breaking news
Bhadradri
-
వాటర్ ట్యాంక్ ఎక్కిన గిరిజనుడు
అశ్వారావుపేటరూరల్: తనకు అర్హత ఉన్నా ప్ర భుత్వం, అధికా రులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని ఆగ్రహించిన ఓ గిరిజనుడు వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన బుధవా రం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మామిళ్లవారిగూడెం గ్రామ పంచాయతీ ఊసిర్లగూడేనికి చెందిన జెట్టి మోహన్రావు.. అధికారులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదని, మద్యం సేవించి మత్తులో మిషన్ భగీరథ ట్యాంక్పైకి ఎక్కాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోతే ట్యాంక్ పైనుంచి కిందకు దూకేస్తానని బెదిరించాడు. దాదాపు గంటపాటు హల్చల్ చేశాడు. స్థానికులు గమనించి మోహన్రావుకు సర్దిజెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేకునే సమయానికి మోహన్రావు కిందికి దిగా డు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. పోగొట్టుకున్న సెల్ఫోన్ల అప్పగింతకొత్తగూడెంటౌన్: సెల్ఫోన్లు పోగొట్టుకున్న తొమ్మిది మందికి కొత్తగూడెం వన్టౌన్ సీఐ ఎం.కరుణాకర్ బుధవారం తిరిగి అప్పగించా రు. సీఐ మాట్లాడుతూ.. కొత్తగూడెం పట్టణ పరిధిలోని పోస్టాఫీస్, బస్టాండ్, సింగరేణి ప్రధాన కార్యాలయాల ప్రాంతాల్లో సెల్ఫోన్లు పోగొట్టుకున్నవారు ఫిర్యాదు చేయగా.. సెల్ఫోన్లను గుర్తించి తిరిగి అందించామని చెప్పారు. సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’చర్ల: మండలంలోని సత్యనారాయణపురంలోని సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్ ముకేశ్కుమార్ సింగ్ ఆదేశాల మేరకు బుధవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల్లో భాగంగా చర్ల మండలంలోని పూసుగుప్ప, ఉంజుపల్లి, చెన్నాపురం, సత్యనారాయణపురం సీఆర్పీఎఫ్ క్యాంపుల సమీప గ్రామాల్లో జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన కార్యాక్రమాల్లో కమాండెంట్ ముకేశ్కుమార్సింగ్, డిప్యూటీ కమాండెంట్ రవిశంకర్శర్మ, రాజేశ్గోడ్రా, ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్సింగ్ మాట్లాడారు. గురాయ్తోగులో పెద్దపులి పాదముద్రలు..!కొత్తగూడ రేంజ్ నుంచి వస్తున్న పులి: రేంజర్ కరకగూడెం: కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న పెద్దపులి సంచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం కరకగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన మేకలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్తున్న క్రమంలో గురాయ్తోగు వద్ద పెద్దపులి పాదముద్రలను గమనించాడు. భయంతో వెంటనే మేకలతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయమై ఏడూళ్లబయ్యారం రేంజర్ తేజస్విణిని వివరణ కోరగా.. కొత్తగూడ రేంజ్ నుంచి పెద్దపులి వస్తున్నదని, రెండు రోజులుగా మండలంలోని పలు అటవీ ప్రాంతాల్లో పులి కోసం సిబ్బందితో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని, ఇప్పటివరకు ఎక్కడా దాని పాదముద్రలు కనిపించలేదని వివరించారు. లింగాల రేంజ్లో పులి సంచరిస్తున్నదని ఇటువైపు కూడా వచ్చే అవకాశం ఉందని, అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాగా, పెద్దపులి సంచారంపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో ఫారెస్ట్ సిబ్బందికి గాలింపు చర్యలు పెనుసవాల్గా మారాయి. హోంగార్డుకు తీవ్ర గాయాలుతిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం పెట్రోల్బంక్ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంతో హోంగార్డుకు తీవ్రగాయాలయ్యాయి. గోల్తండాకు చెందిన ఉపేంద్రయ్య(ఉపేందర్) హోంగార్డు(డ్రైవర్)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన బుధవారం రాత్రి బైక్పై వెళ్తుండగా పెట్రోల్ బంక్ సమీపాన కింద పడడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో సీహెచ్సీలో చికిత్స అనంతరం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
టేకులపల్లి: కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం మండలంలో పర్యటించింది. బుధవారం సేద్య విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్, విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. హేమశరత్చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ మండలంలోని బోడు గ్రామంలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. పత్తి పంటలో నీరు నిల్వకుండా చూసుకోవాలని సంచించారు. అధిక తేమతో వేరుకుళ్లు, మెగ్నీషియం ధాతు లోపం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వేరుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాము లు లీటర్ నీటికి లేదా కార్బండిజమ్ 1 గ్రాము లీటర్ నిటికి కలిపి ప్రత్తి మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోయిన ప్రదేశాల్లో మొక్కల మొదళ్లలో పోయాలని పేర్కొన్నారు. అధిక తేమ ఉన్న పరిస్థితుల్లో మొక్క పోషకాలను తీసుకోలేదు కాబట్టి 191919 లేదా 13045 (మల్టీకే) 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకోవాలని చెప్పారు. వెదజల్లే పద్ధతిలో విత్తిన వరి క్షేత్రాన్ని పరిశీలించి, కలుపు నివారణకు స్టైలోపాప్ బ్యూటైల్ పెనాక్సులమ్ లీటర్ కలుపు మందును, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కె.రమేశ్, భూక్య సైదులునాయక్, నరేందర్, సక్రు తదితరులు పాల్గొన్నారు. -
మరో ప్రమాదంలో ఇద్దరు మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని కరుణగిరి బ్రిడ్జి సమీపాన ఆటోను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ప్ర మాదంలో ఆటో డ్రైవర్తో పాటు ద్విచక్రవాహనదా రుడు మృతిచెందాడు. బుధవారం తెల్లవారుజా మున జరిగిన ఈ ప్రమాదం వివరాలు... ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ పల్లపు నరేష్(28) మంగళవారం అర్ధరాత్రి రోజు మాదిరి గానే కిరాయికి వెళ్లాడు. పలు ప్రాంతాల్లో తిరిగాక తెల్లవారుజామున నాయుడుపేట వైపు వెళ్తుండగా కరుణగిరి సమీపంలో మున్నేరు బ్రిడ్జి వద్దకు రాగా నే వరంగల్ వైపు నుంచి ఖమ్మం వైపు వస్తున్న ద్విచక్రవాహనదారుడు బలంగా ఢీకొట్టా డు. ఈ ఘటనలో ఆటో, ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే, ఆటోడ్రైవర్ నరేష్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, బైక్ నడుపుతున్న ఖమ్మం బొక్కలగడ్డకు చెందిన వున్నపు రాంచరణ్ సాయి(22)సైతం మృతిచెందాడు. ద్విచక్రవాహనం వెనకాల కూర్చున్న చల్లా వీరబాబు,రాంబాబుకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆటోడ్రైవర్ నరేష్ భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐముష్కరాజు తెలిపారు. -
పెళ్లింట పెను విషాదం
● రోడ్డు ప్రమాదంలో వధువు అన్న, బంధువు దుర్మరణం ● వరుడికి కొత్త బట్టలు ఇచ్చేందుకు వెళ్తుండగా ఘటనతిరుమలాయపాలెం/ముదిగొండ: మూడేళ్ల క్రితం తండ్రి కన్నుమూశాడు. దీంతో కుటుంబ బాధ్యత తీసుకున్న యువకుడు అన్నీ తానై చెల్లెలి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాడు. 24గంటలు గడిస్తే చెల్లెలిని పెళ్లి మండపంలో చూడాల్సిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఆయనతో మరో బంధువు సైతం మృతి చెందడంతో అంత సేపు పెళ్లి సందడి నెలకొన్న ఇంట్లో విషాదం అలుముకుంది. ముదిగొండ మండలం గోకినపల్లి సమీపాన బుధవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వధువుకు మంగళస్నానం చేయించి... తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన దొండేటి నాగేశ్వరరావు – పద్మ దంపతులకు కుమారుడు సాయిరంజిత్(34) కుమార్తె సాయి మనీషా ఉన్నారు. నాగేశ్వరరావు గుండె సంబంధిత వ్యాధితో మూడేళ్ల క్రితం మృతిచెందాడు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన రంజిత్ కేరళలో ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నాడు. ఆయన చెల్లి సాయిమనీషా వివాహం నల్లగొండ జిల్లా దామరచర్ల వాసితో నిశ్చయం కాగా గురువారం వివాహం జరగాల్సి ఉంది. ఈమేరకు పిండిప్రోలులో చెల్లి సాయిమనీషా మంగళస్నానాల కార్యక్రమంలో కుటుంబంతో సంతోషంగా గడిపిన రంజిత్ వరుడికి పెళ్లి బట్టలు, ఇతర సామగ్రి ఇచ్చేందుకు సమీప బంధువు, తిరుమలాయపాలెంకు చెందిన కొండబాల శ్రీనివాసరావు(65)తో కలిసి కారులో దామరచర్ల బయలుదేరాడు. అయితే, భారీ వర్షం వస్తుండడంతో ముదిగొండ మండలం గోకినపల్లి వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జుకాగా రంజిత్, శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయం తెలియగానే పెళ్లి పనులతో హడావుడిగా ఉన్న ఆయన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. తిరుమలాయపాలెంకు చెందిన శ్రీనివాసరావుకి భార్య రమాదేవి, కుమారుడు రమేష్బాబు, కుమార్తె శరణ్య ఉన్నారు. కొంతకాలంగా కుమార్తె శరణ్య ఇంట్లోనే ఉంటుండగా ఆయన మృతితో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఘటనపై ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నెలలుగా ఎదురుచూపు..
ఇల్లెందు: రేషన్ డీలర్లు ఐదు నెలలుగా కమీషన్ అందక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించినట్లు జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల స్టాక్ కూడా సకాలంలో పంపిణీ చేశారు. ఈ మూడు నెలల కమిషన్తో పాటు ఏప్రిల్, మే నెలల కమీషన్ కూడా పెండింగ్లో ఉంది. ఇలా ఐదు నెలల కమీషన్ ప్రభుత్వం నుంచి విడుదల కాకపోవటం వల్ల రేషన్ డీలర్లు పరేషాన్ అవుతున్నారు. జిల్లాలో 443 దుకాణాలు ఉండగా 305 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. ప్రతీ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపులు తెరిచి ఉంచి లబ్ధిదారులకు రేషన్ అందించాల్సి ఉంది. ప్రభుత్వం క్వింటాకు రూ.140 కమీషన్ ఇవ్వాలి. అందులో నుంచి రేషన్ డీలర్ బియ్యం బస్తాల దిగుమతి కింద హమాలీలకు క్వింటాకు రూ.17 చెల్లించాల్సి ఉంది. 15 రోజుల పాటు రేషన్ షాపులో పనిచేసిన వర్కర్కు రోజుకు రూ.400 చెల్లించాల్సి ఉంది. రేషన్ షాపు కిరాయి కింద నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది. ఐదు నెలలుగా కమీషన్ జాప్యం కారణంగా ఇల్లు గడువటం కష్టంగా మారిందని, రేషన్ షాపు కిరాయితో పాటు వర్కర్, హమాలీలకు జేబు నుంచి చెల్లించి ఎదురు చూడాల్సి వస్తోందని మదనపడుతున్నారు. డీలర్ల పరిధిలో 2,97,189 రేషన్ కార్డులు ఉన్నాయి. గత జూన్ నెలాఖరు నాటికి 3 నెలల కోటా 17,287 మెట్రిక్ టన్నుల బియ్యం ఒకే నెలలో లబ్ధిదారులకు అందజేశారు. కష్టాలు ఎన్నో.. రేషన్ దుకాణాలకు ఇళ్లు కిరాయికి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. రేషన్ స్టాక్ భద్రపరిచితే పురుగులు వస్తాయని, పందికొక్కులు, ఎలుకల బెడద ఉంటుందని భయపడుతున్నారు. దీంతో పురాతన ఇళ్లల్లోనే ఈ రేషన్ షాపులు నడుస్తున్నాయి. పట్టణంలోని 13వ నంబర్బస్తీ 16వ వార్డులో అద్దె ఇల్లయిన రెండు గదుల రేకుల షెడ్డులో రేషన్ దుకాణం (3020040) నడుస్తోంది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు నెలల రేషన్ ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం మేరకు డీలర్లు మూడు నెలల స్టాక్ను ఐదు దఫాలుగా తెచ్చి అందించారు. స్టాక్ ఉన్న కాలంలో 15 రోజులపాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు షాపు తెరిచి ఉంచాల్సిందే. రేషన్ తీసుకునే సమయంలో మూడు దఫాలు వేలిముద్రలు వేయాలి. ఐదు నెలలుగా అందని కమీషన్.. ఐదు నెలలుగా కమీషన్ అందలేదు. ప్రతీ నెలా అందాల్సిన కమీషన్ ఐదు నెలలైనా రాకపోవడంతో కుటుంబాలు ఎలా గడుస్తాయి. క్వింటా రేషన్కు రూ.140 రావాల్సి ఉంది. ప్రభుత్వం ప్రతీ నెలా కమీషన్ అందజేయాలి. మా ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. –కె.దయాకర్, డీలర్, 2వ నంబర్బస్తీ ప్రతీ నెలా అందజేయాలి.. జిల్లాలో 305 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వీరందరికి 5 నెలలుగా కమీషన్ అందలేదు. దీంతో రేషన్ షాపులు నడపటం కష్టంగా మారుతోంది. తక్షణం ప్రభుత్వం, పౌరసరఫరాలశాఖ అధికారులు స్పందించి కమీషన్ అందేలా చర్యలు తీసుకోవాలి. కమీషన్ను ప్రతీ నెలా ఇచ్చేలా చూడాలి. –ఊకే శేఖర్రావు, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
జవాన్ అనిల్కు కన్నీటి వీడ్కోలు
● సైనిక లాంఛనాలతో స్వగ్రామంలో అంత్యక్రియలు ● కి.మీ. మేర జాతీయ జెండాలతో ర్యాలీ●నాన్న వచ్చాడురా... వేలాదిగా తరలివచ్చిన జనసందోహం నడుమ సూర్యతండాలోని స్వగృహానికి అనిల్ మృతదేహాన్ని తీసుకురాగనాఏ ఆయన తల్లి ద్వాలీ, భార్య రేణుక కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ‘దేశ రక్షణ కోసం వెళ్లి ఇలా తిరిగి వచ్చావా’ అంటూ ఆయన తల్లి చేసిన రోదనలు అందరినీ కంట తడి పెట్టించాయి. అలాగే, ‘మీ నాన్న వచ్చాడురా.. చిన్నా!’ అంటూ అనిల్ కుమారుడికి తండ్రి మృతదేహాన్ని చూపిస్తూ రేణుక కన్నీరుమున్నీరవడం అక్కడి వారందరినీ కంటతడి పెట్టించింది. కారేపల్లి: కాశ్మీర్ లోయలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన ఆర్మీ జవాన్ బానోతు అనిల్కుమార్కు కుటుంబీకులు, స్థానికులు బుధవారం వీడ్కోలు పలికారు. జై జవాన్, అమరహే అనిల్కుమార్ అంటూ నినాదాల నడుమ విద్యార్థులు, యువత, స్థానికులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఈనెల 11వ తేదీన కాశ్మీర్లో జరిగిన ప్రమాదంలో కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన బానోతు అనిల్కుమార్ మృతి చెందిన విషయం విదితమే. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్కు అక్కడి నుంచి అక్కడి నుంచి బుధవారం ఉదయం ప్రత్యేక వాహనంలో కామేపల్లి కామేపల్లి పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. ఈక్రమాన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనిల్ మృతదేహం నివాళులర్పించారు. అనంతరం కారేపల్లి క్రాస్లో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్ నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. భారీగా హాజరైన జనం కారేపల్లి క్రాస్ వద్దకు అనిల్ మృతదేహంతో కూడిన వాహనం చేరేసరికి యువకులు, విద్యార్థులు, స్థానికులు జాతీయ జెండాలో వేచి ఉన్నారు. ఆపై ఆయన మృతదేహం ఉన్న మిలటరీ వాహనాన్ని ఏడు కి.మీ. అనుసరిస్తూ స్వగ్రామానికి చేరారు. ఆపై అనిల్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తీసుకొచ్చి నివాళులర్పించాక వ్యవసాయ పొలం తీసుకెళ్లారు. అక్కడ సైనిక అధికారులు గౌరవ వందనం సమర్పించి మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆపై అనిల్ అంత్యక్రియలు పూర్తిచేశారు. మాజీ ఎమ్మెల్యేలు లావుడ్యా రాములునాయక్, బానోతు చంద్రావతి, మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ సతీమణి మంజుల పాల్గొన్నారు. -
అక్వాడెక్ట్ను పరిశీలించిన కలెక్టర్
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో ఆకేరుపై నిర్మించిన సీతారామ ప్రాజెక్టు అక్వాడెక్ట్కు అడ్డుగా బండరాళ్లు, గుట్టలు ఉండడంతో భారీ వర్షాల సమయాన వరద పోటెత్తే ప్రమాదముంది. ఈ విషయమై మంగళవారం ‘సాక్షి’లో ‘ఆకేరు అక్వాడెక్ట్కు అడ్డుగా గుట్టలు’ శీర్షికన కథనం ప్రచురితం కాగా ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పందించారు. ఈమేరకు మంగళవారం అక్వాడెక్ట్ను పరిశీలించేందుకు రాగా అడ్డుగా ఉన్న బండరాళ్లను పొక్లెయినర్తో తీయిస్తున్నారు. అయితే, వరద వచ్చే వరకు ఏం చేశారని ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. భూసేకరణ సమస్య ఉందని అధికారులు చెప్పగా.. వరద ప్రవాహం పరిశీలనకు సీసీ కెమెరా ఏర్పాటుచేయాలని ఇరిగేషన్ డీఈ బాణాల రమేష్రెడ్డిని ఆదేశించారు. అనంతరం రాకాసితండా వాసులతో మాట్లాడిన కలెక్టర్ అనుదీప్ వరద పెరిగితే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్సాహెబ్ ఎంపీఓ సూర్యానారాయణ పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి సైతం బుధవారం రాకాసి తండాను పరిశీలించిన అధికారులతో వరదపై సమీక్షించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కూసుమంచి సీఐ సంజీవ్, తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ పాల్గొన్నారు. అడ్డుగా ఉన్న గుట్టల తొలగింపుపై సమీక్ష -
గంజాయి పట్టివేత?
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణం మీదుగా 6 కేజీల గంజాయిని తరలిస్తుండగా టౌన్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. కాగా, గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి.. ఎంత మంది తరలిస్తున్నారు? దాని విలువ ఎంత? అనే వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. పేకాట స్థావరంపై దాడికరకగూడెం: మండలంలోని భట్టుపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఎస్ఐ పీవీఎన్ రావు కథనం ప్రకారం.. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.3,000 నగదు, రెండు సెల్ఫోన్లు, ఒక ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదుచండ్రుగొండ: మండలంలోని అయన్నపాలెం గ్రామానికి చెందిన దండుగుల దినేశ్పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ణ బుధవారం రాత్రి తెలిపారు. అయన్నపాలేనికి చెందిన దినేశ్కు అదే గ్రామానికి చెందిన కృష్ణవేణితో ఆరేళ్ల కిందట వివాహమైంది. మద్యానికి బానిసైన దినేశ్ భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో కృష్ణవేణి ఫిర్యాదు మేరకు దినేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అతివేగంగా కారు నడిపిన డ్రైవర్పై ఫిర్యాదుఇల్లెందురూరల్: అతివేగంగా కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారకుడైన కారుడ్రైవర్పై చర్యలు తీసుకోవాలని టేకులపల్లి మండలం కోక్యాతండాకు చెందిన ఆటోడ్రైవర్ గుగులోత్ అరుణ్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గార్ల మండలం సీతంపేట గ్రామానికి కుటుంబంతో సహా ఆటోలో వెళ్లి వస్తుండగా రేపల్లెవాడ స్టేజీ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన కారు.. తన ఆటోను ఢీకొట్టిందని, తనతోపాటు భార్య గాయపడిందని, ఆటో పూర్తిగా ధ్వంసమైందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కారు (టీఎస్ 04 ఈడీ 3828) డ్రైవర్పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇసుక లారీల అడ్డగింతమణుగూరుటౌన్: మున్సిపాలిటీలోని కమలాపురం గ్రామస్తులు ఇసుక లారీలను అడ్డుకున్న ఘటన బుధవారం మణుగూరులో చోటుచేసుకుంది. కమలాపురం, రాయిగూడెం, కోడిముత్తయ్యగుంపు ఇసుక డీసిల్టేషన్తో పాటు చినరాయిగూడెం ఇసుక సొసైటీల నుంచి పరిమితికి మించి లారీల రాకపోకలు సాగుతున్నాయి. అధిక లోడ్తో రోడ్లు దెబ్బతింటున్నాయి. మిషన్ భగీరథ పైపులు దెబ్బతిని ఐదు రోజులుగా నీటి సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామస్తులు ఇసుక కోసం వచ్చిన వందలాది లారీలను నిలిపివేశారు. గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
పొట్టకూటి కోసం వచ్చి అనంతలోకాలకు..
అశ్వాపురం: పొట్ట కూటి కోసం వచ్చిన ఓ మహిళ గుండెపోటుతో బుధవారం మృతిచెందింది. ఏపీ రాష్ట్రం బాపట్ల జిల్లా రేపల్లే మండలం పోతుమేరక గ్రామానికి చెందిన ఏమిలేని లక్ష్మి (55) అశ్వాపురం మండలం మొండికుంటలో నాటు వేస్తూ గుండెనొప్పితో కుప్పకూలింది. స్థానికులు 108లో మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. లక్ష్మికి భర్త, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ప్రత్యేక వాహనంలో లక్ష్మి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె స్వస్థలానికి తరలించారు. కాగా, లక్ష్మి మృతితో ఆమెతో వచ్చినవారు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. వ్యక్తి ఆత్మహత్య.. భద్రాచలంఅర్బన్: కుటుంబ కలహాలతో పట్టణంలోని శిల్పినగర్కి చెందిన తాతా సిద్ధయ్య మంగళవారం పురుగులమందు సేవించాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. 20 ఏళ్ల కిందట సిద్ధయ్యకు సాంబలక్ష్మితో వివాహం జరిగింది. సిద్ధయ్య మద్యానికి బానిసవ్వడంతో ఇటీవల ఇద్దరి మధ్య తగాదాలు జరుగుతున్నాయి. మంగళవారం సిద్ధయ్య మద్యంలో పురుగులమందు కలుపుకుని తాగగా.. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో సిద్ధయ్య మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. అతని తల్లి నాంచారమ్మ ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చెట్టును ఢీకొట్టిన లారీములకలపల్లి: అదుపుతప్పి లారీ చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ మృతిచెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కిష్టారం గ్రామానికి చెందిన లారీడ్రైవర్ బీరవెల్లి కల్యాణ్కుమార్ సత్తుపల్లి నుంచి సారపాకకు బొగ్గు లోడుతో వెళ్తున్నాడు. మూకమామిడి క్రాస్రోడ్డు సమీపంలో లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కల్యాణ్కుమార్ను 108 వాహనంలో పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. రామయ్యకు విరాళాల వెల్లువశ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి బుధవారం పలువురు భక్తులు విరాళం అందించారు. శాశ్వత నిత్యాన్నదానానికి ఖమ్మానికి చెందిన కొండపల్లి వెంకటేశ్వరరావు, రాధ దంపతులు రూ.1,00,100, శ్రీరంగం వకుళ భాష్యం రూ.లక్ష ఆలయ ఈఓకు అందజేశారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఏఏ కామేశ్వరరావు, అవసరాల విజయలక్ష్మి దంపతులు రూ.ఆరు లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించారు. దాతలకు ఈఓ రమాదేవి రశీదు అందజేశారు. పంద్రాగస్టుకు ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా కేంద్రంలోని ప్రగతిమైదానంలో జరిగే 79వ స్వాతంత్య్ర వేడుకలకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి తుమ్మల వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రి తుమ్మలను కలిసిన సబ్ కలెక్టర్దమ్మపేట: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును గండుగులపల్లిలోని ఆయన నివాసంలో బుధవారం కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సత్తుపల్లి తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొన్నారు. డ్రైవింగ్ శిక్షణతో ఉపాధి పొందాలిఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలం: డ్రైవింగ్ను నేర్చుకుని ఉపాధి పొందాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. బుధవారం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 రోజులపాటు శిక్షణ ఉంటుందని, అనంతరం నిర్వహించే టెస్టులో ఉత్తీర్ణులయితే డ్రైవింగ్ లైసెన్సులను అందిస్తామని తెలిపారు. తద్వారా జెన్కో, ఐటీసీ, నవభారత్ వంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని, సొంత వాహనాలు సమకూర్చుకుని యజమానులుగా మారవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, డ్రైవింగ్ స్కూల్ శిక్షకురాలు మల్లేశ్వరి పాల్గొన్నారు. -
ఎట్టకేలకు ‘కారుణ్యం’!
● డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సుముఖత ● జెన్కో పరిధిలో మూడేళ్లుగా ఎదురుచూస్తున్న 110 కుటుంబాలు పాల్వంచ: టీజీ జెన్కో పరిధిలో కారుణ్య నియామకాల(డిపెండెంట్)కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న బాధిత కుటుంబ సభ్యులకు వారంలోగా పోస్టింగ్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ విద్యుత్ సౌధలో జెన్కో డైరెక్టర్(హెచ్ఆర్)కుమార్ రాజ్ను పలు యూనియన్ల నాయకులు కలిసి విన్నవించగా హామి ఇచ్చారు. ఈ నెల 18వ తేదీలోగా పోస్టింగ్లు ఇవ్వాలని తొలుత యోచించినా, తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. జెన్కో వ్యాప్తంగా విధులు నిర్వహిస్తూ అకాల మృత్యువాత పడ్డవారు సుమారు 110 మంది ఉన్నారు. అందులో అత్యధికంగా కేటీపీఎస్ కాంప్లెక్స్లో 76 మంది ఉండటం గమనార్హం. వారి కుటుంబాలు ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్నాయి. గతంలో డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉండటంతో వాయిదా ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఇటీవల డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయడంతో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. సబ్ ఇంజనీర్ పోస్టులపై మీమాంస గతంలో డిప్లొమా ఉన్న వారిని సబ్ ఇంజనీర్గా నియమించారు. గత సీఎండీ ప్రభాకర్ రావు హయాంలో ఇంజనీర్ కేడర్ను తొలగించి జూనియర్ అసిస్టెంట్(ఎల్డీసీ)గా ఉద్యోగాలు కల్పించారు. ఇది సాంకేతికంగా సరైంది కాదని, వారి చదువుకు, ఉద్యోగానికి సంబంధం లేదని సబ్ ఇంజనీర్ పోస్టు ఇవ్వాలని యూనియన్లు కోరుతున్నాయి. ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో సంస్థల్లో పాటించారని, సబ్ ఇంజనీర్నే పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని జెన్కో యాజమాన్యానికి వివరించారు. నూతనంగా నియామకమైన డైరెక్టర్లు మాత్రం డిప్లొమా, బీటెక్ ఉన్నవారిని సైతం జేపీఏ(జూనియర్ ప్లాంట్ అటెండెంట్)గా తీసుకుని సాధ్యమైనంత త్వరగా సబ్ ఇంజనీర్గా పదోన్నతులు కల్పిస్తామని పేర్కొనడంతోపాటు సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రొబేషనరీ పీరియడ్ దాటకుండా కన్వర్షన్ అయ్యే పరిస్థితి లేదని, కనీసం ఐదారేళ్లు పడుతుందని యూనియన్ నాయకులు చెబుతున్నారు. సబ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీ ఉన్న నేపథ్యంలో సబ్ ఇంజనీర్గానే తీసుకోవాలని డైరెక్టర్ కుమార్ రాజును కోరారు. రాతపూర్వకంగా ఇవ్వాలని డైరెక్టర్ కోరగా బుధవారం విద్యుత్ సౌధలో 1104 కంపెనీ జనరల్ సెక్రటరీ దుర్గా అశోక్, 327 నాయకులు కుమార స్వామి, 1535 నాయకులు ఎంఎ.వజీర్, టీఆర్వీకేఎస్ నాయకుడు నవీన్ వర్మ వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు. -
క్రిస్టియన్ మైనారిటీల సమస్యలు పరిష్కరిస్తాం
సూపర్బజార్(కొత్తగూడెం): క్రిస్టియన్ మైనారిటీల సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో పాస్టర్స్ అసోసియేషన్తో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో శ్మశానవాటికలు, అభ్యంతరం లేని చర్చిలకు అనుమతులు, కులధ్రువీకరణ పత్రాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం తదితర సమస్యలను సమావేశంలో చర్చించారు. అనంతరం కలెక్టర్ను సన్మానించారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ దీపక్జాన్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కె.సంజీవరావు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య, సరైన సదుపాయాలుబూర్గంపాడు : విద్యార్థినిలకు నాణ్యమైన విద్యతోపాటు సరైన సదుపాయాలు శుభ్రమైన వసతి, పోషకాహారంతో కూడిన భోజనం అందించినప్పుడే విద్యలో ఉత్తమ ఫలితాలు వస్తాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం ఆయన బూర్గంపాడు తెలంగాణ గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల, హాస్టల్ను తనిఖీ చేశారు. వంటగది, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. సదుపాయాలు, మెనూ అమలుపై ఆరా తీశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని అన్నారు. పాఠశాల ప్రాంగణంలో మునగ, కరివేపాకు, నిమ్మ గడ్డి వంటి మొక్కలను నాటించాలని సూచించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
ఎస్పీ రోహిత్రాజుకొత్తగూడెంటౌన్: జిల్లాలోని వ్యాపారులు దుకాణాల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దొంగ సొత్తును కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. బుధవారం కొత్తగూడెం రైటర్బస్తీలోని ఐఎంఏ హాల్లో జిల్లాలోని ఆభరణల దుకాణాల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో చోరీలను అరికట్టవచ్చని, నిందితులను గుర్తించవచ్చని పేర్కొన్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తుల నుంచి బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు. దుకాణాల పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దుకాణాల చుట్టు పక్కల నివసించే వ్యక్తుల కదలికలపై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యాపార సముదాయాల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని, రాత్రి వేళల్లో గస్తీని పెంచుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఏస్పీ విక్రాంత్కుమార్ సింగ్, ఇల్లెందు, కొత్తగూడెం మణుగూరు, పాల్వంచ డీఎస్పీలు చంద్రభాను, అబ్దుల్ రెహమాన్, రవీందర్రెడ్డి, సతీష్కుమార్, సీఐలు రమాకాంత్, కరుణాకర్, ప్రతాప్, శివప్రసాద్ పాల్గొన్నారు. -
సింగరేణి అధికారుల నిరసన
సింగరేణి(కొత్తగూడెం): ఫెర్ఫామెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) కోసం సింగరేణి అధికారులు చేపట్టిన ఆందోళన బుధవారం రెండోరోజుకు చేరింది. బుధవారం అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఏఐ) నాయకులు మాట్లాడుతూ 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పీఆర్పీ పెండింగ్లో ఉందన్నారు. కోలిండియాలో ఏటా చెల్లిస్తున్నా, సింగరేణిలో రెండేళ్లుగా చెల్లించడం లేదని ఆరోపించారు. మణుగూరు రూరల్ : పీఆర్పీ చెల్లించాలని కోరుతూ మణుగూరు ఏరియాలోని పీకేఓసీ–2 అధికారులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చే శారు. వీరికి ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వై.రాంగోపాల్, ఓసీ–2 ఫిట్ సెక్రటరీ శనిగరపు కుమారస్వామి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కె.సురేష్కుమార్, రామ్శంకర్, భూక్యా భాంగ్యా, నరేష్, మెరుగు లింగబాబు, బుడ్డి బాబ్జీ, సుధాకర్బాబు, ఎం.యుగంధర్, చక్రవర్తి పాల్గొన్నారు. -
సాంకేతిక నైపుణ్యం అందిపుచ్చుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: పిల్లలు చిన్నతనం నుంచే సాంకేతిక నైపుణ్యాలు అందిపుచ్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్ లిటరసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై కాంప్లెక్స్ స్థాయి రిసోర్స్ పర్సన్లకు కొత్తగూడెంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు గణితం సబ్జెక్ట్లో డిజిటల్ లిటరసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలను చేర్చినట్లు తెలిపారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలని, ప్రాథమిక స్థాయి విద్య పటిష్టంగా ఉంటే ఉన్నత స్థాయి రాణిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ.నాగరాజ శేఖర్, శ్రీనివాసరావు, శంకర్, స్వర్ణకుమారి, రవిబాబు, నరేష్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి -
చుక్కనీరూ ఇవ్వలె..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాజీవ్వ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను ఒక్కటిగా చేస్తూ 2016లో సీతారామ ప్రాజెక్ట్ను తెరపైకి తెచ్చారు. పలుమార్లు డిజైన్లలో మార్పులు చోటుచేసుకోగా 2018 చివర నుంచి పనులు మొదలయ్యాయి. 2023 డిసెంబర్ నాటికి మూడు పంప్హౌస్లు, 104 కి.మీ ప్రధాన కాలువతోపాటు సీతమ్మసాగర్ బరాజ్కు సంబంధించి 24 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్ట్కు సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు కేంద్రం నుంచి అనుమతి రాలేదు. కాగా బీఆర్ఎస్ హయాంలో రూ.7,500 కోట్లు పనులు జరిగాయని, అయినా ఒక్క ఎకరాకూ సాగునీరు ఇవ్వలేదని కాంగ్రెస్ విమర్శించింది. ప్రాజెక్ట్కు డిజైన్లలో లోపాలు, ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంది. తమ ప్రభుత్వ హయాంలో ఫలితాలు ఇచ్చే పనులకే నిధులు ఇస్తామని తెలిపింది. ‘రాజీవ్’తో దక్కింది భరోసానే రూ.7,500 కోట్లు ఖర్చు చేసినా ఎక్కడా గోదావరి నీటిని వినియోగించుకున్న దాఖలాలు లేకపోవడంతో ఆగమేఘాలపై రాజీవ్ కెనాల్ రూపకల్పన చేశారు. 2024 జనవరిలో పనులు మొదలుపెడితే 2024 ఆగస్టు 15 నాటికి కాలువను పట్టాలెక్కించారు. ప్రధాన కాలువలో ప్యాచ్వర్క్ పనులు, వంతెనల నిర్మాణం, మూడు పంప్హౌస్ల వద్ద మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు, దుమ్ముగూడెం ఆనకట్ట దగ్గర హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం వంటి పనులు చకచకా చేశారు. గతేడాది, ప్రస్తుత సీజన్లో కృష్ణాకు సమృద్ధిగా నీరు రావడంతో నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి నీటిని ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అవసరమైతే నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అందించగలమనే భరోసా దక్కింది అంతే. ప్రారంభంకాని డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పంప్హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా 2025 ఖరీఫ్ సీజన్ నాటికి జిల్లాలో కనీసం 60 వేల కొత్త ఆయకట్టు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇందుకోసం ప్యాకేజీ 1, 2 కింద డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఆగస్టు చివర్లో ఆమోదం వస్తే, టెండర్ల ప్రక్రియనే 2025 జనవరి దాకా జరిగింది. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ నాటికి ఒకటో ప్యాకేజీకి సంబంధించిన అగ్రిమెంట్ పూర్తయింది. రెండో ప్యాకేజీ ఇంకా టెండర్ల దశలోనే మగ్గుతోంది. దీంతో డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు అసలు ప్రారంభమే కాలేదు. ఫలితంగా శంకుస్థాపన చేసిన తొమ్మిదేళ్లు, మోటార్లు ఆన్ చేసి ఏడాది పూర్తయినా జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా గోదావరి నీరు అందని పరిస్థితి నెలకొంది. భద్రాచలం, పినపాకకు చేయిచ్చినట్టేనా..? గతేడాది పంప్హౌస్ల ప్రారంభోత్సవం సందర్భంగా భద్రాచలం, పినపాక నియోజకర్గాలకు కూడా గోదావరి నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇంతవరకు ఆ దిశగా ఒక్క పనీ జరగలేదు. సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఎక్కడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేకపోవడం పెద్ద పొరపాటని గతేడాది మంత్రులు తెలిపారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంపై ఒక్కసారి కూడా ప్రభుత్వం స్పందించలేదు. రాజీవ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రస్తుతం సీతారామ ద్వారా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పదే పదే ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదు. సీతారామ ప్రాజెక్ట్ పంపుహౌస్లు ప్రారంభించి ఏడాది ఇప్పటికీ జిల్లాలో ఒక్క ఎకరానికీ అందని సాగునీరు చివరి దశలో డీపీఆర్ అనుమతులు, యాతాలకుంట టన్నెల్ పనులుచివరి అంకంలో అనుమతులు ఏడాది కాలంగా సీతారామ డీపీఆర్కు కేంద్రం నుంచి అనుమతులు సాధించే ప్రక్రియలో వేగం పెరిగింది. ఇప్పటికే టెక్నికల్ కమిటీ అనుమతులు వచ్చాయి. పర్యావరణ అనుమతులు కూడా సాధిస్తే సీతారామ డీపీఆర్కు మోక్షం లభించినట్టే. అయితే ఏడాది పూర్తయినా పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదు. అవి వస్తేనే సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మాణానికి సాంకేతిక అనుమతుల అడ్డంకులు తొలగిపోతాయి. సత్తుపల్లి ట్రంక్ కెనాల్కు సంబంధించి యాతాలకుంట టన్నెల్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ పనులు పూర్తయితే వచ్చే సీజన్కు సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకర్గాలకు నీరు అందించే పరిస్థితి ఉంటుంది. అదేఽ విధంగా ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.13,057 కోట్ల నుంచి రూ.19,325 కోట్లకు పెంచేందుకు సర్కార్ ఆమోదం లభించింది. -
ఆలయ, పట్టణాభివృద్ధితో ప్లాన్
● భద్రాచలం దేవస్థాన మాస్టర్ప్లాన్పై సమావేశం ● చేర్పులు, మార్పులను వివరించిన స్తపతి ● భవిష్యత్ అవసరాలకు తగినట్లు ఉంటుందని కలెక్టర్ వెల్లడి భద్రాచలం: భద్రగిరి స్థల చారిత్రక, ఆధ్యాత్మికతతోపాటు టూరిజం, సాంస్కృతిక మేలు కలయిక ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రముఖ స్తపతి సూర్యనారాయణ మూర్తి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఇటీవల భద్రాచలం పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్తపతి, దేవస్థానం వైదిక కమిటీ, అధికారులు, కలెక్టర్లు చర్చించి మాస్టర్ప్లాన్ ఫైనల్ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో స్తపతి, కలెక్టర్, ఆలయ ఈఓ రమాదేవి, వైదిక కమిటీతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్తపతి దేవస్థాన అభివృద్ధి నమూనాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మాట్లాడుతూ ప్లాన్లో దేవస్థానంతోపాటు పట్టణాభివృద్ధిని పొందుపరుస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు తగినట్లు మాస్టర్ప్లాన్ ఉంటుందన్నారు. డిజైన్ రూపకల్పనకు అందరి సలహాలు తీసుకుంటామన్నారు. ఏపీ అధికారుల సహకారంతో రాముడి భూముల పరరిక్షణకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఆలయ చుట్టు పక్కల పరిశీలించారు. ప్రధాన ఆలయంలో మార్పులు లేకుండా.. ! గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన డిజైన్ ప్రకారం ఆలయంలో పూర్తిగా మార్పులు చేపట్టాల్సి ఉండటంతో భారీగా నిధులు అవసరం కానున్నాయి. కానీ తాజా ప్రణాళికలో ప్రధాన ఆలయానికి మార్పులు లేకుండా ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాతి కట్టడంతో నిర్మిస్తేనే సుమారు రూ. 150 నుంచి రూ. 200 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. వైదిక కమిటీ సలహాలు, సూచనల అనంతరం కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ప్రభుత్వం డిజైన్ ఆమోదించాక నిధుల విడుదలపై స్పష్టత రానుంది. తాజా నమూనాలో.. ● దేవస్థాన అభివృద్ధి తాజా నమూనా గతంలో స్తపతి ఆనందసాయి రూపొందించిన నమూనాకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ● ప్రస్తుత నమూనా ప్రకారం రామదాసు నిర్మించిన ప్రధాన ఆలయం, ఇతర ఉపాలయాలకు మార్పులు లేకుండా, కేవలం చుట్టు పక్కల మాత్రమే అభివృద్ధి పనులను చేపట్టే అవకాశం ఉంది. ● చిత్రకూట మండపం తొలగించి, చుట్టూ స్తంభాలతో కాలి నడక మండపం ఏర్పాటు అవకాశం ఉంది. ● ప్రస్తుతం ఉన్న ఉత్తర, తూర్పు ద్వారాలకు మార్పులు చేపట్టి, దక్షిణ ద్వారాన్ని విస్తరించనున్నారు. ● గతంలో పేర్కొన్న మాఢ వీధుల ఏర్పాటు కాకుండా కేవలం చుట్టూ వీధుల పెంపు మాత్రమే ఉండనుంది. ● ఉత్తరం వైపు ప్రస్తుతం కట్టడాలు కూల్చిన ఖాళీ స్థలంలో దేవస్థాన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, వంటశాల ఏర్పాటు కానున్నాయి. ● క్యూలైన్ల ఆధునీకరణ, ప్రసాద విక్రయాల ఇతర పనులు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
●వృద్ధురాలు సైతం..
గరీభ్పేట గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం తండాకు చెందిన పెద్ది కొమరమ్మ రెండేళ్ల కిందట ఆస్పత్రికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. తలకు బలమైన గాయం అయింది. ఈమె భర్త సింగరేణి మాజీ ఉద్యోగి కావడంతో తొలుత సింగరేణి ఆస్పత్రిలో వైద్యం అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ క్రమంలో బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. అవయవదానంతో మరికొందరికి పునర్జన్మ ప్రసాదించవచ్చని వైద్యులు కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. కొమరమ్మ మూత్రపిండాలు, కాలేయంను వైద్యులు సేకరించారు. -
పీఆర్పీ కోసం ఆందోళన
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో అధికారులకు చెల్లించాల్సిన పర్ఫామెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) చెల్లించటం లేదని, సింగరేణివ్యాప్తంగా ఉన్న సుమారు 2,300 మంది అధికారులు మంగళవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం, ఏరి యా జీఎం కార్యాలయం, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎంఓఏఐ సెక్రటరీ కేశవరావు మాట్లాడారు. ఆరు నెలల నుంచి తమకు రావాల్సిన పీఆర్పీ చెల్లించాలని డిప్యూటీ సీఎం, భట్టివిక్రమార్క, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలకు పలుమార్లు వినతిపత్రాలు అందించినప్పటికీ ఎవరూ స్పందించలేదని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రెండు నెలల్లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు ఇల్లెందు: జిల్లావ్యాప్తంగా రాబోయే రెండు నెలల్లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బీఎస్ఎన్ఎల్ డీజీఎం రాజశేఖర్బాబు, ఏజీఎం కె.శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం ఇల్లెందు మండలం కొమరారంలో బీఎస్ఎన్ఎల్ టవర్లో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఇల్లెందులోని బీఎస్ఎన్ఎల్ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 440 బీఎస్ఎన్ఎల్ టవర్లు ఉన్నాయని, త్వరలోనే అన్నింటి నుంచి 5జీ సిగ్నల్ అందిస్తామని, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో ఒక్క రుపాయికే సిమ్ అందజేస్తున్నామని, కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. ఈ సిమ్ పొందిన వారికి మొదటి నెల రీచార్జ్ ఉచితమని, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్రతీ రోజు 2 జీబీ డేటా, 30 రోజుల్లో 100 ఎస్ఎంఎస్లు ఫ్రీ ఉంటాయని, ఈ ప్లాన్ ఈ నెలాఖరు వరకేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇల్లెందులో పలువురికి ఒక్క రూపాయి సిమ్ను అందజేశారు. బీఎస్ఎన్ఎల్ అధికారులు మనీశ్జైన్, బాలాజీ, భరత్రెడ్డి, స్థానిక బీఎస్ఎన్ఎల్ సిబ్బంది పాల్గొన్నారు. బెటాలియన్, పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీభద్రాచలంఅర్బన్: హర్ఘర్ తిరంగాలో భాగంగా సీఆర్పీఎఫ్–141 బెటాలియన్, భద్రాచలం టౌన్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం బైక్ర్యాలీ నిర్వహించారు. ద్విచక్రవాహనాలకు జాతీయజెండాలు కట్టుకుని, సీఆర్పీఎఫ్–141 బెటాలియన్ నుంచి చర్ల రోడ్డు, అంబేడ్కర్ సెంటర్, బ్రిడ్జి పాయింట్ నుంచి సీఆర్పీఎఫ్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ రితేశ్ఠాకూర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్, బెటాలియన్ కమాండెంట్లు రాజేశ్యాదవ్, ప్రీత, డిప్యూటీ కమాండెంట్ పత్రాస్పుర్తి, డాక్టర్ విజయ్కిశోర్రెడ్డి, భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ స్వప్న తదితరులు పాల్గొన్నారు. హెచ్పీఎస్లో ప్రవేశాలకు డ్రా భద్రాచలం: బేగంపేట, రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో విద్యార్థుల ఎంపికకు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం లాటరీ తీశారు. గిరిజనుల్లో కోయలకు మూడు, లంబాడీలకు రెండు, మిగిలిన కులాల వారికి ఒక సీటు కేటాయించగా ఇతర కులాల నుంచి దరఖాస్తులు అందలేదు. ఈ మేరకు తల్లిదండ్రులు, విద్యార్థుల సమక్షాన డ్రా తీయించి ఎంపిక చేశామని పీఎంఆర్సీ ఏసీఎంఓ రమేశ్ తెలిపారు. కాగా, ఎంపికై న వారు సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోతే వెయిటింగ్ జాబితాలో ఉన్న సీట్లు కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తపల్లి పీజీ హెచ్ఎం నర్సింహారావు, ఉద్యోగులు ప్రమీలబాయ్, రామకృష్ణారెడ్డి, రంగయ్య, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో చోరీ
పాల్వంచరూరల్: మండల పరిధి యానంబైల్లోని శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీ రాత్రి గుర్తుతెలియని దుండగులు గుడి తాళాన్ని పగలగొట్టి, హుండీని ధ్వంసం చేసి, భక్తుల కానుకలను చోరీ చేశారు. ఆలయ కమిటీ బాధ్యులు శిరసాని వినోద్కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సురేశ్ కేసు నమోదు చేశారు. ఇసుక ట్రాక్టర్ సీజ్ ములకలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ కథనం మేరకు.. మండలంలోని రామాంజనేయపురంలోని వాగు నుంచి ఇసుక తరలిస్తున్నట్లు మంగళవారం సమాచారం అందింది. దాడి చేసి, అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తోలుతున్న ట్రాక్టర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం అశ్వారావుపేటరూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధమైన ఘటన మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని గాండ్లగూడేనికి చెందిన ధరావత్ బాలాజీకి చెందిన పూరింట్లో స్విచ్ బోర్డు వద్ద మంటలు వ్యాపించి అంటుకున్నాయి. బాలాజీ కూలీ పనులకు వెళ్లగా, ఇంట్లో భార్య చంద్రావతి, కుమార్తె గమనించి భయందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. చుట్టు పక్కల వారంతా చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించగా ఇళ్లంతా కాలి బూడిదైంది. కాగా, ఇంట్లో గ్యాస్ బండ పేలిపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. బీరువాలో భద్రపరిచిన రూ.1.50 లక్షలు, నగదుతోపాటు సామగ్రి అంతా కాలిపోగా, సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. సమాచారం అందుకున్న అశ్వారావుపేట ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకోగా.. అప్పటికే అంతా కాలి బూడిదైంది. అగ్ని మాపక శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. గంజాయి రవాణా కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలుశిక్షఖమ్మంలీగల్: గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరికి 20ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.ఉమాదేవి మంగళవారం తీర్పు వెలువరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దిండిగల్ గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన నాయక్ మల్లేష్, గడ్డం భువన్ అలియాస్ ఎరుగుంట్ల రవితేజతో పాటు ఇషాక్ జల్సాలకు అలవాటు పడి అక్రమార్జన కోసం గంజాయి రవాణా చేస్తున్నారు. ఈక్రమంలోనే 2021 ఏప్రిల్ 28న కారులో రూ.30 లక్షల విలువైన 200 కేజీల గంజాయితో వస్తుండగా, ఖమ్మం సమీపాన వి.వెంకటాయపాలెం వద్ద పోలీస్ చెక్పోస్ట్ ఉండడంతో వేగం పెంచారు. ఈక్రమంలో ప్రయాణికులతో ఉన్న ఆటోను ఢీకొట్టగా రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. ఆటోలో వెళ్తున్న ఒకరు మృతి చెందగా పోలీసులు చేరుకుని కారులో పరిశీలించడంతో 200 కేజీల గంజాయి లభించింది. ఈమేరకు మల్లేష్, భువన్ పట్టుబడగా ఇషాక్ పారిపోయాడు. వీరిపై రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేఠశారు. విచారణ అనంతరం నిందితులపై నేరం రుజువు కావటంతో ఇద్దరికి 20 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కేసు విచారణ గత, ప్రస్తుత ఇన్స్పెక్టర్లు సత్యనారాయణరెడ్డి, ఉస్మాన్ షరీఫ్ చేయగా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏ.శంకర్, జె.శరత్కుమార్రెడ్డి, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది జి.రవికిషోర్, సాంబశివరావు, కె.శ్రీకాంత్, ఎం.డీ.అయూబ్ సహకరించారు. -
పులిగుండాల అభివృది్ధకి రూ.4.20కోట్లు
● కిన్నెరసాని, భద్రాచలం, పులిగుండాల సందర్శనకు ప్యాకేజీ ● ఖమ్మం డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్సత్తుపల్లిటౌన్: జిల్లాలోని పులిగుండాల అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం విభాగంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.4.20 కోట్లు మంజూరు చేసిందని జిల్లా అటవీ శాఖాధికారి సిద్ధార్థ విక్రమ్సింగ్ తెలిపారు. ఇందులో మొదటి విడతగా రూ.1.89 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. సత్తుపల్లి చెక్పోస్టు, క్వార్టర్లు, టింబర్ డిపోను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం కంటైనర్ ఆస్పత్రి, వాచ్టవర్ను పరిశీలించాక చంద్రాయపాలెంలో వనసంరక్షణ సమితి బాధ్యులతో మాట్లాడారు. పులి గుండాల ఎకో టూరిజం, కిన్నెరసాని, భద్రాచలంను సందర్శించేలా ప్యాకేజీ రూపొందిస్తున్నట్లు తెలి పారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే టెంట్తో బస ఏర్పాటు చేస్తామని, పులిగుండాల వద్ద బ్యాటరీ వాహనంతో పాటు రెండు సఫారీ వాహనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సందర్శకుల కోసం సోలార్బోట్ సమకూర్చడమే కాక ప్రాజెక్టు వద్ద రక్షణ కోసం ఫెన్సింగ్, 30 కి.మీ. సఫారీ రూట్, కాకతీయుల తోరణంతో గేట్, రీసెన్షన్ సెంటర్ నిర్మించనున్నట్లు తెలిపారు. పులిగుండాల గుట్టపై పల్లెర్ల బావి, వీరభద్రస్వామి ఆలయం, పాలపిట్ట వాచ్ టవర్తో పాటు జలపాతం సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తాయని డీఎఫ్ఓ తెలిపారు. పోడుదారులపై చర్యలు అడవిలో పోడు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్సింగ్ హెచ్చరించారు. అటవీ సంరక్షణ, అక్రమ తవ్వకాల నివారణ, వన్యప్రాణి రక్షణ, అటవీ అభివృద్ధిపై వీఎస్ఎస్ సభ్యులతో చర్చించాక సూచనలు చేశారు. సత్తుపల్లి ఎఫ్డీఓ వి.మంజుల, టాస్క్ఫోర్స్ రేంజర్ శ్రీనివాసరావు, వైల్డ్లైఫ్ ఎక్స్ఫర్ట్ దీపక్నారాయణ పాల్గొన్నారు. -
వామ హస్తం.. వరమే!
