breaking news
Bhadradri
-
నేడు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాలోని గ్రామపంచాయతీల నుంచి కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను మంత్రి సన్మానిస్తారని క్యాంపు కార్యాలయం ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఐఎల్పీఏ సదస్సుకు రండి..జడ్జీలకు న్యాయవాదుల ఆహ్వానం సూపర్బజార్(కొత్తగూడెం): ఈనెల 20న కొత్తగూడెం క్లబ్లో నిర్వహించే ఇండియన్ లాయర్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్(ఐఎల్పీఏ) రాష్ట్ర సదస్సుకు హాజరు కావాలంటూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్తో పాటు పలువురు జడ్జీలను ఆహ్వానించారు. ఈ మేరకు అసోసియేషన్ జిల్లా కన్వీనర్ గోపీకృష్ణ బుధవారం ఆహ్వాన పత్రికలు అందజేశారు. జిల్లా జడ్జితో పాటు అదనపు జిల్లా జడ్జి ఎస్ సరిత, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్కుమార్, అదనపు సీనియర్ జడ్జి కర్నాటి కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.సుచరిత, రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ బి. రవికుమార్ తదితరులను ఆహ్వానించారు. కార్యక్రమంలో న్యాయవాదులు భానుప్రియ, నిరంజన్ రావు, అంబటి రమేష్, ఎండి సాధిక్ పాషా, ఎరప్రాటి కృష్ణ, వి.హరి, యెర్రా కామేష్, విజయ్ పాల్గొన్నారు. -
సరిహద్దుల నుంచి..
నేను కాశ్మీర్ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నాను. ఎన్నికల సమయంలో లీవ్ తీసుకుని మంగళవారం రాత్రి వచ్చాను. నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. వ్యక్తులను ఎన్నుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. – షేక్ యాకూబ్ పాషా, ఆర్మీ జవాన్, కారేపల్లి నేనుహైదరాబాద్లోని ఓప్రైవేటు కంపెనీలో ఉ ద్యోగం చేస్తున్నాను. ఎన్నికల్లో ఓటువేయటం మన బాధ్యత. ఇప్పటివరకు నేనెప్పుడూ ఓటు మిస్ కాలేదు. మనం ఎక్కడ ఉన్నా మూలాలు మన ఊళ్లోనే ఉంటాయి. – షేక్ సలీమ్ పాషా, ప్రైవేటు ఉద్యోగి, కారేపల్లి కారేపల్లి మండలంలో తొలి ట్రాన్స్జెండర్ ఓటరు ను నేనొక్కడినే. ట్రాన్స్జెండర్గా ఓటు హక్కు వచ్చి న తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనటం ఇదే ప్రథ మం. ఓటువేయటం నాకు చాలాఆనందంగాఉంది. – వేమూరి కీర్తి అలియాస్ శ్రీను, కారేపల్లి -
మూడోసారీ పైచేయే..
చుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన పంచాయతీ పోరులో మొదటి నుంచీ కాంగ్రెస్ మద్దతుదారుల ఆధిపత్యం కొనసాగుతోంది. మొదటి, రెండో విడతలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు తిరుగులేని మెజారిటీ సాధించగా, మూడో దశలోనే అదే ఉనికి చాటారు. జిల్లాలోని 145 గ్రామపంచాయతీలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకంగా 98 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కలిసి రావడంతో పాటు ద్వితీయ శ్రేణి నాయకుల ప్రచారం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. దీంతో అధికారంలో ఉన్న పార్టీని పల్లె ఓటర్లు మరోసారి ఆదరించారు. ఇప్పటివరకు జరిగిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెరుగైన ఫలితాలు సాధించారు. కాగా, తుది విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంత డీలా పడింది. మొదటి విడతలో 38, రెండో విడతలో 31 గ్రామపంచాయతీలను గెలుపొందిన గులాబీ మద్దతుదారులు మూడో విడత ఎన్నికల్లో 19 స్థానాలతోనే సరిపెట్టుకున్నారు. ఇక కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ బలపర్చిన అభ్యర్థులు 16 పంచాయతీలు దక్కించుకుని సత్తా చాటారు. లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల్లో కాంగ్రెస్కు దీటుగా ఫలితాలు సాధించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ రెండు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి అభ్యర్థుల విజయం కోసం వారం రోజుల పాటు శ్రమించారు. ఈ రెండు మండలాల్లోనూ కాంగ్రెస్, సీపీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా హోరాహోరీ పోటీ నెలకొంది. కాగా, సీపీఎం మూడో విడతలో ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. తుది విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారుల హవా -
చదువుతో పాటు సౌకర్యాలూ కల్పించాలి
అశ్వారావుపేటరూరల్: ఆశ్రమ, జీపీఎస్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతోపాటు వసతి, ఇతర సౌకర్యాల కల్పనలో హెచ్ఎంలు, వార్డెన్లు బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. బుధవారం ఆయన అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం, అనంతారం, మేకలబండ గ్రామాల్లో పర్యటించారు. ఉన్నత విద్యనభ్యసించే వారికి వృత్యంతర శిక్షణ అందించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. మేకలబండ జీపీఎస్, అనంతారం ఆశ్రమ పాఠశాలల్లో తరగతి గదులు, వంటగది, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతీరోజు మెనూ ప్రకారం పౌస్టికాహారం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ముందుగా హెచ్ఎం, వార్డెన్లు భోజనం చేశాకే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. ఉద్దీపకం వర్క్బుక్ సంబంధిత అంశాలను విద్యార్థులతో బోర్డుపై రాయించారు. అంతకుముందు గాండ్లగూడెంలో పర్యటించి ఐటీడీఏ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజన లబ్ధిదారులకు చేరుతున్నాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కొండరెడ్ల జీవనోపాధి పెంపునకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, ఎంపీడీఓ అప్పారావు, హౌసింగ్ ఏఈఈ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.హెచ్ఎంలు, వార్డెన్లకు ఐటీడీఏ పీఓ సూచన -
ఓటు కోసమే..
సత్తుపల్లి మండలం కాకర్లపల్లి మా గ్రామం. నేను హైదరాబాద్లో ఉంటూ టీవీ సీరియళ్లలో నటిస్తున్నా. నాకు ఐదు నెలల బిడ్డ ఉంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చా. – ఈర్ల హరిత, వెండితెర నటి, కాకర్లపల్లి ఈ నెల 17న పోలింగ్ ఉందని గ్రామస్తులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అమెరికా నుంచి వచ్చా. ఎంతో సంతోషంగా ఉంది. – చీకటి శ్రీనివాసరావు, ఎన్ఆర్ఐ, అన్నారుగూడెం నేను హైదరాబాద్లో హోటల్ నిర్వహిస్తున్నాను. ఓటు వేసేందుకు కుటుంబ సమేతంగా వచ్చా. ఓట్ల రోజు నా స్నేహితులంతా కలిశారు. ఓటు వేయటం మా ఊరివాడిగా నా బాధ్యత. చాలా ఆనందంగా ఉంది. – చెరుకుమళ్ల రామారావు, కారేపల్లి -
ముస్తాబవుతున్న భద్రగిరి
భద్రాచలం: ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. ఈనెల 20 నుంచి పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి అవతరాల దర్శనం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పంచరంగులు, హంసవాహన పనులు వేగంగా సాగుతున్నాయి. బ్రిడ్జి రోడ్డు సెంటర్లో ప్రధాన స్వాగత ద్వారం, అభయాంజనేయస్వామి, సూపర్మార్కెట్ సెంటర్లతో పాటు ఇతర కూడళ్లలో సైతం స్వాగత ద్వారాలు సిద్ధమయ్యాయి. ఈనెల 29వ తేదీ రాత్రి గోదావరిలో తెప్పోత్సవం కోసం వినియోగించే తాత్కాలిక ర్యాంపు నిర్వహణ స్థలాన్ని ఇటీవల పరిశీలించిన అధికారులు తగు సూచనలు చేశారు. ఆన్లైన్లో 719 టికెట్ల విక్రయం.. కాగా ఉత్తరద్వార దర్శనం కోసం ఆన్లైన్లో 719 టికెట్లను విక్రయించారు. రూ.2వేల విలువగల సెక్టార్ టికెట్లు 353, రూ.1000 విలువైన టికెట్లు 52, రూ.500 విలువైన సెక్టార్ బీ, డీ టికెట్లు 416, రూ.250 విలువైన టికెట్లు 300 ఖాళీగా ఉన్నాయని, వీటిని భక్తులు వెబ్సైట్లో కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. -
రామాలయంలో తిరుప్పావై గోష్టి
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం స్వామి వారి ఉత్సవ మూర్తులతో పాటు ఆండాళ్ అమ్మవారికి అర్చకులు తిరుప్పావై గోష్టి నిర్వహించారు. సాయంత్రం తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ గావించడంతో పాటు తిరుప్పావై ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా స్థానాచార్యులు కేఈ స్థలశాయి ధన్ముర్మాస విశిష్టతను వివరించారు. తిరుప్పావై వ్రతం ఆచరిస్తే భక్తుల సకల అభీష్టాలు నెరవేరుతాయని, జనవరి 14న గోదా కల్యాణంతో ఈ వేడుకలు ముగుస్తాయని వివరించారు. సుమనోహరంగా రామయ్య నిత్యకల్యాణం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం వైభవంగా సాగింది. స్వామివార్లకు బేడా మండపంలో స్నపన తిరుమంజనం చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి బుధవారం భద్రాచలానికి చెందిన భక్తురాలు ప్రేమనీల రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయ పీఆర్ఓ సాయిబాబు పాల్గొన్నారు.ఆండాళ్ అమ్మవారికి వైభవంగా తిరువీధి సేవ -
సాంకేతిక పరిజ్ఞానంతో సాగు లాభదాయకం
బూర్గంపాడు: రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తే పంటల సాగు లాభదాయకంగా మారుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం సోంపల్లిలో డ్రోన్తో నేరుగా వరి విత్తనాలు వెదజల్లే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాగులో సాంకేతికను ఆవలంబిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చన్నారు. డ్రోన్తో వరి విత్తనాలు నేరుగా వెదజల్లడంతో పాటు ఎరువులు, పురుగుమందులు, గడ్డి మందులు పిచికారీ చేయడం ద్వారా కూలీల ఖర్చు తగ్గుతుందని చెప్పారు. కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ మాట్లాడుతూ డ్రోన్తో వరి విత్తనాలు వెదజల్లే విధానంలో వేస్తే గింజలు తక్కువగా అవసరం పడతాయని తెలిపారు. డ్రోన్తో వరి విత్తనాలు వెదజల్లే విధానాలను రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త ఎన్.శరత్చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త శివ, ఏడీఏ తాతారావు, ఏఓ శంకర్, ఏఈఓ పవన్ పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
‘పంచాయతీ’ ముగిసింది
● మొత్తంగా 78.82 శాతం పోలింగ్ నమోదు ● 40 జీపీలు, 840 వార్డులు ఏకగ్రీవంచుంచుపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. జిల్లాలో తొలి విడతలో 159 జీపీలు, 1,436 వార్డులకు గాను నామినేషన్లు రానివి, ఏకగ్రీవాలు మినహాయించి 145 పంచాయతీలు, 1,097 వార్డులకు, రెండో విడతలో 156 పంచాయతీలు, 1,392 వార్డులకు కోర్టు ఆదేశాలతో నిలిచిన చాపరాలపల్లి పంచాయతీ, ఏకగ్రీవాలు పోను 138 జీపీలు, 1,123 వార్డులు, మూడో విడతలో 156 పంచాయతీలు, 1,340 వార్డులకు గానూ కోర్టు ఆదేశాలతో నిలిచిన జూలూరుపాడు జీపీ, ఏకగ్రీవాలు పోగా 145 పంచాయతీలు, 1,071 వార్డులకు ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో 6,30,539 మంది ఓటర్లకు మూడు విడతల్లో కలిపి 4,97,033 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 78.82 శాతం పోలింగ్ నమోదైంది. ఏకగ్రీవాలిలా.. మూడు విడతల్లో కలిపి 471 పంచాయతీలకు గాను 40, 4,168 వార్డులకు 840 ఏకగ్రీవమయ్యాయి. పాండురంగాపురం పంచాయతీని ఎస్టీలకు రిజర్వ్ చేయగా ఆ వర్గం వారు లేరు. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదంటూ అక్కడ సర్పంచ్తో వార్డు స్థానాలకు కూడా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఇంకా అక్కడక్కడా 15 వార్డుల వరకు రిజర్వేషన్ అభ్యర్థులులేక నామినేషన్లు రాలే దు. కోర్టు ఆదేశాల మేరకు చాపరాలపల్లి, జూలూరుపాడులో ఎన్నికలు నిలిచిపోయాయి. జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. (జిల్లాలో మొత్తం 471 గ్రామ పంచాయతీలకు గాను ములకలపల్లి మండలం చాపరాలపల్లి, జూలూరుపాడు, పాల్వంచ మండలం పాండురంగాపురంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరుగలేదు.) -
● వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలన
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఐడీఓసీలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెబ్కాస్టింగ్ ద్వారా సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం జిల్లాలోని పలు కేంద్రాలకు వెళ్లి ప్రత్యక్షంగా పోలింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఎస్పీ.. మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ రోహిత్రాజు బుధవారం సందర్శించారు. జూలూరుపాడు మండలం పాపకొల్లు, సుజాతనగర్ మండలం సర్వారం, లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ, టేకులపల్లి మండలం టేకులపల్లి, దాసుతండా పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. -
‘చివర’కు ఓటెత్తారు..
చుంచుపల్లి: తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో చైతన్యం పెరిగింది. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 145 గ్రామ పంచాయతీల్లో బుధవారం చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 84.67 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా సుజాతనగర్లో 89.32 శాతం, అత్యల్పంగా ఇల్లెందు మండలంలో 80.64 శాతం మంది ఓటు వేశారు. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ వాహనాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని సైతం స్వగ్రామాలకు రప్పించారు. మూడో విడతలో 1,75,074 మంది ఓటర్లకు గానూ 1,48,229 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 21.27 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటలకు 62.35 శాతం పోలింగ్, ఓటింగ్ ముగిసే సమయానికి 84.67 శాతం మంది ఓట్లు వేయడం విశేషం. పలు చోట్ల 12 గంటలకే.. మొదటి విడతలో 71.79 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతలో 82.91 శాతం మంది ఓటేశారు. మూడో విడతలో ఏకంగా 84.67 శాతం పోలింగ్ నమోదైంది. పలు గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటలకే పోలింగ్ పూర్తిస్థాయిలో ముగిసింది. వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఉదయమే ఓటు వేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి అధికారులు ప్రత్యక్షంగా పోలింగ్ సరళిని వీక్షించారు. పటిష్ట పోలీస్ బందోబస్తు కూడా ఉండడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అనిశెట్టిపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎస్పీ రోహిత్రాజు కూడా పలు మండలాల్లో బందోబస్తును పర్యవేక్షించారు. మూడో విడతలో ఎన్నికలు జరిగిన 145 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 470 మంది పోటీపడ్డారు. టేకులపల్లి మండలంలో అత్యధికంగా 112 మంది పోటీ పడగా, సుజాతనగర్ మండలంలో అతి తక్కువగా 32 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాల బరిలో నిలిచారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులు మొదట వార్డుల వారీగా, ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతల వివరాలు వెల్లడించారు. చివరగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ల ఎన్నిక పూర్తి చేశారు. తుది విడత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, వారి అనుచరులు ఉత్సాహంగా సంబురాలు జరుపుకున్నారు. మండలం మొత్తం ఓటర్లు పోలైనవి నమోదు శాతం సుజాతనగర్ 13,598 12,146 89.32 జూలురుపాడు 24,462 21,700 88.71 ఆళ్లపల్లి 9,314 8,205 88.09 టేకులపల్లి 42,068 36,376 86.47 గుండాల 12,092 10,430 86.02 లక్ష్మీదేవిపల్లి 30,811 24,913 80.86 ఇల్లెందు 42,729 34,459 80.64 మొత్తం 1,75,074 1,48,229 84.67 -
దారుణ హత్య
భద్రాచలంటౌన్: మద్యం మత్తులో యువకులు గ్యాంగ్వార్కు తలపడ్డారు. గొడవను నిలువరించబోయిన వ్యక్తిని కత్తులు, స్క్రూ డ్రైవర్లతో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశారు. ఈ దారుణ సంఘటన భద్రాచలంలో బుధవారం జరిగింది. సరిహద్దు ప్రాంతమైన ఎటపాక వైన్ షాపు వద్ద రెండు బైక్లు స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ ఘటన ఘర్షణకు దారితీయగా, మద్యం మత్తులో ఉన్న రాజుపేట కాలనీకి చెందిన ఇరువర్గాల యువకులు చర్ల రోడ్డులోని మరో వైన్ షాపు వద్దకు చేరుకుని గొడవకు దిగారు. సుమారు రెండు గంటలపాటు ప్రధాన రహదారిపై కత్తులు, స్క్రూడ్రైవర్లతో హల్చల్ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. బంధువులను చూసేందుకు వచ్చి.. పాల్వంచ ఒడ్డుగూడేనికి చెందిన సజ్జ రవి(38) జామాయిల్ కలపను ఐటీసీకి విక్రయించే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భద్రాచలం రాజుపేట కాలనీలో ఉన్న బంధువులు అనారోగ్యంతో బాధపడుతుంటే చూసేందుకు వచ్చాడు. వైన్స్ షాపు వద్ద యువకుల మధ్య జరగడం, గొడవలో బంధువులు కూడా ఉండటంతో ఆపేందుకు ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు రవిపైనే దాడి చేశారు. కత్తులు, స్క్రూడ్రైవర్లతో విచక్షణారహితంగా పొడవడంతో రవి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించగా, ఛాతిలో పోడవడంతో గుండెకు గాయమై అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య జయశ్రీ, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆస్పత్రిలో తండ్రి మృతదేహం వద్ద పసిపిల్లలు ఏడుస్తున్న తీరు అందరినీ కదిలించింది. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం ఘర్షణ జరుగుతున్న సమయంలో స్థానికులు డయల్ 100కు, స్థానిక పోలీసులకు పలుమార్లు ఫోన్ చేసినా ఎవ రూ స్పందించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం 4 నుంచి 6 వరకు సుమారు రెండు గంటలపాటు దుండగులు నడిరోడ్డుపై వీరంగం చేసిన పోలీసులు రాకపోవడంపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడుసార్లు గ్యాంగ్వార్ జరగ్గా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మద్యం, గంజాయి మత్తులో యువత హత్యలకు పాల్పడుతున్నారని, ఇప్పటికైనా పోలీస్ అధికారులు మేల్కోని చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. భద్రాచలంలో గ్యాంగ్వార్ కలకలం -
నేటి నుంచి ‘జాగృతి’ జనం బాట
సూపర్బజార్(కొత్తగూడెం)/మణుగూరు టౌన్: సామాజిక తెలంగాణ సాధన, ప్రజాసమస్యల పరిష్కారం కోసం జిల్లాలో గురు, శుక్రవారాల్లో రెండురోజుల పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తారని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు డి.వీరన్న బుధవారం తెలిపారు. ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. కవిత పర్యటనను జయప్రదం చేయాలని హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ కొడిపల్లి శ్రీలత బుధవారం ఒక ప్రకటనలో కోరారు. మద్యం మత్తులో యువకుల హల్చల్పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న మరో యువకుడిపై దాడి సూపర్బజార్(కొత్తగూడెం): మద్యం మత్తులో టూవీలర్పై వచ్చిన యువకులు పెట్రోల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకుండా, పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న యువకుడిపై దాడి చేసిన ఘటన మంగళవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ఏరియా పెట్రోల్ బంక్లో జరిగింది. బంక్ సిబ్బంది కథనం ప్రకారం.. సదరు యువకులు పలుమార్లు మద్యం తాగి అర్ధరాత్రి పెట్రోలు పోయించుకొని డబ్బులు ఇవ్వలేదని, తమ వేతనం నుంచి యజమానికి డబ్బులు చెల్లించామని తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి డబ్బులు ఇవ్వకుండా పెట్రోల్ పోయించుకోవడమే కాకుండా దుర్భాషలాడారని వాపోయారు. బంకులో పనిచేస్తున్న యువకులపై చేయిచేసుకుని రక్తం వచ్చే విధంగా ముఖంపై పిడిగుద్దులతో గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ గన్ లాక్కుని, పెట్రోల్ కొట్టి, లైటర్తో వెలిగించి బంక్ పేల్చేస్తానని బెదిరించారని తెలిపారు. ఇదంతా సీసీ టీవీలో రికార్డయిందని బంక్ యజమాని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని బంక్ నిర్వాహకులు, సిబ్బంది వేడుకుంటున్నారు. ఈవిషయమై వన్టౌన్ సీఐ కరుణాకర్ను వివరణ కోరగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం రాత్రి తెలిపారు. కొనసాగుతున్న క్రికెట్ పోటీలురుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని గౌతంపూర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్లో జరుగుతున్న కంపెనీ లెవల్ క్రికెట్ పోటీల్లో బుధవారం రెండో రోజు కొత్తగూడెం, కార్పొరేట్ ఏరియాల జట్టు శ్రీరాంపూర్ జట్టుపై విజయం సాధించింది. ప్రకాశం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మందమర్రి–బెల్లంపల్లి జట్టుపై ఆర్జీ–1, ఆర్జీ–2 ఏరియా జట్టు గెలిచింది. ట్రాక్టర్ బోల్తా: తప్పిన ప్రమాదంఅశ్వారావుపేటరూరల్: మండలంలోని వినాయకపురం గ్రామంలో బుధవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఎరువుల లోడ్తో వినాయకపురం నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఒక్కసారిగా లారీ అడ్డు రావడంతో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ సురక్షితంగా బయట పడగా, త్రుటిలో ప్రమాదం తప్పింది. -
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి
దుమ్ముగూడెం : మండలంలోని తూరుబాక గ్రామానికి చెందిన వివాహిత ఉన్నం శిరీష (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటప్పయ్య కథనం ప్రకారం.. తూరుబాక గ్రామానికి చెందిన మేడి శాంతి పెద్ద కూతురు శిరీషకు గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన ఉన్నం మధుబాబుతో 2021లో వివాహం జరిగింది. మధుబాబుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 9న శిరీష తల్లికి ఫోన్ చేసి వాంతులు అవుతున్నాయని చెప్పడంతో పుట్టింటికి రప్పించారు. మళ్లీ ఈ నెల 14న వాంతులు కావడంతో భద్రాచలంలోని ఓ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ 16వ తేదీన మృతి చెందింది. మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి తల్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. లారీ ఢీకొని వ్యక్తి.. సత్తుపల్లిటౌన్: రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కిష్టారం సమీపాన బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన తోట వరప్రసాద్(48) సత్తుపల్లిలో బొగ్గు లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. కిష్టారం సమీపంలో రోడ్డు దాటుతుండగా సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన వరప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య●హైదరాబాద్లోని కళాశాలలో ఘటన పాల్వంచ: హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో డీఈగా విధులు నిర్వహిస్తున్న బలరాం కు మారుడు శ్రీకేతన్ హైదరాబాద్లోని కేపీహెచ్బీ సాయి నగర్ ఇగ్నైట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల క్యాంపస్లో బుధవారం ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందడంతో అక్కడికి వెళ్లారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. చోరీ చేసిన మహిళలు అరెస్ట్మణుగూరు టౌన్: పంట రుణం కట్టేందుకు వచ్చిన ఓ రైతు నుంచి నగదు కాజేసిన ఇద్దరు మహిళలను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ నాగబాబు కథనం ప్రకారం.. మండలంలోని కొండాయిగూడేనికి చెందిన మామిడిపల్లి సీతారాములు ఈ నెల 15న పట్టణంలోని ఓ బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు వచ్చాడు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు వెన్నెల, పూలమ్మ రైతును మాటల్లో పెట్టి రూ.70 వేలను దొంగిలించి పరారయ్యారు. బాధితుడు ఫిర్యాదతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టగా గుట్టమల్లారంలోని ఓ మఠంలో నిద్రించినట్లు గుర్తించారు. బుధవారం ఊరి శివారు హనుమాన్ జంక్షన్ వైపు కాలినడకన వెళ్తుండగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సదరు మహిళలు చోరీలు చేస్తూ సంచార జీవితం సాగిస్తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. బొగ్గు లారీ బీభత్సంసూపర్బజార్(కొత్తగూడెం)/రుద్రంపూర్: కార్మిక ప్రాంతమైన రామవరంలోని ఎస్సీబీ నగర్ వద్ద బుధవారం బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. కోయగూడెం ఓసీ నుంచి రుద్రంపూర్లోని ఆర్సీహెచ్పీకి బొగ్గు రవాణా చేసే టిప్పర్ ఎస్పీబీ నగర్ వద్ద ఐషర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తర్వాత విద్యుత్ టవర్ను ఢీకొట్టింది. దీంతో టవర్ నేలకొరిగింది. లారీలో ఉన్న క్లీనర్ కేబిన్లో ఇరుక్కుపోయాడు. సింగరేణి రెస్క్యూ ఇన్చార్జి అనంతరామయ్య, సిబ్బంది కేబిన్ కట్ చేసి క్లీనర్ను బయటికి తీసి 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బొగ్గు టిప్పర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
బాధ్యత గుర్తించి..
ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరుల బాధ్యత. బీటెక్ పూర్తి చేసిన నాకు తొలిసారి ఓటు హక్కు లభించింది. అందుకే ఓటు హక్కు సద్వినియోగం కోసం హైదరాబాద్ నుంచి వచ్చాను. –మచ్చ మమత, బీటెక్, పూబెల్లి నేను బెంగళూరులో రైల్వే కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నా. మా ఊరంటే అభిమానం ఎక్కువ. మంచి నాయకత్వంలో గ్రామం అభివృద్ధి చెందాలనే ఆశయంతో కుటుంబ సమేతంగా ఓటేసేందుకు వచ్చా. – అరెం బాబూరావు, వేపలగడ్డ -
సింగరేణికి అన్యాయం చేస్తే సహించం
కొత్తగూడెంఅర్బన్/మణుగూరుటౌన్: ప్రభుత్వం చేపడుతున్న బొగ్గు బ్లాక్ వేలంలో సింగరేణికి అన్యా యం చేస్తే సహించేదిలేదని కార్మిక సంఘాల అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. బుధవారం కొత్తగూడెంలో అఖిలపక్షం, మణుగూరులో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ సమావేశాల్లో నాయకులు మాట్లాడా రు. ఓసీల తవ్వకాల పొడిగింపునకు సంబంధించి సింగరేణి పరిశ్రమకు మాత్రమే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మణుగూరు పీకే ఓపెన్కాస్ట్ ప్రాజెక్టులను సింగరేణికి అప్పగించకపోతే యావత్తు సింగరేణి పరిశ్రమకే నష్టం జరిగే పరిస్థితి తలెత్తుతుందన్నారు. కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. అలాగే డీఎంఎఫ్, సింగరేణి సీఎస్సార్ నిధులు స్థానిక ప్రాంతాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. సింగరేణి బొగ్గు పరిశ్రమను పరిరక్షించుకోవడం కోసం, బొగ్గు బ్లాక్లను సాధించుకోవడం కోసం పరిరక్షణ సమితి పేరిట అన్ని రాజకీయ పార్టీ లు, అన్ని ప్రజా, కార్మిక సంఘాలను కలుపుకుని ఉద్యమం చేపడుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్కుమార్, నాయకులు వంగా వెంకట్, మల్లికార్జునరావు, రాంగోపాల్, రమణమూర్తి, వీరస్వామి, ఆవుల నాగరాజు, బీ.సురేందర్, ఏ.సురేందర్, శనిగరపు కుమారస్వామి, కిశోర్బాబు, ఐఎన్టీయూసీ నాయకులు త్యాగరాజన్, ఆల్బర్ట్, పితంబరం, శ్రీనివాస్, చిన్ని, టీబీజీకేఎస్ నాయకులు కాపుకృష్ణ, కూసన వీరభద్రం, నాగెల్లి వెంకటేశ్వర్లు, తుమ్మ శ్రీను, వశికర్ల కిరణ్, సీఐటీ యూ నాయకులు మంద నర్సింహారావు, రాజా రావు, సూరం ఐలయ్య పాల్గొన్నారు.సమావేశంలో అఖిలపక్ష నాయకులు -
పట్టభద్రురాలి గెలుపు
సుజాతనగర్: మండలంలోని గరీభ్పేట పంచాయతీ సర్పంచ్గా పట్టభద్రురాలు పూసం దివ్యతేజ ఎన్నికయ్యారు. ఎంఏ బీఈడీ చదివి ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె 816 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇరువర్గాల ఘర్షణటేకులపల్లి: మండలంలోని బద్దుతండాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మద్దిరాలతండాకు చెందిన నరేష్ ఓటు వేసేందుకు బద్దుతండాలోని పోలింగ్ కేంద్రానికి రాగా, గుర్తింపు కార్డు లేకపోవడంతో ఎన్నికల సిబ్బంది వెనక్కి పంపించారు. దీంతో ఇంటికి వెళ్లి ఐడీ కార్డు తీసుకుని వచ్చి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాడు. గమనించి కాంగ్రెస్ మద్దతుదారుడు, సర్పంచ్ అభ్యర్థి భూక్య గంగారావు రెండోసారి ఓటు వేసేందుకు వచ్చాడనే అనుమానంతో నరేష్ని పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగి చేయిచేసుకున్నాడు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐ అలకుంట రాజేందర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ ! తిరుమలాయపాలెం: మండలంలోని తెట్టెలపాడు సర్పంచ్గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన చిర్రా నర్సమ్మ గెలిచారు. ఆమె చెల్లె (పిన్ని కుమార్తె), కర్ణాటక రాష్ట్రంలోని గుల్బ ర్గా కలెక్టర్ హెప్సిబారాణి బుధవారం నర్సమ్మను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శవంతమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. తొలుత నర్సమ్మ విజయంపై గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యాన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బిల్లగిరి ధనుంజయ్, గుంటి పుల్లయ్య, చిర్రా కృష్ణయ్య పాల్గొన్నారు. -
ఓటు వేసేందుకు వచ్చా
నేను యూఎస్లోని మిచ్గన్ లారెన్స్ టెక్నాలజీ వర్సిటీలో ఎంఎస్ చదువు తున్నా. నెల రోజుల ముందుగా ఐ–94 పర్మిషన్ తీసుకుని, విమాన చార్జీలు రూ.1.90 లక్షలు చెల్లించి మంగళవారం రాత్రి స్వగ్రామం వచ్చాను. ఓటు హక్కు వినియోగించుకున్నాను. – ఆళ్ల సాయి తరుణ్, గుండెపుడి నేనుహైదరాబాద్లో ప్రైవేటు జా బ్ చేస్తున్నా. నాభర్తఅఖిల్సాఫ్ట్వే ర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఓ టు వెంగన్నపాలెంలోఉండటం తో మంగళవారం రాత్రివచ్చేశాం. ఓటు హక్కు వినియోగం అందరూ బాధ్యతగా భా వించాలి. – ముత్యాల హరిచందన, వెంగన్నపాలెం -
ఆనందంగా ఉంది..
నేను లండన్లో వ్యాపారం చేస్తున్నా. మాది సత్తుపల్లి మండలం కొత్తూరు. పంచాయతీ ఎన్నికలని తెలియడంతో మావూరు వచ్చేశాను. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయటం చాలా ఆనందంగా ఉంది. – పి.రామకృష్ణారెడ్డి, లండన్నేడను అమెరికాలోని కాలిఫోర్నియలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాను. ఓటు హక్కు వినియోగంచుకునేందుకు ఎల్లలు దాటి వచ్చా. చాలా సంతోషంగా ఉంది. మాది సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామం. – ఎన్.కృష్ణారావు, అమెరికా మా ఊరు సత్తుపల్లి మండలం గౌరిగూడెం. ఢిల్లీలో ఫోరెన్సిక్ సైన్స్ గ్రూప్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను. ఓటేసేందుకు ఇంటికి వచ్చా. ఓటుతో నిజాయతీగా పని చేసే నాయకుడినే ఎన్నుకోవాలి. – ఎస్.సాయిమనోహర్, ఢిల్లీ -
ఎన్ని పనులున్నా..
