Bhadradri
-
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. స్ఫూర్తి ప్రదాత శ్రీపాదరావుకలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూపర్బజార్(కొత్తగూడెం): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు వన్నె తెచ్చిన మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో ఆదివారం శ్రీపాదరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత కలెక్టర్ అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీపాదరావు సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి శాసనసభ స్పీకర్గా ఎదిగారని పేర్కొన్నారు. న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా ప్రజలకు విశిష్ట సేవలు అందించిన ఆయన్ను 1999లో నక్సల్స్ కాల్చి చంపారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, బీసీ సంక్షేమాధికారి ఇందిర, జిల్లా క్రీడా శాఖాధికారి పరంధామరెడ్డి, డీఎం సివిల్ త్రినాథ్బాబు, మైనింగ్ శాఖాధికారి దినేష్ పాల్గొన్నారు. క్రీడలపై దృష్టి సారించాలిపోస్టల్ శాఖ ఎస్పీ వీరభద్ర స్వామిపాల్వంచ: క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ క్రీడలపై దృష్టి సారించాలని పోస్టల్ శాఖ ఖమ్మం డివిజన్ ఎస్పీ వి.వీరభద్రస్వామి సూచించారు. ఇటీవల పాల్వంచ విద్యుత్ కళాభారతిలో జిల్లాస్థాయి వన్డే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దమ్మపేట, కారేపల్లి, కొమ్మినేపల్లి, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులు పాల్గొన్నారు. పోటీల్లో ఇల్లెందు టీం విన్నర్గా, కారేపల్లి టీం రన్నర్గా నిలిచాయి. విజేతలకు ఆదివారం కేఎస్పీ రోడ్లోని వాసవీ హాల్లో బహుమతులు అందించారు. విన్నర్ జట్టుకు రూ.10,116, రన్నర్ టీంకు రూ.5,116 నగదు, ట్రోపీ వీరభద్రస్వామి అందించి మాట్లాడారు. కార్యక్రమంలో పాండురంగాపురం బ్రాంచ్ పోస్ట్మాస్టర్ బండి పుల్లారావు, ఏఐజీడీఎస్యూ తెలంగాణ సర్కిల్ సెక్రటరీ బండి జయరాజు, ఉపాధ్యక్షుడు వై.పట్టాభిరామయ్య, డివిజన్ సెక్రటరీ ఎండి.ఖాజామొహినుద్దీన్, ఖమ్మం డివిజన్ అధ్యక్షుడు ఎస్కె.మౌలాలి, జి.సాయితేజ పాల్గొన్నారు. కిన్నెరసానిలో పర్యాటకుల కోలాహలంఒకరోజు ఆదాయం రూ.21,055 పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 302 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.10,325 ఆదాయం లభించగా, 250 మంది బోటుషికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్కు రూ.10,730 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
వాతావరణమే కీలకం
● ఎయిర్పోర్టుపై రెండోసారి పూర్తయిన ఫీజిబులిటీ సర్వే ● వాతావరణ శాఖ నుంచి నివేదిక కోరిన విమానయాన శాఖ ● సానుకూల ఫలితాలు వస్తేనే విమానం ఎగిరే అవకాశం సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎయిర్పోర్టు మంజూరుకు వాతావరణ శాఖ నివేదిక కీలకం కానుంది. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో సుమారు 900 ఎకరాల స్థలాన్ని ఇటీవల గుర్తించారు. ఈ ప్రాంతం ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుకూలంగా ఉందా ? లేదా ? అని పరిశీలించేందుకు గత జనవరి 23న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో ఫీజిబులిటీ సర్వే నిర్వహించింది. అనంతరం మరిన్ని వివరాలు కావాలంటూ కేంద్ర వాతావరణ శాఖను కోరింది. అక్కడి నుంచి వివరాలు వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి పరిస్థితులు ఎయిర్పోర్టుకు ఎంపిక చేసిన ప్రదేశంలో గాలుల తీరుతెన్నులు, వర్షాలు తదితర అంశాలను బేరీజు వేస్తారు. అప్పుడు సానుకూల ఫలితాలు వస్తే తదుపరి కార్యచరణ మొదలయ్యే అవకాశముంది. వరంగల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి సాంకేతిక ఇబ్బందులు తొలగిపోవడంతో ఆ వివరాలను కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హైదరాబాద్లో మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్పోర్టు వివరాలు కూడా తెలిపారు. భద్రాద్రి ప్రజలకు విమానయాన సౌకర్యం కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే ఎయిర్పోర్టు నిర్మించేందుకు అనుకూలమైన ప్రాంతం కోసం అన్వేషణ సాగుతోందన్నారు. గతంలో ఎంపిక చేసిన స్థలానికి సమీపంలో కొండలు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా నిలిచాయన్నారు. దీంతో మరో ప్రాంతంలో ఇటీవల ఫిజిబులిటీ సర్వే నిర్వహించామని, ఆ ప్రాంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇవ్వాలంటూ వాతావరణ శాఖను కోరామని ఆయన చెప్పారు. -
కరుణించని దేవాదాయశాఖ
అమ్మవారి కటాక్షం ఉన్నా.. పాల్వంచరూరల్: కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మతల్లి ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. పాల్వంచ మండలం కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైఉన్న శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) గుడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. రోజూ వేలాది మంది అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. గురు, ఆదివారాల్లో రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. పరిసర గ్రామాల, పట్టణాల ప్రజలు ఏ పనులు ప్రారంభించాలన్నా తొలుత అమ్మవారిని దర్శించుకుంటారు. జిల్లాలో భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయం తర్వాత దేవాదాయ శాఖకు ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచే వస్తోంది. టికెట్లు, కొబ్బరిచిప్పలు, అద్దెలు, తలనీలాలు, హుండీ ద్వారా ఏటా రూ.3.5 కోట్ల ఆదాయం వస్తున్నట్లు ఎండోమెంట్ అఽధికార లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల ఆలయ ప్రాంగణంలో నూతనంగా శివాలయం కూడా నిర్మించారు. దీంతో భక్తుల సంఖ్య మరింతగా పెరిగింది. అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయ ప్రాంగణంలో మౌలిక సౌకర్యాలు లేవు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కట్లు తప్పడంలేదు. తాగునీరు కూడా లేదు.. ఆదాయం మెండుగా, భక్తుల రద్దీ అధికంగా ఉన్నా దేవాదాయ శాఖ, పాలకవర్గం వసతి సౌకర్యాలు కల్పించడంలేదు. ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు స్నానాలు చేసేందుకు గతంలో నిర్మించిన ఆరు బాత్ రూమ్లను కూల్చివేశారు. గుడికి ఎదురుగా ప్రధాన రహదారి దాటి వెళ్తే మరికొన్ని బాత్రూమ్లు ఉన్నాయి. అవి భక్తుల సంఖ్యకు తగినన్ని లేకపోవడంతోపాటు నిర్వహణ అధ్వానంగా మారింది. దీంతో స్నానాలగదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. అమ్మవారి దర్శనం కోసం ఒకే క్యూలైన్ ఉండగా, ఇబ్బంది తప్పడంలేదు. గతంలో ఆలయం ఎదురుగా ఉన్న చెట్ల కింద నైవేద్యం వండుకుని అమ్మవారికి సమర్పించేవారు. ఆ చెట్లు కూడా తొలగించడంతో నీడ కరువైంది. అక్కడ కొత్త భనవం నిర్మించడంతో వంటలు వండుకునే పరిస్థితి లేకుండాపోయింది. పాలకవర్గం లేక ఏడాది ఏడాది కాలంగా ఆలయానికి పాలకవర్గం లేదు. నూతన పాలకవర్గ నియామకంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. నోటిఫికేషన్ జారీ చేసినా నియామక ప్రక్రియ మాత్రం ముందుకు సాగడంలేదు. దీంతో ఈఓ పర్యవేక్షణలో ఆలయంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. క్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో గత ఈఓ శ్రీనివాసరావు ఆలయాన్ని లోపలకు జరిపి పునర్నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటివరకు మోక్షం లేదు. ఆలయ అభివృద్ధిపై, సౌకర్యాల కల్పనపై దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు. భక్తులు ఏం కోరుతున్నారంటే.. ఆలయంలో తాగునీటి సమస్య పరిష్కరించాలి. ప్రస్తుతం ఒకే క్యూలైన్ ఉన్నందున, అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేయాలి. భక్తుల సంఖ్య తగినట్లు మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలి. పాల్వంచ, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ సర్వీసులు నడిపించాలి. అన్ని డిపోల, అన్ని రకాల సర్వీసులు ఆలయం వద్ద నిలిపేలా చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక సత్రాలు, గదులు నిర్మించాలి. పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. భద్రాచలంలో మాదిరిగా నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలి. స్నానాల గదులు ఏర్పాటు చేయాలి పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకునే మహిళా భక్తులు కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా స్నానాల గదులు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలి . క్యూలైన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుంది. –అరుణ, భక్తురాలు, మహబూబాబాద్నిద్ర చేసేందుకు సత్రం నిర్మించాలి అమ్మవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆలయ సన్నిధిలో బస చేసేందుకు సౌకర్యంలేదు. దీంతో వచ్చిన రోజే తిరిగి వెళ్లిపోతున్నారు. నిద్ర చేసేందుకు సత్రం, గదులు నిర్మిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. తాగునీరు కూడా అందించాలి. –శ్రుతి, భక్తురాలు, హైదరాబాద్ప్రతిపాదనలు పంపాం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎనిమిది బాత్రూమ్లు నిర్మిస్తున్నాం. మరో పది స్నానాల గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. మాస్టర్ ప్లాన్ అమలుకు దేవాదాయ శాఖ కమిషనర్కు గతంలో ప్రతిపాదనలు పంపించాం. అనుమతులురాగానే పనులు ప్రారంభిస్తాం. –ఎన్.రజనీకుమారి, ఈఓ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద కొరవడిన సౌకర్యాలు రోజూ వేలాది మంది వస్తున్నా అరకొరగా బాత్రూంలు.. ప్రతిపాదించి రెండేళ్లయినా అమలుకు నోచుకోని మాస్టర్ప్లాన్ ఆదాయం ఉన్నా భక్తులకు వసతులు కల్పించని ఎండోమెంట్ శాఖ -
వేధిస్తున్న సిబ్బంది కొరత
● అటవీశాఖలో భర్తీకి నోచుకోని ఖాళీ పోస్టులు ● ఉన్న ఉద్యోగులపై అదనపు పనిభారం ● పర్యవేక్షణ కొరవడి అటవీ సంపదకు రక్షణ కరువు చుంచుపల్లి: అటవీ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కిందిస్థాయి ఉద్యోగులు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా ఉన్న సిబ్బందిపై అదనపు పనిభారం పడుతోంది. దీంతో అటవీ సంపదకు రక్షణ కరువవుతోంది. సిబ్బంది తక్కువగా ఉండటంతో పర్యవేక్షణ లేక కొందరు పోడు నరుకుతున్నారని, వేటగాళ్లు వన్యప్రాణులను హతమార్చుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. అటవీ సంపదను రక్షించే క్రమంలో కొందరు సిబ్బంది దాడులకు కూడా గురవుతున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ, భద్రాచలం, కిన్నెరసాని ఆరు అటవీ డివిజన్ల పరిధిలో 10.45 లక్షల ఎకరాల వరకు అడవి విస్తరించి ఉంది. జిల్లావ్యాప్తంగా అటవీ శాఖలో మొత్తం 684 మంది ఉద్యోగులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 529 మాత్రమే పనిచేస్తున్నారు. యూనిఫామ్ విభాగానికి చెందిన ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్(ఎఫ్డీఓ), రేంజ్ అధికారులు, సెక్షన్ అధికారులు, బీట్ అధికారుల (ఎఫ్బీఓ) పోస్టులు 155 ఖాళీగా ఉన్నాయి. ఎఫ్డీఓలు ఆరుగురికి ప్రస్తుతం ఐదుగురే ఉన్నారు. ఇల్లెందు ఎఫ్డీఓ పోస్టు ఖాళీగా ఉంది. రేంజ్ ఆఫీసర్లు 25 మందికి 24 మంది, డీఆర్ఓలు 34 మందికిగానూ 29 మంది పనిచేస్తున్నారు. సెక్షన్ అధికారులు 89 మందికిగానూ 80 మంది ఉన్నారు. 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 535 బీట్ ఆఫీసర్ పోస్టులకు గానూ కేవలం 396 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అటవీ డివిజన్లు: 6మంజూరైన పోస్టులు: 684ప్రస్తుత సిబ్బంది: 529ఖాళీ పోస్టులు: 155ఎఫ్బీఓలపై అదనపు భారం అటవీ విస్తీర్ణానికి అనుగుణంగా బీట్ అధికారులను నియమించడంలేదు. బీట్ పరిధి ఎక్కువగా ఉండటంతోపాటు ఒక్క బీటుకు ఒక్కో అధికారి కూడా లేరు. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే బీట్, సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో అటవీ సంపద రక్షణపై నిఘా కొరవడుతోంది. బీట్ ఆఫీసర్లకు జాబ్చార్ట్ లేకపోవడంతో అన్ని వేళలా విధులకు అందుబాటులో ఉండాల్సి వస్తోంది. సాధారణంగా వెయ్యి హెక్టార్ల భూవిస్తీర్ణం పరిధిలో ఒక బీట్ ఆఫీసర్ పని చేయాల్సి ఉన్నా అలా జరగడం లేదు. దీంతో ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోందని వాపోతున్నారు. ఐదేళ్ల క్రితం ఎఫ్బీఓ పోస్టులను భర్తీ చేయగా, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో చాలామంది వెళ్లిపోయారు. ఉద్యోగ విరమణతో కూడా ఖాళీల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అటవీ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో అడవులపై పర్యవేక్షణ కొరవడుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలప స్మగ్లింగ్, అటవీ భూముల ఆక్రమణ జరుగుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి అటవీ శాఖలోని ఖాళీ పోస్టులను భర్తీ చేసి అడవులను, వన్యప్రాణులను కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
ఉత్తిపోతలు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు 2024 ఆగస్టు 15 నాటికి అందివ్వాలనే లక్ష్యంతో గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు దృష్టి పెట్టారు. ఆ దిశగా అఽధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. సీతారామ ప్రధాన కాలువను నాగార్జున సాగర్ కాలువకు కలుపుతూ కొత్తగా రాజీవ్ కెనాల్ను తెర మీదకు తెచ్చారు. కాలువ నిర్మాణ పనుల కోసం రమారమీ రూ. 100 కోట్లు కేటాయించారు. యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద భూసేకరణ చేపట్టారు. రేయింబవళ్లు యంత్రాలు పరుగులు పెట్టాయి. ఆగస్టు మొదటి వారం నాటికే వానలు విస్తారంగా కురవడం, నాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండలా మారడంతో ఎన్ఎస్పీ కెనాల్కు సమృద్ధిగా కృష్ణా జలాలు అందాయి. దీంతో గోదావరి జలాలను కృష్టా ఆయకట్టకు తరలించే అవసరం లేకుండా పోయింది. సిద్ధమైన పంప్హౌస్లు రాజీవ్ కెనాల్ పనులు 2024 ఆగస్టు 15 నాటికి పూర్తవలేదు. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి జూలూరుపాడు వరకు 102 కి.మీల ప్రధాన కాలువ దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. ఇదే సమయంలో బీజీ కొత్తూరు, పూసుగూడెం (వీకేరామవరం), కమలాపురం దగ్గర ఉన్న మూడు పంప్హౌస్లలో రెండు వంతున మోటార్లను రెడీ చేశారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ మూడు పంప్హౌస్ల ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోశారు. ఇదే స్పీడ్లో పనులు జరిగి రాజీవ్ కెనాల్ అందుబాటులోకి వస్తే వేసవిలో నీటిని ఎత్తిపోయచ్చనే నమ్మకం కలిగేది. పొంగిన గోదావరి గత ఫిబ్రవరి చివరి వారంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు సాంకేతిక కారణాల వల్ల దుమ్ముగూడెం బరాజ్కి ఎగువన ఉన్న సమ్మక్క బరాజ్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. ఫిబ్రవరి 26 నాటికి దుమ్ముగూడెం ఆనకట్ట నిండి కిందకు నీరు ప్రవహించడం మొదలైంది. అప్పటికే మూడు పంప్హౌస్లలో రెండు వంతున మోటార్లు సిద్ధమై ఉండటంతో గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా వైరా రిజర్వాయర్కు తరలిస్తారా ? లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఎట్టకేలకు ఫిబ్రవరి 27న బీజీ కొత్తూరు పంప్హౌస్లో మోటార్లను ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోశారు. ఇక్కడి నుంచి ఈ నీరు ఎప్పుడెప్పుడు వైరా రిజర్వాయర్కు చేరుతుందా అని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. ప్రధాన కాలువకే పరిమితం మొదటి పంప్హౌస్ నుంచి ఫిబ్రవరి 27న ఎత్తిపోసిన నీరు రెండో పంప్ హౌస్ వరకు చేరుకున్నాయి. ఆదివారం సాయంత్రం అక్కడి నుంచి మూడో పంప్హౌస్కు నీటిని ఎత్తిపోశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎత్తిపోతల తీరును పరిశీలిస్తే రాజీవ్ లింక్ కెనాల్తో పాటు ఇతర పనులు పూర్తికానందున ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదావరి నీరు ఎన్ఎస్పీ కెనాల్కు పారే అవకాశం లేనట్టే. కేవలం సీతారామ ప్రధాన కాలువలో నిల్వకే అక్కరకు వచ్చేలా మారాయి. దుమ్ముగూడెం ఆనకట్ట మీదుగా ప్రవహిస్తున్న గోదావరి గత నెల 27న పంప్హౌస్–1లో మోటార్లు ప్రారంభం రాజీవ్ లింక్ కెనాల్లో పూర్తికాని ప్యాచ్ వర్క్ పనులు సీతారామ నీళ్లు ఎన్ఎస్పీ కాల్వకు చేరే అవకాశం లేనట్టే! పెండింగ్లోనే పనులు రాజీవ్ కెనాల్ నిర్మాణ పనుల్లో 2024 ఆగస్టు 15 తర్వాత వేగం తగ్గింది. ఇప్పటికీ ప్రధాన కాలువపై విజయవాడ – జగదల్పూర్ జాతీయ రహదారిపై అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెం దగ్గర వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. అదేవిధంగా రాజీవ్ లింక్ కెనాల్కు సంబంధించి గ్యాస్ పైప్ లైన్ దగ్గర నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయి. వీటితోపాటు ఇటు ప్రధాన కాలువ, అటు రాజీవ్ కెనాల్లలో ఇప్పటికీ ప్యాచ్వర్క్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రస్తుతం దుమ్ముగూడెం ఆనకట్ట మీద నుంచి పొంగిపొర్లుతున్న గోదావరి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాలేదు. -
పంప్హౌస్–2 నుంచి గోదావరి జలాల ఎత్తిపోత
ములకలపల్లి : మండల పరిధిలోని వీకే రామవరం శివారు సీతారామ పంప్హౌస్–2 నుంచి గోదావరి జలాలను ఆదివారం ఎత్తిపోశారు. నాలుగు రోజుల క్రితం అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ ఎత్తిపోతల పథకం పంప్హౌస్–1 నుంచి గోదావరి జలాలు లిఫ్టింగ్ ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం నీరు పంప్హౌస్–2 కెనాల్ ఫుల్ సప్లై లెవల్ (ఎఫ్ఎస్ఎల్) 67.17 మీటర్లకు చేరింది. దీంతో నీటిని ఎత్తి మోటారు ద్వారా దిగువన ఉన్న పంప్హౌస్–3 (కమలాపురం)కు వదిలారు. గంటసేపు మోటార్లు నడిపించి, విజయవంతంగా నీటికి కాలువలోకి మళ్లించారు. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కమలాపురం ఉండగా, ఏడు గంటల్లో జలాలు చేరతాయని నీటిపారుదల శాఖ డీఈ మోతీలాల్ తెలిపారు. రెండు రోజుల్లో కమలాపురం పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, గ్రావిటీ ద్వారా ఏన్కూర్ లింక్ కెనాల్కు, అక్కడి నుంచి ఎన్నెస్పీ కాల్వకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. -
ఓసీలో కాలిపోతున్న బొగ్గు
మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఓపెన్కాస్టులో బొగ్గు రాశులు తగలబడుతున్నాయి. ఎంతో కష్టపడి తీసిన, విలువైన బొగ్గు కళ్ల ముందే కాలిపోతోందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో స్టాక్ యార్డ్ వద్ద ఉంచిన బొగ్గు కాలి దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. అధికారులు మంటలను నిరోధించే చర్యలు తీసుకోకపోవడంతో పొగతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కార్మికుల శ్రమ, యంత్రాలను వినియోగించి వెలికితీసిన బొగ్గు మండిపోవడంతో సింగరేణి సంస్థకు సైతం నష్టం వాటిల్లుతోంది. సింగరేణి యాజమాన్యం ప్రణాళిక రూపొందించి వార్షిక లక్ష్య సాధనకు ప్రయత్నిస్తుండగా మణుగూరు ఓసీ అధికారుల తీరుతో ఆ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి బొగ్గు రాశులను తరచూ నీటి ద్వారా తడుపుతూ మంటలను నిరోధించాలని, కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. అధికారుల ప్రణాళిక లోపంతో సంస్థకు నష్టం -
బైక్ ఢీకొని మహిళ మృతి