● పుట్టుకతోనే కొందరు ఎడమ చేతివాటం ● అలాంటివారే ప్రతిభావంతులంటున్న నిపుణులు నేడు వరల్డ్ లె ఫ్ట్ హ్యాండర్స్ డే పాల్వంచరూరల్: కొందరు వ్యక్తుల్లోని భిన్నత్వం వారిని ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది. సాధారణంగా ప్రతీ వ్యక్తిలో భిన్నమైన లక్షణాలు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. ప్రతీ వంద మందిలో 95 శాతం మంది కుడి చేతివాటం వారు ఉండగా మిగతా 5 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తుంటారు. ఎడమ చేతివాటం అనేది జన్యుప్రభావ ఫలితంగా కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. నేడు ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా కథనం. జన్యు ప్రభావం.. ప్రతీ వ్యక్తి పుట్టినప్పటి నుంచే కుడి, ఎడమ చేతి వాటాలను సహజ సిద్ధంగా కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి మెదడు కుడి, ఎడమ రెండు అర్ధభాగాలుగా ఉంటుంది. కుడి వైపు శరీర భాగాన్ని మెదడు ఎడమ అర్ధభాగం నియంత్రిస్తుందని, కుడి అర్ధభాగం మెదడు బలంగా ఉన్న వారిలో ఎడమ చేతివాటం వస్తుందని చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఎడమ చేతివాటాన్ని గమనిస్తే మాన్పించొద్దని సూచిస్తున్నారు. భిన్నమైన శైలి.. కుడి చేతివాటం వారి కంటే ఎడమ చేతివాటం వారిలో ప్రత్యేక తెలివితేటలుంటాయని, మేధోశక్తి, ఆలోచన, తెలివి భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో గుర్తింపు పొందిన మేధావుల్లో చాలామంది ఎడమ చేతివాటం వారేనని సమాచారం. ప్రముఖ సినీనటుడు అమితాబ్ బచ్చన్, ప్రఖ్యాత క్రికెటర్లు సౌరవ్ గంగూలి, యువరాజ్ సింగ్ వంటి వారు కూడా ఎడమ చేతివాటం వారే కావడం విశేషం. కాగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 8 మంది, దమ్మపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఏడుగురు ఎడమ చేతివాటం కలిగి ఉన్నారు. పనులను మాన్పించొద్దు.. ఎడాదిన్నర నుంచి రెండేళ్ల వయస్సు నుంచి వస్తువులను పట్టుకోవడం ప్రారంభిస్తారు.అప్పుడే కుడి, ఎడమలను గుర్తించవచ్చు. పిల్లలు ఎడమ చేతివాటం పనులు చేస్తుంటే తల్లిదండ్రులు మాన్పించే ప్రయత్నం చేయొద్దని, అలా చేస్తే సమస్యలు తలెత్తుతాయని నిపుణులంటున్నారు. కుడి చెయ్యితే రోజు వారి పనులు చేయడం సహజం. అయితే, ఆ పనులన్నీ ఎడమ చేతితో చేయడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. రోజువారి పనులు ఎడమ చేత్తో చేస్తూ ప్రత్యేకంగా గుర్తింపు పొందిన వారు చాలామంది ఉన్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. -
ఇల్లెందు, మానుకోటకూ ‘సీతారామ’ జలాలు ఇవ్వండి
ఖమ్మంమయూరిసెంటర్: సీతారామ ప్రాజెక్టును ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలకు సైతం అనుసంధానించి సాగునీరు సరఫరా చేయా లని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం మాస్లైన్ నాయకులు హైదరాబాద్లో మంగళవారం సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో సీతారామ ప్రా జెక్టును నిర్మించినా ఇల్లెందు ప్రాంత రైతులకు ప్ర యోజనం లేదన్నారు. అన్ని ప్రాంతాలకు సీతారామ నీరు అందేలా చూడాలని కోరారు. అలాగే, పోడు సాగుదారులకు పొజిషన్ హక్కులు కల్పించి, అర్హులకు పట్టాలు జారీ చేయాలని, పోడు రైతులపై అటవీ అధికారుల దాడులను నిలిపివేయించాలన్నారు. అంతేకాక వ్యవసాయ కూలీలకు రూ.12 వేల భృతి, పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2,500 చెల్లింపుతో పాటు పెండింగ్ ఉపకార వేతనాలు, ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయా లని వినతిపత్రంలో పేర్కొన్నారు. అంతేకాక మంత్రులు జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు మాస్లైన్, ఇతర వామపక్షల పార్టీలు, ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేస్తున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అధికారులకు సూచనలు చేస్తానని చెప్పారని రంగారావు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు కేజీ రాంచందర్, కె.రమ, కె.సూర్యం పాల్గొన్నారు. సీఎంకు విన్నవించిన మాస్లైన్ నాయకులు -
ఆయుష్షు పోస్తూ..
ఆయువు పోయినా..సుజాతనగర్: అమ్మ జన్మనిస్తే అవయవదానం పునర్జన్మనిస్తుంది.. మరణించినా కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయి. ఏ లోకంలో ఉన్నా మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. మన శ్వాస ఆగిపోయినా గుండె మాత్రం లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉంటుంది.. ‘ఆయువు పోయినా.. అవయదానంతో ఊపిరిపోద్దాం.. అవయ వాలను ఈ లోకంలో జీవించనిద్దాం.. రండి అవయదానం చేద్దాం.. మరణించినా మరో వ్యక్తిలో జీవించే ఉందాం’.. అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా కొందరు ఇంకా అపోహలు, అనుమానాలతో వెనకడుగు వేస్తున్నారు. కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. ఏటా ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవదాన దినోత్సవం’ నిర్వహిస్తున్న సందర్భంగా కథనం. అవయవదానానికి ముందుకొస్తున్న కుటుంబాలు ఉమ్మడి జిల్లాలో పెరిగిన అవగాహన నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం చండ్రుగొండ మండలంలో.. తాను మరణించినా ముగ్గురికి అవయవదానం చేశాడు భదాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం టేకులబంజర గ్రామానికి చెందిన రైతు పల్లె వెంకన్న. వ్యవసా యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వెంకన్న కంటిపరీక్షల నిమిత్తం రెండేళ్ల కిందట పాల్వంచ వెళ్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. కుటుంబసభ్యులను కలిసిన జీవన్దాన్ ప్రతినిధులు అవయవదానం గురించి అవగాహన కల్పించారు. కాలేయంతో పాటు, రెండు కళ్లను సేకరించారు. -
అటవీ ఫలాలు దళారుల పాలు కావొద్దు
● ఖాళీ స్థలాల్లో వ్యాపార సముదాయాలు నిర్మించాలి ● జీసీసీ చైర్మన్ తిరుపతి పాల్వంచరూరల్ : అడవుల్లో గిరిజనలు సేకరించే ఫలాలు దళారుల పాలు కాకుండా నేరుగా జీసీసీ డీఆర్ డిపోలకే చేరేలా సిబ్బంది కృషిచేయాలని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) రాష్ట్ర చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. పాల్వంచ జీసీసీ బ్రాంచ్ను ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనులు సేకరించిన అటవీ ఫలాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని, రికార్డులు సక్రమంగా నిర్వహిస్తే జీసీసీ డిపోలు లాభాల బాట పడతాయని అన్నారు. ఇప్ప పువ్వు, ఇప్పకాయలు సీజన్ ఉన్నప్పుడే అధికంగా సేకరించాలని సూచించారు. జీసీసీ ఖాళీ ప్రదేశాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పీఓ రాహుల్ మాట్లాడుతూ.. ఇప్పపువ్వు, ఇప్పబద్ధల ద్వారా నూనె తయారీకి గిరిజనులు ముందుకొస్తే ఐటీడీఏ ద్వారా నూనె తీసే యంత్రాలు అందిస్తామని చెప్పారు. జీసీసీ పరిధిలో నడుస్తున్న డీఆర్ డిపోలు చాలావరకు మరమ్మతులు నిర్వహించాల్సి ఉందన్నారు. పాల్వంచలో పెట్రోల్ పంపు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, ఎన్ఓసీ రాకపోవడంతో పనులు నిలిచాయని తెలిపారు. డీఆర్ డిపోలు, పెట్రోల్ పంపు నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించాలని కోరారు. సమావేశంలో జీసీసీ డీఎం సమ్మయ్య, మేనేజర్లు నర్సింహారావు, జయరాజ్, రాములు పాల్గొన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు భద్రాచలంటౌన్: జీసీసీ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని జీసీసీ చైర్మన్ తిరుపతి స్పష్టం చేశారు. భద్రాచలంలోని జీసీసీ కార్యాలయం, గోడౌన్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాచలం ఏజెన్సీలో గిరిజనుల అభ్యున్నత కోసం కృషి చేయాలని సూచించారు. జీసీసీ పెట్రోల్ బంక్ల నిర్వహణ, ఆదాయ, వ్యయాలు, రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని చైర్మన్ ఆదేశించారు. -
ఇప్పటికీ ఇసుక తిన్నెలే !
● ఆగస్టు వచ్చినా నిండని గోదావరి ● వర్షాకాలంలోనూ కనిపించని వరద ప్రభావం ● మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరని నీరు ● గత పదిహేనేళ్లలో ఇదే తొలిసారి.. బూర్గంపాడు: ఆగస్టు వస్తోందంటే గోదావరి వరదలు ఇళ్లు, పంటలను ముంచెత్తుతాయని ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతుంటారు. ప్రతీ సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వరదలు రావడం పరిపాటి. అలాంటిది ఈ ఏడాది నది నిండా కూడా నీరు ప్రవహించడం లేదు. ఇప్పటికీ భద్రాచలం వద్ద గోదావరిలో ఇసుక తిన్నెలే కనిపిస్తుండడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు అంటున్నారు. మరి ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో తాగు, సాగునీటికి ఇబ్బందులు తప్పవనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎగువనా వర్షాలు అంతంతే.. ప్రతి ఏటా గోదావరి వరదలు భద్రాచలం డివిజన్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటల మునకతో పాటు ఇళ్లలోకీ వరద రావడంతో పలువురు నిరాశ్రయులవుతన్నారు. 2022లో వచ్చిన గోదావరి వరదలకు 10వేలకు పైగా ఇళ్లు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. గత ఐదేళ్లుగా జూలైలోనే వరదలు వస్తుండగా ఆగస్టు, సెప్టెంబర్ వరకూ కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు గోదావరికి ప్రమాదకర స్థాయిలో వరద రాలేదు. జిల్లాతో పాటు గోదావరి బేసిన్లో ఎక్కడా భారీ వర్షాలు నమోదు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిస్తే గోదావరికి వరదలు వస్తాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురిసినా కొంతమేర వరద పెరుగుతుంది. ఇక ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహిత, శబరి, కిన్నెరసానికి కూడా వరదలు లేకపోవడంతో గోదావరి ఉధృతరూపం దాల్చలేదు. అవసరాలు తీరేదెలా.. గోదావరిలో నీరు తక్కువగా ఉండగా, భవిష్యత్ అవసరాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంటున్నారు. జిల్లాకు మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలనే తాగునీరుగా అందిస్తున్నారు. సీతారామ ప్రాజెక్ట్తో ఉమ్మడి జిల్లాలో సాగునీటి అవసరాలకూ ఈ నీరే ఆధారం. తాగు, సాగునీటితో పాటు జిల్లాలోని బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్, సారపాక ఐటీసీ పీఎస్పీడీ మనుగడకు కూడా గోదావరి నీరే కీలకం. 2017లో గోదావరిలో నీటి లభ్యత తగ్గడంతో హెవీ వాటర్ ప్లాంట్ కొన్ని రోజులు మూతపడింది. ఈ ఏడాది ఇప్పుడే గోదావరిలో వరద తక్కువగా ఉండగా రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది రానట్టేనా..? భద్రాచలంలో గోదావరి వరద 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ అవుతాయి. గత ఐదారేళ్లుగా గోదావరి వరద మూడో ప్రమాద హెచ్చరిక వరకు చేరుతూనే ఉంది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు కనీసం మొదటి ప్రమాద హెచ్చరిక కూడా లేకపోవడం గమనార్హం. ఆగస్టు రెండో వారం వరకూ మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ కాకపోవడం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరి వరద నానాటికీ తగ్గుతుండగా.. ఈ ఏడాది వరదలు రాకపోవచ్చనే చర్చ జరుగుతోంది. -
డబుల్పై ధ్యాసేది?
సగం కూడా పూర్తి కాలే.. తెలంగాణ వచ్చిన వెంటనే అప్పటి ప్రభుత్వం పేదల సొంతిటి కల నెరవేర్చే లక్ష్యంతో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. స్థలంతో సహా ప్రతీ పని తామే చేసి, ఇల్లు పూర్తయ్యాక లబ్ధిదారుడికి అందిస్తామంటూ గొప్పగా ప్రచారం చేసుకుంది. అయితే అమలు విషయంలో ఒకడుగు ముందుకు.. పదడుగులు వెనక్కు.. అన్నట్టుగా పరిస్థితి మారింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ముగిసే నాటికి జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం సగం కూడా పూర్తి కాలేదు. జిల్లాకు 6,168 ఇళ్లు మంజూరు కాగా, 2,973 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి, 2,759 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 214 ఇళ్లు పనులు పూర్తయి లబ్ధిదారుల చేతుల్లోకి వెళ్లకుండా పడావుపడి ఉన్నాయి. ఇంకా వివిధ దశల్లో పనులు ఆగిపోయిన ఇళ్లు 3,195 ఉన్నాయి. అమలుకు నోచని మంత్రి ఆదేశాలు.. జూలై 27న కొత్తగూడెం ఐడీఓసీలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల సమీక్ష సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గతంలో నిర్మించిన, మధ్యలో ఆగిపోయిన డబుల్బెడ్రూం ఇళ్ల వివరాలను గ్రామాల వారీగా సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2 బీహెచ్కే ఇళ్లను ఆగస్టు 15లోగా పంపిణీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్నట్టుగానే ఆయన ఇన్చార్జ్గా ఉన్న వరంగల్ జిల్లాలో ఈనెల 8న నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్న 592 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. 2015 జనవరిలో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఈ ఇళ్లు 2016 నాటికి పూర్తయ్యాయి. అప్పటి నుంచి దాదాపు తొమ్మిదేళ్ల పాటు జీ ప్లస్ 3 నిర్మాణంతో కూడిన అపార్ట్మెంట్లు ఖాళీగా ఉండగా.. మంత్రి పొంగులేటి చొరవతో ఈ ఇళ్లు లబ్ధిదారుల వశం అయ్యాయి. దీంతో ఇంత కాలం అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బంది పడిన వారికి సొంతింటి కల సాకారమైంది. పట్టణ ప్రాంతాల్లో పడావుగా.. జిల్లాలో ‘డబుల్’ పథకానికి సంబంధించి ఇంటి నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసిన వాటిల్లో సింహభాగం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ పథకంతో ప్రయోజనం పొందిన వారిని వేళ్లపై లెక్కించవచ్చు. జిల్లా కేంద్రంలో పరిశీలిస్తే.. కొత్తగూడెంలో 831 ఇళ్లు మంజూరయ్యాయి. వీటి కోసం పాత కొత్తగూడెంలో దాదాపు 40 ఎకరాలకు పైగా స్థలంలో భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టారు. వెంచర్ తరహాలో ప్లాట్లు చేశారు. విద్యుత్ సరఫరా, 20 అడుగులు, 30 అడుగులతో అంతర్గత రోడ్లు, వెంచర్ చుట్టూ ప్రహరీ పనులు పూర్తి చేశారు. ఇక్కడ 828 ఇళ ్లకు మూడు బ్లాక్ల్లో 108 పూరయ్యాయి. జీ ప్లస్ 3 పద్ధతిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో కొన్ని సివిల్ పనులు పూర్తి కాగా, విద్యుత్, ప్లంబింగ్ పనులు కావాల్సి ఉంది. మిగిలిన బ్లాక్లు పిల్లర్లు, శ్లాబులు, పునాదుల వరకు పనులు పూర్తయి మొండిగోడలతో దర్శనం ఇస్తున్నాయి. పాల్వంచలో 492 ఇళ్లు మంజూరు కాగా, ఇల్లెందు, మణుగూరు నియోజకవర్గాల్లో, భద్రాచలం పట్టణంలోనూ దాదాపు అంతే ఉన్నాయి. పనులు పూర్తి కాకున్నా.. గత ప్రభుత్వం సాధారణ ఎన్నికల ముందు ఈ ఇళ్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించింది. దీనిపై ఆరోపణలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. నాటి నుంచి నేటి వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం ఎటూ కాకుండా పోతోంది.బీఆర్ఎస్ హయాంలో 2బీహెచ్కే పథకం మధ్యలోనే ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలు నిరుపయోగంగా వందలాది గృహాలు హనుమకొండలో ఇటీవల 592 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగింతడబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కింద చేపట్టిన నిర్మాణాలు ఎందుకూ కొరగాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. హనుమకొండ తరహాలో జిల్లాలో కూడా నిర్మాణం పూర్తయిన 2బీహెచ్కే ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం, అసంపూర్తిగా ఉన్న వాటిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
శిశుమరణాలు నివారించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో శిశు మరణాల నివారణకు వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ప్రాణం అమూల్యమని, సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే శిశువుల ప్రాణాలు కాపాడొచ్చని అన్నారు. హైరిస్క్ గర్భిణులకు ప్రత్యేక పర్యవేక్షణ, సమయానికి వైద్యసేవలు అందించాలని సూచించారు. గిరిజన, గుత్తికోయల ప్రాంతాల్లో పిల్ల ల ఆరోగ్యం, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. శిశువులకు మొదటి ఆరునెలలు పూర్తిగా తల్లిపాలు అందించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఐడీఓసీలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఎక్కడైనా గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఎస్పీ రోహిత్రాజు మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించాలి కొత్తగూడెంఅర్బన్ : ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీ ఆవరణలో జరుగుతున్న పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా ప్రగతికి అనుకూల వాతావరణం నెలకొల్పడమే కాకుండా, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. యూనివర్సిటీ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా విస్తృతంగా ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు. స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేయాలి చుంచుపల్లి: జిల్లాలో కొత్త స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేసి, వాటిలో పేదలకు అవకాశం కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాల బలోపేతంతో మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు. వీరందరికీ చిరు వ్యాపారాలు, ఇతర మార్గాల్లో ఆర్థికంగా ప్రోత్సాహం కలిగిస్తామని అన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి పాల్వంచ: సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. విద్యాసంస్థల ప్రాంగణాలు అందంగా, ఆహ్లాదకరంగా ఉండేలా నీడనిచ్చే చెట్లు, వెదురు మొక్కలు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు పెంచాలని సూచించారు. విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ట్రైనీ కలెక్టర్ సౌరబ్శర్మ, డీఆర్డీఓ విద్యాచందన, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఐఈఓ వెంకటేశ్వరరావు, ఆర్టీఓ వెంకటరమణ, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డీఏఓ బాబురావు, మైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజు, ఎల్బీఎం రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. హౌసింగ్ బోర్డు సెక్రటరీగా రామాలయ ఈఓభద్రాచలం : రామాలయ ఈఓ ఎల్.రమాదేవికి ఇటీవల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి కల్పించిన విషయం విదితమే. ఆమెను ఆర్అండ్బీ శాఖకు కేటాయించినా ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా మంగళవారం.. హౌసింగ్ శాఖలో సెక్రటరీ పోస్టు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఆమె హౌసింగ్ శాఖలో విధులు నిర్వర్తించనుండగా.. రామాలయ ఈఓగా మాత్రం ఇంకా ఎవరినీ నియమించలేదు. విద్యార్థుల భవిష్యత్కు ‘వ్యక్తిత్వ వికాసం’అశ్వారావుపేట: విద్యార్థుల భవిష్యత్ కోసం వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంగళవారం ఈ తరగతులు ప్రారంభించారు. మారుమూల ప్రాంత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తిత్వ వికాసం పొందాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఆదినారాయణ ఈ ఇగ్నైట్ అండ్ ఇన్స్పైర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం హైదరాబాద్కు చెందిన ఇన్స్పైర్ మైండ్స్ – ఇగ్నైటింగ్ సోల్స్ సంస్థ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. కాగా, ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని పీఓ, ఎమ్మెల్యే విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మోటివేటివ్ స్పీకర్ జైపాల్, రంజిత్, సుధాకర్, రామ్, శ్రవణ్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఎరువులు కొంటే బిల్లు తీసుకోవాలిగుండాల: రైతులు ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా బిల్లులు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు అన్నారు. మండలంలోని పలు పురుగుమందుల దుకాణాలను మంగళవారం ఆయన పరిశీలించారు. కాలం చెల్లిన మందులు, నాసిరకం ఎరువులు విక్రయించవద్దని నిర్వాహకులకు సూచించారు. పీఏసీఎస్లో ఎరువుల నిల్వలను పరిశీలించి.. యూరియా సరిపడా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందొద్దని అన్నారు. అనంతరం చెట్టుపల్లి, శంభూనిగూడెంలో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. పురుగుమందులు, ఎరువులు పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అర్హులంతా రైతుబీమా పథకానికి దరఖాస్తూ చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఓ వెంకటరమణ, ఏఈఓ లెనిన్, బాలరాజు ఉన్నారు. -
గిరిజనుల ఆర్థికాభివృద్ధికి పథకాలు
భద్రాచలం: గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన దర్బార్ నిర్వహించగా.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దర్బార్కు వచ్చే గిరిజనులను మర్యాదపూర్వకంగా స్వాగతించాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ పథకాలు గిరిజనుల చెంతకు చేరేలా అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అర్జిదారులు సైతం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ హరీష్, ఏడీఎంహెచ్ఓ సైదులు, ఏఓ సున్నం రాంబాబు, ఎస్ఓ భాస్కర్, ఏపీఓ వేణు, ఆర్ఓఎఫ్ఆర్ డీటీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
టేబుల్ టెన్నిస్ ఉమ్మడి జల్లా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ జట్లను ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సోమవారం ఎంపిక చేశారు. ఈమేరకు జట్ల వివరాలను టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసాని విజయ్కుమార్, వీవీఎస్.సాంబమూర్తి తెలిపారు. అండర్–11 బాలుర జట్టులో అనుమోలు శ్రేయన్, జాయ్, ఈశ్వర్, హేమంత్ సాయి, నిహాల్ కృష్ణ, యశ్వంత్, రోషన్, బాలికల జట్టుకు బాలసాని హర్వికలక్ష్మి, పి.ఆరాధ్య, తోట జిజ్ఞాస, రోస్మిత, అండర్–13 బాలికల జట్టులో పర్స వంషిక, బాలసాని తన్మయిశ్రీ, బొంతు సాయిశివాని, బాలుర జట్టులో కోటగిరి హితేష్ శ్రీరంగా, ఈ.హరి, అభిలాష్, అన్వేష్, సాయి హర్షిత్ ఎంపికయ్యారని వెల్లడించారు. అలాగే, అండర్–15 బాలికల జట్టులో హర్షిత, అఖిల, స్పందన చంద్ర, చిలకబత్తిన పావని, బాలురు జట్టుకు షేక్ సాహెల్ ఫజల్, జి.చార్విక్, ఈ.తరుణ్, ఏ.ఉజ్వల్, ప్రజ్ఞ, అండర్–17 బాలురు జట్టుకు పరిటాల జ్వలిత్, పిట్టల మోహిత్ కృష్ణ, రామ్ సాకేత్, రణధీర్రెడ్డి, సైఫ్, అనస్, బాలికల జట్టులో గద్దల సిరి, పి.అమత, జి.చంద్రికరాణి, షర్మిలరాణి, సుప్రియ ఎంపికయ్యారని తెలిపారు. ఆయా జట్లు ఈనెల 22నుంచి హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొంటాయని వెల్లడించారు.43 కిలోల గంజాయి సీజ్భద్రాచలంటౌన్: ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్ శ్రీహరిరా వు కథనం ప్రకారం.. భద్రాచలంలోని కూనవరంరోడ్డులో వా హనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా 43 కిలోల గంజాయి లభించింది. దీంతో వాహనంలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఒడిశా రాష్ట్రం పాడువకు చెందిన సురేంద్ర సింగ్ రాజ్పుత్గా తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. గంజాయి, కారును సీజ్ చేశారు. మరో ఘటనలో ద్వికచక్ర వాహనంపై 13 లీటర్ల నాటు సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక లారీ సీజ్దమ్మపేట: ఆంధ్రా నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్ప ర్ లారీని దమ్మపేట పోలీసులు సోమవారం సీజ్ చేశారు. ఏపీలోని రాజమండ్రి నుంచి టిప్పర్ ద్వారా దమ్మపేటకు తరలించి, ఓ ఖాళీ ప్రదేశంలో ఇసుక అన్లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. కేసునమోదు చేసినట్లు అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు. -
ఓపెన్ డిగ్రీలో ప్రవేశానికి 13 వరకు అవకాశం
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లిలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో ప్రవేశానికి ఈనెల 13వ తేదీ వరకు అవకాశం ఉందని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పూర్ణచందర్రావు, సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ, డిప్లొమా రెండు సంవత్సరాల కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఈ సంవత్సరం నుంచి గిరిజన విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘డబుల్’ ఇల్లు రాలేదని నిరసనభద్రాచలంఅర్బన్: డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదని ఓ మహిళ సోమవారం ఆవేదన వ్యక్తం చేసింది. పట్టణంలోని మనబోతుల చెరువు ప్రాంతంలోని డబుల్ బెడ్రూం ఇళ్లు నిరుపేదలకు కేటాయించారని పేర్కొంది. జాబితాలో తన పేరు ఉన్నా ఇల్లు మరొకరికి కేటాయించారని సరిత అనే మహిళ వాపోయింది. సోమవారం పెట్రోల్ బాటిల్తో మనబోతుల చెరువు వద్ద ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన తెలిపింది. నిరుపేద అయిన తనకు ఇల్లు ఇవ్వలేదని పేర్కొంది. కొందరు డబుల్ బెడ్ రూం ఇళ్లను రూ.3 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆరోపించింది. కాంట్రాక్ట్ కార్మికుడికి గాయాలుమణుగూరు టౌన్ : మణుగూరులోని ఓ ఓబీ కంపెనీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుడికి గాయాలైన సంఘటన సోమవారం జరిగింది. దుర్గా ఓబీ కంపెనీలో పనిచేసే ఆపరేటర్ దినేశ్ కుమార్ ఓబీ లోడ్తో వెళ్తుండగా, వాహనం ఒకవైపు ఒరిగి త్రుటిలో ప్రమాదం తప్పింది. స్వల్పగాయాలు కావడంతో ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడిని ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ రాంగోపాల్ పరామర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఓబీ కంపెనీల్లో ప్రమాదాలపై యాజమాన్యం దృష్టి సారించాలని కోరారు. నాటిక పోటీల్లో విజేత.. ఖరీదైన జైళ్లుఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలో నాలుగురోజుల పాటు జరిగిన తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీల్లో విజేతల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. కరీంనగర్ చైతన్యభారతి కళాసంస్థ ప్రదర్శించిన ఖరీదైన జైళ్లు, హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు ప్రదర్శించిన అమ్మ చెక్కిన బొమ్మ, తాడేపల్లికి చెందిన అరవింద్ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన విడాకులు కావాలి నాటికలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం తొమ్మిది నా టికలు ప్రదర్శించగా రంగస్థల నటులు సుబ్బ రాయ శర్మ, మేక రామకృష్ణ, గోవిందరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈమేరకు మొదటి మూడు స్థానాల్లో నిలిచిన నాటికలు ప్రదర్శించిన సంస్థలు, ఉత్తమ దర్శకులు, నటులకు బహుమతలు అందజేశారు. నిర్వాహకులు అన్నాబత్తుల సు బ్రహ్మణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్రావు, దేవేంద్ర, డాక్టర్ నాగబత్తిని రవి, వేల్పుల విజేత, నామ లక్ష్మీనారాయణ, వేముల సదానందం తదితరులు పాల్గొన్నారు. -
22 తులాల బంగారం స్వాధీనం
● ఇద్దరు నిందితులు అరెస్ట్ ● భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు కొత్తగూడెంటౌన్: పోలీసులు భారీచోరీ కేసును ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం టూటౌన్ పోలీసు స్టేషన్లో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వెల్లడించిన వివరాలు ఇలా.. రుద్రంపూర్ నాలేరియాకు చెందిన సింగరేణి ఉద్యోగి వాకపల్లి వెంకటరమణ ఇంట్లో ఈ నెల 4న చోరీ జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఆదివారం ఫోర్ ఇంక్లైన్ ఏరియాలో సీఐ డి.ప్రతాప్, ఎస్సైలు కిషోర్, మనీషా, సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ గ్రామానికి చెందిన నారసాని రమేష్, కొత్తగూడెం మేదరబస్తీ గొల్ల గూడేనికి చెందిన ఓర్సు కుమార్ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి విచారించగా సింగరేణి ఉద్యోగి ఇంట్లో చోరీ చేసినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 22 తులాల బంగారం, రూ.2,78,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నారసాని రమేష్ చోరీ కేసులోనే గతంలో జైలుకు వెళ్లి వచ్చాడు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదించిన టూటౌన్ పోలీసులకు, బ్యాక్గ్రౌండ్ సపోర్టు ఇచ్చిన సీసీఎస్ పోలీసులకు డీఎస్పీ రివార్డులను అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో టూటౌన్ సీఐ ప్రతాప్, సీసీఎస్ సీఐ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు పాల్గొన్నారు. -
నిధులు లేక.. ‘ప్రగతి’ సాగక..
ఇల్లెందు: పట్టణాలను అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన పట్టణ ప్రగతికి 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా అభివృద్ధి ఆగిపోయింది. గత ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ప్రతీ మున్సిపాలిటీకి జనాభా ఆధారంగా నిధులు మంజూరు చేయగా.. శానిటేషన్ పనులు ముమ్మరంగా సాగాయి. ప్రారంభంలో ఇల్లెందు మున్సిపాలిటీకి రూ. 25 లక్షలు నిధులు కేటాయించారు. 2023 ఏప్రిల్ నుంచి నిధులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి మున్సిపాలిటీలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రతి నెలా నిధులతో ఇలా.. పట్టణ ప్రగతి ప్రణాళికలు రూపొందించి పట్టణంలోని ప్రధాన కూడళ్ల అభివృద్ధి, హరితహారం, సెంట్రల్ లైటింగ్, డ్రెయినేజీలు, భవన నిర్మాణాలు, చిట్టడవులు, నర్సరీలు, చిల్డ్రన్ పార్క్లు, పట్టణ ప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛ ఆటోలు, ఫౌంటేన్, వెండర్ జోన్ల అభివృద్ధి పనులు చేపట్టారు. అత్యధిక నిధులు కార్మికుల వేతనాలకే.. ఇల్లెందు వంటి మున్సిపాలిటీలో ఇతర ఆదాయాలు రాబడి లేనందున పాలన సాగడం కష్టంగా మారింది. ప్రతి నెలా మున్సిపాలిటీలో పని చేసే కార్మికులకు వేతనాల కోసం రూ. 25 లక్షల వరకు నిధులు అవసరమవుతున్నాయి. పట్టణంలో లైసెన్సులు, ఆస్తి పన్నులు, ఇతర ఆదాయాల ద్వారా సమకూరిన నిధులు కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి సరిపోతున్నాయి. ఇతర అభివృద్ధి పనులు ముందుకు సాగాలంటే పట్టణ ప్రగతి నిధులు, ఆర్థిక సంఘం నిధులు, ఎస్డీఎఫ్, ఎమ్మెల్యే, ఎంపీల నిధులు విడుదల చేయాలని పట్టణాల ప్రజలు కోరుతున్నారు. కేవలం ఆర్థిక సంఘం నిధులు మినహా ఇతర ఏ నిధులూ విడుదల చేయకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి.పట్టణాల్లో కుంటుపడుతున్న అభివృద్ధి 2023 ఏప్రిల్ నుంచి నిలిచిన నిధులు కేవలం ఆర్థిక సంఘం నిధులే దిక్కు.. కార్మికుల వేతనాలకే సరిపోతున్న మున్సిపల్ ఆదాయంఆగిన నిధుల వివరాలిలా.. మున్సిపాలిటీ నిధులు(రూ.లక్షల్లో) ఇల్లెందు రూ. 12,00,743 ఖమ్మం రూ.1,02,30,766 సత్తుపల్లి రూ.12,21,197 మధిర రూ.12,53,413 వైరా రూ.12,25,778 కొత్తగూడెం రూ.28,00,097 మణుగూరు రూ.12,23,162 పాల్వంచ రూ.30,60,485వేతనాల కోసం పాట్లు.. మున్సిపాలిటీలో కార్మికుల వేతనాలు వెళ్లదీయడం కోసం పాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు నేరుగా అందజేస్తే ఇక్కడి పన్నుల మీద వచ్చే ఆదాయంతో పట్టణంలో ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉండేది. నిధులు లేని కారణంగా ఏ పనీ సక్రమంగా చేయలేకపోతున్నాం. పట్టణ ప్రగతి నిధులు విడుదలైతే ఎంతో మేలు జరిగేది. – సీహెచ్.శ్రీకాంత్, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ -
అనారోగ్యంతో పదో తరగతి విద్యార్థిని మృతి
అశ్వారావుపేటరూరల్: అనారోగ్యంతో బాధపడుతు న్న ఓ విద్యార్థిని సోమవారం మృతిచెందింది. స్థానికుల కథ నం ప్రకారం..అశ్వారావుపేట లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పేటమాలపల్లికి చెందిన ఎన్. లౌఖిక(14) కొద్దిరోజులుగా ఫిట్స్తో బాధపడుతోంది. కుటుంబీకులు ఓ వైద్యశాలలో చికిత్స చేయించారు. సోమవారం ఉదయం కూడా ఫిట్స్ రాగా, ఆస్పత్రికి తరలించేలోపే పరిస్థితి విషమించి మృతి చెందింది. పాఠశాల హెచ్ఎం పి.హరిత, ఉపాధ్యాయులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబీకులకు సానుభూతి ప్రకటించారు. విద్యార్థిని మృతితో పాఠశాలకు సెలవు ప్రకటించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి..దమ్మపేట: భార్య మందలించిందనే కారణంగా ఆత్మన్యూనతా భావంతో కలుపు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన సింగిచ్చి ఏసురాజు(48) కొంతకాలంగా మద్యానికి బానిసగా మారి కుటుంబ పోషణను పట్టించుకోవడంలేదు. దీంతో విసుగుచెందిన భార్య కృష్ణవేణి శనివారం అతడిని మందలించింది. క్షణికావేశంలో ఏసురాజు కలుపు మందు తాగి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కౌలు రైతు..అశ్వాపురం: మండల పరిధి లోని గోపాలపురం గ్రామం వద్ద మణుగూరు–కొత్తగూడెం ప్రధా న రహదారిపై ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌలు రైతు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సర్వాయిపాడు బంజర గ్రామానికి చెందిన రైతు సోడే మంగయ్య(36) మణుగూరు మండలం కూనవరంలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రోజూ ఉదయం పొలానికి రాత్రి ఇంటికి వస్తాడు. ఆదివారం కూడా పొలానికి వెళ్లి ఎరువులు చల్లాడు. రాత్రి బైక్పై ఇంటికి వస్తుండగా గోపాలపురం వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో మంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై మధుప్రసాద్ కేసు నమోదుచేశారు. -
పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలి
టేకులపల్లి: గుడుంబాలో కల్తీ వల్లే తన కుమారుడు మృతి చెంది ఉంటాడని, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని మృతుడి తండ్రి ఆర్ఎంపీ యనగంటి అర్జున్రావు, ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి టేకులపల్లి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన కుమారుడు ఆర్ఎంపీ రవికాంత్ గత నెల 27న కొందరు స్నేహితులతో కలిసి మండల కేంద్రంలోని బోడ బజారులో ఓ ఇంట్లో గుడుంబా తాగాడని పేర్కొన్నారు. ఈ గుడుంబా విక్రయించే కుటుంబం గతంలో రవికాంత్తో తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారని తెలిపారు. గత నెల 27న ముఖానికి మాస్కు ధరించిన ఇద్దరు వ్యక్తులు తన కుమారుడిని తీసుకొచ్చి, ఇంటి ముందు వదిలేసి వెళ్లినట్లు స్థానికులు చెప్పారని తెలిపారు. గుడుంబాలో కల్తీ వల్లే తమ కుమారుడు మృతి చెంది ఉంటాడని, పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మార్పీఎస్ నాయకులు మెంతెన ప్రభాకర్, నల్లగట్ల వెంకన్న, జినక ఇస్తారి, సతీష్, వెంకన్న పాల్గొన్నారు. -
అందని యాసంగి బోనస్
● సన్నరకాల ధాన్యం బోనస్ బకాయి రూ.18.34 కోట్లు ● మూడు నెలలుగా ఎదురుచూస్తున్న రైతులు బూర్గంపాడు: గత యాసంగిలో పండించిన సన్నరకం ధాన్యం విక్రయించి మూడు నెలలు దాటింది. వానాకాలం సీజన్ నాట్లు ముగింపు దశకు చేరాయి. అయినా ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. దీంతో రైతులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో గత యాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 55,243 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 36,950 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉంది. ప్రభుత్వం మద్దతు ధర సన్నరకాలకు క్వింటాల్కు రూ. 2,320లు, దొడ్డురకాలకు రూ.2,300 చెల్లించింది. క్వింటాల్కు రూ.500 చొప్పున ఇస్తానని చెప్పిన బోనస్ మాత్రం రైతు ఖాతాల్లో జమ చేయలేదు. జిల్లాలో రూ.18.34కోట్ల బోనస్ బకాయి చెల్లించా ల్సి ఉంది. గత వానాకాలం పండించిన సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం నూరుశాతం బోనస్ అందించింది. అదే నమ్మకంతో యాసంగిలో కూడా రైతులు సన్నరకం వరిని సాగు చేశారు. దొడ్డు రకాల కంటే సన్నరకాలకు ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఎరువులు అధికంగా వేయాలి. చీడపీడలు, దోమ నివారణ, పురుగుల నివారణకు అధికంగా సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. ఎకరాకు రూ. 8 వేల వరకు అదనపు పెట్టుబడి అవుతుంది. యాసంగిలో సన్నరకాలు ఎకరాకు 35 బస్తాల దిగుబడి వస్తే, దొడ్డురకాలు 40నుంచి 45బస్తాల వరకు దిగుబడి వస్తాయి. అయినా బోనస్ అందిస్తామనే ప్రభుత్వ ప్రకటనతో రైతులు సన్నరకాలను సాగు చేశారు. దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లు రెండేళ్లుగా మందకొడిగా సాగుతుండటం వల్ల కూడా సన్నరకాల వైపు మొగ్గు చూపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన పదిరోజుల్లో నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమైంది. కానీ బోనస్ మాత్రం ఇంతవరకు రాలేదు. ఎప్పుడు ఇస్తారనే విషయమై అధికారుల నుంచీ స్పష్టత లేదు. వానాకాలం వరినాట్లకు ఉపయోపడుతుందని ఆశించిన రైతులు బోనస్ అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు. రూ.60వేల బోనస్ రావాలి యాసంగిలో 120 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం అమ్మినాను. నాకు రూ. 60 వేల బోనస్ రావాలి. వడ్లు అమ్మి వందరోజులు దాటినా బోనస్ పడలేదు. ఆ డబ్బులు వానాకాలం నాట్లకు అక్కరకు వస్తాయనుకున్నాను. –వెలమ రమేష్, రైతు, మల్లెలమడుగు, అశ్వాపురం మండలంఎప్పుడు జమవుతుందో చెప్పలేం.. యాసంగిలో కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యానికి సంబంధించిన రైతుల బ్యాంకు ఖాతాలను ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నిర్ణయం మేరకు రైతుల ఖాతాల్లోనే బోనస్ నగదు జమవుతుంది. ఎప్పుడు జమవుతుందో కచ్చితంగా చెప్పలేం. –రుక్మిణిదేవి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి -
ఆర్టీసీకి కలిసొచ్చింది..
ఖమ్మంమయూరిసెంటర్: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వత్రం, రాఖీ పౌర్ణమి రెండో శనివారం.. ఆ తర్వాత ఆదివారం కావడంతో జనమంతా ఊర్ల బాట పట్టడం ఆర్టీసీకి కలిసొచ్చింది. ఈనెల 7నుంచి 10వ తేదీ వరకు ఆర్టీసీ ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల ద్వారా 374 బస్సులు నడిపించారు. ఆ బస్సుల్లో తద్వారా లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చడంతో కాసుల పంట పండింది. ప్రణాళికాయుతంగా.. ఈనెల 8న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోగా విద్యాసంస్థలకు ఆప్షనల్ హాలీడే ఇచ్చారు. ఆ మరుసటి రోజు రాఖీ పండుగ, ఆపై ఆదివారం కలిసొస్తుండడంతో చాలా మంది 7వ తేదీనే సొంత ఊర్లకు పయనమయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 7, 8, 9వ తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోలకు ప్రత్యేక బస్సులను నడిపారు. ఇక 9వ తేదీన హైదరాబాద్తో పాటు జిల్లాలో రద్దీ ఉన్న ప్రాంతాలకు ని బస్సులను తిప్పారు. అంతేకాక 10వ తేదీ ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్కు తిరుగుప్రయాణం అయ్యేవారి కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తూ బస్టాండ్లలో అదనపు సిబ్బంది ద్వారా పర్యవేక్షించడంతో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు. రద్దీలోనూ మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు విపరీతమైన రద్దీలోనూ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని విజయవంతంగా అమలు చేశారు. రక్షా బంధన్ పండుగ రోజు రీజియన్ వ్యాప్తంగా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో 1.50 లక్షల మంది మహిళామణులు ప్రయాణించారు. ఈరోజు మొత్తంగా మొత్తం 2లక్షల మందికి పైగా ప్రయాణికులను రాకపోకలు సాగించారు. ఇక ఆదివారం అదనంగా 137 సర్వీసులు నడింపించారు. కాగా, రీజియన్కు రికార్డ్ స్థాయిలో కేవలం ప్రత్యేక సర్వీసుల ద్వారానే రూ.1.21 కోట్ల ఆదాయం నమోదుకాగా.. అత్యధికంగా మధిర నుంచి రూ.29.84 లక్షల ఆదాయం సమకూరింది. రద్దీకి అనుగుణంగా సర్వీసులు రాఖీ పండుగ, మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యాన ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నాం. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలని ఉద్యోగులకు సూచనలు చేశాం. డిప్యూటీ ఆర్ఎం, డిపో మేనేజర్లతో పాటు నేను కూడా బస్టాండ్లలో పర్యవేక్షిస్తూ రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటుచేయడంతో ఏ సమస్యా రాలేదు. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్వరుస సెలవులతో ప్రయాణికుల రద్దీ నాలుగు రోజుల్లో రూ.1.21 కోట్ల ఆదాయం అత్యధికంగా మధిర నుంచి రూ.29.84 లక్షలునాలుగు రోజుల్లో డిపోల వారీగా ఆదాయం (ప్రత్యేక సర్వీసుల ద్వారా) డిపో కిలోమీటర్లు ఆదాయం (రూ.లక్షల్లో) మధిర 42,316 29.84భద్రాచలం 42,958 25.81ఖమ్మం 38,022 20.99సత్తుపల్లి 26,122 15.58మణుగూరు 24,096 12.05కొత్తగూడెం 15,155 9.16ఇల్లెందు 11,797 7.88రీజియన్ 2,00,466 121.35 -
ఆనాటి హామీలు ఏమాయె?
