breaking news
Jangaon
-
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
స్టేషన్ఘన్పూర్: మహిళల ఆర్థిక అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నా రు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఇందిరా మహిళా శక్తి సంబురాలను శుక్రవారం నిర్వహించారు. డీఆర్డీఓ వసంతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మె ల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్బాషా, అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళా శక్తి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకే అందిస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అధికంగా మ హిళలకు ఉపయోగపడేవే ఉన్నాయన్నారు. అనంత రం 5,682 స్వయం సహాయక సంఘాలకు రూ.17. 36 కోట్ల వడ్డీలేని రుణాలు అందించారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ నూరోద్దీన్, డీపీఎంలు సతీష్, ప్రకాష్, శ్రీనివాస్, నళినినారాయణ, ఏఎంసీ చైర్పర్సన్ లావణ్య, అధికారులు పాల్గొన్నారు. అప్పులున్నా..ప్రజా సంక్షేమం ఆగదు చిల్పూరు: గత పాలకుల అవినీతితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకు మించి అప్పుల భారం ఉన్నా.. ప్రజా సంక్షేమం మాత్రం ఆగదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆర్డీఓ వెంకన్న అధ్యక్షతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, డీసీఎస్ ఓ సరస్వతి అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
భవిష్యత్ తరాలకు నీటికొరత రావొద్దు
రఘునాథపల్లి: భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. మన జిల్లా మన నీరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రఘునాథపల్లి పోలీస్స్టేషన్ ఆవరణలో డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి ఇంకుడుగుంతల నిర్మాణానికి కంకర పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భజలాల పరిరక్షణ అనేది ఒక సామాజిక బాధ్యత అన్నారు. ఈ భూగర్భ జల మట్టం ప్రమాదస్థాయికి చేరకముందే భూగర్భ జలాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మన జిల్లా మన నీరులో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలు మొదలగు వాటిలో ఇప్పటికే 7వేల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టామన్నారు. ఇందిరమ్మ ఇంటిలో ఇంకుడు గుంత తప్పనిసరి అన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసి పట్టి భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు రాకుండా ఇంకుడు గుంతలు దోహదపడుతాయన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కాగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో దేశంలోనే 50 అత్యుత్తమ జిల్లాల్లో రాష్ట్రం నుంచి జిల్లాకు చోటు దక్కడంతో కలెక్టర్ను డీసీపీ, సీఐ, ఎస్సైలు శాలువా, మెమోంటోతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ కొండల్రెడ్డి, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, తహసీల్దార్ ఫణికిషోర్, ఎస్సై దూదిమెట్ల నరేష్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శోభారాణి, బీట్ ఆఫీసర్ రమేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్ -
నో బ్యాక్ బెంచీ సిట్టింగ్
జనగామ: మలయాళ చిత్రం స్థానార్థి శ్రీ కుట్టన్ స్ఫూర్తిగా సర్కారు బడుల్లో విద్యార్థుల సిట్టింగ్ మారిపోతుంది. బడిలో బ్యాక్ బెంచీకి స్వస్తి పలుకుతూ.. యూ ఆకారంలో కూర్చున్న విధానం ప్రాముఖ్యతను గొప్పగా చూపించారు. ఈ మూవీ విడుదలైన తర్వాత కేరళ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో ఈ విధానాన్ని అమలు చేయగా.... ఇప్పుడు జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు డీఈఓ భోజన్న ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల జీవితంలో బ్యాక్ బెంచ్ కళంకాన్ని ఎదుర్కొనే విద్యార్థులకు తీపికబురుగా చెప్పుకోవచ్చు. పాఠశాల తరగతి గదిలోకి ఎంటర్ కాగానే వరుస క్రమంలో కూర్చునే విద్యార్థులు కనిపించడం సర్వసాధారణం. విద్యార్థి ఎత్తును ఆధారంగా పరిగణించడం.. చదువులో రాణించే వారిని ముందు బెంచీలో కూర్చోబెట్టడం నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తుంది. ఇలా ఒకటి, రెండు వరుస క్రమంలో కూర్చునే విద్యార్థులు తెలివి కలిగి ఉండడం.. తర్వాత స్టెప్పుల్లో చదువుకునే పిల్లలు బ్యాక్ బెంచీగా ముద్ర వేసుకుని.. పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తే... వారు అంతేలే అని వదిలేసే పరిస్థితి. ఇలా పది పూర్తి చేసుకున్న తర్వాత ఇంటర్, డిగ్రీ లేదా బీటెక్ ఉన్నత చదువులకు వెళ్లే వరకు... ఒరేయ్ బ్యాక్ బెంచీ అంటూ పిలిచే పరిస్థితి నేటికీ చూస్తూనే ఉన్నాం. బ్యాక్ బెంచీ విద్యార్థుల జీవితాలను ఆధారంగా తీసుకుని మలయాళ దర్శకుడు తీసిన చిత్రం దేశంలోని ప్రతిఒక్కరిని మేలుకొలిపింది. ముఖ్యంగా విద్యాశాఖను. పాఠశాల తరగతి గదిలో బ్యాక్ బెంచీకి స్వస్తి పలుకుతూ ‘యూ’ ఆకారంలో పిల్లలను కూర్చో బెట్టి పాఠాలు బోధించే పద్ధతిని ఇప్పుడు అనేక పాఠశాలల్లో అమలు చేస్తున్నారు.జిల్లాలో యూ ఆకారంలో....జిల్లాలో ప్రాథమిక 341, ప్రాథమికోన్నత 64 యూపీఎస్, ఉన్నత 103 పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో బ్యాక్ బెంచీ విధానానికి స్వస్తి పలికి యూ కారంలో కూర్చోబెట్టిలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీతరగతి గదిలో యూ ఆకారం సిట్టింగ్తో విద్యార్థులందరి దృష్టి పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల బోధన వైపు ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పిల్లల్లో అభ్యసన మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. సెమీ సర్కిల్ లేదా యూ ఆకార అమరిక, సాంప్రదాయ సీటింగ్కు ఉపహరిస్తుంది. తరగతి గదిలో విద్యార్థులు స్వేచ్ఛగా తిరిగే అవకాశం, సహచరులతో చురుకుగా మాట్లాడే వెసులుబాటు దొరకుతుంది. తక్కువ మాట్లాడటం చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులు తక్కువగా ఉన్న తరగతుల్లో బోధనతో పాటు ఉపాధ్యాయుల వ్యక్తిగత పరిశీలనకు అనువుగా ఉంటుంది. పరధ్యానంగా ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయులు సులభంగా గమనించే వీలు కలుగుతుంది. సమూహ అభ్యసన కోసం నలుగురు నుంచి ఆరుగురు విద్యార్థులతో కూడిన చిన్న సమూహాల ఏర్పాటు చేయాల్సిన సమయంలో విద్యార్థులు త్వరగా మరొక జత డెస్క్ల వైపు తిరిగి గ్రూప్ డిస్కర్షన్ చేసుకోవచ్చు. -
వసతి గృహాలపై నిరంతరం పర్యవేక్షణ
● గూగుల్ మీట్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: జిల్లాలోని వసతి గృహాలపై అధికారుల నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతిగృహాలు, కేజీబీవీల నిర్వహణపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్లో మాట్లాడారు. విషపురుగులు, క్రిమికీటకాలు వసతి గృహాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసర ప్రాంతాల్లో చెత్త, చెదారం లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు నిద్రించే గదులపై నిఘా ఉండాలని, స్వచ్ఛత ఉండేలా చూడాలన్నారు. ప్రతిరోజు పిల్లలకు వేడిచేసి చల్లార్చిన తాగునీటిని మాత్రమే అందించాలన్నారు. వసతి గృహాలకు సప్లయ్ చేసే బియ్యం, పాలు, నూనె, గుడ్ల నాణ్యతలో రాజీ ఉండకూడదన్నా రు. తాజా కూరగాయలను మాత్రమే వడ్డించాలన్నారు. వార్డెన్లు అందుబాటులో ఉండాలని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు శాతంతో పాటు వంట సామగ్రిని ప్రతిరోజు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. పాము, కుక్కకాటు మందులతో పాటు సమీపంలోని పీహెచ్సీ వైద్యుల నంబర్లను వసతి గృహాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ గూగుల్ మీట్లో ఆర్డీఓలు, విద్య, వైద్య శాఖల అధికారులు, రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపా ల్స్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.జీఓ 51ని రద్దు చేయాలికొడకండ్ల: జీఓ 51 రద్దుకు గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ రాష్ట్ర నాయకుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలకేంద్రంలో సోమారపు వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన యూనియన్ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ దగా కోరు విధానాలతో రాష్ట్రంలో వేలాది మంది గ్రామ పంచాయతీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ సమస్యలు తీరుతాయని భావించిన కార్మికులకు నిరాశే ఎదురవుతుందన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇస్తూ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ప్రమాద బీమాను రూ.15లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సీఐటీయూ మండల అధ్యక్షుడిగా నూనెముంతల యాకన్న, ప్రధాన కార్యదర్శిగా నామాల ఐలయ్యతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బత్తిని వెంకన్న, కోశాధికారి బస్వ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. విరబూసిన బ్రహ్మకమలంరఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ గ్రామానికి చెందిన పెండెల నర్సింగరావు ఇంటి ఆవరణలో శుక్రవారం తెల్లవారు జామున బ్రహ్మకమలం విరబూసింది. పుష్పించిన బ్రహ్మకమలాన్ని గుర్తించిన నర్సింగరావుసత్యవతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులు విరబూసిన బ్రహ్మ కమలాన్ని చూసి ముగ్ధులయ్యారు. జూలై, సెప్టెంబర్ మాసంలో పుష్పించే బ్రహ్మకమలాన్ని ఎక్కువగా ఆయుర్వేదం, కేన్సర్, తలనొప్పి, విరిగిన ఎముకలకు ఔషధంగా వాడుతారని, రాత్రి సమయంలోనే ఎక్కువగా పుష్పిస్తుందని వేద పండితుడు కృష్ణమాచార్యులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి పోరాటందేవరుప్పుల: రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటం అనివార్యమని యూటీఎఫ్ స్టేట్ బో ర్డు ఆఫ్ డైరెక్టర్ ఆకుల శ్రీనివాసరావు అన్నా రు. శుక్రవారం మండలంలోని పెద్దమడూరుతో పాటు పలు పాఠశాలల్లో యూటీఎఫ్ సభ త్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారం కానందున ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మూడు దశలలో పోరా టం చేయబోతున్నామని వెల్లడించారు. మొద టి దశలో ఈ నెల 23, 24 తేదీల్లో మండల త హసీల్దార్లకు వినతి పత్రాలు, ఆగస్టు 1న జిల్లా స్థాయిలో, 23 రాష్ట్రస్థాయిలో ధర్నా చేపట్టాలన్నారు. మండల అధ్యక్షుడు జి. గోవర్దన్ రెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, సురేష్ బాబు పాల్గొన్నారు. -
ఉపాధి అవకాశాలపై ఆశలు
చివరి దశకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు● నెరవేరుతున్న జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ● నేడు యూనిట్ను విజిట్ చేయనున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ● కొందరు రైతులకు అందని భూ పరిహారం.. స్థానికులకు ఉద్యోగ,ఉపాధి కల్పించేనా..? ● వీటిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ ● కాజీపేట డివిజన్ అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని రైల్వే నాయకుల నిర్ణయంకాజీపేట రూరల్: రైల్వే కోచ్ఫ్యాక్టరీ.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కార్యరూపం దాల్చిన కాజీపేట రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం 80శాతం పూర్తికావొచ్చింది. ఈ యూనిట్ ఏర్పాటుతో స్థానిక యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోపాటు మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. శనివారం రైల్వే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను సందర్శించనున్నారు. వ్యాగన్షెడ్ టు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్.. కాజీపేట మండలం అయోధ్యపురంలో 160 ఎకరాల్లో సుమారు రూ.786 కోట్లతో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం చేపట్టారు. 2023 జూలై 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హనుమకొండ సుబేదారి ఆర్ట్స్కాలేజ్ గ్రౌండ్లో నుంచి కాజీపేట వ్యాగన్షెడ్కు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 2023లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కాజీపేట రైల్వే మల్టీపుల్ యూనిట్గా ప్రకటన చేసి మంజూరు చేశారు. రీ డిజైనింగ్ చేసి జపాన్ టెక్నాలజీతో మల్టీపుల్ యూనిట్ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో వ్యాగన్, కోచ్, వందేభారత్, ఎల్హెచ్బీ, మెము కోచ్లు తయారు చేస్తారు. 80శాతం పూర్తయిన విభాగాలు.. యూనిట్లోని మెయిన్షాప్, పేయింట్ షాప్, స్టోర్ వార్డు, టెస్ట్ షాప్, క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, సెక్యూరిటీ పోస్టు, రెస్ట్ హౌజ్, సేవగ్ ట్రీట్మెంట్ ప్లాంట్/పంప్హౌస్, టాయిలెట్ బ్లాక్స్, ప్యాకేజీ సబ్స్టేషన్, షవర్ టెస్ట్, రోడ్వే బ్రి డ్జి, పంప్హౌస్/జీఎల్ఆర్, పిట్ ట్రావెర్సర్, వ్యా గన్ వే బ్రిడ్జి, గార్డు పోస్ట్/ట్రాక్ గేట్, ఆర్యూబీ, పార్కింగ్, పాండ్, (2000 కేఎల్ కెపాసిటీ), స్క్రాప్ బిన్స్ పనులు 80శాతం పూర్తయ్యాయి. పెండింగ్ పనులు.. రైల్వే కార్మికుల కోసం క్వార్టర్స్ నిర్మాణం, కోచ్ల తయారీకి షెడ్లలో మిషనరీ ఫిట్టింగ్, కనెక్టివిటీ రోడ్లు, ఎంట్రెన్స్ వద్ద రైల్వే వంతెన నిర్మాణం, ఇతరత్ర సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ జరగాల్సి ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చిలో యూనిట్ను ప్రారంభిస్తామని ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ప్రకటించారు. వీటిపై దృష్టిపెట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పంజాబ్ మాదిరి ఉద్యోగ అవకాశాలు కాజీపేటలోని కోచ్ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించనుంది. అయితే ఈ ఉద్యోగాలు ఉమ్మడి జిల్లావాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ కోచ్ఫ్యాక్టరీలో ప్రత్యేక జీఓ తీసి అక్కడి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అదేమాదిరిగా ఇక్కడ కూడా ఈ ప్రాంతం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దీనిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి అయోధ్యపురంలో రైల్వే యూనిట్కు 112మంది 160 ఎకరాల భూమి ఇచ్చారు. ఇద్దరు ఇళ్లు కోల్పోయారు. మొత్తం 114మంది నిర్వాసితులు ఉండగా ప్రభుత్వం ఎకరాకు రూ.8లక్షలు చెల్లించింది. ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరాకు రూ.33 లక్షలు ఉండగా, ప్రభుత్వం రూ.8 లక్షలు రైతుకు ఇచ్చి, రూ.25లక్షలు దేవాదాయశాఖ (ఈ భూమి దేవాదాయశాఖకు సంబంధించింది) కు ఇచ్చారు. 8మంది రైతుల భూమి సీలింగ్ ల్యాండ్ అని నష్టపరిహారం నిలిపివేశారు. ఇప్పటివరకు వారికి రాలేదు. కోట్ల రూపాయల విలువైన భూమి కోల్పోయామని, రైల్వే యూనిట్లో ఇంటికో ఉద్యోగం ఇచ్చి రైల్వేశాఖ ఆదుకోవాలని రైతులు కేంద్రమంత్రులను కోరుతున్నారు. కేంద్రమంత్రుల షెడ్యూల్.. శంకర్పల్లి రైల్వే స్టేషన్నుంచి ఎంఆర్ ప్రత్యేక రైలులో ఉదయం 11 గంటలకు బయలుదేరి 1:30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. 01:30 గంటలకు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి 01:45 గంటలకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు చేరుకుంటారు. 02:45 గంటల వరకు యూనిట్ను విజిట్ చేస్తారు. అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి కాజీపేట రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. 05:30 గంటలకు ఎంఆర్ ప్రత్యేక రైలులో కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకుంటారు.రైల్వే మంత్రి దృష్టికి కాజీపేట డివిజన్ ప్రస్తావన.. రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ దృష్టికి ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్తామని స్థానిక రైల్వే నాయకులు తెలిపారు. అదేవిధంగా టౌన్ స్టేషన్ అభివృద్ధి, ఫాతిమానగర్లో ట్రైయాంగిల్ స్టేషన్ నిర్మాణం, కాజీపేట రైల్వే ఆస్పత్రి సబ్ డివిజన్ ఆస్పత్రిగా అప్గ్రేడ్, కాజీపేట రైల్వే స్టేషన్లో అదనపు ప్లాట్ఫాంల నిర్మాణం, అన్ని హంగులతో కూడిన రైల్వే క్లబ్ (ఇన్స్టిట్యూట్) భవనం, బెజవాడ తరహాలో రైల్వే ఎలక్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. -
ఎక్కువ మంది ఉన్నచోట ఇబ్బంది..
అన్ని సందర్భాల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట, యూ ఆకారంలో కూర్చోబెట్టడం సాధ్యం కాదు. ఒక్కోసారి నల్లబల్ల అందరికీ కనిపించక మెడ నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. ఇంతటి విలువైన ఈ ప్రదేశంలో ప్రతి విద్యార్థికి సమానమైన ప్రాముఖ్యత ఇవ్వగలగాలంటే, ఆ గది విశాలంగా ఉండడంతో పాటు, అత్యంత సౌకర్యవంతంగానూ ఉండగలగాలి. విద్యార్థి క్షేమాన్ని కాంక్షించే ప్రతీ టీచర్ కూర్చున్న స్థలానికి ప్రాధాన్యం ఇవ్వకుండా వారి విద్యావికాసానికి శ్రద్ధ వహిస్తారు. –త్రిపురారి పద్మ, తెలుగు పండిట్ ఉపాధ్యాయురాలు -
ఓపెన్ స్కూల్ను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ/: చదవడం, రాయడం వచ్చిన ప్రతీఒక్కరు ఓపెన్ స్కూల్ను సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్ స్కూల్ పాఠశాల జిల్లా కమ్యూనిటీ మానిటరింగ్ ఆఫీసర్ నాగరాజు, కోఆర్డినేటర్ ఎం.శంకరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలతో పాటు రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో ఓపెన్ స్కూల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడిమధ్యలో మానేసి 14 సంవత్సరాలు పైబడిన వారు పదో తరగతి పరీక్ష రాయడానికి అర్హులన్నారు. పదవ తరగతి పాసైన వారు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయవచ్చన్నారు. ఒకే సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్ష రాసి పాస్ కావచ్చన్నారు. జూలై 31 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణమూర్తి, నర్సింహారెడ్డి, కనక య్య, సిద్ధిరాములు, మంజుల పాల్గొన్నారు. -
విద్యార్థుల మేధోశక్తిని పెంచేందుకే గ్రంథాలయాలు..
జనగామ రూరల్: గ్రంథాలయ పుస్తకాలు విద్యార్థుల మేధోశక్తిని పెంచేందుకు ఎంతో దోహదం చేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి డి.భోజన్న అన్నారు. శుక్రవారం పట్టణంలోని అర్బన్ గురుకుల పాఠశాల ఆవరణలో మైసూర్లోని కేంద్ర భారతీయ భాషల సంస్థ, సమగ్ర శిక్ష సౌజన్యంతో జిల్లాలోని 271 ప్రభుత్వ ప్రాథమిక, 63 ప్రాథమికోన్నత, మొత్తంగా 334 పాఠశాలలకు 115 టైటిల్స్తో కూడిన గ్రంథాలయ పుస్తకాలను అందించారు. అనంతరం వాటిని డీఈఓ చేతుల మీదుగా బచ్చన్నపేట మండలానికి పంపించారు. అనంత రం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల విద్యావికాసాన్ని దృష్టిలో ఉంచుకుని లైబ్రరీ పుస్తకాలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, డీసీఈబీ సెక్రటరీ చంద్రభాను, సీఎంఓ నాగరాజు, పాఠశాల (యూఆర్ఎస్) ప్రత్యేక అధికారి ఏ.శ్రీనివాస్, సీఆర్పీలు యాదయ్య, శ్రీనివాస్, రామచందర్, సిబ్బంది కనకయ్య, సతీష్ తదితరులు ఉన్నారు. పుస్తకాల పంపిణీలో డీఈఓ భోజన్న -
సాగునీరు విడుదల చేయకుంటే ధర్నా
దేవరుప్పుల/పాలకుర్తి టౌన్: దేవాదుల సాగునీరు విడుదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే సీఎం రేవంత్రెడ్డి ఇంటి ఎదుట మహాధర్నా చేపడుతామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. శుక్రవారం దేవరుప్పుల మండలం మాధాపురం నుంచి సాగునీటి కాల్వ గుండా పాలకుర్తి మండలం గూడూరు వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను ఎర్రబెల్లికి విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వ్యవసాయం రంగం పురోగతికి సీఎం రేవంత్రెడ్డి హయాంలో అధికారులు నిద్రవస్థలో పని చేస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు దేవాదుల, ఎస్ఆర్ఎస్పీ ద్వారా 360 రోజులు నీళ్లు అందించామని, మూడు నెలల ముందే సమీక్షలు చేసి చెరువులు నిండుకుండాల నింపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవరుప్పుల, పాలకుర్తి మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని పాదయాత్రకు సంఘీభావం పలికా రు. అంతకుముందు ఓ మహిళా రైతు తను తెచ్చుకున్న సద్దన్నాన్ని ఎర్రబెల్లికి తినిపించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్ల సుందర్రాంమిరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్సింగ్, మాజీ ఎంపీపీలు కొల్లూరి సోమన్న, బస్వ మల్లేషమ్, గడ్డం రాజు, మంగలంపల్లి శ్రీనివాస్, పసునూరి నవీన్, శ్రీనివాస్రావు, నవీన్నాయక్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నదని అనుమానం
జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ వారసత్వాన్ని స్వీకరించి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదనే అనుమానం కలుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆందోళన కలిగిస్తే, కాంగ్రెస్ సర్కారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఫోన్ను కూడా నాడు ట్యాప్ చేశారని, ఆయనెట్లా కేసీఆర్ను కాపాడుతారని ప్రశ్నించారు.కేసీఆర్ లాంటి చండాలమైన వ్యక్తిని తానెక్కడా చూడలేదన్నారు. భార్యాభర్తలు బెడ్రూంలో మాట్లాడుకునే మాటలను కూడా ట్యాప్ చేసి విన్న ఘనుడు కేసీఆర్ అని సంజయ్ దుయ్యబట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్ వెరీ క్లియర్గా ఉందని, వందశాతం వర్తింపజేస్తే, కేంద్రాన్ని ఒప్పించి బిల్లును ఆమోదింపజేసే బాధ్యత తీసుకుంటామన్నారు.51 శాతం జనాభా ఉన్న బీసీలకు ఇప్పటికే మోదీ ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లను అందిస్తోందని, మరి కాంగ్రెస్ ఒరగబెట్టిందేంటని నిలదీశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోమని, అన్ని అంశాలపై కేంద్రం కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిందని సంజయ్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార కర్తలుగా బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లు మాజీ సర్పంచులే ముందుండి పనిచేస్తారన్నారు. -
కలెక్టర్కు సీఎం ప్రశంస
జనగామ: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో దేశంలోని 50 అత్యుత్తమ జిల్లాల్లో రాష్ట్రం నుంచి జనగామ జిల్లాకు చోటు దక్కడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి తన ఎక్స్లో ట్వీట్ చేస్తూ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికార యంత్రాంగం పని చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడానికి ఇదే నిదర్శనమంటూ అందులో పేర్కొన్నారు. ఇంతటి విజయానికి కారణమైన కలెక్టర్ చొరవ, రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. కలెక్టర్కు తన ప్రత్యేక అభినందనలంటూ పేర్కొన్నారు. -
అక్రమాలకు పాల్పడితే జైలు తప్పదు
లింగాలఘణపురం: ప్రజలు ఇచ్చిన అధికారంతో అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడితే జైళ్లకెళ్లడం తప్పదని, ఇప్పటికే ఆ కుటుంబంలో ఒకరు జైలుకెళ్లి వచ్చారని, మిగిలిన వారు వెళ్లకతప్పదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శించారు. గురువారం మండలంలోని జీడికల్– కళ్లెం రోడ్డు శంకుస్థాపన, అసంపూర్తి కాలువ పనుల పరి శీలన, రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.8 కోట్లతో జీడికల్–కళ్లెం రోడ్డుకు మార్చి 16న సీఎం రేవంత్రెడ్డి వేసిన శిలాఫలాన్ని ఎమ్మెల్యే కడియం జీడికల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం అవినీ తి, అక్రమాలకు పాల్పడిందని కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో జైలుకు వెళ్లకతప్పదని అన్నారు. అర్హులందరికీ రేషన్కార్డు వస్తుందని, కొత్త పేర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చి హామీలను అమలు చేస్తు న్నా.. కొంత మందికి అభివృద్ధి కనిపించడంలేదని అన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. నవంబర్లో జరిగే జీడికల్ జాతర నాటికి జీడికల్–కళ్లెం రోడ్డు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను కోరారు. అంతకు ముందు జీడికల్ వద్ద అసంపూర్తిగా ఉన్న దేవాదుల కాలువ పనులను పరిశీలించారు. వారం రోజుల్లో గా పనులు పూర్తి చేయాలని అశ్వరావుపల్లి రిజర్వాయర్ కాలువ నుంచి జీడికల్, రామచంద్రగూడేనికి నీళ్లు అందజేస్తామని చెప్పారు. రూ.30వేల స్వంత డబ్బులతో భూమి కోల్పోతున్న రైతు ప్రశాంత్ భూ మిలో దారి ఏర్పాటు చేస్తానని చెప్పారు. సిరిపురంలో కొంత భూసేకరణలో భూమి కోల్పోతున్న రైతు శశాంక్తో ఫోన్లో మాట్లాడి కాలువ తీసేందుకు సహకరించాలని కోరారు. జీడికల్ వీరాచల రామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, డీసీఎస్ఓ సరస్వతి, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ రవీందర్, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, పీఏసీఎస్ చైర్మన్లు ఉపేందర్, మల్లేశం, మార్కెట్ డైరెక్టర్లు మోహన్, శ్రీలతారెడ్డి, నీటిపారుదల శాఖ డీఈ రవికుమార్, పీఆర్డీఈ రవీందర్, ఏఈ శ్రీనివాసు, వంశీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ పైసా ఇవ్వొద్దు రఘునాథపల్లి: ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం ఎవరైనా ఒక్క రూపాయి అడిగినా తమకు చెప్పాలని, ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజలకు సూచించారు. గురువారం మండలంలోని ఇబ్రహీంపూర్లో నిడిగొండ నుంచి ఖిలాషాపూర్కు రూ.6 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డు, ఫతేషాపూర్లో రూ.20 లక్షలతో మంజూరైన ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణాలకు శిలాఫలకాలు ఆవిష్కరించిన అనంతరం ఖిలాషాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించి వారంలో గోదావరి జలాలు చెరువుల్లో నింపేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఫతేషా పూర్ మహిళా సంఘాలకు ఎంపీ నిధుల నుంచి భవనం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 18 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు, తహసీల్దార్ ఫణికిశోర్, జగదీష్చందర్రెడ్డి, అజయ్, నర్సింహారెడ్డి, సారయ్య, క్రాంతికుమార్ పాల్గొన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
జనగామ రూరల్: వ్యాపార రంగాల్లో ముందుంటూ మహిళలందరూ ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ఇంది రా మహిళ శక్తి సంఘాల సంబురాలను జిల్లా గ్రా మీణ అభివృద్ధి అధికారి వసంత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీఐ సభ్యుడు అభిగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలు పలు వ్యాపార రంగాల్లో ప్రావీణ్యత సా ధిస్తూ అభివృద్ధి పథంలో సాధికారత దిశగా దూసుకెళ్తున్నట్లు తెలిపారు. ఇందిరా మహిళ క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహించడం అభినందించారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు, ధాన్యం కొనుగోళ్లతో ఇప్పటికే అభివృద్ధి పథంలో రాణిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో బస్ల కొనుగోలు చేపట్టారని, సోలార్ యూనిట్ల స్థాపన, పెట్రోల్ బంక్ ల ఏర్పాటు ప్రభుత్వ ఆశయం అన్నారు. ప్రతి సెంటర్లో ఆగస్టు 15వ తేదీ లోపు 50 వనిత టీ స్టాల్ లను చేపట్టాలన్నారు. పిల్లలను చదివించాలన్నారు. అనంతరం వివిధ మండలాల స్వయం సహాయక సంఘాలకు రుణాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, డీపీఎం నళినినారాయణ పాల్గొన్నారు. కలెక్టర్కు సన్మానం న్యాస్ పరీక్షలో దేశంలో జనగామను 50వ స్థానంలోపు నిలిచేలా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కృషి చేయడం గొప్పవిషయమని ఆర్టీఏ సభ్యుడు అభిగౌడ్ అన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లకు గురవారం సన్మానించారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి పాలకుర్తి టౌన్: పచ్చదనం పరిరక్షణకు ప్రభుత్వ కార్యాలయాలు ఆదర్శంగా నిలవాలని, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమర్తో కలిసి మొక్కను నాటి వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ సిద్ధార్థరెడ్డి, డాక్టర్ ఉష, గాయత్రి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఘనంగా ఇందిరా శక్తి సంబురాలు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
సుందరీకరణ పనుల్లో నాణ్యత లేదు
జనగామ: జనగామ రైల్వేస్టేషన్లో జరుగుతున్న సుందరీకరణ పనుల్లో నాణ్యత పాటించడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు గురువారం వినతి పత్రం అందజేశారు. అనంతరం రైల్వేస్టేషన్ పనులు, ట్రెయిన్ల హాల్టింగ్కు సంబంధించి కొద్దిసేపు చర్చించారు. జిల్లాతోపాటు సమీప ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది ఇక్కడకు వచ్చి హైదరాబాద్, విజయవాడ, వరంగల్, ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. జనగామ రైల్వేస్టేషన్లో శాతవాహన, చార్మినార్, షిర్డీ, కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపితే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి సుందరీకరణ పనులు చేయిస్తున్న పనుల్లో నాణ్యతకొరవడిందని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించే విధంగా పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు బొమ్మకంటి అనిల్, ప్రధాన కార్యదర్శి పెద్దోజు జగదీష్, తోకల హరీష్, రవి, రాజా, నాయకులు చంద్రం, లగిశెట్టి వీరలింగం, శివకృష్ణ, కాసుల శీను, పానుగంటి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకలు అజహరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ -
మొక్కలు నాటి సంరక్షించాలి
రఘునాథపల్లి: మొక్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన వనమహోత్సవంలో ఆయన మొక్కలు నాటారు. ఆస్పత్రి పరిధిలో కొనసాగుతున్న ఫీవర్ సర్వే, స్టాప్ డయేరియా ప్రోగ్రాం, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాల కొనసాగింపుపై వివరాలు తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని, వాటితో పర్యావరణ పరిరక్షణ కాపాడుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ కమల్హాసన్, డాక్టర్ స్రవంతి, కమ్యూనిటీ హె ల్త్ ఆఫీసర్ రామ్కిషన్, సూపర్వైజర్లు సుజన, రజని, విష్ణువర్దన్రెడ్డి, పాండారి పాల్గొన్నారు.అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి బచ్చన్నపేట : విద్యుత్ సమ్యలను గుర్తించడానికి ట్రాన్స్కో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్ వేణుగోపాలచారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్లో జనగామ 1, 2, జనగామ రూరల్, పెంబర్తి, బచ్చన్నపేట, పడమటికేశ్వాపూర్ సబ్ స్టేషన్ల పరిధిల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించగా ఆయన ముఖ్యఅథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. బచ్చన్నపేట–4. పడమటికేశ్వాపూర్–2, జనగామ రూరల్–1, లింగాలఘన్పూర్–1 మొత్తం 8 సమస్యలు రిజిస్ట్రర్ అయ్యాయని తెలిపారు. విద్యుత్ అధికారులు వినియోగదారుల వద్ద డబ్బులు తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో టెక్నికల్ మెంబర్ రమేష్, ఫైనాన్స్ మెంబర్ దేవేందర్, ఇండిపెండెంట్ మెంబర్ రామారావు, ఎస్ఈ వేణుమాధవ్, డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, టెక్నికల్ డీఈ గణేష్, ఎస్ఏఓ జయరాజ్, ఏడీఈ వేణుగోపాల్, ఏఈ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం జనగామ రూరల్: గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్స్సీ, బ్యాంకింగ్ పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సు కోసం 150 రోజులపాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణకు ఆన్లైన్ ద్వారా ఆగస్టు 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.లక్ష మించకుండా, పట్టణ ప్రాంతంలో రూ.రెండు లక్షలు మించకూడదని తెలిపారు. డిగ్రీ పరీక్షలో మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.1000 చొప్పున 5 నెలల పాటు స్టైఫండ్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 0870–2571192, 040–2407118 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు. బీజేపీ జిల్లా ఇన్చార్జ్, కన్వీనర్ల నియామకం జనగామ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఎన్నికల పర్యవేక్షణ కోసం జిల్లా ఇన్చార్జ్, కన్వీనర్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. జనగామ జిల్లా ఎన్నికల ఇన్చార్జ్గా బేతి సుభాష్ రెడ్డి, కన్వీనర్గా ఆరుట్ల దశమంతరెడ్డిని నియమించారు. స్థానిక సంస్థల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కై వసం చేసుకునే విధంగా కేడర్ను సమాయత్తం చేస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్యత వీరిపై ఉంది. మెరుగైన సేవలందించి మన్ననలు పొందాలి లింగాలఘణపురం: మండలంలోని ప్రజలకు అత్యవసర సమయంలో మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని 108 జిల్లా కోఆర్డినేటర్ వి.రాము అన్నారు. గురువారం మండల కేంద్రంలోని 108 వాహనాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అంబులెన్స్ నిర్వహణ ఎలా ఉందంటూ తెలుసుకున్నారు. 108 పైలెట్లు ఎం.రమేష్, నవీన్కుమార్, ఏఎంటీ బిల్లా రాజు, శ్రవణ్కుమార్లకు పలు సూచనలు చేశారు. -
డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి
జనగామ రూరల్: డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని వరంగల్ నార్కోటిక్స్ ఏసీపీ సైదులు అన్నారు. గురువారం మండలంలోని పెంబర్తి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల కళాశాలలో యాంటీ డ్రగ్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. అవయవాల మీద డ్రగ్స్ ప్రభావం పడి జీవితం అగమ్యచోచరంగా మారుతుందని వివరించారు. యువత, విద్యార్థులు మత్తుకు బానిసలు కాకూడదని తెలిపారు. చెడు అలవాట్లుకు పోకుండా చదువుపై దృష్టి పెట్టాలని సమాజాభివృద్దికి పాటుపడాలని తెలిపారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేస్తామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జనగామ సీఐ దామోదర్రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, బచ్చన్నపేట స్కూల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత అధ్యాపకులు పాల్గొన్నారు. నార్కోటిక్స్ ఏసీపీ సైదులు -
14.06 టీఎంసీలు.. 6.46 లక్షల ఎకరాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: నీటిపారుదల శాఖ వరంగల్, ములుగు సర్కిళ్ల పరిధిలో వానాకాలం సాగునీటి విడుదల యాక్షన్ ప్లాన్ను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, వర్షం, వరదలను అంచనా వేసి ఉమ్మడి వరంగల్లో ఖరీఫ్ పంటలకు నీరిందించే విధంగా ప్రణాళికను ప్రకటించింది. 2,52,623 ఎకరాల తరి, 3,94,041 ఎకరాల ఆరుతడి కలిపి మొత్తం 6,46,664 ఎకరాలకు 14.06 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయనున్నట్లు యాక్షన్ ప్లాన్లో పేర్కొంది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐడబ్ల్యూఏడబ్ల్యూ (స్కివం) సమావేశం అనంతరం సాగునీటి వివరాలను ప్రకటించారు. నీటి విడుదల తేదీ త్వరలో ప్రకటన.. ఉమ్మడి వరంగల్లో వాస్తవంగా ఎస్సారెస్పీ, దేవాదుల, సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు 9,43,530 ఎకరాలు కాగా.. ప్రస్తుత పరిస్థితులు, నీటిలభ్యతను బట్టి 6,46,664 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం ఇరిగేషన్ వరంగల్ సర్కిల్ పరిధిలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్ని నింపి 2,03,641 ఎకరాలకు 11.48 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. సరిపడా వరదలు వచ్చిన తర్వాత సమీక్షించి ఎల్ఎండీ దిగువన కాకతీయ కాల్వ, ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా మరో 2,91,936 ఎకరాలకు నీటి సరఫరా చేస్తారు. ములుగు సర్కిల్ పరిధిలో 10.05 టీఎంసీలకు 2.419 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల ద్వారా 34,618 ఎకరాల తరి, 1,16,469 ఎకరాల ఆరుతడి కలిపి 1,52,087 ఎకరాలకు సుమారు 2.58 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని అధికారులను ‘స్కివం’ కమిటీ ఆదేశించింది. ఈ మేరకు 15 రోజులకోసారి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన వానాకాలం పంటలకు నీరందించేందుకు ప్రణాళిక సిద్ధం కాగా.. నీటిని విడుదల చేసే తేదీ లను త్వరలోనే అధికారులు ప్రకటించనున్నారు. చీఫ్ ఇంజనీర్ల ప్రతిపాదనలు.. ‘స్కివం’ కమిటీ సూచనలు.. ములుగు సర్కిల్ పరిధిలోని 1,03,883 ఎకరాల ఆయకట్టుకు అధికారులు 93,750 ఎకరాలు ప్రకటించగా.. వరద ఇన్ఫ్లోను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేవాదుల ద్వారా 4,170 ఎకరాలకు 3,570 ఎకరాలకు 0.35 టీఎంసీలు, పాకాల కింద 23,193 ఎకరాలకు 1.43 టీఎంసీలు, రామప్ప ద్వారా 6,780కు 0.80 టీఎంసీల నీటిని ప్రతిపాదించారు. లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగు ద్వారా 23,794 ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా.. ఎస్సారెస్పీలో నీటి కొరత కారణంగా ఎల్ఎండీ, ఎస్సారెస్పీ కింద ప్రతిపాదించిన ఈ ఆయకట్టు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు తగినంత ఇన్ఫ్లో వచ్చిన తర్వాత సమీక్షించనున్నట్లు ‘స్కివం’ సూచించింది. గోదావరి నదిలో తగినంత నీరు అందుబాటులో ఉన్నందున దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపాలని కూడా కమిటీ ఆదేశించింది. ఇంకా రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు పంపింగ్ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాజెక్టుల కోసం ములుగులోని సీఈ ప్రతిపాదించిన కార్యాచరణను కమిటీ అంగీకరించి అమలు చేయాలని సిఫార్సు చేసింది. వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక ఇది ‘స్కివం’ కమిటీ సమావేశంలో యాక్షన్ ప్లాన్ ఖరారు వరంగల్, ములుగు సీఈల ప్రతిపాదనలకు ఆమోదం ప్రస్తుత నీటి లభ్యతను బట్టి నిర్ణయం.. వరదలొచ్చే వరకు ఆన్ అండ్ ఆఫ్.. 15 రోజులకోసారి వారబందీ పద్ధతిన విడుదల -
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuఒక్కో పాఠశాలకు రూ.15 లక్షల విలువ చేసే పరికరాలు జిల్లాలో ఎంపికై న 12 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్కు రూ.1.80 కోట్ల విలువ చేసే సైన్స్ పరికరాలను అందించారు. ఒక్కో పాఠశాలకు రూ.15లక్షల విలువ చేసే ల్యాబ్ పరికరాలు ఈ కిట్టులో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్ పరికరాలు, త్రీడీ ప్రింటింగ్ మిషన్, ఓపెన్–సోర్స్ మైక్రో కంట్రోలర్ బోర్డులు, కంప్యూటర్లు, ఐఎఫ్పీ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ టీవీ)తో పాటు టెలీస్కోప్ తదితర వస్తువులు ఉన్నాయి. ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానల్ బోర్డున్యూస్రీల్ -
విద్యుత్ ఉద్యోగులను ఆదుకోవాలి
జనగామ రూరల్: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ను బట్టి కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ కె.ఈశ్వర్రావు అన్నారు. బుధవారం విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో డివిజనల్ ఇంజనీర్ ఆఫీస్ ఆవరణలో వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 19,600 మంది ఆర్టిజన్ కార్మికులను విద్యాఅర్హతలను బట్టి కన్వర్షన్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీఎస్సీ జాయింట్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, రాష్ట్ర కో కన్వీనర్ కందికొండ వెంకటేష్, వైస్ చైర్మన్ వెనమల నరేందర్, రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ కుమార్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, జేఏసీ జిల్లా కన్వీనర్ జక్కుల యాకూబ్, కొంపెల్లి అశోక్, ఎల్లారెడ్డి, సుధాకర్, వెంకన్న, సంపత్, తదితరులు పాల్గొన్నారు. కన్న తండ్రిపై పోక్సో కేసుదేవరుప్పుల: కూతురుతో అసభ్యకరంగా ప్రవర్తించిన కన్న తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు దేవరుప్పుల ఎస్సై ఊర సృజన్ కుమార్ బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను కన్న తండ్రి లైంగికంగా వేధించాడు. ఈ విషయం తల్లికి చెప్పినప్పటికీ ఆమె స్పందించలేదు. మరోసారి వేధించడంతో సదరు బాలిక తన పెద్దమ్మకు జరిగిన విషయం తెలిపింది. ఆమె సహకారంతో బాలిక స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు బాధిత బాలిక తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఆ బాలికను బాలల సంరక్షణ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై చెప్పారు. ‘కే హబ్’ సందర్శన కేయూ క్యాంపస్: హైదరాబాద్లోని టీహబ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తాలూకా, స్టాఫ్ డైరెక్టర్ బెంజిమిన్ బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని కే హబ్ను సందర్శించారు. ఈపర్యటన సందర్భంగా వారు కే హబ్లోని వసతులు, మౌలిక సదుపాయాలు, స్టార్టప్ సంస్థల అభివృద్ధికి అనుకూలంగా ఉండే సాంకేతిక శాసీ్త్రయ వాతావరణ పరిస్థితులపై వీసీ ప్రతా ప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో చర్చించారు. త్వరలోనే టీ హబ్, కే హబ్కు మధ్య ఎంఓ యూ కుదుర్చుకోనుందని రిజిస్ట్రార్ రామచంద్రం వెల్లడించారు. కార్యక్రమంలో రూసా నో డల్ ఆఫీసర్ ఆర్.మల్లికార్జున్రెడ్డి, కేయూ దూ రవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య బి.సురేశ్లా ల్, కె హబ్ డైరెక్టర్ టి.సవితాజ్యోత్స్న, డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్.వాసుదేవరెడ్డి, కిరణ్కుమార్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. పూర్తి ఫీజు రాయితీ రామన్నపేట : టీజీ పాలిసెట్ –2025 కౌన్సెలింగ్లో పాల్గొంటున్న అభ్యర్థుల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, నవోదయ, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ శాఖల అధ్వర్యంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించనున్నట్లు వరంగల్ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, టీజీ పాలిసెట్ హెల్ప్లైన్ సెంటర్ క్యాంప్ ఆఫీసర్ డా.బైరి ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాయితీ పొందాలంటే అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్ హెల్ప్లైన్ సెంటర్ను సందర్శించి తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94921 10750 నంబర్లో సంప్రదించాలని, లేదా అధికారిక వెబ్సైట్ http://tgpolycet.nic.in ను సందర్శించాలని కోరారు. ‘యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్’తో ఎంఓయూ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలకు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్కు మధ్య ఎంఓయూ (అవగాహన ఒప్పందం) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా 250 మంది విద్యార్థులకు సాఫ్ట్స్కిల్స్, డేటా సైన్స్ తదితర అంశాల్లో కేంద్రీకృత శిక్షణ ఇవ్వనున్నారు. ఈశిక్షణతో విద్యార్థుల్లో ఉద్యోగావకాశాల కోసం అవసరమైన నైపుణ్యాలు పెంపొందిస్తారు. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ ఒప్పంద లక్ష్యం అని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ బుధవారం తెలిపారు. -
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం!
