breaking news
Bhadradri
-
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి
మధిర: మధిర పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఏపీలోని ఎన్టీఆర్జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడుకు చెందిన ఇలవరపు వంశీ (21) తన స్నేహితులతో కలిసి ఆది వారం మధిర పెద్దచెరువులో ఈతకు వెళ్లాడు. పూర్తిస్థాయిలో ఈతరాని ఆయన వంశీ ప్యాంట్తో పాటే చెరువులోకి దిగాక కాసేపటికి ఆయాసంతో ఒడ్డుకు చేరలేకపోయాడు. ఈ సమయాన నీటిలో మునుగుతున్న ఆయనను కాపాడేందుకు స్నేహితులు యత్నించినా ఫలితం కానరాలేదు. సమాచారం అందుకున్న స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు నాలుగుగంటల పాటు శ్రమించి అతని మృతదేహాన్ని వెలికితీశారు. అయితే, గాలింపు కొనసాగినంత సేపు వంశీ ప్రాణాలతో బయటకు వస్తాడని ఎదురుచూసిన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఆయన సంజీవరావు – మరియమ్మ దంపతుల్లో నలుగురి సంతానంలో వంశీ ఒక్కడే కుమారుడు కాగా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చదువుతున్న ఆయన మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఏటీఎంలో చోరీ యత్నం
పోలీసుల రాకతో దుండగుడు పరార్ ములకలపల్లి: ములకలపల్లిలో ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. పోలీసులు కథనం ప్రకా రం.. శనివారం అర్ధరాత్రి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్బీఐ ఏటీఎంలో లైట్లు ఆఫ్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు కారు దిగుతుండగా, ఏటీఎంలో ఉన్న దుండగుడు గమనించి పరారయ్యాడు. నగదు కోసం ఏటీఎంను పగులగొడుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఏటీఎం తెరచుకోకపోవడంతో నగదు చోరీకి గురికాలేదు. నిందితుడు లేతపచ్చరంగు పాలిథీన్ కవర్ ధరించి ఉన్నాడు. కొత్తగూడెం క్లూస్టీం సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఘటనా ప్రదేశాన్ని సందిర్శించి, వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. ఎస్బీహెచ్ మేనేజర్ పుల్లారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు. గుట్కా ప్యాకెట్లు స్వాధీనంఇల్లెందు: మండలంలోని కరెంటాఫీసు వద్ద శనివారం రాత్రి పోలీసులు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని జగదాంబ సెంటర్కు చెందిన కిరాణా వ్యాపారి అన్నవరపు వెంకటేశ్వర్లు 35 బ్యాగుల గుట్కా ప్యాకెట్లు, 60 అంబర్ ప్యాకెట్లు రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ గని తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. దాడి ఘటనలో కేసు నమోదుఇల్లెందు: దాడి ఘటనలో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణానికి చెందిన ముసలయ్య, అతని కుమారుడు కలిసి తనతోపాటు తన కుటుంబ సభ్యులను అకారణంగా దూషించి, దాడి చేశారని మల్లిపెద్ది కమలాకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో పడి వ్యక్తి మృతిమణుగూరు టౌన్: మండలంలోని పగిడేరు గ్రామానికి చెందిన వ్యక్తి శనివారం రాత్రి పేరంటాల చెరువులో గల్లంతు కాగా, ఆదివారం మృతదేహం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం.. మల్లూరుకు చెందిన గోడ చరణ్(28) తన అత్తగారి ఇంటి వద్ద పగిడేరులో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి ఇద్దరు మిత్రులతో కలిసి సమీపంలోని పేరంటాల చెరువులో చేపల వేటకు వెళ్లాడు. వల వేస్తున్న క్రమంలో చరణ్ గల్లంతయ్యాడు. అతనితో వెళ్లిన మిత్రులు కుటుంబసభ్యులకు తెలపగా, రాత్రివేళ గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఆదివారం పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా, చరణ్ మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కమ్యూనిస్టులతోనే దేశ భవిష్యత్
బోనకల్: కమ్యూనిస్టులపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, వారు లేకపోతే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారతాయని సీపీఎం కేంద్ర కమి టీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)లో సీపీఎం నాయకుడు మాదినేని నారాయణ కుమారుడు, రిటైర్డ్ జడ్జి మాదినేని రాధాకృష్ణ మృతిచెందగా ఆయన కుటుంబాన్ని ఆదివారం తమ్మినేని పరామర్శించి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలు డబ్బు, పదవుల చుట్టే తిరుగుతుండడం ఆందోళన కలిగి స్తోందని తెలిపారు. కమ్యూనిస్టులు ఇప్పుడు బలంగా లేకున్నా, భవిష్యత్ మాత్రం కమ్యూనిస్టులదేనని చెప్పారు. కమ్యూనిస్టులను హేళన చేసే వారికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని తెలి పారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు మడిపల్లి గోపాల్రావు, పొన్నం వెంకటేశ్వరావు, పైడిపల్లి కిషోర్కుమార్, గాలి దుర్గారావు, మోదుగు సుధీర్బాబు తదితరులు సైతం రాధాకృష్ణ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని -
ఆర్టీసీ ప్రయాణికుల పాట్లు
ఇల్లెందు: దసరా పండుగ అనంతరం తిరిగి వెళ్తున్న ప్రయాణికులతో ఇల్లెందు బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఆదివారం బస్టాండ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కనిపించింది. తగిన సంఖ్యలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పాలయ్యారు. పండుగతోపాటు గుండాలలో నాలుగు రోజులపాటు శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో విగ్రహా, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారంతా స్వగ్రామానికి చేరుకున్నారు. దసరాకు వచ్చినవారు, అమ్మవారి వేడుకలకు వచ్చినవారు తిరిగి వెళ్తుండటంతో బస్టాండ్ ప్రయాణికులతో కిక్కరిసింది. ఇల్లెందు నుంచి గుండాల, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాలకు సరిపడా బస్సులు లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, మణుగూరు, గోదావరిఖని, వేములవాడ, భూపాలపల్లి, హనుమకొండ, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లే బస్సులు చాలా ఆలస్యంగా వచ్చాయని తెలిపారు. దీంతో కొందరు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు. కాగా పండగలు వస్తే కనీసం భోజనం చేసే తీరిక కూడా ఉండటం లేదని డ్రైవర్లు, కండక్టర్లు అంటున్నారు. బస్టాండ్లలో నిలిపిన బస్సుల్లోనే భోజనాలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రయాణికుల ఇక్కట్లపై డిపో అసిస్టెంట్ మేనేజర్ సునీతను వివరణ కోరగా.. డిపోలో ఒక్క బస్సు కూడా ఉండటం లేదని, అన్ని బస్సులు రూట్లలోనే తిరుగుతున్నాయని తెలిపారు. -
ఆయిల్ఫెడ్లో అవకతవకలపై దర్యాప్తు జరపాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఆయిల్ ఫెడ్ సంస్థలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మాజీ ఎమ్మెల్యేజూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆయిల్ పామ్ రైతుల రాష్ట్ర స్థాయి సదస్సు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుంబూ రు మహేశ్వరరెడ్డి అధ్యక్షతన ఆదివారం ఖమ్మంలో జరగగా రంగారెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్పామ్ పామాయిల్ సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించినా ఆ స్థాయిలో రైతులకు సలహాలు అందడం లేదన్నారు. అంతేకాక రైతులకు ఇబ్బందులు తలెత్తినప్పుడు బాధ్యతతో వ్యవహరించడం లేదని చెప్పారు. టన్నుకు కనీస మద్దతు ధర రూ.25 వేలు చెల్లించాలని, ఆయిల్ ఫెడ్ ద్వారా సరఫరా చేసిన మొక్కలు పెరగక నష్టోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని కోరారు. రైతు సంఘం నాయకులు తుంబూరు మహేశ్వరరెడ్డి, బొంతు రాంబా బు మాట్లాడగా కొకెరపాటి పుల్లయ్య, కారం శ్రీ రాములు, రావు జోగిబాబు, చేలికాని వెంకట్రావు, దొడ్డ చక్రధర్రెడ్డి, బుచ్చన్న, గురువారెడ్డి, సంగీతరెడ్డి, చలపతిరావు, ధనమ్మ, పాషా, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
కిన్నెరసాని నీటి విడుదల
పాల్వంచరూరల్: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున వరదతో కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, 1600 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండటంతో ఆదివారం నీటిమట్టం 406.60 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్కు చెందిన ఒక గేటును ఎత్తి ఉంచి 3 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. జిల్లా బాక్సింగ్ జట్ల ఎంపికకొత్తగూడెంటౌన్: అండర్–14, 17 విభాగాల్లో జిల్లా బాలబాలికల బాక్సింగ్ జట్లను ఎంపిక చేశారు. ఆదివారం కొత్తగూడెం సీఈఆర్ క్లబ్లో ఎంపికలు నిర్వహించారు. అండర్–14 బాలుర విభాగంలో ఆర్.గణేష్, కె.ధనుష్, టి. మణికంఠ, కె. పార్థు, వి.తనుష్, తేజస్, అబ్దుల్ హాసన్, వి.సాయి కిరణ్ ఎంపికయ్యారు. అండర్ –17 విభాగంలో కె.ఆరుణ్కృష్ణ, షేక్ అరహాన్ ఆలీ, వి.భార్గవ్ తేజా, సయ్యద్ అబ్దుల్ మాలిక్లను ఎంపిక చేశారు. అండర్–17 బాలికల విభాగంలో టి.హాసిని, బి. రూప, కె.హారిక, బి.జాహ్నవి, ఖ్యాతి భువన శ్రీ, కె.సానియాలు అర్హత సాధించినట్లు నిర్వాహాకులు మట్టపర్తి రమేష్ తెలిపారు. స్కూల్ గేమ్స్ సెక్రటరీ నరేష్ ఎంపికలను పర్యవేక్షించగా, కోచ్ మట్టపర్తి మానస, శ్రీనివాస్ పాల్గొన్నారు. భారీ కొండచిలువ పట్టివేతపాల్వంచ: బీసీఎం రోడ్లోని కలెక్టరేట్(ఐడీఓసీ) సమీపంలో శనివారం రాత్రి 12 అడుగుల కొండ చిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు, మున్సిపల్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకుని, అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలారు. కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు రామ్ ప్రసాద్, భావ్సింగ్, సిబ్బంది గణేష్, శ్రీకాంత్, మహేష్, ఏడు కొండలు పాల్గొన్నారు. భారీ వర్షంతో కూలిన వృక్షాలుఅశ్వారావుపేటరూరల్: మండల వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతోపాటు గాలివాన రాగా మండలంలోని వినాయకపురం–మామిళ్లవారిగూడెం ప్రధాన రహదారిపై రాత్రి పలుచోట్ల వృక్షాలు విరిగిపడ్డాయి. రహదారికి అడ్డంగా చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అశ్వారావుపేట పట్టణంలోని ప్రధాన, అంతర్గత మార్గాలు జలమయమయ్యాయి. విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతిఇల్లెందురూరల్: మండలంలోని సత్యనారాయణపురం రైతు చింతిరాల వీరభద్రానికి చెందిన రెండు గేదెలు ఆదివారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. తిలక్నగర్ సమీపంలో 11కేవీ త్రీఫేస్ విద్యుత్ లైన్ తీగలు తెగి కింద పడి ఉండగా, మేత కోసం వచ్చిన గేదెలు విద్యుదాఘాతానికి గురై చనిపోయాయి. గమనించిన పశువుల కాపర్లు మిగతా గేదెలను అటు వైపు రాకుండా మళ్లించారు. సుమారు రూ.80 వేల వరకు నష్టం వాటిల్లిందని, ప్రమాద ఘటనపై ట్రాన్స్కో అధికారులకు ఫిర్యాదు చేశానని రైతు వీరభద్రం తెలిపారు. -
సిల్క్ వస్త్రంపై ‘సీతారాములు’
భద్రాచలంఅర్బన్: సిల్క్ క్లాత్ పట్టుకుంటేనే జారిపోతుంది. అలాంటి బట్టపై ఓపికతో సీతారాముల చిత్రాన్ని వేసి తన భక్తిని చాటుకున్నాడు భద్రాచలానికి చెందిన దారా ముక్తేశ్వర్. బీటెక్ పూర్తి చేసిన ఇతను భద్రాద్రి రాములవారి కల్యాణోత్సవం సందర్భంగా వినియోగించే అడ్డుతెరపై చిత్రాన్ని ఆర్కిలికి పెయింట్స్తో గీసిన చిత్రం ఎంతో ఆకర్షణగా నిలిచింది. దాదాపు పది రోజుల 30 గంటలపాటు శ్రమించినట్లు తెలిపాడు. గతంలో రామాలయం చిత్రాన్ని గీశాడు. 3 సెంటీ మీటర్లతో అతి చిన్న మట్టి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశాడు. -
పురుగుల మందు తాగి ఆత్మహత్య
అశ్వాపురం: మండల పరిధిలోని అమెర్ద కాలనీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కరటూరి కిషోర్(38) శనివారం పురుగుల మందు తాగగా, కుటుంబసభ్యులు అశ్వాపురం పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి భద్రాచలం, ఆ తర్వాత ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దసరా పండుగకు అత్త వారింటికి వెళ్లగా, అక్కడి గొడవ జరగడంతో కిషోర్ను కొట్టారని, తిరిగి ఇంటికి వచ్చాక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది. సీఐ అశోక్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేటీపీఎస్ ఆర్టిజన్..పాల్వంచ: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగిన కేటీపీఎస్ ఆర్టిజన్ కార్మికుడు చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నవభారత్ గాంధీనగర్కు చెందిన శాంపూరి ప్రవీణ్కుమార్ (45) కేటీపీఎస్లో ఆర్టిజన్గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 3న పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో ..ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం సారధినగర్లో నివాసముండే మాదాసు సాయితేజ(19) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా... పిల్లలను తల్లి వదిలివేసి వెళ్లింది. దీంతో సాయితేజ సోదరి పెళ్లిని బంధువులు జరిపించారు. అయితే, ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయిన తల్లి తిరిగి రావడం, మద్యం మత్తులో సాయి గొడవ పడుతుండడంతో అందరూ వెళ్లిపోయారు. ఆపై పెద్దమ్మ కవిత ఇంటి వద్ద ఉంటున్న సాయితేజ శనివారం రాత్రి అమ్మవారి శోభయాత్ర ముగిశాక తమ సొంతింటికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఆదివారం ఆయన పెద్దమ్మ ఈ విషయాన్ని గుర్తించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. పాముకాటుతో మహిళ మృతి నేలకొండపల్లి: ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి చెందిన జె.రాధ నేలకొండపల్లి మండలం అనాసాగారంలో ఆదివారం కూలికి వచ్చింది. చేలో పత్తి తీస్తుండగా పాము కాటేయడంతో మిగతా కూలీలు నేలకొండపల్లి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
ఉద్యమ గుమ్మం నుంచే రణనినాదం
● చరిత్రలో నిలిచిపోయేలా సీపీఐ శత వసంతాల ముగింపు సభ ● ఆహ్వాన సంఘం సన్నాహ క సమావేశంలో వక్తలు ● హాజరైన కె.నారాయణ, పువ్వాడ, కూనంనేని ఖమ్మంమయూరిసెంటర్: ఉద్యమ గుమ్మమైన ఖమ్మం నుంచే రణనినాదం మోగించడమే కాక పునరుత్తేజంతో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి జరగాలని సీపీఐ జాతీయ నాయకులు పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు లేని వ్యవస్థ మనజాలకపోగా, రానున్న కాలం కమ్యూనిస్టులదే అయినందున విస్తరణకు పునరంకితం కావడమే అందరి కర్తవ్యమని అన్నారు. సీపీఐ శత వసంతాల ముగింపు సభ డిసెంబర్ 26న జరగనున్న నేపథ్యాన ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని ఆదివారం ఖమ్మంలో నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఖమ్మానికి ప్రత్యేక స్థానం ఉందని, ఆంధ్ర మహాసభ ద్వారా నైజాం పతనానికి నాంది పలికిన ఇక్కడ శత వసంత వేడుకల ముగింపు సభ జరగనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా బహు పోరాటాలకు వేదికగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణకు పునరంకితమవుతోందని తెలిపారు. ఇటీవల జరిగిన ఛండీఘర్ మహాసభ ఇదే పిలుపునిచ్చిందని నారాయణ గుర్తుచేశారు. కాగా, స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఆ తర్వాత సామాజిక చైతన్యం కోసం జరిగిన ఏ పోరాటంతో సంబంధం లేని దేశద్రోహులు దేశభక్తులుగా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని బీజేపీ ధ్వంసం చేస్తోందని, ఫెడరల్ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా మావోయిస్టులను తుదముట్టిస్తామని చెబుతుండగా.. మావోయిస్టులు అంతమైనా ఆ సిద్ధాంతం అంతం కాదని తేల్చిచెప్పారు. దేశాన్ని ముక్కలు కానివ్వమనే నినాదంతో పాటు గ్రామగ్రామాన కమ్యూనిస్టు పార్టీ విస్తరణే లక్ష్యంగా శత వసంత సభ నిర్వహిస్తామని నారాయణ తెలిపారు. ఆర్ఎస్ఎస్ది అధికార కాంక్ష.. ఆర్ఎస్ఎస్ది అధికార కాంక్ష మాత్రమే కాక విభజన, విధ్వంసం మాత్రమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తెలిపారు. సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులు సైద్ధాంతిక నిర్మాణంతో రాజకీయ లక్ష్యం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. బలహీనపడినా పునరుత్తేజం తథ్యమని తెలిపారు. కొందరు అలవికాని హామీలు, ధన ప్రభావం ఇతరత్రా కారణాలతో ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టులే దేశానికి రక్ష, రాజకీయ ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. సభకు అధ్యక్షత వహించిన కూనంనేని మాట్లాడుతూ త్యాగాల చరిత్రతో కమ్యూనిస్టులు ముందుకు సాగుతుంటే.. స్వార్థ చింతన, అధికార లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని అన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యులు టీఎం.మూర్తి, పుదుచ్చేరి రాష్ట్ర కార్యదర్శి సలీం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాగం హేమంతరావు తదితరులు మాట్లాడగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్పాషా, అక్కినేని వనజ, ముప్పాల నాగేశ్వరరావు, జల్లి విల్సన్, రావుల వెంకయ్య, దండి సురేష్, ఎస్.కే.సాబీర్పాషా, నగర ప్రముఖులు ఎంఎఫ్.గోపీనాథ్, డాక్టర్ పి.గోర్కి, డాక్టర్ వై.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అందరి చూపూ.. ఆ రెండింటి వైపే
● దుమ్ముగూడెం, గుండాల జెడ్పీటీసీ స్థానాలు జనరల్ ● ఇక్కడ గెలిస్తే జెడ్పీ చైర్మన్ బరిలో అవకాశం ● జిల్లా వ్యాప్తంగా డిమాండ్ పెరిగిన సీట్లు ● జనరల్కు కేటాయింపుపై ఆదివాసీ సంఘాల ఆగ్రహంభద్రాచలం : స్థానిక సంస్థల ఎన్నికల వేళ దుమ్ముగూడెం, గుండాల జెడ్పీటీసీ సీట్లు హాట్ టాపిక్గా మారాయి. ఎప్పటి నుంచో ఎస్టీలకు రిజర్వ్డ్గా ఉన్న ఈ స్థానాలను ఈసారి జనరల్కు కేటాయించారు. ఇదే సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి సైతం జనరల్కు దక్కడంతో హేమాహేమీల దృష్టి దుమ్ముగూడెం, గుండాల వైపు మళ్లింది. జిల్లాలోని పలువురు సీనియర్ నాయకులు ఈ రెండు చోట్లా పోటీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలు జనరల్ కేటగిరీకి కేటాయించడంపై ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చైర్మన్ పీఠానికి చాన్స్.. జిల్లాలోని గుండాల, దుమ్ముగూడెం జెడ్పీటీసీ స్థానాలు జనరల్, ఆళ్లపల్లి, టేకులపల్లి జనరల్ మహిళలకు కేటాయించారు. జెడ్పీ చైర్మన్ సీటు సైతం జనరల్కు రిజర్వ్ అయింది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, జెడ్పీ సీటు ఆశిస్తున్న వారంతా దుమ్ముగూడెం, గుండాల జెడ్పీటీసీ స్థానాలపై దృష్టి సారించారు. తమకున్న రాజకీయ, ఆర్థిక బలాబలాలు, ఓట్ల శాతం ఇతర అంశాలపై స్థానిక నాయకులతో చర్చిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అశ్వాపురానికి చెందిన తూళ్లూరి బ్రహ్మయ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఓట్ల సమీకరణల ప్రకారం ఆయన మొదటి ప్రాధాన్యత గుండాలకు, ఆ తర్వాత దుమ్ముగూడెం వైపు పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. దుమ్ముగూడెం నుంచి టీపీసీసీ సభ్యులు బుడగం శ్రీనివాస్ సైతం ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది. వీరితో పాటు లక్ష్మీపురానికి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తెల్లం సీతమ్మతో పాటు మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక కాంగ్రెస్తో పొత్తులో భాగంగా దుమ్ముగూడెం సీటు సీపీఐకి వస్తే స్థానికుడైన రావులపల్లి రవికుమార్కు దక్కే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తరఫున రావులపల్లి రాంప్రసాద్ పేరు వినిపించినా.. ఆయనకు నియోజకవర్గ స్థాయి నాయకత్వ బాధ్యతలు ఉండడంతో సాగి శ్రీనివాసరాజును ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఇప్పటికే ఖరారు చేసింది. గుండాల జెడ్పీటీసీ రేసులో తూళ్లూరి బ్రహ్మయ్య కానట్టయితే టేకులపల్లికి చెందిన ఏలూరి కోటేశ్వరరావు పేరు వినిపిస్తోంది. మరో స్థానిక నాయకుడు ఎస్కే ఖదీర్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున పినపాకకు చెందిన భవానీ శంకర్, మోకాళ్ల వీరస్వామి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. టేకులపల్లి, ఆళ్లపల్లి జనరల్ మహిళలు.. టేకులపల్లి జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు కేటాయించగా.. ఇక్కడ పోటీ తీవ్రంగానే ఉంది. జెడ్పీ మాజీ చైర్పర్సన్ గోనెల విజయలక్ష్మి మరిది కూతురు బండ్ల రజని, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తమ్ముడి సతీమణి కోరం ఉమ పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా, వీరితో పాటు గుండాల సుచరిత, ఆకారాపు స్వప్న, భూక్యా చంద్రకళ, భూక్యా గంగ తదితర పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఇక్కడ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఆళ్లపల్లి జెడ్పీటీసీ సైతం జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా కాంగ్రెస్ తరఫున బుర్రా వినోద పేరు దాదాపు ఖరారైనట్టుగా ప్రచారం సాగుతోంది. ఇక బీఆర్ఎస్ తరఫున ఎస్డీ షమీన్, మంజుభార్గవి, బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ కామినేని శ్రీలత పేర్లు వినిపిస్తున్నాయి. చర్ల జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్కు కేటాయించారు. దీంతో భద్రాచలం డివిజన్ సీనియర్ నాయకులు, టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ను కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది. దుర్గాప్రసాద్ కాని పక్షంలో బండారు రామకృష్ణ పేరు పరిశీలనలో ఉంది. బీఆర్ఎస్ తరఫున పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన ఈర్ణి కృష్ణమోహన్ పేరును పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఇక సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు ప్రకటించాల్సి ఉంది. -
పట్టించుకోకుంటే సత్తా చూపిస్తా
ట్రైకార్ మాజీ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లుఅశ్వారావుపేట : జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తన సొంత ట్రస్టులా భావిస్తున్నారని.. పార్టీలోని కింది స్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే తన సత్తా చూపిస్తానని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, ట్రైకార్ మాజీ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను 1981 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, పలు పార్టీల్లో క్రమశిక్షణగా పని చేశానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలతో పార్టీని స్థాపించారని, కానీ జిల్లా పార్టీ పదవుల్లో ఉన్న వారు మూలాలను విడిచి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో తాను బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరినా.. తనకు జరిగిన అవమానం తెలుసుకుని హరీష్రావు, కేటీఆర్ పిలిచి మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు ఒంటెద్దు పోకడలు మానుకోకుంటే తిరుగుబాటు తప్పదని అన్నారు. పార్టీ కేడర్కు తెలియజేయకుండా సమావేశాలు నిర్వహించడం సబబు కాదన్నారు. రేగా కాంతారావు అశ్వారావుపేటలో మీటింగ్ పెడితే తన సత్తా ఏంటో చూపిస్తానన్నారు. గతేడాది పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగితే స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బాధిత రైతులను పరామర్శించామని, పార్టీ పెద్దలను కూడా రావాలని కోరగా వారిని రానీయకుండా ఇన్చార్జ్ లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇకనైనా కేడర్ను కలుపుకుని సమన్వయంతో నడవాలని సూచించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ సభ్యులు అంకత మల్లికార్జునరావు, మాజీ సర్పంచ్లు పొట్టా రాజులు, కారం ఎర్రయ్య, నల్లపు రామారావు తదితరులు ఉన్నారు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్ : మండల పరిఽధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు ప్రజావాణి రద్దుసూపర్బజార్(కొత్తగూడెం): అధికారులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నందున.. కలెక్టరేట్లో సోమవా రం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ వినతిపత్రాలు, దరఖాస్తులు, ఫిర్యాదులను కలెక్టరేట్లోని ఈ వార్డ్ విభాగంలో అందజేయాలని సూచించారు. ఆయా ఆర్జీలను పరిష్కారం కోసం సంబంధిత విభాగాలకు పంపిస్తామని పేర్కొన్నారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడిఒకరోజు ఆదాయం రూ.44,290 పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకుల సందడి కనిపించింది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 518 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.27,440, 280 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్కు రూ.16,850 ఆదా యం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. జేకే ఓసీ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాంఇల్లెందు : నూతన జేకే ఓసీ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామని సింగరేణి డైరెక్టర్(పీఅండ్పీ) కె.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన ఇల్లెందు ఏరియాలో పర్యటించారు. అనంతరం జీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఓసీ ఏర్పాటుకు గల అడ్డంకులు తొలగిపోయేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను అధిగమించాలని, రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఉపరితల గనుల్లో ఉద్యోగులు రక్షణ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఏరియా ఆస్పత్రిని సందర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జీఎం వీసం కృష్ణయ్య, ఎస్ఓటు జీఎం రామస్వామి, అధికారులు నరసింహరాజు, గిరిధర్రావు, జాకీర్ హుస్సేన్, తుకారం, రామ్మూర్తి, శివ వీరకుమార్, శివప్రసాద్, సతీష్ కుమార్, వెంకటేశం, రత్నం, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, ఆదివారం కావడంతో భక్తులు స్వామి వారిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. నిత్యకల్యాణంలోనూ భారీగా పాల్గొన్నారు. గోశాల, శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే గోశాల, శాశ్వత నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన టీకే శ్వేత అనే భక్తురాలు గోశాలకు రూ.75,510, నిత్యాన్నదానానికి రూ.1,01,116 ఆలయ ఈఓ దామోదర్రావుకు అందజేశారు. -
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం
కొత్తగూడెంటౌన్: మార్షల్ ఆర్ట్స్ విభాగంలో కొత్తగూడేనికి చెందిన కరాటే మాస్టర్ మాటూరి మహా విష్ణుమూర్తికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు లభించింది. వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా 980 మంది కరాటే మాస్టర్లు పాల్గొన్నారు. కాగా, మార్షల్ ఆర్ట్స్ విభాగంలో తనకు ఈ అవకాశం లభించిందని విష్ణుమూర్తి తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషినాథ్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నానని పేర్కొన్నారు. -
చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం
● ముగిసిన టెండర్ల ప్రక్రియ ● ఇద్దరు కాంట్రాక్టర్లకు అనుమతి పాల్వంచరూరల్ : చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధమైంది. చేప పిల్లల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియ శనివారం పూర్తి కాగా, జిల్లాలో నిర్దేశించిన జలవనరులకు సరఫరా చేసేందుకు ఇద్దరు కాంట్రాక్టర్లకు అనుమతి లభించింది. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సమక్షంలో ఈ మేరకు ఖారారైనట్లు మత్స్యశాఖ అధికారి ఎండీ.ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. చేప పిల్లల సరఫరాకు సంబంధించిన అనుమతి కోసం మత్స్యశాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనుమతి రాగానే నిర్దేశించిన చెరువులు, కుంటల్లో చేప పిల్ల లు వదులుతామని పేర్కొన్నారు. జిల్లాలో 1.76 కోట్ల పిల్లలు.. జిల్లాలో 734 చెరువులు ఉండగా, ఈ ఏడాది సమయం లేనందున 600 చెరువుల్లో చేప పిల్లలను పోయనున్నట్లు మత్స్యశాఖాధికారి తెలిపారు. ఇందులో చెరువుల్లో నీటి సామర్థ్యం, విస్తీర్ణం ఆధారంగా చిన్న, పెద్ద సైజు పిల్లలను పంపిణీ చేయనున్నారు. 80 నుంచి 100 మి.మీ.సైజులో 86 లక్షల పిల్లలకు ఒక్కో పిల్లకు రూ.1.49 పైసల చొప్పున, 35 – 40 మి.మీ. సైజ్ 90 లక్షల పిల్లలకు 56 పైసల చొప్పున పంపిణీ చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. ఫైనల్ టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇద్దరు కాంట్రాక్టర్ల ద్వారా చేపపిల్లల సరఫరాకు మత్స్యశాఖ కమిషనర్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి అనుమతి రాగానే జిల్లాలోని నిర్దేశించిన చెరువులు, కుంటల్లో చేప పిల్లల పంపిణీ చేయనున్నారు. -
ఆశలు ఆవరి
బూర్గంపాడు: పొట్టదశలో ఉన్న వరి పైరు తెగుళ్లతో నిలువునా ఎండిపోతోంది. పంట చేతికొచ్చే సమయంలో ఎండాకు తెగుళ్లు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చీడపీడల నివారణకు ఎన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు. తెగుళ్ల ఉధృతి రోజురోజుకూ పెరుగుతుండడం రైతులను మరింతగా కలవరపెడుతోంది. ఇప్పటికే నాలుగు సార్లు పురుగుమందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. బోనస్ వస్తుందనే ఆశతో.. సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించటంతో రైతులు సన్నరకం వరి సాగుకే మొగ్గుచూపారు. అయితే సన్నరకం వరికి చీడపీడలు, దోమ, పురుగు బెడద ఎక్కువగా ఉంటుంది. దొడ్డు రకం వరిసాగుకు, సన్నరకం వరి సాగుకు మధ్య ఎకరాకు రూ.5వేల వరకు పెట్టుబడుల్లో వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించటంతో రైతులు ఆ ఆశతో సన్నరకం వరిసాగుకు మొగ్గుచూపారు. జిల్లాలో మూడొంతుల మేర రైతులు సన్నరకం వరినే సాగు చేశారు. వివిధ దశల్లో పంట జిల్లాలోని పలు మండలాల్లో ప్రస్తుతం వరిపైరు పొట్ట, చిరు పొట్ట, కంకి వచ్చే దశలో, గింజ పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈ తరుణంలో అగ్గితెగులు, తాటాకు తెగులు, ఎండాకు తెగులు పంటను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వరి ఆకుల్లోని పత్రహరితం మొత్తం మాడిపోయి పైరు నిలువునా ఎండిపోతోంది. ముదురు, లేత అదునులలో సాగు చేసిన వరిపైరు మొత్తానికి కూడా తెగుళ్లు ఆశిస్తున్నాయి. తెగుళ్ల నివారణకు రైతులు ఇప్పటికే మూడు, నాలుగుసార్లు మందులు పిచికారీ చేశారు. అయినా పెద్దగా మార్పు రాలేదని నిరాశకు గురవుతున్నారు. పంట దిగుబడిపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు తగు సలహాలు, సూచనలు అందించాలని కోరుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది సుమారు 1.80 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో పంట ఏపుగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇటీవలి వరకు ఆశాజనకంగానే ఉండగా.. గత పదిహేను రోజుల నుంచి వరిపైరు చివరి కొనలు ఎండిపోతున్నాయి. ఆకుల చివరి నుంచి ఎండు కుంటు వస్తోంది. తొలుత కొద్దిగానే కనిపించిన తెగుళ్లు రోజుల వ్యవధిలోనే పొలం మొత్తం విస్తరిస్తోంది. అధిక వర్షాల కారణంగానే ఈ తెగుళ్ల ఉధృతి పెరిగిందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు సార్లు రసాయనిక మందులు పిచికారీ చేసినా పెద్దగా మార్పేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పైరును ఆశించిన ఎండాకు తెగులు వరి పొట్టకు వచ్చేటప్పుడు ఎండాకు తెగులు బాగా పెరిగిపోతోంది. ఈ తెగులు కనిపించిన వెంటనే మందులు కొట్టినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దిగుబడి తగ్గిపోతుందని భయంగా ఉంది. పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేకుండా పోతోంది. – మారం శ్రీనివాసరెడ్డి, రైతు, సంజీవరెడ్డిపాలెం వర్షాలు ఎక్కువగా పడుతుండడంతో తెగుళ్ల ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుత వాతావరణం తెగుళ్లకు అనుకూలంగా ఉంది. నివారణకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్, ప్లాంటమైసిన్, నాటివో వంటి ఫంగసైడ్స్ పిచికారీ చేసుకోవాలి. తెగుళ్లు వచ్చిన పైరు క్రమేపీ కోలుకుంటుంది. తెగుళ్లు రాని పైరుకు కూడా ముందస్తుగా మందులు పనిచేస్తాయి. – శంకర్, మండల వ్యవసాయశాఖ అధికారి, బూర్గంపాడు -
చేరువగా ‘కేంద్రీయ’ విద్య
జిల్లాకు విద్యాలయను మంజూరు చేసిన కేంద్రం ● విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ బోధన అందుబాటులోకి.. ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభంకొత్తగూడెం అర్బన్: కేంద్రీయ విద్యాలయ మంజూరుతో జిల్లా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. పిల్లలకు ఉన్నతమైన, నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పార్లమెంట్లో లేవనెత్తడంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో విద్యాలయ మంజూరైంది. కొత్తగా నాలుగు విద్యాలయాలు మంజూరు కాగా, అందులో ఒకటి జిల్లాకు కేటాయించారు. కేంద్రీయ విద్యాలయలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు కూడా విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో సీబీఎస్ఈ సిలబస్కు సంబంధించి విద్యను అభ్యసించాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయ మంజూరు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుండగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధన జరుగనుంది. నామినల్ ఫీజులతో ప్రవేశాలు కేంద్రీయ విద్యాలయలో ఆన్లైన్ పద్ధతిలో నామినల్ ఫీజులతో అడ్మిషన్లు నిర్వహిస్తారు. సీబీఎస్ఈ విద్య కోసం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో రూ. లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉండదు. జిల్లాలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. ఆ స్కూళ్లకు సంబంధించి ఇంకా గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ కూడా రావడంతో జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు రామవరం, లక్ష్మీదేవిపల్లి మండలం పాలకేంద్రంలోని రెండు ఎకరాల స్థలాలను కేంద్ర బృందం పరిశీలించింది. ఏ స్థలాన్ని కూడా ఖరారు చేయకపోవడంతో మరోసారి స్థల పరిశీలన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలకేంద్రంలోని స్థలం విద్యాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. అప్పటివరకూ కొత్తగూడెంలోని తెలంగాణ స్కూల్లో విద్యాలయకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు అనుమతులు ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా భవనాల నిర్మాణం పూర్తయితే నూతన భవనంలోనే విద్యాలయను కొనసాగించనున్నారు. లేకపోతే తెలంగాణ స్కూల్లో క్లాసులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు, పర్యవేక్షణ, నిధులు మంజూరు తదితర కార్యకలాపాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతాయి. -
రైతులకు ‘పూల’బాట !