దమ్మపేట : అతి వేగంగా వస్తున్న బైక్ ఢీకొనడంతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మందలపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మందలపల్లి గ్రామానికి చెందిన కుందవరపు లక్ష్మీ నాగరత్నం (60) ఆదివారం రాత్రి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా అల్లిపల్లి వైపు నుంచి బైక్ పై వెళ్తున్న వ్యక్తి బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమెను బైకు రోడ్డుపై దూరంగా ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్టుగా ధ్రువీకరించారు. మోసం చేస్తున్న ముఠాపై కేసు నమోదుఖమ్మం అర్బన్ : భూములు లేకపోయినా తప్పుడు రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా పై కేసు నమోదు చేసినట్లు ఖానాపురం హవేలీ (ఖమ్మం అర్బన్) సీఐ భానుప్రకాశ్ తెలిపారు. నగరంలో ఇటీవల భూ క్రయవిక్రయాలు తగ్గడంతో అక్రమార్జనకు అలవాటు పడిన మాయగాళ్లు ఖరీదైన భూములకు డాక్యుమెంట్లు సృష్టిస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారి, మధురానగర్కు చెందిన షేక్.బడే సాహెబ్, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన కొత్తపల్లి వేంకటేశ్వర్లు, తిప్పర్తి అశోక్ కుమార్ (ఆర్ఐ)పై కేసు నమోదు చేసి వీరి నుంచి మరిన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సాగర్ కాల్వలో వ్యక్తి గల్లంతుకల్లూరు/కల్లూరురూరల్: మండలంలోని పెద్దకోరుకొండి గ్రా మానికి చెందిన గూడూరు శ్రీమన్నారాయణరెడ్డి(35) సా గర్ కాల్వలో గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. శ్రీమన్నారా యణరెడ్డి కొంతకాలంగా కల్లూరులో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం డబుల్ బెడ్రూమ్ల ఎదురుగా ఉన్న సాగర్ కాల్వలో స్నానం చేసేందుకు వెళ్లాడు.ఈ క్రమంలో జారి నీళ్లలో పడిపోయాడు. ఆ సమయంలో కాల్వలో నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో కొట్టుకుపోతుండగా చూసిన వారు గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు కాల్వలోకి దిగి ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కాల్వ గట్టుపై అతడి దుస్తులు, చెప్పులు, సెల్ఫోన్ లభ్యమయ్యాయి. శ్రీమన్నారాయణరెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యులు కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుక్కను తప్పించబోయి ఆటో పల్టీనేలకొండపల్లి : కుక్కను తప్పించబోయి ఆటో పల్టీ కొట్టిన ఘటన మండలంలోని కొత్తకొత్తూరులో ఆదివారం చోటుచేసుకుంది. బైరవునిపల్లికి చెందిన ఆటో ఖమ్మం వెళ్తుండగా కొత్తకొత్తూరులో కుక్క అడ్డువచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో ఆటోపల్టీ కొట్టడంతో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో మాత్రం బాగా దెబ్బతిన్నది. -
మద్యం మత్తులో వికృత చేష్టలు
పాల్వంచ: మూడు రోజుల క్రితం ఓ అపార్ట్మెంట్లో వాచ్మన్ భార్య స్నానం చేస్తుండగా అదే అపార్ట్మెంట్లో ఉండే కేటీపీఎస్ ఉద్యోగి ఫొటోలు తీశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని కొమ్ముగూడెంలోని ఓ అపార్ట్మెంట్లో దివ్యాంగుడైన వ్యక్తి వాచ్మన్గా పనిచేస్తున్నాడు. భార్య, కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లోనే ఓ గదిలో నివాసముంటున్నాడు. కాగా అతని భార్య బాత్రూంలో స్నానం చేస్తుండగా అపార్ట్మెంట్లో నివాసం ఉండే కేటీపీఎస్ ఉద్యోగి మద్యం తాగి వచ్చి వెంటిలెటర్ నుంచి సెల్ఫోన్తో ఫొటోలు తీశాడు. దీంతో గుర్తించిన మహిళ ఆందోళనకు గురై ప్రశ్నించడంతో గొడవ జరిగింది. బయటకు వెళ్లిన భర్త, కుమారుడు ఇంటికి వచ్చాక సదరు కేటీపీఎస్ ఉద్యోగిని ప్రశ్నించగా.. వారిపైనే తిరిగి దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు, కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాగా ఫొటోలు తీసిన వ్యక్తి గతంలో సైతం అదే తరహాలో వ్యవహరించినట్లు సమాచారం. దివ్యాంగుడి కంటే ముందు అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మన్ భార్యపట్ల కూడా అదే తీరులో వ్యవహరించినట్లు, అపార్ట్మెంట్లో ఉండే వారితో గొడవలు పడిన సంఘటనలు ఉన్నట్లు తెలుస్తోంది. కేటీపీఎస్లో మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా వ్యవహరించి సస్పెన్షన్కు గురయ్యాడని సమాచారం. ఈ విషయమై ఎస్ఐ రాఘవయ్యను వివరణ కోరగా... ఫిర్యాదు వచ్చిందని, అనంతరం వారు మళ్లీ మాట్లాడుకుంటామని వెళ్లిపోయారని తెలిపారు. మహిళ స్నానం చేస్తుండగా సెల్ఫోన్తో ఫొటోలు తీసిన కేటీపీఎస్ ఉద్యోగి? -
రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి
దుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీ నగరం గ్రామంలోని శ్రీ దాసాంజనేయ ఆలయ పూజారి ఆరుట్ల రాజగోపాలాచార్యులు (50)మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎటపాక మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మర్మం ఏడుకొండలు బైక్పై తన భార్యతో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో లక్ష్మీనగరం శివారులో రోడ్డు దాటుతున్న అర్చకుడిని బైక్తో ఢీ కొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలు కాగా, 108 ద్వారా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి పూజారి మృతి చెందాడు. ఏడు కొండలు పరిస్థితి విషమంగా ఉండగా, అతని భార్య ఒక కన్ను కోల్పోయింది. వీరు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ అశోక్ సందర్శించి వివరాలు సేకరించారు. సరిహద్దు గ్రామాల్లో ముమ్మరంగా తనిఖీలుచర్ల: సరిహద్దు గ్రామాల్లో ఆదివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. చర్లలో ఆదివారం జరిగిన వారపు సంతకు సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని అటవీ ప్రాంత గ్రామాల ఆదివాసీలు సరుకులు కొనుగోలు కోసం వస్తుంటారు. వారి మాటున మావోయిస్టులు, మిలీషియా సభ్యులు, కొరియర్లు రావచ్చనే అనుమానంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చర్లకు వచ్చే ప్రధాన రహదారులు తాలిపేరు ప్రాజెక్టు, లెనిన్కాలనీ, కలివేరు క్రాస్రోడ్, దానవాయిపేట ప్రాంతాల్లో సివిల్, స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. వచ్చి పోయే వారిని నిశితంగా పరిశీలించారు. పులువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి విడిచిపెట్టారు. -
రిటైర్డ్ ఎస్సై ఆత్మహత్య
బూడిదగడ్డ ఏరియాలో మరొకరు.. కొత్తగూడెంఅర్బన్: పట్టణంలోని బూడిదగడ్డ ఏరియాలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. బూడిదగడ్డ ఏరియాకు చెందిన పుట్టా రంజిత్(30) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కుటుంబ సభ్యులు వచ్చాక ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కొత్తగూడెంఅర్బన్: రిటైర్డ్ ఎస్ఐ ఒకరు ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి కథనం ప్రకారం.. కొత్తగూడెం త్రీటౌన్లో పని చేసిన ఎస్సై ఖాజా మొహినుద్దీన్ (65) గతేడాది ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఎదురుగడ్డ గ్రామంలో కుటుంబంతో నివాసముంటున్నాడు. ఇటీవల తన భార్య అనారోగ్యంగా ఉండటం, పిల్లలు ఇంకా సెటిల్ కాకపోవడంతో మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్ర మంలో ఆదివారం ఇంట్లోనే చీరతో ఉరేసుకుని మృతి చెండు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ శ్రీనివాసరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దివ్యకారుణ్య తత్వాన్ని పెంపొందించుకోవాలి
ఖమ్మం రూరల్: సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్య కారుణ్య తత్వాన్ని పెంపొందించుకోవాలని కర్నూల్ బిషప్ జ్యానేష్ పిలుపునిచ్చారు. ఖమ్మం మేత్రాసనం బిషన్ డాక్టర్ సగిలి ప్రకాష్ సారథ్యంలో కరుణగిరి ప్రాంగణంలో పుణ్యక్షేత్ర యాత్ర మహాత్సవం ముగింపు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనుషులంతా తోటి వారి పట్ల కరుణ, శాంతితో మెలగాలని కోరారు. ఏసుప్రభు చూపిన మార్గం అందరినీ విశిష్ట మానవులుగా తీర్చిదిద్దుతుందన్నారు. బిషన్ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ.. లోక రక్షకుని బోధనలతో నవ వసంతం నిండుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో విశ్వాసంతో పాటు ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసిందని చెప్పారు. ముగింపు వేడుకల సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. విజేతలకు బహుమతి ప్రదానంతో పాటు బిషప్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఫాదర్ మ్యాత్యూవరప్రసాద్ రాజు, వీజే శౌరి, సూరేపల్లి ఐజాక్, చాన్సలర్ జర్నీస్ తదితరులు పాల్గొన్నారు.కర్నూల్ బిషప్ జ్యానేష్ -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. రామయ్యను దర్శించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యేదుమ్ముగూడెం : పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగ తం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వా త పంచవటీ కుటీరం, నారచీరల ప్రాంతాలను సందర్శించి వాటి విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. చోటేబాబాకు గౌరవ డాక్టరేట్ఖమ్మం మామిళ్లగూడెం : ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ మైనారిటీ విభాగం నాయకుడు షేక్ చోటేబాబా చేసిన సామాజిక సేవలను గుర్తించిన యూరోపియన్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆదివారం ఢిల్లీలో యూరోపియన్, అమెరికన్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఆయా రంగాల్లో సేవ చేసిన వారిని గుర్తించగా అందులో చోటేబాబాకు స్థానం దక్కడం విశేషం. చిన్నారి చికిత్సకు ఆర్థిక సాయంసూపర్బజార్(కొత్తగూడెం): ఇటీవల ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నాలుగేళ్ల చిన్నారి పాసి కృతిక చికిత్స నిమిత్తం రామవరం ఏరియా హనుమాన్ జిమ్, బ్లడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రూ.20 వేల ఆర్థికసాయం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్పాషా చేతుల మీదుగా చిన్నారి తండ్రి, ఆటో డ్రైవర్ కల్యాణ్ పాసికి నగదు అందజేశారు. చిన్నారి పూర్తిస్థాయి చికిత్స కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. జిమ్ ఫౌండేషన్ సభ్యులు దాసు, సుధాకర్, లడ్డు, రాజేష్, సురేష్, దిలీప్, వసంత్, గుత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. అలరించిన లఘుచిత్రాల ప్రదర్శనఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన లఘుచిత్రాల ప్రదర్శనలు అలరించాయి. దాశరధి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో రెండేళ్లుగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ లఘు చిత్రాలు ప్రదర్శిస్తుండగా ఆదివారం ఖమ్మంలో ఏర్పాటుచేశారు. సమాజ చైతన్యం కోసం రూపొందించిన చంద్రుడు, అంతరం, సాగరవాసి, శుభసంకల్పం, వాట్సాప్ స్టేటస్, జన్మనిచ్చిన తల్లికి, వలస గోస వంటి లఘుచిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిలిం సొసైటీ అధ్యక్షుడు ఎస్.వినయ్కుమార్ మాట్లాడుతూ.. అభ్యుదయ భావాలను విస్తరించేందుకే ఇలాంటి చిత్రాలను ప్రదర్శిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఫిలిం సొసైటీ కార్యదర్శి బీడీఎల్ సత్యనారాయణ, మల్లం రమేష్, నెల నెలా వన్నెల నిర్వాహకులు పాల్గొన్నారు. -
సమాజ సేవలో ముందుండాలి
ఖమ్మంమయూరిసెంటర్ : సమాజ సేవలో కమ్మ మహాజన సంఘం సభ్యులు ముందుండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సంఘం నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం ఖమ్మంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. జాతి ఔన్నత్యాన్ని పెంపొదించేలా కమిటీ నడవడిక ఉండాలన్నారు. పెద్దలు చూపిన మార్గంలో పయనించాలని సూచించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గొట్టిపాటి సత్యవాణి మాట్లాడుతూ కమ్మవారు అనేక రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. సంఘన్ని రాజకీయ చట్రంలో బిగించకుండా అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ఐక్యంగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొల్లు రఘు, చావా రాము, ఉపాధ్యక్షులు కర్ణాటి రమాదేవి, జాయింట్ సెక్రటరీ వజ్జా శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్లూరి నిర్మల, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, కోలేటి నవీన్, మేదరమెట్ల స్వరూపారాణి, నల్లమల ఆనంద్, నంబూరి సత్యనారాయణ ప్రసాద్, పోతినేని భూమేశ్వర్, తుమ్మలపల్లి నాగేశ్వరావు, తాళ్లూరి మురళీకృష్ణ, బండి రవికుమార్ పాల్గొన్నారు. కమ్మ మహాజన సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకారంలో మంత్రి తుమ్మల -
కారు, లారీ ఢీ
అశ్వారావుపేటరూరల్: కారును లారీ ఢీ కొట్టిన ఘటన ఆదివారం అశ్వారావుపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక సాయిబాబా ఆలయం వద్ద డివైడర్ నుంచి యూ టర్న్ తీసుకుంటున్న కారును ఖమ్మం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జుకాగా, బెలూన్స్ తెరుచుకోవడంతో కారు నడుపుతున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. కారు డ్రైవర్ జి. ఉమామహేశ్వరరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టీ.యయాతి రాజు తెలిపారు. -
రెండు బైక్లు ఢీ : ముగ్గురికి తీవ్ర గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని పోలారం గ్రామపంచాయతీ భద్రుతండా గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మాణిక్యారం గ్రామపంచాయతీ దేశ్యాతండాకు చెందిన దంపతులు లక్ష్మ ణ్, మంజు బైక్పై స్వగ్రామం నుంచి మర్రిగూడెం వెళ్తున్నారు. అదే సమయంలో వేములవాడ గ్రామానికి చెందిన కుమార్ మర్రిగూడెం నుంచి ఇల్లెందు వైపు మరో బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఇల్లెందు ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో సతీష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం సిఫారసు చేశారు. -
రండి.. రారండి!
ఖమ్మం సహకారనగర్: కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు ఏటా విద్యాసంస్థల బాధ్యులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా చెప్పొచ్చు. ‘మా పాఠశాలలో చేరండి.. మా కళాశాలలో చేరండి’ అంటూ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సైతం తమ కళాశాలలో చేరాలంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లి విస్తృత ప్రచారం చేస్తుండడం గమనార్హం. ఏకై క కళాశాల.. జిల్లా కేంద్రంలో మహిళా విభాగంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటే ఉంది. ఇక్కడ వివిధ శాఖలకు చెందిన హాస్టళ్లు ఉండడంతో ఇతర ప్రాంతాల విద్యార్థినులు సైతం హాస్టళ్లలో ఉంటూ కళాశాలలో చదివేందుకు ఆస్కారముంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్ జిల్లాలకు ఖమ్మం సమీపాన ఉండడం కలిసొచ్చే అవకాశంగా చెబుతున్నారు. ప్రత్యేక శ్రద్ధ.. ఉత్తమ ఫలితాలు ఈ కళాశాలలో విద్యార్థినులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దీంతో ఏటా విద్యార్థినులు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ లభించడంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే భావనతో ఇక్కడ చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్లే కాక వివిధ పోటీ పరీక్షలు, యువజనోత్సవాల్లో అధ్యాపకుల సహకారంతో సత్తా చాటుతున్నారు. ముందస్తు ప్రచారం వచ్చే విద్యాసంవత్సరం కళాశాలలో ప్రవేశాల సంఖ్య మరింత పెరిగేలా ప్రభుత్వ ఆదేశాలతో అధ్యాపకులు ముందస్తు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఖమ్మం నగరంతో పాటు సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లోని ప్రభుత్వ, అనుబంధ జూనియర్ కాలేజీలకు వెళ్లి తమ కళాశాలలో ఉన్న వసతులు, ఫలితాలను వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రైవేట్ కళాశాలలకు దీటుగా కలర్ బ్రోచర్లు ముద్రించడం విశేషం. ఇలా రకరకాల కారణాలతో వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్థినుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల ప్రచారం సౌకర్యాలు, ఫలితాలను వివరిస్తూ ప్రవేశాలకు ఆహ్వానం ‘న్యాక్ ఏ’ గ్రేడ్ ఉండడంతో విద్యార్థినులు సైతం ఆసక్తిగత కొన్నేళ్లుగా కళాశాలలో ప్రవేశాలు సంవత్సరం ఎంపీసీ బీజెడ్సీ బీఏ బీకాం మొత్తం 2022–23 30 57 86 71 244 2023–24 13 65 80 72 230 2024–25 24 52 84 74 234వచ్చే ఏడాది అటానమస్ హోదా 1965లో స్థాపించిన ఈ కళాశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. నెట్, సెట్, డాక్టరేట్ అర్హతలు కలిగిన అధ్యాపకులు బోధిస్తున్నారు. 2025 – 26 విద్యాసంవత్సరం నుంచి అటానమస్ హోదా లభించనుంది. ఇప్పటికే న్యాక్–ఏ ఉన్నందున విద్యార్థినులు చేరేందుకు ముందుకు రావాలి. – జి.పద్మావతి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల -
రెచ్చిపోతున్న గంజాయి స్మగ్లర్లు
భద్రాచలం: భద్రాచలంలో రోజురోజుకూ గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. చెక్పోస్టు వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్కు వాహనంతో డాష్ ఇచ్చి పరారైన సంఘటన ఆదివారం జరిగింది. భద్రాచలం చెక్పోస్టు వద్ద పోలీసులు నిరంతరం గస్తీ, చెకింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్ల వారుజామున మూడు గంటలకు ఓ ద్విచక్రవాహనంపై అతివేగంతో ఇద్దరు యువకులు వెళ్తున్నారు. గమనించిన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగానందాచారి వారిని ఆపేందుకు ప్రయత్నించారు. వారు ఆపకుండా కానిస్టేబుల్ను ఢీకొట్టి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది కానిస్టేబుల్ను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చేయి విరిగినట్లుగా వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్సకు ఆయనను హైదరాబాద్కు తరలించారు. కాగా పది రోజుల క్రితం ఇదే చెక్పోస్టు వద్ద ఇదే తరహాలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ఓ కానిస్టేబుల్ను ఢీ కొట్టి పరారైన విషయం విదితమే. కానిస్టేబుల్ను బైక్తో ఢీకొట్టిపరారైన దుండగులు -
ఇరుకు దారిలో ప్రమాదం, స్తంభించిన ట్రాఫిక్
ఖమ్మంరూరల్: మండలంలోని జలగంగనర్ వద్ద శనివారం కారును లారీ ఢీకొట్టగా ఇరుకుదారి కావడంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ వైపు నుండి ఖమ్మం వస్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. కాగా, మున్నేరు వద్ద తీగల వంతెన నిర్మాణ పనులు జరుగుతుండగా, మూడు నెలల క్రితం మున్నేటి పాత బ్రిడ్జిపై నుండి సైతం రాకపోకలు నిలిపేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా మున్నేటి బిడ్జి కింది నుండి తాత్కాలికంగా సింగిల్ రోడ్డు వేయగా ఈ రహదారిపై ప్రమాదం జరగడంతో రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు చేరుకుని లారీని పక్కకు తీయించి, ఖమ్మం నుండి జలగంగనర్ వైపు వచ్చే వాహనాలను ఎంపీడీఓ కార్యాలయం పక్క నుండి మళ్లించారు. దీంతో రెండు గంటల పాటు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. -
మూడు బియ్యం లారీలు సీజ్
అశ్వారావుపేటరూరల్: అనుమతి లేకుండా రాష్ట్ర సరిహద్దు, ఆపై దేశం దాటించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుండగా.. మూడు బియ్యం లారీలను అశ్వారావుపేట ఆర్టీఏ చెక్పోస్టు వద్ద అధికారులు శనివారం అడ్డుకున్నారు. రాష్ట్రంలోని కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి ఏపీలోని కాకినాడ పోర్ట్కు 12బియ్యం లారీలు బయలుదేరాయి. అనుమానంతో అసిస్టెంట్ సివిల్ సప్లయీస్ అధికారి వరదరాజులు, డీటీ ప్రభాకర్ ఆధ్వర్యాన తనిఖీ చేశారు. అయితే, తొమ్మిది లారీలకు అనుమతి ఉండగా, మరో మూడింటికి అనుమతులు లేవని గుర్తించి అడ్డుకున్నారు. పట్టుబడిన ఒక్కో లారీలో 200 క్వింటాళ్ల బాయిల్డ్ రైస్ ఉందని, ఈ లారీలను సీజ్ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, తనిఖీల విషయాన్ని, ఎన్ని లారీలను సీజ్ చేశారనే అంశాన్ని బహిర్గతం చేయకుండా గంటల కొద్ది రహస్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాకినాడ పోర్ట్కు తరలిస్తుండగా అడ్డుకున్న అధికారులు -
దండకారణ్యంలో శాంతి నెలకొల్పుతాం