జనగామ: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అధికారుల పూర్తి స్థాయి నివేదికతో సమాయత్తమవుతున్నారు. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా జూలై 15 నుంచి టీచర్ల సర్దుబాటు ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ నెల 25వ తేదీ లోపు సమగ్ర వివరాలతో జాబితాను అందించాలని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పలువురు పాత, కొత్త టీచర్లకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. జిల్లాలో పీఎస్ 341, యూపీఎస్ 64, ఉన్నత పాఠశాలలు 103 ఉండగా, సుమారు 30వేల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. నిబంధనల మేరకు.. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 10 మందిలోపు విద్యార్థులకు ఒకరు, 11 నుంచి 60 మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు తప్పనిసరిగా ఉండాలి. కానీ జిల్లాలోని పలు మండలాల్లో అందుకు విరుద్ధంగా 15 మంది విద్యార్థులకు ఒకే టీచర్ ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇతర స్కూల్స్కు వర్క్ అడ్జెస్ట్పై పంపించే ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్నట్లు తెలుస్తుంది. వేసవి సెలవులకు ముందు.. బడులు ప్రారంభమైన తర్వాత చేపట్టిన బడిబాట కార్యక్రమంలో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రతీ టీచర్ కష్టపడ్డారు. దీంతో ఉపాధ్యాయుల నమ్మకంపై అనేక పాఠశాలల్లో ఊహించని విధంగా అడ్మిషన్లు పెరిగాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా, విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకోకుండా ఉపాధ్యాయులను మరో చోటకు వర్క్ అడ్జెస్ట్మెంట్ చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పిల్లల భవిష్యత్పై నీలినీడలు కమ్ముకునే పరిస్థితి ఎదురవుతుంది. ఎంఈఓల సమీక్ష.. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో ఉపాధ్యాయుల సర్దుబాటుపై బుధవారం ఎంఈఓల సమక్షంలో సమీక్ష జరిగింది. 16 నుంచి 17 మంది విద్యార్థులు ఉన్న బడిలో ఇద్దరు టీచర్లు పనిచేస్తుండగా, నిబంధనలకు విరుద్ధంగా ఒకరిని మరోచోటకు పంపించనున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నిబంధనల మేరకు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతులకు 1 నుంచి 20 మంది పిల్లలకు ఇద్దరు (ఒక ల్యాంగ్వేజ్, ఒక భాషేతర), 21 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే నలుగురు ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు 1–220 మంది పిల్లలకు ఏడుగురు ఉపాధ్యాయులు (సబ్జెక్టుకు ఒకరు) ఉండాలి. సర్కారు బడులకు వచ్చే పిల్లల భవిష్యత్ ఆగం కాకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. జీఓకు విరుద్ధంగా 15 మందికి ఒకే టీచర్..? బడిబాటలో పెరిగిన విద్యార్థుల పరిస్థితి ఏంటీ? -
గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuస్థానిక ఎన్నికల కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేయడమే తరువాయి రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ముందుగా పేర్కొన్న విధంగానే మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాతే గ్రామ పంచాయతీలు, వార్డులకు జరిపించనున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్లు, 75 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లపైన సందిగ్ధత నెలకొంది. న్యూస్రీల్75 జెడ్పీటీసీలు, 778 ఎంపీటీసీలు.. -
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
● అదనపు కలెక్టర్ పింకేష్కుమార్జనగామ రూరల్: మొక్కలే మానవాళికి మనుగడ అని, ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని అ దనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. బుధవారం వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 13 షెడ్యూ ల్డ్ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహాలు, 5 రెసిడెన్షియల్ పాఠశాలల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పా ఠశాలలో వన మహోత్సవం కార్యక్రమానికి పింకేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వన మహోత్సవం ప్రాధాన్యం, పర్యావరణం, జీవ వైవిధ్యంలో శాస్త్రవేత్తల పాత్ర తదితర అంశాలపై వివరించారు. గురుకుల పాఠశాల వంటగదిని విద్యార్థులకు అందిస్తున్న మెనూను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ విక్రం కుమార్, ప్రిన్సిపాల్ శ్రీనివాస్రావు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత స్టేషన్ఘన్పూర్: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలను పెంచాలని స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ఆవరణలో బుధవారం ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కనీసం ఐదు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రఘుపతి, పీడీ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ రవీందర్, నర్సింహాచారి, మున్సిపల్ అఽధికారులు నితిన్, సందీప్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రైతులకు నష్టపరిహారం అందించాలి
జనగామ రూరల్: ఎండిన పంటలకు, విత్తనాలకు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని శామీర్పేటలోని ఊరకుంట చెరువు, కర్రె సత్తయ్యకు చెందిన ఎండిన పొలం, వరి నారును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా కరువు నెలకొందని, దేవాదుల ద్వారా చెరువులు నింపి రైతులను ఆదుకోవాలన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు రెండు, మూడు సార్లు విత్తనాలు నాటారన్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా లిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతంలోని 9 రిజర్వాయర్లు, 723 చెరువులు, కుంటలను నింపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. నేటికీ గోదావరి జలాలను పూర్తిస్థాయిలో లిఫ్టింగ్ ప్రారంభించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మీరా సురేష్ నాయక్ , తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ బీరయ్య, ఉర్సుల కుమార్, రైతులు ఆవుల శ్రవణ్, నేతాజీ, తాండ్ర ఆనందం, చింతకింది రాజు, కర్రె సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ
జఫర్గఢ్: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో జిల్లాలో తొలిసారిగా కొత్త రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్కార్డు ఇచ్చిన పాపనపోలేదన్నారు. జిల్లాలో 9,700 కొత్త రేషన్కార్డులు మంజూరు కాగా 14,780 మంది కొత్త సభ్యుల చేర్పులు, మార్పులు జరిగాయన్నారు. ఇంకా కొత్త రేషన్కార్డు రాని వారు ఎవరైన ఉంటే వెంటనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ రేషన్కార్డుల పంపిణీతో నిరుపేదల చిరకాల వాంచ నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లావణ్యశిరీష్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్రావు, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, ఆర్డీఓ వెంకన్న, తహసీల్ధార్ శంకరయ్య, ఎంపీడీఓ సుమన్, నాయకులు పాల్గొన్నారు. అనంతరం వనమహోత్సవంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటారు.కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి జఫర్గఢ్లో కలెక్టర్తో కలిసి కొత్త రేషన్కార్డుల పంపిణీ -
ఉచిత బస్పాస్లు ఇవ్వాలని ధర్నా
జనగామ రూరల్: విద్యార్థులకు ఉచిత బస్పాస్లు అందించి ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడబోయిన మమత ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ పెంచిన బస్పాస్ చార్జీల ధరలు తగ్గించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రతీ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, విద్యార్థుల సమయపాలనకు అనుకూలంగా బస్సులు నడపాలన్నారు. విద్యార్థుల సమస్యలపై డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేదన్నారు. ఎక్కువ మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని, ఎక్కువ ధరలు చెల్లించి చదివే స్థోమత లేక మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. ఆర్టీసీ యాజమాన్యం చొరవ తీసుకుని న్యాయం చేయాలన్నారు. అలాగే ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరిగే ఎస్ఎఫ్ఐ జీప్ జాతాను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్, జిల్లా కార్యదర్శి దాసగాని సుమ, మామిడాల రమేశ్, భూక్యా యాకన్న రాథోడ్, బొమ్మిశెట్టి ఆర్య, నాయకులు శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా స్టేషన్ఘన్పూర్: దివ్యాంగ విద్యార్థులకు అండగా భవిత కేంద్రాలు ఉన్నాయని, సమాజంలో దివ్యాంగులు మనోస్థైర్యంతో ముందుకెళ్లాలనే యోచనతో భవిత కేంద్రాల్లో శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. స్టేషన్ఘన్పూర్ జెడ్పీఎస్ఎస్ ప్రాంగణంలోని భవిత సెంటర్ను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పిల్లలతో మాట్లాడారు. టీచర్లు బాగా నేర్పిస్తున్నారా, ఆడుకునేందుకు వస్తువులు ఇస్తున్నారా, నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల కోసం నిర్మాణం చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని భవిత కేంద్రాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. త్వరలోనే భవిత కేంద్రాల డిజిటలైజేషన్కు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, ఎంఈఓ కొమురయ్య, ఆర్అండ్బీ డీఈ సతీష్, జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం సంపత్, రామతులసి, ప్రవీణ్, గిరి తదితరులు పాల్గొన్నారు. -
కాటేసిన కరువు!
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025కరుణించని వరుణుడు.. ముందుకు కదలని సాగు– 10లోuజనగామ: ముప్పై ఏళ్ల నాటి కరువు మళ్లొచ్చింది. వర్షాభావ పరిస్థితులతో చెరువులు, కుంటలు, వాగులు ఎండిపోయాయి. పది మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు, బావుల్లో చుక్కనీరు కనిపించడం లేదు. పొలంమడులు నెర్రెలు బారితే, నార్లు ఎండిపోతున్నాయి. పత్తి విత్తులు మట్టిలో మురిగిపోతుంటే, మొక్కజొన్న చేను వాలిపోతుంది. వేల రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేసిన రైతులకు పెట్టుబడులు మిగలని పరిస్థితి. గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపక పోవడంతో వానాకాలం సీజన్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. 632 మిల్లీమీటర్లు వర్షపాతం ఖరీఫ్ సీజన్ మొదలై రెండున్నర నెలలు గడిచి పోతున్నా.. ఇప్పటి వరకు ఒక్క ఎకరా ఆయకట్టుకు సాగు నీరు అందించలేదు. జిల్లాలో జూలై మాసంలో 1,120 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 632 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. దీంతో 44 మిల్లీ మీటర్ల మేర మైనస్లో ఉంది. ప్రస్తుతం నావబుపేట, కన్నెబోయినగూడెం రిజర్వాయర్లలో 10శాతం నీటి నిల్వలకు పడిపోగా, ఆర్ఎస్ఘన్పూర్, తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్లలో 50లోపు, మిగతా ప్రాజెట్ల పరిధిలో 50శాతంకు పైగా నీరు ఉంది. ఎండుతున్న నార్లు.. మొలకెత్తని పత్తి వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో నారు, నాట్లు, పత్తి మొలకలు ఎండుతున్నాయి. ఒక్కో ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు నిండా మునిగిపోతున్నారు. బోర్లు ఒట్టిపోవడంతో మొదటి మడికి సైతం తడి అందించలేకపోతున్నారు. దేవరుప్పుల, పాలకుర్తి, రఘునాథపల్లి, నర్మెట, జఫర్గఢ్ తదితర ప్రాంతాల్లో వందలాది మంది రైతులు డబుల్ పత్తి విత్తనాలు వేశారు. మూడోసారి వేసుకునే పరిస్థితుల్లో సాగును వదిలేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్లో పంటలను కాపాడాలంటే గోదావరి జలాలతో చెరువులను నింపడం ఒక్కటే శరణ్యం. న్యూస్రీల్ మట్టిలో కలిసిపోతున్న పత్తిగింజలు ఎండుతున్న నార్లు..నాట్లు వాలిపోతున్న మొక్కజొన్న జిల్లాలో కరువు ఛాయలు -
దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి
జనగామ రూరల్: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయాలన్నారు. ఇందుకు సరిపడు సిబ్బందిని ని యమించుకొని దరఖాస్తులను పరిష్కరించాలన్నా రు. అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లతో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ గూగుల్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బచ్చన్నపేట: భూభారతిలో భూ సమస్యలకు కోసం చేసుకున్న దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. వీసీలో సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ -
దొంగల బీభత్సం
జనగామ: జిల్లా కేంద్రంలో ఒక్కరోజే రెండు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నించగా, మరో రెండు గృహాల్లో దొంగతనం చేశారు. రెండు వారాలు తిరగక ముందే మరోసారి దొంగల హల్చల్తో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ధర్మకంచ అంగన్వాడీ టీచర్ ఇంట్లో 12 తులాల బంగారం, వెండి, నగదు, జీఎంఆర్ కాలనీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఓ రిటైర్డు అధికారి ఇంట్లో చోరీ ఘటన మరువక ముందే వరుస ప్రయత్నాలు పోలీసులకు సవాల్గా మా రిపోయింది. ఇటీవల జీఎంఆర్ కాలనీలో దొంగలు తమ ఆనవాళ్లను పోలీసులు పసిగట్టకుండా ఇళ్లంతా కారం చల్లి కొత్త తరహా పద్ధతికి తెరలేపారు. ప్రస్తుత చోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని జీఎంఆర్–2 కాలనీలో ఎన్పీడీసీఎల్ శాఖలో పని చేస్తున్న కృప ఇంటికి తాళం వేసి ఈ నెల 14న స్వగ్రామానికి వెళ్లింది. మంగళవారం ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి తలుపులు తీసిఉండడంతో ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించింది. ఏఎస్పీ చేతన్ నితిన్, సీఐ దామోదర్రెడ్డితో కలిసి డీసీపీ రాజమహేంద్ర నాయక్ అక్కడకు చేరుకుని ఘటనకు సంబంధించి ఆరా తీశారు. రూ.35వేలు, బంగారు ఆభరణాలు (లెక్క తెలియాలి) ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు వివరించారు. బాలాజీనగర్లో వ్యాపారి ఇంట్లో.. బాలాజీనగర్కు చెందిన వ్యాపారి ఎం.నర్సింహరాములు 14వ తేదీ రాత్రి కుటుంబంతో సహా తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. అదేరోజు అర్ధరాత్రి దొంగలు బీరువాను తెరిచి బట్టలను చిందర వందర చేశారు. తిరుపతిలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అందుబాటులో ఉన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఫింగర్ ప్రింట్స్ నిపుణులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమాయ్యరు. అలాగే సమీపంలో ఉన్న రిటైర్డ్ అధికారి వాసుదేవరావు తాళం వేసిన ఉన్న ఇంటి తలుపులను తెరిచేందుకు ప్రయత్నించగా సెంట్రల్ లాకింగ్ సిస్టంతో కనెక్టివిటీ ఉండడంతో వదిలేసి వెళ్లి పోయారు. శ్రీ విల్లాస్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సత్యనారాయణతో పాటు మరో ఇంటి తాళాలు పగులగొట్టారు. వేలిముద్ర నిపుణులు ఆధారాల కోసం అన్వేషిస్తుండగా, క్రైం పోలీసులు దొంగల కోసం వేట సాగిస్తున్నారు. పోలీసు తనిఖీలు ప్రధాన రోడ్లపై మినహా వలస కూలీలతో పాటు శివారు ప్రాంతాలు, పట్టణ నడిబొడ్డున ఉన్న కాలనీల్లో నిఘా లేకుండా పోయిందని పలువురు అంటున్నారు. పోలీసులు ఇకనైనా తనిఖీలు మరింత పెంచాలని కోరుతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ భయం భయంగా జనగామ పట్టణ ప్రజలు రంగంలోకి డీసీపీ, పోలీసులు, క్లూస్ టీం బృందం -
వరంగల్లోనూ ఏసీబీ ఆరా..!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ (జనరల్) చెట్టి మురళీధర్రావు మూలాలపై ఏసీబీ అధికారులు వరంగల్, హనుమకొండలోనూ ఆరాతీశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు మంగళవారం ఉదయం మురళీధర్రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్, కరీంనగర్, జహీరాబాద్ తదితర పదిచోట్ల కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మురళీధర్రావు కుమారుడు అభిషేక్తో సన్నిహిత సంబంధాలు కలిగిన పలువురు కాంట్రాక్టర్ల గురించి ఆరా తీసినట్లు ప్రచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్తోపాటు సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీలలో కీలక పనుల సబ్ కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హనుమకొండకు చెందిన కాంట్రాక్టర్ల గురించి ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్లో మురళీధర్రావు కీలకంగా వ్యవహరించిన సమయంలో ఆయన కుమారుడు అభిషేక్ బినామీగా కాంట్రాక్టు సంస్థలకు మేలు జరిగేలా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ప్రచారం ఉంది. వర్క్ఆర్డర్లు జారీ చేసిన ఆధారాలు కూడా రాబట్టి హర్ష, సహస్ర (హనుమకొండ హంటర్రోడ్డు) కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లను బయట పెట్టినప్పటికీ.. మరో రెండు కాంట్రాక్టు సంస్థల గురించి ఆరా తీసిన ఏసీబీ పూర్తి వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. కాగా, సహస్ర కంపెనీలో మంగళవారం సోదాలు నిర్వహించారు. నెక్ట్స్ ఎవరో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఏప్రిల్లో కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ను ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అరెస్టు చేశారు. కేసీఆర్ ఫామ్హౌజ్ సమీపంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు అమరావతిలో వాణిజ్య స్థలం, ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు ఉన్నట్లు ప్రకటించారు. ఈయన ఆధ్వర్యంలో రూ.48,665 కోట్ల పనులు జరిగినట్లు కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇదే ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో ఇటీవల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నూనె శ్రీధర్ వందల కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు బయటపెట్టింది. తాజాగా, మంగళవారం ఉదయం మాజీ ఈఎన్సీ మురళీధర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టడం ఇరిగేషన్ వర్గాల్లో కలకలంగా మారింది. తదుపరి జాబితాలో ఎవరో? అన్న చర్చ ఇంజనీరింగ్ వర్గాల్లో సాగుతోంది. కీలక అధికారుల్లో మొదలైన గుబులు.. వరుస దాడులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లలో గుబులు మొదలైంది. పదవీ విరమణ చేసినా వదలకుండా ఏసీబీ దాడులు నిర్వహిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్లు కీలకం. ఈ పనుల నిర్వహణ, పూర్తిలో అప్పటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారని అప్పటి ప్రభుత్వం ప్రశంసించి.. పదవీకాలాన్ని కూడా పొడిగించింది. మేడిగడ్డ కుంగుబాటు తర్వాత ఆయనతోపాటు 19 మంది వివిధ కేడర్లకు చెందిన అధికారులను ప్రస్తుత ప్రభుత్వం తప్పుబట్టింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీలు కూడా విచారించి నివేదికలు రూపొందించాయి. కొందరిపైన క్రిమినల్ కేసులకు కూడా సిఫారసు చేశారు. ఈ జాబితాలో ఉండి విచారణను ఎదుర్కొన్న ముగ్గురు అధికారులపై కొద్ది రోజుల తేడాతో ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపైనే ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమ ఆస్తుల గుట్టువిప్పి అరెస్టు చేయగా.. తర్వాత జాబితాలో ఎవరు? అన్న అంశం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. మాజీ ఈఎన్సీ మురళీధర్ అరెస్టు నేపథ్యం ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వాహకుడితో సంబంధాలు మురళీధర్ కుమారుడు అభిషేక్ సన్నిహితులపై నిఘా కాళేశ్వరం ఇంజనీర్లలో ఒక్కొక్కరిపై దాడి.. ఏసీబీ లిస్టులో తరువాత ఎవరు..? -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
జనగామ రూరల్: బొమ్మకూర్ రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా నీరు అందించి ఆదుకోవాలని రైతులు రోడ్డెక్కారు. మంగళవారం జనగామ హుస్నాబాద్ రోడ్డు వడ్లకొండ రహదారి వద్ద ఎండిన వరి కొయ్యలు, ప్లకార్డ్స్తో రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అధికా రులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. కాల్వల ద్వారా వేల ఎకరాలు వరి సాగు అవుతుండగా అధికారులు సకాలంలో చెరువులను నింపకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నామన్నారు. వరినాట్లు వేసే సమయానికి కూడా నీరు రాకపోవడంతో వరి సాగు చేయడం లేదన్నారు. బోరు బావులు ఉన్న రైతులు కూడా వరి నారు పోసి 40 రోజులు దాటుతుండటంతో నారు ముదిరిపోయే పరిస్థితి ఉందన్నారు. తక్షణమే కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కాల్వల ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వడ్లకొండ గ్రామంలో యేనెచెరువు, ఎర్రకుంటతండా నుంచి వడ్లకొండకు కాల్వల ద్వారా నీరు అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎల్లబోయిన హరీష్, కాగితాపురం రామ్ మోహ న్ రెడ్డి, కాసర్ల అశోక్, నామాల రాజు, బొల్లం శార ద, అశోక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయాలని రాస్తారోకో -
సత్వర న్యాయసేవలు అందించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ జనగామ రూరల్: ప్రజలకు సత్వర న్యాయసేవలు అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టుకు సంబంధించిన సబ్ జైల్, పొక్సో కేసులు, ఇతర జిల్లా జైల్లో ఉన్న జనగామ కోర్టుకు సంబంధించిన విచారణ ఖైదీల గురించి జాతీయ న్యాయ సేవ అధికారి సంస్థ ఆదేశాల మేరకు సమీక్ష సమావేశం నిర్వహించారు. బెయిల్ మంజూరు అయి ఆర్థిక స్థోమత లేని పేదవారి గురించి, షూరిటీలు పెట్టుకోలేని విచారణలో ఉన్న ఖైదీల గురించి చర్చించారు. సమీక్షలో సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్, కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్రనాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, సబ్ జైల్ సూపరింటెండెంట్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు గడువు పొడిగింపు జనగామ రూరల్: జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు గడువును పొడిగించనట్లు డీఈఓ భోజన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 17వ తేదీ వరకు పొడిగించారని, పూర్తి మార్గదర్శకాలు ఆన్లైన్ పోర్టర్లో చూడాలని కోరారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏఎంసీ అభివృద్ధే లక్ష్యం జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం గా పని చేస్తున్నామని ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అన్నారు. మంగళవారం పాలకవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన కార్యాలయ భవనం చుట్టూ ప్రహారీగోడ నిర్మాణం కోసం చర్చించామన్నారు. పెండింగ్లో ఉన్న మూడవ కవర్షెడ్ నిర్మాణ పనులను పునరుద్ధరిస్తామన్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో నూతనంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు పాలక వర్గం ఆమోదం తీసుకుంటామన్నారు. అనంతరం మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించిన జీవన్, నూతనంగా ఖరీదు లైసెన్స్ పొందిన వ్యాపారిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు, డైరెక్టర్లు బుట్రెడ్డి శ్రీలత రెడ్డి, నామాల శ్రీనివాస్, బానోత్ బన్సీ నాయక్, బొట్ల నర్సింగరావు, నీలం మోహన్, నాగ బండి రవీందర్, తోటకూరి రమేష్ యాదవ్, శీలం కొండల్రెడ్డి, వనపర్తి శ్రీనివాస్, బంద కుమారి, బాష్మియా, వర్ష సిద్దేశ్, సిబ్బంది పాల్గొన్నారు. రైతు ముంగిట విద్యుత్ సేవలు ● పొలంబాటతో మంచి ఫలితాలు ● తెలుగులో ఎస్టిమేషన్ కాపీలు ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాదవ్ జనగామ: రైతులకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ఎన్పీడీసీఎల్ సంస్థ చేపట్టిన అనేక కార్యక్రమాలతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఆ శాఖ జిల్లా అధికారి (ఎస్ఈ) టి. వేణుమాదవ్ తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 నుంచి 24 సంవత్సరం వరకు 2,046 విద్యుత్ సర్వీసులు మంజూరీ చేయగా, 2025లో ఈనెల 15వ తేదీ వరకు 2,241(9శాతం) పెరిగినట్లు స్పష్టం చేశారు. వ్యవసాయ సర్వీసుల విషయంలో సత్వర చర్యలు ఉంటున్నాయన్నారు. విద్యుత్ అధికారుల పొలంబాట కార్యక్రమంలో 216 లూజు లైన్లు, 211 వంగిన ఫోల్స్, 2,121 మధ్య స్తంభాలను నూతనంగా అమర్చామన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు కెపాసిటర్లను బిగించాలని రైతులకు అవగాహన కల్పించడంలో విజయం సాధించామన్నారు. మెటీరియల్ కోసం రైతులు దరఖాస్తు చేసుకునేందుకు తెలుగులో ఫారాలు అందుబాటులో ఉంచడంతో సులభతరమవుతుందన్నారు. విద్యుత్తు అదనపు లోడ్కు అనుగుణంగా కొత్తగా 820 ట్రాన్స్ఫార్మర్లు (లోడ్ సామర్ధ్యం 51,660 కేవీఏ) పెంచినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన సమయంలో 24 గంటలు, రూరల్ ఏరియాలో 48 గంటల్లో రీప్లేస్మెంట్ చేస్తున్నామన్నారు. రైతులకు విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైన సమయంలో టోల్ ఫ్రీనంబర్ 1912 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
ప్రొఫెసర్ శ్రీలతకు అవార్డు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ సీజే శ్రీలతకు ఉమెన్ లీడర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవార్డు లభించింది. శ్రీలతకు బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రముఖ సంస్థ ది అకడమిక్ ఇన్సైట్స్ నుంచి అవార్డుకు ఎంపికయ్యారు. ఈపురస్కారం మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నత విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న మహిళలకు అందజేస్తారు. ఈఅవార్డుల వివరాల్ని వారి అధికార జర్నల్ ది అకడమిక్ ఇన్సైట్స్ ఇన్స్పైరింగ్ మైండ్స్లో ఇటీవల ప్రచురించారు. ఈఅవార్డుపై సోమవారం యూనివర్సిటీలో శ్రీలత మాట్లాడారు. -
విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
చిల్పూరు: హై టెన్షన్ విద్యుత్ వైర్లను పోల్లపై గుంజుతుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై వలస కూలీ అర్షద్ అలీ (25) మృతి చెందిన సంఘటన సోమవారం వెంకటేశ్వరపల్లె గ్రామ సమీపంలో జరిగింది. సూపర్ వైజర్ రాజేశ్ అందించిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరపల్లి నుంచి మల్లికుదుర్ల వరకు హైటెన్షన్ విద్యుత్ లైన్ వేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు విద్యుత్ పోల్లను ఎక్కి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో బుగులాబాద్కు చెందిన అర్షద్ అలీ మధ్యాహ్న సమయంలో పనులు చేస్తుండగా పక్కనే ఉన్న మరో లైన్కు విద్యుత్ సరఫరా కావడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై పోల్ పైనే మృతి చెందాడు. వెంటనే పొక్లెయినర్ సాయంతో కిందికి దించారు. అదే సమయంలో జఫర్గఢ్ మండల కేంద్రానికి వెళ్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య విషయం తెలుసుకుని సీపీఆర్ చేయగా అప్పటికే మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జనగామ రూరల్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, పాఠశాల స్థాయి నుంచే మొక్కల ప్రాధాన్యంను తెలపాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పసరమడ్ల అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమాల్లో సంక్షేమ శాఖకు 500 మొక్కలు నాటాలన్న లక్ష్యం చేరుకోవాలన్నారు. కాలుష్య రహితంగా మారుతున్న పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం గుడ్లు, పప్పుల నిల్వల నాణ్యతను పరిశీలించి గర్భిణులు, బాలింతలను అంగన్వాడీ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారి ఫ్లోరెన్స్, సీడీపీఓ సత్యవతి, సూపర్వైజర్, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని సత్రం కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మొక్కలు నాటారు. ఇసుక రవాణా అధిక ధరలకు చెక్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను మన ఇసుక వాహనం యాప్ ద్వారా పొందాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరెట్లోని కాన్ఫరెన్స్హాల్లో మన ఇసుక వాహనంపై అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్లతో కలిసి తహసీల్దార్, ఎంపీడీఓలకు హైదరాబాద్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నస్ బృందం సభ్యులు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరం అయ్యే ఇసుకకు సంబంధించిన అధిక ధరలను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా పాలకుర్తి, కొడకండ్ల మండలంలోని ఇందిరమ్మ ఇళ్లకి సూర్యాపేట నుంచి ఇసుకను తెప్పించి తక్కువ ధరలకే రవాణా, లోడింగ్, అన్లోడింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అధిక ధరలను వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ ఈఈ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ మాతృనాయక్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికి అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో సంక్షేమ పథకాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ను సన్మానించిన విద్యాశాఖ అధికారులు న్యాస్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 50 జిల్లాలో జనగామకు చోటుదక్కిన నేపథ్యంలో కలెక్టర్ రిజ్వాన్బాషాను డీఈఓ భోజన్న, విద్యాశాఖ అధికారులు సోమవారం సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మంచి ఫలితాలు రావడానికి క్షేత్రస్థాయిలో కృషి చేసిన ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు. అనంతరం కేట్కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
పెండింగ్ ఎక్స్గ్రేషియా విడుదల చేయాలి
జనగామ రూరల్: గీత కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేసి, సేఫ్టీ కిట్లు అందించాలని కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి అన్నారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బాధితులతో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పెండింగ్ ఉన్న ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి సంవత్సరం గడిచినా.. ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. సుమారు రూ.12.96 కోట్ల ఎక్స్గ్రేషియా పెండింగ్లో ఉందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు బాల్నే వెంకటమల్లయ్య మాట్లాడుతూ జిల్లాలో 106 మందికి సుమారు రూ. 2.11కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. తాటి కార్పొరేషన్ నుంచి తక్షణ సాయం ఇవ్వాలని, మెడికల్ బోర్డు విధానా న్ని ఎత్తివేయాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతీ గీత కార్మికుడికి పింఛన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకటి రాజయ్య, జిల్లా కమిటీ సభ్యులు జొన్నగొని శ్రీనివాస్, బండమీది వెంకన్న, వడ్లకొండ వెంకటేష్, పరిధుల భా స్కర్, బండపల్లి శంకరయ్య, ఘనగాని రమేశ్, మహేందర్, పరంధామ తదితరులు పాల్గొన్నారు. కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి గోపి -
పాఠశాలల బలోపేతానికి కృషి
తరిగొప్పుల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు చాల్లా తిరుపతిరెడ్డి అన్నారు. టీపీయూఎస్ మండలశాఖ ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఉచిత నోట్బుక్స్, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ వంటి సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. జాతీయ భావజాలంతో పనిచేస్తున్న సంఘాన్ని ఉపాధ్యాయులు ఆదరించి సంఘ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తాటికొండ పెద్దన్న, జిల్లా బాధ్యులు దొంతుల శ్రీనివాస్, పవన్, లలిత, బుడగం సిద్ధారెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. 7,604 కొత్త రేషన్ కార్డులు అప్రూవల్జనగామ: జిల్లాలో సోమవారం ఒక్కరోజే 7,604 రేషన్ కార్డులకు అప్రూవల్ చేశారు. గత నెలలో 2,096 కొత్త రేషన్ కార్డులతో పాటు చేరిక సభ్యులు కలుపుకుని 28,967 మంది లబ్ధిదారులకు మూడు నెలల ఉచిత సన్న బి య్యాన్ని అందించారు. ప్రజాపాలన, మీసేవలో దరఖాస్తు చేసుకున్న సుమారు 36 వేల కుటుంబాల రేషన్ కార్డులకు గ్రీన్సిగ్నల్ రానుండగా, ఒకటి, రెండు రోజుల్లో వందశాతం ప్రక్రియ పూర్తి కానుంది. కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల కుటుంబాలకు సెప్టెంబర్ మాసం నుంచి ఉచిత బియ్యం అందించనున్నారు. కార్డులు వచ్చిన వారు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. పోస్టర్ ఆవిష్కరణ తరిగొప్పుల: చదువుమధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరంలాంటిదని, దానిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కమ్యూనిటీ మానిటరింగ్ ఆఫీసర్ నాగరాజు అన్నారు. సోమవారం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో కోఆర్డినేటర్ ఎం.శంకరరావుతో కలిసి ఓపెన్ స్కూల్ పాఠశాలను ప్రారంభించి పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు పైబడిన వారు పదో తరగతి పరీక్షలు రాయ వచ్చన్నారు. అలాగే ఒకే సంవత్సరంలో ఇంట ర్మీడియట్ పరీక్ష రాసి పాస్ కావచ్చన్నారు. మహిళలు, చదువును మధ్యలో ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా రు. ఆసక్తి గల వారు ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు 9988733085 నంబర్లో సంప్రదించవ చ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జానకి, మండల కోఆర్డినేటర్ బానోతు వసంత్కుమార్, హెచ్ఎం బానోతు రవీందర్, ఉపాధ్యాయులు సుమలత, నాగరాణి, అమర్నాథ్, కుమారస్వామి, శ్రీనివాస్, సీఆర్పీలు మహాలక్ష్మి, అనూష తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ ప్రాధాన్యం హన్మకొండ: ప్రమాదాలు జరుగకుండా ఆర్టీసీ డ్రైవర్లు సురక్షిత డ్రైవింగ్ చేయాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను సూచించారు. సోమవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో డ్రైవర్ల శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎం డి.విజయభాను మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రమాదాలు లేని వరంగల్ రీజియన్గా తీర్చిదిద్దేందుకు ఆర్టీసీ, అద్దె బస్సు, జేబీఎం బస్ డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్లు ఏకాగ్రతతో విధులు నిర్వహించాలంటే ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండడంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నారు. డ్రైవింగ్లో సెల్ ఫోన్ మాట్లాడవద్దన్నారు. మద్యం ముట్టుకోవద్దని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషి చేయాలని కోరారు. -
నడవలేరు.. కూర్చోలేరు..