బోనకల్: మండలంలోని ముష్టికుంట్ల గ్రామంలో రైతులు వాణిజ్య పంటలకు స్వస్తి చెప్పి ఉద్యానవన పంటల సాగుకు మొగ్గు చూపారు. గత పది సంవత్సరాలుగా మిరప, పత్తి పంటలు సాగు చేసి నష్టపోగా, వారు ఉద్యాన పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఉద్యాన పంటల సాగులో అంతర పంటలను వేసి ఏడాదికి మూడు సార్లు పంటల సాగు చేసి దిగుబడులు తీస్తున్నారు. వందల ఎకరాల్లో సాగు బంతి, చామంతి, గులాబి పంటలను వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రదానంగా పండుగ సీజన్లో బంతి, చామంతి, కనకాంబరాలు సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. వినాయక చవితి, బతుకమ్మ సీజన్లతో పాటు కార్తీక మాసాల్లో జరిపే శుభకార్యాలల్లో పూలకు మంచి గిరాకీ ఉంది. బంతి కేజీ రూ. 70 నుంచి 100 వరకు అమ్ముతున్నారు. చామంతి పూలు కేజీ రూ. 500, కనకాంబరాలు రూ. 4000, గులాబీలు కేజీ రూ. 500 వరకు ధర పలుకుతోంది. పూల సాగుకు ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. పూలను అమ్మగా రూ.3 లక్షల ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. పండగ సీజన్ల తరువాత పూలను ఖమ్మం, విజయవాడ మార్కెట్లకు తరలిస్తున్నారు. పూలసాగు లాభసాటిగా ఉంది. గతంలో మిరప పంట వేసి తీవ్రంగా నష్టపోయాను. మూడు ఎకరాల్లో బంతి పూల సాగు చేపట్టాను. పండుగ సీజన్లో పూలు చేతికందేలా పంటను సాగు చేశాను. దింతో గిట్టుబాటు ధర లబిస్తోంది. – బొడ్డుపల్లి నర్సింహారావు, ముష్టికుంట్ల ఐదెకరాల్లో బంతి, చామంతి, గులాబీ పూల సాగు చేశాను. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర లబిస్తుండటంతో క్రమంగా పూలను ఖమ్మం, విజయవాడకు సులభతరంగా మార్కెటింగ్ చేస్తున్నా. మంచి ఆదాయం వస్తోంది. – బొడ్డుపల్లి మల్లికార్జున్రావు, ముష్టికుంట్ల -
కొనసాగుతున్న నిమజ్జనం
భద్రాచలంటౌన్: భద్రాచలం గోదావరి తీరంలోని ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్కు వరుసగా మూడో రోజు శనివారం భారీగా దుర్గామాత విగ్రహాలు నిమజ్జనానికి తరలిచ్చాయి. శరన్నవరాత్రుల సందర్భంగా పూజలు చేసిన భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి ప్రతిమలను నిమజ్జనానికి తీసుకొచ్చారు. విగ్రహాలను భారీ క్రేన్ల సహాయంతో వాహనాల నుంచి దించి లాంచీల ద్వారా గజ ఈతగాళ్లు నదిలో నిమజ్జనం చేస్తున్నారు. గోదావరిలో వరద ఉధృతి ఉండటంతో భక్తులను నిమజ్జన ఘాట్ వద్దకు అనుమతించడంలేదు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.ముగ్గురిపై కేసు నమోదుపాల్వంచరూరల్: వరకట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్త, ఆడబిడ్డలపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని నాగారం కాలనీకి చెందిన భూక్యా వాణిశ్రీకి సుజాతనగర్ మండలం సర్వారానికి చెందిన, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న నరేంద్రతో 2023లో వివాహం జరిగింది. కొద్దిరోజులుగా భర్త, అత్త, ఆడబిడ్డ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. కానిస్టేబుల్తో గొడవ పడిన వ్యక్తిపై.. పాల్వంచరూరల్: కానిస్టేబుల్తో గొడవ పడిన వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద శుక్రవారం రాత్రి గొడవ జరుగుతుందని సమాచారం అందుకున్న కానిస్టేబుల్ సత్యం సంఘటనా స్థలానికి వెళ్లాడు. గొడవను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా జగన్నాథపురానికి చెందిన అడపా నాగేంద్రబాబు అనే వ్యక్తి కానిస్టేబుల్పై తిరగబడ్డాడు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. ప్రమాద ఘటనపై.. భద్రాచలంఅర్బన్: రోడ్డు ప్రమాద ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాచలం పట్టణంలోని కొత్త మార్కెట్ వద్ద గత నెల 28న ద్విచక్రవాహనం ఢీకొని రమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేయగా, ప్రమాదానికి కారణమైన గోపిచంద్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలలో వంట పాత్రలు చోరీ జూలూరుపాడు: జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట పాత్రలను చోరీ చేసిన సంఘటన శనివారం వెలుగుచూసింది. దసరా సెలవుల అనంతరం పాఠశాలలను శనివారం తిరిగి ప్రారంభించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు సిద్ధమవుతుండగా కొన్ని వంట పాత్రలు చోరీకి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హెచ్ఎం లక్ష్మీనరసయ్య తెలిపారు. ఇసుక ట్రాక్టర్ సీజ్భద్రాచలంఅర్బన్: అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ను శనివారం భద్రాచలం పోలీసులు సీజ్ చేశారు. పట్టణంలోని కొల్లుగూడెం వద్ద గోదావరి నుంచి ఇసుక నింపుకుని వస్తుండగా పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. రెండు మట్టి లారీలు సీజ్ములకలపల్లి: అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్ లారీలను అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. మాధారం ఎఫ్ఎస్ఓ హరిప్రసాద్ కథనం ప్రకారం.. అటవీ సిబ్బంది శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా గస్తీ చేపట్టారు. ఈ క్రమంలో మండల పరిధిలోని పూసుగూడెం అటవీ ప్రాంతం నుంచి లారీల్లో అక్రమంగా మట్టి తరలిస్తుండగా ఆపి పరిశీలించారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాలను స్వాధీనం చేసుకుని, పాల్వంచ రేంజ్ డిపోకు తరలించారు. కాగా సీతారామ ప్రాజెక్ట్ కాలువ మట్టిని ములకలపల్లి, పాల్వంచ మండలాల సరిహద్దులోని ఓ ప్రదేశంలో భారీగా డంప్ చేసి, విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అక్రమ తోలకాలు జరుపుతుండగా అటవీశాఖ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. -
మహిళా మావోయిస్టుకు గాయాలు
చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మందుపాతర అమరుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పేలి ఓ మహిళా మావోయిస్టుకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం జరిగింది. బీజాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బందేపార అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మందుపాతర పేలి మహిళా మావోయిస్టు గుజ్జా సోడికి తీవ్ర గాయాలయ్యాయి. సహచర మావోయిస్టులు ఆమెను అక్కడే వదిలేసి, ఆయుధం తీసుకుని వెళ్లారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు పేర్కొన్నారు.మందుపాతర అమరుస్తున్న క్రమంలో ప్రమాదం -
విద్యుత్ సబ్ స్టేషన్లో నూతన బ్రేకర్
మధిర: సిరిపురం విద్యుత్ సబ్ స్టేషన్లో ఏర్పాటుచేసిన నూతన బ్రేకర్ను విద్యుత్ శాఖ ఖమ్మం సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి శనివారం ప్రారంభించారు. సిరిపురం సబ్స్టేషన్ లిఫ్ట్ ఫీడర్ నుంచి సిరిపురం లిఫ్ట్కు, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు సరఫరా అవుతున్న విద్యుత్ను, ప్రత్యామ్నాయంగా కలకోట, సిరిపురం లిఫ్ట్ ఫీడర్లుగా విడదీస్తూ సుమారు రూ.8 లక్షల వ్యయంతో నూత న బ్రేకర్ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం ఒకే బ్రేకర్ మీద సిరిపురం లిఫ్ట్కు, కలకోట, బ్రాహ్మణపల్లి, రాపల్లి గ్రామాలకు సరఫరా అవుతున్న విద్యుత్ను ప్రత్యామ్నాయ నూతన బ్రేకర్ ఏర్పాటుతో ఈ రెండింటినీ విడదీసి అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించే అవకాశం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో వైరా డివిజన్ డీఈ బండి శ్రీనివాసరావు, మధిర సబ్ డివిజన్ ఏడీఈ ఎం.అనురాధ, రూరల్ సెక్షన్ ఏఈ మైథిలి పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
సూపర్బజార్(కొత్తగూడెం)/గుండాల: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్పాషా అన్నారు. శనివారం సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో జరిగిన లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల సమావేశంలో, గుండాల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ చేసిన ప్రతీ స్థానంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత మండల, గ్రామ కమిటీలదేనని తెలిపారు. పోడు భూములకు పట్టాల మంజూరులో పార్టీ కృషి చేసిందని తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను అడవినుంచి దూరం చేసే కుట్రలను మానుకోవాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 26న ఖమ్మం నగరంలో సీపీఐ శత వసంతాల ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. గుండాలలో వివిధ రాజకీయ పార్టీల నుంచి మోకాళ్ల సమ్మయ్య, ఎస్కె సాహెబ్ తదితరులు పార్టీలో చేరినట్లు తెలిపారు. సమావేశాల్లో నాయకులు సరిరెడ్డి పుల్లారెడ్డి, రేసు ఎల్లయ్య, ఉప్పుశెట్టి రాహుల్, వాగబోయిన రమేష్, కొమరం హనుమంతు, చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, భూక్య దస్రు, ధీటి లక్ష్మీపతి, కోమారి హన్మంతరావు, గుత్తుల సత్యనారాయణ, ధనలక్ష్మి, జక్కుల రాములు పాల్గొన్నారు. సౌర విద్యుత్ను వినియోగించుకోవాలి పాల్వంచ: ప్రతీ ఇంట్లో సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా అన్నారు. శనివారం బీీఠిసఎం రోడ్లో ట్రుజోన్ సోలార్ పవర్ సిస్టమ్ బ్రాంచ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎండి.భవానీ సురేష్, చారుగుండ్ల రమేష్, సందుపట్ల శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా -
కోతులు, కుక్కలను తరిమినోళ్లకే..
ఓటేస్తామంటున్న పల్లె ప్రజలు ● గ్రామాల్లో శునకాలు, వానరాల బెడద తీవ్రం ● నిత్యం పదుల సంఖ్యలో దాడి ఘటనలు ● పంటల చేలను నాశనం చేస్తున్న కోతులు బూర్గంపాడు: సాధారణంగా ఎన్నికలు వస్తే రోడ్లు, డ్రెయినేజీలు, ఇళ్లు లేవని, పింఛన్లు రాలేదని పోటీ చేసే అభ్యర్థులను ఓటర్లు డిమాండ్ చేస్తుంటారు. అభ్యర్థులు కూడా వాటిపైనే హామీలిస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో కోతులు, కుక్కల నివారణే ప్రధాన ఏజెండాగా మారనుంది. పాతికేళ్లుగా గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతోంది. అదేస్థాయిలో కుక్కలు కూడా పెరిగిపోయాయి. కోతులు, కుక్కల దాడుల్లో పలువురు గాయపడుతున్నారు. జనాలు ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థులకే ఓటేస్తామనే డిమాండ్ ఓటర్ల నుంచి వస్తోంది. పంట చేలల్లోనూ కిష్కింధకాండ రాష్ట్రంలో అటవీ ప్రాంతంగా పేరున్న జిల్లాలో పోడు సాగు ప్రభావంతో కోతులు గ్రామాల వైపు మళ్లాయి. పట్టణాల్లో కూడా కోతుల బెడద తీవ్రంగానే ఉంది. ఇళ్లను చిందరవందర చేయటంతోపాటు పిల్లలను, మహిళలను, వృద్ధులపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. చేతులలో ఏదైనా కవర్ కనిపిస్తే చాలు ఎగబడి దాడిచేసి లాక్కుపోతున్నాయి. ఇంటి పెరళ్లలో కూరగాయ, పూలమొక్కలు వేసుకునే పరిస్థితులు లేవు. జిల్లాలో రోజూ కనీసం నాలుగైదు చోట్ల కోతుల దాడులలో ప్రజలు గాయపడుతున్నారు. ఇక పంటచేలను కోతుల మందలు నాశనం చేస్తున్నాయి. పత్తి కాయలను కొరికి పడేస్తున్నాయి. వరికంకులను విరిచేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు కాపలా మనుషులను పెట్టుకోవాల్సివస్తోంది. అభ్యర్థులు ఏమి చెబుతారో.. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఓటర్లు మాత్రం ఈసారి స్థానిక ఎన్నికలలో కోతులు, కుక్కల నివారణ కోసం ఏమి చేస్తారని అఽభ్యర్థులను నిలదీసే పరిస్థితులున్నాయి. కొన్నిచోట్ల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు లిఖితపూర్వకంగా కోతులను, కుక్కలను తరిమేస్తామనే హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ముందస్తుగా కోతులు, కుక్కలు తరిమించే చర్యలు చేపట్టిన వారిని ఏకగ్రీవంగా గెలిపిస్తామని ఓటర్లు చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో వీధి కుక్కలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే రక్షణగా చేతిలో కర్ర తెచ్చకోవాల్సి వస్తోంది. పదేళ్లుగా కుక్కల నివారణ చర్యలు చేపట్టడంలేదు. దీంతో కుక్కల దాడిలో పలువురు గాయాలపాలవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజూ 20కుపైగా కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. పలువురు రేబిస్ వ్యాధి బారిన పడుతున్నారు. ఇటీవల పినపాక మండలంలో ఓ వ్యక్తి కుక్కకాటుతో రేబిస్ సోకి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కలు, కోతుల నివారణ చర్యలు తీసుకోవాలని ఏళ్ల తరబడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు అక్కడక్కడా కోతులను పట్టించే కార్యక్రమాలు చేపట్టారు. అవి కూడా తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ములకలపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డ సంఘటన చాపరాలపల్లి శివారులో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని విస్సన్నపేట మండలం మద్దులపర్వ గ్రామానికి చెందిన బత్తుల కిరణ్, చింతపల్లి వాసి సురేష్ ద్విచక్ర వాహనంపై ములకలపల్లి మీదుగా అన్నపురెడ్డిపల్లి వెళుతున్నారు. అదే సమయంలో అన్నపురెడ్డిపల్లి నుంచి ట్రాలీ వాహనం వస్తోంది. ఈ క్రమంలో చాపరాలపల్లి మూలమలుపు వద్ద బైక్, ట్రాలీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కిరణ్ కాలు విరిగగా, సురేష్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాద ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎస్. మధుప్రసాద్ తెలిపారు. పిడుగుపాటుతో ముగ్గురికి తీవ్ర గాయాలుజూలూరుపాడు: పిడుగుపాటుతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రాంపురం తండాలో శనివారం జరిగింది. తండాకు చెందిన కొర్ర కవిత, ఆమె పదేళ్ల కుమారుడు సంతోష్, తోడి కోడలు జానులు పత్తి చేలోకి కోతులు రాకుండా కాపలా వెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చింది. పిడుగుపడటంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో బాధితులను ట్రాక్టర్ సాయంతో వాగు దాటించి, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతదేహం లభ్యంసుజాతనగర్: బహిర్భూమికి వెళ్లి సాగర్ కాల్వలో పడి గల్లంతైన విద్యార్థి లోహిత్ హర్ష(15) మృతదేహం ఏన్కూరు పోలీసులకు శనివారం ఉదయం లభ్యమైంది. సుజాతనగర్కు చెందిన బొమ్మనబోయిన లోహిత్ హర్ష శుక్రవారం సాయంత్రం ఏన్కూరు మండలం రాజలింగాలకు సమీపంలోని సాగర్ కాల్వలో గల్లంతైన విషయం విదితమే. దీంతో ఏన్కూరు పోలీసులు, రెస్క్యూ టీం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా శనివారం ఉదయం మృతదేహం లభ్యమయింది. మృతదేహానికి ఖమ్మంలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సుజాతనగర్లో మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
కొనసాగుతున్న కోటమైసమ్మ జాతర
కారేపల్లి: భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ కోటమైసమ్మతల్లి జాతర మూడోరోజు శనివారం అంగరంగ వైభవంగా కొనసాగింది. ప్రతీ ఏడాది దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ, పర్సా ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని ఉసిరికాయలపల్లిలోని శ్రీ కోటమైసమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో జాతర నిర్వహిస్తుంటారు. ఈనెల2న ప్రారంభమైన జాతర 7వ తేదీ వరకు కొనసాగనుండగా.. భక్తులు భారీగా తరలివస్తున్నారు. ‘అమ్మా మైసమ్మా.. మా తల్లీ మైసమ్మా..’ అంటూ భక్తుల నామస్మరణతో ప్రాంగణం మార్మోగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. దేవాదాయ శాఖ ఈఓ వేణుగోపాలాచార్యులు, పర్సా ట్రస్టు చైర్మన్ పట్టాభిరామారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.మూడోరోజూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలోని స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశా రు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావా చనం, అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరి పారు. వారాంతపు సెలవు దినాలు కావడంతో నిత్యకల్యాణంలో, ఆర్జిత సేవల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలుఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో స్వామివారికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి పాదానికి, శ్రీ స్వామివారి విగ్రహానికి వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం గావించారు. శ్రీవారిని, శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను సుందరంగా అలంకరించి నిత్య కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. ఆ తర్వాత శ్రీవారికి పల్లకీ సేవ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వర అన్నదాన సేవా సమితి నిర్వాహకులు బొబ్బ కృష్ణప్రసాద్, ఎల్వీ నారాయణరెడ్డి, కాకుమాను లీలాకృష్ణ, ఇమ్మడి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, చొప్పవరపు శ్రీనివాసరావు, గిరిజాలక్ష్మి, తదితరులు 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్మోహన్రావు, వ్యవస్థాపక దర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ సీఈగా సుధీర్పాల్వంచరూరల్: జలవనరుల శాఖ జిల్లా చీఫ్ ఇంజనీర్గా(సీఈ)గా వరంగల్ జిల్లా సీఈ ఆర్.సుధీర్కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడ పనిచేసిన సీఈ శ్రీనివాసరెడ్డి గత నెల 30న ఉద్యోగ విరమణ పొందాడు. ఆయన స్థానంలో సుధీర్ను నియమించారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటనఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన పర్యటన ప్రారంభం కానుండగా ఖమ్మం నగరంతో పాటు కూసుమంచి, మధిర, వేంసూరు మండలాల్లో కొనసాగుతుంది. ఆయా మండలాల్లో పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు అండర్ –19 టీటీ ఎంపికలుఖమ్మం స్పోర్ట్స్ : ఉమ్మడి జిల్లాస్థాయి అండర్– 19 బాలబాలికల టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపికలు ఈనెల 6న ఉదయం 9 గంటలకు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు క్రీడల సంఘం కార్యదర్శి ఎం.డి.మూసాకలీం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తేదీన బాలబాలికల కబడ్డీ జట్లను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న వారు పోటీలకు అర్హులని, అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు జారీ చేసిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. -
పార్టీ అభ ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి
కొత్తగూడెంఅర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శనివారం కొత్తగూడెం క్లబ్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొదెం వీరయ్య అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేయాలని అన్నారు. అనంతరం పొదెం వీరయ్య మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం అశ్వారావుపేట, ఇల్లెందు, సోమవారం పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి జెడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేస్తామని, స్థానిక శాసనసభ్యుల సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. తొలుత రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల మౌనం పాటించారు. ఈ సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీలు మోతుకూరి ధర్మారావు, నాగ సీతారాములు, నాయకులు బాల శౌరి, ఏనుగుల అర్జునరావు, తోట దేవి ప్రసన్న, పసుపులేటి వీరబాబు, గడిపల్లి కవిత, కొత్వాల శ్రీనివాస్, కోనేరు చిన్ని, యడవల్లి కృష్ణ, బిక్కసాని నాగేశ్వరావు, జలీల్, మొహమ్మద్ ఖాన్, చీకటి కార్తీక్, రామ్ లక్ష్మణ్, సురేష్ నాయక్, గద్దల రమేష్, నూకల రంగారావు తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో కాంగ్రెస్ నాయకులు -
ఆయిల్పామ్తో స్థిర ఆదాయం
దమ్మపేట: ఆయిల్పామ్ సాగుతో రైతులు స్థిర ఆదాయం పొందుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివా రం మండల పరిధిలోని లింగాలపల్లి శివారు వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్పామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి మంత్రితోపాటు ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, అశ్వారావుపేట, కొత్తగూడెం ఎమ్మెల్యేలు జారే ఆది నారాయణ, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యాక అశ్వారావుపేటలో మరో ఫ్యాక్టరీ నిర్మి స్తామని తెలిపారు. ఆయిల్పామ్ సాగులో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, అంతర పంటల సాగు పరిశీలనకు ఆయిల్ ఫెడ్ ద్వారా రైతుల ను పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తామన్నా రు. ఫ్యాక్టరీలకు గెలలు పోటెత్తిన సందర్భాల్లో దిగుమతిలో జాప్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పామాయిల్ మొక్కలు నాటే ప్రక్రియను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేస్తామని తెలి పారు. భూ ధ్రువ పత్రాలతో సంబంధం లేకుండా సాగుచేసే ప్రతీ రైతుకు ఆయిల్పామ్ మొక్కలను ఉచితంగా అందజేస్తామని అన్నారు. తప్పులను సరిదిద్దుతున్నాం : జంగా గతంలో ఆయిల్ ఫెడ్లో జరిగిన తప్పులను సరి దిద్దుతున్నామని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆఫ్ టైప్, నాణ్యతలేని మొక్కలను తొలగించి కొత్త మొక్కలను నాటుతామని తెలిపా రు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారా యణ మాట్లాడుతూ ఫ్యాక్టరీల ఏర్పాటుతో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం గణనీ యంగా పెరిగిందన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సాగవుతున్న వరిపంట విస్తీర్ణానికి సమానంగా పామాయిల్ సాగయ్యేలా మంత్రి తుమ్మల కృషి చేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆదివాసీలకు ప్రత్యేక రాయితీలు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, అలపాటి ప్రసాద్, చల్లగుళ్ల కృష్ణయ్య, చల్ల గుళ్ల నరసింహారావు, కందిమళ్ల కృష్ణారావు, బండి భాస్కర్, మొగళ్ల చెన్నకేశవరావు, కొయ్యల అచ్యుతరావు, పైడి వెంకటేశ్వరరావు, కాసాని నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సామగ్రి సరఫరా
చుంచుపల్లి: రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక పోరుకు షెడ్యూల్ను ప్రకటించడంతో జిల్లాలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అధికారులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బ్యాలెట్ పెట్టెలను మరోసారి పరిశీలన చేస్తూ అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు. ఎన్నికల సామగ్రిని జెడ్పీ కార్యాలయం నుంచి మండలాలకు వాహనాల్లో తరలిస్తున్నారు. జిల్లాలో ఈనెల 23, 27వ తేదీల్లో రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు జరుగునున్నాయి. జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, మొదటి విడతలో 11మండలాల పరిధిలో 113 ఎంపీటీసీలకు, రెండో విడతలో మరో 11మండ లాల పరిధిలో 120 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రతీ మండలానికి 86 రకాల నమూనా ఫారాలు, కవర్లు, పోటీచేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, ప్రచార ఖర్చుల పుస్తకాలు, అఫిడవిట్ పత్రాలు, పోస్టల్ బ్యాలెట్ కవర్లు, ఎన్నికల పోటీ అభ్యర్థులకు, సిబ్బందికి అవసరమయ్యే ఎన్నికల నియమావళి కరదీపికలతోపాటు 21రకాల పోలింగ్ సామగ్రిని తొలి విడతలో పంపిణీ చేస్తున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో జిల్లాకు ఎన్నికల సామగ్రి రావాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు 56 రకాల వస్తువులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. వీటిలో సిరా, కార్డు బోర్డులు, పెన్నులు, రబ్బర్లు, పెన్సిళ్లు, రబ్బర్ బ్యాండ్లు, కొవ్వొత్తులు, తెల్లవస్త్రాలు, బేసిన్లు, తెల్ల కాగితా లు, నామినేషన్ పత్రాలు, గోనెసంచులు, ట్రంకు పెట్టెలు, లక్క, టబ్బులు, అభ్యర్థుల గుర్తుల పత్రాలు, నోటీసు బోర్డులు, సూదులు, టేపులు, అగ్గిపెట్టెలు, బ్లేడ్లు, వైర్లు,దారాలు, అభ్యర్థుల పాసులు వంటివి ఉంటాయి.జెడ్పీ నుంచి మండలాలకు కరదీపికలు, ఇతర సామగ్రి పంపిణీ -
ఇద్దరు మద్దతిస్తే..
అక్కడ ఎంపీపీగా గెలవొచ్చు ● నాలుగు మండలాల్లో ఐదు చొప్పున ఎంపీటీసీ స్థానాలు ● ఏడింటిలో పదిలోపే ఎంపీటీసీలు ● తక్కువ స్థానాలు ఉన్నచోట మండల పరిషత్ పోరు రసవత్తరం చుంచుపల్లి: అతి తక్కువ ఎంపీటీసీ స్థానాలున్న మండలాల్లో ఎంపీపీ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. అక్కడ ఎంపీపీ కావాలంటే గెలిచిన అభ్యర్థికి ఇద్దరు మద్దతిస్తే సరిపోతుంది. జిల్లా విభజన తర్వాత కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటయ్యాయి. అయితే ఈ మండలాల్లో ఎంపీపీ అధ్యక్ష పదవి విషయంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు ఎంపీపీ పీఠం దక్కించుకోవాలంటే ప్రధాన పార్టీల నాయకులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. మండలాలు చిన్నవి కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గింది. దీంతో పలుచోట్ల ఇద్దరు, ముగ్గురు మద్దతిచ్చినా ఎంపీపీ పదవి దక్కించుకునే అవకాశం ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతటా ఇదే చర్చే జరుగుతోంది. జిల్లాలోని 22 మండలాల్లో పది లోపు ఎంపీటీసీ స్థానాలున్న మండలాలు ఏడు ఉన్నాయి. ముఖ్యంగా ఆళ్లపల్లి, కరకగూడెం, గుండాల, సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో మండల పరిషత్ కార్యవర్గానికి ఐదారుగురు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల అనంతరం ఈ మండలాల్లో జరిగే సమావేశాలకు అధ్యక్ష, ఉపాధ్యక్షులను మినహాయిస్తే ముగ్గురు సభ్యులు మాత్రమే ఉంటారు. మరికొన్ని చోట్ల నలుగురు, ఐదుగురు సభ్యులు మాత్రమే ఉండనున్నారు. ఈ మండలాల్లో కో – ఆప్షన్ ఎన్నిక జరిగితే ఒకరిద్దరు సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చేతులెత్తి ఎన్నుకునే ఎంపీపీ పదవికి అక్కడ సభ్యుల మద్దతు కీలకంగా మారనుండగా అక్కడ గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. స్థానాల వివరాలిలా.. ●ఆళ్లపల్లి మండలం గుండాల నుంచి విడిపోగా, 2019లో నాలుగు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఐదుకు పెరిగాయి. ఇక్కడ జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయిచగా ఎంపీపీ పదవిని ఎస్టీ జనరల్కు రిజర్వ్ చేశారు. ఎంపీపీ పదవి కావాలనుకునే సభ్యుడికి మరో ఇద్దరు ఎంపీటీసీల మద్దతు అవసరం. ●పినపాక నుంచి విడిపోయిన కరకగూడెం మండలంలో మొదట నాలుగు ఎంపీటీసీ స్థానాలుండగా ఈసారి ఒకటి పెరిగింది. జెడ్పీటీసీ బీసీ మహిళకు, ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ జనరల్కు కేటాయించారు. ఇక్కడ కూడా ఎంపీపీ పదవి పొందాలనుకునే సభ్యుడికి ఇద్దరు ఎంపీటీసీల మద్దతు కావాలి. ●గుండాలలో ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీపీ స్థానాన్ని 2019లో ఎస్టీ జనరల్ అభ్యర్థికి కేటాయించగా, ఈసారి ఎస్టీ మహిళకు దక్కింది. జెడ్పీటీసీని జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. ఇక్కడ ఎంపీపీ పదవి పొందాలనుకునే సభ్యుడికి మరో ఇద్దరు ఎం పీటీసీల సహకారం అవసరం. జెడ్పీటీసీ జనరల్ కావడంతో పలువురు నాయకులు ఇటువైపు కన్నేయగా పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ●అన్నపురెడ్డిపల్లి గతంలో చండ్రుగొండ మండలంలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలంలో ఆరు ఎంపీటీసీస్థానాలు ఉండగా 2019లో ఎంపీపీ పదవిని ఎస్టీ జనరల్కు కేటాయించారు. ఈసారి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేశారు. ఎంపీపీ పదవి కావాలనుకునే అభ్యర్థికి మరో ముగ్గురు సభ్యల మద్దతు అవసరం. ●సుజాతనగర్ మండలంలో ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. ఇటీవల కొత్తగూడెం కార్పొరేషన్లో పలు గ్రామాలు కలవడంతో ఆ సంఖ్య ఐదుకు తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ జెడ్పీటీసీ బీసీ జనరల్కు, ఎంపీపీ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వ్ చేశారు. ఎంపీపీ కావాలనుకునే ఎంపీటీసీకి మరో ఇద్దరు సభ్యుల సహకారం అవసరం.మండలం ఎంపీటీసీ ఎంపీపీ స్థానాలు రిజర్వేషన్ ఆళ్లపల్లి 5 ఎస్టీ జనరల్ కరకగూడెం 5 ఎస్టీ జనరల్ గుండాల 5 ఎస్టీ మహిళ సుజాతనగర్ 5 ఎస్టీ జనరల్ అన్నపురెడ్డిపల్లి 6 ఎస్టీ మహిళ -
భద్రగిరిలో ‘స్థానిక’ వేడి
భద్రాచలం: భద్రాచలం జెడ్పీటీసీ పీఠంపై అఽధికార, ప్రతిపక్షాలు గురిపెట్టాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ తొలిసారి జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మిత్రపక్షాలైన సీపీఎం, సీపీఐలు చర్చల దిశలో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రగిరిలో ఎన్నికల వేడి రాజుకుంది. విద్య, వైద్య రంగ ప్రముఖులతో సంప్రదింపులు! భద్రాచలం జెడ్పీటీసీ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు బీసీ మహిళా అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాల్సి ఉండటం, పట్టణంలో ప్రజలతో పరిచయాలు, ప్రముఖు లతో సత్ససంబంధాలు ఉన్న వారితో రాయబారాలు సాగిస్తున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, డివిజన్ నాయకుడు రాంప్రసాద్ కలిసి ప్రముఖ వైద్యుడు మోహన్రావు సతీమణిని రంగంలో దింపేందుకు సదరు వైద్యుడితో సంప్రదింపులు జరిపారు. ఆమె బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బుడగం శ్రీనివాస్కు స్వయానా సోదరి కావడంతో కాంగ్రెస్ నాయకులు ఆ ప్రయత్నానికి ఆదిలోనే చెక్ పెట్టారు. ఆమెను కాంగ్రెస్ తరఫునే బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థిక, రాజకీయ బలం కలిసి వస్తుందని భావిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు భద్రాచలంలోనే క్రాంతి విద్యాలయం అధినేత సోమరౌతు శ్రీనివాసరావు సతీమణితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్నే గెలుస్తుందని, విజయం తప్పక తమదేనంటూ కేటీఆర్తో కూడా హామీ ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా రెండు పార్టీలు విద్య, వైద్య రంగాల ప్రముఖులపైనే ఆధారపడనున్నాయి. ఈ నెల 8న ఉన్న హైకోర్టు తీర్పు అనంతరమే ఈ అభ్యర్థుల ఖరారు చేసే అవకాశం ఉంది. సీపీఎం, సీపీఐ, టీడీపీలు పొత్తుతో సరి?సీపీఎం, సీపీఐ, టీడీపీ పొత్తులతో బరిలో నిలిచి బల నిరూపణకు సిద్ధమవుతున్నాయి. వార్డుల్లో బలం ఉన్న సీపీఎం ఇందులో ముందుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులతో ఆ పార్టీ నాయకులు చర్చలు జరిపారు. ఎనిమిది వార్డులు, వైస్ ఎంపీపీ, ఎక్స్ అఫిషియో సభ్యుడిని కేటాయించాలని బీఆర్ఎస్కు ప్రతిపాదించగా, ఐదు వార్డులను ఇచ్చేందుకు వారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ ముందు కూడా ఉంచనుంది. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో చర్చలు జరపనున్నారు. తమ డిమాండ్లకు ఏ పార్టీ అంగీకరించిన వారితో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే కాంగ్రెస్తో కలిసే అవకాశమే ఎక్కువగా ఉందని సీపీఐ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇక టీడీపీ అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తోంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా, ఒంటరిగా, లేదా కాంగ్రెస్తో, లౌకిక పార్టీలతో కలిసి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నాయి. బీఆర్ఎస్తో మాత్రం పొత్తు ఉండే అవకాశం లేదని వారు తేల్చిచెబుతున్నారు. సీపీఐ సైతం పొత్తుతోనే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇలా అన్ని పార్టీలు భద్రాచలం జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం జెడ్పీటీసీని తొలిసారి కై వసం చేసుకునేందుకు ఆర్థిక, రాజకీయ బలాలను వాడేందుకు సిద్ధమయ్యాయి. -
పనిస్థలాలను పరిశుభ్రంగా ఉంచాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రతీ ఉద్యోగి పనిస్థలం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్పెషల్ క్యాంపెయిన్ 5.0 నోడల్ ఆఫీసర్, జీఎం ఎం.శ్రీహరి అన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానాస్పత్రిలో ఈ నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం మాట్లాడుతూ పరిశుభ్రత, స్థలసృష్టి, సుందరీకరణ, వ్యర్థాల నిర్వహణ తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఏసీఎంఓ ఎం.ఉష, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ ఎస్వీ రమణమూర్తి, ప్రాతినిధ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ పీతాంబర రావు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
7న అండర్–19 క్రీడా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 బాలబాలికల ఆర్చరీ, రెజ్లింగ్ క్రీడా జట్ల ఎంపిక పోటీలు ఈనెల 7వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా జూనియర్ కళాశాలల క్రీడా సంఘం కార్యదర్శి ఎం.డీ.మూసా కలీం తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు. అలాగే, ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 ఖో–ఖో బాలబాలికల జట్ల ఎంపిక కల్లూరు మినీ స్టేడియంలో 11వ తేదీన జరుగుతుందని మూసీ కలీం తెలిపారు. అమ్మవారికి రూ.2.50లక్షల ఆభరణాలు వైరా: వైరా హనుమాన్బజార్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ కోసం డాక్టర్ ఓర్సు వెంకటేశ్వర్లు – తైవశ్రీ దంపతులు రూ 2.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గురువారం సమర్పించారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ చైర్మన్ వేముల శివకృష్ణ సత్కరించారు. అర్చకుడు రాజశేఖర్తో పాటు రాము, బాలయ్య, ఆంజనేయులు, ఏడుకొండలు పాల్గొన్నారు. -
డ్యాన్స్ చేస్తూ.. అస్వస్థతకు గురై
బూర్గంపాడు: బతుకమ్మ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. లక్ష్మీపురం గ్రామంలో బతుకమ్మ నిమజ్జనానికి వెళ్తున్న క్రమంలో డ్యాన్స్ చేస్తూ అస్వస్థతకు గురైన యువకుడు మృతిచెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడు గుండి రమేష్(30)బతుకమ్మ నిమజ్జనంలో డీజే పాటలకు డాన్స్ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన మిగతావారు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. రమేష్ గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. డీజే సౌండ్స్తోనే రమేష్ గుండెపోటుకు గురైనట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.గుండెపోటుతో యువకుడి మృతి -
దసరా సెలవుల్లో దందా!
ములకలపల్లి: సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ శివారులో మట్టి దందా ఆగడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులకు మట్టిని తరలించుకుపోతున్నారు. కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్న మాఫియా దసరా సందర్భంగా ప్రభుత్వ సెలవులు రావడంతో రాత్రి వేళల్లో లారీల్లో కొద్దీ దర్జాగా తరలించారు. మండలంలోని పూసుగూడెం–మాధారం అటవీ ప్రాంతంలో సీతారామ ప్రధాన కాలువ సమీపం నుంచి భారీగా మట్టి తరలిస్తున్నారు. మీడియాలో పలుమార్లు కథనాలు రావడంతో ఇటీవల తోలకాలు నిలిపేశారు. పండుగ సెలవుల్లో మళ్లీ అక్రమంగా తరలించారు. గతంలో తరలించినచోటుతోపాటు సమీపంలోని కిలోమీటరు దూరంలో మరో చోట మట్టి తోలకాలు చేపట్టారు. పూసుగూడెం పంప్హౌస్కు వెళ్లే సీతారామ కాలువ సమీపంలో, కాలువ తవ్విన మట్టి గుట్టలా పోయగా, రోజురోజుకూ అది మాయమవుతోంది. జేసీబీతో లారీల్లో లోడ్ చేసి సమీప పట్టణాలకు తరలించి, అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలిసింది. అక్రమంగా తరలిపోతున్న సీతారామ ప్రాజెక్ట్ మట్టి -
తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా వీరన్న
సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ జాగృతి జిల్లా నూతన అధ్యక్షుడిగా డి.వీరన్నను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరన్న మాట్లాడారు. జిల్లా నూతన అధ్యక్షుడిగా తనను ఎంపిక చేసినందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో వెనుకబడే ఉందన్నారు. ఆంధ్రాలో విలీనం చేసిన గ్రామాలను పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపేవరకు పోరాటాలను ఉధృతం చేస్తామని అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. భద్రాద్రి రామయ్య భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. త్వరలో పూర్తిస్థాయి జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి ఆటో విభాగం జిల్లా అధ్యక్షుడు రాంబాబు, ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జ్ మాళోత్ రాజేందర్ నాయక్, విద్యార్థి విభాగం జిల్లా నాయకుడు సురేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సునీత, ప్రభుత్వ ఆస్పత్రి కాంట్రాక్ట్ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆదినారాయణ, సుగుణ, విజయ, ప్రవీణ్, సత్యవతి, ఆటో యూనియన్ నాయకులు ముజాహిద్, దేశి ప్రసాద్, రాంబాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
వన్యప్రాణం తీయకండి!
పాల్వంచరూరల్: జంతు సంరక్షణకు చట్టాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, అటవీశాఖ సిబ్బంది గస్తీ తిరుగుతున్నా, ట్రాప్ కెమెరాలు అమర్చినా జంతువులకు వేటగాళ్ల నుంచి రక్షణ కరువైంది. జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యంలో చుక్కల దుప్పులు, నెమళ్లు, కుందేళ్లు, కొండ గొర్రెలు, కణుజు, చిరుత పులులు, సాంబర్లు, ఎలుగుబంట్లు, అడవి దున్న వంటి వన్యప్రాణులు జీవిస్తున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం 1977 జనవరి 24న కిన్నెరసానిని అభయారణ్యంగా ప్రకటించారు. కానీ పలుమార్లు జంత వధ జరుగుతూనే ఉంది. జరిమానా, జైలు శిక్ష విధిస్తున్నా వన్యప్రాణులకు రక్షణలేకుండా పోయింది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ ఫారెస్ట్ డివిజన్ల ఆధ్వర్యంలో కూడా వారోత్సవాలు చేపడుతున్నారు. ప్రభుత్వ సెలవు దినాలు కాకుండా ఏడురోజులపాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నేడు ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. వన్యప్రాణులను హతమార్చిన ఘటనలు కొన్ని.. ● వన్యప్రాణులు వేటాగాళ్ల వేటుకు బలవుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులు వేసి వధిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న దమ్మపేట రేంజ్లో దుప్పిని వేటాడి చంపి మాంసాన్ని వండుతుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు. ● గతంలో కిన్నెరసాని డీర్ పార్కు సమీపంలోనే దుప్పిని కుక్కలతో వేటాడారు. పాల్వంచ మండలం సోములగూడెం రోడ్డులోని అటవీ ప్రాంతంలో దుప్పిని వధించి మాంసం విక్రయించారు. అటవీశాఖాధికారులు ఇద్దరు నిందితులను పట్టుకుని కేసు నమోదు చేశారు. ● దంతెలబోరు అటవీప్రాంతంలో అడవి పందిని చంపి మాంసాన్ని విక్రయించగా, అధికారులు పట్టుకున్నారు. ఏడుళ్లబయ్యారం అటవీప్రాంతంలో దుప్పిని బాణాలతో వేటాడి సంహరించారు. ములకలపల్లి, చండ్రుగొండ అటవీ ప్రాంతాల్లో కూడా వన్యప్రాణులను వధించిన సంఘటనలు ఉన్నాయి. ఇల్లెందు డివిజన్లో విద్యుత్ ఉచ్చులతో అడవి దున్నలను వధించారు. ● రెండున్నరేళ్ల క్రితం ఉల్వనూరు వద్ద ఎలుగుబంటిని వధించగా, ఐదుగురిపై కేసుమోదు చేశారు. రెండేళ్ల క్రితం అలుగును చంపి వాటి పెంకులను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఇలా ఏటా జిల్లా అటవీప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల ఉసురు తీస్తున్నారు. అటవీ జంతువుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అటవీ గ్రామాల్లో వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు వంటివి చేపడుతున్నాం. తొలిరోజు నాకా బందీ నిర్వహించాం. రాత్రి, పగలు వాహనాలను తనిఖీలు చేపట్టాం. –బి.బాబు, వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ జంతువులను వధిస్తే 3 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 వేల నుంచి రూ. లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. వన్యమృగాల సంరక్షణ చట్టం 1972 ప్రకారం పులి, చిరుత, నెమలి, ఎలుగుబంటి, కుందేలు, పక్షులు, మొసళ్లు, అడవి దున్న, దుప్పి తదితర జంతువులను వధించడం నేరం. పులిని చంపినా, చర్మం, గోళ్లు తీసినా, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించినా సెక్షన్ 51(ఎ) కింద 3 నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఏడాదిపాటు బెయిల్ కూడా లభించదు. చిరుతపులిని వధించినా ఇవే శిక్షలు విధిస్తారు. ఎలుగుబంటి చంపినా, పట్టుకున్నా, సర్కస్లో ఆడించినా 3 నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష, రూ. 20వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. వేటాడినట్లు రుజువైతే సెక్షన్ 37(ఏ)కింద 3 నుంచి 7 ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. కోతులను పట్టుకున్నా, చంపిన, ఇంట్లో పెంచుకున్నా, అది నివాసం ఉండే ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించినా 5 నుంచి7 నెలలపాటు జైలు శిక్ష, రూ.20 వేల వరకు జరిమాన విధించే అవకాశం ఉంది. కుందేళ్లను చంపినా, పట్టుకున్నా, ఇంట్లో పెంచుకున్నా మూడేళ్ల జైలుశిక్ష, రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. నెమళ్లను పట్టుకున్నా, వధించినా, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించినా, వాటి గుడ్లను పగులగొట్టిన, హాని చేసినా, వైల్డ్లైఫ్ చట్టం ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 25 నుంచి రూ. లక్ష వరకు జరిమాన విధించే అవకాశం ఉంది. పశువులను చంపినా, నిర్బంధించినా, సంతానం కలగకుండా చేసినా, తాళ్లు, గొలుసులతో బంధించి వాహనాల ద్వారా తరలించినా రూ. 25వేలకు పైగా జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. నేడు ప్రపంచ జంతు దినోత్సవం -
వాహన పూజకు ‘నకిలీ’ టికెట్లు?
