Jangaon
-
రూ.32.15 కోట్లు
అంచనా బడ్జెట్జనగామ: జనగామ మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బడ్జెట్లో సాధారణ ఆదాయం, వ్య యం, ప్రారంభం, ముగింపు నిల్వలతో పాటు క్యాపిటల్, వ్యయాలు ఎంత అనే దానిపై వివరించారు. మంగళవారం పురపాలిక కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన అంచనా బడ్జెట్ సమావేశం జరిగింది. అంచనా బడ్జెట్ను సీపీఎం కౌన్సిలర్ బూడిద జ్యోతి ప్రతిపాదిస్తూ, పలు సూచనలు ఇచ్చారు. అధికారులు, కౌన్సిలర్లు బడ్జెట్ కాపీలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మహేశ్వర్రెడ్డి, కౌన్సి లర్లు మారబోయిన పాండు, బుక్క బాలభరద్వాజ్, రామగళ్ల విజయ్, లోకమంతరెడ్డి, మంత్రి సుమలతశ్రీశైలం, బూడిద జ్యోతి, పాముకుంట్ల ప్రసాద్, రజని, అండాలు, అనిత, ఉమ, భాస్కర్ ఉన్నారు. నిధులు పెంచాలి: బూడిద జ్యోతి పట్టణంలో కోతులు, కుక్కలు, పందుల సమస్య పరిష్కారం కోసం బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులు నామమాత్రంగా ఉన్నాయని, ఇందుకు సంబంధించి రూ.15లక్షలకు పెంచాలని కౌన్సిల్ జ్యోతి కోరారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో దోమల సమస్య ఇబ్బందిగా మారిపోయిందని, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశానవాటికల అభివృద్ధి కోసం నిధులు తక్కువగా ఉన్నాయని, వీటి శాతం పెంచాలని డిమాండ్ చేశారు. చీటకోడూరు రిజర్వాయర్ ఆధునీకరణ, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం బడ్జెట్ ప్రతిపాదనలో నిధుల శాతం పెంచాల్సి ఉందన్నారు. పార్కుల నిర్వహణ కోసం రూ.20 లక్షల వరకు నిధులు కావాలని, జనరల్ ఫండ్ పెంచుకోవడానికి ఆదాయ మార్గాలను శాసీ్త్రయంగా అన్వేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ ఇలా.. 2026–27 అంచనా బడ్జెట్ రూ.32.15కోట్లకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. టాక్స్, నాన్టాక్స్ ఆదాయాలతో పాటు గ్రాంట్ల విభాగంలో కూడా గణనీయమైన పెరుగుదల మున్సిపాలిటీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేలా ఉంది. 2025–26లో మొత్తం బడ్జెట్ రూ.18కోట్ల39లక్షలతో పోలిస్తే ఈసారి అంచనా బడ్జెట్లో రూ.13.49 కోట్లు పెరుగుదల కనిపిస్తోంది. కాగా..31.03.2026 నాటికి అంచనా ముగింపు రూ.8కోట్ల53లక్షలు ఉంది.2026–27 ఆర్థిక సంవత్సర అంచనాలు టాక్స్ వనరుల అంచనా (ఆస్తి పన్ను, అసైన్డ్ రెవెన్యూ) జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం గత ఆర్థిక సంవత్సరం కంటే పెరిగిన అంచనా రూ.13.49 కోట్లు పట్టణ అభివృద్ధే లక్ష్యం: చైర్పర్సన్ కడకంచి బాలమణిఆదాయ వివరాలు: 2026–27: రెమ్యునరేటివ్, ఎంటర్ప్రైజెస్, రెంటల్: రూ.1.60కోట్లు ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం: రూ.45.45లక్షలు పట్టణ ప్రణాళిక: రూ.4.02కోట్లు ఇంజనీరింగ్: రూ.88.4లక్షలు మొత్తం నాన్ టాక్స్ ఆదాయం: రూ.6.42కోట్లుడిపాజిట్లు–అడ్వాన్సులు: 2026–27లో: రూ.1.70 కోట్లు టాక్స్, నాన్టాక్స్ కలిపి మొత్తం ఆదాయం: 2026–27: రూ.13.48కోట్లు నాన్ప్లాన్ గ్రాంట్లు: 2026–27: 1.50కోట్లు ప్లాన్ గ్రాంట్లు: రూ.1.58కోట్లు ఇతర గ్రాంట్లు: రూ.6.01 కోట్లు మొత్తం గ్రాంట్లు:రూ.9.09 కోట్లు31.03.2026 నాటికి మిగులు బడ్జెట్ : రూ.8.53కోట్లు 01.04.2027 నాటి ప్రారంభ నిల్వ, 2026–27 సాధారణ ఆదాయం కలుపుకుని: రూ.22.02 కోట్లు 2026–27 సాధారణ వ్యయం: రూ.13.48 కోట్లు 31.03.2027 నాటికి అంచనా ముగింపు బడ్జెట్:రూ..853.80 లక్షలు 2026–27 క్యాపిటల్ ఆదాయ, వ్యయాలు: రూ.16.96కోట్లుటాక్స్, నాన్ టాక్స్ వనరులు, క్యాపిటల్ ప్రాజెక్ట్ ఫండ్ ద్వారా వచ్చే గ్రాంట్లను విభాగాల వారీగా అంచనా బడ్జెట్లో పొందుపరిచారు. అధికారులు చేపట్టిన అంచనాల ప్రకారం ప్రతీ విభాగంలో ఆదాయం సంవత్సరానికొకసారి పెరుగుతూ ఉండటం గమనార్హం. పట్టణ అభివృద్ధే లక్ష్యం..పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. అంచనా బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. అందరి సహకారంతో ప్రభుత్వం నుంచి నిధులను తీసుకురావడంతో పాటు వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. పట్టణాన్ని మిగతా ప్రాంతాలకు రోల్మోడల్గా తీర్చిదిద్దుతాం. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పరిపాలనను మరింత చేరువ చేసే విధంగా ముందుకెళ్తాం. ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాం. – కడకంచి బాలమణి, చైర్పర్సన్ ఏడాది ఆస్తిపన్ను అసైన్డ్ రెవెన్యూ మొత్తం 2024–25 రూ.2.96కోట్లు రూ.9.05కోట్లు రూ.12.02కోట్లు 2025–26 రూ.4.20కోట్లు – రూ.4.20కోట్లు 2026–27 రూ.7.06కోట్లు – రూ.7.06కోట్లు -
ప్రొటోకాల్ రగడ
● వేదికపై వైస్ చైర్మన్కు చోటు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన ● పోడియం వద్ద బైఠాయించి.. చివరకు వాకౌట్జనగామ: మున్సిపల్లో నూతన పాలక మండలి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన రెండో సాధారణ బడ్జెట్ సమావేశంలో ప్రొటోకాల్ వివాదం చెలరేగింది. మంగళవారం చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ అంశంపై నిరసన మొదలైంది. సమావేశ వేదికపై తమ పార్టీకి చెందిన వైస్ చైర్మన్కు చోటు ఇవ్వాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ వేదికపై కూర్చోవడం పరిపాటి అని, అదే ప్రొటో కాల్ను కొనసాగించాలని వారు పట్టుబట్టారు. ఈ విషయంపై కమిషనర్ మహేశ్వర్రెడ్డి స్పందిస్తూ ప్రస్తుత నిబంధనల ప్రకారం వైస్ చైర్మన్ వేదికపై కూర్చునే అధికారం లేదని, అందుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. కమిషనర్ సమాధానంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంతసేపు సమావేశాన్ని నిలిపివేశారు. పోడియం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, కమిషనర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో వారు చివరకు వాకౌట్ చేశారు. అవమానకర చర్య.. ప్రజలు ఎన్నుకున్న వైస్ చైర్మన్కు వేదికపైన చోటు నిరాకరించడం అవమానకర చర్య అని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉడుగుల కిష్టయ్య, హఫీజ్ ఫాతిమా, గోపగోని సుగుణాకర్ గౌడ్, సేవెల్లి మధుసూదన్, గునిగంటి వెన్నెల, మంజుల, సువార్త, మామిడాల రజిత, ఎనగందుల అనూష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘర్షణాత్మక పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సిల్ సమావేశం పూర్తయ్యే వరకు పోలీసులు అక్కడే మోహరించారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, పరిస్థితులు అదుపులోకి రావడంతో సమావేశం తదుపరి కార్యక్రమాలు కొనసాగాయి. మున్సిపల్ బడ్జెట్ సమావేశం ము ఖ్యమైన రోజే ప్రొటోకాల్ వివాదం కేంద్రబిందువుగా మారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. -
అదనపు డీటీఆర్ల కోసం డబ్బులు ఇవ్వొద్దు
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి జనగామ: జిల్లా పరిధిలో అదనపు డీటీఆర్ల మంజూరు కోసం రైతులు ఎవరూ కూడా డబ్బులు ఇవ్వొద్దని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అదనపు డీటీఆర్లు ఏర్పాటు చేయడం పూర్తిగా తమ శాఖ పరిధిలోనే ఉంటుందన్నారు. దీనికి సంబంధించి రైతులు, వినియోగదారులు మధ్యవర్తులు, సిబ్బందికి డబ్బులు ఇవ్వరాదని, డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. రైతులు, వినియోగదారులు ఎదుర్కొనే ఏ సమస్యలకై నా సంబంధిత సెక్షన్న్ అధికారులను నేరుగా సంప్రదించాలన్నారు. అలాగే 1912 హెల్ప్లైన్న్ ద్వారా కూడా సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. రైతులు, వినియోగదారులు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్ లేదా సంబంధిత సెక్షన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు. వీధి వ్యాపారులకు గుర్తింపుకార్డుల అందజేత స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం వీధి వ్యాపారులకు అందించే గుర్తింపు కార్డులను సద్వినియోగం చేసుకోవాలని స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అన్నారు. ఘన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా టీఎంసీ వాణిశ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ వినయ్ కుమార్ మాట్లాడారు. వీధి వ్యాపారులకు మొదటగా రూ.12వేలు బ్యాంకు రుణాలు అందిస్తారని, సకాలంలో చెల్లించిన వారికి అనంతరం రూ.20వేలు, రూ.50వేలు రుణాలను వారి వ్యాపారాల కోసం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 8 వరకు రుణ దరఖాస్తుల గడువు పొడిగింపు జనగామ: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, జనగామ ఆధ్వర్యంలో ఉపాధి కోసం అందించే రుణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈవీ వీలర్, ఈవీ త్రీ వీలర్, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ వంటి పథకాలతో పాటు, ఈ సంవత్సరం కొత్తగా పాడి గేదెల పెంపకం పథకాన్ని కూడా చేర్చినట్లు వెల్లడించారు. అర్హులైన షెడ్యూల్డ్ కులం యువకులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇంటర్వర్సిటీ ఖోఖో టోర్నమెంట్కు కేయూ ఉమెన్ జట్టు కేయూ క్యాంపస్: కర్నాటకలోని దేవనగరి యూనివర్సిటీలో ఏప్రిల్ 1 నుంచి 4వతేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖోఖో టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య మంగళవారం తెలిపారు. ఈ జట్టులో జి. అఖిల, పి. శిరీష్మా, జి. పూజారాణి, కె. కావ్య,టి రజిత, ఇ. సమత, ఎం. నవ్య, బి. శైలజ, ఇ. శ్రీజ, ఎ. నందు, కె. సుమతి, కె నిష్మితా, కె. ఉషారాణి, ఎం. శిరీషా ఉన్నారని వెంకయ్య తెలిపారు. ఈజట్టుకు వరంగల్ ఎల్బీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ ఎ. రాజు కోచ్గా, ఖమ్మం డీజీటీడబ్ల్యూ ఆర్డీసీ ఫిజికల్ డైరెక్టర్ బి. రమ్య మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● వీసీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సీఎస్ రామకృష్ణరావు జనగామ రూరల్: 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 2వ తేదీన జరగనున్న గ్రామసభలను విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంగళవారం, హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో 99 రోజుల ప్రజాపాలనపై వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమావేశానికి హాజరయ్యారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 2న నిర్వహించే గ్రామ సభల్లో ప్రతీ అంశం స్పష్టంగా తెలపాలని, ముఖ్యంగా ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి, వారిచే సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గ్రామ సభలను నిర్వహించి, సంక్షేమ పథకాలను వివరిస్తామన్నారు. ఈ మేరకు 2న జరిగే గ్రామ సభల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరామ్, వెంకన్న, జెడ్పీ సీఈఓ మాధురి షా, డీపీఓ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ‘టెన్త్’ మూల్యాంకనం
విద్యారణ్యపురి: టెన్త్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలోని కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ సారి మూడు దశల్లో వాల్యుయేషన్ నిర్వహించనున్నారు. ఈ క్యాంపునకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అన్ని సబ్జెక్టులు కలిపి 2లక్షల 40వేల 100 జవాబుపత్రాలు కేటా యించారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ జవాబుపత్రాలు రాగా కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తికావొచ్చింది. ఈ క్యాంపు ఆఫీ సర్గా హనుమకొండ డీఈఓ గిరిరాజ్గౌడ్ వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లుగా ఏసీజీఈ భువనేశ్వరి, ఎంఈఓ హనుమంతురావు వ్యవహరిస్తున్నారు. నేటి నుంచి మొదటి దశలో స్పాట్ ప్రక్రియ ఫాతిమా హైస్కూల్ స్పాట్ కేంద్రంలో బుధవారం నుంచి 9వతేదీవరకు తెలుగు, హిందీ,ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించనున్నారు. ఇందుకు 600 మంది ఉపాధ్యాయులను ఏఈలుగా, సీఈలు,స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు,జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలోని సీనియరీటీ ప్రకారం ఆయా టీచర్లను స్పాట్ విధులకు కేటాయించారు. వీరు ఉదయం 8.30గంటలకు క్యాంపులో తప్పనిసరిగా రిపోర్టు చేయాల్సింటుది. లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు. అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తంగా 1,250మంది ఉపాధ్యాయుల వరకు నియామక ఉత్తర్వులు అందజేశారు. రెండోదశలో 10నుంచి 17వరకు టెన్త్ మూల్యంకనం రెండోదశలో ఏప్రిల్ 10 నుంచి 17వరకు కొనసాగనుంది. ఇందులో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సబ్జెక్టుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. మూడో దశలో 15 నుంచి 23 వరకు మూడో దశలో టెన్త్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో సోషల్ స్టడీస్, ఒకేషనల్ కోర్సుల సబ్జెక్టులు ఉంటాయి. నియామకమైన ఉపాధ్యాయులందరూ మూల్యాంకన విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మూల్యాంకన విధులు సక్రమంగా నిర్వర్తించాలి టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకన విధులు సక్రమంగా నిర్వర్తించాలని క్యాంపు ఆఫీసర్, హనుమకొండ జిల్లా డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ కోరారు. ఈ మేరకు మంగళవారం కాజీపేట ఫాతిమాహైస్కూల్ స్పాట్ కేంద్రంలో సంబంధిత డిప్యూటీ క్యాంపు ఆఫీసర్లు, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లుతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఈసారి మూడు దశల్లో వాల్యుయేషన్ ప్రక్రియ 2లక్షల 40 వేల 100 జవాబు పత్రాలు కేటాయింపు 1, 250 మంది వరకు టీచర్లకు విధులు ఫాతిమా హైస్కూల్లో స్పాట్ కేంద్రం -
‘అకాల’ గోస
● భారీ వర్షంతో తడిసిన మక్కలు ● జనగామ మార్కెట్లో వరదకు కొట్టుకుపోయిన గింజలు ● కన్నీటి పర్యంతమైన రైతులుజనగామ: దంచికొడుతున్న ఎండలకు తోడు..అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి మద్దతు ధరకు మక్కలు అమ్ముకుందామని మార్కెట్కు వస్తే అరిగోస పడుతున్నారు. మార్క్ఫెడ్ శాఖ నిర్లక్ష్యం మూలంగా సకాలంలో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో.. తక్కువ ధరకు ప్రైవేటులో అమ్ముకోవాల్సి వస్తోంది. మంచి ధర కోసం ఎదురుచూస్తున్న సమయంలో అకాల వర్షాలు పెట్టుబడులు సైతం రాకుండా చేస్తున్నాయి. మంగళవారం ఉదయం కురిసిన వర్షంతో జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వందలాది బస్తాల మక్కలు తడసి ముద్దయిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో పలువురు రైతులకు చెందిన సుమారు 5 బస్తాల వరకు గింజలు కొట్టుకుపోవడంతో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మక్కలు తడిసి, గింజలు కొట్టుకు పోతున్న సమయంలో వా టిని ఒడిసి పట్టుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. వర్షసూచన ఉండే అవకాశం ఉందని వాతా వరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మక్కలను ఒక్కచోటకు చేర్చి టార్పాలిన్ కవర్లను కప్పడంతో.. అప్పటికే తడిసి ఉండడంతో మొలకెత్తే ప్రమాదం ఉంది. వెంటనే మార్క్ఫెడ్ కేంద్రాన్ని ప్రారంభించి తడిసిన మక్కలను సైతం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
జనగామ
బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026గుముడెల్లి రేణుకకు ఘన నివాళి7● కడవెండిలో విప్లవ రచయిత మిడ్కో మొదటి వర్ధంతి సభ ● హాజరైన ప్రజాసంఘాలు, విరసం, మాజీ మావోలు దేవరుప్పుల : ఏడాది క్రితం కగార్ ఆపరేషన్లో నేలకొరిగిన మావోయిస్టు అనుబంధ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు, విప్లవ రచయిత గుముడెల్లి రేణుక అలియాస్ మిడ్కో అమరత్వ స్మరణతో ఉద్యమాల ఖిల్లా కడవెండి మరోసారి ఎరుపెక్కింది. మంగళవారం మండలంలోని కడవెండిలో గుముడెల్లి రేణుక అలియాస్ మిడ్కో ప్రథమ వర్ధంతి తల్లిదండ్రులు సోమయ్య, జయమ్మ సమక్షంలో నిర్వహించారు. ఈ వర్ధంతికి అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి అధ్యక్షత వహిచంగా పలువురు స్మారక స్తూపం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, అరుణోదయ గాయకురాలు విమలక్క, విరసం నేత పాణి మాట్లాడుతూ.. రేణుక ఉన్నత జీవితం వదిలి ప్రజాసమస్యల పరిష్కారానికి పుస్తకాల్లో మిరుగుడుపూవు(మిడ్కో)గా అటవీబాట పట్టి వెనుకంజవేయలేదన్నారు. ఓ మహిళగా అనేక పోరాట రూపాల్లో సమాజ స్థాపన కోసం పాటుపడుతుంటే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరిట పొట్టన బెట్టుకుందన్నారు. రేణుక భౌతికంగా మనలో లేకున్నా ఆమె రచనలు దేశ విప్లవోద్యమానికి వేగుచుక్కగా మారిందన్నారు. అనంతరం పద్మకుమారి మాట్లాడుతూ నక్సల్ ఉద్యమంలో నేటికి ఇరవై వేల మంది నేలకొరగగా ఆ కుటుంబాలకు బాసటగా నిలుస్తామన్నా లొంగుబాటు నేతల భరోసా తమకు అవసరం లేదన్నారు. అమరుల ఆశయాల సాధనకు వారి వైఖరి వెలిబుచ్చాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కవులు, గాయకులు మిడ్కో త్యాగాన్ని గుర్తు చేసేలా కవితలు, పాటలు ఆలోచింపజేశాయి. విరసం ప్రతినిధి పాణి, సామాజిక ఉద్యమకార్యకర్త సజయ్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, సీనియర్ జర్నలిస్టులు భరద్వాజ్, రమాసుందరి, కుటుంబ సభ్యులు జీవీకే ప్రసాద్, రాజశేఖర్ పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య అందించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం మండలంలోని అడవికేశ్వాపూర్ గ్రామ పరిధిలో గల ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం అమలు వంటి అంశాలను పర్యవేక్షించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని, నాణ్యతగా ఉండాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి పాఠ్యాంశాలపై అవగాహన గురించి పలు ప్రశ్నలు వేసి పరిశీలించారు. అలాగే గ్రామ పంచాయతీలో గల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో ముఖ్యమని సిబ్బంది బాధ్యతగా పనిచేయాలన్నారు. అనంతరం వడ్లకొండ రోడ్డులోని సఖి కేంద్రాన్ని తనిఖీ చేశారు. చదువుతోపాటు సామాజిక అవగాహన ఉండాలి● ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర స్టేషన్ఘన్పూర్: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక అవగాహన కల్గి ఉండాలని ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర సూచించారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని సెయింట్ థామస్ హైస్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ ఎడ్యుకేషన్పై పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కేసీ జాన్బన్నీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ట్రెయినీ ఐపీఎస్ మాట్లాడారు.. విద్యార్ధి దశలోనే భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. దీనికి ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ట్రాఫిక్ ఎడ్యుకేషన్ పై విద్యార్థులు వేసిన పెయింటింగ్లు బాగున్నాయని అభినందించారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు, ఎస్ఐ రాజేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మూడు నెలల రేషన్ ఒకేసారి!
జనగామ: జిల్లాలో తెల్ల రేషన్, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీకి ఈనెల 1న (బుధవారం) శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంబంధిత రేషన్ దుకాణాలకు అవసరమైన బియ్యం సరఫరా చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 2026 వరకు మూడు నెలల బియ్యం లబ్ధిదారులకు అందించేందుకు సర్వం సిద్ధం చేశారు. 5.64లక్షల యూనిట్లు..10.752 మెట్రిక్ టన్నులు జిల్లాలో 355 రేషన్ దుకాణాలు ఉండగా, 1,87,002 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు 10,823కు గాను 30,461మంది లబ్ధిదారులు (యూనిట్లు) ఉన్నారు. వీరికి 1,136.415 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరముంది. తెల్లరేషన్ కార్డులు 1,76,094 (5,34,105 యూనిట్లు) ఉండగా 9,613.890 మెట్రిక్ టన్నుల భారీ మొత్తంలో బియ్యం పంపిణీ చేయనున్నారు. 85 అన్నపూర్ణ కార్డుల పరిధిలో 91 మంది యూనిట్లకు 2.550 మెట్రిక్ టన్నుల బియ్యం మంజూరు చేశారు. మూడు కేటగిరీల కార్డులు 1,87,002 కార్డులు ఉండగా, 5,64,657మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వం వారందరికీ 10,752.855 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించింది. మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో, ఈ భారీ పరిమాణంలో బియ్యం రేషన్ దుకాణాలకు తరలించారు. కార్డుదారులు వచ్చి తీసుకునే విధంగా దుకాణాల వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సంబంధిత శాఖల అధికారులు స్పష్టం చేశారు. రవాణా ఇబ్బందులు లేకుండా.. సాధారణంగా నెల నెలా పంపిణీ జరిగే బియ్యాన్ని ఈసారి ఒకేసారి మూడు నెలలకు ఇచ్చే విధానం వల్ల, లబ్ధిదారులు రవాణా ఇబ్బందులు లేకుండా ముందుగానే నిల్వ చేసుకునే అవకాశం కలగనుంది. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఈ నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది. జిల్లాలో మొత్తం పంపిణీ ప్రక్రియను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. మూడు నెలల బియ్యం పంపిణీకి జిల్లాలో అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో, ఏప్రిల్ 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు సులభతరంగా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో రేషన్ సమాచారం నేటి నుంచి బియ్యం పంపిణీకి శ్రీకారం సర్వం సిద్ధం చేసిన అధికారులు జిల్లాలో 1,87,002 రేషన్కార్డులు.. 10.752 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపుపేరు రేషన్కార్డులు లబ్ధిదారులు బియ్యం అలాట్మెంట్ (మెట్రిక్ టన్నులు)అంత్యోదయ 10,823 30,461 1136.415 తెల్ల రేషన్ కార్డులు 1,76,094 5,34,105 9613.890 అన్నపూర్ణ 85 91 2.550 మొత్తం 1,87,002 5,64,657 10,752.855 -
కేయూ అంచనా బడ్జెట్
రూ. 396.69 కోట్లుకేయూ క్యాంపస్ : 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ అంచనా బడ్జెట్ రూ 396.69 కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈసారి లోటు రూ 27.13కోట్లుగా చూపారు. సోమవారం కేయూ పరిపాలన భవనంలోని సెనెట్హాల్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి అధ్యక్షత వహించగా ఎకనామిక్స్ విభాగం అధిపతి, పాలకమండలి సభ్యుడు బి. సురేశ్లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, విరమణ బెనిఫిట్స్, నిర్వహణ వ్యయాలు, పరీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు వివిధ ఇతర ఖర్చులకు కలిపి మొత్తం రూ. 355.90 కోట్లు కేటాయించారు.మొత్తం బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ఎయిడ్గా రూ. 205.47కోట్లు రానుండగా ఇతర వనరుల నుంచి రూ 126.52 కోట్ల రాబడి వస్తుంద ని అంచనా వేశారు. ఈ బడ్జెట్ను ప్లానింగ్, నాన్ప్లానింగ్ రూపంలో రాబడులు, ఖర్చులు మొత్తం 8 అంశాలను చూపారు. వీటిలో ఉన్నత విద్యా మండలి నుంచి రూ. 10లక్షలు, ఇతరాల నుంచి రూ.15.50లక్షలు, అకడమిక్, ట్యూషన్ ఫీజుల రూపంలో రూ. 8.33 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ. 41.41కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, పరీక్షల విభాగం నుంచి రూ. 49.54 కోట్లు ఉన్నట్లు చూపారు. ఈ అకడమిక్ సెనెట్ బడ్జెట్ ఆమోదంతోపాటు స్టాండింగ్కమిటీ వార్షిక నివేదకను కూడా ఆమోదించింది. రిజిస్ట్రార్ వి. రామచంద్రం, విద్యా కళాశాల డీన్ రాంనాథ్కిషన్, అకడమిక్ ఆడిట్ విభాగం రిజిస్ట్రార్ కోల శంకర్, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్, ప్రిన్సిపాళ్లు, పరీక్షల విభాగం అధికారులు, డీన్లు, అకడమిక్, అకౌంట్స్ విభాగాల ఉద్యోగులు, సెనెట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, తొలుత కేయూ మాజీ వీసీ లింగమూర్తి మృతికి సంతాపంగా నివాళులర్పిస్తూ సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అకడమిక్ సెనెట్లో ఆమోదం కె. ప్రతాప్రెడ్డి, వీసీ దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో కేయూ కూడా ఒకటి. ప్రస్తుతం కేయూ అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. అకడమిక్, పరిశోధనల పరంగా అభివృద్ధిలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా యూజీ, పీజీ కోర్సుల్లోనూ సిలబస్ కూడా మారుతోంది. విద్యార్థులకు స్కిల్, జాబ్ ఓరియెంటేడ్ కోర్సులు లక్ష్యంగా సిలబస్ రూపల్పన చేపడుతున్నాం. కృత్రిమ మేధా క్వాంటం టెక్నాలజీ పొందుపరుస్తున్నాం. త్వరలోనే విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని తీసుకురాబోతున్నాం. రూసానిధులతో ఐ రీసెర్చ్సెంటర్లు, 42 మంది అధ్యాపకులు వ్యక్తిగత ప్రాజెక్టులు,74 మంది ప్రాజెక్ట్ ఫెల్లోలుగా నియామకాలు చేశాం. కెహబ్లోనే త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. యూనివర్సిటీలో పరీ క్షల విభాగం మూల్యాంకనం ఆన్లైన్లో డిజిట లీకరణ, క్యాంపస్లో సీసీ కెమెరాలు, యూనివర్సిటీలో వసతుల కల్పనకు డిటైల్డ్ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు రూ. 400 కోట్ల మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
గడ్డిమందును నిషేధించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి
● అసెంబ్లీ సమావేశాల్లో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: దేశవ్యాప్తంగా పారాక్వాట్ గడ్డిమందును నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం పారాక్వాట్ గడ్డి మందు నిషేధంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన పారాక్వాట్ గడ్డి మందు నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి తీర్మానం ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. రైతులు పంటపొలాల్లో కలుపు మొక్కల నివారణకు, పొలం గట్లపై గడ్డి పెరగకుండా ఉండేందుకు పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డిమందును ఎక్కువగా వినియోగిస్తారన్నారు. అనేక రైతు కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో అప్పులబాధతో, కుటుంబ కలహాలతో, ఇతర సమస్యలతో క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారు ఎక్కువగా ఈ గడ్డిమందును వాడుతున్నారన్నారు. ఈ మందుకు విరుగుడు లేకపోవడంతో బతకాలనే ఆశ ఉన్నప్పటికీ బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ పారాక్వాట్ గడ్డిమందును తక్షణమే నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈనెల 27న ఎంపీ కడియం కావ్య పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని పార్లమెంట్లో లేవనెత్తారన్నారు. గడ్డిమందు నిషేధంపై తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా, దిక్సూచిగా ఉండాలని పేర్కొన్నారు. హోటళ్లపై అధికారుల దాడులుజనగామ: పట్టణంలోని వివిధ హోటల్స్, టీ స్టాల్స్పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సివిల్ సప్లయీస్ డీటీలు శ్రీనివాసు, లచ్చు నాయక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో 10 సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేసి, 10 మంది టీస్టాల్స్ యజమానులపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. హోటళ్లలో కమర్షియల్ సిలిండర్లు మినహా, ఇంట్లో ఉపయోగించే సబ్సిడీ సిలిండర్లను వాడితే కేసులు తప్పవని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు అప్పగించారు. -
నేడు మున్సిపల్ బడ్జెట్
● రూ.31.15కోట్లుగా అంచనాలు విడుదల ● గతేడాదితో పోలిస్తే రూ.13.49 కోట్లు ెపెంపుజనగామ: జనగామ మున్సిపాలిటీ 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ అంచనాలు విడుదల చేసింది. బడ్జెట్లో సాధారణ ఆదాయం, వ్యయం, ప్రారంభం, ముగింపు నిల్వలతో పాటు క్యాపిటల్, వ్యయాలు ఎంత అనే దానిపై వివరించారు. రెండేళ్ల ఆర్థిక సంవత్సరాలను బేరీజు వేస్తూ ఆదాయం, వ్యయాలను సమతుల్యంగా నిర్వహిస్తూ, ముగింపు నిల్వలను స్థిరంగా ఉంచే దిశగా బడ్జెట్ రూపొందించారు. సాధారణ ఆదాయం, వ్యయాలతో పాటు క్యాపిటల్ వ్యయాలకు కూడా గణనీయమైన నిధులను కేటాయిం చారు. ఈనెల 31న(మంగళవారం) పురపాలిక కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరుగనుంది. సమావేశంలో బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం పొందనున్నారు. పెరుగుతూ.. 2024–25లో ఆదాయం అత్యధికంగా రూ.25.33కోట్లు రాగా, 2025–26లో కొంత తగ్గి రూ.18.66కోట్లకు పడిపోయింది. ప్రస్తుత అంచనా బడ్జెట్ 2026–27లో తిరిగి రూ.32.15కోట్లకు పెరిగింది. టాక్స్, నాన్టాక్స్ ఆదాయాలతో పాటు గ్రాంట్ల విభాగంలో కూడా గణనీయమైన పెరుగుదల మున్సిపాలిటీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేలా ఉంది. 2025–26తో పోలిస్తే ఈసారి అంచనా బడ్జెట్లో రూ.13.49 కోట్లు పెరుగుదల కనిపిస్తోంది. -
సత్వరమే పరిష్కరించాలి
● అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం ● ప్రజావాణిలో 232 దరఖాస్తుల స్వీకరణ జనగామ రూరల్: ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలతో కలెక్టరేట్కు వచ్చిన ప్రజల నుంచి 232 అర్జీలు తీసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులు వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ పరిధిలో ఉన్నవి గుర్తించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. ● సంజయ్ నగర్కు చెందిన ఆర్.సరిత, 16వ వార్డులో పది సంవత్సరాలుగా కిరాయికి ఉంటున్నారని, తమకు ఎటువంటి ఇల్లు లేదని, ఖాళీ స్థలం ఉందని, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా ఇంటికి వచ్చి ధ్రువీకరించారని, ఎల్1 జాబితాలో ఉండగా తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కోరారు. ● స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రానికి చెందిన గీతాదేవి రాథోడ్, 2019వ సంవత్సరంలో 623.25 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేయగా, ఇప్పుడు తమ కుటుంబ అవసరాల నిమిత్తం అమ్మకానికి చూడగా హౌస్ సైట్స్ అని చూపిస్తోందని, రిజిస్ట్రేషన్ కావడం లేదని విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు. ● జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన రంగు సారంగపాణి, కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వం 50 ఏళ్లు పైబడిన అందిస్తున్న రూ.2000 పింఛన్కు దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, పింఛన్ అందించి ఆదుకోవాలని కోరారు. ● నర్మెటలో మూడు సంవత్సరాలుగా గ్రామ కార్యదర్శిగా శ్రీధర్ అనే వ్యక్తి సొంతూరులోనే విధులు నిర్వహిస్తున్నారని, పంచాయతీరాజ్ శాఖ నిబంధనల ప్రకారం అది సరికాదని, ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని నర్మెటకు చెందిన పులి రేణుక వినతి పత్రం అందించింది. -
ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి
● డీఈ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా స్టేషన్ఘన్పూర్: విద్యుత్ ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్రేట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో ఘన్పూర్లోని ట్రాన్స్కో డీఈ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. జేఏసీ డివిజన్ చైర్మన్ పాశం రాజు, కోకన్వీనర్లు చెరిపెల్లి సురేష్, బదావత్ లక్ష్మణ్, ఉబ్బని వెంకన్న మాట్లాడారు.. ఏళ్ల తరబడి విద్యుత్ సంస్థలో ఆర్టిజన్, అన్మ్యాన్డ్ కార్మికులు శ్రమదోపిడీకి గురవుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికుల సంఘం నాయకులు సురేష్, సరిత, డాన్ సురేష్, రమ్య, లత , షేక్ బాబా, రాజేందర్, సోమన్న, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వందేమాతరం గీతాలాపన
జనగామ రూరల్: జాతీయ శక్తిని తెలియజేసిన గీతం వందేమాతరం అని ఏబీవీపీ ఆల్ స్టేట్ యూనివర్సిటీస్ ప్రముఖ్ అంబాల కిరణ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏకశిల డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ వందేమాతరం 150వ చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలిచామన్నారు. ఏబీవీపీ వరంగల్ విభాగ్ సంఘటన్ కార్యదర్శి పృథ్వీరాజ్, రిటైర్డ్ కల్నల్ భిక్షపతి, కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, హృతిక్ తదితరులు పాల్గొన్నారు. -
కాలువల్లోకి గోదావరి జలాలు
● ఎండిపోయే దశలో ఉన్న వరి పంటకు ఊపిరిలింగాలఘణపురం: అశ్వరావుపల్లి రిజర్వాయర్ నుంచి ఇటీవల ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేయడంతో తిరిగి మళ్లీ కాలువల్లోకి నీరు చేరింది. దీంతో పొట్టకొచ్చి ఎండిపోయే దశలో ఉన్న వరికి జీవం పోసినట్లైంది. ఈ నెల 27న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పొట్టకొచ్చిన పంట ఎండిపోతుంది సారూ’.. అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. అంతేకాకుండా వ్యవసాయశాఖ అధికారులు పంటలను పరిశీలించి ఏప్రిల్ రెండో వారం వరకు నీటిని విడుదల చేయాలని నివేదిక అందించారు. ఎమ్మెల్యే కడియం సంబంధిత నీటిపారుదల శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేయడంతో 16 ఎల్ నుంచి నీరు నెల్లుట్ల, పటేల్గూడెం, లింగాలఘణపురం రైతుల పొలాలకు చేరుతోంది. దీంతో సుమారు వంద నుంచి 150 ఎకరాల పంటకు మేలు చేకూరనుంది. నీటి విడుదలకు సహకరించి పంటలు కాపాడేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కడియంకు, ఏఈ కిషోర్కు రైతులు ధన్యవాదాలు తెలిపారు. -
రోడ్డు భద్రతా మార్గదర్శకాలను పాటించాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: రోడ్డు భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి రహదారి భద్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ హైవేపై ఐఆర్సీ(ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్) నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. హైవేపై అనుమతి లేని హోర్డింగ్లు ఉండకూడదన్నారు. పట్టణంలో రోడ్లకు ఇరువైపులా ఎలాంటి అమ్మకాలు జరగకుండా, ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తకుండా, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులు త్వరగా పూర్తి చేసి, అందులో అమ్మకాలు నిర్వహించుకునేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఆర్ ఆండ్బీ ఈఈ స్వరూప, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, ఎకై ్సజ్ అధికారి అనిత, ఈఈ పీఆర్ శ్రీనివాస రావు, డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, ఆర్టీఏ మెంబర్ అభి గౌడ్, మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్ రెడ్డి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల నియంత్రణపై విద్యా, వ్యవసాయ, ఎకై ్సజ్, పోలీసు, వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణపై ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. -
డ్రైవింగ్లో అప్రమత్తత అవసరం
● ఉచిత కంటి పరీక్ష శిబిరంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్జనగామ: డ్రైవింగ్ చేసే సమయంలో డ్రైవర్లకు అప్రమత్తత, జాగ్రత్త అవసరమని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్లో ‘అరైవ్–అలైవ్’(క్షేమంగా ఇంటికి చేరుకోండి) ప్రోగ్రాంలో భాగంగా శ్రీ సరోజినీ కంటి హాస్పిటల్, పోలీసు శాఖ సంయుక్తంగా ఆటో, క్యాబ్, బస్సు డ్రైవర్లకు నిర్వహించిన ఫాకో, లేజర్ సెంటర్ ఉచిత కంటి వైద్య శిబిరంలో డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. 40 ఏళ్లు దాటిన ప్రతీ డ్రైవర్ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ సీహెచ్ సృజన్ కుమార్ ఆధ్వర్యంలో వంద మందికి పైగా కంటి పరీక్షలు చేయగా, అవసరమైన వారికి ఉచితంగా కళ్ల అద్దాలను డీసీపీ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు భరత్, చెన్నకేశవులు ఉన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి స్టేషన్ఘన్పూర్: ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రమాదాల నివారణకు పాటుపడాలని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. స్టేషన్ఘన్పూర్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా సస్ట్రో ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ద్విచక్రవాహనదారులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఘన్పూర్ సీఐ జి.వేణు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డీసీపీ చేతుల మీదుగా 200 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిధిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు ఇతర ఫోర్వీలర్లలో వెళ్లేవారు సీటుబెల్టు ధరించాలని సూచించారు. అనంతరం పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఏసీపీ భీమ్శర్మ, ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా, సీఐ జి.వేణు, ఎస్ఐలు వినయ్కుమార్, రాజేష్, మనీషా, సస్ట్రో సంస్థ ప్రతినిధి సుబ్బారెడ్డి, పోలీసుసిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. 30జెజిఎన్052: 30ఎస్టీజీ052– జనగామలో శిబిరాన్ని ప్రారంభిస్తున్న డీసీపీ రాజమహేంద్ర నాయక్స్టేషన్ ఘన్ఫూర్లో బైక్ ర్యాలీలో డీసీపీ, ఏసీపీ, ట్రెయినీ ఐపీఎస్ తదితరులు -
అంబరాన్నంటిన ‘టెక్నోజిల్’ సంబురాలు
జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం టెక్నోజిల్–2026 సంబురాలు అంబరాన్నంటాయి. టెక్నికల్ ఈవెంట్స్ ప్రాజెక్టు ఎక్స్పోలో పీపీటీ ప్రజెంటేషన్ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ విజయ్పాల్రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రశేశేఖర్రెడ్డి వేడుకలను ప్రారంభించారు. డైరెక్టర్ విజయ్పాల్రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కనుగొనే విధంగా గొప్ప ఆలోచనలు చేయాలన్నారు. ప్రిన్సిపాల్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువుకు తగిన ఫలితం దక్కేలా కష్టపడాలన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు టెక్నోజిల్లో భాగంగా ఫ్యాషన్ షో, నృత్యపోటీలతో సభికులను అలరించారు. గాయకులు ఎండీ హైమత్, మేఘనా నాయుడు ఆలపించిన పాటలు విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపాయి. ప్రోగ్రాం కన్వీనర్ పీయూ అనిత, వంశీకృష్ణ, అమరేందర్, స్వప్న ఉన్నారు. -
అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ సిద్ధం
● టీ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి సారంగపాణి వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణలో 2026–27 సంవత్సరంలో నిర్వహించనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ను రూపొందించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సారంగపాణి పేర్కొన్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ..ప్రతిభ గల అథ్లెట్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు తమ అసోసియేషన్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహిపాల్, మహిధర్, రత్నాకర్, నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, చైర్మన్ గట్టు మహేష్బాబు, చీఫ్ కోచ్ ఎండీ గౌస్, సభ్యులు మనోజ్, సోమశేఖర్, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. రామప్పలో ఆస్ట్రియా దేశస్తుడు వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం ఆస్ట్రియాకు చెందిన హరల్డ్ సీబాచర్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి స్టేషన్ఘన్పూర్ : ప్రజలకు నిరంతరంగా నాణ్యమై న విద్యుత్ను అందించడమే లక్ష్యంగా విద్యుత్శా ఖ పనిచేస్తుందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి అన్నారు. డివిజన్పరిధిలోని ఘన్పూర్ టౌన్ సెక్షన్లో ఉన్న మీదికొండ 33/11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు 5 ఎంవీఏ పవన్ ట్రాన్స్ఫార్మర్ పీటీఆర్ను ఎస్ఈ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అమలు చేస్తున్న వేసవి వేసవి యాక్షన్ ప్లాన్ కింద మీదికొండ విద్యుత్ సబ్స్టేషన్లో అదనపు 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ పీటీఆర్ను విజయవంతంగా ఛార్జ్ చేసినట్లు తెలిపా రు. కొత్త ట్రాన్స్ఫార్మర్ చార్జింగ్ వల్ల లోడ్ పంపిణీ మెరుగుపడుతుందని, వేసవిలోనూ నిర్విఘ్నంగా నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమవుతుందన్నారు. వినియోగదారులు విద్యుత్ పరమైన సమస్యల కోసం సమీపంలోని విద్యుత్శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. టోల్ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఈ సారయ్య, ఏడీఈ రణధీర్రెడ్డి, ఏఈలు పి.శంకర్, కుమారస్వామి, ఫోర్మన్ రామాచారి, లైన్మన్ అల్లం సదన్, కాంట్రాక్టర్ అమరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
మిగిలింది ఒక్కరోజే..
