ్యాపక బృందం, ఆయా విభాగాల ప్రొఫెసర్లు పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ఎనిమిది కేటగిరీల పరిధిలో కనీస వసతి సౌకర్యాలు లేవని జాతీయ వైద్య కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. 15వ తేదీన హైదరాబాద్లో జరిగిన సమీక్షకు ప్రిన్సిపాల్ హాజరు కాగా, ఢిల్లీ నుంచి చేపట్టే విచారణలో వర్చువల్గా పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్య సంచాలకులు ప్రత్యక్షంగా హాజరు కాగా.. జనగామ నుంచి ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, ఆయా విభాగాల ప్రొఫెసర్లు పాల్గొని మెడికల్ కళాశాలలో ఉన్న వసతి సౌకర్యాలను వివరించారు. సీటీస్కాన్ సేవలు 10 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని, విద్యార్థుల బోధనకు ఆటంకం కలుగకుండా 10 మృత దేహాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఫాం–16, ఒక డాక్టర్ డిక్లరేషన్కు సంబంధించిన ప్రక్రియను సరిచేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఫేస్ రికగ్నైజేషన్ అంటెడెన్స్ కోసం ప్రభుత్వం నుంచి మిషన్లు సరఫరా చేయలేదని, ప్రస్తుతం సెల్ఫోన్ ఆధారంగా హాజరు నమోదు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎమ్మారై యంత్రం ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, పడకల విషయంలో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభమైతే మరో 100 అందుబాటులోకి వస్తాయనిన్నా రు. బిగ్, స్మాల్ ఆపరేషన్ థియేటర్ల సేవలు సైతం పెరుగుతాయని చెప్పారు. -
పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలి
జనగామ రూరల్: తల్లిదండ్రులు తమ పిల్ల ల ను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలి.. పౌష్టికాహారంతో పాటు విద్యాబోధన ఉంటుందని సీడీపీఓ పూర్ణిమ అన్నారు. ఐసీడీఎస్ పిలుపుమేరకు బుధవారం పసరమడ్ల అంగన్వాడీ కేంద్రంలో చేపట్టిన ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. సర్కారు స్కూళ్లలోనే విలువలతో కూడిన విద్య అందుతున్నదని, పిల్లల బంగారు భవిష్యత్కు బాటలు వేయాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఎస్ఎస్సీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలిజనగామ రూరల్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు నివేదించిన వివిధ పోస్టులకు ప్రత్యక్ష నియామకం ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను ప్రాంతీయ సంచాలకులు కె.రగుల్ ఐ.ఏ.ఎస్.ఆధ్వర్యాన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోస్టుల వివరాలు, వయో ప రిమితి, అవసరమైన విద్యార్హత, చెల్లించాల్సిన రుసుము, పరీక్ష వివరాలు, దరఖాస్తు చేసే విధానం కోసం ఆన్లైన్లో సంప్రదించాలని సూచించారు. ఈనెల 24వ తేదీ లోగా దరఖా స్తు చేసుకోవాలని కోరారు. మహిళా సమాఖ్య నూతన కార్యవర్గం ఎన్నికజనగామ రూరల్: చాకలి ఐలమ్మ మహిళా సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవా రం వివిధ మండల సమాఖ్యల అధ్యక్షులు ఎన్నుకున్నారు. ఎన్నికల అబ్జర్వర్గా పీఎం భారతి, డీపీఎం వరలక్ష్మి వ్యవహరించారు. నూతన అధ్యక్షురాలిగా దేవరుప్పుల మండల అధ్యక్షురాలు పి.మమత, కార్యదర్శిగా జనగా మ మండలానికి చెందిన కె.అరుణ, కోశాధికారిగా లింగాలఘణపురం మండలానికి చెంది న కె.రమ్యశ్రీ ఎన్నికయ్యారు. సమాఖ్య కార్యవర్గ సభ్యులు కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలువగా ఆయన అభినందించా రు. మహిళల అభివృద్ధి, ఆర్థిక ఎదుగులకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత పాల్గొన్నారు. అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ బాలుర కళాశాలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన జూనియర్ ఫిజిక్స్ లెక్చరర్ పోస్ట్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విక్రమ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజిక్స్ సబ్జెక్టులో 50 మార్కులతో పీజీ పూర్తి చేసి బి.ఎడ్ అర్హత కలిగి ఉండాలి, వయసు 44 ఏళ్ల లోపు, బోధనలో మూడేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 26న సాయంత్రం 4 గంటలలోపు కలెక్టరేట్లోని జిల్లా మైనారిటీ సంక్షే మ శాఖ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9951933034, 9059679793, 93469 51278 నంబర్లలో సంప్రదించాలన్నారు. పాలసీల పెంపులో నంబర్ వన్చిల్పూరు: ఎల్ఐసీ పాలసీల పెంపులో 2024–25 సంవత్సరం తెలంగాణలోనే జిల్లా నంబర్ వన్ స్థానంలో ఉంది.. ఇది సిబ్బంది, ఏజెంట్ల కృషి ఫలితమేనని జిల్లా సీనియర్ బ్రాంచి మేనేజర్ హరిలాల్ అన్నారు. మండల కేంద్రంలో జిల్లా స్థాయి మిలీయన్ డాలర్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా జిల్లాలోని 60 మంది ఏజెంట్లతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా చిల్పూరు ఆలయంలో ధర్మకర్త, ఎల్ఐసీ ఏజెంట్ తాళ్లపల్లి బుచ్చయ్య, పిట్టల మహేందర్, దారం రాజన్బాబు ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ బ్రాంచి మేనేజర్ మోతీలాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో హరిలాల్ మాట్లాడుతూ ఇండియాలో 2048 బ్రాంచీలు ఉండగా మొత్తం 33 బ్రాంచీ లు మొదటి స్థానంలో ఉన్నాయని, అందులో తెలంగాణలో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. -
నాడు అన్న.. నేడు తమ్ముడు
భూపాలపల్లి/టేకుమట్ల: వెలిశాల తల్లడిల్లింది. ఈ ప్రాంతంలో నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయారు. 2008లో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ఎన్కౌంటర్లో చనిపోగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆయన తమ్ముడు రవి అలియాస్ గణేష్ మృతిచెందాడు. దీంతో మావోయిస్టు ఉద్యమంలో గాజర్ల కుటుంబ ప్రస్థానం ముగిసినట్లయ్యింది. విషయం తెలియడంతో వెలిశాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యమాల బిడ్డ–నిను మరువదు పోరు గడ్డ అంటూ పలువురు ఉద్యమకారులు రవి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యమానికి పురుడు పోసిన ఘటన.... వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల మల్లయ్య– కనకమ్మలకు ఐదుగురు కుమారులు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్. మల్లయ్య వ్యవసాయం, గౌడ కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. 1987లో గుమ్మడవెల్లి కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో గాజర్ల సారయ్య చైర్మన్ బరిలో నిలిచి గెలుపొందాడు. అయినప్పటికీ అప్పటి పెత్తందారులు బ్యాలెట్ బాక్స్లను గల్లంతు చేసి ఓడినట్లుగా అధికారులతో ప్రకటింపజేశారు. దీంతో సారయ్య మందమర్రిలో ఉండే తన అన్న సమ్మయ్య దగ్గరికి వెళ్లి ఉపాధి కోసం చూస్తాడు. అక్కడ కూడా అతనిపై అక్రమ కేసులు మోపడంతో 1990లో పూర్తిస్థాయిలో నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్లాడు. సారయ్య అలియాస్ ఆజాద్గా గుర్తింపు పొందాడు. ఆయన బాటలోకి గాజర్ల రవి, అశోక్ వెళ్లారు. 2008లో జరిగిన ఎన్కౌంటర్లో సారయ్య అలియాస్ ఆజాద్ చనిపోయాడు. తాజాగా రవి కూడా ఎన్కౌంటర్లో మృతిచెందాడు. అశోక్ మాత్రం 2016లో పోలీసుల ఎదుట లొంగిపోయి, ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. సారయ్య విగ్రహం ఏర్పాటు.. కూల్చివేత.. పోలీసుల శాంతి స్థూపం 2008లో జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల సారయ్య హతమవగా కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థంగా ఆయన విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పటికీ కూలిపోయిన సారయ్య విగ్రహం అక్కడ ఉంది. కాగా, గాజర్ల కుటుంబంలో నక్సల్స్లో చేరిన ముగ్గురిని చూసి గ్రామంలో చాలామంది ఉద్యమ బాట పట్టారు. దీంతో 2005లో అప్పటి సీఐ శ్యాంసుందర్రెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వెలిశాల గ్రామంలో శాంతి స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత రవి మృతి 33 ఏళ్ల క్రితం ఎర్రజెండా పట్టి అజ్ఞాతంలోకి.. సెంట్రల్ కమిటీ సభ్యుడి హోదాలో మరణం వెలిశాలలో ముగిసిన అన్నల శకం మూగబోయిన వెలిశాల.. ఎన్కౌంటర్లో రవి మృతి చెందిన విషయం తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నక్సల్స్ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో ఇద్దరు ఉద్యమకారులు నేలకొరిగారంటూ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు రవితో గడిపిన సమయాలను నెమరువేసుకుంటున్నారు. నేడు అంత్యక్రియలు... ఎన్కౌంటర్లో రవి మృతి చెందాడని ఏపీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం గాజర్ల కుటుంబీకులకు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటున్న సమ్మయ్య, అశోక్(ఐతు)లు రవి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున తిరిగి వెలిశాలకు వచ్చే అవకాశం ఉండగా, రవి అంత్యక్రియలు సాయంత్రం జరగనున్నాయి. ఆపరేషన్లలో దిట్ట.. గాజర్ల రవి 1985–1986లో వరంగల్లో ఐటీఐ చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై స్టూడెంట్ యూనియన్లో పనిచేశాడు. తన అన్న సారయ్య అప్పటికే క్రియాశీలకంగా నక్సల్స్ ఉద్యమంలో పనిచేస్తుండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. దీంతో 1992లో ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. పోలీసులపై దాడులు చేయడంలో దిట్టగా గాజర్ల రవి పేరొందాడు. ఆయన ఆపరేషన్ నిర్వహిస్తే ఫెయిల్ కాదన్న అభిప్రాయం ఉంది. 1994లో ప్రస్తుత జయశంకర్ జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో ల్యాండ్మైన్ పేల్చి నలుగురు పోలీసులను చంపిన వారిలో రవి కీలకంగా వ్యవహరించాడు. 2001లో ఏటూరునాగారం పోలీస్స్టేషన్పై దాడి ఘటనలో ఉన్నాడు. ఇవే కాక పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలపై జరిపిన అనేక దాడుల్లో రవి కీలకంగా వ్యవహరించాడు. 2004లో మావోలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో రవి కూడా ప్రతినిధిగా వ్యవహరించాడు. -
పెట్రోల్బంక్ నిర్మాణానికి స్థల పరిశీలన
రఘునాథపల్లి: రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఖిలాషాపూర్ రోడ్డులో స్వయం కృషి దివ్యాంగుల మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్బంక్ నిర్మాణానికి మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిణి వసంత, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దిన్, తహసీల్దార్ మోహ్సిన్ముజ్తబ, డీపీఎం రాజేంద్రప్రసాద్లతో కలిసి కలెక్టర్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12 గుంటల స్థలంలో పెట్రోల్ బంకు నిర్మాణానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నుంచి అనుమతి లభించిందన్నారు. సుమారు రూ.70 లక్షలతో నిర్మించనున్న ఈ పెట్రోల్ బంక్ నిర్మాణంతో దివ్యాంగుల మండల సమాఖ్య అభివృద్ధి పథంలో కొనసాగనుందన్నారు. ఆయన వెంట ఏపీఎం సారయ్య, సీసీలు జంపయ్య, రేణుక, లలిత తదితరులు ఉన్నారు. పాఠశాల ఆకస్మిక తనిఖీ జనగామ: పట్టణంలోని రైల్వే స్టేషన్ ఏరియా ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్ాధ్యలను పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభను చూసిన డీఈఓ వారిని అభినందించి, కష్టపడి చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను విద్యార్థులకు అందించారనే అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సర్కారు అందిస్తున్న సంక్షేమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వి.కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు ఉన్నారు. భూగర్భ జలాలను పెంచుకోవాలి నర్మెట/బచ్చన్నపేట: భూగర్భ జలాల పెంపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కేంద్ర జలశక్తి అభియాన్ శాస్త్రవేత్త వెంకటగిరి అన్నారు. మంగళవారం నర్మెట, బచ్చన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రతి ఇంట్లోని నీరు వృథాగా పోకుండా ఇంకుడుగుంతను నిర్మించుకోవాలన్నారు. సంబంధిత ఈజీఎస్ అధికారులు గ్రామాల్లో ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓలు బోడపాటి అరవింద్ చౌదరి, వెంకటమల్లికార్జున్, ఏపీఓలు కృష్ణ, పులుగం రమాదేవి, టీఏ బాబు, కార్యదర్శులు శ్రీధర్, గణేష్, నరేష్, సుజాత, తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల నూతన ఫోన్నంబర్లుజనగామ: జనగామ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ఇంజినీర్ల ఫోన్ నంబర్లు మారినట్లు డీఈ ఎం.లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పాత నంబర్ల స్థానంలో కొత్త సిమ్ కార్డులను ఇవ్వడం జరిగిందని, ఈ నంబర్లను ప్రతీ వినియోగదారుడు తెలుసుకుని సేవలను పొందాలన్నారు. హోదా ఫోన్నంబర్ ఎస్ఈ,జనగామ 87124 82677 డీఈ 87124 82682 ఏడీఈ 87124 82693 ఏఈ,జనగామ టౌన్–1 87124 82718 ఏఈ,జనగామ టౌన్–2 87124 82719 ఏఈ,జనగామ రూరల్ 87124 82720 ఏఈ,పెంబర్తి 87124 82721 ఏఈ,బచ్చన్నపేట 87124 82722 ఏఈ,పడమటికేశ్వార్ 87124 82723 ఏడీఈ,దేవరుప్పుల 87124 82695 ఏఈ,దేవరుప్పుల 87124 82724 ఏఈ,సింగరాజుపల్లి 87124 82725 ఏఈ,లింగాలఘణపూర్ 87124 82726 ఏడీఈ,రఘునాథపల్లి 87124 82694 ఏఈ,రఘునాథపల్లి 87124 82728 ఏఈ,ఖిలాషాపూర్ 87124 82729 ఏఈ,నర్మెట 87124 82730 ఏఈ,తరిగొప్పుల 87124 82731 -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం
జనగామ రూరల్: ప్రజావ్యతిరే విధానాలపై ప్రజానాట్యమండలి కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఐలమ్మనగర్లో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి నాటక శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు భూనాద్రి వెంకటేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజానాట్యమండలి కళారూపాలు ప్రజల పక్షాన నిత్యం పోరాడే ఆయుధాలన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ముఖ్య ఘట్టాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో భాగంగా వీర తెలంగాణ నాటకాన్ని ప్రజానాట్యమండలి జిల్లా కళాకారులు నేర్చుకోవడం జరుగుతుందన్నారు. ఈ కళారూపాలను జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రదర్శిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుంచు విజేందర్, జోగు ప్రకాశ్, శివ ప్రసాద్, నరసింహ స్వామి, బాలమని, ప్రమీల, లత, భాగ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి -
కనీస వసతులేవి?
● ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుపై నీలినీడలు ● పూర్తిస్థాయిలో వసతులు కల్పించకపోవడంతో ఎన్ఎంసీ షోకాజ్ ● ఎనిమిది కేటగిరీల్లో లోపాలు ఉన్నట్లు గుర్తింపు ● నేడు విచారణ, వర్చువల్ పద్ధతిలో పాల్గొననున్న ప్రిన్సిపాల్ ● సెప్టెంబర్ 15 నుంచి థర్డ్ ఇయర్ ప్రారంభంజనగామ: ప్రాథమిక స్థాయిలోనే ప్రతీ విద్యార్థి ఎంబీబీఎస్ చదవాలని కోరుకుంటారు. భవిష్యత్లో ఏం కావాలనుకుంటున్నావనే టీచర్ ప్రశ్నకు విద్యార్థి నోటి నుంచి టక్కున వచ్చే జవాబు డాక్టర్. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు డాక్టర్ వృత్తిని కోరుకుంటారు. అంతటి ప్రాధాన్యం కలిగిన వృత్తిపై నీలినీడలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కనీస వసతి సౌకర్యాలు లేవని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు ఈ నెల 14వ తేదీన ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. 2025–26 నూతన విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుకు సంబంధించి మెడికల్ కళాశాలలో విద్యార్థుల బోధనకు తగ్గట్టుగా సౌకర్యాలు లేవని గుర్తించారు. యూజీఎంఎస్ఆర్–2023 నిబంధనలను అనుసరించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కనీస మౌలిక వసతి సౌకర్యాలు, అధ్యాపకులు, విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ హాజరు ఎంబీబీఎస్ విద్యార్థుల బోధన సమయంలో సరిపడా రోగులు, ప్రాక్టికల్స్కు అవసరమైన మృతదేహాలు ఉండాలి. కళాశాల నిర్వహణ ఇలా... జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు చంపక్హిల్స్ మాతా శిశు సంరక్ష ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) ఉంది. ప్రస్తుతం ఎంసీహెచ్ ప్రాంగణంలోని తాత్కాలిక రేకుల షెడ్డుల్లో ఏర్పాటు చేసిన మొదటి, ద్వితీయ సంవత్సర ఎంబీబీఎస్ తరగతులు కొనసాగుతున్నాయి. కోమటిరెడ్డి సుశీలమ్మ అనాథ వృద్ధాశ్రమంలో విద్యార్థినులకు హాస్టల్ వసతి సౌకర్యం కల్పించగా, విద్యార్థులు చంపక్హిల్స్లోని డీఆర్డీవో భవనంలో ఉంటున్నారు. వచ్చే సెప్టెంబర్ 15 నుంచి మూడవ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్న నేపధ్యంలో హాస్టల్తో పాటు తరగతి బోధనకు జిల్లా ఆస్పత్రి ఎదుట ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీసును అద్దెకు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. 100 పడకలతో క్రిటికల్ కేర్ మెడికల్ కళాశాలలో సౌకర్యాలు లేవని ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఇందులో 90 శాతం మేర త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 100 పడకలతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. డీహెచ్లో ీసీటీ స్కాన్ సేవలను వారం రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెడికల్ కళాశాలలో 117 పోస్టులకు గాను రెగ్యులర్ ఉద్యోగులు 82, కాంట్రాక్టు 7 మంది విధులు నిర్వర్తిస్తుండగా, 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జిల్లా కేంద్రం సిద్దిపేట రోడ్డు గీతానగర్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనం ఆరునెలల్లో అందుబాటులోకి రానుంది. నేడు వర్చువల్గా విచారణ మెడికల్ కళాశాల నిబంధనలకు సంబంధించి ఢిల్లీలో నేడు (బుధవారం) జరిగే విచారణకు ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్య సంచాలకులు హాజరు కావాలని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (యూజీఎంఈబీ) ఆదేశించింది. ఈ విచారణలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆయా కళాశాలల నుంచి వర్చువల్గా అందుబాటులో ఉండాలని కోరారు.ఎనిమిది కేటగిరీల్లో లోపాలు.. జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎనిమిది కేటగిరీల్లో లోపాలు ఉన్నట్లు జాతీయ వైద్య కమిషన్ విచారణలో వెల్లడైయింది. మృతదేహాలు, పడకలు, సిటీ స్కాన్, ఎమ్మారై సేవలు, ఆపరేషన్ థియేటర్లు, ఫారం–16 ఇన్ కంప్లీట్, ఒక డాక్టర్ డిక్లరేషన్కు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డీహెచ్, ఎంసీహెచ్లో ఎన్ఎంసీ నిబంధనలను అనుసరించి 420 వందల బెడ్లకు గాను 20 తక్కువగా ఉన్నాయి. బిగ్, స్మాల్ ఆపరేషన్ థియేటర్లు 12 ఉండాల్సిన చోట 9 మాత్రమే ఉన్నాయి. అలాగే క్రిటికల్ ఆపరేషన్ థియేటర్లు చిన్నవి, పెద్దవి కలిపి 5కు గాను ఒక్కటి లేవు. కొంతమంది డాక్టర్లకు సంబంధించి ఫాం–16 ఇన్కంప్లీట్, ఒక డాక్టర్ డిక్లరేషన్ ఇవ్వక పోవడాన్ని అందులో ప్రధానంగా చూపించారు. సమస్యలన్నీ చిన్నవే.. జనగామ మెడికల్ కళాశాలకు ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎనిమిది కేటగిరీల్లో లోపాలు ఉన్నట్లు చూపించారు. కళాశాల ప్రారంభ సమయంలో 6 మృతదేహాలు చూపించగా, ఆ తర్వాత మరో నాలుగువచ్చాయి. సీటీ స్కాన్ సేవలు మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. వైద్యుల ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్కు సంబంధించి పైనుంచే మిషన్లు రాలేదు. ప్రస్తుతం ఎవరికి వారే సెల్ఫోన్ల ద్వారా హాజరు శాతం నమోదు చేసుకుంటున్నారు. ఫారం–16, డాక్టర్ డిక్లరేషన్ కంప్లీట్ చేస్తున్నాం. – డాక్టర్ గోపాల్రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
అట్రాసిటీ కేసుల పరిష్కారానికి కృషి
జనగామ రూరల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరెట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి అట్రాసిటీ కేసులపై జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన బడ్జెట్ ప్రకారం పెండింగ్ లేకుండా బాధితులకు నష్ట పరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 15 నుంచి జూలై 15వ తేదీ వరకు జిల్లాలో ఎంపిక చేసిన 9 గ్రామ పంచాయతీల్లో గిరిజనుల సమస్యలపై ప్రధానమంత్రి దర్తీ ఆబ జాన్ భగీదారి అభియాన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఏసీపీ డీఎస్డీఓ విక్రమ్, డీపీఓ స్వరూప, రాణా ప్రతాప్, భోజన్న పాల్గొన్నారు. పక్కాగా భూగర్భ జలాల నిర్వహణ భూగర్భ జల వనరుల పరిరక్షణలో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. కలెక్టరేట్లో భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి భూగర్భ జలాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచడానికి చర్యలు చేపట్టడంతోనే గణనీయంగా మార్పు వచ్చిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి అశోక్, డీఆర్డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
మోదీతోనే అభివృద్ధి సాధ్యం
లింగాలఘణపురం: దేశ అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కొండబోయిన సంపత్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంతో పాటు రాష్ట్రంలో కూడా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, నేనషల్ హైవేల అభివృద్ధి వంటి పనులు జరుగుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, సోమిడి వెంకట్రెడ్డి, నాగరాజు, సతీష్, గణేష్, కార్తీక్, సాయికుమార్, శర్మ, రవి, అనిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ిసీటీ స్కాన్ సేవలు!