పాల్వంచరూరల్: మండలంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద వాహన పూజకు నకిలీ టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎప్పటిలాగే దసరా పర్వదినం సందర్భంగా బుధవారం అర్ధరాత్రి నుంచి ఆలయానికి వేలాది వాహనాలు పూజ కోసం వచ్చాయి. వాహన పూజతో ఎండోమెంట్కు రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇందుకోసం వాహనదారులు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈసారి వాహన పూజ టికెట్ల విక్రయాలపై ఈఓ పర్యవేక్షణ కొరవడటంతో నకిలీ టికెట్లు వచ్చినట్లు వాహనదారులు ఆరోపించారు. టికెట్లపై ఈఓ, సంబంధిత క్లర్క్ సంతకాలు లేవు. రశీదుపై ఖమ్మం జిల్లా ఎండోమెంట్ శాఖ ముద్ర మాత్రమే ఉంది. పూజలు చేసిన తేదీ, వాహనదారులు చిరునామా వివరాలు కూడా నమోదు చేయలేదు. దేవాదాయశాఖ ఉద్యోగులు లేకుండా ప్రైవేట్ వ్యక్తులు నకిలీ రశీదులతో వేలాది రూపాయలను వాహనదారుల నుంచి వసూళ్లు చేశారు. వాహనాల పూజ టికెట్ల విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు, వాహనదారులు కోరుతున్నారు. గాంధీ జయంతి రోజూ ఆగని జంతు బలి ఈ నెల 2న గాంధీ జయంతి. దీనికితోడు శ్రీదేవీ శరన్నవ రాత్రి మహోత్సవాల చివరి రోజు. దీంతో ఆలయం సముదాయంలో, పరిసర ప్రాంతాల్లో జంతుబలి నిషేధం అమలు చేయాలి. కానీ దసరా పండుగ అని ఆలయంలో మేకలు, గొర్రెలు, కోళ్లను యథేచ్ఛగా వధించారు. బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలు కూడా జోరుగా సాగాయి. ఆలయ ఈఓ, ఎకై ్సజ్శాఖ అధికారులు పట్టించుకోలేదు. జంతు బలిపై భక్తులు ఫిర్యాదు చేసినా ఈఓ స్పందించలేదని, జంతుబలిని పరోక్షంగా ప్రోత్సహించారనే విమర్శలు వ్యక్తవుతున్నాయి. నకిలీ టికెట్ల వ్యవహారంపై పెద్దమ్మతల్లి ఆలయ ఈఓ ఎన్.రజినీకుమారిని వివరణ కోరగా.. టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరగలేదని తెలిపారు. పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ప్రైవేటు వ్యక్తుల దందా -
హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
మణుగూరు రూరల్: ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 233 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్సీలకు కేవలం ఐదు, ఒకే జెడ్పీటీసీ స్థానం కేటాయించడం దారుణమని అన్నారు. మణుగూరు మండలంలో రొటేషన్ ప్రకారం ఈ దఫా జెడ్పీటీసీ స్థానం ఎస్సీలకు ఇవ్వాల్సి ఉండగా, మళ్లీ ఎస్టీలకే కేటాయించారని ఆరోపించారు. కలెక్టర్ పరిశీలన చేసి జనాభా ప్రాతిపదికన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు మద్దెల భద్రయ్య, వేర్పుల నరేష్, వేర్పుల సురేష్, బూర్గుల సతీష్, బూర్గుల సంజీవరావు, ముల్క నరేష్, ఏసురత్నం, వేమూరి రవి, ఉల్లోజు బాబీ, బూర్గులవెంకటరత్నం, వేర్పుల శంకర్, దాసరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు -
నూతన జీఎం కార్యాలయం ప్రారంభం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రూ.2.5 కోట్లతో నిర్మించిన జీఎం నూతన కార్యాలయాన్ని డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు గురువారం ప్రారంభించారు. తొలుత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ సంస్థ ఉద్యోగులు, కార్మికులు, గాంధీజీ బాటలో నడవాలని సూచించారు. ఏరియా జీఎం శాలెంరాజు, ఎస్వోటూ జీఎం కోటిరెడ్డి, యూనియన్ నాయకులు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. కార్పొరేట్లో కానరాని గాంధీ జయంతి వేడుకలు ఈ నెల 2న సింగరేణి కార్పొరేట్ ఏరియాలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించలేదు. దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించే వేడుకలను సింగరేణి సంస్థ విస్మరించడం సరికాదని కార్మికులు పేర్కొంటున్నారు. గాంధీ జయంతి రోజున వేతనంతో కూడిన సెలవును పొందటమే కాకుండా మరికొందరు అధికారులు ప్లేడేలు చేసి మూడు మస్టర్లు పొందుతున్నారని, కానీ గాంధీజీకి నివాళులర్పించకపోవడం శోచనీయమని పేర్కొంటున్నారు. మధిర కళాకారులకు బహుమతులు మధిర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో నిర్వహించిన జాతీయ స్థాయి పద్య నాటక పోటీల్లో మధిర కళాకారులు ఉత్తమ ప్రదర్శనతో అవార్డులు సాధించారు. గతనెల 27నుంచి ఈ నెల 2వరకు జరిగిన పద్య నాటక పోటీల్లో మధిర కళాకారులు ప్రదర్శించిన కస్తూరి తిలకం తృతీయ బహుమతి సాధించింది. అలాగే, డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజుకు ఉత్తమ దర్శకుడు, చింతామణి పాత్ర ధరించిన విజయరాణికి ప్రత్యేక జ్యూరీ బహుమతులు లభించాయి. ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో సాంస్కతిక కళా కేంద్రం ఏర్పాటుకాగా, అక్కడ సాధన చేసే అవకాశం దక్కిందని.. తద్వారా బహుమతులు సాధిస్తున్నామని తెలిపారు. అలాగే, చిలువేరు శాంతయ్య, ఇనపనూరి వసంత్, కిషోర్ రెడ్డి, నరాల సాంబశివారెడ్డి, ఎర్రగుంట రాజేశ్వరరావు, రామవరపు ప్రసాద్ తదితరులు కూడా భట్టికి కృతజ్ఞతలు తెలిపారు. నేడు ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ ఎంపికలు ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–15 బాలబాలికల చెస్ జట్లను శనివారం ఎంపిక చేయనున్నట్లు చెస్ అసోసియేషన్ బాధ్యులు సీహెచ్.గోపికృష్ణ, జ్యోత్స్న తెలిపారు. ఆసక్తి ఉన్న వారు క్రీడాకారులు 94401 62749, 83091 34971 నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే సమయాన వయసు ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని తెలిపారు. ఇసుక లారీ సీజ్దమ్మపేట: అనుమతులు లేకుండా ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ లారీని దమ్మపేట పోలీసులు గురువారం సీజ్ చేశారు. మండలంలోని మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమతులు లేకుండా ఏపీ నుంచి ఇసుకతో వచ్చిన లారీని పట్టుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. కిరాణా దుకాణంలో చోరీములకలపల్లి: కిరాణా దుకాణంలో చోరీపై గురువారం కేసు నమోదైంది. రాజుపేట గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రాజేష్ ఇంటి సమీపంలోని కిరాణా దుకాణానికి బుధవారం రాత్రి తాళం వేసి ఇంట్లోకి వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి చూడగా షట్టర్ తాళాలు పగులగొట్టి, రూ.60 వేలు చోరీ చేసినట్లు గుర్తించాడు. మాస్క్ వేసుకున్న యువకుడు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుప్రసాద్ తెలిపారు. ఇంటర్ విద్యార్థి అదృశ్యంచండ్రుగొండ: మండలంలోని అన్నారంతండాకు చెందిన విద్యార్థి పునరావృత్తం శ్రీధర్ (15) అదృశ్యంపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. శ్రీధర్ గుండాలలోని గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వినాయక చవితి పండుగకు ఇంటికి వచ్చాడు. అనంతరం కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న కుమారుడిని తండ్రి హతీరాం మందలించాడు. దీంతో ఈ నెల 1న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు,స్నేహితులను వాకబు చేసిన ఆచూకీ లభించలేదు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బాలింత ఆత్మహత్య
ములకలపల్లి: క్షణికావేశానికి గురై పురుగుల మందు తాగిన ఆరు నెలల బాలింత మృతి చెందింది. ఎస్సై ఎస్.మధుప్రసాద్ కథనం ప్రకారం.. మండల పరిఽధిలోని పాతగంగారం గ్రామానికి చెందిప శివాని (21)కి, రాచన్నగూడెం గ్రామానికి చెందిన మడివి జగపతితో వివాహం జరిగింది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. బుధవారం రాత్రి భర్త బతుకమ్మ ఆట నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో క్షణికావేశానికి గురైన శివాని పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి, అక్కటి నుంచి వరంగల్కు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. మృతురాలు తండ్రి దుబ్బా చిన్నబ్బులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిదమ్మపేట: భవనంపై నుంచి కిందపడి చికిత్స పొందుతున్న వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... ఏపీలోని గుడివాడకు చెందిన రాయనిపాటి కళ్యాణ శేఖర్(42)కు దమ్మపేట గ్రామానికి చెందిన జయలక్ష్మితో వివాహం జరిగింది. దంపతులు ఏడేళ్లుగా తమ ఇద్దరు కుమారులతో కలిసి దమ్మపేటలోని గాయత్రి నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. జయలక్ష్మి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుండగా, శేఖర్ ప్రైవేట్ ఎలక్ట్రిషీయన్గా పనిచేస్తూ కుటుంబ పోషణను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో దసరా పండుగ రోజు గురువారం రాత్రి దమ్మపేటలోని గాయత్రి నగర్లో అద్దెకు ఉంటున్న భవనం తి మూడో అంతస్తు నుంచి కళ్యాణ్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్రగాయాలు కాగా సత్తుపల్లి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. ఇల్లెందురూరల్: మండలంలోని మొండితోగు గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మొండితోగు గ్రామానికి చెందిన జోగ వినోద్(25) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వినోద్ ఇల్లెందులో దసరా ఉత్సవాలను వీక్షించి బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలానికి చెందిన ఏక విష్ణు మరో బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఇల్లెందు–గుండాల రహదారిపై మూలమలుపు వద్ద రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నా యి. దీంతో ఇద్దరికి త్రీవ గాయాలు కాగా, స్థానికులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వినోద్ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఏక విష్ణు చికిత్స పొందుతున్నాడు. ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేకాట రాయుళ్ల అరెస్ట్ మణుగూరు టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ్నగర్లోని పేకాట స్థావరంపై శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేసి తొమ్మిది మంది యువకులను అరెస్ట్ చేశారు. ఆరు సెల్ఫోన్లు, మోటార్సైకిల్, రూ.8,030 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిలో ఐతనబోయిన గోపి, కుంట నాగరాజు, కుంట నవీన్, మామిళ్ల రవి, అక్కినపల్లి చంటి, దేపాక నరేశ్, ఉప్పు శ్రీను, బాడిష శ్రీను, రేపాకుల వెంకన్న ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు తెలిపారు. -
కలెక్షన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలి
ములకలపల్లి : పామాయిల్ రైతుల సౌకర్యార్థం మండల పరిధిలోని జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన టీజీ ఆయిల్ఫెడ్ కలెక్షన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయిల్పామ్ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్ అన్నారు. గురువారం ఆయన కలెక్షన్ సెంటన్ను ప్రారంభించి మాట్లాడారు. పామాయిల్ సాగు చేసే రైతులు పంటను పామాయిల్ ఫ్యాక్టరీ వరకు తీసుకెళ్లకుండా కలెక్షన్ పాయింట్లో కూడా విక్రయించవచ్చని తెలిపారు. ఫ్యాక్టరీలో చెల్లించే ధరకే ఇక్కడ కొనుగోలు చేస్తారని చెప్పారు. దీంతో రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు దిగుమతి కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో దమ్మపేట ఏఎంసీ చైర్మన్ వాసం రాణి, మాజీ జెడ్పీటీసీలు బత్తుల అంజి, పైడి వెంకటేశ్వరరావు, నాయకులు తాండ్ర ప్రభాకర్ రావు, పర్వతనేని అమర్నాథ్, పువ్వాల మంగపతి, కరుటూరి కృష్ణ, కాసాని నాగప్రసాద్, కేవీ పాల్గొన్నారు.ఆయిల్పామ్ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ప్రసాద్ -
ముగిసిన శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
భక్తులతో కిటకిటలాడిన పెద్దమ్మతల్లి ఆలయం పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన పెద్దమ్మతల్లి ఆలయంలో గత నెల 22న ప్రారంభమైన శ్రీ దేవీ శరన్నవరాత్రి వేడుకలు గురువారం ముగిశాయి. చివరి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమచ్చారు. కాగా, దసరా సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి సన్నిధిలో గురువారం సాయంత్రం శమీ పూజ నిర్వహించగా.. శుక్రవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేశారు. హస్తాల వీరన్నస్వామిని దర్శించుకున్న ఎస్పీచండ్రుగొండ: మండలంలోని బెండాలపాడు గ్రామ శివారులోని కనకగిరి అటవీ ప్రాంతంలో కొలువుదీరిన హస్తాల వీరన్నస్వామి వారిని ఎస్పీ రోహిత్ రాజ్ గురువారం దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, దిశ కమిటీ సభ్యులు బొర్రా సురేష్ తదితరులు ఉన్నారు. జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరుసూపర్బజార్(కొత్తగూడెం): పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుచేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయగా ఎట్టకేలకే ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రానికి నాలుగు విద్యాలయాలు కేటాయించగా, అందులో ఒకటి జిల్లాకు దక్కింది. ఎంపీ చొరవ, ప్రత్యేక శ్రద్ధతో జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైందని కాంగ్రెస్ నాయకులు, జిల్లా ఆదివాసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ రఘురాంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కిన్నెరసానిలో దసరా సందడిరెండురోజుల పాటు భారీ ఆదాయం పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో దసరా పర్వదినాన పర్యాటకులు సందడి చేశారు. గురు, శుక్రవారాల్లో జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. ఈ రెండు రోజుల్లో 1,795 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.1,07,515, 1,350 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్కు రూ.68,850 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కమ్యూనికేషన్స్, ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికి వరుసగా రెండోసారి అవకాశం దక్కింది. డాక్టర్ నిషికాంత్ దూబే చైర్మన్గా ఉన్న కమిటీలో ఏడాది క్రితం సభ్యుడిగా ఆయన నియమితులు కాగా, రెండో దఫా కూడా అవకాశం కల్పించారు. లోక్సభ నుంచి 20మంది, రాజ్యసభ ఉంచి పది మంది సభ్యులతో ఏర్పడే ఈ కమిటీలో రెండోసారి అవకాశం దక్కడంపై ఎంపీ రఘురాంరెడ్డికి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతి నిధులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. -
●వేడుకలకు మంత్రి పొంగులేటి..
సింగరేణి స్కూల్ గ్రౌండ్లో జరిగిన దసరా ఉత్సవాలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. మొదలే ఆయన వచ్చి జ్యోతిప్రజ్వలన చేయగా.. ఆ సమయంలో వీక్షకులు లేక ఆవరణంతా ఖాళీగా కనిపించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయన ఇతర అంశాలు ఏమీ మాట్లాడకుండానే శుభాకాంక్షలు తెలిపి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, పీఏసీఎస్ చైర్మన్ ఎం.కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, మేనేజర్ అంకుషావళీ, డీఈ మురళీకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గంగమ్మ చెంతకు దుర్గమ్మ
భద్రాచలంఅర్బన్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలందుకున్న దుర్గామాత విగ్రహాలు నిమజ్జనానికి భద్రాచలం గోదావరి ఘాట్ వద్దకు చేరుకున్నాయి. ప్రతి ఏడాది వినాయకుడి విగ్రహాలు మాత్రమే గోదావరిలో నిమజ్జనానికి వస్తుంటాయి, అమ్మవారి విగ్రహాలు వచ్చినా చాలా తక్కువ సంఖ్యలోనే ఉండేవి. అయితే ఈ ఏడాది అనూహ్యంగా విజయదశమి పండుగ రోజు అర్ధరాత్రి తర్వాత నిమజ్జన ఘాట్ వద్దకు అధిక సంఖ్యలో విగ్రహాలు చేరుకున్నాయి. కాగా, ఇక్కడ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తుల్లో కొంతమేర ఆందోళన వ్యక్తమైంది. దీంతో అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఒక లాంచీతో పాటు క్రేన్ ఏర్పాటు చేశారు. కాగా, శని, ఆదివారాల్లో అమ్మవారి విగ్రహాలు నిమజ్జనానికి భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 42 విగ్రహాలు నిమజ్జనం కాగా, మరో 30 విగ్రహాలు గోదావరి ఘాట్ వద్ద ఉన్నాయి. నిమజ్జనం ఘాట్ను సందర్శించిన ఏఎస్పీ భద్రాచలం గోదావరి నది ఘాట్ వద్ద అమ్మవారి విగ్రహాల నిమజ్జనాన్ని ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ శుక్రవారం సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల సూచనలను పాటించాలని, కార్యక్రమం ప్రశాంతంగా సాగేలా సహకరించాలని కోరారు. వీలైనంత త్వరగా విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మేం గత ఐదేళ్లుగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విగ్రహాలు నిమజ్జనం చేయాలనుకున్నాం. గతేడాది బాసరలో నిమజ్జనం చేశాం. ఈ ఏడాది భద్రాచలంలో నిమజ్జనం చేయాలని 200 మందిమి వచ్చాం. – బాలకృష్ణ, హైదరాబాద్ -
రాష్ట్రంలో పాలన అధ్వానం
దమ్మపేట/అశారావుపేటరూరల్ : కాంగ్రెస్ హయాంలో పాలన అధ్వానంగా మారిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన దమ్మపేట మండలం పార్కలగండి, అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామాల్లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాల్లో మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని సూచించారు. కేసీఆర్ సంక్షేమ పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఆ పార్టీ పెద్దల అక్రమార్జన సొమ్మంతా ఢిల్లీ మీదుగా బీహార్కు చేరుతోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో తెలంగాణ బీసీలను ఏమార్చి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఓట్ చోర్ అని తిరుగుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలానికి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో జెడ్పీ చైర్మన్తో పాటు అత్యధిక జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని అన్నారు. అంతకుముందు పార్కలగండిలో పలువురు రేగా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు రావు జోగేశ్వరరావు, దొడ్డా రమేష్, సున్నం నాగమణి, మందపాటి మోహన్రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావు, నారం రాజశేఖర్, సోయం వీరభద్రం, దారా మల్లికార్జునరావు, యుగంధర్, రావుల శ్రీను, జలగం వాసు, పాకనాటి శ్రీను, యార్లగడ్డ శ్రీను, గాజుబోయిన ఏసు పాల్గొన్నారు. ముఖ్య నాయకుల గైర్హాజరు.. ఆసుపాకలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, మాజీ జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మీ, నాయకులు యూఎస్ ప్రకాశరావు, సంకా ప్రసాద్, కాసాని చంద్రశేఖర్తోపాటు మరికొందరు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సమావేశ వేదిక మార్పుతో పాటు పార్టీ మండల అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారమే దీనికి కారణమని కార్యకర్తలు చెబుతున్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా -
ఫుల్జోష్గా దసరా..
వైరా: ఒకే రోజు దసరా, గాంధీ జయంతి రావడంతో వైన్స్, బార్లు మూతపడ్డాయి. దీంతో వైన్స్ నిర్వాహకులు ముందస్తుగా సిద్ధం కావడం, మందుబాబులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో అమ్మకంపై ఎలాంటి ప్రభావం పడలేదు. వైరా మద్యం డిపో నుండి సెప్టెంబర్ 29న(సోమవారం), 30న (మంగళవారం) ఉమ్మడి జిల్లాలోని వైన్స్, బార్లకు రూ.42.50 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సెప్టెంబర్ నెలంతా రూ.185 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లగా.. చివరి రెండు రోజుల్లో రూ.42కోట్లకు పైగా ఉండడం గమనార్హం. ముందుగానే అమ్మకాలు తెలంగాణలో అతిపెద్ద పండుగ అంటే దసరానే గుర్తుకొస్తుంది. బంధుమిత్రులతో కలిసి పండుగ జరుపుకునే పలువురి ఇళ్లలో మందు, విందు ఉంటుంది. కానీ ఈసారి దసరా రోజే గాంధీ జయంతి రావడంతో మందుబాబుల్లో ఆందోళన నెలకొనగా.. అమ్మకాలు ఎలా ఉంటాయోనని ఎకై ్సజ్ అధికారులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన ఎకై ్సజ్ సర్కిళ్ల వారీగా లక్ష్యాలు విధించి ముందుగా వైరా డిపో నుంచి మద్యం తీసుకెళ్లాలని సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్ 29న రూ.20కోట్లు, 30వ తేదీన రూ 22.50 కోట్ల విలువైన మద్యాన్ని వైన్స్, బార్ల నిర్వాహకులు తరలించడంతో ఎకై ్సజ్ శాఖకు గణనీయమైన ఆదాయం లభించింది. ఇక ఈనెల 1వ తేదీన మాత్రం రూ.కోటి విలువైన మద్యమే తీసుకెళ్లడం గమనార్హం. సాధారణంగా రోజుకు రూ.4కోట్ల నుండి రూ.6కోట్ల విలువైన మద్యం తీసుకెళ్తారు. కానీ 1వ తేదీన గణనీయంగా పడిపోవడానికి కారణాలు ఆరా తీసిన ఎకై ్సజ్ అధికారులు అంతకు ముందు రోజు భారీగా సరుకు తీసుకెళ్లడం.. 2వ తేదీన షాప్ల బంద్తో అమ్మకాలు ఉండవని వ్యాపారులు వెనక్కి తగ్గినట్లు గుర్తించారని సమాచారం. ఉమ్మడి జిల్లాలో 52బార్లు, మూడు క్లబ్లతో పాటుగా 210 వైన్స్కు వైరా డిపో నుంచి మద్యం తీసుకెళ్తారు. జిల్లాలో రూ.42.50 కోట్ల మద్యం అమ్మకాలు -
నేత్రపర్వంగా విజయోత్సవం
ఇల్లెందు : పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో గురువారం రాత్రి నిర్వహించిన రావణవధ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఇల్లెందులపాడు నుంచి వచ్చిన గుర్రాల రథం, దానిపై అమ్మవారు తరలివస్తున్న దృశ్యం హైలెట్గా మారింది. అయితే ఉత్సవాలు తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పిల్లాపాపలతో భారీ సంఖ్యలో హాజరైనా.. అందుకు తగ్గట్టుగా గ్రౌండ్లో ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు కొంతమేర ఇబ్బంది పడ్డారు. వేదిక ఎత్తు తక్కువగా ఉండడంతో వెనుక ఉన్నవారికి వేడుకల దృశ్యాలు కనిపించకపోవడంతో పలువురు అసంతృప్తికి లోనయ్యారు. కనీసం ఎల్ఈడీ స్క్రీన్లయినా ఏర్పాటు చేస్తారనేకుంటే ఆశాభంగమే అయిందని నిట్టూర్చారు. పత్తాలేని పాలపిట్ట.. సింగరేణి ఉన్నత పాఠశాల గ్రౌండ్లో దసరా సందర్భంగా నిర్వహించిన జమ్మి(శమీ)పూజ వెలవెలబోయింది. విజయదశమి రోజున పాలపిట్టను చూడడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే గతంలో పాలపిట్ట బొమ్మను గ్రౌండ్లో ఏర్పాటుచేసేవారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యక్షంగా పాలపిట్ట దర్శనం కల్పిస్తామని నిర్వాహకులు విస్తృత ప్రచారం చేసినా.. చివరకు పాలపిట్ట కనిపించనే లేదు. దీంతో అందరూ నిరాశకు లోనయ్యారు. సినీ, టీవీ కళాకారుల మ్యూజికల్ నైట్, ఆట – పాటలు కూడా అలరించలేదు. తాగునీటి సౌకర్యం లేక పలువురు అల్లాడారు. భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా రామదాసు నిర్మించిన దసరా మండపంలో అర్చకుల ప్రత్యేక పూజలు, భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ వైభవంగా విజయోత్సవం నిర్వహించారు. సీతా లక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామికి రామదాసు చేయించిన ఆభరణాలు అలంకరించి మంగళవాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణలతో పల్లకీ సేవగా దసరా మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత జమ్మిచెట్టు వద్ద అర్చకులు పుణ్యావాచనం, శమీ పూజ చేశారు. స్వామి వారి ఆయుధాలకు ప్రత్యేక పూజలు గావించారు. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని, రావణాసురుడి చెర నుంచి ప్రజలను కాపాడిన రాముడి విజయమని అర్చకులు పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం ఈఓ దామోదర్ రావు చేతుల మీదుగా రావణాసుర వధ గావించే శ్రీరామ లీలా మహోత్సవ కార్యక్రమం జరిపారు. రావణాసురిడి ప్రతిమపై బాణం సంధించగా మిరుమిట్లు గొలిపే బాణసంచా కాంతులతో దసరా మండప ప్రాంగణం మెరిసిపోయింది. ఈ సమయంలో భక్తులు చేసిన శ్రీరామనామస్మరణలు, జయజయ ధ్వానాలతో దసరా మండప ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం చోటుచేసుకుంది. పూజల అనంతరం భక్తులు జమ్మి చెట్టు ఆకులను తలపై పెట్టుకుని, ఆ తర్వాత భద్రంగా దాచుకున్నారు. రామాలయంలో భక్తుల రద్దీ.. దసరా సెలవులు ముగింపు దశకు రావడం, వారాంతపు సెలవులు కావడంతో రామాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. గురు, శుక్రవారాల్లో జరిగిన నిత్యకల్యాణాలకు భారీగా హాజరయ్యారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, ఈనెల 7న శబరి స్మృతి యాత్ర నిర్వహించనున్నట్లు ఈఓ దామోదర్రావు తెలిపారు. ఉదయం 6.30 గంటలకు గిరి ప్రదక్షిణ, దమ్మక్క విగ్రహం వద్ద నివాళుల అనంతరం బేడా మండపంలో నిత్యకల్యాణం ఉంటుందని పేర్కొన్నారు. గిరిజన సంప్రదాయాల మేరకు వేడుక నిర్వహిస్తామని, బస్సుల ద్వారా వివిధ గ్రామాల నుంచి గిరిజనులను భద్రాచలం తరలించి ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ముగిసిన శ్రీరామాయణ పారాయణోత్సవాలు విజయదశమిని పురస్కరించుకుని రామాలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్న శ్రీరామాయణ పారాయణోత్సవాలు గురువారంతో ముగిశాయి. శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపులో భాగంగా సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామివారికి పట్టాభిషేక మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంక్షేప రామాయణ హవనం, మహా పూర్ణాహుతితో ముగింపు పలికారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా వేడుకలు -
● దసరా.. సరదా తీరేదెలా ?
కొత్తగూడెంటౌన్: దసరా అంటేనే సరదాలకు ప్రతీక. మిగితా పండుగలతో పోలిస్తే దసరాకే ఎక్కువ మంది మాంసాహారం, మద్యం వినియోగిస్తుంటారు. పండుగ రోజున తమ షాపులు, పరిశ్రమలు, వాహనాల ఎదుట కోళ్లు, జీవాలను బలి ఇస్తుంటారు. కానీ ఈ ఏడాది గాంధీ జయంతి రోజున దసరా రావడంతో పలువురు ఆలోచనలో పడ్డారు. మరోవైపున గురువారం మద్యం, మాంసం దుకాణాలు తెరిస్తే చర్యలు తప్పవని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. దీంతో కొనుగోలు దారులు సైతం సందిగ్ధంలో పడ్డారు. కొందరు బుధవారమే మాంసాహార భోజనం చేసినా.. పండుగ రోజు పప్పన్నంతో తినడం ఎలా అని సంకోచిస్తున్నారు. గాంధీ జయంతి రోజే దసరా రావడంతో షాపులు తెరవకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని చికెన్, మటన్ సెంటర్ల నిర్వాహకులు వాపోతున్నారు. -
మద్యానికి దూరంగా గోపన్నగూడెం
● ఏడేళ్లుగా పాటిస్తున్న గిరిజన పల్లె ● ఆదర్శంగా నిలుస్తున్న గ్రామస్తులు అశ్వారావుపేటరూరల్: మహాత్మాగాంధీ ఆశయాన్ని ఓ గిరిజన పల్లె వాసులు ఏడేళ్లుగా పాటించి ఆదర్శంగా నిలుస్తున్నారు. గిరిజన మహిళళలు మద్యపాన నిషేధంపై ఉద్యమించి, గ్రామంలో మద్యం విక్రయించొద్దని, ఎవరూ ముట్టవద్దని తీర్మానించగా నేటికీ ఆ కట్టుబాటును పాటించడం విశేషం. నేడు గాంధీ జయంతి సందర్భంగా ఆ పల్లైపె కథనం.. అశ్వారావుపేట మండల కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గోపన్నగూడెం అనే గిరిజన పల్లె ఉంది. ఈ గ్రామంలో 108 కుటుంబాలకు చెందిన 260 మంది జనాభా నివసిస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం గిరిజనులే కాగా, అందరూ వ్యవసాయం, కూలీ పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 2018కి ముందు గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాల్లో మద్యం విక్రయాలతోపాటు గుడుంబా తయారీ, విక్రయాలు సాగేవి. దీంతో నిత్యం మద్యం మత్తులో గొడవలు జరిగేవి. ఈ గొడవలు, వివాదాలతో అగ్రహించిన మహిళలు బెల్ట్ దుకాణాలు, సారా విక్రయాలపై ఉద్యమించారు. ఈ నేపథ్యంలో అప్పటి కన్నాయిగూడెం సర్పంచ్ గొంది లక్ష్మణరావు ఆధ్వర్యంలో.. తమ గ్రామంలో మద్యం, సారా విక్రయాలు చేయొద్దని గ్రామస్తులు తీర్మానించారు. నాటి నుంచి ఆ గ్రామంలో బెల్ట్ దుకాణాలు, సారా విక్రయాలు నిలిచిపోగా ఏడేళ్లుగా ప్రజలంతా మద్యానికి దూరంగా ఉంటున్నారు. దీంతో మద్యం రహిత గ్రామంగా ఈ పల్లె ఇతర గ్రామాలకూ ఆదర్శంగా మారింది. మద్యం, సారా విక్రయం, సేవించడంతో గ్రామంలో ఎన్నో గొడవలు జరిగాయి. దీంతో గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని మహిళలు నిర్ణయించి నా దృష్టికి తీసుకొచ్చారు. గ్రామస్తుల సహకారంతో మద్యానికి దూరంగా ఉండాలని తీర్మానించి గత ఏడేళ్లుగా అమలు చేస్తున్నాం. స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో చాలా మంది మద్యానికి బానిస కావడం లేదు. నిషేధించిన తర్వాత గ్రామంలో గొడవలు సద్దుమణిగి ప్రశాంతత నెలకొంది. – గొంది లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ -
విజయానికి చిహ్నంగా..
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. రామదాసు కాలం నుంచి ఇలా ఆలయం తరఫున దసరా వేడుకలు జరపడం ఆనవాయితీ కాగా, ఈ వేడుకలకు దసరా మండపం వేదిక కానుంది. ఈ సందర్భంగా గురువారం శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామిని పల్లకీ సేవగా దసరా మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద శమీ, ఆయుధ పూజలు చేస్తారు. రావణాసుర వధగా జరిపే శ్రీ రామలీలా మహోత్సవానికి ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేడుక నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. నిజరూపంలో దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి.. తొమ్మిది రోజులుగా జరుగుతున్న శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నిజ రూపంలో దర్శనమిచ్చారు. మానవులకు అవసరమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించేందుకు అష్టలక్ష్మీ రూపాలను ధరించిన ఆదిలక్ష్మి, కరుణాస్వరూపమైన తన నిజరూపంలో దర్శనమిచ్చి అనుగ్రహిస్తుందంటూ అలంకరణ విశిష్టతను అర్చకులు వివరించారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చన, చిత్రకూట మండపంలో రామాయణ పారాయణం జరిగాయి. ఉదయం బేడా మండపంలో స్వామి వారి నిత్యకల్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇల్లెందు: దసరా వేడుకలకు ఇల్లెందులోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ ముస్తాబైంది. ఇక్కడ మైసూర్ను తలపించే రీతిలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక ఈ ఏడాది పాలపిట్ట ప్రత్యేకం కానుంది. ఇప్పటి వరకు పాల పిట్ట బొమ్మను మాత్రమే ఉంచేవారు. కానీ ఈ దఫా నిజమైన పాలపిట్ట ప్రత్యక్షంగా కనిపించనుందని ఉత్సవ కమిటీ ప్రకటించింది. నవరాత్రుల చివరి రోజున విజయ దశమి నాడు శమీ(జమ్మి) పూజ చేయటం సంప్రదాయం. శమీ వృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉందని ఆ దేవి మహిమతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని చెబుతారు. ఇక ఈ ఏడాది ఉత్సవాల్లో జోష్ నింపేలా సినీ, టీవీ నటులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని దసరా ఉత్సవ మండలి బాధ్యులు తెలిపారు.దసరా వేడుకలకు సర్వం సిద్ధం -
శాంతించిన గోదావరి
● కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక ● పంటలు దెబ్బతినడంతో రైతుల్లో ఆందోళన భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ దోబూచులాడుతున్న గోదావరి ప్రస్తుతం నెమ్మదిగా తగ్గుతూ బుధవారం రాత్రి 8 గంటలకు 44.5 అడుగులకు చేరింది. మంగళవారం సాయంత్రం 5గంటల వరకు పెరుగుతూ 50 అడుగులకు చేరిన నీటిమట్టం.. స్వల్పంగా తగ్గుతూ బుధవారం ఉదమం 7.27 నిమిషాలకు 47.9 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. గోదావరి నీటి మట్టం 43 అడుగుల దిగువకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా విరమించనున్నారు. గత రెండు రోజులుగా భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురంతో పాటు ఏపీలోని విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రాహదారులపై వరద నీరు నిల్వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే ఈ ప్రాంతాలకు రాకపోకలు పునః ప్రారంభం కానున్నాయి. పంటలకు నష్టమే.. రెండు నెలలుగా గోదావరి వరద ముంపునకు గురవుతున్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే వరుస అల్పపీడనాలతో కురుస్తున్న వర్షాలకు పత్తి పంట దెబ్బతిన్నది. ఇప్పుడు గోదావరి వరదలతో పరిస్థితి మరింతగా క్షీణించింది. పత్తితో పాటు వరి పంటపై కూడా రైతులు ఆశలు వదులుకున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
‘సేంద్రియ’ కూరగాయలే వినియోగించాలి
పాల్వంచరూరల్ : అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలని, తద్వారా సేంద్రియ ఎరువులు వినియోగించి కూరగాయలు, ఆకుకూరలను పండించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ఆయా కేంద్రాలకు వచ్చే గర్భిణులు, చిన్నారులకు వాటినే పోషకాహారంగా అందించాలని అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. మండల పరిధిలోని తోగ్గూడెం తండా అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సాక్ష్యం అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా పోషణ్ వాటిక ద్వారా చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. తక్కువ స్థలంలో పందిళ్ల ద్వారా ఎక్కువ కూరగాయలు పండించే అవకాశం ఉందన్నారు. పశువుల ఎరువులను మాత్రమే వినియోగించి ఆకుకూరలు, కూరగాయలు పండించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు ప్రతీ రోజు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి భోజనాలు చేస్తున్నారా, చిన్నారులు బాలామృతాన్ని ఇష్టంగా తింటున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు.. తండాలోని ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని, అర్హత కలిగిన కొంత మంది గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, గతంలో మంజూరై రద్దయిన లబ్ధిదారులకు తిరిగి ఇళ్లు కేటాయించాలని స్థానికులు కలెక్టర్ను కోరారు. కొందరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు రాలేదని, మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ముగిసిన తర్వాత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, ఎంపీఓ చెన్నకేశవులు, ఏపీఓ పొరండ్ల రంగా తదితరులు పాల్గొన్నారు. -
నిండు కుండలా కిన్నెరసాని
ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత పాల్వంచరూరల్: కిన్నెరసాని జలాశయం నీటిమట్టం పూర్తిస్థియిలో నిండి నిండుకుండను తలపిస్తోంది. ఈ ఏడాదిలో రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండటం ఇదే ప్రథమం. ఎగువన కురిసిన వర్షానికి 1,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో రిజర్వాయర్లో నీటిమట్టం బుధవారం రాత్రికి 407 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లను ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు డ్యామ్సైడ్ పర్యవేక్షక ఇంజనీర్ తెలిపారు. గాయపడిన వ్యక్తి మృతి మణుగూరుటౌన్: సింగరేణిలోని ఓబీ కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేస్తున్న కంచర్ల ప్రవీణ్ గత నెల 26వ తేదీన ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొని తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. తలకు బలమైన గాయం కావడంతో ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..దుమ్ముగూడెం: మండలంలోని గౌరారం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఉయిక రమేశ్ (30) మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గొల్లపల్లి సమీపంలోని సింగారం గ్రామానికి చెందిన రమేశ్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చాడు. గౌరారం శివారులో బైక్ అదుపుతప్పి కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. టిప్పర్ ఢీకొని వ్యక్తికి గాయాలు మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా నుంచి బీటీపీఎస్కు బొగ్గు తరలించే టిప్పర్ బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విప్పలసింగారానికి చెందిన గోవర్దన్ ఇంటి నుంచి సెంటర్కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ఓసీ–4 వైపు నుంచి టిప్పర్ లోడ్తో బీటీపీఎస్కు వెళ్తోంది. జీఎం కార్యాలయం దాటిన తర్వాత మూలమలుపు వద్ద బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. గోవర్దన్ గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానికులు టిప్పర్ల వేగాన్ని నియంత్రించాలని ఆందోళన చేపట్టారు. సింగరేణి సెక్యూరిటీ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
అంతగా గుర్తించరని..
భద్రాచలంఅర్బన్: పండగలు వస్తే చాలు భద్రాచలంతో పాటు జిల్లాలో కొందరు వ్యాపారులు నకిలీ సరుకులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పప్పు, పాలు, పసుపు, పిండి, నూనె, కారం లేనిదే రోజు గడవదు. ఇక పండగలు అంటే చెప్పనవసరం లేదు. ఇక దసరా వచ్చిందంటే రకరకాల వంటకాలతో ప్రతి ఇల్లు ఘుమఘుమలాడుతుంది. అయితే, వాటి మాటునే కల్తీ ప్రమాదమూ పొంచి ఉండే అవకాశం ఉంది. వినియోగదారుల అవసరాలను ఆసరా చేసుకొని కొందరు వ్యాపారులు కల్తీ ఆహార పదార్థాలను అంటగడుతుంటారు. కొన్ని జాగ్రత్తలతో కల్తీ పదార్థాలను కనిపెట్టొచ్చంటున్నారు నిపుణులు. పప్పును గుర్తించండి ఇలా.. వినియోగదారుల కళ్లు మెరిసేలా కొందరు వ్యాపారులు కంది, పెసర, మినుము లాంటి పప్పు దినుసులకు నూనె పూస్తుంటారు. కేసరి పప్పునకు మొటానిల్ ఎల్లో రంగు కలుపుతుంటారు. కేసరి పప్పును భూతద్దం సాయంతో గుర్తించవచ్చు. పరీక్ష నాళికలో కొద్దిగా పప్పును తీసుకొని నీటిని కలపాలి. వాటికి 5 మి.లీ గాడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపి 10 నిమిషాల తర్వాత పరిశీలిస్తే గులాబీ రంగులోకి మారితే అది కల్తీ అయినట్లు లెక్క. అయితే తెల్లగా ఉండే గోధుమ పిండిలో గంజి పొడి, బియ్య ం పిండి కలిపే ప్రమాదముంది. దీన్ని గుర్తించాలంటే కొద్దిగా గోధుమ పిండిని పరీక్ష నాళికలో తీసుకొని 5 మి.లీ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపితే దట్టమైన పొగలు వస్తున్నాయంటే అది కల్తీ అయినట్లే. అంతేకాకుండా మిరప పొడిలో ఎరుపురంగు ఇటుక పొడి వంటి వాటిని ఉపయోగించి కల్తీ చేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతూ ప్రజలు తినే ఆహార పదార్థాల్లో హానికరమైన వస్తువులను కలిపి కల్తీ చేస్తున్నారు. మేము తనిఖీలు చేపట్టిన సమయంలో పట్టుబడితే అధికంగా జరిమానా విధిస్తాం. ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే విధంగా విక్రయిస్తూ పట్టుబడితే కోర్టులో శిక్షపడే విధంగా చర్యలు తీసుకుంటాం. –కిరణ్కుమార్, జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి -
● వేడుక చూడాలంటే పెద్దమ్మగుడికి వెళ్లాల్సిందే..
