breaking news
Bhadradri
-
యూరియా కోసం రైతుల నిరీక్షణ
కరకగూడెం: కరకగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సేల్ పాయింట్లో యూరియా నిల్వలు ఉన్నా గురువారం పంపిణీ చేయలేదు. దీంతో రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించారు. ఖమ్మం మార్క్ఫెడ్ అధికారులు పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) యంత్రంలో నమోదు చేసే డీసీ (డెలివరీ చలాన్) నంబర్ను కరకగూడేనికి బదులు పినపాకకు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో డీసీ నంబర్ రాలేదని సిబ్బంది యూరియా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారుల తీరుపై నిరసన తెలిపి, నిరాశగా వెనుదిరిగారు. కాగా యూరియా కోసం వచ్చిన వారిలో వృద్ధులు, బాలింతలు కూడా ఉన్నారు. -
గూడు లేక గోడు
● భ ద్రాచలంలో ఇంటి కోసం నిర్వాసితుల ఎదురుచూపులు ● ఆర్అండ్బీ స్థలంలో కొనసాగుతున్న పనులు ● మరో నెలకు పైగా సమయం పట్టే అవకాశం ● ప్యాకేజీ, స్థలం త్వరగా ఇవ్వాలంటున్న బాధితులు భద్రాచలం: ఎన్నో ఏళ్లుగా ఉంటున్న గూడు చెదిరింది. రామాలయం అభివృద్ధి చెందితే అందరి బతుకులూ బాగుపడతాయని సరిపెట్టుకున్నారు. మాడ వీధుల విస్తరణ కోసం ఇళ్లు ఖాళీ చేయాలని, ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని, ఇంటి నిర్మాణానికి ప్యాకేజీ కూడా ఇస్తామని అధికారులు చెప్పిన మాటలు నమ్మారు. ఆ వెంటనే పెట్టే బేడా సర్దుకొని కట్టుబట్టలతో ఇళ్లు, దుకాణాలు ఖాళీ చేశారు. కానీ అధికారుల హామీలు ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో అటు వ్యాపారాలు కోల్పోయి, ఇటు ఇంటి అద్దెలు చెల్లించలేక నిర్వాసితులు భారంగా జీవనం సాగిస్తున్నారు. జాగలెప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఖాళీ చేసి రెండు నెలలు.. భద్రాచలం రామాలయం అభివృద్ధిలో భాగంగా తొలుత మాడ వీధులను విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం రూ.60.20 కోట్ల నిధులు కేటాయించగా ఆలయానికి రెండు వైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నష్ట పరిహారం అందజేశారు. దీంతో ఆయా ఇళ్లలో వారు నిర్వహిస్తున్న బొమ్మల దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, ఇతర చిరు వ్యాపారాలను వదులుకుని రెండు నెలల క్రితం ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంటికి సంబంధించిన నష్ట పరిహారం అందించగా.. ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి అవసరమైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కూడా అందిస్తామని రెవెన్యూ అధికారులు హమీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు జాగా కానీ, ప్యాకేజీ కానీ అందలేదు. ఇప్పట్లో కానట్టేనా..? స్థానిక బ్రిడ్జి రోడ్డులో ఉన్న ఆర్అండ్బీ గెస్ట్హౌస్, డివిజన్ కార్యాలయాలను తొలగించి ఆ స్థలాన్ని నిర్వాసితులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. నెల క్రితమే స్థలం చదును చేసే పనులు ప్రారంభించారు. మట్టి దిబ్బలు ఉండగా వారం రోజుల్లో పనులు పూర్తి చేసి అందించాలని భావించారు. అయితే పనులు ప్రారంభించాక సీన్ రివర్సయింది. ఆ మట్టి దిబ్బల కింద గట్టి రాళ్లు గుట్టలుగా ఉన్నాయి. దీంతో భారీ క్రేన్లు, జేసీబీల సాయంతో ఆ రాళ్ల గుట్టలను తొలగిస్తున్నారు. తవ్వే కొద్దీ బండలు బయట పడుతున్నాయి. దీంతో మరో నెల రోజులకు పైగా ఈ పనులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో నిర్వాసితులకు మరి కొన్ని రోజులు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది. లాటరీలో 90 గజాల కేటాయింపు...? ఆర్అండ్బీ స్థలంలో కొద్దిమేర నిర్వాసితులకు ఇవ్వాలని గతంలో నిర్ణయించిన అధికారులు.. ఆ తర్వాత మరి కొంత పెంచి ఇవ్వాలని భావించారు. ఇందుకు సుమారు మూడెకరాలు అవసరమని తేల్చారు. దీన్ని 40 మంది నిర్వాసితులకు అందజేస్తే ఒక్కొక్కరికి 90 గజాల స్థలం వచ్చే అవకాశం ఉంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం చాలా విలువైనదిగా భావిస్తున్న నిర్వాసితులు సైతం ఈ స్థలం వైపే మొగ్గు చూపారు. కాగా, స్థలాన్ని పూర్తిగా చదును చేశాక ఇందులోనే రోడ్లు, డ్రెయినేజీలకు కొంత కేటాయించి మిగితా భూమిని లాటరీ ద్వారా అందజేయనున్నారని తెలిసింది. ఆ తర్వాత యూనిట్ల వారీగా ఇంటి నిర్మాణానికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వనున్నారు. త్వరలోనే స్థలం అప్పగిస్తాం రామాలయ అభివృద్ధికి ఇంటి స్థలాలు ఇచ్చిన నిర్వాసితులకు త్వరలోనే ఆర్అండ్బీ స్థలం అప్పగిస్తాం. ఇప్పటికే ఈ పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఆ స్థలంలో రాళ్ల గుట్టలు ఉండగా, వాటి తొలగింపుతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. పూర్తిగా చదును చేశాక లాటరీ ద్వారా స్థలం అందించి ఇంటి నిర్మాణానికి ప్యాకేజీ కూడా ఇస్తాం. – కొల్లు దామోదర్ రావు, భద్రాచలం ఆర్డీఓ -
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ ప్రవాహ సమయంలో నదులు, కాల్వలు, చెరువుల వద్దకు వెళ్లొద్దని, దాటేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సూచనలు చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచినా ఆస్పత్రుల్లో అత్యవసర సేవలకు అంతరాయం వాటిల్లకుండా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నెలలు నిండిన గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు చేర్చాలని తెలిపారు. ఆన్లైన్ తరగతులు వినియోగించుకోవాలి పాల్వంచ: రాష్ట్ర ప్రభుత్వం, ఖాన్ అకాడమీ సంయుక్త నిర్వహణలో కేజీబీవీ విద్యార్థులకు 6 నుంచి 12వ తరగతి వరకు భౌతిక, రసాయన శాస్త్రాలు, గణిత సబ్జెక్టుల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పాటిల్ సూచించారు. పాల్వంచ కేజీబీవీని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలకు అవసరమైన పుస్తకాలు, కంప్యూటర్లు తెప్పించుకోవాలని, వాటి జాబితా తనకు అందిస్తే అవసరమైన కంప్యూటర్లు పంపిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలకు అవసరమైన వసతుల విషయంలో రాజీపడకుండా అన్ని వస్తువులు సమకూర్చాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని డీఈఓ వెంకటేశ్వరాచారిని ఆదేశించారు. మోడల్ కేజీబీవీగా అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉంచేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, సీఎంఓ ఎస్కే.సైదులు, బాలికా విద్య కో ఆర్డినేటర్ జె.అన్నామణి, తహసీల్దార్ దారా ప్రసాద్, కేజీబీవీ ప్రత్యేకాధికారి తులసీ విద్యాసాక్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
శ్రావణం.. ఆధ్యాత్మికం
కొత్తగూడెం టౌన్/జూలూరుపాడు: సకల శుభాలకు నిలయంగా భావించే శ్రావణ మాసం వచ్చేసింది. హిందువులకు శుభప్రదమైన శ్రావణ మాసం శుక్రవారం నుంచి మొదలుకానుంది. ఈ నెలంతా పండుగలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలకు తోడు వివాహ ముహూర్తాలు ఉండడంతో ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే వరలక్ష్మీ వ్రతం, బోనాల వేడుకలే కాక రాఖీ పౌర్ణమి, నాగుల పంచమి ఈనెలలో రానున్నాయి. బోనాల పండుగ ప్రత్యేకం ఆషాఢ మాసంలో పలుచోట్ల అమ్మవార్లకు బోనాలు చెల్లిస్తుండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రావణ మాసంలో బోనాల పండుగ జరుపుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో వరినాట్లు ముగించుకుని అమ్మవార్లకు బోనాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. వివాహాల సందడి శ్రావణమాసంలో శుభ ముహూర్తాలు ఉండడంతో పలువురు తమ పిల్లలకు వివాహాలు జరిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 26 నుంచి వివాహాలు, నిశ్చితార్థాలు, గృహాల శంకుస్థాపన, గృహ ప్రవేశాలు మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నెల 26, 27, 30, 31వ తేదీలతోపాటు ఆగస్టు 1, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 17, 18వ తేదీల్లో ముహూర్తాలు ఉండగా.. పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే పలువురు ముహూర్తాలు కుదుర్చుకున్నారు. ఈ కారణంగా మండపాలు, పురోహితులు, ఫొటోగ్రాఫర్లు, వంట మనుషులకు డిమాండ్ పెరగనుంది. శ్రావణ మాసం తర్వాత వచ్చే భాద్రపద మాసం సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుండగా శూన్య మాసం కావటంతో ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత సెప్టెంబర్ 23 నుంచి ముహూర్తాలు ప్రారంభమై 24, 26, 27, 28, అక్టోబర్ 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31వ తేదీలతో పాటు నవంబర్ 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27,29, 30వ తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. అనంతరం డిసెంబర్ 8 నుంచి ఫిబ్రవరి 6వరకు రెండు నెలల పాటు ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. నేటి నుంచి శ్రావణమాసం నెలంతా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు రేపటి నుంచి వివాహ ముహూర్తాలుపండుగల మాసం శ్రావణ మాసం అంతా పండుగల సందడి ఉంటుంది. ఈసారి శ్రావణంలో ఐదు శుక్రవారాలు వస్తుండగా, 29వ తేదీన మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఇదేరోజు నాగపంచమి కావడంతో నాగదేవతకు పూజలు చేయనున్నారు. అలాగే, ఆగస్టు 1న రెండో శుక్రవారం, 8న మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీ పండుగ, అదే రోజు జంధ్యాల పౌర్ణమి, 16న శ్రీ కృష్ణ జన్మాష్టమి, 23న రైతులు పొలాల అమావాస్య జరుపుకోనున్నారు. పూజలు, వ్రతాలతో పుణ్యఫలం ఈనెల శుభఘడియలే కాక పండుగలకు నిలయంగా నిలుస్తుంది. మంచి ముహూర్తాలు అనేకం ఉన్నాయి. ఈనెలలో మహిళలకు ఇష్టమైన వరలక్ష్మీదేవి వ్రతం జరుపుకోనున్నారు. అంతేకాక పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలను జరుపుకునేందుకు అనువుగా ముహూర్తాలు ఉన్నాయి. – నల్లాన్ చక్రవర్తుల క్రాంతికుమారాచార్యులు, అర్చకులు, విద్యానగర్ కాలనీశ్రావణ మాసం విశిష్టమైనది శ్రావణ మాసం అన్ని విధాల విశిష్టమైనది. వ్యాపార, గృహప్రవేశాలు, నూతన వ్యాపారాలు, పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలలో దేవతా సంబంధిత వ్రతాలు ఆచరిస్తే శుభాలు కలుగుతాయి. హిందూ, వైదిక సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తే ఆరోగ్యరమైన జీవితం గడపొచ్చు. – పురాణం కామేశ్వరశాస్త్రి, శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం, అనంతారం -
హ్యామ్తో మహర్దశ
ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ, ప్రైవేటు భాగాస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో గతంలో కొన్ని రోడ్ల నిర్మాణం జరిగేది. అభివృద్ధి పనులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చేపడతాయి. ఆ తర్వాత నిర్మాణ వ్యయాన్ని వినియోగదారుల(ప్రజలు) నుంచి నిర్ణీత కాలానికి టోల్గేట్లు, ఇతర పద్ధతుల ద్వారా వసూలు చేసుకుంటాయి. వ్యయానికి సరిపడా రాబడి వచ్చిన తర్వాత సదరు ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తాయి. వినియోగదారులపై ఆర్థిక భారం పడుతుండడంతో ఈ విధానంపై విమర్శలు వస్తుండగా.. ఈ భారాన్ని తగ్గిస్తూ కొత్తగా హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో నిర్మాణ వ్యయంలో ప్రభుత్వం 40 శాతం భరిస్తే మిగిలిన 60 శాతాన్ని నిర్మాణ సంస్థ (కాంట్రాక్టర్) భరిస్తారు. అయితే ప్రైవేటు సంస్థ భరించిన వ్యయాన్ని పదిహేనేళ్లలో విడతల వారీగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీని వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం పడదు. సులభ వాయిదాల్లో నిర్మాణ వ్యయాన్ని చెల్లించే వీలు ప్రభుత్వానికి ఉంటుంది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లే రోడ్లను హ్యామ్ (హైబ్రిడ్ యాన్యూటీ మోడల్) విధానంలో విస్తరణ, అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా అభివృద్ధి చేయబోయే రోడ్ల వివరాలను రహదారులు, భవనాల శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 373 రోడ్లను హ్యామ్లో అభివృద్ధి చేయనుండగా.. జిల్లాకు చెందిన పది రోడ్లకు అవకాశం దక్కినట్టుగా ప్రకటించారు. ఈ పదింటిలో మొత్తం 266 కి.మీ నిడివి కలిగిన పలు రోడ్ల అభివృద్ధికి అవకాశం ఏర్పడింది. ఇందుకోసం రూ.380 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో 40 శాతం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం, 60 శాతం నిర్మాణ పనులు దక్కించుకున్న సంస్థ భరించనున్నాయి. పేరుకే పది.. చేసేది ఐదే.. హ్యామ్ విధానంలో అభివృద్ధి చేసే వాటిలో ప్రధానంగా కొత్తగూడెం – తల్లాడ, అనిశెట్టిపల్లి – ఆళ్లపల్లి, దమ్మపేట – పాల్వంచ, బూర్గంపాడు – దుగినేపల్లి (ఏటూరునాగారంరోడ్డు), పాల్వంచ (ఏపీ స్టీల్స్) – పినపాక పట్టీనగర్ రోడ్లు ఉన్నాయి. ఈ పథకం కింద జిల్లాలో పది రోడ్లను అభివృద్ధి చేయబోతున్నట్టు అధికారులు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అవి ఐదు రోడ్లుగానే ఉన్నాయి. ప్రతీ పనిని నియోజకవర్గాల వారీగా విభజించడంతో ఈ ఐదు రోడ్లనే పది రహదారులుగా చూపిస్తున్నారు. అభివృద్ధి చేయబోయే రోడ్లలో అత్యధికంగా పినపాక నియోజకవర్గం పరిధిలో 75.20 కి.మీ. నిడివి ఉండగా అత్యల్పంగా ఇల్లెందు నియోజకవర్గం పరిధిలో 25 కి.మీ. నిడివి ఉంది. భద్రాచలం నియోజకవర్గానికి హ్యామ్ స్కీమ్లో అసలు చోటే దక్కలేదు. ఏజెన్సీ రోడ్లకు స్థానం.. హ్యామ్ పథకం కింద ఎంపిక చేసిన రోడ్లలో కొత్తగూడెం–తల్లాడ, బూర్గంపాడు–ఏటూరునాగారం, దమ్మపేట–పాల్వంచ రోడ్లను జాతీయ రహదారులుగా మర్చాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఈ రోడ్లు హ్యామ్ పథకంలో కాకపోయినా రేపో మాపో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(నాయ్) ద్వారా అయినా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కానీ, హ్యామ్లో కొత్తగా చేర్చిన ఆళ్లపల్లి–అనిశెట్టిపల్లి (వయా తిర్లాపురం, ఆనంతోగు, సిద్దారం, గంగారం), పా ల్వంచ–పినపాక పట్టీనగర్ క్రాస్ రోడ్ (వయా సీతారాంపట్నం, కేటీపీఎస్, పాండురంగాపురం, ఉప్పుసాక) రో డ్లు పూర్తిగా ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నా యి. ఈ రహదారుల విస్తరణ జరిగితే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవా ణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. జిల్లాలో పది రోడ్ల అభివృద్ధి, విస్తరణ మొత్తంగా 266 కి.మీ. రహదారులకు మోక్షం నిర్మాణ వ్యయం అంచనా రూ.380 కోట్లు దశ మారనున్న ఆళ్లపల్లి – కొత్తగూడెం రోడ్డు రోడ్డు నిడివి(కి.మీ.) లబ్ధిపొందే నియోజకవర్గాలు కొత్తగూడెం – తల్లాడ 36 కొత్తగూడెం, వైరా, సత్తుపల్లి దమ్మపేట – పాల్వంచ 59 కొత్తగూడెం, అశ్వారావుపేట బూర్గంపాడు – ఏ.నాగారం 58.20 పినపాక పాల్వంచ – పి.పట్టీనగర్ 10 కొత్తగూడెం, పినపాక అనిశెట్టిపల్లి – ఆళ్లపల్లి 25 ఇల్లెందు, పినపాక -
వైభవంగా భ ద్రగిరి ప్రదక్షిణ
భద్రాచలంటౌన్ : శ్రీరాముడి జన్మనక్షత్రం పునర్వసును పురస్కరించుకుని భక్త రామదాసు ట్రస్ట్ నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం వైభవంగా గిరి ప్రదక్షిణ చేశారు. రామయ్య కరుణాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ వేడుక నిర్వహించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రత్యేక దర్శనంతో పాటు స్వామివారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ఆలయ ఏఈఓ శ్రవణ్కుమార్, సీసీ శ్రీనివాస రెడ్డి, పీఆర్ఓ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఊపందుకుంటున్న ‘సాగు’
● లోటు వర్షపాతం నుంచి గట్టెక్కిన జిల్లా ● 16 మండలాల్లో సాధారణం, ఏడు మండలాల్లో అధికం సూపర్బజార్(కొత్తగూడెం): లోటు వర్షపాతం నుంచి జిల్లా గట్టెక్కింది. రెండు రోజుల క్రితం వరకు అంతగా వర్షాలు లేక వ్యవసాయ పనులు మందకొడిగా సాగగా.. ప్రస్తుతం ఊపందుకున్నాయి. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత వర్షాలతో పత్తి మొక్కలు జీవం పోసుకుంటుండగా వరినాట్లు ముమ్మరమయ్యాయి. గురువారం నాటికి జిల్లాలోని 16 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మరో ఏడు మండలాల్లో అధిక వర్షం కురిసింది. వర్షపాతం వివరాలిలా.. జిల్లాలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 446.2 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 413.1 మి.మీ వర్షపాతం నమోదైంది. చర్ల, మణుగూరు, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, పాల్వంచ, అశ్వారావుపేట మండలాల్లో అధిక వర్షం కురవగా, కరకగూడెం, పినపాక, దుమ్ముగూడెం, అశ్వాపురం, ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడు, భద్రాచలం, ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో వివిధ పంటల సాధారణ విస్తీర్ణం 4,50,512 ఎకరాలుగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇంకా 1,38,725 ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉంది. -
సుమనోహరంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివా రిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా గురువారం శ్రీ సీతా రామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభ శర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేపు ‘దిశ’ సర్వసభ్య సమావేశంచుంచుపల్లి: జిల్లా అభివృద్ధి, సమన్వయ(దిశ) సర్వసభ్య సమావేశం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కో – చైర్మన్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని వివరించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల నివేదికలతో సకాలంలో రావాలని సూచించారు. కిన్నెరసాని నుంచి నీటి విడుదలపాల్వంచరూరల్ : జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయంలోకి భారీగా వరద చేరుతోంది. దీంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం 407 అడుగులు కాగా, ఎగువ నుంచి గురువారం 4,800 క్యూసెక్కుల వరద నీరు రావడంతో నీటిమట్టం 404.30 అడుగులకు పెరిగింది.దీంతో ప్రాజెక్టు అధికారులు రాత్రి ఒక గేటు ఎత్తి 1000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పౌరసేవల్లో మీ సేవ కేంద్రాలే కీలకంబూర్గంపాడు: పౌరసేవలు వేగవంతం చేయటంలో మీ సేవ కేంద్రాలే కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. మోరంపల్లి బంజరలోని మీ సేవ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, దరఖాస్తుల పరిష్కారం, సమయపాలన తదితర అంశాలను పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం మీ సేవ కేంద్రాల్లో కొత్తగా అమలు చేస్తున్న పౌరసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే తీసుకోవాలన్నారు. మీ సేవ కేంద్రాల డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తుల దాడి
చర్ల: మండలంలోని క్రాంతిపురంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన గిరిజనుడు భద్రాచలం వైద్యశాలకు తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. అతని భార్యను కూడా హతమార్చేందుకు యత్నించగా ఆమె తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీ వలస ఆదివాసీ గ్రామం క్రాంతిపురానికి చెందిన మడకం భద్రయ్య (40) ఇంటికి బుధవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలై భద్రయ్య కుప్పకూలిపోయాడు. అతని భార్య లక్ష్మి కేకలు వేయగా, ఆమెను కూడా హతమార్చేందుకు యత్నించారు. దీంతో తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. గ్రామస్తులు క్షతగాత్రుడిని కొయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సీఐ రాజువర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో డాగ్స్క్వాడ్, క్లూస్టీంతో తనిఖీలు నిర్వహించారు. కాగా క్రాంతిపురంలో గడిచిన ఐదేళ్ల కాలంలో మూడు హత్యలు జరిగాయి. పోలీసులు దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వలస ఆదివాసీ గిరిజనుడి మృతి -
గంజాయి సీజ్
భద్రాచలంటౌన్: భద్రాచలం మీదుగా ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎస్టీఎఫ్ బృందం గురువారం పట్టుకుంది. పట్టణంలో రూట్వాచ్తోపాటు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీ చేయగా బ్యాగులో 8.6 కిలోల గంజాయి లభించింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా రాష్ట్రం మల్కన్గిరిని చెందిన శంకర్దాస్, మాటేరులు హైదరాబాద్ నగరం బోరుబండకు చెందిన అంజన్ దూబేకు గంజాయి ఇచ్చేందుకు వెళ్తున్నట్లు తేలింది. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి భద్రాచలం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. గంజాయితోపాటు బైక్, రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. -
క్షీరమే జాలువారినట్టుగా..
కనువిందు చేస్తున్న జలపాతం చుట్టూ అడవి.. పక్షుల కిలకిలారావాల నడుమ క్షీరమే జాలువారుతోందా అన్నట్టుగా.. తెల్లని నురుగుతో నీరు వస్తున్న ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మణుగూరు సమీపంలోని కట్టుమల్లారం వద్ద గల కొండపై ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు పట్టణ ప్రజలు, ఇతర ప్రాంతాల పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో అయితే భారీగా వస్తుంటారు. అయితే ఈ ప్రాంతానికి రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు టూరిస్ట్ స్పాట్గా గుర్తించి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. – మణుగూరు టౌన్ -
యువత క్రీడల్లో రాణించాలి
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంటౌన్: యువత క్రీడల వైపు మొగ్గు చూపడం అభినందనీయమని, భవిష్యత్లో మరింతగా రాణించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ నెల 25,26,27 తేదీల్లో హైదరాబాద్లోని షేక్పేట గ్రౌండ్లో రాష్ట్రస్థాయి అండర్–14 బాక్సింగ్ స్టేట్ మీట్ నిర్వహించనున్నారు. జిల్లా నుంచి ఈ పోటీలకు వెళ్లే క్రీడాకారులు, జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి గురువారం కొత్తగూడెంలో ఎమ్మెల్యేను కలిశారు. ఎమ్మెల్యే వారికి టీ షర్ట్లను పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, వాసిరెడ్డి మురళి, తోటరాజు, బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మట్టపర్తి రమేష్, కోచ్ ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ మోర్చా నిరసన చుంచుపల్లి: కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. కలెక్టర్ ఆఫీస్ సాధారణ పరిపాలన అధికారి రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. సీతారామ కాలువకు ఇరువైపులా ఉన్న రైతులకు సాగునీళ్లు అందడం లేదని ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిలుకూరి రమేష్, ఏనుగు వెంకటరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్, జంపన సీతారామరాజు, రంజిత్,రాపాక రమేష్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. విచారణ చేపట్టాలిఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ వేపలగడ్డతండా గ్రామంలో ధరావత్ రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరారు. గురువారం ఇల్లెందు సీఐ సురేష్ను కలిసి సమస్య విన్నవించారు. రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు పేర్కొంటున్నారని, కానీ ఘటనా స్థలంలో కనిపించిన దృశ్యాలు తమకు అనుమానం కలిగిస్తున్నాయని వివరించారు. స్పందించిన సీఐ సమగ్ర విచారణ చేపడుతామని హామీ ఇచ్చారు. నవోదయలో ముగిసిన క్రీడాపోటీలుకూసుమంచి: మండలంలోని పాలేరులో జవహర్ నవోదయ విద్యాలయలో నిర్వహిస్తున్న క్లస్టర్ స్థాయి స్పోర్ట్స్ మీట్ గురువారంతో ముగిసింది. ఇక్కడ ప్రతిభ చాటిన విద్యార్థులను త్వరలో జరగనున్న రీజినల్ పోటీలకు ఎంపిక చేశారు. క్లస్టర్ మీట్లో పాలేరు నవోదయ విద్యార్థులతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల నవోద య విద్యాలయాల నుంచి 345 మంది విద్యార్థులు పాల్గొనగా వీరిలో 234 మంది రీజినల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ 14, 17, 19 విభా గాల్లో బాలబాలికలకు బ్యాడ్మింటన్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, ఖో–ఖో, యోగా పోటీలు నిర్వహించగా పాలేరు, నల్లగొండ విద్యార్థులు మార్చ్ఫాస్ట్తో పాటు వివిధ క్రీడల్లో సత్తా చాటారు. కాగా, రీజినల్ స్థాయి పోటీల్లో భాగంగా కరీంనగర్లో ఖో–ఖో, కాకినాడలో కబడ్డీ, కేరళలో బ్యాడ్మింటన్, కర్ణాటకలో చెస్, తూర్పుగోదావరిలో టెబుల్ టెన్నిస్, గుంటూరులో యోగా పోటీలు జరుగుతాయని పాలేరు ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు తెలిపారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడుకు చెందిన మేడ శ్రీను(59) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండగా, కొద్దిరోజులుగా గొడవులు జరుగుతుండడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈమేరకు బుధవారం రాత్రి ఇంట్లో గడ్డి మందు తాగిన శ్రీనును ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆయన కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అడవిపంది మాంసం స్వాధీనం
ములకలపల్లి: అటవీశాఖ అధికారులు గురువారం అడవి పంది మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మాధారం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ఎస్ఓ) హరిప్రశాంత్ కథనం ప్రకారం... పాల్వంచ రేంజ్ పరిధిలోని ములకలపల్లి మండలం కొమ్ముగూడెం గ్రామ శివారులో ఉన్న మామిడితోటలో అడవిపందిని వేటాడినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అటవీశాఖ సిబ్బంది దాడులు నిర్వహించారు. వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి మృతిచెందిన అడవిపంది మాంసాన్ని, ఉచ్చులు తయారుచేసేందుకు వినియోగించే వైర్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎఫ్ఎస్ఓ తెలిపారు. నిందితులను పాల్వంచ రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆరుగురిపై కేసు నమోదు -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు ఎంపిక
పాల్వంచరూరల్: కిన్నెరసాని స్పోర్ట్స్ పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 600 మంది క్రీడాకారులు హాజరుకాగా, డీవైఎస్ఓ పరంధామరెడ్డి పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో ప్రతిభ చూపిన 40 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఆగస్టు 3న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారు. డీవైఎస్ఓ విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి.యుంగధర్రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.మహిధర్, అధ్యక్షుడు గొట్టపు రాధాకృష్ణ, ఎస్ఐ సురేష్, పూనెం కృష్ణదొర, పి.నాగేందర్, రామారావు, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. తడిసిన మైదానంలోనే.. వర్షం కురుస్తుండటంతో క్రీడా మైదానం తడిసిపోయి జారి కిందపడే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు నిలిచింది. అయినా అథ్లెటిక్స్ నిర్వాహకులు పట్టించుకోకుండా పోటీలు కొనసాగించారు. దీంతో ఇద్దరు క్రీడాకారులు పరిగెత్తుతూ జారి కిందపడగా, స్వల్ప గాయాలయ్యాయి. -
పిల్లల భవిష్యత్ మార్చేది ఉపాధ్యాయులే..
● సెప్టెంబర్ నుంచి ఎస్సెస్సీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● ఎఫ్ఆర్ఎస్ ద్వారా ఉపాధ్యాయుల హాజరు నమోదు ● విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఖమ్మం సహకారనగర్: పిల్లల భవిష్యత్ను ఉజ్వలంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించి తరగతి గదిలో విద్యార్థులతో మమేకమవుతూ పాఠాలు బోధించాలని సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఆమె విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజలతో కలిసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా యోగితారాణా మాట్లాడుతూ రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలలను తనిఖీ చేశామని తెలిపారు. సింగరేణి మండలం కారేపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చొరవతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని నమ్మకం కలిగిందన్నారు. అలాగే, ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఏడాది 140 మంది విద్యార్థులు కొత్తగా చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. పాఠశాలలకు వచ్చే పిల్లలకు నేర్పించేదే వారి జీవితంలో కీలకంగా మారుతుందని చెప్పారు. ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేస్తూ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాలని సూచించారు. డీఈఓలు, ఎంఈఓలు తరచూ పాఠశాలలను తనిఖీ చేస్తూ ఉపాధ్యాయులకు సూచనలు చేయాలని, ఐఏ ల్యాబ్ల నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. ఇదే సమయాన పాఠశాలల్లో ఉపాధ్యాయులు సకాలంలో హాజరయ్యేలా పర్యవేక్షిస్తూ వారి హాజరును ఫేస్ రికగ్నేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్) ద్వారా నమోదు చేయాలని సూచించారు. అలాగే, జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల సమీపాన అంగన్వాడీ కేంద్రాల నుంచి పిల్లలను చేర్పించాలని సూచించిన ఆమె... పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు సెప్టెంబర్ నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభించి స్నాక్స్ సమకూర్చాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ కార్డులు జారీ చేయించాలని సూచించారు. అనంతరం విద్యా శాఖ సంచాలకులు డాక్టర్ ఈ.నవీన్ నికోలస్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడగా ఎస్సెస్సీలో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన, మూతబడిన స్కూళ్లు తెరిపించిన, అత్యధికంగా విద్యార్థులను చేర్పించిన మండలాల ఎంఈఓలను సన్మానించారు. ఈ సమీక్షలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రెయినీ కలెక్టర్ సౌరభశర్మ, విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు రమణకుమార్, రాజీవ్, సత్యనారాయణరెడ్డి, మదన్మోహన్, వెంకటనర్సమ్మ, డాక్టర్ హెచ్.హరీష్, మంజరి, డీఈఓ సత్యనారాయణ, నాలుగు జిల్లాల అధికారులతో పాటు జి.సురేష్, ప్రాంజలి పాఠక్, తదితరులు పాల్గొన్నారు. -
నిండు కుండల్లా చెరువులు
పాల్వంచరూరల్/ఇల్లెందు/ఇల్లెందురూరల్ : నిన్నా, మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన చెరువులు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో పలు చెరువులు అలుగు పోస్తుండగా, మరి కొన్ని పూర్తిస్థాయిలో నిండాయి. జిల్లాలో మొత్తం 2,364 చెరువులకు గాను 94 చెరువులు అలుగు పోస్తున్నాయి. 688 చెరువులు వంద శాతం, 675 చెరువుల్లోకి 75 శాతం, 645 చెరువుల్లో 50 శాతం మేర నీరు చేరడం విశేషం. పాల్వంచ మండలంలోని ఎర్రసాని చెరువు నిండగా, మందేరకలపాడు వద్ద రాళ్లవాగు పికప్ డ్యామ్, ఇల్లెందు మండలం తొడిదెలగూడెం చెరువు సైతం నిండి అలుగు పోస్తున్నాయి. మిట్టపల్లి వద్ద మసివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే, పాల్వంచ మండలం జగన్నాథపురం, రంగాపురం, నాగారం, దంతలబోరు చెరువులు కళకళాడుతున్నాయి. కిన్నెరసాని వాగులో సోములగూడెం, సూరారం, నాగారం వద్ద నిర్మించిన చెక్ డ్యామ్లు పొంగిపొర్లుతున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే అన్ని చెరువులు నిండి అలుగు పోసే అవకాశముందని జలవనరుల శాఖ ఈఈ అర్జున్ తెలిపారు. కాగా, ఇప్పటికే వరినార్లు సిద్ధం చేసుకున్న రైతులు ఎడతెరిపి లేని వర్షంతో నాట్లు వేయించడంలో నిమగ్నమయ్యారు. వర్షం తెరపి ఇచ్చినప్పుడు పత్తి, మొక్కజొన్న చేలలో కలుపు నివారణ మందు పిచికారీ చేస్తున్నారు. -
కార్మిక కుటుంబాలకు భరోసా
ప్రమాద బీమాతోసింగరేణి(కొత్తగూడెం): కార్మిక, ఉద్యోగ కుటుంబాల సంక్షేమానికి సింగరేణి సంస్థ అనేక చర్యలు చేపడుతోంది. రూపాయి ప్రీమియం చెల్లించకుండా రూ. 1.20 కోట్ల బీమా పరిహారం దక్కేలా చూస్తోంది. సింగరేణి కార్మికుడికి జాతీయ బ్యాంక్లైన ఎస్బీఐ, యూబీఐ, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కేవలం శాలరీ అకౌంట్ ఉంటే ఈ బీమా వర్తిస్తుంది. కార్మికుడికి 13 రకాల సదుపాయాలతోపాటు ప్రమాదంలో మృతి చెందితే పరిహారం అందుతుందని సింగరేణి ఉన్నతాధికారులు చెబుతున్నారు. సహజ మరణం పొందిన వారికీ రూ. ఆరు లక్షల పరిహారం అందుతుంది. సంస్థవ్యాప్తంగా వివిధ ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, వారి కుటుంబాలకు పరిహారం అందజేశారు. ఇటీవల మణుగూరు ఓసీలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన కార్మికుడు మూల్చంద్ విశ్వకర్మ, ఆర్జీ–1, ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సపోర్ట్మెన్ రంజిత్కుమార్ కుటుంబాలకు గత నెల 28న ప్రజాభవన్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరిహారాన్ని అందజేశారు. రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.20 కోట్ల పరిహారం సహజ మరణం పొందితే రూ.ఆరు లక్షల చెల్లింపు -
వర్షాలు.. పత్తి చేలో జాగ్రత్తలు
సూపర్బజార్(కొత్తగూడెం): మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంట దెబ్బతినకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ బుధవారం వివరించారు. ●పత్తి చేలో నీరు నిల్వకుండా కాలువలు ఏర్పాటు చేసి బయటకు పంపించాలి. ●ఈనెల 20 వరకు మాత్రమే పత్తి విత్తుకుని ఉండాలి. భూస్వభావాన్ని బట్టి తేలిక, మధ్యస్త భూముల్లో 30వ తేదీ వరకు అచ్చు వేసుకుని మొక్కల సంఖ్యను పెంచుకునేలా విత్తుకుంటే పత్తి దిగుబడి తగ్గదు. ●విత్తిన పది రోజుల్లో మొలక రాకపోతే మళ్లీ విత్తాలి. రెండు మొలకలు ఉన్నచోట ఒకటి తొలగించాలి. ●పత్తి పంటలో మొదట 45 నుంచి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. ●కలుపు నివారణకు పత్తి విత్తిన 24–48 గంటల లోపు ఎకరాకు 1.2 లీటర్ల పెండిమిథాలిన్ 30 శాతం లేదా 700 మి.లీ పెండిఇతాలిన్ 38.7 శాతం, సిఎస్ మందు 200 లీటర్ల నీటిని కలిపి నేలపై పిచికారీ చేయాలి. భూమిలో సరైన తేమ/పదును ఉన్నపుడు పిచికారీ చేస్తే గడ్డిమందు సమర్థంగా పనిచేసి 20 రోజుల వరకు కలుపు మొక్కలు లేకుండా చేస్తుంది. ●పత్తిచేను 15–20 రోజుల దశలో ఉన్నపుడు చేనులో సన్న ఆకుల గడ్డి (నాలుగు ఆకులు), వెడల్పుకు (2–3 ఆకులు) కలుపు నివారణకు క్వాజలోపాప్ఇథైల్లో 400 మి.లీ. లేదాప్రొపొక్విజీపాపిన్ 250 మి.లీ, పైరిథయోబ్యాక్ సోడియం 250 మి.లీ. లేదా పైరిథియోబ్యాక్ సోడియం 6 శాతంతో పాటు క్విజలోపాప్ ఇథైల్ 4 శాతం , ఎంఈసీ 500 మి.లీలను 200 లీటర్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి ●ఎకరానికి 110 కిలోల యూరియా, 150కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. ●భాస్వరం ఎరువు మొత్తాన్ని దుక్కిలో లేదా విత్తిన 15 రోజుల్లో వేసుకోవాలి. ●విత్తిన 20, 40, 60, 80 రోజుల్లో 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ కలిపి నాలుగు సార్లు వేసుకోవాలి. పైపాటుగా డీఏపీ లేదా కాంప్లెక్స్ (20.20.0.13) ఎరువును వాడకూడదు. ●పత్తిచేను బెట్ట లేదా అధిక వర్షాలకు గురైనప్పుడు పత్తి పెరుగుదలకు 19.19.19 లేదా 13:0:45 లాంటి పోషకాలను లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ●పత్తిచేనులో పత్తి మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతే వేరుకుళ్లుగా భావించి, నివారణకు కార్బండాజిమ్ 1 గ్రా. లేదా కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ల చుట్టూ వేరు బాగా తడిచేలా పోయాలి. ●పత్తిలో మొదట 30–45 రోజుల్లో రసం పీల్చే పురుగుల నివారణకు ఎసిటీమిప్రిడ్ 0.2 గ్రా. లేదా థయోమిథక్సమ్ 0.2 గ్రా లేదా ఫెప్రోనిలో లీటరు నీటికి కలుపుకుని పిచికారీ చేయాలి. కేవీకే సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ భరత్ -
‘నవోదయ’లో క్లస్టర్ స్పోర్ట్స్ మీట్
కూసుమంచి: మండలంలోని పాలేరులో జవహర్ నవోదయ విద్యాలయలో బుధవారం క్లస్టర్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. తొలుత ప్రిన్సిపాల్ కే.శ్రీనివాసులు క్రీడా పతాకాన్ని ఎగురవేయగా, క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సత్తా చాటడం ద్వారా ఉన్నత స్థాయికి చేరొచ్చని చెప్పారు. ఇక్కడ పోటీల్లో ప్రతిభ చాటిన 250మందిని రీజినల్ స్థాయికి ఎంపికచేస్తామని తెలిపారు. 345 మంది క్రీడాకారులు పాలేరు నవోదయలో మొదలైన క్లస్టర్ స్థాయి పోటీలకు పాలేరుతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల నవోదయ విద్యాలయాల విద్యార్థులు 345 మంది హాజరయ్యారు. ఇందులో 183 మంది బాలురు, 162 మంది బాలికలు ఉన్నారు. వీరికి అండర్–14, 17, 19 విభాగాల్లో బ్యాడ్మింటన్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, ఖో–ఖో, యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. కాగా గురువారంతో పోటీలు ముగియనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హాజరైన వివిధ జిల్లాల నవోదయ విద్యార్థులు -
పొలంలో వ్యవసాయ కూలీ మృతి
టేకులపల్లి: వరి పొలంలో గొర్రు కొడుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలి వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని బొమ్మనపల్లికి చెందిన కౌలు రైతు దొడ్ల శంకర్ యాదవ్ బుధవా రం తన వరిపొలంలో గొర్రు కొట్టేందుకు మంగ్యతండాకు చెందిన బాణోత్ వీరు (60)ను పిలిచాడు. గొర్రు కొడుతున్న క్రమంలో వీరు కుప్పకూలి కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే చికిత్స కోసం బొమ్మనపల్లికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని తన ఇంటివద్ద ఉంచి కౌలు రైతుమృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశా రు. ఘర్షణ వాతావరణ నెలకొనడంతో సమాచారం తెలుసుకున్న టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు రాజేందర్, శ్రీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. కాగా పోలీసులు వెళ్లాక పెద్ద మనుషులు చర్చించి మృతుడి కుటుంబానికి రూ.లక్ష పరి హారం ఇచ్చేలా ఒప్పందం చేసినట్లు సమాచారం. -
ముగియనున్న గడువు
● వచ్చే నెల 4 వరకే కేటీపీఎస్ కో ఆపరేటీవ్ సొసైటీ పాలకవర్గం ● ఈసారి ఏడు నుంచి 13కు పెరగనున్న డైరెక్టర్ పోస్టులుపాల్వంచ: కేటీపీఎస్ కో ఆపరేటీవ్ సొసైటీ పాలకవర్గ ఐదేళ్ల పదవీ కాలం వచ్చే నెల 4వ తేదీతో ముగియనుంది. ఈక్రమంలో ఇప్పటినుంచే కొత్త పాలకవర్గంలో చోటు దక్కించుకునేందుకు పలువురు ఆశావాహులు పావులు కదుపుతున్నారు. తమను గెలిపించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సొసైటీకి చివరిసారిగా 2019, నవంబర్ 4న ఎన్నికలు జరగ్గా, 5న కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. గత కమిటీ 1535, టీఆర్వీకేఎస్, 327 యూనియన్ల నేతలు ఎన్నికయ్యారు. ఐదేళ్ల కాలంలో రెండు పాలక వర్గాలు కొలువు దీరాయి. కాగా సొసైటీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తాయి. అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్, డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఓటర్ల జాబితా సిద్ధం కేటీపీఎస్ కోఆపరేటీవ్ సొసైటీలో 3,008 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేసి జిల్లా కో ఆపరేటీవ్ అధికారులకు సమర్పించా రు. కో ఆపరేటీవ్ సొసైటీ కమిషనర్ ఆదేశిస్తే ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా సహకార శాఖ అధికారులు ఆర్సీఎస్(రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటీస్)కు సమాచా రం అందించాలి. అనంతరం ఎన్నికల షెడ్యూల్ తయారు చేయారు చేయాలి. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కేటీపీఎస్ కాంప్లెక్స్లోని ఒఅండ్ఎం(పాత ప్లాంట్) మూసివేయడంతో పలువురు ఉద్యోగులు వైటీపీఎస్, బీటీపీఎస్ కర్మాగారాలకు బదిలీ అయ్యారు. అయినా వారు కూడా ఇక్కడి ఓటర్ల లిస్ట్లోనే కొనసాగనున్నారు. గతంలో ఏడు.. ఇప్పుడు 13 డైరెక్టర్ పోస్టులు గతంలో ఏడుగురు డైరెక్టర్ పోస్టులు ఉండగా ఈ సారి 13 డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న ట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పోస్టులకు ఏడు జనరల్, రెండు బీసీలతోపాటు ఎస్సీ మహిళ, బీసీ మహిళ, ఎస్టీ పురుషులకు రిజ్వరేషన్ ఉండనుంది. దీంతో ఆశావా హుల సంఖ్య మరింత పెరిగింది. రాజకీయ పార్టీ లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటాయి. ఒక్కో ఓటుకు కనీసం రూ.10వేల వరకు పంపకాలు చేపడతారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారీగా ఖర్చు చేసేందుకు ఆశావహులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో రెండు పాలక వర్గాలు.. కేటీపీఎస్ సొసైటీ ఐదేళ్ల పదవీకాలంలో రెండు పాలకవర్గాలు కొలువుదీరాయి. 2019లో ఎన్నికై న తర్వాత ప్రెసిడెంట్గా దానం నర్సింహారావు, సెక్రటరీగా వల్లమల్ల ప్రకాష్, ట్రెజరర్గా మహేందర్, వైస్ ప్రెసిడెంట్గా నాగమణి, డైరెక్టర్లుగా ధర్మరాజుల నాగేశ్వరరావు, నూనావత్ కేశులాల్ నాయ క్, రమణలు ఎన్నికయ్యారు. అనంతరం సొసైటీ సభ్యులుగా ఉన్న 400మంది ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. దీంతో బదిలీ అయినవారి సభ్యత్వాల తొలగించాలనే అంశంపై తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఈ క్రమంలో నాలుగేళ్ల 8 నెలలు పదవీలో ఉన్న అధ్యక్ష, కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో గతేడాది జూలై 1న కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ధర్మరాజుల నాగేశ్వరరావు, సెక్రటరీగా కేశులాల్, ట్రెజరర్గా మహేందర్, వైస్ ప్రెసిడెంట్గా నాగమణి, మరికొందరు డైరెక్టర్లుగా రెండో పాలకవర్గం ఏర్పాటైంది. -
ఊపందుకోనున్న వరినాట్లు
బూర్గంపాడు: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. వర్షాభావంతో ఈ నెల మొదటివారం నుంచి ప్రారంభం కావాల్సిన వరినాట్లు ఆలస్యమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులకు, కుంటలకు నీరు చేరుతోంది. దీంతో వరినాట్లు వేగం పుంజుకుంటున్నాయి. ఈ ఏడాది జిల్లాలో సుమారు 1.95 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేసే అంచనాలున్నాయి. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తుండటంతో ఈసారి అధిక సంఖ్యలో రైతులు ఽవరి సాగుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర రూ.69 పెంచింది. దీంతో క్వింటా ధాన్యం ధర రూ.2,369 చేరింది. రాష్ట్ర ప్రభుత్వ బోనస్తో కలిపి క్వింటా ధాన్యానికి రూ.2,869 ధర దక్కనుంది. దీంతో రైతులు సన్నరకం ధాన్యం సాగుకు మొగ్గు చూపుతున్నారు. జూన్ రెండో వారం నుంచి వరినార్లు పోసుకున్నారు. అడపాదడపా వర్షాలకు నార్లు మొలకెత్తినా, ఆ తర్వాత సరిపడా వర్షం లేకపోవడంతో వడబడ్డాయి. కొందరు రైతులు ట్యాంకర్లతో తడిపి నారు బతికించుకున్నారు. చెరువులు, కుంటలు, లిఫ్టిరిగేషన్ స్కీమ్లు, తాలిపేరు ప్రాజెక్ట్, ఇతర చిన్నతరహా ప్రాజెక్ట్ల కింద కూడా వరినాట్లు మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఒకేసారి వరినాట్లు ప్రారంభం కావటంతో కూలీల కొరత ఏర్పడుతోంది. స్థానికంగా ఉన్న కూలీలు సరిపోకపోవటంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. బెంగాల్, బిహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరినాటుకు వస్తున్నారు. కూలీలకు బాగా డిమాండ్ ఏర్పడగా, ధర పెంచుతున్నారు. గతేడాది ఎకరా వరినాటుకు రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు చెల్లించారు. ప్రస్తుతం రూ. 5వేలు, అంతకు పైగానే చెల్లిస్తున్నారు. కొంత ఆలస్యమైనా వరినాట్లు పడుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు చెరువులు, కుంటల్లోకి చేరుతున్న నీరు -
రామయ్య సేవలో దేవసేన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారిని బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదా శీ ర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రావణ్కుమార్, పండితులు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలికొత్తగూడెంఅర్బన్: వర్షాలు, వరదల నేపథ్యంలో గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జయలక్ష్మి సూచించారు. బుధవారం ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తి సంసిద్ధంగా ఉండాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రోగ్రాంఆఫీసర్ డాక్టర్ మధువరన్, డాక్టర్ పి. స్పందన, డాక్టర్ తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో ఎద్దు మృతిటేకులపల్లి: మండలంలోని కుంటల్ల పంచాయతీ అందుగులగూడేనికి చెందిన రైతు గొగ్గెల కోటేశ్వర్రావుకు ఎద్దు బుధవారం మేతకు వెళ్లి విద్యుత్ తీగలు తగిలి మృతిచెందింది. విద్యుదాఘాతంతో తన కు జీవనాధారమైన ఎద్దు మృతి చెందిందంటూ బాధిత రైతు కన్నీరు పెట్టుకున్నాడు. -
దంత సేవలు అంతంతే...