బోటింగ్ పాయింట్ నుంచి కాటేజీకి వెళ్లే రోడ్డు ఇలా..రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతేడాది ఆగస్టు 12న కిన్నెరసానిలో క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చారు. బోటులో సుమారు రెండు గంటల పాటు జలాశయంలో విహరించారు. జలాశయం మధ్యలో ఉన్న ‘ఆనంద ద్వీపం’ కాన్సెప్టును దగ్గరి నుంచి పరిశీలించారు. బోటులోనే మధ్యాహ్న భోజనం కూడా చేశారు. అనంతరం కిన్నెరసానితో పాటు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముగ్గురూ హామీ ఇచ్చారు. కానీ.. ఏడాది పూర్తయినా వారి హామీల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. దీంతో ప్రగతి భవన్ పరిపాలనైనా, ప్రజాపాలనైనా జిల్లాలో పర్యాటక రంగానికి ఒనగూరిన ప్రయోజనమేమీ లేదనే విమర్శలు వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంపొదల్లో చిక్కుకున్న కాటేజీలు.. ఇల్లెందు క్రాస్రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న హరిత కాకతీయ హోటల్, హరిత కన్వెన్షన్ సెంటర్లకు సంబంధించి మిగిలిన పనులను 2024 నవంబర్ నాటికి పూర్తి చేస్తామని, ముక్కోటికి భద్రాచలం వచ్చే భక్తులు, పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ముక్కోటితో పాటు శ్రీరామ నవమి పర్వదినాలు వచ్చి పోయినా ఈ రెండు పనులు నేటికీ పూర్తి కాలేదు. శిల్పాన్ని చెక్కినట్టుగా ఇక్కడ ప్రతీ పని నెలల తరబడి సాగుతోంది. ఇదే క్యాంపస్లో సివిల్ నిర్మాణం పూర్తయి ఇంటీరియర్ పనులు పెండింగ్లో ఉన్న పది కాటేజీలు (20 గదులు) సంగతి ఏంటన్న అంశంపై ఎవ్వరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. కాటేజీలను పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కల పొదల్లో చిక్కుకుపోయాయి. సా..గుతున్న పర్యాటక పనులు ● గతేడాది ఇదే రోజున కిన్నెరసానికి ముగ్గురు మంత్రులు ● అభివృద్ధి చేస్తామని అమాత్యుల భరోసా ● నేటికీ అమలుకు నోచని వాగ్దానాలు -
సేవలు సద్వినియోగం చేసుకోవాలి
డీసీసీబీ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల మణుగూరు టౌన్: రైతులకు చేరువలో ఉన్న డీసీసీబీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మణుగూరులో సోమవారం ఆయన డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయాన్ని కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, సహకార సంస్థను కూడా కాపాడుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి మన్ననలు పొందేలా ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, బోనస్ రూపంలో రూ.1.50 లక్షల కోట్లు అందించామని వివరించారు. పినపాక నియోజకవర్గంలో భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయని, ఈ ప్రాంతంలో చెరువులు, రహదారులు అభివృద్ధి చేసే అవకాశం గతంలో తనకు లభించిందని అన్నారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తయితే 25 – 30 వేల ఎకరాలకు నీరందుతుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన పులుసుబొంత ప్రాజెక్ట్కు అటవీ అనుమతులు రాకపోవడంతోనే ఆలస్యం జరుగుతోందని, త్వరలోనే సీఎంను కలిసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, సీఈఓ వెంకట ఆదిత్య, జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య, ఏజీఎంఎస్ నవీన్కుమార్, చందర్రావు, డీసీఓ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ బాలరాజు, నాయకులు నవీన్, శివ, దొబ్బల వెంకటప్పయ్య, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు గాండ్ల సురేశ్, ఆవుల సర్వేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి తుమ్మల సీపీఐ నేత అయోధ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 14న హుండీల లెక్కింపుశ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ హుండీలను ఈనెల 14న లెక్కించనున్నట్లు ఈఓ రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల వారు సకాలంలో హాజరు కావాలని కోరారు. కేటీపీఎస్ ఉద్యోగికి డాక్టరేట్పాల్వంచ: కేటీపీఎస్ ఉద్యోగి బూర్గుల విజయభాస్కర్ చేస్తున్న సంఘ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా డాక్టరేట్ అందుకున్నారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజయ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీస్తు సంపూర్ణత ఇవాంజలికల్ మిషన్ వారు సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన వారికి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ పిడుగు విజయ్కుమార్, సీనియర్ కన్సల్టెంట్ బి.మధు చేతుల మీదుగా విజయభాస్కర్ డాక్టరేట్ అందుకున్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
అధికారులకు కలెక్టర్ ఆదేశంసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ప్రగతిమైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పా ట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అన్ని శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని, వేడుక ప్రాంగణంలో 108 అంబులెన్స్, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని, ఆయా శాఖల పనితీరుకు అద్దం పట్టేలా స్టాళ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల్లో దేశభక్తి, జాతీయభావం ఉట్టిపడేలా ఉండాలన్నారు. శాఖల వారీగా ప్రశంసాపత్రాలు అందించేలా గడువులోగా పేర్లు అందించాలని సూచించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలి.. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీ, అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. కలెక్టరేట్లో సోమవారం గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతినెలా ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయ పార్టీలు బూత్లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో హడావుడి చేయకుండా ముందుగానే పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి వాటిపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి.. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. చుంచుపల్లి మండలానికి చెందిన కాకాటి అనూష.. ల్యాండ్ సర్వేయర్ అప్రెంటిస్ నిమిత్తం తనను ఆళ్లపల్లి మండలానికి కేటాయించారని, ఏడాది వయసున్న పాపతో అంతదూరం వెళ్లలేకపోతున్నానని, చుంచుపల్లి మండలానికి సమీపంలో కేటాయించాలని దరఖాస్తు చేయగా భూమి, కొలతల శాఖకు ఎండార్స్ చేశారు. ములకలపల్లి మండలం ఒడ్డు రామవరం అంగన్వాడీ స్కూల్ కాలనీలో బోరు చెడిపోయిందని, మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదని ఫిర్యాదు చేయగా మిషన్ భగీరథ ఈఈకి ఎండార్స్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ట్రైనీ కలెక్టర్ సౌరబ్శర్మ, అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డీఓ మధు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్లు ముజాహిద్, రంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీలకు ఆదరణ..
● కస్తూర్బా కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు ● ఫలితమిచ్చిన ఇంటింటి ప్రచారం ● ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 8,234 మంది చేరిక ● మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 15 వరకు అవకాశంపాల్వంచరూరల్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు ఉచిత భోజనం, వసతి, దుస్తులు ఇవ్వడంతో పాటు నాణ్యమైన బోధన అందుతోంది. గత వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి ఈ మేరకు ప్రచారం కల్పించారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని 28 కస్తూర్బాగాంధీ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఈ ఏడాది 8.234 అడ్మిషన్లు నమోదయ్యాయి. జిల్లాలోని 14 విద్యాలయాల్లో అడ్మిషన్లు ఆశాజనకంగా ఉన్నాయని జీసీడీఓ అన్నామణి తెలిపారు. కొన్ని కళాశాలల్లో కొంత తగ్గినా.. మొత్తంగా చూస్తే ప్రవేశాల సంఖ్య పెరిగిందని వివరించారు. ఉమ్మడి జిల్లాలో 544 సీట్లు ఖాళీ.. ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య పెరిగినా ఉమ్మడి జిల్లా కేజీబీవీల్లో ఇంకా 544 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 49, అన్నపురెడ్డిపల్లి 30, భద్రాచలం 37, బూర్గంపాడు 11, చండ్రుగొండ 20, చర్ల 32, దుమ్ముగూడెం 25, గుండాల 10, జూలూరుపాడు 11, కరకగూడెం 30, ములకలపల్లి 10, పాల్వంచ 10, పినపాక 40, టేకులపల్లి 44 సీట్లు ఉండగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 23, పెనుబల్లి 34, సింగరేణి 20, లింగాల 24, బోనకల్ 24, కూసుమంచి 23, ఏన్కూర్ 14, కొణిజర్ల 15, ముదిగొండ 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 15 వరకు స్పాట్ అడ్మిషన్లు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి డీఈఓ ఆదేశాల మేరకు ఈనెల 15 వరకు స్పాట్ ఆడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తాం. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల మొదటి వారంలో కూడా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించడంతో గతేడాది కంటే విద్యార్థినుల సంఖ్య పెరిగింది. – ఎం.తులసి, సమగ్రశిక్షా అభియాన్ జీసీడీఓ, ఖమ్మం జిల్లాలోని కస్తూర్బా కళాశాలల్లో గత, ప్రస్తుత విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల వివరాలిలా.. 2024–25 2025–26 అళ్లపల్లి 261 245 అన్నపురెడ్డిపల్లి 333 333 భద్రాచలం 277 254 బూర్గంపాడు 276 250 చండ్రుగొండ 307 305 చర్ల 156 165 దుమ్ముగూడెం 239 227 గుండాల 247 249 జూలూరుపాడు 266 252 కరకగూడెం 289 299 ములకలపల్లి 302 342 పాల్వంచ 308 336 పినపాక 247 276 టేకులపల్లి 172 186 మొత్తం 3,680 3,719 -
సేవలు సద్వినియోగం చేసుకోవాలి
డీసీసీబీ బ్రాంచ్ ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల మణుగూరు టౌన్: రైతులకు చేరువలో ఉన్న డీసీసీబీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మణుగూరులో సోమవారం ఆయన డీసీసీబీ బ్రాంచ్ కార్యాలయాన్ని కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, సహకార సంస్థను కూడా కాపాడుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి మన్ననలు పొందేలా ఉద్యోగులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, బోనస్ రూపంలో రూ.1.50 లక్షల కోట్లు అందించామని వివరించారు. పినపాక నియోజకవర్గంలో భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయని, ఈ ప్రాంతంలో చెరువులు, రహదారులు అభివృద్ధి చేసే అవకాశం గతంలో తనకు లభించిందని అన్నారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తయితే 25 – 30 వేల ఎకరాలకు నీరందుతుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన పులుసుబొంత ప్రాజెక్ట్కు అటవీ అనుమతులు రాకపోవడంతోనే ఆలస్యం జరుగుతోందని, త్వరలోనే సీఎంను కలిసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, సీఈఓ వెంకట ఆదిత్య, జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య, ఏజీఎంఎస్ నవీన్కుమార్, చందర్రావు, డీసీఓ శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ బాలరాజు, నాయకులు నవీన్, శివ, దొబ్బల వెంకటప్పయ్య, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు గాండ్ల సురేశ్, ఆవుల సర్వేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి తుమ్మల సీపీఐ నేత అయోధ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. -
రైతు బీమా మార్గదర్శకాలు జారీ
● రైతులు ఏఈఓలను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలి ● ఈ నెల 13వ తేదీ వరకు గడువు విధించిన అధికారులుసూపర్బజార్(కొత్తగూడెం): రైతు బీమా పథకానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. బీమా పథకానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుండగా, సహజ లేదా ఏ కారణంచేతనైనా పట్టాభూమి కలిగిన రైతు మృతి చెందితే నామినీకి రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రైతులు ఈ పథకాన్ని వర్తింపజేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఈనెల 13 లోగా బీమా పథకానికి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. నూతనంగా పేరు నమోదు చేసుకునే వారు రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ పుస్తకం/ఆర్ఓఎఫ్ఆర్ పట్టా జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు సమర్పించాలని వివరించారు. 2025–26 సంవత్సరానికి మార్గదర్శకాలు.. ● 2025 జూన్ 5వ తేదీలోగా భూభారతి చట్టం ప్రకారం పట్టాలు కలిగినవారు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగినవారు అర్హులు. ● 18 నుంచి 59 సంవత్సరాలు అంటే 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్య జన్మించి ఉండాలి. ● ఆధార్ కార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకుంటారు. ● కొత్త పట్టాదారులు, గతంలో నమోదు కాకుండా ఉండి ఐదెకరాల్లోపు భూమి కలిగిన రైతులు, ఐదెకరాలకు మించి భూమి ఉండి గతంలో నమోదుకాని రైతులు ఈ నెల 13వ తేదీ వరకు వ్యవసాయ అధికారులతో పరిశీలన చేయించుకోవాలి. ● అర్హత కలిగి గతంలో ఐడీ వచ్చిన రైతులను రెన్యువల్ చేసేందుకు ఈ నెల 12వ తేదీతో గడువు ముగియనుంది. ● రైతులు డాక్యుమెంట్ కాపీలు, నామినీ వివరాలతో సహా రైతు బీమా పత్రంపై స్వయంగా సంతకంతో ధ్రువీకరించాలి ● వివరాలు నమోదులో పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్, నామినీ ఆధార్, మొబైల్ నంబరు తప్పులు లేకుండా చూసుకోవాలి. ● భౌతికంగా నామినేషన్/దరఖాస్తు ఫారం ధ్రువపత్రాలతో అందజేసినా పోర్టల్లో అప్లోడ్ చేస్తేనే అర్హులు అవుతారు. ● ఏఈఓ నమోదు చేసిన వివరాలు మండల వ్యవసాయాధికారి లాగిన్కు వస్తాయి. ఏఓ పరిశీలించి ధ్రువీకరించాలి. ఆపై ఏడీఏ పర్యవేక్షించాలి. సూచించిన గడువు లోగా నమోదు పూర్తి చేసేలా ఏడీఏ రోజువారీగా సమీక్షించాలి. ● రైతుబీమాలో నమోదుకాని రైతులకు సంబంధించి ఏఈఓ తప్పనిసరిగా కారణాన్ని రికార్డు చేయాలి. ● ఆధార్, పుట్టిన తేదీ పీపీబీ నంబరు, నామినీ వివరాలతో నమోదైన రైతుల వివరాలను రైతు వేదికలో ప్రదర్శించాలి -
సీఎం, ప్రతిపక్ష నేతా మోసగాళ్లే
ఇల్లెందు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇద్దరూ మోసగాళ్లేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఆదివారం ఇల్లెందు మార్కెట్ యార్డులో జరిగిన దివ్యాంగుల సభలో ఆయన మాట్లాడారు. దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలను మోసం చేశారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్ రూ. 2 వేలు పెంచుతామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా పెంచలేదని విమర్శించారు. పింఛన్ పెంచని ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వెళ్లకుండా ఫాం హౌస్లో సేద తీరుతున్నారని, ఇలాంటి ప్రతిపక్ష నేతను దేశంలో ఏ రాష్ట్రంలోనూ చూడలేదని పేర్కొన్నారు. పింఛన్ పెంచాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 3న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పింఛన్దారులు ఆందోళనకు తరలి రావాలని కోరారు. సంఘాల నాయకులు ఏడుకొండలు, మెంతెన వసంతరావు, శ్రావణ్, అన్నీ, జినక ఇస్తారీ, నల్లగట్ల వెంకన్న, మెంతెన ప్రభాకర్, రాజ్కుమార్, యశోద, వెంకన్న, నవీన్, రాజేందర్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
‘సరోగసీ’పై నిఘా!
● ఫెర్టిలిటీ సెంటర్ల నియంత్రణకు సర్కార్ చర్యలు ● జిల్లాలో తనిఖీలు చేపట్టనున్న రాష్ట్ర స్థాయి అధికారులు ● సృష్టి ఘటన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ ● జిల్లా స్థాయిలోనూ ముమ్మరంగా తనిఖీలు ఖమ్మంవైద్యవిభాగం: సరోగసీ ముసుగులో హైదరాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసిన నిర్వాకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల తీరును తెలుసుకునేందుకు ప్రత్యేక టీమ్లు ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో జిల్లాలోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లను త్వరలో తనిఖీ చేయనుండగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కేంద్రాల నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఏడు టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్లకు అనుమతి ఉండగా వాటిలో రెండు సెంటర్లు సరోగసీకి అనుమతి తీసుకున్నారు. ఇంకా పర్మిషన్ లేకుండా అనేక సెంటర్లు పుట్టుకొచ్చాయి. త్వరలోనే ఉన్నతాధికారుల పరిశీలన.. హైదరాబాద్ తర్వాత మెడికల్ హబ్గా వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలకు పేరుంది. కాగా ఖమ్మంలో తక్కువ సమయంలో ఎక్కువ సంతాన సాఫల్య కేంద్రాలు వెలిశాయి. జిల్లాకు అనుకుని ఉన్న భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, ఏపీలోని కృష్ణా జిల్లాల నుంచి వైద్య సేవల కోసం ఎక్కువగా ఖమ్మం వస్తుంటారు. దీనికి తోడు ఆర్ఎంపీలు కమీషన్ల ప్రాతిపదికన పేషెంట్లను తీసుకొస్తుంటారు. ఇదే అదనుగా ఇటీవల సంతాన సాఫల్య కేంద్రాలు కూడా పుట్టుకొచ్చాయి. పిల్లలు లేని దంపతులకు వల వేసి ఆయా సెంటర్లకు తీసుకొస్తుండగా తమ వద్ద చికిత్స తీసుకుంటే 100 శాతం పిల్లలు పుట్టడం గ్యారంటీ అంటూ సెంటర్ల నిర్వాహకులు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా సెంటర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు త్వరలోనే తనిఖీలకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిలా స్థాయిలో తనిఖీలు.. హైదరాబాద్ ఘటన కలకలంతో కలెక్టర్ వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అనుమతి లేని టెస్ట్ట్యూబ్ బేబీ సెంట ర్లు, నిబంధనలు పాటించని ఆస్పత్రుల్లో తని ఖీలు చేయాలని ఆదేశించారు. దీంతో ఈనెల 1న తనిఖీలు ప్రారంభించారు. వైరా రోడ్లోని రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను తనిఖీ చేశారు. అలాగే వైరారోడ్లోని మార్వెల్స్ హాస్పిటల్లో గతంలో సుమారు 168మందికి చికిత్స అందించినట్లు నకిలీ బిల్లులు ఇవ్వగా.. వారు సీఎంఆర్ఎఫ్ బిల్లుల కోసం సమర్పించినట్లు తేలడంతో ఆస్పత్రిని సీజ్ చేశారు. మయూరిసెంటర్లోని బ్రీత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల ఓ మహిళ మృతి చెందడానికి డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కలెక్టర్ దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ, సిబ్బంది వెళ్లి విచారించారు. మహిళ మృతికి వారి నిర్లక్ష్యమే కారణమని గుర్తించి ఆస్పత్రిని సీజ్ చేశారు. అయితే జిల్లాస్థాయిలో చేపట్టిన తని ఖీలు సాదారణమైనవే కాగా హైదరాబాద్ నుంచి వచ్చే బృందాల తనిఖీలతో ఎవరి బాగోతాలు బయటపడతాయో త్వరలో తేలనుంది. -
ఆల్బెండజోల్తో నులిపేద్దాం..
నూరు శాతం సక్సెస్కు.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లల కోసం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ముందస్తుగా ఇంటింటి సర్వే నిర్వహించగా మొత్తం 3,11,317 మంది ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించేలా 3.30 లక్షల మాత్రలు సిద్ధం చేసి ఇప్పటికే అన్ని కేంద్రాలకు పంపిణీ చేశారు. నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నూరు శాతం అమలయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి అంగన్వాడీలు 1,840 మంది, మెడికల్ అండ్ హెల్త్ వర్కర్లు 1,260మంది, ఆశాలు 1,339. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 1,750 మంది సిబ్బందిని నియమించింది. ఒకవేళ నేడు(సోమవారం) మిస్ అయిన పిల్లలకు ఈ నెల 18న మాప్అప్ రౌండ్ నిర్వహించనున్నారు. మాత్రలు మింగించే విధానం, జాగ్రత్తలు.. ● 1 నుంచి 19 ఏళ్ల లోపు బాలబాలికలకు ఆల్బెడజోల్ మాత్రలు వేయనుండగా.. 1 నుంచి 2 ఏళ్ల చిన్నారులకు అర(1/2) మాత్రను రెండు చెంచాలతో పొడి(క్రష్) చేసి నీటితో మింగించాలి. ● 2 నుంచి 3 ఏళ్ల చిన్నారులకు పూర్తి(ఫుల్) మాత్రను రెండు చెంచాలతో పొడి(క్రష్) చేసి నీటితో మింగించాలి. ● 3 నుంచి 19 ఏళ్ల వరకు ఉన్నవారికి ఒక మాత్ర నమిలి మింగించాలి. ● అనారోగ్య సమస్యలు, ఇతర చికిత్సలు తీసుకున్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రలు మింగించొద్దని, పిల్లలకు మధ్యాహ్న భోజనం అయిన అరగంట తర్వాతనే మాత్రలు మింగించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశాం.. అల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమం నూరుశాతం పూర్తి చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశాం. 1 నుంచి 19 ఏళ్ల పిల్ల లకు తప్పకుండా మాత్రలు మింగించాలి. పిల్లలు గోళ్లు కత్తిరించుకోకపోవడం, చేతులు కడకుండా భోజనం చేయటం ద్వారా పేగుల్లోకి నట్టలు చేరి ఆకలి మందగించడంతో పాటు రక్తహీతన ఏర్పడి అనారోగ్యపాలవుతారు. అలా జరగకుండా పిల్లలకు మాత్రలు వేయించి వారి కడుపులోని నులిపురుగులను అంతం చేయొచ్చు. సోమవారం మిస్ అయిన పిల్ల లకు ఈ నెల 18 ప్రత్యేక మాప్ అప్ రౌండ్ ద్వారా మళ్లీ మాత్రలు అందిస్తాం. – డాక్టర్ చందూనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఖమ్మం జిల్లానేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు మాత్రల పంపిణీ పిల్లల గుర్తింపునకు ఇంటింటి సర్వే నూరుశాతం అమలయ్యేలా ప్రణాళికలు మిస్ అయిన వారికి 18న మాప్ అప్ రౌండ్ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లల కోసం సోమవారం జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నులిపురుగుల మూలంగా చిన్నారుల్లో రక్తహీనత ఏర్పడి వివిధ రకాల వ్యాధుల గురవుతున్న నేపథ్యాన ప్రభుత్వం పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమం చేపట్టింది. ఇందుకు అంగన్వాడీ, విద్యాశాఖ సమన్వయంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన అన్ని ఏర్పాట్లు చేసింది. అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలకు మాత్రలు మింగించేలా సిబ్బందికి సైతం శిక్షణ ఇచ్చారు. అలాగే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీ, అర్బన్హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. – ఖమ్మంవైద్యవిభాగంఖమ్మం జిల్లాలో వివిధ కేంద్రాల్లో ఉన్న చిన్నారుల వివరాలు.. అంగన్వాడీ కేంద్రాల్లో (1 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు) – 74,641ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల పిల్లలు – 95,276ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు – 6,040ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులు – 1,35,360 -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
పునఃప్రారంభమైన నిత్యకల్యాణాలు భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా నిలిపిన నిత్యకల్యాణాలను పునఃప్రారంభించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాగా స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. రామయ్య సన్నిధిలో ఏపీ మంత్రిభద్రాచలం/దుమ్ముగూడెం: భద్రాచలం, పర్ణశాల శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని ఆలయాలను ఆంధ్రప్రదేశ్కు చెందిన కార్మిక, పారిశ్రామిక, వైద్య సేవల మంత్రి వాసంశెట్టి సుభాష్ తన కుటుంబ సభ్యులతో ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి పూజలు చేశారు. భద్రాచలం లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలను అందజేశారు. పర్ణశాలలో పంచవటీ కుటీరం, నారచీరల ప్రాంతాలను సందర్శించారు. పోలీసులు బందోస్తు నిర్వహించారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బి.నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయాలని కలెక్టర్ కోరారు. -
సింగరేణికి రూ.450 కోట్ల నష్టం..
● ఎక్స్ప్లోజివ్ టెండర్లలో అక్రమాలు ● విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులుసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఎక్స్ప్లోజివ్స్ కోసం వేసిన టెండర్లలో కంపెనీకి రూ. 450 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. ఆదివారం కొత్తగూడెంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో రూ. కోట్ల కుంభకోణాలు వెలుగు చూస్తున్నా సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కిందిస్థాయి ఉద్యోగులను బదిలీచేస్తూ, వేధింపులకు గురి చేస్తున్నా సింగరేణి విజిలెన్స్ కుంభకోణాలకు పాల్పడుతున్నవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. 1/70 యాక్ట్ పరిధిలో ఉన్న కోయగూడెం ఓసీ, గోదావరిఖనిలోని తాడిచెర్ల, భూపాలపల్లిలోని వెంకటాపుర్ ఓసీ, సత్తుపల్లి ఓసీ–3లలో బొగ్గును ప్రైవేట్ కంపెనీలతో బొగ్గు తవ్వించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. సింగరేణి సంస్థే ఆ ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేశారు. స్ట్రక్చరల్ సమావేశంలో అంగీకరించిన కార్మిక సమస్యలపై సర్క్యులర్లు విడుదల చేయాలని కోరారు. మైనింగ్, ట్రేడ్స్మెన్ ఉద్యోగులు అండర్ గ్రౌండ్ అన్ఫిట్ అయితే సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలన్నారు. ఈపీ ఆపరేటర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, కార్మికుల మారుపేర్ల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. జూలై 30,31 తేదీల్లో జరిగిన మెడికల్ బోర్డ్కు హాజరైన 47 మందికి మళ్లీ మెడికల్ బోర్డ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్కో, జెన్కోలు సింగరేణికి ఇవ్వాల్సిన రూ.36 వేల కోట్లు చెల్లించాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ మాట్లాడుతూ కార్మికులకు 200 గజాల స్థలం, రూ. 30 లక్షలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని, 35 శాతం లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరస్వామి, రమణ మూర్తి, క్రిస్టోఫర్, కత్తర్ల రాములు, సందెబోయిన శ్రీనివాస్, హుమాయిన్, మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కిన్నెరసాని ఒక గేటు ఎత్తివేత
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలాశయానికి వరద కొనసాగుతోంది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1,000 క్యూసెక్కుల వరదనీరు రావడంతో ఆదివారం నీటిమట్టం 404.70 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును రాత్రి 10గంటలకు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలినట్లు ఏఈ తెలిపారు. నది దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉత్సాహంగా టీటీ ఎంపికలుఖమ్మం స్పోర్ట్స్ : ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఎంపికలకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి 120 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడుతూ టేబుల్ టెన్నిస్ బోర్డులకు ప్రత్యేక హాల్ నిర్మిస్తున్నామని, ప్రతీ క్రీడాకారుడు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేలా రాణించాలని ఆకాంక్షించారు. టీటీ అసోసియేషన్ అధ్యక్షుడు బాలసాని విజయ్కుమార్ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులకు తమ సంఘం ఆధ్వర్యాన పది రోజుల పాటు శిక్షణ ఇచ్చి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు జోజిచాకో, షేక్ ముజాఫర్, పరిటాల చలపతి, రెడ్డి సాయి, శివ, రామారావు పాల్గొన్నారు. ముగిసిన నాటిక పోటీలు ఖమ్మంగాంధీచౌక్: తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన కళాసంస్థలు తొమ్మిది నాటికలు ప్రదర్శించాయి. సమాజ చైతన్యం, మూఢనమ్మకాలు, కొత్తపోకడలు, పాశ్చాత్య సంస్కృతి వంటి ఆంశాలపై ప్రదర్శించిన నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. ఆదివారం హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికను ప్రదర్శించారు. జ్యోతిరాజ్ బీశెట్టి రచించిన ఈ నాటికకు డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వం వహించారు. ఇక విశాఖపట్టణానికి చెందిన చైతన్య కళాస్రవంతి వారు (అ)సత్యం నాటికను ప్రదర్శించారు. చివరి రోజు నెల నెలా వెన్నెల నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు సీహెచ్.ఎన్. రాజకుమారి హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక విద్యావేత్తలు వంగా సాంబశివరావు, చైతన్య విద్యాసంస్థల అధినేత మల్లెంపాటి శ్రీధర్, హార్వెస్ట్ విద్యాసంస్థల అధినేత రవిమారుత్, నెల నెలా వెన్నెల నిర్వాహకులు ఎ.సుబ్రహ్మణ్యకుమార్, డాక్టర్ నాగబత్తిని రవి, జగన్మోహన్రావు, కురువెళ్ల ప్రవీణ్, వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ, వేల్పుల విజేత, మొగిలి శ్రీనివాసరెడ్డి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కల్లూరు: ఓ కంపెనీ వార్షికోత్సవ వేడుకలో కులంపేరుతో దూషించి, అవమానించిన ముగ్గురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 7న మధ్యాహ్నం కల్లూరు స్వాగత్ రెస్టారెంట్లో బేయర్ ఆగ్రో పురుగుమందుల కంపెనీ వార్షి కోత్సవాన్ని పురస్కరించుకుని విందు ఏర్పా టు చేశారు. ఈ విందులో పాల్గొన్న కల్లూరు మండలం వాచ్యానాయక్ తండాకు చెందిన బానోత్ ప్రసాద్ను లింగాల గ్రామానికి చెంది న దేవరపల్లి వెంకటరావు, మట్టూరి రాజేష్, దేవరపల్లి అశోక్లు కులం పేరుతో దూషించి, అవమాన పరిచారు. దీంతో బాధితుడు ప్రసా ద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ ముగ్గురుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఏసీపీ రఘు ఆధ్వర్యాన దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ హరిత పేర్కొన్నారు. -
● మ్యూజియాన్ని మరిపించేలా..
భద్రాచలం ట్రైబల్ మ్యూజియాన్ని చిత్రం భళారే అన్నట్టుగా ఐటీడీఏ పీఓ సతీమణి మనీషా రాహుల్ గీశారు. తన పెయింటింగ్ రూపంలో సహజత్వాన్ని సిద్ధించేలా ట్రైబల్ మ్యూజియం ముఖద్వారం రూపుదిద్దుకోవడం ఆమె పెయింటింగ్ కళావైభవానికి ప్రత్యేకంగా చెప్పొచ్చు. వృత్తిపరంగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలైనా.. కవితలు, కథలు, శీర్షికలు రాయడం, చదవడం ఆమె అభిరుచి. పెయింటింగ్ వేయడంలోనూ సిద్ధహస్తురాలు. అయినా భద్రాచలంలోని చెవిటి, మూగ పాఠశాల చిన్నారులకు తినుబండారాలు, భోజన సౌకర్యం కల్పిస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని చూసిన పలువురు మనీషాకు అభినందనలు తెలిపారు. – భద్రాచలంటౌన్ -
డివైడర్పైకి దూసుకెళ్లిన లారీ
మణుగూరు టౌన్: మండలంలోని సమితిసింగారం అశోక్నగర్ సాయినగర్ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఓ లారీ డివైడర్పైకి దూసుకెళ్లింది. స్థానికుల కథనం ప్రకారం.. రాత్రి వేళ ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్తో రోడ్డు సక్రమంగా కనిపించలేదు. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ప్రయత్నంలో లారీ డ్రైవర్పైకి దూసుకెళ్లింది. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొత్తగా నిర్మాణంలో ఉన్న డివైడర్కు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నిర్మాణంలో ఉన్న డివైడర్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వీధి లైట్లు అమర్చాలని కోరుతున్నారు. కూలిన స్తంభం.. తప్పిన ప్రమాదంతిరుమలాయపాలెం: విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపంతో నూతనంగా ఏర్పాటు చేసిన స్తంభం కూలిపోయింది. అప్పటివరకు అక్కడే ఆడుకున్న చిన్నారులు వర్షం వస్తుండగా ఇళ్లలోకి వెళ్లాక స్తంభం కూలడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ఈ ఘటన మండలంలోని హైదర్సాయిపేట శివారు రావిచెట్టుతండాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలు తొలగింపునకు ఆయా గ్రామాల్లో విద్యుత్ కాంట్రాక్టర్తో స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం రావిచెట్టుతండాలో విద్యుత్ స్తంభం వేశారు. ఆ సమయంలో ఐదు నుంచి ఆరు అడుగుల మేర లోతున గుంత తవ్వాల్సి ఉండగా బండ రావడంతో రెండడుగులు మాత్రమే తవ్వి స్తంభం వేశారు. విద్యుత్ అధికారుల పర్యవేక్షణలో స్తంభం ఏర్పాటు చేయాల్సి ఉండగా కాంట్రాక్టర్ ఇవేమీ పట్టించుకోకుండా రెండడుగుల గుంతలో తొమ్మిఇ మీటర్ల ఎత్తుగల స్తంభం ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం వర్షానికి స్తంభం కూలగా గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్యక్తి అదృశ్యంపై కేసు దమ్మపేట: భార్య మందలించిందనే కారణంతో ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ఇది. మండలంలోని దమ్మపేట గ్రామానికి చెందిన దారావత్ రాము(35) అనే వివాహితుడు తరచూ మద్యం తాగుతూ, కుటుంబపోషణను పట్టించుకోవడం లేదు. దీంతో విసుగుచెందిన అతడి భార్య భవాని శనివారం రాత్రి మందలించగా.. అతడు మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున మందలపల్లి బస్టాండ్లో బస్సు ఎక్కి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు అతడు ఇంటికి రాకపోగా.. ఆచూకీ కూడా తెలియకపోవడంతో భార్య పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్రెడ్డి తెలిపారు. -
‘కేర్’ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
సూపర్బజార్(కొత్తగూడెం): హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్థానిక కేసీఓఏ క్లబ్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో కొత్తగూడెం, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మాలోత్ రాందాస్ నాయక్, తెల్లం వెంకట్రావ్, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ యాజమాన్యాలు పేదల కోసం ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించాలని కోరారు. కేర్ యాజమాన్యం వైద్యశిబిరం నిర్వహించడం హర్షణీయమన్నారు. భవిష్యత్లో ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని కోరారు. డాక్టర్ సూర్యప్రకాశరావు వివిధ జిల్లాల్లో సేవలందించారని, బైపాస్ సర్జరీ లేకుండానే యువకుల్లో వంద శాతం బ్లాక్లను తొలగించడం వంటి చికిత్సలలో అగ్రగామిగా ఉన్నారని కొనియాడారు. దేశంలో ఐదువేల మందికి పైగా కార్డియాలజిస్టులకు శిక్షణ ఇవ్వడం ఆయన అనుభవానికి నిదర్శనమని అన్నారు. 2004 నుంచి 45 వేలకు పైగా ట్రాన్సరేడియల్ ప్రొసీజర్లను విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. దేశంతో పాటు ఆసియా, ఫసిఫిక్ దేశాల్లోనూ వైద్య సేవలందిస్తున్నారని వివరించారు. గుండె జబ్బులపై అనేక పరిశోధనలు చేసి పలు అవార్డులు అందుకున్నారని అభినందించారు. కేర్ వైద్యులు వి.సూర్యప్రకాశరావు, కిరణ్కుమార్, శ్రీవాస్తవ్, రాహుల్, సాదత్ అహ్మద్, ఈషాసింగ్ ఉమర్, కాంతాలాల్షా వైద్య సేవలు అందించారు. -
ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా చావా రవి
ఖమ్మం సహకారనగర్ : దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు ఏడు లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహించే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) నూతన ప్రధాన కార్యదర్శిగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, కేంద్ర కమిటీ సభ్యులుగా సీహెచ్.దుర్గాభవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోల్కతా నగరంలో జరుగుతున్న ఎస్టీఎఫ్ఐ 9వ రజతోత్సవ మహాసభలో వీరిరువురు ఎన్నిక కావడం హర్షణీయమని పేర్కొన్నారు. చావా రవి 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సంక్షేమం, ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, మండల స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా పనిచేసి, ప్రస్తుతం అఖిల భారత ఉపాధ్యాయ ఉద్యమానికి నాయకత్వం వహించడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. దుర్గాభవాని మహిళా ఉపాధ్యాయులను చైతన్యపరుస్తూ, ఆదర్శవంతంగా పనిచేసి బాలికల విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వీరి ఎన్నిక పట్ల యూటీఎఫ్ నాయకులు జి.వి.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమి, వల్లంకొండ రాంబాబు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.కేంద్ర కమిటీ సభ్యులుగా దుర్గాభవాని -
ప్రతి ఎకరాకూ సాగునీరు
● రూ.630 కోట్లతో 33 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, వాకిటితో కలిసి జవహర్ లిఫ్ట్ పనులకు శంకుస్థాపన మధిర: జిల్లాలోని ప్రతీ ఎకరానికి కృష్ణ, గోదావరి జలాలు అందేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిర, ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు అందించేందుకు రూ.630 కోట్లతో వంగవీడు సమీపంలో వైరా నదిపై చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం పనులకు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో భట్టి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ మూడో జోన్లో ఉన్న ఆయకట్టుకు రెండో జోన్ నుంచి సాగునీరు అందించాలని ఈ ప్రాంత ప్రజలు పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మధిర ప్రాంతంలో కట్టలేరు, వైరా, మున్నేరు నదులు ప్రవహిస్తున్నా సాగు నీరందడం లేదన్నారు. జవహర్ ఎత్తిపోతల పథకానికి 2012లో మంజూరు ప్రతిపాదనలు సమర్పించామని, గత పాలకులు పదేళ్లలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక సర్వే చేసి, నిధులు మంజూరు చేశామన్నారు. పాలేరు నుంచి సత్తుపల్లి వరకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారానే పంటలు పండుతున్నాయని చెప్పారు. గేమ్ చేంజర్గా ఎత్తిపోతల పథకం.. జవహర్ ఎత్తిపోతల పథకం మధిర ప్రాంతానికి గేమ్ చేంజర్గా ఉంటుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏడాది లోపు పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జవహర్ ఎత్తిపోతల పథకం ద్వారా 33వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, వైరా నదిలో 120 రోజుల్లో 4 టీఎంసీలు ఎత్తిపోసేలా రూపకల్పన చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 190 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం రూ.45 కోట్లు కేటాయించామని చెప్పారు. మధిర మండలంలో 13 వేల ఎకరాలు, ఎర్రుపాలెం మండలంలో 19 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పుష్కలంగా గోదావరి నది జలాలు తీసుకొస్తామని ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దిండి, సీతారామ, పాలమూరు, దేవాదుల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. రూ.1,200 కోట్లతో ఆర్అండ్ బీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, వంగవీడుకు డబుల్ రోడ్డు వేస్తామని చెప్పారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో గత పాలకులు పేదలను మోసం చేశారని, తమ ప్రభుత్వం వచ్చాక ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సన్న ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. జోన్ 3లో ఉన్న బ్రాంచ్ కెనాల్పై మధిర, ఎర్రుపాలెంలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నా నీరందక రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. జవహర్ ఎత్తిపోతల పథకంతో ఆంధ్రాతో సంబంధం లేకుండా జోన్ 3 ఆయకట్టును జోన్ 2 పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. గోదావరి నీటిని పాలేరు తీసుకొచ్చి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న 33 వేల ఎకరాలు రెండు పంటలు సాగయ్యేలా ఈ పథకం ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, మట్టా రాగమయి, ఖమ్మం సీపీ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ సీఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీఏలో చార్జీల పెంపు
లైసెన్స్ ఫీజు, సర్వీస్ చార్జీలు పెంచిన రోడ్డు రవాణా శాఖ ● గత నెల 27న జీఓ విడుదల చేసిన ఉన్నతాధికారులు ● జిల్లాలో 2,02,811 రవాణా వాహనాలు పెరిగిన సర్వీస్ చార్జీలు ఇలా.. లెర్నింగ్ లైసెన్స్లకు గతంలో రూ. 335 ఉండగా రూ.440కు పెంచారు. టూ, ఫోర్ వీలర్ లైసెన్స్కు రూ.450 నుంచి రూ.585కు పెరిగింది. పర్మనెంట్ లైసెన్స్ డ్రైవింగ్ టెస్ట్కు రూ.1035 నుంచి రూ.1135కు పెంచారు. వాహన యాజమాన్య బదిలీలకు రూ.935 నుంచి రూ.1085కు పెంచారు. వాహన ఫైనాన్స్ కంపెనీల హామీ పత్రానికి రూ. 2,135 ఉండగా రూ.1000 పెంచారు. దీంతో రూ.3,135కు పెరిగింది. లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి ప్రస్తుతం వాహనాల ఇన్వాయిస్ను బట్టి 0.1 నుంచి 0.5 శాతం వరకు సర్వీస్ చార్జీలు పెరిగాయి. లైసెన్స్లపై సర్వీస్ చార్జీ రూ.100 పెరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2,02,811 టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నాయి. వాహనదారులందరూ లైసెన్స్ కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ చేయించకుండా వాహనాలను తిప్పొద్దు. వాహనదారులు లైసెన్స్లు, ఆర్సీ కలిగి రవాణాశాఖకు సహకరించాలి. రవాణాశాఖ నియమ నిబంధనలను పాటించాలి. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపొద్దు. –వి.వెంకటరమణ, ఇన్చార్జ్ జిల్లా రవాణాశాఖ అధికారికొత్తగూడెంటౌన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ లైసెన్స్ ఫీజులు, సర్వీసు చార్జీలను పెంచింది. లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్ ఫీజు రూ. 100 చొప్పున, సర్వీస్ చార్జీ వాహనాన్ని బట్టి 0.1 నుంచి 0.5 శాతం వరకు సవరించింది. గత నెల 27న జీఓ కూడా విడుదల చేసింది. అదే రోజు నుంచి పెరిగిన ధరలను అమల్లోకి తెచ్చింది. ప్రతీ వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతీ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. ఇవి రెండు లేకుండా వాహనాలను నడిపితే శిక్షార్హులవుతారని పేర్కొంటున్నారు. ట్రాన్ప్పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100 చొప్పున పెంచారు. ద్విచక్ర వాహనాలకు 0.5 శాతం, నాలుగు చక్రాల వాహనాలు, ఇతర వాహనాలు, బస్సులకు 0.1 శాతం సర్వీస్ చార్జీలు పెంచి అమలు చేస్తున్నారు. గత మూడేళ్లలో 36,243 మందికి లైసెన్స్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,02,811 ద్వి, త్రీ, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వాహనం నడపాలంటే లైసెన్స్ తీసుకోవాలని ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పిస్తుండగా, ఆర్టీఓ కార్యాలయానికి వచ్చే వాహనదారుల సంఖ్య పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా మూడేళ్లలో 36,243 మంది డ్రైవింగ్ లైసెన్స్ పొందారని ఇన్చార్జ్ ఆర్టీఓ వెంకటరమణ తెలిపారు. 2022 నుంచి 2025 జూలై వరకు జిల్లాలో కొనుగోలు చేసిన వాహనాల సంఖ్య వాహన కేటగిరీ 2022లో 2023లో 2024లో 2025లో హెవీ మోటార్ వెహికల్స్ 252 291 269 49లైట్ మోటార్ వెహికల్స్ 3,531 4,420 5,258 950మోటార్సైకిల్, స్కూటర్, మోపెడ్లు 4,351 5,189 5,336 926ట్రాక్టర్లు 564 668 728 148ఇతర కేటగిరీ వాహనాలు 763 1,082 1,269 199మొత్తం 9,461 11,650 12,860 2,272 -
కిన్నెరసానిలో సండే సందడి
ఒక్కరోజు ఆదాయం రూ.51,485పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. 579 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.32,845 ఆదాయం లభించింది. 360 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.18,640 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణ మిత్రులు, అధికారులతో కలిసి కిన్నెరసానిని సందర్శించారు. జలాశయంలో బోటు షికారు చేశారు. -
‘బీసీ’ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలి
సింగరేణి(కొత్తగూడెం): తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని చిల్డ్రన్స్పార్క్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలుపై బీజేపీ రెండు నాలుకల ధోరణి వీడాలని అన్నారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కె.బ్రహ్మాచారి, అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇల్నెస్’ సెంటర్..!