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయం దసరా వేడుకలకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతాయి. చివరి రోజున దసరాను పురస్కరించుకుని శమీ పూజ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ పూజలు వీక్షించడానికి తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, గతేడాది ఉత్సవాల నిర్వహణకు రూ.10 లక్షల మేర వెచ్చించగా, ఈ సారి కూడా అంతే మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. నవరాత్రి మహోత్సవాల చివరి రోజైన గురువారం.. పెద్దమ్మతల్లి ఆలయం ఎదుట గల జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకోసం విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ రజినీకుమారి వెల్లడించారు. -
మతిస్థిమితం లేని యువకుడు అదృశ్యం
ములకలపల్లి: మతిస్థిమితం లేని యువకుడు కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మధుప్రసాద్ కథనం మేరకు.. అశ్వారావుపేట మండలానికి చెందిన సోడే జోగారావు ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడగా మతిస్థిమితం సరిగా ఉండడం లేదు. మండలంలోని రాజాపురంలోని బంధువులైన కారం బాబు ఇంటికి నాటుమందుల కోసం వచ్చాడు. శనివారం బాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిన జోగారావు తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో జోగారావు తండ్రి సోడియం దేవయ్య బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భద్రాచలంలో మహిళ..భద్రాచలంఅర్బన్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మహిళ కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఆదర్శ్నగర్ కాలనీకి చెందిన రామచందర్రావు భార్య మద్ది సాయిషా(35) గత నెల 28న ఇంట్లో నుంచి బయ టకు వెళ్లి తిరిగిరాలేదు. ఎక్కడా వెతినికా ఆచూకీ లభించలేదు. కుటుంబ సమస్యల కారణంగా మన స్తాపంతో ఇంట్లో నుంచి వెళ్లి ఉండవచ్చని బుధ వారం ఆమె భర్త ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
● సందడే సందడి..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఒక రోజు ముందే దసరా సందడి నెలకొంది. పండుగకు స్వగ్రామాలకు వచ్చే వారితో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. కార్లు, ద్విచక్ర వాహనాలకు ఆఫర్లు ప్రకటించగా వాటి కొనుగోలుకు పలువురు ఆసక్తి కనబరస్తున్నారు. ఇక వస్త్ర దుకాణాల వారు సైతం వినియోగదారులను ఆకట్టుకునేలా రూ.3 వేలు, ఆపైన కొనుగోలు చేస్తే సిల్వర్ కాయిన్, మరికొన్ని దుకాణాల వారు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు బహుమతులు ప్రకటించగా అమ్మకాలు జోరందుకున్నాయి. ఆఫర్లతో టీవీ, మొబైల్ ఫోన్లు, ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్లు కొనుగోళ్లకు పలువురు ముందుకొస్తున్నారు. గాంధీజయంతి, దసరా ఒకేరోజు రావడంతో మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. గురువారం రోజున మాంసం అమ్మినా, రెస్టారెంట్లలోనూ మాంసాహారం వడ్డించినా చర్యలు తప్పవని కార్పొరేషన్ కమిషనర్ సుజాత హెచ్చరించారు. దీంతో ఎక్కువ మంది బుధవారమే మద్యం, మాంసం కొనుగోలు చేయగా ఆయా దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. -
శ్రీ మహిషాసురమర్దినిగా పెద్దమ్మతల్లి
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారు.. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీహోమం, లక్షకుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. కాగా, విజయదశమి పండుగ రోజైన గురువారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనం ఇవ్వనున్నారు.కాంట్రాక్ట్ కార్మికుల ఖాతాల్లో బోనస్సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ వారి ఖాతాల్లో జమ చేశారు. ‘కార్మికులకు అందని లాభాల వాటా’ శీర్షికన మంగళవారం సాక్షిలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆర్జించిన లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 చొప్పున ప్రకటించినా.. కాంట్రాక్టర్లు వారికి విధించే జీఎస్టీ, ఇన్కమ్ టాక్స్ను కూడా కలిపి పేమెంట్ చేస్తేనే కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా చెల్లిస్తామని భీష్మించారు. దీంతో స్పందించిన యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో కాంట్రాక్టర్లు కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఇదిలా ఉండగా సివిల్ విభాగంలో 80 శాతం చెల్లించగా, కార్పొరేట్ ఆస్పత్రి, మరికొన్ని విభాగాలతో పాటు, ఇల్లెందు ఏరియాలో అసలే బోనస్ జమ కాలేదు. కార్మికుల వివరాలను కాంట్రాక్టర్లు యాజమాన్యానికి సమర్పించనందున లాభాల బోనస్ నిలిచిపోయిసట్లు సమాచారం. నేటి నుంచి వన్యప్రాణి వారోత్సవాలుపాల్వంచరూరల్ : వన్యప్రాణి వారోత్సవాలు గురువారం నుంచి ఈనెల 10 వరకు నిర్వహించనున్నట్లు వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ కేంద్రంతో పాటు కిన్నెరసానిలో ప్రదర్శనలు నిర్వహిస్తామని, ఏజెన్సీ గ్రామాల్లో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. డీపీఓగా బాధ్యతల స్వీకరణచుంచుపల్లి: జిల్లా పంచాయతీ అధికారిగా టి.రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ డీపీఓగా పనిచేసిన వి.చంద్రమౌళి గత నెల 30న ఉద్యోగ విరమణ పొందగా ఖమ్మంలో డీఎల్పీఓగా పనిచేస్తున్న రాంబాబును డీపీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టగా కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ఆది కర్మయోగి అభియాన్’ను అమలు చేయాలి భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద గిరిజన గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకరిచాలని సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ విభునాయర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం వీడియో, టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలవారీగా ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలుపై అధికారులతో సమీక్షించారు. మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలతోపాటు ప్రతి గ్రామ పంచాయతీలో ఆదిశైవా కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని వెబ్సైట్లో పొందుపరచాలని సూచించారు. గ్రామంలోని సమస్యలతో పాటు ఇంటింటికీ తిరిగి, కుటుంబాల సమస్యలను తెలుసుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కాగా, పథకంలో భాగంగా ఐటీడీఏ పరిధిలోని 19 మండలాల్లో 130 గ్రామ పంచాయతీల్లో ప్రణాళికలు రూపొందించి పోర్టల్లో పొందుపరిచామని ఏపీఓ డేవిడ్రాజ్ తెలిపారు. కార్యక్రమంలో సున్నం రాంబాబు, సిబ్బంది కార్తీక్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో బుధవారం సిల్వర్ జూబ్లీ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1985లో టెలీ కమ్యూనికేషన్ కింద టెలికాం సర్వీసెస్, టెలికాం ఆపరేషన్లుగా రెండు విభాగాలు ఉండేవని, 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం టెలికాం సేవలను కార్పొరేట్ రూపంలోకి మార్చాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శివరాంజీ, సక్రు, షకీల్, సందీప్, లాలూ నాయక్, బాలకృష్ణ, రామరాజు, సాయికిరణ్, సైదులు, మాన్సింగ్, జైపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నూర్ మహమ్మద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కొబ్బరికాయ ధరలకు రెక్కలు
ఖమ్మంగాంధీచౌక్: కొబ్బరికాయల ధరలకు రెక్కలొచ్చాయి. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం, దసరా సమీపించిన నేపథ్యాన కొబ్బరి కాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రాంతాలు, కాయ సైజు ఆధారంగా ఒక్కో కొబ్బరికాయను రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. కార్పొరేట్ మాల్స్లో రూ.40 చొప్పున విక్రయిస్తుండగా, రిటైల్ దుకాణాల్లో రూ.45, గ్రామాల్లో రూ.50కి అమ్ముతున్నారు. అంతేకాక ఆలయాల వద్ద ఈ ధరలు మరింత ఎక్కువ ఉంటున్నాయి. నిన్నామొన్నటి వరకు వినియక చవితి ఉత్సవాలు సాగగా, ప్రస్తుతం శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం.. మరోపక్క భక్తులు భవానీ దీక్ష, అయ్యప్ప దీక్ష ధరిస్తుండడంతో కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది. ఏపీలోని గోదావరి జిల్లాలు, కేరళ రాష్ట్రం నుంచి ఖమ్మంలోని హోల్సేల్ వ్యాపారులు దిగుమతి చేసుకుని సైజు ఆధారంగా గ్రేడింగ్ అనంతరం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. దిగుబడి తగ్గడంతో.. కొబ్బరి పంట దిగుబడి ఆశించిన మేర లేకపోవడంతోనే డిమాండ్ పెరిగిందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు ఆద్యాత్మిక కార్యక్రమాల్లో వినియోగం పెరగడం ఇంకో కారణంగా చెబుతున్నారు. గోదావరి జిల్లాలు, కేరళ రాష్ట్రానికిఆర్డర్ చేసినా సమయానికి రావడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. పండుగ వేళ రూ.40కి పైగానే విక్రయం -
ఎన్నికల నిర్వహణ ఎలా ?
● స్థానిక పోరుకు నిధుల కొరత ● ఒక్కో మండలానికి రూ.2 లక్షల వ్యయం ● ఆర్థికభారంతో అధికారుల సతమతం ● ప్రత్యేక గ్రాంట్ కోసం ఎదురుచూపులుచుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా.. నిధులు అందుబాటులో లేక అయోమయంలో పడ్డారు. ఎన్నికల ఏర్పాట్లకు ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయలేదు. ఈ క్రమంలో ఈనెల 23, 27 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రెండు విడతలు, 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం ఎలా అని సందిగ్ధం వారిలో నెలకొంది. ఇప్పటికే ఓటర్ల జాబితాల రూపకల్పన నుంచి పోలింగ్ సామగ్రి, రవాణా ఖర్చులు చాలా అయ్యాయని వాపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా గ్రాంట్ రాకుంటే ఎలా అని తల పట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు తెచ్చి మరీ ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి రూ.2 లక్షలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదట జిల్లాలో 22 జెడ్పీటీసీలు, 233 ఎంపీటీసీలకు రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులకు మూడు విడతల్లో పోలింగ్ను నిర్వహించనున్నారు. మండలాలకు, గ్రామపంచాయతీలకు ఎన్నికల సామగ్రిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమకూర్చినా, మిగిలిన స్టేషనరీ, ఎన్నికల సామగ్రి రవాణ, సమావేశ బ్యానర్లు, బ్యాలెట్ బాక్సుల మరమ్మతులు, జిరాక్సులు, హమాలీ ఖర్చులు, సిబ్బందికి శిక్షణ, స్నాక్స్, భోజనాలు తదితర ఖర్చుల భారమంతా మండల, జిల్లా అధికారులపైనే పడుతోంది. ఈ అవసరాల కోసం నిధులు లేకపోవడంతో స్థానికంగా ఉన్న స్టేషనరీ దుకాణాల్లో అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఏ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు పడ్డ దాఖలాలు లేవని అధికారులు అంటున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా మంజూరు చేయకపోవడంతో ఏర్పాట్లు భారమయ్యేలా ఉందని, ఇప్పటికే పలు మండలాల్లో ఎన్నికల వ్యయం రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు చేరుకుందని చెబుతున్నారు. అటు పంచాయతీల్లోనూ కార్యదర్శులు రూ.లక్ష వరకు ముందస్తు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఇక గతేడాది ఫిబ్రవరి 2 నుంచి పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతుండగా, ఇదే తరహాలో గతేడాది ఆగస్టు నుంచి జిల్లా, మండల పరిషత్లలో స్పెషలాఫీసర్లు పాలన నడుస్తోంది. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సైతం సక్రమంగా విడుదల కాకపోవడంతో పంచాయతీలు, మండల పరిషత్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. విధి లేని పరిస్థితుల్లో స్పెషలాఫీసర్లు, కార్యదర్శులు సొంత నిధులతో పల్లెల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో ఆ సమస్య మరింత తీవ్రం కానుంది. ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ వచ్చే నాటికై నా ప్రత్యేక ఎన్నికల గ్రాంట్ విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు. -
పొలాలు ఎడారి..
పక్కన గోదారి..అశ్వాపురం: అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో దుమ్ముగూడెం ఆనకట్ట సమీపంలో ఉన్న కుమ్మరిగూడెం ఎత్తిపోతల పథకం సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనుల కారణంగా కాపర్ డ్యాం వల్ల నిరుపయోగంగా మారడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మించిన సమయంలో వేయి ఎకరాలు సాగయ్యేది. భారజల కర్మాగారం, సీతారామ ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పథకంతో భూములు పోగా ప్రస్తుతం 100 ఎకరాలు సాగవుతోంది. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారడంతో రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఎత్తిపోతల పథకానికి, సీతారామ ప్రాజెక్ట్ కెనాల్కు మధ్యలో గోదావరికి అడ్డుగా కాపర్ డ్యాం నిర్మించడంతో ఇసుక మేటలతో ఎత్తిపోతల పథకం వద్ద నీరు లేక పొలాలకు నీరు అందడం లేదు. పక్కనే గోదావరి ఉన్నా నీరు రాక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా పొలాలకు నీరు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను రైతులు ఎంతో కాలంగా కోరుతున్నారు. ప్రాజెక్ట్లు, పరిశ్రమలకు ప్రజా అవసరాలకు వేయి ఎకరాల తమ భూములు ఇచ్చినా వంద ఎకరాలకు సాగునీరు అందించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకం ద్వారా పొలాలకు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు. నిరుపయోగంగా ఎత్తిపోతల పథకం సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనుల్లో ఎత్తిపోతల పథకం పైపులైన్ ధ్వంసమైంది. ఎత్తిపోతల పథకం ద్వారా పొలాలకు నీరు వచ్చేందుకు రూ.కోట్లతో ప్రత్యేకంగా వంతెన నిర్మించి పైపులైన్ ఏర్పాటు చేశారు. అయితే, సరైన నీరు నిల్వ లేకపోవడంతో మోటార్ల ద్వారా నీరు ఎత్తిపోసేందుకు అవకాశం లేకుండాపోయింది. అక్కడ నీటి నిల్వలు లేకపోతే కోట్ల రూపాయల వ్యయంతో పైపులైన్ నిర్మించినా నిరుపయోగంగా మారే అవకాశం ఉంది. దీంతో నిధులు దుర్వినియోగం చేశారని రైతులు పేర్కొంటున్నారు. అసలు నీరు రానప్పుడు పైప్లైన్ ఏర్పాటు చేసి లాభమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. కుమ్మరిగూడెం లిఫ్ట్ కింద 100 ఎకరాలు సాగవుతోంది. సీతారామ ప్రాజెక్ట్ కట్ట వల్ల లిఫ్ట్ ద్వారా పొలాలకు నీరు రావడం లేదు. అధికారులకు విన్నవించాం. అధికారులు స్పందించి లిఫ్ట్ ద్వారా పొలాలకు నీరు ఇవ్వాలి. –ఇమ్మడి అర్జయ్య, రైతు, కుమ్మరిగూడెం కుమ్మరిగూడెం లిఫ్ట్ పాత పైపులైన్ సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనుల్లో పోయింది. ప్రత్యేకంగా వంతెనపై పైపులైన్ నిర్మించారు. లిఫ్ట్ వద్ద కాపర్ డ్యాం వల్ల నీరు లేక పైపులైన్తో ఉపయోగం లేదు. ఇకనైనా లిఫ్ట్ ద్వారా పొలాలకు నీరు ఇవ్వాలి. –కణితి సుబ్బయ్య, రైతు, కుమ్మరిగూడెం -
శ్రీ దుర్గాదేవిగా పెద్దమ్మతల్లి
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో జరుగుతున్న శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు మంగళవారం శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీహోమం, లక్ష కుంకుమార్చన, శ్రీ అంజనేయస్వామికి ఆకుపూజ, శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కాలభైరవస్వామికి పంచామృతాభిషేకం గావించారు. ఐటీడీఏ డీడీగా అశోక్భద్రాచలం : భద్రాచలం ఐటీడీఏలోని విద్యాశాఖ విభాగంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీగా(పూర్తి అదనపు బాధ్యతలు) జి.అశోక్కు పీఓ రాహుల్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన మంగళవారం డీడీ మణెమ్మ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అశోక్ ప్రస్తుతం ఐటీడీఏలో ఏటీడీఓగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన అశోక్కు కార్యాలయ సిబ్బంది అభినందనలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీడీఏలో విద్యా రంగ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి సింగరేణి(కొత్తగూడెం): సైబర్ నేరాల పట్ల సింగరేణి ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ ఎన్.బలరామ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. కార్మికులకు దసరా అడ్వాన్స్, లాభాల బోనస్ను వారి ఖాతాల్లో జమ చేశామని, త్వరలో దీపావళి బోనస్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తారని, అలాంటి వారి మాటలు నమ్మి అకౌంట్ నంబర్లు, ఓటీపీలు చెప్పొద్దని కోరారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో షేర్ హోల్డర్ల సమావేశం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ ఎన్.బలరామ్ అధ్యక్షతన మంగళవారం కంపెనీ షేర్ హోల్డర్ల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలు, వ్యయం, నూతన ప్రాజెక్టులు, షేర్ హోల్డర్లకు డివిడెంట్ల కేటాయింపు, సీఎస్సార్ నిధుల కేటాయింపుపై చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్రాజెక్ట్లకు అనుమతుల సాధన తదితర అంశాలపై చర్చించి, తీర్మానం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో షేర్ హోల్డర్లు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, కోలిండియా ప్రతినిధులు, సింగరేణి డైరెక్టర్లు పాల్గొన్నారు. -
అనుమతులు లేని ఇసుక సీజ్
అశ్వాపురం: మండలంలోని చింతిరాల క్రాస్రోడ్డు సమీపంలో ఎలాంటి అనుమతులు లేని ఇసుక డంపును తహసీల్దార్ మణిధర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆర్ఐ లీలావతి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆవులు తరలిస్తున్న వాహనం పట్టివేత అశ్వారావుపేటరూరల్: అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఆర్టీఏ చెక్పోస్టు వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఏపీలోని తుని వారపు సంత నుంచి అనుమతులు లేకాండా అశోక్ లేల్యాండ్ వాహనంలో 46 ఆవులను హైదరాబాద్లోని తుక్కుగూడ వద్ద కబేళాకు తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. అనంతరం ఆవులను తరలిస్తున్న వ్యక్తితోపాటు వాహన డ్రైవర్పై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి, ఆవులను పాల్వంచలోని గోశాలకు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఓబీ కంపెనీ ప్రతినిధికి దేహశుద్ధి..! మణుగూరుటౌన్: ఏరియాలోని ఎంఎన్జీఓసీలో ఓబీ పనులు దక్కించుకున్న ఓ కంపెనీ వ్యవహారాలు చూసుకునే ప్రతినిధికి దేహశుద్ధి జరిగిన ఘటన మణుగూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఓబీ కంపెనీలో పనులు నిర్వహించే ఓ మహిళ పట్ల సదరు వ్యక్తి కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపులు తాళలేక మహిళ వారి కుటుంబ సభ్యులకు తెలపగా, వారు కంపెనీ ప్రతినిధికి దేహశుద్ధి చేశారు. ఈ విషయమై సింగరేణి అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్ని ంచగా, తమ దృష్టికి రాలేదని తెలిపారు. -
మహిళా ప్రయాణికురాలి హల్చల్
చుంచుపల్లి: ఆధార్ అనుమతి లేని డీలక్స్ బస్కెక్కిన మహిళా ప్రయాణికురాలు హల్చల్ చేసిన ఘటన మంగళవారం కొత్తగూడెం బాబూక్యాంపు వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సును కొత్తగూడెంలో శేషగిరినగర్కు చెందిన బోయ చిట్టి ఎక్కింది. బస్సు బాబూక్యాంపు వద్దకు రాగానే కండక్టర్ ఆమెను టికెట్ తీసుకోవాలని కోరారు. ఆమె తన ఆధార్ కార్డును చూపించగా, ఈ బస్సులో ఆధార్ కార్డు చెల్లదని కండక్డర్ సూచించాడు. దీంతో అప్పటికే మద్యం సేవించి ఉన్న ఆమె కండక్టర్తో ఎందుకు ఆధార్ చెల్లదంటూ వాగ్వాదానికి దిగింది. బస్సు లోని ప్రయాణికులు, డ్రైవర్ సైతం ఆధార్ చెల్లదని ఎంత చెప్పినా ఆమె వినకుండా గొడవ చేస్తూ దిగి బస్సు ముందు అడ్డంగా పడుకొని కొంతసేపు హల్చల్ చేసింది. స్థానికులు చుంచుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమైపె కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవి తెలిపారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఇంటిపై సోలార్ విద్యుత్ ప్లేట్లు అమర్చుతుండగా ఘటన ఇల్లెందు: పట్టణంలోని జగదాంబసెంటర్లో ఓ ఇంటిపై సోలార్ విద్యుత్ కోసం ప్లేట్లు అమర్చే క్రమంలో 11 కేవీ విద్యుత్ వైర్లకు తన చేతిలోని ఐరన్ ప్యానల్ తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఆంబజార్లో నివాసం ఉంటున్న రామాంజనేయులు (48) సోలార్ విద్యుత్ ఏజెన్సీ నడుపుతున్నాడు. మంగళవారం జగదాంబసెంటర్లో ఓ ఇంటిపై సోలార్ ప్లేట్లు అమర్చుతుండగా తన చేతిలోని ఐరన్ ప్యానల్ ఇంటిపైన ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్కు తగిలింది. విద్యుదాఘాతంతో రామాంజనేయులు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు కుమారులున్నారు. భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు సీఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్కర్లు రాకపోవడంతో.. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన రామాంజనేయులు ఇల్లెందులో సోలార్ ఏజెన్సీ నడుపుతున్నాడు. దసరా పండుగ సమీస్తుండటంతో వర్కర్లు ఎవరూ రాలేదు. దీంతో తానే స్వయంగా సోలార్ ప్యానెళ్లు అమర్చేందుకు వచ్చి మృత్యువాత పడటంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
అవగాహన సదస్సులో ఏపీఓ జనరల్
భద్రాచలం: హిమాచల్ ప్రదేశ్లో జరిగిన నిషేధిత మత్తు పదార్థాలపై అవగాహన సదస్సుకు భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ పాల్గొన్నారు. శిక్షణ అనంతరం భద్రాచలం వచ్చిన ఆయన.. మంగళవారం వివరాలు వెల్లడించారు. గిరిజన యువత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహన కల్పించారని, రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణ అధికారి నిఖిల, తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రతిపాదన మేరకు సదస్సులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. త్వరలో మారుమూల ఆదివాసీ గ్రామాల్లో యువకులకు ప్రత్యేక శిక్షణ అందించి ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. హిమాచల్ప్రదేశ్ వెళ్లి వచ్చిన డేవిడ్రాజ్ -
205 కేజీల గంజాయి పట్టివేత
బూర్గంపాడు: అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని మండలంలోని మోరంపల్లిబంజర వద్ద సోమవారం ఎస్ఐ ప్రసాద్ పట్టుకున్నారు. మంగళవారం పాల్వంచ సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు. హరియాణాలోని కురుక్షేత్రకు చెందిన కారుడ్రైవర్ సంజీవకుమార్ తన ఓనర్ ప్రిన్స్కుమార్ ఆదేశాల మేరకు చింతూరుకు వచ్చి, ప్రధాన్ కారా, లఖన్ హంతాల్ వద్ద 205 కేజీల గంజాయి కొనుగోలు చేశాడు. దానిని తన రాష్ట్రానికి తరలిస్తూ మార్గమధ్యలో మోరంపల్లిబంజర వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని, కారును స్వాధీనం చేసుకుని కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ రవాణాకు సంబంధించి కారు ఓనర్ ప్రిన్స్కుమార్, గంజాయి అమ్మిన ప్రధాన్ కారా, లఖన్ హంతాల్పై కేసు నమోదు చేశామని, సంజీవకుమార్ను అరెస్ట్ చేశామని సీఐ వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1.02 కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఒకరు అరెస్ట్, ముగ్గురిపై కేసు -
మున్సిపల్ కమిషనర్గా సింగరేణి ఉద్యోగి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో మేనేజ్మెంట్ ట్రెయినీ వెల్ఫేర్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న కొయ్యాడ ఉదయ్కుమార్ ఇటీవల వెల్లడైన గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–2గా ఎంపికయ్యారు. ఆయన గతేడాది సింగరేణి ఉద్యోగానికి ఎంపిక కాగా విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్–1కు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఉదయ్ను సీఎండీ ఎన్.బలరామ్, డైరెక్టర్, జీఎం వెల్ఫేర్ కిరణ్కుమార్ అభినందించారు. కాగా, ఉదయ్కుమార్ తమ్ముడు ప్రణయ్కుమార్ 2023లో ఐఏఎస్గా ఎంపికై నారాయణపేట జిల్లాలో ట్రెయినీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన ప్రభాకర్ – లక్ష్మి దంపతుల పెద్దకుమారుడు ఉదయ్ మున్సిపల్ కమిననర్గా, రెండో కుమారుడు ఐఏఎస్కు ఎంపిక కాగా చిన్నకుమారుడు పృథ్వీకుమార్ ఎల్ఎల్బీ పూర్తిచేశారు. అయితే, ఎంబీఏ చదివిన ఉదయ్ తన లక్ష్యం ఐఏఎస్ సాధించడమేనని తెలిపారు. ఇల్లెందు ఉద్యోగికి గ్రూప్–2 ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియా అకౌంట్ ఆఫీసర్ కొమ్ము మురళి గ్రూపు–2 ఉద్యోగానికి ఎంపికయ్యారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామానికి చెందిన ఆయన సింగరేణిలో ఉద్యోగం చేస్తూనే గ్రూపు–2 రాసి 139వ ర్యాంకు సాధించారు. తెలంగాణ సెక్రటేరియట్లోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఏఎస్ఓగా పోస్టింగ్ లభించింది. -
రెండో ప్రమాద హెచ్చరిక దాటి..
భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగగా, మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు 48 అడుగులకు చేరడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత గంటగంటకూ పెరుగుతూ మంగళవారం సాయంత్రం 5 గంటలకు 50 అడుగులకు చేరింది. దీంతో అధికారుల అప్రమత్తమై నాలుగు చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద తీవ్రత ఇంకా పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిలిచిన రాకపోకలు.. భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దసరా ఉత్సవాల నేపథ్యంలో భద్రాచలం వచ్చే భక్తులు స్నానాల కోసం గోదావరిలోకి దిగకుండా ఇనుప కంచె, ప్రమాద హెచ్చరిక ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు నీటిమట్టం 50 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అయితే ఎగువన పేరూరు వద్ద గోదావరి ప్రవాహం కొంతమేర తగ్గిందని, ఈ క్రమంలో భద్రాచలంలో కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, రాత్రి 10 గంటలకు 49.70 అడుగులుగా నమోదైంది. ముంపు బారిన పంటలు.. గోదావరి నీటిమట్టం పెరుగుతుండడంతో పరీవాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. వారికి అక్టోబర్ ఎంతో విలువైంది. ఈ నెలలోనే పత్తి, వరి పంటలకు పాట్లు చేయడం సహా మిర్చి సాగు పనులు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వరద నీటితో పంటలు, మిర్చి సాగు చేసే భూములు ముంపునకు గురికావడంతో దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. వరి, పత్తి రైతులకు ఈ వరదలు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, ఆశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరుతో పాటు ఏపీలోని పలు మండలాల్లో ఇప్పటికే పంటలు ముంపనకు గురయ్యాయి. వరదనీటిలో కొత్తపల్లి – దండుపేట రహదారి చర్ల: గోదావరి వరద దోబూచులాడుతోంది. వరద వచ్చినప్పుడల్లా పంటలతో పాటు ప్రధాన రహదారులను ముంచెత్తుతుండగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాజాగా రెండు రోజుల నుంచి గోదావరి వరద పెరుగుతుండగా గుంపెన్నగూడెం, దండుపేట, తేగడ, ఆంజనేయపురం, కుదునూరు, దేవరాపల్లి తదితర గ్రామాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. ఇప్పటికే పలుమార్లు నీట మునిగిన పంటలు మళ్లీ ముంపునకు గురి కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదల నేపథ్యంలో రవాణాకూ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మండలంలోని దండుపేట – కొత్తపల్లి రహదారి నీటమునిగింది. తేగడలోని తాలిపేరు హైలెవల్ వంతెన వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట సూచించారు. గోదావరి వరద ఉధృతిని మంగళవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. స్నానాల కోసం ఎవరూ గోదావరిలోకి దిగవద్దని, అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే భద్రాచలం సబ్ కలెక్టరేట్లోని 08743–232444, కంట్రోల్ రూమ్ నంబర్ 7981219425, ఐడీఓసీలోని 08744–241950, ఐటీడీఏ కార్యాలయంలోని 79952 68352 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
అభివృద్ధికి సహకరించండి..
సింగరేణి(కొత్తగూడెం): రామవరం, రుద్రంపూర్ ప్రాంతాల్లో మాజీ కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లను వారికే కేటాయించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మంగళవారం రాత్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ బలరాంను ఆయన చాంబర్లో కలిశారు. పట్టణం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు సింగరేణి సంస్థ సహకరించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్కు నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్మిక వాడలు, ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు కనీస వసతుల కల్పనలో యాజమాన్యం చొరవ చూపాలన్నారు. ఎమ్మెల్యే వెంట ఎస్కే సాబీర్పాషా, వంగా వెంకట్, రమణమూర్తి తదితరులు ఉన్నారు. -
శాంతించిన తాలిపేరు
చర్ల: ఎగువ ప్రాంతం నుంచి వరదనీటి రాక తగ్గుముఖం పట్టడంతో తాలిపేరు శాంతిస్తోంది. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరదనీరు రావడంతో 40 వేల క్యూసెక్కుల వరకు వరదనీటిని అధికారులు విడుదల చేశారు. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టగా ప్రాజెక్టు గేట్లను మూశారు. కేవలం కేవలం మూడు గేట్లను మాత్రమే ఎత్తి ఉంచి 4,070 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. టికెట్ల ధరల పెంపు తగదు భద్రాచలంటౌన్ : ఓజీ సినిమా టికెట్ ధరలు పెంచొద్దని హైకోర్టు స్టే ఇచ్చినా భద్రాచలంలోని ఏషియన్ ఉదయ్భాస్కర్ థియేటర్ యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. టికెట్ ధరలు రూ.275, రూ.250, రూ.200, రూ.105 ఉండగా, అదనంగా రూ.500, రూ.1000 వరకు వసూ లు చేస్తున్నారని, అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఈ నెల 6వ తేదీ వరకు విచారణ జరిపించాలని, లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. రైతులకు భోజన సదుపాయం పాల్వంచ: పాల్వంచలోని కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయానికి యూరియా కోసం వచ్చే రైతులకు సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేశ్ ఆధ్వర్యాన భోజన వసతి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కూడా రైతులకు భోజనం సమకూర్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుండడంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని కనకేశ్ తెలిపారు. కార్యక్రమంలో కిరణ్, ప్రసాద్, రాఘవేంద్ర, శోభన్, అవోక్, వెంకటేశ్వర్లు, అరుణ్, నవీన్, మురళీ మోహన్, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మణుగూరుటౌన్: పీవీకాలనీలోని భద్రాద్రి స్టేడియంలో నిర్వహించే దసరా సంబరాల వేడుకలకు ప్రాంగణంలో స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని డీజీఎం పర్సనల్ రమేశ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తు స్థానిక జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్మెంట్లో అందజేయాలని పేర్కొన్నారు. తెగుళ్ల నివారణపై రైతులకు అవగాహన వైరా: చింతకాని మండలంలోని కొదుమూరులో పలువురు రైతులు సాగుచేసిన వరి, పత్తి పంటలను మధిర వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు మంగళవారం పరిశీలించారు. వరుస వర్షాలతో పంటలను తెగుళ్లు ఆశించిన పరిశీలించిన వారు యాజ మాన్య పద్ధతులపై సూచనలు చేశారు. పత్తిలో వడ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను లీటర్ నీటిలో కలిపి మొక్క మొదళ్ల చుట్టూ పిచికారీ చేయాలని సూచించారు. అలాగే అల్బేరి యా, ఆకుమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులు, కా యకుళ్లు తెగులు నివారణ చర్యలను వివరించారు. అంతేకాక వరిలో ఆకుల మీద తుప్పు మచ్చలకు జింక్లోపం కారణమని నిర్ధారించారు. పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.రుక్మిణీదేవి, వైరా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.సుచరిత, శాస్త్రవేత్తలు కె.నాగస్వాతి, ఫణిశ్రీ పాల్గొన్నారు. బావిలో పడి వ్యక్తి మృతిఖమ్మంక్రైం: ఖమ్మంలోని ఓ దాల్మిల్లులో దినసరికూలీగా పనిచేస్తున్న వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు బావిలో పడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏపీలోని ఏలూరు లేదా హనుమాన్ జంక్షన్ పరి సర ప్రాంతాలకు చెందిన 60ఏళ్ల వ్యక్తి పేరు కృష్ణగా తెలుస్తోంది. ఆయనమంగళవారం దాల్మిల్లులో కూలీకి వెళ్లగా అక్కడి బావిలో కాలుజారి పడ్డాడు. దీంతో తోటి కూలీలు బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మతదేహన్ని ఖమ్మం ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చగా, ఆయన ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు సూచించారు. -
ఆశలు ఆవిరి!
బూర్గంపాడు: గోదావరి వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరీవాహక ప్రాంత రైతులు ఈ సీజన్లో ఇప్పటికే మూడుసార్లు నష్టపోగా.. మంగళవారం గోదావరి వరద నీటిమట్టం 50 అడుగులకు చేరడంతో వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆగస్టు నుంచి ఇప్పటివరకు మూడుసార్లు గోదావరికి వరదలు రావడంతో పత్తి, మిర్చి, అపరాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆలస్యంగా సాగు చేసినా.. భద్రాచలం డివిజన్లోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని గోదావరి పరీవాహక ప్రాంత రైతులకు వరదలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరదల నేపథ్యంలో ఆయా మండలాల రైతులు వానాకాలం పంటల సాగు కొంత ఆలస్యంగా ఆగస్టు 15 తర్వాతే ప్రారంభిస్తారు. ఈ ఏడాది అగస్టు 15 వరకు అంతగా వరదలు రాకపోవడంతో పత్తి, మిర్చి, అపరాలు, కూరగాయల పంటలు వేశారు. అయితే ఆ నెలాఖరులో వరదలు రావడం, గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరడంతో విత్తనాలు, మొలకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ పత్తి విత్తనాలు వేశారు. ఈ మొక్కలు మొలిచి ఏపుగా పెరుగుతున్న సమయంలో మరోసారి గోదావరి ముంచెత్తగా ఆ పంటలూ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో విత్తనాలు అందుబాటులో లేక కొందరు రైతులు పత్తి సాగుకు దూరంగా ఉండగా ఇంకొందరు మాత్రం దూర ప్రాంతాల నుంచి విత్తనాలు తెచ్చి సెప్టెంబర్ మూడో వారంలో వేశారు. ఆ గింజలు మొలిచి మొక్కలు ఎదుగుతున్న తరుణంలో గత రెండు, మూడు రోజులుగా గోదావరికి భారీగా వరద పెరిగింది. దీంతో ముచ్చటగా మూడోసారి పంట కూడా వరదార్పణమైంది. మిరపదీ అదే పరిస్థితి.. గోదావరి పరీవాహకంలో వరదలకు పత్తి దెబ్బతిన్నాక కొందరు రైతులు మిరప సాగు చేపట్టారు. ఈ పంటకు పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువైనా అదును దాటిపోతుందనే కారణంతో సాగు చేపట్టారు. తల్లాడ, వైరా తదితర ప్రాంతాల నుంచి మిరప నారు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుత వరదలతో ఈ పంట కూడా నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకొందరు మినుము, పెసర, కంది, కూరగాయల పంటలు సాగు చేయగా అవి కూడా మునగడంతో లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం చిరుపొట్ట దశలో ఉన్న వరి కూడా నీటమునిగితే దిగుబడి గణనీయంగా తగ్గుతుందని ఆందోళ చెందుతున్నారు. వరుసగా మూడుసార్లు వేసిన పంటలు వరదలకు నష్టపోవడంతో రైతులు ఈ ఏడాది వానాకాలం పంటను పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకుంటున్నారు. నవంబర్లో రెండో పంట వేసుకోవడమే మంచిదని అంటున్నారు. కొందరు రైతులు పత్తి, మిర్చికి బదులు యూకలిప్టస్, సుబాబుల్ వంటి పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు.గోదావరిని వీడని వరదలు గోదావరి వరదలతో ఇప్పటికి మూడుసార్లు వేసిన పత్తి దెబ్బతిన్నది. ఆగస్టు నుంచి ఇప్పటివరకు మూడు సార్లు వేయగా మొక్కలు ఎదుగుతున్న సమయంలోనే గోదావరి వరదలు వస్తున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చయింది. ఇప్పుడు మళ్లీ పత్తి వేద్దామన్న విత్తనాలు దొరకడం లేదు. – చెంచలపు రాములు, నాగినేనిప్రోలుఆగస్టు రెండో వారంలో వేసిన వరి ఇప్పటికి మూడుసార్లు నీట మునిగింది. వరదలొచ్చిన ప్రతీసారి తేరుకునేందుకు 15 రోజులు పడుతోంది. వరి నారు పోసి రెండునెలలైనా వరదల కారణంగా దుబ్బు చేయలేదు. ఈ ఏడాది ఎకరాకు పది బస్తాలు కూడా పండేలా లేదు. – యడమకంటి లింగారెడ్డి, రెడ్డిపాలెం -
వీరలక్ష్మీ.. పాహిమాం
భద్రాచలం : ముగ్గురమ్మల శక్తి స్వరూపిణిగా, దారిద్య్రాలను పారదోలే వీరలక్ష్మిగా సాక్షాత్కారమైన అమ్మవారిని తిలకించిన భక్తులు పులకించిపోయారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోగా, అమ్మవారు మంగళవారం వీరలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం అమ్మవారికి నిజరూపమైన శ్రీ మహాలక్ష్మిగా అలంకరించనున్నారు. గురువారం విజయదశమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరగనున్నాయి. దసరా మండపంలో శమీ, ఆయుధ పూజతో పాటుగా రావణాసుర వధగా పేర్కొనే శ్రీరామలీలా మహోత్సవం కనులపండువగా జరగనుంది. నేటి అలంకార విశిష్టత.. ధనం, ధాన్యం, సంతానం, విద్య, అధికారం, విజయం, ఐశ్వర్యం.. ఇలా మనిషికి అవసరమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించేందుకు అష్టలక్ష్మీ రూపాలను ధరించిన ఆదిలక్ష్మీ.. కరుణాస్వరూపమైన తన నిజ రూపంలో భక్తులను అనుగ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు. కమనీయం.. నిత్యకల్యాణం.. శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశంసూపర్బజార్(కొత్తగూడెం): స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మొదటి విడతలో భద్రాచలం డివిజన్లోని 11 మండలాల్లోని 11 జెడ్పీటీసీ, 113 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తామని, ఇందుకు 602 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రెండో విడతలో కొత్తగూడెం డివిజన్లోని 11 జెడ్పీటీసీ, 120 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా 669 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతీ విడతలో 20 శాతం అదనపు రిజర్వ్ కేంద్రాలు కూడా సిద్ధంగా ఉంచుతామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులు ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, పబ్లిక్ పార్కులతో పాటు ప్రధాన కూడళ్లలో ఉన్న రాజకీయ నాయకుల ఫొటోలు, హోర్డింగులు, బ్యానర్లు, స్కిక్కర్లు తొలగించాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసేలా గోడలపై రాసిన నినాదాలను చెరిపేయాలన్నారు. ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. సమావేశంలో భద్రాచలం సబ్కలెక్టర్ మ్రిణాల్శ్రేష్ఠ, అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ చంద్రమౌళి, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు మీడియా కూడా సహకరించాలని కోరారు. ఫేక్ వార్తలతో ఘర్షణలు చెలరేగుతాయని, ఈ విషయంలో పారదర్శకంగా ఉండాలని అన్నారు. అంతకుముందు రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా సాగేలా ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చుల నమోదు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై చర్చించారు. సభలు, సమావేశాలతో పాటు కరపత్రాలు, ఫ్లెక్సీలు తదితర అన్ని కార్యక్రమాలు నిశితంగా పరిశీలిస్తామని అన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్, డీఎల్పీఓ సుధీర్, ఆయా పార్టీల నాయకులు అజ్మీరా సురేష్, అనుదీప్, సలిగంటి శ్రీనివాస్, నోముల రమేష్, సత్యనారాయణ, గౌని నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
శిశు మరణాల నివారణపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్చుంచుపల్లి: జిల్లాలో నవజాత శిశు మరణాల నివారణపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన వైద్య శాఖ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎస్ఎన్సీయూలో జరుగుతున్న నియోనేటల్ మరణాలను సింగిల్ డిజిట్కు తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం కావాల్సిన సిబ్బందిని, వనరులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శిశువు పుట్టిన 28 రోజుల్లోపు సంరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. నెలలు నిండకుండా పుట్టిన, అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు అత్యవసర, ప్రత్యేక వైద్య సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి, వైద్యులు రామకృష్ణ, రాధామోహన్, తేజశ్రీ, మధువరణ్, పుల్లారెడ్డి, స్పందన తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల కొంగు బంగారం కోటమైసమ్మ తల్లి..
