breaking news
Jangaon
-
‘జలజీవన్ ’ను సద్వినియోగం చేసుకోండి
● కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ జలజీవన్ ప్రభుత్వ సెక్రటరీ సుమిత్ ఝా జనగామ: దేశంలో ప్రతీ ఇంటికి తాగునీటిని అందించడంతో పాటు నీటి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జలజీవన్ ప్రోగ్రామ్ సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ జలజీవన్ ప్రభుత్వ సెక్రటరీ సుమిత్ ఝా అన్నారు. కేంద్ర జలజీవన్ కార్యక్రమాలపై ప్రభుత్వ సెక్రటరీ సుమిత్ ఝా గురువారం న్యూఢిల్లీ నుంచి దేశంలోని అరుణాచల్ప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణలో అమలవుతున్న జలజీవన్ పథకాల తీరుతెన్నులకు సంబంధించి ఆయా రాష్ట్రాల జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఇందులో హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కార్యాలయం నుంచి మిషన్ భగీరథ ఇంజనీరింగ్ ఇన్చీఫ్ ప్రభాకర్రెడ్డి, జనగామ నుంచి జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా పాల్గొన్నారు. ఈసందర్భంగా సుమిత్ ఝా మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో 17 జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా 31 ఉండగా, ఇక్కడ అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పనుల పురోగతికి సంబంధించి కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కేంద్ర జలజీవన్ మిషన్ కింద అమలవుతున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంజనగామ: జనగామ కలెక్టరేట్లో గురువారం ఆర్డీవో గోపీరామ్తో కలిసి సమాచార కమిషనర్ అయోధ్యరెడ్డి పెండింగ్లో ఉన్న సమాచా ర హక్కు చట్టం దరఖాస్తులను పరిశీలించారు. వివిధ శాఖలకు చెందిన 36 దరఖాస్తులను పరిశీలన పూర్తిచేయగా చేయగా, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. కార్యక్రమంలో జిల్లా ఉన్నతా ధికారులు అంబికాసోని, రాణాప్రతాప్, రవీందర్, విక్రమ్కుమార్, మాధవిలత ఉన్నారు. బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలిజనగామ రూరల్: బంజారా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు దరావత్ శంకర్నాయక్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో లక్షల సంఖ్యలో బంజారాలు ఉన్నా, మంత్రిపదవిని కూడా ఇవ్వకపోవడం దురదృష్ట్టకరమన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ రమేశ్, మోహన్, మూడవత్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
హక్కులు సాధించుకుందాం
లింగాలఘణపురం: కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడిన అమరుల స్ఫూర్తితో హక్కులు సాధించుకుందామని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమల్లయ్య పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని సిరిపురంలో అమరుల యాదిలో సామాజిక చైతన్య యాత్రలో భాగంగా గౌడకులస్తులంతా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మహేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 18వరకు సామాజిక చైతన్య యాత్రలు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, శంకరయ్య, భాస్కర్, లక్ష్మినారాయణ, రాజు, ఉపేందర్, అనిల్, వెంకటేశ్ పాల్గొన్నారు. కల్లుగీత కార్మికుడు బస్వగాని కుమార్కు నివాళి అర్పించారు. -
రాఖీ అమ్మకాల జోరు!
జనగామ: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు జరుపుకునే మహోత్తరమైన పండుగ రాఖీ. సోదరీసోదరుల అనురాగం, ఆప్యాయతలకు నిదర్శనమే ఈ పండుగ. రాఖీ పౌర్ణమినే శ్రావణ, జంధ్యాల పౌర్ణమి అని పిలుచుకుంటారు. అన్నా పండగకు వస్తున్నా..అంటూ చెల్లి పలకరింపు కోసం అన్నలు, అక్క ఎప్పుడొస్తుందోనని కంట్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసే తమ్ముళ్లు..ఇలా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని ఈ నెల 9(శనివారం)వ తేదీన ఘనంగా జరుపుకోనున్నారు. పండుగ సమీపించడంతో జనగామ పట్టణంలోని కృష్ణాకళామందిర్, గణేశ్వాడ, బస్టాండ్, రైల్వేస్టేషన్, నెహ్రూపార్కు, సిద్దిపేట రోడ్డులో రాఖీల దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. ఇళ్లలో మొదలైన సందడి.. రాఖీ పండుగ వచ్చిందంటే ఊరు, వాడ అంతా సందడే. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతీఒక్కరు జరుపుకునే ఈ పండుగతో మార్కెట్ కూడా సందడిగా ఉంటుంది. జనగామ పట్టణంలోని దుకాణాల్లో రకరకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. గతంలో కంటే భిన్నంగా ఈసారి సృజనాత్మకతతో కూడిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. రూ.2 నుంచి మొదలుకుని రూ.250, రూ.300, రూ.500, రూ.1000లకు పైగా వరకు ధరలు పలుకుతున్నాయి. ప్రతిఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని కులమతాలకతీతంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జరుపుకుంటారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండలాల పరిధిలో రాఖీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొనుగోలుదారులతో దుకాణాల కళకళ రూ.2 నుంచి మొదలుకుని రూ.వెయ్యికి పైగా ధరలు రేపు రాఖీ పౌర్ణమి వేడుకలు -
సర్దుబాటుపై సమరం
జనగామ: జిల్లా విద్యాశాఖలో టీచర్ల సర్దుబాటు చిలికిచిలికి గాలివానలా మారుతోంది. బెత్తం ఉన్నోళ్లదే పెత్తనం అనే చందంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. పైరవీకారుల మాటలు విన్న అధికారులు చివరకు చేతులు కాల్చుకునే పరిస్థితికి దిగజారిపోయింది. వారం రోజులు గా రగులుతున్న ఈ మంటలు..ప్రస్తుతం పిల్లల తల్లిదండ్రులు రంగంలోకి దిగి ప్రత్యక్ష యుద్ధం చేసే పరిస్థితికి వెళ్లిపోతోంది. సర్దుబాటుపై టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ముందుకొచ్చి ఎంఈఓ ల తప్పిదాలు, అనాలోచిత నిర్ణయాలు, లోపాయికారి ఒప్పందాలపై జిల్లా విద్యాశాఖ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో సర్దుబాటు జాబితాకు నిప్పు మరింత అంటుకుంటోంది. ఇంత జరుగుతున్నా ఎంఈఓలు మాత్రం తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. నిబంధనల మేరకు పనిచేస్తున్న టీచర్లను కుదించి..వెంటనే మరో చోటకు వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా సర్దుబాటు చేసి, పిల్లల జీవితాలను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకోమ ని సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు టీచర్లను రిలీవ్ చేయడం లేదు. దీంతో చిర్రెత్తిపోతున్న ఎంఈవోలు తమ ఆదేశాలు బేఖాతర్ చేస్తారా అంటూ పరోక్ష బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 109 మంది టీచర్లను సర్దుబాటు చేయగా, ఇందులో అనేక చోట్ల నిబంధనలు ఉల్లంఘించినట్లు సమాచారం. దీనిపై ఐఏఎస్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ అధికారి నివేదికలను కోరగా, సర్దుబాటు ప్రాసెస్ మాత్రం యథావిధిగా జరిగిపోతోంది. తెరపైకి పైరవీకారులు టీచర్ల సర్దుబాటు విషయమై నెలకొన్న గందరగోళ పరిస్థితులను సాక్షి వరుసగా కథనాలను అందిస్తూ భ్రష్టు పట్టిపోతున్న విద్యాశాఖను మేలుకొలిపే ప్రయత్నం చేస్తోంది. సర్దుబాటులో ఆయా పాఠశాలలకు అన్యాయం చేస్తూ పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని సహచర టీచర్లు నెత్తి, నోరు మొత్తుకుంటున్నా ఉన్నతాధికారులకు మాత్రం వినిపించడం లేదు. ఇతర పాఠశాలలకు తాత్కాలిక బదిలీతో పాటు సంఘాల్లో పనిచేస్తున్న వారి బడులకు అదనంగా సర్దుబాటు చేసుకున్న ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొంతమంది పైరవీకారులు ఈ జాబితాలో చేతులుపెట్టారనే ప్రచారం వినిపిస్తోంది. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి సర్దుబాటులో తగ్గిపోయిన బడుల నుంచి..వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గండిరామారం యూపీఎస్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన నర్మెట మండలం గండిరామారం ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట గురువారం తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. టీచర్ల సర్దుబాటు పేరుతో పిల్లలకు అన్యాయం చేయవద్దని ఆందోళన చేపట్టి పెద్దపెట్టున నినాదాలు చేశారు. యూపీఎస్లో గతంలో 40 మంది వరకు విద్యార్థులు ఉండగా, బడిబాటలో మరో 30 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. ఇందుకుగాను నలుగురు ఎజ్జీటీలు, ఒక స్కూల్ అసిస్టెంట్ పిల్లలకు పాఠాలను బోధిస్తున్నారు. ఇటీవల చేసిన సర్దుబాటులో ఈ పాఠశాలకు చెందిన ఎస్జీటీని ఓ పాఠశాలకు పంపించి, ఇక్కడకు మరో స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయున్ని (స్కూల్ అసిస్టెంటు)వేశారు. ఆ పాఠశాలలో పిల్లల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్లు ఉన్నారని, ఎస్ఏను రిలీవ్ చేసే పరిస్థితి లేదని హెచ్ఎం తేల్చిచెప్పడంతో గందర గోళ పరిస్థితి నెలకొంది. దీంతో గండిరామారం యూపీఎస్ టీచర్ను సైతం రిలీవ్ చేయకుండా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. కలెక్టర్ దీనిపై స్పందించి, తమ పిల్లల భవిష్యత్తు ఆగం కాకుండా చూడాలని కోరారు. పిల్లల భవిష్యత్ను ఆగం చేయవద్దంటున్న తల్లిదండ్రులు ఎంఈవోల తప్పిదాలతో పలు పాఠశాలలకు అన్యాయం టీచర్లను రిలీవ్ చేయని హెచ్ఎంలు.. చేయాల్సిందే అంటూ ఎంఈఓల హుకుం ప్రైవేటు బాటపట్టేందుకు సిద్ధమవుతున్న పిల్లలు అగమ్యగోచరంగా జిల్లా విద్యాశాఖ -
ఉల్లాస్ నిరక్షరాస్యత ఖల్లాస్!
విద్యారణ్యపురి: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిదేంద్దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఉల్లాస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ‘అందరికీ చదువు–అందరి బాధ్యత’ అనే నినాదంతో 1,61,613 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనేది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేఽశం. అక్షరాస్యత ఇలా.. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ (ప్రాథమిక అక్షరాస్యత అభ్యసన సామర్థ్యాలు), జీవన నైపుణ్యాలు, అలాగే సమాంతర విద్యను బోధిస్తారు. ఆ తర్వాత అర్హులకు 3, 5 తరగతులు, ఆపైన ఇప్పటికే చదువుకున్న వారికి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్లో ప్రవేశాలు కల్పించేలా ప్రోత్సహిస్తారు. టీచర్లకు శిక్షణ ఉల్లాస్ కార్యక్రమం అమలులో భాగంగా ఇప్పటికే ప్రతి జిల్లా నుంచి ముగ్గురు రెగ్యులర్ టీచర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 18 మంది టీచర్లు శిక్షణ పొందారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశానుసారం గురువారం భూపాలపల్లి జిల్లాతోపాటు వరంగల్ రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు అధికారి రమేశ్రెడ్డి, హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి ఉపాధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన మూడు జిల్లాల్లో వెసులుబాటును బట్టి శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 12న మండల స్థాయిలో ఒక టీచర్, అలాగే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 19న గ్రామస్థాయిలో ఎంపిక చేసిన వలంటీర్ టీచర్లకు శిక్షణ పొందిన రెగ్యులర్ టీచర్లతో శిక్షణ ఇవ్వనున్నారు. సామాజిక చైతన్య కేంద్రాల ఏర్పాటు గ్రామాల్లోని పాఠశాలల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రతి 8 లే దా 10 మందికి ఒక వలంటీర్ విద్యాబోధన చేస్తారు. అంతేకాకుండా టీవీ చానల్స్, ఉల్లాస్ యాప్, ఎస్సీఆర్టీఈ రూపొందించిన దీక్ష పోర్టల్ ద్వారా వయోజనులకు బోధన చేయనున్నారు. నిరక్షరాస్యులైన అతివలు అక్షరాస్యత వైపు.. ‘స్వయం సహాయక’ సభ్యులందరికీ చదువు జిల్లాల్లో టీచర్లకు శిక్షణ షురూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,61,613మంది నిరక్షరాస్యుల గుర్తింపు ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల గుర్తింపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను ఇటీవల అధికారులు గుర్తించారు. వీరని అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆదిశగా వయోజన విద్య అధికారులు ముందుకు సాగుతున్నారు. వారి ని ఉల్లాస్ యాప్లో నమోదు చేస్తారు. ఉల్లాస్ ప్రారంభానికి సన్నాహాలు.. స్వయం సహాయక సంఘాల్లోని 15 ఏళ్లపైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఇన్ సొసైటీ) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. ఆగస్టు–సెప్టెంబర్లో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గంజాయికి వ్యతిరేకంగా పోరాడితే కేసులా?
జనగామ: గంజాయికి యువత బానిసలు కాకుండా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడితే పోలీసులు అక్రమ కేసులు పెట్టారని టీ జీవీపీ జిల్లా అధ్యక్షుడు గన్ను కార్తీక్, జిల్లా కార్యదర్శి తుంగ కౌశిక్ అన్నారు. నాలుగేళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. గురువారం వారు జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ 2022లో జనగామ పట్టణంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మూలన కోసం తమ వంతు పోరాటం చేశామన్నారు. పిల్లలను కాపాడేందుకు ఐక్య ఉద్యమాలు చేస్తే పోలీసులు మాత్రం అక్రమ కేసులతో ఇలా కోర్టు చుట్టూ తిరిగేలా చేశారన్నారు. వారితో పాటు పట్టణ అధ్యక్షుడు వెంపటి అజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, ఎంఎస్ఎఫ్ ప్రతినిధి అనిల్ ధీరజ్, ప్రశాంత్, అనిల్చౌహన్, అఖిల్ ఉన్నారు. ఐక్య విద్యార్థి సంఘ నాయకుల ఆవేదన -
నేతన్నలను ప్రోత్సహిద్దాం
జనగామ: కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగి స్తున్న చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు నేత వస్త్రాలను ధరించి వారిని ప్రోత్సహిద్దామని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. జాతీయ చేనే త దినోత్సవం పురస్కరించుకుని గురువారం ము న్సిపల్ కార్యాలయంలో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. వేడుకలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..చేనేత రంగం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమని, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. భారతీయ చేనేత పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది కార్మికుల కృషి, నైపుణ్యాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. నేతన్న బీమా పథ కం ద్వారా రూ.1.20కోట్ల చెక్కును లబ్ధిదారులకు కలెక్టర్ అందించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన పట్టుచీరలు, ఇతర చేనేత వస్త్రాల స్టాల్స్ను సందర్శించి పరిశీలించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకురాలు చౌడేశ్వరి, జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు ధరించి వారికి అండగా ఉందాం దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత కీలకపాత్ర జాతీయ చేనేత దినోత్సవంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా -
అప్రమత్తంగా ఉండాలి
జనగామ: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో అతి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగ్రం అప్రమత్తమైంది. గురువారం రాత్రి 10.30 గంటలకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, తదితర అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు.. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో 12 మండలాల పరిధిలో లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, ప్రమాదకరంగా ఉన్న రహదారులు, పెంకుటిళ్లు, విద్యుత్కు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికార యంత్రాంగం నిఘా వేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కల్వర్టుల వద్ద జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. జనగామ–నర్మెట ప్రధాన రహదారి గానుగుపహాడ్ తాత్కాలిక మట్టిరోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో భారీ వర్షాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనే భయాందోళన నెలకొంది. అలాగే పాలకుర్తి రూట్లో కుందారం, బచ్చన్నపేట– కొన్నె ప్రధాన రహదారి వెంట ఉన్న కల్వర్టులు, జఫర్గడ్, రఘునాథనాపల్లి, నర్మెట, స్టేషన్ఘన్పూర్, దేవరుప్పుల తదితర మండలాల పరిధిలోని పల్లెలకు వెళ్లే దారులు, మధ్య మధ్యలో వచ్చే కల్వర్టులపై అధికారులు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి కష్టాలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. జిల్లాలో రాత్రి 10 గంటల వరకు కొడకండ్లలో 75 మిల్లీ మీటర్లు, దేవరుప్పులలో 72.3మి.మీ, పాలకుర్తిలో 62.0 మి.మీ, బచ్చన్నపేటలో 19.5 మి.మీ, లింగాలఘనపురంలో 3.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు -
కాలువ పరిశీలన
రఘునాథపల్లి: అశ్వరావుపల్లి రిజర్వాయర్ కుడి కాలువ కెనాల్ నుంచి ఫత్తేషాపూర్ చెరువును నింపే కాలువను గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్చందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్ పరిశీలించారు. ఈసందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ట్రైబల్ వెల్ఫేర్ నిధుల నుంచి ఆయా గ్రామస్థుల కోరిక మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.9 కోట్లు మంజూరు చేయించారన్నారు. ఈ నిధులతో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయించేందుకు అధికారులతో కలిసి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భాస్కర్రెడ్డి, హయ్యద్ అలీ, విరోజి, కరుణాకర్, సత్యనారాయణ, మోహన్, వెంకటేశ్ పాల్గొన్నారు. పెండింగ్ బిల్లులు అందజేయాలి● పెన్షన్ల సాధన పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి చిల్పూరు: రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే అందజేయాలని పెన్షన్ల సాధన పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలతో అందరికీ పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పి ఒకరిద్దరికి మాత్రమే అందించే ప్రయత్నం చేయవద్దన్నారు. 2024 నుంచి ఉద్యోగ విరమణ పొందిన ప్రతీ ఒక్కరికి అందజేయాలని డిమాండ్ చేశారు. -
కార్పొరేట్ దోపిడీని వ్యతిరేకించాలి
స్టేషన్ఘన్పూర్: దేశంలో కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఐక్య పోరాటాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షు డు రాపర్తి సోమయ్య పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 13న బహుళ జాతి కంపెనీలు భారతదేశాన్ని, భారత వ్యవసాయాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను మండలంలోని ఇప్పగూడెంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హా జరైన సోమయ్య మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాదానికి మోదీ ప్రభుత్వం లొంగొద్దన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కుమారస్వామి, శ్రీను, మొగిలి, రమేశ్, వెంకటయ్య, సోమ య్య, గోపయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య -
పింఛన్లు పెంచాలి
● 12న పాలకుర్తికి మంద కృష్ణమాదిగ.. ● ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడ సునీల్ మాదిగపాలకుర్తి టౌన్/పాలకుర్తి: సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు పింఛన్ రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4 వేలు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనగామ జిల్లా ఇన్చార్జ్ బోడ సునీల్మాదిగ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని బాషారత్ గార్డెన్లో ఎమ్మార్పీఎస్, ఎంపీఎస్, వీహెచ్పీఎస్ జిల్లా స్థాయి సమావేశం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దల కిషోర్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బోడ సునిల్ మాదిగ మాట్లాడుతూ.. పెన్షన్లు పెంచాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 12న పాలకుర్తిలో చేయూత పింఛన్దారుల మహాసభకు ముఖ్యఅతిఽథిగా మంద కృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు. సమావేశంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్, బిర్రు నాగేశ్, గడ్డం సోమరాజు, సందెన రవిందర్, చెరుపెల్లి యాదగిరిస్వామి, జెరిపోతుల సుధాకర్ పాల్గొన్నారు. -
యూరియా కొరత సృష్టించొద్దు
బచ్చన్నపేట: ప్రస్తుత వర్షాకాలంలో రైతులకు యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దుకాణదారులు యూరియా కొరతను సృష్టించొద్దని కలెక్టర్ రిజ్వార్ బాషా అన్నారు. బుధవారం మండలకేంద్రంలో పలు ఎరువుల దుకాణాలు, ప్రభుత్వ ఆస్పత్రిని, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎరువుల అమ్మకాల రిజిస్టర్ను పరిశీలించి అందులో రాసి ఉన్న రైతు సెల్కు ఫోన్ చేసి ఎన్ని యూరి యా బస్తాలను కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. అలాగే పీఏసీఎస్లోకి వెళ్లి యూరియా నిల్వలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలను అందించాలన్నారు. ఓపీ సంఖ్య తగ్గకుండా చూసుకోవాలన్నారు. కేజీబీవీ పాఠశాలను సందర్శించి ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సంఖ్య పెరిగిందా, భోజనం ఎలా వడ్డిస్తున్నారని ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విబ్యాబోధన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికాసోనీ, మండల వ్యవసాయ అధికారి విద్యాకర్రెడ్డి, తహసీల్దార్ రామానుజాచారి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, ప్రిన్సిపాల్ గీత, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, సీఈఓ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ఉత్తమ ఫలితాలు సాధించేలా పనిచేయాలి
జనగామ: ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా అధికారులు, టీచర్లు కష్టపడి పని చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్(ఏసీ), జిల్లా విద్యాశాఖ అధికారి పింకేష్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో వయోజన విద్యాశాఖ సంచాలకులు ఉషారాణితో కలిసి ఆయన విద్యాశాఖ పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు ప్రతీ పాఠశాలను విధిగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలన చేస్తూ ఉత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలలో తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్ల సౌకర్యాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. మధ్యాహ్న భోజన మెనూలో చేసిన మార్పుకు అనుగుణంగా తయారు చేయాలన్నారు. ఈ సమీక్షలో అడిషనల్ డైరెక్టర్ సత్యమూర్తి, ఆర్థిక, ఖాతాల విభాగాధికారులు భోజన్న, రాజు, బాలికల పరిరక్షణ అధికారి గౌసియా బేగం, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్యధికారి మల్లికార్జునరావుతో కలిసి సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ప్రజలకు అంటువ్యాధులు రా కుండా దోమల నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలన్నారు. మున్సిపాలిటీలు, జీపీల పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
● ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లవకుమార్ స్టేషన్ఘన్పూర్: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ అన్నారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద బుధవారం ధర్నా, రాస్తారోకో చేపట్టారు. జిల్లా ఉపాధ్యక్షుడు యాకన్నరాథో డ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో లవకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.8,500 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీ యింబర్స్మెంట్స్ పెండింగ్లో ఉన్నాయన్నారు. బస్పాస్ చార్జీలు పెంచడంతో నిరుపేద కుటుంబా లకు చెందిన విద్యార్థులు చదువులకు దూరం కావాల్సిన దుస్థితి నెలకొందన్నారు. నాయకులు మనిత్రాజ్, రవళిక, ప్రకాష్, అభిషేక్, స్టాలిన్, వైష్ణవి, నందిని, కీర్తి, అంజలి పాల్గొన్నారు. -
నివేదిక ఇవ్వండి
ఉపాధ్యాయుల సర్దుబాటుపై ఎంఈఓలను ఆదేశించిన అదనపు కలెక్టర్ పింకేష్కుమార్జనగామ: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటులో వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపధ్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సమగ్ర నివేదికను సమర్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో వయోజన విద్యాశాఖ సంచాలకులు ఉషారాణితో కలిసి విద్యా శాఖ జిల్లా అధికారులు, ఎంఈఓలతో విద్యాశాఖ పని తీరుపై సమీక్షించారు. జిల్లాలో ఎంఈఓల నివేదిక ఆధారంగా చేపట్టిన 109 మంది టీచర్ల సర్దుబాటు విద్యాశాఖను కుదిపేస్తోంది. తప్పుడు నివేదికలు, లోపాయి కారి ఒప్పందం మేరకే సర్దుబాటు చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేస్తుండగా.. ఇందులో నొక్కింది ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. సర్దుబాటు రగడపై ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలు విద్యాశాఖను షేక్ చేస్తుండగా, ఇప్పుడిప్పుడే ఉన్నతాధికారులు స్పందిస్తున్నారు. ఎంఈఓల తప్పుడు నివేదికలతోనే.. మండలాల నుంచి ఎంఈఓల తప్పుడు నివేదికలతోనే టీచర్ల సర్దుబాటు సమస్య జఠిలంగా మారిపోతుందని టీపీటీఎఫ్ జిల్లా కమిటీ తరఫున అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (ఐఏఎస్) పింకేష్కుమార్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే సవరించాలని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల విద్యాధికారుల(ఎంఈఓ) తప్పుడు రిపోర్టులతోనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. దేవరుప్పుల మండలం గొల్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులు కొనసాగుతున్నప్పటికీ, నలుగురు ఉపాధ్యాయుల్లో ఒక భాషా ఉపాధ్యాయుడిని నిబంధనలకు విరుద్ధంగా పొట్టిగుట్ట పీఎస్ తండాకు కేటాయించడం దారుణమన్నారు. అలాగే జిల్లా పరిషత్ కడవెండి పాఠశాలలో జీవశాస్త్రం, సింగరాజుపల్లిలో ఇంగ్లిష్ టీచర్ పదవీ విరమణతో ఏడాదిగా ఖాళీగా ఉన్నప్పటికీ సర్దుబాటులో పట్టించుకోలేదన్నారు. జనగామ పట్టణం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, పెంబర్తి స్కూల్, చిల్పూరు మండలం చిన్న పెండ్యాల స్కూల్తో పాటు మరికొన్ని పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే తప్పుల తడకగా మారిన టీచర్ల సర్దుబాటు జాబితాను పునఃపరిశీలన చేయాలని కోరారు. తప్పుడు రిపోర్టులు సమర్పించిన మండల విద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సంఘ జిల్లా అధ్యక్షుడు ఎన్ఎన్రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంకుశావలి, జిల్లా బాధ్యులు అశోక్, రాజారెడ్డి, లక్ష్మణ్, శ్రీహరి, వజ్రయ్య తదితరులు ఉన్నారు. ఎంఈఓల అవగాహనా రాహిత్యం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిబంధనలు పాటించని ఎంఈఓలపై టీపీటీఎఫ్ ఫిర్యాదుప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఎంఈఓల అవగాహన రాహిత్యంతో బ్రష్టుపట్టిపోతుందని పలు ఉపాధ్యాయ సంఘాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. నర్మెట మండలంలోని ఓ పాఠశాలలో టీచర్ను మరో స్కూల్కు సర్దుబాటు చేయగా, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మా పిల్లల భవిష్యత్ను తాకట్టు పెట్టి రిలీవ్ చేయలేమంటూ సదరు బడి బాస్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. సర్దుబాటు ప్రక్రియ పూర్తిగా తప్పుల తడకగా ఉందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. దానిని రద్దు చేసేందుకు మాత్రం సాహసించడం లేదు. -
ప్రకృతితో అనుబంధం
ప్రతీది ప్రకృతితో అనుబంధంగానే మా జీవన విధానం ఉంటుంది. మా పంటలు, కుటుంబాలతోపాటు, ఆడపిల్లకు సరైన వరుడిని కూడా ప్రకృతి అనుమతితోనే పొందాలన్నదే తీజ్ ఉద్దేశం. చిన్నతనంలో పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం.. ఇప్పటికీ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే భలే ఇష్టం. – భూక్య ఉమ, మహబూబాబాద్అంతా మేరామా యాడీ దయ మా కుల దేవతలు సేవాలాల్, మేరామా యాడీ(గౌరీ దేవి)కి పూజలు చేసి తీజ్ పండుగను ప్రారంభిస్తాం. అంతా అమ్మవారే చూసుకుంటారని నమ్మకం. అందుకోసం గోధుమలు తెచ్చి నిష్టతో తొమ్మిది రోజులు పూజలు చేస్తాం. యువతులు పాటలు పాడుతూ.. ఆటలు ఆడడం సరదాగా ఉంటుంది. – జాటోత్ ఝాన్సీలక్ష్మి, గార్ల -
‘ఇందిర మహిళా శక్తి’తో స్వయం ఉపాధి
జనగామ: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో కల్యాణి స్వయం సహాయక సంఘ ప్రతినిధి మంజుల రూ.2లక్షల రుణంతో ఏర్పాటు చేసుకున్న వనిత టీ స్టాల్ను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా టీ తయారు చేసి అక్కడున్న వారికి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వనిత టీ స్టాల్స్ ద్వారా రోజు రూ.3 వేల ఆదాయాన్ని మహిళలు పొందుతున్నారన్నారు. టీ స్టాల్లో కేవలం టీ అమ్మకం ఒక్కటే కాదని, డిమాండ్కు తగ్గట్టుగా చేతి ఉత్పత్తుల అమ్మకం, భోజనం, కస్టమర్లకు అవసరమైన వస్తువులు కూడా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ వసంత, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని కలెక్టర్తో కలిసి టీ తాగారు. వనిత టీ స్టాల్ను ప్రారంభించిన కలెక్టర్ -
11న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
జనగామ: జిల్లాలో ఈ నెల 11న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వన్ బాషా తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి టాస్క్ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల వ యసు వారికి ఆల్బెండజోల్ మాత్రలను ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లోని పిల్లలకు అందించాలన్నారు. ఈ సమావేశంలో విద్యా, వైద్య, పంచాయతీ రాజ్, మున్సిపల్, అంగన్వాడీ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు, అధికారులతో కలిసి నులిపురుగుల నివారణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఢిల్లీకి తరలిన నేత కార్మికులు జనగామ: కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై ఆధారపడి బతుకుతున్న నేతన్నల జీవితాలను బాగు చేయాలనే సంకల్పంతో అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలిచిన జిల్లాకు చెందిన నలుగురు కార్మికులను జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని నేడు (గురువారం) ఢిల్లీలో జరిగే వేడుకలకు ఎంపిక చేశారు. ఈ మేరకు జనగామ మండలం ఎల్లంల, వీవర్స్ కాలనీకి చెందిన బిర్రు నరేష్, బిర్రు రవీందర్, కాముని సమ్మయ్య, బిట్ల భాస్కర్ ఎంపిక కాగా మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్ వీవర్స్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ జాక్వార్డ్, తదితర వాటిపై శిక్షణ పొందడంతో పాటు సద్వినియోగం చేసుకున్న వీరిని ఢిల్లీ భారత్ మండపంలో జరిగే చేనేత దినోత్సవానికి కేంద్రం ఆహ్వానించింది. మెరుగైన వైద్యసేవలందించాలి నర్మెట: పీహెచ్సీలతో పాటు ఉప ఆరోగ్యకేంద్రాల్లో మెరుగైన వైద్యసేవలందించాలని డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు అన్నారు. కేంద్ర బృందం సభ్యులు హరిఓంశర్మ, పవార్, జేవీ శ్రీనివాస్రావులతో కలిసి పీహెచ్సీని బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నూతనంగా నిర్మాణం చేపట్టిన డెలివరీ రూం, బ్లాక్ లేవల్ పబ్లిక్ హెల్త్ యూనిట్, ఆస్పత్రి పరిసరాలు, రికార్డులను పరిశీలించి వైద్యాధికారి సుకన్యను మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైద్యుడు అశోక్ కుమార్, ఏఈ పీఆర్ ప్రదీప్ కుమార్, సిబ్బంది ఉన్నారు. -
స్టోన్ క్రషర్లపై ‘మైనింగ్’ కత్తి
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్ల అక్రమ దందాను అరికట్టేందుకు గనుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీని రూ.లక్షల్లో కాజేస్తున్న నిర్వాహకులపై కొరడా ఝుళిపించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో గ్రానైట్ క్వారీలు, రోడ్, స్టోన్ మెటల్ (కంకర) క్రషర్ల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు గనులశాఖ దృష్టి సారించింది. ఇందుకు ప్రభుత్వ భూముల్లో గుట్టలు, మైనింగ్కు అనువైన స్థలాలను గుర్తించి టెండర్ ద్వారా లీజుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీలకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొదట ఏడు క్వారీలు.. ప్రభుత్వ స్థలాలు, గుట్టలను గుర్తించి గ్రానైట్, కంకర క్వారీలను టెండర్ల ద్వారా కేటాయించేందుకు శ్రీకారం చుట్టిన గనులశాఖ.. మొదట ఉమ్మడి జిల్లాలో ఏడు క్వారీల టెండర్లు ఈ నెల 12 ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఊరుగొండలో రెండు స్టోన్ మెటల్, రెండు కలర్ గ్రానైట్ క్వారీలు, ఆత్మకూరు మండలం పెద్దాపూర్లో బ్లాక్ గ్రానైట్ క్వారీలు ఈ టెండర్లలో ఉన్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో కంకర క్వారీ, జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో ఒకటి, జఫర్గఢ్ మండలం హిమ్మత్నగర్లో ఒకటి చొప్పున రెండు క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. కాగా, గనుల శాఖ నోటిఫికేషన్ మేరకు జూలై 17న డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 6 వరకు టెండర్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ భూముల్లో క్రషర్లు నడుపుతూ రాయల్టీ, లీజు డబ్బులు చెల్లించని 22 మందికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే, కంకర, గ్రానైట్ కోసం తీసిన రాయికి రాయల్టీ కట్టని వారు.. గనులశాఖకు సూచించిన క్యూబిక్ మీటర్లను మించి రాయి తీసి తనిఖీల్లో దొరికి పెనాల్టీ చెల్లించని వారికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 10–15 రోజుల్లో సదరు నిర్వాహకులు స్పందించకుంటే ఆ లీజులు సైతం రద్దు చేసి టెండర్లు పిలిచే అవకాశం ఉంటుందని మైనింగ్శాఖ అధికారులు చెబుతున్నారు. మెటల్ క్రషర్ (ఫైల్) రాయల్టీ, లీజు తదితర బకాయిదారులపై దృష్టి లీజు రద్దు చేసి టెండర్ల ద్వారా కేటాయించే యోచన ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏడు గ్రానైట్ క్వారీలు, క్రషర్లు ముగిసిన టెండర్ల ప్రక్రియ.. త్వరలో అర్హులకు కేటాయింపుఅక్రమాలకు ఇక అడ్డుకట్ట.. ఉమ్మడి వరంగల్లో సుమారు 360కి పైగా కంకర క్రషర్లు, 100కు పైగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 29 బ్లాక్, 33 కలర్ గ్రానైట్, 64 స్టోన్ మెటల్, క్వార్ట్జ్, గ్రావెల్ క్వారీలు రెండు కలిపి 128 ఉన్నాయి. ఇందులో సగం వరకు రాజకీయ నాయకులు, వారి అనుచరులవే ఉన్నాయి. అనుమతి లేకుండా రాతి క్వారీలు నిర్వహిస్తున్నా, అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘించి ఫ్రాడ్ చేసినా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.ఐదు లక్షల జరిమానా విధించే చట్టాలు చుట్టాలుగా మారుతున్నాయి. కొన్నేళ్లుగా రూ.కోట్ల విలువ చేసే రాతి ఖనిజం కంకర, గ్రానైట్ రూపేణా దోపిడీకి గురైంది. తవ్వి తరలించిన దానికి.. ప్రభుత్వానికి రాయల్టీ కట్టే సమయంలో చూపించే లెక్కలకు పొంతన లేకపోగా.. 30 నుంచి 50 శాతం వరకే చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిచోట్ల లీజు పరిమితి తీరినా.. ఇంకా గ్రా నైట్, కంకర క్వారీలు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్వారీల్లో పేలుడుకు సంబంధించి ఇష్టారాజ్యంగా జిలెటిన్స్టిక్స్ను సరైన భద్రతా చర్యలు లేకుండా తరలిస్తున్నారు. రవాణా సమయంలో భారీ కుదుపులు వచ్చినా, ఎదురుగా ఏదైనా వచ్చి వాహనాన్ని ఢీకొన్నా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది. అధికారుల తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు సరైన భద్రతా వ్యవస్థ లేకుండానే జిలెటిన్స్టిక్స్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై సమీక్షలు చేసిన గనులశాఖ ప్రత్యేక బృందాలను నియమించి క్వారీల వారీ గా లీజు అగ్రిమెంట్లు పరిశీలిస్తూ లీజు, రాయల్టీ బకాయిల లెక్కలు తీస్తోంది. -
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోuసాక్షి, మహబూబాబాద్ : గిరిజన(లంబాడ) కన్నెపిల్లలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. ఈ నెలలో పండుగను ప్రతీ గురువారం ఏదో ఒక తండాలో జరుపుకుంటారు. నేడు (గురువారం) ఉమ్మడిజిల్లాలోని పలు తండాలు తీజ్ పండుగకు ముస్తాబయ్యాయి. ప్రకృతి సిద్ధంగా శ్రావణంలో వర్షాలు కురవడంతో ఆకాశం నుంచి కిందికి వచ్చే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అంటారు. ఆ అందమైన పురుగులు దేవుడు మనకోసం కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు కన్నె పిల్లలు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. మా తాండేరో జోత్ తీజ్ (తండాల్లో వెలుగు తీజ్) అంటూ పండుగకు సిద్ధమయ్యారు. ● తొమ్మిది రోజులపాటు నిష్టతో కన్నె పిల్లల పూజలు ● గిరిజన తండాల్లో తీజ్ సంబురాలు ● ఏడో రోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో(రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానికి నేవైద్యం పెడతారు. ● ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేస్తారు. ● తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను ఇచ్చి ఆశీర్వాదం అందిస్తారు. ● లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. ● తీజ్ (గోధు మ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు(ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగ లతో బుట్టలు అల్లుతారు. ● పెండ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సి న పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలుపెడతారు. సంప్రదాయ పాటలుచివరి రోజు :మొదటి రోజు :● లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. తీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలిస్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీనిని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. లాంబి లాంబియే లాంబడీ ఏకెరీయో... తోన కుణ బొరాయో తీజ్.. సేవాభాయ బొరాయో తీజ్.. (గునుగుపూల వలె ఎదుగుతవమ్మా.. నిను కొలిచే వారెవరమ్మా.. సేవాలాల్ మహరాజ్ అలికి కొలుస్తారమ్మా తీజ్..) అని పాడుతూ తొలిరోజు వేడుకలు జరుపుకుంటారు. తూ కతేతి ఆయోరే దుదియా తళవో.. మారో తీజేరో జోత్ లేయి చాలో.. డగేరేచాలో.. (ఎక్కడినుంచి వచ్చావో దుదియా చెరువు.. తొమ్మిది రోజులు పెంచుకున్న తీజ్ తండా వెలుగును తీసుకుని వెళ్తున్నావు) అంటూ పెళ్లికాని అమ్మాయిలు పాటలు పాడుతూ తీజ్ బుట్టలను చెరువులో నిమజ్జనం చేస్తారు. 9 -
ప్రోత్సాహం
ఉద్యాన పంటలకు జనగామ రూరల్: జిల్లాలో ఉద్యాన పంటల సాగు ను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతీ సంవత్సరం పండ్ల తోటల సాగు తగ్గుముఖం పట్టడంతో రాయితీని పెంచి సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 9,359 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ఇందులో ఆయిల్పామ్ 7 వేల ఎకరాల్లో సాగవుతుండగా, ప్రభుత్వ రాయితీతో పాటు గిట్టుబాటు ధర కల్పించడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇదే తరుణంలో మామిడి, అరటి తోటల సాగు తగ్గుతోంది. 600 ఎకరాల్లో కూరగాయల సా గు అవుతుండగా చాలా ప్రాంతాల్లో రైతులు పండ్ల తోటలను తొలగించి ఆయిల్పామ్ సాగు చేపట్టా రు. ఈ పరిస్థితుల్లో మళ్లీ పండ్ల తోటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా రాయితీలను ప్రకటించింది. డ్రాగన్ ఫ్రూట్కు అధిక రాయితీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మిషన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్) పథకం ద్వారా పండ్ల తోటలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గతేడాది డ్రాగన్ ఫ్రూట్ కు హెక్టారుకు రూ.1,60,000 రాయితీ ఇవ్వగా ఈ ఏడాది రూ.3 లక్షలకు పెంచింది. బొప్పాయి సాగు కు గతేడాది ఇచ్చిన రూ.30 వేల రాయితీని కొనసాగిస్తోంది. మిర్చి, కూరగాయల సాగులో వాడుకునే మల్చింగ్కు ఈ ఏడాది రూ.20వేలకు పెంచింది. మూడేళ్లపాటు ఇదే రాయితీలను కొనసాగించనుంది. రైతులు సద్వినియోగం చేసుకు నేలా అధికారులు గ్రామాల్లో అవగా హన కల్పిస్తున్నారు. లాభాలు వివరిస్తున్నాం..ప్రభుత్వం ఉద్యానవన పంటలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గతంలో కంటే సాగు పెంచడానికి సబ్సిడీని పెంచింది. రైతులు పండ్ల తోటలు సాగు చేయడానికి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఉద్యానవన పంటల సాగు పద్ధతులు, లాభాలు వివరిస్తున్నాం. – సందీప్, క్లస్టర్ హార్టికల్చర్ అధికారి సద్వినియోగం చేసుకోవాలి ఉద్యాన పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంది. ప్రభుత్వం కూడా రాయితీలు పెంచింది. జిల్లాలో భూములు పండ్ల తోటల పెంపకానికి అనువుగా ఉన్నాయి. సంప్రదాయ పంటల కంటే పండ్ల తోటల సాగు లాభదాయకంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన రైతులు హార్టికల్చర్ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీధర్, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిమండలాల వారీగా సాగు వివరాలు రాయితీని పెంచిన ప్రభుత్వం ఎంఐడీహెచ్ పథకం ద్వారా అమలు మూడేళ్ల పాటు సబ్సిడీ వర్తింపు జిల్లాలో 9,359 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుమండలం ఎకరాల్లో చిల్పూరు 719.89 స్టేషన్ఘన్పూర్ 1,076.45 లింగాలఘణపురం 643.06 రఘునాథపల్లి 535.77 జఫర్గఢ్ 515.79 బచ్చన్నపేట 1,435.81 జనగామ 1,714.38 నర్మెట 741.41 తరిగొప్పుల 219.95 దేవరుప్పుల 148.11 కొడకండ్ల 619.76 పాలకుర్తి 920.13 మొత్తం 9359.48 -
కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ: తెలంగాణకు మణిహారంగా మారిన కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు తరిమికొట్టే పరిస్థితి ఉంటుందని, సీఎం రేవంత్రెడ్డి గాలి మోటార్లలో తిరుగుతూ గాలి ముచ్చట్లు చెప్పడానికి మాత్రమే మిగిలి పోయారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మంగళవారం మాజీ మంత్రి హరీశ్రావు హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయం నుంచి కాళేశ్వరంపై వీడియో ప్రజంటేషన్ నిర్వహించగా జిల్లా పార్టీ కార్యాలయంలో తాటికొండ రాజయ్య, పార్టీ కేడర్తో కలిసి వీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను పక్కనబెట్టి కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముందు చూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇర్రి రమణారెడ్డి, పోకల జమున లింగయ్య, బాల్దె సిద్ధిలింగం, గాంధీనాయక్, పుస్కూరి శ్రీనివాస్, పెద్ది రాజిరెడ్డి, గద్దల నర్సింగారావు, పేర్ని స్వరూప, తదితరులు ఉన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తుంది.. జస్టిస్ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే స్వగృహంలో హరీశ్రావు వీడియో ప్రజంటేషన్ను వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుపై ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. -
మెరుగైన వైద్యసేవలందించాలి
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలను అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం అన్నారు. మంగళవారం ఆయన చాంబర్లో వైద్య సేవలపై అన్ని విభాగాల హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజలింగం మాట్లాడుతూ రోగులకు మరింత నమ్మకం కలిగించేలా వైద్యులు, సిబ్బంది పని చేయాలన్నారు. జ్వరం, అనారోగ్య సమస్యలతో అడ్మిట్ అయ్యే రోగుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా జిల్లా ఆస్పత్రిలో మరో 70 నుంచి 80 బెడ్ల సామర్థ్యం పెంచేందుకు ఎదురుగా ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు. ఏఆర్టీ, బ్లడ్బ్యాంకు ఇతర సేవలను ఆ కార్యాలయంలోకి మార్చనున్నారు. డీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం -
పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
స్టేషన్ఘన్పూర్: పాఠశాలలు, హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధి శివునిపల్లిలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో శానిటేషన్ నిర్వహణ, వంటగది, డైనింగ్ హాల్ను పరిశీలించారు. వంటలకు ఉపయోగించే ప్రతీ వస్తువు నాణ్యతతో ఉండాలని, తాజా కూరగాయలను మాత్రమే వాడాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించారు. కంప్యూటర్ క్లాస్రూమ్ను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఉత్తమ మార్కులు సాధించేలా కష్టపడి చదవాలన్నారు. అర్థంకాని పాఠ్యాంశాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి ఓపీ, వైద్యులు, సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యం వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని సందర్శించి యూరియా స్టాక్, యూరియా అందించే తీరును పరిశీలించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వెంట ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
తల్లిపాలు బిడ్డకు అమృతం
జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు జనగామ: తల్లిపాలు బిడ్డకు అమృతంలాంటివని, సంపూర్ణ ఆరోగ్య ప్రదాయనిగా మేలు చేస్తాయని జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం అర్బన్ పీహెచ్సీలో జరిగిన ఆశడే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గర్భిణులకు అందించే వైద్యసేవలను మరింత మెరుగుపరచాలన్నారు. తల్లులు తమ శిశువులకు తల్లిపాలు అందించాలనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు, డెంగీ నివారణ, దోమలను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు ఏఐ కోర్సులో శిక్షణ రఘునాథపల్లి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకు అందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సైన్స్ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సుకు మండలంలోని ఖిలా షాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మంగళవారం సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేశిపెద్ది నర్సింహ్మరాజు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు లావణ్య, హెచ్ఎం భారత రవీందర్, ఉపాధ్యాయులు ఎంపికై న విద్యార్థులను అభినందించారు. అనంతరం హెచ్ఎం మాట్లాడుతూ రెండు నెలల కాలవ్యవధి గల ఈ కోర్సు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి, భవిష్యత్ ఉద్యోగ నియామకాలకు పునాదిగా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోర్స ఇన్చార్జ్ శ్రీనివాస్, శ్రీధర్, ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలి కొడకండ్ల: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, జిల్లా ప్రత్యేక అధికారి ఉషారాణి కోరారు. మంగళవారం మండలకేంద్రంలోని టీజీఆర్ఎస్ జేసీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ దనరాజు, డీఈఓ ఎఫ్ఏఓ భోజన్న, అసిస్టెంట్ డైరెక్టర్ భాస్కర్, విజయ్కుమార్రెడ్డి, శంకర్రావు, శైలజ, ప్రిన్సిపాల్ దిలీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీకే విక్రయించాలి దేవరుప్పుల: రైతులకు కావాల్సిన యూరియా, కాంప్లెక్స్ ఎరువులను ఎమ్మార్పీ ధరలకే అందుబాటులో ఉంచాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందూనాయక్ అన్నారు. మంగళవారం మండలంలోని ధర్మాపురంలో జరిగిన మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతు వ్యతిరేక విద్యుత్ సవరణతో పాటు మార్కెట్ ముసాయిదా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. జిల్లాలో 8వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 6వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి జిల్లాలోని చెరువులు నింపేందుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే ఆందోళనలు చేస్తామన్నారు. అనంతరం ఆగ్రోస్ ఎదుట ఎమ్మార్పీకే యూరియా కావాలని ధర్నా చేయగా ఏఓ హామీ మేరకు విరమించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారపు రమేశ్, పయ్యావుల భిక్షపతి, కోటి, రామ్, రమేశ్, రాములు, సోమన్న లాలు, నరసింహ, మహేందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన ఆహారం అందించాలి
జఫర్గఢ్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. మంగళవారం జఫర్గఢ్ మండలంలోని కేజీబీవీ, ఆదర్శ పాఠశాలను పరిశీలించారు. 3 విద్యాసంస్థలకు వెళ్లే దారి ఇ బ్బందికరంగా ఉండడాన్ని గుర్తించి, అంతర్గత రహదారుల నిర్మాణానికి తగిన ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. కేజీబీవీ హాస్టల్లోని వంట గది, స్టోర్ రూమ్ను పరిశీలించారు. కూరగాయలను పరిశీలించి ఎప్పటికప్పుడు తాజా కూరగాయాల ను తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట అదనపు డైరెక్టర్ సత్యమూర్తి, జిల్లా బాలికల ప ర్యవేక్షక అధికారి గౌసియా బేగం, మండల వి ద్యాధికారి రఘునందన్ రెడ్డి, ఇంజనీర్లు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్, ప్రత్యేక అధికారి స్వప్న, వార్డెన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ -
సీటీ స్కాన్ సేవలకు వేళాయె..