జనగామ: జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (డీహెచ్)లో సీటీస్కాన్ సేవలను మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ీసీటీ స్కాన్ యంత్రం డీహెచ్కు చేరుకుని నెలలు కావస్తుంది. యంత్రం ఇన్స్స్టాలేషన్కు సంబంధించి ఏజెన్సీ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సి ంహ్మ మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు ఫోన్ చేసి ఆరా తీశారు. సీటీ స్కాన్ సేవలను త్వరగా ప్రాంభించాలని ఆదేశించారు. జిల్లా ఆస్పత్రిలో ఓల్డ్ సీటీ స్కాన్ గదిలోనే కొత్త యంత్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి పాత మిషన్ను తొలగించి, కొత్తగా ఏర్పాటు కోసం గదిలో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ నెల 27వ తేదీలోపు ీసీటీస్కాన్ సేవలను ప్రారంభించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో ీసీటీ స్కాన్ సేవలు మూలన పడి 8 ఏళ్లు గడిచి పోతున్నా, పాత వాటి స్థానంలో కొత్త సేవల ప్రారంభంలో జాప్యం పై ‘సాక్షి’ లో అనేక కథనాలు ప్రచురితం చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. ీసీటీస్కాన్ యంత్రం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేయగా, ప్రస్తుతం ఇన్స్స్టాలేషన్ దశలో ఉంది. సాక్షి కృషితో కొద్ది రోజుల్లో పేదలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని సాధించాలి
జనగామ రూరల్: ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లు లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేశ్కుమార్లతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రెండవ విడతగా ఐదు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేయగా మార్కింగ్ పనులు వేగవంతంగా జరిగిందన్నారు. ఇళ్ల ప్రగతిలో స్టేషన్ఘనపూర్ నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఆర్డీఓ డీఎస్. వెంకన్న, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంత నాయక్, హౌసింగ్ పీడీ మాతృనాయక్, డీఈ చంద్రశేఖర్, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఇంటి నంబర్లు కేటాయించాలి
జనగామ రూరల్: పట్టణంలో మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు అధికారులు ఇంటి నంబర్లు వేసి కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అన్నారు. మంగళవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ..గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలోని నిరుపేదలకు 114 ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చారన్నారు. అందులో అనేక ఇబ్బందులు పడి ఇంటి నిర్మాణం చేసుకున్నారని, కానీ ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భూక్య చందు నాయక్ ముసుపట్ల జయ, తేరాల అండాలు, ఏనుగుల కమల, గంగా కౌర్, గంగాధరి సురేష్, సిలివేరి ఉపేందర్, బాలస్వామి, మంద అ మల, రాములు, నీల సమ్మక్క, స్వరూప, దానమ్మ, సుజాత, సిద్ధమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నతో ‘సీఎం’ విజయవంతం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల అమలు తీరును తెలుసుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యాన సోమవారం చేపటిన ముఖాముఖి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు మంత్రులు, సీ.ఎస్ కె.రామకృష్ణారావులతో కలిసి సీఎం 1,031 రైతు వేదికల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. జిల్లాలోని 12 వేదికల్లో వీసీ అందుబాటులో ఉండగా.. మరో 24 చోట్ల ఏర్పాటు చేసిన నూతన వీసీలను ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. మొత్తంగా 36 రైతు వేదికల్లో జిల్లా నుంచి 7,500 మంది రైతులు పాల్గొన్నారు. జనగామ మండలం చీటకోడూరు రైతు వేదికలో ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, ఆర్టీ మెంబర్ అభిగౌడ్, జిల్లా వ్యవసాయధికారి రామారావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, కొడకండ్ల, చిల్పూరు, రఘునాథపల్లి, దేవరుప్పుల, బచ్చన్నపేట పరిధిలో అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. ముఖాముఖిలో 7,500 మంది రైతులు 36 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం పండుగ వాతావరణంలో స్వాగతం -
సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలి
జనగామ: ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించేలా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో క్లబ్ అధ్యక్షుడు ఎడమ సంజీవరెడ్డి ఆధ్వర్యాన నిర్వహించిన లయన్స్ క్లబ్ జనగామ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలను అవగాహన కల్పించాలన్నారు. అహ్మదాబాద్లో చదువుకునే సమయంలో లయన్స్ సేవల గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయానని, అధికారి హోదాలో ఇక్కడ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి, దివంగత కాసం అంజయ్య సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు చంద్రగిరి శ్రీనివాస్, గోవింద్రాజ్, దీపక్ భట్టాచార్య, బాబురావు, వెంకటరెడ్డి, దయాకర్ రెడ్డి, సుకుమార్, డాక్టర్ లవకుమార్రెడ్డి, ముచ్చ రాజిరెడ్డి, కన్న పరశురాములు, రఘునాథ్రెడ్డి, ప్రమోద్కుమార్, కృష్ణ జీవన్ బజాజ్, ప్రభాకర్, జయహరి, గోపయ్య, ఈశ్వర్రావు, హన్మంతరావు, డాక్టర్ కల్నల్ భిక్షపతి, బుస్సా సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
ఇందిరమ్మ ఇళ్లకు నంబర్లు ఇవ్వాలి
జనగామ రూరల్ : పట్టణంలో ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు వెంటనే ఇంటి నంబర్లు వేసి కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస సౌకర్యాలు కల్పించి పేదలను ఆదుకోవాలని లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు, అహల్య, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, ఉపేందర్, చందు నాయక్, బొట్ల శ్రావణ్, పాము శ్రీకాంత్, బాలమణి, పాముకుంట్ల చందు, సుమ, ఎండీ గౌసియా, నాజియా తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి -
విద్యుత్ పనులు త్వరగా పూర్తిచేయాలి
జనగామ రూరల్ : విద్యుత్ సమస్యలతో పాటు పెండింగ్లో ఉన్న డీడీ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ విద్యుత్ శాఖ అధికారులను కోరారు. సోమవారం ఏఈకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ.. మండలంలోని బోరుబావుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నాయని వాటిని సరిచేయాలన్నారు. రైతులు, పశువులు విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారని కొత్త విద్యుత్ తీగలు అమర్చాలని కోరారు. డీడీలు చెల్లించిన రైతులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగకుండా పనులు త్వరగా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మంగ భీరయ్య, నాయకులు విజయ్కాంత్, రజనీకాంత్, బాలుతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయాలి
జనగామ రూరల్: క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిర ఆధ్యర్యాన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి బూత్, మండల, బ్లాక్, జిల్లా కమిటీలు పూర్తి చేయాలని, ప్రతి నెలా జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పారు. వచ్చేనెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి.. కాబట్టి మండలాధ్యక్షులంతా బూత్ కమిటీలను పూర్తి చేసి కష్టపడి పని చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను గడప గడపకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జనగామ మండల అధ్యక్షురాలు కాముని జయకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకట సుబ్బమ్మ, బొట్రెడ్డి శ్రీలతరెడ్డి, దేవులపల్లి భాగ్యలక్ష్మి, కొయ్యడ శోభ, గంగ కోమలత, మౌనిక, స్వప్న, ప్రవళిక, నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య -
ప్రేరణ సాంగ్ అద్భుతం
జనగామ: ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను చాటి చెబుతూ రవీందర్ అల్లూరి రాసిన ‘బడిబాట’ ప్రేరణ సాంగ్ అద్భుతంగా ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా కితాబిచ్చారు. ఇందుకు సంబంధించిన సీడీని సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్తో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, నాణ్యమైన విద్య, విద్యార్థుల నమోదును పెంచేందుకు టీచర్లు పడుతున్న శ్రమను కళ్లకు కట్టినట్లుగా ఈ పాటలో చూపించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, హెచ్ఎం రవీందర్, ఉపాధ్యాయులు వాసంతి, జ్యోతి, నర్సింహారెడ్డి, కె.సురేందర్రెడ్డి, ఎం.లింగం తదితరులు పాల్గొన్నారు. ఇంకుడు గుంతల పరిశీలన కొడకండ్ల : మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను కేంద్ర బృందం సోమవారం పరిశీలించింది. మొండ్రాయి, పెద్దబాయితండా, రామవరం, కొడకండ్ల గ్రామాల్లో కేంద్ర భూగర్భ జలశాఖ మినిసీ్ట్ర ఆఫ్ జలశక్తి అభియాన్ బృందం పర్యటించింది. సైంటిస్ట్ వెంకటగిరి ఆధ్వర్యంలో కేంద్ర బృందం ఇంకుడు గుంతలు, పాం పాండ్, ఫిష్ పాండ్లను పరిశీలించి, అవి వినియోగంలో ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫ్లాంట్ మేనేజర్ వీరన్న, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి, ఏపీఓ కుమారస్వామి, ఈసీ రమేశ్, టీఏలు సుధీర్, బస్వ భాస్కర్, కందికట్ల యాకయ్య, కార్యదర్శులు మధు, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ చాంపియన్ రామ్కిరణ్ చిల్పూరు: మండలంలోని శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన గౌలికర్ రామ్కిరణ్ వాలీబాల్లో ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ అవార్డు అందుకున్నాడు. గతంలో వరంగల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన నేషనల్ లెవల్ వాలీబాల్ పోటీల్లో ఇంటర్నేషనల్కు ఎంపికయ్యాడు. ఇటీవల నేపాల్లోని పొకరాలో జరిగిన అండర్–19 పోటీల్లో తెలంగాణ తరఫున ఆడి అవార్డు అందుకున్నాడు. ‘జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి’ జనగామ: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని టీఎస్ జేయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పలంచి నరేందర్ సోమవారం డీఈఓ భోజన్నకు వినతి పత్రం అందజేశారు. అనంతరం నరేందర్ మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టుల్లో చాలా మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే ఉన్నారని, వారి పిల్లల చదువులకు రాయితీ కల్పించాలని కోరారు. స్పందించిన డీఈఓ త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ జేయూ ఉపాధ్యక్షుడు గంగిశెట్టి మహేష్కుమార్, కోశాధికారి కొన్నె ఉపేందర్, కార్యవర్గ సభ్యులు చేల్లోజు నవీన్ కుమార్, ఓంకార్, గన్ను కార్తీక్, ఎండీ.అఫ్రోజ్, ప్యాట రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల జనగామ రూరల్ : ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జిల్లాకు సంబంధించి సెకండ్ ఇయర్లో 1,227 మంది పరీక్ష రాయగా 740 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 720 మందికి 429 ఉన్నారు. ఫస్ట్ ఇయర్లో 2,007 మందికి 1,282 పాసయ్యారు. ఇందులో బాలురు 829 మందికి 430 మంది, బాలికలు 1,178 మందికి 852 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఒకేషనల్లో 343 మందికి 221 మంది, సెకండియర్లో 376 మందికి 192 మంది పాసైనట్లు ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. -
ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ
జనగామ రూరల్: ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ.. సమస్యలు తీర్చాలంటూ ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. అటు మండల స్థాయిలో.. ఇటు జిల్లా స్థాయి గ్రీవెన్స్లో పదుల సార్లు అర్జీలు పెట్టుకున్నా పరిష్కారానికి నోచుకోవడంలేదు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు వచ్చిన ప్రజలు అధికారులకు తమ గోడు చెప్పుకుని వేడుకున్నారు. వివిధ సమస్యలపై 56 వినతులు రాగా రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్ అర్జీలను పెండింగ్లో లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, జనగామ, స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డీఆర్డీఓ వసంత, అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● జిల్లా కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన చెరుకు ప్రమీల కొడుకు శ్రీకాంత్ దివ్యాంగుడు. కురుస్తున్న పాత పెంకుటింట్లో జీవనం సాగిస్తున్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రమీల అర్జీ పెట్టుకుంది. ● పాలకుర్తి మండలం ముత్తారానికి చెందిన రైతులు పొరల కృష్ణ, కర్రె రవీందర్, బామండ్ల పెద్దాపురం రైతులు కోమటి చెరువు బ్రాహ్మణ కుంట చెరువు శిఖంలో బోర్లు వేసి వ్యవసాయం చేస్తున్నారు. పట్టా భూములకు దారి లేకుండా చేశార ని, తాము పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణం చర్యలు తీసుకో వాలని గ్రామ రైతులు కోరారు. ● చిల్పూర్ మండలం మల్కాపూర్కు చెందిన గంకిడి వీరారెడ్డి అంధుడు. హైదరాబాదు జీఎస్టీ కార్యాలయంలో పనిచేస్తాడు. ‘తన వాటాకు వచ్చిన ఎకరం 10 గుంటలతో పాటు ఇంటి స్థలాన్ని అన్న, వదిన అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. న్యాయం చేయాలని’ అర్జీ పెట్టుకున్నాడు. పక్క ఫొటోలోని వృద్ధురాలి పేరు బి.వీరభద్రమ్మ. తరిగొప్పులకు చెందిన ఈమె భర్త రాజేశ్వర్ చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరో నా సమయంలో వీరభద్రమ్మకు పాజిటివ్ రావడంతో పాటు బ్లాక్ ఫంగస్, షుగర్, బీపీ అటాక్ అయింది. దీంతో ఓ కన్ను వందశాతం పోయింది. అలాగే నోట్లోని కపాలం తొలగించారు. ప్రస్తు తం ఆమెకు నెలనెలా మందులకు రూ.5వేలు ఖర్చవుతోంది. 64ఏళ్ల వయస్సులో భర్త తన రెక్క ల కష్టంతో భార్యకు చికిత్స చేయిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నా డు. సదరం సర్టిఫికెట్ కోసం శిబిరానికి వెళ్తే ‘ఒకే కన్ను పోయింది.. రెండో కన్ను పోతేనే పింఛన్ వస్తది’ అంటూ వెళ్లగొట్టార ని వీరభద్రమ్మ వాపోయింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా కు చెబుతూ కన్నీటి పర్యంతమైంది. పింఛన్ కావాలంటే గిన్ని తిరకాసులేంటని ఆమె తీవ్ర మనోవేదన గురైంది. మండలంలో 20 సార్లు.. గ్రీవెన్స్లో 8 సార్లు పుట్టుకతోనే నడవలేని పరిస్థితి. పీజీ వరకు చదువుకున్నాను. అమ్మా, నాన్నకు ఒక్కడినే. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. సిస్టం వర్క్ ఫర్ఫెక్ట్గా వస్తుంది. ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో ఓ చిన్న ఉద్యోగం ఇప్పించండి. మూడేళ్ల నుంచి మండల పరిషత్లో 20 సార్లు, కలెక్టరేట్ గ్రీవెన్స్లో 8 సార్లు వినతిపత్రం ఇచ్చాను. నా మొర ఆలకించడం లేదు. ఆదుకోండి. – ఏనూతల నాగరాజు, పాలకుర్తి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి చిన్న పాటి వర్షానికే ఇంట్లో ఉండ లేకపోతున్నం. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నం. మొదటి జాబితాలో పేరుఉన్నా మంజూరు సమయంలో రాలేదు. దివ్యాంగుడైన కొడుకు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తమను పోషిస్తున్నాడు. ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – చెరుకు ప్రమీల, ధర్మకంచ, జనగామ పట్టణం ఆలకించి సమస్యలు తీర్చండి గ్రీవెన్స్లో మొరపెట్టుకున్న అర్జీదారులు వివిధ సమస్యలపై 56 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా -
సన్మాన సభకు తరలిరండి
జనగామ రూరల్ : మంద కృష్ణమాదిగ సన్మాన సభకు లక్షలాదిగా దివ్యాంగులు తరలి రావాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిర్రు నగేష్ పిలుపునిచ్చారు. సోమవారం వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీ అందుకున్న మంద కృష్ణను ఈ నెల 19వ తేదీన హైదరాబాద్లోని నాగోల్ శుభం ఫంక్షన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ధరావత్ స్వామి, ఉడుత అనిల్, పశువుల సోమయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
పొద్దంతా ఉక్కపోత.. రాత్రి చలి
జనగామ: వాతావరణంలో చోటుచేసుకుంటున్న వింత మార్పులు ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పొద్దంతా ఎండ.. మధ్యాహ్నం ఆకాశంలో మబ్బులు.. రాత్రి ఈదురు గాలులు, చలి.. ఫలితంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. రాత్రి బాగానే ఉన్నట్టుండి.. తెల్లవారే సరికి అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్తీ దవాఖానలు, సబ్ సెంటర్లు, జిల్లా ప్రభుత్వ జనరల్(డీహెచ్) ఆస్పత్రులు ఉన్నాయి. వాతావరణంలో వస్తున్న అనేక మార్పుల కారణంగా జనం ఒళ్లు నొప్పులు, తీవ్ర జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం పరిస్థితిని మరింత జఠిలంగా మార్చుతోంది. నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్న పంచాయతీల్లో శానిటేషన్ నిర్వహణ గాడి తప్పింది. దోమల స్వైర విహారంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. వెరసి ప్రజలు అనారోగ్యానికి గురై ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సోమవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సమారు 450 మంది వరకు ఓపీలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో స్వల్ప జ్వరంతో ఉన్నవారు 150 మంది ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు జిల్లా ఆస్పత్రితో పాటు మండలాల పరిధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 19,463 మంది ఓపీలో పేర్లు నమోదు చేసుకోగా, 391 మంది అడ్మిట్ అయ్యారు. జిల్లా ఆస్పత్రిలో 4,630 మంది ఓపీ, 72 మంది అడ్మిట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ 14,833 మంది, అడ్మిట్ అయిన జ్వర పీడితులు 319 మంది ఉన్నారు. వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన వారికి రక్త నమూనాలు తీసుకుని పరీక్షలు చేస్తూ వైద్యం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ 15 రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు చేరిన రోగుల సంఖ్య 11 వేల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. నిత్యం పర్యవేక్షణ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందిస్తున్న వైద్య సేవలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పల్లెల్లో నమోదవుతున్న జ్వర పీడితులు, ఇతర రోగ గ్రస్తులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. సబ్ సెంటర్ల పరిధి గ్రామాల్లో సైతం ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం జ్వరాలు వస్తున్నా తగ్గుముఖం పడుతున్నాయి. – డాక్టర్ మల్లికార్జున్ రావు, డీఎంహెచ్ఓ15 రోజుల్లో జిల్లాలోని ఆస్పత్రులకు వచ్చిన రోగుల సంఖ్యా వివరాలు వాతావరణంలో పెనుమార్పులు జ్వరాల బారిన జనాలు రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు 15 రోజుల్లో ఓపీ 19,463గా నమోదు 391 మంది అడ్మిట్ ఆస్పత్రి నమోదు ఓపీ అడ్మిట్డీహెచ్ 4,630 4,558 72 పీహెచ్సీ 14,833 14,514 319 -
పార్టీలకు ‘స్థానిక’ జోష్!
● మంత్రి పొంగులేటి ప్రకటనతో పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి ● వారంలో నోటిఫికేషన్ ఉంటుందన్న సంకేతాలు ● నేటి కేబినెట్ మీటింగ్ తర్వాత మరింత స్పష్టత ● ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ● ఆతర్వాతే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ● అధికార పార్టీలో మళ్లీ మొదలైన ఆశావహుల ప్రయత్నాలు ● ‘స్థానిక’ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తంసాక్షి ప్రతినిధి, వరంగల్: పల్లెల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పొలిటికల్ పార్టీలకు ఎలక్షన్ జోష్ వచ్చింది. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందన్న మంత్రుల వ్యాఖ్యలు.. ఎన్నికల వేడిని రగిలించాయి. మూడు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అత్యధికంగా గెలిచేలా సిద్ధంగా ఉండాలి’ అని నాయకులకు మార్గనిర్దేశం చేసిన మంత్రి ధనసరి సీతక్క పరోక్షంగా ‘స్థానిక’ ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. రెవెన్యూ, గృహనిర్మాణశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏకంగా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. సోమవారం జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. దీంతో అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ని పార్టీల ఆశావహులు పోటీ చేసేందుకు మళ్లీ పావులు కదుపుతున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు! మంత్రుల వ్యాఖ్యలు, ఇదే అంశంపై సోమవారం కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంటామనడంతో ‘స్థానిక’ ఎన్నికల నగారా ఖాయమన్న చర్చ జరుగుతో ంది. 2019 ఏప్రిల్ 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. 27న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. ఇప్పటికే జిల్లాల వారీగా ఎన్నికల, అధికార యంత్రాంగం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలు, బూత్లు, ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. 2019 ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీ చైర్మన్ పదవులు కేటాయించారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఎస్సీ పురుషుడు/మహిళ, వరంగల్ రూరల్ (వరంగల్) జనరల్, జనగామ అన్ రిజర్వుడ్ కోటాలో పురుషుడు/మహిళ, జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ మహిళ, ములుగు అన్ రిజర్వుడ్ పురుషుడు/మహిళ, మహబూబాబాద్ ఎస్టీ మహిళకు కేటాయించారు. అలాగే ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే ఈసారి నిర్వహించబోయే ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే పరిగణనలోకి తీసుకుంటారా? లేక కొత్త నిబంధనలు తీసుకొస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో జిల్లాల వారీగా మొత్తం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలుజిల్లా పేరు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ స్థానాలు స్థానాలు స్థానాలువరంగల్ అర్బన్ 07 07 86 వరంగల్ రూరల్ 16 16 178 భూపాలపల్లి 11 11 106 ములుగు 09 09 72 మహబూబాబాద్ 16 16 198 జనగామ 12 12 140 మొత్తం 71 71 780సర్పంచ్ ఎన్నికలకు సమయం ఉంది.. వాస్తవానికి గతంలో సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగి.. తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరిగితే, మే, జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల తంతు జరిగింది. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే ముందు జరిపించే అవకాశం ఉందనడంతో సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్, సభ్యుల ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి వరంగల్లో మంగపేట మండలం, ఏకగ్రీవమైన 305 పంచాయతీలు మినహా 1,403 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా గతేడాది జూలైలోనే అధికారులు పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. 1,705 జీపీల్లో 15,056 వార్డుల్లో 22,45,394 మంది ఓటర్లను గుర్తించిన అధికారులు ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు ఎన్నికలకు విముఖత వ్యక్తం చేయడంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కాగా.. తాజాగా ఎన్నికల ప్రస్తావన తెర మీదకు రావడంతో అన్ని పార్టీల ఆశావహులతో సందడి మొదలైంది. -
‘రైతు నేస్తం’కు సర్వం సిద్ధం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు, సాగు, దిగుబడి తదితర వాటికి సంబంధించి రైతు నేస్తం కార్యక్రమం ద్వారా సీఎం రేవంత్రెడ్డి నేడు (సోమవారం) రైతులతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ రిజ్వాన్ బాషా నేతృత్వంలో జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాల రైతులతో సీఎం ఇంటరాక్టు కానున్నారు. రైతు వేదిక ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కానుంది. గతంలో 12 రైతుల వేదికల్లో 12 దృశ్య శ్రవణం అందుబాటులో ఉండగా, నేటి నుంచి మరో 24 వేదికల్లో నూతనంగా ప్రారంభించ బోతున్నారు. మొత్తంగా 36 రైతు వేదికల ద్వారా సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. జనగామ మండలం చీటకోడూరు రైతువేదికలో కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొననున్నారు. సీఎం రైతు నేస్తం ప్రోగ్రాంలో మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఏడీఏలు, ఏఓలు, ఏఈఓ హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. పండుగ వాతావరణంలో... సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ప్రోత్సాహంగా అందిస్తున్న కార్యక్రమాలపై ముఖాముఖి ఉంటుందని తెలుస్తుంది. రైతు భరోసా, పంట రుణమాఫీ, ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహం, ధాన్యం కొనుగోళ్లు తదితర వాటికి సంబంధించి సీఎం నేరుగా రైతు నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని సమాచారం. రైతు వేదికలను మామిడి తోరణాలతో అలంకరించి, రంగ వళ్లులతో రైతులను స్వాగతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధికంగా మహిళా రైతులను భాగస్వామ్యులను చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తాగునీరు, తదితర సౌకర్యాలను కల్పిస్తున్నారు. అయితే సీఎం రైతులను అడిగే సమయంలో వారు చెప్పే సమాధానాలు ఎలా ఉండబోతున్నాయనే టెన్షన్ నెలకొంది. నేడు రైతులతో మాట్లాడనున్న సీఎం 36 రైతువేదికల్లో ఏర్పాట్లు పూర్తి -
కష్టపడే స్వభావం ఉండాలి
జనగామ రూరల్: పిల్లలకు కష్టపడే స్వభావం ఉండాలని పలువురు కవులు, కళాకారులు అన్నారు. ఆ దివారం ఫాదర్స్ డే సందర్భంగా పట్టణంలోని గణేష్వాడలో కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నాన్న గొప్పతనం వెలకట్టలేనిదని, ప్రేమ పంచిపెట్టడంలోనూ బరువు బాధ్యతతో కూడిన జీవ నం అనిర్వచనీయమైనదంటూ కవితా గానంలో పేర్కొన్నారు. పిల్లల ఎదుగుదలకు కష్టపడే స్వభా వం, వ్యక్తిత్వం ఎంతో గొప్పదన్నారు. ఈ కవి సమ్మేళనంలో జి.వై.గిరి ఫౌండేషన్ చైర్మన్ జి.కృష్ణ, శ్రీశ్రీ కళా వేదిక రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు లగిశెట్టి ప్రభాకర్, అభినందన కల్చరల్ సొసైటీ ఫౌండర్ అయిలా సోమ నర్సింహచారి, కవి హృదయం సాహిత్య వేదిక వ్యవస్థాపకులు పెట్లోజు సోమేశ్వరాచారి, తదితరులు పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో పలువురు కవులు, కళాకారులు -
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి
● టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జయప్రకాశ్ స్టేషన్ఘన్పూర్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను, ఉప విద్యాధికారి పోస్టులు, డైట్ అధ్యాపకులు, బీఎడ్ కళాశాల అధ్యాపకుల పోస్టులను అర్హులైన ఉపాధ్యాయులచే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్ డిమాండ్ చేశారు. ఘన్పూర్ డివిజన్కేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, హైస్కూ ల్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని, 23 జిల్లాల్లో డీఈఓ పోస్టులు, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా పోస్టులకు ఈనెల చివరివరకు పదోన్నతులు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా లేకుండా చూడాలని కోరారు. నూతనంగా ఏర్పాటైన ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం 13 శాతం ఇంటి అద్దె భత్యం చెల్లించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో త్వరగా కోలుకుంటా..● వీడియో సందేశంలో ఎమ్మెల్యే పల్లా జనగామ: నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజాజీవితంలో యథావిధిగా పాలుపంచుకుంటానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి యశోద ఆస్పత్రి నుంచి వీడియో సందేశం ద్వారా ఆదివారం స్పష్టం చేశారు. ఈనెల 11వ తేదీన ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలు జారి పడడంతో గాయమైయిందన్నారు. అందరి ఆశీర్వాదాలతో నాలుగు గంటలు ఆపరేషన్ విజయవంతం అయిందన్నారు. జనగామ నుంచి తనను కలిసేందుకు చాలామంది వస్తున్నారని, మేజర్ ఆపరేషన్ కావడంతో వైద్యులు రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి కావాలని చెప్పారన్నారు. ఆరోగ్యం కుదుటపడగానే ప్రతిఒక్కరిని కలుసుకుంటానన్నారు. డాక్టర్కు ఉత్తమ అవార్డుదేవరుప్పుల: వైద్య వృత్తిలో విస్తృత సేవలు అందించినందుకు గాను ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో ప్రముఖ సర్జన్ వైద్యుడు లకావత్ లక్ష్మీనారాయణనాయక్కు ఉత్తమ డాక్టర్ అవార్డు లభించింది. ఆదివారం హైదరాబాద్లోని హైటెక్ సిటీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. గవర్నర్ చేతుల మీదుగా సీపీకి అవార్డు వరంగల్ క్రైం: అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసేందుకు ప్రోత్సహించినందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్కు ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెడ్క్రాస్ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ హై బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు. నాటక రంగాన్ని భావితరాలకు అందించాలిహన్మకొండ కల్చరల్ : నాటక రంగాన్ని భావితరాలకు అందించాలని, కళాకారులను ప్రోత్సహిస్తూ దాతలు సహకరించాలని కేంద్ర ఖాదీ చిన్నపరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. వరంగల్ పోతన విజ్ఞానపీఠం ఆ డిటోరియంలో ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈగ మల్లేశం పాల్గొని మాట్లాడారు. -
శ్రీశ్రీ అడుగుజాడల్లో నడవాలి
జనగామ రూరల్: మహాకవి శ్రీశ్రీ అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి లగిశెట్టి ప్రభాకర్ అన్నారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్కాలర్ గ్రామర్ స్కూల్లో ఆదివారం శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాస్) వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ సమసమాజ నిర్మాణానికి శ్రీశ్రీ కవిత్వం పునాదులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు సాంబరాజు యాదగిరి, జి.కృష్ణ, పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సొమనర్సింహచారి, నక్క సురేష్, చిలుమోజు సాయికిరణ్, డాక్టర్ వేముల సదానందం, పొట్టబత్తిని భాస్కర్, గడ్డం మనోజ్ కుమార్, రంగరాజు ప్రసాద్, గూటం రమేష్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, గుండె కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి గిరిజన తండాల్లో సదస్సులు
జనగామ: జిల్లాలోని గిరిజన తండాల్లో ఈ నెల 16 నుంచి పీఎం దర్తీ ఆభ జన్ భాగీ ధారి అభియాన్ పథకంపై సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆరు మండలాల పరిధిలో తొమ్మిది గిరిజన తండాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. 16 నుంచి జూలై 2వ తేదీ వరకు సమస్యల పరిష్కారానికి తండాల పరిధిలో సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధార్, కిసాన్ క్రెడిట్, రేషన్కార్డు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్, ఆయుష్మాన్ భవ, ఇన్సూరెన్స్ కవరేజ్, వృద్ధాప్య, వితంతు పెన్షన్ తదితర పథకాలకు సంబంధించి అర్హులైన వారికి అందించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో వినతులను స్వీకరించనున్నారు. తరిగొప్పుల మండలం భోజ్యా తండా గ్రామపంచాయతీ పరిధి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తేదీల వారీగా సదస్సుల వివరాలు ఈ నెల 16, 17న తరిగొప్పుల మండలం భోజ్యాతండా, 18, 19, 20 తేదీల్లో నర్మెట మండలం బొమ్మకూరు, మల్కపేట, 21, 23న చిల్పూరు మండలం ఫతేపూర్, 24, 25, 26న పాలకుర్తి మండలం కొండాపూర్, మైలారం, 27, 28, 30, జూలై 2న దేవరుప్పుల మండలం లకావత్తండా (తూర్పు), ధర్మాపురం, జూలై 2న కొడకండ్ల మండలం నీలిబండతండాలో సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆరు మండలాల్లో తొమ్మిది తండాలు ఎంపిక కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ప్రైవేట్కు దీటుగా..
సర్కారు కాలేజీల్లో అత్యుత్తమ బోధన● గ్రామాల్లో అధ్యాపకుల విస్తృత ప్రచారం ● 30శాతం పెరగనున్న అడ్మిషన్ల సంఖ్యజనగామ రూరల్: ప్రైవేట్కు దీటుగా అత్యుత్తమ బోధన వసతులపై ఊరూరా ప్రచారం చేస్తూ సర్కారు కాలేజీలో విద్యార్థుల ప్రవేశాలు తీసుకోవాలని అధ్యాపకులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది మొత్తం 4,920 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 68 శాతంగా నమోదైంది. జనగామ, స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన విద్యాబోధన, ఉత్తమ ఫలితాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వడంతో పాటు స్వేచ్ఛయుత వాతావరణం కల్పించడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తుండడంతో ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న అడ్మిషన్ల సంఖ్య 2019–20 విద్యాసంవత్సరంలో జనగామ జూనియర్ కళాశాలలో మొత్తం 2,418 విద్యార్థులు ఉంటే ప్రస్తుత విద్యాసంవత్సరానికి నెల రోజుల వ్యవధిలోనే 415 మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఇంకా అడ్మిషన్ల గడువు ఉండడంతో ఈసారి విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రవేశాలకు ప్రత్యేక చర్యలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన బోధన, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నా... కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్లో ఎక్కువ ఫీజులు చెల్లిస్తూ జేబులు చిల్లు చేసుకుంటున్నారు. ఈసారి అలా కాకుండా ఇంటర్ బోర్డు అధికారులు, కమిషనర్ కృష్ణ ఆదిత్య ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. దాదాపు 50 రోజుల ముందునుంచే గ్రామాల్లో పర్యటించి కళాశాలల్లో కల్పిస్తున్న వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ అడ్మిషన్లను పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.కళాశాలల వారీగా అడ్మిషన్ల సంఖ్య కళాశాల నమోదైన విద్యార్థుల సంఖ్య స్టేషన్ఘన్పూర్ 71 దేవరుప్పుల 39 జనగామ 81 జఫర్గఢ్ 28 కొడకండ్ల 26 నర్మెట 75 జనగామ (బాలికలు) 95 ప్రభుత్వ కళాశాలల్లో కల్పించే వసతులు.. ఉత్తమ ఫలితాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉపకార వేతన సౌకర్యం. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్లో ఫీజు మాఫీ. బస్సు సౌకర్యం లేనటువంటి రూట్లను గుర్తించి రవాణా సౌకర్యం కల్పించడం. అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన. గ్రంథాలయాలు, క్రీడలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి గురించి వివరించడం.విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిపుణులైన, క్రమశిక్షణ కలిగిన అధ్యాపకులు బోధిస్తున్నారు. రాష్ట్రంలో గొప్పస్థాయిలో ఉన్నవారు, అనేక అవార్డులు పొందిన వారు జిల్లాలో పనిచేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేస్తాం. నాలుగేళ్లుగా ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూవస్తుంది. – జితేందర్ రెడ్డి, ఇంటర్ విద్యాధికారి -
శాంతి చర్చలు జరపాలి●
● ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతిచర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ను నిలిపేయాలని శనివారం జిల్లా కేంద్రంలో అఖిలపక్షం, వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు, కవులు, రచయితలు, మేధావుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డిలు మాట్లాడుతూ అటవీ సంపద, ఖనిజాలను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే కుట్రలో భాగమే ఆపరేషన్ కగార్ అన్నారు. తక్షణమే బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే శాంతిచర్చలు జరపాలని, లేదంటే అఖిల పక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు నామాల శ్రీనివాస్, బన్సీ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి, బక్క శ్రీనివాస్, జోగు ప్రకాష్, న్యాయవాది సాధిక్ అలీ, వేముల నర్సింగం, రాపర్తి రాజు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025
జఫర్గఢ్: కన్నపిల్లలు కాకున్నా.. వందలాది మంది పిల్లలతో నాన్న అని పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు’ అనాథ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీ తండా వద్ద ఉన్న ‘మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమం’లో రెండు దశాబ్దాలుగా ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకుని ఆశ్రమంలో చోటు కల్పించారు. వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు గాదె ఇన్నయ్య. అనాథ పిల్లల పట్ల తండ్రి ప్రేమను పంచుతూ.. పిల్లల అభిమానాన్ని పొందుతున్నారు. ఆశ్రమంలోని పిల్లలు తమ ఆధార్ కార్డుల్లో, పాఠశాలల రికార్డుల్లో సైతం ఇన్నయ్య పేరునే తమ తండ్రిగా రాయించడం విశేషం. ఈసందర్భంగా గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలతో నాన్న అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు కూడా తనను తండ్రిలాగే భావిస్తూ తనపై అభిమానం చూపుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు కూడా ఆశ్రమంలో ఇన్నయ్యను నాన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు ఇలా.. పిలవడమే తమకిష్టం అని పిల్లలు చెబుతున్నారు. ‘తండ్రి లేని లోటును తీరుస్తున్న ఇన్నయ్యే మా నాన్న’ అంటూ వారు పేర్కొనడం గమనార్హం.ఏళ్ల కష్టానికి.. విజయమే సమాధానం! బచ్చన్నపేట: భూమిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించారు. చదువును నమ్ముకుని పిల్లలను బాగా చదివించారు. ఆ తండ్రి ఇప్పుడు గర్వంగా చెబుతున్నాడు తమ పిల్లలు ప్రయోజకులయ్యారని. బచ్చన్నపేటకు చెందిన చిమ్ముల మల్లారెడ్డికి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. సేద్యం చేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించాడు. పాడి పశువుల్ని సాకుతూ పాలు పితికి అమ్ముతూ, వ్యవసాయం చేస్తూ ఒక కొడుకు, ఒక కూతురును ఉన్నతంగా చదివించారు. కూతురు చిమ్ముల నవిత ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా జనగామ మండలం పెద్దపహాడ్లో విధులు నిర్వరిస్తున్నారు. కుమారుడు రాజశేఖర్రెడ్డి గ్రూప్–1లో స్టేట్ 272వ ర్యాంకు సాధించారు. ‘నా కలలు నిజమయ్యాయి. పిల్లలు ప్రయోజకులవ్వడం చూస్తే ఇన్నేళ్ల కష్టం మరిచిపోతున్నా’ అంటున్నారు చిమ్ముల మల్లారెడ్డి. న్యూస్రీల్వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న -
ఘనంగా వార కల్యాణం
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావుల ఆధ్వర్యంలో వార కల్యాణాన్ని అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. భక్తులకు హైదరాబాద్కు చెందిన కొండ విష్ణుమూర్తి, శోభారాణి, దేవులపల్లి వెంకటేశ్వర్లు, అనురాధలు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గణగోని రమేష్, గోలి రాజశేఖర్, వేముల వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, భక్తులు పాల్గొన్నారు. -
నాన్న.. కలల నిచ్చెన
పిల్లల జీవితాలకు రంగులద్దుతున్న తండ్రులు ● త్యాగాలు చేస్తూ.. కన్నీళ్లు మోస్తూ.. శక్తికి మించి పనిచేస్తూ ● కడుపున పుట్టినవారు ఉన్నతంగా బతకాలని వారందరి తపన ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా ఫాదర్స్ కష్టాలెన్నున్నా.. చిరునవ్వు ఒలకబోస్తాడు. కన్నీటి సుడులు ఉప్పైనె పొంగుతున్నా.. పంటి బిగువన అదిమి పడతాడు. తాను మాసిన గడ్డంతో ఉన్నా.. పిల్లల బట్టలు మెరవాలంటాడు. తన కోరికలు చంపుకునైనా.. పిల్లలు కోరినవేవైనా చిటికెలో పట్టుకొస్తాడు. తాను కడుపు నిండా తినకపోయినా.. కంటి నిండా నిద్రపోకపోయినా కుటుంబం కోసం అడ్జెస్ట్ అవుతాడు. పిల్లల జీవితాలకు రంగులద్దుతాడు. వారి కలలకు నిచ్చెనవుతాడు. ప్రతీ కుటుంబానికి నాన్న ఓ హీరో. నేడు(ఆదివారం) ఫాదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు. నేడు ఫాదర్స్ డే -
నడిచే దైవం.. నాకు తొలినేస్తం
ఖిలా వరంగల్: వరంగల్ 34వ డివిజన్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన రాజు మెడికల్ రిప్రసెంటేటివ్గా పని చేస్తూ పిల్లల్ని చదివించారు. తండ్రి కష్టానికి ఫలితంగా.. కుమార్తె సాయి శివాని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘కలెక్టర్ కాలన్నది నా లక్ష్యం కాదు. మానాన్న కోరిక. ఆయన ఎంత కష్టాన్నైనా పైకి కనపడనివ్వకుండా తనలోనే దాచుకుంటారు. నేను ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని తపిస్తారు. ఇంజనీరింగ్ ఈసీఈ పూర్తయిన అనంతరం ఇంటి వద్ద ఉంటూ రోజూ 18 గంటలకుపైగా సివిల్స్కు సన్నద్ధమయ్యా. ఇటీవల విడుదలైన ఇల్ ఇండియా సివిల్ సర్వీస్లో 11వ ర్యాంకు సాధించా. ‘నువ్వు కలెక్టర్ కావాలమ్మా’ అనేవారు. ఆయన నడిచే దైవం. నాకు తొలినేస్తం. ఆయన నింపిన స్ఫూర్తే నన్ను ఈస్థానంలో నిలబెట్టింది. -
నాన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి..