ఆస్తి పన్ను చెల్లింపునకు రేపటి వరకు గడువుజనగామ: జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను వందశాతం సాధించేందుకు అధికారులు వేగం పెంచారు. కలెక్టర్ సందీప్ సుకుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో అన్ని విభాగాలు పన్నుల వేటలో నిమగ్నమయ్యాయి. తాజా డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం మొత్తం 15,847 అసెస్మెంట్లపై ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.6కోట్ల13లక్షల డిమాండ్ నమోదైంది. ఇందులో ప్రస్తుత డిమాండ్ రూ.3 కోట్ల70లక్షలు, పాత బకాయిల డిమాండ్ రూ.కోటి 35లక్షలు, పెనాల్టీలతో కలిపి వసూలు చేయాల్సిన మొత్తం భారీగానే ఉంది. పన్నుల కలెక్షన్ల కోసం ఇంకా ఒక్క రోజే మాత్రమే మిగిలి ఉంది. రూ.3.71 కోట్ల వసూళ్లు పురపాలికలో రూ.3 కోట్ల71లక్షల వసూళ్లు సాధించగా, ఇంకా రూ.2కోట్ల 42 లక్షల బ్యాలెన్స్ ఉంది. ఇప్పటి వరకు 60.47శాతం కలెక్షన్లు సాధించారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ విభాగంలో 53.12శాతం, నాన్రెసిడెన్షియల్లో 64.87 శాతం, మిక్స్డ్ విభాగంలో 74.28శాతం కలెక్షన్ పూర్తి చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు వసూళ్ల వేట కమిషనర్ మహేశ్వర్రెడ్డి సూచనలతో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది పన్నుల వసూళ్ల కోసం ఇంటింటికీ పరుగులు పెడుతున్నారు. కమర్షియల్, డొమెస్టిక్ రెండు విభాగాల్లోనూ ప్రత్యేక దృష్టి సారించి ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తూ 100శాతం వసూళ్ల లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రతి వార్డులో పెండింగ్ ఉన్న ప్రాపర్టీల జాబితా తయారు చేసి, డోర్ టు డోర్ వసూలు, నోటీసుల ఇష్యూ, డీఫాల్టర్లను గుర్తించే చర్యలు వేగవంతం చేశారు. ప్రభుత్వ శాఖలపై ప్రత్యేక దృష్టి అత్యంత కీలక అంశం గత కొన్నేళ్లుగా ప్రభుత్వ శాఖల పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉంది. ఈ శాఖలు చెల్లింపులు ఆలస్యం చేయడం వల్ల వసూళ్లపై గణనీయమైన ప్ర భావం పడుతోంది. దీనిని ప్రాధాన్యంగా తీసుకున్న కమిషనర్ మహేశ్వర్రెడ్డి స్వయంగా శాఖ లను సంప్రదిస్తూ, పెండింగ్ వివరాలను వివరిస్తూ వెంటనే చెల్లింపులు జరిపించాలని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ట్యాక్స్ వసూలు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయగా, ఆ శాఖల ఉన్నతాధికారులను సంప్రదించి త్వరగా బకాయిలు క్లియర్ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ శాఖల బకాయిలు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, వసతి గృహాలు, పోలీస్ క్వార్టర్లు, విద్యుత్, అటవీ తదితర శాఖలు చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో అధికారులు ముందుకెళ్తున్నారు. మొత్తం రూ.88లక్షల27వేలు బకాయిలు ఉంది. ఆరోగ్య శాఖ, సివిల్ హాస్పిటల్ పరిధిలో ఆస్తులపై భారీ బకాయిలు రావాల్సి ఉండగా, పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్తోపాటు క్వార్టర్స్పై బకాయిలు ఉన్నాయి. విద్యుత్శాఖకు చెందిన క్వార్టర్స్పై పన్నులు పెండింగ్లో ఉన్నాయి. విద్యు త్, వ్యవసాయ మార్కెట్, సంబంధిత శాఖలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్, ఫారెస్ట్ ఆఫీస్, నర్సరీ వంటి కార్యాలయాలు, పాల కేంద్రాలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్, పోస్టాఫీస్ కలుపుకుని మొత్తం 81 ప్రభుత్వ శాఖలకు సంబంధించి పెండింగ్ బకాయిలు రావాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు ఇప్పటికే సంబంధిత శాఖలకు ఎంత బకాయి ఉందనే సమాచారం ఇచ్చారు. సకాలంలో పన్నులు చెల్లించండి ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపాలిటీలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ప్రధాన ఆదాయ వనరు. ప్రతీ ఇంటి యజమాని, వ్యాపారవేత్త చెల్లించాల్సిందే. పెనాల్టీలు పెరగక ముందే పెండింగ్ క్లియర్ చేసుకోవాలి. వసూళ్ల డ్రైవ్ కొనసాగుతున్నందున రాబోయే రోజుల్లో కలెక్షన్ శాతం పెరుగుతుందనే నమ్మకం ఉంది. – మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, జనగామ -
టెన్త్ పరీక్షలను సజావుగా నిర్వహించాలి
కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్టేషన్ఘన్పూర్: పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ఘన్పూర్, చాగల్లు జెడ్పీఎస్ఎస్లో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్లలో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణ ఎలా ఉందని, ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారని,తదితర వివరాలను సంబంధిత అఽధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. -
మక్కల కొనుగోలు కేంద్రం సందర్శన
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో మక్కలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులు పడుతున్న ఇబ్బందులు, తేమ, ఫంగస్ సాకుతో నిర్వాహకులు పెడుతున్న కొర్రీలపై ‘అమ్మబోతే కొర్రీ’ అనే శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ రంజిత్రెడ్డి స్పందించారు. ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డితో కలిసి మక్కల కొనుగో లు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్లో రాశులుగా ఉన్న మక్కలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడు తూ నిబంధనల మేరకు తేమశాతం తప్పనిసరిగా ఉండాలన్నా రు. అనంతరం మక్కల కొనుగోళ్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, మార్కెట్ సెక్రటరీ జన్ను భాస్కర్, కాంగ్రెస్ మండల పార్టీ అఽ ద్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, సెంటర్ నిర్వాహకుడు ఐత సంతోష్, రైతులు పాల్గొన్నారు. ఏఎంసీ కార్యదర్శిగా అంజిత్రావుజనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ ప్రత్యేక గ్రేడ్ కార్యదర్శిగా డి.అంజిత్రావును నియమిస్తూ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ కె.సురేంద్ర మోహన్ (ఐఏఎస్) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వరంగల్ ఏఎంసీ గ్రేడ్–2 కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు జనగామలో పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఖమ్మం డీఎంఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కె.రామకృష్ణకు తాత్కాలిక బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరి
● డీసీపీ రాజమహేంద్రనాయక్ బచ్చన్నపేట: ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్ను తప్పకుండా ధరించాలని డీసీపీ రాజమహేంద్రనాయ క్, ఏఎస్పీ పండేరి నితిన్చేతన్లు అన్నారు. శనివారం రోడ్డు భద్రతా మా సోత్సవాల సందర్భంగా మండలకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహ ప్రాంగణంలో సర్పంచ్ అల్వాల నర్సింగరావు అధ్యక్షతన వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరి ధరించాలని, కార్లలో ప్రయాణం చేసే సమయంలో విధిగా సీటు బెల్టు ధరించాలన్నా రు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష పడుతుందన్నారు. అనంతరం 100 మందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, ఎ స్సై నైనాల నరేష్, బాలకిషన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జనగామ
రాజీమార్గమే రాజమార్గంIఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ జనగామ రూరల్: రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నా రు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించారు. నాలు గు బెంచ్ల ద్వారా సమస్యలు పరిష్కరింగా మొదటి బెంచ్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ, సభ్యులుగా సునీతరాణి వ్యవహరించారు. మొత్తం 1,508 కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో సివిల్ జడ్జిలు సుచరిత, శశి, సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
మురుగు నీరు రిజర్వాయర్లోకి రావొద్దు
లింగాలఘణపురం: రిజర్వాయర్లోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కాలువలను ఎక్కడపడితే అక్కడ తొలగించి నిబంధనలకు విరుద్ధంగా సాగునీటిని వాడుకోవద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలో పర్యటించిన సందర్భంగా మండలంలోని నవాబు పేట రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సదానందం, పలువురు రైతులు మాట్లాడుతూ.. జనగామ పట్టణంలోని మురికి నీరంతా నెల్లుట్ల చెరువులోకి చేరుతోందని, అక్కడి నుంచి రిజర్వాయర్లోకి వదులుతున్నారని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో వెంటనే ఆయన స్పందించి మురికి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్కు సూచించారు. రిజర్వాయర్లతో సాగు విస్తీర్ణం ఎలా పెరిగింది..ప్రయోజనం పొందుతున్నారా..? అంటూ అడిగి తెలుసుకున్నారు. తూము వద్ద ధ్వంసమైన కాలువ మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఆయనతో పాటు కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఈఎన్సీ రమేశ్ బాబు, ఎస్ఈ సీతారాం, వరంగల్ సీఈ సుధీర్, ఆర్డీఓ వెంకన్న, తహసీల్దార్ అండాలు, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నీటిని వాడొద్దు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు -
అమ్మబోతే కొర్రీ
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఓడీసీఎంఎస్ ద్వారా ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రంలో సెంటర్ నిర్వాహకులు వివిధ కారణాలతో కొనుగోళ్లలో కొర్రీలు పెడుతుండగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుత సీజన్కు గాను జిల్లాలో మొదటగా స్టేషన్ఘన్పూర్లో ఈనెల 23న మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అయితే రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రారంభోత్సవ సమావేశంలో స్వయంగా ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిర్వాహకులు పెడచెవిన పెడుతున్నారు. రైతులు తీసుకొచ్చిన మక్కలకు నిబంధనల మేరకు తేమశాతం ఉన్నప్పటికీ ఫంగస్ ఉందని, నాణ్యత లేదంటూ పొంతన లేని కొర్రీలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇతర మండలాల నుంచి.. నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు పాలకుర్తి మండలం నుంచి సైతం రైతులు మక్కలు ఇక్కడి మార్కెట్కు తీసుకొస్తున్నారు. అయితే మక్కలు తీసుకొచ్చిన మూడు, నాలుగు రోజుల వరకూ కొనుగోళ్లు చేయకుండా తిరిగి తీసుకెళ్లాలంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పేరుకే మార్క్ఫెడ్ అంటున్నారని, తీరా చూస్తే అంతా దోపిడీయే ఉందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అని వస్తే పట్టించుకునేవారు లేరన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే, అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఘన్పూర్ మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం తేమ, ఫంగస్ సాకుతో తిప్పి పంపిస్తున్నారు.. మూడు, నాలుగు రోజులైనా కొనకపోవడంతో రైతుల ఇక్కట్లు ప్రభుత్వ కేంద్రమని వస్తే ఇష్టారాజ్యం వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని అన్నదాతల డిమాండ్మాది పాలకుర్తి మండలం తీగారం గ్రామం. నాలుగు రోజుల క్రితం ముప్పై క్వింటాళ్ల మక్కలను మార్క్ఫెడ్ సెంటర్కు తీసుకువచ్చా. అయితే ఒకసారి తేమశాతం లేదని, మరోసారి ఫంగస్ అంటూ పొంతన లేని కొర్రీలతో ఇంతవరకూ కొనుగోలు చేయలేదు. తీరా ఇక్కడికి వస్తే బాగాలేవంటూ ఇంటికి తీసుకెళ్లమంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి న్యాయం చేయాలి. -
శ్రీభద్రకాళికి గులాబీపూలతో పుష్పార్చన
● ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంతనవరాత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు అమ్మవారికి గులాబీపూలతో పుష్పార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, వేదపాఠశాల విద్యార్థులు గులాబీపూలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయాన్ని సందర్శించే భక్తులు ఎండతాకిడితో ఇబ్బంది పడకుండా శాశ్వత ప్రాతిపదికన జర్మన్ పెండల్స్ టెంట్లు వేయించాలని అందుకు ఆయ్యే ఖర్చు రూ.10లక్షలు విరాళంగా ఇస్తానని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. దీంతో ఆలయ ధర్మకర్తలు పది రోజుల్లో పనిపూర్తి చేయిస్తామని హామీ ఇవ్వడంతో టెంట్లు ఏర్పాటు పనులను పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. వరంగల్కు చెందిన బాకరాజు చంద్రశేఖర్రావు, రాజశ్రీ దంపతులు భక్తులు స్వయంగా కుంకుమార్చన జరుపుకోవడానికి వీలుగా పంచలోహలతో తయారుచేసిన అమ్మవారి పాదుకలను ఆలయానికి సమర్పించారు. రాత్రి దేవాలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. -
పరిశ్రమలకు ఇంక్యుబేషన్.. నిట్ వరంగల్
కాజీపేట అర్బన్: పరిశ్రమలకు నూతన ఆవిష్కరణలు, ఆలోచనలను అందజేసేందుకు ఇంక్యుబేషన్లా నిట్ వరంగల్ నిలుస్తుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం ఐఏఐసీ–26 (ఇండస్ట్రీ అకాడమీ ఇన్నోవేషన్ కాన్క్లేవ్) రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీయల్ కన్సల్టెన్సీ, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సౌజన్యంతో నిర్వహించారు. ఐఏఐసీ–26 సమావేశానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడుతూ నిట్ వరంగల్ ఇన్నోవేషన్ సెంటర్ వేదికగా నిలుస్తోందన్నారు. కాగా, ఐఏఐసీ–26 సమావేశంలో టెక్నాలజీ స్టాల్స్, ఇన్నోవేషన్, ఏఐ ఎగ్జిబిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఫిలిప్స్ టౌన్సెండ్ అసోసియేషన్, ఎల్అండ్టీ అడ్వైజర్ వినాయక్ మరాఠే, ఎఎన్ఆర్ఎఫ్ సీఈఓ శివకుమార్, ఐఏఐసీ ప్రతినిధులు, నిట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఐఏఐసీ–26 సమావేశం ప్రారంభం -
మెరుగైన వైద్యం అందించాలి
పాలకుర్తి టౌన్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతీ వైద్యుడి బాధ్యత అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మందుల గది, ల్యాబ్, ఇన్పేషెంట్ విభాగం, స్టాక్ రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిష్టర్ను పరిశీలించారు. గ్యాస్ కొరతతో ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే భోజనం కట్టెల పొ య్యిపై చేయడాన్ని చూసిన కలెక్టర్ వెంటనే గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని ఆధికారులను అదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, నిర్లక్ష్యం అసలు సహించబోమని హెచ్చరించారు. చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు ప్రజలకు నమ్మకమైన సేవా కేంద్రాలుగా నిలవాలని సూచించారు. కలెక్టర్ వెంట డాక్టర్ శ్వేత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నమ్మకమైన సేవా కేంద్రాలుగా నిలవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి, గురుకులంలో తనిఖీమండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని వంటశాల, భోజనశాలను పరిశీలించారు. బియ్యం, పప్పులు, ఉల్లిగడ్డలు తదితర సరుకుల నాణ్యతను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం రుచిగా, సమయానికి అందించాలని సూచించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు సన్నద్ధతపై ఆరా తీశారు. పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప, సిబ్బంది ఉన్నారు. -
ఆలయాభివృద్ధికి రూ.2 లక్షల విరాళం
రఘునాథపల్లి: మండలంలోని శ్రీమన్నారాయణపురం గ్రామంలోని శ్రీమన్నారాయణమూర్తి ఆలయ పునఃనిర్మాణానికి వంశీ ఫౌండేషన్ చైర్మన్ కంచరకుంట్ల వంశీరెడ్డి శుక్రవారం రూ.2 లక్షల విరాళం అందజేశారు. గ్రామంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, సర్పంచ్ తూడి వెంకటేష్తో కలిసి పాల్గొని రూ.2 లక్షల చెక్కు అందజేశారు. ఆలయ పునః నిర్మాణానికి నిధులు సమకూర్చిన వంశీరెడ్డిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, సర్పంచ్తో పాటు గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గజ్జెల నాగేష్, కొమురాజి,వేణుమాధవ్, భిక్షపతి, యాదగిరి, అంజయ్య, మల్లయ్య, వీరస్వామి, జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.అదుపుతప్పి.. దాణా లారీ బోల్తాజనగామ రూరల్: జనగామ–సిద్దిపేట రహదారి శామీర్పేట క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఓ దాణా లారీ బోల్తా పడి డ్రైవర్కు గాయాలయ్యాయి. షోలాపూర్ నుంచి ఏపీలోని రాజ మండ్రికి సోయాబిన్ పౌడర్ లోడ్తో వెళ్తున్న లారీ శామీర్పేట క్రాస్ వద్ద అదుపుతప్పి బో ల్తాపడింది. డ్రైవర్కు గాయాలు కాగా జనరల్ ఆసుపత్రికి తరలించారు. లారీలో రూ.5 లక్షలకు పైగా విలువ చేసే సరుకు ఉంది. నిత్యం ప్రమాదాలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే హైవే అధికారులు పట్టించుకోవాలని, ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. లారీ బోల్తా పడిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. మండల కార్యదర్శి బోడ నరేందర్, తాండ్ర ఆనందం, మల్లేష్, యాదగిరి, ప్రసాద్ తదితరులు ఉన్నారు. 176 స్లాట్లు.. 8:30 వరకు రిజిస్ట్రేషన్లుకాజీపేట అర్బన్: కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శనివారం 176 స్లాట్ రిజిస్ట్రేషన్లను రాత్రి 8.30 నిమిషాల వరకు సబ్ రిజిస్ట్రార్లు పూర్తి చేయనున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో శనివారం, సోమవారం, మంగళవారం మూడురోజుల పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచేందుకు సబ్ రిజిస్ట్రార్ల పని వేళలు మారుస్తూ 11 గంటల పాటు రిజిస్ట్రేషన్లు కొనసాగేలా మార్పు చేసింది. ఇందులో భాగంగా.. సాధారణంగా ఉదయం 10.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలను మారుస్తూ ఉదయం 9:30 నిమిషాల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు నిర్ణయించింది. పస్తుతం మార్చిన స్లాట్స్లో భాగంగా 176 స్లాట్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే తరహాగా పని వేళలు, స్లాట్ బుకింగ్లు కొనసాగనున్నాయి. 27హెచ్ఎమ్కెడి 306 – -
మండుటెండల్లో చల్లటి ఉపశమనం
జనగామ: వేసవిలో దంచికొడుతున్న ఎండలు.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజల ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తీవ్రమైన వేడిలో ఉపశమనం కోసం ప్రజలు పుచ్చకాయలను కొనుగోలు చేస్తుండడంతో వాటికి డిమాండ్ పెరిగింది. జిల్లా కేంద్రంలోని పాతబీటు బజారు, హైదరాబాద్ రోడ్, ప్రధాన కూడళ్లలో పుచ్చ పండ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డీ హైడ్రేషన్ దూరం.. ఒక్కో పుచ్చకాయ రూ.30 నుంచి రూ.40 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ప్రభావం పెరిగే కొద్దీ పుచ్చకాయల కొనుగోలు కూడా పెరుగుతోంది. వేడిలో దాహార్తిని తగ్గించడం, శరీరానికి తక్షణ శక్తినివ్వడంలో పుచ్చకాయలకు మించింది లేదు. తక్కువ ధర, ఎక్కువ నీటి శాతం కలిగి ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో పుచ్చకాయలు సహజంగా డీహైడ్రేషన్ తగ్గిస్తాయి. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని చ ల్లబరచడంతో పాటు డీహైడ్రేషన్ తగ్గిస్తాయి. పుచ్చకాయల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని తోటల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా రు. పుచ్చకాయల విక్రయం ద్వారా వేసవిలో రైతులు, అమ్మకం దారులకు మంచి ఉపాధి లభిస్తోంది. పుచ్చకాయలకు ఫుల్ గిరాకీ డీహైడ్రేషన్ తగ్గించే సహజ ఫలం రైతులు, అమ్మకం దారులకు ఉపాధి -
అలరించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటకం
● ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం హన్మకొండ కల్చరల్: ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకతీయ నాటక కళాపరిషత్ వరంగల్ వారి ఆధ్వర్యంలో అభినవ ఆంజనేయ బిరుదాంకితులు జమ్మలమడక కృష్ణమూర్తి స్మారకంగా నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ పద్యనాటక ప్రదర్శన అలరించింది. ఈమేరకు శుక్రవారం పోతన పీఠంలో జరిగిన ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలను యూత్కాంగ్రెస్ నాయకులు విష్ణురెడ్డి, వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు గంటా రవికుమార్, సీనియర్ కళాకారులు తడకమల్ల రామచంద్రరావు, ఆకుల సదానందం, జేఎన్ శర్మ, నెరేళ్ల శోభావతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రదర్శించిన సమ్మక్క సారలమ్మ పద్యనాటకం ప్రేక్షకులను అలరించింది. అనంతరం యోగా సాధకులు మినుపూరి సంధ్య, రాణి పాల్గొన్నారు. -
గుండ్లగడ్డలో భారీ చోరీ
జనగామ: పట్టణంలోని గుండ్లగడ్డ కృష్ణబావి ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బంధువుల ఇంటికి వెళ్లిన కుటుంబాన్ని టార్గెట్గా చేసుకుని దొంగలు ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన గురువారం వెలుగు చూసింది. సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లగడ్డకు చెందిన ఇంటి యజమాని వెంకటసాయిలు, ఆయన భార్య రమ ఈ నెల 25వ తేదీన మహబూబాబాద్ జిల్లా మేఘరాజుపల్లిలో బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి వెళ్లారు. అదే రాత్రి సుమారు 2.30 గంటల సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్లో కనిపించిన గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ప్రధాన ద్వారం తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అనంతరం బీరువాను ధ్వంసం చేసి అందులోని సుమారు 6 తులాల బంగారం, 10 తులాల వెండి, అలాగే రూ.25 వేల నగదు దొంగిలించి పరారయ్యాడు. గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో కాలనీవాసులు అనుమానంతో వెంకటసాయిలుకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని చూసేసరికి బీరువాలోని ఆభరణాలు, నగదు కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై భరత్తో కలిసి ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వేలిముద్ర నిపుణులు వచ్చి కీలక ఆధారాలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై భరత్ తెలిపారు. 6 తులాల బంగారం, 10 తులాల వెండి, నగదు అపహరణ తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం -
ఆర్టీసీ వరంగల్ ఆర్ఎంగా భవాని ప్రసాద్
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్గా ఎస్.భవాని ప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న దర్శనం విజయభానును అదిలాబాద్ రీజినల్ మేనేజర్గా బదిలీ చేయగా, ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్గా పనిచేస్తున్న భవాని ప్రసాద్ను వరంగల్ రీజినల్ మేనేజర్గా నియమిస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయభానుపై పలు ఆరోపణలు రావడంతో బదిలీ జరిగిందనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో సాగుతోంది. యువతిని మోసం చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు వరంగల్ లీగల్ : ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో నేరం రుజువుకావడంతో చెన్నారావుపేట మండలం జోజిపేటకు చెందిన నెలకంటి జోసెఫ్ తంబికి పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి జి.ప్రేమలతారెడ్డి గురువారం తీర్పు వెలువరించారు..ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామానికి చెందిన ఓ యువతి నర్సంపేటలోని సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన సోదరి ఊరైన చెన్నారావుపేట మండలం జోజిపేట గ్రామానికి వెళ్లిన వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన జోసెఫ్ తంబితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లు కొనసాగిన వారి స్నేహం ఆసరా చేసుకొని తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లిచేసుకుంటానని నమ్మించిన జోసెఫ్ తంబి పలుమార్లు యువతిని లోబర్చుకున్నాడు. యువతి వివాహ విషయమై పలుమార్లు అడగగా జోసెఫ్ తంబి ఏదో కారణం చెప్పి తప్పించుకున్నాడు. ఖానాపురం పీఎస్లో సదరు యువతి ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. విచారణ లో నేరం రుజువైంది. -
రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి..
లింగాలఘణపురం: రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండి ప్రయాణించాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. గురువారం మండలంలోని వడిచర్లలో రోడ్డు భద్రతలో మూడో విడత కార్యక్రమంలో భాగంగా ఎస్సై శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో దాతల సహాయంతో వందకు పైగా హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దన్నారు. అంతకు ముందు గ్రామంలో హెల్మెట్లు ధరించిన వాహనదారులతో భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో సర్పంచ్ కార్తీక్, వార్డు సభ్యులు, దాతలు పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి స్టేషన్ఘన్పూర్: ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్ర అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో జాతీయ రహదారి పక్కన రోడ్డు ప్రమాదాల నివారణకు స్టేషన్ఘన్పూర్ పోలీసుశాఖ వారిచే హెచ్చరిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు, ఎస్ఐ రాజేష్, కౌన్సిలర్లు పొన్న రాజేష్, బాలగాని అనీల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఉచితంగా హెల్మెట్ల పంపిణీ -
పంచరాయి తండాకు ఉచిత విద్యుత్
జనగామ: ధర్తీ అభ జెన్ జాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్ (డీఏజేజీఏయూఏ) పథకం క్రింద జిల్లాలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతోందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని బోజ్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని పంచరాయి తండా పాఠశాల ఏరియాలో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి, పాఠశాలకు ఉచిత విద్యుత్ మీట ర్ను అమర్చారు. డీఏ జేజీఏయూఏ పథకం ద్వారా జిల్లాలోని ఎస్టీ తండాల్లోని 800 కుటుంబాలకు ఉచిత విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 366 అంగన్వాడీ సెంటర్లకు గాను 50 కేంద్రాలకు ఇప్పటికే ఉచిత కనెక్షన్లు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సుగుణభీమా, ఉపసర్పంచ్ కొముర, పాఠశాల చైర్మన్ రుక్కమ్మ, ప్రధానోపాధ్యాయురాలు సుమిత్ర, ఉపాధ్యాయుడు రాజేందర్, మాజీ ఎంపీటీసీ జుమీలాల్, వార్డ్మెంబర్లు, గ్రామస్థులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు డివిజనల్ ఇంజనీర్ (టెక్నికల్) గడ్డం గణేష్, డివిజనల్ ఇంజనీర్ విజయ్ కుమార్, ఏడీఈ ఆకిటి స్వామిరెడ్డి, ఏడీఈ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పొట్టకొచ్చిన పంట ఎండిపోతోంది సారూ..