● ఖమ్మం పెద్దాస్పత్రిలో వేధిస్తున్న పరికరాల కొరత ● సరైన సేవలు అందక ‘ప్రైవేట్’కు బాధితులు ● గత ఏడాది మొత్తం 4,873 మందికే సాధారణ సేవలుఖమ్మంవైద్యవిభాగం: మానవ శరీరంలో అన్ని అవయవాల మాదిరిగానే దంతాలకు సైతం సమస్యలు వస్తుంటాయి. అయితే, దంత సమస్యలు త్వరగా నయం కావు. ఇందుకోసం వివిధ దశల్లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అలా జరగకపోతే ఇతర శారీరక సమస్యలు వచ్చే ప్రమాదముంది. ప్రధానంగా పరిశుభ్రత పాటించకపోతే దంత సమస్యలు వచ్చే అవకాశముండగా... ఖమ్మం జిల్లాలో దంత సమస్యతో బాధపడే వారికి ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందడం లేదు. ఖమ్మంలోని పెద్దాస్పత్రి దంత విభాగానికి నిరుపేదలే వస్తుండగా, వారికి నామమాత్రపు సేవలతోనే సరిపెడుతున్నారు. దీంతో పలువురు తప్పనిసరై ప్రైవేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. రోజుకు వంద మందికి పైగానే.. వయస్సుతో సంబంధం లేకుండా ఇటీవల దంత సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. పెద్దాస్పత్రిలో ఓపీకి నిత్యం వివిధ సమస్యలతో 1,500మందికి వస్తుండగా, దంత సంబంధిత చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య వందకు పైగానే ఉంటుంది. కానీ ఇక్కడ సాధారణ చికిత్సలే తప్ప మెరుగైన వైద్యం అందకపోవడంతో నానాటికీ ఓపీ తగ్గుతోంది. గత ఏడాది మొత్తంగా పెద్దాస్పత్రిలోని దంత విభాగంలో 4,873 మందికే సేవలు అందా యి. ఆధునిక పరికరాలు లేకపోవడంతో పళ్లు తొలగించడం, కొత్తవి అమర్చడం వంటి మైనర్ చికిత్సలే జరుగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల చికిత్సకు ఉపయోగించే కుర్చీ పాడవడంతో సేవలు మరింత మృగ్యమయ్యాయి. ఓపీ సేవలతోనే సరి పెద్దాస్పత్రిలోని దంత విభాగంలో అన్ని రకాల సేవలు అందక ఓపీ సేవలతో సరిపెడుతున్నారు. ఈ వి భాగంలో రూట్కెనాల్, డీప్ క్లీనింగ్,దంతాల ఫిల్లింగ్, కాస్మోటిక్స్ తదితర చికిత్స అందించాల్సి ఉంటుంది. కానీ అందుకుసంబంధించి పరికరాలు సమకూర్చక.. నిపుణులైన వైద్యులు లేకపోవడంతో పెద్దాస్పత్రికి వచ్చేవారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. దంత విభాగంలో ప్రస్తుతం ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. ఇక చైర్, మౌత్ మిర్రర్, డిజిటల్ ఎక్స్రే,ప్రొబ్, ఓరల్ కెమెరా, అల్ట్రాసోనిక్ స్కేలర్, పా లిషింగ్ బ్రష్ తదితర పరికరాలు లేకపోవడం.. చైర్ కూడా పాడవడంతో సేవలు నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారాయి. సమస్యలతో వచ్చే వారితో మా ట్లాడి నొప్పి నివారణ మాత్రలు రాసి పంపిస్తుండడంతో 10 – 15 మందికి మంచి రావడం లేదు. అన్ని పరి కరాలు సమకూర్చి ఎండీ స్థాయి వైద్యుడికి కేటాయిస్తే పేదలకు మెరుగైన వైద్యంఅందనున్నందున అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.ఈ ఏడాది ఓపీ వివరాలు నెల సంఖ్య జనవరి 404 ఫిబ్రవరి 401 మార్చి 545 ఏప్రిల్ 357 మే 456 జూన్ 397 జూలై (ఇప్పటివరకు) 263ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం... దంత సేవలు అందించే చైర్ పాడైన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో దీన్ని మరమ్మతు చేయించడమా కొత్తది కొనాలో నిర్ణయిస్తాం. ప్రస్తుతం సాధారణ చికిత్సలే అందుతున్నా, ఆధునిక పరికరాలు తెప్పించి మిగతా చికిత్సలు చేస్తాం. ఎండీ స్థాయి వైద్యుడిని కేటాయిస్తే శస్త్రచికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. – డాక్టర్ నరేందర్, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి
బూర్గంపాడు: విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో చదవి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. బూర్గంపాడులోని గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను బుధవారం ఆమె సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి వసతులు, ఇతర అవసరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం బూర్గంపాడులోని కేజీబీవీని సందర్శించి రాత్రి అక్కడే బస చేశారు. అటానమస్ కళాశాల సందర్శన.. పాల్వంచరూరల్ : మండలంలోని లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలను యోగితారాణా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, మాజీ ప్రిన్సిపాల్ చిన్నప్పయ్య, ఫ్యాకల్టీతో మాట్లాడారు. ఈ కళాశాల అటాన్మస్ స్థాయికి ఎలా చేరిందని అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు ఇంటింటి క్యాంపెయిన్ చేశామని, ఉత్తీర్ణ శాతం పెంపునకు కృషి చేస్తున్నామని, తమ విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లోనూ రాణిస్తున్నారని ప్రిన్సిపాల్ తదితరులు వివరించారు. జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలు దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆమె కమిషనర్ దేవసేనకు సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ పద్మను శాలువాతో సత్కరించారు.విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాదివ్యాంగ పిల్లలకు సదుపాయాలు కల్పించాలి.. కొత్తగూడెంఅర్బన్ : దివ్యాంగ పిల్లలకు పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాలని యోగితారాణా అన్నారు. కొత్తగూడెంలోని భవిత కేంద్రాన్ని సందర్శించి, దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ విద్యార్థులతో సమానంగా చదివేలా ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం పిల్లలకు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ, రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు రాజీవ్, మదన్మోహన్, ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి, డీఈఓ వెంకటేశ్వరా చారి తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన కిన్నెరసాని
పాల్వంచరూరల్ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద భారీగా వచ్చి చేరడంతో కిన్నెరసాని జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్లో మంగళవారం 399 అడుగుల నీటిమట్టం నమోదైంది. కాగా, ఎగువ ప్రాంతాల నుంచి 16,700 క్యూసెక్కుల వరద నీరు రావడంతో బుధవారం నాటికి నీటిమట్టం 402.50 అడుగులకు పెరిగినట్లు ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ తెలిపారు. వరద ఇంకా పెరిగితే గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని, దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. -
ఉప్పొంగిన వాగులు
సింగరేణికి నష్టం.. ఏకధాటిగా కురిసిన వర్షంతో సింగరేణి మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం 36 వేల టన్నులకు గాను 20 వేల టన్నులే ఉత్పత్తి చేయగా, బుధవారం 3 వేల టన్నులు మాత్రమే వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఓసీ–2లో చేరిన వరద నీటిని ఎత్తిపోసే పంపులు సైతం నీటమునిగాయి. సాక్షి నెట్వర్క్ : జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం మొదలైన వానలు బుధవారం ఉదయం వరకూ కొనసాగాయి. జోరు వానలతో పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో అనేక గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా పినపాక నియోజవర్గంలో ఏకధాటిగా వర్షం కురవడంతో మణుగూరు పట్టణం జలదిగ్బంధం అయింది. మున్సిపాలిటీలో పరిధిలోని గాంధీనగర్, మేదరబస్తీ, సుందరయ్యనగర్, వినాయకనగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆయా కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బుధవారం ఉదయం 8 గంటల వరకు మణుగూరులో 189 మి.మీ.వర్షపాతం నమోదైంది. గతేడాది ఆగస్టులో పట్టణం నీట మునగగా.. మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మేదరబస్తీ శివారు కృష్ణమందిర్ ఏరియాలో పలు నివాసాలు ముంపునకు గురి కాగా, ఇళ్లలోని ముఖ్య సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఉదయం 11 గంటల తర్వాత వరుణుడు శాంతించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గాంధీనగర్, సుందరయ్యనగర్ శివారు మొట్టువాగు, కట్టువాగులు పొంగినప్పటికీ.. కట్టువాగు, మొట్టువాగు పూడికతీత పనులు కొంతమేర ముంపు ముప్పును తప్పించాయని స్థానికులు అంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆర్డీఓ దామోదర్రావు, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సీఐ నాగబాబు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు ఆయా కాలనీల్లో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. నీటమునిగిన పంటలు.. వరుసగా రెండు రోజుల పాటు వర్షం కురవడంతో పలు చోట్ల పంటలు నీటమునిగాయి. ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న వరితో పాటు మొలకెత్తిన పత్తి పంటల్లో అధికంగా నీరు చేరడంతో నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లిలో బూడిదవాడు ఉధృతంగా ప్రవహించడంతో దానిపై గల బ్రిడ్జి రహదారి కోతకు గురైంది. అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి భారీ వాహనాలు రాకుండా చర్యలు చేపట్టారు. పినపాక మండలం బయ్యారం పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పినపాక – కరకగూడెం, బయ్యారం – మణుగూరు ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. జానంపేటలో పంటలు నీట మునిగాయి. తోగూడెం శివారులోని కల్వర్టు కోతకు గురికగా అధికారులు రాకపోకలు నిలిపేశారు. దుమ్ముగూడెం మండలంలో వర్షంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో పర్ణశాల, కాశీనగరం, సున్నంబట్టి, దుమ్ముగూడెం వద్ద గోదావరి పెరుగుతోంది. పర్ణశాలలో నారచీరల ప్రాంతంలోకి నీరు రాగా సీతమ్మవారి విగ్రహం సగం మేర మునిగిపోయింది. సున్నంబట్టి – బైరాగులపాడు, కాశీనగరం – చిన్ననల్లబల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఇల్లెందు మండలం రాఘబోయినగూడెం పెద్దచెరువు అలుగు పోసింది. అలుగుపై ఉన్న వంతెన మీదుగా వరదనీరు ప్రవహించడంతో పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు మణుగూరులో అత్యధికంగా 189 మి.మీ.వర్షపాతం పలు ప్రాంతాల్లో నిలిచిన రాకపోకలు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం -
ఖ్యాతి పెంచేలా ఎర్త్ సైన్సెస్
కొత్తగూడెంఅర్బన్ : ఖనిజ సంపదకు నిలయమైన జిల్లాలో తెలంగాణ ఖ్యాతిని పెంచేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నిలుస్తుందని అన్నారు. యూనివర్సిటీలో ప్రవేశపెట్టాల్సిన కోర్సులు, మౌలిక వసతులు, భవనాల నిర్మాణం, నిధుల సమీకరణ తదితర అంశాలపై బుధవారం కొత్తగూడెంలోని యూనివర్సిటీ(ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ మైన్స్)లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెలలో సీఎం రేవంత్రెడ్డి ఈ యూనివర్సిటీని ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ పేరును ఈ యూనివర్సిటీకి పెట్టడం గర్వించదగిన విషయమన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే బీఎస్సీ, ఎమ్మెస్సీలో జువాలజీ, ఎన్విరాన్మెంటల్ కోర్సులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని, వివిధ దేశాల్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను సందర్శించి, అక్కడి అనుభవాల ఆధారంగా మౌలిక సదుపాయాలు, కోర్సుల రూపకల్పన చేయాలని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపనకు అవసరమైన చర్యలు, కోర్సులు, విద్యార్థుల సంఖ్య వంటి అంశాలపై చర్చించామని తెలిపారు. జిల్లాలోని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జియాలజీ, భూ విజ్ఞానానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు ఉన్నా, పూర్తిగా ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం మాత్రం ఇదే మొదటిదని స్పష్టం చేశారు. యూనివర్సిటీకి మూడు సంవత్సరాల్లో శాశ్వత భవనాలు, అవసరమైన వసతులు కల్పిస్తామని, ఈ మేరకు నిధులు కేటాయించేలా సీఎం రేవంత్రెడ్డితో చర్చిస్తామని చెప్పారు. మూడేళ్లలో మొత్తం కోర్సులు.. విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు మొదలవుతాయని, రాబోయే మూడేళ్లలో అన్ని కోర్సులు అందుబాటులోకి తెస్తామని అన్నారు. భూమిపై అవగాహన, భూమికి సంబంధించి అన్ని పరిశోధనల కోర్సులతో విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. వివిధ దేశాల విశ్వవిద్యాలయాల సమన్వయంతో ఇక్కడి విద్యార్థులకు సౌకర్యాలు, వివిధ రకాల కోర్సులపై ప్రణాళిక రూపొందిస్తామని, ఇందుకోసం మూడు కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన మాట్లాడుతూ.. డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి పేరుతో ఏర్పాటైన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. శ్రీరాముడు కాలు మోపిన ఈ ప్రాంతంలో అద్భుత యూనివర్సిటీ స్థాపించడం సంతోషకమరని చెప్పారు. దేశంలోని వివిధ రంగాల్లో నిపుణులను కమిటీలో సభ్యులుగా చేర్చడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తిస్థాయి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభించడం జిల్లా అభివృద్ధికి శుభ పరిణామం అన్నారు. దేశంలోని విద్యార్థులు మెరుగైన ఉద్యోగావకాశాలు సాధించేందుకు ఈ విశ్వవిద్యాలయం తోడ్పడుతుందన్నారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే జియోలాజికల్ మ్యూజియంగా జిల్లా ఉందని, అద్భుతమైన ఖనిజ సంపద, గోదావరి పరీవాహక ప్రాంతం ఉన్న ఈ జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపనతో మారుమూల ప్రాంత విద్యార్థులకు ఎంతగానో ఉపయోగమని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి, అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి, ఉన్నత విద్యామండలి సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ రామచంద్రం, రూసా ప్రతినిధి సౌందర్యజోసెఫ్ పాల్గొన్నారు. మూడేళ్లలో పూర్తి స్థాయి యూనివర్సిటీ నిర్మాణం ఆగస్టులో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఈ విద్యా సంవత్సరం నుంచే యూజీ, పీజీ కోర్సులు ప్రారంభం సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల, అధికారులు -
తాలిపేరు.. వరద జోరు
15 గేట్లు ఎత్తి 33వేల క్యూసెక్కుల నీటి విడుదల చర్ల: తాలిపేరు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రాజెక్టుకు చెందిన 15 గేట్లు ఎత్తి 32,981 క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెల్లవారుజామున 8 గేట్లను మూడడుగుల మేర ఎత్తి 15,208 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తుండగా ఉదయం 7 గంటల నుంచి వరద ఉధృతి పెరిగింది. దీంతో మరో 7 గేట్లు కూడా ఎత్తి 28,600 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. దీంతో దిగువన ఉన్న తాలిపేరు నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగుతుండుగా ప్రాజెక్టులోకి మరింతగా వరద నీరు వచ్చే ప్రమాదం ఉండడంతో ఈఈ సయ్యద్ అహ్మద్జానీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. డీఈ తిరుపతి, ఏఈలు ఉపేంద్ర, సంపత్ ప్రాజెక్టు వద్దనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘటాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైభవంగా రుద్ర హోమంనందీశ్వరుడికి అభిషేకం పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో మాసశివరాత్రిని పురస్కరించుకుని బుధవారం రుద్రహోమం, శివాలయంలో నందీశ్వరుడుకి అభిషేకం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాల నడుమ స్వామివారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ గావించి రుద్రహోమం, చివరకు పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. హోమంలో పాల్గొన్న వారికి అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాపారావు, చందుపట్ల రమ్య, చీకటి కార్తీక్ పాల్గొన్నారు.భద్రాచలం సబ్ కలెక్టర్గా మ్రినాల్ శ్రేష్ఠభద్రాచలంఅర్బన్ : భద్రాచలం సబ్ కలెక్టర్గా మ్రినాల్ శ్రేష్ఠను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన మ్రినాల్ 2023లో విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా 449వ ర్యాంక్ సాధించారు. ఆరేళ్ల తర్వాత ఐఏఎస్ నియామకం.. భద్రాచలం సబ్ కలెక్టర్గా ఆరేళ్ల తర్వాత ఐఏఎస్ అధికారిని నియమించారు. 2018 నుంచి 19 వరకు ఇక్కడ భవేష్ మిశ్రా విధులు నిర్వహించి బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన వారంతా ఆర్డీఓ స్థాయి అధికారులే. ఇప్పుడు ఐఏఎస్ అధికారి అయిన మ్రినాల్ శ్రేష్ఠను నియమించారు. భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు తాజాగా బదిలీ అయ్యారు. కాగా, మ్రినాల్ శ్రేష్ఠ గతంలో ఖమ్మంలో ట్రెయినీ కలెక్టర్గా విధులు నిర్వహించారు.స్వల్పంగా పెరిగిన గోదావరిభద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో తాలిపేరుతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి వరదనీరు వస్తుండగా బుధవారం ఉదయం 17 అడుగులు ఉన్న నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతూ రాత్రికి 19 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. కేజీబీవీని సందర్శించిన జేడీజూలూరుపాడు: మండల కేంద్రంలోని కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) సర్వ శిక్షా అభియాన్ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ బుధవారం సందర్శించారు. 8, 9 తరగతుల విద్యార్థినుల సామర్థ్యాలను పరిశీలించి, గణితం బోధించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న డిజిటల్ తరగుతులను పరిశీలించారు. వంటలను పరిశీలించి, మెనూ సక్రమంగా పాటిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థినులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ హజారి శిరీష, ఎంఈఓ బానోత్ జుంకీలాల్, కేజీబీవీ ఎస్ఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
అలరిస్తున్న ‘వెన్నెల’
ముగియనున్న గడువు కేటీపీఎస్ సొసైటీ పాలకవర్గ పదవీ కాలం వచ్చే నెల 4న ముగియనుండగా కొత్త కమిటీలో చోటు కోసం పలువురు ప్రయత్నిస్తున్నారు. వాతావరణ ం జిల్లాలో గురువారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 8లోగురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025మణుగూరు మండలంలోని రథంగుట్ట అభయాంజనేయస్వామి సమీపంలో అర్బన్ పార్క్లో ఉన్న వెన్నెల జలపాతం పర్యాటకులను అలరిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గుట్టపై నుంచి జలం జాలువారుతూ కనువిందు చేస్తోంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు సందర్శనకు భారీగా తరలివస్తున్నారు. – మణుగూరు రూరల్ న్యూస్రీల్ -
అవే సమస్యలు
అప్గ్రేడ్ అయినా..నేడు మంత్రి, ఉన్నతాధికారుల పరిశీలన.. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, అవసరమైన వసతులు, నిధుల కేటాయింపు తదితర అంశాలను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు యూనివర్సిటీ వీసీ, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, తెలంగాణ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్, కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, ప్రొఫెసర్ రాంచందర్ తదితరులు బుధవారం రానున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వీరు అందించే ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో పాటు బోధన, బోధనేతర సిబ్బందిని అదనంగా నియమించడం, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం కేఎస్ఎంలోని మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరమే తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ అయినప్పటికీ.. వైస్ చాన్స్లర్ నియామకం మినహా ఎలాంటి నిధులు, సౌకర్యాలు సమకూర్చలేదు. ప్రస్తుతం ఇక్కడ 11 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండగా మరో ఎనిమిది మంది కాంట్రాక్టు పద్ధతిన నియమితులయ్యారు. 45 మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. యూనివర్సిటీలో అడ్మిషన్లు మొదలై తరగతులు ప్రారంభిస్తే క్లాస్రూమ్లు సరిపోయినా.. కొత్తగా వచ్చేవారికి హాస్టళ్లతో పాటు ఇతర సౌకర్యాలూ కష్టమే. ఒకటి, రెండు సెమిస్టర్లు ఎలాగో నెట్టుకొచ్చినా వచ్చే ఏడాది వరకు అన్ని వసతులు కల్పించాలి. లేదంటే యూనివర్సిటీ సజావుగా సాగే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఉన్న హాస్టల్, మెస్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. కొన్ని గదులు వర్షమొస్తే కురుస్తున్నాయి. ఇక యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ అంతా పిచ్చి మొక్కలు, పాము పుట్టలతో నిండి ఉంది. రోడ్ల పరిస్థితీ అధ్వానంగానే ఉంది. హాస్టళ్లతో పాటు ఇతర అన్ని నిర్మాణాలకూ సరిపడా స్థలం ఉన్నా నిధులు లేవు. పరిహారమూ అందలేదు.. గతంలో కళాశాల స్థాయిలో ఉన్నప్పడే ఏర్పాటైన ప్రత్యేక కమిటీ.. క్షేత్రస్థాయిలో పరిశీలించి వసతుల కల్పనకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ మేరకు హామీ ఇచ్చిన గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఈ యూనివర్సిటీ మొత్తం 300 ఎకరాల్లో విస్తరించి ఉండగా కలెక్టరేట్ నిర్మాణానికి 20 ఎకరాలు, ఎస్పీ కార్యాలయానికి 20 ఎకరాలు, మెడికల్ కాలేజీకి 30 ఎకరాలు తీసుకున్నారు. ఇవన్నీ కలిపి పరిహారంగా రూ.168 కోట్లు రావాల్సి ఉండగా అవి కూడా ఇంతవరకు అప్పగించలేదు. దీంతో కళాశాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతున్నారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ బోర్డు ఏర్పాటుయూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరును డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా ఇప్పటికే మార్చగా.. మంగళవారం నూతన బోర్డు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి, విద్యాశాఖ కార్యదర్శి సందర్శించనున్న నేపథ్యంలో ఈ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు నేటి సమావేశ హాల్ను సైతం సిద్ధం చేశారు. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని వీడని కష్టాలు.. కళాశాల ఆవరణలో పిచ్చిమొక్కలు, పాముల పుట్టలు నిధులు విడుదలైతేనే అభివృద్ధికి అవకాశం నేడు మంత్రి తుమ్మలతో పాటు వీసీ బృందం పరిశీలన యోగితారాణా పర్యటన ఇలా..రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్, మెడికల్, ఇంజనీరింగ్ కాంప్లెక్స్ను సందర్శించి, వీసీలతో సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు యోగితా రాణా శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలను పరిశీలించనున్నారు. 3.30 గంటలకు భవిత కేంద్రాన్ని, సాయంత్రం 6.30 గంటలకు కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేయనున్నారు. అనంతరం బూర్గంపాడులోని టీజీఆర్జీఐఎస్ పరిశీలన, విద్యార్థులు, సిబ్బందితో సమీక్షించి, రాత్రికి అక్కడే బస చేస్తారని తెలిసింది. ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా రామచంద్రంకేయూ క్యాంపస్: ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు వీసీ ప్రతాప్రెడ్డి ఉత్తర్వులు అందజేశారు. ప్రొఫెసర్ రామచంద్రం 1991లో కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులై ప్రస్తుతం సైకాలజీ విభాగం అధిపతిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి 31న కేయూ రిజిస్ట్రార్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే, కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించిన అసోసియేట్ ప్రొఫెసర్ జగన్మోహన్రావును ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా నియమించారు. -
మహాలక్ష్మీ కటాక్షం
● అతివలకు కలిసొస్తున్న ఉచిత ప్రయాణం ● ఖమ్మం రీజియన్లో 7.38 కోట్ల ఉచిత ప్రయాణాలు ● తద్వారా రూ.331.05 కోట్ల చార్జీలు ఆదా ● నేడు సంబురాలకు ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ ఇప్పటివరకు రీజియన్లో మహాలక్ష్మి ప్రయాణికుల వివరాలు, ఆదా అయిన నగదు డిపో ప్రయాణించిన ఆదా అయిన మహిళలు చార్జీలు (రూ.కోట్లలో) ఖమ్మం 1,68,28,069 81.42 మధిర 67,76,202 48.69 సత్తుపల్లి 1,73,32,735 61.43 భద్రాచలం 82,99,912 41.14 కొత్తగూడెం 1,06,83,004 40.62 మణుగూరు 1,12,33,835 48.09 ఇల్లెందు 26,60,649 9.66 మొత్తం 7,38,14,406 331.05 ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. 2023 డిసెంబర్ 9న ఈ పథకం అందుబాటులోకి రాగా ఇప్పటివరకు ఖమ్మం రీజియన్లో 7,38,14,406 మంది ఉచితంగా ప్రయాణించారని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన నేపథ్యాన బుధవారం సంబురాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఖమ్మం కొత్త బస్టాండ్లో జరిగే ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారని అధికారులు తెలిపారు. ‘చిరు’ జీవితాల్లో వెలుగులు.. మహాలక్ష్మి ద్వారా కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం పేద మహిళలకు అండగా నిలుస్తోంది. ప్రయాణ ఖర్చులు లేకపోవడంతో ఆ వనరులను కుటుంబీకుల విద్య, ఆరోగ్యం, చిరు వ్యాపారాలకు మళ్లించగలుగుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగాలకు సిద్ధమవుతూ పట్టణాలకు వెళ్లి వచ్చే యువతులపై ఆర్థిక భారం తగ్గినట్లయింది. అలాగే, గ్రామీణ మహిళలు మెరుగైన వైద్యసేవల కోసం ఆస్పత్రులకు ఉచితంగా వెళ్లివస్తున్నారు. కూరగాయలు, పూలు, ఇతర చిరువ్యాపారాలు చేసే వారికి సైతం ఈ పథకం ఉపయోగపడుతోంది. -
ప్రిన్సిపాల్, వార్డెన్పై సస్పెన్షన్ ఎత్తివేయాలి
కళాశాల గేట్ వద్ద విద్యార్థినుల ధర్నా భద్రాచలంటౌన్: భద్రాచలం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు కళాశాల ప్రధాన గేట్ వద్ద మంగళవా రం ధర్నా చేశారు. కళాశాలలో రెండు రోజుల కిందట విద్యార్థినులకు ఉదయం వడ్డించే కిచిడీలో పురుగులు వచ్చాయని ఆందోళన చేయడంతో విచారణకు ఆదేశించిన ఐటీడీఏ పీఓ.. ఘటనకు కారకులైన వార్డెన్, ప్రిన్సిపాల్ ను సస్పెండ్చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, విద్యార్థినులు వార్డెన్, ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని ధర్నా చేయడం చర్చనీయాంశమైంది. కళాశాలలో మెనూ అమలు విషయంలో ప్రిన్సిపాల్, వార్డెన్ల నిర్లక్ష్యం లేద ని, బియ్యంలో పురుగులు ఉండడంతోనే అలా జరిగిందని వారు పేర్కొన్నారు. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలుసుజాతనగర్: ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే ఈ రోజుల్లో చాలాకష్టంతో కూడుకున్న పని. కానీ, మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన మాలోత్ చంపాలాల్ ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన మాలోత్ గ్యామా, సాలి దంపతుల రెండో కుమారుడు చంపాలాల్ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ)లో జూని యర్ ఇంజనీర్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. అలాగే, ఇటీవల విడుదలైన ఆర్ఆర్బీ ఫలితాల్లో జూనియర్ ఇంజనీర్గా మరో కొలువు సాధించాడు. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన చంపాలాల్ను తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. ఎస్సీ రైతులు పేర్లు నమోదు చేసుకోండిఅశ్వారావుపేటరూరల్: ఉద్యాన విశ్వవిద్యాల యం పరిధిలోని అశ్వారావుపేట ఉద్యాన పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగు పై ఎస్సీ రైతులకు ఒక రోజు శిక్షణ ఏర్పాటు చేయనున్నామని, ఆసక్తి ఉన్నవారు పేర్లు నమోదు చేసుకోవాలని పరిశోధనా స్థానం శాస్త్రవేత్త విజయ్కృష్ణ కోరారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. భారతీయ చిరు ధాన్యాల పరిశోధన సంస్థ సౌజన్యంతో ఎస్సీ రైతులకు పలురకాల ఉద్యాన పంటల సాగుపై త్వరలో ఒకరోజు శిక్షణ నిర్వహిస్తామని, ఈ నెల 27వ తేదీలోపు తమ పేర్లను 79958 90625 నంబర్లో సంప్రదించి నమోదు చేసుకోవచ్చన్నారు. శిక్షణలో ఒక్కొక్క రైతు కు 10 రకాల పండ్ల మొక్కల్ని అందించి, వాటి పెంపకంపై శిక్షణ ఇస్తామని తెలిపారు. -
తపాలా శాఖలో ఐటీ 2.0 సేవలు
ఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖలో ఐటీ–2.0 సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సురక్షితంగా, వేగంగా వినియోగదారులకు సేవలు అందించమే లక్ష్యంగా తపాలా శాఖ కొత్త సాఫ్ట్వేర్ను రూపొందించింది. ఇప్పటికే కర్ణాటకతో పాటు హైదరాబాద్ సర్కిల్లో అమలవుతున్న విధానాన్ని మంగళవారం మిగతాచోట్ల ప్రారంభించగా, ఖమ్మం తపాలా డివిజన్ పరిధిలోనూ అమల్లోకి వచ్చింది. డివిజనల్ కార్యాలయంతో పాటు పది సబ్ డివిజన్ కార్యాలయాలు, ఖమ్మం, కొత్తగూడం, భద్రాచలం హెడ్ పోస్టాఫీసులు, 70 సబ్ పోస్టాఫీసులు, 750 బ్రాంచిల్లో ఐటీ–2.0 ద్వారా పొదుపు పథకాలు, డిపాజిట్లు, బీమా, ఐపీపీబీ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు. తొలిసారి తపాలా కార్యాలయాల్లో ఐటీ–2.0 సాఫ్ట్వేర్ను అమల్లోకి రాగా ఖమ్మం డివిజన్లోని పలు బ్రాంచ్ల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఉద్యోగులు సమీప బ్రాంచ్ల ద్వారా సేవలందించారు.తొలిరోజు అక్కడక్కడా సాంకేతిక సమస్యలు -
కళాశాలలకు మహర్దశ
● ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మరమ్మతులకు నిధులు ● మౌలిక వసతులు, క్రీడా సామగ్రి, ఇతర ఖర్చులకు రూ.3.31 కోట్లు విడుదల ● జిల్లాలో 14 కళాశాలలకు నిధులు పాల్వంచరూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతులు, అదనపు తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్న తురణంలో ప్రభుత్వం కళాశాలల ప్రగతిపై దృష్టి సారించి నిధులు మంజూరు చేసింది. దీంతో జూనియర్ కాలేజీల్లో ఇక వసతులు మెరుగుపడనున్నాయి. జిల్లాలో మొత్తం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 14 ఉండగా ఇందులో చదువుకునే విద్యార్థులు ఐదు వేలకు పైగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాలో ని జూనియర్ కళాశాలలకు రూ.3,35,71,000 విడుదల చేయగా, అందులో మరమ్మతుల కోసం రూ. 3,31,15,000, మొయింటెన్స్ కోసం రూ.3.16 లక్షలు, క్రీడాసామగ్రి కోసం రూ.1.40లక్షలు కేటా యించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి హెచ్.వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ప్రతి జూనియర్ కళాశాలకు రూ. 10వేల చొప్పున క్రీడా సామగ్రి కొనుగోలుకు కేటా యించారు. కళాశాలలకు కేటాయించిన నిధులు.. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల (జీజేసీ) కు రూ.58.50 లక్షలు కేటాయించారు. భద్రాచలం జీజేసీకి రూ.15.40 లక్షలు.. పాల్వంచ జీజేసీకి రూ. 13.34 లక్షలు, మణుగూరు జీజేసీకి రూ.16.84 లక్ష లు, అశ్వాపురం జీజేసీకి రూ.18.26 లక్షలు ఇల్లెందు జీజేసీకి రూ.37.34 లక్షలు, అశ్వారావు పేట జీజేసీకి రూ.9.41లక్షలు, చర్ల జీజేసీకి రూ. 22.90లక్షలు, బూర్గంపాడు జీజేసీకి రూ. 22.76 లక్షలు, పినపాక జీజేసీకి రూ.18.76 లక్షలు, గుండాల జీజేసీకి రూ.14.26 లక్షలు, టేకులపల్లి జీజేసీకి రూ.31.26 లక్షలు, దుమ్ముగూడెం, ములకపల్లి జీజేసీకి రూ.39.34 లక్షలు కేటాయించారు. కాగా, ప్రతి కళాశాలలో రూ.10 వేలు క్రీడా సామగ్రి కొనుగులుకు వినియోగించగా.. మిగిలిన డబ్బులను మెయింటెనెన్స్, మరమ్మతుల కోసం వినియోగించనున్నారు. నిధులను సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆదేశాల మేరకు కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పంచాయతీ రాజ్ శాఖ, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగాల పర్యవేక్షణలో పనులు నిర్వహిస్తారు. –హెచ్.వెంకటేశ్వరరావు, డీఐఈఓ -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మణుగూరురూరల్: అసాంఘిక కార్యకలాపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్రెడ్డి సూచించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని భగత్సింగ్నగర్ లో పోలీస్శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రవీందర్రెడ్డి నేతృత్వంలో సీఐ పాటి నాగబాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది భగత్సింగ్నగర్లోని ప్రతీ ఇంటిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 44 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటో లు, బెల్ట్ దుకాణాల్లోని రూ.25 వేల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని, ద్విచక్ర వాహనదారులు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు పంపే లింకులను ఓపెన్ చేయొద్దని పేర్కొన్నారు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బెల్ట్ దుకాణాలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు డీఎస్పీకి తెలపడంతో సంబంధిత షాపు యజమానులను హెచ్చరించారు. అనంతరం సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. కార్యక్రమంలో అశ్వాపురం సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐలు రంజిత్, మనీషా, సురేశ్, మధుప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సచివాలయం నుంచి రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, జిల్లా అటవీ శాఖాధికారి కృష్ణాగౌడ్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, తిరస్కరణకు గురైతే కారణాలను పొందుపర్చాలని ఆదేశించారు. ఐదు రోజుల్లో పూర్తి నివేదిక అందజేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల పరిష్కారం పూర్తి కావాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలను అటవీ శాఖ నుంచి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ డీడీ మణెమ్మ, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, ఎస్సీ సంక్షేమాధికారి అనసూయ, బీసీ సంక్షేమాధికారి ఇందిర, డీఈఓ వెంకటేశ్వరాచారి, పౌరసరఫరాల శాఖ డీఎం త్రినాథ్బాబు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, డీఎంహెచ్ఓ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన గ్రంఽథాలయ చైర్మన్ జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నియమితులైన పసుపులేటి వీరబాబు మంగళవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధిపై చర్చించారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
మునగ, నేరేడు మొక్కలు నాటండి
టేకులపల్లి మండల పర్యటనలో కలెక్టర్ టేకులపల్లి : పాఠశాలలు, ఆస్పత్రుల ఆవరణల్లో మునగ, నేరేడు మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని పాతతండా ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత మెరుగైన బోధన అందేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓ జగన్, హెచ్ఎం లక్ష్మణ్కు సూచించారు. ఆ తర్వాత సులానగర్ పీహెచ్సీని సందర్శించారు. ఓపీ, ఐపీ ఎలా ఉన్నాయని ఆరా తీశారు. పేషంట్లకు అందుతున్న సేవలు, మందుల నిల్వలు, ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నెలలు నిండిన గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు, మైదాన ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఆస్పత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగాయని, పాములు తిరుగుతున్నాయని, కోతుల బెడద ఉందని స్థానికులు కలెక్టర్ దృష్టికి తేగా.. పంచాయతీ సిబ్బంది సహకారంతో తొలగించాలని వైద్యులను ఆదేశించారు. కోతుల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
పాల్వంచ: విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని డీఎంహెచ్ఓ జయలక్ష్మి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం దంత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుల్లో రాణించాలని సూచించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంటే దోమలు ప్రబలకుండా ఉంటాయని సూచించారు. నవ లిమిటెడ్ వారు విద్యార్థుల ఆరోగ్యంపై తీసుకుంటున్న చర్యలను అభినందించారు. కార్యక్రమంలో నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్లు ఎంజీఎం ప్రసాద్, బి.రామారావు, పాఠశాల హెచ్ఎం రమ, మొబైల్ సైన్స్ సిబ్బంది రాజేశ్వరరావు, రాజేష్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి
జూలూరుపాడు: పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. హెడ్కానిస్టేబుల్ దయానంద్ కథనం ప్రకారం.. భేతాళపాడు జీపీ పంతులుతండాకు చెందిన ధరావత్ కాంతి (70).. తన పని తాను చేసుకునే పరిస్థితి లేక జీవితంపై విరక్తి చెంది ఈ నెల 18న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్కానిస్టేబుల్ దయానంద్ పేర్కొన్నారు. ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీపాల్వంచ: ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా లారీ రివర్స్లో వచ్చి ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఉల్లిపాయల వ్యాపారి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. పాల్వంచ మున్సిపల్ పరిధిలోని రాంనగర్కు చెందిన ధనుకోటి నరసింహనాయుడు (43) ట్రాలీ ఆటోలో ఉల్లిపాయల వ్యా పారం చేస్తుంటాడు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఉల్లిపాయలతో ఇంటి నుంచి బయలు దేరి కొత్తగూడెం వైపు వెళ్తున్నాడు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వద్ద యూటర్న్ వద్దకు రాగానే అక్కడ ఉన్న లారీడ్రైవర్ లారీని రివర్స్లో తీసుకొచ్చి ట్రాలీ ఆటోను ఢీకొట్టాడు. ఆటోలో ఇరుక్కున్న నరసింహనాయుడును బయటకు తీసి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. తలకు తీవ్ర గాయాలతో అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా లారీడ్రైవర్ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన భూక్యా శ్రీనివాస్గా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేకాట స్థావరంపై దాడిపినపాక: మండలంలోని బయ్యారం గ్రామంలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బయ్యారంలోని ఓ ఇంట్లో పేకాడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.46 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఇసుక అక్రమ నిల్వలు సీజ్బూర్గంపాడు: సారపాక గ్రామ పంచాయతీలోని భాస్కర్నగర్లో ఇసుక అక్రమ నిల్వలను తహసీల్దార్ కేఆర్కేవీ ప్రసాద్ మంగళవారం సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సీజ్ చేసిన ఇసుకను గ్రామపంచాయతీ అధికారులకు అప్పగించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. ఒకరు మృతి -
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడి
అశ్వాపురం/కరకగూడెం : రైతులు ప్రత్యామ్నాయ పంటలతో పాటు మేలైన వంగడాలు సాగు చేసి అధిక దిగుబడి సాధించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్.అన్వేష్రెడ్డి అన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, నానో ఎరువులను పిచికారీ చేయాలని, తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. మంగళవారం ఆయన అశ్వాపురంలో పత్తిసాగు, కరకగూడెం మండలం భట్టుపల్లి రైతు వేదికలో కంది విత్తనోత్పత్తిపై నిర్వహించిన అవగాహన సదస్సుల్లో మాట్లాడారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి, విత్తనోత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. రైతు పక్షపాతిగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని, అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లాభాల బాట పట్టాలని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన పప్పు దినుసుల పంటల్లో ఒకటైన కంది విత్తనోత్పత్తిలో రైతులు క్రియాశీలకంగా పాల్గొంటే స్వయం సమృద్ధి సాధించవచ్చని సూచించారు. అవసరమైన సాంకేతి సహాయం అందించడానికి విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఏడీఏ తాతారావు, ఏఓ చటర్జీ, ఏఈఓలు ప్రశాంత్, అనిల్ కుమార్, ఇఫ్కో సంస్థ మేనేజర్ నాగార్జున, టీపీసీసీ సభ్యులు చందా సంతోష్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి -
మెట్ట పంటలకు అనుకూలం..