వెల్నెస్ సెంటర్పై పట్టింపు కరువు ● వేధిస్తున్న మందుల కొరత ● నామమాత్రపు ఔషధాలతోనే నెట్టుకొస్తున్న వైనం ● ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. ఈ సెంటర్ను కొన్ని నెలలుగా మందుల కొరత వేధిస్తోంది. అవసరమైన మందులు దొరకక ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి పరిస్థితి దయనీయంగా మారింది. అవసరమైన మందులు దొరకక కొందరు ఆస్పత్రి చుట్టూ తిరుగుతుండగా, మరికొందరు ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్ కేవలం ఓపీ సేవలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజువారీ మాత్రలు కూడా లేక.. వెల్నెస్ సెంటర్కు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో 40 ఏళ్లు దాటిన వారు ఎక్కువగా బీపీ బారిన పడుతున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో దాదాపు 80 నుంచి 90 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. కొందరు బీపీతో పాటు షుగర్ మాత్రలు రోజూ వేసుకోవాల్సి వస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత గల మందులు వెల్నెస్ సెంటర్లో ఆరు నెలలుగా అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అప్పుడప్పుడు ట్రస్ట్ నుంచి మాత్రలు వస్తున్నా ఒకటి, రెండు రోజుల్లోనే అయిపోతున్నాయి. తాకిడి ఉన్నా పట్టింపు కరువు.. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 200 మంది వెల్నెస్ సెంటర్కు వైద్య సేవల కోసం వస్తుంటారు. ఇక్కడ జనరల్ మెడిసిస్, ఫిజియోథెరపీ, డెంటల్ తదితర సేవలు అందుతాయి. టెస్టులకు ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీ, నరాల బలహీనత, జ్వరం, ఇతర సీజనల్ వ్యాధులకు చికిత్స చేస్తారు. అయితే ఇక్కడ బీ కాంప్లెక్స్, ఇన్సులిన్, థైరాయిడ్, గ్యాస్, జ్వరం, జలుబు, దగ్గు, అస్తమా రోగులకు ఇన్హెల్లర్లు అందుబాటులో లేవు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారు మందులు దొరక్క నిరాశగా వెనుదిరుగుతున్నారు. సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి.. ఉమ్మడి జిల్లా ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మూత్ర పరీక్షల షాంపిళ్లు తీసుకోవడానికి కనీసం బాత్రూమ్లు కూడా లేవు. దాని కోసం జనరల్ ఆస్పత్రిలోని బాత్రూమ్ల్లోకి వెళ్లాల్సి వస్తోంది. ఓపీ, ఇతర విభాగాల్లో కుర్చీలు కూడా లేవు. గదుల్లో కిటికీలకు కర్టన్లు లేక పగటి పూటే దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. సెంటర్లో సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ముగ్గురు ఫార్మసిస్టులకు ఇద్దరు, నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇద్దరు, నలుగురు స్టాఫ్నర్సులకు ఇద్దరు, ముగ్గురు మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తుండగా పెషెంట్లకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదు. గైనిక్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ సేవలు అందుబాటులో లేక ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. బీపీ మిషన్ మరమ్మతులకు గురి కాగా, పక్కన పెట్టారు. అలాగే 400 రకాల మందులు అందుబాటులో ఉండాల్సిన ఈ సెంటర్లో 150 రకాలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా వెల్నెస్ సెంటర్కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి బ్రాండెడ్ మందులు సరఫరా అవుతాయి. ఒక్కో రోగి నెలకు సరిపడా మందులు తీసుకెళ్తుంటారు. అవి అందుబాటులో లేక ప్రైవేటు షాపుల్లో డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది.మూడు నెలలుగా మందులు లేవు మూడు నెలలుగా వెల్నెస్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నా మందులు అందుబాటులో ఉండట్లేదు. ఎప్పుడు వస్తాయనే సమాచారం చెప్పే వారు కూడా లేరు. బీపీ, షుగర్, థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్నా. ఈ సెంటర్తో ఉపయోగం లేకుండా పోయింది. – ఎ.జయలక్ష్మి, ఖమ్మంమందుల కొరత వాస్తవమే వెల్నెస్ సెంటర్లో మందుల కొరత వాస్తవమే. ట్రస్ట్కు ఇండెంట్ పెట్టాం. త్వరలో పూర్తిస్థాయిలో మందులు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న మందులతో సేవలు అందిస్తున్నాం. రోగులకు సాధ్యమైనంత వరకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. కొంత మేరకు సిబ్బంది కొరత ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సౌకర్యాలపై కూడా నివేదిక పంపించాం. – డాక్టర్ నారాయణమూర్తి, వెల్నెస్ సెంటర్ జనరల్ ఫిజీషియన్ -
ముగ్గురిపై కేసు నమోదు
పాల్వంచరూరల్: చందాల విషయంలో జరిగిన ఘర్షణ ఘటనలో పోలీసులు ముగ్గురిపై శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సంగం గ్రామానికి చెందిన పలువురు కలిసి వన దేవత కోసం గ్రామంలో చందాలు వసూలు చేశారు. లెక్కల విషయమై బొర్రెం ఏసుతో ఈ నెల 5న ఇంజమూరి సాయి, నక్కూరి సాయిదుర్గాప్రసాద్, శంఖు ప్రణయ్లు గొడవ పడి దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ – బొలే రో వాహనం ఢీఇద్దరికి తీవ్ర గాయాలు తిరుమలాయపాలెం: బొలే రో వాహనం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున దమ్మాయిగూడెం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పూల మొక్కల లోడుతో నిర్మల్ వెళ్తున్న బొలే రోను వాహనం దమ్మాయిగూడెం సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే మరిపెడ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బొలే రో వాహనం డ్రైవర్ ఆకుల లోవరాజు, తోడుగా వచ్చిన బొడ్డుపల్లి ప్రదీప్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఘటనలో కేసు నమోదుచింతకాని: మండల పరిధిలోని రామకృష్ణాపు రం గ్రామానికి శ్రీలం సుదర్శన్రావు, అతడి కుమారుడు చైతన్యపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్ మీరా తెలిపారు. వివరాలిలా ఉన్నా యి.. సుదర్శన్రావు కుటుంబసభ్యులకు సంబంధించిన భూ వివాదంపై ఈనెల 6న తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గ్రామానికి చెందిన మాలెంపు కోటేశ్వరరావు, వారి కుటుంబసభ్యులు ఈ వివాదంలో జోక్యం చేసకోగా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సుదర్శన్రావు, అతడి కుమారుడిపై దాడి చేసిన ఘటనలో కోటేశ్వరరావుతో పాటు విజయ, పద్మావతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడి మృతివేంసూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. స్థానికుల కధనం ప్రకారం.. రామన్నపాలెం ఎస్సీ కాలనీకి చెందిన కొత్తపల్లి గోపీకిరణ్(20) భీరపల్లి శివారున ఉన్న పెట్రోల్ బంక్లో నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా మొద్దులగూడెం వైపు వెళ్తున్న కారు డీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపీకిరణ్ను చికిత్స నిమిత్తం సత్తుపల్లికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. -
అనారోగ్యంతో వీఆర్ఏ మృతి
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల వీఆర్ఏ ఖాసీం(73) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఖాసీంకు భార్య జయతున్నీషా బేగం, ఎనిమిది కూతుర్లు ఉన్నారు. పురుగుల మందు తాగిన వ్యక్తి మృతిఇల్లెందురూరల్: మండలంలోని హనుమంతులపాడు గ్రామానికి చెందిన కోరం సంతోష్కుమార్ (28) రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య తేజశ్రీ ఫిర్యాదు మేరకు ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటదుమ్ముగూడెం: మండలంలోని తురుబాక గ్రామానికి చెందిన యువకుడు, బూర్గంపాడు మండలానికి చెందిన యువతి ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కోసం శనివారం దుమ్ముగూడెం పోలీసులను ఆశ్రయించారు. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరి వివాహానికి యువతి తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట రహస్యంగా వివాహం చేసుకుంది. రక్షణ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లగా పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇద్దరు మేజర్ల కావడంతో వివాహం చేసుకున్నారని నచ్చజెప్పారు. 32 కేజీల గంజాయి స్వాధీనంమణుగూరు టౌన్: ఒడిశా నుంచి వరంగల్కు తరలిస్తున్న గంజాయిని శనివా రం మణుగూరు పోలీసులు పట్టుకున్నారు. సీఐ పాటి నాగబాబు కథనం ప్రకా రం.. ఎస్ఐ రంజిత్, సిబ్బందితో కలిసి తోగ్గూడెం శివారు ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను ఆపి తనిఖీ చేయగా 32 కేజీల గంజాయి లభించింది. విచారించగా అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దపాక మండలం కుసున్నపల్లి గ్రామానికి చెందిన తోడెం శ్రీను, మహబూబాద్ జిల్లా బోడగుట్ట తండా గ్రామానికి చెందిన బానోత్ కుమార్ ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి విలువ రూ.16 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు సీఐ తెలిపారు. పోగొట్టుకున్న పర్సు అప్పగింతఅశ్వారావుపేటరూరల్: దుకాణం వద్ద మరిచిపోయిన బంగారు ఆభరణాల పర్సును పండ్ల వ్యాపారి దంపతులు తిరిగి బాధిత మహిళకు అప్పగించారు. ఈ ఘటన శనివా రం జరిగింది. ఏపీలోని ఏలూ రు జిల్లా కుక్కునూరు మండలం అల్లిగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ అశ్వారావుపేటలోని ఓ జ్యూయలరీ షాపులో రూ.లక్షా 50 వేల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసింది. తిరిగి వెళ్తున్న క్రమంలో ఆసుపాక శివారులో బిర్రం నరేష్, ప్రత్యూష దంపతుల దుకాణం వద్ద ఆగి డ్రాగన్ పండ్లను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆభరణాల పర్సును అక్కడే పెట్టి ఆటోలో వెళ్లిపోయింది. గమనించిన పండ్ల వ్యాపారి గమనించి భద్రపరిచాడు. మూడు గంటల తర్వాత పర్స్ పోగొట్టుకున్నట్లు గుర్తించిన మహిళ తిరిగి వెతుక్కుంటూ వచ్చింది. నరేష్ దంపతులు ఆభరణాల పర్సు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారి దంపతులను పలువురు అభినందించారు. ట్రాన్స్ఫార్మర్ల దొంగల అరెస్ట్పినపాక: రైతుల పంట పొలా ల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని రాగిని అమ్ముకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠా ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యులు ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగిని తీసుకుని హైదరా బాద్, పాల్వంచలోని స్క్రాప్ షాపుల్లో విక్రయిస్తున్నట్లు తేలిందని మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి తెలిపారు. వారి నుంచి 258 కేజీల రాగి, కారు, స్కూటీ, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కేసు ఛేదించిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై సురేష్లను డీఎస్పీ అభినందించారు. పర్సులో రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు -
హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
టేకులపల్లి: చేతబడి చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన ఘటనలో ఆరుగురు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. టేకులపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ నూనావత్ చంద్రభాను వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ఆళ్లపల్లి మండలం పెద్దవెంకటాపురం పంచాయతీ బూసురాయి గుత్తికోయ గుంపునకు చెందిన పొడియం నంద కుమార్తె గంగి అనారోగ్యంతో గత బుధవారం మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన మడకం బీడ అలియాస్ రాజు (35) చేతబడి చేయడం వల్లే గంగి మృతి చెందిందని బాలిక తల్లిదండ్రులు అనుమానించారు. రాజును బాలిక మృతదేహం వద్దకు తీసుకొచ్చి పంచాయితీ పెట్టారు. పంచాయితీలో దోషిగా పేర్కొంటూ తాళ్లతో కట్టేసి ఆరుగురు వ్యక్తులు కర్రలతో విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలై రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఛత్తీస్గఢ్లోని సొంత గ్రామాలకు వెళ్తుండగా నిఘా పెట్టిన సీఐ బత్తుల సత్యనారాయణ, ఆళ్లపల్లి ఎస్ఐ ఎం.సోమేశ్వర్ శనివారం పెద్ద వెంకటాపురం ప్రైమరీ స్కూల్ వద్ద పట్టుకున్నారు. మడవి రాజు, మొక్కటి చిన్నసోమయ్య, మొక్కటి భీమయ్య, వంజం గంగ, నందం జోగ, మొక్కటి వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. చేతబడి, బాణామతి వంటి మూఢ నమ్మకాలతో దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ చంద్రభాను -
ఎట్టకేలకు ‘మత్స్య’ ప్రతిపాదనలు
కరీంనగర్ నుంచి స్పాన్ తీసుకొచ్చాం జిల్లాలో కోటి 20లక్షల చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ కమిషనర్గా ఇటీవల ప్రతిపాదనలు పంపాం. కరీంనగర్ నుంచి స్పాన్ తీసుకొచ్చి కిన్నెరసాని ఉత్పత్తి కేంద్రంలో పెంచుతున్నాం. పెరిగాక పంపిణీ చేస్తాం. నీరు త్వరగా ఇంకిపోతున్నందున చిన్న చిన్న చెరువులు, కుంటల్లో ఈసారి చేపపిల్లలను వదలడంలేదు. – ఎండీ ఇంతియాజ్ అహ్మద్ఖాన్, జిల్లామత్స్యశాఖాధికారి పాల్వంచరూరల్: ఎట్టకేలకు మత్స్యశాఖ అధికారులు ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రతిపాదనలు రూపొందించారు. ఈసారి 550 చెరువుల్లో కోటి 20 లక్షల చేప పిల్లలను వదలాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం జిల్లాలో చిన్న చెరువులు, కుంటల్లో చేపపిల్లల పెంపకం చేపట్టొద్దని మత్స్యశాఖ నిర్ణ యం తీసుకుంది. జిల్లాలో చేపలు పెంచే చెరువులు, కుంటలు 734 ఉండగా, 70 మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఉన్నాయి. వీటిల్లో 3,248 మంది సభ్యలు ఉన్నారు. చేపల పెంపకంపై సుమారు 10 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే పంపిణీ ప్రక్రియ ఆలస్యం కావడంతో పెద్దగా ఉపయోగం ఉండదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. జిల్లాలో గతేడాది కూడా చేప పిల్లలను ఆలస్యంగా పంపిణీ చేశారు. కేవలం 86 లక్షల చేప పిల్ల లను మాత్రమే అందించారు. సీజన్ ప్రారంభంలో చెరువుల్లో చేప పిల్లలను వదిలితే 8,9 నెలలు పెరిగి ఆశించిన దిగుబడి లభించేది. ఈ నేపథ్యంలో ఈ సారి చేపపిల్లలకు బదులుగా నగదు ఇవ్వాలని మత్స్యకారులు ఇటీవల హైదరాబాద్లో మత్స్యశాఖ కమిషనర్ను కలిసి విన్నవించారు. నగదు ఇస్తే తామే కొనుగోలు చేసుకుని చెరువుల్లో వదులుకుంటామని పేర్కొన్నారు. కిన్నెరసానిలో 12 లక్షల స్పాన్ కిన్నెరసానిలోని మత్స్యశాఖ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో 12 లక్షల గుడ్లను(స్పాన్) తెచ్చి వదిలారు. ఇక్కడి నీటి తోట్లలో రెండు నెలలపాటు పెంచి గిరిజన మత్స్యకార సొసైటీలకు ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. కేంద్రంలో 20 లక్షల చేప పిల్లల పెంపు సామర్థ్యంతో 13 నీటితోట్లు కొన్ని మరమ్మతులకు గురయ్యాయి. దీంతో గతేడాది కేవలం 12 లక్షల చేపపిల్లలను మాత్రమే పెంచారు. ఈ సారి కూడా 12 లక్షల స్పాన్ను మాత్రమే పోశారు. -
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో శనివారం రాఖీ పౌర్ణమి సందడి కనిపించింది. మండల పరిధిలోని కిన్నెరసానికి శనివారం జిల్లా నలు మూలల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. 383 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.19,855 ఆదాయం లభించింది. 150 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.6,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
సమాచారం అడిగే హక్కు అందరికీ ఉంది
ఖమ్మం సహకారనగర్ : సమాచారం అనేది వజ్రాయుధమని, అవసరమైన సమాచారాన్ని సేకరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి. శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ఐఎంఏ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన స.హ.చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాచార హక్కును దుర్వినియోగం చేయొద్దని, దీన్ని అడ్డుపెట్టుకుని కొందరు ప్రలోభాలకు గురిచేస్తూ అడ్డదారులు ఎంచుకోవడం సరైంది కాదని హెచ్చరించారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం–2005కు అనుగుణంగా కోరిన వారికి సకాలంలో సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అప్పిలేట్ అధికా రిపై ఉంటుందని అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు కంభంపాటి నారాయణరావు, జగదీష్, న్యాయవాది తిరుమలరావు, ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు, డాక్టర్ సుబ్బారావు, శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కార్యదర్శి చిర్రా రవి, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.స.హ. చట్టం కమిషనర్ పి.వి.శ్రీనివాస్ -
వైభవంగా చండీహోమం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో శని వారం చండీహోమం పూజలను వైభవంగా జరిపారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని యాగశాలలో చండీ హోమం నిర్వహించా రు. ముందుగా మేళతాళాల నడుమ, వేద మంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధ న, గణపతి పూజలు గావించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న 11 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమాల్లో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, సభ్యులు చందుపట్ల రమ్య, పాపారావు, రామిరెడ్డి, శ్రీనివాస్, సాయిబాబా, సుధాకర్, శేఖర్, అర్చకులు పాల్గొన్నారు. నులి పురుగులను నివారించాలికొత్తగూడెంఅర్బన్: పిల్లల తల్లిదండ్రులు నులిపురుగుల నిర్మూలనపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.జయలక్ష్మి సూ చించారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 11, 18వ తేదీల్లో నిర్వహించే కార్యక్రమంలో 19 ఏళ్లలోపు పిల్లలు 3,36,136 మందికి నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 2,060 అంగన్వాడీ కేంద్రాలు, 1,771 పాఠశాలలు, కళాశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మాత్రలు రక్తహీనత, పోషకాహార లోపం, బలహీనమైన మానసిక, శారీ రక అభివృద్ధిని నివారిస్తాయని వివరించారు. అకస్మాత్తుగా ఊడిన ఆర్టీసీ బస్సు టైరుఅశ్వాపురం: మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు శనివారం పెనుప్రమాదం తప్పింది. భద్రాచలం నుంచి మణుగూరు వెళ్తున్న బస్సు వెనుక టైరు అశ్వాపురం మండలం మిట్టగూడెం క్రాస్ రోడ్డు వద్ద మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై అకస్మాత్తుగా ఊడింది. దీంతో బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లింది. ఊడిన టైరు ఓ స్కూటీకి తగలడంతో, స్కూటీపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఘనంగా హయగ్రీవ జయంతి
● వేడుకగా ముగిసిన పవిత్రోత్సవాలు ● నేటి నుంచి నిత్యకల్యాణాలు పునఃప్రారంభం భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం హయగ్రీవ జయంతి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న హయగ్రీవుని ఉపాలయంలో పండితులు వేదమంత్రాలు, భక్తజనాల శ్రీరామస్మరణల నడుమ హయగ్రీవునికి ఉదయం ప్రత్యేక స్నపనం, తిరుమంజనం జరిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రధానార్చకుడు విజయరాఘవన్ చేతుల మీదుగా చిన్నారులకు పలకలు, సామగ్రి అందజేశారు. పవిత్రోత్సవాల ముగింపులో భాగంగా యాగశాలలో మహాపూర్ణాహుతి పూజలు నిర్వహించారు. కుంభప్రోక్షణ, పవిత్రావరోపణాలతో ఉత్సవ స్వస్తి పలికారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని నిలిపివేసిన నిత్యకల్యాణాలు ఆదివారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. వారాంతపు సెలవు రోజులు కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. -
ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించాలి
భద్రాచలం: ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ, ఆదివాసీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. గిరిజన భవనంలో తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లంవెంకట్రావు మాట్లాడుతూ ఆదివా సీలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వి నియోగం చేసుకొని ఆర్ధికాభివృద్ధి సాధించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఆదివా సీ సంస్కృతీసంప్రదా యాలను అందించాలని చెప్పారు. ఐటీడీఏ తోడ్పాటుతో స్వయం సహా యక గ్రూపుల ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ గిరిజనుల ఆర్థిక అసమ తుల్యతను పారదోలేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని పేర్కొన్నారు. భద్రాచలం ఐటీడీఏ పేరు ఢిలీల్లో మార్మోగుతుండటమే ఇందుకు నిదర్శమని అన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కోయ భాష లిపిని అభివృద్ధి చేస్తున్నామని, ఆది వాసీల ఇలవేల్పుల చరిత్రను గ్రంథ రూపంలోకి తెస్తున్నట్లు వివరించారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ ఏజెన్సీ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. అనంతరం కలెక్టర్, ఐటీడీఏ పీఓ, సబ్కలెక్టర్లను ఆదివాసీ సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత గిరిజన భవన్లో నిర్వహించిన ఆదివాసీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆదివా సీలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గిరిజన మ్యూజియం టేబుల్ బుక్ను ఆవిష్కరించారు. తొలుత ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ కూడలిలో ఉన్న ఆదివాసీ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు డేవిడ్ రాజ్, మణెమ్మ, సున్నం రాంబాబు, అన్ని విభాగాల సిబ్బంది, గిరిజన సంఘాల నాయకులు పూనెం కృష్ణ, పాయం రవి వర్మ, శరత్ బాబు, మురళి, రమేష్, పుల్లయ్య, వీరస్వామి, సుధారాణి, అరుణ , వెంకటరావు వీరభద్రం, విద్యార్థులు పాల్గొన్నారు. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం హాజరైన ఎమ్మెల్యే, కలెక్టర్, పీఓ, సబ్ కలెక్టర్ -
ఆదివాసీలకు తోడ్పాటు : ఎస్పీ
కొత్తగూడెంటౌన్: ఆదివాసీ ప్రజలు అన్ని రంగా ల్లో రాణించేలా తోడ్పాటునందిస్తామని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. శనివారం కొత్తగూడెం పో లీస్ డివిజన్ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినో త్సవం ఘనంగా నిర్వహించారు. రైల్వేస్టేషన్ వద్ద ర్యాలీని ఎస్పీ రోహిత్రాజు ప్రారంభించారు. బస్టాండ్ సెంటర్ మీదుగా కొత్తగూడెం క్లబ్ వర కు ర్యాలీ కొనసాగింది. కొత్తగూడెం క్లబ్లో ఎస్పీతోపాటు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ కనకమ్మ తదితరులు ఆదివాసీ నేతలు కొమరంభీమ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీల కోసం పోలీసుశాఖ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు విద్యా, వైద్యం, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తున్నామని అన్నా రు. యువత కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్లను నిర్మి స్తున్నామని, ఉద్యోగ అవకాశాలకోసం శిక్షణ ఇప్పిస్తున్నామని వివరించారు. రెండు మొబైల్ ఆస్పత్రులు, మూడు గ్రంథాలయాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆదివాసీ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. సీఐలు శ్రీనివాస్, కరుణాకర్, శివప్రసాద్, ప్రతాప్, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో అనువైన ప్రదేశాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క, రాష్ట్రమైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి(ఎనర్జీ) నవీన్ మిట్టల్, జెన్కో సీఎండీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ, సింగరేణి సీఎండీలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారులతో సోలార్ సిస్టం ఇన్స్టలేషన్పై వీడి యో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సోలార్ విద్యుదుత్పత్తికి చేపట్టను న్న చర్యలను కలెక్టర్ వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అక్రమాల డొల్ల..
సింగరేణి ‘ఫారెస్టు’ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సామాజిక బాధ్యత, సంస్థ అవసరాల మేరకు పని చేయాల్సిన ఫారెస్టు విభాగంపై సింగరేణి యాజమాన్యం దృష్టి సారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జామాయిల్ చెట్ల నరికివేత, అమ్మకాల విషయంలో కేవలం భూపాలపల్లి సంఘటనే వెలుగు చూసిందని, కానీ వెలుగులోకిరాని నిజాలెన్నో ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం భూపాలపల్లి ఘటనపైనే విచారణ సింగరేణి సంస్థ పరిధిలో 11 ఏరియాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సింగరేణి సంస్థ భారీగా జామాయిల్ చెట్లను పెంచుతోంది. ఏపుగా పెరిగిన చెట్లను నరికి సంస్థ అవసరాల కోసం వినియోగిస్తోంది. చెట్లను నరకడంతో పాటు వాటిని దుంగలు/మొద్దులుగా మార్చి ఇవ్వాల్సిన పనిని ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. ఈ క్రమంలో భూపాలపల్లి ఏరియాలో 2018 నుంచి 2020 వరకు జరిగిన లావాదేవీల్లో రూ. 50 లక్షలకు పైగా పక్కదారి పట్టినట్టు సంస్థ విజిలెన్స్ విభాగం దృష్టికి వచ్చింది. దీంతో శాఖాపరమైన విచారణ చేపట్టి నివేదికను సిద్ధం చేశారు. అవకతవకలకు కారణమైన ఉద్యోగులు, అధికారులపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అసలేం జరిగిందంటే..? గనుల్లో బొగ్గును తీసిన తర్వాత ఏర్పడిన గుల్ల ప్రదేశంలో బొగ్గు పొరలు కూలి కిందపడకుండా సపోర్ట్గా ఐరన్ రాడ్స్, కలప దుంగలను పెడుతుంటారు. ఇందుకోసమే సింగరేణి సంస్థ వేలాది ఎకరాల్లో యూకలిప్టస్ చెట్లు పెంచుతోంది. జామాయిల్ చెట్టు మొదలు (ప్రోప్), మధ్య (చోక్) భాగాలు సపోర్టింగ్ పిల్లర్లుగా ఉపయోగపడతాయి. చెట్టుపై భాగంలో సన్నగా, పీలగా ఉండే కలప సపోర్టింగ్ పిల్లర్గా పనికి రాదు. కానీ పేపర్ పరిశ్రమలకు ఉపయోగపడుతుంది. వీటితో పేపర్ పల్ప్ను తయారు చేస్తారు. దీంతో నరికివేసిన చెట్ల నుంచి ప్రధాన అవసరమైన సపోర్టింగ్ పిల్లర్లకు సంబంధించిన కలపను సంస్థకు కాంట్రాక్టరు ముందుగా అప్పగించాలి. ఆ తర్వాత మిగులుగా తేలిన జామాయిల్ చెట్ల పై భాగానికి సంబంధించిన వివరాలను వెల్లడించాలి. అనంతరం వాటిని పేపర్ పరిశ్రమలకు అమ్మి, ఆ మేరకు కమీషన్ తీసుకుని మిగిలిన సొమ్మును సంస్థ ఖాతాలో జమ చేయాలి. భూపాలపల్లి ఏరియాలో మిగులు కర్రను కాంట్రాక్టరుకు అప్పగించారు. అయితే తిరిగి ఎంత సొమ్ము సంస్థఖాతాలో జమైంది అనే వివరాల్లో భారీ అంతరాలు చోటు చేసుకున్నట్టు ఫిర్యాదు అందింది. ఇతర ఏరియాల్లో విచారణ జరపాలి... భూపాలపల్లి ఏరియాలో 2018 నుంచి 2020 మధ్య కాలంలో చోటుచేసుకున్న అక్రమాల కారణంగా సంస్థకు రూ. 50 లక్షలకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా తేలింది. సంస్థ పరంగా ఫారెస్టు విభాగంలో పని చేసే అఽధికారుల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చినికిచినికి గాలివానగా మారడంతో ఈ వ్యవహారం విజిల్ బ్లోయర్ ద్వారా విజిలెన్స్ దృష్టికి వచ్చింది. లేదంటే సంస్థకు రావా ల్సిన రూ. 50 లక్షలకు పైగా సొమ్ము రాకుండా పోయేది. ఈ తరహా అవకతవకలు ఇతర ఏరియాల్లోనూ జరిగాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీంతో భూపాలపల్లి తరహాలోనే ఇతర ఏరియాల్లోనూ విచారణ జరపాలనే డిమాండ్లు వస్తున్నాయి. సంస్థ పరిధిలోని అన్ని ఏరియాల్లో కనీసం గడిచిన ఐదేళ్ల కాలంలో ఫారెస్టు విభాగంలో జరిగిన లావాదేవీలపై దృష్టి సారించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కేవలం కర్ర అమ్మకాలే కాకుండా ఎంత విస్తీర్ణంలో కటింగ్ చేయాల్సి ఉండగా ఎంత ఏరియాలో చెట్లను నరికారనే అంశాలపై కూడా దృష్టి పెట్టాలంటున్నారు. దీంతో పాటు భవిష్యత్లో చెట్లు నరికే విషయంలో అవకతవకలు జరిగేందుకు వీలులేకుండా పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా కొత్త నిబంధనలు రూపొందించాలంటున్నారు. పైస్థాయిలో అలా.. కింది స్థాయిలో ఇలా సామాజిక బాధ్యతగా ఐదు కోట్లకు పైగా మొక్కలు నాటిన సంస్థగా సింగరేణి రికార్డు సాధించింది. 2019లో సంస్థలో డైరెక్టర్ పాగా బాధ్యతలు చేపట్టింది మొదలు ప్రస్తుతం సీఎండీ వరకు రికార్డు స్థాయిలో 20 వేలకు పైగా మొక్కలు స్వయంగా నాటారు. అఖిల భారత స్థాయి అధికారుల్లో ఫారెస్టు వారిని మించి మరీ ట్రీమ్యాన్గా గుర్తింపు పొందారు. మరోవైపు ఆ సంస్థ పరిధిలో ఉన్న ఫారెస్టు విభాగం అక్రమాలకు వేదికగా మారడం గమనార్హం.సింగరేణి ప్రధాన కార్యాలయం భూపాలపల్లి ఏరియాలో అక్రమాలపై విచారణ పూర్తి కలప విక్రయాల్లో రూ.50 లక్షలకు పైగా తేడా ఇతర ఏరియాల్లోనూ విచారణకు పెరిగిన డిమాండ్ -
దుర్గం గట్లు.. అభివృద్ధి చేస్తే ఒట్టు
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుర్వాయిగూడెం గ్రామ శివారులోని దుర్గం గట్టుపై కాకతీయుల కాలంలో నిర్మించిన పలు కట్టడాలు, శ్రీ శంకరగిరి దుర్గేశ్వర స్వామి ఆలయం చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయి. కాకతీయుల చరిత్రను ఇనుమడింపజేసేలా ఉన్న ఈ కట్టడాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. కాకతీయ రాజుల్లో చివరివాడైన ప్రతాపరుద్రుడు దుర్గం గట్టుపై పలు చారిత్రక కట్టడాలు, ఆలయాలు నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 20 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఈ గట్టుపై.. క్రీ.శ.1289 – 1323 మధ్య కాలంలో శ్రీ శంకరగిరి దుర్గేశ్వర స్వామి ఆలయంతో పాటు గట్టు చుట్టూ శత్రుదుర్భేద్యమైన రాతికోట నిర్మించారు. నీటి సౌలభ్యం కోసం గట్టుపై ఆరు బావులు తవ్వి, వాటి లోపల రాతి కట్టడాలు నిర్మించారు. ఆ బావి నీటితోనే కాకతీయులు దుర్గేశ్వర స్వామికి అభిషేకం, అర్చన చేసేవారంటారు. గుట్టపై నిర్మించిన ధ్యాన మందిరాలు నేటికీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ మందిరాల్లో ఆనాడు కాకతీయ వంశీయులు ధ్యానం చేసేవారని తెలుస్తోంది. అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ముప్పయ్ సంవత్సరాల క్రితం వరకు కూడా దుర్గం గట్టుపై ఉన్న శివయ్యకు విశేష పూజలు చేసి, దీపధూప నైవేద్యాలు సమరి్పంచేవారు. మహా శివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహించేవారు. కాకతీయుల చరిత్రకు తార్కాణంగా నిలిచే, ఈ గట్టును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.సరైన మార్గం లేక.. దుర్గం గట్టు పైకి వెళ్లడానికి సరైన రవాణా మార్గం లేకపోవడంతో.. కాలక్రమేణా ఆలయ ప్రాభవం తగ్గిపోయింది. ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య క్రమేపీ తగ్గిపోగా, నేటితరం వారికి దుర్గం గట్టు అంటే కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆలయం, కాకతీయుల చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు దుండగులు గట్టుపై.. గుప్త నిధుల కోసం పలుచోట్ల తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలతో ఆలయంతో పాటు పలు రాతి కట్టడాలు ధ్వంసం కావడంతో.. పది సంవత్సరాల క్రితం మండల వాసులు తాత్కాలికంగా శివయ్యకు ఆలయం నిర్మించారు. అమలుకాని ఎమ్మెల్యే హామీ దుర్గం గట్టుపై ఆలయ పునర్నిర్మాణంతో పాటు కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాల ఆనవాళ్లను మెరుగుపరిచి, గట్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని.. ఈ ఏడాది జనవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హామీ ఇచ్చారు. గత జనవరిలో దుర్గమ్మ గట్టును సందర్శించిన ఎమ్మెల్యే.. గట్టుపై చారిత్రక ఆనవాళ్లను పరిశీలించారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే సౌర విద్యుత్ సౌకర్యంతో పాటు, తాగునీటి కోసం బోరు కూడా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. నెలలు గడుస్తున్నా.. అభివృద్ధి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రవాణా సౌకర్యం లేదు దుర్గమ్మ గట్టు పైకి వెళ్లడానికి సరైన రవాణా మార్గం లేకపోవడంతో ఆలయ ప్రాధాన్యం మసకబారిపోతోంది. గట్టు పైకి వెళ్లడానికి సరైన మార్గం ఏర్పాటు చేస్తే, తిరిగి ఆలయానికి సందర్శకులు పెరుగుతారు. కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించి, ఆలయ అభివృద్ధికి పూనుకోవాలి. – పాశం ప్రసాద్, గోపాలపురం, దమ్మపేట మండలం చరిత్రను కాపాడుకోవాలి ఓరుగల్లును పరిపాలించిన కాకతీయులు నిర్మించిన శ్రీ శంకరగిరి దుర్గేశ్వరస్వామి ఆలయ చరిత్ర, విశిష్టతను కాపాడుకోవలసిన అవసరం ఉంది. గట్టుపై ఉన్న ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. దేవాదాయ, పర్యాటక శాఖల సహకారంతో దుర్గం గట్టును అభివృద్ధి చేసి, విద్యుత్, రవాణా, తాగు నీటి సౌకర్యాలను కల్పించాలి. – విజయ మారుతి శర్మ, దమ్మపేట -
మావోయిస్టుల ఇలాకాలో కార్ఖానాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులపై ముప్పేట దాడితో విరుచుకుపడుతోన్న కేంద్ర ప్రభుత్వం వారి కట్టడికి చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెబుతున్న కేంద్రం.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పారిశ్రామిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు రక్షణ కల్పించేందుకు ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసింది. సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్)లో కొత్త రక్తం నింపేందుకు భారీగా రిక్రూట్మెంట్లు చేపట్టనుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నూతన పారిశ్రామిక పాలసీని ప్రకటించింది. ఈ క్రమంలో ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలకు భద్రత కల్పిస్తామని చెబుతున్న కేంద్రం పెట్టుబడులకు ఇబ్బంది రాకుండా చూస్తామని చెబుతోంది. అందులో భాగంగా ప్రత్యేక బలగాల స్థానంలో సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్)ను రంగంలోకి దించుతోంది. సీఐఎస్ఎఫ్పై సీలింగ్ ఎత్తివేత.. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్న జవాన్ల సంఖ్య 1.25 లక్షలకు అటూఇటుగా ఉంది. పహల్గాం ఘటన తర్వాత కొత్తగా 13వేల మందిని చేర్చుకోగా మరో 24వేల మంది నియామక ప్రక్రియ వేర్వేరు దశల్లో ఉంది. సీఐఎస్ఎఫ్కు సంబంధించి 1.62 లక్షల పోస్టుల వరకే సీలింగ్ ఉంది. తాజాగా బస్తర్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు దీన్ని జూలై 22న కేంద్రం సవరించింది. మొత్తంగా 2.20 లక్షల మంది కానిస్టేబుళ్లు/జవాన్లను నియామకానికి సీఐఎస్ఎఫ్కు అవకాశం కల్పించింది. కేంద్రం తాజా నిర్ణయంతో రాబోయే ఐదేళ్లలో ఏటా 14వేల మందికి మించకుండా మొత్తం 58 వేల మంది సీఐఎస్ఎఫ్ జవాన్లు బస్తర్ అడవుల్లో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఇక్కడ పారిశ్రామిక పురోగతి, ఖనిజాల రవాణా కోసం మల్కాన్గిరి–భద్రాచలం రైల్వే మార్గానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, చాన్నాళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన కొత్తగూడెం–కిరండోల్ రైలు మార్గం ఫైనల్ లోకేషన్ సర్వేకూ పచ్చా జెండా ఊపింది. అంతేకాక కిరండోల్–బీజాపూర్–రామగుండం వరకు కొత్త మార్గానికి సర్వే చేపడుతోంది. వీటికి రక్షణతో మొదలయ్యే సీఐఎస్ఎఫ్ విధులు ఆ తర్వాత రాబోయే పరిశ్రమలకూ భద్రత కల్పించనున్నాయి. -
ఒకే కుటుంబంలో ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్లు?
ఖమ్మం అర్బన్: నిరుపేదల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించగా కొన్నిచోట్ల అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం 8వ డివిజన్ వైఎస్సార్ నగర్ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి ఇళ్లు మంజూరైనట్లు జరుగుతున్న ప్రచారం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా, ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని స్థానికులు చెబు తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి నిజమైన పేదలకు ఇళ్లు మంజూరయ్యేలా చూడాలని పలువురు కోరారు. -
గుండెపోటుతో మృతి
మణుగూరుటౌన్: సీపీఐ రాష్ట్ర నాయకుడు బొల్లోజు అయోధ్యచారి మృతిని జీర్ణించుకోలేక సాంబాయిగూడెంనకు చెందిన తన అభిమాని గురువారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సాంబాయిగూడెం గ్రామానికి చెందిన రాచకొండ శంకర్ అలియాస్ చక్రయ (43) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయోధ్య అంటే ఎనలేని అభిమానం. అయోధ్య అంతిమయాత్రలో పాల్గొన్నాడు. కార్యక్రమం అనంతరం ఇంటికి వెళ్లగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బైక్ దొంగ అరెస్ట్భద్రాచలంఅర్బన్: భద్రాచలంటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల చోరీ లకు గురైన ఐదు ద్విచక్ర వాహనాల ను పోలీసులు స్వాధీనం చేసుకుని, చోరీచేసిన నిందితుడైన బూర్గంపాడు మండలం సారపాక జీపీ గాంధీనగర్కు చెందిన గుగులోత్ శ్రీనును శుక్రవారం అరెస్ట్ చేశారు. భద్రాచలంటౌన్ సీఐనాగరాజు కథ నం ప్రకారం.. భద్రాచలం పట్టణంలో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బైక్ల చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై గతంలో నాలుగు కేసులు ఉన్నాయని, రిమాండ్కు తరలించామని సీఐ నాగరాజు వివరించారు. పాత సంతకాలతో నోటరీలు?ఖమ్మంక్రైం: కార్పొరేషన్ కార్యాలయం సమీపాన ఓ మహిళ నిర్వహిస్తున్న జిరాక్స్, ఆన్లైన్ సెంటర్లో శుక్రవారం రాత్రి టూటౌన్, టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీ చేపట్టారు. నోటరీ కోసం వచ్చే వారిని విచారించకుండానే పాత సంతకాలతో కూడిన పత్రాలు విక్రయిస్తుందనే ఫిర్యాదులు అందాయని సమాచారం. దీంతో తనిఖీ చేపట్టి 36 నోటరీలను స్వాధీనం చేసుకున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు. -
గురుకుల విద్యార్థుల ప్రతిభ
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : ఇటీవల తెలంగాణ జూడో అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. బి.ప్రశాంత్ గోల్డ్మెడల్ సాధించి ఉత్తమ క్రీడాకారుడిగానగదు అవార్డు పొందాడు. చల్లా రుషి, చల్లా రుత్విక్ సిల్వర్ మెడల్స్ సాధించారు. ప్రశాంత్ సెప్టెంబర్లో లక్నోలో జరిగే జాతీయస్థాయి పోటీలకు హాజరుకానున్నాడు. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ప్రిన్సిపాల్ టి.బాలరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పోషకాలు ఎక్కువ
ఖర్చు తక్కువ..సూపర్బజార్(కొత్తగూడెం): పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగంతో పెట్టుబడి పెరుగుతోంది. మరోవైపు మొక్కలకు పోషకాలు అందించాలంటే ఎరువుల వాడకం తప్పనిసరిగా మారింది. రాష్ట్రంలో పెద్దదిగా ఉన్న జిల్లాలో దేశ సరాసరి ఎరువుల వినియోగానికి మించి ఎరువులను వినియోగిస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఎకరానికి ఎరువుల ఖర్చు రూ.6,671 అవుతోంది. ఎకరానికి 104 కేజీల యూరియా, 24 కేజీల డీఏపీ, 14 కేజీల ఎంఓపీ, 136 కేజీల కాంప్లెక్స్, 10 కీజీల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వినియోగిస్తున్నారు. అన్ని రకాల ఎరువులు కలిపి ఎకరానికి 287 కేజీలు వాడుతున్నారు. జిల్లాలో 2024లో సాగు విస్తీర్ణం 5,92,264 ఎకరాలు కాగా 1,70,153 మెట్రిక్ టన్నులను రైతులు వినియోగించారు. దీని విలువ రూ.395.12 కోట్లు. 2025లో పంటల సాగు విస్తీర్ణం 6,03,124 ఎకరాలు కాగా 1,69,037 మెట్రిక్ టన్నుల ఎరువులను వాడారు. దీని విలువ రూ.396.13 కోట్లు కావడం గమనార్హం. రసాయన ఎరువులతో అన్ని పోషకాలు అందవు.. అన్ని రకాల పోషకాలు పంటలకు అందాలంటే రసాయనిక ఎరువుల వల్ల సాధ్యం కాదని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువులను వినియోగిస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం తదితర పోషకాలు పంట మొక్కలకు లభిస్తాయని చెబుతున్నారు. నేల సాంద్రతకు భూసార యాజమాన్య పద్ధతులు అవలంబించాలని పేర్కొంటున్నారు. ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, పచ్చిరొట్ట ఎరువులు, నవధాన్యాలు, చెరువు మట్టి, పశువుల, గొర్రెల మందలు పెట్టడం వంటి చర్యలు చేపట్టాలి. పంట మార్పిడి, అంతర పంటలసాగు పాటించాలి. సేంద్రియ ఎరువులతో ప్రయోజనాలు ●పచ్చిరొట్ట పైర్ల సాగువల్ల నేలలో సేంద్రియ పదార్థం, సేంద్రియ కర్బనం వృద్ధి చెంది పోషక లభ్యత పెరుగుతుంది. ●పంటల సాగులో అంతర పంటలుగా అపరాల పంటలైన పెసర, మినుము, కంది, అలసంద చేర్చడం ద్వారా నేలలో నత్రజని లభ్యత పెరుగుతుంది. వర్మీ కంపోస్టు, సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పంటలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి ●భాస్వరం కరిగించే బాక్టీరియాను సేంద్రియ ఎరువులతో కలిపి పంటచేలల్లో వినియోగిస్తే నేలలో స్థిరీకరించిన భాస్వరం పంటలకు ఊతంగా నిలుస్తుంది ●కాంప్లెక్స్ ఎరువులను దుక్కిలో మాత్రమే వాడాలి. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువుల వాడకం సాగు ఖర్చు పెరగడానికి ఉపయోగం తప్ప పంటలకు లభించదు ●యూరియా, పొటాష్ ఎరువులను పంటకాలంలో మూడు పర్యాయాలుగా విభజించి వినియోగిస్తే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ●వరిలో అజోల్లాను వదలితే నత్రజని పంటకు అందుతుంది. ●పైపాటుగా యూరియాకు బదులుగా నానో యూరియా పిచికారీ చేయటం కూడా ఎరువుల్లో పోషక లభ్యత పెరుగుతుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ●పైపాటుగా ఎరువులు వేసినపుడు పాకటింగ్ పద్ధతిలో వేయాలి ●మొక్కకు నాలుగు అంగుళాల దూరంలో అంతే లోతు గుంట తీసి ఎరువు వేసి కప్పివేయాలి. ఈపద్ధతి కారణంగా ఎరువు వృథా కాదు. ఈ పద్ధతుల కారణంగా పంటపెట్టుబడి ఖర్చు తగ్గటంతో పాటు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రియ ఎరువులతో తగ్గనున్న పెట్టుబడి ఖర్చులు దేశ సరాసరి కంటే జిల్లాలో రసాయన ఎరువుల వినియోగం అధికంనాణ్యమైన దిగుబడి.. సాగు ఖర్చు తగ్గి, నేల సాంద్రత పెరిగి అధిక దిగుబడులు సాధించాలంటే సేంద్రియ ఎరువులను రైతులు తప్పకుండా ఉపయోగించాలి. దీని వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు నాణ్యమైన పంట దిగుబడులు వచ్చి రైతులు కూడా ఆర్థికంగా ఎదుగుతారు. ఈవిషయాలపై రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – పి రవికుమార్, అశ్వారావుపేట ఏడీఏ -
25 పనిదినాలు.. 24 రోజులు ఫేక్ అటెండెన్స్
ఇది బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామపంచాయతీ కార్యాలయం. ఇక్కడ గ్రేడ్–2 కార్యదర్శి పనిచేస్తున్నారు. గత నెలలో 31 రోజులకు నాలుగు ఆదివారాలు, ఒక శనివారం, బోనాల పండుగకు కలిపి ఆరు సెలవులు వచ్చాయి. 25 పనిదినాలు ఉండగా, పంచాయతీ కార్యదర్శి 24 రోజులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. నెలమొత్తమ్మీద ఒక రోజు మాత్రం సక్రమంగా హాజరైనట్లు తేలింది. అది కూడా కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశానికి జిల్లాలోని కార్యదర్శులందరూ హాజరైన సందర్భం. ఇక బూర్గంపాడు మండలంలోనే బూర్గంపాడు కార్యదర్శి(గ్రేడ్– 2), లక్ష్మీపురం కార్యదర్శి(గ్రేడ్–4) 24 రోజులు, తాళ్లగొమ్మూరు కార్యదర్శి(గ్రేడ్–3) 23 రోజులు తప్పుడు హాజరు నమోదు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. భద్రాచలంలో పనిచేస్తున్న గ్రేడ్–1 కార్యదర్శి కూడా 24 రోజులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేసుకున్నారు. టేకులపల్లి మండలం తడికలపూడి కార్యదర్శి (గ్రేడ్–3) 21 రోజులు తప్పుడు హాజరు నమోదు చేసుకున్నట్లు అధికారులు తేల్చారు. చుంచుపల్లి: గ్రామ పంచాయతీల్లో కీలకంగా వ్యవహరించే కార్యదర్శులు కొందరు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తప్పుడు హాజరు నమోదు చేసుకున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. జిల్లాలో తప్పుడు హాజరు నమోదు చేసుకున్న 42 మంది పంచాయతీ కార్యదర్శులను అధికారులు గుర్తించి నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో కొందరిపై వేటు పడనుందనే చర్చ జోరుగా జరుగుతోంది. గత నెలలో కొందరు అత్యధికంగా 21, 23, 24 రోజులపాటు తప్పుడు హాజరు నమోదు చేసినట్లు తేలింది. 20 రోజులకు పైగా తప్పుడు హాజరును నమోదు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్నే ప్రామాణికంగా తీసుకుని కొన్ని జిల్లాల్లో కార్యదర్శులను సస్పెండ్ చేశారు. కాగా పది రోజుల కంటే ఎక్కువ తప్పుడు హాజరు వేసుకున్న 42 మందిపై అధికారులు చర్యలకు సిద్ధంకాగా, పది రోజులకంటే తక్కువ తప్పుడు హాజరు నమోదు చేసుకున్నవారు మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. నోటీసులకు వివరణ వచ్చాక.. ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసిన 42 మంది కార్యదర్శుల నుంచి వివరణ కోసం జిల్లా అధికారులు ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు బాధ్యులను చేస్తూ 17 మంది ఎంపీఓలకు సైతం నోటీసులు ఇచ్చారు. నెలలో అత్యధికంగా ఫేక్ అటెండెన్స్ వేసిన కార్యదర్శులు, వారి పనితీరును పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇతర జిల్లాలో మాదిరిగానే ఇక్కడ కూడా తప్పుడు హాజరు నమోదు చేసిన కార్యదర్శులపై వేటు తప్పదనే వాదనలు వినిపిస్తోంది. ప్రధానంగా జూలైలో హాజరును పరిగణనలోకి తీసుకుని అత్యధిక రోజులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేసిన వారిపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఆ ఆరుగురిపై కఠిన చర్యలు? ప్రధానంగా నెలలో 20 రోజులకుపైగా ఫేక్ హాజరును నమోదు చేసినట్లు గర్తించిన సారపాక, భద్రాచలం, బూర్గంపాడు, లక్ష్మీపురం, తాళ్లగొమ్మూరు, తడికలపూడి వంటి మేజర్ పంచాయతీల కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఇక నుంచి విధులకు హాజరవ్వకుండా తప్పుడు అటెండెన్స్ నమోదు చేసే పంచాయతీ కార్యదర్శులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కలెక్టర్లకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ న్యాయ సంహిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫోర్జరీ, మోసపూరిత, సైబర్ మోసం చట్టం తదితర నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించింది. కార్యదర్శులపై పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తించే మండల, డివిజనల్, జిల్లా పంచాయతీ అధికారులు మోసాలను గుర్తించడంలో విఫలమైనా, నిర్లక్ష్యం వహించినా వారిపైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ డైరెక్టర్ సృజన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరు పంచాయతీల్లో 20 రోజులకు పైగా తప్పుడు హాజరు గత నెల అక్రమ హాజర్ల ఆధారంగా కార్యదర్శులపై వేటు? కఠిన చర్యలకు సిద్ధమవుతున్న ఉన్నతాధికారులు జిల్లాలో 42 గ్రామపంచాయతీల్లో ఫేక్ అటెండెన్స్ ఫేక్ అటెండెన్స్ కార్యదర్శుల సంఖ్య 20 రోజులకుపైగా 6 16 నుంచి 20 రోజులు 10 10 నుంచి 15 రోజులు 26 -
మిగులు భూమి ఎంత?