ఎన్ని పనులు ఉన్నా బాధ్యతాయుతంగా నా ఓటు హక్కును వినియోగించుకుంటా. ప్రస్తుతం ఫార్మసీ విభాగంలో స్థిరపడి పుణేలో ఉపాధి పొందుతున్నాను. పోలింగ్లో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా వచ్చాను. – మచ్చ వీరస్వామి, పూబెల్లి ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటున్నాను. పల్లెల బాగుకు పంచాయతీ ఎన్నికల్లో సమర్థులే పీఠమెక్కాలి. పనిఒత్తిడి ఉన్నా బాధ్యత గుర్తించి ఓటువేసేందుకు మా వూరు వచ్చాను. – సోలెం ముక్తేశ్వరరావు, బొజ్జాయిగూడెం -
ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
టేకులపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ విద్యాచందన సూచించారు. టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్నికల సామగ్రి పంపిణీని ట్రెయినీ కలెక్టర్ మురళి, ఎంపీడీఓ బైరు మల్లీశ్వరితో కలిసి మంగళవారం పరిశీలించిన ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి బ్యాలెట్ పేపర్ల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, మధ్యాహ్నం రెండు గంటలకు లెక్కింపు మొదలుపెట్టాలని తెలిపారు. అభ్యర్థులు రాత పూర్వకంగా కోరితేనే ఒకేసారి రీకౌంటింగ్ చేయాలని సూచించారు. సర్పంచ్ ప్రకటన తరువాత ఉప సర్పంచ్ ఎన్నిక సాధ్యం కాకపోతే మరుసటి రోజు నిర్వహణకు అనుమతి తీసుకోవాలని తెలిపారు. తహసీల్దార్ వీరభద్రం, ఎంపీఓ జేఎల్ గాంధీ, ఉద్యోగులు శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన -
గిరిజన విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి
చర్ల: గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారిని తీర్చిదిద్దాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. ఇందుకోసం ఐటీడీఏ సమకూర్చిన ఉద్దీపకం పుస్తకాలను వినియోగించాలని తెలిపారు. చర్ల మండలంలోని వద్దిపేట, ఉంజుపల్లిలో గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అధికారుల పేర్లు, ఉద్దీపకం వర్క్బుక్లోని పలు అంశాలను రాయించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. వెనకబడిన విద్యార్థులపై మరింత శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం చర్ల నుంచి పూసుగుప్ప మార్గంలోని రోటింత వాగుపై రూ.4.30 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు నాణ్యతగా, సకాలంలో జరిగేలా పర్యవేక్షించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పి.జయప్రకాష్, రాజ్కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఏటీడీఏ పీఓ రాహుల్ -
యూరియా.. దారి తప్పకుండా
పంపిణీ కోసం ప్రత్యేక యాప్ ● స్లాట్ బుకింగ్ విధానంలో సరఫరా ● ఈనెల 20నుంచి అమలుకు కార్యాచరణ ఖమ్మంవ్యవసాయం: యూరియా పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పంటలకు అవసరమైన మేరకే రైతులు యూరియా తీసుకెళ్లేలా ప్రస్తుత యాసంగి సీజన్ నుంచి ప్రత్యేక ప్రణాళిక అమలుచేయనుంది. గత ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బంది పడడంతో ఈసారి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా పంపిణీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు ప్రత్యేక యాప్ను రూపొందించి స్లాట్ బుకింగ్ విధానంలో పంట విస్తీర్ణానికి సరిపడా యూరియా సరఫరా చేయనున్నారు. ప్రత్యేక యాప్ రైతులకు యూరియా సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం ‘యూరియా బుకింగ్ యాప్’ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రైతులు పట్టాదారు పాస్ పుస్తకం వివరాల ఆధారంగా యాప్లో నమోదు చేస్తే భూమి విస్తీర్ణం మేరకు ఎంత ఎరువు అవసరమో తెలుస్తుంది. ఆపై యూరియా కావాలనుకున్నప్పుడు యాప్లో నమోదు చేస్తే రైతు ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని 15 రోజుల వ్యవధిలో మండలంలోని ఎరువుల దుకాణాలు లేదా సహకార సంఘంలో ఎరువులు తీసుకోవచ్చు. ఈక్రమంలో ఏ దుకాణానికి ఎంత ఎరువు కేటాయించారు, ఎంత సరఫరా అయిందో వివరాలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన మేర స్టాక్ కేటాయిస్తారు. ఇదే విధానం కౌలు రైతులకు కూడా వర్తించేలా యాప్ను రూపొందించారు. పట్టాదారు రైతు ద్వారా కౌలు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రైతులకు ఉన్న భూవిస్తీర్ణం ఆధారంగా మూడు నుంచి నాలుగు సార్లు స్లాట్ బుకింగ్ ద్వారా ఎరువు పొందే వీలుంటుంది. ఇప్పటికే అవగాహన యాసంగి సీజన్ ప్రారంభమైన నేపథ్యాన రైతులకు యూరియా సరఫరా చేసేందుకు ఈనెల 20 నుంచి యాప్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆతర్వాత స్లాట్ బుకింగ్పై రైతులకు వివరించాల్సి ఉంటుంది. జిల్లాకు 82 వేల మెట్రిక్ టన్నులు ప్రస్తుత యాసంగి సీజన్లో ఖమ్మం జిల్లాలో అన్నీ కలిపి 4,16,609 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 2,46,988, మొక్కజొన్న 1,59,462 ఎకరాల్లో సాగు కానున్నాయి. వీటితోపాటు పప్పు ధాన్యాలు, ఇతర పంటలు జాబితాలో ఉన్నాయి. ఈ పంటల కోసం ప్రభుత్వం 82 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించింది. ఇదికాక జిల్లాలో 16 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. ఈ యూరియాను పంపిణీ చేస్తూ మరింత అవసరమైతే సరఫరా చే అవకాశం ఉంది. -
పాఠశాలలకు రేటింగ్
● జిల్లాస్థాయిలో ఎంపికై న ఎనిమిది స్కూళ్లు ● రాష్ట్ర, జాతీయస్థాయి రేటింగ్కు పరిశీలన ● అభివృద్ధి, శుభ్రత, హరిత వాతావరణమే ప్రామాణికం ● జాతీయ స్థాయిలో సత్తా చాటితే రూ.లక్ష వరకు ప్రోత్సాహక బహుమతి కొత్తగూడెంఅర్బన్: స్వచ్ఛ, హరిత విద్యాలయాలకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రేటింగ్ ఇచ్చే కార్యక్రమం గత సెప్టెంబర్లో ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లాస్థాయి రేటింగ్ ప్రక్రియ పూర్తి కాగా, అవార్డులకు ఎనిమిది పాఠశాలలు ఎంపికయ్యాయి. అయితే, ఆయా పాఠశాలలకు అవార్డుల ప్రదానం ఎన్నికల నేపథ్యాన నిలిచిపోయింది. ఈ మేరకు రాష్ట్ర, జాతీయస్థాయి రేటింగ్ ఇచ్చేందుకు సర్వే గత సోమవారం నుంచి జరుగుతోంది. ఖమ్మం నుంచి విద్యాశాఖ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఆధ్వర్యాన ఎనిమిది పాఠశాలలను పరిశీలిస్తుండగా వివరాలను ఎస్హెచ్వీఆర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం రాష్ట్ర, జాతీయస్థాయి బృందాలు పరిశీలించి రేటింగ్ ప్రకటించనున్నాయి. జాతీయస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష వరకు కూడా ప్రోత్సాహక బహుమతి అందనుంది. ఇవీ ప్రామాణికం.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,685 రేటింగ్ పరిధిలో ఉండగా, ఆయా పాఠశాలల్లో 1,63,657 మంది విద్యార్థులు చదువుతున్నారు. వ్యర్థాల వర్గీకరణ, మితంగా నీటి వినియోగం, వర్షపునీటి సేకరణ, విద్యార్థుల్లో పర్యావరణ, స్నేహపూర్వక అలవాట్లు పెంపొందించడం, మరుగుదొడ్ల శుభ్రత, తాగునీటి వసతి, తరగతి గదులు, వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాలల్లో చెట్ల పెంపకం వంటి అంశాలే కాక విద్యార్థుల సామర్థ్యాలు ప్రామాణికంగా రేటింగ్ కేటాయిస్తారు. పరిశీలన అనంతరం 0–50 మార్కులు వస్తే ఒక స్టార్, 51–74 మార్కులు సాధిస్తే రెండు స్టార్లు, 75–80 మార్కులకు మూడు, 81–89 మార్కులకు నాలుగు, 90–100 మార్కులు సాధిస్తే ఐదు స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. జిల్లా స్థాయికి ఎంపికై న పాఠశాలలు గతంలో జిల్లాస్థాయి రేటింగ్ ప్రక్రియలో ఎనిమిది పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిల్లో బూర్గంపాడు మండలంలోని అంజనాపురం, ఇల్లెందు సంజయ్నగర్, బూర్గంపాడు ఎంపీపీఎస్లు, భద్రాచలం పబ్లిక్ పాఠశాల, అశ్వాపురం సెంట్రల్ గవర్నమెంట్ అటామిక్ ఎనర్జీ పాఠశాల, మోరంపల్లి జెడ్పీహెచ్ఎస్, ఇల్లెందు సత్యనారాయణపురం ఎంపీయూపీఎస్, పాల్వంచ కేజీబీవీ ఉన్నాయి. వీటికి రాష్ట్ర, జాతీయ స్థాయి రేటింగ్ ఇచ్చేందుకు సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని పాఠశాలలు జాతీయస్థాయి రేటింగ్కు ఎంపికయ్యేలా తీర్చిదిద్దాలని హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సూచించాం. మంచి రేటింగ్ సాధించి జాతీయస్థాయిలో ఎంపికై తే రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి అందుతుంది. ఇందుకోసం పచ్చదనం – పరిశుభ్రత విషయంలో శ్రద్ధ కనబరిచేలా పర్యవేక్షిస్తున్నాం. – నాగలక్ష్మి, డీఈఓ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రేటింగ్ ఇవ్వడం.. తద్వారా అవార్డులు, ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా పాఠశాలలు మరింత అభివృద్ధి దిశగా పయనిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాక పచ్చదనం, పరిశుభ్రత పెరగడంతో పాటుగా విద్యార్థులు, ఉపాధ్యాయులను పచ్చదనం వైపు దృష్టి సారించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తారని, వర్షపు నీటి సేకరణపై ఆసక్తి పెంచుకుంటారని చెబుతున్నారు. -
విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
దుమ్ముగూడెం: విద్యార్థులు పాఠ్యపుస్తకాలు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ సూచించారు. దుమ్ముగూడెంలోని కస్తూర్బా పాఠశాలను మంగళవారం సందర్శించిన ఆయన.. ప్రాంగణం తనిఖీ చేశాక బోధనపై ఉపాధ్యాయులతో చర్చించారు. అనంతరం తరగతులకు వెళ్లి విద్యార్థులకు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు చదువును నిరక్ష్యం చేయకుండా శ్రద్ధ వహిస్తే ఉన్నత స్థాయికి చేరొచ్చని తెలిపారు. అనంతరం దుమ్ముగూడెం రెవెన్యూ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆయన నిర్వహణ, దరఖాస్తుల పరిష్కారంపై సూచనలు చేశారు. తహసీల్దార్ అశోక్కుమార్, ఉద్యోగులు భరణిబాబు, కల్లూరు వెంకటేశ్వరరావు, గజ్జల నర సింహారావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముక్కోటికి పిలుపులు
● జిల్లా జడ్జి, ఐటీడీఏ పీఓ, ఏఎస్పీకి ఈఓ ఆహ్వానం ● ధనుర్మాసోత్సవాలకు తీర్థబిందెతో అంకురార్పణభద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన ఈనెల 29, 30వ తేదీల్లో జరగనున్న తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి రావాలంటూ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్కు ఆలయ ఈఓ కొల్లు దామోదర్రావు ఆహ్వానపత్రిక అందజేశారు. అలాగే, ఐటీడీఏ పీఓ రాహుల్, ఏఎస్పీ ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్కు ఆహ్వానాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ముక్కోటికి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, వసతి, వైద్యసేవలు కల్పించాలని సూచించారు. ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ, ఈఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసోత్సవాలకు అంకురార్పణ దేవస్థానంలో జరిగే ధనుర్మాసోత్సవాలకు మంగళవారం అంకురార్పణ జరిపారు. మేళతాళాల నడుమ పవిత్ర గోదావరి నుంచి తీర్థబిందెతో జలాలు తీసుకొచ్చారు. కాగా, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేటకు చెందిన ఎం. వెంకయ్య – భద్రమ్మ దంపతులు స్వామి వారికి వెండి శఠారీ సమర్పించారు. దీని విలువ రూ.73వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కమనీయంగా సాగింది. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు.. నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
రాష్ట్ర బాక్సింగ్ పోటీలకు ఎంపిక
సూపర్బజార్(కొత్తగూడెం): హైదరాబాద్లో ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల, మహిళల బాక్సింగ్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేశారు. కొత్తగూడెంలోని బాక్సింగ్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం చీఫ్ ప్యాట్రన్ ఎర్రా కామేశ్ వివరాలు వెల్లడించారు. పురుషుల జట్టులో జిల్లా నుంచి బోడా జాన్, ఆర్విన్ వసుమూర్తి, ఎర్రా ధనుంజయ్, మహిళల జట్టులో పోట్లపువ్వు హరిప్రియకు స్థానం దక్కిందని తెలిపారు. కార్యక్రమంలో కోచ్ ఎస్కే అర్షద్ పాల్గొన్నారు. పెదవాగు ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి అశ్వారావుపేటరూరల్: గతేడాది భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పెదవాగు ప్రాజెక్టు పునఃనిర్మాణానికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలని ఏపీ సీపీఐ నాయకులు కోరారు. మండలంలోని గుమ్మడవల్లి వద్ద పెదవాగు ప్రాజెక్టును వారు మంగళవారం పరిశీలించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి వేలాది మంది రైతుల భవిష్యత్పై ముడిపడి ఉన్నందున ప్రాజెక్టుకు ఇరు రాష్ట్రాలు నిధులు కేటాయించాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సీపీ ఐ నాయకులు అక్కినేని వనజ, మన్నవ కృష్ణచైతన్య, బండి వెంకటేశ్వరరావు, ఎండీ మునీర్, పిట్టా ప్రసాద్, కారం దారయ్య ఉన్నారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడండి
ఇల్లెందు/రుద్రంపూర్: గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా పర్యవేక్షించాలని న్యూడెమోక్రసీ నాయకులు కోరారు. మంగళవారం పలువురు నాయకులు కొత్తగూడెంలో ఎస్పీ రోహిత్రాజ్తో పాటు జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఎన్డీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు మాట్లాడుతూ.. గుండాలలో ఎన్డీ అభ్యర్థికోరం సీతారాములుకు మద్దతు పలికిన కాంగ్రెస్ నేత ఈసం పాపారావును రోజంతా స్టేషన్లో బంధించారని తెలిపారు. అలాగే, జగ్గాయిగూడెంనకు చెందిన మరో కార్యకర్తను కాంగ్రెస్ నేతలు ఎత్తుకెళ్లారని, ఓటర్లకు ఇష్టారాజ్యంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమాన పలువురు పోలీసులు కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలుకుతున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అలాగే, ఎన్డీ నేతలపై వేధింపులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. జె.సీతారామయ్య, గౌని నాగేశ్వరరావు, ఎన్.సంజీవ్, ఎండీ రాసుద్దీన్, శ్రీనివాస్, నరేశ్ పాల్గొన్నారు. ఎస్పీ, డీపీఓకు ఎన్డీ నేతల వినతి -
గంజాయిపై ఉక్కుపాదం..!
భద్రాచలంఅర్బన్: గంజాయి దందాకు ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం కేరాఫ్గా మారింది. పదో తరగతి, ఇంటర్ చదువుతున్న యువకులు పార్టీల పేరుతో మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు 17 నుంచి 25 ఏళ్ల వయసున్న యువకులే లక్ష్యంగా గంజాయి దందా సాగిస్తున్నారు. భద్రాచలం, సారపాకకు చెందిన చాలామంది యువకులు గంజాయికి బానిసలై.. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడి, పలుమార్లు జైలు కు వెళ్లినా తిరిగి అక్రమ రవాణాను ఆపడం లేదు. పెడ్లర్లుగా మారుస్తూ.. కొందరు యువకులకు తొలుత గంజాయి అలవాటు చేసి, దానికి బానిసలయ్యాక వారినే పెడ్లర్లుగా మారుస్తున్నారు. యువత సైతం ఈజీ మనీకి అలవాటు పడి చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి తీసుకొచ్చి తాము ఉంటున్న కాలనీల్లో మరికొందరికి వాటిని అమ్ముతున్నారు. శివారు ప్రాంతాల్లో గుంపులుగా చేరి, గంజాయి సేవిస్తూ.. విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఎస్పీ రోహిత్రాజు ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ చైతన్యం కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. కాగా, ఏపీ నుంచి జిల్లాలోకి గంజాయి బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల ద్వారా వస్తోందని గుర్తించిన పోలీసులు నిఘా పెంచారు. గంజాయి బృందాలు ఉండే ప్రాంతాలను గుర్తించి.. సాధారణ దుస్తుల్లో వచ్చి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు రావడంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి రవాణా చేస్తూ అనేక మార్లు పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి, వారి ఆస్తులను సైతం జప్తు చేస్తున్నారు. అయితే, ఇటీవల భద్రాచలం మీదుగా కొబ్బరి పీచుల మాటన తరలిస్తున్న సుమారు రూ.కోటి విలువ గల 222 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. ముమ్మర తనిఖీలతో నిఘా పెట్టిన పోలీసులు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రధాన మార్గాలు, అడ్డదారుల్లోనూ విస్తృత తనిఖీలు చేస్తున్నాం. గంజాయి రవాణా ప్రోత్సహించినా, సహకరించినా కఠిన శిక్షలు ఉంటాయి. ఎవరినీ ఉపేక్షించేది లేదు. మాదక ద్రవ్యాలకు బానిసై యువత జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇప్పటివరకు జిల్లాలో ఈ ఏడాది రూ.30 కోట్లు విలువ గల 6000 కేజీల గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నాం. –బి.రోహిత్రాజు, ఎస్పీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎంతటి వారినైనా సహించేది లేదు. గతంలో గంజాయి, గుట్కా తదితర మత్తుపదార్థాలు రవాణా చేస్తూ, లేదా వీటికి సంబంధించిన వ్యాపారం చేస్తూ జైలుకి వెళ్లి, విడుదలైన వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాం. వారు తీరు మార్చుకోకుండా పాత పద్ధతినే కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వారిని తిరిగి జైలుకు పంపిస్తాం. –విక్రాంత్ కుమార్ సింగ్, ఏఎస్పీ, భద్రాచలం ఏఐ సాయంతో.. గోదావరి వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద సీసీ కెమెరా, వీడియో లైవ్ రికార్డింగ్లకు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) వ్యవస్థ కూడా తోడైంది. హైదరాబాద్కు చెందిన బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ అందించే సాంకేతిక సహకారంతో నిఘా పటిష్టం కానుంది. నంబర్ ప్లేట్ ఆధారిత సమాచారం, నిబంధనలకు అనుగుణంగా వాహనం ఉందా? దానిని ఏమైనా మార్పు చేశారా?.. డ్రైవర్ల ప్రవర్తన.. తదితర సమాచారాన్ని ఏఐ సాయంతో విశ్లేషించనున్నారు. ఎలాంటి సందేహం వచ్చినా వెంటనే ఎస్ఎంఎస్, వాయిస్ కాల్ రూపంలో సంబంధిత విభాగాల పోలీసులకు వాహనం వివరాలతో కూడిన అలెర్ట్ను పంపుతుంది. రాష్ట్ర మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ సహకారంతో ఈ వ్యవస్థను భద్రాచలం వద్ద ఏర్పాటు చేశారు. -
వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు
పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో ఈనెల 14న మొదలైన పవిత్రోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈమేరకు చివరి రోజు రుత్విక్కులు సంతోష్కుమార్ శర్మ ఆధ్వర్యాన గణపతి పూజ, పుణ్యావాచనం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తి, ఉత్సవమూర్తులకు పవిత్రధారణ చేశారు. ఆలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం ఈ పవిత్రోత్సవాలు నిర్వహించినట్లు ఈఓ ఎన్.రజనీకుమారి వెల్లడించగా, కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మంత్రి వ్యవసాయ క్షేత్రంలో పరిశీలన దమ్మపేట: మండలంలోని గండుగులపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన ఆయిల్పామ్ తోటలను ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన రైతులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి కాసాని నాగప్రసాద్ ఆయిల్పామ్ సాగు, నీరు, ఎరువుల వినియోగం, అంతర పంటలు, పెట్టుబడి, ఆదాయంపై అవగాహన కల్పించారు. అలాగే, ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం ద్వారా అందుతున్న రాయితీలను వివరించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 1,023 కి.మీ. మేర రోడ్లు ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్వై), ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ పథకాల ద్వారా 1,023 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఈ విషయమై ప్రశ్నించారు. దీనికి మంత్రి కమలేష్ సమాధానం ఇస్తూ.. ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ కింద తెలంగాణకు 146 రహదారి పనులు, 112 వంతెనలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 1,023కి.మీ. నిడివికి గాను రూ.681.15 కోట్ల వ్యయంతో ఇప్పటివరకు 478 కి.మీ. మేర 39 రహదారులు, 50 వంతెనల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని తెలిపారు. ఇక 2016లో ప్రారంభించిన ఆర్సీపీఎల్డబ్ల్యూఈఏ పథకం ద్వారా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల జిల్లాల్లో రహదారి అనుసంధాన పనులు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. నూతన ఓసీల పనుల్లో వేగం ఇల్లెందు/రుద్రంపూర్: సింగరేణి ఇల్లెందు ఏరియాలో ఏర్పాటుచేస్తున్న నూతన ఓసీ పనుల్లో వేగం పెంచి బొగ్గు ఉత్పత్తికి సిద్ధం కావాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు సూచించారు. ఇల్లెందు ఏరియాలో మంగళవారం పర్యటించిన ఆయన జీఎం వీసం కృష్ణయ్య, ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత జేకే ఓసీ పనులపై ఆరాతీసిన ఆయన పలు సూచనలు చేశారు. అలాగే, కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీలో ఓవర్ బర్డెన్ తొలగింపు పనులపైనా డైరెక్టర్ వెంకటేశ్వర్లు కొత్తగూడెంలోని జీఎం కార్యాలయంలో సమీక్షించారు. పనులను గడువులోగా పూర్తిచేసి నిర్దేశిత సమయానికి ఉత్పత్తిమొదలుపెట్టాలని సూచించారు. కాగా, కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖనిలో వార్షిక భద్రతా వారోత్సవాలు నిర్వహించగా డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు రక్షణకు ప్రాధాన్యత ఇస్తే ప్రమాదాలు జరగవని తెలిపారు. ఈ సమావేశాల్లో ఈ కార్యక్రమంలో ఇల్లెందు, కొత్తగూడెం ఏరియా జీఎంలు లక్ష్మీపతిగౌడ్, శాలేం రాజు, ఉద్యోగులు నరసింహరాజు, రామస్వామి, గోవిందరావు, జాకీర్ హుస్సేన్, తుకారం, ప్రభాకర్, రవికుమార్,సాయిబాబు, సైదులు, తివారీ, వెంకటేశ్వరరావు, రామ్భరోసా మహతో, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే...
● సర్పంచ్లు విద్య, వైద్యరంగాలపై దృష్టి సారించాలి ● ఆత్మీయ సమ్మేళనంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చింతకాని: 1970లో కాంగ్రెస్ ఏక పార్టీగా ఉన్నప్పు డు, 2004 వైఎస్.రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పటి తర్వాత మళ్లీ ఇప్పుడే మధిర నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. నియోజకవర్గంలోని 131 స్థానాలకు 90 సర్పంచ్ స్థానాలను గెలవడం అభినందనీయమని తెలిపారు. చింతాని, ముదిగొండ మండలాల జీపీల నుంచి సర్పంచ్లుగా గెలిచిన వారితో చింతకాని మండలం నాగులవంచలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మధిర నియోజకవర్గంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతోనే స్నేహం ఎరుగని గ్రామాల్లో కూడా ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలుచేస్తున్న పథకాలతో ప్రజలు పట్టం కడుతున్నారని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రుణమాఫీతో పాటుట ఇంటిగ్రేటెడ్ రెసిరెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు అంశాలతో సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. కాగా, నూతన సర్పంచ్ల బాధ్యత ప్రారంభమైందని.. గ్రామపాలనతో పాటు విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరిమిత వనరులను ప్రాధాన్యతా పనులకు ఖర్చు చేస్తూ గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామపంచాయతీ అభివృద్ధికి తాను సహకరిస్తానని భట్టి హామీ ఇచ్చారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అభివృద్ధి చేసినప్పుడే గుర్తింపు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నాయకులు కొండబాల కోటేశ్వరరావు, అంబటి వెంకటేశ్వర్లు, కొమ్మినేని రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఫైనల్ ఫైట్!
మొత్తం పంచాయతీలు 156 తుది విడత గ్రామ పంచాయతీల వివరాలు ఏకగ్రీవమైనవి 10 ఎన్నికలు జరిగేవి 145మొత్తం వార్డులు 1,340ఏకగ్రీవ వార్డులు 256ఓటింగ్లో పాల్గొనే ఓటర్లు 1,75,074 బరిలో ఉన్న అభ్యర్థులు 3,272 ఎన్నికలు జరిగే వార్డులు 1,071చుంచుపల్లి: జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, విజేతలను ప్రకటిస్తారు. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. మండలాల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి మంగళవారం ఉద్యోగులు సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరారు. సామగ్రి సహా ఉద్యోగుల చేరవేతకు 80 బస్సులు, 15 మినీ బస్సులు, 30 వరకు టాటా మ్యాజిక్ వాహనాలను వినియోగించారు. 10 ఏకగ్రీవం.. ఒకచోట బ్రేక్ చివరి విడతలో 156 గ్రామ పంచాయతీలు, 1,340 వార్డుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో జూలూరుపాడు సర్పంచ్ స్థానంతో పాటు పది వార్డులకు నిర్వహించాల్సిన ఎన్నికలు కోర్టు ఆదేశాలతో నిలిపివేశారు. ఇక ఆళ్లపల్లిలో రెండు, ఇల్లెందులో ఒకటి చొప్పున మొత్తం మూడు వార్డులకు రిజర్వేషన్ ప్రకారం నామినేషన్లు దాఖలు కాలేదు. మరోపక్క గుండాలలో మామకన్ను, దామరతోగు, లక్ష్మీదేవిపల్లి మండలంలో హరియాతండా, కారుకొండ, అనిశెట్టిపల్లి, సుజాతనగర్లో టూ ఇంక్లైన్, ఇల్లెందు మండలంలో ధనియాలపాడు, సుభాష్నగర్, జూలూరుపాడు మండలంలో శంభునిగూడెం, వినోభానగర్ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 145 పంచాయతీలు, ఏకగ్రీవ వార్డులు 256 మినహాయించి మిగిలిన 1,071 వార్డు స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల నుంచి అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించనున్నారు. అధికారుల పర్యవేక్షణ మూడో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల పరిధిలో ఉద్యోగులకు బ్యాలెట్బాక్సులు, ఇతర సామగ్రి అందించేందుకు మంగళవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగూడెంలోని రామచంద్ర కళాశాల, జూలూరుపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్, సుజాతనగర్ జిల్లా పరిషత్ హైస్కూల్, గుండాలలో గురుకుల పాఠశాల, ఆళ్లపల్లి ఎంపీడీఓ కార్యాలయం, టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇల్లెందు సింగరేణి స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయగా ఉద్యోగులకు సామగ్రి అప్పగించిన అధికారులు ఎన్నికల నిర్వహణపై సూచనలు చేశారు. అనంతరం రూట్ల వారీగా వాహనాల్లో బయలుదేరి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కాగా, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకుడు సర్వేశ్వర్రెడ్డి, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఎన్నికల అధికారి చక్రపాణిరెడ్డి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఆర్డీఓ మధు, ట్రెయినీ కలెక్టర్ మురళి తదితరులు పర్యవేక్షించారు. మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు పీఎస్లు ఓటర్లు ఆళ్లపల్లి 12 43 84 225 90 9,314 గుండాల 09 41 78 249 80 12,092 జూలురుపాడు 21 66 142 361 174 24,462 లక్ష్మీదేవిపల్లి 28 78 221 571 245 30,811 సుజాతనగర్ 12 32 80 199 102 13,598 టేకులపల్లి 36 112 244 609 312 42,068 ఇల్లెందు 27 98 222 588 255 42,729 మొత్తం 145 470 1,071 2,802 1,258 1,75,074చివరి విడతగా జిల్లాలోని ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో 145 గ్రామ పంచాయతీలు, 1,071 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా చోట్ల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు 3,272 మంది పోటీలో ఉండగా, 1,75,074 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్లలో 85,712 మంది పురుషులు, 89,359 మంది మహిళలతో పాటు మరో ముగ్గురు ఇతరులు ఉన్నారు. ఎన్నికల నిమిత్తం 1,258 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 3,818 మంది ఉద్యోగులను నియమించారు. ఇందులో 187 మంది రిటర్నింగ్ అధికారులు, 1,608 మంది పీఓలు, 1,884 ఓపీఓలు, 63 మంది రూట్ ఆఫీసర్లు, 24 మంది జోనల్ అధికారులతో పాటు 23 మంది ఎఫ్ఎస్టీ, 24 మంది ఎస్ఎస్టీ బృందాల సభ్యులు ఉన్నారు. చివరి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం -
కంపెనీ స్థాయి క్రికెట్ టోర్నీ ఆరంభం
రుద్రంపూర్: సింగరేణి కంపెనీ స్థాయి క్రికెట్ టోర్నీ కొత్తగూడెం గౌతంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే పోటీలను జీఎం(వెల్ఫేర్) జీవీ.కిరణ్కుమార్, ఇన్చార్జ్ జీఎం నర్సింహరావు ప్రారంభించారు. అనంతరం ఆరు ఏరియాల క్రీడాకారులను పరిచయం చేసుకున్న వారు మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చడం ద్వారా సంస్థ ఖ్యాతిని చాటాలని సూచించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మొదటి రోజు ఫలితాలు టోర్నీలో భాగంగా తొలిరోజు కొత్తగూడెం, కార్పొరేట్ – భూపాలపల్లి, ఆర్జీ–3 జట్లు తలపడగా కొత్తగూడెం, కార్పొరేట్ జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్ ఇల్లెందు, మణుగూరు – బెల్లంపల్లి, మందమర్రి జట్ల మధ్య జరగగా ఇల్లెందు – మణుగురు జట్టు గెలిచింది. శ్రీరాంపూర్ – ఆర్జీ–3, భూపాలపల్లి జట్ల నడుమ మరో మ్యాచ్లో ఆర్జీ–3, భూపాలపల్లి జట్లు విజయం సాధించింది. -
ట్రాన్స్ఫార్మర్లో కాపర్వైరు చోరీ
కరకగూడెం: మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన రైతు మోడెపు వెంకన్నకు చెందిన పొలంలోని 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ను సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి, అందులోని కాపర్వైరును చోరీ చేశారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఇన్చార్జ్ ఏఈ రాజశేఖర్ మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు రూ.1.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు వెల్లడించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశామని ఎస్ఐ పీవీఎన్ రావు చెప్పారు. తరలిస్తున్న స్క్రాప్ పట్టివేత ఇల్లెందు: పట్టణంలోని కరెంట్ ఆఫీస్ ఏరియాలో డీసీఎం వాహనంలో సింగరేణి స్క్రాప్ను లోడు చేస్తండగా సింగరేణి సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం సింగరేణి ఎస్అండ్పీసీ ఆఫీసర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఎంటీఎఫ్ టీం సభ్యులు డీసీఎంలో లోడ్ అవుతున్న స్క్రాప్ను పట్టుకుని సెక్యూరిటీ కార్యాలయానికి తరలించారు. సుమారు రూ.20 వేల విలువ చేసే స్క్రాప్ ఇందులో ఉన్నట్లు తెలిసింది. సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పొయ్యిలో పడిన వృద్ధురాలు మృతి పాల్వంచ: చలి కాచుకునేందుకు కట్టెల పొయ్యి ముందు కూర్చుని ప్రమాదవశాత్తు అందులో పడి గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణ పరిధిలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన బూర సులోచన (65) ఇంటి వద్ద ఒంటరిగా జీవనం సాగిస్తోంది. కాగా సోమవారం ఉదయం 4 గంటల సమయంలో చలి ఎక్కువగా ఉందని ఇంటి ముందు కట్టెల పొయ్యి వెలిగించుకుని కూర్చుంది. నిద్ర మత్తులో ప్రమాదవశాత్తు పొయ్యిలో పడిపోవడంతో చీరకు మంట అంటుకుని శరీర భాగాలు కాలిపోయాయి. ఆమె కేకలు విన్న కుటుంబ సభ్యులు ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మంగళవారం మృతురాలి కుమారుడు బూర శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ సుమన్ తెలిపారు. నూతన గృహంలో సామగ్రి చోరీ ఇల్లెందురూరల్: మండలంలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయతీ చెక్పోస్టు రొంపేడు గ్రామానికి చెందిన వేములపల్లి వెంకటేశ్వరరావు నూతన గృహంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. చర్చిరొంపేడు గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు ఇటీవలే చెక్పోస్టురొంపేడులో నూతనంగా ఇల్లు నిర్మించుకొని, గృహ ప్రవేశం చేసి.. పాత ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని విషయం గుర్తించిన గుర్తుతెలియని దుండగులు తలుపులు, ఫ్యాన్లు, విద్యుత్ మోటారు, బాత్రూంలోని సామగ్రిని అపహరించారు. బుధవారం చోరీని గుర్తించిన వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
‘మహాలక్ష్మి’తో మహిళలకు ఆదా
● రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి భద్రగిరికి బస్సులు ● ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి భద్రాచలంటౌన్: రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతోందని, ఇప్పటివరకు చార్జీల రూపంలో మహిళలకు రూ.850 కోట్లు ఆదా అయ్యాయని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. భద్రాచలం ఆర్టీసీ డిపోకు మంగళవారం వచ్చిన ఆయన మెకానిక్ వర్క్షాప్, బస్టాండ్ను పరిశీలించారు. అనంతరం ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి బస్సులు నడిచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పది వేల బస్సులతో రోజుకు సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీ గడిచిన రెండేళ్లలో 2,500 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని చెప్పారు. వచ్చే రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాలకు సైతం ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తామని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో విలీనమైన భద్రాచలం సమీప మండలాలకు బస్సులు నడపడంతో పాటు తెల్లవారుజామున వెంకటాపురం వరకు బస్సు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనంతరం ఉద్యోగులు పలు సమస్యలపై వినతిపత్రాలను అందజేసి, ఎండీని సత్కరించారు. మణుగూరురూరల్: మణుగూరు డిపోను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తనిఖీ చేశారు. డిపో ఆవరణ, పరిసరాలను పరిశీలించిన ఆయన సర్వీసుల నిర్వహణపై ఉద్యోగులతో సమీక్షించారు. మేడారం జాతర కు డిపో నుంచి భక్తుల సౌకర్యార్థం సర్వీసులు నడపాలని సూచించారు. ఖమ్మం ఆర్ఎం సరిరాం, డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య, డిపో మేనేజర్లు రాజ్యలక్ష్మి, శ్యాంసుందర్, ఉద్యోగులు రవీందర్, రామయ్య, రవీందర్, నాగబాబు పాల్గొన్నారు. -
తుది విడతకు ఏర్పాట్లు పూర్తి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఎస్పీ రోహిత్రాజ్, ఎన్నికల పరిశీలకుడు సర్వేశ్వర్రెడ్డి, వ్యయ పరిశీలకురాలు లావణ్యతో కలిసి మంగళవారం ఆయన ఎన్నికలు జరగనున్న మండలాల ఉద్యోగులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రితో ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు చేరినందున ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించగానే ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. ఇప్పటికే సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. మొత్తం 1,288 పోలింగ్ కేంద్రాలలో సమస్యాత్మకమైనవి 134, అతి సమస్యాత్మకమైనవి 168, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 184 ఉండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 183 పోలింగ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద 1,500 మంది పోలీసులతో భద్రతా చర్యలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తితే డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని ఎస్పీ రోహిత్రాజ్ సూచించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు
చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సోమవారం మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. బీజాపూర్ జిల్లా పార్సేఘడ్ పోలీస్స్టేషన్ పరిధి పిల్లూర్ – కండ్లపర్తి గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్బాంబును ఓ జవాన్ తొక్కగా, పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన జవాన్ కమలేష్ సైగం, ఏఎస్ఐ అమిత్కుమార్ యాదవ్లను చికిత్స నిమిత్తం రాయ్పూర్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఇల్లెందురూరల్: మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ వైటీసీ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడటంతో గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన పాయం కృష్ణకుమారి (29) మృతి చెందింది. ఇల్లెందు చర్చిలో ప్రార్థనకు హాజరైన ఆమె ఆలస్యం కావడంతో హనుమంతులపాడులోని బంధువుల ఇంటికి బయలుదేరింది. ఈ మార్గమధ్యలో వైటీసీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై హసీనా సోమవారం తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి మృతిచుంచుపల్లి: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం విద్యానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాంజనేయకాలనీకి చెందిన దోమల సంగయ్య (55) విద్యానగర్ నుంచి రామాంజనేయకాలనీకి వెళ్తున్న క్రమంలో వెనకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారుతో ఢీకొట్టిన వ్యక్తి చలపతిరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. -
● కుటుంబమంతా ప్రజాప్రతినిధులే
అశ్వారావుపేట రూరల్ : మండల పరిధిలోని నారాయణపురం గ్రామం నుంచి ఒకే కుటుంబానికి చెందినవారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఉప సర్పంచ్గా గతంలో పనిచేశారు. ప్రస్తుతం అదే కుటుంబం నుంచి మరో వ్యక్తి నారాయణపురం ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాడు. నారాయణపురం గ్రామానికి చెందిన చిన్నంశెట్టి వాసు 2001, 2019లో రెండు పర్యాయాలు ఉప సర్పంచ్గా ఎన్నికయ్యడు. తాజా ఎన్నికల్లో వాసు మేనల్లుడు ఆకుల శ్రీను ఉప సర్పంచ్గా గెలిచాడు. అదే కుటుంబానికి చెందిన చిన్నంశెట్టి వరలక్ష్మి అశ్వారావుపేట జెడ్పీటీసీగా, చిన్నంశెట్టి పల్లవి ఎంపీటీసీగా గతంలో పనిచేశారు. -
మూగబోయిన మైకులు
● పల్లె పోరు ప్రచారాలకు తెర ● ప్రలోభాల ప్రయత్నాల్లో అభ్యర్థులు చుంచుపల్లి : జిల్లాలో ఈనెల 17న జరిగే గ్రామపంచాయతీ తుది విడత ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం తెర పడింది. మైకులు మూగబోవడంతో పల్లెల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖర్చుకు వెనకాడకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. గెలుపే లక్ష్యంగా డబ్బు, మద్యం పంపిణీ ప్రధానాస్త్రాలుగా రంగం సిద్ధం చేశారు. ఎన్నికల వ్యయ పరిమితితో సంబంధం లేకుండా భారీగా ఖర్చు చేస్తున్నారు. సర్పంచ్ పదవులు మహిళలకు కేటాయించిన గ్రామాల్లో ఉప సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు కొందరు అభ్యర్థులు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధమవుతున్నారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని పోలింగ్ రోజు వరకు రప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరడంతో గ్రామాల్లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. 145 జీపీలు.. 1,071 వార్డులు చివరి విడతలో లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, టేకులపల్లి, ఇల్లెందు, ఆళ్లపల్లి, గుండాల మండలాల పరిధిలోని 145 గ్రామ పంచాయతీలు, 1,071 వార్డులకు బుధవారం పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 156 పంచాయతీలు, 1,340 వార్డులకు గాను, కోర్టు తీర్పు నేపథ్యంలో జూలూరుపాడులో సర్పంచ్, 10 వార్డు స్థానాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. మరో మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోగా, 256 వార్డులు ఏకగ్రీవంగా నిలిచాయి. ఈ విడతలో పది సర్పంచ్ స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 145 పంచాయతీలకు 470 మంది, 1,071 వార్డులకు 2,802 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
పోటీ పరీక్షల్లో రాణించేలా చూడాలి
భద్రాచలం : గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా తర్ఫీదు ఇవ్వాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులకు గ్రూప్స్ కోచింగ్ పుస్తకాల కొనుగోలుకు రూ.45 వేల చెక్కును సోమవారం తన చాంబర్లో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల ఖమ్మంలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించానని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పుస్తకాలు కావాలని విద్యార్థులు కోరారని తెలిపారు. వివిధ రకాల నైపుణ్యాలు, పెయింటింగ్ల్లో వారికి అవగాహన కల్పించేలా ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు చొరవ చూపాలని సూచించారు. కెరీర్ గైడెన్స్పై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, కళాశాల ప్రిన్సిపాల్ రజిని తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఒకే కుటుంబం నుంచి వరుసగా..