● తేలికపాటి వానలతో ఆశాజనకంగా పత్తి, మొక్కజొన్న సాగు ● చెరువులు నిండకపోవటంతో వరినాట్లు ఆలస్యం బూర్గంపాడు: ఈ సీజన్లో పడుతున్న తేలికపాటి వానలు మెట్ట పంటల సాగుకు అనుకూలంగా మారాయి. జిల్లాలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న పంటలకు అడపాదడపా కురుస్తున్న వానలు కలిసివస్తున్నాయి. వానాకాలం ఆరంభమై రెండు నెలలు కావస్తున్నా భారీ వర్షాలు కురవకపోవటంతో చెరువులు, కుంటలు నిండలేదు. దీంతో వరినాట్లు ఆలస్యమవుతున్నా యి. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వరినాట్లు కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే వరినాట్లు కూడా ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణ వర్షపాతం.. ఈ ఏడాది జూన్లో జిల్లాలో కొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం, మరికొన్ని మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. రైతులు జూన్ ఆరంభం నుంచే మెట్టపంటల సాగుకు ఉపక్రమించారు. సుమారు 2.25 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు పత్తి వేశారు. జూన్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పత్తి మొలకశాతం కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంది. దీంతో రైతులు రెండో సారి పత్తి గింజలు వేసుకున్నారు. జూలైలో అడపాదడపా కురుస్తున్న తేలికపాటి వానలు పత్తిపంటకు జీవం పోశాయి. ప్రస్తుతం కురుస్తున్న వానలు పత్తికి మరింత అనుకూలంగా మారాయి. ప్రస్తుతం పత్తిచేలు అడుగు ఎత్తు పెరిగి ఆశాజనకంగా ఉన్నాయి. జూన్ మొదటివారంలో ముందుగా వేసిన పత్తి చేలు పూత దశకు చేరాయి. పత్తికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.589 మద్దతు ధరను పెంచింది. దీంతో క్వింటా పత్తి ధర రూ.8,100కు చేరింది. దీంతో జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తిని సాగు చేశారు. అలాగే, 25 వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటకు కూడా జూలైలో కురిసిన వానలు ఊపిరి పోశాయి. పత్తి, మొక్కజొన్నల చేలల్లో కలుపు తీసి రైతులు తొలివిడత ఎరువులు వేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. తేలికపాటి వానలతో కూరగాయల సాగు కూడా పెరగనుంది. నిండని చెరువులు ఇప్పటి వరకు జిల్లాలో భారీ వర్షాలు కురవకపోవటంతో చెరువులు, కుంటలు నిండలేదు. సరైన వానలు కురవక వరినార్లు కూడా ఒకనొక దశలో వడబడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వానలకు జిల్లాలో వరినాట్లు కూడా మొదలయ్యాయి. తుమ్మలచెరువు, టేకులచెరువు, దోమలవాగు చెరువు వంటి పెద్దచెరువులకు నీరు రాలేదు. దీంతో వరినాట్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రుతుపవనాలు బలపడటమో, అల్పపీడన ద్రోణి ప్రభావంతోనో జూలై చివరి వారం భారీ వర్షాలు కురిసి చెరువులు నిండితే పూర్తిస్థాయిలో వరినాట్లు పూర్తవుతాయి. భారీ వర్షాలు కురవకపోతే జిల్లాలో వరిసాగు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి పరీవాహకంలో సాగు ఆలస్యం ఏటా వరదల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సాగు ఆలస్యమవుతోంది. ఆగస్ట్లో గోదావరి వరదలు చూసిన తరువాత రైతులు పంటలు సాగు చేసుకుంటారు. మూడేళ్లుగా జూలైలోనే గోదావరికి వరద రావడంతో రైతులు సాగుకు భయపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు లేనికారణంగా ఇప్పటి వరకు గోదావరికి పెద్దగా వరద రాలేదు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా పదిరోజుల కిందట గోదావరికి 40 అడుగుల మేర వరద చేరింది. రెండు రోజుల వ్యవధిలోనే వరద పూర్తిగా తగ్గింది. ఈసారి వరద రాకపోవచ్చని భావిస్తున్న కొందరు రైతులు సాగుకు ఉపక్రమిస్తున్నారు. పత్తికి అనుకూలంగా ఉంది ఈ ఏడాది కురుస్తున్న తేలికపాటి వానలు పత్తి పంటకు అనుకూలంగా ఉన్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పత్తి ఏపుగా పెరుగుతోంది. తొలివిడత ఎరువులు వేయటం పూర్తయింది. మరో వారం రోజుల్లో రెండో విడత ఎరువులు వేస్తే పూతకు వస్తుంది. –వై.వెంకట్రామిరెడ్డి, రైతు, రెడ్డిపాలెం -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలుచేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో ఇద్దరు సీఐల బదిలీలుఇల్లెందు/కొత్తగూడెంటౌన్: జిల్లాలో ఇద్దరు సీఐలను బదిలీ చేస్తూ వరంగల్ రేంజ్ మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ తాటిపాముల సురేష్ను ఇల్లెందు పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓగా, ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణపై సస్పెన్షన్ ఎత్తివేసి టేకులపల్లి సీఐగా నియమించారు. లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయంనిలిచిన 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ వార్షిక లక్ష్య సాధనలో భాగంగా రోజుకు 1.72 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి శ్రమిస్తుండగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అంతరాయం ఏర్పడుతోంది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు 1.72 లక్షల టన్నులకు గాను రెండు రోజుల నుంచి 72 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే నమోదవుతోంది. దీంతో రోజుకు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి స్తంభించగా, 18 ఓసీల్లో రోజుకు 15లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్(ఓబీ) వెలికితీత కూడా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా, ఎడతెరిపి లేని వర్షంతో ఓసీల్లోని హాల్రోడ్లన్నీ బురద మయం కావడమే కాక భారీగా నీరు చేసింది. దీంతో ప్లాన్టూన్ పంపులు, మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. రామాలయం ఈఓకు ఉద్యోగోన్నతి ?భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈఓ ఎల్.రమాదేవికి ఉద్యోగోన్నతి లభించినట్లు సమాచారం. డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న ఆమెకు 2023 ఫిబ్రవరిలో ఆలయ ఈఓగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అనంతరం కొద్ది నెలలకే ఫుల్ ఇన్చార్జిగా జీఓ విడుదల చేశారు. కాగా డిప్యూటీ కలెక్టర్గా ఉన్న రమాదేవి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అయితే ఇక్కడ ఈఓగా కొనసాగిస్తారా లేక మరో చోటకు బదిలీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. -
25 నుంచి శ్రావణ మాసోత్సవాలు
ఆగస్టు 4 నుంచి 9 వరకు రామాలయంలో పవిత్రోత్సవాలుభద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈనెల 25 నుంచి శ్రావణమాసోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు మంగళవారం వివరాలు వెల్లడించారు. 25న ఫుష్యమి నక్షత్రం సందర్భంగా స్వామివారికి పట్టాభిషేకం, ప్రత్యేక నవకలశ స్నపన తిరుమంజనం, సామూహిక అష్టోత్తర శతనామార్చన, 28న అండాళ్ అమ్మవారికి తిరుమంజనం, ఆగస్టు 1న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారికి కుంకుమార్చన, సంధ్యాహారతి జరపనున్నారు. ఆగస్టు 4న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 5న అగ్నిప్రతిష్ఠ, పవిత్రాధివాసం, అష్టోత్తర శతకలశావాహనం, 6న స్నపన తిరుమంజనం, పవిత్రారోపణం, హోమం, 7న ప్రత్యేక పవిత్రోత్సవముం, 8న శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రతం, సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. 9న హయగ్రీవ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకం, ఉత్సవ సమాప్తి, 15న సామూహిక కుంకుమార్చన, 19న సర్వ ఏకాదశి సందర్భంగా లక్ష కుంకుమార్చన, 22న అమ్మవారికి పుష్పాంజలి తదితర పూజలు ఉంటాయని అధికారులు వివరించారు. కాగా 24 నుంచి 28 వరకు అండాళ్ అమ్మవారి తిరునక్షత్రత్సోవాల సందర్భంగా రాత్రి విశేష సేవాకాలం, విశేష భోగాలను రద్దు చేశారు. పవిత్రోత్సవాలు సందర్భంగా 5 నుంచి 9 వరకు నిత్యకల్యాణాలు రద్దు చేసినట్లు వెల్లడించారు. -
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
● చదువుతో పాటు వారి ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలి ● ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీఓ ఆదేశందుమ్ముగూడెం : విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో చదువుతో పాటు వారి ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలన్నారు. మండలంలోని మంగువాయిబాడవ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేసి, పాఠాలు బోధించారు. అనంతరం మాట్లాడుతూ.. మెనూ సక్రమంగా పాటించాలన్నారు. ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థుల కోసం ఉద్దీపకం–2 వర్క్బుక్లు రూపొందించామని చెప్పారు. గతేడాది ప్రవేశపెట్టిన ఈ పుస్తకాలతో పిల్లల్లో సామర్థ్యం పెరిగిందని తెలిపారు. ప్రతీరోజు బోధించే పాఠ్యాంశాలతో పాటు అదనంగా ఒక పీరియడ్ విద్యార్థినులకు ఇష్టమైన వ్యాసరచన, క్విజ్, నాటికలు, ఏకపాత్రాభినయం, కుట్లు, అల్లికల వంటి వాటిపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వాటికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించి అన్ని పాఠశాలలకు పంపిస్తామని తెలిపారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉండేలా చూడాలని, పిల్లలు ఎవరైనా అస్వస్థతకు గురైతే సమీపంలోని పీహెచ్సీకి తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వీరమ్మ, డిప్యూటీ వార్డెన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పథకాలతో జీవనోపాధి భద్రాచలంటౌన్: పోడు పట్టా కలిగిన గిరిజన రైతులకు ప్రధానమంత్రి జన జాతీయ గౌరవ ఉద్ధరణ అభియాన్ పథకం ద్వారా సబ్సిడీ రుణాలతో జీవనోపాధి కల్పించాలని పశుసంవర్థక శాఖ అధికారులను పీఓ రాహుల్ ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై మంగళవారం ఆయన వారితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా పోడు పట్టాలు పంపిణీ చేసిన గిరిజన రైతులకు ఈ పథకం వర్తింపజేయాలన్నారు. తద్వారా 90 శాతం సబ్సిడీతో గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి యూనిట్లు అందించాలన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు కూడా గ్రామాల్లో ఈ పథకాలపై అవగాహన కల్పించాలని, ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. సమావేశంలో ఏపీఓ డేవిడ్రాజ్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఏడీ రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో జోరు వాన..
జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల పరిధిలోని లో లెవెల్ చప్టాలు నీట మునిగాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మణుగూరు పట్టణంలో మూడున్నర గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో పలు వీధులు నీట మునిగాయి. అశోక్నగర్లోని ఓ వీధి జలదిగ్బంధం అయింది. టేకులపల్లి మండలంలోని పుణ్యపు వాగు ఉధృత ప్రవాహంతో ఆళ్లపల్లి – టేకులపల్లి – కొత్తగూడెం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. – మణుగూరు టౌన్/టేకులపల్లి -
తృటిలో తప్పిన ప్రమాదం
టేకులపల్లి: చింతలతండా – గుండ్లమడుగు గ్రామాల మధ్య ఉన్న పుణ్యపు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని మంగళవారం స్థానికులు రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆర్టీసీ బస్సుతో పాటు ఇతర వాహనాలు నిలిచిపోయాయి. గుండ్లమడుగు గ్రామానికి చెందిన సర్ప శ్రీను కొత్తగూడెం వెళ్లేందుకు పుణ్యపు వాగు వద్దకు వచ్చి బస్సు ఎక్కాడు. కొంత సేపటికే అందరూ వద్దని వారిస్తున్నప్పటికీ బస్సు దిగి వాగు దాటుతున్న క్రమంలో అదుపుతప్పి కొట్టుకుపోయాడు. స్థానికులు వెతికి బయటకు తీసుకొచ్చారు. వారు సకాలంలో స్పందించకపోతే ప్రాణనష్టం జరిగి ఉండేది. కాగా, వాగులో పడటం వల్ల దెబ్బలు తగిలిన శ్రీనును బస్సులో కొత్తగూడెం తరలించారు. యువతి అదృశ్యంపై కేసు చండ్రుగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన యువతి కనిపించకుండా పోయిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ణ మంగళవారం రాత్రి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి (22) ఈ నెల 20 రాత్రి నుంచి కనిపించడం లేదు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన స్థానికులు -
‘మార్చి 31’ లక్ష్యానికి తెలంగాణ నాయకత్వమే అడ్డుగోడ!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీని సమూలంగా నిర్మూలించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తెలంగాణ నేతలే ప్రధాన అడ్డుగోడగా ఉన్నారు. దీంతో తెలంగాణ నేతలను లక్ష్యంగా చేసుకుని స్పెషల్ ఆపరేషన్లకు భద్రతా దళాలు శ్రీకారం చుట్టాయి. చిక్కబడ్డ అడవి, వర్షాలను లెక్క చేయకుండా బస్తర్ జంగళ్లను జల్లెడ పడుతున్నాయి. సమ్మిళిత నాయకత్వం.. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో బలమైన సాయుధ విప్లవ పోరాట పంథాను అమలు చేస్తున్న పీపుల్స్వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) 2004లో విలీనమై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఏర్పాటైంది. అప్పటి నుంచి పదేళ్ల పాటు ఉత్తర, దక్షిణ, తూర్పు భారత దేశాలకు సంబం«ధించిన వారి నేతృత్వంలో మావోయిస్టులు వేగంగా విస్తరించారు. దేశంలో పది రాష్ట్రాల్లో ప్రభావం చూపించే దశకు చేరుకున్నారు. పశుపతి (నేపాల్)టు తిరుపతి వరకు గల ప్రాంతాన్ని రెడ్ కారిడార్గా ప్రకటించడంతో పాటు బస్తర్లో జనతన సర్కార్ పేరుతో సమాంతర రాజ్యాన్ని నడిపించడం ప్రారంభించారు. అయితే మావోయిస్టుల విస్తరణను అడ్డుకునేందుకు మొదట సల్వాజుడుంను ముందుకు తెచ్చి భంగపడిన కేంద్రం.. ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్హంట్తో మొదలుపెట్టి వరుసగా పలు ఆపరేషన్లు అమలు చేస్తోంది. తగ్గిన ఎంసీసీ నేతలు సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటైనప్పుడు కేంద్ర కమిటీలో 34 మందికి పైగా సభ్యులు ఉండేవారు. ఇందులో పీపుల్స్వార్, ఎంసీసీ నేతలకు సముచిత స్థానం లభించింది. కానీ ప్రభుత్వాలు చేపట్టిన యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో మొదట ఎంసీసీకి చెందిన నేతలు ఎక్కువ మంది అరెస్ట్ కావడం లేదా ఎన్కౌంటర్లలో, కొందరు అనారోగ్య కారణాలతో చనిపోయారు. 2006 నుంచి 2025 వరకు పరిశీలిస్తే సుశీల్రాయ్ (2005), జాంటూ ముఖర్జీ (2006), ప్రమోద్ మిశ్రా (2008), కోబడ్ గాంధీ (2009), అమితాబ్ బాగ్చీ (2009), జగదీశ్యాదవ్ (2011), నారాయణ్ సన్యాల్ (2011), అరవింద్ (2018), ప్రశాంత్బోస్ (2021), ప్రయాగ్ మాంఝీ (2025).. మొత్తంగా పదిమంది అగ్రనేతలు సాయుధ విప్లవ ఉద్యమానికి దూరమయ్యారు. ఇదే సమయంలో పీపుల్స్వార్కు చెందిన వారిలో చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్ (2010), మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ 2011లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో మృతిచెందగా.. రెండేళ్ల క్రితం రామకృష్ణ, కటకం సుదర్శన్ అనారోగ్య కారణాలతో మరణించారు. దీంతో దశాబ్ద కాలంగా సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో ఎంసీసీ నేతల ప్రాబల్యం తగ్గి తెలుగు రాష్ట్రాల నుంచి పుట్టుకొచి్చన పీపుల్స్వార్ నాయకత్వమే కీలకంగా మారింది. టార్గెట్ చేరాలంటే.. ఆపరేషన్ కగార్ ప్రభావంతో జనవరిలో చలపతి, మేలో నంబాల కేశవరావు, జూన్లో తెంటు సుధాకర్ వంటి అగ్రనేతలు చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీలో ఏపీకి చెందిన టాప్ లీడర్ల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే 20 ఏళ్ల మావోయిస్టు పార్టీ చరిత్రలో తీవ్రమైన ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొంటూ గెరిల్లా పంథాలో సాయుధ విప్లవ పోరాటాన్ని నడిపించడంలో తెలంగాణ నేతలు మిగిలిన వారి కంటే మిన్నగా ఉన్నారనేది ప్రభుత్వ వర్గాల అంచనా. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన అగ్రనేతల ‘టార్గెట్’ను ఛేదిస్తేనే ‘2026 మార్చి 31’నాటికి అనుకున్న లక్ష్యం చేరగలమని, లేదంటే పరిస్థితి మరోరకంగా ఉంటుందనే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. గణేశ్తో మొదలు.. ఇటీవల వర్షాలతో పాటు చిక్కబడిన అడవులను సైతం లెక్క చేయకుండా భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈనెల 8న చేపట్టిన గాలింపు చర్యల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ నేలకొరిగారు. రాబోయే రోజుల్లో కేంద్ర కమిటీలో ఉన్న పది మంది తెలంగాణ నేతలు టార్గెట్గా చేపట్టే ఆపరేషన్లు ఉధృతంగా సాగనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్లకు వెళ్తున్న జవాన్లు మొబైల్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు విధించినట్టు సమాచారం. -
26 నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
అశ్వారావుపేటరూరల్: ఈ నెల 26, 27వ తేదీల్లో అశ్వారావుపేటలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ జరిగే సీపీఐ జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా కోరారు. సోమవారం అశ్వారావుపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మక పోరాటాల ప్రాంతం, ఏజెన్సీ గ్రామాలకు కేంద్రమైన అశ్వారావుపేటలో జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని, ఈ సభలకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభల్లో భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పన, జిల్లా అభివృద్ధి సాధన, రానున్న మూడేళ్ల కార్యచరణను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి ఎస్డి.సలీం, నారాటి ప్రసాద్, గన్నిన రామృకష్ణ, విజయ్కాంత్, ఎస్డి.జాకీర్, సత్యవతి, సూర్యకుమారి, రిజ్వాన పాల్గొన్నారు. -
తెరపైకి బైపాస్?
ఏడాదిగా మగ్గుతున్నాయి.. కొత్తగూడెం – తల్లాడ మార్గాన్ని జాతీయ రహదారిగా విస్తరించాలని కేంద్రాన్ని కోరినట్టు 2024 జూన్ 29న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అందులో భాగంగా విజయవాడ – జగ్దల్పూర్ (ఎన్హెచ్ 30), దేవరపల్లి – ఖమ్మం (ఎన్హెచ్ 365బీబీ)లను కలుపుతూ కొత్తగూడెం – తల్లాడ – వైరా – జగ్గయ్యపేట వరకు ఉన్న 100 కి.మీ. రోడ్డును జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. అంతేకాదు.. గతంలోనే ఎన్హెచ్ హోదా వచ్చిన సారపాక – ఏటూరునాగారం మార్గానికి నంబర్ కేటాయించడంతో పాటు భద్రాచలం – బూర్గంపాడు – వేలేరుపాడు – అశ్వారావుపేట – రాజమండ్రికి బదులు పాల్వంచ – దమ్మపేట రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు మంత్రి వెల్లడించారు. అయితే ఏడాది గడిచినా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర వ్యాప్తంగా రెండు వరుసలుగా ఉన్న 14 జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో జిల్లాకు సంబంధించి విజయవాడ – జగ్దల్పూర్ ఎన్హెచ్ 30కి చోటు దక్కింది. అయితే జిల్లాలోని ఇతర జాతీయ రహదారుల విస్తరణ, ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్లోనే ఉంటున్నాయి. త్వరలో ‘నాయ్’ సర్వే.. విజయవాడ – జగదల్పూర్(ఎన్హెచ్ – 30) జాతీయ రహదారి వీఎం బంజర సమీపంలో మొదలై భద్రాచలం మీదుగా జగ్దల్పూర్ వెళ్తుంది. పదిహేనేళ్లుగా ఈ రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో చివరి దశకు చెందిన కిన్నెరసానిపై రెండో వంతెన, భద్రాచలం పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ఇప్పుడు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. గోదావరిపై రెండో వంతెన, కొత్తగూడెంలో ముర్రేడు, గోధుమవాగులపై వంతెనలు గతేడాదే అందుబాటులోకి వచ్చాయి. తొలిదశ విస్తరణ సమయానికే రుద్రంపూర్ – కొత్తగూడెం – పాల్వంచ – పెద్దమ్మగుడి వరకు నాలుగు వరుసలుగా రోడ్డు ఉంది. ఎన్హెచ్ 30 మార్గంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రుద్రంపూర్ నుంచి భద్రాచలం వరకు ఉన్న రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాలని తాజాగా నిర్ణయించారు. అందులో భాగంగా భారీ వాహనాలు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోకి రాకుండా భద్రాచలం వైపు వెళ్లేలా కొత్తగూడెం బైపాస్ రోడ్డుకు తాజా విస్తరణలో చోటు కల్పించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన అలైన్మెంట్పై త్వరలో సర్వే చేపట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (నాయ్) సిద్ధమవుతోంది. నిర్మాణ పనుల్లో జాప్యం హైదరాబాద్ – కొత్తగూడెం మార్గానికి నాలుగేళ్ల క్రితం 930పీ నంబర్తో ఎన్హెచ్ హోదా దక్కింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో గౌరారం వద్ద మొదలయ్యే ఈ రోడ్డు తొర్రూరు – మహబూబాబాద్ – ఇల్లెందు మీదుగా కొత్తగూడెం (ఇల్లెందు క్రాస్రోడ్డు) వరకు ఉంటుంది. ఇందులో కేవలం ఇల్లెందు మండలం నెహ్రూనగర్ నుంచి కొత్తగూడెం వరకు 54 కి.మీ. రోడ్డును ఫోర్లేన్గా నిర్మించాలని ముందుగానే నిర్ణయించారు. అయితే అటవీ అనుమతులు, భూసేకరణ, టెండర్ల ప్రక్రియలో జాప్యం కారణంగా ఈ పనులు ఇంతవరకూ మొదలే కాలేదు. గోదావరికి ఇరువైపులా.. భద్రాచలం – వాజేడు రోడ్డును జాతీయ రహదారిగా విస్తరించాలని ఏజెన్సీ వాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తిస్తే జగదల్పూర్ – విజయవాడ ఎన్హెచ్ 30, హైదరాబాద్ – భూపాలపట్నం ఎన్హెచ్ 161 కలుస్తాయి. ఇప్పటికే గోదావరికి కుడి వైపున సారపాక – ఏటూరునాగారం రోడ్డుకు జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రం సానుకూలంగానే ఉంది. నదికి ఎడమ వైపున భద్రాచలం – వాజేడు రోడ్డుకు కూడా జాతీయ హోదా ఇప్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దీంతో గోదావరి తీరానికి రెండు వైపులా రోడ్డు రవాణా సౌకర్యం మెరుగవడంతో పాటు భవిష్యత్లో జల రవాణాకు కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఎన్హెచ్ 30 విస్తరణకు కేంద్రం సానుకూలం రుద్రంపూర్ – భద్రాచలం మధ్య ఫోర్ లేన్ రోడ్డు కొత్తగూడెం కార్పొరేషన్ చుట్టూ రానున్న బైపాస్.. ప్రతిపాదనల్లోనే కొత్త జాతీయ రహదారులు ఎన్హెచ్ 930పీ పనుల్లో మాత్రం కనిపించని పురోగతి -
భూవివాదంలో కుటుంబం వెలి
టేకులపల్లి: టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామంలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భూ వివాదంలో న్యాయం చేయాలని కోరిన కుటుంబాన్ని పెద్దలు కులం నుంచి వెలి వేస్తూ తీర్మానించారు. అంతేకాక ఈ విషయాన్ని గ్రామంలో టంకా వేయించడంతో ఆ కుటుంబం ఆవేదనకు గురవుతోంది. రోళ్లపాడు గ్రామానికి చెందిన పూనెం రామస్వామి – వెంకటరమణ దంపతులకు చెందిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిని అదే గ్రామానికి చెందిన కొడెం ముత్తయ్య కుటుంబీకులు ఆక్రమించి బోరు వేశారు. ఇదేంటని అడిగితే దౌర్జన్యానికి పాల్పడడంతో పటేల్ చీమల లక్ష్మీనారాయణ నాయకత్వాన గ్రామపెద్దలు పంచాయితీ పెట్టారు. అక్కడ అందరి ముందే రామస్వామి దంపతులపై దాడి జరిగింది. మరుసటి రోజు బోరు ధ్వంసం కావడంతో రామస్వామే కారణమని ఆరోపిస్తూ ఆదివారం రాత్రి మరోమారు పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీకి ఆలస్యంగా వచ్చారనే నెపంతో పటేల్, గ్రామ పెద్దలు, గ్రామస్తులంతా ఏకమై రామస్వామి కుటుంబాన్ని వెలివేస్తూ తీర్మానించారు. ఇకపై గ్రామస్తులెవరూ వారితో పాటు వారి కుటుంబీకుల ఇళ్లు, పొలాల్లో పనికి వెళ్లొద్దని చెప్పడమే కాక మాట్లాడొద్దని ఆదేశించారు. ఈ విషయాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే రూ.50వేలు జరిమానా విధిస్తామని మైక్ ద్వారా గ్రామంలో టంకా వేయించారు. దీంతో ఆవేదనకు గురైన రామస్వామి దంపతులు సోమవారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు విన్నవించడమే కాక టేకులపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణ రోళ్లపాడులో కుటుంబాన్ని వెలివేసినట్లు ఫిర్యాదు అందడంతో డీఎస్పీ నూనావత్ చంద్రభాను, సీఐ తాటిపాముల సురేష్, ఎస్ఐ అలకుంట రాజేందర్ గ్రామానికి వెళ్లి వివాదాస్పదమైన భూమిని పరిశీలించారు. ఆపై ఇరు వర్గాలను విచారించారు. అనంతరం గ్రామంలో ఇరువర్గాలతో సమావేశమై కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రామ, కుల బహిష్కరణలు, వెలివేయడం చట్టరీత్యా నేరమని.. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమి పత్రాలతో రెవెన్యూ, అటవీ ఆధికారుల ద్వారా సర్వే చేయించి హద్దులు నిర్ణయించుకునే వరకు ఎవరూ వెళ్లొద్దని స్పష్టం చేశారు. రోళ్లపాడులో వెలుగుచూసిన ఘటన గ్రామంలో విచారణ చేపట్టిన పోలీసులు -
నేరాలు, ప్రమాదాల నియంత్రణకే కార్డన్ సెర్చ్
ఇల్లెందురూరల్: నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను తెలిపారు. మండలంలోని 21 పిట్ ఏరియాలో సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను అతి వేగంగా, అజాగ్రత్తగా నడపొద్దని కోరారు. వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూ చించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని అన్నా రు. గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అంతకు ముందు ఇంటింటికీ వెళ్లి వాహనాలను పరిశీలించా రు. రిజిస్ట్రేషన్ పేపర్లు, ఇతర పత్రాలు లేని వాహనాలను పోలీసుస్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో సీఐలు రవి, సురేష్, ఎస్సైలు శ్రీనివాసరెడ్డి, సూర్య, నాగుల్మీరా, హసీనా పాల్గొన్నారు. ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను -
రేషన్కార్డులతో ఆహారభద్రత
● 93లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీతో రికార్డు ● సమపాళ్లలో అభివృద్ధి, సంక్షేమం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కబోనకల్: రేషన్కార్డుల ద్వారా పేదలకు ఆహార భద్రత లభిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. బోనకల్లో సోమవారం ఆయన నియోజకవర్గవ్యాప్తంగా ఇటీవల మంజూరైన రేషన్కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్కార్డులు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. కానీ తాము అధికారంలోకి రాగానే అర్హత కలిగిన పేదలందరికీ రేషన్కార్డులు ఇచ్చేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో 1.15కోట్ల కుటుంబాలు ఉండగా 93లక్షల కుటుంబాలకు రేషన్కార్డులు ఇవ్వడమే కాక సన్నబియ్యం పంపిణీతో దేశంలోనే రికార్డు సృష్టించామని చెప్పారు. జిల్లాలో 19,690 కార్డులు కొత్తగా మంజూరు చేశామి, మధిర నియోజకవర్గంలో 4,736 కొత్త కార్డులు మంజూరు చేయడంతో పాటు 13,767 మంది పేర్లను చేర్చామని తెలిపారు. ఇక 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాతో రాష్ట్రంలో 51 లక్షల కుటుంబాలకు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో 93 లక్షలకు లబ్ధి జరిగిందని వెల్లడించారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాక అభివృద్ధిని సమపాళ్లలో చేపడుతూ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతుమని డిప్యూటీ సీఎం భట్టి తెలపారు. తొలుత బోనకల్ మండలంలోని చిరునోములలో రూ.1.72కోట్లు, రావినూతలలో రూ.1.62కోట్లతో నిర్మించే సీసీ రోడ్లకు భట్టి శంకుస్థాపన చేశారు. దశల వారీగా ఇందిరమ్మ బిల్లులు చింతకాని: చింతకాని మండలం గాంధీనగర్ కాలనీలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం ప్రారంభించారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా చేపట్టాలని, తద్వారా దశల వారీగా బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి చింతకాని మండలంలోకి ప్రవేశించగానే భారీ వర్షం మొదలవడంతో ఆ వర్షంలోనే గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించాక రైతువేదికలో దళితబంధు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యం, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు కస్తాల సత్యనారాయణ, నవీన్బాబు, సన్యాసయ్య, చందన్కుమార్, ధనసరి పుల్లయ్య, ఆశాలత, శ్రీనివాసాచారి, సునీల్రెడ్డి, ఆర్డీఓ నరసింహారావు, తహసీల్దార్లు కరుణాకర్రెడ్డి, రమాదేవి, ఎంపీడీఓలు శ్రీనివాసరావు, రమాదేవి, ఆత్మ, మార్కెట్ చైర్మన్లు కె.రామకోటేశ్వరరావు, బండారు నర్సింహారావు, ఏఓ మానసతో పాటు నాయకులు పైడిపల్లి కిషోర్, బందం నాగేశ్వరావు,గాలి దుర్గారావు, పిల్లలమర్రి నాగేశ్వరావు, షాజహాన్, జానీ మియా, బోయినపల్లి వెంకటేశ్వర్లు, మురళి, ముస్తఫా, శాస్త్రి, చేబ్రోలు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, భద్రునాయక్, ప్రమీల పాల్గొన్నారు. -
మద్యానికి బానిసైన వ్యక్తి మృతి
పినపాక: మద్యానికి బానిసైన వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని తోగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇర్ఫా నరేష్(35) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నా డు. కొన్ని నెలలుగా మద్యానికి బానిసై కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం కట్టెల కోసం వెళ్లి తిరిగి వచ్చి మద్యం సేవించి తన పాత ఇంట్లో పడుకున్నాడు. మద్యం సేవించినప్పుడల్లా తిరుగుతుంటా డని భావించిన కుటుంబసభ్యులు సాయంత్రం వరకు వెదికి వదిలేశారు. కాగా, పాత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నరేష్ మృతిచెందినట్లు గుర్తించారు. తండ్రి బిక్షం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సురేష్ తెలిపారు. బీరప్ప ఆలయంలో చోరీఅన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): మండలంలోని పెంట్లంగ్రామంలో గల బీరప్ప ఆలయంలో ఆదివా రం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఆల య కమిటీ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ సీహెచ్ చంద్రశేఖర్ సోమవారం సిబ్బందితో కలిసి ఘటనస్థలాన్ని పరిశీలించా రు. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోని హుండీని పగులగొట్టి సుమా రు రూ.10వేల నగదు అపహరించుకెళ్లారని ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతదేహం లభ్యంవేంసూరు: ఏపీలోని వాడపల్లిలో గోదావరిలో గల్లంతైన యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. వేంసూరు మండలం లచ్చన్నగూడెంకు చెందిన పామర్తి సాయిదినేష్ ఈనెల 19న స్నేహితులతో కలిసి వాడపల్లిలో వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లగా అక్కడ గోదావరిలో గల్లంతయ్యాడు. అప్పటి నుంచి రెస్క్యూ బృందాలు గాలిస్తుండడంగా సోమవారం మృతదేహం లభించడంతో కుటుంబీకులకు అప్పగించారు. -
కోయ భాషలో పెళ్లి పత్రిక
ఆవిష్కరించిన పీఓ రాహుల్భద్రాచలంటౌన్: కోయ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ ఆదివాసీ తెగల సమన్వయకర్త సోయం కన్నారాజు – శరణ్య తమ పెళ్లి పత్రికను కోయ భాషలో ముద్రించారు. ఈ పత్రికను ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోయ భాషలో ఉన్న పెళ్లి పత్రికను చూడటం ఆనందంగా ఉందన్నారు. గిరిజనుల మాతృభాషలో లిపి అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. అంతరించిపోతున్న ఆదివాసీ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నంలో భాగంగానే ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేశామని చెప్పారు. నేటి తరం గిరిజన యువతకు వారి భాషపై మక్కువ కలిగేలా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఐటీడీఏ ద్వారా అందించే ఆహ్వాన పత్రికలు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ప్రశంసాపత్రాలు కోయ భాషలోనే ముద్రించామని వివరించారు. అనంతరం వధూవరులు మాట్లాడుతూ.. ఐటీడీఏ పీఓ రాహుల్ కోయ భాష నేర్చుకుని భావితరాలకు ఆదర్శంగా నిలిచారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆగస్టు 3వ తేదీన పెళ్లి చేసుకోబోయే తాము వివాహ పత్రికను కోయ భాషలో ముద్రించామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, సున్నం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటాలు
ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యాన నిర్వహించే పోరాటాలను జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి పిలుపునిచ్చారు. ఖమ్మంలో సోమవారం టీఎస్యూటీఎఫ్ జిల్లా కమిటీ సమావేశం షేక్ రంజాన్ అధ్యక్షతన జరగగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19నెలలు గడిచినా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇవ్వకుండా జాప్యం చేస్తోందన్నారు. ఇకనైనా పీఆర్సీ అమలుచేయడమే కాక ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలనే డిమాండ్తో చేపట్టే దశలవారీ పోరాటంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో జీ.వీ.నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు బుర్రి వెంకన్న, వల్లంకొండ రాంబాబు, దామోదర్, అరవింద్, రాంచంద్ పాల్గొన్నారు. జయప్రదం చేయండి.. ఉపాధ్యాయ సమస్యలపై దశలవారీ పోరాటాలను జయప్రదం చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై.పద్మ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23, 24వ తేదీల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వనుండగా, ఆగస్టు 1న జిల్లా కేంద్రంలో, ఆగస్టు 23న రాష్ట్రస్థాయిలో మహాధర్నా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ కార్యదర్శి ఆకుల నాగేశ్వరరావు, నాయకులు గరిక శ్రీనివాస్, హన్మంతరావు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
చెక్డ్యామ్ ఎత్తు తగ్గింపు పనులు ప్రారంభం
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ప్రకాష్నగర్ వద్ద మున్నేటిపై ఉన్న చెక్డ్యామ్ ఎత్తు తగ్గింపు పనులు మొదలయ్యా యి. జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో చెక్డ్యామ్ వద్దకు యంత్రాలు వెళ్లేలా అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను రెండు రోజులుగా తొలగిస్తున్నారు. ఇదేసమయాన చెక్డ్యామ్ దిగువన ప్రకాష్నగర్ వంతెన చప్టాకు గండ్లు పెట్టి వరద నీరు ముందుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. నగరాన్ని వరద ముంపు నుంచి రక్షించేందుకు చెక్డ్యామ్ ఎత్తు సగం మేర తగ్గించాలని నిర్ణయించిన విషయం విదితమే. ఈమేరకు వరద ప్రవాహం ఆధారంగా ఒకటి, రెండు రో జుల్లో గ్రానైట్ కట్టర్ సాయంతో చెక్డ్యాం ఎత్తు తగ్గించే పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
వర్షం.. రైతుల్లో హర్షం
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోమవారం జోరు వాన కురిసింది. పత్తి, ఇతర విత్తనాలు వేసినా.. వర్షాభావంతో మొలకెత్తకపోవడం, కొన్ని చోట్ల మొలకలు వచ్చినా ఎండకు వడబడుతుండగా ఈ వర్షం ఊపిరి పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టేకులపల్లి మండలంలోని తూర్పుగూడెం, రాంపురం వాగుల్లోకి నీరు చేరింది. జూలూరుపాడు మండలంలోనూ పలు వాగులు, కుంటల్లోకి నీరు చేరింది. అయితే ఈ వర్షంతో సింగరేణి కొత్తగూడెం ఏరియాలో 25వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ఇక కొత్తగూడెంలోని టీఎన్జీవో కాలనీలో వర్షపు నీరు చేరగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రోడ్లు చెరువులను తలపించాయి. – సింగరేణి(కొత్తగూడెం)/కొత్తగూడెం అర్బన్/టేకులపల్లి/జూలూరుపాడు -
బరువెక్కిన ఎరువు
● పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు ● డీఏపీకి కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వ రాయితీ ● కొనుగోలుకు మొగ్గు చూపుతున్న రైతులు బూర్గంపాడు: కాంప్లెక్స్ ఎరువుల ధరలు క్రమేపీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ వ్యవసాయ సీజన్లో ధరల పెంపుతో రైతులపై అదనపు భారం పడుతోంది. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువుల్లో డీఏపీకి కేంద్ర ప్రభుత్వం రాయితీ కొనసాగిస్తోంది. దీంతో ఈ రెండు ఎరువుల ధరలు మాత్రమే ప్రస్తుతం రైతులకు కొంతమేర అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రైవేట్ డీలర్లకు మార్క్ఫెడ్ నుంచి యూరియా సక్రమంగా సరఫరా కావడం లేదు. పీఏసీఎస్ల్లో మాత్రమే యూరియా అందుబాటులో ఉంటోంది. ప్రస్తుతం రైతులు పత్తి, వరి పంటలకు యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. అయితే ప్రైవేటు డీలర్ల వద్ద డీఏపీ కూడా అందుబాటులో ఉండడం లేదు. కొందరు డీలర్ల వద్ద ఉన్నా డీఏపీ కావాలంటే ఇతర ఎరువులు కొనాలంటూ లింక్ పెడుతున్నారు. ఐదు బస్తాల డీఏపీ కావాలంటే ఒక బస్తా క్యాల్షియం లేదా పొటాష్, లేదంటే నానో డీఏపీ, నానో యూరియా కొనాలంటూ షరతు విధిస్తున్నారు. ఇదేంని ప్రశ్నిస్తే తమకు డీఏపీ సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లే ఇలా నిబంధనలు పెడుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం యూరియా, డీఏపీకి డిమాండ్ పెరగడంతో కొందరు ప్రైవేటు డీలర్లు డీఏపీ బస్తాపై రూ. 50 అదనంగా వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రాయితీ పోగా రూ.1,350కి విక్రయించాల్సి ఉండగా ప్రస్తుతం రూ. 1400 చొప్పున అమ్ముతున్నారు. చుక్కలనంటుతున్న ధరలు.. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు 1.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మరో 35 వేల ఎకరాల్లో సాగువుతందని అంచనా. వర్షాభావ పరిస్థితుల్లో కొన్ని మండలాల్లో ఆలస్యమైంది. వరి సుమారు 1.85 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంటున్నారు. గత పదిరోజులుగా వరి నాట్లు వేస్తున్నారు. నాట్లకు ముందే దుక్కిలో డీఏపీ వేస్తారు. పత్తిపంటకు కూడా తొలివిడత డీఏపీ, యూరియా కలిపి వేస్తున్నారు. ఈ తరుణంలో డీఏపీ, యూరియా ఎరువులు దొరకడం కొంత ఇబ్బందిగా మారింది. డీఏపీకి బదులుగా వేరే ఇతర కాంప్లెక్స్ ఎరువులు వేయాలంటే వాటి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతేడాది రూ.1,300 ఉన్న 20:20:0:13 బస్తా ధర ఇప్పుడు రూ.1,400కు పెరిగింది. 10:26:26 బస్తా ధర గతేడాది రూ.1,470 ఉండగా ఇప్పుడు రూ.1,800కు చేరింది. 14:35:14 బస్తా ధర రూ. 1,700 నుంచి రూ.1,800కు పెరిగింది. గతేడాది రూ.1,535 ఉన్న పొటాష్ ధర ఇప్పుడు రూ. 1,900కు చేరింది. 15:15:15 ఎరువుల బస్తా ధర రూ.1,450 నుంచి రూ.1,600కు పెరిగింది. సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూ. 580 నుంచి రూ.640కి చేరింది. ఇలా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో రైతులు తొలి విడతలో డీఏపీ వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో డీపీపీ దొరకకపోవడం, దొరికినా ఇతర ఎరువులు అంటగడుతుండడంతో వారికి తలకు మించిన భారంగా మారింది. ఇతర ఎరువులు అంటగడుతున్నారు డీఏపీ కొనాలంటే దాంతో పాటు ఇతర ఎరువులు కూడా అంటగడుతున్నారు. ఐదు బస్తాల డీఏపీ కొనాలంటే ఒక బస్తా క్యాల్షియం కొనాల్సిందేనని వ్యాపారులు చెబుతున్నారు. అవసరం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కూడా కొనాల్సి వస్తోంది. మిగతా కాంప్లెక్స్ ఎరువుల ధరలు బాగా పెరగడంతో డీఏపీనే వేస్తున్నాం. – యడమకంటి నర్సింహారెడ్డి, రెడ్డిపాలెం ‘నానో’పై అవగాహన కల్పించాలి.. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం, యూరియా కూడా సరిగా దొరకకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఈ తరుణంలో వ్యవసాయ అధికారులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగించాలని రైతులకు సూచిస్తున్నారు. అయితే ద్రవరూప ఎరువుల వినియోగంపై పెద్దగా ఆసక్తి లేని రైతులు గుళికల ఎరువులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పలువురు అంటున్నారు. -
అలంకార ప్రాయంగా అటవీ చెక్ పోస్టులు
పాల్వంచరూరల్: వైల్డ్లైఫ్ పాల్వంచ డివిజన్ విభాగంలో వన్యప్రాణుల సంరక్షణతో పాటు కలప స్మగ్లింగ్ను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో సిబ్బంది లేక అలంకార ప్రాయంగా మారుతోంది. యానంబైల్ రేంజ్ పరిధిలోని మొండికట్ట వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసినా.. కొద్ది రోజులుగా తాళం వేసి ఉంటోంది. ఇక్కడ విధులు నిర్వహించే ఎఫ్బీఓ మోహన్కు రేగులగూడెంలో రెండు బీట్ల బాధ్యతలు అప్పగించారు. అయితే చెక్పోస్టు పర్యవేక్షణ బాధ్యతను మాత్రం ఎవరికీ అప్పగించలేదు. మొండికట్టలో విధులు నిర్వహించే సురేష్కుమార్ డిప్యుటేషన్పై వెళ్లారు. యానంబైల్ బీట్ ఆఫీసర్ గ్రూప్–1 శిక్షణకు వెళ్లారు. కిన్నెరసాని చెక్పోస్టులో విధులు నిర్వహించే భట్టు రాములు ఉద్యోగోన్నతి పై దమ్మపేట రేంజ్కు వెళ్లారు. ఇలా ఈ రేంజ్ పరిధిలో మొత్తం 20 మంది విధులు నిర్వహించాల్సి ఉండగా అరకొర సిబ్బంది కారణంగా చెక్పోస్టులో ఎవరూ ఉండడం లేదని తెలుస్తోంది. రేంజ్ పరిధిలో వన్యప్రాణులు, అభయారణ్యంలోని కలప అక్రమ రవాణాను నిరోధించేందుకు ఆరేళ్ల క్రితం ఉల్వనూరు – పాల్వంచ మార్గంలోని మొండికట్ట వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. కానీ సిబ్బంది లేక అది నిరుపయోగంగానే ఉంది. ఈ విషయమై ఇన్చార్జ్ ఎఫ్డీఓ కృష్ణమాచారిని వివరణం కోరగా మొండికట్ట చెక్పోస్టులో విధులు నిర్వహించే ఎఫ్బీఓకు రేగులగూడెంలో రెండు బీట్లకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీకి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. చెక్పోస్టు వద్ద త్వరలోనే ఒకరిని నియమిస్తామన్నారు.వైల్డ్లైఫ్ విభాగాన్ని వేధిస్తున్న సిబ్బంది కొరత -
‘సేవ’లు అంతంతే !