ఖమ్మంఅర్బన్: రాష్ట్రవ్యాప్తంగా జలవనరుల శాఖ పరిధిలోని భూముల గుర్తింపునకు కసరత్తు మొదలైంది. ఆయా భూముల లెక్కలు తేల్చి రక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ఆదేశించారు. దీంతో జిల్లాలోనూ అధికారులు మిగులు భూముల లెక్కలపై ఆరా తీస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్నెస్పీ) పరిధి కాల్వల నిర్మాణ సమయాన రైతుల నుంచి భారీగా భూములు సేకరించారు. జిల్లాలోని 17 మండలాల పరిధిలో భూములు సేకరించగా.. కాల్వల తవ్వకం, క్యాంప్లు, క్వార్టర్లు, ఇతర నిర్మాణాలకు పోగా మిగిలిన భూములు ఎక్కడెక్కడ, ఎంత మేర ఉన్నాయని సబ్ డివిజన్ల వారీగా నివేదిక తయారు చేస్తున్నారు. 239 కి.మీ. మేర కాల్వలు జిల్లాలో సాగర్ ప్రధాన కాల్వ, బ్రాంచ్ కాలువలు కలిపి 239 కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. వీటితోపాటు మేజర్లు, మైనర్లకు సైతం అప్పట్లో రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే, అవసరానికి మించి చాలాచోట్ల ఎక్కువ వైశాల్యం గల భూములు సేకరించినట్లు అంచనా. డీప్ కట్ ప్రాంతాల్లో మట్టి పోసేందుకు, క్యాంప్లు, యంత్రాల నిల్వ కోసం ఇలా సేకరించినట్లుసమాచారం. బోనకల్ బ్రాంచ్, మధిర బ్రాంచ్, 16–17 బ్రాంచ్ కాల్వల పరిధిలో భారీగా భూసేకరణ జరిగినట్లు తెలిసింది. క్యాంపుల నిర్మాణం విధినిర్వహణకు వచ్చే ఎన్నెస్పీ ఉద్యోగుల కోసం ఖమ్మం, వైరా, నేలకొండపల్లి, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, ఏనుకూరు, తిమ్మారావుపేట, బసవాపురం తదితర ప్రాంతాల్లో క్యాంప్లు నిర్మించారు. అలాగే, ఉద్యోగులు, సిబ్బంది ఉండేలా క్వార్టర్ల నిర్మాణం సైతం జరిగింది. ఆతర్వాత మిగులు భూముల్లో కొన్నేళ్ల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, మార్కెట్ యార్డులకు కేటాయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు సైతం జరగగా.. ప్రభుత్వమే 59 జీఓ ద్వారా క్రమబద్ధీకరించడంతో ఎన్నెస్పీ భూములు కుచించుకుపోయాయి. పేరుకే క్యాంప్.. ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న ఎన్నెస్పీ క్యాంపులో మొత్తం 96 ఎకరాల భూమి జలవనరుల శాఖ పరిధిలో ఉంది. కానీ ఇది రికార్డుల్లో మాత్రమే కనిపిస్తోంది. ఈ భూమిలో 80 ఎకరాలకు పైగా వివిధ ప్రభుత్వ శాఖలు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, ప్రార్ధనా మందిరాలకు కేటాయించారు. ఇదే స్థలంలో ఆర్టీసీ, ఆర్టీఓ, ఎల్ఐసీ, డీపీఓ, ఆర్డబ్ల్యూఎస్ తదితర కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఇక పట్టాదారులు కొందరు అప్పటి ఎన్నెస్పీ అధికారుల ద్వారా తమ పట్టా భూములు మిగులుగా ఉన్నాయని కొంతమేర తీసుకున్నట్లు సమాచారం. అన్నీ పోగా క్యాంప్లో ప్రస్తుతం 16 ఎకరాలే జలవనరుల శాఖ పేరున మిగిలి ఉండొచ్చని అంచనా. కేటాయింపులు, ఆక్రమణలు ఎన్నెస్పీ ప్రధాన కాల్వపైనే పాలేరు నుండి ఏన్కూరు వరకు ఖమ్మం చుట్టుపక్కల సుమారు 368ఎకరాల భూమిని రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఇందులో దానవాయిగూడెం కాలనీ, మద్దులపల్లి మార్కెట్ ఏర్పడ్డాయి. ఇక మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణంతో భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి కొంతమేర స్థలాలు ఇచ్చేందుకు గుర్తించారు. ఖమ్మం నడిబొడ్డున మేజర్ కాల్వ ఐదున్నర కి.మీ. పొడవుతో టేకులపల్లి వంతెన నుంచి చైతన్యనగర్, వరదయ్యనగర్, మధురానగర్ కాలనీ ధంసలాపురం వరకు ఉండేది. కానీ ఇప్పుడు కేవలం కి.మీ. నిడివి ద్వారా మాత్రమే లకారం చెరువులోకి నీరు చేరేందుకు ఉపయోగపడుతోంది. మిగతా భాగమంతా ఆక్రమణలకు గురికాగా.. ఇంకొంత క్రమబద్ధీకరణతో ఇతరుల పరమైంది. అలాగే, కాల్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి ప్లాట్లుగా మార్చేసిన ఉదంతాలు కూడా వెలుగు చూశాయి. దీంతో ఇప్పుడు కాల్వల గుర్తింపు కష్టంగా మారింది చెబుతున్నారు. భవిష్యత్ అవసరాల కోసం... ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల నిర్మించేందుకు అవసరమైన భూమి కావాలన్నప్పుడు వెతకాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యాన మిగులు భూములపై సమగ్ర సర్వే చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు అందాయి. దీంతో జిల్లాలోని జలవనరుల శాఖ మిగులు భూములను పూర్తిస్థాయిలో గుర్తించడంలో నిమగ్నమయ్యారు. ఇదేసమయాన ఆక్రమణలు, కేటాయింపులు, ప్రభుత్వ వినియోగం తదితర వివరాలను కూడా నివేదికలో పొందుపర్చనున్నట్లు తెలిసింది. జలవనరుల శాఖ స్థలాలపై ఆరా సబ్ డివిజన్ల వారీగా లెక్కలు తీస్తున్న యంత్రాంగం ఖమ్మం ఎన్నెస్పీ క్యాంపులో మిగిలింది 16 ఎకరాలే? -
స్ఫూర్తి పూసుకుంట..
ఆదివాసీ గ్రామంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు వెదురు బొమ్మలే జీవనాధారం.. పూసుకుంట గ్రామం వెళ్లాలంటే దమ్మపేట–పాల్వంచ ప్రధాన రహదారి నుంచి దట్టమైన అడవిలో 13 కి.మీ పాటు కాలిబాటన ప్రయాణించాలి. వానాకాలం వచ్చిందంటే బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. మిగతా కాలాల్లో కొన్ని ఆటోలు, టూ వీలర్ల ద్వారా గ్రామానికి రాకపోకలు సాగుతాయి. అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో రోడ్లు, మిషన్ భగీరథ పథకం గ్రామానికి చేరుకోలేదు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వానలపై ఆధారపడి సాగే వ్యవసాయంతో పాటు వెదురు బొమ్మల తయారీనే ప్రజల ప్రధాన జీవనాధారంగా మారింది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆదివాసీల జీవన విధానం, వారి ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో గొప్పగా చెబుతారు. ఆ రోజు గడిస్తే మళ్లీ వారి జీవితాల్లోకి రోడ్డు సౌకర్యం లేకపోవడం, కరెంటు ఉండకపోవడం, తాగునీటి కోసం తండ్లాట వంటి సమస్యలు వచ్చి చేరతాయి. వీరి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రజాప్రతినిధులు గట్టిగా సంకల్పం తీసుకుంటే అధికారులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే సంక్షేమం, అభివృద్ధి కిరణాలు ఎంత వేగంగా ఆదివాసీ జీవితాల్లోకి వస్తాయనేందుకు.. దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామం నిదర్శనంగా నిలుస్తోంది. నాటి గవర్నర్ గ్రామాన్ని సందర్శించాక.. స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాలపాటు దట్టమైన అడవిలో ఉండిపోయిన ఈ గ్రామం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు దాదాపుగా దూరంగా నిలిచిపోయింది. 2021 ఏప్రిల్లో అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేకంగా సందర్శించడంతో ఒక్కసారిగా పూసుకుంట గ్రామం వెలుగులోకి వచ్చింది. అక్కడి ప్రజల కష్టాలను చూసి ఆమె చలించిపోయారు. తాగునీటి సౌకర్యం కోసం ఆర్వో ప్లాంటు, ఈవీ ఆటో, వెదురు బొమ్మల తయారీ శిక్షణ కేంద్రానికి నిధులు మంజూరు చేశారు. కొన్నాళ్లు పని చేసిన ఆర్వో ప్లాంటు మూతపడగా శిక్షణా కేంద్రం అలంకారప్రాయమైంది. ఈవీ ఆటో రిపేర్లకు వచ్చి మూతపడింది. అంతకుముందు చరిత్రను పరిశీలించినా కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే గ్రామాన్ని సందర్శించారు. అది కూడా సాధారణ ఎన్నికల ప్రచారం కోసమే వచ్చినట్టుగా రికార్డులు పేర్కొంటున్నాయి. కొండరెడ్లు ఇతరులతో కలవకుండా దట్టమైన అడవుల్లో వేరుగా ఉండటం, ఓటర్ల సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో అధికారులు, రాజకీయ పార్టీలు వీరిని పట్టించుకోలేదు. ఈ విషయం గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సాక్షి కథనాల ద్వారా వెలుగులోకి వచ్చింది. యాక్షన్ ప్లాన్ గడిచిన ఏడాది కాలంగా కొండరెడ్లు జీవిస్తున్న పూసుకుంట గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్ అండ్ బీ అధికారులు, ఫారెస్టు శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించే పనులు ఈ ఏడాది జనవరిలో మొదలెట్టారు. ప్రస్తుతం రూ. 5 కోట్ల వ్యయంతో మూడు వంతెనల నిర్మాణం పూర్తికాగా, రోడ్డు పనులు కంకర పరిచే దశలో ఉన్నాయి. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆధ్వర్యంలో ఇంటింటా సర్వే నిర్వహించి, వారి నైపుణ్యం ఆధారంగా తేనెటీగల పెంపకం, టెంట్ హౌస్, రెండు పవర్ టిల్లర్లు మంజూరు చేశారు. వ్యవసాయం చేస్తున్న 20 కుటుంబాలకు 12 బోర్లను ఉచితంగా మంజూరు చేశారు. 22 కుటుంబాలకు ఇళ్లను మంజూరు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సుగా ఉపయోగించుకునేందుకు వీలుగా గతంలో మూలన పడిన ఈవీ ఆటోను రిపేర్ చేయించి అందుబాటులోకి తెచ్చారు. నామ్కే వాస్తేగా కాకుండా ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఐటీడీఏల పేరుతో ప్రత్యేక సంస్థలను నెలకొల్పి అనేక పథకాలను అందుబాటులో ఉంచింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పథకాలు లేకపోవడం, మరికొన్ని కాలానుగుణంగా మారకపోవడంతో ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న వ్యయం అంతా బినామీలకు, గుత్తేదారులవశం అవుతుందనే విమర్శలు ఉన్నాయి. ఆదివాసీల పల్లెల్లోకి వెళ్లి వారి జీవితాలను, ఆర్థిక స్థితిగతులను దగ్గరుండి పరిశీలించి పథకాలు అమలు చేస్తే మార్పు త్వరితగతిన వస్తుందనే అభిప్రాయానికి పూసుకుంట గ్రామం వేదికగా మారింది. పీవీటీజీలుగా కొండరెడ్లు ఆదివాసీల్లో కోయ, గోండు, గొత్తికోయ తదితర జాతులు ఎన్నో ఉన్నాయి. వీరిలో బాగా వెనుకబడిన జాతుల్లో కొండరెడ్లు ఉన్నారు. ఆదివాసీల్లో ఎక్కువ శాతం అడవుల్లో జీవించేందుకు ఇష్టపడితే, ఆ అడవుల్లో కొండలపైనే జీవించడం కొండరెడ్ల ప్రత్యేకత. కొండ కిందకు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాల వల్ల ప్రస్తుతం కొండరెడ్లు కిందకు వచ్చి అడవిలోనే ఊళ్లను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. కొండరెడ్లను ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ (అరుదైన ఆదిమజాతి)గా 1975లో కేంద్రం గుర్తించింది. ఆ తర్వాత కాలంలో వీరి జనాభా వేగంగా తగ్గిపోతుండటంతో 2006లో కొండరెడ్లను పీవీటీజీ (పర్టిక్యూలర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్) కేటగిరీలోకి మార్చారు. పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రగతి గిరిజనుల సామాజిక జీవనం మెరుగుపడే అవకాశం -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు రఘునాథపాలెం, వైరా, బోనకల్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల్లోని పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు.సేవకులు ముందు వరుసలో ఉండాలిచర్ల: క్రీస్తు పరిచర్యను కొనసాగించేందుకు సేవకులు ముందు వరుసలో ఉండాలని అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ (ఏఐసీసీ) రాష్ట్ర అధ్యక్షుడు రెవరెండ్ ఏనోశ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం చర్ల మండలంలోని సీ–కత్తిగూడెంలో టీజీఎం ప్రార్థనా మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమా వేశం నిర్వహించగా.. ఆయన పాల్గొని మాట్లా డారు. ఒడిదుడుకులను అధిగమించి ముందు కు సాగితేనే సేవా పరిచర్య సాగించడం సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం చర్ల మండల ఏఐసీసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బండివిజయ్ఆనంద్, ఐ.ఇమ్మానియోల్ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నా రు.ఉపాధ్యక్షులుగా వై.లాజర్,కార్యదర్శిగా ఇప్పా ప్రభుదాస్, సహాయ కార్యదర్శిగా కె.బర్నబస్, ఈసీ మెంబర్లుగా బాలరాజు, పాల్రాజు, సంసో న్, యేసు దాసును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డి.డేవిడ్రాజు, డి.బాలరాజు పాల్గొన్నారు. గుడుంబా స్థావరాలపై దాడులుబూర్గంపాడు: బూర్గంపాడుకు సమీపంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులలోని గుడుంబా స్థావరాలపై శుక్రవారం రెండు రాష్ట్రా ల ఎకై ్సజ్శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కిన్నెరసాని నదిఒడ్డున గుడుంబా తయారీ స్థావరాలతో స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు రెండు రాష్ట్రాల ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి, 30 డ్రమ్ముల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్స జ్ సీఐ రహీమున్నీసా పాల్గొన్నారు. హత్యాయత్నం కేసు నమోదుఇల్లెందు: మద్యానికి డబ్బులు లేవని చెప్పడంతో భార్యను హత్యచేసేందుకు యత్నించిన వ్యక్తిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పట్టణానికి చెందిన నాగరాజు.. తెల్లవారుజామ ను 3 గంటల సమయంలో భార్య ప్రియాంకను నిద్రలేపి, మద్యానికి డబ్బులు అడిగాడు. ఆమె లేవని చెప్పడంతో కత్తితో తలపై దాడి చేశాడు. మెడ పట్టుకుని చంపేందుకు యత్నించగా.. ఆమె తప్పించికుని సోదరి ఇంటికి వెళ్లి.. ఆస్పత్రిలో వైద్యం పొందింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
పెంచక మూడేళ్లు..
లారీ కిరాయిసత్తుపల్లి: మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా సత్తుపల్లిలోని బొగ్గు లారీల యజమానుల పరిస్థితి తయారైంది. లారీ నిర్వహణ ఖర్చులు, పన్నులు, బీమా, పెరిగిన డీజిల్ ధరలు, డ్రైవర్లు, క్లీనర్ల జీతభత్యాలు పెరిగిపోతుంటే.. వారికి ఇచ్చే కిరాయి మాత్రం పెరగడం లేదు. మూడేళ్ల క్రితం హైదరనాబాద్కు బొగ్గు రవాణా చేస్తే టన్నుకు రూ.1,400 చెల్లించేవారు. ఇప్పుడు అదే అద్దె చెల్లిస్తుండడం గమనార్హం. ఒక్కో లారీకి ఏజెంట్ కమీషన్ రూ.3వేలు దండుకుంటున్నా.. కిరాయి పెంచకపోవడంపై లారీల యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయినా లారీలను ఏజెంట్లు చెప్పినట్లుగా అద్దెకు తిప్పాల్సి వస్తోంది. అయితే, ఈ అంశంపై లారీ యజమానుల యూనియన్ దృష్టి సారించకపోవటం మరింత ఆందోళన కలిగిస్తుందని వాపోతున్నారు. ఉద్యమించి సాధించుకున్న బొగ్గు లోడింగ్ దళారుల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమలు కాని తీర్మానం ఏడాదిన్నర క్రితం ఎవరికై నా ఐదు లారీల కంటే ఎక్కువ ఉంటే వాటిని యూనియన్ పరిధిలో సీరియల్ వేసేది లేదని జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించారు. అయినా అమలుకు నోచుకోవడం లేదు. ఐదు లారీల కంటే ఎక్కువగా 20 మంది కలిగి ఉండగా.. వీరి లాభం కోసం ఒక్కో లారీ ఉన్న యజమానులను ఇబ్బందులు పెడుతున్నారని చెబుతున్నారు. యూనియన్లో కూడా వీరి పెత్తనమే ఉండటంతో చర్చించటానికి సైతం ముందుకు రావటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. భూ నిర్వాసితుల సంగతేమిటి? సత్తుపల్లి మండలంలోని కిష్టారం, కొమ్మేపల్లి, జగన్నాథపురం, చెరకుపల్లి, రేజర్ల గ్రామాల రైతులు వందల ఎకరాల భూమిని సింగరేణి గనుల కోసం అప్పగించారు. ఆ సమయాన భూనిర్వాసితులకు బొగ్గు రవాణాలో ప్రాధాన్యత కల్పిస్తామని సింగరేణి అధికారులు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరడం లేదు. ఏడాది క్రితం భూ నిర్వాసితులు తమ న్యాయమైన వాటా కింద లారీలకు లోడింగ్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయిస్తే.. లారీ యూనియన్ బాధ్యులు చర్చిద్దామని నచ్చజెప్పి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. సుమారు వందకు పైగా లారీలు భూనిర్వాసితులకు ఉండగా.. లోకల్, నాన్లోకల్ లోడింగ్ కారణాలతో లోడింగ్ దక్క ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేక రోడ్డున పడుతున్నారు. నాన్లోకల్ రోజుకు 20 లారీల యజమానుల ఆందోళనలకు మద్ధతు తెలుపుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సింగరేణి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో లారీలకు రోజూ 1,500 టన్నుల బొగ్గు లోడింగ్ ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో రోజుకు 50 లారీలకు లోడింగ్ దక్కుతుండగా... నాన్లోకల్ లారీలకై తే కమీషన్ ఎక్కువగా వస్తుందని 20 లారీలు ఇస్తుండడంతో స్థానిక లారీ యజమానులకు మళ్లీ సీరియల్ బాధలు తప్పడం లేదు. లారీ యూనియన్ బాధ్యులు దీనిపై దృష్టి సారించకుండా లోడింగ్ లేవంటూ ఆందోళనలు చేయటం.. తీరా లోడింగ్ వచ్చిన తర్వాత నాన్లోకల్ లారీలకు ఏజెంట్లు కట్టబెడుతున్న తీరుపై నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇకపోతే కోయగూడెం ఓసీలో నాన్లోకల్ కింద బయట లారీలకు కిరాయి ఇవ్వకుండా స్థానిక లారీలకే నాన్లోకల్ కింద తక్కువ కిరాయితో పంపిస్తున్నట్లు సమాచారం. ఏజెంట్ల ఇష్టారాజ్యంతో యజమానులకు అన్యాయం భూనిర్వాసితులకు దక్కని ప్రాధాన్యత -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాలికలు క్రీడల్లో రాణించాలిఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలం: క్రీడల్లో బాలికలు రాణించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఇటీవల హనుమకొండలో జరిగిన 34వ సౌత్ జోన్ మీట్లో భద్రాచలానికి చెందిన పృథ్విక జావెలిన్ త్రోలో రెండో స్థానం, ఎస్కే అమ్రిన్ 100 మీటర్ హ్యాండిల్స్లో రెండో స్థానం సాధించారు. శుక్రవారం పీఓ వారిని తన చాంబర్లో అభినందించారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో రాణించాలని సూచించారు. కాగా పీఓ రాహుల్ ఒక ప్రకటనలో రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కుంజా ధర్మ, పూణేం కృష్ణ, గుండు శరత్, కనితి రాద, శ్రీదేవి, నాగమణి, కోచ్లు జున్ను, గిరి ప్రసాద్ పాల్గొన్నారు. విజయవంతం చేయాలిభద్రాచలంటౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు సహకరించాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన సమితి సభ్యులతో సమావేశమై ఆదివాసీ వేడుకల ఏర్పాట్లపై మాట్లాడారు. అతిథులకు ఆదివాసీ వంటకాల రుచి చూపించాలని చెప్పారు. శనివారం వివిధ ఆదివాసీ తెగల గిరిజనులతో ర్యాలీ నిర్వహిస్తామని, మహనీయులకు విగ్రహాల వద్ద నివాళి, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రతినిధులు పూనెం కృష్ణ, కుంజా ధర్మ, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. పులి సంచారంపై అటవీశాఖ అప్రమత్తంఇల్లెందురూరల్: పాఖాల కొత్తగూడెం సమీపంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో పశువును చంపిన ఘటనతో పులి సంచరిస్తున్నట్లు శుక్రవారం అక్కడి అటవీశాఖ అఽధికారులు నిర్ధారించారు. పులి పాఖాల కొత్తగూడెం నుంచి పాండవుల గుట్ట మీదుగా గుండాల మండలం వైపుగా సంచరిస్తుందని గతంలో చోటుచేసుకున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. శుక్రవారం రాంపూర్, లక్నవరం మధ్య అటవీప్రాంతంలో పులి ఉన్నట్లు ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు, దాని సంచారంపై నిఘా పెంచారు. ఈ క్రమంలో జిల్లా అటవీశాఖ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. పాఖాల కొత్తగూడేనికి సమీపంలో ఉన్న ఇల్లెందు, కొమరారం, గుండాల రేంజ్ అధికారులు అప్రతమత్తమై అడవిలో నిఘా పెంచినట్లు ఇల్లెందు ఎఫ్డీఓ కరుణాకరాచారి తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పులి సంచరిస్తే పాదముద్రలను సులువుగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాకు 3వేల మెట్రిక్ టన్నుల యూరియా ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా అవసరాల కోసం 3,001 మెట్రిక్ టన్నుల క్రిబ్–కో యూరియా సరఫరా అయింది. ఖమ్మం జిల్లా పందిళ్లపల్లి రైల్వే రేక్ పాయింట్కు యూరియా చేరగా.. ఖమ్మం జిల్లాకు 1,501, భద్రాద్రి జిల్లాకు 1,400 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. మిగిలిన 100మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేశారు. జిల్లాల వారీగా కేటాయించిన యూరియాను పీఏసీఎస్లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా విక్రయిస్తారు. -
కార్మికులకు రక్షణ కల్పించాలి
మణుగూరు టౌన్: కార్మికుల రక్షణ, ఆరోగ్య పరిరక్షణపై యాజమాన్యం దృష్టి సారించాలని డీఎంఎస్(మైనింగ్) ఎం.ఉమేశ్ సావర్కర్, డీఎంఎస్ (ఎలక్ట్రికల్) ఆనంద్వెల్ అన్నారు. శుక్రవారం ఇల్లెందు క్లబ్లో మణుగూరు ఏరియాస్థాయి 18వ రక్షణ త్రైపాక్షిక సమావేశం డైరెక్టర్ (పీఅండ్పీ) కొప్పుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. తొలుత అధికారులందరూ రక్షణ ప్రతిజ్ఞ చేశారు. 17వ సమావేశంలో గుర్తించిన సమస్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంఎస్లు మాట్లాడుతూ ప్రతి గనిలో రక్షణపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలన్నారు. రాత్రి షిఫ్ట్ నిర్వహించే ఉద్యోగుల కోసం లైటింగ్ వ్యవస్థను మెరుగుపర్చాలని చెప్పారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్ (మైనింగ్) సనత్కుమార్ మాట్లాడారు. సింగరేణి డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు, జీఎం (సేఫ్టీ) కార్పొరేట్ చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులు తప్పనిసరిగా రక్షణ సూత్రాలు పాటించాలని అన్నారు. యంత్రాల పనిగంటలు పెంచి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని కోరారు. కేసీహెచ్పీలో దుమ్ముధూళి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 2025–26 లక్ష్య సాధనకు సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏబీసీ రక్షణ సూత్రంపై అవగాహన కల్పించారు. ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడుతూ ప్రమాద రహిత ఉత్పత్తికి పటిష్టంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో కొత్తగూడెం ఏరియా జీఎం (సేఫ్టీ) కృష్ణ గోపాల తివారి, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు వై.రాంగోపాల్, త్యాగరాజన్, కృష్ణంరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు. రక్షణ త్రైపాక్షిక సమావేశంలో డీఎంఎస్ ఉమేశ్ సావర్కర్ -
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శ్రావణ మాస రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఉపాలయంలోని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి ఉదయం ప్రత్యేక స్నపనం, పంచామృతంతో అభిషేకం జరిపారు. సాయంత్రం బేడా మండపంలో పల్లకీ సేవగా స్వామివారి ఉత్సవమూర్తులను, అమ్మవారి ప్రతిమను తీసుకొచ్చి బేడా మండపంలో కొలు వుదీర్చారు. అర్చకులు సామూహిక కుంకుమార్చన జరిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, మహిళలు పెద్ద సంఖ్యలో పా ల్గొన్నారు. శనివారం హయగ్రీవ జయంతి, పవిత్రోత్సవ ముగింపు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. నిత్యాన్నదానానికి విరాళం దేవస్థానం సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి భద్రాచలానికి చెందిన భక్తులు విరాళం అందించారు. రామాలయ సెంటర్కు చెందిన ఉడతా రమేష్, అనురాధ దంపతులు రూ.1,00,116లను ఆఓకు అందించగా, ఆమె దాతలకు రశీదు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రవణ్కుమార్, ఆలయ సూపరింటెండెంట్ లింగాల సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. రామాలయంలో సామూహిక కుంకుమార్చన నేడు హయగ్రీవ జయంతి అభిషేకం -
రెండో రోజు రెండు నాటికలు
ఖమ్మంగాంధీచౌక్: తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీల్లో కళాకారులు ప్రదర్శిస్తున్న నాటికలు ప్రేక్షకులను ఆలోచింపచేస్తున్నాయి. నెలనెలా వెన్నెల 8వ వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న పోటీలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కరీంనగర్కు చెందిన చైతన్య కళా భారతి బాధ్యులు ‘ఖరీదైన జైళ్లు’ నాటికను ప్రదర్శించారు. ఆధునిక సమాజంలో గ్రామీణ వాతావరనం, నగరాల్లో బ్రతుకుతున్న ప్రజల జీవన విధానాలు, ప్రేమానుబంధాల మధ్య తేడాను ఈ తేడా ద్వారా కళ్లకు కట్టినట్లు చూపారు. ఓ అపార్టుమెంట్లో ఉంటున్న కుటుంబంలో కొడుకు అమెరికాలో, కూతురు ముంబైలో ఉండగా తండ్రి మరణిస్తాడు. ఈ విషయం తెలిపినా పిల్లలు పనుల కారణంగా రాకపోవడంతో వాచ్మెన్ తలకొరివి పెట్టగా కుమారుడు, కుమార్తె ఆన్లైన్లో చూస్తూ నివాళులర్పించడం ఇతివృత్తంగా ఈ నాటిక సాగింది. అనంతరం విజయవాడకు చెందిన మైత్రి కళానిలయం వారు ‘బ్రహ్మస్వరూపం’ నాటికను ప్రదర్శించారు. స్నిగ్ధ నాటకీకరించిన ఈ నాటికకు టీవీ.పురుషోత్తం దర్శకత్వ వహించారు. ఆహ్లాదకరంగా సాగే జీవితంలో ఊహించని కష్టం చోటు ఎదురైతే జరిగే పరిణామాల ఇతివృత్తంగా ఈ నాటిక సాగింది. కాగా, రెండో రోజు పోటీలను చెరుకూరి వనశ్రీ, కాటంనేని వీరభద్రరావు, రమేష్, సంపత్, తిరుమలాచారి, వేల్పుల విజేత, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, డాక్టర్ నాగబత్తిని రవి, జగన్మోహన్రావు, సదానందం, లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్పొరేటర్, నాయకుడు తుమ్మల యుగేందర్ తదితరులు హాజరై ప్రదర్శకులకు పోత్సాహకాలు అందించారు. కాగా, నాటిక పోటీలకు శనివారం సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించిన ‘ఖరీదైన జైళ్లు’ -
పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి
పాల్వంచరూరల్ : గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కేంద్ర బృందం సభ్యులు కె.జయంత్,ఎస్.రవిచంద్ర సూచించారు. మండలంలోని పాయకారి యానంబైల్ గ్రామంలో గురువారం వారు పర్యటించారు. గ్రామంలో నిర్మించిన ఇంకుడుగుంతలను పరిశీలించారు. మరుగుదొడ్ల వినియోగం, నీటి సంరక్షణ చర్యలపై ఆరా తీశారు. వారి వెంట ఎంపీడీఓ కె.విజయభాస్కరరెడ్డి, ఎస్బీఎం కన్సల్టెంట్ రేవతి, ఎంపీఓ చెన్నకేశవరావు, ఏపీఓ పొరండ్ల రంగా, టీఏ సైదులు, కార్యదర్శులు మధు, శ్రీనివాస్, బాబురావు, దేవ్సింగ్, బాబా ఉన్నారు.యానంబైలులో కేంద్ర బృందం పరిశీలన -
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయండి
డీఐఈఓ వెంకటేశ్వరరావు బూర్గంపాడు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖా అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు. బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలన్నారు. నీట్, జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చాటి సీట్లు సాధించేలా ప్రత్యేక శిక్షణ తీసుకోవాలన్నారు. విద్యార్థుల యూడైస్, అపార్లలో తప్పులుంటే సరిచేయాలన్నారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలని అధ్యాపకులను ఆదేశించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ చీన్యా, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నేడు రామాలయంలో వరలక్ష్మీ వ్రత వేడుకలు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో అభిషేకం, సాయంత్రం 4గంటలకు బేడా మండపంలో సామూహిక కుంకుమార్చన గావిస్తారు. శనివారం హయగ్రీవ జయంతి సందర్భంగా హయగ్రీవునికి ఉదయం ప్రత్యేక స్నపనం, తిరుమంజనం జరపనున్నారు. చిన్నారులకు పలక, బలపం, నోటు పుస్తకాలను అందిస్తారు. అదే రోజు మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం, సాయంత్రం హవనం నిర్వహించారు. కాగా పవిత్రోత్సవాల సందర్బంగా నిలిపివేసిన నిత్యకల్యాణాలను ఆదివారం పునఃప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, పాలక మండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. కాగా, పౌర్ణమి సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయంలో శనివారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. పూజలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించాలని, వివరాలకు 63034 08458 నంబర్లో సంప్రదించాలని సూచించారు.అభ్యసన సామర్థ్యాలు పెంచాలివిద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు విజయలక్ష్మీబాయికొత్తగూడెంఅర్బన్ : విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచాలని, ఈ మేరకు ఉపాధ్యాయులు తగిన ప్రణాళిక రూపొందించాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకురాలు, ఎస్ఐఈటీ డైరెక్టర్ విజయలక్ష్మీబాయి అన్నారు. జూలూరుపాడు మండలంలోని కేజీబీవీని గురువారం ఆమె సందర్శించారు. ఆ తర్వాత కొత్తగూడెం జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, కేజీబీవీ ప్రత్యేకాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. యూడైస్ ప్లస్, అపార్ జనరేషన్, విద్యార్థుల సామర్థ్యాల పెంపు తదితర అంశాల్లో జిల్లా ప్రగతిని విశ్లేషించాలని సూచించారు. పెండింగ్ పనుల వివరాలను ఈనెల 10వ తేదీ లోగా నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని చెప్పారు. డీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతూ.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా విద్యా వ్యవస్థను ముందుకు నడిపిస్తామని అన్నారు.రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ఐదు పతకాలుకొత్తగూడెంటౌన్: రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనగామలో జరిగిన రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు ఐదు పతకాలు దక్కాయి. జిల్లాకు చెందిన 15 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనగా.. రెండు స్వర్ణ, రెండు కాంస్య, ఒక రజిత పతకాలు సాధించారని అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ తెలిపారు. విజేతలను డీవైఎస్ఓ ఎం. పరంధామరెడ్డి, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ కె.సారంగపాణి, జాతీయ కోచ్ నాగపూరి రమేష్ అభినందించారు. -
అమాయకులను హతమారుస్తున్నారు..
ఇల్లెందు : ఛత్తీస్గఢ్లో ఆరు నెలలుగా మారణహోమం సాగుతోందని, పోలీసులు, కేంద్ర బలగాలు మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసీలను హతమార్చారని ఆదివాసీ హక్కుల పోరాట వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, కో కన్వీనర్ ఎన్.నారాయణరావు అన్నారు. ఇల్లెందులో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మొత్తం 650 మందిని హత్య చేయగా అందులో 450 మంది ఆదివాసీలే ఉన్నారని తెలిపారు. ఇంకా లెక్కలోకి రాని మరెంతో మందిని పోలీసులే ఖననం చేశారని ఆరోపించారు. ఆదివాసీ మహిళలపై హత్యలు, అత్యాచారాలు నిలిపేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 9వ తేదీన హైదరాబాద్లో, ఈనెల 24న వరంగల్లో, అక్టోబర్ 5న ఇల్లెందులో పలువురు మేధావులతో సభలు నిర్వహిస్తామని వివరించారు. ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపేయాలని, వనరుల దోపిడీని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వేదిక నేతలు బాలయ్య, చంద్రమౌళి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, ముక్తి సత్యం, మెంతన సంజీవరావు, గుంపిడి వెంకటేశ్వర్లు, సూర్ణపాక సత్యనారాయణ, వట్టం కన్నయ్య, కె.గీతారెడ్డి, దుర్గారావు, వీరభద్రం, ఎట్టి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.ఆదివాసీ హక్కుల పోరాట వేదిక కన్వీనర్ గడ్డం లక్ష్మణ్ -
పనులు సాగేదెలా ?
● ఆలయ మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలే కీలకం ● ప్రస్తుత ఈఓ బదిలీ, ఇంకా ఎవరినీ నియమించని ప్రభుత్వం ● సీనియర్ అఽధికారిని కేటాయించాలంటున్న భక్తులు భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా మాఢ వీధుల విస్తరణ జరుగుతోంది. మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనుండగా వీటికి సంబంధించి ముందస్తు ప్రణాళిక సిద్ధం కావాల్సి ఉంది. మాస్టర్ప్లాన్ పనులు సైతం చేపట్లాల్సి ఉన్న ఈ తరుణంలో ఆలయ ఈవో ఎల్.రమాదేవికి బదిలీ కావడం, ఈ పోస్టులో ప్రభుత్వం ఇప్పటివరకు ఏ అధికారినీ నియమించకపోవడంతో పనులు సాగేదెలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కీలక తరుణంలో ఈఓగా సీనియర్ అధికారిని లేదా ఐఏఎస్ను నియమించాలని కోరుతున్నారు. మాఢ వీధులకు నిధులు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆలయ అభివృద్ధి పనులు చేపడుతోంది. తొలి ఘట్టమైన మాఢ వీధుల విసర్ణణకు నిధులు కేటాయించింది. దీంతో ఆలయానికి మూడు వైపులా ఉన్న ఇళ్లను తొలగించిన రెవెన్యూ అధికారులు.. భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. శిథిలాల తొలగింపు అనంతరం ఆ భూమిని దేవస్థానం అధికారులకు అప్పగించనున్నారు. ఆ తర్వాత రోడ్లు, ఇతర పనులు చేపడతారు. అయితే పనుల వేగవంతం, దేవస్థానం అభివృద్ధి ప్రణాళిక రూపొందించడం, ఆ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించడం వంటి పనుల్లో ఆలయ కార్యనిర్వాహక అధికారే కీలక పాత్ర పోషిస్తారు. ఇక మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. పుణ్య స్నానాలకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రద్దీకి తగినట్టుగా ఆలయంలో దర్శన సౌలభ్యం, ఇతర వసతి, సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు, ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. వీటన్నింటిలోనూ ఈఓనే కీలకం. ముందస్తు చర్యలు చేపట్టాలి భద్రాచలం దివ్యక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. గత పుష్కరాల సమయంలోనే పనులు ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈసారైనా ముందుస్తు చర్యలు చేపట్టాలి. అందుకు అనుభవం కలిగిన సీనియర్ అధికారి ఈఓగా ఉంటేనే మేలు. – అడపా వాసు, భద్రాచలంసీనియర్లయితేనే మేలు.. ప్రస్తుతం ఈఓగా విధులు నిర్వహిస్తున్న రమాదేవికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి కల్పిస్తూ ఆర్అండ్బీ శాఖకు బదిలీ చేశారు. దీంతో ఆలయ ఈఓ పోస్టు ఖాళీ కాగా, ఇంకా భర్తీ చేయలేదు. ఆలయ ఈఓ పోస్టును సీనియర్ అధికారి లేదా ఐఏఎస్ అధికారితో భర్తీ చేయాలని భక్తులు అంటున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం తెలంగాణాకే ప్రత్యేకమైన దేవస్థానం. ఇంతటి కీలక ఆలయాన్ని, వ్యవస్థను నిత్యం పర్యవేక్షించి పరిపాలనను గాడిలో పెట్టాలంటే సమర్థవంతమైన అధికారి అయితేనే సాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సీపీఐ నేత అయోధ్యకు కన్నీటి వీడ్కోలు
మణుగూరు టౌన్: పేదల పక్షపాతి, ప్రజా గొంతుక బొల్లోజు అయోధ్యకు గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, గురువారం స్వగ్రామం రామానుజవరంలో అంత్యక్రియలు జరిపారు. సంతాప సభ నిర్వహించగా, పలువురు హాజరై నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాష, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య తదితరులు నివాళులర్పించినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్య ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక నిర్బంధాలు ఎదుర్కొని ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. అయోధ్య మృతి పార్టీకి, పినపాక నియోజకవర్గానికి తీరని లోటని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలు సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. కన్నీటి వీడ్కోలు రామానుజవరంలో భౌతికకాయాన్ని ఉంచగా అన్ని సంఘాల, పార్టీల నాయకులు, యూనియన్ల నేతలు, భవన, రోడ్డు, లారీ, బొగ్గుముఠా, బార్ షాప్ వర్కర్లు, అసంఘటిత రంగ, సంఘటిత రంగ కార్మిక నాయకులు తరలివచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. మృతదేహం వద్ద నివాళులర్పించిన ప్రముఖులు -
జామాయిల్ కలప మాయం
ములకలపల్లి: తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో పెంచుతున్న ప్లాంటేషన్లో జామాయిల్ మొక్కలు మాయమయ్యాయి. రూ. రెండు లక్షలకుపైగా విలువైన కలప స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మండలపరిధిలోని రంగాపురం శివారులో ములకలపల్లి రేంజ్లో 2006లో జామాయిల్ ప్లాంటేషన్ వేశారు. 60.5 హెక్టార్ల పరిధిలో లక్ష మొక్కలకు పైగా నాటారు. ఇప్పటికే రెండు దఫాలుగా కటింగ్ చేయగా, కలప మూడో కటింగ్కు సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది వీటిని విక్రయించనున్నారు. ఈ తరుణంలో కొంత కలప మాయం చేశారు. ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు చెట్టుకు ఒక కొమ్మ నరికి రెండో కొమ్మను వదిలేశారు. అయితే ఇది ఇంటి దొంగల పనేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల క్రితం సుమారు 500 పైచిలుకు చెట్లను నరికి, గత గురువారం బయటకు తరలించినట్లు తెలుస్తోంది. సుమారు నాలుగు ట్రాక్టర్ల మేర కలప స్వాహా చేసినట్లు సమాచారం. సంబంధిత శాఖ అధికారులు మాత్రం కొంత కర్రను ములకలపల్లిలోని ఓ ప్రైవేటు అడితీలో స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ డిపోకు తరలించారు. కానీ కలప విక్రయించిన, కొనుగోలు చేసినవారిపై కేసు నమోదు చేయలేదు. విషయం బయటకు పొక్కుతున్న క్రమంలో కొద్దిపాటి కలపను పట్టుకుని చేతులు దులుపుకుంటున్నారే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నామమాత్రంగా జరిమానా విధించి, ఒక్క వ్యక్తిపైనే కేసు నమోదు చేసి తమ వారిని ఒడ్డున వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అక్రమంగా కలప తరలింపై వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయమై ప్లాంటేషన్ మేనేజర్ సునీతను వివరణ కోరగా... 500 మొక్కలు నరికినట్లు గుర్తించామని, ఒకరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. రూ.65 వేల జరిమానా విధించామని, సమగ్ర విచారణ సాగుతోందని వివరించారు. -
మునగ సాగులో ముందంజ
సూపర్బజార్(కొత్తగూడెం): మునగ సాగు ద్వారా ఆదాయాభివృద్ధిలో భద్రాద్రి జిల్లాను మోడల్గా తీర్చిదిద్దుతున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గురువారం ‘ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్’పై జాతీయ స్థాయిలో సెమినార్ నిర్వహించారు. దీనికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మునగసాగుపై వివరించారు. తెలంగాణలో పెద్దదైన జిల్లా.. 50 శాతం అడవులతో నిండి ఉందని, 37 శాతం గిరిజన జనాభా ఉందని తెలిపారు. వివిధ పంటలు సాగు చేస్తున్నప్పటికీ తక్కువ ఆదాయం పొందుతున్నారని, పత్తికి సగటున ఎకరాకు రూ.15 వేలు, మొక్కజొన్నకు రూ. 30వేలు మాత్రమే లాభం వస్తోందని వివరించారు. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో టీఎన్ఏయూ(కోయంబత్తూర్), జిల్లాలోని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల నిపుణులతో మునగసాగు, లాభాలపై కరపత్రాల ద్వారా అవగాహన పెంచామని, ఉపాధి హామీ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఖర్చు లేకుండా మునగ సాగు ప్రారంభించామని చెప్పారు. ఎకరానికి 1000 మొక్కలుంటాయని, కనీసం ఒక్కో చెట్టుకు 100 కాయల దిగుబడి వచ్చినా..రూ. 2కు కాయ చొప్పు రూ.2 లక్షల ఆదాయం పొందవచ్చని, ఆకుల విక్రయంతో అదనంగా రూ. 20వేలు లాభం వస్తుందని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 415 ఎకరాల్లో మునగ సాగవుతోందని, 100 ఎకరాల్లో ప్రధాన పంటగా, 315 ఎకరాల్లో అంతరపంటగా సాగు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన రైతు జమీల్ మునగ ఆకులతో కోళ్లకు మేతవేసి అదనపు ఆదాయం పొందారని, ప్రస్తుతం కౌజు పిట్టల యూనిట్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారని వివరించారు. రైతుల అనుమానాలను తొలగించి, గ్రామీణ స్థాయిలో విజేతల అనుభవాలను పంచుకోవడం ద్వారా రైతులు ప్రయోగాత్మకంగా ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. కాగా, సెమినార్లో పాల్గొన్న కేంద్రస్థాయి అధికారులు, ఇతర జిల్లాల కలెక్టర్లు ఇక్కడి మునగసాగును అభినందించారు. ఆదాయాభివృద్ధిలో మోడల్గా జిల్లా.. ఢిల్లీ సెమినార్లో కలెక్టర్ వెల్లడి రైతు జమీల్ సక్సెస్ స్టోరీని వివరించిన పాటిల్ -
పేకాటరాయుళ్లపై కేసు నమోదు
దమ్మపేట: మండలంలోని గండుగులపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వ్యక్తులపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, ఓ వ్యక్తి పరారయ్యాడు. రూ.2,800 నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. చేపల వేటకు వెళ్లి ఒకరు మృతిఅశ్వారావుపేటరూరల్: చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కేశప్పగూడేనికి చెందిన సోడెం మహేష్(29), అతని తమ్ముడు ముత్యాలరావు, మరికొందరు కలిసి ఊట్లపల్లి సమీపంలోని వెంకమ్మ చెరువులో చేపలు వేటకు వెళ్లారు. ఈ క్రమంలోనే మహేష్ చెరువులో దిగి వల విసిరే సమయంలో అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునుగుతూ గట్టిగా కేకలు వేశాడు. ముత్యాలరావుతోపాటు గ్రామస్తులు గమనించి కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే నీళ్లలో మునిగిపోవడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతుడు అవిహితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టీ యయాతీ రాజు తెలిపారు. ఇంటిపై పిడుగుపాటురూ.లక్ష ఆస్తి నష్టంఅశ్వారావుపేటరూరల్: మండలంలోని నారాయణపురం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రైతు కూకటి వెంకన్నబాబు ఇంటి భవనంపై పిడుగు పడింది. దీంతో స్లాబ్ పెచ్చులు ఊడిపోగా, ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్, స్విచ్ బోర్డులు, ఫ్యాన్లతోపాటు విద్యుత్ మీటర్ కాలిపోయాయి. సుమారు రూ. లక్ష ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. కాగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆర్ఐ కృష్ణ గురువారం బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. హైదరాబాద్లో అశ్వారావుపేట వాసి మృతిఅశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటకు చెందిన వ్యక్తి హైదరాబాద్లో గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. అశ్వారావుపేటకు చెందిన పంబి శ్రావణ్(30) భార్య సోనితో కలిసి మూడేళ్లుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ, జీవనం సాగిస్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, శ్రావణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి తండ్రి అశ్వారావుపేటలో పంచాయతీ రాజ్ శాఖలో అంటెడర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరిపై కేసు నమోదు అశ్వారావుపేటరూరల్: బ్యాంక్ రుణం పేరుతో మహిళను మోసం చేసిన ఇద్దరిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై టీ యయాతీ రాజు కథనం ప్రకారం.. పట్టణంలోని నందమూరినగర్కు చెందిన హలీమాకు ప్రైవేటు బ్యాంక్లో రూ. 7 లక్షల రుణం ఇప్పిస్తామని అశ్వారావుపేటకు చెందిన పీ ఫణింద్ర, అతని తండ్రి రామస్వామి బాధితురాలి సంతకాలతో ఖాళీ చెక్కులు తీసుకున్నారు. ఆ తర్వాత హలీమా బ్యాంక్ అకౌంట్లో పడిన నగదు నుంచి రూ. 2 లక్షలు కాజేసి, విడతల వారీగా వస్తాయని నమ్మించారు. తిరిగి నగదు జమ కాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అక్షరాస్యతా ఉద్యమమే ‘ఉల్లాస్’
డీఈఓ నాగలక్ష్మికొత్తగూడెంఅర్బన్ : నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ఉద్దేశమని డీఈఓ నాగలక్ష్మి తెలిపారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్లాంగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ(ఉల్లాస్) అనేది సమాజ సమగ్రాభివృద్ధి కోసం నిర్వహిస్తున్న సామాజిక ఉద్యమమని పేర్కొన్నారు. నిరక్షరాస్యత నిర్మూలనతో పాటు వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం నింపడం, సమాజాన్ని సమానత్వ బాటలో నడిపించే శక్తివంతమైన సాధనం అని వివరించారు. వయోజన విద్య డీడీ అనిల్కుమార్ మాట్లాడుతూ శిక్షణలో పొందిన జ్ఞానాన్ని మండల స్థాయిలో అమలు చేసి, ప్రతి నిరక్షరాస్యుడిని అక్షర్యాస్యులుగా మార్చాలని అన్నారు. కోర్సు కో ఆర్డినేటర్ ఎస్కే సైదులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని క్రియాశీలంగా అమలు చేయడమే లక్ష్యమని, ప్రతి ఎమ్మార్పీ.. వారి పరిధిలో ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణకు సంబంధించిన ఉల్లాస్ బ్రోచర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కో – ఆర్డినేటర్లు సతీష్కుమార్, ఎ. నాగరాజశేఖర్, జె.అన్నామణి, పాపారావు, అరుంధతి పాల్గొన్నారు. -
10న మెగా ఉచిత ఆరోగ్య శిబిరం
కొత్తగూడెంఅర్బన్: హైదరాబాద్ కేర్ ఆస్పత్రుల ఆధ్వర్యాన గుండె సంబంధిత వ్యాధి నిపుణులు వి.సూర్యప్రకాశరావు నేతృత్వంలో ఈనెల 10వ తేదీన గుండె సంబంధిత ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని కొత్తగూడెంలో నిర్వహించనున్నారు. ఈ శిబిరం కేసీఓఏ క్లబ్లో జరుగుతుందని.. ఈసీజీ, టుడీ ఎకో, జీఆర్బీఎస్, లిపిడ్ ప్రొఫైల్, బీపీ పరీక్షలు, కన్సల్టేషన్ ఉచితంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే శిబిరంలో పరీక్షల కోసం శుక్రవారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఇందుకోసం 95054 84389(మునీంద్రరెడ్డి), 88868 53111(నాగార్జున), 63049 25761(మోహిత్ సుభాష్) నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. మీ సేవ కేంద్రాల్లో తనిఖీఇల్లెందు: పట్టణంలోని మీ సేవ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తనిఖీ చేశారు. పెండింగ్ దరఖాస్తులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫీజులు తీసుకోవాలని, ప్రజలకు సేవలు వేగవంతంగా అందజేయాలని సూచించారు. సూచిక బోర్డులు, ధరల పట్టికలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మీ సేవ కేంద్రాల జిల్లా మేనేజర్ సైదేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విధుల నుంచి ఉపాధ్యాయుడి తొలగింపుదుమ్ముగూడెం : మండలంలోని లక్ష్మీనగరం ఏకలవ్య పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఎల్.నాగేశ్వరరావును ఉన్నతాధికారులు గురువారం విధుల నుంచి తొలగించారు. ఏకలవ్య పాఠశాల కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఆరో తరగతి విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించగా, విద్యార్థిని తల్లి ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్సీఓ అరుణకుమారి బుధవారం విచారణ నిర్వహించి, నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ నేపథ్యంలో గురుకులాల కార్యదర్శి సీతామహాలక్ష్మి ఆదేశాలతో ఐటీడీఏ పీఓ రాహుల్ సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించినట్టు ఆర్సీఓ తెలిపారు. కాగా సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని గిరిజనులు మల్లు దొర, కారం గోపాల్, కనితి జంపన్న, రామకృష్ణ తదితరులు కోరారు. పోడు రైతు రిమాండ్పాల్వంచరూరల్: పోడు కొట్టిన కేసులో కోర్టుకు హాజరుకాని రైతుకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. వైల్డ్లైఫ్ సెక్షన్ ఆఫీసర్ కిషన్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన రైతు అలకుంట రమేష్ అక్రమంగా పోడు సాగు చేసినట్లు 2024 మే నెలలో యానంబైల్ రేంజ్ వైల్డ్లైఫ్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టుకు హాజరుకానందున, కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం 14 రోజుల రిమాండ్ విధించగా, భద్రాచలం సబ్ జైలుకు పంపించినట్లు సెక్షన్ ఆఫీసర్ తెలిపారు. చోరీపై విచారణదుమ్ముగూడెం: మండలంలోని రామచంద్రునిపేట గ్రామానికి చెందిన సోయం రామిశెట్టి ఇంట్లో జరిగిన చోరీ కేసుపై విచారణ చేపట్టినట్లు ఎస్ఐ గణేష్ గురువారం తెలిపారు. ఈ నెల 6న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళం పగులగొట్టి లోపలకు ప్రవేశించారని పేర్కొన్నారు. మూడు ఇనుప బీరువాలను పగులగొట్టి బంగారం, నగదు.. మొత్తం రూ.3,53,000 విలువైన సొత్తు చోరీ చేశారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు. -
ఇస్తినమ్మ వాయినం!
