Bhadradri
-
పురుగుల మందు తాగి ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఆసుపాక గ్రామానికి చెందిన వీర్నాల సత్యనారాయణ(27) గతకొద్ది నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈక్రమంలో బుధవారం ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్లిన ఆయన గురువారం ఉదయం గుమ్మడవల్లి గ్రామ సమీపంలోగల పెదవాగు ప్రాజెక్టు ఆనకట్టపై విగతజీవిగా మారాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు.కాగా, మృతుడు మూడు నెలల క్రితమే సొంతింటిని నిర్మించుకోగా.. అప్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మన్మోహన్ సింగ్ ‘ఎర్త్ సైన్సెస్’
● కొత్తగూడెం వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు ● తెలంగాణ కేబినెట్ సమావేశంలో లభించిన ఆమోదం ● జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇటీవల మంజూరైన ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో జిల్లా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో మొదటిది సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్గా 50 ఏళ్ల క్రితం 300 ఎకరాల్లో మొదలై యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (కాకతీయ)గా అప్గ్రేడ్ చెందిన కేఎస్ఎం ప్రస్థానంలో మరో ఎత్తుకు చేరుకుంది. ఇటీవల ఈ కాలేజీని యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్గా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఇప్పుడీ కాలేజీకి ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరును పెట్టింది. నాగరికతతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంలో సహజ వనరులు కీలక పాత్ర పోషించనుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులను అమలుతో జాతీయస్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. అందించే కోర్సులు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కావడంతో దేశ విదేశాల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు ఇక్కడకు వచ్చే అవకాశముంది. కాలేజీ రాకతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వేలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశాలు లభించడంతోపాటు శాస్త్రవేత్తలుగా తయారుచేసే అవకాశాలు ఉన్నాయి. ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. అన్నీ అనుకూలతలే.. దక్షిణ భారతదేశంలో ఖనిజనిధిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరుంది. ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూల వసతులు ఉన్నాయి. నేషనల్ హైవేకు సమీపంలో వర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం సమీపంలో మినీ స్టీల్ ప్లాంట్, నవభారత్ లిమిటెడ్, ఫెర్రో అల్లాయిస్, ఫెర్రో మెగ్నీషియం, విద్యుత్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. జిల్లాలో ఐటీసీ పేపర్ బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్ ఉండగా, ఇక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ కల నెరవేరనుంది. రోడ్డు, రైలు రవాణా మార్గాలు అతి సమీపంలో ఉన్నాయి. 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తోంది. దీనివల్ల భవిష్యత్లో నీటి ఇబ్బందులు ఉండవు. ఇలా కొత్తగూడేనికి ఉన్న అనుకూలతలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని మంజూరు చేయించేందుకు మంత్రి తుమ్మల నిర్విరామంగా కృషి చేశారు. ఇప్పుడు మన్మోహన్సింగ్ పేరు పెట్టడంతో వర్సిటీపై దేశవ్యాప్తంగా చర్చ జరగనుంది.కళకళలాడనున్న క్యాంపస్ గ్రాడ్యుయేషన్లో జియోలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ కోర్సులు ఉండగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జియోలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియో కెమిస్ట్రీ అందుబాటులోకి తేనున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు పీహెచ్డీ చేయొచ్చు. ఇప్పటికే క్యాంపస్లో ఇంజనీరింగ్ విభాగంలో మైనింగ్, కంప్యూటర్సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఐటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ప్రతీ కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 780 సీట్లు ఇక్కడ అందుబాటులో ఉండగా ఎర్త్ సైన్సెస్ సబ్జెక్టులు రావడంతో ఈ సంఖ్య రెట్టింపు కానుంది. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పార్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, అర్చకులు, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారుఎన్సీసీ పరీక్షలో నూరుశాతం ఉత్తీర్ణతఅశ్వారావుపేటరూరల్: మండలంలోని పెదవాగు ప్రాజెక్ట్ గ్రామంలో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల(దమ్మపేట)లోఎన్సీసీ పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. కళాశాలలో 33 మంది విద్యార్థినులు ఉండగా, జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో అందరూ ఉత్తీర్ణత పొందారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ వి. స్పందన గురువారం వివరాలు వెల్లడించారు. కొణిజర్ల కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులకు ఖమ్మం బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్ భద్ర చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్తోపాటు వైస్ ప్రిన్సిపాల్ కె.సింధు శ్రీ, సీటీఓ ఆఫీసర్ ఎం.అరుణ, సిబ్బంది భువన, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు. వెంకన్న సన్నిధిలో పాలకుర్తి ఎమ్మెల్యే పూజలుఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డితో కలిసి గురువారం దర్శించుకున్నారు. శ్రీవారికి, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ అందజేశారు. -
గిరిజన వంటకాలు రుచి చూపించాలి
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆవరణలోని గిరిజన మ్యూజియానికి వచ్చే సందర్శకులు గిరిజన వంటకాల రుచి చూపించాలని, సరసమైన ధరలకు విక్రయించాలని పీఓ బి.రాహుల్ అన్నారు. ఆర్.కొత్తగూడెం శ్రీ ముత్యాలమ్మ జాయింట్ లయబిలిటీ గ్రూప్, గిరిజన గ్రూప్ మహిళలు తయారుచేసిన ఇప్పపువ్వు లడ్డూతోపాటు ఇతర ఆహార పదార్థాలను గురువారం ఆయన తన చాంబర్లో రుచి చూశారు. తయారు చేసే ప్రతీ వస్తువు నాణ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, ముత్యాలమ్మ లియాబిలిటీ గ్రూప్ మహిళలు సున్నం సమ్మక్క, సున్నం శిరీష, సోడే మున్ని, వేల్పుల దేవి, సున్నం స్వాతి, రమాదేవి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అర్హులైన గిరిజన విద్యార్థులకు 3, 5, 8వ తరగతులలో 2025– 26 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ బి.రాహుల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తరగతికి 38, 5వ తరగతికి 20, 8వ తరగతికి 19 సీట్లు.. మొత్తం 77 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 17వ తేదీలోగా ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, 20న ఐటీడీఏ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో ఎంపికలు నిర్వహిస్తామని వివరించారు. -
సొంతింటి కల.. నెరవేరేలా!
ఇల్లెందు: గత ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటే పేదలు తమ కష్టాలు తీరినట్లేనని భావించారు. కానీ చాలామంది కలలు తీరకుండానే ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఆతర్వాత అధికారంలోకి కొలువుదీరిన కాంగ్రెస్ పేదల సొంతింటి కల నెరవేర్చేలా ఇందిరమ్మ ఇంటి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇల్లెందు పట్టణంలోని 24 వార్డుల్లో తొలి విడతగా 357 మంది ఇళ్లు మంజూరయ్యాయి. అయితే, తొలుత నిర్మించుకోవాల్సి ఉండడం.. ఆతర్వాత ప్రభుత్వం దఫాలుగా రూ.5లక్షల మేర బిల్లులు ఇస్తామని చెప్పడంతో నిరుపేదలు ఆలోచనలో పడ్డారు. పెట్టుబడి ఎలా అనే ఆవేదనలో ఉన్న నేపథ్యాన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అధికారులు సమాలోచనలు చేసి ఏపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ను సంప్రదించగా మూకుమ్మడిగా ఇళ్ల నిర్మాణానికి అంగీకరించాడు. రూపాయి పెట్టకుండానే... గత రెండు నెలలుగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, అధికారులు.. ఇళ్ల నిర్మాణం విషయమై ఏపీకి చెందిన ఓ కాంట్రాక్టర్తో సమాలోచనలు చేశారు. దీంతో లబ్ధిదారులు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే తానే ఇంటి నిర్మాణం చేపడతానని.. ప్రభుత్వం నుంచి దశల వారీగా వచ్చే బిల్లులు తీసుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అంతేకాక ప్రభుత్వం ఇచ్చే రూ.5లక్షల్లోనే ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా డిజైన్ సిద్ధం చేయించారు. ఆ కొలతల ప్రకారం ఇల్లెందు పట్టణంలో తొలి దఫా మంజూరైన 357 మంది ఇళ్లు నిర్మించాలనే నిర్ణయానికి ఇరువర్గాలు అంగీకారానికి వచ్చాయి. అవగాహన.. ఒప్పందం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్కు ముందుకొచ్చిన నేపథ్యాన రెండు రోజులుగా పట్టణ, మండల వ్యాప్తంగా లబ్ధిదారులను ఓ చోటుకు చేర్చి ప్రొజెక్టర్ ద్వారా ఇంటి నిర్మాణ డిజైన్.. అందుకు ఉపయోగించే సామగ్రి వివరాలపై అవగాహన కల్పించారు. దీంతో ఇల్లు మంజూరైనా చేతిలో చిల్లిగవ్వ లేక ఏం చేయాలో పాలుపోని స్థితి ఎదుర్కొన్న పేదలు సంతోషం వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్ ప్రకటించిన డిజైన్.. ప్రభుత్వం నుంచి బిల్లు వచ్చాకే తీసుకుంటానన్న మాటతో అంతా ఆనందంగా అంగీకరించారు. మాకూ పని ఇవ్వండి ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్ ముందుకు రాగా అవసరమైన మేసీ్త్రలను తానే సమకూర్చుకునే అవకాశముంది. కేవలం కూలీలను మాత్రమే స్థానికులను తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. దీంతో తాము ఉపాధి కోల్పోతామని స్థానిక మేసీ్త్రలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కాంట్రాక్టర్తో చర్చించినట్లు తెలిసింది. చివరకు స్థానిక మేసీ్త్రలు కొందరికై నా అవకాశం ఇచ్చేలా చర్చలు జరుపుతుండగా.. నిర్ణయం వెలువడాల్సి ఉంది. మూకుమ్మడిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక ఇల్లెందులో కట్టడానికి ముందుకొచ్చిన కాంట్రాక్టర్ పనుల అప్పగింతకు 357 మంది లబ్ధిదారుల నిర్ణయం ఎలా సాధ్యం? ఇంటి నిర్మాణానికి దశల వారీగా ప్రభుత్వం రూ.5లక్షలు మంజూరు చేస్తుంది. లబ్ధిదారులు ఒక్కొక్కరుగా నిర్మించుకునేందుకు సామగ్రి కొనుగోలు చేస్తే భారం పడే అవకాశముంది. అదే కాంట్రాక్టర్ 357 ఇళ్ల నిర్మాణానికి ముందుకురావడంతో సిమెంట్, ఐరన్తో పాటు విద్యుత్ సామగ్రి, దర్వాజాలు, తలుపులు, కిటికీలు ఇలాంటివన్ని మూకుమ్మడిగా కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసే అవకాశముంది. తద్వారా ధర తగ్గి కాంట్రాక్టర్ ప్రతీ ఇంటి ఉంచి కొంత మొత్తం మిగిలే అవకాశముంది. ఇక రూ.5లక్షలకు మించి వెచ్చించగలిగే స్థోమత ఎవరికై నా ఉంటే డిజైన్లో మార్పులు, ఉపయోగించే సామగ్రిలో మార్పులు చేసి అందుకు అయ్యే అదనపు నగదు తీసుకునేలా అంగీకారం కుదుర్చుకోనున్నారు. కాగా, ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల కోసం ప్రజాపాలన సభల్లో 7,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని సొంత స్థలం ఉన్నవారు, స్థలం లేని వారు.. ఇలా రకరకాలుగా వర్గీకరించి 1,900 మందితో జాబితా రూపొందించారు. ఇందులో తొలి దశలో 357 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. అత్యధికంగా కొన్ని వార్లుల్లో 30మంది, తక్కువగా ఇంకొన్ని వార్డుల్లో ఐదుగురు చొప్పున లబ్ధిదారులు ఉన్నారు. మాలాంటి వారికి మేలు ఇల్లు మంజూరైనా నిర్మాణానికి చేతిలో చిల్లి గవ్వ లేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతలోనే కాంట్రాక్టర్ ఇంటి నిర్మాణం చేసి ఇస్తామనే చర్చలు జరిగాయి. ఇదే జరిగితే మా కల నెరవేరినట్లే. ప్రభుత్వం నుంచి వచ్చే బిల్లు కాంట్రాక్టర్కే ఇస్తాం. వేగంగా ఇల్లు కట్టించి ఇస్తే చాలు. – స్వప్నబాయి పాసీ, కొత్త కాలనీ, ఇల్లెందుసద్వినియోగం చేసుకోవాలి ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారు నిర్మించుకోలేకపోతే రద్ద య్యే ప్రమాదం ఉంది. అలా జరగకుండా కాంట్రాక్టర్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ లెక్కల ప్రకారం అదే నిధులతో ఇల్లు పూర్తి చేయించాలనే ఆలోచనకు వచ్చాం. ఈ అవకాశాపికప సద్విని యోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. – కోరం కనకయ్య, ఎమ్మెల్యే, ఇల్లెందు -
ఫుడ్ కోర్టు పూర్తయ్యేనా..?
● కిన్నెరసానిలో అసంపూర్తిగా నిలిచిన భవనం ● పర్యాటకులకు అల్పాహారం కూడా దొరకని దుస్థితి పాల్వంచరూరల్: పర్యాటకుల కోసం కిన్నెరసాని డ్యామ్ పక్కన చేపట్టిన ఫుడ్ కోర్టు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కిన్నెరసానిలో 9 కాటేజీలు, అద్దాలమేడ, ఫుడ్ కోర్టు నిర్మాణంకోసం 2015లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10.77 కోట్లు మంజూరు చేశారు. ఆపసోపాలతో కాటేజీలు, అద్దాలమేడ నిర్మాణ పనులు పూర్తిచేసిన అధికారులు ఫుడ్ కోర్టును మాత్రం నిర్లక్ష్యంగా వదిలేశారు. గతంలో చెక్కతో ఫుడ్ కోర్టు నిర్మించారు. దానిని కూల్చివేసి రెండు అంతస్తుల భవనం నిర్మించాలని పనులు ప్రారంభించారు. నిధులేమితో అర్ధంతరంగా నిలిపివేశారు. మరోవైపు డ్యామ్పైకి వచ్చిన పర్యాటకులకు టీ, అల్పాహారం కూడా దొరకడంలేదు. ఇప్పటికై నా టూరిజం శాఖ అధికారులు స్పందించి ఫుడ్ కోర్టు నిర్మాణం పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. కాగా నిధులలేమి కారణంగా ఫుడ్ కోర్టు నిర్మాణ పనులను నిలిపివేయాల్సి వచ్చిందని టూరిజంశాఖ డీఈ రవీందర్ తెలిపారు. -
‘దబ్బతోగు’కు మరమ్మతులేవి..?
అశ్వారావుపేటరూరల్: వందలాది ఎకరాలకు సాగునీరు అందించే దబ్బతోగు ప్రాజెక్టు అధ్వాన్న స్థితికి చేరింది. ప్రాజెక్ట్ నిర్మించి పాతికేళ్లు కాగా, పూర్తిస్థాయిలో మరమ్మతులకు నోచుకోవడం లేదు. శిథిలమై, తుప్పుపట్టిన షట్లర్ల కారణంగా పంటలకు అందాల్సిన సాగునీరు లీకులై వృథాగా పోతోంది. దీంతో సాగునీరు అందక ఆయకట్టు రైతాంగం ఆవేదన చెందుతోంది. 25 ఏళ్ల క్రితం నిర్మాణం అశ్వారావుపేట మండలం దబ్బతోగు గ్రామంలో 2000వ సంవత్సరంలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ నిర్మించారు. దీంతో దబ్బతోగు, దబ్బతోగు కాలనీ, వినాయకపురం కాలనీ, మల్లాయిగూడెం, నారాయణపురం కాలనీ గ్రామాల పరిధిలో సుమారు 900 ఎకరాలకు సాగునీరు అందింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఎనిమిదేళ్ల క్రితం పూడిక తీసే పనులు, అలుగుకు మరమ్మతులు చేసి వదిలేశారు. ఆ తర్వాత మళ్లీ మరమ్మతులు చేపట్టలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ చెరువు బాట కార్యక్రమంలో కూడా ఈ ప్రాజెక్ట్ను ఎంపిక చేయలేదు. దీంతో ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుప్పు పట్టిన షట్టర్లు.. నీటి లీకేజీ దబ్బతోగు ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువల షట్టర్లు తుప్పు పట్టి శిథిలావస్థలో ఉన్నాయి. షట్టర్లు లీకై నిల్వ ఉన్న సాగునీరు వృథాగా పోతోంది. తక్షణం మరమ్మతులు చేపట్టకపోతే వర్షాకాలంలో అడ్డుకట్ట వేయడం కూడా సాధ్యం కాదని రైతులు పేర్కొంటున్నారు. భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే లీకేజీలతో సాగునీరు మొత్తం వృథాగా పోతుందని చెబుతున్నారు. షట్టర్ల కోసం నిర్మించిన కాంక్రీట్ గోడలకు సైతం బీటలు ఏర్పడ్డాయి. మరో వైపు ప్రాజెక్ట్లో పూడిక పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం కూడా తగ్గిపోతోంది. ధ్వంసమైన గైడ్ వాల్ గతేడాది జూలై 18వ తేదీ నుంచి కురిసిన అతి భారీ వర్షాల కారణంగా దబ్బతోగు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ప్రాజెక్ట్లోకి వరదనీరు పోటెత్తడంతో అలుగు ఉధృతంగా పొంగి దిగువన ఉన్న గైడ్ వాల్ పూర్తిగా ధ్వంసమైంది. అలుగు దిగువన భారీగా మట్టి కోతకు గురి కాగా, ఐదు అడుగుల మేర భారీ గంతలు పడ్డాయి. ఈ ఏడాది మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్ మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టాలని, ఆనకట్టపై చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించాలని రైతులు కోరుతున్నారు. 25 ఏళ్ల క్రితం సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం దెబ్బతిన్న తూములు, షట్టర్లు, గైడ్వాల్ పూడిక పేరుకుపోయి నీటి నిల్వ తగ్గిన ప్రాజెక్ట్ ప్రతిపాదనలు పంపాం దబ్బతోగు ప్రాజెక్ట్కు మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటికే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందించాం. కానీ ఇంకా నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. అలుగు గైడ్ వాల్ మరమ్మతులు వచ్చే ఏడాది చేస్తాం. –కృష్ణ, డీఈఈ, అశ్వారావుపేట -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
బూర్గంపాడు: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్ అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఐటీసీ పీఎస్పీడీలో కార్మికులు పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీసీ పీఎస్పీడీ ఆధ్వర్యాన అడవుల పెంపకం, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ ఉన్నతాధికారులు శ్యామ్కిరణ్, చెంగలరావు, కార్మిక సంఘాల నాయకులు కనకమేడల హరిప్రసాద్, గాదె రామకోటిరెడ్డి, యారం పిచ్చిరెడ్డి, గొనె రామారావు, సానికొమ్ము శంకర్రెడ్డి, బిజ్జం అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పొట్టకూటి కోసం వెళ్తూ అనంతలోకాలకు..
●ట్రాలీ ఆటోను ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు ●ఒక మహిళ మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు దమ్మపేట: పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్న ఓ మహిళ మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు చేరుకుంది. మండలంలోని మందలపల్లి గ్రామ శివారులోని చెరువు సమీపాన రాష్ట్రీయ రహదారిపై గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను పోలీసుల ఇలా తెలిపారు. సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీకి చెందిన నలుగురు మహిళలు, ఒక పురుషుడు మూడు చక్రాల ట్రాలీ ఆటోలో కూలీ పని నిమిత్తం సత్తుపల్లి నుంచి అశ్వారావుపేటకు గురువారం ఉదయం బయలుదేరారు. ఈ క్రమంలో మండలంలోని మందలపల్లి గ్రామ శివారుకు చేరుకోగానే.. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడగా.. అద్దంకి పద్మ (35) అక్కడికక్కడే మృతి చెందగా.. ముంగి గోపమ్మ, ముంగి మారేశ్వరిలకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. గోపమ్మ, మారేశ్వరిలను ఖమ్మం తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికిషోర్రెడ్డి తెలిపారు. -
చెట్లు నరికితే కఠిన చర్యలు
● పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్చుంచుపల్లి/పాల్వంచరూరల్: చెట్లు నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. పాల్వంచ మండలం బస్వతారాకకాలనీ పంచాయతీ అర్బన్ పార్కులో, కొత్తగూడెంలోని అటవీశాఖ వన విహార్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా అటవీశాఖాధికారి జి.కిష్టాగౌడ్తో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. కొత్తగూడెంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సెంట్రల్ పార్క్లో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత కార్యక్రమంలో, ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్లను నరుకుతూ పోతే భవిష్యత్లో ఎలాంటి ఫలసాయం అందుబాటులో ఉండదన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. జిల్లా అటవీశాఖాధికారి కిష్టాగౌడ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా మానివేయాలన్నారు. అటవీ అభివృద్ధి సంస్థ కొత్తగూడెం డివిజన్ కార్యాలయంలో సీజీఎం వీవీ రెడ్డి, డీఎంలు చంద్రమోహన్, కవిత తదితరులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాల్లో ఎఫ్డీఓ కట్టా దామోదర్రెడ్డి, కోటేశ్వరరావు, పర్యావరణ ఇంజనీర్ బి.రవీందర్, కేటీపీఎస్ చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాసబాబు, ప్రభాకర్రావు, రేంజర్లు సురేష్, రవికిరణ్, ఏ.కరుణాకరాచారి, డిప్యూటీ రేంజర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బీట్అధికారులు, సింగరేణి ఎన్విరాన్మెంట్ విభాగం అధికారులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి మణుగూరు రూరల్: ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని సింగరేణి డైరెక్టర్(పిఅండ్పి, పా) కె.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. బంగ్లాస్ ఏరియాలో మొక్కలు నాటారు. అనంతరం ఏరియా అధికారులతో కలిసి ఓసీ–2 వ్యూపాయింట్కు చేరుకుని బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో, నివాస స్థలాల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు పెంచాలనన్నారు. ఏరియా జీఎం కార్యాలయ ఆవరణంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇన్చార్జ్ జీఎం లక్ష్మీపతిగౌడ్ మొక్కలు నాటారు. అనంతరం వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు జ్ఞాపికలు, జూట్ బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమాలల్లో ఎఫ్డీఓ సయ్యద్ మక్సూద్ మొహియుద్దీన్, జీఎంలు డి.వెంకటేశ్వర్లు, తిరుమలరావు, ఇతర అధికారులు శ్యాంసుందర్, ఆర్.శ్రీనివాస్, కేశవరావు, వెంకట్రావు, అనురాధ, మదన్నాయక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఊడిన టాటా ఏస్ స్టీరింగ్..
ఇల్లెందురూరల్/కారేపల్లి: గుండాల మండలం కాచనపల్లి గ్రామం నుంచి కారేపల్లి మండలం పోలెంపల్లి గ్రామంలోని బంధువుల ఇంట్లో శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు టాటా ఏస్ వాహనంలో ఒక కుటుంబం గురువారం ఉదయం బయలుదేరింది. మార్గమధ్యలో ఇల్లెందు మండలంలోని రాజీవ్నగర్తండా శివారులో అకస్మాత్తుగా స్టీరింగ్ ఊడిపోవడంతో టాటాఏస్ వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పోలెబోయిన సుభద్ర, దొడ్ల నర్సమ్మ, రమేష్, పోలెబోయిన వెంకటనర్సు, పోలెబోయిన లక్ష్మి, డ్రైవర్ పూనెం కృష్ణలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స చేసి తీవ్రంగా గాయపడిన సుభద్ర, నర్సమ్మ, వెంకటనర్సులను మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు సిఫారసు చేశారు. మిగిలిన నలుగురికి ఆస్పత్రిలో వైద్యసాయం అందించారు. ఆరుగురికి తీవ్ర గాయాలు -
క్లినిక్ల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు
భద్రాచలం అర్బన్: ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటున్న నేపథ్యంలో గత నెల 26న ప్రచురితమైన ‘దేవుడా ఇదేం పరీక్ష’ అనే కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ధరలు తగ్గిస్తూ ఐటీడీఏ పీఓ రాహుల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణయించిన ధరలు మాత్రమే వసూలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ.. భద్రాచలం అర్బన్: భద్రాచలం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈమేరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ నర్సింగ్హోమ్కు రూ.లక్ష జరిమానా విధించారు. అంతేకాక మరికొన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నిబంధనలకు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్నాయక్ హెచ్చరించారు. కాగా, ఈ తనిఖీ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. సీజ్ చేయాల్సిన సదరు ఆస్పత్రిని ఓ రాజకీయ నాయకుడి అండతో అధికారులు జరిమానాతో సరిపుచ్చినట్లు సమాచారం. ఆర్టీసీ డ్రైవర్కు రివార్డు అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మహేశ్ ఇటీవల అమలాపురం డ్యూటీకి వెళ్లి వస్తున్న క్రమంలో బస్సులో ఓ ప్రయాణికుడి మర్చిపోయిన రూ.లక్షను అదేరోజు డిపోలో అందించాడు. ఈ మేరకు మహేశ్ నిజాయితీని గుర్తించిన ఆర్టీసీ అధికారులు గురువారం హైదరాబాద్లోని ఆర్టీసీ భవన్లో ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ చేతులమీదుగా రాష్ట్ర ఆర్టీసీ సేవా రివార్డ్ను అందజేసి ఘనంగా సన్మానించారు. ఏబీడీసీ డ్రైవ్లు నిర్వహించాలిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఏబీడీసీ డ్రైవ్లు నిర్వహించాలని కలెక్టరేట్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఏబీడీసీ డ్రైవ్, భూభారతి రెవెన్యూ సదస్సులు, బక్రీద్ పండుగ ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా, బడిబాట గ్రామసభల నిర్వహణ, వనమహోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. డ్రైవ్పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నానరు. అజోల్లా పెంపకం, బయోచార్, కంపోస్టింగ్, డిగ్గింగ్ సోక్ పిట్, పామ్ పౌండ్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. మేడేపల్లి పంచాయతీకి పురస్కారం ముదిగొండ: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మండలపరిధిలోని మేడేపల్లి గ్రామపంచాయతీ రాణించడంతో రాష్ట్రస్థాయి అవార్డు ఎంపికై ంది. పర్యావరణం పరిరక్షణకు అమలు చేసిన విధానాలు, సేంద్రియ ఎరువు తయారి, తడి,పొడి చెత్త వేరు చేయడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి అంశాలను అమలు చేసినందుకు గాను ఎంపికై ంది. ఈమేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని టీజీపీసీబీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ చేతులమీదుగా పంచాయతీ కార్యదర్శి రమ్య గురువారం పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. దీంతో మండల అధికారులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండిఖమ్మంసహకారనగర్: నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎ.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని, రూ.100 వెరిఫికేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
మావోయిస్టు సుధాకర్ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, ఏలూరు/ చర్ల: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఉన్న ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, విప్లవ రాజకీయ పాఠశాల ఇన్చార్జ్ తెంటు లక్ష్మీ నరసింహాచలం (67) మరణించాడు. ఆయనకు గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ ఆనంద్ అలియాస్ చంటి అలియాస్ రామరాజు అలియాస్ బాలకృష్ణ అలియాస్ అరవింద్ అనే పేర్లు కూడా ఉన్నాయి.సుధాకర్ పేరుతో పార్టీలో ఆయన సుప్రసిద్ధుడు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించి నెల తిరక్కముందే మరో కీలక నేతను కోల్పోవటంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టయ్యింది. కీలక నేతలున్నారన్న సమాచారంతో..: ఇంద్రావతి అటవీ ప్రాంతంలో సుధాకర్తోపాటు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు, మరికొంతమంది కీలక నేతలు ఉన్నారన్న సమాచారంతో ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా విభాగాల ప్రత్యేక పోలీసు బలగాలు బుధవారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. గురువారం ఉదయం మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని, అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా సుధాకర్ మృతదేహం లభించిందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఘటనా ప్రాంతం నుంచి ఏకే 47 తుపాకీ, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులు బలగాలు స్వాదీనం చేసుకున్నాయి. సుధాకర్పై రూ.40 లక్షల రివార్డు ఉంది. శాంతి చర్చల్లో పాల్గొన్న సుధాకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నక్సలైట్లతో జరిగిన శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నాడు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు. సుధాకర్ తండ్రి రామకృష్ణుడు, తల్లి సరస్వతి. వీరికి సుధాకర్ 6వ సంతానం. సత్యవోలులో సుధాకర్ సోదరుడు తెంటు ఆనందరావు నివసిస్తున్నారు. సుధాకర్ మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన చింతలపూడి మండలం ప్రగడవరంలో 10వ తరగతి, ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో 1972లో చదువుతున్నప్పుడే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై అడవి బాట పట్టారు. చివరిసారిగా 1983లో తన తండ్రి అనారోగ్యానికి గురైతే చూడ్డానికి వచ్చి నపుడు సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సమయంలో 2013లో కేంద్ర కమిటీలో స్థానం దక్కింది. అనంతరం పార్టీ పబ్లికేషన్ విభాగానికి నాయకత్వం వహించాడు. సుధాకర్ 43 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారు. 2024–25 సంవత్సరంలో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 403 మంది మావోయిస్టులు మృతి చెందారని సుందర్రాజ్ వెల్లడించారు. -
వెంగళరాయసాగర్ అలుగుకు మోక్షం
● రూ.33.55 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ● భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జారె చండ్రుగొండ: మండలంలోని సీతాయిగూడెం శివారులో ఉన్న వెంగళరాయసాగర్ అలుగు నిర్మాణానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బుధవారం భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అలుగు పునఃనిర్మాణానికి ప్రభుత్వం రూ.33.55 కోట్లు మంజూరు చేసింది. సుమారు ఐదేళ్ల కిందట అలుగుకు పెద్ద ఎత్తున గండి పడింది. ఏడు గ్రామాల రైతులకు సంబంధించి 2,200 ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్ట్ కింద ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అలుగు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చానని, రెండు నెలలల్లో పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని తాను స్వయంగా కలిసి చేసిన విజ్ఞప్తి మేరకు నిధులు కేటాయించారన్నారు. అశ్వారావుపేటలోని పెద్దవాగు, ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్ట్ల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ సురేశ్కుమార్, డీఈ కృష్ణశంకర్, ఏఈ నర్సింహారావు, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ అశోక్, పీఆర్ డీఈ సైదురెడ్డి, నాయకులు భోజ్యానాయక్, నల్లమోతు రమణ, సారేపల్లి శేఖర్, ఉప్పతల ఏడుకొండలు, ఫజల్, కిరణ్రెడ్డి పాల్గొన్నారు. -
చేపల కోసం చెరువు నీళ్లు వదిలారు...
వైరా: అన్నదాతలకు ఆదెరువుగా, మత్స్యకారులకు అండగా నిలుస్తున్న నిండా నీరు ఉండగా.. చేపలు పట్టడం సాధ్యం కావడం లేదని కాంట్రాక్టర్ నీరు విడుదల చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వైరా మున్సిపాలిటీ పరిధి సోమవరంలోని నల్ల చెరువు నీటిని అనుమతి కాంట్రాక్టర్ చేపల వేట కోసం వదిలినట్లు సమాచారం. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులో 3.5 అడుగుల మేర నీరు ఉంది. అయితే, నీరు విడుదల చేయడానికి నీటి పారుదల శాఖ అధికారుల అనుమతి అవసరం కాగా, అదేమీ లేకుండా మూడు రోజులుగా నీటిని వృథా గా విడుదల చేయడంతో చెరువు ఖాళీ అయ్యే స్థితికి చేరింది. మత్స్య సొసైటీ అధ్యక్షుడు, కాంట్రాక్టర్తో కుమ్మకై ్క ఈ ఘటనకు పాల్పడినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అలాగే, సుమారు 250 ఎకరాల మేర వరి నాట్లకు ఇబ్బంది ఏర్పడనుందని రైతులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా నీటి పారుదల శాఖ, మత్స్యశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావి స్తోంది. ఈ విషయమై ఐబీ డీఈ శ్రీనివాస్ను వివరణ కోరగా చెరువులో చేపల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు నీరు వదిలినట్లు ఆలస్యంగా తెలిసిందని, బాధ్యులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం చెరువు వద్ద లష్కర్లతో పహారా ఏర్పాటు చేశామని వెల్లడించారు. -
యువకుడు అదృశ్యం
పాల్వంచరూరల్: తొమ్మిది రోజుల కిందట సుతారి పనికోసం వెళ్లిన యువకుడు కనిపించకుండాపోయిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన, సూతారి మేసీ్త్రగా పనిచేస్తున్న ధర్మసోత్ సంతోష్ గత నెల 27వ తేదీన పనిఉందని ఇంట్లో తల్లికి చెప్పివెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో యువకుడి తల్లి హచ్చి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు.పట్వారిగూడెంలో మహిళ.. దమ్మపేట: వివాహిత కనిపించకుండా పోయిన ఘటన మండలంలోని పట్వారిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అన్నపురెడ్డి మండలం జానకీపురం గ్రామానికి చెందిన వేముల వరలక్ష్మి తన కుమారుడితో కలిసి వేసవి సెలవులకు మండలంలోని పట్వారిగూడెంలోని పుట్టింటికి 20 రోజుల కిందట వచ్చింది. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రలో ఉండగా, ఆమె బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. వరలక్ష్మి తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. మొదలుకు నిప్పు.. వాహనంపై పడిన చెట్టు ముగ్గురికి తీవ్రగాయాలు తిరుమలాయపాలెం: రోడ్డుపై వెళ్తున్న వాహనంపై భారీ వృక్షం పడడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుమలాయపాలెం కొక్కిరేణి స్టేజీ సమీపాన బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు... పంటలపై నీడ పడుతోందని కొందరు రైతులు రహదారి పక్కన చెట్ల మొదళ్లకు నిప్పు పెడుతున్నారు. ఇలాగే చేయడంతో చెట్టు ఒక్కసారిగా కూలగా అదే రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో వాహనంపై వెళ్తున్న బీసురాజుపల్లితండాకు చెందిన బోడ సేవ్యా, పద్మ, సుధాకర్కు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు చేరకుని జేసీబీతో చెట్టును తొలగించారు.విధులకు ఆటంకపర్చిన ఇద్దరిపై కేసు కారేపల్లి: అటవీ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కారేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కారేపల్లి అటవీ రేంజ్ పరిధి గేటు రేలకాయలపల్లిలో ధర్మసోత్ సూర్యం, ఆయన కుమారుడు జేసీబీతో అటవీ భూమిలో దున్నుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ ఇమ్మడి వీరభద్రం, బీట్ ఆఫీసర్ రమాదేవి వెళ్లి అనుమతి పత్రాలు అడగగా సూర్యం, ఆయన కుమారుడు అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉద్యోగులను గెంటేశారు. దీంతో ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.గోపి తెలిపారు. తిరంగా ర్యాలీ మధిర: ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై త్రివిధ దళాలకు వందనం చెబుతూ మధిరలో బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా దేశ సైనికుల సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ కార్యక్రంమలో డాక్టర్ ఎ.కొండల్రావు, గల్లా సత్యనారాయణ, నెల్లూరు కోటేశ్వరరావు, ఎస్.కే.మహమ్మద్ ముజాయిదీన్ మాట్లాడగా ఏలూరి నాగేశ్వరావు, చావా వేణు, చేకూరి కృష్ణారావు, రషీద్, గాలిమ్, కురువెళ్ల కృష్ణ, చెరుగుడ్ల నర్సింమారావు పాల్గొన్నారు. -
ఉద్యోగాల గని.. సింగరేణి..
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో 1998లో నిలిచిపోయిన వారసత్వ ఉద్యోగాలను.. టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో పునరుద్ధరించింది. ఏడేళ్లలో 18 వేల మంది వారసులకు ఉద్యోగాలు కల్పించింది. సుమారు 6 వేల మందికి ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా ఉపాధి కల్పించింది. రోస్టర్ విధానం అమలులో భాగంగా 665 ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం సింగరేణివ్యాప్తంగా 19 ఓపెన్కాస్ట్ గనులు, 23 భూగర్భ గనుల్లో 40 వేల మంది పర్మనెంట్ కార్మికులు, 2,400 మంది అధికారులు, 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఉత్పత్తి చేసిన బొగ్గు ద్వారా తెలంగాణతోపాటు మరో 7 రాష్ట్రాల్లో సుమారు 2 వేల పరిశ్రమల్లో సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, మరో 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. డిపెండెంట్ల ద్వారా 18 వేలు ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 6 వేల ఉద్యోగాలు అంకితభావంతో పనిచేయాలి.. కొత్తగూడెం ఏరియాలో ఇప్ప టి వరకు 669 మందికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించాం. అంకితభావంతో విధులు నిర్వర్తించాలి. సంస్థ అభివృద్ధికి కృషిచేయాలి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిలో సగం మంది విధులకుగైర్హాజరవుతున్నారు. వీరు పద్ధతి మార్చుకోవాలి. –శాలేంరాజు, ఏరియా జీఎం సింగరేణిలో సౌకర్యాలు ఎక్కువ.. దేశంలో ఏ ఇతర బొగ్గు పరిశ్రమల్లో లేని సౌకర్యాలు సింగరేణిలోనే ఉన్నాయి. ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ 13 రకాల సదుపాయాలతోపాటు అనుకోని పరిస్థితుల్లో కార్మికుడు మృతి చెందితే రూ.కోటి ప్రమాద బీమాతోపాటు మ్యాచింగ్ గ్రాంట్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నాం. –జీవీ కిరణ్కుమార్, జీఎం (కార్పొరేట్ వెల్ఫేర్) -
మెరుగైన వైద్యం అందించడం బాధ్యత
సింగరేణి(కొత్తగూడెం): కార్మికులకు మెరుగైన వైద్యం అందించటం సింగరేణి బాధ్యతని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఒక్కరోజు దీక్ష చేపట్టారు. దీనికి సంఘీభావం తెలిపిన అనంతరం సింగరేణి డైరెక్టర్ (పీపీ అండ్ పా) కె.వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నట్లు యాజమాన్యం చెప్పడం వాస్తవదూరమని, కార్పొరేట్ వైద్యం పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ కార్మికులకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపించారు. కాగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా దీక్షకు మద్దతు పలికారు. మిరియాల రాజీరెడ్డి, కాపు కృష్ణ, సీతాలక్ష్మి, వీరభద్రయ్య పాల్గొన్నారు. మున్సిపాలిటీ కార్యాలయం బోర్డు మార్పు పాల్వంచ: ద్వితీయ శ్రేణి పాల్వంచ మున్సిపాలిటీ కొత్తగూడెం కార్పొరేషన్లో కలిసి డివిజన్ కేంద్రంగా ఏర్పడింది. ఈ క్రమంలో మున్సిపాలిటీ కార్యాలయం బోర్డు కాస్తా కొత్తగూడెం కార్పొరేషన్ బోర్డుగా బుధవారం మార్చారు. ఇప్పటికే కార్పోరేషన్ పరిధిలో డివిజన్ల ఏర్పాటు శరవేగంగా జరుగుతుండగా కార్యాలయ బోర్డు సైతం కార్పొరేషన్ బోర్డుగా ఏర్పాటు కావడం గమనార్హం. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ మీట్లో సత్తాఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–10, 12 అథ్లెటిక్స్ పోటీల్లో ఖమ్మం జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రాక్లీస్ చేస్తున్న డి.లోహిత, సీహెచ్.లాస్య అండర్–10 విభాగంలో, అండర్–12 బాలికల విభాగంలో ఎం.భవిత, బి.రుత్విక, బాలుర అండర్–12లో డి.ఉపేక్షిత్ ఈ.వరుణ్ బహుమతులు సాధించారు. క్రీడాకారులను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్, అథ్లెటిక్స్ అసోసిఇయేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్ బుధవారం అభినందించారు. -
కార్పొరేషన్ భూముల ఆక్రమణకు యత్నం
● వెదురు చెట్లను నరుకుతున్న గిరిజనులు ● అడ్డుకున్న అధికారులు.. ఇరువర్గాల మధ్య వాగ్వాదంఅశ్వారావుపేటరూరల్: ఫారెస్టు అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ)కు చెందిన భూముల్లో ఉన్న వెదురు చెట్లను కొందరు గిరిజనులు నరుకుతుండగా బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అడ్డుకోగా, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజనులకు సర్వే నంబర్లు 30, 36, 39లో 573 ఎకరాలకు సంబంధించి 150 మందికి హక్కు పత్రాలు, పాత పట్టాలు ఉన్నాయి. కాగా, 30 ఏళ్ల కిందట తమ పెద్దలను ఆ నాటి అధికారులు మోసం చేసి అన్యాయంగా తమ భూముల్లో ఎఫ్డీసీ, అటవీశాఖ ఆధ్వర్యంలో వెదురు, టేకు ప్లాంటేషన్లు వేసినట్లు గిరిజనులు కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల కిందటి నుంచి గ్రామస్తులంతా కలిసి వెదురు, ఇతర చెట్లను నరివేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎఫ్డీసీ డీఎం రమేశ్, డీఆర్ఓ రవికుమార్, ఎఫ్ఆర్ఓ చంద్రకళ, ఫారెస్టు రేంజర్ మురళి, సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి వెళ్లి గిరిజనులను అడ్డుకున్నారు. దీంతో గిరిజనులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే స్థానిక సీఐ పింగళి నాగరాజురెడ్డి, ఎస్ఐ యయాతి రాజు, ట్రైనీ ఎస్ఐ అఖిలతోపాటు సిబ్బంది వెళ్లి ఇరువర్గాలను శాంతింపజేశారు. దీంతో గిరిజనులు తమ వద్ద ఉన్న ఆధారాలతోపాటు, 2011లో ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ తమకు ఈ భూములను అప్పగించాలని రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను ఆదేశించిన వివరాలను సీఐకి చూపించారు. కాగా, ఆ నాటి నుంచి అధికారులు సర్వేల పేర్లతో తమను మోసం చేయడంతోపాటు, పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోయారు. ఇరువర్గాలు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, అప్పటిదాకా చెట్లను ధ్వంసం చేయవద్దని సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కాగా, వెదురు చెట్లను నరికిన నలుగురు గిరిజనులపై ఎఫ్డీసీ డీఆర్ఓ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ముంచుకొస్తున్న ముప్పు..
