breaking news
Bhadradri
-
డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
ఐదో సెమిస్టర్లో 50.56, ఆరో సెమిస్టర్లో 50.16శాతం ఉత్తీర్ణతకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. కేయూ క్యాంపస్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేయగా పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ వివరాలు వెల్లడించారు. ఐదో సెమిస్టర్ పరీక్షలకు 13,963 మంది విద్యార్థులు హాజరుకాగా, 7,059 మంది (50.56శాతం) ఉత్తీర్ణులయ్యారని, ఆరో సెమిస్టర్ పరీక్షల్లో 37,999మందికి 19,060 (50.16శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. కాగా, ఫలితాలపై రీవాల్యుయేషన్కు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. పదిహేను రోజుల్లోగా ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. -
ఇసుక లారీలతో ట్రాఫిక్ చిక్కులు
● చర్ల–వెంకటాపురం మార్గంలో రెండు చోట్ల స్తంభించిన రాకపోకలు ● ట్రాఫిక్లో నిలిచిన గర్భిణిని ఆస్పత్రికి తరలించే అంబులెన్స్ చర్ల: ప్రధాన రహదారులపై ఇసుక లారీలు నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నెల రోజులుగా ఇదే తంతు కొనసాగుతున్నా ఇసుక క్వారీల నిర్వాహకులు, అధికారులు పట్టించుకోకపోవడంలేదు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించే వారి పట్ల క్వారీల నిర్వాహకులు దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా గురువారం సాయంత్రం చర్ల–వెంకటాపురం మార్గంలో సీ కత్తిగూడెం వద్ద ప్రధాన రహదారిపై రెండువైపులా అధిక సంఖ్యలో ఇసుక లారీలను నిలిపారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సుమారు రెండున్నర గంటల పాటు ఈ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోగా ఈ ట్రాఫిక్లో ఓ గర్భిణిని వెంకటాపురం వైపు నుంచి భద్రాచలం వైపు తరలిస్తున్న అంబులెన్సు కూడా ఇరుక్కుపోయింది. చర్ల సీఐ రాజువర్మ, ఎస్ఐ కేశవ్ అక్కడకు చేరుకుని అతికష్టం మీద ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. గురువారం రాత్రి కూడా ఇదే మార్గంలోని సుబ్బంపేటలో ప్రధాన రహదారిపై ఇసుక లారీలు నిలపడంతో కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడికి కూడా పోలీసులు వెళ్లి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రధాన రహదారిపై ఇసుక లారీలను నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కలిగి ఉన్నారంటే భారత రాజ్యాంగమే కారణమని, రాజ్యాంగంలోని ఆర్టికల్స్, షెడ్యూళ్లను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అన్నారు. సింగరేణి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో 75 ఇయర్స్ జర్నీ ఆఫ్ ద ఇండియన్ కాన్సిట్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే అంశంపై గురువారం రాష్ట్రస్థాయి సింపోజియం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడారు. గౌరవ అతిథి మారపాక రమేష్, సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ జీకే కిరణ్కుమార్, మేనేజర్ మల్లేశం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శారద కూడా మాట్లాడారు. అనంతరం అతిథులను సన్మానించారు. అధ్యాపకురాలు జి మేఘన పాల్గొన్నారు. -
ఫార్చునర్ కారులో గంజాయి రవాణా!
● 21.5 కేజీలు స్వాధీనం ● ఐదుగురు నిందితుల అరెస్ట్మణుగూరు టౌన్: ఒడిశా నుంచి హైదరాబాద్కు ఫార్చునర్ కారులో తరలిస్తున్న గంజాయిని మణుగూరులో ఎకై ్సజ్ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐలు సుంకర రమేశ్, రాజిరెడ్డి కథనం ప్రకారం... హైదరాబాద్కు చెందిన షేక్ సమీర్, సయ్యద్ అబూబకర్, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచకు చెందిన తానంకి ప్రవీణ్, కోట హరీశ్, యశ్వంత్కుమార్లు గంజాయికి అలవాటుపడి స్నేహితులుగా మారారు. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి హైదరాబాద్లోని పాతబస్తీకి కారులో 21.5 కేజీల గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మణుగూరులోని రథంగుట్ట అర్బన్ పార్క్ వద్ద ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. గంజాయితోపాటు కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 13 లక్షలు ఉంటుందని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని అధికారులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న హైదరాబాద్కు చెందిన షేక్ పైసల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. -
రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ఎమర్జెన్సీ
మాజీ ఎంపీ సీతారాం నాయక్ఇల్లెందు: ఎమర్జెన్సీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. గురువారం ఆయన ఇల్లెందులో విలేకరులతో మాట్లాడారు. ఎమర్జెన్సీ చీకటి రోజులకు 50 ఏళ్లు నిండిందని, నాటి చీకటి రోజుల్లో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని అన్నారు. ఈ ప్రాంతంలో ఎంపీలు ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేక పోయారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, జాతీయ రహదారులకు అతీగతీ లేదని అన్నారు. కాళేశ్వరం కమీషన్, ఫోన్ ట్యాపింగ్, ఈ–రేస్ అంటూ సీరియల్స్ నడపటం తప్ప కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ము సీఎం రేవంత్కు లేదన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నాయకులు గోపీకృష్ణ, సుచిత్ర ఉన్నారు. -
మత్తుకు బానిసలు కావొద్దు
భద్రాచలంఅర్బన్: యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సూచించారు. పట్టణంలో బుధవారం అర్ధరాత్రి, గురువారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వారికి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి, హెచ్చరించి వదిలేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు యువకులు గంజాయి, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై సామాన్య ప్రజలను ఇబ్బందులు కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. దీంతో అనుమానిత ప్రాంతాలు, గంజాయి హాట్స్పాట్లలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు నిషేధిత పదార్థాలు తరలివెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపికలుకొత్తగూడెంటౌన్: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశానికి ఎంపికలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మండలస్థాయిలో ఎంపికై న 124 మంది బాలబాలికలకు తొమ్మిది రకాలు పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన 10 మంది బాలికలు, 10 మంది బాలురను ఎంపిక చేశారు. వీరిని జూలై 2 నుంచి జరిగే రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపుతారు. రాష్ట్రస్థాయిలో అర్హత సాధించినవారికి హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని స్పోర్ట్స్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తారని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు. ఎస్జీఎఫ్ నుంచి నరేష్, పీడీలు, పీఈటీలు, స్పోర్ట్స్ కార్యాలయం నుంచి తిరుమలరావు, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆఫ్టైప్ మొక్కలపై విచారణఅశ్వారావుపేట: ఆయిల్ఫెడ్ నర్సరీల నుంచి సరఫరా అయిన మొక్కల్లో ఆఫ్టైప్ రావడంతో నష్టపోయినట్లు పలువురు రైతులు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ ఇటీవల హైదరాబాద్లో అధికారులు, రైతులతో సమావేశమై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈమేరకు అశ్వారావుపేట మండలంలోని పలువురి తోటలను ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించారు. మండలానికి చెందిన నున్నా కృష్ణ, కుంచం సుబ్బారావు తోటలను పరిశీలించిన వారు ఆఫ్టైప్, సాధారణ మొక్కల ఎదుగుదల, దిగుబడిపై అధ్యయనం చేశారు. ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు ఎంవీ.ప్రసాద్, రామచంద్రుడు, బి.కళ్యాణ్, ఆయిల్ఫెడ్ ఓఎస్డీ ఏ కిరణ్, జిల్లా ఇన్చార్జ్ రాధాకృష్ణ, అశ్వారావుపేట, దమ్మపేట హెచ్ఓలు వేణుమాధవ్, సందీప్, హెచ్ఆర్ఎస్ సైంటిస్ట్ విజయకృష్ణ, ఆయిల్ఫాం గ్రోయర్స్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య పాల్గొన్నారు. డీఐఈఓకు ప్రశంసలుకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యావిధాన పర్యవేక్షణ, కళాశాలల మెరుగైన నిర్వహణ, ఉత్తీర్ణతా శాతం పెంపునకు కృషి చేసినందుకు డీఐఈఓ హాసవత్ వెంకటేశ్వరరావును ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ కృష్ణ ఆదిత్య ప్రశంసించారు. గురువారం హైదరాబాద్లో అన్ని జిల్లాల డీఐఈఓ, ప్రిన్సిపాల్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చేసిన కృషిని అభినందించారని వెంకటేశ్వరరావు తెలిపారు. ముద్దాయిలకు రెండేళ్ల జైలుశిక్షబూర్గంపాడు: బూర్గంపాడులో 2021 ఏప్రిల్ 12న వంగపూడి నాగమణి ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులకు భద్రాచలం ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శివనాయక్ రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. నాగమణి ఇంట్లో రూ 10.లక్షల విలువైన బంగారం, నగదు చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టిన సారపాకకు చెందిన కునమళ్ల సందీప్, బూర్గంపాడుకు చెందిన పుట్టి నవీన్లపై కేసు నమోదు చేసి, కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను విచారించిన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. -
పరిహారం ఇస్తాం.. ఉపాధి కల్పిస్తాం
మణుగూరు టౌన్: మణుగూరు ఓసీ విస్తరణ నిర్వాసితులకు ఎకరానికి రూ.22.5 లక్షలు నష్టపరిహారం అందిస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ తెలిపారు. గురువారం పట్టణంలోని కొమ్ముగూడెం కమ్యూనిటీ హాల్లో గ్రామపెద్ద కంగాల భిక్షం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ.5.5 లక్షలు, ప్రభుత్వ భూమిలోని గిరిజనులకు పూర్తి పరిహారం, గిరిజనేతరులకు రూ.11.25 లక్షలు అందిస్తామని తెలిపారు. నిర్వాసిత నిరుద్యోగులకు కనీస వేతనం తగ్గకుండా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి, ఓసీల్లో ఉపాధి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కోల్పోతున్న భూముల్లో చెట్లు, బోరు, బావి, కట్టడాలు ఉంటే సంబంధిత అధికారుల వాల్యుయేషన్ తెప్పించి అదనంగా ప్రయోజనం చేకూరుస్తామని వివరించారు. చెరువుపై ఆధారపడిన అర్హులైన మత్స్యకారులకు రూ.5.5 లక్షల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందిస్తామని తెలిపారు. దీంతో సింగరేణి కాలరీస్ మణుగూరు ఓసీ విస్తరణ కోసం భూ సేకరణకు గ్రామస్తులు సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ టి.ప్రసాద్, తహసీల్దార్ అద్దంకి నరేశ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.మణుగూరు ఓసీ విస్తరణ గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ -
పోడు వివాదంపై ఆర్డీఓ విచారణ
బూర్గంపాడు: ఇరవెండి ఫారెస్ట్ బీట్లోని వలస ఆదివాసీ గ్రామమైన కొసగుంపులో ఇటీవల పోడు సాగుదారులైన మహిళలకు, అటవీశాఖ అధికారులకు మధ్య జరిగిన వివాదంపై భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు గురువారం విచారణ చేపట్టారు. పోడు భూములకు కందకాలు తీసేందుకు జేసీబీతో వచ్చిన అటవీశాఖ అధికారులను కొసగుంపు మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తమ విధులకు ఆటంకం కలిగించారని అటవీశాఖ అధికారులు, మహిళలని చూడకుండా తమపై దాడులకు పాల్పడ్డారని కొసగుంపు మహిళలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వ్యవహారం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఈ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో ఆర్డీఓ దామోదర్రావు గ్రామానికి వచ్చి ఆదివాసీ మహిళలతో మాట్లాడారు. అటవీశాఖ అధికారుల వాదనలు కూడా విన్నారు. గ్రామంలోని 34 ఆదివాసీ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలిప్పించేందుకు ఉన్నతాధికారులకు నివేదికలిస్తామని ఆర్డీఓ తెలిపారు. మిగతా అటవీభూములలోకి వెళ్లవద్దని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శిరీష, అశ్వాపురం రేంజ్ ఆఫీసర్ రమేష్, ఐటీడీఏ ఏఓ రాంబాబు, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, భజన సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి
కొత్తగూడెంటౌన్: భద్రాద్రిని డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని, అందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడాలని, ఆ మహమ్మారిని తరిమికొట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో అనేక దుష్ఫలితాలు కలుగుతాయన్నారు. గంజాయి, డ్రగ్స్ బారిన పడుతున్న యువత తమ అమూల్యమైన జీవితాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అంతకుముందు డ్రగ్స్ వినియోగించబోమంటూ యువతతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, కరమ్చంద్, జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనినా, కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరరావు, సీఐలు ఎం.కరుణాకర్, శివప్రసాద్, ప్రతాప్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మత్తు నుంచి విముక్తికి సైనికుల్లా పోరాడుదాం గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే పిలుపు -
ఉత్పత్తి వ్యయం తగ్గించాలి
● యంత్రసామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాలి ● సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రుమణుగూరు టౌన్: యంత్ర సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, శ్రమశక్తిని ఉపయోగించి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు సూచించారు. సింగరేణి మణుగూరు ఏరియాలో గురువారం పర్యటించిన ఆయన పీకేఓసీ గనులు, కోల్ బెంచ్ను పరిశీలించాక యంత్రాల పనితీరుపై ఆరాతీశారు. అలాగే, వ్యూ పాయింట్ నుంచి డ్రిల్ మిషన్లు, షావెల్స్, బొగ్గు లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం గౌతమ్ మాట్లాడుతూ వినియోగదారులు కోరిన విధంగా నాణ్యమైన బొగ్గు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడుతూ.. నిర్దేశిత 8 గంటల పనిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ప్రతి ఉద్యోగి, రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడేలా చూడాలని, సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం సింగరేణి ఆస్పత్రి సౌకర్యాలు, మణుగూరు ఓసీ భూ సేకరణ అనుమతుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం దుర్గం రాంచందర్, పీకేఓసీ పీఓ లక్ష్మీపతిగౌడ్, అధికారులు శ్రీనివాస్, శ్రీనివాసాచారి, చంద్రశేఖర్, వెంకట్రావు, రమేశ్, అనురాధ, వీరభద్రుడు, సురేశ్కుమార్, రమణరెడ్డి, నాగరమేశ్, ఎస్ఓటూ డైరెక్టర్ సుశీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నియామకం, ఉద్యోగులకు 250 గజాల స్థలం కేటాయింపు, గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు నిధుల పెంపు, అన్ని ఓసీల్లో భోజనం సౌకర్యం కల్పించడమే కాక ప్లేడేలలో ఎన్–1, పీహెచ్డీలో పీ2 సర్క్యులర్ రద్దు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు తదితర అంశాలపై ఐఎన్టీయూసీ నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, గట్టయ్య, షాబుద్దీన్ తదితరులు డైరెక్టర్ గౌతమ్కు వినతిపత్రం అందజేశారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవా పురం–జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదన, హారతి సమర్పించిన అర్చకులు మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, పాలకమమండలి చైర్మన్ బాలినే ని నాగేశ్వరరావు, వేద పడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. సీల్డ్ కొటేషన్ల ఆహ్వానంపెద్దమ్మతల్లి ఆలయంలో దసరా ముందు నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా వివిధ వస్తువుల సరఫరా, పనుల నిర్వహణకు సీల్ట్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఈఓ రజనీకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయానికి రంగులు, సత్రాలతో పాటు అవసరమైన చోట్ల సునం వేసేందుకు కార్మికుల సరఫరా, రుత్విక్ల ఏర్పాటు, వారికి, భక్తులకు వంట చేసేందుకు, సన్నాయి వాయిద్యకారుల ఏర్పాటు, ఆలయం చుట్టూ లైటింగ్, బోర్డుల ఏర్పాటు, పూల అలంకరణ, పూలదండల సరఫరా వంటి పనులు చేసేందుకు ఆసక్తి గలవారు ఈనెల 28వ తేదీ ఉదయం 11 గంటలోపు కార్యాలయం బాక్స్లో కోటేషన్లు వేయాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం అందరి సమక్షంలో వాటిని తెరిచి ఖరారు చేయనున్నట్లు ఈఓ తెలిపారు. వివరాలకు 6303408458 నంబర్లో సంప్రదించాలని కోరారు. రేపు సబ్ జూనియర్ అఽథ్లెటిక్స్ ఎంపికలుకొత్తగూడెంటౌన్: జిల్లా స్థాయి సబ్జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు భద్రాచలంలో శనివారం జరుగుతాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 10, 12, 14 ఏళ్ల బాలబాలికలకు 60 మీటర్ల పరుగు పందెం, స్టాండింగ్, బ్రాడ్ జంప్, లాంగ్జంప్, కిడ్స్, జావెలిన్త్రో తదితర అంశాల్లో ఎంపికలు ఉంటాయని వివరించారు. ఇక్కడ ప్రతిభ చాటిన వారిని జూలై 6న హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 85220 67157 నంబర్లో సంప్రదించాలని కోరారు. 30 లోగా రేషన్ తీసుకోండికొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని తెల్ల రేషన్కార్డుదారులు ఈనెల 30 లోగా బియ్యం తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణిదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు కలిపి ఒకేసారి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రేషన్ దుకాణాలు, డీఆర్ డిపోల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పంపిణీ చేయాలని సూచించారు. ఆయా సమయాల్లో షాపులు తెరవని డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 30 తర్వాత రేషన్ కార్డుదారులు బియ్యం పొందేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. వృత్తి విద్యలో రాణించడం అభినందనీయంపాల్వంచ: వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలు రాణించడం అభినందనీయమని నవ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ దేవినేని, వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు అన్నారు. గురువారం స్థానిక నవ మహిళా సాధికార కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నవ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా తాటి ఆకుల కళాకృతులు, యూనిఫాంలు కుట్టి విక్రయించడం ద్వారా వచ్చిన రూ.2,59,690 నగదును మహిళలకు చెక్కుల రూపంలో అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో పలు రకాల వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టి స్థానిక యువత, మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఎంజీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మాతృమరణాల నివారణకు చర్యలు చేపట్టాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఎక్కడా మాతృ మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ పద్ధతులు అవలంబించాలని, గర్భిణులు ఇళ్లలో మునగ చెట్లు నాటేలా ప్రోత్సహించాలని సూచించారు. మునగలో ఉండే అధిక పోషక విలువలు, వ్యాధుల నివారణకు ఎలా ఉపకరిస్తుందనే విషయాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను కాలానుగుణంగా పర్యవేక్షించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అర్హత కలిగిన సిబ్బందిని మాత్రమే నియమించాలని, ఈ మేరకు తనిఖీలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, డీఎంహెచ్ఓ భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డీఎస్పీ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ఫలించిన 18 ఏళ్ల పోరాటం!
● కారుణ్య నియామకం సాధించిన దివ్యాంగుడు ● తొలి ప్రజాదర్బార్లో దరఖాస్తుతో పీఆర్ శాఖలో ఉద్యోగం అశ్వారావుపేటరూరల్: ఓ దివ్యాంగుడు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేందుకు ఏకంగా 18 ఏళ్ల పాటు పోరాడాడు. ఎట్టకేలకు ఆయన పోరాటం ఫలించగా ఇటీవల నియామకపత్రం అందుకున్నాడు. కొత్తగూడెం విద్యానగర్కాలనీకి చెందిన కర్నాటి నాగేశ్వరరావు పంచాయతీరాజ్ శాఖలో గ్యాంగ్ మజ్దూర్గా ఉద్యోగం చేస్తూ 2007లో గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు దివ్యాంగుడైన రామకృష్ణ కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో 2017లో హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం కూడా రామకృష్ణకు ఉద్యోగం ఇవ్వాలని తీర్పు ఇచ్చినా ఫలితం కానరాలేదు. ప్రజాదర్బార్లో వినతితో కదలిక.. న్యాయస్థానంలో పోరాడుతూనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి 2023 డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్లో నిర్వహించిన ప్రజాదర్బార్లో రామకృష్ణ పాల్గొని మంత్రి సీతక్కకు దరఖాస్తు ఇచ్చాడు. దీంతో ఉన్నతాధికారులకు పంపించగా.. ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్కుమార్ పరిశీలించి ఈనెల 23వ తేదీన రామకృష్ణను ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం పీఆర్ ఎస్ఈ వెంకటరెడ్డికి ఈ ఉత్తర్వులు అందగా అశ్వారావుపేట పీఆర్ కార్యాలయంలో రామకృష్ణకు పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత డిప్యూటేషన్పై కొత్తగూడెం పంచాయతీరాజ్ కార్యాలయంలో గురువారం ఆయన విధుల్లో చేరాడు. -
ఏసీబీ దాడులతో బెంబేలు
● బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు ● అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు బూర్గంపాడు: జిల్లాలో ఏసీబీ వరుస దాడులు, సోదాలు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ దాడుల్లో కొందరు ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతుండగా మరికొందరు తృటిలో తప్పించుకుంటున్నారు. జిల్లాలో ఇటవల వరుసగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న క్రమంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, ఉద్యోగులు వారం, పది రోజుల పాటు జాగ్రత్తగా ఉంటున్నా.. ఆ తర్వాత ‘మామూలు’గానే తమ పని కానిచ్చేస్తున్నారు. ఈ నెల 21న బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ క్రాంతి కొత్త రేషన్కార్డు ప్రాసెస్ చేసేందుకు రూ. 2,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన జరిగిన ఐదురోజులకే గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. రికార్డులు, కంప్యూటర్ డేటా, భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పత్రాలను, వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలు, ల్యాండ్ కన్వర్షన్ తదితర ఫైళ్లను తనిఖీ చేశారు. కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంపై సబ్ రిజిస్ట్రార్ను ప్రశ్నించారు. సోదాల సమయంలో కార్యాలయంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల చాలా ఫిర్యాదులందాయని, ఈ క్రమంలోనే ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. అవినీతి, అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని డీఎస్పీ తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు చెల్లింపులకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు కూడా నిర్థారణకు వచ్చామన్నారు. సోదాలు పూర్తిస్థాయిలో కొనసాగించాక బాధ్యులపై శాఖాపరమైన చర్యల కోసం ఏసీబీ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఏ ప్రభుత్వ అధికారైనా, ఉద్యోగైనా లంచం అడిగితే ఏసీబీకి సమాచారం అందించాలని కోరారు. ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064 లేదా 9154388981 నంబర్లకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని సూచించారు. -
సీహెచ్సీలో వైద్యుల నియామకం
బూర్గంపాడు: ఎట్టకేలకు బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో ముగ్గురు వైద్యులను నియమించారు. ‘సీహెచ్సీనా.. డెంటల్ ఆస్పత్రా!’ శీర్షికన ఈనెల 11న సాక్షిలో ప్రచురితమైన కథనానికి వైద్యావిధాన పరిషత్ అధికారులు స్పందించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు డీసీహెచ్ఎస్ రవిబాబు.. సీహెచ్సీలో ముగ్గురు వైద్యులను నియమించారు. వీరిలో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు కాగా, ఒకరు గైనకాలజిస్ట్ ఉన్నారు. కాగా, ఈ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలని పలుమార్లు కలెక్టర్ ఆదేశించినా గైనకాలజిస్ట్ లేక డెలివరీలు చేయడం లేదు. ఎట్టకేలకు గైనకాలజిస్ట్ నియామకంతో ప్రసవాలు పెరిగే అవకాశాలున్నాయి. గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రావణి విధుల్లో చేరిన తొలిరోజే ఓ గర్భిణికి సుఖప్రసవం చేయడం విశేషం. -
రామయ్యకు కాసుల పంట
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కాసుల పంట పండింది. చిత్రకూట మండపంలో గురువారం ఆలయ హుండీలను లెక్కించగా రూ.1,97,79,049తో పాటు 65 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, విదేశీ ద్రవ్యం లభించాయని ఈఓ రమాదేవి తెలిపారు. గత మే 6న చివరిసారి హుండీలు లెక్కించారు. ఇప్పుడు 50 రోజుల్లో రూ.2 కోట్లకు దగ్గరగా ఆదాయం సమకూరడం విశేషం. వేసవి సెలవుల నేపథ్యంలో మే, జూన్ నెలల్లో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదాయం భారీగా రావడంతో ఆలయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. హుండీ లెక్కింపు అనంతరం నగదును బ్యాంకు అఽధికారులకు అందజేశారు. 50 రోజుల హుండీ ఆదాయం రూ.1.97 కోట్లు -
నిబంధనలకు విరుద్ధంగా వైద్యసేవలు
● భద్రాచలం ఏజెన్సీలో ఇష్జారాజ్యంగా క్లినిక్ల నిర్వహణ ● స్థాయికి మించి చికిత్స అందిస్తున్న కొందరు ఆర్ఎంపీలు ● చర్యలు తీసుకోని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు భద్రాచలంఅర్బన్: ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తూ, మోతాదుకు మించి మందులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రథ మ చికిత్స వరకే పరిమితం కావాల్సిన వారు క్లినిక్లలో పడకలు ఏర్పాటు చేస్తూ, ల్యాబ్లు నిర్వహిస్తూ నిబంధనలను కాలరాస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం భద్రాచలంలో పలువురు అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, వైద్యఆరోగ్యశాఖ అధి కారులతో సమావేశం నిర్వహించి ఆర్ఎంపీలు పరిధి దాటి చేయకుండా చర్యలు తీసుకోవాలని హె చ్చరించారు. అయినా వైద్యారోగ్యశాఖ అధికారుల్లో చలనం లేదు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలో సుమారు 40 మంది వరకు ఆర్ఎంపీలు ఉన్నారు. ప్రథమ చికిత్స కేంద్రానికి ఎలాంటి పేరు పెట్టకూడదు. అతని పేరు కూడా డాక్టర్గా రాసుకోకూడదు. కట్లు కట్టడం, సైలెన్లు ఎక్కించడం, ఇంజెక్షన్లు వేయడం, వైద్య పరీక్షలకు సిఫారసులు, వంటివి చేయకూడదు. గర్భిణిలు, బాలింతలు, చిన్న పిల్లలకు వైద్య అందించొద్దు. కానీ కొందరు ఆర్ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం పేరుతో రోగుల నుంచి సొమ్ము దండుకుంటున్నారు. పట్టించుకోని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లో టైఫాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలకు, ఇతర వ్యాధులకు ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులు, రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ్క బిల్లుల్లో కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జిల్లాలో ఆర్ఎంపీల వైద్యం వికటించి పలువురు మృతి చెందిన సంఘటనలు సైతం ఉన్నాయి. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆర్ఎంపీల క్లినిక్లను తనిఖీలు చేయడంలేదు. కొందరు అధికారులు మామూళ్లకు అలవాటు పడి వారిని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధిక మోతాదులో మందులు ఇస్తూ.. గ్రామాల్లో, బస్తీల్లో జ్వర బాధితులు సాధారణంగా ఆర్ఎంపీల వద్దకే వెళ్తుంటారు. వారు పెయిన్ కిల్లర్, స్టెరాయిడ్ వంటి మందులను ఇస్తూ, త్వరగా నయం చేస్తున్నట్లు నమ్మిస్తున్నారు. దీంతో ప్రజలు వారి వద్దే చికిత్స పొందుతున్నారు. ఆ మందులు వాడితే అనంతరం కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు వస్తాయనే అవగాహన ప్రజల్లో లేదు. అవగాహన కల్పించే దిశగా అధికారులూ చర్యలు చేపట్టడంలేదు. మందుల ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఉండటం వల్ల జీవక్రియ దెబ్బతింటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా వాడితే జబ్బులు కోరి తెచ్చుకుంటున్నట్లేనని పేర్కొంటున్నారు. బీపీ, స్థూలకాయం, ఎముకల బలహీనత, కంట్లో శుక్లాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. అంతకు మించి మించి వైద్యం చేయొద్దు. రోగుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాస్పత్రి లేదా ఎంబీబీఎస్ డాక్టర్కు రెఫర్ చేయాలి. ఆర్ఎంపీలు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – డాక్టర్ చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ, భద్రాచలం -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాహస అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంటౌన్: జాతీయ సాహస అవార్డులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వారు అందించే జాతీయ సాహస అవార్డులు – 2024 కోసం అన్లైన్లో పోర్టల్ https:// awards. gov. in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూమి, ఆకాశం, సముద్రంపై సాహస యాత్రలు చేసిన వారిలో ఒక్కో విభాగంలో ఒకరికి అవార్డు అందిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో సాహసం చేసి, విజయం సాధించిన యువతీ, యువకులు ఈనెల 30వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తామని తెలిపారు. 2022 నుంచి 2024 వరకు సాహసాలు చేసిన వారి దరఖాస్తులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని వివరించారు. సక్రమంగా విధులు నిర్వర్తించాలిబెటాలియన్ సిబ్బందికి డీఐజీ సన్నీ ఆదేశం కొత్తగూడెంఅర్బన్: బెటాలియన్ పోలీసులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని బెటాలియన్స్ డీఐజీ సి.సన్నీ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ బెటాలియన్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెటాలియన్ పోలీసుల విధి, విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశాక ఆవరణలో మొక్కలు నాటారు. శరత్ మ్యాక్స్ విజన్ కంటి ఆస్పత్రి వారు ఏర్పాటు చేసిన నేత్ర పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు డి.శ్రీనివాసరావు, హెచ్.అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. నియోనాటల్ వాహనంలో అధునాతన పరికరాలు నేలకొండపల్లి: అధునాతన పరికరాలతో కూడిన నియోనాటల్ వాహనం ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఈఎంఆర్ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఉమ్మడి జిల్లా పోగ్రామ్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని సీహెచ్సీ వద్ద బుధవారం నియోనాటల్ వాహనంలో పరికరాల పనితీరుపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ జిల్లాకు తొలిసారిగా ఈ వాహనాన్ని కేటాయించగా అత్యాధునిక పరికరాలు, వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రత్యేకంగా నవజాత శిశువుల సంరక్షణకు ఈ వాహనం సమకూర్చారని చెప్పారు. కాగా, 108 అంబులెన్స్లు ఖమ్మం జిల్లాలో 21, భద్రాద్రి జిల్లాలో 28 ఉండగా, ఒక్కో వాహనంలో కనీసం నెలకు 120 ట్రిప్పుల ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ అధికారి దుర్గాప్రసాద్, 108 సిబ్బంది అజీమ్, పుష్పలత పాల్గొన్నారు. -
మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు
సుజాతనగర్: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని, వాటితో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ బి.రోహిత్రాజు అన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సుజాతనగర్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ధన్వంతరీ ఫార్మసీ కళాశాలలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, గంజాయి రహిత ప్రాంతమే లక్ష్యంగా తమ శాఖ కృషి చేస్తోందని, ఇందులో భాగంగా నిరంతరం విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూడాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐలు ప్రతాప్, రాయల వెంకటేశ్వర్లు, కరుణాకర్, శివప్రసాద్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రాము, కళాశాల చైర్మన్ అరికెల భాస్కర్, ప్రిన్సిపాళ్లు నాగరాజు, రామకోటేశ్వరరావు, ఎస్సై ఎం.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు సూచన -
పరిశ్రమలతోనే ఆర్థిక ప్రగతి
కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూపర్బజార్(కొత్తగూడెం): పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ట్రైనీ కలెక్టర్ సౌరబ్శర్మతో కలిసి నిర్వహించిన టీజీ ఐపాస్, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు జిల్లా అననుకూలమని, దీంతో పరిశ్రమల స్థాపనకు పలువురు ముందుకొస్తున్నారని అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన పథకం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ , మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు అవసరమైన శిక్షణ అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో బయోచార్, ఏబీసీడీ డ్రైవ్లపై అవగాహన కల్పించాలని సూచించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, నవభారత్ లిమిటెడ్ వారు సమన్వయంతో ఉపాధిహామీ పథకం ద్వారా ఇటుకలతో వర్క్షెడ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఐటీఐ విద్యార్థులకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తిరుపతయ్య, ఎల్బీఎం రాంరెడ్డి, గిరిజన సంక్షేమాధికారి అనసూయ, ఉపాధి కల్పన శాఖాధికారి శ్రీరామ్, భూగర్భ జల శాఖ ఏడీ రమేష్, మైనింగ్ ఏడీ దినేష్ పాల్గొన్నారు. మునగపై పర్యవేక్షణ ఉండాలి నవంబర్, డిసెంబర్ నెలల్లో నాటిన మునగ తోటలు ప్రస్తుతం పూత, కాత దశలో ఉంటాయని, సరైన పర్యవేక్షణ లేకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని కలెక్టర్ పాటిల్ ఒక ప్రకటనలో సూచించారు. వర్షాకాలంలో తోటల్లో నీరు నిల్వకుండా చూడాలని, ఉపాధి హామీ పథకం ద్వారా నీటి గుంతలు నిర్మించుకోవాలని తెలిపారు. పుష్పో త్పత్తి, కాత దశలో పశువుల ఎరువు (5–10 కేజీలు), యూరియా (100 గ్రా), పొటాష్ (50గ్రా) మొక్కలకు వేయాలని, ప్రతీ వారం కలుపు తొలగించాలని సూచించారు. రైతులు ఈ సూచనలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించొచ్చని పేర్కొన్నారు. ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించాలి.. పాల్వంచరూరల్ : అవసరాలకు వినియోగించే నీరు బయటకు రాకుండా ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని మురుగునీరు కళాశాలలోకి వస్తోందని ప్రిన్సిపాల్, అధ్యాపకులు కలెక్టర్ దృష్టికి తేగా.. ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. కళాశాల ప్రాంగణంలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలతో పాటు యూకలిఫ్టస్, వెదురు మొక్కలు నాటాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, ఏపీఓ పొరండ్ల రంగా, ఏఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.పరిశుభ్రతే ప్రధానం.. కొత్తగూడెంఅర్బన్: అంటువ్యాధుల నివారణలో చేతుల పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని, దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉపాధ్యాయులకు సూచించారు. డయేరియా నివారణపై బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, సురక్షిత తాగునీటిని అందించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.విద్యా చందన, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, డీఎంహెచ్ఓ భాస్కర్, డీసీహెచ్ఎస్ రవిబాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎస్.జయలక్ష్మి, సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తేజశ్రీ, కోరా శ్రీ యాదవ్, సీహెచ్ఓ నాగభూషణం పాల్గొన్నారు. -
శంకుస్థాపన శిలాఫలకం ధ్వంసం
అశ్వాపురం: మండల పరిధిలోని తుమ్మలచెరువులో లోతువాగుపై వంతెన శంకుస్థాపన శిలాఫలకాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. హైలెవల్ వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో రూ.3 కోట్లు మంజూరు కాగా అప్పటి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికలు రావడంతో పనులు చేపట్టలేదు. నూతన ప్రభుత్వంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవ తీసుకొని వంతెన పనులు పూర్తి చేయించారు. బుధవారం ఎమ్మెల్యే పాయం వంతెనను ప్రారంభించనుండగా, మంగళవారం రాత్రి శంకుస్థాపన శిలాఫలకం పగులగొట్టారు. రేగా కాంతారావు పేరు ఉండకూడదని కాంగ్రెస్ శ్రేణులు ధ్వంసం చేశాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ వాళ్లే ప్రచారం కోసం ధ్వంసం చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆర్అండ్బీ వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఫిర్యాదుతో సీఐ అశోక్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీవీకే–5 ఇంక్లైన్లో కేబుల్ అపహరణసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్ గని ప్యాన్ ఆవరణలోని కాపర్ కేబుల్ చోరీ జరిగిన విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం ఏరియాలో మాజీ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి ఈ నెల 23న మృతి చెందగా, 24న అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది దిగ్బ్రాంతికిలోనై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇది అదునుగా భావించిన దొంగలు ఈ నెల 23, 24 రెండు రోజుల్లో కాపర్ కేబుల్ను ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో నిక్షిప్తమైంది. సుమారు 10 మీటర్లు కేబుల్ చోరీకి గురైందని సిబ్బంది చెబుతుండగా, విచారణలో పూర్తి వివరాలు తేలాల్సి ఉంది. ఈ విషయమై ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ను వివరణ కోరగా.. చోరీ చేసినవాళ్లను గుర్తించామని, గురువారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
సీఐ మెడకు.. ఎన్ఆర్ఐ కేసు
● ఇల్లెందు సీఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు ● ఉత్తర్వులు జారీ చేసిన ఐజీఇల్లెందు: ఓ ఎన్ఆర్ఐ దంపతుల మధ్య ఏర్పడిన వివాదం.. చివరకు ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణ మెడకు చుట్టుకుంది. పోలీస్స్టేషన్కు వచ్చిన తమ పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించారంటూ ఎన్ఆర్ఐ నవీన్రెడ్డి తల్లిదండ్రులు మల్టీజోన్ –1 ఐజీ చంద్రశేఖర్రెడ్డికి ఫిర్యాదు చేయగా.. సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా.. ఇల్లెందు కరెంటాఫీస్ ఏరియాకు చెందిన పి.నవీన్రెడ్డికి హైదరాబాద్లోని శంగిచెర్లకు చెందిన శ్రావ్యతో 2023 జూన్లో వివాహం జరిగింది. కొంతకాలం పాటు అమెరికాలోని డల్లాస్లో కాపురం సాగించాక హోం సిక్ పేరుతో ఇంటికి వచ్చిన శ్రావ్య తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. సుమారు ఏడాది గడిచినా నవీన్రెడ్డి శ్రావ్యను తీసుకెళ్లకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఈనెల 19న ఇల్లెందు పోలీసులను ఆశ్రయించగా సీఐ సత్యనారాయణ, షీం టీం సభ్యులు ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తమను స్టేషన్కు పిలిచి శ్రావ్య కుటుంబసభ్యుల సమక్షంలో సీఐ బెదిరించారని నవీన్రెడ్డి తల్లిదండ్రులు ఉప్పల్రెడ్డి, పద్మజ ఐజీకి ఫిర్యాదు చేయడంతో సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఖమ్మం అదనపు డీసీపీ విచారణ.. సీఐ సత్యనారాయణపై ఫిర్యాదు అందగా ఐజీ ఆదేశాల మేరకు ఖమ్మం అదనపు డీసీపీ ప్రసాదరావు బుధవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్లో విచారణ నిర్వహించారు. నవీన్ రెడ్డి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిచిన సమయంలో సీసీ పుటేజీలను పరిశీలించడంతో పాటు ఆరోజు విధుల్లో ఉన్న సిబ్బందిని విచారించారు. పోస్టింగ్ కోసం అంతర్గత పోరు.. ఇల్లెందు పోలీస్ స్టేషన్లో సీఐ మార్పు జరుగుతుందని కొంతకాలంగా ప్రచారం జోరందుకుంది. దీంతో పాటు ఈ సబ్ డివిజన్కు చెందిన ఓ అధికారి ఇల్లెందు సీఐ పీఠంపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సత్యనారాయణను తప్పించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్ఆర్ఐ కేసు ముందుకు రావడంతో అతడి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేశాడంటూ ఐజీకి ఫిర్యాదు చేయడం, సీఐపై సస్పెన్షన్ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. నా భర్త నుంచి న్యాయం చేయండి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకెళ్లిన ఏడాదికే తిరిగి ఇంటికి పంపించి తన జీవితంతో ఆడుకుంటున్న ఎన్ఆర్ఐ నవీన్రెడ్డి నుంచి న్యాయం చేయాలంటూ శ్రావ్య పోలీసులను కోరారు. తన తల్లిదండ్రులు దుబ్బాక వేణుగోపాల్రెడ్డి, శ్రీలతతో కలిసి బుధవారం ఆమె ఇల్లెందు పోలీస్స్టేషన్కు వచ్చారు. ఈ వివాదంపై మాట్లాడేందుకు తమను సీఐ రమ్మని చెప్పడంతోనే తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. అమెరికాలో ఉన్న రోజుల్లో తనకు సమాచారం ఇవ్వకుండానే పలువురు డాక్టర్లతో కొన్ని పరీక్షలు చేయించాడని, ఆ తర్వాత వీసా గడువు ముగిసిందంటూ ఇంటికి పంపించాడని తెలిపారు. 2025లో మళ్లీ వీసా వచ్చినా రద్దు చేయించాడని, ఈ విషయం అడిగితే దురుసుగా సమాధానం ఇస్తున్నాడని, దీంతో తాను పోలీసులను సంప్రదించానని వివరించారు. -
‘శానిటరీ కాంప్లెక్స్’ పూర్తి చేయాలి
పాల్వంచరూరల్: పక్షం రోజుల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన ఆదేశించారు. మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ ఏడాది రూ.3 లక్షలతో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నారు. ఆలయ ఈఓ పర్యవేక్షణలో పనులు కొనసాగుతుండగా, నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నట్లు సమాచారం రావడంతో ఆమె బుధవారం తనిఖీలు నిర్వహించారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఆలయ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఎస్బీఎం కన్సల్టెంట్ రేవతి పాల్గొన్నారు. ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు మృతిభద్రాచలంఅర్బన్: పట్టణంలోని శిల్పినగర్లో బుధవారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు ట్రాలీ ఆటో కింద పడి మృతి చెందాడు. స్థాని కుల కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం శిల్పినగర్లోని ఓ దుకాణం వద్ద తెప్పల మనోజ్(18)కు, నాగేంద్రకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు. కాగా, నాగేంద్ర తాను పని చేస్తున్న కంపెనీ ట్రాలీ ఆటోలో ఎక్కుతుండగా, నాగేంద్రను కిందకు లాగే ప్రయత్నంలో మనోజ్ కింద పడిపోయాడు. ఈ క్రమంలో ట్రాలీ ఆటో వెనుక టైరు మనోజ్ తల మీదుగా పోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి కల్యాణ్ ఫిర్యాదు మేరకు నాగేంద్రతోపాటు ట్రాలీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు భద్రాచలం పోలీసులు తెలిపారు. ఇద్దరు వైదిక సిబ్బందికి షోకాజ్ నోటీసులుభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైదిక సిబ్బందికి దేవాదాయ శాఖ అధికారులు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరి గిన గ్రూప్ చర్చల్లో దేవస్థానంలో భక్తులు అర్చకులకు సమర్పించే కానుకలు తమకే చెందుతాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. ఈ విషయం ఆలయ అధికారులకు తెలి యడంతో పూర్తి వివరణతో కూడిన నివేదికను రెండు రోజుల్లో అందించాలని షోకాజ్ నోటీసులు అందజేశారు. లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోల్బంక్ నిర్వహణపై విచారణదుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ నిర్వహణపై వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో డీసీఎస్ఓ రుక్మిణి బుధవారం విచారణ చేపట్టారు. వినియోగదారుల వాంగ్మూలం రికార్డు చేసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు. నిర్వహణ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండాలని బంక్ నిర్వాహకులకు సూచించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ ఎస్వో వరదరాజులు, సివిల్ సప్లాయీస్ డీటీ రాజు, ఆర్ఐ కల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అడవి బిడ్డకు అనారోగ్యం..
కరకగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో రహదారులు లేక అడవి బిడ్డల కష్టాలకు పరిష్కారం లభించడం లేదు. కరకగూడెం మండలంలో వలస ఆదివాసీ గ్రామమైన నీలాద్రిపేటలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. నీలాద్రిపేటకు చెందిన మడివి ఉంగమ్మకు బుధవారం వాంతులు, విరేచనాలు తీవ్రమై ఆరోగ్యం విషమించింది. దీంతో కుటుంబీకులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా నీలాద్రిపేటకు సరైన రహదారి లేక వాహనం వచ్చే పరిస్థితి కనిపించలేదు. దీంతో వైద్యంలో జాప్యం జరుగుతుందని భావించిన ఉంగమ్మ భర్త జోగ య్య, తదితరులు డోలీ కట్టి ఆమెను అటవీ మార్గంలో బురద, ఎగుడుదిగుడు మార్గంలో ఆరు కి.మీ. మేర మోస్తూ రెండు గంటల అనంతరం అశ్వాపురంపాడు మీదుగా మోతె సమీపంలోని ప్రధాన రహదారి వద్దకు చేర్చారు. అక్కడ సిద్ధంగా ఉన్న 108లో ఉంగమ్మను మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. డోలీలో ఆరు కి.మీ. మోసుకెళ్లిన కుటుంబీకులు -
ఆగని అరెస్టులు
సింగరేణి మెడికల్ బోర్డులో బదిలీలు, డిప్యుటేషన్లను ఆధారంగా చేసుకుని ఇంత కాలం దందాకు పాల్పడిన వ్యక్తులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఈ అంశంపై ఏసీబీ సీరియస్గా దృష్టి పెట్టడంతో ఆరు నెలల్లో ముగ్గురు అరెస్టయ్యారు. రాబోయే రోజుల్లో మరికొందరిని సైతం అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ సిద్ధమవుతోందని సమాచారం. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంసింగరేణిలో అవినీతి దందాపై ఏసీబీ నజర్ ● కార్పొరేట్ కార్యాలయానికీ అంటుతున్న మరకలు ● 40 రోజుల్లో మూడు చోట్ల దాడులు ● ఏసీబీ చేతికి కీలక సమాచారం, మరిన్ని దాడులకు అవకాశం !కార్పొరేట్ ఆఫీస్ అడ్డాగా.. తెలంగాణలో భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం అసిఫాబాద్ జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. సుమారు 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. బొగ్గు వెలికితీతలో సంస్థకు వందేళ్ల చరిత్ర ఉండగా ఇటీవల థర్మల్, సోలార్ విద్యుత్ రంగంలోనూ అడుగు పెట్టింది. సంస్థ పరిధిలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం, నియామకాలు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియ అంతా కొత్తగూడెంలోని కార్పొరేట్ ఆఫీస్ వేదికగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ గతంలో పని చేసిన ఓ వ్యక్తి తనకు ఉన్నతాధికారుల వద్ద పలుకుబడి ఉందంటూ కార్మికులను నమ్మించాడు. ఆ తర్వాత బదిలీలు, డిప్యుటేషన్లు, మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలు ఇప్పించడం వంటి పనులు చేయించగలనంటూ నమ్మబలికాడు. అందుకు తగ్గట్టే నాలుగైదేళ్ల క్రితం వరకు సదరు ఉద్యోగి మాట సంస్థలో చలామణి అయింది. అయితే చివరకు సంస్థ ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. అయినప్పటికీ డిప్యుటేషన్లు, బదిలీలు, మెడికల్ బోర్డు వ్యవహారంపై తరచూ అవినీతి ఆరోపణలు రావడంపై దృష్టి సారించింది. ఇతరుల సంగతేంటి? కార్మికుల సంక్షేమం విషయంలో కార్మిక సంఘాలు గతంలో రాజీలేకుండా పని చేశాయి. కానీ గత పదేళ్లలో కారుణ్య నియామకాలు మొదలైన తర్వాత కార్మిక సంఘాల కంటే ఖద్దరు నేతల పెత్తనం పెరగడం మొదలైంది. ఆ తర్వాత ఈ విష సంస్కృతి బదిలీలు, డిప్యుటేషన్లకు విస్తరించింది. ఎవరు పడితే వారు కాసులిస్తే చాలు సింగరేణిలో పనులు చక్కబెడతామని ప్రచారం చేసుకోవడం ప్రారంభమైంది. మొదట్లోనే ఈ విధానాలకు అడ్డుకట్ట వేయకపోవడంతో ఈ వ్యవహారం శృతి మించింది. చివరకు విజిలెన్స్తో పని కావడం లేదని ఏసీబీని రంగంలోకి దించారు. మెడికల్ బోర్డులోకి ఆర్మీ డాక్టర్ను తీసుకురావాలనే ప్రతిపాదనను పరిశీలించాల్సి వచ్చింది. అంతేకాదు.. బదిలీలు, డిప్యుటేషన్ల విషయంలో అవినీతిని అరికట్టేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఈ అంశంపై ఆరు నెలలుగా నిర్విరామంగా దృష్టి పెట్టడంతో ఒక్కొక్కరుగా ఏసీబీకి చిక్కుతున్నారు. అయితే ప్రస్తుత విచారణ అంతా గతంలో సంస్థలో పని చేసిన ఓ వ్యక్తి, అతని కోటరీకి సంబంధించిన సింగరేణి ఉద్యోగులు/వ్యక్తుల కేంద్రంగానే సాగుతోందనే విమర్శ ఉంది. బదిలీలు, మెడికల్ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే ఈ కాసుల దందాతో సంబంధం ఉన్న అందరిపైనా దృష్టి సారించాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు. కాగా, సంస్థలో జరుగుతున్న అవినీతి వివరాలు తెలిపేందుకు ప్రత్యేకంగా 94911–44104 నంబర్ను సింగరేణి అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఫోన్ చేయడం లేదా వాట్సాప్ ద్వారా వివరాలు అందించొచ్చని తెలిపారు.ఒక్కొక్కరుగా.. లిఖిత పూర్వకంగా, ఫోన్కాల్స్, వాట్సాప్, ఈమెయిళ్ల ద్వారా అందిన సమాచారానికి తోడు సంస్థలో ఉన్నతాధికారులు ఇచ్చిన నమ్మకమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఏడాది మే 6న కొత్తగూడెంలోని మెయిన్ వర్క్షాప్లో పని చేస్తున్న అన్నెబోయిన రాజేశ్వరరావు అనే ఉద్యోగిని ఏసీబీ అధికారులు విచారించారు. తిరిగి జూన్ 6న ఇదే అంశంపై కొత్తగూడెం నివాసి, సంస్థతో సంబంధం లేకపోయినా సింగరేణి వ్యవహారాల్లో కీలకంగా మారిన ఓ మహిళనూ విచారించారు. తాజాగా భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ ఖని 1 ఇంక్లైన్ లో జనరల్ మజ్దూర్గా పని చేస్తున్న ఎస్. ప్రశాంత్ అనే ఉద్యోగిని ఏసీబీ విచారణ చేస్తోంది. భూపాలపల్లి విచారణలో కీలక అంశాలు లభించాయని, వాటి ఆధారంగా త్వరలో కొత్తగూడెం ఏరియాలో మరికొందరిని కూడా విచారించే అవకాశం ఉంది. -
● ఇల్లెందు పట్టణంలో తరచూ తాగునీటి సమస్య ● నీరు సరిపడా, సకాలంలో రావడంలేదు : మున్సిపల్ శాఖ ● వారే సకాలంలో ట్యాంకులకు ఎక్కించడంలేదు: మిషన్ భగీరథ ● రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో సమస్య తీవ్రం
ఇల్లెందు: వర్షాకాలం మొదలైనా ఇల్లెందు పట్టణ వాసులకు తాగునీటి తిప్పలు తప్పడంలేదు. గత జనవరి నుంచి మూడు, నాలుగు రోజులకోసారి, అదికూడా అరగంటపాటే సరఫరా చేస్తున్నారు. వారం రోజుల క్రితం నాలుగు రోజులపాటు పట్టణంలో నీటి కటకట ఏర్పడింది. పట్టణానికి నీటిని అందించే బాధ్యత మున్సిపాలిటీది కాగా, నీటిని ట్యాంకుల వరకు మిషన్ భగీరథ చేర్చాల్సి ఉంది. ఈ రెండు శాఖల మధ్య తీవ్ర సమన్వయ లోపంతో తరచు నీటి సమస్య ఏర్పడుతోంది. భగీరథ నుంచి సమయపాలన పాటించకుండా, అది కూడా తక్కువ సమయమే నీరు సరఫరా చేస్తున్నారని, అందుకే నీటి ఎద్దడి ఏర్పడుతోందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు సకాలంలో ట్యాంకులకు ఎక్కించుకుని ట్యాప్లకు సరఫరా చేయకపోవటం లేదని మిషన్ భగీరథ అధికారులు పేర్కొంటున్నారు. రెండు శాఖల అధికారులను సమన్వయం చేసే అధికారి, ప్రజాప్రతినిధి లేకపోవటంతో ప్రజలకు ఇక్కట్లు తప్పటం లేదు. మున్సిపల్ పాలకవర్గం కూడా లేకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. మూడు, నాలుగు రోజులకోసారి.. ఇల్లెందు పట్టణంలో 24 వార్డులు ఉండగా, మిషన్ భగీరథ, మున్సిపాలిటీ పరిధిలోని చెరువు, సింగరేణి నీరు సరఫరా చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మున్సిపాలిటీ వాటర్ సప్లైలో మోటార్లు మొరాయించటంతో నీటిరు సరఫరాలో లోపం తలెత్తింది. తోగ్గూడెంలోని మిషన్ భగీరథ ఫిల్టర్బెడ్లో మరమ్మతుల కారణంగా సక్రమంగా నీరు అందడంలేదు. దీంతో నాలుగు రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడింది. అసంపూర్తిగా భగీరథ పనులు ఇల్లెందులో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ట్యాంకుల నిర్మాణం నుంచి మొదలుకుని పైపులైన్లు, నల్లాలు అన్ని అసంపూర్తిగానే వదిలేశారు. మెయిన్ లైన్, సబ్లైన్లు, ఇంటింటికీ నల్లాలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. కొన్ని వీధుల్లో పైపులైన్లు లీకవుతున్నాయి. పట్టణంలో ఐదు వేలకు పైగా నల్లా కనెక్షన్లు ఉండగా, వీటన్నింటికీ భగీరథ పైపులైన్ల అనుసంధానం చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో తాగునీటి సమస్య తలెత్తుతోంది. ● -
ఫిట్నెస్లేని మూడు బస్సులు సీజ్
ఇల్లెందు: పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన మూడు బస్సులను సీజ్ చేఽశారు. బుధవారం ఇల్లెందు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.నిర్మల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇల్లెందు పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులతో కళాశాలకు వస్తుండగా జేకే బస్టాప్ సమీపంలో తనిఖీ చేశారు. ఫిట్నెన్ లేని కారణంగా మూడు బస్సులను సీజ్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కొంత కాలంగా పట్టణంలో పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన బస్సులను ఫిట్నెస్ లేకుండా తిప్పుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులు విద్యాసంస్థల బస్సులను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ఇతర సంస్థల బస్సులను కూడా తనిఖీ చేస్తామని ఇన్స్పెక్టర్ నిర్మల తెలిపారు. -
పాఠశాలకు ప్రాణం పోశారు..
టేకులపల్లి : టేకులపల్లి మండలం దాసుతండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక మూసివేస్తారనే ప్రచారం సాగగా.. ఇద్దరు విద్యార్థినులు చేరి బడికి ప్రాణం పోశారు. ఇక్కడ గతేడాది మూడో తరగతిలో ముగ్గురు, నాలుగో తరగతిలో ముగ్గురు విద్యార్థులు చదువుకున్నారు. ఈ సంవత్సరం అందులో నలుగురు టీసీ తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. నాలుగో తరగతిలో అనన్య, ఐదో తరగతిలో ఝాన్సీ మాత్రమే మిగిలారు. వారు కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తామంటూ ఇంతకాలం బడికి రాలేదు. దీంతో విద్యార్థులు లేక పాఠశాల మూతపడుతుందనే ప్రచారం సాగింది. ఈనెల 6 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాఠశాల పేరుతో ప్రత్యేకంగా కరపత్రాలు ముద్రించిన ప్రధానోపాధ్యాయురాలు(సింగిల్ టీచర్) విజయనిర్మల.. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, మెరుగైన బోధనపై గ్రామంలో ప్రచారం చేశారు. గ్రామంలో 20 మంది బడీడు పిల్లలు ఉండగా అంతా ప్రైవేట్ స్కూళ్లపై మోజుతో అటే పంపించారు. దీంతో హెచ్ఎం మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి నచ్చజెప్పడంతో నాలుగో తరగతి చదివే గుగులోత్ అనన్య అనే విద్యార్థిని బుధవారం పాఠశాలలో చేరింది. ఐదో తరగతికి చెందిన ఝాన్సీని కూడా గురువారం చేర్పిస్తామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. దీంతో మూసివేస్తారనే ప్రచారం జరిగిన పాఠశాలకు ప్రాణం పోసినట్టయింది. -
కరెంట్ షాక్తో నలుగురి దుర్మరణం
ఇల్లెందురూరల్/నేరడిగొండ/గంగారం : వేర్వే రు చోట్ల విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మూడు జిల్లాల పరిధిలో బుధవారం ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన ఏనుగు నర్సయ్య (60), ఎర్రమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. అందరికీ వివాహాలు జరగ్గా, చిన్న కుమారుడు ప్రవీణ్ (35) తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. పొలం పనులకు వెళ్లాలని బుధవారం తెల్లవారుజామునే నిద్రలేచారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఆరుబయట నేల బురదమయంగా మారింది. ముందుగా ఎర్రమ్మ నిదానంగా అడుగులు వేస్తూ చేతికందే ఎత్తులో ఉన్న దండెం తీగను ఆసరాగా పట్టుకుంది. అప్పటికే విద్యుత్ సర్వీసు వైరుకు తగిలి ఉన్న దండెం నుంచి కరెంట్ ప్రసారం కావడంతో ఎర్రమ్మ షాక్తో కింద పడింది. ఆ వెనుకాల వస్తున్న నర్సయ్య.. భార్య జారి పడిందని భావించి పైకిలేపే ప్రయత్నం చేయగా ఆయనకు కూడా షాక్ తగలడంతో బిగ్గరగా అరిచాడు. ఏం జరిగిందోనని పరుగున బయటకు వచ్చిన ప్రవీణ్ నేరుగా వారి వద్దకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేయడంతో ఆయనా షాక్కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో నర్సయ్య, ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఎర్రమ్మను స్థానికులు తొలుత ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన యువ రైతు సాబ్లే సుభాష్ (35) తన పత్తి చేలో కలుపు తీస్తుండగా.. వేలాడుతున్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని మృతుని బంధువులు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన చిలుక ప్రవీణ్(28) గత ఏడాది మార్చిలో జూనియర్ లైన్మ్యాన్గా మహబూబాబాద్ గంగారం మండలంలో విధుల్లో చేరారు. కోమట్లగూడెం రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి త్రీఫేజ్ విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకొని మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం కావడంతో ప్రవీణ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సౌమ్య ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి. -
మావోయిస్టులకు సహకరించొద్దు..
పాల్వంచరూరల్: సంఘ విద్రోహ శక్తులు, మావోయిస్టులకు ఆదివాసీ గిరిజనులు సహకరించవద్దని జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) జి.నరేందర్ సూచించారు. మండలంలోని మల్లారం జీపీ మామిడికుంట గ్రామాన్ని మంగళవారం సీఐ సతీశ్కుమార్తో కలిసి అడిషనల్ ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో మాట్లాడారు. పిల్లలకు స్టడీ మెటీరియల్, పుస్తకాలు పంపిణీ చేశారు. వలస ఆదివాసీలకు పోలీసుల సహకారం ఎప్పుడూ ఉంటుందని, మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపాలని చెప్పారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ సురేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఉద్దీపనం పుస్తకాల సరఫరాకు టెండర్లుభద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ గిరిజన ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల్లో ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ఉద్దీపకం వర్క్ బుక్–2 ఇవ్వనుండగా, ముద్రించి సరఫరా చేసేందుకుటెండర్లు ఆహ్వా నిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. సుమారు 13,206 మంది విద్యార్థులకు అన్నిపుస్తకాలు కలిపి 30,89,784 పేజీ ల మేర ముద్రించి సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లా లోని ప్రింటింగ్ప్రెస్ల యజమానులు నిర్ణీత రుసుం డీడీ రూపంలో చెల్లించి ఐటీడీఏ కార్యాలయంలో టెండర్ దరఖాస్తులు తీసుకుని ఈ నెల 28వ తేదీ వరకు సమర్పించాలని సూచించారు. వివరాలకు ఐటీడీఏ ఉపసంచాలకుల కార్యాలయంలో 97013 15526, 91828 61609 నంబర్ల ద్వారా సంప్రదించాలని పీఓ ఓ ప్రకటనలో తెలిపారు.కేవీకే కోఆర్డినేటర్ రవికుమార్ బదిలీవ్యవసాయ కళాశాల ప్రొఫెసర్గా నియామకం వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని కృషి విజ్ఞా న కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ బదిలీ అయ్యారు. ఆయన ను భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్గా నియమించారు. అయితే, రవికుమార్ స్థానంలో కేవీకే కోఆర్డినేటర్గా ఎవరి నీ నియమించలేదు. కేవీకేలో సీనియర్ శాస్త్రవేత్తకు కోఆర్డినేటర్గా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.జిల్లా అథ్లెట్కు అభినందనకొత్తగూడెంటౌన్: కరకగూడెంనకు చెందిన అథ్లెట్ తోలెం శ్రీతేజకు బంగారు పతకం రావ డం హర్షణీయమని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహీధర్ మంగళవారం తెలిపారు. యూపీలోని ప్రయోగరాజ్లో జరుగుతున్న జాతీయ జూనియర్ (అండర్–20) ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తోలెం శ్రీతేజ.. ఈవెంట్లో బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. శ్రీతేజ, కోచ్ నాగేందర్బాబును యువజన క్రీడలశాఖ అధికారి ఎ. పరందామరెడ్డి, అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.సారంగపాణి, కోచ్ నాగపూరి రమేశ్ తదితరులు అభినందించారని ఆయన పేర్కొన్నారు.వైన్స్ వద్ద ఘర్షణ.. కత్తిపోట్లుఖమ్మంఅర్బన్: వైన్స్ వద్ద మందుబాబుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసింది. ఖమ్మం విజయ డెయిరీ ఎదురుగా వైన్స్ వద్ద మంగళవారం రాత్రి ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఇందిరానగర్కు చెందిన మనీశ్ వైన్స్ వద్ద మద్యం సేవిస్తూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో టేకులపల్లి లక్ష్మీనగర్కు చెందిన తాపీ మేసీ్త్ర మేడరాజుల వెంకటేశ్వర్లు ఇదేమిటని ప్రశ్నించగా వాగ్వాదం తలెత్తినట్లు సమాచారం. ఈక్రమంలోనే మనీష్కు ఆయన స్నేహితులు తోడై వెంకటేశ్వర్లుపై దాడి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి మనీష్పై దాడి చేయగా ఆయన మెడపై తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత వెంకటేశ్వర్లు పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. కాగా, ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించగా, ఈ గొడవతో ఆ ప్రాంతంలో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. -
‘సీతారామ’ జలాలు ఇవ్వకపోతే సహించం..
మణుగూరురూరల్: సీతారామ జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఇవ్వకుండా అన్యాయం చేయాలని చూస్తే సహించబోమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతాంగానికి సంబంధించి పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టి 90 శాతం నిధులతో పనులను పూర్తి చేసిందన్నారు. రాష్ట్రంలో మాయమాటలతో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి జిల్లా మంత్రులు పూసగూడెం వద్ద ప్రాజెక్ట్ను ప్రారంభించి ఈ జిల్లాకు నీరు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తరలించుకుపోవడం దుర్మార్గమని, ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటు న్న కాంగ్రెస్ మంత్రులు.. నేడు జిల్లా రైతాంగాన్ని విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ నెల 30వ తేదీన జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో పూసగూడెం నిరసన చేపట్టనున్న ట్లు తెలిపారు. సమావేశంలో కుర్రి నాగేశ్వరరావు, కుంటా లక్ష్మణ్, పోశం నర్సింహరావు, వేర్పుల సురేశ్, అక్కి నర్సింహారావు, యాదగిరిగౌడ్, రామ కోటి, సృజన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు -
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని ఫ్యూన్ బస్తీ(సింగరేణి ప్రధాన కార్యాలయం వెనుక ప్రాంతం)లోని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మార్క బ్రహ్మయ్య(75) మంగళవారం మృతిచెందారు. ఆయనకు ఇద్దరూ కుమార్తెలే. వీరిలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న పెద్ద కుమార్తె సిరికొండ రాధిక తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకుంది. కాగా, బ్రహ్మయ్యకు కొడుకులు లేని లోటును కుమార్తెలే తీర్చారని స్థానికులు చర్చించుకున్నారు. ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యపాల్వంచరూరల్: ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మండలంలోని మందెరకలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాటి అయోధ్య హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. గతేడాది పూసలతండాకు చెందిన బి.సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల సంధ్య భర్త, కుటుంబ సభ్యుతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. సోమవారం సంధ్య ఇంటికి వెళ్లి.. గొడవపడి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని, సంధ్య తల్లి, కుటుంబ సభ్యులు మంజుల, ఆమె భర్త కుమార్ కారణమని మంగళవారం మృతుడి తండ్రి వీరభద్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్పాల్వంచ: గంజాయి సేవిస్తున్న ఐదుగురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పాత పాల్వంచ చింతలచెర్వు కట్టపైన గంజాయి తాగుతున్న గాంధీనగర్ ఏరియాకు చెందిన సయ్యద్ సాజిద్పాషా, షేక్ సమీర్, షేక్ వసీంలతో పాటు మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 1.750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్షఖమ్మం లీగల్: చెల్లని చెక్కు కేసులో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన మహ్మద్ జూనీమియాకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి బిందుప్రియ ముంగళవారం తీర్పు చెప్పారు. ముదిగొండ మండలం పెద్దమండవకు తాళ్లూరి శీతయ్య వద్ద జానీమియా 2018 ఆగస్టులో రూ.2లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమాన చెక్కు జారీ చేయగా అది బౌన్స్ అయింది. శీతయ్య కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం జానీమియాకు ఆరు నెలల జైలుశిక్షతో పాటు ఫిర్యాదికి రూ.2.24క్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. -
ఆగస్టు 15 నాటికి దరఖాస్తుల పరిష్కారం
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా 58,365 దరఖాస్తులు వచ్చాయని, ఆగస్టు 15 వరకు పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వన మహోత్సవంలో 70 లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని వివరించారు. సమావేశంలో జిల్లా అటవీశాఖాధికారి కృష్ణగౌడ్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, డీఏఓ బాబూ రావు, డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, జిల్లా ఉద్యాన శాఖాధికారి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.భూ భారతిపై వీసీలో కలెక్టర్ పాటిల్ -
గంజాయి రవాణాలో యువతులు
ఖమ్మంక్రైం: పోలీసులు, ప్రయాణికులకు అనుమానం రాకుండా అమ్మాయిలతో కొందరు అక్రమార్కులు గంజాయి రవాణా చేయిస్తునట్లు తేలింది. గంజాయి రవాణా సమాచారంతో ఎకై ్సజ్ ఏఈ ఎస్ తిరుపతి ఆధ్వర్యాన మంగళవారం ఖమ్మం కొత్త బస్టాండ్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక యువకుడు, ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగుల్లో పరిశీ లించగా రూ.2.50 లక్షల విలువైన గంజాయి బయటపడింది. ఒడిశా నుంచి గంజాయితో బయలుదేరిన వారు బస్సులు మారుకుంటూ ఖమ్మం చేరుకుని, బెంగళూరుకు వెళ్లడానికి సిద్ధమైనట్లు గుర్తించారు. నిందితులు ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాకు చెందిన శుభకర్మండల్, కాజల్మండల్, శుశు లిశిల్గా గుర్తించామని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీహరిరావుతో పాటు ఉద్యోగులు కరీం, హరీష్, వెంకట్, సుధీర్, విజయ్కుమార్, ఉపేందర్, వీరబాబు, స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం కొత్త బస్టాండ్లో పట్టుబడిన నిందితులు -
రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలి
కొత్తగూడెంఅర్బన్: సికింద్రాబాద్లోని రైల్వే భవన్లో మంగళవారం జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు డీఆర్యూసీసీ సమావేశంలో కొత్తగూడెం నుంచి డీఆర్యూసీసీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం బర్తేశ్కుమార్ జైనీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. మణుగూరు నుంచి కొత్తగూడెం మీదుగా తిరుపతి, షిరిడీకి ప్రత్యేక రైలు నడపాలని, సింగరేణి, కాకతీయ రైళ్లను పాత పద్ధతిలో అదనంగా భోగీలు ఏర్పాటు చేసి నడిపించాలన్నారు. రైల్వే అధికారులు మాట్లాడుతూ.. త్వరలోనే మణుగూరు టు కొత్తగూడెం మీదుగా తిరుపతి, షిరిడీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తామని, రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయిస్తామని వివరించారు. సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ ఏడీఆర్ఎం డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్, సీనియర్ డీసీఎం సిపాలికుమార్, సీనియర్ డీఓఎం డాక్టర్ సురేశ్రెడ్డి, డీసీఎం బి.చరణ్నాయక్, గూడ్స్ డీసీఎం విశాల్ అర్జున్, డీఆర్యూసీసీ సభ్యులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
కొత్తగూడెంటౌన్: విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం మాదకద్రవ్య నివారణ వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాఽలకు బానిస కావొద్దని సూచించారు. డ్రగ్ నిర్మూలన సోల్జర్గా నమోదు చేసుకునేందుకు లింక్ ఏర్పాటు చేశామని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై పోలీస్ శాఖ తరఫున అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినట్లు తెలిసినా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఏస్పీ మల్లయ్యస్వామి, సీఐ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వన్టౌన్ సీఐ కరుణాకర్, ఐటీ సెల్ రాము, జూలూరుపాడు, అశ్వారావుపేట సీఐలు ఇంద్రసేనారెడ్డి, నాగరాజురెడ్డి, ఆర్ఐలు నర్సింహారావు, కృష్ణారావు పాల్గొన్నారు. నిరుపయోగ వస్తువులకు రేపు వేలంజిల్లా పోలీసు శాఖలో నిరుపయోగ వస్తువులను ఈ నెల 26న వేలం వేస్తామని ఎస్పీ రోహిత్రాజు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు హెడ్ క్వార్టర్స్లో వేలం ఉంటుందని, కంప్యూటర్, మానిటర్లు, సీపీయూలు, కీ బోర్డులు, మౌస్లు, యూపీఎస్లు, ట్యాబ్లు, యాపిల్ ఐపాడ్లు, ఇన్వెర్టర్, ఇన్వర్టర్ బ్యాటరీలు, డ్రాగన్ లైట్లు, టెంట్లు, టేబుళ్లు, కుర్చీలు, బీరువా తదితర వస్తువులను వేలం వేస్తామని వివరించారు. పాల్గొనేవారు జిరాక్స్, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని, వివరాలకు 87126 82143 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
అందరికీ తెలిసేలా..
గిరిజన సంస్కృతిభద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ పీఓగా రాహుల్ బాధ్యతలు స్వీకరించి బుధవారంతో ఏడాది పూర్తయింది. విద్య, వైద్య రంగాలకు ప్రాముఖ్యత ఇస్తూనే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు అందరికీ తెలిసేలా ఆయన చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యాయి. రాహుల్ ప్రత్యేక చొరవతో రూపుదిద్దిన గిరిజన మ్యూజియం పర్యాటక ప్రాంతంగా మారింది. చదువును చక్కదిద్దుతూ.. ఏజెన్సీలో విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, గిరిజనాభివృద్ధికి కృషి చేస్తానని విధుల్లో చేరిన రోజే చెప్పారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పర్యటించి కొందరు విద్యార్థులు కనీస సామర్థ్యాల్లో వెనుకబడ్డారని గుర్తించారు. అలాంటి వారి కోసం ‘ఉద్దీపనం’ పేరిట 1 నుంచి 4వ తరగతుల వరకు గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో స్టడీ మెటీరియల్ రూపొందించారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థుల కోసం ‘కెరీర్ గైడెన్స్ వాల్’ను ఏర్పాటు చేయించారు. నిరుద్యోగులకు ప్రోత్సాహం.. నిరుద్యోగ యువత, గిరిజన మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మిల్లెట్స్తో బిస్కెట్లు, సబ్బులు, షాంపూల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమల్లో వారిని భాగస్వాములను చేశారు. మార్కెటింగ్కు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. జాబ్మేళాలు నిర్వహించి ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు ఇప్పించారు. నిరుద్యోగులు చదువుకుని ఉద్యోగాలు సాధించేలా భద్రాచలంలోని లైబ్రరీని పంచాయతీ నిధులతో అభివృద్ధి చేయడంతో పాటు స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేశారు. మెరిట్ ర్యాంకర్లకు ల్యాప్టాప్లు, ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆదివాసీల వంటకాలు అందరికీ తెలిసేలా.. ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన మ్యూజియాన్ని ఆధునికీకరించడంతో పాటు ఆదివాసీ వంటకాల రుచులు అందరికీ తెలిసేలా స్టాళ్లు ఏర్పాటు చేసి మంత్రులు, ఉన్నతాధికారుల మెప్పు పొందారు. ఆదివాసీ ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేసేందుకు ఢిల్లీ భవన్లో సైతం ప్రదర్శనకు ఉంచారు. అంతేకాక ఆదివాసీ భాష తాను నేర్చుకుంటూ వారితో మమేకమయ్యేలా ప్రయత్నించారు. ప్రత్యేక కార్యక్రమాలకు కోయ భాషలో ఆహ్వానాలు అందిస్తూ గిరిజన సంస్కృతిని విశ్యవ్యాప్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలందేలా.. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రణా ళికలు రూపొందించారు. గోదావరి వరదల సమయంలో గర్భిణులను గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టిక రూపొందించి అధికంగా వసూలు చేయకుండా కట్టడి చేశారు. అయితే మూడు రాష్ట్రాల గిరిజనులకు కేంద్రంగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిపై మాత్రం తనదైన మార్క్ చూపించలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదివాసీ భాష, కట్టుబాట్లను పదిలపరుస్తున్న పీఓ స్వయం ఉపాధి, విద్యారంగంపై ప్రత్యేక దృష్టి రాహుల్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది -
● జీసీసీ నుంచే ఆలస్యం
పాల్వంచరూరల్ : వర్షాకాలంలో పేదలు ఇబ్బంది పడకుండా మూడు నెలల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా.. క్షేత్రస్థాయిలో జాప్యంతో లబ్ధిదారులు ఇబ్బంది పడ్డాల్సి వస్తోంది. పాల్వంచ మండలంలోని కొన్నిషాపులకు జీసీసీ పాయింట్ నుంచి బియ్యం సరఫరా ఆలస్యమవుతోంది. మరికొన్ని చోట్ల వేలిముద్రలు పడక, మిషన్లకు సిగ్న ల్ అందక డీలర్లు, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కిన్నెరసాని షాప్ పరిధిలో 556 రేషన్కార్డులకు గాను 308.18 క్వింటాళ్ల బియ్యం వచ్చా యి. ఇందులో ఇప్పటివరకు 251 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయగా ఇంకా 57క్వింటాళ్లు మిగిలి ఉన్నా యి. లక్ష్మీదేవిపల్లి షాప్ పరిధిలో 962 రేషన్కార్డులు ఉండగా ఇంకా 150 మందికి బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. జీసీసీ పాయింట్ నుంచి బియ్యం సరఫరాలో జాప్యంతోనే మిగిలిన వారికి బియ్యం అందించలేదని డీలర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మూడుసార్లు తిరిగినా బియ్యం ఇవ్వలే మూడు నెలల బియ్యం ఇస్తున్నారంటే ఇప్పటికి మూడు సార్లు వచ్చినా ఇంకా ఇవ్వలేదు. జీసీసీ పాయింట్ నుంచి బియ్యం రాలేదని డీలర్ అంటున్నాడు. బియ్యం పంపిణీ గడువు పెంచి అందరికీ వచ్చేలా చూడాలి.– తేనె వెంకటేశ్వర్లు, లబ్ధిదారుడు -
గిరిజన మ్యూజియం భేష్..
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోకుండా నాటి గుర్తులతో నిర్మించి గిరిజన మ్యూజియం బాగుందని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ – న్యూఢిల్లీ(మోటా) ప్రత్యేకాధికారి సుభాష్ అన్నారు. భద్రాచలం డివిజన్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని మ్యూజియాన్ని సందర్శించి కళాఖండాలు, పెయింటింగ్లు, గిరిజన వంటకాలను ఆస్వాదించారు. అనంతరం మాట్లాడుతూ.. పర్యాటకులకు కనువిందు కలిగేలా ట్రైబల్ మ్యూజియం రూపొందించడం హర్షణీయమని అన్నారు. జిల్లాలో రెండు రోజులు పర్యటించి దేవాలయాలతో పాటు మ్యూజియాన్ని సందర్శించడంతో మంచి అనుభూతి కలిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గిరిజనులకు సక్రమంగా అందిస్తున్న ఐటీడీఏ అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పీఓ బి.రాహుల్, ఏపీఓ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు ఉన్నారు.నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.సీఐపై సస్పెన్షన్ వేటు ?ఇల్లెందు: ఇల్లెందు పోలీస్ సబ్ డివిజన్లోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఎన్ఆర్ఐ ఒకరు కేసు విషయమై సదరు సీఐతో ఇటీవల ఫోన్లో మాట్లాడగా దురుసుగా బదులిచ్చినట్లు సమాచారం. దీంతో సదరు ఎన్ఆర్ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఈమేరకు సీఐని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరాచారి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నాయకులు రాయితీ కోసం వినతిపత్రం అందజేయగా, స్పందించి వెంటనే 50 శాతం ఫీజు రాయితీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్, ఎండీ షఫీ, టెంజు జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, నేషనల్ కౌన్సిల్ సభ్యులు చండ్ర నరసింహారావు, జర్నలిస్టులు కృష్ణ్ణగోవింద్, ప్రభాకర్రెడ్డి, రాజ్కుమార్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. -
బూడిద.. చెరువుల పాలు..