చర్ల: దండకారణ్యంలోని గ్రామాల్లో శాంతిని నెలకొల్పేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తోందని సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ ఛత్తీస్గఢ్ సెక్టార్ ఐజీ రాకేష్ అగర్వాల్ పేర్కొన్నారు. మండల సరిహద్దున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధి కౌరగట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ క్యాంపులో ఆదివారం సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. సమీప కంచాల, బట్టిగూడెం, దామవరం, జీడిపల్లి, గాదిగూడెం, మీనగట్ట తదితర గ్రామాలకు చెందిన సుమారు 200 మంది ఆదివాసీలకు నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు, వ్యవసాయ సామగ్రి, క్రీడా సామగ్రి, విద్యార్థులకు యూనిఫాం, స్టేషనరీ, సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో అసాంఘిక శక్తుల వల్ల నెలకొన్న భయాందోళనలను పోగొట్టి శాంతిని నెలకొల్పేందకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పోలీస్శాఖ కృషి చేస్తోందని తెలిపారు. సీఆర్పీఎఫ్ డీఐజీ ఎన్కే సింగ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్కుమార్, కమాండెంట్ రంజన్ ప్రకాశ్, డిప్యూటీ కమాండెంట్ లీలామోహన్ కుమార్, అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ నీరజ్పాండే తదితరులు పాల్గొన్నారు. సీఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ -
కబడ్డీ టోర్నీ విజేత విజయవాడ
ఎర్రుపాలెం: మహాశివరాత్రి పండుగ సందర్భంగా మండలంలోని బనిగండ్లపాడు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి, ఈ పోటీల్లో విజేతగా ఏపీలోని విజయవాడ సాయి సెంటర్ జట్టు నిలిచి రూ.25వేలు, ఖమ్మం అకాడమీ జట్టు రెండో స్థానంలో నిలిచి రూ.20వేల నగదు బహుమతి గెలుచుకున్నాయి. అలాగే, మూడు నుంచి ఆరో స్థానం వరకు బనిగండ్లపాడుకు చెందిన పెద్దమళ్ల వెంకటేశ్వర్లు మెమోరియల్ జట్టు, వై.కే.రెడ్డి రాజుల దేవరపాడు, బనిగండ్లపాడు జీవీకే ఈవెంట్స్, బనిగండ్లపాడు గణేష్ మార్కెట్ జట్లు నిలవగా నగదు బహుమతులు అందజేశారు. మధిర మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, శివాలయం వ్యవస్థాపకులు ఐలూరి అంకిరెడ్డి –విజయలక్ష్మితో పాటు యరమల పూర్ణచంద్రారెడ్డి, గుర్రాల శ్రీనివాస్రెడ్డి, యన్నం పిచ్చిరెడ్డి, పెద్దమళ్ల మోహన్రావు విజేతలకు బహుమతులు అందజేయగా అర్చకులు కాశవఝల నర్సింహమూర్తితో పాటు ,అనుమోలు కృష్ణారావు, యన్నం సత్యనారాయణరెడ్డి, శీలం ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
స్వీయ నియంత్రణ
ఉపవాసం (రోజా) పాటించడంతో మనిషి చెడుల నుంచి నియంత్రణలోకి వస్తాడు. పేదలు పడే ఇబ్బందులు తెలుస్తాయి. ఫలితంగా తనకుతానుగా మంచిమార్గంలో ప్రయాణం చేసేందుకు ఉపవాసం ఉపయోగ పడుతుంది. – అబ్దుల్ రెహమాన్, మదర్సా ఇస్లామియా దారుల్ ఉలూం, కొత్తగూడెం వ్యసనాలు దూరం ఉపవాసదీక్షతో మనిషిలో చెడువ్యసనాలు దూరమవుతాయి. మంచి మార్గంలో జీవనం సాగించడంతోపాటు తోటివారి పట్ల ప్రేమ ఆప్యాయతలు పెంపొందుతాయి. ఫలితంగా మంచి సమాజ ఆవిష్కరణకు దోహదపడుతుంది. – ఎం.డీ.ఖాజాహుస్సేన్, సనాతన ధర్మ సత్యసందేశ కేంద్రం, చండ్రుగొండ● -
పవిత్రమాసం.. రంజాన్
● నేటి నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం ● ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లింలు ఉపవాసంతో ప్రయోజనాలు ఉపవాసం ద్వారా మానసికంగా, శారీరకంగా, నైతికంగా, సామాజిక ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యోదయం కంటే ముందు నుంచే సూర్యాస్తమయం వరకు దాదాపు 13 నుంచి 14 గంటలపాటు ధర్మసమ్మతమైన ఆహార పానీయాలను సైతం తీసుకోరు. యంత్రాలను సైతం కొంత సమయం తర్వాత ఎలా నిలుపుదల చేస్తామో ఆ విధంగా ఓ మనిషి పగటి వేళ ఆహార పానీయాలు తీసుకోకపోవడం వల్ల జీర్ణకోశం బలోపేతం అవుతుంది. ఉదరకోశానికి విశ్రాంతి నివ్వడం ద్వారా శరీరానికి అనారోగ్యం కలిగించే ఆమ్లాలు హరించుకుపోతాయి. జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. ఇదే అంశంపై సంస్కృతంలో సంకణం – దివ్యఔషధం ఇదే విషయాన్ని ఆయుర్వేదశాస్త్రం కూడా బలపరుస్తుంది. నైతికత పెంపొందేలా.. మనసా వాచా కర్మేణా ఓ వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నపానీయాలను దూరంగా ఉంటూ చెడులకు, వ్యసనాలను సైతం అదుపులో ఉంచుకోవడమే నైతికత. తనకు తాను అదుపులో ఉంచుకుని రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండే వ్యక్తికి ఈ నెల రాబోవు 11 నెలలకు శిక్షణ లాంటిది. అకలిదప్పుల బాధ తెలవడంతోపాటు పేదలకు ఆదుకునే తత్వం పెంపొందుతుంది. రంజాన్ నెలలో రూపాయి దానం చేస్తే అందుకు ఏడు వందల రెట్లు పుణ్యఫలం దక్కుతుందని పలువురు విశ్వసిస్తారు. ప్రతి మనిషిలో దానధర్మ గుణాలను ప్రోత్సహించడమే ఈ మాసపు లక్ష్యంగా చెప్పవచ్చు.పవిత్రతకు ప్రతిరూపమైన రంజాన్ మాసం నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. చంద్రవంక కనిపించడంతో శనివారం రాత్రి ప్రత్యేక ప్రార్థన(తరాబీ)లు, నమాజ్లతో ముస్లింలు రంజాన్ మాసానికి స్వాగతం పలికారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకత్వం చూపే దివ్యఖురాన్ ఈ మాసంలోనే అవతరించిందని నమ్ముతారు. ఈ మాసంలో ప్రతి విశ్వాసి రోజా (ఉపవాసం) ఆచరిస్తారు. ఉపవాసం ముస్లింల విధిగా నిర్ణయించినట్లు దైవగ్రంథాలు చెబుతున్నాయి. – చండ్రుగొండ● చాంద్ ముబారక్● కనిపించిన నెలవంక అశ్వారావుపేటరూరల్: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలంతా చాంద్ ముబారక్ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మసీదులు, ఇళ్ల వద్ద ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. -
అనుచరుడి పాడె మోసిన మంత్రి తుమ్మల
సత్తుపల్లి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు, మాజీ జెడ్పీటీసీ గాదె సత్యనారాయణ(79) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందగా శనివారం సత్తుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించే సమయాన మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కూసంపూడి మహేష్, దొడ్డా శంకర్రావు, సాంబశివరావు ఉన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
భద్రాచలంటౌన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెనూ ప్రకారం భోజనం సమకూరుస్తూనే వ్యక్తిగత ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఉద్యోగులకు సూచించారు. ఉమ్మడి జిల్లాలోని గిరిజన పాఠశాలల హెచ్ఎంలు, వార్డెన్లు, ఏఎన్ఎంలకు భద్రాచలం బీఈడీ కళాశాలలో శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎన్ఎంలు అప్రమత్తంగా ఉంటూ పిల్లల ఆరోగ్యాన్ని గమనించాలని, ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ప్రత్యేక గది ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై సమీప పీహెచ్సీల వైద్యులతో నెలకోసారి అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. కిశోర బాలికలకు మహిళా వైద్యులతో అవసరమైన కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. అన్ని పాఠశాలలకు త్వరలోనే మెడికల్ కిట్లు అందిస్తామని పీఓ వెల్లడించారు. ఎస్సెస్సీలో వంద శాతం ఫలితాలే లక్ష్యం.. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యాన వెనకబడిన విద్యార్థులకు రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, హెచ్ఎంలు, వార్డెన్లు, సబ్జెక్ట్ టీచర్లు పాఠశాలల్లోనే రాత్రి బస చేయాలని పీఓ రాహుల్ ఆదేశించారు. ప్రీ ఫైనల్ పరీక్షల జవాబు పత్రాలు దిద్దే సమయాన విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి మరింత మెరుగపడేలా సూచనలు చేయాలని తెలిపారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూనే ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీలు మణెమ్మ, విజయలక్ష్మి, ఏసీఎంఓ రమణయ్య, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరూనాయక్, హెల్త్ కమాండ్ సెంటర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ చైతన్య, ఏటీడీఓలు అశోక్ కుమార్, జహీరుద్దీన్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు ఐటీడీఏ పీఓ ఆదేశం -
పందిళ్లపల్లి రైల్వే గూడ్స్షెడ్కు మోక్షం
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వేస్టేషన్లో ఎరువుల దిగుమతి కోసం గూడ్స్ షెడ్ సిద్ధమైంది. దీంతో జిల్లాకు ఎరువుల రవాణా సులువు కానుంది. మూడో రైల్వే లైన్ ఏర్పాటుతో గత జనవరిలో ఖమ్మం రైల్వేస్టేషన్లో ఉన్న గూడ్స్ షెడ్ను తొలగించి పందిళ్లపల్లి స్టేషన్కు మార్చారు. కానీ సాంకేతిక కారణాలతో కొత్త గూడ్స్ షెడ్ ద్వారా ఎరువుల దిగుమతి మొదలుకాకపోవడంతో మిర్యాలగూడ, వరంగల్ రేక్ పాయింట్ల నుండి ఎరువులను తెప్పించి సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేశారు. ఈక్రమంలో ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. ఇంతలోనే ఇంటిగ్రేటెడ్ ఎరువుల నిర్వహణ వ్యవస్థ(ఐఎఫ్ఎంఎస్) ద్వారా పందిళ్లపల్లి షెడ్కు రైల్వే వ్యాగన్లలో ఎరువుల సరఫరాకు వివిధ కంపెనీలకు అనుమతి జారీ చేయడంతో సమస్య పరిష్కారమైనట్లయింది. రంగంలోకి రెండు ప్రాంతాల కార్మికులు పందిళపల్లి రైల్వేస్టేషన్ రేక్ పాయింట్ నుంచి ఎరువులను సరఫరా చేయడానికి లారీ యజమానుల అసోసియేషన్ బాధ్యులు ముందుకొచ్చి హ్యాండ్లింగ్ కాంట్రాక్టర్కు హామీ ఇవ్వడంతో ఆ సమస్య తీరింది. ఇదిలా ఉండగా పందిళ్లపల్లి గూడ్స్ షెడ్లో పనిచేసేందుకు పరిసర ప్రాంతాల కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతులను తక్కువ ధరకే చేస్తామని కాంట్రాక్టర్కు హామీ పత్రం అందజేశారు. ఇంతలోనే ఖమ్మం గూడ్స్ షెడ్లో పనిచేసిన కార్మికులు సైతం తామే ఇక్కడ పనిచేస్తామని, కొత్తవారిని తీసుకోవద్దని కోరారు. ఈఅంశం రాజకీయ నాయకుల జోక్యంతో తీవ్రం కాగా వైరా పోలీస్ సర్కిల్ కార్యాలయానికి చేరింది. అఽధికారులు సమస్యను పరిష్కరిస్తే త్వరలోనే వ్యాగన్ల ద్వారా ఎరువుల దిగుమతి మొదలుకానుంది. కార్మికుల సమస్య పరిష్కారమైతే ఎరువుల దిగుమతి -
శివరాత్రి జాతరల ఆదాయం లెక్కింపు
మధిర: మధిరలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన జాతరకు సంబంధించి ఆదాయాన్ని శనివారం లెక్కించారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3.80 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ జగన్మోహన్రావు వెల్లడించారు. అలాగే, జాయింట్ వీల్, దుకాణాల ఏర్పాటు, కొబ్బరిచిప్పల సేకరణ, ప్రసాదాల అమ్మకం, కల్యాణ కట్నాలు, పూజల టికెట్ల అమ్మకంతో కలిపి రూ 32.78 లక్షల ఆదాయం నమోదైందని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ.3.52 లక్షల ఆదాయం పెరిగిందని ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాధ, అర్చకులు రాయప్రోలు సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. స్నానాల లక్ష్మీపురంలో రూ.9.47లక్షలు వైరారూరల్: వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను శనివారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.3,55,450 సమకూరగా, టికెట్ల అమ్మకంతో రూ.2,99,840, దుకాణాల వేలం ద్వారా రూ. 83,350, మిఠాయి షాపుల ద్వారా రూ.50వేలు, ప్రసాదాల అమ్మకంపై రూ.1,39,500, కొబ్బరిచిప్పల వేలంతో రూ.19వేలతో పాటు కల్యాణ కట్న కానుకలు కలిపి రూ.9,47,564 ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. ఈకార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కె.వేణుగోపాలచార్యులు, ఈఓ హరిచ్రందశేఖర్, ఉత్సవ కమిటీ చైర్మన్ దొడ్డా ఉషారాణితో పాటు దొడ్డా పుల్లయ్య, మల్లు రామకృష్ణ, నూతి వెంకటేశ్వర్లు, మొగునూరు సత్యనారాయణ, మల్లు శేషమ్మ, సుల్తాన్ పద్మా, తలారి నర్సింహారావు, సంగేపు రామకృష్ణ, గిరగాని శ్రీనివాసరావు, మైబ్జానీ, శ్రీనివాసరావు పాల్గొన్నారు. కోటిలింగాల జాతరకు రూ.3.54లక్షలు కారేపల్లి: మహా శివరాత్రి సందర్భంగా కారేపల్లి మండలం బుగ్గవాగు ఒడ్డున శ్రీ కోటిలింగాల ఆలయంలో నిర్వహించిన జాతర ఆదాయాన్ని ఆలయ కమిటీ చైర్మన్ అలెం వెంకటేశ్వర్లు శనివారం ప్రకటించారు. హుండీలో భక్తులు రూ.92,825 సమర్పించగా, కొబ్బరికాయల షాపు వేలం ద్వారా రూ.90వేలు, కొబ్బరిచిప్పల వేలంతో రూ.22వేలు, లడ్డూల అమ్మకం ద్వారా రూ.20వేలు, దర్శన టికెట్ల ద్వారా రూ.1,29,430 కలిపి రూ.3,54,255 ఆదాయం వచ్చిందని తెలిపారు. అయితే, జాతర ఏర్పాట్లకు రూ.3,82,082 ఖర్చు కావడంతో రూ.27,827 లోటు నమోదైందని వెల్లడించారు. గత ఏడాది రూ.50వేలు మిగలగా, ఈసారి భక్తుల సంఖ్య తగ్గటంతో ఆదాయం సైతం తగ్గిందని భావిస్తున్నారు.మృత్యుంజయ స్వామి ఆలయానికి రూ.32.78లక్షలు -
ఆకలి బాధ తెలిసేందుకే..
రంజాన్లో ఆచరించే రోజా(ఉపవాసం) అంటే కేవలం పస్తులుండటం కాదు. కనీసం ఒక్కపూట కూడా తిండిలేనివారు, ఒళ్లు దాచుకోవడానికి కూడా దుస్తులులేనివారి దుర్భర జీవనం పరిస్థితిని అవగతం చేసుకోవడమే ఉపవాసం ఉద్దేశం. – ఎం.డీ.ఉస్మాన్ఖాన్, ఆధ్యాత్మిక రచయిత, ములకలపల్లి సద్భావన జనిస్తుంది ఉపవాసవ్రతం పాటిస్తే ఆకలి అంటే ఏమిటో స్వయంగా అనుభవంలోకి వస్తుంది. తద్వారా మనిషిలో పరుల పట్ల సానుభూతిభావాలు పెంపొందుతాయి. పేదలకు దానధర్మాలు చేయాలన్న సద్భావన జనిస్తుంది. – యాకూబ్పాషా, జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్, పాల్వంచ -
జోరుగా ఇసుక అక్రమ రవాణా
● ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ● రెండు వారాల్లో ఆరు వాహనాలు సీజ్ ములకలపల్లి: ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మండలంలోని వివిధ వాగుల నుంచి ఆరు నెలలుగా ఇసుక తరలిపోతోంది. రాత్రివేళ పదుల సంఖ్యలో లారీల్లో, ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. ఉమ్మడి పూసుగూడెం పంచాయతీ పరిధి సీతారాంపురం శివారు గుర్రాలకుంట బస్షెల్టర్ సమీపంలోని వాగుల నుంచి ఏకలవ్య పాఠశాల, సీతారామ కాంట్రాక్ట్ పనులకు, సత్తుపల్లి, పెనుబల్లి, ఖమ్మం, కొత్తగూడెం తదితర పట్టణాలకు తరలిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల సహకారంతోనే ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా పోలీసులు ఇసుక తరలింపుపై నిఘా పెట్టారు. రెండు వారాల వ్యవధిలో మూడు లారీలు, మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. కాగా ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రత్యేక నిఘా పెట్టామని ములకలపల్లి ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ సీజ్బూర్గంపాడు: కిన్నెరసాని నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను శనివారం పోలీసులు సీజ్ చేశారు. బుడ్డగూడెం గ్రామ సమీపం నుంచి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించి, యజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చండ్రుగొండలో..చండ్రుగొండ : మండలంలోని సత్యనారాయణపురం గ్రామ శివారులో ఉన్న ఎదుళ్లవాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను శనివారం రాత్రి సీజ్ చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. ట్రాక్టర్ యజమాని నర్సింహారావుపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
సీతారామ కాలువలో పడి వ్యక్తి మృతి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన తాళ్లూర వెంకటేష్ (30) గుంపెన సమీపంలోని సీతారామ కాలువలో పడి శనివారం మృతి చెందాడు. వెంకటేష్ స్నేహితులతో కలిసి సరదాగా చేపలు పట్టేందుకు సీతారామ కాలువ వద్దకు వెళ్లాడు. వల విసిరే క్రమంలో కాలు జారి కాలువలో పడిపోయాడు. స్నేహితులు వెలికితీసి ఎర్రగుంట పీహెచ్సీ తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. అనుమానాస్పదస్థితిలో యువకుడు..చండ్రుగొండ : మండలంలోని మంగయ్యబంజర్ గ్రామానికి చెందిన నక్కా మనోహర్ (22) శనివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి ఇంట్లో నిద్రించిన యువకుడు ఉదయం లేచేసరికి జామచెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు తెలిపారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్...పాల్వంచ: విద్యుదాఘాతంతో శనివారం ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన నిమ్మల ప్రసాద్ (32) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. శనివారం ముర్రేడువాగు సమీపంలో రైతు పరిమి వెంకన్న పొలంలో మోటర్ రిపేర్ చేసేందుకు వెళ్లాడు. రిపేర్ చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య భానుశ్రీ, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాఘవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న వృద్ధుడు ...పాల్వంచరూరల్: పురుగుల మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు శనివారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మాలోత్ సీతారాములు(69) శుక్రవారం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందుతాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉండగా, పక్క పొలం రైతు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. మహిళా హోంగార్డుపై వరకట్న వేధింపులు పాల్వంచరూరల్: మహిళా హోంగార్డును వరకట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్త, మామలపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన దుర్గ బూర్గంపాడు పోలీసుస్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తోంది. ఆమె నాలుగున్నరేళ్ల క్రితం పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామానికి చెందిన గంపల ప్రసాద్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఏడాది పాప ఉంది. ఇటీవల కొంతకాలంగా అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామలు వేధిస్తున్నారని దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త ప్రసాద్, అత్త రమణ, మామ సత్యంలపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై ఐడీఓసీలో శనివారం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగుతాయని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 73 కేంద్రాల్లో 12, 282 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. పరీక్షలకు 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 5 ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఏడుగురు రూట్ అధికారులు, 73 మంది డిపార్టుమెంటల్ అధికారులను నియమిస్తున్నట్లు వివరించారు. పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాల రవాణా, పరీక్ష అనంతరం సమాధాన పత్రాల బండిళ్లను పోస్టాఫీసులకు తరలించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలాని పోలీస్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలి.. పరీక్ష కేంద్రాల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలు రెండు రోజుల్లో పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ను అమలు చేయాలని అన్నారు. పరీక్షల సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని, విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆయా అధికారులను ఆదేశించారు. ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ సమస్య వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ వెంకటేశ్వరాచారి, డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి.. భూముల క్రమబద్ధీకరణకు జిల్లాలో దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. మొబైల్ యాప్ ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఇందుకోసం నీటిపారుదల శాఖ అధికారులు ఆయా శాఖల సిబ్బందికి ప్రతీ రోజు లక్ష్యాలను నిర్దేశించాలని, నీటి వనరుల బఫర్జోన్, ఎఫ్టీఏల్లో స్థలాలు ఉంటే అనుమతించవద్దని సూచించారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ సమయంలో నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి రెండు వారాల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. అధికారులకు కలెక్టర్ ఆదేశం -
స్కూల్ స్కీముల్లో స్కామ్లు !