జనగామ/జనగామ రూరల్: నడవలేరు, కూర్చోలేరు, కాళ్లు చేతులు ముడుచుకోలేరు, కంటిచూపు లేకున్నా.. తమ కంటి పాపలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లిదండ్రులు దివ్యాంగ పింఛన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. సదరం సర్టిఫి కెట్ ఉన్నా.. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తూ బాధిత కుటుంబాలపై ఆర్థిక భారం పెంచేస్తున్నారు. బిడ్డలకు మెరుగైన వైద్యం కోసం కడుపు మాడ్చుకుంటున్న తల్లిదండ్రులు కలెక్టర్ కరుణిస్తాడని గ్రీవెన్స్కు వచ్చి అర్జీ అందజేసి న్యాయం జరుగుతుందని పూర్తి భరోసాతో ఇంటికి తిరిగి వెళ్లారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో జరిగిన గ్రీవెన్స్కు జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కారానికి 75 మంది వినతులు సమర్పించారు. ఇందులో రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన తల్లిదండ్రులు నడవలేని దివ్యాంగపిల్లలను తీసుకుని కలెక్టరేట్కు రాగా.. వారిని చూసిన ప్రతి ఒక్కరూ మనోవేదనకు గురయ్యారు. ఇదిలా ఉండగా పలు సమస్యలకు సంబంధించి కలెక్టర్కు విన్నవించుకోగా.. త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మరికొన్ని వినతులు ఇలా.. ● 2007లో ఇందిరమ్మ మూడో విడతలో ఇంటి ని ర్మాణం కోసం ప్రభుత్వం ప్లాటు ఇచ్చిందని, ప్ర స్తుతం ప్లాటు కోసం వెళ్తే ప్రభుత్వం తిరిగి తీసుకుందని, ఇక్కడకు రావొద్దని అధికారులు చెబు తున్నారని కలెక్టర్కు విన్నవిస్తూ బచ్చన్నపేటకు చెందిన జాఫర్ కన్నీటి పర్యంతమయ్యారు. ● తమ కూతురు సమిహా ఫాతిమా పుట్టుకతోనే చెవిటి, మూగ. మాటలు రావడం లేదు. ప్రతీ నెల గొంతు ఫిజియోథెరఫీ కోసం రూ.9 వేలు ఖర్చు చేస్తున్నాం. పింఛన్ మంజూరు చేయాలని రఘునాథపల్లికి చెందిన నజీర్ వేడుకున్నాడు. ● రఘునాథపల్లికి చెందిన షబానా కుమారుడు జహంగీర్ (6) పుట్టుకతోనే కాళ్లు, చేతులు పని చేయవని, దివ్యాంగ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా... రావడం లేదని వేడుకుంది. ● జనగామ పట్టణంలో విచ్చలవిడిగా బెల్ట్ దుకా ణాలు వెలిశాయని, తక్షణమే చర్యలు తీసుకోవా లని పట్టణ వాసులు ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న తల్లిదండ్రుల పేరు పులిగిల్ల మాధవి, నవీన్. జనగామ మండలం యశ్వంతాపూర్ గ్రామం. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు నిహాల్(6) కాళ్లు, చేతులు, చాతి పని చేయకుండా జన్మించాడు. నడవలేడు, కూర్చోలేడు. సదరం సర్టిఫికెట్ కోసం ఇప్పటి వరకు 25 సార్లు స్లాట్ బుకింగ్ చేసినా ఫలితం దక్కలేదు. కూలిపని చేసుకుంటూనే పూట గడిచే పరిస్థితి. ప్రభుత్వం పింఛన్ ఇప్పించి ఆదుకోవాలి. ఈ ఫొటోలో కనిపిస్తున్న కాలియ నరసమ్మ తన ఒడిలో చిన్నారి పాప సుజాత(7)ను తీసుకుని కలెక్టరేట్లోని గ్రీవెన్స్కు తీసుకు వచ్చింది. రఘునాథపల్లి మండలం బానాజీపేట శివారు పిట్టలగూడెం. పాప పుట్టుకతోనే కా ళ్లు, చేతులు ముడుచుకోలేవు. ఎప్పుడూ నిటా రుగానే ఉంటుంది. సుజాత పుట్టిన ఏడాదికే సదరం సర్టిఫికెట్ వచ్చింది. పింఛన్ కోసం ఐదుసార్లు దరఖాస్తు చేసుకున్నా.. రావడం లేదు. భర్త లక్ష్మయ్య పనికి వెళ్తూ బిడ్డ వైద్యం కోసం ప్రతీ నెల రూ.3 వేలు ఖర్చు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పింఛన్ల కోసం దివ్యాంగుల గోస సదరం సర్టిఫికెట్లు ఉన్నా..పింఛన్లు రావు రఘునాథపల్లి వాసులే ఎక్కువ కలెక్టర్తో సమస్యలను ఏకరువు పెట్టుకున్న ప్రజలు ప్రజావాణిలో 75 వినతులువరి నార్లు ఎండుతున్నయ్.. జనగామ మండలం చీటకోడూరు రిజర్వాయర్ పక్కనే 2 వందల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని, దేవాదుల ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కలెక్టర్ను కోరారు. భూగర్భ జలాలను పెంచేందుకు చీటకోడూరు–యశ్వంతాపూర్ వాగుపై రూ.11 కోట్లు ఖర్చు చేసి నాలుగు చెక్ డ్యాంలను నిర్మించారన్నారు. తక్షణమే దేవాదుల ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు యాదగిరి, సోమిరెడ్డి, కనకరెడ్డి, శివశంకర్, భాస్కర్రెడ్డి, రాములు, రవి, వెంకటేశ్వర్లు, తిరుపతి తదితరులు కలెక్టర్కు విన్న వించుకున్నారు. -
గోదావరి జలాలతో చెరువులు నింపాలి
జనగామ రూరల్: గోదావరి జలాలతో జనగామ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూక్యా చందు నాయక్ మాట్లాడారు. వర్షాలు లేక విత్తనాలు పుచ్చి పోయాయని, ఒక్కో రైతు రూ. పది వేల వరకు నష్టపోయారని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 9 రిజర్వాయర్లు 723 చెరువులు కుంటలు ఉన్నాయని, ఈ చెరువులు, కుంటలను పూర్తిస్థాయిలో నింపి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పోతుకనూరి ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఉర్సుల కుమార్, కర్రి సత్తయ్య, రాజు, రైతులు పాల్గొన్నారు. -
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా శ్రీనివాసులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా ఆవిభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆవిభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ పెద్దమళ్ల శ్రీనివాస్రావు కొద్దిరోజుల క్రితం రాజీనామా చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రొఫెసర్లు ఎవరూ లేకపోవడంతో శ్రీనివాసులును నియమించారు. నేడు(మంగళవారం) ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన ఆవిభాగానికి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, విశ్వవిద్యాలయం మహాత్మాజ్యోతిరావు పూలే సెల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం.. శ్రీనివాసులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. -
కలెక్టరేట్ను సందర్శించిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ
జనగామ: జనగామ సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి సోమవారం సందర్శించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్తో కలిసి రికార్డులను భద్ర పరిచే గదితో పాటు ఇతర విభాగాలను పరిశీలించారు. శాఖల వారీగా కేటాయించిన చాంబర్లకు సంబంధించిన వివరాలను కలెక్టర్ వివరించారు. ఇటీవల న్యాస్ ఫలితాల్లో దేశంలో ఎంపికై న 50 జిల్లాల్లో జనగామకు 50వ స్థానం దక్కిందని వివరించగా, ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముందస్తుగా చేపట్టిన పూర్తి వివరాలను వెల్లడించారు. న్యాస్లో మంచి ఫలితాలను సాధించేందుకు పాఠశాలలో రోజు వారీగా అమలు చేసిన కార్యక్రమాలపై విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు (ఏసీ) పింకేష్ కుమార్, రోహిత్సింగ్, ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డీఈఓ భోజన్న తదితరులు ఉన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదవాలి ● డీఈఓ భోజన్న బచ్చన్నపేట: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని జిల్లా విద్యాధికారి భోజన్న అన్నారు. సోమవారం మండలంలోని ఆలింపూర్ గ్రామంలోని ప్రాఽథమికోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి వారిని సెక్షన్లుగా విభజించాలన్నారు. ప్రభుత్వ పా ఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు స్కూ ల్ యూనిఫామ్స్, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం, ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించ డం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం స్వర్ణతార, ఉపాధ్యాయులు మమత, నర్సమ్మ, బాలకిషన్, విద్యార్థులు పాల్గొన్నారు. -
సోమేశ్వరాలయంలో పూజలు
పాలకుర్తి టౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రం సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్వామివారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, నాగరాజు, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, పెందోట చక్రపాణి, శ్రీపాద ఉప్పలాచారి, రాజేంద్రచారి, ముత్తొజు రాము, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఎస్పీసీలో మూడో స్థానం
జనగామ రూరల్: జాతీయ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 3 రకాల అంశాలపై రాష్ట్రాలకు కాంపిటీషన్ పోటీలు నిర్వహిస్తుంది. నేషనల్ స్టూడెంట్ పార్టీ స్పెషల్ కాంపిటీషన్ (ఎన్ఎస్పీసీ)లో ముఖ్యంగా చెత్త నిర్వహణ, మొక్కల పెంపుదల, భూగర్భ జలాల పెంపుదలపై పోటీలు నిర్వహిస్తుంది. ఈ పోటీలో రాష్ట్రం, దేశంలో రెండవ స్థానంలో ఉండగా రాష్ట్రంలో జనగామ జిల్లా 3వ స్థానంలో ఉంది. ప్రజారోగ్యం, పరిశుభ్రత అనే మూడవ కీలక అంశంపై కూడా ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి పోటీల్లో పాల్గొనేలా చేయడం ద్వారా విద్యాలయాలు, వసతి ప్రాంతాల్లో హైజీన్, వేస్ట్ మేనేజ్మెంట్, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరుస్తూ, కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లా వ్యాప్తంగా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ‘మన జిల్లా మన నీరు’ అనే కార్యక్రమంతో వివిధ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదువేల ఇంకుడు ఇంతల నిర్మాణాలకు ప్రణాళిక చేపట్టారు. అదే సమయంలో వనమహోత్సవం కార్యక్రమం కింద వేలాది మొక్కలు నాటుతున్నారు. విద్యార్థుల భాగస్వామ్యం.. విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, జీవనశైలిని పెంపొందించాలని, మొక్కలు నాటటం, నీటి సంరక్షణ, వ్యర్థాలను వేరుచేసే అలవాట్లను విద్యార్థులకు పెంపొందించడానికి నేషనల్ గ్రీన్ కోర్ తయారు చేసిన నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీలు జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో కేజీబీవీలు, సోషల్ వెల్ఫేర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఎక్కువగా పాల్గొంటున్నారు. కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ జూలై 1 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పోటీలు కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తుండగా ఫలితాలు ఆగస్టు 30న ప్రకటించనున్నారు. 1వ తరగతి నుంచి పరిశోధన విద్యార్థుల వరకు ఐదు విభాగాల్లో పోటీ నిర్వహిస్తారు. ఎకో మిత్రం అప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలని, హిందీ, ఇంగ్లిష్ మరిన్ని భాషల్లో క్విజ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న లేదా వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 1వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులతో పాటు సామా న్య పౌరులు కూడా పాల్గొనవచ్చు. పోటీలో పాల్గొ న్న ప్రతీ విద్యార్థికి వెంటనే ఈ–సర్టిఫికెట్ లభిస్తుంది. విద్యా సంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తారు. పర్యావరణ సమతుల్యతకు కృషి చేయాలి జాతీయ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్పీసీ పోటీలో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలువగా ఆగస్టు 31 వరకు గడువు ఉంది. అన్నివర్గాల ప్రజల సహకారంతో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తాం. భూగర్భజలాలు సంరక్షించి వర్షపు నీటిని ఒడిసి పట్టి భవిష్యత్ తరాలకు అందించాలి. విద్యార్థులు ప్రతిఒక్కరూ పరిశుభ్రతపై బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. విరివిగా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతకు కృషి చేయాలి. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ పర్యావరణ సమతుల్యతలో విద్యార్థుల భాగస్వామ్యం భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక కార్యక్రమం కలెక్టర్ కృషితో ఉత్సాహంగా మొక్కలు నాటడం, ఇంకుడుగుంతల నిర్మాణం -
వరినారు ఎండుతోంది..
బచ్చన్నపేట : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పొలంలో వేసిన వరినారు ఎండిపోతుంది. నాటు వేసేందుకు దమ్ముచేసిన పొలాలు కూడా ఎండిపోతున్నాయి. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన కామిడి శ్రీనివాస్రెడ్డి, రాంరెడ్డితో పాటు పలువురు రైతులు మాట్లాడుతూ..వర్షాలు కురవక పోవడంతో భూగర్భ జలాలు అడుగంటి నాటు వేసిన వరిపొలం ఎండిపోతున్నాయని తెలిపారు. గోదావరి జలాలతో చెరువులు, కుంటలను నింపకపోతే మిగిలిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికై న సంబంధిత అధికారులు చొరవ చూపి చెరువులు, కుంటలను నింపాలని కోరారు. -
రోడ్డు పనులకు ఆటంకం కలిగిస్తే ధర్నా చేస్తాం
రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి రెడ్డికాలనీ నుంచి భాంజీపేట వెళ్లేదారిపై చేపట్టిన మట్టి రోడ్డు పనులకు ఆటంకం కలిగించే వారి ఇళ్ల ముందు ధర్నా చేస్తామని గ్రామ రైతులు హెచ్చరించారు. రోడ్డు పనులకు కొందరు అడ్డంకులు కలిగిస్తుండటంపై ఆదివారం గాదె జయపాల్ అధ్యక్షతన బాధిత రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామం నుంచి వ్యవసాయ బావులకు వెళ్లే భాంజీపేట దారికి రోడ్డు కావాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరికి విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే స్పందించి ఈజీఎస్లో రోడ్డు పనులు చేయించారు. మట్టిపై నడిచే పరిస్థితి లేక.. సమస్య ఎమ్మెల్యేకు విన్నవించగా ఆయన వెంటనే స్పందించి కలెక్టర్తో మాట్లాడి మొరం పోసుకోవడానికి అనుమతి ఇచ్చారు. 750 ట్రిప్పులకు పర్మిషన్ పొంది ఎకరా చొప్పున తామే నిధులు సమకూర్చుకొని 350 ట్రిప్పులు మాత్రమే మొరం పోసుకున్నామని.. గ్రామానికి సంబంధం లేని వ్య క్తులు అధికారులకు ఫిర్యాదు చేసి పనులు నిలిపి వేయించారన్నారు. స్వచ్ఛందంగా రోడ్డు పనులు చే సుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి రాపోలు రామ్మూర్తి, ఓరుగంటి మనోహర్, చిన్నపురెడ్డి, కిరణ్రెడ్డి, రాజారెడ్డి, జోజిరెడ్డి, దినేష్రెడ్డి, శౌరెడ్డి తదితరులు ఉన్నారు. కంచనపల్లి రైతులు -
వైభవంగా బోనాలు
పాలకుర్తి టౌన్ : మండలంలోని మంచుప్పల గ్రామంలో ఆదివారం మారమ్మ, మహంకాళి అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల నృత్యాలతో వైభవంగా బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. గొల్లపల్లిలో.. దేవరుప్పుల : ఆషాఢం సందర్భంగా మండలంలోని గొల్లపల్లిలో ఆదివారం మహాంకాళి, మారమ్మలకు యాదవ కులస్తులు నజర్ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఒగ్గు కళాకారుల ఆటపాట, శివసత్తుల పూనకాలతో ఇంటింటా మహిళలు బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. గ్రామంలో వర్షాలు సమృద్ధి కురవాలని, పాడిపంటలు పండాలని భక్తులు మొక్కుకున్నారు. పెద్ద గొల్ల దూదిమెట్ల సోమలింగం, బయన్న, వర్రె కొమురయ్య, మాజీ సర్పంచ్ కోనేటి సుభాషిని నర్సయ్య, యాకన్న, తీగల వెంకన్న, తీగల సత్యనారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కొత్త కార్డులొచ్చేస్తున్నాయ్
జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులను ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నేరవేరుస్తున్నారు. ప్రజా పాలనతో పాటు మీసేవలో దరఖాస్తు చేసుకున్న కుటుంబాల ఎదురుచూపులకు కొద్ది గంటలే మిగిలిఉంది. నేడు (సోమవారం) సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి కొత్త రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సుదీర్ఘ కాలం పాటు తెల్లరేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ బియ్యంకు దూరంగా ఉన్న వారంతా.. సెప్టెంబర్ మాసం నుంచి రేషన్ ఉచిత బియ్యాన్ని పొందనున్నారు. జిల్లాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. న్యూ రేషన్ కార్డులు 2,096 జిల్లాలో కొత్త రేషన్ కార్డులు 2,096 మందికి వచ్చాయి. ప్రజా పాలనతో పాటు మీసేవలో దరఖాస్తు చేసుకోగా ఎంక్వరీ తర్వాత వీటిని అప్రూవల్ చేశారు. దీంతో చాలా మంది లబ్ధిదారులు ఆన్లైన్లో తమ కార్డులను డౌన్లోడ్ చేసుకోగా, అధికారికంగా నేటి (సోమవారం) అందుకోనున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు గతంలో కార్డులు ఉండి, తమ పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల చేరికకు ఏళ్ల తరబడి నిరీక్షించారు. న్యూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో పిల్లల చేరికకు సైతం అవకాశం ఇవ్వగా, రెండు కలిపి 28,967 మంది (యూనిట్స్) కొత్తగా చేరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూన్ మాసంలో మూడు నెలల బియ్యం కోటా ఒకేసారి ఇవ్వగా.. కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ మాసం నుంచి ఉచిత బియ్యం అందనున్నాయి. ఇదిలా ఉండగా ఒంటరి మహిళలు, ఆదరణ లేని అత్యంత దయనీయ స్థితిలో ఉన్న నిరుపేదలకు అంత్యోదయ (35 కిలోల బియ్యం), అన్నపూర్ణ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భరోసా కల్పించే విధంగా మంజూరీ చేయాలని ప్రభుత్వాన్ని బాధిత కుటుంబాలు కోరుతున్నారు. జిల్లాలో 335 రేషన్ దుకాణాలు జిల్లాలో 335 రేషన్ షాపులు ఉన్నాయి. పాత, కొత్త రేషన్ కార్డులు కలుపుకుని 1,63,283కు పెరగగా, 5,06,722 మంది ఉచిత బియ్యం పొందుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నెలవారి కోట సన్న బియ్యం 3,221.188 మెట్రిక్ టన్నులను పెంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి న్యూ రేషన్ కార్డుల కోసం వేలాది కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నారు. 2020లో కొంత మంది అర్హులైన నిరుపేదలకు కొత్త కార్డులను అందించి తిరిగి నిలిపివేశారు. ఇన్నాళ్లకు న్యూ రేషన్ కార్డులు రానుండడంతో పేదోళ్ల కుటుంబాల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. ఆరేళ్ల ఎదురుచూపులకు మోక్షం.. ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. భర్త ఫాస్ట్ఫుడ్ వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొత్త రేషన్ కార్డు కోసం అనేక సార్లు అర్జీ పెట్టుకున్నా రాలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉచిత రేషన్ బియ్యం పొందలేకపోయాం. ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని పథకాలు కూడా అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త తెల్ల రేషన్ కార్డు మంజూరు కావడం చాలా సంతోషంగా ఉంది. – తాళ్లపల్లి మానస, గృహిణి, చిన్న పెండ్యాల, చిల్పూరు నేడు సూర్యాపేటలో ప్రారంభించనున్న సీఎం జిల్లాలో 2,096 కొత్తరేషన్ కార్డులు కొత్తగా 28,967 కుటుంబ సభ్యుల చేరిక ప్రతీ నెల 3,221,188 మెట్రిక్ టన్నుల కోటా -
చెక్డ్యాంలలో నీళ్లు నింపాలని నిరసన
జనగామ రూరల్: వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటి వానాకాలం సీజన్లో సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయని, దేవాదుల ద్వారా చెరువులు, చెక్ డ్యాంలను నింపి ఆదుకోవాలని కోరుతూ జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆదివారం నిరసన తెలిపారు. చీటకోడూరు–యశ్వంతాపూర్ వాగుపై నిర్మాణం చేసిన చెక్ డ్యాంల్లో చుక్క నీరు లేక మోడు బారిపోయాయన్నారు. నీటి పారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి దేవాదుల నీటిని విడుదల చేయని పక్షంలో సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోతాయని రైతులు బాల్నె ఉమాపతి, గొల్లూరి యాదగిరి, ఎర్ర రవి, గండి సుభాష్, మంగ రాములు, కొత్త సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎండుతున్న పంటల పరిస్థితిని చూసి కలెక్టర్ చొరవ తీసుకోవాలన్నారు. రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రధాన పూజారి హరీశ్ శర్మ భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. గైడ్ కుమార్ ఆలయ విశిష్టత గురించి పర్యాటకులకు వివరించారు. సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష కేయూ క్యాంపస్: సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. ఉదయం 10–30 నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 440 మంది అభ్యర్థులు హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ సెల్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును ఎస్సీ వెల్ఫేర్ అధికారి బి.నిర్మల, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రమాదేవి పరిశీలించారు. ముగిసిన ‘సకల కళల సంబురాలు’ హన్మకొండ కల్చరల్: తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో.. తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ కోసం రెండు రోజుల పాటు నిర్వహించిన సకల కళలు సంబురాల జాతర–25 కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఉదయం వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో జరిగిన చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా 33 జిల్లాల నుంచి పలు కళారంగాల్లో నిష్ణాతులైన కళాకారులు, కళాబృందాలు హాజరై ప్రదర్శనలిచ్చారు. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ నిర్వాహకులు జడల శివ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యాపారవేత్త ఆడెపు రవీందర్, జ్యూరీ, చీఫ్ కో–ఆర్టినేటర్ టీవీ అశోక్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్వాహకులు జడల శివ, హరిత దంపతులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ ప్రదానం చేశారు. కళాకారులు సకల కళలు సంబరాల జాతర కార్యక్రమంలో భాగంగా చిన్నారుల కూచిపూడి నృత్యాలు, జానపద నృత్యాలు, ఒగ్గుకథ, బుర్రకథ, నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. పాల్గొన్న కళాకారులకు ప్రశంసపత్రాలు అందజేశారు. అనంతరం జడల శివ మాట్లాడుతూ.. కళాకారులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు, సహాయం అందాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళాకారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అనుమాండ్ల మధుకర్, మంచిర్యాల జిల్లా నాట్య కళాకారులు సమాఖ్య రాకం సంతోశ్, కోశాధికారి రామగిరి అర్జున్, పీఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి
స్టేషన్ఘన్పూర్: ఆర్యవైశ్యులు వాణిజ్య, వ్యాపారాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్కుమార్ అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని మా గార్డెన్స్ ఫంక్షన్హాల్లో ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణిస్తూ తమ సత్తా చాటాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఉన్న చోట పోటీ చేయాలన్నారు. ఆర్యవైశ్యులు కేవలం వాణిజ్య, వ్యాపారాలకే పరిమితం కాకుండా ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, రానున్న రోజుల్లో రాజకీయాల్లోనూ సత్తా చాటాలన్నారు. ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్ను నర్సింహులు, నాయకులు బెలిదె వెంకన్న, పార్శి కమల్కుమార్, బెజుగం భిక్షపతి, తెల్లాకుల రామకృష్ణ, పార్శి రంగారావు, గౌరిశెట్టి శ్రీని వాస్, పాలకుర్తి సోమశేఖర్, పాలకుర్తి శ్రీనివాస్, జొన్నల రాజేశ్వరరావు, సరాబు ఆంజనేయులు, రవీందర్, వరూధిని తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు ప్రమోద్కుమార్ -
అంతర్జాతీయ దివ్యాంగ క్రీడాకారిణికి ఆర్థికసాయం
జనగామ: ప్రతిభ ఉంటే అంగ వైకల్యం సైతం అడ్డురాదని నిరూపించారు స్టేషన్ఘన్పూర్ మండలం విశ్వనాథపురంకు చెందిన దివ్యాంగురాలు మాచర్ల కృషివేణి. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు ఎదురీదుతూ విజయ తీరాలకు చేరుకున్న ఆ క్రీడాకారిణి.. ముందడుగు వేయాలంటే ఆర్థిక వనరులు అడ్డువస్తూనే ఉన్నాయి. మనసున్న దాతల సహాయంతో దేశ, విదేశాల్లో జరిగే క్రీడాపోటీల్లో తన సత్తాను నిరూపించుకుంటున్నారు కృష్ణవేణి. ఈ నెల 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మలేషియాలో జరుగనున్న ఏషియన్ పేరా టైక్వాండో గేమ్స్కు భారత దేశం తరఫున కృష్ణవేణి అర్హత సాధించారు. జిల్లా, రాష్ట్రం, దేశంలో ఎన్నో పథకాలను సొంతం చేసుకున్న ఆమెకు...మలేషియా పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక పరిస్థితులు అడ్డొస్తున్నాయి. కనీసం విమాన చార్జీలు సైతం లేని దయనీయ పరిస్థితుల్లో మానవతా వాదుల సహకారాన్ని కోరుతున్నారు. కృష్ణవేణి టాలెంట్ను చూసిన తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజుగౌడ్ వెంటనే కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా ప్రతినిధులతో పాటు సంఘ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలకు ఈ విషయాన్ని చేరవేశారు. ఎన్ఆర్ఐ డాక్టర్ అతికం గిరిగౌడ్, డాక్టర్ అతికం శ్రీనివాస్గౌడ్లు నాతి గణేష్ ద్వారా రూ.1.50 లక్షలు, గౌడ ప్రముఖులు మరో రూ.30వేలను ప్రకటించారు. ఆదివారం పట్టణంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాల్నె వెంకట మల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో దివ్యాంగురాలు మాచర్ల కృష్ణవేణిని శాలువాతో సత్కరించి, నగదుకు సంబంధించి చెక్కులను అందించారు. ఇందులో కరాటే కోచ్ అబ్బాస్, గోపగోని సుగుణాకర్, చిలువేరు అభిగౌడ్, బూడిది గోపి, వెంకట మల్లయ్య, దూడల సిద్ధయ్య, బైరగోని మల్లేశం, తాళ్లపల్లి రాజుగౌడ్, చీకట్ల నవీన్గౌడ్ దూడల రాజాసంపత్ గౌడ్ ఆర్థిక సాయం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బండకింది అరుణ్ కుమార్, కమ్మగారి నాగన్న, మహేందర్, బొల్లపల్లి విశ్వనాథ్గౌడ్ తదితరులు ఉన్నారు. -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
జనగామ రూరల్ : కలెక్టరేట్ సబ్స్టేషన్ పరిధిలో నేడు (ఆదివారం) సబ్స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ చంద్రమౌళి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని బాలాజీనగర్, ఎల్లమ్మ గుడి, జ్యోతినగర్, కలెక్టర్ ఆఫీస్, ఆయుష్మాన్ హాస్పిటల్, అక్షయహోటల్, సెయింట్ మేరీస్ స్కూల్, సాన్ మారియా స్కూల్, ఏకశిల బీఈడీ కాలేజ్, అనంత సాయి, ఇందిరమ్మ కాలనీ, దత్తంరెడ్డి నగర్, శ్రీవిలాస్ కాలనీ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ఆర్టీఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రంగారావు స్టేషన్ఘన్పూర్: ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ అడ్వకసీ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లికి చెందిన పార్శి రంగారావును నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సర్కారు బడులకు ఉచిత ఇంటర్నెట్
జనగామ: సర్కారు బడుల్లో అమలు చేస్తున్న ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. సమగ్ర శిక్షలో భాగంగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ భాగస్వామ్యంతో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్, డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడతలో కంప్యూటర్లు అందుబాటులో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను ఎంపిక చేయడంతో పాటు వాటికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 75 పీఎస్, యూపీఎస్లను గుర్తించారు. పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇన్స్టాలేషన్కు సంబంధించి ఫార్మెట్ ప్రకారం ప్రతీ శనివారం ఈ–మెయిల్ ద్వారా ప్రభుత్వానికి జిల్లా విద్యాశాఖ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైన వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించాలని అందులో పేర్కొన్నారు. ఉచిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభం కాబోతుండడంతో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాంతో పాటు ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా పోతుంది. జిల్లాలో అర్హత పొందిన పాఠశాలలుమండలం పాఠశాలలు బచ్చన్నపేట 10 చిల్పూరు 5 దేవరుప్పుల 4 స్టేషన్ఘన్పూర్ 9 జనగామ రూరల్ 11 జనగామ అర్బన్ 4 కొడకండ్ల 3 లింగాలఘణపురం 5 నర్మెట 2 పాలకుర్తి 4 రఘునాథపల్లి 11 తరిగొప్పుల 3 జఫర్గఢ్ 4 మొత్తం 75 జిల్లాలో 75 పీఎస్, యూపీఎస్లు ఎంపిక బీఎస్ఎన్ఎల్ నుంచి సేవలు ఎఫ్ఎల్ఎన్ మెరుగు పరిచేందుకు.. -
రిజర్వాయర్ నీరు విడుదల చేయాలని ధర్నా
జనగామ రూరల్: బొమ్మకూర్ రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా నీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ శనివారం మండలంలోని శామీర్పేట వద్ద జనగామ నుంచి సిద్దిపేట జాతీయ రహదారి వద్ద రైతులు ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. అనంతరం మాజీ ఎంపీపీ మేకల కళింగరాజు, జిల్లా యువజన నాయకులు ఇరుగు సిద్ధులు మాట్లాడుతూ మే, జూన్, జూలై మాసాల్లో తగినంత వర్షం కురవక పోవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని, వరి నాట్లకు కూడా నీరు లేదన్నారు. బొమ్మకూర్ ఎడమ, కుడి కాల్వల నుంచి నీరు అందించే నార్లు పోసుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. తక్షణమే నీళ్లు వదలాలని, లేదంటే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు శానబోయిన మైపాల్, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దడిగ సందీప్, బైరగోని యాదగిరి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ బొల్లం శారద, ఎడమ ఐలయ్య, దడిగ సిద్ధులు, శంకర్, నరేష్, రవి, రైతులు పాల్గొన్నారు. పంపులు ఆన్చేయండి:ఎమ్మెల్యే పల్లా జనగామ: నియోజకవర్గంలో నారుమళ్లకు సాగు నీరు అందడం లేదని, తక్షణమే పంపులు ఆన్ చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి శనివారం నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. వానాకాలంలో సాగు చేసిన వరి, పత్తి, ఇతర పంటలను కాపాడాలంటే వందశాతం పంపులను ఆన్ చేయడమే షరణ్యమన్నారు. నార్లు, నాట్లు ఎండిపోయే దశలో ఉన్నాయని, కాపాడితేనే రైతులు చల్లంగా ఉంటారన్నారు. దేవాదుల నుంచి జనగామ నియోజకవర్గానికి సరిపడా సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే పల్లా -
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025
పక్క ఫొటోలో కనిపిస్తున్న పాఠశాల పాలకుర్తి మండల కేంద్రం ప్రాథమిక పాఠశాల. ఇందులో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు చిదురాల శ్రీనివాస్ పాఠశాల ఆవరణను తీరొక్క మొక్కలతో పచ్చలహారంగా తీర్చిదిద్దారు. మొక్కలపై హెచ్ఎం చూపిస్తున్న ప్రేమ, శ్రమ ఫలితంగా బడి కాస్త పచ్చదనంతో తోటలా మారిపోయింది. ప్రకృతి, పర్యావరణంపై విద్యార్థులకు బోధిస్తూ పది కాలాల పాటు ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించడం ఒక్కటే కాదు... ప్రకృతి మన నిత్యందన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందనే అవగాహన కల్పిస్తున్నామని హెచ్ఎం శ్రీనివాస్ తెలిపారు. – పాలకుర్తి టౌన్ న్యూస్రీల్ -
వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం వార, మాస కల్యాణంతో పాటు హోమ కార్యక్రమం నిర్వహించడంతో భక్తుల సందడి నెలకొంది. ఉదయం అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల స్వామి వారి మాస, వార కల్యాణంతో పాటు హోమం నిర్వహించారు. భక్తులకు హైదరాబాద్, వరంగల్కు చెందిన బోడ మహేష్–వినీష, ముసిని నరేందర్–లావణ్య దంపతులు అన్నప్రసాదం వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ధర్మకర్తలు పాల్గొన్నారు. నిడిగొండ త్రికూటాలయాన్ని పునరుద్ధరించాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ రఘునాథపల్లి: హనుమకొండ వేయి స్తంభాల ఆలయం తరహాలో నిడిగొండ త్రికూటాలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌడ రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం శిథిలావస్థలో ఉన్న మండలంలోని నిడిగొండ త్రికూటాలయాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునరుద్ధరణ పేర ఆలయ కళాఖండాలు కుప్పగా పోసి వదిలేయడంతో అవి నేలలో కూరుకు పోతున్నాయన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఆలయం పునఃనిర్మించి దేవాదాయ శాఖ ఆదీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణుకుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కావటి ముత్యాల్యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి సోమేశ్వర్, ద్యావర రాజు, మల్కపురం శ్రీకాంత్, దైతల రంజిత్, చెవ్వ రాజు, యామంకి కొమురెల్లి, మహేందర్జీ, రవి, కమలాకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
హరిత టీచర్లు
పూలు..పండ్లు..ఔషధ మొక్కలుపై ఫొటో దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు బి ల్లా యాదవరెడ్డి, అండాలు దంపతులు. యాదవరెడ్డి 20ఏళ్ల క్రితం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగే క్రమంలో 9 గుంటల వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఒక గుంట స్థలం ఇల్లు నిర్మాణం చేయగా మిగతా ఖాళీ స్థలంలో భార్య అండాలుతో కలిసి రకరకాల మొక్కలు నాటగా, నేడు ఆ స్థలమంతా హరితమయంగా మారిపోయింది. పచ్చని హరివిల్లులో రాజకీయాలకతీతంగా సేదతీరుతూ ముచ్చటించుకునే ప్రతి ఒక్కరు ఈ దంపతులు చల్లంగా ఉండాలని కోరుకుంటారు. – దేవరుప్పులజనగామ: కాలుష్య రహితంగా మారుతున్న పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. అంతరించి పోతున్న అడవులు.. అభివృద్ధి పేరిట మాయమైపోతున్న మహావృక్షాలతో స్వచ్ఛమైన గాలి పీల్చే పరిస్థితి లేకుండా పోతుంది. ఈ నేపధ్యంలో పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ప్రేమికులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటి పెరట్లో పచ్చదనం పెంచుతూ.. ఔషధ, పూలు, పండ్ల మొక్కలతో స్వచ్ఛమైన వాతావరణంలో జీవనం సాగిస్తుంటే.. బడిలో పాఠాలతో పాటు మొక్కలు నాటే ప్రత్యక్ష బోధన చేస్తున్నారు టీచర్లు. చెరువు కట్టలు, ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాల్లో సమాజ ప్రేమికులు మొక్కలను నాటుతూ వాటి సంరక్షణకు జీ వితాలనే త్యాగం చేస్తూ రేపటి తరానికి ఆయుష్షు పోసేందుకు తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో హరితహారంపై ‘సాక్షి’ స్ఫూర్తి కథనం.నర్మెట: ఆ దంపతులకు పచ్చదనం అంటే అమితమైన ప్రేమ. మొక్కలను సంరక్షించడంలో ఆదర్శంగా నిలుస్తారు. స్వచ్ఛమైన వాతావరణం ఇంటినే పచ్చదనంగా మార్చుకున్నారు. స్వచ్ఛదనంలో ఆరోగ్య ప్రదాయనిగా పిలుచుకునే ఔషధ మొక్కలను పెంచుతూ పర్యావరణ ప్రేమికులుగా పిలువబడుతున్నారు నర్మె ట మండల కేంద్రానికి చెందిన మహేశ్వరం అనిత, మురళి దంపతులు. రెండు దశాబ్ధాలుగా ఇంటి పెరట్లో 21 రకాల పూలు, పండ్లు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. చెట్లు అంటే ప్రాణంపర్యావరణ ప్రేమికుడు ఈ టీచర్ విద్యార్థుల భాగస్వామ్యంతో మొక్కల సంరక్షణ ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయులు ఇంటి పెరటితోటల్లో ఔషధమొక్కలు హరితహారంపై ‘సాక్షి’ స్ఫూర్తి కథనం -