● యాష్ రేటు పెంచడంతో తగ్గిన కొనుగోళ్లు ● విధిలేక బూడిదను చెరువులకు వదులుతున్న అధికారులు ● అవి నిండుతుండడంతో కట్టల ఎత్తు పెంచుతున్న వైనం..పినపాక: పినపాక – మణుగూరు మండల సరిహద్దులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న బూడిద రేట్లను పెంచడంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆ బూడిదను చెరువుల్లోకి తరలిస్తున్నారు. ఫలితంగా ఐదు నుంచి 10 అడుగుల వరకు ఉండాల్సిన బూడిద చెరువులను 30నుంచి 40అడుగుల ఎత్తువరకు పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అదికూడా నిండితే అధికారులు ఏం చేస్తారోనని పరిసర ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ బూడిదను ఇటు కల బట్టీలు, సిమెంట్ కంపెనీలు, కన్స్ట్రక్షన్లలో వినియోగిస్తారు. పెరుగుతున్న ధరలు అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి బూడిద రేట్లను భారీగా పెంచుతున్నారు. పాల్వంచ కేటీపీఎస్లో టన్ను ధర రూ.30 నుంచి రూ.60 ఉండగా, టీబీపీఎస్లో రూ.150 నుంచి 200వరకు విక్రయిస్తున్నా రు. ఇది కాక లోడింగ్ చార్జీలు, కాటా చార్జీల ఆధారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తద్వారా విక్రయాలు తగ్గి బూడిదను చెరువులకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిండిన చెరువులు పవర్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిద ఎక్కువ శాతం బంకర్ల ద్వారా ఇటుకల బట్టీలకు, సిమెంట్ కంపెనీలకు విక్రయించి, కొంత శాతం బూడిదను వాటర్ ద్వారా బూడిద చెరువుకు తరలిస్తారు. కానీ పవర్ ప్లాంట్లో దానికి భిన్న పరిస్థితి ఉంది. అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి అధిక రేట్లకు టెండర్లు వేసి బూడిద విక్రయిస్తున్నారు. రేట్లు అధికంగా ఉండడంతో సిమెంట్ కంపెనీలు, ఇటుకల బట్టీల యజమానులు మరోచోట బూడిదను కొనుగోలు చేస్తుండటంతో.. మిగులుతున్న బూడిదను గొట్టాల ద్వారా చెరువులకు తరలిస్తున్నారు. తద్వారా బూడిద చెరువులు నిండుతున్నాయి. ఇలా ఐదునుంచి పదిఅడుగులు ఉండాల్సిన బూడిదచెరువులు బూడిదతో నిండటం, వేరే ఒకమార్గం లేక సుమారు 30 నుంచి 40 అడుగులఎత్తుకు చెరువులను పెంచుతున్నారు. అది నిడితే అధికారులు ఏంచేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉచితంగా ఇవ్వాలి పవర్ ప్లాంట్ నిర్వాసిత గ్రామాల్లో ఉంటున్న ప్రజలకు, ఇటుకల బట్టీలకు, అవసరమైన వారికి ఉచితంగా బూడిద అందజేయాలి. అధిక రేట్లకు కొనలేని పరిస్థితి ఉంది. అధికారులు బూడిదను కూడా విక్రయిస్తుండడం సరికాదు. ఈ అంశంపై ఇప్పటికై నా పునరాలోచించాలి. –సుబ్బారెడ్డి, ఇటుకల బట్టీ యజమాని, ఐలాపురం ధరలు తగ్గించాలి బీటీపీఎస్లో బూడిద ధరలను తగ్గించాలి. నామమాత్రపు ధరలకు బూడిదను విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలి. టన్నుకు రూ.180 నుంచి రూ.200 పెట్టుకుని బూడిద కొంటే ఇటుకలు అధిక రేట్లకు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అధికారుల తగు చర్యలు తీసుకోవాలి. –రవి, బట్టుపల్లి -
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
దుమ్ముగూడెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మారుమూల ప్రాంతాల ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. నర్సాపురంలో మంగళవారం నిర్వహించిన ధర్తీ ఆబాజాన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ యోజన సదస్సులో వారు మాట్లాడారు. గిరిజనులు ఆయా సంక్షేమ పథకాలు పొందాలంటే వ్యక్తిగత గుర్తింపు కార్డులు అవసరమని, వివిధ రకాల గుర్తింపు కార్డులు అందించేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్, కేవైసీ, రేషన్ కార్డులతో పాటు కుల ధ్రువీకరణ పత్రాలను గ్రామ సభల్లోనే పొందొచ్చని చెప్పారు. ఆహార నియమాలు పాటించకపోవడంతో ఎక్కువ మంది సికిల్సెల్ అనీమియా వ్యాధితో బాధ పడుతున్నారని, ఆయుష్మాన్ భవ కార్డు ద్వారా ఇలాంటి వ్యాధులకు రూ.5లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఏఓ సున్నం రాంబాబు, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఈఓ సమ్మయ్య, ఆర్ఐ వెంకటేశ్వర్లు, డాక్టర్ సుభాష్, ఏఓ నవీన్ కుమార్, ఐకేపీ ఏపీఎం హేమంతిని, ఏపీఓ సుకన్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాలి భద్రాచలంటౌన్ : ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని పీఓ రాహుల్ అన్నా రు. గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ కాలేజీలో సీటు సాధించిన దుమ్ముగూడెం మండలం లింగాపురం గ్రామానికి చెందిన కాక జోగారావుకు మంగళవారం ఆయన రూ. 47 వేల చెక్కు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మణిపూర్లో సీటు సాధించిన జోగారావుకు ఉన్నత చదువుల కోసం ఐటీడీఏ నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఎమ్మెస్సీ చదువుతూ స్పోర్ట్స్ కోచింగ్ తీసుకొని జాతీయస్థాయిలో ఎనిమిదో ర్యాంకు, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాడని అభినందించారు. -
వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే
దమ్మపేట: మండలంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నాచారం గ్రామంలో వరి నాట్లు వేస్తున్న మహిళలతో కలిసి నాట్లు వేశారు. మంగళవారం మండలంలోని లింగాలపల్లి, జమేదారుబంజర, గుర్వాయిగూడెం, పార్కలగండి, అంకంపాలెం, అర్లపెంట, కొడిసెలగూడెం, చెన్నువారిగూడెం, జగ్గారం, నాగుపల్లి, నాచారం, తొట్టిపంపు, మొద్దులగూడెం, అల్లిపల్లి, మల్కారం, పెద్దగొల్లగూడెం, దమ్మపేట గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. రూ.3,44,50,000 వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, పాఠశాల ప్రహరీలు, తాగునీటి బోర్లు, పైపులైన్లను ప్రారంభించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నాచారంలో లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి, వైద్య సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. దమ్మపేటలో ఉపాధి హామీ కూలీలకు గడ్డపారలు, బాల్చాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, ఎంపీడీఓ చంద్రశేఖరరెడ్డి, ఎంపీఓ రామారావు, ఏఈలు, డీఈలు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
● నిల్వ సామర్థ్యం లేక ఇక్కట్లు
ఇల్లెందు: ఇల్లెందులోని 13వ నంబర్ బస్తీ 16వ వార్డులో రెండు గదుల రేకుల షెడ్డులో రేషన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక నెలకు సరిపడ బియ్యం కూడా నిల్వచేసే పరిస్థితిలేదు. దీంతో మూ డు నెలల స్టాక్ను ఐదు దఫాలుగా అందజేశారు. ఈ షాపు పరిధిలో 730 రేషన్ కార్డులు ఉండగా ఇప్పటికి 630 మందికి బియ్యం పంపిణీ చేశారు. కొందరు వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడంతో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రేషన్ అందజేస్తున్నారు. కాగా, తమకు మూడు నెలలుగా కమీషన్ ఇవ్వడం లేదని డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతీ నెల కమిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. -
అర్హులందరికీ బియ్యం
● మూడు నెలలకు 16,773 మెట్రిక్ టన్నులు అవసరం ● రేషన్ షాపులకు చేరిన బియ్యం 16,258 మె.టన్నులు ● 2,41,760 కార్డులకు పూర్తయిన పంపిణీ ● కొన్నిచోట్ల కొనసాగుతున్న సరఫరాకొత్తగూడెంఅర్బన్: వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్కార్డుదారులకు మూడు నెలల సన్నబియ్యాని ఈనెల 1 నుంచి సరఫరా చేస్తోంది. ఈనెల 30 వరకు అర్హులందరికీ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది. అయితే కొన్ని దుకాణాల్లో మూడు నెలల స్టాక్ నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో బియ్యం అయిపోగానే మళ్లీ పంపించేలా ఏర్పాట్లు చేశారు. 81.34 శాతం పూర్తి.. జిల్లాలో 2,97,189 రేషన్కార్డులు ఉండగా ఇప్పటికే 2,41,760 కార్డులవారికి బియ్యం పంపిణీ చేశామని, 81.34 శాతం ప్రక్రియ పూర్తయిందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి రుక్మిణి తెలిపారు. మూడు నెలల కోటా 16,773 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను ఇప్పటివరకు 16,258 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపులకు చేరాయని, మరో 515 మెట్రిక్ టన్నుల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ఈనెలాఖరు లోగా అవికూడా పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. అయితే క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల బియ్యం స్టాక్ లేక లబ్ధిదారులు మరో దుకాణానికి వెళ్లాల్సి వస్తుండగా, ఇంకో చోట సరఫరాలో జాప్యం జరుగుతోంది. ● బియ్యం లేక షాప్ మూత.. భద్రాచలంటౌన్: భద్రాచలంలోని ఒక రేషన్ షాపులో బియ్యం నిల్వలు లేక దుకాణాన్ని మూసివేశారు. మండలంలో మొత్తం 21 రేషన్ షాపులు ఉండగా మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించడంతో అధికారులు పూర్తి స్థాయిలో బియ్యం నిల్వ ఉంచారు. కానీ, మెడికల్ కాలనీలోని 19వ నంబర్ షాపులో బియ్యం లేక డీలర్ షాపునకు తాళం వేశాడు. దీంతో లబ్ధిదారులు వేరే దుకాణానికి వెళ్లాల్సివచ్చింది. కాగా, మంగళవారం పట్టణంలో విద్యుత్ కోత ఉండడంతో బయోమెట్రిక్ మిషన్లు పనిచేయక చాలా రేషన్ షాపులను మూసివేశారు. -
మున్సిపాలిటీల్లో పదోన్నతులు, బదిలీలు
అశ్వారావుపేట/ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఖమ్మం నగరపాలక సంస్థ అసి స్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లాను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. అలాగే, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ జె.అనిల్కుమార్కు పదోన్నతి కల్పించి కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్గా నియమించారు.అంతేకాకుండా మధిర, వైరా కమిషనర్లుగావిధులు నిర్వర్తిస్తున్న ఏ.సంపత్కుమార్, సీహెచ్.వేణును అక్కడే పూర్తిస్థాయి కమిషనర్లుగా పోస్టింగ్ ఇచ్చా రు. అంతేకాక పలు మున్సిపాలిటీల్లో జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. కొత్తగూడెంలో పనిచేస్తున్న జె.సుజితకు కేఎంసీలో సీనియర్ అసిస్టెంట్గా, ఇల్లెందులో పనిచేస్తున్న బి.సుధీర్కు వైరాలో, కేఎంసీలో పనిచేస్తున్న డి.నాగరాజుకు కొత్తగూడెం కార్పొరేషన్లో, సత్తుపల్లిలో పనిచేస్తున్న బి.రామచంద్రుకు కేఎంసీలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అలాగే, ఇల్లెందులో పనిచేస్తున్న ఎం.వీరకుమారి, మధిరలో పని చేస్తున్న ఆర్.నాగలక్ష్మి, కొత్తగూడెంలో పనిచేస్తున్న మూడ్ అశోక్, పి.సరస్వతికి పాత కేంద్రాల్లోనే పోస్టింగ్ ఇవ్వగా, మహబూబాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న కే.పీ.దిలీప్కుమార్ను సత్తుపల్లి సీనియర్ అసిస్టెంట్గా నియమించారు. విధుల్లో చేరిన అశ్వారావుపేట కమిషనర్ గ్రేడ్–3 కమిషనర్గా పదోన్నతి పొందిన బి.నాగరాజును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కమిషనర్గా నియమించారు. దీంతో ఇన్నాళ్లు ఇన్చార్జ్ కమిషనర్గా వ్యవహరించిన సుజాత నుంచి బాధ్యతలు స్వీకరించిన నాగరాజు ఆతర్వాత ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో కొత్త కమిషనర్ను ఎమ్మెల్యే సన్మానించి మున్సిపాలిటీలో అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళికపై సూచనలు చేశారు. అశ్వారావుపేట కమిషనర్గా నాగరాజు -
రైతు భరోసాను సద్వినియోగం చేసుకోవాలి
పాల్వంచరూరల్: వానాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా డబ్బులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన పేర్కొన్నారు. మండలంలోని జగన్నాథపురం గ్రామంలోని రైతువేదికలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల నిధులను రైతు ల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఏడీఏ యు.నర్సింహారావు, ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, ఏఓ శంభోశంకర్, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, ఏపీఓ పొరండ్ల రంగా, ఏపీఎం రాంబాబు, పంచాయతీ కార్యదర్శులు చెన్నకేశవ, ఏఈఓలు సత్యం, శాంతి, ఇతర శాఖల అధికారులు కె.వెంకటేశ్వర్లు, మాధవీలత, అశోక్కుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీఐ ఆధ్వర్యాన రక్తదానం
ఖమ్మంగాంధీచౌక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 70వ వ్యవస్థాపక వేడుకల్లో భాగంగా మంగళవారం ఖమ్మం మమత కాలేజ్ రోడ్డు బ్రాంచ్లో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 123 మంది ఎస్బీఐ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్యాంక్ రీజినల్ మేనేజర్ బి.రాజేఖర్ మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడంలో రక్తదానం కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మోహన్నాయక్, బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ ఏజీఎస్ షేక్ ఇబ్రహీం, రీజనల్ సెక్రటరీ ఆర్.శివకుమార్, హెచ్ఆర్ మేనేజర్ ఉదయ్, స్టాఫ్ యూనియన్ వైస్ ప్రసిడెంట్ నందన్, రీజనల్ సెక్రటరీ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరో ముందడుగు
రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్న సీతమ్మ సాగర్ బరాజ్, కరకట్టల నిర్మాణం విషయంలో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్కు కీలకమైన టెక్నికల్ కమిటీ అనుమతులు గత ఏప్రిల్లో జారీ కాగా, ఇప్పుడు భూ నిర్వాసితులకు పరిహారం విషయంలోనూ ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంసీతమ్మసాగర్ కరకట్ట నిర్వాసితులకు పరిహారంలో కదలిక ● ఈ ప్రాజెక్టుతో ఎగువ ప్రాంతాల్లో ముంపు సమస్య ● వరద నివారణకు ఎత్తుగా కరకట్టల నిర్మాణం ● పరిహారం ఇవ్వాలంటూ కొంతకాలంగా ఆందోళనలు 100 అడుగుల ఎత్తుతో.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల మధ్య గోదావరి నదిపై సీతమ్మసాగర్ పేరుతో బరాజ్ నిర్మాణ పనులు 2022 చివరలో ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్ణయించిన ప్లాన్లో బరాజ్కు ఇరువైపులా కొద్ది దూరం మేరకే రివిట్మెంట్ నిర్మాణాలు ఉన్నాయి. అయితే అదే ఏడాది జూలైలో 29 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద గోదావరికి రావడంతో నదీ తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అంతేకాదు.. నదిలో కలిసే వాగుల్లోకి సైతం గోదావరి వరద ఎగపోటు వేసింది. ఈ భారీ వరద ఫలితాలను దృష్టిలో ఉంచుకుని సీతమ్మ సాగర్ బరాజ్కు ఎగువన ఇరువైపులా, నదిలో కలిసే వాగులకు సైతం కరకట్టలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద కరకట్ట ఎత్తు 80 అడుగులుగా ఉంటే బరాజ్కి ఎగువన వంద అడుగుల ఎత్తుతో నిర్మించేలా డిజైన్ చేశారు. భూసేకరణ సమస్య.. సీతమ్మ సాగర్కు ఎగువన ఒక వైపు అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాలు, మరోవైపు దుమ్ముగూడెం, చర్ల మండలాలు ఉన్నాయి. అశ్వాపురం వైపు 40 కి.మీ., దుమ్ముగూడెం వైపు 55 కి.మీ. కరకట్టల పనులు వెంటనే ప్రారంభించారు. ఈ కొత్త నిర్మాణాల కోసం స్థానిక రైతుల నుంచి భూములు సేకరించాల్సి వచ్చింది. ఇందులో కొన్ని పట్టా భూములు ఉండగా మరికొన్ని పట్టా లేనివి ఉన్నాయి. అయితే కరకట్ట పనులు చేపట్టడానికి ముందే తమకు పరిహారం చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఈ తరహా ఆందోళనలు ఎక్కువగా జరిగాయి. ఓ వైపు రైతుల ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు నిర్మాణ పనులు మొదలయ్యాయి. కోర్టు ఆదేశాలతో.. సీతారామ ప్రాజెక్టులో ప్రధానమైన సీతమ్మ సాగర్ బరాజ్, కరకట్ట నిర్మాణ పనులకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని, తమకు సరైన పరిహారం అందించలేదని కొందరు న్యాయస్థానం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో 2023 మే చివరి వారంలో సీతమ్మ సాగర్ బరాజ్ పనులు ఎక్కడివక్కడే ఆపేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో బరాజ్తో పాటు కరకట్ట పనులు సైతం నిలిచిపోయాయి. దీంతో రెండేళ్లుగా కరకట్ట పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థల వారు కొందరు యంత్రాలతో పాటు కార్మికులను ఇతర ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని సంస్థలు భారీ యంత్రాలను నదీ తీరంలోనే నిలిపి ఉంచగా.. అవి తుప్పు పట్టే దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి సీతమ్మసాగర్ విషయంలో సానుకూల నిర్ణయం వెలువడింది.దశలవారీగా పరిహారం.. కరకట్టల నిర్మాణం కారణంగా నష్టపోయే రైతులను ప్రభుత్వం రెండేళ్ల క్రితం గుర్తించింది. అయితే వారికి పరిహారం మాత్రం అందలేదు. తాజాగా చర్ల మండలం దేవరపల్లి(జెడ్) గ్రామంలో 13.26 ఎకరాల స్థలానికి సంబంధించి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దశల వారీగా పరిహారం చెల్లింపులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అంతకుముందే సీతమ్మ సాగర్ బరాజ్, సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు కేంద్రం నుంచి ఆమోదం తెచ్చే విషయంలోనూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత ఏప్రిల్లో టెక్నికల్ కమిటీ నుంచి అనుమతులు వచ్చాయి. పర్యావరణ అనుమతులు రావడం ఇక లాంఛనమే అనే తరుణంలో భూ నిర్వాసితుల పరిహారం విషయంలోనూ కదలిక వచ్చింది. -
నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియాలో వీకే–7ఓసీ గనికి అన్ని రకాల అనుమతులు లభించిన నేపథ్యంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ఈ ఏడాది కంపెనీ నిర్దేశించిన 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని వీకే–7 ఓసీ, రైల్వే సైడింగ్ పనులపై సమీక్షించారు. ఓసీకి కేటాయించిన స్థలాన్ని, నూతన సీహెచ్పీని పర్యవేక్షించారు. అనంతరం ఏరియా అధికారులతో మాట్లాడుతూ రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ, బ్లాస్టింగ్, లోడింగ్ పనుల వివరాలను జీఎంను అడిగి తెలుసుకున్నారు. బొగ్గు నాణ్యత సామర్థ్యం పెంచేలా చూడాలని సూచించారు. తొలుత ఏరియా జీఎం శాలెంరాజు తదితరులు డైరెక్టర్కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జీఎం వెంకటేశ్వర్లు, ఏజీఎం రామకృష్ణ, జీకే ఓసీ పీఓ శ్రీ.రమేష్, తావురియా తదితరులు పాల్గొన్నారు. రైతు సదస్సు వీక్షణకు ఏర్పాట్లు చేయాలిసూపర్బజార్(కొత్తగూడెం): రైతు భరోసా రూ.9 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ప్రభుత్వం సచివాలయం వద్ద మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే రైతు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగిస్తారని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో వీడియో సౌకర్యం ఉన్న 58 రైతు వేదికల్లో రైతులు సదస్సును వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా రైతులు కూడా హాజరయ్యేలా చూడాలని, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. హాజరైన రైతుల వివరాలు నమోదు చేసి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. -
ప్రజావాణికి తగ్గిన రద్దీ
సూపర్బజార్(కొత్తగూడెం): ఇటీవల తరచూ ఏదో ఒక కారణంతో ప్రజావాణి కార్యక్రమాలు వాయిదా పడుతుండటంతో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు ఎక్కువగా హాజరు కాలేదు. దీనికితోడు చెదురు ముదురుగా వర్షాలు పడుతుండటం, గ్రామీణ ప్రాంతాల్లో వానాకాలం సాగు పనులు ప్రారంభం కావడంతో జనం ఎక్కువ సంఖ్యలో రాలేదు. ప్రజావాణికి హాజరైన అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ వివిధ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలు.. ● కుటుంబ పోషణ కోసం ఉద్యోగం ఇప్పించాలని పదో తరగతి చదివిన, పాల్వంచకు చెందిన బధిరురాలు మడిపల్లి నందిని వినతిపత్రం అందజేయగా, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్కు ఎండార్స్ చేశారు. ● తమ గ్రామంలో సంత ఏర్పాటుకు బూర్గంపాడు ఎంపీడీఓ, పోలీసులకు దరఖాస్తు చేసినా స్థల పరిశీలనలో జాప్యం చేస్తున్నారని, త్వరితగతిన పరిశీలన చేపట్టి, సంతకు అనుమతి ఇచ్చేలా చూడాలని బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన దుర్గాల వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయగా, దరఖాస్తును కలెక్టరేట్ ఓఎస్డీకి ఎండార్స్ చేశారు. ● అశ్వాపురం మండలం నెల్లిపాక రెవెన్యూ సర్వే నంబర్ 433/8లోని 30 కుంటల భూమిని 2019లో కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని, తన పేరుమీద పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని బీజీ కొత్తూరు గ్రామానికి చెందిన మర్రి కృష్ణారెడ్డి దరఖాస్తు చేయగా, అశ్వాపురం తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. వైభవంగా రుద్రహోమంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం అమ్మవారికి రుద్రహోమం పూజలు వైభవంగా నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని యాగశాలలో రుద్రహోమం పూజలు చేశారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజలు, రుద్రహోమం గావించారు. చివరన పూర్హాహుతి జరిపారు. రుద్రహోమం పూజలో పాల్గొన్న ముగ్గురు దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్ చెవుగాని పాపారావు తదితరులు పాల్గొన్నారు.ప్రధానికి వేయి సంతకాలతో వినతి సూపర్బజార్(కొత్తగూడెం): పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధా నమంత్రి మోదీకి వేయి సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్కు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు ఈజీఆర్ వెస్లీ, ఆర్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.నాగేశ్వరరావు, టీజీఈ జేఏసీ కన్వీనర్ ఎస్.వెంకటపుల్లయ్య, చైర్మన్ రామారావు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిఇల్లెందురూరల్: మండలంలోని కొమ్ముగూడెం జీపీ నాయకులగూడెం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్తీ ఉదయ్ (21) మృతి చెందాడు. మాణిక్యారం గ్రామానికి చెందిన ఉదయ్, అతని స్నేహితులు ప్రభాస్, వినీత్రాజ్ ముగ్గురు బైక్పై ఇల్లెందు నుంచి మాణిక్యారం వెళ్తుండగా నాయకులగూడెం స్టేజీ వద్ద గేదెను ఢీకొట్టారు. డ్రైవింగ్ చేస్తున్న ఉదయ్ తీవ్రంగా గాయపడగా, అతని స్నేహితులకు స్వల్పంగా గాయాలయ్యాయి. గేదె అక్కడికక్కడే మృతి చెందింది. 108 ద్వారా క్షతగాత్రులను ఇల్లెందు ప్రభుత్వాస్సత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉదయ్ మృతి చెందాడు. సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతా పకడ్బందీగా..
● అంగన్వాడీ సరుకులు పక్కదారి పట్టకుండా ఏర్పాట్లు ● సెంటర్లలో ఫేషియల్ రికగ్నైజేషన్ ● మొదటగా చిన్నారుల తల్లులకే.. ● వచ్చే నెల 1 నుంచి అమలు భద్రాచలంఅర్బన్: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. తల్లుల ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేయాలని భావిస్తోంది. ఆరు నెలలుగా మూడేళ్ల చిన్నారులకు అందించే బాలామృతం, గుడ్ల పంపిణీకి మాత్రమే దీనిని వినియోగిస్తోంది. ఇందుకు ఫోన్ ట్రాకర్ యాప్లో తల్లుల ముఖ గుర్తింపు నమోదు చేస్తోంది. ప్రస్తుతం పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం అమలులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్రక్రియ జూలై 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జులై 1 నుంచి పకడ్బందీగా.. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,061 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 30,654 మంది, 3 – 6 ఏళ్ల మధ్య వారు 26,635 మంది ఉన్నారు. వీరితో పాటు 6,429 మంది గర్భిణులు, 5,825 మంది బాలింతలు ఉన్నారు. ప్రస్తుతం 192 టీచర్, 961 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ నమోదు తప్పనిసరి చేసింది. సరుకులు పక్కదారి పట్టకుండా ఈ ప్రక్రియ అమలు చేయనుంది. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలోని అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఏప్రిల్ నుంచే ఈ ప్రక్రి య కొనసాగుతుండగా.. కొందరికి ఫోన్ ట్రాకర్ పనిచేయక పోగా.. దీన్ని వచ్చే నెల నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నారు. యాప్ను సైతం అప్డేట్ చేశారు. ఇప్పటివరకు చిన్నారులకే.. ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం ఆరు మాసాల వారి నుంచి మూడేళ్ల చిన్నారులకు పంపిణీ చేసే అదనపు ఆహారమైన బాలామృతం, గుడ్ల పంపిణీకి మాత్ర మే ఇప్పటివరకు వర్తించేది. మూడేళ్లలోపు చిన్నారులకు ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని రిజిస్ట్రేషన్ అయి న తల్లి లేదా తండ్రి ఫొటోను ఫోన్లో నమోదు చేసి పంపిణీ చేస్తారు. ప్రస్తుతానికి నమోదు ఇదొక్కటే అయినప్పటికీ రానురాను అన్ని సరుకులను ఫేషి యల్ రికగ్నైజేషన్ ప్రక్రియ ద్వారా పంపిణీ చేయనున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఈ విధానం ద్వారానే అందించనున్నారు. అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలయ్యేలా చూస్తాం. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులకు గుడ్లు, బాలామృతం ప్యాకెట్లు అందించే సమయంలో ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా నమోదు చేస్తున్నాం. జూలై 1 నుంచి బాలింతలు, గర్భిణులకు కూడా ఫేస్ రికగ్నైజేషన్ తర్వాతనే పోషకాహారం అందిస్తాం. ప్రభుత్వ సూచనల మేరకు దీనిని పూర్తిస్థాయిలో అమలులోకి తెస్తాం. –జ్యోతి, సీడీపీఓ, దుమ్ముగూడెం ప్రాజెక్ట్ హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు.. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు అందించే అన్ని రకాల సరుకులు, పోషకాహారం పంపిణీ చేసే సమయంలో ఫేస్ రికగ్నైజేషన్ తప్పనిసరి చేయడంతో చిన్నారుల తల్లులు, ఇటు బాలింతలు, గర్భిణులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులకు అందాల్సిన అన్ని సరుకులు పక్కదారి పట్టకుండా పారదర్శకంగా చేరుతాయని పేర్కొంటున్నారు. -
‘ప్లాంటేషన్’ భూముల ఆక్రమణకు యత్నం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని రామన్నగూడెంలోని సర్వే నంబర్లు 30, 36, 39లో ఉన్న భూములను తమకు అప్పగించాలనే డిమాండ్తో సోమవారం స్థానిక గిరిజనులు అటవీ, ఎఫ్డీసీ ఆధీనంలో ఉన్న ప్లాంటేషన్ భూముల ఆక్రమణకు యత్నించారు. గిరిజనులంతా భూముల్లోకి చేరి నాలుగు గంటలపాటు బైఠాయించారు. ఆయా సర్వేనంబర్లలో ఉన్న సుమారు 573ఎకరాల భూ ములు తమ పూర్వీకుల నుంచి పూర్వపు హక్కు పట్టాలు కలిగి ఉన్నామని, హైకోర్టుతోపాటు నాటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ సర్వే చేసి గిరిజనులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. తాము అనేక దఫాలుగా భూములను అప్పగించాలని పోరాటాలు చేస్తున్నామని, ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టామని, దీంతో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వారం రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి విస్మరించారని వివరించారు. విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ డీఎం గణేశ్, ఎఫ్డీసీ రేంజర్ చంద్రకళతోపాటు అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి గిరిజనులతో చర్చించారు. తహసీల్దార్ రామకృష్ణకు సమాచారం అందించగా.. ప్రస్తుతం కలెక్టర్ అందుబాటులో లేరని మరో రెండు రోజుల గడువు కోరారు. చివరికి అధికారుల వినతితో గిరిజనులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఆశల మొలకలు
పంట చేలల్లోరెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా తేలికపాటి వానలు ● పత్తి పంట, వరినారుకు జీవం పోసిన వర్షపు జల్లులు ● విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు రైతు ‘భరోసా’ ● మరింత ముమ్మరం కానున్న సాగు పనులు బూర్గంపాడు: మృగశిర కార్తెలో ముఖం చాటేసిన వరుణుడు ఆరుద్రలో కరుణించాడు. ఈ నెల 22న ఆదివారం నుంచి ఆరుద్ర కార్తె ఆరంభంకాగా, తొలిరోజు నుంచే జిల్లాలో వర్షపు జల్లులు మొదలయ్యాయి. ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయని సామెత. సోమవారం జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వానలు కురిశాయి. దీంతో పత్తి మొక్కలు, వరినార్లు జీవం పోసుకున్నాయి. పది, పదిహేను రోజుల క్రితం నాటిన విత్తనాలు కూడా మొలకెత్తుతున్నాయి. వరినార్లకు మొలకలు వస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షపు జల్లులతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. పొడి దుక్కుల్లోనే విత్తనాలు ఈ ఏడాది మేలో అకాల వర్షాలు కురవటంతో భూములు పదునయ్యాయి. దీంతో రైతులు అప్పుడే దుక్కులు చేసుకుని పంటల సాగుకు భూములు సిద్ధం చేశారు. ఈ నెల మొదటి వారంలోనే చాలామంది పొడి దుక్కుల్లో పత్తి గింజలు వేశారు. 5న కురిసిన ఓ మోస్తరు వర్షానికి అక్కడక్కడా పత్తి గింజలు మొలకలు వచ్చాయి. ఆ తర్వాత 15 రోజులపాటు చినుకు పడలేదు. దీనికి తోడు ఎండల తీవ్రత పెరగడంతో పత్తి మొక్కలు వడలిపోయాయి. కొన్నిచోట్ల మొక్కలను కాపాడుకునేందుకు రైతులు బిందెలతో నీళ్లు పోశారు. మరికొన్నిచోట్ల మొలకలు రాకపోవటంతో రెండోసారి పత్తి గింజలు విత్తారు. ఈ నెల రెండో వారంలో పోసిన వరినార్లు కొంత మొలకలు వచ్చి, కొంత మొలకలు రాలేదు. ఈ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేశాయి. వాన కోసం రైతులు మూడు వారాలుగా ఎదురుచూస్తున్నారు. శనివారం రాత్రి నుంచి జిల్లాలో అక్కడక్కడా వర్షపు జల్లులు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి జిల్లావ్యాప్తంగా జల్లులు కురిశాయి. సోమవారం ఉదయం నుంచి జిల్లాలో చిరు జల్లులు పడుతుండటం పంటలకు జీవం పోసింది. వర్షాలు ఆలస్యం కావటంతో ఈ ఏడాది పంటల సాగు రెండువారాలు ఆలస్యమైంది. 2.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జిల్లాలో ఈ ఏడాది 2.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా. ఇప్పటికే 1.05 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. మిగిలిన రైతులు ఈ వారంలో విత్తనాలు వేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర పెంచటం, మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ఈ ఏడాది జిల్లాలో పత్తిసాగు గణనీయంగా పెరగనుంది. ఇక ఖరీఫ్లో 1.95 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు వరినార్లు పోసుకున్నారు. కొన్నిచోట్ల వరి నార్లు మొలకలు వచ్చాయి. మోటార్ల కింద రైతులు వరినార్లుకు నీరు పెట్టి నారు పెంచుతున్నారు. భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండితే వరి నాట్లు షురువవుతాయి. బోర్లు కింద జూలై మొదటివారం నుంచి వరినాట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మిర్చికి రేటు పడిపోవటంతో రైతులు విముఖత చూపుతుండటంతో ఈ ఏడాది జిల్లాలో మిర్చి సాగు పడిపోనుంది. అందిన భరోసా.. సాగుకు ఊతం రైతులు పెట్టుబడులకు వెతుకులాడుకోకుండా రైతు భరోసా అందించటం కూడా పంటల సాగుకు ఊతమిచ్చినట్లయింది. జిల్లాలోని రైతులందరికీ దాదాపుగా రైతు భరోసా పెట్టుబడి సాయం అందింది. దీంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఎరువుల కొరత ఉంటుందనే ప్రచారంతో చాలామంది రైతులు రైతు భరోసా నగదుతో ముందస్తుగానే యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. -
ఆదివాసీలు ఆర్థికంగా ఎదగాలి
కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రత్యేకాధికారి సుభాష్ అశ్వారావుపేటరూరల్/ములకలపల్లి: గిరిజనులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ప్రత్యేకాధికారి సుభాష్ సూచించారు. సోమవారం ఆయన ములకలపల్లి మండలం మూకమామిడిలో, అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం, తిరుమలకుంట, గోగులపూడి గ్రామాల్లో నిర్వహించిన ధర్తీ ఆభా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ యోజన సదస్సులకు హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు వ్యక్తిగత గుర్తింపు కార్డులు అవసరమని, అందుకోసమే గ్రామాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా గిరిజన రైతుల పంట పొలాలకు విద్యుత్, బోరు, మోటారు ఏర్పాటుకు సబ్సిడీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొండరెడ్ల, ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు, రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. గోగులపూడి గ్రామంలో కొండరెడ్ల గిరిజనులు వెదురుతో తయారీ చేసిన కళాఖండాలను పరిశీలించారు. ములకలపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించి బోధనాతీరుపై ఆరా తీశారు. అధికారులు సున్నం రాంబాబు, భాస్కర్రావు, గద్దె రేవతి, భాగ్యలక్ష్మి, డాక్టర్ ప్రదీప్కుమార్, రామకృష్ణ, ప్రవీణ్ కుమార్, సంపత్కుమార్, సురేశ్కుమార్, వరప్రసాద్, గఫూర్ పాషా, శివరాంప్రసాద్, మధులిక, రాందాస్ నాయక్, బాపనయ్య, ప్రసాద్ పాల్గొన్నారు. -
వాతావరణ ం
జిల్లాలో మంగళవారం ఉదయం వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఆకాశంలో మబ్బులు కమ్మేయవచ్చు. ఆయిల్పామ్ మొక్కలపై సమగ్ర నివేదిక ఇవ్వాలిజాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి ఆదేశం అశ్వారావుపేట: ఉమ్మడి జిల్లాలోని అశ్వారావుపేట, సత్తుపల్లి మండలం రేగళ్లపాడు నర్సరీల ద్వారా రైతులకు పంపిణీ చేసిన ఆయిల్పామ్ మొక్కలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ సూచించింది. ఈ రెండు నర్సరీల ద్వారా ఇచ్చిన మొక్కల్లో ఆఫ్టైప్ రావడంతో రూ.లక్షల్లో నష్టపోయామని పలువురు రైతులు ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం హైదరాబాదులో ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ విచారణ చేపట్టారు. ఆయిల్ఫెడ్, ఉద్యానశాఖ అధికారులతో పాటు బాధిత రైతులు హాజరవగా 2016 – 2022 మధ్యలో పంపిణీ చేసిన ఆయిల్పామ్ మొక్కల ఎదుగుదల, దిగుబడిపై సమగ్ర నివేదిక నెలలోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విచారణకు ఉద్యానశాఖ కమిషనర్ యాష్మిన్ బాషా, ఆయిల్ఫెడ్ ఎండీ శంకరయ్య, ఓఎస్డీ అడప కిరణ్, ప్రవీణ్రెడ్డి, రైతులు కారం శ్రీరాములు, మడివి బాలరాజు, కొండ్రు మురళి, చెలికాని వెంకట్, తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలి
గుండాల: గిరిజన ప్రాంతాల యువత అన్ని రంగాల్లో ముందుండాలని, భవిష్యత్లో ఉన్నతస్థాయికి ఎదగాలని అడిషనల్ ఎస్పీ నరేందర్ ఆకాంక్షించారు. ఎస్పీ రోహిత్రాజు ఆదేశాల మేరకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గిరిజన యువతను దృష్టిలో పెట్టుకుని పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశామని, అందులో భాగంగానే రవాణాశాఖ అధికారుల సహకారంతో మండలంలోని 100 మంది యువకులకు డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించామని చెప్పారు. గిరిజన యువతకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని, క్రీడాపోటీలు, వైద్యశిబిరాల నిర్వహణ, ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సాహం లాంటి కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని యువకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్, కానిస్టేబుల్ శంకర్ను అభినందించినారు. ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, గుండాల సీఐ రవీందర్, ఎస్ఐ సైదా రవూఫ్ తదితరులు పాల్గొన్నారు. 30 డొమెస్టిక్ సిలిండర్ల సీజ్ కొత్తగూడెంఅర్బన్: జిల్లా పౌరసరఫరాలశాఖ అధికా రులు కొత్తగూడెం, రామవరం, చుంచుపల్లిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కమర్షియల్కు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వాడు తుండగా.. వాటిని సీజ్ చేశారు. 15 హోటళ్లు, రెస్టారెంట్లలో 30 సిలిండర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి మహేశ్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
వాటాధనం నుంచి వాటా..
● సొసైటీలకు ఆరు శాతం డివిడెంట్గా చెల్లించేందుకు నిర్ణయం ● ఫలితంగా రూ.103 కోట్లలో రూ.6 కోట్లు అందే అవకాశం ● రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం డీసీసీబీలో అమలుఖమ్మంవ్యవసాయం: సహకార బ్యాంకుల మనుగడకు మూలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)ల బలోపేతానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) నడుం బిగించింది. సహకార వ్యవస్థలో కీలకమైన పీఏసీఎస్లకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వాటాధనంలో కొంత మేర చెల్లించాలని నిర్ణయించింది. సహకార సంఘాల సభ్యులకు డీసీసీబీ నుంచి ఏటా పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు మధ్య కాలిక, దీర్ఘ కాలిక రుణాలను ఇస్తున్నారు. ప్రతీ రుణంలో 10 శాతం వాటాధనాన్ని అప్పులో భాగంగా తమ వద్దే డిపాజిట్ చేస్తారు. ఇందులో నుంచి ఆరు శాతాన్ని డివిడెంట్ రూపంలో పీఏసీఎస్లకు అందించాలని డీసీసీబీ పాలకవర్గం తాజాగా నిర్ణయించింది. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని ఖమ్మం జిల్లాలో 75, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో రెండేసీ పీఏసీఎస్లతో పాటు 176 వ్యవసాయేతర పరపతి సంఘాలు ఉన్నాయి. అంతేకాక బ్యాంకు 50 బ్రాంచ్లతో రూ.3,600 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. ఏటా సుమారు రూ.1,200 కోట్ల పంట రుణాలు, రూ.900 కోట్లు డిపాజిట్లు కొనసాగుతుండగా, వ్యవసాయ అవసరాలకే కాక బంగారు తాకట్టుపై, గృహ నిర్మాణం, వాహన, విద్య అవసరాలకు కూడా రుణాలు ఇస్తున్నారు. డివిడెంట్గా ఆరు శాతం సహకార సంఘాల ద్వారా అందించిన పంట రుణాలు, ఇతర మధ్య కాలిక, దీర్ఘ కాలిక రుణాల ద్వారా వాటాధనంగా రూ.103 కోట్ల నిధులు ఉన్నాయి. ఇందులో నుంచి ఆరు శాతం అంటే రూ.6 కోట్ల మేర సహకార సంఘాలకు డివిడెంట్ రూపంలో చెల్లించేలా తీర్మానించారు. ఈ నిధులతో సంఘాలు తిరిగి సంఘ సభ్యులకే లబ్ధి జరిగేలా ఖాతాల్లో అప్పు కింద జమ చేసుకునే అవకాశం ఉంది. లేదంటే దీర్ఘకాలిక అవసరాల కోసం గోదాంలు, కోల్డ్ స్టోరీజీలు నిర్మించే ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. 100 సంఘాలకు ప్రయోజనం వాటాధనం నుంచి ఆరు శాతం డివిడెంట్ రూపంలో డీసీసీబీ చెల్లిస్తుండగా, బ్యాంకు పరిధిలోని 100 సహకార సంఘాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. వాటాధనంగా జమ అయిన మొత్తం రైతులు తీసుకున్న పంట రుణాల ద్వారా సమకూరగా, ఆ వాటాధనం రైతులదే కావడంతో అన్నదాతలతో పాటు సహకార సంఘాలకు ప్రయోజనం కలిగేలా డీసీసీబీ పాలక వర్గం డివిడెంట్ చెల్లింపునకు నిర్ణయించింది. సొసైటీల బలోపేతమే లక్ష్యం పీఏసీఎస్ల బలోపేతమే లక్ష్యంగా సంస్కరణలు అమ లు చేస్తున్నాం. బ్యాంకు ఎదుగుదలకు కీలకమైన పీఏసీఎస్ల నుంచి రైతులు తీసుకున్న రుణాల్లో వాటాధనం సేకరిస్తున్నాం. అందులో నుంచి ఆరు శాతం డివిడెంట్గా సంఘాలకు చెల్లించేందుకు పాలకవర్గం నిర్ణయించింది. –ఎన్.వెంకటఆదిత్య, సీఈఓ, డీసీసీబీ తొలిసారి ఇక్కడే.. రాష్ట్రంలో తొమ్మిది డీసీసీబీలు ఉండగా, ఖమ్మం డీసీసీబీ మాత్రమే వాటాధనంలో ఆరు శాతాన్ని సహకార సంఘాలకు డివిడెంట్గా చెల్లించాలని నిర్ణయించడం విశేషం. 105 ఏళ్ల చరిత్ర కలిగిన డీసీసీబీ అనేక సంస్కరణలను తీసుకురాగా, ఒడిదుడుకులు, లాభ నష్టాలను అధిగమిస్తూ రైతులు, ఇతర వర్గాలకు అండగా నిలుస్తోంది. 2023 – 24 నుంచి బ్యాంకు లాభాల్లో పయనిస్తుండగా, 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో రూ.9.64 కోట్ల లాభాలు గడించింది. ఈ నేపథ్యాన బ్యాంకు మనుగడకు మూలమైన పీఏసీఎస్లకు ప్రయోజనం కలిగేలా వాటాధనం చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. -
అరకొర వసతులే!
● స్థాపించి నాలుగేళ్లయినా అసంపూర్తిగా భవనాల నిర్మాణం ● వెంటాడుతున్న అధ్యాపకులు, సిబ్బంది కొరత ● ఇదీ కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాల దుస్థితి ● ఈ నెల 25 నుంచి కళాశాలలో ప్రత్యేక కమిటీల తనిఖీమెడికల్ కళాశాలలో సిబ్బంది వివరాలు.. పోస్టులు ఉండాల్సింది ఉన్నది రెగ్యులర్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ 41 10 01 అసోసియేట్ ప్రొఫెసర్ 51 05 –– అసిస్టెంట్ ప్రొఫెసర్ 139 32 08 ట్యూటర్లు 31 –– 13 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ 76 18 –– అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ 01 –– –– సీనియర్ అసిస్టెంట్ 01 –– – టెక్నీషియన్లు 24 –– –– ఔట్ సోర్సింగ్ సిబ్బంది 75 సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా సంక్షోభం తర్వాత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విరివిగా మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. వైద్యకళాశాలకు అనుమతులు సాధించడంలో చూపించిన శ్రద్ధ కాలేజీ భవనాల నిర్మాణం, సిబ్బందిని భర్తీ చేయడంలో చూపించడంలేదు. దీంతో కొద్దిమంది అధ్యాపకులతో అద్దె భవనాల్లో కళాశాలలు కొనసాగుతున్నాయి. ఈ దుస్థితిపై ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త మెడికల్ కాలేజీల పరిస్థితులపై అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పది ప్రత్యేక కమిటీలను నియమించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు కమిటీ సభ్యులు కళాశాలలను సందర్శించి, పరిశీలించి 30న ప్రభుత్వానికి నివేదిక అందివ్వనున్నారు. నాలుగో బ్యాచ్ వచ్చేస్తోంది జిల్లాకు 2021లో 150 సీట్లతో వైద్యకళాశాల మంజూరైంది. మొదటి బ్యాచ్ విద్యార్థులు 2022 నవంబరులో చేరారు. ఈ ఏడాది కౌన్సెలింగ్ పూర్తయితే నాలుగో బ్యాచ్ విద్యార్థులు కూడా చేరతారు. మొదటి బ్యాచ్ విద్యార్థులు ఫైనలియర్కు చేరుకుని జూనియర్ డాక్టర్ హోదా పొందుతారు. మొత్తంగా ఈ ఏడాది చివరి నాటికి మెడికోలు సుమారుగా 600 మంది, టీచింగ్ స్టాఫ్ రెండు వందల మంది, సపోర్టింగ్ స్టాఫ్తో కలుపుకుని దాదాపుగా వెయ్యి మందికి అనువుగా మెడికల్ కాలేజీకి భవనాలు, హాస్టళ్లు, ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లు, ఆఫీస్ స్టాఫ్ ఇలా అన్ని రకాల సౌకర్యాలు సమకూరాల్సి ఉంది. సమస్యల చిట్టా ప్రస్తుతం కాలేజీ భవనాలు, బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లు, మెస్, రెసిడెంట్ డాక్టర్ల క్వార్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. భవనాలు లేకపోవడంతో పాల్వంచలోని వేర్వేరు చోట్ల గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లు ఏర్పాటు చేశారు. హాస్టల్ మెస్లో పెట్టే భోజనం నాణ్యతగా లేదంటూ గతేడాది వివాదం చోటు చేసుకుంది. హాస్టల్ నుంచి కాలేజీకి, కాలేజీ నుంచి జనరల్ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. ఇటీవల మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోకు ప్రమాదం జరగడంతో మెడికోలు గాయపడ్డారు. ‘భద్రాద్రి కొత్తగూడెం’ తరహాలోనే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో స్టాఫ్ లేకపోవడం, భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడంపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ఎంసీ ఎఫెక్ట్... మొదలైన పనులు మెడికల్ కాలేజీకి హాస్టల్, తరగతి గదులు, మెస్, రెడిసెండ్ డాక్టర్ల క్వార్టర్లు తదితర తొమ్మిది రకాల భవనాల నిర్మాణం జరుగుతోంది. అకడమిక్ క్లాసులు నిర్వహించే భవనం జీ ప్లస్ 4, బాల, బాలికల హాస్టళ్లు జీ ప్లస్ 5 పద్ధతిలో నిర్మించాల్సి ఉంది. మెస్, స్టాఫ్ క్వార్టర్స్ జీ ప్లస్ 2 గా నిర్మించాల్సి ఉంది. 2023 ఆరంభంలో పనులు మొదలవగా 2024 డిసెంబరు నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ నిధుల విడుదలలో జాప్యం కారణంగా నిర్మాణ పనులు ఆగుతూ సాగుతున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు శ్లాబ్ దశకు చేరుకోగా నిధుల సమస్య తలెత్తడంతో గత మార్చిలో పనులు ఆపేశారు. ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పనులు మళ్లీ మొదలు పెట్టారు. భవన నిర్మాణ కార్మికులు, యంత్రాలు తిరిగి కాలేజీ దగ్గరకు చేరుకుంటున్నాయి. -
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
పరుగును ప్రారంభించిన కలెక్టర్ జితేష్, ఎమ్మెల్యే కూనంనేని కొత్తగూడెంటౌన్: అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్ ఉత్సాహంగా సాగింది. క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడాజ్యోతితో పరుగులు పెట్టారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం. పరంధామరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కొత్తగూడెం సూపర్బజార్ వద్ద రన్ ప్రారంభించి బస్టాండ్ సెంటర్, పోస్టాఫీస్ మీదుగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో జిల్లా కేంద్రంలో 50 ఎకరాల్లో కొత్త స్టేడియం నిర్మిస్తామని తెలిపారు. క్రీడల్లో రాణించే యువతను ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, క్రీడా సంఘాల బాధ్యులు సాబిర్పాషా, నాగా సీతారాములు, కొత్వాల శ్రీనివాసరావు, కె.మహీధర్, యుగంధర్రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్, డాక్టర్ బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
భద్రాచలం: గిరిజనుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన అర్జీలను స్వీకరించారు. సంబంధిత యూనిట్ అధికారులకు ఎండార్స్ చేసి, పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో ఆదివాసీ గ్రామాల్లో బ్లీచింగ్, శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అర్జీలు, పరిష్కార వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని ఇలా.. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇప్పించాలని చర్ల మండలం మామిడిగూడెం గ్రామానికి చెందిన సమ్మయ్య ఫిర్యాదు చేశారు. ఎల్టీఆర్ భూ సమస్య పరిష్కరించాలని గుండాల మండలానికి చెందిన వెంకయ్య విన్నవించారు. సౌర విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని సింగరేణి మండలం గేట్ కారేపల్లికి చెందిన శాంత, గురుకులంలో సీటు ఇప్పించాలని ఏన్కూర్కు చెందిన నిహారిక వినతిపత్రాలు అందించారు. ఉద్యోగం కల్పించాలని కూసుమంచికి చెందిన నవ్య, సోలార్ ప్యానల్ ఇప్పించాలని గార్ల మండలం గాజుల తండాకు చెందిన సరోజ, బోరుబావికి అనుమతి ఇవ్వాలని బయ్యారం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రమ విన్నవించారు. నూతన మత్స్య సొసైటీ ఏర్పాటు చేయాలని సూర్యాతండాకు చెందిన 16 మంది అర్జీ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, హరీష్, అరుణ కుమారి, రవీంద్రనాథ్, వేణు, లక్ష్మీనారాయణ, ఉదయకుమార్, ఆదినారాయణ, లింగా నాయక్ పాల్గొన్నారు. గిరిజన దర్బార్లో ఐటీడీఏ పీఓ రాహుల్ -
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి..