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (డీహెచ్)లో సీటీ స్కాన్ సేవల ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. స్కానింగ్ సేవలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ మంగళవారం ఆరా తీసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషాను ఆదేశించినట్లు తెలిసింది. స్కానింగ్ సేవలు అందుబాటులో వస్తే నిరుపేదల కుటుంబాలకు ఆర్థిక భారం తప్పుతుందనే వివరాలతో కూడిన జాబితాను మంత్రికి అందజేశారు. డీహెచ్లో కొత్త సీటీ స్కాన్ యంత్రం బిగించి సుమారు 20 రోజులు గడిచి పోతుంది. అయితే స్కానింగ్ సేవల ప్రారంభానికి రెడీగా ఉన్నప్పటికీ, సంబంధిత శాఖ మంత్రి పర్యటన ఖరారు కావాల్సి ఉంది. గత ఎనిమిది సంవత్సరాల క్రితం మూలన పడిన సీటీ స్కాన్ సేవల పునఃప్రారంభానికి సాక్షి అనేక కథనాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. సాక్షి కథనంతో మొట్ట మొదటిసారి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ స్పందించారు. సంబంధిత రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులను అలర్ట్ చేసి, స్కానింగ్ యంత్రం కొనుగోలు కోసం అవసరమైన బడ్జెట్ కేటాయించడంతో ప్రాసెస్ మొదలైంది. డబ్బులు చెల్లించిన నెలన్నర తర్వాత మిషన్ డీహెచ్కు చేరుకోగా, 20 రోజుల క్రితం ప్రత్యేక గదిలో కార్పొరేట్ స్థాయిని తలదన్నేలా దానిని అమర్చారు. మంత్రి సమయం ఇచ్చిన వెంటనే.. రెండు, మూడు రోజుల్లో సీటీ స్కాన్ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐదు జిల్లాల నుంచి.. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి జనగామతో పాటు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, సూర్యాపేట జిల్లాల సమీప పరిధిలోని ప్రజలు వైద్య సేవల కోసం ఇక్కడకు వస్తుంటారు. మహానేత వైఎస్ఆర్ హయాంలో నిరుపేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించాలనే తపనతో నాటి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేక చొరవతో సీటీ స్కాన్ సేవలను డీహెచ్లో ప్రారంభించారు. ఈ సేవలు అందుబాటులోకి రావడంతో పేద కుటుంబాలపై కొంతమేర ఆర్థిక భారం తగ్గింది. స్కాన్ యంత్రం మరమ్మతు రావడం, దానికి రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడడంతో నిధుల లేమితో మూలన పడేశారు. దీంతో పేదలకు అవసరమైన సమయంలో సీటీ స్కాన్ కోసం లోకల్తో పాటు హైదరాబాద్, హనుమకొండలోని ప్రైవేట్ సెంటర్లకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించడంతో మంత్రి స్పందించడంతో... ఇన్నాళ్లకు స్కానింగ్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం కలిగింది. సేవలు ప్రారంభమైన తర్వాత పేదలకు సేవలందించే క్రమంలో సాంకేతిక సమస్యలు రాకుండా పర్యవేక్షణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. సీటీ స్కాన్ సేవలను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. త్వరలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభం! వివరాలు అందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా ‘సాక్షి’ చొరవతో పునఃప్రారంభం -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
జనగామ రూరల్: విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకుడు కానుగంటి రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం యూఎస్పీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి కలెక్టరేట్ ఏఏఓ సరస్వతికి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. పీఆర్సీని ప్రకటించి పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని టైం స్కేల్ ఇవ్వాలని, వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్ టైం, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇచ్చి ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించా లని, లేదంటే 23న రాష్ట్ర స్థాయి ధర్నా చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమి టీ నాయకులు చంద్రశేఖర్ రావు, ఎన్ఎన్ రాజు, షరీఫ్, సత్తయ్య, మడూరి వెంకటేష్, అంకుషావలి, ఇ ప్ప రాంరెడ్డి, శాడ రవి, శ్రీనివాసరావు, కుర్రెముల యాదగిరి గౌడ్, కళావతి, మంగు జయ ప్రకాష్, చిక్కు డు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు -
ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలి
జనగామ: వ్యాపారులు ఖచ్చితంగా పరిశుభ్రతను పాటించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వీధి వ్యాపారులు పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు, వ్యాధుల నివారణ మార్గాలు, ఆహార నిల్వ, వంట విధానం, ప్లాస్టిక్ నివారణపై పలు సూచనలు ఇచ్చారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా, మోప్మా, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వ్యాపారులకు శిక్షణ నిర్వహించారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్తో పాటు సేఫ్టీ కిట్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏఎస్వీఐ రాష్ట్ర అధ్యక్షుడు రంగ శాలివాన్, సేఫ్టీ ఇండియా స్టేట్ మేనేజర్ వసీం అహ్మద్, మోప్మా ప్రాజెక్టు డైరెక్టర్ హర్షవర్థన్, అధికారులు వినీల్కుమార్, రమేశ్నాయక్, వాణిశ్రీ, షాహిన్ సుల్తానా, తిరుమల, గురునాఽథ్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి -
సిద్ధేశ్వరాలయంలో శ్రావణ పూజలు
బచ్చన్నపేట: శ్రావణ మాసం రెండో సోమవారం సందర్భంగా మండలంలోని కొడవటూర్ గ్రామం సిద్ధేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో అన్ని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. చిన్నరామన్ పల్లిలోని స్వయంభూ రామలింగేశ్వరాలయం, బండనాగారం, కొన్నెలోని శివ లింగాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఆలయాలకు వచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈఓ చిందం వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓంనమశివాయ, సిబ్బంది నూకల లక్ష్మికాంత్రెడ్డి, గంగం భానుప్రకాష్రెడ్డి, బండారి శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. వేయిస్తంభాల దేవాలయంలో... హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసంలోని ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారికి ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 100 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమ దంపతులు దేవాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం జరిపించారు. మధ్యాహ్నం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
విద్యారంగానికి అధిక ప్రాధాన్యం
జనగామ రూరల్: ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్లతో విద్యాప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని, తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ డీఈఓ వాసంతి, ఎంఈఓలు, స్పెషల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్, అధికారులు పాల్గొన్నారు. నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి నీటి నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషాతో కలిసి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికి దేవాదుల నీటి ద్వారా జిల్లాలోని పంట పొలాలను కాపాడుకునే అవకాశం ఉందన్నారు. పొలాలు ఎండిపోకుండా నీటిని సర్దుబాటు చేయాలని, వర్షపాతం తక్కువగా నమోదైనందున నీరు వృథా కాకుండా పంటలకు అందించే బాధ్యత అధికారులదేనన్నారు. జనగామ, హనుమకొండ జిల్లాల నీటిపారుదల శాఖ ఎస్సీలు సుధీర్, వెంకటేశ్వర్లు డిప్యూటీ కలెక్టర్ సుహాసిని జనగామ, స్టేషన్ ఘనపూర్ ఆర్డీఓలు గోపిరామ్, వెంకన్న, అధికారులు, రైతులు, పాల్గొన్నారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి స్టేషన్ఘన్పూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం డివిజన్ కేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మాణం పూర్తయిన మోడల్ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు పూర్తయిన లబ్ధిదారులకు బిల్లులు త్వరగా చె ల్లించేలా చూడాలని, ఇప్పటి వరకు నిర్మాణాలు మొదలు పెట్టని వారిని గుర్తించి పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. ఆర్డీఓ వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి విద్యాప్రగతిపై సమీక్ష -
పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం
జగనామ: హిందువులు, ప్రకృతి ఆరాధకులు ప్రాణాధార, ఔషధ మొక్కలను పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని వీహెచ్పీ జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో విశ్వహిందూ పరిషత్, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దైవిక మొక్కలు నాటి హరిత సంకల్పాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వృక్ష సంపదను పెంపొందించడంతో పాటు పర్యావరణ సమతుత్యతను కాపాడాలన్నారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు గజ్జెల నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరు ఒక మొక్క నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాశం శ్రీశైలం, గోవర్ధన్, యాదగిరి, హనుమారెడ్డి, అనిల్, సాయిసుజీత్, నాగమణి, జక్క జ్యోతి, ధనలక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు. వీహెచ్పీ జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ -
కాంప్లెక్స్ ఎరువులనే వాడాలి
పాలకుర్తి టౌన్: యూరియాకు బదులు కాంప్లెక్స్ ఎరువులను వాడేవిధంగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి కట్ట అంబికాసోని అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంప్లెక్స్ ఎరువులు వాడి నేల సారవంతాన్ని పెంపొందించుకోవాలన్నారు. షాపు యజమానులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. స్టాక్ బోర్డులు ప్రదర్శించాలన్నారు. మండల పరిధిలోని షాపుల్లో నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి వ్యవసాయ అధికారి విజయ్రెడ్డి, ఏఈఓలు సంకటబోయిన మహేష్, ముత్తినేని వెంకటేష్, మాన్యపు దీపక్, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంబికాసోని -
ఇళ్లను కూలగొట్టిన వారిపై చర్య తీసుకోవాలి
జనగామ రూరల్: పేదల ఇళ్లను కూలగొట్టిన వా రిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్, బొట్ల శేఖర్ డిమాండ్ చేశారు. సో మవారం పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్ద సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం డీసీపీ రాజమహేంద్రనాయక్కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో 400 సర్వేనంబర్లో 20 సంవత్సరాల క్రితం ఆటో, హమాలీ కార్మికులు, ఒంటరి మహిళలు కొనుగోలు చేసుకుని ఇల్లు నిర్మించుకున్నారన్నారు. సోమవారం ఓ వ్యక్తి ఆ భూమితో ఎ లాంటి సంబంధం లేకపోయినా దౌర్జన్యంగా ఇళ్లను కూలగొట్టారన్నారు. తక్షణమే కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, పల్లెల లలిత, ధర్మ భిక్షం, అజ్మీరా సురేష్ నాయక్, కనకాచారి, శివ, సమ్మయ్య, గాజుల నాగరాజు, గట్టయ్య, బండ్రు సత్తయ్య, మంజుల లక్ష్మి, ప్రసాద్, పరశురాములు, నాగరాజు, గంగరబోయిన మల్లేష్రాజ్, సుమ, తదితరులు పాల్గొన్నారు. -
జనగామ
మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025సమస్యలు పరిష్కరించరూ..ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు హనుమకొండ జేఎన్ఎస్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు సోమవారం ముగిశాయి.జనగామ రూరల్: ఉండటానికి ఇల్లు లేదని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, వితంతు పింఛన్, ఇంటి నంబర్ తప్పు పడిందని, భూమి ఆక్రమించుకోవాలని చూస్తున్నారని.. ఇలా పలు సమస్యలతో సోమవారం బాధితులు గ్రీవెన్స్కు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు అధికారులు తక్షణమే పరిష్కరించాలన్నారు. పెండింగ్ సమస్యలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. గ్రీవెన్స్లో మొత్తం 81 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. వినతులు కొన్ని ఇలా.. ● బచ్చన్నపేట గ్రామానికి చెందిన చల్లా వసంత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన సంభోజు నరసింహస్వామికి చెందిన భూమిని కొంతమంది అక్రమంగా పట్టా చేయించుకున్నారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. ● జనగామ పట్టణంలోని సాయినగర్కు చెందిన బంధారపు లక్ష్మయ్య మిషన్ భగీరథ కనెక్షన్ ఇప్పించాలని కోరారు.భూమి కబ్జా చేయాలని చూస్తున్నారు.. మల్కాపురం గ్రామంలో 333/ఇ1, 333/ఇ2 సర్వే నంబర్లలోని ఎకరం భూమిని గత కొన్ని ఏళ్ల నుంచి సాగు చేసుకుంటా. గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు అక్రమంగా మార్పిడి చేసి పదేళ్ల నుంచి రైతు పెట్టుబడి సాయం అందకుండా చేశారు. విచారణ చేపట్టి సదరు వ్యక్తులపై చర్య తీసుకొని న్యాయం చేయాలి. – బిల్లా మల్లారెడ్డి, మల్కాపురం, చిల్పూర్ భూమి పట్టా చేయడం లేదు.. గ్రామంలో తన తండ్రి మనోహర్ పేరు మీద సర్వే నంబర్ 362సీలో 14 గుంటల భూమి ఉంది. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి మరణించారు. వారసత్వంగా వస్తున్న భూమి పట్టా చేయాలని స్లాట్ బుక్ చేయగా ఏడాది అవుతున్న పట్టా కావడం లేదు. భూమి పట్టా అయ్యేటట్లు చూడాలి – దుక్కిడి కృష్ణ, ఇబ్రహీంపూర్,రఘునాథపల్లి పై ఫొటోలోని వ్యక్తులు రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన వారు. స్థానిక ఎస్బీఐ వద్ద వీధిదీపాలు లేకపోవడంతో గ్రామంలోని మహిళలు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాత్రి వేళల్లో విషపురుగులతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తక్షణమే వీధిదీపాలు ఏర్పాటు చేయించాలని గ్రామానికి చెందిన బానోత్ జితేందర్తో పాటు మరికొందరు కలెక్టర్కు వినతిపత్రం అందించారు.ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదుకూలీ పనులు చేసుకుంటున్న తమకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు. గ్రామంలో ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. –పోతుగంటి జ్యోతి, అలీంపూర్, బచ్చన్నపేట ఒంటరి మహిళా పింఛన్ ఇప్పించరూ.. భర్త అనివార్య కారణాలతో నన్ను విడిచిపెట్టారు. ఇద్దరు పిల్లలను కూలీ పనులు చేసుకుంటూ పోషించుకుంటున్న. ఒంటరి మహిళ కింద పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – జేరుపోతుల ప్రసన్న, ఓబుల్ కేశవాపూర్, జనగామన్యూస్రీల్ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న బాధితులు పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రజావాణికి 81 వినతులు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ సమస్యలే ఎక్కువ -
డీవీఏహెచ్ఓగా మురళీధర్రావు
జనగామ: జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారిగా డాక్టర్ ఎస్.మురళీధర్రావు సోమవారం బాధ్యలను స్వీకరించారు. అనంతరం డీవీఏహెచ్ఓ కలెక్టర్ రిజ్వాన్ బాషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్లు, సర్జన్లు డీవీఏహెచ్కు మొక్క అందించి శాలువాతో సత్కరించారు. డీఎల్ఎంఓగా ఝాన్సీ.. జనగామ: జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ (డీఎల్ఎంఓ)గా పి.ఝాన్సీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పని చేస్తున్న వి.శ్రీనివాసులు పదోన్నతిపై నల్లగొండ హెడ్ క్వార్టర్కు బదిలీ కాగా, అక్కడ సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఝాన్సీ పదోన్నతిపై జనగామకు వచ్చారు. సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలం దేవరుప్పుల: ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమవుతున్నారని ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడు పృధ్వీరెడ్డి అన్నారు. సోమవారం సింగరాజుపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఉద్యమాలకు పురిటిగడ్డ పాలకుర్తిలో ప్రజామార్పుతో గెలిచిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారన్నారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి సాగు నీరు విడుదల ప్రారంభోత్సవానికే సరిపోయిందన్నారు. వెంటనే కాల్వల ద్వారా చెరువులు నింపి పంట లను రక్షించాలన్నారు. పంటలు ఎండిపోతే పా లకవర్గాలు పూర్తి బాధ్యత వహించాలన్నారు. సాగునీరు అందించాలని ధర్నా జనగామ రూరల్: దేవాదుల కాల్వ నిర్మాణ పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జనగామ, సిద్దిపేట జిల్లాల అధ్యక్షులు ఆది సాయన్న, కత్తుల భాస్కర్రెడ్డి మాట్లాడుతూ దేవాదుల కాల్వ చేర్యాల మండలం నాగపురి గ్రామ శివారులోని గండికుంట వరకు నిర్మించి వదిలేశారని, దీంతో 20 సంవత్సరాలు దాటినా.. నిర్మాణ పనులు పూర్తి కాలేదన్నారు. తక్షణమే పోతిరెడ్డిపల్లి గ్రామం బయ్యన్నచెరువు వరకు నిర్మాణం పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి సొప్పరి సోమయ్య, అందే అశోక్, వలబోజు నరసింహాచారి, రైతులు గూడూరి బాలరాజు, జింకల హరికృష్ణ, బట్టు భాస్కర్, కొక్కొండ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. డీజిల్ ట్యాంకర్ బోల్తా ● తప్పిన ప్రమాదం ● క్యాన్లలో డీజిల్ తీసుకెళ్లిన స్థానికులు స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి శివారులో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట నుంచి హుస్నాబాద్కు 12వేల లీటర్ల డీజిల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తా పడింది. బోల్తా పడిన గంటసేపటి వరకు వాహనం నుంచి డీజిల్ కిందపోతుండగా ట్యాంకర్ ఇంజిన్ ఆన్లోనే ఉంది. రాత్రి సమయం కావడం, వర్షం కురుస్తుండటంతో వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ట్యాంకర్ బోల్తా పడి డీజిల్ పోతుందనే సమాచారం మేరకు శివునిపల్లితో పాటు సమీప తండాకు చెందిన వారు అక్కడికి చేరుకుని డీజిల్ను క్యాన్లలో తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై వినయ్కుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు. రాత్రి వేళకావడంతో పాటు వర్షం కురుస్తుండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎస్సై తెలిపారు. -
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు కృషి
జనగామ రూరల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా, సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వన మహోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్తో కలిసి మొక్కలు నాటారు. పాఠశాలలోని స్టాక్ రూమును సందర్శించి విద్యార్థుల భోజనం కొరకు వినియోగిస్తున్న వంట సామగ్రిని, వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా?లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులు చదవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్రావు, జిల్లా బాలికల పర్యవేక్షణ అధికారి గౌసియా బేగం, సివిల్ సప్లయీస్ డీటీలు శ్రీనివా స్, లచ్చు నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల సందర్శన -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
జనగామ: జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల ఫెల్యూర్స్ను తగ్గించి నాణ్యమైన విద్యుత్ను అందించాలని ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో గత నెలలో జరిగిన పనులు, టార్గెట్, ప్రస్తుత మాసంలో చేయాల్సిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ జరిగే ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. 33 ఇంటర్ లింకింగ్ లైన్ పూర్తి చేయడంతో పాటు వ్యవసాయ సర్వీస్లను వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో చీఫ్ ఇంజనీర్ రాజ చౌహన్, సూపరింటెండెంట్ ఇంజనీర్ వేణుమాధవ్, డీఈ టె క్నికల్ గణేష్, ఎస్ఏఓ జయరాజు, జనగామ, స్టేషన్ఘన్పూర్ డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, రాంబాబు, విజయకుమార్, ఏడీ, ఏఈలు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ మధుసూదన్ -
టీచర్లకు యాప్ కష్టాలు!
పలు పాఠశాలల్లో నెట్వర్క్, సర్వర్ సమస్యతో ఇబ్బందులు జనగామ: ప్రభుత్వం సర్కారు బడుల్లో అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్) టీచర్లకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. అప్ అండ్ డౌన్ చేస్తున్న ఉపాధ్యాయులకు మునుపటిలా అనుకూల పరిస్థితి కనిపించడం లేదు. ముఖ చిత్రం ద్వారా అటెండెన్స్ ప్రవేశ పెట్టడంతో ఒక్క సెకండ్ ఆలస్యం జరిగినా.. అందులో నమోదవుతుంది. దీంతో టీచర్లు ఒక్క నిమిషం ముందుగానే బడిలో ఉండే పరిస్థితి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి అప్ అండ్ డౌన్ చేసే వారికి కష్టంగానే చెప్పుకోవచ్చు. పిల్లల ఉన్నత చదువుల కోసం ఇన్నాళ్లు అప్ అండ్ డౌన్ చేస్తున్న టీచర్లు జిల్లా హెడ్ క్వార్టర్ మకాం మార్చేందుకు పలువురు టీచర్లు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, హనుమకొండ నుంచి.. జిల్లాలో 459 పాఠశాలలు (కేజీబీవీ, మోడల్, యూఆర్ఎస్ కలుపుకుని) ఉండగా, 2,773 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో లోకల్గా 800 మంది వరకు జిల్లా కేంద్రంలో నివాసం ఉండగా స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్, చిల్పూరు, రఘునాథపల్లి, పాలకుర్తి పరిధిలోని పాఠశాలలకు కొంతమంది ఉపాధ్యాయులు హనుమకొండ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట, జిల్లా హెడ్ క్వార్టర్కు సుమారు 8 నుంచి 9 వందల మంది సికింద్రాబాద్, కూకట్పల్లి, చింతల్, ఎస్ఆర్నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ (హైదరాబాద్) తదితర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తుంటారు. మండల హెడ్ క్వార్టర్స్కు చేరుకున్న తర్వాత మెజార్టీ టీచర్లు అక్కడ నుంచి 5 నుంచి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో గత కొంత కాలంగా విద్యార్థులకు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్.. ఆగస్టు 1వ తేదీ నుంచి ఉపాధ్యాయులకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05, సాయంత్రం 4.15 గంటల తర్వాత రోజుకు రెండు సార్లు స్కూల్స్ ఏరియాలో టీచర్లు యాప్లో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. ఒక్క సెకండ్ ఆలస్యం జరిగినా... ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత స్కూల్ సమయ పాలనలో మరింత ఖచ్చితత్వం పెరిగింది. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు యాప్లో అటెండెన్స్ వేసే సమయంలో ఒక్క సెకండ్ ఆలస్యం జరిగినా అందులో నమోదవుతుంది. దీంతో నెలలో ఎన్ని నిమిషాలు, గంటలు, అనే వివరాలు కాంప్లెక్స్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఇట్టే తెలిసి పోతుంది. దీంతో అటెండెన్స్ నమోదు ఆధారంగా వేతనాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి అప్ అండ్ డౌన్ చేసే టీచర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. తెల్లవారు 5 గంటలకు ఇంటి బయలు దేరి.. రాత్రి 8 గంటల వరకు చేరుకునే పరిస్థితులతో జనగామ జిల్లా హెడ్ క్వార్టర్కు మారేందుకు నిర్ణయం తీసుకోవడంలో మెజార్టీ టీచర్లు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. సమయ పాలన పాటించేందుకు జనగామలో టులెట్ బోర్డుల కోసం ఆరా తీస్తున్నారు. లొకేషన్ పరిధి పెంచాలని.. అప్ అండ్ డౌన్కు స్వస్తి జిల్లాలో 2,773 మంది ఉపాధ్యాయులుఏక కాలంలో ఓపెన్ చేయడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు విధానం తీవ్రమైన బాలారిష్టాలతో సాగుతోంది. నెట్వర్క్లో సాంకేతిక సమస్య, సర్వర్ సతాయింపులతో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేసే సమయంలో ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాల ఆవరణను జీపీఎస్తో అను సంధానం చేయడంతో..సెల్ సిగ్నల్ వచ్చినా, రాకున్నా అక్కడే ఉండి ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫోన్ ద్వారా హాజరు తీసుకున్నప్పటికీ ఫొటో డిస్ప్లే కాకపోవడం, ఉన్నతాధికారుల డేటా నమోదులో సైతం కనిపించక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ యాప్ కోసం సైట్ ఓపెన్ చేయడంతో నెట్వర్క్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగి పోతుంది. ఫొటోను అప్ లోడ్ చేసే సమయంలో ఆఫ్ క్వాలిటీకి కుదించితే కొంతవరకు ఈ సమస్య తీరుతుందనే భావనను వ్యక్త పరుస్తున్నారు. ఐఫోన్ (ఆపిల్) ఫోన్లో ఎఫ్ఆర్ఎస్ యాప్ పని చేసే విధంగా చూడాలనే డిమాండ్ సైతం వినిపిస్తుంది. సాంకేతిక సమస్యను అధికమించే వరకు అటెండెన్స్ నమోదులో గ్రేస్ పిరియడ్ ఉండే విధంగా నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో సెల్ సిగ్నల్ కష్టంగా మారిన సమయంలో స్కూల్ ఆవరణ నుంచి కొద్ది దూరం వెళ్లి అటెండెన్స్ వేసేలా పిన్ లొకేషన్ పరిధి పెంచాలనే విన్నపాలు పెరుగుతున్నాయి. సాంకేతిక సమస్యలతో టీచర్స్ మొబైల్స్లో అటెండెన్స్ మార్కు కనిపిస్తున్నా, జిల్లా వరకు వచ్చే సరికి గైర్హాజరైనట్లుగా చూపిస్తుందనే ప్రచారం ఉంది. చెక్ ఇన్ కొరకు అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఫొటో కనిపించక పోవడంతో, రెండవ సారి ఫేస్ అటెండెన్స్తో చెక్ ఇన్–చెక్ అవుట్ అని ఒకేసారి చూపిస్తుండడంతో టీచర్లు టెన్షన్ పడుతున్నారు. ఫేషియల్ అటెండెన్స్ తీసుకునే సమయంలో ఉత్పన్నమవుతున్న సాంకేతిక సమస్యను నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. -
రుద్రేశ్వరుడిని దర్శించుకున్న రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యమిశ్రా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మంగళవాయిద్యాలతో ఘ నంగా స్వాగతించారు. డీజీపీ సౌమ్యమిశ్రా ముందుగా ఉత్తిష్ట గణపతిని దర్శించుకుని రుద్రేశ్వరస్వామికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేష వ స్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు చాలా సార్లు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. స్వామి వారిని దర్శించుకుంటే కొంత మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏ ర్పాట్లు పర్యవేక్షించారు. ఆమె వెంట వరంగల్ ఏసీపీ నాగరాలె శుభం ప్రకాశ్ ఉన్నారు. -
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు
జనగామ: జనగామ పట్టణం రైల్వేస్టేషన్ అమ్మబావి సమీపంలోని ఉప్పలమ్మ తల్లి శ్రావణమాసం రెండవ ఆదివారం ప్రత్యేక చీరల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన పూజారి వారనాసి పవన్శర్మ మంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 7న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలుజనగామ: జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో ఈ నెల 7న జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు హాజరు కావాలని కోరుతూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్కు ఆదివారం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ ఆహ్వా న పత్రిక అందించారు. ఆయన వెంట అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి ఆవుల అశోక్, గాదె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అంబేడ్కర్ సేవారత్న అవార్డు ప్రదానంస్టేషన్ఘన్పూర్: విద్యుత్శాఖలో స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి లైన్మన్గా పనిచేస్తున్న గబ్బెట సుధాకర్ ఆదివారం అంబేడ్కర్ సేవారత్న అవార్డును అందుకున్నారు. విద్యుత్శాఖలో విధుల్లో చురుకుగా పనిచేస్తూనే పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న సుధాకర్ సేవలను గుర్తించి లలిత కళా సమాఖ్య సేవా సామాజిక సంస్థ వారు అంబేడ్కర్ సేవారత్న అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని త్యాగరాయ గానసభ వేదికపై సుధాకర్కు అవార్డును అందించారు. అవార్డుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. టీటీసీ పరీక్షలకు 99.11 శాతం హాజరు విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఆదివా రం మూడు సెషన్లలో నిర్వహించారు. ప్రభు త్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, లష్కర్బజార్ బాలి కల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెట్రోల్బంక్ ప్రభుత్వ హైస్కూల్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 566 మంది అభ్యర్థులకుగాను 560 మంది 99.11 శాతం హాజరైనట్లు జిల్లా విద్యాశాఖలోని ఏసీజీఈ బి.భువనేశ్వరి తెలిపారు. -
‘స్థానిక’ం తర్వాతే..