ఇల్లెందురూరల్: దశాబ్దాలుగా జనం చేత పూజలందుకుంటూ ప్రసిద్ధికెక్కిన నిజాంపేట కోటమైసమ్మ అమ్మవారి జాతర బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. ఏటా విజయదశమి సందర్భంగా రెండు రోజులపాటు అమ్మవారి జాతరను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మండలంలోని రేపల్లెవాడ గ్రామపంచాయతీ నిజాంపేట సమీపంలో సుమారు ఐదు దశాబ్దాల క్రితం వెలిసిన కోటమైసమ్మ తల్లి ఆలయంలో ఏడాది పొడవునా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. విజయదశమి పురస్కరించుకొని బుధవారం గ్రామస్తులు బోనాలతో ప్రదర్శనగా తరలివచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. గురువారం శక్తిస్వరూపిణిగా దర్శనమిచ్చే అమ్మవారికి పలు గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
మాస్టర్ ప్లాన్కు కసరత్తు
యూనివర్సిటీలో నూతన భవనాల నిర్మాణం కోసం మాస్టర్ప్లాన్ రెడీకి కసరత్తు చేస్తు న్నాం. దీంతో పాటుగా ప్రస్తుతం యూనివర్సిటీలో ఉన్న పాత భవనాలు, ఓల్డ్ షెడ్లకు సంబంధించి మరమ్మతులు, లీకేజీలకు సంబంధించిన ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నాం. అన్నింటినీ ప్రభుత్వానికి నివేదించి నిధులు విడుదలైన తరువాత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. –జగన్మోహన్రాజు, యూనివర్సిటీ ఓఎస్డీ కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం కేఎస్ఎంలోని డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో నూతన భవనాల నిర్మాణానికి మాస్టర్ప్లాన్ సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే దోస్త్, స్పాట్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ జియాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్ కోర్సుల్లో 51 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ హాస్టల్ సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం ఎమ్మెస్సీలో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 110 మంది బాలికలు, 100 మంది బాలురకు సరిపడేలా హాస్టల్ భవనాలను సిద్ధం చేసిన అధికారులు.. భవిష్యత్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా తరగతి గదులు, ల్యాబ్లు, హాస్టల్ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న భవనాలు, ల్యాబ్లకు అవసరమైన మరమ్మతుల కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 650 మంది.. అయితే, ఇంజనీరింగ్ విభాగంలో ఇప్పటికే 650 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా యూనివర్సిటీకి సంబంధించి మరో 51 మంది విద్యార్థులు నూతనంగా వచ్చారు. ఎంఎస్సీకి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ సాగుతుండడంతో అదనంగా మరికొంత మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. నూ తన భవనాలు నిర్మించే వరకు కూడా బీఎస్సీ, ఎంఎస్సీ విద్యార్థులకు క్లాసురూంలతో పాటుగా హాస్టల్లో కూడా సర్దుబాలు చేయాల్సిన అవసరముంది. అన్ని సౌకర్యాలు ఏర్పడే వరకు ఈ సర్దుబా టులు తప్పేలా లేవు. ప్రభుత్వానికి మాస్టర్ ప్లాన్, మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలు నివేదించిన అనంతరం నిధులు విడుదల అయితే పనులు ప్రార ంభించనున్నారు. యూనివర్సిటీలో మొదటి బ్యాచ్ విద్యార్థులకు గుర్తిండిపోయే విధంగా క్లాసులు నిర్వహించడం, సౌకర్యాలు కల్పించేందకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కూడా విద్యార్థులకు హామీ ఇచ్చి, అదే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. పాత భవనాలమరమ్మతులకు ప్రతిపాదనలు -
స్థానిక పోరుకు
సై..11 మండలాల చొప్పున.. జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు ఇటీవలే పూర్తి చేశారు. జిల్లాలోని 11 జెడ్పీటీసీ స్థానాలు, వాటి పరిధిలోని 113 ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 23న తొలి విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో అశ్వాపురం మండలంలో 12, భద్రాచలంలో14, బూర్గంపాడులో 17, చర్లలో 12, దుమ్ముగూడెంలో 13, కరకగూడెంలో 5, మణుగూరులో 11, పినపాకలో 9, ఆళ్లపల్లిలో 5, గుండాలలో 5, జూలూరుపాడు మండలంలోని 10.. మొత్తం 113 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మలి విడత అక్టోబర్ 27న చుంచుపల్లి మండలంలోని 12, లక్ష్మీదేవిపల్లిలో 11, సుజాతనగర్లో 5, పాల్వంచలో 10, దమ్మపేటలో 17, అశ్వారావుపేటలో 11, ములకలపల్లిలో 10, చండ్రుగొండలో 8, అన్నపురెడ్డిపల్లిలో 6, టేకులపల్లిలో 14, ఇల్లెందు మండలంలోని 16.. మొత్తం 120 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. జెడ్పీటీసీ స్థానాలకు తొలి, మలి విడతల్లో 11 స్థానాల చొప్పున ఎన్నికలు ఉంటాయి. కాగా, జిల్లాలో ఇప్పటికే ఓటరు జాబితాలు, బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సిబ్బంది, నోడల్ అధికారుల నియామకం పూర్తయింది. ఇప్పటికే రెండు విడతలుగా ఆర్ఓలు, ఏఆర్ఓలకు, పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఇక జిల్లాలో 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డు స్థానాలు ఉండగా అక్టోబర్ 31న అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లోని 159 జీపీలు, 1,436 వార్డులకు, నవంబర్ 4 అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ మండలాల్లోని 156 జీపీలు, 1,392 వార్డులకు 8వ తేదీన ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతననగర్, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లోని 156 పంచాయతీలు, 1,340 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్పంచ్లకు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ముద్రించి భద్ర పర్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు 10,223 మంది, పరిషత్ ఎన్నికలకు 8,711 మంది సిబ్బందిని కేటాయించారు. పంచాయతీలకు 4,242, పరిషత్ ఎన్నికలకు 1,271 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కాగా, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బంది నియామకం, మొదటి విడత శిక్షణ తరగతులు పూర్తయ్యాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. పరిషత్ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11తో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో రాజకీయ సందడి ప్రారంభమైంది. – చుంచుపల్లి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 23న తొలివిడత, 27న రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. పంచాయతీలకు అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ జరగనుంది. పంచాయతీల్లో పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఫలితాలను మాత్రం నవంబర్ 11న ప్రకటిస్తారు. పరిషత్ ఎన్నికలకు మొదటి విడత నోటిఫికేషన్ అక్టోబర్ 9న, రెండో విడత నోటిఫికేషన్ను 13న విడుదల చేసి, అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. పంచాయతీలకు తొలి విడత నోటిఫికేషన్ అక్టోబర్ 17న, రెండో విడత నోటిఫికేషన్ 21న, మూడో విడత నోటిఫికేషన్ 25న విడుదల చేసి అదేరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపడతారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలను అందుబాటులో ఉంచారు. షెడ్యూల్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొనగా.. ఆశావహులు బరిలో నిలిచేందుకు ప్రయత్నాల్లో మునిగిపోయారు. రిజర్వేషన్లు అనుకూలించని చోట కొందరు నైరాశ్యంలో ఉన్నారు. మోగిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల నగారా -
యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం అమల్లో భాగంగా పంచాయతీల సమగ్రాభివృద్ధి కోసం విలేజ్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. కర్మయోగి కార్యక్రమం కింద గల 130 గ్రామ పంచాయతీల్లో ఈ ప్లాన్ అత్యవసరమని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా బోర్వెల్ మరమ్మతులు, కొత్త బోర్లు, రోడ్లు, వాటర్ ట్యాంకులు, విద్యుత్ సదుపాయం, వ్యవసాయ ఆధునికీకరణ, డ్రోన్ల వినియోగం, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, విద్యార్థులకు డైనింగ్ హాళ్లు, వైద్య సౌకర్యం పంటల విస్తీర్ణం వంటి అంశాలను యాక్షన్ ప్లాన్లో చేర్చాలని ఆదేశించారు. విలేజ్ యాక్షన్ ప్లాన్ను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను ఐటీడీఏ పీఓ రాహుల్ పర్యవేక్షిస్తారని తెలిపారు. అక్టోబర్ 2న ఆది కర్మయోగి అభియాన్ అమలవుతున్న 130 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని, ప్రజల అవసరాలు, అభివృద్ధి సూచనలు, కార్యాచరణపై చర్చించాలని సూచించారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు.అధికారులకు కలెక్టర్ ఆదేశం -
మళ్లీ పెరిగిన గోదావరి
భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరిగింది. సోమవారం రాత్రి 10 గంటలకు 46.70 అడుగులకు చేరింది. శనివారం రాత్రి 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఆదివారం రాత్రి 42.70 అడుగులకు చేరడంతో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. కాగా, సోమవారం ఉదయం నుంచి మళ్లీ పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం 46 అడుగులకు పైగా నమోదు కావడంతో భద్రాచలం నుంచి చర్లతో పాటు ఏపీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరీ వాహక ప్రాంత ప్రజలను అధికారలు అప్రమత్తం చేస్తున్నారు. బతుకమ్మల నిమజ్జనానికి గోదావరిలోకి అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, మంగళ వారం మధ్యాహ్నానికి నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశ ం ఉందని అదికారుల అంచనా. నీట మునిగిన తూరుబాక రోడ్డు దుమ్ముగూడెం : గోదావరి ప్రవాహం పెరగడంతో మండలంలోని తూరుబాక వద్ద డైవర్షన్ రోడ్డుపైకి వరద చేరింది. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో పర్ణశాల, కాశీనగరం, సున్నంబట్టి, దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పర్ణశాల నారచీరల ప్రాంతం పూర్తిగా నీట మునగగా సున్నంబట్టి – బైరాగులపాడు రహదారి పైకి నీరు చేరింది.కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక -
అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు..
● ఐశ్వర్యలక్ష్మిగా అమ్మవారి దర్శనం ● నేడు వీరలక్ష్మి అలంకరణలో లక్ష్మీతాయారమ్మవారుభద్రాచలం: అఖిలాండ కోటి శాసకురాలిగా, కరుణాస్వరూపినిగా అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటూ దీవిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీతాయారమ్మవారు సోమవారం ఐశ్వర్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చన జరిపారు. చిత్రకూట మండపంలో జరుగుతున్న శ్రీరామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేద పండితులు, అర్చకులు యుద్ధకాండ పారాయణం చేశారు. నేటి వీరలక్ష్మి అలంకార విశిష్టత.. ‘దారిద్య్ర ధ్వంసినీందేవీం సర్వోపద్రవవారిణీం..’ అని అమ్మవారిని వీరలక్ష్మీగా కీర్తిస్తుంది పురాణం. దారిద్య్రాన్ని, అన్ని రకాల ఉపద్రవాలను పారదోలే వీరత్వం ఈ అమ్మ సొంతమని, త్రిమూర్తులకు సైతం సాధ్యం కాని మహిషాసురిని, ముగ్గరమ్మల శక్తి స్వరూపంగా ఆవిర్భవించి సంహరించిందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అమ్మను ఆరాధిస్తే అన్ని రకాల దుష్ట శక్తులు, భయాలు, ఉపద్రవాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ముత్తంగి అలంకరణలో రామయ్య.. దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.అక్టోబర్ 2వ తేదీన విజయదశమిని పురస్కరించుకుని విజయోత్సవం, శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీలా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రామదాసు మండపం వద్ద ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే అశ్వయుజ పౌర్ణమి రోజున శబరి స్మృతియాత్ర నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
బతుకమ్మా.. మళ్లీ రావమ్మా..
జిల్లాలో తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులు ఉత్సాహంగా ఆడిన బతుకమ్మ వేడుకలు సోమవారం సద్దుల సంబురంతో ముగిశాయి. తీరొక్క పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో మహిళలు ప్రదర్శనగా వెళ్లి.. ఉత్సాహంగా ఆడుతూ.. పాడుతూ సందడి చేశారు. బతుకమ్మకు పలు రకాల నైవేద్యాలు సమర్పించి చివరకు చెరువులో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ‘వెళ్లిరా బతుకమ్మా.. మళ్లీ రావమ్మా’ అంటూ గౌరమ్మను వేడుకున్నారు. కాగా, అధికారులు ఆయా గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రాచలం బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ అధికారులు ఏర్పాటుచేసిన కాగితపు బతుకమ్మ విశేషంగా ఆకట్టుకుంది. -
శ్రీ సరస్వతీదేవిగా పెద్దమ్మతల్లి
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అమ్మవారిని సోమవారం మూలా నక్షత్రం సందర్బంగా శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. అనంతరం చండీహోమం, లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. ఖమ్మం ఎంపీ ఆర్.రఘురాంరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ, ఆలయ కమిటీ చైర్మన్ ఆయనకు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ భద్రాచలంటౌన్: ఆర్టీసీలో వేయి మంది డ్రైవర్లు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిందని, ఉమ్మడి జిల్లాలో అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. www. tgprb. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 22 – 40 ఏళ్ల వయస్సు కలిగిన వారు డ్రైవర్లుగా, 18 – 35 ఏళ్ల వయస్సు వారు శ్రామిక్ పోస్టులకు అర్హులని వెల్లడించారు. డ్రైవర్ పోస్టుకు రూ.300, శ్రామిక్ పోస్టుకు రూ.200 చెల్లించి అక్టోబర్ 8నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని పీఓ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎట్టకేలకు దీక్ష విరమణ● జాయింట్ సర్వేకు ఆదేశించిన కలెక్టర్ సూపర్బజార్(కొత్తగూడెం): అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు.. భూ సమస్య పరిష్కరించాలంటూ ఎనిమిది రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్ష సోమవారం రాత్రి ముగిసింది. రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని, ఈ మేరకు సర్వే చేపడతామని అశ్వారావుపేట తహసీల్దార్ రామకృష్ణ హామీ ఇవ్వడంతో ఆదివాసీలు దీక్ష విరమించి ఇంటిబాట పట్టారు. కాగా, అశ్వారావుపేట తహసీల్దార్, ఎఫ్ఆర్ఓ ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహించనున్నట్టు ఆర్డర్ కాపీ అందిన నేపథ్యంలో దీక్ష విరమిస్తున్నటు ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి మడకం నాగేశ్వరరావు సోమవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యాన పంటలతో అదనపు ఆదాయంఅశ్వారావుపేటరూరల్: ఉద్యాన పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి జంగా కిషోర్ రైతులకు సూచించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల పరిధిలోని పామాయిల్, కొబ్బరి ఇతర పంటల్లో అంతర పంటలుగా సాగు చేస్తున్న కోకో, వక్క, అరటి, బొప్పాయి, పూల తోటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతర పంటల సాగుతో ప్రభుత్వం నుంచి సబ్సిడీతోపాటు అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. అరటి పంట సాగు చేస్తే ఎకరానికి రూ.28 వేలు, బొప్పాయికి రూ.12వేలు, పూల తోటలకు రూ.8వేలు, కోకో పంటకు రూ.12వేలు, మామిడికి రూ.20వేల చొప్పున సబ్సిడీ వస్తుందని వివరించారు. కలుపు నివారణకు ప్లాస్టిక్ మల్చింగ్ వినియోగిస్తే ఎకరానికి రూ.8 వేల సబ్సిడీ అందుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఈఓ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
2 క్వింటాళ్ల గంజాయి సీజ్
బూర్గంపాడు: మండల పరిధిలోని మోరంపల్లి బంజర వద్ద సోమవారం తెల్లవారుజామున బూర్గంపాడు ఎస్సై మేడా ప్రసాద్ అనుమానాస్పద రీతిలో వేగంగా వెళ్తున్న ఓ కారును పట్టుకుని సోదాలు నిర్వహించారు. వాహనంలో తరలిస్తున్న 2.05 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారు నడుపుతున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు. భద్రాచలంలో 10 కిలోలు.. భద్రాచలంటౌన్: పట్టణంలోని కూనవరం రోడ్డులో ఉన్న ఆర్టీఓ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టిన ఎకై ్సజ్ అధికారులు బైక్పై తరలిస్తున్న 10.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బైక్ను స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన గోళ్ల గణేష్, మూరగుండ్ల ఆనంద్కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులను భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్ శ్రీహరిరావు తెలిపారు. -
కేటీపీఎస్ 8వ దశ నివేదిక రూపొందించాలి
పాల్వంచరూరల్: కేటీపీఎస్ 8వ దశ నిర్మాణానికి నివేదిక రూపొందించాలని ఖమ్మం ఎంపీ ఆర్.రఘురాంరెడ్డి సూచించారు. 8వ దశ సాధన కమిటీ, టీఆర్వీకేఎస్ ఆధ్వర్యంలో కేటీపీఎస్ కాలనీలో సోమవారం ఎంపీని పూలమాలలు, శాలువాలతో వేర్వేరుగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేటీపీఎస్లో 8వ దశ కర్మాగార నిర్మాణంపై పార్లమెంట్లో చర్చకు లేవనెత్తగా కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో 8వ దశ సాధన సమితి అధ్యక్షుడు సీతారాంరెడ్డి, కన్వీనర్ మంగీలాల్, టీఆర్వీకేఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్, మార్క్ఫెడ్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, పెద్దమ్మగుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఆళ్ల మురళి, చందుపట్ల శ్రీనివాసరెడ్డి, మహిపతి రామలింగం, రవికుమార్, రాంబాబు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మించాలని విన్నపం పట్టణంలోని శ్రీనివాసకాలనీ శివారులో ఉన్న టెన్నిస్ క్రీడామైదానాన్ని ఎంపీ రఘురాంరెడ్డి సందర్శించారు. క్రీడాకారులు, క్రీడా సంఘాల బాధ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్ ట్రాక్, డ్రెయినేజీ తదితర సమస్యలు పరిష్కరించాలని జిల్లా టెన్నిస్, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్రెడ్డి విన్నవించారు. అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మిక ప్రాంతం రామవరంలోని 7 నంబర్ బస్తీలో ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారి సోమవారం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. కంచర్ల చంద్రశేఖర్రావు, ఆళ్ల మురళి, చీకటి కార్తీక్, పీతాంబరరావు, హరి సింగ్, ఉత్సవాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
5న సీపీఐ ‘శత వసంతాల’ సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఐశత వసంతాల ముగింపు సభ డిసెంబర్లో ఖమ్మంలో జరగనుండగా, నేపథ్యాన అక్టోబర్ 5న సన్నాహక సమావేశం ఏర్పాటుచేసినట్లు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు ఎస్.కే.సాబీర్ పాషా, దండి సురేష్ తెలిపారు. ఖమ్మం ఎస్ ఆర్ గార్డెన్స్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, బినాయ్ విశ్వం, కె.నారాయణ, అజీజ్ పాషా, పువ్వాడ నాగేశ్వరరావు, చాడ వెంకటరెడ్డి హాజ రవుతారని వెల్లడించారు. అలాగే, ఆహ్వాన సంఘ సమావేశానికి తెలంగాణతో పాటు వివిధ ఇతర రాష్ట్రాల నేతలు పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, ఎం.వీరపాండ్యన్, మహ్మద్ సలీం, సుందరేష్, పర్ష పద్మ, శ్రీనివాస్, ఈటి నర్సింహా, బాగం హేమంతరావు తదితరులు కూడా పాల్గొంటారని తెలిపారు. -
కుల వ్యవస్థను నిర్మూలించాలి
ఇల్లెందురూరల్: కుల వ్యవస్థ నిర్మూలనను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. కుల వ్యవస్థ నిర్మూలన వారోత్సవాలను పురస్కరించుకుని మండలంలోని కొమరారం గ్రామంలో మాస్లైన్ ఆధ్వర్యంలో సోమవారం సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ అణచివేత, ఆధిపత్యం కొనసాగిస్తున్న మనువాద హిందుత్వ భావజాలానికి, కుల దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజాన్ని ఏర్పాటు చేసిన జ్యోతిరావుపూలే స్ఫూర్తితో ఉద్యమించాలని కోరారు. సమావేశంలో నేతలు ఆజ్మీర బిచ్చా, బుర్ర రాఘవులు, కాంపాటి పృథ్వి, బోస్, సావిత్రి, జగ్గులు, యలందర్, శాంతారావు, వాంకుడోత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో.. జూలూరుపాడు: మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు జాటోత్ కృష్ణ అన్నారు.సోమవారం అన్నారుపాడు గ్రామంలో నిర్వహించిన సదస్సులో మాట్ల్లాడారు. నాయకులు ఏదులాపురం గోపాల్రావు, బానోత్ ధర్మా, లింగాల వీరభద్రం, తోటకూరి నరేశ్, బానోత్ ధన్వంతరావు, ఇరప రాజు, వీరు, నాగేశ్వరరావు, బాబు, వెంకన్న, నవీన్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య -
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మణుగూరు రూరల్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పని చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీల ను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ విడుదల చేసిన బాకీ కార్డును కూడా ఇంటింటికి పంచాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, నాయకులు లక్ష్మణ్, అప్పారావు, యూసుఫ్, నర్సింహరావు, ప్రభుదాసు, పాల్గొన్నారు. అవినీతిపై విచారణ జరపాలిభద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో డీడీగా పనిచేసి మణెమ్మ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని గిరిజన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పృథ్వీనాయక్ సోమవారం ఐటీడీఏ పీఓ రాహుల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత లేని మెనూ అమలు చేసి గిరిజన విద్యార్థులు అనారోగ్యం పాలవ్వడానికి కారణమయ్యారని తెలిపారు. వసతి గృహాల మరమ్మతులు, సరుకుల టెండర్లు, డిప్యూటేషన్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. డివైడర్ను ఢీకొట్టి కంటైనర్ బోల్తాఏన్కూరు: కొత్తగూడెం నుండి ఖమ్మం వైపు వెళ్తున్న కంటైనర్ ఏన్కూరులోని డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. సోమవారం తెల్ల వారుజామున ఈ ఘటన జరగగా డ్రైవర్కు గాయాలయ్యాయి. ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు, ఆర్అండ్బీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపించారు. ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఖమ్మం కవిరాజ్నగర్ ప్రాంతానికి చెందిన సీహెచ్.సురేష్బాబు, వడిగాశిల్ప శశికళారాణికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి బి.రజని సోమవారం తీర్పుచెప్పారు. ఖమ్మం నెహ్రూనగర్కు చెందిన జె.రామ జగ్గారావు వద్ద సురేష్, శశికళారాణి 2020 ఫిబ్రవరిలో రూ.6 లక్షల అప్పు తీసుకున్నారు. తిరిగి 2021 ఫిబ్రవరిలో రూ.6 లక్షలకు చెక్కు ఇచ్చినా వారి ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో జగ్గారావు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఈమేరకు ఇద్దరికి జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.6లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. వ్యక్తి ఆత్మహత్య పాల్వంచరూరల్: మద్యం తాగొద్దని తల్లి మందలించినందుకు ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని మారుతినగర్కు చెందిన పంతంగి ఉపేందర్(46) సీతారాంపట్నం విద్యుత్ సబ్స్టేషన్లో ఆర్టిజన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 27న మద్యం తాగి ఇంటికి రాగా తల్లి ఈశ్వరమ్మ మందలించింది. దీంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పురుగుల మందుతాగాడు. అపస్మారక స్థితిలో పడిపోగా స్నేహితులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి మెరుగైన వైద్యంకోసం కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పట్టణ ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
స్వరాష్ట్రంలో తొలి పోరు
భద్రాచలం: స్థానిక సంస్థల ఎన్నికలకు భద్రగిరి సిద్ధమవుతోంది. రాష్ట్రమంతటా గతంలో స్థానిక ఎన్నికలు జరిగినా భద్రాచలంలో ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భద్రాచలంలో మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలు ఇవే తొలిసారి కానున్నాయి. భద్రాచలం మండల పరిషత్ జనవరి 1, 1987న ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2014లో రాష్ట్ర విభజనకు ముందు మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గ కాలం 2018లో ముగిసింది. నాడు 13 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగగా, చివరి జెడ్పీటీసీగా జి.రవికుమార్ బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం జరిగిన రాష్ట్ర విభజనలో భద్రాచలం మండలం మినహా ఇతర(పోలవరం ముంపు) గ్రామాలన్నీ ఏపీలో విలీనం చేశారు. పాలకవర్గం కాలం ముగిసిన అనంతరం మళ్లీ ఎన్నికలను జరపలేదు. ఆ తర్వాత నిర్వీర్యంగా మారిన మండల పరిషత్ను నూతనంగా ఏర్పాటు చేసిన ఆళ్లపల్లి మండలానికి తరలించారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొద్ది నెలల క్రితం తిరిగి భద్రాచలానికి మండల పరిషత్ కేటాయించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. 2014లో 13 ఎంపీటీసీలు ఉండగా, ఇప్పుడు 14కు పెంచారు. జెడ్పీటీసీ బీసీ మహిళకు, ఎంపీపీని గిరిజన మహిళకు కేటాయించారు. 20 వార్డుల్లో 60 పోలింగ్ బూత్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈసారి భద్రాచలంలోనూ పరిషత్, పంచాయతీ ఎన్నికలు మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న భద్రాచలం మున్సిపాలిటీగా, గ్రామపంచాయతీగా, మళ్లీ మూడు గ్రామపంచాయతీలుగా, అనంతరం ఒక్క గ్రామపంచాయతీ ఏర్పాటు చేసే చిత్ర విచిత్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు మేజర్ పంచాయతీగానే ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ చివరిసారిగా 2013లో ఎన్నికలు జరగ్గా, పాలకవర్గ కాలం 2018లో ముగిసింది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం, సారపాకలను మున్సిపాలిటీగా ప్రకటించగా, ఆదివాసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో చుక్కెదురుకాగా భద్రాచలాన్ని మూడు గ్రామపంచాయతీలుగా విభజించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. భద్రాచలం చివరి సర్పంచ్గా భూక్యా శ్వేత వ్యవహరించారు. ప్రస్తుతం తిరిగి మళ్లీ ఎస్టీ జనరల్కే సర్పంచ్ను కేటాయించారు. 20 వార్డుల్లో 10 వార్డులను ఎస్టీ జనరల్ మహిళలకు కేటాయించగా, మరో 5 వార్డులను జనరల్ విభాగంలోని మహిళలకు, మరో ఐదింటిని జనరల్కు రిజర్వేషన్ చేశారు. ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండగా, ఆశావాహులు సమీకరణాల్లో మునిగిపోయారు. రాజకీయ పార్టీల పెద్దలతో టచ్లోకి వెళ్లారు. అధికార కాంగ్రెస్లో సర్పంచ్, జెడ్పీటీసీ పదవులకు విపరీతమైన పోటీనెలకొంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు ఎమ్మెల్యే, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు. -
నకిలీ నోట్ల కలకలం
ముగ్గురు పూల వ్యాపారులకు టోకరా కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం సూపర్బజార్ ఏరియాలో సోమవారం ముగ్గురు పూల వ్యాపారులకు నకిలీ రూ.500 నోట్లను అంటగట్టి దుండగులు ఉడాయించారు. అడవి కంబాలపల్లి(ఇల్లెందు)కి చెందిన వీరభద్రం, సుజాతనగర్ మండలం రాఘవపురానికి చెందిన సిద్దెల వంశీ, మరో మహిళ బతుకమ్మ పూలు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక్కో వ్యాపారి వద్ద రూ.100 గునుగు పూలను కొన్నారు. రూ.500 నకిలీ నోటు ఇచ్చి, వ్యాపారి నుంచి రూ.400 తీసుకుని వెళ్లిపోయారు. వ్యాపారులు ఆ నోట్లను గుర్తించేలోపే దుండగులు అక్కడి నుంచి జారుకున్నారు. నోట్లపై ఒకవైపు ముద్రణ ఉండగా మరో వైపు తెల్లగా ఉంది. దొంగనోటు ఇచ్చిన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ కెమెరా కూడా లేక పోవడంతో చిరువ్యాపారులు లబోదిబోమంటున్నారు. దొంగనోట్లను అంటగట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. వ్యక్తి ఆత్మహత్యపై కేసు పాల్వంచరూరల్: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని కేసీఆర్ నగర్కు చెందిన బానోతు రాజేంద్రప్రసాద్(37) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏడు నెలల క్రితం డ్రెయినేజీ దాటుతుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడటంతో రెండుకాళ్లు విరిగి గాయపడ్డాడు. పనులకు వెళ్లలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెంది ఈ నెల 7న పురుగుల మందుతాగాడు. వరంగల్ ఎంజీఎం తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పట్టణ ఎస్ఐ కేసు నమోదు చేశారు. ‘చాంబర్’ ఎన్నికలకు సమాయత్తం మూడేళ్లకోసారి ఆఫీస్ బేరర్లు, 19శాఖల ప్రతినిధుల ఎన్నిక ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఆఫీస్ బేరర్లు, 19 వ్యాపార శాఖల విభాగాల ప్రతినిధులను మూడేళ్లకోసారి ఎన్నుకుంటారు. ఈమేరకు వ్యాపారులు ప్యానెళ్లుగా ఏర్పడి బరిలో నిలుస్తారు. ఈసారి అధ్యక్షుడిగా కురువెళ్ల ప్రవీణ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా గొడవర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా కురువెళ్ల కాంతారావు, సహాయ కార్యదర్శిగా బాదె రమేష్, కోశాధికారిగా తూములూరి లక్ష్మీనరసింహారావు పోటీ చేసేలా మరికొందరితో ప్యానల్ ఏర్పాటైంది. ఈ ప్యానల్ బాధ్యులు సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. వీరికి మద్దతుగా పత్తిపాక రమేష్, పొలవరపు కోటేశ్వరరావు, మాటేటి రాకేష్, చిలకల ఆదినారాయణ, వడ్డే వెంకటేశ్వర్లు, సోమవరపు సుదీర్కుమార్, ప్రభాకర్, బజ్జూరి రమణా రెడ్డి, బండి సతీష్ సిరికొండ వెంకటేశ్వర్లు, గుడిపూడి నరిసింహారావు ప్రచారంలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
నేలకొండపల్లి: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి పరుగులు తీస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మండలంలోని అమ్మగూడెం, కోనాయిగూడెం, నేలకొండపల్లిల్లో సోమవారం ఉదయం ఆయన బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. అలాగే, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, భధ్రయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, బొందయ్య, అడపాల రామారావు, నల్లాని మల్లికార్జున్రావు, రాయపూడి నవీన్, నంబూరి రామారావు, యర్రబోయిన నర్సయ్య, పెంటమళ్ల పుల్లమ్మ, కొచ్చేర్ల శ్రీనివాసరావు, కొమ్మినేని పుష్పావతి, మేకల వెంకటేశ్వర్లు, కొమ్మినేని విజయ్బాబు, కడియాల నరేష్, ఇస్లావత్ బాలాజీ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో మంత్రి కూసుమంచి: మండలంలోని నాయకన్గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం రాత్రి నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో ఆడిపాడిన ఆయన మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు.రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం
మణుగూరురూరల్: ఎస్సీ వర్గీకరణలో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాలమహానాడు జాతీయ నాయకులు బి.చెన్నయ్య అన్నారు. ఆదివారం మండలంలోని సమితిసింగారం గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన మాలమహానాడు సంఘం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వర్గీకరణలో ఐదుశాతం మాలలకు, తొమ్మిది శాతం మాదిగలకు కేటాయిస్తూ ప్రభుత్వం వర్గీకరణ చేపట్టి మాలల ఉనికే ప్రశ్నార్థకమయ్యేలా వ్యవహరించిందన్నారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపును పునఃసమీక్షించి జీఓ–99ను సవరించాలని డిమాండ్ చేశారు. మాలల హక్కులను కాపాడుకునేందుకు నవంబర్ 2వ తేదీన చలో హైదరాబాద్, మాలల రణభేరి మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బూర్గుల వెంకటేశ్వర్లు, పప్పుల జాన్, రంజిత్కుమార్, శివకుమార్, నవతన్, బూర్గుల విజయ్కుమార్, సుష్మ, మద్దెల భద్రయ్య, వేర్పుల నరేశ్, బూర్గుల సతీశ్, చింతమల్ల రమేశ్, దాసరి వెంకట్, వేర్పుల సురేశ్, బూర్గుల సంజీవరావు, ముల్క నరేశ్, ఏసురత్నం, ప్రసాద్, రవి, బాబీ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమాల అధికారి..?
మణుగూరురూరల్: పినపాక నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నిర్వహిస్తున్న విద్యుత్ కర్మాగారంలో తవ్వేకొద్ది అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కమీషన్ల కక్కుర్తితో అవసరం లేని పనులకు రెండింతలు అంచనాలు వేపించడం.. వారి వద్ద నుంచి 15 – 25 శాతం ఓ అధికారి మామూళ్లు వసూలు చేస్తుండటంతో రాష్ట్రస్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించాల్సిన కర్మాగారం పరువు దిగజారుతుండటంపై పలువురు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఫైల్ కదలాలన్నా.. కాంట్రాక్ట్ దక్కాలన్నా, ఓపెన్ టెండర్లో లొసుగులు లీక్ చేయాలన్నా.. అడిగినంతా ఇచ్చుకోవాల్సిందేనని సమాచారం. అనర్హులకు టెండర్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే అడిగిన టెండర్కు పోటీదారులను పెంచి ప్రశ్నించిన వారిని తొక్కేస్తారని బాధితులు చెబుతున్నారు. ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలతో ఇంటెలీజెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ప్లాంట్లో పర్యటించినట్లు తెలిసింది. అడుగడుగునా ఆరోపణలే.. కర్మాగారంలో అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోంది. తవ్వేకొద్ది అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీకి ఫ్లైయాష్ కోసం వచ్చే లారీలకు కంపెనీ స్థలాన్ని పార్కింగ్ స్థలంగా కేటాయించే దగ్గరి నుంచి చిన్నాచితక నామినేటెడ్ కాంట్రాక్ట్లు కేటాయించే దాకా సారుకు అడిగినంతా ముట్టజెప్పాల్సిందేనని బంధువులు, కుటుంబ సభ్యుల ఖాతాలకు నగదు బదిలీ చేయాల్సిందేనని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. లేదంటే తనకు నచ్చింది చేస్తారని, పాత కాంట్రాక్టర్లు, తన సామాజిక వర్గానికి చెందిన అనుభవం లేనివారికి పనులు అప్పగించేస్తారని ప్లాంట్ వర్గాలు, కార్మికులు, కాంట్రాక్టర్లు గుసగుసలాడుతున్నారు. ● కర్మాగారం నుంచి విడుదలయ్యే ఫ్లైయాష్ తీసుకెళ్లేందుకు మొత్తం 11 కంపెనీలకు అనుమతి ఉండగా, అందులో 7 సిమెంట్ కంపెనీలు, నాలుగు ట్రేడింగ్ కంపెనీలున్నాయి. అయితే రోజూ ప్లాంట్ నుంచి విడుదలయ్యే ఫ్లైయాష్లో అధిక శాతం సిమెంట్ కంపెనీలకు కేటాయించాలని నిబంధన ఉంది. కానీ, స్థానికంగా కుదుర్చుకున్న మామూళ్ల ఒప్పందం ప్రకారం నాలుగు ట్రేడింగ్ కంపెనీలకు లారీకి రూ.100 – రూ.150 చొప్పున వాటా ఇచ్చే ఒప్పందంతో వేల టన్నుల లోడింగ్ కల్పిస్తున్నారని తెలుస్తోంది. ప్రతిఫలంగా ఓ అధికారికి ప్రతి నెలా 3వ తేదీన ఠంచనుగా మామూళ్లు ఇవ్వాల్సిందేననే ఆరోపణలున్నాయి. ● ప్లాంట్ ప్రారంభం నుంచి టెండర్ లేకుండా నిర్వహిస్తున్న క్యాంటీన్లో పనిచేసే వర్కర్లను సొంత పనులకు వాడుకుని నామమాత్రపు జీతాలు ఇచ్చి వారి అసలు జీతాలు విత్డ్రా చేసుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. ● 2022లో వసూళ్ల దందాపై ఓ కాంట్రాక్టర్ ఎదురుతిరగడంతో అతడిపై అధికారుల అండదండలతో మరో కాంట్రాక్టర్ దాడికి పాల్పడి హత్యా యత్నం చేయడం స్థానిక పీఎస్లో కేసు నమోదు లాంటి విషయాలు సంచలనం సృష్టించాయి. ● యాష్ కోసం వచ్చే వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్లాంట్పై ఉండగా, సమీపంలోని ఓ స్థలం కేటాయించేందుకు అధికారి రూ.లక్షల్లో లంచం తీసుకుని చక్రం తిప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● చెప్పులరిగేలా తిరుగుతున్న వీటీడీఏ సొసైటీల సభ్యులను కాదని ముడుపులు చెల్లించిన వారికి కట్టబెట్టిన కాంట్రాక్టులపై ఆదివాసీ సంఘాలు బహి రంగంగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి బూడిద కేటాయింపుల్లో జరిగిన అక్రమాలను అధికారి బంధువు, కుటుంబ సభ్యుల బ్యాంకు వివరాలపై విచారణ చేపడితే అసలు విషయాలు బయటకొస్తాయని ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు పేర్కొంటున్నాయి.విద్యుత్ కర్మాగారంలో ఆయన చెప్పిందే వేదం..! టెండర్ ప్రక్రియ ఉన్నతాధికారుల ఆధీనంలోనిది. ఇక్కడ కేవలం అమలు చేయడమే నా విధి. క్యాంటీన్ టెండర్ మార్పుపై పైఅధికారులకు రాతపూర్వకంగా పంపాం. బూడిద చెరువులో 64 లక్షల టన్నుల బూడిద ఉంది. ఎవరు వచ్చినా కేటాయిస్తాం. వాటిల్లో అక్రమాలు జరిగే అవకాశం లేదు. – బిచ్చన్న, సీఈ -
కొత్త ఫ్యాక్టరీ నిర్మిస్తాం
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏళ్లనాటిది కావడంతో కొన్ని సమస్యలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ మరో ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి తెలిపారు. ఆదివారం దమ్మపేట మండలంలోని అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీలను, నారంవారిగూడెం నర్సరీని సందర్శించారు. అప్పారావుపేటలో ఉద్యోగులు, సిబ్బంది సమీక్ష జరిపారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీలో బాయిలర్లు, గెలల క్రషింగ్, పవర్ ప్లాంట్ను తనిఖీ చేశారు. పనితీరుపై ఆరా తీశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ఏటా పెరుగుతున్న తోటల విస్తరణ, గెలల దిగుబడి దృష్ట్యా కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అశ్వారావుపేటలో కొత్త ఫ్యాక్టరీకి ఆయిల్బోర్డు మీటింగ్లో తీర్మానించేలా కృషి చేస్తానని తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరిగూడెంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ వచ్చే జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. సిద్దిపేట ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కాగా, గెలల క్రషింగ్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కొన్ని గెలలు సిద్దిపేటకు తరలిస్తున్నాం ఫ్యాక్టరీలో గెలల క్రషింగ్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఖమ్మం జిల్లాలోని ముది గొండ, వైరా ప్రాంతాలతోపాటు మహబూబాబాద్ జిల్లాలోని మరికొన్ని మండలాల గెలలను సిద్దిపేట ఫ్యాక్టరీకి మళ్లించామన్నారు. కొత్తగా తోటల విస్తరణకు 10లక్షల మొక్కల్ని సిద్ధం చేశామన్నారు. మరో ఆరు నెలల్లో పొట్టి రకం మొక్కలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ఆఫ్టైప్ మొక్కలతో నష్టం జరిగిన మాట వాస్తవమేనని, రాష్ట్రంలో 40వేల మంది రైతులు తోటలను సాగు చేస్తుంటే, 67 మంది రైతుల తోటల్లో ఆఫ్టైప్ మొక్కలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆయిల్ఫెడ్కు రూ. 60 కోట్ల అప్పు ఉంటే, రూ.600 కోట్లు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. టన్ను గెలల ధరను రూ.25వేలకు పెరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ట్రాక్టర్ను నడిపిన ఆయిల్ఫెడ్ చైర్మన్ దమ్మపేట: మండలంలోని అప్పారావుపేట ఫ్యాక్టరీలో టీఎస్ ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ఆయిల్పామ్ గెలల లోడుతో ఉన్న ట్రాక్టర్ను నడిపి రైతులు, సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఆదివారం ఫ్యాక్టరీని సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పామాయిల్ ట్రాక్టర్ను చైర్మన్ స్వయంగా నడుపుతూ, కాంటా పెట్టించిన అనంతరం ర్యాంప్ మీదుగా ప్లాట్ఫాం పైకి ఎక్కించి, గెలలను అన్లోడ్ చేయించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకుడు బండి భాస్కర్, ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, డివిజనల్ మేనేజర్ రాధాకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్లు కల్యాణ్, నాగబాబు పాల్గొన్నారు. అశ్వారావుపేటలో మరో ఆయిల్పామ్ కర్మాగారం -
కిన్నెరసాని గేటు ఎత్తివేత
పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలయాశానికి వరద కొనసాగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 5 వేల క్యూసెక్కుల వరద రావడంతో ఆదివారం నీటిమట్టం 406.10 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈ తెలిపారు. సండే సందడి కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 607 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.32,475 ఆదాయం లభించింది. 300 మంది బోటుషికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.18,350 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
9 కి.మీ.. 900 గుంతలు!