వరంగల్ క్రైం: చిన్నప్పటి నుంచి మా నాన్న జన్నేల్సింగ్ నాలో నింపిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. వృత్తిరీత్యా నాన్న ప్రిన్సిపాల్ కావడంతో చదువులో ప్రోత్సాహం అందించారు. ముఖ్యంగా సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో ఆయన చేసిన మోటివేషన్ నాలో రెట్టింపు ఉత్సాహం నింపింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచేలా తిర్చిదిద్దారు. సామాజిక సమస్యలు, వాటిని ఎదుర్కొంటున్న ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన కల్పించారు. చదువుకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు ప్రతీ దశలో వెన్నంటి ప్రోత్సహించారు. – సన్ప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
వెలివేసినా.. విజయబావుటా!
రఘునాథపల్లి: రఘునాథపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ ప్రభాకర్ 33 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఇరు కుటుంబాలు వెలివేశాయి. అయినా బెదరకుండా అద్దె ఇంట్లో ఉంటూ.. ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా, ఆర్ఎంపీగా, రోజు వారీ కూలీగా పని చేశాడు. ముగ్గురు కుమారులు, ఒక కూతురిని చదివించారు. పెద్ద కుమారుడు ఉదయ్కుమార్ సింగరేణిలో పర్సనల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ ఇటీవల గ్రూప్–1లోనూ ప్రతిభ చాటారు. రెండో కుమారుడు పృధ్వీకుమార్ హైదరాబాద్లో లా పైనల్ ఇయర్ చదువుతున్నాడు. మూడో కుమారుడు ప్రణయ్కుమార్ తెలంగాణ కేడర్ ఐఏఎస్గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కూతురు మౌనశ్రీ ఓయూలో పీహెచ్డీ చేస్తోంది. ‘ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్న.. అద్దె ఇంట్లో ఉంటూ పడరాని కష్టాలు పడ్డా. గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించి ఉన్నత స్థానాల్లో నిలిపినందుకు గర్వపడుతున్నా. ప్రణయ్కుమార్ ఐఏఎస్ సాధించిన రోజు మరువలేనిది. అనేక కష్టాలను అనుభవించిన మేం.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందు వరుసలో ఉంటాం’ అంటున్నారు ప్రభాకర్. -
రాజీపడితేనే సమస్యల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ జనగామ రూరల్: రాజీపడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నారు. జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని ఎక్కువ మొత్తంలో కేసులు పరిష్కారించుకోవాలన్నారు. లోక్ అదాలత్లో 6 బెంచ్ల ద్వారా సమస్యలను పరిష్కరించారు. మొత్తం సివిల్ కేసులు 82, మోటార్ యాక్సిడెంట్ కేసులు 4, క్రిమినల్ కేసులు 5160, ప్రీ లిటిగేషన్ 450 కేసులను పరిష్కరించగా రూ.1,03,17,307 వసూలు అయినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంచ్ జడ్జీలు విక్రమ్, ఈ సుచరిత, జి. శశి, సందీప, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
సోమేశ్వరాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పూజలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి, ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ జడ్జి సందీప, ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు, ఎస్సై దూలం పవన్కుమార్, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, అనిల్కుమార్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంజనగామ రూరల్: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే మోదీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ సుపరిపాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొఫెషనల్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదల అభ్యన్నతికి తోడ్పాటునందిస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు అత్యధిక స్థానాలు గెలవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్ రెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, ఉడుగుల రమేష్, నందా రెడ్డి, తోకల ఉమారాణి, శివరాజ్ యాదవ్, శశిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య మహాసభ జోన్ చైర్మన్గా వేదకుమార్జనగామ/రఘునాథపల్లి: జిల్లా ఆర్యవైశ్య మహాసభ జోన్ చైర్మన్గా రఘునాథపల్లికి చెందిన కూరెళ్ల వేదకుమార్ నియామకమయ్యా రు. ఈ మేరకు శనివారం ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్య క్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్కుమార్ వెల్లడించారు. అనంతరం వేదకుమార్కు నియామకపత్రం అందించి శాలువాతో సత్కరించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని, ఈ నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గన్ను నరసింహులు, కోశాధికారి బెజుగం భిక్షపతి, రీజన్ చైర్మన్ పడకంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలిజనగామ రూరల్: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు అధ్యక్షత జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం అవుతున్నప్పటికీ విద్యా రంగంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, కన్వీనర్ గూడెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి తాపీ మేసీ్త్ర.. కుమార్తె డాక్టర్
కాజీపేట రూరల్: ఆయన చదువుకోలేదు. తనలా పిల్లలు కావొద్దని బాగా చదివించాడు. సమాజంలో గొప్ప స్థాయిలో కూతుళ్లను చూస్తూ మురిసిపోతున్నాడు కాజీపేట బాపూజీనగర్కు చెందిన తాపీ మేసీ్త్ర లింగాల వీరస్వామి. వీరస్వామికి ఇద్దరు కూతుళ్లు. 15 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. పెద్ద కూతురు హేమలతను వైద్య విద్య చదివించాడు. ఆమె ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రైమరీ వెటర్నరీ సెంటర్ పెగడపల్లిలో అసిస్టెంట్ సర్జన్గా పని చేస్తున్నారు. చిన్న కూతురు సుమలత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నాన్న జీవితమే తమకు ప్రేరణనిచ్చిందని.. సుమలత, హేమలత చెబుతున్నారు. -
బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి జనగామ రూరల్: జాతీయ రహదారి జనగామ నుంచి దుద్దెడ వరకు నిర్మిస్తున్న 365బి నిర్మాణంలో ఇళ్ల స్థలాలు కోల్పోతున్న యజమానులకు గజానికి రూ.20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీఓ గోపిరామ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణంలో స్థలాలు కోల్పోతున్న బాధితుల విషయంలో ప్రభుత్వాలు, అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్హెచ్ బాధిత ప్లాట్ ఓనర్ల కమిటీ అధ్యక్షుడు బూడిది గోపి, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దల కిషోర్, కోశాధికారి గూడెల్లి కృష్ణారెడ్డి, గౌరవ సలహాదారు కర్రే కృష్ణ, నల్ల యాదగిరి, గంగుల భూపాల్రెడ్డి, గుండు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన
పాలకుర్తి టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన అందుతుందని డీఈఓ డి.భోజన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, టెంపుల్ కాలనీ పాఠశాలల్లో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో ఈ విద్యాసంత్సరం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్) తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, మైనర్ రిపేర్ పనులు చేయించినట్లు తెలిపారు. పాలకుర్తి ప్రాథమిక పాఠశాల అద్భుతంగా ఉందని హెచ్ఎం చిదురాల శ్రీనివాస్ను, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, ఉన్నత పాఠశాల హెచ్ఎం శోభారాణి, టెంపుల్ కాలనీ హెచ్ఎం ఇమ్మడి అశోక్, ఎం.శ్రీనివాస్, విజయ్కుమార్, విజేందర్, శ్రీనివాస్, మంజుల, అప్రాష్ సూల్తానా, సుధాకర్, నరసింహమూర్తి, సంపత్ పాల్గొన్నారు.జిల్లా విద్యాధికారి భోజన్న -
ప్రైవేట్ మాయా వలయంలో చిన్నారులు
● లెక్కకు మించి నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు ● బ్యాగు మోయలేక చిన్నతనంలోనే వెన్ను సంబంధ సమస్యలు˘ జనగామ: ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలు బండెడు పుస్తకాల మూట మోయాల్సి వస్తున్నది. చదువుల పేరిట వారిపై మోయలేని భారం మోపుతున్నారు. లెక్కకు మించి నోట్బక్స్, పాఠ్యపుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని ఉదయం బడికి వెళ్లడం, సాయంత్రం తిరిగి రావడంతో అలసటకు గురవుతున్నారు. స్కూల్కు వెళ్లిన తర్వాత మొదటి, రెండవ అంతస్తులో ఉన్న తరగతి గదికి బ్యాగుతో చేరుకోవాల్సి ఉంటుంది. భరువు మోయలేక ముక్కుపచ్చలారని చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నా రు. స్కూల్ బ్యాగుల బరువు ఎంత ఉండాలనే అంశంపై 2006లోనే ఉమ్మడి రాష్ట్రంలో చట్టం తీసుకువచ్చారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో చిన్నారు ల ‘బ్యాగు మోత’పై కథనం. శరీర బరువులో 10శాతం మించొద్దు చిల్ట్రన్ స్కూల్ బ్యాగ్ యాక్టు–2006 ప్రకారం విద్యార్థి శరీర బరువులో పుస్తకాల బరువు 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోల బరువు ఉన్న విద్యార్థి 3 కిలోల బరువుకు సమానంగా పుస్తకా ల బ్యాగు ఉండాలి. అయితే ఒకటో తరగతి చదివే విద్యార్థి శరీర బరువు 15 కేజీలు ఉంటే.. పుస్తకాల బ్యాగు 1.5 కిలోలకు బదులుగా 5 కిలోలు ఉంటున్నది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి 35 నుంచి 40 కిలోలు ఉంటే.. పుస్తకాల బరువు దాదాపు 12 కేజీలు దాటుతోంది. దీంతో విద్యార్థుల వెన్ను విలవిల్లాడిపోతోంది. శారీరక, ఎముకలు, కండరాల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెడ, భుజాలు, వెన్నుముక వంగి పోతున్నాయి. అనేక మంది పిల్లలు వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. శ్వాస పూర్తిగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నది. తరగతులకు వెళ్లేందుకు తంటాలు జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు అత్యధికంగా బహుళ అంతస్తుల భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. పుస్తకాల బ్యాగు బరువుతో విద్యార్థులు పైకి వెళ్లేందుకు నరకం చూస్తున్నారు. రెగ్యులర్ సిలబస్ పుస్తకాలతో పాటు అసైన్మెంట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జీకే, కంప్యూటర్, డైరీ తదితరాలతోపాటు హోంవర్క్, ఇంగ్లిష్, హిందీ, తెలుగు, సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్.. ఒక్కో సబ్జెక్టుకు 2 నుంచి 4 నోట్బుక్స్ ఉండడంతో మోయలేని భారంగా తయారైంది. యశ్పాల్ కమిటీ నివేదిక ఇలా.. విద్యార్థుల స్కూల్ బ్యాగు బరువుపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం యశ్పాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత ‘లెర్నింగ్ విత్ అవుట్ బర్డెన్’ పేరుతో నివేదిక వెల్లడించింది. దాదాపు 90 శాతం పాఠశాలల్లో ఆహ్లాదకరంగా లేని బోధన సాగుతోందని, ఫలితంగా విద్యార్థులు మానసిక వేదనకు గురువుతున్నారని పేర్కొంది. దీనికి తోడు అవసరానికి మించిన పుస్తకాలు విద్యార్థుల ప్రతిభకు అడ్డంకిగా మారుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ నివేదిక ప్రకారమే 2006లో స్కూల్ బ్యాగులపై చట్టం తీసుకువచ్చారు. నియమ నిబంధనలు: ● నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు పుస్తకాలు మోయకూడదు. ● ఇతర తరగతికి చెందిన విద్యార్థుల బ్యాగులు శరీరం కంటే 10శాతానికి మించకూడదు. ● స్కూల్ బ్యాగు బరువు, రోజు తీసుకురావాల్సిన పుస్తకాలపై శాసీ్త్రయ అంచనాలతో తల్లిదండ్రులకు పాఠశాలలు మార్గదర్శకాలు ఇవ్వాలి. ● కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే స్కూల్ బ్యాగులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● మిగిలిన పుస్తకాలు స్కూల్లో భద్ర పరుచుకునేలా పాఠశాలల యాజమాన్యాలు లాకర్, డెస్క్ ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు పాటించక పోతే ఆయా స్కూళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి స్కూల్ బ్యాగుల అధిక బరువుతో పిల్లలు చిన్న తనంలోనే అనేక అనా రోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చట్టంలోని నిబంధనల మేరకు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో హోం వర్క్ ఇచ్చిన పుస్తకాలు మినహా మిగతావి బడిలోనే ఉండేలా చూడాలి. ఇలా చేయకుంటే వెన్నుపూసపై తీవ్ర ప్రభావం పడుతుంది. పిల్లల ఎదుగుదల విషయంలో దుష్ఫలితాలు ఉంటాయి. బ్యాగుల మోతపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించక పోతే ఎదిగే పిల్లలను అనారోగ్య సమస్యలు జీవితాంతం వెంటాడుతాయి. – కల్నల్, డాక్టర్ భిక్షపతి, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఎండీ (మెడిసిన్) -