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి కేడర్ కదిలించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ కమిటీలు వేయాలని మొదట భావించింది. ఏప్రిల్ 24 నుంచి జిల్లాల వారీగా ఇన్చార్జ్ల ద్వారా సమావేశాల ఏర్పాటు చేసి ఆశావహుల పేర్లను కూడా సేకరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టడం.. పార్టీ పరంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో సంస్థాగత కమిటీల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు సంస్థాగత కమిటీలపై చర్చ జరుగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్పులు, చేర్పులు మంచిది కాదన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రస్థాయి కమిటీలకు డైరెక్టర్ల కోసం మాత్రం ఎమ్మెల్యేల ద్వారా పేర్లను సేకరించారు. పదవులకు ప్రామాణికం 2017 కటాఫ్.. మహిళలకు ప్రాధాన్యం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హైదరాబాద్లో ఇటీవల ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ నుంచి జిల్లా ఇన్చార్జ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు సంస్థాగత, నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 24 మంది పేర్లను ఎమ్మెల్యేలు సూచించాల్సి ఉంది. వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో రెండింటితో సరిపెట్టలేమని, ఐదు వరకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలిస్తామన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి డైరెక్టర్లతోపాటు జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని, 2017 సంవత్సరం కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా మొదటి దఫాలోనే అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నదని, ప్రజాప్రతినిధులు సీనియర్లను ఎంపిక చేయాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిశీలనలో ఉన్న డీసీసీ ఆశావహుల పేర్లు ఇవే... వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను మేవరకు నాటికి పూర్తి చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు ఏప్రిల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీల నియామకానికి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించింది. మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావించి కసరత్తు చేశారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలు వేయాలని అధిష్టానం భావిస్తే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను మరోసారి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. రాజకీయ సమీకరణలు మారితే నమిండ్ల శ్రీనివాస్, గోపాల నవీన్రాజ్, కూచన రవళిరెడ్డి పేర్లు వినిపించాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చంద్రారెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ఈయనను మార్చితే హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి పేర్లు పరిశీలించారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్కే మళ్లీ అవకాశమన్న ప్రచారం జరుగగా.. మంత్రి ధనసరి సీతక్క కుమారుడు సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.డీసీసీలకు కొత్త సారథులు!? బ్లాక్, మండల అధ్యక్షులు కూడా యథాతథం పునరాలోచనలో పార్టీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఓకే.. త్వరలో డైరెక్టర్ పోస్టుల నియామకం అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు.. నగరాల్లో ఐదు కావాలన్న ఎమ్మెల్యేలు ఇటీవలే ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం -
సుందరీకరణ పనులు పరిశీలన
జనగామ: జనగామ రైల్వేస్టేషన్లో అమృత్ భారత్ పథకంలో కొనసాగుతున్న సుందరీకరణ పనులను దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం గోపాలకృష్ణన్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీనత్తే నయంశ్రీ శీర్షికన సాక్షిలో గత నెలలో ప్రచురితమైన కథనానికి డీఆర్ఎం స్పందించారు. పనుల్లో నాణ్యత పాటించి, మరింత వేగం పెంచాలని ఆదేశించారు. స్టేషన్ ముఖద్వారంతో పాటు ప్లాట్ ఫాంలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, డివైడర్లు, ఇతర పనులను పరిశీలించారు. కాగా జనగామ స్టేషన్లో దానాపూర్, చార్మినార్, షిర్డీ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపే విధంగా చూడాలని కోరుతూ నాయకులు ఈగం శ్రీనివాస్, బింగిరాజు, కె.యాదగిరి, చెన్నోజు నగేష్ కుమార్, కొమురయ్య, సోమ శేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు డీఆర్ఎంకు వినతి పత్రం అందించారు. -
బీసీల చైతన్యం కోసమే ఉద్యమం
జనగామ రూరల్: బీసీల అస్తిత్వ చైతన్యం కోసమే ఉద్యమమని మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కటకం నర్సింగరావు అన్నారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ఆవిర్భవించిన మన ఆలోచనల సమితి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి బీసీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ సంఘాల సమన్వయ వేదిక సమన్వయ కర్త కన్న పరశురాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నర్సింగరావు మాట్లాడుతూ మా వాటా మాకే, మన ఓటు మనకే నినాదం గ్రామాల్లో చర్చ జరగాలని, అప్పుడే రాజ్యాధికార సాధన సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి జిల్లా కన్వీనర్లు గునిగంటి రామకృష్ణ, పన్నీర్ సత్యం జి. కృష్ణ, బొమ్మగాని అనిల్ గౌడ్, బైరు బాబు, చంద్రయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలు
స్టేషన్ఘన్పూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్పై ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే కడి యం శ్రీహరి మండిపడ్డారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్యనాయకుల సమావేశాన్ని డివిజన్ కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కడియం హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే దానికి చట్టబద్దత కల్పించకుండా ప్రజలను మభ్యపెట్టడానికి నాటకాలు ఆడుతున్నారన్నారు. అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని, ముందుగా పార్టీ శ్రేణులు సమష్టిగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 105 మంది లబ్ధిదారులకు రూ.41.89లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కాగా పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పార్టీ నాయకులెవరూ కండువాలు ధరించకుండా రావడం విశేషం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.రాంబాబు, చి ల్పూరు దేవస్థాన చైర్మన్ శ్రీధర్రావు, రైస్మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బెలిదె వెంకన్న, నా యకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
జనగామ రూరల్: కేంద్రం విద్యుత్ సవరణ చట్టం చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందూనాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణ కార్యదర్శి మంగ భీరయ్య అధ్యక్షతన తెలంగాణ రైతు సంఘం పట్టణ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించే పత్తి పంట కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రైస్ డెఫిసిటీ పేమెంట్ స్కీమ్ వెనక్కి తీసుకోవాలన్నారు. జిల్లాలో 8000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటే కేవలం 6,000 మెట్రిక్ టన్నులు మాత్రమే అందిందని, దీంతోనే యూరియా కొరత ఏర్పడిందన్నారు. తక్షణమే రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య, రామావత్ మీట్యా నాయక్, ఉర్సుల కుమార్, నంద రాములు, కే.వెంకన్న, కర్రె రాములు, సత్తయ్య, బీరయ్య, శ్రీశైలం పాల్గొన్నారు. -
ప్రభుత్వాలు మారినా.. ప్రజల బతుకులు మారలె
బచ్చన్నపేట: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా ప్రజ ల బతుకుల్లో మార్పు రాలేదని మాజీ మంత్రి గుండె విజయరామారావు అన్నారు. ఆదివారం మండలంలోని దబ్బగుంటపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ చే పడుతున్న మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బంగారు మహేష్ అధ్యక్షతన ఇంటింటికి బీజేపీ ప్రతి ఇంటికి పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. నరేంద్రమోదీ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని, బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరాచక పాలనను ఈ ప్రభుత్వం కూ డా కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, నాయకులు శశిధర్రెడ్డి, స ద్ది సోమిరెడ్డి, పరమేశ్వర్రెడ్డి, నవీన్రెడ్డి, ఉమరవి, గద్ద రాజు, జలేందర్, చక్రపాణి, రమేష్, కనకారెడ్డి, రమేశ్, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి విజయరామారావు -
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్
స్నేహితుల సంఘం! గీసుకొండ: గ్రేటర్ వరంగల్లోని 16వ డివిజన్ ధర్మారంలోని కోట మెసమ్మ తల్లి పరపతి సంఘం (స్నేహితుల సంఘం) ఆదర్శంగా నిలుస్తోంది. 2014 ఆగస్టు 15న తొమ్మిది మంది స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన సంఘంలో ప్రస్తుతం 24 మంది సభ్యులున్నారు. రూ. 50 లక్షల టర్నోవర్తో సంఘం లావాదేవీలు నిర్వహిస్తోంది. అవసరం ఉన్నసభ్యులకు 0.5 వడ్డీతో రుణాలిస్తున్నారు. సంఘ సభ్యులెవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.లక్ష సాయం అందిస్తున్నారు. ఏటా ఫ్రెండ్ షిప్ డే రోజున సంఘ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. కోటమైసమ్మ తల్లికి గొర్రెలను బలిచ్చి విందు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.హన్మకొండ: సమాజానికి సేవ చేయాలనే సదుద్దేశంతో 10 మందితో మొదలైంది బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్. ప్రస్తుతం వేయి మందితో నడుస్తోంది. ఆర్థిక సమస్య కారణంగా ఎవరూ చదువు మధ్యలోనే ఆపేయవద్దనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి దేవేందర్, డిప్యూటీ తహసీల్దార్ పతంగి భాస్కర్తో పాటు మరికొంత మంది మిత్రులు. 2020లో మొదలైన ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద విద్యార్థులకు ఆర్థికసాయం, పాలిసెట్ బుక్స్ పంపిణీ, పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ అందజేత, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సహాయం. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ వారికి ఆర్థిక చేయూతనందిస్తూ ముందుకుసాగుతోంది. సేవే అభిమతంతొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆపదలో స్నేహితులకు ఆర్థిక చేయూతనిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుడు చాట్ల సంపత్ను బతికించాలని రూ.1.3 లక్షలు సమీకరించి చికిత్స అందించారు. అదేవిధంగా కంఠాయపాలెం గ్రామానికి చెందిన ఆర్ఎన్ చారి అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోగా.. గుర్తించిన మిత్రులు రూ.50 వేలు జమ చేసి అందించారు. పదో తరగతి మిత్రుడు నాగేశ్వరావు ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తుండగా.. బస్సు ప్రమాదంలో అతడి కాళ్లు విరిగాయి. ఆరు నెలలు డ్యూటీ లేకుండా ఇంట్లోనే ఉండడంతో అతడి కూతురు చదువుకు ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మేమున్నామంటూ సహచర పదో తరగతి మిత్రులు రూ.70 వేలు అందించారు. కేసముద్రం: బాల్యమిత్రుడు మృతి చెందాడు. అతని ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు. ఆ ఆడబిడ్డల్లో స్నేహితుడిని చూసుకుంటున్నారు కేసముద్రంలోని ఎస్వీవీ హైస్కూల్కు చెందిన 1996–97 ఎస్సెస్సీ బ్యాచ్ మిత్రులు. మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గాండ్ల అశోక్కు ఇద్దరు కుమార్తెలు. మొదటి భార్యకు కూతురు పుట్టగానే ఆమె మృతిచెందింది. ఆతర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. కాగా.. రెండో భార్యకు మరో కూతురు జన్మించగానే అశోక్ చనిపోయాడు. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించిన ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆ ఇద్దరు ఆడపిల్లల పేరుమీద సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఎఫ్డీ చేయించారు. ఏటా రూ.45వేల ఫీజు చెల్లిస్తూ పెద్దకూతురు శివానిని(6వ తరగతి) నర్సంపేటలోని ఓప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. వారి చదువుకున్నంత కాలం చదివిస్తామని బాల్యమిత్రులు చెబుతున్నారు. కేసముద్రం: శివాని ఫీజు కడుతున్న బాల్యమిత్రులు జనగామ: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్కారు ఉత్తర్వులకు విరుద్ధంగా విద్యార్థి, టీచర్ రేషియోను పట్టించుకోకుండా అధికారులు సర్దుబాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్దుబాటులో పలుకుబడి కలిగిన వారు పని చేస్తున్న స్కూల్స్కే పెద్దపీట వేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పిల్లలు తక్కువగా ఉండి, అదనంగా పని చేస్తున్న టీచర్లను, విద్యార్థుల సంఖ్య ఎక్కువ, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉన్న చోటకు సర్దుబాటు చేయాలి. కానీ జిల్లాలో పైరవీలు చేసిన వారికే ప్రాముఖ్యం ఇచ్చారని చెప్పుకుంటున్నారు. శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేస్తూ.. వెంటనే విధుల్లో చేరాలని పేర్కొన్నారు. 72 మంది ఎస్జీటీలు, 32 మంది ఎస్ఏలు.. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 109 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 72 మంది ఎస్జీటీలు, 32 మంది స్కూల్ అసిస్టెంట్లు, 5 లాంగ్వేజ్ పండిట్ లను మరో పాఠశాలకు సర్దుబాటు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రాథమిక పాఠశాలలో 10 మందిలోపు విద్యార్థులకు ఒక టీచర్, 11 నుంచి 60 లోపు ఉంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు టీచర్లు ఉండాలనే నిబంధన ఉంది. కానీ ఇందుకు విరుద్ధంగా విద్యార్థులు తక్కువ ఎక్కువతో సంబంధం లేకుండా సర్దుబాటు విషయంలో కేవలం పైరవీలకు మాత్రమే చోటు కల్పించారని మాట్లాడుకుంటున్నారు. జనగామ మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, మరొక టీచర్ను కేటాయించలేదు. అదే కొంత మంది ప్రముఖులుగా చెప్పుకునే టీచర్ల విషయంలో సర్దుబాటులో ప్రియార్టీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ 40 నుంచి 45 మంది విద్యార్థులకు 3 టీచర్లు ఉండగా, సర్దుబాటులో మరొకరిని కేటాయించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా నర్మెట మండల పరిధిలో పలు స్కూల్స్ల్లో 45 నుంచి 50 మంది విద్యార్థులకు 3 ఎస్జీటీలు ఉండగా, ఒకరిని తొలగించి అదే మండలంలో బాధ్యులుగా చెప్పుకునే వారి పాఠశాలలో 40 నుంచి 45 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు పని చేస్తున్నా, మరొకరిని కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బచ్చన్నపేట మండలంలో నేతలు పని చేస్తున్న స్కూల్స్ల్లో విద్యార్థుల సంఖ్య 45 నుంచి 50 మందికి నలుగురు లేక ఐదుగురు పని చేస్తున్నా.. అక్కడ నుంచి ఒక్కరిని కూడా తొలగించలేదు. ఇదే మండలంలో బడిబాట, రెగ్యులర్గా పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి, మరో టీచర్ అవసరమున్నప్పటికీ, ఈ జాబితాలో చోటు కల్పించలేదు. సర్దుబాటు జాబితాపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపధ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని మేధావి వర్గం డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం నిరుపేద పిల్లల అభ్యున్నతికి సర్కారు విద్యను బలోపేతం చేసే దిశగా ముందుకు వెళుతుంటే, సర్దుబాటు సమయంలో విద్యార్థుల భవిష్యత్కు ఆటంకంగా మారే పరిస్థితి ఉందని మాట్లాడుకోవడం గమనార్హం. ఐఏఎస్ అధికారి జిల్లా విద్యా శాఖ అధికారిగా బాధ్యతలను తీసుకున్న తర్వాత, సర్దుబాటులో సమన్యాయం జరగలేదనే ప్రచారంలో నిజానిజాలను వెలుగులోకి తీసుకు రావాలని, సర్కారు బడులను గౌరవించే ప్రతిఒక్కరు కోరుతున్నారు. మండలాల వారీగా ఉపాధ్యాయుల సర్దుబాటు బచ్చన్నపేట మండలంలో 8, చిల్పూరు 9, దేవరుప్పుల 10, స్టేషన్ఘన్పూర్ 8, జనగామ 20, నర్మెట 7, కొడకండ్ల 5, లింగాలఘణపురం 6, పాలకుర్తి 13, రఘునాథపల్లి 15, జఫర్గఢ్లో 8 మందిని సర్దుబాటు చేశారు. -
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu3. నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు. A) ఇద్దరికి మించి B) ఒకరు211. ఫ్రెండ్ షిప్ అంటే..మీ దృష్టిలో A) అవసరాలు తీర్చేది B) కల్మషం లేనిది84స్నేహం అంటే మనుషుల్ని కలిపే వారధి. కష్టసుఖాలను పంచుకునే ఓ అనుభూతి. కష్టం వచ్చిందంటే నేనున్నానంటూ ‘చేయి’ అందించే ఓ రూపం.. ప్రపంచంలో ప్రతీ బంధానికి ప్రత్యేకత ఉంటుంది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు..బంధువులు సహజంగా లభిస్తారు.. కానీ స్నేహితులు మాత్రం మనం మన చేతిగా ఎంచుకునే బంధం. అలాంటి అపూర్వమైన అనుబంధాన్ని గుర్తుచేసుకునే రోజు స్నేహితుల దినోత్సవం. ఈ నేపథ్యంలో స్నేహబంధంపై ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంపై సాక్షి సర్వే నిర్వహించింది. ఇప్పటికీ, ఎప్పటికీ కల్మషం లేనిది స్నేహబంధమని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరికి జీవితంలో ఇద్దరికంటే ఎక్కువ స్నేహితులుండాలని, అప్పుడే ఏదైనా ఆపద వస్తే అండగా ఉంటారని చెప్పారు. 36992. ఫ్రెండ్షిప్ కూడా.. కలుషితం అయిందా..! 4. నీ ఫ్రెండ్కు ఇచ్చేస్థానం..?. A) అమ్మ, నాన్న, ఫ్రెండ్ B) నాన్న, అమ్మ, ఫ్రెండ్ A● ఇద్దరికి మించి స్నేహితులు అవసరం ● అమ్మానాన్న తరువాత ఫ్రెండ్కే ప్రాధాన్యం ● ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంA) లేదుB) అవును2932C) ఫ్రెండ్, అమ్మ, నాన్న 6159– సాక్షి నెట్వర్క్ న్యూస్రీల్ -
ఆడపిల్లలకు ఆర్థిక చేయూత
ఖానాపురం: మండల కేంద్రంలోని హైస్కూల్లో 1996–97లో విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరంతా మూడేళ్ల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్న సమయంలో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకున్నారు. వీరితో పాటే 6 నుంచి 9వ తరగతి చదివిన వారిని సైతం ఇదే గ్రూప్లో యాడ్ చేసుకున్నారు. ప్రస్తుతం సుమారు 50 మందితో గ్రూప్ సాగుతోంది. గ్రూపులో ఎవరికి ఏ కష్టమొచ్చినా తామున్నామనే భరోసాను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 14 మంది స్నేహితుల కుమార్తెలకు వివాహ సమయంలో ఆర్థిక సాయం అందించారు. -
ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలి●
● జిల్లా పంచాయతీ అధికారి స్వరూప జఫర్గఢ్: ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా పంచాయతీ అధికారి స్వరూప కోరారు. మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణతో పాటు గ్రామ పరిసరాలు, అంగడిని పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పారిశుద్ధ్యం విషయంలో పంచాయతీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ముందస్తు చర్యలు చేపట్టాలి
జనగామ రూరల్: సీజనల్ వ్యాధులపై ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం మండలంలోని పెంబర్తి జీపీ ఆవరణలోని సబ్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా త నిఖీ చేశారు. సిబ్బంది రిజిస్టర్, మందుల నిల్వను పరిశీలించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భా గంగా ఇప్పటివరకు ఎంత మందికి స్క్రీనింగ్, ఎక్స్రే చేశారని, ఓపీ నమోదు, మలేరియా, డెంగీ కేసుల వివరాలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని హాకా ఫార్మర్ సెంటర్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ యూరియా కొరత లేదని, ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం పట్టణ సుందరీకరణలో భాగంగా హైదరాబాద్ రోడ్డు వైపు జరుగుతున్న అభివృద్ధి పనులను, రెండో వార్డులోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకుంటే ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
కల నెరవేరింది
జనగామ: రెండు దశాబ్దాల పోరాటం ఫలించింది. మొక్కవోని దీక్ష న్యాయం వైపు దారి చూపించింది. ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ప్రభుత్వంతో సంప్రదింపులు కొలిక్కి రాకపోవడంతో.. కోర్టు మెట్లు ఎక్కిన టీచర్లకు తీపి కబురు అందిస్తూ తీర్పు వెలవరించింది. పాత పెన్షన్ విధానానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, అపాయింట్మెంట్ ఆర్డర్లలో జాప్యం జరగడంతో సీపీఎస్ పరిధిలోకి వచ్చారు. ప్రభుత్వాలతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో కోర్టు ద్వారా న్యాయాన్ని పొందారు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు. ఇందుకు సంబంధించి సాక్షి ప్రత్యేక కథనం. పోరాటం సాగిందిలా... 2003 నవంబర్ మాసంలో డీఎస్సీ–2003 నోటిఫికేషన్ జారీ చేశారు. ఉపాధ్యాయుల సెలక్షన్ ప్రక్రియ జూన్ 2004లో పూర్తి చేశారు. ఈ సమయంలో పాత పెన్షన్ (ఓపీఎస్) విధానం అమల్లో ఉంది. కానీ టీచర్లకు మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్లు 2005 నవంబర్లో ఇచ్చారు. నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఓపీఎస్ అమలులో ఉన్న సమయంలోనే అర్హత సాధించినప్పటికీ, ఆర్డర్లో జాప్యం కావడంతో సీపీఎస్ పరిధిలోకి వెళ్లారు. దీనిపై అప్పట్లోనే నిరసనలు తెలిపారు. ఓపీఎస్ కిందకు తీసుకురావాలని నాటి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. ఫలితం లేకపోవడంతో ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలం తర్వాత డీఎస్సీ–2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పాత పెన్షన్ పథకానికి అర్హులేనని ప్రకటిస్తూ తీర్పు వెలువడింది. ఒక్క టీచర్లే కాకుండా 2003లో కానిస్టేబుల్, గ్రూప్–1, హెల్త్ డిపార్టుమెంట్ల ఉద్యోగులకు సైతం పాత పింఛన్ వర్తించనుంది. కోర్టు తీర్పు ఇలా.. డీఎస్సీ 2003 ద్వారా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) వర్తింపజేయాలని తెలంగాణ హైకోర్టు గత నెల 29వ తేదీన తీర్పు ఇచ్చింది. డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు సీపీఎస్ కాకుండా పాత పెన్షన్ విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేస్తే పెన్షన్, డీఏ, ఫ్యామిలీ పెన్షన్ తదితర సౌకర్యాలు అమలులోకి రానున్నాయి. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెర ఓపీఎస్కు అనుకూలంగా హైకోర్టు తీర్పు సంతోషంలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని విన్నపంజిల్లాలో 73 మంది జిల్లాలో 2003 నాటి డీఎస్సీ టీచర్లు 73 మంది ఉన్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు బయోసైన్స్–1, ఇంగ్లిష్–15, హిందీ–2, గణితం–3, పీడీ–1, ఫిజికల్ సైన్స్–15, సాంఘిక–5, తెలుగు–6, ఎస్జీటీ–25 మంది ఉన్నారు. హైకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. -
తల్లి పాలే బిడ్డకు శ్రీరామరక్ష!
తల్లిపాలతో లాభాలు ● తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన ఆహారాన్ని అందిస్తాయి. ● నాణ్యమైన ప్రొటీన్లు, ఒమెగా 3, 6, 9 బిడ్డ మెదడు వికాసానికి తోడ్పడుతాయి. ● తల్లిపాలలో బిడ్డకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టోజుతో కాల్షియం ని ల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. ● తొలి నెలలో శిశువుకు వివిధ రకాల అంటువ్యాధుల నుంచి కాపాడుతాయి. బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. ● కేన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండెవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. వారోత్సవాల వివరాలు ● ఆగస్టు 2న ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాధాన్యాన్ని తల్లులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. ● 4న అన్నప్రాసన ఉంటుంది. అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు బ్రెస్ట్ ఫీడింగ్పై అవగాహన కల్పిస్తారు. ● 5న ఇంటింటికి వెళ్లి తల్లిపాల ప్రాధాన్యాన్ని ప్రచారం చేస్తారు. ● 6న చేతులను శుభ్రం చేసుకునే అంశంపై అవగాహన కల్పిస్తారు. ● 7న స్వయం సహాయక సంఘాల సభ్యులు, మోప్మా, సెర్ఫ్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి బ్రెస్ట్ ఫీడింగ్పై అవగాహన కల్పిస్తారు.జనగామ రూరల్: పుట్టిన బిడ్డకు తల్లి పాలే శ్రీరామరక్ష. తల్లి పాల పాముఖ్యతను గ్రామీణ ప్రాంత మహిళలకు తెలియజేయడానికి ప్రభుత్వం తల్లి పాల వారోత్సవాలను ప్రతీ ఏటా ని ర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నారు. జిల్లాలోని అంగన్వాడీలు, పీహెచ్సీల్లో తల్లి పాల వారో త్సవాల నిర్వహనకు మహిళా శిశు సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామాల్లో తల్లిదండ్రులతో పాటు ప్రతిఒక్కరూ భాగస్వాములు కానున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బంది, ఆశలు, స్వయం సహాయక సంఘాలు, డీఆర్డీఏ, లైన్ డిపార్ట్మెంట్ల సిబ్బంది తల్లి పాల ప్రాధాన్యం, ఉపయోగాలపై అవగాహన విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలో 3 ప్రాజెక్టుల పరిధిలో 695 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 25,138 మంది పిల్లలు ఉన్నారు. తల్లిపాలపై అవగాహన జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లి పాల ప్రాఽ దాన్యతపై విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి ఆరు నెల ల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలు ఇ వ్వకూడదని వైద్యాధికారులు తెలిపారు. తల్లిపాలు తేలికగా జీర్ణమవుతాయని, శ్వాసకోశ, అలర్జీ, ఆస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయన్నాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8 నుంచి 10 సార్లు లేదా ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుందన్నారు. బిడ్డకు పాలిచ్చే సమయంలో కెఫి న్ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానియాలు తీసుకోరాదని, ఇవి శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతాయన్నారు.మొదలైన తల్లిపాల వారోత్సవాలు వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు జిల్లాలో 690 అంగన్వాడీల్లో 25,138 మంది చిన్నారులుఅవగాహన కల్పిస్తాం.. జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో తప్పనిసరిగా తల్లి పాల వారోత్సవాలు నిర్వహించాలి. తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన క ల్పించేలా విస్తృతంగా మహిళా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతీ అంగన్వాడీ టీచర్ తప్పనిసరిగా పాల్గొనాలి. – చౌడేశ్వరీ, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ -
స్వాతంత్య్ర దినోత్సవానికి నెల్లుట్ల పంచాయతీ కార్యదర్శి
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి రొండ్ల శ్రీనివాసురెడ్డికి ఈ నెల 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలంటూ శుక్రవారం ఆహ్వానం అందింది. భూగర్భ జలాల అభివృద్ధిలో 2023లో అప్పటి సర్పంచ్ చిట్ల స్వరూపరాణిభూపాల్రెడ్డి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు. మళ్లీ అదే గ్రామపంచాయతీకి చెందిన పంచాయతీ కార్యదర్శికి ఆహ్వానం రావడం విశేషం. రాష్ట్రం నుంచి ఆరుగురికి ఆహ్వానం అందగా జిల్లా నుంచి లింగాలఘణపురం మండలం నెల్లుట్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసురెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు 14న శ్రీనివాసురెడ్డి ఢిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు. -
డీఈఓగా అదనపు కలెక్టర్ పింకేష్కుమార్
● అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులుజనగామ: జిల్లా విద్యాశాఖ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఐఏఎస్) పింకేష్కుమార్కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ కార్యాలయంలో ఎఫ్ఏఓగా విధులు నిర్వర్తిస్తున్న భోజన్నకు ఈ ఏడాది మే 1వ తేదీన డీఈఓగా ఇన్చార్జ్ బాధ్యలను అప్పగించారు. మూడు నెలల కాలం పాటు పని చేసిన ఆయన స్థానంలో ఏసీ ఎల్బీకి బాధ్యతలను అప్పగించడంతో.. భోజన్న యాథాస్థితికి వెళ్లనున్నారు. శుక్రవారం పింకేష్కుమార్ డీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. ఒక్కరు.. మూడు బాధ్యతలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా 12 మండలాల పరిధిలో పంచాయతీల నిర్వహణ, జిల్లా గ్రామీణాభివృద్ధి, ప్రభుత్వం అమలు చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై దృష్టి సారించాల్సి ఉంటుంది. పురపాలిక పాలక మండలి గడువు ముగియడంతో స్పెషల్ ఆఫీసర్గా పింకేష్ కుమార్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో అదనపు కలెక్టర్తో పాటు పురపాలిక స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు.. డీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించడంతో పర్యవేక్షణ పెరిగింది. ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న క్రమంలో మూడో బాధ్యత సత్ఫలితాలు ఇస్తుందా లేదా అనే విషయం కాలం నిర్ణయించనుంది. పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజంనర్మెట: వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుందని జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జునరావు అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీతో పాటు ఆగపేటలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసి పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును పరిశీలించి వైద్య, పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డెంగీ పాజిటివ్ వచ్చిన ఇంటిని, పరిసరాలను పరిశీలించి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎం, ఆశలకు సూచించారు. ఆయన వెంట వైద్యాధికారి సుకన్య, సూపర్వైజర్ పద్మావతి, ఎస్ఎన్లు సునీత, శ్రీలత, ఆశాజ్యోతి, ఎల్టి కుమార్, ఎస్ఏ ప్రవీణ్, ఫార్మసిస్ట్ అనిల్ కుమార్, ఏఎన్ఎంలు సరిత, విజయశాంతి, శివ తదితరులు ఉన్నారు. డీసీఓగా కోదండరాములుజనగామ: జిల్లా సహకార సొసైటీ అధికారి (డీసీఓ/ఫుల్ అడిషనల్ ఇన్చార్జ్)గా కె.కోదండరాములు శుక్రవారం బాధ్యతలను తీసుకున్నారు. ప్రస్తుతం పని చేసిన రాజేందర్రెడ్డి పదవీ విరమణ పొందగా, ఆయనకు పూర్తి బాధ్యతలను అప్పగించారు. అనంతరం కోదండరాములు కలెక్టర్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక పాలకుర్తి టౌన్: రాష్ట్ర స్థాయి అఽథ్లెటిక్స్ పోటీలకు పాలకుర్తి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ధరావత్ గాయత్రి ఎంపికై ంది. జూలై 26న నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్లో 60 మీటర్ల రన్నింగ్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో ఈనెల 3, 4న హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్ధాయి పోటీల్లో గాయత్రి పాల్గొననుంది. ఈ మేరకు శుక్రవారం హెచ్ఎం పాయం శోభారాణి, పిజికల్ డైరెక్టర్ మామిండ్ల సోంమల్లు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
స్కూళ్లలో ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ షురూ
ఉమ్మడి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ నమోదు వివరాలు..జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా (పెద్దపల్లి మినహా) ప్రభుత్వ పాఠశాలల్లో బోధనచేసే టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్(ఎఫ్ఆర్ఎస్) నమోదు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల ర్యాంకులు (శాతం) విడుదల చేశారు. వరంగల్–8, హనుమకొండ–16, మహబూబాబాద్–26, జనగామ–27, ములుగు–29, భూపాలపల్లి–33వ స్థా నంలో నిలిచాయి. మొబైల్ ఫోన్లో విద్యార్థితో పాటు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బందికి సంబంధించి ఒకే లాగిన్లో వేర్వేరుగా అటెండెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. కొంతకాలంగా విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం కొనసాగుతుండగా.. కొత్తగా టీచర్లకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటల తర్వాత టీచర్లు, స్టాఫ్ ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. కాగా, అటెండెన్స్ తీసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ తర్వాత ఫొటో అప్లోడ్ అ య్యేందుకు అరగంట సమయం పట్టిందని పలువురు టీచర్లు తెలిపారు. సాంకేతిక సమస్య ఇలాగే కొనసాగితే అటెండెన్స్ కోసమే సమయం వృథా చేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. జిల్లా పాఠశాలలు టీచర్లు మొదటిరోజు శాతం ర్యాంకు రిజిస్ట్రేషన్ జనగామ 459 2,773 1,572 56.69 27 వరంగల్ 534 3,211 2,085 64.93 08 హనుమకొండ 472 2,987 1,883 63.04 16 మహబూబాబాద్ 768 3,859 2,231 57.81 26 ములుగు 337 1,557 832 53.44 29 భూపాలపల్లి 414 1,927 901 46.76 33 -
ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి
హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరీలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో సంతోషంగా ఉంది.. నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాటరూపంలో రాశా. – కాసర్ల శ్యామ్, పాటల రచయిత జిల్లావాసి కాసర్ల శ్యామ్కు నేషనల్ అవార్డు ఉత్తమ లిరిక్రైటర్గా గుర్తింపు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు -
దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలి
జనగామ రూరల్: సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చే దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం విభాగా న్ని వైద్యాధికారులతో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆస్పత్రిని నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దివ్యాంగులు యూడీఐడీ పొందేందుకు వచ్చే దివ్యాంగులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట వైద్య కళాశాల పర్యవేక్షకులు రాజలింగం, గోపాల్రావు, సిబ్బంది ఉన్నారు. పురాతన దేవాలయాల పరిరక్షణకే ఽ దూప దీప నైవేద్యం జనగామ రూరల్: పురాతన దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పథకాన్ని అమలు చేస్తుందని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ధూప దీప నైవేద్యం పథకానికి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయాలను గుర్తించి ధూప దీప నైవేద్య పథకాన్ని అమలు చేయాలని డీడీఎన్ త్రిసభ్య కమిటీ సభ్యులను ఆదేశించారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు, త్రీ సభ్య కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్ను సన్మానించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
శేష జీవితం ప్రశాంతంగా గడపాలి..
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జనగామ రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. ఉద్యోగులు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులతో ఆటుపోట్లను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తారని, శేష జీవితం ప్రశాంతంగా గడపాలని కోరారు. జిల్లా సహకార శాఖ అధికారిగా సేవలందించిన రాజేందర్రెడ్డి ఉద్యోగ విరమణ పొందారు. ఈసందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా రాజేందర్రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. తోటి ఉద్యోగులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సహకార శాఖకు వన్నె తేవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, డిప్యూటీ కలెక్టర్ సుహా సిని, శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీఐ బోర్డులు ఏర్పాటు చేయాలి
జనగామ రూరల్: ఆర్టీఐ దరఖాస్తుల సమాచారం అందించేందుకు ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం ఆర్టీఐ చట్టంపై అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. హనుమకొండ జిల్లా భూ గర్భ జల శాఖ పర్యవేక్షకుడు ధరంసింగ్ శిక్షణ ఇ చ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని కలెక్టర్ కార్యాలయ ఏఓ శ్రీకాంత్ తదితరు పాల్గొన్నారు. చేనేత కార్మికుల రుణమాఫీకి ప్రతిపాదనలుకలెక్టర్ చాంబర్లో జిల్లా స్థాయి చేనేత కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. జిల్లాలోని చేనేత కార్మికులు 2017 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31, 2024 మధ్య కాలంలో చేనేత రుణాలు తీసుకున్న 442 కార్మికులకు సంబంధించి రూ. 3,71,35,208లు మాఫీ చేసేందుకు కమిటీ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. రుణాలు చెల్లించిన 237 మంది కార్మికులకు సైతం మాఫీ చేసి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపామన్నారు. సమావేశంలో చేనేత జౌళి శాఖ ఆర్ డీడీ పద్మ, సహాయ సంచాలకులు శ్రీమతి చౌడేశ్వరి వజీర్ సుల్తాన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మూర్తి, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్, జీఎం ఇండస్ట్రీస్ శివ కృష్ణ, ఠాకూర్ పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలి దేవరుప్పుల: ఇంటర్ ప్రవేశానికి పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ షేక్ రిజ్వానా బాషా సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలతోపాటు స్థానిక హైస్కూల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ టి.సురేశ్కుమార్, ఎంఈఓ కళావతి, హెచ్ఎం విష్ణువర్ధన్రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
లక్ష్య సాధనతో ముందుకు సాగాలి
తరిగొప్పుల: విద్యార్థులు లక్ష్య సాధనతో ముందుకు సాగాలని, క్రమశిక్షణతో మెలగాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పింకేశ్కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మెనూ బోర్డును పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ప్రతీ రోజు వందశాతం హాజరు నమోదయ్యేలా.. ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం డీఈఓ బోజన్నతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంఈఓ నెల్లుట్ల జానకి, ఎంపీడీఓ ఆలేటి దేవేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, పాఠశాల స్పెషల్ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయంజనగామ: రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు నెలలలోపే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను సైతం ఆదేశించడం గొప్ప నిర్ణయమన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికై నా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయమై ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. సుప్రీం కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్య పద్ధతులను గౌరవించాలని, వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ పార్లమెంటరీ వ్యవస్థను గౌరవించేలా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలిజనగామ రూరల్: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని ఏవైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు ఆయన జిల్లా కేంద్రంలోని సబ్ జైలును గురువారం సందర్శించారు. జైల్లోని ఖైదీలను పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. న్యాయవాదులను నియమించుకోని ఖైదీలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలన్నారు. ఖైదీల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ను కూడా జైల్లో ఏర్పాటు చేసినట్లు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.రవీంద్ర అడ్వకేట్ దరఖాస్తులు రాసుకోవడానికి సహాయంగా పారా లీగల్ వలంటరీ బి.శేఖర్ అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ కృష్ణకాంత్, వలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని బాల సదనాన్ని సందర్శించారు. బాలికలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రిజిస్టర్లు పరిశీలించారు.రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపికచిల్పూరు: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పల్లగుట్ట గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జీడి ప్రీతి, పూర్వ విద్యార్థి కలకోల సంజు ఎంపికై నట్లు హెచ్ఎం పెనుమాటి వెంకటేశ్వర్లు, ఫిజికల్ డైరెక్టర్ దేవ్సింగ్ తెలిపారు. ఈనెల 28వ తేదీన జిల్లా కేంద్రంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో జూనియర్ ట్రాథలింగ్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆగస్టు 3, 4 తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈసందర్భంగా గురువారం పాఠశాలలో ఎంపికైన విద్యార్థులను చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, శ్యాంసుందర్రెడ్డి, ఉపాధ్యాయులు ప్రకాశ్, అలకనంద, శోభారాణి, రమణకుమార్ తదితరులు అభినందించారు. -
ముఖ చిత్రమే ముఖ్యమిక!