● నానాటికీ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● వివిధ కారణాలతో తరుగుతున్న అడవులు ● వాతావరణ సమతుల్యతకు మరింత విఘాతం ● పర్యావరణ పరిరక్షణే మార్గమంటున్న నిపుణులు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం చుంచుపల్లి: మానవ మనుగడలో పర్యావరణం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే కొన్నేళ్లుగా మానవ తప్పిదాలు, ఇతర కారణాలతో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. విలువైన సహజ సంపదను కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తేనే భావితరాలు సాఫీగా సాగుతాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. విచక్షణా రహితంగా చెట్ల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం, పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువులు, వ్యర్థాలతో భూతాపం పెరగడం, భూ, వాయు, జల కాలుష్యాలు పెరుగుతుండడం వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించాలంటే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇందుకోసం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తారు. అడవుల తగ్గుదలతో ఆందోళన అడవుల అభివృద్ధితోనే పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనేది సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పలు రకాలైన జంతు, వృక్ష జాతులకు ఆశ్రయం కల్పించి జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు తోడ్పడతాయి. అడవులు భూసారాన్ని కాపాడమే కాకుండా నేల క్షీణతను నిరోధిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే మానవ మనుగడకు అడవులే ఆధారం. 2021 నుంచి 2023 వరకు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గటం ఒకింత ఆందోళన కలిగించే అంశం. ఉమ్మడి జిల్లాలో మూడేళ్ల వ్యవధిలో 121.21 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం తగ్గినట్లు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్–2023ను గతేడాది డిసెంబర్లో వెల్లడించింది. 2021–23 మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95.55 చ.కి.మీ. ఖమ్మం జిల్లాలో 25.76 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం తగ్గిందని నివేదికలో పేర్కొంది. 2021 కాలంలో 2,957.21 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2023 చివరి నాటికి 2,861.66 చ.కి.మీ.కి తగ్గినట్లు తెలిపింది. ఇక ఖమ్మం జిల్లాలో 2021 కాలంలో 633.23 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం ఉండగా, 2023 ముగిసే నాటికి 607.47 చ.కి.మీ.గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్ (–115.50) తర్వాత భద్రాద్రి జిల్లా (–95,55) రెండో స్థానంలో నిలవగా, ఖమ్మం మూడో స్థానంలో ఉందని వివరించింది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, కిన్నెరసాని, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు.. తదితర ఎనిమిది అటవీ డివిజన్లలో ఒక్క కిన్నెరసాని వైల్డ్లైఫ్లో తప్ప మిగతా వాటిలో అటవీ విస్తీర్ణం తగ్గినట్లు నివేదిక పేర్కొంది. అక్రమణలు, అగ్ని ప్రమాదా అందుకు కారణమని, అగ్ని ప్రమాదాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటిస్థానంలో ఉన్నట్లు తేలింది. విస్మరిస్తే తీరని నష్టం రోజురోజుకూ వాతావరణంలో మార్పుల కారణంగా మానవ మనుగడ భవిష్యత్లో కష్టతరం కానుంది. అటు రుతువుల్లో వస్తున్న మార్పులతో రైతులకు సైతం నష్టం వాటిల్లుతోంది. ఇక వేసవి సీజన్లో భూగర్భజలాలు అమాంతం పడిపోతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే తలెత్తే పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నాం. –బి.రవీందర్, ఈఈ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పర్యావరణానికి చాలా ప్రమా దం పొంచి ఉందనేది ఇప్పటికే తెలుస్తోంది. అటవీశాఖ అన్ని చోట్ల మొక్కలు నాటే ప్రక్రియ కు శ్రీకారం చుడుతోంది. ఏటా వనమహోత్సవం పేరుతో లక్షలాది మొక్కలను నాటి సంరక్షిస్తోంది. అటు స్వచ్ఛంద సంస్థలు తమవంతు ముందుకు వచ్చి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి. యువతీ, యువకులు ఒక మొక్కను పెంచే బాధ్యత తీసుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. –కిష్టాగౌడ్, డీఎఫ్ఓ, భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి జిల్లాలో అటవీ విస్తీర్ణం (చ.కి.మీ.ల్లో) భద్రాద్రి జిల్లా ఖమ్మం జిల్లా అటవీ డివిజన్లు 06 02 దట్టమైన అడవులు 637.34 42.68 మధ్యస్థాయి అడవులు 1,502.70 261.44 ఓపెన్ అడవులు 721.60 303.30 -
భూసమస్యల పరిష్కారానికే సదస్సులు
కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొత్తగూడెంఅర్బన్ : భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, సమస్యలు ఉన్నవారు సదస్సుల్లో దరఖాస్తు అందజేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలకలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు తదితర సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. వాటి పరిశీలనకు భూ భారతి చట్ట ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతారని, నిర్దేశిత గడువు లోగా సమస్యలు పరిష్కరిస్తారని వివరించారు. ఆర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తహసీల్దార్ను అదేశించారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు. జయరాజు స్ఫూర్తి ఆదర్శం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జయరాజు అందించిన స్ఫూర్తి ముందు తరాలకు ఆదర్శమని కలెక్టర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జయరాజును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రకృతి పరిరక్షణకు జయరాజుతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కొత్తగూడెం ప్రకృతి అశ్రమ సభ్యులు రాజేంద్రప్రసాద్, సుగుణారావు, నాగ సీతారాములు, వెంకటముత్యం, సురేష్, వరలక్ష్మి, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ.. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం తనిఖీ చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోనికి రానీయొద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్లు ఎండీ.ముజాహిద్, రంగాప్రసాద్, ఆయా పార్టీల నాయకులు నోముల రమేష్, లక్ష్మణ్ అగర్వాల్, రాంబాబు తదితరులు ఉన్నారు. -
స్వయం ఉపాధితో ఎదగాలి
భద్రాచలం : ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని గిరిజన మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏలోని పీఈటీసీ కాంప్లెక్స్లో గల భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ న్యూట్రీ బిస్కెట్ కేంద్రాన్ని, వైటీసీలోని కుట్టు శిక్షణ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిస్కెట్ల నాణ్యతతో తయారు చేసి ప్రజలకు అందించాలని సూచించారు. కుట్టు మిషన్ శిక్షణ ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలని, మరి కొందరికి సైతం కుట్టు శిక్షణ అందించాలని అన్నారు. బ్లౌజ్, స్కర్ట్ ,యూనిఫామ్, పంజాబీ డ్రెస్, షర్ట్, నిక్కర్, ఫ్రాక్ చుడీదార్ వంటివి కుట్టడంలో పరిణతి చెందితే రాబోయే రోజుల్లో ఎంబ్రాయిడరీ శిక్షణ కూడా అందిస్తామని తెలిపారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు జారీ చేసి, బ్యాంకు ద్వారా ముద్ర రుణాల కింద కుట్టు మిషన్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత గిరిజన యువతకు శిక్షణ అందిస్తున్న హాస్టళ్లు, గదులను పరిశీలించారు. యువత వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా నిష్ణాతులైన వారితో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. అనంతరం పీఎంఆర్సీ భవనంలో రెండో విడత ఉద్దీపకం బుక్లెట్స్ డాటా వివరాలను డీడీ మణెమ్మను అడిగి తెలుసుకొన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మిస్తున్న షటిల్ కోర్టు, ఇండోర్ క్రీడా స్థలం పనులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఏసీఎంఓ రమేష్, జేడీఎం హరికృష్ణ, క్రీడల అధికారి గోపాల్రావు, ఎంఎస్ఎంఈ యూనిట్ మహిళలు లలిత, నీలవేణి తదితరులు పాల్గొన్నారు. మహిళలకు ఐటీడీఏ పీఓ సూచన -
నేతల్లో నైరాశ్యం
పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తా చాటాలని హస్తం పార్టీ హైకమాండ్ దిశా నిర్దేశం చేసింది. అందుకు తగ్గట్టే పార్టీలో పై స్థాయి నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. కానీ క్షేత్రస్థాయి నాయకత్వంలో మాత్రం అంతగా జోష్ కనిపించడం లేదని ఆ పార్టీ వారే చెబుతున్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఅసంతృప్తిలో నేతలు సంప్రదాయ కాంగ్రెస్ వాదులు, తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నేతల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉధృతిని, అప్పటి ప్రభుత్వ ఒత్తిడులు, బెదిరింపులు, ప్రలోభాలను తట్టుకుని పార్టీ కోసం పని చేసిన తమకు ప్రస్తుతం తగిన గుర్తింపు దక్కడం లేదనే భావన వారిలో నెలకొంది. ఇప్పటికే కొందరు పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుంటే, మరికొందరు వ్యక్తిగత పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తూ పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. పని చేస్తున్నా పదవులు దక్కడం లేదని అసంతృప్తి ● నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యంపై ఆందోళన ● కష్టపడినా గుర్తింపు లేదంటున్న కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు ● పార్టీ కార్యక్రమాలకు దూరంగా పలువురు.. బీఆర్ఎస్ హవాను తట్టుకుని.. తెలంగాణ వచ్చిన తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ హవా కనిపిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు భద్రాద్రి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకర్గాల నుంచి అనేక మంది ఆశావహులు ముందుకొచ్చారు. పార్టీ టికెట్ దక్కించుకోవడం కోసం ఎన్నికలకు రెండు, మూడేళ్ల ముందు నుంచే నియోజకర్గ స్థాయిలో శ్రమించారు. కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు వంటి వారు ఆసక్తి చూపించగా పినపాక నుంచి బట్టా విజయ్గాంధీ, చందా సంతోష్, పోలెబోయిన శ్రీవాణి, అశ్వారావుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణి టికెట్ ఆశించారు. ఇక రాష్ట్రంలోనే అత్యధిక మంది అభ్యర్థులు ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం పోటీ పడ్డారు. ఇందులో చివరి నిమిషం వరకు శంకర్నాయక్, డాక్టర్ రవి, చీమల వెంకటేశ్వర్లు తదితర నేతలు టికెట్ రేసులో మిగిలారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో గ్రామ, మండల స్థాయిల్లో తమకంటూ అనుచరగణం ఏర్పాటు చేసుకుని పని చేశారు. ‘నామినేటెడ్’ భర్తీ ఎప్పుడో ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పొదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కింది. ఇక ఆ తర్వాత నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెద్దగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో పార్టీ కోసం చెమటోడ్చిన తమను ఇంకెప్పుడు గుర్తిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 18 నెలలుగా ఎలాంటి పదవులు దక్కలేదని, తమను నమ్ముకున్న వారికి కనీస స్థాయిలో సాయం చేసే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కింది స్థాయి కేడర్లో ఉత్సాహం నింపేలా, గతంలో టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం పార్టీ కోసం ఓపికగా పని చేసుకుంటూ వెళితే సరైన సమయంలో తగిన గుర్తింపు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి.. ఎన్నికల సమీకరణలు, వ్యూహాల్లో భాగంగా కొత్తగూడెం టికెట్ సీపీఐకి కేటాయించగా, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడిచిన పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణకు అవకాశం దక్కింది. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు టికెట్ ఇచ్చారు. అయితే కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐ, మరో మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. భద్రాచలంలో పొదెం వీరయ్య ఓడిపోయారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ శ్రమకు తగిన గుర్తింపు ఉంటుందని టికెట్ దక్కని ఆ పార్టీ నేతలు ఆశించారు. -
మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్నాం
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు మూడు నెలల సన్నబియ్యాన్ని ముందుగానే పంపిణీ చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి రుక్మిణీ దేవి తెలిపారు. జిల్లాలోని పలు రేషన్ దుకాణాలను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్డుదారులకు అవసరమైన 17,287 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌక దుకాణాలకు దఫాల వారీగా తరలిస్తున్నామని చెప్పారు. ఈనెల 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ ఉంటుందని, డీలర్లు సమయపాలన పాటించాలని సూచించారు. జిల్లాలోని 443 రేషన్ షాపుల్లో ఇప్పటివరకు 32,488 మంది కార్డుదారులు బియ్యం తీసుకున్నారని వివరించారు. -
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలుభద్రాచలంటౌన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్ఓ భాస్కర్ నాయక్ తెలిపారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరికై నా జ్వరం వస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయడంతో పాటు మందులు అందించాలని సిబ్బందికి సూచించారు. మలేరియా నివారణలో భాగంగా ఐఆర్ఎస్ పిచికారీకి అవసరమైన ఏసీఎంలను జిల్లాలోని అన్ని పీహెచ్సీలకు అందజేశామని చెప్పారు. అనంరతం సిబ్బందికి మలేరియా కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ చైతన్య పాల్గొన్నారు. గర్భిణుల నమోదు తప్పనిసరి కొత్తగూడెంఅర్బన్ : గర్భిణుల వివరాలు ముందస్తుగా నమోదు చేయాలని, సకాలంలో ప్రసవాలు చేసేలా చూడాలని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ అన్నారు. తన కార్యాలయంలో బుధవారం ఆయన సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా నమోదుకు చర్యలు చేపట్టాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎస్.లక్ష్మి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల గర్భిణులను అంచనా వేసిన డెలివరీ తేదీల కంటే ముందుగానే అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని అన్నారు. అన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలని, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. సమావేశంలో వైద్యులు మధువరణ్, తేజశ్రీ, పుల్లారెడ్డి, భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓ చైతన్య తదితరులు పాల్గొన్నారు. పశువులకు వ్యాధి నివారణ టీకాలుపాల్వంచరూరల్ : వానాకాలంలో పశువులు, గొర్రెలు, మేకలకు సంక్రమించే వ్యాధుల నివారణకు గత నెల 27 నుంచి ఈనెల 26 వరకు టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2.30 లక్షల ఆవులు, గేదెలకు గొంతువాపు, జబ్బవాపు, ముద్దచర్మ వ్యాధి నివారణ టీకాలు, 1.41 లక్షల గొర్రెలు, మేకలకు చిటుకు వ్యాధి నివారణకు ఉచితంగా టీకాలు వేస్తున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగరేణిలో 39 మంది అధికారుల బదిలీసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో పర్సనల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న 39 మంది అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఒక ఏజీఎం, ఏడుగురు డీజీఎంలు, 12 మంది డిప్యూటీ పీఎంలు, 17 మంది సీనియర్ పీఓలు, ఇద్దరు సంక్షేమాధికారులు ఉన్నారు. ముందస్తు వరద హెచ్చరిక పాల్వంచరూరల్: వర్షాలు కురుస్తున్నందున కిన్నెరసాని ప్రాజెక్టు ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగితే గేట్లను ఇప్పటి నుంచి వర్షకాలం పూర్తయ్యే నవంబర్ వరకు ఎప్పుడైనా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని కిన్నెరసాని ప్రాజెక్టు సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ రామకృష్ణారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరద ఉధృతిని బట్టి గేట్లు ఎప్పుడైనా ఎత్తే అవకాశం ఉంటుందని, వీలైనంత వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎత్తి వాగులోకి వరద నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. -
ఆయిల్పామ్తో అదనపు ఆదాయం
అశ్వారావుపేటరూరల్: దీర్ఘకాలిక పంటగా పేరున్న ఆయిల్పామ్లో అంతర పంటల సాగు, కుటీర పరిశ్రమల ఏర్పాటుతో అదనపు ఆదాయానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో కొంతకాలంగా ఆయిల్పామ్ సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 75, 049 ఎకరాల్లో ఈ పంట సాగులో ఉండగా అందులో 63 వేల ఎకరాల్లో అంతర పంటలు సాగు చేస్తుండడం విశేషం. సాగునీరు, శ్రమ ఆదా.. ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటల సాగుతో అధిక ఆదాయం వస్తుంది. ఎకరం తోటలో 59 పామాయిల్ మొక్కలు నాటితే వాటి మధ్య ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉంటుంది. ఆ స్థలంలో తొలి నాలుగేళ్ల పాటు మొక్కజొన్న, వేరుశనగ, పుచ్చ, బొబ్బర్లు, పత్తి, అరటితో పాటు బీర, దోస, చిక్కుడు, సొరకాయ, బెండ వంటి కూరగాయలు, బంతి, చామంతి వంటి పూలసాగు కూడా చేస్తూ ఆదాయం గడించవచ్చు. దీంతో ఎరువుల ఖర్చు కలిసొస్తుంది. డ్రిప్ ద్వారా ఏక కాలంలో ఆయిల్పామ్, అంతర పంటలకు సాగునీరు అందించడం ద్వారా నీరు, శ్రమ కూడా తగ్గుతాయి. ఐదేళ్లకు పామాయిల్ మొక్కలు పెరిగాక కూడా అంతర పంటలుగా కోకో, వక్క, జాజికాయ పంటలు సాగు చేయొచ్చు. పెట్టుబడి ఖర్చులన్నీ మొదటి నాలుగేళ్లలోనే వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది. కుటీర పరిశ్రమలకూ చాన్స్.. ఆయిల్పామ్ గెలల దిగుబడి వచ్చిన తర్వాత కూడా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ప్రధానంగా నాటు కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం, ఫారం కోళ్ల షెడ్లు, వర్మి కంపోస్టు తయారీ యూనిట్ల ద్వారా రూ.లక్షల్లో ఆదాయం గడించే అవకాశం ఉంటుంది. అంతర పంటలు సాగు చేయండి ఆయిల్పామ్ తోటల్లో తొలి నాలుగేళ్లు, ఆ తర్వాత ఐదేళ్ల తర్వాత కూడా అంతర పంటలు సాగు చేయొచ్చు. ఆయా ప్రాంతాల్లో పండే ఏ రకం పంటలైనా వేసుకోవచ్చు. ఈ అదనపు ఆదాయంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఉద్యాన పంటలకు ప్రభుత్వం అనేక రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నందున అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం. – జంగా కిషోర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అంతర పంటల సాగుకు అనేక అవకాశాలు కుటీర పరిశ్రమలు సైతం ఏర్పాటు చేసుకోవచ్చు నాలుగేళ్లలోనే తీరనున్న పెట్టుబడి ఖర్చులు -
విభజన అశాసీ్త్రయం
● పాత వార్డులనే కలిపి చూపించారు.. ● క్షేత్రస్థాయి సందర్శన లేకుండానే జాబితాలు.. ● అధికారుల పర్యవేక్షణ లోపం.. బిల్ కలెక్టర్ల ఇష్టారాజ్యం‘గూడెం’లోనూ అదే తీరు.. కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల విభజన ముసాయిదా విడుదలైంది. అయితే ఏర్పాటు ప్రక్రియ అందరికీ ఆమోదయోగ్యంగా లేదనే వాదనలు వెల్లువెత్తున్నాయి. డివిజన్ల విభజన కాదు.. పాత వార్డుల్లో కమ్యూనిటీల విభజన చేసినట్టు ఉందని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం గతంలో ఎన్నికై న వార్డు ప్రస్తుతం వారి డివిజన్లో కలిసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓటర్లయితే తాము ఏ డివిజన్లోనికి వెళ్లాం, అది ఏ ఏరియా అని తెలియక గందరగోళంలో ఉన్నారు. కార్పొరేషన్ కార్యాలయ నోటీసు బోర్డులో ఏర్పాటు చేసిన ముసాయిదా డ్రాఫ్ట్ను చెక్ చేసుకుంటున్నారు. అయితే డివిజన్ల విభజనపై అసంతృప్తిగా ఉన్నవారు అభ్యంతరాలను ఈ నెల 11 వరకు ఇవ్వొచ్చని అధికారులు సూచిస్తున్నారు. పాల్వంచ నుంచి మొదలు.. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం 60 డివిజన్లుగా విభజించారు. కొత్తగూడెం 29 డివిజన్లు, పాల్వంచ 27, సుజాతనగర్ 4 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లో మొత్తం 1,34,011 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్తగూడెం పరిధిలో 63,750 మంది, పాల్వంచకు సంబంధించి 61,240, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీల పరిధిలో 9,021 మంది ఉన్నారు. 1 నుంచి 27వ డివిజన్ వరకు పాల్వంచ ఉండగా, 28 నుంచి 38 వరకు కొత్తగూడెం, మళ్లీ 39 నుంచి 42వ డివిజన్ వరకు సుజాతనగర్ మండలంలోని నిమ్మలగూడెం నుంచి నర్సింహాసాగర్ వరకు, ఆ తర్వాత 43 నుంచి 60వ డివిజన్ వరకు కొత్తగూడెం బాబుక్యాంపు నుంచి కూలీలైన్ వరకు ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఈనెల 11 వరకు సమర్పించాలని అధికారులు కోరారు. అశ్వారావుపేట : ‘తాళి కట్టించా.. తన్నుకు చావండి..’ అన్న చందంగా మారింది అశ్వారావుపేట మున్సిపాలిటీలో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ. మున్సిపాలిటీలో వార్డులు, డివిజన్ల ఏర్పాటు/ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ముందే సిద్ధం కావాల్సిన మున్సిపల్ సిబ్బంది.. ఆదాయ మార్గాలైన ఎల్ఆర్ఎస్, గృహ నిర్మాణ అనుమతుల వంటి ఆర్థిక లావాదేవీల్లో నిమగ్నమై వార్డుల విభజనను భ్రష్టు పట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. అంతా గందరగోళం.. అశ్వారావుపేట మున్సిపాలిటీని 22 డివిజన్లుగా విభజించారు. ఇందులో అశ్వారావుపేట మేజర్ పంచాయతీలోని పాత 16 వార్డులను ప్రస్తుతం 1 నుంచి 8 వార్డులకు కేటాయించారు. 9, 10 వార్డుల్లో పేరాయిగూడెం పంచాయతీలోని ఏఎస్ఆర్ కాలనీ, బీసీ కాలనీ, మోడల్ కాలనీ, ఫైర్ కాలనీలు ఉన్నాయి. ఆ తర్వాత జాతీయ రహదారికి ఉత్తరం వైపున ఉన్న అశ్వారావుపేట సరిహద్దు బండి పుల్లారావు రోడ్డు నుంచి లక్కీ ఆపార్ట్మెంట్ వరకు 11వ వార్డు, అక్కడ కట్ చేస్తే.. వ్యవసాయ క్షేత్రాల ఆవల ఉన్న మారుతీనగర్, గుర్రాల చెరువు ప్రాంతాన్ని 12వ వార్డులో, దొంతికుంట చెరువుకు ఆనుకుని ఉన్న భవనాలు, భద్రాచలం రోడ్కు పడమర భాగాన్ని 13వ వార్డులో, సంతమార్కెట్ నుంచి తూర్పు బజార్ వరకు 14 వార్డుగా, వెలమబజార్ నుంచి భూపతి మాస్టార్ ఇంటి మీదుగా పాలడుగుల రంగమణి ఇంటి వరకు 15వ వార్డు, రామాలయం బజార్, మున్సిపాలిటీ వెనుక భాగం, జవహర్ కాన్వెంట్ నుంచి చెక్పోస్టు వరకు 16వ వార్డు, మళ్లీ కట్ చేస్తే పూర్వ పేరాయిగూడెం పంచాయతీ పరిధిలోని ఇందిరా కాలనీ, బీసీ కాలనీలలో కొంత భాగం 17వ వార్డు, ఆ తర్వాత పేరాయిగూడెం, నెహ్రూనగర్, ఫైర్ కాలనీల్లో కొంత భాగాన్ని 18వ వార్డు, ఆ తర్వాత జాతీయ రహదారి దాటి షిరిడీ సాయి నగర్ను 19 వవార్డు, బస్టాండ్కు తూర్పు భాగపు ప్రాంతాన్ని 20వ వార్డు, ఇందిరాకాలనీ, బీఎస్ఆర్ నగర్లో కొంత భాగం 21వ వార్డు, తిరిగి ఫైర్ కాలనీ, మోడల్ కాలనీల్లో కొంత భాగంతో 22వ వార్డుగా విభజించారు. మొక్కుబడిగా ప్రక్రియ.. నిబంధనల ప్రకారం వార్డులు ఒకదానికొకటి పక్కపక్కనే ఉండాలి. పూర్వ జనగణన ఆధారంగా వార్డులను విభజించి సరిహద్దులు గుర్తించాలి. జాబితా లపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మ్యా ప్ రూపొందించాలి. కానీ పేరాయిగూడెం పంచాయతీలోని అన్ని ఆవాసాలను విభజించి రెండు, మూడు వార్డుల్లో పొందు పరిచారు. పాత ఓటరు జాబితా, వార్డుల జాబితాలను కాపీ, పేస్ట్ చేసినట్లుగా ఉంది తప్పితే మున్సిపల్ సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని పలువురు అంటున్నారు. మొక్కుబడి విభజనతో ఎన్నికల్లో పోటీ చేసే వారితో పాటు, సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి డీలిమిటేషన్లో అనుభవం ఉన్న అధికారులతో వార్డుల విభజన చేయించాలని స్థానికులు కోరుతున్నారు. డివిజన్ల ముసాదాయి డ్రాఫ్ట్ విడుదల 11 వరకు అభ్యంతరాల స్వీకరణ అసంతృప్తిలో మాజీలు, ప్రజాప్రతినిధులు -
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
ములకలపల్లి: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు ఆదనపు కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ములకలపల్లి మండలంలో తొలిరోజు కమలాపురం, రాచన్నగూడెం గ్రా మాల్లో నిర్వహించిన సదస్సుల్లో ఆయన మా ట్లాడారు. రైతులకు భూ సమస్యలు ఉంటే ఈ సదస్సుల్లో తప్పక దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తలను పరిశీ లించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ భూక్యా గన్యా, నాయబ్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఆర్ఐలు సత్యావతి, భద్రు, మాజీ ఎంపీపీ మట్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ చోరీ కామేపల్లి: మండలంలోని పొన్నేకల్ బుగ్గవాగు ఎత్తిపోతల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. రైతులు ఇచ్చిన సమాచారంతో ఇరిగేషన్ డీఈఈ శంకర్నాయక్, ఏఈఈ రమేశ్ మంగళవారం పరిశీలించారు. కాగా, విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతు చేయించి ట్రాన్స్ఫార్మర్ను వినియోగంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ వల్లభనేని అప్పారావు కోరారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
ఉమ్మడి జిల్లాలో గోదావరి పరవళ్లు
ఏన్కూరు: గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీతారామ ఎత్తిపోతల పథకం సిద్ధమవుతోందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో కీలకమైన రాజీవ్ కెనాల్ పనులు 8.86 కి.మీ.ల్లో 7.86 కి.మీ. మేర పూర్తయినందున, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలకు సాగునీరు అందనుందని వెల్లడించారు. ఏన్కూరు సమీపాన రాజీవ్ కెనాల్(ఏన్కూరు లింక్ కెనాల్) పనులను మంగళవారం మంత్రి పరిశీలించి మాట్లాడారు. ఈనెల 10వ తేదీకల్లా కెనాల్ పనులు పూర్తి కానుండగా, పుష్కలంగా సాగునీరు అందుతుందన్నారు. కాగా, సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలకు సాగునీరు అందించేలా యాతాలకుంట టన్నెల్ నిర్మిస్తున్నామన్నారు. సాగర్ ద్వారా కృష్ణా జలాలు రావడానికి రెండు నెలల ముందుగానే ఖమ్మం జిల్లా రైతులకు గోదావరి జలాలు అందించాలన్నది తమ సంకల్పమని మంత్రి తెలిపారు. లింక్ కెనాల్ పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల -
పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ
కరకగూడెం: పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా మలేరియా అధికారి స్పందన స్పష్టంచేశారు. మంగళవారం ఆమె కరకగూడెం పీహెచ్సీని సందర్శించి ‘ఆశా డే’కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధిని అరికట్టడంలో సిబ్బంది సేవలతో పాటు ప్రజల సహకారం ఉండాలని, ఇళ్ల చుట్టూ, ఇంటి లోపల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరిబొండాలు, పగిలిన కుండలు, పూలకుండీలు, డ్రమ్ము లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. అనంతరం పీహెచ్సీలోని రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో వైద్యాధికారి రవితేజ, సబ్ యూనిట్ ఆఫీసర్ వీరస్వామి, హెచ్ఈఓ పోలెబోయిన కృష్ణయ్య, ఎంటీఎస్ అరుణ్బాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
చూద్దాం రండి..!
మ్యూజియం.. ● ప్రజల ఆదరణ చూరగొంటున్న భద్రాచలంలోని గిరిజన మ్యూజియం ● ఏజెన్సీ కేంద్రంలో సరికొత్త ఆటవిడుపు ● రూ.కోటి నిధులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ● ఐటీడీఏ పీఓ రాహుల్కు ప్రశంసల వెల్లువ భద్రాచలం: గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఐటీడీఏ పీఓ రాహుల్ తీసుకున్న నిర్ణయం, చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియానికి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజాప్రతినిధుల ప్రశంసలు దక్కడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూ.కోటి నిధులను విడుదల చేస్తామని వెల్లడించింది. ఇలాంటి గిరిజన మ్యూజియాలను అన్ని ఐటీడీఏల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించడంతో పీఓ రాహుల్ కృషికి ఫలితం దక్కినట్లయింది. ఫొటోలకు అనుమతి గిరిజన మ్యూజియంలో గతంలో కేవలం వస్తువులు, పరికరాల సందర్శనకు మాత్రమే అనుమతించే వారు. ప్రస్తుతం పర్యాటకులు, వీక్షకులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు కూడా అనుమతివ్వడంతో బారులుదీరుతున్నారు. విశాలంగా గిరిజన పల్లె తరహాలో ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకునేందుకు, పుట్టినరోజు ఇతర పార్టీలను చేసుకునేందుకు అనువుగా ఉండటంతో ప్రజలు తరలివస్తున్నారు. వెదురుతో చేసిన సెల్ఫీ పాయింట్, రంగురంగుల విద్యుత్ అలంకరణ జత కూడాయి. గిరిజన వంటకాలు ఆహుతులను అలరిస్తున్నాయి. ఏజెన్సీ కేంద్రంలో ఆటవిడుపు.. పిల్లలకు, యువతకు, పెద్దలకు ఆటవిడుపునకు కేంద్రంగా తీర్చిదిద్దటం అద్భుత ఫలితాలను ఇచ్చింది. పిల్లలకు పెడల్ బోటింగ్, పార్క్, యువతకు బాక్స్ క్రికెట్, పెద్దలకు ఇసుక వాలీబాల్, షటిల్ తదితర ఆటల సెంటర్లను ఏర్పాటు చేయడంతో పెద్ద ఆటవిడుపుగా మారింది. వారాంతం, సెలవు రోజుల్లో జాతరను తలపించేలా జనం వస్తున్నారు. ఏప్రిల్ 7న దీనిని గవర్నర్ మహదేవ్వర్మ ప్రారంభించగా, నాటి నుంచి ఇప్పటి వరకు 50 వేలకు పైగానే దీనిని సందర్శించారు. విశ్వవ్యాప్తం చేయాలి గిరిజన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విశ్వవ్యాప్తం చేయాలని రూపొందించిన గిరిజన మ్యూ జియానికి ఇంత ఆదరణ లభించటం సంతోషంగా ఉంది. హైదరాబాద్లోని తాజ్ బంజారాలో జరిగిన కాన్ఫరెన్స్లో దీనిపై వివరించటం, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, న్యూఢిల్లీ రూ.కోటి నిధుల ప్రకటన, మంత్రి సీతక్క, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్ల సత్కారం.. గిరిజనులకు, అధికారులకు జరిగిన సన్మానంగా భావిస్తున్నా. – బి.రాహుల్, పీఓ, ఐటీడీఏ భద్రాచలంకేంద్రం నుంచి రూ.కోటి నిధులు మ్యూజియం ప్రారంభమైన నాటి నుంచి సందర్శించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పీఓ కృషిని ప్రశంసించారు. తాజాగా సందర్శించిన మంత్రి సీతక్క అన్నింటిని వీక్షించి పర్యాటకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రజాప్రతినిధుల సిఫార్సుతో భద్రాచలం గిరిజన మ్యూజియం అభివృద్ధికి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ (మోట) న్యూఢిల్లీ నుంచి రూ.కోటి నజరాన ప్రకటన వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులను విడుదల చేస్తే ఐటీడీఏ మ్యూజియానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా తీర్చిదిద్దవచ్చు. అరకు, అసోం ప్రాంతాల్లో మాదిరిగా భద్రాచలం ప్రత్యేకమైన గిరిజన కొమ్ము, కోయ నృత్యాలలో పర్యాటకులను భాగస్వాములను చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. -
సాయి మందిరానికి రూ.లక్ష విరాళం
భద్రాచలంటౌన్: భద్రాచలం ప్రభుత్వ జూని యర్ కళాశాల సెంటర్లోని శ్రీసాయిబాబా మందిర అన్నప్రసాద షెడ్డు నిర్మాణానికి ఓ భక్తుడు రూ.లక్ష విరాళం అందించాడు. పట్టణానికి చెందిన దివంగత చెరుకూరి సత్యవాణి జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు ఆలయ అధ్యక్షుడు కొమ్మనాపల్లి ఆదినారాయణకు మంగళవారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు కుటుంబసమేతంగా బాబావారిని దర్శించుకని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు దాతలకు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో చెరుకూరి మల్లికార్జునరావు, గొర్ల వెంకటేశ్వరరావు, శ్రీరామ్శర్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పునరావృతం కాకుండా చర్యలుభద్రాచలంటౌన్: భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో పరమత వ్యాఖ్యలతో ఉన్న కవర్లు రావడం చాలా దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వ ర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సంఘం అధ్యక్షుడు అన్నెం శ్రీనివాసరెడ్డి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. వస్త్రాలు విక్రయించే కాంట్రాక్టర్ స్క్రాప్ కవర్లను విక్రయించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు కాంట్రాక్టర్ వివరణ ఇచ్చాడని తెలిపారు. సున్నితమైన అంశంపై విపరీతమైన ప్రచారం జరగడంతో ఆలయ ఉద్యోగులు, రామ భక్తులు విచారం వ్యక్తం చేశారని, భవిష్యత్లో ఇలాంటి ఘటన లు జరగకుండా చూస్తామని వివరించారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయలో యంత్ర ప్రతిష్ఠ సింగరేణి(కొత్తగూడెం): రామవరంలోని శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు పార్వతి సమేత రామలింగేశ్వర, పంచముఖ ఆంజనేయ, సుబ్రహ్మణ్యేశ్వర, నంది, ఉష్ణవాహన, శిఖర, నాగ, యంత్ర విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం యంత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. గణపతి పూజ, గోపూజ, పుణ్యావాచనం, పంచగ్రవ్య ప్రాశన, రక్షాబంధనం, రుత్వికరణం, దీక్షాధారణం, యాగశాల ప్రవేశం అఖండ దీపస్థాపన నిర్వహించారు. సాయంత్రం పలు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. -
నాటుసారా స్థావరాలపై దాడులు
కరకగూడెం: నాటుసారా తయారు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మణుగూరు ఎకై ్సజ్ సీఐ రాజిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. విప్పలగుంపులో ఓ ఇంట్లో సారా తయారీకి ఉపయోగించే సుమారు 200 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశారు. 9 మంది సారా తయారీ, విక్రయదారులపై కేసులు నమోదు చేసి, వారిని తహసీల్దార్ కార్యాలయంలో తహసీ ల్దార్ కాంతయ్య ఎదుట బైండోవర్ చేశారు. కార్యక్రమంలో హెచ్సీ అష్రఫ్, సిబ్బంది ఆంజనేయులు, ధనజ్యోతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కేసు నమోదు ఇల్లెందు: పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన సైదులుపై అదే గ్రామానికి చెందిన యాకూబ్పాషా, సోని దాడి చేసి గాయపర్చారు. మంగళవారం జరిగిన ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ హసీనా కేసు నమోదు చేశారు. విద్యార్థిని అదృశ్యంపాల్వంచరూరల్: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బట్టలు, ల్యాప్ట్యాప్ను సర్దుకుని ఓ విద్యార్థిని వెళ్లిపోయింది. మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన ఓపెన్ డిగ్రీ చదువుతున్న విద్యార్థిని (19) మంగళవారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయందని, ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదని తండ్రి శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశామని ఎస్ఐ సురేశ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామంలో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంగళవారం ఎస్ఐ నాగుల్మీరా కేసు నమోదు చేశారు. మాణిక్యారం గ్రామానికి చెందిన గడదాసు గణేశ్ బైక్పై పోలారం నుంచి మాణిక్యారం వెళ్తూ కొమరారంలో ఎదురుగా స్కూటీపై వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాలును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలు తీవ్రంగా గాయపడగా.. ఆయన కుమారుడు కిరణ్ ఫిర్యాదు మేరకు విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. -
సర్వేకే పరిమితమైన డబ్లింగ్ లైన్
ఇళ్లు, వ్యవసాయ భూములు కోల్పోనున్న పలువురు ● ఐదు నెలల క్రితమే సర్వే, ఆపై మార్కింగ్ ● ఇప్పటికీ పరిహారం ఊసెత్తని అధికారులు కారేపల్లి: డోర్నకల్ రైల్వే జంక్షన్ నుంచి కారేపల్లి రైల్వే జంక్షన్ మీదుగా కొత్తగూడెం స్టేషన్ వరకు ఉన్న సింగిల్ ట్రాక్ను డబుల్ ట్రాక్గా నిర్మించేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈమేరకు కారేపల్లి మండలంలో కమలాపురం, గేటుకారేపల్లి, కారేపల్లి, గాంధీనగర్, చీమలపాడు, రేలకాయపల్లి గ్రామాల్లో భూసేకరణ కోసం సర్వే చేశారు. మండల వ్యాప్తంగా 54 ఎకరాలు అవసరమని గుర్తించగా, కారేపల్లి పరిధి సింగరేణి రెవెన్యూలో సుమారు 60 – 70 మంది నుంచి 11.35 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించాలని ఉంటుందని నిర్ధారించారు. అలాగే, కారేపల్లిలో స్టేషన్ విస్తరణ, రెండో ప్లాట్ ఫామ్, అదనంగా రెండు ట్రాక్ల నిర్మాణానికి 20 కుటుంబాల నుంచి ఇళ్లు సేకరించాల్సి ఉంటుంది. ట్రాక్ నుంచి 45 మీటర్ల మేర వ్యవసాయ భూమి, స్టేషన్ పరిధిలో 65మీటర్ల భూమితో పాటు ఇళ్లు సేకరించేలా మార్కింగ్ సైతం వేశారు. ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు భూనిర్వాసితులకు సమాచారం ఇచ్చారు. ఆపై గ్రామసభలు నిర్వహించినా, ఇప్పటివరకు పరిహారంపై ప్రకటన చేయకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాగు చేయాలా, వద్దా..? డబ్లింగ్ లైన్ నిర్మాణ భూసేకరణ కోసం సర్వే చేపట్టి ఐదు నెలలు కావొస్తుండగా, పరిహారంపై స్పష్టత కోసం నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ సీజన్ మొదలుకావడంతో రైల్వే అధికారులు మార్కింగ్ చేసిన భూముల్లో పంట సాగు చేయాలా, వద్ద మీమాంస నెలకొంది. సింగరేణి రెవెన్యూ పరిధి మైదాన ప్రాంతంలో ఉండడంతో ఇక్కడి భూములకు మంచి ధర పలుకుతోంది. అయితే, వ్యవసాయి భూములు, ఇంటి స్థలాలకు మార్కెట్ ధర కంటే మూడు రెట్లు అదనంగా పరిహారంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ఇళ్లకు స్వభావం ఆధారంగా ధర నిర్ణయించి గ్రామసభలో తీర్మానం చేస్తారని సమాచారం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలియకున్నా పరిహారం స్పష్టత లేక, పంటల సాగుపై అవగాహన లేక నిర్వాసితులు ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. -
మలేరియాను తరిమికొట్టాలి..
ఇల్లెందు: మలేరియా నివారణ కోసం ముందస్తు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించిన వారి వల్ల వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా మలేరియా వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించే సర్వే పూర్తి చేశారు. జ్వర పీడితుల నుంచి రక్తపూతలు సేకరించి పరీక్షించారు. గొత్తికోయగూడేల్లో ఉన్న వారే ఈ జ్వర పీడితులుగా తేలారు. వీరు తమ స్వగ్రామాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి నుంచి మలేరియా సోకినట్లు గుర్తించారు. వారికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. వచ్చే నెల 16 నుంచి మలేరియా నివారణ కోసం మందు పిచికారీ చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఏడు మలేరియా సబ్ యూనిట్లు.. జిల్లాలో ఏడు మలేరియా సబ్ యూనిట్ సెంటర్లు ఉన్నాయి. ఒక్కో సెంటర్కు ఒక సబ్ యూనిట్ సూపర్వైజర్ పనిచేస్తున్నారు. జిల్లాలో మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ కార్యక్రమం రూపొందించి సబ్యూనిట్లకు చేరవేస్తారు. మలేరియా సబ్యూనిట్ సూపర్వైజర్ ద్వారా కిందిస్థాయిలోమలేరియా నివారణ కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ఇల్లెందు యూనిట్ పరిధిలోసులానగర్(టేకులపల్లి), ఆళ్లపల్లి, రొంపేడు(సుదిమళ్ల), గుండాల పీహెచ్సీలు ఉన్నాయి.కొత్తగూడెం సబ్ యూనిట్ పరిధిలో కొత్తగూడెం, పెనగడప, సుజాతనగర్, చండ్రుగొండ, జూలూరుపాడు, ఎర్రగుంట, ఎంపీ బంజర సబ్ యూనిట్ పరిధిలో ఉల్వనూరు, ముల్కలపల్లి, పాల్వంచ, జగన్నాథపురం, ఎంపీ బంజర,అశ్వారావుపేట సబ్ యూనిట్ పరిధిలో వినాయకపురం, గుమ్మడివల్లి, దమ్మపేట, పట్వారీగూడెం, మణుగూరు సబ్ యూనిట్ పరిధిలోమణుగూరు, అశ్వాపురం, పినపాక, జానపేట, కరకగూడెం, భద్రాచటం సబ్ యూనిట్పరిధిలో భద్రాచలంటౌన్, నర్సాపురం,పర్ణశాల, దుమ్ముగూడెం, చర్ల పీహెచ్సీలు ఉండగా వీటి పరిధిలో 20 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 20 కేసుల గుర్తింపు రాకపోకల వల్లే వ్యాధి వ్యాప్తి ముందస్తు చర్యలతోనే నివారణమలేరియా నివారణకు చర్యలు.. జిల్లాలో మలేరియా నిర్మూలన కోసం ప్రణాళికాయుతంగా చర్యలు చేపడతున్నాం. ఇప్పటికే గ్రామస్థాయిలో రక్తపూత లు సేకరించి పరీక్షించగా 20 కేసులు నమోదయ్యాయి. వారందరికీ వైద్యం అంది స్తున్నాం. ప్రస్తుతం మలేరియా అదుపులో ఉంది. నివారణకు తగు చర్యలు ముమ్మరం చేశాం. –డాక్టర్ స్పందన, మలేరియా ప్రోగ్రాం అధికారి -
భూముల రీసర్వేతో రైతులకు మేలు
● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● ములుగుమాడులో సదస్సు, సర్వేను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి ● పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మలఎర్రుపాలెం: రాష్ట్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా భూముల రీసర్వే చేపట్టనుండగా రైతులకు మేలు జరగడమే కాక భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూముల రీ సర్వే, భూభారతి సదస్సును మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఎవరిపై భారం పడకుండా సర్వే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడమే కాక ఎవరికీ రూపాయి కూడా ఖర్చు లేకుండా భూముల రీసర్వే చేసి రికార్డులకు భద్రత కల్పిస్తామని భట్టి, మంత్రులు వెల్లడించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ధరణి చట్టం స్థానంలో భూభారతి తీసుకొచ్చామని తెలిపారు. తద్వారా ప్రతీ భూకమతానికి ఆధార్కార్డు మాదిరి భూధార్ ఇస్తామని చెప్పారు. అంతేకాక ఏటా సదస్సులు నిర్వహించి అమ్మకాల, కొనుగోలు వివరాలను అప్డేట్ చేస్తామని తెలిపారు. భూ సంస్కరణల కారణంగా రాష్ట్రంలో దాదాపు 26లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదలకు పంపిణీ చేస్తే, గత పదేళ్లలో ఎక్కడా కమిటీలు కానరాలేదన్నారు. ఈనేపథ్యాన కొత్త చట్టంతో కమిటీలు ఏర్పాటు చేసి మిగులు భూములను ఇంటి పట్టా లుగా, సాగుకు పంపిణీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న భూమి కంటే ఎక్కువగా రికార్డుల్లో నమోదు చేయించి రైతుబంధు నిధులు కాజేశారని, ఇలాంటివి ఇక సాగవని స్పష్టం చేశారు. గ్రామ పాలనాధికారులు, లైసెన్సు సర్వేయర్ల నియామకంతో రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. -
బంగారు భవిష్యత్కు బాటలు వేద్దాం
● అన్ని ఏరియాల్లో నూతన గనుల సాధనకు ప్రయత్నాలు ● సంస్థ అభివృద్ధికి ఏరియా జీఎంలు ప్రణాళిక రూపొందించాలి ● బొగ్గు ఉత్పత్తి, నాణ్యతపై దృష్టి పెట్టాలి ● సింగరేణి సీఎండీ బలరామ్ దిశా నిర్దేశం సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి భవిష్యత్కు బంగారు బాటలు వేయాలని సీఎండీ ఎన్.బలరామ్ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన అన్ని ఏరియాల జీఎంలు, ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంపెనీ విస్తరణ, సమస్యల పరిష్కారంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. ఓవర్బర్డెన్ తొలగింపులో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, రవాణాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన గనులు లేకపోతే ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి తదితర ఏరియాలకు భవిష్యత్ ఉండదని, కొత్త గనుల కోసం ముమ్మరంగా ప్రయత్నించాలని అన్నారు. అటవీ అనుమతులు సాధనలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. శాంతిఖని, అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ల్లో నష్టాల నివారణకు ప్రత్యేక కమిటీ వేస్తామని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు సత్తుపల్లిలో కోల్వాషరీ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డైరెక్టర్లు సత్యనారాయణరావు, ఎల్.వి. సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లుతో పాటు అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు. ప్రజాకవి జయరాజుకు సన్మానం సింగరేణి సంస్థ మాజీ ఉద్యోగి, ప్రజాకవి గొడిశెల జయరాజును కొత్తగూడెంలో సీఎండీ ఎన్.బలరామ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జయరాజుకు ఇప్పటికే పలు అవార్డులు, పురస్కారాలు వచ్చాయని, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతి అందిస్తూ తగిన గుర్తింపునివ్వడం హర్షణీయమని అన్నారు. సింగరేణి సంస్థలో ఫిట్టర్గా విధులు నిర్వహిస్తూనే కార్మికుల, కర్షకుల కష్టాలపై స్పందించేవారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అందరికీ అర్థమయ్యేలా పాటల రూపంలో వివరించేవారని తెలిపారు. సింగరేణి కార్మికులు నెల రోజుల పాటు చేసిన సమ్మెలో పాల్గొన్న జయరాజు.. ఎవరు ప్రలోభ పెట్టినా తన పంథా వీడలేదని చెప్పారు. అనంతరం జయరాజు మాట్లాడుతూ.. సింగరేణి అందించిన సహకారం, ప్రోత్సాహం వల్లే తాను కవిగా, ఉద్యమకారుడిగా, ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని చెప్పారు. కార్యక్రమంలో కోల్ మూమెంట్ డైరెక్టర్ ఎస్డీఎం సుభాని పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి 19 వరకు జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులక సూచించార. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్ పుస్తకాలు, డిజిటల్ విద్య, ఉపకార వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. 6 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యలో బడి మానేసిన వారిని గుర్తించి తిరిగి పాఠశాలకు పంపించాలని, పిల్లలను బడికి పంపేందుకు ఇష్టపడని తల్లిదండ్రులతో మాట్లాడి కారణాలను నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను గుర్తించి, రెండు వారాల్లో తగిన మరమ్మతులు చేయించాలని చెప్పారు. ఉపాధిహామీ పథకం ద్వారా అన్ని పాఠశాలలకు మట్టి ఇటుకలతో ప్రహారీలు నిర్మించాలని, భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి అవసరమైన వైద్య సౌకర్యాలు అందించాలని ఆదేశించారు. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాసం యాప్ ద్వారా వారికి అభ్యాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 100 శాతం అక్ష్యరాస్యత సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పాఠశాలల్లో ఎకో క్లబ్ల ఆధ్వర్యంలో సీడ్ బ్యాంకుల ద్వారా విత్తనాలు ఎక్కువగా సేకరించిన స్కూళ్లకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో తులసి, ఉసిరి, చింత, వెలగ, మునగ, కరివేపాకు మొక్కలు నాటాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీఓ సంజీవరావు, మెప్మా పీడీ రాజేష్, డీఈఓ ఎం. వెంకటేశ్వరాచారి, బీసీ సంక్షేమాధికారి ఇందిర, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణప్రపంచ పర్యావరణ దినోత్సవ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచాలి
దమ్మపేట : ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగేలా చొరవ తీసుకోవాలని, ఈ మేరకు రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అధికారులకు సూచించారు. మండలంలోని గండుగులపల్లిలో మంత్రిని అధికారులు కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. పామాయిల్ సాగులో ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తెలంగాణను పామాయిల్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. తక్కువ పెట్టుబడి, ప్రభుత్వ రాయితీలు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి పామాయిల్కు ఉన్నాయని, ఈ పంట సాగుతో స్థిర ఆదాయం పొందొచ్చని చెప్పారు. ఇవే అంశాలపై రైతుల్లో చైతన్యం కలిగించాలన్నారు. కార్యక్రమంలో అశ్వారావుపేట వ్యవసాయ సహాయ సంచాలకులు రవికుమార్, ఏఓలు చంద్రశేఖర రెడ్డి, శివరామ ప్రసాద్, అరుణ్బాబు, అనూష, వినయ్, నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు, కోటగిరి బుచ్చిబాబు పాల్గొన్నారు.వ్యవసాయాధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం -
‘ప్రకృతి’ సాగు దిశగా..