● మీ సేవా కేంద్రాల్లో తప్పని తిప్పలు ● రోజుకు 100 మందికి కూడా అందని సర్వీసులు ● శిథిల భవనాల్లోనే సెంటర్ల నిర్వహణ ఇల్లెందు: జిల్లాలో మీ సేవా కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా.. వాటిలో వినియోగదారులకు అందే సేవలు మాత్రం అంతంతగానే ఉన్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వం ఏర్పాలు చేసిన కేంద్రాలు 11 ఉండగా ప్రైవేట్ సెంటర్లు సుమారు 100 ఉన్నాయి. ప్రతీ సంవత్సరం కొన్ని కొత్త కేంద్రాలకు అనుమతి ఇస్తున్నారు. ఇక కొన్ని మండలాల్లో నాలుగైదుకు తగ్గకుండా కేంద్రాలకు ఉండగా, ఇంటర్నెట్ సిగ్నల్ సరిగా లేని చోట సెంటర్లు ఏర్పాటు చేయలేదు. ఉన్నచోట కూడా ఆఽశించిన స్థాయిలో సేవలు అందడం లేదు. ము ఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని కేంద్రాలు సక్రమంగా పనిచేయక పట్టణాలకు పరుగు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మున్సిపాలిటీల వద్ద ఉన్న సెంటర్లకు తాకిడి పెరుగుతోంది. ఇల్లెందులోని మీ సేవా కేంద్రానికి ఇల్లెందు, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మండలాల నుంచి వినియోగదారులు వస్తుండగా సదుపాయాలు అంతంతగానే ఉన్నా యి. కంప్యూటర్లు, స్కానర్లు, ఇతర పరికరాలు సరిగా పనిచేయక పోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. తీరని ఆధార్ గోస.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆధార్, కుల, ఆదాయ సర్టిఫికెట్లు, రేషన్కార్డులు తదితర అవసరాల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల వద్ద బారులుదీరుతున్నారు. ముఖ్యంగా ఆధార్కార్డుల్లో తప్పుల సవరణ, అప్డేట్ కోసం ఎక్కువ మంది వస్తున్నారు. పలువురికి ఆంధ్రప్రదేశ్, ఖమ్మం జిల్లా పేరుతోనే ఆధార్ కార్డులు ఉండగా.. వాటి సవరణ ల కోసం కూడా భారీగా వస్తున్నారు. ఇక ప్రజా పాలన గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రేషన్ కార్డులు రావడం లేదు కానీ.. మీ సేవా కేంద్రంలో డబ్బు ముట్టజెప్పి దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే వస్తుండడంతో వారు కూడా పోటెత్తుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 11 కేంద్రాలు.. ఉమ్మడి జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, మధిర, వైరా, సత్తుపల్లి, పాల్వంచ, అశ్వారావుపేట, ఏదులాపురం, కల్లూరులో మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రతీ మున్సిపాలిటీలో ఒక మీ సేవా కేంద్రం ఉంది. వాటిలో 100కు పైగా సేవలు అందుతున్నాయి. కానీ ఏ కేంద్రంలోనూ మూడుకు మించి కంప్యూటర్లు లేవు. ఉన్నవి కూడా సక్రమంగా పని చేయడం లేదు. ఫర్నిచర్ విరిగి, లైట్లు, ఫ్యాన్లు పనిచేయక, భవనాలు శిథిలావస్థకు చేరడంతో అటు నిర్వాహకులు, ఇటు వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.అత్యవసర సేవల్లో జాప్యం.. ఇది ఇల్లెందులోని మీ సేవా కేంద్రం. ఇక్కడ ఏ ఒక్క లబ్ధిదారుడికీ సేవలు అంత సులభంగా లభించవు. కొన్ని నెలలుగా స్టేషనరీ సరఫరా కావడం లేదు. నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లకు ముగ్గురే పని చేస్తున్నారు. ఇందులోనే ఒకరిని ఆధార్ కార్డులకు, మరొకరిని బిల్లులు, సర్టిఫికెట్ల జారీకి కేటాయించారు. ఏ కంప్యూటర్ చూసినా సర్వర్ బిజీ వస్తోందని ఆపరేటర్లు సమాధానం చెబుతున్నారు. దీంతో భారీ సంఖ్యలో సర్టిఫికెట్లు పెండింగ్లో ఉంటున్నాయి. -
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళ, బుధవారాల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మంలోని విజయ డెయిరీ యూనిట్ను మంగళవా రం ఉదయం పరిశీలించనున్న మంత్రి నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తారు. ఆతర్వాత ఖమ్మం 15వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇక బుధవా రం కొత్తగూడెంలోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శించి ఉన్నతాధికారులతో సమీక్షలో పాల్గొంటారు. ఆపై సాయంత్రం 3 గంటలకు రఘునాథపాలెం మండలం పరికలబోడు తండాలో రహదారుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు కారేపల్లి: లింక్ ఊడిపోవడంతో గూడ్స్ రైలు నుంచి కొన్ని బోగీలు విడిపోయిన ఘటన కారేపల్లి మండలం గేటుకారేపల్లి స్టేషన్ సమీపాన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. డోర్నకల్ జంక్షన్ నుంచి కారేపల్లి రైల్వే జంక్షన్ మీదుగా ఖాళీ బోగీలతో గూడ్స్ రైలు కొత్తగూడెం వైపు వెళ్తోంది. గేటుకారేపల్లి స్టేషన్ సమీపానికి వచ్చేసరికి కొన్ని బోగీలకు లింగ్ ఊడిపోయింది. దీంతో కొన్ని బోగీలను వదిలేసి ఇంజిన్ ఇంకొన్ని బోగీలతో వెళ్తుండడాన్ని గేటుకారేపల్లి, అనంతారం గేట్మెన్లు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రైవర్ను అప్రమత్తం చేసి గూడ్స్ రైలును నిలిపివేయగా, ఆతర్వాత సిబ్బంది చేరుకుని ఊడిపోయిన బోగీలను మరో ఇంజన్ సాయంతో తీసుకొచ్చి జత చేశారు. దీంతో అరగంట తర్వాత గూడ్స్ రైలు ముందుకు కదిలింది. ఇదే సమయాన గేటుకారేపల్లి, అనంతారం గేట్లను మూసివేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పిడుగుపాటుతో మహిళ మృతిపినపాక: పొలంలో వరి నాటు వేస్తుండగా పిడుగు పడి మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని బోటుగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోరం రమణ (55) తోటి కూలీలతో వరి పొలంలో నాటు వేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో పని ప్రదేశంలోనే పిడుగుపడగా కుప్పకూలిన రమణను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.çÜ$gê™èl¯]lVýSÆŠḥË 13 Ðól$MýS-Ë$.. సుజాతనగర్: పిడుగుపాటుతో 13 మేకలు మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక అంబేడ్కర్ నగర్కు చెందిన కేసుపాక పుల్లయ్య మేకలను మేత కోసం రాఘవాపురం రోడ్డు పక్కన గల జామాయిల్ తోటలోకి తీసుకెళ్లాడు. అయితే భారీ వర్షం కురవడంతో పాటు మేకలపైనే పిడుగు పడడంతో అవి అక్కడికక్కడే మృతిచెందాయి. జీవనాధారమైన మేకల మరణంతో తనకు సుమారు రూ.2లక్షల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం పరిహారిం అందించాలని పుల్లయ్య వేడుకున్నాడు. కాగా, మేకల కాపరి పుల్లయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి కుమారి హనుమంతరావు, కాంగ్రెస్ ఫార్టీ మండల కార్యదర్శి చింతలపూడి శేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. -
కోల్ మూమెంట్ ఈడీగా బాధ్యతల స్వీకరణ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బి.వెంకన్న సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2010 ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్(ఐఆర్టీఎస్)కు చెందిన వెంకన్న మూడేళ్ల పాటు డిప్యుటేషన్పై ఈ పదవిలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎండీ ఎన్.బలరామ్ను కలిశారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ప్రతీ సంవత్సరం సుమారు 700 లక్షల టన్నుల బొగ్గు రవాణా అవుతుందని, ఇందులో అధిక భాగం రైల్వే ద్వారానే పలు రాష్ట్రాల విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో కంపెనీ సాధిస్తున్న వార్షిక లక్ష్యాల సాధనలో కోల్మూమెంట్ విభాగం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని, ఈ బాధ్యత కోల్మూమెంట్ ఈడీదేనని అన్నారు. అనంతరం ఈడీ మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా నిబద్ధతతో పని చేస్తానని, లక్ష్య సాధనకు కృషి చేస్తానని చెప్పారు. నేడు కరకగూడేనికి విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్కరకగూడెం: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మంగళవారం కరకగూడెం మండలం భట్టుపల్లికి రానున్నారు. గ్రామంలోని రైతు వేదికలో కంది పంట విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కల్పిస్తారు. కంది విత్తనోత్పత్తిని పెంచడం, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం, తద్వారా రైతుల ఆదాయం పెంచడం తదితర అంశాలపై చర్చించనున్నారు. విత్తనోత్పత్తిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కార మార్గాలపై రైతులతో మాట్లాడుతారని మండల వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ తెలిపారు. రైతులు నేడు ఉదయం 11 గంటల వరకు రైతు వేదిక వద్దకు రావాలని కోరారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): వర్షాలు పెరుగుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ వైద్య శాఖాధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా అవసరమైనంత మేరకు ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా తక్షణమే స్పందించేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటి నిల్వలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తవ్వి దోమల వ్యాప్తిని నివారించాలని సూచించారు. యూరియా వంటి కీలక ఎరువుల సరఫరా విషయంలో రైతుల్లో ఆందోళన కలగకుండా ఉండేందుకు ప్రతి ఎరువుల దుకాణం ఎదుట అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలు ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని కోరారు. అవసరమైతే డిమాండ్కు అనుగుణంగా మరింత స్టాక్ సమకూర్చేందుకు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబూరావు, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, ఇరిగేషన్ ఈఈ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ఆనాటి నిర్లక్ష్యం.. రూ.6 కోట్ల భారం!
ప్రారంభించిన ఆరు నెలలకే పగుళ్లు.. సింగరేణి సంస్థ పరిధిలోని కొత్తగూడెం ఏరియాలో ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 145 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 11 ఏరియాల్లో కొత్తగూడెం అగ్రస్థానంలో నిలిచింది. ఏరియాలోని సత్తుపల్లిలోని జేవీఆర్, కిష్టారం ఓసీల నుంచి నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడి నుంచి రవాణా సక్రమంగా సాగితే కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చనే ఆలోచనతో యాజమాన్యం సీహెచ్పీని నిర్మించింది. ఇందుకోసం సమంత కంపెనీకి రూ.398 కోట్లతో టెండర్ కట్టబెట్టింది. పనులు దక్కించుకున్న సంస్థ రెండున్నరేళ్లపాటు నిర్మాణ పనులు సాగించింది. సుమారు ఏడాదిన్నర క్రితం సీహెచ్పీ అందుబాటులోకి రాగా రైలు ద్వారా బొగ్గు రవాణా చేస్తున్నారు. కానీ ప్రారంభించిన ఆరు నెలలకే నాణ్యతాలోపాలు వెలుగుచూశాయి. సీహెచ్పీ బంకర్లో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఏడాది నుంచి బొగ్గు రవాణాకు ఆటంకం కలుగుతోంది. రోజుకు 10 రేక్ల తరలించాల్సి ఉండగా, పగుళ్ల కారణంగా అతి కష్టంపై 5–6 రేక్లు కూడా దాటడం లేదు. వెరసి లక్ష్యం మేరకు ఉత్పత్తి సాగుతున్నా వినియోగదారులకు సకాలంలో బొగ్గు అందించలేకపోతున్నారు. సరిపడా మెటీరియల్ కూడా వాడలేదు.. జేవీఆర్, కిష్టారం ఓసీల నుంచి బొగ్గును రైలు మార్గం ద్వారా రవాణా చేసేందుకు 8 వేల టన్నుల కెపాసిటీ కలిగిన మూడు బంకర్లను నిర్మించారు. వాటిలో ఒక బంకర్లో పూర్తిగా, మరో బంకర్లో పాక్షికంగా పగుళ్లు వచ్చాయి. 8 వేల టన్నుల సామర్థ్యానికి సరిపడా మెటీరియల్ వాడాల్సి ఉండగా, కేవలం 6 వేల టన్నులకు తగిన మెటీరియలే వాడారని, అందుకే బంకర్లో బీటలు ఏర్పడ్డాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. మెయింటెనెన్స్ నిర్మాణ సంస్థదా? సింగరేణిదా? సాధారణంగా పనులు పూర్తై అప్పగించాక కొన్నేళ్లపాటు నిర్మాణ సంస్థే మెయింటెనెన్స్కు బాధ్యత వహించాలి. కానీ టెండర్ అగ్రిమెంట్లో మెయింటెనెన్స్ విషయం పేర్కొన్నారా? లేదా అనే విషయం బహిర్గతం కావడంలేదు. పగుళ్లు ఏర్పడ్డా సదరు సంస్థ పట్టించుకోవడంలేదు. బీటల కారణంగా బంకర్ ఏడాది నుంచి నిరుపయోగంగా మారింది. ఇందుకు మరమ్మతులు చేపట్టేందుకు మరో రూ. ఆరు కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ పనుల రెన్యువేషన్ సింగరేణి యాజమాన్యం టెండర్లు పిలిచింది. బాధ్యులపై చర్యలేవి? రూ. 398 కోట్లతో చేపట్టిన పనులను ఆనాటి ఏరియా ఉన్నతాధికారి, సివిల్, క్వాలిటీ, విజిలెన్స్ అధికారులు పట్టించుకోలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. పనుల్లో నాణ్యత లోపించినా సింగరేణి విజిలెన్స్ ఎందుకు గుర్తించలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. కనీసం 60 ఏళ్ల వరకు పటిష్టంగా ఉండాల్సిన సీహెచ్పీకి రెండేళ్లకే మరమ్మతులు చేపట్టాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో సీహెచ్పీ మనుగడ నీలినీడలు అలుముకుంటున్నాయి. ఇందుకు కారణమైన అప్పటి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు, కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. బ్లాక్ లిస్ట్లో పెట్టాం.. సత్తుపల్లిలోని సీహెచ్పీ బంకర్లో పగుళ్లపై విచారణ చేయించగా నిర్మాణ సంస్థ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని తేలింది. సమంత కంపెనీ సింగరేణిలో ఏ పని చేయకుండా బ్లాక్లిస్ట్లో పెట్టాం. కోల్ఇండియా పరిధిలోనూ పనులు ఇవ్వొద్దని లేఖ రాశాం. సత్తుపల్లి నుంచి బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడకుండా మరమ్మతులకు టెండర్ పిలిచాం. – శాలేంరాజు, కొత్తగూడెం ఏరియా జీఎంరూ.398 కోట్లతో నిర్మించిన సీహెచ్పీలో నాణ్యతలేమి బంకర్లలో పగుళ్లపై విచారణలో వెల్లడైన లోపాలు సింగరేణిలో గత అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు మరమ్మతులకు టెండర్ పిలిచిన యాజమాన్యం డిజైన్లోనే లోపం నిర్మాణ పనులను అప్పటి జీఎం, ఇతర విభాగాల అధికారులు పర్యవేక్షించకుండా కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు దండుకున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఆరు నెలలకే సీహెచ్పీ బంకర్లో బీటలు వారాయని పేర్కొన్నారు. పగుళ్లు ఏర్పడి కూలేందుకు సిద్ధంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయమై సంస్థ సెంట్రల్ మైనింగ్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా విచారణ జరిపించగా డిజైన్లోనే లోపముందని, బంకర్ నిర్మాణానికి నాణ్యమైన సామగ్రి వాడలేదని తేలింది. -
శిథిలాలు ఎప్పుడు తొలగిస్తారో..?
● మాడ వీధుల విస్తరణకు ఇళ్లు, దుకాణాల కూల్చివేత ● రెండు నెలలు గడిచినా ఇంకా తొలగించని అధికారులు ● భూ సేకరణ పూర్తయితేనే రామాలయ అభివృద్ధి పనులు.. భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి తొలుత మాడ వీధుల విస్తరణ చేపట్టారు. ఆలయానికి రెండు వైపులా ఉన్న ఇళ్లు, దుకాణాల యజమానులకు నష్టపరిహారం అందజేశారు. గత మే నెల 25 నుంచి సదరు దుకాణాలు, ఇళ్లను తొలగించి, స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ కూల్చి రెండు నెలలు గడుస్తున్నా శిథిలాలు తొలగించకపోవడంతో ఆలయానికి రెండు వైపులా గుట్టల్లా దర్శనమిస్తున్నాయి. వీవీఐపీలు ఎంట్రన్స్, తూర్పు మెట్ల వైపు లడ్డూ కౌంటర్లకు వరకు అడ్డుగా ఉన్నాయి. రోడ్లపై శిథిలాలు.. భక్తులకు ఇక్కట్లు దేవస్థానం తూర్పు, ఉత్తర దిక్కుల్లో సాధారణంగా వీధులు చాలా ఇరుకుగా ఉంటాయి. ఇటీవల కాలంలో రామాలయానికి భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రోడ్లపై శిథిలాలు ఉండటంతో స్వామివారి దర్శనానికి వెళ్లే వృద్ధులు, దివ్యాంగులు, వీఐపీలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువైపు వచ్చే కార్లు, ఆటోలతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. కిందివైపు వెళ్లే మార్గం మూసివేయడంతో ఇక్కడే వాహనాలను మళ్లించాలన్నా, వాటి నడుమనే భక్తులు దర్శనానికి వెళ్లాలన్నా ఇక్కట్లు తప్పడంలేదు. తోపుడు బండ్లకు చోటు లేకపోవడంతో చిరువ్యాపారులు సైతం ఉపాధి కోల్పోతున్నారు. ఆ నాలుగు ఇంకా కూల్చలే.. మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం భూ సేకరణ, ఇతర పనులకు తొలి విడతగా రూ.60.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో భూ సేకరణ కోసం 40 కుటుంబాలకు రూ.34.45 కోట్ల పరిహారం కేటాయించారు. 32 మంది బాధితులు నష్టపరిహారం పాక్షికంగా తీసుకుని ఇళ్లను ఖాళీ చేశారు. మరో ఎనిమిది కుటుంబాల వారు అధిక నష్టపరిహారం డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు పలు దఫాలు చర్చించి, పరిహారం పెంచడంతో ఖాళీ చేసేందుకు ఒప్పుకున్నారు. కానీ భూ సేకరణ మాత్రం పూర్తి కాలేదు. ఆ ఇళ్ల భవనాలు అలాగే ఉండగా, అందులో వ్యాపారాలను సైతం కొనసాగిస్తున్నారు. మాడ వీధుల విస్తరణకు అడ్డుగా ఉన్న ఆ ఇళ్లను కూల్చాలని, ఇప్పటికే కూల్చిన శిథిలాలను తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల్లో పూర్తి చేస్తాం భక్తుల ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. రెండు, మూడు రోజుల్లో మిగిలిన ఇళ్లను కూల్చే పనులు ప్రారంభమవుతాయి. అనంతరం ఆ శిథిలాలను తొలగించి దేవస్థానానికి అప్పగిస్తాం. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తవుతుంది. – కొల్లు దామోదర్ రావు, ఆర్డీఓ, భద్రాచలం భూ సేకరణ పూర్తయితేనే.. రెవెన్యూ అధికారులు శిథిలాలు తొలగించి ఆ భూములను ఆలయానికి అప్పగించాలి. ఆ తర్వాతే అభివృద్ధి పనులు మొదలవుతాయి. మాడ వీధుల విస్తరణ పూర్తయితేనే మాస్టర్ప్లాన్ రూపకల్పన, నిధుల విడుదల జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. రామయ్య సేవలో..శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని ఆదివారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ముంబై ఐఐటీ ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలోని మూలమూర్తులకు పూజలు చేశారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు ఆశీర్వచనం గావించారు. ఆలయ ఈఓ రమాదేవి స్వామివారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉమ్మడి జిల్లాలో నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటనఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమ, మంగళవారాల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఖమ్మం 31వ డివిజన్లో మోడ్రన్ మార్కెట్ యార్డు ఆధునికీకరణ పనులు పరిశీలిస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్, ఎంఈ కాంప్లెక్స్ను సందర్శించి, అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కొత్తగూడెం నుంచి బయలుదేరి 3 గంటలకు రఘునాథపాలెం మండలం పరికలబోడు తండాకు చేరుకుంటారు. అక్కడ చింతగుర్తి రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో మైనారిటీలతో సమావేశం నిర్వహిస్తారని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ‘ఎర్త్సైన్సెస్’కు రేపు పరిశీలకుల రాక!కొత్తగూడెంఅర్బన్: కేఎస్ఎంలోని మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఈ నెల 22న ఇన్చార్జ్ వైస్ చాన్స్లర్ యోగితారాణా, హయ్యర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, కాకతీయ యూనివర్శిటీ వైస్ చాన్స్లర్ సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో సదుపాయాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించినట్లు తెలుస్తోంది. సదుపాయాలు కల్పించాక ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సమాచారం. పరిశీలకుల బృందం పర్యటనపై యూనివర్శిటీ ప్రిన్సిపాల్ జగన్మోహనరాజును సంప్రదించగా.. తనకు సమాచారం లేదని తెలిపారు. -
‘ఉపాధి’లో వేతన వెతలు
● నాలుగు నెలలుగా అందని జీతభత్యాలు ● తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు ● జిల్లాలో 459 మంది ఉపాధి హామీ సిబ్బందిచుంచుపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలందడంలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 2006లో పథకం ప్రారంభమైనప్పటి నుంచి పని చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. పే స్కేల్ అమలు చేయడంలేదు. వేతనాలు, పే స్కేల్ విషయంలో పంచాయతీరాజ్శాఖ మంత్రి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చడంలేదు. ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్పర్శ పేరిట డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్లో సిబ్బంది వివరాల నమోదు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో వేతనాల చెల్లింపు ఆలస్యమవుతోందని చెబుతున్నారు. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన చెందుతున్నారు. పెరుగుతున్న పనిభారం ఉపాధిహామీ పథకంలో జిల్లావ్యాప్తంగా 459 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఏపీఓలు, సాంకేతిక సలహాదారులు (ఈసీలు), సాంకేతిక సహాయకులు(టీఏలు), కంప్యూటర్ ఆపరేటర్లు, క్షేత్ర సహాయకులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఒకవైపు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఖాళీలతో అదనపు బాధ్యతలు తప్పడం లేదు. జిల్లాలో 481 పంచాయతీలు, 22 మండలాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించలేదు. ఒక్కో గ్రామంలో కనీసం నాలుగైదు ప్రాంతాల్లో కూలీలు పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యలో సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఆ ప్రదేశాలను సందర్శించాలంటే ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయని సాంకేతిక సహాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, అదనపు సిబ్బందిని నియమించాలని పలువురు కోరుతున్నారు. ఇవీ సిబ్బంది బాధ్యతలు.. ఉపాధి సిబ్బంది గ్రామంలో ఉపాధి కూలీలతో పనులు చేయించాలి. మస్టర్ల నమోదు, కొలతలు వేయాలి. గ్రామ నర్సరీల నిర్వహణ, చెట్ల పెంపకం వంటివి పర్యవేక్షించాలి. గ్రామసభల్లో గుర్తించిన, రైతులు దరఖాస్తు చేసుకున్న పనులను కంప్యూటర్లలో నమోదు చేయాలి. కూలీల కోసం గ్రామసభల్లో పనులను గుర్తించాలి. కొలతల ప్రకారం పనులను పంచాయతీ కార్యదర్శి, ఎస్ఏలు, సీనియర్ మేట్లకు అప్పగించాలి. గ్రామాల్లో మేట్లు ఇచ్చిన కొలతలు సరిగా ఉన్నాయో లేవో ప్రతీ వారం తనిఖీ చేయాలి. వారం చివరలో పనుల కొలతలను మస్టర్లలో నమోదు చేయాలి. ఎంబీ పుస్తకంలో నమోదు చేసి ఇంజినీర్ కన్సల్టెన్సీకి నివేదించాలి. -
‘జీఎస్టీ’తో సమస్యలు పరిష్కరించాలి
ముంబై ఐఐటీ ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయభద్రాచలంటౌన్: ఓపెన్ సోర్స్ జియో స్పెషల్ టెక్నాలజీ (జీఎస్టీ) ద్వారా విద్యార్థులు, అధికారుల భాగస్వామ్యంతో సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా కృషి చేయాలని ప్రిన్సిపాల్ ఇన్వెస్ట్ గ్రేటర్ ఆఫ్ ద ఫోజ్ ప్రాజెక్ట్, బాంబే ఐఐటీ ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయ సూచించారు. భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అందిస్తున్న స్వయం ఉపాధి, సంక్షేమ పథకాలతో కలుగుతున్న ఉపయోగాలను తెలుసుకునేందుకు వైటీసీ, ట్రైబల్ మ్యూజియంను ఆదివారం ఆయన కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ గిరిజనులు సాంకేతిక పరంగా, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లే మార్గాన్ని చూపించాలని చెప్పారు. గిరిజనులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేయడంతో కలెక్టర్కు ఓపెన్ సోర్స్ జీఐఎస్ కోహర్ట్ అవార్డులను అందించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కలెక్టర్ ప్రజలకు సూచించిన ఆదాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు కాపాడేందుకు మ్యూజియంను ఏర్పాటు చేయడంపై ఐటీడీఏ పీఓను అభినందించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగులు జీవనోపాధి పొందేలా వైటీసీ ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మట్టితో ఇటుకలు తయారుచేసి జీవనోపాధి పెంపొందించుకునేలా శిక్షణ ఇచ్చామని, అందుకు సంబంధించిన యంత్రాలను సబ్సిడీపై అందించామని వివరించారు. ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు, మేనేజర్ ఆదినారాయణ, ఆర్ఐ నరసింహారావు, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బయోచార్ను ఎరువుగా ఉపయోగించాలి సుజాతనగర్: రైతులు బయోచార్ను పంటలకు ఎరువుగా ఉపయోగించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. రాఘవపురం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బయోచార్ యూనిట్ ప్రక్రియను ఆదివారం ఆయన బాంబే ఐఐటీ ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో విరివిగా లభించే తుమ్మ చెట్టు కొమ్మలు, రహదారులు, కరెంట్ తీగలకు అడ్డంగా ఉన్న కొమ్మలను ఉపయోగించి తయారు చేయాలని సూచించారు. -
విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణించాలి
కొత్తగూడెంఅర్బన్/కొత్తగూడెంటౌన్: విద్యార్థులు విద్యతో పాటు క్రీడా పోటీల్లో కూడా రాణించాలని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్, జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రగతి మైదానంలో సబ్ జూనియర్స్ బాలురు, బాలికల బాక్సింగ్ పోటీలు నిర్వహించగా, ఆయన విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన బాలబాలికలను జిల్లా జట్టుకు ఎంపిక చేశామని తెలిపారు. వీరిని ఈ నెల 25, 26, 27వ తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. బాలుర విభాగంలో ఆర్.గణేష్, ఆర్.ఉదయ్, ఎస్.కె.అసిమ్ ఆలీ, జెస్విత్, వి.సాయి కిరణ్, కె.అరుణ్కృష్ణ, డి.హేమంత్, కె.మధు, కె.సోహిత్ చంద్ర, బాలికల విభాగంలో ఏ.ప్రవళిక, ఎం.హనిత్య శ్రీ, లోక్షిత, కె.శరణ్య, డి.సుప్రియ, కె.అమృత వర్షిణి, బి.కీర్తన ఎంపికయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ రాజా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ షమీ ఉద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శివసుబ్రమణ్యం, కోచ్ జి.ఈశ్వర్, సహాయ కోచ్ బానోతు సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలను ఉన్నతంగా చదివించాలి
జూలూరుపాడు: పిల్లలను తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ఆదివారం నల్లబండబోడు గ్రామంలో కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రెస్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనా రెడ్డి, ఎస్ఐ బాదావత్ రవి, డాక్టర్ బాబూరావు, డాక్టర్ రాజశేఖర్ అయ్యప్ప, డాక్టర్ స్రవంతి, కాకర్ల శ్రీసంతాన వేణుగోపాలస్వామి, ఆలయ చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
తపాలా నూతన సాంకేతికతపై అవగాహన
ఖమ్మంగాంధీచౌక్: దేశ వ్యాప్తంగా తపాలా శాఖలో ఈ నెల 22 నుంచి అమలు చేస్తున్న ఐటీ–2.0 నూతన సాంకేతిక విధానంపై ఖమ్మం డివిజన్ తపాలా పరిధిలోని ఉద్యోగులకు ఆదివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి మాట్లాడుతూ.. నూతన సాంకేతిక విధానంలో తపాలా సేవలు సురక్షితంగా, వేగవంతంగా సాగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకులుగా బి.హుస్సేన్, పి.శ్రీకాంత్, పుల్లారావులు వ్యవహరించారు. -
పండితాపురంలో చోరీ..
కామేపల్లి: ఇంటి తాళం వేసి ఊరెళ్లిన ఓ ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పండితాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోడేపూడి అనురాధ ఇటీవల హైదరాబాద్లో ఉన్న తన కుమారుడి వద్దకు వెళ్లింది. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు శనివారం రాత్రి గేటు, ఇంటి తాళాలు పగలకొట్టి చోరికి పాల్పడ్డారు. ఈనేపథ్యాన ఆదివారం పని మనిషి ఇంటి ఆవరణాన్ని ఊడ్చేందుకు వెళ్లగా.. గేటు తాళాలు తీసి ఉండడంతో అనుమానం వచ్చి ఇంటి వెనకకు వెళ్లగా తలుపు పగలకొట్టి ఉంది. దీంతో చోరీ జరిగిందని గుర్తించి స్థానికులతో కలిసి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడేసి ఉండడంతో పాటు బీరువాలోని సుమారు నాలుగు కేజీల వెండి వస్తువులు, అభరణాలతో పాటు పట్టు చీరలను దోచుకెళ్లినట్లు గుర్తించారు. మల్లెలమడుగులో.. అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కొండా తిరుపతయ్య దంపతులు ఆదివారం ఉదయం 11 గంటల సమయాన ఇంటికి తాళం వేసి భద్రాచలంలోని కుమార్తె ఇంటికి వెళ్లారు. తిరిగి సాయంత్రం 4గంటల సమయాన ఇంటికి రాగా ఇంటి వెనుక ద్వారం తీసి ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలోని సుమారు 20 తు లాల బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ అశోక్రెడ్డి చోరీ ఘటనను పరిశీలించి విచా రించారు. క్లూస్ టీం ఫింగర్ప్రింట్లు సేకరించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. చింతకాని: మండలంలోని లచ్చగూడెం గ్రామ సమీపాన శనివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టగా బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన కంచర్ల వెంకటేశ్వర్లు, చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన నర్మదలకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వెంకటేశ్వర్లు ఆదివారం తన ద్విచక్ర వాహనంపై తూటికుంట్ల గ్రామం నుంచి ఖమ్మం వెళ్తుండగా.. లచ్చగూడెం గ్రామంలో నర్మద అతడిని లిఫ్ట్ అడిగి ఎక్కింది. ఈక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వారిరువురికి గాయాలు కాగా వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై నాగుల్మీరా కేసు నమోదు చేశారు. విద్యార్థినికి పాముకాటు దుమ్ముగూడెం: మండలంలోని గౌరారం ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పైదిగూడెం గ్రామానికి చెందిన కంగాల నవ్యశ్రీ ఆదివారం పాముకాటుకు గురైంది. హాస్టల్ ఆవరణలో తోటి విద్యార్థులతో ఉండగా పాము కరిచింది. దీంతో హాస్టల్ వార్డెన్ లక్ష్మీపతి హుటాహుటిన ములకపాడు వైద్యశాలకు, అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. -
చెరువులు వెలవెల
పాల్వంచరూరల్: గత నెలలో, ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. చెరువుల్లో మాత్రం వెలవెలబోతున్నాయి. జిల్లాలో మొత్తం 2,364 చెరువులు ఉండగా, ఒక్క చెరువు కూడా పూర్తిగా నిండలేదు. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు. నిండిన ప్రాజెక్ట్లు జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు, మూకమామిడి ఉన్నాయి. తాలిపేరు పూర్తిస్థాయి నీటిమట్టం 74.00 మీటర్లు కాగా ఆయకట్టు 24,700 ఎకరాలు ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ పూర్తిగా నిండింది. కిన్నెరసాని ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులుకాగా, ప్రస్తుతం నీటిమట్టం 399 అడుగులకు చేరింది. ఆయకట్టు 10 వేల ఎకరాలు ఉంది. అశ్వారాపుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులుకాగా, సుమారు 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 2,360 తెలంగాణలో ఉండగా, మిగతా ఆయకట్టు ఆంధ్రాలో ఉంది. కాగా గతేడాది గండిపడటంతో ప్రాజెక్ట్లో నీరు నిలవడంలేదు. తాత్కాలికంగా రింగ్బండ్ నిర్మించినా కొద్దిమేర మాత్రమే జలాలు ఉన్నాయి. ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 120 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 118 అడుగులకు చేరింది. ఆయకట్టు 3,250 ఎకరాలు సాగవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి మరో రెండు ఫీట్లు చేరితే గరిష్టస్థాయికి నీటిమట్టం చేరుతుంది ఈఏడాది వర్షాలు తక్కువే.. గతేడాదికంటే ఈ సంవత్సరాలు వర్షాలు తక్కువగా కురిశాయి. దీంతో జిల్లాలోని చెరువుల్లోకి నీళ్లు చేరలేదు. జలాశయాలు మాత్రం నిండి కళకళలాడుతున్నాయి. కిన్నెరసానిలోకి ఇన్ ఫ్లో పెరుగగా, కొద్దిమేర జలాలను దిగువకు వదిలాం. చెరువుల్లోకి మాత్రం పూర్తిస్థాయి నీళ్లు చేరలేదు. ఈ నెలాఖరులోగా భారీ వర్షాలు కురిస్తే చెరువులు నిండే అవకాశం ఉంది. –శ్రీనివాసరెడ్డి, జిల్లా సీఈ జలవనరులశాఖ ఇప్పటివరకు అలుగుపోసింది ఒకే ఒక్కటి ఆందోళన చెందుతున్న ఆయకట్టు రైతులు పూర్తిగా నిండి జలకళ సంతరించుకున్న జలాశయాలు -
వరి పైరుకు ఊతమిచ్చేలా..
● అధిక దిగుబడులకు అజోల్లా దోహదం ● పశువుల మేతగా వినియోగం ● రైతులకు అవగాహన సదస్సులు సూపర్బజార్(కొత్తగూడెం): రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతాంగం దృష్టి మరల్చడానికి, నాణ్యమైన దిగుబడులు సాధించడానికి వ్యవసాయ అధికారులు దృష్టి సారించి ఆ దిశగా రైతాంగాన్ని క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే బయోచార్ ద్వారా అధిక దిగుబడులు, వ్యవసాయానికి పెట్టుబడులు తగ్గించుకోవచ్చని కలెక్టర్ స్థాయి నుంచి వ్యవసాయ అధికారులు, కింది స్థాయి వరకు రైతాంగాన్ని చైతన్యం చేయడంలో నిమగ్నమై ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. అదే విధంగా వరికి ఎంతో ఉపయోగమైన అజోల్లా పెంపకం, వాడకంపై అధికారులు దృష్టి సారించి రైతులను చైతన్యపరుస్తున్నారు. ఎక్కువ పోషణ.. అజోల్లా వాడకం వల్ల భూసారం పెరుగుతుంది. హెక్టారుకు 30 నుంచి 40 కిలోల నత్రజని సహజంగా అందిస్తుంది. పశువుల మేతగా ఉపయోగపడుతూ వ్యయాన్ని తగ్గిస్తుంది. ఇప్పటి వరకు మేలైన గడ్డి జాతులైన బెర్సీం, లూసర్న్, అలసంద మొక్కల కంటే 25 నుంచి 30 శాతం ప్రోటీన్లు ఎక్కువగా ఉండి మంచి పోషణ ఇస్తుందని పరిశోధనలో వెల్లడైంది. కాగా దీని వాడకంపై చాలామంది రైతులకు అవగాహన లేదు. పెంచే విధానం.. ● వారం రోజుల్లో పెరిగే అజోల్లాలను ఇంటి పెరటిపైన, డాబాలపై ఇలా ఎక్కడైనా పెంచుకోవచ్చు. ● సూర్యరశ్మి నేరుగా బెడ్లపై పడకుండా పాక్షికంగా నీడ ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతులు ముందుగా 10సెం.మీ లోతు, 2.25 మీటర్ల వెడల్పుతో తొట్లను తయారు చేసుకుని భూమిని నలువైపులా చదరంగా ఉండేలా చూడాలి. ● ఒక వరుసలో ఇటుకలు అడ్డంగా నిలబెడుతూ సమానంగా పరుచుకుంటూ వెళ్లాలి. ● గుంతలో ఎక్కువగా ఉన్న నీరు బయటకు పోయేలా ఒక ఇటుకను బోర్లా పరిస్తే సరిపోతుంది. ఇటుకలే కాకుండా రైతులు తమకు అందుబాటులో ఉన్న వాటిని తొట్టిలాగా నిర్మించుకోవచ్చు. ● తయారు చేసుకున్న మడిలో కప్పడానికి 2.5 మీటర్ల పొడవు, 1.75 మీటర్ల వెడల్పు, 150 జీఎస్ఎం మందం కలిగిన పాలిథీన్ షీట్ను ఉపయోగించాలి. ● తొట్టిలోతు 10 సెం.మీకు మించకుండా.. 30 నుంచి 35 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి మెత్తటి మట్టిని షీట్మీద సమానంగా పరిస్తే సరిపోతుంది. జాగ్రత్తలు.. ఉపయోగాలు.. ● వరి నాటిన తరువాత సుమారు 200 కిలోల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి. ● ఆ తరువాత నీటిని తొలగిస్తే 3 నుంచి 4 రోజులలో నత్రజని, ఇతర పోషకాలు మొక్కకు అందిస్తుంది. అవకాశం ఉన్న రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలియదున్నితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ● పశువుల దాణాగానే కాకుండా గొర్రెలు, మేకలు, పందులు, కౌజు పిట్టలకు కూడా ఉపయోగపడుతుంది. ● దీని వాడడం వల్ల కోడి మాంసం, గుడ్డు నాణ్యత పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. గ్రాస్కార్సు వంటి గడ్డి తినే చేపలు అజోల్లాను ఇష్టంగా తింటాయి. అజోల్లా అంటే ఏమిటి? అజోల్లా నీటిపై తేలియాడుతూ పెరిగే ఫెర్న్ జాతికి చెందిన మొక్క. ఒక్కో మొక్క 2 సెంటీ మీటర్ల వెడల్పుతో చిన్న చెరువులు, కుంటల్లో త్వరగా పెరుగుతుంది. కాండం అడుగున ఉన్న వేరు వ్యవస్థ క్రమంగా పైకి రావడంతో ఇది నీటిపై తేలియాడుతూ నాచులా కనిపిస్తుంది. అనాబినా అనే సైనో బాక్టీరియాకు ఆశ్రయం కల్పించి వాయు రూపంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి వరి పైరుకు అందుబాటులో ఉంచుతుంది. నత్రజనిని మాత్రమే కాకుండా సేంద్రియ కర్బనం, పొటాషియంలను వరిపైరుకు అందిస్తుంది. దశాబ్దాల కాలంగా దీనిని వరిలో జీవ ఎరువుగా ఉపయోగిస్తున్నారు. అధిక లాభాలు.. అజోల్లా వల్ల వరిపంటకే కాకుండా ఇతర వాటికి కూడా అధిక లాభాలు ఉన్నాయి. పంటకు పెట్టుబడుల ఖర్చు తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. రైతులు అవగాహన పెంచుకుని వినియోగించుకోవాలి. – డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, కేవీకే ప్రోగామ్ కోఆర్డినేటర్అవగాహన కల్పిస్తున్నాం.. అజోల్లా పెంపకం, వినియోగం, లాభాలపై రైతాంగానికి అవగాహన కల్పించి వినియోగించుకునేలా చర్యలు చేపట్టాం. రైతులు కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే ఎంతో ఉపయోగం. – పి.రవికుమార్, ఏడీఏ, అశ్వారావుపేట -
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 637 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.36,720 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.19,450 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దు భద్రాచలంటౌన్: విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో అయోధ్య రెప్లికే టెంపుల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం నిర్వహిస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని భద్రాద్రి దేవస్థాన ఈఓ ఎల్.రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి దేవస్థానానికి చెందిన ఆస్థాన పండితులు వస్తున్నారని ప్రచారం చేసి కల్యాణం నిమిత్తం సుమారు రూ.3 వేలు భక్తుల నుంచి వసూలు చేస్తున్నట్లు దేవస్థాన అధికారులకు ఓ వీడియో ద్వారా తెలిసిందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రచారంతో భద్రాచలం దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని, దేవస్థానం వారికి తెలియకుండా ఇటువంటి కార్యక్రమం కల్యాణాలు నిర్వహించుట చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు మోసపోవద్దని ఈఓ సూచించారు. అక్రమంగా పామాయిల్ గెలల కొనుగోలుదమ్మపేట: ఓ రైతుకు చెందిన పామాయిల్ గెలలను బెల్ట్ షాపు నిర్వాహకుడు అక్రమంగా కొనుగోలు చేసిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని గుత్తవారిగూడెం గ్రామానికి చెందిన చెలమాల రాము తన పామాయిల్ తోటలో గెలలు కోసి, ట్రాక్టర్లో అప్పారావుపేట ఫ్యాక్టరీకి పంపించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్.. ఐదు క్వింటాళ్ల గెలలను దమ్మపేటలోని ఓ బెల్ట్ షాపు నిర్వాహకుడికి అక్రమంగా విక్రయించాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైతు మరి కొందరు రైతులతో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశాడు. అదే ప్రాంతంలో వేరే రైతులకు చెందిన పామాయిల్ గెలలు కూడా ఉండడాన్ని గమనించిన రైతులు అక్రమంగా ఎందుకు కొనుగోలు చేస్తున్నావంటూ బెల్ట్ షాపు నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత రైతు తెలిపాడు. చదువుతోనే సమాజ మార్పుకొత్తగూడెంఅర్బన్: చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని బామ్ సెఫ్ నేషనల్ కేడర్ తెలంగాణ ఇన్చార్జ్ నల్ల శ్రీధర్ అన్నారు. ఆదివారం రామవరం ఎస్సీబీనగర్లోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగంపై అవగాహన ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్, చిరంజీవి ఆఫాన్, సంతోష్ కుమార్, బాసిత్, సుగుణారావు, ఎస్.వెంకటేశ్వర్లు, గోనె శ్రీకాంత్, బాలశౌరి, మల్లెల రామనాథం, కొండ పెద్దన్న, శివ, నబీ సాహెబ్, పర్వీన్, వేంకటముత్యం, కృష్ణయ్య , ఛత్రునాయక్, ప్రసాద్ పాల్గొన్నారు. జయప్రదం చేయండి ఖమ్మం సహకారనగర్: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యాననిర్వహించనున్న దశలవారీ పోరాటాలను జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని కోరారు. ఆదివారం ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి దశగా ఈ నెల 23, 24 తేదీల్లో మండల కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రం, రెండో దశలో ఆగస్టు 1న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా, మూడో దశలో ఆగస్టు 23న చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు జీ.వీ.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమీ, రాంబాబు, రాందాస్, నరసయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పుట్టిన రోజు నాడే అనంతలోకాలకు..