జనగామ: ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరు పట్టికలో సంతకాలు పెట్టే రోజులు పోయినట్లే. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్ఎస్) విధానం కొనసాగుతుండగా.. నేటి (శుక్రవారం) నుంచి టీచర్లకు వర్తింపజేయనున్నారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయగా.. పాఠశాల విద్యాశాఖ యాప్లో ఎఫ్ఆర్ఎస్ సమాచారాన్ని పొందుపర్చారు. బడి సమయం దాటిన తర్వాత ఉపాధ్యాయులు వచ్చి హాజరు పట్టికలో సంతకాలు పెట్టే పరిస్థితి ఇక నుంచి ఉండదు. ముఖ కదలిక ఐ రిష్ అటెండెన్స్ ద్వారా టీచర్లు ఎన్ని గంటలకు వ చ్చారనే విషయం ఇట్టే తెలిసిపోనుంది. సాయంత్రం బడి ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో ఎఫ్ఆర్ఎస్ హాజరు తప్పనిసరి చేశారు. నేటి నుంచి అమలు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సంబంధించిన ఫేస్ రికగ్నైజేషన్ ఆధారిత హాజరు నేటి(గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఈపద్ధతిని ముందుగా విద్యార్థుల హాజరు కోసం ప్రవేశపెట్టగా, ఇప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో 29,300 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. కొంత కాలంగా విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైజేషన్ ిసిస్టం ద్వారా అటెండెన్స్ తీసుకుంటున్నారు. విద్యార్థి ప్రతి రోజు స్కూల్కి వచ్చిన తర్వాత వారి ముఖ, ఐరిష్ వివరాల ఆధారంగా యాప్లో హాజరు తీసుకుంటున్నారు. ఆవివరాల్ని వెంటనే రాష్ట్ర విద్యాశాఖ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. తరగతులు, కాంప్లెక్స్, మండలం, జిల్లా, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా హాజరు శాతం ఎంత నమోదు అయిందనే సమాచారాన్ని యాప్లో చూసుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టీచర్లకు ఈ విధానం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టగా.. ఇక నుంచి జిల్లాల వారీగా ఎఫ్ఆర్ఎస్ యాప్లో విద్యార్థుల హాజరు పక్కనే టీచర్ల వివరాలు సైతం నమోదు చేయనున్నారు. పెరగనున్న పర్యవేక్షణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు మొబైల్ ద్వారా ఎఫ్ఆర్ఎస్ హాజరు నిర్ణయం శుభ పరిణామం. గతంలో ఈ విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ భావించి నప్పటికీ, పలు సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. ఇదిలా ఉండగా.. స ర్కారు బడుల టీచర్లతో పాటు ఇకముందు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధానం అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లకు ఈవిధానం ద్వారా స్కూల్ సమయానికి టీచర్లు చేరుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మరింత పారదర్శకత ఉండేందుకు దోహదపడుతుంది. హాజరు ఇలా.. ఉపాధ్యాయులు తమ స్మార్ట్ఫోన్లలో ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకుంటారు. చేతి రాత ద్వారా సంతకం చేసే రోజుల నుంచి డిజిటల్ రూపంలో హాజరు గుర్తింపు జరుగుతుంది. ఎఫ్ఆర్ఎస్ ద్వారా అటెండెన్స్తో ఉపాధ్యాయులు సకాలంలో స్కూల్కు హాజరు కావడంతో విద్యాబోధనలతో తలెత్తే ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు. రోజులో ఒక పూట గైర్హాజరైనప్పటికీ, 100 శాతం అటెండెన్స్ వేసుకునే పరిస్థితులు ఇక నుంచి ఉండవు. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ సిస్టంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా, ఎప్పటికప్పుడు పర్యక్షించాల్సిన పూర్తి బాధ్యత పాఠశాల విద్యాశాఖపైనే ఉంది.ఉపాధ్యాయులు 2,480మంది కేజీబీవీలు12మోడల్ స్కూళ్లు 8ప్రభుత్వ పాఠశాలలు 341జిల్లాలో ఇలా..నేటి నుంచి ఉపాధ్యాయులకు ఫేషియల్ అటెండెన్స్ పాఠశాల విద్యాశాఖ యాప్లో వివరాలు బడికి వచ్చాక.. వెళ్లిపోయే సమయంలో నమోదు ఇకపై ఉపాధ్యాయుల సమయపాలనలో పారదర్శకతపారదర్శకత పెరుగుతుంది.. పాఠశాలల్లో విద్యార్థులకు మాదిరిగా టీచర్లకు సైతం ఎఫ్ఆర్ఎస్ హాజరు శాతం అమలు చేయడం మంచి పరిణామం. దీంతో మరింత పారదర్శకత పెరుగుతు ంది. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పాఠశాల విద్యాశాఖ నిరంతరం పర్య వేక్షించాలి. – రావుల రామ్మోహన్రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు నేటి నుంచి రిజిస్ట్రేషన్లుజిల్లాలో నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో టీచర్లకు ఫేస్ రికగ్నైజేషన్ ఆధారిత హాజరు అమలు కానుంది. అయితే ముందుగా వారం రోజుల పాటు టీచర్లు ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకుంటారు. వందశాతం యాప్లో వివరాలను నమోదు చేసిన వెంటనే ఎఫ్ఆర్ఎస్ అమల్లోకి వస్తుంది. – భోజన్న, డీఈఓ, జనగామ -
బంకులో అంకెల గారడీ
జనగామ: జనగామ పట్టణం సిద్దిపేట రోడ్డు జిల్లా ఆస్పత్రి ఏరియా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భారత్ పెట్రోలియంలో పెట్రోలు తక్కువ వచ్చిన ఘటనపై కస్టమర్లు గురువారం ఆందోళనకు దిగారు. పట్టణానికి చెందిన చంద్రశేఖర్, అభిషేక్, ఉదయ్ తదితరులు 2.25 లీటర్ థమ్సప్ బాటిల్లో పెట్రోలు పోయించుకున్నారు. క్వాంటిటీ 2.33 లీటర్లంటూ బిల్లు జనరేట్ అయ్యింది. దీంతో తక్కువ క్వాంటిటీ పెట్రోల్కు ఎక్కువ బిల్లు వచ్చిందని బాధితులు నిర్వాహకులను నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు వెంటనే తూనికలు, కొలతల జిల్లా అధికారి శ్రీనివాస్, జిల్లా పౌరసఫరాల శాఖ అధికారి సరస్వతీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు పెట్రోల్ బంకు వద్దకు వచ్చారు. ఫిర్యాదు చేసిన కస్టమర్లతో పాటు ప్రజల సమక్షంలో మున్సిపల్ రోడ్డు వైపు ఉన్న బంకులోని ఓ ఫ్యూయల్ డిస్పెన్సర్ను తనిఖీ చేశారు. అధికారుల సాక్షిగా ఆ పంపులో నంబర్స్ జంప్ అవుతున్న సంగతిని గమనించి.. పెట్రోల్ సైతం తక్కువగా రావడాన్ని గుర్తించారు. అలాగే బంకులోని ప్రతీ డిస్పెన్సర్కు ఉన్న అధికారిక సీల్, ఐదు లీటర్ల క్యాన్లో పెట్రోలు తీసి తనిఖీ చేశారు. వారం రోజుల నుంచి పంపు జంప్ అవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడున్న ప్రజలు మండిపడ్డారు. నిత్యం వందలాది మంది తమ వాహనాల్లో పెట్రోలు పోయించుకుని నష్టపోయారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ బంక్ను సీజ్ చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం తూనికలు, కొలతల అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి భారత్ పెట్రోలియంలోని ఓ ఫ్యూయల్ డిస్పెన్సర్లో నంబర్స్ జంప్ అవుతున్న విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. వారం నుంచి జంప్ అవుతున్నట్లుగా కస్టమర్లు చెప్పారని, పూర్తి నివేదికను కలెక్టర్కు అందజేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బంకులోని ఒక ఫ్యూయల్ డిస్పెన్సర్ను సీజ్ చేశామని, కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు. జిల్లాలో బంకుల నిర్వహణపై ఆందోళన జిల్లాలోని పెట్రోల్ బంకుల నిర్వహణపై కస్టమర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలు బంకుల్లో పెట్రోలు తక్కువ రావడం, నీళ్లు రావడం, జంప్ సిస్టం తదితర వాటిపై ఫిర్యాదులు రాగా.. తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. సంబంధిత అధికారులు పెట్రోల్ బంకులను తనిఖీ చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. పెట్రోల్ బంకులో నంబర్ల జంపింగ్ తక్కువ వచ్చిందంటూ అధికారులకు వినియోగదారుల ఫిర్యాదు ఒక ఫ్యూయల్ డిస్పెన్సర్ సీజ్.. కలెక్టర్కు నివేదిక -
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
స్టేషన్ఘన్పూర్: ఉపాధ్యాయులకు సమయపాలన ఎంతో ప్రధానమని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి బి.శ్రీనివాస్ అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధి ఛాగల్లు, స్టేషన్ఘన్పూర్, శివునిపల్లి ప్రభుత్వ పాఠశాలల సముదాయాల సమావేశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులంతా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల్ని వినియోగించుకోవాలని, నూతన బోధన పద్దతులను మెరుగుపర్చుకునేందుకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కొమురయ్య, కాంప్లెక్స్ హెచ్ఎంలు ఎం.సంపత్, కుసుమ రమేశ్, సెక్రటరీలు సోమనారాయణ, శ్రీధర్, ఎమ్మార్సీ సిబ్బంది గిరి, లవన్, శ్రీలత, జ్యోతి, వెంకటేశ్వర్లు, రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారత కోసమే పథకాలు
దేవరుప్పుల: మహిళలు సాధికారత సాధించేందుకు ఇందిరా మహిళా శక్తి పథకాలు దోహదపడతాయని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద వారిద్దరు వనమహోత్సవంలో మొక్కలు నాటారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కామారెడ్డిగూడేనికి చెందిన జిల్లా మేఘన మహిళా సంఘం అధ్యక్షురాలు పులిపంపుల మమత స్వీయ ప్రేరణతో, మహిళా సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన వనిత మహిళా శక్తి క్యాంటీన్ను కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ వసంత, ఏపీడీ నూరొద్దీన్, తహసీల్దార్ ఆండాలు, ఎంపీడీఓ సురేశ్కుమార్, విజయ డెయిరీ జిల్లా చైర్మన్ ధర్మారెడ్డి, ఐకేపీ డీపీఎం ప్రకాశ్, ఏపీఎం వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వరాలయంలో పూజలు పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గురువారం ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
జనగామ రూరల్: ఏడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆన్లైన్లో నమోదు కాని జీపీ కార్మికులు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ సీహెచ్ శ్రీకాంత్కు వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి నారోజు రామచంద్రం కోశాధికారి బస్వ రామచంద్రం, కంబాలోజు రాజు, ఇట్టబోయిన మహేందర్ పగిడిపల్లి మల్లేశ్, ఉపేందర్, ఆంజనేయులు, సమ్మయ్య, ముత్యం, దేవి వినోద, మధు, మారపాక లక్ష్మి, ఆకారపు యాదమ్మ, బాల్నే రాధిక, బొంకూరి భారత తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద జీపీ కార్మికుల ధర్నా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు -
ఓటరు జాబితా సవరణకు ఇంటింటి సర్వే
స్టేషన్ఘన్పూర్: ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు తదితర సవరణలు చేపట్టి తుది జాబితా కోసం త్వరలో ఇంటింటి సర్వే చేపట్టననున్నట్లు ఆర్డీఓ డీఎస్ వెంకన్న తెలిపారు. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్రెడ్డి గురువారం చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక తహసీల్ కార్యాలయంలో ఆర్డీఓతో పాటు వివిధ మండలాల తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. వీసీలో అఽధికారులకు, ఎన్నికల సిబ్బందికి పలు సూచనలిచ్చారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ.. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితాను తాజా పర్చుటకు ఇంటింటా సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఘన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ మండలాల తహసీల్దార్లు, సూపర్వైజర్లు, ఎన్నికల సిబ్బంది శ్రీప్రియ, మహిపాల్రెడ్డి, రాజకీయ పార్టీల నాయకులు తెల్లాకుల రామకృష్ణ, కె.శరత్కుమార్, జలగం ప్రవీణ్, తోట రమేశ్, సారయ్య పాల్గొన్నారు. ఆర్డీఓ డీఎస్ వెంకన్న -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జనగామ: సీజనల్ వ్యాధులపై వైద్యులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మలేరియా, పైలేరియా అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్ నాయక్ ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ రాజలింగం, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగమణి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావులతో కలిసి బుధవారం జిల్లా ఆస్పత్రితో పాటు జఫర్గఢ్ మండలం కూనూరు పీహెచ్సీని సందర్శించారు. అంతకుముందు స్టేషన్ఘన్పూర్ వైద్యాధికారులతో గూగుల్ మీట్లో మాట్లాడారు. డెంగీ వ్యాధి కేసులు నమోదైన సమయంలో వైద్యాధికారులు, సబ్ యూనిట్ అధికారులు అలర్ట్గా ఉండాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. అనంతరం తెలంగాణ డయాగ్నోస్టిక్ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ల్యాబ్ పరికరాలను ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై ఆరా తీశారు. మలేరియా, పైలేరియా అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ -
విజేతలకు సన్మానం
జనగామ: తెలంగాణ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ సబ్ జూనియర్ అండర్–15 పోటీల్లో జిల్లా నుంచి వివిధ విభాగాల్లో పతకాలు సాధించిన వారిని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం అభినందించారు. పోటీల్లో పతకాలు సాధించిన గూడురులోని తెలంగాణ గిరిజన బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు కె.ఐశ్వర్య, జి.సాత్విక, బి.అనూష, జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పి.మనోజ్, ఈ.శశికాంత్రెడ్డిలను కలెక్టర్ రిజ్వాన్ బాషా శాలువా, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటరెడ్డి, కోచ్ రాజు, పీఈటీ సుష్మిత పాల్గొన్నారు. ఇత్తడి కవచాల అందజేత చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలోని అమ్మవార్లకు, గరుడస్వామికి రూ.60వేల విలువైన ఇత్తడి కవచాలను బుధవారం అందించారు. హైదరాబాద్కు చెందిన పొతకనూరి సతీష్కుమార్–పుష్పలత, అక్షయతన్వి, వెంకట్అద్విక్లు ఉదయం ఆలయానికి చేరుకుని ఇత్తడి కవచాలకు ఆలయ అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులచే ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావుల సమక్షంలో అందించారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలుజనగామ రూరల్: దేశంలో పేదలు ఉపాధి లేక అల్లాడుతున్నారని, నిరుద్యోగంతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు అన్నారు. బుధవారం మండలంలోని మరిగడిలో మండల కార్యదర్శి బోడ నరేందర్ అధ్యక్షతన రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టబడిదారి విధానాలకు ప్రత్యామ్నాయం సోషలి స్టు విధానాలేనన్నారు. రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. కమిటీ సభ్యులు పోతుకునూరి ఉపేందర్, చందునాయక్, రాములు, ఆనందం, రామచొక్కం, సాంబరాజు పాల్గొన్నారు. సాగునీరు అందించాలని నిరసనస్టేషన్ఘన్పూర్: దేవాదుల ద్వారా పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో 3ఎల్ సబ్ కెనాల్ వద్ద రైతులు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు గొడిశాల సతీష్, జూలుకుంట్ల ప్రకాష్రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘన్పూర్ మెయిన్ కెనాల్ నుంచి ఇటీవల నీటిని విడుదల చేసిన సమయంలో చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని తెలిపారని, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఇప్పగూడెం 3ఎల్ సబ్ కెనాల్లోకి నీరు రావడం లేదన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే, అధికారులు స్పందించి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాటికొండ వెంకటయ్య, మల్లారెడ్డి, బాబు, రవి, చంద్రమౌళి పాల్గొన్నారు. జీపీ సిబ్బందికి ప్రతీనెల వేతనాలుబచ్చన్నపేట: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల సిబ్బందికి ప్రతీనెల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి అన్నారు. బుధవారం మండలంలోని పోచన్నపేట గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ఇటీవల జీపీ సిబ్బందికి వేతనాలు అందడం లేదనే ఫిర్యాదు మే రకు విచారణ చేపట్టారు. జీపీల్లో పనిచేసే సి బ్బందికి వేతనాలు అందించేలా ఆదేశాలు ఇ చ్చామన్నారు. అనంతరం పలు జీపీ రికార్డుల ను పరిశీలించారు. ఎంపీడీఓ వెంకటమల్లికా ర్జున్, కార్యదర్శి వెంకట్, సిబ్బంది ఉన్నారు. -
వేగంగా.. సులువుగా..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం భక్తులకు సులువుగా కల్పించేందుకు అధికారులు, పూజారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, డీఎస్పీ రవీందర్, ఈఓ వీరస్వామి, సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజుల పూజారులతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని సందర్శించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో చేయడం వల్ల భక్తులకు సులువుగా దర్శనం కలుగుతుందన్న ఆలోచనపై పూజారులతో చర్చించారు. ఆర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్ప్లాన్, అధికారులు తయారు చేసిన మ్యాప్లను పూజారులకు కలెక్టర్ వివరించారు. అంతిమ నిర్ణయం పూజారులదే.. ఆర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్ప్లాన్ వల్ల అమ్మవార్ల దర్శనంలో భక్తులకు ఇబ్బందులు తల్తెత్తుతాయనే అభిప్రాయాన్ని పూజారులు అధికారులకు వివరించారు. కానీ, అధికారులు సమ్మక్క– సారలమ్మల గద్దెల పక్కన వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను ఉంచడంపై పూజారులు సమాలోచనతో సానుకూల నిర్ణయానికి వచ్చారు. సారలమ్మ ఎంట్రెన్స్ గేట్ను సుమారుగా 20 ఫీట్ల దూరం విస్తరించి వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పూజారులు కొంతమేరకు ఏకీభవించారు. నలుగురు దేవతలను వరుస క్రమంలో ఉండడం వల్ల టీటీడీ కల్యాణ మండపం ద్వారా, ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులకు రెండు వైపులా దర్శనం సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా రెండు వైపులా క్యూలైన్ల ద్వారా గద్దెల ప్రాంగణంలోకి వచ్చిన భక్తుల్లో ఒకేసారి పదిమంది వెళ్లేలా వెడల్పాటి మరో క్యూలైన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. కాగా, గద్దెల మార్పుపై రెండుమూడు రోజుల్లో పూజారులతో చర్చించి అభిప్రాయాన్ని వెల్లడిస్తామని గోవిందరాజు పూజారి.. అధికారులకు తెలిపారు. మొక్కుల చెల్లింపులో ఇబ్బంది లేకుండా.. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, కానుకల చెల్లింపులో భక్తులు ఇబ్బందులు పడకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా అధికారులు పరిశీలించారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను వరుస క్రమంలో భక్తులు దర్శనం చేసుకునే సమయంలో పూజారులు సమ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద క్యూలైన్ లోపల ఉండి భక్తులు సమర్పించిన ఎత్తు బంగారం తీసుకుని తిరిగి ప్రసాదం అందించడంతోపాటు మొక్కు బంగారాన్ని ఎప్పటికప్పుడు బయటకు తరలించే మార్గాలను పరిశీలించారు. నాలుగు గద్దెలు వరుసక్రమంలో ఉంటే వీఐపీ, వీవీఐపీల దర్శనం సమయంలోనూ సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వీవీఐపీలు అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం నేరుగా హెలిపాడ్ ప్రదేశానికి వెళ్లేలా సారలమ్మ ఎగ్జిట్ గేట్నుంచి ఐరన్తో ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మరింత సులువుగా ఉంటుందని సమాలోచన చేశారు. పూజారులు తమ నిర్ణయాన్ని త్వరగా తెలిపితే పదిహేను రోజుల్లో పనులు మొదలు పెడతామని కలెక్టర్ దివాకర టీఎస్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం దర్శనం పాస్లు ఈసారి మహాజాతరలో షెడ్యూల్ ప్రకారం వీఐపీ, వీవీఐపీలు, అధికారులు, మీడియాకు దర్శనం పాస్లు జారీ చేయాలనుకుంటున్నారు. అందరికీ ఒకేసారి పాస్లు జారీ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈసారి జాతరకు ముందుగా నాలుగైదు తేదీల్లో పాస్లు జారీ చేయడంతో ఇబ్బందులు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. జాతర నాలుగు రోజుల్లో ఎమ్మెల్యే, ఆపైస్థాయి వారికి పాస్లు జారీ చేసే ఆలోచన చేస్తామని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా సమ్మక్క మ్యూజియం, సారలమ్మ ఎంట్రెన్స్ నుంచి జంపన్నవాగు ఆర్అండ్బీ రోడ్డు వరకు దారిని విస్తరించాలని పూజారులు కలెక్టర్ను కోరారు. కాగా, రోడ్డును కూడా కలెక్టర్..ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.భక్తులు వనదేవతలను దర్శించుకునేలాసమాలోచనలు మేడారంలో పూజారులతో కలిసి గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ పూజారులదే ఫైనల్ నిర్ణయం -
కష్టాలు
తీరనున్న కట్టెల పొయ్యి సర్కారు బడుల్లో గ్యాస్ సిలిండర్లు అందించేందుకు నిర్ణయంమండలాల వారీగా పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యమండలం పాఠశాలలు విద్యార్థులు తరిగొప్పుల 21 695 చిల్పూరు 35 1,596జఫర్గఢ్ 32 1,629స్టేషన్ఘన్పూర్ 31 2,138రఘునాథపల్లి 32 2,155నర్మెట 29 1,228బచ్చన్నపేట 41 2,410జనగామ 55 3,440లింగాలఘణపురం 31 1,618దేవరుప్పుల 47 1,428పాలకుర్తి 51 1,921కొడకండ్ల 30 1,247జనగామ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పూర్తిస్థాయిలో గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈమేరకు సిలిండర్లు లేని పాఠశాలల వివరాలను జిల్లా అధికారులు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. జిల్లాలోని 447 పాఠశాలల్లో 950 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాయి. గతంలో జిల్లాలో కొన్ని పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా.. అవి మూలనపడ్డాయి. నిర్వాహకులు మళ్లీ కట్టెల పొయ్యి మీదే ఆధార పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో పూర్తిస్థాయిలో ఎల్పీజీ కనెక్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 15వ తేదీలోగా అందించేందుకు.. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 450 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉంది. 21,405 మంది విద్యార్థులకు ప్రతీరోజు భోజనం అందిస్తున్నారు. కేవలం 3 పాఠశాలల్లో మాత్రమే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్, స్టౌవ్లు అందుబాటులో ఉన్నాయి. మిగతా 447 పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రతిపాదనలు పంపించారు. నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద వంట చేసే సమయంలో వెలువడే పొగతో అనేక అవస్థలకు గురవుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతోపాటు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్లు అందించేందుకు కనెక్షన్లు లేని పాఠశాలల వివరాలు సేకరించింది. ఆగస్టు 15వ తేదీలోగా గ్యాస్ సిలిండర్లు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిలిండర్ల భారంపై సందిగ్ధం మధ్యాహ్న భోజనం తయారీ కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ల భారం ప్రభుత్వమే భరిస్తుందా! లేక నిర్వాహకులపై వేస్తుందా! అనేది తెలియాల్సి ఉంది. గతంలో అందించిన గ్యాస్ కనెక్షన్లకు సిలిండర్ల భారాన్ని నిర్వాహకులే భరించారు. దీంతో చాలామంది భారం మోయలేక గ్యాస్ వినియోగించడమే మానేశారు. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరుకు తక్కువ ధరకే లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు సరిపడా వంటచెరుకు కోసం సుమారు రూ.1,500 వరకు చెల్లిస్తున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో వంట చెరుకు కోసం సుమారు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు అవుతుంది. ఉచితంగా అందించాలి మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్లు ఉచితంగా అందించాలి. ఇప్పటివరకు వంట చెరుకు కొనుగోలు చేసుకొని వంట చేస్తున్నాం. కట్టెల పొయ్యితో వచ్చే పొగతో ఇబ్బందులు పడుతున్నాం. అయినా కష్టపడి పిల్లల కోసం వంట వండి పెడుతున్నాం. – ఆదిలక్ష్మి, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు కనీస వేతనాలు అమలు చేయాలి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటివరకు అమలు చేయలేదు. రూ.26వేల కనీస వేతనం అందించాలనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందించాలి. – రాపర్తి రాజు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కనెక్షన్లు లేని పాఠశాలల వివరాల సేకరణ జిల్లాలో 447 పాఠశాలలకు ప్రతిపాదనలు మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరటపెరిగిన మెస్చార్జీలు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మెస్చార్జీలను ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో పెంచారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78 చెల్లిస్తుండగా 6 నుంచి 8వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.10.17 చొప్పున, 9, 10 తరగతి వారికి రూ.13.17 చొప్పున చెల్లిస్తున్నారు. రోజు విడిచి రోజు ప్రతీ విద్యార్థికి కోడిగుడ్డు అందిస్తున్నారు. -
మానవ అక్రమ రవాణాపై అవగాహన
జనగామ: ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, కార్మికశాఖ చైల్డ్ హెల్ప్లైన్, స్కోప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ర్యాలీ నిర్వహించి మానవ అక్రమ రవాణాపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఉప్పలయ్య మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా రైలు మార్గాల ద్వారా జరుగుతుందని, ఏ చిన్న అనుమానం వచ్చిన చైల్డ్ హెల్ప్లైన్ 1098, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికాంత్ మాట్లాడుతూ చిన్నారులు, మహిళలు, వలస కూలీలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక అధికారి కుమారస్వామి, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్, సిబ్బంది వెంకన్న, మాస్టర్ మల్లికార్జున్, మనోజ్కుమార్, లావణ్య, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ రవాణాను నియంత్రించాలి స్టేషన్ఘన్పూర్: మానవ అక్రమ రవాణాను నివారించాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారిణి స్వప్నరాణి అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, జిల్లా కార్మిక విభాగం, చైల్డ్ హెల్ప్లైన్, స్కోప్ ఎన్జీఓ సంయుక్తంగా బుధవారం స్థానిక రైల్వేస్టేషన్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవ అక్రమ రవాణా నివారణకు ప్రతీఒక్కరు బాధ్యతగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో స్టేషన్మాస్టర్ ఎస్.కుమార్, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది నాగరాజు, చిల్పూరు ఏఎస్ఐ జయకుమార్, స్కోప్ ఎన్జీఓ సిబ్బంది అజిత్కుమార్, అశోక్యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలి
● అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ స్టేషన్ఘన్పూర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా మొదలుపెట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిప ల్ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్యకలాపాలను విస్తృతం చేయాలని, మున్సిపల్ ఆదాయం పెంచేదిశగా ప్రణాళికతో ముందుకుసాగాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభు త్వ నిబంధనల మేరకే నిర్మాణాలు చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చేపడుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. సాంకేతిక సమస్య వస్తుందని పలువురు తెలపగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, హౌసింగ్, ఇంజనీరింగ్ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. -
స్టాక్ రిజిస్టర్లు తప్పనిసరిగా ఉండాలి
చిల్పూరు: ఎరువుల దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు తప్పనిసరిగా ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్బాషా అన్నారు. చిన్నపెండ్యాల గ్రామంలోని బీకేఎస్ అగ్రిమాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎరువుల ఔట్లెట్ను బుధవారం కలెక్టర్ సందర్శించారు. షాపులోని స్టాక్, ధరల బోర్డును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా లెసెన్సులు రద్దు చేస్తామన్నారు. అంతకుముందు చిన్నపెండ్యాలలోని పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్ పీహెచ్సీని సందర్శించి, వర్షాకాలం ముగిసే వరకు వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకే రోజు ఐదుగురు సిబ్బందికి సెలవులు మంజూరు చేసిన వైద్యాధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే మల్కాపూర్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, ఇళ్లు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజవరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్కుమార్, డాక్టర్ కుశాలి, వ్యవసాయాధికారి నజీరుద్దీన్, న ర్సింహులు, వినయ్కుమార్, దాసరి గోవర్దన్, అధి కారులు తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ రిజ్వాన్బాషా -
పాడి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
జనగామ రూరల్: పాలసేకరణలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని, పాడి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డిప్యూటీ డైరెక్టర్ ఎన్.గోపాల్సింగ్ అన్నారు. పట్టణంలోని విజయడెయిరీ చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి అధ్యక్షతన బుధవారం పాల ఉత్పత్తి సహకార సంఘాల అధ్యక్షులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ రైతులకు దాణా, గడ్డి విత్తనాలు, కాల్షియం తదితర సబ్సిడీపై అందజేస్తామన్నారు. పాల సంఘాలకు అవసరమైన పాల క్యాన్లు, బిల్లులు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దామెర నాగరాజు, మేనేజర్లు డాక్టర్ నరేష్, హరికృష్ణ, లింగారెడ్డి, లక్ష్మి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ గోపాల్సింగ్ పాలసేకరణలో జిల్లా టాప్ -
ఎదురుచూపులు?
రుణానికి ● అర్ధాంతరంగా నిలిచిన ‘రాజీవ్ యువ వికాసం’ ● మండల స్థాయిలోనే కొలిక్కిరాని ఎంపికలు ● జిల్లా వ్యాప్తంగా 29,367 దరఖాస్తులు జనగామ రూరల్: రాజీవ్ యువ వికాసం యూనిట్ల మంజూరులో సందిగ్ధత నెలకొంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొంతమందికి మంజూరు పత్రాలు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండల స్థాయిలోనే కొలిక్కి రాకపోవడంతో ప్రభుత్వం యూనిట్ల మంజూరు పత్రాల పంపిణీని నిలి పేసింది. ఇప్పుడు ఆర్వైవీకి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు.. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 8,437 మందికి రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటికోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 8,437 యూనిట్ల లక్ష్యానికి 29,367 దరఖాస్తులు రావడంతో మండల స్థాయిలో ఎంపిక చేయాలని నిర్ణయించారు. రాజకీయ ఒత్తిళ్లు.. రుణాల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి మండల స్థాయిలోనే అర్హుల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. ఈ జాబితాలు జిల్లా స్థాయికి పంపిస్తే అక్కడ బడ్జెట్ అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉంది. కానీ మండల లెవల్ కమిటీలు తుది జాబితాలను పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ కమిటీలో ఎంపీడీఓ, మండల స్థాయి డీఆర్డీఏ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది ఉండగా రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తుది జాబితాలు సిద్ధం కాలేదని సమాచారం. సిబిల్ స్కోర్ చిక్కు.. నిరుద్యోగులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికఅభివృద్ధి పొందేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టి రుణాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. అయితే బ్యాంకులు సిబిల్ స్కోర్ తప్పనిసరి అనడంతో గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు చాలా వరకు పాన్కార్డు లేకపోగా సిబిల్ స్కోర్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ పథకానికి సిబిల్ స్కోర్ తొలగించాలని ఇప్పటికే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సిబిల్ స్కోరును మినహాయిస్తే గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగులు ఎక్కువగా లబ్ధిపొందే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి సిబిల్ స్కోర్ విధానం ఉంటుందా లేదా అనేది స్పష్టంకానుంది. కేటగిరీ వారీగా దరఖాస్తులు, కేటాయించిన యూనిట్లు ఎస్సీ దరఖాస్తులు 8,779యూనిట్లు 3500బీసీ దరఖాస్తులు 15425యూనిట్లు 2714ఈబీసీ దరఖాస్తులు 447యూనిట్లు 511మైనార్టీ దరఖాస్తులు 981యూనిట్లు 186క్రిస్టియన్ మైనార్టీలు దరఖాస్తులు 48యూనిట్లు 57షరతులు లేకుండా రుణాలు అందించాలి గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మంజూరు చేయాలి. జూన్ 2న ఇస్తామని చెప్పినా.. ఇంత వరకు ఆదేశాలు రాకపోవడం నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయ జోక్యం లేకుండా, అర్హులైన వారందరికీ ఆర్థిక భరోసా కల్పించాలి. – చందూనాయక్, సీపీఎం నాయకుడుఎలాంటి ఆదేశాలు రాలేదు.. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదు. ఇంకా తుది జాబితా కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తాం. – మాదవి లత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
విధుల్లో నిర్లక్ష్యం వద్దు
లింగాలఘణపురం: సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఆరోగ్య కేంద్రాల సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ రిజ్వాన్బాషా తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి ఎవరెవరు విధుల్లో ఉన్నారనే అటెండెన్స్ తీసుకున్నారు. ఓపీ రిజిస్టర్, ల్యాబ్ టెక్నీషియన్ రిపోర్టును పరిశీలించారు. సిబ్బంది, ఏఎన్ఎంలతో సమీక్షించారు. ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అశోక్కుమార్, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ కమల్, స్వర్ణలత, సలీమాబేగం, శ్రవంతి, సిబ్బంది ఉన్నారు. అనంతరం జీడికల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇసుక అధిక ధరకు విక్రయిస్తున్నారని తెలపడంతో అధికారులు ఏం చేస్తున్నారని పంచాయతీ సెక్రటరీ మల్లేశంను ప్రశ్నించారు. ఇసుక ట్రాక్టర్ యజమానులపై చర్య తీసుకోవాలని తహసీల్దార్ రవీందర్ను ఆదేశించారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లూటంగ్ వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. యూనిఫాం, పాఠ్య, నోట్ పుస్తకాలు ఇచ్చారా లేదా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. లక్ష్యంతో చదవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఇన్చార్జ్ ఎంపీడీఓ రఘురామకృష్ణ, ఎంఈఓ విష్ణుమూర్తి, హెడ్మాస్టర్ సబిత తదితరులు ఉన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం సీరియస్ కలెక్టర్ రిజ్వాన్ బాషా -
యూరియా కొరత సృష్టిస్తే చర్యలు
రఘునాథపల్లి: జిల్లాలో యూరియా కొరత లేదని, కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం ఫర్టిలైజర్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, లైసెన్స్, స్టాక్ బోర్డు, భౌతిక నిల్వ, రైతులకు అమ్మిన ఎరువుల వివరాలను పరిశీలించారు. యూరియా కొనుగోలు చేసిన రైతుల వివరాల ఫోన్ నంబర్లతో సహా రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ వసంత సుగుణ, మండల వ్యవసాయాధికారి కాకి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీ ఘనత రేవంత్రెడ్డిదే.. జనగామ: రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేసి, ఆర్థిక భరోసా కల్పించిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందని డీసీసీ అధ్యక్షుడు, జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 8వ వార్డులో నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలను తీసుకున్న తర్వాత ప్రజా సమస్యలు, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. అంతకుముందు కొమ్మూరి ప్రతాప్రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, 8వ వార్డు అధ్యక్షుడు కడారి ప్రవీణ్, పీఏసీఎస్ డైరెక్టర్ మల్లారెడ్డి, మాజీ కౌన్సిలర్లు వంగాల కల్యాణి, గాదెపాక రాంచందర్, మురళి, చలపతిరెడ్డి, మురళి లబ్ధిదారులు పాల్గొన్నారు. జనగామ ఎల్ఐసీకి అరుదైన గౌరవం జనగామ: దేశంలో జనగామ ఎల్ఐసీ బ్రాంచ్కు అరుదైన గౌరవం దక్కిందని సంస్థ జాతీయస్థా యి ఎండీ రత్నాకర్ పట్నాయక్ అన్నా రు. మంగళవారం జనగామ ఎల్ఐసీ కార్యాలయంలో సంస్థ బ్రాంచ్ మేనేజర్ గుగులోత్ హరిలాల్ అధ్యక్షతన జరిగిన విజయోత్సవ వేడుకల్లో ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ మేనేజర్ పునీత్ కుమార్తో కలిసి ఆయన ముఖ్యఅతిథి గా పాల్గొని మాట్లాడారు. 2024–2025 వార్షిక సంవత్సరంలో జనగామ ఎల్ఐసీ రికార్డు బిజినెస్ సాధించి ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. వ్యాపారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనగామ బ్రాంచ్ మొదటి స్థానంలో నిలువగా, ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల పరిధిలో రెండవ స్థానం దక్కించుకుందన్నారు. ఇదే స్ఫూర్తిలో ఏజెంట్లు కష్టపడి పని చేస్తూ ప్రస్తుత సంవత్సరంలో కూడా రికార్డు సృష్టించాలన్నారు. అనంతరం ఎల్ఐసీ ఉద్యోగులు, అధికారులు, ఏజెంట్లు, సిబ్బందిని శా లువాతో సత్కరించి జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో వరంగల్ డివిజనల్, సీనియర్ మేనేజర్లు సుబ్రమణ్యన్, సుధాకర్బాబు, జె.మోతిలాల్, జి.దునీలాల్,అమర్నాథ్, బి.శ్రీ నివాస్, బుచ్చిరెడ్డి, వెంకటరాములు, చిరంజీవి, లాల్సింగ్, మధుసూదన్, శశికళ, డీఓ విజయ్ కుమార్, టీవీ మ్యాథ్యూస్, సాంబశివరావు, కరుణాకర్రెడ్డి, ఏజెంట్లు పాల్గొన్నారు. అర్చక ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విశాల్ చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్దెమారి విశాల్ తెలంగాణ రా ష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగుల మలిదశ జీ1ఏ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యా రు. మంగళవారం ముషీరాబాద్ భవానీ శంకర దేవస్థానంలో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రంగవరపు ప్రసాద్ నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా విశా ల్ మాట్లాడుతూ అర్చక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. -
ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ
సాక్షిప్రతినిధి, వరంగల్: రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లతో ఉమ్మడి వరంగల్కు కొత్త కళ రానుంది. హ్యామ్ మొదటి దశలో తెలంగాణ వ్యాప్తంగా 17 ప్యాకేజీల వారీగా మొత్తం 373 రోడ్ల పనులకు ప్రభుత్వం రూ.6,478.33 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఆర్అండ్బీ ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్లకు 588.65 కిలోమీటర్ల రోడ్ల కోసం రూ.617.21 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో 49 రోడ్లకు మహర్దశ పట్టనుండగా.. 588.65 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో రోడ్లను ఉన్నతీకరించనున్నారు. సర్కిళ్ల వారీగా పనులు, నిధులు, పర్యవేక్షణ.. రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు ఒక వరుస రోడ్లను రెండు వరుసలుగా విస్తరించేందుకు కూడా నిధులు మంజూరు చేశారు. అయితే కొత్తగా ఏర్పడిన సర్కిళ్ల వారీగానే టెండర్లు, పనుల పర్యవేక్షణ జరుగుతోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్లు ఉండగా.. హనుమకొండకు 394.42 కిమీ మేర 39 రోడ్ల ఉన్నతీకరణ కోసం రూ.467.90 కోట్లు కేటాయించారు. భూపాలపల్లి సర్కిల్ పరిధిలో 10 రోడ్లను 194.23 కిమీ మేర అభివృద్ధి, విస్తరణ కోసం రూ.249.31 కోట్లు విడుదల చేశారు. హ్యామ్ రోడ్లపై ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ సంస్థ సూచన మేరకు ఆర్అండ్బీ సర్కిల్ వారీగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వుల జారీ చేసింది. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి నేషనల్ హైవేలకు సంబంధించిన నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఆ రోడ్లకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టు సంస్థలు టోల్ప్లాజా ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు ఉండగా.. ఇక్కడ చేపట్టే హ్యామ్ రోడ్లకు మాత్రం టోల్ట్యాక్స్ అనేది ఉండదు. ఆ రోడ్ల నిర్వహణ బాధ్యతను కూడా సదరు గుత్తేదారు సంస్థే అగ్రిమెంట్ ప్రకారం చూసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ‘హ్యామ్’ విధానం ఇలా.. రోడ్లు ఎక్కడెక్కడంటే.. హ్యామ్ విధానంలో మేజర్ రోడ్లయితే 60 శాతం నిధులను ఉమ్మడి జిల్లాలో టెండర్ల ద్వారా పనులు పొందిన గుత్తేదారు సంస్థలే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ సొమ్మును వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. మిగిలిన 40 శాతం నిధులు కూడా దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉంది. పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రోడ్లను అభివృద్ధి చేసేందుకే ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు సర్కిళ్ల పరిధిలో 49 పనులకు రూ.617.21 కోట్లు కేటాయించగా.. గ్రామీణ ప్రధాన రహదారుల ఉన్నతీకరణతో పాటు పల్లెల నుంచి మండల కేంద్రం, జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీ ఉన్న రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఇదిలా ఉండగా 49 రోడ్లలో ప్రధానంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని హైదరాబాద్ నుంచి హనుమకొండ రోడ్డు (ఓల్డ్ ఎన్హెచ్–163) (జీడబ్ల్యూఎంసీ పరిధి)ను 14 కిమీ మేర అభివృద్ధి చేసి, విస్తరించనున్నారు. కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ రోడ్డు (కాజీపేట, ఫాతిమానగర్, వడ్డేపల్లి, కాకతీయ యూనివర్సిటీ, పెద్దమ్మగడ్డ) 9.47 కిమీ రోడ్డుకు సుమారు రూ.20 కోట్లకు పైగా మంజూరు చేశారు. ఆత్మకూరు నుంచి పరకాల వయా శాయంపేట, పెద్దకోడెపాక వరకు ఒకటి 3 కిమీ, మరోటి 11 కిమీ కలిపి మొత్తం 14 కిమీ ఉన్నతీకరించనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట టు కక్కిరాలపల్లి (వర్ధన్నపేట, నందనం, రాంనగర్, కక్కిరాలపల్లి) వరకు 14.50 కిమీ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. స్టేషన్ఘన్పూర్లో మడికొండ నుంచి నారాయణగిరి (ఎలుకుర్తి, ముప్పారం, నారాయణగిరి) రోడ్డు 10.50 కిమీ మేర బలోపేతం చేసేందుకు నిధులు కేటాయించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో కేసముద్రం–నెల్లికుదురు రోడ్డు (కేసముద్రం, భూక్యారాం తండా, మహమూద్పట్నం, ఇనుగుర్తి, చిన్న గంగారం, తారాసింగ్బాయి తండా, భూక్యాదన్యతండా, సపావత్ తండా, భోజ్యతండాను కలిపే)ను 20.60 కిమీ మేర అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మొదటి విడతలో మొత్తం 49 రోడ్ల కోసం రూ.617.21 కోట్లు ఖర్చు చేయనుండగా.. ఈ నిధులతో మండలం, జిల్లా కేంద్రాలను కలిపే పల్లెరోడ్లు కళకళలాడనున్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లాకు రూ.617.21 కోట్లు 589 కిమీ 49 హ్యామ్ రోడ్ల ఉన్నతీకరణకు నిధులు హనుమకొండ, భూపాలపల్లి సర్కిళ్ల పర్యవేక్షణ పల్లెల నుంచి పట్టణాలకు మెరుగవనున్న కనెక్టివిటీ హైదరాబాద్ను కలిపే జిల్లా, మండల కేంద్రం రోడ్లకు నిధులు -
ఆయుర్వేదానికి వెన్నెముక ‘చరకుడు’
జనగామ: ఆయుర్వేదశాస్త్రంలో చరకుడు వెన్నెముక వంటి మహనీయుడని జనగామ వేద ఆయుర్వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్ డాక్టర్ అంజిరెడ్డి అన్నా రు. మంగళవారం చరక జయంతిని పురస్కరించుకుని దవాఖానాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు చరకుని చిత్రపటానికి పూలమాల వేసి, ప్రత్యేక పూజలు చే శారు. ప్రపంచ వ్యాప్తంగా చరకుడిని జనరల్ మెడిసిన్ పితామహుడిగా పిలుస్తారన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఆహారపు అలవాట్లు, నిత్యందన జీవన ప్రయాణంలో ఎలా ఉండాలనే విషయాన్ని చరక సంహిత గ్రంథంలో పేర్కొన్నారన్నారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆన్లైన్ మోసాలతో అప్రమత్తంగా ఉండాలి
కొడకండ్ల: ఆన్లైన్ సైబర్ మోసాలతో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్ను డీసీపీ సందర్శించి పరిసరాలను, సిబ్బంది కిట్ ఆర్టికల్స్ను పరిశీలించి, పరేడ్, లాఠీ డ్రిల్, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ ద్వారా వచ్చే ఓటీపీలను షేర్ చేయవద్దన్నారు. ఫోన్లకు వచ్చే అనవసర లింక్లు ఓపెన్ చేస్తే మోసాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఆన్లైన్ మోసాలకు గురైతే రెండు గంటలలోపు 193 సైబర్క్రైమ్ టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యా దు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, ఎస్సై చింత రాజు, సిబ్బంది పాల్గొన్నారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ -
హామీ నెరవేర్చకుంటే రాజీనామా చేయాలి
జనగామ రూరల్: హామీ నెరవేర్చకపోవడం చేతకాకుంటే సీఎం రాజీనామా చేయాలని, పెన్షన్ పెంపుదలపై రేవంత్ సర్కారు దగా చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నారు. వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షత జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్హాల్లో చలో హైదరాబాద్ పెన్షన్దారుల గర్జన సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంద కృష్ణ హాజరై మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ రూ.6000, వృద్ధులు, వితంతువుల చేయూత పెన్షన్ రూ.4000 వ రకు పెంచుతామని ఎన్నికల ముందు రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు. అందాల పోటీలు, భూస్వాములకు రైతుభరోసా, అభివృద్ధి పేరుతో వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు, పెన్షన్ పెంచకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన ప్రతిపక్ష, విపక్ష పార్టీలు మౌనం వీడాలని సూచించారు. ఆగస్టు మొదటి వారంలోపు 15 డిమాండ్లు తీర్చకపోతే హైదరాబాద్లో లక్షలాది మంది పింఛన్దారుల శక్తి ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు. వీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రు నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఈగ చక్రపాణి, ధరావత్ స్వామి నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షుడు తిప్పారపు బాలయ్య, ఇన్చార్జ్ బోడ సునీల్ మాదిగ, గండి యాదగిరి, కృష్ణమూర్తి, బిచ్చల వంశీ, జ్యోతి, కిశోర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
మహాప్రభో!