● పల్లిపాడు, ఏన్కూరు రోడ్డులో అడుగడుగునా గోతులే.. ● నరక ప్రాయంగా మారిన ప్రయాణం ● ఇబ్బందులు పడుతున్న ప్రజలు ● పట్టించుకోని అఽధికారులుపల్లిపాడు – ఏన్కూరు రోడ్డు నిర్మాణానికి ఏడాది క్రితమే ప్రతిపాదనలు పంపించాం. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. వర్షాలు పూర్తిగా తగ్గే వరకు రోడ్డు మరమ్మతు చేయడం సాధ్యం కాదు. ఇప్పటికే రెండుసార్లు మడ్ మిక్స్తో గుంతలు పూడ్చి వేయించాం. వర్షాలు తగ్గితే రోడ్డు మరమ్మతు చేయిస్తాం. – మోడేపల్లి రమేష్, ఆర్అండ్బీ డీఈ, వైరాకొణిజర్ల: ఉన్నది 9 కిలోమీటర్ల రోడ్డు.. కానీ 900కు పైగా గుంతలున్నాయంటే ఆ రహదారిలో ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఈ గుంతల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు పడి పలువురు ప్రయాణికులు గాయపడగా, వాహనాలు ధ్వంసమయ్యాయి. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. పల్లిపాడు టు ఏన్కూరు.. కొణిజర్ల మండలం పల్లిపాడు నుంచి అంజనాపురం, జన్నారం మీదుగా ఏన్కూరు మండల కేంద్రం వరకు 2018లో డబుల్ రోడ్డు నిర్మించారు. ఖమ్మం – భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడేన్ని కలిపేందుకు ఇది దగ్గరి దారి. ప్రస్తుతం ఆ రోడ్డు గుంతలమయం కాగా ప్రయాణం నరకప్రాయంగా మారింది. పల్లిపాడు నుంచి అంజనాపురం వరకు ప్రతీ రెండడుగులకో గుంత చొప్పున రోడ్డు జల్లెడ మాదిరిగా తయారైంది. ఆ తర్వాత నాలుగు కి.మీ.దూరంలో ఏన్కూరు ఉండగా.. ఆ రోడ్డు పరిస్థితి అధ్వానంగానే ఉంది. వర్షాకాలం కావడంతో గోతుల్లో నీరు నిండగా ఎక్కడ గుంత ఉందో తెలియక ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొణిజర్ల మండలం తీగలబంజరకు చెందిన ఓ యువకుడు మూడు నెలల క్రితం గుంతను తప్పించబోయి కిందపడి కోమాలోకి వెళ్లి మూడు రోజుల చికిత్స అనంతరం మృతి చెందాడు. లాలాపురానికి చెందిన ఓ యువకుడు కారులో ప్రయాణిస్తుండగా గుంతలో టైరు దిగబడి రిమ్ము పూర్తిగా ధ్వంసం కాగా రూ.50వేలకు పైగా నష్టపోయినట్లు తెలిపాడు. ఇక లాలాపురం – తీగలబంజర మధ్య పగిడేరుకు వరద వస్తే రోడ్డు కొట్టుకుపోయి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఏటిపై నిర్మించిన చప్టాకు రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఈ రోడ్డును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిన ప్రభుత్వం 40 శాతం, ప్రైవేట్ సంస్థలు 60 శాతం వాటా ధనంతో పునః నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. అయితే పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. శిథిలావస్థలో కల్వర్టులు.. 2018 లో రోడ్డు నిర్మించినప్పుడు ఆర్అండ్బీ అధికారులు కల్వర్టుల నిర్మాణాలపై ప్రతిపాదనలు రూపొందించకపోవడంతో పాత కల్వర్టులపైనే రోడ్డు వేశారు. ప్రస్తుతం ఆ కల్వర్టులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పల్లిపాడు సమీపంలో కల్వర్టు కూలగా పైపువేసి మట్టితో పూడ్చారు. లాలాపురం – తీగలబంజర సమీపంలో కల్వర్టులు కుంగి ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అంజనాపురం సమీపంలో నిమ్మవాగుపై నిర్మించిన లో లెవల్ చప్టా కూడా కూలేందుకు సిద్ధంగా ఉంది.పల్లిపాడు నుంచి సింగరాయపాలెం వరకు రోజూ ద్విచక్రవాహనంపై తిరుగుతుంటా. ఈ క్రమంలో గుంతలో పడి నా బైక్ ధ్వంసమైంది. రిపేర్ చేయిస్తే రూ.10 వేలు ఖర్చయ్యాయి. రోడ్డు గుంతల మయంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు. – షేక్ నాగుల్మీరా, సింగరాయపాలెంపల్లిపాడు నుంచి అంజనాపు రం వరకు రోజూ ఆటో తిప్పుతుంటా. ఈ 9 కి.మీ. ప్రయా ణం చేయడానికి గంటకు పైగా పడుతోంది. గుంతల్లో పడి ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రి పూట ఈ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడుతున్నాం. అధికారులు స్పందించి మరమ్మతు చేయాలి. – ముత్తనబోయిన లెనిన్, అటో డ్రైవర్, తీగలబంజర -
పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు
● జిల్లాలో 471 జీపీలు, 4,168 వార్డులు ● అధికంగా ఎస్టీలకు 460 సర్పంచ్ స్థానాలు చుంచుపల్లి: జిల్లాలోని 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ, 22 ఎంపీపీ స్థానాలకు అధికారులు శనివారం రిజర్వేషన్లు ప్రకటించారు. ఇదే క్రమంలో ఆదివారం జిల్లాలోని 471 పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులకు, 4,168 వార్డులకు సైతం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి వెల్లడించారు. 471 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు గాను 235 చోట్ల ఎస్టీ జనరల్కు రిజర్వ్ చేయగా, మరో 225 స్థానాలను ఎస్టీ మహిళలకు కేటాయించారు. ఇక ఎస్సీలకు జనరల్లో రెండు స్థానాలు కేటాయించగా, బీసీ జనరల్కు నాలుగు స్థానాలు, బీసీ మహిళకు మరో రెండు స్థానాలను, జనరల్ అభ్యర్థులకు మూడు స్థానాలను కేటాయిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇక గ్రామ పంచాయతీల పరిధిలోని 4,168 వార్డులకు గాను ఎస్టీ జనరల్కు 1,396 కేటాయించగా, ఎస్టీ మహిళలకు 1,257 వార్డులను రిజర్వేషన్లో అవకాశం కల్పించారు. ఎస్సీ జనరల్కు 11, ఎస్సీ మహిళకు 7, బీసీ జనరల్కు 19, బీసీ మహిళకు 23 చొప్పున రిజర్వేషన్లో వెసులుబాటు కల్పించారు. జనరల్ స్థానాల్లో 789 వార్డులు కేటాయించగా, అదే జనరల్లో మరో 666 వార్డులను మహిళలకు అవకాశం కల్పించారు. గడిచిన నాలుగు రోజులుగా గ్రామ పంచాయతీల వారీగా పంచాయతీ అధికారులు తీవ్రస్థాయిలో ఈ రిజర్వేషన్ల కేటాయింపుపై తీవ్ర కసరత్తు చేశారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాబితాలను రూపొందించి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అనుమతితో రిజర్వేషన్లను ప్రకటించారు. -
బతుకమ్మ
బంధాలను పెంచే ఖమ్మంగాంధీచౌక్: రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే అతి పెద్ద పండుగ, మహిళల ప్రత్యేక పండుగ బతుకమ్మ. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూలతో పేర్చి ఆటపాటలతో సాగే సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. సాగనంపే సద్దుల బతుకమ్మను పోయిరావమ్మ, మళ్లీ రావమ్మా అంటూ ఊరూ వాడ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సోమవారం జరుపుకునే సద్దుల బతుకమ్మకు ఇళ్లన్నీ మహిళలతో కళకళలాడుతున్నాయి. బతుకమ్మ వేడుకలను పుట్టింట్లో జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. కొందరు ఏ ప్రాంతంలో ఉన్నా, పొరుగు రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్నా బతుకమ్మ పండుగ కోసం పుట్టింటికి వచ్చి వేడుకలు నిర్వహిస్తుంటారు. పుట్టి పెరిగిన ఊరు, కలిసి చదువుకున్న స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడపడానికి మహిళలు ప్రాధాన్యత ఇస్తారు. పుట్టింటి వారే గాక పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన కోడళ్లు సైతం అత్తవారి ఇంట్లోనే ఉండి బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఏ పండుగకు తల్లిగారింటికి వెళ్లినా బతుకమ్మ పండుగకు మాత్రం అత్తవారి ఇంట్లో ఉండి పూల పండగను జరుపుకోవాలని భావిస్తున్నారు. స్నేహితులు, బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో, పచ్చిక బయళ్లలో పూలు కోసుకువచ్చి బతుకమ్మలను పేర్చుతారు. ప్రతి రోజు సాయంత్రం అందమైన దుస్తులు, పట్టు వస్త్రాలు ధరించి బతుకమ్మలను మోస్తూ బ్యాండ్ మేళాలు, డీజే సౌండ్స్, కోలాటాలతో పాటలు పాడుతూ, ఆటలాడుతూ సమీప దేవాలయాలు, జలాశయాల వద్దకు చేరుకొని గౌరమ్మను పూజిస్తూ బతుకమ్మ పాటలతో సంబురాలు జరుపుకుంటున్నారు. సోమవారం జరుపుకునే సద్దుల బతుకమ్మ కోసం విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు మహిళల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.. పూల పండుగకు ఎల్లలు దాటి వస్తున్న మహిళలు -
గోదావరి దోబూచులాట
భద్రాచలంటౌన్: ఎగువ ప్రాంతాల్లో వస్తున్న వరద ప్రవాహంతో గోదావరి పెరుగుతూ, తగ్గుతూ దోబూచులాడుతోంది. 24 గంటల వ్యవధిలో భద్రాచలం వద్ద రెండుసార్లు నీటిమట్టం 43 అడుగులు దాటడంతో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం ఉదయం 40.80 అడుగులు ఉన్న నీటిమట్టం మధ్యాహ్నం 12 గంటలకు 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. 46.60 అడుగులకు చేరి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి శనివారం రాత్రి 10 గంటలకు 42.90 అడుగులు రావడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. శనివారం ఉదయం వరకు తగ్గిన గోదావరి మధ్యాహ్నం నుంచి మళ్లీ పెరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9 గంటలకు ప్రవాహం 43.80 అడుగులకు చేరింది. రాత్రి 10 గంటలకు స్వల్పంగా తగ్గి 43.70 అడుగులుగా నీటిమట్టం నమోదైంది. గోదావరి తీర ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు నదిలో దిగకుండా హెచ్చరిక బోర్డులు, కంచె ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. మరో మూడు అడుగులు పెరిగితే భద్రాచలం నుంచి చర్లతోపాటు ముంపు మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్నాయి. 24 గంటల వ్యవధిలో రెండు సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ -
పండుగ వేళ ప్రయాణ పాట్లు
కొత్తగూడెంఅర్బన్: దసరా పండుగ సమీపిస్తుండటంతో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. రైళ్లు, ఆర్టీసీ బస్సులు రద్దీగా మారాయి. కానీ రైల్వేశాఖ ప్రయాణికుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేయలేదు. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్(కొత్తగూడెం) నుంచి అత్యధికంగా ఆదాయం గడిస్తున్నా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వరకు తెల్లవారుజామున నడిచే కాకతీయ రైలు, రాత్రి నడిచే మణుగూరు ఎక్స్ప్రెస్, సిర్పూర్ కాగజ్నగర్ వరకు నడిచే సింగరేణి ఎక్స్ప్రెస్ రైళ్లలో పండుగ వేళ ప్రయాణికుల రద్దీ నెలకొంటోంది. వీటితోపాటు మధ్యాహ్నం కొత్తగూడెం నుంచి విజయవాడకు మరో రైలు నడిపిస్తున్నారు. రైళ్లలో రిజర్వేషన్లు సైతం పండుగ తర్వాత వరకు కూడా బిజీ షెడ్యూల్తో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పండుగలకు సొంతూరికి వెళ్లే ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. కరోనా కంటే ముందు రద్దు చేసిన రైళ్లను కూడా పునరుద్ధరించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. సింగరేణి రైలుకు బదులుగా నడుపుతున్న పుష్పుల్ రైలులో సామగ్రి పెట్టుకునే వీలులేదు. బాత్రూంల నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నేపథ్యంలో దసరా తర్వాత కనీసం వారంరోజుల వరకు అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని, రైళ్లలో స్వచ్ఛత పాటించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రద్దయిన రైళ్ల కోసం ఎదురుచూపులు కొత్తగూడెం నుంచి కరోనా సమయంలో రద్దు చేసిన రైళ్ల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. పండుగ సమయంలోనైనా పునఃప్రారంభించాలని, కాకతీయ రైలుకు పాత పద్ధతిలో అదనపు బోగీలు, స్లీపర్ కోచ్తో పాటు ఏసీ బోగీలు ఏర్పాటు చేయాలని, బెల్గావి రైలును పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. వీటిపై గత జూలైలో హైదరాబాద్లో జరిగిన డీఆర్యూసీసీ సమావేశంలో రైల్వే అధికారులు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదు. నత్తనడకన అమృత్ పథకం పనులు రైల్వే స్టేషన్లో అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్టేషన్లో వెయిటింగ్ హాల్ ఒక్కటీ పూర్తికాలేదు. దీంతో ప్రయాణికులు స్టేషన్లో ఇబ్బందులు పడుతున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేకు భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి బొగ్గు రవాణా ద్వారానే ఏటా రూ.650 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. అయినా రైల్వే అధికారులు ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించడంలేదు. గతంలో ఏడు రైళ్లు గతంలో కొత్తగూడెం స్టేషన్ నుంచి ఏడు రైళ్లు రాకపోకలు సాగించేవి. సింగరేణి ఎక్స్ప్రెస్, డోర్నకల్ ప్యాసింజర్, విజయవాడ ప్యాసింజర్, కాజీపేట ప్యాసింజర్, కాకతీయ ప్యాసింజర్, కొల్హాపూర్ ఎక్స్ప్రెస్, మణుగూరు సూపర్ఫాస్ట్ సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం మణుగూరు సూపర్ఫాస్ట్, సింగరేణి ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్, విజయవాడ రైలు మాత్రమే నడుస్తున్నాయి. బెల్గావి రైలును గతేడాది రద్దు చేశారు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రైళ్ల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు. -
కదంతొక్కిన ఆదివాసీలు
● ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలి ● ధర్మయుద్ధ సభలో ఆదివాసీ సంఘాల నాయకులు ● భద్రాచలంలో ఆదివాసీ సంప్రదాయ సందడిభద్రాచలం: ఆదివాసీలు కదం తొక్కారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడాలు, బంజారాలను తొలగించే వరకు ధర్మయుద్ధం ఆగదని నినదించారు. ఫలితం వచ్చేవరకూ న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎస్టీ జాబితాలో ఉన్న బంజారాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి ఆదివాసీలు ఆదివారం భద్రాచలం తరలివచ్చారు. సంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించారు. సారపాక బ్రిడ్జి, కూనవరం, చర్ల రోడ్ల నుంచి ర్యాలీలు నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో, పాత మార్కెట్ సెంటర్లో ఆదివాసీ వీరుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన మహాసభకు తరలివెళ్లారు. అన్నింటా అన్యాయమే.. లంబాడాలను ఎస్టీ జాబితాలో కలపటం వల్ల ఆదివాసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతోందని ఆదివాసీ రాజకీయ, కుల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్మయుద్ధం పేరిట సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1971లో ఆదివాసీలు 2,85,226 మంది, లంబాడాలు 1,32,464 మంది ఉండగా, 1981లో ఆదివాసీల సంఖ్య, 3,59,799కు, లంబాడాల సంఖ్యకు 11,58,342కు చేరిందని అన్నారు. 2021 లెక్కల ప్రకారం ఆదివాసీలు 9 లక్షలకు పైగా ఉండగా, లంబాడాల సంఖ్య 40 లక్షలకు చేరుకుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఓసీ, బీసీ లంబాడాలందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి చొరబడ్డారని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని అన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేవరకు న్యాయ పోరాటం ఆగదని అన్నారు. ఎస్టీ జాబితా నుంచి బంజారాలను, లంబాడాలను తొలగించాలని హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసులో విచారణలో ఉన్నాయని తెలిపారు. న్యాయపోరాటం చేస్తున్న ఆదివాసీలపై లంబాడాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని ఆరోపించారు. తమ పోరాటానికి అందరూ సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, పినపాక, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, తాటి వెంకటేశ్వర్లు, ఆదివాసీ సంఘాల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ, ఆదివాసీ సంఘాల నాయకులు కొర్స వెంకటేశ్వరరావు, పొడియం బాలరాజు, కల్లూరి జయబాబు, మైపతి అరుణ్కుమార్, రాంబాబు, పూనెం శ్రీనివాస్, తెల్లం వెంకటేశ్వరరావు, తెల్లం రమణయ్య, ముర్రం వీరభద్రం, ముర్ల రమేష్, కోవా దవలత్ రావు, తెల్లం సీతమ్మ, పూసం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
విజేతలుగా నిలవాలని..
● భక్తులకు విజయలక్ష్మి అమ్మవారి దీవెనలు ● నేడు ఐశ్యర్య లక్ష్మిగా అమ్మవారుభద్రాచలం: జ్ఞానం ద్వారా విజేతలుగా నిలవాలని, విజయోస్తు అంటూ విజయలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులను దీవెనలు అందించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం లక్ష్మీతాయారు అమ్మవారు విజయలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం సామూహిక కుంకుమ పూజలు జరిపారు. చిత్రకూట మండపంలో శ్రీరామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేద పండితులు, అర్చకులు సుందరకాండ పారాయణం చేశారు. రామయ్యకు సువర్ణ పుష్పార్చన దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం తెల్లవారుజామున అభిషేకం జరిపారు. గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, సువర్ణ పుష్పార్చన చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం గావించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. దసరా సెలవులు, ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివార్లను దర్శించుకున్నారు. నిత్యాన్నదానానికి విరాళంభద్రాచలంటౌన్: రామాలయంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఆదివారం విజయవాడలోని సుందరయ్య నగర్ కాలనీకి చెందిన వీర్నాల శ్రీమన్నారాయణ రూ.74,400 వేల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పీఆర్వో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.నేటి ఐశ్వర్యలక్ష్మి అలంకార విశిష్టత ‘అస్యేశానా జగతో విష్ణుపత్నీ’ అని కీర్తిస్తుంది.. యజుర్వేదం. ఐశ్వర్యం అంటే శాఖాపరమైన శక్తి సామర్థ్యాలని, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు శాసకరాలు, కరుణారూపిణి అయిన ఈ అమ్మ క్రీగంటి చూపుల కదలికలనే శాసనాలుగా భావించి శ్రీ మహావిష్ణువు సకల జగద్రక్షణ చేస్తుంటాడని శ్రీ పరాశరభట్టార్ కీర్తించారు. ఈ రూపంలో ఉన్న అమ్మను ఆరాధిస్తే శాసకత్వం, వాక్కుకు ప్రభావం, అనంత ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. -
‘మల్బరీ’తో ఆదాయం మెరుగు
● రెండు ఎకరాల్లో పంట సాగు చేస్తే రూ.7 లక్షల వరకు రాబడి ● ఉద్యానశాఖ ద్వారా రైతులందరికీ రాయితీ సూపర్బజార్(కొత్తగూడెం): రైతులు సంప్రదాయ పంటలవైపు దృష్టి సారిస్తే ఆర్థికంగా ఎదుగుతారని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన సందేశంలోనూ మిర్చి, పత్తి పంటలే కాకుండా రైతులు ఉద్యాన, ఇతర పంటల వైపు దృష్టి సారించి ఆర్థిక పరిపుష్టి సాధించాలని పిలుపునిచ్చారు. రాయితీలు కూడా ఎక్కువగా ఉంటాయ ని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న రాయితీల గురించి సరైన అవగాహన లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపడం లేదు. రాయితీల వల్లే ఇటీవల జిల్లాలో ఆయిల్పామ్ సాగు పెరుగుతోంది. తాజాగా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మల్బరీసాగుతో అధిక నికర ఆదాయం పొందవచ్చని రైతులను చైతన్యం చేస్తున్నారు. మల్బరీ సాగుకు ఇస్తున్న రాయితీలను ప్రకటించారు. రెండెకరాలను యూనిట్గా పరిగణించనున్నట్లు అధికారులు తెలిపారు. యూనిట్కు రూ. 5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఓసీ, బీసీ రైతులకు రూ 4,65,456, ఎస్సీ రైతులకు రూ 6,00,456, ఎస్టీ రైతులకు రూ 6,00,456 రాయితీని ఉద్యాన శాఖ ద్వారా అందించనున్నారు. వివరాలు ఓసీ/బీసీ ఎస్సీ ఎస్టీమల్బరీ మొక్కలు నాటేందుకు 60,000 78,000 78,000 బిందు సేద్యం నిమిత్తం 50,000 65,000 65,000 పట్టు పురుగుల రేరింగ్ షెడ్కు 2,25,000 2,92,500 2,92,500 రేరింగ్ స్టాండ్స్ నిర్మాణానికి 15,456 26,706 26,706 పట్టు పురుగులు పెంచే ఇతర పరికరాలకు 37,500 37,500 37,500 రోగ నిరోధక మందులకు 2,500 3,250 3,250 కిసాన్ నర్సరీ 75,000 97,500 97,500 మొత్తం 4,65,456 6,00,456 6,00456మల్బరీసాగు రైతులకు వరప్రదాయిని. సంప్రదాయ పంటలను విడనాడి అధిక ఆదాయం సాధించేందుకు ఉద్యాన పంటలు సాగు చేయాలి. అవగాహన పెంచుకుని ఉద్యాన పంటల వైపు రైతులు దృష్టి సారించాలి. –జంగా కిషోర్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి -
భగత్సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలి
సుజాతనగర్: భగత్సింగ్ స్ఫూర్తితో విద్యా, ఉపాఽధి కోసం యువత ఉద్యమించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లిక్కి బాలరాజు, కాలంగి హరిక ృష్ణ పిలుపునిచ్చారు.శనివారం సుజాతనగర్లో నిర్వహించిన భగత్సింగ్ జయంతి వేడుకల్లో వారు మాట్లాడారు. నేటి పాలకులు స్వాతంత్య్ర స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ దేశసంపదను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. తొలుత భగత్సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాట్రాల తిరుపతిరావు, గండమాల భాస్కర్, ప్రశాంత్, వేణు, నీలావతి, కిషోర్, కావ్య, ప్రశస్త్ర తదితరులు పాల్గొన్నారు. -
గోదాముల్లోనే బతుకమ్మ చీరలు
నిరాశలో మహిళా సంఘాల సభ్యులు చుంచుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల్లోని సభ్యులకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒక్కో సభ్యురాలికి రెండు చీరలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి చీరలు జిల్లాకు చేరుకున్నాయి. ఈ నెల 22 నుంచి చీరల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో చీరల పంపిణీకి బ్రేక్ పడినట్లేనని తెలుస్తోంది. ఈనెల 29న సద్దుల బతుకమ్మ సంబరాలను జరుపుకోనున్నారు. సరిపడా చీరలను సరఫరా చేయకపోవడం వల్లే పంపిణీ నిలిపివేసినట్లు సమాచారం. దీంతో మహిళా సంఘాల సభ్యులు నిరాశ చెందుతున్నారు. కాగా జిల్లాకు చేరిన చీరలను కొత్తగూడెం, చుంచుపల్లి, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, అశ్వరావుపేట ప్రాంతాల్లోని గోదాంల్లో నిల్వ ఉంచారు. జిల్లాకు 2,13,367 చీరలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,06,685 చీరలు మాత్రమే వచ్చాయని అధికారులు తెలిపారు. -
వీధి కుక్కలతో ప్రమాదం
పాల్వంచరూరల్: రోజురోజుకూ వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధికుక్కలతోపాటు పెంపుడు కుక్కల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే రేబిస్ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. ఇటీవల జిల్లాలోని పినపాకలో పెంపుడు కుక్కు కరవడంతో రేబిస్ వ్యాధికి గురై ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. జిల్లాలో వీధి కుక్కలు అధికసంఖ్యలో సంచరిస్తున్నాయి. కుక్కకాటు బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. సంతానోత్పత్తి నియంత్రణేది..? ఎనిమల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వీధి కుక్కలను తరలించి సంతానోత్పత్తి కలగకుండా శస్త్రచికిత్స చేస్తామని అధికారులు గతంలో పేర్కొన్నారు. అనంతరం పట్టుకొచ్చిన ప్రాంతంలోనే వదిలేస్తామని చెప్పారు. కానీ జిల్లాలో ఎక్కడా కుక్కల సంతానోత్పత్తి నియంత్రణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పశువులకు కూడా.. కుక్కలు, కోతులు, ఎలుకల కాటుతో మనుషులకు, పశువులకు కూడా రేబిస్ సోకుతుంది. కుక్క సొంగ పుండ్ల మీదపడ్డ వ్యాధి సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కుక్క కరిచినప్పుడు చిన్న గాయమైతే పీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. గాయం తీవ్రంగా ఉంటే పెద్దాస్పత్రులకు వెళ్లాల్సి రావడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వీధి కుక్కలను పట్టుకుని, ఎనిమల్ కేర్ సెంటర్కు తరలించారని, ఇప్పుడు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు అవగాహన లేక నాటు వైద్యం చేయించుకుని ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అడవి జంతువులు కోతులు, పందులు, దుప్పులు, ఎలుగుబంట్లు వంటివి దాడిచేసి గాయపరిచినా కుక్క కాటు వ్యాక్సిన్ వేస్తున్నారు. మూడు నెలల్లో 5,023 మందికి.. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు 5,023మంది కుక్కకాటుకు గురైనట్లు డీఎంహెచ్ఓ జయలక్ష్మి తెలిపారు. జూన్లో 1,723, జూలైలో 1,869, ఆగస్టు 1,421 మంది ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో వ్యా క్సిన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రేబిస్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త లూయి పాశ్చర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 28న ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కుక్కకాటు బాధితులు నాటుమందు వాడొద్దు. కుక్క కరిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలి. కుక్క కాటుకు గురైనప్పుడు ప్రథమ చికిత్స కూడా కీలకం. కాటువేసిన ప్రాంతంలో ఉన్న రేబిస్ వైరస్ను మంచినీటితో, స్నానం సబ్బుతో కడగడం ద్వారా నిర్మూలించవచ్చు. ఆదివారం పెంపుడు జంతువులకు ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తాం. చుంచుపల్లి, విద్యానగర్ ఏరియా, మణుగూరులో ఈ కార్యక్రమం చేపట్టాం. –డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పశువైద్యాధికారి -
సొసైటీ సిబ్బందితో రైతుల వాగ్వాదం
టేకులపల్లి: టేకులపల్లిలోని బేతంపూడి సొసైటీ కార్యాలయం వద్ద శనివారం రైతులకు, సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టేకులపల్లి మండలానికి చెందిన ఓ రైతుకు కారేపల్లి మండలంలో సాగు భూమి ఉంది. ఆ భూమి పత్రాలతో యూరి యా తీసుకునేందుకు రాగా ఇచ్చేందుకు ఏఓ నిరాకరించారు. రెండు బస్తాలకు పైగా యూరియా తీసుకున్న వారు నానో యూరియా బాటిల్ తీసుకోవాల ని సొసైటీ సిబ్బంది మెలిక పెడుతున్నారు. ఈ క్రమంలో రైతులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొంది. క్యూలో ఉన్నవారికి ఇవ్వకుండా, పైరవీలు చేసేవారికి యూరియా బస్తాలు ఇస్తున్నారని ఆరోపించారు. కాగా నిబంధనల ప్రకారమే యూరియా పంపిణీ జరుగుతోందని సొసైటీ సీఈఓ ప్రేమాచారి తెలిపారు. చైర్మన్ సురేందర్రావు జోక్యం చేసుకుని రైతులను శాంతింపజేశారు. -
నైపుణ్యం మెరుగుపర్చుకోవాలి
బూర్గంపాడు/మణుగూరురూరల్: ఏటీసీలతో యువత నైపుణ్యం మెరుగుపర్చుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన బూర్గంపాడు మండలం కృష్ణసాగర్, మణుగూరు ప్రభుత్వ ఐటీఐలలో నూతనంగా నిర్మించిన భవనాలను, ఎక్విప్మెంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీఐ కాలేజీలలో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి పూర్తైన విద్యార్థులు ఏటీసీల్లో శిక్షణ పొందాలని చెప్పారు. ఇక్కడ శిక్షణ పొందినవారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే 19 సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్స్ ధర్మాచారి, రవి, కార్మిక శాఖ అధికారులు రాజు, యేసుపాదంంతోపాటు చెంగలరావు, దేవదాసు, వేణు రామారావు, శివకుమార్, ఎం.శ్రీనివాసరావు, జీవీ.కృష్ణారావు, ఏ.నర్సయ్య, వేణుగోపాల్ పాల్గొన్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు -
గోదావరి తగ్గుముఖం
భద్రాచలంటౌన్: ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండగా భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం శనివారం ఉదయం వరకు పెరిగినా సాయంత్రం తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు 46 అడుగులు ఉన్న నీటిమట్టం క్రమంగా తగ్గుతూ రాత్రి 10.30 గంటలకు 42.8 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహ రించారు. గోదావరి ప్రవా హం పెరగడంతో భద్రాచలం – చర్ల ప్రధాన రహదారితో పాటు ఏపీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం పడడం, ఎగువ ప్రాంతాల నుంచి నీరు చేరడంతో రామాలయ పడమర మెట్లు, విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం మునిగిపోయాయి. నీటిని గోదావరిలోకి ఎత్తిపోసేందుకు విస్తా కాంప్లెక్స్ వద్ద మోటార్లు ఏర్పాటు చేసినా, సకాలంలో ఆన్ చేయకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. కాగా, ఆలయ ఈఓ దామోదర్రావు శనివారం వర్షపు నీటిని తొలగించేలా చర్యలు చేపట్టారు. నీరు నిలిచిన ప్రదేశాల్లో బ్లీచింగ్ చల్లించడంతో పాటు పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. అప్రమత్తంగా ఉండాలని తుమ్మల ఆదేశం.. గోదావరి వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్తో శనివారం ఫోన్లో మాట్లాడి తగు సూచనలు చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, రైతులు, పశువుల కాపరులు వాగులు దాటకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరకట్ట వద్ద స్లూయీస్ లీక్ కాకుండా చూడాలని, అత్యవసర వైద్య సేవల విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. -
డీజేల మోత.. భూ సమస్య వెత
సూపర్బజార్(కొత్తగూడెం):భూ సమస్య పరిష్కరించాలంటూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రామన్నగూడెం ఆదివాసీ రైతులు ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకల నేపథ్యంలో కలెక్టరేట్లో వివిధ ప్రభు త్వ శాఖల ఆధ్వర్యంలో ప్రతి రోజు రాత్రి డీజే సౌండ్తో బతుకమ్మ ఆడుతున్నారు. దీంతో కలెక్టరేట్ పరి సర ప్రాంతాల్లో ఒకవైపు హర్షధ్వానాలు, మరో వైపు హాహాకారాలు వినిపిస్తున్నాయి. భూసమస్య పరి ష్కారం కోసం 250 ఆదివాసీ కుటుంబాలు పిల్లాపాపలతో నిరాహారదీక్ష చేపట్టిన విషయం విదితమే. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురవగా దీక్షా శిబిరం వద్ద ఆదివాసీల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. దోమల కారణంగా కొంద రు జ్వరాల బారిన పడగా, పిల్లలకు దుప్పట్లు కప్పు తూ రక్షించుకునేందుకు తల్లిదండ్రులు తెల్లవార్లు జాగారం చేయాల్సి వచ్చింది. సర్వేకు సమాయత్తం.. రామన్నగూడెం ఆదివాసీల భూ సమస్యపై ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు జిల్లా అధికారులు స్పందించారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం నుంచే భూముల సర్వేకు రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో సమాయత్తం అవుతున్నట్టు తెలిపారు. ఆయా శాఖల పరిధిలో ఎంత భూమి ఉంది, ఆదివాసీల పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఎంత భూమి ఉంది అనే విషయాన్ని క్షేత్రస్థాయిలో సర్వే చేసి కలెక్టర్కు నివేదిస్తామని చెప్పారు. కాగా, సర్వే ప్రారంభిస్తామని అశ్వారావుపేట తహసీల్దార్ రామకృష్ణ ఫోన్ ద్వారా సమాచారం అందించారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి మడకం నాగేశ్వరరావు తెలిపారు. అయితే కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు నిరాహారదీక్ష విరమించేది లేదని ఆదివాసీలు స్పష్టం చేశారు.కలెక్టరేట్ పరిసరాల్లో విచిత్ర పరిస్థితి -
జనరల్కే జెడ్పీ..