కొత్తగూడెంఅర్బన్: పుట్టినరోజు నాడే ఓ ఆటో డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన లక్ష్మీదేవిపల్లిలో శనివారం జరిగింది. కొత్తగూడెంలోని ప్యూన్ బస్తీకి చెందిన సుమో జాన్(50) ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున కిరాయికి వెళ్లి వస్తుండగా ముర్రేడు బ్రిడ్జిపై డీసీఎం వ్యాన్ ఆటోను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, శనివారం పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు కుటుంబసభ్యులు సిద్ధమవుతున్న తరుణంలో జాన్ మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. భార్య, ముగ్గురు పిల్లలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన డీసీఎంను చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఓ షాపింగ్ మాల్ వద్ద పార్క్ చేసి, డ్రైవర్ పరారైనట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆటో డ్రైవర్ -
మొదటి కాన్పులో సిజేరియన్
ఇల్లెందు: మొదటికాన్పులో సిజేరియన్ జరిగిన ఓ మహిళ వైద్యుల సూచనలు పాటిస్తూ రెండోసారి నార్మల్ డెలివరీ పొందింది. కరకగూడెం మండలం మద్దెలగూడెం గ్రామానికి చెందిన చీమల ఈశ్వరయ్య భార్య లావణ్య రెండో కాన్పు కోసం సుదిమళ్లలోని పుట్టింటికి వచ్చింది. శనివారం పురిటి నొప్పులు రాగా ఇల్లెందు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ ప్రియాంక, స్టాఫ్ నర్సు అనూష తగిన వైద్యసేవలందించి సాధారణ కాన్పు పొందేలా చూశారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. డాక్టర్, స్టాఫ్ నర్స్ను సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్ధన్, ఆర్ఎంఓ రాంనివాస్, డీసీహెచ్ఎస్ డాక్టర్ జి. రవిబాబు అభినందించారు. రెండోసారి నార్మల్ డెలివరీ -
అధికారులే బినామీలుగా..!
● పట్టణ పరిధిలో పలు అభివృద్ధి పనులు ● పాల్వంచ మున్సిపల్ డివిజన్లో అక్రమాలు? ● తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఏసీబీ సోదాలు ● ప్రైవేట్ వ్యక్తులతో జరిపిన లావాదేవీలపై ఆరాపాల్వంచ: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్లో అవినీతి, అక్రమాలు హెచ్చుమీరుతున్నాయి. పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఇక్కడి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తాజాగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున ఆరు గంటల వరకు మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ ఉద్యోగులతో లావాదేవీలు ఏసీబీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టగా, అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కీలక పనులను ప్రైవేట్, చిరు ఉద్యోగుల ముసుగులో అధికారులే చేస్తున్నట్లు తెలుస్తోంది. శానిటేషన్, వాటర్ స్ౖప్ల, పలు అభివృద్ధి పనులు, రిపేర్ల పేరుతో భారీగా దండుకున్నట్లు సమాచారం. టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిలో నిర్వహించిన పనుల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరి కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా చేసి, అధికారులు బినామీలుగా ఉండి పనులు చేయించినట్లు సమాచారం. సర్టిఫికెట్ల మంజూరు, నిర్మాణాల అనుమతుల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు, ప్రైవేట్ ఉద్యోగులను అడ్డుపెట్టుకుని ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ముఖ్యఅధికారి డ్రైవర్, ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, మరో అధికారి ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీలను పరిశీలించారు. డ్రైవర్, అధికారి ఫోన్ పేల ద్వారా అధిక మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పెండింగ్ విషయంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. కాగా కొందరు ఉద్యోగులు ఆధారాలు చిక్కకుండా ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తెల్లవారుజామువరకు తనిఖీలు శుక్రవారం ఉదయం కార్యాలయాన్ని దిగ్బంధనం చేసిన ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారు జామున ఆరు గంటల వరకు తనిఖీలు కొనసాగించారు. దీంతో కమిషనర్ కె.సుజాత, మేనేజర్, టీపీఓ, శానిటేషన్, రెవెన్యూ సిబ్బందితో పాటు, ఇతర సిబ్బంది రాత్రంతా కార్యాలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. పారిశుద్ధ్య వాహనాలకు ఆయిల్ వాడకం, రిపేర్లు తదితర అంశాలను కూడా పరిశీలించారు. మున్సిపాలిటీకి ఖాతా ఉన్న కేఎస్ఎంలోని పెట్రోల్ బంక్కు అర్ధరాత్రి వెళ్లి బిల్లులను సైతం తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులకు పలు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. సోదాలపై ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ను వివరణ కోరగా.. తాము సేకరించిన ఆధారాలను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, తనిఖీలు మళ్లీ ఎప్పుడైనా ఉండొచ్చని తెలిపారు. -
అమ్మవారి సన్నిధిలో.. నక్షత్ర వనం
పెద్దమ్మతల్లి ఆలయ ఆవరణలో 48 రకాల మొక్కలతో ఏర్పాటు ● నక్షత్రాలు, రాశులు, నవగ్రహాల పేరుతో నాటి, సంరక్షణ ● మొక్కలకు పూజలు చేస్తున్న భక్తులు హిందూ సంప్రదాయంలో ప్రకృతిలోని పూలు, మొక్కలను దేవతామూర్తుల ప్రతిరూపాలుగా భక్తులు కొలవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ప్రతీ పండుగలో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. భక్తులు తమ జన్మ నక్షత్రాల్లో ఏర్పడిన దోషాల నుంచి విముక్తి కోసం వాటికి ప్రతిరూపాలైన మొక్కలకు పూజలు చేయడం ద్వారా ఫలితం ఉంటుందని నమ్ముతారు. ఈ నేపథ్యాన భక్తుల మనోభావాలకు అనుగుణంగా పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ సన్నిధిలో నక్షత్రాల ఆధారంగా వివిధ రకాల మొక్కలు నాటి వనంగా తీర్చిదిద్దారు. నక్షత్రాలు, రాశులు, నవగ్రహాల పేర్లతో మొక్కలు పెంచి సంరక్షిస్తుండడంతో భక్తులు పూజలు చేస్తున్నారు. –పాల్వంచరూరల్నక్షత్రాల వారీగా మొక్కలు ఇవే.. హిందూ సంప్రదాయంలో జాతక రీత్యా ఒక్కో రాశి వారు నిర్దేశిత మొక్కకు పూజిస్తే శుభ ఫలితాలు గోచరిస్తాయని నమ్ముతారు. ఇందులో భాగంగా అశ్విని నక్షత్రం వారు అడ్డసరం, భరణి నక్షత్రం వారు ఉసిరి, కృతిక – మేడి, రోహిణి – నేరేడు, మృగశిర – సండ్ర, ఆరుద్ర – రేల, పునర్వసు – వెదురు లేదా గన్నేరు, పుష్యమి నక్షత్రం – రావి, ఆశ్లేష – నాగకేసరి, జ్యేష్ఠ – దేవదారు, అనూరాధ – పొగడ, విశాఖ – నాగమల్లి, స్వాతి – మద్ది, చిత్త – మారేడు, హస్త – కుంకుడు, ఉత్తర – జువ్వి, పుబ్బ – మోదుగు, మఖ – మర్రి, మూల – వేగిస, పూర్వాషాడ – నిమ్మ, నారింజ, ఉత్తరాషాడ – పనస, శ్రవణా నక్షత్రం – తెల్లజిల్లేడు, ధనిష్ఠ – జమ్మి, శతభిషం – అరటి, పూర్వాభాద్ర – మామిడి, ఉత్తరాభాద్ర – వేపతో పాటు రేవతి నక్షత్రం వారు విప్ప మొక్కకు పూజ చేస్తే మంచిదని నమ్మిక. రాశులు, గ్రహాల వారీగా.. ఇక రాశుల వారీగా మేషం – ఎర్రచందనం, వృషభం – ఏడుకాయల పాయ, మిథునం – పనస, కర్కాటకం – మోదుగు, సింహం – కలిగట్టు, కన్య – మామిడి, తుల – పొగడ, వృశ్చికం – సండ్ర, ధనస్సు – రావి, మకరం – జిట్రేగు, కుంభం – జమ్మి, మీన రాశి వారు మర్రి మొక్కకు పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. అలాగే, నవగ్రహాల్లో సూర్యుడికి జిల్లేడు, చంద్రుడికి – మోదుగు, కుజుడికి – చండ్ర, బుధ గ్రహానికి – ఉత్తరేణి, గురు – రావి, శుక్ర – అరటి, శని – జమ్మి, రాహువు – గరిక, కేతువు కోసం దర్భ మొక్కలు పూజలు చేశాలని అంటున్నారు. -
జిల్లాలో యూరియా కొరత లేదు
● అసత్య ప్రచారంతోనే విక్రయ కేంద్రాలలో రైతుల రద్దీ ● గోదాముల్లో 6,200 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి ● డీఏఓ బాబూరావు వెల్లడిఇల్లెందురూరల్ : జిల్లాలో యూరియా కొరత లేదని, రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా చేస్తున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరా వు తెలిపారు. మండలంలోని కొమరారంలో ఏర్పాటుచేసిన యూరియా విక్రయ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సాగయ్యే ఆరు లక్షల ఎకరాలకు 37,300 మెట్రిక్ టన్నుల యూరి యా అవసరమని, జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు 18,080 మెట్రిక్ టన్ను ల యూరియా సరఫరా అయిందని వివరించారు. ఇందులో 11,800 మెట్రి క్ టన్నులు విక్రయించగా, జిల్లాలో ప్రస్తుతం 6,200 మె.ట. యూరియా నిల్వ ఉందని, రెండు రోజుల్లో మరో 10 వేల టన్నులు దిగుమతి అవుతుందని చెప్పారు. ఈ లెక్కన ప్రస్తుత సీజన్లో జిల్లాకు అవసరమైన యూరియాలో 50 శాతానికి మించి రవాణా చేశామని తెలిపారు. జిల్లాలోని 23 పీఏసీఎస్లకు నిత్యం 40 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా రవాణా అవుతోందని, ఇల్లెందుకు అదనంగా 40 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తున్నామని వివరించారు. రెండు రోజుల్లో చల్లసముద్రంలో మరో విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. గుళికల రూపంలో ఉన్న యూరియాకు బదులుగా ద్రవ రూపంలో ఉండే నానో యూరియాను వినియోగిస్తే అదనపు ప్రయోజనం ఉంటుందని, రైతులు ఆ యూరియాను పిచికారీ చేసి సత్ఫలితాలు పొందాలని సూచించారు. విక్రయ కేంద్రాల వద్ద బారులుదీరకుండా సంయమనం పాటిస్తే ప్రతీ రైతుకు అవసరమైనంత యూరియా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ మెట్టెల కృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, ఏడీఏ లాల్చంద్, ఏఓ సతీష్, పీఏసీఎస్ సీఈఓ హీరాలాల్ పాల్గొన్నారు. -
రహదారులపై నెత్తుటిధారలు
కొత్తగూడెంటౌన్: రోడ్లు రక్తమోడుతున్నాయి. అతి వేగం, మద్యం మత్తులో, నిర్లక్ష్య డ్రైవింగ్తో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెల్లవారు జామున, రాత్రి వేళ్లలో, మూలమలుపుల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు భద్రతా చర్యలు తీసుకుంటున్నా, ట్రాఫిక్పై అవగాహన కల్పిస్తున్నా ఆశించినమేర ఫలితాలు రావడంలేదు. బ్లాక్స్పాట్లను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా సూచికలు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 2024 నుంచి 2025 ఈ నెల 10వ తేదీ వరకు 722 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 344 మంది మృతి చెందగా, 331 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 535 మంది స్వల్ప గాయాలపాలయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 207 ప్రమాదాలు జరగ్గా, 95 మంది మృతి చెందారు. 194 మంది తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో అధిక ప్రమాదాలు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలను అతివేగం, అజాగ్రత్తగా నడుపుతుండటంతో ప్రమాదాలకు జరుగుతున్నాయి. లారీలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నాయి. పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. దీంతో అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాల సంఖ్య తగ్గడంలేదు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడినవారికి, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినవారికి జరిమానాలు విధించినా మార్పు రావడంలేదు. అయితే ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రాణనష్టంతోపాటు వైద్య ఖర్చులు రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. మృతి చెందినవారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంటి పెద్దదిక్కు కోల్పోతే పిల్లల చదువులు, పెళ్లిళ్లు కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరు గాయపడి వైకల్యం పొందుతున్నారు. తీవ్ర గాయాలపాలైనవారు చికిత్స కోసం రూ. వేల నుంచి రూ. లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. వాహనదారులు కూడా ప్రమాదాల బారిన పడకుండా, కుటుంబాలను కష్టాలపాలు చేయకుండాతగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉంది. నివారణ చర్యలు తీసుకుంటున్నాం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మద్యం తాగి, అతివేగంతో వాహనాలు నడపొద్దు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై నిత్యం అవగాహన కల్సిస్తున్నాం. బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నాం. –బి.రోహిత్రాజు, ఎస్పీ అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు పలువురు మృత్యువాత, మరికొందరు గాయాలపాలు రోడ్డున పడుతున్న, ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టినా తగ్గని ప్రమాదాలు -
రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుదాం
ఇల్లెందు: రాజ్యాంగ హక్కుల అమలు కోసం పోరాడుదామని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య తెలిపారు. శనివారం ఇల్లెందులో నిర్వహించిన అరుణోదయ రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అరుణోదయ కళాకారులు గళమెత్తాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు వేణు, ఉదయగిరి, రాజన్న, వెంకన్న, చిరంజీవి, జ్యోతి, స్వప్న, రాజన్న, లక్ష్మక్క, అభిగ్నో, శ్రీకాంత్, కిషన్, ఉమేష్, హరీష్, నాగమల్లు, కాంతారావు, కొండలరావు, కొండన్న, ఎన్డీ నేతలు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంజూలూరుపాడు: స్థానిక కేజీబీవీలో ఖాళీగా ఉన్న రెండు టీచింగ్ పోస్టు(గెస్ట్ ఫ్యాకల్టీ)ల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కేజీబీవీ ఎస్ఓ పద్మజ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. సీఆర్టీ – ఇంగ్లిష్, పీజీసీఆర్టీ – జువాలజీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అర్హులైన వారు ఆధార్ జిరాక్స్ను దరఖాస్తుకు జతచేసి 20వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా కళాశాలలో దరఖాస్తులు అందించాలని తెలిపారు. సీఆర్టీ – ఇంగ్లిష్ పోస్టుకు రూ.18,000, పీజీసీఆర్టీ – జవాలజీ పోస్టుకు రూ.23 వేల వేతనం ఉంటుందన్నారు. ఆ సీఐ వ్యవహారంపై విచారణ ఖమ్మంక్రైం: ఖమ్మంలో శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీఆర్బీ సీఐ హడావుడి చేసిన అంశంపై పత్రికల్లో కథనాలు రావడం పోలీస్ శాఖలో చర్చకు దారి తీసింది. సదరు సీఐ వ్యవహారశైలిపై శాఖాపరంగా విచారణ మొదలుపెట్టినట్లు తెలిసింది. ఆయన తీరుపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ, ఖమ్మం పోలీస్ కమిషనర్ వేర్వేరుగా నివేదికలు ఇవ్వగా, సీఐకి భద్రాద్రి ఎస్పీ మెమో జారీ చేసినట్లు తెలిసింది. పోక్సో బాధితులకు అండగా ఉంటాంపాల్వంచ: పోక్సో బాధితులకు అండగా ఉంటామని భరోసా సెంటర్ ఎస్ఐ చల్లా అరుణ అన్నారు. శనివారం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పోక్సో కేసులు, బాలికల సాధికారత, హక్కులు, భరోసా సేవలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మానసిక, శారీరక ఇబ్బందులకు గురిచేస్తే తమకు సమాచారం ఇవ్వాలని విద్యార్థినులకు సూచించారు. భరోసా సెంటర్ అందుబాటులో ఉండి, అండగా నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో అంబికా, అనూష, తులసి తదితరులు పాల్గొన్నారు. బాలకార్మికుడి గుర్తింపు చండ్రుగొండ : ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా చండ్రుగొండలో శనివారం నిర్వహించిన స్పెషల్డ్రైవ్లో ఓ మెకానిన్షెడ్లో పనిచేస్తున్న బాలకార్మికుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. సహాయ కార్మిక శాఖాధికారి ఎండీ షర్ఫుద్దీన్, చండ్రుగొండ, కొత్తగూడెం ఎస్ఐలు శివరామకృష్ణ, విజయకుమారి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మెకానిక్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. పేకాట స్థావరంపై దాడిఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని కంపగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రూ.20 వేల నగదు, బైక్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఏడుగురిపై కేసు నమోదుపాల్వంచరూరల్: దాడి ఘటనలో ఏడుగురు వ్యక్తులపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఓర్సు గణేష్, గండుగుల రాజు హైదరాబాద్లో నివాసం ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిట్టీ డబ్బులు ఇవ్వాల్సి ఉండగా రాజు భార్యకు గణేష్ ఫోన్ చేసి అడిగాడు. ఇటీవల ఇద్దరూ గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో తన భార్యకు ఫోన్ ఎందుకు చేశావంటూ శనివారం పంచాయితీ పెట్టారు. పంచాయితీకి పెద్ద మనుషులను తీసుకొచ్చేందుకు వెళ్లగా తనపై రాజుతోపాటు మరో ఆరుగురు కలిసి దాడి చేశారని గణేష్ ఫిర్యాదు చేశాడు. దీంతో దాడిచేసిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం/భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ద్రాక్షారామంలో రామయ్య కల్యాణం.. ఏపీలోని కోనసీమ జిల్లా ద్రాక్షారామం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవాన్ని శనివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కల్యాణ వేడుకకు ఆలయ ఈఓ ఎల్.రమాదేవి హాజరై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ పీఆర్ఓ సాయిబాబు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. రామయ్య సన్నిధిలో ఏపీ కమిషనర్.. శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని అమరావతి సెక్రటేరియెట్ ఆర్అండ్బీ కమిషనర్ రామసుందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. -
అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం
● ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి ● రేడియో కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసారంలో కలెక్టర్ పాటిల్ చుంచుపల్లి : జిల్లా అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రజా సమస్యలపై వారితో నేరుగా మాట్లాడేందుకు శనివారం ఆయన కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఫోన్ ద్వారా కలెక్టర్కు పలు సమస్యలు, అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, గ్రామీణ రహదారులు, తాగునీటి సమస్య, రేషన్ కార్డుల జారీ, పెన్షన్ పంపిణీలో జాప్యం తదితర అంశాలను ప్రస్తావించారు. వాటన్నింటినీ ఆసక్తిగా విన్న కలెక్టర్.. పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఆకాశవాణి ద్వారా ప్రజలతో ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడటం మంచి అనుభూతి ఇచ్చిందని తెలిపారు. అందరి అభిప్రాయాలు, సూచనలు ఎంతో విలువైనవని అన్నారు. వ్యవసాయం వ్యర్థమని ఎవరూ భావించొద్దని, అది రైతుల జీవనాధారమని అన్నారు. యువత ఉద్యోగాల కోసం నిరీక్షించకుండా ఉన్న భూములను సద్వినియోగం చేసుకుంటూ ఆయిల్పామ్, మునగ సాగుతో పాటు చేపల పెంపకం వంటివి చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ హెడ్ కొలిపాక శంకర్ రావు, సిబ్బంది ప్రభాకర్, ఆనంద్, సుమన్, కోటేశ్వరరావు, కట్ట రామకృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యాచరణ పాటించాలి.. గ్రామాల్లో పరిశుభ్రత పెంచేందుకు ఐదు రోజుల కార్యాచరణ అమల్లోకి తేవాలని కలెక్టర్ పాటిల్ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్పై శనివారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారంలో ఐదు రోజుల పాటు స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సోమవారం పిచ్చి మొక్కలు తొలగించి, ప్రజలకు ఉపయోగపడే మొక్కలు నాటాలని ఆదేశించారు. మంగళవారం తడి – పొడి చెత్త వేరు చేయడంతో లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇకపై మంగళ ,శుక్రవారాల్లోనే పొడి చెత్త సేకరించాలని తెలిపారు. బుధవారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిరుపయోగ వస్తువులు తొలగించాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని అన్నారు. గురువారం డ్రెయినేజీల శుభ్రత, దోమల నివారణకు మందుల పిచికారీ, శుక్రవారం వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. -
మహిళ ఆత్మహత్య
పాల్వంచ: భర్త వదిలేసి పోవడంతో మానసిక ఇబ్బందులు తాళలేక శనివారం ఓ మహిళ చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన గోకినపల్లి విజయ(38)ను భర్త 18 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఇళ్లలో పనిచేసుకుంటూ కూతురు, కుమారుడిని సాకుతోంది. కొద్దిరోజుల నుంచి మతిస్థిమితం కోల్పోతోంది. రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు. రోజులానే శనివారం ఉదయం ఇళ్లలో పనిచేసేందుకు వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి రాలేదు. దీంతో కూతురు శ్రీలేఖ, కుమారుడు శ్రీకాంత్, తల్లి సిద్దుల చుక్కమ్మ, తమ్ముడు రాంబాబులు వెతకగా, పాత పాల్వంచ చింతల చెర్వులో మృతదేహం లభ్యమైంది. పోలీసులకు సమాచారం ఇవ్వగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తమను అనాథలను చేసి వెళ్లిపోయావా అమ్మా.. అంటూ మృతదేహం వద్ద పిల్లలు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
బ్రిడ్జి పనుల్లో నాణ్యత పరిశీలన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని రెడ్డిగూడెం వద్ద ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రూ.177 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పనులను రాష్ట్ర క్వాలిటీ మానిటరింగ్ అధికారి ఇ.దశరథం శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డీఈ రామకృష్ణ, ఏఈలు శివలాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. 15 మంది మైనింగ్ అధికారుల బదిలీసింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో 15 మంది మైనింగ్ అధికారులను బదిలీ చేస్తూ కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్ఓడీ ఎ.జె. మురళీధర్ రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో ఎనిమిది మంది డిప్యూటీ జీఎం స్థాయి అధికారులు, ఒకరు సూపరింటెండెంట్ ఆఫ్ మైన్స్ ఇంజనీర్, ఇద్దరు అడిషినల్ మేనేజర్లు, ఒక ఎస్ఈ, ముగ్గురు డిప్యూటీ ఎస్ఈ స్థాయి అధికారులు ఉన్నారు. వీరంతా ఈనెల 31వ తేదీ లోగా కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని సూచించారు. నేరాల నివారణకు చర్యలు చేపట్టాలిఎస్పీ రోహిత్రాజు ఆదేశం పాల్వంచ : సబ్ డివిజన్లలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన పాల్వంచ డీఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి సమాచారం వచ్చినా అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించాలని, ఎప్పటికప్పుడు కేసులు పరిష్కరించాలని అన్నారు. అనంతరం కార్యాలయంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్కుమార్, పాల్వంచ, అశ్వారావుపేట సీఐలు సతీష్, నాగరాజు రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు. పౌర సేవలు వేగవంతం చేయాలి బూర్గంపాడు: ప్రజల ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని, పౌర సేవలు వేగవంతం చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. బూర్గంపాడు తహసీల్ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేఆర్కేవీ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రాంతీయ ఆస్పత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అశ్వారావుపేటలోని ప్రాంతీయ ఆస్పత్రిలో మత్తు వైద్య నిపుణుడు, పాల్వంచ, చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గైనకాలజిస్టు పోస్టులు.. మొత్తం మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. -
అధికారులే బినామీలుగా..!
పాల్వంచలో మున్సిపల్ పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. 8లోనక్షత్రాలు, రాశులు, నవగ్రహాల్లో ఒక్కొక్క దాని కోసం ఒక్కో మొక్కకు పూజలు చేయాలని భావించే వారు ఆ మొక్క ఎక్కడ ఉందో వెదకడం ప్రయాసగా మారుతోంది. ఈ నేపథ్యాన పాల్వంచ మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయ సన్నిధిలో అన్ని రకాల మొక్కలతో వనాన్ని తీర్చిదిద్దారు. ప్రతీ మొక్క వద్ద పేరు, అందుకు సంబంధించిన రాశి, నక్షత్రంతో కూడిన బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ పూజలు చేసేభక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అన్నీ ఒకేచోట.. -
నిలిచిన తపాలా సేవలు
ఖమ్మంగాంధీచౌక్: తపాలా నిర్వహణలో నూతన సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకొస్తున్న క్రమాన శనివారం నుంచి పలు సేవలను నిలిపివేశారు. ఐటీ–2.0 పేరిట నూతనంగా రూపొందించిన సాఫ్ట్వేర్ను ఈనెల 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో అమలు చేయనున్నారు. ఇందుకోసం మార్పులు చేయాల్సి ఉండడంతో శనివారం, సోమవారం పలు విభాగాల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో డిపాజిట్లు, విత్ డ్రాతో పాటుఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు(ఐపీపీబీ) సేవలే కాక ఆధార్ ఆధారంగా నగదు విత్ డ్రా నిలిచిపోయింది. సురక్షితంగా, వేగవంతమైన సేవలందించేలా తపాలా శాఖ దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో ఐటీ–2.0 సాఫ్ట్వేర్ అమలుకు సిద్ధమైన అధికారులు, రెండు రోజుల పాటు లావాదేవీల్లో అంతరాయం ఏర్పడుతుందని ముందుగానే ప్రకటించారు. ఈమేరకు శనివారం ఖమ్మం తపాలా డివిజన్ కార్యాలయం, డివిజన్ పరిధిలోని 10 సబ్ డివిజన్ కార్యాలయాలు, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం హెడ్ పోస్టాఫీసులే కాక 70 సబ్ పోస్టాఫీసులు, 750 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. తిరిగి 22వ తేదీ నుంచి అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. కాగా, ఉత్తరాల బట్వాడా మాత్రం కొనసాగుతోందని వెల్లడించారు. -
గిరిజన ఇలవేల్పులపై అధ్యయనం
గుండాల : గిరిజనులు సంస్కృతి, సంప్రదాయాలతో నిర్వహిస్తున్న ఇలవేల్పుల పండుగలపై అధ్యయనం చేసి వారి చరిత్రను పుస్తక రూపంలో అందించేందుకు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో శనివారం ఆయన ఆళ్లపల్లి మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో ఉన్న ఆలయాలను సందర్శించారు. పెద్దూరు గ్రామంలో కొమురం వంశీయులతో చర్చించారు. రెక్కల రామక్క జాతర ఎప్పుడు, ఎలా నిర్వహిస్తారని అడిగి తెలుసుకున్నారు. ఇంకా మండలంలో ఏయే గ్రామాల్లో జాతరలు జరుపుతారు.. ఇలవేల్పులు ఎలా అవతరించాయని ఆరా తీశారు. ఇప్పనపల్లిలో గొగ్గెల వారి ఇలవేల్పు, పెద్దూరులో కొమరం వంశీయుల ఇలవేల్ప యిన రెక్కల రామక్క, నడిమిగూడెం పాయం వంశీయుల ఇలవేల్పు రణాసురుడు తదితరుల చరిత్రపై అధ్యయనం చేస్తామని చెప్పారు. గత మార్చిలో జరిగిన జాతరలకు తాను పని ఒత్తిడి కారణంగా రాలేకపోయానని తెలిపారు. ఆయన వెంట ఏటీడీఓ రాధమ్మ, ఐటీడీఏ మ్యూజియం ఇన్చార్జ్ కొండ్రు వీరస్వామి, రిటైర్డ్ హెచ్ఎం జగపతి, కొమరం రాంబాబు తదితరులు ఉన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి భద్రాచలంటౌన్: భద్రాచలం ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని పీఓ బి.రాహుల్ అన్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి పీహెచ్సీల పనితీరుపై సమీక్షించారు. భద్రాచలం, పాల్వంచ, చర్ల, మణుగూరు, ఇల్లెందు, బూర్గంపాడు, అశ్వారావుపేట పీహెచ్సీల్లో అన్ని రకాల వైద్య పరీక్షలతో పాటు వైద్యులను నియమించామని తెలిపారు. పీహెచ్సీ, సీహెచ్సీల్లో డయాలసిస్ చికిత్సలు, సాధారణ ప్రసవాలు చేయాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని, వరద ముంపు గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆరేశించారు. డీసీహెచ్ఎస్ రవిబాబు మాట్లాడుతూ.. చర్ల సీహెచ్సీలో త్వరలో ఆపరేషన్ థియేటర్ ప్రారంభిస్తామని, హాజరు కావాలని పీఓను కోరారు. సమావేశంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, ఆర్ఎంఓ సంతోష్, యశోదా రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆలయాలను సందర్శించిన ఐటీడీఏ పీఓ -
కిచిడీలో పురుగులు..!
● తినకుండానే తరగతులకు వెళ్లిన గురుకుల కళాశాల విద్యార్థినులు ● విచారణకు ఆదేశించిన ఐటీడీఏ పీఓ భద్రాచలంటౌన్: భద్రాచలంలోని గిరిజన సంక్షేమ గురుకులు బాలికల జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం వడ్డించే కిచిడీలో పురుగులు కనిపించడంతో విద్యార్థినులు ఆందోళన చేశారు. అల్పాహారం తినకుండానే తరగతి గదిలోకి వెళ్లారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే పురుగు పట్టిన బియ్యంతో వంట చేస్తున్నారని, గత మూడు రోజులుగా ఇలాగే చేస్తుండగా ప్రిన్సిపాల్కు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ కళాశాలలో సుమారు 600 మంది విద్యార్థినులం ఉన్నామని, మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ విషయం తెలియగానే ఐటీడీఏ పీఓ రాహుల్ విచారణకు ఆదేశించారు. పూర్తిస్థాయిలో పరిశీలన చేపట్టి నివేదిక అందించాలని విచారణాధికారిగా నియమించిన ఆర్సీఓకు సూచించారు. బాలికలకు నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, పురుగులు వచ్చిన బియ్యాన్ని ప్రిన్సిపాల్ గుట్టుచప్పుడు కాకుండా జీసీసీ గోడౌన్కు పంపించారు. అయితే, విద్యార్థినులు ఆకలితో ఇబ్బంది పడకుండా బిస్కట్లు అందించామని, పురుగుపట్టిన బియ్యాన్ని గోడౌన్కు తరలించి మంచి బియ్యం తెప్పిస్తున్నామని ఆ తర్వాత పీఓ రాహుల్ ప్రకటించారు. -
మతతత్వం దేశానికి ప్రమాదం
ఇల్లెందు: దేశంలో రోజురోజుకూ బీజేపీ, ఆర్ఎస్ ఎస్ల మతతత్వం పెరిగిపోతోందని, ఇది దేశానికి ప్రమాదమని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ అన్నారు. ఇల్లెందులోని చండ్ర కృష్ణమూర్తి(ఎల్లన్న) మెమోరియల్ ట్రస్ట్ భవన్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. దేశంలో యూనివర్సిటీలకు, మీడియాకు స్వతంత్రం లేకుండా పోయిందన్నారు. ప్రజాస్వామ్య విలువలపై, రాజ్యాంగంపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ విధానాలపై సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగా రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని విమర్శించారు. బ్రోకర్లు దర్జాగా డబ్బులు తీసుకుని 24 గంటల్లో రేషన్ కార్డులు ఇస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్స య్య మాట్లాడుతూ ఇల్లెందుకు సీతారామ జలాలు ఇవ్వకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన రాజీవ్సాగర్ ప్రాజెక్ట్ను కొనసాగించాలని కోరారు. ఆంఽక్షలు లేకుండా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కిచ్చెల రంగయ్య, కేజీ రాంచందర్, చండ్ర అరుణ, కే.రమ, జి.వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, నంది రామయ్య, సదానందం, జిల్లా కార్యదర్శి ముద్ధా భిక్షం, పాయం చిన్న చంద్రన్న, డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ తదితరులు పాల్గొన్నారు.సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్సింగ్ ఠాగూర్ -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
మణుగూరురూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రేకుల ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలోని సాంబా యిగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ ఖుర్బాన్ నిద్రిస్తున్న సమ యంలో గురు వారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, వస్తువులన్నీకాలిపోయాయి. ఖుర్భాన్కు సైతం స్వల్ప గాయాలయ్యాయి. సమాచారంఅందుకున్న మ ణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేశ్ దగ్ధమైన ఇంటిని పరిశీలించారు. డీటీరామారావు, ఆర్ఐ గోపి ఉన్నారు. నలుగురిపై కేసు నమోదు దుమ్ముగూడెం: అక్రమంగా పాపను దత్తత తీసుకున్న విషయంలో ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గణేశ్ శుక్రవారం తెలిపారు. మండలంలోని చిన్న ఆర్లగూడెం గ్రామానికి చెందిన కోర్స రమేశ్ – ఆదిలక్ష్మి దంపతులు అశ్వాపురం మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన మెస్సా నరసింహారావు – అమల దంపతుల కుమార్తెను రెండు నెలల కిందట అక్రమంగా దత్తత తీసుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు పాపను తల్లిదండ్రులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరచారు. వారు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పాపను ఎవరికీ ఇవ్వమని, తామే పెంచుకుంటామని కమిటీ వారికి తల్లిదండ్రులు తెలిపగా పాపను అప్పగించారు. కానీ, నెల రోజుల నుంచి పాపను కోర్స రమేశ్ – ఆదిలక్ష్మి దంపతులు పెంచుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పాపను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్లగూడెం సెక్టార్ సూపర్వైజర్ పాయం రాజేశ్వరి ఫిర్యాదు మేరకు అక్రమ దత్తతకు పాల్పడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, ఆరు నెలల ఆ పాపను భద్రాచలంలోని శిశుగృహకు తరలించారు. చికిత్స పొందుతున్న లారీడ్రైవర్ మృతిపాల్వంచరూరల్: లారీ కిందకు వెళ్లి మరమ్మతులు చేస్తున్న డ్రైవర్ పైనుంచి అదే లారీ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని సత్యసాయి జిల్లా సూరపల్లి గ్రామానికి చెందిన గార్ల సుందర్రాజు (35) సారపాక ఐటీసీ నుంచి పేపర్లోడుతో బెంగళూరుకు వెళ్తున్నా డు. గురువారం రాత్రి పాల్వంచ మండలం ఆర్టీఏ చెక్పోస్టు సమీపంలో నాగారంకాలనీవద్ద చాకలి శివశంకర్ లారీ చెడి పోయింది. సుందర్రాజు లారీని ఆపి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో చాకలి శివశంకర్, క్లీనర్ ఇస్లాయిల్ కలిసి సుందర్రాజును సాయం కోరడంతో లారీ కిందకు వెళ్లి మరమ్మతులు చేస్తున్నాడు. లారీ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో ప్రమాదవశాత్తు లారీ ముందుకు కదిలి, మరమ్మతులు చేస్తున్న సుందర్రాజు పైనుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుని సోదరుడు సురేశ్బాబు ఫిర్యాదు మేరకు లారీడ్రైవర్, క్లీనర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
ప్రజలు ఓటేస్తే.. కాంగ్రెస్ కాటేసింది
అలవి కాని హామీలతో గెలిచిన కాంగ్రెస్ ● ఉమ్మడి జిల్లా రాజకీయ సమీకరణలతో గత ఎన్నికల్లో నష్టపోయాం.. ● స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు కథానాయకులై కదలాలి ● మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ను నమ్మి ప్రజలు ఓటేస్తే.. వాటిని అమలు చేయకుండా ప్రజలను ప్రభుత్వం కాటేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నా ఈయనెవరో బిర్యానీ పెడతానంటున్నడుగా అని కాంగ్రెస్కు ఓటేశారని తెలిపారు. కానీ ప్రజలకు ఇప్పుడు అసలు విషయం అర్థమైనందున, ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏం జరుగుతుందో రేవంత్రెడ్డికి తెలుసునన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. వాటిని బొంద పెడతారని ప్రజలు ఊహించక ఒక్క తప్పు ఓటు వేసినందుకు ఐదేళ్లు శిక్ష పడిందని పేర్కొన్నారు. రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. తెలంగాణ ప్రజలు రెండు సార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వాన కొత్త రాష్ట్రంలో బుడిబుడి అడుగులు వేస్తూనే.. మరోవైపు పటిష్టమైన పునాది వేసేలా నిర్మాణాత్మకంగా, ప్రణాళికాయుతంగా పదేళ్లు పనిచేశామని తెలిపారు. తద్వారా వ్యవసాయం, సాగునీరు, పట్టణ, పల్లె అభివృద్ధి, విద్య, వైద్యం, గిరిజన, దళితుల, బలహీన వర్గాలు, మహిళలు, మైనార్టీల సంక్షేమం తదితర రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిపామన్నారు. తద్వారా 2014లో కేవలం 63 సీట్లు సాధించిన బీఆర్ఎస్కు 2018లో ప్రజలు 88 సీట్లు కట్టబెట్టారని తెలిపారు. హామీలు ఊదరగొట్టి.. పదేళ్లపాటు బీఆర్ఎస్ అద్భుత పాలన అందించాక 2023లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ప్రజలను ఆకర్షించాయని కేటీఆర్ చెప్పారు. నోటికి వచ్చినట్లుగా హామీల వర్షం కురిపించి రైతు డిక్లరేషన్, బోనస్ పేరిట బోగస్ మాటలు చెప్పారన్నారు. బీసీ డిక్లరేషన్, రైతుభరోసా, రుణమాఫీ, ఉద్యోగాల కల్పన, యువతకు పెళ్లికి తులం బంగారం తదితర ఈస్ట్మన్ కలర్ సినిమాతో నమ్మిన ప్రజలు మోసపోయారని చెప్పారు. ప్రతినాయకుడు ఉంటేనే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో భాగంగా 2023లో నష్టం జరిగిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అన్నీ సవ్యంగా సాగితే జీవితం విలువ అర్థం కాదని, చుట్టూ ఉండే మనుషుల విలువ, నాయకుడి విలువ తెలియాలన్నా ప్రతినాయకుడు ఉండాల్సిందేనని చెప్పారు. జిల్లాలో ముగ్గురు మంత్రుల్లో ఒకాయన చెప్పిన బాంబులు ఇప్పటికీ పేలలేదన్నారు. ఇంకొకరు కమీషన్లలో బిజీగా ఉంటే, మరొకరు వ్యవసాయ మంత్రిగా ఏం చేస్తున్నాడో తెలియడం లేదని చెప్పారు. రైతులు ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుండడం ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని తెలిపారు. మీ కోసం మేం కష్టపడతాం.. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నాయకుల కోసం కార్యకర్తలు కష్టపడ్డారని, ఇప్పుడు కార్యకర్తల కోసం నాయకులు కష్టపడతారని కేటీఆర్ వెల్లడించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున కష్టపడి పనిచేస్తే ఖమ్మం, భద్రాద్రి జెడ్పీలు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ స్థానాలన్నీ గెలవొచ్చని తెలిపారు. మున్సిపాలిటీలు, ఎంపీపీ స్థానాల్లోనూ యువకులు ముందుకొచ్చి కాంగ్రెస్ను చీల్చి చెండాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసాన్ని గ్రామగ్రామాన ఎండగట్టేలా మరో కేసీఆర్లా కథానాయకులై కదలాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, కొండబాల కోటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కూరాకుల నాగభూషణం, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, ఖమర్, తాజుద్దీన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
మధిర: మధిర రైల్వేస్టేషన్ సమీపాన శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి (55) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమార్గంలో వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకింద పడి సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించామని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎస్.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. అయితే, ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకుల సహకారంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ఎర్రుపాలెం: మండలంలోని విద్యానగర్కు చెందిన మునగాల నాగరాజు(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ పక్కన చెట్ల పొదల్లో ఆయన మృతదేహాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించారు. నాగరాజుకు భార్య ఉండగా, ఇటీవల అత్తగారింటికి వెళ్లిన ఆయన మృతదేహమై కనిపించాడు. మృతదేహం కొంత మేర కుళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో మధిర రూరల్ సీఐ మధు, ఎస్ఐ ఆర్.రమేష్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మంటల్లో టాటా ఏస్ దగ్ధం నేలకొండపల్లి: ఇంజన్ వేడెక్కడానికి తోడు షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనం కాలిపోయింది. హైదరాబాద్కు చెందిన టాటా ఎస్ డ్రైవర్ ఆజాద్ శుక్రవారం ఖమ్మం నుంచి కోదాడ మీదుగా హైదరాబాద్కు వెళ్లేందుకు నేలకొండపల్లి మీదుగా బయలుదేరారు. ఈక్రమంలో పైనంపల్లి టోల్గేట్ వద్ద ఇంజన్ వేడికి తోడు షార్టు సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలయ్యాయి. దీంతో డ్రైవర్ వాహనాన్ని పక్కన నిలిపి దిగగానే టాటా ఏస్ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. -
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
పాల్వంచ: పాల్వంచ మున్సిపల్ డివిజన్ కార్యాలయంలో మరో సారి ఏసీబీ తనిఖీలు చేపట్టడం కలకలం రేపింది. శుక్రవారం ఏసీబీ డీఎస్పీ ఐ.రమేశ్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా కార్యాలయానికి చేరుకున్న అధికారులు గేట్లు, తలుపులు మూసి సిబ్బందిని బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. మొదటగా మేనేజర్ ఎల్వీ సత్యనారాయణతో మాట్లాడారు. అనంతరం సమాచారం అందుకున్న కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ కె.సుజాత కార్యాలయానికి రాగా ఆమెతో పాటు ఇతర సిబ్బందిపై విచారణ చేపట్టారు. కాగా కార్యాలయంలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి పనులు, ఆరోపణలపై ఫిర్యాదులు వచ్చాయని ఈ క్రమంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాగా కార్యాలయ సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ.40 వేల నగదును సైతం సీజ్ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతున్న విచారణ ఉదయం 11.30 గంటల సమయంలో ఆకస్మికంగా కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు కార్యాలయంలో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కమిషనర్ గదిలోకి సంబంధిత రికార్డులు తెప్పించుకుని వాటిని పరిశీలించారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనుల్లో అనేక అవకతవకలు జరిగాయని, బినామీల పేరుతో అధికారులే పనులు చేపట్టారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అడ్డగోలుగా బిల్లులు చేసి నగదును పక్కదోవ పట్టించినట్లు పలు ఫిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలో ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పనుల వివరాలు, ఏవిధంగా పనులు కట్టబెట్టారు? ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కొందరు ప్రైవేట్ ఉద్యోగులను అడ్డుపెట్టుకుని అధికారులు అక్రమార్జన చేశారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే ఏసీబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా, కొందరు ప్రైవేట్ ఉద్యోగులు, డ్రైవర్లు, అటెండర్లు, ఇతర సిబ్బంది ఉద్యోగుల ఫోన్ పే, గూగుల్ పే, ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించారు. కొందరి ఫోన్లలో భారీ ఎత్తున నగదు బదిలీలు జరిగినట్లు గుర్తించారు. ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయనే కోణంలో ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో రెండోసారి.. ఈ ఏడాది ఏప్రిల్ 18న మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ వెంకట రమణి, ప్రైవేట్ ఉద్యోగి ప్రసన్నకుమార్ను పట్టుకున్నారు. ఈ క్రమంలో మరో సారి ఏసీబీ తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయ నిర్వహణపై వచ్చిన ఫిర్యాదుల తో ఆకస్మిక తనిఖీ ఆరోపణల నేపథ్యంలో విచారణ కార్యాలయంలో ఇటీవల జరిగిన అనేక పనుల విషయంలో జరిగిన అవకతవకలు, ప్రైవేట్ వ్యక్తులతో చేస్తున్న అక్రమార్జన వంటి విషయాలపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టాం. ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరిగినా, డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలి. లేదా 91543 88981 నంబర్లో సంప్రదించాలి. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. –ఐ.రమేశ్, ఏసీబీ డీఎస్పీ -
ప్రచార కరపత్రాల దహనం
ఇల్లెందురూరల్: మండలంలోని 21 పిట్ ఏరి యా భూపేశ్నగర్లో కరపత్రాలు, ఓ మతగ్రంథంతో ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. వారి చేతిలో ఉన్న ప్రతులు, కరపత్రాలను లాక్కొని దహనం చేశారు. ఘటనపై దినకర్ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి.. ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ప్రతులను దహనం చేసిన పది మందిపై కేసు నమోదు చేశారు. పురుగుమందుల షాప్లో రికార్డులు స్వాధీనం దుమ్ముగూడెం: మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామానికి చెందిన పురుగుమందుల వ్యాపారి దోసపా టివెంకటేశ్వరరావు కు చెందిన దుకాణ రికార్డులను వ్యవసాయాధికారి నవీన్కుమార్ శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గురువారం సుజ్ఞానపురం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు ఒకే మందును వేర్వేరు ధరలకు విక్రయించి, బిల్లులు ఇవ్వలేదు. దీంతో రైతులు పోలీసులు, ఏఓకు ఫిర్యాదు చేశారు. ఏఓ శుక్రవారం ఎస్ఐ గణేశ్తో కలిసి దుకాణాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించి బాధితులను విచారించారు. రైతులకు బిల్లులు ఇవ్వలేదని, ఇద్దరికీ వేర్వేరు ధరలకు విక్రయించినట్లు తేలడంతో రికార్డులో స్టాప్ సేల్ అని రాశారు. అనంతరం దుకాణ లైసెన్స్ రద్దు చేసేందుకు జిల్లా అధికారులకు సిఫార్సు చేసినట్లు ఏఓ తెలిపారు. కేటీఆర్ పర్యటనలో సీఐ!ఖమ్మంక్రైం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన కోసం హెలీకాప్టర్లో రాగా, హెలీప్యాడ్ వద్ద ఓ సీఐ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పదుడిగా ముద్ర పడిన ఆ సీఐ భద్రాద్రి జిల్లా డీసీఆర్బీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి సివిల్ డ్రస్లో హెలీప్యాడ్ వద్ద వేచి ఉండడాన్ని గుర్తించారు. గతంలో ఖమ్మం రూరల్ సీఐగా విధులు నిర్వర్తించినప్పుడు ఆయన బీఆర్ఎస్ నాయకుల సూచనలతో ఇతర పార్టీల నేతలను వేధించాడనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు గతంలో ఘాటుగా స్పందించారు. ఇప్పుడు ఆయన కేటీఆర్ పర్యటనలో పాల్గొనడం పోలీసు వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఉన్నతాధికారుల అనుమతితో వచ్చాడా, లేదా అన్నది తెలియరాలేదు. అయితే, గతంలో సిరిసిల్లలో పనిచేసినప్పుడు కేటీఆర్తో ఉన్న సంబంధాల కారణంగానే వచ్చి ఉంటాడని మరికొందరు చెబుతున్నారు. ట్రెయినీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం ఆశ్రమ పాఠశాల, సుదిమళ్ల గిరిజన గురుకుల బాలికల పాఠశాలను ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి మధువరుణ్ శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో వసతి గృహాలను, తరగతి గదులను, వంట, స్టోర్ రూంలను పరిశీలించారు. ప్రతీరోజు అందిస్తున్న మెనూ వివరాలతోపాటు భోజనం ఎలా ఉంటోందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. అందుకోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. రొంపేడు పీహెచ్సీ వైద్యాధికారి కవిత, హెచ్ఓ రాజు, హెచ్ఎం నాగమణి, మాధవి తదితరులు పాల్గొన్నారు. 21న ఖమ్మం మార్కెట్కు సెలవు ఖమ్మంవ్యవసాయం: ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా సోమవారం(21న) ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. తిరిగి మంగళవారం యధాతథంగా పంటల కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు. -
పంటల బీమాపై పట్టింపేది?