సూపర్బజార్(కొత్తగూడెం): అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 20 నుంచి 26 వరకు మిషన్ పరివర్తన, నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు చేపట్టామని, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనీనా అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మాదక ద్రవ్యాలకు బానిస కావొ ద్దని, ఆరోగ్యాన్నే కాకుండా సామర్థ్యాన్ని కూడా నశింపజేస్తాయన్నారు. మాదక ద్రవ్యాలపై విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల ని సూచించారు. డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ దక్షిణ ఫౌండేషన్ ద్వారా భద్రాచలంలో ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలో హాట్స్పాట్ సెంటర్లను గుర్తించి అక్కడి నుంచి మాదక ద్రవ్యాలు ఇతర ప్రాంతాలకు రవాణా కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్, ఎక్సైజ్ శాఖలదే కాకుండా ప్రతి పౌరుడిపై ఉందన్నారు. డ్రగ్స్కు బానిసలైన వారి వివరాలను టోల్ ఫ్రీ నంబర్ 14446కు ఫోన్ చేసి చెబితే తగిన సలహాలు, సూచనలు ఇస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం – ఆరోగ్యంపై ప్రభావం పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో ఆర్డీఓలు మధు, దామోదర్రావు, డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, డీఈఓ వెంకటేశ్వరాచారి, డీఐఈఓ వెంకటేశ్వర్లుతోపాటు అనసూయ, ఇందిర, సంజీవరావు, కరంచంద్, వరప్రసాద్, నరేశ్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన -
డ(ద)యాలసిస్ సేవలు..!
● గుండాలలో డయాలసిస్ కేంద్రానికి ప్రతిపాదనలు ● 20 రోజుల్లో ఏర్పాటు చేసేలా సన్నాహాలు ● పరిశీలన చేసిన ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ టీం ● జిల్లాలో 7 సెంటర్లు.. 53 డయాలసిస్ మిషన్లు ఇల్లెందు: జిల్లాలో మారుమూల మండలమైన గుండాల మండల కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనతో డీసీహెచ్ఎస్ డాక్టర్ జి.రవిబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈనేపథ్యాన గుండాల పీహెచ్సీలో 20 రోజుల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కానుంది. పీహెచ్సీ పరిశీలన.. గత మేలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్కు లేఖ రాయగా.. ఆయన సూచనతో డీసీహెచ్ఎస్ ఐదు పడకల డయాలసిస్ కేంద్రం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రెండు రోజుల క్రితం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ టీం సభ్యులు గుండాల పీహెచ్సీని సందర్శించి అక్కడున్న సదుపాయాలను పరిశీలించారు. ఈక్రమంలో 21న గుండాల మండలానికి వచ్చిన మంత్రి పొంగులేటి దృష్టికి మండల ప్రజలు సమస్యను తీసుకెళ్లడంతో.. ఇప్పటికే ఐదు పడకలతో ప్రతిపాదనలు ఉండగా.. మంత్రి నుంచి ఆదేశాలు రావడంతో మరింత వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. త్వరలో అందుబాటులోకి.. గుండాల మండలంలో సుమారు 30 వేల జనాభా కలిగి ఉంది. గుండాల–ఇల్లెందు, గుండాల– మణుగూరు, గుండాల– ములుగు, గుండాల–నర్సంపేటలు ఒకదానికొకటి కనీసం 70కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కాగా, గుండాల మండలంలో 75 మంది వరకు డయాలసిస్ బాధితులు ఉన్నారు. వీరంతా డయాలసిస్ కోసం సమీప పట్టణానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుండగా.. గుర్తించిన ఎమ్మెల్యే కలెక్టర్తో చర్చించి డీసీహెచ్ఎస్ ద్వారా ఆరోగ్యశ్రీ మెల్త్ కేర్, వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి తెచ్చారు. ఇక్కడ కేంద్రం ఏర్పాటుకు అన్ని అంశాలు సానుకూలంగా మారాయి. జిల్లా పురోభివృద్ధికి దోహదం.. జిల్లాలో ఏడు కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గుండాల వంటి మారుమూల ప్రాంతం నుంచి డయాలసిస్ కోసం వెళ్లాలంటే ఆర్థికంగా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలో ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రులు, చర్ల, పాల్వంచ సీహెచ్సీలు, కొత్తగూడెం జీజీహెచ్లలో డయాలసిస్ సెంటర్లు దిగ్విజయంగా సాగుతున్నాయి. జిల్లాలో డయాలసిస్ సెంటర్లు, యంత్రాల వివరాలు.. సెంటర్ డయాలసిస్ రోగులు యంత్రాలు ఏరియా ఆస్పత్రి 08 32 ఇల్లెందు సీహెచ్సీ పాల్వంచ 10 41 ఏరియా ఆస్పత్రి 10 60 భద్రాచలం ఏరియా ఆస్పత్రి 05 32 మణుగూరు సీహెచ్సీ చర్ల 05 10 ఏరియా ఆస్పత్రి 05 29 అశ్వారావుపేట జీజీహెచ్ కొత్తగూడెం 10 44 మొత్తం 53 248ప్రతిపాదనలు పంపాం.. గుండాల మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఐదు పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. ఆరోగ్య హెల్త్కేర్ యూనిట్ టీం సభ్యులు కూడా పరిశీలించారు. మంత్రి, కలెక్టర్ ఆదేశాలతో 20 రోజుల్లో ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ దృష్టికి తీసుకెళ్తాం. – డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్ఎస్ -
పూర్తయిన పాసేజ్ పిల్లర్ నిర్మాణం
● పిల్లర్ పటిష్టతపై అధికారుల ఆరా ● కొనసాగుతున్న లైనింగ్ పనులుములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐపీ) ప్రాజెక్ట్ ప్రధాన కాల్వపై నిర్మించిన సూపర్ పాసేజ్ పిల్లర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మండలపరిధిలో 48.30 కి.మీ వద్ద ఎగువ భాగంలో వరద నీటిని ప్రధాన కాల్వ దాటేందుకు రూ.కోటి వ్యయంతో సూపర్పాసేజ్ నిర్మించారు. అయితే పాసేజ్ ఎడమ వైపు పిల్లర్ (వీకే రామవరం శివారులో గల పంప్హౌస్–2 నుంచి పంప్హౌస్ –3 కమలాపురంకు వెళ్లే దారిలో) కూలిపోయిన విషయం విదితమే. ఈ విషయమై పత్రికల్లో కథనాలు రావడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యాన మెయిన్ కెనాల్ నిర్మించిన ఏజెన్సీతో నూతన పిల్లర్ నిర్మిస్తామని ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఈక్రమంలో దిద్దుబాటు చర్యలు ఆరంభించారు. గత రెండు నెలల నుంచి.. గత రెండు నెలలుగా పిల్లర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇవి గత పది రోజుల క్రితం పూర్తయ్యాయి. దీంతో పాసేజ్కు సపోర్ట్గా వేసిన ఐరన్ రాడ్లను పూర్తిగా తొలగిస్తున్నారు. ఇదిలా ఉండగా, భూమిపొరల్లో కదలిక వల్ల నిర్మించిన నాలుగేళ్లలోనే ఎడమ పిల్లర్ కూలిన నేపథ్యాన సంబంధిత శాఖ అధికారులు మరింత పటిష్ట చర్యలకు ఉపక్రమించారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోకుండా నేరుగా ప్రధాన కాలువలోకి వెళ్లేందుకు కాంక్రీట్ లైనింగ్ వేస్తున్నారు. కూలిన పిల్లర్కు ఎదురుగా గల కుడివైపు పిల్లర్ పటిష్టతపై కూడా దృష్టి సారించారు. ఈ పిల్లర్ చుట్టూ కాంక్రీట్లైనింగ్ వేస్తున్నారు. నూతనంగా నిర్మించిన పిల్లర్ చుట్టూ కూడా లైనింగ్ పనులు చేపట్టనున్నట్లు నీటిపారుదలశాఖ ఈఈ అర్జున్ తెలిపారు. -
ఆదర్శవంతంగా ఏదులాపురం
ఖమ్మంరూరల్ : నూతనంగా ఏర్పాటైన ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు రహదారుల నిర్మాణ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తూ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పథకాలను అందిస్తున్నామని, తద్వారా పేదలు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం చారిత్రక నిర్ణయమని, ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబ్్, ఈఈ యుగంధర్, ఆర్డీఓ నర్సింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ -
గట్టి ప్రయత్నం..
మట్టి ఇటుకలకు సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో ఆదివారం నిర్వహించిన సండే బ్రిక్స్ చాలెంజ్ పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా...ఉత్సాహంగా జరిగాయి. విద్యార్థులు, యువత మొదలు వృద్ధుల వరకు పోటీల్లో భాగస్వాములయ్యారు. పర్యావరణహిత మట్టి ఇటుకలపై ప్రజలలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ పోటీలను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమకు ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బెంగళూరుకు చెందిన సీఎస్ఈవీ నిపుణుడు సుధాకర్రెడ్డి మట్టి ఇటుకల తయారీ విధానంపై అవగాహన కల్పించారు. 60 శాతం మట్టి, 20 శాతం ఇసుక, 10 శాతం సిమెంట్, పది శాతం సున్నం కలిపిన మిశ్రమంతో యంత్రం ద్వారా ఇటుకలను తయారు చేశారు. దృఢ సంకల్పంతో... కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బ్రిక్స్ చాలెంజ్ కార్యక్రమం పోటీ మాత్రమే కాదని సంప్రదాయ, దృఢ సంకల్పమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో ఎర్రమట్టి పుష్కలంగా లభిస్తుందని, సిమెంట్, ఇసుక, సున్నం కలిపి ఇటుకలు తయారు చేస్తే దృఢంగా ఉంటాయని, కాల్చిన ఇటుకలకు ధీటుగా ఉంటాయని వివరించారు. బెంగళూరు వంటి నగరాల్లో ధనవంతులు ఉదయం వ్యాయామంగా మట్టి ఇటుకలను తయారుచేసి సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారని తెలిపారు. మట్టి ఇటుకలతో జిల్లావ్యాప్తంగా పాఠశాలల ప్రహరీలు, మరుగుదొడ్లు, వంటషెడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు కలెక్టర్ క్యాప్లు, టీ షర్ట్లు బహూకరించారు. విద్యాశాఖ కోఆర్డినేటర్ సైదులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి, డీఈఓ వెంకటేశ్వరాచారి, విద్యాశాఖ కో ఆర్డినేటర్ నాగ రాజశేఖర్, డీఆర్డీఏ, మెప్మా అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వాకర్లు, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు. సండే సందడిగా బ్రిక్స్ చాలెంజ్ పోటీలు తక్కువ వ్యయంతో మట్టి ఇటుకల తయారీపై అవగాహన ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువకుల భాగస్వామ్యంయువతకు ఉపాధి మా కరాటే విద్యార్థులు చాలా మంది పాల్గొన్నారు. వారి ఇళ్లలో తయారీకి ప్రయత్నిస్తారు. దృఢమైన నిర్మాణాలకు మట్టి ఇటుకలను ఉపయోగించుకునేలా ప్రజలకు మా తరఫున అవగాహన కల్పిస్తాం. – పంతంగి సాయి నిరంజన్, కరాటే కోచ్అవగాహన కలిగింది సండే బ్రిక్స్ చాలెంజ్లో పాల్గొనడం ద్వారా మట్టి ఇటుకల తయారు చేసే పద్ధతి తెలిసింది. తోటి విద్యార్థులతో ఈ అనుభవాన్ని, ప్రాధాన్యతను పంచుకుంటాను. చాలా మంచి కార్యక్రమం. – ఓ.ఇందు, ఇంటర్ విద్యార్థిని, సింగరేణి మహిళా కళాశాల దృఢమైన నిర్మాణాలు.. మట్టి ఇటుకలతో నిర్మాణాలు దృఢంగా ఉండటంతోపాటు పర్యావరణానికి మేలు చేస్తాయి. ప్లాస్టింగ్ అవసరం ఉండదు. వీటితో నిర్మించే ఇంట్లో వేసవిలో చల్లదనం ఉంటుంది. సాధారణ ఇటుకలతో పోలిస్తే తయారీ తేలిక, ఖర్చు తక్కువ. దీని ద్వారా ఉపాఽధీ పొందవచ్చు. –సుధాకర్రెడ్డి, బెంగళూరు సీఎస్ఈవీ నిపుణుడు ప్రాధాన్యత తెలిసింది పర్యావరణహిత మట్టి ఇటుకల ప్రాధాన్యం తెలిసింది. మట్టి ఇటుకల తయారీపై మా పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాను. నిర్మాణాల్లో వినియోగించే విధంగా కృషి చేస్తాను. –నాగలక్ష్మి, వ్యాయామ ఉపాధ్యాయురాలు, టేకులపల్లి -
మొరాయించిన స్పీడ్ బోటు
కిన్నెరసాని జలాశయం మధ్యలో పర్యాటకుల ఆందోళన పాల్వంచరూరల్: పర్యాటకులు ఆదివారం జలవిహారం చేస్తుండగా స్పీడ్ బోటు కిన్నెరసాని రిజర్వాయర్ మధ్యలో మొరాయించింది. జలాశయంలో మొసళ్ల సంచారం ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందారు. నెల క్రితమే బోటుకు మరమ్మతులు చేపట్టినా ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోయింది. డ్రైవర్ మరమ్మతులు నిర్వహించగా తిరిగి స్టార్ట్ కావడంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. కొరవడిన పర్యవేక్షణ బోటింగ్ పాయింట్ వద్ద టూరిజం కార్పొరేషన్ మేనేజర్ నిత్యం పర్యాటకుల భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఆదివారం మేనేజర్ విధులకు రాలేదు. స్పీడ్ బోటు జలాశయం మధ్యలో నిలిచిపోవడంతో బోటింగ్ సమస్యపై ఎవరికీ ఫిర్యాదు చేయాలో అర్థం కాలేదని పలువురు పర్యాటకులు పేర్కొంటున్నారు. అనంతరం కొందరు ఏజీఎంకు సమస్యను విన్నవించారు. ఈ విషయమై మేనేజర్ దుర్గాప్రసాద్ను వివరణ కోరగా.. అనారోగ్య సమస్యలతో విధులకు రాలేదని తెలిపారు. ఒక రోజు ఆదాయం రూ. 50 వేలు... కిన్నెరసానికి పర్యాటకల రాకతో ఆదివారం ఒక్కరోజూ రూ. 50 వేల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 684 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.36,090 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.14,040 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరపగా, క్యూలైన్ ద్వారా భక్తులు దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. నేడు రుద్రహోమంపెద్దమ్మతల్లి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా సోమవారం రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని, వివరాలకు 6303408458లో సంప్రదించాలని కోరారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖిత పూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. భద్రాచలంలో గిరిజన దర్బార్..భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయాలని పేర్కొన్నారు. దూరవిద్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంఖమ్మం సహకారనగర్ : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (గత ఎస్డీఎల్సీఈ )లో 2025 – 26లో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ టి.గోపి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన చేశారు. జూలై 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 80088 11998 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ఇంకెన్నాళ్లకు ‘లిఫ్ట్’ ఇస్తారు?
● నత్తనడకన ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులు ● 208–19లో మూడు పథకాలకు రూ.29.64 కోట్లు మంజూరు ● ఇంకా పూర్తికాని నాగారం, సూరారం లిఫ్ట్ల పనులు ● సాగునీటి కోసం ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతులు పాల్వంచరూరల్: ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులు చేపట్టి ఐదేళ్లు గడిచినా పూర్తికాలేదు. పనుల జాప్యంతో సాగునీరు అందక పంటలు సాగు కావడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు మనోవేదన చెందుతున్నారు. మూతపడ్డ ఎత్తిపోతల పథకాల(లిఫ్ట్)ల పునరుద్ధరణకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలో మొత్తం 111 ఎత్తిపోతల పథకాలు ఉండగా, 21 పనిచేయడంలేదు. మరో ఐదు మూతపడ్డాయి. కొన్ని పథకాలు పనిచేస్తున్నాయి. 2018–19 సంవత్సరంలో జిల్లాలో మూడు లిఫ్ట్లకు రూ. 29.64 కోట్లు మంజూరు చేసింది. ఇందులో చర్ల మండలం పెదమిడిసిలేరు వద్ద లిఫ్ట్ను రూ.9.31 కోట్లతో పునరుద్ధరణ చేపట్టారు. పాల్వంచ మండలం నాగారం ఎత్తిపోతల పథకానికి రూ.14 కోట్లు, సూరారం ఎత్తిపోతల పథకానికి రూ.6.33 కోట్లు మంజూరు చేశారు. కానీ పనులు ఇప్పటివరకు పూర్తికాలేదు. నాగారంలో అసంపూర్తిగా.. పాల్వంచ మండలం జగన్నాథపురం సమీపంలో కిన్నెరసాని వాగుపై రూ. 30 లక్షలతో 1978లో నాగారం లిఫ్ట్ నిర్మించారు. జగన్నాథపురం, రంగాపురం, నాగారం, సంగం, నారాయణరావుపేట గ్రామాల పరిధిలో 1,808 ఎకరాలకు సాగునీరు అందించారు. కిన్నెరసాని వాగులో బూడిద మేట వేయడంతో లిఫ్ట్ మరమ్మతులకు గురైంది. పలుమార్లు మరమ్మతులు నిర్వహించి సాగునీరు అందించారు. 1981లో పథకం పూర్తిగా నడపలేని పరిస్థితి తలెత్తడంతో మూతపడింది. ఆయకట్టు రైతుల విన్నపంతో రూ.18 లక్షలతో మరమ్మతులు చేపట్టినా రైతులకు ఉపయోగపడలేదు. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 2019లో ప్రభుత్వం లిఫ్ట్ల పునరుద్ధరణకు రూ. 14 కోట్లు మంజూరు చేయగా, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కిన్నెరసాని వాగు ఒడ్డున పాత లిఫ్ట్ సమీపంలో ఓ బావిని తవ్వి అసంపూర్తిగా వదిలేశారు. పైపులైన్ కోసం కాల్వ నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం ఆ కాల్వలు కూడా పూడుకుపోయాయి. కొంత దూరం పైపులైన్ వేశారు. లిఫ్ట్ కోసం తెచ్చిన పైపులు బీసీఎం ప్రధాన రహదారి పక్కన పడవేశారు. అటవీశాఖ అభ్యంతరాలతో పనులు నిలిచిపోయాయి. పిల్ల కాల్వలు నిర్మించాల్సి ఉంది. సూరారంలో పైపులైన్ నిర్మించలే.. సూరారం గ్రామ సమీపంలోని మూతపడ్డ లిఫ్ట్ పునరుద్ధరణ పనుల్లో కూడా తీవ్ర జాప్యం చేస్తున్నారు. 1986లో లిఫ్ట్ నిర్మాణం చేపట్టారు. సూరారం, బిక్కుతండా, కమ్మరిగూడెం, సోములగూడెం గ్రామాల పరిధిలో 970 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందింది. కిన్నెరసాని వాగు ఒడ్డున కట్టిన లిఫ్ట్తో పలువురు రైతులు లబ్ధిపొందారు. కానీ బూడిదనీరు కిన్నెరసాని వాగులో ప్రవహించడంతో లిఫ్ట్ పనిచేయకుండా పోయింది. 2019లో పునరుద్ధరణ కోసం రూ.6.33 కోట్లు మంజూరు చేశారు. టెండర్ల ద్వారా పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రధాన పైపులైన్ పనులు మాత్రం పూర్తిచేశారు. ఇంకా 9 కిలోమీటర్ల మేర పైపులైన్ కాల్వ నిర్మించాల్సి ఉంది. పంపుహౌస్, మైనర్ పనులు నిర్వహించాల్సి ఉన్నా చేపట్టడంలేదు. ఇక నాగారం లిఫ్ట్ కింద 14 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మించాల్సి ఉంది. నత్తనడకన సాగుతున్నాయి... నాగారం లిఫ్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈఏడాది పూర్తయ్యే పరిస్థితి కన్పించడంలేదు. పైపులైన్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు అందించాలి. పనులు పూర్తయితే రెండు పంటలకు సాగునీరు అందుతుంది. –బాదర్ల నాగేశ్వరరావు, జగన్నాథపురం, రైతుత్వరితగతిన పూర్తి చేయాలి సూరారం లిఫ్ట్ పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. పంపుహౌస్, మైనర్ కాల్వల పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు కూడా పూర్తి చేసి భూములకు సాగునీరు అందించాలి. లిఫ్ట్ కింద మాకు రెండెకరాలు ఉంది. నీళ్లు లేకపోవడంతో పంటలు పండటం లేదు. –పి. సందీప్, సూరారంపనులు కొనసాగుతున్నాయి సూరారం, నాగారం లిఫ్ట్ నిర్మాణ పనులు గతేడాదే పూర్తికావాల్సి ఉంది. పనుల్లో జాప్యంపై సంబంధిత కాంట్రాక్టర్కు రెండు సార్లు నోటీసులు జారీ చేశాం. అయినా స్పందించకపోవడంతో మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగించాం. – బి.అర్జున్, జలవనరులశాఖ ఈఈ -
నీటి చుక్క నిలవక..
మైదానాన్ని తలపిస్తున్న పెదవాగు ప్రాజెక్ట్ ఏటా వానాకాలం సీజన్లో సాగునీటితో నిండే పెదవాగు ప్రాజెక్ట్ ఈ ఏడాది మాత్రం పచ్చదనం పర్చుకుంది. గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లివద్ద ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఆనకట్టకు భారీ గండి పడి కోతకు గురైంది. ఈ ఏడాది వానాకాలం సీజన్కు ముందే ప్రాజెక్ట్ను తిరిగి నిర్మిస్తామని పాలకులు హామీ ఇచ్చారు. వరద ఉధృతికి ఆనకట్ట కొట్టుకుపోయినట్లే ఆ హామీ కూడా కొట్టుకుపోయి గోదారిలో కలిసింది. దీంతో ప్రాజెక్ట్లో సాగునీరు నిలవక పచ్చదనంతో నిండి క్రికెట్ మైదానంలా కనిపిస్తోంది. కాగా ఆయకట్టు రైతులు సాగునీటి కోసం మనోవేదన చెందుతున్నారు. –అశ్వారావుపేటరూరల్ -
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
జూలూరుపాడు:పురుగు మందు తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ బాదావత్ రవి తెలిపిన వివరాల ప్రకారం.. పాపకొల్లు రెవెన్యూ పరిధి వెనకతండాకు చెందిన కళావతి(32)కి, జూలూరుపాడుకు చెందిన షేక్ అన్వర్ను ప్రేమ వివాహం కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరి మతాలు వేర్వేరు కావడంతో అన్వర్ తన భార్యను కులం పేరుతో దూషిస్తూ, అనుమానంతో చిత్రహింసలకు గురి చేసేవాడు. అయినా ఓపికతో ఉంటునా భర్తలో మార్పు రాకపోగా ఈనెల 19న భార్యను అక్రమ సంబంధంపై అనుమానించి, పురుగు మందుల డబ్బా ఇచ్చి ఇంటి తలుపులు మూసివేసి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి అన్వర్ తల్లి తలుపులు తీసి చూడగా.. కళావతి అపస్మారకస్థితిలో పడి ఉండడాన్ని గమనించి చుట్టుపక్కల వారి సాయంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆదివారం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో (తల్లాడ వద్ద) మృతి చెందింది. మృతురాలి తండ్రి ధరావత్ సామ్యా అన్వర్ పెట్టే చిత్రహింసల వల్లే మృతిచెందిందని ఫిర్యాదు చేయడంతో అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవి తెలిపారు. అత్త ఇంటి ఎదుట కోడలు నిరసనమణుగూరుటౌన్: మున్సిపాలిటీలోని గాంధీబొమ్మ సెంటర్లో ఓ వివాహిత తన కొడుకుతో సహా అత్త ఇంటి ఎదుట నిరసనకు దిగింది. శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను బాధితురాలు ఇలా తెలిపింది. మున్సిపాలిటీకి చెందిన బూర రవితేజకు కొన్నాళ్ల క్రితం పగిడేరుకు చెందిన శ్రావణికి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో వారిమధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో మూడేళ్లుగా దూరంగా ఉంటున్నారు. శ్రావణి పుట్టింటికి వెళ్లిపోగా.. పిల్లల్లో ఒకరు తల్లి దగ్గర, మరొకరు తండ్రి వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్త మరో కొడుకును తన నుంచి దూరం చేస్తున్నాడని, మానసికంగా వేధిస్తూ విడాకులు ఇస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని వివాహిత ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని తన కొడుకును తనకివ్వాలని కోరుతూ.. శనివారం అర్ధరాత్రి గాంధీబొమ్మ సెంటర్లోని అత్త ఇంటి వద్ద నిరసనకు దిగింది. దీంతో ఆమె అత్త, భర్త ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. హత్య కేసు నమోదుదుమ్ముగూడెం: భూ సరిహద్దు తగాదాల వల్ల ఓ వ్యక్తి మృతిచెందాడు. సీఐ అశోక్ కథనం ప్రకారం.. మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన సవలం మల్లేష్, సవలం నాగేశ్వరరావుల మధ్య గత కొంతకాలంగా భూమి సరిహద్దు విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి మల్లేష్పై నాగేశ్వరరావు కత్తితో దాడి చేయగా తీవ్రగాయాలు కావడంతో.. భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, వీరిద్దరూ సొంత అన్నదమ్ముల పిల్లలు. హంతకుడు నాగేశ్వరరావు పరారిలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుని కోర్టులో హాజరుపర్చుతామని పేర్కొన్నారు. నగదు చోరీ.. భద్రాచలంఅర్బన్: భద్రాచలం శ్రీసీతా రామచంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు వరంగల్ జిల్లా తొర్రూరు నుంచి ఓ వాహనంలో 20 మంది భక్తులు ఆదివారం ఉదయం భద్రాచలంకు వచ్చారు. ఈ క్రమంలో ముందుగా గోదావరిలో స్నానం చేసేందుకు కరకట్ట కింద వరకు వాహనంలో వెళ్లి తమ వాహనాన్ని అక్కడే నిలిపి అందరూ అందులోకి దిగారు. వీరిని గమనించి ఇద్దరూ దొంగలు సదరు వాహనంలోకి ప్రవేశించి నగదు చోరీ చేసి కిందకు దిగే సమయాన స్థానికులు గుర్తించి పట్టుకుని సదరు భక్తులను పిలిచారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని తమ వద్ద ఉండాల్సిన నగదు రూ.30వేలు లేకపోవడంతో పట్టుబడిన దొంగల జేబులు వెతకగా రూ.30వేలతో పాటు మరో రూ.1,700 లభించాయి. ఈ క్రమంలో స్థానికులు భద్రాచలం టౌన్ సీఐ నాగరాజుకు సమాచారం ఇవ్వగా.. వారు ఆ దొంగలను స్టేషన్కు తరలించారు. ఇద్దరు దొంగలపై ఇదివరకే రెండు కేసులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. తాళం వేసి పరారైన భర్త, అత్త -
చిక్కుముడి
వాతావరణ ం జిల్లాలో సోమవారం ఉదయం చల్లగాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. ● భద్రాచల రామాలయ అభివృద్ధికి ఆటంకం! ● స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించని రెండు కుటుంబాలు ● భూ సేకరణ పూర్తయితేనే పనులు ప్రారంభం మాఢవీధుల విస్తరణకు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అభివృద్ధికి చేపట్టిన మాఢవీధుల విస్తరణకు అడ్డు తొలగడం లేదు. దాదాపు అందరూ ఖాళీ చేసినా ఓ రెండు కుటుంబాల పేచీతో భూ సేకరణ పూర్తి కాలేదు. భూ సేకరణ పూర్తయితేనే రామాలయ అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయి. దీంతో భక్తులకు ఎదురుచూపులు తప్పడంలేదు. మేము నష్టపోయామంటున్న నిర్వాసితులు ప్రభుత్వంపై నమ్మకంతో రామాలయ అభివృద్ధికి సహకరించేందుకు ఆలయానికి పడమర, దక్షిణం వైపున ఉన్న చిరు వ్యాపారులు, ఇళ్ల యజమానులు గత నెల 10వ తేదీ తర్వాత ఖాళీ చేశారు. నష్టపరిహారం పూర్తిగా అందించలేదని, ప్రత్యామ్నాయ ఇంటి స్థలం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే తమ నివాసాలను ఖాళీ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వారు జేసీబీలతో ఇళ్లను కూల్చేశారు. నెల రోజులు దాటినా ఇతర ఇళ్లను ఖాళీ చేయించలేదు. దీంతో తాము వ్యాపారం నష్టపోయామని ఖాళీ చేసిన నిర్వాసితులు పేర్కొంటున్నారు. పుష్కరాల నాటికై నా అవుతాయా..? రామాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అంటున్నా ప్రభుత్వ చిత్తశుద్ధిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నెలలు కావొస్తున్నా అభివృద్ధిలో కీలక ఘట్టమైన మాఢ వీధుల విస్తరణ భూ సేకరణకే నెలలపాటు సమయం తీసుకోవడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. భూ సేకరణ పూర్తయి, మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వం ఆమోదించి, విడతల వారీగా బడ్జెట్ విడుదలైతేనే పనులు పూర్తవుతాయి. ఆ పనులన్నీ అయ్యేదెప్పుడు.. ఆలయం అభివృద్ధి చెందేదెప్పుడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కనీసం గోదావరి పుష్కరాల నాటికై నా ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేస్తారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి భూ సేకరణ పూర్తి చేసి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. రెండు కుటుంబాలతోనే సమస్య రామాలయ అభివృద్ధికి ప్రధానమైన మాఢ వీధుల విస్తరణపై ప్రభుత్వం తొలుత దృష్టి సారించింది. 40 ఇళ్లను తొలగించాలని నిర్ణయించిన అధికారులు సంప్రదింపులు జరిపి 32 మందికి నష్టపరిహారం కొంత అందజేశారు. ఇళ్లు తొలగించారు. ఆ తర్వాత మరికొంత పరిహారం చెల్లించగా ఇంకా సుమారు 25 శాతం పరిహారం చెల్లించాల్సి ఉంది. ప్రత్నామ్నాయ ఇంటి స్థలాన్ని కూడా చూపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు అందరూ ఖాళీ చేసినా రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది మాత్రం ససేమిరా అంటున్నారు. ఆలయంలో పనిచేసే ఓ ప్రధానార్చకుడితోపాటు కొందరు వ్యాపారులు అంగీకరించడం లేదు. రోడ్డు భవనాల శాఖ నిర్దేశించిన మేర కాకుండా పెద్ద మొత్తంలో నష్టపరిహారాన్ని వారు ఆశిస్తున్నట్లు తెలిసింది. చివరకు రెవెన్యూ అధికారులు 2013 చట్టం ప్రకారం ఇవ్వడానికి అంగీకరించినా అది కూడా సరిపోదంటూ వారు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఇటు రెవెన్యూ అధికారులు సైతం సీసీఎల్ కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నష్టపరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసి ఆ ఇళ్లను సైతం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
నల్లబెల్లం, పటిక స్వాధీనం
పాల్వంచ: నాటు సారా తయారీ కోసం నల్లబెల్లం, పటిక తరలిస్తున్న బొలేరో వాహనాన్ని పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ డీసీజి.జనార్ధన్రెడ్డి ఆదేశాల మేరకు ఆది వారం పట్టణంలోని దమ్మపేట సెంటర్లో వాహన తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో బొలేరో వాహనాన్ని ఆపి తనిఖీచేయగా.. 4,025కేజీల నల్లబెల్లం, 20 కేజీ ల పటిక,10లీటర్ల నాటుసారా,2 సెల్ఫోన్లు ఉన్న ట్లు గుర్తించి స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పాల్వంచలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో అప్పగించారు. తనిఖీల్లో ఎస్ఐ సీహెచ్.శ్రీహరిరావు, హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుళ్లు వెంకట్, హరీష్, వీరబాబు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మత్తుపదార్థాల రవాణా, వినియోగంపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 18004252523 సంప్రదించాలని కోరారు. -
గిరులు.. సంప్రదాయాల సిరులు
భద్రాద్రి కొత్తగూడెం: గిరిజన గ్రామాల ప్రజల జీవితం ప్రకృతి, సంప్రదాయాలు, ఆచారాలతో ముడిపడి ఉంటోంది. ఏటా వానాకాలం ఆరంభానికి ముందు నిర్వహించే వన భోజనాలు గిరిజనుల నమ్మకాలు, ఆశలు, ప్రకృతిపై భక్తిని చాటిచెబుతాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు.. గిరిజన గ్రామాల్లో బోనాల పండుగ నిర్వహించి గ్రామ దేవతలను పూజిస్తారు. ఆపై బోనాల సందడి మొదలవుతుంది. భోజనాలు.. ఆటపాటల సందడి వన భోజనాలకు వెళ్లినప్పుడు, ప్రతీ కుటుంబం తమ వంతు ఆహార పదార్థాలు తీసుకెళ్తారు. కొందరు అక్కడే వంటలు చేసుకుంటారు. ఆతర్వాత ఒకేచోట కూర్చుని సహపంక్తి భోజనం చేస్తారు. ఆపై పెద్దలు కబుర్లు చెప్పుకుంటూ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. ఇక పిల్లాపాపలు ఆటపాటలతో సందడి చేస్తారు. వనంలోకి వెళ్లి పూజలు.. బోనాల పండుగ ముగిశాక గిరిజనులు వన భోజనాలకు బయలుదేరుతారు. నిర్ణీత రోజు.. ఊరంతా కలిసి సామూహికంగా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్తారు. వన భోజనాలు అంటే కేవలం భోజనం చేయడమే కాక.. ప్రత్యేకించి వృక్షాలు, ప్రకృతికి పూజలు నిర్వహిస్తారు. అక్కడి వేపచెట్టు, రావిచెట్ల మొదట్లో అటవీ దేవతలను ప్రతిష్టిస్తారు. వాటికి పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమరి్పస్తారు. ఈ క్రతువు ద్వారా వారు భూమి, వర్షం, అటవీ సంపదకు కృతజ్ఞతలు చెబుతారు.పాడిపంటల కోసం ప్రార్థన బోనాలు, వన భోజనాల వెనుక ప్రధాన ఉద్దేశం పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రకృతి, దైవాలను వేడుకోవడమే. గిరిజనుల జీవనం పూర్తిగా వ్యవసాయం, అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉంటుంది. వర్షాలు సరిగ్గా కురవకపోతే వారికి ఇక్కట్లు ఎదురవుతాయి. అందుకే ఏటా వానాకాలం ప్రారంభానికి ముందు పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పెరగాలని ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకునేలా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.మా కాలంలో వేరు.. మా కాలంలో టీవీలు, ఫోన్లు లేవు. వనభోజనాలంటే సరదాగా ఉండేది. వానలు బాగా పడి పంటలు పండాలని గ్రామ దేవతలకు బోనాలు సమరి్పంచి ఆ తర్వాత అడవికి వెళ్తాం. తొలుత ఉమ్మడిగా కలిసి కుండల్లో వంటకాలు సిద్ధం చేసుకునేవాళ్లం. – పోలెబోయిన రామచంద్రయ్య, వెంకటాపురంబంధాలను కలిపే పండుగ.. వన భోజనాలు అనగానే.. ఉదయమే సామగ్రి సర్దుకుని వెళ్తాం. పచ్చని చెట్ల కింద రోజంతా బంధువులతో గడపడం ఆనందంగా ఉంటుంది. అమ్మాయిలం కోలాటం ఆడుతూ పాడతాం. ఇది మా మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. – ఈసం అమృత, పద్మాపురంప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడానికి.. వన భోజనాలంటే మాకు ఊరు పండుగ. వానలు పడాలి, పంటలు బాగా పండాలని దేవుడిని మొక్కుకుని ప్రకృతికి కృతజ్ఞతలు చెబుతాం. ఇదంతా వేడుక మాదిరి సాగుతుంది. మా తాత, తండ్రి తర్వాత వారసత్వంగా ఏటా కొనసాగిస్తున్నాం. – చందా రామకృష్ణ, చిరుమళ్ల -
పదేళ్ల క్రితం మరమ్మతులు
గేట్లకు పదేళ్ల క్రితం మరమ్మతులు నిర్వహించారు. నాలుగైదు ఏళ్లకోసారి మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా జెన్కో అధికారులు పట్టించుకోవడం లేదు. రిజర్వాయర్లోని నీటిమట్టం 393 అడుగుల లోపు ఉంటేనే పనులు చేపట్టేందుకు వీలవుతుంది. అంతకంటే ఎక్కువగా పెరిగితే పనులు సాధ్యం కావని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ ఒకటో గేటు నుంచి నాలుగో గేటు వరకు, 13వ నంబర్ గేటు మధ్య పిల్లర్లకు బీటలు వారాయి. దీంతో పిల్లర్ల మధ్య నీటి చెమ్మ అధికంగా కన్పిస్తోంది. గేట్ల మధ్య రబ్బర్ సీల్స్ కూడా లీకవుతుండటంతో రిజర్వాయర్ నుంచి నీరు వృథాగా పోతోంది. అయితే ఈ లీకులతో ప్రమాదమేమీ లేదని కేటీపీఎస్ అధికారులు చెబుతున్నా రు. రిజర్వాయర్లో నీటిమట్టం 400 అడుగులకు మించి పెరిగినప్పుడే బీటలనుంచి నీళ్లు బయటకు వస్తాయని పేర్కొంటున్నారు. పరీవాహక గ్రామాల ప్రజ లు, ఆయకట్టు రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆదిలోనే మరమ్మతులు నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. కాగా పిల్లర్ల మరమ్మతులు, ఇతర పనుల కోసం ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభు త్వ పథకం డ్రిప్ ఇరిగేషన్ కింద రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపారు. కానీ నిధులు మంజూరు కాలేదు. -
తిమ్మంపేట శివారులో క్షుద్ర పూజలు
ములకలపల్లి: మండల పరిధిలోని తిమ్మంపేట శివారులో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామశివారులో బీటీ రోడ్డుపై పూజలు చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి. పసుపు, కుంకుమలతో మానవ ఆకారంలో బొమ్మ గీశారు. శుక్రవారం అర్ధరాత్రి పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిని కట్టేసి హత్యాయత్నంఇల్లెందురూరల్: భార్య, అత్తగారింటి సభ్యులు తనను కట్టేసి హత్య చేయబోయారని ఆరోపిస్తూ భర్త రామకృష్ణ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన రామకృష్ణకు ఇల్లెందులోని స్టేషన్బస్తీకి చెందిన రాజేశ్వరితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య రాజేశ్వరి, అత్త ఆళ్లకట్టి సరిత, మామ సారయ్య, బావమరిది ప్రేమ్సాయి కలిసి మాట్లాడుదామని ముకుందాపురంలో ఉంటున్న రామకృష్ణను నిజాంపేటలో అతను అద్దెకు తీసుకున్న ఇంటికి పిలిపించారు. మాటమాట పెరిగి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రామకృష్ణను ఇంట్లో సిమెంట్ పోలుకు కట్టేసి పెట్రోల్ చల్లుతుండగా, అదే సమయంలో అక్కడికి వచ్చిన అతని మేనమామ బండారు శ్రీనివాస్ రక్షించి ఆస్పత్రిలో చేర్పించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు. అక్రమ ఇసుక నిల్వలు సీజ్దుమ్ముగూడెం: మండలంలోని దుమ్ముగూడెం కరకట్ట తదితర ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను శనివారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సుమారు 40 ట్రక్కుల ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేశామని తహసీల్దార్ అశోక్కుమార్ తెలిపారు. ఆయన వెంట ఆర్ఐ వెంకటేశ్వరరావు ఉన్నారు. -
బడిలో సెల్కు చెల్లు
వైరా: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇకపై తరగతి గదిలో సెల్ఫోన్ మాట్లాడడం నిషేధం. ఈ విషయమై రాష్ట్రప్రభుత్వం కొద్దిరోజుల క్రితం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తరగతి గదిలో ఉన్న సమయాన సెల్ఫోన్లో మాట్లాడితే చర్యలు ఉంటాయని అందులో వెల్లడించింది. రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వినియోగిస్తున్నారనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో ఫోన్లు మాట్లాడడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పిల్లల చదువుపై ప్రభావం పడుతుందని నిపుణుల సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఉపాధ్యాయులు స్వీయ నియంత్రణ పాటిస్తూ సెల్ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని సూచించింది. విలువైన సమయం వృథా కాకుండా.. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్ మాట్లాడడం ద్వారా సమయం వృథా అవుతుందని, విద్యార్థుల్లో ఏకాగ్రత దెబ్బతింటుందని చెబుతున్నారు. అంతేకాక ఫోన్లో మాట్లాడగానే అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు వెంటనే పాఠ్యాంశంలో నిమగ్నం కావడం సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. ఈ విషయమై విద్యావేత్తల నుంచి అందిన సమాచారంతో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. కాగా, ఉపాధ్యాయులు తరగతి గదిలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకో వాలి. రాగానే స్టాఫ్రూమ్లో పెట్టడం.. విరామ సమయాల్లోనూ చూసేలా పర్యవేక్షించాల్సి ఉంటుంది. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఫోన్ మాట్లాడొద్దు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువుపై ప్రభావం పడుతుందని నిర్ణయం -
37 కేజీల గంజాయి సీజ్
పాల్వంచరూరల్: గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలతోపాటు ఓ వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సీతానాగారం కాలనీ వద్ద రూరల్ ఎస్ఐ సురేష్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న కారు పోలీసులను గమనించి కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వైపు మళ్లింది. దీంతో పోలీసులు వెంబడించి కారును పట్టుకుని తనిఖీ చేశారు. వాహనంలో రూ.18.82 లక్షల విలువైన 37.650 కేజీల గంజాయి లభించింది. గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సింగ్యాతండాకు చెందిన బానోతు వెంకన్న, బానోతు కల్పన, నర్సంపేట మండలం రాంనాయక్ తండాకు చెందిన గుగులోతు పార్వతిలను అరెస్ట్ చేశారు. విచారించగా ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి తరలింపునకు ఎస్కార్ట్గా ఉన్న ఒడిశాకు చెందిన రమేష్, రాము, బెంగళూరుకు చెందిన రాజేష్, ఏపీ రాష్ట్రంలోని తాడిపత్రికి చెందిన జవహర్లు పరారీ లో ఉన్నారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు నిందితుల అరెస్ట్ -
వెల్లువలా వినతులు
● జిల్లాలో 529 భూ భారతి సదస్సులు.. ● 58,345 దరఖాస్తులుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో నిర్వహించిన భూ భారతి అవగాహనా సదస్సుల్లో వివిధ సమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా 529 సదస్సులు జరగగా.. 58,345 వినతులు వచ్చాయి. కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని సుజాతనగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా, ఇక్కడ నిర్వహించిన సదస్సుల్లో 649 మంది పలు రకాల భూ సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ డివిజన్లో మొత్తం 15 మండలాలు ఉండగా మిగిలిన 14 మండలాల్లో 45,698 దరఖాస్తులు వచ్చాయి. భద్రాచలం డివిజన్లోని 8 మండలాల్లో 207 సదస్సులు జరగగా 12,657 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగూడెం ఆర్డీఓ మధు, భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు ఆయా డివిజన్లలో సదస్సులను పర్యవేక్షించారు. పలుచోట్ల కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై భూ భారతి సదస్సుల ప్రాధాన్యతను రైతులకు వివరించారు. ప్రధానంగా సాదాబైనామా, అసైన్మెంట్ భూముల రిజిస్ట్రేషన్, భూముల సర్వే సరిహద్దుల సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు అందాయని, వీటిపై సమగ్ర విచారణ చేస్తామని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు. -
తీరు మారడం లేదు !