చుంచుపల్లి: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. దీంతో ఎంతో కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. పూర్తి ఏజెన్సీ జిల్లా అయినందున అత్యధిక స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని మాత్రం జనరల్ అభ్యర్థులకు రిజర్వ్ అయింది. జిల్లా ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రం ఈ స్థానం ఎస్టీలకు రిజర్వ్ అయిన విషయం తెలిసిందే. సర్వం సిద్ధం.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ ఓటర్ల తుది జాబితాలను అందుబాటులో ఉంచారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు, ఇతర ఏర్పాట్లపై అధికారులు నెలరోజులుగా కసరత్తు చేస్తుండగా ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్టయింది. ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని, బ్యాలెట్ బాక్సులను, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో 22 మండలాలు ఉండగా తొలి విడతలో 12, రెండో విడతలో 10 మండలాల్లో పోలింగ్ జరగనుంది. 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలు.. జిల్లాలో 22జెడ్పీటీసీ, 233ఎంపీటీసీ స్థానాలున్నా యి. ఎంపీటీసీ స్థానాలు అశ్వాపురం మండలంలో 12, అశ్వారావుపేటలో 11, భద్రాచలం 14, బూర్గంపాడు 17, చండ్రుగొండ 8, అన్నపురెడ్డిపల్లి 6, చర్ల 12, దమ్మపేట 17, దుమ్ముగూడెం 13, గుండాల 5, ఆళ్లపల్లి 5, జూలూరుపాడు 10, లక్ష్మీదేవిపల్లి 11, సుజాతనగర్ 5, చుంచుపల్లి 12, మణుగూరు 11, ముల్కలపల్లి 10, పాల్వంచ 10, పినపాక 9, కరకగూడెం 5, టేకులపల్లి 14, ఇల్లెందు మండలంలో 16 స్థానాలు ఉన్నాయి. వీటిలో ఎస్టీలకు 123, ఎస్సీలకు ఐదు, బీసీలకు 18, జనరల్ అభ ్యర్థులకు 87 కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా 6,69,048 మంది ఓటర్లు ఉండగా పురుషులు 3,25,045, మహిళలు 3,43,979, ఇతరులు 24 మంది ఉన్నట్టు గుర్తించారు. ప్రాదేశిక ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 1,271 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎట్టకేలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలు కానుంది.జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా చేపట్టాం. జిల్లాలోని 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ, 22 ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లను కేటాయించాం. ఎక్కువ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. షెడ్యూల్ ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నాం. – బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ మండలం జెడ్పీటీసీ(రిజర్వ్డ్) ఎంపీపీ (రిజర్వ్డ్) ఆళ్లపల్లి జనరల్(మహిళ) ఎస్టీ(జనరల్) అన్నపురెడ్డిపల్లి (ఎస్టీ జనరల్) ఎస్టీ(మహిళ) అశ్వాపురం ఎస్టీ(జనరల్) ఎస్టీ (జనరల్) అశ్వారావుపేట ఎస్టీ (మహిళ) ఎస్టీ (మహిళ) భద్రాచలం బీసీ (మహిళ) ఎస్టీ (మహిళ) బూర్గంపాడు ఎస్టీ (జనరల్) బీసీ (జనరల్) చండ్రుగొండ ఎస్టీ (మహిళ) ఎస్టీ (జనరల్) చర్ల బీసీ(జనరల్) ఎస్టీ (మహిళ) చుంచుపల్లి ఎస్సీ(జనరల్) ఎస్టీ (మహిళ) దమ్మపేట ఎస్టీ (మహిళ) జనరల్ దుమ్ముగూడెం జనరల్ ఎస్టీ (జనరల్) -
ధాన్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు శనివారం ధాన్యలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ఉదయం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం లక్ష్మీతాయారు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేడు విజయలక్ష్మి అలంకరణ.. లక్ష్మీతాయారమ్మవారు ఆదివారం విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. విజయం అంటే కేవలం యుద్ధ విజయమే కాదని, అన్ని రంగాల్లో విజయమని, ఈ రూపంలో ఉన్న అమ్మను సేవిస్తే అన్ని రంగాల్లో సునిశితమైన జ్ఞానాన్ని ప్రసాదించి, తద్వారా విజేయులను చేస్తుందని, అందుకే అమ్మవారిని విజయలక్ష్మిగా అలంకరిస్తున్నామని అర్చకులు తెలిపారు. రామయ్యకు సువర్ణ తులసీ అర్చన.. భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఐటీడీఏకు టూరిజం ఎక్స్లెన్స్ అవార్డు
● పీఓకు అందజేసిన సీఎం భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏకు టూరిజం ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు హైదరాబాద్ శిల్పారామంలో శనివారం జరిగిన ప్రపంచ పర్యాటక వేడుకల్లో పీఓ బి.రాహుల్కు సీఎం రేవంత్రెడ్డి అవార్డు అందజేశారు. ఐటీడీఏ ప్రాంగణంలో ట్రైబల్ మ్యూజియాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది పర్యాటకులను విశేషంగా ఆకర్షించడంతో పాటు ప్రాచర్యంలో తీసుకొచ్చినందుకు గాను ఈ పురస్కారానికి ఎంపికై నట్లు పీఓ తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అభినందించారని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.కేటీపీఎస్ విస్తరణకు కేంద్రం నుంచి సహకారం● ఎంపీ రఘురాంరెడ్డి లేఖకు కేంద్ర మంత్రి స్పందన ఖమ్మంమయూరిసెంటర్: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్( కేటీపీఎస్) మరో రెండు యూనిట్ల విస్తరణ, ఆధునికీకరణకు ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర విద్యుత్ శాఖ సహాయమంత్రి శ్రీపాద్నాయక్ తెలిపారు. ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆగస్టు 20న ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈమేరకు కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్నాయక్ సానుకూలత వ్యక్తం చేస్తూ తాజాగా ఎంపీ రఘురాంరెడ్డికి లేఖ పంపారు. పాత కేటీపీఎస్ స్టేషన్ వద్ద అందుబాటులో ఉన్న స్థలంలో రెండు 800 మెగావాట్ల యూనిట్ల స్థాపనకు నివేదిక సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టీజీ జెన్కోకు సూచించగా.. నివేదిక రావాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. టీజీ జెన్కో నిధులు సమకూరుస్తుందని, ఆపై కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను సులభతరం చేయనుండగా, బొగ్గు కేటాయింపునకు సైతం కేంద్రం అవసరమైన మద్దతు ఇస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆ లేఖలో తెలిపారని ఎంపీ రఘురాంరెడ్డి వెల్లడించారు. వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయంసింగరేణి(కొత్తగూడెం): గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సింగరేణి వ్యాప్తంగా రోజుకు 90 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతోంది. సంస్థ ఈ ఏడాది 76 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకోగా రోజుకు 1.80లక్షల టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉంటుంది. కానీ వర్షం కారణంగా 90 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. కాగా సింగరేణి వ్యాప్తంగా 18 ఓపెన్కాస్ట్ గనుల్లో రోజుకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తీయాల్సి ఉండగా వర్షంతో విఘాతం కలిగింది. ఓసీల్లోకి చేరిన వాన నీటిని ప్లాంటూన్ పంపుల ద్వారా తీయిస్తున్నారు. కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలుసూపర్బజార్(కొత్తగూడెం): బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు వేడుకలను కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. డీఆర్డీఏ, మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపాలిటీలు, టీజీఓఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కలెక్టర్ జితేష్ విపాటిల్, అదనపు కలెక్టర్ విద్యాచందన, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డీసీఓ రుక్మిణి, టీజీఓఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటపుల్లయ్య, టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సులోచనారాణి తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ‘ఓపెన్’ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: ఈనెల 22న ప్రారంభమైన ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు శనివారం ముగిశాయని డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. చివరి రోజు ఇంటర్ అభ్యర్థులు 107 మందికి 87 మంది హాజరయ్యారని, ఉదయం జరిగిన పదో తరగతి పరీక్షకు ఎనిమిది మందికి ఆరుగురు, మధ్యాహ్నం పరీక్షకు 18 మందికి 12 మంది హాజరయ్యారని వివరించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. -
కేటీపీఎస్లో భారీగా తగ్గిన విద్యుదుత్పత్తి
పాల్వంచ: ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు, నాణ్యత లేని బొగ్గు కారణంగా కేటీపీఎస్ కాంప్లెక్స్లో విద్యుత్ ఉత్పత్తిపై భారీగా ప్రభావం పడుతోంది. విద్యుత్ డిమాండ్ తగ్గడంతో యూనిట్లను రిజర్వ్ షట్డౌన్లో ఉంచాల్సి వస్తోంది. 5, 6, 7 దశల కర్మాగారాల్లో 1,800 మెగావాట్లకు గాను ప్రస్తుతం 1,200 మెగావాట్లు మాత్రమే నడుస్తున్నట్లు తెలుస్తోంది. 5వ దశ కర్మాగారంలో 250 మెగావాట్ల సామర్థ్యం గల 8వ యూనిట్ను శుక్రవారం వరకు బ్యాక్డౌన్లో ఉంచగా శనివారం తిరిగి ఉత్పత్తి ప్రారంభించారు. 9వ యూనిట్ 250 మెగావాట్లు పూర్తిగా రిజర్వ్ షట్డౌన్ చేశారు. 500 మెగావాట్ల సామర్థ్యం గల 10వ యూనిట్లో నాణ్యత లేని బొగ్గు వినియోగంతో 370 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే వస్తోంది. 7వ దశలో 800 మెగావాట్లకు గాను 710 మెగావాట్లు మాత్రమే వస్తోంది. జల విద్యుత్ అధికంగా వస్తున్న క్రమంలో రాత్రి వేళ హైడల్ విద్యుత్ను, పగలు మాత్రమే థర్మల్ విద్యుత్ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో థర్మల్ కేంద్రాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ విషయమై 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్రావును వివరణ కోరగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఉత్పత్తిని తగ్గిస్తున్నామని, నాణ్యత లేని బొగ్గుతో కూడా ఉత్పత్తి తగ్గిందని తెలిపారు.రిజర్వ్ షట్డౌన్లో పదో యూనిట్ 250 మెగావాట్లు -
కొండా లక్ష్మణ్ను ఆదర్శంగా తీసుకోవాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రతి ఒక్కరూ అదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ.. తెలంగాణ, స్వాతంత్య్ర ఉద్యమాల్లో బాపూజీ కీలకపాత్ర పోషించారని అన్నారు. 1969లో జరిగిన తెలంగాణ తొలిదశ పోరాటంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమానికి అండగా దీక్ష చేశారని, మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేశారని కొనియాడారు. తనకంటూ ఏమీ లేకుండా బలహీన వర్గాల అభివృద్ధికి తన ఆస్తులను దానం చేసిన త్యాగశీలి అని అన్నారు. తుది శ్వాస వరకు తెలంగాణ సాధనకు, బడుగుజీవుల అభ్యున్నతికి కృషి చేశారని కీర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి అనేక కార్యక్రమాలను ఆధికారికంగా నిర్వహించడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి పి. విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమాధికారి ఎ.శ్రీలత, డీఎస్ఓ రుక్మిణి, బీసీ సంఘం నాయకులు ఇమంది ఉదయ్కుమార్, కొదుమూరి సత్యనారాయణ, గుమలాపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ విపాటిల్ -
పత్తి కొనుగోళ్లకు అడ్డంకులు
● సీసీఐ టెండర్లకు జిన్నింగ్ మిల్లులు దూరం ● నిబంధనలు మార్చాల్సిందేనని డిమాండ్ ● అక్టోబర్ ఆరంభం నుంచి పత్తి కొనుగోళ్లు కష్టమే.. ఖమ్మంవ్యవసాయం: పత్తి పంట సీజన్ ముంచుకొచ్చినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటవుతాయో స్పష్టత రావడం లేదు. అక్టోబర్ మొదటి నుంచి పత్తి కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించగా.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) జిన్నింగ్ మిల్లుల ఎంపికకు కసరత్తు మొదలుపెట్టింది. అయితే, టెండర్ల దాఖలుకు మిల్లర్లు ముందుకు రావడంలేదు. ఇప్పటికే గ్రామాలు, మార్కెట్లలో పత్తి క్రయవిక్రయాలు మొదలుకాగా గరిష్టంగా రూ.7,500, మోడల్ ధర రూ.6,500, కనిష్టంగా రూ.4,300 ధరే దక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 8 తేమశాతం కలిగిన పత్తికి గరిష్టంగా క్వింటాకు రూ. 8,110 ధర నిర్ణయించింది. 12 శాతం వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వ కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు ధర విషయంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. రెండు సార్లు ఆహ్వానించినా.. ఖమ్మం జిల్లాలోని 2,25,613 ఎకరాల్లో పత్తి సాగు కాగా 27,07,356 క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో 2,40,345 ఎకరాల నుంచి 28,05,576 పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఏటా సీసీఐ ఆధ్వర్యాన జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపడుతారు. మిల్లులను టెండర్ల ద్వారా ఎంపిక చేయాల్సిఉండడంతో ఈసారి యజమానులు దూరంగా ఉంటున్నారు. ఆగస్టు 9న తొలిసారి టెండర్లు ఆహ్వానించి అదేనెల 31వ తేదీ వరకు గడువు విధించారు. టెండర్ల నిబంధనలను కఠినంగా ఉన్నాయని మిల్లుల యజమానులు రాకపోవడంతో సెప్టెంబర్లో రెండో సారి ఆహ్వానించినా యజమానులు పాల్గొనలేదు. దీంతో మూడోసారి టెండర్ల నిర్వహణకు సీసీఐ సిద్ధమవుతోంది. సీసీఐ నిబంధనల కారణంగానే తాము టెండర్లు దాఖలు చేయడం లేదని మిల్లుల యజమానులు చెబుతుండగా.. మూడోసారి టెండర్లలో మార్పులు చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది. కాగా, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ల వారీగా పత్తి కొనుగోళ్లకు జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసిన అధికారులు ప్రభుత్వం, సీసీఐకి ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లాలో తొమ్మిది, భద్రాద్రి జిల్లాలో ఆరు మిల్లులను నోటిఫై చేసి కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కమిటీలను కూడా నియమించారు. ఇదంతా బాగానే ఉన్నా టెండర్ల ప్రక్రియ ఎటూ తేలకపోవడంతో పత్తి కొనుగోళ్లు ఎప్పుడు మొదలవుతాయో స్పష్టత రావడం లేదు. మరికొన్ని సవాళ్లు పత్తి కొనుగోళ్లకు టెండర్ల ప్రక్రియ ఓ సవాల్గా ఉండగా, వ్యవసాయ శాఖ పంట నమోదు ప్రక్రియ కూడా ఇంకో అడ్డంకిగా మారనుంది. యూరియా కొరత నేపథ్యాన వ్యవసాయ విస్తర్ణాధికారులు ఆ పనుల్లో నిమగ్నమై ఉండగా.. పంట నమోదు ప్రక్రియ పూర్తికాలేదు. వ్యవసాయ శాఖ నమోదు చేసిన సాగు విస్తీర్ణం ఆధారంగా పత్తి కొనుగోళ్లు ఉంటాయి. దీనికి తోడు ఈ ఏడాది కేంద్రప్రభుత్వం ‘కపాస్ కిసాన్ యాప్’ను ప్రవేశ పెట్టింది. రైతులు ఈ యాప్లో పంట విక్రయానికి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉండడంతో మారుమూల గ్రామాల రైతులకు ఇబ్బంది పడే అవకాశముంది.ప్రభుత్వ ఆదేశాల మేరకు పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంపిక చేసిన మిల్లుల్లో కొనుగోళ్లు సజావుగా సాగేలా వివిధ శాఖల అధికారులతో కమిటీలు నియమించాం. జిన్నింగ్ మిల్లులకు టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పత్తి కొనుగోళ్లు మొదలవుతాయి. – ఎం.ఏ.అలీం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం -
సింగరేణి లాభాల వాటాలో ‘శ్రీరాంపూర్’ ఫస్ట్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ప్రకటించిన లాభాల వాటాలో శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేసే టింబర్ యార్డ్ వర్క్మన్ సుద్దిమల్ల శ్రీనివాస్కు అత్యధికంగా రూ.3,27,018 బోనస్ లభించనుంది. అలాగే మొత్తం సింగరేణి వ్యాప్తంగా అధికంగా బోనస్ అందుకునే మొదటి పది మందిలో ఈ ఏరియా నుంచే ఎనిమిది మంది ఉండడం విశేషం. సింగరేణి సంస్థ అందించే లాభాల వాటాలో ఏ విభాగంలోని కార్మికులకు ఎంత మొత్తం బోనస్ వస్తుందన్న వివరాలను శనివారం యాజమాన్యం వెల్లడించింది. దీని ప్రకారం.. మరో టింబర్యార్డ్ వర్క్మన్ మేషు కిశోర్ రూ.3,20,093, ఎస్టీపీసీ డీవైజీఎం ఎనగందుల శ్యాంరాజ్ రూ.3,13,724, ఆర్జీ–3 ఏరియా జీడీకే–11 సీనియర్ మైనింగ్ సర్దార్ నాగ వేణుగోపాల్ రూ.3,12,897 బోనస్గా అందుకోనున్నారు. అలాగే, శ్రీరాంపూర్ ఏరియా ఆర్కేఎన్టీ గని హెడ్ ఓవర్మన్ జక్కినబోయిన సదానందం రూ.3,06,850, ఆర్కే–7 గని ఫోర్మన్ మెకానిక్ పుదారి ఉమేశ్గౌడ్ రూ.3,06,184, టింబర్ యార్డ్ వర్క్మన్ ఈసంపల్లి ప్రభాకర్ రూ.3,05,614, ఆర్కే–5 గని ఎస్డీఎల్ ఆపరేటర్ బండారి శ్రీనివాస్ రూ.3,05,334, ఆర్జీ–1 ఏరియా జీడీకే–11 గని అదనపు మేనేజర్ బి.మల్లేశం రూ.3,03,759, శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే–5 గని ఎస్డీఎల్ ఆపరేటర్ అటికం శ్రీనివాస్ రూ.3,03,715 అందుకోనున్నారు. అండర్ గ్రౌండ్ కార్మికులకు మస్టర్కు రూ.805.37 సింగరేణి సంస్థ 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో 34 శాతం వాటాను కార్మికులకు ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంస్థలో సుమారు 40 వేల మంది కార్మికులకు రూ.802.40 కోట్లు వాటాగా చెల్లించనున్నారు. కాగా, సింగరేణిలో పనిచేసే ఉద్యోగులను యాజమాన్యం వివిధ విభాగాలుగా విభజించింది. ఇందులో అండర్ గ్రౌండ్ కార్మికులకు మస్టర్ (ఒక రోజు హాజరు)కు రూ.805.37 చొప్పున చెల్లించనున్నారు. అంటే అత్యధిక హాజరు నమోదైన వారికి అత్యధిక బోనస్ అందనుంది. ఇక ఓసీ, సీఎస్పీ, ఎస్టీపీపీ ఉద్యోగులకు మస్టర్కు 637.58, డిపార్ట్మెంట్ ఉద్యోగులకు రూ.588.53 చొప్పున చెల్లించనున్నారు. ఈ లెక్కల ప్రకారం సింగరేణి యాజమాన్యం లాభాల బోనస్ డబ్బును సోమవారం కార్మికుల ఖాతాల్లో జమ చేయనుంది. -
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్
తీవ్రంగా గాయపడిన యువకుడు మణుగూరుటౌన్: బొగ్గు తరలిస్తున్న లారీలో లోపాలు తలెత్తడంతో రోడ్డుపైనే నిలిపారు. వెనుక నుంచి వచ్చిన ఆటో లారీని ఢీకొట్టగా.. పక్కకు తీస్తున్న క్రమంలో మరో వ్యక్తి బైక్తో వచ్చి ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బీటీపీఎస్కు మణుగూరు నుంచి బొగ్గు తరలిస్తున్న ఓ టిప్పర్ తెల్లవారుజామున విజయనగరం గ్రామం నాగులమ్మ ఆలయ సమీపంలో నడిరోడ్డుపై నిలిచిపోయింది. లారీ ఆగి ఉన్నట్లు ఎలాంటి గుర్తులు పెట్టకపోవడంతోపాటు సిగ్నల్ లైట్లు లేకపోవడంతో వెనుక నుంచి వచ్చిన ఆటో వేగంగా ఢీకొట్టింది. ఆటోను పక్కకి తొలగిస్తున్న క్రమంలో ఓబీ కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా విధులు పూర్తిచేసుకున్న కంచర్ల ప్రవీణ్ బైక్పై వచ్చి లారీని ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో చికిత్స నిమిత్తం స్థానికులు మణుగూరు ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి భద్రాచలం, ఖమ్మం తరలించారు. ఆటో నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా, వివరాలు తెలియరాలేదు. ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మణుగూరు పోలీసులను రోడ్డు ప్రమాద విషయమై సంప్రదించగా ఫిర్యాదు అందలేదన్నారు. -
ఏసీబీకి చిక్కిన మణుగూరు ఎస్ఐ
మణుగూరు టౌన్: కారు చోరీ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40వేల లంచం డిమాండ్ చేసిన మణుగూరు ఎస్సై రంజిత్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో ఇద్దరు నిందితులు స్టేషన్ బెయిల్ కోసం కొన్నాళ్ల క్రితం ఎస్సైను ఆశ్రయించారు. ఇందుకోసం ఆయన రూ.40 వేలు డిమాండ్ చేశాడు. కొద్దిమేర తగ్గించాలని కోరినా ఎస్సై ససేమిరా అనడంతో వారు ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. ఆపై గతంలోనే డబ్బు ఇచ్చేందుకు వచ్చినా అనుమానంతో తీసుకోలేదు. ఈమేరకు ఫిర్యాదుదారుల నుంచి సేకరించిన ఆడియో, వీడియో రికార్డింగ్ల ఆధారంగా ఎస్సై రంజిత్పై 7బీ కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపారు. తనిఖీల్లో ఖమ్మం ఏసీబీ సీఐలు శేఖర్, కృష్ణకుమార్ పాల్గొన్నారు.స్టేషన్ బెయిల్కు రూ.40వేల లంచం డిమాండ్ -
‘మద్యం’ దరఖాస్తులకు ఏర్పాట్లు..
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2025–27 నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలో మొత్తం 88 వైన్ షాపులుండగా 44 ఎస్టీలకు, 31 జనరల్ కేటగిరీకి, ఎస్సీ 7, గౌడ్ 6 కేటాయించినట్లు చెప్పారు. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం కౌంటర్లు ఏర్పాటు చేశామని, తొలి రోజు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని అన్నారు. టెండర్లో పాల్గొనేందుకు గానూ రూ.3 లక్షల ఫీజును ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గతేడాది 5,057 దరఖాస్తులు వచ్చాయని, ఈ ఏడాది అంతకంటే ఎక్కువ రావొచ్చని అన్నారు. అక్టోబర్ 18వ తేది వరకు గడువు ఉందని, 23న డ్రా తీస్తామని తెలిపారు. ఎకై ్సజ్ టాస్క్ఫోర్ ఎస్సై గౌతమ్, సిబ్బంది పాల్గొన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య -
రామయ్య చెంత రైలు కూత!
రాజుపేటలో భద్రాచలం రైల్వే స్టేషన్! ● భద్రగిరి–మల్కాన్గిరి రైల్వే లైన్లో మార్పులు జరిగే అవకాశం ● ధ్రువీకరించాల్సిన రైల్వే శాఖ అధికారులు అన్ని అనుకూలిస్తే భద్రగిరివాసుల దశాబ్దాల కల వాస్తవరూపం దాల్చనుంది. రైల్వే శాఖ చిత్రపటంలో భద్రాచలం పేరు కనిపించనుంది. భద్రాచలం–మల్కాన్గిరి రైల్వే లైన్ ఏర్పాటుతో రామ భక్తుల ముచ్చట కూడా తీరనుంది. గోదావరికి ఇరువైపులా ప్రతిపాదించిన రైల్వే స్టేషన్ల సర్వేలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటువైపు సారపాకలో, అటువైపు తాజాగా భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న రాజుపేటలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుండగా, రైల్వే అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులతో ఇమిడి ఉన్న రాజుపేటలో ఏ ప్రాంతంలో రైల్వే స్టేషన్ రానుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. –భద్రాచలం భద్రాచలం స్టేషనే కీలకం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో రవాణా, ప్రయాణికుల కోసం మల్కాన్గిరి–భద్రాచలం రైల్వే లైన్ ప్రతిపాదించారు. రైల్వే మార్గంలో అనేక గిరిజన గ్రామాలు అనుసంధానించనున్నారు. ఇందుకోసం సుమారు 173 కిలోమీటర్ల మేర లైన్, పలు చోట్ల భారీ వంతెనలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించారు. ఒడిశాలోని జేపూర్ వరకు, అక్కడి నుంచి మల్కాన్గిరి వయా భద్రాచలం వరకు ఈ లైన్ ఉంటుందని గతంలో అధికారులు పేర్కొన్నారు. భద్రాచలం నుంచి పాండురంగాపురం రైల్వే స్టేషన్ను అనుసంధానం చేస్తూ సారపాకలో రైల్వే స్టేషన్కు ప్రతిపాదించారు. నిర్మాణానికి తొలుత సుమారు రూ. 2,800 కోట్లు, ఆ తర్వాత రూ.3,592 కోట్లు వ్యయకానుందని అంచనా వేశారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఈ రైల్వే లైన్ వస్తే భద్రాచలానికి దేశ వ్యాప్తంగా రైల్వే రవాణా భక్తులకు అందుబాటులో రానుంది. రామాలయానికి కూతవేటు దూరంలో.. గతంలో ఒడిశాలోని మల్కాన్ గిరి, బదలి, కోవాసి గూడ, రాజన్గూడ, మహారాజ్ పల్లి, లూనిమన్గూడ స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్లోని కన్నాపురం, కుట్టుగుట్ట, పల్లు, నందిగామల గుండా భద్రాచలంలో ప్రవేశించేట్లు రైల్వే లైన్ పనులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ భద్రాచలానికి సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో ఉండే ఏపీలోని యటపాక, పిచుకలపాడు తదితర గ్రామాల వద్ద ఏర్పాటయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగింది. తాజాగా స్టేషన్ భద్రాచలం పరిధిలో ఉన్న రాజుపేటలోకి మారినట్లు సమాచారం. ఏపీలోని చింతూరు మండలం కుయుగూరు, కూనవరం మండలంలోని సీతారామపురం, భీమవరంలో రైల్వే స్టేషన్ల ప్రతిపాదన కూడా వచ్చింది. భద్రాచలం శివారు రాజుపేట గ్రామంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి కూత వేటు దూరంలో రైల్వే స్టేషన్ రానుండటంతో భక్తులు, భద్రాచలం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఉమ్మడిగా రాజుపేట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజుపేట భద్రాచలం శివారు ప్రాంతంగా ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం గ్రామం రెండు ముక్కలయింది. రెండు రాష్ట్రాల సరిహద్దుగా మారింది. ఇక్కటి ప్రజలకు తెలంగాణలో ఇళ్లు, ఏపీలో పొలాలు ఉన్నాయి. రాజుపేటలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తే ఇటు తెలంగాణలోనా, అటు ఆంధ్రప్రదేశ్లోనా అనే సస్పెన్స్ నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఖాళీ స్థలాలు అత్యధికంగా ఏపీలోనే ఉన్నాయి. దీంతో దాదాపు ఏపీలోని రాజుపేటలోనే నెలకొనే అవకాశం ఉంది. ఈ విలీన గ్రామపంచాయతీ ప్రజలు ఎన్నో రోజుల నుంచి తమ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చితే రైల్వే స్టేషన్ను ఏ రాజుపేటలో ఏర్పాటు చేసినా తెలంగాణ పేరు మీదుగానే చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. -
అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు
ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఎనిమిది రోజులపాటు ప్రభుత్వం దసరా సెలవులు ఇచ్చింది. కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, తల్లులకు రోజూ అందిస్తున్న మెనూ, పోషకాహారంలను టేక్ హోంతో ఇళ్లకు అందజేస్తామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. అంగన్వాడీలకు మొదటిసారిగా సెలవులను ఇవ్వడంతో టీచర్లు, ఆయాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లు అంగన్వాడీ సిబ్బందికి సెలవులు ఇచ్చామని, జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా తెలిపారు. భూసేకరణకు సర్వేజూలూరుపాడు: సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం కోసం శుక్రవారం గుండెపుడి, రామచంద్రాపురం గ్రామాల్లో భూసేకరణ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈఈ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ 16 ఆర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ప్యాకేజీ–2 కింద భూసేకరణకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని చెరువులకు, సీతారామ ప్రధాన కాలువను సంధానం చేసేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. జూలూరుపాడు సొసైటీ చైర్మన్ కొమ్మినేని పాండురంగారావు, కాళ్లూరు ప్రవీణ్ కుమార్, ఆనగంటి ధనమయ్య, రైతులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలిచుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పారదర్శకంగా పోలింగ్ జరిగేందుకు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన, జిల్లా ఉపాధికల్పానాధికారి శ్రీరామ్, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం ఐడీఓసీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్టేజ్ –1 రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో సంబంధిత ఆర్వోలు, ఏఆర్వోలు సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. 180 మందికి శిక్షణ నిర్వహించారు. గ్రామ పంచాయతీల ఎన్నికల విధులకు హాజరయ్యే ఆర్వోలు, ఏఆర్వోలకు కొత్తగూడెం క్లబ్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 742 మందికి అవగాహన కల్పించారు. డీల్పీఓలు ప్రభాకర్, సుధీర్, ఏఓ రమణ, పుల్లయ్య పర్యవేక్షించారు. వంద శాతం పీఎల్ఎఫ్ సాధించాలిపాల్వంచ: విద్యుదుత్పత్తిలో వంద శాతం పీఎల్ఎఫ్(ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించేలా కృషి చేయాలని జెన్ కో (థర్మల్) వై.రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 7వ దశ కర్మాగారాన్ని ఆయన ఎఫ్ఏ సీసీఎం (అకౌంట్స్) జి.సత్తిరాజుతో కలిసి సందర్శించారు. యాష్ పాండ్, యాష్ ప్లాంట్, సైలోస్లలో పర్యటించారు. అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. నాణ్యతతో కూడిన విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా, విధుల్లో క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. మెయింటెనెన్స్ సక్రమంగా ఉంటేనే ఉత్పత్తిలో అంతరాయాలు నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో జనరేషన్ సీఈ రత్నాకర్, 7వ దశ సీఈ శ్రీనివాసబాబు, ఎస్ఈలు రాజ్కుమార్, కె.కిరణ్కుమార్ పాల్గొన్నారు. ‘ప్రభాత సుమాలు’ గ్రంథానికి గుర్తింపుఅశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటకు చెందిన సాహితీవేత్త సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు రచించిన పరిశోధనా గ్రంథం ప్రభాత సుమాలుకు అంతర్జాతీయ ప్రామాణికత గ్రంథ గుర్తింపు లభించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని రాజారామమోహన్రాయ్ ఐఎస్బిఎన్ ఏజెన్సీ నుంచి అధికారికంగా లేఖ వచ్చినట్లు రచయిత తెలిపారు. కాగా, ఈ గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం ఆర్థిక సహకారంతో ముద్రించి నవంబర్లోపు పాఠకులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. -
‘జల్ సంచయ్’లో ప్రత్యేక గుర్తింపు
జిల్లాకు రూ. 25 లక్షల నగదు బహుమతి చుంచుపల్లి: దేశవ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడంతోపాటు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రావడం గర్వకారణమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 కార్యక్రమంలో జిల్లాకు రూ.25 లక్షల నగదు బహుమతి లభించిందన్నారు. జిల్లాలో 32,000 నిర్మాణాలు చేపట్టి 29,103 నీటి సంరక్షణ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఇంకుడు గుంతలు, నీటికుంటలు, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, ఊట చెరువులు వంటి వర్షపు నీటి సంరక్షణ పనులు పట్టణ ప్రాంతాలకు కూడా ఉపయుక్తంగా మారాయని పేర్కొన్నారు. ప్రజల సహకారం, స్థానిక సంస్థల భాగస్వామ్యం, గ్రామీణ అభివృద్ధి సంస్థల కృషితో ఈ విజయాన్ని సాధించగలిగామని అన్నారు. -
ప్రకృతి సంపదను కాపాడుకోవాలి
అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క గుండాల : ప్రజలు ప్రకృతి సంపదను కాపాడుకోవాలని అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని జయశంకర్ నగర్ యాపలగడ్డ గ్రామంలో బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సాహంగా బతుకమ్మ ఆడి బహుజన బతుకమ్మ ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ప్రకృతి రక్షణ, ప్రజలకు రక్షణగా బహుజన బతుకమ్మ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజులు బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం కూడా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఆటపాట మాటతో ప్రారంభించి చివరిగా ఉప్పల్ మండల కేంద్రంలో ముగింపు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణక్క, రుద్ర. మల్సూర్, సమ్మయ్య పాల్గొన్నారు. -
ఎస్టీ కమిషన్ విచారణకు అధికారుల గైర్హాజరు
ఇల్లెందురూరల్: జేకేఓసీ విస్తరణలో భాగంగా గిరిజనుల సాగుభూమి విషయంలో జాతీయ ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన విచారణకు బాధిత రైతులు హాజరు కాగా సింగరేణి అధికారులు గైర్హాజరయ్యారు. మండలంలోని పూసపల్లి గ్రామ సమీపంలో విజయలక్ష్మినగర్ గ్రామపంచాయతీలో గిరిజనులు సాగుచేస్తున్న సర్వే నంబర్ 588/2 పరిధిలో ఉన్న 7.03 ఎకరాల విస్తీర్ణంపై సింగరేణి అధికారులు అనుసరిస్తున్న తీరును రైతులు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్కు వివరించారు. గతంలో రెవెన్యూ, అటవీశాఖల అధికారులు సాగులో ఉన్న తమకు పట్టాల మంజూరులో ఒకరిపై మరొకరు నెపం పెట్టుకొని అన్యాయం చేశారని వాపోయారు. ప్రస్తుతం పట్టాలు లేవన్న సాకుతో రెవెన్యూ అధికారులు తమ నుంచి భూమిని స్వాధీనం చేసుకుని, సింగరేణికి అప్పగించినట్లుగా తమకు నోట్ పంపారని తెలిపారు. ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ స్పందిస్తూ విచారణకు సింగరేణి అధికారులు హాజరు కానందున మరో సమన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహాశక్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మాలోత్ దిలీప్, 21పిట్ ఏరియా అఖిల పక్ష కమిటీ నేతలు పూనెం సురేందర్, వడ్ల శ్రీనివాస్, బాధిత రైతులు పాల్గొన్నారు. -
విద్య, ధన ప్రాప్తిరస్తు
● వైభవంగా సాగుతున్న నవరాత్రి ఉత్సవాలు ● నేడు ధాన్యలక్ష్మి అలంకరణలో అమ్మవారు భద్రాచలం: విద్యాధనం, హిరణ్య ధనం, శక్తి ధనంలను ప్రసాదించే ధనలక్ష్మిగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చి అభయమిచ్చారు. భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజలను గావించారు. లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చన జరిపారు. చిత్రకూట మండపంలో వేద పండితులు, అర్చకులు అరణ్య కాండ పారాయణం చేశారు. ధాన్యలక్ష్మి అలంకార విశిష్టత అమ్మవారిని శనివారం ధాన్యలక్ష్మిగా అలంకరించనున్నారు. అన్ని రకాల ధాన్యాన్ని ప్రసాదించేది అమ్మవారేనని, అమ్మవారిని ఆరాధిస్తే ఈతి బాధలన్నీ తొలగి, సమయానికి తగిన వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. కనుల పండువగా కల్యాణం స్వామివారికి బేడా మండపంలో నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అలరించిన నృత్య ప్రదర్శనభద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శుక్రవారంనిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మైత్రి ఫైన్ ఆర్ట్స్ మద్రాస్ ఆధ్వర్యంలో సరళ కుమారి నేతృత్వంలో చిత్రకూట మండపంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ నిత్య రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిన్నారుల నృత్యం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. -
పిల్లాపాపలతో రేయింబవళ్లు దీక్ష
సూపర్బజార్(కొత్తగూడెం): మా భూమి మాకు అప్పగించాలని ఆదివాసీలు రేయింబవళ్లు దీక్షలు చేపడుతున్నారు. చెట్ల పొదలతో నిండి ఉన్న కలెక్టరేట్ ధర్నాచౌక్లో అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఐదు రోజులుగా అక్కడే దీక్ష చేపడుతున్నా.. జిల్లా ఉన్నతాధికారులంతా కలెక్టరేట్లోనే ఉంటున్నా అడవి బిడ్డల గోస ఎవరికీ పట్టడంలేదు. 250 మంది ఆదివాసీలు చిన్న పిల్లలతో విద్యుత్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం లేకపోయినా ఆందోళన కొనసాగిస్తున్నారు. ధర్నాచౌక్లో పూర్తిగా అపరిశుభ్ర వాతావరణం, చెట్ల పొదలతో నిండి ఉండటంతో దోమలు, ఇతర కీటకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల కారణంగా కొందరు వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఇలాగే దీక్ష కొనసాగితే చాలామంది అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. చిన్న పిల్లలతో కూడా ఉండటంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వారు పడుతున్న అవస్థలు చెప్పనలవి కాదు. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఆందోళన వైపు దృష్టిసారించలేదు. అన్ని పార్టీలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపి తమ భూసమస్యను పరిష్కరించాలని ఆదివాసీలు కోరుతున్నారు. రామన్నగూడెంలో 150 మంది ఆదివాసీ రైతులకు సంబంధించిన 573.20 ఎకరాల భూమి విషయంలో అటవీ, ఎఫ్డీసీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నెలకొంది. భూములకు ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇచ్చిందని, హైకోర్టు సైతం తమకు అనుకూలంగా 2011లో తీర్పు చెప్పిందని, అయినా భూమి మాత్రం తమకు దక్కలేదని ఆదివాసీలు ఆవేదన చెందుతున్నారు. దీక్షలకు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య దీక్షా శిబిరాన్ని సీపీఐ మాస్ లైన్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ రవి మాదిగ తదితరులు దీక్షలను సందర్శించి మద్దతు తెలిపారు. మా భూములపై హక్కు కల్పించాలి. తాత ముతాత్తల కాలం నుంచి పోరాటం జరుగుతోంది. మాకు పట్టాలు ఉన్నాయి. 573 ఎకరాల్లో 104 ఎకరాలు మాత్రమే మా ఆధీనంలో ఉన్నాయి. 180 మంది ఆదివాసీ రైతుల గోడును అధికారులు పట్టించుకోవాలి. –మడకం నాగేశ్వరరావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శిఎన్ని కష్టాలు ఎదురైనా మా భూ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదలం. మాకు భూమిపై హక్కు కల్పించాలి. రెవెన్యూ, అటవీశాఖలు సమన్వయంతో మా సమస్యను పరిష్కరించాలి. –ముడియం రమాదేవిపిల్లా పాపలతో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటూ ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే అధికారులు స్పందించక పోవడం దారుణం. గత నెల 9న కొత్తగూడెం ఆర్డీఓ వచ్చి పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. – కొర్స శ్రీను సమస్య పరిష్కారానికి గతంలో రామన్నగూడెం వెళ్లాం. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నవారికి భూమిని చూపిస్తామని చెప్పాం. కానీ రెవెన్యూ పరిధిలో ఉన్న భూమి కాకుండా అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూమి విసయంలో సమస్య ఉంది. –మధు, కొత్తగూడెం ఆర్డీఓ -
కాయ కుళ్లి.. పూత రాలి..