● బాలికల ఆత్మరక్షణ శిక్షణపై ప్రచారం శూన్యం ● గుట్టుగా నిధులు స్వాహా చేస్తున్న వైనం ● ఇన్స్ట్రక్టర్లుగా అనర్హుల నియామకం ● వాటాలు పంచుకుంటున్న హెఎంలు, శిక్షకులు ● ఏసీబీకి పట్టుబడడంతో విషయం వెలుగులోకి.. కొత్తగూడెంఅర్బన్: బాలికలు, యువతులు, మహిళలపై దాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచడంతో పాటు దాడుల నుంచి స్వీయ రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతున్నాయి. బాల్యం నుంచే వారు ధైర్యంతో ముందుకుసాగితే భవిష్యత్లో ఎలాంటి ఘటనలు ఎదురైనా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో బాలికలకు విద్యార్థి దశలోనే కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అవి కాగితాలకే పరిమితమవుతుండగా.. బాలికలు శిక్షణకు నోచుకోవడం లేదు. పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన వేతనం ఇస్తున్నా.. కొందరు మాత్రం అదనపు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బాలికల ఆత్మరక్షణకు.. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు చదివే బాలికలకు కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు 2018లో ప్రభుత్వం రాణి లక్ష్మీబాయి ఆత్మ రక్షా ప్రశిక్షణ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించగా, నాలుగేళ్ల క్రితం పీఎం శ్రీ కింద మరో స్కీమ్ ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలో ఈ రెండు పథకాలపై ప్రచారం చేయడం, బాలికలకు శిక్షణ ఇప్పించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికలకు మూడు నెలల పాటు శిక్షణా తరగతులు నిర్వహించాల్సి ఉండగా విద్యాశాఖ అధికారులు ఒక్క రోజు కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవు. దీంతో కరాటే శిక్షణకు విడుదలవుతున్న నిధులు భారీగా దుర్వినియోగం అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిక్షణ ఇలా.. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు మూడు నెలల పాటు కరాటే శిక్షణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం నిధులు విడుదల చేస్తున్నాయి. ఈ మేరకు ఇన్స్ట్రక్టర్లను నియమించి జనవరి నుంచి ఏప్రిల్ వరకు శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థినులకు రోజు వారీ బోధనతో పాటు ఈ మూడు నెలలు అదనంగా మరి కొంత సమయం కేటాయించి శిక్షణ ఇప్పించాలి. అయితే సమయం సరిపోవడం లేదనే సాకుతో బాలికలకు శిక్షణ ఇప్పించడం లేదని, నిధులు మాత్రం హెచ్ఎంలు, ఇన్స్ట్రక్టర్లు వాటాలుగా పంచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా శుక్రవారం కొత్తగూడెం కూలీలైన్ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంకు, ఇన్స్ట్రక్టర్కు మధ్య విఽబేధాలు రావడం, ప్రధానోపాధ్యాయుడిపై శిక్షకుడు ఏసీబీకి ఫిర్యాదు చేసి పట్టించిన విషయం తెలిసిందే. అయితే మిగతా పాఠశాలల్లోనూ ఇదే తంతు సాగుతున్నా గుట్టుచప్పడు కాకుండా పంపకాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక పాఠశాలల్లో శిక్షకులను జిల్లా క్రీడా శాఖాధికారి ఎంపిక చేయాల్సి ఉండగా, జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇందులోనూ అనర్హులకు స్థానం కల్పించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపికై న పాఠశాలలు ఇవే.. బాలికలకు కరాటేలో శిక్షణ ఇప్పించేందుకు జిల్లాలో రాణి లక్ష్మీబాయి ఆత్మ రక్షా ప్రశిక్షణ పథకం కింద 183 పాఠశాలలు, పీఎంశ్రీ పథకం కింద 17 పాఠశాలలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనూ ఇన్స్ట్రక్టర్లకు ఇప్పటికే సగం వరకు డబ్బులు ముట్టాయి. ఒక్కో పాఠశాలలో శిక్షణ పొందే విద్యార్థినులు 50 మందికి పైగా ఉంటే నెలకు రూ.10 వేలు, 50 మందికి తక్కువగా ఉంటే రూ.5వేల చొప్పున మూడు నెలల పాటు విడుదల చేస్తారు. పీఎంశ్రీ కింద జిల్లాలోని 16 పాఠశాలలకు నెలకు రూ.10 వేలు, ఒక పాఠశాలకు రూ.5 వేల చొప్పున విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించే రాణి లక్ష్మీబాయి ఆత్మ రక్ష పథకం కింద కూడా 183 పాఠశాలకు అలాగే నిధులు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర విద్యాశాఖ నుంచి ప్రొసీడింగ్స్ ఆలస్యంగా రావడంతో ఫిబ్రవరిలోనే కరాటే క్లాసులు ప్రారంభమైనట్లు పాఠశాలల హెఎంలు నమోదు చేసుకున్నారు. అయితే శిక్షణ అన్ని పాఠశాలల్లో కూడా కాగితాలకే పరిమితమైందని, బాలికలకు కరాటే నేర్పించడం లేదని తెలుస్తోంది. శిక్షణ అందించని పాఠశాలలపై చర్యలు.. జిల్లాలోని ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణ ఇప్పిస్తున్నాం. శిక్షణ ఇవ్వని పాఠశాలలపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేసిన పాఠశాలల్లో తప్పని సరిగా కరాటే శిక్షణ తరగతులు నిర్వహించేలా హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్వరా చారి, డీఈఓ -
రామాలయానికి మాజీ సర్పంచ్ రూ.5లక్షల విరాళం
అశ్వాపురం: మండలంలోని మొండికుంటలో నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలకు సిద్ధమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే మాజీ సర్పంచ్, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ మర్రి మల్లారెడ్డి–సంధ్యారాణి దంపతులు శనివారం రూ.5 లక్షల విరాళం అందజేశారు. మొండికుంట గ్రామస్తుల చిరకాల కోరిక అయిన రామాలయ నిర్మాణాన్ని పూర్తిచేయడంలో చొరవ చూపడమే కాక విరాళం అందించిన మల్లారెడ్డికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగం పేరుతో మోసంపాల్వంచ: ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని నవభారత్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని కేటీపీఎస్ కాలనీకి చెందిన పోటు స్వాతి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పోలంపల్లి రాజశేఖర్ రూ.3.30 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాఘవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలుఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మిర్చి కూలీలు గాయపడ్డారు. సుదిమళ్ల గ్రామానికి చెందిన కూలీలు రొంపేడు గ్రామంలో మిర్చి కోసేందుకు ఆటోలో వెళ్తుండగా కుక్క అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో ఈ ఆటోలో ప్రయాణిస్తున్న వారందరూ గాయపడ్డారు. గ్రామస్తులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో సంధ్య, నాగమణి, లక్ష్మి, వీరమ్మ, నర్సమ్మ, రాజేశ్వరి, లావణ్య, కనకమ్మ, గురువమ్మ ఉన్నారు. వీరిలో సంధ్య, నాగమణి, లక్ష్మిలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు ఖమ్మం సిఫారసు చేశారు. మూడు ఆటోలు సీజ్చండ్రుగొండ : పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న మూడు ఆటోలను శనివారం సీజ్ చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. చండ్రుగొండ నుంచి అన్నపురెడ్డిపల్లి వైపు వెఽళ్తున్న ఆటోలను తనిఖీ చేయగా ఒక్కో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్ఐ పేర్కొన్నారు. ఆటోల యజమానులపై కేసు నమోదు చేశామన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చింతకాని: మండలంలోని చిన్నమండవకు చెందిన తుపాకుల అగ్గిరాములు(43) అప్పుల బాధతో శుక్రవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన గత నాలుగేళ్లుగా కుటుంబ అవసరాలకు అప్పులు చేయగా అవి పెరగడంతో తీర్చే మార్గం లేక మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి భార్యాపిల్లలు నిద్రించాక ఇంటి వరండాలోని రేకుల షెడ్ పైప్కు చీరతో ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున నిద్రలేచిన భార్య ఈ విషయాన్ని గమనించి స్థానికులను పిలవగా పరిశీలించే సరికి అగ్గిరాములు మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య ప్రభావతి శనివారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు. రోడ్డు రోలర్ చోరీపై కేసు నమోదు మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డు రోలర్ చోరీ జరిగిందని ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురానికి చెందిన భిక్షంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు. ఏదులాపురానికి చెందిన భిక్షంరెడ్డి వద్ద రోడ్డు రోలర్ అద్దెకు తీసుకునేందుకు ఫిబ్రవరి 23న ముగ్గురు సంప్రదించారు. రూ.35 వేల అద్దెతో ఒప్పందం కుదరగా రూ.25వేలు పంపించారు. దీంతో ఆయన అదేరోజున వాహనాన్ని డ్రైవర్ అఫ్జల్తో మహబూబాబాద్ పంపించాడు. అయితే, ఆర్ఓబీ ప్రాంతంలో డ్రైవర్ వాహనాన్ని నిలపగా మరుసటి రోజు ఉదయంకల్లా కనిపించలేదు. ఈమేరకు ఫిబ్రవరి 25న మహబూబాబాద్ చేరుకున్న భిక్షంరెడ్డికి పాత ఇనుప సామాన్ల దుకాణం సమీపాన రోడ్డు రోలర్ కనిపించడంతో ఆరా తీయగా రూ.2.19 లక్షలకు ఓ వ్యక్తి విక్రయించాడని షాపు నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
భద్రాచలంటౌన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెనూ ప్రకారం భోజనం సమకూరుస్తూనే వ్యక్తిగత ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఉద్యోగులకు సూచించారు. ఉమ్మడి జిల్లాలోని గిరిజన పాఠశాలల హెచ్ఎంలు, వార్డెన్లు, ఏఎన్ఎంలకు భద్రాచలం బీఈడీ కళాశాలలో శనివారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎన్ఎంలు అప్రమత్తంగా ఉంటూ పిల్లల ఆరోగ్యాన్ని గమనించాలని, ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ప్రత్యేక గది ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయించాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై సమీప పీహెచ్సీల వైద్యులతో నెలకోసారి అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. కిశోర బాలికలకు మహిళా వైద్యులతో అవసరమైన కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. అన్ని పాఠశాలలకు త్వరలోనే మెడికల్ కిట్లు అందిస్తామని పీఓ వెల్లడించారు. ఎస్సెస్సీలో వంద శాతం ఫలితాలే లక్ష్యం.. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యాన వెనకబడిన విద్యార్థులకు రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, హెచ్ఎంలు, వార్డెన్లు, సబ్జెక్ట్ టీచర్లు పాఠశాలల్లోనే రాత్రి బస చేయాలని పీఓ రాహుల్ ఆదేశించారు. ప్రీ ఫైనల్ పరీక్షల జవాబు పత్రాలు దిద్దే సమయాన విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి మరింత మెరుగపడేలా సూచనలు చేయాలని తెలిపారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూనే ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీలు మణెమ్మ, విజయలక్ష్మి, ఏసీఎంఓ రమణయ్య, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరూనాయక్, హెల్త్ కమాండ్ సెంటర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ చైతన్య, ఏటీడీఓలు అశోక్ కుమార్, జహీరుద్దీన్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు ఐటీడీఏ పీఓ ఆదేశం -
పందిళ్లపల్లి రైల్వే గూడ్స్షెడ్కు మోక్షం
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వేస్టేషన్లో ఎరువుల దిగుమతి కోసం గూడ్స్ షెడ్ సిద్ధమైంది. దీంతో జిల్లాకు ఎరువుల రవాణా సులువు కానుంది. మూడో రైల్వే లైన్ ఏర్పాటుతో గత జనవరిలో ఖమ్మం రైల్వేస్టేషన్లో ఉన్న గూడ్స్ షెడ్ను తొలగించి పందిళ్లపల్లి స్టేషన్కు మార్చారు. కానీ సాంకేతిక కారణాలతో కొత్త గూడ్స్ షెడ్ ద్వారా ఎరువుల దిగుమతి మొదలుకాకపోవడంతో మిర్యాలగూడ, వరంగల్ రేక్ పాయింట్ల నుండి ఎరువులను తెప్పించి సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేశారు. ఈక్రమంలో ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. ఇంతలోనే ఇంటిగ్రేటెడ్ ఎరువుల నిర్వహణ వ్యవస్థ(ఐఎఫ్ఎంఎస్) ద్వారా పందిళ్లపల్లి షెడ్కు రైల్వే వ్యాగన్లలో ఎరువుల సరఫరాకు వివిధ కంపెనీలకు అనుమతి జారీ చేయడంతో సమస్య పరిష్కారమైనట్లయింది. రంగంలోకి రెండు ప్రాంతాల కార్మికులు పందిళపల్లి రైల్వేస్టేషన్ రేక్ పాయింట్ నుంచి ఎరువులను సరఫరా చేయడానికి లారీ యజమానుల అసోసియేషన్ బాధ్యులు ముందుకొచ్చి హ్యాండ్లింగ్ కాంట్రాక్టర్కు హామీ ఇవ్వడంతో ఆ సమస్య తీరింది. ఇదిలా ఉండగా పందిళ్లపల్లి గూడ్స్ షెడ్లో పనిచేసేందుకు పరిసర ప్రాంతాల కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతులను తక్కువ ధరకే చేస్తామని కాంట్రాక్టర్కు హామీ పత్రం అందజేశారు. ఇంతలోనే ఖమ్మం గూడ్స్ షెడ్లో పనిచేసిన కార్మికులు సైతం తామే ఇక్కడ పనిచేస్తామని, కొత్తవారిని తీసుకోవద్దని కోరారు. ఈఅంశం రాజకీయ నాయకుల జోక్యంతో తీవ్రం కాగా వైరా పోలీస్ సర్కిల్ కార్యాలయానికి చేరింది. అఽధికారులు సమస్యను పరిష్కరిస్తే త్వరలోనే వ్యాగన్ల ద్వారా ఎరువుల దిగుమతి మొదలుకానుంది. కార్మికుల సమస్య పరిష్కారమైతే ఎరువుల దిగుమతి -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, ఫిబ్రవరి నెలలో స్వామి వారిని 1,97,860 మంది దర్శించుకున్నారు. రామయ్యకు భక్తుల విరాళంభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వివిధ కార్యక్రమాల నిమిత్తం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లికి చెందిన రెడ్ల కిషన్ – కల్పన దంపతులు రూ.2,00,232 విరాళాన్ని శనివారం అందజేశారు. ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి రూ.1,00,116, గోశాలలో ఏడాది పాటు ఆవుల పోషణకు రూ.1,00,116 వినియోగించాలని ఆలయ అధికారులను కోరారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకోగా, సిబ్బంది స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయ పీఆర్వో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణంఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయగా వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. వందల సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించి పులకించిపోయారు. కాగా, ఆలయ అధికారులకు భక్తులకు అన్నదానంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారు. యూడీఐడీ పోర్టల్పై అవగాహన కల్పించాలిచుంచుపల్లి: ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం) కార్డు కోసం యూడీఐడీ(యూనిక్ డిజబిలిటీ ఐడీ) పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్ఎంఓ రమేష్,సెర్ప్ సిబ్బంది యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ.. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ, వీఎల్ఈ కేంద్రాలను ఆశ్రయించేవారని, ఇప్పుడు వీటితోపాటు యూడీఐడీ పోర్టల్, మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియను శనివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. 10లోపు ఇందిరమ్మ లబ్ధిదారులకు మొదటి బిల్లు నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు మొదలుపెట్టాలని గృహ నిర్మాణ శాఖ ఖమ్మం పీడీ బి.శ్రీనివాస్ సూచించారు. మండలంలోని కొంగరలో లబ్ధిదారులతో శనివారం సమావేశమైన ఆయన.. ప్రభుత్వ సూచనల మేరకు 400 – 500చ.గజాల్లో ఇంటి నిర్మాణం చేపడితే ఇబ్బందులు ఉండవని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించిన గ్రామాల లబ్ధిదారులు తొలుత ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని, వీరికి ఈనెల 10లోగా తొలి బిల్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
పతులకు ఫైన్ !
● స్థానిక సంస్థల్లో మహిళా ప్రజా ప్రతినిధులకు అధికారం అంతంతే.. ● 50 శాతం రిజర్వేషన్లు ఉన్నా పురుషుల ఆధిపత్యమే ● అనధికార పెత్తనం తగ్గించేందుకు కేంద్రం చర్యలు ● త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలుపెత్తనం మగాళ్లదే.. స్థానిక సంస్థల్లో 50 శాతం, అంతకు మించి మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పడానికి ఘనంగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. అనేక చోట్ల పెత్తనమంతా ఎన్నికై న మహిళల కుటుంబంలోని మగవారి చేతుల్లోనే ఉంటోంది. ముఖ్యంగా భార్యలు ప్రజాప్రతినిధులుగా ఉన్న చోట భర్తలే అసలైన అధికారం చలాయిస్తున్నారు. మరి కొన్నిచోట్ల కుమారులు, సోదరులు, తండ్రులు కూడా అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని మహిళలను నామ్ కే వాస్తే ప్రజాప్రతినిధులుగా మారుస్తున్నారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడం, ప్రతిపాదనలు రూపొందించడం, ప్రారంభోత్సవాలు తదితర అన్ని పనుల్లో పురుష పెత్తనమే ఎక్కువైంది. అధికారులు సైతం సదరు ప్రజాప్రతినిధుల కుటుంబంలోని మగవారికే అన్ని విషయాలు చెబుతూ పెత్తనానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. చివరకు అధికారిక సమావేశాలు, గ్రామ/వార్డు సభల్లోనూ తమకు కుర్చీలు ఎందుకు వేయడం లేదనే వరకు ఈ పరిస్థితి రావడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల స్ఫూర్తిని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అనధికారిక పెత్తనం చలాయిస్తున్న పురుషుల దూకుడుకు కళ్లెం వేయనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం తీసుకోబోయే చర్యలు ఆసక్తికరంగా మారాయి. మహిళలకు పెద్దపీట.. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు క్షేత్ర స్థాయిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను కీలకంగా మార్చారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల్లో 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. తెలంగాణలో అవి 50 శాతానికి చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్ నుంచి జెడ్పీ చైర్పర్సన్ వరకు, పట్టణాల్లో కౌన్సిలర్ మొదలు మేయర్ వరకు ఆయా సామాజిక వర్గాల వారీగా మహిళలకు సీట్లు కేటాయించారు. దీంతో స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. 50 శాతం రిజర్వేషన్తో పాటు స్థానిక పరిస్థితులు, బలమైన నాయకత్వం ఉన్న చోట జనరల్ స్థానాల్లోనూ మహిళలే పోటీలో ఉంటున్నారు. ఫలితంగా స్థానిక సంస్థల్లో కొన్ని చోట్ల వారి ప్రాతినిధ్యం 50 శాతం కంటే ఎక్కువగానే ఉంటోంది. సలహా మండలి సిఫారసులు.. స్థానిక సంస్థల్లో మహిళా ప్రజాప్రతినిధుల కుటుంబానికి చెందిన మగవారి పెత్తనాల అంశం 2023లో సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతింటోందని, దీనిపై దృష్టి సారించాలని కేంద్రానికి సుప్రీం సూచన చేసింది. దీంతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ అంశంపై నివేదిక ఇవ్వాలంటూ సలహా మండలిని ఏర్పాటు చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన సలహా మండలి.. మహిళా రిజర్వేషన్ల అమలు తీరు, మగవారి పెత్తనంపై వివరాలు సేకరించింది. కేంద్రానికి పలు సూచనలు చేస్తూ ఇటీవల నివేదిక సమర్పించింది. జరిమానాలు విధించేలా.. మహిళా ప్రజాప్రతినిధులు ఎన్నికై న చోట వారి కుటుంబ సభ్యులు పెత్తనం చలాయిస్తే జరిమానా (పెనాల్టీ) విధించాలనే సలహా మండలి సిఫార్సును కేంద్రం సీరియస్గా పరిశీలిస్తోంది. ఈ అంశంపై క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక హెల్ప్లైన్లు, మహిళా పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయనుంది. అనధికారిక పురుష పెత్తనంపై సహేతుకమైన ఆధారాలతో ఫిర్యాదులు అందించే విజిల్ బ్లోయర్స్ (సామాజిక కార్యకర్తలు)కు నజరానాలు సైతం అందించాలని యోచిస్తోంది. ఈ మేరకు విధివిధానాలు సిద్ధం చేసి త్వరలో అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే స్థానిక ఎన్నికలు.. జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల గడువు తీరిపోయింది. ఈ ఏడాది వేసవిలో స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేలా సన్నాహాలు చేస్తోంది. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆసక్తి గల వారు తమకు రిజర్వేషన్లు అనుకూలించకుంటే తమ కుటుంబంలోని మహిళలను నిలిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గతంలో మాదిరిగా రాబోయే రోజుల్లో అనధికారిక పెత్తనం చలాయించే అవకాశాలు ఉంచకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. కొత్త మార్పులు అమల్లోకి వస్తే రాజకీయ, పాలనా పరమైన అంశాల్లో మహిళలకు మరింత న్యాయం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వార్డు మెంబర్లు 4,232సర్పంచ్లు 479ఎంపీటీసీలు 236జెడ్పీటీసీలు 22నాలుగు మున్సిపాలిటీల్లో వార్డులు 103 -
అంతరపంటలతో అధిక లాభాలు
● ఆయిల్పామ్లో మునగ సాగు భేష్ ● జిల్లా ఉద్యాన అధికారి కిషోర్అశ్వారావుపేటరూరల్ : ఆయిల్పామ్ తోటల్లో అంతర్ పంటగా మునగ సాగు చేసి అధిక లాభాలు గడించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జంగా కిషోర్ సూచించారు. అశ్వారావుపేటలోని కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం, నర్సరీతోపాటు పాల్వంచలో శనివారం ఆయన పర్యటించి రైతులు సాగు చేస్తున్న మునగ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పామాయిల్ తోటల్లో తొలి రెండేళ్ల లోపు అంతర్ పంటగా మునగ సాగు చేస్తే మూడేళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. మునగ పంటతో వచ్చే ఆదాయంతో పాటు తోట యాజమాన్యం నిమిత్తం తమ శాఖ నుంచి ఎకరానికి రూ.2,100 అందిస్తామని చెప్పారు. ఈజీఎస్ జాబ్ కార్డు ఉన్న రైతులకు వంద శాతం సబ్సిడీపై మునగ మొక్కలు పంపిణీ చేస్తామని, మెటీరియల్ కాంపొనెంట్ కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఉద్యాన, ఉపాధి హామీ అధికారులను లేదా ఎంపీడీఓ, ఏఓను సంప్రదించాలని సూచించారు. ఆశాజనకంగా ఆయిల్పామ్ ధర.. ఆయిల్పామ్ టన్ను ధర రైతులకు ఆశాజనకంగా మారుతోంది. ధర క్రమంగా పెరుగుతుండగా.. శనివారం ఆయిల్ఫెడ్ ఉన్నతాధికారుల సమావేశంలో టన్ను ధర మరో రూ.384 పెంచుతూ నిర్ణయించామని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. గత నెల టన్ను ధర రూ.20,487 ఉండగా, తాజా పెంపుతో రూ.20,871కి చేరింది. ఈ సీజన్లో అధికంగా ధర పెరగడం ఇదే తొలిసారి. కాగా, ధర పెంపుతో కొత్తగా పామాయిల్ సాగుకు రైతులు ముందుకొచ్చే అవకాశం ఉందని జీఎం చెప్పారు. తోటల సాగుకు కొత్త రైతులు ముందుకొస్తే నాణ్యమైన మొక్కలు అందిస్తామన్నారు. -
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి..
మణుగూరురూరల్: విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. శుక్రవారం మండలంలోని గుట్టమల్లారం గిరిజన సంక్షేమశాఖ ఇంగ్లిష్ మోడల్ పాఠశాలను, పగిడేరులోని ఎస్టీకాలనీలో గల జీపీఎస్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో బోర్డ్పై అక్షరమాల, అధికారుల పేర్లను రాయించారు. అక్షరాలు రాయడం, చదవడం, ఇంగ్లిష్ పదాలు పలకడంలో విద్యార్థులు వెనుకంజలో ఉన్నారని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏటీడీఓ అశోక్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వైద్యశిబిరం విజయవంతం మణుగూరురూరల్: మండలంలోని పగిడేరు గ్రామంలో ఐటీడీఏ సహకారంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా వైద్యశిబిరం విజయవంతమైంది. ఈ వైద్య శిబిరానికి మొత్తం 524 మంది హాజరు కాగా.. జనరల్ ఫిజీషియన్, ఎముకలు, చెవి, ముక్కు, గొంతు, పిల్లలు, కంటి, సీ్త్ర సంబంధిత వ్యాధి నిపుణులు ప్రజలకు వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. పలువురికి రక్త పరీక్షలు, 52 మంది గర్భిణులకు స్కానింగ్, 83 మందికి కంటి పరీక్షలు చేయగా.. 46 మందికి ఎక్స్రే తీశారు. వైద్యశిబిరాన్ని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ సందర్శించారు. కార్యక్రమంలో డీఐఓ బాలాజీనాయక్, మణుగూరు పీహెచ్సీ వైద్యుడు నిశాంత్రావు, వైద్యులు సాత్విక, సంజీవరావు, విజయ్, రాజశేఖర్, విక్టర్, ఖిల్లా, శైలేశ్, సిబ్బంది పాయం శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, లింగ్యానాయక్, రాముడు, రవి, వెంకన్న, వాణి తదితరులు పాల్గొన్నారు. -
రామాలయానికి రూ.4 లక్షల విరాళం
అశ్వాపురం: మండలంలోని మొండికుంటలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు మొదలుకానున్నాయి. ఈ సందర్భంగా ఆలయం మూలనిధికి గ్రామానికి చెందిన కందాల వెంకటరెడ్డి కుమార్తె ముద్దం చంద్రకళ–లచ్చిరెడ్డి దంపతులు శుక్రవారం రూ.4 లక్షల విరాళం అందజేశారు. గతంలోనూ ఈ దంపతులు రూ.6 లక్షలతో మకరతోరణం, శ్రీచక్రం, ఆకాశదీపాలు అందజేయడమే కాక ఆలయ ప్రాంగణానికి కావాల్సిన గ్రానైట్ రాయి సమకూర్చారు. ఈ సందర్భంగా చంద్రకళ – లచ్చిరెడ్డి కుటుంబీకులకు ఆలయ నిర్మాణ, ప్రతిష్ఠాపన కమిటీల బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు.శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి శుక్రవారం భక్తులు విరాళం అందజేశారు. ఖమ్మం శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన ముసునూరి రామారావు – విజయకుమారి దంపతులు రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు అందజేశాక స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఉద్యోగి సాయిబాబు పాల్గొన్నారు. టెన్నిస్ టోర్నీ సింగిల్స్ విజేత అధర్వశర్మ ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో వారం రోజులుగా కొనసాగుతున్న టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ విజేతగా అధర్వశర్మ(మహారాష్ట్ర) నిలిచాడు. చల్లపల్లి రాధమ్మ స్మారక టోర్నీలో భాగంగా సింగిల్స్ విభాగంలో శుక్రవారం ఫైనల్స్ నిర్వహించా రు. ఇందులో అధర్వశర్మ, ఓగెస్ థేయ్జో జయప్రకాశ్(తమిళనాడు) తలపడగా 1–6, 6–3, 6–3 తేడాతో శర్మ టైటిల్ కై వసం చేసుకున్నాడు. ఈమేరకు విజేతతో పాటు రన్నరప్కు వీవీసీ గ్రూప్ చైర్మన్ వీ.వీ.రాజేంద్రసాద్, డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డితో పాటు చల్లపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ కాసాని అనిల్, కాంపాటి సత్యనారాయణ, మద్దినేని వెంకట్ ట్రోఫీలు అందజేశారు. అలాగే, మొదటి నాలుగుస్థానాల్లో నిలిచిన క్రీడాకారులు, డబుల్స్ విజేతలు, రన్నరప్కు కలిపి మొత్తంగా రూ.2.50లక్షల నగదు బహుమతి అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఎఫ్బీఓపై దాడి.. ములకలపల్లి: ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీఓ)పై దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదైంది. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. పాల్వంచలోని నెహ్రూనగర్కు చెందిన తేజావత్ అనూష మండలంలోని ఒడ్డురామవరం ఎఫ్బీఓగా విధులు నిర్వహిస్తోంది. పూసుగూడెంనకు చెందిన భూక్యా నంద ఇంటి వద్ద టేకు కలప నిల్వ చేశారన్న సమాచారం మేరకు గురువారం సిబ్బందితో కలిసి దాడులు చేశారు. నందా భార్య సరిత, సోదరి సామిని ఎఫ్బీఓను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడికి పాల్పడ్డారు. తనిఖీల పేరుతో మరోమారు ఇంటికి వస్తే చంపుతామని బెదిరించారు. ఈ ఘటనపై ఎఫ్బీఓ అనూష శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దివ్యాంగుడి అదృశ్యం పాల్వంచ: ఇంట్లో గొడవపడి దివ్యాంగుడు ఆరు రోజుల కిందట కనిపించకుండా వెళ్లిపోయాడు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని గాంధీనగర్కు చెందిన ఎన్.సామిత్ కుడికాలుకు పోలియో ఉంది. ఆరు రోజుల కిందట ఇంట్లోని సభ్యులతో గొడవ పడి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ ఎక్కడా దొరక్క పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం బాటిళ్లు స్వాధీనం ఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామ పంచాయతీ కట్టుగూడెం గ్రామానికి చెందిన సునీల్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 21 మద్యం బాటిళ్లను ఎకై ్సజ్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా మద్యం బాటిళ్లను నిల్వ చేసి, విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సునీల్పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్లకు ఓకే..