● ఏసీబీకి చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ● లంచం తీసుకుంటూ పట్టుబడిన టైపిస్ట్ ● బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఘటన బూర్గంపాడు: జిల్లాలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ తరచూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఓ ఘటన మరువక ముందే మరో ఘటన అన్నట్టుగా దొరికిపోతున్నారు. పట్టుబడిన వారిపై వేటు వేస్తున్నా.. మిగితా ఉద్యోగుల వైఖరిలో మార్పు రావడం లేదు. ఇటీవల భద్రాచలం, మణుగూరులో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు సీఐలు, సిబ్బంది లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నాలుగు నెలల క్రితం ఆళ్లపల్లి మండల పంచాయతీ అధికారి కూడా ఏసీబీకి చిక్కాడు. జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా.. లంచాలకు అలవాటుపడిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో ప్రజల్లో చైతన్యం పెరిగింది. లంచం అడిగిన వారి సమాచారాన్ని నేరుగా ఏసీబీకి చేరవేస్తుండగా ఆ శాఖ అధికారులు పధకం ప్రకారం దాడులు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. రూ.4వేలు తీసుకుంటూ.. బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్ట్గా పనిచేసే నవక్రాంత్ కొత్త రేషన్ కార్డు జారీ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సదరు వ్యక్తి శనివారం నవక్రాంత్కు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ దాడిచేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నవక్రాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. ఆరేళ్లలో మూడోసారి.. బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో గత ఆరేళ్లలో ఇప్పటికి మూడుసార్లు ఏసీబీ దాడులు జరిగాయి. పట్టాదారు పాసు పుస్తకాల కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఇన్చార్జ్ తహసీల్దార్(డిప్యూటీ తహసీల్దార్), టైపిస్ట్ గతంలో ఏసీబీకి దొరికిపోయారు. ఆ ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత ఇసుక కూపన్లకు లంచం తీసుకుంటూ మరో డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. మరోసారి ఏసీబీ దాడులు నిర్వహించేందుకు సమయాత్తమవుతున్న తరుణంలో లంచం అడిగిన అధికారి ఒకరు తెలివిగా విధులకు డుమ్మా కొట్టి తప్పించుకోగలిగాడు. వరుసగా ఈ కార్యాలయంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఉద్యోగులు ఏ మాత్రం భయం లేకుండా లంచం డిమాండ్ చేయడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల వ్యవధిలో మూడుసార్లు తహసీల్ కార్యాలయ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. అయినా అధికారులు, ఉద్యోగులు మాత్రం తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు. వీడియో తీసిన రైతు..అశ్వాపురం మండలంలో ఓ రైతు తన అవసరాల నిమిత్తం పొలం అమ్మగా కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ రూ.15 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో రూ.5వేలు ఇస్తానని ఒప్పుకున్న రైతు.. తహసీల్దార్కు లంచం ఇస్తూ తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం సదరు తహసీల్దార్పై బదిలీ వేటు వేశారు. -
లాకులకు లీకులు..
పాల్వంచరూరల్: పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చడంతోపాటు తాగు, సాగునీరు అందించే కిన్నెరసాని ప్రాజెక్ట్కు ప్రమాదం పొంచిఉంది. పదేళ్లుగా ప్రాజెక్ట్ గేట్లు(లాకులు) మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీంతో గేట్ల మధ్య లీకులు ఏర్పడి జలాశ యం నుంచి నీరు వృథాగా పోతోంది. రెండు, మూ డేళ్లుగా గేట్ల రబ్బర్ సీల్స్ లీకై నీళ్లు బయటకు వస్తున్నాయి. లీకేజీ చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు, పరీవాహక ప్రాంతాల ప్రజ లు పేర్కొంటున్నారు. గేట్లకు సంబంధించిన పిల్ల ర్లు కూడా దెబ్బతింటున్నాయి. మరమ్మతులకు అవసరమైన నిధులున్నా పనులు చేపట్టడంలేదు. ప్రా జెక్ట్ నిర్వహణ చూస్తున్న జెన్కో (కేటీపీఎస్) అధి కారులు మేల్కొనకపోతే పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. రిజర్వాయర్ సామర్థ్యం 407 అడుగులు కిన్నెరసాని రిజర్వాయర్ నిర్మాణం 1962లో ప్రారంభించి 1972లో పూర్తిచేశారు. 13క్రస్ట్గేట్లతో 407 అడుగుల గరిష్ట నీటిమట్టంతో 8.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయం నిర్మించారు. తొలుత ప్రాజెక్ట్ను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షించగా, 1998 ఏప్రిల్ 1 నుంచి జెన్ కో పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్ట్ నిర్మించి ఆరు దశాబ్దాలు గడుస్తుండగా మధ్యలో జెన్కో అధికారులు కరకట్టను పటిష్టపరిచే పనులు చేపట్టారు. 2014లో రూ.60 లక్షలతో 13 క్రస్ట్ గేట్లకు రోప్ వే, సాకెట్లను మార్చారు. దీంతో వీటిని మరో పదేళ్లు మార్చాల్సిన అవసరం లేదు. కాగా కిన్నెరసాని జలాశయం విస్తీర్ణం 515 చదరపు మీటర్లు, డ్యామ్ ఎత్తు 39మీటర్లు, పొడవు 2.4 కిలోమీటర్లుగా ఉంది. కేటీపీఎస్లో విద్యుదుత్పత్తికి, ఎన్ఎండీసీ, నవభారత్, కర్మాగారాలకు కిన్నెరసాని నుంచే నీరు సరఫరా చేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు తాగునీరు, పాల్వంచ మండలంలో మూడు వేలు, బూర్గంపాడు మండలంలో 7 వేల ఎకరాలకు సాగునీరు కూడా అందిస్తున్నారు. కట్ట పటిష్టతకు రూ.1.90 కోట్లు కిన్నెరసాని జలాశయం కరకట్ట పటిష్టతకు జెన్కో యాజమాన్యం రూ.1.90 కోట్లు, గేట్ల మరమ్మతులకు రూ.1.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. అయితే పుణేలోని సెంట్రల్ వాటర్ పవర్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నుంచి నిపుణులు వచ్చి అధ్యయనం చేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ను పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించిన తర్వాత పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులతోపాటు భవిష్యత్లో ఎదురయ్యే పరిణామాలను తట్టుకునేలా నిపుణులు అధ్యయనం చేసి సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. ఇక గేట్ల మరమ్మతులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. కిన్నెరసాని ప్రాజెక్ట్కు పొంచి ఉన్న ముప్పు పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోని గేట్లు నిధులున్నా టెండర్లకు ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు ప్రమాదమేమీ లేదని కొట్టిపారేస్తున్న జెన్కో అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచాం.. కిన్నెరసాని గేట్ల మరమ్మతుల కోసం రూ.1.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. గత నెల 6న, 22న, ఈ నెల 3న... మూడు సార్లు టెండర్లు పిలిచాం. కానీ కాంట్రాక్టర్లు ఎవరూ ముందురావడంలేదు. డ్యామ్లో నీటిమట్టం 393 అడుగులు ఉంటేనే మరమ్మతులు చేసే అవకాశంఉంటుంది. గేట్ల మధ్య సీల్స్ ఏర్పాటు, రోప్ మార్పు, పెయింటింగ్ పనులు నిర్వహిస్తాం. డ్యామ్ సేఫ్టీ కోసం కూడా ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. –ప్రభాకర్రావు, కేటీపీఎస్ 5వ దశ సీఈ -
సంస్కృత పండితుడికి సన్మానం
భద్రాచలంటౌన్: భద్రాచల దేవస్థానంలో సంస్కృత పండితుడిగా పనిచేస్తున్న ఎస్టీజీ శ్రీమన్నారాయణ ఆచార్యులును భద్రాద్రి దేవస్థానం, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో శనివారం ఘనంగా సన్మానించారు. వేలాది మంది విద్యార్థులకు సంస్కృత భాషను బోధించిన ఆయన ఇటీవల ప్రాచ్య విద్య విభూషణం బిరుదు అందుకున్నారు. ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎల్. రమాదేవి, ఏఈఓలు శ్రవణ్ కుమార్, భవాని రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప కాలనీలో నివాసాల కూల్చివేతభద్రాచలంఅర్బన్: పట్టణంలోని అయ్యప్ప కాలనీలో ఉన్న 40 నివాసాలను శనివారం గ్రామ పంచాయతీ అధికారులు జేసీబీ యంత్రాలతో కూల్చివేశారు. ఈ ఇళ్లలో ఉండే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించిందని గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రాంతంలో కలెక్టర్ ఆదేశాల ప్రకారం జామాయిల్ మొక్కలను నాటి, సంరక్షిస్తామని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే అశోక్నగర్ కొత్తకాలనీలో గత నెలలో 41 నివాసాలను సంబంధిత అధికారులు కూల్చివేశారు. భూ వివాదంలో ఘర్షణదుమ్ముగూడెం: మండల పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన సవలం మల్లేష్, సవలం నాగేశ్వరరావు భూ వివాదం నేపథ్యంలో శనివారం రాత్రి గొడవ పడ్డారు. ఈ క్రమంలో నాగేశ్వరరావు కత్తితో దాడి చేయడంతో మల్లేష్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు నాగేశ్వరరావు పోలీస్ స్టేషన్లో లొంగిపోగా, ఘటన స్థలాన్ని దుమ్ముగూడెం సీఐ అశోక్ పరిశీలించారు. విద్యార్థులపై శ్రద్ధ చూపాలి ● భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్వంచరూరల్: విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో సోమవారం నాటికి వందశాతం హాజరు ఉండాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. పాల్వంచలోని గిరిజన బాలికల పోస్టు మెట్రిక్ వసతి గృహాన్ని, బాలుర ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. హాస్టల్ గదులు, డార్మెటరీ, డైనింగ్ హాల్, బాతురూమ్లు, వంటగదులు, వసతి గృహాల పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది, విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలకు చేరుకునేలా హెచ్ఎంలు, వార్డెన్లు చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, డ్రెయినేజీలు, బాత్రూమ్లు శుభ్రంగా ఉంచాలని, పిల్లలకు రక్షిత తాగునీరు అందించాలని చెప్పారు. నూతన మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఆదేశించారు. హాస్టళ్లలో మరమ్మతులు ఉంటే ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. వేసవి సెలవుల అనంతరం హాస్టళ్లకు వచ్చిన విద్యార్థులు ప్రస్తుత వాతావరణం మార్పుతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, వార్డెన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. హెచ్ఎంభద్రు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు. రూ.1.62 కోట్లు కొల్లగొట్టిన కేసులో ఇంకొకరి అరెస్టుఖమ్మం క్రైం: ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి సుమారు రూ.1.62 కోట్ల మేర మోసం చేసిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. బోనకల్ మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఫోన్ చేసిన ముఠా సభ్యులు దితులు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి వాట్సప్, ట్రేడింగ్ లింక్ల ద్వారా సుమారు రూ.1.62 కోట్లు జమ చేయించారు. ఆతర్వాత ముఖం చాటేయడంతో మోసపోయిన గుర్తించిన బాధితుడు ఖమ్మం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో డబ్బు జమ అయిన అకౌంట్ ఆధారంగా ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, నేనావత్ అఖిల్ను నాగర్కర్నూల్ జిల్లాలో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హాజరుపర్చాక రిమాండ్కు తరలించినట్లు సీపీ తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైం డీఎస్పీ ఫణీందర్, ఎస్సైలు రంజిత్కుమార్, విజయ్కుమార్, సిబ్బందిని ిసీపీ అభినందించారు. -
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం
గుండాల : గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే తాము ఈ నాలుగేళ్లలోనే వంద శాతం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేసి చూపుతామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జగ్గుతండా – లక్ష్మీదేవిపల్లి, చీమలగూడెం – ఇప్పలగుంపు మధ్య బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. తూరుబాకలో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ, మామకన్నులో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించారు. ఆళ్లపల్లి మండలంలో కస్తూర్బా పాఠశాల భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. పినపాక నియోజకవర్గానికి మొదటి విడుతగా 4,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఆ తర్వాత విడతల వారీగా ప్రతి నిరుపేదకూ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రతీ సోమవారం నిధులు విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో రూ.17వేల కోట్లు రుణమాఫీ చేస్తే తాము 10 నెలల వ్యవధిలోనే రూ.21వేల కోట్లు మాఫీ చేశామని చెప్పారు. కొత్తగూడెం–ఆళ్లపల్లి మధ్య రోడ్డు నిర్మాణానికి రూ. 100 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారు. గుండాల ప్రభుత్వాస్పత్రికి రెండు డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేశామని, నెల రోజుల్లో ప్రారంభిస్తామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా పోడు సాగు చేస్తున్న భూముల జోలికి వెళ్లొద్దని అటవీ అధికారులకు సూచించిన మంత్రి.. కొత్తగా పోడు సాగు చేయొద్దని గిరిజనులను కోరారు. ఈ మేరకు పోలీసులు, అటవీ అధికారులతో సమావేశం నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటేల్ను ఆదేశించారు. తొలత జగ్గూతండాలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్ మాట్లాడుతూ.. ఈప్రాంత అభివృద్ధికి తాను గతంలో కూడా నిధులు మంజూరు చేయించానని, భవిష్యత్లో కూడా కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్రాజు, ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, అదనపు కలెక్టర్ విద్యాచందన, నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, గాంధీ, ఖదీర్, ముత్యమాచారి, సీపిఐ నాయకులు బొల్లోజు అయోధ్య పాల్గొన్నారు. పొంగులేటి సభకు వర్షం అడ్డంకి.. ఇల్లెందు : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇల్లెందులోని సింగరేణి స్కూల్ గ్రౌండ్లో నిర్వహించాల్సిన పార్టీ నాయకులు, కార్యకర్తల సభకు వర్షం అడ్డంకిగా మారింది. మంత్రి పొంగులేటి హాజరు కానుండగా పెద్ద ఎత్తున ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. సభ ప్రారంభానికి ముందే ఒక విడత వర్షం కురిసింది. అప్పటికే గ్రౌండ్కు చేరుకున్న ప్రజలు చెట్ల కిందకు చేరి వర్షం ఆగిన తర్వాత మళ్లీ సభా ప్రాంగణంలోకి చేరుకున్నారు. గంట ఆలస్యంగా ప్రారంభమైన సభలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసంగిస్తుండగా మరోసారి వర్షం కురిసింది. దీంతో జనం అంతా పరుగులు తీస్తూ ఇంటి దారి పట్టారు. కొంతమంది వర్షంలోనూ తడుస్తూ అక్కడే వేచి ఉండగా సభా వేదిక వద్దకు చేరుకున్న పొంగులేటి వారికి అభివాదం చేసి, మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మంత్రి వెంట ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ పోరిక బలరాం నాయక్, కాంగ్రెస్ నేతలు డానియేల్, దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, సయ్యద్ జానీపాషా, మండల రాము, మడుగు సాంబమూర్తి, బానోతు సుజాత, చిల్లా శ్రీనివాస్, పడిదల నవీన్, అంకెపాక నవీన్ తదితరులు ఉన్నారు. ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తాం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి -
కారు పల్టీ: కమిషనర్కు తీవ్రగాయాలు
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ రోడ్డు ప్రమాధంలో గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి ఇల్లెందు నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఆయన కారు టేకులపల్లి మండలం బోరింగు తండా వద్ద పల్టీ కొట్టింది. దీంతో కమిషనర్కు తీవ్రగాయాలయ్యా యి. అటుగా వెళ్తున్నవారు గమనించి సమాచారం ఇవ్వటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది ఖమ్మం తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న కమిషనర్ను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్గౌడ్ తదితరులు పరామర్శించారు. కాగా కమిషనర్ శ్రీకాంత్ ఆరు నెలల కాలంలో రెండోసారి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థినులకు గాయాలుకొత్తగూడెంఅర్బన్: ఆటో బోల్తా పడి ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థినులు గాయపడ్డ ఘటన శుక్రవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులు ప్రయాణిస్తున్న ఆటో కేఎస్ఎం దగ్గర అదుపు తప్పి పల్టీ కొట్టింది. దీంతో ఓ విద్యార్థిని కాలు విరిగింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను కొత్తగూడెంలోని సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించలేదు. ఎదురెదురుగా బస్సు, ఆటో ఢీకామేపల్లి: కామేపల్లి మండలం ముచ్చర్ల క్రాస్ సమీపాన శనివా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వివరాలు... మహబూబాబాద్ జిల్లా గార్ల నుంచి లింగాల మీదుగా ఖమ్మం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఖమ్మం నుంచి నలుగురు ప్రయాణికులతో ఇల్లెందు వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సలీంతో ఆటోలో ప్రయాణిస్తున్న షేక్ మహబూబ్, హలీమా, సోందుబీ, జర్పుల కమలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎస్సై సాయికుమార్, సిబ్బందితో చేరుకుని క్షతగాత్రులను 108లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చెందిన షేక్ సోందుబీ(68) మృతి చెందింది. అలాగే చికిత్స చేయిస్తుండగా గాదెపాడుకు చెందిన అంగన్వాడీ టీచర్ షేక్ మహబూబ్(48) కన్నుమూసింది. అంతేకాక అలాగే, సలీం(ఇల్లెందు) పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, కమల(గాదెపాడు)కు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.విత్తన వ్యాపారికి షోకాజ్ నోటీస్సుజాతనగర్: అనుమతులు లేని చోట విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడిన సుజాతనగర్కు చెందిన విత్తన వ్యాపారికి జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు ఏఓ జి.నర్మద శనివారం తెలిపారు. విత్తన వ్యాపారి శివ నాయక్ నిబంధనలకు విరుద్ధంగా చండ్రుగొండ మండలంలో విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడటంతో కేసు నమోదైందని, దీంతో షోకాజ్ నోటీసు అందజేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు మహిళల మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రక్తంగా జరిపించారు. ఈ – టికెట్లపై భక్తులకు అవగాహనభద్రాచలం: భక్తుల సమయాన్ని ఆదా చేసేందుకు దర్శనం, ప్రసాదాలు ఇతర సేవలకు గాను రామాలయంలో ఏర్పాటు చేసిన మిషన్లపై ఈఓ ఎల్.రమాదేవి శనివారం భక్తులకు అవగాహన కల్పించారు. తొలుత ఈ మిషన్లకు పూజలు నిర్వహించాక యంత్రాల్లో ఉన్న సదుపాయాలు, ఈ టికెట్లు పొందే విధానం గురించి వివరించారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. భక్తులు సైతం ఈ టికెట్లు తీసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీందర్, ఏఈఓ భవాని రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు. రూ. 270.92 కోట్ల రైతు భరోసా జమ● డీఏఓ బాబూరావు వెల్లడి సూపర్బజార్(కొత్తగూడెం): ఇప్పటి వరకు 1,70,764 మంది రైతులకు రూ. 270, 92, 33,145 వారి బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి వి.బాబూరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గత యాసంగిలో ఉన్న పట్టాదారుల సంఖ్య 1,78, 545 కాగా, ఈ వానాకాలం సీజన్ నాటికి కొత్తగా 1,023 మంది పట్టాలు పొందారని పేర్కొన్నారు. గత సీజన్లో బ్యాంకు వివరాలు సరిగా లేని పట్టాదారులు 832 మంది ఉన్నారని, అసలే నమోదు చేయని వారు 550 మంది ఉన్నారని వివరించారు. వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో 1,80,119 మంది లబ్ధిదారుల వివరాలను వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా సేకరించి పోర్టల్లో నమోదు చేశామని, ఈనెల 21 వరకు 1,76,506 మంది రైతుల కోసం రూ. 305,87,04,190 ట్రెజరీకి పంపామని, అందులో ఈనెల 20వరకు 1,63,360 మంది లబ్ధిదారులకు రూ.237,58,19,701 వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని వివరించా రు. శనివారం 14,642 మంది రైతుల ఖాతాల్లో రూ. 51,31,26,190 జమ చేశామని తెలిపారు. కార్మికచట్టాల రక్షణకు పోరాటం ఖమ్మంమయూరిసెంటర్: ప్రజా రవాణా రంగంతో పాటు కార్మిక చట్టాలను కాపాడుకునేలా ప్రజా ఉద్యమాలకు రూపకల్పన జరగాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య(ఏఐఆర్డబ్ల్యూఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య అన్నారు. ఇందుకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ అనుబంధం) మహాసభలు వేదిక కావాలని సూచించారు. ఖమ్మంలో శనివారం ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభం కాగా, లక్ష్మయ్య మాట్లాడుతూ 2019 మోటారు వాహనాల చట్టం సవరణతో కేంద్ర ప్రభుత్వం రవాణా సంస్థలకు సమాధి కట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వచ్చేల 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మిక వర్గం పాల్గొనాలని కోరారు. సభలో ఆయా సంఘాల నాయకులు థామస్రెడ్డి, అశ్వద్ధామరెడ్డి, పాటి అప్పారావు, బత్తినేని హనుమంతరావు, వీ.ఎస్.రావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, పి.శ్రీకాంత్, సీహెచ్.సుందరయ్య, ఎంఎన్. రెడ్డి, వి.రాములు పాల్గొన్నారు. -
ఆ ఐదింటి సంగతేంటి?
భద్రాచలం: ఏళ్లు గడస్తున్నా విలీన గ్రామపంచాయతీల సమస్య ఓ కొలిక్కి రావడం లేదు. మాటల దశలోనే ఉన్న ఈ డిమాండ్ కనీసం చర్చలు, ప్రతిపాదనలకు సైతం నోచుకోలేదు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా చేసిన ఈ విలీనాన్ని రద్దు చేసి మళ్లీ తెలంగాణలో కలపాలని ఆయా గ్రామాల ప్రజలు చేస్తున్న విన్నపాలు కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్లడం లేదు. అయితే ఈ నెల 25న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ‘ప్రగతి ఏజెండా’ పేరుతో నిర్వహించే సమావేశంలో అయినా విలీన పంచాయతీలపై చర్చ జరగాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఈ మేరకు డిమాండ్ చేయడం గమనార్హం. గతంలోనే సీఎంల భేటీలో ప్రస్తావన.. తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభజనకు ముందు యటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకలపాడు, కన్నాయిగూడెం పంచాయతీలు భద్రాచలం డివిజన్లో అంతర్భాగంగా ఉండేవి. రాష్ట్ర విభజనలో భాగంగా పోలవరం ముంపు పేరుతో ఈ ఐదు పంచాయతీలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. దీంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం పలుమార్లు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేశారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి గోడు వినిపించారు. భద్రాచలం పర్యటనకు వచ్చిన గవర్నర్, రాష్ట్రపతికి సైతం వినతిపత్రాలు సమర్పించారు. కాగా దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. గతంలో ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు సమావేశమైనప్పుడు కూడా ఈ అంశం ప్రాథమికంగా చర్చకు వచ్చింది. దీనిపై పరిశీలించాలని ఇరు రాష్ట్రాల ఉన్నతాఽధికారులను వారు ఆదేశించినా సమస్య అపరిష్కృతంగానే ఉండిపోయింది. 25న తీర్మానం చేయాలి.. ఈనెల 25న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించనున్న సమావేశంలో అయినా దీనిపై చర్చించాలని ఆయా గ్రామాల వారు అంటున్నారు. నాలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొనే ఈ సమావేశం రాష్ట్రాల నడుమ సమస్యల ప్రస్తావన, పరిశీలన, పరిష్కారానికి కీలకం కానుందని, ఈ నేపథ్యంలో విలీన పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేలా తీర్మానం చేయాలని అంటున్నారు. ఈ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేలా చర్చ జరగా లని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు శుక్రవారం హైదరా బాద్లో జరిగిన ఓ సమావేశంలో డిమాండ్ చేసిన విషయం విదితమే.తెగని విలీన గ్రామ ‘పంచాయితీ’లు ఏళ్లుగా పెండింగ్లోనే సమస్య ఈ నెల 25న సీఎంలతో ప్రధాని సమావేశం అందులోనైనా చర్చించాలని పలువురి విన్నపం అభివృద్ధి పనులకు కీలకం.. భద్రాచలంలో అంతర్భాగమైన ఆ ఐదు పంచాయతీలు ఏపీలో కలవడంతో భద్రాచలం అభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వ పథకాల అమలు, ఇతర నిర్మాణాలకు స్థలం కొరత ఏర్పడింది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు కేంద్రంగా ఉండడంతో పాటు ఆధ్యాత్మిక, పర్యాటకరంగాల్లో దేశ వ్యాప్తంగా భద్రాచలానికి పేరుంది. ఈ నేపథ్యంలో ప్రజల, భక్తుల అభిరుచికి తగినట్లుగా అభివృద్ధి చేయాలంటే ఈ ఐదు పంచాయతీలను భద్రాచలం డివిజన్లో విలీనం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి కేంద్ర స్థాయిలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు చొరవ చూపితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 25న జరిగే భేటీలో ఏపీ, తెలంగాణ సీఎంలు ఆ ఐదు గ్రామాల వారి కోరిక మేరకు చర్చించాలి. ప్రధానమంత్రి సమక్షంలోనే పరిష్కారం చూపాలి. బిల్లు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలి. – కొప్పుల మురళి, భద్రాచలం -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
● ప్రతిరోజూ అలవాటుగా మార్చుకోవాలి ● ఎస్పీ రోహిత్రాజు సూపర్బజార్(కొత్తగూడెం): నిత్యం యోగా చేయడంతో పని ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందమైన జీవితానికి ప్రతి ఒక్కరూ రోజూ యోగా చేయాలని సూచించారు. ప్రపంచదేశాలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రత్యేక గుర్తింపు ఇచ్చాయని అన్నారు. పనిపై శ్రద్ధ పెరగడానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఉపయోగపడుతుందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో యోగాసనాలు, ధ్యానం, శ్వాసపై ధ్యాస, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం తదితర ఆసనాలు వేయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేందర్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డీసీఆర్బీ, ఏఆర్ డీఎస్పీలు మల్లయ్యస్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీయుల అమూల్య సంపద.. భద్రాచలం : యోగా భారతీయుల అమూల్య సంపద అని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతీయులదని, అది నేడు అందరికీ అనురణీయంగా మారిందని అన్నారు. యోగాసనాలతో మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. విద్యార్థులతో నిత్యం యోగా చేయించాలని గిరిజన సంక్షేమ పాఠశాలల హెచ్ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, దీంతో ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయని తెలిపా రు. యోగా గురువు గుమలాపురం సత్యనారా యణ మాట్లాడుతూ.. విద్యార్థులు నిత్యం యో గా చేస్తే మేధాశక్తి నైపుణ్యాలు పెరుగుతాయని సూచించారు. కార్యక్రమంలో ఏఓ సున్నం రాంబాబు, ఎస్ఓ భాస్కరన్, ఏటీడీఓ అశోక్ కుమార్, క్రీడాధికారి గోపాలరావు, జీసీడీఓ అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం జరిపారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతిని సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. మూడో రోజు టెట్ ప్రశాంతం సుజాతనగర్: మండలంలోని వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో మూడో రోజు శుక్రవారం నిర్వహించిన టీజీ టెట్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 120 మంది అభ్యర్థులకు గాను మొదటి షిఫ్ట్లో 98 మంది, రెండో షిఫ్ట్లో 110 మంది హాజరయ్యారు. రెండు షిఫ్టుల్లో కలిపి 32 మంది గైర్హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయిల్ఫెడ్ ఎండీ ఆకస్మిక పర్యటనఅశ్వారావుపేట: ఆయిల్ఫెడ్ ఎండీ శంకరయ్య శుక్రవారం ఆకస్మిక పర్యటించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని ఆయిల్పామ్ నర్సరీ, ఫ్యాక్టరీలను సందర్శించారు. గెలల దిగుమతి, క్రషింగ్, నూనె రికవరీ, ఉప ఉత్పత్తులు, నిర్వహణ తదితర వివరాలు తెలుసుకున్నారు. నారంవారిగూడెం నర్సరీలో మొక్కల పెంపకంపై ఆరా తీశారు. కాగా శంకరయ్య ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అశ్వారావుపేట డివిజన్కు రావడం ఇదే మొదటిసారి. ఆయన వెంట పీఅండ్పీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి, కిరణ్కుమార్, రాధాకృష్ణ, నాగబాబు, కళ్యాణ్ ఉన్నారు. ముగిసిన కేంద్ర పథకాల నమోదు క్యాంపులుభద్రాచలంటౌన్: గిరిజన గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధర్తీ ఆభా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ యోజన పథకాల నమోదు కోసం నిర్వహించిన క్యాంపులు ముగిసినట్లు పీఓ రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో 30 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 30 సదస్సులు నిర్వహించగా, 3,807 మంది గిరిజనులు పీఎం కిసాన్, ఆధార్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, జనధన్, కులం సర్టిఫికెట్లు, ఎన్ఆర్ఈజీఎస్ కార్డుల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని, 1,955 మందికి రిజిస్ట్రేషన్ చేశామని వివరించారు. -
త్వరలో సీఎం రాక?
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి శంకుస్థాపన ● యంగ్ ఇండియా పాఠశాలల ప్రారంభోత్సవం ● స్థానిక ఎన్నికలకు ముందు పార్టీలో జోష్ తెచ్చేలా పర్యటనకు ప్రణాళికప్రారంభోత్సవాలు పర్యాటక రంగం అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సీఎం జిల్లా టూర్ ఖరారైతే అందులో శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు కూడా ఉండేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దాదాపు పదేళ్లుగా నిర్మాణం సాగుతున్న హరిత కన్వెన్షన్ సెంటర్, హరితా హోటళ్లతో పాటు కిన్నెరసాని ఎకో టూరిజం కాటేజీలను ప్రారంభించేందుకు యత్నిస్తున్నారు. దీంతో చివరి దశలో ఉన్న పనులను మరింతగా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు మరోసారి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గస్థాయిలో పార్టీ కేడర్ను ఉత్తేజపరిచే పనిలో ఉన్నారు. పైగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కు కంచుకోటగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉంది. దీంతో ఇక్కడి నుంచే పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టే ఆలోచనలో హస్తం పార్టీ నేతలు ఉన్నారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ముందు సీఎం రేవంత్రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉందా అంటే అధికార పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల జిల్లాకు మంజూరైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ముఖ్యమంత్రిని జిల్లాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో ఏకై క వర్సిటీ దేశంలోనే మొట్టమొదటి ఎర్త్సైన్సెస్ యూనివర్సిటీని జిల్లాకు మంజూరు చేశారు. ఈ కాలేజీలో అందించాల్సిన కోర్సులపైనా ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. మరోవైపు కేంద్రం నుంచి నవోదయ స్కూల్/కాలేజీ జిల్లాకు మంజూరైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనిర్సిటీ పనులను సీఎంతో లాంఛనంగా ప్రారంభింపజేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోనే కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ వర్సిటీ భవన నిర్మాణాలు, ఎక్విప్మెంట్ కోసం రూ.200 కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉంది. స్థలసేకరణ అయితే జిల్లాకు ఐదు యంగ్ ఇండియా స్కూల్స్ మంజూరయ్యాయి. ఒక్కో స్కూల్కు రూ.200 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రతీ పాఠశాలను కనీసం 15 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే కొత్తగూడెం, పినపాకలలో స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించారు. ఇల్లెందు విషయంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితి ఉంది. అశ్వారావుపేట, భద్రాచలం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. స్థల సేకరణ పూర్తయితే ఐదు యంగ్ ఇండియా స్కూళ్ల పనులకు ఒకేసారి సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కొత్తగూడెం – పాల్వంచ మున్సిపాలిటీలను ఏకం చేస్తూ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. ఈ కార్పొరేషన్కు బడ్జెట్లో కేటాయించిన రూ.300 కోట్లతో చేపట్టబోయే పనులకు సీఎం చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించవచ్చనే అంశంపై కూడా హస్తం నేతలు దృష్టిపెట్టారు. -
వాడీవేడిగా డీసీసీబీ మహాజన సభ
అక్రమాలపై విచారణకు నిర్ణయం ఇళ్ల స్థలాలకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి రూ.6 కోట్ల రుణాలు తీసుకున్న వ్యవహారంపై విచారణ చేపట్టాలని డీసీసీబీ పాలకవర్గం నిర్ణయించింది. మహాజన సభకు ముందుగా బ్యాంకు పాలకవర్గ సమావేశం జరగగా ఈ అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించారు. దీంతో బ్యాంకు సొమ్మును పక్కదారి పట్టించిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా విచారణకు నిర్ణయించారు.ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) 127వ మహాజన సభ వాడీవేడిగా సాగింది. ఖమ్మంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సభ నిర్వహించగా, తొలుత వార్షిక నివేదిక ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా సహకార సంఘాల చైర్మన్లు పలువురు తీర్మానాలను మినిట్స్ బుక్లో రాయాలని సూచించగా.. అధికారులు బుక్ తీసుకురాలేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాజన సభకు మినిట్స్ బుక్ లేకుండా హాజరుకావడం ఏమిటంటూ సమోసాలు, టీ కోసం వచ్చామా అని ప్రశ్నించారు. కాగా, 2007–08లో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారి నుంచి రూ.90 కోట్లు డిపాజిట్లు సేకరిస్తే, ఆ డిపాజిట్ల చెల్లింపుపై గత సభలో చేసిన తీర్మానం అమలుకు నోచుకోలేదని పలువురు తెలిపారు. వడ్డీ కలిపి రైతులకు చెల్లించాల్సి ఉందని చెప్పడంతో త్వరలోనే చెల్లిస్తామని బ్యాంకు సీఈఓ వెంకటఆదిత్య బదులిచ్చారు. కాగా, పీఏసీఎస్లు పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో డీసీఎంఎస్, ఇతర సంస్థల ద్వారా ధాన్యం కొనుగోలుపై అవకాశం కల్పించటం సరికాదని పేర్కొన్నారు. అలాగే, ధాన్యం కొనుగోళ్ల సమయాన నియమించే సిబ్బంది వేతనాల విషయమై ప్రశ్నించగా కమీషన్ నుంచి వేతనాలు చెల్లించవచ్చని జిల్లా సహకార అధికారి గంగాధర్ తెలిపారు. అలాగే, బ్యాంకు రుణాల నుంచి వసూలు చేసే వాటాధనంలో సహకార సంఘాలకు భాగం ఇచ్చేలా తీర్మానానికి పలువురు పట్టుబట్టారు. అంతేకాక 2023 నుంచి మొక్కజొన్నల కొనుగోళ్లపై రూ.లక్షల్లో రావాల్సిన కమీషన్ చెల్లించాలని కోరగా రాష్ట్ర మార్క్ఫెడ్ సమావేశం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని మార్క్ఫెడ్ జీఎం సునీత తెలిపారు. ఇంకా భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఎరువుల స్టాక్ పాయింట్ ఏర్పాటు, సహకార సంఘాల ఉద్యోగుల బదిలీలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, బ్యాంకు డైరెక్టర్లు గొర్ల సంజీవరెడ్డి, లక్కినేని సురేందర్రావు, లక్ష్మణ్రావు, ప్రసాద్, సైదులు, డీఆర్డీఓ అవధానుల శ్రీనివాసరావు, అధికారులు, పీఏసీఎస్ల చైర్మన్లు పాల్గొన్నారు. సభ్యులకు బీమా పెంపు పీఏసీఎస్ల నుంచి పంట రుణాలు తీసుకునే సభ్యులకు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ పరిమితిని పెంచుతూ పాలకవర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న బీమా పరిమితిని రూ.లక్షకు పెంచారు. అలాగే, 2024–25లో బ్యాంకు గడించిన లాభాల్లో రూ.530.55 కోట్లను సహకార సంఘాలకు డివిడెంట్(ఆరు శాతం)గా చెల్లించాలని నిర్ణయించింది. అంతేకాక ఉద్యోగులకు 8–12 శాతం(దూరం ఆధారంగా) అలవెన్స్ చెల్లింపునకు నిర్ణయించారు. మినిట్స్ బుక్ లేకపోవడంపై సభ్యుల మండిపాటు డిపాజిట్లు, ఇతర అంశాలపై ప్రశ్నల వర్షం -
సింగరేణిలో పర్సనల్ విభాగం అఽధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని పర్సనల్ విభాగంలో నలుగురు అఽధికారులను బదిలీ చేస్తూ గురువారం రాత్రి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్ ఎడ్యుకేషన్ విభాగంలో డీవైపీఎంగా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్వరరావును బెల్లంపల్లి ఏరియా పర్సనల్ విభాగానికి, వెల్పేర్ వింగ్ కార్పొరేట్ డీవైపీఎం జీకే కిరణ్కు మార్ను కార్పొరేట్ ఎడ్యుకేషన్ విభాగానికి బదిలీ చేసింది. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ–3లో మేనేజ్మెంట్ ట్రైనీగా పనిచేస్తున్న వేల్పుల కిశోర్ను అదే ఏరియాలోని కేటీకే–1 ఇంక్లైన్కు, సింగరేణి మెయిన్ ఆస్పత్రి సీనియర్ పీఓ మండల శ్రీనివాస్ను కార్పొరేట్ ఏరియా వెల్ఫేర్ వింగ్కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
మేరునగధీరులు.. దాశరథి, ఆరుద్ర
ఖమ్మం సహకారనగర్: తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన దాశరథి, ఆరుద్ర తెలుగు సాహిత్య చరిత్రలో మేరునగధీరులుగా నిలిచారని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ అన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన ‘శతజయంతి సాహితీమూర్తులు’ పేరిట దాశరథి – ఆరుద్రజీవితం సాహిత్యంపై నిర్వహించే రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైస్ ప్రిన్సిపాల్ ఏ.ఎల్.ఎన్.శాస్త్రి అధ్యక్షత వహించగా దాశరథి, ఆరుద్ర చిత్రపటాల వద్ద నివాళులర్పించాక వీసీ సూర్య ధనుంజయ్ తదితరులు మాట్లాడారు. తెలంగాణ పీడిత ప్రజల పక్షాన నిలిచి అక్షరమే ఆయుధంగా పోరాడిన యోధుడిగా దాశరథి తిమిరంతో సమరం చేశారని చెప్పారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడిన బడుగు వర్గాలకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. ఇక ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య పరిశోధనతో చరిత్రను లోతుగా అధ్యయనం చేసి అరుదైన పరిశోధకుడిగా నిలిచారని కొనియాడారు. నేటి యువత వీరిద్దరి సాహిత్యంపై అధ్యయనం చేయాలని సూచించారు. అనంతరం దాశరథి, ఆరుద్ర సాహిత్యంపై ఓయూ తెలుగు శాఖాధిపతి ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, సాహిత్య విమర్శకులు కవి రెంటాల వెంకటేశ్వరరావు కీలకోపన్యాసం చేశారు. ఈకార్యక్రమంలో కేయూ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ బన్న అయిలయ్య, కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్రా రాజుతో పాటు రవిమారుత్, ప్రసేన్, బానోత్ రెడ్డి, డాక్టర్ సునంద, డాక్టర్ పి.రవికుమార్, డాక్టర్ సీతారాం, డాక్టర్ జె.అనురాధ, కిరణ్కుమార్, డాక్టర్ ఎం.వీ.రమణ, డాక్టర్ కార్తీక్, కోటమ్మ, శ్రీ నివాస్ మాట్లాడగా వివిధ ప్రాంతాల అధ్యాపకులు 30మంది పత్రాలు సమర్పించారు.జాతీయ సదస్సులో వక్తలు -
బీమా చెక్కు అందజేసిన ఎస్పీ
సూపర్బజార్(కొత్తగూడెం): ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ టి.అనిల్కుమార్ కుటుంబానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.కోటి చెక్కును ఎస్పీ రోహిత్రాజ్ చేతుల మీదుగా శుక్రవారం అందజేసింది. పోలీస్ వేతన ప్యాకేజీ అకౌంట్ ద్వారా యూనిఫామ్ సర్వీ స్ కస్టమర్ల సంక్షేమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా ప్రవేశపెట్టిన స్కీం ద్వారా వచ్చిన నగదును అనిల్ కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సత్యనారాయణ, చీఫ్ మేనేజర్ ఆంజనేయ రమేశ్, బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ‘ఇన్సూరెన్స్’ ద్వారా మరో రూ.కోటి పాల్వంచ డీఎస్పీ కార్యాలయంలో పోలీస్ కానిస్టేబుల్ తన్నీరు అనిల్కుమార్ 2024, డిసెంబర్లో జరిగినరోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన 2022 సెప్టెంబర్లో టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా పాలసీ తీసుకోవడంతో నామినీగా ఉన్న తన్నీరు నాగలక్ష్మి ఈ ఏడాది జనవరి 8న అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించగా.. రూ.కోటి ని ఆమె బ్యాంక్ ఖాతాలో జమచేశారు. కార్యక్రమంలో బీఎం జక్కుల సతీశ్, రాహుల్, నాగేంద్రరెడ్డి, కొచ్చెర్ల కమలారాణి, భూక్య తారాప్రసాద్, డి.శివ ప్రసాద్, రాములు, ఆనంద్వర్ధన్, అనిల్, శివ లీల, సుమన్, నాగలక్ష్మి, పావని, మహేశ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ను బలోపేతం చేయాలి
చుంచుపల్లి: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. చుంచుపల్లి మండలంలోని నందాతండా, ధన్ బాద్, గౌతంపూర్, రుద్రంపూర్, పెనగడప గ్రామాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, నాయకులు ఆళ్ల మురళి, పెదబాబు, అంతోటి పాల్, చింతలపూడి రాజశేఖర్, జేవీఎస్ చౌదరి, వై.శ్రీనివాస్ రెడ్డి, బోదాసు కనకరాజు, ఎండి రజాక్, పీతాంబరం తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి -
ఇక ఈ–టికెట్లు..