వినతులు కొన్ని ఇలా.. ● పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు గ్రామంలో సొసైటీ చెరువు కబ్జాకు గురైందని, విచారణ చేపట్టి చర్య తీసుకోవాలని విన్నవించారు. ● నర్మెట మండలం బొమ్మకూరు శివారు బోడబండతండాకు చెందిన మూడావత్ శ్రీకాంత్ అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ● జనగామ మండలం పెంబర్తి గ్రామానికి చెందిన బండ సత్తయ్య అనే వ్యక్తికి చెందిన భూమిని బండ నర్సయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, విచారణ జరిపి చర్య తీసుకోవాలని వినతిపత్రం అందించారు. ● వివిధ గ్రామాలు, తండాల నుంచి జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇ బ్బందులు పడుతున్నారని, అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లవకుమార్ విన్నవించారు. ● సర్వే నంబర్ 280బీ/1లో 2 ఎకరాల భూమి ఉంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న. ఆన్లైన్లో ఫారెస్ట్ భూమి అని చూపిస్తుందని రైతు భరోసా రావడం లేదు. విచారణ చేసి న్యాయం చేయాలని జఫర్గఢ్ మండలం సాగరంకు చెందిన మహేందర్ వినతిపత్రం అందించారు. ● దివ్యాంగులకు ప్రభుత్వం అందించే మూడు చక్రాల వాహనాలకు అర్హులనే ఎంపిక చేయా లని తెలంగాణ దివ్యాంగుల వేదిక అధ్యక్షుడు మేకల సమ్మయ్య, బొట్ల సుమతి, దామెర రమేశ్ తదితరులు కలెక్టర్ను కోరారు. -
‘ఇందిరమ్మ’ నిర్మాణాల్లో ఆదర్శంగా నిలవాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అ న్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ ఫేజ్ 1, 2లో మంజూరు అయిన లబ్ధిదారులు వందశాతం పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని, సాంకేతిక సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలన్నారు. లబ్ధిదారులకు స్థానికంగా ఇసుక, మట్టి తరలించుకోవడానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు అనుమతి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్సింగ్, ఆర్డీఓ వెంకన్న, హౌసింగ్ పీడీ మాతృనాయక్, సిద్దార్ధ, కమిషనర్ రామకృష్ణ, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. -
శివోహం..
● ఆలయాల్లో శ్రావణ సోమవారం పూజలు జనగామ: పవిత్రమైన శ్రావణమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని జిల్లాలో శివాలయాలు, వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల మంత్రోచ్ఛరణల నడుమ అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలను చేపట్టారు. చెన్నకేశ్వర ఆలయంలో గోదాదేవి అమ్మవారిని పట్టువస్త్రాలతో అలంకరించి పూజించారు. పాలు, నెయ్యి, తేనె, తులసి, బిల్వ పత్రం, గంగాజలంతో శివ లింగానికి అభిషేకాలు చేశారు. పట్టణంలోని పాతబీటు బజారు రామలింగేశ్వర, చెన్నకేశ్వర, గుండ్లగడ్డ ఉమామహేశ్వర, గీతాశ్రమం, హెడ్ పోస్టాఫీస్ ఏరియా సంతోషిమాత, కన్యకాపరమేశ్వరి, బాణాపురం వేంకటేశ్వర, పాలకుర్తి సోమేశ్వర, కొడవటూరు సిద్ధులగుట్ట, జీడికల్ సీతారామచంద్రస్వామి, చిల్పూరు బుగులోని వేంకటేశ్వర తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. -
వైద్యసేవలు బాగున్నాయా?
మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuచూడడానికి డిఫరెంట్గా ఉండే వైట్ టైగర్ (శరణ్, 13 సంవత్సరాలు మగ) పుట్టి పెరిగింది భాగ్యనగరంలోనే. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో 2012,అక్టోబర్ 20న జన్మించింది. శరణ్ తండ్రి పేరు బద్రి, తల్లిపేరు సురేఖ అని అటవీ రేంజ్ అధికారి మయూరి తెలిపారు. శరణ్ బరువు (180 కేజీలు) వరకు ఉంటుంది. దీని జీవితకాలం 15 ఏళ్లు. త్వరలో ఆడ తెల్లపులిని కూడా జూకి తీసుకొస్తామని వారు పేర్కొన్నారు.లీటర్ మిల్క్.. కేజీ చికెన్ ప్రతీరోజు ఉదయాన్నే రెండు ఎగ్స్, లీటర్ మిల్క్, కిలో చికెన్ను శరణ్కు అందిస్తారు. ఆర్ఓ ప్లాంట్ వాటర్నే తాగిస్తారు. పులి ఆరోగ్యంగా ఉండేందుకు ఎలక్ట్రాల్ పౌడర్, కాల్షియం సప్లిమెంట్స్తో కూడిన ద్రావణాన్ని అందిస్తారు. అనంతరం ఎన్క్లోజర్లోకి వదులుతారు. సాయంత్రం జూ క్లోజ్ అయ్యే వరకు ఎన్క్లోజర్లో సందర్శకులు వీక్షించేందుకు ఉంచుతారు. భారీ ఆహార్యం.. నడకలో రాజసం.. గాండ్రింపులో గాంభీర్యం.. దాన్ని చూస్తే ఏ జంతువైనా పారిపోవాల్సిందే. అలాంటి తెల్ల పులి(శరణ్)ని సందర్శకుల కోసం ఇటీవల వరంగల్ కాకతీయ జూలాజికల్ పార్క్కు తీసుకొచ్చారు. క్రూర మృగాల్ని చూడాలన్నా.. చాలా మందికి భయమే కానీ.. ఆ భయం వెనుక వాటి గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా దాగి ఉంటుంది. అందులో భాగంగానే శరణ్ (వైట్ టైగర్) గురించి ‘సాక్షి’ కొన్ని ఆసక్తికర అంశాలు సేకరించింది. నేడు (మంగళవారం) అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మన తెల్ల పులిపై ప్రత్యేక కథనం. – న్యూశాయంపేటజూలో సందడే.. సందడి వరంగల్ నగరంలోని కాకతీయ జూలాజికల్ పార్క్లో సందర్శకులకు తెల్ల పులి కనువిందు చేస్తోంది. ఈ నెల 18వ తేదీన తెల్లపులిని బోనులో నుంచి ఎన్క్లోజర్లోకి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ విడుదల చేశారు. ఈ తెల్లపులిని చూసేందుకు నగర వాసులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు ఆసక్తిచూపుతున్నారు. బోన్లెస్ అంటే ఇష్టం..తెల్లపులి (శరణ్) బోన్లెస్ మాంసాన్ని ఇష్టంగా తింటుంది. అందులో భాగంగా వాటికి ప్రత్యేకంగా బీఫ్ మాంసాన్ని రోజుకు 6 కేజీల చొప్పున పెడుతున్నామని జూ పార్క్ వెటర్నరీ డాక్టర్ కార్తికేయ తెలిపారు. జంతు ప్రదర్శన శాలలో తెల్ల పులులకు బీఫ్ను మాత్రమే అందిస్తారని ఆయన పేర్కొన్నారు. వీటిలో లివర్, హార్ట్, స్ల్పీన్ ఇష్టంగా తింటుందని తెలిపారు. ప్రతీ శనివారం తెల్లపులిని ఉపవాసం ఉంచుతామని, ఆరోగ్య రీత్యా ఇది అవసరమని డాక్టర్ చెబుతున్నారు. ఆ రోజంతా లవణాలతో కూడిన నీటిని అందిస్తామంటున్నారు. శరణ్ అని పిలిస్తే చాలు.. ఉదయం నుంచి రాత్రి వరకు బాగోగులు చూసే టైగర్ కేర్ టేకర్ మూర్తి శరణ్ అని పిలిస్తే చాలు.. పరిగెత్తుకుంటూ వస్తుంది వైట్ టైగర్. అతను పెట్టిన ఆహారాన్ని తింటుంది. పులికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ దాని ఆలనాపాలన చూస్తూ కేర్టేకర్ అన్నీ గమనిస్తూ ఉంటాడు.● తెల్లపులి పుట్టి పెరిగింది హైదరాబాద్ జూ లోనే.. ● డేట్ ఆఫ్ బర్త్ : 2012, అక్టోబర్ 20 ● బోన్లెస్ మటన్ అంటే ఇష్టం.. శనివారం రోజంతా ఫాస్టింగ్ ● కాకతీయ జూ పార్కులో ప్రత్యేక ఆకర్షణ ● ఆసక్తికర విషయాలు వెల్లడించిన జూ పార్క్ అధికారులు ఈ ఫొటోలోని బాధితులు మండలంలోని ఎర్రగొల్లపహడ్కు చెందిన ఇల్లు లేని పేదలు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామంలో 287 దరఖాస్తులు రాగా మొదటి విడతలో ఎంత మందికి ఇచ్చారు, వారి పేర్లు జీపీలో డిప్లే కూడా చేయలేదని వాపోయారు. తమకు ఉండటానికి ఇల్లు లేదని, కిరాయి ఇంట్లో ఉంటున్నామని, మరోసారి విచారణ చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ను వేడుకున్నారు.న్యూస్రీల్ -
నాణ్యమైన భోజనం అందించాలి
బచ్చన్నపేట: పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్లోని వంటగది, స్టాక్ రూం, తరగతి గదులను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాకాలంలో ఈగలు, దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తాజా కూరగాయలను వండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ వెంకట్రెడ్డి, ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి అనిల్రాజ్, వార్డెన్ అన్నపూర్ణ, హెడ్కుక్ తేలుకంటి విజయ, కవిత, సుశీల, నైట్ వాచ్మన్ మౌనిక పాల్గొన్నారు. మోదీ పాలనలో ఆర్థిక అసమానతలుజనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశంలో ఆర్థిక అసమానతలు, పేదరికం, నిరుద్యోగం పెరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సోమవారం అమరజీవి ఏసీ రెడ్డి నరసింహారెడ్డి 34వ వర్ధంతి సభ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పోరాటాలు చేయాలన్నారు. అంతకుముందు నెహ్రూ పార్క్ నుంచి భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేశ్, బొట్ల శేఖర్, రాపర్తి సోమ య్య, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం స్టేషన్ఘన్పూర్: ఐక్య పోరాటాల ద్వారానే ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కా రం అవుతాయని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్ప రాంరెడ్డి అన్నారు. స్టేషన్ఘన్పూర్ మండలంలో డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కోసం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తామని పలు హామీలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సదరు సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపకపోవడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమనారాయణ, కార్యదర్శి దూడయ్య, మండల అధ్యక్షుడు సోమరాజు తదితరులు పాల్గొన్నారు. -
టీబీ రహిత జిల్లా కోసం కృషి చేద్దాం
జనగామ: టీబీ రహిత జిల్లా కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా పిలుపునిచ్చారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో ఐఎంఏ సహకారంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన క్షయ కార్యక్రమంలో టీబీ రోగులకు కలెక్టర్ చేతుల మీదుగా ఉచిత న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గతేడాది 1,051 మంది, ప్రస్తుతం సంవత్సరం ఇప్పటి వరకు 361 మందికి క్షయ వ్యాధిగ్రస్తులుగా గుర్తించారన్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశాన్ని క్షయ వ్యాధి రహిత భారత్గా చేసేందుకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో టీబీ సోకే అవకాశం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వ్యాధిగ్రస్తులు ఆరు నెలలు పాటు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ బాలాజీ, కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్, వైద్యులు రాజమౌళి, లవకు మార్రెడ్డి, లక్ష్మినారాయణ, శ్రీనివాస్, శ్యామ్, కమలహాసన్ తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత సృష్టిస్తే చర్యలు జనగామ రూరల్: యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం మన గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపును సందర్శించి స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, అనవసరంగా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ఓబుల్ కేశవాపూర్లోని పీహెచ్సీని సందర్శించి పలు సూచనలు చేవారు. అనంతరం పీహెచ్సీ ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని, ఎంపీడీఓ, మెడికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేయాలి ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాల నేపథ్యంలో మండల స్పెషల్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ శుక్రవారం స్కూల్డేగా పెట్టామ ని స్పెషల్ అధికారులు మండలాల పరిధిలోని పాఠశాలలను, రెసిడెన్షియల్ హాస్టళ్లను పరిశీలించి మె నూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందేలా చూ డాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓలు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా రోగులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ -
పానీ.. పంటకు హాని!
జనగామ: ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలతో పంట ఎర్రబడి దిగుబడి తగ్గిపొయే ప్రమాదం ఉంది. ముసురు వర్షాలు తగ్గిన తర్వాత రైతులు వివిధ పంటలకు సంబంధించి యాజమాన్య పద్ధతులను పాటించాలని భువనగిరి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.అనిల్ కుమార్ తెలిపారు. జిల్లాలోప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, పెసరతో పాటు కూరగాయల పంటలు సాగు చేశారన్నారు. తుఫాను ప్రభావంతో ఇంకా కొద్ది రోజుల పాటు వర్ష సూచనలు ఉన్న కారణంగా తాత్కాలికంగా పురుగు లేదా కలుపు మందుల పిచికారీ వాయిదా వేసుకోవాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు యాజమాన్య పద్ధతులు ఆయన మాటల్లోనే. వరిలో నీటి కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి పొలంలో నిలిచిన అధిక నీటిని బయటకు మళ్లించే విధంగా కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ బూస్టర్ డోస్గా వేసుకోవాలి. అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వరిలో అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు ఒక లీటరు నీటికి 1.5 మిల్లీ లీటరు ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మి.లీ. కాసుగా మైసిన్ చొప్పున కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. ముదురు నారు నాటే సమయంలో నారు కొనలను తుంచి నాటితే ఫలితం ఉంటుంది. వరిలో ప్రస్తుతం జింక్ దాతులోపం నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. వరి నారుమడులు వరద ముంపునకు గురై ఎర్రబడి నారు చనిపోతే, ప్రత్యామ్నాయంగా స్వల్పకాలిక (120 రోజుల) రకాలైన కె. ఎన్.ఎం–118, ఆర్.ఎన్.ఆర్–29325, ఆర్.ఎన్.ఆర్– 28361, డబ్ల్యూజీఎల్ –915 వంటి వరి రకాలు ఎంపిక చేసుకొని ఎకరానికి 12 కిలోల మొలకెత్తిన విత్తనాన్ని దుక్కి, దమ్ము చేసిన పొలంలో డ్రంసీడర్తో లేదా నేరుగా వెదజల్లే పద్ధతిలో వేసుకోవాలి. పత్తిలో సస్యరక్షణ చర్యలు పత్తి చేనులో నీరు నిల్వ ఉండకుండా నీటి కాల్వల ద్వారా బయటకు పంపించి మొక్కలు చనిపోకుండా చూడాలి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పైపాటుగా ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను బూస్టర్ డోస్గా వేయాలి. పత్తిలో అధిక వర్షాలతో మెగ్నీషియం ధాతువు లోపం రావడానికి అవకాశం ఉంటుందని, దీని నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేస్తే సరి పోతుందన్నారు. కలుపు నివారణకు.. పత్తి మొలకెత్తిన నెల రోజులకు చేనులో పెరిగే లేత గడ్డి, వెడల్పు ఆకు రకం కలుపు నివారణకు ఎకరానికి 400 మి.లీ పైరిథయోబాక్ సోడియం 8 శాతం, క్విజలోఫాప్ ఇథైల్ 2 శాతం మిశ్రమాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో పూత, పిందె, కాయ రాలుట నివారించడానికి లీటరు నీటికి 10 గ్రాముల 13:0:45 (పొటాషియం నైట్రైట్) చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఎండు తెగులు, వేరు కుళ్లు నివారణకు 1 లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బెండాజిమ్ చొప్పున కలిపి మొక్కల మొదల్ల వద్ద స్ప్రేయర్ నాజిల్ తీసి ఆశించిన మొక్కలకు, చుట్టుపక్క ఉన్న మొక్కలకు పోయాలి.ముసురు వానతో పంటల్లో నిలిచిన నీరు సస్యరక్షణ చర్యలు చేపట్టి కాపాడుకోవాలి భువనగిరి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్కుమార్మొక్కజొన్న పంటలో మెళకువలు ముసురు వర్షాలతో భాస్వరం లోపం ఏర్పడి మొక్కజొన్న ఉదారంగులోకి మారుతుంది. వర్షాలు తగ్గిన తర్వాత లీటరు నీటికి 10 గ్రాముల 19:19:19 లేదా 20 గ్రాముల డీఏపీ చొప్పున కలిపి పిచికారీ చేస్తే పంటకు మేలు జరుగుతుంది. -
ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా స్టేషన్ఘన్పూర్ మోడల్ స్కూల్
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్లోని తెలంగాణ మోడల్ స్కూల్ ఈ విద్యా సంవత్సరం జిల్లాలో ఉత్తమ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికై న ట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి ఆదివా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ద్వారా వివిధ పీఎంశ్రీ పథకాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఎంపికై నట్లు తెలిపారు. దీనిని పురస్కరించుకుని ఈనె ల 29న జాతీయ నూతన విద్యాదినోత్సవం సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బహిరంగ సభను విజయవంతం చేయాలిరఘునాథపల్లి : సిద్దిపేట జిల్లా కేంద్రంలో నేడు (సోమవారం) నిర్వహించనున్న కార్మికుల బహిరంగ సభను విజయవంతం చేయాలని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రాసమల్ల కొమురయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండలకేంద్రంలో సంఘం నాయకులతో కలిసి వాల్పోస్టర్లు గోడలకు అంటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికుల సమస్యల సాధనకు చేపట్టిన బహిరంగ సభకు కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి సింగపురం భిక్షపతి, పోకల శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లుజనగామరూరల్: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని శామీర్పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇళ్లు లేని పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రానున్న రోజుల్లో అర్హులైన పేదలందరికీ ఇళ్లు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బనుక భిక్షపతి, జినుకల మల్లయ్య, కడమంచి వీరమల్లు, మేకల రామకృష్ణ, తెల్జీరు రాజు, అంజనేయులు, కృష్ణ, కనకరాజు, పాషా, సురేష్, మధు తదితరులు పాల్గొన్నారు. రేపు లక్ష్మీనారాయణస్వామి కల్యాణంజనగామ: యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం (కై లాసపురం) పుణ్యక్షేత్రంలో ఈ నెల 29న ల క్ష్మీనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం ని ర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షు డు, వాసవీ ఉపాసకులు, ఐవీఎఫ్ థార్మిక పరి షత్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వి. అంజయ్య స్వా మి తెలిపారు. ఆదివారం ఆయన జనగామలో మాట్లాడుతూ కల్యాణ మహోత్సవంతో పాటు గౌరీ, రేణుక, వాసవీ మాతలకు లక్ష కుంకుమార్చన పూజలు జరుగనున్నాయన్నారు. హమ్మయ్య!జనగామ: బంగాళాఖాతంలో అల్పపీడన ప్ర భావంతో వారంరోజులుగా కురుస్తున్న ముసు రు వర్షంతో సూర్య భగవానుడు మేఘాల చాటున కనిపించకుండా పోయాడు. అప్పటి వరకు దంచికొట్టిన ఎండలతో అల్లాడి పోయిన ప్రజలు.. వరుస వర్షాలతో గజగజవణికి పోయారు. వారం రోజుల తర్వాత ముసురు వర్షం మాయమై... ఆదివారం ప్రత్యక్షమైన సూర్యుడిని చూసిన వారంతా హమ్మయ్య అంటూ ఎండ వచ్చిందంటూ సంతృప్తి పొందారు. జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఓ మాదిరిగా దంచి కొట్టింది. రేపటి నుంచి ఉచిత కంటి వైద్య శిబిరంజనగామ: పట్టణంలోని సిద్ధిపేట రోడ్డు రమాదేవి ఫంక్షన్హాల్లో శంకర నేత్రాలయ మేసు, హైదరాబాద్, నెల్లుట్ల ఉమారాణి, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఉచిత కంటిపొర చికిత్స శిబిరం నిర్వహించినున్నట్లు ఆదివారం నిర్వాహకులు తెలిపారు. కంటి శుక్లం ఉన్న వారికి వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 709517 5251 నంబర్కు సంప్రదించాలన్నారు. -
సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర
భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్/మొగుళ్లపల్లి: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కొడారి కొమురయ్య విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించి రైతు కూలీలతో మాట్లాడారు. అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రం, జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతీ గురుకులాన్ని సందర్శించి అక్కడి సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. బీజే పీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని, వచ్చే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ను గెలిపించాలని కార్మికులను కోరారు. కాంగ్రెస్ ఆగడాలను ప్రశ్నిస్తున్న తమ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. త్వరలోనే జిల్లాకో పార్టీ లీగల్ సెల్ ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో 3,400 పల్లెలను జీపీలుగా, జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసినవాటిని చెప్పుకోవడంలో విఫలం అయినందునే ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్నారు. మరోమారు అలా జరుగకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రతీ గ్రామంలో ఇంటింటికి తెలుపాలని సూచించారు. గండ్రకే ఎమ్మెల్యే టికెట్... తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్కు సోదరుడిగా ఉన్న సిరికొండ మధుసూదనాచారికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసన సభాపతి పదవి ఇచ్చారన్నారు. అంతేకాకుండా కేబినెట్ హోదాకు సమానమైన శాసన మండలి ప్రతిపక్ష నేత పదవి ఇచ్చారన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చూసుకుంటారని, ఆయనకే టికెట్ అని ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. గండ్ర నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గోరీల మీద మాదిరిగా ఇక్కడి ఎమ్మెల్యే శిలాఫలకాలపై ఫొటోలు వేయించుకుంటున్నాడని అన్నారు. తాను భూకబ్జా చేశానని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, పెద్ది సుదర్శన్రెడ్డి, దివ్యాంగుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, స్థానిక నాయకులు కటకం జనార్దన్, గొర్రె సాగర్ తదితరులు పాల్గొన్నారు. గురుకులాలను గాలికొదిలిన ప్రభుత్వం జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం.. కేసులకు జంకొద్దు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటన -
జిమ్, యోగాతో ఆరోగ్య రక్షణ
● డీసీపీ రాజమహేంద్రనాయక్ పాలకుర్తి టౌన్: ఆరోగ్య రక్షణకు వాకింగ్, జిమ్, యోగా ఎంతో ఉపయోపడుతుందని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని దేవస్థానం ఆర్చి సమీపంలో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ను డీసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలతో బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని, ఉక్కులాంటి యువతరం తయారు కావాలన్నారు. పిల్లలు, యువత, పెద్దలు వ్యాయామ సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ జానకిరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్కుమార్, జిమ్ నిర్వాహకుడు చెరిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా విగ్రహ ప్రతిష్ఠాపన
జనగామ: జిల్లా కేంద్రం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని శ్రీలక్ష్మీగణపతి దుర్గాదేవి ఆలయంలో లోక కల్యాణార్థం శివ, నంది, ద్వజ శిఖర, నాగేంద్రస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివా రం కనుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 7.30 గంటల కు గణపతి పూజతో ప్రతిష్ఠాపన వేడుకలను మొదలు పెట్టారు. కలష స్థాపన, మండపారాధన, జలధివాసము, ధాన్యాది, పుష్పాది, అన్నాధి, శయ్యాది వాసము, హిరణ్యాధివాసము, యంత్ర, విగ్రహ ప్రతిష్ఠ మహా బలి నివేదిన, స్థాపిత దేవత మూల యంత్ర హవనములు, ప్రతిష్ఠాంగ హోమం తదిత ర పూజా కార్యక్రమాలతో విగ్రహ ప్రతిష్ఠాపనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు లింగమూర్తి, మాధరపు రాజు, గంగిశెట్టి మనోజ్ కుమార్, శెట్టి రవి, రామాంజనేయులు, గాదె శ్రీను, తమ్మిశెట్టి మల్లికార్జున్, సుధాకర్రెడ్డి, హరిబాబు, శెట్టి వెంకన్న, సతీష్ పాల్గొన్నారు. -
లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష ప్రశాంతం
జనగామ: లైసెన్స్డ్ సర్వేయర్ల అర్హత పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కో–ఆర్డినేటర్ మన్యంకొండ పర్యవేక్షణలో పట్టణంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాలలో అర్హత పరీక్ష నిర్వహించారు. మొదటి సెషన్ 10 గంటలకు ప్రారంభం కాగా, 9 గంటల నుంచే లోనికు అనుమతించారు. రెండు సెషన్లలో జరిగిన అర్హత పరీక్ష సీసీ కెమెరా నిఘా నీడలో జరిగింది. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జరిగింది. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో సీఐ, ఎస్సైలు సెంటర్ వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. 144 సెక్షన్ అమలు చేసి, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి వేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్లో జరిగిన గ్రామ పరిపాలన ఆఫీసర్స్ (జీపీఓ) అర్హత పరీక్షకు 23 మందికి గాను 22 మంది అభ్యర్థులు హాజరు కాగా, ఒక్కరు గైర్హాజరయ్యారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు మొత్తం 173 అభ్యర్థులకు మొదటి సెషన్లో ముగ్గురు, రెండో సెషన్లో ఆరుగురు గైర్హాజరయ్యారు. కాగా రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ పరీక్ష తీరును పరిశీలించారు. మొదటి సెషన్లో ముగ్గురు, రెండో సెషన్లో ఆరుగురు గైర్హాజరు -
పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య
జనగామ: తెలంగాణ ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ పాఠశాలల నిర్వాహణకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇస్తూ, మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే విద్యాసంవత్సరంలో (2026–27) 1వ తరగతిలో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు అర్హత ఉన్న చిన్నారులను ఈ ఏడాదిలో ప్రీ ప్రైమరీ విభాగంలో చేర్చుకోనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 15 పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. పిల్లల ప్రవేశ సమయంలో వయస్సు, నివాస రుజువుతో సహా అవసరమైన అన్ని పత్రాలను ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరణను నిర్ధారించుకోవాలి. అడ్మిషన్లకు సంబంధించి రిజిస్టర్లో నమోదు చేసిన వెంటనే యూడైస్ పోర్టల్లో అప్ లోడ్ చేయాలి. అణగారిన వర్గాలకు చెందిన పిల్లలతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులను గుర్తించి, డబ్ల్యూడీసీడబ్ల్యూ, ఆరోగ్య శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది సమన్వయంతో ప్రభుత్వ నిబంధనల మేరకు సమగ్ర సమాచారం తీసుకోవాలి. నిర్వహణ ఇలా... ప్రీ ప్రైమరీ పాఠశాల నిర్వహణకు పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయుడు ఒక ప్రత్యేక తరగతి గదిని కేటాయించాలి. వెంటిలేషన్, ఫర్నీచర్తో పా టు పిల్లల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, ఆ కర్షణీయంగా తీర్చిదిద్దాలి. తరగతి గది చుట్టూ స్వ చ్ఛమైన వాతావరణం కల్పించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల కాలక్షేపం కోసం ఇండోర్, అవుట్ డోర్లో ఆడుకునేందుకు ఆట వస్తువులను అందుబాటులో ఉంచాలి. ప్రీ ప్రైమరీలో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీ సమన్వయంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీపై ఉంటుంది. ప్రీ ప్రైమరీలో రెండు పోస్టులు ప్రీ ప్రైమరీ స్కూల్ నిర్వహణకు టీచర్, ఆయా రెండు పోస్టులను మంజూరు చేశారు. ప్రీ ప్రైమరీ టీచర్ కనీస అర్హత ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన బాల్య విద్య లేకుంటే ప్రాథమిక బోధనలో అర్హతలు ఉంటే సరిపోతుంది. ఆయా పోస్టుకు కనీస 7వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. గ్రామ నివాసి అయి ఉండాలి. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి అభ్యర్థులు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న వారు అర్హులు. కలెక్టర్ అధ్యక్షతన అదనపు కలెక్టర్ (వైస్ చైర్మన్), డీఈఓ (కన్వీనర్), కలెక్టర్ నామినేటెడ్ చేసిన ఒక సభ్యుడితో కూడిన జిల్లా కమిటీ పర్యవేక్షణలో టీచర్, ఆయాలను ఎంపిక చేస్తారు. ఎన్సీఈఆర్టీ సూచించిన పాఠ్యాంశాలు.. నేషనల్ కరికులం ప్రేమ్ వర్క్ ఫర్ ది ఫౌండేషనల్ స్టేజ్తో అనుసంధానం చేసిన ఎన్సీఈఆర్టీ సూచించిన పాఠ్యాంశాలను బోధించాలి. ఉపాధ్యాయుల చేతి పుస్తకాలు, ఇతర బోధనా, సామాజిక, భావోద్వేగ, భాషా అభివృద్ధిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి. జిల్లాలో 15 ప్రీ ప్రైమరీ స్కూల్స్ జిల్లాలో రెండో విడతలో 15 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు 60 ప్రీ ప్రైమరీ పాఠశాలల వచ్చే అవకాశం ఉన్నట్లు భావించిన విద్యాశాఖ అధికారులు, బడిబాటలో ఆ మేరకు అడ్మిషన్లను పెంచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం 90 మందికి పైగా నాలుగు సంవత్సరాల చిన్నారులు సర్కారు బడిలో చేరగా, 15 మాత్రమే ప్రీ ప్రైమరీ మంజూరు కావడంతో టీచర్లలో ఒకింత టెన్షన్ పట్టుకుంది. జిల్లాలో పోచన్నపేట, బచ్చన్నపేట, కొడవటూరు, కోలుకొండ, లక్ష్మీతండా, కొండాపూర్, కొత్తపల్లి, బోనకొల్లూరు, గూడూరు, వాచ్చ్యాతండా, ధర్మగడ్డతండా, దాసన్నగూడెం ప్రాథమిక పాఠశాల, సూరారం, సోలీపూర్, నెల్లుట్ల ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్స్కు ఎంపికయ్యాయి.జిల్లాలో 15 స్కూల్స్ ఎంపిక వచ్చే విద్యాసంవత్సరంలో అడ్మిషన్లను పెంచే లక్ష్యంగా.. నాలుగేళ్లు నిండిన చిన్నారులకు అవకాశం -
108 సేవలకు రెండు దశాబ్దాలు
జనగామ: దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖరరెడ్డి 108 అంబులెన్స్ సేవలను ప్రారంభించి ఆదివారం నాటికి రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని 108 అంబులెన్స్ సెంటర్లో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అంబులెన్స్ నిర్వహణ జిల్లా కోఆర్డినేటర్ వి.రామును ఉద్యోగులు బిల్ల రాజు, రాకేష్, వీరన్న, అనిల్, రాజు, రమేష్, నరేష్, మల్లేష్, హరీష్, రఘు, రాజు ఘనంగా సన్మానించారు. ఆపదలో ఉన్న క్షతగాత్రులకు ప్రాణం పోయాలనే సంకల్పంతో ప్రవేశ పెట్టిన 108 అంబులెన్స్లు వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపాయని రాము అన్నారు. నేడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో 108 సేవలను నడిపిస్తున్నారన్నారు. ఈ సేవలో ప్రత్యక్షంగా తాము భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలో ఘనంగా వేడుకలు -
తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షించాలి
‘సాక్షి’తో వరంగల్ నార్కొటిక్ విభాగ డీసీపీ సైదులుసాక్షి, వరంగల్: మాదకద్రవ్యాల వ్యసనం ఎన్నో కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది. దీనికి అలవాటుపడిన వారిలో ఎక్కువగా యువత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థులే తప్పుదారి పడుతున్నారు. చెడు స్నేహాలు, ఒకరిని చూసి మరొకరు ఇలా మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. ఈనేపథ్యంలో తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వరంగల్ నార్కొటిక్ విభాగం డీసీపీ సైదులు ‘సాక్షి’కి శనివారం తెలిపారు. కుటుంబం తీసుకునే ప్రత్యేక జాగ్రత్తలతో డ్రగ్స్, గుట్కా, గంజాయి, సిగరెట్ మొదలగు చెడు అలవాట్ల వైపు రాకుండా చూడాలని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆ పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు రోల్మోడల్గా ఉండాలని సూచించారు. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వ్యసనాలకు అలవాటుపడకుండా చూసుకోవాలని, ఒకవేళ పిల్లలు మాదకద్రవ్యాలకు బానిసలైనట్టు తెలిస్తే వెంటనే నిపుణుల సాయం తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఊయలలో వదిలేయండి
జనగామ: పసిబిడ్డలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయకండి..వద్దనుకుంటే ఎంసీహెచ్లో ఏర్పాటు చేసి న ఊయలలో వేసి వెళ్లండి.. వివరాలను గోప్యంగా ఉంచుతాం.. భూమిపై ప్రతీ జీవికి జీవించే హక్కు ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. చంపక్హిల్స్లోని ఎంసీహెచ్లో చికిత్స పొందుతున్న అనాథ మగశిశువు ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ రిజ్వాన్బాషా–డాక్టర్ సయ్యద్ అమ్రిన్ దంపతులు శుక్రవారం రాత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ మాసాలు మోసి కన్నబిడ్డలను ఎక్కడ పడితే అక్కడ వదలడం సమంజసం కాదన్నారు. శిశువులను ఊయలలో వేసి వదిలేసినా, ప్రభుత్వం వారికి ఉజ్వల భవిష్యత్ను అందిస్తుందన్నారు. ఎవరైనా తమ పిల్లల్ని అప్పగించాల్సిన పరిస్థితి ఉన్న సమయంలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ)ని సంప్రదించాలన్నారు. చైల్డ్ హెల్ప్లైన్ నంబర్–1098 లేదా చట్ట బద్ధమైన దత్తత ప్రక్రియను అనుసరించవచ్చన్నారు. కలెక్టర్ వెంట డీడబ్ల్యూఓ డి.ఫ్లోరెన్స్, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ నీలిమ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవికాంత్, చైల్డ్ హెల్ప్లైన్ (1098) ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ రవికుమార్ తదితరులు ఉన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ జనగామ రూరల్: చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివా రం మండలంలోని పెంబర్తి మహాత్మా జ్యోతి రావు పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థినులకు ఎక్కువ సమయం కేటాయించి ఏ సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నారో తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ప్రిన్సిపాల్కు సూచించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, కిచెన్లో ఉండే వంట సరుకులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, డీసీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి
జనగామ రూరల్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. శనివారం మండలంలోని యశ్వంతపూర్, పెంబర్తి, ఓబుల్కేశవాపూర్ ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం పిల్లలకు టీకాలు వేయించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామంలోని నిల్వ నీటి ప్రదేశాలు, మూసివేయని కాల్వలను శుభ్రం చేయాలని, చెత్త తొలగింపునకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఎల్హెచ్పీ, ఏఎన్ఎం, ఆశకార్యకర్తలు సమన్వయంతో గ్రామ పర్యటనలు నిర్వహించి దోమలు అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఇఫ్తాకరుద్దిన్, వైద్యులు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ మల్లికార్జునరావు -
జీపీఓ పరీక్ష సజావుగా నిర్వహించాలి
జనగామ రూరల్: నేడు పట్టణంలోని డిగ్రీ కళాశాలలో జరగనున్న జీపీఓ, లైసెన్స్డ్ సర్వేయర్ల అర్హత పరీక్ష సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ఆదేశించారు. శనివారం పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో భూభారతి సదస్సులో వచ్చిన దరఖాస్తుల తనిఖీ ప్రక్రియ పరిశీలించారు. దరఖాస్తుల విచారణ ప్రక్రియను ఆలస్యంగా చేస్తున్న దేవరుప్పుల, స్టేషన్ఘనపూర్, కొడకండ్ల మండలాలకు సంబంధించిన దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. అంకితభావంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలుజనగామ రూరల్: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధ్యం అవుతాయని డీఈఓ భోజన్న అన్నారు. శనివారం మండల విద్యాశాఖ అధికారి శంకర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్మకంచ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండలస్థాయి కాంప్లెక్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. న్యాస్ పరీక్షలో జనగామ జిల్లా మొదటి 50 స్థానంలో ఉండటం ఆనందదాయకమన్నారు. ఉపాధ్యాయులు మరింత ఉత్సాహం, అంకితభావంతో పనిచేసి మెరుగైన ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తాటోజు శ్రీనివాసులు, పెంబర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ నాగరాణి పాల్గొన్నారు. దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి నర్మెట: భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్–2 కె.కొంరయ్య అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, దరఖాస్తులను పరిశీలించారు. వారసత్వపు దరఖాస్తులలో పట్టాదారులుగా తల్లిదండ్రుల పేర్లు ఉండి పట్టాదారు పాసుపుస్తకం, మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల (వారసుల) వివరాలు క్లుప్తంగా ఉంటేనే పరిశీలించాలని తహసీల్దార్ ఎండీ.మొహసీన్ ముజ్తాబకు సూచించారు. మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం సవరణ, పట్టాదారు పాసు పుస్తకంలో పేర్లు తప్పుగా ఉంటే సవరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీ కురికాల వేణు, ఆర్ఐ సింగారం సాయిబాబ, సిబ్బంది పాల్గొన్నారు. -
అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ
● సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్కుమార్ ● ప్రొఫెసర్ ప్రభంజన్ సంస్మరణ సభ పాలకుర్తి టౌన్: అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ లభిస్తుందని, మరణ అనంతరం కూ డా మానవ శరీరాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని సదాశయ ఫౌండేషన్ జాతీ య అధ్యక్ష, కార్యదర్శులు శ్రవణ్కుమార్, చౌడవరపు లింగమూర్తి అన్నారు. శనివారం మండలంలని గూడూరులో సీనియర్ జర్నలిస్టు, ప్రొఫెసర్ యాదాలన ప్రభంజన్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరీర దానం వైద్య కళాశాల విద్యార్థుల విద్యాబోధనకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ప్రభంజన్ సతీమణి మంచిర్యాల వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖ మాట్లాడుతూ తన భర్త ఉన్నంతకాలం జర్నలిజం ప్రొఫెసర్గా, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనేవారన్నారు. అ నంతరం ఫౌండేషన్ జ్ఞాపికను ప్రభంజన్ కు టుంబ సభ్యులకు అందించారు. కార్యక్రమంలో కన్వీనర్ చౌడవరపు శ్రీనివాస్, ప్రొఫెసర్ శ్రీకాంత్, రాజయ్య, రవీందర్, తదితురులు పాల్గొన్నారు. -