బూర్గంపాడు: పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలకు పత్తిరైతు కుదేలవుతున్నాడు. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలు పత్తిపంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దసరాకు తొలివిడత పత్తి చేతికందే వేళ కురుస్తున్న వర్షాలకు పత్తికాయలు దెబ్బతింటున్నాయి. వర్షాలకు ఇప్పటికే మొక్కకు పది నుంచి ఇరవై కాయలు కుళ్లి నల్లబడిపోయాయి. భూమి ఆరకపోవటంతో తేమ ప్రభావంతో పత్తిలో పూత, పిందె రాలిపోతున్నాయి. జూన్, జూలై నెలల్లో ఆశాజనకంగా కనిపించిన పత్తి చేలు, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కురుస్తున్న వర్షాలకు దెబ్బతిని, దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ఎకరాకు రెండు క్వింటాళ్ల మేరా పత్తి వచ్చే కాయలు నల్లబడి కుళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు పూత, పిందె రాలిపోయి మొక్కలు ఎర్రబారుతున్నాయంటున్నారు. 2 లక్షల ఎకరాలకు పైగా.. ఈ ఏడాది జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు పత్తి సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాకు రూ.8,100 మద్దతు ధర ప్రకటించింది. సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రైతులు జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పత్తి సాగు చేపట్టారు. జూన్లో సాగు చేసిన పత్తిపంట అడపాదడపా వర్షాలకు జూలై నెలాఖరు వరకు ఆశాజనంగా ఎదిగింది. ఆగస్ట్లో ఆరంభమైన వర్షాలు పత్తిపంటను క్రమేపీ దెబ్బతీస్తూ వస్తున్నాయి. ఇప్పటికే ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల పత్తి రావాల్సి ఉండగా వర్షాలకు కాయలు దెబ్బతిన్నాయి. పక్వానికి వచ్చిన పత్తికాయలలోకి వర్షపు నీరు చేరి కాయలు నల్లబడి కుళ్లిపోతున్నాయి. పూత, పిందెలు కూడా రాలిపోతున్నాయి. వర్షాలతో పత్తి చేలకు బూజు తెగుళ్లు, పండు తెగుళ్లు ఆశించి ఆకులు రాలిపోతున్నాయి. కలుపు పెరిగిపోతోంది. సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు కూడా వర్షాలు అడ్డంకిగా మారాయి. రైతులు మందులు పిచికారీ చేసిన గంట, రెండు గంటల్లోనే వర్షాలు కురుస్తుండటంతో రైతులకు నష్టం కలుగుతోంది. అక్కడకక్కడా పూసిన పత్తిని తీసేందుకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. వర్షాలకు కాయ గుల్లలో పత్తి ఇరుక్కుపోయి తీసేందుకు సరిగా రావటం లేదు. దీంతో ఎక్కువ మంది కూలీలను పత్తి తీసేందుకు పెట్టుకోవాల్సి వస్తోంది. క్వింటా పత్తి తీసేందుకు రూ.3 వేల వరకు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ఒక్క కూలీ రోజుకు పదికిలోల పత్తి కూడా తీయలేకపోతున్నారు. తీసిన పత్తిని కూడా ఇళ్ల వద్ద ఆరబెట్టుకోవాల్సి వస్తోంది. వర్షాలకు రంగుమారిన పత్తిని వ్యాపారులు ఎవరు కొనుగోలు చేయటం లేదని రైతులు తెలిపారు. ఈ ఏడాది పత్తిపంటపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రైతులంటున్నారు. వర్షాలతో పంటకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయని, ఎరువులు, సస్యరక్షణ ఎక్కువ సార్లు చేపట్టాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఐదారుసార్లు పురుగుమందులు పిచికారీ చేశామని, నాలుగైదుసార్లు ఎరువులు వేసుకున్నామని అంటున్నారు. యూరియా కొరత కారణంగా రైతులు ఈ ఏడాది ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు వినియోగించారు. ఎకరాకు రూ.3 వేల వరకు అదనంగా పెట్టుబడి పెరిగింది. ఇంకా పత్తి పంటకు ఐదారుసార్లు పురుగు, దోమ, తెగుళ్ల మందులు పిచికారీ చేసుకోవాల్సిన ఉంది. చేలలో కాయలు ఏమీ లేవని, వర్షాలు తగ్గి మళ్లీ కాస్తే తప్ప పత్తి చేతికి రాదని రైతులు వాపోతున్నారు. ఈ తరుణంలోనైనా పత్తిపంటను దక్కించుకునేందుకు సరిపడా యూరియా సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరు తున్నారు. పత్తి చేలకు తెగుళ్లు ఆశిస్తున్నాయని, ఈ తరుణంలో శిలీంధ్రనాశిని మందులు ఎక్కువగా వాడుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పత్తి పంటపై నానో యూరియా పిచికారీ చేసుకుంటే సరిపడా నత్రజని అందుతుందని వారు రైతులకు చెబుతున్నారు. వర్షాలకు దెబ్బతింటున్న పత్తిచేలు -
4,104 కేజీల నల్లబెల్లం స్వాధీనం
అశ్వారావుపేటరూరల్: సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటికతో పాటు నాటుసారా తరలిస్తున్న ఓ వాహనాన్ని ఖమ్మం జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. దసరా సందర్భంగా సారా తయారీకి అవకాశముందనే సమాచారంతో నల్లబెల్లం రవాణాను అడ్డుకునేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ మేరకు అశ్వారావుపేటలోని చెక్పోస్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ సీహెచ్ శ్రీహరి ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా నుంచి తెలంగాణలోకి వస్తున్న టాటా ఇంట్రా వాహనాన్ని తనిఖీ చేయగా 4,104 కేజీల నల్లబెల్లం, 30 కేజీల పటిక, 10 లీటర్ల నాటుసారా లభించాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొడమంచిలి క్రాంతి, సవరపు రవి, పులిదిండి హరీశ్ అశ్వారావుపేటకు వీటిని తరలిస్తున్నట్లు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా హరీశ్ పరారీలో ఉన్నాడు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ కరీం, సిబ్బంది సుధీర్, వెంకట్, ఉపేందర్ పాల్గొన్నారు.ఏపీ నుంచి తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు -
కలప పట్టివేత
దుమ్ముగూడెం: మండలంలోని ఆర్లగూడెం సెక్షన్ పరిధిలోని గుర్రాలబైలు శివారులో అక్రమంగా దాచి ఉంచిన కలపను అటవీశాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులో అక్రమంగా కలప దాచి ఉంచారనే సమాచారంతో భద్రాచలం రేంజర్ కె.రంజిత ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. కలపను పట్టుకుని రేంజ్ కార్యాలయానికి తరలించారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని తెలిసింది. దాడిలో ఆర్లగూడెం డీఆర్వో డి.కృష్ణ, భద్రాచలం సెక్షన్ అధికారి వీరస్వామి, బీట్ అధికారులు కుమార్, బుచ్చా, రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి బూర్గంపాడు: మండలంలోని మోతె పట్టీనగర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల కాపరి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మోతె గ్రామానికి చెందిన పాశం శేషు (54) శుక్రవారం మేకలను మేపుకుని ఇంటికి వస్తున్న క్రమంలో భద్రాచలం వైపు వెళ్తున్న ఆటో అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శేషును స్థానికులు భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శేషు మృతిచెందాడు. మృతుడి కుమారుడు ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, కోడలు, మనువడు, మనువరాలు ఉన్నారు. శేషు మృతితో మోతె గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పెరుగుతున్న గోదావరి
దుమ్ముగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు మండలంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పర్ణశాల నారచీరల ప్రాంతం శుక్రవారం పూర్తిగా నీట మునిగింది. వరద పెరుగుతుండటంతో సున్నంబట్టి–బైరాగులపాడు గ్రామాల మధ్య రహదారి పైకి వరద నీరు చేరింది. భద్రాచలం–చర్ల ప్రధాన రహదారి తూరుబాక డైవర్షన్ రహదారి పైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి కిన్నెరసాని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేతపాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికివరద ఉధృతి పెరగగా, శుక్రవారం నీటి మట్టం 405.80 అడుగులకు చేరింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో 4500 క్యూసెక్కులు ఉండగా, రెండుగేట్లను ఎత్తి ఉంచి 10 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. తాలిపేరుకు మళ్లీ వరదచర్ల: తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్ట్లోకి వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదనీరు వచ్చి చేరుతోంది. 15 గేట్లను ఎత్తి ప్రాజెక్ట్ నుంచి 20,753 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లుకాగా, వరద ఉధృతి దృష్ట్యా 73.59 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నట్లు డీఈ తిరుపతి తెలిపారు. -
కరెన్సీ నోట్లతో అలంకరణ..
ములకలపల్లి/పాల్వంచ/ఇల్లెందురూరల్/: పాల్వంచ పట్టణంలోని శివనగర్–వికలాంగుల కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు. మండపాన్ని రూ.21లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ములకలపల్లి ఉమా పృథ్వీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతిష్ఠించిన అమ్మవారు శుక్రవారం ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.5 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఇల్లెందు మండలంలోని సుభాష్నగర్ రామాలయంలో మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారిని రూ.5 లక్షల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. -
ఐలమ్మ ఆశయసాధనకు కృషి చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. మొదట కలెక్టర్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమించారన్నారు. 1940 – 44 మధ్య కాలంలో విస్నూర్లో దేశ్ముఖ్, రజాకార్ల అరాచకాలపై ఎదురుతిరిగి పోరాడిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళల్లో స్ఫూర్తి నింపారని, ఆమె పోరాట స్ఫూర్తి తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను నిర్వహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి పి.విజయలక్ష్మి, బీసీ సంఘం నాయకులు నేరెళ్ల రమేశ్, అజిత్కుమార్, సర్వేశ్, కె.వసంతరావు, బి.శ్రీనివాస్, ఆర్.వెంకటయ్య, ఎం.భిక్షం, బి.జయమ్మ, కొదుమూరి సత్యనారాయణ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రయత్నించడంలోనే విజయం ఉంటుంది.. పాల్వంచ: ప్రయత్నం చేయడంలోనే విజయం దాగి ఉంటుందని, జీవితంలో ప్రయత్నం చేస్తే లక్ష్యాలు సాధించవచ్చని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ అన్నారు. శుక్రవారం స్థానిక శ్రీనివాసకాలనీ మినీ స్టేడియం టెన్నిస్ క్రీడా మైదానంలో ఈ నెల 21వ తేదీన జిల్లా టెన్నిస్ టోర్నమెంట్లో విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. హైదరాబాద్ ఓపెన్ నేషనల్ టెన్నిస్ అండర్–60లో రన్నరప్గా నిలిచిన అన్నం వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా నేషనల్ ఆర్చరీ విభాగానికి ఎంపికై న వంశీని అభినందించి, మాట్లాడారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్రెడ్డి, టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.వెంకటేశ్వర్లు, సెక్రటరీ జకరయ్య, కోచ్ డానియేల్ రాంబాబు, భాస్కర్, కబీర్, దాట్ల రాజు, కుటుంబరావు, కృష్ణారావు, రాజ్కుమార్, సతీశ్, టెన్నిస్ క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డ్రైవర్కు ఏడాది జైలు శిక్ష భద్రాచలంఅర్బన్: బస్సుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, ఓ వ్యక్తి మృతికి కారణమైన భద్రాచలం ఆర్టీసీ డిపోకి చెందిన డ్రైవర్ సూర్యనారాయణకు ఏడాది జైలుశిక్షతోపాటు రూ.1000 జరిమానా విధిస్తూ భద్రాచలం ప్రథమశేణి న్యాయమూర్తి శివనాయక్ తీర్పునిచ్చారు. ద్విచక్రవాహనంపై వస్తున్న సయ్యద్ సోహైల్ను 2017 డిసెంబర్ 12న బూర్గంపాడు సమీపంలోని సమక్క – సారలమ్మ గద్దెల వద్ద బస్సు ఢీకొట్టింది. సోహైల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనకు సంబంధించి మృతుడి తల్లి సయ్యద్ హసీనాబేగం బూర్గంపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం 2018లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సోహైల్ మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ సూర్యనారాయణకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు..
మణుగూరుటౌన్: ప్రేమించి, వివాహం చేసుకుంటానని నమ్మించడంతో కలిసి ఉంటున్నామని, అతడికి మరో మహిళతో గతంలో వివాహం జరిగిందని తెలిసి ప్రశ్నించేందుకు వచ్చిన తనపై దాడి చేసి హత్యాయత్నం చేశారని, తనకు న్యాయం చేయాలని ఓ యువతి తెలిపింది. శుక్రవారం బాధితురాలు విలేకరులతో వివరాలు వెల్లడించింది. మండలంలోని వాగుమల్లారానికి చెందిన మట్టా గణేశ్తో ఏపీ రాష్ట్రం కడప శివారుకు చెందిన యువతికి మూడేళ్ల కిందట బెంగుళూరులో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లు బెంగుళూరులో ఆ తర్వాత ఏడాది నుంచి హైదరాబాద్ షేక్పేటలో కలిసి ఉంటున్నారు. కొద్దికాలంగా అతని ప్రవర్తనలో మార్పు రాగా, అనుమానంతో ఆరా తీయగా, వివాహం జరిగి పిల్లలు ఉన్నట్లు తెలిసిందని, ఈ విషయమై ప్రశ్నించేందుకు వాగు మల్లారంలోని గణేశ్ ఇంటికి జూలై 15న రాగా తనను విచక్షణా రహితంగా అతడి భార్య మట్టా రాశిశుక్రియా, ఆమె తల్లి గొడుగు రమాదేవి, గణేశ్ తండ్రి కలిసి హత్యా యత్నం చేశారని బాధితురాలు వెల్లడించింది. తన వద్ద పలు దఫాలుగా రూ.10 లక్షలు తీసుకున్నాడని ఆధారాలు చూపింది. అనారోగ్యం పాలయ్యానని పేర్కొంది. కాగా, కడప జిల్లాకు చెందిన యువతి మండలంలోని మహిళా సంఘాలను ఆశ్రయించడంతో అండగా నిలిచాయి. దిశ, రేణుక అక్షర మహి ళా మండలి, సఖి ప్రతినిధులు మట్టా గణేశ్తో పాటు యువతిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థాని క డీఎస్పీ రవీందర్రెడ్డికి యువతితో కలిసి ఫిర్యాదు చేశారు. సమావేశంలో పూనెం సరోజ, షబానా, కోరి శ్యామల, బొడ్డు సౌజన్య, సుజాత, రేణుక, దేరంగుల సుజాత, కన్నాపురం వసంత, దిశ అధ్యక్షురాలు అనిత, సఖి మండలి నాయకురాలు భోగినేని వరలక్ష్మి, బత్తుల సుజాత, బీస మహిళా కమిటీ మండల అధ్యక్షురాలు కవిత, శిరీష, నర్సమ్మ, రోహిణి, జయమ్మ తదితరులు ఉన్నారు. బాధితురాలి ఆవేదన.. అండగా మహిళా సంఘాలు -
ఎవరికీ పట్టని ఆదివాసీల వ్యథ
సూపర్బజార్(కొత్తగూడెం): అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో 150 మంది ఆదివాసీ రైతులకు సంబంధించిన 573.20 ఎకరాల భూమి విషయంలో అటవీ, ఎఫ్డీసీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతోంది. ఉమ్మడి ఏపీగా ఉన్న కాలం నుంచే రైతులు అనేక పోరాటాలు చేసినా భూములు మాత్రం దక్కలేదు. ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇచ్చిందని, ఈ భూమి తమదేనంటూ హైకోర్టు సైతం 2011లో తీర్పు చెప్పిందని, అయినా భూమి మాత్రం తమకు దక్కలేదని ఆదివాసీలు అంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గత జూన్ 9న ఆదివాసీలంతా కలిసి మూడురోజుల పాటు రామన్నగూడం నుంచి కలెక్టరేట్కు పాదయాత్రగా వచ్చి ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ వారి వద్దకు వచ్చి సమస్యను కలెక్టర్కు వివరించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అయితే మూడు నెలలు గడిచినా పరిష్కారం కాకపోవడంతో తిరిగి కలెక్టరేట్ పక్కన అధ్వాన స్థితిలో ఉన్న ధర్నాచౌక్ వద్ద శుభ్రం చేసుకుని పిల్లాపాపలతో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఆందోళన గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. అక్కడే వంటావార్పు చేసుకుంటూ, విద్యుత్ సౌకర్యం లేకున్నా టార్చిలైట్ల వెలుతురులో కాలం గడుపుతున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని ధర్నాచౌక్లో ఇబ్బందులు పడుతూ నిరాహారదీక్ష చేస్తున్నా ఆదివాసీల ఆందోళన నాలుగు రోజులుగా బయటి ప్రపంచానికి తెలియలేదు. గురువారం జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ఆరేం ప్రశాంత్, పాల్వంచ మాజీ ఎంపీపీ మడవి సరస్వతి, ఆదివాసీ నాయకులు సోయం సత్యనారాయణ, సోయం లక్ష్మయ్య, పూనెం నాగేశ్వరరావు వారికి మద్దతు తెలపగా ఈ విషయం వెలుగుచూసింది. కాగా, తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి మడకం నాగేశ్వరరావు స్పష్టం చేశారు. -
ముగ్గురికి గ్రూప్ –1 కొలువులు
దమ్మపేట/టేకులపల్లి/భద్రాచలంటౌన్ : గ్రూప్ –1లో జిల్లాకు చెందిన ముగ్గురు కొలువులు సాధించారు. దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు తాటి ప్రమోద్ సాయి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మల్టీ జోన్ పరిధిలో ఉద్యోగం పొందనున్నారు. ఆయన తల్లి సుదర్శనమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు కాగా, తండ్రి చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమోద్సాయి పాఠశాల విద్య అనంతరం ఇంటర్, ఇంజనీరింగ్ హైదరాబాద్లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుని, సివిల్స్, గ్రూప్ –1 ఉద్యోగాలకు సన్నద్ధం కాగా గత మే నెలలో ప్రకటించిన రాత పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 317వ ర్యాంకు సాధించారు. టేకులపల్లి మండలం కొత్తతండా(పి) గ్రామానికి చెందిన రమావత్ లక్ష్మీప్రసన్న గ్రూప్–1లో సత్తా చాటి గ్రేడ్ – 2 మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం సాధించారు. నాగార్జునసాగర్కు చెందిన లక్ష్మీప్రసన్నకు తొమ్మిది నెలల క్రితం కొత్తతండాకు చెందిన బానోత్ జనార్దన్తో వివాహమైంది. పదో తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, ఇంటర్, ఎంబీబీఎస్ హైదరాబాద్లో చదివారు. ఆ తర్వాత యూపీఎస్సీ లక్ష్యంగా ఢిల్లీలో కోచింగ్ తీసుకుని పరీక్ష రాయగా మూడు సార్లు మెయిన్లో క్వాలిఫై అయినా ఇంటర్వ్యూలో ఉద్యోగం కోల్పోయారు. ప్రస్తుతం విజయం సాధించారు. కాగా, జనార్దన్ జీహెచ్ఎంసీలో టీపీబీఓగా పని చేస్తున్నారు. భద్రాచలం వైఎస్సార్ నగర్కు చెందిన ఎడారి రేవంత్ గ్రూప్–1లో మొదటి ప్రయత్నంలోనే డీపీఓగా ఉద్యోగం సాధించారు. స్థానిక సెయింట్ పాల్ స్కూల్లో పదో తరగతిలో ఉత్తమ ర్యాంక్, వరంగల్ ఐఐటీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించాడు. తన తండ్రి కలైన ఐఏఎస్ సాధించాలనేది జీవిత లక్ష్యమని రేంవత్ చెప్పాడు. -
బాధ్యతగా స్వచ్ఛత పాటించాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్చుంచుపల్లి: ప్రతీ పౌరుడు బాధ్యతగా స్వచ్ఛత పాటించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో శ్రమదానం నిర్వహించారు. కలెక్టర్తోపాటు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు విశ్వవిద్యాలయ ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ ఇంటి నుంచి సమాజం వరకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయొద్దని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతేనని పేర్కొన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మున్సిపల్ కమిషనర్ సుజాత, మైనింగ్ ఏడీ దినేష్, గ్రౌండ్ వాటర్ ఏడీ రమేష్, మెప్మా పీడీ రాజేష్, ఉద్యోగులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ నిలిపివేయాలి
పాల్వంచరూరల్: అటవీ సంపదను కొందరికి కట్టబెట్టాలంటే మావోయిస్టులను చంపేస్తే అడ్డు ఉండదనే భావనతో పాలక వర్గాలు చేపడుతున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్రం శాంతిచర్చలు జరపాలని, అప్పుడే శాంతి నెలకొంటుందని బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ విమలక్క అన్నారు. పాల్వంచ మండలం ఉల్వనూరులో గురువారం నిర్వహించిన బహుజన బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న విమలక్క గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని గిరిజనుల నివాసాలు, గిరిజన అశ్రమ బాలికల పాఠశాల మైదానంలో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతిని విధ్వంసం చేయడమంటే ప్రజలపై యుద్ధం చేయడమేనని తెలిపారు. అలా కాకుండా ప్రకృతి రక్షణే ప్రజల రక్షణగా భావించాలని సూచించారు. బహుజనులు పంచ భూతాలను కాపాడుతుంటే బహుళజాతి కంపెనీలు వాటిని కబళిస్తున్నాయని ఆరోపించారు. వనరుల విధ్వంసం, వివక్షత, ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ ఇక్కడికి కదిలి వచ్చిందని తెలిపారు. బహుళ పంటలతో విలసిల్లాల్సిన తెలంగాణ ఏకపంటల పద్ధతితో వలసలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈమేరకు ప్రకృతికి మూలమైన ఆడబిడ్డలు, దేశ మూలవాసులు ఆదివాసీలతో పాటు అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్కౌంటర్లు లేని, ఆదివాసీ బిడ్డలు ఉపిరి పీల్చుకునే, పిల్లల భవిష్యత్ మంచిగా ఉండే తెలంగాణను అంతా కోరుకుంటున్నారని విమలక్క వ్లెడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ, వాసం రుద్ర, మంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిధుల్లేక నీరసం..
బూర్గంపాడు: గ్రామ పంచాయతీలకు ఏడాదిన్నర కాలంగా నిధులు రాక పల్లెలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వర్షాకాలం కావడంతో వీధులన్నీ బురదమయంగా మారాయి. రాత్రి వేళ కనీసం వీధిలైట్లు కూడా వేయలేని పరిస్థితుల్లో గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ప్రస్తుతం బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా రాత్రి అయిందంటే చీకట్లో వెళ్లలేక ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకాలం సొంత డబ్బుతో గ్రామాల్లో పనులు చేయించిన పంచాయతీ కార్యదర్శులు అప్పుల్లో కూరుకుపోయారు. ట్రాక్టర్ల డీజిల్, రిపేర్లు, తాగునీటి సరఫరాలో లైన్ల మరమ్మతులకు కూడా నిధుల కొరత వేధిస్తోంది. వీధుల్లో బురద పేరుకుపోగా బ్లీచింగ్ కొనేందుకు సైతం డబ్బు లేక కార్యదర్శులు ఏ పనీ చేయలేకపోతున్నారు. పేరుకుపోతున్న చెత్త.. 2024 జనవరిలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. నాటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు లేకపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 18 నెలలుగా నిధులు నిలిచిపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై భారం పడుతోంది. పలు గ్రామ పంచాయతీల కార్యదర్శులు అప్పులు చేసి అత్యవసర పనులు చేయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సైతం చేపట్టలేక ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ఇక ఇంటి పన్నులు, వార సంతల నిర్వహణ, దుకాణాల అద్దె, ఇతరత్రా వస్తున్న ఆదాయాన్ని పంచాయతీల జనరల్ ఫండ్ ఖాతాలో జమచేయాలి. అయితే జనరల్ ఫండ్ నిధులను ప్రభుత్వం ఫ్రీజింగ్లో పెట్టడంతో కార్యదర్శులు కనీసం ఆ డబ్బు కూడా వాడుకునే అవకాశం లేదు. ఫ్రీజింగ్ తొలగించి ఆ నిధులు వాడుకునే అవకాశం కల్పించాలని, తద్వారా కనీస అసవరాలైనా తీర్చొచ్చని కార్యదర్శులు అంటున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికే చిన్న పంచాయతీల కార్యదర్శులు రూ.2 లక్షలకు పైగా, పెద్ద పంచాయతీల వారు రూ.6లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అప్పు చేసి వివిధ పనులు చేయించారు. అయితే ప్రస్తుతం తమకు అప్పు ఇచ్చేవారు కూడా లేరని గ్రామపంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీలకు 18 నెలలుగా నిధులు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో నలిగిపోతున్నాం. గ్రామాల్లో ఏ పని చేయాలన్నా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. చాలా మంది కార్యదర్శులు సాధ్యమైనంత మేర అప్పులు తెచ్చి పనులు చేయిస్తున్నారు. ప్రస్తుతం అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది. జనరల్ ఫండ్ను వినియోగించుకోవాలంటే ట్రెజరీలో ఫ్రీజింగ్ నడుస్తోంది. – కిరణ్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడుఅప్పుల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగ వేళ గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు. ఆ సమయంలో వీధిలైట్లు వెలగకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. ఇక వర్షాలు పడుతుండగా వీధుల్లో బ్లీచింగ్ చల్లాలి. కానీ బ్లీచింగ్, వీధి లైట్ల కొనుగోలుకు డబ్బులు లేక కార్యదర్శులు సతమతం అవుతున్నారు. స్థానికంగా సోషల్ మీడియా గ్రూప్ల్లో వెలగని వీధిలైట్ల ఫొటోలు పెడుతున్న కొందరు పంచాయతీ కార్యదర్శులను నిలదీస్తున్నారు. బతుకమ్మ నిమజ్జనాల కోసం వాగులు, నదులు, చెరువుల వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో ఘాట్లు ఏర్పాటు చేయాలి. ఈ పనులన్నింటికీ నిధుల కొరత వేధిస్తుండగా కార్యదర్శులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఈ క్రమంలో వారు కూడా పండుగ ఎలా జరుపుకోవాలంటూ పంచాయతీ కార్యదర్శులనే నిలదీస్తున్నారు. -
శ్రీ గాయత్రీదేవిగా పెద్దమ్మతల్లి
పాల్వంచరూరల్: మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి అలంకరణ విశిష్టతను అర్చకులు వివరించారు.రామయ్యను దర్శించుకున్న సీఆర్పీఎఫ్ ఐజీభద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కర్ణాటక రాష్ట్ర సీఆర్పీఎఫ్ ఐజీ విపుల్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఉపాలయాలను సందర్శించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, ఆలయ ఏఈఓ శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.సీపీఐ జాతీయ సమితిలో ఇద్దరికి చోటుసూపర్జార్(కొత్తగూడెం): చంఢీఘర్లో ఐదు రోజులుగా జరుగుతున్న సీపీఐ జాతీయ మహాసభలు గురువారం ముగిశాయి. చివరి రోజున ఎన్నుకున్న కమిటీలో.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్యవర్గ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. కూనంనేని 2005 నుంచి 2009 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2009, 2023లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సాబీర్పాషా విద్యార్థి దశ నుంచే చురుకై న పాత్ర పోషించి, యువజన, కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఏడేళ్ల పాటు ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, 2001లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2002లో సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా ఎంపికయ్యారు. భద్రాద్రి జిల్లా ఆవిర్భావం నుంచి జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు.ఓయూ నుంచి డాక్టరేట్కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడేనికి చెందిన భూక్యా ప్రకాశ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఎం.వి.కృష్ణారావు పర్యవేక్షణలో ‘జియోపాలిమర్ కాంక్రీట్’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు. ఖమ్మంలో బీ.టెక్, హైదరాబాద్లో ఎం.టెక్ చదివి ప్రస్తు తం జీహెచ్ఎంసీ సర్కిల్–29, టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎన్ఏసీ సైట్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. తన డాక్టరేట్ను తల్లిదండ్రులు కిషన్, చంద్రిలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. -
మద్యం టెండర్లకు రెడీ..
● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ● అక్టోబర్ 18 వరకు గడువు, 23న డ్రా ● ఫీజు గతేడాది కంటే రూ.లక్ష పెంపుకొత్తగూడెంఅర్బన్: నూతన మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా, అదే నెల 23న డ్రా తీస్తారు. టెండర్లు దక్కించుకున్న వారు డిసెంబర్ 1 నుంచి మద్యం దుకాణాలను ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న దుకాణాలకు నవంబర్ 30తో గడువు ముగియనుంది. ప్రస్తుతం దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు దరఖాస్తుదారులు అమ్మవారి ఆలయాలు, మండపాల వద్ద పూజలు జరిపించి టెండర్లు వేసే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. అయితే గతేడాది కంటే ఈ సంవత్సరం టెండర్ ఫీజు రూ. లక్ష పెంచడంతో దరఖాస్తుదారులకు అదనపు భారం కానుంది. జిల్లాలో 88 వైన్స్.. జిల్లాలో ప్రస్తుతం 88 వైన్స్ ఉన్నాయి. 2023లో జరిగిన మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియలో రూ.2 లక్షల ఫీజుతో మొత్తం 5,057 దరఖాస్తులను స్వీకరించిన ఎకై ్సజ్ అధికారులు డ్రా పద్ధతిలో 88 మందికి లైస్సెన్స్లు జారీ చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచినా పాతవారు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. జిల్లాలో కొత్త మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా కొత్తగూడెంలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేటల్లో ఆయా స్టేషన్ల పరిధిలోని వారు ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు అందించేలా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫీజు గతేడాది కంటే రూ.లక్ష పెంచడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా.. దరఖాస్తుదారుల సంఖ్య గతం కంటే తగ్గొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా 2027 నవంబర్ 30 వరకు కాలపరిమితి ఉంటుంది. కొత్త మద్యం దుకాణాల కోసం టెండర్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశాం. స్టేషన్ల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తాం. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం. శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. –జానయ్య, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జిల్లాలో కొత్త మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో గురువారం లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలో ఏ–4 మద్యం దుకాణాలు 88 ఉండగా, 44 షాపులను ఏజెన్సీ ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 44 షాపుల్లో ఎస్సీలకు ఏడు, గౌడ కులస్తులకు ఆరు, జనరల్ వారికి 31 కేటాయించారు. -
గజలక్ష్మిగా జగన్మాత
నేడు ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారుభద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం లక్ష్మీతాయారు అమ్మవారిని.. చెదరని అధికారం, తరగని సంపదను ప్రసాదించే గజలక్ష్మి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన నిర్వహించగా మహిళలు భారీగా హాజరయ్యారు. కాగా, చిత్రకూట మండపంలో జరుగుతున్న శ్రీరామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేద పండితులు, అర్చకులు అయోధ్య కాండ పారాయణం చేశారు. నేటి ధనలక్ష్మి అలంకార విశిష్టత.. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం..’ అంటూ శ్రీ సూక్తం అమ్మవారిని ధనలక్ష్మిగా కీర్తిస్తుంది. ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. విద్య, బలం, కీర్తి మొదలైనదంతా ధనమేనని, విద్యాధనం, హిరణ్య ధనం, శక్తి ధనాలను ప్రసాదిస్తుంది కాబట్టే ఈ అమ్మకు ధనలక్ష్మిగా పేరని, ముగ్గరమ్మల శక్తిని భక్తులకు పంచుతుందని పండితులు చెబుతున్నారు. నేత్రపర్వంగా రామయ్య కల్యాణం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు
● ప్రభుత్వ సీసీఏ రూల్స్ వీరికీ వర్తిస్తాయి ● రామాలయ వైదిక సిబ్బందికి జీఓ జారీ భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం వెలుపల జరిగే ప్రైవేట్ వైదిక కార్యక్రమాలకు ఆలయ అర్చకులు, పండితులు హాజరు కావడానికి అనుమతి లేదని రామాలయ ఈఓ కొల్లు దామోదర్ రావు గురువారం ప్రకటనలో తెలిపారు. దేశ, విదేశాల్లో ఆలయ వైదిక సిబ్బంది తరుచుగా లోక కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, ప్రవచనాలు, వేదసంహిత కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు హాజరు కావటం క్రమశిక్షణను ధిక్కరించినట్లుగా భావిస్తున్నందున, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సీసీఏ రూల్స్ ప్రకారం వైదిక సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి లేకుండా దేశ విదేశాల్లో ఎటువంటి వైదిక కార్యక్రమాలను నిర్వహించొద్దని, పాల్గొనద్దని తెలిపారు. ఈ ఉత్తర్వులను ధిక్కరిస్తే క్రమశిక్షణా చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఈఓ మరో ప్రకటనలో తెలిపారు. 29న సాయంత్రం 5 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద జరుపుతున్నట్లు వెల్లడించారు. -
ప్రైవేటు బస్సుల్లో అధిక చార్జీలు!
దసరాకు వచ్చే ప్రయాణికుల జేబులకు చిల్లు ● టికెట్ ధర మూడింతలు పెంచిన ట్రావెల్స్ నిర్వాహకులు ● చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులుభద్రాచలంఅర్బన్: దసరా సెలవుల్లో ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు దండుకుంటున్నారు. టికెట్ ధరలు రెండు, మూడింతలు పెంచేశారు. ముందస్తు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా.. ప్రయాణికుల వరకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్వీసుల సంఖ్య ప్రకటించి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అవకాశం ప్రైవేటు ఆపరేటర్లకు కాసుల పంటగా మారుతోంది. సాధారణ రోజుల్లో.. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. దీంతో రాజధాని తదితర ప్రాంతాల్లో ఉన్నవారు సొంతూళ్లకు వస్తున్నారు. ఆర్టీసీలో భద్రాచలం–హైదరాబాద్ టికెట్కు సాధారణ రోజుల్లో నాన్ ఏసీ ఎక్స్ప్రెస్ రూ.470, నాన్ ఏసీ సూపర్ లగ్జరీ టికెట్ ధర రూ. 650, డీలక్స్ రూ. 570గా, ఏసీ రాజధాని రూ.800, లహరీ బస్సులో సిట్టింగ్రూ.820, స్లీపర్కు రూ.1018 వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్లో.. ప్రైవేటు ట్రావెల్స్లో భద్రాచలం–హైదరాబాద్ టికెట్ నాన్ ఏసీ బస్సులో సిట్టింగ్కు రూ. 450 తీసుకుంటారు. స్లీపర్ రూ. 650, ఏసీ సర్వీసులకు రూ.819 పైగా వసూలు చేస్తున్నారు. పండుగ సందర్భంగా టికెట్ ధర అమాంతం పెంచారు. నాన్ ఏసీ బస్సులకు స్లీపర్ రూ.1400, సిట్టింగ్ అయితే రూ. 1000, ఏసీ బస్సుల్లో స్లీపర్ రూ. 1400కు పైగా వసూలు చేస్తున్నారు. పండుగ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ఇదే చార్జీ వసూలు చేస్తారు. పట్టించుకోని రవాణాశాఖ ఇటీవల కాలంలో ట్రావెల్స్ బస్సులను రవాణాశాఖాధికారులు తనిఖీలు చేయడంలేదు. భద్రాచలం మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ఏ ఒక్క ప్రైవేట్ బస్సునూ గోదావరి బ్రిడ్జి పాయింట్లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేసిన సందర్భం లేదు. దీంతో పరిమితికి ప్రయాణికులను ఎక్కించడంతోపాటు గంజాయి వంటి నిషేధిత ఉత్పత్తులను కూడా తరలిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తాం. బస్సుల్లో ప్రయాణికులు లగేజీ మాత్రమే తీసుకెళ్లాలి. బస్సులకు సంబంధించిన పర్మిట్, ట్యాక్స్, డ్రైవింగ్ లైసెన్స్, రవాణాపై దృష్టి సారించి నిబంధనలు అతిక్రమించిన బస్సుల యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తాం. –వెంకట పుల్లయ్య, ఎంవీఐ, భద్రాచలం -
కలెక్టరేట్లో బతుకమ్మ సంబురాలు
సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ హాజరై మాట్లాడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, తహసీల్దార్లు గన్యా, భగవాన్రెడ్డి, స్వర్ణలత, స్వాతిబిందు పాల్గొన్నారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో.. కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ప్రధాన కార్యాలయంలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం అధికారులు ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి బహమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు జీవీ కిరణ్ కుమార్, కే.విజయలక్ష్మి వెంకటేశ్వర్లు, టి.సంధ్యారాణి,పి.సుమలత, కేసా నారాయణ రావు, బి.శివకేశవరావు, ముకుంద సత్యనారాయణ, నాయకులు ఎం.శ్యామ్ కిరణ్, ఎస్.పితాంబర రావు, ఆర్.కేశవ రావు, కే.జానకి సాయిబాబు, జి.నాగబిందు పాల్గొన్నారు. -
గోదావరి ఘాట్ వద్ద భక్తుడిపై దాడి
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని గోదావరి ఘాట్ వద్ద స్నానం చేస్తున్న ఓ భక్తుడిపై అక్కడే ఓ దుకాణం నడుపుకుంటున్న యువకుడు రాయితో దాడి చేశాడు. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం స్వామివారికి దర్శనానికి వచ్చిన మిర్యాలగూడకు చెందిన చెరుకు ఆంజనేయులు గోదావరిలో స్నానం ఆచరిస్తున్నాడు. ఆ సమయంలో ఘాట్ వద్ద దుకాణం నడుపుకుంటున్న సుధాకర్ అనే వ్యక్తి మరో భక్తుడిపై చేయి చేసుకునేందుకు వెళ్తున్నాడు. అడ్డుకోబోయిన ఆంజనేయులును దుర్భాషలాడుతూ రాయితో దాడి చేశాడు. అక్కడే ఉన్న కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగాడు. కాగా బాధితుడు ఆంజనేయులు స్థానిక పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశాడు. -
యూరియా లారీ అడ్డగింత
బూర్గంపాడు: యూరియా సరఫరాలో జరుగుతున్న జాప్యంపై రైతులు కన్నెర్రజేశారు. గురువారం మండల పరిధిలోని నాగినేనిప్రోలు సొసైటీ గోదాంలో ఐదు టన్నుల యూరియా దిగుమతి, మిగతా యూరియా ను మణుగూరు తరలిస్తుండగా లారీని రైతులు అడ్డుకున్నారు. నాగినేనిప్రోలు రెవెన్యూ పరిధిలో నాలుగువేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములుంటే ఇప్పటివరకు ఎన్ని యూరి యా బస్తాలు ఇచ్చారని, దిగుమతి చేసిన 120 బస్తాల యూరియాను ఎంతమందికి ఇస్తారని ప్రశ్నించారు. సొసైటీ సిబ్బంది కూడా యూరియా పంపిణీలో వివక్ష చూపుతున్నారని, పరపతి ఉన్న రైతులకే ఇస్తున్నారని ఆరోపించారు. ఏ రైతుకు ఎంత యూరియా ఇచ్చారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. రెండునెలలుగా తిరుగుతున్నా యూరియా మాత్రం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటలపాటు లారీని అడ్డుకోగా, సొసైటీ సీఈఓ, వ్యవసాయ అధికారులు పలుమార్లు రైతులతో మాట్లాడారు. మణుగూరుకు వచ్చిన యూరియాను ఇక్కడ దిగుమతి చేయటం అసాధ్యమని, ఒకట్రెండు రోజుల్లో 20 టన్నుల యూరియాను నాగినేనిప్రోలులో దిగుమతి చేయిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. దీంతో లారీని అధికారులు మణుగూరు పంపించారు. -
వరిలో బెరుకులు
ఆందోళనలో రైతులు అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సేద్యం చేసిన వరిపంటలో అధికంగా బెరుకులు కన్పిస్తున్నాయి. రాజాపురం, నామవరం గ్రామాల్లో 200 ఎకరాల్లో ఈ పరిస్థితి నెలకొంది. బీపీటీ 2782 సాంబ రకం పంటలో బెరుకులు సమస్య నెలకొంది. ఈ క్రమంలో బాధిత రైతులు గురువారం రాజాపురంలో సీడ్ డీలర్ షాపు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన వ్యవసాయ శాఖ అధికారి అనూష పంట పొలాలను పరిశీలించారు. సమస్యను జిల్లా అధికారులకు నివేదిస్తామని తెలిపారు. మిరపనారులో కలుపు మందు పిచికారీఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు కలుపు మందు పిచికారీ చేయడంతో సలీం అనే రైతుకు చెందిన రెండు ఎకరాల మిరప నారు ఛిద్రమైంది. తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో మిరప సాగు చేసేందుకు రైతు మిరపనారు పోసుకున్నాడు. ఇప్పటికే రెండెకరాల్లో మొక్కలు నాటగా, మరో రెండెకరాల్లో నాటేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, ఈ ఘటన జరిగింది. రైతు వ్యవసాయశాఖ, పోలీ సులకు ఫిర్యాదు చేయగా, వ్యవసాయశాఖ అధికారులు మిరపనారును పరిశీలించారు. జామాయిల్ తోటలో..అశ్వాపురం: మండల పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన జమలపుడి వెంకటేశ్వర్లు ఎకరం జామాయిల్ తోటకు బుధవారం కొందరు వ్యక్తులు గడ్డిమందు కొట్టడంతో మొక్కలు ఎండిపోయాయి. మూడు నెలల క్రితం మొక్కలు నాటామని, గడ్డిమందు కొట్టడంతో ఎండిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేళ్ల నుంచి భూ తగాదా జరుగుతోందని, ప్రత్యర్థులే గడ్డిమందు కొట్టారని బాధిత రైతు వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నాడు. ప్రతీ ఏటా పొలంలో వేసిన పంటను నాశనం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తునే ఉన్నానని వాపోయాడు. అట్రాసిటీ కేసులో డీఎస్పీ విచారణసూజాతనగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై గురువారం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విచారణ నిర్వహించారు. మండలంలోని నాయకులగూడెం గ్రామానికి చెందిన చల్ల నర్సయ్య, పుల్లమ్మ, చల్ల అచ్చయ్య తమను కులం పేరుతో దూషించారని అదే గ్రామంలోని లెనిన్నగర్కు చెందిన దళితమహిళలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో డీఎస్పీ వచ్చి విచారణ చేపట్టారు. బాధిత మహిళలతోపాటు దూషించిన వారిని విచారించారు. డీఎస్పీ వెంట చుంచుపల్లి సీఐ ఆర్.వెంకటేశ్వర్లు, సుజాతనగర్ ఎసై రమాదేవి ఉన్నారు.