డిజిటల్మయంగా రామాలయం రామాలయం డిజిటల్మయంగా మారుతోంది. తొలుత దేవస్థాన వెబ్సైట్ ఆధునికీకరించారు. లడ్డూ కౌంటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్ చేశారు. నిత్యన్నదానం, గోశాలకు విరాళాలు ఇచ్చే వారి వివరాల నమోదుతో పాటు దాతలకు ఆన్లైన్ రశీదులు అందజేస్తున్నారు. స్వామివారి వస్త్రాల విక్రయాలకు బార్కోడ్ రూపొందించారు. ప్రొటోకాల్ దర్శనానికి వచ్చే వారికి స్కాన్తో ఫొటో తీసి ఎంట్రీ టికెట్ అందజేస్తున్నారు. అన్నదానానికీ ఈ–టోకెన్ ఇస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో డిజిటల్ సేవలను విస్తరింపజేశారు. -
చదువుకొనగలుగుతారా..?
ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యం ● పుస్తకాల పేరుతోనూ దోపిడీ.. ● కానరాని మైదానాలు, ఫీజుల పట్టికలు ● ఆర్థికభారంతో అవస్థలు పడుతున్న తల్లిదండ్రులు ● పర్యవేక్షణపై పట్టింపు లేని అధికారులు కొత్తగూడెంఅర్బన్: పిల్లలను అత్యున్నస్థాయిలో చూసేందుకు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తుంటారు. కానీ, ఆయా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు మోపే ఆర్థిక భారాన్ని భరించలేకపోతున్నారు. తల్లిదండ్రుల ఆశను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వారు అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలు కూడా మెరుగైన సౌకర్యాలతో ప్రైవేట్కు దీటుగా మారుతున్నాయి. విద్యాబోధన కూడా అదేస్థాయిలో ఉండటంతోపేద, మధ్యతరగతి వారు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. ప్రభుత్వ పాఠశాల ఉన్న దగ్గర ఐదు కిలోమీటర్ల వరకు మరో ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేయడానికి వీలు లేదు. నిబంధనలు కూడా ఒప్పుకోవు. కానీ, విద్యాధికారుల సహకారం ఉండడం వల్ల పాఠశాలలు ఏర్పాటు చేసుకొని లక్షల్లో దోచుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 220కి పైగా ప్రైవేట్ పాఠశాలలున్నాయి. అందులో ఎన్ని పాఠశాలలకు అనుమతులున్నాయి? ఎన్ని రెన్యూవల్ అయ్యాయి? అనే సమాచారం కూడా జిల్లా విద్యాశాఖాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఎంఈఓలు కూడా సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటే విషయం అర్థమైపోతోంది. పుస్తకాల దందా.. ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాల ధరలు కూడా అధికంగా ఉన్నాయి. ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి చేరితే ఆ పాఠశాల ప్రింట్ చేసిన నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు మాత్ర మే చదవాలి.. రాయాలి. బయట నుంచి కొను గోలు చేస్తే అనుమతించరు. బయట బుక్స్టాల్లో రూ.30కి దొరికే నోట్బుక్ రూ.50కి అమ్ముతున్నారు. వీటిని సమీపంలోని ఇళ్లు, షెట్టర్లలో పెట్టి విక్రయిస్తున్నారు. ఇక 6వ తరగతి నుంచి ఐఐటీ విద్యను బోధిస్తామని అదనంగా రూ.5 వేలు దండుకుంటున్నట్లు సమాచారం. కార్పొరేట్ పాఠశాల లు ఎల్కేజీ నుంచి రూ.లక్ష వసూలు చేస్తే, మిగతారావు సదుపాయాలను బట్టి రూ.30 నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. -
ఇల్లెందు ఆస్పత్రి ఉద్యోగులకు ప్రశంస
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా ఆస్పత్రి ఉద్యోగులకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. జిల్లాలోని ఆరు ఏరియా ఆస్పత్రుల్లో మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యో గులను గుర్తించి శుక్రవారం కలెక్టరేట్లో పత్రాలు అందజేశారు.ప్రశంసలు అందుకున్న వారిలో ఇల్లెందు నుంచి డాక్టర్ హర్షవర్ధన్, రాంనివాస్, బన్సీలాల్, ఎల్టీ రాజేష్, ఫార్మసీ శ్రీలత, నర్సింగ్ ఆఫీసర్లు షర్మిల, భారతి, ఫర్జానా, సెక్యురిటీ శ్రీను, శానిటేషన్ సూపర్వైజర్ రాము, ఉదయ్, సాయికృష్ణ ఉన్నారు. -
పాత విధానంలోనే పంట రుణాలు ఇవ్వాలి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1/70 చట్టం కారణంగా రైతులకు పంట రుణాల జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నందున, గతంలో మాదిరి పహా నీల ఆధారంగా రుణాలు ఇవ్వాలని పలుపీఏసీఎస్ల చైర్మన్లు కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో శుక్రవారం జరిగిన డీసీసీబీ మహాసభలో జిల్లా సహకార అధికారి జి.గంగాధర్, డీసీసీబీ సీఈఓ వెంకట్ఆదిత్యకు వినతిపత్రం అందజేశారు. అలాగే, ఏజెన్సీ రైతులు సహకార బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను రెన్యూవల్ చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ, కొత్తగూడెం, మేడేపల్లి, కొణిజర్ల పీఏసీఎస్ల చైర్మన్లు కొత్వాల శ్రీనివాసరావు, మండే హన్మంతరావు, సామినేని వెంకటేశ్వరరావు, చెరుకుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో సీఆర్టీల బదిలీ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధి లోని ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో ఐదేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న ఉపాధ్యాయుల(సీఆర్టీ)ను బదిలీ చేశారు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న 64మంది సీఆర్టీలకు సబ్జెక్టుల వారీగా శుక్రవారం ఐటీడీఐ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్ ఇచ్చినట్లు డీడీ విజయలక్ష్మి తెలిపారు. ఆ తర్వాత బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 3,5,8వ తరగతుల్లో ప్రవేశానికి అందిన దరఖాస్తుల ఆధారంగా తల్లిదండ్రులు, కమిటీ సభ్యు ల సమక్షాన డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేశామని డీడీ వెల్లడించారు. కార్యక్రమాల్లో వైరా ఏటీడీఓ జహీరుద్దీన్, ఏఓ నారాయణ రెడ్డి, ఏసీఎంఓలు రాములు, రమేశ్, హెచ్డబ్ల్యూఓలు హన్మంతరావు, రాంబాబు, రాజేంద ర్, నర్సింహారావు, శ్రీనివాసరావు, ధనుశ్, భద్రాచలం ఎంఈఓ రమతో పాటు అలివేలు మంగతాయారు, రంగయ్య, ప్రసాద్, శ్రీధర్, మణికుమార్, సురేశ్, భద్రం తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ సమీపాన గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతసాగర్కు చెందిన వట్టికూటి జగదీష్(27) మృతి చెందాడు.ఆయన ద్విచక్ర వాహనంపై ఖమ్మం నుంచి అనంతసాగర్ వస్తుండగా పందిళ్లపల్లి సేషన్ సమీపాన ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జగదీష్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన తండ్రి నాసరయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై నాగుల్మీరా తెలిపారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ములకలపల్లి/చండ్రుగొండ: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, టీఎస్ ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ములకలపల్లి మండలం రామాంజనేయపురం గ్రామంలో బత్తుల పుష్పలత, చెన్నకేశవులు దంపతుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం గుర్రాలకుంట, చింతలపాడు, అన్నారం గ్రామాల శివార్లలోని వాగులపై రూ.5.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మూడు హైలెవల్ వంతెనల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. దామరచర్ల, సీతాయిగూడెం మధ్య ఉన్న ఎదుళ్లవాగుపై హైలెవల్ బిడ్జీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీతాయిగూడెంలోని వెంగళరాయసాగర్ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోవు నాలుగేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థికపరిస్థితి అథోగతికి చేరిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పేరిట రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ పాలకులు ఖాళీ చేశారని ఆరోపించారు. ఇక్కడి వెంగళరాయసాగర్ అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 33.55 కోట్లు ప్రాజెక్ట్ అభివృద్ధికి మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రన్ శుక్రవారం ములకలపల్లి మీదుగా వెళ్తుండగా, మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఒలింపిక్ జ్యోతితో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, అధికారులు భూక్యా గనియా, రవికిరణ్, గద్దె రేవతి, అరుణ్బాబు, మాజీ జెడ్పీటీసీ బత్తుల అంజి, నాయకులు తాండ్ర ప్రభాకర్రావు, కారం సుధీర్, భూక్యా పత్తీలాల్, సున్నం సుధాకర్, గాడి తిరుపతి రెడ్డి, శనగపాటి రవి, కె.రవి పాల్గొన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల గృహాలు నిర్మిస్తాం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి -
సన్నబియ్యం తూకంలో తేడాలు
ములకలపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం క్షేత్రస్థాయిలో అభాసుపాలవుతోంది. రేషన్ దుకాణంలో చేస్తున్న మాయాజాలంతో లబ్ధిదారులకు రావాల్సిన వాటికన్నా కొంతమేర కోత పడుతోంది. ములకలపల్లి రేషన్ దుకాణంలో ఈ నెల 1వ తేదీ నుంచి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఒకేసారి మూడు నెలలకు బియ్యం అందుతున్నా యని ఆనందిస్తున్న తరుణంలోనే, రావాల్సిన వాటికంటే తగ్గువగా బియ్యం ఇస్తున్నారు. రేషన్ దుకాణంలోని యాభై కిలోల బియ్యం బస్తాలో ముందుకుగానే కొన్ని బియ్యం తీసి, లబ్ధిదారుడికి ఇచ్చే సమయంలో తూకం వేయకుండా ఇస్తున్నారు. గత బుధవారం పంపిణీ చేసిన ఇరువురికి బియ్యం తక్కువగా రావడంతో విషయం బయటపడింది. ఈ విషయమై ములకలపల్లి రేషన్షాపు సేల్స్మెన్ అగ్గిరాంను వివరణ కోరగా.. రేషన్ సెంటర్కు వచ్చే యాభై కిలోల బియ్యం బస్తాల్లో బియ్యం ఎక్కువగా ఉంటున్నాయని, దీంతో బస్తా సీల్ తీసి, కొంతబియ్యం తీసి తూకం వేయకుండా లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇకపై అన్ని బస్తాలూ తూకం వేసి, సక్రమంగా బియ్యం అందేలా చూస్తామని చెప్పారు. రేషన్షాపులో మాయాజాలం -
అంతా ఔట్ సోర్సింగే..
● రెగ్యులర్ ఉద్యోగులు లేరు.. ● మార్కెట్ల ఆదాయ మార్గాలే చెక్ పోస్టులు.. ● జిల్లాలో కొత్తగూడెం, దమ్మపేట, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, ఇల్లెందు మార్కెట్లు ఇల్లెందు: మార్కెట్ యార్డులకు ఆదాయం కలిగిన చెక్ పోస్టులన్నీ ఏళ్లతరబడి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో నడుస్తున్నాయి. కోట్ల రూపాయల ఆదాయం కలిగిన మార్కెట్ యార్డులు పటిష్టపర్చటంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలోని ఆరు మార్కెట్ కమిటీల పరిధిలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క మార్కెట్ చెక్ పోస్టులో కూడా రెగ్యులర్ ఉద్యోగులు లేరు. ఇతర సూపర్వైజర్ పోస్టులు కూడా చాలావరకు ఔట్ సోర్సింగ్ వారితో నెట్టుకొస్తున్నారు. ఇక భద్రాచలం లాంటి మార్కెట్లో ఇద్దరు ఉద్యోగులు ఉన్నా మహిళలే కావటంతో పర్యవేక్షణ కష్టంగా మారింది. దీనికి తోడు ఆయా మార్కెట్ కమిటీల పరిధిలో ఆదాయం కోసం ఏర్పాటు చేసుకున్న చెక్ పోస్టుల్లో చాలా వరకు పైసా వసూలు చేయని చెక్ పోస్టులుఉన్నాయి. అలాంటి వాటిని మార్చకుండామరో మార్గంలో ఏర్పాటు చేయకుండా ఆదాయం లేని చెక్ పోస్టులను నేటికీ కొనసాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్నీ వ్యవసాయ మార్కెట్లు సీజనల్గా సాగేవే ఉన్నాయి. ఏడాది పొడవునా ఏ ఒక్క మార్కెట్లో క్రయ విక్రయాలు సాగటం లేదు. మార్కెట్లకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం సాంధించాలంటే చెక్ పోస్టులపై ఆధారపడాల్సిందే. ఈ తరుణంలో చెక్ పోస్టులు కీలకంగా మారుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, దమ్మపేట, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, ఇల్లెందు మార్కెట్యార్డులున్నాయి. సీజనల్ మార్కెట్లు కావటంతో పాటు సిబ్బంది సరిపడా లేకపోవటం వల్ల పర్యవేక్షణ కరువైంది. ఎన్నో రకాల పంట ఉత్పత్తులను మార్కెట్లో క్రయవిక్రయాలు చేసుకునే అవకాశం ఉంది. కానీ, ఏ ఒక్క అధికారి కూడా ఆ మార్కెట్ సాగేలా ప్రణాళిక రూపొందించడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు కూడా తోడవుతున్నాయి. ఎక్కడైనా వ్యాపారులు మార్కెట్కు రావాలంటే అక్కడ రాజకీయ ఒత్తిడి మొదలవుతోంది. దీంతో అధికారులు ఆదాయం రాబట్టుకునేందుకు పాటుపడుతున్నారు. జిల్లాలో కొన్ని చెక్ పోస్టులు అధిక ఆదాయం కలిగిఉన్నాయి. సరిహద్దు చెక్ పోస్టులు పటిష్టంగా ఏర్పాటు చేస్తే ఆదాయం మెరుగవుతుంది. 2025–26 సంవత్సరంలో రూ.22.65 కోట్ల లక్ష్యానికి గాను రూ.21.69 కోట్లు సాధించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది, గత ఏడాది మార్కెట్లకు నిర్దేశించిన లక్ష్యం, అవి సాధించిన లక్ష్యం ఇలా ఉంది.. జిల్లాలో చెక్ పోస్టులు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు మార్కెట్ యార్డులు ఉండగా 18 వరకు చెక్ పోస్టులు ఉన్నాయి. కొత్తగూడెంలో–3, ఇల్లెందులో–4, దమ్మపేటలో–2, బూర్గంపాడులో–4, చర్లలో–4, భద్రాచలంలో–1 ఉన్నాయి. ఇల్లెందు మార్కెట్ పరిధిలోని సుదిమళ్ల చెక్ పోస్టు ద్వారా 2014–15లో రూ.51.72 లక్షలు, 2015–16లో రూ.62.70 లక్షలు, 2016–17లో రూ.56.40 లక్షలు, 2017–18లో రూ.28.34 లక్షలు, 2018–19లో రూ.13.48 లక్షలు, 2019–20లో 20.31లక్షలు, 2020–21లో రూ.5.77 లక్షలు, 2021–22లో రూ.26.84 లక్షలు, 2022–23లో రూ.2.88 లక్షలు, 2023–24లో రూ.2.76 లక్షలు, 2024–25లో రూ.38.54 లక్షలు, 2025–26లో రూ.1.82 లక్షల ఆదాయం లభించింది. భద్రాచలం,బూర్గంపాడు, కొత్తగూడెం చెక్ పోస్టుల్లో ఆదాయం లేదు. ఇల్లెందు, చర్ల, దమ్మపేట చెక్ పోస్టులు ఆదాయం సమకూరుస్తున్నాయి. సమన్వయం చేస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డులన్నీ బలోపేతం చేసి సరుకు తరలి వెళ్లే రహదారులను గుర్తించి ఆ మార్గాల్లో చెక్ పోస్టులు నెలకొల్పితే మార్కెట్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.ఈ మార్కెట్ కమిటీలోని చెక్ పోస్టులుఆదాయంలభించనివి కూడా ఉన్నాయి. వాటిని తొలగించిఆదాయ మార్గాలు ఉన్న చోట ఏర్పాటు చేస్తే ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా సమన్వలోపం కారణంగా వ్యవసాయ మార్కెట్లు క్రయవిక్రయాలు లేకుండా పోతున్నాయి. మార్కెట్ గత ఏడాది ఈ ఏడాది లక్ష్యం లక్ష్యం బూర్గంపాడు 5.86 కోట్లు 6.25 కోట్లు దమ్మపేట 3. 25 కోట్లు 3.67 కోట్లు ఇల్లెందు 4.64 కోట్లు 5.16కోట్లు భద్రాచలం 2. 00 కోట్లు 1.94 కోట్లు కొత్తగూడెం 3. 30 కోట్లు 3.47 కోట్లు చర్ల 2.62 కోట్లు 2.12 కోట్లు 21.69 కోట్లు 22. 65 కోట్లు -
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
మణుగూరుటౌన్: బీటీపీఎస్ యాష్ ప్లాంట్ నుంచి బూడిద కట్టల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పినపాక మండ లం బోటిగూడెం పంచాయతీ మారేడుగూడెంనకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రామారావు (48).. బీటీపీఎస్ యాష్ప్లాంట్ నుంచి బూడిద కట్టలను మరో చోటికి ట్రాక్టర్లో తరలిస్తున్నాడు. మార్గమధ్యలో చెరువుకట్ట పైనుంచి అదుపుతప్పి 15 అడుగుల లోతులో ట్రాక్టర్ బోల్తా పడటంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించారు. చోరీ కేసులో ఇద్దరి అరెస్టు అశ్వారావుపేటరూరల్: ఓ ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరిని శుక్రవారం స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ యయాతిరాజు కథనం ప్రకారం.. మండలంలోని గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్ట్ వద్దగల శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 12వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హుండీల తాళాలను ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించిన సంగతి తెలిసిందే. కాగా, అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎస్ఐ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడేనికి చెందిన సబ్కా కాంతారావు, పాయం అనిల్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. 21 కేజీల గంజాయి పట్టివేత భద్రాచలంఅర్బన్: కారులో తరలిస్తున్న 21 కేజీల గంజాయిని కూనవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి టౌన్ పోలీసులు పట్టుకున్నారు. టౌన్ ఎస్ఐ సతీశ్ సిబ్బందితో కలిసి కూనవరం రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారును ఆపి తనిఖీ చేశారు. అందులో 21 కేజీల గంజాయి లభించింది. హైదరాబాద్కు చెందిన బాలకృష్ణ, వెంకటేశ్ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. గంజాయి విలువ రూ.12 లక్షలు ఉంటుందని, నిందితుల ఫోన్లు సీజ్ చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ఒలింపిక్ రన్ సక్సెస్
భద్రాచలంటౌన్: పట్టణంలో అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ విజయవంతమైంది. పాల్వంచలో మొదలైన రన్ దమ్మపేట మీదుగా భద్రాచలం వరకు ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్, ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి మాట్లాడారు. పట్టణంలో త్వరలో 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ కోసం ఐదెకరాల స్థలం సేకరించనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ బాధ్యులు మహిధర్, నాగ సీతారాములు, వెంకటేశ్వర్లు, నాగేంద్రబాబు, గిరి ప్రసాద్, దాట్ల రాజు, కుంచాల రమేష్, ఉదయ్ కుమార్, రామి రెడ్డి, శ్వేత, దుర్గారావు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
బయోచార్తో భూసారం..
సూపర్బజార్(కొత్తగూడెం): వ్యవసాయాన్ని సహజంగా మార్చుకునే క్రమంలో బయోచార్ వినియోగం ఇటీవల అందుబాటులోకి వచ్చింది. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీనిని తయారు చేసుకుని సాగు భూముల్లో వేసుకోవచ్చు. జిల్లాలో మొదటి సారిగా గత నెలలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ క్యాంపు కార్యాలయంలో బయోచార్ తయారీకి శ్రీకారం చుట్టారు. ఇవీ ఉపయోగాలు బయోచార్ అనేది ఎరువు కాదు. కానీ పంటలకు వేసే ఎరువుల వినియోగ సామర్థ్యం 30–40 శాతం పెంచుతుంది. మట్టిలో పేరుకుపోయిన రసాయన అవశేషాలను తొలగించేందుకు తోడ్పడుతుంది. సాగునీటిలో విషాలను హరించివేస్తుంది. దీన్ని బయో (జీవం), చార్ (చార్కోల్ బొగ్గు) జీవం ఉన్న బొగ్గుగా పేర్కొనవచ్చు. నేలసారానికి సేంద్రియ కర్బనం అవసరం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. దీన్ని పెంపొందించేందుకు బయోచార్ ఉపయోగపడుతుంది. తద్వారా అధిక దిగుబడులు, నాణ్యమైన పంట ఉత్పత్తులను సాధించవచ్చు. తయారీ ఇలా.. పత్తి కట్టె, మిరపకట్టె, మొక్కజొన్న చొప్ప, వేరుశెనగ పొట్టు, వరి పొట్టు, పొగాకు మోడ్లు తదితర వ్యర్థ పదార్థాలను తగులబెట్టే బదులు వీటితో బయోచార్ తయారు చేయవచ్చు. తుమ్మవంటి కంప చెట్ల కలపతో, జీడి గింజల పైపెంకులతో కూడా బయోచార్ తయారు చేయవచ్చు. పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో పెద్దగా పొగ రాకుండా 450 డిగ్రీల నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్చితే (ఈ ప్రక్రియను పైరోలైసిస్ అంటారు) తయారయ్యే నల్లని కట్టె బొగ్గే బయోచార్. రైతులు ఇనుప డ్రమ్ముల్లో లేదా కందకం తవ్వి కూడా బయోచార్ను తయారు చేయవచ్చు. నేరుగా వేయకూడదు.. బయోచార్ను నేరుగా పొలాల్లో వేయకూడదు. బయోచార్ కంపోస్టును తయారు చేసుకుని వేయాలి. మాగిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు లేదా జీవామృతం లేదా పంచగవ్వ వంటి ఏదైనా సేంద్రియ ఘన/ద్రవ ఎరువుల్లో ఏదో ఒకదానిని బయోచార్తో సమపాళ్లలో కలపాలి. కుప్పగా వేసి బెల్లం నీటిని చిలకరిస్తూ రోజు కలియ తిప్పుతూ ఉంటే 15 రోజుల్లో బయోచార్ కంపోస్టు తయారవుతుంది. సాగు భూముల్లో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవాలి. తొలుత కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. జిల్లాలోని ప్రతీ గ్రామంలో కనీసం ఒక రైతైనా బయోచార్ తయారుచేసి పంటసాగులో వాడేలా చూడాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఇప్పటికే వ్యవసాయాధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొదట బయోచార్ తయారు చేయగా, ప్రస్తుతం వ్యవసాయాధికారులు వివిధ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా బయోచార్ తయారీ చేపడుతున్నారు. కలెక్టరేట్లో తొలిసారిగా ప్రయోగాత్మక ప్రదర్శన గ్రామానికో రైతు బయోచార్ వినియోగించేలా చర్యలు సేంద్రియ కర్బనం పెంపొంది అధిక, నాణ్యమైన పంట ఉత్పత్తులు -
ఇరవెండిలో పోడు వివాదం..
బూర్గంపాడు: ఇరవెండి ఫారెస్ట్ బీట్లోని కొసగుంపు వలస ఆదివాసీ గ్రామంలో శుక్రవారం పోడు భూములపై వివాదం చోటుచేసుకుంది. కందకాలు తవ్వేందుకు వెళ్లిన జేసీబీని కొసగుంపునకు చెందిన వలస ఆదివాసీ మహిళలు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులు మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి వారు వినకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో కందకాలు తవ్వొద్దని మహిళలు కోరగా.. గ్రామపెద్దలతో చర్చించిన తర్వాతనే తవ్వకాలు చేపట్టామని ఫారెస్ట్ అధికారులు వివరించారు. వాగ్వాదం పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొనగా.. ఫారెస్ట్ అధికారులు తమపై దాడి చేశారని మహిళలు ఆరోపించారు. ఈ విషయమై అశ్వాపురం ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేశ్ను వివరణ కోరగా.. కొసగుంపు గ్రామస్తులు, పెద్దలతో రెండు నెలలుగా చర్చించిన తరువాతనే సామరస్యంగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు. మహిళలు అక్కడకు వచ్చి పనులను అడ్డుకున్నారని, ఫారెస్ట్ సిబ్బందిని దుర్భాషలాడారని తెలిపారు. తిరిగి తామే దాడికి పాల్పడ్డామని ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఇదిలాఉండగా ఫారెస్ట్ అధికారులు తమపై దాడులకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు మహిళలు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు, ఎస్ఐ రాజేశ్కు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వుతుండగా అడ్డుకున్న గిరిజనులు -
ఇల్లెందుకు దేవాదుల!
సీఎం రేవంత్ దృష్టికి పాకాల – బయ్యారం పెద్ద చెరువుకు ప్రణాళిక అమల్లోకి వస్తే మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో కొత్తగూడ, గంగారం మండలాలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీఎంకు సన్నిహితుడిగా పేరున్న వేం నరేందర్రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు. దీంతో ఈ ప్లాన్ను పట్టాలెక్కించే విషయంలో వారిద్దరూ సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గత మార్చిలో దేవాదుల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఇటీవల సీఎం రేవంత్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ప్లాన్కు ఆమోదం లభిస్తే బయ్యారం వరకు వచ్చిన నీటిని రోళ్లపాడు మీదుగా పాలేరుకు తరలించే అంశంపై ఉమ్మడి జిల్లా మంత్రులు దృష్టి సారించాల్సి ఉంటుంది.సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ద్వారా గోదావరి జలాలు అందించేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అయితే సీతారామ కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో దేవాదుల ద్వారా గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాకు తెచ్చే ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి. ప్లాన్ మారింది.. నీళ్లు రాలేదు సీతారామ ప్రాజెక్టు పనులు 2016లో ప్రారంభించినప్పుడు దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి లిఫ్ట్ చేసిన గోదావరి నీటిని జిల్లాలో ఎత్తయిన ప్రాంతమైన ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడుకు తరలించాలని నిర్ణయించారు. పది టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి, ఇక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని ఉమ్మడి జిల్లాలోని పంటపొలాలకు తరలించాలని భావించారు. అయితే దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి రోళ్లపాడు వరకు నీటిని తెచ్చే క్రమంలో కిన్నెరసాని అభయారణ్యం అడ్డుగా ఉందంటూ ఈ ప్లాన్ను మార్చారు. దీంతో గోదావరి నీటిని ములకలపల్లి మండలం వరకు తరలించి, అక్కడి నుంచి రెండు వేర్వేరు లిఫ్టుల ద్వారా సత్తుపల్లి ట్రంక్ కెనాల్, పాలేరు కెనాల్గా రీ డిజైన్ చేశారు. ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పనులు జరుగుతుండగా పాలేరు పనులు మధ్యలో నిలిచిపోయాయి. జూలూరుపాడు వద్ద 10 కి.మీ. టన్నెల్ పూర్తయితేనే పాలేరుకు నీరు.. లేదంటే రాజీవ్ కెనాల్ ద్వారా ఎన్నెస్పీ ఆయకట్టు స్థిరీకరణతో సరిపెట్టుకోవాల్సిందే. అనేక అడ్డంకులు.. సీతారామ ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో 6.50 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు పెట్టినా ఆశించిన ఫలితం దక్కలేదు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు, నిధుల కేటాయింపు చూస్తుంటే అశ్వారావుపేట, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు లక్షల ఎకరాలతో పాటు రాజీవ్ కెనాల్ ద్వారా వైరా దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరందే పరిస్థితి మాత్రమే ఉంది. అటవీశాఖ అనుమతులు సాధించి, భారీగా నిధులు కేటాయిస్తేనే జూలూరుపాడు దగ్గర పది కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాతే పాలేరు, ఖమ్మం నియోజకర్గాలకు నీరు అందనుంది. ఇక ఇల్లెందు నియోజకవర్గం, మహబూబాబాద్ జిల్లా ప్యాకేజీ కోసం అదనంగా రూ.3,200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాకాల నుంచి బయ్యారం వరకు.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు గోదావరి జలాలు అందించేందుకు 25 ఏళ్ల క్రితం దేవాదుల ప్రాజెక్టును చేపట్టారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసిన నీరు రామప్ప జలాశయం ద్వారా పాకాల వరకు వస్తోంది. అక్కడికి చేరుకున్న గోదావరి నీటిని బయ్యారం చెరువుకు తరలించే ప్రత్యామ్నాయ ప్లాన్ను ప్రభుత్వం ఆలోచిస్తోంది. పాకాల చెరువు సముద్ర మట్టం నుంచి 250 అడుగుల ఎత్తులో ఉండగా బయ్యారం చెరువు 198 అడుగుల ఎత్తులో ఉంది. అయితే మధ్యలో కొన్ని గుట్టలు అడ్డుగా ఉన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.1000 కోట్లు ఖర్చు చేసి కొన్ని ఎత్తిపోతలు, కొత్త కాల్వల నిర్మాణం ద్వారా పాకాల నుంచి బయ్యారం వరకు గోదావరి జలాలు తేవచ్చనే నిర్ణయానికి వచ్చారు.పాకాల జలాశయం వరకు వస్తున్న గోదావరి జలాలు అక్కడి నుంచి బయ్యారం పెద్ద చెరువుకు తరలింపు ముందుగా గార్ల, బయ్యారం మండలాలకు నీరు.. ఆపై బయ్యారం నుంచి రోళ్లపాడుకు వస్తే ఉమ్మడి జిల్లాకు లబ్ధి సీఎం రేవంత్ చెంతకు ప్రతిపాదన -
గ్రామాల్లోనూ కంటైనర్ గృహాలు
● ఖర్చు తక్కువ.. అన్ని వసతులు ● నచ్చిన కొలతల్లో తయారీకి అవకాశం కొణిజర్ల: ఇప్పటి వరకు నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, చిన్నపాటి ఆఫీసులుగా చూసిన కంటైనర్ ఇళ్లు ఇప్పుడు అందరికీ చేరువవుతున్నాయి. ఇష్టం వచ్చిన రీతిలో త్వరగా సమకూర్చుకునే అవకాశం ఉన్నందున గ్రామాల్లోనూ పలువురు వీటిని ఆర్డర్పై తయారు చేయించుకుంటున్నారు. దూలపల్లిలో తయారీ.. కొణిజర్ల వాసి చింతల సతీష్కు ఇక్కడ 300 చదరపు అడుగుల స్థలం ఉంది. ఈ స్థలంలో బేస్మెంట్ నిర్మించాక ప్రీ ఫ్యాబ్రికేట్ ఇళ్లు సిద్ధం చేసి ఇస్తున్నారని తెలియడంతో హైదరాబాద్ కొంపల్లి సమీపాన దూలపల్లిలోని సంస్థను సంప్రదించాడు. దీంతో కిచెన్, హాల్, సింగిల్ బెడ్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో కంటైనర్ రూపంలోని ఇళ్లు తయారుచేసి ఇచ్చారు. ప్రత్యేక వాహనంపై తీసుకొచ్చి ముందే నిర్మించిన బేస్మెంట్పై ఫిట్ చేయించాడు. తనకు ఉన్న స్థఽలం కొలతల ఆధారంగా ఇంటిని సిద్ధం చేయించుకున్న సతీష్ ఇందుకోసం రూ.6 లక్షల వ్యయమైందని, జీఎస్టీ, రవాణా కలిపి మరో రూ.లక్ష వెచ్చించానని చెబుతున్నారు. ఇంటీరియర్ డిజైన్తో పాటు వాటర్, హీట్, ఫైర్ ఫ్రూప్గా ఉండి ఏడాది వారంటీతో ఇచ్చారని వెల్లడించాడు. కాగా, ఈ ఇంటిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్తో పాటు నచ్చిన కొలతలతో ఇంటి నిర్మాణానికి అవకాశం ఉండడంతో పలువురు సంస్థను సంప్రదించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ ఇళ్లలో కాస్తంత ఎత్తు తక్కువగా ఉండడం కొంత లోపంగా చెబుతున్నారు. సాధారణంగా ఇళ్లు పది అడుగుల ఎత్తులో నిర్మిస్తుంటే ఈ క్యాబినెట్ ఇల్లు మాత్రం 9 అడుగుల ఎత్తులోనే ఉంది. -
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ భద్రాచలంటౌన్: బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ ఆదేశించారు. భద్రాచలం పట్టణంలోని డీ అడిక్షన్ సెంటర్ను గురువారం ఆయన సందర్శించారు. రోగులతో మాట్లాడి చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వ్యసనాలకు బానిసలైన వ్యక్తులు వాటి నుంచి బయటపడేందుకు మానసిక నిపుణులతో కలిసి కౌన్సెలింగ్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ఎస్.జయలక్ష్మి, ఉదయ్, చైతన్య, ఫైజ్మోహినుద్దీన్, బి.సోమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు. 26న నిరుపయోగ వస్తువుల వేలంసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులను ఈ నెల 26న ఉదయం 10 గంటలకు హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో బహిరంగ వేలం పాట ద్వారా విక్రయించనున్నట్లు ఎస్పీ రోహిత్రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ మానిటర్లు, సీపీయూలు, కీ బోర్డులు, మౌస్లు, యూపీఎస్లు, ట్యాబ్లు, యాపిల్ ఐప్యాడ్లు, ఇన్వర్టర్, ఇన్వర్టర్ బ్యాటరీలు, డ్రాగన్ లైట్లు, టార్చ్లైట్లు, క్లాత్ టెంట్లు, టేబుళ్లు, కుర్చీలు, బీరువాలు, ఫర్నిచర్ సామగ్రి, ఇతర వస్తువులను వేలం వేస్తామని వివరించారు. ఆసక్తి కలిగినవారు ఒరిజినల్ ఆధార్కార్డుతో పాటు ఒక జిరాక్స్ కాపీ తీసుకుని ఆర్ఐ అడ్మిన్ షేక్ లాల్బాబును 87126 82143 నంబరులో సంప్రదించాలని సూచించారు. రెండు బైక్లు ఢీ : నలుగురికి తీవ్ర గాయాలుఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్నగర్ గ్రామపంచాయతీ శివారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. సుభాష్నగర్కు చెందిన చీకటి రాకేష్ బైక్పై జగదాంబగుంపునకు బయలుదేరాడు. అదే సమయంలో రాఘబోయినగూడెం గ్రామపంచాయతీ మొట్లగూడెం గ్రామానికి చెందిన కల్తి ప్రవీణ్, సూర్నపాక శ్రీను, సూర్నపాక ఆదిలక్ష్మి మరో బైక్పై కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న చీకటి రాకేష్, కల్తి ప్రవీణ్లను ఖమ్మం సిఫారసు చేశారు. ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిఇల్లెందురూరల్: పోచారంతండా, కొమరారం గ్రామాల మధ్య గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పోచారంతండా గ్రామపంచాయతీ అమర్సింగ్తండా గ్రామానికి చెందిన గుగులోత్ బాలునాయక్ (45) బైక్పై కొమరారం వస్తుండగా మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో తలకు తీవ్రంగా గాయమైంది. అదే మార్గంలో వెళుతున్న వ్యక్తులు ప్రమాదాన్ని గుర్తించి బాలునాయక్ను కొమరారం పీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కొమరారం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గ్రానైట్ వ్యాపారి అరెస్ట్ ఖమ్మంక్రైం: మహిళపై అత్యాచారానికి పాల్ప డిన కేసులో ఓ గ్రానైట్ వ్యాపారిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంతో కలిసి అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాడు. తరచుగా వారి ఇంటికి వెళ్లే వెంకటేశ్వర్లు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. -
సమయపాలన పాటించేలా..