ఓరుగల్లు అభివృద్ధిపై ఫోకస్
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లాలో పర్యటించిన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ప్రకటించారు. ఈమేరకు సీఎం, మంత్రులు ఓరుగల్లు అభివృద్ధిపై తరచూ సమీక్షలు చేస్తున్నారు. తాజాగా.. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్లోని అంబేడ్కర్ సచివాలయంలో వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరా జ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డితో కలిసి వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్టైల్ పార్కు, భద్రకాళి దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఔటర్రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఓరుగల్లు అభివృద్ధిపై ఆశలు.. మామునూరు ఎయిర్పోర్ట్, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు తదితర అంశాలపై సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీని వా స్రెడ్డి.. కలెక్టర్లు, అధికారులకు పలు సూచనలు చేశారు. మామునూరు ఎయిర్పోర్ట్ కల త్వరలో సాకారం కానుందని, ఇందుకు అవసరమైన భూసే కరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, రూ.205 కోట్లు విడుదల చేశామని, భూ సేకరణకు గ్రీన్చానల్ ద్వారా నిధులు వి డుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి అక్కడ రాజీవ్గాంధీ టౌన్షిప్లో ఆర్–ఆర్ ప్యాకేజీ కింద 1,398 మంది లబ్ధిదారులను గుర్తించి 863 ప్లాట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ కాలనీలో సెప్టెంబర్ నెలాఖరు నాటికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే, వెటర్నరీ హాస్పిటల్, ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ కా ర్యాలయ భవనం నిర్మించాలని, మెగా టెక్స్టైల్ పార్కులో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. 2057జనాభాను దృష్టిలో పెట్టుకొని వరంగల్లో రూ.4,170కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను త్వరగా ప్రారంభించాలని, పనులను విభజించుకుని దశల వారీగా చేపట్టాలని మార్గదర్శనం చేశారు. సమావేశంలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీలు ప్రకాశ్, శ్రీనివాస్ రెడ్డి, సారయ్య, అంజిరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద, రిజ్వాన్బాషా, సీపీ సన్ప్రీత్సింగ్, ఎస్పీలు శబరీష్, కిరణ్ఖరే పాల్గొన్నారు. ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం.. సీఎం, మంత్రుల వరుస సమీక్షలు త్వరలో ఎయిర్పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం మెగా టెక్స్టైల్ పార్కు, ‘భద్రకాళి’, ‘స్మార్ట్’ పనుల పరుగులు హైదరాబాద్లో సమీక్షించిన ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్న ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భద్రకాళి.. భద్రకాళి ఆలయ మాడవీధులతోపాటు కల్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్ అలంకరణను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు తానే స్వయంగా వస్తానని, రోప్వే, గ్లాస్బ్రిడ్జితో సహా అన్ని పనులు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తిచేయాలన్నారు. భద్రకాళి చెరువు ప్రాంతంలో ఇంతవరకు 3.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించామని, రూ.2.06 కోట్ల విలువైన మట్టిని విక్రయించామని అధికారులు వివరించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవసరమైన భూమి గుర్తించాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనకు అనుగుణంగా వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, ప్రభుత్వ ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. వరంగల్ అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్, టెండర్, పనులు ప్రారంభించడానికి, పూర్తిచేయడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని చెప్పారు. -
సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వ స్తున్న సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. శనివారం అ దనపు కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గూగు ల్ మీట్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని, సంబంధిత గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనా యక్, గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత, పంచాయతీ అధికారిని స్వరూపలతో కలిసి ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వస్తున్న సాంకేతిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక సమస్యలు ఉన్న మండలాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ఈడీఎం వెళ్లాలని ఆదేశించారు. ఈ–కేవైసీ, బ్యాంక్ అకౌంట్స్, ఉపాధి హామీ జాబ్ కార్డ్స్ వంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లు, జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. అధికారులు బాధ్యతగా పనిచేయాలి స్టేషన్ఘన్పూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ విషయంలో అధికారులు బాధ్యతగా పనిచేయాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. స్టేషన్ఘన్పూర్ మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రధాన మంత్రి ఆవాస్యోజన గృహ నిర్మాణాల్లో వస్తున్న సాంకేతిక సమస్యలపై ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ పీడీ మాతృనాయక్, ఈడీఎం గౌతమ్రెడ్డి, ఎంపీడీఓ విజయశ్రీ పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి లింగాలఘణపురం: ప్రతిఒక్కరూ ఇంటింటికి మొక్కలు నాటాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని బండ్లగూడెం గ్రామాన్ని సందర్శించి మొక్కలను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
ట్రేడ్ లైసెన్స్లు లేని వైన్స్కు తాళాలు
స్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రేడ్ లైసెన్స్లు లేని వైన్స్కు కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది శనివారం తాళం వేశారు. వివరాలిలా ఉన్నాయి.. నూతన ఆర్థిక సంవత్సరం 2025–26కు గాను ఏప్రిల్ నుంచి మున్సిపాలిటీ నిబంధనల మేరకు మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారాలు చేసే యజమానులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాలని పలుమార్లు మున్సిపల్ అధికారులు సూ చించారు. అయినప్పటికీ స్పందించక పోవడంతో కమిషన్ రాధాకృష్ణ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ సందీప్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది స్థానిక వైన్షాపులకు తాళం వేశారు. దీంతో మున్సిపల్ సిబ్బందికి, వైన్షాపుల వారికి వాగ్వాదం జరిగింది. రెండు రోజుల్లో ట్రేడ్ లైసెన్స్లు తీసుకుంటామని వైన్షాపుల వారు చెప్పడంతో తిరిగి షాపులను తెరిచారు. వ్యాపారాలు చేసేవారు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్లు తీసుకోవాల్సిందేనని కమిషనర్ రాధాకృష్ణ స్పష్టం చేశారు. -
కలలకు రంగులద్దారు. ఆశలకు జీవం పోశారు. భవిష్యత్కు భరోసా ఇచ్చారు. తిన్నాతినకపో యినా.. అడిగిందల్లా కొనిపెట్టారు. అలాంటి అమ్మానాన్నలు కనిపించే దైవాలు. నేడు (ఆదివారం) జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వారి తల్లిద
జనగామ: నాన్న అబ్దుల్ మజీద్ పోలీస్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పని చేశారు. అమ్మ షీరీ గృహిణి. పంద్రాగస్టు, జనవరి 26 ఇలా జాతీయ దినోత్సవ కార్యాక్రమాల వేళ నాన్న తన వెంట తీసుకెళ్లేవారు. అప్పుడే కలెక్టర్ కావాలనే తపన కలిగింది. చదువు విషయంలో నాన్న ఎప్పుడు రాజీ పడలేదు. కష్టపడి చదువుకుని ఇన్ఫోసిస్లో ఉద్యోగం సంపాదించా. నాలుగేళ్లు పని చేశా. అయినా తృప్తి లేదు. నాన్నా.. నేను సివిల్ సర్వీసు వైపు వెళ్తా అన్నాను. ‘గో హెడ్’ అన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశా. అంత పెద్ద జాబ్ వదులుకున్నా, మొదటిసారి ర్యాంకు రాకపోయినా.. ప్రోత్సహించారు. నాన్న ఎలాంటి ఒత్తిడి లేకుండా పెంచారు. తల్లిదండ్రులకు ఎంత చేసినా తక్కువే. నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి, మన భవిష్యత్కు బాటలు వేసే తండ్రిని కంటికి రెప్పలా కాపాడుకుంటేనే పిల్లల జన్మకు సార్థకత అని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు.శ్రమకోర్చి ప్రయోజకుల్ని చేసి.. జీవితాలకు బాటలు వేసిన తల్లిదండ్రులు ఆదర్శంగా నిలుస్తున్న పేరెంట్స్ నేడు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం అనుబంధాన్ని పంచుకున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కంటికి రెప్పలా కాపాడుకోవాలి -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జనగామ: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు, ఆయా శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం జనగామ చంపక్హిల్స్ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ భాషా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్లతో కలిసి ఆయన పరిశీలించారు. చిన్న పిల్లల వార్డుకు వెళ్లి వైద్య సేవలపై ఆరా తీశారు. సమయానికి వైద్యులు వచ్చి చూస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎంసీహెచ్లో సేవలు బాగున్నాయన్నారు. అన్ని ఆస్పత్రుల్లో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండడంతో పాటు మందుల కొరత లేకుండా చూసుకోవాలనిఅన్నారు. ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టాలి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ఆయా శాఖల అధికారులు కష్టపడి పనిచేయాలని, జిల్లాలో ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై మున్సిపల్, పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలతో పాటు క్షేత్రస్థాయి సందర్శనలు చేయాలన్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్లో ఇప్పటి వరకు 40 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి 54,148 మందికి స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. సమీక్షలో డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లిర్జున్రావు, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగమణి, ఎంసీహెచ్, డీహెచ్ సూపరింటెండెంట్లు డాక్టర్ మధుసూదన్రెడ్డి, డాక్టర్ రాజలింగం,ప్రోగ్రాం ఆఫీసర్స్, వైద్యులు తదితరులు ఉన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి బచ్చన్నపేట: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాసం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. అలాగే మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో పర్యటించి డెంగీ పాజిటివ్ వచ్చిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి రోగులతో మాట్లాడారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ అశోక్కుమార్, కమలహాసన్, తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి ఎంసీహెచ్ సేవలు బాగున్నాయి.. సీజనల్ వ్యాధుల నియంత్రణ ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు -
అభివృద్ధి పనుల పరిశీలన
జనగామ: జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటను పంచతంత్ర థీమ్లో అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్ధేశ్యంతో రూ.1.50కోట్లతో బతుకమ్మకుంట అభివృద్ధి పనులు చేయిస్తున్నామన్నారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. వారం రోజుల్లోపు సివిల్ పనులు పూర్తి చేసి రెండు వారాల్లో బతుకమ్మకుంట సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. చెరువు పూడికతీత, వాకింగ్ ట్రాక్ ఏరియా, లైటింగ్, రేలింగ్, ఫెన్సింగ్, వాటర్ ట్యాంక్ పనుల్లో వేగం పెంచాలన్నారు. అంతకు ముందు చిన్నపిల్లల ఆట వస్తువుల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. -
వరద పారదు..చెరువు నిండదు
● జిల్లాలో 16.6 మిల్లీమీటర్ల వర్షపాతం జనగామ: తుఫాను ప్రభావం అనేక జిల్లాల్లో కుంభవృష్టి కురిపిస్తుంటే... జిల్లాలో ముసురుతోనే పెడతున్నాయి. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించినా.. కాగితానికే పరిమితంగా మారిపోయింది. ఎండుతున్న పంటలకు ముసురు ఊపిరి పోస్తున్నా... చిరు జల్లులతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేకుండా పోయింది. నాలుగురోజులుగా ఊరిస్తూ... మురిపిస్తూ కురుస్తున్న వర్షంతో వరద పారదు, చెరువు నిండని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి వరంగల్లో అనేక ప్రాంతాల్లో చెరువులు జలకళతో నిండుకుండలా మారగా.. జిల్లాలోని చెరువు మోడు బారి కనిపిస్తున్నాయి. కాగా జిల్లాలో శుక్రవారం అత్యధికంగా నర్మెట మండలంలో 30, అత్యల్పంగా కొడకండ్ల మండలంలో 12.5 మిల్లీ మీ టర్లు (మొత్తం 16.6) వర్షపాతం కురిసింది. -
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లా కేంద్రంలో ఈనెల 27న నిర్వహించే లైసెన్స్ సర్వేయర్ల అర్హత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. 173 మంది అభ్యర్థులు హాజరు కానుండగా, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలన్నారు. సెంటర్లో విద్యుత్, తాగునీరుతో పాటు మౌలిక వసతులు కల్పించాలన్నారు. -
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
● జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి నర్మెట: వర్షాలు కురుస్తున్నందున పంచాయతీలు పారిశుద్ధ్య నిర్వాహనపై ప్రత్యేక దృష్టి సారించాలని, వైద్య సిబ్బంది విషజ్వరాలు ప్రబలకుండా గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి అన్నారు. నర్మెట గ్రామ పంచాయతీని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిల్వలు ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరవింద్ చౌదరి, వైద్యాధికారి ఉదయ్ కిరణ్, కార్యదర్శి కందకట్ల శ్రీధర్, బిల్ కలెక్టర్ చిర్ర వెంకట్ రెడ్డి, ఏఎన్ఎంలు కుల్సుం సుల్తానా బేగం, కరుణ, ఆశలు శ్వేత, మంగ, శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం!
లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష వివరాలు పరీక్ష రాసే అభ్యర్థులు: 173సెంటర్: ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల పరీక్ష సమయం: మొదటి పరీక్ష: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండవ పరీక్ష: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకురేపు లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్ష ● 28, 29న ప్రాక్టికల్స్ ● మొబైల్స్కు అనుమతి లేదు ● సెంటర్ వద్ద 144 సెక్షన్ ● కలెక్టరేట్ స్ట్రాంగ్ రూంకు ప్రశ్నపత్రాలుజనగామ: లైసెన్స్డ్ సర్వేయర్ల తుది పరీక్షకు జిల్లాలో సర్వంసిద్ధం చేశారు. కలెక్టర్ రిజ్వాన్బాషా ఆధ్వర్యంలో పరీక్షల కో–ఆర్డినేటర్, సర్వే డిపార్ట్మెంట్ ఏడీ మన్యంకొండ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నా రు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం– 2025 భూమి కొలతలు, సర్వే చేసేందుకు లైసెన్స్డ్ పొందిన సర్వేయర్ల కోసం పరీక్ష నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాలో 225 మంది సర్వేయర్లు లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇద్దరు గైర్హాజరు కాగా, 223 మంది ఈ ఏడాది మే 26 నుంచి జూలై 26 (నేటి వరకు) వరకు 50 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందులో 173 మంది పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. రెండు రోజులపాటు ప్రాక్టికల్స్ లైసెన్స్డ్ సర్వేయర్లకు ఈ నెల 27న (ఆదివారం) తుది పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు థియరీ, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్లాటింగ్ పరీక్ష జరగనుంది. 28, 29వ తేదీల్లో యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ప్రాక్టికల్స్ పరీక్షతో శిక్షణ సంపూర్ణంగా ముగియనుంది. 27వ తేదీన జరిగే పరీక్ష కోసం పట్టణంలోని సిద్దిపేటరోడ్డు ఏబీవీ ప్రభుత్వ (అటానమస్) డిగ్రీ కళాశాలలో సెంటర్ను ఏర్పాటు చేశారు. 173 మంది అభ్యర్థుల కోసం ఏడు గదులను ఏర్పాటు చేయగా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించనున్నారు. థియరీ, ప్లాటింగ్, ప్రాక్టికల్స్కు 100 మార్కుల చొప్పున 300 మార్కులు ఉంటాయి. ఇందులో ప్రతి పరీక్షలో 60 మార్కులు సాధించిన అభ్యర్థులు లైసెన్స్డ్ సర్వేయర్కు అర్హత సాధిస్తారు. ఉదయం 9.45 నిమిషాలకే సెంటర్లోనికి.. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులు 9.45 గంటల వరకు సెంటర్ లోనికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన వారికి లోనికి అనుమతించరు. అభ్యర్థి వెంట సెల్ఫోన్ అనుమతి లేదు. చీఫ్ సూపరింటెండెంట్, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి విక్రమ్, చీఫ్ అబ్జర్వర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్, 8 మంది ఇన్విజిలేటర్ల ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయంలో సాంకేతిక సమస్య, లోటు పాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చే నెల ఆగస్టు 1వ తేదీ నుంచి 5 వరకు జేఎన్టీయూహెచ్లో పేపర్ కరెక్ష న్, 10వ తేదీన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇ దిలా ఉండగా ప్రశ్న పత్రాలు శుక్రవారం జిల్లాకు చే రుకోగా, కలెక్టరేట్ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. -
శ్రావణ పూజలు షురూ
ఆలయాలకు పోటెత్తిన భక్తులు నెలరోజుల పాటు వ్రతాలు, పూజలుజనగామ: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసం పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భక్తిభావం నెలకొంది. అమ్మవార్లకు ప్రీతికరమైన శుక్రవారం శ్రావణమాసం రావడంతో ఆలయాలకు మహిళా భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో తెల్లవారు జాము నుంచే వేద మంత్రోచ్ఛారణల నడుమ మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వర, బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వర, లింగాలఘణపురం మండలం జీడికల్ సీతారామచంద్రస్వామి, చిల్పూరు బుగులోని వేంకటేశ్వరస్వామి, జనగామ పట్టణంలో వేంకటేశ్వర, రామలింగేశ్వర, గుండ్లగడ్డ ఉమామహేశ్వరస్వామి, మహంకాళీ, అమ్మబావి ఉప్పలమ్మ సహిత ఆంజనేయ, చెన్నకేశ్వర, సాయిబాబా, గీతాశ్రమం, బతుకమ్మకుంట విజయదుర్గామాత, హనుమకొండ రోడ్డులోని రేణుక ఎల్లమ్మ, పంచకోసు రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో శ్రావణ మాసం ప్రారంభం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదుర్గ అమ్మవారిని గాజులతో అలంకరించారు. భక్తులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించి, ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. -
ఇక.. భూసేకరణ వేగవంతం
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో పరిహారం విషయమై ఇప్పటికే డిస్టిక్ట్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ చర్చించింది. వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887గా నిర్ణయించింది. పాత ఎయిర్ స్ట్రిప్నకు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధీనంలో ఉంది. ఈ రన్వే విస్తరణ కోసం అదనంగా అవసరమయ్యే 253 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లు కేటాయించింది. అందుకు పరిపాలన అనుమతులను శుక్రవారం మంజూరు ఇవ్వడంతో ఇక భూసేకరణ వేగవంతం కానుంది. కాగా, 50 శాతంమందికి పైగా రైతులు తమ కన్సెంట్ (అంగీకార పత్రం) తెలపడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండానే భూసేకరణ జరుగుతుందని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు రూ.205 కోట్లు కేటాయించిన జీఓ ఆధారంగా ఇప్పుడు బడ్జెట్ కేటాయించారంటున్నారు. మూడు జిల్లాలను అనుసంధానించేలా... కేంద్రం ఉడాన్ పథకం కింద 2022 సెప్టెంబర్లో మామునూరు విమానాశ్రయాన్ని ఎంపిక చేసింది. నిజాం కాలంలోని ఈ విమానాశ్రయంలో ఎయిర్స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్వే ఉంది. ఈ రన్ వే విస్తరణకు అదనంగా 253 ఎకరాల భూసేకరణ అవసరం. ముఖ్యంగా వరంగల్కు చేరుకోవాలంటే హైదరాబాద్లో దిగి మూడు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. ఇది పెట్టుబడులకు ఆటంకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వరంగల్లోనే నేరుగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటే వేగంగా పెట్టుబడులు వస్తాయని భావించింది. అలాగే, ఉత్తర తెలంగాణలో మరో ముఖ్య పట్టణమైన కరీంనగర్తోపాటు ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు మామునూరు విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగించేలా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్–కరీంనగర్ మధ్య 80 కిమీ మేర ఎన్హెచ్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. వరంగల్ –ఖమ్మం నేషనల్ హైవే ప్రస్తుత రద్దీకి అనుగుణంగా లేదు. నల్లగొండ జిల్లా ప్రజలను ఓరుగల్లుతో అనుసంధానించేందుకు వరంగల్–దంతాలపల్లి–సూర్యాపేట వరకు రెండు వరుసల ఎన్హెచ్ ఉంది. దీన్ని నాలుగు వరుసలుగా విస్తరించాల్సి ఉంది. అలాగే, వరంగల్ నుంచి 15 కిమీ దూరంలో ఉన్న మామునూరుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట నుంచి రేడియల్ రోడ్లు నిర్మించాలి. నగర ఇన్నర్, ఔటర్ రింగురోడ్లను ఎయిర్పోర్టుతో అనుసంధానిస్తారు. మామునూరు విమానాశ్రయంపై సర్కారు నజర్ తాజాగా 253 ఎకరాల కోసం రూ.205 కోట్లకు పాలనాపరమైన అనుమతులు విమానాశ్రయానికి 50 శాతం మందికిపైగా రైతులు అంగీకారం మరో రూ.112 కోట్లు అత్యవసరంపర్యాటకం, ఐటీ పరిశ్రమలకు బూస్ట్.. మామునూరు ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే కొచ్చిన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మాదిరిగానే భద్రాచలం, రామప్ప, లక్నవరం, మేడారానికి భక్తులు, సందర్శకులు పెరుగుతారు. టైర్ 2 పట్టణాల్లోనూ ఐటీ విస్తరణలో భాగంగా ఎయిర్పోర్ట్ కీలకంగా మారనుంది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కై టెక్స్ మాదిరిగానే మరిన్ని అంతర్జాతీయ వ్యాపారసంస్థలు ముందుకు వస్తాయి. దీంతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశముంది. మామునూరు సమీప ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది. మరో రూ.112 కోట్లు అవసరమే... విమానాశ్రయ నిర్మాణానికి నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలో 240 ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు 13 ఎకరాల (61,134.5 చదరపు గజాల) వ్యవసాయేతర భూమి సేకరించాల్సి ఉంది. వ్యవసాయ భూమికి రూ.288 కోట్లు, వ్యవసాయేతర భూమికి రూ.29,87,61,858 భూనిర్వాసితులకు చెల్లించాలి. మొత్తంగా రూ.317 కోట్లు అవసరం అవుతుండగా.. మరోదఫా రూ.112 కోట్లు అవసరం. భూసేకరణ పూర్తయి, ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే 150 నుంచి 186 మంది ప్రయాణించే ఏ–320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. -
మొత్తం ఓటర్లు 7,67,426
జనగామ రూరల్: జిల్లాలో మొత్తం 7,67,426 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రాఫ్ట్ జాబితా ప్రకటన 2024 అక్టోబర్ 29 నాటికి జిల్లాలో 7,57,982 ఓటర్లు ఉండగా ఫైనల్ పబ్లికేషన్ (06.01.2025) నాటికి 7,61,642కు చేరిందన్నారు. తుది జాబితా 2025 జూలై 25 నాటికి 7,67,426 చేరిందన్నారు. ఇందులో పురుషులు 3,77,953 (49.25శాతం), మహిళలు 3,89,443 (50.75శాతం), ఇతరులు 30 మంది ఉన్నారన్నారు. నియోజకవర్గాల వారీగా జనగామ 2,48,245, స్టేషన్ఘన్పూర్ 2,59,095, పాలకుర్తి 2,60,086 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీకాంత్, ఎలెక్షన్ సూపరింటెండెంట్ స్వప్న, భాస్కర్, రవి, విజయభాస్కర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్గా శశాంకసాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్గా ఐఏఎస్ అధికారి కె.శశాంక నియమితులయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్కు 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శశాంక పేరును ప్రకటించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కమిషనర్గా వ్యవహరిస్తున్న ఆయన గతంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా పని చేశారు. ఇటీవల ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కమిషనర్గా నియమించిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ స్పెషలాఫీసర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఫీవర్ సర్వే చేపట్టాలిజనగామ రూరల్: గ్రామాల్లో వైద్యశాఖ అధికారులు ఫీవర్ సర్వే చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, డైరెక్టర్ సృజన, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో పర్యటించాలన్నారు. శానిటేషన్పై పర్యవేక్షించి పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. మురుగు కాల్వలో దోమలు పెరగకుండా స్ప్రే చేయించాలన్నారు. తాగునీటి సరఫరాలో పైపులైన్ల లీకేజీ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురిషా, జిల్లా పంచాయతీ శాఖ అధికారి స్వరూపారాణి, వైద్య శాఖ అధికారి మల్లికార్జున్ రావు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు పాటించాలి
కొడకండ్ల: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, ప్రతి రోజు కాచి చల్లార్చిన నీటిని విద్యార్దులు తాగేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ సూచించారు. గురువారం మండలకేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ప్రతీ రోజు ఉపాధ్యాయులు తెలుసుకోవాలని, విద్యార్థులతో కల్సి ఉపాధ్యాయులు భోజనం చేయాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖల అధికారులు వసతి గృహాలను సందర్శించి సిబ్బంది పనితీరును తెలుకుంటూ విద్యార్థులతో భోజనం చేయాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రిజిస్టర్లను పరిశీలించా రు. ఆయన వెంట ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు విక్రమ్కుమార్, రవీందర్, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి జనగామ రూరల్: సీజనల్ వ్యాధులపై వైద్యరోగ్య శాఖ డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు ఆదేశించారు. జనగామ మండలం గానుగుపహాడ్లో రెండు డెంగీ కేసులు నమోదు కావడంతో గురువారం డీఎంహెచ్ఓ గ్రామంలో పర్యటించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనులు నిర్లక్ష్యం చేయొద్దని గ్రామ పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కోమల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో గానుగుపహాడ్లో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించాలని డీఎంహెచ్ఓ సూచించారు. జ్వరాలపై ఇంటింటి సర్వే చేపట్టి, లక్షణాలు గుర్తించిన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
జిల్లాలో యూరియా కొరత లేదు
జనగామ/జఫర్గఢ్: జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. గురువారం జనగామలోని కావేరి, సాయిరాం ఫర్టిలైజర్ షాపులను డీఏఓ కట్ట అంబికాసోనీతో కలిసి తనిఖీలు చేపట్టిన కలెక్టర్ జఫర్గఢ్లో వెంకటేశ్వర ఎరువుల షాపుతోపాటు రైతు ఆగ్రోస్ సెంటర్ను తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో ఇప్పటి వరకు జరిగిన ఎరువుల విక్రయాల స్టాక్ రిజిస్ట్టర్, ప్రస్తుత నిల్వలను పరిశీలించారు. ఆయా దుకాణాల్లో ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు కలెక్టర్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్ని ఎకరాల పొలం సాగు చేస్తున్నారు.. కొనుగోలు చేసిన యూరియా బస్తాలు ఎన్ని.. అసలు అవసరం ఎంత.. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీశారు.సాయిరాం ఫర్టిలైజర్ దుకాణంలో ధరల పట్టిక, స్టాక్ వివరాలు చూపించే బోర్డు కనిపించకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీగా యూరియా విక్రయించే సమయంలో రైతు ఫోన్ నంబర్తోపాటు సమగ్ర సమాచారం రశీదులో నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలో 3,560 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. మార్క్ ఫెడ్లో ఈ సీజన్కు సరిపోయే విధంగా బఫర్ స్టాక్ సైతం నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 89777 45512 ద్వారా సంప్రదించాలని సూచించారు. మండలాలు, గ్రామాల్లో యూరియా కొరత సృష్టించకుండా సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. జఫర్గఢ్లో ఏఓ కరుణాకర్రెడ్డిని రైతులతో మాట్లాడించి ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా తీసుకున్నారు. ఏ రేటుకు తీసుకున్నారు. ఏమైన ఇబ్బందులు ఎదురయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట తహసీల్దార్ రాజేష్రెడ్డి, ఏఓ కరుణాకర్రెడ్డి, ఆర్ఐలు బలరాం, దేవేందర్ ఉన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు జనగామ: వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాలతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవా లని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నతాధికారులు స్పందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి 90523 08621 ఫోన్ నంబర్ కేటాయించినట్లు తెలిపారు. కంట్రోల్ రూం సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. భారీ వర్షాలతో వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం తదితర విపత్కర పరిస్థితులు ఎదురైన సందర్భంలో కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు రైతుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు కలెక్టర్ రిజ్వాన్బాషా -
ముసురుతోనే సరి
జనగామవిద్యా కమిషన్కు సమస్యల ఏకరువు రాష్ట్ర విద్యాకమిషన్కు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, టీచింగ్, నాటీచింగ్ స్టాఫ్ సమస్యలు ఏకరువు పెట్టారు.శుక్రవారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2025–8లోuజనగామ: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా జోరు వర్షాలు కురుస్తుంటే.. జిల్లాలో మాత్రం ముసురుతోనే సరిపెట్టేస్తుంది. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ (మోస్తారు నుంచి భారీ వర్షాలు) ప్రకటించినప్పటికీ.. తేలికపాటి నుంచి మోస్తారు వర్షమే కురుస్తుంది. ఈ సీజన్లో వరుణుడు ముఖం చాటేయడంతో పత్తి విత్తులు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతే.. వరి నారుమళ్లు ఎండిపోయాయి. పత్తి సాగుకు సమయం ముగిసిపోగా.. వరినాట్లకు మరో వారం మిగిలి ఉన్నప్పటికీ.. సాగు అంచనాలో 50 శాతం దాటని పరిస్థితి. రెండు రోజులుగా కురుస్తున్న ముసురుతో జిల్లా వ్యాప్తంగా వరినాట్లు ఊపందుకున్నాయి. సాగు నీరందక రెండోసారి విత్తిన పత్తి గింజలు సైతం మట్టిలో కలిసి పోగా కొంతమంది రైతులు మూడో సారి విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. 1.93 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో పత్తి, వరి, ఇతర పంటలు కలుపుకుని 3.54 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2.15 లక్షల ఎకరాల్లో వరి, 1.25 లక్షల ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 3,500 ఎకరాల్లో కందులు తదిర పంటలు సాగు కావాల్సి ఉంది. సీజన్ ఆరంభం నుంచి వర్షాలు మొఖం చాటేయడం, భూగర్భ జలాలు అడుగంటడంతో సాగు పనులు ముందుకు కదలలేదు. దీంతో ఇప్పటి వరకు 1.02లక్షల ఎకరాల్లో పత్తి, 80,085 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. 40 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పూర్తి చేయడం ఆందోళన కలిగించే పరిణామం. ప్రస్తుతం తుపాన్ ప్రభావంతో రైతులు ఆశగా వరి సాగు పనులను ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా జూలైలో 272.9 మిల్లీ మీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా, ఇప్పటి వరకు 192.2 మి.మీ మాత్రమే కురిసింది. జిల్లాలోని చాలా చెరువులు పూర్తిస్థాయిలో నిండకపోవడం గమనార్హం. సాగు ఆలస్యం.. నాట్ల పనులు చివరి దశకు చేరుకునే సమయంలో.. ప్రారంభమయ్యే విచిత్ర పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల దుక్కులు దున్నుతుండగా, అప్పటికే సిద్ధం చేసి ఉంచిన మళ్లలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు నాట్లు వేస్తున్నారు. బోరు బావులపై ఆధారపడి సాగు చేసిన వరి, పత్తి పంటల్లో కలుపు తీయడం, గుంటుకలు కొట్టడం, ఎరువులు వేయడంలో రైతులు బిజీగా ఉన్నారు. వాతావరణ శాఖ ప్రకటించినట్లుగా వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు సైతం పెరిగే అవకాశం ఉంటుంది. చిల్పూరు మండలంలో రెండు చెరువులు మాత్రం మత్తడి దూకుతున్నాయి.సాగు వివరాలు (ఎకరాల్లో..) సరాసరి కురియాల్సింది272.9కురిసింది -
భూరికార్డులను సిద్ధం చేయండి
లింగాలఘణపురం: భూభారతిలో వచ్చిన భూసమస్యల పరిష్కారానికి అన్ని రకాల రికార్డులను ఆగస్టు 15 నాటికి సిద్ధం చేయాలని రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భూభారతి ఫిర్యాదులన్నీ పరిష్కారమయ్యే విధంగా రికార్డులను పరిశీలించాలని సూచించారు. సాదాబైనామాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, అసైన్డ్లాండ్స్ సమస్యల పరిష్కారానికి కూడా మార్గదర్శకాలు నిర్దేశిస్తుందని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ రవీందర్ ఉన్నారు. మానవత్వం చాటుకున్న గ్రామస్తులు గంటల వ్యవధిలోనే రూ.70వేలు జమ తరిగొప్పుల: నిరుపేద మహిళ మృతిచెందడంతో అంత్యక్రియలకు తమవంతు సాయం చేసి అంత్యక్రియల్లో పాల్గొని నర్సాపూర్ గ్రామస్తులు మానవత్వం చాటుకున్నారు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న గ్రామానికి చెందిన పల్లె లక్ష్మి(36) అనారోగ్యంతో గురువారం మృతిచెందగా.. గ్రామస్తులు అండగా నిలిచారు. గంటల వ్యవధిలోనే సుమారు రూ.70 వేలు పోగుచేసి లక్ష్మి కుమారుడికి అందజేశారు. సాయం కోసం సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇతర గ్రామాలకు చెందినవారు సైతం సాయం చేసినట్లు నర్సాపూర్ వాసులు తెలిపారు. ఉపాధ్యాయుల సూచనలు పాటించాలి జఫర్గఢ్: ఉపాధ్యాయుల సూచనలు విద్యార్థులు పాటించాలని తెలంగాణ మోడల్ స్కూల్ డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్ను సందర్శించారు. పాఠశాల గదులు, ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యాసనను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ, పరిశుభ్రత, బోధనపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం దుర్గాప్రసాద్ను ఉపాధ్యాయులు జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా మోడల్ స్కూల్ నోడల్ ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి స్టేషన్ఘన్పూర్: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని తెలంగాణ విద్యాకమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరారావు, డాక్టర్ చారగొండ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం వారు స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఛాగల్లులో ప్రభుత్వ ప్రాథమిక, జెడ్పీఎస్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ముందుగా పాఠశాల పరిసరాలు, ఉపాధ్యాయుల రిజిస్టర్లను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల మధ్యాహ్న భోజనం తదితర విషయాలను తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠాలు సరిగ్గా అర్ధం అవుతున్నాయా.. అని తెలుసుకున్నారు. విద్యార్థులు ఇంగ్లిష్లో దారాళంగా మాట్లాడాలని, కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుకోవాలని, అప్పుడే జీవితంలో రాణిస్తారని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల డైరీలు, పాఠ్యప్రణాళికలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ కొమురయ్య, స్టాఫ్ సెక్రటరీ కొల్లూరు ప్రకాశం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సర్కారు బడుల్లో ఏఆర్, వీఆర్ ల్యాబ్స్