‘స్వచ్ఛ జనగామ’గా తీర్చిదిద్దుకుందాం
జనగామ: పట్టణాన్ని ‘స్వచ్ఛ జనగామ’గా తీర్చిదిద్దుకుందాం.. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదనపు సంచాలకులు జ్యోత్స్న అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పురపాలికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘100 రోజుల కార్యాచరణ’లో భాగంగా శుక్రవారం ఆమె జనగామలో పర్యటించారు. కమిషన్ వెంకటేశ్వర్లుతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. పచ్చదనం, పరిశుభ్రత, తడి, పొడిచెత్త సేకరణ, దోమల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అపరి శుభ్ర వాతావరణంతో పందులు, కుక్కల సంచారం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నార ని, ప్రతీ కుటుంబం ఇంటి మాదిరిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి ఎదుట మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. పట్టణంలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా మున్సిపల్, మెప్మా విభాగాలు కలిసి పనిచేయాలని, వందరోజుల్లో ఈ మార్పు కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వి.గోపయ్య, పులి శేఖర్, మెప్మా సిబ్బంది వాణిశ్రీ, తిరుమల, షాహిన్ తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదనపు సంచాలకులు జ్యోత్స్న -
చవక ధరలకు నాణ్యమైన మందులు
● డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు పాలకుర్తి టౌన్: చవక ధరలకు నాణ్యమైన మందులు ప్రధాన మంత్రి జాతీయ జన్ ఔషధి కేంద్రంలో పొందవచ్చని జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున్రావు అన్నారు. మండల కేంద్రంలో జాతీయ జన్ ఔషధి కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శంచిన ఆయన వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఎచ్ఓ డాక్టర్ సుధీర్, డీఐఓ డాక్టర్ స్వర్ణకుమారి, పీహెచ్సీ వైద్యాధికారి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. -
నిజరూప దర్శనం
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి శుక్రవారం భక్తులకు నిజరూప అలంకరణలో దర్శనంఇచ్చారు. ఉదయం ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు లాభదాయకం నర్మెట: ఆయిల్ పామ్ తోటలతో రైతులకు అధిక లాభాలుంటాయి.. అంతర పటలకు అనుకూలమని ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ శంకర్ అన్నారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు అవగా హన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని, చీడపీడలు, కోతులతో నష్టం ఉండదని పేర్కొన్నారు. బిందు సేద్యం ద్వారా 50 శాతం ఎరువులు, సాగు ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్వహణ వ్యయంగా ఎకరాకు రూ.4,500 ఆర్థిక సహాయం అందజేస్తున్నదని, బిందు సేద్యం పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్ఓ హరిబాబు, పీఎంఓ రాజేందర్, డ్రిప్ కంపెనీ ప్రతినిథులు, రైతులు పాతూరి మల్లారెడ్డి, దేవులపల్లి రాంరెడ్డి, ముప్పిడి భూమయ్య, కొన్నె భిక్షపతి, నిమ్మ కృష్ణారెడ్డి, ఐలేని సిద్దిరామిరెడ్డి, వెంకట్రామి రెడ్డి, గౌరబోయిన యాదయ్య తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ కుంటలో ఔషధ మొక్కలుజనగామ: పట్టణంలోని బతుకమ్మకుంటలో ఔషధ మొక్కలు నాటేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయుష్ విభాగం ప్రతినిధులు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. మెడికల్ ప్లాంట్స్ గురించి వివరించి సింధూరి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ కుంట చుట్టూ ఔషధ మొక్కలు నాటేందుకు కలెక్టర్ అనుమతించారు. కార్యక్రమంలో విశ్వ ఆయుర్వేద పరిషత్ నుంచి డాక్టర్ సురేష్, డాక్టర్లు అంజిరెడ్డి, అనురాధ, మమత, హారిక, ప్రీతి తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలనజనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాంను శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా సందర్శించారు. భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పరిశీలించారు. ఈవీఎం వీవీ ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ల నిర్వహణలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాల ని, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట వివిధ పార్టీల నాయకులు భాస్కర్, రవి, విజయభాస్కర్, జోగు ప్రకాశ్ తదితరులు ఉన్నారు. 24 గంటల ధర్నాను జయప్రదం చేయండిజనగామ రూరల్: పట్టణంలోని మూడో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యాన ఈనెల 16న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన 24 గంటల ధర్నాను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో మూడో విడత ఇందరమ్మ ఇళ్ల సాధన కమిటీ అధ్యక్షు డు కళ్యాణం లింగం ఆధ్వర్యాన ఏర్పాటు చేసి న సమావేశంలో వారు మాట్లాడారు. ఇళ్లు నిర్మించుకొని అక్కడే నివాసం ఉంటున్న లబ్ధిదారులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి నంబర్లు, విద్యుత్, రోడ్డు, డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోట్ల శ్రావణ్, పగిడిపల్లి బాలమణి, కొమ్మగళ్ల ఎల్లయ్య, ముసిపట్ల జయ, భూనాద్రి వెంకటేశ్, మాదాసి సుధాకర్, బాలస్వామి, మేడ పద్మ, కొడిదాల అంజమ్మ, గుండు శశిరేఖ, సంతోష తదితరులు పాల్గొన్నారు. -
అదనపు కోర్టు మంజూరు చేయాలి
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని స్థానిక బార్ అసోసియేషన్ బాధ్యులు జిల్లా జడ్జి ప్రతిమను కోరారు. జడ్జి శుక్రవారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. కోర్టు పరిసరాలను పరిశీలించిన ఆమె కోర్టు ఫైలింగ్ కేసులు తదితర వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఘన్పూర్ కోర్టు పరిధిలోని కేసుల గురించి ఘన్పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేశ్ జడ్జికి వివరించారు. కోర్టు పరిధిలో 3,600 కేసులు ఉన్నాయని, హైకోర్టు నిబంధనల మేరకు అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఘన్పూర్ జడ్జి సందీప తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జికి ఘన్పూర్ బార్ అసోసియేషన్ బాధ్యుల వినతి -
ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలి
జనగామ రూరల్: ముస్లింలకు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఉపాధ్యక్షుడు న్యాయవాది జమాల్ షరీఫ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రార్థన అనంతరం జనగామలోని జామియా, ఏక్ మినార్, అజీజియా, హైదర్, జుబేదా మసీదుల్లో వాల్ పోస్టర్లు ఆవిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రభుత్వంలో 14శాతంగా ఉన్న ముస్లింలకు ఒక మంత్రి పదవి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల ఓట్ల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తరువాత తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ నుంచి అమీర్అలీఖాన్ మాత్రమే ఉన్నారని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ముహమ్మద్ అన్వర్, ముహమ్మద్ ఇస్మాయిల్, ముహమ్మద్ గౌస్, ముహమ్మద్ అజారుద్దీన్, ముహమ్మద్ అలీముద్దీన్, ముహమ్మద్ బాబా, ఫరూక్, అకీల్ హమ్మద్, ముహమ్మద్ రఫీ మతీన్ అడ్వకేట్, డాక్టర్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు. -
బడి.. విద్యార్థుల సందడి
శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuజనగామ: సర్కారు బడుల పునఃప్రారంభం పండుగ వాతావరణాన్ని తలపించింది. అరటి, మామిడి కొమ్మలు, తీరొక్క పూలతో బడుల ప్రాంగణాలను అలంకరించి, చదువుల తల్లి సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. వేసవి సెలవులను ముగించుకుని స్కూల్ బాట పట్టిన విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. యూనిఫాంలో కొందరు, కొత్త బట్టలు ధరించి మరి కొందరు విద్యార్థులు బడికి వచ్చారు. విద్యార్థుల చేతిలో పూలు పెట్టి ఉపాధ్యాయులు, హెచ్ఎంలు స్వాగతం పలికారు. యాభై రోజుల పాటు ఆడి, పాడుతూ ఎంజాయ్ చేసిన పిల్లలు, నూతన విద్యా సంసవత్సరంలో భుజాన బ్యాగు వేసుకున్నారు. మొదటి రోజు తల్లిందడ్రులతో కలిసి పాఠశాలకు వచ్చిన విద్యార్థులు పై తరగతిలో కూర్చొని సంతోషపడ్డారు. జనగామ మండలం ఎర్రగుండ తండా పీఎస్ను కలెక్టర్ పునఃప్రారంభించారు. నూతన విద్యార్థులు 2,428 జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకుల పాఠశాలలు 548 ఉన్నాయి. వీటి పరిధిలో 45 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు డీఈఓ భోజన్న పర్యవేక్షణలో టీచర్లు బడిబాట నిర్వహించారు. దీంతో విద్యార్థుల సంఖ్యను కొంతమేర పెంచగలిగారు. అన్ని కేటగిరీల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,607, కేజీబీవీ (6 నుంచి12 వర కు) 821 మొత్తం 2,428 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. తొమ్మిది జీరో స్కూళ్లు పునఃప్రారంభం జిల్లాలో 72 ప్రాథమిక, ఒక యూపీఎస్ మొత్తం 73 పాఠశాలల్లో జీరో స్ట్రెంత్తో రెండేళ్ల క్రితం మూసేశారు. గతంలో మూతబడిన పాఠశాలల్లో బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి, జయాల, చిల్పూరు మండలం గార్లగడ్డ తండా, దేవరుప్పుల మండలం మల్యతండా, రాజీవ్ కాలనీ, జనగామ మండలం ఎర్ర గుంటతండా, కొడకండ్ల మండలం బోడ తండా, నర్మెట మండలం లుంబియా తండా, పాలకుర్తి మండలం కురుమ తండా పరిధిలో తిరిగి పునఃప్రారంభించారు. తొమ్మిది గ్రామాల్లో ఉపాధ్యాయులు గత నెల రోజుల నుంచి ఇంటింటికీ తిరుగుతూ సర్కారు బడుల్లో బోధన గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి.. బడులను పునఃప్రారంభించడంలో సక్సెస్ సాధించారు. నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు నోట్, పాఠ్య పుస్తకాలతో పాటు ఒక జత యూనిఫాం అందించారు. కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు బుక్ బ్యాంకు నుంచి ఇవ్వగా.. తక్కువగా ఉన్న వారి కోసం సర్కారుకు ఇండెంట్ పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అడ్మిషన్ల కోసం క్యూలు.. గతంలో ఎన్నడూ లేని విధంగా 2025–26 నూతన విద్యా సంవత్సరం మొదటి రోజు చాలా చోట్ల సర్కారు బడుల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కట్టారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్, బచ్చన్నపేట, రఘునాథపల్లి ఇలా అనేక పాఠశాలల పరిధిలో ఉపాధ్యాయులు ఊహించని విధంగా అడ్మిషన్లు తీసుకున్నారు. కలెక్టర ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు బడి బాట పట్టి వసతి సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజన తయారీ, వడ్డింపు తదితరాలు పర్యవేక్షించారు.