● ఆకాంక్ష పథకంలో జిల్లా ఎంపిక ● మార్గదర్శకాలను విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ ● జిల్లాలో 22 క్లస్టర్లలో అమలుకు సన్నాహాలు ● క్లస్టర్కు 125 మంది చొప్పున రైతుల ఎంపిక పూర్తి సూపర్బజార్(కొత్తగూడెం): రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే జాతీయ మిషన్ ఏర్పాటు చేసింది. భద్రాద్రి ఇప్పటికే ఆకాంక్షిత జిల్లాగా ఎంపిక కావడంతో ప్రకృతి వ్యవసాయ జాతీయ మిషన్ పథకం అమలుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి మండలంలో ఒక క్లస్టర్ గ్రామాన్ని ఎంపిక చేసి 125 మంది చొప్పున రైతులను గుర్తించారు. వారి కమతాల్లో తొలుత 125 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తారు. ఎంపికై న గ్రామాలు ఇవే.. జిల్లాలో భద్రాచలం మినహా మిగిలిన 22 మండలాల్లో క్లస్టర్ గ్రామాలను ఎంపిక చేశారు. ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు, చుంచుపల్లి, గుండాల, జూలూరుపాడు, కరకగూడెం, కొత్తగూడెం, మణుగూరు, పినపాక, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు మండల కేంద్రాలతో పాటు అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం, అశ్వారావుపేట మండలం నారాయణపురం, చండ్రుగొండ మండలం పోకలగూడెం, చర్ల మండలం తేగడ, దమ్మపేట మండలం మామిడాలపల్లి, దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక, ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, పాల్వంచ మండలం యానంబైౖలు గ్రామాలను క్లస్టర్లుగా ఎంపిక చేశారు. జాతీయ మిషన్ ఎందుకంటే..? వాతావరణంలో వస్తున్న మార్పులు, పంటలను ఆశిస్తున్న చీడపీడల ఉధృతి, క్షీణిస్తున్న నీటి లభ్యత, పంట ఉత్పత్తుల్లో తగ్గుదలను అధిగమిస్తూ ప్రస్తుతం ఆచరిస్తున్న వ్యవసాయ పద్ధతుల నుంచి క్రమంగా ప్రకృతి వ్యవసాయం వైపు మారేలా కృషి చేసేందుకు కేంద్రం జాతీయ మిషన్ ఏర్పాటు చేసింది. దశలవారీగా.. మొదటి సంవత్సరంలో రైతులకు శిక్షణ, క్షేత్ర సందర్శన, ఇంటి పెరట్లో గృహావసరాలకు సరిపడా కూరగాయల సాగుతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభింపజేస్తారు. రెండు, మూడో సంవత్సరాల్లో ఆవుపేడ, మూత్రం సేకరించి జీవామృతం వంటి బయో ఉత్పత్తుల తయారీ, మల్చింగ్, అంతర పంటల సాగు పద్ధతులను అవలంబింపజేయడం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన, నమ్మకం ఏర్పడి రైతు తన క్షేత్రంలో కొంత విస్తీర్ణంలో ఆచరణ మొదలు పెట్టేలా చర్యలు చేపడతారు. నాలుగు, ఐదో సంవత్సరాల్లో రైతుల భూమి మొత్తంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభిస్తారు. నాణ్యమైన పంట ఉత్పత్తుల కోసం.. జిల్లాలో ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన, అధిక పంట దిగుబడులు వస్తాయి. తద్వారా పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ ధర పలుకుతుంది. ప్రజారోగ్యం సంరక్షణకు దోహదపడుతుంది. సాగు ఖర్చులు కూడా తగ్గుతాయి. –పి.రవికుమార్, అశ్వాపురం ఏడీఏ ప్రకృతి వ్యవసాయంలో పంచసూత్రాలు.. బీజామృతంతో విత్తన శుద్ధి నేల ఆరోగ్యం, నీటి యాజమాన్యం సంవత్సరం మొత్తం నేలను కప్పి ఉంచేలా పంటలతో లేదా వ్యర్థాలతో భూమి ఆచ్చాదన నేల సూక్ష్మ వాతావరణం, యాజమాన్యం పంటల ఆరోగ్య యాజమాన్యం రైతులు సామూహికంగా ఆచరించాల్సిన పద్ధతులు.. నేలలో సేంద్రియ పదార్థాల వృద్ధి నేలను దున్నకుండా లేదా కనీసస్థాయిలో దున్నడం ద్వారా పంటల సాగు వైవిధ్యంగా పంటల సాగు పశుపోషణను పంటల సాగుతో మిళితం చేయడం ప్రకృతి పద్ధతులతో చీడపీడల యాజమాన్యం కృత్రిమ రసాయనాల వాడకం నిషేధం వ్యవసాయ క్షేత్రంలోనే తయారు చేసిన సహజ బయో ఉత్పత్తుల వాడకం స్థానికంగా రూపొందించిన స్థానిక వాతావరణానికి తగిన పంట విత్తనాలను నాటడం -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. డివిజన్ల ప్రక్రియ ఎప్పుడో..? అశ్వారావుపేట: నూతనంగా ఏర్పాటైన అశ్వారావుపేట మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన కొత్తగూడెంలో డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ రెండో చోట్లా మంగళవారమే డివిజన్ల కేటాయింపు జరగాల్సి ఉంది. అయితే కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు అశ్వారావుపేట మున్సిపాలిటీకి కమిషనర్గా సుజాత ఒక్కరే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆమె ఏ మున్సిపాలిటీలోనూ అందుబాటులో ఉండరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల ఏర్పాటు, సవరణ జాబితాను మంగళవారం ప్రకటించాలి. దీనిపై అభ్యంతరాల స్వీకరణ, విచారణ పూర్తయ్యాక తుది జాబితా విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా మొదటి రోజు ప్రక్రియే చేపట్టలేదు. పాలనాపరమైన అంశాల్లో కార్యాలయ సిబ్బంది సైతం జోక్యం చేసుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలో గుర్రాలచెరువు, పేరాయిగూడెం, పూర్వ అశ్వారావుపేట గ్రామపంచాయతీలు ఉండగా ఏ వార్డు ఎక్కడ మొదలవుతుంది.. ఎక్కడ ముగుస్తుంది.. ఇలా 23 వార్డుల సమగ్ర సమాచారం కోసం పట్టణ వాసులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై కమిషనర్ సుజాతను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు. 14 మంది మైనింగ్ అధికారుల బదిలీసింగరేణి(కొత్తగూడెం) : సింగరేణిలో వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న 14 మంది మైనింగ్ (సేఫ్టీ) అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఐదుగురు డిప్యూటీ జీఎంలు, ఒక కాలరీ మేనేజర్, ముగ్గురు అడిషినల్ మేనేజర్లు, ఇద్దరు ఎస్ఈలు, ఇద్దరు సీనియర్ అండర్ మేనేజర్ స్థాయి అధికారులు ఉన్నారు. కాగా, వీరంతా ఈనెల 14వ తేదీన కేటాయించిన ఏరియాల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు. -
ఇక్కడ ఇలా..
అక్కడ అలా..బోనకల్ లో శరవేగంగా.. గతేడాది అక్టోబర్లో బోనకల్ లో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోనూ త్వరితగతిన స్థల సేకరణ, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పుడు పనులు మొదలుపెడితే కనీసం వచ్చే విద్యాసంవత్సరం నాటికై నా యంగ్ ఇండియా ఫలాలు విద్యార్థులకు అందే అవకాశం ఉందని అంటున్నారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘రేవంత్రెడ్డి పేరు చెబితే యంగ్ ఇండియా స్కూళ్లు గుర్తొస్తాయి’ అని సీఎం ఇటీవల గర్వంగా ప్రకటించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలకెత్తుకున్న యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం జిల్లాలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. అంతా ఒకేచోట.. తెలంగాణ వచ్చిన తర్వాత కేజీ నుంచి పీజీ విద్యలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వేర్వేరుగా గురుకుల పాఠశాలలు నియోజకర్గానికి ఒకటి చొప్పున ప్రారంభించారు. ఈ గురుకులాల్లో చాలా వరకు ఇప్పటికీ అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్యనే కొనసాగుతున్నాయి. అయితే సామాజికంగా అందరినీ ఒకే చోట కలుపుతూ సమానత్వం తెచ్చే లక్ష్యంతో సకల హంగులతో అన్ని గురుకులాలను ఒకే చోట నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి యంగ్ ఇండియా స్కూళ్లుగా పేరు పెట్టింది. గతేడాది అక్టోబర్లో తొలి విడతగా 18 యంగ్ ఇండియా స్కూళ్లకు శంకుస్థాపన చేయగా ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, మధిర నియోజకర్గాలకు చోటు దక్కింది. జిల్లాకు ఐదు మంజూరు మలి విడతలో భాగంగా ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం 55 నియోజకవర్గాలకు యంగ్ ఇండియా స్కూళ్లు మంజూరు చేసింది. ఇందులో ఇల్లెందు, పినపాక, కొత్తగూడెం నియోజకర్గాలకు స్థానం దక్కింది. కాగా ఇటీవల అశ్వారావుపేట, భద్రాచలం నియోజకర్గాలకు కూడా మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణానికి కనీసం 20 నుంచి 25 ఎకరాలు అవసరం పడుతుంది. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తంగా ఐదు స్కూళ్లకు రూ.1000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఈ స్కూళ్లు నడవనున్నాయి. స్కూళ్లకు స్థల సమస్య.. జిల్లాకు మూడు యంగ్ ఇండియా స్కూళ్లు మంజూరై దాదాపు మూడు నెలలు కావొస్తున్న ఇప్పటివరకు మణుగూరు, కొత్తగూడెం మినహా మరెక్కడా స్థల సేకరణ పూర్తి కాలేదు. ఇల్లెందు నియోజకర్గానికి మంజూరైన యంగ్ ఇండియా స్కూల్ కోసం బైపాస్ రోడ్డులో 25 ఎకరాల స్థలం గుర్తించారు. అయితే ఇది వివాదంలో ఉండటంతో స్థల సేకరణ అంశం ఎంతకీ తేలడం లేదు. మరో ప్రత్యామ్నాయ స్థలం చూసేందుకు స్థానిక రాజకీయ నాయకులు సుముఖంగా లేరు. దీంతో ఈ విషయంలో పీటముడి బిగుసుకుంది. కొత్తగూడెంలో రెండేళ్ల క్రితం సింగరేణి సంస్థ భారీ ఎత్తున భూములను రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. పట్టణంలోని గోధుమ వాగు సమీపంలో ఇలా కేటాయించిన భూములను యంగ్ ఇండియా స్కూల్కు కేటాయించినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. మణుగూరులో పట్టణ పరిధిలో 20 ఎకరాలను రవాణా శాఖ కేటాయించినా.. ఆ తర్వాత ఈ అంశంపై స్తబ్ధత నెలకొంది. ఇక అశ్వారావుపేట, భద్రాచలంలో ఇప్పటికే స్థల సేకరణ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో యంగ్ ఇండియా స్కూళ్లు ఎక్కడ నిర్మించాలనే అంశం ఎవరికీ అంతుపట్టడం లేదు. అడుగు ముందుకు పడని ‘యంగ్ ఇండియా’ ఖమ్మం జిల్లాలో శరవేగంగా సాగుతున్న పనులు మంజూరుతోనే సరిపెట్టుకున్న భద్రాద్రి జిల్లా.. పలుచోట్ల కొలిక్కి రాని స్థల సేకరణ -
కళలను కాపాడుకోవాలి
పాల్వంచ: దేశ సంస్కృతీ సంప్రదాయాలు, కళలను కాపాడుకుని, భావితరాలకు అందించాలని ఎమ్మె ల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేఎస్పీ రోడ్లో పాల్వంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలను సోమవారం ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటులో కళాకారుల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. అనంతరం పలువురు గాయకులు పాటలతో అలరించారు. ఆ తర్వాత తెలంగాణా ఉద్యమకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు, మహిపతి రామలింగం, దుర్గా అశోక్, కొత్త వెంకటేశ్వర్లు, మంతపురి రాజుగౌడ్, నరసింహాకుమార్, మంజూరు ఖాన్, రషీద్, కొండల రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
అవతరణ వేళ.. జీసీసీ వెలవెల
పాల్వంచరూరల్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. కానీ పాల్వంచ జీసీసీ కార్యాలయం మాత్రం వెలవెలబోయింది. జీసీ బీఎం గది తలుపులు మూసి బయట గడియపెట్టారు. మరో అధికారి గదికి ఏకంగా తాళం వేసి వెళ్లిపోయారు. సంబంధిత అధికారులతో అవసరం ఉన్న గిరిజనులు వ్యయప్రయాసలకోర్చి కార్యాలయానికి రాగా ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరు. జీసీసీ బ్రాంచ్ మేనేజర్ లక్ష్మోజీ గత నెల 31న ఉద్యోగ విరమణ పొందగా, భద్రాచలం డీఎంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన భద్రాచలంలో ఉండటంతో ఇక్కడి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కూడా అధికారులు, సిబ్బంది ఎవరూ కార్యాలయంలో లేకుండా వెళ్లిపోవడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఇన్చార్జి డీఎం సమ్మయ్యను వివరణ కోరగా.. జెండా ఆవిష్కరణ అనంతరం సిబ్బంది బయటకు వెళ్లి ఉంటారని తెలిపారు. తలుపు, తాళం వేసి కార్యాలయం నుంచి వెళ్లిపోయిన అధికారులు -
కేటీపీఎస్లో అగ్ని ప్రమాదం
పాల్వంచ: పాల్వంచలో 800 మెగావాట్ల సామర్థ్యం గల కేటీపీఎస్ ఏడో దశ కర్మాగారంలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. జూలూరుపాడు వెళ్లే కరెంట్ ట్రాన్స్ఫార్మర్(సీటీ) స్విచ్యార్డు నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో లైన్ ట్రిప్ అయింది. వెంటనే కేటీపీఎస్ అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయమై సీఈ శ్రీనివాసబాబు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్లో మంటలు రాగానే ఆర్పేశామని, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని తెలిపారు. ఉత్పతికి ఎలాంటి అవాంతరం లేదని, నష్టం కూడా పెద్దగా ఏమీ లేదని అన్నారు. కారును ఢీకొట్టిన లారీఅశ్వారావుపేటరూరల్: కారును వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జంగారెడ్డిగూడెం మార్గంలోని రత్నం పెట్రోల్ బంక్ సమీపంలో అశ్వారావుపేట వైపు వస్తున్న కారును ఏపీ వైపు నుంచి వస్తున్న లారీ అదుపుతప్పి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న అశ్వారావుపేటకు చెందిన చారి అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదుఅశ్వారావుపేటరూరల్: ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న యువకుడిపై సోమవారం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. పట్టణంలోని వడ్డెర బజార్ ప్రాంతానికి చెందిన యువకుడు మేకల మారేష్ మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికను కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. వేధింపులు తట్టుకోలేక బాధితురాలు విషయాన్ని తన కుటుంబీకులకు చెప్పింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బెల్లం, పటిక సీజ్ కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం దుబ్బ తండా గ్రామానికి చెందిన అజ్మీర గణేష్ నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, పటికలను సోమవారం ఆటోలో తరలిస్తుండగా హేమచంద్రపురం దగ్గర వాహన తనిఖీలు చేపట్టిన కొత్తగూడెం ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. 108 కేజీల బెల్లం, 40కేజీల పటిక, 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదుచేసినట్లు డీటీఎఫ్ ఎస్సై గౌతమ్ తెలిపారు. (02కెజిఎం377): వివరాలు వెల్లడిస్తున్న ఎకై ్సజ్ అధికారులు -
నీటి సంప్లో పడి చిన్నారి మృతి
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని రేగులచలకలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోని నీటి సంప్లో ప్రమాదవశాత్తు పడిన చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రేగులచలకకు చెందిన ఆటో డ్రైవర్ సత్తి నరేష్–వినోద్ కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రీరాజ్యవి (5) ఇంటి ముందు అడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడి నీటి సంప్లో పడింది. తల్లి ఇంటి పనుల్లో ఉండగా ఈ విషయాన్ని గుర్తించలేదు. కాసేపటి తర్వాత చిన్నారి ఎటు వెళ్లిందోనని ఆరా తీస్తుండగా సంప్లో కనిపించడంతో బయటకు తీసి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అంతసేపు కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈమేరకు కేసు నమోదు చేసినట్లురఘునాథపాలెం సీఐ ఉస్మాన్షరీఫ్ తెలిపారు. -
అవతరణోత్సవం..
అట్టహాసంగాతెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం కార్యాలయాల్లో జెండాలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదాన్లో నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు తదితరులు హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో సంక్షేమ, అభివృద్ధిని తెలిపేలా శకటాలను ప్రదర్శించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిపారు. –సూపర్బజార్ (కొత్తగూడెం)/సింగరేణి (కొత్తగూడెం) -
కొత్త ఐటీఐలు ప్రారంభమయ్యేనా..?
● గత మార్చిలో ఇల్లెందు, అశ్వారావుపేటలకు మంజూరు ● ఐదు ట్రేడ్లతో 200 మంది విద్యార్థులకు అవకాశం ● ఇప్పటివరకు ఊసేలేని తరగతుల ప్రారంభోత్సవం ఇల్లెందు: గత మార్చిలో ఇల్లెందు, అశ్వారావుపేటలకు ప్రభుత్వ ఐటీఐలు మంజూరు చేసింది. అయి తే విద్యాసంవ్సతరం సమీపిస్తున్నా వాటి ఏర్పాటు ప్రక్రియ కార్యరూపం దాల్చటం లేదు. దీంతో అడ్మిషన్లు జరుగుతాయా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లెందు జేకే బస్టాఫ్ వద్ద గ్రంథాలయ సమీపంలో ఐటీఐ నిర్మించాలని నిర్ణయించారు. మార్చి 10న కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎమ్మె ల్యే కోరం కనకయ్య, సింగరేణి జీఎం కృష్ణయ్య తదితరులు స్థలాన్ని పరిశీలించారు. 13న స్థలం కేటాయిస్తున్నట్లు తహసీల్దార్ కలెక్టర్కు లేఖ అందజేయగా, కలెక్టర్ 15న స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి పంపించారు. ఇక అక్కడి నుంచి ఫైల్ ముందుకు కదలడంలేదు. ఐదు ట్రేడ్లు.. 200 మంది విద్యార్థులు నూతనంగా ఇల్లెందులో నెలకొల్పే ఐటీఐలో ఐదు ట్రేడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో పేర్కొంది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఐఓటీ, ఫ్యాషన్ డిజైనర్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిక్ ట్రేడులు ప్రవేశ పెట్టనుండగా, ఒక్కో ట్రేడ్కు 40 మంది చొప్పున మొత్తం 200 మంది విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. కృష్ణసాగర్ ఐటీఐ వైస్ ప్రిన్సిపాల్ను, ఇక్కడి ఐటీఐకి ఇన్చార్జిగా నియమించారు. ఐటీఐలో ప్రిన్సి పాల్, వైస్ ప్రిన్సిపాల్తో పాటు ట్రైనింగ్ ఆఫీసర్, ఇతర సిబ్బంది 20 మంది వరకు ఉంటారు. ప్రభుత్వం అనుమతిస్తే తాత్కాలికంగా ఇల్లెందు వైటీసీ/ ప్రభుత్వ డిగ్రీ కళాశాల/14 నంబర్ బస్తీలోని హాస్టల్ భవనంలో ఐటీఐ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతన్నారు. క్వార్టర్లు ఖాళీ చేయించటంలో జాప్యం ఇల్లెందులో ఐటీఐ కోసం 609 సర్వే నంబర్లో 2.08 ఎకరాల స్థలం గుర్తించారు. అధికారులు పరిశీ లించిన స్థలంలోని సింగరేణి క్వార్టర్ల ఉంటున్నవారిని ఖాళీ చేయటంలో జాప్యం జరుగుతోంది. అశ్వారావుపేటలో సర్వే నెంబర్ 911/1లో మూడెకరాల స్థలం కేటాయించారు. గిరిజన ప్రాంతాల్లో ఐటీఐలు చేపట్టాల్సి ఉన్నందున కలెక్టర్ ప్రతిపాదనలు పంపిస్తే స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నుంచి స్థలం కేటాయింపు జరగాల్సి ఉంది. ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కార్యాలయంలో ఫైల్ పెండింగ్లో ఉండగా, స్థలం కేటాయిస్తూ లేబర్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి మంజూరు పత్రం విడుదల కావాల్సి ఉంది. తరగతులకు అనుమతి ఇవ్వాలి ఐటీఐ తరగతులు నిర్వహించేందుకు అనుమతి లభించాల్సి ఉంది. జూన్ 15న అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. కనీసం మలి విడత నోటిఫికేషన్ నాటికై నా తరగతులు నడిపేందుకు అనుమతి లభిస్తే ప్రైవేట్ భవనంలో అయినా తరగతులు నిర్వహిస్తాం. – జి.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ (ట్రైనింగ్ ఆఫీసర్), ఇల్లెందు ఐటీఐ -
అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు
చుంచుపల్లి: పోడు పేరుతో అటవీ భూముల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని కొత్తగూడెం ఫారెస్ట్ డివిజనల్ అధికారి యు.కోటేశ్వరావు హెచ్చరించారు. సోమవారం డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామవరం రేంజ్ పరిధిలోని జగ్గారం, గడ్డిగుట్ట, పాలవాగు ప్రాంతాల్లో కొందరు గొత్తి కోయలు అటవీ భూములను ఆక్రమించుకుంటున్నారని, పర్యవేక్షణకు వెళ్తున్న అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడగా 18 మందిపై కొత్తగూడెం టూటౌన్ పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు. జగ్గారానికి చెందిన 34 మంది సుమారు 348 ఎకరాల వరకు అటవీ భూములను ఆక్రమించుకున్నారని, వారందరికీ నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. సమావేశంలో అటవీ రేంజ్ అధికారులు వి.శ్రీనివాసరావు, సీహెచ్.శ్రీనివాస్, డీఆర్వోలు తోలెం వెంకటేశ్వర్లు, మదన్ సిబ్బంది జి.రాము,బి. కళ్యాణి, ప్రసాద్, ఫిరోజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరరావు -
బెల్ట్షాపులు తొలగించాలని నిరసన
సత్తుపల్లిరూరల్: మద్యంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నందున బెల్ట్షాప్లు తొలగించాలనే డిమాండ్తో వేంసూరు మండలం శంభునిగూడెంకు చెందిన మహిళలు పలువురు సోమవారం నిరసన తెలిపారు. ఈమేరకు సత్తుపల్లి ఎకై ్సజ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన వారు మాట్లాడారు. ఎకై ్సజ్ అధికారులు స్పందించి గ్రామాల్లో బెల్ట్షాపులు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎస్సై శేఖర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పద్మ, రాధ, మారేశ్వరమ్మ, చెన్నమ్మ, తిరుపతమ్మ, సావిత్రి, రమణ, కొలికపోగు సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డీసీఎంఎస్ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఖమ్మంవ్యవసాయం: జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అదనపు కలెక్టర్, సంస్థ పర్సన్ ఇన్చార్జి పి.శ్రీనివాసరెడ్డి ప్రశంసా పత్రాలు అందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఖమ్మంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ఆఫీస్ సబార్డినేట్ వెలిశాల వెంకటి, కల్లూరు సూపర్వైజర్ పెరుగు నాగరాజు, నేలకొండపల్లి ఉద్యోగి బొడ్డు సంతోష్కు ప్రశంసాపత్రాలు అందించారు. సంస్థ మేనేజర్ కె.సందీప్, ఉద్యోగులు పి.వినోద్, గోపి, శివప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేకాట రాయుళ్లు అరెస్ట్టేకులపల్లి: మండలంలోని కిష్టారం గ్రామ శివారులో కొందరు పేకాట అడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు బోడు ఎస్సై బి. శ్రీకాంత్ తెలిపారు. 10 మంది నుంచి 10 బైక్లతో పాటు రూ.3,750 సీజ్ చేసినట్లు వివరించారు. వర్షానికి కూలిన ఇంటి పైకప్పు కారేపల్లి: ఇటీవల కురిసిన వర్షాలతో పూర్తిగా నా నిన పెంకుటింటి కప్పుకుప్పకూలింది. మండలం లోని గేటుకారేపల్లికి చెందిన భూక్యా శాంతి బాలి కల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తోంది. ఆమె సో మవారం పక్కనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లగా, ఇప్పటికే వరుస వర్షాలతో నానిన ఇంటి కప్పు, గోడలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ సమయంలో శాంతి లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. కాగా, అధికారులు తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరింది. చికిత్స పొందుతున్న వృద్ధురాలు మృతి కారేపల్లి: పురుగుల మందు తాగిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని స్టేషన్ చీమలపాడుకు చెందిన బానోతు మంగ్లీ(70) భర్త ఏడాది క్రితం మృతి చెందగా, అప్పుడప్పుడూ మద్యం తాగుతుండేది. ఈ క్రమంలోనే గత నెల 29న మద్యం తాగాక మంగ్లీ పురుగుల మందు తాగింది. కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఖమ్మం తరలించి చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందిందని ఎస్ఐ బి.గోపి తెలిపారు. అడవి జంతువు మాంసం స్వాధీనం సత్తుపల్లిరూరల్: ఓ వ్యక్తి వద్ద నుంచి అడవి జంతువు మాంసాన్ని అటవీ శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని జగన్నాథపురం పునరావాస కాలనీకి చెందిన ఓ వ్యక్తివద్ద అటవీ జంతువుమాంసం ఉందనే సమాచారంతో అధికారులు తనిఖీచేపట్టారు. ఈ సంద ర్భంగా మాంసం లభించడంతో ఆయనను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఎస్ఓ కొండారెడ్డి తెలిపారు. అయితే, మాంసం ఏజంతువుదో తేలాల్సి ఉందని పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ గుర్తింపుదుమ్ముగూడెం: మండలంలోని ఆంధ్రకేసరి నగరం శివారులో కల్వర్ట్ వద్ద ఆదివారం లభించి న మృతదేహాన్ని సోమవారం బంధువులు గుర్తించారు. మృతుడు చర్ల మండలం లింగాపురంపా డు గ్రామానికి చెందిన ముక్కల పూర్ణచందర్రా వు (32)అని పోలీసులు తెలిపారు. మూడు రోజు ల క్రితం ఇంట్లో వెళ్లిన ఆయన కల్వర్టు వద్ద నీటి మడుగులో ఆదివారం మృతదేహామై కనిపించా డు. అధికంగా మద్యం తాగి కల్వర్ట్ పై నుంచి నీళ్లలో పడి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి భార్య అనూష పిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
రామాలయంలో సుదర్శన హోమం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ యాగశాలలో సోమవారం చిత్తా నక్షత్రం సందర్భంగా సుదర్శన హోమం నిర్వహించారు. కాగా, మూలమూర్తులు ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. డయాగ్నస్టిక్ సెంటర్లలో తనిఖీకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ సోమవారం తనిఖీ చేశారు. ఈ క్రమంలో విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్కు తగిన అనుమతులు లేవని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద సూచించిన మార్గదర్శకాలు పాటించడం లేదని తేలడంతో సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరమైన, భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ఆరోగ్య సంబంధిత సేవలు, నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలు సత్వరమే పరిష్కరించాలి భద్రాచలం: గిరిజన దర్బార్లో వినతులు ఇచ్చే వారి సమస్యలు సత్వరమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ అన్నారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన వివిధ గ్రామాల నుంచి వచ్చిన గిరిజనుల దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హతల మేరకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పథకాలు సద్వినియోగం అయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. గిరి జల వికాసం ద్వారా బోర్లు, నూతన మత్స్య సొసైటీల ఏర్పాటు, వితంతు మహిళల పెన్షన్ తదితర సమస్యలపై ఎక్కువ మంది వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, గురుకుల ఆర్సీఓ అరుణకుమారి, ఎస్డీసీ రవీంద్రనాథ్, హెచ్ఈఓ లింగానాయక్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకతీయుల కాలం నాటి శిలాశాసనం నేలకొండపల్లి: మండలంలోని అనాసాగారంలో కాకతీయుల నాటి శిలాశాసనాన్ని గుర్తించారు. గ్రామ పాత బొడ్రాయి సెంటర్లో రావిచెట్టు వద్ద ఈ శాసనం వెలుగుచూసింది. నాలుగు అడుగుల పొడవు, అడుగు మందంతో ఉన్న నల్లరాతి బండపై ఓ వైపున 19 పంక్తులతో తెలుగు లిపిలో రాసి ఉన్న శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కోకన్వీనర్ కట్టా శ్రీనివాస్ నేతృత్వాన సోమవారం గుర్తించారు. శాసనంపై శివలింగం, దానికి రెండువైపులా సూర్యచంద్రుల చిహ్నాలు ఉన్నాయి. మహామండలీశుడు కాటేయ(రుద్రసేనాని కొడుకు) రాజ్యం ఏలుతున్నప్పుడు గోవిందమాంబ, దేవశెట్టి కొమ్మోజు తవ్వించిన రుద్రసముద్రానికి ఎకరంన్నర భూదానం చేసినట్లు ఈ శాసనం తెలుపుతోందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బృందం కన్వీనర్ హరగోపాల్, గ్రామ పెద్దలు వున్నం వెంకయ్య, పసుమర్తి శ్రీనివాస్, తిరుమల్, షేక్ రహీముతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల చెంతకు ‘సంక్షేమం’
● సుదీర్ఘ పోరాటాలతో తెలంగాణ ఏర్పాటు ● రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పీఓ రాహుల్భద్రాచలం : ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం అని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆవరణలో జరిగిన వేడుకల్లో ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గిరిజనుల చెంతకు పలు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని. గిరిజనాభివృద్ధికి విశేష కృషి జరుగుతోందని తెలిపారు. విద్యార్థుల కోసం ఉద్దీపనం వర్క్బుక్లు, వేదిక మ్యాథ్స్ తదతర ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. విద్యతో పాటు క్రీడలకూ పెద్ద పీట వేస్తున్నామని, ఇటీవల ఉట్నూర్లో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడా పోటీల్లో భద్రాచలం జోన్ ఓవరాల్ చాంపియన్షిప్ సాధించడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. ఇంకా ట్రైకార్, వ్యవసాయ, ట్రైబల్ రిలీఫ్ ఫండ్ ద్వారా కొండరెడ్ల ఆర్ధికాభివృద్ధికి కృషి చేస్తున్నామని, వైద్య రంగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు. గిరిజన మ్యూజియంతో వారి సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తున్నామని చెప్పారు. అనంతరం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదివి ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. గురుకులంలో చదివి సత్తుపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో సీటు సాధించిన అశ్వారావుపేట మండలం తిరుమలకుంటకు చెందిన యాట్ల ధనలక్ష్మికి ల్యాప్టాప్ అందించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, గురుకుల ఆర్సీఓ అరుణకుమారి, ఎస్ఓ భాస్కరన్, వివిధ శాఖల అధికారులు ఉదయ్కుమార్, లక్ష్మీనారాయణ, సున్నం రాంబాబు, మనిధర్, రమేష్, అశోక్ కుమార్, అలివేలు మంగతాయారు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గోపాలమిత్రల గోస
● తొమ్మిది నెలలుగా అందని వేతనాలు ● వెతలు చెప్పినా పట్టించుకోని పాలకులు ● ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలులక్ష్యం చేరకపోతే.. గోపాలమిత్రలకు కృత్రిమ గర్భధారణ విషయంలో పశుసంవర్థకశాఖ టార్గెట్ విధిస్తుంది. ఆ లక్ష్యాన్ని చేరకపోతే వేతనంలో కోత విధిస్తారు. ఏడాదికి ఒక్కో గోపాలమిత్ర 1000 కృత్రిమ గర్భధారణ సెమన్లను పశువులకు వేయాల్సి ఉంటుంది. పశువులు ఎదకు వచ్చే సమయాన్ని గుర్తించి, వాటి యజమానిని ఒప్పించి టార్గెట్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇలా టార్గెట్ పూర్తి కాని గోపాలమిత్రలు నెలకు రూ.ఐదారు వేల వేతనం కూడా అందుకోలేకపోతున్నారు. వేతనాల కోసం ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించినా ఫలితం ఉండడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమ గోస ఆలకించి ప్రతినెలా వేతనాలు అందించాలని కోరుతున్నారు. బూర్గంపాడు: తొమ్మిది నెలలుగా వేతనాలు అందక గోపాలమిత్రలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే అరకొర వేతనం కూడా నెలల తరబడి అందకపోవడంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 262 మంది గోపాలమిత్రలు వేతనాలు అందక అగచాట్లు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పశు వైద్యం అందించడంలో కీలకంగా పనిచేస్తున్న వీరి బతుకులు దయనీయంగా మారాయి. 2000లో నియామకం పశుసంవర్థక శాఖలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వం 2000 సంవత్సరంలో గోపాలమిత్రలను నియమించింది. వీరు గ్రామాల్లో పశు వైద్య సహాయకులుగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా పశుసంవర్థక శాఖ అందించే సెమన్ను ఎదకు వచ్చిన పశువులకు ఇచ్చి మేలుజాతి దూడలను పెంపొందించటంలో వారి పాత్ర కీలకం చేశారు. దీంతో పాటు పశువులు, జీవాలకు వ్యాక్సినేషన్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు ప్రాథమిక వైద్యం అందించడంలో కూడా కీలకంగా మారారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పశు సంవర్థక శాఖలో 262 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో వీరికి నెలకు రూ 11,050 వేతనం అందిస్తున్నారు. అయితే అది కూడా నెలనెలా సక్రమంగా రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో పశువులకు వైద్యం చేసేందుకు నిత్యం వెళ్తుండగా బైక్ పెట్రోలు, టిఫిన్, భోజనాల ఖర్చులు కూడా ఇబ్బందికరంగా మారాయి. నెలకు ఇచ్చే వేతనం ఎటూ సరిపోవడం లేదని ఆవేదన చెందుతున్న వీరు.. ఆ వేతనం కూడా నెలనెలా అందకపోవడంతో అప్పుల పాలవుతున్నారు.ఆర్థికంగా ఇబ్బందులు గోపాలమిత్రలకు వేతనాలు అందక ఆర్థికంగా చితికిపోతున్నాం. రోజూ గ్రామాల్లో పశువులకు వైద్యసేవలు అందించేందుకు బైక్పై వెళితే పెట్రోలు ఖర్చులకు కూడా ఇబ్బందిగా ఉంది. 20 ఏళ్లుగా గ్రామాల్లో వైద్యసేవలు అందిస్తున్నా వేతనాలు పెంచకపోగా నెలల తరబడి పెండింగ్లో పెట్టడంతో ఇబ్బంది అవుతోంది. వేతనాలు పెంచి ప్రతినెలా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – చింతమల్ల కిరణ్, గోపాలమిత్ర, పినపాక పట్టీనగర్ సకాలంలో వేతనాలు అందించాలి వేతనాలు సకాలంలో అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. కృత్రిమ గర్భధారణలో టార్గెట్ల కారణంగా వేతనాల్లో కోత విధిస్తున్నారు. 9 నెలలుగా వేతనాలు అందకపోవడంతో మా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి. విద్యాసంవత్సరం ఆరంభమవుతున్న తరుణంలో పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా 9 నెలల వేతనం చెల్లించాలి. – తాతిరెడ్డి గోవిందరెడ్డి, గోపాలమిత్ర, బూర్గంపాడు -
అమరుల త్యాగఫలితమే తెలంగాణ
సింగరేణి(కొత్తగూడెం): ఎంతోమంది అమరుల త్యాగఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన జాతాయ పతాకాన్ని ఆవిష్కరించారు. సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. సంస్థ వ్యాప్తంగా గల 11 ఏరియాలకు చెందిన ఉత్తమ కార్మికులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాల పాటు ఎంతోమంది అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. భూగర్భ గనులతో నష్టం.. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని 24 భూగర్భ గనులతో సంస్థకు ఏడాదికి రూ.13,093 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని బలరామ్ తెలిపారు. ఓసీలు, సంస్థ డిపాజిట్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని లాభాలుగా చూపిస్తున్నామని చెప్పారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో శావెల్స్ 74 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, కంపెనీలో ఉన్న 66 శావెల్స్ రోజుకు 19 గంటలకు పైగా అందుబాటులో ఉంటున్నా.. వాటిని 12 గంటలు, 425 డంపర్లు రోజుకు 18 గంటలు అందుబాటులో ఉంటుండగా 8 గంటలు మాత్రమే వినియోగిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. యంత్రాలు పనిచేస్తేనే ఉత్పత్తి ఖర్చు తగ్గి లాభాలు వస్తాయన్నారు. సింగరేణి పరిధిలో ఇప్పటికీ 1,633 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు సింగరేణి కంటే తక్కువ ధరకు బొగ్గు విక్రయిస్తున్న నేపథ్యంలో బొగ్గు ధర తగ్గింపునకు బోర్డు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు వేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు రాజ్కుమార్, రమణమూర్తి, పీతాంబరరావు, సీఎంఓఏఐ నాయకులు రాజీవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాత్రి జరిగిన వేడుకలకు సీఎండీతో పాటు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ విస్తరణలో భాగంగా 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్, 1,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రాజస్తాన్తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. విదేశాల్లో కూడా జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పాటుకు కృషి జరుగుతోందని వివరించారు. ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. 2009 – 2014 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొత్తగూడెంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, ఆ సమయంలో తాను సుమారు 30 రోజలు పాదయాత్ర నిర్వహించానని చెప్పారు. సింగరేణి సీఎండీ బలరామ్ సంస్థ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు -
సమగ్రాభివృద్ధి దిశగా..