కుక్కల ఆపరేషన్ @ రూ.2.97 లక్షలు
జనగామ: జనగామ మున్సిపల్లో కుక్కల సంచారం ప్రజల పాలిట ప్రమాదకరంగా మారింది. ఏ వీధికెళ్లినా ఏ ముందులే అన్నట్టుగా అడుగడుగునా శునకాలు రాజ్యమేలుతున్నాయి. కాలినడకన కనిపించినా.. ద్విచక్రవాహనం వెళ్తున్నా.. కుక్కలు వెంబడిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల అనేక వార్డుల్లో కుక్కల దాడుల్లో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా బయటకు పంపించాలంటేనే వణికిపోతున్నారు. ఈ నేపధ్యంలో గతేడాది సెప్టెంబర్–అక్టోబర్ మాసంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు పురపాలిక అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చంపక్హిల్స్ డంపింగ్ యార్డు సమీపంలో నిర్మాణం చేసిన జంతువుల జనన నియంత్రణ (ఏబీసీ/కు.ని) సెంటర్లో ఈ ఆపరేషన్కు సిద్ధం చేశారు. అయితే కుక్కలను పట్టుకునే సమయంలో లొకేషన్లో ట్రేస్ అవుట్ చేయాలి. ఆపరేషన్ చేసి, ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత ఎక్కడ నుంచి పట్టుకు వెళుతున్నారో, అక్కడే వదిలిపెట్టి పూర్తి ఆధారాలు మున్సిపల్లో అందుబాటులో ఉంచుకోవాలి. 180 కుక్కలకు ఆపరేషన్ అధికారుల లెక్కల ప్రకారం విడతల వారీగా 180 కుక్కలను పట్టుకుని ఏబీసీ సెంటర్కు తరలించి కు.ని ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్కు ముందు మూడు రోజుల పాటు సంరక్షించి, 4వ రోజు సర్జరీ చేస్తారు. మరో మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుకుని, ఏడవ రోజు కుక్కను పట్టుకు వెళ్లిన ప్రదేశంలో వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో శునకం ఆపరేషన్ ఖర్చు కోసం సుమారు రూ.1,650 లెక్కన మొత్తంగా రూ.2.97లక్షల వరకు ఖర్చు చేశారు. కుక్కల సంతతి తగ్గించేందుకు ఆపరేషన్ కార్యక్రమం బాగున్నప్పటికీ, కు.ని తర్వాత వాటిని ఎక్కడ వదిలేశారు.. జీపీఎస్ లొకేషన్ ఎక్కడ? అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేకుండా పోయింది. పట్టణంలో ఏ వార్డుకు వెళ్లినా పదుల సంఖ్యలో కుక్కలు దాడి చేసే పరిస్థితికి చేరుకున్నాయి. లక్షల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసి, శునకాలకు ఆపరేషన్ చేయించినా, ఫలితం లేదంటున్నారు పట్టణ ప్రజలు. కుక్కల ఆపరేషన్ కోసం చేసిన ఖర్చు వివరాలకు సంబంధించి విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై శానిటేషన్ ఇన్స్పెపెక్టర్ గోపయ్య మాట్లాడుతూ కుక్కల ఆపరేషన్కు రూ.2.97 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కుక్కలను పట్టుకు వెళ్లిన ప్రదేశం, జీపీఎస్ తమ వద్ద లేదన్నారు. ఎక్కడ పట్టుకెళ్లారు జీపీఎస్ లొకేషన్ ఉందా ? వీధుల వెంట గుంపులుగుంపులుగా శునకాలు -
ముగిసిన సమ్మర్ ఇంటర్న్షిప్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సమ్మర్ ఇంటర్న్షిప్–25 ప్రోగ్రాం శుక్రవారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై సమ్మర్ ఇంటర్న్షిప్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. నిట్ వరంగల్లో తొలిసారిగా మే 9వ తేదీన ప్రవేశపెట్టిన సమ్మర్ ఇంటర్న్షిప్నకు అనూహ్య స్పందన లభించిందని, యూజీ, పీజీ నుంచి 194 విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఇక ప్రతిఏటా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్, ప్రొఫెసర్ వెంకయ్య చౌదరి, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసమస్యలు పరిష్కరించాలని ధర్నా
జనగామ రూరల్: పట్టణంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ప్రజలకు సక్రమంగా సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు జనాభాకు అనుగుణంగా లేకపోవడంతో పట్టణంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండటంతో దుర్వాసన వస్తుందన్నారు. ఏసి రెడ్డి నగర్లో డబుల్ బెడ్రూంలో సీసీ రోడ్డు డ్రెయినేజీ నిర్మించాలని, అర్హులైన పేదలందరికీ కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు అహల్య, బొట్ల శేఖర్, బూడిది గోపి, చుంచు విజయేందర్, చందు నాయక్, పొతుకునూరి ఉపేందర్, కల్యాణం లింగం పల్లెలు లలిత, పందిళ్ల కల్యాణి, బొట్ల శ్రావణ్, పాము కుంట్ల చందు, పాము శ్రీకాంత్, పగిడిపల్లి బాలమణి తదితరులు పాల్గొన్నారు. పోరాటాలకు సిద్ధం కావాలి రఘునాథపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై పార్టీ శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం మండలంలోని కుర్చపల్లిలో సీపీఎం రెండు రోజుల మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, గంగాపురం మహేందర్, కాసాని పుల్ల య్య, మంచాల మల్లేష్, బీమగోని చంద్రయ్య, మైలారపు వెంకటేశ్వర్లు, యాదగిరి, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఆర్ను సకాలంలో అందించాలి
జనగామ రూరల్: రబీ, ఖరీఫ్ 2024–25కు గాను సీఎంఆర్ను సకాలంలో అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రేషన్ కార్డులు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి తహసీల్దార్లు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాలను అనుగుణంగా రైస్ మిల్లర్లు సీఎంఆర్ను నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. ఖరిఫ్ (వానాకాలం) 2024–25 సీజన్ కు సంబంధించి 91827.554 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 73664.210 మెట్రిక్ టన్నుల బియ్యం, 80.22శాతం ఇప్పటికే మిల్లింగ్ చేసి డెలివరీ చేయగా ఇంకా 18163.344 మెట్రిక్ టన్నులు డెలివరీ చేయాల్సి ఉందన్నారు. రబీ (యాసంగి) 2024–25 సీజన్కు సంబంధించి 144834.216 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను 38135.916 మెట్రిక్ టన్నుల బియ్యం, 26.33శాతం ఇప్పటికే మిల్లింగ్ చేసి డెలివరీ చేయగా ఇంకా 106698.300 మెట్రిక్ టన్నులు డెలివరీ చేయాల్సి ఉందన్నారు. కొత్తరేషన్ కార్డుల జారీ, పాత రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబందించి ప్రక్రియ వేగవంతం కావాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు, సివిల్ సప్లయీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
జనాభా నియంత్రణకు కృషి చేయాలి
జనగామ రూరల్: జనాభా నియంత్రణకు సమష్టిగా కృషి చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కువగా చేపట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ రావుతో కలిసి అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు వైద్య సిబ్బందితో జనాభా నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 1987లో ఐక్యరాజ్య సమితి జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోగా 1989 జూలై 11వ తేదీ నుంచి ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటించడం జరుగుతుందన్నారు. ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపట్టికొత్తగా వివాహం జరిగిన మహిళలను గుర్తించి 23 సంవత్సరాలు ఉండి, ఆరోగ్యవంతురాలిగా ఉన్నప్పుడే గర్భం దాల్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు తెలియ చెప్పాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ మహిళలు సంపూర్ణ ఆరోగ్య వంతురాలిగా ఉన్నప్పుడు గర్భం దాల్చినట్లయితే గర్భస్రావాల రేటు తగ్గుతుందన్నారు. అత్యధికంగా 700 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ శకుంతల, మోటివేషన్ పర్సన్ దీపారాణి, ఉత్తమ సేవలందించిన దేవరుప్పల మండల పీహెచ్సీకి చెందిన ఆశకార్యకర్త స్వప్నలను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
83.29శాతం
మొక్కల సంరక్షణజనగామ: అటవీ ప్రాంతంలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక ఫోకస్ సారిస్తున్నారు. నాటిన ప్రతీ మొక్కను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ జిల్లాలో గడిచిన తొమ్మిదేళ్ల లెక్కలను పరిశీలిస్తే అటవీ ప్రాంతం కేవలం 0.5 శాతం మాత్రమే పెరిగింది. 2015కు మందు ఒక శాతం ఫారెస్ట్ ఏరియా ఉండగా... డబుల్ చేసేందుకు నాటి నుంచి నేటి వరకు కష్టపడినా.. ఫలితం కనిపించడం లేదు. మండలాల పరిధిలో ఎక్కువగా అటవీ ప్రాంతం లేకపోవడంతో అధికారులు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. ఒక్కో మొక్కను పెంచి పెద్ద చేసి, నాటే వరకు రూ.86 ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో పచ్చదనం ఏటా అటవీ ప్రాంతం విస్తీర్ణం పెరుగుదల తదితర అంశాలపై సాక్షి ప్రత్యేక కథనం. తొమ్మిదేళ్లు..4.83 కోట్ల మొక్కలు జనగామ ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలో అతి తక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లాలో జనగామ ఒకటి. కేవలం ఒకే ఒక్క అటవీ ప్రాంతంతో ఉన్న జిల్లాలో రెండు నుంచి మూడుకు పెంచాలని నాటి కలెక్టర్ దేవసేన నుంచి ప్రస్తుత జిల్లా బాస్ రిజ్వాన్ బాషా వరకు కృషి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ 0.5 శాతం మాత్రమే పెంచగలిగారు. ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా లేకపోవడం, సాగు పెరగడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 2016 నుంచి 2024 వరకు 5.80 కోట్ల మొక్కల లక్ష్యం కాగా 4.83 కోట్లు నాటారు. ఇందులో 83.29 శాతం మేర మొక్కలను సంరక్షించగలిగారు. 2.18 లక్షల హెక్టార్ల భౌగోళిక ప్రాంతం జనగామలో 2,18,750 హెక్టార్ల భౌగోళిక ప్రాంతం ఉండగా, ఇందులో లింగాలఘణపురం, జనగామ, కొడకండ్ల మినహా 9 మండలాల పరిధిలో 3,357.03 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం (1.05 శాతం) విస్తరించి ఉంది. జనగామ, నర్మెట మండలం వె వెల్దండ గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఉండగా, బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లిలో త్వరలోనే ప్రారంభించనున్నారు. వీటి పరిధిలో 1.20లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండగా, ఇటీవల పురపాలికలోని 30 వార్డుల్లో నాటేందుకు 12,500 మొక్కలను వెల్దండ, మరో 10 వేలను జనగామ నర్సరీ నుంచి సరఫరా చేశారు. మొక్కను పెంచేందుకు రూ.12, నాటేందుకు (అన్ని కలుపుకుని) రూ.74 మేర మొత్తంగా రూ.86 ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన తొమ్మిదేళ్లలో రూ.4.15 కోట్ల మేర ఖర్చు చేయగా, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. వందశాతం మొక్కలు నాటే సమయంలో ఇందులో ఎండి, విరిగి పోవడం, చెదలు పట్టడంతో 10 నుంచి 20 శాతం మేర నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. వీటి స్థానంలో కొత్త మొక్కలను నాటి వందశాతం ఫలితాలను తీసుకు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. 10వేల మొక్కలకు ఒక వాచర్ను ఏర్పాటు చేసి రెండేళ్ల పాటు మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగిస్తున్నారు. ప్రస్తుత వనమహోత్సవంలో 2025 వార్షిక టార్గెట్ అన్ని శాఖలు కలుపుకొని 33 లక్షలు ఉండగా అటవీశాఖ 14,400 మొక్కలు నాటాల్సి ఉంది. రూ.4.15 కోట్ల ఖర్చు జిల్లాలో 3,357.03 హెక్టార్లలో అటవీ ప్రాంతం తొమ్మిదేళ్లలో 0.5 శాతం పెరుగుదల ఈ సంవత్సరం లక్ష్యం 14,400 ఒక్కో మొక్కకు రూ.86 ఖర్చు బచ్చన్నపేట 188.82మండలాల వారీగా అటవీ ప్రాంతం (హెక్టార్లలో)రఘునాథపల్లి 605.48పాలకుర్తి 1,107.75మొత్తం 3357.03నర్మెట 250.12స్టేషన్ఘన్పూర్ 924.30 చిల్పూరు, తాటికొండ, జఫర్గఢ్ 183.45తరిగొప్పుల 97.11జిల్లాలో అటవీ విస్తీర్ణం జిల్లా భౌగోళిక ప్రాంతం: 2,18,750 హెక్టార్లు అటవీ ప్రాంతం: 3,357.03హెక్టార్లు అటవీ శాతం: 1.05శాతంమొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణజిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. 12 మండలాల పరిధిలో పెద్దగా అటవీ ప్రాంతం లేదు. ప్రస్తుతం 3,357.03హెక్టార్ల పరిధిలో మాత్రమే పారెస్ట్ ఏరియా ఉండగా, పొలం గట్లు, చెరువు కట్టలు, వ్యవసాయ క్షేత్రాలు, ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటి కొంతమేర అటవీ ప్రాంతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇందు కోసం రైతులను కూడా ప్రోత్సహిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవం ప్రోగ్రాంలో అటవీ శాఖ ప్రధాన భూమిక పోషిస్తోంది. 9 సంవత్సరాల్లో మంచి ఫలితాలు సాధించి, 2025 వార్షిక సంవత్సరానికి 14,400 మొక్కల పెంపకం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. నాటిన మొక్కలు వాడి పోవడం, ఎండటం, చెదలు పట్టకుండా మందులు చల్లుతూ వాచర్ పర్యవేక్షణలో నిత్యం దృష్టి సారిస్తున్నాం. ఒకవేళ 10 నుంచి 20 శాతం లోపు మొక్కలకు నష్టం కలిగితే వాటి స్థానంలో మళ్లీ మొక్క నాటుతున్నాం. వందశాతం ఫలితాలు వచ్చేలా అందరి భాగస్వామ్యంతో కష్టపడుతున్నాం. – కొండల్రెడ్డి, ఫారెస్ట్రేంజ్ ఆఫీసర్ -
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
స్టేషన్ఘన్పూర్: ప్రతిఒక్కరూ విద్యార్థి దశలోనే భవిష్యత్ లక్ష్యాలను నిర్ధేశించుకుని లక్ష్యసాధనకు ప్రణాళికయుతంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు. మండలంలోని ఛాగల్లు ఉన్నత పాఠశాలను డీఈఓ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని రికార్డులు, రిజిస్టర్లు, టీచర్ల డైరీలు, బేస్ లైన్ పరీక్షల వివరాలు, పాఠ్య ప్రణాళికలు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన ఎలా ఉంది, పాఠ్యాంశాలు సరిగా అర్థం అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, వినయం కలిగి ఉండాలని, ఉన్నత చదువుతో సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యార్థులు ఎలాంటి దురలవాట్లకు గురికావద్దని, చదువుపైనే శ్రద్ధ వహించాలన్నారు. ఉపాధ్యాయుల సూచనల మేరకు ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. వంట చేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ కొమురయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు. డీఈఓ భోజన్న -
మొక్కలు నాటి సంరక్షించాలి
జనగామ రూరల్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని బీసీ వెల్పేర్ అధికారి బి. రవీందర్ అన్నారు. జనగామలోని రైల్వే ట్రాక్ట్ వద్ద గల ఎంజే పీ బాలుర పాఠశాలలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అధ్వర్యంలో శుక్రవారం బీసీ వెల్ఫేర్ అధికారి బి.రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. పెంబర్తి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల, బచ్చన్నపేట మ హాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల జూ నియర్ కాలేజీ, పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 200 వందల మొ క్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయని, మొక్కలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో స్టేషన్ఘన్పూర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ ఎం.అనిత, అధ్యాపకులు పాల్గొన్నారు. బీసీ వెల్ఫేర్ అధికారి రవీందర్ ఎంజేపీల్లో వనమహోత్సవం -
బహుమతుల ప్రదానం
జనగామ రూరల్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రోడ్డులోని సేయింట్ మేరీ హైస్కూల్లో శుక్రవారం జిల్లా స్థాయి కామిక్ రైటింగ్ పోటీలు విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొని కార్టూన్లు గీసి తమ ప్రతిభను చాటారు. కాగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ భోజన్న గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లతోపాటు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో పోటీల ఇన్చార్జ్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి బొమ్మనబోయిన శ్రీనివాస్, శామ్యూల్ ఆనంద్, నవీన్, అనిల్ పాల్గొన్నారు. -
జీలుగతో భూసారం పెంపు
● ఏడీఏ వసంత సుగుణదేవరుప్పుల: వ్యవసాయ క్షేత్రాల్లో పంటల సాగుకు ముందు జీలుగ వేయడం వల్ల భూసారం పెరుగుతుందని స్టేషన్ఘన్పూర్ ఏడీఏ వసంత సుగుణ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జీలుగ పంట సాగును ఆమె పరిశీలించారు. పంటల మార్పు చేయడంతోపాటు జిలుగు విత్తనాలు వేసి ఎదిగిన పంటను కలియదున్నడం వల్ల బలసంవర్ధకంగా భూమి మారి సాగు చేసే పంటలు రోగాల బారిన పడకుండా అధిక దిగుమతి పొందుతారని సూచించారు. రఘునాథపల్లి ఏవో ఓ శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓ సాగర్, ఆదర్శ రైతులు లెక్కల ఇంద్రసేనారెడ్డి, ఆవుల సురంజన్ రెడ్డి,ఊఉగు సత్యనారాయణ, వెంకటయ్య, యాదయ్య పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి
పాలకుర్తి టౌన్: మంజూరైన ఇందిరమ్మ ఇల్లును గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తొలగించారని ఆరోపిస్తు శుక్రవారం బమ్మెర గ్రామానికి చెందిన బరిగెల పోతన కుటుంబ సభ్యులతో శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోతన మాట్లాడుతూ రెండు నెలల క్రితం బమ్మెర వచ్చిన కలెక్టర్ రిజ్వాన్ భాష తనకు ఇల్లు మంజూరు చేస్తూ కట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కాగా, గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇల్లు మంజూరు అయితే రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ధర్నాలో పోతన భార్య రేణుకతోపాటు ఇద్దరు పిల్లలు పాల్గొన్నారు. -
కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలు చేయాలి
జనగామ రూరల్: వివిధ యాజమాన్యాల కింద కొనసాగుతున్న పాఠశాలలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమాపతి కార్యాలయంలో టీపీటీఎఫ్ జిల్లా సబ్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్ రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యా య విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్ర భుత్వ పాఠశాలలన్నింటినీ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల, బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల వివిధ రకాల బిల్లులను విడుదల చేయాలని, వెంటనే పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఎన్ ఎన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలన్నింటికీ పదివేల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంకుషావలి, రాష్ట్ర కౌన్సిలర్ కుర్రంల యాదగిరి, సత్యనారాయణ రెడ్డి, వజ్రయ్య, రాజారెడ్డి, లక్ష్మణ్ జి, రాజేందర్, ప్రభాకర్, శారద, కవిత తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనకు కృషి
రఘునాథపల్లి: ఖిలాషాపూర్ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు అన్నారు. శుక్రవారం పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థుల సంఖ్య పెంచిన హెచ్ఎం ఆలేటి యాదవరెడ్డి, ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. పాఠశాలకు మూడు అదనపు తరగతి గదులు, సరిపడు టాయిలెట్స్ మంజూరు చేయాలని హెచ్ఎం వినతి పత్రం అందజేశారు. తరగతి గదుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు శ్రమదానంతో గదులు నిర్మించుకోవడాన్ని చూసి రాంబాబు వారిని అభినందించారు. మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీష్ఛందర్రెడ్డి, మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, తోటకూర రమేష్, మేకల నరేందర్ పాల్గొన్నారు. -
కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం
తరిగొప్పుల: కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అల్పాహారం చేసేందుకు పాఠశాల విద్యార్థులను సిబ్బంది పిలవగా ప్లేట్ తీసుకువస్తానని గదిలోకి వెళ్లిన విద్యార్థిని కనిపించకుండా పొయింది. సదరు విద్యార్థిని వద్ద మొబైల్ ఫోన్ దొరికిందని, అట్టి విషయాన్ని సిబ్బంది పాఠశాల ప్రత్యేక అధికారినికి దృష్టికి తీసుకువెళ్లారని, దీంతో భయబ్రాంతికి గురై పాఠశాల నుంచి పారిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పాఠశాల ప్రధాన ద్వారం మూసి ఉన్నప్పటికీ గదిలోని కిటికీ ఇనుప గ్రిల్స్ లేకపోడంతో దానిగుండ విద్యార్థిని పారిపోయినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. కాగా, ఇట్టి విషయమై పోలీస్స్టేషన్లో ఎస్ఓ సునీత ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శ్రీదేవి తెలిపారు. సమస్యలు పరిష్కరించాలి స్టేషన్ఘన్పూర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయల సమస్యల పట్ల అనుసరిస్తున్న ఉదాసీనత వైఖరిని విడనాడి తక్షణమే పరిష్కరించాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా విద్యారంగంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉందన్నారు. ‘గులాబీ జెండా ఎగరాలి’ రఘునాథపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపు నిచ్చారు. శుక్రవారం మండలకేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామ గ్రామాన జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని, 17 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి విస్మరించి ప్రజలను నిలువునా మోసం చేస్తుందన్నారు. వై కుమార్గౌడ్, ముసిపట్ల విజయ్, పెండ్లి మల్లారెడ్డి, మడ్లపల్లి సునీత, గైని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి సాయం చిల్పూరు: కొండాపూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి దాత బంగారి రెడ్డి కుమారుడు పింగిళి యోగానందరెడ్డి రూ.2.40 లక్షల విరాళం అందజేశారు. కాగా, శుక్రవారం విరాళంతో ఆలయ కమిటీ ఆలయంలో రేకులషెడ్ను నిర్మించింది. అభినందనీయం దేవరుప్పుల: ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతి కోసం పూర్వవిద్యార్థుల తోడ్పాటు అభినందనీయమని ఎంఈఓ జి.కళావతి అన్నారు. శుక్రవారం చిన్నమడూరు ఉన్నత పాఠశాలలో 1993–94 పదోవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పాఠశాలకు బీరువా, పోడియం బహూకరించారు. గోదావరి జలాలతో చెరువులు నింపుతాం బచ్చన్నపేట: గోదావరి జలాలతో చెరువులను, కుంటలను డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి చొరవతో నింపుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇజ్జగిరి రాములు అన్నారు. శుక్రవారం లక్ష్మాపూర్ గ్రామం వద్ద ఉన్న గోదావరి పైపులైన్ డెలివరీ పాయింట్ నుంచి బండనాగారం గ్రామ చెరువు, కుంటలకు వెళ్లే కాల్వకు మరమ్మతు పనులు చేయించారు. దేవస్థాన మాజీ చైర్మన్ చల్ల సురేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీధర్రెడ్డి, ప్రవీణ్ ఉన్నారు. ఆస్పత్రి ఆవరణలోకి పాము స్టేషన్ఘన్పూర్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోకి శుక్రవారం పాము రావడంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఘన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని శుక్రవారం ఓ పాము రావడంతో అక్కడ ఉన్న రోగులు గమనించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే విషయాన్ని వైద్య సిబ్బందికి తెలుపగా వారు పాములు పట్టే స్నేక్ క్యాచర్ రమణాకర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అతడు ఆసుపత్రికి చేరుకుని పామును పట్టుకోవడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. -
ఘనంగా ‘పల్లా’ జన్మదిన వేడుకలు
సాక్షి నెట్వర్క్: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కాగా, జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా, 50 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం దానం చేశారు. ప్రముఖ వైద్యుడు పగిడిపాటి సుధసుగుణాకర్రాజుతో పాటు పలువురు రక్తదానం చేశారు. అలాగే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాపురం ఆంజనేయస్వామి దేవాలయంలో మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం
జనగామ: పట్టణంలోని 12వ వార్డులో శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిట్ల అంజమ్మ, పళ్ళ రమ, వంగ యుగేందర్, ఎనగందుల వెంకటేష్, శ్రీరామ్ శ్రీనివాస్, వెంకటేష్, సమ్మయ్య, కుడికాలు రాజు ఉన్నారు. ‘దేవాదుల’ నుంచి నీటిని విడుదల చేయాలి స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్కు చెందిన ఛాగల్లు పంప్హౌజ్ నుంచి ఛాగల్లు, విశ్వనాథపురం, ఇప్పగూడెం, పాలకుర్తి తదితర ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని ఛాగల్లు మాజీ ఎంపీటీసీ కనకం స్వరూప, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గణేష్ డిమాండ్ చేశారు. ఛాగల్లు పంప్హౌజ్ కెనాల్ నుంచి రిజర్వాయర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో రైతులతో కలిసి వారు శుక్రవారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం దున్నకాలు, వరినాట్ల సమయం కావడంతో సాగునీరు అందక ఛాగల్లు, విశ్వనాథపురం, ఇప్పగూడెం తదితర ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వేసిన వరినాట్లు, పత్తి మొక్కలు ఎండిపోతున్నాయని, కనీసం పశువులకు సైతం నీరు లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారన్నారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించాలని, ఛాగల్లు పంప్హౌజ్ కెనాల్ నుంచి నీరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. -
సంక్షిప్త సమాచారం
పరామర్శ పాలకుర్తి: ఇటీవల కాలుకి ఆపరేషన్ చేసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వావివాలకు చెందిన రాష్ట్ర దివ్యాంగుల సమితి జిల్లా అధ్యక్షుడు రావుల సత్యనారాయణను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుక్రవారం పరిమర్శించారు. అలాగే గ్రామంలో మృతి చెందిన కూనబోయిన కోమురయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రావులసతీష్, అనపర్తి యాకూబ్లను పరామర్శించారు. అలాగే పాడిశెట్టి మహేందర్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. నివాళి జనగామ: జనగామ పట్టణ సీనియర్ జర్నలిస్టు మాదంశెట్టి శివకుమార్ తల్లి మనమ్మ (90) మృతి చెందింది. కాగా, శుక్రవారం ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్, కోశాధికారి బెజుగం భిక్షపతిలు మనమ్మ మృతదేహంపై పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించారు. తండాలను బమ్మెరలో చేర్చాలి పాలకుర్తి: 2018 వరకు బమ్మెర ఎంపీటీసీ స్థానంలో ఉన్న తమ తండాలను బమ్మెరలోనే చేర్చాలని గిరిజన సంఘం నాయకుడు రమేష్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎన్నిక రఘునాథపల్లి: మండలంలోని దాసన్నగూడెం గ్రామానికి చెందిన బొక్క రామచంద్రయ్య టీడీపీ మండల అధ్యక్షుడిగా మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మండల కేంద్రంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల మల్లేష్, రాష్ట్ర నాయకులు ఎండీ జహంగీర్, ఉమ్మగోని నర్సయ్యల సమక్షంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామచంద్రయ్య, ఉపాధ్యక్షులు సత్తయ్య, తానాజీ, ఈర్యానాయక్, మండల ప్రధాన కార్యదర్శి కొంగరి నర్సింగరావు, ప్రచార కార్యదర్థి వీరస్వామి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బండి సంజయ్ జన్మదిన వేడుకలు జఫర్గఢ్: కేంద్రమంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లుపంపిణీ చేశారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోచయ్య సేవలు మరువలేనివి బచ్చన్నపేట: కొన్నె గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వేముల పోచయ్య మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంగౌడ్ అన్నారు. శుక్రవారం పోచయ్య మృత దేహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. కొడవటూర్ దేవస్థాన చైర్మన్ మల్లారెడ్డి, జంగిటి విద్యానాథ్, వెంకట్రెడ్డి, ఎల్లయ్య, బాలకిషన్గౌడ్, ఆగయ్య, సిద్దిరాములు, అంజి, మహేందర్, బిక్షపతి, చంద్రయ్య ఉన్నారు. శ్రీనివాస్జీ సేవలు.. దేవరుప్పుల: రాజకీయాలకతీతంగా బడుగుల అభ్యున్నతి కోసం పాటుపడిన శ్రీనివాస్జీ సేవలు మరువలేనివని తెలంగాణ గిరిజన కార్పొరేషన్ స్టేట్ మాజీ చైర్మన్ మోహన్ గాంధీనాయక్ అన్నారు. శుక్రవారం కడవెండి పడమటి తోట ప్రాంగణం వద్ద మాజీ సర్పంచ్ అస్నాల శ్రీనివాస్జీ వర్ధంతి పురస్కరించుకొని ఆయన స్మారక స్థూపానికి కుటుంబ సభ్యులు తదితరులు నివాళులర్పించారు. ‘స్థానికం’లో కాంగ్రెస్ సత్తా చూపాలి కొడకండ్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చే అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి సత్తాను చూపాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ధరావత్ సురేష్నాయక్ కోరారు. శుక్రవారం హక్యతండాలో నిర్వహించిన ఎంపీటీసీ క్లస్టర్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తహసీల్దార్ను కలిసిన నాయకులు రఘునాథపల్లి: రఘునాథపల్లి తహసీల్దార్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఫణికిషోర్ను శుక్రవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్ కార్యాలయంలో బొకేలు, శాలువాలతో సత్కరించారు. మారుజోడు రాంబాబు, లింగాల జగదీష్చందర్రెడ్డి, కోళ్ల రవి, మేకల నరేందర్ ఉన్నారు. ఆర్థికసాయం జఫర్గఢ్: మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన పేద విద్యార్థిని యాతం సంధ్యారాణికి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి పంపిన రూ.5 వేల సాయం మాజీ ఎంపీటీసీలు ఇల్లందుల స్రవంతి మొగిళి, బాదవత్ దేవేందర్నాయక్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సంధ్యారాణి ఇంటర్ ఫలితాల్లో మండల స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి ఎంసెట్లో ప్రతిభ కనబరిచిందన్నారు. పై చదువులకు బ్రహ్మారెడ్డి ఆర్థికసాయం అందజేయడం అభినందనీయమన్నారు. మాజీ వార్డు సభ్యులు కాట సుధాకర్, ఎల్లయ్య, పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి.. బచ్చన్నపేట: అనారోగ్యంతో బాదపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు తేలుకంటి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సామాజిక సేవా కర్త కోడూరి శివకుమార్ గౌడ్ రూ. 5వేల సాయం అందజేశారు. క్రీడాకారిణికి.. చిల్పూరు: పల్లగుట్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న క్రీడాకారిణి కోల సాయిప్రియ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. కాగా, సాయిప్రియకు చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు శుక్రవారం ఆర్థికసాయం పంపగా హెచ్ఎం పెనుమాటి వెంకటేశ్వర్లు అందజేశారు. హెచ్ఎం మాట్లాడుతూ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొన్న సాయిప్రియ ప్రతిభ కనబరిచి ఆగస్టులో బిహార్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్రావుకు వ్యాయామ ఉపాధ్యాయుడు దేవ్సింగ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, చిర్ర వెంకటేశ్వర్లు, జీడి ఆనందంలు కృతజ్ఞలతు తెలిపారు. కాల్వకు మరమ్మతు చిల్పూరు: సాగునీటి సమస్యను పరిష్కరించాలని పల్లగుట్ట గ్రామానికి చెందిన చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యంలో రైతులు ఈనెల 9వ తేదీన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కాగా, శుక్రవారం అధికారులు గ్రామంలోని బర్రెంకల చెరువు నుంచి వెంకటాద్రి చెరువు వరకు వెళ్లే కాల్వకు పొక్లెయినర్తో మరమ్మతు పనులు చేయించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించాలి బచ్చన్నపేట: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఎలగందుల బార్గవి–శేఖర్ దంపతులు రూ.5వేల విరాళం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి’ కొడకండ్ల: ఉనికిని కాపాడుకొనేందుకై బీఆర్ఎస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, ధరావత్ సురేష్నాయక్ అన్నారు. రామేశ్వరం గ్రామ పరిధిలోని పలుగుల తండాకు చెందిన ఎస్టీ సెల్ నాయకులు సురేష్నాయక్, నరేష్నాయకులు శుక్రవారం తిరిగి సొంతగూటికి చేరగా వారు కండూవాలు కప్పారు. కార్యక్రమంలో శ్రీనునాయక్ పాల్గొన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు దేవరుప్పుల: మండలంలోని వాగు పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు అనివార్యమని ఎస్సై ఊర సృజన్కుమార్ అన్నారు. శుక్రవారం గొల్లపల్లిలో వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరిస్తున్న తీగల వెంకన్న పై కేసు నమోదు చేశామని, ట్రాక్టర్ సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. -
నిర్మాణాల్లో నిబంధనలు తప్పనిసరి
● హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ ప్రీతితరిగొప్పుల: ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాలని హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ ప్రీతి సూచించారు. ఎంపీడీఓ ఆలేటి దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ మండలానికి ఎమ్మెల్యే కోటా కింది 62 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సమక్షంలోనే ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయాల్సిందిగా సూచించారు. ఎస్సై గుగులోత్ శ్రీదేవి, ఏపీఎం విజయ, ఎంపీఓ మాలతి, పింగిళి జగన్మోహన్రెడ్డి, తాళ్లపల్లి రాజేశ్వర్గౌడ్, చిలువేరు లింగం,బూస యాదగిరి, ముద్దసాని వెంకట్రెడ్డి, సాయిల్ల రాజు, రాచకొండ సంపత్,మర్రికుమార్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ నర్మెట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుక్రవారం ఎంపీడీఓ బోడపాటి అరవింద్ చౌదరి మంజూరు పత్రాలను అందజేశారు. తొలి విడతలో 106 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోటాలో ఇళ్లను అధికారులు మంజూరు చేశారు. నర్మెట–19, ఆగాపేట–6, అమ్మాపురం–7, డీసీ తండా–3, గండిరామారం–6, హన్మంతాపురం–10. గుంటూర్పల్లి–3, ఇప్పలగడ్డ–7, ఇసుకబాయితండా–2, కన్నెబోయిన గూడెం–4, లోక్యతండ–3, మచ్చుపహాడ్–8, మల్కపేట–6, మాన్సింగ్తండా–7, సూర్యబండతండా–4, వెల్దండ–11, కాగా బొమ్మకూర్ పాయిలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. కార్యక్రమంలో జూనియర్ అస్టిస్టెంట్ రవిందర్, పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో.. జనగామ రూరల్: మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్థిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. మండలంలోని 20 గ్రామ పంచాయితీల్లో ఎంపికై న 119 మంది లబ్ధిదారులకు ఎంపీడీఓ సంపత్కుమార్ ఆధ్వర్యంలో జీపీ కార్యదర్శులు లబ్ధిదారులకు అందజేశారు. హౌజింగ్ ఏఈ మఽధు, జూనియర్ అసిస్టెంట్ సృజన పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక సౌకర్యాలతో పాటు అర్హత కల్గిన ఉపాధ్యాయులచే విద్యాబోధన అందిస్తున్నారని, ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని స్టేషన్ఘన్పూర్ ఎస్సై మనీష అన్నారు. పాంనూర్ మండల పరిషత్ యూపీఎస్ను ఎస్సై శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు సిరికొండ కుమారస్వామి ముగ్గురు పిల్లలను అదే పాఠశాలలో చేర్పించిన విషయం తెలుసుకుని ఉపాద్యాయుడిని, పిల్లలను ఎస్సై అభినందించారు. హెచ్ఎం రఘుప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఓటరుగా నమోదు చేయించాలి
● ఆర్డీఓ గోపీరామ్బచ్చన్నపేట: 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేయించాలని జనగామ ఆర్డీఓ గోపీరామ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో బీఎల్ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తహసీల్దార్ రామానుజాచారి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, ఎంఆర్ఐలు వంశీ కృష్ణ, మున్వర్, ఆయా గ్రామాల బీఎల్ఓలు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి తరిగొప్పుల: రాబోయే స్థానిక సంస్థలు ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఏడెల్లి శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు నెలాఖరులోగా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు.ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని పిలుపున్చిరు. మండల అభివృద్ధికి కృషి దేవరుప్పుల: మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎంపీడీఓ టి సురేష్కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల ఎంపీడీఓగా ఉన్న కె.లక్ష్మీనారాయణ ఉద్యోగ విరమణ పొందడంతో ఎంపీఓ కొనసాగుతున్న టి.సురేష్కుమార్కు జిల్లా సీఈఓ.. ఎంపీడీఓగా ఉత్తర్వులు జారీ చేయడంతో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా మండల పరీశీలనకు వచ్చిన డీపీఓ స్వరూప శుభాకాంక్షలు తెలిపారు. -
ఆయిల్పామ్ సాగుపై రైతుల ఆసక్తి
లింగాలఘణపురం: జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారని, వచ్చే మూడేళ్లలో ఎక్కువ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం మండలంలోని నెల్లుట్లలో చిట్ల జ్ఞానేందర్రెడ్డికి చెందిన 12 ఎకరాల భూమిలో మెగా ఆయిల్పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యానవనశాఖ, వ్యవసాయశాఖ, ఆయిల్ఫెడ్ సహకారంతో మూడేళ్లుగా 6,500 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 3,500 ఎకరాలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే 734 ఎకరాలను సాగు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఆయిల్పామ్ సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని, జిల్లాలో 40 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటు, కార్యకలాపాల నిర్వహణకు భవ నం మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యా న శాఖ అధికారి శ్రీధర్రావు, డీఏఓ రామరావునాయక్, ఆయిల్ఫెడ్ జిల్లా మేనేజర్ శంకర్, ఏఓ వెంకటేశ్వర్లు, రైతులు వంచ మనోహర్రెడ్డి, చిట్ల ఉపేందర్రెడ్డి, సుధీర్రెడ్డి పాల్గొన్నారు. అర్హులకు పింఛన్లు అందించాలి జనగామ రూరల్: అర్హులందరికీ పింఛన్లు అందా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువా రం కలెక్టరేట్లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్లు, పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది, టెక్నికల్ స్టాఫ్, ఎన్ఎఫ్బీఎస్ సిబ్బందికి చేయూత పింఛన్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్స్ స్కీం అమల్లో జిల్లాను ముందంజలో నిలబెట్టాలన్నారు. అర్హుల వివరాలను పోర్టల్లో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 769 మంది అర్హులైన లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వానికి పంపగా.. అందులో 576 మందికి రూ.20,000 చొప్పున మంజూరయ్యాయని తెలిపారు. సెర్ప్ పెన్షన్ విభాగం డైరెక్టర్ గోపాల్ రావు వివిధ రకాల పింఛన్ అర్హతలో సాంకేతిక సమస్యలు స్పౌజ్, డార్మెంట్ అకౌంట్స్, శాశ్వత వలస తదితర అంశాలపై జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు చేయాల్సిన పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, డీఆర్డీఓ వసంత, అదనపు డీఆర్డీఓ నూరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. ఉపాద్యాయుల ధ్రువపత్రాల పరిశీలన జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ పాఠశాలలో గెజిటెడ్ హెడ్ మాస్టర్ పదోన్నతుల కోసం జరుగుతున్న ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రక్రియ వివరాలు విద్యాశాఖాధికారి భోజన్న ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపెన్ స్కూల్కి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికను విడుదల చేశారు. కార్యక్రమంలో స్టేట్ కోర్డినేటర్ మాధవి, ఉల్లాస్, టాస్ ఇన్చార్జ్ శంకర్ రావు, జిల్లా పరీక్షల సెక్రెటరీ చంద్రభాన్, రవి, నాగరాజు పాల్గొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఆయిల్పామ్ సేకరణ కేంద్రం 40 ఎకరాల్లో నర్సరీ, జిల్లా కేంద్రంలో మానిటరింగ్కు భవనం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా -
భవిష్యత్పై బాధ్యతతో తీసుకున్న నిర్ణయం
పాలకుర్తి టౌన్: మా జీవితం చిన్నదే కానీ, లక్ష్యం స్పష్టంగా ఉంది. మా కుమార్తెకు ఉత్తమ చదువు, ఆరోగ్యం, స్వేచ్ఛతో కూడిన భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కూతురు చాలనుకున్నాం. పెరుగుతున్న ఖర్చులు, స్కూల్ ఫీజులు, హెల్త్ చెకప్స్ అన్నీ చూస్తుంటే, నాణ్యతతో జీవితం ఇవ్వడం ఒక్కరితోనే సాధ్యమవుతుంది. ఒక బిడ్డ అయితే మరింత ప్రేమ, మరింత శ్రద్ధ చూపే అవకాశం దొరుకుతుంది. భవిష్యత్లో పిల్లలకు అవకాశాలు తగ్గకుండా ఉండాలంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయం అందుకు అనుగుణంగా ఉండాలి. – దేవగిరి రేణుక– నాగరాజు, పాలకుర్తి, అర్చకుడు -
నాడు ఆదర్శం.. నేడు విచ్ఛిన్నం
కనుమరుగవుతున్న ఉమ్మడి కుటుంబాలునేడు ప్రపంచ జనాభా దినోత్సవంపాశ్చాత్య పోకడలతో దూరమవుతున్న ప్రేమ, అనుబంధాలు కుటుంబ పోషణ, చదువు, ఇతర ఖర్చుల భారంపొద్దన లేచింది మొదలుకుని రాత్రి పడుకునే వరకు ఇళ్లంతా సందడి.. కడుపులో ముద్ద వేసామంటే ఎవరిపనికి వారు వెళ్లడం.. సాయంత్రానికి ఇంటికి చేరడం... అందరి సంపాదన ఇంటిపెద్ద చేతిలో పెట్టే ఆనాటి ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. సంపాదన తక్కువ ఉన్నా క్రమశిక్షణతో పిల్లలను పోషించడంలో ఉమ్మడి కుటుంబాలు సక్సెస్ అయి ఆదర్శంగా నిలిచాయి. కానీ, రెండున్నర దశాబ్దాలుగా ఉమ్మడి కుటుంబాల్లో వేరుకుంపటి మొదలైంది. పిల్లల కార్పొరేట్ చదువులు.. భార్య, భర్త ఉద్యోగం వంటి కారణాలతో వేరుకుంపటి అనివార్యంగా మారింది. దీంతో బంధాలు, అనుబంధాలు అంటే పిల్లలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. కానీ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆనాటి ఉమ్మడి కుటుంబాలు నేటికీ సంతోషంగా ఉంటున్నాయి. కానీ, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు, పిల్లలను పెంచే ఓపిక, ఆలనా పాలనా చూసుకునే పెద్ద దిక్కులు లేకపోవడంతో ఒక్కరు, లేదా ఇద్దరితోనే సరిపుచ్చుకుంటున్నారు. ఈనేపథ్యంలో నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.స్టేషన్ఘన్పూర్: ఈ ఫొటోలో కనిపిస్తున్నది స్టేషన్ఘన్పూర్ మండలంలోని రంగరాయగూడెం గ్రామానికి చెందిన ఐత వీరేశం కుటుంబం. గ్రామానికి చెందిన ఐత రామయ్య, ద్రాక్షమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. రామయ్య చిన్న కిరాణాషాపు నిర్వహిస్తూ పది మంది సంతానాన్ని పోషించారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటూ అందరి వివాహాలు జరిపించారు. పదేళ్ల క్రితం రామయ్య మృతి చెందగా, ద్రాక్షమ్మ ఏడాది క్రితం మృతి చెందారు. అయినప్పటికీ ఐదుగురు అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంగా గ్రామంలోనే కలిసి ఉంటున్నారు. వారి వ్యాపారాలు వేరైనా అందరూ ఒకే ఇంట్లో నివాసముంటూ ఇప్పటికీ రాత్రి భోజనాలు కలిసే చేస్తారు. పెద్దన్న వీరేశం మాట మిగిలిన నలుగురు తమ్ములు ఏనాడు జవదాటకుండా ఉంటూ గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. – జనగామ -
ఆడపిల్ల కోసమని ఐదుగురిని కన్నా
దేవరుప్పుల: ఇంటికి ఆడపిల్ల కావాలని ఐదుగురురు కొడుకుల్ని కన్నాను. ఐదుగురు కొడుకులు పుట్టినంక వేరుపడేస్తే అర ఎకరం వ్యవసాయంతో సంసారం మొదలైంది. నా భర్త, నేను కూలీ చేసుకుంటూ పిల్లలను పెంచాం. నలుగురు కొడుకుల్ని జీతాలు ఉంచాం. చెప్పిన పని చేసిండ్రు. అందరి పెళ్లిల్లు చేసి మనిషికి ఎనిమిది ఎకరాల జాగ అప్పజెప్పినం. ఇప్పుడు పెద్దోడికి ముగ్గురు పిల్లలు కాగా మిగితా వారికి ఇద్దరు చొప్పున పిల్లలు ఉన్నరు. పదకొండు మంది (మనవళ్లు, మనవరాళ్లు)లో ఏడుగురి పెండ్లిళ్లు చూసిన, ఇంక నలుగురి పెళ్లి చూస్తే ఈ జన్మకు ఇక చాలు. నా కొడుకులు ఐతే మంచిగా బతుకుతుండ్రు. ఏ ఇంట్లో కార్యమైన కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, కొత్త ఇయ్యం అందుకున్న చుట్టాలు కలిస్తే పెండ్లంత సందడి. వామ్మో ఇప్పుడు ఒక్కరిద్దరు చాలని ఆపరేషన్ చేసుకుంటుండ్రు. ఐనా ఎనుకటి పిల్లలకు ఇది కావాలి, అది కావాలనే స్వార్థంలేదు. ఇప్పుడు పుట్టగానే బాయిలర్ కోళ్లలాగా సాదుతుండ్రు. అయ్య, అవ్వ ఆస్తిని ఆక్రమించుకోవాలనే చూస్తుండ్రు. – తోటకూరి సోమనర్సమ్మ, దేవరుప్పుల -
వివరాలు 8లో
ఓరుగల్లులో తగ్గిన జననాల రేటు రాష్ట్ర జననాల సగటులో 13వ స్థానంలో ఉమ్మడి జిల్లా ● 2011 నుంచి జననాల రేటు తగ్గుముఖం... ఐదేళ్లలో పుట్టింది 70 వేల మందే.. ● ఇలాగైతే వచ్చే ఇరవై ఏళ్లలో పెరగనున్న సీనియర్ సిటిజన్లు ● ఆందోళన కలిగిస్తున్న జననాల సంఖ్య... – సాక్షిప్రతినిధి, వరంగల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి ● అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
అంతకంటే ఎక్కువ వద్దంటున్న యువ జంటలు
ఉమ్మడి కుటుంబంలో ఉంటేనే సంతోషం ● ‘సాక్షి’ సర్వేలో స్పష్టీకరణ 1. మీరు ఎంత మంది పిల్లలను కనాలనిఅనుకుంటున్నారు?3. పెళ్లి చేసుకున్నాక పిల్లలను కనే ప్లాన్ ఎలా చేస్తారు? 2. ఉమ్మడి కుటుంబమా.. ఒంటరిగా ఉండడం ఇష్టమా? ఉమ్మడి కుటుంబం భార్యాభర్తలు విడిగా ఉండడంభార్యాభర్తలు జాబ్ చేయడం వల్ల పిల్లలను చూసుకునే వారు లేక ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని..4. ఈ తరంలో ఒక్కరు, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు ఎందుకు? 401510051626362024‘ఒక్కరు.. లేదా ఇద్దరు పిల్లలు చాలు. అంతకంటే ఎక్కువ మందిని కనే పరిస్థితులు లేవు. ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని అంటున్నాయి యువజంటలు. దీంతోపాటు ఉమ్మడి కుటుంబం ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశాయి. మారిన జీవన పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో ఈ తరం ఒక్కరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. కానీ వచ్చే ఇరవై ఏళ్లలో యువజనుల జనాభా తగ్గి, సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరుగుతుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురికి పైగా.. బిడ్డల్ని కనాలన్న సూచనలు వస్తున్నాయి. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనే విషయంలో యువజంటలు ఏమంటున్నాయి.. వీరితో పాటు 25 ఏళ్ల పైబడి వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారి మనోగతంపై ‘సాక్షి’ గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అంశాలపై సర్వే నిర్వహించింది. – సాక్షి నెట్వర్క్ -
జీఎంసీ ప్రిన్సిపాల్ బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ మెడికల్ కళాశాల ప్రిన్సి పాల్గా ఫ్రొఫెసర్ డాక్టర్ నాగమణి(మైక్రో బయాలజీ) గురువారం బాధ్యతలను స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మెడికల్ కళాశాలలో మైక్రో బయాలజీ ఫ్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె, బదిలీపై ఇక్కడకు వచ్చారు. పాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ అన్వర్, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ అనురాధ, పిడియాట్రిక్స్ ప్రొఫెసర్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్రెడ్డి, అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ జితేంద్ర, ఆప్తాల్మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పద్మిని, ఫిజియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ, ఎస్పీఎం అసోసియేట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు ఆమెను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి జనగామ రూరల్: సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి డాక్టర్ విక్రమ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత పరీక్ష జూలై 13వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించి హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత వసతి, భోజనంతో 10 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నీటిని ఒడిసి పట్టండి లింగాలఘణపురం: ప్రతి సబ్సెంటర్లలో ఇంకుడు గుంతలను నిర్మించి నీటిని ఒడిసి పట్టాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు సూచించారు. మండలంలోని నెల్లుట్ల సబ్సెంటర్లో నిర్మించిన ఇంకుడు గుంతను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అవకాశం ఉన్న ప్రతి చోట ఇంకుడు గుంతలను నిర్మించాలని సిబ్బందికి చెప్పారు. తద్వారా భూగర్భజలాలు పెరిగి ప్రజలకు ఉపయోగపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి స్వర్ణలత, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. బోగస్ హామీలతో కాంగ్రెస్ మోసం ● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకొడకండ్ల: సార్వత్రిక ఎన్నికల్లో బోగస్ 420 హామీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలకేంద్రంలో బీఆర్ఎస్ నూతన పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించిన అనంతరం సిందె రామోజీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దయాకర్రావు మాట్లాడారు. తెలంగాణలో బ్లాక్ మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడువడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోసపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కే 80 శాతం అనుకూలంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. రామేశ్వరం గ్రామ కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్య నరేష్తోపాటు పలువురు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ బబ్బూరి శ్రీకాంత్గౌడ్, పేరం రాము, అభిమన్గాంధీ, సోమరాములు, జ్యోతి, రాజిరెడ్డి, విజయమ్మ, సతీష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘నీట్’లో జనగామ విద్యార్థినికి ఉత్తమ ర్యాంకు జనగామ: వైద్యవృత్తి కోర్సు అభ్యసన కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు బొగ్గారపు శ్రీనివాసు, వాణిశ్రీ కుమార్తె బొగ్గారపు సాయి సంయుక్త జాతీయ స్థాయిలో 5,153, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 164 ర్యాంకు సాధించారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాల్సిందే..
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం లేబర్కోడ్లు రద్దు చేయాల్సిందేనని, లేదంటే కార్మికులు ఆగ్రహా నికి గురికాకతప్పదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న హెచ్చరించారు. బుధవారం కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ, జా డు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రిస్టన్ గ్రౌండ్ నుంచి నెహ్రూపార్క్ వరకు ర్యాలీ చే పట్టారు అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వేము ల నర్సింగం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రాజారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్నలు మాట్లాడారు. బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, దే శంలో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కా ర్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకురావడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది గంటల పనిని 10 గంటలకు పెంచే జీఓ 282ను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సుంచు విజేందర్, భూక్య చందు నాయక్, జేరుపోతుల కుమార్, శ్రీదేవి, రాధ, యాకుబ్, కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ -
ప్రాథమిక స్థాయిలోనే డిజిటల్ తరగతులు
జనగామ: ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో డిజిటల్ తరగతులను అమలు చేస్తుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులకు వచ్చే నిరుపేద పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు వేసే విధంగా ముందుకు వెళుతుంది. గణితాన్ని సులభంగా పరిచయం చేయడంతో పాటు చిత్రాల ద్వారా కూడిక, తీసివేతల లెక్కలపై పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ కేంద్రం (ఎస్సీఈఆర్టీ) ద్వారా బుధవారం టీ–శాట్ నిపుణుల ద్వారా ప్రాథమిక ప్రాథమికో న్నత పాఠశాలల్లో గణిత శాస్త్ర బోధనపై అవగాహన కల్పించారు. వర్చువల్ పద్ధతిలో జిల్లాలోని 348 ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా పాల్గొన్నారు. ట్యాబ్ల అందజేత సీఎం రేవంత్రెడ్డి ఆలోచనకు అనుగుణంగా విద్యశాఖ అధికారులు ఎస్సీఈఆర్టీ భాగస్వామ్యంతో డిజిటల్ అక్షరాస్యతకు శ్రీకారం చుట్టింది. వీటిని స మర్థవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయుల కు ట్యాబ్లను అందించింది. వీటితో గణితం వంటి సబ్జెక్ట్లకు అనుసంధానం చేసి, ప్రాథమిక స్థాయిలో డిజిటల్ నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తుంది. వర్చువల్ పద్ధతిలో నిపుణుల బోధన -
పసుపు అలంకరణలో రేణుకా ఎల్లమ్మ
జనగామ: ఆషాఢమాసం పర్వదినం పురస్కరించుకుని పట్టణంలోని బాలాజీనగర్ రేణుకా ఎల్లమ్మ తల్లి పసుపు (హిరణ్యం) అలంకరణలో బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. కాలనీవాసులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. నేడు శాకంబరీ ఉత్సవాలు పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేడు (గురువారం) శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. శ్రీచండిక అమ్మవారి దేవాలయంలో పార్వతీదేవి శాకంబరీ దేవిగా అలంకరిస్తారన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పెన్షన్దారులను మోసం చేస్తున్న ప్రభుత్వంజనగామ రూరల్: పెన్షన్దారులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఆగష్టు 13న నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ పెన్షన్దారుల గర్జనకు లక్షలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పైస రాజశేఖర్, తాళ్లపల్లి కుమార్, బిర్రు నగేష్, ఇనుముల నర్సయ్య, రవీందర్, శాంసన్ నిర్మలా భాస్కర్, గువ్వల రవి తదితరులు పాల్గొన్నారు.దేవాలయాల పరిశీలనపాలకుర్తి టౌన్: ధూప దీప నైవేద్యం పథకాన్ని అమలు చేయడానికి త్రిసభ్య కమిటీ సభ్యులు బుధవారం పాలకుర్తి మండలంలోని వల్మిడి, మంచుప్పుల, ఎల్లరాయిని తొర్రూరులోని ఆ లయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మీ మా ట్లాడుతూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమి షన్ ఆదేశాల మేరకు జిల్లాలో 45 దేవాలయాలు ధూప దీప నైవేద్యం పథకం కోసం దరఖా స్తు చేసుకున్నాయన్నారు. ఆయా ఆలయాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రిస భ్య కమిటీ సభ్యులు దేవగిరి అనిల్కుమార్, త్రిపురారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.ఆస్పత్రి సూపరింటెండెంట్గా బాధ్యతల స్వీకరణజనగామ: జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్గా ప్రొఫెసర్, డా క్టర్ రాజలింగం బుధవారం బాధ్యతలను స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ ప్రొఫెసర్గా పని చేస్తున్న ఆయనను జనగామ డీహెచ్ సూపరింటెండెంట్గా బదిలీ చేశారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ గోపాల్రెడ్డి సమక్షంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మధుకర్, అనురాధ, వైద్య సిబ్బంది పాల్గొని నూతన సూపరింటెండెంట్ను శాలు వాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు.ట్రెజరీ అధికారిగా అన్వర్ హుస్సేన్..జనగామ రూరల్: జిల్లా ట్రెజరీ అధికారిగా ఎండీ అన్వర్ హుస్సేన్ బుధవారం బాధ్యతల స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. -
ముందుకు సాగట్లే.. !
ఉమ్మడి జిల్లాకు కలిసిరాని వానాకాలం ● గత సీజన్లో ఇప్పటికే 74శాతం.. ఈ సారి 34.50 శాతానికే పరిమితం ● సాగు అంచనా 15.83 లక్షల ఎకరాలు.. ఇప్పటికీ అయ్యింది 5.46 లక్షల ఎకరాలు ● లోటు వర్షపాతం ఖాతాలో ఆరు జిల్లాలు ● కష్టకాలంలో పత్తి సాగువైపే మొగ్గు... వరి సాగుపై వేచి చూసే ధోరణిసాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్షాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు సిద్ధం చేసుకుని నారు పోసుకున్నారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చాలా వరకు పత్తి, మొక్కజొన్న విత్తనాలు భూమిలో ఎండిపోగా.. పొలాలు దున్నిన రైతులు సైతం ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. వానాకాలం మొదలై రెండు మాసాలు నడుస్తున్నా.. ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. దీంతో జలాశయాలు, చెరువులకు నీరు చేరక.. పెరిగిన భూగర్భజలాలు కూడా అంతంతే కావడంతో రైతులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదును దాటుతున్నా సాగు 34.50 శాతమే.. మే 28, 30 తేదీల్లో ముందస్తుగానే వర్షాలు పడటంతో సాగు విస్తీర్ణం అంచనాలు దాటుతుందని అందరూ భావించినా.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో 14.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావించగా, 15.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. గత సాగును దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్లో 15,82,755 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి సాగు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇదే సమయానికి 74 శాతం వరకు పంటలు వేయగా.. అదును దాటుతున్న ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 5,46,138 (34.50 శాతం) ఎకరాల్లోనే సాగు చేశారు. ముందస్తుగా ఒకటి రెండు వర్షాలు పడినా..ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల ఈసారి ఆశించిన మేరకు సాగు పెరగలేదని, అయితే ఇంకా సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో 2025–2026 వానాకాలం సాగు అంచనా, సాగు లెక్క ఇదీ..మొత్తం సాగు అంచనా ఎకరాలు5,46,138 మొత్తం సాగు శాతం : 34.50 శాతం15,82,755 ఇంకా లోటు వర్షపాతమే... వరి సాగు 6.39 శాతమే.. జనగామ జిల్లాల్లో 47 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 30 శాతం లోటు వర్షపాతం ఉండగా.. మహబూబాబాద్లో సాధారణ వర్షాపాతానికంటే 18 శాతం తక్కువగా నమోదైంది. అలాగే వరంగల్లో 23, ములుగులో 32, హనుమకొండలో 30శాతం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే సాగు తగ్గినా.. రైతులు కష్టకాలంలోనూ వర్షాధార పంటగా పత్తిని ఎంచుకున్నారు. 5,76,863 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,07,554 (70.28 శాతం) ఎకరాల్లో వేశారు. కాగా 8,78,376 ఎకరాల వరిసాగు అంచనాకు కేవలం 56,155 (6.39 శాతం) ఎకరాల్లోనే వరి పంటలు వేయడం ఈసారి ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతోంది. -
పదోన్నతులకు వేళాయె
జనగామ: రాష్ట్రంలోని ఉన్నత, ప్రాథమికో న్నత పాఠశాలల్లో పని చేస్తున్న అర్హత కలిగి న స్కూల్ అసిస్టెంట్ల(ఎస్ఏ) పదోన్నతి ప్రక్రియ పట్టా లెక్కింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను విద్యాశాఖ మొదలు పె ట్టగా, సర్కారు నుంచి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. సీనియర్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ హెచ్ఎంగా పదోన్నతి పొందిన తర్వాత మల్టీజోన్–2 పరిధిలో (14 జిల్లాలు) బదిలీ కావా ల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో సీని యార్టీ జాబితాను తయారు చేసిన తర్వా త, జిల్లాల వారీగా ఉన్న ఖాళీలను పరిగణలోకి తీ సుకుని పోస్టింగులను ఇస్తారు. మొదటి విడత మ ల్టీజోన్ పదోన్నతి, బదిలీల సమయంలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి 2 నుంచి 400కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తు తం ఉన్న జీహెచ్ఎంలను బదిలీలు చేసిన తర్వాత, పదోన్నతులు చేపడితే ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల వాదన. పదోన్నతికి 163 స్కూల్ అసిస్టెంట్లు.. జిల్లాలో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు 167 ఉన్నాయి. ఈ పాఠశాలల పరిధిలో గెజిటెడ్ హెచ్ఎంకు అర్హత కలిగిన 163 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ ఏ) ఉన్నారు. 2009లో పదోన్నతుల ప్రక్రియ జరుగగా, వరుసగా 2011, 2013, 2015లో క్రమం తప్పకుండా నిర్వహించారు. 9 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత అనేక పోరాటాల ఫలితంగా 2024 జూన్ 12వ తేదీన 2001 సీనియార్టీ ప్రకారం ఎస్ఏలకు మల్టీజోన్–2 గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించి, బదిలీ చేశారు. ఏడాది తర్వాత రెండోసారి పదోన్నతుల ప్రక్రియకు కదలిక వచ్చింది. కానీ ప్ర భుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం 2022 డిసెంబర్ 31వ తేదీ వరకు ఎస్ఏగా సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతికి అర్హతగా లెక్కించనున్నారు. పదోన్నతుల సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, జనరల్ కోటలో రిజర్వేషన్ల ఆధారంగా సీనియార్టీ జాబితాను తయారు చేస్తారు.సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు నేడు ప్రెస్టన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జిల్లాలో 163 సీనియర్ స్కూల్ అసిస్టెంట్లునేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జిల్లా కేంద్రం హనుమకొండరోడ్లోని ప్రెస్టన్ స్కూల్లో నేడు (గురువారం) స్కూల్ అసిస్టెంట్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగనుంది. జిల్లాలో ఉన్నత పాఠశాలలో 148, ప్రాథమికోన్నత స్థాయిలో 15 మంది గెజిటెడ్ హెచ్ఎంకు అర్హత కలిగి ఉన్నారు. జిల్లాల వారీగా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే జాబితాను ఆర్జేడీకి పంపిస్తారు. మల్టీజోన్–2 పరిధిలో ఖాళీల ఆధారంగా సీనియార్టీ జాబితా ప్రకారం రెండు, మూడు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తారు. స్థానిక సంస్థల నగారా మొగనున్న నేపధ్యంలో ప్రభుత్వం తక్షణమే పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు బదిలీలను చేపట్టాల్సి ఉంటుంది. అంతకు ముందుగానే మల్టీజోన్–2 ఏరియాలో గెజిటెడ్ హెచ్ఎంల బదిలీలను నిర్వహించి, జిల్లాల వారీగా ఖాళీల్లో ప్రస్తుతం పదోన్నతులు పొందే వారికి అవకాశం కల్పిస్తే ఇబ్బందులు ఉండవని ఉపాధ్యాయ సంఘాల వాదన. ఎస్ఏలకు పదోన్నతులు కల్పించే క్రమంలో ఆ ఖాళీలను సీనియర్ ఎస్జీటీలతో భర్తీ చేయనున్నారు. -
ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలి
స్టేషన్ఘన్పూర్: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిఽ ధిలోని చాగల్లులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను హౌసింగ్ పీడీ మాతృసింగ్తో కలిసి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి నిర్మాణం పనితీరు గురించి, ఇసుక, సిమెంట్, కంకర ఎక్కడ నుంచి తెచ్చారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణాలకు సరిపోను ఇసుక మండలంలోని కొత్తపల్లి, తాటికొండ రీచ్లో సమృద్ధిగా ఉందని, ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ఇసుక లోడింగ్, రవాణా ఖర్చులు మాత్రమే లబ్ధిదారుడు చెల్లించా ల్సి ఉంటుందన్నారు. అనంతరం స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓతో కలిసి సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే ట్రేడ్ లైసెన్స్, అడ్వటైజ్మెంట్ హోర్డింగ్ రెంట్, ప్రాపర్టీ టాక్స్, కమర్షియల్ భవనాల రెంట్, వాటర్ టాక్స్ లక్ష్యానికి తగినట్లు వసూలు చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంత రం మండలంలోని ఇప్పగూడెం జెడ్పీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల్లో రాణించాలని, వార్షిక పరీక్షలో ఉత్తమ మా ర్కులు సాధించాలన్నారు. మధ్యాహ్న భోజనం, వంటగది, కూరగాయలు శుభ్రంగా ఉండాలన్నా రు. అలాగే ఇప్పగూడెం పీహెచ్సీని సందర్శించి రి జిస్టర్లు పరిశీలించారు. టీబీ ముక్త్భారత్ అభియాన్ అమలుతీరును పరిశీలించారు. హెచ్ఎం రఘు, డాక్టర్ ప్రణీత, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
బ్యాంకర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి
జనగామ రూరల్: బ్యాంకులు వచ్చే ఏడాదికి పూర్తి లక్ష్యాలు సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి బ్యాంకు మేనేజర్లు, బ్యాంకు కంట్రోలర్స్తో బ్యాంకు రుణాల వివరాలు, బ్యాంకు లింకేజీ ప్రభుత్వ పథకాలపై డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2025–26 వార్షిక సంవత్సరానికి రూ.5,381.87 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రైతులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ వసంత, ఎల్డీఎం మూర్తి, ఆర్బీఐ ఏజీఎం చేతన్, అధికారులు పాల్గొన్నారు. పథకాలను విస్తృత ప్రచారం చేయాలి ఇందిరా మహిళా శక్తి పథకాలను విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ఇందిర మహిళా శక్తి పథకాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని డీఆర్డీఓ వసంత ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. సర్వే అధికారులకు పరీక్షలు నిర్వహిస్తాం గ్రామపాలన, సర్వే అధికారులకు పరీక్షలు నిర్వహిస్తామని సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీసీలో మాట్లాడారు. ఈ నెల 27న జీపీ, సర్వే అధికారులకు పరీక్షలు నిర్వహిస్తామని, అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లుగా రాణించాలి సర్వేయర్లు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది సర్వేయర్లుగా రాణించాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అ న్నారు. బుధవారం క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న సర్వేయర్ల శిక్షణ శిబిరాన్ని ఏడీ సర్వే అండ్ ల్యాండ్ కార్డ్స్ మన్యంకొండ, ఆర్డీఓ గో పిరామ్తో కలిసి పరిశీలించారు. సర్వేయర్లుగా రా ణించినప్పుడే వృత్తికి గౌరవం లభిస్తుందన్నారు. రూ.5,381.87కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి..
మల్టీజోన్–2లో 280 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల్లో సీనియర్ టీచ ర్లు హెచ్ఎంలుగా అదనపు బాధ్యతలను స్వీకరించడంతో సబ్జెక్టుల కొరత ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది పదవీ విరమణ చేయడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా ఖాళీలను భర్తీ చేయడానికి పభుత్వం నిర్ణయించుకోవడం అభినందనీయం. అదే సందర్భంలో ఎంఈఓలను నియమిస్తే బాగుంటుంది. పదోన్నతులతో ఏర్పడిన ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే, విద్యారంగంలో నాణ్యత పెరగడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం దిశగా ముందుకు వెళతాయి. – పి.చంద్రశేఖర్రావు, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ సంతోషం..!