● పంచాయతీరాజ్లో ముఖ గుర్తింపు హాజరు పద్ధతికి కసరత్తు ● ఇప్పటికే గ్రామపంచాయతీ కార్యదర్శులకు వర్తింపు ● త్వరలో మండల పరిషత్ల్లో అమలుకు చర్యలుఇల్లెందురూరల్: అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించేలా పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే విద్య, వైద్య విభాగాల్లో ప్రయోగాత్మకంగా పలు జిల్లాల్లో అమలు చేస్తున్న ముఖగుర్తింపు హాజరు విధానాన్ని ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేక యాప్ ద్వారా కార్యదర్శులకు అమలు చేస్తోంది. ఇదే విధానాన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా అమలు చేయనుంది. సామగ్రి చేరక జాప్యం.. ఈ నెల 16వ తేదీ నుంచి అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా ముఖ గుర్తింపు హాజరుకు సంబంధించిన సామగ్రి కార్యాలయాలకు చేరకపోవడంతో జాప్యం జరుగుతోంది. కాగా నూతన హాజరు విధానం కోసం ఎంపీడీఓ, ఎంపీఓ, పర్యవేక్షకులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, పీఆర్ ఏఈలు, గృహనిర్మాణ శాఖ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఏపీవోలు, టీఏలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఉద్యోగులు, సిబ్బంది వివరాలు, ఆధార్కార్డుల వివరాల సేకరణ మొదలు పెట్టారు. సంబంధిత సామగ్రి రాగానే నూతన విధానాన్ని అమలు చేయనున్నారు. ఉదయం విధులకు రాగానే, సాయంత్రం విధులు పూర్తయ్యాక రెండుసార్లు ముఖ గుర్తింపుతో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి జీపీఎస్ను అనుసంధానం చేస్తారు. ఇలా నమోదైన రోజు వారీ హాజరు నివేదికను రాష్ట్ర కార్యాలయాలకు పంపుతారు. ఇతర విభాగాల్లోనూ కసరత్తు 2019లో మహబూబాబాద్ జిల్లాలోని మండల స్థాయి కార్యాలయాల్లో అప్పటి కలెక్టర్ శివలింగయ్య బయోమెట్రిక్ విధానంలో ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని ప్రారంభించారు. ఏడాదిన్నరపాటు సాఫీగా సాగినా కరోనా సమయంలో రద్దయింది. వైద్యశాఖలోనూ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ఖమ్మం జిల్లాలో అమలు చేశారు. ఇక్కడ విజయవంతం కావడంతో అన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు వైద్యశాఖ కసరత్తు చేస్తోంది. విద్యాశాఖలో విద్యార్థుల హాజరును ముఖగుర్తింపు పద్ధతిలో అమలు చేస్తుండగా, ఈ విధానాన్ని ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తర్వులు అందాయి.. మండల పరిషత్ కార్యాలయాల్లో ముఖగుర్తింపు హాజరు విధానం అమలు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఉత్తర్వులు అందాయి. దీనికి సంబంధించి బయోమెట్రిక్, ఇతర యంత్ర సామగ్రి అందుబాటులోకి రాగానే నూతన విధానం ప్రకారం హాజరు నమోదు ప్రారంభిస్తాం. – ధన్సింగ్, ఎంపీడీఓ, ఇల్లెందుగతంలో వేలిముద్ర ప్రయోగం ఉద్యోగులు సమయ పాలన పాటించేలా గతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేలిముద్ర హాజరు విధానం ఉండేది. సంబంధిత యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో అనతికాలంలోనే హాజరు పట్టికలో సంతకం విధానం కొనసాగుతోంది. దీంతో ఎప్పటిలాగే ఉద్యోగులు ఆలస్యంగా రావడం, తొందరగా వెళ్లడం, విధులకు రాకపోయినా మరుసటి రోజు వచ్చి సంతకాలు చేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యానికి చెక్ పెట్టేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మండల పరిషత్ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు హాజరు విధానం అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
మంత్రి పదవులు ఇవ్వకుంటే గుణపాఠం చెబుతాం
ఖమ్మం మామిళ్లగూడెం: యాదవులు, మున్నూరు కాపులతో పాటు ఎంబీసీలకు మంత్రి పదవులు ఇవ్వకుంటే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతామని తెలంగాణ రాష్ట్ర బీసీ జనసభ అధ్యక్షుడు డి.రాజారాంయాదవ్ హెచ్చరించారు. ఖమ్మంలో గురువారం ‘బీసీల రిజర్వేషన్లు, మంత్రి పదవుల కేటాయింపు’అంశంపై తెలంగాణ యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి గుమ్మా రోశయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యాదవులు, మున్నూరుకాపులు, ఎంబీసీలు సహకరించగా, యూపీఏ–1, 2 ప్రభుత్వం మనుగడలోనూ ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్ కృషి ఉందని తెలిపారు. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డి యాదవజాతిని నిర్లక్ష్యంగా చూడడం సరికాదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సూచనల మేరకు ఇకనైనా మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై 30వ తేదీన యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యాన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రాజారాం కోరారు. సదస్సులో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మున్నూరు కాపు సంఘం నాయకుడు గుండాల కృష్ణ, గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి అమరగాని వెంకన్నగౌడ్, తెలంగాణ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య యాదవ్తో పాటు వివిధ సంఘాల నాయకులు ఎర్రబోయిన గోవిందరావు, గోవర్దన్, మేకల కృష్ణ, మధు, బారీ మల్సూర్, చిత్తారు ఇందుమతి, జడ మల్లేష్, జంగా సత్యనారాయణ, మీగడ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలి
సీడబ్ల్యుసీఈ అధికారి పృథ్వీరాజ్ కరకగూడెం: నీటి సంరక్షణ పద్ధతులపై గ్రామీణ ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీరింగ్ (సీడబ్ల్యుసీఈ) పృథ్వీరాజ్ సూచించారు. గురువారం జలశక్తి అభియాన్ కార్యక్రమ పర్యవేక్షణలో భాగంగా మండలంలోని అనంతారం, సమత్ మోతె, వట్టంవారి గుంపు, తాటిగూడెం, కరకగూడెం, సమత్ భట్టుపల్లి, కన్నాయిగూడెం గ్రామాలను సందర్శించారు. ఇంకుడు గుంతలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాజు, భాస్కర్, కృష్ణయ్య, పాపయ్య, రామకృష్ణ పాల్గొన్నారు. -
64 మంది విద్యార్థులు.. ఇద్దరు టీచర్లు
టేకులపల్లి: మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామం బర్లగూడెం (గొల్లగూడెం) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 64 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయులు మాత్రం ఇద్దరే ఉన్నారు. గురువారం కేవలం హెచ్ఎం మాత్రమే హాజరయ్యారు. మరో టీచర్ రాలేదు. రోజూ ఇద్దరు హాజరైతేనే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఏ రోజైనా ఒక టీచర్ సెలవు పెడితే 64 మంది విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు ఒక్కరూ మాత్రమే బోధించాల్సి వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి బర్లగూడెం పాఠశాలకు మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రాజకీయ జోక్యమే కాపాడుతోందా?
● డీసీసీబీలో రూ.కోట్ల అక్రమాలపై విచారణకే పరిమితం ● నేడు మహాజన సభలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) 127వ మహాజన సభ శుక్రవారం జరగనుండగా, బ్యాంకులో ఏళ్ల క్రితం అక్రమాలపై పలువురు చర్చకు పట్టుబట్టే అవకాశముందని తెలుస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ఖమ్మంలోని పలు బ్రాంచ్ల ద్వారా 21మంది ఇళ్ల నకిలీ ధ్రువపత్రాలతో రూ.6 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇవేకాక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బ్రాంచ్ల ద్వారా రుణాల మంజూరీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటిపై నాలుగేళ్లుగా వివిధ స్థాయిల్లో విచారణ జరుగుతుండగా, కేవలం ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మిగతా బ్రాంచ్ల అధికారులు అక్రమాలకు కారణమని తెలిసినా ప్రధాన కార్యాలయంలో ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడంతోనే సరిపెట్టడం గమనార్హం. మిగతా వారికి రాజకీయ నాయకుల అండ ఉండడంతో విచారణల పేరిట కాలం వెళ్లదీస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా, రూ.6కోట్ల రుణం తీసుకుని చెల్లించని వ్యవహారంపై గత పాలకవర్గం రాష్ట్ర సహకార బ్యాంకు(టస్కాబ్) దృష్టికి తీసుకెళ్లగా సహకార శాఖ రిజిస్ట్రార్ విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ విచారణ తర్వాత నివేదిక సమర్పించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై కొద్దినెలల క్రితం జరిగిన సమావేశంలో డైరెక్టర్లు ప్రశ్నించారు. దీంతో శుక్రవారం జరిగే సమావేశంలో గట్టిగా నిలదీయాలని డైరెక్టర్లు భావిస్తుండడంతో, మహాజన సభలో చర్చించేలా అజెండాగా చేర్చారు. అంతేకాక స్థానిక అధికారులతో విచారణ చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ విషయమై బ్యాంకు సీఈఓ వెంకటఆదిత్యను సంప్రదించగా రుణ అక్రమాలపై మహాజన సభలో నిర్ణయం తీసుకునే అవకాశముందని, సభ్యులు చర్చిస్తే విచారణకు తీర్మానిస్తామని తెలిపారు. అలాగే, ఏడాది క్రితం బ్యాంకులో జరిగిన పలు అక్రమాలపైనా సభ్యులు నిలదీయనున్నట్లు సమాచారం. కాగా, వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పంట రుణాలు, పీఏసీఎస్ల ద్వారా ఎరువుల పంపిణీపై చర్చించేలా అజెండాలో చేర్చారు. -
యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ..
సూపర్బజార్(కొత్తగూడెం): యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం ప్రదర్శన నిర్వహించారు. వామపక్ష పార్టీ జాతీయ కమిటీల పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ కార్యాలయాల నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అమెరికా తన ఆయుధ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు వివిధ దేశాల మధ్య చిచ్చుపెడుతూ యుద్ధాలకు ప్రేరేపిస్తోందని, ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధం ట్రంప్ సామ్రాజ్యవాద కాంక్షకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని అమెరికా కర్రపెత్తనం చేస్తోందని ఆరోపించారు. రెండు దశాబ్దాలుగా పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ నిరంతర బాంబు, వైమానిక దాడులకు పాల్పడుతూ లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటూ మారణ హోమాన్ని సృష్టిస్తోందని అన్నారు. అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కులు హరించుకుపోతున్న పరిస్థితిలో పాలస్తీనా ప్రజలకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా ముందు మోకరిల్లే విధానాలకు స్వస్తి చెప్పి ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంపై ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా నోరు విప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు, మాస్లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, న్యూడెమోక్రసీ నాయకుడు కందగట్ల సురేందర్ కూడా మాట్లాడారు.వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన -
‘చేయూత’కు ఆకర్షితులవుతున్నారు..
సూపర్బజార్(కొత్తగూడెం): ఆపరేషన్ చేయూతకు ఆకర్షితులై మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపుతున్నారని ఎస్పీ రోహిత్రాజు తెలిపారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో గురువారం 12 మంది మావోయిస్టులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం పోలీసులు, సీఆర్పీఎఫ్ అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 294 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. వీరిలో ముగ్గురు డీవీసీఎంలు, 17 మంది ఏసీఎంలు, 34 మంది పీఎంలు, 107 మంది మిలీషియా సభ్యులు, 35 మంది ఆర్పీసీలతో పాటు మరో 98 మంది వివిధ స్థాయిల్లో పనిచేసిన వారు ఉన్నారని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ – ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారని, సరిహద్దు గ్రామాల ప్రజలు వారికి సహకరించొద్దని కోరారు. లొంగిపోవాలనుకున్న మావోలు స్థానిక పోలీస్స్టేషన్లలో బంధువుల ద్వారా సంప్రదించాలని సూచించారు. గురువారం లొంగిపోయిన 12 మంది మావోయిస్టులకు మొదట రూ.25 వేల చొప్పున నగదు అందజేశారు. వారి హోదాను బట్టి అందించే మిగతా సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్ ముఖేష్కుమార్ సింగ్, 141 బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ ప్రతాప్ పుర్తి, చర్ల సీఐ రాజువర్మ, ఆర్ఐ రవి పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజు వెల్లడి 12 మంది మావోయిస్టుల లొంగుబాటు -
యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
సింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 21న సింగరేణివ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, జీఎం పర్సనల్ (వెల్ఫేర్ అండ్ సీఎస్సార్) జీవీ కిరణ్కుమార్ తెలిపారు. గురువారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో అన్ని ఏరియాల పర్సనల్ విభాగం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సంస్థ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, గనులు , డిపార్ట్మెంట్లలోని ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. కారుణ్య నియామకాల పక్రియ వేగవంతం చేయాలని, చిన్న, చిన్న తప్పిదాలను ఏరియా స్థాయిలోనే సరిచేసి, డిపెండెంట్లకు త్వరితగతిన ఉద్యోగాలు వచ్చేలా చూడాలన్నారు. టర్మినెల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మురళీధర్ రావు, కేశ నారాయణ రావు, బి.శివకేశవ రావు, ముకుంద సత్యనారాయణ, టి. శ్రీనివాస్రావు పాల్గొన్నారు. -
బాలుడి గొంతులో ప్లాస్టిక్ గన్ బుల్లెట్
● ఏడాదిగా నొప్పి, మింగలేక ఇబ్బందులు ● శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన వైద్యుడు ఖమ్మంవైద్యవిభాగం: ఆడుకునే క్రమాన ప్లాస్టిక్ గన్ బుల్లెట్ను నోట్లో పెట్టుకోగా అది బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఏడాది కాలంగా నొప్పి, ఏదీ సరిగా తినలేక ఇబ్బంది పడుతుండగా శస్త్రచికిత్స ద్వారా బయటకు తీసిన వైనమిది. మహబూబాబాద్ జిల్లా పాతపోచారం గ్రామానికి చెందిన పి.శ్రవణ్కుమార్ – సౌజన్య దంపతుల మూడేళ్ల కుమారుడు షణ్ముక్ కొంత కాలంగా గొంతు నొప్పి, మింగలేకపోవడం, తినలేక బాధపడుతున్నాడు. చాలా ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేక ఖమ్మం నెహ్రూనగర్లోని ప్రవీణ్ ఈఎన్టీ ఆస్పత్రిలో డాక్టర్ ఎం.జీ.వీ.ప్రవీణ్ను సంప్రదించారు. బాలుడికి ఎండోస్కోపీ నిర్వహించినా ఫలితం లేక సిటీ స్కాన్ చేయగా గొంతు వెనుక భాగంలో వస్తువు కనిపించింది. అత్యంత సున్నితమైన మెదడు అడుగు భాగాన పదునైన వస్తువు ఉన్నట్లు తేలడంతో శస్త్రచికిత్స ద్వారా బయటకు తీయగా అది ప్లాస్టిక్ గన్ బుల్లెట్గా గుర్తించారు. దీన్ని అలానే వదిలేసి ఉంటే కపాలం నుంచి మెదడులోకి చొచ్చుకెళ్లి మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలను పాడు చేసేదని వైద్యుడు తెలిపారు. -
రూ.7,700.87కోట్లతో రుణ ప్రణాళిక
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7700.87 కోట్ల రుణ ప్రణాళిక లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేశారు. గతేడాదికి సంబంధించి రైతులు, స్వయం సహాయక సంఘాలతో పాటు వివిధ సంక్షేమ శాఖల రుణాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ పథకాల లక్ష్య సాధనకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 5,242.49 కోట్లకు గాను రూ. 3,960.63 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రుణాల మంజూరుతో పాటు రికవరీపై శ్రద్ధ వహించాలని కోరారు. అనంతరం ఈ ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఇందులో వ్యవసాయ అవసరాలకు రూ. 3,838 కోట్లు, ఎంఎస్ఎంఈ కింద రూ. 847.80 కోట్లు, ఇతర రంగాలకు రూ. 4,883.99 కోట్లు అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ తిరుపతయ్య, పశుసంవర్థక శాఖ డీడీ వెంకటేశ్వర్లు, అన్ని బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. 29, 30వ తేదీల్లో కేన్సర్ చికిత్స శిబిరాలు.. ఈనెల 29న భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాల, 30న దుమ్ముగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో కేన్సర్ ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్, వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరపత్రాలు, బ్యానర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్.ఎల్. కాంతారావు, ఆయా సంఘాల బాధ్యులు సూర్యనారాయణ, జగదీష్, బి.రాజారెడ్డి, బి. సుబ్బరాజు, ఎం. మోహన్రావు, సుదర్శనరావు, పి.రాజశేఖర్, భానుప్రసాద్, వి.కామేశ్వరరావు, గట్టు వెంకటాచార్య, కమలా రాజశేఖర్, పాకాల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. సికిలెసెల్పై అప్రమత్తత అవసరంభద్రాచలం: ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సికిల్సెల్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. ప్రపంచ సికిల్సెల్ అనీమియా డే సందర్భంగా ఐటీడీఏలో గురువారం రక్త పరీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సికిల్సెల్ అనీమియా ప్రాణాంతక వ్యాధి కాదని, జన్యుపరంగా వస్తుందని తెలిపారు. ప్రాధమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స పొందాలని సూచించారు. గిరిజనులు మూఢనమ్మకాల వైపు వెళ్లకుండా అవగాహన జాతాలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. 2047 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించేలా చూడాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని 130 గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, ఏడీఎంహెచ్ఓ చైతన్య, సికిల్సెల్ ప్రోగ్రాం అధికారి మధుకర్, ఆర్ఎంఓ రాజశేఖర్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవగాహన అవసరం చుంచుపల్లి: పంచాయతీల అభివృద్ధికి అవగాహన అవసరమని కలెక్టర్ అన్నారు. గురువారం ఐడీఓసీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణం, డిజిటల్ లావాదేవీలు, మహిళా భాగస్వామ్యం వంటి విభిన్న అంశాల్లో పంచాయతీల స్థితిగతులు అర్థమవుతాయని అన్నారు. వీటి పురోగతిపై అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ చంద్రమౌళి, డీఈఓ వెంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి -
సుమనోహరం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి సమర్పించాక మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఈఓ ఎన్.రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. 22 మంది మైనింగ్ అధికారుల బదిలీసింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 22 మంది మైనింగ్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఈఈ సెల్ హెచ్ఓడీ మురళీధర్రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది డీజీఎంలు, ఒక ఎస్ఓఎం, ఆరుగురు అడిషినల్ మేనేజర్లు, ఒక డిప్యూటీ మేనేజర్, ఇద్దరు ఎస్ఈలు, ఇద్దరు డీవైఎస్ఈలు, ఒక సీనియర్ అండర్ మేనేజర్ ఉన్నారని వివరించారు. వీరంతా ఈనెల 28వ తేదీలోగా కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని సూచించారు. 27 వరకు దరఖాస్తుల స్వీకరణకొత్తగూడెంఅర్బన్: సహాయ ఉపకరణాల కోసం జిల్లాలోని అర్హులైన దివ్యాంగుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఇందుకు ఈనెల 27 వరకు గడువు ఉందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనీనా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిట్రో ఫిట్టెడ్ మోటార్ వాహనాలు, బ్యాటరీ వీల్ చైర్లు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ వీల్ చైర్లు, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో హైబ్రిడ్ వీల్ చైర్, ల్యాప్టాప్లు, 5జీ స్మార్ట్ ఫోన్, ట్రై సైకిల్, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. దరఖాస్తు కాపీలను తమ కార్యాలయంలో అందజేయాలని, వివరాలకు 63019 81960, 83310 06010 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. రెండో రోజు టీజీ టెట్ ప్రశాంతంసుజాతనగర్: మండలంలోని వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో రెండో రోజు గురువారం నిర్వహించిన టీజీ టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 120 మందికిగాను మొదటి షిఫ్ట్లో 93 మంది, రెండో షిఫ్ట్లోనూ 93 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. నేడు, రేపు జాతీయ సదస్సు ఖమ్మంసహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ జూనియర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన శుక్ర, శనివారాల్లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ జకీరుల్లా తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, తెలంగాణ సాహిత్య అకాడమీ తదితర విభాగాల ఆధ్వర్యాన శతజయంతి సాహితీమూర్తులు దాశరథి, ఆరుద్ర జీవితం, సాహిత్యంపై ఈ సదస్సు జరుగుతుందని వెల్లడించారు. కళాశాల విద్యా కమిషనర్ ఎ.శ్రీదేవసేనతో పాటు పలువురు కవులు, కళాకారులు హాజరవుతారని తెలిపారు. -
మెరుగైన చికిత్స అందించాలి
● వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ● పాల్వంచ సీహెచ్సీలో తనిఖీలుపాల్వంచ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ అన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సతీమణి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయిన నేపథ్యంలో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు గురువారం ఆయన సీహెచ్సీకి వచ్చారు. అన్ని వార్డుల్లో తిరుగుతూ ఎలా చికిత్స అందుతోందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రకాల జబ్బులతో ఆస్పత్రికి వచ్చే బాధితులతో మమేకమై చికిత్స అందించాలని, విధుల్లో లోటుపాట్లు ఉండొద్దని, సమయ పాలన పాటించాలని సూచించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో వైద్యులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో అజయ్కుమార్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. అంకిత భావంతో పనిచేస్తే ఉద్యోగులకు మంచి పేరు వస్తుందని అన్నారు. అనంతరం జిల్లాలోని ఏడు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్న 80 మంది సిబ్బందికి సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్, ఆర్ఎంఓ డాక్టర్ సోమరాజు దొర, డాక్టర్ ముక్కంటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రక్షణ చర్యలు పటిష్టపర్చాలి
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరగకుండా పటిష్ట రక్షణ చర్యలు అమలు చేయాలని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆ్ఫ్ మైన్స్ సేఫ్టీ(డీడీజీఎంఎస్) టి.ఆర్.కన్నన్ అధికారులకు సూచించారు. స్థానిక ఇల్లెందు గెస్ట్హౌస్లో గురువారం కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లోని గనుల్లో తీసుకోవాల్సిన భద్రత చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కన్నన్ మాట్లాడుతూ.. ఉపరితల గనుల్లో వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్ లిమిట్ ఉండాలని, బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్లు, లారీలు కూడా వేగ నియంత్రణ పాటించాలని ఆదేశించారు. మెకానిక్లు వినియోగించే పరికరాలు ఎంతమేరకు సామర్థ్యం కలిగి ఉన్నాయో పరిశీలించాలని సూచించారు. కాలపరిమితి ముగిసిన పరికరాలను తిరిగి పంపించి కొత్తవి సమకూర్చుకోవాలని చెప్పారు. ఎలక్ట్రికల్ వస్తువులు వినియోగించే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. మైన్స్, ఉపరితల గనుల అవవరణల్లో తిరిగే వాహనాల కండిషన్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలని ఆదేశించారు. కార్యక్రమంలో మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ అశోక్కుమార్, డీజీఎంఎస్లు సనత్కుమార్, దిలీప్, కమలేష్కుమార్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియా జీఎంలు ఎం.శాలేంరాజు, దుర్గం రాంచందర్, కృష్ణయ్య, సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, రీజియన్ సేఫ్టీ జీఎం కె.జి.తివారి, ఇతర విభాగాల జీఎంలు సూర్యనారాయణ, రఘురామ్, ప్రెజ్రాల్డ్, తిరుమలరావు, ఎన్.దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు. గనుల్లో ప్రమాదాలు జరగకుండా చూడాలి మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కన్నన్ -
12 మంది మావోయిస్టులు లొంగుబాటు
కొత్తగూడెం: వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్ అవుతున్నారు. తాజాగా కొత్తగూడెం ఎస్పీ ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. గత ఆరు నెలల్లో 294 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు రూ. 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు.కాగా, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి.ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. -
ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో మెలగాలి
ఖమ్మంస్పోర్ట్స్: ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నత స్థానాలకు చేరాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ నార్సింగ్ షైలానీ సూచించారు. ఖమ్మం హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లోని ఎన్సీసీయూనిట్ను బుధవారం పరిశీలించిన ఆయ న కేడెట్లతో మాట్లాడారు. కేడెట్లు ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని తెలిపారు. భారత ఆర్మీలో చేపట్టే ఎంపీకల్లో ఎన్సీసీ కేడెట్లకు ప్రత్యేక కోటా ఉంటుందని చెప్పారు. అనంతరం గ్రూప్ కమాండర్ కల్నల్, వీరచక్ర అవార్డు గ్రహీత సచిన్ నింబాల్కర్, ఏడీ (పర్సనల్) కల్నల్ సంజీవ్కుమార్, 11వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్కుమార్ భద్ర, హార్వెస్ట్ కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డితో పాటు జి.బాలకృష్ణ, మమత, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖమ్మంలోని ఎన్సీసీ బెటాలియన్ను సందర్శించారు. -
రూ.3.60 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం బైపాస్ రోడ్డు సమీపాన గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకర రమేశ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేపట్టగా టీన్జీవోస్ కాలనీకి చెందిన కట్టగోరు రవితేజ, పాకబండబజార్కు చెందిన జిలాన్ సైఫ్, సంభానీనగర్కు చెందిన షేక్ మహమ్మద్ బాషా, పిండిప్రోలుకు చెందిన బాసిగోంపు గోపి, కోలా శ్రీకాంత్ పట్టుబడ్డారు. ఇదే ముఠాకు సంబంధించి ఎలగందుల సందీప్ పరారీలో ఉండగా, వీరంతా ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరికి బైక్లపై వెళ్లి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో నిందితుల నుంచి రూ.3.60 లక్షల విలువైన గంజాయితో పాటు నాలుగు ద్విచక్రవాహనాలు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సీఐ రమేశ్తోపాటు ఎస్ఐ శ్రీహరిరావు, ఉద్యోగులు కరీం, బాలు, సుధీర్, వెంకటేశ్, విజయ్, హనుమంతరావు, హరీశ్, వీరబాబు పాల్గొన్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా విత్తనాల విక్రయం
చండ్రుగొండ: నిబంధనలకు విరుద్ధంగా మిరప, పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఐదుగురు వ్యాపారులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జూ లూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం... సుజాతనగర్కు చెందిన డీలర్కు చండ్రుగొండ మండలంలో విక్రయించే అనుమతి లేనప్పటికీ బెండాలపాడులో విత్తనాలు విక్రయిస్తున్నాడు. దీంతో పోలీసులు దాడి చేశారు. పది కిలోల మిరప విత్తనాలను, 105 పత్తి విత్తన పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 12,73,250 ఉంటుంది. ఈ ఘటనలో బెండాలపాడుకు చెందిన వీరభద్రం, అన్వేష్లతోపాటు సుజాతనగర్కు చెందిన శివనాగ్, సాయిదుర్గప్రసాద్, యోగానంద్లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ శివరామకృష్ణ, ఏఓ వినయ్ పాల్గొన్నారు. ఐదుగురు వ్యాపారుల అరెస్ట్ -
పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలి
కరకగూడెం: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) బృందం సభ్యులు సూచించారు. మండలంలోని రఘునాథపాలెం, చిరుమళ్ల, కలవలనాగారం, నర్సాపురం అటవీ ప్రాంతాల్లో కంపా నిధులతో చేపట్టిన వివిధ పనుల పురోగతిని బుధవారం వారు పరిశీలించారు. చెక్ డ్యామ్లు, ఫైర్ లైన్స్, ప్లాంటేషన్, చెక్ పీడీల కొలతలు సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో చెక్ డ్యామ్ల నిర్మాణంతో భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని, ఇది పర్యావరణ సమతుల్యతకు చాలా అవసరమని అన్నారు. అలాగే వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా భూమిలోకి ఇంకి, వేసవిలో కూడా పచ్చదనాన్ని కాపాడేందుకు ఉపకరిస్తాయని తెలిపారు. మొక్కల పెరుగుదల బాగుందని, సరైన మొక్కలను ఎంచుకోవడం, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బృందం సభ్యులు ఎండీ నసీర్ పాషా, పద్మజ, శిరీష, ఏడూళ్ల బయ్యారం రేంజర్ తేజస్వి పాల్గొన్నారు. అటవీ పనుల పురోగతిపై ఈపీటీఆర్ఐ బృందం అధ్యయనం -
హత్య కేసులో మరో ఆరుగురు అరెస్ట్
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీలో ఈ నెల 7న జరిగిన కనితి సతీష్ హత్య కేసులో మరో ఆరుగురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్పీ విక్రాంత్ కుమా ర్ సింగ్ కథనం ప్రకారం.. ఏఎస్ఆర్ కాలనీలో జరి గిన హత్య కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు గంజి సాయి సహా 12మంది నిందితులను అరెస్ట్ చేశా రు. పరారీలో ఉన్న సారపాకకు చెందిన వల్లెపు నా ని, భద్రాచలానికి చెందిన పగిడిపాటి మురళీకృష్ణ, షేక్ షరీఫ్, కొండవీటి పవన్కళ్యాణ్, ఎటపాక మండలంలోని శ్రీరంనగర్కాలనీకి చెందిన దామెర్ల రమేష్తోపాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇంకా పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుపై మహిళలకు అవగాహనఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలతో పరిశ్రమలు ఏర్పాటు చేయించేలా అవగాహన కల్పిస్తున్నట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జెడ్పీ కార్యాలయంలో డీఆర్డీఏ, సెర్ప్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో అడిషనల్డీఆర్డీఓ ఆర్.జయశ్రీ మాట్లాడారు. మహి ళలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు సదస్సుల్లో ఔత్సాహికుల ను ఎంపిక చేసి పరిశ్రమల ఏర్పాటు, నిర్వహ ణ, మెళకువలు, నైపుణ్యాభివృద్ధిపై 15 రోజుల శిక్ష ణ ఇస్తామని, అంతేకాక లైసెన్స్, రుణాల మంజూరులో అండగా నిలుస్తామని తెలిపారు. -
ముగ్గురు వేటగాళ్ల అరెస్ట్
ములకలపల్లి: వన్యప్రాణులను హతమారుస్తున్న ముగ్గురు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం. రవికిరణ్ కథనం ప్రకారం.. ఏపీలోని వేలేరుపాడు మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన కుంజా విష్ణు తన నాటుతుపాకీతో అశ్వారావుపేట మండలం నందిపాడుకు చెందిన కుర్సం రామకృష్ణతో కలిసి శుక్రవారం రాత్రి మండలంలోని కుమ్మరిపాడు గ్రామానికి వచ్చారు. అదే గ్రామానికి చెందిన పద్దం సీతారాములు, పద్దం వినోద్లతో కలిసి గ్రామ శివారులోని అటవీప్రాంతానికి వన్యప్రాణుల వేటకు వెళ్లారు. శనివారం ఉదయం తిరిగి ఇంటికి వస్తుండగా పక్కా సమాచారంతో ఫారెస్ట్ అధికారులు గస్తీ ఏర్పాటు చేశారు, చాపరాలపల్లి వెస్ట్బీట్, కంపార్ట్మెంట్ నెంబర్ 24 వద్ద అటవీశాఖ సిబ్బందికి వేటగాళ్లు ఎదురుపడినా తప్పించుకున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి విష్ణు, రామకృష్ణ, సీతారాములను మంగళవారం అదుపులోకి తీసుకొని, అరెస్ట్ చేశారు. కుంజా వినోద్ పరారీలో ఉన్నాడు. నిందితులను బుధవారం కొత్తగూడెం కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. నాటు తుపాకీ స్వాధీనం -
సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీ
ఇల్లెందు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, మహబూబాబాద్ ఎంపీ బలరామ్నాయక్ బుధవారం హైదరాబాద్లో కలిశారు. ఇల్లెందు, భద్రాచలం, వైరా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, మాలోతు రాందాస్నాయక్ సీఎంను కలవగా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, నిధుల మంజూరు ప్రతిపాదనలు సమర్పించారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా దృష్టి సారించాలని సీఎం వారికి సూచించారు. భూ భారతితో సమస్యల పరిష్కారం● అదనపు కలెక్టర్ వేణుగోపాల్ చుంచుపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారం సులభతరమవుతుందని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. మండలంలోని వెంకటేశ్వరకాలనీలో బుధవా రం ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సులో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు లోకి తెచ్చిందన్నారు. తహసీల్దార్ కృష్ణ, ఆర్ఐ మంగ్యా, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్యములకలపల్లి: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై బుధవారం కేసు నమోదైంది. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం సీతారాంనగరానికి చెందిన వేటగాని నాగరాజు (21)కు ములకలపల్లి మండలంలోని నల్లివారిగూడెం గ్రామానికి చెందిన గీతతో సుమారు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. నాగరాజు కొంతకాలంగా మద్యానికి బానిసకాగా, గీత పుట్టింటికి వచ్చేసింది. కాగా నాగరాజు బంధువు మృతిచెందగా, భార్య గీతను తీసుకెళ్లేందుకు మంగళవారం నల్లివారిగూడెం వచ్చాడు. మద్యం మానేస్తేనే వస్తానని భార్య గీత స్పష్టం చేయడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబీకులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జీసీసీ గోదాంలో రేషన్ బియ్యం తనిఖీపాల్వంచరూరల్: స్థానిక గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సముదాయంలోని గోదాంలో రేషన్ బియ్యం నిల్వలను రాష్ట్ర విజిలెన్స్ టాస్క్ఫోర్స్ అధికారులు అంజయ్య నేతృత్వంలోని బృందం బుధవారం తనిఖీలు నిర్వహించింది. గోదాంలోని సన్నబియ్యం రేషన్ షాపులకు ఎన్ని క్వింటాళ్లు తరలించారు.. ఎంత నిల్వ ఉన్నాయి.. అనే వివరాలతో పాటు ఆర్ఓ ఎంట్రీలను పరిశీలించారు. దమ్మపేట, భద్రాచలంలో కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు డీటీ శ్రీనివాసరావు తెలిపారు. గెలిచిన వారిపై ఓడిపోయిన వారి దాడిఖమ్మంక్రైం: ఖమ్మంలోని ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరగగా.. ఓడిన వారు ఆగ్రహంతో గెలిచిన వర్గీయులపై దాడి చేశా రు. ఈ ఘటనలో ఓ అంబులెన్స్ డ్రైవర్కు తీవ్రగాయాలు కాగా చికిత్స పొందుతున్నాడు. పలు ప్రైవే ట్ ఆస్పత్రులకు సంబంధించిన అంబులెన్స్ డ్రైవర్ల యూనియన్ ఎన్ని కలు ఇటీవల జరిగాయి. ఇప్పటికే ఉన్న కార్యవర్గ బాధ్యులు ఓడిపోగా, కొత్తవారు గెలిచారు. లావాదేవీలపై చర్చించేందుకు నూతన కార్యవర్గం బాధ్యులు మంగళవారం ఖమ్మం నెహ్రూనగర్లో పాత యూనియన్ బాధ్యుల వద్దకు వెళ్లగా ఆగ్రహంతో ఉన్న వారు లెక్కలు వివరించే క్రమాన గొడవకు దిగారు. ఆపై అంబులెన్స్ డ్రైవర్ వినయ్ ఆధ్వర్యాన ఏలూరి శ్రీకాంత్, మైదులు, మహేశ్ తదితరులపై దాడి చేయగా శ్రీకాంత్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యు లు నిర్ధారించడంతో న్యాయమూర్తి శ్రీకాంత్ వాంగ్మూలం తీసుకున్నారు. కాగా, దాడికి పాల్పడిన వినయ్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టు టౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. -
ఈసారి 71 లక్షల మొక్కలు..
● వనమహోత్సవానికి సిద్ధమవుతున్న అధికారులు ● మొక్కలు నాటేందుకు ప్రభత్వ శాఖల వారీగా లక్ష్యాలు ● రైతులకు ప్రత్యేకంగా టేకు మొక్కల పంపిణీచుంచుపల్లి: జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే వన మహోత్సవ కార్యక్రమానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే వివిధ శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించగా, మొక్కలను నాటేందుకు గుంతలను తవ్వుతున్నారు. జూలై 1 నుంచి వన మహోత్సవానికి శ్రీకారం చుట్టాలని అధికారులు భావిస్తున్నారు. గడిచిన ఆరు నెలలుగా గ్రామాల్లోని హరిత సర్సరీల్లో వన మహోత్సవానికి కావాల్సిన మొక్కలు పెంచుతున్నారు. ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నర్సరీలను నిర్వహిస్తుండగా, అధికా రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 481 హరిత నర్సరీలు, అటవీ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో మరో 32 నర్సరీల్లో వచ్చే వన మహోత్సవంలో మొక్కలను నాటడానికి సిద్ధంగా ఉంచారు. పెద్ద గ్రామపంచాయతీల్లో 20 వేలు, చిన్న గ్రామ పంచాయతీల్లో 10 వేల చొప్పున 20 రకాల జాతులకు చెందిన మొక్కలను పెంచుతున్నారు. కానుగ, వేప, చింత, నేరేడు, గుల్ మొహర్, జామ, వెలగ, శిశు, మునగ, సీమ తంగేడు, తులసి, గులాబీ, మందార, గన్నేరు, దిరిశన, అల్ల నేరేడు, ఉసిరి, దానిమ్మ, ఈత, బొప్పాయి, మందార, సిసో, టికోమ, బహునియా, సెలోఫాం తదితర రకాల మొక్కల పెంపకం చేపట్టారు. ఈ మొక్కలను గ్రామాల్లో అంతర్గత, అనుసంధాన రోడ్లకు ఇరువైపులా, చెరువు, కాలువ కట్టలు, ప్రభుత్వ, రౖపైవెట్ ఖాళీ స్థలాల్లో నాటనున్నారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పూలు, పండ్లు, వేప తదితర మొక్కలను పంపిణీ చేయనున్నారు. నర్సరీల్లో సిద్ధంగా.. డీఆర్డీఏ ఆధ్వర్యంలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో 481 హరిత నర్సరీల్లో దాదాపు 50 లక్షల మొక్కల పెంపకం చేపట్టారు. అటవీ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో మరో 40 లక్షల వరకు మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలో గత పదేళ్లుగా మొక్కలు నాటుతుండగా, ఈసారి 11 ఏట 71.41 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేకంగా పంపిణీ చేసేందుకు 20 లక్షల టేకు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అడిగిన ప్రతి సన్నకారు, చిన్నకారు రైతుకు ఎకరానికి 100 వరకు టేకు మొక్కలను ఇవ్వనున్నారు. మొదటి విడతలో 111.49 లక్షలు, రెండో విడత 161.33 లక్షలు, మూడో 163.09 లక్షలు, నాల్గవ విడత 96.17 లక్షలు, ఐదో 146.27 లక్షలు, ఆరవ 160.29 లక్షలు, ఏడవ 135.41 లక్షలు, ఎనిమిదవ 105.08 లక్షలు, తొమ్మిదో 55.13 లక్షలు, పదో విడతలో 70.61 లక్షల చొప్పున మొక్కలను నాటారు.లక్ష్యాలు కేటాయించాం త్వరలో చేపట్టబోయే వన మహోత్సవానికి కావాల్సిన మొక్కలు సిద్ధం చేస్తున్నాం. ఇందుకోసం గ్రామ పంచాయతీలు, అటవీ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నాం. శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలను ఇప్పటికే కేటాయించాం. అన్ని శాఖల సహకారంతో వనమహోత్సవాన్ని విజయవంతం చేస్తాం. –ఎం.విద్యాచందన, డీఆర్డీఏఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటనున్న శాఖలు ప్రభుత్వ శాఖ లక్ష్యం డీఆర్డీఏ 30,00,000 ఫారెస్ట్ శాఖ 10,00,000 టీఎస్ఎఫ్డీసీ 12,90,000 సింగరేణి 3,30,000 ఎకై ్సజ్శాఖ 1,00,000 అగ్రికల్చర్ 5,00,000 ఇరిగేషన్ 2,00,000 -
చెక్ డ్యాంలో పడి వ్యక్తి మృతి
జూలూరుపాడు: మండలంలోని వెంగన్నపాలెం వైకుంఠధామం సమీపంలోని చెక్ డ్యాంలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెంగల చిన్న వెంకయ్య(55) మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లేదు. బుధవారం చెక్ డ్యాం నీటిలో మృతదేహం లభ్యమైంది. అనారోగ్యం, మానస్థితి బాగాలేక బాధపడుతున్న చిన్న వెంకయ్య బహిర్భూమికి వెళ్లి చెక్ డ్యాంలో పడి మృతి చెంది ఉండవచ్చునని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న యువకుడు..టేకులపల్లి: పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న యువకుడు బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని తావుర్యాతండా పంచాయతీ స్టేషన్తడికలపూడి గ్రామానికి చెందిన గుగులోత్ తరుణ్(20) పదేళ్లుగా అప్పుడప్పుడు మతిస్థిమితం కోల్పోతుంటాడు. ఈ క్రమంలో ఈ నెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. విషయం కుటుంబ సభ్యులకు కూడా చెప్పడంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వంచలో.. పాల్వంచరూరల్: పురుగుల మందుతాగి చికిత్స పొందుతున్న యువకుడు బుధవారం మృతిచెందాడు. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. హైదరాబాద్లోని చింతల్ ప్రాంతానికి చెందిన రామనాథ్ నరేష్(37) మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న అత్తవారింటికి వచ్చాడు. కాగా నరేష్కు, అతని భార్య త్రివేణి, ఆమె కుటుంబ సభ్యులకు మధ్య మంగళవారం గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. షీ టీం అదుపులో యువకుడుసూపర్బజార్(కొత్తగూడెం): రామవరంలోని మాతా శిశు ఆస్పత్రి వద్ద ఉన్న బస్స్టాప్ వద్ద ఈవ్ టీజింగ్కు పాల్పడుతున్న యువకుడిని బుధవారం షీ టీం ఎస్ఐ రమాదేవి అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీసులకు అప్పగించారు. కొన్ని రోజులుగా ఓ యువతిని వేధిస్తుండటంతో ఆమె షీ టీంను ఆశ్రయించింది. దీంతో ఎస్ఐ రమాదేవి మఫ్టీలో వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మహిళలను ఎవరైనా వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులు భయపకుండా తమకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. -
మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు
గుండాల: మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం ఓఎస్డీ నరేందర్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని దామరతోగు గ్రామం నేతకాని గుంపులో పోలీస్ కమ్యునిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు ప్రభుత్వానికి సహకరిస్తూ అభివృద్ధి దిశగా పయనించాలని అన్నా రు. అనుమానితులు వస్తే పోలీసులకు సమాచారం చేరవేయాలని సూచించారు. చట్టవ్యవతిరేక కార్యకలాపాలకు పాల్పడి అనవసరంగా జైలుపాలు కావొ ద్దని అన్నారు. అనంతరం 50 కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేశారు. విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు ఇచ్చారు. దోమ తెరల పంపిణికీ సహకరించిన ప్రాణిక్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కొత్తగూడెం ఓఎస్డీ నరేందర్ -
గిరిజన విద్యార్థుల హాస్టళ్లలో విచారణ
భద్రాచలంటౌన్: పట్టణంలోని గిరిజన జూనియర్ కళాశాల, స్కూల్ విద్యార్థుల హాస్టళ్లలో అందుతున్న సౌకర్యాలపై నిజనిర్ధారణ కమిటీ బుధవారం విచారణ నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 20న వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేవని, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థుల ఫిర్యాదుపై భద్రాచలంలో కోర్టులో కేసు నమోదైంది. దీంతో భద్రాచలం ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శివ నాయక్ ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు న్యాయవాది చుక్క నాగఅంబేడ్కర్, పేరాల నాగరాజు, ఎంవీ రమణలు హాస్టళ్లను సందర్శించి, స్థితిగతులను పరి శీలించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్కూలు విద్యార్థులకు హాస్టల్లో సరైన బెడ్లు లేవని, తగిన సంఖ్యలో మరుగుదొడ్లు కూడా లేవని, దుర్వాసన వెదజల్లుతున్నాయని పేర్కొన్నారు. సరిపడినంత భోజనం కూడా పెట్టడం లేదని, మెస్ బిల్లులు కూడా సక్రమంగా అందట్లేదని విద్యార్థులు కమిటీ సభ్యులకు తెలిపారు. ప్రిన్సిపాల్, వార్డెన్ను విచారించగా దాదాపు 8 నెలల నుంచి మెస్ బిల్లు రావట్లేదని, దీంతో కావలసినన్ని సరుకులు అందటంలేదని వివరించారు. హాస్టళ్ల స్థితిగతులపై న్యాయమూర్తికి నివేదిక ఇస్తామని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు తెలిపారు. భద్రాచలం న్యాయమూర్తికి నివేదిక ఇవ్వనున్న నిజనిర్ధారణ కమిటీ -
ట్రాక్పై మొక్కల తొలగింపు
దుమ్ముగూడెం: ములకపాడు వైద్యశాల సమీపంలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియంలోని ట్రాక్పై ఉన్న మొక్కలను బుధవారం పోలీసులు తొలగించారు. ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యంతో ఇండోర్ స్టేడియంతో ప్రారంభించడంలేదని, దీంతో మైదానంలోని ట్రాక్పై మొక్కలు మొలిచాయని ‘సాక్షి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన సీఐ అశోక్కుమార్ తన సిబ్బందితో కలిసి శ్రమదానం చేపట్టి ట్రాక్పై మొలిచిన మొక్కలను తొలగించారు. ఐటీడీఏ అధికారులతో మాట్లాడి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయించి, త్వరలోనే ఇండోర్ స్టేడియం ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్ఐ గణేష్, సిబ్బంది, స్థానిక యువకులు పాల్గొన్నారు. -
అంతా రహస్యమే..!