● రిజిస్ట్రేషన్తో పాటే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేలా మార్గదర్శకాలు ● ఎన్నికల కోడ్ ముగియగానే అమలుఖమ్మంమయూరిసెంటర్: 2020 ఏడాదికి ముందు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం ఎల్ఆర్ఎస్ కింద 2020లో దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు రిజిస్ట్రేషన్ సమయాన ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు లేకుండా వేసిన వెంచర్లలో పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉంటే లింక్ డాక్యుమెంట్లతో పని లేకుండానే రిజిస్ట్రేషన్ చేసేలా ఈ ఉత్తర్వుల్లో పొందుపరిచారు. అంతేకాక ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఫీజు వసూలు అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులతో పాటు ప్రత్యేక మాడ్యూల్ సైతం విడుదల చేసింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2020 ఏడాది కంటే ముందే వేసిన వెంచర్లల్లోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఎన్నికల కోడ్ ముగియగానే.. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీ ప్రకటించినా ఇంకా అమల్లోకి రాలేదు. కోడ్ ముగిశాక రాయితీ అమల్లోకి వస్తుందని, ఆపై 2020 ఏడాదికి ముందు వేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నేరుగా సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని చెబుతున్నారు. తద్వారా రిజిస్ట్రేషన్ సంఖ్యతో పాటే ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది. -
సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలి
చర్ల: రబీలో పంటలు సాగు చేసిన రైతులు తాలిపేరు ప్రాజెక్టు నీటిని సమన్వయంతో సక్రమంగా వినియోగించుకోవాలని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టు ఈఈ రాంప్రసాద్ సూచించారు. ప్రాజెక్టు రెండో జోన్ పరిధిలోని పొలాలలకు సాగునీటిని విడుదల చేస్తుండగా చివరన గల పొలాలకు సాగునీరు అందకపోవడంపై రైతులు ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండో జోన్ పరధిలో లేనప్పటికీ కొన్ని చోట్ల పంటలు సాగు చేసిన రైతులు తాలిపేరు సాగునీటిని అక్రమంగా వినియోగిస్తున్నారని, తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాలిపేరు ప్రాజెక్టు ఈఈ, డీఈ, ఏఈ, జేఈలు రైతులతో కలిసి అనధికారికంగా సాగునీటిని వినియోగిస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులతో కలిసి ఆయకట్టు రైతులు తాలిపేరు ప్రాజెక్టును కూడా సందర్శించి నీటి నిల్వను, ఇన్ఫ్లోను పరిశీలించారు. నీటిని తోడేందుకు వినియోగిస్తున్న ఆయిల్ ఇంజన్లు, మోటార్లు, పైపులైన్లను వెంటనే తొలగించాలని సంబంధిత రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఈఈ రాంప్రసాద్ మాట్లాడుతూ.. తాలిపేరు ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో తగ్గిందని, ప్రస్తుతం ఉన్న నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈ తిరుపతి, ఏఈలు ఉపేందర్ పాల్గొన్నారు. -
ట్రాక్టర్ పైనుంచి పడి డ్రైవర్ మృతి
టేకులపల్లి: ట్రాక్టర్ పైనుంచి జారి.. ఇంజన్ కిందపడి డ్రైవర్ మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ బి.నరసింహారావు కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్తండాకు చెందిన మూతి ముత్తేశ్ (38) అదే గ్రామానికి చెందిన బాదావత్ హరిరామ్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కోయగూడెంలోని ఓ రైతు మిర్చి తోటలో పనిచేసిన మధ్యప్రదేశ్ కూలీలను ట్రాక్టర్లో తీసుకొస్తున్న క్రమంలో బావోజీతండా క్రాస్రోడ్లోని ముత్యాలమ్మ గుడి వద్దకు రాగానే ముత్తేశ్ అదుపుతప్పి ఎడమవైపు ఇంజన్ వెనుక టైర్ కింద పడ్డాడు. ట్రాక్టర్లో ఉన్న కూలీలు కేకలు వేస్తూ కొందరు కిందకు దూకేశారు. ఓ ఇద్దరు కూలీలు ధైర్యం చేసి ఇంజన్ మీదకు వెళ్లి బ్రేక్పై వేయడంతో పత్తి చేనులోకి వెళ్లి ఆగింది. ముత్తేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్తలాన్ని టేకులపల్లి సీఐ సురేశ్ సందర్శించి, వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో, బైక్ ఢీ : ఒకరు మృతి బూర్గంపాడు: ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఇరవెండి, మోతె గ్రామాల మధ్య ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ఉన్న, అశ్వాపురానికి చెందిన బండ్ల శ్రీనివాసరావు (35)రోడ్డుపక్కన పొదల్లో పడిపోయాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్కు సమాచారమిచ్చారు. అయితే అతను అప్పటికే మృతిచెందాడు. మృతుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సారపాకకు చెందిన ఉషశ్రీతో అతనికి వివాహమైంది. వారికి మూడేళ్ల పాప, నెలరోజుల బాబు ఉన్నారు. సారపాకలోని అత్తగారింటికి వచ్చి తిరిగి మోటార్ సైకిల్పై అశ్వాపురానికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆటోడ్రైవర్, మరో ఇద్దరు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామ శివారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈర్ల భరత్ (20) మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన నర్సింహారావు, సుశీల దంపతుల రెండో కుమారుడు ఈర్ల భరత్ ప్రస్తుతం హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఖమ్మంలో ఉంటున్నారు. మూడు రోజుల కిందట స్నేహితుని పుట్టినరోజు వేడుక పేరుతో ఇల్లెందుకు వచ్చిన భరత్.. ఇతర స్నేహితులతో కలిసి లాడ్జ్లో దిగినట్లు సమాచారం. మూడు రోజులు లాడ్జ్లోనే గడిపిన భరత్ శుక్రవారం తెల్లవారుజామున బైక్పై టేకులపల్లికి బయలుదేరాడు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడటంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భరత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు. -
పెళ్లి అన్నాడు, పాప పుట్టాక కాదన్నాడు...
● యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు తిరుమలాయపాలెం: అప్పటికే ఒకరి చేతిలో మోసపోయిన ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన దగ్గరి బంధువు పాప జన్మించాక ముఖం చాటేయడంతో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలాయపాలెంకు చెందిన యువతికి నాలుగేళ్ల క్రితం క్రితం వివాహం జరగగా, 16 రోజులకే భర్త మరో మహిళతో వెళ్లిపోయాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటూ జీవనం సాగిస్తోంది. రెండేళ్లుగా ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడుకు చెందిన మేనత్త కుమారుడు చిర్రా హరీశ్ వీరి ఇంటికి వచ్చివెళ్లే క్రమాన ఆమె అంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా దగ్గరయ్యాడు. దీంతో ఆమె గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చాక తనతో ఎలాంటి సంబంధం లేదని, పాప తనకు పుట్టలేదంటూ హరీశ్ బుకాయించాడు. ఈక్రమాన ఆమె మూడు నెలల పాపను తీసుకుని హరీశ్ ఇంటికి వెళ్లగా ఆయనతో పాటు తల్లిదండ్రులు, సోదరి ఇంటికి రావొద్దని, వస్తే చంపేస్తామని బెదిరించారు. ఈమేరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు. -
కాంట్రాక్ట్ కార్మికుడి దారుణ హత్య
మణుగూరుటౌన్: ఓబీ కంపెనీలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్కి చెందిన కార్మికుడిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోది, దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం మణుగూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్ రాష్ట్రం సిద్ధి జిల్లా గోహరి గ్రామానికి చెందిన మునిసింగ్ బిశ్వకర్మ (42) స్థానిక ఓ ఓబీ కంపెనీలో మెకానిక్ హెల్పర్గా పనిచేస్తున్నాడు. గాంధీనగర్ చర్చ్ సమీపంలోని ఓసీ–4 దుర్గా ఓబీ కంపెనీ పాత డంప్యార్డ్ వద్దకు బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తికి శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, పేకముక్కలు చిందరవందరగా పడేసి ఉండగా, అక్కడి మంచం నవారును మెడకు చుట్టి బండరాయితో తలపై మోది హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ సోమ సతీశ్, ఎస్ఐలు సందర్శించి డాగ్ స్క్వాడ్ ద్వారా ఓబీ కంపెనీ గ్యారెజీలో తనిఖీ చేశారు. కంపెనీ ప్రతినిధి ముత్తుతో పాటు పలువురిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కంపెనీ మెనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీశ్ పేర్కొన్నారు. ముగ్గురు నిర్దోషులుగా తీర్పు భద్రాచలంటౌన్: నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నారనే అంశంలో ముగ్గురిపై కేసు నమోదు కాగా, విచారణలో నేరం రుజువు కానందున నిర్దోషులుగా భద్రాచలం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి వి.శివనాయక్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2013లో ములకలపల్లి అశోక్, కొండసాని రాము, కత్తుల వెంకటేశ్వర్లుపై రూ.3 వేలు అసలు నోట్లు ఇస్తే రెట్టింపు నకిలీ నోట్లు ఇస్తామని చెప్పారనే అభియోగంపై కేసు నమోదైంది. ఈ మేరకు భద్రాచలం టౌన్ పోలీసులు చారి్జ్షీట్ దాఖలు చేయగా, విచారణలో నేరం రుజువు చేయలేకపోవడంతో వీరిని నిర్దోషులుగా తీర్పు చెప్పారు. ఇసుక లారీ సీజ్ ములకలపల్లి: అనుమతుల్లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. జగన్నాథపుర వైపు ఇసుక తరలిస్తున్నట్లు అందిన నమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. కంపగూడెం క్రాస్ రోడ్డు వద్ద ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీని సీజ్ చేసి, పోలీస్స్టేషన్కు తరలించారు. -
ఉన్నత శిఖరాల వైపు పయనించాలి
దుమ్ముగూడెం : చదువుకుని గ్రామాల్లో ఉన్న యువత బయట ప్రపంచంలోకి వచ్చి, ఉన్నత శిఖరాల వైపు పయనించాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ములకపాడు వైద్యశాల క్రీడా మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండలస్థాయి వాలీబాల్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాలీబాల్ పోటీలకు 54 గ్రామాల నుంచి టీంలు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. దుమ్ముగూడెం మండలంలో సుమారుగా రూ. 2 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి, మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని సూచించారు. ఆ తర్వాత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించారు. స్టేడియంలో సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారుర. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ పరితోజ్ పంకజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, 141 బెటాలియన్ సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రేవతి అర్జునన్, సీఐ అశోక్, ఎస్ఐలు వెంకటప్పయ్య, పోటు గణేష్ పాల్గొన్నారు. వ్యాయామం అవసరంభద్రాచలంటౌన్: యువత శారీరక దృఢత్వం కోసం రోజూ వ్యాయామం చేయాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. పట్టణంలోని టెంపుల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ను ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. సీఐ రమేష్, ఎస్ఐ మధు ప్రసాద్ పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజు -
వృత్తివిద్యపై దృష్టి సారించాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పాల్వంచ: యువత వృత్తి విద్యా కోర్సులపై దృష్టి సారించాలని, మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నవలిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తన్న ఒకేషనల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్, మహిళా సాధికార కేంద్రాలను శుక్రవారం సందర్శించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించి మాట్లాడారు. వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. నవలిమిటెడ్ అధికారులు ఎంజీఎం.ప్రసాద్, సంజీవరావు, ఖాదారేంద్ర బాబు, సాంబశివరావు, శ్రీనివాసరావు, యుఎస్ఎన్.శర్మ పాల్గొన్నారు. -
స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, పూజలు చేశారు పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈఓ సుదర్శన్ పాల్గొన్నారు. మొదటి విడత తునికాకు టెండర్లు ఖరారుపాల్వంచరూరల్: తునికాకు సేకరణ టెండర్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. ఈ ఏడాది తునికాకు సేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్ధ గురు, శుక్రవారాల్లో మొదటి దఫాలో పలు యూనిట్లకు టెండర్లు ఖరారు చేసింది. రెండో విడత ఈ నెల 10,11 తేదీల్లో, మూడో విడత 20,21వ తేదీల్లో టెండర్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు సంస్థ డీఎం పృథ్వీరాజ్ వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో 39 యూనిట్లలో గతేడాది కూడా ఆలస్యంగా టెండర్లు నిర్వహించారు. 35,100 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యంగా నిర్దేశించగా, నాలుగో విడతలో పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు ఖరారు చేసుకున్నారు. ఇక ఖమ్మం జిల్లాలోని ఐదు యూనిట్లు ఉండగా, ఒక్క యూనిట్పైనా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. దీంతో గతేడాది ఖమ్మం జిల్లాలో తునికాకు సేకరణ జరగలేదు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
పాల్వంచ: మోటార్ సైకిల్పై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సంజయ్నగర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా.. బైక్పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. తనికీ చేయగా వారి వద్ద రూ.3.90 లక్షల విలువ చేసే 7.8 కేజీల గంజాయి దొరికింది. పట్టుబడిన వ్యక్తులు సికింద్రాబాద్కు చెందిన అభిరామ్, చంద్రశేఖర్గా తేలగా.. వారు సీలేరు ప్రాంతం నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ రాఘవయ్య తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది రమేశ్, రాజశేఖర్, వేణు, లక్ష్మణ్ పాల్గొన్నారు. చోరీ నిందితుడి అరెస్ట్ జూలూరుపాడు: మాచినేనిపేటతండాకు చెందిన బానోత్ బాలు ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ బాదావత్ రవి కథనం ప్రకారం.. ఈ నెల 25వ తేదీ రాత్రి బాలు ఇంట్లోకి ఖమ్మం నగరం అగ్రహారం కాలనీకి చెందిన ఎస్కే నదీమ్పాషా ప్రవేశించి బంగారం, నగదు అపహరించాడు. శుక్రవారం స్థానిక ఉప మార్కెట్ యార్డు సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా పోలీసులను గమనించిన నదీమ్పాషా ఆటోతో పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంబడించి పట్టుకొని, విచారించగా తానే చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించామని ఎస్ఐ రవి వివరించారు. -
విద్యాశాఖపై అవినీతి మరకలు
పాల్వంచ: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వరుసగా అవినీతి నిరోధక శాఖకు చిక్కుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. విద్యాబుద్ధులు నేర్పే గురువులు లంచం తీసుకుంటూ విద్యార్థుల ఎదుటే అరైస్టె జైలుకు వెళ్తున్నారు. 2023 సెప్టెంబర్లో మధిర హెచ్ఎం మాతంగి శ్రీలత రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. మన ఊరు–మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు బిల్లులు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసి దొరికియారు. గత జనవరి 25న ఇల్లెందు ప్రభుత్వ మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ బి.కృష్ణ, ఆఫీస్ అటెండర్ కొచ్చెర్ల రామకృష్ణ రూ.2 వేలు లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులకు జీతాల బిల్లులు చేసేందుకు లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డారు. తాజాగా కొత్తగూడెం కూలీలైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. విద్యార్థులకు, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు లంచావతారం ఎత్తుతుండటంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక హాస్టళ్లలో కూడా హెచ్ఎంలు, వార్డెన్లు, అధికారులు మామూళ్లకు అలవాటుపడ్డారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో చైతన్యం వస్తోంది అవినీతి అధికారులను పట్టించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రజలు చైతన్యంతో ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగి పట్టుకుంటున్నాం. లంచం అడిగితే 1064 టోల్ఫ్రీ నంబర్కు, 9154388981 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. –వై.రమేష్, ఏసీబీ డీఎస్పీ -
గని కార్మికులకు జడ్జి అభినందన
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికులు వందల అడుగుల లోతులో పనిచేస్తూ, వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్నారని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి.భానుమతి పేర్కొన్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నారని అభినందించారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5షాఫ్ట్ గనిని శుక్రవారం ఆమె సందర్శించారు. బొగ్గు గని కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బొగ్గు ఉత్పత్తి, రక్షణ చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కార్మికులు హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ నిరంజన్ రావు, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు, సింగరేణి అధికారులు రవీందర్, శ్యాంప్రసాద్, షకీల్, హుమాయిన్, సీతారామ్, వి.కృష్ణవేణి, అనుపమ పాల్గొన్నారు. పారా లీగల్ వలంటీర్ల బాధ్యత కీలకం కొత్తగూడెంఅర్బన్: పారాలీగల్ వలంటీర్ల బాధ్యత కీలకమని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. శుక్రవారం వలంటీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వృద్ధాశ్రమం, మానసిక వికాస కేంద్రాల్లో సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నల్సా స్కీమ్ను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కౌన్సిల్ పి.నిరంజన్రావు, న్యాయవాదులు జి. రామచంద్రరెడ్డి, షాజహాన్ పర్వీన్, జి.సునంద, మెండు రాజమల్లు, పార్వతి, మహాలక్ష్మి, పారా లీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఆపదలో అండగా..