పాల్వంచరూరల్/ములకలపల్లి/దమ్మపేట: ఒకే కుటుంబానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. భార్యాభర్తలు, తల్లీ కొడుకులు గత, ప్రస్తుత పాలకవర్గాల్లో సర్పంచ్లుగా గెలిచారు. పాల్వంచ మండలం పాండురంగాపురంతండా గ్రామ పంచాయతీలో 2019 నుంచి 2023 వరకు అజ్మీరా జగదీష్కుమార్ సర్పంచ్గా పనిచేయగా, తాజా ఎన్నికల్లో అతని తల్లి అజ్మీరా రుక్మా సర్పంచ్గా ఎన్నికై ంది. బంజర పంచాయతీ సర్పంచ్గా ముక్కటి ధనలక్ష్మి ఎన్నిక కాగా, గత పాలకవర్గంలో ఆమె భర్త నగేష్ సర్పంచ్గా పనిచేశాడు. లక్ష్మీదేవిపల్లి(ఎస్) పంచాయతీ సర్పంచ్గా గతంలో భూక్యా విజయ్కుమార్ ఎన్నిక కాగా, ఈసారి అతని భార్య భూక్యా మంజుల సర్పంచ్గా గెలిచింది. కేశవాపురం సర్పంచ్గా 2019 నుంచి 2023 బానోతు బాలు సర్పంచ్గా పనిచేశాడు. ఈసారి అతని భార్య శ్రీదేవి సర్పంచ్గా ఎన్నికై ంది. రంగాపురంలో మాలోతు హరి గతంలో సర్పంచ్గా పనిచేసి, ఈసారి వార్డు సభ్యుడిగా గెలిచాడు. అతని భార్య అనూష సర్పంచ్గా ఎన్నికై ంది. దమ్మపేటలో.. దమ్మపేట మండలం బాలరాజుగూడెం గ్రామ సర్పంచ్గా గతంలో కురసం శ్రీనివాస్ పనిచేయగా, తాజా ఎన్నికల్లో ఆయన తల్లి కురసం లక్ష్మి సర్పంచ్గా ఎన్నికయ్యారు. మల్కారం గ్రామ సర్పంచ్గా గతంలో కునుసోతు చిట్టిబాబు పనిచేయగా, ప్రస్తుతం అతడి భార్య ధనలక్ష్మి రాచూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికయ్యారు. ములకలపల్లి మండలం సీతాయిగూడెం తొలి సర్పంచ్గా కారం సుధీర్ పని చేశాడు. రెండో దఫా ఎన్నికల్లో ఈస్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్కాగా, సుధీర్ భార్య చంద్రకళ పోటీ చేసి సర్పంచ్గా విజయం సాధించింది. ఈ గ్రామంలో గతంలోజగన్నాధపురం జీపీలో అంతర్భాగంగా ఉండేది. 2018లో కొత్త పంచాయతీగా ఆవిర్భవించగా, మొదటిసారి భర్త, రెండోసారి భార్య గ్రామ ప్రథమపౌరులుగా ఎన్నికయ్యారు. పాల్వంచరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి కూడా పోటీ చేసిన మహిళలు సర్పంచ్లుగా గెలిచారు. 2019 నుంచి 2023 వరకు సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించిన ఉల్వనూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ వాసం రుద్ర ఈసారి కూడా 520 ఓట్లతో విజయం సాధించింది. జగన్నాథపురం గ్రామ పంచాయతీలో గత పాలకవర్గంలో సర్పంచ్గా పనిచేసిన బానోతు అనిత తాజాగా ఎన్నికల్లో 694 ఓట్లతో గెలిచింది. బస్వతారాకకాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ జర్పుల కాశమ్మ కూడా వరుసగా రెండోసారి ఎన్నికై ంది. ఈసారి 460 ఓట్ల మెజారిటీ సాధించింది. రేగులగూడెంలో టాస్ ద్వారా ఎన్నికై న కుర్సం రాములును మూడోసారి సర్పంచ్గిరీ వరించింది. గతంలో చండ్రాలగూడెం పంచాయతీ సర్పంచ్గా 1981లో మొదటిసారి, 2014లో రెండోసారి సర్పంచ్గా పనిచేశాడు. పట్టభద్రులు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా ఎన్నికై న పలువురు ఉన్నత చదువులు చదివారు. మండలంలోని దంతలబోరు ఎస్సీకాలనీ సర్పంచ్గా గెలిచిన సోడె వెంకటరమణ పీజీ పూర్తిచేసింది. ఛత్తీస్గఢ్లో ఏంఏ చదివింది. రేపల్లెవాడలో..చండ్రుగొండ : మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన ఇరప స్రవంతి సర్పంచ్గా ఎన్నికై ంది. ఆమె బీఎస్సీ, బీఈడీ విద్యాభ్యాసం చేసింది.గత, తాజా ఎన్నికల్లో సర్పంచ్లుగా ఎన్నిక -
భక్తులపైనే భారం..
భద్రాచలం : శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈ ఏడాది నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఉత్సవాల ఖర్చులు రాను రాను భారంగా మారుతుండడం, మరోవైపు ప్రభుత్వ సాయం అందకపోవడంతో ఆలయ అధికారులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో పగల్ పత్తు ఉత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు రోజుకో సంస్థ ఖర్చు భరించి వేడుకల్లో భాగస్వాములు కావాలనే ప్రతిపాదన ఆచరణలో పెట్టారు. దీంతో రామయ్య ఉత్సవ ఖర్చులు దాతలపై వేస్తున్నందుకు బాధపడాలో, ఉత్సవంలో భాగస్వాములు అవుతున్నందుకు ఆనందించాలో తేల్చుకోలేని సందిగ్ధంలో భక్తులు ఉన్నారు. పెరుగుతున్న వ్యయం.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం దివ్యక్షేత్రంలో ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలు వైభ వంగా జరుగుతాయి. దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు భద్రాచలం తరలివస్తారు. అలాంటి ఉత్సవాల నిర్వహణ ఆలయానికి తలకు మించిన భారంగా మారుతోంది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఆ ఖర్చు సైతం పెరుగుతోంది. వీటిలో అత్యధికంగా భక్తుల కోసం చేపట్టే తాత్కాలిక వసతులకే వ్యయం అవుతోంది. లైటింగ్, పెయింటింగ్, తాత్కాలిక పనులు, చలువ పందిళ్లు, ఏసీలు, ఎల్ఈడీలు తదితర పనుల నిమిత్తం దేవస్థానం నుంచి నిధుల కేటాయిస్తున్నారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల పనులకు ఇప్పటికే రూ.80 లక్షలకు టెండర్ దాఖలైంది. వీటికి అదనంగా మరో రూ.50 లక్షల వరకు ఖర్చవుతాయి. శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలకు సుమారు రూ.2 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ ఉత్సవాల ఖర్చంతా హుండీ ఆదాయం నుంచే భరించాల్సి వస్తోంది. స్వామి వారికి, ఆలయ అభివృద్ధికి భక్తులకు సమర్పించే కానుకలు ఇలా ఉత్సవాలకు వినియోగించాల్సి వస్తోంది. ‘పగల్పత్తు’లో భాగం కండి.. ఆలయంపై పడుతున్న భారాన్ని తట్టుకునేందుకు ఈ ఏడాది అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టారు. ముక్కోటి ఉత్సవాల్లో మొదటి తొమ్మిది రోజులు స్వామి వారు రోజొక అవతారంలో దర్శనమిస్తారు. వీటిని పగల్ పత్తు ఉత్సవాలు అంటారు. ముక్కోటి తర్వాత జరిగే రాపత్తు ఉత్సవాలను ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల వారే నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చు ఆయా శాఖలే భరిస్తాయి. అయితే ఈ ఏడాది తొలిసారిగా పగల్పత్తు ఉత్సవాల్లోనూ రోజొక ధార్మిక సంస్థ లేదా అసోయేషన్లు నిర్వహించేలా వీలు కల్పించారు. ఈ మేరకు చాంబర్ ఆఫ్ కామర్స్, పలు స్వచ్చంద, ధార్మిక సంస్థలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలకు రోజుకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే ఆ ఖర్చు భరించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భక్తుల కోసం ప్రభుత్వం నిర్వహించాల్సిన ఉత్సవాలకు సైతం దాతలపై ఆధారపడాల్సి రావడం బాధాకరమని పలువురు అంటున్నారు. ముక్కోటి ఉత్సవాల్లో భక్తులను భాగస్వాములను చేసేందుకే దాతలను ఆశ్రయించాం. అవతారాల నిర్వహణ అవకాశాన్ని స్వచ్ఛంద, ధార్మిక సంస్థలకు కల్పించాం. తద్వారా దేవస్థానంపై సైతం వ్యయ భారం తప్పుతుంది. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారమే ఉత్సవాలు నిర్వహిస్తాం. – కొల్లు దామోదర్రావు, రామాలయ ఈఓ ప్రభుత్వాలు మారినా.. సాయం సున్నా భద్రాచల క్షేత్రంలో జరిగే ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని భక్తులు కోరుతున్నా, ఆలయం నుంచి పలుమార్లు నివేదించినా కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఉత్సవాల నిర్వహణపై నిర్లక్ష్య వైఖరిలో మార్పు ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మేడారం వంటి ఉత్సవాలకు రూ.కోట్ల నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం.. భద్రగిరి ఉత్సవాలకు నయా పైసా విడుదల చేయడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణపై దృష్టి సారించి నిధులు విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు. ముక్కోటి వేడుకలకు అందని సర్కారు సాయం -
పారదోలేందుకు..
మహమ్మారిని ● వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల చర్యలు ● 18 నుంచి ఇంటింటా కుష్ఠు వ్యాధి బాధితుల గుర్తింపు సర్వేభద్రాచలంఅర్బన్: కుష్ఠు వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నెల 18 నుంచి 31 వరకు ఇంటింటా రెండో విడత లెప్రసీ సర్వేకు శ్రీకారం చుట్టింది. గత మార్చి 17 నుంచి 30 వరకు మొదటి విడతలో 2,29,336 ఇళ్లలో సర్వే నిర్వహించింది. 1,702 మందికి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తించగా, పరీక్షల అనంతరం 25 మందికి వ్యాధి ఉన్నట్లు తేలింది. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు రెండో విడతలో 2,43,336 ఇళ్లను సర్వే చేయనుండగా, 1,407 ఆశా కార్యకర్తలు, 1,436 వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, 290 మంది సూపర్వైజర్లు సర్వేలో పాల్గొనున్నారు. 12 నెలల్లో తగ్గిపోతుంది.. మైక్రో బ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మ క్రిమి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా ఇది చర్మం, నరాలకు సోకుతుంది. లక్షణాలు బహిర్గతమయ్యేందుకు సగటున 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. వ్యాధి ఎవరికై నా రావచ్చు. వంశపరంపర్యంగా వచ్చే వ్యాధి కాదు. బహుళ ఔషధ చికిత్సతో తీవ్రతనుబట్టి 6 నుంచి 12 నెలల్లో పూర్తిగా నయం చేసుకోవచ్చు. లక్షణాలివే.. చర్మంపై మచ్చలు కనిపించినా, కాళ్లు, చేతులు చచ్చుబడినా, వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. శరీరంపై స్పర్శలేని మచ్చలు, నరాల వాపు, నొప్పి తెలియని పుండ్లు, ముఖంపై గుళ్లలు, చేతులు, పాదాల తిమ్మిర్ల వంటి లక్షణాలు కనిపిస్తే కుష్ఠువ్యాధిగా అనుమానిస్తారు. ఇది సోకిన వారికి అంగవైకల్యం సంభవిస్తుందని, దీర్ఘకాలికంగా వేధిస్తుందని వైద్యులు చెబుతున్నారు. చికిత్స విధానం.. కుష్ఠువ్యాధి నివారణకు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందుతుంది. బహుళ ఔ చికిత్స(ఎండీటీ)విధానంతో పూర్తిగా నయమవుతుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే అంగవైకల్యాన్ని కూడా నివారించవచ్చు. బాధితులకు మైక్రో సెల్యూలార్ రబ్బర్ పాదరక్షలు ఉచితంగా అందిస్తున్నారు. అంగవైకల్యం పొందితే కన్సట్రక్టివ్ సర్జరీగా కూడా నిర్వహస్తారు. రూ.12 వేలను ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారు. కుష్ఠు వ్యాధిని సకాలంలో గుర్తించి మందులు వాడితే సులువుగా తగ్గించవచ్చు. అపోహలు వీడి చికిత్స చేయించుకోవాలి. జిల్లాలో ఎంతమందికి లక్షణాలు ఉన్నాయనే సమాచారాన్ని సేకరించి, వారికి చికిత్స అందించాలనే లక్ష్యంతో లెప్రసీ సర్వే చేపడుతున్నాం. ఈ నెల 18 నుంచి 31 వరకు ఇంటింటి సర్వే చేపడుతున్నాం. –డాక్టర్ పుల్లారెడ్డి, జిల్లా లెప్రసీ నివారణ అధికారి -
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య!
● మృతిపై కుటుంబీకుల అనుమానాలు ● మృతదేహంతో జాతీయ రహదారిపై రాస్తారోకోపాల్వంచ: భార్య, భర్తల మధ్య గొడవల నేపథ్యంలో భర్త ఆదివారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణంలోని వెంగళరావుకాలనీకి చెందిన ధరావత్ హరినాథ్ (39)కు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. హరినాథ్ భార్య ఫారెస్ట్ శాఖలో బీట్ ఆఫీసర్గా ములుగు జిల్లా వెంకటాపురం ఏరియాలో పనిచేస్తోంది. దంపతుల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా గొడవ జరగ్గా, మనస్తాపం చెంది హరినాథ్ ఇంటి ముందు ఉన్న స్లాబ్ హుక్కుకు చీరతో ఉరి వేసుకుని మృతి చెందాడు. రాత్రి రెండు గంటల సమయంలో భార్య గుర్తించి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కిందకు దింపారు. అయితే అప్పటికే మృతి చెందాడు. కోడలుకు వివాహేతర సంబంధం ఉండటంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, పలుమార్లు సర్దిచెప్పామని, గొడవలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి మంగమ్మ ఫిర్యాదుతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహంతో బీసీఎం రహదారిపై ఆందోళన మృతదేహానికి సోమవారం పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అతడు ఆత్మహత్య చేసుకోలేదని, భార్యనే వేరే వారితో హత్య చేసి ఉండవచ్చని, పోలీసులు విచారణ చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ సెంటర్లో బీసీఎం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ఎస్ఐలు సుమన్, జీవన్రాజ్, కల్యాణి సిబ్బందితో అక్కడికి చేరుకుని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి
జూలూరుపాడు/సుజాతనగర్ : ఈనెల 17న జరిగే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికారులు జాగ్రత్తలు పాటించాలని సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్రెడ్డి సూచించారు. సుజాతనగర్, జూలూరుపాడులో సోమవారం ఆర్ఓలు, ఏఆర్ఓలు, సిబ్బందితో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల సిబ్బందికి తాగునీరు, భోజనం, విద్యుత్, స్ట్రాంగ్ రూమ్ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని చెప్పారు. ఆయా సమావేశాల్లో జూలూరుపాడు తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఎంపీడీఓలు బి.భారతి, పూరేటి అజయ్, ఎంపీఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ తాళ్లూరి రవి పాల్గొన్నారు. సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్రెడ్డి -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జానకీ సదనానికి రూ.12 లక్షల విరాళం.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు వసతి కల్పించేందుకు చేపట్టిన జానకీ సదనం నిర్మాణానికి ఖమ్మం జయనగర్ కాలనీకి చెందిన శ్రీరంగం వకుళాభాష్యం రూ.12 లక్షల విరాళాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ శ్రావణ్కుమార్కు దాతలకు రశీదు అందించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తాంఎండీ నాగిరెడ్డి వెల్లడి చుంచుపల్లి: టీజీఎస్ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కొత్తగూడెంలో నూతన బస్టాండ్ నిర్మాణంపై త్వరలో పరిశీలన చేస్తామన్నారు. అన్ని ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు సమష్టి కృషితో సంస్థ సేవలను మరింతగా విస్తరిస్తామని వివరించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. అనంతరం కొత్తగూడెం బస్టాండ్ ప్రాంగణం, డిపోలో పలు గ్యారేజీలను పరిశీలించారు. ప్రధాన సమస్యలేంటని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది పలు సమస్యలను ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట ఆర్ఎం సరిరామ్, డిప్యూటీ ఆర్ఎం మల్లయ్య, డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.నేటి నుంచి కంపెనీ లెవల్ టోర్నీరుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కంపెనీ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు ఫ్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు ఆరు టీమ్లను అధికారులు తయారుచేశారు. కొత్తగూడెం – కారొరేట్ ఒక టీమ్గా, ఇల్లెందు – మణుగూరు ఏరియాలు కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేశారు. ఇక భూపాలపల్లి, రామగుండం రీజియన్, శ్రీరాంపూర్ వేర్వేరుగా, బెల్లంపల్లి – మందమర్రి ఏరియాతో మరో టీమ్ను ఎంపిక చేశారు. మొత్తంగా 80 మంది క్రీడాకారులు తమ ప్రతిభ చాటనున్నారు. టోర్నీకి కోలిండియా క్రీడాకారులు, టీమ్ మేనేజర్లు కూడా హాజరు కానున్న నేపథ్యంలో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఖమ్మంవ్యవసాయం: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై అందరూ అవగాహన పెంచుకోవాలని ఖమ్మం జిల్లా అటవీ అధికారి(డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్సింగ్ సూచించారు. రాష్ట్ర చిహ్నాలు, ముఖ్యమైన వణ్య ప్రాణులు, ప్రకృతి సంరక్షణను వివరిస్తూ రూపొందించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల్లో పర్యావరణ స్పృ హ పెంచడం, ప్రకృతిపై ప్రేమ, బాధ్యత పెంపొందించడమే లక్ష్యంగా పోస్టర్ల ద్వారా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ మంజుల, గ్రీన్ వారియర్ జేవీఎస్.చంద్రశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
జనవరి 4న ‘గురుకుల’ స్వర్ణోత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన బాలుర గురుకుల పాఠశాల స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2026 జనవరి 4న స్వర్ణోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పాఠశాల ప్రాంగణంలో నిర్వహణ కమిటీ సభ్యులు సోమవారం సమావేశమై చర్చించారు. ఈనెల 28వ తేదీనే వేడుకలు జరపాలని భావించినా.. భద్రాలచంలో తెప్పోత్సవం, ముక్కోటి వేడుకల నేపథ్యంలో వారం రోజుల పాటు వాయిదా వేశారు. పూర్వ విద్యార్థులంతా హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ రమేష్, పూర్వ విద్యార్థులు ఎస్.చక్రవర్తి, ఖాదర్, రమేష్రెడ్డి, ధారవత్ వెంకన్న, బుర్ర అశోక్, సత్యనారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూల్లో నిర్మాణాలకు ప్రతిపాదనలు.. కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో అదనపు గదులు, ప్రహరీ, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదలను పంపిస్తామని గిరిజన సంక్షేమ శాఖ ఈఈ టి.మధుకర్ తెలిపారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించారు. ఆయనవెంట హెచ్ఎం చందు ఉన్నారు. కాగా, గిరిజన బాలుర గురుకుల కళాశాల, పాఠశాలను ఆర్సీఓ బి.అరుణకుమారి సోమవారం సందర్శించారు. అవసరమైన సౌకర్యాలు, మరమ్మతులపై ప్రిన్సిపాళ్లతో చర్చించారు. -
‘ముక్కోటి’కి పటిష్ట ఏర్పాట్లు
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 29, 30వ తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. భద్రాచలం సబ్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఆలయ పరిసరాల్లో సీసీ టీవీలు, భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రాచలం, పర్ణశాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, భక్తులకు సురక్షిత తాగునీరు, సరిపడా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు. మొబైల్ టీమ్ల పర్యవేక్షణతో పాటు అంబులెన్సులు, ఏరియా ఆస్పత్రిలో పది పడకలు, మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తెప్పోత్సవంతో పాటు, భద్రాచలం ప్రాముఖ్యత తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన సాంప్రదాయ వంటకాలు, వస్తువుల స్టాళ్లు ఏర్పాటు చేయాలని, ఏరు ఉత్సవ పనులు మంగళవారం నుంచే ప్రారంభించాలని సూచించారు. హంస వాహనంపైకి పరిమిత సంఖ్యలోనే అనుమతించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆలయ ఏఈఓ శ్రావణ్కుమార్, ఈఈ రవీంద్రనాథ్, ఇరిగేషన్ ఏఈ శ్యామ్, ఏడీఎంహెచ్ఓ సైదులు, విద్యుత్ శాఖ డీఈ జీవన్కుమార్, సతీష్, ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
రైతులకు ‘కలప’తరువుగా..
● జామాయిల్ పంటపై పలువురి దృష్టి ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం ● పత్తి, మిర్చితో వరుస నష్టాలు.. జామాయిల్తో నికరాదాయం ● కాగితపు పరిశ్రమతో పాటు ఫ్లైవుడ్ తయారీకి వినియోగంబూర్గంపాడు: జామాయిల్ సాగు మళ్లీ ఊపందుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏటా ఈ పంట విస్తీర్ణం మరింతగా పెరుగుతోంది. గతంలో ఉమ్మడి జిల్లాలో వేల ఎకరాల్లో జామాయిల్ సాగయ్యేది. అయితే 15 ఏళ్ల క్రితం మార్కెట్ ఒడిదుడుకులతో రైతులు ఈ పంటలను తొలగించారు. కానీ పదేళ్లుగా జామాయిల్ కర్ర ధర క్రమంగా పెరుగుతుండడంతో మళ్లీ సాగుపై రైతులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం జామాయిల్ కర్ర ధర టన్నుకు రూ. 8వేల వరకు ఉంది. గత మూడేళ్లుగా జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పత్తి, మిర్చి పంటలు రైతులకు వరుస నష్టాలను కలిగిస్తున్నాయి. తెగుళ్లు, పురుగు ఉధృతితో ఈ రెండు పంటల దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. దీనికి తోడు వీటికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. దీంతో పలువురు రైతులు జామాయిల్ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 80 వేల ఎకరాల్లో ఈ పంట సాగువుతుండగా ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. వేల టన్నుల సరఫరా.. సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ పేపర్ పరిశ్రమకు రోజుకు వేల టన్నుల జామాయిల్ కర్ర సరఫరా ఆవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను జామాయిల్ సాగుకు ఐటీసీ ప్రోత్సహిస్తోంది. పరిశ్రమకు అవసరమైన జామాయిల్ కర్రను రైతులతో సాగు చేయించి కొనుగోలు చేస్తోంది. అంతేకాక సబ్సిడీపై మొక్కలు అందిస్తోంది. ఒకసారి జామాయిల్ మొక్క నాటితే 12 నుంచి 15 ఏళ్ల వరకు పంటను మార్చాల్సిన అవసరం ఉండదు. ప్రతీ మూడు, నాలుగేళ్లకోసారి కర్ర నరికి ఐటీసీకి విక్రయించుకోవచ్చు. ఎకరం విస్తీర్ణంలో 45 నుంచి 60 టన్నుల వరకు కర్ర దిగుబడి వస్తుండగా రైతులకు రూ. రూ.3.50 లక్షల నుంచి రూ 4.50 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పైగా ఈ పంటకు పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువే. ఒకటి, రెండు సార్లు నీరు పెట్టి ఎరువులు వేస్తే సరిపోతుంది. భూమి కౌలుకు తీసుకున్న రైతులకు సైతం పెట్టుబడితో కలిపి ఎకరాకు ఏటా రూ.30 వేలకు మించి ఖర్చు రాదు. పెట్టుబడి పోగా ఏటా తక్కువలో తక్కువగా ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు జామాయిల్ కర్రను సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీనే ఎక్కువగా కొనుగోలు చేసేది. ప్రస్తుతం రాజమండ్రి పేపర్ మిల్లు కూడా జిల్లాలో సాగు చేసిన జామాయిల్ కర్ర కొనుగోలు చేస్తోంది. గతంలో కాగితపు పరిశ్రమలే ఈ కర్రను కొనుగోలు చేసేవి. ప్రస్తుతం ఫ్లైవుడ్ తయారీకి కూడా జామాయిల్ కలపనే వినియోగిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఫ్లైవుడ్ పరిశ్రమలు ఉండడంతో జామాయిల్ కొనుగోలు పెరిగింది. ఒకప్పుడు బంజర భూములు, బీడు భూముల్లోనే ఈ పంట సాగు చేసేవారు. ప్రస్తుతం నీటివనరులు ఉన్న సారవంతమైన భూముల్లోనూ సాగు చేస్తుండడం గమనార్హం. అటవీశాఖ కూడా వనసంరక్షణ సమితి ఆధ్వర్యంలో జామాయిల్ సాగు చేపడుతోంది. అయితే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుండగా భవిష్యత్లో డిమాండ్ తగ్గుతుందనే అనుమానాలు రైతులను వెంటాడుతున్నా.. పంట సాగులో మాత్రం వెనుకంజ వేయడం లేదు. తక్కువ పెట్టుబడి, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం వంటి సానుకూల అంశాలతో రైతులు పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. -
నిర్దిష్ట లక్ష్యాలతోనే విజయాలు
ఖమ్మంఅర్బన్: విద్యార్థులు భవిష్యత్పై నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకుని సాధన చేస్తే విజయాలు వరిస్తాయని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం టేకులపల్లిలోని మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందిన విద్యార్థినులు ఎంపీహెచ్డబ్ల్యూ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి 2, 4, 5, 7, 8, 10వ ర్యాంకులు సాధించగా వారిని సోమవారం కలెక్టర్ అభినందించి మాట్లాడారు. పేద కుటుంబాలు, ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థినులు ఇక్కడితో ఆగిపోకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడాలని సూచించారు. ర్యాంకులు సాధించిన జబ్బా పావని, మచ్చా శ్రావణి, దేవత్ సంధ్యవిక, చిదిం మౌనిక, బానోతు కల్పన, పగిడిపల్లి రాజేశ్వరితో పాటు మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత, ఉద్యోగులు నాగ సరస్వతి, స్పందన, మల్లిక, సుధీర్, సుకన్య, మౌనిక, లాలయ్య పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్యాయత్నం● సెల్ఫీ వీడియో కలకలం భద్రాచలంటౌన్: భద్రాచలంలో మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత ఆత్మహత్యకు యత్నించడం సోమవారం కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు ఆమె సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఓ మహిళకు న్యాయం చేసేందుకు వెళ్లినప్పుడు దళిత సంఘ నాయకులు తనపై వేధింపులకు పాల్పడ్డారని వీడియోలో ఆమె పేర్కొంది. వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. కాగా కుటుంబ సభ్యులు ఆమెను భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని సీఐ నాగరాజు తెలిపారు. వ్యక్తికి గాయాలు సుజాతనగర్: కారు, బైక్ ఢీకొని ఒకరికి గాయాలైన ఘటన సోమవారం జరిగింది. కొత్తగూడెంలోని పెనగడపకు చెందిన కిరణ్ ద్విచక్రవాహనంపై ఖమ్మం వెళ్తున్నాడు. అదే సమయంలో ఖమ్మం వైపు వెళ్తున్న కారు నందనవనం సమీపంలో యూ టర్న్ తీసుకునే క్రమంలో డ్రైవర్ కొద్ది దూరం వెనుకకు రానిచ్చాడు. ఈ క్రమంలో కొత్తగూడెం వైపు నుంచి వస్తున్న ద్విచక్రవాహనం కారు వెనుకభాగంలో ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. పినపాకలో ఇరువర్గాల వాగ్వాదం తల్లాడ: మండలంలోని పాత పినపాక గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయు ల మధ్య సోమవారం వాగ్వాదం చోటు చేసుకుంది. పినపాకకు చెందిన బీఆర్ఎస్ తరఫున వార్డుసభ్యులుగా పోటీ చేస్తున్న ఎక్కిరాల నాగేశ్వరరావు, ఎక్కిరా ల అనసూర్య, తేళ్లపుట్ల లక్ష్మి, తేళ్లపుట్ల కుమారి, తేళ్లపుట్ల మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్కు చెందిన గుర్రం నాగేశ్వరరావు, ఆళ్ల శ్రీను, గుర్రం శివరాం, తేళ్లపుట్ల నాగేశ్వర్రావు, నర్వనేని శ్రీను తదితరులు ఎక్కిరాల నాగేశ్వరరావుపై దాడికి యత్నించారని ఆరోపించారు. అయితే, బీఆర్ఎస్ నేతలే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఎక్కిరాల ప్రభాకర్రావు పేర్కొన్నారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదు అందిందని ఎస్సై ఎన్.వెంకటకృష్ణ తెలిపారు. న్యూలక్ష్మీపురంలో ఘర్షణ ముదిగొండ: మండలంలోని న్యూలక్ష్మీపురంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు గ్రామ రహదారిపైకి చేరడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు చేరుకుని ఇరువర్గాల వారిని పంపించారు. అయితే, రాళ్లు, కర్రలతో తమపై దాడి చేశారంటూ ఇరువర్గాల వారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన వార్డుసభ్యుడి మృతి రఘునాథపాలెం: మండలంలోని మంగ్యాతండా గ్రామ వాసి, ఈనెల 11న వార్డుమెంబర్గా ఎన్నికై న కొడకళ్ల వెంకటాచారి(45) మృతి చెందాడు. గ్రామ ఒకటో వార్డు సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వడ్రంగిగా జీవనం సాగించే ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈమేరకు వెంకటాచారి చిత్రపటం వద్ద నూతన సర్పంచ్ మాలోతు భార్గవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, నాయకులు రవికిరణ్, నాగేశ్వరరావు, రమేశ్, నాగాచారి, భాస్కర్ నాయకులు నివాళులర్పించారు. వ్యక్తి అదృశ్యంపై కేసు ఖమ్మంఅర్బన్: ఖమ్మం బల్లెపల్లికి చెందిన ఓ వ్యక్తి కానరాకుండా పోయిన ఘటనపై కేసు నమోదైంది. బల్లేపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గండు వెంకన్న(42) గత నెల 25న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆయన కుమారుడు నవీన్ ఫిర్యాదు ఖమ్మం అర్బన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. -
వరినారు.. జాగ్రత్తలు
కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ భరత్ సూపర్బజార్(కొత్తగూడెం): యాసంగిలో వరిసాగు కోసం చలి కాలంలో వరినారు రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ టి.భరత్ వివరించారు. నారుమడిలో చలి వల్ల వరిపంట చాలా ప్రభావితమవుతుంది. చలి వల్ల విత్తనం త్వరగా మొలకెత్తదు. నారు సరిగ్గా పెరగదు. పసుపు రంగుకు మారి తరువాత ఎర్రబడి కొన్నిసార్లు చనిపోతుంది. నారు సరిగ్గా పెరగకపోవడంతో నాట్లు ఆలస్యమవుతాయి. జింక్ లోపం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. యాసంగిలో దమ్ము చేసిన నారుమడిలో మండె కట్టిన విత్తనాలు వేయాలి. రెండు గుంటల నారుమడికి రెండు కిలోల నత్రజని (ఒక కిలో విత్తనం చల్లే ముందు, ఒక కిలో విత్తిన 12–14 రోజుల తరువాత) రెండు కిలోల భాస్వరం, ఒక కిలో పోటాష్ను ఇచ్చే ఎరువుతోపాటు, రెండు క్వింటాళ్ల మాగిన కోళ్ల ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వానపాముల ఎరువును నారుమడి దుక్కులో వేసి కలియదున్నాలి. చలి నుంచి నారుమడిని కాపాడేందుకు నారుమడి పైన పాలిథీన్ షీట్ లేదా పట్టాలను ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రల ఊతం సాయంతో సాయంత్రం వేళల్లో కప్పి మరుసటి రోజు ఉదయం తీసివేయాలి. నారు మంచిగా పెరగటానికి యూరియా పైపాటుగా వేసేటప్పుడు కిలో యారియాకు 2.5 గ్రా. కార్బండాజిమ్+మ్యాంకోజెట్ చొప్పున మిశ్రమ మందును కలిపి నారుమడిలో వేసుకోవాలి. రాత్రిపూట నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి కొత్తనీరు పెట్టాలి. జింకులోప నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి. -
రేపు బాక్సింగ్ జట్ల ఎంపిక
కొత్తగూడెంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా బాక్సింగ్ జట్ల ఎంపిక పోటీలు కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో మంగళవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చీఫ్ ఫ్యాట్రన్ ఎర్రా కామేశ్ తెలిపారు. కొత్తగూడెంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యాన సీనియర్స్ విభాగంలో మహిళలు, పురుషుల జట్లను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఇక్కడ ఎంపిక చేసే జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు నిర్ధారణ పత్రంతో ఉదయం 9 గంటల వరకు ప్రగతి మైదానానికి రావాలని, వివరాల కోసం 98854 42131, 99490 83202 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. వెయిట్ లిఫ్టింగ్లో ప్రతిభమణుగూరు రూరల్ : రాష్ట్ర బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్లో మణుగూరు ప్రాంతానికి చెందిన కొమురెల్లి రవీందర్రెడ్డి ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఖమ్మంలో జరిగిన పోటీల్లో 93 కేటగిరీ రవీందర్రెడ్డి 115 కేజీల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. జనవరి 6న హరియాణాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఆత్మలింగేశ్వరాలయంలో పూజలుపాల్వంచ: పట్టణంలోని శ్రీ ఆత్మలింగేశ్వరాలయాన్ని ఉత్తరప్రదేశ్లోని మధురలో మలూక పీఠానికి చెందిన పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు ఆదివారం సందర్శించారు. పీఠం బాధ్యులైన జగత్ గురుస్వామి రాజేంద్ర దాస్ జీ మహారాజ్ శిష్య బృందంతో ఈ నెల 6 నుంచి ఆలయాలను సందర్శిస్తూ వస్తున్నారు. 8వ రోజు యాత్రలో ఆత్మలింగేశ్వరాలయాన్ని సందర్శించారు. పూజలు నిర్వహించి, భిక్ష స్వీకరించారు. సనాతన ధర్మ పరిరక్షణ, గో పరిరక్షణకు యాత్ర చేపట్టినట్లు స్వామీజీలు తెలిపారు. దర్మకర్త మచ్చా శ్రీనివాసరావు, అర్చకుడు జితేంద్ర కుమార స్వామి పాల్గొన్నారు. -
మలిదశ మెరుగే..