సీతారామ, సీతమ్మ సాగర్తో భూములు సస్యశ్యామలం ● రాష్ట్రంలోనే మొదటి ఎర్త్సైన్స్ యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటు ● తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి తుమ్మల జాతీయ పతాకానికి వందనం సమర్పిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ పాటిల్, ఎస్పీ రోహిత్రాజు (ఇన్సెట్) మాట్లాడుతున్న మంత్రి తుమ్మల సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం ప్రగతిమైదానంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మొదట అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్తో కలిసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వ పనులు పూర్తయ్యాయని, మూడు పంపుహౌస్లు ప్రారంభించడంతో ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా నీరు విడుదల చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 1,57,574 ఎకరాల నూతన ఆయకట్టుకు నీరందడమే కాక, చిన్న నీటి తరహా చెరువుల కింద ఉన్న 42,935 ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు కోసం 3,123 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, తాలిపేరు, కిన్నెరసాని, పెదవాగు ప్రాజెక్టుల ద్వారా 37,060 ఎకరాలకు, చిన్నతరహా నీటి పారుదల వనరులతో 1,29,058 ఎకరాలకు నీటి వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.415 కోట్లతో 108 రహదారుల పనులు చేపట్టగా, ఇప్పటికే 75 పూర్తయ్యాయని, మరో 33 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, 18 బ్రిడ్జీల నిర్మాణానికి రూ.195 కోట్లు మంజూయ్యాయని చెప్పారు. నిరంతర విద్యుత్.. జిల్లా ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా రూ.38.50 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్లు 13, రూ. 3.67 కోట్లతో ఐదు 33 కేవీ సబ్స్టేషన్లు నిర్మించామని తెలిపారు. రూ. 21.50 కోట్లతో 33 కేవీ ఇంటర్లింక్ లైన్ల పనులు చేపట్టగా నాలుగు పూర్తయ్యాయని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఎర్త్సైన్స్ యూనివర్సిటీకి ఆమోదం.. జిల్లా కీర్తిప్రతిష్టలు మార్మోగేలా రాష్ట్రంలోనే మొదటి ఎర్త్సైన్స్ యూనివర్సిటీని కొత్తగూడెంలో స్థాపిస్తున్నామని మంత్రి తుమ్మల అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి ఈనెల 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మారుమూల గ్రామాలు, నిరుపేదలు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని అభినందించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ‘నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో వేడుకలు..తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కలెక్టరేట్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. -
ఆస్తుల కన్నా.. పర్యావరణం మిన్న
● వన మహోత్సవంలో సింగరేణి సీఎండీ ● 121 మొక్కలు నాటిన బలరామ్ సింగరేణి(కొత్తగూడెం): ప్రపంచంలో అన్నింటికీ హద్దులు ఉన్నా.. గాలి, వెలుతురు, ఆక్సిజన్కు లేవని, ఎవరైనా కుటుంబసభ్యులకు ఇళ్లు, స్థలాలు, బంగారు ఆభరణాలు ఇస్తుంటారని, వాటన్నింటి కంటే పర్యావరణం ముఖ్యమని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకేఓసీ డంప్యార్డ్ వద్ద ఆదివారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 121 మొక్కలు నాటారు. దీంతో తాను ఇప్పటివరకు 19,121 మొక్కలు నాటానని, వచ్చే జూలై చివరి నాటికి మరో 1,879 మొక్కలు నాటి.. 21వేల లక్ష్యాన్ని చేరాల్సి ఉందని వివరించారు. ఒక మొక్క ద్వారా రూ. కోటి విలువైన ఆక్సిజన్ ఉచితంగా పొందవచ్చన్నారు. భావితరాలకు అదే మనమిచ్చే ఆస్తి అని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది సింగరేణి ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు. అనంతరం చెరువు పక్కన కాసేపు ధ్యానం చేశారు. కార్యక్రమంలో ఏరియా జీఎం శాలేంరాజు, డైరెక్టర్లు ఎల్.వి.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, అటవీ, పర్యావరణ శాఖ సలహాదారు మోహన్ చంద్ర పరిగెన్, పర్యావరణ జీఎం సైదులు, జీకేఓసీ పీఓ రమేష్, సూర్యనారాయణ, ఎండీ రజాక్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఫౌండేషన్ విత్తనాల పంపిణీ
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని 23 మండలాల్లో ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున రైతులను ఎంపిక చేసి సోమవారం నుంచి వరి, పెసర ఫౌండేషన్ సీడ్ (పునాది విత్తనం) పంపిణీ చేయనున్నట్లు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమె వివరాలు వెల్లడించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘ఈ దేశ మూలవాసులం మనమే..’ ఖమ్మం మామిళ్లగూడెం: ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలే కాక మతం మార్చుకున్న ముస్లిం మైనార్టీలు కూడా ఈ దేశ మూలవాసులేనన్న అంశం శాసీ్త్రయంగా నిరూపితమైందని బామ్సెఫ్ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా శ్రీధర్ తెలిపారు. సంఖ్యాపరంగా అధిక సంఖ్యలోనే ఉన్నా బానిసలుగా, బాధితులుగా మిగిలిపోవడంతో విద్య నుండి దూరమయ్యామని చెప్పారు. ఖమ్మం టీటీడీసీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇతర దేశాల నుండి వలస వచ్చిన ఆర్యులు ఇక్కడి జీవన విధానం, నాగరికతను ధ్వంసం చేసి ఎవరూ తిరగబడకుండా కుల వ్యవస్థ, మనుధర్మాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అందరూ చరిత్రను చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. బామ్సెఫ్ రాష్ట్ర అధ్యక్షులు విజయకుమారి మాట్లాడుతూ సీ్త్రలకు విలువలు లేని మనుధర్మ శాస్త్రం, కులాన్ని రుద్దడం ద్వారా రాజ్యాధికారానికి దూరం చేశారని తెలిపారు. తొలుత సామాజిక ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ సంఘాల నాయకులు కొండా పెద్దన్న, భూక్యా ఉపేంద్రబాయి, షేక్ నజీమా, ప్రమీల, త్రివేణి, భవాని, సరోజని, బానోతు భద్రునాయక్, మీగడ రామారావు, రవి, సోమ్లా, సంజీవరావు, పి.నాగేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు. -
రోహిణి కార్తె ప్రతాపం
జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు బూర్గంపాడు: ఉపరితల ఆవర్తనంతో శనివారం వరకు చల్లగా ఉన్న వాతావరణం ఆదివారం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోహిణి కార్తె ఎండ తీవ్రత జిల్లా వ్యాప్తంగా కనిపించింది. శుక్రవారం వరకు ఆడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు సాగు పనులు మొదలుపెట్టారు. రుతుపవనాలు కూడా విస్తరిస్తున్నాయనే వాతావరణ సూచనలతో కొందరు రైతులు పత్తిగింజలు వేయటం కూడా మొదలు పెట్టారు. ఆదివారం ఎండ తీవ్రతకు పొలం పనులకు వెళ్లిన రైతులు, కూలీలు మధ్యాహ్ననికే ఇంటిదారి పట్టారు. కొందరు రైతులు వేసిన పత్తిగింజలు మొలకలు తిరిగి ఎండిపోతున్నాయి. పత్తిగింజలు వేసేందుకు సిద్ధమైన కొందరు రైతులు ఎండల తీవ్రతకు వెనుకడుగు వేస్తున్నారు. సింగరేణి అధికారుల బదిలీసింగరేణి(కొత్తగూడెం): వివిధ ఏరియాల్లోని ఐఈడీ విభాగంలో పనిచేస్తున్న ఏడుగురు అధికారులను బదిలీచేస్తూ ఆదివారం సింగరేణి యాజమాన్యం ఉత్తర్యులు జారీ చేసింది. మణుగూరు ఏరియా ఏజీఎం కె.వెంకట్రావును కార్పొరేట్ హెచ్ఓడీగా, కార్పొరేట్లో హెచ్వోడీగా పనిచేస్తున్న సీహెచ్ సీతారాంబాబును మణుగూరుకు, మందమర్రి ఏరియా డీవైజీఎం పి.రాజన్నను శ్రీరాంపూర్కు, భూపాలపల్లి డీవైజీఎంగా ఏ.వసంతరావును కార్పొరేట్ హెచ్వోడీగా, శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఈ కె.కిరణ్ కుమార్ను మందమర్రికి, కార్పొరేట్ ఏరియా సీపీపీ ఎస్ఈ ఎం.మనోజ్కుమార్ను ఈఆర్పీ వింగ్కు, మణుగూరు ఎస్ఈ ఎం.శ్రీనివాసులును కార్పొరేట్ సీపీపీ విభాగానికి బదిలీ చేశారు. వీరందరూ ఈ నెల 11వ తేదీ తేదీలోగా కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని సూచించింది. కరాటే పోటీల్లో బంగారు పతకాలుగుండాల: జాతీయస్థాయి కరాటే పోటీల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన జాతీయ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో గుండాల మండలం నుంచి 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆరుగురు స్వర్ణ, ఆరుగురు రజత, మరో 11 మంది కాంస్య పతకాలను అందుకున్నారని కోచ్ సుధాకర్ తెలిపారు. విజేతలను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. మందుపాతరలు నిర్వీర్యంచర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పోలీసు బలగాలను మట్టుబెట్టాలన్న లక్ష్యంతో మావోయిస్టులు ఏర్పాటు చేసిన 10 శక్తిమంతమైన మందుపాతరలను ఆదివారంభద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఈ ఘటన కోహిమెట్టా పోలీస్ స్టేషన్ పరిధి కుతుల్ సీఆర్పీఎఫ్ క్యాంపు సమీపంలోని కొడ్బార్–గుర్బా గ్రామాల అటవీ ప్రాంతంలో జరిగింది. మందుపాతరలను నిర్వీర్యం చేయడంతో పోలీసు బలగాలకు పెను ప్రమాదం తప్పింది. కాగా ఆ ప్రాంతంలో మరిన్ని మందుపాతరలు ఉన్నాయనే అనుమానంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
నేటి నుంచి ఇంటర్ తరగతులు
● మొదటి సంవత్సరంలో కొనసాగుతున్న అడ్మిషన్లు ● ఇంకా ప్రభుత్వ కళాశాలలకు చేరని పాఠ్యపుస్తకాలు ● మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని విన్నపం కొత్తగూడెంఅర్బన్: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కళాశాలలను శుభ్రం చేసి, సిద్ధం చేశామని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి తెలిపారు. మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా కళాశాలలు ప్రారంభమవుతున్నా పాఠ్య పుస్తకాలు ఇంతవరకు కళాశాలలకు చేరుకోలేదు. ఏటా కళాశాలల ప్రారంభం తర్వాతే అరకొరగా పాఠ్యపుస్తకాలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు సీనియర్ల పుస్తకాలు అడిగి చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దూరప్రాంతాల నుంచి కళాశాలలకు వస్తున్న విద్యార్థుల కోసం మధ్యాహ్నభోజన పథకం అమలు చేయాలని ఎన్నో ఏళ్లుగా తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు విన్నవించారు. జిల్లాలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలు 14, ప్రైవేటు కళాశాలలు 30 ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో 2,900 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, రెగ్యులర్ లెక్చరర్లు 160, కాంట్రాక్టు లెక్చరర్లు 11, గెస్ట్ లెక్చరర్లు 27, నాన్ టీచింగ్ స్టాఫ్ 65 మంది ఉన్నారు. కాగా ప్రభుత్వ కళాశాలల్లో గతంలో గెస్ట్ లెక్చరర్లుగా పని చేసిన వారిని, లెక్చరర్ల సంఖ్య తక్కువ ఉన్న చోట మళ్లీ తీసుకోవచ్చని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది లెక్చరర్ల కొరత ఉండదని, పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందాలని ఇంటర్మీడియట్ అధికారులు కోరుతున్నారు. మధ్యాహ్న భోజనం అమలు చేయాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి. సుదూరప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థులు అవస్థ పడుతున్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు వినతిపత్రం కూడా అందించాం. –ఎం.ఖుర్షీద్ అహ్మద్, లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుఅడ్మిషన్లు పొందాలి జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్లు పొందాలి. నేటి నుంచి కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కళాశాలలను ఇప్పటికే సిద్ధం చేశాం. పాఠ్య పుస్తకాల కోసం ప్రతిపాదనలు పంపించాం. –హెచ్.వెంకటేశ్వరరావు, నోడల్ అధికారి -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భక్తులతో పోటెత్తిన భద్రగిరిభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన ని ర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదిత ర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకుంటుండడం, ఆదివారం కావడంతో భద్రగిరి భక్తులతో పోటెత్తింది. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన పిదప స్వామి దర్శనానికి ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో దేవస్థాన ప్రాంగణం సందడిగా మారింది. -
పెద్దమ్మతల్లికి పూజలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం విశేష పూజలు చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఒడి బియ్యం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తమ చిన్నారులకు అన్నప్రాశన వేడుకలు జరిపించారు. పూజా కార్యక్రమాల్లో వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఈఓ ఎన్.రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. రాయితీపై ఫైబర్ గడలుదమ్మపేట : పామాయిల్ గెలల కోతకు వినియోగించే ఫైబర్ గడలను ఉద్యాన శాఖ ద్వారా రాయితీపై అందజేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని గండుగులపల్లిలోని తన నివాసంలో పలువురు రైతులు కలిసి సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎత్తయిన పామాయిల్ చెట్ల గెలలు కోసే క్రమంలో విద్యుత్ షాక్ తగలకుండా ఫైబర్ గడలను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు, మన్నెం అప్పారావు, రైతులు పాల్గొన్నారు. 21 మంది పోలీసులకు సేవా పతకాలుకొత్తగూడెంఅర్బన్: పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా పతకాలకు ఎంపిక చేసింది. వివిధ కేటగిరీల్లో పతకాలను ప్రకటించగా, జిల్లా నుంచి కఠిన సేవా పతకం విభాగంలో ఆర్ఐలు షేక్ లాల్బాబు, గుండాల సీఐ ఎల్.రవీందర్, చర్ల పీఎస్కు చెందిన జి.సైదులు, పి.సుమన్, కరకగూడెం స్పెషల్ పార్టీ పోలీసులు బాణోత్ బాలాజీ, వీరబాబు, కె.దిలీప్, డి.నగేష్ ఉన్నారు. సేవా పతకం దక్కిన వారిలో డీసీఆర్బీ డీఎస్పీ ఎన్.మల్లయ్యస్వామి, చండ్రుగొండ ఏఎస్సై ఎస్.పాపయ్య, డీఎస్బీ ఏఎస్సై టి.ప్రసాద్రావు, ఆళ్లపల్లి ఏఎస్సై ఎం.వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏఎస్సై సయ్యద్ రఫీ అహ్మద్, పాల్వంచకు చెందిన కె.కస్తూరి, కొత్తగూడెం వన్ టౌన్ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ టి.బాలరామరాజు, టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్లు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి.వెంకటేశ్వర్లు, ఆళ్లపల్లి హెడ్ కానిస్టేబుల్ ఎం.కృష్ణమూర్తి, డీఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి.చాంద్ ఉన్నారు. వీరికి నేడు కొత్తగూడెంలో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఎస్పీ రోహిత్రాజు పతకాలు అందజేయనున్నారు. నిత్యావసరాల సరఫరాకు టెండర్లు భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, హాస్టళ్లకు అవసరమైన కోడిగుడ్లు, కూరగాయలు, అరటి పండ్లతో పాటు చికెన్(స్కిన్లెస్) సరఫరాకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు రూ.2 వేల డీడీ చెల్లించి టెండర్ ఫారం తీసుకోవాలని సూచించారు. ఆపై కూరగాయలకు రూ.50 వేలు, పండ్లకు రూ.50 వేలు, కోడిగుడ్లకు రూ.50 వేలు, స్కిన్లెస్ చికెన్కు రూ.50 వేల చొప్పున ధరావత్తు డీడీ రూపంలో చెల్లించి ఈనెల 9వ తేదీలోగా టెండర్లు సమర్పించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ధరావత్తులో 20శాతం రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. కాగా, పాన్, టిన్ నంబర్లు, సొంత దుకాణం, బ్యాంకు ఖాతా కలిగిన జిల్లా వాసులు అర్హులని పీఓ తెలిపారు. భారజల కర్మాగారం జీఎంగా శ్రీనివాసరావుఅశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగారం జీఎంగా ఘంటసాల శ్రీనివాసరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత జీఎం హెచ్కే.శర్మ ఉద్యోగ విరమణ పొందగా డీజీఎంగా పని చేస్తున్న శ్రీనివాసరావుకు ఉద్యోగోన్నతి లభించింది. -
ఏదీ కారుణ్యం?
● జెన్కోలో కారుణ్య నియామకాల్లో తీవ్ర జాప్యం ● మూడేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు ● కేటీపీఎస్లో సుమారు 76 మంది బాధితులు పాల్వంచ: రాష్ట్రానికి వెలుగులు పంచే విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. కర్మాగారాల్లో నిత్యం కాలుష్యం అధికంగా ఉండే రెడ్జోన్ పరిధిలో కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో అనేక ప్రాణాంతక వ్యాధులకు గురై అనారోగ్యంతో బాధపడుతుంటారు. వ్యాధులు, ప్రమాదాలతోపాటు అకాల మరణాలు చెందిన అనేక మంది ఉద్యోగుల కుటుంబాలకు దక్కాల్సిన కారుణ్య నియామకాలపై జెన్కో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగ, కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా తాత్సారం చేస్తోంది. జెన్కో వ్యాప్తంగా సుమారు 110 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తుండగా, కేవలం కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలోనే సుమారు 76 మంది వరకు ఉన్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. బాధితుల ఎదురుచూపులు ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో జాప్యం లేకుండా కారుణ్య నియామకాలు చేపడుతున్నారు. జెన్కోలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సీఎండీలు మారడం, డైరెక్టర్స్థాయి పోస్టులు ఖాళీగా ఉండటం, ప్రభుత్వం మారడం వంటి పరిణామాలతో మూడేళ్లుగా ఈ ప్రక్రియ మందగించింది. దీంతో విధుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న బాధిత కుటుంబీకులు మనోవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఫైరవీల పేరుతో బాధితుల నుంచి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగాలు వెంటనే ఇస్తే ఎక్కువ కాలం విధులు నిర్వర్తించే చేసే అవకాశం, సీనియారిటీ పెరిగి అధిక వేతనం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నట్లు పలువురు వాపోతున్నారు. వర్తించని జీపీఎఫ్ 1999 నుంచి 2004 మధ్యలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ వర్తించడం లేదు. ఈపీఎఫ్ను జీపీఎఫ్గా మార్చి పెన్షన్ ఇవ్వాలని ఉద్యోగాలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్యపై కూడా ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. అయినా సమస్య పరిష్కారం కావడంలేదు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి, కారుణ్య నియామకాల కోసం, జీపీఎఫ్ కోసం తగిన చర్యలు చేపట్టాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాడ్ చేస్తున్నాయి. -
కిన్నెరసానికి పోటెత్తిన పర్యాటకులు
ఒకరోజు ఆదాయం రూ.62,610 పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 703 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.37,370, 400 మంది బోటు షికారు చేయడం ద్వారా పర్యాటకాభివృద్ధి సంస్థకు రూ.25,240 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
అశ్వారావుపేటరూరల్/ములకలపల్లి: తల్లిదండ్రులు తమ పిల్లలను మన ఊరి ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి నాణ్యమైన ఉచిత విద్యను పొందాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు కోరారు. ఆదివారం అశ్వారావుపేట, ములకపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో విద్యావంతులైన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలతోపాటు ఉచితంగా పాఠ్య, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్కులు, యూనిఫాంలు, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, రాగి జావ, కోడి గుడ్లు అందిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు వి.వరలక్ష్మి, జిల్లా కార్యదర్శి కృష్ణారావు, నాయకులు ఎం.రాజేశ్వరరావు, ఎన్.కొండలరావు, హరినాఽథ్బాబు, ఎం.వెంకటేశ్వర్లు, ఎం.సురేష్, గరికె శ్రీనివాస్, కిషోర్, కే. శ్రీరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజు -
రూ.5 కోట్ల పనులు.. ఆనవాళ్లు కరువు
వైరా: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన వైరా రిజర్వాయర్ ఆనకట్ట రూపురేఖలు కోల్పోతోంది. నైజాంల కాలం నిర్మించిన ఈ రిజర్వాయర్కు జిల్లాలోనే ప్రాధాన్యత ఉంది. కానీ అటు అధికారుల, ఇటు పాలకుల పట్టింపులేని తనంతో ఇప్పుడు ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వైరా రిజర్వాయర్ ఆనకట్ట అభివృద్ధికి 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5.30 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 2.5 మీటర్లు ఉన్న ఆనకట్టను 8మీటర్లుగా వెడల్పు చేయడంతో పాటు బతుకమ్మ ఘాట్, 2.5 కి.మీ. మేర ఆనకట్టపై రెయిలింగ్ ఏర్పాటుచేసి, లాన్ తీర్చిదిద్దారు. అంతేకాక కట్ట పొడవున సోలార్ లైట్లు ఏర్పాటు చేయగా.. ఇప్పుడు అవేమీ కానరావడం లేదు. అటు రిజర్వాయర్, ఇటు మినీ ట్యాంకు బండ్గా పేరున్నా సేద తీరాలని వచ్చే వారికి అసౌకర్యాలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. దెబ్బతిన్న రెయిలింగ్ రిజర్వాయర్ ఆనకట్టను సుమారు వందేళ్ల క్రితం నిర్మించినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ 2019 సంవత్సరంలో చేపట్టిన పనులు ఐదేళ్లు దాటకముందే నాణ్యతాలోపంతో దెబ్బతింటున్నాయి. ఇప్పటికే అర కిలో మీటర్కు పైగా ఆనకట్టుకు రెయిలింగ్కు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇదిలాగే వదిలేస్తే ప్రమాదకర స్థాయికి చేరే అవకాశముంది. ఇక ఆనకట్టపై రూ.20లక్షలు వెచ్చించి పచ్చటి గడ్డితో తీర్చిదిద్దిన లాన్ సైతం ఆనవాళ్లు కోల్పోయి పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. కానరాని సోలార్ లైట్లు, ప్యానళ్లు రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా నిర్వహణ లోపంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్ల క్రితం రూ. 35 లక్షలతో 2.5 కి.మీ. పొడవులో 73 సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. కానీ చాలా వాటి బ్యాటరీలు, ప్యానెళ్లు, లైట్లు చోరీ కావడంతో ఇప్పుడు పదికి మించి లైట్లు వెలగడం లేదు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులిపేసుకున్న అధికారులు కొత్తవి ఏర్పాటు చేయకపోవడంతో సాయంత్రం వేళ ఆనకట్టపైకి వచ్చే పర్యాటకులు, వాకర్లు చీకట్లో ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయాన ఆకతాయిల తీరుతో మహిళలకు అవస్త ఎదురవుతోంది. అంతేకాక బతుకమ్మ ఘాట్ మందుబాబులకు అడ్డాగా మారింది. సాయంత్రం వేళ ఇక్కడ మద్యం సేవిస్తున్న పలువురు బాటిళ్లు పగులగొట్టి వదిలేస్తుండడం గమనార్హం. పర్యవేక్షణ లోపంతోనే.. రిజర్వాయర్ ఆనకట్ట పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యం పొందినా అటు నీటి పారుదల శాఖ, మున్సిపల్, పర్యాటక శాఖ అధికారులెవరూ పట్టించుకోకపోవడం లేదు. ఫలితంగా నిర్వహణ లోపంతో ఆనవాళ్లు కోల్పోతుంది. సాయంత్రమైనా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తే ఆకతాయిలకు అడ్డుకట్ట పడుతుంది. అలాగే, రెయిలింగ్ పగుళ్ల వద్ద మరమ్మతులు చేసి, పచ్చని మొక్కలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి. వైరా రిజర్వాయర్ ఆనకట్టకు పగుళ్లు ట్యాంక్బండ్ పనుల్లోనూ అదే పరిస్థితి ఆసక్తిగా వచ్చే స్థానికులు, పర్యాటకులకు నిరాశ మరమ్మతులు చేపడతాం.. రిజర్వాయర్ ఆనకట్ట రెయిలింగ్కు పగుళ్లు వచ్చిన చోట మరమ్మతు చేయిస్తాం. అలాగే, మున్సిపల్ అధికారులతో మాట్లాడి పిచ్చి మొక్కలు తీయించడమే కాక పూల మొక్కలునాటుతాం. ఆనకట్టను మరింత అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు రూపొందిస్తాం. – శ్రీనివాస్, ఐబీ, డీఈ, వైరా -
యూనిఫాం సిద్ధం
● 75 శాతానికి పైగా పూర్తయిన పనులు ● తయారీ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు ● పాఠ్య పుస్తకాలూ 89 శాతం వచ్చేశాయ్.. ● పాఠశాలల ప్రారంభం రోజు అందజేయనున్న అధికారులు కొత్తగూడెంఅర్బన్ : ఈనెల 12 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలను సర్కారే అందించనుండగా.. ఇప్పటికే యూనిఫాం తయారీ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. జిల్లాలోని 1,332 ప్రభుత్వ పాఠశాలల్లో బాలురు 29,850, బాలికలు 32,682 మంది.. మొత్తం 62,532 విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 2.56లక్షల మీటర్ల వస్త్రం అవసరం కాగా, ప్రస్తుతం ఒక జతకు సరిపడేలా 1.28 లక్షల మీటర్ల క్లాత్ చేరుకోగా, దాన్ని అన్ని మండలాలకు పంపిణీ చేశారు. జిల్లాలోని పలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు దుస్తులు కుట్టే బాధ్యత అప్పగించారు. పాఠశాలల ప్రారంభం రోజున ఒక్కో విద్యార్థికి ఒక జత యూనిఫాం అందజేయనున్నారు. కొన్ని రోజుల తర్వాత మరో జత అందించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది జత యూనిఫాం కుట్టినందుకు మహిళా సంఘాల సభ్యులకు రూ.50 అందజేయగా.. ఈ సంవత్సరం రూ.75 చొప్పున చెల్లిస్తున్నారు. యూనిఫాం తయారీ పనులను పట్టణాల్లో మెప్మా, మండలాల్లో సెర్ప్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మండలాలకు చేరుతున్న పాఠ్యపుస్తకాలు.. ఈ విద్యా సంవత్సరం పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలు అందించాలనే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. జిల్లాకు మొత్తం 5,08,400 పుస్తకాలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 4,54,925 (89.4 శాతం) చేరుకున్నాయి. మిగిలిన పుస్తకాలు ఒకటి, రెండు రోజుల్లో వస్తాయని అధికారులు అంటున్నారు. జిల్లా గోదాంకు చేరిన పుస్తకాలను మండలాల వారీగా పంపిణీ చేస్తున్నారు. అక్కడి నుంచి పాఠశాలలకు చేరనున్నాయి. ప్రారంభం రోజే అందజేస్తాం జిల్లాకు ఇప్పటికే 89 శాతానికి పైగా పాఠ్యపుస్తకాలు చేరాయి. వీటిని గోదాంలో భద్రపరిచి అక్కడి నుంచి మండలాలకు పంపిణీ చేస్తున్నాం. ఇక యూనిఫాం తయారీ పనులు కూడా 75 శాతం వరకు పూర్తయ్యాయి. మిగితా పనులు కూడా రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పాఠశాలలు ప్రారంభమయ్యే ఈనెల 12న విద్యార్థులందరికీ పుస్తకాలు, ఒక జత యూనిఫాం అందజేస్తాం. – ఎం.వెంకటేశ్వరా చారి, డీఈఓవిద్యార్థులకు మెరుగైన బోధన.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్, ప్రైవే ట్ పాఠశాలలకు దీటుగా బోధన అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శిక్షణలో నేర్చుకున్న కొత్త అంశాలతో టీచర్లు బోధన చేసి చిన్నారుల్లో విద్యాబుద్ధులను మరింతగా మెరుగుపర్చనున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించేలా సర్కారు దశల వారీగా ప్రణాళికలు రూపొందిస్తోంది. -
3వ తేదీ వరకు పుస్తకాల పంపిణీ
డీఈఓ వెంకటేశ్వరా చారికొత్తగూడెంఅర్బన్: ఈ ఏడాది పాఠశాలల పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం ఈనెల 3వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరా చారి తెలిపారు. శనివారం పాత కొత్తగూడెంలోని గోదాం నుంచి రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు 5,08,400 పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4,54,925 పుస్తకాలు చేరాయని వివరించారు. ఇప్పటికే 59 శాతం పుస్తకాలను పంపిణీ చేశామని, మిగితావి రెండు రోజల్లో చేరవేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఎంఈఓ ప్రభుదయాళ్ పాల్గొన్నారు. -
ఖుర్షీద్ సేవలు అభినందనీయం
చుంచుపల్లి: జిల్లా సహకార శాఖ అధికారిగా సుదీర్ఘకాలం పనిచేసిన సయ్యద్ ఖుర్షీద్ సేవలు ఎనలేనివని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. డీసీఓ ఉద్యోగ విరమణ సందర్భంగా కలెక్టరేట్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విధుల్లో చేరిన నాటి నుంచి సహకార రంగ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని అన్నారు. తోటి సిబ్బందితో స్నేహంగా ఉంటూనే క్రమశిక్షణతో విధులు నిర్వహించేలా పర్యవేక్షించారని చెప్పారు. ఉద్యోగ విరమణ పొందిన ఖుర్షీద్ శేషజీవితం సజావుగా సాగాలని, ఆయురాగ్యాతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ అధ్యక్షులు అమరనేని రామారావు, టీజీఓస్ జిల్లా అధ్యక్షుడు సంగం వెంకటపుల్లయ్య, ఇన్చార్జ్ డీసీఓ శ్రీనివాస్, కవి, సామాజికవేత్త కోమాకుల సీతారాములు, మద్దెర్ల రమేష్, సహకార శాఖ చైర్మన్లు, ఖుర్షీద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
రామయ్యకు పునర్వసు పట్టాభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం పునర్వసు నక్షత్రం సందర్భంగా పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. అలాగే స్వామివారి మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. 2న సాంస్కృతిక కార్యక్రమాలు భద్రాచలంటౌన్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎల్.రమాదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు చిత్రకూట మండపంలో ఈ వేడుకలు ఉంటాయని, కళాకారులు, కళాభిమానులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. పొగాకు రహిత సమాజానికి కృషి చేయాలిసూపర్బజార్(కొత్తగూడెం): పొగాకు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.సరిత అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో శనివారం న్యాయమూర్తులు, న్యాయ శాఖ ఉద్యోగులు, కోర్టు డ్యూటీ పోలీసులతో ఈ మేరకు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పొగాకు వాడడంతో రోగాల బారిన పడుతున్నారని, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. పొగాకు ఉత్పత్తులతో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పొగాకు, సిగరెట్, ఆల్కహాల్ వినియోగంతో గుండె జబ్బులు, నోటి, లంగ్ కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్కుమార్, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.రాజమల్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఏఓ జె.కిరణకుమార్ పాల్గొన్నారు. వైద్యులకు మంత్రి దామోదర అభినందనభద్రాచలంఅర్బన్ : భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్ ద్వారా అభినందనలు తెలిపారు. రెండు నెలల క్రితం పురుగుమందు తాగి ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందిన మడకం శిరీష అనే యువతి కోలుకోగా.. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శుక్రవారం ఆమెను పరామర్శించడంతో పాటు వైద్యులు చూపిన శ్రద్ధ తదితర వివరాలు ఆరా తీశారు. కాగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కూడా యువతిని రక్షించిన ఏరియా ఆస్పత్రి వైద్యులను అభినందించారు. తాజాగా శనివారం మంత్రి రాజనర్సింహ తన ఎక్స్ అకౌంట్ ద్వారా డీసీహెచ్ఎస్ రవిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, పల్మనాలజిస్ట్ జగదీశ్తో పాటు సిబ్బందిని అభినందించారు. జీపీ కార్యదర్శే ట్రాక్టర్ డ్రైవర్!దుమ్ముగూడెం: గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా పాలకవర్గాలు సైతం లేకపోవడంతో కార్యదర్శులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని ఉన్నతాఽధికారులు ఆదేశించారు. ఇందుకు అవసరమైన రాళ్లు, ఇసుక తీసుకొచ్చేందుకు జీపీల ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. కానీ దుమ్ముగూడెం మండలం నర్సాపురం జీపీ ట్రాక్టర్ డ్రైవర్కు జ్వరం వచ్చి శనివారం విధులకు హాజరు కాలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శి యాకూబ్ ఇలా ట్రాక్టర్ డ్రైవర్గా మారాడు. -
ప్రపంచవ్యాప్తంగా విస్తరణకు చర్యలు
సింగరేణి(కొత్తగూడెం): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థకు మంచి రోజులు వచ్చాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో సంస్థ పదేళ్లు వెనక్కు వెళ్లిందని, కొత్త గనులు రాకపోవడం, విస్తరణ చేపట్టకపోవడమే దీనికి కారణమని చెప్పారు. కొత్తగూడెంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన వర్క్షాప్ను, ఆ తర్వాత జీఎం కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగూడెం ఏరియాలో వీకే – 7 ఓసీకి పర్యావరణ అనుమతులు వచ్చాయని, త్వరలో రెండో దశకు అనుమతులు రానున్నాయని తెలిపారు. సింగరేణి సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేలా చర్యలు చేపడతామన్నారు. 136 సంవత్సరాల ఘన చరిత్ర గల ఈ సంస్థ కేవలం బొగ్గుపైనే ఆధారపడకుండా లాభదాయకమైన టెక్నికల్ మినరల్స్ తవ్వే ఆలోచనలో ఉన్నామని, రాబోయే 30 ఏళ్లలో మరో 22 మిలియన్ టన్నుల బొగ్గును అదనంగా వెలికితీసేందుకు కొత్త గనులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే రూ.కోటి ప్రమాద బీమా వర్తింపజేస్తున్నామని, దీంతోపాటు వారసులకు తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే ఆగ్రహం.. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ప్రారంబోత్సవ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యేగా తన అధ్యక్షతన జరగాల్సి ఉందని, అంతేకాక ప్లెక్సీలో తన ఫొటో ముద్రించకుండా ప్రొటోకాల్ విస్మరించారని కూనంనేని సాంబశివరావు సింగరేణి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేను కాదని ఏ పనీ చేయొద్దని, భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కావొద్దని సూచించారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గడిపెల్లి కవిత, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నేషనల్ కో ఆర్డినేటర్ కొప్పుల రాజు, ఎస్పీ రోహిత్రాజు, సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణరావు, కొప్పల వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్, మిరియాల రంగయ్య, కొత్తగూడెం ఏరియా జీఎం శాలేంరాజు తదితరులు పాల్గొన్నారు. లాభదాయకమైన టెక్నికల్ మినరల్స్ తవ్వే ఆలోచనలో సింగరేణి జీఎం కార్యాలయం, ఏరియా వర్క్షాప్ ప్రారంభోత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి -
అవసరాలు తెలుసుకునేందుకే..
పాల్వంచరూరల్/పాల్వంచ : గిరిజనుల అవసరాలు ఏంటో తెలుసుకుని ఆ వర్గ నాయకులను ఒక చోట చేర్చేందుకే ఆదివాసీ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక గిరిజన జనాభా గల ఈ జిల్లాలో ఈ వేడుక నిర్వహించడం హర్షణీయమని అన్నారు. పాల్వంచ మండలం కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నిర్వహిస్తున్న ఆదివాసీ సమ్మేళనం చివరి రోజైన శనివారం భట్టితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నల్లమల డిక్లరేషన్ను తీసుకొచ్చామన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాలల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తండాలు, గూడేలను మొదట అభివృద్ధి చేసింది ఇందిరాగాంధీ హయాంలోనని గుర్తు చేశారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజనుల మనుగడను దెబ్బతిసేలా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య మాట్లాడుతూ ఆదివాసీలను ఐక్యం చేసి గిరిజన చట్టాలపై పూర్తి అవగాహన తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఆ తర్వాత మూడు రోజల సమ్మేళనంలో పాల్గొన్న ప్రతినిధులకు ధ్రువీకరణ పత్రాలు అందజేయగా గిరిజన మహిళలు నృత్యాలతో నాయకులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘురాంరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, వైరా, డోర్నకల్, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, రామచంద్రునాయక్, మట్టా రాగమయి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, సమ్మేళన్ ఇన్చార్జ్ రాహుల్ బాల్, నాయకులు చందాలింగయ్యదొర, కోనేరు చిన్ని తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్థానిక కేటీపీఎస్ గెస్ట్హౌస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి పార్టీ వ్యవహారాలపై దిశానిర్దేశం చేశారు.ఆదివాసీ సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి -
●ముందుకు సాగలేక.. వెనక్కి వెళ్లలేక
ఖమ్మం బైపాస్ రోడ్డులో శనివారం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వాహనాలు మెల్లగా కదులుతుండడంతో తెలంగాణ తల్లి సర్కిల్ నుంచి చైన్నె షాపింగ్మాల్ వరకు మూడు గంటల పాటు బారులుదీరాయి. పోలీసులు చేరుకున్నప్పటికీ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి శ్రమించాల్సి వచ్చింది. తెలంగాణ తల్లి సర్కిల్ విస్తీర్ణం ఎక్కువగా ఉండడం.. ట్రాఫిక్ స్నిగల్ గ్రీన్ లైట్ సమయం తక్కువగా ఇస్తుండగా.. ఐదారు భారీ వాహనాలు మూల తిరిగి వెళ్లేలోగా రెడ్ లైట్ పడుతోంది. శనివారం కూడా ఇదే సమస్యతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని లారీల డ్రైవర్లు వాపోయారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తాం
భద్రాచలం: పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి గిరిజన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్లన్నింటినీ అన్ని వసతులతో సిద్ధం చేస్తామని, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. హైదరాబాద్లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ సీతాలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డితో కలిసి గిరిజన సంక్షేమ ప్రత్యేక సెక్రటరీ శరత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, మంచాలు, కిటికీలకు మెష్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం పీఓ రాహుల్ మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభం సమయానికి అన్ని వసతులతో విద్యార్థులకు స్వాగతం పలికేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీసీలో డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, డీఈ హరీష్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన మ్యూజియంపై శ్రద్ధ వహించాలి.. గిరిజన మ్యూజియం అభివృద్ధికి మరింత శ్రద్ధ వహించాలని పీఓ రాహుల్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. శనివారం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మ్యూజియం అభివృద్ధికి కేంద్రం రూ.కోటి నజరానా ప్రకటించటం హర్షణీయమని అన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన ఈఈ చంద్రశేఖర్, ఏసీఎంఓ రమణయ్య, ఉద్యానవన శాఖ సిబ్బంది మాలి బాబురావులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, గురుకులం ఆర్సీఓ అరుణ కుమారి, ఏఓ సున్నం రాంబాబు, ఏటీడీఓలు అశోక్ కుమార్, చంద్రమోహన్, రాధమ్మ, మేనేజర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు టేకులపల్లి: విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు స్పష్టం చేశారు. మండలంలోని విత్తన, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆమోదిత విత్తనాలను, నిర్దేశించిన ధరల్లో మాత్రమే విక్రయించాలని చెప్పారు. యూరియా అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. బీజేపీ ఆధ్వర్యంలో శోభాయాత్ర చుంచుపల్లి: బీజేపీ ఆధ్వర్యంలో రాణి అహల్యాబాయి జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అహల్యాబాయి 300 ఏళ్ల క్రితమే మహిళా సాధికారతకు కృషి చేశారని అన్నారు. నాయకులు జీవికే మనోహర్, రంగాకిరణ్, జల్లారపు శ్రీను, గూడ విజయ, పైడిపాటి రవీందర్, కుంజా ధర్మ, తిమ్మిరి నరేంద్రబాబు, శీలం విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. నిజాయితీ చాటిన రైతుసుజాతనగర్: జొన్నలు కొనుగోలు చేసిన వ్యాపారి అదనంగా డబ్బులు చెల్లించగా, ఆ సొమ్ము తిరిగి చెల్లించి ఓ రైతు తన నిజాయితీని చాటుకున్నాడు. నర్సింహసాగర్ గ్రామానికి చెందిన బానోత్ భీముడు 50 కిలోల జొన్నలను విక్రయించేందుకు డేగలమడుగులోని మన్నెపల్లి రాణి ఇంటికి వెళ్లాడు. కిలో ధాన్యం రూ.50 చొప్పున విక్రయించాడు. కాగా రైతుకు రూ. 2500 ఇవ్వాల్సి ఉండగా రూ.20,500 వ్యాపారి రైతుకు ఇచ్చింది. రైతు ఇంటికి వెళ్లి చూసుకోగా రూ.18 వేలు అదనంగా ఉండటంతో ఆ సొమ్మును తిరిగి వ్యాపారికి వద్దకు వచ్చి ఇచ్చివేశాడు. కామారెడ్డి రైతులకు ‘ఆయిల్పామ్’పై అవగాహనఅశ్వారావుపేటరూరల్/దమ్మపేట: కామారెడ్డి జిల్లా రైతులు శనివారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. సుమారు 150 మంది రైతులు నారంవారిగూడెం వద్దగల ఆయిల్ఫెడ్ పామాయిల్ మొక్కల నర్సరీ, దమ్మపేట మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీతోపాటు ఆయిల్పామ్ సాగు క్షేత్రాలను పరిశీలించారు. తోటల పెంపకం, సాగు పద్ధతులు, దిగుబడి తదితర వివరాలు స్థానిక రైతులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ సంస్థ మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ కంట్రోల్ కమిటీ పరిశీలనభద్రాచలంటౌన్: పట్టణంలోని మదర్ థెరిస్సా డిగ్రీ కళాశాలలో కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ ఎన్ఏఏసీ క్వాలిటీ కంట్రోల్ విభాగం బృందం సభ్యులు శనివారం సందర్శించారు. బోధనా ప్రమాణాలు తదతర అంశాలపై ఆరా తీశారు. ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంపొందిస్తూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ కమిటీ డైరెక్టర్ వెంకటరమణ, కరస్పాండెంట్ ప్రభాకర్ పాల్గొన్నారు. -
పొగాకు క్యూరింగ్లో మార్పులు రావాలి
అశ్వారావుపేటరూరల్: పొగాకు పంట క్యూరింగ్లో విప్లవాత్మక మార్పులు రావాలని, రైతులు గ్యాస్ ఆధారిత క్యూరింగ్ విధానానికి మారాలని ఐసీఏఆర్–ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్ అన్నారు. శనివారం అశ్వారావుపేట మండల పరిధిలోని తిమ్మాపురంలో రైతు కొడవాటి వాసు వ్యవసాయ క్షేత్రంలో ఐసీఎఆర్–ఎన్ఐఆర్సీఏ, ఎల్ఓసీఎల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన గ్యాస్ ఆధారిత పొగాకు బ్యారన్ పనితీరుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు క్యూరింగ్ సమయంలో బ్యారన్లలో వినియోగించే వివిధ రకాల కలపతో కాలుష్యం పెరుగుతోందని, పొగాకులో నాణ్యత తగ్గిపోతోందని తెలిపారు. జనరల్ మేనేజర్ వర్నేకర్, చీఫ్ మేనేజర్ లలిత, పొగాకు బోర్డు విస్తరణ మేనేజర్ సురేఖ, బోర్డు ఆర్ఎం ప్రసాద్, ప్రాజెక్టు హెడ్ డాక్టర్ ఎల్కే ప్రసాద్, డాక్టర్ ఐవీ సుబ్బయ్య, టి.వెంకటేష్, టి.రమేష్, దేవానంద్, ఆయిల్ఫెడ్ డీఓ నాయుడు రాధాకృష్ణ, పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబు పాల్గొన్నారు. ఐసీఏఆర్–ఎన్ఐఆర్సీఏ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్ -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ
అశ్వారావుపేటరూరల్: అదుపుతప్పి ఓ లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఏపీ వైపు నుంచి అశ్వారావుపేట వైపు విద్యుత్ సామగ్రి లోడుతో వస్తున్న లారీ సరిహద్దు చెక్పోస్టు వద్ద ఆగింది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన పార్కింగ్ చేసేందుకు లారీని రివర్స్ చేస్తున్న క్రమంలో అదుపుతప్పి వెనుక ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగి, వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. లారీ డ్రైవర్, క్లీనర్ సరక్షితంగా బయటపడ్డారు. విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునఃరుద్ధరించారు. నాటుసారా స్వాధీనంపాల్వంచ: ఆటోలో ఆరు లీటర్ల నాటుసారా తరలిస్తుండగా పట్టణంలోని దమ్మపేట సెంటర్ వద్ద ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూక్యా వీరేందర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుక్కునూరు మండలం వేలేరు గ్రామం నుంచి తీసుకొస్తుండగా పట్టుకున్నట్లు సీఐ ఎం.ప్రసాద్, ఎస్ఐ సరిత తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
జీవనంలో సగపాలు
జీవన ప్రమాణాలు మెరుగుపర్చేది పాడిపరిశ్ర మ●● పౌష్టికాహారంలో పాలకే ప్రాధాన్యత ● ఉమ్మడి జిల్లాలో మెరుగ్గా పాల ఉత్పత్తి ● త్వరలోనే ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు ● నేడు ప్రపంచ పాల దినోత్సవంఖమ్మంవ్యవసాయం: పాలు, పాల ఉత్పత్తులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పాలు ఆరోగ్యకరమైన ఆహారం. జీవనోపాధి, సమాజ ప్రయోజనాలకు పాడి పరిశ్రమ ఎంతగానో దోహదపడుతుంది. జీవన ప్రమాణాలను మెరుగుకు పాడి పరిశ్రమ ప్రధాన భూమిక పోషిస్తుందనటంలో సందేహం లేదు. మానవాళి జీవనంలో పాలు ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ నేపథ్యాన ఆదివారం అంతర్జాతీయ పాల దినోత్సవం సందర్భంగా కథనం. పాల ఉత్పత్తికి పెరుగుతున్న ప్రాధాన్యం మనిషి ఆరోగ్యం పాల ఉత్పత్తులపై ఆధారపడటంతో ఆయా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యాన ప్రభుత్వాలు పాడి పరిశ్రమకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. వ్యవసాయ పరంగా ముందంజలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాడి పరిశ్రమపైనా రైతులు మక్కువ కనబరుస్తునానరు. ఉమ్మడి జిల్లాలో గేదె పాలు ఉత్పత్తి ఎఉ్కవగా ఉండగా.. ప్రభుత్వం 25 వేల లీటర్ల సామర్థ్యంతో పాడి పరిశ్రమ (విజయ డెయిరీ)ను నిర్వహిస్తోంది. ఖమ్మంలోని ఈ పరిశ్రమకు అనుబంధంగా కామేపల్లి, మధిర, ఎర్రుపాలె, కల్లూరు, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెంలలో 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పాల శీతలీకరణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 227 గ్రామాల్లో పాల సేకరణ పాల శీతలీకరణ కేంద్రాల ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 30 మండలాల్లోని 227 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ పాల సేకరణ కేంద్రాల్లో 3,025 మంది ఉత్పత్తి చేసే పాలను విక్రయిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాల ఉత్పత్తిదారుల నుంచి ప్రస్తుతం రోజుకు 7,750 లీటర్ల పాలను సేకరిస్తుండగా, కొత్తగూడెం జిల్లా నుంచి 2,500 లీటర్ల పాలను సేకరిస్తున్నారు. ఈ మొత్తం నుంచి ఖమ్మం జిల్లాలో 1,000 లీటర్లు, కొత్తగూడెం జిల్లాలో 2,600 లీటర్లు విక్రయిస్తున్నారు. విజయ పాల ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రాధాన్యం ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 6 డెయిరీ పార్లర్లు నడుస్తున్నాయి. వెన్నశాతం ఆధారంగా పాడి పరిశ్రమ రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. ప్రభుత్వం ఇటీవల పాల ధరను పెంచింది. 10 వెన్నశాతం ఉన్న గేదె పాల ధరను రూ.80 నుంచి 84.60కు, వెన్నశాతం 7 ఉన్న గేదె పాల ధర రూ.56 నుంచి రూ.59.50లకు పెంచింది. ఇందిరా డెయిరీతో పెరగనున్న ఉత్పత్తి రాష్ట్ర ప్రభుత్వం మధిర నియోజకవర్గంలో ఇందిరా మహిళా డెయిరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. సభ్యులైన మహిళలకు రెండు గేదెల చొప్పున సబ్సిడీపై అందించనున్నారు. మధిర, ఎర్రుపాలెం, ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. ఇప్పటికే ఎర్రుపాలెంలో బల్క్ మిల్క్ కేంద్రం ఉండగా, బోన కల్, చింతకాని, మధిర, ముదిగొండల్లో ఒక్కో మండలంలో 2,500ల నుంచి 5 వేల సామర్థ్యం కలిగిన బల్క్మిల్క్ సెంటర్ల ఏర్పాటు ప్రతిపాదనలు చేశారు. ఆరోగ్యం.. శక్తి పాలలో మన శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, జింక్, పాస్ఫరస్, అయోడిన్, ఐరన్, పొటాషియం, ఫోలేట్స్, విటమిన్–ఏ, బిటమిన్–డీ, రైబోఫ్లేవిన్, విటమిన్ బీ–12, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్ వంటివి ఉంటాయి. నిత్యం సగటున ఒక మనిషికి 274 గ్రాముల పాలు, పాల పదార్థాలు అవసరం. మన దేశంలో ఒక్కో మనిషికి సగటున 186 గ్రాములు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 100 గ్రాములకు మించి పాల ఉత్పత్తులు అందటం లేదని నివేదికలు చెబుతున్నాయి. రైతుల్లో పెరుగుతున్న అవగాహన పాల ఉత్పత్తిపై రైతులకు అవగాహన పెరుగుతోంది. పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో పాడి పరిశ్రమపై కూడా రైతులు దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు గేదెలను పెంచుకొని, వాటి ద్వారా పాడిని ఉత్పత్తి చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. స్థానికంగా పాలు విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా డెయిరీలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఖమ్మం జిల్లాలో పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. –మోహనమురళి, విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్, ఖమ్మం -
లక్ష్యానికి దూరంగా..