సామాజిక బాధ్యత ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతగా సింగరేణి స్పందిస్తోంది. సుశిక్షితులైన సింగరేణి రెస్క్యూటీం బ్రిగేడియర్లు తక్షణమే రంగంలోకి దిగుతున్నారు. మేడారం జాతర, శ్రీరామనవమి, పుష్కరాలు వంటి పర్వదినాలు, తుపానులు, గోదావరి వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మేమున్నామంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దీంతో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సైతం ఆపత్కాలంలో సింగరేణి వైపు చూస్తోంది.సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో బాధితులను కాపాడే రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి తన వంతు సాయం అందిస్తోంది. ప్రతి ఏటా గోదావరి వరదలు, మేడారం జాతర వంటి సందర్భాల్లోనూ సేవలందిస్తోంది. బొగ్గు తవ్వకాలు ప్రారంభించిన తర్వాత భూగర్భంలో నీటి ఊటలు రావడం, పై కప్పు కూలిపోవడం, విషవాయువులు లీక్ అవడం వంటి ప్రమాదాలు జరిగేవి. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై కార్మికులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తారు. అయినా ఊహించని ప్రమాదాల వల్ల గనుల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సింగరేణి రెస్క్యూ టీమ్లను ఏర్పాటు చేసింది. అవసరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు ఆధునిక పరికరాలను సమకూరుస్తోంది. 500 మందికి పైగా.. సింగరేణి సంస్థలో భూగర్భ గనుల్లో పని చేసే కార్మికుల్లో 21 నుంచి 30 ఏళ్లలోపు వయసు, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవారు రెస్క్యూటీమ్లో చేరేందుకు అర్హులు. ఇలా ఎంపికై న వారికి రామగుండం రీజియన్ (గోదావరిఖని)లోని ప్రధాన రెస్క్యూ సెంటర్లో 14 రోజులపాటు శిక్షణ ఇస్తారు. తుపానులు, వరదలు, క్రౌడ్ మేనేజ్మెంట్, అగ్నిప్రమాదాలు, నిర్మాణాలు కూలిపోవడం, రోడ్డు ప్రమాదాలు తదితర విపత్కర పరిస్థితుల్లో సేవలు ఎలా అందివ్వాలనే అంశాలను శిక్షణలో నేర్పిస్తారు. ఆ తర్వాత సంస్థలోని మూడు ప్రధాన రీజియన్లలో ఉన్న కొత్తగూడెం, భూపాలపల్లి, మందమర్రి రెస్క్యూ సెంటర్లకు వీరిని కేటాయిస్తారు. ఇక్కడ ప్రతీనెల రీజినల్ రిఫ్రెష్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. రీజినల్ సెంటర్లలో షిఫ్ట్నకు ఐదుగురు బ్రిగేడియర్లు, ముగ్గురు శిక్షకులు.. ఎనిమిది మందితో కూడిన బృందం సిద్ధంగా ఉంటుంది. గోదావరిఖనిలో పద్దెనిమిది మందితో కూడిన మూడు బృందాలు అప్రమత్తంగా ఉంటాయి. సంస్థవ్యాప్తంగా 500 మందికి పైగా బ్రిగేడియర్లు ఆపదల్లో సాయం చేసేందుకు రెడీగా ఉన్నారు. ఆధునిక పరికరాలు రెస్క్యూ బృందానికి చెందిన బ్రిగేడియర్లు వరదలు, అగ్నిప్రమాదాలు, జనసమ్మర్థం తదితర సమయాల్లో ఎలా స్పందించాలనే అంశాలపై శిక్షణ పొందినా ఆధునిక పరికరాల సాయం లేకుంటే ఆ నైపుణ్యాలు అక్కరకు వచ్చేది అంతంతే. దీంతో రెస్క్యూ బృందాలకు ఆధునిక పరికరాలు సమకూర్చడంలో సింగరేణి శ్రద్ధ పెట్టింది. ప్రమాదాలు జరిగినప్పుడు పెద్ద బరువులు ఎత్తేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్టులతోపాటు గ్యాస్ కట్టర్లు, స్ప్రెడర్లు, రాక్డ్రిల్స్ తదితర పరికరాలు అందుబాటులో ఉంచింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు కట్టర్లు, స్ప్రెడర్లు ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లోనూ ఈ పరికరాలు ఉపయోగపడుతున్నాయి. ఎస్ఎల్బీసీలో 250 మందితో.. ఎస్ఎల్బీసీ ఆపరేషన్లో సింగరేణి రెస్క్యూ బృందానికి చెందిన 250 మంది సభ్యులు గడిచిన రెండు రోజులుగా పాల్గొంటున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి 24 గంటలు సహాయక చర్యల్లో చెమటోడ్చుతున్నారు. టన్నెల్లో కూలిపోయిన బోరింగ్ మిషన్ భాగాలను గ్యాస్ కట్టర్ల సాయంతో తొలగిస్తున్నారు. టన్నెల్ ట్రాక్ను పునరుద్ధరించేందుకు అడ్డుగా ఉన్న గడ్డర్లు, ఇనుప పైపులను తొలగించే పనిలో శ్రమిస్తున్నారు. దీంతోపాటు బాఽధితులు ఉన్న ప్రదేశాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకునేందుకు వీలుగా జీపీఐ (గ్రౌండ్ పెనట్రేటింగ్ పరికరాలు) బిగించే పనిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి పనిచేస్తున్నారు. సీఎండీ బలరాంనాయక్, జీఎం అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు.విపత్కర పరిస్థితుల్లో ఆదుకుంటున్న సింగరేణి రెస్క్యూ బృందాలు నాలుగు రెస్క్యూ సెంటర్లు, 500 మందికి పైగా బ్రిగేడియర్లు ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో 250 మంది సభ్యుల సేవలు తుపానులు, వరదలు, పర్వదినాల్లోనూ ప్రజాసేవకు సిద్ధం -
ఏసీబీకి చిక్కిన హెచ్ఎం
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమేష్ కథనం ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కరాటే నేర్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పాఠశాలకు రూ.30 వేలు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో కొత్తగూడెంలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలకు రూ.30 వేలు విడుదల చేసింది. దీంతో ఓ శిక్షకుడి చేత విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పిస్తున్నారు. శిక్షణ ఏప్రిల్తో ముగియనుంది. ఈ క్రమంలో కరాటే నేర్పించిన శిక్షకుడికి ఇప్పటికే రూ.10 వేలు చెల్లించారు. మిగతా రూ.20 వేలు తనకు ఇవ్వాలని పాఠశాల హెచ్ఎం తాటి రవీందర్ డిమాండ్ చేశారు. దీంతో శిక్షకుడు ఏసీబీకి సమాచారం అందించగా, వారు వలపన్ని హెచ్ఎంకు రూ.20 వేలు డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. గత రెండు నెలల కాలంలో విద్యాశాఖలో ముగ్గురు అధికారులు ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. కాగా కూలీలైన్ పాఠశాలలో రెండు నెలలుగా గతంలో ఉన్న హెచ్ఎం, ప్రస్తుత హెచ్ఎం మధ్య వర్గపోరు జరుగుతోందని, పరస్పరం రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని, విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రవీందర్ -
‘ఆఫ్టైప్’ నష్టాన్ని పూడ్చేదెవరు?
● నాణ్యతలేని ఆయిల్పామ్ మొక్కలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ● నష్టపరిహారం కోసం ఎదురుచూపులు ● నిబంధనలు పాటించని అధికారులు ● స్పందించని ఆయిల్ ఫెడ్ యాజమాన్యం దమ్మపేట: తెలంగాణ ఆయిల్ ఫెడ్ పరిధిలోని నర్సరీల్లో మొక్కల పెంపకంలో అధికారుల సరైన పర్యవేక్షణ, నిబంధనలు పాటించని కారణంగా పంపిణీ చేసిన ఆఫ్టైప్ పామాయిల్ మొక్కల సాగుతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పరిహారం కోసం రైతులు ఎదురుచూస్తుండగా, ఆయిల్ ఫెడ్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 89 వేల ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ పంటను సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు వేల సంఖ్యలో ఆఫ్టైప్ మొక్కలు రావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమకు ఆఫ్టైప్ మొక్కలు వచ్చాయనే అవగాహన కూడా లేక వాటిని తొలగించి, కొత్త మొక్కలను నాటిన ఘటనలు అనేకం ఉన్నాయి. నర్సరీలో విత్తన దశ నుంచి మొక్కగా పెరుగుతున్నప్పుడే.. ఈ ఆఫ్టైప్, నాణ్యత లేని మొక్కలను గుర్తించలేకపోవడం, ఆయిల్ ఫెడ్ నర్సరీ అధికారుల అసమర్థతకు నిదర్శనమని రైతులు ఆరోపిస్తున్నారు. మొక్కల పెంపకానికి అవసరమైన విత్తనాల ఎంపికలో కూడా ఆయిల్ ఫెడ్ అధికారులు నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో ఐదేళ్లపాటు సొంత పెట్టుబడితో మొక్కలను పెంచిన తర్వాత అవి ఆఫ్టైప్కి చెందినవని, వాటి వల్ల ఏమాత్రం దిగుబడి రాదని తెలియడంతో రైతులు నిర్ఘాంత పోయారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. దీంతో పంట దిగుబడి రాని చెట్లను జేసీబీల సాయంతో పెకిలించారు. నర్సరీలో మొక్కల పెంపకం తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నర్సరీలో విత్తనాల నుంచి పామాయిల్ మొక్కలను పెంచుతారు. కొస్టారికా, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి మేలు రకం విత్తనాలను తీసుకొచ్చి, వీటి ద్వారా మొక్కలను నాలుగు నెలల పాటు షేడ్ నెట్లో పెంచుతారు. ఈ మొక్కల పెంపకాన్ని ఒక కాంట్రాక్టర్కు అప్పగించి, ఆయిల్ ఫెడ్ పరిధిలోని అధికారులు, సూపర్వైజర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలి. అనంతరం ఎనిమిది నెలల పాటు బయట ప్రదేశంలో పెంచుతారు. మొక్కలు షేడ్ నెట్లో ఉండగానే ఎదుగుదలలో లోపాల ఆధారంగా, ఈ ఆఫ్టైప్, నాణ్యత లేని మొక్కలను ముందుగానే గుర్తించవచ్చు. కానీ అధికారులు ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యహరించారని తెలుస్తోంది. ఆఫ్టైప్ మొక్కలను గుర్తించిన వెంటనే నిబంధనల ప్రకారం వాటిని నర్సరీ నుంచి తొలగించాలి. ఏడాదిపాటు మొక్కల పెంపకం పూర్తయిన అనంతరం, వాటిలో కొన్ని మొక్కలను నమూనాలుగా సేకరించి, నాణ్యత నిర్ధారణ కోసం ఏపీలోని ఏలూరు జిల్లా పెదవేగిలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్పామ్ రీసెర్చ్ సెంటర్కు పంపాలి. అక్కడ ఉద్యాన పంటల శాస్త్రవేత్తలు నాణ్యతను పరిశీలించి సాగుకు యోగ్యమైననని నిర్ధారించిన తర్వాత మాత్రమే రైతులకు మొక్కలను పంపిణీ చేయాలి. కానీ, ఏనాడు మొక్కలను పరిశీలనకు పంపిన సందర్భాలే లేవని రైతులు చెబుతున్నారు. నిబంధనల అతిక్రమణ విత్తనాల ఎంపికలో ఆయిల్ ఫెడ్ అధికారుల నిబంధనల అతిక్రమణ, అసమర్థత కారణంగానే ఎక్కువ సంఖ్యలో ఆఫ్టైప్, నాణ్యతలేని మొక్కలు నర్సరీలో పెరిగాయనేది రైతుల ఆరోపణ. నర్సరీలోని షేడ్ నెట్లో ఉండగానే నాణ్యత లేని, ఆఫ్టైప్ మొక్కలను అధికారులు గుర్తించాలి. అశ్వారావుపేట డివిజన్ నర్సరీలో 2016 నుంచి 2024 వరకు పంపిణీ చేసిన మొక్కల్లో చాలావరకు నాణ్యతలేని, ఆఫ్టైప్ మొక్కలు ఉన్నట్టు రైతులు చెబుతున్నారు. విత్తన కంపెనీలతో అధికారుల లోపాయికారీ ఒప్పందాలు, నాణ్యతలో రాజీపడి ఈ నాణ్యత లేని, ఆఫ్టైప్ మొక్కలను నర్సరీల్లో పెంచారని సమాచారం. ఆఫ్టైప్, నాణ్యత లేని మొక్కలతో కొంతమంది రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఎకరా విస్తీర్ణంలో 50 నుంచి 57 పామాయిల్ మొక్కలను సాగు చేస్తారు. వీటిల్లో ఒకటి లేదా రెండు మొక్కలు ఆఫ్టైప్ రావడం సాధారణమే. కానీ, ఎకరంలో ఐదు నుంచి ఇరవై వరకు ఆఫ్టైప్, కల్లింగ్ మొక్కలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల పాటు మొక్కలను సాకిన తర్వాత అవి ఆఫ్టైప్ అని తెలియడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. పరిహారం చెల్లించాలి ఆఫ్టైప్ మొక్కలతో నష్టపోయిన వారికి మొక్కల సంఖ్య ఆధారంగా పరిహారం చెల్లించాలి. పట్వారిగూడెం, జగ్గారంలో 30 ఎకరాల్లో 2016 – 17లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించా. అందులో 150 ఆఫ్టైప్, 100 నాణ్యత లేని, అంతగా దిగుబడి రాని మొక్కలుగా తేలాయి. పరిహారం కోసం ఆయిల్ ఫెడ్ అధికారులను సంప్రదిస్తే కొత్త మొక్కలు మాత్రమే ఇస్తామని చెప్పారు. –చెలికాని సూరిబాబు, జగ్గారం, దమ్మపేట మండలం నేనే సరిగ్గా సాగు చేయలేదన్నారు.. 2018లో 12 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు మొదలు పెడితే ఐదేళ్ల అనంతరం దిగుబడి సమయాన 250 ఆఫ్టైప్ మొక్కలు ఉన్నాయని తేలింది. సూపర్వైజర్లు కూడా పరిశీలించారు. ఆ తర్వాత ఆయిల్ ఫెడ్ నుంచి స్పందన లేక హైకోర్టును ఆశ్రయించా. దీంతో నాకు న్యాయం చేయాలని సూచించింది. కానీ, నేను సరిగా సాగు చేయలేదంటూ రిట్ వేసినట్టు తెలిసింది. –పుచ్చకాయల సోమిరెడ్డి, రైతు, నారాయణపురం, సత్తుపల్లి మండలం కొత్త మొక్కలు ఇస్తున్నాం ఆఫ్టైప్ మొక్కల ద్వారా నష్టపోయిన రైతులకు వాటి స్థానంలో కొత్త మొక్కలను ఉచితంగా అందజేస్తున్నాం. నేను ఈ మధ్యనే చార్జ్ తీసుకున్నాను. ఆఫ్టైప్ మొక్కలు వచ్చినట్లు ఇప్పుడిప్పుడే నా దృష్టికి వస్తోంది. కానీ, ఆఫ్టైప్ మొక్కలకు నష్ట పరిహారం ఇవ్వాలనే అంశంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నా పరిధిలోనిది కాదు. –నాయుడు రాధాకృష్ణ, నర్సరీ ఇన్చార్జ్, అశ్వారావుపేట -
జాగా కొలిచేదెట్లా?
ఉమ్మడి జిల్లాలో భూ సర్వే సమస్యలు పేరుకుపోతున్నాయి. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వ్యవస్థతో హద్దులు, కొలతలకు సంబంధించిన అర్జీలు కూడా పెరిగిపోతున్నాయి. చాలా సర్వే నంబర్లలో భూ వివాదాలు నెలకొన్నాయి. మరోవైపు కొలత వేసి హద్దులు నిర్ధారించే, మ్యాపులు అందించే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోవడంలేదు. సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్, చైన్మన్లు ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఉన్నవారు పని ఒత్తిడిని ఎదుర్కొవాల్సివస్తోంది. –పాల్వంచరూరల్సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, చైన్మన్ తదితర 18 రకాల పోస్టులు ఉంటాయి. పెరుగుతున్న అవసరాల రీత్యా అదనపు పోస్టులను మంజూరు చేయకపోగా ప్రభుత్వం ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 114 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 74 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంకా 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కీలకమైన డిప్యూటీ సర్వేయర్ పోస్టులు 19 ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సర్వేయర్ 11, చైన్ మన్ పోస్టులు 3, ఇతర సిబ్బంది 9 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. భద్రాద్రి జిల్లాలో సర్వే ఇన్స్పెక్టర్ 1, సర్వేయర్ 2, డిప్యూటీ సర్వేయర్ 8, చైన్మన్ 1, ఇతర సిబ్బంది ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక మండలాల్లో అధికారుల కొరత ఉండటంతో ఇతర మండలాలవారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో పనిభారం పెరిగి భూముల హద్దుల గుర్తింపు అర్జీలు పరిష్కరించలేకపోతున్నారు. ఫలితంగా భూ సర్వే కోసం దరఖాస్తుదారులు ఏళ్లతరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దశాబ్దాల నాటి రికార్డుల ప్రకారమే సర్వే చేయాల్సి వస్తుండగా, ఏళ్లు గడుస్తున్నా భూ హద్దుల వివాదం తేలడంలేదు. సరైన హద్దు రాళ్లులేక సర్కారు భూములు, బఫర్ జోన్, చెరువు శిఖం వంటివి ఆక్రమణకు గురవుతున్నాయి. 45 రోజుల్లో పరిష్కరించాల్సి ఉన్నా... భూ పంపకాలు, భూ యజమానుల మధ్య గట్టు వివాదాలు తలెత్తినా, క్రయ, విక్రయాల సమయంలో సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటారు. నిబంధనల ప్రకారం సర్వే దరఖాస్తులను తహసీల్దార్లు పరిశీలించి 45 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. సర్వేయర్లతో భూ కొలతలు తీసుకుని దరఖాస్తుదారుడికి నివేదికలు అందించాల్సి ఉంటుంది. కానీ సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ల కొరత కారణంగా భూ కొలతలు ఎప్పుడు చేపడతారో తెలియని పరిస్థితి నెలకొంది. రీ సర్వే జరగక సమస్యలు జఠిలం.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, అటవీ ఇతర భూముల్లో రీ సర్వే జరగకపోవంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అనేక చోట్ల స్పష్టమైన హద్దుల్లేక అనుభవదారుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. గ్రీవెన్స్డేతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో వీటికి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి సారించి సర్వేశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, అవసరమైన అదనపు పోస్టులను మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు. అదనపు పోస్టులేవి..? నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత నూతన పోస్టులు మంజూరు కాలేదు. ఖాళీలూ భర్తీ చేయలేదు. దీంతో భద్రాద్రి జిల్లా ఏడీగా ఖమ్మం జిల్లా ఏడీ శ్రీనివాసరావుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టం అమల్లోకి వస్తే భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు భూ పటం(నక్ష) తప్పనిసరి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డిప్యూటీ సర్వేయర్ల పోస్టుల్లో పూర్వ వీఆర్వో, వీఆర్ఏల్లో ఆసక్తి కలిగిన వారిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఖాళీ పోస్టుల భర్తీపై భూమి కొలతలు, రికార్డుల నిర్వహణ శాఖ ఏడీ శ్రీనివాస్రావును వివరణ కోరగా.. సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు, ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. భూ సర్వేశాఖ పునర్ వ్యవస్థీకరణపై ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వే విభాగంలో సిబ్బంది కొరత రెండు సర్వేయర్, 19 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఖాళీ ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో 445 దరఖాస్తులు ఏళ్లు గడుస్తున్నా హద్దులు, కొలతలు తేలని భూ వివాదాలు ఉమ్మడి జిల్లాలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో పోస్టుల వివరాలు.. జిల్లా మొత్తం పనిచేస్తున్న ఖాళీలు పోస్టులు సిబ్బంది ఖమ్మం 62 39 23 భద్రాద్రి 52 35 17 మొత్తం 114 74 40దరఖాస్తుల వివరాలు ఇలా.. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 2016 నుంచి ఇప్పటివరకు భూ కొలతల కోసం 7,123 దరఖాస్తులు అందాయి. ఇందులో 5,311 దరఖాస్తులను తిరస్కరించారు. 76 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 21 మండలాల నుంచి 2021 నుంచి ఇప్పటివరకు 13,726 దరఖాస్తులు రాగా, వీటిలో 6,354 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 369 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మిగిలిన అర్జీలను పరిష్కరించారు. -
నేటి నుంచి కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: డీఎస్సీ–2024 ద్వారా నియమితులైన 258 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు శుక్రవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు మూడు రోజులపాటు వృత్యంతర శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన విద్యా విధానంలో పిల్లలకు తరగతి గదిలో బోధన, అభ్యసన కృత్యాలు ఎలా సాగించాలి, వర్క్ బుక్, పాఠ్యపుస్తకాలు ఉపయోగించే విధానం, బహుళ తరగతి బోధన, పరీక్షా విధానాలు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా నుంచి 12 మంది జిల్లా రిసోర్స్పర్సన్లు ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన శిక్షణ కార్యక్రమానికి హాజరై వచ్చారని తెలిపారు. వారు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమానికి అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని వెల్లడించారు. -
టీచర్ ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి గెలుపు ఖాయం
టేకులపల్లి: ఖమ్మం – నల్లగొండ – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మరోమారు అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపు ఖాయమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా టేకులపల్లిలో గురువారం పోలింగ్ కేంద్రాల వద్ద ఆయన ఉపాధ్యాయులను కలిసి మాట్లాడారు. గత ఆరేళ్లలో ఉపాధ్యాయులు, సీఆర్టీలు, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసమే కాక విద్యారంగ అభివృద్ధికి నర్సిరెడ్డి కృషి చేశారని తెలిపారు. తద్వారా మరోమారు ఆయనను గెలిపించాలని ఉపాధ్యాయులు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఉద్యమ సంఘాలైన టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్ బాధ్యలంతా ఇందుకోసం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.హరిలాల్నాయక్తో పాటు టీపీటీఎఫ్, టీఎస్ యూటీఎఫ్ బాధ్యులు బి.కిషోర్సింగ్, వి.వరలక్ష్మి, బి.మాన్సింగ్, డి.హరికుమార్, బి.రామరాజు, రేపాకుల శ్రీనివాస్, ఎం.డీ.మౌలానా, టి.బిక్షమయ్య, వి.కాంతారావు, గుమ్మడి కృష్ణవేణి, మంజీలాల్, బి.వీరన్న, కడుదుల వీరన్న, ఈసం నర్సింహారావు పాల్గొన్నారు. -
మ్యూజియంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియాన్ని పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. మ్యూజియం కమిటీ సభ్యులతో కలిసి ఆయన గురువారం మ్యూజియం పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్న బాక్స్ క్రికెట్ గ్రౌండ్తోపాటు బోటింగ్ కోసం సిద్ధం చేసిన చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 10వ తేదీలోగా పనులు పూర్తి కావాలని చెప్పారు. అన్ని గిరిజన తెగల ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన బుక్లెట్ తయారు చేయించాలని, కోయ భాషలో స్వాగతం పలికే పెయింటింగ్ వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్, ఉదయభాస్కర్, ప్రభాకర్ రావు, హరీష్, హరికృష్ణ, గోపాల్ రావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలి అశ్వాపురం: గిరిజన రైతులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. మండల పరిధిలోని చింతిర్యాలగూడెంలో విఘ్నేశ్వర రైతు ఉత్పత్తి దారుల సంఘం గోదాంను గురువారం ఆయన సందర్శించారు. యంత్ర పరికరాలు అందజేయాలని రైతులు ఈ సందర్భంగా పీఓను కోరారు. అనంతరం పీఓ మాట్లాడుతూ అశ్వాపురంలో 550 మెట్రిక్ టన్నుల గోదాం ఉన్నందున రైతులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. నాబార్డు, ఐటీడీఏ సహకారంతో అందించిన ట్రాక్టర్, యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పంటలపై మందులు చల్లేందుకు స్ప్రే డ్రోన్ యంత్రం మంజూరుకు కృషి చేస్తామన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో 9మందిపై కేసు
కొణిజర్ల: కొణిజర్ల మండలం లింగగూడెం, అమ్మపాలెం పరిధి ఇండోఖతార్ వెంచర్స్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించిన ఘటనలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ గుగులోత్ సూరజ్ గురువారం తెలిపారు. గ్రీన్ల్యాండ్ వెంచర్స్ యజమానులు నాలుగేళ్ల క్రితం వెంచర్లో విల్లాల డెవలప్మెంట్ కోసం పొలిశెట్టి గిరికి కొంత స్థలం అప్పగించారు. ఆయన విల్లాలు నిర్మించి అమ్ముతుండగా, గత ఏడాది డిసెంబర్ 28న వెంచర్స్ యజమానులు తనకు తెలియకుండా 64 ప్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని, అందులో అప్పటికే అమ్మేసిన విల్లాలు కూడా ఉన్నాయని వైరా ఏసీపీ, సబ్ రిజిస్ట్రార్కు గిరి ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ అనంతరం ఎం.రాము, ఎం.కిషోర్, కె.శరత్, బి.రాంబాబు, అరవింద్, అజయ్, వసీమ్, రాజా, ఉపేందర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. లారీ ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలుదమ్మపేట: బైక్ను లారీఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని అచ్యుతాపురం క్రాస్ రోడ్డు వద్ద గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... అశ్వారావుపేట మండలం పేరాయిగూడేనికి చెందిన యువకు డు రమేష్ సత్తుపల్లి మండలం గంగారంలోని ఓ వ్యక్తి వద్ద కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు. గురువారం విధులు ముగించుకుని బైక్పై గంగారం నుంచి అశ్వారావుపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో అచ్యుతాపురం క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. దీంతో రమేష్కు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. గుండె నొప్పితో సింగరేణి కార్మికుడి మృతిసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లిలోని కిష్టారం ఓసీలో ట్రిప్మెన్గా విధులు నిర్వహిస్తున్న బొడ్డు శ్రీనివాస్(52) గురువారం గుండెనొప్పితో మృతి చెందాడు. అతను ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలో షిప్ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా, మేకప్మెన్గా కూడా పనిచేస్తున్నాడు. గురువారం వార్షికోత్సవం సందర్భంగా సెయింట్ మేరీస్ పాఠశాలలో పిల్లలకు మేకప్ వేసి ఇంటికి వెళ్తూ ఒకేసారి కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కల్లంలో ఆరబోసిన మిర్చి చోరీ