జనగామ జిల్లా: అతనికి ఇద్దరు భార్యలు. వారిద్దరూ తోబుట్టువులే. తమ తల్లిని చంపాడన్న పగతో ఉన్న ఆ ఇద్దరూ భర్తను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం పిట్టలోనిగూడెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీఐ శ్రీనివాస్రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్యకు చొక్కమ్మ, గౌరమ్మలిద్దరూ భార్యలు. మే 18న కనకయ్య.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో అత్త జున్నుబాయిని (చొక్కమ్మ, గౌరమ్మల తల్లి) మామిడి తోటలో ఉండగా తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపాడు. మరో గ్రామంలో మామిడితోటలో ఉన్న తన ఇద్దరు భార్యలకు విషయం చెప్పకుండా వారిని తీసుకొని సిద్దిపేటకు పారిపోయాడు. తెల్లవారుజామున విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కనకయ్య సిద్దిపేటలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి పట్టుకునేలోపు పారిపోయాడు. ఈ విషయం చొక్కమ్మ, గౌరమ్మలకు తెలియడంతో పిట్టలోనిగూడేనికి తిరిగివచ్చారు. అప్పటినుంచి కనకయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పిట్టలోనిగూడెం వచి్చన కనకయ్య భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో గూడెంలోని ప్రజలంతా నిద్రలేచి అక్కడకు వచ్చారు. గొడవ తీవ్రంగా జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన చొక్కమ్మ, గౌరమ్మలు.. వరుసకు సోదరులైన జనార్దన్, శ్రీనివాసులుతో కలిసి గొడ్డలితో కనకయ్యను హత్య చేశారు. మృతదేహాన్ని గ్రామంలో నుంచి కొద్ది దూరం తీసుకెళ్లి చెట్ల పొదల్లో పడేశారు. కనకయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ చెప్పారు. పీడ విరగడైంది..: నేర చరిత్ర కలిగిన కనకయ్య తాగిన మైకంలో ఏం చేస్తాడో తెలియదని, క్రూరమృగంలా ప్రవర్తించి.. మహిళలతో వావివరుసలు లేకుండా వ్యవహరిస్తాడని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. మహిళలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. అతని చేష్టలపై గతంలో పంచాయితీలు పెట్టి పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు చెప్పారు. -
మున్సిపల్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు
● అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ జనగామ: జనగామ పురపాలికలో ప్రభుత్వ స్థలా లను ఆక్రమిస్తే చర్యలు తప్పవని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ హెచ్చరించారు. పట్టణంలో రోడ్లపై పార్కింగ్, ఫుట్పాత్ల ఆక్రమణ, ఎంక్రోచ్మెంట్లపై సాక్షిలో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించారు. ఏఎస్పీ పండరి నితిన్ చేతన్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ ఈఈ స్వరూప, ఏఈ మహిపాల్తో కలిసి నె హ్రూపార్కు ఏరియాను సందర్శించారు. రూ.2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు ట్రాఫిక్, పార్కింగ్, రోడ్ల ఆక్రమణలకు సంబంధించి ఆరా తీశారు. సిద్దిపేటరోడ్డు నెహ్రూపార్క్ వద్ద ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ కంట్రోల్ పనులకు సంబంధించి ఏఎస్పీతో చర్చించారు. అక్కడ నుంచి హైదరాబాద్ బైపాస్ వరకు చేపట్టిన 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను అధికారులను అ డిగి తెలుసుకున్నారు. విస్తరణలో భాగంగా విద్యుత్ ఫోల్స్ను పక్కకు జరిపేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. అనంతరం హైదరాబాద్ రూట్లో వరద కాల్వ నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. -
అభివృద్ధి పథం..
● మానుకోట జిల్లా సోమ్లాతండా, కేసముద్రంలో రూ.400కోట్ల పనులకు శంకుస్థాపనలు ● హాజరైన డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు సాక్షి, మహబూబాబాద్/ కేసముద్రం/మహబూబా బాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 400కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, ధనసరి సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమ్లాతండా, కేసముద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలకు మహిళలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. రూ.400కోట్ల పనులకు శంకుస్థాపన మహబూబాబాద్ పరిధిలో సుమారు రూ.100కోట్లతో రహదారులు, మున్సిపాలిటీ అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్ భవనాలు, నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శుంకుస్థాపనలు చేశారు. అలాగే రూ.300కోట్లతో కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, పట్టణంలో 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం, నూతన సబ్స్టేషన్లు, సీసీరోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, నూతన గిడ్డంగుల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు. కార్యకర్తల్లో జోష్.. బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రసంగాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నిండింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకోసం రూ.70వేల కోట్లు ఖర్చుచేసి, రైతు ప్రభుత్వమని నిరూపించుకున్నామన్నారు. మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాకు గోదావరి జలాల మళ్లింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన మానుకోట అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కళాశాల, ఔటర్ రింగ్రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కనకయ్య, నాగరాజు, ట్రైకార్ చైర్మన్ బెల్ల య్య నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు ఏమన్నారంటే...– వివరాలు 8లోu -
బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డిజనగామ రూరల్: జనగామ నుంచి హుస్నాబాద్ గానుగపహడ్ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మా ణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నర్మెట, జనగామ, తరిగొప్పుల మండలాల ముఖ్యనాయకులు కార్యకర్తలు బ్రిడ్జి వద్ద వంటావార్పు, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్రెడ్డి, కలెక్టర్ స్పందించి తక్షణమే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రమాదాల నుంచి కాపాడాలని కోరారు. నా యకులు సాయన్న, చొప్పరి సోమన్న, చెల్లూరు మల్లేశం, తేజవతి విజయ, పండుగ నిర్మల, యాదలక్ష్మి, పులి కృష్ణ, ఊదర వెంకటాద్రి, ఎం. సుదర్శనం, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాల డొంక కదులుతోంది..
జనగామ: పురపాలిక పాపాలపుట్ట కదులుతోంది. ఇంటి అనుమతుల నుంచి మొదలుకుని పట్టణ ప్రణాళిక, రెవెన్యూ శాఖల పరిధిలో ప్రతీ ఫైల్ దుమ్ము దులుపుతున్నారు. ‘సెటిల్మెంట్ కింగ్లు ఎవరు’ శీర్షిన సాక్షిలో ప్రచురితమైన కథనం పురపాలికను షేక్ చేసింది. దీనిపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జోరుగా సాగుతుంది. మున్సిపల్పై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపధ్యంలో డీఎంఏ సైతం కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మ్యుటేషన్లు, ఇంటి నంబర్ల కేటాయింపులు, పన్నుల నిర్ధారణపై నిజనిజాలను బయటకు తీసేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ డీఎల్పీఓ వెంకట్రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. ఏడాది అనుమతులపై విచారణ మున్సిపల్లో గడిచిన ఏడాది నుంచి ఇంటి నంబర్ల కేటాయింపులు, పన్నుల కేటాయింపులకు సంబంధించి ఫైల్ టు ఫైల్ పరిశీలన చేయాలని విచారణ అధికారిని అదనపు కలెక్టర్ ఆదేశించారు. మొదట ఆరు నెలల కాలంలో కొత్త ఇంటి నంబర్లకు అనుమతులు ఇచ్చారనే దానిపై తనిఖీ చేయాలని చెప్పినప్పటికీ, ఆ తర్వాత ఏడాదికి పొడగించారు. సుమారు 6 వందల వరకు ఫైల్స్ ఉండగా.. ప్రస్తుతం 311 అసెస్మెంట్ల ఫైల్స్ బయటకు తీసి, ప్రత్యేకంగా తయారు చేసిన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. కొత్త ఇంటి నంబర్ల కేటాయింపులపై డీఎల్పీఓ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా వెళ్లి అనుమతి ప్రకారం నిబంధలు ఉన్నాయా లేదా అని పరిశీలన చేయాల్సి ఉంటుంది. అనుమతుల సమయంలో ‘ఫార్మాల్టీస్’ ఉన్నాయా అనే కోణంలో సైతం విచారణ చేయనున్నారు. పురపాలికలో జరుగుతున్న అవకతవకల బాగోతంతో మామూళ్లశ్రీ ఉచ్చులో బలైన చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. గప్చుప్గా మున్సిపల్ వాతావరణం.. మ్యుటేషన్ల అవకతవకలపై సాక్షిలో ప్రచురితమైన కథనంతో మున్సిపల్ వాతావరణం గప్చుప్గా మారిపోయింది. అనుమతుల కోసం కొత్త ఫైల్స్ వచ్చిన సమయంలో ఒకటికి రెండు సార్లు పరిశీలన చేస్తున్నారు. ఒకటో ముచ్చట తప్ప.. రెండో మాట వద్దంటున్నట్లు సమాచారం. అందులో పని చేస్తున్న కొందరు సర్కారు కొలువు చేస్తున్నామనే విషయాన్ని మరిచి పోయి ఇక్కడ నుంచి సమాచారం లీక్ అవుతుందని సహచరులపై బాహాటంగానే ఎత్తిపొడుపు మాటలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చర్చ జరుగుతుంది. కమిషనర్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత చిన్న చిన్న స్టాంపులు, తదితర పనులకు చేతులు తడిపే వరకు పని జరగదనే ప్రచారం బాహాటంగానే వినిపిస్తుంది. ఇందులో కొంతమంది తప్పులు చేస్తూనే, మంచి కోసం పని చేసే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలు రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురపాలికలో అంకితభావంతో పని చేయాలే తప్ప, ‘టిప్’ కోసం చేతులు చాచితే ఎవరైన సరే ఫిర్యాదు చేస్తామంటున్నారు సమాజం మేలు కోరే ప్రజలు. విచారణ జరిపిస్తున్నాం.. జనగామ మున్సిపల్లో గడిచిన ఏడాది నుంచి ఇప్పటి వరకు నూతనంగా ఇంటి నంబర్ల జారీకి సంబంధించిన ఫైల్స్ను తనిఖీ చేస్తున్నాం. ప్రస్తుతం 311 ఫైల్ బయటకు తీయగా, మిగతా వాటిని ఒక్కొక్కటిగా సేకరిస్తున్నాం. ఇంటి నంబర్ల కేటాయింపులపై క్షేత్రస్థాయికి వెళ్తాం. తుది నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం. – వెంకట్రెడ్డి, విచారణ అధికారి, డీఎల్పీఓ ఏడాది అనుమతులపై విచారణ ఇంటి నంబర్ల కేటాయింపులపై ఆరా విచారణ అఽధికారిగా డీఎల్పీఓ -
వైఎస్సార్కు ఘన నివాళి
జనగామ: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశా ల మేరకు పట్టణంలోని లేబర్ అడ్డా వైఎస్ఆర్ విగ్రహానికి జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, మాజీ కౌ న్సిలర్లు మేడ శ్రీనివాస్, గాదెపాక రామచందర్, తోట సత్యం, జమాల్ షరీ ఫ్, గౌస్, జాఫర్ షరీఫ్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. -
పక్కాగా ఫీవర్ సర్వే నిర్వహించాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. 100 రోజుల టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా టీబీ బారిన పడిన వారిని, వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఎలా గుర్తిస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆశవర్కర్లకు ఫీవర్ సర్వేపై పలు సూచనలు చేశారు. 13వ వార్డులో జరుగుతున్న ఫీవర్ సర్వేను పరిశీలించి జ్వరం, దగ్గు, ఒంటి నొప్పుల వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అవసరమైన పరీక్షలు, వైద్యసేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి శ్రీతేజ, సూపర్వైజర్ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే మెరుగైన విద్య ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఇంటర్ అడ్మిషన్లపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్రెడ్డి, ప్రిన్సిపాల్స్, డీఈఓ భోజన్న, అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. మున్సిపాలిటీలోని 21 వార్డు కుర్మవాడలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పరిశీలించారు. అలాగే పట్టణంలోని ధర్మకంచ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శకులు కావాలన్నారు. -
తక్కువ ఖర్చుతో నిర్మాణం..
నాడు వారసత్వ సంపదగా భూములు, ఆస్తులు ఉండేవి. నేడు గ్లోబల్ వార్మింగ్ నేపధ్యంలో మన భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, కలుషితం లేని నీరు అందించాల్సి న అవసరం ఏర్పడింది. ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ పచ్చదనం ఉండేలా చూసుకోవాలి. వనమహోత్సవంలో నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలి. ప్రతీ నీటిబొట్టును ఒడిసి పట్టుకుని, భూమి లోపలకు పంపించే విధంగా తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాం. ప్రతీ ఇంటి ముందు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేశాం. భవిష్యత్లో గాలి, నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడదు. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ ● -
కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు సరికాదు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరిజఫర్గఢ్: సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇప్పటికై న భాష మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీ కడియం కావ్యతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడి వేల కోట్ల ఆస్తులు సంపాదించింది ఎవరని ప్రశ్నించారు. ప్రభుత్వంలో పొరపాట్లు జరిగితే ఎత్తిచూపాలని, అంతేగాని మీ తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్రావు, వైస్ ఎంపీపీ నూకల ఐలయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
అవే సమస్యలు..తీరని వ్యథలు!
జనగామ రూరల్: ఏళ్ల తరబడి పట్టా పాస్బుక్ కావడం లేదని ఒకరు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని దివ్యాంగుడు, భూమిని కబ్జా చేశారని మరొకరు, పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని వృద్ధులు.. ఇలా ప్రజలు ప్రజావాణికి వచ్చారు. చెప్పులరిగేలా తిరుగుతున్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్లతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా వినతులు స్వీకరించారు. మొత్తం 58 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న వినతులను తక్షణమే పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని సమస్యను దర ఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందన్నారు. లబ్ధిదారులు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆర్డీఓ గోపిరామ్, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంత నాయక్, డీఆర్డీఓ వసంత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సమస్యలు ఇలా.. ● రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామానికి చెందిన దేవేందర్ తన తండ్రి ముడావత్ లింబ సర్వే నంబర్ 310 లో 2008 సంవత్సరంలో సర్పంచ్ అనుమతి పొంది ఇంటిని నిర్మించుకోగా దాని ధ్రువీకరణ పత్రం, ఇంటి నంబర్ ఇప్పించాలని కోరారు. ● పాత హరిజనవాడలో సర్వే నంబర్ 403/82, 404/82లో సొంత స్థలంలో గంధమల్ల ఇస్తారి అనే వ్యక్తి ఆక్రమించి రేకుల షెడ్డు నిర్మిస్తున్నారని, తగిన చర్య తీసుకోవాలని బచ్చన్నపేటకు చెందిన విజయలక్ష్మి విన్నవించారు. ● తన పేరుమీద ఉన్న 12 గుంటల భూమికి పట్టా పాస్బుక్ ఇచ్చి రైతు భరోసా వచ్చేలా చూడాలని రఘునాథపల్లి మండలం మాధారంకు చెందిన మోహన్ వినతిపత్రం అందించారు. ● కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వీహెచ్ పీఎస్ ఆధ్వర్యంలో బిర్రు నగేష్, గడ్డం సోమరాజ్ కలెక్టర్కు విన్నవించారు. ● లింగాలఘణపురం మండలం చీటూరుకు చెందిన వృద్ధురాలు ఎలిశాల రాజమ్మకు వృద్ధాప్య పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్కు వేడుకుంది. ప్రజావాణిలో 58 దరఖాస్తులు ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా -
పారిశుద్ధ్య నిర్లక్ష్యంపై నిరసన
జనగామ: జిల్లా కేంద్రంలో పేరుకుపోతున్న పారిశుద్ధ్యంపై పాలకవర్గం లేకపోగా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై ప్రతిపక్ష పార్టీలు వినూత్న నిరసన తెలిపారు. ఇటీవల ‘సాక్షి’లో జనగామ మున్సిపల్లో గాడితప్పిన శానిటేషన్ నిర్వహణ, అంతర్గత రోడ్లు గుంతలమయం, రహదారులపై పేరుకుపోతున్న చెత్తకు సంబంధించి వరుస కథనాలకు ఉన్నతాధికారులతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ‘సాక్షి’ కథనాలను చూపిస్తూ సోమవారం పట్టణంలో ‘క్లీన్ అండ్ గ్రీన్ జనగామ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పోకల జమున మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో పాలకవర్గం ఎన్నికలు నిర్వహించక పోవడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. వీధి దీపాలు వెలుగక, మురుగు నీరు రోడ్లపైకి చేరి కంపు కొడుతుందన్నారు. కమిషనర్ నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావెల రవి, మొహినుద్దీన్, దేవుని సతీష్, మాజీ కౌన్సిలర్లు పేర్ని స్వరూప, వాంకుడోత్ వనిత, జూకంటి లక్ష్మీ శ్రీశైలం, బండ పద్మ, మాజీ కోఆప్షన్ సభ్యులు మసీ ఉర్ రెహమాన్, ధర్మపురి శ్రీనివాస్, సేవెల్లి మధు, కృష్ణ ఉల్లెంగుల సందీప్, ఉడుగుల నరసింహులు, తిప్పారపు విజయ్, యాకూబ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వెలుగని వీధిదీపాలు, దుర్వాసనతో ప్రజల అవస్థలు మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం! ఎమ్మెల్యే పల్లా ఆదేశాలతో బీఆర్ఎస్ ‘క్లీన్ అండ్ గ్రీన్ జనగామ’ -
అత్యాధునిక బోధన!
సర్కారు బడుల్లో జనగామ: విద్యారంగంలో సరికొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్కారు బడులకు వచ్చే విద్యార్థులకు కార్పొరేట్కు దీటుగా బోధన చేసేలా దేశంలోని ప్రసిద్ధ సంస్థల భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ సాధనాలు, ఏఐ బోధన, పిల్లల భద్రత, స్నేహపూర్వక వాతావరణంలో విద్యాబోధన తదితర కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ మేరకు ‘తల్లిదండ్రుల భాగస్వామ్యం–డిజిటల్ తరగతులు’ అనే అంశంపై నేడు (మంగళవారం) సమగ్ర శిక్షలో భాగంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, గురుకులాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించేందుకు ఉత్తర్వులను జారీ చేసింది. విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యంతో సమావేశం నిర్వహించబోతున్నారు. పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్రపై ఇందులో చర్చించనున్నారు. సమావేశాలకు ఒక్కరోజు ముందుగానే హెచ్ఎంలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారిని ఆహ్వానించాలి. సమావేశానికి హాజరయ్యే క్రమంలో తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ తెచ్చుకోవాలి. వారి ఫోన్లో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ను డౌన్లోడ్ చేయాలి. పిల్లలు నమోదు, హాజరు మెరుగుపర్చేందుకు తల్లిదండ్రుల మద్దతు తీసుకోవాలి. ప్రతీ మూడో శనివారం పీటీఎం నిర్వహించడం జరుగుతుందని ముందుగానే సమాచారం ఇవ్వాలి. అవగాహన కల్పించాలి.. సర్కారు బడుల్లో అమలు చేస్తున్న డిజిటల్ తరగతుల వివరాలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. డిజిటల్ లెర్నింగ్, జేఈఈ, నీట్, చైల్డ్ సేఫ్టీ తదితర అంశాలపై పిల్లలను తీర్చిదిద్దడంలో 6 సంస్థలు విద్యాశాఖతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సంస్థల ద్వారా పిల్లలకు అవసరమైన నైపుణ్యాలను అందించడంలో పూర్తి సహకారం లభిస్తుంది. ఎన్జీవోల సహకారంతో చదవడం, అర్థం చేసుకోవడం (2 నుంచి 5 తరగతులు), విద్యార్థులు, ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ సపోర్టు (6 నుంచి 10 తరగతులు), ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, డిజిటల్ ఇనిషియేటివ్, కోడింగ్, సమస్య పరిష్కారం, హ్యాండ్స్ అండ్ లెర్నింగ్, (1 నుంచి 10 తరగతులు), పోటీ పరీక్షల ప్రిపరేషన్ (నీట్, జేఈఈ, సీఎల్ఏటీ /9 నుంచి 12 తరగతులు/ప్రత్యక్ష తరగతులు, పరీక్షలు), పిల్లల భద్రత, రక్షణ, కౌన్సెలింగ్ (6 నుంచి 12 తరగతులు), బడి బయట ఉన్న పిల్లల నమోదు, వయోజన అక్షరాస్యత, వృత్తిపరమైన శిక్షణ (ఓపెన్ స్కూల్ విద్య) ఇస్తున్నట్లు తల్లిదండ్రులకు స్పష్టం చేయాలి. విద్యార్థుల దినచర్యను గమనించాలి విద్యార్థి బడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే దినచర్యను ఎప్పటికప్పుడు గమనించాలి. పిల్లలు నేర్చుకోవడంలో సహాయ పడడానికి ‘ఇంటింట చదువుల పంట’ (ఐసీపీ) యాప్ను వారికి అందుబాటులో ఉంచాలి. పిల్లలు చదువకునే ప్రదేశంలో టీవీ, రేడియో శబ్ధాలు లేకుండా చూడాలి. మోడల్: 8ప్రాథమిక : 341 ప్రాథమికోన్నత: 64కేజీబీవీ: 12ఉన్నత: 103 స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో డిజిటల్ సాధనాలు పిల్లల భవిష్యత్పై ప్రభుత్వం ముందుచూపు కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన బడుల పర్యవేక్షణపై తల్లిదండ్రుల భాగస్వామ్యం నేడు పేరెంట్స్, ఉపాధ్యాయుల సమావేశం పీటీఎంలో పాల్గొనాలి.. పీటీఎంలో విద్యార్థి తల్లిదండ్రులు హాజరు కావాలి. గ్రామ పెద్దలు కూడా వీటిలో భాగస్వామ్యం అయితే మంచిది. విద్యార్థుల ప్రతిభ సామర్థ్యాలతో పాటు ఏమైన లోపాలు ఉంటే సమావేశాల్లో చర్చించవచ్చు. తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండి విద్యార్థి సామర్థ్యాలు మరింత మెరుగుపడేందుకు దోహదపడతాయి. – రావుల రామ్మోహన్రెడ్డి, ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలి..తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో చేపట్టబోయే సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సర్కారు బడుల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కీలకం. ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన గురించి ప్రస్తావించాలి. – భోజన్న, డీఈఓ -
కాంగ్రెస్ ఇన్చార్జ్గా అడ్లూరి లక్ష్మణ్కుమార్
● సంస్థాగత నిర్మాణంపై పార్టీ దృష్టి ● వీరి ఆధ్వర్యంలో గ్రామ, మండల, జిల్లా కమిటీలు! సాక్షిప్రతినిధి, వరంగల్: సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని మరింత బలోపేతం చేయడంపై కసరత్తు చేస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవలి పర్యటన తర్వాత ఆ పార్టీ హైకమాండ్ దూకుడు పెంచింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన అధిష్టానం.. సోమవారం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్లను నియమించింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్కు పార్టీ ఇన్చార్జ్గా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను నియమించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్కుమార్ గతంలో ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా.. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కగా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖను కేటాయించారు. నల్లగొండ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న లక్ష్మ ణ్కు ఉమ్మడి వరంగల్ పార్టీ ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ఉమ్మడి వరంగల్లో ఇటీవల నెలకొన్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్ సోమవారం లక్ష్మణ్కుమార్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టం మొదలవనుండగా.. సమర్థంగా ఎదుర్కొనేందుకు సంస్థాగత కమిటీలు పూర్తి చేసేందుకు అన్ని స్థాయిల్లో కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్లను నియమించిన అధిష్టానం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వీరి ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల సమన్వయంతో గ్రామ, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేసే బాధ్యతలను అప్పగించినట్లు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీబీ రహిత జిల్లాగా మార్చాలి జనగామ రూరల్: టీబీ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్, ఎన్సీడీ ప్రోగ్రాం అమలు తీరును జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావుతో కలిసి పీహెచ్సీ, సబ్ సెంటర్స్, వైద్యులతో సమీక్షించారు. ఆస్పత్రులకు వచ్చే రోగులను పరిశీలిస్తూ అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎన్సీడీ వ్యక్తి పీహెచ్సీకి వస్తే వివరాలు అప్డేట్ చేసి, రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఆస్పత్రుల్లోకార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలందించాలన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంతో ఉపాధి ఇందిరా మహిళా శక్తి పథకంతో ఉపాధి కల్పన కలుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలతో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబురాలు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి కలెక్టర్ హాజరై విజయోత్సవ సంబరాల ఆవశ్యకత నిర్వహణ గురించి దిశా నిర్దేశం చేశారు. -
గుండెపోటుతో చిన్నారి మృతి
స్టేషన్ఘన్పూర్: ముక్కుపచ్చలారని చిన్నారి గుండె ఆగి చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అశోక్, అనూష దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఉపాధి కోసం వీరు హైదరాబాద్కు వచ్చారు. అశోక్ నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. రెండో కుమార్తె మిధున (6) శనివారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుందని అంటూ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే పాప మృతిచెందింది. కాగా, గుండె పోటుతో తమ కుమార్తె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో బీరప్ప బోనాలు
అమ్మవారికి పట్టువస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించిన కురుమ కులస్తులు సోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025బచ్చన్నపేట: సిద్ధేశ్వరాలయంలో లక్ష పుష్పాలంకరణలో శివలింగంపాలకుర్తి టౌన్: లక్ష్మీనర్సింహస్వామికి పూజలు చేస్తున్న అర్చకులుజనగామ: తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పట్టణంలో ఆదివారం కురుమ కులస్తులు బీరప్ప స్వామికి బోనాలు స మర్పించారు. వందలాది మంది మహిళలతో జనగామ పురవీ ధులు భక్తి పారవశ్యంతో పులకించాయి. కళాకారుల ఢోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టింది. కురుమ కుల సంఘ పెద్దలు అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. జనగామలో బీరప్ప బోనాల పండుగ కనుల పండువగా జరిగింది. కుర్మవాడ, నాగులకుంట, ధర్మకంచ, సాయినగర్, జ్యోతినగర్, బీరప్ప ప్రాంతాల నుంచి వందలాది మంది మహిళలు బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్లతో ర్యాలీగా బొడ్రాయి వద్దకు చేరుకున్నారు. బొడ్రాయి వద్ద గుమ్మడి కాయలు, నిమ్మకాయలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి నుంచి మహంకాళి దేవాలయం, గుడి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నేరుగా బీరప్ప ఆలయానికి చేరుకున్నారు. బీరప్ప దేవునికి నైవేద్యం సమర్పించారు. మొక్కుల చెల్లింపులు పట్టణంలోని బీరప్ప కామారతి, మహంకాళి అమ్మవార్లకు సంఘ పెద్దలు మొక్కులు చెల్లించారు. ఆలయంలో ప్రత్యేక పూజ లు చేసి, అమ్మవారికి బో నం నైవేద్యం సమర్పించా రు. బోనాల పండుగ నేపధ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. కాగా పెద్ద కురుమ మోటె లింగయ్య, పట్టణ అధ్యక్షుడు బాల్దె మల్లేశం ఇంటి నుంచి ర్యాలీగా స్వామి వారి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘ ప్రతినిధులు జూకంటి శ్రీశైలం, కేమిడి ఉపేందర్, కర్రె కృష్ణ, కడకంచి మధు, మంత్రి శ్రీశైలం, వైకుంఠం, శ్రీను, శ్రీనివాస్, ఉపేందర్, రాములు, చందు పాల్గొన్నారు. సోమేశ్వరాలయంలో..పాలకుర్తి టౌన్: తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో మామిడి తోరణాలతో తులసీ దళాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, ఆలయ అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సుందరాచార్యులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.న్యూస్రీల్ -
స్నాతకోత్సవానికి వేళాయె..
నేడు కేయూకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రాక ● ముఖ్య అతిథిగా ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి ● 387 మందికి పీహెచ్డీ పట్టాలు.. ● 373 మందికి 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం ● అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్ల పంపిణీకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవాన్ని సోమవారం ఉదయం 11:30 గంటలకు క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఒక స్టీరింగ్ కమిటీ బాధ్యులతోపాటు 10 సబ్కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2020 నుంచి 2025 వరకు పీహెచ్డీ పూర్తయిన వారిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 387 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనునున్నారు. ఇందులో ఆర్ట్స్లో 56, సైన్స్ 96, ఫార్మసీ 21, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 49, సోషల్ సైన్సెస్ 133, ఎడ్యుకేషన్ 18, లా 4, ఇంజనీరింగ్లో 10 మంది పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారు. 2016 నుంచి 2021 వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన 373 మందికి 564 గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఆర్ట్స్లో 60, సైన్స్లో 161, ఫార్మసీలో 48, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో 66, సోషల్ సైన్సెస్లో 88, ఎడ్యుకేషన్లో 25, లా 72, ఇంజనీరింగ్లో 44 మందికి గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నారు. కళాశాలలకు గోల్డ్మెడల్స్ విద్యార్థుల జాబితాలు.. పీహెచ్డీ పట్టాలు పొందే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లను పరీక్షల విభాగంలో అందజేశారు. పేరెంట్స్కు కూడా ఎంట్రీపాస్లు జారీ చేశారు. కేయూలోని వివిధ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పలు కోర్సులు చదివి గోల్డ్మెడల్స్ సాధించిన వారి జాబితాలను ఆయా కళాశాలలకు ఇప్పటికే పంపారు. అలాగే, ఆయా విద్యార్థులకు అడ్మిట్కార్డులు, ఎంట్రీపాస్లను కూడా పరీక్షల విభాగాధికారులు పంపించారు. గోల్డ్మెడల్స్ పొందే విద్యార్థులు అడ్మిట్ కార్డులు, ఎంట్రీపాస్లతో స్నాతకోత్సవానికి రావాల్సి ఉంటుంది. ముందుగానే గోల్డ్మెడల్స్ ప్రదానం.. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 నుంచి 9:30 గంటల వరకు అభ్యర్థులకు గోల్డ్మెడల్స్ ముందే అందజేస్తారు. ఇందుకు అధ్యాపకులతో కూడిన కమిటీ కూడా ఉంది. అభ్యర్థులు గోల్డ్మెడల్స్ తీసుకుని ఆడిటోరియంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది. పీహెచ్డీ విద్యార్థులకు పట్టాల ప్రదానం అనంతరం గోల్డ్మెడల్స్ విద్యార్థులు వేదిక మీదకు వచ్చి గవర్నర్ జిష్ణుదేవ్వర్మతో ఫొటోలు దిగాల్సి ఉంటుంది. 373 మంది విద్యార్థులను 19 బ్యాచ్లుగా చేశారు. అయితే అందులో ఎంతమంది హాజరవుతారనేది ఉదయమే తెలియనుంది. ఎందుకంటే వారిలో కొందరు ప్రస్తుతం ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు విదేశాలకు వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. పేరెంట్స్కు బయట స్క్రీన్ ఏర్పాటు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆడిటోరియంలోకి అనుమతిలేదు. వీరి కోసం ఆడిటోరియం బయట భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవాన్ని వీరు వీక్షించనున్నారు. షెడ్యూల్ ఇలా... గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హైదరాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయల్దేరి ఉదయం 11 గంటలకు వరంగల్ నిట్కు చేరుకుంటారు. ఉదయం 11:15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కాకతీయ యూనివర్సిటీకి ఉదయం 11:25 గంటలకు చేరుకుంటారు. ఆడిటోరియం వద్ద ఉదయం 11:30 గంటలకు అకడమిక్ సెనేట్ సమావేశం ఉంటుంది. 11:35 గంటలకు సెనేట్ సభ్యులు గవర్నర్తో ఫొటో దిగుతారు. అనంతరం ప్రొసెసన్ ఉంటుంది. ఉదయం 11:40 గంటలకు కాన్వొకేషన్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. 11:50 గంటలకు కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి రిపోర్ట్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్య అతిథి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి ప్రసంగిస్తారు. 12:10 గంటలకు చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ప్రసంగిస్తారు. 12:20 గంటల నుంచి పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం, అనంతరం గోల్డ్మెడల్స్ అభ్యర్థులు గ్రూప్ ఫొటో దిగాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1:15 గంటలకు స్నాతకోత్సవం ముగుస్తుంది.గవర్నర్, ఐఐసీటీ డైరెక్టర్ రాక కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానున్నారు. అలాగే, ముఖ్య అతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. పీహెచ్డీ పట్టాలు, గోల్డ్మెడల్స్ పొందేవారు వైట్ డ్రెస్లోనే రావాల్సి ఉంటుంది. కేటాయించిన సీట్లలో వీరు కూర్చోవాల్సి ఉంటుంది. కేయూలో భారీ బందోబస్తు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించనున్న స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రానుండడంతో క్యాంపస్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం స్నాతకోత్సవాన్ని నిర్వహించే ఆడిటోరియం ప్రాంతంలో బాంబుస్క్వాడ్ తనిఖీ చేసింది. సోమవారం ఉదయం మరోసారి తనిఖీ చేయనున్నది. కేయూలో పోలీసులు మొహరించారు. కేయూ పోలీస్ స్టేషన్తోపాటు వివిధ పోలీస్స్టేషన్లకు చెందిన ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది అందులో క్విక్ రెస్పాన్స్ పోలీస్ ఫోర్స్ కూడా బందోబస్తు నిర్వహిస్తారు. ఎంట్రీపాస్లు ఉన్న అభ్యర్థులకు వివిధ కమిటీల బాధ్యులకు సభ్యులకు (ఆచార్యులు, ఉద్యోగులు) పాలక మండలి సభ్యులు, సెనేట్ సభ్యులకు ప్రెస్కు ఆడిటోరియంలోకి అనుమతి ఉంటుంది. పలు విద్యార్థి సంఘాల బాధ్యులపై పోలీసులు నిఘా ఉంచారు. -
రజకుల సమస్యలు పరిష్కరించాలి
స్టేషన్ఘన్పూర్: రజక వృత్తిదారులు సమస్యలు పరిష్కంచాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పైళ్ళ ఆశయ్య అన్నారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో ఆదివారం రజక వృత్తిదారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది మంది రజక వృత్తిదారులు రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా తీవ్రంగా వెనుకబడి ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వివిధ చేతి వృత్తిదారులకు ఇచ్చిన హామీలను అమలులో రజకులను ఆర్థికంగా నిలబడటానికి ప్రతీఒక్కరికి రుణ సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామాల్లో కమ్యూనిటీ హాల్లు, దోబీ ఘాట్లు నిర్మించాలని, యాభై సంవత్సరాలు నిండిన వృత్తిదారులకు పెన్షన్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదునూరి మధు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నాయకులు పొన్నల రమేశ్, పద్మాకర్, భానుచందర్, రవి, వెంకటయ్య, సాంబయ్య, యాదగిరి, అశోక్, ఉపేందర్, పరశురాములు, రవి, కొండల్ తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశయ్య -
బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
జనగామ రూరల్: జనగామ హుస్నాబాద్ రోడ్డు వడ్లకొండ, గానుగుపహాడ్ మధ్య అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలను ఆదుకోవాలని ఆదివారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వడ్లకొండ మాజీ సర్పంచ్ బోల్లం శారద, గానుగుపహాడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడతూ రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదని, ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ నుంచి హుస్నాబాద్ ద్వారా కరీంనగర్కు రాకపోకలు జరుగుతాయని, వందల సంఖ్యలో వాహనాలు ర్రాతింబవళ్లు నడుస్తాయన్నారు. ఇప్పటికై న అధికారులు చొరవ తీసుకొని పనులు త్వరగా పూర్తి చేయాలన్నా రు. ఈ సందర్భంగా నిర్మాణ పనులకు సంబంధించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు ఇరుగు సిద్దులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శా నబోయిన మహిపాల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దడిగ సందీప్యాదగిరి, దడిగ సిద్ధులు, తిరుపతి, గుర్రం నరేష్, శ్రవణ్, వెంకటేష్ పాల్గొన్నారు. అఖిల పక్షం ఆధ్వర్యంలో ధర్నా -
ఘనా, నీలపతాక క్రమాల్లో అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రోత్సవాల్లో భాగంగా పదకొండో రోజు ఆదివారం అమ్మవారికి ఘనా, నీలపతాక క్రమాలలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఘనా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని నీలపతాక అమ్మవారిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. తొలి ఏకాదశి, ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఎన్ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగింది. ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. -
శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు పాటుపడాలి
జనగామ రూరల్: శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు పాటుపడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. ఆదివారం శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప విద్యావేత్త, జాతీయవాది, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు ఒకే దేశం ఒకే జెండా అనే నినాదం చేసిన మొదటి వ్యక్తి అని కొనియాడారు. రాజకీయానికి నూతన దశాదిశ నేర్పిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతీఒక్కరు కృషి చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, ఓబీసీ రాష్ట్ర నాయకుడు గుజ్జుల నారాయణ, భాగాల నవీన్ రెడ్డి, పెద్దోజు జగదీష్, శివ కృష్ణ, రఫ్తార్ సింగ్, చందు, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ -
మత సామరస్యానికి ప్రతీక మొహర్రం
మత సామరస్యానికి ప్రతీకగా మొహర్రంను ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. తొమ్మిది రోజు ఊరూరా పురవీధుల్లో పీరీల (షావర్ల) పండుగ సందడి కనిపించింది. జనగామ జిల్లా కేంద్రంతో పాటు లింగాలఘణపురం, జఫర్గఢ్, స్టేషన్ఘన్పూర్, బచ్చన్నపేట, చిల్పూర్, దేవరుప్పుల తదితర మండలాల్లో పీరీలను ఊరేగింపు నిర్వహించారు. సీతారాంపురంలో మాజీ ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేషమ్ దంపతులు షావర్లకు కుడుకలు, జట్టీలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు.– సాక్షి నెట్వర్క్మరిన్ని ఫొటోలు 9లో.. -
రేపు సిద్ధేశ్వరాలయంలో వేలం
బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రా మంలోని స్వయంభూ శ్రీ సిద్ధేశ్వరాలయంలో రేపు (మంగళవారం) తలనీలాల హక్కుకు వే లం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఆ ముదాల మల్లారెడ్డి ఆదివానం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తలనీలాలు వేలం పాట వరుసగా రెండుసార్లు సరైన పాట రానందున వాయిదా వేశామన్నారు. ఆసక్తిగల వేలం పాటదారులు సకాలంలో వేలంలో పాల్గొనాలన్నారు. జీఓ 282ను ఉపసంహరించుకోవాలిజనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 282ను ఉపసంహరించుకోవాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు పారిశ్రామిక యాజమాన్యానికి లాభాలు చేకూర్చేందుకు కార్మికుల శ్రమను తీవ్రంగా దోపిడీ చేసేందుకే కార్మిక శాఖ ద్వారా 8 గంటల పని దినాన్ని 10 నుంచి 12 గంటలకు పెంచేందుకు జీఓ 282 ఉత్తర్వులు జారీ చేశారని, ఈ జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీపీఎం నాయకుల నిరసనజనగామ రూరల్: పట్టణంలోని సెయింట్ మేరీస్ పాఠశాల క్రాస్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ పనులు నత్తనడక నడుస్తున్నాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి అన్నారు. ఆదివారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని 3, 4 వార్డుల్లో బాలాజీనగర్, జ్యోతినగర్ సెంట్ మేరీ స్కూల్ ఏరియా, లక్ష్మీ వాటర్ ప్లాంట్ ఏరియా, కురుమవాడ, ఏకశిలా స్కూల్ ప్రాంతం తదితర ప్రాంతాల్లో వరద నీటి నివారణ కోసం నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ పెద్ద మోరీ పనులు ప్రారంభించి మూడు నెలలు కావస్తుందన్నారు. పనులు పూర్తి కాకపోవడంతో చిన్నపిల్లలు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో పల్లెర్ల లలిత, గాడి శివ, గుండు శ్రీనివాస్, రామా, తేజ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఎరుకుల కులస్తుల అభివృద్ధికి కృషి జనగామ రూరల్: సమాజంలో వెనుకబడిన ఎరుకుల కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఎరుకుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవర ఎల్లయ్య అన్నారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా జనగామ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దేవర ఎల్లయ్య మాట్లాడుతూ. తరతరాలుగా ఎరుకల జాతి ప్రజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వాలు కూడా చిన్నచూపు తగదన్నారు. ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఎరుకల కులస్తులను ఆదుకోవాలన్నారు. 1/70 చట్టం ద్వారా అటవీ హక్కులను స్థానిక ఆదివాసులకే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిద్ధిని రాములు, అంగడి మల్లయ్య, అంగిడి పోశయ్య, మైసయ్య, రిటైర్డ్ సీటీఓ ఉప్పలయ్య, దేవర రామ, మానుపాటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ముగిసిన చెస్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్గార్డెన్ వద్ద ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హోరాహోరీగా సాగిన పోటీల్లో గండు రిత్విక్, దారా సాయివివేష్, జె.రంజిత్, నిక్రీ ప్రహర్ణ విజేతలుగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. ముగింపు వేడుకల్లో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, రజినీకాంత్, ఫ్రాంక్లిన్, అక్షయ్ తల్లిదండ్రులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా సవరణలో జాగ్రత్తలు తీసుకోవాలి
పాలకుర్తి టౌన్: ఓటరు జాబితా సవరణలో బీఎల్ఓ లు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని ఎండీపీఓ కార్యాలయంలో పాలకుర్తి అసెంబ్లీ లెవ ల్ మాస్టర్ ట్రైనర్ నరసింహమూర్తి, శేషగిరిరావు బీఎల్ఓలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరమే నూతన ఓటరు నమోదు, సవరణ, తొలగింపు, బదిలీ, ఫొటో మార్పిడి తదితర సవరణలు చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నందున బల్క్గా ఓటరు దరఖాస్తు ఫారాలు, ఒకే వ్యక్తి పెద్ద మొత్తంలో ఇచ్చే ఓటరు నమోదు దరఖాస్తులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ బీఎల్ఓ ఓటర్లుకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.నాగేశ్వర్రావు, డీటీ వేణుగోపాల్రెడ్డి, ఆర్ఐ రాకేష్, బీఎల్ఓలు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ -
నత్తే నయం!
జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం రైల్వేస్టేషన్లను సుందరీకరించేందుకు అమృత్ భారత్ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో అమృత్ భారత్ పథకంలో జనగామ రైల్వేస్టేషన్కు చోటు కల్పించారు. 2023 ఆగస్టులో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా అభివృద్ధి పనులు ప్రారంభించగా, రెండేళ్లు కావస్తున్నా సుందరీకరణ పనులు నేటికీ పూర్తి కాలేదు. రాష్ట్రంలోని చర్లపల్లితో పాటు పలు మినీ స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని కొత్త కళను సంతరించుకోగా, జిల్లాలో మాత్రం ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారిపోయాయి. స్టేషన్ అభివృద్ధి పనులకు రూ.100 కోట్ల నిధులను కేటాయించగా, మొదటి విడతలో రూ.24.50 కోట్ల నిధులను విడుదల చేశారు. ఎక్కడి పనులు అక్కడే.. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును తలదన్నే రీతిలో జనగామ రైల్వే స్టేషన్ నమూనాను డిప్లే చేయగా, అది చూసిన ప్రయాణికులు, ప్రజలు ఖుషీ అయ్యారు. మొదట్లో చకచకా సాగిన పనులు, ఆరు నెలల తర్వాత నత్తనడకన సాగుతున్నాయి. స్టేషన్ ముఖ ద్వారంతో పాటు ఫుట్పాత్, పార్కింగ్, గ్రీనరీ, టాయిలెట్స్ తదితర పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మొదటి దశ పనులు పూర్తి చేసుకుని, రెండవ దశ సైతం ప్రారంభం కావాల్సిన దశలో మొదటికే మోక్షం కరువైపోయింది. ప్రతిపాదించిన పనులు.. జనగామ రైల్వేస్టేషన్ ఆధునీకరణకు మొదటి విడతలో మంజూరు చేసిన రూ.24.50 కోట్లతో స్టేషన్ ముఖద్వారం తుది మెరుగులు, కొత్తగా రెండవ ప్రవేశ ద్వారం ఏర్పాటుకు ప్రణాళిక చేశారు. అలాగే 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ఓవర్ బ్రిడ్జి, ప్లాట్ఫాం అభివృద్ధితో పాటు అదనపు కవర్ను ఏర్పాటు చేయనున్నారు. మరుగుదొడ్లను మరింత మెరుగుపర్చి, కొత్తగా టాయిలెట్ల బ్లాకుల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకునే గదులకు కొత్త హంగులు సమకూరుస్తారు. స్టేషన్ ప్రాంగణంలో గ్రీనరీ, విశాలమైన పార్కింగ్, ప్రయాణికులకు అనుకూలమైన వాతావరణం కలిగించేలా స్టేషన్ అభివృద్ధికి ప్లాన్ చేసిన కేంద్రం, అందుకు తగ్గట్టుగా పనులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్లాట్ఫాంపై కోచ్ ఇండికేషన్ బోర్డుల ఏర్పాటు, క్వార్టర్లు, వెయిటింగ్ హాల్స్లో దోమల నివారణకు చర్యలు తీసుకోనున్నారు. లిఫ్టు, ఎస్కలేటర్, రైళ్ల రాకపోకల సమయంలో మరింత పకడ్బందీగా పర్యవేక్షణ ఉండేలా టెలికాం, సిగ్నల్స్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. కానీ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం రెనోవేషన్ పనులు జరుగుతుండడంతో టికెట్ కౌంటర్తో పాటు రాకపోకలకు సంబంధించిన గేటును దారి మర్చారు. ఆలస్యంగా రైల్వేస్టేషన్ సుందరీకరణ పనులు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రూ.100 కోట్లు మంజూరు మొదటి విడతలో రూ.24.50 కోట్లు విడుదలప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు..రూ.100 కోట్లతో రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయనున్నారు. వందశాతం పనులు పూర్తయితే స్టేషన్ కార్పొరేట్ హంగులను సంతరించుకుంటుంది. ప్రస్తుతం పనులను పెండింగ్లో ఉంచడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ఏడాదిలోపే స్టేషన్కు కొత్త హంగులను తీసుకు వస్తామని అధికారులు చెప్పిన మాటలకు పొంతన లేకుండా పోయింది. ఇప్పటికై నా జాప్యాన్ని నివారించాలి. –కాముని శ్రీనివాస్, యశ్వంతాపూర్రెండో దశ ప్రారంభించాలి..జనగామ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు సంబంధించి మొదటి విడత కంప్లీట్ చేసి, రెండవ దశ పనులను వెంటనే ప్రారంభించాలి. రెండేళ్ల నుంచి పనులు సాగుతూ ఉన్నాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు. పనుల పురోగతిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టి సారించాలి. – జోగు ప్రకాశ్, సీపీఎం పట్టణ కార్యదర్శి -
ప్రజల ప్రాణాలపై పట్టింపు లేదు..
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనగామ మండలం వడ్లకొండ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న గానుగుపహాడ్ కల్వర్ట్ బ్రిడ్జి ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిందన్నారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వచ్చే క్రమంలో అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారన్నారు. కాంట్రాక్టర్కు వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించి, గానుగుపహాడ్ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక జనగామ రూరల్: ఇటీవల నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో పట్టణంలోని సెయింట్ మెరీస్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ జైమోన్ థామస్ తెలిపారు. శనివారం రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ లాంగ్జంప్లో పి.మనోజ్, ఎ.బౌషిక్, 60 మీటర్ల రన్నింగ్లో పి.నిఖిల్ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబర్చాలని కోరారు. వ్యాయామ ఉపాధ్యాయుడు గుణవర్ధన్, నరసింహా, రాజు, హేమలతలు విద్యార్థులను అభినందించారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలిజనగామ రూరల్: ఈ నెల 9న జాతీయ కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్ తెలిపారు. శనివారం ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె కు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు, దళిత సంఘాల నాయకులు పాల్గొనాలన్నారు. జిల్లా అధ్యక్షుడు తుటి దేవదానం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యక్షులు పల్లెర్ల లలిత, మబ్బు ఉప్పలయ్య సహాయ కార్యదర్శి గండం యాదగిరి, కాకర్ల బాబు, బోట్ల శ్రావణ్, ఎండీ హతియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. ఎలుగుబంట్లను బంధించిన అధికారులు జఫర్గఢ్: మండలంలో గత కొద్ది రోజుల నుంచి సంచరిస్తున్న ఎలుగుబంట్లను ఫారెస్టు అధికారులు బంధించారు. వివరాలిలా ఉన్నాయి... శనివారం మండలంలోని తీగారం గ్రామశివారులోని హనుమాన్తండా సమీపంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు ఫారెస్టు అధికారులకు తెలిపారు. దీంతో స్పందించిన ఎఫ్ఆర్ఓ మురళీధర్ నేతృత్వంలో ఫారెస్ట్ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ముందుగా తల్లి ఎలుగుబంట్టితో పాటు రెండు పిల్ల ఎలుగుబంట్లు ఉన్నట్లు గుర్తించారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి వాటిని బంధించారు. వీటిని హైదరాబాద్ జూపార్కుకు తరలిస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నర్సింగ్, సెక్షన్ ఆఫీసర్ జరినాబేగం, బీట్ ఆఫీసర్ రవి, అంజి, వాచర్ మోహన్, సంతోష్, రిస్క్టీం సభ్యులు పాల్గొన్నారు. -
ఈవీఎం గోదాం పరిశీలన
జనగామ రూరల్: ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కలెక్టరేట్లోని ప్రధాన ఈవీఓం గోదాంను కలెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం పరిశీలించారు. ఈ మేరకు భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పరిశీలన, నియంత్రణ పద్ధతులను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హుస్సేన్, ఎన్నిక సంఘం సిబ్బంది పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు జనగామ: జిల్లాలో ట్రిపుల్ ఐటీకి అర్హత సాధించిన 49 మంది విద్యార్థులను కలెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం అభినందించారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీలో ఆరు సంవత్సరాల కోర్సుకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. పిల్లలు జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారన్నారు. కొడకండ్ల మండలంలోని 15, రఘునాథపల్లి 8, లింగాలఘణపురం, చిల్పూర్, జనగామ మండలం నుంచి ముగ్గురు చొప్పున ప్రవేశం పొందినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ కొడకండ్ల నుంచి అత్యధికంగా 8 మంది, ఆదర్శ పాఠశాల నుంచి 5 విద్యార్థులు ఎంపికలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. భవిష్యత్తులో సాంకేతిక విద్య పొందడానికి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపించాలని, ప్రణాళిక బద్ధంగా బోధన చేస్తూ, పదో తరగతిలో మంచి ఫలితాలను రాబట్టి, ట్రిపు ల్ ఐటీ బాసరలో మరిన్ని సీట్లు పెరిగేలా చూ డాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ట్రిపుల్ ఐటీలో అవకాశం పొందిన ప్రతీ విద్యార్థిని అభినందిస్తూ, ఉపాధ్యాయుల కృషిని కీర్తించారు. -
‘తొలి ఏకాదశి’కి ముస్తాబు
జనగామ: ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. ఉత్తర దిక్కున ఉన్న సూర్యుడు, ఈరోజు నుంచి దక్షిణ దిక్కున ప్రయాణించడంతో దీనిని దక్షిణాయణంగా పరిగణిస్తారు. శివకేశవులు, విష్ణువుకు ఈరోజు ప్రీతికరమైన రోజు గా భావిస్తారు. నేడు (ఆదివారం) తొలి ఏకాదశి ప్రారంభం పురస్కరించుకుని జిల్లాలోని శివాలయాలు, వైష్ణవ దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. ముస్తాబవుతున్న ఆలయాలు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వర, చిల్పూరు వేంకటేశ్వర, పాలకుర్తి సోమేశ్వర, జనగామ పట్టణం బాణాపురం వేంకటేశ్వర, పాతబీటు రామలింగేశ్వర, సంతోషిమాత ఆలయాలను సుందరంగా అలంకరిస్తున్నారు. తొలిఏకాదశి పర్వదినం పురస్కరించుకుని నేడు తెల్లవారు జాము నుంచి ఆలయాలకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. నేడు కురుమ కులస్తుల బోనాలు పట్టణంలో కురుమ కులస్తులు బీరప్ప కామరతి, అక్క మహంకాళి దేవతామూర్తులకు బోనాలు సమర్పించనున్నారు. కుర్మవాడ నుంచి నెహ్రూపార్కు మీదుగా ఒగ్గుఢోలు కళాకారుల వాయిధ్యాలు, శివసత్తుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు వేలాది మంది మహిళలు బోనాలతో పాటు పట్టువస్త్రాలతో బీరప్ప ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, బోనం నైవేద్యం సమర్పించిన అనంతరం, పట్టు వస్త్రాలు కా నుకగా ఇచ్చి, ఓడిబియ్యం పోస్తారు. ఇందుకు సంబంధించి ఆలయం వద్ద ఏర్పాట్లు చేస్తుండగా, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు కురుమ కులస్తుల బోనాలు -
నిబంధనలు విస్మరిస్తే చర్యలు
దేవరుప్పుల: నిబంధనలు విస్మరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీసీపీ రాజమహేందర్నాయక్ హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల నమోదు రికార్డులు, జప్తు చేసిన సామగ్రి, కీలక భద్రత గదులను పరిశీలించారు. అనంతరం కామారెడ్డిగూడెంలోని వాగును పరిశీలించి ఇసుక ట్రాక్టర్ అనుమతి పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పేదల ఇళ్ల కోసం నిర్ధేశిత ప్రాంతాలకు రెవెన్యూ అధికారులు ఇస్తున్న అనుమతుల మేరకు ఇసుకను తరలించాలన్నారు. అక్రమంగా ఇతరులకు విక్రయిస్తే వాహనం సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. ఇసుక రవాణా విషయంలో పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ చేయాలన్నారు. డీసీపీ వెంట ఎస్సై ఊర సృజన్కుమార్, సిబ్బంది ఉన్నారు. డీసీపీ రాజమహేందర్నాయక్ -
ప్రజాధనం వృథా!
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuజనగామ: లక్షలాది రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన మున్సిపల్ వాహనాలు తుప్పుబడుతున్నా.. సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణ పర్యవేక్షణ గాలికి వదిలేయడంతో కాలనీల్లో మౌలిక వసతులు కరవయ్యాయి. గాడితప్పిన పురపాలికపై సాక్షి ప్రత్యేక కథనం. జనగామ పురపాలికలో ప్రజాధనం అంటే లెక్క లేకుండా పోయింది. ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్లు, ఆయా మార్గాల్లో జరిమానాలు, నిర్మాణ సమయంలో అనుమతుల పేరిట ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది. దీంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత నిధుల విడుదల చేస్తుంది. ఒక్కోపైసా ఖర్చు చేసే సమయంలో బాధ్యత ఉండాలి. అభివృద్ధి పనుల్లో నాణ్యత, ప్రజలకు సౌకర్యాలు కల్పించే సమయంలో మూణ్నాళ్ల పాటు బాగుండే విధంగా చూడాల్సిన బాధ్యత కమిషనర్పై ఉంటుంది. ఇక్కడ మాత్రం అవేమీ కనిపించవు. కమిషనర్ అజమాయిషీ లేకపోవడం, పరిపాలనపై అవగాహ న రాహిత్యంతో ప్రజలకు శాపంగా మారింది. సమస్యలపై ఫిర్యాదు చేస్తే రోజుల తరబడి తిరగడం తప్ప, ఒక్క పని జరిగిన దాఖలాలు లేవని పట్టణంలో చర్చ జరుగుతోంది. శానిటేషన్ నిర్వహణ, చెత్త సేకరణ కోసం లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి కొనుగోలు చేసిన వాహనాలను మూలన పడేశారు. రూ.10లక్షల విలువ చేసే ఆరు డంపర్లు తప్పు పట్టిపోతున్నా.. పట్టించుకోవడం లేదు. మరమ్మతు చేయిస్తే ఉపయోగంలోకి వచ్చే ట్రాక్టర్ ట్రాలీలు అక్కరకు రాకుండా పోతున్నాయి. జనరేటర్ ఎండకు ఎండుతూ, వానకు తడిసి పోతూ ఎందుకు పనికి రాకుండా పోతుంది. హైడ్రాలిక్ ఆటో, మరో ట్రాలీ, వీధుల్లో ఏర్పాటు చేసే చెత్త డబ్బాలు పిచ్చిమొక్కల మధ్య దర్శనమిస్తున్నాయి. అధికారులు కార్యాలయాలకు ఉపయోగించే ఏసీకి అనుసంధానంగా ఉండే ఇన్వర్టర్ను నిర్లక్ష్యంగా చెట్ల పొదల మధ్య ఏర్పాటు చేశారు. ఇన్వర్టర్లోకి పిచ్చిమొక్కలు వెళ్తూ.. వర్షంలో తడుస్తూ పాడై పోతుంది. లక్షల సొమ్ము మట్టి పాలు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించమంటే నిధులు లేవని చెబుతున్న కమిషనర్ నిర్లక్ష్యంపై మెజార్టీ ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ శానిటేషన్ విభాగం వాహనాలు మూలకు పడిన వాహనాలివే న్యూస్రీల్ తుప్పుపడుతున్న మున్సిపల్ వాహనాలు వానకు తడుస్తూ..ఎండకు ఎండుతున్న జనరేటర్ పట్టణ ప్రజలకు కనీస మౌలిక వసతులు కరువు పట్టించుకోని పురపాలిక అధికారులురాత్రి వేళలోనూ చెత్త సేకరణ జనగామ: జనగామ పట్టణంలో పురపాలిక అధికారులు రాత్రి సమయంలో చెత్త సేకరణకు శ్రీకారం చుట్టారు. గాడితప్పిన శానిటేషన్ నిర్వహణపై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలతో అధికారులు స్పందిస్తున్నారు. ప్రధా న రహదారులతో పాటు కమర్షియల్ వార్డుల్లో చెత్తను సేకరిస్తూ డంప్ యార్డుకు తరలిస్తున్నా రు. ఈ ప్రక్రియను మూణ్నాళ్ల ముచ్చటగా కా కుండా, నిరంతర ప్రక్రియగా ముందుగా సా గాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.ఆటోలు: 10ట్రాక్టర్లు:7ప్రైవేట్ ఆటోలు: 5 జేసీబీ: 1 ఫాగింగ్ యంత్రాలు: 4 శానిటేషన్ కార్మికులు: 147స్ప్రేయర్లు: 64 ట్రాలీ కం ఇంజిన్: 1 ట్రాక్టర్ ట్రాలీలు: 2 జనరేటర్: 1 డంపర్లు: 6 హైడ్రాలిక్ ఆటో: 1ఆటో ట్రాలీ: 1 -
ముందస్తు చర్యలు తీసుకోవాలి
జనగామ రూరల్: పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పచ్చదనం విస్తృతంగా చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి దనసరి సీతక్క అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలోని స్వచ్ఛదనం, పచ్చదనంపై చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, డీపీఓ స్వరూపారాణి, డీఆర్డీఓ వసంత, జెడ్పీ సీఈఓ మధురీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ శానిటేషన్ పనులు విస్తృతంగా చేపట్టాలని, పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు తొలగించాలని, మురుగు కాల్వలు శుభ్రపరచాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటూ అపరి శుభ్ర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను నిరంతరాయంగా చేపట్టాలన్నారు. ప్రతీ నెల 1, 11, 21 తేదీల్లో ట్యాంకులను శుభ్రం చేయించి, రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని, ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పచ్చదనం విస్తృతంగా చేపట్టాలి వీసీలో మంత్రి దనసరి సీతక్క -
పన్నులతో పురపాలికకు ఆదాయం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజు ప్రణాళిక కార్యక్రమంలో పురపాలికకు పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శనివారం వ్యాపార, వాణిజ్య సంస్థలను ఆయన సందర్శించి కొలతలు తీసుకున్నారు. అనంతనం ఆయన మాట్లాడుతూ పట్టణంలో 15,574 అసెస్మెంట్లు, ఉండగా ఇందులో 12,841 నివాస గృహాలు, 1,088 నివాసేతర గృహాలు, 1,645 మిక్స్డ్ భవనాలు ఉండగా, ఏటా ఆదాయం రూ.5.67 కోట్ల డిమాండ్ ఉందన్నారు. గతంలో నిర్వహించిన సర్వేలో 2,730 గృహాలను రీ అసెస్మెంట్ చేయగా, రూ.44.89 లక్షల డిమాండ్కు పెరగడం జరిగిందన్నారు. ఇంకా నూతన అసెస్మెంట్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 2025–26 వార్షిక సంవత్సరంలో 2,125 దుకాణాల పరిధిలో కొలతలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న 65 గృహాలను గుర్తించి, వాటిని ఆన్లైన్ నుంచి తొలగించడం(వీటి ద్వారా రూ.28.43 లక్షలు కోల్పోయారు) జరిగిందని, కొత్తగా నిర్మాణం చేసే సమయంలో తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఆయన వెంట కమిషనర్ వెంకటేశ్వర్లు, పులి శేఖర్ తదితరులు ఉన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
నిబద్ధత గల నేత కొణిజేటి రోశయ్య
● కలెక్టర్ రిజ్వాన్ బాషాజనగామ రూరల్: నిబద్ధత గత నాయకుడు కొణిజేటి రోశయ్య అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈసందర్భంగా రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎంగా, గవర్నర్గా పనిచేసి పరిపాలన దక్షుడిగా కీర్తి ప్రతిష్టలు పొందిన మహోన్నతమైన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు. ఉద్యోగులు కొణిజేటి రోశయ్యను ఆదర్శంగా తీసుకొని విధుల్లో అంకితభావం, విధేయత చూపాలని సూచించాఉ. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ జలాలను పెంపొందించాలి
దేవరుప్పుల: మానవ జీవిత పురోగతికి నిరంతరం దోహదపడే విద్య, వైద్య రంగాల్లో విధులు నిర్వర్తించే అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించిన కలెక్టర్ భూరెవెన్యూ సదస్సుల ప్రక్రియ, రేషన్ కా ర్డుల జారీ తదితర విషయాలపై సమీక్షించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దినచర్య యాప్లో కాకుండా రికార్డులపరంగా సమాచారం లేకపోవడాన్ని గుర్తించి సత్వరమే పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశిస్తూ స్థానికుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి కొత్తకాలనీలో కస్తూర్బా బాలికల హాస్టల్ను సందర్శించిన కలెక్టర్ గంటసేపు పైగా తరగతి గదులు తిరిగి విద్యార్థినుల అభ్యున్నతిపై నిశితంగా ప్రశ్నిస్తూ పలు సందేహాలకు నివృత్తి చేశారు. ప్రతి కుటుంబ అభివృద్ధిలో విద్య కీలకమని, బాలికల అభ్యున్నతికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించాలని ఎంఇఓ కళావతికి సూచించారు. పాఠశాలలు ప్రారంభమై నెలదాటినా బాలికలకు యూనిఫామ్ అందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో అందేలా చర్యలు తీసుకోవాలని ఐకేపీ ఏపీఎం వెంకట్రెడ్డిని ఆదేశించారు. నిర్దేశిత 360 మందికి 310 విద్యార్థినులు ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన సిబ్బంది కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారి సుకన్యకు సూచించా రు. ఇదిలా ఉండగా.. కామారెడ్డిగూడెం రైతులు తమ వాగు నుంచి ఇసుక తరలించొద్దని కలెక్టర్ను కోరగా.. వారం తర్వాత ఇసుక తరలింపు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భూగర్భ జలాలను పెంపొందించాలి జనగామ రూరల్: ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టి భవిష్యత్లో తాగు, సాగు నీటి కొరత ఉండకుండా భూగర్భ జలాలను పెంపొందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మన జిల్లా –మననీరు కార్యక్రమంలో భాగంగా తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతల నిర్మాణం ప్రగతి పైన శుక్రవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయం నుంచి గూగుల్ మీట్ ద్వారా వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. ప్రతి గ్రామ, మండల, జిల్లా కార్యాలయంలో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించాలని తెలిపారు. తాగు, సాగు నీరుకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే భూగర్భ జలాలను సంరక్షించుకోవడం తప్పనిసరి అని వివరించారు. వర్షపు నీరు వృథాగా పోకుండా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి రోజు సాధించిన ప్రగతిని సోక్ పిట్ ఫొటోలను గూగుల్ షీట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశిస్తూ సాధ్యమైనన్ని సోక్ పిట్ నిర్మాణాలు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని చెపారు. వన మహోత్సవంపై గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలన్నారు. విద్య, వైద్య రంగాల్లో నిర్లక్ష్యం తగదు కలెక్టర్ రిజ్వాన్ బాషా -
దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి
జనగామ రూరల్: దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నా రు. సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ పోరాటంలో వెనుకబడిన తరగతుల కులాలకు అండగా నిలబడిన దొడ్డి కొమురయ్య మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెనుకబడిన తరగతుల కులాలకు ప్రాధాన్యతనిచ్చి వారి అభ్యున్నతికి కృషిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచె రాములు, పట్టణ అధ్యక్షుడు బల్దే మల్లేశం, పట్టణ కార్యదర్శి జూకంటి శ్రీశైలం, కోశాధికారి ఎండ్రు వైకుంఠం, యాదవ సంఘం పట్టణ అధ్యక్షుడు కానుగంటి ముత్తయ్య, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, రజక సంఘం జిల్లా సెక్రటరీ పదునూరి మదార్, కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బల్దే వెంకట మల్లయ్య, కోపా అధ్యక్షుడు కర్రే కృష్ణ పాల్గొన్నారు. -
ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత తప్పనిసరి
● డీపీఓ స్వరూపారాణి స్టేషన్ఘన్పూర్: ప్రతీ ఇంటి ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడుగుంత నిర్మించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి అన్నారు. మండలంలోని తాటికొండ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఎదునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లోకాస్ట్ మ్యాజిక్ సోప్పిట్ (తక్కువ ఖర్చుతో నిర్మాణం చేసే ఇంకుడుగుంత)లను శుక్రవారం డీపీఓ పరిశీలించారు. గ్రామంలోని రైతువేదిక, పీహెచ్సీ, అంగన్వాడీ సెంటర్లలో నిర్మాణం చేపట్టిన ఇంకుడు గుంతలను ఆమె పరిశీలించారు. అనంతరం డీపీఓ మాట్లాడుతూ.. ఇంకుడు గుంతలతో ప్రయోజనాలపై ప్రజలు చైతన్యం కావాలన్నారు. ఇంకుడుగుంతల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, నీరు నిల్వ ఉండే చోట ఇంకుడు గుంతల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ నర్సింగరావు, కార్యదర్శి సత్యనారాయణ, ఏఈఓ శ్రావణి, అంగన్వాడీ టీచర్లు పద్మ, ధనలక్ష్మి, కారోబార్ సలీమ్, పోకల నరేష్ పాల్గొన్నారు. -
ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జనగామ రూరల్: స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎప్సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్ రాత్ ఖానం అన్నారు. ఎప్సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు 1,071 విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు తమకు నచ్చిన కాలేజీ కోసం వెబ్ఆప్షన్లు ఇవ్వవచ్చని, 18న మొదటి విడత అలాట్మెంట్ జరుగుతుందన్నారు. అంతర్జాతీయ క్లాసికల్ చెస్ రేటింగ్ సాధించిన శ్రీయాన్రామ్ కొడకండ్ల: మండలకేంద్రానికి చెందిన శివరాత్రి శ్రావణ్కుమార్ – లలిత కుమారుడు శ్రీయాన్రామ్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ రేటింగ్ సాధించాడు. జూన్లో హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో జరిగిన అండర్ –9 చెస్ నేషనల్ టోర్నమెంట్లో శ్రీయాన్రామ్ ప్రతిభ కనబరిచి 1506 రేటింగ్ సాధించినట్లు కోచ్లు రాజు, పవన్ తెలిపారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే చెస్లో ప్రతిభను చాటుకొంటున్న శ్రీయాన్రామ్ను పలువురు అభినందించారు. విద్యతోపాటు వినయాన్ని అలవర్చుకోవాలి రఘునాథపల్లి: విద్యతోపాటు విద్యార్థులు వినయాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాధికారి భోజన్న సూచించారు. మండలంలోని వెల్ది మోడల్ స్కూల్ను శుక్రవారం ఆయన సందర్శించారు. పదో తరగతి గదిలో విద్యార్థుల పక్కనే కూర్చొని ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకుంటే జీవితంలో ఎదిగేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం స్కూల్ ఆవరణలో ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్తో కలిసి ఇంకుడు గుంత పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్ కందగట్ల, మల్లం శ్రీధర్, కట్ట రాజు, శ్రీను, జయశ్రీ, విజయ, శశికుమారి, పార్వతి, సౌజన్య, ప్రియ, పీఈటీలు రాజయ్య, వాసుదేవు తదితరులు పాల్గొన్నారు.ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలిబచ్చన్నపేట: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని డీఎల్పీఓ వెంకట్రెడ్డి అన్నారు. కొడవటూరు రైతువేదికలో జసిరెడ్డిపల్లి, బండనాగారం, లక్ష్మాపూర్, బోనకొల్లూరు, కేసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన వారికి పలు సూచలను చేశారు. లబ్ధిదారులతో వెంటనే ఇళ్లను ప్రారంభింపజేయాలని, కొలతల్లో తేడా రాకుండా చూడాలన్నారు. నిర్మాణ దశలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లో చెల్లింపులు జరుగుతాయన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ వెంకట మల్లికార్జున్, హౌసింగ్ ఏఈ ఈశ్వర్, కార్యదర్శులు నర్సింహాచారి, బృంగి రూప, చైతన్య, భరత్, కిషోర్ పాల్గొన్నారు. -
ముగిసిన కోలాట శిక్షణ
జనగామ రూరల్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా కళల పరిరక్షణలో భాగంగా నిర్వహించిన బోనాల కోలాట శిక్షణ శిబిరం ము గింపు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథి గా అరుణోదయ కల్చరల్ ఫెడరేషన్ చైర్మన్ విమల క్క హాజరై మాట్లాడుతూ.. ప్రజా కళలు జీవించాల ని ప్రజలను చైతన్యవంతం చేయడానికి కళాకారులు కృషి చేయాలన్నారు. 51 మంది శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఓగ్గు ధర్మయ్య, కనకంచి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ అభివృద్ధికి బాధ్యతగా పనిచేయాలి
● మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ జేడీ శ్రీధర్ స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, సి బ్బంది ప్రత్యేక చొరవతో బాధ్యతగా పనిచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మున్సిపాలిటీ పరిసరాలు, కమిషనర్ గది, ఫైళ్లు, రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మా ట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ బాధ్యతగా పనిచేయాలన్నా రు. 100 రోజుల ప్రణాళిక పనులను సమర్ధవంతంగా చేపట్టాలని, విధి నిర్వహణలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. గతంలో గ్రామ పంచాయతీ, ప్రస్తుత మున్సిపాలిటీకి పనుల్లో చాలా వ్యత్యాసం ఉంటుందని, అందరూ పనుల్లో అప్గ్రేడ్ కావాలని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మాజీ సీఎం రోశ య్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పట్టణ సుందరీకరణకు రూ.1.50 కోట్లు
జనగామ: జనగామ పట్టణంలోని బతుకమ్మకుంటతోపాటు చుట్టూ సుందరీకరణ పనుల కోసం రూ.1.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. సుందరీకరణ పనులపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ చుట్టూ పాదచారులకు పాత్ వే నిర్మాణంతోపాటు సేదదీరేందుకు బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకునే పరికరాలు, కుంట చుట్టూ గ్రిల్స్, గార్డెన్ లైటింగ్, కట్టపై హైమాస్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బతుకమ్మ కుంటలో బురద మట్టి పేరుకుపోయి, దుర్గంధం వెదజల్లడంతో రూ.10 లక్షలతో పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. బస్టాండ్ చౌరస్తాలో డివైడర్పై 12 ఆకృతులతో సూర్య నమస్కారాలు, 12 అడుగుల ఎత్తుతో నమస్కార ముద్ర విగ్రహా న్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్ బైపాస్ రోడ్డులో సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య స్మారక చిహ్నాల ఏర్పాటుతోపాటు వాటర్ ఫౌంటేషన్కు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. హనుమకొండ బైపాస్పై పట్టణానికి ఆకర్షనీయమైన ప్రవేశ ద్వారం పనులు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జనగామ చుట్టూ స్వాగత తోరణాలు జంక్షన్లో సూర్యనమస్కారాల విగ్రహాలు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
చర్య తీసుకోవాలి
స్టేషన్ఘన్పూర్: మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి భాస్కర్పై దాడి చేసిన మార్కెట్కమిటీ వైస్ చైర్మన్ విజయ్కుమార్పై తగిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ ఉద్యోగుల అధ్యక్షుడు, స్టేషన్ఘన్పూర్ మార్కెట్ కార్యదర్శి జన్ను భాస్కర్ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిపై ఈనెల 2న వైస్ చైర్మన్ చేసిన దాడిని ఖండిస్తూ టీఎన్జీఓల మార్కెట్ కమిటీ ఉద్యోగుల కేంద్ర సంఘం నాయకుల పిలుపుమేరకు స్టేషన్ఘన్పూర్లో మార్కెట్ కార్యదర్శి జన్ను భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం మార్కెట్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జన్ను భాస్కర్ మాట్లాడారు. మార్కెట్ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, వైస్ చైర్మన్ను పదవి నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోండి
లింగాలఘణపురం: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు. మండల కేంద్రంతోపాటు బండ్లగూడెంలో గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. బేస్మెంట్ వరకు ఎంత ఖర్చు అయింది.. మహిళా సంఘాల నుంచి ఏమైనా రుణాలు తీసుకున్నారా.. మెరీటీయల్ కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నాయా.. అంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. మేసీ్త్రలు, కూలీల కొరత ఏమైనా ఉందా.. అని ఆరా తీశారు. ప్రతి సోమవారం లబ్ధిదారులకు ఆయా ఇళ్ల స్థితికి అనుగుణంగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని, ఎలాంటి జాప్యం జరగదని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్మిస్తున్న మోడల్హౌజ్ను పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న సోక్ఫిట్స్ను పరిశీలించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపుతో ఎరువుల తనిఖీ చేశారు. ధరల పట్టికల ఏర్పాటు చేయాలని, విత్తనాలు, ఎరువులు విక్రయించే సమయంలో రైతుల పేర్లు, సెల్ నంబర్లను నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్తోపాటు తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, ఎంపీఓ రాఘురామకృష్ణ, ఏఓ వెంకటేశ్వర్లు, హౌజింగ్ ఏఈ దివ్య, కార్యదర్శులు ప్రవీణ్కుమార్, సంతోషిమాత తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ రిజ్వాన్బాషా -
ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు
జనగామ: అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆర్డీఓ గోపీరాం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జనగామ నియోజకవర్గస్థాయి ఇంది రమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్లతో కలిసి ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో నిరుపేదల కల సాకారం అవుతుందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో భూ భారతి సదస్సులు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు పరిష్కారం చేస్తున్నామన్నారు. కొత్త రేషన్కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం వంటి ప్రభుత్వ పథకాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామన్నారు. వ్యవసాయం పండుగలా చేపట్టేందుకు రైతులు పండించిన ధాన్యం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేశామన్నారు. సన్నాలు పండించే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకంగా క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రుణమాఫీతోపాటు రైతు భరోసా పథకం అమలు చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తే అధికారులు, ప్రజాప్రతినిధులతో వచ్చి ప్రారంభిస్తామన్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వద్ద దమ్ము ఉందని, సంక్షేమం, అభివృద్ధికి ఎక్కడా ఇబ్బందులు ఉండవన్నారు. అంతకు ముందు జనగామ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, జనగామ రూరల్, బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగొప్పుల మండలాలకు చెందిన 816 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ఎంపీ అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, హౌసింగ్ పీడీ మాతృనాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్టీఏ మెంబర్ అభిగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎంకు దమ్ముంది.. సంక్షేమం, అభివృద్ధి ఆగదు ఇళ్ల పట్టాల పంపిణీలో ఎంపీ కిరణ్కుమార్రెడ్డి -
నాలాల క్లీనింగ్.. గుంత పూడ్చివేత
జనగామ: జనగామ పట్టణంలో మట్టి, చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండిన నాలాల క్లీనింగ్ పనులు పురపాలక అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పురపాలక అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘మూణ్నాళ్ల ముచ్చటేనా’, ‘కంపు కంపు’, మట్టిరోడ్లు మస్తు తిప్పలు’, ‘చెత్త కంపు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ కథనాలతో శానిటేషన్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు నిద్రమత్తు వీడారు.. నాలాల్లో చెత్తను తొలగిస్తుండగా, రోడ్లపై చెత్తను డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా సాగితేనే పట్టణంలో స్వచ్ఛత నెలకొంటుంది. ఈ దిశగా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తే, సమస్యలు పునరావృతం కాకుండా ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తూనే.. కమిషనర్ మాత్రం తన సీటును వదిలిబయటకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దోమల నివారణకు గురువారం సాయంత్రం సంబంధిత కార్మికులు జనగామలో ఫాగింగ్ చేశారు. ప్రమాదకర గుంతకు మోక్షం హెడ్పోస్టాఫీస్ మలుపు వద్ద ప్రమాదకరంగా మారిన గుంతను పూడ్చి వేశారు. సాక్షి లో వచ్చిన కథనాలకు సంబంధించిన ప్రతులతో అమ్మ ఫౌండేషన్ సంస్థ నిరసనలు తెలుపగా, అధికారులు స్పందించారు. ఇంజనీరింగ్ డిపార్డుమెంట్ ఏఈ మహిపాల్ ఆధ్వర్యంలో గుంతలో సీసీ వేయించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నారు. ప్రజాసమస్యలపై నిత్యం సాక్షి చేస్తున్న పోరాటానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
విద్యార్థుల బాధ్యత ఉపాధ్యాయులదే..