జిల్లాలో భారీగా తగ్గిన తునికాకు సేకరణ ● నిర్దేశిత లక్ష్యంలో 40.77 శాతమే ● టెండర్లలో జాప్యం, అకాల వర్షాల ప్రభావం పాల్వంచరూరల్: ఈసారీ తునికాకు సేకరణ లక్ష్యం నెరవేరలేదు. గతేడాది కంటే కూడా సేకరణ తగ్గింది. గడిచిన సంవత్సరం లక్ష్యంలో 41.7 శాతం సేకరిస్తే ప్రస్తుత సంవత్సరం 40.77 శాతం మాత్రమే సేకరించారు. మే నెల రెండో వారం నుంచి సేకరణ ప్రారంభంకాగా కేవలం పక్షం రోజులే గిరిజనులు తునికాకు సేకరించారు. అప్పటి నుంచి అకాల వర్షాలు రావడం, కొందరు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లడంతో తునికాకు సేకరణ లక్ష్యం నెరవేరలేదని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఆరు డివిజన్లలో ఈ ఏడాది సేకరణ లక్ష్యం 35,100 స్టాండర్డ్ బ్యాగులుగా నిర్దేశించగా, 14,313 స్టాండర్డు బ్యాగులు మాత్రమే సేకరించారు. మే 31 వరకు సేకరణ జరగాల్సి ఉండగా, ఐదు రోజుల ముందే సేకరణ నిలిచిపోయింది. కాగా గతేడాది 35,300 స్టాండర్డ్ బ్యాగుల లక్ష్యానికి 13,478.66 స్టాండర్డు బ్యాగుల తునికాకు సేకరించారు. కారణాలు ఇవే.. అకాల వర్షాలు, టెండర్ల ప్రక్రియలో జాప్యంతో కూలీలు ఆకు సేకరణపై ఆసక్తి చూపలేదు. వర్షాల కారణంగా ఆకు చీడ పట్టి పనికిరాకుండా పోయింది. దీంతో నాణ్యమైన ఆకు కూడా దొరకలేదు. ఏటా ఏప్రిల్ నెలాఖరులో తునికాకు సేకరణ ప్రారంభిస్తారు. అప్పటి నుంచి మే వరకు సుమారు 30 నుంచి 35 రోజుల వరకు ఆకు సేకరిస్తారు. కానీ గత వేసవిలో మాత్రం టెండర్లలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో మే నెల రెండో వారంలో సేకరణ ప్రారంభమైంది. కేవలం పది, పదిహేనురోజులు మాత్రమే ఆకు సేకరణ జరిగింది. దీనికితోడు అకాల వర్షాలు కూడా ప్రభావం చూపాయి. కాగా గతంలో 50 ఆకుల కట్టకు రూ.3 చొప్పున చెల్లిస్తే ఈసారి రూ.3.30 చొప్పున కూలీలకు చెల్లించారు. డివిజన్ల వారీగా తునికాకు సేకరణ వివరాలు డివిజన్ లక్ష్యం సేకరణ శాతం కిన్నెరసాని 3,200 1,117 35 అభయారణ్యం భద్రాచలం 9,700 4,338 43 ఇల్లెందు 10,600 2,550 20 మణుగూరు 5,400 3,952 73 పాల్వంచ 2,300 356 15 కొత్తగూడెం 3,900 2,000 20 మొత్తం 35,100 14,313 40.77 -
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలి
కొత్తగూడెంఅర్బన్/జూలూరుపాడు: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి బి.రాజు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపు కోసం ఆ సంఘం ఆధ్వర్యంలో ప్రచార జాతా నిర్వహిస్తున్నారు. శనివారం కొత్తగూడెం రైల్వే స్టేషన్, బస్టాండ్, పోస్ట్ ఆఫీస్ సెంటర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో, జూలూరుపాడులో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉన్నాయని చెప్పారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడుసార్లు గుడ్లు, రాగిజావ అందిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఫీజుల భారం తగ్గించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో విద్యా వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని, తల్లిదండ్రుల ఆకాంక్షలను ప్రైవేట్ విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, నాయకులు బి.లక్ష్మా, బి.మంగీలాల్, ఎదళ్లపల్లి వీరస్వామి, బి శంకర్, గురుమూర్తి, ఆర్ నాగజ్యోతి పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి -
ఇసుక తవ్వకాలపై సొసైటీ సభ్యుల ఆగ్రహం
చర్ల: మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీలో సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇసుక తవ్వకాలను చేపట్టారు. దీంతో సొసైటీ సభ్యులు శనివారం నిరసన తెలిపారు. ఇసుక తవ్వకాలు చేపట్టిన ప్రాంతానికి చేరుకుని పనులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం ఇవ్వకుండా తవ్వకాలు ఎందుకు చేపట్టారని ప్రశ్నిస్తే తమపై దాడి చేశారంటూ సుందరయ్యకాలనీ, చీమలపాడుకు చెందిన గిరిజనులు ఆరోపించారు. సొసైటీలోని సభ్యులందరికీ సమాచారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సొసైటీలో కొందరు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇసుకను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇసుకను మాన్యువల్ పద్ధతిలో తీయాల్సి ఉన్నప్పటికీ భారీ యంత్రాల ద్వారా తీస్తూ తమ పొట్ట కొడుతున్నారని, దీనిని తక్షణమే నిలిపివేయించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ జె.సురేశ్ కథనం ప్రకారం.. తడకలపూడి, చీమలపహాడ్ రైల్వేస్టేషన్ మధ్యన దాదాపు 35 నుంచి 40 ఏళ్ల వయసు గల వ్యక్తిని సింగరేణి రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు ఫుల్షర్టు, బ్రౌన్ కలర్ పాయింట్ ఉన్నాయి. రైల్వేట్రాక్పై చెత్త ఏరుకునే బస్తాలు, మృతుడు చూడడానికి యాచకుడి లాగా ఉన్నారని స్థానికులు తెలిపారు. తడికలపూడి రైల్వేస్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆస్పత్రి మార్చురిలో భద్రపరిచినట్లు వివరించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 99890 25481, 87126 58600, 970137 1472 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కేసు నమోదు ములకలపల్లి: సోదరుడిపై దాడి చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. మండలంలోని మూకమామిడికి చెందిన హుస్సేన్.. తన సోదరుడు రజాక్కు ఏడేళ్ల కిందట రూ.60 వేలు ఇచ్చాడు. రజాక్ ప్రస్తుతం మిర్యాలగూడలో ఉంటున్నాడు. ఈ నెల 28న తిరిగి మూకమామిడికి రాగా, హుస్సేన్, అతని భార్య నస్రీన్ తీసుకున్న నగదు ఇవ్వాలని అడిగారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రజాక్.. హుస్సేన్, నస్రీన్లపై దాడి చేశాడు. నస్రీన్ శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ పాల్వంచ: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. వనమాకాలనీలో మూగిది గణపతి ఐదు రోజుల కిందట కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లాడు. ఇంటికి శుక్రవారం వచ్చి చూడగా.. ఇంటి కిటికీ ఐరన్ రాడ్లను కోసి, బీరువా తెరిచి, అందులోని 15 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, రూ.50 వేల నగదు చోరీకి గురైనట్లు తేలింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
ముందస్తు చర్యలేవి..?
ప్రభుత్వాస్పత్రుల్లో కిట్లు లేవు.. ల్యాబ్లు తెరుచుకోవు ● కోవిడ్ ఐసోలేషన్ వార్డు, బెడ్లు ఏర్పాటు చేయని వైద్యాధికారులు ● మరోవైపు జిల్లా ప్రజల్లో కరోనా భయం కొత్తగూడెంఅర్బన్: దేశంలో పలుచోట్ల కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఒకింత ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం కేసులు లేనప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టడంలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన ఏర్పాట్లు కూడా చేయడంలేదు. జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న రోగులకు డాక్టర్లు సాధారణ పారాసిటమోల్, సిట్రెజిన్ వంటి మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కిట్లు కూడా లేవు. గతంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించిన ల్యాబ్లు ప్రస్తుతం మూతపడి ఉన్నాయి. ల్యాబ్ల్లో సిబ్బంది, టెక్నీషియన్లు కూడా అందుబాటులో లేరు. కరోనా సమాచారం తెలుసుకోవాలని ప్రజలు ప్రయత్నిస్తే జిల్లాలో కేసులు ఏమి నమోదు కాలేదు కదా..? అప్పుడే తొందర ఏమి ఉందని వైద్యాధికారులు కొట్టిపారేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. సిబ్బంది, వైద్యులకు మినహా ఇతరులకు ఆస్పత్రుల్లో కనీసం మాస్కులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో 13,66,730 మందికి పరీక్షలు జిల్లాలో గతంలో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 13,66,730 మందికి నిర్వహించగా, 58,089 మందికి పాజిటివ్గా తేలింది. 572 మంది మృతి చెందినట్లు జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖాధికారులు వెల్లడించారు. కొత్తగూడెం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ద్వారానే అత్యవసర రోగులకు ప్రాణవాయువు అందిస్తున్నారు. పాల్వంచ ఆస్పత్రిలో కూడా నవభారత్ యాజమాన్యం సోషల్ రెస్పాన్స్బులిటీ కింద ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు రేసింది. ప్రస్తుతం ఆ ప్లాంట్ ద్వారానే ఆస్పత్రిలోని అత్యవసర వార్డుల్లో ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. కాగా ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో ముందస్తు చర్యలు చేపట్టలేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. సిద్ధంగా ఉన్నాం జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదు. కేసులు ఏమైనా నమోదయితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని సూపరింటిండెంట్లకు సూచించాం. –భాస్కర్నాయక్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి -
పల్లె సమస్యలపై స్పందన
చుంచుపల్లి: కొంతకాలంగా ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలపై గురువారం సాక్షిలో ప్రచురితమైన ‘పల్లెలో ప్రత్యేక పాట్లు’కథనానికి అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. పారిశుద్ధ్యంతో పాటు ఇతర సమస్యలపై దృష్టి సారించారు. ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని గ్రామాల్లో సమస్యలపై ఆరా తీస్తున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనను సంప్రదించగా ప్రత్యేక అధికారులకు పాలనపై మరింత దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. వివాహిత అదృశ్యం పాల్వంచరూరల్: దంపతుల మధ్య గొడవ జరగగా మనస్తాపం చెందిన భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ధర్మసోత్ గోప భార్య సుజాత భర్తతో గొడవపడి గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆచూకీ లభించకపోవడంతో సుజాత తండ్రి మాళోతు మగితియా ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేశ్ కేసు నమోదు చేశారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివా రికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలో ని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు,కుంకుమ, గాజులు, హా రతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.ఆవిర్భావ వేడుకలకు ముఖ్యఅతిథిగా తుమ్మలసూపర్బజార్(కొత్తగూడెం): జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదాన్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేషన్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మీ పార్టీ సంగతి చూసుకోండిఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎంపీ బలరాం నాయక్ఇల్లెందు: కాంగ్రెస్ మునిగిపోయే నావ వంటిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించడం గర్హనీయమని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ పేర్కొన్నారు. తొలుత బీఆర్ఎస్లో ముసలం సంగతి చూసుకోవాలని ఆయన హితవు పలికారు. ఇల్లెందులోని టీపీసీసీ మాజీ సభ్యుడు ఎస్.కే.జానీ ఇంటికి శుక్రవారం వచ్చిన ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా నిధుల కొరత వేధిస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసి అప్పులు తీరుస్తూనే పథకాల అమలుకు శ్రమిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో గౌస్, గోచికొండ శ్రీదేవి, సాంబమహేష్, సయ్యద్ ఆజం, శ్రీనివాసగౌడ్, లింగంపల్లి శ్రీనివాస్, సిరాజ్ పాల్గొన్నారు.బీఏఎస్కు దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: 2025–26 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్(బీఏఎస్) పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖాధికారి అనసూర్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో రెసిడెన్షియల్(హాస్టల్)లో 69 సీట్లు, 1వ తరగతిలో నాన్ రెసిడెన్షియల్ (డే స్కాలర్స్)లో 66 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. రుద్రంపూర్ సెయింట్ జోసఫ్ హైస్కూల్లో 22 సీట్లు, స్వర్ణభారతి హై స్కూల్లో 22, భద్రాచలం లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో 22, లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 69 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. జూన్ 16వ తేదీ లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని, 20న లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని వివరించారు. -
నేడు జీఎం ఆఫీస్, వర్క్షాపు ప్రారంభం
● ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ● రూ.455.4 కోట్లతో వీకే–7 ఓసీ విస్తరణ పనులు సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నూతనంగా నిర్మించిన జీఎం కార్యాలయం, వర్క్షాపును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించనున్నారు. వెంకటేష్ ఖని (వీకే–7 షాఫ్ట్) భూగర్భ గనిలో నిక్షేపాలు పూర్తికావడంతో విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో యాజమాన్యం రూ.455.4 కోట్లతో విస్తరణ పనులు నిర్వహిస్తోంది. సుమారు 184 మిలియన్ టన్నుల మిగులు నిక్షేపాలున్న వీకే–7 విస్తరణ గనికి దాదాపు 30 సంవత్సరాల జీవిత కాలం ఉండే అవకాశం ఉంది. దీంతో రూ.333 కోట్లతో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, రూ. 10 కోట్లతో ఏరియా వర్క్షాపు, జీఎం కార్యాలయం, రూ.80 కోట్లతో రైల్వే సైడింగ్ పనులు, రూ.20 కోట్లతో హైవే మళ్లింపు పనులు, రూ. 3.4 కోట్లతో ఫిల్టర్బెడ్ నిర్మాణ పనులు చేపట్టారు. వీటి పనులు ఏడాది క్రితమే పూర్తయినా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. డిప్యూటీ సీఎం శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి పాల్వంచ చేరుకుని కిన్నెరసానిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారని, 1:50 గంటలకు 3 ఇంక్లైన్లో నూతన జీఎం కార్యాలయం, 4 ఇంక్లైన్లోని వర్క్షాపులను ప్రారంభిస్తారని, అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తారని వివరించారు. -
ప్రత్యేకంగా పర్యాటక అభివృద్ధి
● ఎకో టూరిజంలో కనకగిరి గుట్టలకు స్థానం ● భద్రాచలం, కిన్నెరసాని, పులిగుండాల అనుసంధానానికి ప్రణాళిక ● రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెనుబల్లి: జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నందున ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తద్వారా పర్యాటక రంగానికే కాక స్థానికులకు ఆదాయం పెరగనుందని చెప్పారు. పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు వద్ద అటవీశాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఎకో టూరిజం ప్రాజెక్టును కలెక్టర్ ముజ్మమిల్ఖాన్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో పాటు అటవీ, పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. బ్రహ్మళకుంట అటవీప్రాంత సమీపాన పులిగుండాల సాగునీటి ప్రాజెక్టు వద్ద రూ.20 లక్షలతో చేపట్టిన టూరిజం పనులను పరిశీలించాక, టూరిస్టుల కోసం ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభించారు. రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు పులిగుండాల వద్ద సుమారు 30 వేల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎకోటూరిజం ప్రాజెక్టుగా గుర్తించి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోందని మంత్రి తుమ్మల వెల్లడించారు. రాష్ట్రంలోని వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాలోని పులిగుండాల ప్రాజెక్టు వరకు కనకగిరి గుట్టల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. వీటన్నింట్లో పులిగుండాల ప్రాజెక్టును కీలకంగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. సుమారు రూ.7 కోట్ల నిధులతో ఎకో టూరిజం పనులకు శ్రీకారం చుట్టామని వివరించారు. కాగా, పెనుబల్లి మండలంలో ఇటీవల పోడు పేరుతో అడవులు నరుకుతున్నట్లు తెలిసిందని.. ఇలాంటి వారిపైనే కాక నిర్లక్ష్యంగా వహించే సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పులిగుండాల ప్రాజెక్టు పరిధిలో చిరుతపులి, ఎలుగుబంటి, తోడేలు వంటివే కాక 120 రకాల పక్షి జాతులు సంచరిస్తున్నందున పర్యాటకంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. పులిగుండాల ప్రాజెక్టు నుండి అటవీ మార్గం ద్వారా భద్రాచలం వరకు వెళ్లేలా రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు భద్రాచలం, కిన్నెరసాని, పులిగుండాల ప్రాజెక్టులను అనుసంధానం చేసేలా ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ అటవీ, పర్యాటక శాఖల మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు సహకారంతో పులిగుండాల ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు మట్టా దయానంద్తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో పూసపల్లి ఓసీ పనులు
● గని ప్రాంతంలో సాగుతున్న చెత్తాచెదారం తొలగింపు పనులు ● వచ్చే నెలలో భూమి పూజకు సన్నాహాలు ● మూడు నెలల్లో బొగ్గు వెలికి తీసేలా కార్యాచరణ ఇల్లెందు: కేంద్ర పర్యావరణ, అటవీఽశాఖ అనుమతులు లభించడంతో జేకే ఓసీ(పూసపల్లి)పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బొగ్గు వెలికి తీసే ప్రాంతంలో ఓబీ పనులు చేపట్టేందుకు చెత్తా చెదారం తొలగిస్తున్నారు. కొద్ది రోజుల్లో భూమి పూజ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాబోవు మూడు నెలల్లో బొగ్గు వెలికి తీయాలని వారం రోజుల క్రితం ఇల్లెందు సందర్శించిన సీఎండీ ఎన్.బలరాం జీఎం వీసం కృష్ణయ్యను ఆదేశించారు. పదేళ్లపాటు జేకే ఓసీ(పూసపల్లి)లో 1.9 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయనుండటంతో ఇల్లెందు సింగరేణి ఉద్యోగులు, అధికారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పరిహారం కోసం నిర్వాసితుల ఆందోళన నూతన ఓసీకి అనుమతులు లభించడంతో ఓబీ వెలికితీతకు టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఓబీ పనులను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. మరోవైపు నిర్వాసితులు పరిహారం కోసం ఆందోళనలు చేపడుతున్నారు. 21 పిట్ ఏరియాలో వ్యవసాయభూములతోపాటు నివాస గృహాలు, పురాతన సింగరేణి క్వార్టర్లలో నివాసం ఉంటున్నవారు రోడ్డెక్కుతున్నారు. ఏడాది కాలంగా ఓసీ పనులను అడ్డుకుంటున్నారు. వారం క్రితం కూడా జీఎం ఆఫీస్ను ముట్టడించారు. రెండు రోజుల క్రితం ఓబీ పనులను అడ్డుకున్నారు. పరిహారం సమస్య పరిష్కారమైతేకానీ ఓసీ పనులు ప్రారంభమయ్యే పరిస్థితిలేదు. తరలిపోతున్న డంపర్లు ఇల్లెందులోని జేకే–5 ఓసీ కాలపరిమితి గత మార్చితో ముగిసింది. దీంతో ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. డంపర్ తదితర యంత్రాలను తరలిస్తున్నారు. గత వారంలో నాలుగు డంపర్లను మణుగూరుకు తీసుకెళ్లారు. 12 మంది ఆపరేటర్లను సత్తుపల్లికి బదిలీ చేశారు. కాగా రూ.297.88 కోట్లతో 1114.507హెక్టార్ల భూమిలో బొగ్గు వెలికి తీయనున్నారు. ఇల్లెందు మండలంలో రొంపేడు, సుదిమళ్ల, ఖమ్మం జిల్లాలో సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలో జేకే ఓసీ విస్తరించనుంది. త్వరితగతిన పనులు నూతన జేకే ఓసీ(ఫూసపల్లి) ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి పత్రం విడుదలైంది. టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఓబీ వెలికితీసే పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరితగతిన బొగ్గు వెలికితీసేలా చర్యలు తీసుకుంటాం. –వీసం కృష్ణయ్య, ఇల్లెందు ఏరియా జీఎం -
మూడు నెలలకు ఒకేసారి..
● రేషన్ బియ్యం అందించేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు ● ఇప్పటికే గోదాంలకు స్టాక్ చేర్చిన అధికారులు ● వర్షాకాలం దృష్ట్యా లబ్ధిదారులు ఇబ్బందిపడకుండా చర్యలు భద్రాచలంటౌన్: వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. రేషన్ కార్డు లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్న బియ్యం జూన్లోనే అందించనుంది. ఇప్పటికే రేషన్ షాపుల గోదాంలకు బియ్యం చేర్చారు. జూన్ 1 నుంచి పంపిణీ చేయనున్నారు. ఏజెన్సీలో చిన్న చిన్న రేషన్ షాపుల్లో ఒకేసారి మూడు నెలల బియ్యం నిల్వ చేసే వీలు లేకపోవడంతో దశలవారీగా సరఫరా చేయనున్నారు. జాన్ చివరివరకు డీలర్లు మూడు నెలల కోటాను తీసుకెళ్లాలని పౌరసఫరాల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా, రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని చోట్ల రేషన్ షాపుల్లో మూడు నెలల సన్నబియ్యం నిల్వకు స్థలం లేక డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. కాగా లబ్ధిదారులు ఈ–పాస్ మిషన్పై మూడుసార్లు వేలిముద్ర వేసి సన్నబియ్యం తీసుకోవాల్సిఉంటుంది. వర్షాల కారణంగా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడు నెలల రేషన్ ముందుగానే అందించే ఏర్పాట్లు చేస్తోంది. 1.65 లక్షల క్వింటాళ్ల బియ్యం జిల్లాలో మొత్తం442 రేషన్షాపులు, 2,93,683 రేష న్ కార్డులు ఉన్నాయి. వీటిపైనా ప్రతీ నెల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 55 వేల క్విటాళ్ల బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. మూడు నెలలకు సంబంధించిన బియ్యం సుమారు 1.65లక్షల క్వింటా ళ్లను జూన్లోనే ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంది. సద్వినియోగం చేసుకోవాలి వర్షాకాలం దృష్ట్యా ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలోని రేషన్ షాపుల గోదాంలకు సన్నబియ్యం సరఫరా చేశాం. డీలర్లు జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు అందిస్తారు. రేషన్ షాపుల్లో నిల్వలను బట్టి బియ్యం సరఫరా చేస్తాం. –రుక్మిణి, జిల్లా పౌరసరఫరాల అధికారిపక్కదారి పట్టే అవకాశం! వ్యవసాయ సీజన్లో గ్రామాల్లో ప్రజలు పనుల్లో బిజీగా ఉంటారు. మూడు నెల రేషన్ను ఒకేసారి పంపిణీ చేయడంలో కొంత అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఏజెన్సీలో ఇప్పటికే ఈపాస్ యంత్రాలకు సర్వర్ మొరాయింపు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో డీలర్లు కార్డుదారుడితో మూడుసార్లు వేలి ముద్ర సార్లు వేయించి ఒక్కసారి రేషన్ ఇచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
మసిబారుతున్న బతుకులు..
భద్రాచలంఅర్బన్/కరకగూడెం: పొగాకు అన్ని రకాలుగా ప్రమాదకరమేనని, పొగాకు ఉత్పతులన్నీ నోరు, గొంతు, అన్న వాహిక, కడుపు, ఊపిరితిత్తులు, మూత్రవ్యవస్థపై ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. పొగాకులో పాలిసైక్లిన్ ఆటోమేటిక్ హైడ్రోకార్బైడ్స్, నైట్రోజీన్ అమైన్స్తోపాటు కాడ్మియం, క్రోమియం, ఇథిలిన్ ఆకై ్సడ్ వంటి దాదాపు 72 రకాల కేన్సర్ కారకాలు ఉంటాయంటున్నారు. బలవుతున్న యువత.. జిల్లాలో 18 నుంచి 24 ఏళ్లలోపు వయసున్న యువత పొగాకు ఉత్పత్తుల వినియోగానికి బానిసలవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం చెడు సావాసాలు. ఏటా కొత్తగా 8 శాతం మంది సిగరెట్కు అలవాటు పడుతున్నట్లు అంచనా. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ప్రతి నెలా రూ.కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే జిల్లాలో పొగాకు వినియోగం ఏ మేరకు ఉందో తెలుస్తోంది. పొగతాగే వారితోపాటు పీల్చే వారు సైతం అనారోగ్యానికి గురవుతున్నారు. పొగ తాగే భర్తల కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీ్త్రలలో పునరుత్పత్తి శక్తి తగ్గడం, అబార్షన్లు జరగడం, పిండంలో లోపాలు వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇలా.. జిల్లాలో సుమారు 3 లక్షల మందికి పైగా పొగతాగడం, లేదా పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు అంచనా. వీరంతా వివిధ రకాల గుండె, ఊపిరితిత్తుల జబ్బులకు గురవుతున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 714 మంది కేన్సర్ బాధితులున్నారు. అనధికారికంగా ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఎక్కువ మంది పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులను వినియోగించడమే అనారోగ్యానికి కారణంగా తెలిసింది. పొగతాగడం వల్ల గొంతు, ఊపిరితిత్తులు, కడుపు, మూత్రపిండాల కేన్సర్ సోకే అవకాశం ఉంది. గుండె రక్తనాళాలు బిరుసుగా మారి హార్ట్ఎటాక్ రావడం, నాడీ సంబంధ వ్యాధులు, పక్షవాతం, మధుమేహం, రక్తపోటు, మానసిక రుగ్మతలకు కారణమ్యే అవకాశాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. భద్రాచలంలో డీఅడిక్షన్ సెంటర్ భద్రాచలం పట్టణంలో శాంతినగర్కాలనీలో దక్షత సొసైటీ ఆధ్వర్యంలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పొగాకుతోపాటు ఇతర వ్యసనాలకు బానిసలైన వారికి కౌన్సెలింగ్, బిహేవియర్ థెరపి చేస్తూ, మందులు అందజేస్తున్నారు. ఈ సెంటర్లో వైద్యుడు, కౌన్సిలర్లు, సూపర్వైజర్లు, ఫీల్డ్ వర్కర్లు 22 మంది పనిచేస్తున్నట్లు ఈ కేంద్రం అధ్యక్షుడు గుత్తా బాబు, ఉపాధ్యక్షురాలు సరోజనమ్మ తెలిపారు. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు ప్రచార కరపత్రాలు, స్టిక్కర్లను ఇటీవల ఆవిష్కరించారు. చుట్ట, బీడీ, సిగరెట్తో ఎన్నో అనర్థాలు గుండెపోటు, పక్షవాతం, ఊపిరితిత్తుల వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం పొగతాగడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని, అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చుట్ట, బీడీ, సిగరెట్ ఏదైనా ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది మారడం లేదు. ఆ అలవాటును వదిలేయడం లేదు. ఈ విషయాలను పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరపాలని తీర్మానించింది. 1988 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆందులో భాగంగా జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సదస్సులు, ర్యాలీలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. పొగాకు ఏ రూపంలో ఉన్నా అది ప్రాణాంతకమే. సిగరెట్లు, బీడీలు, గుట్కా, నమిలే పొగాకు ఇవన్నీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. కేవలం వినియోగదారుల ఆరోగ్యానికే కాదు పరోక్ష ధూమపానం ద్వారా కుటుంబ సభ్యులు, పిల్లల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం పొగాకు వ్యసనం నుంచి బయటపడాలి. – భాస్కర్నాయక్, డీఎంహెచ్ఓ మందులు పనిచేయవు.. ధూమపానం చేసేవారిలో మందులు పనిచేయని పరిస్థితి ఉంటుంది. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు ధూమపానం చేస్తే మందులు వాడినా వ్యాధులు అదుపులో ఉండవు. ధూమపానం చేసేవారిలో మధుమేహం కారణంగా వచ్చే దుష్ఫలితాలు అధికంగా ఉంటాయి. కంటి రెటీనా సమస్యతో పాటు, సైలెంట్ హార్ట్ ఎటాక్, పక్షవాతం, కిడ్నీల సమస్యలు తలెత్తుతాయి. – డాక్టర్ సీతారామరాజు, మధుమేహ నిపుణుడు -
యువతి ప్రాణాలు కాపాడిన వైద్యులు
భద్రాచలంఅర్బన్: పురుగులమందు సేవించి, కోమాలోకి వెళ్లిన యువతికి 60 రోజులపాటు చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన వైద్యులను పలువురు అభినందించారు. వివరాలిలా ఉన్నాయి.. చర్ల మండలం లెనిన్కాలనీకి చెందిన మడకం రమేశ్ కుమార్తె శిరీష గత ఏప్రిల్ 1న పురుగులమందు తాగింది. ఆమెకు స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించి, భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందిస్తుండగా కోమాలోకి వెళ్లింది. తర్వాత 60 రోజుల పాటు ఐసీయూలోనే ఉంచి, చికిత్స అందించి, కోమా నుంచి బయటపడేలా చేశామని వైద్యులు తెలిపారు. ఇదే చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.25 లక్షలు అవుతుందని వారు వివరించారు. కాగా, ఆస్పత్రి సూపరింటెంటెండ్ రామకృష్ణ, వైద్యులు జగదీశ్ను జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అభినందించారు. ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ఏరియా ఆస్పత్రిని శుక్రవారం భద్రాచలం ఎమ్యెల్యే తెల్లం వెంకట్రావు సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏసీయూలో చికిత్స పొందుతున్న శిరీషను పరామర్శించారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, ఐసీయూ ఇన్చార్జ్ జగదీశ్ తదితరలు పాల్గొన్నారు. -
ఇంకుడు గుంతలు నిర్మించాలి
గుండాల: వర్షపు నీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి అన్నారు. గురువారం ఆమె పలు పంచాయతీ కేంద్రాల్లో నర్సరీలను, ఇంకుడు గుంతలను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అన్ని గ్రామాల్లో ఇంకుడు గుంతలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీఓ శ్యాం సుందర్రెడ్డి, ఏపీఓ రవితేజ తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేయాలి దుమ్ముగూడెం : పంచాయతీల్లో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని డీపీఓ చంద్రమౌళి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని దుమ్ముగూడెం, లక్ష్మీనగరం పంచాయతీల్లోని పల్లె ప్రకృతి వనాలను, ఇంకుడు గుంతల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ పంచాయతీలో 100 ఇంకుడు గుంతలను నిర్మించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఎంపీఓ బద్ది రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి -
గిరిజన మ్యూజియానికి రూ. కోటి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియానికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రూ. కోటి ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అధికారులు శుక్రవారం హైదరాబాద్లో వివరాలు వెల్లడించారు. ఈ నిధులతో మ్యూజియాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవల భద్రాచలం పర్యటనలో ఐటీడీఏ పీఓ రాహుల్ అభినందించి, రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఏలలో ట్రైబల్ మ్యూజియాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.భూసేకరణపై గ్రామసభమణుగూరురూరల్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఓసీ విస్తరణలో భాగంగా భూసేకరణ కోసం భూసేకరణ చట్టం ప్రకారం శుక్రవారం తిర్లాపురంలో పీసా గ్రామసభ నిర్వహించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ హాజరై.. భూములు కోల్పోయే వారికి సింగరేణి పరిహారం అందిస్తుందని, సింగరేణి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇప్పటికే తమలో చాలామంది ఓసీ విస్తరణలో భూములు కోల్పోయారని తెలిపారు. తమకు మెరుగైన నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇస్తేనే భూములు ఇస్తామని, లేదంటే ఇచ్చే ప్రస్తకే లేదని స్పష్టం చేశారు. పరిహారంపై స్పష్టమైన ఒప్పంద హామీ ఇవ్వకపోవడంతో గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించి వెళ్లిపోయారు. సభలో తహసీల్దార్ అద్దంకి నరేశ్, ఎంపీడీఓ తేళ్లూరి శ్రీనివాసరావు, పీకేఓసీ పీఓ లక్ష్మీపతిగౌడ్, ఎంపీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.ఫాస్ట్ ఫుడ్తో అనారోగ్యంజూలూరుపాడు: ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని యునాని డాక్టర్ రాజేందర్ అన్నారు. యోగా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం జూలూరుపాడులో యోగాపై అవగాహన నిర్వహించారు. రాజేందర్ మాట్లాడుతూ.. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల చిన్న వయసులో ఊబకాయం, కంటి చూపు మందగించడం, గుండె జబ్బు, కిడ్నీ వ్యాధుల బారినపడతారని చెప్పారు. యోగాసనాలు, ధ్యానంతో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వేల్పుల బోసు, బండ్ల వెంకటేశ్వర్లు, తిప్పర్తి శివ, పెండ్యాల నరేశ్, తాళ్లూరి నవీన్, నరేశ్చౌదరి, బసవయ్య, రజనీకాంత్, కోటయ్య పాల్గొన్నారు.చదువుతోపాటు క్రీడల్లో రాణించాలిసింగరేణి(కొత్తగూడెం): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఏజీఎం పర్సనల్ (వెల్ఫేర్) గడిపెల్లి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ప్రకాశం స్టేడయంలో వర్క్పీపుల్ స్పోర్ట్స్, గేమ్స్ ఆధ్వర్యంలో నెలరోజులుగా సాగిన సమ్మర్ కోచింగ్ క్యాంపు శుక్రవారంతో ముగియగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏజీఎం మాట్లాడారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంత బాల, బాలికలు ఇక్కడ నేర్చుకున్న క్రీడల్లో నిరంతరం తర్ఫీదు పొందుతూ ఉండాలని చెప్పారు. అనంతరం సర్టిఫికెట్లు, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రమణమూర్తి, పీతాంబరరావు, కట్టా బసవయ్య, కోడూరు శ్రీనివాస్రావు, టి.శ్రీనివాస్రావు, పాసినెట్ పాల్గొన్నారు.చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలుకొత్తగూడెంఅర్బన్: పీసీ అండ్ పీఎన్డీటీ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ అధ్యక్షతన గర్భధారణ, ప్రసవానికి ముందు రోగ నిర్ధారణ పద్ధతులు, చట్టంపై జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ..అల్ట్రాసౌండ్ స్కానింగ్ సమయంలో గర్భిణి సంసిద్ధత, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి రిఫరల్, ఆధార్కార్డు కాపీని ఫారంతో జతచేయాలని పేర్కొన్నారు. వైద్యులు అనూష, ఎండీ అస్గర్హుస్సేన్, ఎం.సునీత, రాజమణి, స్పందన, ఫైజ్మోహియుద్దీన్ పాల్గొన్నారు.పోక్సో కేసులో నిందితుడు రిమాండ్టేకులపల్లి: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.. టేకులపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. -
‘కగార్’ పేరుతో ప్రభుత్వ హత్యలు..