లింగాలఘణపురం: ‘‘సారూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు.. పొట్టకొచ్చిన వరికి సాగునీరందించి ప్రాణం పోయండి.. చేతికొచ్చే దశలో ఉన్న వరి ఎండిపోతోంది..’’అని నెల్లుట్ల, పటేల్గూడెం రైతులు వేడుకుంటున్నారు. యాసంగిలో పొట్టదశలో ఉన్న వరికి కొన్ని గ్రామాల్లో సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. 15 రోజులుగా అశ్వరావుపల్లి రిజర్వాయర్ 16 ఎల్ కాల్వ నుంచి వస్తున్న నీటితో నెల్లుట్ల, లింగాలఘణపురం, పటేల్గూడెం గ్రామాల్లోని రైతులకు మేలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే మళ్లీ కాల్వ నీరు తగ్గడంతో పొట్టకొచ్చి ఈనె దశలో ఉన్న వరి ఎండిపోయే ప్రమాదం నెలకొంది. దీంతో నెల్లుట్ల, పటేల్గూడెం గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాలకు పైగా ఎండిపోతోందని, సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. -
వల్మిడి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్గా పాలేపు సత్తయ్య
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉత్సవ కమిటీని నియమిస్తు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ ఎం.హనుమంతరావు గురువారం ఉత్వర్వులు జారీ చేశారు. జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు కమిటీ చైర్మన్గా పాలేపు సత్తయ్య, కమిటీ సభ్యులుగా వీరమల్ల రామకృష్ణ, నిమ్మల మంజుల, పిట్టల యాకయ్య, దండెంపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఉత్సవ కమిటీ నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జనగామ నుంచి వల్మిడికి ప్రత్యేక బస్సులుపాలకుర్తి టౌన్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం శుక్రవారం జనగామ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ 30 నిమిషాలకు ఒక్క బస్సు సర్వీసు ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరారు.జనగామ: హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక టీకా శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ, హజ్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన శిబిరంలో జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్న యాత్రికులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మా ట్లాడుతూ.. హజ్ యాత్ర సందర్భంగా భారీ జనసమ్మర్థం ఉండే నేపథ్యంలో సంక్రమణ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటళ్లపై విచారణ జరిపించాలిజనగామ: పట్టణంలో హన్మకొండ రోడ్డులోని లోటస్ హాస్పిటల్ భవనంతో పాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అనుమతులపై విచారణ చేయాలని 15వ వార్డు కౌన్సిలర్ మారబోయిన పాండు అగ్నిమాపక శాఖ జిల్లా అధికారికి గురువారం ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక అనుమతులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, భవన అనుమతులపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే మెడికల్ కళాశాల, అనుబంధంగా ఉన్న ఎంసీహెచ్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పనిచేస్తున్న వైద్యులు, ఫ్రొఫెసర్ల సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదని కోరుతూ వైద్యారో గ్య శాఖ మంత్రితో పాటు డీఎంఈకి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత, పట్టణంలో ప్రైవేటు హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయన్నారు. చిన్న పిల్లలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించకుండా, హైదరాబాద్లాంటి కార్పోరేట్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారని మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. -
క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరువ
హన్మకొండ కల్చరల్ : విద్యార్థులు ప్రణాళికాప్రకారం క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరుకుంటారని, చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా విషయ సేకరణ చేసి భద్రపరచాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ వెలుదండ నిత్యానందరావు అన్నారు. గురువారం వరంగల్ హంటర్ రోడ్డులోని జానపద గిరిజన విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. అనంతరం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి వీసీ నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ గతంలో పీఠంలో జరిగిన పరిశోధనలు, పొందుపరిచిన పరిశోధనాంశాలను డిజిటలైజేషన్ చేయాలని, అందుకు సహకరిస్తానన్నారు. అనంతరం ఆచార్య అయిలయ్య.. విద్యార్థులకు భాషా ప్రావీణ్యంపై, సాహిత్యంపై అవగాహన కల్పించారు. పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న మాట్లాడుతూ.. వీసీ నిత్యానందరావు విద్యార్థుల కోరిక మేరకు పీఠంలో తగిన సదుపాయాలు కల్పించారన్నారు. జూనియర్ అసిస్టెంట్ అమేర్ అలీఖాన్, పీఠం అసిస్టెంట్ ప్రాఫెసర్లు శ్రీమంతుల దామోదర్, బాసాని సురేశ్, చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంపా సతీశ్, సిద్దోజు సునంద, గెస్ట్ లెక్చరర్ నోముల రాజు, సిబ్బంది ఆంజనేయులు, అశోక్ , సులోచన, కస్తూరి బాయి, పరిశోధకులు సోనబోయిన సతీశ్, శాంతి తదితరులు పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం సందర్శన -
బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ : బీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్.. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ కమిషన్ విచారణ జరిపింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్పీడీసీఎల్లో చేపట్టిన నియామకాలు, రిజర్వేషన్ల అమలు, అభ్యర్థుల ఎంపికపై చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి విచారణ చేపట్టారు. ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా బీసీ సెల్ ఏర్పాటు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ముందుగా హెచ్ఆర్డీ డైరెక్టర్ సి.ప్రభాకర్, ఎన్పీడీసీఎల్లో అమలు చేస్తున్న రోస్టర్ పాయింట్, రిక్రూట్మెంట్, బ్యాక్ లాగ్ వెకెన్సీపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పని చేసే ఆన్ మ్యానన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల గురించి సంస్థ ఆలోచించి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు వినూత్న సేవలు అందిస్తున్నామని, సాంకేతికతను అందిపుచ్చుకొని విద్యుత్ భద్రతాప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. చీఫ్ ఇంజనీర్లు టి.తిరుమల్ రావు, మాధవరావు, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, జీఎంలు శ్రీనివాసరావు, ఎం.హేమంత్ కుమార్, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమార స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు జి.బ్రహ్మేంద్రరావు, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎన్.సదానందం, కార్యదర్శి నీలారపు రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ను నక్కలగుట్టలోని విద్యుత్ అతిథి గృహంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీజీ ఎన్పీడీసీఎల్లో బీసీ సెల్ ఏర్పాటు చేయాలి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ -
కల్యాణం చూతము రారండి!
జనగామ: జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయాలు, పుష్పాలతో మండపాలు, భక్తుల కోలాహలంతో జిల్లా పండగ వాతావరణంలో మునిగిపోయింది. లింగాల ఘణపురం మండలం జీడికల్ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, పాలకుర్తి మండలం వల్మిడి రామాలయం, చిల్పూరు మండలంలోని బుగులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు జనగామ పట్టణంలోని పాతబీటు బజారు, బాణాపురం, ఆర్టీసీ బస్టాండు, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వరస్వామి, శ్రీనగర్ కాలనీలోని సాయిరాం కన్వెన్షన్ హాల్లో ర ఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, బచ్చన్నపేట, జఫర్గఢ్, నర్మెట, జనగామ మండలాల్లో ఏర్పాట్లు పూర్త య్యాయి. నేటి(శుక్రవారం)మధ్యాహ్నం 12 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణం జరగనుంది. ఆధ్యాత్మిక ఉత్సాహం.. సీతారాముల కల్యాణ మహోత్సవం ప్రారంభ ఘట్టం భక్తులను ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపనుంది. రామయ్య కల్యాణం కనులారా వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. శాస్త్రోక్త పద్ధతుల్లో ఎదుర్కొళ్లు, మంగళాస్త్రం, తలాంబ్రాలు వంటి సంప్రదాయ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయాల కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. వల్మిడిలో వైభవంగా.. పాలకుర్తి టౌన్: వాల్మికి మహాముని నడియాడిన నేల, తెలంగాణలో రెండో భద్రాద్రిగా వెలుగొందుతున్న పాలకుర్తి మండలంలోని వల్మిడిలో శ్రీరామ నవమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాముని గుట్ట(క్షేత్రం)పై నిర్వహించే సీతారాములు కల్యాణానికి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. సీతారాముల కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు తెలిపారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు పాలకుర్తిలోని శ్రీసోమేశ్వర ఆలయం, పాటిమీద ఆంజనేయస్వామి ఆలయం, విస్నూరులో సీతారామచంద్రస్వామి కల్యాణానికి ఏర్పాటు చేశారు. శ్రీసీతారాముల వివాహ మహోత్సవానికి ఆలయాల ముస్తాబు ఆధ్యాత్మిక వైభవంగా కల్యాణ ఘట్టం జీడికల్, వల్మిడి, నవాబుపేట తదితర ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తిలింగాలఘణపురం: మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. ముఖ్యంగా నవాబుపేట కోదండరామస్వామి, జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాలకు ఆలయాలను ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణం, కల్యాణ మండపాల్లో చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. నవాబుపేట కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 19న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం గరుడముద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గరుడముద్ద ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మిప్రసన్న, సర్పంచ్ సదా నందం, వేదపండితులు లక్ష్మినర్సింహ్మచార్యులు, కృష్ణమూర్తి, భద్రినాథ్, విష్ణువర్ధన్, ఆలయ సిబ్బంది రాజేందర్రెడ్డి, అశోక్, రవితేజ, వసంత, రమేశ్,, ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సుల కొరతతో ప్రజల ఇబ్బందులు
జనగామ: జనగామ నియోజకవర్గంలో నెలకొన్న రవాణా సమస్యలపై తక్షణం స్పందించి ప్రజలు పడుతున్న ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో మంత్రిని కలిసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. చేర్యాల నుంచి జనగామకు వెళ్లే బస్సు సర్వీసు గతంలో బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి, కొన్నె మీదుగా నడిపించారన్నారు. ప్రస్తుతం రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఆ బస్సును నిలిపివేశారన్నారు. కొన్నె నుంచి వీరన్నపేట వయా నాగిరెడ్డిపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణం చేసి, బస్సు సర్వీసును పునరుద్ధరించాలని కోరినట్లు చెప్పారు. నాగిరెడ్డిపల్లి ప్రాంత విద్యార్థులు సిద్దిపేట జిల్లా చుంచునకోట హైస్కూల్కు వెళ్లి చదువు కోవడంతో లోకల్ నాన్ లోకల్ సమస్యలు ఎదుర్కొంటూ భవిష్యత్తులో విద్యా, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ నుంచి బచ్చన్నపేట వరకు మాత్రమే నడుస్తున్న బస్సును వట్టిపల్లి, సాల్వాపూర్, లింగంపల్లి, కొన్నె, ఇటికాలపల్లి, ప్రజ్ఞాపూర్ మీదుగా హైదరాబాద్ వరకు విస్తరించాలని సూచించినట్లు తెలిపారు. జగద్గిరిగుట్ట నుంచి బచ్చన్నపేట వరకు నడుస్తున్న బస్సును ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటికాలపల్లి, రామచంద్రగూడెం, కొన్నె, లింగంపల్లి, సాల్వాపూర్, రాజపేట, యాదగిరిగుట్ట మార్గంగా విస్తరించా లని కోరినట్లు స్పష్టం చేశారు. బస్సు సర్వీసు సేవలకు సంబంధించి తక్షణమే చర్యలు తీసుకుంటా మని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు ఎమ్మెల్యే పల్లా వినతి -
సైన్స్ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్
కేయూ క్యాంపస్ : కేయూలో సైన్స్ విభాగాల్లో 2026–2027 జనవరి సెషన్లో పీహెచ్డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీచేసినట్లు సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు గురువారం తెలిపారు. ఫెల్లోషిప్ అభ్యర్థులు యూజీసీ జేఆర్ఎఫ్, /సీఎస్ఐఆర్/ సీడ్/డీఈటీ/ ఎన్ఎఫ్పీడబ్ల్యూ డీ, డీఎస్టీ–ఇన్స్పైర్ లేదా ఫిప్, క్విప్ టీచర్ ఫెల్లోషిప్స్, అలాగే నెట్, గేట్, జిప్యాట్ కలిగిన అభ్యర్థులు ఈ పీహెచ్డీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు సైన్స్విభాగాల డీన్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాల్సింటుంది. వెకెన్సీలు ఇలా ఉన్నాయి. బయోకెమిస్ట్రీ 3, బ యోటెక్నాలజీ 4, బాటనీ 4, కెమిస్ట్రీ 4, కంప్యూటర్ సైన్స్ 5, జియాలజీ 1, మ్యాథ్మెటిక్స్ 9, మైక్రోబయాలజీ 6, ఫిజిక్స్ 6, జువాలజీ 13 సీట్లు వెకెన్సీలుగా ఉన్నాయని తెలిపారు. రేపటి నుంచి క్రీస్తుజ్యోతిలో టెక్నోజిల్జనగామ: మండలం యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 28వ తేదీ నుంచి టెక్నోజిల్–2026 వేడుకలు నిర్వహించనున్నట్లు క ళాశాల డైరెక్టర్ డి.విజయపాల్రెడ్డి తెలిపారు. గురువారం టెక్నోజిల్ పోస్టర్ను ఆవిష్కరించిన అనంత రం ఆయన మాట్లాడారు.. నాలుగు రోజులు పాటు జరిగే టెక్నోజిల్ వేడుకల్లో సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రిన్సిపాల్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. చివరి రోజు 30వ తేదీ నిర్వహించే మెగా ఈవెంట్ లైవ్ మ్యూజిక్, ఫ్యాషన్ షో, ఇతర కళాశాలల ఆధ్వర్యంలో సాంస్కృతిక కా ర్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందులో కార్యక్రమ కన్వీనర్ అనిత, కో కన్వీ నర్ అమరేందర్, వంశీక్రిష్ణ తదితరులు ఉన్నారు. -
మినీ టెక్స్టైల్ పార్క్కు నిధులు మంజూరు చేయండి
కొడకండ్ల: మండల కేంద్రంలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి చేనేత కార్మికుల సంక్షేమానికి బాసటగా నిలువాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి కోరారు. గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే మినీ టెక్స్టైల్ పార్క్ అంశంపై మాట్లాడారు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిపాలన అనుమతులు లేకుండానే ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపన చేశారన్నారు. నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది చేనేత కార్మికులు ఉపాధి కోసం సూరత్కు వెళ్తారని, కొడకండ్ల, దేవరుప్పులలో ఎంతో మంది పద్మశాలీలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని మినీ టెక్స్టైల్ పార్క్తో స్థానికంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఇందుకుగాను మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులు ఇచ్చి రూ.63 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
వేసవిలో జాగ్రత్తలు పాటించాలి
జనగామ రూరల్: వేసవి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. వడదెబ్బకు ఎలాంటి నష్టాలు కలగకుండా శాఖల వారీగా వారి పరిధిలో తీసుకోనున్న యాక్షన్ ప్లాన్ అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..విద్యార్థులకు, గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు, వడదెబ్బకు సంబంధించిన మందులను పంపిణీ చేయాలన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్ల అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి వాల్పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఏసీపీ పండరి చేతన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మలికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ‘సర్’ ప్రక్రియకు సహకారం అందించాలి.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) మ్యాపింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మినీ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమర్థవంతంగా డిజిటల్ పాలన.. జిల్లాలో డిజిటల్ పాలనను మరింత సమర్థమంతంగా అమలు చేసేందుకు గాను జిల్లా స్థాయి ఐటీ మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఎన్ఐసీ హాల్లో జిల్లా స్థాయి ఐటీ మానిటరింగ్ సెల్ను అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి ప్రారంభించారు. ప్రధానంగా గ్యాస్ సరఫరా, ఇసుక తరలింపు, తాగునీటి సమస్యలపై వెంటనే స్పందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం 1800 425 6605 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఫణి కుమార్, ఈడీఎం గౌతమ్, ఇతర సంబంధిత అధికారులు, ఐటీ సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడాలి.. మహిళలు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోని ఆర్థికంగా బలపడాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. మండలంలోని మరిగడి గ్రామంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు లో మహిళలకు డ్రోన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నూరుద్దీన్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, డీపీఎం నలిని, నారాయణ, వ్యవసాయ అధికారులు శరత్ చంద్ర, విజయ రెడ్డి, మనోహిత్, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలి బచ్చన్నపేట: వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు మనో ధైర్యం కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది రిజిస్టర్, ఓపి రిజిస్టర్, పిల్లల వార్డు, ఇన్ పెషేంట్ వార్డులను, మందుల నిల్వలను పరిశీలించారు. అనంతరం మన్సాన్పల్లి, లింగంపల్లి, కొన్నె, రామచంద్రాపురం, ఇటికాలపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతాప్రమాణాలను తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. కొన్నె గ్రామంలో అక్రమంగా నడుస్తున్న హిటాచీని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాతృనాయక్, సర్పంచ్లు కోడూరి స్వర్ణలత, గీస సందీప్, అల్వాల నర్సింగారావు , వైద్యులు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
7 మెడికల్ షాపుల డ్రగ్ లైసెన్స్ల సస్పెన్షన్
జనగామ: జిల్లా వ్యాప్తంగా ఔషధ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న మెడికల్ షాపులపై అధికారుల తనిఖీలు వేగం పెరిగాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా ఔషధ తనిఖీ అధికారి బాలకృష్ణ జిల్లాలోని పలు మండలాల్లో మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అపరిచిత వ్యక్తుల ద్వారా మత్తు అలవాటు కలిగించే మందుల అమ్మకాలు నిర్వహించగా, నియమాలు ఉల్లంఘించిన మెడికల్ దుకాణాలను సీజ్ చేశారు. అనంతరం సంబంధిత నివేదికలను వరంగల్ ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకులకు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా మత్తు పదార్థాలు అమ్మకాలు చేసిన ఔషధ వ్యాపారులకు నోటీసులు జారీ చేసి మెడికల్ దుకాణాల డ్రగ్ లైసెన్స్లను జనగామ అధికారి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. డ్రగ్ లైసెన్స్ రద్దు చేసిన సస్పెండ్ అయిన మెడికల్ దుకాణాలు ఆక్సిజన్ మెడికల్ స్టోర్స్, రఘునాథపల్లి(7 రోజులు), సాయితేజ మెడికల్ స్టోర్స్, రఘునాథపల్లి(7రోజులు), వాసవి మెడికల్ స్టోర్స్, రఘునాథపల్లి(7రోజులు) ఏ టు జెడ్ మెడికల్ స్టోర్స్, జనగామ(7రోజులు), సుమన మెడికల్ స్టోర్స్, జనగామ(7రోజులు), మారుతి మెడికల్ స్టోర్స్, లింగాలఘణపురం(5 రోజులు), శ్రీ మల్లికార్జున మెడికల్ ఏజెన్సీస్, జనగామ(2రోజులు) సీజ్ చేశారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని బాలకృష్ణ హెచ్చరించారు. 30న ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా జనగామ రూరల్: రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా ఈనెల 30న కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు ఆహార భద్రత అధికారి సీహెచ్ వినీల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెన్యువల్ చేసుకోవాలని కోరారు. ఆహార భద్రత అధికారి: 7306335795.– గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్: 9985820544 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
తెలంగాణ రన్ పోస్టర్ ఆవిష్కరణ
జనగామ: తెలంగాణ రన్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 6 గంటలకు బతుకమ్మకుంట వద్ద నిర్వహించనున్న 2 కేఎం, 5 కేఎం, 10 కేఎం రన్ కార్యక్రమ పోస్టర్ను మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బా లమణి శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి రన్లు ఎంతో ఉపయోగకరమని, భారీసంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కౌన్సిలర్ పాముకుంట్ల ప్రసాద్గౌడ్, రన్రేస్ డైరెక్టర్ వంగాల పురుషోత్తంరెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు నారోజు రామేశ్వరచారి, పోచయ్య, కుమారస్వామి, నరేష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని గృహనిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్ అన్నారు. మండలంలోని ఇప్పగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మందపురం రాణిఅనీల్గౌడ్ అధ్యక్షతన ఇందిరమ్మ లబ్ధిదారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పీడీ మాట్లాడారు.. లబ్ధిదారులుగా ఎంపికై ఇంతవరకూ పనులు ప్రారంభించని వారు వెంటనే పనులను చేపట్టాలన్నారు. లేనిపక్షంలో ఇళ్ల మంజూరు రద్దయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో హౌజింగ్ డీఈ చంద్రశేఖర్, ఏఈ అఖిల, ఉపసర్పంచ్ లింగనబోయిన రాజు పాల్గొన్నారు. హౌజింగ్ పీడీ మాతృనాయక్ -
భయంతోనే బారులు!
అవసరానికి మించి పెట్రోల్ కొనుగోళ్లు జనగామ: జిల్లా వ్యాప్తంగా పెట్రోలు బంకుల్లో పెరుగుతున్న రద్దీతో వినియోగదారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు భారత ఇంధన సరఫరాపై ప్రభావం చూపవచ్చనే వార్తలు బయటకు రావడంతో, సాధారణంగా రోజువారీ అవసరం మేరకు ఇంధనం నింపుకునే వాహనదారులు ఇప్పుడు ముందస్తు భయంతో అడ్వాన్స్గా పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు. రవాణా రంగంతో పాటు వ్యక్తిగత వాహన యజమానులు కూడా అవసరానికి మించి పెట్రోల్ కొనుగోలు చేయడం వల్ల జిల్లాలోని పలు బంకుల్లో స్టాక్ తగ్గిపోయి, కొన్నిచోట్ల తాత్కాలికంగా బంకులు మూతపడే పరిస్థితి ఏర్పడింది. అదనంగా కొనుగోలు.. సాధారణంగా రోజుకు ఒకసారి మాత్రమే ఇంధనం తీసుకునే వినియోగదారులు ఇప్పుడు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో బంకుల్లో ఉన్న రెగ్యులర్ స్టాక్ గంటల వ్యవధిలోనే కొనుగోలు పేరిట ఆవిరైపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఇండియన్, భారత్, హెచ్పీ ఎస్ఆర్.. తదితర కంపెనీలకు చెందిన 97 బంకులు ఉన్నాయి. వీటిల్లో సాధారణంగా రోజువారీగా లక్ష లీటర్లకు పైగా పెట్రోల్ అమ్మకం జరుగుతుంది. అయితే ప్రస్తుతం డిమాండ్ 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు అధికారులు బంకు నిర్వాహకులు చెబుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లోని బంకుల్లో అధిక రద్దీ కనిపిస్తోంది. ఉదయం మొదలైన క్యూలైన్లు రాత్రి 10 నుంచి 11 గంటల వరకూ కొనసాగుతోంది. రద్దీ భయంతో మెజార్టీ కస్టమర్లు ముందస్తుగా పెట్రోలు నింపుకోవడానికి బంకుల వద్ద నిరీక్షిస్తున్నారు. మండలాల వారీగా.. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో 11 పెట్రోల్ బంకులు ఉండగా, తాటికొండ, ఇప్పగూడెంలోని మూడు బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారు. బచ్చన్నపేట మండలంలో ఐదు పెట్రోల్ బంకుల్లో రెండింట్లో పెట్రోల్ క్లోజ్ అయింది. జఫర్గఢ్ మండలంలో మూడు బంకులకు గాను రెండు బంకుల పరిధిలో నో స్టాక్ బోర్డు పెట్టారు. నర్మెట మండలంలోని మూడు బంకుల్లో నిల్వలు క్లోజ్ కావడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దేవరుప్పుల మండలంలో ఆరు బంకులకుగాను రెండింట్లో పెట్రోలు లేకపోవడంతో మూసివేశారు. పాలకుర్తి లో ఒకే ఒక్క బంకులో నోస్టాక్ ఉంది. ఇంధన సరఫరాపై ప్రభావం పడొచ్చనే ఆందోళనే కారణం.. కొరత లేదు.. ఆందోళన వద్దు: ప్రభుత్వం అడ్వాన్స్ కొనుగోళ్లతో కొరత: బంకుల యజమానులు ఇంధన సరఫరాలో అంతరాయం లేదని చమురు కంపెనీలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అడ్వాన్స్ కొనుగోళ్లతో కొరత ఏర్పడిందే తప్ప, పెట్రోల్ కొరత లేదని ప్రభు త్వం, అధికారులు చెబుతున్నారు. అవసరానికి మించిన కొనుగోళ్లు చేయకుండా ప్రజలు సహకరిస్తే జిల్లా వ్యాప్తంగా పరిస్థితి యథాస్థితికి చేరుకుంటుందని అంటున్నారు. ప్రస్తుతం బంకుల్లో కనిపిస్తున్న రద్దీ పూర్తిగా ప్రజల ఆందోళనతోనే పెరిగిందని, సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని సంబంధిత శాఖలు చెబుతున్నాయి. -
పారదర్శకంగా ‘సర్’ ప్రక్రియ
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తహసీల్దార్లకు, ట్రైనర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరాం, వెంకన్న, తహసీల్దార్లు, ఎలక్షన్ డీటీ పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం పట్టణంలోని మైనారిటీ సంక్షేమ గురుకులాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్టాఫ్ రూమ్ను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అనంతరం శామీర్పేట్లోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో విక్రమ్, హౌజింగ్ పీడీ మాతృ నాయక్ పాల్గొన్నారు.అసంపూర్తి ఇళ్ల నిర్మాణానికి నిధులివ్వండి● అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: పట్టణంలోని అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్ల సమస్యపై బుధవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అసెంబ్లీలో గళం వినిపించారు. గతంలో నిర్మాణం ప్రారంభమైన ఇళ్లను పూర్తి చేయకుండా వదిలేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న 800 డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తి చేసేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్లాబ్ దశలో నిలిచిపోయిన ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్1, ఎల్3 జాబితాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి గ్రామంలో కొంతమంది ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉందని, ఎన్నికల ముందు ఇళ్ల పూర్తి కోసం ప్రక్రియ ప్రారంభమైనా మధ్యలోనే నిలిచిపోయిందన్నారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి జనగామ రూరల్: లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ, న్యూఢిల్లీ తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు 28న(శనివారం) జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించబడినట్లయితే, వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుం కూడా పార్టీలకు తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. జనగామ: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో దళిత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్ రాయితీపై అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ యూనిట్లకు భారీ స్పందన వచ్చిందని ఈడీ మాధవీ లత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 వార్షిక ప్రణాళికలో భాగంగా ఓబీఎంఎంఎస్ పోర్టల్ tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీ వరకు పొడిగించడం జరిగిం దన్నారు. ఇప్పటివరకు ఈబీ టూ వీలర్లకు 299, గైడ్స్ కోసం 145, ప్యాసింజర్ 407, సోలార్ పంప్ కంట్రోల్ యూనిట్లు 33, మొత్తంగా 884 దరఖాస్తులు వచ్చినట్లు స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఆన్న్లైన్లో సమర్పించిన తమ అప్లికేషన్కు సంబంధించిన అవసరమైన పత్రాలను కలెక్టరేట్లోని ఎఫ్–25 రూం నంబర్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలన్నారు. సిద్ధేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.3.59లక్షలుబచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ స్వయంభు శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 3,59,197లు వచ్చినట్లు ఆలయ ఈఓ చిందం వంశీ తెలిపారు. బుధవారం హుండీ లెక్కింపు అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2026 జనవరి 4 నుంచి మార్చి 24వరకు భక్తులు హుండీలో సమర్పించిన 80 రోజుల కానుకల ఆదాయాన్ని ఆలయ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో లెక్కించామన్నారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి ఓం నమశివాయ, సర్పంచ్ నీల కవితమురళి, ఉప సర్పంచ్ గంగం దయాకర్ రెడ్డి, మాజీ డైరెక్టర్ నిమ్మ కరుణాకర్రెడ్డి, అర్చకులు, ఆలయ సిబ్బంది, మహబూబాబాద్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
డబ్బులు దోచేసినోళ్లను పట్టుకోండి
జనగామ: గ్రామైఖ్య సంఘాల ద్వారా బ్యాంకు నుంచి రుణం తీసుకుని వాయిదాల పద్ధతిలో చెల్లించినా నోటీసులు తప్పడం లేదని జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన 30 గ్రూపులకు చెందిన సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి వచ్చిన నోటీసులతో బుధవారం పురపాలిక కార్యాలయ ఆవరణలో ఉన్న ఎస్బీఐకి వచ్చి మోసపోయిన విషయం అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు విలేకరులతో మాట్లాడారు.. సారూ.. సీఏ ద్వారా మినీ బ్యాంకు నిర్వాహకులకు రుణం డబ్బులు చెల్లిస్తే.. బ్యాంకులో జమ చేయలేదని వాపోయారు. సాయిబాబా గ్రామైఖ్య సంఘంలో 36 గ్రూపులు ఉండగా, ఇందులో 30 గ్రూపులకు సంబంధించి రుణం రూ.86లక్షలు ఉండగా, 95శాతం మేర 2022 ఫిబ్రవరిలో క్లోజ్ చేసినట్లు చెప్పారు. సీఏ ద్వారా మినీ బ్యాంకు నిర్వాహకురాలు కలిసి తమ డబ్బులు బ్యాంకులో జమ చేయలేదన్నారు. దీంతో 2023లో రుణం డబ్బులు కట్టాలని బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో ఇద్దరి కుంభకోణం వెలుగు చూసిందన్నారు. అప్పటి ఉంచి నేటి వరకు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామన్నారు. 2026 మార్చి చివరి అవకాశం నేపథ్యంలో రుణం డబ్బులు చెల్లించాలని మరోసారి నోటీసులు ఇచ్చారని గ్రామైఖ్య సంఘం కార్యదర్శి నూనెముంతల వనితతో పాటు వందలాదిగా వచ్చిన మహిళా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మినీ బ్యాంకులో డబ్బులు చెల్లించే సమమంలో తమకు ఇచ్చిన కౌంటర్ ఫైల్లో కనీసం స్టాంపు కూడా లేదని, దీనిపై విచారణ చేయాలని గత ఐదేళ్లుగా తిరుగుతున్నామన్నారు. కొత్త వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు సైతం వినతి చేశామన్నారు. మహిళా సంఘాలను మోసం చేసి, తాము ఇచ్చిన డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల ఆస్తులను అటాచ్ చేసి, తమకు ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలని వేడుకున్నారు. బ్యాంకు నుంచి నోటీసులు ఇస్తున్నారు.. 2022 నుంచి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు.. వెంకిర్యాల మహిళా సంఘాల సభ్యుల నిరసన -
మహిళా చేనేత కార్మికులకు నైపుణ్య శిక్షణ
జనగామ: మహిళా సాధికారతకు, చేనేత రంగానికి నూతన ఉత్సాహం నింపాలనే లక్ష్యంతో, జెన్పాక్ట్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) మద్దతుతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జి–సఖీ ఇక్కత్ వీవర్స్ ప్రాజెక్ట్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రాంతీయ మహిళలకు కొన్ని నెలలుగా ప్రీ–లూమ్, లూమ్ విభాగాలలో నైపుణ్య శిక్షణ అందించగా, ఇప్పటి వరకు 70 మంది మహిళలు శిక్షణ పూర్తి చేశారు. అదనంగా, 30 మంది మహిళలకు ఆధునిక మోదా పెడల్ లిఫ్టింగ్ యంత్రాలను పంపిణీ చేశారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో పల్లె సృజన ఫౌండర్ బ్రిగేడియర్ గణేశం మాట్లాడుతూ.. చిన్న ఆలోచనకు సరైన మద్దతు లభిస్తే ప్రజలకు అవసరపడే సేవాత్మక ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటుందో జి–సఖీ కార్యక్రమం నిరూపించిందన్నారు. ప్రఖ్యాత చేనేత నిపుణుడు చింతకింది మల్లేశం మాట్లాడుతూ.. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళలకు లభిస్తున్న ప్రయోజనాలు జీవితంలో అవసరపడుతాయన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మోదా యంత్రం రూపకర్త శివకుమార్, జనగామ చేనేత, జౌళీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చౌడేశ్వరి, జెన్పాక్ట్ లీడర్షిప్ టీమ్ సభ్యులు లతీష్, అపర్ణ పాథక్, అజిత్ చౌహాన్, రాధాకృష్ణ, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
క్షయవ్యాధి నిర్మూలనకు అవగాహన తప్పనిసరి
జనగామ రూరల్: క్షయవ్యాధి నిర్మూలనకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కె.మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి బస్స్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయవ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్, టీబీ ప్రోగ్రాం ఆఫసర్, వైద్యులు శ్రీ హర్ష, శ్యామ్ కుమార్, కమల్హాసన్, ప్రభాకర్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. టీబీ రహిత జిల్లా చేయాలి.. రఘునాథపల్లి: జిల్లాను టీబీ రహితంగా చేసేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్రావు పిలుపునిచ్చారు. మండలంలోని ఖిలాషాపూర్ ఆరోగ్య ఉప కేంద్రంలో మంగళవారం టీబీ డేను పురస్కరించుకుని టీబీ ముక్త్ హారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శిబరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ శాగ కవితఅశోక్, స్థానిక డాక్టర్ స్రవంతి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుధీర్, అశోక్, కమల్హాసన్, సీహెచ్ఓ రామకిషన్, సుజనారజని, మానస, మధు, జిల్లా టీబీ కంట్రోల్ సూపర్వైజర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, అంజుకుమార్, సుమన్, ఖలీల్ పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.మల్లికార్జునరావు -
సర్కారు దవాఖానాలో కంటి శస్త్రచికిత్సలు
● సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సేవల పునరుద్ధరణ జనగామ: ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కంటి శుక్లాల ఉచిత శస్త్ర చికిత్సలు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మళ్లీ ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్, కంటి వైద్య నిపుణులు రాజలింగం ఆధ్వర్యంలో ఈ విభాగం యాక్టివ్గా పనిచేసేందుకు శ్రీకారం చుట్టారు. జిల్లా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ను ఆధునికీకరించడం, అవసరమైన పరికరాలను కొత్తగా సమకూర్చడం, శుభ్రత, సురక్షిత ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయడం వంటి చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రాజలింగం బృందం స్వయంగా మూడు కంటి శుక్లాల శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల ప్రయోజనంగా ఉచితంగా అందిస్తున్న ఈ శస్త్ర చికిత్సలు ప్రతీ మంగళవారం, శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆసుపత్రి అందిస్తున్న నాణ్యమైన కంటి సేవలతో ప్రయోజనం పొందాలని కోరారు. -
పునర్విభజనలో మరో తొమ్మిది!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభనకు సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన బిల్లు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. మహిళలకు రిజర్వేషన్లు, డీలిమిటేషన్ చట్టాలకు సవరణ చేయనుందని ప్రకటించారు. ఆ వెనువెంటనే డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో పెరిగే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలపై చర్చ జరుగుతోంది. పునర్విభజన జరిగితే ఉమ్మడి వరంగల్లో కొత్తగా దాదాపుగా 9 నియోజకవర్గాలు ఏర్పడనునున్నాయి. దీంతో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 21కి చేరనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనల ప్రకారం 2021లో జరగాల్సి ఉండగా.. జనగణన ఆలస్యం కారణంగా నిలిచిపోయింది. కేంద్రం మళ్లీ జనగణనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అది పూర్తికాగానే నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కొత్తగా తొమ్మిది పెరిగే అవకాశం.. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరలో నియోజక వర్గాలను పునర్ వ్యవస్థీకరించారు. అంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత ఒక్కటి పెరిగి ఆ సంఖ్య 12 నియోజకవర్గాలకు చేరింది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో రెండు (వరంగల్ పశ్చిమ, పరకాల), వరంగల్లో మూడు (వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట), జనగామలో మూడు (జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి), మ హబూబాబాద్లో రెండు (మహబూబాబాద్, డోర్నకల్), జేఎస్ భూపాపల్లిలో ఒకటి (భూపాలపల్లి), ములుగులో ఒకటి (ములుగు)లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 35.12 లక్షలున్న జనాభా.. ప్రస్తుతం అది 41.50 లక్షలు దాటి ఉంటుందని అంచనా. జనగణన పూర్తయితే 2027 జనాభా ప్రకారం పునర్విభజనలో ఉమ్మడి జిల్లాలో దాదాపు తొమ్మిది కొత్త నియోజకవర్గాలు రానున్నాయి. దాంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 21కి పెరిగే అవకాశం ఉంది. ‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్లో ఐదు... మానుకోటలో నాలుగు... జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులో యథాతథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం... ఆ ప్రకారమే 2029 ఎన్నికలు.. కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా పునర్విభజనజిల్లా నియోజకవర్గాలు మొత్తం ప్రస్తుతం పెరగనున్నవి జనాభా నియోజక వర్గాలు హనుమకొండ 02 04 10,80,858 06 వరంగల్ 03 02 8,90,651 05 జేఎస్ భూపాలపల్లి 01 01 4,16,763 02 జనగామ 03 00 5,66,376 03 మహబూబాబాద్ 02 02 77,45,49 04 ములుగు 01 00 25,77,44 01 12 09 39,87,241 21 -
కేయూలో త్వరలోనే జీవ విజ్ఞాన కేంద్రం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో త్వరలోనే జీవవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని, విద్యార్థులు సృజనాత్మక ఆలోచలను పెంపొందించుకోవాలని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో సెమినార్హాల్లో ‘అడ్వాన్స్సెస్ ఇన్లైఫ్ సైన్స్సెస్ ప్రజెంట్ ఫ్యూచర్’ అనేఅంశంపై మంగళవారం నిర్వహించిన జాతీయ సదస్సు ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జీవ విజ్ఞాన కేంద్రం, ఔషధ శాస్త్ర కేంద్రం అనుబంధశాస్త్రాల కేంద్రం స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అనుమతులు రాగానే ఉన్నతస్ధాయి పరిశోధనలకు వేదికగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశాలు పొందుతారన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కర్నాటి రాయ్.. మెదడు కణజాలంలో ఏర్పడే గ్లియోమావ్యాధిలో కనిపించే ఒక ముఖ్యమైన జీవరసాయన మార్పు గురించి వివరించారు. ఈ సదస్సు నిర్వాహక కార్యదర్శి, జూవాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి వై. వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, ఆ విభాగం ప్రొఫెసర్ షిమిత, ప్రొఫెసర్ ఈసం నారాయణ, మైక్రోబయాలజీ విభాగం అఽధిపతి సుజాత, బి వెంకటగోపినాఽథ్, తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు వివిధ యూనివర్సిటీల నుంచి 150 పరిశోధన పత్రాలు వచ్చాయి. కాగా, పరిశోధన పత్రాల అబ్స్ట్రాక్ట్ సావనీర్ను వీసీ ప్రతాప్రెడ్డి అతిథులు ఆవిష్కరించారు. ‘ప్రజాపాలన ప్రగతి’ని విజయవంతం చేద్దాం.. తెలంగాణ రాష్ట్ర 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేద్దామని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలోని పరిపాలన భవనంలోని అకడమిక్ కమిటీ హాల్లో అన్ని విభాగాల అఽధిపతులు, ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల అధ్యాపకులుగా కేరీర్పై వ్యక్తిత్వ వికాసం, ఉన్నత విద్య అవకాశాలపై విద్యార్థులకు తెలపాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. వీసీ కె. ప్రతాప్రెడ్డి -
ఫిన్లాండ్ పర్యటనకు జిల్లా ఉపాధ్యాయురాలి ఎంపిక
● ప్రపంచ ఉత్తమ విద్యా విధానంపై అధ్యయనం జనగామ: పాఠశాల విద్యాశాఖ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల కోసం రూపొందించిన టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ చేంజ్ ప్రోగ్రాం (ఉపాధ్యాయుల క్షేత్ర పర్యటన, విద్యా మార్పిడి)కు రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఎంపిక కాగా, ఇందులో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలకు చెందిన స్కూల్ అసిస్టెంట్ తౌటం నిహారిక ఉన్నారు. ఫిన్లాండ్లో నిర్వహించనున్న ఈ ప్రత్యేక పర్యటనకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీచర్లు ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాలను సందర్శించనున్నారు. ఫిన్లాండ్ పర్యటన నేపథ్యంలో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పాఠశాల విద్యా విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఈ పర్యటన ఉండనుంది. విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి జనగామ రూరల్: బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్రాజు అధ్యక్షత టీపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు అందజేశారు. టీపీటీఎఫ్ పూర్వ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, కుర్రముల యాదగిరి, జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. బాలికను లోబర్చుకున్న యువకుడి అరెస్ట్ మహబూబాబాద్ రూరల్ : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకుని, గర్భవతిని చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం పీఎస్లో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్లోని కంకరబోర్డు ప్రాంతానికి చెందిన ఎండీ మౌలానా అనే యువకుడు స్థానిక ఓ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఓ బాలిక ఫొటో దిగేందుకు స్టూడియోకు రాగా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. ఈ క్రమంలో ఆ బాలికలో మార్పును గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతిగా తేలింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. మౌలానాపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని టౌన్ సీఐ తెలిపారు. టౌన్ ఎస్సై మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. -
పునర్విభజనలో మరో తొమ్మిది!