ఖమ్మం గంటకు గంటకు ఇలా...చుంచుపల్లి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లోని 138 గ్రామ పంచాయతీలు, 1,123 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ఓటింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల పాటు చలి ప్రభావంతో 21.93 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఓటర్లు తరలి రావడంతో పలు పోలింగ్ కేంద్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. 11 గంటల వరకు 57.57 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత రెండు గంటల పాటు ఓటర్లు భారీగా తరలివచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులను ఆటోలు, ద్విచక్ర వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు, వారి అనుచరులు కృషి చేశారు. ఎట్టకేలకు చివరకు 82.65 శాతం పోలింగ్ నమోదు కాగా, ఏడు మండలాల పరిధిలో 1,96,395 మంది ఓటర్లకు గాను 1,62,323 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో విడత ఎన్నికల్లో కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు రావడం విశేషం. కాగా, మొదటి విడత జరిగిన ఎన్నికల్లో జిల్లాలో 71.79 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. మొదటి విడత కంటే రెండో దశలో 11 శాతానికి పైగా ఓటింగ్ పెరిగింది. ఉన్నతాధికారుల పరిశీలన.. మలి విడత పోలింగ్ ప్రక్రియను పలువురు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. చుంచుపల్లి మండలంలో ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్రెడ్డి, చుంచుపల్లి తండా, బాబూక్యాంప్, రామాంజనేయకాలనీ కేంద్రాలను ఎస్పీ రోహిత్రాజు తనిఖీ చేశారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగిన 138 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 386 మంది, 1,123 వార్డులకు 2,820 మంది పోటీ పడగా, పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదట వార్డులకు, తరువాత సర్పంచ్ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు. ప్రతీ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆ తర్వాత 82.91 -
వాగ్వాదాలు.. స్వల్ప ఘర్షణలు
అశ్వారావుపేటరూరల్:గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం పలు చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణలు జరిగాయి. మండలంలోని నారాయణపురం, ఊట్లపల్లి, జమ్మిగూడెం గ్రామ పంచాయతీల్లో ఇరుపార్టీల వర్గీయు ల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. జమ్మిగూడెం పంచాయతీలో ఆదివారం తెల్లవారుజాము న కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఓటర్లకు నగదు, చీరలు పంపిణీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్వారిపై దాడులు చేసి సెల్ఫోన్లు ధ్వంసం చేసినట్లు బాధితులు తెలిపారు. ఊట్లపల్లి పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయు ల మధ్య అభ్యర్థుల ప్రచారంపై ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. నారాయణపురం కేంద్రంలో పోలింగ్ సమయం ముగిశాక గ్రామానికి చెందిన బండి అమూల్య ఓటు వేసేందుకు వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ వర్గీయులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో అమూల్య కిందపడిపోగా, కాలుకు స్వల్ప గాయం కావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో సీఐ నాగరాజు, ఎస్సై యయాతీ రాజు, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచ నం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామయ్యకు వెండి పల్లెం బహూకరణ శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం, దుప్పలపూడి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, రామలక్ష్మి రూ.1.50 లక్షల విలువైన వెండి పళ్లెం బహూకరించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకోగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. -
కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రటేకులపల్లి: ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఒంటెత్తు పోకడలతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పలు సామాజిక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే వారు పార్టీని వీడుతున్నారని, ఇదే కొనసాగితే ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే బాణోతు హరిప్రియ అన్నారు. ఆదివారం టేకులపల్లిలోని హరిప్రియ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ నాయకుడు భూక్య దళ్సింగ్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్రావుతో పాటు మాజీ దళకమాండర్ పూనెం సమ్మయ్య, పలువురు వార్డు సభ్యులు ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 17న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటి అధిక స్థానాలు గెలుచుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దిండిగల రాజేందర్, బొమ్మెర్ల వరప్రసాద్, ఆమెడ రేణుక, హరిసింగ్ నాయక్, రవి పాల్గొన్నారు. -
● పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్ సందర్శన
దమ్మపేట/అశ్వారావుపేటరూరల్ : దమ్మపేట మండలం జమేదార్బంజర, అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ పాత అల్లిగూడెం, నారంవారిగూడెం కాలనీ, నారంవారిగూడెం, జమ్మిగూడెం, ఊట్ల పల్లి, వినాయకపురం, అనంతారం, గాండ్లగూడెం తదితర కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ విద్యా చందన, తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, ఎంపీడీఓ అప్పారావు పాల్గొన్నారు. పాల్వంచ డీఎస్పీ సతీష్కుమార్ కూడా పలు కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతం సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆదివారం ఎన్నికలు జరిగిన ఏడు మండలాల్లో మొత్తం 1,96,395 మంది ఓటర్లు ఉండగా, 1,62,323 మంది ఓటు హక్కు వినియోగించుకున్నాని, మొత్తంగా 82.65 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో 85.13 శాతం, అశ్వారావుపేటలో 87.85, చంద్రుగొండలో 85.93, చుంచుపల్లిలో 66.19, దమ్మపేటలో 85.73, ములకలపల్లిలో 86.59, పాల్వంచ మండలంలో 86.58 శాతం పోలింగ్ నమోదైందని వివరించారు. -
ఒక ఓటుతో వరించిన విజయం
కూసుమంచి/తిరుమలాయపాలెం: కూసుమంచి మండలంలోని జుజుల్రావుపేట సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారుడు దాట్ల సలీమ్ ఒక్క ఓటుతో గెలుపొందాడు. కాంగ్రెస్ మద్దతుదారు దాట్ల అనూషపై తొలుత మూడు ఓట్లతో ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరం తెలపగా మూడు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. చివరకు సలీమ్ను ఒక ఓటుతో సర్పంచ్ పదవి వరించింది. ●తిరుమలాయపాలెం మండలం తాళ్లచెరువులోనూ ఒక్క ఓటుతో బీఆర్ఎస్ బలపరిచిన గడుపుడి వెంకటనారాయణ సర్పంచ్గా విజయం సాధించారు. వెంకటనారాయణకు 312 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడుపుడి వీరభద్రంకు 311 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వార్డుల వారీగా బీఆర్ఎస్కు 90 ఓట్ల మెజార్టీ రాగా, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినా ఒక్క ఓటుతో పరాజయం పాలయ్యాడు. ●కూసుమంచి మండలం నేలపట్ల గ్రామపంచాయతీలో కూడా రీకౌంటింగ్ నిర్వహించగా కాంగ్రెస్ మద్దతుదారుడు నూకల శోభన్బాబు నాలుగు ఓట్లతో విజయం సాధించాడు. ఇక కూసుమంచి సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు కొండా కృష్ణవేణి వేయి ఓట్ల మెజార్టీతో గెలవగా.. జీళ్లచెరువు కాంగ్రెస్ అభ్యర్థి ఐతగాని వెంకటరమణ 400పై చిలుకు ఓట్లతో విజయం సాధించింది. మునిగేపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గంగా స్రవంతి 250 ఓట్లతో విజయం సాధించడం విశేషం. -
అత్యధికం హస్తగతం
చుంచుపల్లి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం ఆదివారం ముగియగా.. ఈ దశలోనూ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సత్తా చాటారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ మద్దతుదారులు నిలవగా, సీపీఐ మూడో స్థానం దక్కించుకుంది. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చుండ్రుగొండ, చుంచుపల్లి, ములకలపల్లి, పాల్వంచ, దమ్మపేట మండలాల పరిధిలోని 156 స్థానాలకు గాను 16 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. ములకలపల్లి మండలం చాపరాలపల్లిలో కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు జరగకపోగా, పాల్వంచ పాండురంగాపురంలో ఎస్టీ రిజర్వ్డ్ అభ్యర్థి లేక ఎవరూ నామినేషన్ వేయలేదు. మిగిలిన 138 గ్రామపంచాయతీలు, 1,123 వార్డులకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు. ఇందుకోసం 386 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,820 వార్డు సభ్యులు బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధికంగా 80 సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకున్నారు. బీఆర్ఎస్ బలపర్చిన వారు 31, సీపీఐ మద్దతుదారులు 21, సీపీఎం మద్దతుదారులు ఐదుగురు, ఇతరులు 17 చోట్ల విజయం సాధించారు. మొదటి, రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన అధిక్యం కనబరిచారు. జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామపంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ స్థానాలు కై వసం చేసుకునేలా కృషి చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ సైతం పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలోని పలు పంచాయతీల్లో అధికార పార్టీ మద్దతుదారులకు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. ములకలపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పలు గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు పైచేయి సాధించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా -
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
● అమృత్ పథకం కింద రూ.249 కోట్లతో పనులు ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం అర్బన్: ఖమ్మంలో జరుగుతున్న అభి వృద్ధి పనుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ పది కాలాలు మన్నికగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలోని పలు డివిజన్లలో ఆదివారం పర్యటించిన ఆయన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు, కార్యాచరణపై ఆరా తీసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షపు నీరు, మురుగునీరు వేర్వేరుగా ప్రవహించేలా స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తద్వారా చెరువులు కలుషితం కాకుండా రక్షించుకోవచ్చని చెప్పారు. అమృత్ పథకం ద్వారా రూ.249 కోట్లతో చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు వచ్చే వర్షాకాలానికి ముందే పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. అలాగే, ఖానాపురం ఊరచెరువు నుంచి ధంసలాపురం చెరువు వరకు 8.5 కి.మీ. మేర ట్రంక్ పైప్లైన్, ధంసలాపురంలో 44 ఎంఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రం, పుట్టకోటలో 9.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీ పనులపై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డి, కేఎంసీ ఎస్ఈ వి.రంజిత్, కార్పొరేటర్లు ఆళ్ల నిరోష అంజిరెడ్డి, చామకూర వెంకటేశ్వర్లు, జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈ ఉదయ్ప్రతాప్, తహసీల్దార్ సైదులు, కాంగ్రెస్ ఖమ్మం అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి పాల్గొన్నారు. -
మంత్రి స్వగ్రామంలో కాంగ్రెస్దే గెలుపు
దమ్మపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ బలపర్చిన మెచ్చు ఈదప్ప విజయం సాధించాడు. ఇక్కడ పోటీలో ఉన్న బీఆర్ఎస్ మద్దతుదారుడు పండు సాంబశివరావుపై ఆయన 350 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అంతేకాక పది వార్డులకు ఏడింటిని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. రాజుపేట బీఆర్ఎస్ కై వసం కూసుమంచి: కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుదారుడు బానోత్ మహేష్ సర్పంచ్గా గెలుపొందాడు. పాలేరు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య స్వగ్రామం ఇదే కావడంతో నాయకులు ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. మరోపక్క కాంగ్రెస్ నాయకులు కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మహేష్ కాంగ్రెస్ బలపర్చిన కుర్రా రమేష్పై 23 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు. బీటెక్ సర్పంచ్ ! కామేపల్లి: కామేపల్లి మండలం పొన్నేకల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన గుగులోత్ భూమిక సర్పంచ్గా గెలిచింది. ఇక్కడ మొత్తం 842 ఓటర్లకు గాను 728 ఓట్లు పోలయ్యాయి. ఈమేరకు భూమిక 603 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందింది. బీటెక్(ఈఈఈ) పూర్తి చేసిన ఆమె 23 ఏళ్ల వయస్సులోనే గ్రామ ప్రథమ పౌరురాలిగా ఎన్నికవడం విశేషం. విద్యావంతురాలినైన తాను గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ప్రచారంలో వెల్లడించింది. ఎమ్మెల్సీ స్వగ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం విజయం తిరుమలాయపాలెం: ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ స్వగ్రామమైన పిండిప్రోలులో బీఆర్ఎస్ మద్దతుతో సీపీఎం సర్పంచ్ అభ్యర్థి కామళ్ల సువార్త 381ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఆమెకు 1,750 ఓట్లు రాగా మాస్లైన్ అభ్యర్థి ఆరెంపుల కేతమ్మకు 1,369 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 12 వార్డులకు గాను కాంగ్రెస్, మాస్లైన్ అభ్యర్థులు నాలుగు వార్డులు కై వసం చేసుకోగా, బీఆర్ఎస్, సీపీఎం కూటమికి ఎనిమిది వార్డులు దక్కాయి.పోరాడి .. విజయం సాధించిములకలపల్లి : తిమ్మంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై న తుర్రం శ్రీనివాసరావు అవిశ్రాంతంగా పోరాడుతూ, పరాజయాలను అధిగమిస్తూ విజయాన్ని చేజిక్కుంచుకున్నారు. శ్రీనివాస్ టీడీపీ నుంచి 2013లో పీఏసీఎస్ డైరెక్టర్గా పోటీ చేసి పరాయజం పాలయ్యారు. ఆ తర్వాత ఐక్యకూటమి అభ్యర్థిగా ఉమ్మడి తిమ్మంపేట జీపీ సర్పంచ్గా పోటీ చేసి మరోమారు ఓటమి చెందారు. 2019లో తిమ్మంపేట ఎంపీటీసీగా శ్రీనివాసరావు భార్య ఈశ్వరి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా విజయం దరిచేరలేదు. అయినా శ్రీనివాసరావు పట్టువదలని విక్కమార్కుడిలా ఈ దఫా తిమ్మంపేట సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచి, సమీప సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ అభ్యర్థి మడకం రాజులుపై 264 ఓట్ల ఆఽధిక్యంతో విజయం సాధించారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికకరకగూడెం: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపికల్లో మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు తోలెం బాలకృష్ణ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. పాల్వంచలోని కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన బాలకృష్ణ.. ఈ నెల 20 నుంచి 24 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఇంకా ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకూ ఎంపికై నట్లు స్పోర్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. -
మేమూ ఓటేశాం..
● ఆసక్తి, ఆనందంతో తొలిసారి ఓటు హక్కు వినియోగం ● ఎన్నికల ప్రక్రియలో భాగమైనందుకు యువతీయువకుల్లో హర్షంమొదటిసారి నా ఓటు హక్కు గ్రామపంచాయతీ ఎన్నికల్లో వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అందుకే బాధ్యతగా ఓటేశాను. – కొర్రా అంజలి, కామేపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయడం ఆనందంగా ఉంది. అభివృద్ధి చేస్తా రని భావించిన అభ్యర్థులను నేను ఓటు వేశారు. – లకావత్ అమృత, పునుకుల తొలిసారి ఓటు హక్కు లభించిన యువతీయువకులు ఉత్సాహంగా ఓటేశారు. రాజ్యాంగ హక్కును వినియోగించుకుని.. గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటేశామని.. మొదటిసారి ఓటేయడం బాధ్యతగా భావించడంతోపాటు మధురానుభూతిని కలిగించిందని.. గెలుపులో యువత ఓట్లే కీలకమని.. సమర్థులైన సర్పంచ్ల ఎన్నికల్లో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందని యువ ఓటర్లు పేర్కొన్నారు. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించగా, పలువురు యువతీ, యువకులు ఆసక్తి, ఆనందంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. – దమ్మపేట/అశ్వారావుపేట రూరల్/చుంచుపల్లి/పాల్వంచ రూరల్/కామేపల్లి -
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట భద్రత
ఇల్లెందు: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పట్టిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజ్ తెలిపారు. శనివారం ఆయన ఇల్లెందు పోలీస్ స్టేషన్లో సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. చర్ల, దుమ్ముగూడెంలోనూ ఇదే తరహాలో అధికారులను సన్నద్ధం చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఎన్డీ, ఇతర ఎంఎల్ గ్రూపులు పోటీ చేస్తున్నాయని, అందుకే ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అతి సమస్యాత్మక గ్రామాలైన దామరతోగు, మామకన్ను, దనియాలపాడు, సుభాష్నగర్లో ఏకగ్రీవం కావడం శుభపరిణామం అన్నారు. జిల్లాలో 1,400 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత రోడ్ సేఫ్టీ.. గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత రోడ్ సేఫ్టీ కార్యక్రమం ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. రోడ్డు భద్రత చర్యలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని అన్నారు. భద్రాచలం మీదుగా జిల్లాలోకి వచ్చే గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని తెలిపారు. నంబర్ లేని బైక్లు, వాహనాలు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాత్రికేయుల వాహనాలకు ప్రత్యేకంగా స్టిక్కర్లు సమకూర్చేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు వెంటనే పరిహారం అందజేశామని, ప్రస్తుతం జిల్లా నుంచి అజ్ఞాతంలో ఎవరూ లేరని చెప్పారు. సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ ఎన్.చంద్రభాను, సీఐలు టి.సురేష్, బత్తుల సత్యనారాయణ, ఎల్.రవీందర్, ఎస్ఐలు హసీనా, సమ్మిరెడ్డి, రాజేందర్, శ్రీనివాసరెడ్డి, నాగుల్ మీరా, సైదా రవూఫ్ పాల్గొన్నారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. కొత్తగూడెంటౌన్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎస్పీ రోహిత్రాజ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ సిబ్బంది, అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎవరైనా నగదు, మద్యం పంపిణీ చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఎస్పీ రోహిత్రాజ్ వెల్లడి -
● కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
టేకులపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శనివారం ఆయన మండలంలోని వివిధ గ్రామాల్లో అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని 36 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని కోరారు. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కోరం సురేందర్, భూక్యా దేవా నాయక్, ఈది గణేష్ , బాణోతు భద్రు, బండ్ల రజిని, బోడ మంగీలాల్ పాల్గొన్నారు.ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య -
‘వికాస తరంగణి’ ద్వారా విస్తృత సేవలు
● త్రిదండి చినజీయర్స్వామి సత్తుపల్లిటౌన్: సమాజ హితం కోసం వికాసతరంగణి విశేషమైన సేవలు అందిస్తోందని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్స్వామి తెలిపారు. సత్తుపల్లిలోని సమగ్ర కాంప్లెక్స్ వద్ద శనివారం ఆయన భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు వికాతరంగణి ద్వారా స్వర్ణామృత ప్రాశన పంపిణీ జరుగుతోందని తెలిపారు. సమాజానికి వెన్నుముక అయిన మహిళలు బ్రెస్ట్ కేన్సర్ బారిన పడకుండా లక్షలాది మందికి అవగాహన కల్పిస్తూనే అవసరమైన వారికి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. అలాగే, ప్రజ్ఞా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వీటన్నిటికి మూలాధారం శ్రీరామచంద్రుడేనని, శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని మానవసేవను మాధవ సేవగా చేపడుతున్నామని తెలిపారు. అనంతరం రేజర్లలోని నల్లాన్ చక్రవర్తుల రామకృష్ణమాచార్య నివాసంలో పాదపూజ నిర్వహించారు. మంత్రి తుమ్మల పూజలు సత్తుపల్లిలోని సమగ్ర కాంప్లెక్స్ వద్ద శ్రీదేవి, భూదేవి సమ్మేత శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యావావచనం, రక్షాబంధనం అనంతరం వేద మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ ఘట్టాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఓసీల్లో మహిళా ఆపరేటర్లు
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో తొలిసారిగా మహిళా ఆపరేటర్లు అడుగుపెట్టనున్నారు. ఆఫీస్ విధులకే పరిమితమైన మహిళలు ఇక నుంచి యంత్రాలతో బొగ్గు తవ్వకాలు చేపట్టడంతోపాటు రవాణా చేయనున్నారు. ఇందుకోసం సంస్థ సీఎండీ బలరాం చొరవ తీసుకున్నారు. జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న మహిళల నుంచి గత సెప్టెంబర్లో దరఖాస్తులు ఆహ్వానించగా, ఓసీల్లో పనిచేసేందుకు 43 మంది ముందుకువచ్చారు. ప్రస్తుతం వారికి సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు, ప్రధాన ఆస్పత్రిలో మెడికల్ టెస్టులు చేస్తున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థలో హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో 30 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఖాళీల లభ్యత ఆధారంగా ఈపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ–5 డిసిగ్నేషన్తో పోస్టింగ్ ఇవ్వనున్నారు. అనుకూలమైన యంత్రాలు.. ఓసీల్లో డోజర్లు మహిళా ఆపరేటర్లు పనిచేసేందుకు అనువుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. తక్కువ వైబ్రేషన్ ఉండటంతో సులభంగా ఆపరేట్ చేసేందుకు వీలుగా ఉంటాయి. రోడ్లను లెవలింగ్ చేసేందుకు ఓసీల్లో గ్రేడర్లను, దుమ్ము, ధూళి లేవకుండా వాటర్ ట్యాంకర్లను వినియోగిస్తారు. బరువులు ఎత్తడానికి హైడ్రాలిక్ క్రేన్లను ఉపయోగిస్తారు. 35 నుంచి 60 టన్నుల సామర్థ్యం కలిగిన చిన్న డంపర్లు కూడా ఉన్నాయి. ఆయా యంత్రాల్లో ఆటోమేటిక్ వ్యవస్థ, పవర్ స్టీరింగ్ వంటి సౌకర్యాలు ఉండటంతో మహిళలు సులభంగా పనిచేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మైనింగ్ జోన్లలో సేఫ్టీ రెస్పాన్స్ వాహనాలుగా ఉండే అంబులెన్స్లు కూడా మహిళా డ్రైవర్లు నడపవచ్చు. స్టాకర్ రిక్లైయిమర్, కన్వేయర్ సిస్టమ్, క్రషర్ ఆపరేటర్ వంటివి జాయ్స్టిక్, బటన్లతో నడిపే యంత్రాలపై మహిళలు తేలికగా పనిచేయవచ్చని సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఒత్తిడి, శక్తి వినియోగంలేని యంత్రాలతో పని -
ఓట్లు వేయలేదని దూషిస్తున్నారు..
అశ్వాపురం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో డబ్బు తీసుకుని ఓటు వేయలేదంటూ కొందరు దూషిస్తున్నారంటూ అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామస్తులు వాపోయారు. ఓట్లు వేయలేదని కొందరు తమ ఇళ్ల ముందుకు వచ్చి తిడుతున్నారని, మహిళలను దూషిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పెద్దసంఖ్యలో శనివారం స్థానిక పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టగా ఉద్రిక్తత నెలకొంది. సీఐ అశోక్రెడ్డి నచ్చజెప్పినా వినకపోవడంతో మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి తగాదాలు వీడి కలిసికట్టుగా ఉండాలని సూచించారు. అయినా గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని కోరగా ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీంతో బొల్లినేని గణేష్ ఫిర్యాదు మేరకు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీస్స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళన -
మలిపోరుకు రెఢీ
చుంచుపల్లి: జిల్లాలోని ఏడు మండలాల్లో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విడతలో 16 పంచాయతీలు, 248 వార్డులు ఏకగ్రీవం కాగా, 138 గ్రామ పంచాయతీలు, 1,123 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల సిబ్బంది శనివారం ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన స్థానాలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రానికి ఫలితాలు వెల్ల డిస్తారు. ముందుగా వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. గెలిచిన వార్డు సభ్యుల్లో సగం మంది అందుబాటులో ఉంటే వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. లేదంటే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. రెండో విడతలో అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, ములకలపల్లి, పాల్వంచ మండలాల పరిధిలోని జీపీలకు ఎన్నికలు జరుగనున్నాయి. సిబ్బంది, సామగ్రిని తరలించేందుకు 90 బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేశారు. 4,019 మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. వీరిలో ఆర్ఓలు 187 మంది, పీఓలు 1,671, ఓపీఓలు 2,031 మంది ఉన్నారు. వీరితో పాటు రూట్ ఆఫీసర్లు 61 మంది. జోనల్ ఆఫీసర్లను 27 మందితో పాటు ఎఫ్ఎస్టీ టీమ్ 23, ఎస్ఎస్టీ టీమ్కు 19 మందిని కేటాయించారు. ఇక రెండో విడత పోలింగ్ కోసం 4.50 లక్షల బ్యాలెట్ పత్రాలు, 1,420 బ్యాలెట్ బాక్సులు, 1,392 పోలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచారు. బరిలో 3, 206 మంది.. జిల్లాలో రెండో విడతలో 156 గ్రామ పంచాయతీలు, 1,392 వార్డులకు గాను 16 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. పాల్వంచ మండలం పాండురంగాపురంలో ఎస్టీ రిజర్వ్డ్ అభ్యర్థులు లేక నామినేషన్లు వేయకపోగా, ములకలపల్లి మండలం చాపరాలపల్లిలో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేపట్టలేదు. మిగిలిన 138 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక 1,384 వార్డులకు 13 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా 248 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,123 వార్డులకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే 138 పంచాయతీల్లో 386 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,123 వార్డులకు 2,820 మంది కాగా, మొత్తంగా 3,206 మంది బరిలో ఉన్నారు.నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు -
ఇసుక రవాణా నిలిపివేత
మణుగూరు రూరల్ : మండలంలోని ర్యాంపుల నుంచి ఇసుక రవాణా సాగించేందుకు రాజుపేట, గుట్టమల్లారం అటవీ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా తాత్కాలిక రహదారులను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రాజుపేట గ్రామస్తులు హైకోర్ట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఇసుక రవాణాను నిలిపివేయాలంటూ అధికారులను ఆదేశించింది. దీంతో శనివారం మణుగూరు అటవీశాఖ అధికారులు రహదారులను మూసివేసి ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేశారు. అయితే అన్నారం, చినరాయిగూడెం ఇసుక సొసైటీ సభ్యులు మణుగూరు ఎఫ్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇసుక లారీలను నిలిపివేస్తే తమకు జీవనాధారం పోతుందని ఎఫ్డీఓకు వినతిపత్రం ఇచ్చారు. కాగా అనుమతులు లేకుండా లారీలతో ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని ఎఫ్డీఓ మక్సూద్ మొహియుద్దీన్ హెచ్చరించారు. -
పెద్దమ్మతల్లి ఆలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం ఈ ఉత్సవాలు జరుపుతున్నామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆమె కోరారు. నేడు నెట్బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: సీనియర్స్ విభాగంలో ఉమ్మడి జిల్లాస్థాయి పురుషులు, మహిళల నెట్బాల్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయి. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఈ పోటీలు జరుగుతాయని నెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.ఫణికుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు వెంట తీసుకుని ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గం ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో మూడేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా ఆర్.సంపత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా పి.ఉపేందర్, కోశాధికారిగా ఏ.రాము, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకాష్ ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా సురేష్, భార్గవ్, సీహెచ్.ప్రభుకిషోర్, సంయుక్త కార్యదర్శులుగా ప్రభుదాస్, కె.కవిత, ప్రియ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.ఉమాశంకర్, లోకేష్, వసంత్, ప్రచార కార్యదర్శిగా ఎస్.డీ.గౌసియాబేగం, కార్యవర్గ సభ్యులుగా ఝాన్సీ, సంధ్య, కౌసల్య ను ఎన్నుకున్నారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్షకొత్తగూడెంఅర్బన్: ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశాలకు జిల్లాలో శనివారం పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,852 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,472 మంది మాత్రమే హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి తెలిపారు. కొత్తగూడెంలోని పలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా పరిశీలకులు ఆర్.సాంబశివరావు తెలిపారు. అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయండిభద్రాచలంఅర్బన్ : భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ను బార్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు సారపాక ఐటీసీ గెస్హౌస్లో వారు న్యాయమూర్తికి వినతిపత్రం అందజేశారు. భద్రాచలం, మణుగూరు ప్రాంతాల నుంచి 600 పైగా సెషన్స్ ట్రయల్ కేసులు కొత్తగూడెంలో పెండింగ్ ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంతంలో నివసించే నిరుపేదలు అంతదూరం వెళ్లాలంటే ఆర్థిక భారం అవుతోందని వివరించారు. గిరిజనులకు సత్వర న్యాయం అందించాలంటే భద్రాచలంలో అదనపు సెషన్స్ కోర్టు అవసరమని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. లేదంటే కొత్తగూడెం నుంచి ఒక అదనపు సెషన్స్ కోర్టును భద్రాచలానికి మార్చాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటా దేవదానం, ఉపాధ్యక్షుడు సున్నం రమేష్, జనరల్ సెక్రటరీ పుసాల శ్రీనివాస్, న్యాయవాదులు కొడాలి శ్రీనివాసన్, టి.చైతన్య, మోహన్కృష్ణ, బి.రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళంశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన శ్రీరామాంజనేయరెడ్డి – శారద దంపతులు రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. రామయ్యను దర్శించుకున్న ఆండవన్స్వామి.. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని శ్రీరంగంలోని శ్రీ పౌండరీపుర స్వామి ఆశ్రమానికి చెందిన ఆండవన్ స్వామి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ దామోదర్రావు దంపతులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
● ప్రశ్నించేవారినే ఎన్నుకోవాలి
గుండాల: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏజెన్సీలో అభివృద్ధి కావాలంటే ప్రశ్నించే, పోరాడేవారినే ఎన్నుకోవాలని, అందుకే మాస్లైన్(ప్రజాపంథా) అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అజ్ఞాతంలో బాటన్న, కోటన్న, లింగన్న బాటలో సమస్యలపై పోరాడిన వ్యక్తి ఈసం శంకరన్న సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాడని, ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపంచాలని కోరారు. అధికారులు అధికారపార్టీకే మద్దతుగా నిలిచినట్లుగా తెలుస్తోందని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చండ్ర అరుణ, అభ్యర్థి ఈసం శంకర్, మాచర్ల సత్యం, సుగుణారావు, క్రిష్ణ, శాంతయ్య, జగన్, సాంబయ్య, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు -
ఏర్పాట్లు పూర్తి చేశాం
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఆదివారం జరుగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని, సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ తదితర మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సమయానికి చేరుకుని విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారులకు ముందుగానే శిక్షణ ఇచ్చామని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసి సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అక్రమ నగదు, మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కీలక పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల పర్యవేక్షణకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఓటర్లు భయాందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పంపిణీ కేంద్రంలో పరిశీలన.. చుంచుపల్లి: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సిబ్బందికి సూచించారు. కొత్తగూడెం క్లబ్లోని సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. సిబ్బంది సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆర్ఓలను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా సాగేందుకు ప్రతీ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ బస్సులు
భద్రాచలంఅర్బన్: అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుంచి బస్సులను బుక్ చేసుకునే సదుపాయం ఉంది. 36 సీట్లు ఉండే సూపర్ లగ్జరీ బస్సులు, 40 సీట్లు ఉండే డీలక్స్ బస్సులు, 49 సీట్లు ఉండే ఎక్స్ప్రెస్ బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. కిలోమీటర్కు డీలక్స్ బస్సుకు రూ. 57, లగ్జరీ బస్సుకు రూ.59, ఎక్స్ప్రెస్ బస్సుకు రూ.68, ఏసీ రాజధాని బస్సుకు రూ.77 చొప్పున అద్దె చెల్లించాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. స్వాములు వంట సామగ్రిని తీసుకెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. ప్రయాణించే కిలోమీటర్ల ఆధారంగా అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అన్ని బస్సులకు వెయిటింగ్ చార్జి గంటకు రూ.300గా నిర్ణయించారు. ఒక బస్సు బుక్ చేస్తే గురుస్వామితోపాటు ఇద్దరు వంట మనుషులు, ఇద్దరు మణికంఠ స్వాములు, అటెండరుకు చార్జి మినహాయింపు ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్ చేస్తే గురుస్వామికి రోజుకు రూ.300 చొప్పున కమీషన్ చెల్లించనున్నారు. ఒక్కో బస్సుకు ఇద్దరు నిపుణులైన డ్రైవర్లను కేటాయించనున్నారు. బస్సుల కోసం డిపో మేనేజర్లను సంప్రదించాలని, ఇతర తీర్థయాత్రలకు కూడా బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అద్దెకు ఇస్తున్న యాజమాన్యం శబరిమల యాత్ర భక్తుల కోసం బస్సులను అద్దెకు ఇస్తున్నాం. కిలోమీటరు చొప్పున, వెయిటింగ్ సమయాన్ని లెక్కగట్టి తగిన ధర నిర్ణయిస్తాం. ఈ అవకాశాన్ని అయ్యప్ప స్వాములు సద్వినియోగం చేసుకోవాలి. –జంగయ్య, ఆర్టీసీ డిపో మేనేజర్, భద్రాచలం -
● న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలి
గుండాల: ఏజెన్సీ ప్రాంత సమస్యలే ఎజెండాగా పోరాడుతున్న న్యూడెమోక్రసీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు అన్నారు. శనివారం కాచనపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాయమాటలు చెప్పే పార్టీలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అధికార పార్టీ డబ్బు, మద్యం ఆశ చూపుతూ ఓటర్లను తమవైపు తిప్పుకుంటోందని ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతూ, అక్రమ కేసులు బనాయిస్తే భయపడే ప్రసక్తే లేదని అన్నారు. గుండాల మండలంలోని కాచనపల్లిలో జర్పుల కిష న్, గుండాలలో సీతారాములు, పడుగోనిగూడెంలో రవి, చెట్టుపల్లిలో ఇర్ప రాజేష్లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు అటి కం నాగేశ్వరరా వు, బొర్ర వెంకన్న, రమేష్, రంగన్న తదితరులు పాల్గొన్నారు. కిడ్నాప్లు, బెదిరింపులకు భయపడేది లేదు కాంగ్రెస్ సీనియర్ నాయకులు న్యూడెమోక్రసీకి మద్దతు ఇస్తుండగా ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థితోపాటు ఇతర నాయకులు కిడ్నాప్లకు, బెదిరింపులకు పాల్పడతున్నారని, అయినా తాము భయపడబోమని ఆ పార్టీ నాయకుడు ఆవునూరి మధు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం రాత్రి జగ్గాయిగూడెం గ్రామానికి చెందిన పొంబోయిన హరినాథ్ను బలవంతంగా కారులో ఎక్కించుకునిపోయి భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని అన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కోరం సీతారాములు, ఈసం పాపారావు, సుధాకర్, వీరన్న, తెల్లం భాస్కర్, యాసారపు వెంకన్న, అరెం నరేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు -
లక్ష్మీదేవిపల్లి విభిన్నం..
● ఓ వైపు పంచాయతీ, మరోవైపు మున్సిపాలిటీ పాల్వంచరూరల్: మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ (ఎస్) బీసీయం జాతీయ రహదారి వైపు ఉంటుంది. ఇందులో కొంత మున్సిపాలిటీ పరిధిలో విస్తరించి ఉంది. పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. గతంలో పంచాయతీ సర్పంచ్గా పనిచేసిన భూక్యా విజయ్కుమార్ భార్య మంజులను ఈసారి బరిలోకి దింపారు. కాంగ్రెస్ అభ్యర్థి కూడా పోటీలో ఉండటంతో ఇక్కడ ద్విముఖ పోటీ ఉంటుంది. మొత్తం 1,056 మంది ఓటర్లు ఉండగా 514 మంది పురుషులు, 542 మహిళా ఓటర్లు ఉన్నారు. 8 వార్డుల్లో ఒకటో వార్డు ఎస్టీ జనరల్, 2వ వార్డు ఎస్టీ మహిళ, 3, 4 వార్డులు జనరల్ మహిళ, 5వ వార్డు ఎస్టీ మహిళ, 6, 7, జనరల్, 8వ వార్డు ఎస్టీ జనరల్కు రిజర్వు అయ్యాయి. కాగా, లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలోకి విలీనం చేయాల ని స్థానికులు పలుసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. గెలిపిస్తే మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేస్తామని బరిలో ఉన్న ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు హామీలిస్తున్నారు. -
రెండు మేజర్ జీపీలు హస్తగతం..
బూర్గంపాడు: గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సారపాక, బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. సారపాక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం వరకు కొనసాగింది. సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన గుగులోత్ కిశోర్శివరామ్నాయక్ 2,998 ఓట్ల మెజారిటీతో, బూర్గంపాడు సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన మందా నాగరాజు 571 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో 5 ఏకగ్రీవం కాగా.. ఎన్నికలు జరిగిన 13 జీపీల్లో 8 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ దక్కించుకున్నాయి. -
‘చేతి’లో చర్ల సర్పంచ్ స్థానం..
చర్ల: చర్ల గ్రామ పంచాయతీలో హోరాహోరీగా సాగిన ఎన్నికలో సర్పంచ్ స్థానాన్ని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన పూజారి సామ్రాజ్యం సర్పంచ్గా ఎన్నికయ్యారు. సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీతో పాటు బీజేపీ నుంచి అభ్యర్థులు పోటీ పడ్డారు. గురువారం అర్ధరాత్రి వరకు లెక్కింపు కొనసాగింది. 16 వార్డుల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, సీపీఎం3, ఇతరులు 3 వార్డులను దక్కించుకున్నారు. కాగా, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ వార్డు సభ్యుడు కాపుల కృష్ణార్జున్రావును ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. సర్పంచ్గా పూజారి సామ్రాజ్యం, ఉప సర్పంచ్గా కాపుల కృష్ణార్జున్రావు -
భద్రగిరి పీఠం కాంగ్రెస్దే..
● 20 వార్డులకు గాను 15 వారివే ● సర్పంచ్గా పూనెం కృష్ణ, ఉపసర్పంచ్గా రత్నం కవితభద్రాచలం: జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి.. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో ప్రచారం సాగిన భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని కాంగ్రెస్ వశం చేసుకుంది. సర్పంచ్ స్థానంతో పాటుగా 20 వార్డులకు గాను 15 వార్డులలో వారి మద్దతుదారులు జయకేతనం ఎగురవేశారు. దీంతో సుదీర్ఘ కాలం అనంతరం, తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థి పూనెం కృష్ణ విజేతగా నిలిచాడు. సర్పంచ్ స్థానానికి మొత్తం 19,838 ఓట్లు పోలవ్వగా పూనెం కృష్ణ 8,416 ఓట్లు సాధించి, తొలి స్థానంలో, బీఆర్ఎస్ మద్దతుదారుడు మానె రామకృష్ణ 6,732 ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. బీజేపీ కూటమి అభ్యర్థి హరిశ్చంద్రనాయక్ 2,756 ఓట్లు సాధించారు. ఇక ఓటుకు నోటొద్దంటూ వినూత్నంగా ప్రచారం చేసిన పూనెం ప్రదీప్కుమార్ 298 ఓట్లను సాధించారు. ఉపసర్పంచ్ కాంగ్రెస్దే.. భద్రాచలంలో హోరాహోరీగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డుల్లో సైతం కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. 20 వార్డులకు గాను 15 వార్డుల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడంతో ఉపసర్పంచ్ పదవి సైతం కాంగ్రెస్కే దక్కింది. 16వ వార్డులో గెలిచిన రత్నం కవితను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. సీపీఎంకు రెండు, బీఆర్ఎస్కు ఒకటి, టీడీపీకి ఒకటి, ఇండిపెండెంట్కు ఒకటి దక్కాయి. 20 వార్డుల్లో విజేతలు వీరే.. 1వ వార్డులో చెంచు సుబ్బారావు(కాంగ్రెస్), 2వ వార్డు బొంబోతుల రాజీవ్(కాంగ్రెస్), 3వ వార్డు బొంత రమణ(కాంగ్రెస్), 4వ వార్డు బండారు శరత్(సీపీఎం), 5వ వార్డు నర్రా వాణి(కాంగ్రెస్), 6వ వార్డు అబ్బినేని వినీలా రాణి (టీడీపీ), 7వ వార్డు కావూరి గోపి (బీఆర్ఎస్), 8వ వార్డు పెద్దినేని లక్ష్మి (కాంగ్రెస్), 9వ వార్డు కారం సుజాత (కాంగ్రెస్), 10వ వార్డు నిట్టా రాజు(కాంగ్రెస్), 11వ వార్డు భూక్యా సుశీల(కాంగ్రెస్), 12వ వార్డు కారం దుర్గారావు (కాంగ్రెస్), 13వ వార్డు తాటి ఉదయ్ (కాంగ్రెస్), 14వ వార్డు ఇలమల అశోక్కుమార్ (ఇండిపెండెంట్), 15వ వార్డు (కాంగ్రెస్), 16వ వార్డు రత్నం కవిత (కాంగ్రెస్), 17వ వార్డు సున్నం భూలక్ష్మి (కాంగ్రెస్), 18వ వార్డు జగ్గా కుమారి(కాంగ్రెస్), 19వ వార్డు మహేశ్(సీపీఐ), 20వ వార్డు ఇర్పా అనుసూయ(సీపీఎం) గెలుపొందారు. -
‘వేట’ ముగిసిందా ?!