నేడు వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్న మహిళలు ● లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం ● ఆలయాలు, ఇళ్లలో పూజలకు ఏర్పాట్లు కొత్తగూడెంటౌన్: శ్రావణమాసంలో తలపెట్టిన పనులకు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందని, వరలక్ష్మీవ్రతం ఆచరిస్తే సకల సౌభాగ్యాలు, సంపదలు చేకూరుతాయని మహిళలు విశ్వసిస్తారు. నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా మగువలు వ్రతం ఆచరించనున్నారు. మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగ ఇది. వ్రతం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సంపద, భూమి, శిక్షణ, ప్రేమ కీర్తి, శాంతి, సంతోషం, శక్తి సిద్ధిస్తాయని వేదపండితులు, అర్చకులు పేర్కొంటున్నారు. వివాహితలు దీర్ఘ సుమంగళిగా ఉండాలని, యువతులు మంచి భర్త రావాలని వ్రతం ఆచరిస్తారు. ఆలయాలు, ఇళ్లలో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీవ్రతం జరుపుకోవడం ఆచారమని పురోహితులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఆలయాలు, ఇళ్ల్లలో పూజలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. గారెలు, బూరెలతో నైవేద్యం వ్రతం సందర్భంగా తొలుత అమ్మవారి చిత్రపటాల వద్ద ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. పండ్లు, పూలు, గాజులతో అలంకరిస్తారు. అమ్మవారు మెచ్చే గారెలు, బూరెలు, పులిహోర, పూర్ణాలు, శెనగల ప్రసాదం నైవేద్యంగా పెడతారు. ఎరుపు, ఆకుపచ్చ, బంగారు వర్ణపు చీరలు ధరించి మహిళలు పూజలు చేస్తారు. కొందరు అమ్మవారికి చిత్రపటం ఎదుట కలశ స్థాపన చేస్తారు. కోరిన కోర్కెలు నెరవేరాలని, కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మహిళలు వ్రతం ఆచరిస్తారు. వ్రతం అనంతరం వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. మార్కెట్లో పూల సందడి వరుస పండుగలు కావడంతో జిల్లా కేంద్రంలో గురువారం పూల సందడి నెలకొంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో కొత్తగూడెం సూపర్బజార్, రైతుబజార్, రామవరం, పాలకేంద్రం, రుద్రంపూర్, పాత కొత్తగూడెం, విద్యానగర్కాలనీ, పోస్టాఫీస్ ఏరియాలతో పాటు పలు ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. పూలు, స్వీట్లు, నూతన వస్త్రాల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. కిలో చామంతి రూ.800, దండ (చామంతి) రూ.300, లిల్లీ పూల దండ రూ.200, బంతిపూలు పావు కిలో ధర రూ.50, గనుగు పూలు రూ.15, తామర పువ్వు రూ. 15, తమలపాకులు కట్టా రూ.10, చామంతి ఆకు రూ.50, మల్లెపూలు మూర రూ.50, గుమ్మడి కాయ ధరలు రూ.200 నుంచి రూ. 350 వరకు, తంగేడు పూల కట్ట రూ.15, గులాబీ పూవు ఒక్కోటి రూ. 40, గోరింట పూలు చటాక్ రూ.40 వరకు పలికాయి. చామంతి పూలు మూర రూ.50, విరజాజి పూలు మూర రూ.50కు విక్రయించారు. -
ఇల్లెందులో భారీ వర్షం
● లోతట్టు ప్రాంతాలు జలమయం ● మంచినీటి చెరువుకు అలుగు ఇల్లెందు/ఇల్లెందురూరల్: మండలంలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. సుభాష్నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని బీడీ కాలనీ, దర్గా వెనక ప్రాంతంలో వరదనీరు ఇళ్లలోకి చేరింది. బీడీకాలనీలో ఆరుబయట గూళ్లలో పదుల సంఖ్యలో ఉన్న కోళ్లు నీట మునిగి మృతి చెందాయి. రహదారులు దెబ్బతిన్నాయి. ఇంటి మెట్లు కూలిపోయాయి. వరదనీటితోపాటు పాములు సైతం కొట్టుకుని రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారే వరకు నీటి ప్రవాహం కొనసాగడంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఇక ఇల్లెందు తాగునీటి చెరువు అలుగు పోసింది. దీంతో పట్టణ ప్రజలు ఆనందంతో అలుగులో జలకాలాటలు ఆడారు. -
ఆ దాడులు పాశవికం..
గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులను అన్ని వర్గాల ప్రజలూ ఖండించాలని, శాంతి నెలకొల్పేందుకు దేశాధినేతలు కృషి చేయాలని పలువురు నినదించారు. ఖమ్మంలో గురువారం పాలస్తీనా సంఘీభావ కమిటీ ఆధ్వర్యాన భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలు, సంఘాల నాయకులు, యువజనులు, విద్యార్థులు, న్యాయవాదులు, వైద్యులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పెవిలియన్ మైదానం నుంచి మయూరిసెంటర్, వైరా రోడ్డు మీదుగా జెడ్పీ సెంటర్ వరకు ప్రదర్శనగా సాగారు. పాలస్తీనా ప్రజలకు ఆహారం, నీరు అందకుండా వేలాదిమంది ఆకలి చావులకు కారణమవుతున్న ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ అక్కడి ప్రజల దీనస్థితిని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. –ఖమ్మం మయూరిసెంటర్ -
మా కుటుంబాలకు అన్యాయం జరుగుతోంది..
చర్ల: ఇసుక అక్రమాలపై పూర్తి స్థాయిలో ఆధారాలు అందిస్తామని, విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని చర్ల మండలం మొగళ్లపల్లి భూమి పుత్ర సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం కొందరు సభ్యులు సమావేశమై తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. గోదావరి నదిలో చేపట్టిన ఇసుక క్వారీని తాము నిర్వహిస్తున్నామని, అయితే ఇసుక రీచ్ మంజూరుకు రైజింగ్ కాంట్రాక్టర్ రూ.కోట్లు ఖర్చు చేశాడంటూ సొసైటీ రికార్డులన్నీ ఆయన వద్దే ఉంచారని, దీనిపై తమ సొసైటీ అధ్యక్షురాలిని అడిగితే తమపైనే వాదనకు దిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక క్వారీ రికార్డుల తనిఖీకి వచ్చిన అధికారులు.. పంచాయతీ కార్యాలయంలో కాకుండా కాంట్రాక్టర్ ఇంటి వద్ద రికార్డులు తనిఖీ చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు, కాంట్రాక్టర్తో కుమ్మక్కయి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు సభ్యులమైన తమ కడుపు కొడుతున్నారని, ఈ విషయంలో అధికారులు విచారణ చేపట్టాలని కోరారు. తామే ఇసుక క్వారీ నిర్వహించుకునేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ఇసుక అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, కలెక్టర్, ఐటీడీఏ పీఓ ఇతర ఉన్నాతాధికారుల సమక్షంలో విచారణ చేపడితే అందిస్తామని తెలిపారు. మొగళ్లపల్లి భూమిపుత్ర సొసైటీ సభ్యుల ఆవేదన -
‘ఉద్దీపనం’తో నైపుణ్యాలు మెరుగుపడాలి
ఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలం: గిరిజన విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయిలో నైపుణ్యాలను పెంచేందుకు రూపొందించిన ఉద్దీపనం మెటీరియల్కు సాధికారత లభించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. గురువారం ఆయన ఐటీడీఏ సమావేశ మందిరంలో పీజీహెచ్ఎం, హెచ్ఎంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలు, హాస్టళ్లలో అమలవుతున్న మెనూ, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్దీపనం మెటీరియల్తో సత్ఫలితాలు వచ్చాయని, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. నవంబర్లో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తామని, ఈ లోగా విద్యార్థులకు వర్క్బుక్పై పూర్తి స్థాయిలో అవగాహన రావాలని అన్నారు. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సమష్టిగా పని చేయాలని సూచించారు. సెప్టెంబర్ నుంచి ప్రతి ఇనిస్టిట్యూట్లో ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు తీసుకునేలా యాప్ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. సమావేశంలో డీడీ మణెమ్మ, ఏసీఎంఓ రమేష్, ఏటీడీఓలు అశోక్కుమార్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. పీఓకు బ్రహ్మకుమారీ రాఖీ.. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మాతలు ఐటీడీఏ పీఓకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న కార్యకలాపాలను వివరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిదులు కృష్ణవేణి, భావన తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు అమృతంతో సమానంతల్లిపాలు అమృతంతో సమానమని, బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఇచ్చేలా ప్రతీ తల్లికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, పీఓ రాహుల్ అన్నారు. సబ్ కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో వారు మాట్లాడుతూ.. పుట్టిన గంటకే తల్లిపాలు అందేలా వైద్యులు, అంగన్వాడీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. కనీసం ఆరు నెలల వరకు తల్లి పాలు ఇప్పించేలా చూడాలన్నారు. అనంతరం గర్భిణులకు బాలామృతం అందజేయగా, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా, సీడీపీఓ జ్యోతి, సూపర్వైజర్లు అనసూయ, చంద్రకళ పాల్గొన్నారు. -
ఎస్పీని కలిసిన రిటైర్డ్ పోలీసులు
కొత్తగూడెంటౌన్: జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఎస్పీ రోహిత్రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న సంఘం నాయకులు పుష్పగుచ్ఛం ఇచ్చారు. వారిలో నూతన అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు అశోక్కుమార్, చీఫ్ అడ్వైజర్ ఎస్ఎం అలీ, అడ్వైజర్గా సీహెచ్ సుబ్బారావు, వైస్ ప్రెసిడెంట్లు బి.తారాసింగ్, కె.శ్రీను, ఆర్గనైజింగ్ సెక్రటరి కె.శివశంకర్రావు, జాయింట్ సెక్రటరి వి.వెంకయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎంఏ హాకీం, బి.శ్రీనివాసరావు, బి.రాంజీ, జి.అప్పారావు, ఎస్కే జానీమియా తదితరులు ఉన్నారు. ట్రాఫిక్కు అంతరాయం అశ్వారావుపేటరూరల్: ఓ ఎస్బీ కానిస్టేబుల్ కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిన ఘటన బుధవారం అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని రామాలయం వీధిలోని సూపర్మార్కెట్ వద్ద.. ఎస్బీ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ విధుల్లో భాగంగా కారులో వచ్చి.. ప్రధాన రహదారిపైనే పార్కింగ్ చేశాడు. అటువైపు వస్తున్న ఓ ట్రాక్టర్ను ఆపి వివరాలు సేకరించాడు. రోడ్డుపై అడ్డుగా ఉన్న కారుతోపాటు ఇసుక ట్రాక్టర్ కూడా ఆగిపోవడంతో ఈ మార్గంలో వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయి, ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. నిత్యం వాహనాల రాకపోకలతో ఈ మార్గం రద్దీగా ఉంటుంది. ఇలాంటి రద్దీ ప్రాంతంలో కానిస్టేబుల్ అనాలోచితంగా కారును పార్కింగ్ చేసి వాహనదారులను ఇబ్బందులు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానిక ఎస్ఐ యయాతిరాజును వివరణ కోరగా.. ఈ ఘటన తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి వివరాలు తెలుసుకుంటానని తెలిపారు. తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తెసింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా రామవరం 2 ఇంక్లైన్లో సింగరేణి మాజీ ఉద్యోగి కోలపూరి తులసీరామ్ (62) మంగళవారం మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. పెద్ద కుమార్తె ప్రవళ్లిక బుధవారం తలకొరివి పెట్టింది. దాడి చేసిన వ్యక్తిపై కేసుపాల్వంచరూరల్: చందా అడిగిన వెంటనే ఇవ్వలేదనే కోపంతో దాడి చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని సంగం గ్రామానికి చెందిన కస్కూరి సాయిదుర్గాప్రసాద్ మంగళవారం రోడ్డుపై నిలబడి ఉండగా అదే గ్రామానికి చెందిన బి.ఏసు వచ్చి వనదేవతల పండగకు చందా ఇవ్వాలని కోరాడు. తన వద్ద ఇప్పడు డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సాయిదుర్గాప్రసాద్పై ఏసు కర్రతో దాడి చేసి గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం ఏసుపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
నీటి సంపులో పడి బాలుడు మృతి
కామేపల్లి: ఆడుకునే క్రమాన ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిన రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మండలంలోని పండితాపురానికి చెందిన బాదావత్ నాగరాజు–కవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు జయరిషినాయక్(2) ఉన్నారు. ఈక్రమాన బుధవారం కవిత ఇద్దరు కుమార్తెలకు స్నానం చేయిస్తుండగా, జయరిషి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఆతర్వాత కుమార్తెలను ఇంట్లోకి తీసుకెళ్లిన క్రమంలో బాలుడు అక్కడే ఆడుతూ నీటి సంపులో పడిపోయాడు. కాసేపటికి రిషి కనిపించడం లేదని వెతుకుతుండగా సంపులో గుర్తించి బయటికి తీసి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఫోన్ మాట్లాడుతూ బావిలో పడి.. ఖమ్మంఅర్బన్: ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు బావిలో పడిన కార్మికుడు మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన సుధీర్ కుమార్(32) ఖమ్మం ఖానా పురంలోని గ్రానైట్పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆయ న బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు సమీప బావలో పడ్డాడు.సమీపంలో ఉన్నవారుబయటకు తీసేలోగా ప్రాణా లు కోల్పోవడంతో ఆయన బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ వెల్లడించారు. -
అనుమతిలేని ప్రైవేట్ పాఠశాల సీజ్
చుంచుపల్లి: జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు నందాతండాలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీచైతన్య పాఠశాలను బుధవారం ఎంఈఓ బాలాజీ, విద్యాశాఖ సిబ్బంది సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. గతేడాది ఈ పాఠశాలకు మూడు నోటీసులతో పాటు ఈ ఏడాది ఏప్రిల్లో పాఠశాలను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అయినా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠశాలను కొనసాగిస్తుండటంతో సీజ్ చేశామని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరంటేకులపల్లి: సైబర్ దుండగులు ప్రజలు చాకచక్యంగా ముగ్గులోకి దింపి, బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు కాజేస్తారని, ప్రజల్లో అప్రమత్తత అవసరమని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను హెచ్చరించారు. బుధవారం టేకులపల్లి, లచ్చతండా, సింగ్యాతండా, మూడుతండాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలులేని 43 మోటార్ సైకి ళ్లు, మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నాక.. డీఎస్పీ మాట్లాడారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం పిన్, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పొద్దని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, అర్ధరాత్రి తిరగడం, మద్యం సేవించ డం మానేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ లు సత్యనారాయణ, సురేశ్, ఎస్ఐలు రాజేందర్, శ్రీకాంత్, సూర్య, నాగుల్మీరా, సోమేశ్వర్ పాల్గొన్నారు. గ్రామాల్లో రాష్ట్ర బృందం పర్యటనదుమ్ముగూడెం: మండలంలోని గౌరారం, బి. కొత్తగూడెం గ్రామ పంచాయతీలను రాష్ట్ర బృందం బుధవారం సందర్శించింది. గ్రామాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చేపట్టిన ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, హ్యాండ్వా ష్ల నిర్మాణాలను పరిశీలించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బృందం సభ్యు లు, ఎంపీడీఓ వివేక్రామ్, ఏపీఓ సుకన్య, పంచాయతీ కార్యదర్శులు రాంబాబు, సాయి, స్రవంతి, మంగీలాల్, శ్రీకాంత్, రాజు, షర్మిల పాల్గొన్నారు. ‘ఏకలవ్య’లో ఆర్సీఓ విచారణదుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలోని ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతి విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై ఆర్సీఓ అరుణకుమారి బుధవారం విచారణ చేపట్టారు. పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థులు, ఉపాధ్యాయుల ను విచారించారు. బాధిత విద్యార్థినిని, ఆరోపణలు వచ్చిన ఉపాధ్యాయుడి నుంచి వివరా లు సేకరించారు. నివేదికను ఉన్నతాధికారుల కు అందజేయనున్నామని ఆర్సీఓ పేర్కొన్నా రు. కాగా,పాఠశాలలో జరిగిన ఘటనపై ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని తల్లి లేకుండా విద్యార్థినిని విచారించినట్లు సమాచారం. చదువు మానేసిన వారికి వరంలా ఓపెన్ స్కూల్కారేపల్లి: వివిధ కారణాలతో మధ్యలో చదువు మానేసిన వారే కాక స్వయం సహాయక సంఘాల సభ్యులు ఓపెన్స్కూల్ ద్వారా చదువు కొనసాగించాలని ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు సూచించారు. కారేపల్లి ఐకే పీ కార్యాలయంలో బుధవారం ఆయన ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లుతో కలిసి ఐకేపీ సీసీలు, గ్రామ దీపికలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ మాట్లాడుతూ చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న సభ్యులు పదో తరగతి, ఇంటర్ చదివే అవకాశముందని తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్కు అవకాశమున్నందున సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఐకేపీ సీసీలు అనిల్కుమార్, పుష్పకుమారి, సోందు, గౌసియా బేగం, విజయలక్ష్మి, అకౌంటెంట్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ ఎంట్రీలు లేకుండా జాగ్రత్త వహించాలి
ఇల్లెందురూరల్: వివిధ స్థాయిల్లో బిల్లుల మంజూరు కోసం ఆన్లైన్లో ఎంట్రీలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ పీడీ రవీంద్రనాథ్ సూచించారు. మండలంలో మెడల్ గ్రామంగా ఎంపికై న పూబెల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తీరును పరిశీలించారు. బేస్మెంట్, రూఫ్ లెవెల్కు చేరుకున్న ఇళ్ల లబ్ధిదారులు ఇప్పటివరకు చేసిన ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థాయిలవారీగా సకాలంలో ఎంట్రీలు పూర్తి చేసి త్వరితగతిన బిల్లులు మంజూరయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీలో ధన్సింగ్, హౌసింగ్ ఏఈ స్వాతి, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ ఆనవాళ్లు ఏవి..?
● అప్గ్రేడ్ అయ్యి రెండు నెలలు.. ● అభివృద్ధివైపు అడుగులు శూన్యం.. ● డివిజన్లలో అపరిష్కృతంగా సమస్యలు ● కోతులు, కుక్కలతో భయాందోళనలో ప్రజలు కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం ఏ–గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయ్యి రెండు నెలలు కావస్తున్నా అభివృద్ధిలో ఏమార్పు కనిపించడం లేదు. పేరులో మార్పు వచ్చింది కానీ, కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్లోని డివిజన్లలో అభివృద్ధిలో ముందడుగు పడలేదు. పాల్వంచ నుంచి వివిధ సెక్షన్లకు సంబంధించిన అధికారులు కొత్తగూడెం కార్పొరేషన్కు వచ్చి పనిచేస్తున్నారు. పాల్వంచలో డివిజన్ కార్యాలయం కొనసాగుతుండగా, సుజాతనగర్లోని డివిజన్లలో గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు డివిజన్ల ఇన్చార్జ్లు గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు ప్రజల సౌక ర్యం కోసం కార్పొరేషన్ కార్యాలయం నుంచి యూ డీసీలను నియమించారు. వీరు రోజూ సుజాతనగర్లోని డివిజన్లలో విధులు నిర్వర్తిస్తూ ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్లలో ఇంతకు మించి ఏం జరుగడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నా రు. డివిజన్లలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయ ని, వాటి పరిష్కారం కోసం కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటున్నారు. కార్పొరేషన్ అయిన తరువాత అందుకు సంబంధించిన ఏ ఒక్క ఆనవాళ్లు కూడా ఇక్క డ కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. డివిజన్లలో అనేక సమస్యలు.. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్లోని డివిజన్ల లో అనేక సమస్యలు నెలకొన్నాయి. అక్కడి స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. కొత్తగూడెంనకు సంబంధించి డివిజన్లలో కుక్కలు, కోతుల సంచారం ఎక్కువగా ఉంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరినీ కుక్కలు కరుస్తున్నాయి. పలువురు తీవ్రంగా గాయపడిన ఘటనలు అనేక ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. కార్పొరేషన్లో కుక్కలను పట్టించే కార్యక్రమాలు జరగడం లేదు. రైటర్బస్తీ లోని యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రం మూతబడి ఉండడంతో కుక్కలను సైతం పట్టడం లేదు. ఏబీసీ సెంటర్ తెరిస్తే కుక్కలను పట్టించి వ్యాక్సినేషన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, గతంలో ఉన్న కాంట్రాక్టర్కు బిల్లులు నిలిపివేడయంతో ప్రస్తుతం ఏబీసీ సెంటర్ నిర్వహణ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. కొత్తగూడెంలో ఉదయం, సా యంత్రం వేళల్లో కోతులు ఇళ్లలోని వచ్చి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఎదురుతిరిగితే ప్రజలను గాయపరుస్తున్నాయి. గతంలో మాదిరి ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కుక్కలను, కోతులను పట్టించే వారిని తీసుకొచ్చి, పట్టించాలని ప్రజలు కోరుతున్నారు. చెత్తతో నిండిన యార్డ్ పాత కొత్తగూడెం ఏరియాలో ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డు చెత్తతో నిండిపోయి ఉంది. యార్డు పక్కనే శ్మశానవాటిక ఉండడంతో ఆ రోడ్డులో కూడా చెత్తాచెదారం వేస్తున్నారు. ఎవరైనా మృతి చెందితే శ్మశానవాటికలోని తీసుకెళ్లే వీలు లేకుండా పోయింది. దీంతో పాటుగా అక్కడ స్థానికులకు దుర్గంధంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాల్వంచలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రహదారులు జలమయం.. వర్షం పడితే చాలు రోడ్లన్నీ జలమయం అవుతున్నా యి. రోడ్లలో ఇటీవల వర్షాలు గుంతలు ఏర్పడి అంతర్గత రహదారులన్నీ కూడా దెబ్బతినడడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే సుజాతనగర్లోని డివిజన్లలో వీధిలైట్లు లేక ప్రజలు రాత్రివేళల్లో బయటకు రావడం లేదు. ప్రత్యేక టెండర్లు పిలిచి లైట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదు. కార్పొరేషన్గా మారిన తరువాత చెప్పుకోదగిన అభివృద్ధి పనులు రెండు నెలల కాలంలో ఒక్కటి కూడా జరుగలేదు.ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.. కార్పొరేషన్లో అభివృద్ధిపై దృష్టిసారించాం. ఇప్పడిప్పుడే అన్నీ సర్దుకుంటున్నాయి. పాల్వంచ నుంచి సెక్షన్ ఇన్చార్జులు కొత్తగూడెం వచ్చి పని చేస్తున్నారు. కమిషనర్ ఆధ్వర్యంలో కార్పొరేషన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. –ప్రసాద్, కార్పొరేషన్ మేనేజర్ -
నాటుకోళ్ల మృతిపై ఫిర్యాదు
దుమ్ముగూడెం: మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన కట్టోజు సరస్వతికి చెందిన నాటుకోళ్లకు విషగులికలు పెట్టి హతమార్చగా.. కారుకులైనవారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 4వ తేదీన సరస్వతి కుటుంబ సభ్యులందరూ ఇల్లెందుకు వెళ్లారు. ఇంట్లో ఉన్న సుమారు 50 నాటుకోళ్లను ఉదయం పూట వదిలిపెట్టాలని పక్కింటి వారికి చెప్పారు. వారు నాటుకోళ్లను వదిలిపెట్టగా ఇంటి దగ్గర్లో ఉన్న పొలంలోకి వెళ్లగా.. యజమాని గుళికలు కలిపాడు. దీంతో ఇంటి ఎదుట 20 కోళ్లు మృతి చెందగా మరో 30కోళ్లు కనిపించకుండా పోయాయి. నాటుకోళ్లు మృతి చెందడంతో సుమారు రూ.లక్ష వరకు నష్టపోయామని బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐదు మట్టి ట్రాక్టర్లు సీజ్అశ్వారావుపేటరూరల్: రెవెన్యూ శాఖ నుంచి అనుమతి లేకుండా మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్లను బుధవారం స్థానిక తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెం శివారు నుంచి అశ్వారావు పేట వైపు వస్తున్న మట్టి ట్రాక్టర్లను సమాచారం మేరకు దాడి చేసి అదుపులోకి తీసుకుని, తహసీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు. కాగా, అనుమతి లేకుండా మట్టి, ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. పేకాటరాయుళ్ల అరెస్ట్టేకులపల్లి: పేకాట ఆడుతున్న ఐదుగురిని బోడు పోలీసులు అరెస్ట్ చేశారు. టేకులపల్లి మండలం లచ్చగూడెం శివారు మామిడి తోటలో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు బోడు ఎస్ఐ పి.శ్రీకాంత్ ఆధ్వర్యాన బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లచ్చగూడెం, కిష్టారంవాసులు ఐదుగురిని అరెస్ట్ చేయగా, ముగ్గురు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి రూ.3,200 నగదు, సెల్ఫోన్లు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. అసభ్య ప్రవర్తన కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష ఖమ్మం లీగల్/వైరా: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో వైరా మండలం గొల్లెనపాడుకు చెందిన 70ఏళ్ల చెరుకూరి లాలయ్యకు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా పోక్సో–1 కోర్టు ఇన్చార్జి న్యాయాధికారి కె.ఉమాదేవి బుధవారం తీర్పుచెప్పారు. అంతేకాక ఆయనకు రూ.50వేల జరిమానా విదించారు. గత ఏడాది ఫిబ్రవరి 2న బాధిత బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా లాలయ్య తన ఇంటికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయగా, విచారణలో నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.డీ.ఇర్షాద్ వాదించగా.. సిబ్బంది కె.చిరంజీవి, శ్రీకాంత్, ఆర్.నాగేశ్వరావు, చిట్టిబాబు సహకరించారు. కాగా, విచారణలో పాల్గొన్న సీఐ ఎన్.సాగర్, ఎస్సై పి.రామారావు, కానిస్టేబుల్ కె.చిరంజీవి సీపీ సునీల్దత్ అభినందించారు. -
మెనూ అమలులో నిర్లక్ష్యం తగదు..
భద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సరఫరా చేస్తున్న అల్పాహారం, భోజనాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని సంబంధిత ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు, ఉపాధ్యాయులను ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా గురుకుల ప్రిన్సిపాళ్లతో ఆయన బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 15 రోజులుగా గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థలకు సరఫరా చేసే ఆహారం విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనబడుతోందని, ఇప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అవసరమైతే ప్రిన్సిపాల్, వార్డెన్, సిబ్బంది కలిసి శ్రమదానం చేసుకుంటే పరిసరాలు శుభ్రంగా ఉంటాయని తెలిపారు. ఏజెన్సీల ద్వారా సరఫరా చేసే కూరగాయలు, జీసీసీ ద్వారా సరఫరా చేసే బియ్యం, పప్పులు, ఉప్పులు, పల్లి పట్టి నాణ్యతగా ఉన్నవి తీసుకోవాలని, నాసిరకంగా ఉన్నట్లు తెలిస్తే వెంటనే ఆర్సీఓకి తెలపాలని చెప్పారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా 8, 9, 10వ తరగతి పిల్లలకు ప్రతీ నెల 2వ శుక్రవారం, 4వ శుక్రవారం తప్పనిసరిగా ఏదో ఒక శాఖ నుంచి అధికారిని పిలిపించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్సీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. మెనూ పక్కగా అమలు చేయాలి ములకలపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ కచ్చితంగా అమలు చేయాలని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ తెలిపారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల/ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, స్టాక్ రూం, కిచెన్ గార్డెన్లను పరిశీలించి, సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను చిన్నారులకు అందించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎంఈఓ సత్యనారాయణ, హైస్కూల్ హెచ్ఎం లత, ఎస్ఎంసీ చైర్మన్ గొడ్ల రాజు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఇంటర్ అడ్మిషన్లు పెంచాలి
పాల్వంచరూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు పెంచాలని, కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలని ఇంటర్ బోర్డు రాష్ట్ర అబ్జర్వర్ హేమచంద్రరావు ఆదేశించారు. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం అయిన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల బోధన, బోధనేతర సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సెల్నంబర్లను సేకరించి కళాశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చెప్పారు. విద్యార్థుల ఆధార్, యూడైస్ అపార్ను అప్డేట్ చేసుకోవాలన్నారు. ప్రతి శనివారం ప్రయోగశాలలో ప్రాక్టికల్స్ నిర్వహించి, మధ్యాహ్న సమయంలో క్రీడలు నిర్వహించాలని సూచించారు. తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని, బోధన సిబ్బంది రాష్ట్రంలో ఉమ్మడి టైంటేబుల్ను అనుసరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, బోధన సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ బోర్డు రాష్ట్ర అబ్జర్వర్ హేమచంద్రరావు -
దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
జూలూరుపాడు: కుటుంబీకులంతా దైవదర్శనం చేసుకున్నారు. బంధువులను కలిసి, మరో బంధువు నిశ్చితార్థంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. కానీ, వారి ప్రయాణం గమ్యం చేరుకోలేదు. వీరు వెళ్తున్న మారుతి వ్యాన్ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గద్దలగూడెం గ్రామానికి చెందిన కె.చెన్నారావు (33) ఖమ్మంటౌన్–3 విద్యుత్ సబ్స్టేషన్లో సబ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు నుంచి బుధవారం తొమ్మిది మంది వ్యాన్లో ఖమ్మం వెళ్లగా చెన్నారావు డ్రైవింగ్ చేశాడు. ఖమ్మంలో దైవదర్శనం అనంతరం బంధువులను కలిసి చుంచుపల్లి బయలుదేరారు. హౌసింగ్ బోర్డులో బుధవారం సాయంత్రం చెన్నారావు మేనకోడలు నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం వద్ద వీరి వ్యాన్ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో చెన్నారావుకు తీవ్రగాయాలు కాగా సీపీఆర్ చేయడంతో పాటు తీవ్రంగా గాయపడిన ఆయన భార్య భార్గవి, తల్లి సావిత్రి, మరో ముగ్గురు క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే చెన్నారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది. ఒకరు మృతి.. మరో ఐదుగురికి గాయాలు -
ఆస్పత్రికి వెళ్తూ.. అనంతలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సీపీఐ నేత అయోధ్య ● సూర్యాపేట నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఘటన మణుగూరు టౌన్ : కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతూ.. చికిత్స నిమిత్తం హైదరాబాద్ వెళ్తుండగా సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య(74) దుర్మరణం పాలయ్యారు. మణుగూరు నుంచి మంగళవారమే తన కారులో వెళ్లి సూర్యాపేటలోని కుమార్తె నివాసంలో బస చేశారు. బుధవారం తెల్లవారుజామున అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే ముందు వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో డ్రైవర్ రమేష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రజాప్రతినిధిగా తనదైన ముద్ర.. మణుగూరుకు చెందిన అయోధ్య పీఏసీఎస్ చైర్మన్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పని చేసి, ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా కూడా సేలందించారు. కాంట్రాక్ట్ కార్మికులు, లారీ, కోల్ యూనియన్, కోల్ ట్రాన్స్పోర్ట్.. ఇలా పలు రంగాల కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాడారు. చిక్కుడుగుంట, సాంబాయిగూడెం, దమ్మక్కపేట గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించారు. 18 ఏళ్ల వయసులో సీపీఐలో చేరి కడవరకూ అదే పార్టీలో కొనసాగారు. సీపీఐ మండల కమిటీ సభ్యుడి నుంచి ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. శోకసంద్రంలో మణుగూరు.. అయోధ్య మరణ వార్త తెలియగానే మణుగూరు, పరిసర ప్రాంతాల ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతికి సంతాపంగా కిరాణా, బులియన్, ఇతర వ్యాపారులు, ప్రైవేట్ పాఠశాలల వారు స్వచ్ఛందంగా బంద్ చేశారు. సూర్యాపేటలో పోస్టుమార్టం అనంతరం సాయంత్రం 6 గంటలకు భౌతికకాయం మణుగూరుకు చేరింది. కొత్తగూడెం – మణుగూరు మధ్యలోని పలు గ్రామాల్లో పార్టీ నాయకులు, అభిమానులు మృతదేహంతో పాదయాత్రగా తరలివచ్చారు. కాగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. అయోధ్య మృతదేహానికి గురువారం ఉదయం రామానుజవరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు.. సూపర్బజార్(కొత్తగూడెం): అయోధ్య మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా నివాళులర్పించారు. సూర్యాపేట నుంచి మణుగూరుకు భౌతికకాయాన్ని తీసుకొస్తున్న క్రమంలో పార్టీ శ్రేణుల సందర్శనార్ధం కొత్తగూడెంలోని శేషగిరిభవన్లో కాసేపు ఉంచారు. సీపీఐ, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాపసభలో సాబీర్పాషా మాట్లాడుతూ పార్టీ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఎనలేని సేవలందించారని, అనేక భూపోరాటాలకు నాయకత్వం వహించారని అన్నారు. నివాళులర్పించిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, నాయకులు అన్నవరపు కనకయ్య, మైనార్టీ సంఘాల నాయకులు నయీమ్ ఖురేషి, మాస్లైన్ జిల్లా కార్యదర్శి ముద్ధా భిక్షం, కాంగ్రెస్, సీపీఐ నాయకులు ముత్యాల విశ్వనాధం, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, దమ్మాలపాటి శేషయ్య, మునిగడప వెంకటేశ్వర్లు, దారా శ్రీను, ధనలక్ష్మి, అబీద్ తదితరులు ఉన్నారు. -
చిన్నారులకు విద్య, వైద్యమే ప్రధానం
● గర్భిణుల్లో రక్తహీనత లేకుండా చూడాలి ● అధికారులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనములకలపల్లి : పిల్లలకు విద్యతో పాటు ఆరోగ్యం ఎంతో ప్రధానమైనవని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఈ రెండూ సక్రమంగా అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. మండలంలోని మంగపేట పీహెచ్సీ, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. తొలుత పీహెచ్సీలో వైద్యుల హాజరు, ఓపీ రిజిస్టర్, మందుల నిల్వ తదితర వివరాలను పరిశీలించారు. పేషంట్లకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా చూడాలని, సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని, వ్యాధి నిరోధక టీకాలు, పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆ తర్వాత పాఠశాలను సందర్శించి.. మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. భోజనం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అన్నారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను రాబట్టారు. వారికి పెన్నులు, నోట్ పుస్తకాలు అందజేశారు. పిల్ల లు కింద కూర్చోకుండా తరగతి గదుల్లో బెంచీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో తహసీల్థార్ భూక్యా గన్యా, ఎంఈఓ సత్యనారాయణ, హెచ్ఎం కోటమ్మ, అంగన్వాడీ టీచర్ సుజాత, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. -
స్థానిక పోరుకు సన్నద్ధం
● జీపీ, పరిషత్కు రెండు దశల్లో ఎన్నికలు ● ప్రతిపాదనలను సిద్ధం చేసిన అధికారులు ● ఇప్పటికే 90 శాతం మేర పనులు పూర్తిచుంచుపల్లి : స్థానిక సంస్థల ఎన్నికలు ఈ సారి రెండు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాల్లో సాధ్యాసాధ్యాలపై ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. 2019లో గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికలు రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రెండు విడతల్లోనే నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. ఆరు నెలల క్రితమే ఎన్నికలు నిర్వహిస్తారని భావించినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో మళ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఇప్పటికే ఓటరు జాబితా, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సిబ్బంది, నోడల్ అధికారుల నియామకాలు తదితర 90 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఇక ఎన్నికల ప్రకటన వెలువడడమే తరువాయి. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి.. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఉన్న బ్యాలెట్ బాక్సులతో పాటు గతంలోనే కర్ణాటక నుంచి మరికొన్ని తెప్పించారు. ప్రస్తుతం జంబో బాక్సులు 1,811, మీడియం బాక్సులు 351 అందుబాటులో ఉండగా మరో 1,000 బాక్సులు అదనంగా తెిప్పించనున్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగే 471 గ్రామ పంచాయతీల్లో 4,168 వార్డులు ఉన్నాయి. అలాగే 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా ఇప్పటికే పూర్తయింది. సర్పంచ్లకు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగులో ముద్రించి స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపర్చారు. పంచాయతీ ఎన్నికలకు 10,223 మంది, పరిషత్లకు 8,711 మంది సిబ్బంది అవసరమని గుర్తించారు. పంచాయతీ ఎన్నికలకు 4,242 పోలింగ్ కేంద్రాలు, పరిషత్ పోలింగ్కు 1,271 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికలు తొలి విడతలో అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, పినపాక, ఆళ్లపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల మండలాల్లో, మలి విడతలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో నిర్వహించనుండగా, పరిషత్ ఎన్నికలు 11 మండలాల చొప్పున రెండు విడుతల్లో పూర్తి చేసేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. రెండు విడతల్లో నిర్వహిస్తాం రాష్ట్ర ఈసీ ఆదేశాల మేరకు ఈసారి రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. గతంలో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలోని 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికలపై ప్రకటన ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. – బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ -
నిధుల గ్రహణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాకు 2021లో వైద్య కళాశాల మంజూరైంది. దీనికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా వచ్చింది. మెడికల్ కాలేజీ కంటే ముందుగానే నర్సింగ్ కాలేజీ భవనాలు నిర్మించగా.. వాటిలోనే వైద్య విద్యార్థులకు కూడా బోధన సాగుతోంది. ఇక ఐడీఓసీకి సమీపంలోనే 2023లో వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హాస్టల్, తరగతి గదులు, మెస్, రెసిడెంట్ డాక్టర్ల క్వార్టర్లు తదితర తొమ్మిది రకాల భవనాలు నిర్మిస్తున్నారు. అకడమిక్ క్లాసులు నిర్వహించే భవనం జీ ప్లస్ 4, బాలుర, బాలికల హాస్టళ్లు జీ ప్లస్ 5 పద్ధతిలో నిర్మించాల్సి ఉంది. మెస్, స్టాఫ్ క్వార్టర్లు జీ ప్లస్ 2గా నిర్మించాలని, ఈ పనులన్నీ 2024 డిసెంబర్ నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బిల్లులు పెండింగ్లో.. మెడికల్ కాలేజీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కళాశాల నిర్వహణకు, భవన నిర్మాణ పనులకు పదే పదే నిధుల గ్రహణం పడుతోంది. ఇప్పటికే రెండుసార్లు బిల్లులు పెండింగ్ ఉండడంతో ని ర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ పనులు పక్కనపెట్టింది. సాంకేతిక ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో 200 మంది కార్మికులు పని చేయాల్సిన చోట నలుగురు, ఐదుగురితో తూతూ మంత్రంగా పనులు చేయిస్తున్నారు. ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి రూ.27 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. పెరుగుతున్న వ్యయం.. మెడికల్ కాలేజీ, భవన నిర్మాణ పనులు 2023లో ప్రారంభమయ్యాయి. కాగా, బిల్లులు మంజూరు కావడం లేదంటూ నిర్మాణ పనులు మధ్య మధ్య నెలల తరబడి నిలిచిపోతున్నాయి. తిరిగి మొదలయ్యే సరికి సామగ్రి ధరల సవరణతో నిర్మాణ వ్యయం పెరుగుతోంది. ఆరంభంలో ఈ భవనాల నిర్మాణ వ్యయం రూ.105 కోట్లు కాగా, తొలి సవరణలో రూ.130 కోట్లకు, రెండో సవరణలో రూ.147 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం పనులు ఆగిపోయి ఉన్నాయి. మరోసారి అంచనా వ్యయం సవరణ జరిగితే ఇది రూ.178 కోట్లకు చేరుకుంటుందని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు. నిధుల సర్దుబాటులో జాప్యంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుండగా అటు విద్యార్థులకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఎవరికీ పట్టింపు లేదు.. మెడికల్ కాలేజీలో 2022 – 23 విద్యాసంవత్సరంలో 150 మంది విద్యార్థులతో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. నర్సింగ్ కాలేజీలో బోధన.. అద్దె భవనాల్లో హాస్టళ్లు కొనసాగుతున్నాయి. హాస్టళ్ల నుంచి కళాశాలకు విద్యార్థుల రాకపోకలకు కనీసం బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. ఆటోల్లో వచ్చి పోతూ విద్యార్థులు ప్రమాదాలకు గురైన ఘటనలూ ఉన్నాయి. కలెక్టర్గా ప్రియంకా ఆల ఉన్న సమయంలో కాలేజీ విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇంత జరుగుతున్నా.. ఇప్పటి వరకు మెడికల్ కాలేజీ నడుస్తున్న తీరు తెన్నులపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అటు జిల్లా ఉన్నతాధికారులు ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. ఈ కాలేజీ మీదుగానే రాకపోకలు సాగిస్తూ.. మాట వరసకై నా విద్యార్థులను పలకరించిందీ లేదు. అర్ధంతరంగా ఆగిన వైద్య కళాశాల నిర్మాణం 2023లో ప్రారంభమైన పనులు 2024 డిసెంబర్ నాటికే పూర్తి కావాలని లక్ష్యం ఇప్పటి వరకు 70 శాతమే పూర్తయిన సివిల్ పనులు70 శాతం పనులు పూర్తి.. కళాశాల అకడమిక్ భవనం, హాస్టళ్లు, రెసిడెంట్ వైద్యుల క్వార్టర్లు, మెస్ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయి. శ్లాబ్, కాంక్రీట్, గోడల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. సివిల్ పనులు పూర్తయితే ఆ తర్వాత డ్రెయినేజీ, విద్యుత్, పెయింటింగ్ పనులు జరగడమే తరువాయి అనుకున్న సమయంలో పనులు మళ్లీ అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి, శర వేగంగా పనులు చేపట్టినా.. మరో ఏడాది గడిస్తే కానీ ఈ కాలేజీ భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. -
పక్వానికి వచ్చిన గెలలే తీసుకురావాలి
దమ్మపేట : పామాయిల్ గెలలు పక్వానికి వచ్చిన తర్వాతే ఫ్యాక్టరీకి తీసుకురావాలని, ఈ మేరకు రైతుల్లో చైతన్యం కల్పించాలని ఆయిల్ఫెడ్ ఈడీ ప్రశాంత్కుమార్ అన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలను ప్లాంట్ల మేనేజర్ సత్యనారాయణతో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. గెలల క్రషింగ్, యంత్రాల పనితీరును పరిశీలించారు. అంతర్గత సమస్యలేమైనా ఉన్నాయా అని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయిల్ రికవరీ శాతం పెరిగేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ మేనేజర్లు కళ్యాణ్, నాగబాబు, కార్తీక్, వెంకట్ పాల్గొన్నారు. -
వైభవోపేతంగా పవిత్రార్పణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం పవిత్రార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత స్వామి వారికి వేద విన్నపాలు చేశారు. బేడా మండపంలో ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం, సహస్ర ధారలతో ప్రత్యేక స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు నిర్వహించాక హారతి సమర్పించారు. ప్రధాన ఆలయం నుంచి పవిత్రాలను తీసుకొచ్చి ప్రత్యేక పూజల అనంతరం మూలమూర్తులకు ధరింపజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లి లక్ష్మీతాయారు అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి భక్తరామదాసు, గోదాదేవి అమ్మవారికి అలంకరించారు. ఆలయానికి, ధ్వజస్తంభానికి, బలిపీఠానికి, సుదర్శన చక్రానికి పవిత్రాలను ధరింపచేసి, అర్చకులు సైతం ధరించారు. గతేడాది కాలంలో రామాలయంలో జరిగిన పూజాది కార్యక్రమాల్లో జరిగిన దోష నివారణకు ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ అని అర్చకులు వివరించారు. ఆ తర్వాత ఈఓ రమాదేవికి వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.స్ఫూర్తి ప్రదాత.. జయశంకర్ భద్రాచలంటౌన్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడిపిన స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ అని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. జయశంకర్ జయంతి వేడుకలను బుధవారం ఐటీడీఏలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం 1969 నుంచే జయశంకర్ అహర్నిశలూ ఉద్యమించారని తెలిపారు. ఆయన కృషి ఫలితంగానే తెలంగాణ ఏర్పాటైందని అన్నారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, అధికారులు హరీష్, లక్ష్మీనారాయణ, రమేష్, భాస్కరన్, ఉదయ్కుమార్, ప్రభాకర్ రావు, హరికృష్ణ పాల్గొన్నారు. పీఓను కలిసిన సబ్ కలెక్టర్..భద్రాచలం సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మ్రిణాల్ శ్రేష్ఠ పీఓ రాహుల్ను మరాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై చర్చించారు. ఆదివాసీల భూ సమస్యలతో పాటు రెవెన్యూ సమస్యలు, కోర్టు కేసుల వంటి వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని ఈ సందర్భంగా పీఓ కోరారు. -
ఇదేం న్యాయం..?