బూర్గంపాడు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అటకెక్కించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేదారిలో పయనిస్తోంది. అకాల వర్షాలు, వరదలు, కరువు పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన రైతులకు బీమా అందే పరిస్థితులు లేవు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవటంతో రైతులకు నష్టం జరుగుతోంది. వ్యవసాయ సీజన్ ప్రారంభమై యాభైరోజులు దాటింది. ఇప్పటి వరకు పంటల బీమాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో పంటలు వడబడుతున్నాయి. ఇలాంటి తరుణంలోరైతులు పంటల బీమా కోసం ఎదురుచూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 5.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. సుమారు 2.95 లక్షల మంది రైతులు పత్తి, వరి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. ఉద్యా నవన పంటల సాగు కూడా పెరిగింది. ముఖ్యంగా పామాయిల్ సాగు ఏటా విస్తరిస్తోంది. కానీ, అకాల వర్షాలు, వరదలు నష్టం కలిగిస్తున్నాయి. పంట నష్టం జరిగినప్పుడు బీమా లేక ఎలాంటి పరిహారం అందటం లేదు. భారీ వర్షాలు, వరదలకు పంటలు నష్టపోయినప్పుడు గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందలేదు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, ఈ ప్రభుత్వం కూడా బీమాను పట్టించుకోవడం లేదు. కానీ, గత ఏడాది వానాకాలం సీజన్లో భారీ వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం మాత్రం అందించింది. 2018 వరకు.. 2017 – 18 వరకు రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలైంది. రైతులు పంటరుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకర్లు ఫసల్ బీమా కోసం రైతుల వాటాను బీమా కింద జమచేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపేవారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కూడా జతచేసి కేంద్రానికి పంపేది. కేంద్ర ప్రభుత్వం తమ వాటాను కూడా కలిపి బీమా కంపెనీలకు చెల్లించేది. కొన్నిపంటలకు గ్రామాన్ని యూనిట్గా , కొన్ని పంటలకు మండలాన్ని యూనిట్గా, మరికొన్నింటికి వ్యవసాయ డివిజన్ను యూనిట్గా తీసుకుని పంటల బీమా అమలు చేశారు. పంటలు నష్టపోయిన తరుణంలో ఫసల్ బీమాతో పెద్దగా మేలు జరగటం లేదనే భావనతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకాన్ని ఎత్తివేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమాను సొంతంగా రాష్ట్రంలో అమలు చేయాలని యోచించింది. విధివిధానాలపై కసరత్తు చేసినట్లు తెలిసింది. అయితే కొత్త బీమా పథకాన్ని అమలు చేయాలా.. లేక ఫసల్ బీమాను మళ్లీ కొనసాగించాలా అనే విషయంలో తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఎనిమిదేళ్లుగా నిలిచిన పంటల బీమా పథకం ఫసల్ బీమాను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతున్న రైతులు పరిహారం అందక ఆర్థికంగా చితికిపోతున్న రైతాంగంతీవ్రంగా నష్టపోతున్నాం.. భారీ వర్షాలు, వరదలకు గత ఏడాది పత్తి చేలు, వరి మాగాణులు బాగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం పంటల బీమా అమలు చేస్తే రైతులకు ఉపయోగం. గత ఏడాది ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు పరిహారమందించింది. దీనికి తోడు బీమా ఉండి ఉంటే రైతులకు మరికొంత లాభం జరిగేది. –ఇమడాబత్తుని రామకృష్ణ, రైతు ఫసల్ బీమా అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమాను రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం రైతుల మేలుకోరి తీసుకువచ్చిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవటం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. –ఏనుగుల వెంకటరెడ్డి, బీజేపీ కిసాన్మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి -
సీ్త్రనిధి.. వసూళ్ల జాడేది ?
● జిల్లాలో రూ.52.78 కోట్ల మేర బకాయిలు ● అధికారుల నిర్లక్ష్యంతోనే భారీగా పెండింగ్ ! ● ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు సన్నాహాలుచుంచుపల్లి: మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం బ్యాంక్ లింకేజీతోపాటు సీ్త్రనిధి ద్వారా రుణా లు అందజేస్తోంది. ప్రతీనెల సకాలంలో చెల్లించే మహిళా సంఘాలకు కొత్తరుణాలు ఇస్తోంది. అయితే ఇటీవల ఎస్హెచ్జీల నుంచి రుణాల రికవరీలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం సీ్త్రనిధి రుణ బకాయిలు భారీగా పేరుకుపోగా, వసూళ్లపై నీలినీడలు కమ్ముకున్నా యి. వ్యక్తిగత అవసరాలతోపాటు చిరు వ్యాపారాల కోసం సీ్త్రనిఽధి రుణాలు తీసుకున్న మహిళలు సకా లంలో వాయిదాలు చెల్లించడం లేదు. గత నాలుగేళ్లుగా అధికారుల నిర్లక్ష్యంతోనే బకాయిల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. జిల్లాలో సీ్త్రనిధి బకాయిలు భారీగా పేరుకుపోవడం అధికారులకు సవాల్గా మారింది. వీటిని రాబట్టేందుకు సెర్ప్ అధికారులు నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. పేరుకుపోతున్న బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం అందించే బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు తీసుకుని మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా రాణిస్తున్నారు. జిల్లాలోని 23 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 18,415 స్వయం సహాయక సంఘాలు ఉండగా, ఇందులో 1,81,612 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వారు చిరు వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, మహిళా శక్తి పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది భారీగా రుణాలు ఇస్తోంది. అయితే తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ముఖ్యంగా మెప్మా, సెర్ప్ పరిధిలో మహిళా సంఘాల సభ్యులు చెల్లించాల్సిన సీ్త్రనిధి రుణ బకాయిలు రూ.64.41 కోట్లు ఉండగా, రూ.11.81కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.52.78కోట్ల మేర బకాయిలు వసూలు కావాల్సి ఉంది. అధికారులు అవగాహన కల్పిస్తే.. స్వయం సహాయక సంఘాలు నెలకు రెండుసార్లు సమావేశమై అప్పులు, పొదుపు విషయం చర్చించాలి. కానీ ఈ సమావేశాలు నామమాత్రంగానే చేపడుతున్నారని తెలుస్తోంది. వీఓఏలు చెల్లించిన రుణాలు, కిస్తీలను సీ్త్రనిధి అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. తగినంత మంది అధికారులు, సిబ్బంది లేకపోవడంతో పనిభారంతో పర్యవేక్షణ లోపిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. మహిళా సంఘాల సభ్యులు రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయమై ఆయా అధికారులు సభ్యులకు అవగాహన కల్పించాలని పలువురు అంటున్నారు. ప్రణాళిక రూపొందిస్తున్నాం డీఆర్డీఓ ఆదేశాల మేరకు జిల్లాలో సీ్త్రనిధి బకాయిలు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా మొండి బకాయిలపై దృష్టిసారిస్తాం. నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని యోచిస్తున్నాం. గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా పర్యటించి మహిళా సంఘాలకు అవగాహన కల్పిస్తాం. పాత బకాయిలను రాబట్టేలా చర్యలు తీసుకుంటాం. – డి.నీలయ్య, అదనపు డీఆర్డీఓ, సెర్ప్ పేరుకుపోయిన బకాయిలు(రూ.కోట్లలో)మండలం బకాయి అన్నపురెడ్డిపల్లి 1.18 అశ్వాపురం 2.26 అశ్వారావుపేట 2.16 బూర్గంపాడు 3.09 చండ్రుగొండ 1.81 చర్ల 1.76 చుంచుపల్లి 3.28 దమ్మపేట 4.53 జూలూరుపాడు 2.75 కరకగూడెం 1.10 లక్ష్మీదేవిపల్లి 2.64 మణుగూరు 3.24 ములకలపల్లి 3.31 పాల్వంచ 1.56 పినపాక 1.76 సుజాతనగర్ 1.68 టేకులపల్లి 3.16 ఇల్లెందు 2.55 మెప్మా పరిధిలో.. సీ్త్రశక్తి గ్రూపు 1.74 క్రాంతి గ్రూపు 1.67 -
మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యం
భద్రాచలం/కొత్తగూడెంఅర్బన్/బూర్గంపాడు: మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బూర్గంపాడు మార్కెట్ యార్డులో, భద్రాచలం గిరిజన భవన్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావులతో కలిసి పాల్గొన్నారు. పినపాక నియోజకవర్గానికి చెందిన మహిళలకు రూ 19.18 కోట్ల పావలా వడ్డీ రుణాల చెక్కులను అందజేశారు. భద్రాచలంలో 268 స్వయం సహాయక సంఘాలకు రూ.17.64కోట్లు, లోన్ బీమా ద్వారా 17మంది సభ్యులకు రూ.22.49 లక్షల చెక్కులను లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రామాలయం చుట్టు పక్కల జరుగుతున్న మాడ వీధుల విస్తరణ పనులను పరిశీలించారు. సేకరించిన స్థలం వివరాలను రెవెన్యూ అధికారులను, దేవస్థానం ఈవోలను అడిగి తెలుసుకున్నారు. తొలుత గిరిజన్ భవన్లో మహిళలు తయారు చేసిన బిస్కెట్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల మహిళలకు గత ప్రభుత్వం పావలా వడ్డీ రుణాలు చెల్లించకుండా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. 875 కోట్లను చెల్లించామని తెలిపారు. సభ్యుల వయో పరిమితిని 60 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు పెంచనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ ఆశయ స్ఫూర్తితో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయ స్ఫూర్తితో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని పట్టుదలతో పనిచేస్తున్నట్లు తెలిపారు. పినపాక నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్ట్తో 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం గుర్తించాలని కలెక్టర్కు సూచించారు. గోదావరి ముంపు బాధితులకు మెరక ప్రాంతంలో స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలకు అదనంగా 1500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి తగిన ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్, ఐటీడీఏ పీవో, దేవస్థానం అధికారులు, వైదిక కమిటీ సభ్యులను మంత్రి ఆదేశించారు. భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు కూడా మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించుకుని హస్తం పార్టీ సత్తా చాటుదామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యు డు రామసహాయం రఘురాం రెడ్డి పిలుపునిచ్చా రు. శుక్రవారం కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న పొంగులేటి క్యాంపు కార్యాలయంలో చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిని నియమించినట్లు మంత్రి ప్రకటించగా కొత్తగూడెం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, సీఈఓ నాగలక్ష్మీ, డీఆర్డీఓ విద్యాచందన, డీఎస్ఓ రుక్మిణి, నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, తుళ్లూరి బ్రహ్మయ్య, ఆళ్ల మురళి, తూము చౌదరి, పెద్దబాబు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, కంచర్ల చంద్రశేఖర్, ఎండీ.రజాక్, కార్తీక్, సీపీఐ నాయకుడు బొల్లోజు అయోధ్య పాల్గొన్నారు. పినపాకలో 40 వేల ఎకరాలకు సీతారామ జలాలు రామాలయ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి ఇందిర మహిళా శక్తి సంబరాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
రేగాను పరామర్శించిన కేటీఆర్
కరకగూడెం: మాతృ వియోగంతో బాధపడుతున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును మండలంలోని కుర్నవల్లి గ్రామంలో ఉన్న ఆయన స్వగృహంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. రేగా మాతృమూర్తి నర్సమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, వనమా, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి, శంకర్ నాయక్, నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, బడే నాగజ్యోతి, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు రేగాను పరామర్శించారు. భట్టుపల్లి మినీ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కేటీఆర్ వాహనంలో రాగా, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పాల్గొన్న పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రప్పా.. రప్పా ! పెద్దసంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులు పుష్ప–2 సినిమాలోని ’రప్పా.. రప్పా’ డైలాగ్తో కూడిన బోర్డులు ప్రదర్శించారు. అందులో కేటీఆర్ ఫొటోతో పాటు ‘2028లో కాంగ్రెస్ నాయకులకు మిత్తీతో సహా చెలిస్తాం.. 3.0 లోడింగ్..’ అంటూ అందులో ముద్రించారు. -
ఆధార్ క్యాంప్లకు విశేష స్పందన
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో నిర్వహించిన మెగా ఆధార్ క్యాంపులకు విశేష స్పందన లభించిందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన క్యాంపుల్లో 6,159 మంది ఆధార్ నమోదు, సవరణలు వంటి సేవలను పొందారని తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన క్యాంప్లో అత్యధికంగా 3,772 మంది, భద్రాచలం క్యాంప్లో 801 మంది, ఇల్లెందులో 714 మంది, మణుగూరులో 525 మంది, దమ్మపేటలో 347మంది సేవలు పొందారని వివరించారు. ఈ– సేవలు, పంచాయతీ కార్యాలయాలు, ఎంపీడీఓ కా ర్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులలో, స్కూల్ ఆధార్ టీంల ద్వారా సేవలు లభిస్తాయని వివరించారు. స్కూల్ ఆధార్ టీంకు సంబంధించి వివరాల కోసం జిల్లా మేనేజరు వంశీని 73311 15024 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఆధార్ సేవలపై ఫిర్యాదులు, సలహాల కోసం యూఐడీఏఐ హెల్ప్లైన్ నంబర్ 1947 లేదా ఈ–డిస్ట్రిక్ట్ మేనేజరు సైదేశ్వరరావును కలెక్టరేట్లో సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
ఫ్లెక్సీలు వృథా!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేశామని ప్రచారం చేసుకునేందుకు రాష్ట్ర సర్కారు చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సరైన ప్రణాళిక లేకుండా కేవలం ప్రచారమే లక్ష్యంగా చేసిన ప్రయత్నం విఫలమైంది. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా మారింది. శాసనసభ సాధారణ ఎన్నికల ముందు రైతులకు రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గెలుపొందిన తర్వాత రుణమాఫీ ఎప్పుడు చేస్తారనే ప్రశ్నలు రైతులు, ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతూనే 2024 ఆగస్టు 15 నుంచి విడతల వారీగా రుణమాఫీ చేశారు. ఎట్టకేలకు 2024–2025 ఆర్థిక సంవత్సరం ముగింపు / ఉగాది పండగ నాటికి బ్యాంకుల్లో రుణ మాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 61 వేల ఫ్లెక్సీల ముద్రణ రుణమాఫీ అమలులో అనేక కొర్రీలతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం వెచ్చించామని ప్రభుత్వం చెప్పుకుంది. ఈ క్రమంలోనే ఏ గ్రామంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఎంత డబ్బులు వారి ఖాతాలో జమ చేశామనే వివరాలను బహిరంగంగా వెల్లడించేందుకు సిద్ధమైంది. లబ్ధిదారుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ముద్రించి గ్రామాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామానికి రెండు, మూడు చొప్పున జిల్లాలోనే అరవై ఒక్క వేలకు పైగా ఫ్లెక్సీలను ముద్రించింది. గ్రామాల్లో రుణమాఫీ వివరాలతో ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం మాఫీకాని వారినుంచి వ్యతిరేకత రావడంతో నిలిచిన ప్రక్రియ జిల్లాలో రూ.18.33 లక్షల ప్రజాధనం దుబారా!గప్చుప్ రుణమాఫీ లబ్ధిదారుల వివరాలను పేర్కొంటూ మే చివరి వారం నుంచి గ్రామాల్లో ఫ్లెక్లీల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన చోట ఇబ్బందులు రావడం మొదలైంది. సాంకేతిక కారణాలు, వడ్డీ కారణంగా రూ.రెండు లక్షలకు మించిన రుణం ఉన్న రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతి రేకత వచ్చింది. పంచాయతీ ఎన్నికలకు ముందు బ్రహ్మాస్త్రంలా పనికి వస్తుంది అనుకున్న ప్రచా రం కాస్త బూమరాంగ్ అవుతుందనే సందేహాలు ప్రభు త్వ పెద్దల్లో నెలకొన్నాయి. దీంతో ఫ్లెక్సీల ఏర్పాటును ఎక్కడిక్కడ నిలిపేశారు. అప్పటికే 220 గ్రామాల్లో ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నా వాటిలో కూడా సింహభాగం ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ప్రింటింగ్ పూర్తి చేసుకున్న ఫ్లెక్సీలు మండల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో మూలన పడేశారు. ఒక్కో ఫ్లెక్సీకి సగటున రూ.350 వంతున ఖర్చు చేశారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.28 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. జిల్లాలో రూ.18.33 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చా రు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వా మి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. డీఏఓ ఆకస్మిక తనిఖీజూలూరుపాడు: సహకార సంఘం కార్యాలయంలోని ఎరువుల విక్రయ కేంద్రంలో శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి వేల్పుల బాబూరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ను పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. నానో యూరియా, నానో డీఏపీ వాడటం వల్ల కలిగే లాభాలను వివరించారు. జిల్లాలో యూరియా కొరతలేదని, అవసరమైన మేరకే యూరియాను తీసుకోవాలని రైతులకు సూచించారు. ఏఓ దీపక్ ఆనంద్, ఏఈఓ గౌస్, సొసైటీ సెక్రటరీ రమణారెడ్డి, సిబ్బంది సాయి, అమల, సునీత, రైతులు పాల్గొన్నారు. 399 అడుగులకు చేరిన కిన్నెరసానిపాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతుంటంతో కిన్నెరసాని జలాశయం నీటిమట్టం పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లోకి ఎగువనుంచి 4 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో శుక్రవారం నీటిమట్టం 399 అడుగులకు చేరిందని ప్రాజెక్ట్ పర్యవేక్షణ ఇంజనీర్ తెలిపారు. దేవాదాయ శాఖ భూముల పరిశీలనకొత్తగూడెంటౌన్: కొత్తగూడెంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను శుక్రవారం ఆ శాఖ వరంగల్ జోన్ శాఖ ఉప కమిషనర్ ఽకేఎల్ సంధ్యారాణి పరిశీలించారు. తొలుత శ్రీవిజయ విఘ్నేశ్వరస్వామి దేవస్థానాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కోర్టు వివాదంలో ఉన్న చిట్టి సత్రం, కామేశ్వరమ్మ సత్రంతో పాటు నిర్మాణంలో ఉన్న ఆర్యవైశ్య సత్రం భూములను, కొత్తగూడెం ఓల్డ్ డిపో సమీపంలోని సత్రం భూములను పరిశీలించారు. ఈఓ రజనీకుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మణుగూరు ఓసీ విస్తరణకు ఆమోదంమణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఓసీ విస్తరణకు రామానుజవరం గ్రామస్తులు సముఖత వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో భూ సేకరణ ప్రత్యేకాధికారి సుమ మాట్లాడుతూ భూ నిర్వాసితులైన గిరిజనులకు, గిరిజనేతరులకు లభించే పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలతోపాటు ఔట్ సోర్సింగ్ ఉపాధి, టెక్నికల్ కోచింగ్ తదితర అంశాలపై వివరించారు. అనంతరం రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మెరుగైన పరిహారం అందిస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు సుముఖత వ్యక్తం చేస్తూ సంతకాలు చేశారు. ఓసీ విస్తరణకు సింగరేణి ఆధీనంలోని భూమి మినహా 813 ఎకరాలు అవసరం ఉండగా, ఇప్పటికే కొమ్ముగూడెం, తిర్లాపురం గ్రామాల్లో ప్రజామోదం లభించింది. తాజాగా రామానుజవరంలోనూ ఆమోదం లభించడంతో మణుగూరు ఓసీ విస్తరణకు మార్గం సుగమమైంది. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు. -
తేలని పోడు పోరు..
● మాణిక్యారం – ఎర్రబోడు ప్లాంటేషన్ లో తరచూ వివాదం ● ప్రత్యామ్నాయం చూపలేదని పోడుదారుల ఆందోళన ● అక్కడే మకాం, వంటావార్పు ● తొలగించే క్రమాన ఘర్షణలుకారేపల్లి: ప్రత్యామ్నాయం చూపిస్తామని పోడు భూమిని లాక్కున్నారని గిరిజనులు.. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన ప్లాంటేషన్లో సాగు చేయనిచ్చేది లేదని అటవీ అధికారులు.. ఇలా ఎవరికి వారు పట్టు వీడకపోవడంతో ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి. పోడు భూమి తప్ప తమకు ఆధారం లేనందున ప్రత్నామాయం చూపించాలని, లేకపోతే ఇక్కడే సాగు చేసుకోనివ్వాలని గిరిజనులు కోరు తూ తరచుగా దున్నేందుకు సిద్ధమవుతుండడం.. అధికారులు అడ్డుకునేక్రమాన గొడవలు జరుగుతున్నాయి. అయినా గిరిజనులు మాత్రం వెనక్కి తగ్గకుండా ప్లాంటేషన్లోనే డేరాలు వేసుకుని వంటా వార్పుతో అక్కడే గడుపుతుండడంతో వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదీ వివాదం... కారేపల్లి మండలం మాణిక్యారం – ఎర్రబోడు గ్రామపంచాయతీల పరిధి మాణిక్యారం, గుడితండా, కోయగుంపు, రూప్లాతండా, ఎర్రబోడు గ్రామాలకు చెందిన సుమారు 50 కుటుంబాల గిరిజన, గిరిజనేతర పోడుదారులు ఏళ్లుగా పోడు చేసుకుంటున్నారు. వీరంతా కారేపల్లి ఫారెస్టు రేంజ్ పరిధి ఊట్కూరు నార్త్ బీట్లో సుమారు 150 ఎకరాల్లో తాతల నాటి నుంచి పోడు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. అయితే, సుమారు 50 హెక్టార్ల పోడు భూమి స్వాధీనానికి అటవీ అధికారులు కొన్నేళ్ల క్రితం సిద్ధమయ్యారు. ఇక్కడ అటవీ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తామని చెబుతూ... పోడుదారులకు ప్రత్యామ్నాయంగా మరో చోటు భూమి చూపిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పోడుదారులు తొలుత నిరాకరించినా అధికారులు పట్టువదలకుండా పెద్దల సమక్షాన హామీ ఇవ్వడంతో 2020 సంవత్సరంలో ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. హామీ మరిచిన అధికారులు ఆపై అధికారులు ప్రత్యామ్నాయ భూమి చూపించకపోగా, ఎన్నిసార్లు పోడుదారులు కలిసినా స్పందనరాలేదు. ఈమేరకు 2021లో ప్లాంటేషన్లోని మొక్కలను పోడుదారులు ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఘర్షణ జరగగా 30మంది పోడుదారులపై కేసులు నమోదయ్యాయి. ఇందులో జాటోతు కిషన్, కాంపాటి రమేష్, భూక్యా రమేష్, రాయల మహేష్, కళమ్మ, వెంకన్న కోర్టుకు సైతం హాజరయ్యారు. ఇదే తరహాలో 2023, 2024లో కూడా పోడుదారులు ప్లాంటేషన్లోకి ప్రవేశించి మొక్కలు ధ్వంసం చేయడం, దున్నేందుకు యత్నించడం.. అధికారులు అడ్డుకుని కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. అయినా వివాదం సద్దుమణగలేదు. ఈసారి 7వ తేదీన పోడుదారులు అరకలు కట్టి దున్నుతుండగా.. అధికారులు అడ్డుకున్నారు. అక్కడ ఘర్షణ జరగడంతో ఎఫ్డీఓ వెంకన్న చేరుకుని త్వరలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డేరాలు వేసుకుని మకాం అధికారులు హామీ ఇచ్చి వారం దాటినా ఎలాంటి స్పందన లేకపోవడంపై పోడుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ప్లాంటేషన్ వద్దే డేరా లు వేసుకుని వంటావార్పు చేసుకుంటూ గడుపుతున్నారు. ఇక బుధవారం కూడా పోడుదారులు – ఉద్యోగుల నడుమ తారస్థాయిలో ఘర్షణ జరిగింది. సీపీఎంతో పాటు, అనుబంధ ప్రజాసంఘాలు పోడుదారులకు మద్దతు తెలుపుతూ పోడు పోరు తేల్చేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని చెబుతుండడం గమనార్హం. పోడు ఘర్షణలో 16మందిపై కేసు కారేపల్లి: మండలంలోని మాణిక్యారం, ఎర్రబోడు పోడు ప్లాంటేషన్లో పోడుదారులు, అటవీ ఉద్యోగులకు బుధవారం ఘర్షణ జరగగా, అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్లాంటేషన్లోకి అక్రమంగా ప్రవేశించి ధ్వంసం చేయడమే కాక తమ విధులకు ఆటంకం కలిగిస్తూ దాడి చేశారంటూ ఊట్కూరు ఎఫ్ఎస్ఓ శిల్ప ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోడుదారులు, సీపీఎం నాయకులు 16మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.గోపి తెలిపారు. -
మహిళా సంఘాల పనితీరు భేష్
కొత్తగూడెంఅర్బన్: స్వయం సహాయక మహిళా సంఘాల పనితీరు భేష్ అని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. గురువారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో డ్వాక్రా గ్రూపు మహిళలతో ఆయన మాట్లాడారు. గ్రూపుల నిర్మాణం, పనితీరు, ఆర్థికాభివృద్ధి తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రుణాలు పొందినవారు తిరిగి చెల్లిస్తున్న తీరు ఆదర్శంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా డీఎంసీ సీహెచ్. రాజశేఖర్, ఏడిఎంసీ టి.చంద్రశేఖర్బాబు, టీఎంసీబి వెంకటేశ్వర్లు, సీఓపీ సరిత, అంగన్వాడీ టీచర్లు శాంతి, సుజాత, అరుణ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
జెడ్పీని సందర్శించిన ట్రైనీ కలెక్టర్
చుంచుపల్లి: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ గురువారం సందర్శించారు. అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో వివిధ శాఖల్లో ఆరు రోజుల శిక్షణ నిమిత్తం ఆయన జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ విభాగాల పని తీరు, ఇతరఅంశాలకు సంబంధించిన వివరా లను జిల్లా ప్రజా పరిషత్ సీఈవో బి. నాగలక్ష్మి, డిప్యూటీ సీఈఓ కె.చంద్రశేఖర్లను అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల ఫైళ్లను పరి శీలించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని అభినందించారు. కాలువ కట్టకు మరమ్మతులుములకలపల్లి: కోతకు గురవుతున్న సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐపీ) ప్రధాన కాలువ కట్టకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. మండల పరిధిలోని వీకే రామవరం శివారు పంప్హౌస్–2 నుంచి కమలాపురంలోని పంప్హౌస్–3కు వెళ్లే ప్రధాన కాలువ 51వ కిలోమీటర్ వద్ద కుడివైపున కోతకు గురైంది. వర్షాకాలం నేపథ్యంలో ప్రధాన కాలువ కట్ట తెగిపోయి సిమెంట్ లైనింగ్కు పగిలిపోయే ప్రమాదముంది. దీంతో ఇరిగేషన్ శాఖ అధి కారులు స్పందించి కోతకు గురైన ప్రదేశంలో మట్టిపోసి కట్టను పటిష్టం చేశారు. బీఎస్ఎన్ఎల్ న్యాయవాదిగా బాబూరావుకొత్తగూడెంఅర్బన్: బీఎస్ఎన్ఎల్ ఎంప్యానెల్మెంట్ న్యాయవాదిగా ఏవూరి బాబూరావు నియమితులయ్యారు. ఉమ్మడి జిల్లాలో న్యాయ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనర ల్ మేనేజర్ ఈ మేరకు నియామకం చేపట్టారు. బాబూరావుకు గురువారం జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుభాష్ నియామక పత్రాన్ని అందజేశారు. బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజనల్ ఇంజనీర్ సక్రు, జూనియర్ టెలికాం ఆఫీసర్ సందీప్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు శివరాంజి పాల్గొన్నారు. రేపు ద్రాక్షారామంలో రామయ్య కల్యాణంభద్రాచలం: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఈ నెల 19న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రమాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడి బాల భక్తసమాజం అభ్యర్థనతో దేవస్థానం ప్రచార రథా న్ని పంపి, ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో వేడుక జరుపనున్నట్లు పేర్కొన్నారు. వెలిసిన మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లుసుజాతనగర్: మండల పరిధిలోని స్టేషన్ బేతంపూడిలో గురువారం మావోయిస్టు వ్యతి రేక పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు ఆత్మ పరి రక్షణ ప్రజాఫంట్ పేరుతో వాల్ పోస్టర్లను గ్రా మంలో అక్కడక్కడా అంటించారు. మావో యిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పోస్టర్లలో పేర్కొన్నారు. ఇసుక నిల్వలు సీజ్ములకలపల్లి: మండలంలోని వీకే. రామవరం, ఒడ్డు రామవరం, సంజీవ్పల్లి శివార్లలో అక్రమంగా నిల్వ చేసిన నాలుగు లారీల ఇసుకను గురువారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇసుకను స్వాధీనం చేసుకుని తహసీల్కు తరలించినట్లు తహసీల్దార్ భూక్యా గన్యా తెలిపారు. మందుపాతరలు నిర్వీర్యంచర్ల: సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు బీరు బాటిళ్లలో ఏర్పా టు చేసిన రెండు మందుపాతరలను భద్రతా బలగాలు గురువారం గుర్తించి నిర్వీర్యంచేశారు. ఊ సూరు పోలీస్స్టేషన్ పరిధి టేకుమెట్ల అటవీ ప్రాంతానికి వెళ్తున్న సీఆర్పీఎఫ్ 196 బెటాలియన్కు చెందిన బలగాలు మందుపాతరలను గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, అక్కడే నిర్వీర్యం చేశారు. -
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దు
జూలూరుపాడు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. గురువారం మండలంలోని మాచినేనిపేటతండాలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ఇంటింటికీ వెళ్లి సోదాలు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాలను గుర్తించేందుకు జాగిలంతో తనిఖీలు చేపట్టారు. కార్డెన్ సెర్చ్లో రూ 4 వేల విలువైన నాటుసారా, రూ.15 వేల విలువైన మద్యం బాటిళ్లు, రూ.3,500 విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలులేని 65 వాహనాలకు రూ.8,900లు జరిమానా విధించారు. అనంతరం మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రతాప్, 12మంది ఎస్ఐ లు, 60మంది పోలీస్ సిబ్బంది కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ -
మృతదేహానికి రీ పోస్టుమార్టం
చుంచుపల్లి: ఆంధ్రప్రదేశ్ తిరువూరులో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తూ గతేడాది అక్టోబర్లో మృతి చెందిన డాక్టర్ ప్రిష్కల్లా కుమారి (62) మృతదేహానికి గురువారం వెంకటేశ్వరకాలనీలోని క్రిస్టియన్ శ్మశానవాటికలో అధికారులు, పోలీసుల సమక్షంలో తిరిగి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రిష్క ల్లా కుమారి మృతిపై కుటుంబసభ్యులు అనుమా నం వ్యక్తం చేయడంతో తిరువూరు పోలీసులు, చుంచుపల్లి పోలీసులు, మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ బృందం పర్యవేక్షణలో రీ పోస్టుమార్టం నిర్వహించినట్లు చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణ తెలిపారు. కలెక్టరేట్ ఎదుట నిరసన నిద్రసూపర్బజార్(కొత్తగూడెం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి భారీ వర్షంలో నిరసన నిద్ర చేపట్టారు. నిరసన కార్యక్రమం తొలుత ధర్నాచౌక్లో నిర్వహించా లని భావించారు. అక్కడ చెట్లపొదలు, చెత్తా చెదా రంతో నిండి, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కలెక్టరేట్ మెయిన్గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వర్షంలో కూడా నిరసన కార్యక్రమం కొనసాగించారు. పోలీసులు చొరవ తీసుకుని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష్యకార్యదర్శులు హరీష్, ఫహీం దాదా, నాయకులు వి సతీష్, ఖయ్యూం, ఉపేందర్ పాల్గొన్నారు. -
వర్షాభావంతో ఆందోళన
సూపర్బజార్(కొత్తగూడెం): లోటు వర్షపాతంతో పంటలు మాడిపోతున్నాయి. ఇప్పటికే పత్తి మొక్కలు వాడిపోతున్నాయి. వరినార్లు ఎండిపోతున్నా యి. వర్షాభావ పరిస్థితులు వానాకాలం సాగుపై ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలో జూన్లో లోటు వర్షపాతం నమోదుకాగా రైతులు ఆందోళన చెందారు. ఈ నెల ప్రారంభంలో కురిసిన వర్షాలతో లోటు వర్షపాతం కాస్తా అధికవర్షపాతంగా నమోదైంది. రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. ఈ నెల 3వ తేదీ వరకు రైతులను మురిపించిన వర్షం.. ఆ తర్వాత అడపాదడపా చినుకులకే పరిమితమైంది. ఆశించినస్థాయిలో వానలు కురవకపోవంతో పత్తి పంటలు, వరినార్లు ఎండిపోతున్నాయి. రుతుపవనాలు ముందే వచ్చి మురిపించినా ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. జిల్లాలోని 12 మండలాల్లో లోటువర్షపాతం నమోదుకాగా, 9 మండలాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. కేవలం రెండు మండలాలలో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జూన్, జూలై నెలల్లో కురవాల్సిన వర్షం ముందే అంటే మే నెలలో కురవడం వల్ల సాగుపై తీవ్రప్రభావం చూపుతుందని స్వయంగా కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించడం గమనార్హం. రాబోయే నాలుగైదు రోజులు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించగా రైతులు ఎదురు చూస్తున్నారు. పత్తి రైతులు మే నెలలో కురిసిన వర్షాలకు విత్తనాలు వేశారు. అనంతరం వరుణుడు మొఖం చాటేయడంతో మొలకెత్తలేదు. ఆ తర్వాత మళ్లీ విత్తారు. మొక్కలు మొలిచాక వర్షాలు లేకపోవడంతో వాడిపోతున్నాయి. దీంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. కాగా గురువారం రాత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం రైతులకు ఉపశమనం కలిగించింది. వడబడుతున్న పత్తి మొక్కలు, వరినారుకు ప్రాణం పోసినట్లయింది. అత్యధికంగా జూలూరుపాడులో... కరకగూడెం, పినపాక, దుమ్ముగూడెం, మణుగూ రు, ఆళ్లపల్లి, గుండాల, ఇల్లందు, చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, భద్రాచలం, ములకలపల్లి మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం నమోదైన మండలాల్లో చర్ల, అశ్వాపురం, టేకులపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, బూర్గంపాడు, దమ్మపేట ఉన్నాయి. జూలూరుపాడు, అశ్వారావుపేట మండలాల్లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో జూన్ 1వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. జూలూరుపాడు మండలంలో అత్యధికంగా 40.9 మి.మీ వర్షపాతం నమోదుకాగా, చర్ల మండలంలో అత్యల్పంగా 1.4 మి.మీ వర్షపాతం నమోదైంది. కరకగూడెం మండలంలో 41.5 మి.మీ, పినపాక 48.4 , దుమ్ముగూడెం 38.7, అశ్వాపురం 7.3, మణుగూరు 39.2, ఆళ్లపల్లి, 27.7, గుండాల 23.5, ఇల్లెందు 36.1, టేకులపల్లి 9.6, చండ్రుగొండ 16.7, అన్నపురెడ్డిపల్లి 7.3, చుంచుపల్లి 30, సుజాతనగర్ 12.5, కొత్తగూడెం 26.8, లక్ష్మీదేవిపల్లి 28.2, పాల్వంచ 13.9, బూర్గంపాడు 1.5, భద్రాచలం 24.2, ములకలపల్లి 35.5, దమ్మపేట 17.1, అశ్వారావుపేటలో 37.7మి.మీ వర్షపాతం నమోదైంది. వానల కోసం రైతుల ఎదురుచూపులు 12 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు తొమ్మిదింటిలో సాధారణం, రెండింటిలో అధికం గురువారం రాత్రి కురిసిన వర్షంతో కాస్త ఉపశమనంవర్షాలు పడితేనే మొక్కలకు జీవం వర్షాభావ పరిస్థితులు భయపెడుతున్నాయి. మొదట వర్షాలు కురవడంతో సంతోషపడ్డాం. పత్తి విత్తనాలు వేశాం. తర్వాత వర్షాలు పడక అవి భూమిలోనే కలిసి పోయాయి. ఆ తర్వాత కురిసిన వర్షానికి మళ్లీ పత్తి విత్తనాలు వేశాం. అవి మొలకెత్తాయి. వర్షాలు పడితేనే మొక్కలు బతుకుతాయి. – చింతల నాగరాజు, రైతు, గరిమెళ్లపాడు -
దాడి కేసులో ఇద్దరు అరెస్ట్
టేకులపల్లి: కత్తితో దాడి చేసిన కేసులో పోలీసులు ఇద్దరు నింది తులను గురువారం అరెస్ట్ చేశా రు. టేకులపల్లి ఎస్ఐ అలకుంట రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని మూడు తండాకు చెందిన గుగులోత్ రవి ఈనెల 7న రాత్రి టేకులపల్లి లోని డాల్ఫి న్ బేకరీ వద్దకు వెళ్లాడు. అదే సమయంలో రవి తమ్ముడు (బాబాయి కుమారుడు) గుగులోత్ వినోద్ కుమార్ కూడా అక్కడికి వచ్చాడు. కొంత కాలంగా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వివాదం ఉండగా, మళ్లీ వాగ్వాదం నెలకొంది. దీంతో వినోద్ కుమార్ కత్తితో దాడి చేయడంతో రవికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడిని స్థానికులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు వినోద్కుమార్, అతనికి సహకరించిన వాంకుడోత్ ప్రవీణ్ను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారని ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలుకరకగూడెం: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం జరిగింది. మండల పరిధిలోని నీలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామానికి చెందిన కుంజం శివ బైక్పై కరకగూడెం వచ్చి వెళ్తుండగా మోతె మూలమలుపు వద్ద చెట్టును ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో 108లో కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మణుగూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు బైక్లు ఢీ : ఇద్దరికి గాయాలుఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లెందు కోర్టు ఉద్యోగి స్వామినాథం ఆళ్లపల్లి మండలానికి బైక్పై వెళ్లి వస్తున్నాడు. అదే సమయంలో ఇల్లెందుకు చెందిన మహేష్ మరో బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొమరారం శివారులో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
ఓసీ పనులు వేగవంతం చేయాలి
ఇల్లెందు: ఇల్లెందులో నూతన ఓసీ పనులు వేగవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన కేఓసీలో పర్యటించి అక్కడి బొగ్గు ఉత్పత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓసీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అధికారులు వీసం కృష్ణయ్య, రాధాకృష్ణ, రామస్వామి, గిరిధర్రావు, గోవిందరావు, నరసింహరాజు, జాకీర్ హుస్సేన్, రవికుమార్, నాగరాజు నాయక్, రామూర్తి, శివవీరకుమార్ పాల్గొన్నారు. -
మహిళల అభివృద్ధే లక్ష్యం
ఇల్లెందు : మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ పేదవాడికీ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇల్లెందులోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి మంత్రి ధనసరి సీతక్కతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు 18 నెలల్లో రూ.856 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామని, ఇప్పుడు వారిని బస్సులకు యజమానులుగా చేస్తున్నామని చెప్పారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, నెలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించిన చరిత్ర ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఇప్పటికే 60 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని, త్వరలో మరో 40 వేల ఉద్యోగాలు అందిస్తామని అన్నారు. ఇన్ని పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ పార్టీని వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని కోరారు. పురుషులపై ఆధారపడకుండా.. మహిళలు పురుషులపై ఆధారపడకుండా స్వఽశక్తితో ఎదగాలనే లక్ష్యంతో ఇందిరమ్మ రాజ్యం పని చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని సీఎం రేవంత్రెడ్డి కంకణం కట్టుకున్నారని, ఆ దిశగా మహిళామణుల కోసం సెర్ప్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబనకు మార్గంగా మారుతుందని అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందుతుండడంతో సభ్యుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు ఏ పని చేయాలన్నా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేదని, ఇప్పుడు మహిళలకు ప్రభుత్వమే ప్రోత్సాహకాలు అందిస్తోందని వివరించారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ ఇంటి మంజూరుపత్రాలతో పాటు వడ్డీ లేని రుణాలు, బీమా, బ్యాంక్ లింకేజీ తదితర రూ.34 కోట్ల చెక్కులను మంత్రులు పొంగులేటి, సీతక్క అందజేశారు. కార్యక్రమంలో ఇల్లెందు, భద్రాచలం ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్రాజ్, మహబూబాబాద్ ఆర్డీఓ మధుసూదన్రాజ్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, తహాసీల్దార్ రవి, ఎంపీడీఓ ధన్సింగ్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, డీఎస్ఓ రుక్మిణీ, సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తదితరులు పాల్గొన్నారు.ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ఇళ్లు.. కోటి మంది నారీమణులను కోటీశ్వరులను చేస్తాం మంత్రులు పొంగులేటి, సీతక్క ఇల్లెందులో ఘనంగా మహిళా శక్తి సంబురాలు -
మంత్రులకే మోడల్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. భారీగా సబ్సిడీలు అందిస్తున్నాయి. అయినా ఆశించిన స్థాయిలో సౌర విద్యుత్ యూనిట్ల స్థాపనకు ప్రజల నుంచి స్పందన రావడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మోడల్ సోలార్ విలేజ్ పేరుతో ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లో గృహ, వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ప్రతీ ఇంటికి సోలార్ యూనిట్లను సర్కారు ఖర్చుతో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 80 గ్రామాలను ఎంపిక చేయగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 28 ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో ఇంటికై తే 2 కిలోవాట్స్, వ్యవసాయ మోటార్లకు 7.50 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ యూనిట్లను లబ్ధిదారులకు అందించనుంది. అన్నీ ఖమ్మం జిల్లాకే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 28 గ్రామాలను మోడల్ సోలార్ విలేజ్ పథకానికి ఎంపిక చేశారు. ఇందులో 27 గ్రామాలు ఖమ్మం జిల్లా పరిధిలో ఉండగా, భద్రాద్రి జిల్లాలో ఒకే ఒక్కటి ఉండడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో ఎంపికై న 27 గ్రామాల్లో 22 బోనకల్ మండలంలోనే ఉన్నాయి. ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సోలార్ యూనిట్లు ఉచితంగా ఏర్పాటుచేయనున్నారు. ఇక మధిర మండలం సిరిపురం, పాలేరు నియోజకర్గంలోని చెరువుమాధారం, ఖమ్మం నియోజకర్గంలో రఘునాథపాలెం, వైరా నియోజకర్గంలో స్నానాల లక్ష్మీపురం, శ్రీరామగిరి గ్రామాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి మాత్రమే అవకాశం దక్కింది. మంత్రులకే పెద్దపీట.. మోడల్ సోలార్ విలేజ్ పథకానికి ఎంపికై న గ్రామాలను పరిశీలిస్తే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, వారి సొంత గ్రామాలకే చోటుదక్కింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న బోనకల్ మండలంలో 22 గ్రామాలు, మధిర మండలం సిరిపురం ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ఆయన సొంతూరైన వైరా నియోజకర్గంలోని లక్ష్మీపురంతో పాటు శ్రీరామగిరి కూడా ఉన్నాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహించే నేలకొండపల్లి మండలం చెరువుమాధారం, తుమ్మల నాగేశ్వరరావు ప్రాతనిధ్యం వహిస్తున్న రఘునాథపాలెంతో పాటు ఆయన సొంతూరైన గండుగులపల్లికి అవకాశం దక్కింది. తుమ్మల సొంతూరు భద్రాద్రి జిల్లా కాకుంటే ఆ ఒక్క గ్రామానికి కూడా చోటు లభించేది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా సోలార్ యూనిట్లు మోడల్ విలేజ్ పథకంలో ఏజెన్సీ జిల్లాపై వివక్ష తొలి దశలో మంత్రుల నియోజకర్గాల్లోని గ్రామాలకే చోటు ఉమ్మడి జిల్లాకు 28.. భద్రాద్రికి దక్కింది ఒక్కటే ఏజెన్సీ జిల్లాపై పట్టింపేది ? ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో పది అసెంబ్లీ స్థానాలకు గాను ఖమ్మంలో ఐదు, భద్రాద్రిలో ఐదు ఉన్నాయి. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమే ఎక్కువ. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన గిరిజన గ్రామాలు, ఆ సామాజిక వర్గ జనాభానే అధికంగా ఉన్నారు. ప్రభుత్వం తరఫున అమలయ్యే ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాల్లో ఈ జిల్లాకు కచ్చితంగా చోటు కల్పించాలి. కానీ అందుకు భిన్నంగా ఖమ్మం జిల్లాకే, అందులోనూ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే అన్ని పథకాల్లో ప్రాధాన్యత దక్కుతుండటం విమర్శలకు తావిస్తోంది. మోడల్ సోలార్ విలేజ్ పథకంలో ఇల్లెందు, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి నియోజకర్గాల నుంచి ఒక్క గ్రామాన్ని కూడా చేర్చకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. -
సుమనోహరం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి, మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పెద్దమ్మతల్లిని ఈనెల 20న శాకాంబరీ రూపంలో అలంకరించనున్నట్లు ఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. కంప్యూటర్ విద్యపై పట్టు సాధించాలి● డీఈఓ వెంకటేశ్వరా చారి మణుగూరు రూరల్ : విద్యార్థులు చదువుతో పాటు కంప్యూటర్ విద్యపైనా పట్టు సాధించాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి అన్నారు. మణుగూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ప్రయోగశాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవితంలో ఎదిగేందుకు విద్య గొప్ప ఆయుధంలా దోహదపడుతుందని అన్నారు. ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఎంఓ సైదులు, ఏఎంఓ నాగరాజశేఖర్, ఎంఈఓ జి.స్వర్ణజ్యోతి, సాంబాయిగూడెం కాంప్లెక్స్ హెచ్ఎం ఎం.శ్రీలత, ఎమ్మార్పీలు ఎం.విష్ణు, పి.బాలరాజు, పి.రామకృష్ణ, కె.రాంబాబు, ఐ.బాలాజీ, ఐ.రమేష్, టి. శ్రీకాంత్, హెచ్ఎం బ్రహ్మయ్య, బి.విజయ, ఏఏపీసీ చైర్మన్ ఉత్తమకుమారి పాల్గొన్నారు. నానో యూరియానే వినియోగించాలిబూర్గంపాడు: రైతులు గుళికల యూరియా స్థానంలో ద్రవ రూపంలో ఉండే నానో యూరి యా వినియోగాన్ని పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు సూచించారు. బూర్గంపాడు పీఏసీఎస్లో యూరియా విక్రయాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నానో యూరియాతో అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. గుళికల యూరియా కంటే బాగా పనిచేస్తుంద ని, పంటల దిగుబడి పెరుగుతుందని తెలిపా రు. నానో యూరియాతో భూగర్భ జలాల్లోకి నత్రజని చేరదని, తద్వారా భూసారం బాగుంటుందని అన్నారు. అర లీటర్ నానో యూరి యా ఒక బస్తా యూరియాతో సమానమన్నారు. ఇది రవాణాకు కూడా తేలికగా ఉంటుందని, కూలీల ఖర్చు తగ్గుతుందని వివరించారు. కార్యక్రమంలో ఏఓ శంకర్ పాల్గొన్నారు. -
నిండని తుమ్మలచెరువు
● ఆయకట్టులో ప్రశ్నార్థకంగా మారిన వరిసాగు ● సీతారామ జలాలు ఇవ్వాలని కోరుతున్న రైతులుఅశ్వాపురం: కాకతీయులకాలం నాటి తుమ్మల చెరువు ఆయకట్టులో ఖరీఫ్ వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో చెరువులో ఇంకా నీరు చేరలేదు. ఆయకట్టులో పోసిన వరినార్లు ఎండిపోతున్నాయి. దీంతో సుమారు 10 వేల మంది రైతులు, వేలాది మంది రైతు కూలీలు ఆందోళన చెందుతున్నారు. ముందుకు సాగని మారెళ్లపాడు లిఫ్ట్ పనులు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా తుమ్మలచెరువుకు నీరు అందించేందుకు బీజీ కొత్తూరు పంప్హౌస్ సమీపంలో మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. రెండేళ్లు గడిచినా పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనులను సందర్శించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా ఈ ఖరీఫ్కు దీనిద్వారా నీరు ఇవ్వడం సాధ్యం కాదు. తుమ్మలచెరువుకు మూడు కాలువలు ఊరవా యి, కుందారం, చదలవాడ కాలువలు ఉన్నాయి. ఇవి సీతారామకాలువ సమీపంలోనే ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీతారామ ప్రధాన కాలువకు అనువైన ప్రదేశంలో గేట్వాల్వ్ ఏర్పాటు చేసి, మోటార్లు, పైపుల ద్వారా తాత్కాలికంగా చెరువు కాలువల్లోకి నీరు ఇచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎమ్మెల్యే, నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి తుమ్మలచెరు వు కాలువలకు నీరు అందించేలా చర్యలు తీసుకో వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. సాగు నీరు ఇవ్వాలి చెరువు ఆయకట్టులో వరినారు పోశాం. వర్షాల్లేక నారు ఎండిపోతోంది. ఈ వానాకాలం సీజజన్లో తుమ్మల చెరువు కింద వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం స్పందించి సీతారామ నీళ్లు ఇవ్వాలి. –కమటం వెంకటేశ్వరరావు, ఆయకట్టు రైతు, మొండికుంట -
కలెక్టర్కు అవార్డులు
సూపర్బజార్(కొత్తగూడెం): ఐఐటీ బాంబేలో నిర్వహించిన ఓపెన్ సోర్స్ డేలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డుతో పాటు ఓపెన్ సోర్స్ జీఐఎస్ కోహార్ట్ అవార్డులను గురువారం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ మాజీ చైర్మన్ ఏ.ఎస్.కిరణ్కుమార్ చేతులమీదుగా అందుకున్నారు. జిల్లాలో గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం జియో స్పేషియల్ టెక్నాలజీ నిపుణులతో నిర్వహించిన మొదటి ఓపెన్ సోర్స్ జీఐఎస్ సదస్సు నిర్వహణకు, జిల్లా సమస్యలను లోకల్ స్థాయిలో పరిష్కరించేలా చేసినందుకు ఈ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐఐటీ బాంబే సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లాకు తీసుకొచ్చి రైతులు, విద్యార్థులు, అధికారులు అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగానే జీఐఎస్ సాయంతో పత్తి, మొక్కజొన్న పొలాలను మ్యాప్ చేసి రైతులను మునగసాగు వైపు మళ్లించే ప్రయత్నం మొదలు పెట్టామని, మేకల పెంపకం, మేక పాల ఉత్పత్తి పెంపుదలపై పరిశీలనలు జరుగుతున్నాయని వివరించారు. ఈ అవార్డులు జిల్లాకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. -
రామయ్య భూములు దక్కేనా ?