సత్తుపల్లి: సత్తుపల్లి అర్బన్పార్కులో చుక్కల దుప్పులను తుపాకీతో వేటాడిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు ఆ తర్వాత విచారణలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇందులో ఇతర వేటగాళ్ల పాత్ర ఉందా.. వారికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో విచారణ ముందుకు సాగడం లేదు. అసలు విచారిస్తున్నారా, లేదా అన్న అంశంపై కూడా స్పష్టత లేకపోగా, అధికారులు ఏ అంశాన్ని బయటకు వెల్లడించకపోవడం చర్చకు దారి తీస్తోంది. వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’ సత్తుపల్లి పార్క్లో దుప్పుల వేట సాగుతోందని, ఓ వ్యక్తి వివాహ విందులో దుప్పి మాంసం వడ్డించారనే సమాచారంతో ‘సాక్షి’లో గతనెల 29న ‘తూటా దూసుకెళ్తోంది..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో విషయం వెలుగులోకి రాగా వరుస కథనాలు వస్తుండడంతో అటవీ శాఖ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తొలుత ఇద్దరిని అరెస్ట్ చేయగా, వారం తర్వాత మరో ఇద్దరు తమ ఎదుట లొంగిపోయారని సత్తుపల్లి ఎఫ్డీఓ మంజుల ప్రకటించారు. ఆపై సైలెన్సర్ బిగించిన తుపాకీతో దుప్పులను వేటాడినట్లు గుర్తించామని, తదుపరి చర్యల కోసం రెండు జిల్లాల పోలీసు అధికారులు, భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి నట్లు డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్ తెలిపారు. జవాబు లేని ప్రశ్నలెన్నో.. దుప్పులను వేటాడినట్లు నలుగురిని అరెస్ట్ చేయగా, అందులో ఎవరి పాత్ర లేదా అన్న ప్రశ్నకు అటవీశాఖ అధికారులు సమాధానం చెప్పడం లేదు. సత్తుపల్లి, దమ్మపేట మండలాల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా కొందరు వేటగాళ్లు వచ్చారనే ప్రచారం జరుగుతున్నా స్పష్టత ఇవ్వడంలేదు. ఐదు దుప్పులనే వేటాడారా.. ఇంకా ఎన్నింటిని హతమార్చారు, ఆ మాంసంను ఎక్కడ విక్రయించారనే వివరాలను.. రిమాండ్కు తరలించే ముందు వేటగాళ్లను విచారించి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేశారా, లేదా అన్నది తెలియరావడం లేదు. ఇక దుప్పి మాంసాన్ని ఓ వివాహ విందులో వడ్డించినట్లు తెలిసినా, ఎవరెవరు హాజరయ్యారు, ఆ ఫంక్షన్ హాల్ పరిసరాల్లో ఆధారాలు సేకరించారా, హతమార్చిన వన్యప్రాణుల చర్మాలను స్వాధీనం చేసుకున్నారా అన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. కాగా, వేటలో పాల్గొన్న దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంనకు చెందిన మెచ్చా రఘు నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకోగా, ఆయన లైసెన్స్ను దుర్వినియోగం చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. సత్తుపల్లి అటవీశాఖ డివిజన్ పరిధిలో ఎఫ్డీఓ, రేంజర్, ఎఫ్ఎస్ఓ, బీట్ ఆఫీసర్లతో పాటు సుమారు 100 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అర్బన్పార్కులో వరుస ఘటనలు జరుగుతున్నా.. ఏ ఒక్కరికీ కనీస సందేహం రాకపోవడం గమనార్హం. ఔట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న వారిపై నిఘా పెట్టడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. ఎవరిపైన చర్యలు తీసుకున్నారో వెల్లడించలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బాధ్యులుగా చేసి విధుల నుంచి తొలగించిన అధికారులు.. రెగ్యులర్ ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదు. ఈ అంశంపై సత్తుపల్లి ఎఫ్డీఓ వాడపల్లి మంజులను వివరణ కోరగా.. అంతర్గతంగా అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, అది పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పట్టించుకోకపోవడంపై విమర్శలు -
‘అమృత్’ పనులు పరిశీలన
కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అమృత్ పథకం పనులను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవా త్సవ పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు వినతిపత్రాలను అందజేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్యూసీసీ మెంబర్ శ్రీనివాస్రెడ్డి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని, తిరుపతి, షిరిడీలకు రైలు సౌకర్యం ఏర్పాటు చేయాలని, బెల్గావి, డోర్నకల్–కాజీపేట ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. న్యూ గొల్లగూడెం వరకు రోడ్డు విస్తరణ పనులకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. అధికారులు గోపాలకృష్ణయ్య, మల్లాది శ్రీనివాస్, సిఫాలి, రాజేంద్రప్రసాద్, పాషా, విశ్వనాథ్, దిశా కమిటీ సభ్యుడు ఆనందరావు, శ్రీకాంత్, ఎం.రామకృష్ణ, కొదుమూరి శ్రీనివాసరావు, కంభంపాటి రవి పాల్గొన్నారు. రామయ్య సేవలో.. భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారిని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాత్సవ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ దామోదర్రావు స్వాగతం పలుకగా ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు పూజలు చేశారు. ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపిక అందచేశారు. రైల్వే అఽధికారులు, ఏఈఓ శ్రవణ్కుమార్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాల సందర్శన
చండ్రుగొండ: మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను ట్రైబల్ వెల్ఫేర్ అడిషినల్ డైరెక్టర్ (పంచాయతీ ఎన్నికల రాష్ట్ర పరిశీలిలకులు) సర్వేశ్వరరెడ్డి శుక్రవారం సందర్శించారు. పాఠ శాలలో మెనూ, విద్యాభ్యాసం జరుగుతున్న తీరు తెన్నులపై విద్యార్థినులతో మాట్లాడి తెలుసుకున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్ పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రిలో డీఎంహెచ్ఓ తనిఖీ సుజాతనగర్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ శుక్రవారం తనిఖీ చేశారు. గర్భిణులకు అందుతున్న సేవలు, 30 ఏళ్లు పైబడినవారికి బీపీ, షుగర్ పరీక్షలు, చికిత్స, కీటక జనిత వ్యాధుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. చిన్నపిల్లల టీకాలు, 14 ఏళ్ల బాలికలకు నూతనంగా అందించబోతున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ గురించి వివరించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యుడు రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బాలరాజు రుద్రంపూర్: సింగరేణి కార్పొరేట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా రిటైర్డ్ డీఎస్పీ పి.బాలరాజును నియమిస్తూ యాజమా న్యం ఇటీవల ఉత్తర్వు లు జారీ చేసింది. ఆయ న ఈ పదవిలో ఏడాదిపాటు కాంట్రాక్ట్ పాత్రిపదికన ఉంటారు. దాడులపై కేసు నమోదు చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం, బస్వాపురంల్లో ఎన్నికల సందర్భంగా ఇళ్లపై దాడి చేసిన వారిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. రామకృష్ణాపురంలో కన్నెబోయిన కుటుంబరావు ఇంటిపై ఉసికల లక్ష్మీనారాయణతో పాటు మరో 14 మంది కర్రలు, రాళ్లతో దాడి చేశారు. రెండు బైక్లు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. కుటుంబరావు ఫిర్యాదుతో 15మందిపై కేసునమోదు చేశారు. బస్వాపురంలో సుంకసాని విజయలక్ష్మి ఇంటిపై కుక్కల నాగరాజుతో పాటు మరో 12 మంది దాడి చేయగా ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొదుమూరు, నర్సింహాపురం, అనంతసాగర్లలో జరిగిన ఘర్షణలపై మరో 37 మందిపై కేసులు నమోదు చేశామని వివరించారు. -
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
టేకులపల్లి: నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉంటే తీవ్రంగా అవమానిస్తున్నారని, దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మండలానికి చెందిన భూక్య దళ్సింగ్నాయక్, ఆయన భార్య, మాజీ సర్పంచ్ భూక్య గంగా తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. 1987లో పార్టీలో చేరానని, వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉంటూ పార్టీలోనే కొనసాగానన్నారు. అనేక పార్టీలు మారి వచ్చినవారే తనను దూరం పెడుతున్నారని తెలిపారు. 2019లో అధిక స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తే చుక్కాలబోడులో కాంగ్రెస్ తరఫున తన భార్య గంగాబాయిని ఏకగ్రీవం చేసిన ఘనత తనదేనని, ఇప్పుడు కూడా ఏకగ్రీవం చేద్దామని గ్రామస్తులు కోరితే తనను సంప్రదించకుండానే ఎమ్మెల్యే తరఫున వేరే అభ్యర్థితో నామినేషన్ వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలతోనే రాజీనామా చేస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. కార్యక్రమంలో భూక్య రంజిత్, భూక్య రమేశ్, నాగేశ్వరరావు, బిచ్చా, బీక్య, జగపతి, బాలాజీ, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక రవాణాకు హైకోర్టు బ్రేక్
మణుగూరురూరల్: మున్సిపాలిటీ పరిధిలో కొన్ని నెలలుగా ప్రజలకు ప్రమాదకరంగా పరిణమించిన ఇసుక, బొగ్గు రవాణాకు శుక్రవారం హైకోర్టు బ్రేక్ వేసింది. అనుమతులు లేకున్నా రాజుపేట గ్రామం మీదుగా దుమ్ము, ధూళి ఎగిసిపడేలా దూసుకెళ్తున్న లారీలు గ్రామాన్ని నిత్యం కప్పేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ విషయంపై గ్రామస్తులు పలుమార్లు సింగరేణి, మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. లారీల మితిమీరిన వేగం, ఎగిసిడే దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పలువురు పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. అయినా ఇసుక, బొగ్గు రవాణా ఆగలేదు. చివరికి గ్రామస్తుల ఆవేదన విన్న హైకోర్టు న్యాయవాది చప్పిడి రామకృష్ణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజుపేట పరిస్థితులపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యానికి, జిల్లా కలెక్టర్కు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో అధికార యంత్రాంగం కదిలి కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ గ్రామం మీదుగా జరుగుతున్న ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేసింది. రాజుపేట సమీపంలోని అటవీ భూభాగంలో అనుమతులు లేకుండా ఏళ్ల నాటి చెట్లను భారీ యంత్రాలతో నరికివేయించి రాత్రింబవళ్లు ఇసుక రవాణాను సాగిస్తున్నట్లు న్యాయవాది రామకృష్ణ మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అటవీ నాశనంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అటవీశాఖ అధికారులను ఆదేశించింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లారీలు ఆపి.. తర్వాత మళ్లీ ఇసుక రవాణా యథావిధిగా సాగుతుండటంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవిలో చెట్ల నరికివేతపై ఆగ్రహం -
సత్వర సేవలు..
ఖమ్మంవైద్యవిభాగం: అత్యవసర వైద్యసేవలు అందించటంలో 108, 102 వాహనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఈ వాహనాల ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు చేరవేయటంలో 108 వాహనాలు కీలక ప్రాత పోషిస్తుండగా, గర్భిణులు, బాలింతలను క్రమం తప్పకుండా పెద్దాస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించి తిరిగి గమ్యస్థానాలకు చేర్చడంలో 102 వాహనాలదే ప్రముఖ పాత్ర. ఈ వాహనాలు గర్భిణులు, బాలింతలు, అత్యవసర చికిత్స పొందే వారికి సంజీవనిలా ఉపయోగపడుతున్నాయి. అమ్మ ఒడి సేవలతో.. గతంలో గర్భిణులు ప్రతీనెలా వైద్య పరీక్షలతో పాటు ప్రసవ సమయాన ఆస్పత్రులకు వెళ్లటానికి ఇబ్బంది పడేవారు. సరైన రవాణా సౌకర్యాలు లేక ఇతర వాహనాలు సమకూర్చుకొని అవస్థలు పడుతూనే వెళ్లే వారు. కానీ, 102 అమ్మ ఒడి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి ఇబ్బందులు తప్పాయి. వాహనాల్లో ఆశ కార్యకర్తలు వెంట ఉండి అవసరమైన పరీక్షలు చేయిస్తున్నారు. ఈ వాహనంలో అత్యవసర చికిత్సకు వైద్య కిట్లు, ప్రసవానికి అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉన్నందున ఇబ్బందులు ఎదురుకావడం లేదు. ప్రసవానంతరం కొన్ని నెలల వరకు తల్లీబిడ్డలకు అవసరమయ్యే టీకాలు వేయించేందుకు, ఇతర చికిత్స కోసం పెద్దాస్పత్రికి తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్దకు చేర్చుతున్నారు. ఈ వాహనాల ద్వారా పీహెచ్సీలు, ఆరోగ్య ఉపకేంద్రాల వారీగా గర్భిణులు, బాలింతలకు సేవలందుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 వాహనాలు ఉండగా, గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో 1,89,088 మంది గర్భిణులు, బాలింతలు వీటి ద్వారా వైద్యసేవలు పొందారు. 50,862 మందికి అత్యవసర సేవలు ఉమ్మడి జిల్లాలో అత్యవసర వాహన సేవలు కీలకంగా మారాయి. ప్రమాద బాధితులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రులకు చేర్చటంలో 108 వాహనాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అంతే కాకుండా ప్రసవ వేదనతో బాధపడుతున్న వారిని ఆస్పత్రులకు తరలించటంలోనూ ముఖ్య భూమిక ఈ వాహనాలదే. ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర, జాతీయ రహదారులు ఉండటంతో తరచూ వాహన ప్రామాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయాన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తూ వందలాది మంది ప్రాణాలు నిలుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 108 వాహనాలు 49 ఉండగా, భద్రాద్రి జిల్లాలో 28 వాహనాలు, ఖమ్మం జిల్లాలో 21 వాహనాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతాలకు వెళ్లి అత్యవసర చికిత్స అవసరమైన రోగులను 108 వాహనం ద్వారా తరలిస్తూ ప్రాణాలు నిలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 50,862 మందికి అత్యవసర చికిత్స అందించి వారి ప్రాణాలు నిలపడంలో 108 వాహనాలు, సిబ్బంది కీలక పాత్ర పోషించారు. బాలింతలు, గర్భిణులకు అండగా ‘102’ 108 వాహనం 102 వాహనం ఏడాది సేవలు ట్రిప్పులు సేవలు 2024 21,829 12,564 38,903 2025 23,509 11,765 37,650 108 వాహనం 102 వాహనం ఏడాది సేవలు ట్రిప్పులు సేవలు 2024 25,642 22,407 57,101 2025 27,353 21,765 55,434ఉమ్మడి జిల్లావాసులు 102, 108 వాహన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలకు సైతం వాహనాలు వెళ్తున్నాయి. 102 వాహనం ద్వారా ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేర్చడం, బాలింతలకు అవసరమైన పరీక్షలు, చికిత్స అందిస్తున్నాం. ఫోన్ చేసిన పావు గంట లోపే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర సమయంలో వాహనంలోనే ప్రసవం చేసేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. –శివకుమార్, 108, 102 వాహనాల ప్రోగ్రామ్ మేనేజర్ -
ఫిర్యాదు చేయండి
వాతావరణ ం జిల్లాలో శనివారం మధ్యాహ్నం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాయంత్రం నుంచే చలి తీవ్రత ఉంటుంది. అవినీతి పరులపైపాల్వంచరూరల్: చట్టప్రకారం ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఏర్పాటు చేసింది. ఏసీబీ జిల్లాలో ఇటీవల దాడులు చేస్తూ అవినీతి అధికారులను అరెస్ట్ చేసి, జైలుకు పంపుతోంది. ఈ క్రమంలోనే సులువుగా ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో క్యూర్ కోడ్ స్కానర్లకు సంబంధించిన స్టిక్కర్లు ఏర్పాటు చేసింది. స్మార్ట్ఫోన్ ద్వారా క్యూర్ కోడ్ను స్కాన్చేసి సులభంగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. 2025లో 20 కేసులు నమోదు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్య, వైద్య, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఫారెస్టు, రిజిస్ట్రేషన్ శాఖల్లో అవినీతి అధికంగా జరుగుతున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈఏడాది జనవరి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు వరకు 20 కేసులు నమోదు చేశారు. అవినీతికి పాల్పడిన ప్రభుత్వశాఖల అధికారులను కటకటాలపాలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. రెవెన్యూశాఖలో 6, పోలీసుశాఖలో 3, రిజిస్ట్రేషన్, వ్యవసాయశాఖ రెండు చొప్పున, మైనార్టీ సంక్షేమం, ఇరిగేషన్, ఫారెస్ట్, మున్సిపల్, కార్మిక, ఎకై ్సజ్, విద్యాశాఖల్లో ఒకటి చొప్పున కేసులు చొప్పున నమోదయ్యాయి. ఇలా ఫిర్యాదు చేయొచ్చు ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు లంచం అడిగితే అదే ఆఫీసులో ఏసీబీ అధికారులు అంటించిన స్టికర్(క్యూర్ కోడ్) స్కాన్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలను నమోదు చేసి సెండ్ చేసిన వెంటనే మీ మొబైల్ ఫోన్కు ఓటీపీ నంబర్ వస్తుంది. టోల్ఫ్రీ నంబర్ 1064, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై.రమేష్ 91543 88981కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వ్యక్తితో ఏసీబీ అధికారులు సంప్రదించి వివరాలు సేకరించుకుని ఫిర్యాదుదారుని పేర్లను రహస్యంగా ఉంచుతారు. కాగా ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఏసీబీ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పనుల కోసం అధికారులకు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం నేరం. అధికారులు ఇబ్బందులు పెట్టినా, డబ్బులు డిమాండ్ చేసినా మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడితే ఎవరైనా వదిలిపెట్టం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా ఫిర్యాదులు చేయవచ్చు. – వై.రమేష్, ఏసీబీ డీఎస్పీ -
పొదెంXతెల్లం!
భద్రాచలం: భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్యల మధ్య వర్గపోరు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరోసారి బహిర్గతమైంది. ఉపసర్పంచ్ ఎంపికపై రగడ నెలకొంది. ఉపసర్పంచ్ పదవికి ఎమ్మెల్యే వర్గం నుంచి రత్నం కవిత, మాజీ ఎమ్మెల్యే పొదెం వర్గం నుంచి చెంచు సుబ్బారావు పోటీపడ్డారు. దీంతో పొదెం అనుచరుడికి తొలుత మూడేళ్లు, ఆ తర్వాత రెండేళ్లు ఎమ్మెల్యే అనుచరుడికి పదవి ఇచ్చేలా కౌంటింగ్ కేంద్రం బయట ఇద్దరు నేతలు చర్చించుకుని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లాక ఎమ్మెల్యే వర్గం సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. అత్యధిక సభ్యులు రత్నం కవితకు మద్దతు తెలపటంతో ఆమెనే ఉప సర్పంచ్గా ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా ఎమ్మెల్యే వర్గం ఒప్పందాన్ని పాటించకపోవడంతో పొదెం వీరయ్య తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాట తప్పారని, చివరి రెండేళ్లు తమవారికి ఉప సర్పంచ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే నుంచి మాత్రం ఎటువంటి స్పష్టత రాలేదు. పదవులు ఉన్నా, లేకున్నా.. భద్రాచలంటౌన్: పదవులు ఉన్నా, లేకున్నా కార్యకర్తగా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై శుక్రవారం పార్టీ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పార్టీపై అసంతృప్తి పెరిగిపోయిందని, దీనికి ఎమ్మెల్యే వెంకట్రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధిష్టానానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా స్పష్టమైన వివరణ రాలేదన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులమని చెప్పుకుంటూ కొందరు పరోక్షంగా బీఆర్ఎస్ మద్దతుదారుల కోసం పనిచేశారని ఆరోపించారు. పరిమి శ్రీనివాసరావు, తమ్మల్లా వెంకటేశ్వరరావు, అడబాల వెంకటేశ్వరరావు, కోలపుడి వరుణ్, వాసిరెడ్డి సాంబశివరావు, కాపుల శ్రీను, బసవరాజు, సరిత, రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఉప సర్పంచ్ ఎంపికపై ఇరువర్గాల రగడ -
స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామిదేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.శ్రీకనకదుర్గమ్మకు పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మకు శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. నేడు నవోదయ పరీక్ష కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో శనివారం నిర్వహించనున్న నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనుందని, 8 కేంద్రాల్లో 1,852 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. విద్యార్థులు అడ్మిట్ కార్డు, హాల్ టికెట్, పరీక్ష సామగ్రి తెచ్చుకోవాలని తెలిపారు. అదనపు సమాచారం కోసం ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ను 99890 27943 నంబరులో సంప్రదించాలని సూచించారు. నేడు సింగరేణి ప్రణాళికలపై సమీక్షరుద్రంపూర్: హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఈ నెల 13న బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదక, భవిష్యత్ ప్రణాళికలపై సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కోల్ సెక్రటరీ విక్రమ్ దేవ్ దత్తాతోపాటు కేంద్ర ఇంధన శాఖ అధికారులు, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇతర డైరెక్టర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 2030 నాటికి చేపట్టే మధ్యకాలిక ప్రణాళిక, 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 5,850 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ దీర్ఘకాలిక ప్రణాళికలు, 15 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్, కీలక ఖనిజ రంగంలో ప్రవేశం, అంతర్జాతీయస్థాయిలో గ్లోబల్ సింగరేణి లిమిటెడ్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించినున్నట్లు సమాచారం. సభ్యత్వ నమోదులో పాలుపంచుకోవాలి ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదులో అందరూ చురుగ్గా పాల్గొనాలని ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాస్ సూచించారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. సభ్యత్వ నమోదును విజయవంతం చేయడంతో పాటు 2026 డైరీ రూపకల్పనలో పాలుపంచుకోవాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, బకాయిలు విడుదల చేయడంతో పాటు ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. జెడ్.ఎస్.జైపాల్, విజయ్ కుమార్, జి.బాలకృష్ణ, వల్లపు వెంకన్న పాల్గొన్నారు. -
ఫలితాలు మెరుగుపడేనా?
కొత్తగూడెంఅర్బన్: ఇన్చార్జ్ అధికారుల పాలన, అంతకుమించి పనిఒత్తిడి, హెచ్ఎం, ఉపాధ్యాయులకు సర్వేలు తదితర బోధనేతర పనులు అప్పగించడంతో ఈసారి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారు కావడంతో విద్యార్థులతోపాటు ఉసాధ్యాయులకు కూడా పరీక్షగా మారింది. ఎంఈఓలు, డీఈఓ ఇన్చార్జులే.. జిల్లా విద్యాశాఖలో ఎంఈఓల నుంచి డీఈఓల వరకు ఇన్చార్జ్ల పాలన సాగుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు పాఠశాలల్లో బోధన పనుల కంటే ప్రభుత్వ కార్యక్రమాలు, సర్వేలు, ఎన్నికల విధులు వంటివి ఎక్కువగా నిర్వహిస్తున్నారు. అసలే ఇన్చార్జ్ల పాలన ఆపై వివిధ రకాల విధులతో బోధన, విద్యార్థులపై పర్యవేక్షణ లేకుండాపోయినట్లు కనిపిస్తోంది. గతేడాది పదో తరగతి, ఇంటర్మీడియట్లలో చెప్పుకోదగిన ఫలితాలు రాలేదు. ఈ ఏడాది సబ్జెక్ట్ టీచర్లు ఉన్నా ఇతర పనులు ఎక్కువ కావడంతో పర్యవేక్షణ కొరవడింది. వెరసి విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మెరుగైన ఫలితాల కోసం పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్ర వేళల్లో పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సాయంత్ర వేళ ఒక గంట ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 302 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 12,828 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. వీరితోపాటు మరో 394 మంది సప్లిమెంటరీ విద్యార్థులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో 27వ స్థానంలో నిలువగా 91.49శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 62.56శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 9వ స్థానం లభించింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్లో 10,111 మంది విద్యార్థులు, సెకండియర్లో 10,085 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. స్లిప్ టెస్టులను నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. గతేడాదికంటే ఈ ఏడాది ఉత్తీర్ణత పెరుగుతుంది. –నాగలక్ష్మి, డీఈఓపదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జనవరిలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తామని, అనంతరం వారిపై మరింత శ్రద్ధ పెడతామని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు మొదలు కానున్నాయి. కాగా అపరాధరుసుంతో ఈ నెల 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. -
ఎందుకిలా..?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటరు పోలింగ్ బూత్కు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఓటర్ను బ్యాలెట్ పేపర్ దిశగా నడిపించడంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు వెనుకబడ్డారు. ఫలితంగా 71.79 శాతం పోలింగ్తో జిల్లా రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అభ్యర్థులకు సమయం సరిపోలేదా..? గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. వార్డుస్థాయిలో ఒకటి రెండు ఓట్ల తేడా వల్ల కూడా ఫలితాలు తారుమారు అవుతాయి. ఈ క్రమంలో ప్రతీ ఓటరును బూత్ వరకు తీసుకొచ్చేందుకు అభ్యర్థులు శ్రద్ధ వహిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత తొలి విడతలో ఉన్న పంచాయతీల నుంచి వార్డు మెంబర్గా, సర్పంచ్గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నవారు అప్పటికప్పుడు అప్రమత్తం కావాల్సి వచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మద్దతుదారులను కూడగట్టుకోవడం, ప్రత్యర్థులను బుజ్జగించడం వంటి పనులకే చాలా సమయం పోయింది. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ నుంచి గుర్తులు కేటాయించే వరకు అభ్యర్థులకు తీరికలేదు. ప్రచారం మొదలైన తర్వాత తమకు కేటాయించిన గుర్తును ఓటర్లలోకి తీసుకెళ్లడానికే సమయం సరిపోయింది. దీంతో పోలింగ్ రోజున దగ్గరుండి ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురావడంలో ఓటర్లు, పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య సమన్వయం లోపం ఎదురైంది. అందువల్లే ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను గ్రామాలకు రప్పించడం, గ్రామాల్లో ఉంటూనే పొలం పనులకు, ఉద్యోగాలకు వెళ్లే వారిని ఓటు వేసేలా ప్రేరేపించడంలో తగినంత కసరత్తు జరగలేదు. ఫలితంగా ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అతి పెద్ద పంచాయతీగా ఉన్న భద్రాచలంలో 40 వేల మందికి పైగా ఓట్లు ఉంటే అక్కడ పోలింగ్ 48.87 శాతం దగ్గరే ఆగిపోయింది. అతి పెద్ద పంచాయతీలోనే సగం మంది ఓటర్లు తమ సర్పంచ్ ఎంపికకు దూరంగా ఉన్నట్లయింది. మలి, తుది విడత ఎన్నికల సమయానికై నా జిల్లాలో ఓటింగ్ శాతం పుంజుకునేలా అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో నోటిఫికేషన్ వెలువడే వరకు ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం లేదు. ఎట్టకేలకు నవంబర్ 25న నోటిఫికేషన్ జారీ చేశారు. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించారు. ఇందులో మొదటి విడతలో జిల్లాలో పినపాక, అశ్వారావుపేట నియోజకర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల పరిధిలో 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 14 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన చోట ఈ నెల 11న ఎన్నికలు జరిగాయి. ఇందులో పోలింగ్ శాతం కేవలం 71.79 శాతమే నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ శాతంగా ఉంది. తొలివిడత ఎన్నికల్లో 71.79 శాతమే పోలింగ్ -
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ రోహిత్రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్రెడ్డి, వ్యయ పరిశీలకురాలు లావణ్య, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో శుక్రవారం రాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి తాగునీరు, భోజనం, విద్యుత్, స్ట్రాంగ్ రూం ఏర్పాట్లు తదితర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, రిజిస్టర్లు, ఇతర ఎన్నికల సామగ్రి నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేర్చాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటరు రిజిస్టర్ కచ్చితంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితులలో దొంగ ఓట్లకు అవకాశం ఇవ్వరాదని ఆదేశించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయడంతోపాటు రెండువేలకు పైగా ఓటర్లు ఉన్న జగన్నాథపురం, నరసాపురం, పెద్దిరెడ్డిగూడెం, వినాయకపురం, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట తదితర ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఓటర్లలో అవగాహన పెంచేందుకు పంచాయతీ వాహనాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ఎస్పీ రోహిత్రాజు మాట్లాడుతూ రెండో విడత ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రెండో విడత ఎన్నికల సమీక్షలో కలెక్టర్ జితేష్ భద్రాచలంలో ఈనెల 29, 30 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లను అంటిస్తామని తెలిపారు. సౌకర్యాలపై ఈ నెల 15న భద్రాచలం సబ్ కలెక్టరేట్లో డివిజన్స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. దేవస్థానం ఈఓ దామోదర్రావు, అర్చకులు పాల్గొన్నారు. -
భద్రగిరిలో తీవ్ర నిరీక్షణ
● అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యంగా కౌంటింగ్ ● అందరికీ ఓటర్ల స్లిప్లు పంపిణీ చేయలేదనే ఆరోపణలు ● భద్రాచలం పంచాయతీలో అతి తక్కువ పోలింగ్ శాతం భద్రాచలం: అధికారుల నిర్లక్ష్యంతో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు పడిగాపులు కాశారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు సర్పంచ్ ఫలితాలు వెల్లడికాకపోవడంతో రాత్రంతా అభ్యర్థులు, వారి మద్దతుదారులు, కార్యకర్తలు చలిలో గజగజ వణికిపోయారు. గురువారం ఉదయం ఏడు నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ ముగియాల్సి ఉంది. ఒంటిగంటలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వడంతో కొంత సమయం పట్టింది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల లోపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ బాక్స్లు చేర్చి కౌంటింగ్ ప్రారంభించాల్సి ఉంది. కానీ తీవ్ర జాప్యం జరిగింది. తన ఓటు హక్కును మరొకరు వినియోగించుకున్నారనే ఫిర్యాదుతో వెంకటలక్ష్మి అనే ఓటరుకు టెండర్ ఓటును కేటాయించారు. ఆ ఓటు కౌంటింగ్, విధి విధానాలు స్థానిక ఎన్నికల అధికారులకు తెలియకపోవడంతో రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమాచారం తెలుసుకున్న అనంతరం బ్యాలెట్ బాక్సులోని ఓట్లను కట్టలు కట్టడం ప్రారంభించారు. దీంతో రాత్రి ఏడు గంటల వరకు కౌంటింగ్ ప్రారంభం కాలేదు. ఈ సమయంలో బయట వేచి చూస్తున్న అభ్యర్థులకు, పార్టీ కార్యకర్తలకు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ కేంద్రంలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు సైతం చేశారు. అఽధికారుల నిర్లక్ష్యం వల్ల భద్రాచలం పంచాయతీ సర్పంచ్ ఫలితం శుక్రవారం తెల్లవారుజామున వెలువడింది. అప్పటివరకు చలిలో అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతి తక్కువగా భద్రాచలంలో ఓటింగ్ జిల్లావ్యాప్తంగా అత్యధిక ఓటర్లు ఉన్న భద్రాచలం గ్రామపంచాయతీలో అతి తక్కువగా 48.87 శాతం పోలింగ్ నమోదయింది. ఓటర్లు స్లిప్లు ఇంటింటికీ చేరవేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఓటరు జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రాల వివరాలు ముందస్తుగా ప్రచారం చేయలేదు. దీంతో ఓటర్లు భద్రాచలంలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ప్రచారానికి అతి తక్కువ రోజులు ఉండటంతో వార్డు మెంబర్ పోటీదారులు తప్ప సర్పంచ్ పోటీదారులు అన్ని కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేయలేకపోయారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా ప్రభావం చూపలేకపోయారు. ఇతర ప్రాంతాలు, నగరాల్లో ఉంటున్న పట్టభద్రులు, ఉద్యోగులను భద్రాచలం తీసుకురాలేకపోయారు. ఇక ప్రధానంగా పోటీదారులు ఓటుకు నోటునే బలంగా నమ్ముకోవడంతో అత్యధిక ఓటర్లు, వృద్ధులు నోటు తీసుకొని చడీచప్పుడు చేయకుండా ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో 40,761 ఓట్లకుగాను 19,838 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. -
ఎదురెదురుగా ఎంపీ, మాజీ మంత్రి
పాల్వంచరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పాల్వంచ మండలం దంతలబోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున గురువారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ గ్రామ స్కూల్ సెంటర్ వద్ద ఎదురుపడ్డారు. పరస్పరం అభివాదం చేసుకున్న వారు తిరిగి ప్రచారంలో నిమగ్నమయ్యారు. కాగా, దంతలబోరు, నాగారం, నాగారంకాలనీ, లక్ష్మీదేవిపల్లి తదితర గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థుల తరఫున ప్రచారంలో ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరగదని గుర్తించి కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, నాగా సీతారాములు, యర్రంశెట్టి ముత్తయ్య, కోనేరు చిన్ని, గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. ఇక వనమా వెంకటేశ్వరరావు మండలంలోని దంతలబోరు, తోగ్గూడెం తదితర గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
పోలింగ్
మండలం మొత్తం ఓట్లు పోలైనవి శాతం అశ్వాపురం 32,860 25,743 78.34భద్రాచలం 40,761 19,920 48.87బూర్గంపాడు 44,878 31,018 69.12చర్ల 32,653 26,637 81.58దుమ్ముగూడెం 33,182 28,231 85.08కరకగూడెం 12,869 10,877 84.52మణుగూరు 36,480 22,783 62.45పినపాక 25,387 20,765 81.79 -
రెండో విడత ప్రచారాలకు నేటితో తెర
చుంచుపల్లి: జిల్లాలో ఈనెల 14న జరిగే రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారాలకు శుక్రవారం సాయంత్రంతో తెరపడనుంది. మలి దశలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల పరిధిలోని 155 గ్రామపంచాయతీలు, 1,384 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 16 గ్రామ పంచాయతీలు, 240 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇవి మినహాయించి మిగతా చోట్ల గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటామంటూ హామీలు గుప్పించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం వినూత్న రీతిలో ప్రచారం సైతం నిర్వహించారు. పాదయాత్రలు, మైకు ప్రచారాలతో గ్రామాలు హోరెత్తాయి. -
ఎన్సీసీతోనే క్రమశిక్షణ
కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్కుమార్ భద్రటేకులపల్లి : యువతలో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి వంటివి ఎన్సీసీతోనే పెంపొందుతాయని, ఈ మేరకు శిక్షణ ఇస్తామని 11 టీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్ కుమార్ భద్ర అన్నారు. స్థానిక ఏకలవ్య(ఈఎంఆర్ఎస్) పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్సీసీ ప్రాథమిక శిక్షణలో డ్రిల్, రైఫిల్ డ్రిల్, మ్యాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్, ిఫీల్డ్ క్రాఫ్ట్, రాక్ క్లైంబింగ్, మౌంటనీరింగ్, ట్రెక్కింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పాఠశాలలో ఎన్సీసీ ఏర్పాటుకు ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ తీసుకున్న చొరవను ఆయన అభినందించారు. ఎన్సీసీ కేడెట్ల ఆసక్తి, క్రమశిక్షణ చూసి హర్షం వ్యక్తం చేశారు. -
గ్రామం ఇక్కడ, ఓటర్లు అక్కడ..!