కామేపల్లి: కల్లంలో ఆరబెట్టిన మిర్చిని గుర్తు తెలియ ని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన ఇది. మండలంలోని ముచ్చర్లకు చెందిన రైతు జాల శివకృష్ణ ఇటీవల మిర్చి కోయించి కల్లంలో ఆరబెట్టాడు. బుధవారం తీర్థాల జాతరకు వెళ్లిన ఆయన గురువారం తెల్ల వారుజామున కల్లం వద్దకు వచ్చేసరికి సుమారు 10 బస్తాల్లో మిర్చిని ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. అంతేకాక మరో ఎనిమిది బస్తాల్లో మిర్చి నింపి ఉండడంతో చుట్టుపక్కల గాలించగా.. ఎలక్ట్రికల్ స్కూటీ కనిపించింది. చోరీ చేసిన మిర్చి విలువ రూ.60 వేల వరకు ఉంటుందని, నిందితులను గుర్తించి తనకు న్యాయం చేయాలని శివకృష్ణ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. -
‘సీతారామ’ నీరు విడుదల
అశ్వాపురం: మండలంలోని బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్ట్ ఫేస్ – 1 పంప్హౌస్ ద్వారా అధికారులు గురువారం నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు రోజుల క్రితం వరకు ఆనకట్ట వద్ద నీరు తక్కువగా(49.1 మీటర్లు) ఉండడంతో తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి 1,200 క్యూసెక్కుల నీటిని ఇటీవల విడుదల చేశారు. కాగా, గురువారం 49.6 మీటర్లకు నీటి మట్టం చేరి ఆనకట్టపై గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్ పంప్హౌస్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. వారం రోజులుగా కసరత్తు.. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నాగార్జునసాగర్ కెనాల్కు గోదావరి జలాలు తరలించేందుకు అధికారులు గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. కుమ్మరిగూడెం నుంచి జూలూరుపాడు వరకు సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ 112.4 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు ప్రవహించి ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా నాగార్జునసాగర్కు తరలించనున్నారు. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు అడ్డుగా ఉన్న బెల్మౌత్ మట్టి కట్టను తొలగించడంతో నీరు మొదట అమెర్ద వద్ద హెడ్ రెగ్యులేటర్ వరకు వచ్చాయి. అక్కడి నుంచి బీజీ కొత్తూరు పంప్హౌస్ వరకు నీరు చేరింది. పంప్హౌస్ ద్వారా నీరు ఎత్తిపోయడంతో 43.9 కిలోమీటర్ల దూరంలోని ములకలపల్లి మండలం పూసుగూడెం ఫేస్–2 పంప్హౌస్కు చేరుతాయి. అక్కడ ఎత్తిపోస్తే 57.2 కిలోమీటర్ల దూరంలో కమలాపురంలో ఫేస్–3 పంప్హౌస్కు చేరుతాయి. ఆపై కాలువ ద్వారా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, జూలూరుపాడు వరకు చేరుతాయి. జూలూరుపాడులో 100.09 కిలోమీటర్ వద్ద నుంచి ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా 8 కిలోమీటర్లు పయనించి నాగార్జునసాగర్ కెనాల్లోకి చేరనున్నాయి. పంప్హౌస్ నుంచి సాగర్ కెనాల్కు తరలింపు -
యువతి హత్య కేసులో జీవిత ఖైదు
పెనుబల్లి: యువతిని హత్య చేసిన కేసులో వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ సత్తుపల్లి ఆరో అదనపు జడ్జి ఎం.శ్రీనివాస్ గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లకు చెందిన కావటి తేజస్విని గంగారంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివేది. సత్తుపల్లికి చెందిన బెల్లేడు నితిన్ ప్రేమ పేరుతో ఆమె వెంట పడగా, మాయమాటలు చెప్పి ఇంటి నుంచి 2019 ఆగస్టులో బైక్పై తీసుకెళ్లిన ఆయన లంకపల్లి గుట్టల వద్ద కర్చీప్తో ఉరివేసి హతమార్చాడు. ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేయగా.. సీఐలు టి.సురేష్కుమార్, టి.రవికుమార్, టి.కరుణాకర్ దశల వారీగా విచారణ జరిపి నితిన్ను నిందితుడిగా గుర్తించి సత్తుపల్లి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఈమేరకు విచారణ అనంతరం నితిన్ నిందితుడిగా తేలడంతో జీవిత ఖైదు విధించడమే కాక రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని సత్తుపల్లి రూరల్ సీఐ ఎం.ఎల్.ముత్తిలింగయ్య తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్దుల్ పాషా కేసు వాదించగా ఉద్యోగులు కె.శ్రీకాంత్, డి.నాగేశ్వరరావులు, కె.గిరి సహకరించారు. కాగా, తీర్పు వెలువడ్డాక నిందితుడిని వీఎంబంజర్ ఎస్సై కె.వెంకటేష్ సబ్జైల్కు తరలించారు. ప్రేమ పేరుతో తీసుకెళ్లిన యువకుడు హత్య చేసినట్లు నిర్ధారణ -
మాస్టర్ ప్లాన్తోనే మహర్దశ
● ఎదురుచూస్తున్న భక్తులు, స్థానికులు ● నవమి వేడుకల్లో రేవంత్ ప్రకటనపైనే కోటి ఆశలు ● తొలిసారి సీఎం హోదాలో హాజరయ్యే అవకాశం ● నిధులు కేటాయిస్తే ఆలయాభివృద్ధికి బాటలు భద్రాచలం : దేశ వ్యాప్తంగా భక్తులు ఎదురుచూసే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు సమయం సమీపిస్తోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీరామనవమి, 7న పట్టాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. వీటికి ముందు ఉగాది రోజునే స్వామి వారి పెళ్లి పనులు ప్రారంభిస్తారు. ఈసారి సీఎం హోదాలో రేవంత్రెడ్డి తొలిసారి స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనే అవకాశం ఉండగా నూతన మాస్టర్ ప్లాన్, నిధుల విడుదలపై ఏం ప్రకటన చేస్తారోనని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది ఎన్నికల కోడ్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది జరిగే స్వామివారి కల్యాణం రెండోది. గత శ్రీరామనవమి సమయంలో లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సీఎం రేవంత్రెడ్డి కల్యాణానికి హాజరు కాలేదు. దీంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులే పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ సంవత్సరం నవమి వేడుకల సమయంలో ఎన్నికల కోడ్ ఉండే సూచనలు లేకపోవడంతో సీఎం హోదాలో ఆయన తొలిసారి హాజరవుతారని అంచనా. బీఆర్ఎస్ హయాంలో సీఎంగా ఉన్న కేసీఆర్ 2014, 2015లో మాత్రమే స్వామివారి కల్యాణానికి హాజరయ్యారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులే పట్టువస్త్రాలు అందించే సంప్రదాయం కొనసాగింది. సుమారు దశాబ్ద కాలం తర్వాత సీఎం హాజరయ్యే అవకాశం ఉండగా, ఆలయాభివృద్ధికి ఎలాంటి ప్రకటన చేస్తారోనని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు ముందే హామీ.. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 ఫిబ్రవరి 14న రేవంత్రెడ్డి భద్రాచలం వచ్చారు. రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ మాట తప్పారని, తాము అధికారంలోకి వస్తే ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చాక 2024 మార్చి 11న మరోసారి భద్రాచలం రాగా, ఆలయంలో చేపట్టాల్సిన పనులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అధికారులతో చర్చించారు. భక్తులకు మౌలిక వసతులతో పాటు ఇతర పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో దేవాదాయ శాఖ ఉన్నతాఽధికారులు, ఆలయాధికారులతో చర్చించి రామాలయంతో పాటు పర్ణశాల అభివృద్ధికి చేపట్టాల్సిన పనుల నివేదికలు రూపొందించారు. ఆలయ మొదటి ప్రాకారం, దేవస్థానం, కల్యాణ మండపం రెండు వైపులా విస్తరణ, మాడ వీధులు, రాజ వీధుల విస్తరణ, కోనేరు నిర్మాణంతో పాటు రామాలయం నుంచి నృసింహస్వామి ఆలయం వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్డి, సంస్కృత, సంగీత పాఠశాల, పురుషోత్తపట్నంలో గోశాల నిర్మాణం, పర్ణశాల వద్ద దేవాలయం విస్తరణ, ప్రాకార మండపాల నిర్మాణం, కల్యాణ మండపం తదితర పనులతో ప్రణాళిక రూపొందించారని సమాచారం. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన స్థపతి సూర్యనారాయణ మూర్తి నూతన మాస్టర్ ప్లాన్ స్కెచ్లను సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి చేసి చూపించాలి భద్రాచలం అభివృద్ధికి ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నిధులు ప్రకటించాలి. వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. ఇటీవల భక్తుల రాక పెరిగినందున వసతుల కల్పనపై దృష్టి సారించాలి. – రేపాక రవికిరణ్, భద్రాచలం బడ్జెట్లో కేటాయింపే కీలకం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి భద్రాచలం దేవస్థానం అభివృద్ధి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. గత సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు ప్రకటించి.. బడ్జెట్లో కేటాయించినా నిధులు మాత్రం విడదల చేయలేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ముందు, ఆ తర్వాత హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా రామాలయ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని భక్తులు అంటున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతున్నారు. -
వేతనం రూ.300 వచ్చేలా చూడాలి
దుమ్ముగూడెం : ఉపాధి హామీ కూలీలకు రోజు వారీ వేతనం రూ.300 వచ్చేలా పని కల్పించాలని జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన సిబ్బందికి సూచించారు. గురువారం మండలంలోని బట్టిగూడెం, మహాదేవ పురం గ్రామపంచాయతీల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఫామ్పాండ్స్, మునగ తోట పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పని ప్రదేశాల వద్ద నీడ, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేవించారు. తాగునీటి సమస్య ఉందని కూలీలు ఆమె దృష్టికి తేగా, వెంటనే ఎంపీడీఓ రామకృష్ణ, మిషన్ భగీరథ ఇంజనీర్లలను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సుకన్య, ఈసీలు అప్పారావు, రాజు, టీఏ వెంకటేష్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
గెలుపుపైనే ధీమా
కలెక్టర్, ఎస్పీ పరిశీలన.. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఇల్లెందు బాలికోన్నత పాఠశాల కేంద్రాన్ని, ఎస్పీ రోహిత్ రాజ్ కొత్తగూడెంలోని సింగరేణి హైస్కూల్తో పాటు పాల్వంచలో ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కాగా, జిల్లాలో 463 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తించారు.జిల్లాల వారీగా ఇలా... జిల్లా మొత్తం ఓటర్లు ఓటు వేసింది పురుషులు మహిళలు పోలింగ్ శాతం ఖమ్మం 4,089 3,804 2,214 1,590 93.03భద్రాద్రి కొత్తగూడెం 2,022 1,858 973 885 91.94ప్రశాంతంగా ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ● ఖమ్మంలో 93.03, భద్రాద్రిలో 91.94 శాతం పోలింగ్ ● వచ్చే నెల 3నుంచి నల్లగొండలో ఓట్ల లెక్కింపు ● విజయంపై అభ్యర్థులు, ఉపాధ్యాయ సంఘాల లెక్కలు ● బందోబస్తు నడుమ బాక్స్ల తరలింపు -
అంత్యక్రియలకు రూ.50వేల ఆర్థికసాయం
మణుగూరు టౌన్: నిరుపేద యువతి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు రూ. 50 వేలు ఆర్థికసాయం అందించి దాతలు మానవత్వం చాటుకున్నారు. ముత్యాలమ్మనగర్కి చెందిన ఎం.శాంతి(24) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందింది. నిరుపేద కుటుంబం కావడంతో తల్లిదండ్రుల వద్ద అంత్యక్రియలకు డబ్బు లేక ఇంటి ఆరుబయటే మృతదేహాన్ని ఉంచి రోదిస్తున్నారు. దయనీయ దృశ్యాన్ని గమనించిన చంద్రశేఖర్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయగా, జిల్లాలోని పలువురు ఆ కుటుంబానికి ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. ఒక్కొక్కరు రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు ఫోన్ పే ద్వారా విరాళం అందించారు. రూ.50 వరకు సాయం అందింది. -
వీరు పూర్వ విద్యార్థులే!
పెనుబల్లి : అందరి వయ స్సు 75 ఏళ్లు దాటింది. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరి పిల్లలు చేతికి రావడంతో మనవళ్లు, మనవరాళ్లతో శేషజీవితం గడుపుతున్నారు. అయితే, నాటి పెనుబల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.. ప్రస్తుత వీఎం బంజర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1965–64లో వీరందరూ 11వ తరగతి(హెచ్ఎస్సీ) చదివారు. పాఠశాలలో వీరికి రెండో బ్యాచ్గా 11మంది ఉండేవారు. ఇందులో తొమ్మిది మంది ఇటీవల కలుసుకోవాలని నిర్ణయించుకుని గురువారం పాఠశాలకు చేరుకుని ఆనాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. చదువు చెప్పిన గురువులు, తమను వీడిపోయిన మిత్రులను స్మరించుకున్నారు. పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన దివంగత సీఎం వెంగళరావు సేవలను కొనియాడారు. ఆనాటి విద్యార్థులైన వంగా నరసింహాస్వామి, ఏటుకూరి రామారావు, కాటోజు మునేశ్వరరావు, బజ్జూరి వెంకటేశ్వరరావు, దామెర ప్రసాద్రావు, పోలకంపల్లి ధనుంజయ్రావు, సోమరాజు నాగభూషణ్రావు, ఏటుకూరి చిన్న కృష్ణారావు, వంగల రంగాచారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రెండు కార్లు ఢీ
నలుగురికి గాయాలు జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ గ్రామ సమీపంలో తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రహదారిపై గురువారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని నలుగురు గాయపడ్డారు. కొత్తగూడేనికి చెందిన సింగరేణి ఉద్యోగులు ప్రశాంత్, శ్రీనివాస్, తిరుమలరెడ్డి కారులో ఖమ్మం వెళ్తున్నారు. సుజాతనగర్ శివాలయం ఈఓ చంద్రశేఖర్ హరి తన కారులో ఖమ్మం నుంచి సుజాతనగర్ వెళుతున్నారు. ఈ క్రమంలో వినోభానగర్ సమీపం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నా యి. దీంతో నలుగురికీ గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఈఓను ఖమ్మం ఆస్పత్రికి, సింగరేణి ఉద్యోగులను కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. -
చట్టాలపై అవగాహన అవసరం
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి భానుమతిసూపర్బజార్(కొత్తగూడెం): మహిళలకు చట్టాలపై అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గొల్లపూడి భానుమతి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో గురువారం మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భానుమతి మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడడం నేరమని అన్నారు. ఈ వేధింపుల నివారణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. మహిళల రక్షణ కోసం చట్టం అనే బలమైన సాధనం ఉందన్నారు. మహిళా సాధికారతకు వ్యక్తులు, వ్యవస్థల సహకారం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. కలెక్టర్ పాటిల్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై సహోద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడితే బాధిత మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భవిష్యత్ ప్రణాళికలో ఆర్థిక అక్షరాస్యత కూడా కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. మహిళలు జీవనజ్యోతి, ప్రధానమంత్రి యోజన తదితర పథకాలను వినియోగించుకోవాలని, వాటిపై అవగాహన పెంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంరెడ్డి. డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రాజబాబు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కమనీయంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి వైభవంగా సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో గురువారం అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం శ్రీ అన్నపూర్ణాసమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా మూలమంత్ర హోమం, జయాధి హోమం, మహా పూర్ణాహుతి, చూర్ణోత్సవం, త్రిశూల స్నానం, వసంతోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శివసంతోష్శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. మార్చి 31 వరకు పశుగణనపాల్వంచరూరల్ : జిల్లాలో పశుగణన కార్యక్రమాన్ని మార్చి 31 వరకు పొడిగించినట్లు పశుసంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబర్ 25న జిల్లాలో గణన ప్రారంభమై ఫిబ్రవరి 28వరకు ముగియాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే పాడిపశువులు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు తదితర లెక్కింపు పూర్తి కాకపోవడంతో గడువు పొడిగించామని వివరించారు. గురుకులాల్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి నేలకొండపల్లి: గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఎస్సెస్సీ, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని గురుకులాల జోనల్ ఆఫీసర్ కె.స్వరూపా రాణి తెలిపారు. నేలకొండపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూం, కిచెన్ను పరిశీలించాక విద్యార్థులతో కలిసి భోజనం చేయగా మెనూ అమలుపై ఆరా తీశారు. అనంతరం జోనల్ ఆఫీసర్ మాట్లాడుతూ భద్రాద్రి జోన్లోని ఐదు జిల్లాల గురుకులాల్లో 19,300 మంది విద్యార్థులు చదువుతుండగా నూతన మెనూ అమలులో రాజీ పడకుండా పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపా రు. అలాగే, ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, వెనకబడిన వారిపై మరింత శ్రద్ధ వహిస్తున్నామని చెప్పారు. అలాగే, పరీక్షల వేళ తాజా పండ్లు అందిస్తున్నామని తెలిపారు. కాగా, గురుకులాల్లో ప్రవేశానికి జోనల్ పరిధిలో 25,318 మంది దరఖాస్తు చేసుకోగా 97 శాతం మంది పరీక్ష రాశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.పద్మావతి, ఉద్యోగి పాకనాటి కన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్ సర్వేతో మాస్టర్ ప్లాన్
సూపర్బజార్(కొత్తగూడెం): పాల్వంచ మున్సిపల్ అభివృద్ధికి డ్రోన్ సర్వేతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన తదితరులతో కలిసి డ్రోన్కు పూజ చేసి సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు అన్నీ డిజిటలైజ్ చేయడమే లక్ష్యమని అన్నారు. అధునాతన సాంకేతికత, డ్రోన్ కెమెరాల సాయంతో పకడ్బందీగా సర్వే చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా రాష్ట్రంలో 50 వేల నుంచి లక్ష జనాభా కలిగిన 20 మున్సిపాలిటీలను మాస్టర్ప్లాన్ డిజిటల్ సర్వేకు ఎంపిక చేయగా.. జిల్లాలో పాల్వంచ మున్సిపాలిటీకి చోటు దక్కిందని వివరించారు. ఈ సర్వేతో పాల్వంచ పట్టణం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉపగ్రహాలు, డ్రోన్ల సాయంతో ప్రాంతాల వారీగా ఉపరితలం ఎత్తు, పరిస్థితులు, రోడ్లు, ఇళ్లు, టాయిలెట్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్లు, సెల్ టవర్లు, రిజర్వాయర్లు, మార్కెట్లు, వైకుంఠధామాలను చిత్రీకరించి బేస్ మ్యాప్లను తయారు చేస్తారని వివరించారు. సీతారామ బ్రిడ్జి పరిశీలన.. అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని గుంపెన గ్రామ శివారులో సీతారామ కాల్వపై రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మించే క్రమంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన అప్రోచ్ రోడ్డును వెంటనే తొలగించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, ఈఈ అర్జున్, డీఈ భాస్కర్, ఆర్ఐ మధు పాల్గొన్నారు. గొత్తికోయ ఆవాసాల్లో పర్యటన.. కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక గ్రామపంచాయతీ పరిధిలోని చింతలమేది, మద్దిగుంపు గొత్తికోయ ఆవాసాల్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యటించారు. వారి జీవన స్థితిగతులు, అందుతున్న మౌలిక వసతులపై ఆరా తీశారు. ఆ రహదారిలో కారు వంటి వాహనాలు వెళ్లే వీలు లేకపోవడంతో మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్తో కలసి ద్విచక్రవాహనంపై చేరుకున్నారు. తాగునీటి కోసం అక్కడి గిరిజనులు ఏర్పాటు చేసుకున్న చెలిమలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ సంపదను కాపాడాలని, పోడు కొట్టడం చట్ట వ్యతిరేకమని, ఎవరూ చెట్లను నరకవద్దని సూచించారు. గొత్తికోయల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నామని, విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. చింతలమేదిలో నివసించే ఆరు కుటుంబాల వారు రోడ్డు సమీపంలోకి రావాలని, వారికి మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వగా త్వరలో తమ నిర్ణయం తెలియజేస్తామని స్థానికులు కలెక్టర్కు చెప్పారు. గ్రామంలో తాగునీరు కోసం సంపు నిర్మించాలని మిషన్ భగీరథ ఈఈని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ చలపతిరావు, మిషన్ భగీరథ డీఈ శివయ్య, ఏఈ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి -
వైభవంగా తిరువీధి సేవ
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అనుబంధ ఆలయమైన అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర ఆలయంలో గురువారం రాత్రి తిరువీధి సేవ వైభవంగా సాగింది. మహా శివరాత్రి పర్వదినాన్ని పుర్కరించుకుని ఆలయంలో బుధవారం రాత్రి శివ పార్వతుల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఆలయం నుంచి మేళాతాళాల నడుమ తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
టీచర్ ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి గెలుపు ఖాయం
టేకులపల్లి: ఖమ్మం – నల్లగొండ – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మరోమారు అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపు ఖాయమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా టేకులపల్లిలో గురువారం పోలింగ్ కేంద్రాల వద్ద ఆయన ఉపాధ్యాయులను కలిసి మాట్లాడారు. గత ఆరేళ్లలో ఉపాధ్యాయులు, సీఆర్టీలు, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసమే కాక విద్యారంగ అభివృద్ధికి నర్సిరెడ్డి కృషి చేశారని తెలిపారు. తద్వారా మరోమారు ఆయనను గెలిపించాలని ఉపాధ్యాయులు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఉద్యమ సంఘాలైన టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్ బాధ్యలంతా ఇందుకోసం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.హరిలాల్నాయక్తో పాటు టీపీటీఎఫ్, టీఎస్ యూటీఎఫ్ బాధ్యులు బి.కిషోర్సింగ్, వి.వరలక్ష్మి, బి.మాన్సింగ్, డి.హరికుమార్, బి.రామరాజు, రేపాకుల శ్రీనివాస్, ఎం.డీ.మౌలానా, టి.బిక్షమయ్య, వి.కాంతారావు, గుమ్మడి కృష్ణవేణి, మంజీలాల్, బి.వీరన్న, కడుదుల వీరన్న, ఈసం నర్సింహారావు పాల్గొన్నారు. -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