గుండాల: ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీలను హత్య చేయడాన్ని నిలిపివేయడమే కాక అన్ని ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అరుణోదయ చైర్మన్ విమలక్క డిమాండ్ చేశారు. అంతేకాక కాల్పుల విరమణ పాటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలన్నారు. గుండాలలో అఖిల భారత రైతు కూలీ సంఘం, ఆల్ ఇండియా కేత్ మజ్దూర్ కిసాన్ సభ, రైతు కూలీ సంఘం ఆధ్వర్యాన ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ శుక్రవారం ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ మధ్య భారతంలోని అడవుల్లో ఉన్న విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేలా, ఆదివాసీలను అడవుల్లో నుంచి తరిమివేసేందుకే కగార్ పేరిట మానవ హననానికి పూనుకున్నారని ఆరోపించారు. మే 31నాటికి మావోయిస్టులను తుద ముట్టిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా కాల్పుల విరమణను మావోయిస్టులు ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం స్వాగతించకుండా వేలాది సైనిక బలగాలను అడవుల్లోకి పంపి మావోయిస్టు నాయకులతో పాటు అమాయక ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు సహా 26 మందిని హత్య చేసి, మృతదేహాలు కూడా ఇవ్వకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. కేశవరావు మృతితో పాటు 2024 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ప్రసాద్, ఊక్లానాయక్, నాగిరెడ్డి, వెల్తురు సదానందం, కోడెం వెంకటేశ్వర్లు, కందకట్ట సురేందర్, సోమన్న, బొమ్మర రాంబాబు, వి.చంద్రయ్య, మోకాళ్ల సమ్మయ్య, యుగంధర్, పల్స యాదగిరి, ఆరెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.అరుణోదయ చైర్మన్ విమలక్క -
ఆదివాసీలందరికీ ఒకే చట్టం అమలు చేయాలి
పాల్వంచరూరల్: దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజనులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయాలని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భూక్యా భంగ్యానాయక్ అన్నారు. మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్త సమ్మేళన్ రెండో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఆదివాసీ చట్టాలు, జీవనవిధానం, సంప్రదాయాలపై ప్రొఫెసర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణ చట్టాలపై గిరిజనులు అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గిరిజన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ప్రతీ గిరిజనుడు హక్కులు, చట్టాలపై ప్రశ్నించగలగాలని చెప్పారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్, 1/70 చట్టం, పీసా చట్టాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్ధ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొదం వీరయ్య, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, ఏఐసీసీ ఇన్చార్జి రాహుల్ బాల్, గాదె ఇన్నయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు కిన్నెరసానికి మంత్రుల రాకతెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్త సమ్మేళన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ హాజరుకానున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని, ఈ సందర్భంగా కిన్నెరసాని క్రీడా మైదానంలో వనమహోత్స కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటతారని నిర్వాహకులు తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ భూక్యా భంగ్యానాయక్ -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశాం
● వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్సూపర్బజార్(కొత్తగూడెం): వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా అమలు చేశామని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.మహేందర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. గతేడాది నవంబర్ నుంచి వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయడంతో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలిగామన్నారు. లోడ్ పెరిగే అవకాశం ఉన్న గుండాల మండలంలోని మామకన్ను, గుండాల, ఆళ్లపల్లి మండలంలోని ఆళ్లపల్లి, చర్ల మండలం సత్యనారాయణపురంలలో నూతన పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని, దీంతో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా నివారించామని చెప్పారు. ఇప్పటివరకు 309 నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని, 58 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం కూడా పెంచామని వివరించారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపాడు, సారపాక, మణుగూరు, అశ్వారావుపేట, దమ్మపేట, చుంచుపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, టేకులపల్లి, బొమ్మనపల్లి, లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడులలో ఓవర్లోడ్ తగ్గించామని తెలిపారు. అంతరాయాలను నివారించగలిగాం గతంలో 33/11 కేవీ సబ్స్టేషన్లలో ఒకే వీసీబీపై రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉండేవని, దీనివల్ల ఒక ఫీడర్లో అంతరాయం ఏర్పడితే మిగతా ఫీడర్లలో కూడా అంతరాయం కలిగేదని అన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బే ఎక్స్టెన్షన్/ప్రత్యేక వీసీబీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలను తగ్గించామన్నారు. ఓల్టేజీలో హెచ్చుతగ్గులు లేకుండా క్షేత్రస్థాయిలో 45–600 కెపాసిటర్ బ్యాంకులు, 33/11 కేవీ సబ్స్టేషన్లలో 8–1 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేశామని వివరించారు. ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకుని వేసవికి సమాయత్తం కావడంతో అంతరాయం లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేశామని, ప్రతీ ఉద్యోగి నిబద్ధతతో పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందని ఎస్ఈ తెలిపారు. పోల్ ట్యాక్స్ చెల్లించాలిభద్రాచలంఅర్బన్: పట్టణంలోని కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ నిర్వాహకులు పోల్ ట్యాక్స్ సక్రమంగా చెల్లించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్ సూచించారు. భద్రాచలం విద్యుత్ శాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన వైర్లు గజిబిజిగా ఉన్నాయని, సమస్య ఏర్పడినప్పుడు విద్యుత్ స్తంభాలు ఎక్కాలంటే కేబుల్ వైర్లతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. రానున్న వర్షాకాలంలో వేగంగా వీచే గాలుల వల్ల విద్యుత్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, ఆపరేటర్లు వైర్లను సరిచేసుకోవాలని చెప్పారు. డీఈ జీవన్ కుమార్, ఏడీఈ వేణు, ఏఈలు రాజారావు, ఉపేందర్ పాల్గొన్నారు. -
కదిలిన కృషీవలుడు
ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే పలకరించడంతో రైతులు ముమ్మరంగా వ్యవసాయ పనులు చేపడుతున్నారు. IIలోఅందుబాటులో లేని కిట్లు కొత్తగూడెంలోని సర్వజన ఆస్పత్రి, సింగరేణి ఆస్పత్రి, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం ఏరియా ఆస్పత్రుల్లో ఎక్కడా కరోనా పరీక్షలు చేసేందుకు కిట్లు లేవు. దీంతో ఆస్పత్రుల్లోని ల్యాబ్లు కూడా మూతపడి ఉన్నాయి. కొత్తగూడెం సర్వజన ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేయలేదు. ఇదే విషయమై ఆస్పత్రి ఆర్ఎంఓను సంప్రదిస్తే వార్డు ఏర్పాటు చేశామని, ప్రజలు భయపడతారని బోర్డు ఏర్పాటు చేయలేదని చెప్పారు. కానీ సాక్షి ఆధ్వర్యంలో ఆస్పత్రిలో పరిశీలించగా ఐసోలేషన్ వార్డు, కనీసం బెడ్లు కూడా ఏర్పాటు చేయనట్టు తేలింది. ల్యాబ్, ఆక్సిజన్ సరఫరా వంటి విషయాలను ఆర్ఎంఓ దృష్టికి తీసుకెళ్లగా, ఆ విషయాలు చెప్పేందుకు తనకు సమయం లేదని పేర్కొనడం గమనార్హం. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వైద్యాధికారులు పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది. -
‘నంబాల’ అస్థికలకు న్యాయపోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అస్థికల కోసం కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 21న జరిగిన ఎన్కౌంటర్లో నంబాల చనిపోగా.. ఆయన మృతదేహానికి పోలీసులే 26వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనతో పాటు మరికొందరి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే అస్థికలను కుటుంబసభ్యులకు అప్పగించే విషయంలో.. మరోసారి వివాదం చెలరేగినట్టు బస్తర్, జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆదివాసీ శ్మశానవాటికలో.. ఈనెల 21న నంబాలతో పాటు 28మంది మావోయిస్టులు చనిపోగా అందులో 27మంది మృతదేహాలకు నారాయణపూర్ ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురి మృతదేహాలు ఉన్నాయి. వీరి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్రీజర్లతో కూడిన మూడు అంబులెన్సులు 22వ తేదీ సాయంత్రం నాటికి నారాయణపూర్ చేరుకున్నాయి. కాగా, మృతులతో తమకున్న రక్త సంబంధం నిరూపించుకునేందుకు చట్టపరమైన ఆధారాలు (ఆధార్ కార్డ్, ఫ్యామిలీ ఫొటో, సర్పంచ్ ధ్రువీకరణ పత్రం) సమర్పించలేదనే కారణంతో.. 26వ తేదీన సాయంత్రం పోలీసులే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. నారాయణపూర్లోని ఆదివాసీ శ్మశానవాటికలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మావోయిస్టులతో పాటు మరో ముగ్గురు ఛత్తీస్గఢ్ నక్సల్స్ మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. డిక్లరేషన్ పేచీ.. అంత్యక్రియలు జరిగిన మర్నాడు.. నంబాల కేశవరావు సోదరుడు నంబాల రామ్ప్రసాద్ ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయించి తన సోదరుడి అస్థికలు ఇవ్వాలని కోరారు. కాగా, తమ కుటుంబ సభ్యుడేనని నిరూపించుకునేందుకు అవసరమైన చట్టపరమైన పనులు నిర్వర్తించడంలో విఫలమైనట్లు డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాలని అక్కడి పోలీసులు సూచించినట్లు సమాచారం. దీనికి నిరాకరించిన నంబాల సోదరుడు మరోసారి న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. చివరి చూపైనా దక్కలేదు ఎనిమిది మంది మృతదేహాలకు పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. అందులో మావోయిస్టు హుంగీ కుటుంబ సభ్యులు.. తమ ఆర్థిక సమస్యల రీత్యా.. పోలీసులే నిర్వహించాలని కోరారు. కానీ అంత్యక్రియలకు ముందు ఒక్కసారైనా హుంగీ మృతదేహాన్ని తమకు చూపలేదని వారు వాపోయారు. ఏళ్ల తరబడి ఇంటికి దూరమై విగత జీవులుగా మారిన తమ వారికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించాలనే లక్ష్యంతో ఫ్రీజర్ బాక్స్లున్న అంబులెన్సులు తెచ్చుకున్నామని, కానీ ఉత్త చేతులతో తిరుగు ముఖం పట్టాల్సి వచ్చిందని తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 21న ఎన్కౌంటర్ జరిగితే.. 26వ తేదీ వరకు మృతదేహాలన్నీ ఆరుబయటే ఉన్నాయని, మార్చురీ నుంచి వచ్చే దుర్గంధంతో ఆస్పత్రి ప్రాంగణం, సమీపంలోని టీ కొట్లు, ఇతర దుకాణాలను మూసేశారని వెల్లడించారు. ఇంత జరిగినా తమ వారి చివరి చూపు కోసం పరితపిస్తే ఛత్తీస్గఢ్ పోలీసులు సహకరించలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ మావోయిస్టుల విషయంలో కేవలం ఆధార్కార్డు వివరాలు నమోదు చేసుకుని మృతదేహాలు ఇచ్చారని.. తెలుగు రాష్ట్రాల మావోయిస్టుల విషయంలోనే పేచీ పెట్టారని వారు వాపోతున్నారు. -
బొగ్గు టిప్పర్ దగ్ధం
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని పెద్దిరెడ్డిగూడెం పంచాయతీ శాంతినగర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం బొగ్గు టిప్పర్ కేబిన్లో మంటలు చెలరేగి దగ్ధమైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సత్తుపల్లి సింగరేణి ఓపెన్కాస్టు నుంచి బొగ్గు లోడ్తో వచ్చిన టిప్పర్ కొత్తగూడెంలో అన్లోడ్ చేసి తిరిగి వెళ్తోంది. ఈ క్రమంలో టిప్పర్ కేబిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ వాహనం నిలిపి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సత్తుపల్లి నుంచి ఫైరింజ్తో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. కస్తూరి జింక అవశేషాల ఘటనపై కేసు నమోదుఅశ్వారావుపేటరూరల్: కస్తూరి జింక అవశేషాల ఘటనలో ఇద్దరిపై గురువారం అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. అశ్వారావుపేట ఫారెస్టు రేంజర్ మురళి కథనం ప్రకారం.. మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన ఎస్కే అబ్దుల్ హఫీజ్ ఇంట్లో ఉన్న బ్యాగుల్లో కస్తూరి జింకలకు సంబంధించి బంతి ఆకారంలో ఉన్న 13 అవశేషాలు ఉన్నట్లు అనుమానంతో అతని భార్య ఆనీశ్ఫాతిమా ఈ నెల 26న ఫిర్యాదు చేయగా, అధికారులు ఇంట్లో సోదాలు చేసి స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. కాగా, ఈ ఘటనలో అబ్దుల్ హఫీజ్తోపాటు మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన పామర్తి మధుపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కస్తూరి జింక అవశేషాలుగా భావిస్తున్న వాటిని హైదరాబాద్లోని సీసీఎంబీ ల్యాబ్కు పంపించామని, నిర్ధారణ కావాల్సి ఉందని రేంజర్ తెలిపారు. మనస్తాపంతో వృద్ధుడి ఆత్మహత్యఅశ్వారావుపేటరూరల్: వృద్ధుడి ఆత్మహత్య ఘటనలో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని రమణక్కపేట గ్రామానికి చెందిన జల్లి నర్సయ్య(55) కుమార్తె భద్రమ్మకు ఐదేళ్ల క్రితం వివాహం కాగా, ఈ నెల 27న విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. విందులో నర్సయ్య అతిగా మద్యం తాగి వాగ్వాదం పెట్టుకోవడంతో కుల పెద్దలు మద్యం తాగొద్దని మందలించారు. దీంతో మనస్తాపం చెంది అదే రోజు ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు ప్రసాద్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆదివాసీల అంతానికి కేంద్రం కుట్ర
● అటవీ సంపదను సంపన్నులకు దోచిపెట్టే ప్రయత్నం ● ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సీతక్క పాల్వంచరూరల్ : ఆదివాసీ జాతిని అంతం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఆదివాసీ సమ్మేళనాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మణిపూర్, అసోం, నాగాలాండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం పలు ఆపరేషన్ల పేరుతో దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతోందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఐదు, ఆరు చట్టాల ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే స్థానిక గిరిజనులతో గ్రామసభలు నిర్వహించి అమోదించాక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కానీ అలాంటిది ఏమీ లేకుండానే మోడీ ప్రభుత్వం ఖరీదైన అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని, ఎదురుతిరిగిన వారిపై నక్సలైట్లు అనే ముద్ర వేసి అడ్డు తొలగిస్తోందని ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పారు. గిరిజనులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఐటీడీఏలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నాడు రద్దు చేసిన జీఓలను తిరిగి తమ ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని, ఐటీడీఏలకు పూర్వ వైభవం తీసుకొస్తామని వివరించారు. రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమించాలి.. రాజ్యాంగ పరిరక్షణకు ఆదివాసీలు ఉద్యమించాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరామ్ నాయక్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ.. గిరిజన చట్టాలు, హక్కులపై అందరికీ అవగాహన ఉండాలని, ఇలాంటి శిక్షణ తరగతుల్లో వాటి గురించి తెలుసుకోవాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సక్రమంగా అమలు చేయకుండా బీజేపీ సొంత ఎజెండా అమలు చేస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివాసీల హక్కులు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఉద్యమం చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పిలుపునిచ్చారు. కాంగ్రెస్తోనే దేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. గిరిజన హక్కుల సాధనకు ఉద్యమం చేస్తామని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చెప్పారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ బాబురావు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ప్రోగ్రామ్ కన్వీనర్ రాహుల్ బాల్, నాయకులు ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు, సుగుణ, కొత్వాల శ్రీనివాసరావు, యర్రంశెట్టి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జి పనులకు శంకుస్థాపన.. చుంచుపల్లి : పాత కొత్తగూడెం నుంచి పెనుబల్లి వరకు రూ. 6.50 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి పనులకు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి మంత్రి సీతక్క గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్ల ఏర్పాటుతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రతీ మారుమూల గ్రామానికీ రోడ్లను అనుసంధానం చేస్తామని చెప్పారు. అంతకుముందు ఐసీడీఎస్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించి వేస్ట్ నుండి బెస్ట్ను రూపొందించిన కళాకృతులను చూసి అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల నిరసన
పాల్వంచ/మణుగూరు రూరల్: ఉత్తర ప్రదేశ్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్(టీజీపీఈ) జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గురువారం పాల్వంచ కేటీపీఎస్, మణుగూరులోని బీటీపీఎస్ల ఎదుట భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులపై కేసులు బనాయిస్తూ, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సంస్థల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని, ఉత్తర ప్రదేశ్ కార్మికులకు అందరూ అండగా నిలవాలని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ అసిస్టెంట్ ఇంజనీర్ల అసోసియేషన్ నాయకులు రవిప్రసాద్, రవితేజ, వివిధ కార్మిక సంఘాల నాయకులు బ్రహ్మాజీ, యాస్మీన్, రాజేందర్, రాధాకృష్ణ, వెంపటి వెంకటేశ్వర్లు, నరసింహారావు, సాయిరాం, వి.ప్రసాద్, బి.కృష్ణ, వెంకట్రామ్, వీరస్వామి, ఆర్.రామచందర్, సిద్దెల హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
నేల చదును పనులు అడ్డగింత
ఇల్లెందురూరల్: మండలంలోని విజయలక్ష్మినగర్ శివారులో వ్యవసాయ భూమిలో సింగరేణి చేపట్టిన నేల చదును పనులను స్థానిక గిరిజనులు గురువారం అడ్డుకున్నారు. జేకే ఓసీ నిర్వాసిత ప్రాంతంగా గుర్తించిన తమ వ్యవసాయ భూమికి పరిహారంపై స్పష్టత ఇవ్వకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని అధికారులను నిలదీశారు. యంత్రాలకు అడ్డుగా కూర్చొని నిరసన తెలపడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ సర్వే నంబర్ 588/2 పరిధిలోని 7.03 ఎకరాల్లో సింగరేణి, అటవీ, రెవెన్యూ అధికారులు సర్వే చేశారని, పరిహారం చెల్లిస్తామని ఆర్ఓఎఫ్ఆర్ గ్రామసభలో అప్పటి ఆర్డీఓ స్వర్ణలత ప్రకటించారని గుర్తుచేశారు. కానీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తేజావత్ లాలు, ఎట్టి హరికృష్ణ, ధనసరి రాజు, వడ్ల శ్రీను, స్థానిక రైతులు పాల్గొన్నారు.సింగరేణి అధికారులతో నిర్వాసితుల వాగ్వాదం -
తుప్పు పడుతున్న శిక్షణ !
ఐటీడీఏ ఆధ్వర్యంలో వైటీసీల ఏర్పాటు ● కేంద్రాల నిర్వహణపై కొరవడిన పర్యవేక్షణ ● భూత్బంగ్లాను తలపిస్తున్న ఇల్లెందు సెంటర్ ● ఇలాగైతే యువతలో నైపుణ్యం పెంచేది ఎలా..? సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘మన విద్యార్థుల దగ్గర పేరుకే సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ జాబ్ మార్కెట్కు తగ్గ స్కిల్స్ ఉండడం లేదు’ అని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. అచ్చంగా అదే పరిస్థితి జిల్లాలోనూ నెలకొంది. గిరిజన యువత కోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నా అక్కడ శిక్షణే ఇవ్వడం లేదు. దశాబ్దాల క్రితమే వైటీసీలు.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ డిగ్రీలు సాధించిన విద్యార్థుల వద్ద కూడా జాబ్ ఓరిఝెంటెడ్ స్కిల్స్ కొరవడ్డాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న యువతతో పాటు రాబోయే తరానికి కూడా ఇప్పటి జాబ్ మార్కెట్కు తగ్గట్టుగా నైపుణ్యం ఉండేందుకు వీలుగా ఏకంగా సిల్క్ యూనివర్సిటీనే ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రస్తుత పోటీ ప్రపంచంలో స్కిల్స్కు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అయితే రేవంత్రెడ్డి సర్కార్ కంటే దశాబ్దాలకు ముందే గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలు నైపుణ్య శిక్షణపై దృష్టి సారించాయి. ఈ మేరకు ప్రతీ ఐటీడీఏ పరిధిలో ప్రత్యేకంగా యూత్ ట్రైనింగ్ సెంటర్లను (వైటీసీ) నిర్మించారు. భద్రాచలంలోని వైటీసీ రాష్ట్ర విభజనతో ఏపీలోకి వెళ్లడంతో ఇల్లెందులో కొత్తగా మరొకటి నిర్మించారు. ఆ తర్వాత భద్రాచలం ఐటీడీఏ క్యాంపస్లో మరో వైటీసీని అందుబాటులోకి తెచ్చారు. శిక్షణ కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులు/ఉద్యోగార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించారు. అయితే ఆరంభంలో జోరుగా సాగిన శిక్షణ కార్యక్రమాలు ఆ తర్వాత మందగించాయి. ఒకప్పుడు వెంటవెంటనే జరిగిన జాబ్మేళాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. పట్టించుకునే నాథులేరి ? హైదరాబాద్ – కొత్తగూడెం జాతీయ రహదారి పక్కనే ఇల్లెందు డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్న వైటీసీ ఎప్పుడూ తాళం వేసే ఉంటోంది. సకల సకర్యాలున్న భవనం ఇలా పడావు పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. జిల్లా స్థాయి అధికారులు ఒకసారి ఈ వైటీసీని సందర్శిస్తే గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో తెలుస్తుంది. ఎంత మంచి పని ముట్టయినా ఉపయోగించకుంటే తుప్పు పట్టినట్టు సకల సౌకర్యాలున్న వైటీసీలు శిక్షణ లేక దుమ్ముకొట్టుకుపోతున్నాయి. -
కిష్టారం ఓసీ వెల్ఫేర్ ఆఫీసర్గా శ్రీనివాస్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ వెల్ఫేర్ ఆఫీసర్గా కసనబోయిన శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈమేరకు యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులను గురువారం జీఎం శాలేంరాజు అందించారు. సింగరేణి గతేడాది ఇంటర్నల్ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ట్రెయినీ(వెల్ఫేర్ ఆఫీసర్)లుగా పలువురిని ఎంపిక చేయగా కొందరికే పోస్టింగ్ ఇచ్చింది. మిగతా వారు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా ఆదేశాలు వచ్చాయి. దీంతో ఐదుగురికి పదోన్నతి కల్పించగా అందులో శ్రీనివాస్ ఉన్నారు. అలాగే, కె.కల్యాణ్ రాజ్కుమార్ను ఆర్జీఓసీ–2కు, ఏ.మధును అడ్రియాలకు, సిరిమల్లె అశోక్ను ఇల్లెందు కేఓసీకి, దాసరి నాగరాజును జీడీకే 2, 2ఏకు కేటాయించారు.కార్పొరేట్ సివిల్ హెచ్ఓడీగా వెంకటేశ్వర్లుసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో సివిల్ హెచ్ఓడీగా ధనసరి వెంకటేశ్వర్లును నియమిస్తూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జీఎంగా విధులు నిర్వర్తిస్తున్న టి. సూర్యనారాయణ ఈ నెల 31 ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మణుగూరు సివిల్ ఏజీఎం వెంకటేశ్వర్లును నియమించారు.ఏఎస్పీ బాధ్యతల స్వీకరణకొత్తగూడెంఅర్బన్: జిల్లా అడిషనల్ ఎస్పీ(ఆపరేషన్స్)గా గోపతి నరేందర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్ టాస్క్ఫోర్స్ ఏసీపీగా పని చేస్తున్న ఆయన జిల్లాకు పదోన్నతిపై అడిషనల్ ఎస్పీగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన నరేందర్ను పలువురు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.గురుకులంలో డిగ్రీకి దరఖాస్తుల ఆహ్వానంఅశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెంలోని గిరిజన గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ బండారుపల్లి రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, బీకామ్, బీఏ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఐటీ హబ్లో 2నుంచి నైపుణ్య శిక్షణఖమ్మం అర్బన్: ఖమ్మంలోని ఐటీ హబ్లో వచ్చేనెల 2వ తేదీ నుంచి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యాన నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు. జావా ఫండమెంటల్, జావా ప్రోగ్రామింగ్, పైథాన్ డేటాబేస్, క్లౌడ్ కంప్యూటింగ్, టాలీ జీఎస్టీ, ఐటీ స్కిల్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందుకోసం రూ.599 రిజిస్టేషన్ ఫీజు చెల్లిస్తే ఆరు నెలల వ్యవధిలో అభ్యర్థులకు అనుకూలమైన సమయంలో శిక్షణకు హాజరుకావొచ్చని వెల్లడించారు. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం 95025 05880 నంబర్లో సంప్రదించాలని వారు ఓ ప్రకటనలో సూచించారు.తెలంగాణ ఉద్యమకారుడు ఆశీర్వాదం మృతితల్లాడ: తల్లాడ మండలం పినపాకకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మోదుగు ఆశీర్వాదం(69) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. యాభై ఏళ్ల క్రితం కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించిన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. కొన్నాళ్లు కాంగ్రెస్లో కొనసాగగా, 2001లో టీఆర్ఎస్లో చేరి మలిదశ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించారు. బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మధిర నియోజకవర్గ ఇన్చార్జ్గానూ పనిచేసిన ఆశీర్వాదం తల్లాడలో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, ఆశీర్వాదం మృతదేహం వద్ద మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాళులర్పించారు. అలాగే, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్తో పాటు వజ్రాల రామిరెడ్డి, కోడూరి వీరకృష్ణ, బద్దం కోటిరెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కాంపాటి జమలయ్య, జీవీఆర్, వివిధ పార్టీల నాయకులు సైతం నివాళులర్పించి ఆశీర్వాదం కుటుంబీకులను పరామర్శించారు. -
మున్సిపాలిటీ ఇక కనుమరుగు!
పాల్వంచ: పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ మున్సిపాలిటీ ఇక కనుమరుగై కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం అయింది. దీంతో డివిజన్ ఆఫీస్గా మాత్రమే మనుగడ కొనసాగనుంది. ఇకపై పరిపాలనా వ్యవహారాలన్నీ కొత్తగూడెం కార్పొరేషన్లోనే నడవనున్నాయి. కార్పొరేషన్ అయితే గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నా.. పన్నుల భారం కూడా అధికంగానే ఉంటుందని స్థానికులు అంటున్నారు. 1987లో ఏర్పడిన పాల్వంచ మున్సిపాలిటీ 38 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు పలికింది. కొత్తగూడెం కార్పొరేషన్ జీఓ గురువారం విడుదలైంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లోని పలు గ్రామాలు సైతం ఈ కార్పొరేషన్లో విలీనం కానున్నాయి. అధికారుల పాలనలోనే.. ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా, పారిశ్రామిక పట్టణంగా ఉన్న పాల్వంచలో 24 వార్డులు, 44 స్లమ్ ఏరియాలు ఉండగా సుమారు లక్ష మంది జనాభా ఉన్నారు. 1987 ఫిబ్రవరిలో పాల్వంచ గ్రామ పంచాయతీని తృతీయ శ్రేణి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి అదే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించారు. 1992 వరకు పాలకవర్గం కొనసాగింది. తర్వాత మూడేళ్ల పాటు ఎన్నికలు జరగలేదు. తిరిగి 1995లో ఎన్నికై న పాలకవర్గం 2000 సంవత్సరం వరకు కొనసాగింది. ఇక ఆ తర్వాత ఎన్నికల ఊసే లేదు. ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినా ఇది ఏజెన్సీనా, నాన్ ఏజెన్సీనా అనే వాదనలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూ ఆ ప్రభావం ఎన్నికలపై పడుతూ వచ్చింది. దీంతో గత 25 ఏళ్లుగా అధికారుల పాలనే కొనసాగుతోంది.కొత్తగూడెం కార్పొరేషన్లో పాల్వంచ విలీనం కార్పొరేషన్ కమిషనర్గా సుజాత కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సుజాతను నియమిస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేషన్లో విలీనమైన సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామాలు, పాల్వంచ మున్సిపల్ ఆస్తులను కార్పొరేషన్కు బదలాయించాలని, అందుకు పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. తరలిపోయిన అనేక కార్యాలయాలు.. గతంలో ఐటీడీఏ పాల్వంచలో ఉండేది. ఆ తర్వాత భద్రాచలానికి వెళ్లింది. దాంతో పాటు ట్రైబల్ కోర్టు కూడా తరలిపోయింది. ఇక ఆర్డీఓ కార్యాలయాన్ని కొత్తగూడెం డివిజన్కు మార్చేశారు. పలు ప్రభుత్వ డివిజన్ కార్యాలయాలు సైతం ఇక్కడి నుంచి తరలిపోయాయి. డివిజన్ కేంద్రంగా ఉన్న సమయంలో ఇక్కడికి అనేక మండలాల ప్రజలు పనుల నిమిత్తం వచ్చేవారు. వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయం, ఇరిగేషన్ ఈఈ కార్యాలయం, ఏటీడబ్ల్యూఓ కార్యాలయాలు సైతం తరలిపోయాయి. పారిశ్రామిక కేంద్రానికి ఆయువుపట్టుగా ఉన్న కేటీపీఎస్లో ఓఅండ్ఎం(పాత ప్లాంట్) తొలగింపుతో వేలాది మంది కార్మికులు బదిలీపై వెళ్లిపోయారు. ఎన్ఎండీసీ విస్తరణకు నోచుకోక మూతబడింది. నవ కంపెనీ విద్యుత్ కేంద్రంలోనూ ఉత్పత్తి నిలిపివేశారు. -
వస్తుందో.. రాదో..?
రాజీవ్ యువ వికాసంపై గందరగోళం ● సిబిల్ స్కోర్ నిబంధనతో దరఖాస్తుదారుల ఆందోళన ● మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న పథకంకొత్తగూడెంఅర్బన్: రాజీవ్ యువ వికాసం పథకం రుణం వస్తుందో? రాదోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలువురు యువతీ యువకులు ఆయా మున్సిపాలిటీలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది పరిశీలించి అన్ని ధ్రువపత్రాలు ఉన్న దరఖాస్తులను బ్యాంకులకు పంపించారు. బ్యాంకర్లు దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్, గతంలో ఉన్న బ్యాంకు రుణాలు, చెల్లింపులు, చెక్బౌన్స్, ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న రుణానికి మళ్లీ నగదు చెల్లించగలడా? అనే విషయాలు పరిశీలించి అర్హుల జాబితాలను మండల, పట్టణ అధికారులతోపాటు ఎంపిక కమిటీలకు పంపిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత అధికారులు, కమిటీ సభ్యులు ఇంటర్వ్యూ నిర్వహించి, కులాల వారీగా ఆయా కార్పొరేషన్లకు పంపించనున్నారు. అనంతరం ప్రభుత్వ సైట్లో అప్లోడ్ చేసి సబ్సిడీ కోసం పంపించాల్సి ఉంటుంది. సబ్సిడీ ఇలా.. రాజీవ్ యువ వికాసం పథకం జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన దరఖాస్తుదారులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణం ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో రూ.50 వేలు రుణం తీసుకున్న వారు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు తీసుకున్న వారికి 80 శాతం సబ్సిడీ, 20 శాతం బ్యాంకు రుణం ఇస్తారు. రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు తీసుకుంటే 70 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం ఇస్తారు. గతంలో దరఖాస్తుదారుడు బ్యాంకు రుణం తిరిగి చెల్లిస్తాడో లేదోననే అనుమానంతో సబ్సిడీ పోగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకర్లు ముందే డిపాజిట్ చేయించుకునేవారు. ఇప్పుడు సిబిల్ స్కోర్, ఇతర పరిశీలన అంతా బ్యాంకర్లకు అప్పగించడం సరికాదని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. రాజకీయ పార్టీల నుంచి మరో జాబితా... రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి పట్టణ, మండలాధికారులు, కమిటీలు తర్జనభర్జనలు పడుతూ దరఖాస్తుల పరిశీలన చేసి బ్యాంకులకు పంపిస్తుంటే, కొందరు దరఖాస్తుదారులు రాజకీయ పార్టీ నాయకులను ఆశ్రయిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు వేర్వేరుగా దరఖాస్తుదారుల నుంచి ఒక జిరాక్స్ సెట్ సేకరిస్తున్నారు. ప్రస్తుతం రాజీవ్యువ వికాసం దరఖాస్తులు అన్నీ కూడా బ్యాంకులకు చేరాయి. వాటిలో అర్హత కలిగిన వారి జాబితాను ప్రభుత్వం తిరిగి బ్యాంకులకు పంపిస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. కార్పొరేషన్ అధికారులు మాత్రం బ్యాంకు నుంచి బయటకు వచ్చిన జాబితాలోని వారికి పట్టణ, మండల కమిటీలు ఇంటర్వ్యూలు చేపట్టి అర్హులను ఎంపిక చేస్తారని చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు గందరగోళంలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్కు 9747, బీసీ కార్పొరేషన్కు 20602, మైనారిటీ కార్పొరేషన్కు 9800 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సిబిల్తో సంబంధం లేకుండా.. రాజీవ్ యువ వికాసానికి సంబంధించి కొత్త నిబంధనలు రద్దు చేయాలి. సిబిల్ స్కోర్ పరిగణనలోకి తీసుకోకుండా రుణం మంజూరు చేయాలి. సబ్సిడీ పోను 20, 30 శాతం వాటాను బ్యాంక్లో డిపాజిట్ చేసేందుకు దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారు. –హరి, కొత్తగూడెంగడువుకు ముందే పని చేయలే.. రాజీవ్ యువ వికాసం సైట్ కేటాయించిన గడువుకు వారం ముందు నుంచే పని చేయలేదు. దీని వలన దరఖాస్తు చేసుకోలేకపోయాను. ప్రభుత్వం మళ్లీ దరఖాస్తులకు వెసులుబాటు కల్పించాలి. అర్హులందరికీ రుణం అందించాలి. –శ్రీనివాస్, కొత్తగూడెం -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, స్వామివారిని రాష్ట్ర మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈఓ రమాదేవి స్వాగతం పలకగా పండితులు వేదాశీర్వచం అందించారు. పెద్దమ్మతల్లి హుండీ ఆదాయం రూ.23.42 లక్షలు పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. 80 రోజులకు గాను రూ.23,42,780తో పాటు రెండు విదేశీ కరెన్సీ లభించాయని, మిశ్రమ బంగారం, వెండి కూడా లభ్యమయ్యాయని ఈఓ రజినీకుమారి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి జి.సుదర్శన్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ అనిల్కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి సువర్ణ పుష్పార్చన.. శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సదస్సుకు జిల్లా అధికారికొత్తగూడెంఅర్బన్: ఢిల్లీలో యూనిసెఫ్ సహకారంతో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు జిల్లా ఎన్సీడీ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వి.మధువరణ్ హాజరయ్యారు. మానవ ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాలు, దేశంలో వాతావరణ అనుకూలత కోసం ఆవిష్కరణలు, పరస్పర అధ్యయనాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై సదస్సు జరుగనుండగా దేశంలోని పలువురు ప్రముఖులు, వైద్యారోగ్య శాఖ నిపుణులు అవగాహన కల్పించారు. జిల్లా నుంచి హాజరైన మధువరణ్ కూడా పలు సూచనలు చేశారు. -
విద్యుత్ ఫిర్యాదులకు ‘చాట్బాట్’
● వాట్సాప్ నంబర్ 79016 28348కు ఫిర్యాదు చేస్తే సరి ● స్థితిగతులు తెలుసుకునేలా ట్రాకింగ్ ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారంలో మరింత వేగం పెంచడమే కాక వినియోగదారులకు మెరుగైన సేవలందించే లా ఎన్పీడీసీఎల్ (నార్తర్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) సాంకేతికతను వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగానే సమస్యలపై అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ‘వాట్సాప్ చాట్బాట్’సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం వాట్సాప్ నంబర్ను కేటాయించింది. ఐడీ నంబర్.. ట్రాకింగ్ వినియోగదారులు చాట్బాట్లో చేసే ప్రతీ ఫిర్యా దుకు సంస్థ ఒక నంబర్ కేటాయిస్తుంది. అలాగే, సంబంధిత అధికారి వద్దకు ఫిర్యాదు చేరిందని సమాచారం కూడా అందుతుంది. ఆపై వినియోగదారులు ఆ నంబర్ ఆధారంగా సమస్య పరి ష్కారం ఏస్థాయిలో ఉందో చాట్బాట్లో తెలుసుకోవచ్చు. అలాగే, సమస్య పరిష్కరించాక వినియోగదారునికి సమాచారం ఇవ్వడమే కాక ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ సీకరిస్తారు. ఒకవేళ వినియోగదారులు సంతృప్తి చెందకపోతే మరోమారు కంప్లైంట్ రీ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే www. tgnpdcl. com వెబ్సైట్లో కనిపించే వాట్సాప్ ఐకాన్పై క్లిక్ చేసి చాట్ చేయొచ్చు.ఫిర్యాదు నమోదు ఇలా.. వినియోగదారులు తమ సెల్ఫోన్ నుంచి వా ట్సాప్ లో 79016 28348 నంబర్కు హాయ్ అని చాట్ చేయగానే టీజీఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్కు స్వా గతం అని వస్తుంది. అందులో రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్ చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది. ఈ మేరకు రిజిస్టర్ కంప్లైంట్ ఎంచుకుంటే విత్ యూనిక్ సర్వీస్ నంబర్, వితౌట్ యూనిక్ సర్వీస్ నంబర్, ప్రీవియస్ మెనూ అని వస్తుంది. ఆపై విత్ యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేస్తే వినియోగదారుడి సర్వీస్ వివరాలు వస్తాయి. ఆ వివరాలను సరిపోల్చుకున్నాక ఓకే చేస్తే సబ్ టైప్ లేదా చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది. ఇలా ఏజెంట్తో చాట్ చేస్తూ ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. మరింత మెరుగైన సేవలకు.. వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించేలా సాంకేతికతను వినియోగించుకుంటున్నాం. ఇందులో భాగంగా మొబైల్ వాట్సాప్ నుంచి సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. ఇదేకాక టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా కూడా సేవలు పొందే అవకాశం ఉంది. –ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ, ఖమ్మం సర్కిల్ -
మహిళలే అంబాసిడర్లు..
ఖమ్మంమయూరిసెంటర్: ‘మా వంతుగా మార్ట్ ఏర్పాటు చేసి ప్రచారం కల్పిస్తున్నాం.. మీరు తయారు చేసిన ఉత్పత్తులకు మీరే అంబాసిడర్లుగా విక్రయించుకోవడం, లాభాలు వచ్చేలా ముందుకు సాగే బాధ్యత మీదే’ అని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పేర్కొన్నారు. ఖమ్మం వైరా రోడ్డులో ఏర్పాటుచేసిన మహిళా మార్ట్ను భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఖమ్మం సీపీ సునీల్దత్, భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజ్, ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్సింగ్తో కలిసి కలెక్టర్ గురువారం సందర్శించారు. మార్ట్ ఏర్పాటుకు దారి తీసిన అంశాలను కలెక్టర్ వారికి వివరించాక మహిళా సంఘాల సభ్యులు రూపొందించిన వస్తువులను అధికారులు ఆసక్తిగా పరిశీలించారు. ఈసందర్భంగా ఉమ్మడి జిల్లా అధికారులు మార్ట్లో పలు వస్తువులు కొనుగోలు చేశారు. టీ బాగుంది.. నేనే పే చేస్తా.. మార్ట్ను సందర్శించాక ఆవరణలో ఏర్పాటుచేసిన క్యాంటీన్ను వద్దకు అధికారులంతా వచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం సీపీ సునీల్దత్ అందరినీ టీ తాగాలని కోరారు. ఆపై టీ బాగుందని నిర్వాహకురాలిని అభినందించిన ఆయన తన ఫోన్లో యాప్ ద్వారా డబ్బు చెల్లించారు. మహిళా మార్ట్ను సందర్శించిన ఉమ్మడి జిల్లా అధికారులు -
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పనిచేస్తున్నాం
దమ్మపేట: విశ్వవిఖ్యాత నటుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తితో పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దమ్మపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. నాడు ఎన్టీఆర్ చేతుల మీదుగా తయారైన నాయకులే నేడు పలు పార్టీల్లో కొనసాగుతున్నారని తెలిపారు. ఒక్క తెలంగాణలోనే కాక దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానిస్తే తాను వెళ్తానని స్పష్టం చేశారు. సొంత పార్టీ వ్యక్తులు, బయట పార్టీ వ్యక్తులు ఎన్ని ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నించినా తాను ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. సీతారామ ప్రాజెక్టు జలాలను ప్రస్తుత సంవత్సరం సత్తుపల్లి నియోజకవర్గానికి, రాబోయే సంవత్సరం నాటికి అశ్వారావుపేట నియోజకవర్గానికి తీసుకొస్తానని వివరించారు. పెదవాగు, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహిస్తామని చెప్పారు. అంతకుముందు మండలంలోని గండుగులపల్లిలో తన పామాయిల్ క్షేత్రంలో ఫార్మ్ రోబో సంస్థ రూపొందించి కలుపు తీసే యంత్రాన్ని పరిశీలించారు. ఆయిల్ ఫెడ్ అనుబంధ శాస్త్రవేత్త కిరణ్ కుమార్, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, తెలుగుదేశం సార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కట్రం స్వామి దొర, వలీపాషా, అలపాటి ప్రసాద్, కొయ్యల అచ్యుతరావు, రావు గంగాధరరావు, పైడి వెంకటేశ్వరరావు, దారా మల్లికార్జునరావు, పగడాల రాంబాబు, కొండపల్లి కృష్ణమూర్తి, కే.వి.సత్యనారాయణ, ఎర్రా వసంతరావు, నల్లగుళ్ల కిరణ్, గడ్డిపాటి సత్యం పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల -
2న హ్యాండ్బాల్ జట్ల ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల జట్ల ఎంపికకు జూన్ 2న పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ పి.రఘునందన్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డుతో ఉదయం 10 గంటలకల్లా రిపోర్టు చేయాలని సూచించారు. ఏళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశే.. ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఏర్పడితే నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే 11ఏళ్లుగా నిరాశే మిగిలిందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర వ్యవస్థాపక కార్యదర్శి మనోహర్రాజు పేర్కొన్నారు. యూనియన్ 12వ ఆవిర్భావ వేడుకలను ఖమ్మంలోని కార్యాలయం వద్ద గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన మనోహర్రాజు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యాన ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నామని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.వీ.నాగేశ్వరరావు, వెంగళరావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డితో పాటు విజయ్, పద్మ, ముత్తయ్య, వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి, ఉమాదేవి, రాము పాల్గొన్నారు. -
పకడ్బందీగా ప్రాధాన్యతా పథకాలు
● ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ● ఏ ఒక్క అనర్హుడికి ఇల్లు మంజూరైనా బాధ్యులపై చర్యలు ● ఎరువులు, విత్తనాల కొరత రాకుండా ప్రత్యేక దృష్టి ● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ఽవర్షాకాల ఆరోగ్య కార్యాచరణ, సాగు ప్రణాళికలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో తొలుత ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేష్ వి.పాటిల్ జిల్లాల వారీగా పథకాలు అమలు నివేదికలు వెల్లడించారు. నకిలీలు అమ్మితే కఠిన చర్యలు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. జిల్లాలోకి నకిలీలు రాకుండా ఏపీ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టగా, రైతులకు చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. కాగా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. అలాగే, భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఆయన జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణపై సూచనలు చేశారు. అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలను తొలి దశలో అరికట్టడమే కాకుండా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేయాలని, జాబితాలో అర్హుల పేర్లే ఉండేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు ఆశాజనకంగానే ఉన్నా మరింత పెరగాలని సూచించారు. ఇక రుతుపవనాలు ముందుగా వచ్చినందున సరిపడా ఎరువులు, విత్తనాలు సమకూర్చాలని సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. నిల్వలను తరచుగా పరిశీలిస్తూ ఎక్కడా బ్లాక్ మార్కెట్కు తరలించకుండా చూడాలని సూచించారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉన్నట్లు తేలితే బాధ్యులైన గెజిటెడ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసైన్డ్ భూముల్లో పొజిషన్లో ఉన్న నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నందున ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అలాగే, సాదా బైనామా దరఖాస్తుల్లో ప్రభుత్వ భూములు ఉంటే తిరస్కరించాలని తెలిపారు. జూన్ 10 లోపు పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడమే కాక లబ్ధిదారులకు అవసరమైన ఇసుక టోకెన్ల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని తెలిపారు. అంతేకాక సగంలో మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తిచేయించాలన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు వైద్యులు, సిబ్బందిని పెంచాలని కోరారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసులు పరిగణనలోకి తీసుకోకుండా చూడాలన్నారు. సమావేశంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, మట్టా రాగమయి, ఖమ్మం సీపీ సునీల్ దత్, ఎస్పీ బి.రోహిత్ రాజ్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్లు పి.శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీసీలో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
బూర్గంపాడు: ఐటీసీ పీఎస్పీడీలో గురువారం పని ప్రదేశం నుంచి జారి కిందపడి ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతిచెందాడు. తోటి కార్మికుల కథనం ప్రకారం.. దుమ్ముగూడెం మండలం పెద్దకమలాపురం గ్రామానికి చెందిన పర్శిక హరీశ్(24) ఐటీసీ పీఎస్పీడీలో ప్రాజెక్ట్ వర్క్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సుమారు 20 అడుగుల ఎత్తులో పనిచేస్తుండగా, జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో ఐటీసీ డిస్పెన్సరీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు చిట్టిబాబు, నర్సమ్మ, కుటుంబసభ్యులు గుండెలావిసేలా రోదిస్తున్నారు. కాగా మృతుడు అవివాహితుడు. మృతుడి కుటుంబానికి ఐటీసీ ఒప్పందం ప్రకారం రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందించేందుకు కృషి చేస్తామని గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రాద్రి కలెక్టర్ సతీమణి ప్రసవం
భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందేలా నిరంతరం పర్యవేక్షిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆ ఆస్పత్రులపై నమ్మకం పెరిగేలా అడుగు ముందుకేశారు. ఆయన భార్య శ్రద్ధ గర్భం దాల్చినప్పటి నుంచి పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోనే పరీక్షలు చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు నెలలు నిండడంతో ఆస్పత్రిలో చేరి్పంచగా సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్ నేతృత్వాన వైద్యులు సరళ, అనూష, హెడ్ నర్సు రేవతి బుధవారం ఉదయం 10.03 గంటలకు ఆపరేషన్ ద్వారా కాన్పు చేశారు. కలెక్టర్ దంపతులకు ఇప్పటికే కుమారుడు ఉండగా, రెండో కాన్పులోనూ పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా ఆస్పత్రికి చేరుకున్న కలెక్టర్ తన కుమారుడిని ఎత్తుకుని మురిసిపోవడమే కాక వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని వసతులు, నిపుణులైన వైద్యులు, సిబ్బంది ఉన్నందున ప్రజలు సది్వనియోగం చేసుకోవాలని సూచించారు. అభినందనలు తెలిపిన మంత్రులు కలెక్టర్ జితేష్ పాటిల్ తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించడంపై పలువురు అభినందించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్విట్టర్లో ఆయనను ప్రశంసించారు. ఉన్నత స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తమ కుటుంబీకులకు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. -
వెంటాడి.. వేటాడి...