● విద్యాశాఖపై కలెక్టర్ సమీక్షజనగామ: సర్కారు బడుల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ‘శిథిల గదులు– చదువులు ఆగం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. 2025–26 నూతన విద్యా సంవత్సరంలో విజయోస్తు 2.0 కార్యక్రమంలో భాగంగా బడిబాట నమోదు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ, అకాడమీక్ క్యాలెండర్, పది వార్షిక పరీక్షల ముందస్తు ప్రణాళిక తదితర వాటిపై అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీఈఓ భోజన్న, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులతో కలిసి గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి స్కూల్కు రెగ్యుల్గా వచ్చేలా మానిటరింగ్ చేయడంతోపాటు ప్రతి అంశాన్ని ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని ప్రతి రోజు నివేదిక రూపంలో అందించాలని ఆదేశించారు. పాఠ్యంశాల బోధనకు ఇబ్బంది కలగకుండ లీవ్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు. పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, పంట సామగ్రి, నీరు, కూరగాయలు శుభ్రంగా ఉండాలన్నారు. కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు ముందు బెంచ్లో కూర్చునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీ లోపు ఇంటర్లో చేరిన విద్యార్థుల నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పదో తరగతి ముందస్తు కార్యాచరణను మొదలు పెట్టాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే కేరిర్ గైడెన్స్ ఉండాలని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడాంశాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. ప్రతి పాఠశాలలో కనీసం 3 సోక్ పిట్స్ నిర్మాణం చేసి, వన మహోత్సవంలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నషా ముక్త భారత్లో భాగంగా హై స్కూల్ విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ సారించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో బోధన మెరుగుపడాలన్నారు. -
డ్రెయినేజీలు, రోడ్ల పరిశీలన
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అధ్వానంగా ఉన్న డ్రెయినేజీలు, రోడ్లు, పారిశుద్ధ్య సమస్యపై ‘మారని తీరు–మున్సిపాలిటీ అయినా కంపు కొడుతున్న వార్డులు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి మున్సిపాలిటీ అధికారులు స్పందించారు. మున్సిపల్ పరిధిలోని ఛాగల్లు, స్టేషన్ఘన్పూర్, శివునిపల్లిలోని పలువార్డులను కమిషనర్ రాధాకృష్ణ అధికారులతో కలిసి గురువారం సందర్శించారు. ఆయా వార్డుల్లో అసంపూర్తిగా ఉన్న డ్రెయినేజీలు, మట్టిరోడ్లు, దెబ్బ తిన్న సీసీ రోడ్లను పరిశీలించారు. అవసరమైన చోట డ్రెయినేజీలు, సీసీ రోడ్లను ప్రాధాన్యత క్రమంలో చేపడతామని, ఈ మేరకు నివేదికను తయారు చేయాలని అధికారులకు సూచించారు. వార్డుల్లో చెత్తా చెదారం లేకుండా కార్మికులు బాధ్యతగా పనులు చేయాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ ఏఈ వంశీకృష్ణ, జూనియర్ అసిస్టెంట్లు శ్రీనివాస్, సందీప్, నాయకులు బూర్ల శంకర్, పోశాల కృష్ణ, సారంగపాణి, రమేష్, నాగేష్, ఫాతికుమార్, పూర్ణచందర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
స్థానిక పోరుకు సై
పల్లెల్లో రాజకీయ నేతల హడావుడి జనగామ: స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పుతో పల్లెల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కొద్దిరోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆశావహులు రంగలోకి దిగుతున్నారు. కేడర్తోపాటు అధిష్టానం ఆశీస్సుల కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పోటీకి సర్వం సిద్ధం చేసుకుంటూ, రిజర్వేషన్లు ఎలా ఉంటాయ నే దాని పై కులాల వారీగా లెక్కలు వేసుకునేపనిలో పడ్డారు. తెరపైకి ఆశావహులు స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్దిరోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆశావహులు ఖద్దర్ డ్రెస్లతో ప్రజల ముందు ప్రత్యక్షమవుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 2న సర్పంచ్, జూలై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి గ్రామం, మండలం, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేసినా, బీసీ రిజర్వేషన్లు, కులగణన నేపథ్యంలో వాయిదా పడ్డట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో అప్పటి వరకు పోటీపై ఆసిక్తగా ఉన్న వివిధ పార్టీల ఆశావహులు డీలా పడిపోయారు. కేడర్తోపాటు సేవా కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారు. స్థానిక సమరానికి సమయం ఆసన్నం కావడంతో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఆర్ఎస్ పార్టీల్లోని నాయకులతోపాటు స్వతంత్రంగా పోటీ చేసేందుకు ఆశావహులు మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్న నాయకులు విందులతో తమవైపు తిప్పుకునే ప్రయత్నం ప్రారంభించారు. జిల్లాలో ఎక్కడ చూసినా స్థానిక సమరం గురించే చర్చించుకుంటున్నారు. ప్రధాన, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలదే స్థానిక ఎన్నికల్లో హవా కొనసాగడం ఆనవాయితీ. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించడంలో జాప్యం చేయడంతో సర్కార్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కొంతమేర ఎలక్షన్స్పై పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక పాలనలో మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధి కుటుంబడిపోతుండడం, కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవడంతో ఎలక్షన్లు నిర్వహించేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందరికీ ప్రతిష్టాత్మకమే.. అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. స్థానిక సంస్థల్లో తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని బీఆర్ఎస్ బరిలో దిగనుండగా, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను పునరావృతం చేసుకుని సంపూర్ణ విజయం పొందాలని కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే.. ఈసారి అత్యధిక స్థానాలను కై వసం చేసుకునేలా బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తుంది. సీపీఎం, సీపీఐ, స్వతంత్రులు సైతం బరిలో గట్టి పోటీ ఇచ్చేందుకు తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. రిజర్వేషన్ మారేనా..?ఎన్నికల్లో పోటీచేయాలంటే మందుగా రిజర్వేషన్ కలిసిరావాలి. అయితే ఆసారి పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా.. లేక కొత్త ప్రతిపాదనలు చేస్తారా.. అనే విషయంలో క్టారిటీ లేకపోవడంతో ఆశావహులు సందిగ్ధంలో పడ్డారు. అయితే పాత రిర్వేషన్ల ప్రకారమే ఎలక్షన్లు నిర్వహించబోతున్నట్లు ప్రచారం జరుగుతుండడం గమనార్హం. తెరపైకి ఆశావహులు సేవా కార్యక్రమాల్లో బిజీబిజీ రిజర్వేషన్లపై సందిగ్ధంసిద్ధమవుతున్న అధికారులు గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే మందుస్తు ఊహాగానాలతో అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎలక్షన్ల నిర్వహణ కోసం ఆర్ఓ, ఏఆర్ఓలు ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేశారు. స్టేషన్ఘన్పూర్ డివిజన్ను మున్సిపల్ చేయడంతో జిల్లాలో 280 జీపీలు, 2,576 వార్డులు ఉన్నాయి. 12 జెడ్పీటీసీలు, 134 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జెడ్పీ ఎలక్షన్ల కోసం 753, పంచాయతీ ఎన్నికల కోసం 2,576 పోలింగ్ కేంద్రాలను గుర్తించడంతోపాటు బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ ముద్రణ, ఎలక్షన్ సామగ్రిని సిద్ధం చేసి అధికారులు రెడీగా ఉన్నారు. -
అభివృద్ధికే స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు
జనగామ రూరల్: పాఠశాల అభివృద్ధి.. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకే స్కూల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ భోజన్న తెలిపారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల స్కూల్ కౌన్సిల్ ఎన్ని కలను ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించారు. జూన్ 30వ తేదీన పాఠశాలలో ఎన్నికలు నిర్వహించగా ఫలితాలను జూలై 1న వెల్లడించి గురువారం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులతో డీఈఓ భోజన్న ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జీ లను అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను కూడా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోనే చదువుకొని డీఈఓ స్థాయికి ఎదిగినట్లు గుర్తు చేసుకున్నారు. ఎన్నికలలో విజయం సాధించిన విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవరచుకొని రాబోయే కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ నరసింహులు గౌడ్ పాల్గొన్నారు. డీఈఓ భోజన్న -
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
లింగాలఘణపురం: విద్యార్థులు జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని అందుకుతగ్గట్టుగా కృషి చేసి సాధించాలని జనగామ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సి.విక్రమ్ అన్నారు. మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలపై అ వగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు విద్యార్థులు బానిసలు కావొద్దని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉ పాధ్యాయ బృందం, వలంటీర్లు పాల్గొన్నారు. టీబీ కేసులను గుర్తించాలి జనగామ: దేశ వ్యాప్తంగా చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రోగ్రాంలో కే సులను గుర్తించాలని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కా ర్యదర్శి ఆరాధన పట్నాయక్ ఆదేశించారు. గు రువారం ఢిల్లీ నుంచి టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయి న్పై ఎండీ ఎన్హెచ్ఎంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టరేట్ నుంచి పీఓ ఎన్టీ ఈపీ సిబ్బందితో కలిసి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో 1,21,613 మందికి ఎక్స్రే, నాట్ ద్వారా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 736 మందికి ఎక్స్రే, 781 మందికి నాట్ టీబీ పరీక్షలు చేయగా.. 43 మందికి టీబీ ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు టీచర్ల వేతనాల విడుదల జనగామ: 2008లో డీఎస్సీ అర్హత సాధించి పదహారేళ్లుగా పోరాటం చేస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాంట్రాక్టు పద్దతిలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇచ్చింది. ఇందులో జనగామ జిల్లాలో 32 మంది(ఎస్జీటీ)గా బాధ్యతలు స్వీకరించారు. 2025–26 వా ర్షిక సంవత్సరంలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న వీరి వేతనాలకు సంబంధించి జిల్లాకు రూ.1,33,73,800 విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గైనిక్, అనస్థటిస్ట్ పోస్టులకు ఇంటర్వ్యూలు జనగామ: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న గైనకాలజిస్టు(1), అనస్థటిస్ట్(1) పోస్టుల ను నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో కాంట్రాక్ట్ ప ద్దతిలో భర్తీ చేయనున్నట్లు డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గైనకాలజిస్టు(అర్హత ఎంబీబీఎస్/ ఎంఎస్,డీజీఓ/ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్/వేతనం రూ.లక్ష) అనస్థటిస్ట్ పోస్టుకు(ఎండీ డిప్లొమా ఇన్ అనస్తియా (డీఏ), మెడికల్ కౌన్సి ల్ రిజిస్ట్రేషన్/వేతనం రూ.లక్ష) అర్హత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఈ నెల 8వ తేదీన కలెక్టరేట్లో మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. కొనసాగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జనగామ రూరల్: టీజీఎప్సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతోందని కళాశాల ప్రిన్సిపాల్ రాత్ ఖహ్నం గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ఇప్పటి వరకు 800లకుపైగా విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6:00 వరకు వరకు ఈప్రక్రియ ఉంటుందని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన వారు ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు కాలేజీ కోసం ఆన్లైన్లో ఆప్ష న్ ఇవ్వాలని తెలిపారు. 18న మొదటి విడత అలాట్మెంట్ జరుగుతుందని తెలిపారు. నేడు కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు జనగామ రూరల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పనిచేసిన కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు శుక్రవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొనాలని పేర్కొన్నారు. -
‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. భర్త, పిల్లలను వదిలేసి రా'
జనగాం: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్కుమార్తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్.. తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్కుమార్కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త సతీశ్కుమార్ హుటాహుటిన మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కె. రియాజ్పాషా తెలిపారు. -
అంగన్వాడీల బలోపేతానికి కృషి
జనగామ రూరల్:అంగన్వాడీల బలోపేతానికి కృషి చేయాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్ మోహితి అన్నారు. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జిల్లా స్థాయి సిబ్బంది, డీసీపీయూ, చైల్డ్ హెల్ప్లైన్, సఖి సెంటర్, పోషణ అభియాన్, అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహా రం అందేలా చూడాలన్నారు. అంతకుముందు పట్టణంలోని అంబేడ్కర్నగర్, రఘునాథపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలను పరి శీలించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలినర్మెట: విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ అన్నారు. మండలంలోని కస్తూ ర్భాగాంధీ బాలికల విద్యాలయం, నర్మెట గ్రామపంచాయతీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ పరిసరాలు, తరగతి గదులు, వంటశాల పరిశీలించిన అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలోని పలు రికార్డులు పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను నిర్మించాలన్నారు. ఆయన వెంటన డీఈఓ భోజన్న, జీసీడీఓ గౌసియా బేగం, ఎంపీడీఓ అరవింద్ చౌదరి, ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, ఎస్ఓ రజిత, కార్యదర్శి కందకట్ల శ్రీధర్, సిబ్బంది తదితరులున్నారు. సమస్యలు సత్వరమే పరిష్కరించాలిచిల్పూరు: ఫిర్యాదుదారులు ఇచ్చే దరఖాస్తులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సత్వరమే చర్యలు తీసుకోవాలని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేందర్ నాయక్ అన్నారు. చిల్పూరు పోలీస్ స్టేషన్ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్య క్తం చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్ర వర్తించాలన్నారు. కార్యక్రమంలో జనగామ రూరల్ సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్రెడ్డి, ఎస్సై నవీన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీగా హనుమాజనగామ: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ ఎస్డీసీ–2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న వి.హనుమాకు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నుంచి రిలీవ్ అయి, కొత్త పో స్టులో జాయినింగ్ తేదీని ప్రభుత్వానికి తెలియ పర్చాలని అందులో పేర్కొన్నారు. తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్ల బదిలీలుజనగామ: జిల్లాలో నలుగురు తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేయడంతో పాటు పోస్టింగ్లు ఇస్తూ కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రఘునాథపల్లి తహసీల్దార్ ఎండీ మొహ్సిన్ ముజ్తభాను నర్మెటకు, నర్మెటలో పని చేస్తున్న తహసీల్దార్ రామానుజాచారికి బచ్చన్నపేటకు పోస్టింగ్ కల్పిస్తూ ఆర్డర్ ఇచ్చారు. బచ్చన్నపేటలో ఇన్చార్జ్ తహసీల్దార్గా పని చేస్తున్న నాయబ్ తహసీల్దార్ ఎల్.ఫణికిషోర్ రఘునాథపల్లికి బదిలీ చేయడంతో పాటు తహసీల్దార్గా అదనపు పూర్తి బాధ్యతలను అప్పగించారు. రఘునాథపల్లి నాయబ్ తహసీల్దార్గా పని చేస్తున్న సుంచు శంకర్ జనగామ ఆర్డీఓ కా ర్యాలయానికి బదిలీ కాగా, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కలెక్టరేట్లో డిప్యూటేషన్ పై పని చేస్తారన్నారు. బదిలీ అయిన తహసీల్దా ర్లు, నాయబ్ తహసీల్దార్లు వెంటనే విధుల్లో చే రాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆయిల్పామ్ సాగును పెంచాలి●
● కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్: రైతులకు అధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్పామ్ సాగును పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుపై ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,500 ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అవకాశం ఉందని, ముందుగా గుర్తించిన 700 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు చర్యలు తీసుకోవాలన్నారు. 2,800 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసేందుకు ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా లక్ష్యాలు రూపొందించుకొని ఫలితాలు సాధించాలన్నారు. భూగర్భ జలాలను పరిరక్షించేందుకు ప్రతీ రైతువేదికలో ఇంకుడుగుంతలు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన, పట్టు పరిశ్రమ శా ఖ అధికారి శ్రీధర్, వ్యవసాయ శాఖ అధికారి రా మారావు నాయక్, సహకార శాఖ అధికారి రాజేందర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ శంకర్, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతమైన విద్య, పౌష్టికాహారం అందుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం మండలంలోని ఓబుల్కేవాపూర్ జెడ్పీ హైస్కూల్ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా 9, 10 తరగతిలో విద్యార్థుల సామర్థ్యాలు, డిజిటల్ బోధన తీరు, మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం టెన్త్ ఫలితా ల్లో మొదటి స్థానం వచ్చేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కష్టమైన సబ్జెక్టులు ఉంటే ఇప్పటినుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూలోది కాకుండా వేరేది పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అనంతరం అంగన్వాడీ పాఠశాలను సందర్శించి పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జీరో పర్మిట్ విధానం అమలు చేయాలి జిల్లాలో ఆన్లైన్లో జీరో పర్మిట్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇసుక, కంకర, ఖనిజ వనరులకు సంబంధించిన ఆన్లైన్ల జీరో పర్మిట్, టీజీఎండీసీలో ఇసుక అనుమతులు తీసుకునే విధానంపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీరో పర్మిట్ విధానం ద్వారా అనుమతులు తీసుకునే విధంగా కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ ఏడీ విజయ్ కుమార్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
పక్క ఫొటోలో కనిపిస్తున్న ఏరియా స్టేషన్ఘన్పూర్ ఎస్సీ కాలనీలోని 16వ వార్డు దుస్థితి. వార్డులో డ్రెయినేజీ సౌకర్యం సరిగా లేకపోవడంతో మురుగునీరు జనవాసాల మధ్య నిలుస్తూ చిన్నపాటి కుంటను తలపిస్తుంది. ఇళ్ల మధ్య మురుగునీరు నిలిచి ఉండగా పందులు, దోమల స్వైర విహారంతో కాలనీవాసులు దుర్వాసనతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్టేషన్ఘన్పూర్ ఎస్సీ కాలనీలోని జనవాసాల మధ్య నిలిచిన మురుగునీరు న్యూస్రీల్ -
కురిసిన వర్షం.. రైతన్న హర్షం
పత్తి, వరి పంటకు ఊపిరి ● రెండవసారి పత్తి విత్తనాలువిత్తుతున్న రైతులు ● ఆలస్యంగా ప్రారంభమైన వరి నాట్ల పనులు ● వ్యవసాయ క్షేత్రాల్లో సందడిజనగామ: వానాకాలం సీజన్ రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. సీజన్కు ముందు మురిపించిన వర్షాలు, పత్తి విత్తులు, నారు మళ్లు సిద్ధం చేసుకున్న తర్వాత ముఖం చాటేశాయి. గడిచిన నెలరోజుల్లోగా వరణుడి పలకరింపు లేకపోవడంతో నాటిన విత్తనాలు మట్టిలో కలిసి పోగా, నారు మళ్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో నాట్లు వేయడం కొంత ఆలస్యం జరుగగా, వర్షం కోసం అన్నదాతలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. రెండు రోజుల క్రితం కురిసిన మోస్తరు వర్షం పత్తి మొలకలు, నారు మళ్లకు ఊపిరిపోసింది. వరణుడి కరుణతో కురిసిన కంటి తుడుపు వర్షంతో వ్యవసాయ క్షేత్రాల్లో సందడి నెలకొంది. 3.40 లక్షల ఎకరాల్లో సాగు అంచనా.. జిల్లాలో వానాకాలం సీజన్లో 3.40 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, వేరుశనగ తదితర పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ ముందస్తుగా అంచనా వేసింది. పత్తి 1.25 లక్షలు, వరి 2.15 లక్షలు సాగు చేయనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు పత్తి, 20వ తేదీ వరకు నాట్లు 70 శాతం మేర పూర్తి కావాల్సి ఉంది. రైతన్నకు ఊరట.. జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులకు కొంత మేర ఊరట కలిగిస్తున్నాయి. ఇప్పుడప్పుడే భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేనప్పటికీ, వరద నీరు పొలాల్లోకి వచ్చి చేరుతుంది. నార్లు పోసి సిద్ధంగా ఉంచుకోగా, నాట్ల కోసం దుక్కులు మొదలు పెట్టారు. పలుచోట్ల పత్తిలో కలుపు తీత పనులు జోరుగా సాగుతున్నాయి. పత్తి కొమ్మలు వా డి పోతున్న సమయంలో ఈ వాన జీవం పోసింది. ఒక్కోరైతుకు రూ.10వేల నష్టం ఈ సీజన్లో ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో ముందస్తుగా నాటిన పత్తి విత్తులు నేలలోనే మురికి పోయాయి. ఒక్కో రైతు రూ.5 నుంచి రూ.10 వేల వరకు నష్టపోయారు. ఇటీవల కురుస్తున్న మోస్తరు వర్షాలతో రెండవ సారి పత్తి విత్తులు నాటుతుండడంతో పెట్టుబడి భారం పెరిగిపోతుంది. జిల్లాలో సాగు వివరాలు (ఎకరాల్లో) పత్తి : 57,807వరి : 42,342కందులు : 605పెసర : 278ధైంచ : 10,127మొక్కజొన్న : 4,007మొత్తం సాగు : 1,15,166వర్షపాతం వివరాలు(మిల్లీ మీటర్లు) నెల కురియాల్సింది కురిసింది శాతం జూన్ 124.2 56.8 మైనస్ 54 శాతం జూలై 8.4 39.0 ప్లస్ 36 శాతంపంటలకు ప్రాణం పోసింది.. వేల రూపాయలు ఖర్చు చేసి వరి, పత్తి పంట సాగు చేసిన. దుక్కుల నుంచి మొదలుకుని విత్తనాల కొనుగోలు, నారు మళ్లు, కూలీల ఖర్చు వేలల్లో ఉంది. పత్తి విత్తనాలు నాటి, నాట్లకు సిద్ధం చేసుకుందామంటే చినుకు జాడ లేదు. దీంతో ఆందోళన చెందాం. ప్రస్తుత వర్షం పంటలకు ప్రాణం పోసింది. – చెవుల రాజు, రైతు, నర్మెట -
ఈసారి ముందస్తుగానే.. మహాజాతర
ఎస్ఎస్తాడ్వాయి: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ప్రతీ రెండేళ్లకోసారి సాగే మహాజాతర తేదీలను పూజారులు ఎక్కువగా ఫిబ్రవరి నెలలోనే ఖరారు చేస్తారు. ఈసారి అధిక అమావాస్య రావడంతో వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పూజారులు బుధవారం మహాజాతర తేదీలను ప్రకటించారు. 20 రోజుల ముందుగానే జాతర ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన మేడారం మహాజాతర ఈసారి 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. దీంతో 20 రోజుల ముందుగానే మహాజాతర జరగనుంది. పూజారులు పంచాంగం, కొత్త క్యాలెండర్ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి, అమ్మవార్ల గడియలను బట్టి జాతర తేదీలను ఖరారు చేస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి జాతర తేదీలను అమావాస్య రోజుల్లో పౌర్ణమికి ముందుగా నిర్ణయించడం ఆనవాయితీ. ఈసారి 2026 జనవరి 17 నుంచి అమావాస్య మాసం ప్రారంభం కావడం, జనవరి 31న పౌర్ణమి అవుతుండడంతో మాఘశుద్ధ పౌర్ణమికి ముందుగా జాతర తేదీలను నిర్ణయించారు. అంటే అధిక అమావాస్య రావడంతో ఈసారి జనవరిలోనే నిర్ణయించినట్లు పూజారులు వెల్లడించారు. 2018లో జనవరిలోనే జాతర.. గత మహాజాతరల తేదీలతో పోలిస్తే 2018లో జనవరి 31నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర తేదీలను నిర్ణయించారు. అలాగే 2010లో ఫిబ్రవరి 17నుంచి 20 వరకు, 2012లో ఫిబ్రవరి 8 నుంచి 11వరకు, 2014లో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు, 2016లో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు, 2020లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు, 2022లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు, 2024లో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర సాగింది. 2018లో మాత్రం జనవరి 31 నుంచి జాతర సాగగా.. ఈ దఫా 2026 జనవరి నెలాఖరులోనే జాతర సాగనుంది. జాతర ఇలా..జనవరి 28వ తేదీ: సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి రాక 29వ తేదీ : సమ్మక్క గద్దైపెకి 30వ తేదీ: భక్తుల మొక్కుల చెల్లింపు 31వ తేదీ: దేవతల వనప్రవేశం అధిక అమావాస్య రాకతో జనవరిలో నిర్వహణ మేడారం జాతర తేదీలను ప్రకటించిన పూజారులు 2026 జనవరి 28 నుంచి 31 వరకు.. కొనసాగుతున్న శాశ్వత అభివృద్ధి పనులుఅధికార యంత్రాంగం సమాయత్తం మేడారం మహాజాతర తేదీలను పూజారులు ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై సమాయత్తం కానుంది. ఈసారి ముందస్తుగానే శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో ఇప్పటికే మేడారంలో శాశ్వత నిర్మాణం పనులు కొ నసాగుతున్నాయి. ఇకనుంచి జిల్లా యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై ప్రణాళికలతో ముందుకెళ్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అ ధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కోరారు. -
మారని తీరు!
స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అయినా కంపు కొడుతున్న వార్డులు ● అధ్వానంగా రోడ్లు, డ్రెయినేజీలు ● ఎక్కడి చెత్త అక్కడే.. ● పారిశుద్ధ్య లోపంతో ప్రజల పాట్లు స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ వివరాలు విస్తీర్ణం 48.24 చ.కి.మీ. వార్డులు 18 జనాభా 30,527 ఓటర్లు 18,358 పురుషులు 8,842 సీ్త్రలు 9516 గృహాలు 7,408అసంపూర్తిగా డ్రెయినేజీ నిర్మాణం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మోడల్ కాలనీకి వెళ్లే రోడ్డులో ఉన్న డ్రెయినేజీ అసంపూర్తిగా నిర్మాణం చేయడంతో మురుగునీరు జనవాసాల్లో నిలుస్తుంది. డ్రెయినేజీ సమస్యను పట్టించుకునే వారు లేక కాలనీవాసులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు.గుంతల రోడ్డుతో అవస్థలు స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి అంబేడ్కర్ సెంటర్ రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. శివునిపల్లి నుంచి జఫర్గఢ్, ఐనవోలుకు వెళ్లేందుకు ఈ దారిపైనే ప్రయాణించాల్సి ఉంది. గుంతలమయమైన రోడ్డుపై అవస్థలు పడుతున్నారు. -
ఆర్అండ్బీ ఈఈగా బాధ్యతల స్వీకరణ
జనగామ: జనగామ జిల్లా రోడ్లు, భవనాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)గా స్వరూపారాణి మంగళవారం పదవీబాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఈఈ కలెక్టర్ రిజ్వాన్బాషాను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.పశు సంరక్షణపై అవగాహన కల్పించాలిజనగామ రూరల్: విద్యార్థులకు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ పశు సంరక్షణ, పోషణపై అవగాహన కల్పించాలని గో సేవా విభాగం తెలంగాణ ప్రశిక్షణ ప్రముఖ్ డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో హిందూ సంస్థల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో పర్యావరణ పరిరక్షణ అవగాహన పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ, సహా కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, మాధవరెడ్డి, ముక్క స్వామి, చిక్కుడు నగేష్, సత్యం, అంచూరి రమేష్, కృష్ణమూర్తి, రాంబాబు, భజరంగ్ దళ్ నగర కన్వీనర్ యామంకి రాఖేష్ తదితరులు పాల్గొన్నారు.పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీసిన ప్రభుత్వంచిల్పూరు: ప్రభుత్వం పెన్షనర్లపై మొండి వైఖరిని కొనసాగిస్తూ వారి మనోభావాలను దెబ్బతీశారని పెన్షనర్ల సాధన పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. మండలకేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెన్షనర్లకు 15 నెలలుగా రావాల్సిన బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కొందరు సంఘం నాయకులు ఒక తప్పుడు సమాచారాన్ని సీఎంకు చేరవేయడంతోనే ఇలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచించి పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానంజనగామ రూరల్: పెంబర్తి మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్ పోస్టుకు సంబంధిత పీజీ సబ్జెక్టులో 55శాతం ఉత్తీర్ణత, బోధనలో అనుభవం, యూజీసీ నెట్, సెట్, పీహెచ్డీ అర్హత గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటు ందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 4వ తేదీలోపు కళాశాలలో నేరుగా దరఖాస్తు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు 70133 10928 నంబర్లో సంప్రదించాలన్నారు.మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలిలింగాలఘణపురం: జీవితాలను నాశనం చేసే మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. మానసిక, శారీరక ఆరోగ్యాలపై ఏ విధంగా ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ సీతారామరాజు, ప్రిన్సిపాల్ సునీత, పారా లీగల్ వలంటీర్లు రవీందర్, జితేందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 26.3 మిల్లీమీటర్ల వర్షం
జనగామ: జిల్లాలో గత నెల 31వ తేదీ నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షం పత్తి, వరి పంటలకు ఊపిరిపోసింది. మృగశిర కార్తె ప్రారంభమైన తర్వాత చినుకు జాడ లేకపోవడంతో పత్తి విత్తులు నేలలోనే మురికి పోగా, నారు, నాట్లు వేసిన మళ్లు పగుళ్లు పట్టే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైయింది. ఈ పరిస్థితుల్లో వరణుడి కరుణతో కొంత మేలు జరిగింది. జిల్లాలో మంగళవారం నాటికి 26.3 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షంతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకోగా, రైతులు విత్తనాల కొనుగోలుకు జనగామ బాట పట్టారు.మండలాల వారీగా వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో)మండలం వర్షపాతం బచ్చన్నపేట 48.0 జనగామ 45.5 లింగాలఘణపురం 42.5 దేవరుప్పుల 42.3 కొడకండ్ల 35.0 పాలకుర్తి 25.5 తరిగొప్పుల 23.3 నర్మెట 23.3 జఫర్గఢ్ 21.3 స్టేషన్ఘన్పూర్ 19.5 రఘునాథపల్లి 14.3 చిల్పూరు 10.3 -
సమాజ హితమే వైద్యుల ధ్యేయం
జనగామ: సమాజ హితమే ధ్యేయంగా వైద్యులు పని చేస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో మంగళవారం డాక్టర్స్ డేను పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనగామ బ్రాంచ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాలాజీ అధ్యక్షతన నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు రక్తదానం మరొకరికి ప్రాణం పోస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో ఐఎంఏ సహకారం అందించాలన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్రావు మాట్లాడుతూ ఐఎంఏ ఆధ్వర్యంలో జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అ భినందనీయమన్నారు. సీనియర్ డాక్టర్ డి.లవకుమార్రెడ్డి, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.కరుణాకర్రాజు, వైద్యులు అన్వర్, ఏ.శ్రీనివాస్, కన్న పరశురాములు, కల్నల్ మాచర్ల భిక్షపతి, కృష్ణ జీవన్ బజాజ్, కెమిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధి దేవరాజ్, డాక్టర్ సీహెచ్.రాజమౌళి, కృష్ణ, వెంకటేశ్వర్లు, కనకరాజు, తదితతరులు పాల్గొన్నారు. పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ జనగామ రూరల్/లింగాలఘణపురం: జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యక్రమం కింద మంగళవారం తమిళనాడు నుంచి సర్పంచ్లు, బ్లాక్ ప్రెసిడెంట్, అధికారులు జిల్లాకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో డీపీ ఓ స్వరూప ఆధ్వర్యంలో తడి పొడి చెత్త, పారిశుద్ధ్య నిర్వహణ, నర్సరీలో మొక్కల పెంపకం గురించి వివరించారు. అనంతరం జెడ్పీ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, తడి పొడిచెత్త నిర్వహణ ద్వారా వస్తున్న ఆదాయం, నర్సరీలో మొక్కల పెంపకం, భూగర్భ జలాల పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం, పంటల సాగు, శానిటేషన్ నిర్వహణతో సీజనల్ వ్యాధులను అరికడుతున్న తీరును సర్పంచ్ బృందానికి వివరించారు. డాక్టర్స్డేలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
చెత్త కంపు
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuఇది రోడ్డేనా...? గిర్నిగడ్డ ప్రాంతంలో రోడ్లన్నీ చెత్తతో అపరిశుభ్రంగా మారిపోయాయి. రోజు వారి చెత్త సేకరణలో జాప్యం జరుగుతుండడంతో రహదారిపై చెత్త పేరుకుపోతుంది.నాలా పక్కనే చెత్త నిల్వ హనుమకొండ రోడ్డు దేవీ థియేటర్ సమీపంలోని ఓ నాలా పక్కనే చెత్తను నిల్వ చేస్తున్నారు. మురికి నీటిలో చెత్తను తొలగించి, వెంటనే తీసుకు వెళ్లక పోవడంతో తిరిగి అందులోనే పడిపోయే అవకాశం లేకపోలేదు. దేవీ థియేటర్ నాలా వద్ద పేరుకుపోయిన చెత్త గిర్నిగడ్డ గోదాం వద్ద చెత్తమయం వైద్య కళాశాల రూట్లో..న్యూస్రీల్