జనగామ : ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకంలో ఎంపికై న పాఠశాలల్లో సాంకేతిక విద్య అమలు చేస్తూ ఆధునిక పరిశోధన కేంద్రాలుగా మారుస్తోంది. ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, కనీస వసతి సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేస్తున్న కేంద్రం.. కొత్తగా ఏఆర్(అగ్మెంటెడ్ రియాల్టీ), వీఆర్(వర్చువల్ రియాల్టీ) ల్యాబోరేటరీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో మొదటి విడత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 10 పీఎం శ్రీ పాఠశాలలను ఎంపిక చేశారు. బోధన.. ప్రయోజనాలిలా.. ● ఏఆర్, వీఆర్ ల్యాబ్లతో ఆస్ట్రోనమీ (ఖగోళ శాస్త్రం), రెండవ ప్రపంచ యుద్ధం, గుండె పనితీరు, మానవ శరీరంలోని అవయవాల కదలికలు, నాటి చరిత్రలు (హిస్టరీ) తదితర సబ్జెక్టుల వారీగా బోధన చేసే సమయంలో విద్యార్థులు ప్రత్యక్ష అనుభూతికి లోనవుతారు. ● దిగువ స్థాయి పిల్లవాడినుంచి బాగా చదువుకునే విద్యార్థి వరకు ఏఆర్, వీఆర్ బోధన పరికరాలతో టీచర్ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. ● విద్యార్థులు గుండె, కణాల నిర్మాణం వాటి విధులు, జీవశాస్త్ర, ఆస్ట్రానమీ లాంటి ఫిజిక్స్, గణిత, గతంలోకి వెళ్లి హిస్టరీ పాఠాలను ఇమ్మర్సివ్, ఇంటరాక్టివ్ టెక్నాలజీలను ఉపయోగించి వీఆర్ ద్వారా వాటిలోకి ప్రవేశించి స్వీయ అనుభవంతో నేర్చుకుంటారు. ● పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రతీ పాఠశాలకు 10 ఏఆర్, వీఆర్ పరికరాలు, ఒక బీన్ బ్యాగ్, ఒక చార్జింగ్ ట్రాలీ, ఒక టాబ్, ఒక టీచర్ సపోర్టింగ్ ట్యాబ్, ఒక స్టోరేజ్ కేస్, 1 కేవీఏ యూపీఎస్ పరికరాలను ల్యాబ్లో అమర్చనున్నారు. ● 5 నుంచి 10 తరగతి వరకు జనరల్ సైన్స్, గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రాన్ని బోధించడానికి, విద్యార్థులు నేర్చుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తారు. 5డీ మోడ్లో.... వీఆర్ హెడ్గేర్ రాష్ట్ర పాఠ్యాంశాలకు మ్యాప్ చేసిన కంటెంట్తో లోడ్ చేశారు. దీని ద్వారా విద్యార్థులు ఇంటరాక్టివ్ , 5డీ(ప్రస్తుత టెక్నాలజీ) మోడ్లో పాఠాలను నేర్చుకోగలుగుతారు. గుండె పనితీరును బోధించే సమయంలో ఉపాధ్యాయులు బోర్డుపై హృదయ రేఖాచిత్రాన్ని గీసి చూపించాలి. వీఆర్ ఆధారిత అభ్యాసం విషయంలో హెడ్గేర్ను ఉపయోగించడంతో త్రీడీలో హృదయం తెరపై కనిపిస్తుంది. మనిషి ఆర్గాన్ పనితీరును విద్యార్థులు చూడడంతోపాటు సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పీఎం శ్రీ ఎంపిక చేసిన పాఠశాలల్లోనే..ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలల పరిధిలో ఎంపిక చేసిన స్కూల్స్లో ఏఆర్, వీఆర్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తోంది. పరికరాలు సైతం వస్తున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి గైడ్లైన్స్ జారీ చేశారు. మెటీరియల్ వినియోగం, నిర్వహణ కోసం పాఠశాలలోని ఫిజికల్ లేదా బయాలజీ టీచర్ను నియమిస్తారు. ఏజెన్సీ ద్వారా ఏఆర్, వీఆర్ ల్యాబ్ల పరికరాలు వచ్చిన వెంటనే హెచ్ఎంలు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. – బొమ్మనబోయిన శ్రీనివాస్,జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, జనగామ ఉమ్మడి జిల్లాలో 10 పాఠశాలలు ఎంపిక ప్రతీ సబ్జెక్టుతో అనుసంధానం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతి ఉమ్మడి జిల్లాలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లా మండలం ఉన్నత పాఠశాల హనుమకొండ ఐనవోలు ఒంటిమామిడిపల్లి హనుమకొండ కాజీపేట మడికొండ భూపాలపల్లి భూపాలపల్లి గొల్ల బుద్దారం జనగామ అర్బన్ ధర్మకంచ మహబూబాబాద్ మహబూబాబాద్ బాలికల మహబూబాబాద్ తొర్రూరు తొర్రూరు మహబూబాబాద్ గూడూరు పొనుగోడు మహబూబాబాద్ దంతాలపల్లి దంతాలపల్లి వరంగల్ నర్సంపేట బాలికల వరంగల్ రాయపర్తి కొండూరు -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
జఫర్గఢ్: ఆస్పత్రికి వచ్చే రోగులకు టెస్ట్లు నిర్వహించి మెరుగైన వైద్యాన్ని అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంతోపాటు కస్తూర్బా పాఠశాలను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ముందుగా ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.. వైద్యులు, వైద్య సిబ్బంది రిజిస్టర్లను పరిశీ లించారు. ఓపీ, టెస్టులు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. టెస్టుల వివరాల నమోదులో అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు రిజిష్టర్లో సంతకాలు చేయకుండా నిర్లక్ష్యం చేసిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం పేషెంట్లతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. డయాలసీస్ విభాగాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం కేజీబీవీలో తనిఖీలు చేపట్టిన కలెక్టర్ వంట సామగ్రి పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట డీఈఓ భోజన్న, తహసీల్దార్ రాజేష్రెడ్డి, ఎంఈఓ రఘునందన్రెడ్డి ఉన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు జనగామ రూరల్: జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. గురువారం కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీపై వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ చేతన్ నితిన్లతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అత్యధికంగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలపై చర్చించి, నివారణ చర్యలపై చ ర్చించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్, కారులో సీట్ బెల్ట్ ధరించా లన్నారు. గ్రామీణ ప్రాంతాల పరిధిలో మలుపుల వద్ద వాహన డ్రైవర్లకు రోడ్డు క్లియర్గా కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుతోపాటు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద సమాచారమిచ్చేలా యువతకు అవగాహన కల్పించాలన్నారు. డీటీఓ జీవీఎస్ గౌడ్, పోలీసులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలి
రఘునాథపల్లి: ఇందిరమ్మ లబ్ధిదారుల నిర్మాణ వివరాలను రెండు రోజుల్లోగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్లో నమోదు చేయాలని జెడ్పీ సీఈఓ మాధురిషా.. అధికారులు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణ వివరాలను ఎంపీడీఓ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. మండలంలో 553 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, సాంకేతిక సమస్యలతో పీఎంజీవై పోర్టల్లో నమోదు కావడం జాప్యం జరుగుతుందని ఎంపీడీఓ వివరించారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం రెండు రోజుల్లో పోర్టల్లో నమోదు పూర్తి చేయాలని మాధురిషా చెప్పారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా పంచాయతీ కార్యదర్శులు, అధికారులు ప్రోత్సహించాలన్నారు. వర్షం కురిసినప్పుడు స్లాబ్ నుంచి కార్యాలయంలోకి నీరు కారుతుందని సీఈఓకు ఎంపీడీఓ తెలియజేయగా.. కార్యాలయం గదులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ రమేష్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. జెడ్పీ సీఈఓ మాధురిషా -
రైతులకు అధికారులు సహకరించాలి
●● వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు పరశురామ్నాయక్ ● మూడు మండలాల అధికారులతో సమావేశంపాలకుర్తి: రైతులకు వ్యవసాయ అధికారులు పంటల సాగు విధానం తదితర అంశాల్లో సహకరించాలని డివిజనల్ వ్యవసాయ సంచాలకుడు అజ్మీరా పరశురామ్ నాయక్ అన్నారు. బుధవారం పాలకుర్తి రైతు సేవా కేంద్రంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల స్థాయి వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రైతు తమ భూముల పట్టాదారు పాసుబుక్ తీసుకుని ఏఈఓల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై వివరించారు. డివిజన్లోని అన్ని మండలాకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను పరిశీలించాలని అన్నారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ ఏఓ విజయ సాయిరెడ్డి, ఏఈఓలు వెంకటేశ్, రాధిక, మహేష్, దీపక్, రేవంత్, కీర్తి, సన, సువర్ణ, నవ్య, భాస్కర్, సాయి కిరణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలకు బీమా
జనగామ రూరల్: గ్రామాల్లో వలసలు నివారించి పని కోరిన ప్రతిఒక్కరికీ స్థానికంగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా కూలీలు తమ అవసరాలకు ఉపాధి పొందుతుండగా వారికి మరో ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతిఒక్కరికీ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. కూలీలతో కొంత ప్రీమియం చెల్లింపజేసి వారికి బీమాను కల్పించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ఇప్పటికే ఉపాధి హామీలో ఉన్న కూలీలకు ఎవరెవరికీ బీమా ఉంది, లేనివారితో బీమా చేయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు జిల్లాలో బీమా లేని వారి వివరాలను సేకరించి వారిని బీమా చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏటా రూ.20 బీమాకు జమ జిల్లాలో మొత్తం 1.21 లక్షల యాక్టివ్ జాబ్కార్డులు ఉండగా.. ఇందులో 2.31 లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరందరికీ బీమా వర్తించనుంది. సురక్ష బీమా యోజన కోసం 18 నుంచి 71 ఏళ్లలోపు వారు జాతీయ బ్యాంకుల్లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ ఖాతా ఆధార్కార్డుతో అనుసంధానమై ఉండాలి. బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచీలో ఖాతా నుంచి ఏటా రూ.20 బీమాకు జమ చేయాలని అంగీకారపత్రం ఇవ్వాలి. పేరు నమోదు చేసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణించినా పూర్తిగా అంగవైకల్యం కలిగినా.. రూ.2 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంటుంది. పాక్షికంగా అంగవైకల్యం కలిగినా.. రూ.లక్ష పరిహారం అందుతుంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 50 రోజుల్లో రూ.20 కోట్ల మేరకు పనులు చేపట్టారు.●ఉపాధి కూలీలందరికీ వర్తించేలా.. ఉపాధి కూలీలకు బీమా అనేది నిరంతరం ప్రక్రియ. దీనికి చివరి తేదీ అంటూ ఏమీ లేదు. జిల్లాలో ఎవరెవరికీ బీమా లేదన్న విషయాన్ని బ్యాంకుల వద్ద సేకరించి లేని వారికి బీమా కల్పించేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. ప్రతి ఒక్కరికీ బీమా కల్పించడమే లక్ష్యంగా అవగాహన కల్పిస్తున్నాం. – వసంత, డీఆర్డీఓ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద అమలు బీమా లేని వారిని గుర్తించే పనిలో అధికారులు జిల్లాలో 2.31 లక్షల ఉపాధి కూలీలు -
బోధనలో మరింత నాణ్యత
జనగామ: సర్కారు బడుల్లో బోధనపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ సారించింది. పాఠశాల స్థాయిలో పటిష్టమైన పునాదులు వేయడానికి, బోధనలో కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిధిలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024–25 ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్లో నిర్మాణాత్మక సమావేశాలతో విద్యార్థుల అభ్యాసనంలో పురోగతి సాధించారు. రేపటి నుంచి (శుక్రవారం) స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపధ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వందశాతం హాజరు కావాలి జిల్లాలో ప్రాథమిక 341, ప్రాథమికోన్నత 64, ఉన్నత 130 పాఠశాలలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఎనిమిది నెలల పాటు ప్రధానోపాధ్యాయులు (సీహెచ్ఎం), మండల విద్యాధికారుల (ఎంఈఓ) పర్యవేక్షణలో నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ఉపాధ్యాయులు వందశాతం హాజరు కావాలి. ప్రతీ కాంప్లెక్స్ సమావేశం ముగిసిన వెంటనే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్లో కాంప్లెక్స్ హెచ్ఎం ఆధ్వర్యంలో మీటింగ్ మినట్స్ను అప్లోడ్ చేయాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనే ఆదేశాలు జారీ చేశారు. కాంప్లెక్స్ సమావేశాలకు హాజరైన టీచర్లకు మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ సర్టిఫికెట్ జనరేట్ చేయబడుతుంది. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎం, రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులకు వీటిని చేరవేయాల్సి ఉంటుంది. 40 మందికి మించకూడదు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించే సమయంలో ప్రతి గదిలో 40 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండకుండా చూసుకోవాలి. పాఠశాల పరిధిలో ఐఎఫ్పీ ప్యానెళ్లు, సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాలు, టీఎల్ఎం ఉపాధ్యాయ హ్యాండ్ బుక్కులు, వర్క్ బుక్స్, తాగునీరు, మరుగుదొడ్లు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలి. సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా, కాంప్లెక్స్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ల సేవలను ఉపయోగించు కోవాలని జీఓలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలకు హాజరయ్యే క్రమంలో పిల్లల పురోగతి, ఉత్తమ పద్ధతులు, వాటికి సంబంధించిన పూర్తి డేటాతో హాజరు కావాలి. ఏర్పాట్లు పూర్తి చేశాం.. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రేపటి నుంచి జిల్లాలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహించనున్నాం. 1 నుంచి 5, 6 నుంచి 10 తరగతులకు సంబంధించి ప్రైమరీ, సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాలకు వందశాతం హాజరయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి మాసం 25వ తేదీ వరకు సమావేశాలు జరుగుతాయి. – భోజన్న, జిల్లా విద్యాశాఖ అధికారిజిల్లాలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల తేదీలు 1 నుంచి 5వ 6 నుంచి 9వ నెల తరగతి వరకు తరగతి వరకు (ప్రైమరీ కాంప్లెక్స్/తేదీ) (సబ్జెక్టు కాంప్లెక్స్/తేదీ) మొదటి/రెండవ మొదటి/రెండవ జూలై 25 26 30 31 ఆగస్టు 22 23 29 30 సెప్టెంబర్ 16 17 18 19 నవంబర్ 21 22 24 25 డిసెంబర్ 18 19 20 23 జనవరి–2026 23 24 30 31 ఫిబ్రవరి 20 21 24 24నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిస్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధికి ఒక వేదికగా పని చేస్తాయి. బోధనలో నాణ్యత పెరగడంతో పాటు విద్యార్థుల అభ్యాసన ఫలితాలను బలోపేతం చేసేందుకు అవకాశం కలుగుతుంది. ఉపాధ్యాయుల అనుభవాలను పంచుకోవడం, ఉత్తమ పద్ధతుల మార్పిడి, భాగస్వామ్య అభ్యాసన సంస్కృతిని పెంపొందిస్తుంది. 1 నుంచి 5 తరగతులను నిర్వహించే అన్ని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్జీటీలు) పాఠశాల సముదాయ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలల బోధనకు అంతరాయం కలగకుండా మొదటి రోజు 50శాతం, రెండవ రోజు మిగతా ఎస్జీటీలు హాజరు కావాలి. 6 నుంచి 9 తరగతులను నిర్వహిస్తున్న అన్ని పాఠశాలల సహాయకులు (స్కూల్ అసిస్టెంట్లు), భాషా పండితులు (ఎల్పీ) సంబంధిత సబ్జెక్టు పాఠశాల సముదాయ ప్రాంగణాల్లో నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి రోజు భాషా, రెండవ రోజు భాషేతర టీచర్లు రావాలి. ప్రతీ నెల రెండు కాంప్లెక్స్ సమావేశాలకు ఎంఈఓలు రెండుసార్లు తనిఖీ చేయాలి. సమావేశాల్లో ఉపాధ్యాయుల సూచనలను డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి, ఎస్సీఈఆర్టీ సమగ్ర శిక్ష శాఖలకు పంపించాలి. ప్రతి నెల 28వ తేదీన నిర్వహించే జిల్లా సమీక్ష సమావేశంలో కాంప్లెక్స్లో తమ దృష్టికి వచ్చిన అందరి అభిప్రాయాలను సీహెచ్ఎం, ఎంఈఓల ద్వారా డీఈఓ సేకరించాలి. రేపటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహణ వందశాతం ఉపాధ్యాయులు హాజరు కావాలి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు -
ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచిన ప్రభుత్వం
జనగామ రూరల్: ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆ ర్టీసీని బలోపేతం చేయడమే కాక ప్రజల్లో నమ్మకా న్ని పెంచిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. బుధవారం జనగామ ఆర్టీసీ బస్టాండ్లో మహాలక్ష్మి పథకం విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిపోలో 2.26 కోట్ల మహిళలు ప్రయాణించి రూ.108.96 కోట్లు ఆర్టీసీ ప్రగతి సాధించినట్లు తెలిపారు. బస్సు ల ద్వారా ఆదాయం సమకూరడంతో మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేసి తద్వారా లబ్ధి పొందడమే కాక ఆ బస్సులకు యజమానులుగా మారారన్నారు. అనంతరం ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ మాట్లాడుతూ. ఆర్టీసీ సంస్థ లాభాల బాటల పయనించడం సంతోషకరంగా ఉందన్నారు. డీఎం స్వాతి ఆర్టీసీ ప్రగతిని వివరిస్తూ గతంలో 36 వేల మంది ప్రయాణించే ఈ ప్రాంతం 56 వేల మంది ప్రయాణికులతో 66శాతం మహిళలతోనే ప్రయాణాలు కొనసాగుతున్నట్లు వివరించారు. ఆర్టీసీ సంస్థ ప్రగతి బాటలో పరుగులు పెడుతున్నదని అందుకు ఆర్టీసీ ఉద్యోగులు అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు. కాగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి కలెక్టర్ సన్మానించి ప్రత్యేక బహుమతులను అందించారు.ఈ కార్యక్రమంలో అడీషనల్ డీఆర్డీవో నూరుద్దీన్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మమత ఆర్టీసీ అధికారులు సిబ్బంది మహిళ ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు రఘునాథపల్లి: జిల్లాలో సరిపడు యూరియా నిల్వ లు ఉన్నాయని, కొరత సృష్టిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నా రు. బుధవారం మండలకేంద్రంలోని వెంకటేశ్వర, లక్ష్మి ఫర్టిలైజర్ షాపులు, ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా వ్యవసాయేతర అవసరాలకు తరలిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ఉన్నత పాఠశాలలో కిచెన్షెడ్ను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, సరుకుల వద్ద పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ నిర్వాహకులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, ఎంఈఓ రఘునందన్రెడ్డి, డీఏఓ అంబికాసోని పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా బస్టాండ్లో మహాలక్ష్మి పథకం సంబురాలు -
నెట్బాల్లో బంగారు పతకాలు
గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025జనగామ: తమిళనాడు రాష్ట్రం సేలంలో ఈ నెల 17 నుంచి 20 వరకు జరిగిన సౌత్ జోన్ నేషనల్ నెట్బాల్ పోటీల్లో పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ వి ద్యార్థులు బంగారు పతకాలు సాధించి అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు వైష్ణవి, అక్షయ, మంగ సునైనా, శ్రుత కీర్తి, అర్చనలను కలెక్టర్ రి జ్వాన్ బాషా బుధవారం అభినందించారు. కలెక్టర్ను కలిసిన వారిలో యువజన, క్రీడల అధికారి వెంకట్రెడ్డి, జిల్లా నెట్బాల్ అధ్యక్షుడు రామస్వామి, వెంకటేశ్వర్లు, కోచ్ రవి కుమార్ ఉన్నారు.న్యూస్రీల్ -
ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం
స్టేషన్ఘన్పూర్/రఘునాథపల్లి: దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం స్టేషన్ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి కుడి ప్రధాన కాల్వ ద్వారా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డితో కలిసి సాగు నీటిని విడుదల చేశారు. రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయ ర్ కుడి కాలువ, చీటకొడూర్ ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి పసుపు, కుంకుమ, పూలు చల్లారు. అనంతరం కడియం మాట్లాడుతూ ఘన్పూర్ రిజర్వాయర్ కుడి మెయిన్ కెనాల్ కింద స్టేషన్ఘన్పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతుల ఇబ్బందులను గుర్తించి రిజర్వాయర్ల ద్వారా ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపా రు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా కొందరు బీఆర్ఎస్ నాయకులు సాగునీటి విషయంలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, నాయకులు బెలిదె వెంకన్న, నరేందర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, నీటిపారుదల ఎస్ఈ సుధీర్, ఈఈ వినయ్బాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మాజీ జెడ్పీటీసీలు లింగాల జగదీష్చందర్రెడ్డి, బొల్లం అజయ్, గుడి వంశీధర్రెడ్డి, కోళ్ల రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల -
ప్రతిఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి●
అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ జనగామ రూరల్: విద్యార్థులకు తప్పనిసరిగా ఆర్బీఎస్కే ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బుధవారం మండలం చౌడారం మోడల్ పాఠశాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. రాష్ట్రీయ బాల స్వస్తియ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలకు తప్పనిసరిగా వైద్య పరీక్షల నిర్వహించి, నివేది కను అందజేయాలన్నారు. మందుల స్టాక్ రిజిస్టర్ను విద్యార్థుల సంఖ్యను కూడా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు వేడి చేసి చ ల్లార్చిన తాగునీటిని ఇవ్వాలని, తాజాగా వండిన ఆహారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ సంపత్ కుమార్, అ ధ్యాపకులు, వైద్యులు పాల్గొన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు జనగామ: ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ విభాగం (డీఎంఈ) పరిధిలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న వైద్యులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా స్పెషాలిటీ విభాగాల్లో పని చేస్తున్న వారికి పదోన్నతి కల్పిస్తూ ప్రొఫెసర్లుగా తక్షణమే విధుల్లో చేరే విధంగా ఆదేశాలు జారీ చేశారు. వైద్య విద్య డైరెక్టర్ ఆదేశాలను అనుసరిస్తూ వైద్య కళాశాల ప్రిన్సిపాల్స్, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పదోన్నతి పొందిన వారిని వెంటనే రిలీవ్ చేయాలని కోరారు. అసోసియేట్ ప్రొఫెసర్లు, పదోన్నతి ఉత్తర్వులు అందిన తేదీ నుంచి 15రోజుల వ్యవధిలోపు ఆ పదవిలో చేరాలని, లేదంటే పదోన్నతి కోల్పోతారని పేర్కొన్నారు. జనగామ వైద్య కాలేజీ పరిధిలో అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న పది మంది పదోన్నతిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళుతున్నారు. బయో కెమిసీ్త్ర విభాగంలో హైదరాబాద్ ఉస్మానియా వైద్య కాలేజీ నుంచి డాక్టర్ బనూజరాణి, డీవీఎల్ విభాగంలో డాక్టర్ ఎన్.సుధీర్ పదోన్నతిపై జనగామ వైద్య కాలేజీకి రానున్నారు. గొర్రెలతో నిరసనస్టేషన్ఘన్పూర్: గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట బుధవారం గొర్రెలతో నిరసన చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు అందించారు. ఈ సందర్భంగా జీఎంపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మేకల మల్లేశం మా ట్లాడారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గొర్రెలు, మేకల పెంపకందార్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అ ధ్యక్షుడు అమరాజు రాజయ్య, గుంటి రాజ య్య, కుమార్, ఐలయ్య, అశోక్, చంద్రయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలి
జనగామ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని, సంక్షేమ ఫలాలు పేదలకు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సీఎస్ రామకృష్ణారావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లలో భోజన, మౌలిక వసతుల ఏర్పాటు, వనమహోత్సవంలో మొక్కలు నాటడడం, మహాలక్ష్మి పథకం తదితర అంశాలపై సమీక్ష చేశారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు కలెక్టర్లు, అధికారులు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను సూర్యాపేట నుంచి తెప్పిస్తున్నామని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యంత ఇస్తున్నందున ఇసుక కొరత రాకుండా ఉండేందుకు నల్లగొండ జిల్లా నుంచి కూడా ఇసుకను కేటాయించాలని కోరారు. వనమహోత్సవాన్ని విస్తృతంగా చేపట్టాలి జిల్లాకు కేటాయించిన 30.50లక్షల మొక్కల లక్ష్యాలను సాధించేందుకు వన మహోత్సవం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటింటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతంగా చేపట్టాలన్నారు. గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ సమయంలో నోటీసు బోర్డులను పరిశీలించి స్టాక్ను పర్యవేక్షించాలన్నారు. ఎరువులు విత్తనాల కొరత రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ మాధురిషా, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీఓ గోపిరామ్, కొమురయ్య, డీఆర్డీఓ వసంత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీసీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, లక్ష్మణ్కుమార్ -
లాఠీ పట్టిన చేతులతో గొర్రు కొట్టి..
● రైతుగా మారిన ఎస్సై లింగారెడ్డిపాలకుర్తి: ఉద్యోగ రీత్యా ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మేకల లింగారెడ్డి పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో పత్తి చేనులో గొర్రు కొట్టారు. మంగళవారం విధి నిర్వహణలో భాగంగా గూడూరు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. అనంతరం పత్తి చేనులో గొర్రు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగం రాక ముందు మా నాన్న మేకల సాంబిరెడ్డితో కలిసి వ్యవసాయం చేసే వాడినన్నారు. ఎస్సై లింగారెడ్డి పత్తి చేనులో గొర్రు కొట్టే విధానాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీకి మహా‘లక్ష్మి కళ’
హన్మకొండ: ఆర్టీసీకి మహాలక్ష్మి కళ సంతరించుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ప్రగతి రథ చక్రాలు పరుగులందుకున్నాయి. గతంలో ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు సైతం ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల వైపు మళ్లారు. పథకానికి ముందు 70 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో పథకం అమలయ్యాక 93 శాతానికి పెరిగింది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 110 నుంచి 120 శాతానికి చేరుకుంది. మహిళలకు ఫ్రీ జర్నీ కావడంతో వారి కుటుంబ సభ్యులు (పురుషులు) కూడా ఆర్టీసీలోనే ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత బస్సు సొమ్మును ఆర్టీసీకి చెల్లిస్తుండడంతో సంస్థ ఆర్థిక లేమి నుంచి క్రమంగా బయటపడుతోంది. వరంగల్ రీజియన్లో ఇలా.. మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం 2023 డిసెంబర్ 15 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటినుంచి నేటి వరకు వరంగల్ రీజియన్లో 15,41,10,000 మంది మహిళలు ప్రయాణించి రూ.688,35,58,000 చార్జీలు ఆదా చేసుకున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం నాటి నుంచి నేటి వరకు ఉచిత, చార్జీలు చెల్లించిన ప్రయాణికులు మొత్తం 23,98,67,000 ప్రయాణించగా.. రూ.1401,63,14,000 ఆదాయం వచ్చింది. ఇందులో చార్జీలు చెల్లించిన ప్రయాణికులు 8,57,58,000 ఉన్నారు. వీరి ద్వారా రూ.713,27,56,000 ఆదాయం వచ్చింది. మొత్తం ప్రయాణికుల్లో ఉచిత ప్రయాణం చేసిన వారు 64శాతం మంది ఉన్నారు. వీరి ద్వారా ఆర్టీసీకి 49శాతం ఆదాయం వచ్చింది. చార్జీలు చెల్లించిన వారు 36శాతం ప్రయాణించగా వీరి ద్వారా 51శాతం ఆదాయం వచ్చింది. నేడు అన్ని బస్డిపోలు, స్టేషన్లలో సంబురాలు ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసిన సందర్భంగా నేడు (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ సంబురాలు జరుపుతోంది. ఈ మేరకు వరంగల్ రీజియన్లోని అన్ని డిపోలు, ప్రధాన బస్ స్టేషన్లలో మేనేజర్లు ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి పథకంపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇప్పటికే వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. అదే విధంగా ఆర్టీసీ బస్సులో క్రమం తప్పకుండా ప్రయాణించే ఐదుగురు మహిళలను ఎంపిక చేసి సన్మానించనున్నారు. వారికి బహుమతులు అందించనున్నారు. ఈ సంబరాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులను ఆహ్వానించారు. వరంగల్ బస్స్టేషన్లో జరిగే సంబరాల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు. వరంగల్ రీజియన్లోని డిపోల వారీగా ప్రయాణికులు, ఆదాయం వివరాలు (లక్షల్లో)... సంస్థకు అనూహ్యంగా పెరిగిన ప్రయాణికులు ఉచిత ప్రయాణంతో 93 శాతానికి పెరిగిన ఓఆర్ ఆర్థికలేమి నుంచి బయటపడుతున్న సంస్థ నేడు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల్లో సంబురాలుడిపో మహాలక్ష్మి నాన్ మహాలక్ష్మి ప్రయాణికులు ఆదాయం ప్రయాణికులు ఆదాయం హనుమకొండ 305.68 9658.61 128.93 8351.40 వరంగల్–1 132.63 5541.54 101.14 15325.45 వరంగల్–2 127.35 7818.34 105.23 12972.48 పరకాల 147.91 5920.53 83.28 4221.54 భూపాలపల్లి 144.71 7447.00 77.25 6428.55 జనగామ 226.64 10897.12 112.77 7492.23 మహబూబాబాద్ 138.31 5956.19 68.15 3389.06 నర్సంపేట 173.34 7335.12 98.55 6357.02 తొర్రూరు 144.52 8261.13 82.27 6789.83 -
డ్రా విధానాన్ని రద్దు చేయాలి
జనగామ రూరల్: ఉపకరణాల ఎంపికలో డ్రా పద్ధతిని రద్దు చేసి అర్హత ఉన్న ప్రతీ దివ్యాంగుడికి అందించాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాముకుంట్ల చందు, బిట్ల గణేశ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా, జిల్లా సంక్షేమాధికారి ఫ్లోరెన్స్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు ఉచితంగా అందించే పరికరాల్లో ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ కాదని జిల్లా అధికారులు డ్రా పద్ధతిలో ఎంపిక చేసిన లిస్టును వెంటనే రద్దు చేయాలన్నారు. జిల్లాలో ఆన్లైన్ బెనిఫిషియర్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్ ద్వారా అర్హత కలిగిన దివ్యాంగులు 88 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వెంటనే డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన లిస్టును రద్దు చేసి ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మళ్లీ అభ్యర్థులను ఎంపిక చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి.వీరస్వామి, ఉద్దవ్, సాయి పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ కార్డులు మంజూరు చేయాలి జనగామ: రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులను అందించాలని జిల్లా వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు తీగల సిద్దిమల్లయ్య అన్నారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల కార్డులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని విన్నవించారు. కార్డుల ద్వారా పథకాలు నిరాటంకంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారానికి పోరాటం జనగామ రూరల్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి యూఎస్పీసీఎస్ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలు చేయనున్నట్లు ఉపాధ్యాయ సంఘ నాయకులు చంద్రశేఖర్రావు, డి.శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశల వారీగా ఉద్యమించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి నేడు, రేపు మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు, ఆగస్టు 1న జిల్లా కేంద్రం కలెక్టరేట్ ఎదుట ధర్నా, 23న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ ఉపాధ్యాయ సంఘం నాయకులు నాగుల రాజు, ఇప్ప రాంరెడ్డి, సత్తయ్య, మడూరి వెంకటేష్, శ్రీనివాస రావు, శాడ రవి, చొక్కయ్య శ్రీనివాసులు, అఫ్సర్, రాజిరెడ్డి పాల్గొన్నారు. నవ సమాజ వైతాళికుడు దాశరథి జనగామ రూరల్: సమాజ మార్పుకోసం తన స్వరాన్ని వినిపించిన గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్యులు అని సాధిక్ ఫౌండేషన్ చైర్మన్ సాధిక్ అలీ అన్నారు. మంగళవారం స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాధిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా కవి దాశరథి కృష్ణమాచార్య జయంతిని నిర్వహించారు. అనంతరం కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ భవాని అధ్యక్షతన నిర్వహిహించిన సమావేశంలో సాధిక్ అలీ మాట్లాడుతూ నిజాం పాలకులపై తన దిక్కార స్వరాన్ని వినిపించి జైలు కెళ్లిన ధీశాలి అని అభివర్ణించారు. దాశరథి సాహిత్యాన్ని విద్యార్థులకు వారి పద్యాలు, పాటల ద్వారా వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ముమ్మర తనిఖీలు జనగామ రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ, కేజీబీవీల్లో మంగళవారం అధికారులు ముమ్మర తనిఖీలు చేశారు. ప్రతీ మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు వారి పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని చౌడారంలోని కేజీబీవీని తహసీల్దార్ హుస్సేన్ సందర్శించారు. వంట గదిలో కూరగాయల పరిశుభ్రతను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. -
సకాలంలో బిల్లులు అందించాలి
స్టేషన్ఘన్పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం లేకుండా లబ్ధిదారులకు వెంటనే బిల్లులు వచ్చేలా అధికారులు ప్రత్యేక చొరవతో పనిచేయాలని ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘన్పూర్ మండలంలో పైలట్ గ్రామంగా ఎంపికై న తానేదార్పల్లిలో మంగళవారం క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలను పరి శీలించారు. గ్రామంలో నిర్మాణం జరుగుతున్న ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి వారితో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా, బిల్లులు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. దీంతో కొందరు బిల్లులు రావడం లేదని తెలుపగా అక్కడే ఉన్న హౌసింగ్ అధికారులను వివరణ అడిగారు. బ్యాంకుల సమస్యతో జాప్యం అవుతుందని, రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమ అవుతాయని తెలిపా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లపై పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని, రెండు, మూడు రోజుల్లో కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్నగుప్తా, ఏఎంసీ చైర్పర్సన్ లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు సీహెచ్.నరేందర్రెడ్డి, దుంపల పద్మారెడ్డి, మంతెన ఇంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంక్షేమంలో దేశానికే ఆదర్శం పేద వర్గాల సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఆర్డీఓ డీఎస్ వెంకన్న, డీఎస్ఓ శ్రీనివాస్, లావణ్యశిరీష్రెడ్డి, ఐలయ్య పాల్గొన్నారు. -
శాకంబరీ దేవిగా రాజరాజేశ్వరి అమ్మవారు
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డకాలనీలోని ఉమామహేశ్వర దేవాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారు శాకంబరీదేవి అలంకారణలో సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా ఉమామహేశ్వర దేవస్థానం మహిళా భక్తులు, అర్చకులు గంగు సాంబమూర్తి, రామశాస్త్రి అమ్మవారిని వివిధ రకాల పూలు, పండ్లు, కూరగాయలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సిద్ధేశ్వరాలయంలో ధర్మశాల ప్రారంభం బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్ గ్రామంలోని సిద్ధేశ్వరాలయ ప్రాంగణంలో సద్గురు సదానంద దత్తాత్రేయ ఆలయంలో అలేఖ్య దత్త ధర్మశాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సోమవారం ప్రారంభించారు. ముందుగా సిద్ధేశ్వరాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రిని శాలువాలతో సన్మానించారు. అలాగే దత్తాత్రేయ ఆలయంలో పూజలను నిర్వహించారు. భక్తుల కొంగు బంగారంగా సిద్ధేశ్వరాలయం నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నూకల బాల్రెడ్డి, మల్లం శ్రీనివాస్, ఆలయ ప్రధాన పూజారి ఓం నమశివాయ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భగవద్గీతపై విస్తృత ప్రచారం దేవరుప్పుల: మండలంలోని సింగరాజుపల్లిలో తైత్ర సిద్ధాంత భగవద్గీత గ్రంథాలపై త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక భువనగిరి, చేర్యాల, జనగామ, తొర్రూరు కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విస్తృత ప్రచారం చేపట్టారు. శ్రీ కృష్ణాష్టమి త్రైత సిద్ధాంత ఆదికర్త ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల దివ్య ఆశీస్సులతో ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి ప్రతినిధులు దేవేంద్ర, లింగస్వామి లక్ష్మీనారాయణ, రామకృష్ణ, భాస్కర్, అశోక్, సాయిరాజ్, లత, రాణి, కవిత, రాజేశ్వరి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. 30న జిల్లా స్థాయి జూడో పోటీలు రామన్నపేట: నగరంలోని కెమిస్ట్ భవన్లో ఈ నెల 30న సబ్ జూనియర్స్, కేడెట్ విభాగాల్లో బాల బాలికలకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కై లాష్ యాదవ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనే బాల బాలికలు విభాగాల వారీగా 2011 – 2013వ సంవత్సరాల్లో జన్మించి ఉండాలని, బాలురు 30 – 66 కిలోలలోపు, బాలికలు 28 – 57 కిలోల బరువు ఉండాలని పేర్కొన్నారు. కేడెట్ విభాగంలో పాల్గొనే బాల బాలికలు విభాగాల వారీగా 2008 – 2010వ సంవత్సరాల్లో జన్మించి ఉండాలని, బాలురు 50 – 90 కిలోల లోపు, బాలికలు 40 – 90 కిలోలలోపు ఉండాలని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు ఒరిజినల్ వెంట తీసుకొని రావాలని కోరారు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 5, 6వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 99899 53253 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు.. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు గద్వాలలో జరగనున్న 10వ జూనియర్ అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ పోటీలకు వరంగ ల్ జిల్లా బాలుర జట్టు ఎంపిక పూర్తైనట్లు వరంగల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వీశ్వర్ రెడ్డి, రమేష్ తెలిపారు. ఈ నెల 6న హనుమకొండ సెయింట్ జోసెఫ్ స్కూల్లో జిల్లా స్థాయి ఎంపికను నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థా యికి ఎంపిక చేసినట్లు వివరించారు. -
చెక్ పోస్టుల ఆదాయ వివరాలు (రూ.లక్షల్లో..)