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రతాదళాలు చుట్టుముట్టడంతో మావోయిస్టు పార్టీ చీఫ్ కమాండర్ నంబాల కేశవరావును కాపాడుకునేందుకు తిండీతిప్పలు లేకుండా 60 గంటలపాటు మావోయిస్టులు పోరాటం సాగించారు. ఎత్తైన కొండలు ఎక్కి దిగారు.. వాగులు, వంకలు దాటారు. చివరకు అలసిపోయి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. విరామం నుంచి తేరుకునేలోగా తీవ్ర నష్టం జరిగిందని.. అదే అబూజ్మఢ్ ఎన్కౌంటర్కు కారణమైనట్లు తాజాగా వెలుగుచూసింది. ఇద్దరు పారిపోవడంతో... నంబాల కేశవరావు రక్షణ దళం, అబూజ్మఢ్లో విప్లవ విస్తరణలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు పోలీసులకు లొంగిపోవడంతో నంబాల టీమ్ అడవిలో ఎక్కడ ఉందనే విషయం పోలీసులకు సమాచారం అందింది. దీనికి తోడు ఈనెల 17న రాత్రి నంబాల టీమ్లో ఉన్న ఇద్దరు (భార్యాభర్తలు) క్యాంప్ను విడిచి పారిపోయారు. దీంతో అప్రమత్తమైన నంబాల టీమ్ అదేరోజు సాయంత్రం క్యాంప్ను ఖాళీ చేసి మరో సురక్షిత ప్రాంతానికి కాలినడకన ప్రయాణం మొదలెట్టింది. దీంతో తమ వెంట అత్యవసర వస్తువులు తప్పితే ఆహారం, ఇతర వస్తువులు ఎక్కువగా తెచ్చుకునే వీలు చిక్కలేదు. ఈనెల 18న నాలుగు జిల్లాలకు చెందిన భద్రతా దళాలు ఓర్చా వైపు నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టాయి. ఈనెల 19న ఉదయం 9 గంటల సమయంలో పోలీసులు తమ సమీపానికి వచి్చనట్టుగా గమనించిన నంబాల టీమ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. జట్లూరు–బోటేర్ అటవీ ప్రాంతంలో ఇరువర్గాల నడుమ ఉదయం 10 గంటలకు మొదలైన కాల్పులు ఆ రోజంతా కొనసాగాయి. అయితే ఎలాంటి నష్టం లేకుండా తప్పించుకున్న మావోలు గుండెకోట్ గ్రామం వైపుగా అటవీ మార్గంలో వెళ్లారు. కొండ దగ్గర విరామం చివరకు 20వ తేదీ సాయంత్రానికి గుండెకోట్ సమీపంలోని అడవికి చేరుకుంది. కాసేపటికే మరో ఎత్తయిన కొండ ఎదురవడంతో కొంతమేర ఎక్కి వెదురు వనాల మధ్యకు చేరుకున్నాక కాసేపు విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. దట్టంగా ఉండే వనాల్లో ఉంటే పోలీసులకు కనిపించడం అసాధ్యమని.. ఒకవేళ కనిపించినా తప్పించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేసినట్లు సమాచారం. అప్పటికే 60 గంటలుగా నిద్రహారాలు లేకుండా అడవుల్లో ప్రయాణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మావోయిస్టుల మార్గాలపై పట్టున్న డీఆర్జీ బలగాలు అదే దిశలో సెర్చ్ ఆపరేషన్ సాగిస్తూ.. గుండెకోట్ గ్రామానికే చేరుకున్నాయి. ఈనెల 20న రాత్రి గుండెకోట్ అడవిలో నంబాల టీమ్, భద్రతా దళాలు కేవలం కిలోమీటరు దూరంలోనే బస చేసినట్టు సమాచారం. చిమ్మచీకటిలో చడీచప్పుడు చేయకుండా రాత్రంతా ఇరువర్గాలు గడిపాయి. తెల్లవారాక గుట్టపైకి చేరుకుని సురక్షిత ప్రాంతంలోకి వెళ్లాలనేది మావోయిస్టుల ఆలోచన. ఇదే సమయాన మావోలను వెంటాడుతూ వారున్న ప్రాంతంలోకి వెళ్తే ఆంబుష్ వలలో చిక్కుకుంటామనే సందేహాలు భద్రతా దళాలను ముసురుకున్నాయి.వ్యూహం ఫలించక..గుండెకోట్ అటవీ ప్రాంతంపై మావోలకు పట్టున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకున్న భద్రతా దళాలు.. 21వ తేదీ తెల్లవారుజామునే మరింత ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టాయి. ఉదయం 7 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. భద్రతాదళాలకు దారి చూపుతున్న డీఆర్జీ జవాన్పై దాడి చేయడం ద్వారా ప్రభుత్వ బలగాలను ఆత్మరక్షణలోకి నెట్టాలన్న మావోల వ్యూహం ఫలించలేదు. చివరకు ఈ కాల్పుల్లో పార్టీ చీఫ్ నంబాలతోపాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
మణుగూరు టౌన్: వ్యసనాలకు బానిసై చోరీలను అలవాటుగా మార్చుకున్న అంతర్రాష్ట్ర దొంగను మణుగూరు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ రవీంద్రరెడ్డి కథనం ప్రకారం.. ఈ నెల 23న మణుగూరు అంబేద్కర్ సెంటర్లోని శ్రీవారి జ్యూయలరీలో 13 తులాల బంగారం చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో హనుమాన్ టెంపుల్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని విచారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరానికి చెందిన గొర్రెల సత్యనారాయణ ఆరు బంగారు చైన్లు, నల్లపూసల గొలుసు, చిన్న పిల్లల రింగులు 5 మొత్తం 132 గ్రాముల బంగారం అపహరించినట్లు అంగీకరించాడు. వరంగల్, తిరుపతి, కర్నూలు ప్రాంతాల్లో కూడా చోరీలు చేసినట్లు విచారణలో తేలింది. గతంలో అతనిపై సుమారు 30 కేసులు ఉన్నాయి. నిందితుడిని బుధవారం మణుగూరు కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. చోరీలు ఇలా... మంగళ, శుక్రవారాల్లో బంగారం దుకాణాల యజమానులు పూజలు నిర్వహిస్తుంటారు. ఆ సయమంలోనే సత్యనారాయణ రెక్కీ నిర్వహిస్తూ, కొనుగోళ్లు చేసినట్లు ఏమార్చి షో కేస్లో ఉన్న బంగారం అపహరిస్తుంటాడని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన ఇన్చార్జి సీఐ వెంకటేశ్వర్లు, మణుగూరు ఎస్ఐ మేడ ప్రసాద్, సీసీఎస్ ఎస్ఐ రామారావు, కానిస్టేబుల్ రామారావు, వెంకటనారాయణ, విజయ్లను డీఎస్పీ రవీంద్రరెడ్డి అభినందిస్తూ నగదు రివార్డును అందజేశారు. 132 గ్రాముల బంగారం స్వాధీనం -
ఆ ఎనిమిది మంది మాటేంటి..?
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల విస్తరణలో భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా పాక్షిక పరిహారం తీసుకున్న చిరు వ్యాపారులు, భూ యజమానులు దుకాణాలు, ఇళ్లను ఖాళీ చేశారు. దీంతో రెవెన్యూ అఽధికారులు బుధవారం ఆ ఇళ్లను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. అయితే రామాలయానికి వచ్చే భక్తుల రద్దీ, స్థానికుల రాకపోకలు అధికంగా సాగుతుండడంతో రాత్రి వేళల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించారు. కాగా పరిహారం తీసుకున్న వారు ఖాళీ చేసినా, తీసుకునేందుకు విముఖత చూపిన ఎనిమిది మంది ఇళ్ల తొలగింపు, స్వాధీనంపై మాత్రం స్పష్టత రాలేదు. దీంతో ఆ భవనాల్లో అద్దెకు దుకాణాలను నిర్వహిస్తున్న వారు దర్జాగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. కలెక్టర్ చొరవ చూపితేనే.. మాడ వీధుల విస్తరణలో ఆలయం చుట్టుపక్కల 40 ఇళ్లను తొలగించాలని దేవస్థానం, రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఇందుకు 32 మంది అంగీకరించగా.. అధికారులు మూడో వంతు నష్టపరిహారం కూడా అందజేశారు. మిగితా మొత్వం ఇళ్లు ఖాళీ చేశాక ఇచ్చేందుకు పరస్పర అంగీకారం కుదిరింది. దీంతో వారంతా ఇళ్లు, షాపులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అయితే ఎనిమిది మంది మాత్రం ప్రభుత్వ నష్ట పరిహారం సరిపోవడం లేదంటూ స్వీకరణకు విముఖత చూపారు. గతంలో సైతం ఆలయ విస్తరణ సమయంలో ఒప్పుకోని ఇద్దరితో పాటు మరో ఆరుగురు ఈసారి కూడా ముందుకురాలేదు. పరిహారం పెంచితేనే ఖాళీ చేస్తామంటూ భీష్మించారు. దీంతో ఆ ఎనిమిది ఇళ్ల తొలగింపు అడ్డుగా మారింది. పడమర మెట్లకు ఎదురుగా కొన్ని, దక్షిణం వైపున కొన్ని ఇళ్లు అలాగే ఉండిపోనున్నాయి. దీనిపై కలెక్టర్ చొరవ చూపితేనే రామాలయ అభివృద్ధిపై ప్రభుత్వ హామీ ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. కాగా ఖాళీ చేసిన భూ యజమానులకు బ్రిడ్జి సెంటర్లో ఉన్న ఆర్అండ్బీ స్థలాన్ని కేటాయిస్తామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. గతంలోనే ఆ స్థలాన్ని చదును చేశామని, త్వరలోనే లాటరీ పద్ధతిలో నిర్వాసితులకు అప్పగిస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకం పెట్టడమే తప్పా.. ప్రభుత్వంపై నమ్మకంతో, అధికారులు ఇచ్చిన నష్టపరిహారం తీసుకున్న చిరువ్యాపారులు, దుకాణ యజమానులు ఇప్పుడు అసంతృప్తివ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలువులు పూర్తికాకపోవడంతో భక్తుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో వ్యాపారాలు ఉన్నప్పటికీ హనుమాన్ జయంతి అనంతరం ఖాళీ చేస్తామని చెప్పిన మాట ప్రకారం స్థలాలను అప్పగించారు. అయితే పరిహారం తీసుకోని ఆఎనిమిది భవనాల్లోని అద్దె దుకాణాల్లో మాత్రం దర్జాగా వ్యాపారాలు సాగుతున్నాయి. దీంతో ఖాళీ చేసిన దుకాణాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ సమన్యాయం జరిగేలా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భూ సేకరణలో పూర్తి కాని నష్టపరిహారం ఇళ్లను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు ఒక వైపు ఖాళీలు, మరో వైపు దర్జాగా దుకాణాలు త్వరలోనే స్థలాలు అప్పగిస్తాం భూ సేకరణ పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇళ్లు కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నాం. నష్టపరిహారం అందుకోని వారు సైతం తొలి దశలో అంగీకరించినవారే. వారితో సంప్రదింపులు జరిపి పూర్తి చేస్తాం. లేదంటే కోర్టు ద్వారా ఆ ఇళ్లను తొలగించి స్వాధీనం చేసుకుంటాం. ఖాళీ చేసిన వారు ఆందోళన చెందొద్దు. బ్రిడ్జి పాయింట్లో ఉన్న ఆర్అండ్బీ స్థలాన్ని త్వరలోనే నిర్వాసితులకు అప్పగిస్తాం. – దామోదర్ రావు, ఆర్డీఓ -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
బూర్గంపాడు: మండల కేంద్రం బూర్గంపాడులోని గౌతమిపురం వద్ద బుధవారం మోటార్సైకిల్ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. బూర్గంపాడులోని గిరిజన ఆశ్రమ పాఠశాల(బాలికలు)లో వంటమనిషిగా పనిచేస్తున్న కుర్సం జానకమ్మ(51) తమ బంధువు మోటార్సైకిల్పై బుధవారం మధ్యాహ్నం పాఠశాలకు వస్తోంది. ఈ క్రమంలో గౌతమిపురం వద్ద ఎదురుగా వస్తున్న కారు బైక్ను ఢీ కొట్టింది. దీంతో బైక్పై వెనుక కూర్చున్న జానకమ్మ తారురోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావటంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న బంధువుకు, మధ్యలో కూర్చున్న ఆమె మనవడికి కూడా తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు ఆంధ్రప్రదేశ్లోని వీఆర్పురం మండలవాసి కాగా, ఉద్యోగరీత్యా బూర్గంపాడులో ఉంటోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లెల్లో ‘ప్రత్యేక’ పాట్లు
చుంచుపల్లి: ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. పల్లెలు పారిశుద్ధ్య సమస్యతో సతమతమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. గతేడాది జనవరితో సర్పంచుల పదవీకాలం ముగియగా ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక అధికారులకు అప్పగించారు. ఎంపీపీ, జెడ్పీ పాలక మండళ్ల గడువు సైతం గతేడాది ఆగస్టు మొదటి వారంతో ముగియగా, అక్కడా స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక కొత్తగూడెం, ఇల్లెందు పురపాలికల్లోనూ పాలక వర్గాల గడువు ఈ ఏడాది జనవరిలో ముగియగా పాలన బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించారు. వివిధ ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న మండల స్థాయి అధికారులకు ఒక్కొక్కరికి 2 నుంచి 4 గ్రామాల చొప్పున అదనపు బాధ్యతలు కేటాయించారు. జెడ్పీకి కలెక్టర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తుండగా, మండల పరిషత్లకు జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. కొత్తగూడెం, ఇల్లెందు రెండు మున్సిపాలిటీల పాలన పర్యవేక్షణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కు అప్పగించారు. కార్యదర్శులపైనే భారం స్థానిక సంస్థల పాలన పట్టించుకోవాల్సి అధికారులు కనీసం అటువైపు రావడం లేదనే ఆరోపణలున్నాయి. భారం అంతా గ్రామాల్లో కార్యదర్శుల పైనే పడుతోంది. మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారులు కూడా పాలనను పట్టించుకోవడంలేదనే పలువురు పేర్కొంటున్నారు. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నెలల తరబడి ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధుల విడుదల చేయకపోవడంతో పాలన పూర్తిగా పడకేసింది. వర్షాకాలం సీజన్ను ప్రారంభమవుతున్నా దృష్టా ప్రత్యేక అధికారులు మేల్గొనాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు పర్యవేక్షించాలి గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించాలి. వర్షాకాలం సీజన్లో అప్రమత్తంగా ఉండాలి. సమస్యలు ఏమైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులను మరోసారి ఆదేశిస్తాం. – ఎం.విద్యాచందన, అదనపు కలెక్టర్ ఎన్నికలు నిర్వహించాలి ప్రత్యేకాధికారులు గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. మరోవైపు పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. – మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలు పంచాయతీలను పట్టించుకోని ప్రత్యేకాధికారులు మున్సిపాలిటీల్లోనూ అదే తీరు గ్రామపంచాయతీలు 481 జిల్లా పరిషత్ 1 మండల పరిషత్లు 22లోపిస్తున్న జవాబుదారీతనం పదవీకాలం ముగిసి ఏడాది దాటినా సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఎప్పుడన్నది స్పష్టతలేదు. మండల, జిల్లా పరిషత్ల పాలన గడువు ముగిసి పది నెలలు అవుతున్నా ఎన్నికలకు ప్రభుత్వం విముఖత చూపుతోంది. ప్రత్యేకాధికారులు పనిభారం తదితర కారణాలతో గ్రామ పాలన పట్టించుకోవడంలేదు. తమకు సొంత శాఖ విధులతోనే సరిపోతోందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. దీనికితోడు స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అధికారులతో జవాబుదారీతనం కూడా లోపిస్తోంది. పాలనాభారం గ్రామ కార్యదర్శులు మోస్తున్నా నిధులు లేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రత్యేక అధికారులను నియమించినా ప్రజలకు అందుబాటులో ఉండటంలేదు. కాగా ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసంతో పాటు మరికొన్ని పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
మాజీ ఎమ్మెల్యేకు కన్నీటి వీడ్కోలు
● నివాళులర్పించిన మంత్రి తుమ్మల, వివిధ పార్టీల నేతలు ● పాడె మోసిన ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ రఘునాథపాలెం: వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బానోత్ మదన్లాల్ అంత్యక్రియలను బుధవారం ఆయన స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం ఈర్లపుడిలో నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఆయన మృతదేహాన్ని మంగళవారం ఖమ్మం కవిరాజ్నగర్లోని నివాసగృహానికి తీసుకురాగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఈర్లపుడికి తరలించగా, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు మదన్లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను ఓదార్చారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తదితరులు పాడె మోశారు. అలాగే, ఇల్లెందు, జనగామ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పల్లా రాజేశ్వరరెడ్డి, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ మాలోతు కవితతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తుళ్లూరి బ్రహ్మయ్య, రాంరెడ్డి గోపాల్రెడ్డి, ఏనుగుల రాకేశ్రెడ్డి, దిండిగల రాజేందర్, బెల్లయ్యనాయక్, కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, బచ్చు విజయ్కుమార్, అజ్మీరా వీరూనాయక్, మాదంశెట్టి హరిప్రసాద్, గుత్తా రవి, మెంటెం రామారావు, పిన్ని కోటేశ్వరరావు, చెరుకూరి ప్రదీప్, కూరాకుల వలరాజు, నాగండ్ల కోటి, మానుకొండ రాధాకిశోర్ తదితరులు సైతం మదన్లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
సర్కార్ వైద్యంపై భరోసా
పాల్వంచ: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యానికి గతంలో పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా వచ్చేవారు. అక్కడి వాతావరణం, అరకొర సిబ్బంది, వైద్యుల పలకరింపు, సిబ్బంది పనితీరు పట్ల కొంత ఆందోళన చెందేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆస్పత్రి పరిసరాలు శుభ్రంగా ఉండటంతోపాటు ఆధునిక వైద్య పరికరాలు, స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులోకి వచ్చారు. దీంతో ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తన భార్య శ్రద్ధ పాటిల్ కాన్పు కోసం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, మగబిడ్డ జన్మించాడు. ఆస్పత్రిలో వసతులు మెరుగ్గా ఉన్నాయని కలెక్టర్ కితాబు ఇవ్వడం విశేషం. పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు కూడా.. గతంలో భద్రాచలం పీఓగా, ఖమ్మం కలెక్టర్గా విధులు నిర్వహించిన వీపీ.గౌతమ్ 2018 అక్టోబర్ 28న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో తన సతీమణికి ప్రసవం చేయించారు. 2020 ఆగస్టు 27న అప్పటి ఎస్పీ సునీల్ దత్ సతీమణి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించారు. ఏఎస్పీ శబరీష్ సతీమణి, ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలత కూడా ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం పొందారు. గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనుదీప్ సైతం తన సతీమణి మాధవికి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించి ఆదర్శంగా నిలిచారు. ఈ క్రమంలో ప్రస్తుత కలెక్టర్ జితేష్ తన సతీమణికి ప్రభుత్వాస్పత్రిలో కాన్పు సేవలు పొందారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు సేవలు పొందుతున్న ఐఏఎస్, ఐపీఎస్ కుటుంబీకులు -
జేకే ఓసీ విస్తరణకు అనుమతులు
ఇల్లెందు: జేకే–5 ఓసీ విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. ఈ మేరకు బుధవారం సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య వివరాలు వెల్లడించారు. జేకే–5 ఓసీ మూతపడనున్న నేపథ్యంలో యజమాన్యం పలువురు ఉద్యోగులను బదిలీ చేసింది. జేకే ఓసీ విస్తరణ అనుమతుల్లో జాప్యం జరిగింది. పలు దఫాలు ప్రయత్నించినా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు ఆలస్యం కావటంతో ఓసీ విస్తరణ పట్ల ఆందోళన వ్యక్తమైంది. సీఎండీతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పలు దఫాలు సింగరేణి అధికారులు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, గుర్తింపు సంఘం నాయకులు ఒత్తిడి పెంచడంతో తుది అనుమతులు బుధవారం లభించాయి. దీంతో కార్మికులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2023 ఏప్రిల్ 26న జేకే ఓసీ విస్తరణకు సింగరేణి ప్రజాభిప్రాయం సేకరించింది. రూ.297.88 కోట్లతో 1114.507హెక్టార్ల భూమిలో 2.50 మిలియన్ టన్నుల బొగ్గు సేకరణ కోసం అనుమతి కోరారు. ప్రస్తుతం 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే అనుమతి లభించినట్లు జీఎం తెలిపారు. విస్తరణ పనులు చేపట్టి బొగ్గు వెలికితీతకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసుపాక బీపీఎంపై సస్పెన్షన్ వేటుఅశ్వారావుపేటరూరల్: మండల పరిధిలోని ఆసుపాక బ్రాంచ్ పోస్టుమాస్టర్ శశాంక్పై బుధవారం తపాలా శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గడిచిన ఏడాది కాలంగా గ్రామస్తులకు పోస్టు ద్వారా వచ్చిన ఉత్తరాలు, ఆధార్, ఏటీఎం, బీమా, ఇతర నోటీసు పత్రాలను పంపిణీ చేయడం లేదని, ఈ నెల 26వ తేదీన గ్రామస్తులు వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అదే రోజు పోస్టుమాస్టర్ శశాంక్పై గ్రామస్తులు లిఖిత పూర్వకంగా అశ్వారావుపేట ఎస్పీఎం సాయిబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో పాల్వంచ డివిజన్ ఇన్చార్జి పోస్టల్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి ఆసుపాక గ్రామంలో విచారణ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలను నమోదు చేసి, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పోస్టుమాస్టర్పై సస్పెన్షన్ వేటు వేశారు. 1.9 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి సింగరేణి సన్నాహాలు -
కొండరెడ్ల సంక్షేమానికి కృషి
● ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ● ఐటీడీఏ పీఓ రాహుల్ అశ్వారావుపేటరూరల్: మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే కొండరెడ్లకు సంక్షేమ పథకాలు, జీవనోపాధి కల్పించేలా కృషి చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. మండలంలోని తిరుమలకుంట, గోగులపూడి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. తిరుమలకుంటలో తాగునీరు, డ్రెయినేజీ సమస్యలు ఉన్నాయని, కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కొండరెడ్లు కోరగా.. సర్వే చేసి అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ దత్తత గ్రామమైన గోగులపూడిలో పర్యటించి కొండరెడ్లు తయారీ చేసిన వెదురు ఉత్పత్తులను పరిశీలించారు. వీటి విక్రయానికి మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని, వ్యాపారాన్ని విస్తరించాలని సూచించారు. కొండరెడ్ల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపునకు ఈనెలాఖరు లోగా ఇంటింటి సర్వే చేసి వారం రోజుల్లో అందరికీ మంజూరు పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన రైతులకు ఇందిరా గిరి జల వికాసం పథకం కింద బోరు, మోటార్, డ్రిప్ కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. పోడు పట్టాలున్న భూముల్లో ఆయిల్పాం, మునగ, వెదురు పెంపకం చేపట్టాలని, అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగు చేయాలని కోరారు. యువత జీవనోపాధి పొందేందుకు మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణ, యువకులకు సెల్ఫోన్ రిపేర్లు, ఆడియో, వీడియో రంగాలపై శిక్షణ అందిస్తామని వివరించారు. ఐటీడీఏ ద్వారా నిర్వహించే జాబ్మేళాకు హాజరై ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనతంరం శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, జేడీఎం హరికృష్ణ, హౌసింగ్ ఏఈ మదన్, కార్యదర్శులు కార్తీక్, సందీప్ పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు పాటించాలికొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధిగా నిబంధనలు పాటించాలని పౌర సరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్బాబు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. రైతులు కూడా ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్ధి పొందాలని కోరారు. 2023 – 24 యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2,289 మంది రైతుల నుంచి 13,642.680 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.29.79 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని, 2024 – 25 సీజన్లో 144 కొనుగోలు కేంద్రాల ద్వారా 49,527.320 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 7,297 మంది రైతుల ఖాతాల్లో రూ.114.61 కోట్లు జమ చేశామని వివరించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 6,500 మంది రైతుల నుంచి రూ.103.43 కోట్ల విలువైన 44,700.640 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. అకాల వర్షాలఓ ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. క్రీడల్లో ప్రతిభ చాటాలిఙదమ్మపేట : క్రీడల్లో ఉన్నతంగా రాణించి, జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ చాటాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి విద్యార్థులకు సూచించారు. మండలంలోని నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే క్రీడల్లో ఉన్నతంగా రాణించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సరళ, కోచ్లు శివాజీ, అభి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర బృందం పర్యటన
ములకలపల్లి/ పాల్వంచరూరల్: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్డీ) బృందం సభ్యులు రాకేశ్కుమార్, వివేక్కుమార్ కేసరి బుధవారం ములకలపల్లి, సీతారాంపురం గ్రామాల్లో పర్యటించి అభివృద్ది పనులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన కుంటలు, నర్సరీలు, మెగా ప్రకృతి వనాలను చూసి, ఉపాధి కూలీలతో మాట్లాడారు. పని ప్రదేశాల్లో వసతులు కల్పిస్తున్నారా, బిల్లులు సకాలంలో అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకంలో ములకలపల్లి – మూకమామిడి మధ్య నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ గద్దె రేవతి, ఇన్చార్జ్ ఎంపీఓ వెంకటేశ్వర్లు, పీఆర్ ఏఈ సురేశ్, జీపీ కార్యదర్శి రవి తదితరులు ఉన్నారు. కాగా, పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని మంగళవారం సందర్శించిన సభ్యులు బుధవారం కూడా వెళ్లి జలాశయంలో బోటింగ్ చేశారు. మరోసారి కిన్నెరసాని సందర్శన -
అంగన్వాడీల బలోపేతంపై దృష్టి
చుంచుపల్లి : వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అమలతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో జరిగే వాస్తవాలను మాత్రమే ప్రభుత్వ దృష్టికి తేవాలని, తద్వారా ఏమైనా లోటుపాట్లుంటే సరిచేసుకోవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. కలెక్టరేట్లో ఐసీడీఎస్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖల పనితీరుపై ఉమ్మడి జిల్లా అధికారులతో బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. చిన్నారులకు అవసరమైన వసతులు సమకూర్చుతున్నామని, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఈ కేంద్రాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రాథమిక పాఠశాలల సమీపంలోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఖాళీల భర్తీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణాల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని సూచించారు. గ్రామీణ ప్రాంత పిల్లల ఆలనా పాలన కోసం క్రష్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులను పట్టించుకోని వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. పల్లెల్లో తాగునీటి సమస్య రావొద్దు సమన్వయంతో పనిచేస్తూ లక్ష్యం సాధించాలి సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క పంచాయతీరాజ్ పనుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం సురక్షిత తాగునీరు అందించాలి.. మారుమూల ప్రాంత ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ సమస్యలపై వారం పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, 15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయాలని అన్నారు. ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టిన అధికారులను అభినందించారు. కాగా, పంచాయతీరాజ్ శాఖలో మంజూరైన పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు పూర్తయిన పనులు ఎందుకు చేయడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. గిరిజనుల అభివృద్ధికి రోడ్లు, బ్రిడ్జిల ఏర్పాటు ముఖ్యమని, ప్రతీ గ్రామానికి కనెక్టివిటీ ఉండేలా రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, కమిషనర్ కాంతివెస్లీ, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, మట్టా రాగమయి, మహిళా శిశు సంక్షేమ శాఖ జేడీ సునంద, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అదనపు కలెక్టర్లు విద్యాచందన, శ్రీజ, సంక్షేమాధికారులు లెనినా, రాంగోపాల్రెడ్డి, డీపీఓలు ఆశాలత, చంద్రమౌళి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత పాతకొత్తగూడెం – పెనుబల్లి గ్రామాలను కలిపే హై లెవల్ బ్రిడ్జి పనులకు సీతక్క నేడు శంకుస్థాపన చేయనున్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు గావించారు. -
ఇష్టారీతిగా మద్యం ధర పెంచుతున్న వ్యాపారులు
రేటు పెంచిన సిండికేటు..లైసెన్స్ పొందిన వైన్ షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్మాల్సి ఉంటుంది. అయితే ఎమ్మార్పీకి అమ్మితే లాభాలు పెద్దగా రావనే ఉద్దేశంతో మద్యం వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి, వైన్స్లలో పాపులర్ మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకుండా చూస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న మద్యాన్ని బెల్ట్షాపుల ద్వారా అధిక ధరలకు అమ్ముతుంటారు. క్వార్టర్ బాటిల్పై ఎమ్మార్పీ ధర కంటే రూ.20 ఎక్కువకు బెల్ట్షాప్లకు విక్రయిస్తే వారు మరో రూ.20 కలిపి ఎమ్మార్పీకంటే రూ.40 అదనంగా అమ్ముతుంటారు. జిల్లాలోని అనేక పట్టణాల్లో ఈ దందా చాలా రోజులుగా కొనసాగుతోంది. అయితే ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు పట్టణాల్లో సిండికేట్ నిర్వాహకులు తమ లాభాలను మరింతంగా పెంచుకునేందుకు ఎమ్మార్పీపై రూ.30 వరకు అదనంగా అమ్మడం మొదలుపెట్టారు.బయట నుంచి మద్యం..సాధారణంగా పట్టణాలు, పెద్ద మండల కేంద్రాల్లో మద్యం నిర్వాహకులు సిండికేట్గా ఏర్పడుతుంటారు. వీరి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై వారిదే గుత్తాధిపత్యం నడుస్తోంది. సిండికేట్ చెప్పిన ధరకు మద్యం కొనుగోలు చేయడంతో కష్టం తమది.. లాభం వారికి పోతోందని భావించిన బెల్ట్షాపు నిర్వాహకుల్లో కొందరు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. సిండికేట్ లేని పట్టణాల్లోని వైన్స్ నుంచి ఎమ్మార్పీకే భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేయడం మొదలెట్టారు. కొన్నాళ్లుగా చాపకింద నీరులా నడుస్తున్న ఈ వ్యవహారం ఇటీవల ముదురుపాకాన పడింది.ఇల్లెందు ఘటనతోమణుగూరు సిండికేట్తో విభేదించిన కొందరు బెల్ట్షాప్ నిర్వాహకులు మహబూబాబాద్ నుంచి భారీ ఎత్తున మద్యం తీసుకెళ్తున్నారనే విషయం ఇల్లెందు ఎకై ్సజ్ పోలీసులకు ఉప్పందింది. దీంతో దారి కాచి భారీగా సరఫరా అవుతున్న మద్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. అయితే ఈ దాడి జరగడం వెనుక సిండికేట్ హస్తం ఉందని బెల్ట్షాపు నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇల్లెందు ఎకై ్సజ్ పరిధిలోనూ ఇలాంటి దాడులు అనేకం జరిగాయని వారు గుర్తు చేస్తున్నారు. బెల్ట్షాపుల్లో మద్యం అమ్మడం నేరమైనప్పుడు, సిండికేట్ రూపంలో ఎమ్మార్పీకి మద్యం అమ్మకపోవడం కూడా చట్టరీత్యా నేరమేనని అంటున్నారు. సిండికేట్ ఘనాపాఠీల వ్యవహారాలను చూసీచూడనట్టుగా వదిలేయడం, చిల్లర దుకాణాలు, బడ్డీకొట్లలో నడుపుకునే బెల్ట్షాపులపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు సిండికేట్ అత్యాశ కారణంగా తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని, దీనిపై ఎకై ్సజ్ శాఖ దృష్టి పెట్టాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. ఈ విషయమై ఇల్లెందు ఎకై ్సజ్ సీఐ రాంప్రసాద్ను వివరణ కోరగా తాము ఎక్కడా దాడులు చేయడం లేదని చెప్పారు.బెల్ట్షాప్ నిర్వాహకుల్లో అసంతృప్తి..గ్రామాల్లో కిరాణా దుకాణాలు, పాన్షాపులు, బడ్డీకొట్లు బెల్ట్ షాపులుగా రూపాంతరం చెందాయి. స్థానికంగా ఉండే వారే ఎక్కువగా ఇక్కడ మద్యం తాగుతుంటారు. వారికి ప్లాస్టిక్ గ్లాసులు, మంచినీరు, పల్లీలు తదితర తినుబండారాలు ఉచితంగా ఇవ్వాల్సి వస్తోంది. దీంతో తమ లాభాలు తగ్గిపోతున్నాయనే అసంతృప్తి బెల్ట్షాపుల నిర్వాహకుల్లో ఉంది. బార్లు, వైన్స్, కౌంటర్ల వద్ద ప్లాస్టిక్ గ్లాస్కు కూడా డబ్బు వసూలు చేస్తారు. కానీ స్థానికంగా ఉండే పరిచయాలు, పరిస్థితుల కారణంగా తాము గ్లాసులకు బిల్లు వేయలేక నష్టపోతున్నామనేది బెల్ట్షాపుల వారి బాధ. అంతేకాదు.. అధిక ధరకు మద్యం అమ్ముతుంటే తమకు మందుబాబుల నుంచి ఇబ్బంది ఎదురవుతోందని అంటున్నారు. ఈ తరుణంలో క్వార్టర్ బాటిల్పై సిండికేట్ వారు అదనంగా వసూలు చేసే రూ.20లో తగ్గింపు ఇవ్వాలని కోరుతున్న తరుణంలో రేటు మరింతగా పెంచడం వివాదానికి బీజం వేసింది. -
బతుకులు ఆగం చేయొద్దు
● మాడవీధుల విస్తరణకు సహకరిస్తాం ● ప్రత్యామ్నాయం చూపండి.. పరిహారం ఇవ్వండి ● రామాలయ పరిసరాల చిరు వ్యాపారుల వినతి ● నేటి నుంచి ఇళ్లు తొలగించనున్న రెవెన్యూ అధికారులు భద్రాచలం: ‘దశాబ్దాల తరబడి రాముడిపైనే ఆధారపడి ఉంటున్నాం.. భక్తులు వస్తేనే మాకు పొట్ట నిండేది.. అయినా సరే రాముడిపై భక్తి, ఆలయాభివృద్ధి కోసం ఇళ్లు, దుకాణాలు ఖాళీ చేస్తున్నాం. ప్రభుత్వం హామీ ఇచ్చిన పరిహారం కూడా పూర్తిగా అందలేదు.. ప్రత్యామ్నాయ స్థలమూ చూపించలేదు.. ఇదేం అన్యాయం.. మా బతుకులు ఆగం కాకుండా చూడండి’ అంటూ నిర్వాసితులు గోడును వెల్లబోసుకుంటుచ్చారు. మేమెక్కడ ఉండాలి.. భద్రాచలం, రామాలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ పరిసరాల్లోని ఇళ్లు, దుకాణాలు తొలగించి మాడ వీధుల విస్తరణకు అధికారులు చర్యలు చేపట్టారు. నిర్వాసితులకు రెవెన్యూ అధికారులు ఇటీవల నష్టపరిహారం అందజేశారు. పరిహారం పూర్తిగా చెల్లించామని రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీరామనవమికి ముందు రోజు హడావిడిగా చెక్కులు పంపిణీ చేశారని, అయితే ఆ రోజున మూడో వంతు పరిహారం మాత్రమే అందించారని నిర్వాసితులు అంటున్నారు. మిగిలిన మొత్తం కొద్ది రోజుల్లోనే ఇస్తామని, భూమికి బదులు భూమి అందిస్తామని చెప్పారని, కానీ ఇంతవరకూ మిగితా డబ్బు ఇవ్వకపోగా ప్రత్యామ్నాయం కూడా చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఇళ్లు తొలగిస్తామని అంటున్నారని, మరి తామెక్కడ ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు, దుకాణాలు ఖాళీ చేయాలంటూ తమపై ఒత్తిడి చేస్తున్న అధికారులు.. ప్రత్యామ్నాయం చూపకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్పష్టత ఇవ్వని అధికారులు.. నిర్వాసితులకు భూమి అందజేసే విషయంలో రెవెన్యూ అధికారులు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. కానీ ‘ప్రసాద్’ పనుల్లో భాగంగా బ్రిడ్జి సెంటర్లో తొలగించిన ఆర్అండ్బీ స్థలాన్ని లాటరీ పద్ధతిలో కేటాయిస్తారనే ప్రచారం సాగింది. అయితే సుమారు రెండెకరాల ఈ స్థలం భవిష్యత్లో భద్రాచలం, రామాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుందని, నిర్వాసితులకు పురుషోత్తపట్నం లేదంటే పట్టణంలో ఖాళీగా ఉన్న ఇతర ప్రభుత్వ స్థలాలను అప్పగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారుల వద్ద ఎలాంటి స్పష్టత లేకపోవడంతో చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఖాళీ చేయాల్సిన భవనాల్లోని ఖరీదైన ఫర్నిచర్, కలపను మంగళవారం తరలించారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
సూపర్బజార్(కొత్తగూడెం): పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఐడీఓసీలో మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9.30 – మధ్యాహ్నం 12.30గంటల మధ్య పరీక్షలు జరుగుతాయ ని, ఇందుకోసం కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 1,367 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఐదుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు డిపార్టుమెంటల్ అధికారులు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు 50 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ వెంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానాకాలంలో మలేరియా, పైలేరియా, మెదడువాపు, డెంగీ, చికున్గున్యా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. నీరు ఎక్కువగా నిల్వ ఉంటే దోమలు పెరుగుతాయని, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి శుభ్రం చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, డీసీహెచ్ఎస్ రవినాయక్, జిల్లా మలేరియా అధికారి స్పందన, డీపీఓ చంద్రమౌళి, బీసీ, గిరిజన సంక్షేమాధికారులు ఇందిర, మణెమ్మ, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, నళిని, ఏడీఎంహెచ్ఓ జయలక్ష్మి పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి -
తెలుగు మాధుర్యాన్ని పిల్లలకు అందించండి
కొత్తగూడెంఅర్బన్: తెలుగు భాష మాధుర్యాన్ని పిల్లలకు అందించి, మాతృభాషపై మక్కువ పెంచాల్సిన బాధ్యత తెలుగు ఉపాధ్యాయులపై ఉందని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్ అన్నారు. జిల్లాలోని తెలుగు ఉపాధ్యాయులకు కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో జరుగుతున్న చివరి విడత వృత్యంతర శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆంగ్ల మాధ్యమ ఒరవడిలో తెలుగు భాష కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, దీనిని సమర్థవంతంగా ఎదుర్కొని, కథలు రాయటం, కథలు చెప్పటం, పద్యాలు రాయటం, పద్య పఠనం, ఇంకా అనేక ప్రక్రియలను పరిచయం చేసి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాల్సిన బాధ్యత తెలుగు ఉపాధ్యాయులదేనని గుర్తు చేశారు. కేవలం పబ్లిక్ పరీక్షల్లో పిల్లలు ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయకుండా తెలుగు సాహిత్యం, తెలుగుకు సంబంధించిన వివిధ గ్రంథాలను చదివేటట్లుగా ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్ర ఇన్చార్జ్ బి.నీరజ, రాష్ట్ర పరిశీలకులు మడత భాస్కర్గౌడ్, డీఆర్పీలు రంగపురి కృష్ణార్జున్రావు, బండి రామచందర్రావు, సత్య సాయిరాం, భూక్య కర్ణ పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కన్నుమూత
● ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రస్థానం ● తొలినాళ్లలో సర్పంచ్, ఎంపీటీసీగా కూడా విజయం ● సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపంవైరా/రఘునాథపాలెం: వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్(63) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబీకులు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో ఈనెల 23న చేర్పించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన స్వగ్రామం రఘునాథపాలెం మండలం ఈర్లపుడి కాగా మదన్లాల్కు భార్య మంజుల, కుమారుడు మృగేందర్లాల్, కూతురు మనీషాలక్ష్మి ఉన్నారు. కుమారుడు తమిళనాడు(కోయంబత్తూరు) రాష్ట్ర జీఎస్టీ కమిషనర్గా, కోడలు శ్వేత తమిళనాడు కేడర్లో జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు నెలల క్రితమే ఆయన సోదరుడు, పోలీస్ శిక్షణా కేంద్రం ఏసీపీ జవహర్లాల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు మదన్లాల్ మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఉపాధ్యాయుడి నుంచి ఎమ్మెల్యే దాకా.. మదన్లాల్ ఈర్లపూడిలోని సామాన్య కుటుంబంలో జన్మించారు. 11 మంది సంతానంలో మదన్లాల్ మూడో వ్యక్తి కాగా, ప్రాథమిక విద్య డోర్నకల్ మండలం బలపాలలో, డిగ్రీ ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాలలో పూర్తిచేశారు. కళాశాల రోజుల్లో పీడీఎస్యూలో పనిచేసిన ఆయన.. 1989లో కామేపల్లి మండలం అబ్బాస్పురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. కబడ్డీలో ప్రావీణ్యం ఉండడంతో అదే ఏడాది ఎస్ఐ పోస్టుకు ఎంపికై నా కేసుల కారణంగా ఉద్యోగం దక్కలేదు. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి 1996 – 2001 వరకు ఈర్లపూడి సర్పంచ్గా పనిచేశారు. 2001 – 2006 వరకు ఆయన భార్య మంజుల సర్పంచ్గా కొనసాగగా, తిరిగి 2006లో మదన్లాల్ రెండోసారి సర్పంచ్గా, ఆపై కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా విజయం సాధించారు. 2004లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్ ఆశించినా దక్కలేదు. 2009లో ఏర్పాటైన వైరా(ఎస్టీ) నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఫలితం లేక ఇండిపెండెంట్గా బరిలోకి దిగి 5వేల పైచిలుకు ఓట్లు సాధించారు. దివంగత సీఎం వైఎస్పై అభిమానంతో 2014లో నాటి ఎంపీ, ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా వైఎస్సార్సీపీలో చేరి, వైరా నుంచి సీపీఎం మద్దతుతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఏడాది తిరగకుండానే బీఆర్ఎస్(టీఆర్ఎస్)లో చేరగా, 2018, 2023 ఎన్నికల్లోనూ పోటీ చేసినా విజయం దక్కలేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. కేసీఆర్ సహా పలువురి నివాళి మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ మృతదేహాన్ని ఖమ్మం కవిరాజ్నగర్లోని నివాసగృహానికి తీసుకొచ్చారు. ఈమేరకు మాజీ సీఎం కేసీఆర్ మదన్లాల్ కుమారుడు మృగేందర్లాల్కు ఫోన్ చేసి ఓదార్చారు. అలాగే, సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. ఇక ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, కొండబాల తదితరులు మదన్లాల్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్తో పాటు వివిధ పార్టీల నాయకులు గడిపల్లి కవిత, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, రాంపూడి రోశయ్య, పగడాల మంజుల, కూరాకుల నాగభూషణం, లింగాల కమలరాజు, గుండాల కృష్ణ, నెల్లూరి కోటేశ్వరరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, పగడాల నాగరాజు, మందడపు సుబ్బారావు, నున్నా రవికుమార్, బాగం హేమంతురావు, దండి సురేష్, యర్రా బాబు తదితరులు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి సైతం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. కాగా, మదన్లాల్ అంత్యక్రియలను బుధవారం స్వగ్రామమైన ఈర్లపుడిలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. -
సౌకర్యాలు ఎలా ఉన్నాయ్..?