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 548విద్యార్థుల సంఖ్య: 45,000మొదటి రోజు హాజరు శాతం: 69.8న్యూస్రీల్ పునఃప్రారంభమైన పాఠశాలలు విద్యార్థులకు పూలతో స్వాగతం యూనిఫాంలో కొందరు.... కొత్త దుస్తుల్లో ఇంకొందరు కలెక్టర్, డీఈఓ, ఉన్నతాధికారుల పర్యటనలు యాభై రోజుల తర్వాత మోగిన పాఠశాల గంట నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ తొమ్మిది జీరో స్కూళ్లు రీఓపెన్పుష్పాలిచ్చి.. స్వాగతించి! నర్మెట: మండలంలోని మాన్ సింగ్తండా, కేజీబీవి, ఆగపేట పాఠశాలలను సందర్శించిన డీఈఓ భోజన్న విద్యార్థులకు గులాబీ పువ్వులు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, కాంప్లెక్స్ హెచ్ఎం నీలం వేణు, హెచ్ఎంలు పైడిపల్లి దామోదర్, గంగరాజు కేశవరావు, ఎస్ఓ బైరోజు రజిత, ఉపాధ్యాయులు రావుల రామ్మోహన్రెడ్డి ఉన్నారు.పాఠ్యపుస్తకాల అందజేత జనగామ రూరల్: బడిబాట సందర్భంగా మండలంలోని ఓబులకేశ్వాపూర్ ఉన్నత పాఠశాలలో డీఈఓ దర్శనం భోజన్న, ఎంఈఓ శంకర్ రెడ్డి గురువారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్లు, యూనిఫాం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగిళ్ల నర్సింహారెడ్డి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ శ్రీమతి బత్తెపు ఉమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చదువుతోనే గౌరవం ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం బడి బాటలో భాగంగా జనగామ మండలం ఎర్రకుంట తండా మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పునఃప్రారంభించారు. ఎర్రకుంట పాఠశాలకు 28 మంది విద్యార్థులు వచ్చేలా కృషి చేసిన ఉపాధ్యాయురాలు రేష్మాను అభినందించారు. కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ భోజయ్య, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం
తరిగొప్పుల: భూభారతి రెవెన్యూ సదస్సులతో రైతుల భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహిపాల్రెడ్డి, డీటీ మందాడపు రామారావు, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గురువారం జనగామ మండలం ఎర్రకుంట తండాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే బిల్లులు కూడా త్వరగా అందుతాయన్నారు. తండాకు చెందిన మాలోతు అనితను ఇంటి నిర్మాణం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
చదువుతోనే బంగారు భవిష్యత్
● జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ బచ్చన్నపేట: విద్యార్థులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్ ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆదర్శ, కస్తూర్బాగాంధీ, సెకండరీ పాఠశాలల పరిసరాలను మధ్యాహ్న వంటను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు బుక్స్ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక వసతులు కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులు వాటిని వినియోగించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పాఠశాల ప్రిన్సిపాళ్లు భారతీదేవి, గీత, పంచాయతీ కార్యదర్శి అనిల్రాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. -
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..
స్టేషన్ఘన్పూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు రైతులకు చేసిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో హామీలు అమలు చేయాలని గురువారం ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులకు రుణ విముక్తి చేయాలని, రుణ విమోచన చట్టం తేవాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లు, వ్యవసాయ ప్రైవేటు మార్కెట్ల ముసాయిదాను వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైతులకు చేసిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి లింగనబోయిన కుమారస్వామి, నాయకులు మొగిలి, రాజు, మల్లయ్య, సోమయ్య, లింగయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలి
రఘునాథపల్లి: క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కె.మల్లికార్జునరావు వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వంద రోజుల టీబీ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక క్షయ వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. టీబీ నిర్ధారణ కోసం వచ్చిన వారితో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మొబైల్ యాక్టివ్ కేస్ ఫైండింగ్ యూనిట్, సీవై టీబీ పరీక్షలను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. వైద్య శిబిరంలో పాల్గొన్న 155 మంది టీబీ అనుమానితులకు ఎక్స్రే, సీబీ నాట్ పరీక్ష, సైడ్ టీబీ స్క్రీన్ టెస్ట్ నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు అశోక్, కమల్హాసన్, పీహెచ్సీ వైద్యాధికారి స్రవంతి, సీహెచ్ఓ రామ్కిషన్, జిల్లా క్షయ నిర్ధారణ బృంద సభ్యులు చంద్రారెడ్డి, విశ్వనాథ్, మధు, అంజుకుమార్, శ్రవణ్కుమార్, సూపర్వైజర్లు సుజన, రజనీ, సులోచన తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జునరావు -
ఫిట్నెస్ ఆలస్యమేనా?
జనగామ: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బస్సు సర్వీసుల సేవల విషయంలో కాసింత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు పిల్లలను తీసుకొచ్చే సమయంలో ఆర్టీఏ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కిటికీలకు జాలీలు, డోరు వద్ద క్లీనర్ పర్యవేక్షణ తప్పనిసరి. బస్సు ఎక్కి పాఠశాలకు చేరుకుని, తిరిగి ఇంటికి చేరే వరకు కేర్గా చూసుకోవాలి. గతంలో జిల్లాలోని రెండు ప్రాంతాల్లో విద్యార్థులు బస్సు దిగి వెళ్లే క్రమంలో చక్రాల కింద నలిగి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇతర ఆర్టీఏ నిబంధనలు పాటించాలని సంబంధిత అధికారులు పదే పదే చెబుతూనే ఉన్నారు. వేసవి సెలవులు ముగిసే సమయంలో ఇరవై రోజు ల ముందు నుంచే అన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు నోటీసులను పంపించారు. జిల్లాలో 190 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో 150 సర్వీసులకు ఫిట్నెస్ పూర్తయ్యింది. మరో 40 బస్సులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 20 బస్సులకు ఆర్టీఏ నిబంధనలు లేకపోవడంతో జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి రిజెక్ట్ చేయగా, మరో 20 బస్సులకు మరమ్మతులు చేయిస్తున్నారు. మూడు బస్సులు సీజ్.. జిల్లాలోని పలు పాఠశాలల ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా నడిపిస్తూ రవాణా శాఖ అధికారులకు గురువారం పట్టుబడ్డాయి. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక విజిలెన్స్ అధికారి పాహిమా సుల్తానా (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని ఆర్టీసీ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. ఈతనిఖీల్లో సాన్మారియా స్కూల్కు చెందిన రెండు, చంపక్హిల్స్ న్యూ క్రియేషన్ పాఠశాల ఒక బస్సు ఫిట్నెస్ లేకుండా తిరుగుతుండడంతో విజిలెన్స్ అధికారులను పట్టుకున్నారు. మూడు బస్సులను సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యం నిబంధనలు తుంగలో తొక్కి.. రోడ్డెక్కుతున్న బస్సులు జిల్లా రవాణా శాఖ ఉక్కుపాదం విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఒక్కరోజే మూడు బస్సుల సీజ్ -
అర్హులందరికీ సంక్షేమ పఽథకాలు
బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పఽథకాలు అందిస్తోందని ఎవరూ నిరుత్సాహ పడొద్దని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం మండల మండలంలోని సాల్వాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లను దశల వారీగా ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. పదేళ్లుగా ఎదురు చూస్తున్న సొంతింటి కల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్రెడ్డి హయాంలో నెరవెరబోతోందన్నారు. అలాగే గ్రామంలో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, దేవస్థాన చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, నాయకులు జంగిటి విద్యానాఽథ్, హరిబాబుగౌడ్, వెంకటేశ్, రవీందర్రెడ్డి, అల్వాల ఎల్లయ్య, సందీప్, మసూద్, బాలకిషన్గౌడ్, హరీష్, రాములు, స్వామి, రమేశ్, బాలరాజు, సురేందర్రెడ్డి, పలువురు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి -
పనులు సత్వరమే పూర్తి చేయండి
రఘునాథపల్లి: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని నిడిగొండ, కంచనపల్లి పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి భోజయ్య, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, పీఆర్ ఏఈ భరత్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రశంస పత్రాల పంపిణీ జనగామ రూరల్: కార్పొరేట్ కళాశాల విద్యను విద్యార్థులు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి ఇంటర్లో కార్పొరేట్ కళాశాలలో చేరుతున్న 15 మంది విద్యార్థులకు ప్రవేశపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ, మైనార్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు డాక్టర్ విక్రమ్, రవీందర్ సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ‘బడిబాట’పై పాట ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, నాణ్యమైన విద్య, విద్యా ప్రాముఖ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా అల్లూరి రవీందర్ రాసిన, వసంత, జ్యోతి, యమున టీచర్లు గానం చేసిన బడి బాట పాట వీడియోను కలెక్టర్ రిజ్వానా భాషా, డీఈఓ భోజన్న మండలంలోని ఎర్రకుంట తండా పాఠశాలలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల నమోదుకు చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. -
మూడో ఏటనే.. బడికి పంపారు
నన్ను రెండేళ్లు దాటి మూడో ఏడు రాగానే బడికి పంపించారు. అయితే.. నా గోల భరించలేక మా అమ్మ ఓ పథకం వేసి బడిలో అయితే కాస్త భయంతో ఉంటానని అనుకుని ఉండొచ్చు. ప్రైమరీ స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. పెద్ద సారు క్యాడర్ పెద్దది కాబట్టి మాకు చిన్నసారే పలక మీద ఓనమాలు పెట్టించేది. ఆయనకు పెద్ద మీసాలు ఉండేవి. పిల్లలంతా ఈయనకి కూడా భయపడే వారు. అనంతరం హైస్కూల్ చదువులోనూ ఎప్పుడూ ఫస్ట్ ఉండేదాన్ని. బడికి వెళ్లాలంటే ఏనాడు భయపడలేదు. తల్లి ప్రోత్సాహంతో చదివి ఉన్నతస్థాయికి ఎదిగాను. ఇప్పటికీ బాల్య స్మృతులు గుర్తుకు వస్తే.. ఎంతో సంతోషంగా ఉంటుంది. – నెల్లుట్ల రమాదేవి, ఆంధ్రాబ్యాంకు రిటైర్డ్ జోనల్ చీఫ్ మేనేజర్, శివునిపల్లి ●