‘ఓరుగల్లు’లో 21కి పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు హనుమకొండలో ఆరు, వరంగల్లో ఐదు..మానుకోటలో నాలుగు... జేఎస్ భూపాలపల్లిలో రెండు.. జనగామ, ములుగులో యథాతథం ఆరు జిల్లాల పరిధిలోనే మొత్తం 21 నియోజకవర్గాలు 2027 జనాభా లెక్కల ఆధారంగా చేసే అవకాశం.. ఆ ప్రకారమే 2029 ఎన్నికలు... కేంద్రం కసరత్తు నేపథ్యంలో చర్చనీయాంశంగా పునర్విభజన – సాక్షిప్రతినిధి, వరంగల్ -
జనగామ
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 20267బ్రహ్మోత్సవాలకు ముస్తాబు పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయం ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పక్కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలి ● సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ఫోన్ పోతే పోర్టల్లో నమోదు చేసుకోవాలి
● డీసీపీ రాజమహేంద్ర నాయక్ జనగామ రూరల్: సెల్ఫోన్ పోతే పోర్టల్లో నమోదు చేసుకోవాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో క్రైం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలో మొబైల్ ఫోన్లు కోల్పోయిన బాధితులకు అందజేశారు. సీఈఐఆర్ పోర్టల్ను వినియోగించి, పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా ట్రేస్ చేసి అందించవచ్చన్నారు. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం సులభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ మండలాల ఎస్ఐలు, పొలీసు అధికారులు పాల్గొన్నారు. -
15
శ్రీసోమేశ్వరుడి హుండీ ఆదాయంలక్షలురూ.పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం హుండీ ఆదాయం రూ.15,32,767 సమకూరినట్లు ఈఓ భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. 2026 జనవరి 2 నుంచి మార్చి 24 వరకు భక్తులు హుండీలో సమర్పించిన 80 రోజుల కానుకల ఆదాయాన్ని మంగళవారం ఆలయ కల్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ నిఖిల్ పర్యవేక్షణలో లెక్కించారు. 2 గ్రాముల 111మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, 500 గ్రాముల మిశ్రమ వెండి, యూఎస్ డాలర్–1, ఇంగ్లాండ్ –1(10ఫౌండ్స్) వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో సర్పంచ్ కమ్మగాని విజయ, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ప్రధాన అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, దేవగిరి అనిల్కుమార్, ఆలయ సిబ్బంది, శ్రీసోమేశ్వర, రాజరాజేశ్వరి సేవా ట్రస్ట్ సభ్యులు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. -
పొట్టకొట్టిన..బండ కొరత!
జనగామ: జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా 13 రోజులుగా నిలిచిపోవడంతో హోటల్ రంగం పూర్తిగా కుదేలైపోతోంది. జిల్లాలోని టిఫిన్ సెంటర్లు, భోజనశాలలు, బిర్యానీ సెంటర్లు, డాబా, టీకొట్లు, ఫాస్ట్ఫుడ్ పాయింట్లు తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ లేక 10 నుంచి 25 హోటళ్లు పూర్తిగా మూతపడగా, మరో 70 హోటళ్లు సగం పూట మాత్రమే నడుస్తున్నాయి. వందలాది మంది వలస కార్మికుల్లో సగంమేర ఇప్పటికే ఉపాధి కోల్పోయి కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కట్టెల ధరలు క్వింటాల్కు రూ.600 నుంచి రూ.800లకు పెరిగి, మరికొన్ని రోజుల్లో రూ.వేయి దాటనున్నాయని హోటల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో హోటళ్ల ఆధారంగా జీవనం సాగించే వందలాది కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. 450 హోటల్స్కు పైగా.. జిల్లాలో సుమారు 450 వరకు టిఫిన్ సెంటర్లు, భోజనశాలలు, బిర్యానీ సెంటర్లు, టీషాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, మద్యం సిట్టింగ్లతో పాటు ఇతర తినుబండారాల హోటళ్లు ఉన్నాయి. వీటిలో బీహర్, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ నిలిపివేతతో వీరి జీవనోపాధి దెబ్బతింది. ఫుడ్ ఐటెంలలో కోత.. సగం పూట నడుస్తున్న హోటళ్లలో దోశ, వడ, ఇడ్లీ, బోండా వంటి నిత్యాహార వంటకాలపై కూడా సగం కోత విధించారు. మిగతా ఐటమ్స్ను కొందరు కట్టెల పొయ్యిలతో, మరికొందరు ఇళ్లలో తాత్కాలిక ఏర్పాట్లతో చేసి విక్రయిస్తున్నారు. అయినప్పటికీ నష్టాలు భారీగానే ఉంటున్నాయని హోటల్ యజమానులు చెబుతున్నారు. గ్యాస్ కొరత ప్రభావంతో కట్టెల ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం క్వింటాల్కు రూ.600కు లభించే కట్టెలు రూ.800కు అమ్ముతున్నారు. ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే క్వింటాల్ కట్టెల ధర రూ.1,000 దాటడం ఖాయమని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల తాత్కాలికంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లతో హోటళ్లు నడిపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, పెద్దగా ప్రయోజనం లేకపోతోంది. యుద్ధ ప్రభావంతో హోటళ్లపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వందలాది కుటుంబాలు ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతున్నాయి. గ్యాస్ అందుబాటులోకి రాకపోతే తమ ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణించి పోతాయని హోటల్ యజమానులు వాపోతున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలేక సంక్షోభంలో హోటల్ రంగం మూతబడుతున్న టీ, టిఫిన్ సెంటర్లు దోశ, వడ, ఇడ్లీ, బోండా వంటి ఐటెమ్లలో సగం కోత వందలాది కార్మికుల ఉపాధిపై దెబ్బ.. స్వరాష్ట్రాలకు పయనం కొన్నిచోట్ల కట్టెల పొయ్యితో వంటకాల తయారీమూతబడ్డ హోటల్స్ కమర్షియల్ గ్యాస్ సప్లై నిలిచిపోవడంతో జిల్లా కేంద్రంలో 10 నుంచి 25 హోటళ్లు పూర్తిగా మూతపడగా, మరో 70 హోటళ్లు కేవలం సగం పూట మాత్రమే నడుస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది కార్మికులతో పాటు స్థానికంగా పనిచేస్తున్న పలువురు ప్రత్యామ్నాయంగా రోజువారీ కూలీ పనులకు వెళ్లే పరిస్థితికి నెలకొంది. హోటల్స్ ప్రభావం కిరాణా, ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ప్లాంట్లు, కూరగాయల వ్యాపారాలపై సైతం దీని ప్రభావం ఎక్కువగానే పడుతోంది.సగంపూటే నడిపిస్తున్నారు..పక్క ఫొటోలో కనిపిస్తున్న హోటల్ యజమాని పేరు బొబ్బిశెట్టి రాజశేఖర్. జనగామ పట్టణం రైల్వేస్టేషన్ రోడ్డులో ఎస్ఆర్ టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నాడు. నిత్యం తెల్లవారుజాము 6 గంటలకు తెరుచుకుని రాత్రి 11 గంటలకు నడిపేవారు. ఇందులో కుటుంబ సభ్యులతో పాటు ఆరుగురు ఇతర రాష్ట్రాలు, జిల్లా కేంద్రానికి చెందిన ఆరుగురు కార్మికులు పనిచేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో సగంపూట హోటల్ మాత్రమే నడిపిస్తున్నారు. దీంతో ముగ్గురు జార్ఖండ్కు చెందిన కార్మికులు వెళ్లిపోగా, ఉన్న వారికి సగం వేతనం మాత్రమే ఇస్తున్నారు. -
రైతులు ఇబ్బందులు పడొద్దు
జనగామ రూరల్: యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు నిర్వహణ ప్రక్రియ సజావుగా జరగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ, మార్కెట్, రవాణా, గ్రామీణాభివృద్ధి, కో–ఆపరేటివ్, తదితర శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాలకు వచ్చే ధాన్యం కొనుగోళ్లు పక్కాగా జరగాలన్నారు. ఏ రోజు వచ్చే ధాన్యం అదే రోజు కొనుగోలు చేసి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టార్పాలిన్లు, ధాన్యం శుద్ధి చేసే యంత్రాలు, గన్నీ సంచులు, వెయింగ్ మెషీన్లు తదితర పరికరాలు అన్నీ కొనుగోలు కేంద్రాల్లో సరిపడా అందుబాటులో ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ వసంత, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోనీ, డీఎం సీఎస్ హతీరాం, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. జనాభా లెక్కింపు ప్రక్రియపై అవగాహన ఉండాలి జనాభా లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జనగణన 2027 ఫేజ్ 1 గృహాల జాబితా, గృహ గణన నిర్వహణలో భాగంగా నూతనంగా ఎంపికై న టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్లకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఓ చినకోట్యా నాయక్, జేడీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టిదేవరుప్పుల: విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మంగళవారం మండలంలోని పెద్దమడ్డూర్ హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు, మధ్యాహ్న భోజన సరుకుల నిల్వ రిజిస్టర్లు, అకౌంట్ రికార్డులతోపాటు గదుల్లో ఉన్న సామగ్రిని పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ రోజు విద్యా ర్థుల కు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాల న్నారు. విద్యార్థులతో రాగి జావ ఎలా ఉంది? అని అడగ్గా విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశీలనలో హెచ్ఎం అశోక్, ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఇండక్షన్ స్టవ్
● గ్యాస్ కొరతతో భారీ డిమాండ్ ● డిస్ట్రిబ్యూటర్ల వద్ద నో స్టాక్ ● ఆర్డర్ ఇచ్చి 15 రోజులు గడుస్తున్నా దొరకట్లే ● 12 రోజులుగా సరఫరా నిలిచిన కమర్షియల్ సిలిండర్లుజనగామ: జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో గ్యాస్ మార్కెట్లో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో గ్యాస్ ధరలు, సరఫరాలో ఊహించని మార్పులు చోటుచేసుకోవడంతో జిల్లా ప్రజలు ముందస్తు జాగ్రత్తల పేరుతో గ్యాస్ బుకింగ్లను భారీగా పెంచుతున్నారు. సబ్సిడీ సిలిండర్లకు పెద్దగా కొరత లేకున్నా.. గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగులు పెరగడంతో డెలివరీలపై భారం ఎక్కువవుతోంది. జిల్లాలో 1.60లక్షల కనెక్షన్లు.. జిల్లాలో మొత్తం 12 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా సబ్సిడీ సిలిండర్ల సంఖ్య 1,60, 016గా ఉంది. పట్టణంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ప్రస్తుతం నాలుగు వేల పైచిలుకు బుకింగ్లు పెండింగ్లో ఉండగా, ఇతర మండలాల పరిధిలో ఒక్కో ఏజెన్సీకి 400 నుంచి 500 వరకు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. జిల్లాకు కమర్షియల్ సిలిండర్ల సరఫరా 12 రోజులుగా నిలిచిపోయినప్పటికీ, హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లలో ఇంకా కనిపించడం సందేహాలను రేకెత్తిస్తోంది. సరఫరా నిలిచిపోయిన పరిస్థితుల్లో ఈ సిలిండర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సబ్సిడీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసి పెద్ద సిలిండర్లలోకి మిషన్ల సాయంతో నింపుతున్నారన్న ప్రచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం పట్టణంలోని పలు హోటళ్లలో వంటకు కమర్షియల్ సిలిండర్లతో పాటు కట్టెల పొయ్యిలను కూడా వినియోగిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్ల కొరత, ధరల పెరుగుదల అన్నీ కలిసి జిల్లాలో ఇంధన పరిస్థితిపై ఊహించని ఒత్తిడిని పెంచుతున్నాయి. గృహ వినియోగ సబ్సిడీ సిలిండర్ల కొరత లేకున్నప్పటికీ, కొరత వస్తుందనే ఆందోళన, భయంతో ప్రజలు ముందస్తు చర్యలతో గ్యాస్ మార్కెట్ను మరింత అతలాకుతలం చేస్తోంది. -
ఇండక్షన్ స్టవ్ల కొరత నిజమే
గతంలో ఎలక్ట్రిక్ స్టవ్ల అమ్మకాలు చాలా తక్కువ. గత 15 రోజులుగా ఈ రకం పొయ్యిలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మా వద్ద ఉన్న స్టాక్ క్లోజ్ కాగా, ఆర్డర్ ఇచ్చి 12 రోజులు గడిచిపోతున్నా రావడం లేదు. స్ప్రింగ్ పొయ్యిల సరఫరా పూర్తిగా నిలిచి పోగా, 1500, 2000, 2500 వాట్స్ ఇండక్షన్ స్టవ్ల ధరలు మునుపటి కంటే భారీగా పెరిగాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా దొరకడం లేదు. –కందుకూరి నాగరాజు, వ్యాపారి, జనగామ బుకింగ్ పెండింగ్..సబ్సిడీ సిలిండర్(ఇళ్లలో ఉపయోగించే గ్యాస్) సప్లై యథావిధిగా ఉంది. కొరత వస్తుందనే భయంతో చాలా మంది ముందస్తు బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో ఒక్క జనగామ పట్టణంలోనే 4వేల బుకింగ్ పెండింగ్లో ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా మాత్రం 12 రోజుల క్రితమే నిలిచిపోగా, ఇళ్లలో ఉపయోగించే గ్యాస్ మాత్రం రెగ్యులర్గా వస్తోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. –కాశీనాథ్, గ్యాస్ ఏజెన్సీ మేనేజర్, జనగామ -
బోనస్ బకాయిలు వెంటనే చెల్లించాలి
జనగామ: వరి సేకరణలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అసెంబ్లీలో సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో రైతులకు చెల్లించాల్సిన బోనస్, బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించడంలో ఆలస్యంతో మార్కెట్ ధర క్వింటాల్ ధాన్యానికి రూ.1,600 నుంచి రూ.1,700 వరకు పడిపోయిందన్నారు. సీఎం ప్రకటించిన రూ.1800 ధర సరిపోదని, వాస్తవానికి రూ.2400 కాగా, దీనికి బోనస్ కలిపితే రూ.2900 వరకు రావాల్సి ఉందన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లను సకాలంలో ప్రారంభించాలని కోరారు. గత యాసంగి సీజన్కు సంబంధించిన రూ.12,800 కోట్ల బోనస్ బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని, ఆ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. బుగులు వెంకన్న హుండీ ఆదాయం రూ.4.66లక్షలుచిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలను సోమవారం కొడవటూరు దేవాలయ ఈఓ చిందం వంశీ ఆధ్వర్యంలో చైర్మన్ శ్రీధర్రావు, ఈఓ లక్ష్మిప్రసన్న సమక్షంలో లెక్కించారు. 75 రోజలకుగాను రూ. 4,66,496ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు రవీందర్శర్మ, రంగచార్యులు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, ధర్మకర్తలు గోలి రాజశేఖర్, ఎడ్ల యాదగిరి, గణగోని రమేశ్, దారం రాజన్బాబు, రత్నాకర్రెడ్డి ,రాజరాజేశ్వరి సమితీ సభ్యులు పాల్గొన్నారు. 33 కేవీ లైన్ల జీఐఎస్ డిజిటలైజేషన్ ప్రారంభంజనగామ: జిల్లాలోని విద్యుత్ శాఖ పరిధిలో ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ అండ్ ట్రాకింగ్ ప్రక్రియ వేగవంతంగా ప్రారంభమైందని ఎస్ఈ సంపత్ రెడ్డి తెలిపారు. సోమవారం ఎస్ఈ మాట్లాడుతూ.. 33 కేవీ లైన్లకు చెందిన 44 ఫీడర్లను డిజిటలైజేషన్లోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రతీ విద్యుత్ స్తంభం వారీగా పెట్రోలింగ్ నిర్వహించడం మరింత సులభమవుతుందని తెలిపారు. నిర్వహణ పనులు, ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాలు, గతంలో చోటుచేసుకున్న విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన వివరాలు వంటి కీలక సమాచారాన్ని రియల్టైమ్లో ట్రాక్ చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే ఆ ప్రాంతంలోని పోల్ నెంబర్ ఆధారంగా వెంటనే లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకొని తక్షణమే సిబ్బంది అక్కడికి చేరుకునే విధంగా వ్యవస్థ ఉపయోగపడుతుందని సంపత్రెడ్డి వివరించారు. జీఐఎస్ డిజిటలైజేషన్ వ్యవస్థతో ఫీడర్ల పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా మారి, స్పందనా వేగం పెరిగి, విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గే అవకాశముందని ఎస్ఈ చెప్పారు. రైతుల ఖాతాల్లోకి ‘భరోసా’ డబ్బులు జనగామ రూరల్: జిల్లాలో 2025–26 యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు మొత్తం (12) మండలాల్లోని (176) గ్రామాల పరిధిలో గల (1,79,936) మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు పేర్కొన్నారు. ఈ విడతలో మొత్తం 91,99,03,173 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా ఈ ప్రక్రియను ముగించామని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం సంబందించిన బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు. -
ప్రజాసమస్యలకే ప్రాధాన్యం
● త్వరితగతిన పరిష్కరించాలి ● గ్రీవెన్స్లో అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం ● 207 దరఖాస్తుల స్వీకరణజనగామ రూరల్: ఏ దిక్కు లేని అనాథను కరుణించాలని, తన పిల్లలతో అనాథాశ్రమంలో ఉంటున్నానని తనకు ఇందిరమ్మ ఇల్లు, వితంతు పెన్షన్ ఇప్పించాలని ఓ మహిళ, మొరం తరలింపుతో రోడ్డు దెబ్బతింటోందని ఓ వ్యక్తి, అల్లుడు తమ భూమిని ఆక్రమించాడని ఓ కుటుంబం..ఇలా పలు సమస్యలతో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 207 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, వివిధ శాఖల అధికారులు, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● కొడకండ్ల గ్రామానికి చెందిన బంగారు మల్లికార్జున్, తండ్రి సోమయ్య ఇంతవరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలను మంజూరు చేయలేదని వృద్ధాప్య పింఛన్తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ● చిల్పూరు మండలం లింగంపల్లికి చెందిన రమేశ్ తండ్రి వెంకటయ్య.. పేరున సర్వే నెం, 343లో 17 ఎకరాల 33 గుంటల భూమి ఉందని, అందులో నుంచి 15 ఎకరాల 39 గుంటల భూమిని ఇతరులకు అమ్మినట్లు, మిగతా భూమిని వారత్వం కింద తన పేరు మీద మార్చి పట్టా ఇప్పించాలని వినతి పత్రం అందించారు. ● బచ్చన్నపేట గ్రామానికి చెందిన బేతి మాధవి ఆమె భర్త మురళి మృతి చెందారని, తాను నిరుపేదనని కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నామని, తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంది. ● స్టేషన్ ఘన్పూర్ మండంలోని ఇప్పగూడెం దేవాదుల కాల్వవెంట ఉన్న మొరాన్ని అక్రమంగా జేసీబీలతో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారని దీంతో బీటీ రోడ్డు తెబ్బతింటోందని స్టేషన్ ఘన్పూర్కు చెందిన తోట రమేశ్ వినతి పత్రం అందించారు. తరలించిన మొరం పట్టణంలో ఓ ప్రాంతంలో డంప్ చేసి విక్రయిస్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ● తన పేరు మీద సర్వే నెంబర్ 535లో 2ఎకరాల 8 గుంటల భూమి ఉందని, తన అల్లుడు తనకు తెలువకుండా మాయమాటలు చెప్పి అక్రమంగా పట్టాచేసుకున్నాడని కొడకండ్ల మండలం పలుగుల తండాకు చెందిన జాటోతు దాలి విన తి పత్రం అందించారు. ఆ పట్టా రద్దుచేసి తన పేరున పట్టా చేసి ఆదుకోవాలని వేడుకుంది. -
మక్కలు కొనేదెప్పుడు?
జనగామ: జిల్లా రైతులు మూడు, నాలుగు రోజులుగా మొక్కజొన్నను మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ, జనగామ వ్యవసాయ మార్కెట్లో కేంద్రం ఏర్పాటు చేయడంలో జాప్యం చేస్తున్నారు. జిల్లాలో 31,500 ఎకరాల్లో సాగు జిల్లాలో 31,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరగగా, ప్రస్తుతం కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో రైతులు భారీగా మొక్కజొన్నలను అమ్ముకునేందుకు మార్కెట్కు తరలిస్తున్నారు. ప్రతీరోజు కనీసం వెయ్యి బస్తాలు చేరుతుండగా, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్వింటా మద్దతు ధర రూ.2400 మొక్కజొన్నకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400. అయితే ప్రైవేట్ వ్యాపారులు కేవలం రూ.1,700 నుంచి రూ.1800లు మాత్రమే ఆఫర్ చేస్తుండటంతో క్వింటాల్కు రూ.600 మేర రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డుకు జిల్లా నలుమూలల నుచి వచ్చిన రైతులు మక్కలను మద్దతు ధరకు అమ్ముకునేందుకు మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్లో నాలుగు రోజులుగా రైతుల పడిగాపులు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యం మద్దతు ధర రూ.2,400.. ప్రైవేటులో రూ.1,800ఒకటి రెండు రోజుల్లో.. జిల్లాలోని స్టేషన్ఘన్పూర్లో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. ఒకటి, రెండు రోజుల్లో జనగామ మార్కెట్లో కూడా సెంటర్ ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నాం. ముందుగా మార్కెట్ల పరిధిలో వీటిని ఏర్పాటు చేయబోతున్నాం. –రంజిత్రెడ్డి, డీఎం, మార్క్ఫెడ్ -
హెచ్జే దొర సేవలు చిరస్మరణీయం
● ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర స్టేషన్ఘన్పూర్: పోలీసుశాఖ డీజీపీగా హెచ్జే దొర చేసిన సేవలు చిరస్మరణీయమని ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్ర అన్నారు. ఘన్పూర్కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల రాష్ట్ర నాయకుడు, లిడ్క్యాప్ మాజీ మెంబర్ జోగు కుమారస్వామి ఆధ్వర్యంలో ఘన్పూర్లో సోమవారం హెచ్జే దొరకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిఽథిగా హాజరైన మనీషానెహ్ర తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీఐ జి.వేణు, ఎస్ఐలు వినయ్కుమార్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మొబైల్ ఫోన్లను అనుమతించొద్దు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రఘునాథపల్లి: పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్తో ఎవరినీ లోనికి అనుమతించవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్, సెయింట్ ఆల్ఫోన్సస్, సెయింట్ మేరీస్ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులను సరిపడా అందుబాటులో ఉంచాలని సూచించారు. సిట్టింగ్ స్క్వాడ్, ప్లయింగ్ స్క్వాడ్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ప్రహరీ సరిగా లేని చోట భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
పేదలందరికీ బీమా
లింగాలఘణపురం: రాష్ట్రంలోని పేదలందరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం దేశశంలోనే ఒక చరిత్ర అని, కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే పేదల సంక్షేమ ప్రభుత్వమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని రామచంద్రగూడెం, జీడికల్, గుమ్మడవెల్లి, పటేల్గూడెం గ్రామాల్లో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి 50 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, వారందరికీ ప్రభుత్వం బీమా కల్పిస్తూ బడ్జెట్ రూపొందించిందని అన్నారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మండలంలోని అన్నీ చెరువులను గోదావరి జలాలతో నింపుతున్నానని, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశానని అన్నారు. అంతకు ముందు రామచంద్రగూడెంలోని తాళ్లకుంటలో గోదావరి జలాలకు భూమిపూజ చేశారు. జీడికల్లో వీరాచల రామచంద్రునికి ప్రత్యేక పూజలు, గుమ్మడవెల్లిలో మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్రెడ్డి సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన వాటర్ప్లాంట్ను, పటేల్గూడెంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. మార్కెట్ వైస్ చైర్మన్, పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్, సర్పంచ్లు మల్లారెడ్డి, సుమలత, బుచ్చయ్య, రామకృష్ణ, దేవస్థాన చైర్మన్ మూర్తి, నాయకులు దిలీప్రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
జనగణనలో కచ్చితత్వం కీలకం
జనగామ రూరల్: జనగణన ప్రక్రియలో కచ్చితత్వం కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగణన 2027 ఫేజ్ 1 గృహాల జాబితా, గృహ గణన నిర్వహణలో భాగంగా నూతనంగా ఎంపికై న టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్లకు ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ హాజరై..నూతనంగా ఎంపికై న వారికి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగణన దేశ అభివృద్ధికి ముఖ్యమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ అని తెలిపారు. ప్రతి వివరాన్ని కచ్చితంగా నమోదు చేసే విధానాన్ని, అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాలని, డేటా సేకరణలో పారదర్శకతపై, ఇతర వివరాలపై ప్రతి అంశాన్ని నిశితంగా విని నేర్చుకోవాలని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో సీపీఓ చినకోట్యా నాయక్, శిక్షకులు రవి నాయక్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
గుమ్మడవెల్లిలో వడగళ్ల బీభత్సం
లింగాలఘణపురం: మండలంలోని గుమ్మడవెల్లిలో శనివారం రాత్రి వీచిన గాలిదుమారం, వడగళ్ల వానతో సుమారు 20 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దడిగ గట్టయ్యకు అనే రైతు తన రెండు ఎకరాలతో పాటు కౌలుకు తీసుకొని మరో పది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ఒకటి రెండు రోజుల్లో కోత కోసే దశలో ఉన్న వరి మొత్తం అంతా నేలరాలింది. దీంతో తీవ్ర మనోవేదనతో ఉన్న గట్టయ్య భార్య రేణుక ఆదివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించింది. స్పందించిన ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్న రేణుక కూతురు రక్షిత వివా హానికి తనవంతుగా పంట నష్టపరిహారంగా రూ.లక్ష సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఏఓను పంపిస్తానని చెప్పారు. కాగా గుమ్మడవెల్లి గ్రామం నుంచి కోమ్మాయిపల్లికి వెళ్లే రోడ్డులో సుమారు 20 ఎకరాల పరిధిలోనే తీవ్రమైన గాలిదుమారంతో వడగళ్ల వాన కురిసి నష్టం జరిగింది. -
రేపు అంగడి వేలం
బచ్చన్నపేట: మండల కేంద్రంలోని వారాంతపు అంగడిలో పలు హక్కులకు బహిరంగ వేలం పాటలను ఈనెల 24న (మంగళవారం) నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగారావు తెలిపారు. ఆదివారం గ్రామ పంచాయతీ ఈఓ అనిల్రాజ్తో కలిసి మాట్లాడారు. ఈ వేలం పాటల కాల వ్యవధి ఒక ఏడాది పాటు (2026–27 వరకు) ఉంటుందన్నారు. పశువుల రహదారి వేలానికి రూ. 60 వేల డిపాజిట్, తైబజారుకు రూ. 25 వేలు, డక్క ఫీజుల పాటకు రూ. 5వేల డిపాజిట్లను వేలం పాటలో పాల్గొనే వారు చేయాలన్నారు. ఎన్జీఓల శిక్షణకు జిల్లావాసి ఎంపికజనగామ: హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎన్జీఓల కోసం 3 రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి జిల్లా కేంద్రానికి చెందిన స్వచ్ఛ సామాజిక సేవా ఫౌండేషన్ ప్రతినిధి కర్రె రాజు ఎంపికయ్యారు. నేటి(సోమవారం) నుంచి 25 వరకు మూడు రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నారు. లెర్నింగ్ ఫ్రం సక్సెస్ ఆడాప్టివ్ మేనేజ్మెంట్ ఇన్ ఎన్జీఓ పేరుతో జరగనున్న ఈ శిక్షణకు జిల్లాల రాజు పాల్గొననున్నారు. భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ బోనాలుజనగామ రూరల్: మండలంలోని ఎర్రకుంటతండాలో దుర్గమ్మ, రేణుక ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవార్ల బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు దేవతలకు పూజలు నిర్వహించారు. సర్పంచ్ రమావత్ శ్రీకాంత్ ఏర్పాట్లు చేశారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ గ్రీవెన్స్జనగామ: వినియోగదారుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడంలో విద్యుత్ ప్రజావాణి కీలక పాత్ర పోషిస్తోందని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా స్వీకరించి, వేగంగా పరిష్కరించడమే ప్రజావాణి కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం క్రమం తప్పకుండా నిర్వహించే ఈ కార్యక్రమం, ఫీల్డ్ నుంచి సర్కిల్ స్థాయి వరకు అధికారులను వినియోగదారుల సమస్యలపై మరింత అప్రమత్తం చేస్తోందని తెలిపారు. జిల్లా సర్కిల్, డివిజన్, ఈఆర్ఓ సబ్డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో నేటి (సోమవారం)ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే గ్రీవెన్స్లో నమోదు చేసుకొని వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఈ కోరారు. -
మబ్బులతో గుబులు
చల్లబడుతున్న వాతావరణం..రైతన్నకు టెన్షన్జనగామ: యాసంగి సీజన్ కీలక దశలో ఎండలు, మేఘాల దోబూచులాటతో రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఏటా మార్చి, ఏప్రిల్ వచ్చినప్పుడల్లా అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులు రైతులను ఆర్థికంగా నష్టపోయేలా చేస్తుండగా, ఈసారి కూడా అదే భయం తిరిగి మొదలైంది. ఉదయం మండే ఎండ లు, మధ్యాహ్నం తర్వాత ఆకాశాన్ని కమ్మేసే మబ్బులు ఇలా మారే వాతావరణ పరిస్థితులు వ్యవసాయ క్షేత్రాల్లో ఆందోళన పెంచుతున్నాయి. రెండు లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలు పొట్ట దశలో ఉండగా.. ఇంకో 15 రోజులు రైతులకు పరీక్ష సమయం. యాసంగి పంటలు పొట్ట దశలో ఉన్న సమయంలో ఆకాశం మబ్బులతో హడలెత్తిస్తోంది. జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండటం రైతుల కలవరపాటుకు గురవుతున్నారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి, ఆరుగాలం చెమటోడ్చి పండిస్తున్న పంటల భవితవ్యంపై దేవుడిపై భారం వేస్తున్నారు. యాసంగి సీజన్న్లో జిల్లా వ్యాప్తంగా వరి 2,00,250 ఎకరాలు, మొక్కజొన్న 31,500 ఎకరాలు, వేరుశనగ 1,050 ఎకరాలు, మిర ప 230 ఎకరాలు, పొగాకు 250 ఎకరాలు, ఇతర పంటలు 500 ఎకరాలుగా వ్యవసాయాధికారులు నమోదు చేశారు. ముఖ్యంగా వరి పంట పెద్ద ఎత్తున సాగు చేయగా, వాతావరణ మార్పులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏప్రిల్ మొదటి వారం తర్వాత వరి కోతలు ప్రారంభం కానున్నాయి. కానీ దానికి ముందు జరిగే ఈ వాతావరణ మార్పులు ముఖ్యమైన దశలో పంటకు ముప్పుగా మారే అవకాశం ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉదయానికి మండే ఎండలతో పంట బాగా నిలబడుతుందని అనుకుంటే, మధ్యాహ్నానికల్లా మబ్బులు కమ్మేసి జల్లులు పడటం రైతుల ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితిని తెచ్చిపెడుతోంది. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు వస్తుండడంతో పంట నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా ప్రతి యాసంగి సీజన్లో రైతులను వేధించే అకాల వర్షాలు, వడగల్లులు ఈసారి మరలా పునరావృతం కాకూడదని రైతులు భయపడుతున్నారు. వచ్చే 15 రోజులు ఎలా ఉంటాయన్న ఆందోళనతో పంటలను చుట్టూ తిరుగుతూ పరిస్థితిని గమనిస్తున్నారు. యాసంగి పంటలు చివరి దశలోకి చేరిన కీలక దశలో రైతులు వరుణుడిపై భారం వేసి వేడుకుంటున్నారు.– కొంతం కుమారస్వామి, రైతు, తమ్మడపల్లి(జి) పగలు ఎండలు..సాయంత్రానికి చీకట్లు అన్నదాతల్లో వణుకు పుట్టిస్తున్న వరణుడు మార్చి, ఏప్రిల్లో వెంటాడుతున్న అకాల వర్షాలు, వడగళ్లు జిల్లాలో 2లక్షలకు పైగా పంటల సాగువాతావరణంలో మార్పులు, అకాల వర్షాల భయంతో కంటిమీద కునుకు లేకుండా పోతోంది. లక్షన్నర రూపాయల పెట్టుబడులు పెట్టి ఏడు ఎకరాల్లో వరి సాగు చేశాను. మరో 10 రోజులు గడిస్తే పంట చేతికందే దశలో ఉంది. కాయ కష్టం చేసి పంటను కాపాడుకుంటే తీరా చేతికందే దశలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటూ అకాల వర్షాల భయం నెలకొంది. గోపరాజుల అనిల్, రైతు, కొడకండ్ల -
ఆరు గ్యారంటీల అమలులో విఫలం
జనగామ రూరల్: ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అద్యక్షుడు సౌడ రమేష్ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని, గృహిణులకు రూ.2,500 ఇస్తామని మోసం చేశారన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సోమవారం చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కేవీఎల్ఎన్ రెడ్డి, ఉడుగుల రమేశ్, డాక్టర్ భిక్షపతి, తోకల ఉమారాణి, డాక్టర్ శశిధర్ గుప్తా, ఆవుల శ్రీనివాస్, పూర్ణచంద్రరావు, పెద్దోజు జగదీష్, శివ, మురళి నాగరాజు, గంధం రాములు తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతా
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: జిల్లాలో పెండింగ్లో ఉన్న దేవాదుల ఇరిగేషన్ పనులపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్లో ఇరిగేషన్కు సంబంధించి పెండింగ్లో ఉన్న విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. దేవాదుల వందశాతం కంప్లీట్ కోసం రూ.15 వేల కోట్లు అవసరమన్నారు. మల్లన్న సాగర్ నుంచి అన్ని చెరువులను నింపాల్సి అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు 80శాతం పూర్తి కాగా, మరో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే పిల్ల కాలువలను బాగు చేసుకుంటామన్నారు. ఈ విషయమై గతంలోనే సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డికి వినతి చేయగా, అసెంబ్లీలో మరోసారి ప్రస్తావిస్తామన్నారు. గ్యాస్ తంటాలు..హోటళ్ల బంద్స్టేషన్ఘన్పూర్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని పలు హోటళ్లు, మెస్లు, బిర్యానీసెంటర్లు, బేకరీలను నిర్వాహకులు బంద్ చేశారు. రెండురోజులుగా డివిజన్ కేంద్రంలోని పలు హోటళ్లు మూసి ఉండగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలు పనులపై ఘన్పూర్కు వచ్చిన వారు హోటళ్లు, మెస్లలో మధ్యాహ్న భోజనం, టిఫిన్లు చేసేవారు. అయితే ఇటీవల ఏర్పడిన గ్యాస్కొరతతో హోటళ్లు, మెస్లు బంద్ చేశారు. గ్యాస్ సకాలంలో అందక, కట్టెలపొయ్యిలపై వంటలు చేయలేక పలువురు చేసేదేమి లేక హోటళ్లను బంద్ చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. -
రాములోరి కల్యాణం వైభవంగా నిర్వహించాలి
● వల్మిడి జాతరపై పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సమీక్ష పాలకుర్తి టౌన్: వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 27న శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్య యశస్వినిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆది వారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ఆలయ నూతన కమిటీ సభ్యులతో శ్రీరామనవమి ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ పరిసరాల్లో శుభ్రత, తాగునీరు, విద్యుత్ దీపాలు, క్యూ, పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చూడాలననారు. అనంతరం శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో మార్కెట్ చైర్పర్సన్ మంజుల, తొర్రూరు మార్కెట్ చై ర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి, ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పాలేపు సత్తయ్య, సర్పంచ్ నీరటి లక్ష్మీ చంద్రయ్య, రా పాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, ఎర్రబెల్లి రాఘవరావు, చెరుకు ప్రభాకర్, తండా వీరస్వామి, ప్రజాప్రదినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. -
దళారులకు అమ్ముకున్న..