2023–242024–2523.0535.3533.8719.2719.0218.2418.2110.867.458.3816.6వెలిశాలగూడూరు(పాలకుర్తి)సింగరాజు పల్లిస్టేషన్ ఘన్పూర్జనగామ బచ్చన్నపేటమొండ్రాయి -
రేపే సాగునీరు విడుదల
స్టేషన్ఘన్పూర్: రేపటి (బుధవారం) నుంచి రిజ ర్వాయర్ల ద్వారా సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు వేసిన నార్లు, పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో రైతులను ఆదుకునే దిశగా దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్ల నుంచి ఆన్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్, మల్లన్నగండి, అశ్వరావుపల్లి రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచే ప్రయత్నం చేస్తున్నామని, ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటితో రైతులు నాట్లు వేసుకునే అవకాశం ఉందన్నారు. ఽకాల్వల ద్వారా అందించే సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. బీసీ బిల్లుకు మద్దతు తెలపాలి కేంద్రమంత్రి కిషన్రెడ్డికి బీసీలపై ప్రేమ ఉంటే ప్రభుత్వం పంపిన బీసీ బిల్లుకు మద్దతు తెలపాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని ఒప్పించడం చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై కపట ప్రేమ చూపిస్తుందని కిషన్రెడ్డి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, లింగాజీ, ఎల్లయ్య, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
అసంపూర్తి పనులతో అవస్థలు
జనగామ రూరల్: అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణ పనులతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే ప్రధాన రోడ్డు కావడంతో ప్రమాదాలు సంబంధించే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు జనగామ, హుస్నాబాద్ రహదారి వడ్లకొండ వద్ద ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో గత ప్రభుత్వం నూతన బ్రిడ్జిని మంజూరు చేసింది. దీంతో ఓ కాంట్రాక్టర్ పనులను ప్రారంభించి పిల్లర్స్ వరకు పనులు పూర్తి చేశారు. ప్రయాణికులు, వాహనదారుల సౌలభ్యం కోసం పక్కనే తాత్కాలిక మట్టిరోడ్డును నిర్మించారు. ఆ రోడ్డు గతేడాది కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోగా పైప్లైన్ వేసి కంకర పోసి మళ్లీ రోడ్డు వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక రోడ్డు సైతం కోతకు గురై కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. పైగా మట్టి రోడ్డు కావడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణ విషయమై పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. రాకపోకలకు అంతరాయం.. జనగామ నుంచి నర్మెట, తరిగొప్పుల, హుస్నాబాద్ నుంచి కరీంనగర్కు రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ బస్సుల ద్వారా వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు జనగామ పట్టణానికి ఉన్నత చదువులకు వస్తుంటారు. కరీంనగర్కు భారీ వాహనాలతో గ్రానైట్, వివిధ రకాల సరుకులు రవాణా అవుతుంటాయి. వీటితో పాటు నిత్యం జనగామ, గానుగపహడ్, వడ్లకొండ, మరిగడి, ఎర్రగొల్లపహడ్, అడవికేశాపురంతో పాటు తండా ప్రజలు ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు కోతకు గురైతే పలు గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. పనులు త్వరగా పూర్తి చేయాలి బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి. ఇటీవల వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కొద్దిపాటి వర్షానికే కోతకు గురైంది. రాత్రి పూట ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. యుద్ధ ప్రాతిపాదికన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. – ఇరుగు సిద్దులు, జనగామ కోతకు గురవుతున్న తాత్కాలిక రోడ్డు జనగామ, హుస్నాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు పట్టించుకోని పాలకులు, అధికార యంత్రాంగం -
ముందస్తు ప్రణాళిక ముఖ్యం
జనగామ రూరల్: వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని, భారీ వర్షాలతో ఎలాంటి ప్రమాదం కలుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలు, సీజనల్ వ్యాధులు, తదితర విషయాలపై సోమవారం హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, పింకేష్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొదించుకోవాలన్నారు. జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులకు రెవెన్యూ, పోలీస్ అధికారులను నియమించే విధంగా వివరాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారికి సూచించారు. జిల్లాలో రేషన్ కార్డులు ఇంకా ఎన్ని పంపిణీ చేయాలి, దరఖాస్తు పెండింగ్లో ఎన్ని ఉన్నాయి, తదితర వివరాలను అందించాలని సివిల్ సప్లయీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం చెరువుల నీటి నిల్వల వివరాలను రోజువారీగా సమర్పించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆర్డీఓ, తహసీల్దార్లు, అధికారులకు సూచించారు. వీసీలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు -
ప్రభుత్వ కళాశాలల్లో నిఘా
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇక నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. అందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాలల్లోని తరగతి గదులు, ల్యాబ్లు, స్టాఫ్ గది, ప్రిన్సిపాల్ గది, వరండా, కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించారు. ఒక్కో కళాశాలలో 14 నుంచి 16 వరకు, అవసరమైన చోట 20వరకు సీసీ కెమెరాలు అమర్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ నిరంతరం కొనసాగనుంది. విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ గతంలో కేవలం ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో మాత్రమే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవారు. ఆ తరువాత వాటిని తీసివేసేవారు. ఈ విద్యా సంవత్సరం 2025 – 2026 నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రధానంగా విద్యార్థుల హాజరు, అధ్యాపకుల విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. ప్రతీ తరగతి గదిలో నిఘా ఉంటుంది. అకడమిక్ మానిటరింగ్ కమిటీలు, డీఐఈఓలతో పాటు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ ద్వారా సంబంధిత అధికారులు పర్యవేక్షించనున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా.. గతంలో ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులు తమ ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోయేవారు. దాంతో హాజరు శాతం తక్కువగా ఉండడంతో పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం కూడా తక్కువగా ఉండేది. ఈ క్రమంలో సరైన విద్యాబోధన, పరీక్షల ఫలితాలు మెరుగుపడేలా ఉన్నతాధికారులు ఇంటర్లో పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. ఇకనుంచి అధ్యాపకులు కూడా సక్రమంగా విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్టు అధ్యాపకుడు ఒకరోజు రాకుంటే ఆ పీరియడ్లో వేరే అధ్యాపకుడు విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫిజిక్స్వాలా శిక్షణపై.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఫిజిక్స్వాలా ద్వారా సంబంధిత వెబ్సైట్ ద్వారా జేఈఈ, ఐఐటీ, ఎప్సెట్, నీట్లాంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం ఇంటర్ విద్యార్థులకు శిక్షణ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఫిజిక్స్వాలా శిక్షణకు సంబంధించిన టైంటేబుల్ను డీఐఈఓల ద్వారా ఆయా జిల్లాల కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందించారు. ప్రతిరోజూ ఏదో ఒక సబ్జెక్టుపై శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం వివిధ కళాశాలల్లో ల్యాప్ట్యాప్లు, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ కళాశాలకు ఇన్ప్లాంట్స్ టేబుల్స్ కూడా రానున్నాయి. పెద్ద కంప్యూటర్ మానిటర్లో వెబ్సైట్ ద్వారా వీడియోలను విద్యార్థులు తిలకించనున్నారు. ఫిజిక్స్వాలా శిక్షణను విద్యార్థులు సరిగా వినియోగించుకుంటున్నారా లేదా అనేది హైదరాబాద్ నుంచి సంబంధిత అధికారులు కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణకు ప్రతీజిల్లాకు ఒకరి చొప్పున ఇన్చార్జ్లను నియమించారని సమాచారం. అలాగే డీఐఈఓలు కూడా పర్యవేక్షిస్తారు. అందుకు డీఐఈఓ కార్యాలయాల్లో కూడా సీసీ కెమెరాలకు సంబంధించి డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవేళ సీసీ కెమెరాల్లో టెక్నికల్ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక టెక్నీషియన్ చొప్పున నియమించారు. నిరంతర పర్యవేక్షణతో విద్యాబోధన మెరుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘాతో నిరంతర పర్యవేక్షణతో పారదర్శకత పెరగనుంది. అధ్యాపకుల బోధన, విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ ఉండడంతో విద్యాబోధన మెరుగుపడుతుంది. విద్యార్థుల హాజరు పెరగడంతోపాటు అధ్యాపకులు విద్యాబోధనతో మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రయోగాలు చేయడం, టైంటేబుల్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. జిల్లాల్లో డీఐఈఓలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా నిఘా ఉండి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తారు. – శ్రీధర్సుమన్, వరంగల్ డీఐఈఓఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలల సంఖ్య ఇలా.. నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఒక్కో జూనియర్ కళాశాలకు 14 నుంచి 16 వరకు కేటాయింపు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, ల్యాబ్ సౌకర్యం, ఫిజిక్స్వాలా శిక్షణహనుమకొండ 9 వరంగల్ 11 మహబూబాబాద్ 10 జనగామ 7 ములుగు 8 జయశంకర్ భూపాలపల్లి 5 -
నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తాం..
పాలకుర్తి టౌన్/దేవరుప్పుల/కొడకండ్ల: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండల కేంద్రాల్లో నూతన రేషన్ కార్డులను అందించారు. అనంతరం ఏర్పాటు చేసి న సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కడవెండి వానకొండయ్య గుట్టపై కల్యాణోత్సవం, భక్తుల సౌకర్యార్థం రూ.కోటితో అభివృద్ధి పనులు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ మంజుల, నాయకులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, కారుపోతుల శ్రీనివాస్, తహసీల్దార్లు ఆడెపు అండాలు, చంద్రమోహన్, కొడకండ్ల మార్కెట్ చైర్పర్సన్ నల్ల ఆండాలు, ఎంపీడీఓ తాటి సురేష్, జిల్లా డైరీ చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి, నల్ల శ్రీరామ్, వడ్లకొండ తార, వెంకటేశ్వర్రెడ్డి, సురేష్నాయక్, సాయికృష్ణ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి పాలకుర్తి టౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గూడూరులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవి ష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్ సమాజానికి దారి చూపిన మహానాయకుడన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత కొస్న వెంకటసోమనర్సింహరెడ్డి, అంబేడ్కర్ సంఘం అఽ ద్యక్షుడు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. వానకొండయ్య గుట్ట అభివృద్ధికి నిధులు ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి -
ఏఐతో విద్యాబోధన: నిట్ డైరెక్టర్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ అధ్యాపకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. టెక్నాలజీ ఎనెబుల్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే అంశంపై నిట్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు కొనసాగనున్న వర్క్షాప్ను నిట్ డైరెక్టర్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. తరగతి గదుల్లో పుస్తకాల్లోని పాఠ్యాంశాలనే కాకుండా నిజజీవితంలోని ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో వివరించాలన్నారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ బాంబే ప్రొఫెసర్ కన్నన్ మౌధాల్యా, ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ సమీర్ సహస్ర బుదే, నిట్ టీటీఆర్ చైన్నె ప్రొఫెసర్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
విలీనం ఇంకెప్పుడు?
జనగామ: పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లాల విభజన చేసి పదేళ్లు గడిచి పోతున్నా, వ్యవసాయ మార్కెట్ల విలీన ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. జిల్లాలోని మార్కెట్ చెక్ పోస్టుల ఆదాయం, పొరుగున ఉన్న సిద్దిపేట ఖజానాకు చేరుకుంటుంది. దీంతో జనగామ వ్యవసాయ మార్కెట్ లక్షల్లో ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. చెక్పోస్టుల విలీనంపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు పట్టింపు లేకుండా పోయింది. వాస్తవంగా బచ్చన్నపేట జనగామ జిల్లాలో ఉన్నప్పటికీ, చేర్యాల మార్కెట్కు అనుసంధానంగా పని చేయడం హాస్యాస్పదం. ఈ విషయమై గతంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ దృష్టికి తీసుకు వెళ్లినా.. పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడి అధికారులు కూడా వారిపై ఒత్తిడి తీసుకు రాకపోవడంతో సొంత జిల్లా ఆదాయాన్ని పక్కా జిల్లాకు బంగారుపల్లెంలో పెట్టి మరీ అప్పగించేస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ నిర్వహణ విచిత్రంగా మారింది. ఆదాయ మార్గాలను పెంచుకోవాల్సిన అధికారులు, గత ప్రభుత్వం నుంచి ఉన్నవాటిని వదులుకునే పరిస్థితి నెలకొంది. సొంత జిల్లాలో ఉన్న చెక్పోస్టుల ఆదాయాన్ని పొరుగు జిల్లా పట్టుకుని పోతుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. ఇదేంటని అడిగిన వారికి, ప్రభుత్వమే చూసుకుంటుందని చేతులు దులుపు కుంటున్నారు. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 6 చెక్ పోస్టులు ఉన్నాయి. ఇందులో జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల చెక్ పోస్టులు మాత్రం సిద్దిపేట జిల్లా చేర్యాల మార్కెట్కు అనుసంధానంగా పని చేస్తున్నాయి. అత్యధికంగా కాసులు కురిపించే ఈ మూడు చెక్ పోస్టుల విలీనంపై జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడాదికి రూ.40 లక్షల పైమాటే... జిల్లాలో జనగామ, వెలిశాల (కొడకండ్ల), మొండ్రాయి (కొడకండ్ల), సింగరాజుపల్లి (కొడకండ్ల), స్టేషన్ఘన్పూర్, గూడూరు (పాలకుర్తి) మండలాల పరిధిలో 7 చెక్ పోస్టులు ఉన్నాయి. వీటిపై 2023–24లో రూ.1.34కోట్ల ఆదాయం రాగా, 2024–25లో రూ.73.88 లక్షలకు తగ్గిపోయింది. జనగామ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న మూడు చెక్పోస్టుల ద్వారా రూ.40 లక్షలకు పైగానే రాబడి ఉంది. జిల్లాల పునర్విజన జరిగిన సమయంలో, వీటి విలీనంపై ఎవరూ కూడా పట్టించుకోక పోవడంతో సిద్దిపేట మార్కెట్ ఖజానాకు అదనపు ఆదాయం కలిసొచ్చింది. రూ.లక్షల రాబడి ఎందుకంటే.. మహారాష్ట్ర–కాకినాడ ప్రధాన హైవేలో 24 గంటల పాటు పనిచేసే చెక్పోస్టుల్లో బచ్చన్నపేట ఒక్కటి. ప్రధాన హైవేలు బైపాస్లుగా మారడం, నిఘా లేకపోవడంతో సరుకు లోడుతో వచ్చే వందలాది వాహనాలు, చేర్యాల లేదా బచ్చన్నపేట చెక్పోస్టుల పరిధిలో పన్నులు చెల్లించి రశీదు తీసుకుంటారు. లోకల్గా సరుకుల కొనుగోలుపై వచ్చే ఆదాయం కన్నా, రోడ్డు రవాణా పరంగా వచ్చే కలక్షన్లే ఎక్కువ. బచ్చన్నపేట చెక్పోస్టు 2005 నుంచి 2022 వరకు ఏటా రూ.25 నుంచి రూ.55 లక్షలకు పైగానే రికార్డు వసూళ్లు చేసింది. 2023–24లో రూ.19.27 లక్షలు, 2024–25లో రూ.18.24 లక్షల మేర ఆదాయం సమకూరింది. ఇంత పెద్ద మొత్తంలో రాబడి ఉన్నప్పటికీ బచ్చన్నపేటతో పాటు పక్కనే ఉన్న నర్మెట, తరిగొప్పుల చెక్పోస్టులను జనగామ జిల్లాలో కలుపుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. కాగా చెక్పోస్టుల విలీనంపై రైతు సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. బచ్చన్నపేట మార్కెట్ను జనగామలో విలీనం చేసేందుకు అధికార పార్టీ నాయకులు దృష్టి సారించాలని కోరుతున్నారు. విలీనం జరిగితే చెక్పోస్టుపై మరింత నిఘా పెరగడంతో పాటు ఆదాయం కూడా అంతే మొత్తంలో పెరుగుతుందని భావిస్తున్నారు. బచ్చన్నపేట మార్కెట్ చెక్పోస్టు ఆదాయం సిద్దిపేట జిల్లాకు.. విభజన జరిగి పదేళ్లయినా.. పట్టించుకోని అధికారులు రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతున్న జనగామ వ్యవసాయ మార్కెట్ విలీనం చేస్తే నూతన పాలక మండలికి అవకాశంనూతన మార్కెట్ పాలకమండలికి అవకాశం బచ్చన్నపేట మార్కెట్ను జనగామ జిల్లాలో విలీనం చేసి, నూతన మార్కెట్ పాలక మండలిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూసే వారికి సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. నూతన పాలక మండలి ఏర్పాటు వైపు దృష్టి సారిస్తే, రాబడికి రాబడి, పదవులకు పదవులు రెండు కలిసి వచ్చే అవకాశం కలుగుతుంది. -
క్రికెట్ స్టేడియం.. స్పోర్ట్ ్స స్కూల్
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్లో ప్రతిష్టాత్మకంగా క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. ఈమేరకు గ్రేటర్ వరంగల్ పరిధి ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్లో ముఖ్యమంత్రిని కలిసి నగరాభివృద్ధికి పలు ప్రతిపాదనలు చేశారు. మామునూరు ఎయిర్పోర్ట్, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ తదితర పథకాల కోసం ఇప్పటికే సుమారు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించారు. తాజాగా ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్వినిరెడ్డి కలిసి క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ కావాలని కోరారు. ఈమేరకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల సమీపంలోని 50 ఎకరాలు అనువుగా ఉంటుందని వినతిపత్రం ద్వారా సీఎం రేవంత్కు ఎమ్మెల్యేలు వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఎం తన నివాసంలో కలిసిన ఎమ్మెల్యేల బృందంతో అరగంటకు పైగా.. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న అభివృద్ధిపై సీఎం చర్చించినట్లు తెలిసింది. ఈసందర్భంగా వివిధ క్రీడాంశాల్లో ఉమ్మడి వరంగల్ నుంచి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన క్రీడా దిగ్గజాలు ఉన్నారని, అందులో ద్రోణాచార్య, అర్జున అవార్డులు అందుకున్న వారు ఉన్నారని సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యేలు వివరించారు. ప్రస్తుతం హనుమకొండలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఒక్కటే ఉందని, ఇక్కడ అనేక మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. వరంగల్ జిల్లాకు తెలంగాణ క్రీడా పాఠశాలతో పాటు ప్రత్యేకంగా క్రికెట్ స్టేడియాన్ని మంజూరు చేస్తే మరింత క్రీడా పురోగతిని సాధించవచ్చని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థలం ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామంలో ‘కుడా’కు చెందిన సర్వే నంబర్ 325లో 20 ఎకరాలు, పక్కనే మరో 30 ఎకరాల స్థలం జాతీయ రహదారి 163కి ఆనుకుని నగరానికి దగ్గరగా అందుబాటులో ఉందని వివరించారు. వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం నగరానికి మణిహారంగా నిలుస్తాయని సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యేలు తెలిపారు. దీంతో స్పోర్ట్స్ స్కూల్, ప్రత్యేక క్రికెట్ స్టేడియం మంజూరు చేయాలన్న వినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలో యువత ఎక్కువగా ఉన్నారని, మినీ స్టేడియం ఎంతో అవసరమని సీఎం దృష్టికి తీసుకు వెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. ఈమేరకు స్పోర్ట్స్ స్కూల్, స్టేడియం నిర్మాణాలకు కావాల్సిన ప్రతిపాదనలు పరిశీలించి, అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సంబంధిత శాఖ సెక్రటరీకి సీఎం ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా.. త్వరలోనే ఆరెండింటినీ మంజూరు చేస్తానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంపై ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.‘గ్రేటర్ వరంగల్’లో ఏర్పాటుకు సీఎం గ్రీన్సిగ్నల్ ఎమ్మెల్యేల బృందానికి రేవంత్రెడ్డి హామీ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల సమీపంలో 50 ఎకరాల్లో ప్రతిపాదన మంజూరు పత్రాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం -
ఏడాదిలోపే బదిలీలు!
కాజీపేట అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల తర్వాత బదిలీ అవుతారు. కానీ, ఇందుకు భిన్నంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోని అధికారులను ఏడాదిలోపే బదిలీలు చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసింది. ఇందులో భాగంగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు స్లాట్ బుకింగ్, పారదర్శక సేవలకు ఈ–సైన్తో రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై పర్యవేక్షణ కొనసాగించే జిల్లా రిజిస్ట్రార్లకు ఏడాదిలోపే స్థానచలనం కల్పించింది. పదోన్నతులకు బ్రేక్.. జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతులు కల్పించడంలో జాప్యం అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా జిల్లా రిజిస్ట్రార్ స్థానంలో అధికారులు లేకపోవడంతో ఇన్చార్జ్లతోనే పాలన కొనసాగుతోంది. కాగా, ఒక్కో జిల్లా రిజిస్ట్రార్ రెండు మూడు కార్యాలయాలకు పనిచేయాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో బదిలీ అయిన ఫణీందర్ హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్గా ఆఫీస్ డ్యూటీలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్గా, కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ వరంగల్ జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. సీనియార్టీ ప్రకారం తమకు పదోన్నతి కల్పించాలని గతంలో విధులు నిర్వర్తించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లు, వివిధ జిల్లాలకు చెందిన గ్రూప్–1 అధికారులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో పదోన్నతులకు బ్రేక్ పడింది. త్వరలో సబ్ రిజిస్ట్రార్ల బదిలీ! ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గతేడాది ఆగస్టులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అటెండర్ స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు బదిలీలు అయ్యారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాధ్యతలను స్వీకరించి లాంగ్ లీవ్లోకి వెళ్లిపోయిన సబ్ రిజిస్ట్రార్లు, సహాయ రిజిస్ట్రార్ చిట్స్లు అనగా స్టేషన్ఘన్పూర్, వరంగల్ ఆర్వో చిట్స్ కార్యాలయంలోని అధికారులతోపాటు వరంగల్ ఆర్వోకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు సైతం స్థానచలనంలో భాగంగా నేడో రేపో బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, మేరా నంబర్ ఆయేగా అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చర్చించుకోవడం గమనార్హం. డేంజర్ జోన్లకు వెళ్లేందుకు జంకుతున్న సబ్ రిజిస్ట్రార్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ సబ్ రిజిస్ట్రార్తోపాటు ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు డేంజర్ జోన్లుగా మారిపోయాయి. ట్రాన్స్ఫర్ ఓకే కాని డేంజర్ జోన్లకు వద్దు అంటూ తలలు పట్టుకుంటున్నారు సబ్ రిజిస్ట్రార్లు. పదోన్నతులు లేక ఇన్చార్జ్లతోనే పాలన నేడో రేపో సబ్ రిజిస్ట్రార్లకు స్థానచలనం -
స్వచ్ఛ సర్వేక్షణ్లో నిరాశ!
జనగామ: స్వచ్ఛత కోసం కేంద్ర ప్రభుత్వం పట్టణ, నగరాల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా స్వచ్ఛ సర్వేక్షణ్కు శ్రీకారం చుట్టింది. తడి, పొడి చెత్త సేకరణ, ఎరువు తయారీ, వ్యక్తిగత మరుగుదొడ్లు, రహదారులపై ఎప్పటికప్పుడు చెత్త సేకరణ తదితర విభాగాల్లో ఏటా పురపాలిక, కార్పొరేషన్ పరిధిలో కాంపిటీషన్ నిర్వహిస్తోంది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024–25 వార్షిక సంవత్సరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు ఫలితాలను ఈ నెల 17న విడుదల చేశారు. స్వచ్ఛత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్లో జనగామ మున్సిపాలిటీకి నిరాశే ఎదురైంది. గత ర్యాంకు కంటే మెరుగు పరుచుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. దీంతో అధ్వానమైన శానిటేషన్ నిర్వహణతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పూర్ ఫర్ఫార్మెన్స్ ర్యాంకును మూటగట్టుకుంది. పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వాటి మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు దీనిని ప్రారంభించారు. జనగామ మున్సిపాలిటీ గతంలో ఒకటవ స్టార్ గెలుచుకోగా.. 2024–25 సంవత్సరంలో త్రీ స్టార్ ర్యాంకు కోసం అప్లైయ్ చేసుకున్నారు. స్వచ్ఛతపై ప్రజలను భాగస్వామ్యం చేయడంలో అధికారులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. తడి, పొడిచెత్తను ఎలా వేరు చేయాలి, రహదారుల క్లీన్ అండ్ గ్రీన్, వ్యక్తి గత మరుగుదొడ్ల వినియోగం తదితర అంశాలపై ప్రజలకు ఎక్కడా కూడా అవగాహన కల్పించలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకు సాధించాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు పోటీ పడితే... ఇక్కడ మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యారని చెప్పుకోవచ్చు. కమిషనర్ పర్యవేక్షణ శూన్యం.. 2024–25 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో జనగామ మున్సిపల్ 50వేల నుంచి 3 లక్షల జనాభా విభాగంలో రాష్ట్రంలో 78, జాతీయ స్థాయిలో 466 ర్యాంకు సాధించింది. 2023–24లో సౌత్జోన్లో నంబర్ వన్గా నిలిచిన జనగామ.. నేడు దిగువ స్థాయికి పడిపోయింది. కమిషనర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణ, అజమాయిషీ లేకపోవడంతో శానిటేషన్ నిర్వహణ గాడి తప్పింది. ఇంటింటికీ చెత్త సేకరణలో 68 శాతం, తడి, పొడిచెత్త వేరు చేయడంలో 38 శాతం, ఎరువుగా తయారు చేయడం 98శాతం, ప్రధాన కూడళ్లలో చెత్త నిల్వలు లేకుండా నియంత్రణ(నో స్టార్), ఓడీఎఫ్ (డబుల్ ప్లస్) ఆయా కేటగిరీల్లో కేంద్రం విడుదల చేసిన ఫలితాల్లో జనగామ ర్యాంకు ఈ విధంగా ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో అట్టడుగు స్థాయికి దిగజారి పోవడంతో.. మున్సిపల్ అధికారులు వీటిని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు.. చెత్త సేకరణ పట్టణంలో డ్రెయినేజీ, శానిటేషన్ నిర్వహణ ఇంకా మెరుగు పడడం లేదు. బాలాజీనగర్, కుర్మవాడ, జ్యోతినగర్, కుర్మవాడ, శ్రీవిలాస్ కాలనీ (పలు ప్రాంతాలు) హౌసింగ్ బోర్డు తదితర కాలనీల పరిధిలో డ్రెయినేజీల పరిస్థితి అధ్వానంగా మారింది. మురికి నీరు నిండి రోడ్లపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. గతంలో సాక్షి వరుస కథనాలతో అధికారులు స్పందించినా.. అప్పటికప్పుడు హడావుడి చేసి మళ్లీ గాలికి వదిలేస్తున్నారు. రోడ్లపై రోజు వారీగా చెత్త సేకరణ తూతూ మంత్రంగా మారిపోయింది. విద్యలో జనగామ జిల్లా జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేందుకు శ్రద్ధ చూపిస్తున్న ఉన్నతాధిరులు.. స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం ఎందుకు పోటీ పడడం లేదని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పట్టణ వీధులు, ప్రధాన రహదారులు మురికి కూపంగా మారిపోతున్నాయి. వరద నీరు, డ్రెయినేజీల నిర్వహణ, చెత్త సేకరణ తదితర వాటిని పర్యవేక్షించేందుకు కమిషనర్ ఒక్క వార్డులో కూడా పర్యటించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. జనగామ పురపాలికకు రాష్ట్రంలో 78, జాతీయ స్థాయిలో 466 ర్యాంకు తడి, పొడిచెత్త వేరులో అట్టర్ ప్లాప్ అధ్వానంగా శానిటేషన్ నిర్వహణ -
శాకంబరీ దేవిగా ఉప్పలమ్మ తల్లి
జనగామ రూరల్: పట్టణంలోని అమ్మ బావి వద్ద గల ఉప్పలమ్మ సహిత ఆంజనేయస్వామి దేవాలయంలో ఆదివారం ఉప్పలమ్మ తల్లి శాకంబరీ దేవిగా దర్శనమిచ్చారు. ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూ జలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అ మ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు సంవృద్ధిగా పండాలని కోరుకున్నారు. నేటి ప్రజావాణి రద్దుజనగామ రూరల్: నేడు (సోమవారం) కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బోనాలు పండుగ సందర్భంగా ప్రజావాణి నిర్వహించబడదని, ప్రజలు విషయాన్ని గమనించి కలెక్టర్ కార్యాలయానికి రాకూడదని కోరారు. భక్తజనంతో పులకించిన హేమాచల క్షేత్రం మంగపేట : మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రం ఆదివారం భక్తజనంతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సుదూర ప్రాంతాల నుంచి స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో హేమాచలక్షేత్రం పులకించింది. ఆది, సోమవారాలు రెండు రోజులు సెలవు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి ఏజెన్సీలోని లక్నవరం, బొగత తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. రామప్ప, మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు తదితర వాహనాల్లో భారీగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంలో సహజ సిద్ధంగా వెలిసిన చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అర్చకులు పవన్కుమార్ ఆచార్యులు, నాగఫణిశర్మ స్వామివారికి తిల తైలాభిషేకం పూజలు జరిపించి నూతన పట్టువస్త్రాలతో అలంకరించి కై ంకర్యాదులు నిర్వహించారు. మూడు గంటల పాటు వేచి ఉండి మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభూ స్వామవారి అభిషేక పూజలో పాల్గొని ఆలయ చరిత్ర, స్వామివారి ప్రత్యేకతను తెలుసుకుని పులకించారు. అనంతరం సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని స్వీకరించేందుకు వచ్చిన దంపతులతో పాటు స్వామివారి అభిషేక పూజలో పాల్గొన్నారు. భక్తుల గోత్రనామాలతో పూజారులు ప్రత్యేక అర్చనలు జరిపించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అదేవిధంగా అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వాచ్టవర్ పైనుంచి దట్టమైన అటవీ ప్రాంతంలోని కనుచూపు మేర కనిపించే అందమైన ప్రకృతి అందాలను వీక్షించి సెల్ఫీలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఈఓ సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, రికార్డు అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, సిబ్బంది తదితరులు చర్యలు తీసుకున్నారు. బొగత వద్ద పర్యాటకుల సందడి వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ప్రభుత్వ సెలవు కావడంతో పర్యాటకులు భారీసంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలు చూసి ఫిదా అయ్యారు. జలపాతం జలదారలను వీక్షించడంతో పాటు సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. కొలనులో స్నానాలు చేయడంతో పాటు ఫొటోలు, సెల్ఫీలు దిగారు. -
వడ్డీ బకాయిలువిడుదల
గీసుకొండ: బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకున్న సెర్ప్ పొదుపు సంఘాల మహిళలకు రెండు నెలల వడ్డీ బకాయిలు మంజూరయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళల అభ్యున్నతికి పలు కార్యక్రమాలను చేపడుతుండగా తాజాగా వడ్డీ బకాయిల చెల్లింపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు వడ్డీ బకాయిలను ప్రభుత్వం ఆయా సంఘాల ఖాతాల్లో జమచేసింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో సకాలంలో వడ్డీ బకాయిలు విడుదల కాకపోవడంతో పొదుపు సంఘాల మహిళలు ఇబ్బందులు పడ్డారు. 2019 నుంచి 2022 వరకు మూడేళ్ల వడ్డీ నిధులు మంజూరు చేయలేదు. విడతల వారీగా చెల్లింపులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2023–24 సంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల బకాయిలను కొన్ని నెలల క్రితం విడుదల చేసింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు పది నెలల వడ్డీ బకాయిలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల్లోని 48,717 సంఘాలకు రూ.92.74 కోట్ల బకాయిలను విడుదల చేసింది. అలాగే, ఇటీవల ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు సంబంధించి ఎస్హెచ్జీలు 50,372 ఉండగా వారికి వడ్డీ కింద రూ.20.27 కోట్లను మంజూరు చేయడంతో పొదుపు సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధికి ఊతం.. మహిళా సంఘాల్లోని సభ్యులు బ్యాంకు లింకేజీ కింద తీసుకున్న వడ్డీలేని రుణాల(వీఎల్ఆర్)తో ఆ ర్థికంగా ఎదగటంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామిక వే త్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పలువురు చిన్న తరహా పరిశ్రమలు, యూనిట్లను నెలకొల్పుతున్నారు. క్యాంటీన్ల ఏ ర్పాటు, పెరటికోళ్ల పెంపకం, గేదె ల పోషణ, కిరాణం, క్లాత్స్టోర్లు, టై లరింగ్, సానిటరీ న్యాప్కిన్ల త యారీ తదితరాలను ఎంచుకుని ఆ దాయం పొందుతూ చిన్న పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. అలాంటి వారికి వడ్డీ బ కాయిలను సకాలంలో అందిస్తే మరింత ఉత్సాహంతో ముందుకు సాగే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం గీసుకొండ ప్రగతి మండల సమాఖ్య వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి పొదుపు సంఘాల మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ప్రత్యేక మార్గాలను ఎంచుకోవాలన్నారు. సంఘాల వారు ఆర్టిఫీషియల్ జ్యూయలరీ, పౌల్ట్రీ, డైరీ తదితర రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. పాత బకాయిల చెల్లింపు ఊసేలేదు.. ఇది ఇలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు అలాగే పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాం నుంచి వడ్డీ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తూ వస్తోంది. అయితే గత బీఆర్ఎస్ సర్కారు కాలంలో పేరుకుపోయిన భారీ మొత్తంలోని బకాయిల గురించి ఎవరూ ఊసెత్తడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు విడుదలైన వడ్డీ బకాయిలు ఎస్హెచ్జీలకు రెండు నెలల వడ్డీని మంజూరు చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 50,372 సంఘాలు రూ.20.27 కోట్లు పొదుపు సంఘాల ఖాతాల్లో జమజిల్లా లబ్ధిపొందిన వచ్చిన మొత్తం సంఘాలు (రూ.కోట్లలో) వరంగల్ 9,669 4.32 హనుమకొండ 8,600 3.86 జనగామ 9,216 3.41 మహబూబాబాద్ 11,552 4.51 ములుగు 5,308 1.92 జయశంకర్ భూపాలపల్లి 6,027 2.25 -
స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం
జనగామ: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళా శాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1974–75 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆనాడు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒక్కచోట కలుసుకుని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదివిన బడి, పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాటి గురువులు నేర్పి న క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన కొలిపాక బాలయ్య, నర్సింహారెడ్డి, రామస్వామి, భాగ్యలక్ష్మి గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బచ్చు రమేశ్, నర్సింహాప్రసాద్, బండిరాజుల శంకర్, అల్లాడి మహేశ్వర్, సోమ హనుమంత్రావు, స్వామి, కుమారస్వామి, రాజిరెడ్డి, నీలం మధు, నాయిని రమేశ్, ఖలీముల్లా తదితరులు పాల్గొన్నారు. -
వానొస్తే రోడ్లన్నీ చిత్తడే..
జనగామ: ఇటీవల కురుస్తున్న మోస్తరు వర్షాలతో జనగామ పట్టణ వీధులు, ప్రధాన రహదారులు గలీజుగా మారిపోతున్నాయి. డ్రెయినేజీలు నిండి.. మురికి నీరు ౖపైపెకి ఉబికి వస్తుండడంతో వ్యాపార, వాణిజ్య సముదాలతో పాటు ఇళ్ల గడప ముందుకు చేరుకునే పరిస్థితి నెలకొంది. పది నిమిషాలు చిరుజల్లులు కురిస్తేనే ఇంతటి పరిస్థితి నెలకొంటే.. భారీ వర్షం నమోదైతే పట్టణ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతుంది. రాబోయే రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపధ్యంలో పురపాలిక అధికారులు కనీసం అప్రమత్తత లేకుండా పోయారు. భయం గుప్పిట్లో మున్సిపల్ ఉద్యోగులు.. పురపాలికలో అనేక అక్రమాలపై విచారణ కొనసాగుతుండగా, ఇందులో ఓ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటుపడగా.. వరుస క్రమంలో ఉంటానేమోననే భయం చాలా మందికి పట్టుకున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతుంది. రోడ్లపైకి వచ్చే మురికి నీటిని ఎవరికి వారే శుభ్రం చేసుకునే పరిస్థితి పట్టణంలో నెలకొంది. హైదరాబాద్ రోడ్డులో వరద నీరు నిలిచి ద్విచక్ర వా హనం వెళ్లలేని పరిస్థితుల్లో కనీసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదు. డ్రెయినేజీ, చెత్త నిర్వహణ గాడి తప్పడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు వివిధ అనారోగ్యాల బారిన పడుతూ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి నెలకొంది. మున్సిపల్పై అజమాయిషీ చేయాల్సిన సీడీఎంఏ అధికారులు సైతం మెమోలతోనే సరిపెడుతున్నారని ప్రజలు బాహాటంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాలనీలను ముంచెత్తిన వరద గడప ముందుకు మురికి నీరు ఎవరికి వారే శుభ్రం చేసుకుంటున్న వైనం