చుంచుపల్లి: మండల పరిధిలోని వెంకటేశ్ఖని గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఓటర్లందరూ ప్రస్తుతం గ్రామంలో నివసించడం లేదు. రెండు నెలల క్రితం సింగరేణి అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడి 70 కుటుంబాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. దీంతో ఇక్కడ ముగ్గురు, నలుగురు ఓటర్లు మాత్రమే స్థానికంగా మిగిలిపోయారు. ఈ గ్రామ పంచాయతీకి 2014 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. 2018 ఎన్నికల్లో కేవలం 146 ఓట్లతో ఇక్కడ పంచాయతీ పాలకవర్గాలను ఎన్నుకున్నారు. ఇటీవల వరకు ఈ గ్రామపంచాయతీ పరిధిలో 256 మంది జనాభా ఉండగా, తాజా ఓటర్ల జాబితాలో ఇక్కడ 183 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 93 మంది మహిళలు కాగా, 90 మంది పురుషులు ఉన్నారు. అయితే, సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా బ్లాస్టింగ్ జోన్కు ఆతిదగ్గరలో ఉండడంతో అధికారులు ఇక్కడ నివసిస్తున్న కుటుంబాలను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించడంతోపాటు గంగహుస్సేన్బస్తీలో ప్రత్యేక స్థలాలను ఇచ్చారు. దీంతో ఇక్కడ ఉన్న ఊరు ఖాళీ అయింది. ఇక్కడి కుటుంబాలు స్థానికంగా ఉన్న రామవరం, రుద్రంపూర్, పెనగడప, గౌతంపూర్ ప్రాంతాలకు తరలి వెళ్లాయి. కేవలం ఒక కుటుంబంలోని ముగ్గురు, నలుగురు ఓటర్లు మాత్రమే ప్రస్తుతం ఊరిలో ఉన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లు అందరూ ఇక్కడ ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటు వేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్కు రిజర్వేషన్ చేశారు. మిగిలిన 4 వార్డులను ఎస్టీ జనరల్కు ఒకటి, జనరల్ మహిళకు ఒకటి, బీసీ మహిళకు ఒకటి, ఎస్టీ మహిళకు ఒకటి కేటాయించారు. ఇక్కడ జనాభాతో పాటు ఓటర్లు సైతం లేకపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం కూడా చేయడం లేదు. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లను వెతికి పట్టుకోవాలంటే అవస్థలు పడాల్సి వస్తోంది. చిరునామా కనుక్కొని వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న రెండో విడతలో వెంకటేశ్ఖని పంచాయతీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న 183 మంది ఓటర్లను ఇక్కడే ఓటు వేసే విధంగా అధికారులు చర్య లు చేపడుతున్నారు. వెంకటేశ్ఖనిలో విచిత్ర పరిస్థితి -
యార్డుల్లో యాతన
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయినా డంపింగ్ యార్డుల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఉన్న యార్డు సరిపోకపోవడంతో రోజువారీ వెలువడుతున్న చెత్తను కొంత మేర రోడ్ల వెంటే వేయాల్సి వస్తోంది. దీంతో రహదారులపై దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేషన్లో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మరో రెండు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నారు. కొత్తగూడెంలో రోజువారీ చెత్త 30 మెట్రిక్ టన్నులు వెలువడుతుండగా పాల్వంచలో కూడా అదే స్థాయిలో సేకరణ జరుగుతోంది. ఇక కార్పొరేషన్లో విలీనమైన సుజాతనగర్ మండల పరిధిలోని నాలుగు డివిజన్లలో వెలువడే చెత్తను అక్కడే డంప్ చేస్తున్నారు. జనాభాకు తగ్గట్టుగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య, వాహనాలు పెంచడంతో పాటు కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కార్మికులు సరిపడా లేకపోవడంతో రోజు వారి కూలీలతో పని కానిచ్చేస్తున్నారు. ఇక కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీలో డంపింగ్ యార్డే లేదు. రోజువారీ వెలువడే చెత్తను నివాసాల సమీపంలోనే డంప్ చేస్తున్నారు. మణుగూరు మున్సిపాలిటీలో రోజుకు 12 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నా సమీపాన అన్నారంలోని డంపింగ్ యార్డుకు తరలించాలంటే వర్షాకాలంలో ట్రాలీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బయో మైనింగ్ పూర్తయ్యేదెప్పుడో.. గతంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో వెలువడే చెత్తను రామవరం డంపింగ్ యార్డులో వేసేవారు. అయితే అక్కడ రాత్రివేళ గుర్తు తెలియని వ్యక్తులు తరచూ చెత్త తగులబెడుతుండడంతో దట్టమైన పొగ వ్యాపించి సమీప ప్రజలు ఇబ్బంది పడేవారు. దీంతో స్థానికులు చెత్త ట్రాలీలను అడ్డుకుని ఆందోళన చేయడంతో అక్కడ డంప్ చేయడం మానేశారు. గత మూడేళ్లుగా పాతకొత్తగూడెంలోని మొర్రేడువాగు సమీపంలోని డంపింగ్ యార్డులో వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 30వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త పేరుకుపోయింది. దీంతో ఇప్పుడు సేకరిస్తున్న చెత్త రోడ్లపైనే వేయాల్సి వస్తోంది. ఈ యార్డులో లక్ష మెట్రిక్ టన్నుల చెత్త తొలగించేందుకు ఆరు నెలల క్రితం బయోమైనింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటివరకు 33 వేల మెట్రిక్ టన్నుల చెత్త నుంచి గాజు, ప్లాస్టిక్ వేరు చేశారు. పొడి చెత్త, ప్లాస్టిక్ వస్తువులు, గాజును క్రాష్ చేసి సిమెంట్ కంపెనీలకు పంపుతున్నారు. అయితే ఇంకా 67 వేల మెట్రిక్ టన్నుల చెత్త బయోమైనింగ్ చేయాల్సి ఉండగా మూడు నెలల సమయం పడుతుందని కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. పాల్వంచలోనూ బయోమైనింగ్కు అవసరమైన యంత్రాలు ఏర్పాటు చేసినా.. ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఇక డంపింగ్ యార్డుల్లో వర్మికంపోస్టు తయారీకి నిర్మించిన బెడ్లు ప్రస్తుతం వృథాగా ఉన్నాయి. వర్మీ కంపోస్టు తయారు చేసి, తక్కువ ధరకు కొత్తగూడెం చుట్టుపక్కల గ్రామాల రైతులకు అమ్మితే కార్పొరేషన్కు కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది.కార్పొరేషన్ పరిధిలో కొత్త డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. రామవరంలోని పాత డంపింగ్ యార్డులో బయోమైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ పని పూర్తయితే యార్డును పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడా జాప్యం కాకుండా పర్యవేక్షిస్తున్నాం. -
పోలింగ్ కేంద్రం సమీపంలో ఉద్రిక్తత
మణుగూరురూరల్: స్థానిక జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇరువైపులా టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. కాగా, తహసీల్దార్ కార్యాలయ ఎదురు వీధిలో టెంటు అడ్డంగా వేసి వచ్చే ఓటర్లకు గుర్తులు చూపి ప్రలోభ పెడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ వాతావరణం ఏర్పడుతోందని సమాచారం అందుకున్న సీఐ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. బీఆర్ఎస్ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒకవర్గానికే సహకరిస్తే సహించేది లేదంటూ వాగ్వాదానికి దిగగా, సీఐ రెండు పార్టీల టెంట్లు తీసివేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ సిబ్బందిని కాపలా ఉంచారు. సీతంపేట, పాండురంగాపురంలో.. పినపాక: మండలంలోని సీతంపేట పంచాయతీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా పోలీసులు సర్ది చెప్పారు. అక్కడి నుంచి నాయకులను పంపించివేశారు. పాండురంగాపురం పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈసం భవతి విజయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఎన్ని ఓట్లు, ఏ వార్డులు అనే సమాచారం లేకుండా ఎలా విజయాన్ని ధ్రువీకరిస్తారని బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు సరైన సమాచారం లేకుండా ధ్రువీకరించారని ఆరోపించారు. పోలీసులు చేరుకొని వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. -
దొంగ ఓటు కలకలం..
● భద్రాచలంలో ఘటన ● టెండర్ ఓటు వేయించిన అధికారులు భద్రాచలంఅర్బన్: రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం జరగగా భద్రాచలం పట్టణంలోని 4వ వార్డుకు చెందిన కోటగిరి వెంకటలక్ష్మి కూనవరం రోడ్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోని 11వ నంబర్ బూత్కు వెళ్లింది. అధికారులు వివరాలు పరిశీలించి.. తమ ఓటు ఇప్పటికే పోలైందని, మళ్లీ ఓటు వేసేందుకు అవకాశం లేదని చెప్పడంతో సదరు ఓటరు షాక్కు గురైంది. ఇదే విషయంపై భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్తో పాటు ఇతర అధికారులకు తెలపడంతో.. ఆమెతో అధికారులు టెండర్ ఓటు వేయించారు. కాగా, భద్రాచలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ అంశంపై తహసీల్దార్ మాట్లాడుతూ.. అది రిగ్గింగ్ కాదని, ఓట్లు పరిశీలించే అధికారి తప్పిదం వల్లే జరిగిందని చెప్పినా.. అధికారికంగా ధ్రువీకరించలేదు. ఎమ్మెల్యే వెంకట్రావుతో వాగ్వాదం.. ఓట్ల రిగ్గింగ్ జరిగిందని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు స్థానికులు, కాంగ్రెస్ అభ్యర్థి, బీఆర్ఎస్ నాయకురాలు తెలిపారు. వార్డు సభ్యుడిగా బరిలో నిలబడిన అభ్యర్థిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతివ్వడం లేదని చెప్పడంతో ఎమ్మెల్యే అక్కడే ఉండి అభ్యర్థిని కేంద్రంలోకి పంపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు.. ఓట్ల రిగ్గింగ్పై నిలదీయడంతో ఎమ్మెల్యేకు ఆమెకు మధ్య వాగ్వాదం జరిగింది. టెండర్ ఓటు అంటే..? ఓటింగ్ సమయంలో ఒకరి ఓటును మరొకరు వేస్తుంటారు. దీంతో అసలు ఓటర్ తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతాడు. అయితే, అలా జరగకుండా భారత ఎన్నికల సంఘం 1961లో సెక్షన్ 49(పీ)ను అమల్లోకి తెచ్చింది. ఓ వ్యక్తి ఓటును మరో వ్యక్తి వేస్తే ఈ సెక్షన్ ద్వారా టెండర్ ఓటు వేసే అవకాశం ఉంది. పోలింగ్ అధికారులు అసలు ఓటరు అతడేనని నిర్ధారించుకుంటే సాధారణ బ్యాలెట్ పేపర్ బండిల్లోని చివరి బ్యాలెట్ను ఇస్తారు. టెండరు బ్యాలెట్గా ఓటు వేయడానికి అనుమతిస్తారు. అయితే, ఆ టెండరు ఓటును బ్యాలెట్ బాక్సులో వేయకుండా ప్రిసైడింగ్ అధికారికి అప్పగిస్తారు. దానిని ప్రత్యేక కవర్లో పెట్టి టెండర్ బ్యాలెట్ వివరాలను సంబంధిత ఫారంలో నమోదు చేస్తారు. -
అంతా ప్రశాంతం..
తొలి విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగాయి. చెదురుముదురు ఘటనలు మినహా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలింగ్ ముగిసింది. యువకులు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోగా.. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, నడవలేనివారి కోసం వీల్చైర్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వృద్ధులను ఎత్తుకుని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, రేగా కాంతారావు.. వారివారి గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. –సాక్షి నెట్వర్క్ -
తొలిపోరు ప్రశాంతం
చుంచుపల్లి : జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లో పోలింగ్ జరగగా, మొత్తం 71.79 శాతంగా నమోదైంది. అత్యధికంగా దుమ్ముగూడెం మండలంలో 85.08 శాతం ఓట్లు పోలవ్వగా, అత్యల్పంగా భద్రాచలంలో 48.87 శాతం మాత్రమే నమోదయ్యాయి. 145 గ్రామపంచాయతీలు, 1,097 వార్డులకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ కొంత మందకొడిగానే సాగగా, అప్పటివరకు 13.57 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ తర్వాత అంతటా పోలింగ్ ఊపందుకుంది. 11 గంటల వరకు 41.44 శాతం, పోలింగ్ పూర్తయ్యే సరికి 71.79 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒంటి గంట లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లను అధికారులు లోపలికి అనుమతించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించగా, ఎస్పీ రోహిత్రాజు భద్రాచలం, మణుగూ మండలం సమితి సింగారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కౌంటింగ్ సాగిందిలా.. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ పూర్తి కాగా, 2 గంటలకు అధికారులు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మొదట వార్డుల వారీగా లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు. అనంతరం సర్పంచ్ స్థానాలకు కౌంటింగ్ చేపట్టి విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. విజేతలుగా నిలిచిన అభ్యర్థులు, వారి అనుచరులు రంగులు చల్లుకుని, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మహిళలదే హవా.. తొలివిడత ఎనిమిది మండలాల పరిధిలో 145 గ్రామ పంచాయతీలు, 1,097 వార్డులకు ఎన్నికలు జరగగా అన్ని చోట్లా పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటి పరిధిలో మొత్తం 2,59,070 మంది ఓటర్లు ఉండగా, 1,85,974 మంది పోలింగ్లో పాల్గొన్నారు. ఇందులో పురుషులు 90,175 మంది కాగా, మహళా ఓటర్లు 95,794 మంది ఉన్నారు. ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు -
నర్సింగ్హోంలో డీఎంహెచ్ఓ తనిఖీ
పాల్వంచ: పట్టణంలోని దమ్మపేటరోడ్లో గల విజయ నర్సింగ్ హోంను డీఎంహెచ్ఓ తుకారంరాథోడ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఆస్పత్రిలో శిశువు మృతిపై వస్తున్న ఆరోపణలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వైద్యులు విజయలక్ష్మికి, సిబ్బందికి సూచనలిచ్చారు. ఆస్పత్రిలో రోగులకు అందించే సేవల ధరల పట్టిక రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని, ల్యాబ్లో నిర్వహించే రక్త పరీక్షల ధరలు, ఆస్పత్రిలో పనిచేసే వైద్యుల పేర్లు కూడా అందులో ఉండాలన్నారు. కాన్పులు నిర్వహించే గదులు శుభ్రంగా ఉంచాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ పీఎంఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో పొగలుపాల్వంచ: భద్రాచలం నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు వెనక భాగం నుంచి పొగలు రావడంతో ఆందోళన నెలకొంది. పాల్వంచ మీదుగా గురువారం ఈ బస్సు వెళ్తుండగా నవభారత్ వద్ద బస్సు వెనుక భాగం నుంచి పొగలు మొదలై లోపల కమ్ముకున్నాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పక్కన నిలిపివేశాడు. అనంతరం మరమ్మతులు చేయడంతో పొగలు నిలిచిపోగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సాంకేతిక లోపంతోనే పొగలు వచ్చినట్లు తెలిసింది. ట్యాంకర్ బోల్తా.. ములకలపల్లి: రసాయనాలు తరలిస్తున్న ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతిచెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్కు చెందిన డ్రైవర్ పవన్ (27) ట్యాంకర్లో ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి సమీపంలోని గోపాలపురం నుంచి హైడ్రో క్లోరిక్ ఆమ్లం (హెచ్సీఎల్)తో రాయపూర్కు బయలుదేరాడు. బుధవారం అర్ధరాత్రి మండలంలోని రాజుపేట శివారులో పాములేరు వాగు వంతెన సమీపంలో ట్యాంకర్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి లోయలోకి దూసుకుపోయింది. క్యాబిన్ నుజ్జునుజ్జుకావడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్ఐ ఘటనా ప్రదేశానికి చేరుకున్నా, అర్ధరాత్రి కావడం, ట్యాంకర్ చుట్టూ చెట్టుకొమ్మలు అల్లుకొని ఉండడం, యాసిడ్ లీకై ఘాటైన వాసన వస్తుండటంతో రక్షణ చర్యలు చేపట్టలేకపోయారు. గురువారం వేకువజామున రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపకశాఖ సహకారంతో లారీ క్యాబిన్లో ఇరుక్కున్న పవన్ మృతదేహాన్ని బయటకు తీసి, కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి మార్చరీకి తరలించారు. ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వివరించారు. -
‘నమస్తే’తో వారికి గౌరవం
ఖమ్మంమయూరిసెంటర్: పారిశుద్ధ్య రంగంలో పనిచేసే కార్మికులకు భద్రత, గౌరవం కల్పించడంతో పాటు చేతితో శుభ్రం చేసే పనులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నమస్తే’(నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. డ్రెయినేజీలు, సెప్టిక్ ట్యాంకుల శుభ్రత పనులు చేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కార్మికులు అనారోగ్యంతో మరణించొద్దనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు చేయాల్సిన ఈ పథకంపై కార్మికుల్లో అవగాహన కల్పించడంలో ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అధికారులు వెనుకబడ్డారనే విమర్శలున్నాయి. పథకాన్ని మార్చి కొత్తగా.. కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘నమస్తే’ను 2022లో ప్రారంభించారు. గతంలో అమలైన ‘మానవ మల స్కావెంజర్ల పునరావాసం కోసం స్వయం ఉపాధి పథకం (ఎస్ఆర్ఎంఎస్)’స్థానంలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. నేషనల్ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని 2023–24 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. దృష్టి సారిస్తే మేలు పీఎఫ్, ఈహెచ్ఎస్ వంటివి లేక, సరైన వేతనాలు అందకుండా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెద్ద సంఖ్యలోనే ఉన్నా.. వారి వివరాల నమోదులో అధికారులు వెనకబడినట్లు తెలుస్తోంది. ఈ పథకంలో కార్మికుడి వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు లాగిన్ ఐడీల ఏర్పాటుకు వీలు కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు లాగిన్ ఐడీలు తీసుకున్నా.. కార్మికుల వివరాలు నమోదు చేయడం లేదని తెలుస్తోంది. కేఎంసీలో 700 మందికి పైగా కార్మికులు ఉంటే 74 మంది ప్రొఫైలింగ్ మాత్రమే పూర్తయింది. మిగతా వారి వివరాలను నమోదు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయోజనాలు ఇవే.. ‘నమస్తే’పథకం ద్వారా కార్మికులకు దక్కే లబ్ధి భద్రతకే పరిమితం కాక ఆర్థిక స్వావలంబనకు మార్గాన్ని సుగమం చేస్తుంది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కలిపి ఆయుష్మాన్ భారత్ – పీఎం జన ఆరోగ్య యోజన కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే, వృత్తిపరమైన భద్రత, యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తూ ఆ సమయాన నెలకు రూ.3 వేల స్టైఫండ్ చెల్లిస్తారు. కార్మికులు సొంతంగా పారిశుద్ధ్య వ్యాపారాలు ప్రారంభించేలా వాహనాలు, పరికరాల కొనుగోలుకు రూ.5 లక్షల ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాయితీ లభిస్తుంది. తక్కువ వడ్డీ రేటు (మహిళలకు 5 శాతం, పురుషులకు 6 శాతం)తో ఇచ్చే ఈ రుణం తిరిగి చెల్లించేందుకు ఏడేళ్ల గడువు ఇస్తారు. అలాగే, కార్మికులకు వ్యక్తిగత రక్షణ కిట్లు, బూట్లు, యాప్రాన్లు ఉచితంగా పంపిణీ చేస్తారు.నిర్ణీత కాల వ్యవధిలోనే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధి కార్మికులకు ఈ పథకంలో చోటు కల్పించేలా రిజిస్ట్రేషన్ చేయాలి. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం కార్పొరేషన్లతో పాటు మధిర, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు, మణు గూరు మున్సిపాలిటీల పరిధిలో మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులను గుర్తించి ప్రొఫైలింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేఎంసీ పరిధిలో 74, మధిర, వైరా ముగ్గురు చొప్పున, సత్తుపల్లిలో ఇద్దరు, కొత్తగూడెంలో 20 మంది, ఇల్లెందులో 10 మంది, మణుగూరులో ఇద్దరి ప్రొఫైల్ను పూర్తి చేసి పథకం అమలు చేస్తున్నారు. అలాగే, మున్సిపాలిటీకి అనుబంధం కాకుండా, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్న ‘వేస్ట్ పిక్కర్ల’ప్రొఫైలింగ్ కొనసాగుతోంది. వీరిలో బయట రాక్ పిక్కర్లు, వెంట్రుకలు ఏరుకునే వాళ్లు, ఓనర్ కమ్ డ్రైవర్లు వంటి వారు ఉన్నారు. ఆన్లైన్ పరిశీలన పూర్తయ్యాక వీరిందరికీ పథకం ప్రయోజనాలు దక్కుతాయి. ప్రొఫైలింగ్ పూర్తయిన ప్రతీ కార్మికుడికి గుర్తింపు కార్డును జారీ చేస్తారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యం, భద్రత -
సమాజమా మేలుకో..
ప్రతీ ఎన్నికల్లో ఆళ్లపల్లి మండలంలోని గ్రామాల్లో ఇలా ప్రచారం చేస్తున్నా. యువతలో మార్పు రావాలని, అభివృద్ధి చెందాలని ప్రచారం చేపట్టాను. సొంత ఖర్చులతోనే మండలంలోని ప్ర తీ గ్రామంలో తిరుగుతున్నా. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. –ఇందుకుమార్, ఆటోడ్రైవర్ గుండాల: సర్పంచ్గా నిలబడే వ్యక్తి వద్ద ఓటర్ల లిస్టు కాదని, గ్రామంలోని సమస్యల లిస్టు.. గ్రామాభివృద్ధికి కావాల్సిన ప్రణాళిక పత్రాలుండాలని, ఓటు నిజాయితీగా వేస్తే తలెత్తుకుని తిరిగేలా చేస్తుందని, చిల్లర డబ్బులకు ఆశపడి ఓటు వేస్తే బానిసలా తల దించుకుని బతికేలా చేస్తుందని ఓ యువకుడు ఓటర్లకు అవగాహన కోసం ఆటోలో ప్రచారం చేస్తున్నాడు. ఆళ్లపల్లి మండలం మర్కోడుకు చెందిన దివ్యాంగుడు ఇందుకుమార్ ప్రతీ సారి ఎన్నికల్లో ఓటర్లలో మార్పు రావాలని కోరుతూ.. తన సొంత ఖర్చులతో తన ఆటోకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని మైకుతో ప్రచారం సాగిస్తున్నాడు. ‘రేపటి భవిష్యత్ కోసం ఆలోచించాలని, మద్యం, డబ్బు పంచే వ్యక్తి నాయకుడు కాదని, అర్ధరాత్రి పిలిచినా నేనున్నానంటూ ధైర్యం చెప్పేవ్యక్తి నాయకుడని, డబ్బులు పెట్టేవారు గెలిచాక ఎలా రాబట్టాలో చూస్తారని, యువత చేతుల్లోనే అభివృద్ధి దాగి ఉందని, వారు ముందుకు వచ్చి పోటీ చేయాలని, గెలిస్తే చరిత్ర అని, ఓడితే అనుభవమని ప్రచారం చేస్తున్నాడు. అయితే, అతడి ప్రచారం ప్రజలను ఆలోచింపజేస్తోంది. ఓ దివ్యాంగుడి ఆలోచనతో ఆటోలో ప్రచారం -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, శ్రీ సీతారామచంద్ర స్వామిని విశాఖపట్నంలోని డీఎస్ నేషనల్ లా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.సూర్యప్రకాష్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోకి కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేద పడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. 13న నవోదయ ప్రవేశపరీక్ష కూసుమంచి: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని నవోదయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 13న పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఎనిమిది చొప్పున, ములుగు జిల్లా వెంకటాపురంలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు పాలేరు నవోదయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. ప్రవేశ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,737 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతుల పరీక్ష13, 14వ తేదీల్లో ఏర్పాటు పాల్వంచ: విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదోన్నతుల కోసం పాల్వంచలోని జెన్కో ట్రైనింగ్ సెంటర్లో ఈనెల 13, 14 తేదీల్లో (డిపార్ట్మెంట్ అకౌంట్స్ టెస్ట్) పరీక్షలు నిర్వహించనున్నారు. ట్రాన్స్కో, జెన్కో, డిస్కం సంస్థల్లో పనిచేసే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ (జేఏఓ), ఏఈలు సైతం పదోన్నతులు రావాలంటే ఈ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తుండగా, ప్రస్తుతం పాల్వంచలో ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు. 16 నుంచి క్రికెట్ టోర్నీరుద్రంపూర్: ఈనెల 16 నుంచి 18 వరకు కొత్తగూడెంలోని జయశంకర్ మైదానంలో కంపెనీ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఏరియా జీఎం ఎం.శాలేంరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం – కార్పొరేట్, ఇల్లెందు – మణుగూరు, భూపాలపల్లి, రామగుండం రీజియన్, శ్రీరాంపూర్, బెల్లంపెల్లి – మందమర్రి ఏరియాలను కలుపుతూ ఆరు టీమ్లుగా ఏర్పాటు చేశామని వివరించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. టాస్తో వార్డు సభ్యురాలి విజయందుమ్ముగూడెం: మండలంలోని అచ్చితాపురం పంచాయతీలోని ఐదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సోయం కౌసల్య, ఎవీఎస్పీ అభ్యర్థి సోయం నగ్మాకు చెరో 24 ఓట్లు వచ్చాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి కౌసల్యను విజయం వరించింది. -
‘మహాలక్ష్మి’కి రెండేళ్లు!
● రీజియన్లో 8.91కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం ● చార్జీల రూపంలో రూ.420 కోట్లు ఆదాప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని ఉమ్మడి జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పథకం ప్రారంభమైన తర్వాత ఆర్టీసీకి ఆదరణ పెరిగింది. మహిళా ప్రయాణికులతో పాటు ఇతరులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. ఇదే సమయాన మరిన్ని సౌకర్యాలు కల్పించేలా సంస్థ చర్యలు చేపడుతోంది. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్ఖమ్మంమయూరిసెంటర్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి రెండేళ్లు నిండాయి. మహిళా ప్రయాణికులకు వరంలా మారిన ఈ పథకం ద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గింది. 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ పథకం ప్రారంభం కాగా, ఇప్పటివరకు రెండేళ్లలో ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా మహిళలకు టికెట్ల రూపంలో రూ.420.05 కోట్లు ఆదా అయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. భారీ స్థాయిలో ప్రయాణాలు మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుండి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గ్రామాల నుండి వివిధ పనులు, ఉపాధి నిమిత్తం పట్టణాలు, నగరాలకు వెళ్లే మహిళలు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. కూలీలు, చిరు ఉద్యోగులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పథకం వారికి ఊరటగా మారింది. ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల పరిధిలో గత రెండేళ్లలో ఏకంగా 8.91 కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. రోజుకు సగటున 1,23,605 మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. తద్వారా వారికి చార్జీలు ఆదా అవుతుండగా, ఈ నగదును నిత్యావసరాలు, పిల్లల చదువు, ఆరోగ్యం వంటి ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. తద్వారా ఈ పథకం మహిళా ప్రయాణికులకు ‘ఆర్థిక స్వేచ్ఛ’ను ఇస్తోందని పలువురు అభివర్ణిస్తున్నారు. సౌకర్యాల కల్పనపై దృష్టి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యాన బస్సులు సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యాన ఆర్టీసీకి మహిళా సంఘాల ద్వారా బస్సులను సమకూర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహాలక్ష్మి పథకం ద్వారానే స్వయం సహాయక సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి అద్దె ప్రాతిపదికన సంస్థకు అప్పగిస్తున్నారు. ఇక డ్రైవర్లు, కండక్టర్లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తుండడంతో సిబ్బంది కొరత తీరుతోంది. -
భవితవ్యం మీ చేతుల్లోనే..
● ప్రలోభాలకు కాదు.. ప్రగతికి ఓటేద్దాం ● నేడు గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్కరకగూడెం: ప్రజాస్వామ్య పండుగగా నిలిచే గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరుగనుంది. ఇది కేవలం ఓటు హక్కు వినియోగం మాత్రమే కాదు.. గ్రామ భవిష్యత్ను చక్కదిద్దే అవకాశం. ఈ ఓటుపైనే గ్రామాభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతీ పౌరుడు ఆలోచించాల్సిన కొన్ని కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి. గ్రామాల్లో కులం, బంధుత్వం, పార్టీ అభిమానం ఆధారంగా ఓటేస్తుంటాం. అలా కాకుండా మనం వేసే ఓటు.. రోడ్లు వేయించడం, తాగునీటి సమస్య పరిష్కరించడం, వీధి దీపాలు వెలిగించడం వంటి మౌలిక వసతులు తీర్చేదిగా ఉండాలి. గ్రామాభివృద్ధికి కట్టుబడే నాయకుడిని ఎన్నుకుంటేనే ఇవన్నీ నెరవేరుతాయి. లేదంటే రాబోయే ఐదేళ్లు గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతుంది. నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అతడికి ఎంత డబ్బు ఉందని చూడకుండా విద్య, పని చేయగల సామర్థ్యం, సమస్యలు అర్థం చేసుకునే గుణం, ప్రభుత్వ పథకాలు, నిబంధనలపై అవగాహన ఉన్న వారిని గుర్తించాలి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వారికే ఓటు వేయాలి. ఒకరోజు సంతోషం కోసం ఓటు అమ్ముకోవడం ప్రమాదకరం. వారిచ్చే డబ్బు, మద్యం తీసుకుని ఓటేస్తే గెలిచిన అభ్యర్థి ఐదేళ్ల పాటు ప్రజాప్రయోజనాలు కాకుండా.. అధికారాన్ని తన సొంతానిని వినియోగించుకుంటాడు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కావడంతో పాటు గ్రామ భవిష్యత్తే దెబ్బతింటుంది. గ్రామాల్లో మహిళా ఓటర్లు, యువకులు ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలి. పోటీ చేసే అభ్యర్థి గ్రామానికి ఏం చేస్తారో ప్రశ్నించాలి. అలాగే తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై మహిళల నిర్ణయాధికారం పెరుగుతోంది. అందుకే ప్రలోభాలకు లొంగకుండా తమ కుటుంబ సంక్షేమం కోసం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఎన్నికల తర్వాత కూడా గ్రామాభివృద్ధి నిరంతరం సాగాలంటే ఎన్నికల సమయంలో శాంతి, సామరస్యాలు పాటించాలి. గొడవలు గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. రాజకీయాలకతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే గ్రామంలో ఏ పని అయినా సాధ్యమవుతుంది. -
●ఎన్నికల నియమావళి పాటించాలి
జూలూరుపాడు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలని జిల్లా ఎన్నికల నోడల్ అధికారి ఎ. శ్రీనివాస్ అన్నారు. బుధవారం జూలూరుపాడు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు, రిటర్నింగ్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఎన్నికల నియమావళి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ రోజు ఖర్చు వివరాలను ఎంపీడీఓకు సమర్పించాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఓలకు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అభ్యర్థులు, రాజకీయ నాయకులు సహకరించాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. అధికారులు నాగరాజు, టి. శ్రీనివాస్, పూరేటి అజయ్, శ్రీలక్ష్మి, బాదావత్ రవి, టి.తులసిరామ్ పాల్గొన్నారు. -
చిన్నారి మృతిపై వీడని మిస్టరీ?