నేను 2 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశా. గతంలో కంటే ఈసారి దిగుబడి కూడా సరిగ్గా రాలేదు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు రూ.1700కే అమ్ముకున్న. వాళ్లు కూడా 20 రోజుల తర్వాత డబ్బులు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే క్వింటాలుకు రూ.600 నుంచి రూ.700 ఎక్కువగా వచ్చేవి. కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోవాల్సి వచ్చింది. – నకీర్త సంపత్, రైతు, పీచర, వేలేరు మండలం ● -
మక్కలకు లేదు ‘మద్దతు’
● పరిశీలనలోనే కేంద్రాల ఏర్పాటు.. ప్రారంభంకాని కొనుగోళ్లు ● కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400.. వ్యాపారుల ధర రూ.1,950 ● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 3.43 లక్షల ఎకరాల్లో సాగు ● అసెంబ్లీలో ఈనెల 18న చర్చ.. మంత్రి ఆదేశించినా పురోగతి లేదు ● మొక్కజొన్న రైతుకు తప్పని దళారుల బెడదఈ ఫొటోలో ఉన్నది హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు నకీర్త మధు. మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల కురిసిన వడగళ్లకు కొంత మేరకు దెబ్బతింది. మిగిలిన పెరడు కోసి కంకి కొట్టాడు. అమ్మేందుకు మక్కలను కల్లం వద్ద ఆరబోశాడు. బయట అమ్ముకుందామంటే ధర తక్కువ. కొనుగోలు కేంద్రాలు అగొచ్చే ఇగొచ్చే అని అధికారులు అంటుంటే ఐదారు రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ, ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితి ఒక్క నకీర్త మధుదే కాదు.. అనేక మంది మక్క రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా మొక్కజొన్న రైతులకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకడం లేదు. యాసంగి మక్కల కొనుగోళ్ల కోసం ప్రతీసారి మార్చి మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే మార్క్ఫెడ్, ప్యాక్స్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఈసారి వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. ఎక్కడా కూడా మార్క్ఫెడ్ ఇంకా కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో సిండికేట్గా మారిన కొందరు ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్లో తమకు తోచిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.2,400 కాగా.. కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,950 చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఎంఎస్పీతో పోలిస్తే క్వింటాలుకు రూ.500 నుంచి రూ.650 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు.. ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయశాఖ అంచనాలను మించి రైతులు 88 శాతం అధికంగా సాగు చేశారు. వాస్తవానికి 2025–26 యాసంగిలో మొత్తం సాగు అంచనా 68,67,407 ఎకరాలు కాగా, 81,20,332 (118 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. ఇందులో మొక్కజొన్న సాగు అంచనా 6,45,574 ఎకరాలకు 12,13,914 (188 శాతం) ఎకరాల్లో వేశారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్లో 3,43,732 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న వేశారు. సాగైన మొత్తం విస్తీర్ణంలో సగటున ఎకరానికి 18 క్వింటాళ్లు వస్తే 6,18,717 టన్నులు.. 25 క్వింటాళ్లు వస్తే 8,59,330 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 26 కేంద్రాలను ప్రతిపాదించిన మార్క్ఫెడ్, వ్యవసాయశాఖలు ఈసారి ఇంకా కొనుగోలు కేంద్రాల పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో రైతులు అవసరాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 18న మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో చర్చకు తేగా.. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఐదు రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో పురోగతి లేదు. -
పెట్టుబడి సాయానికి వేళాయె
జనగామ: యాసంగి సీజన్ను పూర్తి చేసుకున్న రైతులకు పెట్టుబడి సాయం నేటి (ఆదివారం) నుంచి బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి రైతుభరోసా పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సందర్శన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని విడుదల చేయనున్నారు. జిల్లాలో 2 లక్షల మంది రైతులు జిల్లాలో 2,02,044 మంది రైతులు రైతు భరోసా లబ్ధిదారులుగా నమోదు కాగా, ప్రభుత్వం మొదటి విడతలో ఎకరా చొప్పున మొత్తం 1,98,072 మంది రైతులకు భారీ మొత్తాన్ని కేటాయించింది. నిబంధనల ప్రకారం ఒక గుంట నుంచి ఎకరం వరకు సాగు భూములకు పెట్టుబడి సాయాన్ని జమ చేయనుండగా, విడతల వారీగా అర్హత కలిగిన ప్రతీ రైతులకు అందించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు రూ.12 వేల పెట్టుబడి సాయం అందిస్తోంది. దీంతో రైతులకు యాసంగి పెట్టుబడిలో కొంత ఆర్థిక వెసులుబాటు దొరకనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సందర్శన, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలి రావాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం కోరారు. నర్మెట్టలో వ్యవసాయ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన వివిధ ఎగ్జిబిషన్, స్టాల్స్ను మూడు రోజులుగా జిల్లాలోని ఆయా ప్రాంతాల రైతులు వెళ్లి సందర్శిస్తున్నారన్నారు. నేడు సీఎం సమక్షంలో రైతుభరోసా నిధుల విడుదల చేయనున్న సందర్భంగా జిల్లా నుంచి రైతులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని 12 మండలాల నుంచి 39 ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో రైతులు నర్మెట్టకు వెళ్లనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో జిల్లాలోని 1,98,072 మంది రైతులకు ఎకరం వరకు రైతుభరోసా నిధులు జమకానున్నట్లు చెప్పారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులతో పాటు మహిళా, యువ, అభ్యుదయ రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 2,02,044 మంది రైతులు మొత్తం రూ. 242.12 కోట్లు -
ఫైల్..ఆన్లైన్!
జనగామ: జిల్లా పరిపాలనలో నూతన సాంకేతికతకు నాంది పలుకుతూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ–ఆఫీస్ సేవలు ప్రారంభించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన డిజిటల్ వ్యవస్థ, ఫైళ్ల ప్రాసెసింగ్ను పూర్తిగా మార్చివేయనున్నారు. పరిపాలనలో వేగం జిల్లాలో పేపర్ ఆధారిత ఫైల్ వ్యవస్థను క్రమంగా పూర్తిగా తొలగించి, పారదర్శకతను పెంచే దిశగా ఈ–ఆఫీస్ కీలకంగా పనిచేస్తుంది. ఆన్లైన్ ఫైల్ మేనేజ్మెంట్ వల్ల ఒక ఫైల్ ఎక్కడ ఉంది.. ఎంతసేపు పెండింగ్లో ఉంది.. ఏ దశలో ఉందన్నది సమయానుకూలంగా చూసుకునే వీలు కలుగుతుంది. దీనివల్ల సేవల వేగం గణనీయంగా పెరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి జాప్యానికి చెక్ పడుతుంది. అన్ని శాఖల్లో ఇదే తరహా డిజిటల్ వర్క్ వ్యవస్థను అమలు చేసే విధంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఫైల్ ప్రాసెసింగ్లో విప్లవాత్మక మార్పు ఈ–ఆఫీస్ ద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య ఫైళ్ల తరలింపు పూర్తిగా డిజిటల్ అవుతుంది. ఫైళ్లను భౌతికంగా ఒక శాఖ నుంచి మరో శాఖకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అలాగే ఫైల్ స్థితిపై పూర్తి స్పష్టత రానుండగా, విభాగాల మధ్య సమన్వయం, వేగవంతం, అధికారుల పనితీరుపై పర్యవేక్షణ సులభతరమవుతుంది. అనవసర ఆలస్యం కాకుండా నిరంతరం కలెక్టర్ పర్యవేక్షణ చేసేందుకు ఈ –ఆఫీసు సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సిబ్బందికి డిజిటల్ నైపుణ్యంపై శిక్షణ ఈ–ఆఫీస్ అన్నది కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు.. ఇది ఒక నూతన పరిపాలనా సంస్కృతి. ప్రతీ అధికారి, సిబ్బంది దీనిపై పూర్తి అవగాహనతో ముందుకు రావాల్సి ఉంటుంది. అందుకోసం శిక్షణా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించేలా కలెక్టర్ మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి శాఖ 100 శాతం డిజిటల్గా పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పౌర సేవలపై ప్రత్యక్ష ప్రభావం ఈ సేవల ద్వారా రెవెన్యూ, భూమి, ధ్రువపత్రాలు, అనుమతులు వంటి సేవలు వేగవంతమవుతాయి. ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్తో ఫిర్యాదులు తగ్గనుండగా, నిర్ణయాలు త్వరగా తీసుకునే అవకాశం పెరుగుతుంది. ఇదిలా ఉండగా ప్రభుత్వానికి పేపర్, ఇతర మెటీరియల్ ఖర్చుల ఆదా అవుతాయి. ఏ ఫైల్కై నా యూనిక్ ఐడీ ద్వారా ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. జిల్లాలో ఈ–ఆఫీసు సేవలకు కలెక్టర్ శ్రీకారం పేపర్లెస్ పరిపాలన దిశగా కీలక అడుగు సేవలు వేగవంతం..పారదర్శకత పెంపు లక్ష్యం రెవెన్యూ, భూ సేవల్లో వేగవంతమైన పరిష్కారం ప్రజా సేవల్లో ఆలస్యానికి అడ్డుకట్ట ఈ –ఆఫీసుపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణప్రతీ శాఖలో అమలు చేయాలి ఈ–ఆఫీస్ సేవలను జిల్లాలో ప్రతీ శాఖ అనుసరించాలి. పేపర్లెస్, వేగవంతమైన, ప్రజాపరిపాలన అందించాలనేదే మా లక్ష్యం. పనితీరులో జవాబుదారీతనాన్ని పెంచే విధంగా ఈ–ఆఫీసు సేవలు ఉంటాయి. ఫైళ్ల ప్రాసెసింగ్ వేగవంతమవుతుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతీ శాఖలో ఈ విధానం అమలు చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఈ–ఆఫీసు సేవలపై అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఫైళ్ల నిల్వ, ట్రాకింగ్ సులభతరమవుతుంది. జిల్లా పరిపాలనలో ఆధునికతకు నాంది పలికాం. ప్రతీ ఫైల్ ఆన్లైన్లో రిజిస్టర్ అవుతుంది. ఏ ఫైల్ ఎక్కడ ఉందో క్షణాల్లో తెలుసుకునే వీలు ఉంటుంది. శాఖల మధ్య సమన్వయంతో పాటు సమయం ఆదా అవుతుంది. – సందీప్ కుమార్ ఝా, కలెక్టర్ -
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.ఉమ్మడి జిల్లాలో కేటాయింపులు ఇలా.. ● గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్మెంట్కు రూ.5 కోట్లు ● జేసీఆర్ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు ● రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు ● మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు ● వరంగల్లోని రీజినల్ సైన్స్ సెంటర్కు రూ. 30 లక్షలు ● వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు ● మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ● ములుగులోని ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) రూ. 93.22 కోట్లు ● కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు ● కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు ● వరంగల్, కరీంనగర్ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు ● జనగామలో ప్రభుత్వ కోకోన్ మార్కెట్ నిర్మాణానికి రూ.2.53 కోట్లు -
అవీ, ఇవీ, అన్నీ..
● వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది. ● ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ● ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు. ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి. ● గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది. బడ్జెట్పై భిన్నాభిప్రాయాలు వివిధ వర్గాల మనోగతం -
ప్రభుత్వ హాస్టళ్లలో అదనపు కలెక్టర్ తనిఖీలు
జనగామ రూరల్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు మెనూ ఉండాలని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పసరమడ్ల గ్రామంలోని ఎస్టీ బాలుర హాస్టల్ను, పెంబర్తిలోని రెసిడెన్షియల్ స్కూల్, మహిళా డిగ్రీ కళాశాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్, వార్డెన్లకు భోజన తయారీ, హాస్టల్ నిర్వహణపై పలు సూచనలను చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహిపాల్రెడ్డి, ఎంజేపీ ప్రిన్సిపాల్ అనిత పాల్గొన్నారు. ఎస్సీ హాస్టల్లో.. బచ్చన్నపేట: మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ను జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ తనిఖీ చేశారు. కిచెన్, స్టాక్ రిజిస్టర్లు రైస్, పప్పు దినుసులు, ఇతర వంటసరుకులు, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇంద్రవళ్లి హుస్సేన్, ఆర్ఐలు వంశీకృష్ణ, మునవర్, జీపీఓ సూర్య పలువురు పాల్గొన్నారు. -
నేడు రంజాన్
జనగామ: ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ పండుగ నేపథ్యంలో జిల్లాలో మజీద్, ఈద్గాల వద్ద ఏర్పాట్లు చేశారు. నేడు(శనివారం) రంజాన్ పండుగ జరుపుకోనున్నారు. జనగామ, స్టేషన్ఘన్ పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో మజీదులు, ఈద్గాలు విద్యుదీపాలతో అలంకరించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దు స్టేషన్ఘన్పూర్: హోటళ్లు, దాబాలు, మెస్లలో ఎలాంటి డొమెస్టిక్ సిలిండర్లను వినియోగించవద్దని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా, సీఐ జి.వేణు అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ హోటళ్లు, మెస్లు, దాబాలకు సంబంధించిన వ్యాపారులు, యజమానులకు స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా, సీఐ వేణు మాట్లాడారు.. ప్రస్తుతం గ్యాస్ కొరత ఉన్న కారణంగా హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తప్పవన్నారు. కాగా, వ్యాపార నిమిత్తం వంటగ్యాస్ సిలిండర్లను సకాలంలో సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్నకు హోటళ్ల నిర్వాహకులు వినతిపత్రం అందించారు. 23 నుంచి మక్కల కొనుగోళ్లు స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ మార్కెట్లో ఈనెల 23న మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు మార్క్ఫెడ్ డీఎం ఎడ్ల రంజిత్రెడ్డి, ఏంఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి తెలిపారు. మక్కల కొనుగోలు కేంద్రాలు లేక మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇటీవల అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రస్తావించిన నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు. ఈ మేరకు మార్క్ఫెడ్ డీఎం రంజిత్రెడ్డి ఏఎంసీ చైర్పర్సన్తో కలిసి స్థానిక వ్యవసాయ మార్కెట్ను పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కుమారస్వామి, సంతోష్ పాల్గొన్నారు. -
చదువులో రాజీపడొద్దు
● లక్ష్యాన్ని చేరేవరకు కృషి చేయాలి.. ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ: ‘చదువులో ఎప్పుడూ రాజీపడొద్దు.. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆపకుండా కృషి చేయాలి’ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విద్యార్థులకు సందేశం అందించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన అకస్మికంగా పరిశీలించారు. పాఠశాల ప్రాంగణం, వసతి గృహాలు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను స్వయంగా పరిశీలించి, లోపాలుంటే వెంటనే సరిచేయాలని అధికారులకు ఆదేశించారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, హాజరు రిజిస్టర్లు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి విద్యార్థుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. టీచర్గా మారిన కలెక్టర్.. కలెక్టర్ స్వయంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. 5 నుంచి 10వ తరగతి వరకు బోధన విధానం, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ వంటి విషయాల్లో విద్యార్థుల ప్రగతిని పరిశీలించి, 9వ తరగతి విద్యార్థులకు గణితంలోని మౌలిక అంశాలపై సులభంగా అర్థమయ్యే పద్ధతిలో బోధించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ మీరు నిర్ణయించుకున్న లక్ష్యం ఎలాంటిదైనా, క్రమశిక్షణ, కష్టపడి చదవడం, దృఢ సంకల్పం ఉంటే ఎవరూ ఆపలేరన్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశమై బోధనలో నాణ్యత పెంచాల్సిన అవసరాన్ని కలెక్టర్ ప్రస్తావించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్ర బడ్జెట్ 2026–27
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి నిరాశే ఎదురైంది. శాసనసభలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ప్రగతిపద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాఖల వారీగా నిధులు కేటాయించినప్పటికీ వరంగల్ పేరుతో ప్రత్యేకంగా ప్రకటించిన పథకాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైన ఈ బడ్జెట్పై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పెద్దగా ప్రచారం చేసిన టెక్స్టైల్ పార్కు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు కేవలం కొనసాగింపు నిధులే కేటాయించగా.. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు పూర్తిగా కనిపించలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ బడ్జెట్లో కొత్తగా మెగా ప్రాజెక్టు ఒక్కటి కూడా ప్రకటించకపోవడం.. ప్రత్యక్ష కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం యూనిట్గా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, రైతు, కార్మికవర్గాలకు ప్రయోజనం కలగనుంది. కాగా, ఈ బడ్జెట్లో వివిధ రంగాలకు జరిగిన కేటాయింపుల ద్వారా ఉమ్మడి వరంగల్కు రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు పరోక్షంగా లాభం చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు కేటాయింపుల్లో ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం.. ఆరు గ్యారంటీలకు ఆదరణ సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళా సంక్షేమానికి పెద్దపీట -
శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం
జనగామ: జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు గురువారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. దేవాలయాలు భక్తులతో కళకళలాడగా, వేద మంత్రాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో మార్మోగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ సీతారామచంద్ర, లక్ష్మణ, ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుతో మండపాలకు తీసుకొచ్చారు. అనంతరం విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచనం, అఖండ దీపారాధన, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, ధ్వజారణ కార్యక్రమాలు ఘనంగా నిర్వ హించారు. వాడవాడలా పట్టణంలోని 27వ వార్డు పాత బీటుబజారు శ్రీరామనవమి పందిరి వద్ద గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ ఉత్సవాలు ఈసారి మరింత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, డీసీపీ రాజమహేంద్రనాయక్ పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. హెడ్పోస్టాఫీసు ఆవరణలోని శ్రీ సంతోషీమాత ఆలయంలో ప్రధాన పూజారి శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో కౌన్సిలర్ చెంచారపు కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు. వసంత నవరాత్రోత్సవాలు షురూహన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీపరాభవ నామ సంవత్సరం చైత్రమాసం పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి నిర్మాల్య సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. -
స్కూళ్లకు టాస్క్ఫోర్స్
● ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు ● హాజరు, ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం పరిశీలన ● 12 మండలాలు..ఆరుగురితో ప్రత్యేక టీంలు ఏర్పాటు ● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాటాస్క్ఫోర్స్ టీమ్లు విద్యాసంస్థలను పరిశీలించాల్సి ఉంటుంది. సిబ్బంది హాజరు రిజిస్టర్ల పరిశీలన, ఆమోదించిన డైట్ చార్ట్ అమలు, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, పరిమాణం, పరిశుభ్రత, స్టాక్ రిజిస్టర్లు (ధాన్యాలు, సరుకులు మొదలైనవి) వంటశాల పరిస్థితులు, నిల్వ విధానాలు ప్రాంగణ పరిశుభ్రత, మరుగుదొడ్లు, తాగునీటి ఏర్పాట్లు, పాఠశాల, హాస్టల్ నిర్వహణ, క్రమశిక్షణ వంటి పర్యవేక్షణ చేయాలి. -
పిచ్చుకలు.. ప్రకృతి నేస్తాలు!
తగ్గిపోవడానికి కారణాలెన్నో.. పిచ్చుకల సంతతి తగ్గిపోవడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్తు,పెట్రోల్ వంటివి వినియోగం, సెల్టవర్ల కారణంగా పెరుగుతున్న రేడియేషన్, పట్టణీకరణ పేరుతో ఎక్కడికక్కడ సిమెంటు ఇళ్ల నిర్మాణాలు, కనీసం ఇవి గూడు పెట్టుకునే ఆవాసాలు లేకపోవడం, వ్యవసాయంలో పురుగు మందులు, క్రిమి సంహారక మందుల వినియోగం బాగా పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఖిలా వరంగల్: జీవ పరిణామ క్రమంలో ఉద్భవించిన అద్భుత జంతుజాలమే పక్షులు.. ఈ సంపద ప్రకృతి వరప్రసాదం. అందులో పిచ్చుకలు.. ప్రకృతికి అందం, మానవాళికి జీవవైవిధ్యంతోపాటు ఆనందాన్ని అందిస్తాయి. ఒకప్పుడు ఉదయం లేవగానే నగర, పట్టణ,గ్రామాల్లో ఎక్కడ చూసినా పిచ్చుకలు కనిపించేవి. ఇళ్లల్లోకి వచ్చి కిచకిచమంటూ పలకరించేవి. చప్పుడు చేయగానే తుర్రుమంటూ ఎగిరిపోతుండేవి. కాలక్రమంలో ఈబుజ్జి పక్షులు మన జీవితాల నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను సంరక్షించడంతో పాటు వాటి ప్రాఽధాన్యం మానవాళికి తెలియజేయడం కోసం ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిచ్చుకలతో మానవాళి మనుగడ.. చూసేందుకు చిన్నవిగా ఉండే పిచ్చుకలు మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పంటలను ఆశించే వివిధ కీటకాలను తినటం ద్వారా తెగుళ్లు రాకుండా పరోక్షంగా మేలు చేస్తాయి. వివిధ పంటల్లో పరపరాగ సంపర్కం జరిగేలా చేసి దిగుబడులు పెంచుతాయి. నేలను సారవంతం చేస్తూ భూమిలో మొక్కలు మొలకెత్తేందుకు దోహదం చేస్తాయి. మనమేమి చేయాలంటే.. అవగాహన ఉన్న కొందరు గ్రామీణ ప్రాంత ప్రజలు,రైతులు తమ పంట పొలాల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా టీ ఆకారంలో కర్రలను ఉంచడం ద్వారా వాటిపై పక్షులు వాలుతుంటాయి. ● పొలం గట్లపై మోదుగు, చీమ చింత, మల్బరీ, నేరేడు వంటి పండ్ల చెట్లను పెంచడం ద్వారా పక్షులు పంట పొలాలకు దగ్గరలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి ● నగరాల్లో ప్రత్యేక గూళ్లు లభ్యమవుతున్నాయి. ఇంటి ఫోర్టికో వద్ద, పరిసరాల్లో ఆ గూళ్లను ఏర్పాటుచేసి అక్కడక్కడ డబ్బాల్లో ధాన్యం గింజలు, తాగునీరు అందుబాటులో ఉంచాలి. గూళ్ల పంపిణీతో పిచ్చుకల పరిరక్షణ..హసన్పర్తి: అంతరించిపోతున్న పిచ్చుకలను పరిరక్షించేందుకు నడుం కట్టారు హసన్పర్తికి చెందిన మహర్షి గోశాల నిర్వాహకులు. కొన్నేళ్లుగా పిచ్చుక గూళ్లను పంపిణీ చేస్తున్నారు. పిచ్చుకల కడుపు నింపేందుకు వరి గొలుసులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పిచ్చుకలతో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని, ఎవరికీ గూళ్లు కావాలన్నా ఉచితంగా అందిస్తామని మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు ఎస్.రమేశ్ చెబుతున్నారు. పక్షులను రక్షిస్తే మనకు మేలు చేస్తాయని అంటున్నారు. తెగుళ్లు నివారణ కోసం విచ్చలవిడిగా క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులతోపాటు పిచ్చుకల మనుగడకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. రైతు నేస్తాలుగా వీటిని పరిగణించి వాటికి ప్రత్యేకంగా ఆవాసాలు కల్పించాలి. పిచ్చుకల దినోత్సవాలను నిర్వహించడం ద్వారా ఈచిన్న పక్షులను మన జీవితాల్లోకి తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగాలి. – డాక్టర్ అరుణ్జ్యోతి, కేవీకే శాస్త్రవేత్త మానవ జాతి మనుగడతో ముడిపడి ఉన్న పిచ్చుకల సంరక్షణ బాధ్యతగా భావించాలి. అందరూ తమ ఇళ్ల ముందు మొక్కలు నాటి, ఇంటి పరిసరాల్లో పిచ్చుకలు నివసించడానికి వీలుగా చెక్కతో తయారు చేసిన డబ్బాలను అమర్చాలి. వాటిలో ధాన్యం, నీళ్లు అందించాలి. పిచ్చుకలు ఇళ్లల్లో నివసిస్తే ఆ ఇంటికి శుభ సూచకంగా భావిస్తారు. – గాదె స్వరూప్రెడ్డి పక్షుల ప్రేమికుడు, హన్మకొండ ● ఆహ్లాదాన్ని పంచే అతి చిన్న పక్షులు రక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా జనగామ రూరల్: రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సూచనల మేరకు జనగామ మండలం రైతులను సిద్దిపేట జిల్లాలోని నర్మెట గ్రామంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమానికి మండలం నుంచి ఆయిల్పామ్ పండించే 51 మంది రైతులను కలెక్టరేట్ నుంచి బస్సులో తరలివెళ్లారు. కార్యక్రమంలో రూటు ఆఫీసర్లుగా జనగామ మండల ఏఈఓలు గిరి, రాజు, అనిల్ కుమార్ పాల్గొన్నారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్య● వరంగల్ ఎంపీ కడియం కావ్య స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం రూపొందించిన బ్రౌచర్లను హన్మకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. 2026–27 సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సులలో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరి తమ భవిష్యత్కు బలమైన పునాది వేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బత్తిని చంద్రమౌళి, అధ్యాపకులు నాగరాజు, సుమలత, అఖిల తదితరులు పాల్గొన్నారు. -
విద్య, వైద్య రంగాలతో సమాజ అభివృద్ధి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాదేవరుప్పుల: విద్య, వైద్య రంగాల పురోగతితోనే సమాజ అభివృద్ధి ముడిపడి ఉందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం మండల కేంధ్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దేవరుప్పుల హైస్కూల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్వహణ స్థితిగతులు పరిశీలించి పలు సూచనలు చేశారు. రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వల్మిడి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయండిజనగామ: పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టరేట్ మినీ కాన్ఫెరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వామివారి బ్రహ్మోత్సవాల కోసం ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ వెంకన్న, ఏసీపీ నర్సయ్య, పలువురు అధికారులు ఉన్నారు. రైతు మహోత్సవంలో పాల్గొనాలి సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మహోత్సవంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానవన, ఆయిల్ ఫెడ్, అనుబంధ శాఖలు, ఆర్టీసీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోని, మార్కెటింగ్, ఉద్యనవన తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే శ్రీవిద్య ఆత్మహత్య
● కేయూలో విద్యార్థి సంఘాల ధర్నా కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విద్యార్థిని శ్రీవిద్య సీ నియర్ల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఇది ముమ్మాటికి యూనివర్సిటీ అఽధికారుల నిర్లక్ష్యమని నిరసిస్తూ ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, సేవాలాల్సేన, ఏబీఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం యూనివర్సిటీలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించా రు. లైబ్రరీ ప్రాంగణం నుంచి పరిపాలనా భవనం వరకు ర్యాలీ కొనసాగింది. పరిపాలనా భవనంలోనికి దూసుకువచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ శ్రీవిద్య ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొద్ది రో జులుగా ఈ విషయంపై సంబంధిత యూనివర్సిటీ అధికారులు సరిగా స్పందించలేదన్నారు. కార్యక్రమంలో మనోహర్, భాస్కర్ పాల్గొన్నారు. -
ఆరోగ్య భాగ్యం
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026సహజ సేద్యం..జిల్లాలో విస్తరిస్తున్న నేచురల్ ఫార్మింగ్● జీవామృతం, ఘన జీవామృతంపై అవగాహన ● మిత్ర పురుగుల సంరక్షణతో జీవవైవిధ్యం ● పెట్టుబడులు తక్కువ.. లాభాలు ఎక్కువ ● జిల్లాలో 15 క్లస్టర్లు, 1,875 మంది రైతులుజనగామ: ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) పథకం కింద జిల్లాలో సహజ వ్యవసాయం వేగంగా విస్తరిస్తోంది. జిల్లా పరిధిలో 15 క్లస్టర్లు ఏర్పాటు చేసి, ప్రతీ క్లస్టర్కు 125 మంది చొప్పున 1,875 మంది రైతులకు సహజ వ్యవసాయ కిట్లను అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం 12 మండలాల వ్యాప్తంగా అమలు అవుతోంది. తొలి దశలో గ్రామాల వారీగా ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ ఏర్పాటు చేసి రైతులకు నేచురల్ ఫార్మింగ్ తత్వం, పెంపక పద్ధతులు, మట్టిలో జీవాలను పెంపొందించడం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. పథకాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు కేంద్రం, రాష్ట్రం, జిల్లా పరిధిలో కోఆర్డినేటర్లు నియమిస్తారు. వీరు సాధారణ రైతు సమూహాలతో సహకరిస్తూ పథకం అమలును పర్యవేక్షిస్తారు. రసాయనిక ఎరువులకు దూరంగా.. రసాయనాల వినియోగం పెరుగుతున్న నేపధ్యంలో భూసారం తగ్గిపోకుండా, పంటల నాణ్యత దెబ్బతినకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన దిగుబడులు అందేలా చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. రసాయనిక వ్యవసాయం వైపు రైతులు మళ్లిపోతున్న పరిస్థితుల్లో, నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులు అవలంభించడం అత్యంత అవసరమని కేంద్రం దృష్టి సారించింది. ఈ పథకం కింద రైతులకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ ప్రకృతి సిద్ధ ఎరువుల తయారీ వరకు అన్ని అంశాల్లో రైతులకు అధికారులు సలహాలు అందిస్తున్నారు. ముఖ్యంగా జీవామృతం, ఘన జీవామృతం, కషాయాల వంటి సన్నద్ధ పద్ధతుల ద్వారా పూర్తిగా రసాయన రహిత సాగును ప్రోత్సహిస్తున్నారు. రైతులు మార్కెట్ ఆధారిత రసాయన ఎరువులపై ఆధారపడకుండా, తమ వద్దే లభించే పదార్థాలతో ఎరువులు తయారు చేసుకునే విధానం ఈ పథకంలో భాగం. అలాగే స్థానిక విత్తనాల వినియోగం, పంటల వైవిధ్యాన్ని పెంపొందించడం, మిత్ర పురుగుల రక్షణ, సహజ రీతిలో జీవ వైవిధ్యం పెంపుదల వంటి అంశాలను రైతులకు బోధిస్తున్నారు. ఈ పథకం ద్వారా రసాయన వ్యయాలు తగ్గి, రైతుల ఆదాయం పెరగడంతో పాటు నేల జీవసమృద్ధి కూడా పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో సహజ వ్యవసాయం మరింత విస్తరించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సహజ వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో ఈ పథకానికి మంచి స్పందన లభించడంతో, మరిన్ని క్లస్టర్లను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించారు. శిక్షణ.. వర్క్షాపులు మట్టి ఆరోగ్యం–పర్యావరణ సుస్థిరతని సాధించడం పథకం ప్రధాన లక్ష్యం. రైతులకు ప్రతీ ఎకరాకు నేచురల్ ఫార్మింగ్ అమలు కోసం ఆర్థిక అస్సిస్టెన్స్ ఇవ్వబడుతుంది. శుద్ధ జీవ ఎరువులు, పది రకాల లేదా అంతకన్నా ఎక్కువ జీవసిద్ధ సిప్ ఎరువుల తయారీకి స్థానిక స్థాయిలో శిక్షణ, వర్క్షాప్లు నిర్వహిస్తారు. నేచురల్ పద్ధతుల ద్వారా పంటలు, పప్పు దినులపంటలు వేసుకునేలా మార్గనిర్ధేశకాలు అందిస్తారు. రైతులు ఎటువంటి రసాయనాలపై ఆధార పడకుండా పంటల ఆరోగ్యం, పెట్టుబడి పెంపొందించుకోవచ్చు. రైతులకు సాంకేతిక సహాయం, మార్కెట్ లింక్, నేచురల్ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కేంద్రం ప్రత్యేక ప్రక్రియలు రూపొందిస్తున్నారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జనగామ రూరల్: మండలంలోని శామీర్పేట గ్రామంలోని తెలంగాణ ఎస్టీ బాలికల హాస్టల్ను అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, స్టాక్ రిజిస్టర్లు రైస్, ఆయిల్, పప్పు తదితర సరుకులతో పాటు స్టాఫ్ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిచెన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యమైన సరుకులను భోజన తయారీకి వినియోగించాలని ప్రిన్సిపాల్, వార్డెన్లకు తెలిపారు. సర్పంచ్ గణిపాక వనితమహేందర్, సిబ్బంది ఉన్నారు. రాంగ్ రూట్లో వెళ్తే చర్యలు చిల్పూరు: యూటర్న్ల వద్ద రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తే చర్యలు తప్పవని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. మండలంలోని చిన్నపెండ్యాల గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలోని యూటర్న్ వద్ద చిల్పూరు ఎస్సై నవీన్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం రాంగ్ రూట్ ప్రయాణం ప్రమాదకరం నినాదంతో ఉన్న పోలీస్ కారు బొమ్మను ఏర్పాటు చేయించగా డీసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సమయంలో రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనాలను ఆపి అవగాహన కల్పించారు. ఇక నుంచి రాంగ్ రూట్లో వెళ్తే సీసీ కెమరాలకు చిక్కి జరిమానా కట్టాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్రెడ్డి, నాయకులు తాళ్లపల్లి సమ్మయ్య, గడ్డమీది అశోక్, వెంకటస్వామి, సాదం నర్సింహులు, సాదం బీమయ్య, సాదం రాజ్కుమార్, ఉంచాల రాజు తదితరులు ఉన్నారు. సోమయ్యకు ఉగాది పురస్కారం దేవరుప్పుల: మారుమూల పల్లెల్లో జీవిస్తూ తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న తెలుగు అధ్యాపకుడు, సామాజిక కవి అంకాల సోమయ్యకు ఉగాది పురస్కారం లభించింది. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ పరాభావ నామ సంవత్సరం పురస్కరించుకొని ఉగాది కవి సమ్మేళనం, అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తెలంగాణ సాహిత్య అకాడమీ బాధ్యులు ఏనుగు నరసింహారెడ్డి, నందిని సిద్దారెడ్డితో పాటు పలువురి చేతుల మీదుగా సోమ య్య ఉగాది పురస్కారం అందుకున్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తి జనగామ రూరల్: జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ 2026–27 సంవత్సరానికి గాను ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వై. చంద్రరుషి, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు కె.చంద్రశేఖర్, పి.చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో నామినేషన్ పక్రియ పూర్తి చేశారు. ఈ మేరకు అధ్యక్ష అభ్యర్థులుగా దయాకర్రెడ్డి, కె.ఎల్లారెడ్డి, పానుగంటి శ్రీనివాస్ నామినేషన్లు వేశారు. ఉపాధ్యక్షులుగా టి.రాజయ్య, ఎన్. సిద్దులు, ఎన్.రేణుక, ప్రధాన కార్యదర్శులుగా ఎం.సత్తయ్య, సీహెచ్ నర్సింగరావు నామినేషన్లు వేశారు. కాగా సెక్రటరీగా ఎంవీ భద్రినాఽథ్, కోశాధికారిగా ఎన్.శ్రీమన్, జి.అమృతయ్య, క్రీడలు, సౌంస్కృతిక కార్యదర్శిగా బాలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహిళా కార్యదర్శిగా ఎం.స్వప్న, కే.సునీతారాణి నామినేషన్ వేశారు. ఈసీ మెంబర్లుగా ఎన్.కల్యాణి, జ్యోత్స్న, దయామని, సంపత్, శ్రీనివాస్లు నామినేషన్లు వేశారు. ఈ నెల 20న ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. -
వేగంగా.. సులభంగా..