● అప్పారావుపేట ఫ్యాక్టరీలో ఏ విషయమూ బయటకు రాదు ● ఆయిల్ఫెడ్లో అంతా అయోమయం.. ● గంటకు 90 టన్నుల క్రషింగ్ వట్టిమాటేనా..?అశ్వారావుపేట: B BƇ¬ÌŒ òœyŠæ ¸ëÅMýStÈÌZ A…™é Æý‡çß çÜÅÐól$. AMýSPyýl H… 糯]l$Ë$ ^ólÔ>Æý‡$..°Æý‡Óçß × GÌê E…§ýl¯ól ÑçÙĶæ*Ë$ ºÄ¶æ$rMýS$ Æ>Ð]l#. AÌê Æ>MýS$…yé ™ðlË…V>× BƇ¬ÌŒ òœyŠæ A«¨M>Æý‡$Ë$, K BÝ릯]l M>…{sêMýStÆŠæḥ^èlÆý‡ÅË$ ^ólç³yýl$™èl$…sêÆý‡¯ól ÑÐ]l$Æý‡ØË$ E¯é²Æ‡¬. ÑÐ]l-Æ>ÌZÏMìS Ððlã™ól.. §ýlÐ]l$Ã-õ³r Ð]l$…yýl-ÌS… A´ëµ-Æ>Ð]l#-õ³-rÌZ Æý‡*.100 MørÏ A糚-™ø 2016ÌZ VýS…rMýS$ 30 r¯]l$²ÌS {MýSíÙ…VŠæ ÝëÐ]l$-Æý‡¦Å…™ø {ç³ç³…^èl Ýë¦Æ‡$$ ¸ëÅMýSt-Ȱ °ÇÃ…-^éÐ]l$° ¯ésìæ ´ëÌS-MýS$-Ë$ Vöç³µ-Ë$ ^ðl´ëµÆý‡$. AƇ$$™ól D ¸ëÅMýSt-ÈOò³ B¨ ¯]l$…` ç³Ë$ ÑÐ]l$-Æý‡Ø-Ë$ ÐðlË$Ï-Ððl-™èl$¢-™èl$¯é².. §ýlÐ]l$Ã-õ³r Ð]l$…yýlÌS ç³Ç«¨ÌZ°¨ M>Ð]l-yýl…-™ø H© ºÄ¶æ$-rMýS$ ´÷MýSP-±Ä¶æ$-MýS$…yé AMýSPyìl ¯éĶæ$-MýS$-Ë$, A«¨M>Æý‡$-Ë$, ´ëÌS-MýS$-Ë$ gê{VýS™èl¢ ç³yól-ÐéÆý‡$. AÌê Aѱ† Ðólâ¶æ*Ï-¯]l$-MýS$-´ùƇ$$ MýS$…¿ýæ-Mø×êÌSMýS$ §éÇ ¡íÜ…¨. సంగతేంటంటే.. అప్పారావుపేట ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 90 టన్నులకు విస్తరిస్తూ గత ప్రభుత్వం రూ.50 కోట్లతో పనులు ప్రారంభించగా 9 నెలల క్రితం పూర్తయ్యాయి. కానీ ఫ్యాక్టరీ సామర్థ్యం 90 టన్నులకు చేరలేదు. ఈ విషయాన్ని ఆయిల్ఫెడ్ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకుని కాంట్రాక్టర్కు బిల్లులు ఆపినట్లు సమాచారం. అయితే ఫ్యాక్టరీలో ఎలాంటి మార్పులు చేయకున్నా.. కొంత కాలం తర్వాత ఓ మంత్రి సూచనతో బిల్లు చెల్లించినట్లు తెలిసింది. ఇక 90 టన్నుల క్రషింగ్ సామర్థ్యం ఉన్న ఫ్యాక్టరీ.. ప్రస్తుతం ఎంత మేర చేస్తుందనేది కూడా ఎవరికీ తెలియనివ్వరు. ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ మొదలు జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి వరకు ఎవరినడిగినా వాస్తవాలు వెలుగులోకి రావు. పైగా ఇది అడగరాని విషయమని అంటారు. గతంలో ఏపీకి చెందిన వెయ్యి టన్నుల ఆయిల్పామ్ గెలలను క్రషింగ్ చేసిన సమయంలో రోజుకు ఎన్ని టన్నులు జరిగిందో ఫ్యాక్టరీ రికార్డుల్లో నమోదై ఉంటుంది. కానీ ఆ వివరాలూ కూడా వెల్లడించరు. మార్పులకు అవకాశం లేదా ? ఫ్యాక్టరీని 90 టన్నుల సామర్థ్యానికి తీసుకొచ్చేందుకు అవసరమైన మార్పులు చేపట్టలేని విధంగా నిర్మించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా చేయాలంటే ఫ్యాక్టరీలోని కీలక భాగాలను పూర్తిగా తొలగించాల్సిందేనని తెలుస్తోంది. బ్రాయిలర్ గంటకు 90 టన్నుల క్రషింగ్కు సరిపడా స్టీమ్ను ఉత్పత్తి చేయగలిగినా ప్లాంటుకు విడుదల చేయలేదని నిపుణులు తేల్చినట్టు సమాచారం. అంతే కాక స్టెరిలైజర్లు 90 డిగ్రీల వ్యత్యాసంతో అమర్చడంతో ఆయిల్ రికవరీపైనా దుష్ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇన్ని అనర్థాలు ఉన్నా.. మచ్చలేని మంత్రిగా చెలామణి అయ్యే ఓ రైతుబాంధవుడి పాత్ర ఉండడం వల్లే ఏ విషయమూ బయటకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోపాలుంటే సరి చేస్తాం తెలంగాణలో ఆయిల్ఫెడ్ను ఉన్నత స్థానంలో ఉంచేందుకు, ఫ్యాక్టరీలు నిర్మించేందుకు మేం చాలా కష్టపడుతున్నాం. ఫ్యాక్టరీ క్రషింగ్లో లోపాలుంటే సరిచేయిస్తాం. కొందరు కావాలని తప్పుడు ప్రచా రం చేస్తున్నారు. క్రషింగ్ వివరాలు త్వరలో వెల్లడిస్తాం. – సుధాకర్రెడ్డి, ఆయిల్ఫెడ్ జీఎం -
సహకార శిక్షణ ఇక ఇక్కడే..
● నాలుగు జిల్లాలకు కలిపి ఖమ్మంలో.. ● చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు సహకార శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేసింది. సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణా కేంద్రాలను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యాన మల్టీ జోన్ –1గా హైదరాబాద్, మల్టీ జోన్ –2గా వరంగల్లో మాత్రమే కేంద్రాలు కొనసాగుతున్నాయి. కానీ రాష్ట్రంలోని 60 వేల సహకార సంఘాల నిర్వాహకులకు శిక్షణ ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించిన ప్రభుత్వం.. కొత్తగా మరో మూడు కేంద్రాలను మంజూరు చేసింది. వీటిని ఖమ్మంతో పాటు నిజామాబాద్, మహబూబ్నగర్లో ఏర్పాటుచేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. చట్టాలపై అవగాహన.. సహకార వ్యవస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది, అనుబంధ సంస్థలు, ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లకు సహకార చట్టం, సహకార వ్యవస్థ నిర్వహణపై అవగాహన పెంచేలా ఈ కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. ప్రధానంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), గొర్రెల పెంపకందారులు, మత్స్య సహకార సంఘాలు, కార్మిక సహకార సంఘాల నిర్వాహకులు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, స్టాఫ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ స్టాఫ్, డైరెక్టర్లకు ఈ కేంద్రం ద్వారా చట్టాలపై అవగాహన కల్పించనున్నారు. అలాగే, కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఉద్యోగులు, ప్రతినిధులకు కూడా ఇక్కడే శిక్షణ ఇస్తున్నారు. సహకార చట్టాలతో పాటు వ్యవస్థ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, ఆడిట్, వ్యాపార లావాదేవీలే కాక నూతనంగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.నాలుగు జిల్లాలకు కలిపి.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో సహకార ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చేలా ఖమ్మంలో కేంద్రాన్ని నెలకొల్పుతారు. ఖమ్మం జిల్లాలోని 76 పీఏసీఎస్లు, ఏడు జిల్లా స్థాయి సొసైటీలు, 818 ఎయిడెడ్, 434 అన్ ఎయిడెడ్ సొసైటీలతో పాటు భద్రాద్రి జిల్లాలోని 21 పీఏసీఎస్లు, ఒక జిల్లా స్థాయి సొసైటీ, 316 ఎయిడెడ్, 315 అన్ ఎయిడెడ్ సొసైటీలే కాక మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని సంస్థల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కేంద్రం అందుబాటులోకి రానుంది. కాగా, ఈ కేంద్రం నిర్వహణకు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సంబంధిత అంశాల్లో అనుభవం కలిగిన ఫ్యాకల్టీని నియమించడమే కాక అవసరమైన భవనాన్ని కేటాయించాల్సి ఉంటుంది. -
గురుకులాల్లో.. లోటుపాట్లు ఉండొద్దు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురుకులాల నిర్వహణ కొనసాగాలని డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా, ఎకై ్సజ్ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, జితేష్ వి.పాటిల్, సీపీ సునీల్దత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుకులాలు, వసతిగృహాల నిర్వహణ, బీసీ సంక్షేమ, రవాణా, ఎకై ్సజ్ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, వనమహోత్సవం నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. సరైన వసతులు లేని గురుకులాలను ప్రత్యామ్నాయ భవనాల్లోకి మార్చాలని, ఎక్కడా దోమల బెడద లేకుండా జాలీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కామన్ డైట్ కచ్చితంగా అమలయ్యేలా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని తెలిపారు. మొక్కలు నాటేందుకు గతంలో రూ.వేల కోట్లు ఖర్చు చేసినా, ఎన్ని బతికాయో లెక్కలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈసారి అలాకాకుండా మొక్కల పెంపకాన్ని బాధ్యతగా భావించాలని సూచించారు. కాగా, బస్సు సర్వీసులు అవసరమైన గ్రామీణ రూట్లపై ప్రతిపాదనలు సమర్పిస్తే నూతన బస్సులు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఐఐటీ, నీట్పై శిక్షణ అందించాలి.. గురుకులాల్లో విద్యాప్రమాణాలు మరింత మెరుగుపరుస్తూ, ఐఐటీ, నీట్ల్లో మంచి ఫలితాలు సాధించేలా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పెరిగిన డైట్ చార్జీల ఆధారంగా కామన్ డైట్ అమలు చేయాలని తెలిపారు. గ్రామీణ యువత ఉద్యోగాలు సాధించేలా బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ ఏడాది వన మహోత్సవంలో ఈత, తాటి మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తూ గీత కార్మికులను భాగస్వామ్యం చేయాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు పీఎంఈ స్కీం ద్వారా ఎలక్ట్రికల్ బస్సులు తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళా సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం మేయర్ పి.నీరజ, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులు తరచూ తనిఖీ చేయాలి అవసరమైన అన్ని ప్రాంతాలకూ బస్సు సర్వీసులు ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం -
తెలంగాణలో తొలిసారి
జెడ్పీటీసీ పీఠంపై ఆరాటం.. రాజకీయ పార్టీల్లో ఇప్పటికే మండల పరిషత్ ఎన్నికల కోలాహలం మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు తోడు ఆ తర్వాత ఎంపిక చేసే ఎంపీపీ పీఠంపై ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించకపోయినా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రంగా ఉండడంతో పలువురు ఆశావహులు ఇటీవల బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరితో పాటుగా సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీజేపీ నాయకులు సైతం జిల్లా నాయకత్వాలకు తమ ప్రతిపాదనలు పంపారని సమాచారం. రాష్ట్ర విభజనతో కనుమరుగు.. భద్రాచలం మండల పరిషత్ తొలిసారి జనవరి 1, 1987న ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 42 మంది అధికారులు పూర్తి, ఇన్చార్జ్ బాధ్యతల్లో పని చేశారు. ఈ మండల పరిషత్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి సారిగా 2014 జనవరిలో ఎన్నికలు జరగగా, పాలకవర్గ పదవీ కాలం 2018లో ముగిసింది. నాడు 13 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా, చివరి ఎంపీపీగా ఊకా శాంత, జెడ్పీటీసీగా రవికుమార్ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2014 జూన్లో రాష్ట్ర విభజన అనంతరం భద్రాచలం మండల కేంద్రం మినహా ఇతర గ్రామాలన్నీ ఏపీలో విలీనం చేశారు. పాలకవర్గ పదవీ కాలం ముగిసిన తర్వాత అభివృద్ధికి సరైన ప్రణాళిక లేక మండల పరిషత్ నిర్వీర్యంగా మారింది. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాచలం మండల పరిషత్ను కొత్తగా ఏర్పాటు చేసిన ఆళ్లపల్లికి తరలించారు. ఇక్కడి ఉద్యోగులను సైతం డిప్యూటేషన్పై ఇతర చోట్ల సర్దుబాటు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక తిరిగి భద్రాచలానికి మండల పరిషత్ను కేటాయించారు. దీంతో వెళ్లినట్టే వెళ్లిన మండల పరిషత్ మళ్లీ తిరిగి వచ్చింది. నాడు 13.. నేడు 14 ఎంపీటీసీ స్థానాలు 2014 జనవరి ఎన్నికల్లో భద్రాచలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన ఒక స్థానం పెంచారు. దీంతో త్వరలో 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా భద్రాచలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 50,088 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 80 వేల నుంచి లక్ష వరకు ఉంటుందని అనధికారికంగా అంచనా వేస్తున్నారు. ఇందులో పురుష ఓటర్లు 19,752, మహిళలు 21,254, ఇతరులు ఇద్దరు కలిపి మొత్తం 41,008 మంది ఓటర్లు ఉన్నారు. 20 వార్డులుగా విభజించగా, ఎన్నికలు సులువుగా నిర్వహించేందుకు 60 పోలింగ్ బూత్లు సిద్ధం చేశారు. కాగా, మండల పరిషత్ కార్యాలయం పూర్తి శిథిలావస్థకు చేరగా, రికార్డులు అత్యధిక భాగం కాలిపోయాయి. ప్రస్తుతం ఎంపీడీఓతో పాటు మరో ముగ్గురు ఉద్యోగులు ఉండగా అందరూ ఇన్చార్జ్లే. మండల పరిషత్ భవనానికి మరమ్మతులు చేపట్టి, పూర్తిస్థాయిలో ఉద్యోగులను నియమిస్తే పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు. పూర్వ వైభవం తేవాలి రాష్ట్ర విభజనతో జరిగన నష్టాల్లో మండల పరిషత్ కోల్పోవడం ఒకటి. స్థానికుల కోరిక మేరకు తిరిగి మండల పరిషత్ రావటం హర్షణీయం. శిథిలావస్థకు చేరిన ఎంపీడీఓ కార్యాలయాన్ని ఎన్నికలకు ముందే మరమ్మతులు చేయాలి. పూర్తి స్థాయిలో ఉద్యోగులను కేటాయించాలి. త్వరగా ఎన్నికలు నిర్వహించి భద్రాచలాన్ని మళ్లీ అభివృద్ధి బాట పట్టించాలి. – చల్లగుళ్ల నాగేశ్వరరావు, భద్రాచలం తరలిపోయి.. తిరిగొచ్చిన మండల పరిషత్ పుష్కరకాలం తర్వాత భద్రాచలంలో ఎన్నికలకు సన్నాహాలు నాడు 13.. నేడు 14 ఎంపీటీసీ స్థానాలు జెడ్పీటీసీ పీఠంపై ఆశావహుల ఆరాటం ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో భద్రాచలం మండల పరిషత్ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఇక్కడున్న మండల పరిషత్ తరలిపోయి, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటైంది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భద్రాచలం మండల పరిషత్కు తొలిసారి ఎన్నికలు జరగబోతుండడం విశేషం. దీంతో ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఇప్పటి నుంచే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. – భద్రాచలం -
కమనీయం.. కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జాబ్మేళాకు విశేష స్పందనసింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించిందని జిల్లా ఉపాధికల్పనాఽ శా ఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. సంస్థలో 33పోస్టులు ఖాళీగా ఉండగా, జిల్లా వ్యాప్తంగా 80 మంది హాజరయ్యారని, వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించి 19 మందిని ఎంపిక చేశామని వివరించారు. వారికి కేటాయించిన సెంటర్లలో గడువులోగా విధుల్లో చేరి ఉత్తమ భవిష్యత్కు పునాది వేసుకోవాలని సూచించారు. ప్రశాంతంగా టీజీ టెట్సుజాతనగర్: మండలంలోని వేపలగడ్డలో గల అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన టీజీ టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొదటి షిఫ్ట్లో 120 మంది అభ్యర్థులకు గాను 104 మంది హాజరయ్యారు. రెండో షిఫ్ట్లో 110 మందికి 100 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. రెండు షిఫ్ట్ల్లో కలిపి 26 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. మాతా, శిశు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలికొత్తగూడెంఅర్బన్: మాతా, శిశు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. బుధవారం లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్లలోని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫీసును సందర్శించారు. ఎన్జీఓ నిర్వహించిన వివిధ ఆరోగ్య కార్యకలా పాలను పరిశీలించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన పెంచడంలో, ఆరోగ్య విద్య ప్రాముఖ్యతను వివరించా రు. అనంతరం అల్టాస్రౌండ్ స్కానింగ్ యూని ట్ పనితీరును కూడా తనిఖీ చేసి, సరైన రికార్డులను నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించా రు. చికిత్సకోసం వచ్చిన వారితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫైజ్మోహినుద్దీన్, అజయ్ కుమార్ పాల్గొన్నారు. -
కరకట్ట పరిసరాలు శుభ్రంగా ఉండాలి
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని, వారంతా గోదావరిలో స్నానమాచరించే అవకాశం ఉన్నందున కరకట్ట ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. గోదావరి కరకట్ట పక్కనున్న అనధికార డంపింగ్ యార్డ్లో బుధవారం కొందరు చెత్తకు నిప్పంటించగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పీఓ.. గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాసరావుకు పలు సూచనలు చేశారు. కరకట్ట ప్రదేశాల్లో చెత్త వేయకుండా సిబ్బందిని కాపలా ఉంచాలని, సేకరించిన చెత్తను కొత్తగా నిర్మించిన డంపింగ్ యార్డ్లోనే వేయాలని ఆదేశించారు. ధర్తీ ఆభా యోజనను సద్వినియోగం చేసుకోవాలి బూర్గంపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ధర్తీ ఆభా యోజన పథకాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని పీఓ రాహుల్ అన్నారు. కృష్ణసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ గిరిజనుల సౌకర్యార్థం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, జిల్లాలోని 130 పంచాయతీయలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా గిరిజన కుటుంబాల వారికి అవసరమైన గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు. మీ సేవ కేంద్రాలకు, నెట్ సెంటర్లకు వెళ్లకుండా అధికారులు ఇంటికే వచ్చి అందజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయా గ్రామాలకు వచ్చిన అధికారులను కలిసి గుర్తింపు కార్డుల కోసం రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ బాలయ్య, ఏఓ శంకర్, పీఏఓ విజయలక్ష్మి, ఏపీఎం నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అనంతరం గిరిజన గురుకుల సంక్షేమ కళాశాలను సందర్శించారు. విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులకు సూచించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, వారు మాదక ద్రవ్యాలకు అలవాటుపడకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.పంచాయతీ సిబ్బందికి పీఓ ఆదేశం -
పల్లె చూపు.. పోరు వైపు
22 మండలాల పరిధిలో.. జిల్లాలో 22 గ్రామీణ మండలాలు ఉండగా, వీటి పరిధిలో ప్రస్తుతం 471 గ్రామపంచాయతీలు, 4,168 వార్డులు, 22 జెడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు మూడు విడుతలుగా ఎన్నికల నిర్వహిస్తారని తెలుస్తోంది. మొదట విడతలో 8 మండలాలు, రెండు, మూడు విడతల్లో ఏడు మండలాల చొప్పున ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయింది. సర్పంచ్లకు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులు ఉండనందున.. సర్పంచ్ అభ్యర్థులకు 20, వార్డు సభ్యులకు 10 చొప్పున స్వతంత్ర గుర్తులను కేటాయించారు. చుంచుపల్లి: వచ్చే నెలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్రెడ్డి మంత్రి వర్గ సహచరులకు సూచించడంతో అందరి దృష్టీ ఎన్నికల వైపు మళ్లింది. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు, ఆ తరువాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్స్ల మరమ్మతుల పనులు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కేటాయింపు పూర్తి చేసి వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం హైదరాబాద్లో శిక్షణ పొందిన మాస్టర్ ట్రెయినీలు.. జిల్లాలో విధులు నిర్వహించే ఆర్ఓలు, ఏఆర్ఓలు, పీఓలు, ఏపీఓలకు శిక్షణ పూర్తి చేశారు. అయితే ఈ ఎన్నికల్లో పాత రిజర్వేషన్లే కొనసాగిస్తారా.. కొత్తవి ప్రకటిస్తారా అనే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. భద్రాచలం, సారపాకకూ ఎన్నికలు.. భద్రాచలం, సారపాకను కలిపి మున్సిపాలిటీగా మార్చాలనే యోచనతో 2018లో ఆయా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అయితే గిరిజన సంఘాల వారు కోర్టును ఆశ్రయించగా ఆ ప్రతిపాదన విరమించుకున్న ప్రభుత్వం.. ఆ తర్వాత ఒక్కో పంచాయతీని మూడుగా విభజించాలని బీఆర్ఎస్ హయాంలో చట్టం చేశారు. దాన్ని సైతం పలువురు వ్యతిరేకించగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పంచాయతీల్లో ఎలాంటి మార్పులు లేకుండా ప్రస్తుతం యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇంకా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆమోదానికి పంపిన మరో 10 కొత్త పంచాయతీలపై స్పష్టత రావాల్సి ఉంది. అటు కార్పొరేషన్లోకి వెళ్లిన సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీల పరిధిలో మూడు ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు వరసగా ఎన్నికలు రానుండగా గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం జిల్లాలో స్థానిక సంస్థలతో పాటు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది కేటాయింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బ్యాలెట్ బాక్స్లు ఇప్పటికే రెడీ చేశాం. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి తొలి విడత శిక్షణ ఫిబ్రవరిలోనే పూర్తిచేశాం. – ఎం.విద్యాచందన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రాదేశిక సమరానికి సమాయత్తం వచ్చే నెలలో ‘స్థానిక’ ఎన్నికలకు అవకాశం గ్రామాల్లో మొదలైన సందడి జిల్లాలోని స్థానిక సంస్థల వివరాలు.. జెడ్పీటీసీ స్థానాలు : 22 గ్రామపంచాయతీలు : 471ఎంపీటీసీ స్థానాలు : 236 వార్డుల సంఖ్య : 4,168పోలింగ్ కేంద్రాలు : 1,279 పోలింగ్ కేంద్రాలు : 4,200 -
గనుల్లో రక్షణ చర్యలపై ఆరా..
కొత్తగూడెం ఏరియాలో పర్యటించిన డీజీఎంఎస్ బృందంసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి బొగ్గు గనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు పాటిస్తున్నారని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ(డీజీఎంఎస్) అధికారులు ఆరా తీశారు. గనుల్లో రక్షణ, భద్రతా చర్యలపై గురువారం కొత్తగూడెం ఏరియాలో నిర్వహించనున్న ఇంటరాక్టివ్ సెక్షన్లో పాల్గొనేందుకు వారు మంగళవారమే చేరుకున్నారు. స్థానిక ఇల్లెందు గెస్ట్హౌస్లో సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారా యణరావు వారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీజీఎంఎస్ బృందానికి నేతృత్వం వహించిన టి.ఆర్.కన్నన్ మాట్లాడుతూ.. గనుల్లో ఇటీవల ఏమైనా ప్రమాదాలు జరిగాయా.. నివారణకు కంపెనీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగితెలుసుకున్నారు. ఆ తర్వాత ఏరి యాలోని పలు గనులు, డిపార్ట్మెంట్లలో పర్యటించి రక్షణ చర్యలను పరిశీలించారు. కార్యక్రమంలో మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ అశోక్కుమార్, ఎస్ఓటు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సనత్కుమార్, ఇతర డైరెక్టర్లు దిలీప్ కుమార్, కమలేష్, కొత్తగూడెం, ఇల్లెందు ఏరియాల జీఎంలు శాలేంరాజు, వి.కృష్ణయ్య, సేఫ్టీ జీఎం శ్రీనివాస్రావుతో పాటు వివిధ విభాగాల అధికారులు కె.జి.తివారీ, దామోదర్రావు, కోటిరెడ్డి, వెంకటేశ్వరరావు, జి.వి.మోహన్రావు, గోవర్దన్, హరీష్, సయ్యద్ ఖలీల్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి రైతుపై విత్తన భారం
● అందని ప్రభుత్వ సబ్సిడీ ● అయినా సాగుకు రైతుల మొగ్గు ● జిల్లాలో ఈ ఏడాది రెండు లక్షల ఎకరాలు దాటే అవకాశంపాల్వంచరూరల్ : ప్రతీ సంవత్సరం విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నాయి. ఆరుగాలం శ్రమించినా పంటలకు సరైన ధర రాక నష్టపోతున్నారు. కొన్ని రకాల విత్తనాలకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతున్నా.. పత్తి, వరికి మాత్రం ఎలాంటి రాయితీలు రావడం లేదు. ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేయాల్సి రావడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. దీనికి తోడు గతేడాది 450 గ్రాముల పత్తి ప్యాకెట్ ధర రూ. 856 ఉండగా, ఈ సంవత్సరం రూ.45 పెరిగి రూ.901కి చేరింది. ఈ ఏడాది పెరగనున్న సాగు.. జిల్లాలో గత సంవత్సరం 1.85 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా.. ఈసారి రెండు లక్షల ఎకరాలకు పైగా సాగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎకరానికి రెండు నుంచి మూడు ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయి. కాగా, కొందరు డీలర్లు నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి వస్తాయి అని చెబుతూ అమాయక రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లతో పాటు దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్లు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఈ ఏడాది ఎక్కువ మంది పత్తి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. అదును లేకున్నా విత్తనాలు.. జిల్లాలో ప్రస్తుతం ఆశించిన మేర వర్షాలు కురవలేదు. అయితే విత్తనాల సాగుకు అదును లేకున్నా కొందరు రైతులు పత్తి విత్తనాలు వేస్తున్నారు. పొడిదుక్కుల్లో విత్తొద్దని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నా పలువురు పెడచెవిన పెడుతున్నారు. మృగశిర కార్తె ప్రారంభమైతే వర్షాలు కురుస్తాయని, ముందుగానే దిగుబడి వస్తే అధిక ధర దక్కుతుందనే ఆశతో విత్తనాలు వేసిన రైతులు.. ఇప్పటికీ ఎండలు దంచికొడుతుండడంతో మొలకలు రాక, వచ్చినవీ ఎండిపోతుండడంతో తల పట్టుకుంటున్నారు. మరోసారి విత్తనాలు కొనుగోలు చేయాలంటే ఆర్థిక భారం తప్పదని ఆందోళన చెందుతున్నారు. -
మాతా శిశు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి
కొత్తగూడెంఅర్బన్ : జిల్లాలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలు పక్కగా అమలు చేయాలని, మాతా శిశు ఆరోగ్యాలపై దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ సిబ్బందికి సూచించారు. తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని, వీటిని వైద్యాధికారులు పర్యవేక్షించాలని అన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎస్. జయలక్ష్మి మాట్లాడుతూ పోషకాహార కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో డాక్టర్ మధువరణ్, డాక్టర్ తేజశ్రీ, ప్రోగ్రామ్ అధికారులు పి.స్పందన, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివా రికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజ లు చేశారు. నేడు డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం పర్యటన ఖమ్మంమయూరిసెంటర్/మధిర/ఖమ్మం వ్యవసాయం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి సామగ్రితో సహా సిబ్బంది చేరుకునేలా సమకూర్చిన విద్యుత్ అంబులెన్స్లను ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరిస్తారు. ఆతర్వాత మధ్యాహ్నం 12–30గంటలకు బోనకల్ మండలం జానకీపురం సబ్స్టేషన్లో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను ఆవిష్కరిస్తారు. ఇక రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయం 10–30 గంటలకు ఖమ్మం కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులతో పలు పథకాలపై సమీక్షిస్తారు. ఆ తర్వాత మధిరలో నిర్మించే నూతన బస్టాండ్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం శంకుస్థాపన చేయనున్నారు. ప్రారంభమైన టీజీ ఈసెట్ కౌన్సెలింగ్ ఖమ్మంసహకారనగర్: పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేలా నిర్వహించిన తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈమేరకు అర్హత సాధించిన విద్యార్థులకు ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో మంగళవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. తొలిరోజు 105 మంది స్లాట్ బుక్ చేసుకోగా, 102 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారని ప్రిన్సి పాల్ జాకీరుల్లా తెలిపారు. కౌన్సెలింగ్ 19వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. -
వరదలపై అప్రమత్తంగా ఉండాలి
● ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం సూపర్బజార్(కొత్తగూడెం): గోదావరి నదికి వరదలొస్తే అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీఓసీలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారుల వాహనాల్లో లైఫ్ జాకెట్లు, టార్చిలైట్, తాడు, హ్యాండ్ మైక్ సిద్ధంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రమాదం జరుగకుండా ముందస్తు ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల వారిని తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లైఫ్ జాకెట్లు, గజఈతగాళ్లు, నాటు పడవలు, బోట్లు సిద్ధంగా ఉంచాలని అన్నారు. రానున్న మూడు నెలల పాటు నిత్యావసర వస్తువులు నిల్వ ఉంచాలని డీఎస్ఓను ఆదేశించారు. వరద ముంపు చర్యల పర్యవేక్షణకు సెక్టోరియల్, జోనల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. అత్యవసరమైతే హెలీకాప్టర్ సేవలు ఉపయోగించుకునేలా హెలీప్యాడ్లు ఏర్పాటు చేయాలని, కిన్నెరసాని వంటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తే సమయంలో ప్రభావిత ప్రాంతాల వారికి ముందుగానే సమాచారం అందించాలని అన్నారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలూ పనిచేసేలా ఫ్లడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని చెప్పారు. గర్భిణులు ఇబ్బంది పడకుండా ముందుగానే ఆస్పత్రుల్లో చేర్పించాలని, 108 వాహనాలు అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. పాము, తేలు కాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. సింగరేణి, కేటీపీఎస్, నవభారత్ తదితర సంస్థల రెస్క్యూ టీమ్ల సేవలు వినియోగించుకునేలా జాబితా సిద్ధం చేయాలని సూచించారు. భద్రాచలంలోని విస్తా కాంప్లెక్స్, అశోక్నగర్లో నీరు నిల్వకుండా ఎత్తిపోసేందుకు మోటార్లను అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గోదావరి వరద 73 అడుగుల మేర వచ్చినా ఎదుర్కొనేలా అధికారులు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ ఽగిరిజనులు పలు కీలక సేవలు పొందేందుకు 15 రోజుల పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ రోహిత్రాజు, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు, ఏఎస్పీ విక్రాంత్సింగ్ పాల్గొన్నారు. రెండు రోజుల్లో 1,13,398 మందికి రైతు భరోసారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా సోమ, మంగళవారాల్లో కలిపి 1,13,398 మంది రైతుల ఖాతాల్లో రూ.102,10,83,683 జమయ్యాయని కలెక్టర్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. గత యాసంగిలో పట్టాదారులు 1,78,545 మంది ఉండగా ప్రస్తుతం కొత్తగా 1,023 మంది పట్టాలు పొందారని, అలాగే గత సీజన్లో బ్యాంకు వివరాలు సరిగా లేనివారు, నమోదు చేయని వారు కలిపి 1,382 మంది ఉన్నారని పేర్కొన్నారు. వానాకాలానికి సంబంధించి 1,79,535 మంది లబ్ధిదారుల వివరాలను పోర్టల్లో నమోదు చేశామని తెలిపారు. నూతనంగా పట్టాలు పొందిన రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ను ఏఈఓలకు అందించి రైతు భరోసా పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఒలింపిక్ డే రన్ టీషర్టుల ఆవిష్కరణఈనెల 23న అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన టీ షర్టులను కలెక్టర్ పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడల్లో దేశం తరఫున పాల్గొని పతకాలు సాధించడమే లక్ష్యంగా క్రీడాకారులు ముందుకు సాగాలన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ ఎస్కె సాబీర్పాషా మాట్లాడుతూ ఈ రన్ను పాల్వంచలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ప్రారంభిస్తారని తెలి పారు. 19న అశ్వారావుపేట, 20న భద్రాచలం, 21న మణుగూరు, 22న ఇల్లెందులో కొనసాగుతూ 23న కొత్తగూడెంలో ముగుస్తుందని వివరించారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ ఎం. పరంధామరెడ్డి, అసోసియేషన్ బాధ్యులు వై.వెంకటేశ్వర్లు, కె.మహీధర్, మాస్టర్స్ అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ మంజులాల్, కార్యదర్శి నాగలక్ష్మి, ఎస్జీఎఫ్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్, అంతర్జాతీయ క్రీడాకారిణి సింధు తపస్వి పాల్గొన్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో కార్పొరేట్ వసతులు పాల్వంచ: అంగన్వాడీ కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్ పాటిల్ తెలిపారు. పాత పాల్వంచ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రంలో ‘అమ్మ మాట – అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో విద్యార్థులకు ఆయన పలకలు, పుస్తకాలు అందించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుద్దీకరణ, తాగునీరు, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని, అనుభవజ్ఞులైన టీచర్లను నియమించామని చెప్పారు. చిన్నారులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించి ఆర్థిక భారం పెంచుకోవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారిణి స్వర్ణలత లెనినా, మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘ఆఫ్టైప్’కు పరిహారం చెల్లించకపోతే ఆందోళనలు
సత్తుపల్లి/వేంసూరు: ఆయిల్పామ్ సాగుచేయగా, ఆఫ్టైప్ మొక్కలు వచ్చిన రైతులకు పరిహారం చెల్లించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ హెచ్చరించారు. సత్తుపల్లి, వేంసూరు దమ్మపేట మండలాల్లోని ఆయిల్పామ్ తోటలు, రేగళ్లపాడులోని నర్సరీని మంగళవారం సంఘం ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం సత్తుపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోటలోనే 40 ఆఫ్టైప్ మొక్కలు వచ్చాయని చెప్పారని, తద్వారా ఇంకా ఎందరు రైతులకు ఇలా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. నాలుగేళ్లుగా ఆఫ్టైప్ మొక్కలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఒక్కో రైతు ఎకరాకు రూ.6 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. రేగళ్లపాడు నర్సరీలో 2.20 లక్షల మొక్కలను తీసివేయకుండా రైతులకు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నించడం సరికాదన్నారు. ఇకనైనా ఆయిల్ఫెడ్ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించడమే కాక పామాయిల్ మద్దతు ధరను టన్నుకు రూ.25వేలు ఇవ్వాలని సాగర్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు బొంతు రాంబాబు, కొక్కెరపాటి పుల్లయ్య, తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి, చెలికాని సూరిబాబు, అన్నవరపు సత్యనారాయణ, బాల బుచ్చయ్య, వెంకట్రావ్, మోరంపూడి పాండు, సర్వేశ్వరరావు, రావుల రాజబాబు పాల్గొన్నారు. రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ -
చైన్ స్నాచర్ల అరెస్ట్
పాల్వంచ: బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి మెడలో నుంచి మరో బైక్పై వెళ్తున్న యువకుడు, ఇద్దరు మైనర్లు కలిసి బంగారు చైన్ను చోరీ చేయగా.. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సతీశ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న గొల్లగూడెం ఏరియా రేణుకా అపార్ట్మెంట్లో నివాసం ఉండే పెనికలపాటి అబ్రహంపీటర్ బైక్పై బజార్కు వచ్చి సరుకులు తీసు కుని వెళ్తుండగా జూలురుపాడు మండలం మాచినేనిపేట పెద్దతండాకు చెందిన భూక్యా వినోద్, మరో ఇద్దరు మైనర్లు కలిసి స్పోర్ట్స్ బైక్పై వెంబడించారు. ఒడ్డుగూడెం రోడ్లో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో అబ్రహంపీటర్ మెడలోని బంగారు చైన్ను లాక్కెల్లారు. దీంతో అబ్రహంపీటర్ బైక్ పైనుంచి కింద పడగా, ముగ్గురు పరారయ్యారు. దీంతో సీఐ సతీశ్, ఎస్ఐలు సుమన్, జీవన్రాజ్ ఘటనా స్థలా న్ని పరిశీలించారు. అనంతరం సీసీఎస్ పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టి చోరీ చేసిన ముగ్గురిని పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.లక్ష విలువ చేసే 23.6 గ్రాముల బంగారు చైన్ను, మూడు సెల్ఫోన్లు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. వినోద్ గతంలో కొత్తగూడెం త్రీటౌన్, టుటౌన్ పరిధిలో చైన్ స్నాచింగ్లు, జూలూరుపాడు పరిధిలో మిరప బస్తాలు చోరీ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. సమావేశంలో ఎస్ఐలు కల్యాణి, దేవ్సింగ్ పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
సూపర్బజార్(కొత్తగూడెం): మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించా లని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశాన్ని జిల్లా ఎస్పీ రోహిత్రాజ్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించకుండా కళాశాల యాజమాన్యా లు, తల్లదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దులు, చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా పెట్టాలని సూచించారు. అటవీ శాఖాధికారులు గంజాయి సాగు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను ప్రతినెలా తనిఖీ చేయా లని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీడి యాక్టు నమోదు చేస్తాం మాదకద్రవ్యాలు వినియోగించినా, రవాణా చేసినా పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ రోహిత్రాజ్ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కేజీల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా మాదకద్రవ్యాలను గుర్తించేందుకు రెండు నార్కోటిక్ డాగ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, భద్రాచలంలో డీఎడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. సమీక్షలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్సింగ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి, కొత్తగూడెం ఆర్టీఓ వెంకటరమణ, డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, డీఈఓ వెంకటేశ్వరాచారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, డీఏఓ బాబూరావు పాల్గొన్నారు. అలాగే, రహదారి భద్రతపై జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించగా.. కలెక్టర్, ఎస్పీ పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో గుర్తించాలని, ఈనెల చివరి నాటికి రహదారులపై ఉన్న గుంతలను పూడ్చాలన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రాణాలు పోకుండా ఆస్పత్రులకు తీసుకువెళ్లేందుకు అవకాశం ఉన్న సమీప రహదారులు, ఆస్పత్రులను ఎంపిక చేయాలని చెప్పారు. రహదారులపై సైన్బోర్డులతో పాటు, రేడియం స్టిక్కర్లు, జీబ్రాలైన్లు, స్టాపేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం రహదారి భద్రతపై రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, డీపీఓ చంద్రమౌళి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. యాంటీ డ్రగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్