ఇల్లెందురూరల్:మండలంలోని మామిడిగూడెం గ్రామ పంచాయతీ సుంకరగూడెం గ్రామంలో ఐదేళ్ల చిన్నారి ఫ్రాన్సీ ఈ నెల 1న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక మృతిపై కుటుంబీకులు, గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తంచేయగా, ఇప్పటివరకు మిస్టరీవీడలేదు. మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మె ల్యే కోరం కనకయ్య సైతం సమగ్ర విచారణతో దోషులను శిక్షించాలని పోలీసు అధికారులకు సూచించారు. పది రోజులు గడిచినా విచారణ ముందుకు సాగకపోవడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతి చెందిన రోజే తల్లిదండ్రులు కేజియా, ప్రభాకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు అనుమానాలు రావడంతో మరుసటి రోజు అనుమానితుల పేర్లతో మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో తాత్సారం చేస్తుండటంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు మనోవేదనకు గురవుతున్నారు. విచారణలో జాప్యంపై సీఐ సురేష్ను వివరణ కోరగా.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారిస్తామని, అనుమానితులను సైతం విచారించి దోషులుగా తేలితే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఉరి వేసుకుని మహిళ బలవన్మరణంసత్తుపల్లిటౌన్: ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సత్తుపల్లిలోని శ్రీవాణి కళాశాల రోడ్డులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రగుంటకు చెందిన ఇమ్మనేని నరేంద్ర – అనూష అద్దెకు ఉంటున్నారు. సూర్యాపేట జిల్లా నకిరేకల్కు చెందిన అనూష(37)తో ఎర్రగుంట వాసి నరేంద్రకు 2012లో వివాహమైంది. అయితే, వీరి మధ్య తరచూ మనస్పర్థలు వస్తుండేవని సమాచారం. ఈక్రమంలోనే బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన అనూష ఫ్యాన్కు ఉరి వేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి లోపల గడియవేసి ఉండడంతో ఎంత పిలిచినా ఫలితం లేక కిటికీలో నుంచి చూడగా అనూష ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలిసిందని నరేంద్ర కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. వీరికి ఏడో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రదీప్ తెలిపారు. -
ఎన్నికల సిబ్బందికి అరకొరగా భోజనాలు
దుమ్ముగూడెం: అధికారులు భోజన ఏర్పాట్లలో విఫలం కావడంతో ఎన్నికల విధులకు వచ్చిన పోలింగ్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలానికి సుమారు 750 మందిని ఎన్నికల నిర్వహణకు కేటాయించారు వారికి కె.రేగుబల్లి ఆశ్రమ పాఠశాల ఆవరణలో భోజనాలు ఏర్పాటు చేశారు. అరకొరగా ఏర్పాటు చేయడంతో అందరికీ భోజనం అందలేదు. దీంతో సిబ్బంది ఖాళీ ప్లేట్లతో ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి ఎన్నికల సామగ్రి తీసుకుని, సరి చూసుకుని ఆకలితో కేంద్రానికి వచ్చే సరికి భోజనం లేకపోవడంతో ఆవేదన చెందా రు. అనంతరం అధికారులు బయట హోటళ్ల నుంచి భోజనాలు తెప్పించారు. అప్పటికే చాలా మంది సిబ్బంది లక్ష్మీనగరంలోని హోటళ్లకు వెళ్లి భోజనం, టిఫిన్ చేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తీసుకెళ్లేందుకు బస్సులు సరిపోకపోవడంతో సుమారు 50 మందిని ఆటోల ద్వారా తరలించారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
● పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం బూర్గంపాడు/భద్రాచలంటౌన్ : ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం ఆయన బూర్గంపాడు, భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. సెక్టార్ల వారీగా పోలింగ్ సామగ్రి తరలింపునకు ప్రత్యేక బస్సులు, 10 మంది అధికారులను ఏర్పాటు చేశామని చెప్పారు. చలి తీవ్రత దృష్ట్యా సిబ్బందికి పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. అందరూ సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. బ్యాలెట్ బాక్స్లను తెరవడం, మూయడం వంటి కీలక ప్రక్రియలపై సిబ్బందికి సమగ్రంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ బి.రాహుల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, తహసీల్దార్లు ధనియాల వెంకటేశ్వర్లు, ప్రసాద్, ఎంపీడీఓలు బాలయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైద్య సేవలపై ఆరా.. చర్ల: చర్ల సీహెచ్సీలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆరా తీశారు. బుధవారం ఆయన స్థానిక సీహెచ్సీని పరిశీలించారు. ఆస్పత్రిలో కొన్నిచోట్ల లీకేజీలను గుర్తించి తక్షణమే సరిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆస్పత్రికి అవసరమైన పరికరాలు, అభివృద్ధి పనులపై నివేదిక సమర్పించాలని వైద్యాధికారికి సూచించారు. గర్భిణులు, చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. అనంతరం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లో భద్రత ఏర్పాట్లు సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని సూచించారు. అనంతరం ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందితో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఆర్ కొత్తగూడెంలో శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ యూనిట్ను సందర్శించి మహిళలు తయారు చేస్తున్న విప్ప పువ్వు లడ్డూ, బర్ఫీ, చాక్లెట్, టీ పొడి, నల్లేరు పచ్చడి తదితర ఉత్పత్తులను పరిశీలించారు. విప్పపండ్లు సేకరణ సమయంలో నేలపై పడకుండా ఉండేలా అవసరమైన నెట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. వాటిని ఆరబెట్టేందుకు సోలార్ పరికరాలు కావాలని మహిళలు కోరగా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, ఎంపీడీఓ ఈదయ్య, సీహెచ్సీ సూపరింటెండెంట్ సాయివర్దన్, వైద్యులు కాంత్, రవికుమార్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
●జోరుగా తాయిలాల పంపిణీ
రఘునాథపాలెం: తొలిదశ గ్రామపంచాయతీల్లో గురువారం పోలింగ్ జరగనుండగా మంగళవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఇక బుధవారం రోజంతా అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులు పోటాపోటీకి వీటిని ఇచ్చినట్లు సమాచారం. ప్రత్యర్థి ఎంత ఇచ్చారో ఆరా తీయడంతో పాటు అంతకు మించి ఇచ్చినట్లు తెలిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.వేయి మొదలు రూ.1,500, రూ.2వేల వరకు పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కాక ప్రతీ ఇంటికి కేజీ, అరకేజీ చికెన్, చేపలు, పలువురికి మద్యం బాటిళ్ల పంపిణీ చేసినట్లు సమాచారం. త్రిముఖ పోటీ నెలకొన్న కొన్ని పంచాయతీల్లో ఒక్కో ఓటుకు అభ్యర్థులంతా ఇచ్చిన నగదు రూ.5 వేలు దాటిందని చెబుతున్నారు. నేలకొండపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటర్లు కొందరు తమ తీరుతో సర్పంచ్ అభ్యర్థులను ఖంగు తినిపిస్తున్నారు. కొందరు అభ్యర్థులు దావత్ ఏర్పాటు చేసి ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. అయితే, కొందరు ఓటర్లు ఇరుపార్టీల అభ్యర్థుల దావత్లకు హాజరవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇదేమిటని అభ్యర్థులు తీస్తే ‘దావత్ వరకే అటు.. ఓటు మాత్రం నీకే వేస్తా’ అని చెబుతున్నట్లు సమాచారం. ఇంకొందరు ఫలానా బ్రాండ్ మద్యమే కావాలని హుకుం జారీ చేస్తున్నారని, నిరాకరిస్తే ఓటు పడుతుందో, లేదోననే బాధతో అభ్యర్థులు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. నేలకొండపల్లి: కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు ఓటుకు ఇంత అని నగదు ఇస్తుండడమే కాక మద్యం కూడా పంపిణీ చేస్తున్నారని సమాచారం. తమకు తప్పక ఓటు వేస్తారనే నమ్మకం ఉన్న వారికి కొద్దిరోజులుగా 90 ఎం.ఎల్. లేదా క్వార్టర్ బాటిల్ ఇంటికే పంపిస్తున్నారని తెలిసింది. అలాగే, ప్రచారంలో తమ వెంట తిరుగుతున్న వారికి కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంతో పాటు రాత్రి భోజనం, మద్యం సమకూరుస్తున్నట్లు సమాచారం. ఖమ్మంవైరారోడ్: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలను కేటాయించాలని బీఆర్ఎస్, సీపీఎం నాయకులు కోరారు. ఈమేరకు బుధవారం వారు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్కు వినతిపత్రం అందజేశారు. గత అనుభవాలు, ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న గ్రామపంచాయతీల జాబితాను సీపీకి సమర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా భరోసా కల్పించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం, బీఆర్ఎస్ నాయకులు నున్నా నాగేశ్వరరావు, బెల్లం వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఓటర్లకు గ్రామాల్లో డబ్బు, మద్యం, మాంసం -
తొలిపోరు నేడే
మండలం జీపీలు వార్డులు అశ్వాపురం 23 193 భద్రాచలం 01 20 బూర్గంపాడు 13 125 చర్ల 26 152 దుమ్ముగూడెం 32 192 కరకగూడెం 16 118 మణుగూరు 14 123 పినపాక 20 174 చుంచుపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొదటి దశలో 8 మండలాల పరిధిలో ఏకగ్రీవాలు మినహా 145 పంచాయతీలు, 1,097 వార్డులకు గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎన్నికలు జరగనున్నాయి. 3,028 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2,70,573 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే 4,003 మంది అధికారులు, సిబ్బంది బుధవారమే సామగ్రితో సహా తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకున్నారు. ఇందులో 1,812 మంది పీఓలు, 2,191 మంది ఓపీఓలు ఉన్నారు. వీరితో పాటు అదనంగా మరో 10 శాతం మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. ఎనిమిది మండలాల పరిధిలో 56 మంది రిటర్నింగ్ అధికారులు, 191 మంది స్టేజ్–2 అధికారులు, 79 మంది రూట్ ఆఫీసర్లు, 26 మంది జోనల్ అధికారులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఓటరు గుర్తింపు కార్డు ఉంటేనే ఎవరినైనా పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియనుండగా, 2 గంటలకు లెక్కింపు ప్రారంభించి అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. మొదట వార్డుల వారీగా ఓట్లను లెక్కించి, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. 14 జీపీలు ఏకగ్రీవం.. తొలివిడతలో అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల పరిధిలోని 159 పంచాయతీలు, 1,436 వార్డులకు గాను 14 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 145 పంచాయతీల్లో నేడు పోలింగ్ కొనసాగనుండగా, 461 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,436 వార్డులకు మూడు చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 336 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,097 వార్డులకు ఎన్నికలు జరగనుండగా 2,567 మంది పోటీ పడుతున్నారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 2,70,573 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో మహిళలు 1,21,037, పురుషులు 1,49,525 మంది కాగా ఇతరులు 11 మంది ఉన్నారు. తొలి విడతలో 1,428 పోలింగ్ కేంద్రాలకు గాను 1,510 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపునకు దాదాపు 70 బస్సులు, 15 మినీ బస్సులతో పాటు ఇతర టాటా మ్యాజిక్ వాహనాలను వినియోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో తొలివిడత 145 గ్రామపంచాయతీలు, 1,097 వార్డులకు గురువారం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది బుధవారమే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సామగ్రితో సహా తరలివెళ్లారు. పోలింగ్తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాం. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. – జితేష్ వి.పాటిల్, కలెక్టర్మొదటి విడత ఎన్నికలకు రంగం సిద్ధం -
గోదావరి బ్రిడ్జిపై మరమ్మతులు
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరిపై ఉన్న పాత బ్రిడ్జికి అధికారులు ఎట్టకేలకు మరమ్మతులు చేశారు. రెండు బ్రిడ్జిలపై నెలకొని ఉన్న సమస్యలపై ‘వారధికి మరమ్మతులేవి..?’, ‘అమాత్యులైన మీరైనా..’శీర్షికన ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. స్థానికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఎత్తి చూపింది. దీంతో స్పందించిన జిల్లా అధికారులు మొదటి బ్రిడ్జిపై ఉన్న గుంతలను పూడ్చారు. కుంగిపోయిన అప్రొచ్రోడ్కు ప్యాచ్వర్క్ పూర్తి చేశారు. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెండు బ్రిడ్జిలపై నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, నూతన బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ఖర్చుల వివరాలు నమోదు చేయాలి
టేకులపల్లి: ఈనెల 3 నుంచి 17వ తేదీ వరకు చేసిన ఎన్నికల ఖర్చులను ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలని, వాటికి సంబంధిత రసీదు కూడా జత చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సూచించారు. ముత్యాలంపాడు రైతువేదికలో సర్పంచ్ అభ్యర్థులకు ఎన్నికలు, ఖర్చులపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన ఖర్చు రూ.5వేల లోపైతే నేరుగా నగదు ఇవ్వొచ్చని, అంతకు మించితే చెక్కు లేదా ఆర్జీఎఫ్జీ ద్వారా చెల్లించాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన 45 రోజుల్లో మొత్తం లెక్కలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. నిబంధనకు మించి అధికంగా ఖర్చు చేసినా, తప్పుడు లెక్కలు చూపినా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఒక పంచాయితీలో అనుమతి తీసుకున్న వాహనంపై మరో పంచాయతీలో తిరిగితే దాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా సహాయ ఎన్నికల అధికారి బైరు మల్లేశ్వరి మాట్లాడుతూ.. ఓటరు స్లిప్పులను పంచాయతీ సిబ్బంది మాత్రమే పంచుతారని, అభ్యర్థులు, రాజకీయ నాయకులు పంచేందుకు అనుమతి లేదని తెలిపారు. దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు రామకృష్ణ, జేఎల్ గణేష్గాంధీ తదితరులు పాల్గొన్నారు.జిల్లా వ్యయ పరిశీలకురాలు లావణ్య -
రామయ్యను దర్శించుకున్న పరిక్రమణ సమితి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని గోదావరి నది పరిక్రమణ(ప్రదక్షిణ) సమితి బృందం బుధవారం దర్శించుకుంది. బృందం సభ్యులకు ఈఓ దామోదర్రావు, అర్చకులు స్వాగతం పలకగా, ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రదక్షిణలో భాగంగా స్వామి వారిని దర్శించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, సాధువుల బృందం, తదితరులు పాల్గొన్నారు. స్వామి వారి వస్త్రాల నిలిపివేత...? భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో స్వామి వారి వస్త్రాల కేంద్రం టెండర్దారునికి భక్తులు సమర్పించే వస్త్రాలను అందజేయటం నిలిపివేసినట్లు సమాచారం. స్వామి వారి వస్త్రాల పేరుతో బయటి మార్కెట్లో లభించేవి ఇటీవల కాలంలో ఆ కేంద్రం వద్ద ఆలయ సిబ్బంది పట్టుకున్న విషయం విదితమే. దీనిపై ఆ కాంట్రాక్టర్కు నోటీస్ జారీ చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వస్త్రాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో ఆ కాంట్రాక్టర్ కాలపరిమితి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వస్త్రాలను గతంలో మాదిరిగా దేవస్థానం సిబ్బందితోనే విక్రయించాలనే యోచనలో ఆలయ అధికారులు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ముగిశాక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. పెద్దమ్మతల్లి ఆలయంలో 14 నుంచి పవిత్రోత్సవాలుపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో ఈనెల 14 నుంచి 16 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజినీకుమారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేవాలయ పవిత్రత, భక్తుల శ్రేయస్సు కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మానికి చెందిన ఎ.ఎన్.కె.సంతోష్కుమార్ శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు ఈ మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. అలసత్వం వహించొద్దుపినపాక: ఎన్నికల విధుల్లో ఎవరూ అలసత్వం వహించొద్దని, తనిఖీ కేంద్రంలో ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని ఈ బయ్యారం క్రాస్రోడ్లోని ఎన్నికల తనిఖీ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఎన్నికల నిబంధనావళిని ప్రతీ ఒక్కరు అనుసరించాలని, సరైన ఆధారాలు లేకుండా అధిక మొత్తంలో నగదు తీసుకెళ్తే జప్తు చేయాలని చెప్పారు. రాత్రి వేళలో అదనపు సిబ్బందితో ప్రత్యేకంగా వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. -
ముక్కోటి పనులు వేగవంతం
● హంస వాహనానికి రంగులు ● ఆన్లైన్ టికెట్లకు భక్తుల నుంచి ఆదరణభద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఈనెల 20న ప్రారంభమయ్యే వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 29న సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం, 30న తెల్ల వారుజామున ఉత్తర ద్వార దర్శనం ఉంటాయి. తెప్పోత్సవానికి ఉపయోగించే హంసవాహనానికి కార్మికులు రంగులు అద్దుతూ సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చలువ పందిళ్ల నిర్మాణం తుది దశకు చేరుకోగా, పంచ రంగుల పనులు నడుస్తున్నాయి. ప్రధాన ఆలయం, ఉపాలయాలకు రంగులు వేస్తున్నారు. బ్రిడ్జి రోడ్డు వద్ద స్వాగత ద్వారం పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పలుమార్లు పర్యటించి పనులు వేగంగా, నాణ్యంగా చేయాలని ఆదేశించారు. ఆన్లైన్లో టిక్కెట్లకు ఆదరణ దేవస్థానం వెబ్సైట్లో ఉంచిన ఉత్తర ద్వార దర్శనం టికెట్లకు భక్తుల నుంచి ఆదరణ లభిస్తోంది. రూ.2 వేల విలువ గల వీఐపీ సెక్టార్ల టికెట్లు 650కు గాను 225 టికెట్లు, రూ.వెయ్యి విలువ గల టికెట్లు 200కు గాను 88 అమ్ముడుపోయాయి. రూ.500 విలువ గల టికెట్లు బీ సెక్టార్లో 49, సీ సెక్టార్లో 79, డీ సెక్టార్లో 22, రూ.250 విలువ గల టికెట్లు 21 ఇప్పటి వరకు భక్తులు ఆన్లైన్లో కొనుగోలు చేశారు. మరో 19 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఆన్లైన్ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకోవాలని, ఒరిజనల్ టికెట్లను దేవస్థానం కార్యాలయం నుంచి ధ్రువీకరణ ఐడీతో పొందాలని ఈఓ దామోదర్రావు కోరారు. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్సవ మూర్తులకు బుధవారం బేడా మండపంలో స్నపన తిరుమంజనుం వేడుకను వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
ప్రలోభాలకు లోను కావొద్దు
ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ భద్రాచలంఅర్బన్: అభ్యర్థులు, ఏజెంట్లు, రాజ కీయ కార్యకర్తల ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా పూర్తి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్ల్లో భద్రతపై పోలీసులకు బుధవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలన్నారు. భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు, టౌన్ ఎస్ఐలు తిరుపతి, సతీష్, రామకృష్ణ, ఏఎస్ఐ సూర్యం, తదితరులు పాల్గొన్నారు. స్వగ్రామంలో మంత్రి పొంగులేటి కల్లూరురూరల్: స్వగ్రామమైన కల్లూరు మండలంలోని నారాయణపురానికి బుధవారం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్రెడ్డితో కలిసి తమ తండ్రి రాఘవరెడ్డి ఐదో ఆబ్దికంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రాఘవరెడ్డి స్మృతివనంలో కుటుంబసభ్యులతో కలిసి మంత్రి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తులు ఖమ్మంలీగల్: చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, పోక్సో కేసుల విచారణకు ఏర్పాటైన ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టులో మార్చి 2026 వరకు తాత్కాలిక పద్ధతిపై పనిచేసేలా సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ను నియమించనున్నట్లు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. 65ఏళ్లు నిండని రిటైర్డ్ జ్యుడీషియల్ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. జనరల్ అభ్యర్థులైతే 18 – 34 లోపు వారు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. సీనియర్ అసిస్టెంట్ పోస్టుకు గ్రాడ్యుయేషన్ చేసి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని, ఓఎస్ పోస్టుకు 7 నుంచి 10వ తరగతి వరకు అర్హతతో పాటు డ్రైవింగ్, ఎలకి్ట్రకల్, ఫ్లంబింగ్, వంటలో నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 20 సాయంత్రం 5గంటల లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా జడ్జి ఓ ప్రకటనలో సూచించారు. బాలికల కరాటే శిక్షణకు నిధులుకేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి రూ.33.60లక్షలు ఖమ్మం స్పోర్ట్స్: సమగ్ర శిక్షా ఆత్మ రక్షణ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాకు రూ.29.10లక్షలు కేటాయించగా, ఇదే పథకం కింద కేంద్రప్రభుత్వం మరో 25 పాఠశాలలకు రూ.4.50లక్షలు విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు కరాటే శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలోని 194 పాఠశాలలను ఎంపిక చేశారు. కేంద్రప్రభుత్వం మరో 25 పాఠశాలల్లో మూడు నెలల పాటు శిక్షణ కోసం నిధులు మంజూరు చేసింది. గతంలో ఈ పథకం నిర్వహించినప్పుడు కొన్ని పాఠశాలల్లో శిక్షణ ఇవ్వకున్నా తప్పుడు రికార్డులతో నిధులు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈసారి 72 కరాటే తరగతులు నిర్వహించడంతో పాటు హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థినుల వివరాలతో రిజిస్టర్ నిర్వహిస్తేనే శిక్షణ ముగిశాక కోచ్లకు గౌరవ వేతనం అందజేస్తారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలల్లోనూ శిక్షణకు గౌరవ వేతనం చెల్లిస్తారు. మతిస్థిమితంలేని వ్యక్తి చేరదీత భూపాలపల్లి రూరల్: మతిస్థిమితంలేని వ్యక్తిని ఖమ్మం జిల్లాకు చెందిన అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు చేరదీశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి – కాళేశ్వరం సమీపాన అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి ఒంటరిగా తిరుగుతున్నాడు. అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు బుధవారం కాళేశ్వరం మీదుగా ఖమ్మం వెళ్తుండగా సదరు వ్యక్తిని గుర్తించారు. అనంతరం ఆయనకు భూపాలపల్లి పోలీసుల సమక్షాన అంబులెన్స్లో ఖమ్మం తీసుకెళ్లారు. వైద్యం చేయించి కోలుకున్నాక కుటుంబ వివరాలు తెలిస్తే చట్టపరంగా అప్పగిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెట్టాలి
కొత్తగూడెంటౌన్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ రోహిత్రాజు పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రజలు నిర్భయంగా ఓటు వేసేలా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐలు ప్రతాప్ ,శ్రీలక్ష్మి, వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, రమాదేవి, జయసింహారెడ్డి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశం -
మక్కల కొనుగోళ్లలో దందా!
● రైతుల వద్ద తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు ● మార్క్ఫెడ్ కేంద్రాల్లో వారి పేరుతోనే విక్రయాలు ● ఫలితంగా మద్దతు ధర పొందలేకపోతున్న రైతులు ఇల్లెందు: మొక్కజొన్న కొనుగోళ్లలో వ్యాపారుల దోపిడీని అధికారులు నియంత్రించలేకపోతున్నా రు. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, రైతుల పేరుతోనే కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. ఫలితంగా రైతు క్వింటాల్కు సుమారు రూ. 500 నుంచి 700 వరకు నష్టపోతున్నాడు. మార్క్ఫెడ్ ద్వారా ఇల్లెందు, కొమరారం, గుండాల, ఆళ్లపల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో గుండాల, ఇల్లెందు సొసైటీల్లో ఏర్పాటు కేంద్రాలకు మక్కలు రాకుండా వ్యాపారులు అడ్డుపడుతున్నారు. 20 రోజులుగా ఇల్లెందు కొనుగోలు కేంద్రంలో 258 మంది రైతుల నుంచి 1,800 మెట్రిక్ టన్నులు, కొమరారంలో 76 మంది రైతుల నుంచి 525 మెట్రిక్ టన్నులు మొక్కజొన్న కొనుగోలు చేశారు. రైతుల వద్ద రూ.1,750కే.. వ్యాపారులు రైతుల వద్ద క్వింటాల్ రూ.1,450 నుంచి రూ.1,750కే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు రూ. 2,400 చొప్పున కేంద్రాల్లో వ్యాపారులు విక్రయించుకుని లాభం పొందుతున్నారు. మార్కెట్, సొసైటీ అధికా రులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారని, అందుకే వ్యాపారుల దర్జాగా కొనుగోళ్లు చేపడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రాలకు వచ్చిన పంట, విక్రయించిన రైతులు వివరాలు సేకరించి విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. సుదిమళ్ల స్టేజీ వద్ద ఇద్దరు వ్యాపారులు సొసైటీని అడ్డుపెట్టుకుని తక్కువ ధరకు పంట కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మట్టి పెడ్డలు, దుమ్ము, ధూళి ఏరివేసే జల్లెడ మిషన్లను కూడా రైతుల ముసుగులో వ్యాపారులు వినియోగించుకుంటున్నారు. కొనుగోళ్లపై సొసైటీ సీఈఓ హీరాలాల్ను వివరణ కోరగా.. రైతుల పేరుతో వచ్చే పంటనే కొనుగోలు చేస్తున్నామని, ఆరంభంలో ఎక్కువ పంట వచ్చిందని, ఇటీవల తగ్గిపోయిందని వివరించారు. -
‘క్లరికల్’ పరీక్ష ఊసేది..?
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ రాతపరీక్ష కోసం ఇంటర్నల్ అభ్యర్థులు 20 నెలలుగా ఎదురుచూస్తున్నారు. రిక్రూట్మెంట్సెల్ జీఎంలు ముగ్గురు మారినా పరీక్ష నిర్వహణ ఊసే లేదు. దీంతో అర్హులైన కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణివ్యాప్తంగా 8 విభాగాల్లో సుమారు 360 పోస్టుల భర్తీకి యాజమాన్యం 2014, మార్చిలో ఇంటర్నల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు విభాగాల్లో రాత పరీక్ష నిర్వహించి, భర్తీ ప్రక్రియ పూర్తిచేసింది. క్లరికల్ విభాగంలో జూ నియర్ అసిస్టెంట్ పోస్టులు 177 ఉండగా, 6,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాత పరీక్ష నిర్వహించకుండా జాప్యం చేస్తుండటంతో దరఖాస్తు చేసుకున్న అంతర్గత ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. నోటిఫికేషన్ విడుదల చేశాక రిక్రూట్మెంట్ సెల్ జీఎంలు ముగ్గురు మారారు. డైరెక్టర్(పా)గా కూడా ముగ్గరు మారారు. అయినా పరీక్ష మాత్రం నిర్వహించలేదు. కాలయాపన చేస్తున్న యాజమాన్యం సంస్థలో 2018 నుంచి సుమారు 18 వేల మంది మెడికల్ అన్ఫిట్ అయ్యారు. వారి వారసులు(డిపెండెంట్లు) సుమారు 16వేల మంది ఉద్యోగాల్లో చేరారు. వారిలో 98శాతం డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి, కంప్యూటర్పై అవగాహన కలిగినవారు ఉన్నా రు. ఈ నేపథ్యంలో డిపెండెంట్లకు బదిలీ వర్కర్గా పోస్టింగ్ ఇచ్చినా యాజమాన్యం క్లరికల్ పనులు చేయిస్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై యాజమాన్యం శ్రద్ధ చూపడంలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి రాత పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. -
గొంతుకోసుకున్న వ్యక్తికి శస్త్రచికిత్స
● ప్రాణం కాపాడిన జిల్లా వైద్యాధికారులు ● అభినందించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్పాల్వంచ: కుటుంబ సమస్యల నేపథ్యంలో ఓ వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, ప్రభుత్వ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణం కాపాడారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలోని నూడుల్స్ పాయింట్లో వంట మాస్టర్గా పనిచేసే వెస్ట్ బెంగాల్కు చెందిన 35 ఏళ్ల బిశాల్ తమంగ్ మంగళవారం సాయంత్రం కత్తితో గొంతు కోసుకున్నాడు. చికిత్స నిమిత్తం కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరచలించగా, అక్కడి వైద్యులు వరంగల్ లోని ఎంజీఎంకు రెఫర్ చేశారు. సమాచారం అందడంతో బాధితుడిని పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని జిల్లా ప్రధాన ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ జి.రవిబాబు సూచించారు. ఈఎన్టీ వైద్యుడైన రవిబాబు అక్కడకు చేరుకుని, జనరల్ సర్జన్ సోమరాజు దొర, మత్తు వైద్య నిపుణుడు రాంప్రసాద్, సిబ్బందితో కలిసి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. అనంతరం ఐసీయూ సేవల కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. కాగా శస్త్రచికిత్స చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
●ఒకే కుటుంబం నుంచి ఐదుగురు..
జూలూరుపాడు: మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా అక్కుల నరసింహారావు పోటీ చేస్తుండగా, అతని సోదరుడు అక్కుల రాములు సీపీఐ బలపరిచిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరి తల్లి అక్కుల నారమ్మ 2వ వార్డు నుంచి, సర్పంచ్ అభ్యర్థి రాములు పెద్ద కుమారుడు రాజేష్ 6వ వార్డు నుంచి, మరో సోదరుడు అక్కుల చిన్న రాములు 7వ వార్డు నుంచి బరిలో నిలిచారు. దీంతో కొత్తూరు పంచాయతీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. -
కేజీ ఉల్లిగడ్డలు రూ.25
సాక్షి ప్రతినిధి, భద్రాద్రికొత్తగూడెం : ఓ వైపు వరుస లొంగుబాట్లతో పార్టీ బలహీనపడుతున్నా.. మావోయిస్టుల్లోని ఒక వర్గం సాయుధ పోరాట పంథానే కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ బలగాల నుంచి తమ కార్యకలాపాలను రహస్యంగా ఉంచడంపై దృష్టి సారించింది. ఈ మేరకు కొత్తరకం కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిర్బంధంతో బృందాల మధ్య తెగిన సంబంధాలు శాంతిచర్చల ప్రస్తావన మొదలైనప్పటి నుంచి మావోయిస్టుల నుంచి తరచూ వినిపిస్తున్న మాట కమ్యూనికేషన్ గ్యాప్. ‘మా మధ్య కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. కలిసి మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వండి. ఒకసారి మాలో మేం చర్చించుకొని సాయుధ పోరాట విరమణ, లొంగుబాట్లపై సామూహిక నిర్ణయం తీసుకుంటాం’అని మావోయిస్టులు కోరుతున్నారు. ఏప్రిల్లో రూపేశ్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు దగ్గర నుంచి నిన్నటి అనంత్ వరకు అందరూ ఇదే డిమాండ్ చేశారు.కానీ ప్రభుత్వం ససేమిరా అనడంతో ఎవరికి వారే లొంగిపోతున్నారు. అయితే ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో సాయుధ పోరాట పంథా కొనసాగిస్తామంటున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు పోలీసుల కన్నుగప్పి అంతర్గత సమాచారం చేరవేసుకునేందుకు తమ కమ్యూనికేషన్ విభాగంలో కొత్తకోడ్ లాంగ్వేజ్ రూపొందించుకున్నారు. ఇటీవల బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో లభ్యమైన డాక్యుమెంట్లలో ఈ విషయం బయటపడింది.భద్రతా దళాల సమాచారం? రహస్య జీవితం, అజ్ఞాత విధానంలో పనిచేసే సంస్థలు ప్రభుత్వ / శత్రు నిఘా వర్గాలకు చిక్కకుండా కోడ్ లాంగ్వేజ్లో సమాచారం చేరవేసుకుంటాయి. అందులో భాగంగా వాడుకలో ఉండే వివిధ ప్రాంతాలు, పండ్లు, కూరగాయలు, సముద్రాలు, నదులకు సైతం కోడ్ లాంగ్వేజ్లో పేర్లు ఉన్నాయి. వివిధ నంబర్లకు కూడా ఇలాగే నిత్య జీవితంలో కనిపించే వస్తువులు, ప్రదేశాల పేర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉల్లిపాయలకు సంబంధించిన కోడ్ నేమ్ 201గా ఉంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో భాగంగా దండకారణ్యంలో సీఆర్పీఎఫ్, కోబ్రా, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ తదితర పేర్లతో భద్రతా దళాలు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. వీటికి బెటాలియన్ల వారీగా నంబర్లు కేటాయించి, అక్కడి నుంచి కంపెనీల వారీగా ప్రతీ ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంపులను నెలకొల్పుతున్నాయి.ఈ క్రమంలో బీజాపూర్, సుక్మా జిల్లాల్లో కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టే ఒక బెటాలియన్ను ఉల్లిగడ్డగా పేర్కొంటూ నక్సలైట్లు కొత్త కోడ్ లాంగ్వేజ్ రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. దాని ఆధారంగా శత్రువుల (భద్రతా దళాల) కదలికలను అంచనా వేస్తూ తమ వ్యూహాలకు పదును పెట్టే పనిచేస్తున్నట్టు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో ఉన్న ప్రభుత్వ విభాగాలు అనుమానిస్తున్నాయి. ఆ ధరకైతే వెనక్కే ఈ నెల 3వ తేదీన బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయి స్టులు, ముగ్గురు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఘటనాస్థలి నుంచి మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని భద్రతా బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. ఇందులో విప్లవ సాహిత్యం, నిత్యావసర వస్తువులు, డైరీలు, నోట్ పుస్తకాలు ఉన్నాయి. అందులోని ఒక నోట్బుక్లో రాసి ఉన్న విషయాలు అసాధారణంగా కనిపించాయి. గోండు భాషలో కేజీ ఉల్లిపాయలు రూ.25 నుంచి మొదలుపెట్టి రూ.30 వరకు రాసుకుంటూ పోయారు. వేర్వేరు ధరలకు వేర్వేరు అర్థాలు రాసుకొచ్చారు. కేజీ రూ.25 అయితే తీసుకురావొచ్చని, రూ.26 అయితే అక్కడే ఉంచాలని, రూ.27 అయితే వెనక్కి ఇవ్వాలని ఇలా ఒక్కో ధరకు ఒక్కో అర్థం రాసి ఉంది. దీనిపై అనుమానం వచి్చన భద్రతాదళాలు ఇదేమైనా కోడ్ లాంగ్వేజ్ కావొచ్చేమోనని ఆరా తీశారు. -
వైఎస్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సమత్ భట్టుపల్లి గ్రామానికి చెందిన పోలెబోయిన తిరుపతయ్య కుటుంబం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించి దాదాపు 20 ఏళ్లుగా ప్రజా సేవలో నిలకడగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ తిరుపతయ్య కాంగ్రెస్ తరఫున సమత్ భట్టుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2001 గ్రామపంచాయతీ ఎన్నికల్లో తిరుపతయ్య తల్లి సర్పంచ్గా గెలుపొందారు. ఆపై 2006 ఎన్నికల్లో తిరుపతయ్య గెలిచారు. ఇక 2013లోనూ వైసీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే, 2019లో పంచాయతీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన భార్య పోలెబోయిన శ్రీవాణి పోటీ చేసి గెలిచారు. ఇలా రెండు దశాబ్దాలుగా పంచాయతీ అధికారం నిరంతరం పోలెబోయిన కుటుంబం చేతుల్లోనే ఉంటుండగా.. తిరుపతయ్య మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. -
విమానం ఎగిరేనా?
జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రక్రియ ఒకడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఎయిర్పోర్టు కోసం ప్రత్యామ్నాయ స్థలాలను సాధ్యమైనంత త్వరగా ఎంపిక చేసి, ఫీజుబులిటీ సర్వేను నిర్వహిస్తేనే రాబోయే మూడేళ్లలో ఈ అంశంపై ఎంతో కొంత ప్రగతి సాధ్యమవుతుంది. లేదంటే ఎప్పటిలాగే విమానాశ్రయ ఏర్పాటు అంశం ప్రకటనలకే పరిమితం అవుతుంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంరెండు దశాబ్దాల కల.. కొత్తగూడెంలో విమానాశ్రయం నిర్మాణానికి గత రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడు చెలక, పాల్వంచ మండలం బంగారుజాల – గుడిపాడు ప్రాంతాల్లోని భూములను పరిశీలించారు. అయితే ఎయిర్పోర్టు నిర్మాణానికి ఈ స్థలాలు అనుకూలంగా లేవని ప్రాథమిక దశలోనే తేలింది. దీంతో ప్రభుత్వం గతేడాది కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించింది. ఈ మేరకు ఆయా మండలాల పరిధిలో మొత్తం 950 ఎకరాలు ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. మళ్లీ మొదటికొచ్చిన కథ.. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కోసం గరీబ్పేట పరిసర ప్రాంతాల్లో ఎంపిక చేసిన 950 ఎకరాల స్థలాన్ని పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన టెక్నికల్ టీమ్ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నియమించింది. ఈ బృందం జనవరి 23న క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఎంపిక చేసిన స్థలం సమీపంలో ఎత్తయిన గుట్టలు ఉండటం, ఇక్కడ గాలి వీచే దిశ, వేగం తదితర అంశాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా లేవంటూ ఆ బృందం ఫిబ్రవరిలో నివేదిక ఇచ్చింది. ఇదే సమయంలో వరంగల్ ఎయిర్పోర్ట్ పురోగతిని వివరిస్తూ మార్చిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నివేదికలోని విషయాలను వెల్లడించగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ కేంద్రం స్పష్టంగా ప్రకటన చేసింది. దీంతో కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కథ మళ్లీ మొదటికి వచ్చినట్టయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు విమానాశ్రయ నిర్మాణానికి ఎంపిక చేసే ప్రదేశానికి సంబంధించిన వాతావరణ (మెటీయోరాలాజికల్) నివేదికలు, విండ్రోజ్ డయాగ్రమ్ తదితర సాంకేతిక అంశాలు కీలకంగా ఉంటున్నాయి. అదే విధంగా సదరు స్థలంలో ఉన్న ఎత్తయిన కొండలు, నిర్మాణాలు, వాగులతో విమాన రాకపోకలకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అనే అంశాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. గతంలో ఎంపిక చేసిన బంగారుజాల – గుడిపాడు విషయంలోనూ ఎత్తయిన కొండలు, కేటీపీఎస్ చిమ్నీలు ఇబ్బందిగా మారాయి. తాజాగా గరీబ్పేటలోనూ భౌగోళిక పరిస్థితులే అడ్డుగా నిలిచాయి. అందుకే మరోసారి స్థలాన్ని గుర్తించేప్పుడు భౌగోళిక అంశాల విషయంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికై తే పాల్వంచ, బూర్గంపాడు మండలాల పరిఽధిలో కొండలు, గుట్టలు, వాగులు లేని రెవెన్యూ స్థలాలను జిల్లా యంత్రాంగం గుర్తించినట్టు సమాచారం.సందిగ్ధంలో ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రక్రియ కొత్తగూడెం ఎయిర్పోర్టు అంశంపై విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సెప్టెంబర్ 16న ఢిల్లీలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో కాకుండా మరోచోట స్థలాన్ని ఎంపిక చేస్తామని, అక్కడ ఫీజుబులిటీ సర్వే చేపట్టాలని కోరారు. ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్సింగ్ యూనివర్సిటీ ప్రారంభం, అడ్మిషన్లు, మౌలిక వసతుల కోసం ప్రణాళిక తయారీ తదితర అంశాలపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేసింది. దీంతో ఎయిర్పోర్ట్ అంశం మరుగునపడింది. ఇటీవల ఈ యూనివర్సిటీని సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా కొత్తగూడెం ఎయిర్పోర్ట్ విషయంలో కేంద్రం తన స్పందనను స్పష్టం చేసింది. ఇకనైనా ఎయిర్పోర్ట్కు ప్రత్యామ్నాయ స్థలాల ఎంపికపై జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
సమన్వయంతో పని చేయండి
● ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలి ● అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశంసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని తరలించాలని, బ్యాలెట్ పేపర్లు, బాక్సులు సరిపడా ఉన్నాయా పరిశీలించాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుతో పాటు వీడియోల ద్వారా రికార్డు చేయాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల తరలింపునకు అవసరమైన వాహనాలను ముందే సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పోలింగ్ అనంతరం ర్యాలీలు, విజయోత్సవాల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి భోజనం, రవాణా వంటి సదుపాయాలు కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. పెద్ద పంచాయతీలైన భద్రాచలం, సారపాక వంటి ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు తగినంత పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. తొలివిడతలో 159 పంచాయతీలు.. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 159 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ పాటిల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, పినపాక, చర్ల, కరకగూడెం మండలాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది అధికారులు, 2,295 మంది సిబ్బంది నియమించామని వివరించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి భద్రత కట్టుదిట్టంతో పాటు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకులు లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ సుధీర్, డీఏఓ బాబురావు, డీఎంఓ నరేందర్, ఆర్టీఓ వెంకటరమణ పాల్గొన్నారు. -
‘తొలి పోరు’కు ఏర్పాట్లు సిద్ధం
చుంచుపల్లి : జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేశామని డీపీఓ ఎం.సుధీర్కుమార్ తెలిపారు. మూడు విడతల జీపీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయని, షెడ్యూల్ ఏరియాలో 457, నాన్ షెడ్యూల్ ఏరియాలో 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకు తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో 14, రెండో విడతలో ఎన్నికలు జరిగే వాటిలో 16 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, వీటి పరిధిలోని 584 వార్డులు కూడా ఏకగ్రీవంగా నిలిచాయని తెలిపారు. మొదటి విడతలో 8 మండలాల్లోని 159 పంచాయతీలు, 1,436 వార్డులు, రెండో విడత ఏడు మండలాల్లో 155 జీపీలు, 1,384 వార్డులు, మూడో విడతలో ఏడు మండలాల్లోని 154 పంచాయతీలు, 1,330 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కోసం 3,808 పెద్దవి, 520 చిన్న బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉంచామని తెలిపారు. మొత్తంగా 13.50లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించామని, ఇందులో సర్పంచ్ స్థానాలకు సంబంధించి 6.50లక్షల పేపర్లు సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 6,69,048 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వెల్లడించారు. మూడు విడతల ఎన్నికల్లో 12,507 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని, ఇందులో పీఓలు 5,091 మంది, ఓపీఓలు 6,106 మంది ఉన్నారని, వీరికి అదనంగా 10 శాతం సిబ్బంది రిజర్వుడ్లో ఉంచామని తెలిపారు. వార్డు సభ్యుల పోలింగ్కు 200 మంది ఓటర్లు ఉంటే ఇద్దరు ఉద్యోగులతో పాటు ఒకరు అదనపు సిబ్బంది, 200 నుంచి 400 వరకు ఓటర్లు అయితే ముగ్గురు ఉద్యోగులతో పాటు ఒకరు అదనపు సిబ్బంది, 400కు పైగా ఓటర్లు ఉన్న వార్డులకు నలుగురు ఉద్యోగులతో పాటు ఇద్దరు అదనపు సిబ్బందిని కేటాయించామని వివరించారు.డీపీఓ సుధీర్కుమార్ వెల్లడి -
అప్రమత్తతతోనే ప్రమాదాలకు చెక్..
మణుగూరుటౌన్: మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు జరుగుతాయని, విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటే జరగవని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్, జీఎం (ఈఅండ్ఎం) దామోదర్రావు అన్నారు. మంగళవారం 56వ రక్షణ పక్షోత్సవాల సందర్భంగా మణుగూరు ఏరియా వర్క్ షాప్ను రక్షణ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వర్క్షాప్లో ఇన్చార్జ్ ఏరియా ఇంజనీర్ వీరభద్రుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థపై కృతజ్ఞత భావం, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మెరుగైన పర్యవేక్షణ, పనిలో అంకితభావం, సమష్టి కృషి, సమయపాలన వంటి అంశాలు రక్షణతో కూడిన పనికి దోహదపడతాయన్నారు. ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యంగా పనిచేస్తే జీవితంలో చీకటి మిగిలుతుందని, విద్యుత్ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా సింగరేణి మాజీ కార్మికుడు ఎస్డీ నాజర్పాషా రచన, దర్శకత్వంలో సింగరేణి కళాకారులు ప్రదర్శించిన ‘తస్మాత్ జాగ్రత్త’నాటకం ఆకట్టుకుంది. కార్యక్రమంలో అధికారులు టి.శ్రీకాంత్, వెంకట రామారావు, శ్రీనివాసాచారి, గుర్తింపు సంఘం నాయకులు వై.రాంగోపాల్, ఐఎన్టీయూసీ నాయకులు కృష్ణంరాజు, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు మదన్నాయక్, రక్షణ తనిఖీ బృందం సభ్యులు కృష్ణారెడ్డి, దామోదర్, సురేశ్, సుధాకర్ తదితరులు ఉన్నారు.రక్షణ తనిఖీ బృందం కన్వీనర్, జీఎం (ఈఅండ్ఎం) దామోదర్రావు -
సర్పంచ్ బరిలో గర్భిణి!