● కొత్త ఎల్టీ సర్వీస్ల కోసం సరళమైన చార్జీలుజనగామ: వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్ల మంజూరులో వేగంగా, సులభంగా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. కొత్తగా ఎల్టీ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వినియోగదారులు ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, లోడ్ ఆధారంగా మాత్రమే చార్జీలు చెల్లించి త్వరగా సర్వీసులు పొందవచ్చు. ఈ మేరకు రెగ్యులేషన్ నంబర్ 1 ఆఫ్ 2026 ప్రకారం కొత్త సర్వీసుల కొరకు ఎన్పీడీసీఎల్ సంస్థ సర్వీస్ లైన్ చార్జీల (ఎస్ఎల్ఎస్) విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో.. వినియోగదారులు ముందుగానే తమకు ఎంత సర్వీస్ లైన్ చార్జీలు వస్తాయో తెలుసుకుని సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అనవసర ఆలస్యాలు, అదనపు భారం పూర్తిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కనెక్షన్ పొందడం మరింత సులభం కానుంది. చార్జీలు ఇలా.. 20 కిలోవాట్ వరకు డెవలప్మెంట్, సర్వీసు చార్జీలు వర్తింపు. 20 కిలోవాట్ పైగా కేవలం ఎస్ఎల్ఎస్ మాత్రమే తీసుకుంటారు. డెవలప్మెంట్ చార్జీలు రద్దు చేశారు. కేటగిరీ వారీగా చార్జీల విషయానికి వస్తే గృహ వినియోగదారులు (ఎల్టీ–1) పరిధిలో 1 కిలోవాట్ వరకు రూ.500, 1 నుంచి 5 కిలో వాట్కు రూ.500, ప్రతీ కిలోవాట్కు రూ.600, 5 నుంచి 20 కిలోవాట్ రూ.2,900, ప్రతి కిలోవాట్కు రూ.1500, 20 కిలోవాట్ పైగా ప్రతీ కిలోవాట్కు రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ పరిధిలో 1 కిలోవాట్ వరకు రూ.1,000, 1 నుంచి 5 కిలోవాట్ వరకు రూ.1,000, ప్రతీ కిలోవాట్కు రూ.1,200, 20 కిలోవాట్ పైగా ప్రతీ కిలోవాట్కు రూ.10వేలు చెల్లించాలి. మిగతా కేటగిరీల్లో కూడా లోడ్కు అనుగుణంగా చార్జీలను సవరించారు. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మల్టీ, స్టోరీ భవనాలకు మొత్తం కాంట్రాక్ట్ లోడ్పై ఆధారపడి ఎస్ఎల్ఎస్ అమలు చేశారు. ట్రాన్స్ఫార్మర్ ఖర్చు వినియోగదారుడిపై భారం పడకుండా నిబంధనలు అమలులోకి తెచ్చారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు బాధ్యత పూర్తిగా విద్యుత్ సంస్థదే ఉంటుంది. రైతులకు లాభం వ్యవసాయ వినియోగదారులకు సులభమైన రేట్లు అమల్లోకి తీసుకువచ్చాం. వ్యవసాయ కనెక్షన్కు కేవలం 1 కిలోవాట్కు రూ.1,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కొత్త విధానం ద్వారా సేవల మంజూరులో వేగం పెరిగి, అవినీతి అవకాశాలు పూర్తిగా తగ్గి, చార్జీలపై స్పష్టత పెరుగుతుంది. విద్యుత్ కనెక్షన్ పొందడాన్ని సులభతరం చేయడమే ప్రభుత్వం లక్ష్యం. – సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్ -
అధికారులు పారదర్శకంగా పనిచేయాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ రూరల్: అధికారులు పారదర్శకంగా పనిచేస్తేనే సత్ఫలితాలు సాధ్యమని కలెక్టర్ సందీప్ కుఆమర్ ఝా అన్నారు. మంగళవారం భూ భార తి, ఇసుక తరలింపు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తదితర అంశాల మీద కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూకు సంబంధించిన ఏ అంశాలు పెండింగ్లో ఉండకూడదన్నారు. భూ భారతికి సంబంధించిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. అక్రమ ఇసుక, మొరం, గ్రావెల్ అక్రమ రవాణా కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను జనాభా లెక్కల విధులను సమర్థంగా నిర్వహించాలన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా.. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం జిల్లా స్థాయి గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. టోల్ ఫ్రీ నంబర్ అమలు, గ్యాస్ సరఫరా, నిల్వల పరిస్థితిపై ఆరా తీశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులతో పాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఆస్పత్రులకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రవీందర్, హసీనా బేగం, విక్రమ్, డీడబ్ల్యూఓ కో దండరాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌ డ్, గ్యాస్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు. మహిళా సంఘాలు ముఖ్య పాత్ర వహించాలి మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మార్క్ ఫెడ్ ప్రతినిధులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొక్కజొన్న సాగు, కోతలు, కొనుగోళ్లు మొదలు కావడంతో వాటికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి అంబి కాసోని, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత, ఏడీఏలు, అడిషనల్ పీడీలు, అధికారులు పాల్గొన్నా రు. అనంతరం పెంబర్తిలో నిర్మాణంలో ఉన్న జిల్లా సమైక్య భవనాన్ని కలెక్టర్ పరిశీలించి నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
సుస్థిర వ్యవసాయ విధానాలను అనుసరించాలి
రఘునాథపల్లి: ఆరోగ్యకరమైన పంటల కోసం రైతులు సుస్థిర వ్యవసాయ విధానాలను అనుసరించాలని జిల్లా వ్యవసాయాధికారి కట్ట అంబికాసోని అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో మంగళవారం సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు లేని ఆహారాన్ని పండించడం ఎంతో అవసరమన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించడం ద్వారా ఆరోగ్యకరమైన పంటలతో పాటు, నేల సారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు మాట్లాడుతూ సహజ వ్యవసాయం ద్వారా నేల సారాన్ని పెంచడంతో పాటు దీర్ఘకాలికంగా వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందన్నారు. అనంతరం సుస్థిర వ్యవసాయం చేస్తున్న రైతులకు వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎస్.కరుణాకర్, ఏఈఓలు శివుడు, అజయ్ కల్పన, సౌజన్య, కీర్తి స్నేహ, కృషి, సఖి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రేపు రుద్రేశ్వరాలయంలో ఉగాది వేడుకలు
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో గురువారం ఉగాది, సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈఓ ధరణికోట అనిల్కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం దేవాలయంలో ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఉగాది వేడుకల్లో భాగంగా సాయంత్రం పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ ఉదయం స్వామివారికి ఉగాది పచ్చడి నివేదన, సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్శర్మ, సిబ్బంది మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా మాసశివరాత్రి పూజలు.. మాసశివరాత్రిని పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు మణికంఠశర్మ, అర్చకుల ప్రణవ్, సందీప్శర్మ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి ఆరాధన, శ్రీరుద్రేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం నాట్యమండపంలో రుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారిని ప్రతిష్ఠించి కలశస్థాపన, బాసికధారణ, యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి శ్రీరుద్రేశ్వరిదేవి, శ్రీరుద్రేశ్వరస్వామికి కల్యాణోత్సవం నిర్వహించారు. -
వైద్యులు సమయపాలన పాటించాలి
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జునరావు రఘునాథపల్లి: వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీ వ్రంగా ఉంటాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి డాక్టర్ మల్లికార్జునరావు సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఆస్పత్రిలో ప్రసవాలు పెంచాలని పేర్కొన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఆందిస్తున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నా రు. వేసవి దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నేటి నుంచి చేపట్టనున్న లెప్రసీ ఐడెంటిపై సర్వే చేసి లెప్రసీని ఏరాడికెట్ చేయడానికి కృషి చేయాలన్నారు. అలాగే మండలంలోని ఖిలాషాపూర్ ఆరో గ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి స్రవంతి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డి.రామకృష్ణ, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళాశక్తి స్టాల్స్ను తొలగించొద్దు
● కలెక్టర్కు వినతిపత్రం అందించిన మహిళలుజనగామ రూరల్: పేద మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి వనితా టీ స్టాల్, విజయ మిల్క్ డెయిరీ స్టాల్ను తొలగించవద్దని మహిళలు సోమవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బొట్ల శేఖర్, బూడిది గోపి మాట్లాడుతూ.. పాలమాకుల చిన్నమంజుల, పొత్కసూరి విజయలక్ష్మి ఉపాధి కోసం డీఆర్డీఏ ఆధ్వర్యంలో టీస్టాల్, విజయ మిల్క్ స్టాల్ కలెక్టరేట్ గోడ వద్ద ఏర్పాటు చేశారని, ఉపాధికోసం ఏర్పాటు చేస్తే నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. సంబంధిత విషయంపై భువనగిరి పార్లమెంట్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి వద్దకు వెళ్లగా స్టాళ్లను అలాగే కొనసాగించాలని ఇచ్చిన లేఖను కలెక్టర్కు అందించారు.పట్టణంలో ప్రజాసమస్యలు అనేకం ఉన్నాయని వాటిపై అధికారులు దృష్టిపెట్టాలని కోరారు. -
మెడికల్ షాపులపై ఆకస్మిక దాడులు
● నిబంధనలు ఉల్లంఘించిన 6 దుకాణాలపై కేసు నమోదుజనగామ: జిల్లాలో మత్తు కలిగించే మందుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు డ్రగ్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వరంగల్ ఔషధ నియంత్రణ పరిపాలన సహాయ సంచాలకులు డాక్టర్ రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో 65 మెడికల్ షాపుల్లో టెస్ట్ పర్చేజ్ విధానాన్ని అమలు చేశారు. అపరిచిత వ్యక్తుల ద్వారా మందులు విక్రయిస్తున్నారో లేదో పరీక్షించగా పలు అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. ఈ తనిఖీల్లో 6 మెడికల్ షాపులు నిషేధితంగా, మత్తును కలిగించే ట్రమాడాల్ అనే నొప్పినివారణ మందును నిబంధనలు ఉల్లంఘించి విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. జనగామలో 2, రఘునాథపల్లిలో 3, స్టేషన్ ఘన్పూర్లో ఒక దుకాణంపై కేసు నమోదు చేసి ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి సిఫారసు చేయగా, సంబంధిత షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మత్తు కలిగించే మందులను అనధికారికంగా విక్రయించినా, వినియోగించినా చట్టపరంగా కఠినమైన క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
కలెక్టర్ సార్!
నర్మెట: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయుడిగా మారిపోయారు. మండలంలోని మాన్సింగ్తండాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేసి పదో తరగతి విద్యార్థులకు గణితం బోధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టంతో చదివి లక్ష్యాలను సాధించాలని సూచించారు. తరగతి గదులను, వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం పౌష్టిక ఆహారాన్ని అందించాలని ప్రత్యేక అధికారి బైరోజు రజితకు సూచించడంతో పాటు విద్యార్థినుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆస్పత్రి గదులను, పరిసరాలను, రికార్డులను పరిశీలించి, సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వైద్యాధికారి సిద్ధార్థరెడ్డికి సూచించారు. -
విద్యుత్ సరఫరా..మరింత మెరుగ్గా
● అంతరాయాలు తగ్గించేందుకు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ వాహనాలు ● జనగామ సర్కిల్ పరిధిలో అందుబాటులోకి..జనగామ: ప్రకృతి విపత్తులు, భారీ వర్షాలు, ఈదురుగాలులు, సాంకేతిక లోపాలు వంటి కారణాలతో విద్యుత్ సరఫరాలో ఏర్పడే అంతరాయాలను తగ్గించేందుకు జనగామ ఎన్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలో పటిష్ట చర్యలు చేపట్టారు. సంస్థ ఎస్ఈ సంపత్రెడ్డి నేతృత్వంలో వినియోగదారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు అత్యవసర రీస్టోరేషన్ చర్యలను ప్రాధాన్యంగా అమలు చేస్తున్నారు. సర్కిల్ పరిధిలో రెండు ఎమర్జెన్సీ రీస్టోరేషన్ వాహనాలు సర్కిల్ పరిధిలో 2 ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్ (ఈఆర్టీ) వాహనాలు సిద్ధం చేశారు. 24 గంటల పాటు కార్యకలాపాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సబ్డివిజన్ స్థాయిలో 7 ప్రత్యేక వాహనాలు కూడా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ముందుగానే సిద్ధం చేసి ఉంచారు. ఈ వాహనాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతుల కు అవసరమైన కండక్టర్లు, ఇన్సులేటర్లు, కేబుల్స్, టూల్స్ వంటి మెటీరియల్ను ముందుగానే లోడ్ చేసి ఉంచుతున్నారు. సమస్య ఏర్పడిన వెంటనే బృందాలు ఘటనాస్థలానికి చేరుకునేందుకు ఈ ఆర్టీ వాహనాలకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చారు. దీంతో సమస్యలను అత్యంత వేగంగా గుర్తించి పరిష్కరించే అవకాశం కలుగుతుంది. తక్షణ పరిష్కారం.. విద్యుత్ సరఫరాలో హఠాత్తుగా ఏర్పడే లోపాలు, లైన్ బ్రేక్డౌన్లు, ట్రాన్స్ఫార్మర్ సమస్యలను వీటి సహాయంతో తక్షణమే పరిష్కరించడంలో ఈ వ్య వస్థ ఉపకరిస్తుంది. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉత్పన్నమైతే టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నారు. ఈ నెంబర్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. నాణ్యమైన సేవల కోసం..విద్యుత్ అంతరాయాలను తగ్గించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో సంస్థ మరింత సమర్థవంతంగా ముందుకెళ్తోంది. విద్యుత్ అంతరాయాల సమయంలో తక్షణం పునరుద్ధరించేందుకు ఈఆర్టీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. 24 గంటల పాటు ఈ కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికారులు, ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమస్యలను మాకు వేగంగా తెలియజేయవచ్చు. –సంపత్రెడ్డి, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్, జనగామ -
వినతుల పరిష్కారం వేగంగా..
● ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశం ● ప్రజల నుంచి 224 వినతుల స్వీకరణ ● కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాట్లుజనగామ రూరల్: కుమారుడు బాగోగులు చూసుకోవడం లేదని ఓ తల్లి, జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలని భూమి కోల్పోయిన నష్టపరిహారం చెల్లించాలని ఒకరు, మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతులు, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ రావడం లేదని ఓ లబ్ధిదారుడు, వ్యవసాయ బావుల వద్దకు దారి ఇవ్వడం లేదని గ్రామస్తులు..ఇలా పలు సమస్యలతో ప్రజలు గ్రీవెన్స్ సెల్కు తరలివచ్చారు. ఈసందర్భంగా కలెక్టరేట్లోని కాన్ఫ్రెన్స్ హాల్లో ప్రజావాణికి వచ్చిన ప్రజలను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆప్యాయంగా పలకరించి సమస్యలను విని వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా 224 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈమేరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆర్డీఓలు గోపిరాం, వెంకన్న, డీఆర్డీఓ వసంత, డీఏఓ అంబికా సోనీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులు కొన్ని ఇలా.. ● పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామానికి చెందిన బి.వసంత, 12 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో జీవనం సాగిస్తున్నామని, గుంట భూమి ఉండగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేశామని, తన ప్రజాపాలన దరఖాస్తును జనగామ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా పొలాస రూరల్కు బదిలీ చేయాలని విన్నవిస్తూ దరఖాస్తు చేశారు. ● తరిగొప్పుల మండలం ఎన్యా నాయక్ తండాకు చెందిన ఎం.నిర్మల, తనకు గల ఒక గుంట భూమి పట్టా పాస్ బుక్ లాక్ అయిందని, ఆర్డీఓ లాగిన్లో ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలని వినతి అందజేశారు. ● లింగాల ఘణపురం మండలం వడిచర్ల గ్రామానికి చెందిన రమాదేవి, తనకు సొంత ఇల్లు, సొంత స్థలం ఏమీ లేదని, అద్దెకు ఉంటున్నానని, గతంలో ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నానని, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంది. ● జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీ 12వ వార్డుకు చెందిన పెంట సోమలక్ష్మి గత ప్రజాపాలన కార్యక్రమంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నానని, తమకు ఎటువంటి ఇల్లు, ఖాళీ స్థలం లేదని, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పించాలని వేడుకుంది. ● జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్కు చెందిన గౌరోజు సదాశివరావు, హైదరాబాద్ రోడ్డులోని ఏకశిల కళాశాల పక్కన తనకు ప్లాటు కలదని, ఆ ప్లాటు కెనాల్ కాలువలో పోయిందని, ఈ విషయమై తనకు నష్ట పరిహారం ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. ● గోవర్థనగిరి గ్రామంలో సర్వే నెంబర్ 228లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, గతంలో రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు భూ సర్వే కోసం ప్రతిపాదనలు పంపగా ఆర్డీఓ వద్ద పెండింగ్లో ఉందని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్కు రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లి గ్రామానికి చెందిన మంతపురం యాదగిరి వినతి పత్రం అందజేశారు. ● పట్టణంలోని రాజీవ్నగర్ 1వ వార్డు చెందిన చింతల సంపత్ తనకు గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడీ రావడం లేదని, వెంటనే అందజేయాలని వినతి పత్రం అందించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసి..రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. ● నష్కల్ గ్రామం పరిధిలో ఉన్న తమ భూమి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం కోల్పోయామని, నష్టపరిహారం కాజేయాలని తమ పాలివారు ప్రయత్నం చేస్తున్నారని, వారసత్వం కింద తమకే అందజేయాలని చిల్పూరు మండలం వంగాలపల్లికి చెందిన మట్వాడ అంజయ్య వినతి అందించారు. -
చివరి తడి
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026జలసంరక్షణతోనేజిల్లా సగటు (మీటర్లలో)గతేడాది కంటే మెరుగ్గానే భూగర్భజలాలుజనగామ: జిల్లా పరిధిలో భూగర్భ జలాల స్థితిలో స్వల్ప మార్పులే నమోదయ్యాయి. ఫిబ్రవరి 2025, ఫిబ్రవరి 2026, అలాగే జనవరి 2026 నెలలోని నీటి మట్టాలను పరిశీలిస్తే, కొన్ని మండలాల్లో పెరుగుదల కనిపించగా, మరికొన్ని ప్రాంతాల్లో తగ్గుదల చోటుచేసుకుంది. జిల్లా సగటు భూగర్భ జలాల మట్టం ప్రకారం ఫిబ్రవరి 2025లో 8.01 మీటర్లు, జనవరి 2026లో 5.01 మీటర్లు, ఫిబ్రవరి 2026 వచ్చే సరికి కేవలం 5.99 మీటర్ల లోతులోనే ఉన్నట్లు గుర్తించారు. నిలకడగా ఉన్నా.. రాబోయే రెండు నెలలపై ఆందోళన జనవరి 2026తో పోలిస్తే ఫిబ్రవరి 2026లో స్వల్ప తగ్గుదల (సుమారు 0.98 మీటర్లు) కనిపించినప్పటికీ, ఫిబ్రవరి 2025తో పోలిస్తే నీటిమట్టం మెరుగైన స్థాయిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని చెరువుల్లో ఉన్న నీటి మట్టంతో భూగర్భజలాలు నిలకడగా ఉన్నాయి. కొన్ని మండలాల్లో నీటి మట్టం మెరుగుపడిన చోట్ల వ్యవసాయ, తాగునీటి బోర్లు స్థిరంగా పనిచేస్తున్నాయి. అయితే అధిక లోతు ప్రాంతాల్లో స్వల్ప తగ్గుదల కనిపించడం వల్ల వేసవిలో అదనపు నీటి సంరక్షణ చర్యలు అవసరం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లా సగటు నీటిమట్టం ప్రస్తుతం 5.99 మీటర్ల వద్ద ఉండడం సానుకూల సంకేతమే అయినప్పటికీ, రాబోయే రెండు నెలలు కీలకమని అధికారులు భావిస్తున్నారు. వేసవి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో, యాసంగి సీజన్ పంటలతో పాటు పంచాయతీల నుంచి మున్సిపల్ పరిధి వరకు నీటివినియోగంపై ముందస్తు ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. జిల్లా భూగర్భ జలాల పరిస్థితి గత సంవత్సరంతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ, నీటి వినియోగంపై జాగ్రత్తలు పాటించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. దేవాదుల ఒక్కటే శరణ్యం దేవాదుల కాలువల ద్వారా సాగునీటి విడుదల ఒక్కటే యాసంగి సీజన్కు ఊపిరిగా రైతులు భావిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని చెరువుల్లో 25 నుంచి 50శాతం మేర నీటినిల్వలు ఉండగా, యాసంగి సీజన్లో సాగు చేసిన పంటలకు సాగునీరు అందిస్తున్న నేపథ్యంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కాలువల ద్వారా చెరువులకు జలాలను తరలిస్తే.. పడిపోతున్న భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వరి పంటకు అరకొర సాగునీరు అందించే గడ్డుకాలం మొదలైంది. అయినా వేసవి తీవ్రతతో సాగుభయం దేవాదుల ఒక్కటే శరణ్యమంటున్న రైతులు చెరువులు నింపితేనే పంట చేతికి వస్తుందంటూ విన్నపం జిల్లాలో మొదలవుతున్న సాగునీటి కష్టాలుమండలం(ఊరు) ఫిబ్రవరి–25 జనవరి–26 ఫిబ్రవరి–26 బచ్చన్నపేట 9.16 4.5 5.24 దేవరుప్పుల 4.2 1.83 2.38 జనగామ 4.79 2.61 3.14 కొడకండ్ల 10.21 7.77 8.55 లిం.ఘణపురం 7.15 3.97 5.62 పాలకుర్తి 9.91 4.35 6.15 రఘునాథపల్లి 10.05 5.86 7.29 తరిగొప్పుల 9.02 3.06 3.92 -
నిబంధనలు విస్మరించొద్దు
● హాస్టళ్లలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ ఆకస్మిక తనిఖీ జనగామ రూరల్: పేద విద్యార్థుల సంక్షేమం విషయంలో నిర్వాహకులు నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని ఎస్సీడీడీ, టీఎంఆర్జేసీ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, స్టాక్ రిజిస్టర్లు, స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేసి ప్రిన్సిపాల్, వార్డెన్లకు పలు సూచనలు చేశారు. -
బోరులో నీటిమట్టం తగ్గుతోంది..