● సింగరేణి మెడికల్ కళాశాలలో దక్కని సరైన వాటా ● సింగరేణీయులకు ఏడు సీట్లే కేటాయిస్తున్న వైనం ● ఏటా దరఖాస్తు చేసుకుంటున్న 200 మంది విద్యార్థులు ● కళాశాలకు స్థలం, రూ. 500 కోట్లు ఇచ్చిన సింగరేణి సంస్థ ● 40 శాతం సీట్లు కేటాయించాలని ఉద్యోగుల డిమాండ్ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)లో సింగరేణీయుల పిల్లలకు న్యాయమైన వాటా దక్కడంలేదు. దీంతో కార్మికులు, ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది. పెద్దపెల్లి జిల్లా రామగుండంలో ప్రభుత్వం మెడికల్ కళశాల ఏర్పాటు చేయగా సింగరేణి సంస్థ స్థలం ఇచ్చింది. రూ.500 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. దీంతో సింగరేణి మెడికల కళాశాలగా పిలుస్తున్నా.. సింగరేణి కార్మికుల పిల్లలకు కేవలం ఐదు శాతం అంటే ఏడే సీట్లే కేటాయించారు. సింగరేణి సంస్థలో సుమారు 40 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి పిల్లలు ఏటా 2 వేల మంది ఎంబీబీఎస్లో ప్రవేశం కోసం నీట్ పరీక్ష రాస్తున్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఏటా సుమారు 200 మంది వరకు సింగరేణి మెడికల్ కళాశాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ ఏడుగురికే సీట్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు సూపర్ యానిమేషన్ కింద 40 శాతం సీట్లు పెంచాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నారు. మెరిట్ సీట్లనూ సింగరేణి కోటాలో చూపుతున్నారు... ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉద్యోగుల పిల్లలు సుమారు 200 మంది సింగరేణి హెచ్ఆర్డీ విభాగం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నీట్ పోటీ పరీక్షలో 500 మార్కులు వచ్చిన సింగరేణీయుల పిల్లలు సుమారు 200 మంది వరకు ఉండగా, రిజర్వేషన్తో సంబంధం లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని కోరుతున్నారు. గతంలో ఇచ్చిన 5శాతం కాకుండా ఈ ఏడాది 40శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నీట్ నిర్వాహకులు ఓవరాల్ మెరిట్ వచ్చిన సీట్లను కూడా సింగరేణి కోటాలో చూపుతున్నారని, దీంతో కార్మికుల పిల్లలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. కోల్బెల్ట్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు స్పందించి సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కనీసం 40శాతం సీట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏడు సీట్లు ఇవ్వడం సరికాదు.. సింగరేణి యాజమాన్యం మెడికల్ కళాశాల ఏర్పాటుకు రూ.500 కోట్లతో పాటు స్థలం కేటాయించింది. అయినా కేవలం 5 శాతం అంటే 7 సీట్లు కేటాయించడం సరికాదు. సింగరేణీయులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? – పీతాంబరరావు, ఐఎన్టీయూసీ కార్పొరేట్ ఉపాధ్యక్షుడుకార్మిక సంఘాలను సంప్రదించకుండానే.. సింగరేణి యాజమాన్యం కనీసం కార్మిక సంఘాలను సంప్రదించకుండానే నేరుగా ప్రభుత్వానికి రూ.500 కోట్లు సమర్పించింది. అదే కంపెనీ మెడికల్ కళాశాల పెట్టి ఉంటే కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు, పిల్లలకు మెడికల్ సీట్లు వచ్చేవి. – వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడుఫిర్యాదు చేస్తాం.. ప్రస్తుత విద్యాసంవతర్సంలో కార్మికులు, అధికారుల పిల్ల లకు కోరిన విధంగా సీట్లు కేటాయింపు జరగాలి. లేకపోతే ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తాం. సీట్ల పెంపునకు అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఆందోళన చేస్తాం. – రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శిసీట్ల పెంపు పరిశీలనలో ఉంది.. మెడికల్ కళాశాల సీట్ల పెంపు విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులు, అధికారుల పిల్లలకు మెరిట్తో సంబంధం లేకుండా సీట్లు పెంచే యోచనలో ఉంది. కార్మికులకు మెరుగైన వైద్యం కూడా అందించాలని భావిస్తోంది. ఉద్యోగుల అభివృద్ధి, సంక్షేమమే మాకు ప్రథమ ప్రాధాన్యం. – ఎన్.బలరామ్, సీఎండీ -
పేదరికమే అర్హతగా పథకాలు
తిరుమలాయపాలెం: ఎవరికి ఓటు వేశారనేది పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పేదరికమే అర్హతగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, మూడు విడతల్లో మిగతా వారికి సైతం ఇస్తామని వెల్లడించారు. తిరుమలాయపాలెంలో రూ.3.30 కోట్లతో నిర్మించే బీటీ రహదారులకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఆతర్వాత ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి రేషన్కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయగా మంత్రి మాట్లాడారు. తిరుమలాయపాలెంకు ఐటీఐ కేటా యించగా, 30 పడకల ఆస్పత్రిని రూ.26 కోట్లతో 50 పడకలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుండగా తమ ప్రభుత్వానికి దీవెనలు అందించాలని పొంగులేటి కోరారు. కాగా, భూభారతి చట్టం ఈనెల 15 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని తెలిపారు. చేత కాకపోతే రాజీనామా చేయండి ‘జల్లెపల్లిలో డెంగీతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిసినా పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించడం సరికాదు... చేతకాకుంటే రాజీనామా చేయండి’ అని ఎంపీడీఓ సిలార్సాహెబ్ను మంత్రి పొంగులేటి హెచ్చరించారు. జల్లేపల్లిలో సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ‘ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా.. నీ కోసం ప్రత్యేక జీఓ తేవాలా? నువ్వే పరిపాలన చేయ్.. లేకుంటే రాజీనామా చేయ్’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా, మండలంలోని బలరాంతండాకు చెందిన శివ కానరావడం లేదని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన తల్లి లలిత మంత్రి దృష్టికి తీసుకురాగా, పోలీసులకు పొంగులేటి సూచనలు చేశారు. ఎవరికి ఓటు వేశారో అడిగేది లేదు.. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
గ్రామాలకు వెళ్లకుండానే హాజరు
● పంచాయతీ కార్యదర్శుల ఇష్టారాజ్యం ● జిల్లా వ్యాప్తంగా 42 మందికి నోటీసులు ● బూర్గంపాడు మండలంలో అత్యధికంగా ఏడుగురు ● వారిని పర్యవేక్షించాల్సిన ఎంపీఓలపైనా చర్యలుచుంచుపల్లి: పల్లె పాలనపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పంచాయతీ కార్యదర్శులు బాధ్యతలు మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పంచా యతీల్లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఏడాదిన్నర నుంచి గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు గ్రామాల చొప్పున అదనపు బాధ్యతలు అప్పగించారు. వేర్వేరు శాఖల నుంచి ప్రతీ గ్రామానికి ప్రత్యేక అధికారిని నియమించారు. వారిలో కొందరికి గ్రామాలపై అవగాహన లేకపోవడం, ఇతర బాధ్యతలు తదితర కారణాలతో పల్లె పాలన అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు మండల పంచాయతీ అధికారులు (ఎంపీఓలు) కూడా దృష్టి పెట్టడంలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరుకాకుండానే హాజరైనట్లు హాజరు నమోదు చేసుకుంటున్నారు. గ్రామాలకు వెళ్లకుండా పంచాయతీ సిబ్బందితో హాజరు నమోదు! పచాయతీ కార్యదర్శులు ఉదయం 10గంటల లోపు గ్రామానికి వెళ్లి డీఎస్ఆర్ (డెయిలీ శానిటేషన్ రిపోర్టు) ముఖ గుర్తింపు యాప్ ద్వారా సెల్ఫీ ఫొటో దిగి హాజరు నమోదు చేసుకోవాలి. అనంతరం పారిశుద్ధ్య పనుల ఫొటోలను కూడా అప్లోడ్ చేయాలి. అయితే కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు వెళ్లకుండానే తన మొబైల్లో ఫొటో దిగి దానిని వాట్సాప్ ద్వారా పంచాయతీ సిబ్బందికి పంపి, ఓటీపీ చెబుతూ రోజువారీ హాజరు నమోదు చేసుకుంటున్నారు. ఇంకొందరు పంచా యతీ కార్మికుల ఫోన్లలోనే యాప్ ఇన్స్టాల్ చేశారు. దీంతో కార్మికులే డీఎస్ఆర్ యాప్లో కార్యదర్శి హా జరు వేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పాతఫొటోలు, సంబంధం లేదని ఫొటోలను అప్లోడ్ చేస్తుండటంతో జూలైహాజరులో అధికారులు గుర్తించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 553 మందిని గుర్తించగా, జిల్లాకు చెందిన వారు 42 మంది కార్యదర్శులు ఉన్నారు. బూర్గంపాడు మండలంలో, పాల్వంచ మండలంలో ఆరుగురు ఉన్నారు. భద్రాచలంలో ఒకరు, చర్లలో ఇద్దరు, దమ్మపేటలో ఇద్దరు, దుమ్ముగూడెంలో ఇద్దరు, గుండాలలో ఐదుగురు, కరకగూడెంలో ఇద్దరు, ఆళ్లపల్లిలో ఇద్దరు, అశ్వాపురంలో ముగ్గురు, లక్ష్మీదేవిపల్లిలో ఇద్దరు, మణుగూరులో ఒకరు, ములకలపల్లిలో ముగ్గురు, సుజాతనగర్లో ఒకరు, టేకులపల్లిలో ఒకరు, ఇల్లెందు మండలంలో ఇద్దరు తప్పుడు హా జరు నమోదు చేసినట్లు గుర్తించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరును పర్యవేక్షించాల్సిన ఎంపీఓలు, ప్రత్యేక అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ 42 మంది కార్యదర్శులతో పాటు 17 మంది ఎంపీఓలను బాధ్యులను చేస్తూ నోటీసులు జారీ చేశారు. విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు హాజరు నమోదు విషయం తేలడంతో ఇకనుంచి పంచాయతీ కార్యదర్శుల ఆన్లైన్ హాజరును నిత్యం మండల, డివిజనల్, జిల్లా పంచాయతీ అధికారులు పరిశీలించాలని పీఆర్ డైరెక్టర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శులను సైతం బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. చర్లలో ఇద్దరికి నోటీసులుచర్ల: చర్ల మండలంలో కుదునూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి భూక్యా శరత్బాబు, సీ కత్తిగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి గుగులోతు రాంబాబులకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ నోటీసులు జారీ చేశారు. శరత్బాబు 17 రోజులు, రాంబాబు 11 రోజులు ఫేక్ అటెండెన్స్ నమోదు చేశారు. కాగా మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.చర్యలు తప్పవు పంచాయతీ కార్యదర్శులు తప్పుడు హాజరు నమోదు చేసినా, విధుల్లో నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే 42మంది పంచాయతీ కార్యదర్శులకు, 17మంది ఎంపీఓలకు నోటీసులు జారీ చేశాం. వివరణ అనంతరం వారిపై చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి కార్యదర్శులపై పర్యవేక్షణ పెంచుతాం. –వి.చంద్రమౌళి, డీపీఓ -
ఢిల్లీ దీక్షలో జిల్లా కాంగ్రెస్ నేతలు
ఖమ్మంమయూరిసెంటర్/వైరా: బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలనే డిమాండ్తో కాంగ్రెస్ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్నాయక్, కోరం కనకయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొనగా కేంద్రం తీరును వారు ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, నాయకులు వనం ప్రదీప్త చక్రవర్తి, గజ్జల వెంకన్న, జెర్రిపోతుల అంజనీకుమార్ యాదవ్ పాల్గొన్నారు. -
భద్రాద్రి ఫొటోగ్రాఫర్కు జాతీయస్థాయి అవార్డు
భద్రాచలంటౌన్: పట్టణా నికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఎస్కే షరీఫ్కు జాతీ యస్థాయి అవా ర్డు లభించింది. ఈ మేరకు మంగళవారం ఆయన వివరా లు వెల్లడించా రు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సృజనాత్మకత, సంస్కృతి కమిషన్, ఇండి యా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫిక్ కౌన్సిల్ (ఐఐపీసీ), ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండి యా (పీఏఐ) సహకారంతో ఏపీ ప్రభుత్వం నేషనల్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించింది. షరీఫ్ తీసిన చిత్రం ఎగ్జిబిషన్లో ప్రదర్శించగా ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డు–2025కు ఎంపికై ంది. ఈ నెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో అవార్డును అందుకోనున్నట్లు షరీఫ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కీచకోపాధ్యాయుడు●విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినవైనం దుమ్ముగూడెం: మండల పరిధిలోని లక్ష్మీనగరం ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం శరీరంపై ఉపాధ్యాయుడు చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడని, కంటితో అసభ్యకరంగా సైగలు చేశాడని విద్యార్థిని తల్లికి తెలిపింది. దీంతో ఆమె పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా, ప్రిన్సి పాల్ సదరు ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసినట్లు తెలిసింది. కాగా ఈ ఘటనపై ఆర్సీఓ అరుణకుమారిని వివరణ కోరగా.. విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తామని తెలిపారు. చీటింగ్ కేసు నమోదుఇల్లెందురూరల్: పోలీసులు మంగళవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. ఖమ్మానికి చెందిన ఈశ్వరప్రగడ రంగనాథ్ మండలంలోని సుభాష్నగర్లో బైక్ షోరూం ప్రారంభించాడు. నిర్వహణ బాధ్యతను ఇల్లెందుకు చెందిన యాలం దయాసాగర్కు అప్పగించాడు. ఏడాదిపాటు నిర్వహణ చేపట్టిన అతను యజమానికి తెలియకుండా రూ. 12.31 లక్షల విలువైన బైక్లను విక్రయించి నగదును తన సొంతానికి వాడుకున్నాడు. అందులో కొంత చెల్లించాడని, ఇంకా రూ. 8.82లక్షలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని బాధితుడు ఫిర్యాదు చేశౠడు. దీంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. వ్యక్తిపై పోక్సో కేసుపాల్వంచ: ఆన్లైన్లో పిల్లల లైంగిక వీడియోలు వీక్షించిన ఓ వ్యక్తిపై పాల్వంచ పోలీస్ స్టేషన్లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. 2024 సంవత్సరంలో ఆన్లైన్లో ఓ వ్యక్తి పిల్లల లైంగిక వీడియోలు వీక్షించారు. ఈ క్రమంలో సైబర్ క్రైం అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగుల అశ్రద్ధతోనే లోపాలు
● విద్యాసంస్థల్లో తప్పు జరిగితే సిబ్బందిపై క్రిమినల్ కేసు ● భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ఖమ్మంమయూరిసెంటర్: ఏడాదికాలంగా గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లో విద్యార్థులకు చదువు, ఆహారం, ఆరోగ్యం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, కానీ ఇటీవల సిబ్బంది నిర్లక్ష్యం, వార్డెన్లు, హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్ల అశ్రద్ధతో లోపాలు వెలుగు చూస్తున్నాయని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం ఆయన గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు, వార్డెన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యార్థులకు అల్పాహారం, భోజనాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కల్లూరు పాఠశాలలో జరిగిన ఘటనను హెచ్చరికగా భావించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. ఇలాంటి పొరపాట్లు ఎక్కడ జరిగినా సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పీఓ హెచ్చరించారు. వండిన ఆహారాన్ని ముందుగా ప్రిన్సిపాల్, హెచ్ఎం, వార్డెన్, ఉపాధ్యాయులు తిన్నాకే విద్యార్థులకు వడ్డించాలని పీఓ రాహుల్ స్పష్టం చేశారు. ●గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఖమ్మంలోని పీఎంహెచ్ బాలుర వసతిగృహాన్ని తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. బోధన, మెనూపై ఆరా తీయడమే కాక భవిష్యత్ లక్ష్యాలపై ఆరా తీశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయకుండా తీరిక సమయంలో పుస్తకాలు చదవాలని సూచించారు. అనంతరం గిరిజన భవనాన్ని సందర్శించిన పీఓ శుభకార్యాల నిర్వహణకు ఇచ్చేలా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. తొలుత పీఓ ఖమ్మంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ను సందర్శించి క్రయవిక్రయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీఓ(జనరల్) డేవిడ్రాజ్, డీడీ విజయలక్ష్మి, ఉద్యోగులు నారాయణరెడ్డి, యు.భారతిదేవి పాల్గొన్నారు. -
పోడు రైతులపై అటవీ అధికారుల దాడి ?
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం గడ్డోరగట్ట గ్రామంలో పోడు సాగు చేసుకుంటున్న రైతులపై అటవీ అధికారులు సోమవారం సాయంత్రం దాడి చేశారని తెలిసింది. పోడు భూముల్లో సాగు చేసిన పత్తి మొక్కలను అటవీ అధికారులు తొలగించారంటూ మాజీ ఎంపీ మిడియం బాబూరావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్యతో కలిసి కొందరు రైతులు సోమవారం ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేశారు. అదే రోజు సాయంత్రం గ్రామంలోకి వెళ్లిన అటవీ అధికారులు.. మళ్లీ పీఓ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసుకోండి అంటూ తమపై దాడి చేశారని కుంజా జోగయ్య, మిడియం తులశమ్మ, సోడి రమణ, కణితి జయమ్మ తదితరులు ఆరోపిస్తున్నా రు. ఫొటోలు తీయకుండా సెల్ఫోన్లు సైతం లాక్కున్నారని చెప్పారు. అయితే సీపీఎం జిల్లా నాయకులు యలమంచి వంశీకృష్ణ, మర్మం చంద్ర య్య మంగళవారం బాధితులను పరామర్శించే వరకు ఈ ఘటన వెలుగులోకి రాకపోవడం గమనార్హం. దీన్ని సుమోటాగా స్వీకరించి అటవీ అధికారులపై కేసులు నమోదు చేయాలని వారు ఐటీడీఏ పీఓ రాహుల్ను కోరారు. దీనిపై దుమ్ముగూడెం అటవీ రేంజర్ కమలను వివరణ కోరగా మూడు రేంజ్ల పరిధి సిబ్బంది వనమహోత్సవం కార్యక్రమంపై డెమో ఇచ్చేందుకు సిబ్బంది వెళ్లగా ఇద్దరు గ్రామస్తులు తమను చూసి పారిపోయారని, తాము ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్పీసీ నాయకులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరారు. అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలని, 5,571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయాలని, బీఈడీ అర్హత గల వారికి కూడా ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించాలని అన్నారు. 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల వేతనం చెల్లించాలని, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2023 జూలై 1వ తేదీ నుంచి పీఆర్సీ అమలు చేయాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ కుబేర్లో ఉన్న పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని, జీఓ 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో పండిట్, పీఈటీ పోస్టులు అప్గ్రేడ్ చేసి ఉద్యోగోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్, టీపీటీఎఫ్ తదితర సంఘాల నాయకులు ఎం. వెంకటేశ్వర్లు, ఎన్.కృష్ణ, ఆర్.రమేష్కుమార్, బి.రాము, పాషా, ఆశాలత, సత్యశ్రీ, జి.హరిలాల్, వి.వరలక్ష్మి, బి.రాజు, పి.గంగరాజు, బి.హనుమంతు, డి. ఉమాదేవి, ఎండీ ఆసియా తదితరులు పాల్గొన్నారు. యూఎస్పీసీ ఆధ్వర్యంలో ధర్నా -
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. మంగళవారం యాగశాలలో, ఆలయంలో అగ్నిప్రతిష్ఠ, అష్టోత్తర శత కలశావాహనం, పవిత్రాధివాసం, హవనం నిర్వహించారు. ఈనెల 9 వరకు జరిగే ఈ పవిత్రోత్సవాల్లో బుధవారం స్నపన తిరుమంజనం, పవిత్రారోపణం, హోమం జరపనున్నారు. 9న ఉత్సవ సమాప్తి, హయగ్రీవ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు వెల్లడించారు. కాగా పవిత్రోత్సవాల సందర్భంగా 9వ తేదీ వరకు నిత్యకల్యాణాలు నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 8న వరలక్ష్మీ వ్రతం, 22న పుష్పాంజలి.. శ్రావణ మాసోత్సవం సందర్భంగా ఈనెల 8వ తేదీన వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తామని, ఆ రోజున రామాలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయని ఈఓ రమాదేవి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు బేడా మండపంలో సామూహిక కుంకుమార్చన చేపడతామని చెప్పారు. అలాగే 22వ తేదీన సాయంత్రం 4గంటల నుంచి పుష్పాంజలి వేడుక ఉంటుందని, శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి వివిధ పుష్పాలతో అర్చన, విశేష భోగ నివేదన, మంత్ర పుష్పం తదితర పూజలు జరుగుతాయని వివరించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. వైభవంగా అగ్నిప్రతిష్ఠ -
ఆస్పిరేషన్ నుంచి ఇన్ స్పిరేషన్గా మారాలి
చుంచుపల్లి: ఆస్పిరేషన్ జిల్లాగానే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలిచే ఇన్స్పిరేషన్ జిల్లాగా మారాలని, అందుకోసం అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐడీఓసీలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్ జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో జిల్లా అగ్రస్థానంలో నిలిచి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. ప్రతీ ఉద్యోగి సమర్థంగా పనిచేయడం వల్లే జిల్లా ఈ స్థాయికి చేరిందని తెలిపారు. ఇంకుడు గుంతలు తవ్వాలనే పిలుపుతో అన్ని గ్రామాల్లో చేపట్టిన ఈ సామూహిక కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపం, ఎనీమియా వంటి సమస్యలు ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు స్మార్ట్ అంగన్వాడీలు, డిజిటల్ తరగతులు, ఏఐ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీపీఓ సంజీవరావు మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో భాగంగా జిల్లాలో వివిధ శాఖలు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం కలెక్టర్ను అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఏఓ బాబూరావు, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి స్వర్ణలత లేనినా తదితరులు పాల్గొన్నారు. ఐసీడీఎస్ టేకులపల్లి ప్రాజెక్టుకు అవార్డుటేకులపల్లి: ఐసీడీఎస్ టేకులపల్లి ప్రాజెక్టు పరిధిలోని గుండాల మండలంలో 100 శాతం న్యూట్రిషన్ సాధించింది. దీంతో మంగళవారం ఐడీఓసీలో నిర్వహించిన కార్యక్రమంలో సీడీపీఓ కె.ఎం.తారతో పాటు సూపర్వైజర్లు స్వరాజ్యలక్ష్మీ, ఖలీదాబేగం, పదిమంది అంగన్వాడీ సిబ్బందికి కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందించారు. ప్లాంటేషన్ వేగవంతం చేయాలికొత్తగూడెంఅర్బన్: ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆవరణలో ప్లాంటేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి మంగళవారం ఆయన యూనివర్సిటీ ఆవరణలో చెట్ల తొలగింపు, పరిసరాల పరిశుభ్రత ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవనాలు, కంప్యూటర్ ల్యాబ్లు, తరగతి గదుల నిర్మాణానికి అనుగుణంగా ఆవరణను చదును చేయాలని సూచించారు. ఖాళీ ప్రదేశంలో విస్తృతంగా ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే పనస, టెకోమో, తెల్ల గన్నే రు, మందారం మొక్కలను నాటాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఇంజనీరింగ్, యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ -
అనుబంధానికి ఆర్టీసీ చేయూత!
● రాఖీ పండుగకు అదనపు సర్వీసులు ● ఖమ్మం రీజియన్లో 111 బస్సుల ఏర్పాటుఖమ్మంమయూరిసెంటర్: సోదరులకు రాఖీ కట్టేందుకు వచ్చివెళ్లే మహిళలతో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు నుంచే బస్సుల్లో రద్దీ పెరగనుంది. ఈమేరకు ముందస్తు ఏర్పాట్లపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. రద్దీకి అనుగుణంగా ఈనెల 7నుంచి 11వ తేదీ వరకు ఖమ్మం రీజియన్లోని ఏడు డిపోల నుంచి 111అదనపు సర్వీసులు నడిపించాలని నిర్ణయించారు. వరుస సెలవులు రాఖీ పౌర్ణమి రెండో శనివారమైన 9వ తేదీన వచ్చింది. పాఠశాలలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ఉండడం, ముందు రోజు కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళా ఉద్యోగులు సెలవు పెట్టి స్వగ్రామాలకు వెళ్లనున్నారు. ఇక పండుగ తర్వాత ఆదివారం రావడంతో మూడు రోజులు స్వస్థలాల్లో గడిపేలా కుటుంబాలతో సహా వెళ్లే అవకాశముంది. దీంతో 7వ తేదీ నుంచే అధికారులు ప్రత్యేక సర్వీసులు(అదనపు బస్సులు) నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అదనపు బస్సులన్నీ ఈ రూట్లోనే నడిపేలా కారాచరణ సిద్ధం చేశారు. రిజర్వేషన్.. అదనపు చార్జీ? రోజూ నడిచే సర్వీసులకు తోడు ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి అదనంగా 111 బస్సులు నడపిస్తారు. అయితే, అదనపు సర్వీసుల్లో రిజర్వేషన్ అమలు చేయడమే కాక సాధారణ చార్జీ కంటే అదనంగా వసూలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈమేరకు 60 బస్సుల్లో రిజర్వేషన్, మిగతా బస్సులు బస్సులను రిజర్వేషన్ లేకుండా నడపాలని నిర్ణయించారు. ఈనెల 7నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్ నుండి ఉమ్మడి జిల్లాకు, 10, 11వ తేదీల్లో ఉమ్మడి జిల్లా నుండి హైదరాబాద్కు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అత్యధికంగా ఖమ్మం డిపో నుంచి 24 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేస్తుండగా, మధిర, భద్రాచలం నుంచి 19చొప్పున, సత్తుపల్లి నుంచి 17, మణుగూరు నుంచి 14, కొత్తగూడెం నుంచి 11, ఇల్లెందు డిపో నుంచి ఏడు బస్సుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు.రద్దీకి అనుగుణంగా బస్సులు రాఖీ పండుగకు వచ్చివెళ్లే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ బస్సులు నడుపుతాం. బస్టాండ్లలో ప్రయాణికులకు సమాచారం ఇచ్చేలా ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నాం. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్ -
గంజాయి రవాణాకు
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఖమ్మం కలెక్టర్ను కలిసిన ఐటీడీఏ పీఓభద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఖమ్మం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమానికి సంబంధించిన అధికారిక సమావేశాలు ఖమ్మం కలెక్టరేట్లో జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన రాహుల్.. కలెక్టర్ను కలిశారు. గిరిజన గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై చర్చించారు. రేపు జాబ్మేళాసింగరేణి(కొత్తగూడెం): చుంచుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఈనెల 7వ తేదీన నిరుద్యోగులకు జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో కొత్తగూడెం, పాల్వంచ, జూలూరుపాడు, మణుగూరు, భద్రాచలం, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, తల్లాడల్లో సెంటర్ మేనేజర్/ఈఆర్ఓ/ఎల్ఆర్ఓ రూరల్/మైక్రోలోన్స్ పోస్టుల్లో పని చేయాల్సి ఉంటుందని వివరించారు. 18 – 32 సంవత్సరాల వయసు కలిగి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. బ్యాండెడ్ క్రైట్ కలకలంపాముల్లో అత్యంత విషపూరితమైనదిగా పేరుమణుగూరు టౌన్: మణుగూరులో బ్యాండెడ్ క్రైట్ పాము కలకలం సృష్టించింది. సింగరేణి అధికారులు నివాసముండే ప్రాంతంతో ఈ పాము సోమవారం అర్ధరాత్రి కనిపించగా స్నేక్ క్యాచర్ సాయంతో బంధించి అడవిలో వదిలేశారు. మణుగూరు సింగరేణి ఏరియాలోని ఓ అధికారి నివాసంలో పాము తిరగడాన్ని ఆయన కుటుంబీకులు గుర్తించారు. దీంతో స్నేక్ క్యాచర్ మహ్మద్ ముజాఫర్కు సమాచారం ఇవ్వగా ఆయన చేరకుని దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. అయితే, ఈ పామును పరిశీలించగా బ్యాండెడ్ క్రైట్గా తేలింది. పాముల్లో అత్యంత విషపూరితమైనదిగా భావించే ఇది కాటు వేస్తే మరణం అంచుల్లోకి చేరతారని, చికిత్స కాస్త ఆలస్యమైనా పక్షవాతం లేదా అవయవాలన్నీ చచ్చుపడిపోతాయని చెబుతున్నారు. రాత్రిపూట మాత్రమే సంచరించే ఈ రకం పాము ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అధికంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఫొటోతో సహా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.అక్రమార్కుల ఆటలు కట్టించేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా వ్యవస్థ జిల్లాలో అందుబాటులోకి వచ్చింది. భద్రాచలం వద్ద గోదావరి వంతెన సమీపంలో ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ ఏర్పాటైంది. గంజాయి, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ఆధునిక వ్యవస్థ.. ఏ మేరకు పని చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి.. ● భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు సరఫరా ● భద్రాద్రి వంతెన వద్ద అందుబాటులోకి ఆధునిక నిఘా ● ఆర్టిిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అక్రమార్కుల గుర్తింపు గోదావరి వంతెన వద్ద ఏర్పాటవుతున్న చెక్ పోస్టు (ఇన్సెట్) కొత్తగా అమర్చిన సీసీ కెమెరాలు వారధిగా భద్రాద్రి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో జిల్లా సరిహద్దులు పంచుకుంటోంది. అంతేకాక.. ఒడిశాకు అతి సమీపంలో ఉంది. దీంతో ఈ మూడు రాష్ట్రాల నుంచి వాహనాలు జిల్లా మీదుగా తెలంగాణలోకి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణాలోకి వచ్చేందుకు అశ్వారావుపేట దగ్గర ఓ హైవే ఉండగా, భద్రాచలం వద్ద మరో జాతీయ రహదారి ఉంది. ఇందులో భద్రాచలం మీదుగా వెళ్లే ఎన్హెచ్ – 30 రహదారి గంజాయి అక్రమ రవాణాకు కీలకంగా మారింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఉన్న ఎత్తయిన కొండలు, దట్టమైన అడవుల్లో పండించిన గంజాయిని జిల్లా మీదుగా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించడం పరిపాటిగా మారింది. దీంతో కేవలం గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకే భద్రాచలంలో గోదావరి వంతెన ప్రారంభంలో చెక్పోస్టు ఏర్పాటు చేసి 24 గంటలూ నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిఘా పెరిగింది జిల్లాలో గోదావరి తీరంలో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ఇక్కడి రీచ్ల నుంచి వెళ్లే ఇసుక మార్గమధ్యలో పక్కదారి పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇసుక అమ్మకాల్లో పారదర్శకత తెచ్చేందుకు తెలంగాణ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిఘాను పెంచింది. రీచ్ల దగ్గరనే కాకుండా రాష్ట్ర రాజధానికి ఇసుక వెళ్లే మార్గంలో ముఖ్యమైన కూడళ్ల వద్ద కూడా నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భద్రాచలం చెక్పోస్టు దగ్గర ఇటీవల టీజీఎండీసీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సాంకేతికతను ఉపయోగిస్తోంది. వచ్చి పోయే వాహనా ల వీడియోలను సీసీ కెమెరాల్లో రికార్డు చేయడంతో పాటు నంబర్ ప్లేట్ ఆధారంగా.. తీసుకున్న పర్మిట్ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది. సరైన మార్గంలోనే వెళ్తుందా, పక్కదారి పడుతోందా అనే విషయాలు తెలుసుకునే వీలుంది. ఫలితాలపై ఆసక్తి.. మూడు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి గేట్వేగా ఉన్న భద్రాచలం పట్టణం మీదుగా గంజాయి, ఇసుకల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దీన్ని అరికట్టేందుకు ఏడాది కాలంగా సాధారణ నిఘాను పోలీసులు, అబ్కారీ, టీజీఎండీసీలు పెంచాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్తో పాటు ఆరిఫీషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించాలని నిర్ణయించారు. గంజాయి, ఇసుక అక్రమ రవాణాకు ఈ ఆధునిక నిఘాతోనైనా అడ్డుకట్ట పడుతుందనే ఆశాభావం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అంతటా వినిపిస్తున్న ఏఐ టెక్నాలజీ నిఘా ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. మిర్చి ధరలో పురోగతి ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధర కొంత మేర పెరిగింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్వింటాకు రూ.14,350 ధర పలికింది. పంట సీజన్ ఫిబ్రవరిలో గరిష్టంగా రూ.14,200 పలకగా, ఏప్రిల్ మూడో వారం వరకు రూ.13,500, ఆపై రూ.12,200కు పడిపోయింది. జూన్లో అదే పరిస్థితి ఉండగా జూలై నుంచి పెరుగుతూ ఇప్పుడు రూ.14,350కు చేరింది. ఈ ధర కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికి పలకగా, నాన్ ఏసీ మిర్చి ధర గరిష్టంగా రూ.8,800గానే ఉండడం గమనార్హం. హెచ్పీఎస్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్ బేగంపేట, రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరానికి ఖమ్మం జిల్లాకు రెండు సీట్లు కేటాయించగా, ఈనెల 8వ తేదీ లోపు తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని సూచించారు. జనన, కుల, ఆదాయ, స్థానికత ధ్రువపత్రాలతో పాటు రేషన్, ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారి అటెస్టేషన్తో దరఖాస్తుకు జతచేయాలని తెలిపారు. ఇదేం న్యాయం..? సింగరేణి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు న్యాయమైన వాటా దక్కడం లేదనే విమర్శలు ఉన్నాయి. 10లోన్యూస్రీల్ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చేరిక.. భద్రాచలంలో గోదావరి నది వద్ద తాజాగా ఏర్పాటు చేసిన చెక్పోస్టు దగ్గర సీసీ కెమెరా ఫుటేజీలు, వీడియోల లైవ్ రికార్డింగ్లకు సరికొత్త ఆర్టిిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థ కూడా తోడైంది. హైదరాబాద్కు చెందిన బ్లూ క్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ సంస్థ అందించే సాంకేతిక సహకారంతో భద్రాచలం గోదావరి వంతెన దగ్గర నిఘా మరింత పటిష్టం కానుంది. లైసెన్స్ ప్లేట్ రికగ్నైజేషన్ (నంబర్ ప్లేట్ ఆధారిత సమాచారం), రూల్బేస్డ్ ఆల్టెరింగ్ (నిబంధనలకు అనుగుణంగా వాహనం ఉందా? ఏమైనా మార్పులు చేశారా ? ఉదా: పుష్ప తరహాలో పైన ట్రాక్టర్ బాడీ కింద గంజాయి తరలించే ఘటనలు జిల్లాలో కూడా జరిగాయి), బిహేవియరల్ అనామలీ (సందేహాస్పదంగా డ్రైవర్ ప్రవర్తన) తదితర ప్రాథమిక సమాచారాన్ని ఏఐ సాయంతో విశ్లేషించి గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెడుతుంది. ఏదైనా వాహనం సందేహాస్పదంగా కనిపిస్తే వెంటనే ఎస్సెమ్మెస్, వాయిస్ కాల్ రూపంలో సంబంధిత విభాగాల పోలీసులకు వాహనం వివరాలతో కూడిన అలెర్ట్ను పంపుతుంది. రాష్ట్ర మాదక ద్రవ్యాల నియంత్రన సంస్థ (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) సహకారంతో ఈ వ్యవస్థను భద్రాచలం దగ్గర ఏర్పాటు చేశారు. -
అమ్మవారికి శఠగోపం!
● పెద్దమ్మగుడి ఏసీ ఫంక్షన్ హాళ్లకు వేలంపాట ● పోటీ లేదంటూ అతి తక్కువ ధరకే కట్టబెట్టిన ఆలయ అధికారులు ● గతేడాది కంటే రూ. 31 లక్షలు మైనస్ ● కొబ్బరి చిప్పలకు పెరిగిన రూ.1.80 లక్షలు.. పాల్వంచరూరల్: అమ్మవారి ఆలయానికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా ఎండోమెంట్ అధికారులు మాత్రం ఫంక్షన్ హాళ్లకు తక్కువ ధరకే కట్టబెట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో సోమవారం వ్యాపార దుకాణాలు, ఫంక్షన్ హాళ్లకు ఉమాసోమలింగేశ్వరస్వామి ఆలయ ఈఓ వీఎల్వీ వెంకట్రావు పర్యవేక్షణలో టెండర్ కం బహిరంగ వేలంపాట నిర్వహించారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు ఏడాది కాలానికి భద్రాచలానికి చెందిన ఎస్.వెంకట చెంచు సుబ్బారావు రూ.17,01,000 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఇదే కొబ్బరి చిప్పలకు రూ.15.20 లక్షలు వచ్చాయి. ఈసారి రూ.1.80 లక్షల ఆదాయం అదనంగా పెరిగింది. ఫంక్షన్ హాళ్లకు తక్కువ పాట 700 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఏసీ ఫంక్షన్ హాల్ ఏడాదికి రూ.26 లక్షల 55వేలకు పాల్వంచకు చెందిన ఆకుల ఆనంద్ దక్కించుకున్నారు. గతేడాది ఇదే హాల్కు వేలంపాటలో రూ.40 లక్షల 4 వేలు వచ్చాయి. ఈసారి మాత్రం రూ.13 లక్షల 49 వేల ఆదాయం తగ్గింది. 500 సీటింగ్ సామర్థ్యం కలిగిన మరో ఏసీ ఫంక్షన్హాల్ ఏడాదికి రూ.16.20 లక్షలకు కాంపెల్లి కనకేష్ దక్కించుకున్నారు. ఇదే ఫంక్షన్హాల్ గతేడాది రూ.34 లక్షల 2వేలు పలికింది. ఈసారి రూ.16 లక్షల 20వేలకు ఇవ్వడంతో ఆలయానికి రూ.18 లక్షల 32 వేల ఆదాయం తగ్గింది. రెండు ఫంక్షన్ హాళ్లపై ఈ ఏడాది అమ్మవారి ఆలయం సుమారు రూ. 31 లక్షల ఆదాయం కోల్పోయింది. ఇంత తక్కువకు రెండు ఫంక్షన్ హాళ్లను అప్పగించడం భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఈఓ రజనీకుమారిని వివరణ కోరగా.. మూడు, నాలుగుసార్లు టెండర్లు పిలిచినా పాట దారులు ఎవరూ ముందుకు రాలేదని, చివరిగా తగ్గించి వారికి కేటాయించామని చెప్పుకొచ్చారు. కాగా ఒకటో నంబర్ దుకాణానికి పాటదారులు ఎవరూ ముందుకురాని కారణంగా వాయిదా వేసినట్లు పెద్దమ్మగుడి ఈఓ రజనీకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు పాపారావు, శ్రీను, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు రోజుల్లో కుమారుడి పెళ్లి..
పాల్వంచ: రెండు రోజుల్లో కుమారుడి వివాహం జరగాల్సి ఉంది. అంతలోనే తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... పాల్వంచ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన రిటైర్డ్ పోస్ట్మాన్ నంది వీరభద్రరావు(63) కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. కాగా అతని చిన్న కుమారుడి వివాహం బుధవారం జరగాల్సి ఉంది. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరభద్రరావు ఆరోగ్యం క్షీణించి మృతి చెందడంతో వివాహం వాయిదా పడింది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. అనారోగ్యంతో తండ్రి మృతి -
45 కేజీల గంజాయి స్వాధీనం
ఇల్లెందు: భద్రాచలం, ఇల్లెందుల మీదుగా ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను కథనం ప్రకారం.. ఎస్ఐ పి.శ్రీనివాసరెడ్డి, సిబ్బంది సోమవారం బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి మహా రాష్ట్రకు కారులో తరలిస్తున్న 45 కేజీల గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కోట్యాతండాకు చెందిన తేజావత్ శంకర్, తేజావత్ జమ్కు, సూర్యపేట జిల్లా రాజు నాయక్ తండాకు చెందిన అంగోతు సంతుగా తేలింది. నిందితులను అరెస్ట్ చేసి, కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 22.62 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒడిశాకు చెందిన రాము, తాతారావు, మహారాష్ట్రకు చెందిన హరిబాబు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, నిందితులను ముగ్గురిని రిమాండ్కు తరలించామని తెలిపారు. సీఐ టి. సురేష్, ఎస్ఐ పి. శ్రీనివాస రెడ్డి, సిబ్బంది ఉన్నారు. ముగ్గురు నిందితుల అరెస్ట్, కారు సీజ్ -
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం
అశ్వారావుపేటరూరల్: తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని, తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలే పట్టాలని డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా సూచించారు. సోమవారం అశ్వారావుపేటలోని గెస్ట్హౌస్ ఏరియా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అశ్వారావుపేట సెక్టార్ పరిధిలో ఏడు నెలలు నిండిన పిల్లలకు అదనపు ఆహారం అందించి, అన్నప్రాసన చేశారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. వయస్సుకు తగిన బరువు ఉన్న పిల్లలను గుర్తించి బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం అమ్మ సేవా సదనంతోపాటు పలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి రికార్డులను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో సీడీపీవో ముత్తమ్మ, సూపర్వైజర్లు ఇమ్మడి పద్మావతి, సౌజన్య, రమాదేవి, వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. ప్రయాణికుల నిజాయితీబూర్గంపాడు: ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన పెరిక రోశయ్య, చల్లా లక్ష్మీనారాయణ, బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామానికి చెందిన బాదావత్ లలిత సోమవారం ఆటోలో వెళ్తున్న క్రమంలో నాగినేనిప్రోలు రెడ్డిపాలెం వద్ద పర్సు కనిపించింది. ఆటో ఆపి పర్సును తీసి పరిశీలించగా, రూ.16వేల నగదు, ఆధార్కార్డు ఉన్నాయి. ముగ్గురు వ్యకులు పర్సును పోలీస్స్టేషన్లో అప్పగించారు. పోలీసులు ఆధార్కార్డు ఆధారంగా బాధితుడిని రప్పించి అందజేశారు. బూర్గంపాడు నుంచి భద్రాచలం వెళ్తున్న క్రమంలో జేబులో నుంచి పర్సు జారిపడిందని బాధితుడు, ఆటోడ్రైవర్ మాడుగుల ప్రశాంత్ తెలిపాడు. నిజాయితీ చాటుకున్న ముగ్గురు వ్యక్తులను ఎస్ఐ మేడ ప్రసాద్ అభినందించారు. కబడ్డీ క్రీడాకారుల ఎంపికకరకగూడెం: మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు తెలంగాణ ప్రీమియర్ లీగ్ కబడ్డీ చాంపియన్షిప్కు ఎంపికయ్యారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 9 వరకు హైదరాబాద్లో జరిగే పోటీలకు తోలెం ప్రసాద్, బాలకృష్ణ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. కాగా వీరు గతంలో ప్రో కబడ్డీ లీగ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వరకట్న వేధింపుల కేసు నమోదుచండ్రుగొండ: పోలీసులు సోమవారం వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని అయన్నపాలెం గ్రామానికి చెందిన నల్లగట్ల ఆశాకు ఖమ్మం అల్లీపురం గ్రామానికి చెందిన నాగేంద్రబాబుతో 2022లో వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు సంతానం కలిగారు. కొంతకాలంగా భర్త నాగేంద్రబాబు, అత్త నాగమ్మ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాడ్జీలో హైదరాబాద్ పోలీసుల తనిఖీలు!భద్రాచలంటౌన్: పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో మైనర్లకు రూమ్ ఇచ్చిన ఘటనలో హైదరాబాద్ పోలీసులు తనిఖీలు చేసినట్లు సమాచారం. వారం రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన బాలుడు, బాలిక పట్టణంలోని ఓ లాడ్జీలో బస చేసినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం వచ్చి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని సీఐ నాగరాజు తెలిపారు. 20 తులాల బంగారం చోరీకొత్తగూడెంటౌన్: టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రంపూర్ నాలేరియాకు చెందిన సింగరేణి ఉద్యోగి వి.వెంకటరమణ ఇంట్లో 20 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ జరిగింది. సీఐప్రతాప్ కథనం ప్రకారం... వెంకట రమణ జీఎం కార్యాలయంలో క్లర్క్గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె సోమవారం ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో పరిశీలించగా దొంగలు బీరువాను పగులగొట్టి 20 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును చోరీ చేశారు. స్థానికుల సమాచారంతో క్లూస్ టీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ప్యూన్ బస్తీలో నిర్మాణంలో ఉన్న ఇంటి అవసరాల కోసం దాచి ఉంచిన బంగారం, నగదు అపహరించారని బాధితురాలు ఆవేదనవ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కరకగూడెం: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసు ల కథనం ప్రకారం.. మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన బిలపాటి నరేందర్ (18) వరి పొలంలో మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లాడు. మెయిన్ లైన్ నుంచి వచ్చిన 2 కోర్ సర్వీస్ కరెంట్ వైరులోని ఓ సింగిల్ కోర్ వైరును న్యూట్రల్ వైరుగా భావించి.. పొరపాటున ఫేస్ వైరును పొలంలోని ఇనుప కంచె (ఫెన్సింగ్)కు తగిలించాడు. ఆ తర్వాత మోటార్ పైపును సరిచేసేందుకు ముందుకు వెళ్లగా ఫెన్సింగ్కు తాకి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనను గమనించిన స్థానిక రైతు ఇర్రి వెంకన్న ఫెన్సింగ్కు ఉన్న తీగలను తొలగించి పెనుప్రమాదాన్ని నివారించాడు. యువకుడి మృతితో తండ్రి రాంబాబు సొమ్మసిల్లి పడిపోయాడు. తల్లి మణెమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. మృతుడి సోదరుడు శ్యామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ● భద్రాద్రి జిల్లా వాసి మృతి కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల ఎస్ఐ జి.సూరజ్ వెల్లడించిన వివరాలు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మామిడి గుండాలకు చెందిన ముక్తి భూపతి(38) ఓ ప్రైవేట్ బీమా కంపెనీలో పనిచేస్తున్నాడు. వైరాలో మార్కెటింగ్ ఏజెంట్ల శిక్షణ సోమవారం జరగగా ఆయన హాజరై తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం సమీపాన ఆయన బైక్ను వెనక నుంచి కంటైనర్ లారీ ఢీకొట్టడమే కాక టైరు భూపతి పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాల పాలై ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య తులసి, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. భూపతి సోదరుడు విజయ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నీటి తొట్టిలో పడి చిన్నారి మృతిజూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ పెద్దతండాలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... పెద్దతండాకు చెందిన భూక్యాగోపి నాయక్, సరస్వతి దంపతులకు 26 నెలల కుమార్తె తన్విశ్రీ, 8 నెలల బాబు తన్విష్ ఉన్నారు. చిన్నారి తన్విశ్రీ పక్కన ఉన్న అమ్మమ్మ జ్యోతి ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడింది. ఆ సమయంలో అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేరు. కొద్దిసేపటికి పాప కన్పించలేదని తల్లి, కుటుంబ సభ్యులు వెతకగా నీటి తొట్టిలో కన్పించింది. బయటకు తీసి స్థానిక గ్రామీణ వైద్యుడి తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యుడు తెలిపారు. చిన్నారిమృతితో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిచారు. తన్వి శ్రీకి 8 నెలల తమ్ముడు తన్విష్ ఉన్నాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అద్దె భవనాలే ..