చుంచుపల్లి: కొత్తగూడెం, ఇల్లెందు పట్టణ పరిసర ప్రాంతాల ఆర్టీసీ ప్రయాణికులకు సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం 99592 25959 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ కథల పోటీల్లో బహుమతిఅశ్వారావుపేటరూరల్: అంతర్జాతీయ కథల పోటీల్లో అశ్వారావుపేటకు చెందిన బాలకథా రచయిత సిద్దంతాపు సాత్విక్కు బహుమతి లభించింది. తెలుగు తల్లి కెనడా, గడుగ్గాయి పిల్లల మాసపత్రిక నిర్వాహకులు అంతర్జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించారు. సాత్విక్ రాసిన ‘నిజాయితీ విలువ’ కథను పంపించగా ప్రత్యేక బహుమతికి ఎంపికై ంది. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని ఈ మెయిల్ ద్వారా పంపినట్లు బాలుడి తండ్రి ప్రభాకరాచార్యులు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో బహుమతి రావడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు అభినందనలు చుంచుపల్లి: హనుమకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యాన మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో వాక్ ఫర్ ట్రీస్ నినాదంతో ప్రతిరోజు మొక్క నాటుతున్న కొత్తగూడెంకు చెందిన చిన్నారి విశ్వామిత్ర చౌహాన్ను సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టి.హరీశ్రావు, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్రెడ్డి ఆయనను సన్మానించి మాట్లాడారు. సింగరేణి కార్మికులు నేరుగా రిఫరల్కు..!సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికులు గతంలో ఏ రిఫరల్ కావాలన్నా ఆస్పత్రి చుట్టూ, హెడ్డాఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గని మేనేజర్, వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా లెటర్ అప్రూవల్ చేసుకుంటే సరిపోతుందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్ బి.జనక్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసరంగా ఆస్పత్రిలో చేరిన ఉద్యోగి బంధువులు మెరుగైన వైద్యం కోసం గతంలో మాదిరిగా కార్యాలయాలు, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని వెల్లడించారు. రెండు ఫొటోలతో కూడిన దరఖాస్తు తీసుకొస్తే కార్పొరేట్ ఆస్పత్రిలో రిఫరల్కు వెళ్లవచ్చునని తెలిపారు. ఈ విషయమై తాను సింగరేణి ఉన్నతాధికారులతో చర్చించడంతో అనుమతించారని, త్వరలోనే సర్క్యులర్ జారీ అవుతుందని పేర్కొన్నారు. సింగరేణి ప్రధానాస్పత్రిలో ఖరీదైన శస్త్రచికిత్ససింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ప్రధానాస్పత్రిలో ఓ మహిళకు ఖరీదైన శస్త్రచికిత్స నిర్వహించారు. సింగరేణి ఉద్యోగి భార్య గైనిక్ సమస్యతో బాధపడుతుండగా కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సీనియర్ గైనకాలజిస్ట్ మాలతి శస్త్రచికిత్స నిర్వహించి గర్భాశయంలో ఉన్న కణుతులను తొలగించారు. ఈ కేసును హైదరాబాద్కు రిఫర్ చేస్తే సుమారు రూ. 3 లక్షల వరకు ఖర్చయ్యేదని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్సలో డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ రవళి, థియేటర్ సిబ్బంది సహకరించారు. బొగ్గు టిప్పర్ ఢీకొని ఒకరికి గాయాలుఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని గుంపెన గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. అబ్బుగూడెం గ్రామానికి చెందిన గడ్డం శ్రీను తన ద్విచక్రవాహనంపై ఎర్రగుంట నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. దీంతో శ్రీను కిందపడగా, అతని కాలుపై నుంచి టిప్పర్ టైరు వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయింది. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ సత్తుపల్లిటౌన్: ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స కాకుండా ఆస్పత్రుల పేరిట పడకలు ఏర్పాటు చేసి వైద్యం నిర్వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి హెచ్చరించారు. సత్తుపల్లి ఎన్టీఆర్నగర్లో ఓ ఆర్ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్లో బెడ్లు ఉండడంతో పాటు ఫార్మసీ నిర్వహిస్తుండగా గురువారం ఆమె సీజ్ చేసి మాట్లాడారు. అనంతరం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న కంటి పరీక్షల శిబిరం, గంగారం పీహెచ్సీలో రికార్డులను పరిశీలించారు. -
ఫైర్కు లైన్స్తో చెక్
●రూ.55 లక్షలతో 489 కిలోమీటర్ల ఫైర్లైన్స్ ●జిల్లాలోని ఆరు డివిజన్లలో సాగుతున్న పనులు ●14 ఫైర్ బ్లో బృందాలనూ ఏర్పాటు చేసిన అటవీశాఖ ●అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలుపాల్వంచరూరల్: వేసవికాలంలో అటవీ ప్రాంతంలో సంభవించే అగ్నిప్రమాదాల నివారణకు అటవీశాఖ ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తోంది. ఎండాకాలంలో అడవుల సంరక్షణకు ఈ ఏడాది ముందే దృష్టి సారించింది. జిల్లాలో అటవీ విస్తీర్ణం 4,28,698 చదరపు కిలోమీటర్లు ఉండగా, 6 డివిజన్లు, 24 రేంజ్లు, 944 బీట్లు ఉన్నాయి. వేసవి కాలంలో చెట్ల ఆకులు నేలరాలి ఎండిపోతుంటాయి. అడవిలోకి వెళ్లిన వారు బీడీలు, చుట్టలు, సిగరెట్లు కాల్చివేయడం ద్వారా ఎండిన ఆకులకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగి అడవి దహనమవుతుంటుంది. ఈ క్రమంలో అగ్ని ప్రమాదాల నివారణకు ఏటా అటవీశాఖ ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తోంది. గతేడాది కిన్నెరసాని అభయారణ్యం, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం డివిజన్ల పరిధిలో రూ.19,45,197 కంపా నిధులతో 122.65 కిలోమీటర్ల మేర ఫైర్లైన్స్ నిర్మించింది. ఈ ఏడాది కూడా కంపా నిధులు కూడా రూ.55.60 లక్షలతో 489 కిలోమీటర్ల పరిధిలో ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తోంది. వేసవిలో అటవీప్రాంతంలో మంటలు అంటుకోకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఆరు డివిజన్ల పరిధిలో అధికంగా, తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను గుర్తించారు. గుండాల, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, చర్ల అటవీ ప్రాంతాలను ముప్పు ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా 14 ఫూర్ బ్లో బృందాలను కూడా ఏర్పాటు చేశారు. గిరిజన కూలీలకు ఉపాధి అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాల నివారణకు అటవీ శాఖ ప్రతి సంవత్సరం చేపడుతున్న ఫైర్లైన్స్ ఏర్పాటు పనులతో సుమారు వెయ్యి మంది గిరిజనులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. దాదాపు నెలరోజులపాటు కూలీలకు పని దొరుకుతుంది. వాచర్ల నియామకం లేనట్లేనా..? వేసవికాలంలో అడవులకు నిప్పు అంటుకుని ప్రమాదాలకు గురి కాకుండా ముందస్తు సమాచారం ఇచ్చేందుకు అటవీశాఖ ఫైర్వాచర్లను నియమిస్తుంది. ఏటా బీట్ల వారీగా నియామకాలు చేపడుతుంది. కానీ ఈ సంవత్సరం ఫైర్ వాచర్లను నియమించలేదు. అగ్ని ప్రమాదం సంభవించిన సమాచారం ఆలస్యంగా అందితే అడవులు కాలిపోతాయి. అయితే నిధుల కొరతతో ఫైర్వాచర్లను నియమించనట్లు తెలుస్తోంది. ప్రత్యేక చర్యలు జిల్లాలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. ఫైర్లైన్స్ నిర్మాణ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయి. ఫైర్లైన్స్ ద్వారా అగ్నిప్రమాదాల తీవ్రతను తగ్గించి పూర్తిస్థాయిలో అడవిని రక్షించగలుగుతున్నాం. వేసవిలో అధిక అగ్ని ప్రమాదాలు సంభవించే ఐదు ప్రాంతాలను గుర్తించాం. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం. అడవిలోకి ఎవరైనా అగ్గిపెట్టె తీసుకుని వెళ్లి నిప్పు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఫైర్ బ్లో ద్వారా కూడా అగ్ని ప్రమాదాలను నివారిస్తున్నాం. –కృష్ణాగౌడ్, జిల్లా అటవీశాఖాధికారిగతేడాది ఇలా.. 2024–2025 సంవత్సరంలో 122.65 కిలోమీటర్ల ఫైర్లైన్ల విస్తరణకు రూ.19.45 లక్షలు ఖర్చు చేశారు. పాల్వంచ కిన్నెరసాని అభయారణ్యంలో 19.5 కిలోమీటర్లకు రూ.9.19 లక్షలు వ్యయం చేశారు. కొత్తగూడెం డివిజన్ పరిధిలో 22 కిలోమీటర్ల లైన్స్కు రూ.2.19 లక్షలు, భద్రాచలం డివిజన్ పరిధిలో 13.7 కిలోమీటర్లకు రూ.1.36 లక్షలు, మణుగూరు డివిజన్లో 15.75 కిలోమీటర్లకు రూ.1.75 లక్షలు, పాల్వంచ డివిజన్లో 19.70 కిలోమీటర్లకు రూ.2.70 లక్షలు, ఇల్లెందు డివిజన్ పరిధిలో 32.55 కిలోమీటర్లకు రూ.3.24 లక్షలు ఖర్చు చేశారు.డివిజన్ల వారీగా కేటాయించిన నిధులు డివిజన్ కిలోమీటర్లు వ్యయం (రూ.లక్షల్లో) కొత్తగూడెం 50 5.70 ఇల్లెందు 227 27.46 పాల్వంచ 15 1.23 మణుగూరు 75 7.83 భద్రాచలం 42 4.38 వైల్డ్లైఫ్ 80 9 -
పేకాటరాయుళ్ల అరెస్ట్
కరకగూడెం: మండల పరిధిలోని భట్టుపల్లి అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ గుడి సమీపంలో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, నాలుగు సెల్ ఫోన్లు, ఐదు బైక్లు, రూ.7500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు. కోడి పందేల స్థావరంపై దాడిఅశ్వాపురం: మండల పరిఽధిలోని అమ్మగారిపల్లి గ్రామంలో కోడి పందేల స్థావరంపై సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పోలీసులు దాడి చేశారు. రూ. 3 వేల నగదు, ఐదు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
పోలింగ్కు రెడీ..
ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ ఉమ్మడి జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు 6,111 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,440 మంది, మహిళా ఓటర్లు 2,671 మందితో జాబితా సిద్ధమైంది. జిల్లాల వారీగా చూస్తే ఖమ్మం జిల్లాలో 4,089మంది ఓటర్లకు గాను పురుషులు 2,372 మంది, మహిళలు 1,717, భద్రాద్రి జిల్లాలో 2,022 మంది ఓటర్లకు గాను పురుషులు 1,068, మహిళా ఓటర్లు 954 మంది ఉన్నారు. రెండు జిల్లాలో కలిపి 47 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఖమ్మం రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగు కేంద్రాలు ఉండగా, 1,986 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆతర్వాత జలగంనగర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో 488 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన 24 కేంద్రాల్లో సగానికి పైగా ఓటర్లు ఈ కేంద్రాల్లోనే ఓటు వేయనున్నారు. అలాగే, భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా భద్రాచలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 250 మంది, ఇల్లెందులోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 210 మంది, చుంచుపల్లిలోని బాబుక్యాంపు బాలికల ఉన్నత పాఠశాల కేంద్రంలో 175 మంది ఓటర్లు ఉన్నారు. కేంద్రాలకు చేరిన సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు బుధవారం రాత్రి వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో పోలింగ్ సామగ్రి పంపిణీని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో ఏ.పద్మశ్రీ పర్యవేక్షించారు. ఖమ్మం జిల్లాను ఎనిమిది రూట్లుగా విభజించి సిబ్బందిని ఆర్టీసీ బస్సుల్లో పంపించారు. కాగా, పోలింగ్ కేంద్రాలను పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనే 56 మంది పీఓల (ప్రిసైడింగ్ అధికారులు)కు గాను ఖమ్మం జిల్లాలో 28 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 28 మంది ఉన్నారు. వీరు కాక ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టార్ అధికారులు విధులు నిర్వర్తిస్తారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను నల్లగొండలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రెండు ప్రాధాన్యతలే కీలకం ఈ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఓన్నారు. దీంతో ఓటర్లు 1నుంచి 19 వరకు ప్రాధాన్యత ఇస్తూ అంకెల ద్వారా ఓటు వేయొచ్చు. అయితే, 1, 2వ నంబర్ వేసే ఓట్లకే ప్రాధాన్యత ఉంది. ఒకటో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో గెలుపు తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో విజేతను ఖరారు చేస్తారు. మొత్తం పోలైన ఓట్లలో 51శాతం వచ్చిన వారినే విజేతగా ప్రకటిస్తారు. 19మంది అభ్యర్థుల్లో ఒకటో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ వచ్చినా.. పోలైన ఓట్లలో వారికి ఈ ప్రాధాన్యత ఓట్లు 51 శాతంగా ఉంటేనే విజయం ఖరారవుతుంది. అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్లలో 51 శాతం ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తూ.. తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తారు. ఇలా మొత్తం అభ్యర్థుల్లో చివరి వరకు ఎవరికి 51 శాతం ఓట్లు ఉంటే వారినే గెలుపు వరిస్తుంది. ఫలితంగా బరిలో ఉన్న అభ్యర్థులు ఒకటో ప్రాధాన్యత ఓటుతో పాటు రెండో ప్రాధాన్యత ఓటునూ కీలకంగా తీసుకున్నారు. గత ఎన్నికల్లో అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందిన విషయం విదితమే.ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవాలికలెక్టర్ జితేష్ వి. పాటిల్ కొత్తగూడెంఅర్బన్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హత గల ఉపాధ్యాయులంతా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఆయన అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగుతుందని చెప్పారు. జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాలు, ఏడు రూట్లు ఏర్పాటు చేశామని, ఒక్కో రూట్కు ఒక్కో సెక్టార్ అధికారితో పాటు ఒక్కో రూట్ అధికారిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ఉండవని, బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటు వేయాల్సి ఉంటుందని, బ్యాలెట్ పేపర్పై పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు, ఫొటో ఉంటాయని, ప్రాధాన్య క్రమంలో నచ్చి న అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడిలో నంబ ర్లు వేయాలని అన్నారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను మాత్రమే వినియోగించాలని, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్ పాల్గొన్నారు. నేడు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉమ్మడి జిల్లాలో 47కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులుఖమ్మం – నల్లగొండ – వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు 47 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. జిల్లా కేంద్రాల నుంచి ఉద్యోగులు సామగ్రితో బుధవారం సాయంత్రంకల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంఓటర్లు, పోలింగ్ సిబ్బంది వివరాలు జిల్లా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మొత్తం ఓటర్లు 4,089 2,022 6,111పోలింగ్ కేంద్రాలు 24 23 47 -
ఫీజు కడతారా.. ఇంటికెళ్తారా..?
విద్యార్థులపై ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఒత్తిడి ● పరీక్షలు దగ్గరపడుతుండడంతో విద్యార్థుల అవస్థలు ● ఇంటికెళ్లి తల్లిదండ్రులతో వాగ్వాదాలు ● చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు కొత్తగూడెంఅర్బన్: ఫీజు కట్టకపోతే తరగతి గది బయట నిలుచోండి.. ఫీజు కట్టలేదు కదా ఇంటర్నల్ మార్కులు తక్కువగా వేస్తాం.. ఫీజు చెల్లించలేదు కదా పరీక్షలకు అనుమతి లేదు.. లాంటి హెచ్చరికలను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు తరచూ వినాల్సివస్తోంది. వచ్చేది వార్షిక పరీక్షల సమయం.. విద్యార్థులు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతుంటే.. ఇదే అదనుగా భావించిన యాజమాన్యాలు ఫీజులు కట్టాలని విద్యార్థులపైనే ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో అటు ఫీజుల అంశం.. ఇటు పరీక్షలు.. రెండు కలిపి విద్యార్థులకు అగ్నిపరీక్షగా మారాయి. ఇంటికెళ్లి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగడంతో వారు అప్పు చేసి మరీ ఫీజులు కడుతున్నట్లు సమాచారం. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షల సమయం ఆసన్నం కాబోతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులను ఫీజుల పేరుతో ఒత్తిడి చేస్తున్నారు. ఒకవైపు విద్యార్థులు ఫైనల్ పరీక్ష టెన్షన్లో ఉంటే ఫీజుల అంశం మరో రకమైన ఒత్తిడి పెంచుతోంది. ఫీజులు చెల్లించలేని విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో తరగతి గదుల బయట నిల్చోబెట్టడం, ఇంటికి పంపడం వంటి చర్యలతో విద్యార్థులు పరీక్షల వేళ మరింత ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో దాదాపు 220కి పైగా ప్రైవేట్ పాఠశాలలుండగా.. అక్కడ ఫీజుల ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. ఇక ఇంటర్మీడియట్కు సంబంధించి ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవి మొదలుకాక ముందు నుంచే ఇంటర్ విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి మొదలై ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది. దీంతో పాటుగా పలు ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతిలో సబ్జెక్టులు సులువుగా అర్థం చేసుకునేందుకు గానూ తొమ్మిదో తరగతి విద్యార్థుల వద్ద ప్రత్యేక ఫీజులు వసూళ్లు చేస్తూ పదో తరగతి పాఠ్యంశాల బోధన చేస్తున్నారు. ఫీజులు చెల్లించలేని వారిని తొమ్మిదో తరగతిలోనే ఉంచి.. సిలబస్ రివిజన్ చేయిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖాధికారులు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫీజులకు సంబంధించిన వివరాలను పాఠశాల, కళాశాలల్లో అందరికీ కనిపించే విధంగా బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతి సంవత్సరం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఎవరూ పాటించడం లేదని సమాచారం. దీంతో యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులను వసూళ్లు చేస్తున్నాయి. పరీక్షల సమయం.. పదో తరగతి విద్యార్థులకు మార్చి 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రీఫైనల్ పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్కు సంబంధించి 299 పాఠశాలలకు చెందిన 12,282 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. దీంతో పాటు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు థియరీ పరీక్షలు జరుగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్మీడియట్కు సంబంధించి మొదటి సంవత్సరం 9,255 మంది, ద్వితీయ సంవత్సరంలో 10,003 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అయితే పదో తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మళ్లీ పాఠశాలలకు, కళాశాలలకు వచ్చే అవకాశం ఉండకపోవడంతో వారి నుంచి ఏడాది కాలపు మొత్తం ఫీజు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ఇటీవల ఇంటర్నల్ మార్కులు వేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో అయితే ఫీజులు చెల్లించని వారికి ఇంటర్నల్ మార్కులు తక్కువగా వేస్తామని భయపెట్టడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో ఫీజుల విషయంలో గొడవకు దిగడం లాంటి ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. దీంతో వారు చేసేదేమీ లేక అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఫీజులు కట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్య తాప్రమాణాలు పెరిగినప్పటికీ కొందరు పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంకా బాగా చదివించాలనే ఆలోచనతో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్చి అప్పుల పాలవుతున్నారు. ఫీజుల కోసం ఒత్తిడి చేయొద్దు.. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఫీజుల కోసం ఇబ్బందులకు గురి చేయొద్దు. వారి తల్లిదండ్రులను సంప్రదించి ఫీజుల విషయంపై చర్చించండి. విద్యార్థులను ఇబ్బందుల కు గురిచేస్తే చర్యలు తీసుకుంటాం. పరీక్షల సమ యంలో విద్యార్థులను అవస్థలకు గురిచేస్తే ఆ ప్రభా వం పరీక్షల ఫలితాలపై పడే అవకాశం ఉంటుంది. – వెంకటేశ్వరచారి, డీఈఓ -
‘పవర్’ఫుల్ శిక్షణ
● ఆర్టీసీ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాల పెంపునకు నిర్ణయం ● రోజుకు 40 మంది చొప్పున 182 అంశాలపై అవగాహన ● రీజియన్లోని ఆరు డిపోల్లో తరగతులు సత్తుపల్లిటౌన్: ప్రయాణికులు మరింత మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా సంస్థ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ వారికి సంస్థపై నమ్మకం పెంచడం, తద్వారా ఆదాయాన్ని రాబట్టుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇదేసమయాన ఉద్యోగుల సంక్షేమంపైనా దృష్టి సారించిన యాజమాన్యం ఏటా వైద్యపరీక్షలు నిర్వహిస్తోంది. ఈక్రమంలో ప్రయాణికులతో వ్యవహరించాల్సిన తీరు, ఇతర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించేలా మరో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. రద్దీ నేపథ్యాన... రాష్ట్రప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా కండక్టర్లు, డైవర్లు, ట్రాఫిక్ సూపర్వైజర్లకు విధినిర్వహణ సవాల్గా మారిందని చెబుతున్నారు. ఈ నేపథ్యాన ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించి యజమానిననే భావన కల్పించేందుకు ‘పవర్’ పేరిట శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల్లో ఈనెల 18వ తేదీన మొదలైన శిక్షణ వచ్చేనెల 2వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం ఏడు డిపోల్లో కలిపి 681 మంది ఆర్టీసీ డ్రైవర్లు, 427 మంది అద్దె బస్సు డ్రైవర్లతో పాటు 860 మంది కండక్టర్లు, 204 మంది ట్రాఫిక్ సూపర్వైజర్లు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. 2022 సంవత్సరంలో ‘ఒక గొప్పమార్పుకు ఇదే శ్రీకారం’, 2023లో ‘ట్యాక్ట్’ పేరిట కార్యక్రమాలు నిర్వహించిన విషయం విదితమే. శిక్షణలో అంశాలు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, సిబ్బందిలో దృఢ సంకల్పం, వ్యక్తిత్వ వికాసం పెంపు, రహదారి భద్రత, ప్రయాణికులతో సత్ప్రవర్తన, వస్త్రధారణపై అవగాహన, ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ శిక్షణలో భాగంగా వీడియోలు, ప్రసంగాల ద్వారా వివరిస్తున్నారు. తొలుత డిపోల వారీగా అధికారులకు హైదరాబాద్ బస్ భవన్లో శిక్షణ ఇవ్వగా, వారి ఆధ్వర్యాన డిపోల్లో సిబ్బందికి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. 182 అంశాలపై.. పవర్(పీక్ పర్ఫార్మెన్స్ త్రూ ఓనర్షిప్ విత్ ఎంపతి రిసాల్ప్) పేరిట ఈ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతీ డిపోలో రోజుకు 40 మంది చొప్పున ఉద్యోగులకు డిపో మేనేజర్ ఆధ్వర్యాన శిక్షణ ఇస్తున్నారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 182 అంశాలపై వీడియోలు, చిత్రాలు ప్రదర్శిస్తూ అందులోని సారాంశాన్ని వివరించడమే కాక.. అప్పటికప్పుడే పరీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే, స్కిట్ల ప్రదర్శన ద్వారా సిబ్బందిలో సృజనాత్మకతను పెంపొందించే ప్రయత్నం జరుగుతోంది. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఎక్కువ ఫలితాలను సాధించడం, మరింత శక్తి వినియోగం ఆవశ్యకతను ఇందులో వివరిస్తున్నారు.