ఉపాధి కూలీలను ఆరా తీసీన కేంద్ర బృందం పాల్వంచరూరల్ : పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు కల్పిస్తున్నారా.. కూలీలకు సరాసరి ఎంత వేతనం వస్తోంది.. పనిచేశాక ఎన్ని రోజులకు వేతనం అందుతోంది అంటూ కేంద్ర బృందం సభ్యులు రాకేష్కుమార్, వివేక్కుమార్ కేసరి ఆరా తీశారు. మండలంలోని జగన్నాథపురం, ప్రభాత్నగర్లో మంగళవారం పర్యటించిన సభ్యులు.. ఉపాధి కూలీలతో మాట్లాడి వివరాలు సేకరించారు. జగన్నాథపురంలో ఫాంపాండ్ పనులు, పామాయిల్ తోట, నర్సరీలు, ప్రభాత్నగర్లో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద చేపట్టిన బ్రిడ్జి పనులను పరిశీలించారు. కిన్నెరసాని సందర్శన.. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. డీర్ పార్కులోని దుప్పులను చూస్తుండగా ఒక జింక కంచె వద్దకు రాగా దానికి మేత అందించారు. ఆ తర్వాత డ్యామ్ పైకెళ్లి జలాశయాన్ని వీక్షించి లొకేషన్ చాలా అందంగా ఉందంటూ కితాబిచ్చారు. స్థానిక అధికారులతో కలిసి ఫొటోలు దిగారు. బృందం వెంట డీఆర్డీఓ విద్యాచందన, ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, ఏపీఓ రంగా, ఏపీఎం రాంబాబు, ఈసీలు రాజు, పుల్లయ్య, కార్యదర్శులు సాయిరాం, శ్రీనివాస్, శ్రీబాబు, రవి తదితరులు ఉన్నారు. -
మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి
ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ బూర్గంపాడు: నర్సరీల్లో మొక్కల పెంపకంపై జాగ్రత్తలు పాటించాలని ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ సిబ్బందిని ఆదేశించారు. మండల పరిధిలోని సందెళ్ల రామాపురం అటవీ నర్సరీని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవుల నరికివేతతో తగ్గిన అడవి జాతి మొక్కలను తిరిగి పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం అడవుల సంరక్షణ, అటవీ ఉత్పత్తుల పెంపుపై ట్రెయినీ బీట్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ మసూద్, ఎఫ్ఆర్ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామయ్య దర్శనం.. భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. అర్చకులు స్వాగతం పలకగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.ఎఫ్ఆర్ఓ సుజాత, ఆలయ పీఆర్ఓ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ కార్యాలయంలో నిధి ఆప్కే నికట్
కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని ‘సాక్షి’ కార్యాలయంలో ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఆధ్వర్యాన ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ‘నిధి ఆప్కే నికట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్పై ఉద్యోగుల సందేహాలను అధికారులు నివృత్తి చేయడమే కాక ప్రయోజనాలను వివరించారు. జిల్లా నోడల్ ఆఫీసర్ బి.నాగులు, సూపర్వైజర్ కె.నాగేశ్వరరావు, ఈఎస్ఐ బ్రాంచ్ ఇన్చార్జ్ మేనేజర్ రెహానా సుల్తానా, ఉద్యోగి బి.కార్తీక్తో పాటు సాక్షి బ్రాంచ్ మేనేజర్ జి.మోహనకృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు.చిన్న వయసు నుంచే ప్రోత్సహించాలి పాల్వంచ: చిన్న వయసు నుంచే పిల్లలను తల్లిదండ్రులు క్రీడలు ఆడేలా ప్రొత్సహించాలని పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక శ్రీనివాసకాలనీ మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సబ్ జూనియర్ డే అండ్ నైట్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలను డీఎస్పీ ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిల్లా క్రీడల అధికారి ఎం.పరంధామరెడ్డి మాట్లాడుతూ.. క్రీడలను ప్రోత్సహించేందుకు తమవంతు కృషి ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి.యుగంధర్రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహిధర్, పి.నాగేందర్, మల్లికార్జున్, నాగరాజు, గిరిప్రసాద్, అక్బర్, ఎర్రయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. తాగునీటిలో పురుగులు అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటిలో మూడు రోజులు గా పురుగులు, ఇతరవ్యర్థాలు వస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. అశ్వారావుపేట పట్టణ ప్రజలకు రోజూ స్థానిక పాత ప్రభుత్వ ఆస్పత్రి లో ఉన్న మిషన్ భగీరథ ట్యాంక్ ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా చేస్తుంటారు. కాగా, మూడు రోజులుగా స్థానిక వెలమబజారు, ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ప్రాంతం, కోనేరుబజారుతోపాటు పలు ఏరియాల్లో తాగునీటిలో పురుగులు, వాటి అవశేషాలతో పాటు వ్యర్థాలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళవారం తాగునీటిలో వచ్చిన పురుగులు, వాటి అవశేషాల ఫొటోలు, వీడియోలను తీసి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. వాటర్ ట్యాంకులను సకాలంలో శుభ్రం చేయకపోవడం, కొన్నిచోట్ల తాగునీటి పైపులు డ్రెయినేజీల్లో ఉండటంతో కలుషితం అవుతున్నట్లు పట్టణ వాసులు చెబుతున్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ సుజాతనగర్: తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన వేపలగడ్డ గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. ఎస్ఐ రమాదేవి కథనం మేరకు.. వేపలగడ్డకు చెందిన మల్లెల బాలచెన్నారెడ్డి తన ఇంటికి తాళం వేసి ఊరెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలోని 3.3 తులాల బంగారు వస్తువులతో పాటు రూ.60 వేల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ముక్కు నేలకు రాస్తా..
● ఇప్పుడున్న ఎమ్మెల్యేను ఒక్క పట్టా ఇప్పించమనండి.. ● మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సవాల్..మణుగూరురూరల్: ఆనాడు తాను ఎంతో శ్రమించి, పోడు పట్టాలిప్పిచ్చానని, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఒక్క పట్టా ఇప్పించినా ముక్కు నేలకు రాస్తానని పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సవాల్ విసిరారు. మంగళవారం మండలంలోని కట్టుమల్లారం గ్రామ పంచాయతీలో కొందరు గిరిజనులు ట్రాక్టర్లతో అటవీ ప్రాంతంలో దున్నుతుండగా మణుగూరు ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో సాగు పనులు చేస్తున్నట్లు తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ ఉపేందర్, ఇతర అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిబంధనలను అతిక్రమించి అడవిని ఆక్రమించి పోడు సాగు చేయొద్దని సూచించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలకు చెందిన గిరిజన కుటుంబాల మధ్య, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పోడు భూమి రాలేదంటూ కాంగ్రెస్ వర్గీయులు కాంతారావును ప్రశ్నించారు. ఆనాడు అధికారులు చేసిన సర్వేలో ఏదైనా పొరపాట్లు దొర్లి ఉండవచ్చని.. ఆ రికార్డులను తెప్పిస్తే న్యాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎంత నచ్చజెప్పిన సదరు గిరిజనులు వినకుండా భీష్మించడంతో.. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోనే ఉందని, స్థానిక పాలకులతో సమస్యను పరిష్కరించుకోకుండా ఇలా అటవీ భూమిని ఆక్రమించి మొక్కలు నాటడం సరికాదని సూచించారు. ఆనాడు తాను ఎంతో శ్రమించి గిరిజన పోడు సాగుదారులకు పట్టాలు ఇప్పించానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు దమ్ముంటే ఒక్కరికి పట్టా ఇప్పించినా.. ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షంలో ఈ ప్రాంతంలో ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. సమస్యను పెద్దది చేసే చర్యలు మానుకుని న్యాయ పరిష్కారానికి సహకరించాలని హితువు పలికారు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఇల్లెందు: పట్టణంలోని 15వ నంబర్బస్తీవాసి, ఆటోడ్రైవర్ దుర్గాప్రసాద్ (45) పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం 8వ నంబర్ చెరువు సమీపంలో కూల్డ్రింక్లో పురుగులమందు కలుపుకుని తాగి మృతి చెందగా సాయంత్రం మేకల కాపరులు చూసి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా దుర్గాప్రసాద్ మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య మీనాపాసీ కుమారి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే ఆయ న ఆరు నెలల కాలంలో రెండు దఫాలు యాక్సిడెంట్లో గాయపడ్డాడు. తలలో రక్తం గడ్డకట్టగా ఆపరేషన్ అయినట్లు బంధువులు తెలిపారు. మానసికంగా ఇబ్బంది పడుతున్న ఆయన కుటుంబసభ్యుల సమాధుల వద్దకు చేరి, అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. -
పరీక్షలకు సన్నద్ధం కావాలి
పాల్వంచరూరల్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కావాలని, బాగా రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. స్థానిక గిరిజన బాలుర అశ్రమ పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా.. నిరుత్సాహపడకుండా శ్రద్ధగా చదవాలని, ఉపాధ్యాయులు బోధించే పాఠాలు ఆసక్తిగా వినాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే సంబంధిత సబ్జెక్టు టీచర్ను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. అనంతరం అశ్రమ పాఠశాలలో నిర్మిస్తున్న మరుగుదొడ్లు, విద్యుత్ కనెక్షన్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్రాజు, హెచ్ఎం భద్రు తదితరులు పాల్గొన్నారు. -
నిధులున్నా.. మరమ్మతులు సున్నా
● ప్రారంభం కాని తాలిపేరు కాల్వల పనులు ● రబీకి ముందే ఆరంభం కావాల్సి ఉన్నా వాయిదా.. ● సాగునీరు విడుదల చేయాలని రైతులు పట్టుబట్టడమే కారణం ● మళ్లీ ఖరీఫ్ పూర్తయితేనే వీడనున్న గ్రహణంచర్ల: తాలిపేరు ప్రధాన కాల్వల మరమ్మతులకు పట్టిన గ్రహణం వీడడం లేదు. నాడు నిధులు లేక మరమ్మతులు చేపట్టకపోగా నేడు నిధులున్నా పనులు జరగడం లేదు. దీంతో ఆయకట్టు పరిధి లోని సాగు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని పెదమిడిసిలేరు వద్ద గల తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు కింద ఏటా ఖరీఫ్లో అధికారికంగా 24,700 ఎకరాలు, అనధికారికంగా మరో 15వేల ఎకరాల్లో పంటలు సాగ వుతున్నాయి. ఈ ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో విస్తరించి ఉండగా దీనికి 34 డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు ఉన్నాయి. వీటి కింద 21,100 ఎకరాల్లో అధికారికంగా, 12వేల ఎకరా ల్లో అనధికారికంగా పంటలు సాగవుతున్నాయి. ఎడమ కాల్వ చర్ల మండలం దోశిళ్లపల్లి, భూముల్లంక, రైస్పేట, చర్ల, లింగాపురం, మొగళ్లపల్లి, జీపీపల్లి, చింతకుంట గ్రామాల మీదుగా విస్తరించి ఉండగా, 8 డిస్ట్రీబ్యూటరీ కెనాళ్లు ఉన్నాయి. దీని కింద అధికారికంగా 3,600, అనధికారికంగా మరో 3 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఏటా తాత్కాలికమే.. కాల్వలతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల మరమ్మతులకు ఏళ్లుగా నిధులు మంజూరుకాలేదు. గతేడాది ప్రాజెక్టు, ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల మరమ్మతులకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గత జనవరిలోనే పనులు ప్రారంభించాల్సి ఉండగా రబీ పంటలకు సాగునీరు ఇవ్వాలని రైతులు పట్టుబట్టడంతో పనులు వాయిదా వేశారు. ఏప్రిల్ తర్వాత కూడా పనులు చేపట్టకపోవడంతో మళ్లీ సాగు సమయానికి పనులు పూర్తికావని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో ప్రధాన కాల్వల వంతెనలు, యూటీల నిర్మాణాల పనులు నిలిచిపోగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు సంబంధించిన మరమ్మతు పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అవకాశం ఉన్నా.. తాలిపేరు ఎడమ ప్రధాన కాల్వపై పలుచోట్ల ఉన్న యూటీలు కృంగిపోయి సాగునీరు చివరి భూముల వరకు వెళ్లకపోవడంతో గత ఏడాది ఖరీఫ్లో ఇరిగేషన్ అధికారులు సిమెంట్ బస్తాలను ఏర్పాటు చేసి తాత్కాలిక మరమ్మతులు చేసి అతికష్టం మీద సాగునీటిని కాల్వ ద్వారా మళ్లించారు. ప్రస్తుతం అవి ధ్వంసం కావడంతో ఖరీఫ్ సీజన్లో సాగునీటి సరఫరాకష్టమే. ఏప్రిల్లో పనులు ప్రారంభించి జూన్ రెండో వారం నాటికి పూర్తి చేసే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు మండిపడుతునానరు. తాలిపేరు ప్రాజెక్టు, కాల్వలపై అధికారులు, ప్రభుత్వం ఎప్పుడూ నిర్లక్ష్యమే ప్రదర్శిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.ముందుగా చేస్తే బాగుండేది.. ప్రధాన కాల్వకు సంబంధించి రబీసాగు పూర్తవ్వగానే పను లు ప్రారంభిస్తే బాగుండేది. గత ఏడాదే యూటీలు కూలి పోయి సాగునీరు అతికష్టం మీద పొలాలకు చేరింది. మళ్లీ యూటీలకు తాత్కాలిక మరమ్మతులు చేయాల్సిన పరిస్థితే ఉంది. అధికంగా వర్షాలు కురిస్తే ఇసుక బస్తాలు కూడా కొట్టుకుపోతాయి. –కూరపాటి వీర్రాజు, రైతు, ఆర్.కొత్తగూడెం సమయాభావంతోనే పనుల వాయిదా సమయాభావం వల్ల ప్రధాన కాల్వకు సంబంధించి అండర్ టన్నెళ్ల మరమ్మతులు వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ పనులు చేయాలంటే కనీసం రెండు నెలలు పడుతుంది. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు సంబంధించిన మరమ్మతులు ప్రారంభించాం. అండర్ టన్నెళ్ల పనులూ చేపడతాం. –ఎస్డీ అహ్మద్ జానీ, ఈఈ, ఇరిగేషన్ -
నాటుసారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
భద్రాచలంఅర్బన్: ద్విచక్రవాహనంపై నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని బ్రిడ్జి సెంటర్ వద్ద మంగళవారం జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఏపీలోని ఎటపాక మండలం గుండువారిగూడెం గ్రామానికి చెందిన నితిన్ తన ద్విచక్రవాహనంపై 23 లీటర్ల నాటుసారాను బూర్గంపాడు మండలం సారపాకకు తరలిస్తుండగా పట్టుకున్నామని ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నితిన్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని, నాటుసారా, గంజాయి రవాణాకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 18004252523కు అందించాలని సీఓ పేర్కొన్నారు. దాడుల్లో కరీం, బాలు, సుధీర్, హనుమంతరావు, హరీశ్, ఉపేందర్ పాల్గొన్నారు. గంజాయిపై డాగ్స్క్వాడ్తో తనిఖీలుఅశ్వాపురం: గంజాయి నియంత్రణ చర్య ల్లో భాగంగా మంగళవారం నార్కోటిక్ గ్రేసీడాగ్తో ఎస్ఐమధుప్రసాద్ ఆధ్వర్యం లో పోలీసులు మండలంలోని చవిటిగూడెంలో అనుమానితుల ఇళ్లు, పొద లు, ఖాళీస్థలాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మధుప్రసాద్ మా ట్లాడుతూ.. యువత, విద్యార్థులు గంజా యి లాంటి మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. మండలంలో గంజాయి నిర్మూలనలో ప్రజలు, యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గంజాయి పట్టివేత?జూలూరుపాడు: అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయిని మంగళవారం స్థానిక పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. భద్రాచలం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీలో గంజాయి తరలిస్తుండగా జూలూరుపాడు మండల పరిఽధిలో వా హనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. లారీలో భారీ మొత్తంలోనే గంజాయి దొరికినట్లు తెలిసినా.. పోలీసులు వివరాలు వెల్లడించేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు దమ్మపేట: భూ వివాదం విషయంలో రెండు వర్గాల మధ్య పరస్పర దాడులు జరగగా.. ఓ వర్గంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మరో వర్గంపై దాడి కేసు నమోదైంది. పోలీసులు మంగళవారం వివరాలు వెల్లడించారు. మండలంలోని అఖినేపల్లి శివారులోని పామాయిల్ తోట తమదే అంటూ దమ్మపేటకు చెందిన కునుసోతు వెంకటేశ్వరరావు, పద్మ దంపతులు పామాయిల్ ఆకులను కోయడం ప్రారంభించారు. అదే సమయంలో తోటలోకి దమ్మపేటకు చెందిన మారిశెట్టి రామారావు, శ్రీనివాసరావు సోదరులు వచ్చి తోట తమదే అంటూ వెంకటేశ్వరరావు, పద్మను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. -
లాల్ సలామ్ కామ్రేడ్!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీపీఐ (మావోయిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో కన్నుమూసి వారం దాటింది. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారమే నంబాల మృతికి కారణమంటూ.. ఆ పార్టీకి చెందిన విప్లవ్ సోమవారం లేఖ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీస్ అధికారులు ఎన్కౌంటర్ జరిగిన తీరును వెల్లడించారు. ఆ వివరాలు ‘సాక్షి’కి ప్రత్యేకం.మూడో రోజు ఎదురుకాల్పులుఛత్తీస్గఢ్లోని అబూజ్మఢ్ అడవుల్లో పీఎల్జీఏ కంపెనీ–7 సంచరిస్తోందన్న సమాచారం రావడంతో అక్కడ మావో యిస్టు కీలక నేత ఉన్నట్టుగా భావించిన పోలీసులు ఈనెల 19న సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. సుక్మా, బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ యూనిట్లతో కుడ్మేల్–కలజా–జట్లూర్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆరోజు ఇరువర్గాల మధ్య నాలుగుసార్లు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నా భద్రతా దళాలకు సానుకూల ఫలితం రాలేదు. అయినప్పటికీ అలసిపోకుండా 20వ తేదీ కూడా ముందుకు సాగారు. ఆ రోజు రాత్రి అడవిలోనే క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక 21వ తేదీ తిరిగి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన కాసేపటికే డీఆర్జీ బృందాలను ముందుండి నడిపిస్తున్న జవాన్పై సెంట్రీ విధుల్లో ఉన్న ఓ మావోయిస్టు ఉదయం 7 గంటల సమయాన తుపాకీ మడమతో కొట్టి దాడి చేశాడు. ఇరువురి మధ్య జరిగిన పెనుగులాటలో తుపాకులు ఫైర్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఇటు భద్రతా దళాలు, అటు మావోయిస్టులు అప్రమత్తమై పొజిషన్ తీసుకున్నారు. అప్పటికే మూడు రోజులుగా భద్రతా దళాల ఆపరేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ వస్తున్న సాయుధులైన మావోయిస్టుల బృందం ఎదురుగా ఉన్న భద్రతా దళాల వలయాన్ని ఛేదించుకుని దక్షిణ దిశగా వెళ్లేందుకు యత్నించింది. అయితే అదే దిశగా మరో డీఆర్జీ టీమ్ కాల్పులు జరుపుతుండటంతో వెనక్కి తిరిగి ఉత్తర దిశగా వెళ్తూ కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశానికి చేరారు. అక్కడి నుంచి భద్రతా దళాల మీద కాల్పులు జరపడం మొదలెట్టారు. ఇదే సమయాన మావోయిస్టులంతా వలయాకారంలోకి వచ్చి మధ్యలో ఓ వృద్ధుడైన వ్యక్తిని కాపాడటానికి యత్నించడం భద్రతా దళాలు గమనించాయి. దీంతో వలయంలో ఉన్న పెద్ద మనిషి కచ్చితంగా పార్టీకి చెందిన టాప్ర్యాంక్ లీడరై ఉంటాడనే నమ్మకం, పట్టుదలతో కాల్పులు జరుపుతూ మావోయిస్టుల వలయం వైపు దూసుకెళ్లారు.శక్తివంచన లేకుండా ప్రయత్నించి..అటువైపు 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఉండగా.. డీఆర్జీ బలగాలు దాదాపు 1000 మంది నాలుగు బృందా లుగా విడిపోయి కాల్పులు ప్రారంభించారు. ఇరువైపులా అర గంట పాటు కాల్పులు జరిగాయి. మధ్యలో ఉన్న ముఖ్యమైన వ్యక్తికి గార్డుగా నిలిచిన మావోయిస్టుకు తూటా తాకడంతో పడిపోయాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే కీలకమైన వ్యక్తికి సైతం తూటా తాకడంతో ఆయన కూడా పడిపోయారు. అప్పటివరకు వలయంగా ఉండి తమ నాయకుడిని కాపాడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించిన మావోలు ‘లాల్ సలామ్ కామ్రేడ్.. పీఎల్జీఏ జిందాబాద్’ అని నినాదాలు చేస్తూ వలయం నుంచి విడిపోయి చెల్లాచెదురై భద్రతా దళాల వైపు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. కానీ వారిని వెంటాడుతూ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో చాలా మంది చనిపోగా కొందరు తప్పించుకున్నారు. కాల్పులు ఆగిపోయాక ఘటనాస్థలిలో పరిశీలించగా మావోయిస్టులు తమ ప్రాణాలకు తెగించి కాపాడేందుకు యత్నించిన కీలక వ్యక్తి అక్కడే పడిపోయి ఉన్నాడు. డీఆర్జీ జవాన్లలో కొందరు ఆయనను మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ డీఆర్ దాదా అలియాస్ బసవరాజుగా గుర్తించారు. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా కేశవరావుతో కలిసి మొత్తం 27 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. నంబాలకు తూటా ఎక్కడ తాకింది?ఎన్కౌంటర్ మృతుల ఫొటోలను పరిశీలిస్తే ఎక్కువ మంది మావోయిస్టుల తలలకు తూటాల గాయాలు కనిపించాయి. ఎదురు కాల్పులు జరిగే సందర్భాల్లో గాయపడి పారిపోతూ కిందపడిన / చనిపోయిన ప్రత్యర్థుల శరీరాలను స్వాధీనం చేసుకునే క్రమాన ముందు జాగ్రత్తగా తలపై కాలుస్తుంటారు. అందుకే నంబాల రక్షణ టీమ్లో చాలామందికి హెడ్షాట్స్ కనిపించాయి. అయితే నంబాలకు మాత్రం అలా కనిపించలేదు. శరీరంలో మరేదైనా కీలక భాగంలో తూటా గాయం కావడంతోనే ఆయన మరణించి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రాణాలతో పట్టుబడిన నంబాలను భద్రతా దళాలు కాల్చి చంపాయని మావోయిస్టులు తమ లేఖలో ఆరోపించారు.నంబాలకు కుటుంబసభ్యులకన్నీటి నివాళిమృతదేహం అప్పగించకపోవడంతో కలత చెందిన తల్లి, సోదరుడు ఏపీ హైకోర్టులో చత్తీస్గఢ్ పోలీసులపై కోర్టు ధిక్కార కేసు నమోదు టెక్కలి: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు చిత్రపటం వద్ద కుటుంబ సభ్యులు మంగళవారం నివాళులు అరి్పంచారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామంలో కేశవరావు నివాసం వద్ద తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లేశ్వరరావుతోపాటు కుటుంబ సభ్యులంతా నివాళులు అర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు మరో మారు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా చత్తీస్గఢ్ పోలీసులు దాన్ని ధిక్కరించడంపై కేశవరావు తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లేశ్వరరావు తరఫున పౌర హక్కుల సంఘం మరోమారు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేశారు. చత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమితాబ్ జైన్, ఆ రాష్ట్ర డీజీపీ అరుణదేవ్ గౌతమ్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తదితర అధికారులను ప్రతివాదులుగా చేర్చినట్లు తెలుస్తోంది. -
'క' సినిమాను గుర్తుచేస్తున్న తపాలా ఉద్యోగి నిర్లక్ష్యం
భద్రాద్రి జిల్లా: మీరు కిరణ్ అబ్బవరం నటించిన 'క' సినిమా చూశారా.. ? అదే తరహాలో ఓ తపాలా ఉద్యోగి తన బా ధ్యతలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును గ్రామస్తులు సోమవారం వెలుగులోకి తీసుకొచ్చారు. సదరు ఉద్యోగిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. అశ్వారావుపేట మండలం ఆసుపాక బ్రాంచ్ పోస్టుమాస్టర్ శశాంక్.. పోస్టు ద్వారా గ్రామస్తులకు వచ్చిన ఆధార్ కార్డులు, బీమా పత్రాలు, పాన్, ఏటీఎం కార్డులతో పాటు పోలీస్ శాఖ ద్వారా వచ్చే నోటీసులను సైతం గత ఏడాది కాలంగా ఆయా వ్యక్తులకు అందించకుండా తన వద్దే ఉంచుకున్నాడని, తాము అడిగితే రాలేదని సమాధానం చెప్పేవాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులకు పోస్టు ద్వారా వచ్చిని లేఖలను కూడా తన గదిలోనే పడేయడంతో అవి కుప్పలుగా పేరుకుపోయాయని తెలిపారు. తమకు రావాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్ కార్డులు రాకపోవడంతో కొందరు అనుమానం వచ్చి ఉద్యోగి గదిలోకి వెళ్లి చూడగా కుప్పలుగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. వీటిపై సదరు ఉద్యోగిని స్థానికులు ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వారంతా అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై అశ్వారావుపేటలోని ప్రధాన తపాలా కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ తతంగం అంతా చూస్తుంటే కిరణ్ అబ్బవరం నటించిన 'క' సినిమా గుర్తుకు వస్తుందని అక్కడి గ్రామంలోని యువకులు అంటున్నారు. -
డీర్పార్కును అభివృద్ధి చేయాలి
● వెలుగుమట్ల తరహాలో తీర్చిదిద్దాలి ● ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ పాల్వంచరూరల్ : కిన్నెరసాని డీర్పార్క్ను అభివృద్ధి చేయాలని, ఖమ్మంలోని వెలుగుమట్ల పార్కు తరహాలో తీర్చిదిద్దాలని ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ సూచించారు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని సోమవారం అయన సందర్శించారు. వైల్డ్లైఫ్ చెక్పోస్టు పనితీరు, డీర్పార్కులోని దుప్పులను, అద్దాలమేడ, కాటేజీలను పరిశీలించారు. పనుల వివరాలపై సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. కిన్నెరసాని నుంచి అడవి దున్నలు అధికంగా సంచరించే రేగళ్ల ఫారెస్ట్ వరకు సఫారీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైతే పర్యాటకులను అకట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. చిల్డ్రన్స్ పార్కును కూడా అభివృద్ధి చేయాలని చెప్పారు. ఆయన వెంట రేంజర్ కవిత మాధురి, బీట్ అధికారి ఉమాదేవి, వైల్డ్లైఫ్ సిబ్బంది ఉన్నారు. -
ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని.. ● భద్రాచలం భగవాన్దాస్ కాలనీకి చెందిన సోళ్ల రత్నమ్మ.. అశ్వాపురం మండలం చింతిర్యాల పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 80/3, 80/4లో 1.03 ఎకరాల భూమి తన సోదరి మరియమ్మ పేరున ఉందని, ఆమె మరణించినందున వారసుల పేరున పట్టా మార్పిడి చేయాలని దరఖాస్తు చేయగా కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్కు ఎండార్స్ చేశారు. ● పాల్వంచ గాంధీనగర్కు చెందిన నడిగిరి మణికంఠ తాను హీమోపీలియా వ్యాధితో బాధపడుతున్నానని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో ఏ పనీ చేయలేకపోతున్నానని, దివ్యాంగ పింఛన్ కోసం సదరమ్ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరగా ఆ దరఖాస్తును డీఎంహెచ్ఓకు ఎండార్స్ చేశారు. ● పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న పావురాల రామతులశమ్మ.. తాను రజకురాలినని, ఇసీ్త్ర చేస్తూ ముగ్గురు కుమార్తెలను పోషిస్తున్నానని, పాల్వంచ మున్సిపాలిటీ మార్కెట్ కాంప్లెక్స్లో ఒక గదిని కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేయగా మున్సిపల్ కమిషనర్కు పంపించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం అవసరం
పాల్వంచ: ప్రస్తుతం తరగతి గది డిజిటల్ తరగతి గదిగా మారనున్న తరుణంలో ఉపాధ్యాయులు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకోవాలని, తద్వారా విద్యా బోధన చేయాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి అన్నారు. స్థానిక కొమ్ముగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా కృషి చేయాలని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని, తద్వారా ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడుతుందని వివరించారు. అనంతరం కేటీపీఎస్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న హిందీ ఉపాధ్యాయుల శిక్షణ శిబి రాన్ని సందర్శించారు. భోజనం చేసి కోర్సు డైరెక్టర్ను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా మానిట రింగ్ అధికారి ఎ.నాగ రాజశేఖర్, సెంటర్ ఇన్చార్జ్ లు ఎస్కే.సైదులు, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. డీఈఓ వెంకటేశ్వరా చారి -
కేసులు సత్వరమే పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం లేకుండా సత్వరమే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. తన కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్లో వివిధ సమస్యలపై బాధితులు అందించిన దరఖాస్తులను స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలను తీసుకోవడం ద్వారా వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం తగదు టేకులపల్లి : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ రోహిత్రాజు సిబ్బందిని హెచ్చరించారు. సోమవారం ఆయన టేకులపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చేలా మెలగాలని సూచించారు. నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టేకులపల్లి సీఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.గ్రీవెన్స్లో ఎస్పీ రోహిత్రాజ్ -
ఉపాధి పనుల పరిశీలన
చండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లి, రావికంపాడు గ్రామాల్లో సోమవారం కేంద్ర బృందం సభ్యులు రాకేష్కుమార్, అమిత్కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వారు పరిశీలించారు. ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన మట్టి పనులను తనిఖీ చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు సదుపాయాల కల్పన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, నీడ కోసం టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఏర్పాటు చేయడం లేదని, పలుగు పారలు ఇవ్వడం లేదని కూలీలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మునగ పంట సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు. రుణాల మంజూరు, రికవరీ ఎలా ఉన్నాయని స్వయం సహాయక సంఘాల మహిళలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట డీఆర్డీఓ విద్యాచందన, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ ఉన్నారు. నేడు పాల్వంచకు.. పాల్వంచరూరల్ : కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈజీఎస్, ఐకేపీ శాఖలకు చెందిన అభివృద్ధి పనుల పరిశీలనకు మంగళవారం కేంద్ర బృందం సభ్యులు రాకేష్కుఉమార్, అమిత్కుమార్ పాల్వంచ మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు కిన్నెరసాని, 12 గంటలకు తోగ్గూడెం గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు.తిప్పనపల్లి, రావికంపాడులో కేంద్ర బృందం పర్యటన -
నిష్క్రమణ..
బరువెక్కిన గుండెలతోభద్రాచలం : నిత్యం శ్రీరామ నామస్మరలతో తన్మయత్వం, రామయ్య చెంతకు వచ్చే భక్తులతో ఆత్మీయ పలకరింపులు, రామనామ కీర్తనల నడుమ జీవనయానం.. ఇవీ రామాలయ పరిసర ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు సాగించే వారి జీవన శైలి. ఇవన్నీ ఇక నుంచి దూరం కానున్నాయనే బాధ గుండెలను పిండేస్తున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో దుకాణాలను ఖాళీ చేస్తున్నారు. జీవనోపాధి దూరం కావడంతో పాటు భద్రాచల రామయ్యతో ఉన్న అనుబంధం ఇక వారికి అనుభూతులుగానే మిగలనున్నాయి. విస్తరణకు నాంది.. రామాలయ అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రారంభమైంది. ఇప్పటికే ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయగా, ఆయా స్థలాల్లోని దుకాణాలను యజమానులు, అద్దెదారులు ఖాళీ చేయడం ప్రారంభించారు. పడమర మెట్ల వైపు, దక్షిణ భాగంలో ఉన్న దుకాణాలన్నింటినీ దాదాపుగా ఖాళీ చేశారు. సోమవారం అక్కడి దుకాణాలను తొలగించి బొమ్మలు, వస్తువులను వాహనాల ద్వారా తరలించారు. కాగా భూ సేకరణ కోసం ఖాళీ చేసిన చిరు వ్యాపారుల్లో అత్యధికంగా అద్దెకు ఉంటున్న వారే. దీంతో తమకు ప్రభుత్వమే కాంప్లెక్స్ నిర్మించి అందులో దుకాణాలను కేటాయించాలని కోరుతున్నారు. ఈ మేరకు మంత్రులను, స్థానిక ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సైతం అందజేశారు. కాగా, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ ఎనిమిది మంది ఖాళీ చేస్తేనే.. కాగా మాడ వీధుల విస్తరణలో భూ సేకరణకు ప్రభుత్వం రూ. 35 కోట్లు విడుదల చేసింది. ఇందులో అందరూ నష్టపరిహారం తీసుకోగా ఎనిమిది మంది మాత్రం నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పరిహారం సరిపోవడం లేదని, తాము ఖాళీ చేసేది లేదని భీష్మించారు. దీంతో ప్రస్తుతం ఇతరులు ఖాళీ చేసినా.. వీరు కూడా ఖాళీ చేయకుంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని ఆలయ అధికారులకు అందించే పరిస్థితి లేదు. భూమి మొత్తం అందకుంటే తదుపరి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఎనిమిది మందితో రెవెన్యూ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వారు అంగీకరించకపోతే న్యాయపరంగా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరి చూపు ఆ ఎనిమిది మంది వైపే ఉంది. జిల్లా అధికారులు సైతం దీనిపై త్వరగా దృష్టి సారించి భూ సేకరణ పూర్తయ్యేలా చూడాలని భక్తులు కోరుతున్నారు. దుకాణాలు ఖాళీ చేస్తున్న వ్యాపారులు రామాలయ మాడ వీధుల్లో భూ సేకరణకు నాంది -
గోదారికీ అదే సమస్య..
నాలుగు లేన్లుగా చేస్తేనే.. ప్రస్తుతం తిరిగే వాహనాల రద్దీకే కొత్తగూడెం – ఖమ్మం రహదారి సరిపోవడం లేదు. ఈ మార్గంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా తల్లాడ నుంచి ఖమ్మం వరకై తే అసాధ్యమనే చెప్పాలి. అయితే ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనులు చివరి దశకు రావడంతో వైరా – ఖమ్మం మధ్య ట్రాఫిక్ సమస్య తీరినట్టే కానీ.. తల్లాడ – కొత్తగూడెం వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పటికే కొత్తగూడెం – తల్లాడ – వైరా – జగ్గయ్యపేట వరకు ఉన్న 100 కి.మీ. రోడ్డును జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు పంపారు. ఈ మార్గానికి జాతీయ హోదా సాధించడంతో పాటు త్వరితగతిన పనులు చేపడితే పుష్కరాల నాటికి ట్రాఫిక్ చిక్కులు రావు. కనీసం తల్లాడ – కొత్తగూడెం మార్గాన్ని అయినా వేగంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. అలాగే భద్రాచలం – సారపాక – బూర్గంపాడు – కుక్కునూరు – అశ్వారావుపేట మీదుగా రాజమండ్రి వరకు గల రోడ్డును గతంలో జాతీయ రహదారిగా గుర్తించారు. కానీ పోలవరం కారణంగా ఈ రోడ్డు అభివృద్ధి పనులు పక్కన పెట్టారు. దీంతో ఈ జాతీయ రహదారి అలైన్మెంట్ను సారపాక – బూర్గంపాడు – ములకలపల్లి – దమ్మపేట – అశ్వారావుపేటగా మార్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ట్రాఫిక్ చిక్కులు ఎదురైనప్పుడు వాహనాలు మళ్లించేందుకు ప్రత్యామ్నాయమార్గంగా ఉపయోగపడుతుంది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాళేశ్వరం దగ్గర సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రమించింది. భారీగా నిధులు కేటాయించి పనులు చేపట్టింది. కానీ పుష్కరాలు మొదలయ్యాక తలెత్తిన ట్రాఫిక్ సమస్య భక్తులను ఇక్కట్ల పాలు చేసింది. పన్నెండు రోజుల పాటు జరిగిన పుష్కరాల్లో దాదాపు తొమ్మిది రోజులు ట్రాఫిక్ చిక్కులు భక్తులకు తప్పలేదు. నడి వేసవి, నట్టడవిలో భక్తులు నీళ్ల కోసం, నీడ కోసం అల్లాడిపోయారు. పుష్కర ఘాట్ వద్ద ఏర్పాట్లపై పెట్టిన శ్రద్ధ వాహనాల క్రమబద్ధీకరణ, అందుకు అవసరమైన రోడ్ల విస్తరణ, కొత్త మార్గాల నిర్మాణంపై లేకపోవడం వల్లే ఈ సమస్య ఎదురైంది. జయశంకర్ భూపాలపల్లి తరహాలోనే భద్రాద్రి జిల్లా కూడా అడవులు, కొండలు, వాగులు, నదులతో నిండి ఉంది. కాబట్టి ముందుస్తు ప్రణాళిక లేకుంటే 2027 గోదావరి పుష్కరాలకు ఇక్కట్లు తప్పవు. రోడ్డు మార్గాల విస్తరణపై ఇప్పుటి నుంచే దృష్టి సారించాల్సిన అవసరముంది. బాటిల్నెక్గా కిన్నెరసాని జగదల్పూర్ – విజయవాడ జాతీయ రహదారి పరిధిలోకి వచ్చే కొత్తగూడెం – భద్రాచలం మార్గంలో భద్రాచలం వద్ద గోదావరిపైన, కొత్తగూడెంలో ముర్రేడు, గోదుమవాగులపైన రెండో వంతెనలు నిర్మించారు. కానీ పాల్వంచ దాటిన తర్వాత కిన్నెరసానిపై కొత్త వంతెన నిర్మాణం చేపట్టలేదు. గతంలో నిర్మించిన వంతెన మీదుగానే రాకపోకలు సాగుతున్నాయి. ఇక్కడ రెండో వంతెన నిర్మించకుంటే పుష్కరాల సమయంలో ఈ వంతెన బాటిల్నెక్గా మారి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. రెండో వంతెన నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గతేడాది జూన్లోనే రూ. 20.20 కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ఇకనైనా జాప్యం చేయకుండా పనులు ప్రారంభించి గోదావరి పుష్కరాల నాటికి కొత్త వంతెన అందుబాటులోకి వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇల్లెందు పనులు ఇంకెప్పుడు.. కొత్తగూడెం – ఇల్లెందు – మహబూబాబాద్ మీదుగా వలిగొండ వరకు జై శ్రీరామ్ పేరుతో జాతీయ రహదారి 930పీ విస్తరణ పనులు రెండేళ్లుగా టెండర్ల దశలోనే మగ్గిపోతున్నాయి. ఈ రోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ, అటవీ శాఖ అనుమతులు వంటివి చివరి దశలో ఉన్నాయి. ఇల్లెందు – కొత్తగూడెం మధ్య నాలుగు వరుసల రోడ్డు నిర్మిస్తే హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చే వాహనాలను ఇల్లెందు మీదుగా మళ్లించేందుకు వీలుంటుంది. ఫలితంగా ఖమ్మం –కొత్తగూడెం – భద్రాచలం మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మోరంపల్లి బంజర నుంచి బూర్గంపాడు మీదుగా సారపాక వరకు ఉన్న రాష్ట్ర రహదారిని కూడా విస్తరించాలి. దీంతో పాటు భద్రాచలం – దుమ్మగూడెం – చర్ల – వాజేడు రహదారిని కూడా ట్రాఫిక్ మళ్లింపు విషయంలో పరిగణనలోకి తీసుకోవచ్చు.సరస్వతి పుష్కరాలకు ట్రాఫిక్ చిక్కులు రోడ్ల విస్తరణపై ప్రణాళిక లేకపోవడమే కారణం 2027 గోదావరి పుష్కరాలకు సైతం ఇదే సమస్య ఎదుర య్యే అవకాశ ం పాత రోడ్ల విస్తరణ, కొత్త మార్గాలు అభివృద్ధి చేస్తే భేష్ ఇప్పుడు పనులు ప్రారంభిస్తేనే అప్పటికి సిద్ధం -
సర్వేయర్లుగా రాణించాలి
చుంచుపల్లి: కొత్తగూడెం యూనివర్సిటీ ఆఫ్ మైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే చేసేందుకు సర్వేయర్లుగా ఎంపికై న 426 మందికి శిక్షణ ఇస్తున్నామని, అభ్యర్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని రాణించాలని సూచించారు. ప్రభుత్వ కొత్త భూ రికార్డుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అభ్యర్థులకు మొత్తం 50 రోజుల పాటు శిక్షణ ఇస్తామని, రెండు బ్యాచ్లుగా విభజించి ఉదయం థియరీ, మధ్యాహ్నం క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి సర్వేపై శిక్షణ ఇస్తారని వివరించారు. తరగతులకు హాజరైన అభ్యర్థుల విద్యార్హత సర్టిఫికెట్లను ప్రత్యేక కౌంటర్ల ద్వారా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ వారికి సర్వే గొలుసులు, కాలిక్యులేటర్, స్కేల్, పెన్సిల్, నోట్ బుక్స్తో పాటు స్టడీ మెటీరియల్ కిట్లను అందించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏడీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణా తరగతుల ప్రారంభంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఏకలవ్య కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ భద్రాచలం అర్బన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలల్లో జూనియర్ ఇంటర్లో ఖాళీగా ఉన్న 302 సీట్ల భర్తీకి సోమవారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలంలోని ఈఎంఆర్ఎస్ కళాశాలలో కన్వీనర్ నాగేశ్వరరావు, ఆర్సీఓ అరుణకుమారి నేతృత్వాన కౌన్సెలింగ్ ఏర్పాటుచేయగా 577 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖాళీగా ఉన్న 302 సీట్లలో మెరిట్ ప్రకారం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు భద్రాచలం కళాశాల ప్రిన్సిపాల్వందనాబీ దాస్ తెలిపారు. దీంతో కళాశాలల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు విజయ్కుమార్, సంజయ్ మల్కర్, ప్రశాంత్, నితిన్సింగ్, విజయేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో అప్రెంటిస్షిప్నకు అవకాశం ఖమ్మంమయూరిసెంటర్: డీజిల్ మెకానిక్ ట్రేడ్లో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఖమ్మం రీజియన్లోని ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీస్షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్ఎం ఏ.సరిరామ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అర్హత కలిగిన అభ్యర్థులు అప్రెంటిస్షిప్ ఇండియా వెబ్సైట్లో టీజీఎస్ ఆర్టీసీ లొకేషన్ను ఎంపిక చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలాగే, ఎస్సెస్సీ, ఐటీఐ మెమోలు, కుల ధ్రవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ అప్లోడ్ చేయాలని తెలిపారు. జూన్ 10వ తేదీ లోపు నమోదుకు అవకాశముందని ఆర్ఎం ఓ ప్రకటనలో వెల్లడించారు. బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ బ్రోచర్లు ఆవిష్కరణభద్రాచలంఅర్బన్ : జిల్లా బ్యాడ్మింటన్ మీట్ బ్రోచర్ను ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి మాట్లాడుతూ.. జూన్ 7, 8 తేదీల్లో సుజాతనగర్ మండలం వేపలగడ్డలోని ఇండోర్ స్టేడియంలో పోటీలు జరుగనున్నాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనే సింగిల్స్ జట్టుకు రూ.800, డబుల్స్/ మిక్స్డ్ డబుల్స్కు రూ.1000 ఎంట్రీ ఫీజు చెల్లించాలని, ప్రభుత్వ పాఠశాల / కాలేజీ విద్యార్థులకు రూ.200 మాత్రమే ఉంటుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం సాధారణ విద్యార్థులు ఠీఠీఠీ. ఛ్టటౌుఽజీుఽ్ఛ. జీుఽ ద్వారా నమోదు చేసుకోవచ్చునని, ప్రభుత్వ విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్లతో పాటు ఎంట్రీలను 9059722803 నంబర్కు పంపాలని తెలిపారు. కార్యక్రమంలో పి.హరి ప్రసన్న కుమార్, చంద్రకళ, నాగరాజు, హసన్, పి. ఉదయ్, అఖిల్ పాల్గొన్నారు.