ఆదాయం సమకూరుస్తున్నా కొత్తగూడెంటౌన్: రవాణాశాఖ ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది. కానీ ఆ శాఖ కార్యాలయాలు మాత్రం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలంలలో ఆర్టీఓ కార్యాలయాలు ఉండగా, రెండూ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అద్దె భవనాల్లోనే అధికారులు, సిబ్బంది విధులు నిర్వరిస్తున్నారు. నెలకు రూ. లక్షల్లో ఆదా యం గడిస్తున్నా జిల్లా రవాణాశాఖకు ఇప్పటివరకు సొంత భవనం లేదు. 20 ఏళ్లుగా అద్దె చెల్లిస్తూ సింగరేణి క్వార్టర్లో కార్యాలయాన్ని నెట్టుకొస్తున్నారు. పేరు నమోదు ఒకచోట.. టెస్ట్ మరో చోట రైటర్బస్తీ సమీపంలోని జిల్లా కోర్టు భవనాల సముదాయం వెనుక భాగంలో ఉన్న సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్లో జిల్లా రవాణాశాఖ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ప్రతీ నెల అద్దె చెల్లిస్తూ అధికారులు, సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం, భద్రాచలంలతో పాటు అశ్వారావుపేటలో డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లు ఉన్నాయి. వాహనాల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, లైసెన్స్, ట్రాన్ప్పోర్ట్ పర్మిషన్ తదితర అవసరాల కోసం నిత్యం వందల మంది వాహనదారులు ఆర్టీఓ కార్యాలయానికి వస్తుంటారు. ఈ భవనం పాతది కావడంతో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని వాహనదారులు పేర్కొటున్నారు. డ్రైవింగ్ టెస్టు కోసం కార్యాలయానికి కిలోమీటర్ ఉన్న రామవరంలోని డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్కు వెళ్లాల్సి ఉంటుంది. కొత్తగూడెంలోని జిల్లా కార్యాలయంలో పేరు నమోదు చేసుకుని టెస్టింగ్ కోసం వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. స్థలం కేటాయించినా.. జిల్లా రవాణాశాఖ కార్యాలయ భవనం, డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ల నిర్మాణానికి 2016లో ప్రభుత్వం రామవరం సీఆర్పీ క్యాంప్ సమీపంలో దాదాపు 8 ఎకరాల స్థలం కేటాయించింది. కానీ ఇప్పటివరకు అక్కడా పునాది రాయి కూడా వేయలేదు. బడ్జెట్ సమస్య వల్లే ఆలస్యమవుతోందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ఆర్టీఏ ఉన్నతాధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి, సొంత భవనాలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో సొంత భవనాల్లేని ఆర్టీఓ కార్యాలయాలు జిల్లా కేంద్రంతోపాటు భద్రాచలంలోనూ అదే పరిస్థితి కొత్తగూడెంలో 20 ఏళ్లుగా సింగరేణి క్వార్టర్లోనే నిర్వహణ స్థలం కేటాయించినా నిధులివ్వని ఆర్టీఏ ఉన్నతాధికారులు -
రక్తదానంతో ప్రాణ రక్షణ
మణుగూరు టౌన్: ఒక యూనిట్ రక్తదానంతో ఇతరుల ప్రాణాలకు రక్షణ కల్పించొచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మణుగూరు 100 పడకల ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. గర్భిణులు, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధులతో బాధపడే వారు, ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండుసార్లు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆస్పత్రిలో వైద్య పోస్టుల భర్తీకి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం కలెక్టర్ రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రవిబాబు, సూపరింటెండెంట్ సునీల్, తహసీల్దార్ నరేశ్, ఎంపీడీఓ శ్రీనివాస్, సాయిమోహన్, గౌరి పాల్గొన్నారు. ఉన్నత ఆలోచనలతో ముందుకు సాగండి.. కరకగూడెం: విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని, విద్యార్థులంతా ఉన్నత ఆలోచనతో ముందుకు సాగాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. మండలంలోని భట్టుపల్లి కేజీబీవీని సోమవారం ఆయన తనిఖీ చేశారు. బోధన ఎలా ఉంది, సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను నోట్ చేసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించిన ఎస్ఎస్ఏ నిధులు రూ.5లక్షలతో అవసరమైన పనులు చేయించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో మునగ, కరివేపాకు, ఉసిరి మొక్కలు నాటాలని, విద్యార్థులకు ఔషధ మొక్కలపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కరకగూడెం జెడ్పీ పాఠశాలను పరిశీలించారు. త్వరలో నవోదయ పాఠశాల ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంటా ప్రతాప్, ఎంఈఓ మంజుల, విద్యాశాఖ ఏఈ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ కాంతయ్య, ఎంపీఓ మారుతీ యాదవ్, కేజీబీవీ ఎస్ఓ శ్రీదేవి, ఆర్ఐ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ.. సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం తనిఖీ చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్, సిబ్బంది నవీన్ ఉన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి మణుగూరు 100 పడకల ఆస్పత్రిలో రక్త నిల్వల కేంద్రం ప్రారంభం -
భారీగా తగ్గిన విద్యుత్ డిమాండ్
● పగటి వేళ బ్యాక్డౌన్లో కేటీపీఎస్ యూనిట్లు ● 6వ దశలో పది రోజులుగా రిజర్వ్ షట్డౌన్లో 500 మెగావాట్లు పాల్వంచ: ఇటీవల కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు సోలార్, జల విద్యుత్ సైతం అధికంగా వస్తుండడంతో థర్మల్ విద్యుత్ను అంతంతగానే వాడుతున్నారు. ఈ క్రమంలో పాల్వంచలోని కేటీపీఎస్ ఽకర్మాగారంలో తరచూ బ్యాక్డౌన్, రిజర్వ్ షట్ డౌన్లో యూనిట్లను ఉంచుతున్నారు. కేటీపీఎస్ 5,6,7 దశల కర్మాగారాల్లో మొత్తం 1,800 మెగావాట్లకు గాను మధ్యాహ్నం 800 మెగావాట్లు మాత్రమే ఇక్కడ ఉత్పత్తిని రాష్ట్ర గ్రిడ్కు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. పగలు అరకొరగా.. రాత్రి ఫుల్ లోడ్ పగలు విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండడంతో పాటు సోలాల్ ఉత్పత్తిని వినియోగిస్తుండడంతో కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలోని 800 మెగావాట్లకు గాను 450 మెగావాట్లు మాత్రమే తీసుకుంటున్నారు. మిగితాది బ్యాక్డౌన్లో ఉంచుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఫుల్ లోడ్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేటీపీఎస్ 5వ దశలోని 8వ యూనిట్ 250 మెగావాట్లలో ఉదయం 175 మెగావాట్లు, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఫుల్ లోడ్ తీసుకుంటున్నారు. 9వ యూనిట్ 250 మెగావాట్లు, 6వ దశలోని 10వ యూనిట్ను గత నెల 25 నుంచి రిజర్వ్ షట్డౌన్లో ఉంచి పూర్తిగా ఉత్పత్తి నిలిపివేశారు. కాగా 9వ యూనిట్లో సుమారు పది రోజుల అనంతరం సోమవారం ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చారు. డిమాండ్ లేకే ఉత్పత్తి తగ్గిస్తున్నాం పగలు విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండడంతో పాటు సోలార్ ఉత్పత్తిని అధికంగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని యూనిట్లను పగలు బ్యాక్డౌన్లో ఉంచి, రాత్రి ఫుల్ లోడ్ తీసుకుంటున్నారు. ఇక 9, 10 యూనిట్లు గత పది రోజులు పూర్తి స్థాయిలో ఉత్పత్తిని నిలిపివేసి రిజర్వ్ షట్డౌన్లో ఉంచాం. – ఎం.ప్రభాకర్ రావు, 5, 6వ దశల సీఈ -
రామాలయంలో కియాస్క్ మిషన్ ప్రారంభం
భద్రాచలంటౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఫెడరల్ బ్యాంక్ వారు అందజేసిన రెండో కియాస్క్ మిషన్ను ఈఓ ఎల్.రమాదేవి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్తులు ఈ మిషన్ను ఉపయోగించుకుని అవసరమైన ప్రసాదాలను పొందవచ్చని తెలిపారు. నిమిషం లోపే టోకెన్ పొంది, ప్రసాదం తీసుకునేలా ఏర్పాటు చేశామని చెప్పారు. కియాస్క్ మిషన్లకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీంద్రనాథ్, ఏఈఓ శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్లో జిల్లాకు 26 పతకాలుకొత్తగూడెంటౌన్ : హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం ముగిసిన రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు 26 పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ తెలిపారు. ఈ పోటీలకు జిల్లా నుంచి 40 మంది అథ్లెట్లు హాజరు కాగా, 26 మంది పతకాలు సాధించారని, జిల్లాకు ఆరు బంగారు, 14 రజిత, 6 కాంస్య పతకాలు వచ్చాయని వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్ఓ ఎం. పరంధామరెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు యుగంధర్, కార్యదర్శి రాజేందర్ తదితరులు అభినందించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలిపోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచన కొత్తగూడెంఅర్బన్ : పోలీస్ శాఖలో పని చేసేవారు క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సోమవారం ఆయన ఏఆర్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అడ్మిన్ ఆర్ఐ కార్యాలయంతో పాటు మోటార్ ట్రాన్స్పోర్ట్, సంక్షేమ కార్యాలయాలను, హోంగార్డ్ ఆర్ఐ ఆఫీసులో రికార్డులను తనిఖీ చేశారు. బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో వినియోగించే సాంకేతికత, శిక్షణను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలని అన్నారు. శారీరక, మానసిక దృఢత్వం కోసం నిత్యం వ్యాయామం, యోగా చేయాలని చెప్పారు. అధికారులు, సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎంటీఓ సుధాకర్, హోమ్గార్డ్, అడ్మిన్, వెల్ఫేర్ ఆర్ఐలు నరసింహారావు, లాల్బాబు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. డీఈఓగా జెడ్పీ సీఈఓకు అదనపు బాధ్యతలుకొత్తగూడెంఅర్బన్ : జిల్లా విద్యాశాఖ అధికారిణిగా జెడ్సీ సీఈఓ నాగలక్ష్మి సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి గత నెల 31న ఉద్యోగ విరమణ చేయగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాగలక్ష్మికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరించారు. -
ప్రజావాణికి తగ్గిన జనం
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి గతంలో జనం పోటెత్తేవారు. కానీ రాను రాను ఈ కార్యక్రమానికి ఫిర్యాదుదారులు తగ్గుతున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో పాటు కలెక్టర్ ప్రజావాణికి హాజరయ్యారా లేదా అని ఫోన్లో తెలుసుకుంటున్నారు. ఆయన లేరని తెలిస్తే ఆ రోజు ఎక్కువ మంది రావడం లేదు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలనే సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ నిత్యం ఏదో ఒక ప్రాంతానికి వెళుతున్నారు. దీంతో ఆయన ప్రజావాణికి రాలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే వారంలో ఒక పూట మాత్రమే నిర్వహించే ప్రజావాణిలో వినతిపత్రం ఇస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో వస్తున్న వారు కలెక్టర్ లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. పలువురు అధికారులు సైతం శాఖా పరమైన పనుల నిర్వహణతో ప్రజావాణికి హాజరు కావడం లేదు. సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయండి ఇల్లెందు మున్సిపాలిటీ 19వ వార్డు గోవింద్ సెంటర్కు చెందిన ప్రజలు.. తాము 40 సంవత్సరాలుగా స్థానిక రైల్వే స్థలంలో ఉంటూ ఇంటి పన్నులు, తాగునీటి పంపు బిల్లులు చెల్లిస్తున్నామని, పేదరికంలో ఉన్న తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఆన్లైన్లో తమ పేర్లు మొదటి లిస్టులో వచ్చాయని, రైల్వే స్థలమనే కారణంతో ఇళ్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలివ్వాలి కొత్తగూడెం కార్పొరేషన్ చిట్టి రామవరం 19వ డివిజన్ వాసులు తమకు పోడు పట్టాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. గరీబ్పేట పంచాయతీ అంబేద్కర్ నగర్ బీట్లోని అటవీ భూమిని 45 ఏళ్లుగా పోడు చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోడు భూములకు పట్టాలివ్వాలని ఆదేశించినందున తమకు కూడా జారీ చేయాలని కోరారు. ఈ మేరకు సీపీఐ నాయకులు బానోత్ చందర్, బానోత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో రైతులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. -
రెండేళ్లుగా సా..గుతూ !
● అమృత్ భారత్ పనుల్లో జాప్యం ● 60 శాతం మాత్రమే పూర్తయ్యాయని అంచనా ● పనుల వివరాలు వెల్లడించేందుకు రైల్వే అధికారుల నిరాకరణ ● ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు కొత్తగూడెంఅర్బన్: అమృత్ భారత్ పథకానికి భద్రాచలం రోడ్(కొత్తగూడెం) రైల్వే స్టేషన్ ఎంపికై మంగళవారానికి రెండేళ్లు పూర్తయింది. ఈ పథకం కింద స్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ప్లాట్ఫాంపై రేకుల షెడ్లు మినహా మిగిలినవన్నీ నత్తనడకనే సాగుతున్నాయి. అయితే ఈ పథకం కింద ఏయే పనులు చేస్తున్నారు, అవి ఎంతవరకు పూర్తయ్యాయి, ఎన్ని నిధులు ఖర్చు చేశారు అనేది పర్యవేక్షించే బాధ్యత ఐఓడబ్ల్యూ విభాగం అధికారులదే. అయితే ఆ విభాగం అధికారిని సంప్రదిస్తే తన వద్ద ఎలాంటి సమాచారం లేదని, డోర్నకల్ లేదా సికింద్రాబాద్ అధికారులను అడగాలని అంటున్నారు. కనీసం వారి ఫోన్ నంబర్లు కూడా తనకు తెలియదని చెప్పడం గమనార్హం. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు.. పనుల్లో జాప్యంతో పాటు రైల్వే స్టేషన్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్ఫాంపై రేకుల షెడ్లు లేక ఎండ, వానల్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వెయిటింగ్ హాళ్లు పూర్తి కాకపోవడంతో ఎక్కడ కూర్చోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. కొందరు ప్రయాణికులు స్టేషన్ ఆవరణలో ఉండే ఆటోలు, కార్లలో, ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైన వేచి ఉంటున్నారు. అమృత్ భారత్ పథకంతో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఇక్కడ మాత్రం ఉన్న వసతులు కూడా తొలగించారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 60 శాతం మేరకే పనులు.. అమృత్ భారత్ పథకం కింద 2023 ఆగస్టు 5న భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ను ఎంపిక చేశారు. అభివృద్ధి పనుల కోసం రూ.25.41 కోట్లు కేటాయించారు. అయితే నాడు ప్రారంభించిన పనులు ఇంకా కొనసా..గుతూనే ఉన్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాకర్లు నెలల తరబడి జాప్యం చేయడం, రైల్వే అధికారులు వారితో చర్చలు జరిపి పనులు ప్రారంభించేసరికి జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు 60 శాతం మేర మాత్రమే పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్గా మారిన తర్వాత రైలు ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడంతో స్టేషన్ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.25.41 కోట్లు కేటాయించగా, పూర్తయిన పనుల వివరాలను అధికారులు సర్కారుకు పంపితేనే నిధులు విడుదలవుతున్నాయి. ఇంకా విద్యుద్దీకరణ, వెయిటింగ్ హాళ్లు, ఎస్కలేటర్, లిఫ్ట్ పనులు పూర్తి కాలేదు. పనులు వేగవంతం చేయాలి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సమావేశంలో కోరాం. ప్రస్తుతం కూడా రైల్వే స్టేషన్ ఏఓను కలిసి పనులు ఎంత వరకు జరిగాయనే వివరాలు సేకరిస్తున్నాం. పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ -
దళారులకు చెక్..
నాడు దళారులదే రాజ్యం.. ఒకప్పటి ఆనవాయితీ కొనసాగిస్తూ సింగరేణి కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ఇచ్చిన వెసులుబాటు.. మెడికల్ బోర్డును అవినీతికి కేరాఫ్గా మార్చింది. కారుణ్య నియామక కోటాలో వారసత్వ ఉద్యోగాలు కల్పించేందుకు నిర్వహించే అనారోగ్య పరీక్షలు, ఆ తర్వాత జరిగే తంతులో దళారులు ప్రవేశించారు. గని స్థాయిలో సంక్షేమాధికారికి దరఖాస్తు చేయడానికి ముందే ఈ వ్యవహారంలో చొరబడి.. కీలకమైన అనారోగ్య పరీక్షలు నిర్వహించే మెడికల్ బోర్డు వరకు అంతా తామే చూసుకుంటామంటూ కార్మికులకు మాయమాటలు చెప్పేవారు. ఒక కార్మికుడిని అనారోగ్య కారణాలతో అన్ఫిట్ చేయించి అతడి వారసుడికి ఉద్యోగం ఇప్పించేందుకు కనీసం రూ.5లక్షల నుంచి రూ. 8లక్షల వరకు చేతులు మారడం సర్వసాధారణ వ్యవహారంగా నిలిచింది. ఈ దళారుల దందాకు ఆరంభంలోనే బ్రేకులు వేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం పొరపాటుగా పరిణమించింది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మెడికల్ బోర్డులో అవినీతి వ్యవహారాలు శృతి మించుతున్నాయనే ఆరోపణలు రావడంతో గత ఆరు నెలలుగా సింగరేణి సంస్థ మెడికల్ బోర్డు నిర్వహణపై ఆచితూచి వ్యవహరిస్తోంది. కొత్తగా కార్మికుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించకుండా, గతంలో నిర్వహించిన బోర్డుల్లో సెకండ్ ఒపీనియన్ కోసం హయ్యర్ రిఫరల్ చేసిన కేసులకే ప్రత్యేకంగా జూలై 30, 31 తేదీల్లో మెడికల్ బోర్డు ద్వారా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. 54 మంది కార్మికులు/ఉద్యోగులను వైద్య పరీక్షల కోసం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రికి పిలవగా 53 మంది హాజరయ్యారు. కాగా, పరీక్షల తర్వాత మెడికల్ బోర్డు వెల్లడించిన ఫలితాలు సింగరేణి వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తొమ్మిది శాతమే.. మెడికల్ బోర్డు ద్వారా అనారోగ్య కారణాల రీత్యా తమను అన్ఫిట్ చేసి వారసులకు సంస్థలో ఉద్యోగాలు ఇవ్వాలంటూ 53 మంది కార్మికులు ఆర్జీ పెట్టుకుంటే.. ఇందులో ఐదుగురే అన్ఫిట్గా తేలారు. 17 మంది కార్మికులు భూగర్భ గనుల్లో పని చేసేందుకు ఫిట్గా లేరని, వీరికి ఉపరితలంలో పని కల్పించాలని సూచించారు. వీరు కాకుండా మిగిలిన 31 మంది కార్మికులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మెడికల్ బోర్డు తేల్చి చెప్పింది. మొత్తంగా తొమ్మిది శాతం మంది ఉద్యోగులే అన్ఫిట్ కావడం గమనార్హం. గతంలో సుమారు 70 శాతం మంది కార్మికులు అన్ఫిట్ అయితే, మరో 20 శాతం మందిని హయ్యర్ రిఫరల్కు పంపేవారు. వారసత్వ ఉద్యోగాల పేరుతో దళారులు చక్రం తిప్పడం వల్లే మెడికల్ బోర్డు ఫలితాల్లో అన్ఫిట్ శాతం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ప్రక్షాళన బాటలో.. దళారుల అండ లేకుంటే తమ పిల్లలకు ఉద్యోగాలు రావనే అభిప్రాయం కార్మికుల్లో బలపడింది. దీంతో కాయకష్టం చేసి ఆర్జించిన సొమ్ముతో పాటు అప్పు చేసి దళారుల జేబులు నింపడం పరిపాటిగా మారింది. ‘కారుణ్య నియామకాలు – అవినీతి దందా’పై వరుసగా వార్తా కథనాలు రావడం, సంస్థ ప్రతిష్టకు మచ్చగా నిలుస్తుండడంతో ఈ ఏడాది జనవరి నుంచి సింగరేణి యాజమాన్యం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. సంస్థ పరంగా విజిలెన్స్ నిఘా పెంచడంతో పాటు ఏసీబీకి విచారణ బాధ్యతలు అప్పగించింది. ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్తో పాటు ఈ మెయిల్ అడ్రెస్ను సీఎండీ బలరామ్ నాయక్ అందుబాటులోకి తెచ్చారు. ఈ చర్యల ఫలితమే గడిచిన కొన్ని నెలలుగా సింగరేణి కేంద్రంగా జరుగుతున్న ఏసీబీ అరెస్టులు. తాజాగా 54 మంది కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహిస్తే ఇందులో ఐదుగురు కార్మికులే అన్ఫిట్ అయ్యారు. ఈ మార్పుతో మెడికల్ బోర్డు దళారీ వ్యవస్థ గప్చుప్ అయింది. మార్చి తర్వాత మెడికల్ బోర్డు పెట్టడం లేదంటూ నిన్నా మొన్నటి వరకు సన్నాయి నొక్కులు నొక్కిన వారు ఇప్పుడు కిమ్మనడం లేదు. మరోవైపు బోర్డులో అవినీతి ప్రక్షాళనపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి మెడికల్ బోర్డుపై ఏసీబీ నజర్ అనారోగ్యం బారిన పడిన వారే అన్ఫిట్ 54 మందికి పరీక్షలు.. ఐదుగురికే దక్కిన ‘వారసత్వం’ 49 మంది కార్మికులు తిరిగి విధుల్లోకే.. సంస్థ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న కార్మికులు -
వైద్య శిబిరాలు నిర్వహించాలి
జూలూరుపాడు: మలేరియా, డెంగీ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి అన్నారు. జూలూరుపాడు పీహెచ్సీని సోమవారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, ప్రసవాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్లో అన్ని అంశాల్లో 100 శాతం లక్ష్యం సాధించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆశ కార్యకర్తల సాయంతో ప్రతీ గ్రామంలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. పీహెచ్సీలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం పీహెచ్సీ ఆవరణలో మునగ మొక్కలు నాటారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి వెంకటేశ్వర్లు, డాక్టర్ తేజస్విని, సీహెచ్ఓ ఎం.రామకృష్ణ, స్టాఫ్నర్సు సుకుమారి, ఫార్మసిస్టు జి.శశికళ, ఎల్టీ జగదీష్ పాల్గొన్నారు. ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయాలికొత్తగూడెంఅర్బన్: క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయాలని డీఎంహెచ్ఓ జయలక్ష్మి అన్నారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సికిల్సెల్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అదనంగా పోషక విలువలు అందించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కల్పించే మునగ విశిష్టతను వివరించారు. సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు పుల్లారెడ్డి, తేజశ్రీ, ఎండీ ఫైజ్ మోహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నవజాత శిశువులకు రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటి కార్యక్రమం అమలుపై జిల్లా ఇన్చార్జ్ సుభద్రతో సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ఓ జయలక్ష్మి -
మల్చింగ్ సాగు.. బాగు
ఇల్లెందురూరల్: రైతులు సాగు చేసిన పంటలపై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తుంటాయి. దీనికి తోడు తెగుళ్లు, చీడపీడల బెదడ వంటి పలు కారణాలతో దిగుబడులు తగ్గి పెట్టుబడులు కూడా చేతికందక నష్టపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు క్రమంగా సాంకేతిక సాగు పద్ధతులు అవలంభిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఘడించేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. విపత్తులను తట్టుకుంటూ చీడపీడలు, కలుపు నియంత్రిస్తూ, తక్కువ మోతాదులో నీటి తడులతో ఆశించిన దిగుబడులు అందించే మల్చింగ్ సాగు విధానంపై రైతులు దృష్టిసారిస్తున్నారు. షీట్ల ఎంపిక ఇలా.. ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లు, పూల మొక్కల సాగులో మల్చింగ్ షీట్లను అధికంగా ఉపయోగిస్తారు. 3 నుంచి 4 నెలల కాలవ్యవధి ఉండే పంటల సాగులో 50 మైక్రాన్ల మల్చింగ్ షీట్లను ఉపయోగిస్తారు. 12 నుంచి 15 నెలల కాల వ్యవధి కలిగిన పంటల సాగులో 100 షీట్లను వాడటం మేలు. 7.25 మైక్రాన్ల మందం కలిగిన షీట్లు ఒక పంట కాలానికి, 50 నుంచి 200 మైక్రాన్ల మందం కలిగిన షీట్లు మూడేళ్ల వరకు మన్నిక కలిగి ఉంటాయి. సాగు విధానం.. మల్చింగ్ పరిచే విధానం పలు రూపాలలో ఉంటుంది. విత్తనం వేయక ముందు, వేసిన తరువాత కూడా మల్చింగ్ షీట్లను కప్పేందుకు అవకాశం ఉంటుంది. ●మొక్క పాదుకు సరిపడా షీట్ను కత్తిరించి మధ్యలో గుండ్రంగా మొక్క కాండానికి సరిపడా రంధ్రం చేసి బయటకు చీలిక చేయాలి. ●చీలిక గుండా కాండం మధ్యలోకి వచ్చేలా తొడిగి మట్టితో షీట్ అంచులు కప్పడంతో పాటు మూడు, నాలుగు అర్థచంద్రాకారంలో రంద్రాలు చేస్తే భూమిలోకి నీరు ఇంకుతుంది. ●కూరగాయల పంటల్లో విత్తనాలు విత్తేముందు మొక్క మధ్యలో వరుసల మధ్య ఉన్న దూరాన్ని బట్టి ముందే షీట్కు రంధ్రాలు చేయాలి. ●షీట్ను నాగలి సాలు మీద పరిచి రెండు వైపులా కొనలపై మట్టి ఎగదోస్తే కవర్లు కొట్టుకుపోకుండా ఉంటాయి. ఆతర్వాత రంధ్రాల్లో 2 నుంచి 3 విత్తనాలు వేసి మట్టి కప్పాలి. ●విత్తనాలు మొలిచాక మొక్క చుట్టూ షీట్ను తగిన సైజులో కత్తిరించి ప్రతి మొక్క మొదటలో వచ్చేలా తొడగాలి. ●ఈ షీట్ను ప్రతీ వరుసలో లేదా చెట్టు దగ్గర మరీ వదులుగా లేదా బిగుతుగా లేకుండా కప్పి అన్ని చివరలకు గాడిలో పోయేలా చేసి మట్టితో కప్పాలి. దీనివల్ల మల్చింగ్ షీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. ప్రయోజనాలిలా.. భూమిపై ప్లాస్టిక్ షీట్ కప్పి బయటి వాతావరణానికి సంబంధం లేకుండా నేలలోని ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరిస్తుంది. సూర్యకిరణాలను మొక్క ప్రతి భాగానికి అందించి అనుకూలమైన పరిస్థితులను ఏర్పర్చడానికి వీలు కలుగుతుంది. కలుపు నివారణ 80 శాతం తగ్గుతుంది. 50శాతం వరకు సాగునీటి ఆదాతో పాటు తెగుళ్ల నివారణకు దోహదపడుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో సాగుచేసే రైతులకు ప్రయోజనం చేకూర్చుతుంది. ఏజెన్సీ రైతుల్లోనూ ఆసక్తి.. వ్యాపార పంటలు అధికంగా సాగు చేస్తున్న ప్రాంతాలకే పరిమితమైన మల్చింగ్ సాగు విధానం ప్రస్తుతం క్రమంగా ఏజెన్సీ ప్రాంతాలకు విస్తరిస్తోంది. నీటి వనరులు తక్కువగా ఉన్న రైతులు మల్చింగ్, డ్రిప్ వనరులను వినియోగించుకుంటూ పంటల సాగు చేపడుతున్నారు. ఇల్లెందు మండలంలో గతేడాది టమాట పంటకు మల్చింగ్ విధానంతో సాగు ప్రారంభమైంది. చీడపీడలు, కలుపు అంతగా ప్రభావం చూపకపోవడంతో ఈ ఏడాది కాకర, బీర, బొప్పాయి పంటల సాగులో మరికొందరు రైతులు మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. కలుపు, చీడపీడల సమస్యకు చెక్ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు ఆసక్తి చూపుతున్న ఏజెన్సీ రైతులు -
పోడు భూములు పచ్చగా..
● ‘ఇందిరా సౌర గిరి జలవికాసం’ ద్వారా అభివృద్ధికి ప్రణాళిక ● నీటి పారుదలకు సోలార్ పంపుసెట్ల మంజూరు ● ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలో 73,733 మంది రైతులకు లబ్ధి ● 2.23 లక్షల ఎకరాల మేర సాగుకు ప్రయోజనం ఖమ్మంవ్యవసాయం: పోడు భూముల(ఆర్ఓఎఫ్ఆర్)ను ఉద్యాన వనాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’పథకాన్ని రూపొందించింది. ఆర్ఓఎఫ్ఆర్ (రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) భూములు గిరిజన ప్రాంతంలో ఉండటం, ఆయా భూములను గిరిజనులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుండటంతో 2006లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హక్కులు కల్పించారు. గిరిజనులు ఆ భూముల్లో వర్షాధారంగా మెట్ట పంటలను సాగు చేస్తున్నారు. సారవంతమైన ఈ భూ ములను అభివృద్ధి చేసేందుకు ఐదేళ్ల ప్రణాళికతో ఈ పథకానికి రూపకల్పన చేసి, అమలు బాధ్యత గిరిజనాభివృద్ధి సంస్థకు అప్పగించింది. రాష్ట్రంలో 2,30,735 మంది గిరిజన రైతులకు చెందిన 6.69 లక్షల ఎకరాల భూమిని రూ.12,600 కోట్లతో అభివృద్ధి చేసి, ఉద్యాన వనాలను పెంచా లని నిర్ణయించింది. రాష్ట్రంలోని 17జిల్లాల్లో ఉన్న పోడు భూముల అభివృద్ధికి ఈ పథకాన్ని వర్తింప జేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. 2025–26 నుంచి 2029–30 వరకు అమలు చేయనున్న ఈ పథకంలో తొలి ఏడాది ప్రయోగాత్మకంగా తక్కువ మంది రైతులు, తక్కువ విస్తీర్ణంలో.. తరువాత నాలుగేళ్లలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోనున్నారు. తొలి ఏడాది 10 వేల మంది రైతులకు చెందిన 27,184 ఎకరాల్లో పథకాన్ని అమలు చేసే విధంగా రూ.600 కోట్లతో అంచనాలు రూపొందించారు. తిరిగి పచ్చదనం పూర్వం దట్టమైన అడవులతో ఉన్న భూములను ఆయా ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు జీవనోపాధి కోసం సాగు భూములుగా మార్చుకున్నారు. దీంతో అడవులు క్రమంగా అంతరించి, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ పథకంలో భాగంగా పోడు భూముల అభివృద్ధి, ఉద్యాన పంటల సాగు ను చేపట్టనుండటంతో గిరిజనుల జీవనోపాధి మె రుగుపర్చడమే కాకుండా తిరిగి ఆ భూములు అడవులను తలపిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రోత్సాహకాలు అందించి ఆయిల్ పామ్, మా మిడి, జామ, సపోట వంటి తోటలను పండించేలా చర్యలు చేపడుతున్నారు. సోలార్ పంపుసెట్ల మంజూరుకు ప్రణాళిక పథకంలో భాగంగా నీటి సౌకర్యం రెండున్నర ఎకరాలను ఒక యూనిట్గా తీసుకుని, వంద శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్ను అందిస్తారు. ఒక యూనిట్కు రూ.6 లక్షల వ్యయంతో 200 అడుగుల లోతు బోరుగుంత తీసి, కేసింగ్ వేసి, పంపుసెట్ ఏర్పాటు చేస్తారు. సోలార్ పలకలు అమ ర్చి, ఇన్వర్టర్ ఏర్పాటు, పంపుసెట్, సోలార్ పలకల చుట్టూ ఫెన్సింగ్ వంటి నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఎంపిక చేసిన కంపెనీలు ఐదేళ్ల పాటు నిర్వహిస్తాయి. ఐదేళ్ల కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 73,733 మంది రైతులకు చెందిన 2.23 లక్షల ఎకరాలకు అమలు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో 11,386 మంది రైతులకు చెందిన 27,448 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 62,347మంది రైతులకు చెందిన 1,95,998 ఎకరాల పోడు భూముల్లో పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ ఏడాది మాత్రం ఖమ్మం జిల్లాలో 550 మంది రైతులకు చెందిన 1,516 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,923 మంది రైతులకు చెందిన 8,046 ఎకరాల్లో అమలు చేయాలని నిర్ణయించారు.మార్గదర్శకాలు అందాల్సి ఉంది.. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలులో భాగంగా సోలార్ పంపుసెట్ల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉంది. వాటి ఆధారంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల పోడు భూముల్లో సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. పలు కంపెనీల ద్వారా సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. –పి. అజయ్కుమార్, రెడ్కో మేనేజర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఐదేళ్ల పాటు ‘ఇందిరా సౌర గిరి జలవికాసం’ప్రణాళిక ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య ఎకరాలు లబ్ధిదారుల సంఖ్య ఎకరాలు 2025–26 550 1,516 2,923 8,046 2026–27 2,809 6,483 14,856 46,988 2027–28 2,809 6,483 14,856 46,988 2028–29 2,809 6,483 14,856 46,988 2029–30 2,809 6,483 14,856 46,988 మొత్తం 11,786 27,448 62,347 1,95,988 -
బాలుడికి పాముకాటు..
అశ్వారావుపేటరూరల్: ఆటాడుకుంటున్న ఓ బాలుడు పాముకాటుకు గురి కాగా, ఓ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్తే విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీ పరిధి కొత్త వాగొడ్డుగూడెం గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు మడకం బాబీ ఆదివారం ఉదయం ఇంటి సమీపాన తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో పాముకాటుకు గురికాగా.. తల్లిదండ్రులు హుటాహుటిన సమీపంలోని గుమ్మడవల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈసమయాన ఆస్పత్రిలో విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది బాలుడిని పట్టించుకోకుండా.. కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండా వైద్యులు, మందులు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారని బాధిత కుటుంబీకులు వాపోయారు. బాలుడిని అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా, వైద్యాధికారులు విధుల్లో లేకపోవడంతో పాటు సిబ్బంది కనీసం పట్టించుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. దీనిపై గుమ్మడవల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి వెంకటేశ్వరరావు వివరణ కోసం ‘సాక్షి’ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. పోలీసుల అదుపులో దొంగల ముఠాదమ్మపేట: దొంగిలించిన బంగారు నగలను విక్రయించడానికి వెళ్తున్న ఓ ముఠాను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. దమ్మపేట ఎస్సై సాయికిషోర్రెడ్డి కథనం ప్రకారం.. ఇటీవల మండలంలోని బాలరాజుగూడెం గ్రామంలో ఓ ఇంటిలో బంగారు నగలను చోరీ చేసిన కొమ్మనబోయిన సీతారాములు ఆ నగలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, కల్లూరుకు చెందిన నలుగురు వ్యక్తులకు (ముగ్గురు పురుషులు, ఒక మహిళ) విక్రయించమని ఇచ్చాడు. దీంతో ఆ నలుగురు ఆటోలో సత్తుపల్లి నుంచి ఏపీ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు బయలుదేరారు. ఈ క్రమంలో వారు మండలంలోని మొద్దులగూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసుల వద్ద తారసపడ్డారు. ఆటోలో ఉన్న ఈ నలుగురి ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో వా రిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారించారు. వారి వద్ద ఉన్న 92 గ్రాముల బంగారు ఆభరణాలు(నల్లపూసల గొలుసు, నెక్లెస్, సాదా గొలుసు), మొబైల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు సీతారాములు పరారీలో ఉండగా.. ఈ నలుగురిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు పంపామని ఎస్సై తెలిపారు. మధిర పట్టణంలో చోరీమధిర: పట్టణంలోని నందిగామ బైపాస్ రోడ్డు సమీపంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చెరుకూరి నాగార్జున శనివారం హైదరాబాద్ వెళ్లగా ఆయన సతీమణి లక్ష్మి ఎన్టీఆర్జిల్లా వత్సవాయి మండలం మక్కపేటలోని పుట్టింటికి వెళ్లింది. గుర్తుతెలియని దుండగులు అదే రోజు రాత్రి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.1.20 లక్షల నగదు, 4 బంగారు గాజులు, నల్లపూసల గొలుసు చోరీచేశారని, సుమారు రూ.9లక్షల సొత్తును అపహరించినట్లు బాధితుడు తెలిపారు. మరో గది తలుపు గడియ పగలగొట్టి దుస్తులు, వస్తువులను చిందరవందర చేశారు. ఘటనా స్థలాన్ని టౌన్ ఎస్హెచ్ఓ రమేశ్తో పాటు ఖమ్మం నుంచి క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం -
13 కిలోల ఎండుగంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: భద్రాచలం మీదుగా ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుంచి హైదరాబాద్, మహా రాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత ఎండు గంజాయిని ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆది వారం స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్.శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులో రూట్వాచ్తో పాటు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఒక కారు, ద్విచక్ర వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా బ్యాగులో 13.130 కిలోల ఎండు గంజాయి లభించింది. వాహనాలలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఒడిశా రాష్ట్రం మల్కన్గిరిని చెందిన సయ్యద్ యూనిస్ మాలిక్, బోధ పవన్లు తేలింది. ఇందులో మరో వ్యక్తి కోన ఉమామహేశ్వరరావు పరారీలో ఉండగా.. ఇద్దరిని అరెస్ట్ చేసి భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. పట్టుబడిన గంజాయి, హోండా సీటీ కారు, ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. గంజాయి విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్, హరీష్, వీరబాబు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. రామవరంలో 300 గ్రాముల గంజాయి.. కొత్తగూడెంటౌన్: గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను రామవరం టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 300 గ్రాముల గంజాయిని స్వా ధీనం చేసుకున్నారు. టూటౌన్ సీఐ ప్రతాప్ కథనం ప్రకారం.. రామవరం నాగయ్యగడ్డ బస్తీ శివారు గరీబ్పేటకు వెళ్లే దారిలో ఎస్సై బి.కిశోర్ బృందం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న చెట్ల మధ్య నాగయ్యబస్తీకి చెందిన ముగ్గురు యువకులు కాండ్రేగుల నాగ అఖిల్ అలియాస్ మెంటూ, గరీబ్పేటకు చెందిన పర్లపల్లి ఉదయ్కుమార్ అలియాస్ భూపతి, ఉదయ్లు అనుమానాస్పదంగా కనిపించగా.. వారిని విచారించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో ఆ ముగ్గురి దగ్గర ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్లను తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఒక వ్యక్తి పరారు కాగా నాగఅఖిల్, ఉదయ్లను పట్టుబడ్డారు. వారిద్దరి వద్ద నుంచి రూ.15వేలు విలువైన 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్కు తరలించినట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి, మూడవ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు సీఐ ప్రతాప్ తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు బలరాం రాజు, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, రాజా, బుచ్చిరాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక పోరుకు సిద్ధం!
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ పోరులో క్షేత్రస్థాయిలో తమ బలం పెంచుకునేలా వ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే సీపీఐ ఆ దిశగా కసరత్తు చేస్తుండగా తాజాగా బీజేపీ సైతం కార్యకర్తల్లో జోష్ నింపింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఎన్నికలకు సమాయత్తమవుతున్న రాజకీయ పార్టీలు ● కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించాలంటూ సీపీఐ డిమాండ్ ● క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే పనిలో భారతీయ జనతా పార్టీ ● ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధమేనంటున్న కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో బలపడాలనే యోచనలో బీజేపీ వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఈసారైనా క్షేత్రస్థాయిలో బలపడాలని భారతీయ జనతా పార్టీ ఆలోచనలో ఉంది. ఇప్పటికీ ఆ పార్టీ పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మండల, గ్రామ స్థాయిలో పార్టీని విస్తరించేందుకు మంచి అవకాశంగా చూస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంటే కాంగ్రెస్, వామపక్షాలు, ఒకప్పుడు టీడీపీ అన్నట్టుగా ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు, బీఆర్ఎస్లు బలమైన పార్టీలుగా ఉండగా, ఆ స్థాయిలో బీజేపీకి బలం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామస్థాయిలో సర్పంచ్, వార్డు మెంబర్లుగా బీజేపీ తరఫున నిలబడేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆశావహుల సంఖ్య పెరిగింది. ఇలాంటి వారిని గుర్తించి అధిక స్థానాల్లో విజయం సాఽధించడం ఎలా అన్న అంశంపై ఆ పార్టీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాకు కొత్త అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్రెడ్డి చేతికి పగ్గాలు అప్పగించింది. ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న రామచంద్రరావు సైతం రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించి ఆ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపారు. గుంభనంగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి చేదు ఫలితాలు ఎదురైనా ఈ జిల్లాలో అంచనాలకు మించి సానుకూల ఫలితాలు సాధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వాటిని ఎదుర్కోవడం ఆ పార్టీ సిద్ధంగా ఉంది. అయితే ఎప్పటిలాగే ఆ పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండటం, అందులో నుంచి అభ్యర్థులను ఎంపిక చేయడమే సమస్యగా మారనుంది. పైగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో కాంగ్రెస్లో చేరికలు జరిగాయి. దీంతో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం మరో సవాల్గా ఆ పార్టీ ముందు నిలిచింది. దీంతో ముందే ఎన్నికల హడావుడి చేస్తే ఎదురయ్యే అంతర్గత సమస్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గుంభనంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం తడాఖా చూపిస్తామని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ వైఫల్యాలు లాభిస్తాయని బీఆర్ఎస్ అంచనా.. ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి సైతం ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యాలు తమకు లాభిస్తాయని ఆ పార్టీ అంచనాతో ఉంది. దీనికితోడు పార్టీ ఫిరాయింపుల కేసులో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో భద్రాచలం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయనే అంచనాతో ఆ పార్టీలో వేడిని పెంచాయి. మిత్రధర్మం పాటించాలి... 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. ఈ క్రమంలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ప్రభుత్వానికి మిత్ర పక్షంగా ఉండటంతో పాటు వామపక్ష పార్టీల గొంతు అసెంబ్లీ వినిపించే అవకాశం సీపీఐకి వచ్చింది. ఈ రెండు కలిసి వచ్చి మరోసారి జిల్లాలో సీపీఐ తన బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మిత్రధర్మం పాటిస్తూ తమకు బలం ఉన్న చోట ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలని అధికార కాంగ్రెస్ ముందు డిమాండ్ పెట్టింది. జిల్లాలో అనేక గ్రామాల్లో తమకు పట్టుందని పేర్కొంటోంది. గత ఎన్నికల్లో గెలుపు సాధించామని గుర్తు చేస్తోంది. ఇవే విషయాలను ఇటీవల జరిగిన సీపీఐ సంస్థాగత సమావేశాల్లో కూనంనేని, జిల్లా కార్యదర్శి సాబీర్పాషా వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో తమకు న్యాయం జరగకపోతే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారు. -
పేదలందరికీ గూడు కల్పిస్తాం
● రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5ం లక్షల ఇందిరమ్మ ఇళ్లు ● 95 లక్షల రేషన్ కార్డులు, 51 లక్షల కుటుంబాలకు ‘గృహజ్యోతి’ ● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి ● కమలాపురంలో గోదాం నిర్మాణానికి భూమి పూజ ముదిగొండ : ప్రతీ పేదవాడికి గూడు నిర్మించే సంకల్పంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మండలంలోని కమలాపురంలో రూ.10 కోట్లతో నిర్మించే 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకాలంలో సాగునీటి సరఫరా, రుణమాఫీ, రైతు భరోసా వంటి కార్యక్రమాల అమలుతో దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. సీతారామ ప్రాజెక్టుతో జిల్లా భూములు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి నీరు తెచ్చేలా చేసిన డిజైన్ను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతో ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే నీటికి ఇబ్బంది ఉండేది కాదన్నారు. రాజకీయ విమర్శలకు తావు లేకుండా బనకచర్ల ప్రాజెక్టును ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు. రాష్ట్రంలో 95 లక్షల పేద కుటుంబాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునేలా 104 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు నిర్మిస్తున్నామని వివరించారు. మహిళా సంఘాలకు రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పెంచుతామని చెప్పారు. కమలాపురంలో చేపట్టిన గోదాముల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గోదాముల నిర్మాణం పూర్తయితే రైతులు పండించే వరి, ఇతర పంటల నిల్వలకు ఇబ్బంది ఉండదని అన్నారు. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్తో వరి ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు. అనంతరం పెదమండవ ఎస్సీ కాలనీలో రూ.58.50 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి బోర్డును ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎండీ లక్ష్మి, హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఖమ్మం సీపీ సునీల్దత్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ కళావతి బాయి, డీఎంఓ ఎంఏ. అబ్దుల్ అలీమ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు మందడపు నాగేశ్వరరావు, వనం నర్సింగరావు, వల్లూరి భద్రారెడ్డి, వనం ప్రదీప్త చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కిన్నెరసాని ప్రాజెక్ట్, డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదం పొందారు. 489 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.25,770 ఆదాయం లభించగా, 320 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.15,010 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఒక్కరోజు ఆదాయం రూ.56,170