యాసంగి సీజన్లో బోరుబావి కింద మూడున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేశా. వేసవిలో ఎండలు పెరగక ముందే బోరుబావిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. బోర్ నుంచి కొద్దిపాటి నీరు మాత్రమే వస్తోంది. నెలరోజుల పాటు పంటకు నీరు అందించాల్సి ఉంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఇలా ఉంటే, పంట చేతి కందే వరకు కష్టంగా మారనుంది. కొద్దిరోజుల నుంచి దేవాదుల కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇంకా పనులు మొదటి దశలోనే ఉన్నాయి. వీటి ద్వారా పంటలకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. –భూక్య బాలాజీ నాయక్, రైతు, టీబీ తండా, జఫర్గఢ్ -
మల్లన్నకు పెద్దపట్నం
ఐనవోలు: ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర చివరి ఆదివారం మహా పెద్ద పట్నం, గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మలతో మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి నిత్య పూజలు పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో నటరాజస్వామి మండపానికి ఎదురుగా ఉదయం 7 గంటల నుంచే 53 అడుగుల అతిపెద్ద పట్నం 11 రకాల రంగులతో సుమారు 50 మంది ఒగ్గు పూజారులు 6 గంటల పాటు శ్రమించి మహా పెద్దపట్నం వేశారు. పెద్దపట్నంపైకి ఉత్సవ మూర్తులు పెద్దపట్నం వేసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆలయ మూల మూర్తులైన అమ్మవార్లు గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మ, మల్లికార్జునుడి ప్రతిరూపమైన ఉత్సవ విగ్రహాలను ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో మహా పెద్దపట్నంపైకి తీసుకొచ్చారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ శైవాగమోక్తంగా స్వామి, అమ్మవార్ల కల్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. అనంతరం కల్యాణ మూర్తులను మహా పెద్దపట్నం చుట్టూ ప్రదక్షిణ గావించి ఒగ్గు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు, మంగళ హారతులు స్వామివారికి సమర్పించి అక్షతలను పెద్దపట్నంపై చల్లారు. పూజలు పూర్తయిన వెంటనే శివసత్తులు, ఒగ్గు పూజారులు, భక్తులు తన్మయత్వంతో బండారి (పసుపు) చల్లుకుంటు మహా పెద్దపట్నంపై నృత్యాలు చేసి ఓలలాడారు. అనంతరం ఉత్సవమూర్తులను ఒగ్గు పూజారులు బండారి చల్లుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, ముఖ్య అర్చకులు శ్రీనివాస్, మధుకర్ శర్మ, వేదపండిట్లు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు భానుప్రసాద్, మధు, శ్రీనివాస్, నరేశ్, దేవేందర్, ఒగ్గు పూజారులు పెద్ద మనుషులు మజ్జిగ మహేందర్, రాజయ్య, అశోక్ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చక సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.వైభవంగా కల్యాణోత్సం -
వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి
జనగామ రూరల్: వినియోగదారులు తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులు తెలుసుకోవాలని సాధిక్ ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్ సాధిక్ అలీ అన్నారు. ఆదివారం ప్రపంచ వినియోగ దా రుల దినోత్సవం సదర్భంగా పట్టణంలోని స్కాలర్ గ్రామర్ స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామలో వినియోగదారుల ఉద్యమం 1986లో మొదలై నేటి వరకు కొనసాగుతున్నదని తెలిపారు. వినియోగదారులకు ఏవైనా సమస్యలుంటే కలెక్టర్ కార్యాలయంలో వినియోగదారుల సమాచార కేంద్రంలో ఫిర్యాదు చేయవచ్చని, ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుందన్నారు. కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు జి.కృష్ణ,పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సోమ నరసింహచారి, రామచంద్రం, పొట్టబత్తిని భాస్కర్, బుదారపు లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణం, సుస్థిరాభివృద్ధిపై అవగాహన
జనగామ రూరల్: పర్యావరణంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని స్టేషన్ ఘన్పూర్ కళాశాల ఎన్న్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జ్యోత్స్న అన్నారు. పెంబర్తి గ్రామంలో ఎనన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా ఆదివారం పర్యావరణం, సుస్థిరాభివృద్ధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పర్యావరణాన్ని సంరక్షించడం, చెట్ల పెంపకం, నీటి వనరులను కాపాడటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. భవిష్యత్ తరాలకు శుభ్రమైన ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. -
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యమే లక్ష్యం
జనగామ: పారిశుద్ధ్య కార్మికుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం జనగామ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, కార్యాలయ సిబ్బందికి జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించి, మరింత మెరుగైన చికిత్సలు అవసరమున్న వారిని జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే పట్టణ ప్రజల ఆరోగ్యం కాపాడగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్ కుమార్, 10వ వార్డు కౌన్సిలర్ నీరటి రజిని, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ శానిటరీ ఇన్న్స్పెక్టర్, జవాను సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గొందాల వాగును పరిశీలించిన కలెక్టర్ జనగామ రూరల్: మండలంలోని గానుగుపహాడ్ గ్రామం నుంచి భాషనగర్ తండాకు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న గొందాల వాగును కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా గ్రామంలోని ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ శానబోయిన అనూష మహిపాల్ కలెక్టర్ను కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గొందాల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలను కూడా సందర్శించి అక్కడి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్ర శంకర్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.మున్సిపాలిటీలో వైద్యశిబిరం ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
లక్ష మల్లెపూలతో అభిషేకం
జనగామ: జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ ఉప్పలమ్మతల్లి ఆలయంలో ఆది వారం అమ్మవారికి లక్ష మల్లెపూలతో పూలాభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి వారణాసి పవన్శర్మ మంత్రోచ్ఛరణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహిక విష్ణులలితా సహస్ర నామాలను పారాయణం చేశా రు. అమ్మవారిని దర్శించుకుని, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేటి నుంచి ఒంటిపూట బడులుజనగామ రూరల్: ఈనెల 16 (సోమవారం) నుంచి ఒక్కపూట బడులు ప్రారంభమవుతున్నాయని విద్యాశాఖ అధికారుల అదివారం తెలిపారు. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుందన్నారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో తరగతులను మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణహన్మకొండ కల్చరల్: వరంగల్ మిత్రమండలి సౌజన్యంతో సామాజికవేత్త రంగరాజు శ్యాంసుందర్ రావు రాసిన ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ మేరకు హనుమకొండ పోస్టల్కాలనీలోని అభయాంజనేయస్వామి దేవాలయ ఆవరణలో కవి వీఆర్ విద్యార్థి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. యాత్రను రచనగా చేయడం వల్ల ప్రకృతిని ఆస్వాదించడమే కాకుండా, అక్కడి సంస్కృతి అందరికి తెలిసేలా చేసిన రచయిత శ్యాంసుందర్ అభినందనీయుడని అన్నారు. సాహితీవేత్తలు గన్నమరాజు గిరిజమనోహరబాబు, నాగిళ్ల రామశాస్త్రి, మల్యాల మనోహర్రావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి శుక్తిమతి అతిథులుగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చాడ జైహింద్రెడ్డి, స్థానికులు వాసిరెడ్డి కృష్ణారావు, మండవ రవీందర్రావు, దిలీప్కుమార్, ఏవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ షురూవిద్యారణ్యపురి/కాళోజీ సెంటర్: ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ను ఆదివారం ప్రారంభించినట్లు హనుమకొండ, వరంగల్ డీఐఈఓలు ఎ.గోపాల్, శ్రీధర్సుమన్ తెలిపారు. వరంగల్ ఎల్బీ కళాశాలలో వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల జవాబు పత్రాలు, హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనగామ, హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలకుడు రాజన్న మూల్యాంకన కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు. హనుమకొండ క్యాంపు ఆఫీసర్గా డీఐఈఓ ఎ.గోపాల్, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ జనరల్–1గా హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.శ్రీనివాస్రావు వ్యవహరిస్తున్నారు. -
మహిళాశక్తి స్టాల్స్ తొలగింపును నిలిపివేయండి
జనగామ రూరల్: ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ తొలగింపును నిలిపివేయాలని ఆదివారం ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డికి హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో మహిళలు వినతి పత్రం అందజేశారు. పట్టణ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయ కాంప్లెక్స్ గోడ మూల వద్ద గత కలెక్టర్ రిజ్వాన్ బాషా చొరవతో డ్వాక్రా గ్రూపు మహిళలు పాలమాకుల చిన్న మంజుల, పోత్కనూరి విజయలక్ష్మి వనితా టీ స్టాల్, విజయ పాల ఉత్పత్తి పార్లర్ ఏర్పాటు చేశారు. ఇటీవల కొత్తగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మున్సిపల్ పోలీసు అధికారులతో 10వ తేదీ, 11వ తేదీ తొలగించే ప్రయత్నం చేశారని చామల కుమార్ రెడ్డికి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళలను ఆర్థికంగా ఎదగడం కోసం చిన్న వ్యాపారాలకు సహకరిస్తున్నారని, కలెక్టర్ చర్యలు మాత్రం నష్టదాయకంగా ఉన్నాయని తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బానోతు ధర్మభిక్షం నాయక్ , పాలమాకుల కనకయ్య, సోమయ్య పాల్గొన్నారు. ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డికి మహిళల వినతి -
కొసరు మిగిలే
యాదాద్రి– వరంగల్ హైవేపై పూర్తికాని సర్వీసు రోడ్లు, రెయిలింగ్ పనులుఅసలు అయిపాయే..సర్వీసు రోడ్లు లేక ప్రజల అవస్థలు గ్రామాల్లో సర్వీసు రోడ్లు లేకపోవడంతో ప్రజలు అవస్థల పాలవుతున్నారు. రహదారి విస్తరణ పనుల్లో భాగంగా గ్రామాలు ఉన్న చోట ప్రజల సౌకర్యం కోసం తప్పనిసరిగా సర్వీసు రోడ్లు వేయాలి. సర్వీసు రోడ్డుపై నుంచి ప్రజలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా మధ్యలో రెయిలింగ్ వేయాలి. సర్వీసు రోడ్డుకు, జాతీయ రహదారికి మధ్య హైమాస్ట్ లైట్లు పెట్టాలి. సర్వీసు రోడ్డు పక్కన డ్రెయినేజీలు పూర్తి చేసి ఆ నీరు ఇళ్లలోకి రాకుండా ఏర్పాటు చేయాలి. అయితే సంబంధిత అధికారులు కేవలం జాతీయ రహదారి విస్తరణ చేశారేగాని సర్వీసురోడ్లు, రెయిలింగ్ పనులు విస్మరించారు. కొన్ని గ్రామాల్లో సర్వీసు రోడ్లు కొంతమేర వేసి వదిలేశారు. స్టేషన్ఘన్పూర్: జిల్లాలో జాతీయ రహదారి పనుల విషయంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో సర్వీస్రోడ్లు, రెయిలింగ్లు, డ్రెయి నేజీ పనులు అరకొరగా అసంపూర్తిగా చేయగా ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా జాతీ య రహదారి పనుల పరిస్థితి అసంపూర్తిగా ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడినా అధికారులు, పాలకులకు పట్టడం లేదు. పనులు పూర్తి చేయాల్సిన గడువు ముగి సి ఏడేళ్లయినా పనుల పూర్తికి మోక్షం కలగడం లేదు. కేవలం ప్రధాన రహదారి పనులపై దృష్టి సారించి రహదారి వెంట ఉన్న గ్రామాల్లో సర్వీసు రోడ్లు, రెయిలింగ్లు చేపట్టలేదు. అసలు పనులను పూర్తి చేసిన అధికారులు కొసరు పనుల్లో జాప్యం చేస్తున్నారు. 2015లో మొదలైన పనులు.. జాతీయ రహదారి 143 విస్తరణ పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో రూ.1,920 కోట్లతో యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో రహదారి విస్తరణ పనులకు రూ.897.03కోట్లు, మిగిలిన రూ.1,022.97కోట్లు భూసేకరణ, ఇళ్ల యజమానులకు కేటాయించారు. 2016 జూన్ 1న నాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పనులకు శంకుస్థాపన చేయగా ఎల్అండ్టీ సంస్థ పనులు చేపట్టింది. యాదాద్రి జిల్లా వంగపల్లి నుంచి వరంగల్ జిల్లా ఆరెపల్లి వరకు 99.10 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులను 30 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. వాస్తవానికి 2019 జనవరి వర కు పనులు పూర్తి కావాల్సి ఉంది. గడువు ముగిసి ఏడేళ్లయినా పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదు. జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. జిల్లాలోని లింగాలఘణ పురం, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల్లో పలు చోట్ల సర్వీసు రోడ్డు పనులు పూర్తి చేయలేదు. యూటర్న్లు లేకపోవడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చి పలుమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలున్నాయి. స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లిలో హైదరాబాద్, జనగామ నుంచి హన్మకొండవైపు వచ్చే ఆర్టీసీ బస్సులు బస్టాండ్లోకి రాకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర సమస్యగా మారింది. సర్వీసు రోడ్లపై ఎండలో నిల్చుని బస్సులను ఆశ్రయిస్తున్నారు. స్టేషన్ఘన్పూర్లో సర్వీసు రోడ్లు అసంపూర్తిగా వేశారు. స్థానిక బస్టాండ్ నుంచి శ్రీవాణి గురుకులం వరకు సర్వీసు రోడ్డు వేయాల్సి ఉండగా కేవలం విద్యుత్సబ్స్టేషన్ వరకే వేసి వదిలేశారు. దీంతో సర్వీసు రోడ్డు నిరుపయోగంగా మారగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ఘన్పూర్ మండలం రాఘవాపూర్లో రహదారికి రెండువైపులా ఇంతవరకు సర్వీసు రోడ్లు వేయలేదు. కొత్తపల్లి క్రాస్రోడ్డు వద్ద జాతీయ రహదారిపైకి ప్రజలు నేరుగా వస్తుండగా పలురోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హైమాస్ట్ లైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు అవస్థల పాలవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి సర్వీసు రోడ్లు, రెయిలింగ్ పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 1. స్టేషన్ఘన్పూర్లో అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్డు 2. ఘన్పూర్ బస్టాండ్ వద్ద సర్వీసురోడ్డుపై ప్రమాదకరంగా బస్సులు ఎక్కుతున్న ప్రజలు 3. రాఘవాపూర్లో కంకరపోసి వదిలేసిన రోడ్డు బస్సుల కోసం అవస్థలు హైదరాబాద్, జనగామ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు బస్టాండ్లోకి రావడం లేదు. రహదారి పక్కన సర్వీసు రోడ్డుపై బస్సులు నిలుపుతుండగా బస్సుల కోసం ప్రయాణికులు జాతీయ రహదారిని ప్రమాదకరంగా దాటాల్సి వస్తోంది. ఈ విషయమై అధికారులు వెంటనే స్పందించాలి. – మునిగెల రాజు, స్టేషన్ఘన్పూర్ పెండింగ్ పనులు పూర్తి చేయాలిఘన్పూర్లో సర్వీసు రోడ్డు విషయంలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు అరిగోస పడుతున్నారు. ఇప్పటికై నా స్పందించి ఘన్పూర్తో పాటు గ్రామాల్లో సర్వీసు రోడ్లు, రెయిలింగ్, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి. – మారెపల్లి ప్రసాద్, స్టేషన్ఘన్పూర్ 2 నిర్మాణ పనులకు గడువు ముగిసి ఏడేళ్లు రోడ్డు ప్రమాదాలతో ప్రజలకు ఇక్కట్లు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.. పట్టింపులేని పాలకులు, అధికారులు -
యూజీడీ వైపు అడుగులు
రూ.5,257 కోట్లకు ఇటీవల పరిపాలన అనుమతిసాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టు వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. సుమారు 40 ఏళ్లుగా ఈ ప్రాజెక్టుకు మోక్షం కలగలేదు. పలుమార్లు ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వాలకు పంపించినా ఏదో ఒక కారణంతో ఆచరణకు నోచుకోలేదు.ఎట్టకేలకు యూజీడీ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.5,257 కోట్లతో పరిపాలన అనుమతి ఇవ్వగా.. పనుల ప్రారంభం కోసం కసరత్తు జరుగుతోంది. యూజీడీ లేక రోడ్లపైకి మురుగు నీరు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) అంచనాల ప్రకారం సాధారణ సమయంలో నగరంలో రోజుకు సుమారు 180–200 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఈ మురుగును శుద్ధి చేసేందుకు రెడ్డిపురం, ప్రగతినగర్, ఉర్సుగుట్ట సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 120 ఎంఎల్డీలు మాత్రమే శుద్ధి అవుతున్నాయి. మిగిలిన మురుగు నీరంతా నగరంలో బంధం చెరువు, ధర్మసాగర్, మడికొండ, గోపాలపూర్, భద్రకాళి, వడ్డేపల్లి తదితర చెరువులతో పాటు ఎస్సారెస్పీ కాల్వలోకి చేరి కలుషితం అవుతున్నాయి. ఇక వర్షాకాలం వస్తే చాలు పలుమార్లు రోడ్లపైకి పారే వరద, మురుగునీరు కారణంగా ప్రధాన కాలనీలు మునిగిపోయిన పరిస్థితి. ఎట్టకేలకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇవ్వడంతో పాటు టెండర్ల ప్రక్రియను సైతం మొదలెట్టడం చర్చనీయాంశం అవుతోంది. ఏప్రిల్లో సీఎంతో పనులు ప్రారంభం.. నేడు తేదీలు ఖరారయ్యే అవకాశం యూజీడీ పనులకు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10న వరంగల్ అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈ నెలాఖరులో యూజీడీ పనుల టెండర్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ల ప్రక్రియ ఈ నెలలో పూర్తి చేసి వచ్చే నెలలో సీఎం రేవంత్రెడ్డితో శంకుస్థాపన చేయించే యోచనలో నేతలు ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యూజీడీ విషయమై కూడా సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. త్వరితగతిన నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ.. అధికారుల కసరత్తు పూర్తి సకాలంలో పనులు పూర్తయితే ‘గ్రేటర్’కు తప్పనున్న మురుగు, ముంపు యూజీడీ ప్రాజెక్టు వివరాలు..ప్రాజెక్టు పేరు: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) మొత్తం వ్యయం: రూ. 5,257 కోట్లు అమలు సంస్థ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాజెక్టు లక్ష్యం: ట్రైసిటీలో సమగ్ర యూజీడీ వ్యవస్థ ఏర్పాటు పైపులైన్ నెట్వర్క్: 740 కిలోమీటర్లు యూజీడీ జోన్లు: 9 సీవరేజ్ ట్రీట్మెంట్ జోన్లు: 21 డ్రెయినేజీ కనెక్షన్లు: దాదాపు 3.15 లక్షల ఇళ్లువరంగల్ : గిర్మాజీపేట, శివనగర్, మండిబజార్, మట్టెవాడ, దేశాయిపేట, మిల్స్కాలనీ, రాంనగర్, ఆటోనగర్, ఎంజీఎం హాస్పిటల్ పరిసరాలు, హంటర్ రోడ్డు, కరీమాబాద్ హనుమకొండ : సుబేదారి, బాలసముద్రం, అదాలత్ సెంటర్, ఎల్బీనగర్, నయీంనగర్, కిషన్పుర క్రాస్, ఎన్జీఓస్ కాలనీ, తిరుమల బార్ చౌరస్తా, అంబేడ్కర్ భవన్ ఏరియా కాజీపేట : రైల్వే కాలనీ, ఫాతిమానగర్, శివనగర్, గాంధీనగర్, ఎల్ఐసీ కాలనీ, డీజిల్ కాలనీ, మడికొండ రోడ్డు పరిసరాలు -
అంధకారం.. భయంతో ప్రయాణం
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని శివాజీచౌక్ నుంచి శివునిపల్లి అంబేడ్కర్ సెంటర్ వరకు ఉన్న రైల్వే ఫ్లైౖఓవర్పై లైట్లు వెలగకపోవడంతో అంధకారంగా మారింది. స్టేషన్ఘన్పూర్ నుంచి శివునిపల్లి, జఫర్గఢ్, ఐనవోలు, వర్ధన్నపేట, పాలకుర్తి తదితర ప్రాంతాలకు ప్రధాన మార్గంగా ఉన్న ఈ ఫ్లైౖఓవర్ బ్రిడ్జిపై కొద్ది రోజులుగా లైట్లు వెలగడం లేదని ప్రజలు వాపోతున్నారు. దాంతో ఈ ఫ్లైౖఓవర్పై రాత్రివేళ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఫ్లైౖఓవర్పై వెళ్లే వాహనదారులు భయంభయంతో నెమ్మదిగా వెళ్తున్నారు. గతంలో ఈరోడ్డుపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు సైతం అనేకం ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి లైట్లను వీలైనంత తొందరగా వేయించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. -
సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి
జనగామ: జిల్లాలో యాసంగి సీజన్లో పంటలకు తగినంత సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశం హాలులో పంటల పరిస్థితి, సాగునీటి వినియోగం, విద్యుత్ సరఫరా అంశాలపై నీటి పారుదల, ఎన్పీడీసీఎల్, వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి వనరులు, వినియోగ నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేసి అందించాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలన్నారు. సమావేశంలో డీఏఓ అంబికా సోనీ, నీటిపారుదల ఎస్ఈ సీతారాం, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవు.. జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ సందీప్ కుమా ర్ ఝా తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశం హాలులో డీసీపీ రాజమహేంద్ర నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, ఇతర సంబంధిత అధికారులతో కలిసి గ్యాస్ సరఫరాపై కలెక్టర్ గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ (డీఎల్ఈఎస్ఎంసీ) సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్ డిమాండ్కు అనుగుణంగా సంబంధిత ఏజెన్సీల వద్ద సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఆందోళన చెందవద్దు అని చెప్పారు. అక్రమ గ్యాస్ తరలింపుపై సమాచారం కోసం కలెక్టరేట్లో హెల్ప్లైన్ నెంబర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీసీపీ మాట్లాడుతూ.. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని తెలిపారు. సమీక్షాలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, జిల్లా పౌరసరఫరాల అధికారి సరస్వతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రవీందర్, హసీనా బేగం, విక్రమ్, డీఏఓ అంబికా సోనీ, డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు, డీడబ్ల్యూఓ కోదండరాములు, ఇతర సంబంధిత అధికారులు, గ్యాస్ డీలర్ల సంఘం అధ్యక్షులు, సభ్యులు, డిస్ట్రిబ్యూటర్లు,, తది తరులు పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవు సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
ఎవరికీపట్టని ‘సీఎంఆర్’!
సాక్షిప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైస్మిల్లును ఏడాది క్రితం డిఫాల్టర్ల జాబితాలో చేర్చారు. 2021–22, 2022–23 సంవత్సరాలకు సీఎంఆర్ కింద కేటాయించిన సుమారు రూ.7.50 కోట్ల విలువైన ధాన్యం ఎగవేయడమే ఇందుకు కారణం. డిఫాల్టర్ల జాబితాలో చేర్చి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసినా ఇప్పటికీ నూరు శాతం సీఎంఆర్ రికవరీ కాలేదు. హసన్పర్తి మండలంలోని ఓ రైస్మిల్లు నిర్వాహకులు 2,200 మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించాల్సి ఉంది. దాడులు, తనిఖీలు చేసి నోటీసులు జారీ చేయడంతో 1,300 మెట్రిక్ టన్నులు చెల్లించారు. ఇంకా 900 మెట్రిక్ టన్నులు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. .. ఇలా ప్రతీసారి కస్టం మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) దారి మళ్లుతోంది. వ్యాపారం, వృత్తి మీద నిబద్ధత ఉన్న సుమారు 75 శాతం మంది రైస్మిల్లర్లు సకాలంలో సీఎంఆర్ చెల్లిస్తున్నారు. కొందరు రాజకీయ పలుకుబడి, మరికొందరు అక్రమార్జన కోసం సీఎంఆర్ బకాయి పెడుతున్నారు. ఓ సీజన్కు చెల్లించాల్సింది మరో సీజన్కు ఇస్తూ.. కొందరు అధికారులను మేనేజ్ చేస్తూ సర్కారు ధాన్యంతో వ్యాపారం చేస్తున్నారు. కొందరైతే మొత్తానికే ఎగవేస్తున్నారు. సర్కారు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసి ‘రియల్’ వ్యాపారం చేస్తున్నారు. ఏటా రూ.కోట్ల విలువ చేసే ధాన్యం దారి మళ్లుతుండగా అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొంతమంది అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ వరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. స్కాం ఇలా వెలుగులోకి.. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని సివిల్ సప్లయీస్/మార్కెటింగ్ శాఖ ద్వారా రైస్ మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ధాన్యం తీసుకున్న తర్వాత మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వాలి. ఒప్పందం ధాన్యం మిల్లింగ్ చేసి సుమారు 67 శాతం బియ్యం ఎఫ్సీఐ/సివిల్ సప్లయీస్ గోదాములకు ఇవ్వాలి. ఇక్కడే అసలు స్కాం మొదలవుతుంది. కొంతమంది మిల్లర్లు ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ చేయరు.. లేదా కొంత మాత్రమే మిల్లింగ్ చేస్తారు. మిగిలిన ధాన్యాన్ని మార్కెట్ ధర ఎక్కువ ఉంటే ప్రైవేట్కు అమ్మేయడం, లేదంటే మరాడించి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారంలో ఫేక్ మిల్లింగ్ రికార్డులు, స్టాక్ రిజిస్టర్ మార్పులు చేసి తక్కువ బియ్యం చూపించడం.. బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగితే ధాన్యం తడిగా ఉండడం, మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్ సమస్యలను చెప్పి దాటవేయడం పరిపాటి. తీరా పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మిల్లుల్లో ఉన్న ధాన్యం, సరఫరా చేసిన బియ్యం లెక్కల్లో భారీ తేడా కనిపిస్తుంది. దీంతో సీఎంఆర్ బకాయిలు, పక్కదారి పట్టించిన స్కాంలు బయట పడుతున్నాయి. 33 మంది మిల్లర్ల నిర్లక్ష్యం 2021–22లో రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద రైస్మిల్లర్లకు సరఫరా చేశారు. ఆ ధాన్యానికి సంబంధించిన బియ్యం సరఫరా చేయడంలో ఉమ్మడి వరంగల్లోని 33 మంది మిల్లర్లు నిర్లక్ష్యం వహించారు. బియ్యం చెల్లించని వారికి పౌరసరఫరాలశాఖ నోటీసులు ఇచ్చింది. స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2023లో టెండర్లు నిర్వహించారు. అలా ఉమ్మడి వరంగల్లోని మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు.. తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. ఇంకా సుమారు రూ.107 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌర సరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా పౌర సరఫరాల శాఖ కమిషనర్కు కొందరు రైస్మిల్లర్లే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎంఆర్ బకాయిలు రాబట్టడంపై కొందరిపై కఠినంగా, మరికొందరిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్లో సీఎంఆర్ బకాయిలపై కమిషనర్ కార్యాలయం తాజాగా ఆరా తీయడం రైస్మిల్లర్లలో చర్చనీయాంశంగా మారింది. డిఫాల్టర్ రైస్మిలర్లపై చర్యలు లేవు.. వారి వద్దే కస్టం మిల్లింగ్ రైస్ నోటీసులకే పరిమితమైన రికవరీ.. ‘తిలా పాపం తలా పిడికెడు’లా పరిస్థితి మూడేళ్లు గడిచినా ఇంకా మౌనమే.. మిల్లర్ల వ్యాపారానికి సర్కారు ధాన్యం అధికారుల ఉదాసీనతపై కమిషనర్ సీరియస్.. మళ్లీ తెరపైకి బకాయిల వ్యవహారం -
రాములోరి కల్యాణానికి కోటి తలంబ్రాలు
బచ్చన్నపేట: మండలంలోని గోపాల్నగర్ గ్రామం నుంచి భద్రాచలంలో శ్రీరామ కల్యాణానికి కోటి తలంబ్రాలను గ్రామస్తులు పంపించారు. శనివారం భద్రాచలం ఆలయం నుంచి వచ్చిన స్వామి రామకోటి రామరాజుతో భద్రాచలం పంపించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. భద్రాచల ఆలయం వారు పంపించిన వడ్ల ప్యాకెట్లను తీసుకొని రామభక్తులు చేతితో ఒలిచి మళ్లీ ప్యాకెట్లలో పెట్టి కోటి తలంబ్రాలను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పేరబోయిన కళ్యాణి పర్షరాములు, ఉపసర్పంచ్ చింతల కర్ణాకర్, భక్తులు దొంతుల రాజు, కొత్తపల్లి కాశీపతి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేటకు ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులుజనగామ రూరల్: జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేటకు రెండు ఎక్స్ప్రెస్ బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ డీపో మేనేజర్ ఎస్.స్వాతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ నుంచి సిద్దిపేటకు 05:40, 07:10, 10:00, 11:10, 14:30, 14:40, 17:50, 18:20 గంటల వరకు, సిద్దిపేట నుంచి జనగామకు 07:45, 09:15, 12:15, 12:45, 16:10, 16:35, 19:45, 20:10 గంటల సమయాల్లో సర్వీసులు ఉంటాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. డిజిటల్ చెల్లింపులపై అవగాహనజనగామ రూరల్: మండలంలోని పెంబర్తి ఎంజేపీ మహిళ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థినుల ప్రత్యేక శిబిరం నిర్వహించారు. శనివారం గ్రామంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపుల ఉపయోగాలు, భద్రతా జాగ్రత్తలు, ఫోన్పే, గూగుల్ పే వంటి యాప్ల ద్వారా సులభంగా డబ్బులు పంపడం, స్వీకరించడం ఎలా అనే విషయాలను వివరించారు. నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్ లావాదేవీలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జ్యోత్స్న, విద్యార్థులు పాల్గొన్నారు. కోచ్ ఫ్యాక్టరీలో కొలువులివ్వాలి..కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీలో అయోధ్యపురం భూ నిర్వాసితులు, గ్రామస్తులకు, కాజీపేట పరిసర ప్రాంతాల వారికి, రైల్వే ఆక్ట్ అప్రెంటీస్ చేసిన వారికి, ఉమ్మడి జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అన్నారు. కాజీపేట రైల్వే ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవేందర్ మాట్లాడుతూ.. ఆదివారం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ ఎదుట రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో మహా నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. రైల్వే జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలని రైల్వే జేఏసీ చేపడుతున్న డిమాండ్లు నెరవేరే వరకు అందరి సహకారం ఉండాలన్నారు. కాజీపేట డివిజన్ కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని, రైల్వే జేఏసీ దీక్షను అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైల్వే జేఏసీ బృందం పాక వేద ప్రకాశ్, గుర్రపు సుధాకర్రావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
కమర్షియల్ సిలిండర్
జనగామ: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కస్టమర్లపై తీవ్రంగా పడింది. కమర్షియల్ సిలిండర్ల కొరత నాలుగు రోజులుగా కొనసాగుతుండటంతో హోట ల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాల కార్యకలాపాలు చాలా చోట్ల స్తంభించాయి. పరిస్థితి ఇంకా అలా గే కొనసాగితే గృహ వినియోగదారులకు కూడా సిలిండర్ల కొరత తప్పదన్న భయం నెలకొంది. బుకింగ్ల వెల్లువ, సర్వర్లు డౌన్ యుద్ధం కారణంగా ధరలు పెరుగుతాయనే ఆందోళన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అవసరమున్నా లేకున్నా అడ్వాన్స్గా గ్యాస్ కోసం బుకింగ్ చేస్తున్నారు. జనగామ పట్టణంలో రోజుకు 1,000 నుంచి 1,800ల బుకింగ్లు వస్తుండగా, మండలాల్లో 150 నుంచి 400 బుకింగ్లు నమోదవుతున్నాయి. సాధారణంగా జిల్లా కేంద్రంలో రోజువారీ బుకింగ్లు 300 నుంచి 400 మధ్యే ఉండేది. అయితే అత్యవసర భయంతో మూడు రెట్లు పెరగడంతో గ్యాస్ కంపెనీల సర్వర్లు కూడా నిలకడ కోల్పోతున్నాయని ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. బుకింగ్ చేసినా సిలిండర్ సమయానికి రాకపోవడంతో ప్రజలు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. కొరత లేదు.. ముందస్తు బుకింగ్లను చేయవద్దంటూ నిర్వాహకులు చెబుతున్నా వినియోగదారుల భయం తగ్గడం లేదు. ప్రస్తుతం జనగామ పట్టణానికి ప్రతి రోజు 524 సబ్సిడీ సిలిండర్లు వస్తుండగా, మండలాల వారీగా ఇంతే మొత్తంలో వస్తున్నాయి. బుకింగ్లు ఒక్కసారిగా పెరగడంతో కొరత ఉన్నట్టు కనిపిస్తోంది. జిల్లాలో కమర్షియల్ కనెక్షన్లు తక్కువ జిల్లాలో సబ్సిడీ సిలిండర్ల కనెక్షన్లు 1.60లక్షలు ఉండగా, కమర్షియల్ కనెక్షన్లు 378 మాత్రమే ఉన్నాయి. కానీ కమర్షియల్ సిలిండర్ల సప్లై నాలుగు రోజుల క్రితమే నిలిచిపోయింది. దీంతో కలెక్టరేట్లోని క్యాంటిన్ నిర్వాహకులు కట్టెల పొయ్యిలను ఉపయోగించి రోజువారీ కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాల్లో అయితే పరిస్థితి మరింత దారుణం. నాలుగు రోజులుగా కమర్షియల్ సిలిండర్లు లేకపోయినా, పలు హోటళ్లు వాటితో వ్యాపారం చేయడంపై గ్యాస్ ఏజెన్సీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ది గుమతి నిలిచిపోయిన కమర్షియల్ సిలిండర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. సబ్సిడీ గృహ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసి, వాటిని కమర్షియల్ సిలిండర్లలో రీఫిల్ చేస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఓఎస్డీ ప్రభాకర్, లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ తనిఖీలు చేపట్టారు. 18 హోటల్స్, టిఫిన్ సెంటర్లలో జరిగిన రైడ్స్లో 45 సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇకపై సబ్సిడీ సిలిండర్లను కమర్షియల్గా వాడితే కఠిన చర్యలు తప్పవని, జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు. వారి వెంట జనగామ అధికారులు ఇట్టబోయిన శ్రీనివాస్, లచ్చు నాయక్ ఉన్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదు. ఆందోళనతో ఒక్కసారిగా బుకింగ్ చేసుకుని, ఇంకా సిలిండర్లు సప్లై చేయడం లేదని మా వద్దకు వస్తున్నారు. రోజు వారీగా సిలిండర్లతో వచ్చే లోడ్ను వినియోగదారులకు ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నాం. కమర్షియల్ సిలిండర్ల సప్లై నాలుగు రోజుల క్రితమే నిలిచి పోయింది. సబ్సిడీ సిలిండర్ల కొరత ఏ మాత్రం లేదు. – కాశీ విశ్వనాథం, గ్యాస్ ఏజెన్సీ మేనేజర్, జనగామకమర్షియల్ సిలిండర్ సాధారణ ధర రూ.2,100 ఉండగా, ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లో రూ.2,500 నుంచి రూ.3,000 వరకు అమ్ముతున్నట్లు సమాచారం. ఇక సబ్సిడీ సిలిండర్లను కూడా కొందరు అదనపు ధరలకు కొనుగోలు చేసి, మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ప్రచారం ఉంది. ప్రస్తుత సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటున్న దళారులకు అధికారులు చెక్ పెట్టాల్సిన అవసరం పెరిగింది. ఇప్పటికిప్పుడు గృహ వినియోగదారులకు సబ్సిడీ సిలిండర్ల కొరత లేకున్నప్పటికీ, బుకింగ్లు విపరీతంగా పెరగటం, కమర్షియల్ మార్కెట్ ఇప్పటికే కుప్పకూలడంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే డొమెస్టిక్ సిలిండర్ సరఫరాపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దీంతో ముందే డబుల్ సిలిండర్ తీసుకుని నిల్వ చేసుకో వడానికి ప్రయత్నిస్తున్నారు. కట్టెల కొరత ప్రస్తుతం లేకున్నప్పటికీ, జిల్లాలో కర్రలు క్వింటాళుకు రూ.700 ధర పలుకుతోంది. పట్టణంలో రోజుకు వెయ్యి నుంచి 1,800 బుకింగ్లు నిలిచిన సప్లై.. బ్లాక్ మార్కెట్లో రూ.3వేలు..? 18 హోటళ్లపై విజిలెన్స్ రైడ్, 40 సిలిండర్ల సీజ్ గుట్టుచప్పుడు కాకుండా రీఫిల్లింగ్ దందా -
మున్సిపల్ ఎన్నికల ఖర్చులు చూపించండి
జనగామ: ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికల నేపథ్యంలో పోటీచేసిన అభ్యర్థులు ఎలక్షన్ల ఖర్చులు చూపించాలని జనగామ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి ఎలక్షన్ లెక్కల ఖర్చుల వివరాలను మున్సిపల్ కార్యాలయంలో అబ్జర్వర్కు ఈ నెల 29 వరకు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానంజనగామ: జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా జనగణన–2027 విధులకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కనీసం 4 సంవత్సరాలు వరుసగా జనగామ జిల్లాలో చదివి ఉండడంతో పాటు స్టడీ సర్టిఫికెట్ తప్పనిసరి అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను జతపరిచి, కలెక్టరేట్లోని రెండో అంతస్థు 29వ నెంబర్లోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషిజనగామ రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సంస్థ నిరంతరం కృషి చేస్తుందని విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి అన్నారు. శుక్రవారం మండలంలోని పెంబర్తి ఓల్డ్ సబ్స్టేషన్ కార్యాలయ ఆవరణలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈసందర్భంగా విఽనియోగదారుల నుంచి 22 దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ సంపత్రెడ్డి, డీఈ లక్ష్మినారాయణరెడ్డి, ఎస్ఏఓ సుదర్శన్రావు తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఏటీఎంఏ, బీఎఫ్ఏసీ సభ్యుల ఎంపికజనగామ: మండల స్థాయిలో అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఏటీఎంఏ) పథకం కింద బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ (బీఎఫ్ఏసీ), (డీఎ్ఫ్ఏసీ) సభ్యుల ఎంపిక కోసం అర్హులైన ప్రగతిశీల రైతుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏటీఎంఏ 2025–26 మార్గదర్శకాల ప్రకారం మండల స్థాయిలో రైతుల అవసరాలు, సమస్యలు, సూచనలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు బీఎఫ్ఏసీ కమిటీ ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. ఈ కమిటీ ద్వారా బ్లాక్స్థాయి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, రైతుల భాగస్వామ్యం పెంపొందుతుందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో (పాడి, ఉద్యానవన పంటలు, మత్స్య పరిశ్రమ, పట్టు పరిశ్రమ, ప్రకృతి వ్యవసాయం) అనుభవం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల రైతు లు తమ దరఖాస్తులను సంబంధిత మండల వ్యవసాయ అధి కారి (ఎంఏఓ) కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ లోపు సమర్పించాలని కోరారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు జిల్లా పోర్టల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. -
విజయీభవ!
జనగామ: జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 (శనివారం) నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. విద్యార్థులు కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ అవుతుండగా, విజయోస్తు అంటూ అధికారులు, ఉపాధ్యాయులు దీవిస్తున్నారు. విద్యలో ఉన్నతి సాధించే ఈ కీలక దశలో విద్యార్థులు ఎలాంటి టెన్షన్, ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో జిల్లా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని జిల్లా విద్యాశాఖ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. ప్రత్యేక తరగతులు, రిమైండర్ క్లాసులతో విద్యార్థుల్లో నమ్మకం పెంపొందించారు. జిల్లాలో విద్యార్థుల హాజరు, సెంటర్ల వివరాలు జిల్లాలో 183 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉండగా, పదో తరగతి పరీక్షలకు 6,645 మంది హాజరు కానున్నారు. కాగా ఒకేషనల్ పరీక్షల కోసం 713 మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 39 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో సెంటర్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు భద్రత నిమిత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కఠిన నియంత్రణ...సెల్ఫోన్లకు నో పరీక్ష కేంద్రంలో విద్యార్థులు మాత్రమే కాదు, పర్యవేక్షణలో ఉన్న అధికారులు కూడా సెల్ఫోన్లు తీసుకురావడం నిషేధం. ప్రశ్నపత్రాలను పోలీస్ ఎస్కార్ట్తో ఉదయం పరీక్షలకు ముందు సెంటర్లకు తరలించనున్నారు. ప్రస్తుతం అన్ని పోలీస్ స్టేషన్లలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాల బండిల్ను ఓపెన్ చేస్తారు. పరీక్షా సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, ఫిజిక్స్, బయాలజీ (సైన్స్) 9.30 నుంచి 11.00 వరకు జరుగనుంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 15న ఒకేషనల్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11.00 వరకు జరుగుతాయి. పోలీస్, విద్యాశాఖ ఏర్పాట్లు పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రాలు, మార్గాలు అన్ని పర్యవేక్షణలో ఉంటాయి. విద్యాశాఖ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్షల పరిస్థితిని నిరంతరం పరిశీలించనున్నారు.పాఠశాలలు 183 (ప్రభుత్వ, ప్రైవేటు) సెంటర్లు 39 విద్యార్థులు 6,445 ఒకేషనల్ విద్యార్థులు 713 నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ 39 సెంటర్లలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్.. జిరాక్స్ సెంటర్ల మూసివేత -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
జనగామ రూరల్: ఫిబ్రవరి 25వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారంతో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ముగిశాయని పరీక్షల నిర్వహణకు సహకరించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా, పోలీసు అధికారులకు, ఇతర శాఖల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా చివరి రోజు పరీక్షకు 77 మంది గైర్హాజరయ్యారన్నారు. జనరల్లో 3,085 మందికి గాను 3,044 మంది హాజరుకాగా 41 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్లో 576 మందికి 540 మంది హాజరుకాగా 36 మంది గైర్హాజరయ్యారన్నారు. -
ఘన్పూర్ అభివృద్ధికి రూ.63కోట్ల బడ్జెట్
● ప్రజాప్రతినిధులందరూ బాధ్యతగా పనిచేయాలి ● మున్సిపాలిటీ తొలి వార్షిక బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అధ్యక్షతన 2026–27 వార్షిక బడ్జెట్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కడియం మాట్లాడు తూ.. బడ్జెట్ అంచనాలపై చర్చించారు. 2026–27 సంవత్సరానికి గాను రూ.63,33,70,000ల బడ్జెట్ అంచనాలను పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారన్నారు. పట్ణణ కేంద్రంలోని బస్టాండ్ సమీపాన ఉన్న శ్రీతిరుమలనాథస్వామి దేవస్థాన భూమిని లీజుకు తీసుకుని అందులో మార్కెట్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయగా. పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. అదేవిధంగా పట్ట ణ కేంద్రంలోని పార్కును అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని, వక్ఫ్బోర్డు ఆధీనంలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని లీజుకు తీసుకునేలా తీర్మానాలు చేసినట్లు తెలిపారు. నిధుల వినియోగంపై ప్రశ్నించిన బీఆర్ఎస్ సమావేశంలో బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు బూర్ల రాజేశ్వర్, పొన్న రాజశేఖర్, అనీల్గౌడ్, తాటికొండ మధు, చల్లా రమ్యరఘురెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి వచ్చిన నిధుల వినియోగంపై ప్రశ్నించారు. మున్సిపాలిటీకి వచ్చిన రూ.50 కోట్ల నిధులలో ఇప్పటివరకు ఎక్కడెక్కడ టెండర్లు పిలి చారు, ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, పెండింగ్లో ఏమి ఉన్నాయి.. తదితర వివరాలు తెలుపాలని కోరారు. కాగా ఏఈ ద్వారా కౌన్సిలర్లకు వివరాలను అందించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాక్రిష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధికి అందరూ సహకరించాలి నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేలా అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా సహకరించాలని మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. పన్నుల విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, మున్సిపల్ పాలక మండలి తీర్మానం మేరకు పేదలపై పెద్దగా ఆర్థిక భారం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
పాలకుర్తి టౌన్: రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణను కూడా అభివృద్ధి చేసి ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. పశువైద్యం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అయ్యంగారిపల్లిలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిఽథిగా పాల్గొని ప్రారంభించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పశువులకు టీకాలు వేయించుకోవాలన్నారు. కల్టెకర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ.. పశువైద్యశాఖ అధికారులు గ్రామాల వారీగా టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి మురళీ, విజయ డైయిరీ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ సింగ్, సర్పంచ్ ముస్కు సుధాకర్, తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ వేదవతి, పశువైద్యాధికారి అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
మూడున్నర కిలోమీటర్లు వెళ్లి తీసుకోవాలి
ప్రతి నెల మూడున్నర కిలోమీటర్లు వెళ్లి రేషన్ బియ్యం తీసుకోవాల్సి వస్తోంది. తండాలో 80 మందికి పైగా రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరంతా ప్రతినెల కిష్టగూడెం వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో వర్షాకాలం వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నాం. – ధరావత్ సురేందర్. డీకే తండా వాసిఎన్నో ఏళ్ల నుంచి రేషన్ సరుకుల కోసం మా తండా నుంచి టీబీ తండా వద్ద ఉన్న రేషన్ షాపునకు సుమారు రెండున్నర కిలోమీటర్లు పోవాల్సి వస్తోంది. తాము ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. – బాదావత్ రాజు, రేగడి తండా గ్రామ నివాసి -
పక్కూరికెళ్తేనే ‘రేషన్’
జనగామ రూరల్: పరిపాలన సౌలభ్యంకోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. కానీ అక్కడ ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో సమస్యలు పరిష్కారం కాక తిష్ఠవేసుకొని ఉన్నాయి. ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులు తీసుకునే అవకాశం లేక కిలో మీటర్ల మేర ఇతర గ్రామాలకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. కొత్త జీపీలకు రేషన్ షాపులు ఇప్పటి వరకు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దివ్యాంగులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నూతన జీపీలకు రేషన్ షాఫులు కరువు.. జిల్లాలో 281 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో పాతవి 190, నూతనంగా 91 జీపీలు ఏర్పాటు అయ్యాయి. వాటిలో కొన్ని రేషన్ షాపులు ఏర్పాటు కాగా ఇంకా చేయాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 335 రేషన్ షాపులు ఉండగా వాటిలో 1,86,294 కార్డులు ఉన్నాయి. కాగా కొత్తగా 24 దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. నూతనంగా ఏర్పడిన జీపీల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో రేషన్ షాపుల పరిస్థితి 500 జనాభా ఉన్న వాటికి కొత్తగా రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలి. కాని ప్రభుత్వ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. జనగామ మండలంలోని పెద్దతండా (ఎం), పెద్దతండా (వై) తండాల వారు మరిగడి, ఎర్రగొల్లపహడ్కు వెళ్లి తీసుకోవల్సిన పరిస్థితి ఉంది. అలాగే జఫర్గఢ్ మండలంలోని ముగ్థాంతండా, దరాగ్యతండా, లక్ష్మి నాయక్ తండా, ఏంబీ తండాలు నూతనంగా ఏర్పాటయ్యాయి. తండాల వారు రేషన్ కోసం రేగడితండాకు వెళ్లాల్సి ఉంది. మాసిరెడ్డిపల్లి వారు 7 కిలోమీటర్లు ఉప్పుగళ్లుకు వెళ్లి తీసుకుంటున్నారు. తరిగొప్పుల మండలంలోని జాలుబాయి తండా ప్రజలు బొంతగట్టు నాగారానికి వెళ్తున్నారు. లింగాల ఘణపురం మండలంలోని రామచంద్రాగుడెం ప్రజలు జీడికల్కు, చిక్కుడుగూడెం ప్రజలు నాగా రం గ్రామానికి, మంధొని గూడెం ప్రజలు మాణిక్యపూరానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చిల్పూర్ మండలంలో యాపలతోడు తండా పంచంగాల తండా, దేవోజీ తండా, రత్న నాయక్ తండా ప్రజలు లింగంపెల్లికి రేషన్ సరుకుల కోసం వెళ్లాల్సి వస్తోంది. బచ్చన్నపేట మండలం వీఎస్ఆర్నగర్ వాసులు కట్కూర్కు వెళ్తున్నారు. లక్ష్మిపూర్ గ్రామస్తులు బండనాగారానికి, కొడకండ్లలో రాగ్యానాయక్ తండా, గుమ్ముల బండ తండా, కడగుట్టతండా, బోదతండా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు మూడు కిలోమీటర్లు వెళ్లి తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఆటో కిరాయి తీసుకోని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు చొరవ తీసుకుని కొత్త జీపీల్లో రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త గ్రామపంచాయతీల్లో షాపులెక్కడ? తీరని సమస్య..కిలోమీటర్ల ప్రయాణం జిల్లాలో 281 జీపీలు, 1,86,294 రేషన్కార్డులు కొత్తగా ఏర్పడాల్సిన షాపులు 24 -
గ్యాస్ సరఫరాపై అపోహలు వద్దు
జనగామ: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై వినియోగదారులు గందరగోళం చెందుతున్న దృష్టా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే పరిస్థితుల్లో ప్రచారంపై అధికార యంత్రాంగం అ ప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ కొరత లేదన్నారు. జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి, గ్యాస్ నిల్వలు, సరఫరా మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామన్నారు. అసత్య ప్రచారాలను ఆసరాగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా సిలిండర్లను బ్లాక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజమహేంద్రనాయక్, వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్ సప్లై తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ -
ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
జనగామ రూరల్: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఫస్టియర్లో జనరల్ విభాగంలో 3,477మందికి గాను 3,425 మంది హాజరుకాగా 52 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 640 మంది విద్యార్థులకు గాను 592 మంది విద్యార్థులు హాజరుకాగా 48 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతగా ముగిశాయని డీఐఈఓ జితేందర్రెడ్డి తెలిపారు. తమకు సహకరించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా, పోలీస్ అధికారులకు, డిపార్ట్మెంట్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు పరీక్షలు ముగియడంతో వారి సొంతూళ్లకు తరలివెళ్లారు. చివరి రోజు 100మంది విద్యార్థుల గైర్హాజరు -
కిడ్నీల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి
జనగామ: కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల ప్రభుత్వరంగ ఆసుపత్రుల్లో చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని, కిడ్నీ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గురువారం ప్రపంచ కిడ్నీ దినో త్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, డాక్టర్ లక్ష్మినారాయణ, ఆర్ఎంఓ కోటాచలం, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ భిక్షపతి, నర్సింగ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి, హెడ్ నర్సులు విజయ నిర్మల, వెంకటరమణ తదితరుల ఆధ్వర్యంలో కేక్కట్ చేశారు. అనంతరం రాజలింగం సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. అనారోగ్యకర జీవనశైలి, నీటి వినియోగం తగ్గడం, మోతాదు లేని మందుల వాడకం కారణంగా కిడ్నీలపై ప్రభావం పడుతోందని తెలిపారు. షుగర్, బీపీ ఉన్నవారు తప్పనిసరిగా రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి నర్సులు, టెక్నీషియన్లు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం -
అధిక ధరలతో అవస్థలు..
నిత్యవసర ధరలు పెంచడంతో అవస్థ పడుతున్నాం. ఆర్థిక భారం పెరిగింది. మా కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, మనవళ్లతో కలుపుకుని 12 మందిమి ఉన్నాం. గ్యాస్, నూనె, పప్పుల ధరలు పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. నెలవారీగా వచ్చే ఆదాయానికి ధరలు రెట్టింపు కావడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది.యుద్ధంతో పేద, మధ్యతరగతిపై ఆర్థిక భారం పడుతోంది. మా కుటుంబంలో ఆరుగురు వ్యక్తులు ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మా ఇంట్లో నెలకు మూడు కిలోల నూనె అవసరం పడుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పేదల బతుకులు దుర్భరంగా మారుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ చేపట్టాలి. – మారేపల్లి ప్రసాద్, ప్రైవేట్ ఉద్యోగి, స్టేషన్ఘన్పూర్ -
ధరాఘాతం
యుద్ధప్రభావం..సలసలకాగుతున్న వంటనూనె ధరలు పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవుతున్నాయి. యుద్ధ ప్రభావం భారత్లోని ఇంధన, నిత్యావసర సరుకుల మార్కెట్పై పడుతోంది. దిగుమతి చేసుకునే సరుకుల రవాణా ఖర్చులు యుద్ధం కారణంగా పెరిగాయి. దీంతో పాటు పలు వస్తువులు పశ్చిమాసియా నుంచి రావాల్సి ఉండడం కూడా ధరల పెరు గుదలకు మరో కారణం. యుద్ధం మరింత కాలం కొనసాగితే ధరా భారం తీవ్రం కానుంది.జనగామ: ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగి గృహ బడ్జెట్కు భారంగా మారాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.114 వరకూ పెరగడం సాధారణ కుటుంబాలకు పెద్ద దెబ్బగా మారింది. వంటనూనెల ధరలు కూడా మండిపోతున్నాయి. సన్ఫ్లవర్, పామాయిల్ తదితర నూనెల దిగుమతులకు అంతరాయం కలగడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో లీటర్కు రూ.155 ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ప్రస్తుతం రూ.170కు చేరింది. 5 లీటర్ల క్యాన్ రూ.780 నుంచి రూ.880కూ, 15 లీటర్ల క్యాన్ రూ.2380 నుంచి రూ.2480 వరకు పెరిగాయి. పామాయిల్ ప్యాకెట్ ధర రూ.111 నుంచి రూ.120కు చేరింది. రైస్బ్రాన్ ఆయిల్లో లీటర్కు రూ.10 చొప్పున పెరుగుదల నమోదైంది. ఇతర నిత్యావసరాలపై కూడా.. ఒకవైపు నూనెల ధరలు పెరుగుతుండగా, మరోవైపు వెల్లుల్లి, పల్లీల ధరలు వినియోగదారులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కిలో పల్లీలు రూ.120 నుంచి రూ.165కు పెరగడం గమనార్హం. వెల్లుల్లి ధర రూ.120 నుంచి రూ.150కు ఎగబాకింది. దీంతో పల్లీల ఆధా రంగా తయారయ్యే అనేక ఉత్పత్తుల ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల మార్కెట్లో కూడా ధరల పెరుగుదల వేగం తగ్గడం లేదు. గ్యాస్ ఆధారిత తయారీ కావడంతో మినీ వాటర్ గ్లాసుల ప్యాకెట్ ధర రూ.25 నుంచి రూ.35, జంబో గ్లాసుల ప్యాకెట్ రూ.35 నుంచి రూ.60కు పెరిగింది. హ్యాండిల్ కవర్ల కిలో ధర రూ.120 నుంచి రూ.170, బిగ్ సైజ్ కవర్లు రూ.145 నుంచి రూ.220కు పెరగడం చిన్న వ్యాపారులను, రిటైల్ షాపులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. యుద్ధం కొనసాగుతున్నంతకాలం ధరలు ఇంకా ఎక్కడికి చేరతాయో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుండగా, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ తేదీలను పెంచడం కూడా కొరత భయాన్ని మరింత పెంచింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడంతో రాబోయే రోజుల్లో ధరలు స్థిరపడతాయా, సరుకుల కొరత మరింత పెరుగుతుందా అనే అంశాలపై వినియోగదారులు, వ్యాపార వర్గాలు తీవ్ర అనిశ్చితిలో ఉన్నారు.– సిరిపాటి రాందాస్, గోపాల్నగర్, బచ్చన్నపేట వెల్లుల్లి, పల్లి, ఇతర నిత్యావసర సరుకులది అదే తీరు దిగుమతి వస్తువులపై రవాణా భారమే కారణం ప్లాస్టిక్ ఉత్పత్తుల ధరలు కూడా పెంపు పేద, మధ్యతరగతి ప్రజలకు భారంవస్తువు గత ధర ప్రస్తుతం ధర పెరిగిన ధర సబ్సిడీ సిలిండర్ రూ.907.50 రూ.957.50 రూ.60 కమర్షియల్ సిలిండర్ రూ.1,997 రూ.2,111 రూ.114 సన్ఫ్లవర్ ఆయిల్ (1 లీ.) రూ.155 రూ.170 రూ.15 సన్ఫ్లవర్ క్యాన్ (5 లీ.) రూ.780 రూ.880 రూ.100 సన్ఫ్లవర్ క్యాన్ (15 లీ.) రూ.2380 రూ.2,480 రూ.100 రైస్బ్రాన్ ఆయిల్ (1 లీ.) రూ.160 రూ.175 రూ.10 పామాయిల్ ప్యాకెట్ రూ.111 రూ.120 రూ.09 పల్లీలు (1 కిలో) రూ.120 రూ.165 రూ.45 వెల్లుల్లి (1 కిలో) రూ.120 రూ.150 రూ.30 -
ఏ జిల్లా శిశుగృహ ఆ జిల్లాలోనే ఉండాలి
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకటే శిశుగృహ ఉండడంతో దత్తతలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏ జిల్లాకు చెందిన శిశుగృహ ఆ జిల్లాలోనే ఉంటే ఇలాంటి సమస్యలు రావని అందరు సమన్వయంతో ముందుకెళ్లవచ్చని హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి అభిప్రాయపడ్డారు. ‘సమన్వయ లోపం.. శిశువులకు పాపం’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న అక్రమ దత్తత కేసులు తొందరగా పరిష్కారమైతే ఐదుగురు శిశువుల దత్తత ప్రక్రియ త్వరగా ముగుస్తుందన్నారు. శిశువుల దత్తతలో ఆలస్యమవడానికి గల కారణాలను లోతుగా పరిశీలించి జిల్లా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. హనుమకొండలోని శిశుగృహలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 13 మంది శిశువులు ఉంటే 10 మంది అక్రమ దత్తత, డీఎన్ఏ పెండింగ్, కిడ్నాప్ కేసుల వల్ల దత్తత వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నారు. దీంతో నాలుగు గోడల మధ్యే ఉండాల్సిన పరిస్థితి ఉందని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడే దత్తత సమస్యలు త్వరగా పరిష్కారం హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి -
సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
శిక్షణకు హాజరైన ప్రజాప్రతినిధులు, కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝాజనగామ రూరల్: ప్రజాపాలనలో సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని కళ్లెం రోడ్డులో గల శ్రీ భక్తమార్కండేయస్వామి, పద్మశాలి కల్యాణ మండపంలో జిల్లాలో నూతనంగా ఎన్నికై న ప్రజా ప్రతినిధులకు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా పది అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయా శాఖలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి నిర్వహణ, ఆరోగ్యం, గృహ నిర్మాణం వంటి కార్యక్రమాలను నిరంతం చేపట్టాలన్నారు. ముఖ్యంగా పది అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని వ్యవసాయం పద్ధతులు, పరికరాల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల బలో పేతం, పర్యావరణం, నీటి సంరక్షణ, గ్రామీణ క్రీడలు, మహిళ సంక్షేమ పథకాలు, వడ్డీలేని రుణాలు, గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ..ప్రతీ ఒక్కరు క్షేమంగా ఇంటికి చేరాలంటే కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలను అరికట్టడంలో అందరి భాగస్వామ్యం ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ చేసి, అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, జనగామ మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ బూష పర్వతాలు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీలరాజమ్మ, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజాప్రతినిధులకు ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’పై శిక్షణ -
నేడు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
జనగామ: జనగామ, బచ్చన్నపేట మండలాల పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని వాటికి తక్షణ పరిష్కారం చూపే లక్ష్యంతో ఎన్పీడీసీఎల్ శాఖ వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 13న (శుక్రవారం) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఫోరం చైర్పర్సన్ ఎన్వీ వెంకటగోపాలచారి గురువారం తెలిపారు. జనగామ మండలం పెంబర్తి ఓల్డ్ సబ్స్టేషన్ కార్యాలయ ఆవరణలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశంలో వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను రాతపూర్వకంగా సమర్పించవచ్చన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, ఓల్టేజి హెచ్చుతగ్గులు, లోపాలు ఉన్న మీటర్ల మార్పు, కొత్త సర్వీసుల మంజూరు తదితర సమస్యలను వినియోగదారులు తమ దృష్టికి తీసుకు రావచ్చన్నారు. కృత్రిమ మేధానైపుణ్యాలను పెంపొందించుకోవాలికేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో నిలవాలంటే కృత్రిమ మేధా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్రెడ్డి కోరారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం రూసా 2 ప్రాజెక్టు కింద రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్లు ఎన్.రమణ, కెభిక్షాలు, డాక్టర్ ఆసిం ఇక్బాల్, మహేందర్తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా దశమంత్రెడ్డిజనగామ: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకులు ఆరుట్ల దశమంతరెడ్డిని నియమిస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కార్యకలాపాలను ప్రజలకు చేరవేయడం, పార్టీ అభిప్రాయాలను సమర్థవంతంగా ప్రతిబింబించడం వంటి కీలక బాధ్యతలు రాష్ట్ర అధికార ప్రతినిధులపై ఉంటాయని ఆయన తెలిపారు. మిర్చి యార్డులో దడవాయిల జీరో దందావరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డులో కొంతమంది దడవాయిలు జీరో దందా యథేచ్ఛగా సాగిస్తున్నట్లు వెలుగుచూసింది. బుధవారం వచ్చిన మిర్చికి పలికిన ధరలను మార్కెట్ అధికారులు ఆన్లైన్లో పరిశీలించగా కొంతమంది రైతుల సరుకులకు సగం ధరలు పలికినట్లు వెల్లడి కావడంతో ఈ దందా వెలుగు చూసింది. ఇందుకు కారణమైన దడవాయిలు తూర్పాటి రమేష్, నిమ్మాని నాంపల్లి, ఆకుతోట సతీష్లకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేషం నోటీసులు జారీ చేసి గురువారం వీరికి డ్యూటీలు వేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. దందా కొన్నేళ్లుగా సాగుతున్నట్లు మార్కెట్లో చర్చించుకుంటున్నారు. -
వనిత టీ డబ్బాలు తొలగించొద్దు
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో సూర్యాపేట రోడ్డు ఏరియాలోని బతుకమ్మకుంట జంక్షన్ ప్రాంతంలో గత కలెక్టర్ ప్రారంభించిన వనిత టీ స్టాల్ తొలగింపునకు సంబంధించి గురువారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ ప్రహరీ వెంట ఉన్న విజయ డెయిరీ ప్రోడక్ట్స్, టీస్టాల్ను తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ రెడ్డితో కలిసిరాగా నిర్వాహకులు ఆందోళనకు దిగారు. వాటిని తొలగించవద్దని బాధితులు అడ్డుకున్నారు. డీఆర్డీఏ ద్వారా రూ.3 లక్షల రుణం తీసుకొని ఏర్పాటు చేశామని దీనిని గత కలెక్టర్ ప్రారంభించగా ఇప్పుడు ఎలా తొలగిస్తున్నారని ఆవేదన చెందారు. తాము తీసుకున్న రుణం తిరిగి చెల్లించి డబ్బాను తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గంటసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, సీపీఎం నాయకులు మద్దతు పలకగా కమిషనర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఆన్లైన్లో ఆర్టీఏ సేవలు
ఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆర్టీఏ సేవలన్నీ వందశాతం ఆన్లైన్లోకి తెచ్చింది. శుక్రవారం నుంచి పేపర్ రహిత సేవలను పక్కాగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ అధికారులు కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. జనవరి 24 నుంచి వాహనాలు విక్రయించిన షోరూంలలోనే నాన్ ట్రాన్స్పోర్ట్ వాహన రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విధానాన్ని రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ సురేశ్రెడ్డి పర్యవేక్షణలో ఆరు జిల్లాల షోరూం డీలర్ల వద్ద తాత్కాలిక, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దరఖాస్తుల సమర్పణ ఆన్లైన్లోనే.. వాహనాల శాశ్వత నమోదు కోసం షోరూం డీలర్ల వద్ద దరఖాస్తుల సమర్పణకు బదులుగా వందశాతం పేపర్ రహిత ఆన్లైన్ విధానం అమలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీలర్లు.. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ –20 (ఫైనాన్షియర్ సంతకం అవసరమైతే), ఇతర పేపర్ ఆధారిత ప్రతాలను స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సంబంధిత ఆర్టీఏ కార్యాలయాలకు పంపిస్తున్నారు. ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్లు రవాణాశాఖ గుర్తించింది. అన్ని పత్రాలు స్కాన్ చేసి ఆన్లైన్ పంపిస్తే అధికారులు పరిశీలించి ఆదే రోజు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయింపుతోపాటు కార్డు జారీకి ఆదేశాలు వెళ్లనున్నాయి. నేటినుంచి పేపర్రహిత సేవలు .. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో, షోరూం డీలర్లకు ఫామ్ 20, ఇతర పేపర్ పత్రాలను నేరుగా సమర్పించే విధానాన్ని పూర్తిగా రద్దు చేసి శుక్రవారం ఉదయం నుంచి వాహన షోరూంలో జరిగే తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) వాహనాలకు, డీలర్లు ఫామ్ –20, ఇతర పత్రాలు స్కాన్ కాపీలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాహనం తీసుకోగానే పత్రాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసే బాధ్యత డీలర్లదే. తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని డీటీసీ సురేశ్రెడ్డి స్పష్టం చేశారు. నేటినుంచి వందశాతం పేపర్ రహిత సేవలు ఫామ్20, ఇతర పత్రాలు నేరుగా సమర్పించే విధానం రద్దు పత్రాలన్నీ స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిందే.. ఆర్టీఏ కార్యాలయాల్లో పక్కాగా అమలుకు నిర్ణయంవాహన షోరూం డీలర్ నుంచి ఆర్టీఏ కార్యాలయానికి ఆన్లైన్లో పంపించిన దరఖాస్తులను రెండు పనిదినాల్లో అధికారులు పరిశీలించి ఆమోదం లేదా రివ్యూ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. డీలర్ల వద్ద 7రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్లో ఉంచకూడదు. ఉల్లంఘన జరిగితే వారి లాగిన్ నిలిపివేస్తారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. డీలర్లు అందరూ ఆన్లైన్ సేవలను వినియోగించుకుని, వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఫామ్ 20, ఇతర పత్రాలను ఆన్లైన్ విధానంలోనే సమర్పించాలి. – సురేశ్రెడ్డి, డీటీసీ -
విద్య, వైద్య రంగాల పురోగతితోనే సమాజ అభివృద్ధి
దేవరుప్పుల: విద్య, వైద్య రంగాల పురోగతితోనే సమాజ అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని సింగరాజుపల్లిలో ఆకస్మికంగా పర్యటించి పలు సూచనలు చేశారు. తొలుత ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల నిర్వహణ, 6, 8, 9, 10వ తరగతి గదుల్లో జరుగుతున్న బోధన విధానాన్ని గమనించి, విద్యార్థులతో మాట్లాడారు. టెన్త్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను పరీక్షించారు. గణితం, జీవ శాస్త్ర పాఠాలను బోధించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, తాగునీరు, పరిశుభ్రత వంటి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల నిల్వ, టీకా కార్యక్రమాల అమలు వంటి అంశాలను సమీక్షించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, చిన్నపిల్లలకు అవసరమైన టీకాలు సమయానికి ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల హాజరు, పౌష్టికాహార పంపిణీ, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తాగునీటి ట్యాంకు పరిసర ప్రాంతంలో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వీధులు, డ్రెయినేజీలు, చెత్త నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీపీఓ వసంత, హౌసింగ్ పీడీ మాతృ నాయక్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్ కొండ ఊర్మిళమల్లారెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా సింగరాజుపల్లిలో ఆకస్మిక పర్యటన -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జనగామ రూరల్: పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ బెన్షాలోపమ్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, స్టాక్ రిజిస్టర్లు రైస్, ఆయిల్, పప్పు తదితర సరుకులు, స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యమైన సరుకులనే భోజన తయారీకి వినియోగించాలని ప్రిన్సిపాల్, వార్డెన్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల అభివృద్ధికి చర్యలు
నర్మెట/బచ్చన్నపేట: గ్రామ పంచాయతీల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ సీనియర్ కన్సల్టెంట్ సంత్దీప్ సింగ్ అన్నారు. ఉత్తమ పంచాయతీల ఎంపికలో భాగంగా బచ్చన్నపేట మండలంతోపా టు, నర్మెట మండలంలోని కన్నెబోయినగూడెం జీపీ కార్యాలయం, మండల పరిషత్ కా ర్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో 20 23–24 రికార్డులు, అభివృద్ధి పనులను పరిశీ లించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్పీఎం ఇ–పంచాయతీ సీపీఆర్ రాజయ్య, జెడ్పీ సూపరింటెండెంట్ ఉ మామహేశ్వరి, ఇన్చార్జ్ ఎంపీడీఓ వెంకట మ ల్లికార్జున్, సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ మ ధు, కార్యదర్శి విద్యాసాగర్, ఆర్ఐ సింగారపు సాయిబాబా, తదితరులు ఉన్నారు. ఎలుగుబంటి సంచారం! రఘునాథపల్లి: మండలంలోని కంచనపల్లి శివారులో కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మొక్కజొన్న, వేరుశనగ పంటలను వన్యప్రాణుల నుంచి రక్షించుకోవడానికి రాత్రి సమయంలో పంట పొలాల వద్దకు వెళ్తున్నారు. బుధవారం తెల్లవారు జామున మొక్కజొన్న చేనులో ఎలుగుబంటిని గుర్తించిన రైతులు బెంబేలెత్తిపోయారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేయాలని రైతులు కోరుతున్నారు. వినియోగదారుల ఆందోళన జనగామ రూరల్: పెట్రోల్కు బదులు బంక్లో నీళ్లు వచ్చాయని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళనకు దిగిన ఘటన బుధవారం రాత్రి పట్టణంలోని ఆర్టీసీ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లాకేంద్రంలోని కాంప్లెక్స్లో నడుస్తున్న పెట్రోల్ బంక్లో వినియోగదారుడు లక్కాకుల ప్రసాద్ తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకుని సుమారుగా 200 మీటర్లు వెళ్లే సరికి బైక్ ఆగిపోయింది. దీంతో మెకానిక్ వద్దకు వెళ్తే అసలు విషయం బయటపడింది. పెట్రోల్ తీసి చూసేసరికి వాటర్ లాంటి పదార్థం బయటకు రావడంతో అవాక్కయ్యారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు సమాచారం అందించగా వారు వచ్చి నిర్ధారణ కోసం పరీక్షలకు పంపినట్లు తెలిపారు. గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా పలు రకాల సేవల ద్వారా రూ.21,44,433 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ ప్రసాద్, ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్రెడ్డి, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. బుధవారం హుండీల లెక్కింపు చేపట్టగా గతనెల 27 నుంచి ఈనెల 11 వరకు వివిధ సేవల ద్వారా ఆదాయం సమకూరిందన్నారు. -
గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026
జనగామ రూరల్: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ రుణాలు అందిస్తుంది. మహిళలు స్వయం ఉపాధితో ఎదిగేలా అండగా నిలుస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 8,609 స్వయం సహాయక సంఘాలకు రూ.46,034 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే రూ.42,163 కోట్ల రుణాలు మహిళా గ్రూపులకు అందించారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం మరో 19 రోజులు మిగిలి ఉండగా రూ.30 కోట్ల వరకు రుణాలు ఆయా సంఘాలకు అందించాల్సి ఉంది. సగటున రోజూ కోటిన్నర చొప్పున రుణాలు అందజేస్తే లక్ష్యం చేరుకుంటారు. 91.59 శాతం పూర్తి చేయగా వందశాతం లక్ష్యం సాధించే విధంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. మొదటి స్థానంలో నర్మెట జిల్లాలోని 12 మండలాల్లో రెండు మండలాలు వందశాతం లక్ష్యం పూర్తి కాగా లక్ష్యానికి మించి రుణాలు ఇవ్వగా, మిగతా 8 మండలాల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అత్యల్పంగా దేవరుప్పుల మండలం 44.38 శాతం, జఫర్గఢ్ 44.91 శాతం, కొడకండ్ల 56.03 శాతంతో రుణ మంజూరులో వెనుకబడి ఉన్నాయి. మొదటి స్థానంలో నర్మెట మండలం 112.61 శాతం, బచ్చన్నపేట మండలం 103శాతం రుణాలు మంజూరు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 19 రోజుల్లో గడువు ముగియనుంది. లక్ష్యాన్ని సాధించే దిశగా ఆయా మండలాల సెర్ప్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకులను సంప్రదిస్తూ మిగతా సంఘాలకు రుణాలు మంజూరు చేసేలా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా వందశాతం లక్ష్యాన్ని సాధించాలని వెనుకబడిన మండలాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి లక్ష్యం చేరుకోనేలా కృషి చేస్తున్నారు.మొత్తం ఎస్హెచ్జీలు, లక్ష్యం, అందించిన రుణాలురూ. 46,034.43 కోట్లురూ. 42,163.06 కోట్లు8,069ఎస్హెచ్జీలుఅందించిన రుణాలులక్ష్యం -
మళ్లీ జనగణన
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశవ్యాప్తంగా త్వరలో జనగణన చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనాభా వివరాలపై మళ్లీ చర్చ మొదలైంది. చివరిసారిగా 2011లో జరిగిన జనగణనలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం జనాభా 35,12,576గా నమోదైంది. వాస్తవానికి మళ్లీ 2021లో జనగణన చేపట్టాల్సింది. కరోనాతో అది జరగలేదు. అప్పటి నుంచి 15 ఏళ్లలో జనాభా గణనీయంగా పెరిగినట్లు అంచనాలు చెబుతున్నాయి. అధికారిక గణాంకాలు వెలువడితే ఉమ్మడి జిల్లాలో జనాభా 38 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత మొదటిసారి.. ఉమ్మడి వరంగల్ను హనుమకొండ, వరంగల్ , జనగామ, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలుగా విభజించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జరగనున్న ఇది మొదటి పూర్తిస్థాయి జనగణన కావడం విశేషం. కాగా, కొత్త జిల్లాల వారీగా మొదటి పూర్తి డేటా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ జనగణనలో ప్రతి జిల్లాకు విడిగా పూర్తి గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందనుంది. దశాబ్దంలో పెరిగిన పట్టణీకరణ.. 2011 గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత దశాబ్దంలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. ముఖ్యంగా వరంగల్–హనుమకొండలో జనాభా పె రుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధి కారులు భావిస్తున్నారు. పట్టణాలకు వలసలు, వి ద్య అవకాశాలు, పరిశ్రమలు, ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడమే ఇందుకుకారణమని చెబుతున్నారు. డిజిటల్గా జనగణన.. జనగణన ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా కాగితపు దరఖాస్తుల స్థానంలో సర్వేయర్లు మొబైల్ యాప్ల ద్వారా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. దీంతో డేటా సేకరణ వేగంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. జనగణనలో ప్రతి ఇంటి కుటుంబ వివరాలు, విద్యస్థాయి, ఉద్యోగం, గృహ పరిస్థితులు తదితర అంశాలను నమోదు చేస్తారు. కొత్తగా ఆన్లైన్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసే అవకాశం కూడా కల్పించే యోచన ఉంది. కాగా, సర్వేలో ఇల్లు, కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు, లింగం, విద్యస్థాయి, ఉద్యోగం/వృత్తి, ఇల్లు సొంతమా అద్దెనా, తాగునీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు.. తదితర 33 ప్రశ్నలతో వివరాలు సేకరించనున్నారు. రెండు విడతల్లో జనగణన సర్వే జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు.. ఎన్యుమరేటర్లకు శిక్షణ ఉమ్మడి వరంగల్లో పకడ్బందీగా జనగణన చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ దశ 11 మే 2026న ప్రారంభమై 9 జూన్ 2026 వరకు కొనసాగుతుంది. రెండో దశలో జనాభా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహిస్తారు. 1 మార్చి 1 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు. కాగా, రెండు విడతల్లో చేపట్టే జనగణనలో ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది సర్వేయ ర్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ మంగళవారం నుంచి మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా రెవెన్యూ అధికారి, డీ ఎఫ్ఓ, ఆర్డీఓలు, వరంగల్ మహానగర పాలకసంస్థ, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటున్నారు.అక్షరాస్యత 65.11% గ్రామీణ జనాభా 71.7% పట్టణ జనాభా 28.3%కరోనాతో వాయిదా.. 15 ఏళ్ల తర్వాత త్వరలో శ్రీకారం కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మొదటిసారి వివరాల నమోదు ఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా 38 లక్షలు దాటే అవకాశం పట్టణీకరతో వరంగల్, హనుమకొండలో జనాభా భారీగా పెరుగుదల -
స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలోనే బ్లాక్డే
స్టేషన్ఘన్పూర్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలోనే బ్లాక్డేగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం ఘన్పూర్లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం ఏకపక్షంగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో స్పీకర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అప్పుడే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే రానున్న రోజుల్లో నియోజకవర్గ ప్రజలు ఊరుకోరన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య -
చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు టెండర్ వద్దు
కాశిబుగ్గ: చేనేత ఉత్పత్తుల కొనుగోళ్లకు కొత్తగా టెండర్ విధానం అమలు చేయవద్దని వరంగల్ కొత్తవాడకు చెందిన చేనేత సహకార సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు బుధవారం వారు హుస్నాబాద్లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేనేత సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న కార్పెట్స్ బెడ్షీట్స్, బెడ్డింగ్ మెటీరియల్ను టెండర్ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులు, కాంట్రాక్టర్లకు ఇస్తే 60వేల చేనేత కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ చేనేత కార్మికులకు అన్యాయం జరగకుండా చూసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాజుల భగవాన్, చేనేత సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పంతగాని శ్రీనివాస్, అడిగొప్పుల సంపత్, దూబల రాజేందర్, ఆడెపు రవి, ఝెలుగం సాంబయ్య, పరికిపండ్ల రమేశ్, కూచన ఓదెలు పాల్గొన్నారు. చేనేత పరిశ్రమను పరిరక్షించాలి చేనేత పరిశ్రమ పరిరక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాములు వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనర్సయ్య కోరారు. ఈ మేరకు బుధవారం వారు హైదరాబాద్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యంకు వినతిపత్రాలు అందజేసి మాట్లాడారు. 13 సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడంతో చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు, ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ చేనేత సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
అభ్యసన సామర్థ్యాలపై శిక్షణ
జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 3, 4, 5వ తరగతి విద్యార్థులకు ఏఐ ద్వారా అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఏఎంఓ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని 12 పాఠశాలల్లో 55 మంది ఉపాధ్యాయులకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు 27 మంది ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్, ఏఐపై డీఆర్పీలు శ్యామ్మోహన్రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సుజిత్ శ్రావణి, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. నేడు (గురువారం) మరో 28 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఈ శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
రైతుల డబ్బులతో రాజకీయాలు చేస్తే సహించం
జనగామ రూరల్: రైతుల డబ్బులతో రాజకీయాలు చేస్తే సహించేది లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందునాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని రాపర్తి సోమయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో రైతులకు భారీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను వెంటనే ఖాతాల్లో జమచేయాలన్నారు. జిల్లాలో మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈనెల 23, 24 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మాచర్ల సారయ్య, రామావత్ మీట్యా నాయక్, బెల్లకొండ వెంకటేష్, మంగ బీరయ్య, నక్క యాకయ్య, అంజయ్య, మంద చంద్రమోళి, కుమారస్వామి, బిక్షపతి, రాములు, తదితరులు పాల్గొన్నారు.