అశ్వారావుపేటరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఏడు నెలల గర్భిణి సర్పంచ్ పదవికి పోటీచేస్తోంది. మండలంలోని పాతరెడ్డిగూడెం గ్రామ పంచాయతీలో మొత్తం 644 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 310 మంది పురుషులు, 334 మంది సీ్త్రలు ఉన్నారు. అత్యధికంగా కొండరెడ్ల ఓటర్లు ఉండగా, సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. కొండరెడ్డి సామాజిక వర్గానికే చెందిన ఉమ్మల వెంకటరమణ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భంతోనే ప్రచారం నిర్వహిస్తోంది. వెంకటరమణ డిగ్రీ పూర్తి చేసింది. టేకులపల్లి: సర్పంచ్ బరిలో గర్భిణీ నిలిచింది. మండలంలోని చంద్రుతండాకు చెందిన భూక్య రాజా సతీమణి శైలజ ప్రస్తుతం 8 నెలల గర్భిణి. కాంగ్రెస్ తరఫున చంద్రుతండా పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తోంది. మంగళవారం నుంచి గ్రామంలో ప్రచారం చేస్తోంది. -
రెండు రంగుల్లో బ్యాలెట్ పేపర్
● సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ ● తెలుపు రంగు వార్డు సభ్యులకు..సుజాతనగర్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగిస్తున్న విషయం విదితమే. అయితే త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను మాత్రం బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక ఓటు సర్పంచ్కు, మరో ఓటు వార్డు సభ్యుడికి.. ఇలా రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఓటర్లకు అందజేసే బ్యాలెట్ పత్రాలు రెండు రంగుల్లో ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. బ్యాలెట్ పత్రాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండవు. కేవలం వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే కనిపిస్తాయి. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. బ్యాలెట్ పత్రం చివరలో నోటా గుర్తు ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ చివరిలో నోటాను వినియోగిస్తున్నారు. పైఅభ్యర్థులు నచ్చకపోతే ఓటరు నోటాకు ఓటు వేయొచ్చు. ఒక్క బ్యాలెట్ పేపర్లో ఎనిమిది గుర్తులతో పాటు చివరలో నోటా గుర్తుకు స్థానం ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సంఖ్య దాటితే మరో బ్యాలెట్ పేపర్ జతచేస్తారు. అంటే ఎక్కడైనా ఎనిమిది మందికి మించి బరిలో ఉంటే అదనపు బ్యాలెట్ వినియోగిస్తారు. కాగా, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామగ్రిని సంబంధిత సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించి, అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు చేపడతారు. కౌంటింగ్ కేంద్రంలో ఒక్కో వార్డు బ్యాలెట్ బాక్సును వరుసగా తెరుస్తారు. ముందు వార్డు సభ్యుల ఓట్లు లెక్కిస్తారు. ఒకవేళ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. -
భారంగా నడిపిస్తున్నారు..
కొత్తగూడెంఅర్బన్: ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి అభివృద్ధి నిధుల విడుదల లేకపోవడంతో నిర్వహణ కష్టంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో సొంత డబ్బులు ఖర్చు చేసి పనులు ముందుకు నడిపించాల్సి వచ్చిందని, అయినా కనీస గౌవరం దక్కడం లేదని యూనివర్సిటీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీగా మారే అంశం ప్రారంభమైన గత జూన్ నుంచి కూడా పనిచేస్తున్న అడ్మినిస్ట్రేషన్ విభాగం సభ్యులంతా కంటికి నిద్ర లేకుండా కష్టపడితే ఇటీవల జరిగిన సీఎం ప్రోగ్రాంలో వారికి కనీస గౌవరం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి యూనివర్సిటీగా రూపురేఖలు మారిస్తే సీఎంకు కనీసం బొకే ఇచ్చే అవకాశం కూడా కల్పించలేదని, కనీసం సీఎం ఉన్న సమయంలో స్టేజీ మీదకు కూడా వచ్చే అవకాశం రాలేదని వాపోతున్నారు. ఇలా ఉంటే భవిష్యత్లో యూనివర్సిటీ కోసం ఏరకంగా పని చేయగలుగుతామని ప్రశ్నిస్తున్నారు. యూనివర్సిటీకి కేటాయించిన రిజిస్టర్ బాధ్యత అంతా కూడా తీసుకొని ముందుండి నడిపించాల్సి ఉండగా అలా జరుగలేదని, జిల్లా అధికారుల ఒత్తిడి, ఆదేశాల మేరకు పని చేసిన వారిని ప్రోగ్రాంలో పట్టించుకోకపోవడం చాలా ఇబ్బంది కలిగించిందంటున్నారు. పరీక్షలపై లేని క్లారిటీ.. డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో సిలబస్ లేకపోవడంతో కాకతీయ యూనివర్సిటీ అధికారులే మూడు నెలల క్రితం తయారు చేశారు. దీంతో పాటుగా విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి ఫీజులు తీసుకొని, వాటిని యూనివర్సిటీ బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. కానీ, ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలు తెరవకపోవడంతో ఆ ఫీజులన్నింటినీ కాకతీయ యూనివర్సిటీ బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశారు. యూనివర్సిటీకి ప్రత్యేక అకౌంట్లు తీసుకోవాల్సిన అవసరాన్ని వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లిన కూడా ఫలితం లేదనే ఆరోపణలున్నాయి. యూనివర్సిటీ అవసరాలకు సంబంధించి ప్రతిపాదనలు పెట్టిన కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ప్రస్తుతం నూతనంగా అడ్మిషన్లు తీసుకొని యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న యూజీ, పీజీ విద్యార్థులకు జనవరిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లే ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని, పైగా యూనివర్సిటీలో పనిచేస్తారా.. కేయూలో పని చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని హెచ్వోడీ స్థాయి అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ విద్యార్థులకు సంబంధించి అధ్యాపకులు ఆరుగురికిపైగా వరంగల్లో డిప్యూటేషన్లో పనిచేస్తున్నారు. దీంతో బీటెక్లో అధ్యాపకుల కొరత ఒక వైపు వేధిస్తుంటే, మరో వైపు యూనివర్సిటీలో కూడా ఇప్పుడిప్పుడే అధ్యాపకుల నియమాకం జరుగుతుండడం, రెండింటిని కూడా నడిపించడం అధ్యాపకులకు కత్తిమీద సాములాగా మారింది. యూనివర్సిటీకి సంబంధించి పూర్తిస్థాయి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, టీచింగ్ స్టాఫ్, స్థానికంగా రిజిస్ట్రార్ స్థాయి అధికారి ఉంటే తప్పా యూనివర్సిటీ గాడిలో పడే అవకాశం లేదు.ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో పరీక్షలపై లేని క్లారిటీ -
తుది విడతలో 10 జీపీలు ఏకగ్రీవం
చుంచుపల్లి: మూడో విడత ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీలు, వార్డులకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ముగిసింది. బుజ్జగింపులు, బేరసారాలు జరగడంతో చివరి నిమిషంలో కొందరు నామినేషన్లు ఉపసంహరించుకోగా ఆయా స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 155 గ్రామపంచాయతీలు, 1,330 వార్డులకు ఈనెల 17న మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కోర్టు ఆదేశాలతో జూలూరుపాడు పంచాయతీకి ఎన్నికల ప్రక్రియ నిలిచిన విషయం విదితమే. ఇక నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 10 గ్రామ పంచాయతీలు, 224 వార్డు స్థానాలు ఏకగ్రీవంగా నిలిచాయి. మొదటి విడతలో 14 జీపీలు, 336 వార్డులు, రెండో విడతలో 16 జీపీలు, 240 వార్డులు, మూడో విడతలో 10 జీపీలు, 224 వార్డులు ఏకగ్రీవం కావడం విశేషం. తుది విడత ఎన్నికల బరిలో నిలిచే సర్పంచ్, వార్డుల అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా.. బుధవారం నుంచి వీరి ప్రచారపర్వం ప్రారంభం కానుంది. ఏకగ్రీవంగా నిలిచినవివే.. సుజాతనగర్ మండలంలో టూ ఇంకై ్లన్ గ్రామపంచాయతీ సర్పంచ్తో పాటు మొత్తంగా 30 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 12 పంచాయతీలు, 80 వార్డులకు పోలింగ్ జరుగనుంది. ఆళ్లపల్లిలో 12 పంచాయతీలు, 90 వార్డులకు గాను నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. గుండాలలో 11 గ్రామపంచాయతీలు, 96 వార్డులకు మామకన్ను, దామరతోగు జీపీలతో పాటు 18 వార్డులు ఏకగ్రీవంగా నిలిచాయి. 9 గ్రామపంచాయతీలు, 78 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు. జూలూరుపాడు మండలంలో శంభునిగూడెం, వినోభానగర్ జీపీలతో పాటు 14 వార్డులు ఏకగ్రీవం కాగా, 23 గ్రామపంచాయతీలు, 174 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. లక్ష్మీదేవిపల్లిలో హరియాతండా, కారుకొండ, అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీలు, 39 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28 పంచాయతీలు, 251 వార్డులకు పోలింగ్ జరగనుంది. టేకులపల్లి మండలంలో 68 వార్డు స్థానాలు మాత్రమే ఏకగ్రీవం కాగా, 36 గ్రామపంచాయతీలు, 244 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇల్లెందు మండలంలో 29 గ్రామపంచాయతీలు, 274 వార్డులకు గాను సుభాష్నగర్, ధనియాలపాడు గ్రామ పంచాయతీలతో పాటు 51 వార్డులు ఏకగ్రీవంగా నిలిచాయి. మిగిలిన 27 జీపీలు, 223 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.224 వార్డు స్థానాలు కూడా.. -
ముక్కోటి భక్తులకు ఏర్పాట్లు
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గోదావరి కరకట్ట ప్రాంతంలో తెప్పోత్సవం, ఏరు ఉత్సవం ఏర్పాటుచేసే ప్రదేశాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్ పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్పెషల్ సబ్ జైలులో ఖైదీలు తయారుచేస్తున్న హెర్బల్ అగర్బత్తీ యూనిట్ను, లీగల్ ఎయిడ్ క్లినిక్ను సందర్శించారు. క్షణికావేశంలో తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లాక ఉపాధి పొందేలా శిక్షణ ఇప్పించాలని జైలు అధికారులకు సూచించారు. ఖైదీలు తయారు చేస్తున్న అగర్బత్తీలు బాగున్నాయని, వీటిని స్థానిక మార్కెట్లో విక్రయించాలని అన్నారు. వీటితో పాటు పేపర్ కప్పులు, పేపర్ బాక్సుల తయారీ యూనిట్ కూడా పెట్టుకుంటే ఖైదీలకు ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో కౌజు పిట్టల పెంపకానికి ఖాళీ ప్రదేశంలో ఏర్పాట్లు చేసుకోవాలని జైలర్ ఉపేందర్కు సూచించారు. ఆ తర్వాత బ్రిడ్జి పాయింట్లో ఉన్న శిశుగృహాన్ని సందర్శించి శిశువులకు, చిన్నారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. శిశువులు రక్తహీనతకు గురికాకుండా పౌష్టికాహారం అందించాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో అనాథ పిల్లలను ఆశ్రమాల్లో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, రామాలయ ఈఓ దామోదర్ రావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ డీఈ జీవన్కుమార్, ఇరిగేషన్ ఏఈ వెంకటేశ్వరరావు, పంచాయతీ ఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వెల్లడి -
వృద్ధులకు చట్టపరమైన రక్షణ అవసరం
సుజాతనగర్: వృద్ధులకు గౌరవంతో పాటు చట్టపరమైన రక్షణ అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ అన్నారు. పాత అంజనాపురంలో ఇటీవల ఏర్పాటైన వృద్ధాశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, వృద్ధులను గౌరవించడం చట్టపరమైన భాద్యత అన్నారు. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం –2007 గురించి వివరించారు. ఆశ్రమం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిర్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తం రావు, ఆశ్రమ నిర్వాహకులు పోటు రాఘవరావు, కొల్లు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మహిళా సమాఖ్య సభ్యులు మంగళవారం ఆవిష్కరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కాకపోగా, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత పర్యవేక్షణలో వేడుక నిర్వహించారు. ఉపాధ్యాయురాలికి ఉత్తమ అవార్డుభద్రాచలంటౌన్/పాల్వంచ : భద్రాచలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని భవిత కేంద్రంలో పనిచేస్తున్న ఐఈఆర్పీ రేగళ్ల సుమలత జిల్లా స్థాయి ఉత్తమ ఇంక్లూజివ్ టీచర్గా ఎంపికయ్యారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్వంచలోని ఐడీఓసీలో అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఈఓ నాగలక్ష్మి సుమలతను అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో సుమలత మాట్లాడుతూ.. తనకు ఈ పురస్కారం రావడానికి సహకరించిన ఐఈ కో ఆర్డినేటర్ సైదులు, విద్యా శాఖాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. 13న నవోదయ ప్రవేశ పరీక్షకొత్తగూడెంఅర్బన్ : 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 13న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రవేశ పరీక్షకు జిల్లా నుంచి 1,852 మంది విద్యార్థులు హాజరవుతారని, ఇందుకోసం జిల్లాలో 8 సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. అశ్వారావుపేటలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర, భద్రాచలంలోని ఎస్ఎన్ఎం జెడ్పీహెచ్ఎస్ కొర్రాజులగుట్ట, భద్రాచలం జీహెచ్ఎస్, బూర్గంపాడు జీహెచ్ఎస్, కొత్తగూడెంలో సింగరేణి పాఠశాల, సెయింట్ మేరీస్, ఇల్లెందులోని సింగరేణి స్కూల్, జీహెచ్ఎస్ జేబీఎస్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 13వ తేదీ ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని, గంట ముందుగానే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే 94906 55706 నంబర్లో సంప్రదించాలన్నారు. -
వైఎస్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి..!
● 20 ఏళ్లుగా ప్రజా సేవలో తిరుపతయ్య కుటుంబం కరకగూడెం: సమత్ భట్టుపల్లి గ్రామానికి చెందిన పోలెబోయిన తిరుపతయ్య కుటుంబం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించి దాదాపు 20 ఏళ్లుగా ప్రజా సేవలో నిలకడగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ తిరుపతయ్య కాంగ్రెస్ తరఫున సమత్ భట్టుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2001 గ్రామపంచాయతీ ఎన్నికల్లో తిరుపతయ్య తల్లి సర్పంచ్గా గెలుపొందారు. ఆపై 2006 ఎన్నికల్లో తిరుపతయ్య గెలిచారు. ఇక 2013లోనూ వైసీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే, 2019లో పంచాయతీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన భార్య పోలెబోయిన శ్రీవాణి పోటీ చేసి గెలిచారు. ఇలా రెండు దశాబ్దాలుగా పంచాయతీ అధికారం నిరంతరం పోలెబోయిన కుటుంబం చేతుల్లోనే ఉంటుండగా.. తిరుపతయ్య మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. -
రామయ్య క్యాలెండర్లు సిద్ధం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల కోసం నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు సిద్ధం చేయగా ఈఓ కొల్లు దామోదర్రావు మంగళవారం ఆవిష్కరించారు. తొలుత వీటిని అంతరాలయంలో మూలమూర్తుల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య రంగురంగుల చిత్రాలను క్యాలెండర్, డైరీలలో పొందుపర్చామని తెలిపారు. స్వామివారి అవతారాలు, ముక్కోటి, శ్రీరామవమని వంటి ఉత్సవాల ఫొటోలతో పాటు ఆలయ సమాచారం, ప్రత్యేక, ఆర్జిత పూజల వివరాలతో కూడిన 12 పేజీల క్యాలెండర్ రూ.120, డైరీ రూ.75 చొప్పున విక్రయించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భక్తులు, పర్యాటకులు, స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానాచార్యులు స్థలశాయి. వేద పండితులు కృష్ణమాచార్యులు, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, ఏఈఓ శ్రవణ్కుమార్, ఈఓ సీసీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
ఎన్డీ అభ్యర్థులను గెలిపించండి
ఇల్లెందు: దోపిడీ పాలక వర్గ పార్టీల అభ్యర్థులను ఓడించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పీడిత ప్రజల రాజ్య స్థాపనకు పోరాడే ఎన్డీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు పిలుపునిచ్చారు. మంగళవారం ఇల్లెందులోని ఎన్డీ కార్యాలయంలో పలు గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బూర్జువా పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమైందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్కోడ్లను అమలులోకి తెచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ అడ్డదారులు తొక్కి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 1978 నుంచి ఈ ప్రాంతంలో ఎంఎల్ పార్టీల అభ్యర్థులే విజయం సాధించారని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ఇల్లెందు మండలంలో 11 గ్రామ పంచాయతీల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్డీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, పార్టీ నాయకులు జె.సీతారామయ్య, ఎండీ రాసుద్ధీన్, మండల కార్యదర్శి పొడుగు నర్సింహారావు, మోతీలాల్, సంతు, సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర నేతలు సాధినేని, మధు -
ముగిసిన మొదటి దశ ఎన్నికల ప్రచారం
ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులుచుంచుపల్లి: తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో ప్రధానమైన ప్రచార పర్వం ముగిసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడగా మైకులు మూగబోయాయి. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసేవారు గత వారం రోజులుగా విస్తృత ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. ప్రచార గడువు ముగియడంతో ప్రలోభాల పర్వం మొదలైంది. దాదాపు సర్పంచ్ అభ్యర్థులంతా డబ్బు పంపకాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రధానంగా గ్రామాల్లో మూకుమ్మడిగా పడే ఓట్లపై అభ్యర్థులు కన్నేశారు. మరో వైపు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని స్వగ్రామాలకు తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మందు, విందు పార్టీలు జోరందుకోగా పోలీసులు కూడా అప్రమత్తమై తనిఖీలు తీవ్రతరం చేశారు. ఇక మొదటి విడత 159 గ్రామపంచాయతీల్లో 14 జీపీలు, 336 వార్డులు ఏకగ్రీవం కాగా, మూడు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో 145 జీపీలతో పాటు 1,097 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ స్థానాలకు 461 మంది, వార్డులకు 2,567 మంది బరిలో నిలిచారు. -
చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి
బూర్గంపాడు: పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలలోని పినపాకపట్టీనగర్ గ్రామానికి చెందిన ఆదెమ్మ (63) తన భర్త వెంకటేశ్వర్లుతో కలిసి పాల్వంచలోని తన మనవడి వద్ద ఉంటోంది. వీరికి ముగ్గరు కుమార్తెలు. సోమవారం భద్రాచలం వెళ్లి తిరిగి పాల్పంచ వెళ్తున్న ఆదెమ్మ పినపాకలో దిగి ఇంటికి చేరుకుంది. తర్వాత గ్రామంలోని వైకుంఠధామం సమీపంలో పురుగులమందు తాగింది. స్థానికులు ఆమెను పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లగా మంగళవారం మృతిచెందింది. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోందని, అందుకే పురుగులమందు తాగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి మనవడు రమేశ్బాబు ఫిర్యాదు మేరకు అదనపు ఎస్ఐ నాగభిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్య బూర్గంపాడు: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని సోంపల్లి గ్రామానికి పెంకె ప్రేమలత (48) సోమవారం రాత్రి తన నివాసంలో ఉరేసుకుంది. అర్ధరాత్రి గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను మోరంపల్లిబంజర పీహెచ్సీ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుమారుడు అఖిల్ ఫిర్యాదు మేరకు అదనపు ఎస్ఐ నాగభిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పురుగుల మందు తాగి వ్యక్తి.. చింతకాని: మండలంలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన శీలం అంజి(37) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. నాటుసారా స్థావరాలపై దాడులు.. ● 1,900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం దుమ్ముగూడెం: మండలంలోని సుజ్ఞానపురం గ్రామంలోని నాటుసారా స్థావారాలపై దుమ్ముగూడెం పోలీస్, ఎకై ్సజ్ శాఖ పోలీసులు సంయుక్తంగా మంగళవారం దాడులు నిర్వహించారు. అటవీ ప్రాంతంలో దాచిన 1,900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి 16 డ్రమ్ములను తగలబెట్టారు. నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎకై ్సజ్ సీఐ రహీమున్నీసా, ఎస్ఐ సీతారామరాజు, స్థానిక ఎస్ఐ రాజశేఖర్, డీటీఎఫ్ ఎస్ఐ గౌతమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు
పాల్వంచరూరల్: మండలంలోని పెద్దమ్మతల్లిని డీసీసీ అధ్యక్షులు తోట దేవీప్రసన్న, జగన్నాథపురం అభ్యర్థి బి.అనితతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం మండలంలోని జగన్నాథపురంలో పోటీ చేస్తున్న అనితతో కలిసి దేవీప్రసన్న ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బానేని నాగేశ్వరరావు, దార్ల జ్యోషి, నందనాయక్, బాదర్ల నాగేశ్వరరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పుష్కరఘాట్ల పరిశీలన దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాల, దుమ్ముగూడెం గ్రామాల్లోని పుష్కరఘాట్లను హైదరబాద్కు చెందిన ప్రైవేట్ ఈవై కన్సల్టెన్సీ బృందం సభ్యులు సాయితేజ, కుసా, తాహరీం మంగళవారం పరిశీలించారు. 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలకు అనువుగా పుష్కరఘాట్లను ఏర్పాటు చేసేందుకు తొలుత పర్ణశాల ఘాట్లను పరిశీలించి ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పర్ణశాలలో ఘాట్ల నిర్వహణ ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయని, అందుకు గాను దుమ్ముగూడెం వద్ద ఘాట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. అనంతరం దుమ్ముగూడెంలోని నందులరేవు పుష్కరఘాట్లను ఫొటోలు తీసుకుని వెళ్లారు. వారి వెంట ఇరిగేషన్ జేఈ రాజ్సుహాస్, పీటీ మస్తాన్వలీ తదితరులు పాల్గొన్నారు. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలి..● ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు సర్వేశ్వరరెడ్డి బూర్గంపాడు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పలు పోలింగ్ కేంద్రాలు, చెక్పోస్టులను జిల్లా సాధారణ పరిశీలకులు వి.సర్వేశ్వరరెడ్డి మంగళవారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేసే ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, టోకెన్ల పంపిణీతోపాటు మోరంపల్లి బంజర జెడ్పీహెచ్ఎస్, పినపాకపట్టీనగర్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, లైటింగ్ వంటి సదుపాయాలపై అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మోరంపల్లి బంజర, కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను తనిఖీ చేశారు. డబ్బు, మద్యం రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మాజీ మావోయిస్టు నాయకుడు మృతిఅశ్వాపురం: మండలంలోని చింతిర్యాల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నాయకుడు తోట సీతారామయ్య(70) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయన 1980లో విప్లవోద్యమంలో భాగమయ్యాడు. కొంత కాలం పీస్ బుక్ సెంటర్లో విప్లవ సాహిత్యాన్ని అమ్మే పనిచేయగా అప్పుడు పీబీసీ కుమార్ అని పిలిచేవారు. 1985లో పీస్బుక్ సెంటర్ మూసేశాక కొరియర్గా పనిచేశాడు. డీటీపీ, ఆప్సెట్ ప్రింటింగ్ నేర్చుకొని విప్లవ సాహిత్యాన్ని అచ్చువేసి ఉద్యమ ప్రాంతాలకు తరలించేవాడు. 2001నుంచి దండకారణ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతికి కంప్యూటర్ ఆపరేటర్గా, సహాయకుడిగా పనిచేయడం ప్రారంభించారు. ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన సీతారామయ్య 2023లో చికిత్స కోసం బయటకు వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత బెయిల్పై విడుదల కాగా, అనారోగ్యంతో చింతిర్యాలలో ఉంటూ సోమవారం మృతి చెందగా, మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. -
నేడు తెలగాణ తల్లి విగ్రహావిష్కరణ
సూపర్బజార్(కొత్తగూడెం): స్థానిక ఐడీఓసీలో మంగళవారం ఉదయం 10 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికా రులు, అనధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకంఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ సూపర్బజార్(కొత్తగూడెం): గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం మైక్రో అబ్జర్వర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు విడతల్లో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. పోలింగ్కు ముందురోజే పరిశీలకులు తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ప్రతి దశలోనూ నిశితంగా పర్యవేక్షిస్తూ, ఎన్నికల నియమావళి అమలుతీరును అంచనా వేసి సాధారణ పరిశీలకులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సాయికృష్ణ, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడికి ఉత్తమ అవార్డుదుమ్ముగూడెం : దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో నాన్ భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న దుమ్ముగూడెం మండల ఐఈఆర్పీ సతీష్కు జిల్లా స్థాయి ఉత్తమ ఇంక్లూజివ్ టీచర్ అవార్డు దక్కింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఈఓ నాగలక్ష్మి చేతుల మీదుగా ఆయన సోమవారం అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. దివ్యాంగ చిన్నారులకు తాను అందిస్తున్న సేవలకు గాను ఉత్తమ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పారు. ‘ఐఈఎల్టీఎస్’ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఉమ్మడి జిల్లా విద్యార్థులకు ఖమ్మంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన ఐఈఎల్టీఎస్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. ఈ శిక్షణ ద్వారా విదేశాల్లోని అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు, స్కాలర్షిప్ పొందేలా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్హులైన వారు టీజీఎస్ బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ www. tgbcstudycircle. cgg. gov. in ద్వారా ఈ నెల 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 08742–227427, 94419 31359, 96521 61850, 90597 93456 నంబర్లలో సంప్రదించాలని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. -
ఉన్నత విద్యకు తోడ్పాటు
● కేజీబీవీల్లో విద్యార్థినులకు పోటీ పరీక్షలపై ప్రత్యేక శిక్షణ ● ఉమ్మడి జిల్లాలో ఆరు పాఠశాలలు ఎంపిక ● నెల రోజుల నుంచి కొనసాగుతున్న తరగతులుకరకగూడెం: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో చదువుతున్న విద్యార్థినులు పోటీ పరీక్షల్లో రాణించేలా, రాష్ట్ర, జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సాధించేలా రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థినుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 14 కేజీబీవీలు ఉండగా, వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 3,700 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఖమ్మంలో జిల్లాలో 14 కేజీబీవీలు ఉండగా, 4,300 మంది విద్యనభ్యసిస్తున్నారు. పెరగనున్న ఆదరణ మెరుగైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణలతో కేజీబీవీలకు ఆదరణ పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని కేజీబీవీల్లో శిక్షణ అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. కేజీబీవీల్లో 6వ తరగతి, ఇంటర్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
మద్యం రవాణా అరికట్టాలి
ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సూచించారు. వాతావరణ ం జిల్లాలో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. రాత్రి వేళ చలి ప్రభావం మాత్రం మరింతగా పెరుగుతుంది. కామేపల్లి: కామేపల్లి మండలం పాతలింగాలకు చెందిన దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి గ్రామ సర్పంచ్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. స్వగ్రామానికి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై న వెంకటరెడ్డి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. 1967లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి పంచాయతీగా లింగాల సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు. 1977లో ఏకగ్రీవం కాగా.. పదేళ్లు సర్పంచ్గా పని చేశారు. 1996లో సుజాతనగర్లో ఉప ఎన్నిక రావడంతో అక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మళ్లీ 1999, 2004 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పాలేరు నుంచి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలాగే, 2009లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా, 2016లో అనారోగ్యంతో ఆయన మృతి చెందారు. -
ఓటుకు నోటొద్దంటూ..
భద్రాచలం: విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దని, పైసాకు అమ్ముడుపోతే ఐదేళ్లు బానిస కావాలని, అభివృద్ధే ప్రధానంగా సర్పంచ్కు ఎన్నుకోండంటూ ఓ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీలో ఆదివాసీ పూనెం ప్రదీప్కుమార్ సర్పంచ్ బరిలో నిలిచాడు. మిగతా అభ్యర్థులకు భిన్నంగా ప్రచారం సాగిస్తున్నాడు. కళాశాలలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లతో గ్రూపు మీటింగ్లు నిర్వహిస్తున్నాడు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశానని, ఓటర్లలో చైతన్యం తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొంటున్నాడు. తాను గెలిస్తే భద్రాచలం అభివృద్ధికి నిస్వార్థంగా పాటుపడతానని చెబుతున్నాడు. సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం -
గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏలో నిర్వహించే గిరిజన దర్బార్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీఓ డేవిడ్ రాజ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించిన దర్బార్లో అర్జీలు మాత్రమే స్వీకరించినట్లు పేర్కొన్నారు. అర్జీల వివరాలు ప్రత్యేక రిజిస్టర్తోపాటు ఆన్లైన్లో నమోదు చేస్తామని చెప్పారు. ఎన్నికల నియమావళి ముగిశాక సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. నిరుద్యోగులకు ఉచిత శిక్షణజూలూరుపాడు: భద్రాచలం ఐటీసీ, ప్రతం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బూర్గంపాడులో పురుషులకు ఎలక్ట్రికల్, సోలార్ రంగంలో శిక్షణ, భద్రాచలంలో మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉచిత భోజన వసతి కూడా ఉంటుందని, 18–35 ఏళ్ల వయస్సు కలిగిన 8, 9, 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా చదువుకున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. వలంటీర్ల ఎంపికకు దరఖాస్తులుసూపర్బజార్(కొత్తగూడెం): యూత్ వలంటీర్ల ఎంపిక కోసం ఉమ్మడి జిల్లాలోని యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ తెలిపారు. ఏడాది సమాజసేవ నిమిత్తం 2025 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18–29 ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, చదువుతున్న వారు, ఉద్యోగులు అనర్హులని స్పష్టం చేశారు. ఎంపికై న వలంటీర్లకు నెలకు రూ.5వేలు స్టైఫండ్ చెల్లించనున్నందున యువజన సంఘాల స్థాపన, క్రీడలు, ఆరోగ్యం, అక్షరాస్యత, లింగ వివక్ష తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కలిగిన వారు https:// nyks.nic.in/ NationalCrops/nyc.html ద్వారా మండలాన్ని ఎంచుకుని ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 08742–296777 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో ప్రతిభ ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్–17 బాలబాలికల బీచ్ వాలీబాల్ పోటీలను ఖమ్మం సీక్వెల్ రిసార్ట్స్లోని కృత్రిమ బీచ్లో సోమవారం జరిగాయి. పోటీలకు పాత పది జిల్లాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈమేరకు బాలుర విభాగంలో ఖమ్మం జట్టు విజేతగా నిలవగా, రెండు, మూడో స్థానాల్లో మెదక్, నిజామాబాద్ జట్లు నిలిచాయి. ఇక బాలికల విభాగంలో ప్రథమస్థానం నిజామాబాద్ జట్టు సాధించింది. ద్వితీ య, తృతీయ స్థానాల్లో ఖమ్మం, హైదరాబాద్ జట్లు నిలిచాయి. విజేతల జట్లకు పోటీల రాష్ట్ర పరిశీలకులు మధు అందజేయగా, వాలీబాల్ అసోసియేషన్జిల్లాకార్యదర్శి బి.గోవిందా రెడ్డి, జిల్లా పాఠశాలల క్రీడల కార్యదర్శి వై.రామారావుతో పాటు డి.సైదులు, ఆదర్శ్కుమార్, నాగూల్మీరా, చిన్ని, అంజయ్య పాల్గొన్నారు. ‘కంపా’ నిధులెన్ని కేటాయించారు? ఖమ్మంమయూరిసెంటర్: సాగునీరు, విద్యుత్ సహా వివిధ రకాల ప్రాజెక్టుల కోసం తీసుకునే అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూముల్లో అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం కాంపెన్సేటరీ అఫారేస్టేషన్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ(కంపా) నిధులను ఎంత మేర కేటాయించారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారని ఆయన సోమవారం లోక్సభలో అడిగారు. దీంతో ‘కంపా’ నిధుల్లో భాగంగా తెలంగాణకు ఇప్పటివరకు రూ.3,852.61 కోట్లు అందించినట్లు కేంద్ర అటవీ శాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు. -
రామనామంతో మార్మోగిన భద్రగిరి
భద్రాచలం : భద్రగిరి మాఢ వీదులు జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగాయి. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులు చేపట్టిన శ్రీరామ పునర్వసు దీక్షను సోమవారం విరమించారు. ఆలయ ఈఓ కె.దామోదర్రావు దంపతులు శ్రీరామ పాదుకలను శిరస్సుపై ధరించగా.. మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శ్రీరామదాసు విగ్రహానికి పూలమాలలు అలంకరించారు. అనంతరం బేడా మండపంలో శ్రీరామ దీక్షా విరమణ పూజలు, సంక్షిప్త రామాయణ హవనం జరిపారు. ఆ తర్వాత సేవాకాలం, ప్రవచనం, తీర్ధ గోష్టి గావించారు. సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామికి పంచామృతాలతో స్నపన తిరుమంజనం చేశారు. ముత్తంగి అలంకరణలో దర్శనం.. శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.వైభవంగా పునర్వసు దీక్ష విరమణ -
ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
భద్రాచలంఅర్బన్ : ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కొందరు అక్రమంగా మద్యం, నగదు రవాణా చేస్తుంటారని, అలాంటి వాటిని అరికట్టాలని ఎస్పీ రోహిత్రాజు సిబ్బందికి సూచించారు. భద్రాచలం బ్రిడ్జి పాయింట్లో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్టును సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అందుకు సంబంధించిన వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని చెప్పారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ సతీష్ తదితరులు ఉన్నారు.ఎస్పీ రోహిత్రాజు -
పిట్లైన్పై పట్టింపేది ?
● టెర్మినల్ స్టేషన్గా భద్రాద్రి కొత్తగూడెం ● జిల్లా మీదుగా మూడు కొత్త లైన్లు ● భద్రాచలంరోడ్లో రైలు నిర్వహణ సౌకర్యం ● నానాటికీ పెరుగుతున్న పిట్లైన్ అవసరంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గతంలో నడిచిన రైళ్లను పునరుద్ధరించడంతో పాటు కొత్త రైళ్లు నడిపించేందుకు వీలుగా భద్రాచలం రోడ్లో ‘రేక్’ నిర్వహణ కోసం ఆధునిక పిట్లైన్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రైలు నిర్వహణ సౌకర్యాలు మెరుగుపడితే దాని తాలూకూ ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాకుండా ఉత్తర తెలంగాణ మొత్తానికి ఉపయోగపడే అవకాశం ఉంది. కొత్త రైళ్ల కొరత.. తెలంగాణ నుంచి తిరుపతి, షిర్డీ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్తున్న భక్తుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతోంది. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి తిరుపతికి రైలు కావాలనే డిమాండ్ అధికంగా ఉంది. ఇదే విషయాన్ని ఈ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు గతంలో అనేక సార్లు రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్, ఖమ్మం నుంచి రోజుకు మూడు రైళ్లు తిరుపతికి ఉన్నందున భద్రాచలంరోడ్ నుంచి కొత్త రైలు అవసరం లేదని, మంచిర్యాల స్టేషన్లో రైలు నిర్వహణకు సరిపడా మౌలిక సదుపాయాలు లేనందున అక్కడి నుంచి తిరుపతికి రైలు నడిపించలేమని రైల్వే బోర్డు నుంచి సమాధానాలు వస్తున్నాయి. దశాబ్దాల తరబడి రైల్వే పరంగా సికింద్రాబాద్, ఆ తర్వాత కొద్దో గొప్పో కాజీపేట మినహా మరే స్టేషన్ కూడా అభివృద్ధి చెందకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. మౌలిక సదుపాయాలేవి..? సాధారణంగా ఒక రైలుకు ఉపయోగించే బోగీలన్నింటిని కలిపి రేక్ అంటారు. ఈ రేక్లో ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై నాలుగు వరకు బోగీలు ఉంటాయి. సాధారణంగా ఈ బోగీలు మూడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాక ఒకసారి సాధారణ మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అవి తిరిగి ప్రయాణానికి అనువుగా ఉంటాయి. గతంలో సింగరేణి రైలు మెయింటెనెన్స్ భద్రాచలంరోడ్ స్టేషన్లో ఉండేది. ఇందు కోసం స్టేషన్ ఆవరణలో 14 బోగీల సామర్థ్యం కలిగిన పిట్లైన్ కూడా నిర్మించారు. కాలక్రమేనా సింగరేణి రైలు నిర్వహణ భారం కాజీపేటకు తరలిపోయింది. అప్పటి నుంచి రైలు రేక్ల మెయింటెనెన్స్ విషయంలో భద్రాచలం రోడ్ స్టేషన్కు ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో కాజీపేట – మణుగూరు ప్యాసింజర్, బెళగావి ఎక్స్ప్రెస్లు నడిపించడం లేదని రైల్వేశాఖ పైకి చెబుతున్నా, ఆయా రైళ్ల నిర్వహణకు సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు ఇక్కడ లేకపోవడమే అసలు కారణం. భద్రాచలం రోడ్ కీలకం మణుగూరు – రామగుండం రైల్వే లైన్ నిర్మాణానికి రూ.4వేల కోట్లతో రైల్వే శాఖ డీపీఆర్ సిద్ధం చేసింది. దీని నిర్మాణం పూర్తయితే బల్లార్షా – కాజీపేట – విజయవాడ మార్గానికి మరో ప్రత్యామ్నాయ లైన్ అందుబాటులోకి వస్తుంది. భద్రాచలం – మల్కన్గిరి (ఒడిశా) కొత్త లైన్ను కేంద్రం 2024 ఆగస్టులో మంజూరు చేసింది. ఈ మార్గంలో 173 కిలోమీటర్ల మేరకు కొత్త లైన్ నిర్మించనున్నారు. ఇక కొత్తగూడెం – కిరోండల్ మధ్య దూరం 180 కిలోమీటర్లుగా ఉంది. ఈ లైన్ నిర్మాణానికి ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయింది. ఇవి కాకుండా డోర్నకల్ – భద్రాచలం రోడ్ – మణుగూరు లైన్ ప్రస్తుతం సింగిల్ నుంచి డబ్లింగ్గా అప్గ్రేడ్ అవుతోంది. భద్రాచలంరోడ్ – సత్తుపల్లి మార్గం కూడా ప్రారంభం కాగా, దీన్ని కొవ్వూరు వరకు పొడిగించే అవకాశం ఉంది. ఇందులో సగం ప్రాజెక్టులు మొదలైనా.. దక్షిణ మధ్య రైల్వేలో భద్రాచలంరోడ్ స్టేషన్ కీలకంగా మారుతుంది. అందుకు తగ్గట్టుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉత్తర తెలంగాణ మీదుగా వెళ్లే రైళ్ల నిర్వహణ కోసం భద్రాచలంరోడ్లో 24 బోగీల సామర్థ్యంతో కొత్త పిట్లైన్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.