● పురుషోత్తపట్నంలో పర్యటించిన పీఠాధిపతి ● స్థానికులతో చర్చలు.. భూములు తమవేనంటున్న రైతులు ● అన్యమతస్తుల నుంచి భూమి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ ● రాముడి భూమి ఆలయానికే చెందాలన్న శ్రీనివాసానంద స్వామిజీ భద్రాచలం: భద్రాద్రి రామయ్యకు చెందిన ఏపీలోని పురుషోత్తపట్నం భూములపై రచ్చ కొనసాగుతూనే ఉంది. దేవాదాయ శాఖకు చెందిన భూములను స్వాధీనం చేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని రామాలయ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాముడికి చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతుండడం, వాటిని ఆలయ వర్గాలు అడ్డుకోవడంతో ఘర్షణలతో ఉద్రిక్తత నెలకొంటోంది. కాగా, ఏపీలోని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీతో పాటు బీజేపి నాయకులు పురుషోత్తపట్నంలో గురువారం పర్యటించి గ్రామస్తులు, రైతులతో మాట్లాడారు. అన్యమత సంస్థకు ఎలా అప్పగించారు..? ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న తాము రామాలయానికి కౌలు చెల్లిస్తున్నామని, రాముడిపై ఆధారపడి జీవిస్తున్న తమకు అన్యాయం చేయొద్దని స్థానిక రైతులు అన్నారు. అయితే ఆలయానికి చెందిన 12 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీలోని నాటి టీడీపీ ప్రభుత్వం ఓ అన్యమత సంస్థకు ఎలా అప్పగించిందని ప్రశ్నించారు. మొదట ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాకే తమ వద్దకు రావాలని అన్నారు. రాముడికి తాము వ్యతిరేకం కాదని, అందరికీ సమన్యాయం జరగాలని, ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. భూమి రాముడికే చెందాలి.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న భద్రాద్రి రామయ్యకు చెందిన భూములు స్వామివారికే దక్కాలని శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ అన్నారు. పురుషోత్తపట్నంలో పర్యటన తర్వాత భద్రాచలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాలకు చెందిన సున్నితమైన అంశాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని సూచించారు. ఇటు ఆలయానికి, అటు రైతులకు సమన్యాయం జరిగేలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నివేదిక ఇస్తామన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి దేవాదాయ శాఖకు శాశ్వత స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అన్యమత సంస్థకు కేటాయించిన భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అక్కడ నుంచే ఆక్రమణల తొలగింపును ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సాధుపరిషత్ గౌరవాధ్యక్షులు అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ.. రాముడికి చెందిన భూముల స్వాధీనంపై ఇరు రాష్ట్రాల సీఎంలు స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏపీ సాధు పరిషత్ గౌరవ సలహాదారు కురిచేటి రామచంద్రమూర్తి పాల్గొన్నారు. కాగా, తొలుత భద్రాచలం వచ్చిన ఈ బృందం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. పండితులు వారికి వేదాశీర్వచనం అందజేశారు. -
గ్రంథాలయ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ
కొత్తగూడెంఅర్బన్ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కాంగ్రెస్ నాయకుడు పసుపులేటి వీరబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని లైబ్రరీలను త్వరలో పరిశీలిస్తానని, గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని, వాటిని ఆదర్శంగా నిలుపుతామని చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుకుల, పాఠకులకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు. అంతకుముందు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కరుణకుమారి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ జి.మణిమృదుల, ఆఫీస్ ఇన్చార్జ్ ఎం.నవీన్కుమార్, నాగన్న, మధుబాబు, నాయకులు పల్లె వరప్రసాద్, జల్లారపు ఈశ్వర్, బండి శ్రీకాంత్గౌడ్, లావుడియా నరేష్ పాల్గొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రణాళికలు
పాల్వంచ: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు వివిధ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. గురువారం స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలో టేబుల్ టెన్నిస్ క్రీడలను శిక్షణ కలెక్టర్ సౌరభ్ శ ర్మతో కలిసి ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు వ్యాసరచన, ఉపన్యాసం పోటీలతో పాటు కుట్టడం, అల్లికలు, కరాటే తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఐదు పాఠశాలల్లో హాకీ, హ్యాండ్బాల్, బాల్ బాడ్మింటన్, రెజ్లింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈమేరకు విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్, స్పోర్ట్స్ అధికారి గోపాలరావు, అసిస్టెంట్ స్పోర్ట్స్ అధికారి వెంకటనారాయణ, హెచ్ఎం భద్రం, వార్డెన్ పవన్, గోపాలరావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏపీ సర్కారుదే!
కొవ్వూరు బాధ్యత ఆంధ్రప్రదేశ్ వాటా ఇస్తే పనులు ప్రారంభిస్తాం ● భద్రాచలంరోడ్ – కొవ్వూరు లైన్పై ఎస్సీఆర్ జీఎం స్పష్టీకరణ ● ఈ లైన్ నిర్మాణంపై జీఎంను కలిసిన రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి ● తెలంగాణ వాటాధనంతో సత్తుపల్లి వరకు పనులు పూర్తి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: అరవై ఐదు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భద్రాచలంరోడ్ – కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రైల్వేశాఖ నుంచి గతేడాది హామీ లభించింది. కానీ ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. ఎప్పుడు ప్రారంభమయ్యేది పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. చెరిసగం ఖర్చుతో.. భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) నుంచి కొవ్వూరు వరకు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి 2011 – 12 బడ్జెట్లో రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 199.60 కి.మీ. నిడివి కలిగిన ఈ మార్గం నిర్మాణ వ్యయంలో సగం భరించేలా అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దీంతో 200 కి.మీ. రైలు మార్గంలో దాదాపు 100 కి.మీ. నిర్మాణ వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలంరోడ్ నుంచి సత్తుపల్లి వరకు సుమారు 54 కి.మీ. నిర్మాణ వ్యయాన్ని బొగ్గు రవాణా అవసరాల దృష్ట్యా తెలంగాణ తరఫున సింగరేణి సంస్థ భరించింది. ఈ కొత్త రైలు మార్గాన్ని 2022 నవంబర్లో ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఇక సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు 151 కి.మీ. మార్గం నిర్మించాల్సి ఉంది. ఏపీ వాటా ఇస్తేనే.. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంరోడ్ – కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో స్తబ్దత నెలకొంది. గతేడాది జూలై, డిసెంబర్లో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఈ రైలు మార్గాన్ని నిర్మించాలంటూ పలుమార్లు రైల్వే అధికారులను కోరారు. దీంతో మరోసారి ఈ లైన్ నిర్మాణ పనుల అంశం తెరపైకి వచ్చింది. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ పనుల పురోగతిపై చర్చించేందుకు తాజాగా మంగళవారం సికింద్రాబాద్లోని రైల్భవన్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవతో పురందేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రాచలంరోడ్ – కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తమ వాటా చెల్లించిందని, దీంతో సత్తుపల్లి వరకు నిర్మించామని జీఎం తెలిపారని రైల్వే వర్గాల సమాచా రం. మిగిలిన పనులకు సంబంధించి ఏపీ వాటా కూడా చెల్లిస్తే వెంటనే పనులు ప్రారంభించి 2030 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై భద్రాచలంరోడ్ – కొవ్వూరు లైన్ భవితవ్యం ఆధారపడి ఉంది. అలైన్మెంట్ ఎలా ఉండేనో.. పలుమార్లు చేపట్టిన సర్వేల ప్రకారం భద్రాచలంరోడ్ – కొవ్వురు మార్గం రామవరం, గరీబ్పేట, రావికంపాడు, మద్దుకూరు, అన్నపురెడ్డిపల్లి, రేగులపాడు, గండుగులపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మీదుగా ఏపీలోకి ప్రవేశిస్తుంది. అయితే 2011 – 12 తర్వాత ఈ అలైన్మెంట్లో మార్పులు చేసి చండ్రుగొండ, భవన్నపాలెం మీదుగా సత్తుపల్లి వరకు కొత్త లైన్ నిర్మించారు. ఇక్కడి నుంచే ముందుకు తీసుకెళ్తే మందలపల్లి – అశ్వారావుపేట మీదుగా ఏపీలోకి ఈ లైన్ వెళ్తుంది. అక్కడ జీలుగుమిల్లి, తాడ్వాయిరోడ్, జంగారెడ్డిగూడెం, రాజవరం, పొంగుటూరు, చిన్నాయిగూడెం, దేవరపల్లి మీదుగా కొవ్వూరుకు చేరుకుంటుంది.ఆంధ్రా సర్కారు ముందుకు రావాలి సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు 150 కి.మీ. మేర నిర్మించే నూతన రైలు మార్గానికి రూ.2,155 కోట్లు అవసరమని గతేడాది తేల్చారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తన వాటాగా రూ.1,100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 1960 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కేవలం ప్రకటనలకే పరిమితమైంది. దీంతో నిర్మాణ వ్యయం ఏటేటా పెరుగుతోంది. ఇప్పటికై నా జాప్యం చేయకుండా నిర్మాణ వ్యయంలో సగం మంజూరు చేసి, పనులు వెంటనే ప్రారంభయ్యేలా ఏపీ ప్రభుత్వం చొరవ చూపించాలని రెండు రాష్ట్రాలకు చెందిన గోదావరి తీర ప్రాంత ఏజెన్సీ వాసులు కోరుతున్నారు. -
లెక్క తేలింది..
● ఉమ్మడి జిల్లాలో ఎంపీటీసీ 516, జెడ్పీటీసీ స్థానాలు 42 ● పునర్విభజన అనంతరం స్థానాల ప్రకటన ● త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం ● అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో జోరు పెంచిన అధికార పక్షం ● ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలుసాక్షిప్రతినిధి, ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఒక్కో అడుగు పడుతోంది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలతో పాటు మండల ప్రజా పరిషత్ స్థానాలను ప్రకటించింది. ఈ ప్రకారం ఖమ్మం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు 20 చొప్పున ఉండగా, ఎంపీటీసీ స్థానాలు 283గా వెల్ల డైంది. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీలు 22 చొప్పున, ఎంపీటీసీ స్థానాలు 233గా లెక్క తేల్చారు. కాగా, ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో 289 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, పునర్విభజనతో ఆ సంఖ్య తగ్గింది. అలాగే, మార్పులు, చేర్పుల అనంతరం ఖమ్మం జిల్లాలో 571 గ్రామపంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 జీపీలు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును గవర్నర్కు సమర్పించిన నేపథ్యాన, గవర్నర్ ఆమోదం పొందితే ఈనెలాఖరులోగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని తెలుస్తోంది. రెండు మున్సిపాలిటీల ఏర్పాటుతో.. ఖమ్మం జిల్లాలో 289 ఎంపీటీసీ స్థానాలకు గతంలో ఎన్నికలు జరిగాయి. అయితే, ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటుతో ఖమ్మం రూరల్ మండలంలోని కొన్ని గ్రామపంచాయతీలు అందులో విలీనమయ్యాయి. అలాగే రఘునాథపాలెం మండలంలోని ఎంపీటీసీ స్థానం ఖమ్మం రూరల్లో చేరింది. అంతేకాక కల్లూరు మున్సిపాలిటీ ఏర్పాటుతో ఐదు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. ఖమ్మంరూరల్, రఘునాథపాలెం మండలాలు కలిపి ఒకటి, కల్లూరు మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు తగ్గడంతో జిల్లాలో 283గా ఖాయమయ్యాయి. అలాగే జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు 20 ఉన్నాయి. ఇవికాక ఏదులాపురం, కల్లూరులో విలీనమైన గ్రామపంచాయతీలను మినహాయిస్తే జిల్లాలో 571 గ్రామపంచాయతీలు, 5,214 వార్డులు ఉన్నట్లు లెక్క తేలింది. భద్రాద్రి జిల్లాలో 471 జీపీలు, 4,168 వార్డులు ఉన్నాయి. ఇక ఎన్నికల సందడి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఖరారైన నేపథ్యాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాక రిజర్వేషన్లు ఖరారు కాగానే అభ్యర్థులను ఎంపిక చేసేలా కసరత్తు మొదలుపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల జోరు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యాన ప్రభుత్వ కార్యక్రమాల జోరు పెరిగింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ప్రధానంగా గ్రామ, మండల స్థాయిల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. మంత్రులు మండలాల వారీగా పర్యటిస్తూ మహిళా సంఘాలకు వడ్డీ రుణాల చెక్కులే కాక రేషన్కార్డుల పంపిణీ మొదలుపెట్టారు. ఇలా రకరకాలుగా ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారించారు. ఇదే సమయాన ఇతర పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలను దీటుగా ఎదుర్కొనేలా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో స్థానాల వివరాలు స్థానాలు ఖమ్మం భద్రాద్రి జిల్లా జిల్లా జెడ్పీటీసీలు 20 22ఎంపీపీలు 20 22ఎంపీటీసీలు 283 233గ్రామపంచాయతీలు 571 471వార్డులు 5,214 4,168ఎప్పుడైనా నోటిఫికేషన్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రిజర్వేషన్లపై ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టసవరణ ఆమోదం కోసం ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదానికి పంపింది. గవర్నర్ ఆమోదం పొందగానే చట్ట సవరణ అమల్లోకి వస్తుంది. తద్వారా ఈ రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫి కేషన్ జారీ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈనెల 25లోగా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఆతర్వాత గ్రామపంచాయతీ ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. -
నాణ్యమైన భోజనం అందించాలి
దమ్మపేట : ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని అంకంపాలెం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను బుధవారం రాత్రి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు కేటాయించిన మెనూ సక్రమంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థినులతో మాట్లాడిన పొంగులేటి.. సౌకర్యాల కల్పనలో ఏవైనా లోటుపాట్లు ఉంటే తెలియజేయాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడారు. అంతకుముందు గిరిజన గురుకుల పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన, గిరిజనేతర రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్బాబు మాట్లాడుతూ.. మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. మొదట ఇందిరా శక్తి మహిళా సంబరాల్లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు పలు క్రీడా పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. సభా వేదికపై ఆదివాసీలు సంంప్రదాయ నృత్య ప్రదర్శన చేయగా మంత్రి పొంగులేటి వారిని అభినందించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాహుల్, డీఆర్డీఓ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఆర్డీఓ మధు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సోయం సుజాత, దిశ కమిటీ సభ్యురాలు సొంగా యేసుమణి తదితరులు పాల్గొన్నారు. మెనూ సక్రమంగా అమలు చేయాలి అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం అంకంపాలెం ఆశ్రమ పాఠశాల పరిశీలన.. -
కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలిభగీరథ గ్రిడ్ను పరిశీలించిన ఈఎన్సీ.. దుమ్ముగూడెం : ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని పర్ణశాల గ్రామంలో గల గ్రిడ్ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శేఖర్రెడ్డి, ఈఈలు తిరుమలేష్, నళిని, డీఈలు బ్రహ్మదేవ్, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. మిట్టగూడెంలో..అశ్వాపురం: మండలంలోని మిట్టగూడెంలో రథంగుట్ట వద్ద మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కృపాకర్రెడ్డి బుధవారం పరిశీలించారు. నీటి సరఫరాపై అధికారులతో మాట్లాడి పలు సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో సీఈలు శ్రీనివాస్, మధుబాబు, ఎస్ఈలు నరేందర్రెడ్డి, శేఖర్రెడ్డి, డీఈ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. న్యాయవాద పరిషత్ జిల్లా కమిటీ ఎన్నికకొత్తగూడెంటౌన్: న్యాయవాద పరిషత్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలో బుధవారం పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపల్లి విజయ్కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా అనుబ్రోలు రాంప్రసాద్రావు, ఉపాధ్యక్షులుగా జి.రామచంద్రారెడ్డి, రేపాక మనోరమ, కిరణ్, కాసాని రమేష్, కార్యదర్శులుగా పిల్లి వేణువాసురావు, ఎస్.రమణారెడ్డి, వీర మధుసూదన్, జి. నాగరాజు, ఎల్. రవినాయక్, ట్రెజరర్గా దేవేంద్ర, మహిళా ప్రతినిధిగా నల్లమల్ల ప్రతిభ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పాతూరి పాండురంగ విఠల్, కార్య నిర్వాహక కమిటీ సభ్యులుగా దూడెం మురళి ఎన్నికయ్యారు. అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: ఇంజనీరింగ్, నాన్– ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ఖమ్మం రీజియన్లోని ఆర్టీసీ డిపోల్లో మూడేళ్ల అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం సరిరామ్ తెలిపారు. గ్రాడ్యుయేషన్, వివిధ కోర్సుల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారే కాక డిప్లొమా చదివిన అర్హులని వెల్లడించారు. 2021 విద్యాసంవత్సరం తర్వాత ఉత్తీర్ణులైన వారికి నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీం ద్వారా ఇచ్చే శిక్షణ కోసం ఈనెల 23వ తేదీ లోగా నాట్స్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, శిక్షణ కాలంలో స్టైఫండ్ అందుతుందని ఆర్ఎం తెలిపారు. -
యూరియా కోసం బారులు..
తెల్లవారుజాము నుంచే విక్రయ కేంద్రానికి రైతులుఇల్లెందురూరల్ : వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో యూరియా కోసం రైతులు విక్రయ కేంద్రాల వద్ద బారులు దీరుతున్నారు. బుధవారం తెల్లవారుజామునే ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డ్కు చేరుకుని పడిగాపులు కాశారు. రెండు రోజులుగా తిరుగుతున్నా యూరియా లభించలేదని, అందుకే తెల్లారకముందే విక్రయ కేంద్రానికి చేరుకున్నామని రైతులు చెబుతున్నారు. అయితే రోజుకు 300 మంది రైతులకు సరపడా మాత్రమే దిగుమతి అవుతుండడం, అంతకు మించి రైతులు రావడంతో అధికారులకు కూడా సమస్యగా మారుతోంది. దీంతో గురువారం నుంచి నిబంధనలు సడలించాలని పీఏసీఎస్, వ్యవసాయ శాఖల అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పిస్తే యూరియా ఇచ్చేవారు. దీంతో రైతులు కుటుంబంలోని సభ్యులందరినీ తీసుకొచ్చి యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా నిబంధనలు సడలించినట్లు అధికారులు తెలిపారు. గురువారం నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ పత్రంతోపాటు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కూడా వెంట తెచ్చుకుంటేనే యూరియా విక్రయిస్తామని స్పష్టం చేస్తున్నారు. కాగా, ఆన్లైన్ అనుమతులు రాగానే కొమరారంలో కూడా యూరియా విక్రయాలు ప్రారంభిస్తామని ఏఓ సతీష్ తెలిపారు. -
మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు
ఇల్లెందు: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూర్య(సీతక్క), రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, పౌరసమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురవారం ఇల్లెందుకు రానున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో సభా ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహిళలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. బ్యాంకు లింకేజీ, రుణ బీమా, రేషన్ కార్డులు అందజేయనున్నారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, కోరం సురేందర్, లక్కినేని సురేందర్, మండల రాము, డానియేల్, పులి సైదులు, మడుగు సాంబమూర్తి, సూర్యం, కిరణ్, భిక్షం, చిల్లా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఎరువులు అధికంగా వాడొద్దు
మునగ తోటను పరిశీలించిన కేవీకే శాస్త్రవేత్తలుపాల్వంచరూరల్ : మునగ తోటలకు అధికంగా ఎరువులను వినియోగించవద్దని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ సూచించారు. మండల పరిధిలోని సోములగూడెంలో రైతులు సాగు చేసిన మునగ తోటలను బుధవారం వారు పరిశీలించారు. పంట సంరక్షణ, దిగుబడి తదితర అంశాలపై సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వానకాలంలో మునగ తోటలో నీరు నిలిస్తే ఆకు పసుపు రంగులోకి మారి పూత, ఆకు రాలిపోతుందని, వర్షపు నీరు తోటలో నిల్వకుండా చూడాలని సూచించారు. చీడపీడల నివారణకు 13 – 0 – 45 మ్యాక్స్ పౌడర్ను లీటర్ నీటిలో 5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. చెట్లను బొంత పురుగు ఆశించకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ పొరండ్ల రంగా, టెక్నికల్ అసిస్టెంట్లు రజిత, సుజాత, నాగేశ్వరరావు, ప్రసన్నకుమార్, రైతులు బాలినేని నాగేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలి
కొత్తగూడెంటౌన్: న్యాయవాదుల సంక్షేమానికి, కొత్త కోర్టులు, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ కోరారు. బుధవారం కొత్తగూడెం జిల్లా కోర్టు ఆవరణలోని లైబ్రరీ హాల్లో కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు వెల్లంకి వెంకటేశ్వరావు అధ్యక్షతన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోతుకూరి ధర్మారావు, నాగసీతారాములు, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ సభ్యుడు జేబీ శౌరి, జైభీమ్రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఝెర్రా కామేషలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కోర్టు, ఫ్యామిలీ కోర్టు లేబర్కోర్టు నూతన న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని అన్నారు. న్యాయవాదుల హెల్త్ కార్డుల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, రేపా క వెంకటరత్నం, పలివెల సాంబశివరావు, వీవీ సుధాకర్రావు, వైవీ రామారావు, రావి విజయ్కుమార్, ఊట్ల రాజేశ్వరావు, ఎర్రపాటి కృష్ణ పాల్గొన్నారు.కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ -
మైనార్టీలను శత్రువులుగా చూస్తున్నారు..
● బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారిని వేటాడి చంపుతున్నాయి ● మాస్లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్సింగ్ ఠాగూర్ ఇల్లెందు : కేంద్రంలో నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక మైనార్టీలను శత్రువులుగా చూడడమే కాక, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు వారిని వేటాడి హతమారుస్తున్నారని సీపీఐ(ఎంఎల్)మాస్లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక హక్కులు కాలరాయడంతో పాటు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. మాస్లైన్ దివంగత నాయకులు రాయల చంద్రశేఖర్, గండి యాదగిరి స్మారక స్తూపాలను ఇల్లెందులో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఠాగూర్ మాట్లాడుతూ.. దేశంలో ఒక శాతం ఉన్న కార్పొరేట్ శక్తులకు సంపద మొత్తం కట్టబెడుతున్నారని, ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసి జైళ్లపాలు చేస్తున్నారని ఆరోపించారు. దివంగత నేత రాయల చంద్రశేఖర్ రైతుల సమస్యలపైనే జీవితాంతం పోరాడారని, దేశ వ్యాప్తంగా వివిధ పేర్లతో ఉన్న రైతు సంఘాలను సమన్వయం చేసి ఒకే సంఘంగా ఏర్పాటు చేయాలని పార్టీ వద్ద ప్రతిపాదన పెట్టారని వివరించారు. ఆయన అశయ సాధన కోసం అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ మాస్లైన్ ఆవిర్భావంలో రాయల చంద్రశేఖర్ కీలక భూమిక పోషించారని, పార్టీ విస్తరించే క్రమంలో ఆయన మరణం తీరని లోటని అన్నారు. దేశంలో కమ్యూనిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్షా కంకణం కట్టుకున్నాడని, ఛత్తీస్గఢ్లో రక్తపుటేరులు పారిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అఽధికారం కోసం 420 హామీలు ఇచ్చారని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించినా అమలులో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చంద్రశేఖర్ సతీమణి విమల, మాస్లైన్ నాయకులు రాయల రమ, కె.జి.రాంచందర్, చిన్న చంద్రన్న, కెచ్చెల రంగయ్య, చండ్ర అరుణ, ముద్దా భిక్షం, నాయిని రాజు, జగ్గన్న, రాము, బిచ్చా, కె రవి, కృష్ణ, బుర్ర వెంకన్న, యాకుబ్షావలి, రేసు బోసు, కాంపాటి పృథ్వీ, అజయ్, పాయం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
ఇల్లెందు/టేకులపల్లి: ప్రభుత్వానికి, ఉపాధ్యాయ సంఘాలకు మధ్య అనుసంధానకర్తగా పని చేస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పీఆర్టీయూ నాయకుడు, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్లో, టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎంజేపీ బీసీ బాలుర గురుకులంలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉపాఽధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని తెలిపారు. ఈహెచ్ఎస్ స్కీం అందరికీ అనువుగా ఉండేలా, సింగరేణిలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఉద్యోగుల హెల్త్ స్కీం అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీని ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దామోదర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాస రెడ్డి, నాయకులు ధనికొండ శ్రీనివాస్, తన్నీరు శ్రీనివాస్, దశమ్ బాబు, విజయ నిర్మల, పి. నర్సయ్య, సీహెచ్ ప్రభాకర్రావు, రవీందర్, కె. శేఖర్, రంగారావు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి -
ప్రైవేటు ఆస్పత్రి సీజ్
అశ్వారావుపేట: అశ్వారావుపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిని డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.జయలక్ష్మి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా క్లినిక్లు, ల్యాబ్లు, మెడికల్ షాపులు నిర్వహించొద్దని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న, అర్హత కలిగిన వైద్యుల క్లినిక్లకు మాత్రమే ప్రజలు వెళ్లాలని సూచించారు. అనంతరం వినాయకపురం పీహెచ్సీని సందర్శించారు. డీఎంహెచ్ఓ వెంట ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధువరుణ్, డీడీఎంహెఓచ్వో ఫైజ్ మోహియుద్దీన్ ఉన్నారు.వెలిసిన మావోయిస్టుల వ్యతిరేక పోస్టర్లుబూర్గంపాడు/పాల్వంచరూరల్: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో బుధవారం ప్రజాఫ్రంట్ పేరుతో మావోయిస్టుల వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. బూర్గంపా డు మండలం కొసగుంపు, చింతకుంట, ఉర్లదోసపల్లి, గోపాలపురం, రాజీవ్నగర్ వలస ఆదివాసీ గ్రామాల్లో, పాల్వంచ మండలం రెడ్డిగూడెం ఎస్టీకాలనీ, ఒంటిగుడిసె, ఉల్వ నూరు, చండ్రాలగూడెం తదితర గ్రామాల్లో పోస్టర్లు అంటించారు. మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పోస్టర్లలో పేర్కొన్నారు. సింగరేణీయుల పిల్లలకు ఎంబీబీఎస్లో ప్రవేశాలుసింగరేణి(కొత్తగూడెం): 2025–26 విద్యాసంవత్సరంలో సింగరేణి మెడికల్ కశాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేంరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. రామగుండంలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (సిమ్స్)లో ఏడు సీట్లను ఉద్యోగుల కోటా కింద భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నీట్లో ఉత్తీర్ణత సాధించిన సింగరేణి అధికారులు, కార్మికుల పిల్లలు అర్హులని తెలిపా రు. ర్యాంక్ ఆధారంగా స్పాన్సర్షిప్ కల్పిస్తామని, సంబంధిత మైన్స్/ డిపార్ట్మెంట్లలో సంప్రదించి ఈ నెల 25వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ప్రవేశాల పెంపునకు కృషి చేయాలిఅశ్వారావుపేట: అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెంచేలా ప్రతీ లెక్చరర్ కృషి చేయాలని ఇంటర్మీడియట్ బోర్డ్ డిప్యూటీ సెక్రటరీ సీహెచ్ హేమచంద్ర సూచించారు. బుధవారం ఆయన కళా శాలను సందర్శించారు. కళాశాల గదులు, రికా ర్డుల పరిశీలన అనంతరం అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రాపవుట్స్ను తగ్గించాలని సూ చించారు. ప్రిన్సిపాల్ ఎ.అనిత పాల్గొన్నారు. లారీలను అడ్డుకున్న గ్రామస్తులుమణుగూరు రూరల్ : తమ గ్రామం మీదుగా ఇసుక లారీలు, బొగ్గు లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ మండలంలోని రాజుపేట గ్రామస్తులు బుధవారం లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీల వల్ల దుమ్ము, ధూళి ఎగిసిపడి అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీడ్ బ్రేకర్లు, దుమ్ము లేవకుండా వాటర్ స్ప్రే ఏర్పాటు చేయడంలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. సింగరేణి అధికారులు వచ్చి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. యువకుడి ఆత్మహత్యఖమ్మంరూరల్: మండలంలోని పడమటితండాకు చెందిన యువకుడు తమ్మోజు విఘ్నేశ్ చా రి (20) ఈనెల 3న గడ్డి మందు తాగి, చికి త్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఖమ్మంలో వెల్డింగ్ పనిచేస్తున్న యువ కుడికి ఖమ్మానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గమనించిన యువతి తండ్రి చంపుతానని బెదిరించినట్లు తెలి సింది. దీంతో యువకుడు ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
●టగ్ ఆఫ్ వార్
దమ్మపేట మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకులంలో బుధవారం ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొనగా, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు టగ్ ఆఫ్ వార్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనగా మంత్రి శ్రీనివాసరెడ్డి వారిని ప్రోత్సహించడమే కాక విజేతలకు బహుమతులు అందజేశారు. – దమ్మపేట -
రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలి
సింగరేణి(కొత్తగూడెం): ఈ ఏడాది కూడా ప్రమాద రహిత సింగరేణికి కృషి చేయాలని, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సింగరేణి (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) డైరెక్టర్ కే.వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్సీఓఏ క్లబ్లో కొత్తగూడెం ఏరియా జీఎం ఎం శాలేంరాజు అధ్యక్షతన ఇల్లెందు, కొత్తగూడెం ఏరియాల 19వ, 17వ రక్షణ త్రైపాక్షిక సమావేశం జరిగింది. జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన సమావేశాన్ని ప్రారంభించారు. రక్షణ ప్రతిజ్ఞ చేశారు. గత సమావేశ మినిట్స్, 12వ, నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్స్ మిని ట్స్పై తీసుకున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రక్షణ చర్యలు పాటించాలని చెప్పారు. ఆ తర్వాత డీడీఎంస్, డీజీఎంఎస్లు గనుల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరాతీశారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రమాదాలు జరగకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేసిసందుకు రెండు ఏరియాల జీఎంలను అభినందించారు. ఇదే స్ఫూర్తి తో రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు ఉమేష మధకర్రావు సవార్కర్, ఎస్.ఆనంద్వెల్, చింతల శ్రీని వాస్, సనత్కుమార్, కమలేష్ కుమార్, దిలీప్ కుమార్, ఎస్కే నాగుల్ మీరా, అంకిత్ సింగ్, కృష్ణయ్య, యూనియన్ నాయకులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు -
‘తపాలా’లో నూతన సాంకేతికత
● 22వ తేదీ నుంచి ఐటీ–2.0 అమలు ● 19, 21వ తేదీల్లో సేవలకు అంతరాయంఖమ్మంగాంధీచౌక్: తపాలా శాఖ నిర్వహణలో మార్పులు తీసుకొస్తున్నారు. సురక్షితమైన సేవల కోసం అధునాతన సాంకేతిక విధానం అమలుకు రంగం సిద్ధం చేశారు. తపాలా శాఖ కార్యాలయాల ద్వారా సేవలన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్పై అమలుకు నిర్ణయించిన నేపథ్యాన ఐటీ–2.0 పేరుతో నూతన సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ స్టాఫ్వేర్ కార్యకలాపాల డేటా భద్రతను పెంచుతుందని చెబుతున్నారు. అలాగే, ఉద్యోగుల పని సామర్ధ్యం పెరగడమే కాక సేవలు మెరుగవుతాయని భావిస్తున్నారు. తెలంగాణ సర్కిల్ అంతటా... ఐటీ–2.0ను ఈనెల 22వ తేదీ నుంచి తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా అమలు చేయనుంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంతో మన రాష్ట్రంలోని హైదరాబాద్ సర్కిల్, తెలంగాణ సర్కిల్లోని నల్లగొండ తపాలా డివిజన్లో అమలు చేస్తున్నారు. ఈనెల 22 నుంచి తెలంగాణ సర్కిల్ అంతటా అమలుకు నిర్ణయించారు. ఖమ్మం తపాలా డివిజనల్ ఆఫీస్, 10 సబ్ డివిజనల్ కార్యాలయాలు, కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం హెడ్ పోస్టాఫీసులు, 70 సబ్ సోస్టాఫీసులు, 750 బ్రాంచ్ ఆఫీసుల్లో ఐటీ–2.0 సేవలు అందుబాటులోకి రానుండగా, ఇప్పటికే ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. రెండు రోజులు సేవలకు బ్రేక్ కొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యాన ఈనెల 19, 21 తేదీల్లో తపాలా సేవలు నిలిపివేస్తున్నట్లు ఖమ్మం డివిజన్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులు, ఖాతాదారులు గమనించాలని, 22వ తేదీ నుంచి నూతన సాంకేతికత అమల్లోకి వస్తుందని తెలిపారు. -
గ్రామాల్లో కంటైనర్ ఆస్పత్రులు..
దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల పీహెచ్సీ పరిధి కాశీనగరం ఆరోగ్య ఉపకేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా, కంటైనర్ వైద్యశాలగా మార్చింది. ఇక్కడి ఆరోగ్యఉప కేంద్రం భవనం మరమ్మతులకు గురైంది. దీంతో కంటైనర్ ఆస్పత్రి ఏర్పాటుకు అధికారులు మొగ్గుచూపారు. జిన్నెలగూడెం గ్రామంలోనూ కంటైనర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని భావించగా, అక్కడ ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదు. దీంతో కాశీనగరంలో మాత్రమే నిర్మాణ పనులు చేపట్టారు. దాదాపు పనులు పూర్తి కావొచ్చాయి. విద్యుత్కు సంబంధించిన పనులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లాలోని ఆళ్లపల్లి, గుండా ల, వినాయకపురంలలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కంటైనర్ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్యసేవలు అందుతాయని చెబుతున్న వైద్యాధికారులు.. వాటి నిర్మాణానికి ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారనే విషయం మాత్రం వెల్లడించడంలేదు. ఇవీ సదుపాయాలు కంటైనర్ వైద్యశాలలో ఓ బెడ్, ఫ్యాన్, సిబ్బంది కోసం టేబుల్, విద్యుత్ సదుపాయం కల్పించనున్నారు. మరుగుదొడ్డిని పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక వైద్యం అందించేందుకు వైద్య సిబ్బందిని, మందులను, వైద్య పరికరాలను సమకూర్చనున్నారు.అత్యవసర మందులను సైతం అందుబాటులో ఉంచనున్నారు. కంటైనర్ ఆస్పత్రుల్లో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు నిత్యం అందుబాటులో ఉండనున్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లను కల్పిస్తున్నారు. మలేరియా, డెంగీ జ్వరాల నిర్ధారణ పరీక్షలు సైతం చేయనున్నారు. గర్భిణులకు కూడా వైద్యం అందించనున్నారు. అవసరాన్ని బట్టి సమీప పీహెచ్సీ వైద్యులు వచ్చి సేవలు అందించనున్నారు. జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు కాశీనగరంలో పూర్తికావొచ్చిన నిర్మాణ పనులుప్రజలకు అందుబాటులో వైద్యం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కంటైనర్ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల తక్షణ వైద్య సహాయం అందుతుంది. వీటి పురోగతిని పరిశీలించాక మిగతా ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతాం. –డాక్టర్ రేపాక చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ -
వేగంగా రుణాల జారీ
సభ్యులకు త్వరగా రుణాలు జారీ చేస్తుండడం, రికవరీ కూడా బాగుండడంతో సంఘం అభివృద్ధి సాధిస్తోంది. ఖరీఫ్, రబీలో ధాన్యాన్ని ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నారు. పంటల నిల్వకు గోదాం కూడా నిర్మించారు. –కంభం శేషయ్య, పీఏసీఎస్ సభ్యుడువార్డెన్ హాస్టల్లో మద్యం తాగుతున్నారు..ములకలపల్లి: వార్డెన్ హాస్టల్లో మద్యం తాగుతున్నారని, మత్తులో చేయి చేసుకుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్న వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ములకలపల్లి ఎస్సీ బాలుర హాస్టల్కు హాస్టర్ వెల్ఫేర్ ఆఫీసర్ (వార్డెన్)గా శ్రీధర్ ఇటీవల నియమితులయ్యారు. అతను మిత్రులతో కలిసి హాస్టల్లో మద్యంతాగుతున్నారని, హాస్టల్లోనినూనె డబ్బా లను బయటకు తరలిస్తున్నారని వీడియోలో తెలి పారు. విద్యార్థులను బూతులు తిడుతూ, కొడుతున్నారని పేర్కొన్నారు. తప్పతాగి విద్యార్థులపై దాడికి పాల్పడుతున్న వార్డెన్ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా ఇన్చార్జి రాంచరణ్ తేజ్, నాయకులు అరవింద్, నాగతేజ తదితరులు బుధవారం జిల్లా సాంఘిక సంక్షేమాధికారికి వినతిపత్రం అందజేశారు. కాగా ఈ ఘటనపై జిల్లా సాంఘిక సంక్షేమాధికారి అనసూయను వివరణ కోరగా.. ఫిర్యాదు అందిందని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి స్వాధీనంకొత్తగూడెంఅర్బన్: సీలేరు నుంచి ఆటోలో తరలిస్తున్న గంజాయిని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి కథనం ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని లోతువాగు అటవీ ప్రాంతం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మహబూబాబాద్ రంగశాయిపేటకు చెందిన బండి వెంకటేశ్వర్లు ఆటోలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. రూ.15లక్షల విలువైన 31.93 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. విద్యార్థులు ఆరోపిస్తున్న వీడియో వైరల్ -
సొసైటీ.. ప్రగతిలో మేటి..
చింతకాని: మండలంలోని నాగులవంచ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ప్రగతి పథంలో కొనసాగుతోంది. రైతులకు పంట రుణాల పంపిణీ, ఎరువులు, విత్తనాల సరఫరా చేయడమే కాక ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. అలాగే, రైతులకు ఆన్లైన్ సర్వీసుల కోసం గతేడాది కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో సేవలు విస్తృతమయ్యా యి. 15 ఏళ్లుగా సంఘం లాభాల బాటలో నడుస్తుండడంతో తాజాగా నాబార్డు ఉత్తమ సొసైటీగా అవార్డు ప్రకటించింది. హైదరాబాద్లో మంగళవా రం ఈ అవార్డును సొసైటీ చైర్మన్, సీఈఓ అందుకున్నారు. 30 మంది సభ్యులతో ఏర్పాటు నాగులవంచ పీఏసీఎస్ పరిధిలో నాగులవంచ, చిన్నమండవ, సీతంపేట, తిమ్మినేనిపాలెం, తిరుమలాపురం, నాగులవంచ రైల్వేకాలనీ, రేపల్లెవాడ గ్రామాలు ఉన్నాయి. 1963 నవంబర్ 6వ తేదీన 30 మంది సభ్యులతో రూ.6 వేల వాటాధనంతో సొసై టీ ఏర్పడగా ఇప్పుడు 2,400 మంది సభ్యులు, రూ.1.22 కోట్లు వాటాధనం కలిగి ఉంది. పీఏసీఎస్ ద్వారా 1,198 మంది రైతులకు 2025–26 ఖరీఫ్ సీజన్కు రూ.8.64 కోట్లు పంట రుణాలు ఇవ్వడమే కాక మరో 110 మంది రైతులకు రూ.60 లక్షలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సంఘంలోని 950 మంది రైతులు సేవింగ్ డిపాజిట్ల కింద రూ.42.50 లక్షలు పొదుపు చేసుకున్నారు. అలాగే 870మంది రైతుల డిపాజిట్లు రూ.1.26కోట్లు ఉన్నా యి. పీఏసీఎస్ ద్వారా పంటరుణాలు తీసుకున్న 1,162 మందిలో 824 మందికి రూ.6.02 కోట్ల మేర రుణమాఫీ అయింది. నికర ఆదాయం రూ.1.20 కోట్లు సంఘం ప్రస్తుత నికర ఆదాయం రూ.1.20 కోట్లుగా నమోదైంది. డీసీసీబీలో వాటాధనం రూ.1.50 లక్షలు ఉండగా, డిపాజిట్లు రూ.1.95 కోట్లు ఉన్నాయి. 2024 ఖరీఫ్ సీజన్ నుంచి పీఏసీఎస్ ద్వారా రూ.5.50 కోట్ల విలువైన ఎరువులు, విత్తనాల వ్యాపారం నిర్వహించారు. అలాగే, 600 మంది రైతుల వద్ద నుంచి గత రెండేళ్ల కాలంలో రూ.20.50 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. గోదాం నిర్మాణం సంఘంలో సభ్యులైన రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా సొసైటీ ఆవరణలో అగ్రి డెవలప్మెంట్ స్కీం కింద నాబార్డు అందజేసిన రూ.60 లక్షలతో వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గిన గోదాంను మూడేళ్ల కిందట నిర్మించారు. ఇందులో 15 మంది రైతులు 995 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు నిల్వ చేసి తనఖా రుణంగా రూ.80 లక్షలు తీసుకున్నారు. 2009–10లో 350 సభ్యులు ఉన్న సమయాన పీఏసీఎస్కు రూ.25 లక్షల నష్టం రాగా.. అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా అభివృద్ధి బాటలో పయనిస్తుండడంతో నాబార్డు అవార్డు ప్రకటించింది. ప్రగతి పథంలో నాగులవంచ సొసైటీ పీఏసీఎస్లో 2,400 మంది సభ్యులు.. ప్రస్తుతం రూ.1.20 కోట్ల ఆదాయం రుణాలు, పంటల కొనుగోళ్లలో రైతులకు చేయూత నాబార్డు నుంచి ఉత్తమ సొసైటీగా అవార్డు -
గతేడాది 357 మంది మావోల మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గతేడాది కాలంలో సానుభూతిపరుడి నుంచి జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు వరకు మొత్తం 357 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ (సీసీ) పేరిట గత జూన్ 23న రాసిన 22 పేజీల డాక్యుమెంట్లో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ మంగళవారం వెలుగులోకి వచ్చింది. అందులోని వివరాల ప్రకారం...బూటకపు ఎన్కౌంటర్లలో 80 మంది చనిపోయారని, మొత్తంగా చనిపోయిన వారిలో 136 మంది మహిళలు ఉన్నారని, ఎదురుకాల్పులు కాకుండా అనారోగ్య కారణాలతో నలుగురు, ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 23 మంది జిల్లా కమిటీ సభ్యులు, 83 మంది ఏరియా కమిటీ, 138 మంది పార్టీ సభ్యులు, పీఎల్జీఏ 17, ఇతర విభాగాల వారు 40, గుర్తించని మృతులు 36 మంది ఉంటారని వివరించింది. వీరి త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. చుట్టుముట్టి చంపుతున్నారు నక్సల్బరీ విప్లవ పోరాటం మొదలైన తర్వాత ఆపరేషన్ కగార్తో ఏడాది వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో సెంట్రల్, స్టేట్ కమిటీ సభ్యులను కోల్పోవడంతో తీవ్ర నష్టం జరిగిందని పార్టీ సెంట్రల్ కమిటీ పేర్కొంది. గతేడాది ఏప్రిల్లో జరిగిన కాంకేర్ ఎన్కౌంటర్ (29 మంది మావోయిస్టులు చనిపోయారు) తర్వాత సగటున ప్రతీ 20 రోజులకు ఒక భారీ ఎన్కౌంటర్ జరుగుతోందని, ఈ ఘటనల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 35 మంది వరకు మావోయిస్టులు చనిపోయారని తెలిపింది. 20 కిలోమీటర్ల వలయాకారంలో వేలాది మంది భద్రతాదళాలు చుట్టుముడుతూ తమపై దాడులు చేస్తున్నాయని, ఆధునిక ఆయుధాలు, టెక్నాలజీ గల భద్రతా దళాలను తమ కేడర్ ప్రాణాలకు తెగించి ఎదుర్కోంటోందని ఆ డాక్యుమెంట్లో పేర్కొంది. నిజాలు దాస్తున్నారు ప్రతీ ఎదురుకాల్పుల ఘటనలో భద్రతాదళాల వైపు కూడా పది మందికి మించి జవాన్లు చనిపోతున్నారని సెంట్రల్ కమిటీ తెలిపింది. తమకున్న అంచనా ప్రకారం ప్రతిదాడుల్లో 70 మంది జవాన్లు చనిపోగా, 130 మంది తీవ్రంగా గాయపడి ఉంటారని అభిప్రాయపడింది. అయితే ఈ విషయాన్ని దాచి పెడుతూ కేవలం మావోయిస్టుల మరణాల లెక్కలనే పాలకులు బయటకు వెల్లడిస్తున్నారని విమర్శించింది. దీర్ఘకాలిక సాయుధ పోరాటంలో ఎత్తుపల్లాలు సహజమేనని వివరణ ఇచ్చింది. అంతర్జాతీయ వ్యవహారాలపై కూడా ఈ డాక్యుమెంట్లో కేంద్ర కమిటీ తమ అభిప్రాయాలను తెలిపింది. అనువైన సమయం కోసం గెరిల్లా యుద్ధతంత్రంలో అనుసరించాల్సిన వ్యూహాలను సరైన రీతిలో అమలు చేయనందుకే పార్టీకి నష్టాలు పెరిగాయని సీసీ వివరణ ఇచి్చంది. 2024 ఆగస్టులో పొలిట్బ్యూరో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకురాబోతున్నట్టు పేర్కొంది. వర్గ పోరాటాన్ని వికేంద్రీకరించి అటవీ, గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో పార్టీని విస్తరించాలని సీసీ స్పష్టంగా పేర్కొంది. పెరిగిన నిర్బంధం, పార్టీకి వరుసగా జరుగుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ విస్తరణ వీచేగాలిలా, ప్రవహించే నీరులా ఉండాలని కేడర్కు కేంద్ర కమిటీ సూచించింది. శత్రువు బలంగా ఉన్నప్పుడు ఎదురుగా నిలిచి పోరాటం చేయనక్కర్లేదని, అనువైన సమయం కోసం ఎదురుచూడాలని ఆదేశించింది. శాంతి చర్చలు జరపాలంటూ 9 రాష్ట్రాల నుంచి డిమాండ్ రావడం ఇటీవల కాలంలో కనిపించిన సానుకూల పరిణామమని ఆ పార్టీ పేర్కొంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం చేసిన ప్రకటన ఎప్పటికీ నెరవేరబోదని ధీమా వ్యక్తం చేసింది. -
అభివృద్ధికి ముందడుగు..
● రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా 11 పీఏసీఎస్లు ● స్టేషనరీ, కార్యాలయాల నిర్వహణకు నిధులు విడుదల ● ఒక్కో ఎఫ్పీఓకు రూ 3.16 లక్షలు.. ● మంత్రి తుమ్మల చేతుల మీదుగా చెక్కుల పంపిణీ బూర్గంపాడు: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఎఫ్పీఓ( రైతు ఉత్పత్తిదారుల సంస్థ)గా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రక్రియలో ముందడుగు పడింది. జిల్లాలో 11 పీఏసీఎస్లను తొలి విడతలో ఎఫ్పీఓలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. తద్వారా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు తక్కువ ధరల్లో ఇన్పుట్ సబ్సిడీ పొందడం, రైతుల ఆదాయం పెంచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్పీఓలను ఏర్పాటుచేశాయి. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణకు ఈ ఎఫ్పీఓలు ఉపయోగపడతాయి. ఎఫ్పీఓల్లో సభ్యులైన రైతులకు రుణాలు, ఇతర ఆర్థిక సాయం కూడా అందనున్నాయి. రైతుల అభివృద్ధే ధ్యేయంగా.. ఎఫ్పీఓల్లో కనీసం 150 మంది రైతులు సభ్యులుగా చేరి వాటా ధనం చెల్లించాలి. వీరికి ప్రభుత్వం రూ.15 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తుంది. ఈ నగదుతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడంతో పాటు తక్కువ ధరలకు ఇన్పుట్ సబ్సిడీ కింద వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసుకోవచ్చు. వీటి ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఆ రైతులకే అందుతుంది. ఈ ఆదాయంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, విత్తనోత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకుని తమ పరిధిని మరింతగా విస్తరించుకోవచ్చు. ఎఫ్పీఓల్లో రైతులు చెల్లించిన వాటాకు ప్రభుత్వం ఈక్విటీ గ్రాంట్ అందిస్తుంది. ప్రాజెక్ట్ రుణాలకు రూ.2 కోట్ల వరకు క్రెడిట్ గ్యారంటీ సౌకర్యం కల్పిస్తుంది. ఇలా రైతుల ఆర్థిక సామర్థ్యాలు బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఐదు నెలల క్రితం ఎఫ్పీఓల ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని పీఏసీఎస్లలో రైతులు తమ వాటాధనం చెల్లించి ఎఫ్పీఓలలో చేరారు. ఈ సంస్థలకు అవసరమైన స్టేషనరీ, ఫర్నిచర్ కొనుగోలుకు రూ 3.16 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా, హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎఫ్పీఓలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెక్కులు అందజేశారు. జిల్లా నుంచి ఎంపికై న పీఏసీఎస్ చైర్మన్లు, సెక్రటరీలు ఈ చెక్కులు అందుకున్నారు. -
ఆ ఐదింటి సంగతేంటి?
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. సింగరేణి మహిళా కళాశాలలో తనిఖీలుసూపర్బజార్(కొత్తగూడెం): సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలను కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు మంగళవారం తనిఖీ చేశారు. కాలేజీలో నూతనంగా ప్రవేశపెట్టిన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుకు సంబంధించి మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, ప్రయోగశాలలు, తరగతి గదులు, ఇతర వనరులు ఉన్నాయా, అధ్యాపకులు సరిపడా ఉన్నారా అనే వివరాలను కేయూకు చెందిన ప్రొఫెసర్లు పి.వరలక్ష్మి, నరసింహాచారి, జి. హనుమంతరావు అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలు, వనరులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శారద తెలిపారు. నేడు స్మారక స్తూపాల ఆవిష్కరణఇల్లెందు: సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ఆధ్వర్యాన ఇల్లెందులో నిర్మించిన అమరవీరుల స్మారక స్తూపాలను బుధవారం ఆవిష్కరించనున్నారు. గతంలో ప్రజాపంథాగా ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం, పటిష్టతకు కృషి చేసిన చండ్ర కృష్ణమూర్తి(ఎల్లన్న), గండి యాదన్న, రాయల చంద్రశేఖర్ స్మారక స్తూపాలను నిర్మించారు. వీటిని నేడు ఆవిష్కరించాక ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సభ విజయవంతానికి కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా, బుధవారం జరిగే సభలో మాస్లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్సింగ్ ఠాగూర్, రాష్ట్ర కార్యదర్శి పి.రంగారావు, నాయకులు చండ్ర అరుణ, కే.జీ.రాంచందర్, కె.రంగయ్య, కె.రమ, గుమ్మడి నర్సయ్య, ముద్ధా భిక్షం, నాయిని రాజు, ఈసం శంకర్, రాయల విమల తదితరులు పాల్గొననున్నారు. భద్రాచలం: ఏపీలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీల సమస్య మరింతగా ముదురుతోంది. పోలవరం ముంపు పేరుతో అన్యాయంగా తమను ఏపీలో కలిపారని ఆయా గ్రామాల వారు భగ్గుమంటున్నారు. ఆ పంచాయతీలను విడదీసి భద్రాచలం పట్టణాన్ని ముక్కలు చేశారంటూ భద్రాద్రి వాసులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కేంద్ర జలమండలి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబునా యుడు భేటీ కానున్న నేపథ్యంలో ఈ ఐదు గ్రామాలపై చర్చించాలని అందరూ వేడుకుంటున్నారు. సమస్యపై పట్టింపేది.. ఏపీలో విలీనమైన యటపాక, గుండాల, పురుషోత్తపట్నం, పిచుకలపాడు, కన్నాయిగూడెం గ్రామాలు భద్రాచలం మండల పరిధిలో ఉండేవి. 2011 జనాభా లెక్కల ప్రకారం కన్నాయిగూడెంలో 2,161, పిచుకలపాడులో 2,187, గుండాలలో 3,816, పురుషోత్నపట్నంలో 1,372, యటపాకలో 2,410.. మొత్తం 11,946 జనాభా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 25 వేలు దాటుతుందని అంచనా. ఇక భద్రాచలంలో నాడు 40 వేల మంది ఉండగా ఇప్పుడు సుమారు లక్ష వరకు ఉండొచ్చని అఽధికారులు అంటున్నారు. పట్టణానికి మూడు వైపులా సరిహద్దులుగా ఆ ఐదు పంచాయతీలు ఉండేవి. ఇవి లేని భద్రాచలం పట్టణాన్ని ఊహించలేమని స్థానికులు చెబుతుంటారు. కానీ రాష్ట్ర విభజన సమయంలో రాత్రికి రాత్రే రాజ్యాంగ సవరణ ద్వారా పోలవరం ముంపు పేరుతో ఈ పంచాయతీలను ఏపీలో విలీనం చేశారు. అయితే తమను తిరిగి తెలంగాణలో కలపాలంటూ దశాబ్దకాలంగా ఆయా గ్రామాలతో పాటు భద్రాచలం వాసులు కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడి నుంచి పోటీచేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఈ మేరకు హామీలు గుప్పించినా.. సమస్యను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నేటి భేటీలో చర్చించండి.. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో బుధవారం భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న ఐదు పంచాయతీల సమస్యను చర్చించాలని, ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకురావాలని ఆయా గ్రామాల ప్రజలు, భద్రాద్రి వాసులు కోరుతున్నారు. ఇరువురు సీఎంలు సానుకూలంగా స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.కార్డియాలజిస్ట్ నియామకంఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్గా డాక్టర్ సీతారాం డిప్యూటేషన్పై విధులు నిర్వర్తించారు. ఆయన డిప్యూటేషన్ గడువు గత నెలలో ముగియగా చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి గుండె సంబంధిత సమస్యలతో వచ్చే వారికి ఇబ్బందులు ఎదురుకాగా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా మళ్లీ సీతారాంను డిప్యూటేషన్పై తీసుకోవాలని నిర్ణయించగా తిరిగి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఐటీడీఏ పీఓ రాహుల్ వెల్లడిన్యూస్రీల్విలీన గ్రామాలపై దృష్టి పెట్టాలని వేడుకోలు తిరిగి తెలంగాణాలో కలపాలని స్థానికుల డిమాండ్ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన నేటి సీఎంల భేటీలో చర్చించాలని విన్నపాలు -
కొండరెడ్ల సంక్షేమానికి ప్రణాళిక
భద్రాచలం: మారుమూల ప్రాంతాల్లో నివసించే కొండరెడ్ల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్ తెలిపారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన తెగల అధ్యయన బృందం మంగళవారం భద్రాచలం వచ్చింది. ఈ సందర్భంగా రాహుల్ను కలిసిన సభ్యులు.. ఉట్నూరు ఏజెన్సీలో నివసిస్తున్న కొలమ్ గిరిజన తెగకు సంబంధించిన గ్రామాలు, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం పీఓ రాహుల్ మాట్లాడుతూ.. తాము గిరిజనులకు విద్య, వైద్యం కోసం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గిరిజన రైతులకు కరెంటు మోటార్లు, ఆయిల్పామ్ సాగుతో పాటు పలు రంగాల్లో శిక్షణ అందిస్తున్నామని వివరించారు. కొండరెడ్లు, కోయ, లంబాడా, నాయక్ పోడు గిరిజన తెగల గోత్రాలు, వారి ఇలవేల్పులకు సంబంధించిన అంశాలను స్టోరీల రూపంగా బుక్లెట్ ముద్రించి ఆగస్టు 9న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, పీవీటీజీ అధికారి రాజారావు, అధ్యయనం బృందం సభ్యులు ఆత్రం ముకుందరావు, కుడిమేత తిరుపతి, మర్సుకోల బాబూరావు, ఏకం వసంతరావు, సిడం భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ బీమా కార్డులు.. గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధార్తీ ఆభాజాన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ శ్యాచురేషన్, పీఎం జన్మన్ కార్డులు పంపిణీకి చర్యలు తీసుకుంటామని రాహుల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శరత్ వీసీ నిర్వహించగా జిల్లా నుంచి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 10,290 మందికి బీమా కార్డులు అందజేశామని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలకు 114 మెడికల్ కిట్లు అందించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. కాగా, అడిషనల్ డీఎంహెచ్ఓగా నియమితులైన బి.సైదులు పీఓ రాహుల్, ఎమ్మెల్యే వెంకట్రావును మర్యాదపూర్వకంగా కలిశారు.ఆశ్రమ పాఠశాల సందర్శన.. జూలూరుపాడు: మండలంలోని పడమటనర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను పీఓ రాహుల్ మంగళవారం సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి భవిష్యత్లో ఎలాంటి లక్ష్యాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. తాను ఐఏఎస్ కావాలనుకుంటున్నానని ఆరోతరగతి విద్యార్థిని వెంకటరమణి చెప్పగా, ఆ బాలికకు పెన్ను ఇచ్చి ప్రోత్సహించారు. అనంతరం టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్ను ప్రారంభించి విద్యార్థినులతో కలిసి టేబుల్ టెన్సిస్ ఆడారు. పిల్లల్లో నైపుణ్యత పెంపొందించేలా డిబేట్, వ్యాసరచన, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, కుట్లు, అల్లికల కార్యక్రమాలను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థినులు టీవీ కావాలని కోరగా వారం రోజుల్లో సమకూరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి గోపాల్రావు, హెచ్ఎం బానోత్ సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో ఇంటర్నెట్!
కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్య, బోధన, భవనాలు, సౌకర్యా లు ఇలా అన్నీ దశలవారీగా ఏర్పాటు అవుతున్నా యి. ఈ క్రమంలో పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. కానీ, విద్యాశాఖ ఉన్నత అధికారులు, మండలస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోందనే ఆరోపణలున్నా యి. పర్యవేక్షణ పూర్తిస్థాయిలో ఉంటే కార్పొరేట్, ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారే అవకాశం ఉంది. గతంలో ఉపాధ్యాయుల పనితీరుకు గ్రేడింగ్ ఇచ్చే ఆలోచన చేయగా.. ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాలకు తెరలేపడంతో అధికారులు వెనక్కి తగ్గారు. గ్రేడింగ్ ప్రక్రియ ఉంటే పోటీతత్వం పెరిగి బోధనలో మార్పులు వచ్చే అవకాశం ఉండేదని పలువురు చెబుతున్నారు. అలాంటి మంచి కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాలు అడ్డుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యారంగానికి అనేక సంక్షేమ పథకాలు, నిధులు విడుదల చేస్తున్న క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2012–13లో కంప్యూటర్ విద్య నేర్పించేందుకు ప్రత్యేక ఫ్యాకల్టీ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. 129 పాఠశాలల్లో 812 కంప్యూటర్లు ఏర్పాటు చేశా రు. మరుసటి ఏడాది అవి దెబ్బతినడంతో బోధన, కంప్యూటర్లను అటకెక్కించారు. ఆ తరువాత 2016–17లో 49 పాఠశాలలకు కంప్యూటర్లు మరమ్మతులు చేయించేందుకు రూ.2 వేల చొప్పున విడుదల చేయగా.. అవి సరిపోక కంప్యూటర్లు అలా గే ఉండిపోయాయి. అనంతరం జిల్లాలోని కొన్ని పాఠశాలలకు కంప్యూటర్లు నేరుగా రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచే మంజూరు చేస్తున్నారని, దీంతో ఏఏ పాఠశాలల్లో ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయనే వివరాలపై స్పష్టత లేదని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. డిజిటల్ బోధన కూడా అంతంతే..! జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్ బోధన చేసే ఉద్దేశంతో మొత్తం 270 పాఠశాలల ను ఎంపిక చేసి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్పీ)లను తరగతి గదుల్లో ఏర్పాటు చేశారు. ప్యానళ్లు ఏర్పా టు చేసిన పాఠశాలల్లో 80 శాతం వరకు సాధారణ బోధన, 20శాతం వరకు డిజిటల్ బోధన నడు స్తోంది. ప్యానల్స్ ఏర్పాటు చేసిన చోట ఇంటర్నెట్ సౌకర్యం కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. ప్యానళ్లకు నెట్కావాలంటే సెల్ఫోన్ల ద్వారా కనెక్షన్ ఇచ్చి డిజిటల్ బోధన చేస్తున్నారు. అయితే, తరగతి గదుల్లో సెల్ఫోన్లు వినియోగించకూడదనే నిబంధన అడ్డువస్తోంది. జిల్లాలో 148 పాఠశాలలు ఎంపిక కంప్యూటర్లు, ఫర్నిచర్ లేక అవస్థలు పాఠశాలల్లో బోధకులు లేని వైనం ఫలితంగా అంతంతా మాత్రంగానే డిజిటల్ బోధన పాఠశాలలకు నెట్ సౌకర్యం.. పాఠశాలల్లో గతంలో కంప్యూటర్లకు నెట్ సౌకర్యం లేక, బోధకులు లేక మరుగునపడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కంప్యూటర్లు ఉన్న పాఠశాలల్లో నెట్ సౌకర్యం కల్పించేందుకు గానూ రాష్ట్ర విద్యాశాఖాధికారులు జిల్లాలో 148 పాఠశాలలను ఎంపిక చేసి ఆయా పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు గానూ బీఎస్ఎన్ఎల్ బాధ్యులతో చర్చ లు జరుపుతున్నారు. చర్చలు సఫలీకృతం అయితే 148 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం రానుంది. వీటిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కూడా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని కూలీలైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎంపిక జాబితాలో ఉంది. కానీ, అక్కడ ఒక్క కంప్యూటర్ కూడా లేకపోవడం గమనార్హం. అక్కడే ఉన్న ఉన్నత పాఠశాలలో కంపూటర్లు ఉన్నప్పటికీ ఫర్నిచర్ లేక కిందనే భద్రపరిచారు. చాలా పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఉన్న కంప్యూటర్లకు మరమ్మతులు చేయిస్తే స్వచ్ఛంద సంస్థల వారు బోధకులను ఏర్పాటు చేసి కంప్యూటర్ విద్యను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో నవభారత్ ఒకేషనల్ ఇన్స్టిట్యూ ట్ సంస్థ కంప్యూటర్ బోధకులకు వేతనాలు చెల్లించి, పాఠశాలలకు పంపించింది.జిల్లాలో 148 పాఠశాలల ఎంపిక ఇంటర్నెట్ సౌకర్యం కోసం జిల్లాలో 148 పాఠశాలలను రాష్ట్ర విద్యాశాఖాధికారులు ఎంపిక చేశారు. బీఎస్ఎన్ఎల్ నెట్ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. దీంతో విద్యార్థులకు మెరుగైన బోధన అందనుంది. – ఎం.వెంకటేశ్వరాచారి, డీఈఓ -
అసాంఘిక శక్తులపై పటిష్ట నిఘా
కొత్తగూడెంటౌన్ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. ప్రతీ కేసులో సమగ్ర విచారణ నిర్వహించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మంగళవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అఽధికారులపై చర్యలు తప్పవని అన్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో నిరంతరం రోడ్లపై తిరుగుతూ ఉండాలని, గంజాయి, మత్తు పదార్థాలు తరలించే వారిపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో హాట్స్పాట్ ప్రాంతాలను గుర్తించాలన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలను అమర్చాలని, వ్యాపార సముదాయాలు, ఇళ్లలో కూడా ఏర్పాటుచేసేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కేసులను సత్వరమే పరిష్కరించాలని, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయాలని అన్నారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జోనల్ స్థాయిలో పతకాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభిపందించారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, సతీష్కుమార్, రవీందర్రెడ్డి చంద్రభాను, డీసీఆర్బీ డీఎస్పీ మల్ల య్యస్వామి తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు -
కలెక్టర్కు జాతీయ అవార్డు
సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టర్ జితేష్ వి పాటిల్కు నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టిషనర్ అవార్డు లభించింది. ఈనెల 17న ఐఐటీ బాంబేలో జరుగనున్న ఓపెన్ సోర్స్ జీఐఎస్ డేలో ఐఎస్ఆర్ఓ మాజీ చైర్మన్ కిరణ్కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. దేశంలోనే తొలిసారి జిల్లాలో ఓపెన్ సోర్స్ జీఐఎస్(జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ఏర్పాటు చేసి గ్రామీణ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ విశేషంగా కృషి చేయడంతో కలెక్టర్ను ఈఅవార్డు వరించింది. ఈ ప్రాజెక్టులో తొలి అడుగుగా కలెక్టర్ చొరవతో ఐఐటీ బాంబే ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 6, 7 తేదీల్లో పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో సదస్సు నిర్వహించారు. జిల్లాలోని అగ్రికల్చర్, మైనింగ్, ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరు కాగా క్యూజీఐఎస్(క్వాంటం జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ద్వారా గ్రామీణ సమస్యల పరిష్కారానికి జియో స్పేషియల్ డేటాను ఎలా వినియోగించాలో ప్రాక్టికల్గా చూపించారు. గోదావరి వరదల సపయంలో నీటిస్థాయిని బట్టి ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి హెచ్చరికలు జారీ చేయడం, వివిధ పీహెచ్ిసీ, సబ్ సెంటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను జీఐఎస్ ద్వారా మ్యాప్ చేసి విద్యార్థుల ఆరోగ్యంపై డాక్టర్లను అప్రమత్తం చేయడం వంటి వాటికి ఉపయోగపడుతుందని వివరించారు. ఇలాంటి సాఫ్ట్వేర్ను గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తెచ్చేలా కలెక్టర్ కృషి చేయడంతో ఈ అవార్డుకు ఎంపికయ్యారు. భారజల కర్మాగారం సందర్శనఅశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగారాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సందర్శించారు. పరిపాలన విభాగం కార్యాలయంలో జీఎం శ్రీనివాసరావు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భారజలం ఉత్పత్తి అయ్యాక వెలువడే నీటి వ్యర్థాలను తాగునీటిగా మార్చే అంశంపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేష్, డీఈ బ్రహ్మదేవ్, భారజల కర్మాగారం అధికారులు పాల్గొన్నారు. రక్తదానం చేయండి.. జీవితాలు కాపాడండికొత్తగూడెంఅర్బన్: యువత రక్తదానం చేసి పలువురి జీవితాలను కాపాడాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. ఇండియన్ యూత్ సెక్యూర్డ్ ఆర్గనైజేషన్ సౌజన్యంతో స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన రక్త పరీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్త పరీక్షలతో బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం సులభమని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కేంద్రంలో తాను కూడా రక్త పరీక్ష చేయించుకున్నానని, అవసరమైతే రక్తదానానికీ సిద్ధమని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీఓ వెంకటరమణ, మనోహర్, వెంకటపుల్లయ్య, డీఎస్పీ రెహమాన్, ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.రేపు అందుకోనున్న పాటిల్ -
గురుకులాలు హౌస్ఫుల్!
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ గురుకులాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు గురి కుదురుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల గురుకులాల్లో ప్రవేశాలకు ఏటా పోటీ పెరుగుతుండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో సీట్లకు సరిపడా విద్యార్థులు మాత్రమే ప్రవేశపరీక్ష రాయడంతో దాదాపు అందరికీ సీట్లు వచ్చేవి. కానీ రెండు, మూడేళ్లుగా పరీక్ష రాస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగడంతో పోటీ పెరిగింది. ఒక్కో గురుకులంలో వందల సంఖ్యలో ఉన్న సీట్లకు వేల సంఖ్యలో విద్యార్థులు పోటీ పడుతుండడం విశేషం. ఉమ్మడి జిల్లాలో ఎస్సీ, బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యాన గురుకులాలు కొనసాగుతుండగా, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా బీసీ గురుకులాల్లో గత ఏడాది 2వేల మేర సీట్లు ఖాళీగా మిగిలితే ఈసారి సీట్లన్నీ భర్తీ అవుతుండడంపై అధికారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ఆదరణ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో చేరేందుకు గతంలో విద్యార్థులు అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే, నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తుండడంతో ఏటేటా పోటీ పెరుగుతోంది. గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు కార్పొరేట్ స్థాయి బోధన అందుతోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, లెక్చరర్లు బోధిస్తుండగా, చదువుతోనే సరిపెట్టకుండా విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంపైనా దృష్టి సారిస్తున్నారు. క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థులు పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. వసతి విషయానికి వస్తే బెడ్ల నుంచి ఆహారం వరకు నాణ్యతగా ఉండం.. సన్నబియ్యంతో భోజనమే కాక మటన్, చికెన్, గుడ్డు, పాలు అందిస్తున్నారు. బాలికలు, బాలురకు వేర్వేరుగా విద్యనందించేలా ఏర్పాట్లు ఉండడంతో విద్యార్థినుల నుంచి కూడా ఆదరణ పెరుగుతోంది. సీట్ల కోసం పైరవీలు.. గురుకులాల్లో ప్రవేశానికి వేల మంది ప్రవేశ పరీక్ష రాస్తున్నారు. అయితే, కొందరికి సీట్లు రాకపోగా, సీట్లు వచ్చినా పలువురు వివిధ కారణాలతో చేరడం లేదు. దీంతో బ్యాక్లాగ్ సీట్లలో చేరేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ద్వారా పిల్లలకు సీట్లు ఇప్పించాలని తల్లిదండ్రులు సంక్షేమ శాఖల అధికారులకు చెప్పిస్తున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి లేఖలతో సంక్షేమ శాఖల కా ర్యాలయాల చుట్టూ తిరుగుతుండడం గురుకులా లకు పెరిగిన ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.ఎస్సీ గురుకులాలు జిల్లా పాఠశాలలు కళాశాలలు మొత్తం సీట్లు నిండినవి ఖమ్మం 11 11 7,040 6,564 భద్రాద్రి 07 07 4,480 4,190ప్రవేశాలకు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తి ఎస్సీ, బీసీ గురుకులాల్లో 90శాతానికి పైగా సీట్లు భర్తీ మిగిలిన సీట్ల కోసం పోటాపోటీగా పైరవీలుఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీ గురుకులాలు, సీట్లు బీసీ గురుకులాలు జిల్లా పాఠశాలలు కళాశాలలు మొత్తం సీట్లు నిండినవి ఖమ్మం 13 13 8,674 8,370 భద్రాద్రి 11 10 6,880 6,450మెరుగైన ఉత్తీర్ణత మునుపెన్నడూ లేనివిధంగా ఈ విద్యాసంవత్సరం బీసీ గురుకులాల్లో చేరేందుకు విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. గత ఏడాది పదో తరగతి, ఇంటర్లో మెరుగైన ఉత్తీర్ణత నమోదు కావడమే కాక పలువురు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. గురుకులాల్లో మెరుగైన విద్యతో పాటు మంచి సౌకర్యాలు ఉండడం విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణంగా భావిస్తున్నాం. – సీహెచ్.రాంబాబు, ఆర్సీఓ, బీసీ గురుకులాలు -
మంత్రుల సభ ఏర్పాట్ల పరిశీలన
ఇల్లెందు: ఇల్లెందు పట్టణంలోని జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో బుధవారం జరిగే సభలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ విద్యాచందన మంగళవారం పరిశీలించారు. సుమారు 5 వేల మంది పాల్గొంటున్న ఈ సభలో వడ్డీలేని రుణాలు రూ.5.7 కోట్లు, ఏప్రిల్ నుంచి జూలై వరకు బ్యాంకు లింకేజీ రుణాలు రూ.30 కోట్లు, ప్రమాద బీమా, లోన్ బీమా రూ.15 లక్షలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేయనున్నారు. సభలో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, ఎమ్మెల్యే కోరం కనకయ్య తదితరులు పాల్గొననున్నారు. అధికారులతో సమీక్ష ఇల్లెందురూరల్/టేకులపల్లి: ఇల్లెందులో జరిగే మంత్రుల పర్యటన, సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఇల్లెందు, టేకులపల్లి మండలాల సెర్ప్ అధికారులు, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందితో అదనపు కలెక్టర్ విద్యాచందన సమీక్ష నిర్వహించారు. ముందుగా రొంపేడు అటవీ ప్రాంతంలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారని, ఆ వెంటనే మహిళా శక్తి సంఘాల లబ్ధిదారులతో బహిరంగ సభ ద్వారా సమావేశమవుతారని వివరించారు. సభ మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఆలోపు మహిళలు సభా ప్రాంగణానికి వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. సమావేశంలో ఎంపీడీఓ ధన్సింగ్, డీపీఎం సమ్మక్క, ఏపీఎంలు దుర్గారావు, రవికుమార్, ఏపీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, టేకులపల్లి మండలం సులానగర్ పీహెచ్సీలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించారు. రక్తహీనత గురించి మహిళలకు వివరించారు. ఆకుకూరలు ఎక్కువగా తినాలని, మునగాకు, కరివేపాకు, బెల్లంతో తయారు చేసిన రాగి లడ్డు, నువ్వుల లడ్డు, పల్లి చెక్క రోజువారీగా తీసుకోవాలని సూచించారు. వైద్యాధికారి కంచర్ల వెంకటేశ్, ఆయుష్ వైద్యాధికారి విజయశ్రీ, డీపీఎం సమ్మక్క, ఉద్యోగులు రవికుమార్, సునీల్కుమార్, నాగేశ్వరరావు, వజ్జా పార్వతి, దేవా, కౌసల్యసింగ్, రాజు పాల్గొన్నారు. -
●బోర్డు చాటు తెర..
ఆ పాఠశాలలోని తరగతి గదిలో ఓ వినూత్న ప్రయోగం చేశారు. స్లైడింగ్ బోర్డు ఏర్పాటు చేశారు. ముందు ఆకుపచ్చ రంగులో ఉన్న బోర్డు కనిపిస్తుంది. దానిని పక్కకు జరిపితే లోపల డిజిటల్ తెర (టీవీ) కనిపిస్తుంది. అవసరమైనప్పుడు బోర్డుపై పాఠాలు బోధిస్తారు. లేదా బోర్డును జరిపి డిజిటల్ క్లాసులు చెబుతారు. ఇలా సాంకేతికత తరగతి గదుల్లోకి చొచ్చుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ స్లైడింగ్ బోరుకరకగూడెం జెడ్పీహెచ్ఎస్లో ఉంది. –కరకగూడెం -
వాహనం ఢీకొని రెండు గేదెలు మృతి
అశ్వారావుపేటరూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని రెండు పాడి గేదెలు మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వినాయకపు రం గ్రామ రైతు మురళీకి చెందిన పాడి గేదెలు ఉద యం మేతకోసం ఆసుపాక రోడ్డు వైపు వెళ్లాయి. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. కాగా, అటువైపుగా వెళ్లిన స్థానికులు గేదెలు మృతి చెంది ఉండటాన్ని గమనించి రైతుకు సమాచారం అందించారు. గేదెల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని బాధిత రైతు వాపోయాడు. సెల్ టవర్ను దహనం చేసిన మావోయిస్టులు చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి మావోయిస్టులు సెల్టవర్కు నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటన నారాయణపూర్ జిల్లాలో గల చోటేడోంగేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చోటేడోంగేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మద్నార్లోని టవర్కు మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి నిప్పంటించారు. సమాచారం అందుకున్న చోటేడోంగేర్ పోలీసులు ఘటనా ప్రాంతంలో వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేకాట స్థావరంపై దాడిమణుగూరుటౌన్: మున్సిపాలిటీలోని చినరాయిగూడెం రోడ్డు సమీపంలోని అడవుల్లో పేకాట ఆడుతున్న వ్యక్తులను టాస్క్ఫోర్స్ అధికారులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాయి గూ డెం సమీపంలో కొందరు పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సీఐ రమాకాంత్ దాడి చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.40,350 నగదు, ఐదు సెల్ఫోన్లు, ఆటోస్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారని పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిఖమ్మంక్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. నేలకొండపల్లి మండలం అజయ్తండాకు చెందిన గుగులోతు సైదులు(37) మంగళవారం ఖమ్మం రాగా, జిల్లా ఆస్పత్రి ఎదుట రోడ్డు దాటే క్రమాన వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. పల్టీ కొట్టిన కారు: తప్పిన ప్రమాదంఖమ్మంఅర్బన్: ఖమ్మం గొల్లగూడెం రోడ్డులో రెండు కార్లు ఢీకొనగా, ఓ కారు డీవైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఖమ్మంకు చెందిన సుధాకర్ మంగళవా రం తన కుటుంబ సభ్యులతో కారులో వెళ్తుండగా వెనక నుండి మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుధాకర్ కారు బోల్తా పడగా అందులో ఉన్న వారు స్వ ల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ సమయాన వాహనాల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా ఖమ్మం అర్బన్ పోలీసులు చేరుకుని రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ప్రాధాన్యత
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ విద్యుత్ సర్వీసుల జారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సర్వీసుల మంజూరీ 14 శాతం పెరిగిందని వెల్లడించారు. 2023 జూలై 15నుంచి 2025 జూలై 14 వరకు 3,875 వ్యవసాయ సర్వీసులు మంజూరీ చేయగా, 2024 జూలై 15 నుంచి 2025 జూలై 14 వరకు 4,018 సర్వీసులు మంజూరు చేశామని తెలిపారు. అలాగే, పొలంబాటలో భాగంగా వంగిన స్తంభాలు, లూజ్ లైన్లను గుర్తించి సరిచేస్తున్నామని, ఇందులో భాగంగా1,937 లైన్లను సరిచేయడమేకాక అవసరమైన చోట 2,013 స్తంభాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మరమ్మతుకు గురైన ట్రాన్స్ఫార్మర్ల తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేశామని, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పట్టణాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోగా కొత్తవి అమరుస్తున్నామని ఎస్ఈ వెల్లడించారు. కొత్తలింగాలలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం కామేపల్లి/కారేపల్లి: కామేపల్లి మండలం కొత్తలింగాల సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రాన్ని ఎస్ఈ శ్రీనివాసాచారి భూమి పూజ చేశారు. ఈ కేంద్రం ద్వారా కామేపల్లి, కారేపల్లి, రఘునాథపాలెం, ఏన్కూరు మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే సత్వర మరమ్మతుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి