breaking news
Bhadradri
-
కొత్త రైళ్ల జాడేది..?
తొమ్మిది నెలలుగా నడవని బెళగావి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి చేరుకునేందుకు ఉదయం వేళ కాకతీయ, రాత్రి సమయంలో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు కరోనాకు ముందు మణుగూరు నుంచి కొల్హాపూర్ వరకు రైలు నడిచింది. రోజూ సాయంత్రం 5 గంటల సమయంలో బయల్దేరి వెళ్లేది. సికింద్రాబాద్ – బేగంపేట – లింగంపల్లిల మీదుగా కొల్హాపూర్ వరకు నడవడంతో ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండేది. పశ్చిమ హైదరాబాద్లో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సౌకర్యంగా ఉండేది. కరోనా సమయంలో ఈ రైలును రద్దు చేశారు. ఆ రైలు స్థానంలో 2022లో మణుగూరు – బెళగావి రైలు అందుబాటులోకి వచ్చింది. విజయవాడ–కాజీపేట మార్గంలో జరుగుతున్న మూడో లైను నిర్మాణ పనుల కారణంగా బెళగావిని ప్రతీ మూడు నాలుగు నెలలకోసారి రద్దుచేసేవారు. చివరగా 2024 డిసెంబరు 18న రైలును రద్దు చేయగా, ఆ తర్వాత మళ్లీ రైలును ప్రారంభించే అంశంపై రైల్వేశాఖ పెదవి విప్పడం లేదు. మరోవైపు మూడో లైను నిర్మాణ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. సాయంత్రం రైళ్లేవి జిల్లా కేంద్రం నుంచి ఉదయం 5 గంటలకు కాకతీయ, 6 గంటలకు సింగరేణి, మధ్యాహ్నం 1:45 గంటలకు విజయవాడ ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. రాత్రి వేళ 10:45 గంటలకు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. సాయంత్రం సమయంలో ఒక్కరైలు కూడా అందుబాటులో లేదు. గతంలో బెళగావి ట్రైన్ అందుబాటులో ఉండేది. వివిధ పనుల మీద కొత్తగూడెం వచ్చే సింగరేణి కార్మికులు సైతం ఈ రైలు ద్వారా వరంగల్/కాజీపేటకు చేరుకుని అక్కడి నుంచి మరోరైలు ద్వారా మంచిర్యాల, రామగుండం, బెల్లంపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లేవారు. బెళగావిని తిరిగి ప్రారంభించకపోవడంతో ఇటు హైదరాబాద్, అటు కోల్బెల్ట్ ఏరియాలకు వెళ్లే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. కరోనాకు ముందు నడిచిన మణుగూరు–కాజీపేట ప్యాసింజర్ రైలు పగటి వేళ వరంగల్ – కొత్తగూడెం మధ్య రాకపోకలు సాగించేవారికి ఉపయుక్తంగా ఉండేది. ఐదేళ్ల క్రితం దీన్ని రద్దు చేసిన రైల్వే శాఖ తిరిగి ప్రారంభించే ఊసే ఎత్తడం లేదు. డోర్నకల్ – భద్రాచలంరోడ్ ప్యాసింజర్ది ఇదే పరిస్థితి. డిమాండ్లకే పరిమితం భద్రాచలంరోడ్ – పెద్దపల్లి– నిజామాబాద్ మీదుగా షిరిడీకి రైలు నడిపించాలనే డిమాండ్తో ఇచ్చిన వందలాది అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. భద్రాచలంరోడ్/మణుగూరుల నుంచి తిరుపతి వరకు రైలు నడిపించాలనే డిమాండ్ సైతం ఏళ్ల తరబడి అమలుకు నోచుకోవడం లేదు. కనీసం డోర్నకల్ మీదుగా ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్లే రైళ్లకు భద్రాచలంరోడ్/మణుగూరుల నుంచి కనీసం ఐదారు స్లీపర్ కోచ్లను పంపే అంశాన్ని కూడా రైల్వేశాఖ పట్టించుకోవడం లేదు. దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల సందర్భంగా వందలాది ప్రత్యేక ట్రైన్స్ను ప్రకటించే రైల్వేశాఖ ఏర్పాటు చేస్తున్నా అందులో ఒక్కటి కూడా జిల్లాకు కేటాయించడం లేదు. ఆఖరికి ముక్కోటి, శ్రీరామనవమి వంటి పర్వదినాలప్పుడు భద్రాచలం పుణ్యక్షేత్రానికి కూడా రైళ్లను నడిపించడంపై కొన్నేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తూ వస్తోంది. సింగరేణి బొగ్గు రవాణా చేసేందుకు రోజూ జిల్లా మీదుగా 14కు తగ్గకుండా మాల్గాడీలు (గూడ్సు రైళ్లు) నడుస్తున్నాయి. తద్వారా కోట్లాది రూపాయల ఆదాయం రైల్వేకు దక్కుతోంది. ఇదే సమయంలో మాల్గాడీల్లో కనీసం సగం సంఖ్యలో అయినా ఇక్కడి ప్రజల అవసరాలకు తగినట్లు రైళ్లను నడిపించడం లేదు. రైల్వేశాఖ మొక్కుబడిగా నాలుగు రైళ్లతోనే నాలుగైదేళ్లుగా సరిపెడుతోంది. ఈ అంశంపై ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్లు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం రద్దయిన బండ్లను పునఃప్రారంభించని రైల్వే శాఖ -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాక ప్రజలను చైతన్యవంతులను చేసేలా పత్రికలు వ్యవహరిస్తాయి. అలాంటి పత్రికల స్వేచ్ఛను హరించడం సరికాదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరాలన్నా... ప్రజలకు ఏమేం వసతులు కావాలో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంలో పత్రికలు కీలకంగా నిలుస్తాయి. కానీ ఏపీలో ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్జి, జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదు. – ఎస్.విజయ్, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
కదలని దస్త్రం!
మంత్రులు దృష్టిసారించినాభద్రాచలం: గోదావరి కరకట్టలో భాగంగా చేపట్టిన క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు ముందుకు పడటం లేదు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతులు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కరకట్ట నిర్మాణం దాదాపుగా పూర్తయినా జాతీ య రహదారిపై క్రాసింగ్ బ్రిడ్జి పెండింగ్లో పడిపోయింది. గోదావరి వరదల నుంచి భద్రాచలానికి రక్షణగా 2000 సంవత్సరంలో కరకట్ట నిర్మించారు. కూనవరం రోడ్డుకు ఇరువైపులా 700 మీటర్ల మేర పనులు అప్పుడు ఆగిపోయాయి. ఆ పనులను రూ. 38 కోట్లతో పూర్తి చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఆ తర్వాత గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనులు చేపట్టింది. 2024 జూన్ నాటికి పనులు పూర్తికావాల్సి ఉండగా, ఇప్పటివరకు మట్టి, రిటైనింగ్, ఇతర పనులు పూర్తయ్యా యి. కరకట్టలో నిర్మాణంలో భాగంగా విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారిపై తలపెట్టిన ఓవర్ క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణంలో మాత్రం కదలిక లేదు. సీడీఓ అనుమతుల్లో జాప్యం నిర్మాణ పనుల బాధ్యత తీసుకున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బ్రిడ్జి డిజైన్ను రూపొందించి అనుమతి కోసం హైదరాబాద్లోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ)కు పంపించింది. రెండు నెలలు గడిచినా అక్కడి నుంచి అనుమతి రాలేదు. సీడీఓ సూచనల ప్రకారం పలుమార్లు డిజైన్లో మార్పులు చేశారు. మళ్లీ ఇటీవల కరకట్ట రిటైనింగ్ వాల్, ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ సీడీఓ అధికారులు సందేహాలను వ్యక్తం చేశారు. దీంతో బ్రిడ్జి కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో డిజైన్ ఫైనల్ కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఇలాంటి పనులను తగిన బడ్జెట్ను అందచేస్తే ఆయా శాఖలే పూర్తి చేస్తాయి. తమదికాని నిర్మాణాలను ఒప్పుకున్న ఇరిగేషన్ శాఖ అధికారులు పనులు పూర్తి చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ఓవర్ క్రాసింగ్ బ్రిడ్జి, కరకట్ట, అప్రోచ్ రోడ్డులకు సంబంధించి డిజైన్ సీడీఓకు పంపించాం. వారి సూచనల ప్రకారం చేర్పులు, మార్పులతో నూతన డిజైన్ రూపొందిస్తాం. వీలైనంత తొందరగా పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. – సయ్యద్ అహ్మద్ జానీ, ఇరిగేషన్ ఈఈ, భద్రాచలం డివిజన్బ్రిడ్జి డిజైన్ను సీడీఓ ఆమోదించాక ఆర్అండ్బీ, నేషనల్ హైవే శాఖలు ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత దస్త్రం ప్రభుత్వం వద్దకు పంపితే నిధులు కేటాయిస్తుంది. గతంలో కరకట్టకు రూ.38 కోట్లు విడుదల చేయగా, ప్రస్తుతం ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇప్పటికే పలుమార్లు కరకట్టను పరిశీలించారు. అయినా క్రాసింగ్ బ్రిడ్జి నిర్మాణంలో కదలికలేదు. ఇప్పటికై నా దృష్టి సారించి త్వరితగతిన ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని భద్రాచలం ప్రజలు కోరుతున్నారు. -
దాడులు నిలిపేయాలి
సమాజ శ్రేయస్సు, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్టులు, మీడియా సంస్థలపై దాడులు చేయడం హేయమైన చర్య. ఏపీలో ‘సాక్షి’ పత్రిక ఎడిటర్, జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరించడం సరికాదు. ప్రజాస్వామ్యంలో నాలుగో మూలస్తంభంగా వ్యవహరించే పత్రికా రంగంపై దాడులను నిలిపేయాలి. ‘సాక్షి’ ఎడిటర్, జర్నలిస్టులపై నమోదుచేసిన కేసులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. – మోదుగు వేలాద్రి, టీజీవోస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి -
●పాఠశాలలో ‘తెర’గతి గది
మండలంలోని మారుమూల కొత్త కావడిగుండ్ల గ్రామంలో ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయినులు విధులు నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు 30 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల భనవంలో ఒకే తరగతి గది ఉండగా, అందులో ఐదు తరగతులు నిర్వహించడం కష్టంగా మారింది. దీంతో ఉపాధ్యాయులు వరండాకు గ్రీన్ షీట్ను ఏర్పాటు చేసి మరో తరగతి గదిని ఏర్పాటు చేసుకుని పాఠాలు బోధిస్తున్నారు. – అశ్వారావుపేటరూరల్ -
గొంతు నొక్కేయడం కక్షే..
పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రజల పక్షాన పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కేయడం సరికాదు. ఇది భారత రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేయడం, అక్కడ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ప్రజల పక్షాన నిలిచే వారిపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. – సింగం జనార్ధన్, టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్, ఖమ్మం -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు
ఆంధ్రప్రదేశ్లో పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛను హరించేలా తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పుపడుతున్నారు. ‘సాక్షి’ తెలుగు దినపత్రికకు చెందిన పలు ఎడిషన్ కేంద్రాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ విషయంలో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు. ఇక ప్రభుత్వం హామీల అమలులో చేస్తున్న జాప్యంపై ప్రజల పక్షాన వార్తల ప్రచురిస్తే మాత్రం కేసులు నమోదు చేసి సాక్షి కార్యాలయాలు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. తాజాగా ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛను అక్కడి ప్రభుత్వం తమ గుప్పిట్లోకి తీసుకునేలా చేస్తున్న ప్రయత్నాలపై పలువురు మండిపడ్డారు. – ఖమ్మం సహకారనగర్ / ఖమ్మం లీగల్ -
పోడు భూములకు పట్టాలివ్వాలి
బూర్గంపాడు/భద్రాచలంటౌన్: అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయాలని, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అన్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ నుంచి భద్రాచలం ఐటీడీఏ వరకు సుమారు 10 కిలోమీటర్ల శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల పత్తి పంటలను ధ్వంసం చేయడం, గిరిజన రైతులపై అటవీ అధికారులు దాడులు చేయడం మానుకోవాలని కోరారు. బూర్గంపాడు మండలంలో 2005 కంటే ముందు నుంచే గిరిజనులు పోడు సాగు చేసుకుంటున్నారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇంకా 90 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలి ఇవ్వాల్సి ఉందని అన్నారు. అనంతరం కార్యాలయ పరిపాలనాధికారి సున్నం రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముక్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, రావులపల్లి రవికుమార్, మువ్వా వెంకటేశ్వర్లు, నరెడ్డి వుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, ఈనంశెట్టి పూర్ణచంద్ర రావు, పేరాల శ్రీనివాస్, జంగం మోహన్ రావు, శ్రీనివాస్, సాధనపల్లి సతీష్, అలవాల సీతారామ రెడ్డి, సోందె కుటుంబ రావు పాల్గొన్నారు. -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారి కి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారి కి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపా రు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, ప్రత్యక పూజలు చేశారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. జూలూరుపాడు మార్కెట్కు రూ.3 కోట్లుజూలూరుపాడు: జూలూరుపాడు వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి రూ.3.03 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర మార్కెటింగ్శాఖ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. శుక్రవారం మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్తో కలిసి ఆయన జూలూరుపాడు శాశ్వత వ్యవసాయ మార్కెట్ నిర్మాణానికి కేటా యించిన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 25న టెండర్ ప్రక్రియ జరుగుతుందని, అనంతరం మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఓ నరేందర్, ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి బజారు, సిబ్బంది పాల్గొన్నారు. 15న సైన్స్ సెమినార్కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 15న జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘క్వాంటం ఏజ్ బిగిన్స్ పొటెన్షియల్స్ – చాలెంజెస్‘అనే అంశంపై జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో సెమినార్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సెమినార్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రతీ పాఠశాల నుంచి ఒక్కరు లేదా ఇద్దరు విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. గరిష్టంగా ఐదు చార్టులు, పవర్ పాయింట్కు సంబంధించి ఐదు స్లైడ్లు ప్రదర్శించవచ్చని, పోటీలో పాల్గొనే విద్యార్థులు వివరాలను నమోదు చేసుకోవాలని వివరించారు. ఇతర వివరాలకు జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజ శేఖర్ను సంప్రదించాలని కోరారు. కిన్నెరసాని నుంచి నీటి విడుదలపాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1600 క్యూసెక్కుల వరదనీరు రావడంతో శుక్రవారం నీటిమట్టం 405.20 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్ట్కు చెందిన ఒక గేటును ఎత్తి ఉంచి 3 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. -
ఈజీగా రాజీ!
● నేడు జాతీయ లోక్ అదాలత్ ● జిల్లాలోని 5 కోర్టుల్లో నిర్వహణ ● పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపెండింగ్లో ఉన్న, రాజీ కుదుర్చుకునేందుకు అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీపడేలా చూడాలి. – విక్రాంత్ కుమార్ సింగ్, ఏఎస్పీ, భద్రాచలంభద్రాచలం డివిజన్ పరిధిలోని న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్ అధికారులు జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలి. కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రాజీమార్గంతో ఎక్కువ కేసుల పరిష్కారానికి సహకరించాలి. – శివనాయక్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, భద్రాచలం భద్రాచలంఅర్బన్: బాధితులు ఏళ్లపాటు కోర్టులు చుట్టూ తిరగకుండా, సత్వరమే కేసులు పరిష్కరించేలా న్యాయస్థానాలు లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నాయి. లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం–1987 ప్రకారం లోక్ అదాలత్ల ద్వారా ఏటా వేల సంఖ్యలో పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్నాయి. బాధితులకు సత్వరమే న్యాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 13న జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, దమ్మపేట, ఇల్లెందు కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. తీర్పు అంతిమం.. రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్క రించుకోవచ్చు. ఇక్కడ ఇచ్చే తీర్పే అంతిమం. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసుల విషయంలో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం ముందూ అప్పీల్ చేయడం కుదరదు. లోక్ అదాలత్ తీర్పుతో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయి. పరిష్కారం చూపే కేసులు.. క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగాదా, రోడ్డు ప్రమాదం, చిట్ ఫండ్, డ్రంకెన్ డ్రైవ్, ట్రాఫిక్ తదితర కేసులను పరిష్కరించుకోవచ్చు. దొంగతనం, బ్యాంకు రికవరీ, సెల్ఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం చెక్ బౌన్స్ కేసులు, కార్మిక సంబంధిత కేసులు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు కూడా పరిష్కరించుకోవచ్చని న్యాయవాదులు చెబుతున్నారు. లోక్ అదాలత్తో ప్రయోజనాలు ● సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చిక్కుల నుంచి విముక్తి. ● ఫార్మల్ కోర్టు విచారణ అవసరం లేకుండా సులభంగా పరిష్కారం. ● లీగల్ ఫీజులు, కోర్టు ఖర్చులు తగ్గుతాయి. ● తక్కువ ఖర్చుతో, శాంతియుతంగా వివాదాలను ముగించే అవకాశం. -
స్ట్రక్చరల్ సమావేశం బహిష్కరణ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి యాజమాన్యం మొండివైఖరి వల్లే స్ట్రక్చరల్ సమావేశాన్ని బహిష్కరించినట్లు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ( ఏఐటీయూసీ) అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏడాదికాలంలో మూడుసార్లు నిర్వహించిన సమావేశాల్లో అంగీకరించిన అంశాలపై యాజమాన్యం ఇప్పటివరకు సర్క్యులర్ జారీ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సొంతింటి పథకంపై కమిటీ వేసినా ఇంతవరకు సమావేశం నిర్వహించలేదన్నారు. ఏసీబీ బూచి చూపి మెడికల్ బోర్డ్ను నిలిపివేయడం యాజమాన్య తప్పిదమేనని అన్నారు. గతంలోలాగే మెడికల్ బోర్డ్ నిర్వహించాలని కోరారు. కంపెనీ వాస్తవ లాభాలు ప్రకటించి, 35శాతం కార్మికులకు వాటాను చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు మిరియాల రంగయ్య, సారయ్య, వీరభద్రయ్య, సమ్మయ్య, ఎల్లయ్య, వెంకటి, ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం నేతలు సీతారామయ్య, రాజ్కుమార్ -
రైతులకు తప్పని యూరియా వెతలు
ఇల్లెందు/పాల్వంచరూరల్: రైతులకు యూరియా వెతలు తీరడంలేదు. పంపిణీ కేంద్రాల వద్ద తెల్లవారుజామునుంచే బారులుదీరుతున్నారు. గు రువారం వరకు పాల్వంచ పట్టణంలోని సహకార సొసైటీ కార్యాలయంలో అధికారులు యూరి యా పంపిణీ చేశారు. శుక్రవారం జగన్నాథపురం రైతువేదికలో పంపిణీ చేపట్టారు. దీంతో జగన్నాథపురం, కేశవాపురం, సోములగూడెం, తోగ్గూడెం, నాగారం, రంగాపురం, దంతలబోరు, బండ్రుగొండ, సంగం తదితర గిరిజన గ్రామాల రైతులు తరలివచ్చారు. దీంతో రైతువేదిక నిండిపోయింది. 320 మంది రైతులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా, 220మంది రైతులకే యూరియా పంపిణీ చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇంకా 100 మందికి యూరి యా దొరకలేదు. మిగిలిన రైతులకు సోమవారం లోడ్ వస్తే పంపిణీచేస్తామని ఏఓ శంకర్ తెలిపారు. ఇక ఇల్లెందులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం వద్దకు రొంపేడు, మసివాగు, ముత్తారపుకట్ట తదితర గ్రామాల నుంచి తెల్లారేసరికే రైతులు చేరుకున్నారు. రోజంతా క్యూలైన్లో నిలబడలేక చెప్పులు క్యూలో పెట్టి ఎదురుచూశారు. ఇల్లెందు, చల్లసముద్రం, సుదిమళ్ల, కొమరారం కేంద్రాలుగా యూరియా పంపిణీ కేంద్రాలు తెరిచి 1,860 మెట్రిక్ టన్నుల యూరియా ను సుమారు 10 వేల మంది రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నాయి. అయినా పంటలకు సరిపడా యూరియా అందక రైతులు గోస పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఏడీఏ సుధాకర్, సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్, సీఈఓ సత్యం, స్టాక్ అసిస్టెంట్ లక్ష్మి పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
అశ్వాపురం: ఎన్సీసీ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండల పరిధిలోని మిట్టగూడెంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిబిరంలో శుక్రవారం కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. క్రమశిక్షణ అలవర్చుకోవాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ కల్నల్ సంజయ్కుమార్ భద్ర, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ నవీన్యాదవ్, కళాశాల ప్రిన్సిపాల్ రవికుమార్, తహసీల్దార్ మణిధర్, విద్యార్థులు పాల్గొన్నారు. నానో యూరియాతో ఇన్సూరెన్స్ సౌకర్యంటేకులపల్లి: నానో యూరియాతో రైతులకు రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ సదుపాయం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వేల్పుల బాబూరావు తెలిపారు. శుక్రవారం టేకులపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా నానో యూరియా, నానో డీఏపీ పిచికారీపై డెమో ద్వారా రైతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇఫ్కో యూరియా నాలుగు బాటిళ్లు కొన్నవారు బిల్లు భద్రపరచుకోవాలని చెప్పారు. రైతు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఇన్సూరెన్స్ లభిస్తుందని తెలిపారు. డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సరిత, ఏఓ అన్నపూర్ణ, శ్రావణి, విశాల పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు
వరంగల్ లీగల్: స్నేహితుడిని హత్య చేసిన కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ తండాకు చెందిన పాల్తియా రమేశ్కు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి శుక్రవారం తీర్పు వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజమల్లారెడ్డి తెలిపిన వివరాలు... పాల్తియా రమేశ్, హనుమకొండ రాయపురకు చెందిన యంజాల శివ మిత్రులు. వీరిద్దరు పాత ఇనుప సామగ్రి, చిత్తు కాగితాలు, ఖాళీ సీసాలు విక్రయిస్తూ జీవిస్తుండగా డబ్బు పంపకాల్లో తేడాతో గొడవలు మొదలయ్యాయి. రమేశ్ బాల్యం నుంచే చోరీ కేసుల్లో వరంగల్, హైదరాబాద్, ఖమ్మం జైళ్లలో శిక్ష అనుభవించాడు. మళ్లీ వరంగల్ చేరుకొని శివను కలవగా, 2023 సెప్టెంబర్ 13వ తేదీన గొడవ పడగా, శివ నిద్రించేందుకు హనుమకొండలోని మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అయితే, ప్రతిసారి తనతో గొడవ పడుతున్నాడని భావించిన రమేశ్.. కాసేపటికి శివ వద్దకు వెళ్లి విచక్షణరహితంగా కొట్టి బంగ్లా పైనుంచి కిందికి నెట్టేయడమే కాక కర్ర, బండరాళ్లతో కొట్టి చనిపోయాడని నిర్ధారించుకుని పారిపోయాడు. అనంతరం రమేశ్ పోలీసులకు లొంగిపోగా విచారణలో నేరం రుజువు కావడంతో రమేశ్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యంభద్రాచలంటౌన్: పట్టణంలోని కరకట్ట రోడ్డులో శుక్రవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతుడి వయసు సుమారు 43 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏడుగురిపై కేసు నమోదుటేకులపల్లి: నకిలీ స్టాంపు పేపర్లు సృష్టించిన వ్యవహారంలో ఏడుగురు వ్యక్తులపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ కథనం ప్రకారం... లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన సోమరాజు వెంకట రాజా రాంప్రసాద్, అతని కుటుంబ సభ్యులకు సంపత్ నగర్ గ్రామం గంగారం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 303/2/157లో ఉన్న 70 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది. ఆ భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో ఏడుగురు వ్యక్తులు కలిసి నకిలీ స్టాంపు పేపర్లను మోసపూరితంగా సృష్టించారు. బాధితుడు వెంకట రాజా రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు మాళోతు నాగలక్ష్మి, భూక్య భావ్సింగ్, గుగులోత్ సక్కుబాయి, మాళోతు బలరాం, మెట్ల వెంకటేశ్వర్లు, ఏలూరి కోటేశ్వర్రావు, కోరం చిట్టిబాబులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నంఇల్లెందురూరల్: మండలంలోని పూబెల్లి బీట్ ఆఫీసర్ రాణి శుక్రవారం ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యుల కథంనం ప్రకారం.. పూబెల్లి శివారులో కోతుల బెడద తగ్గించుకునేందుకు రైతు చేను పక్కనే చెట్లను తొలగిస్తుండగా బీట్ అధికారి అడ్డుకుంది. ఈ విషయంలో సదరు రైతు పురుగుల మందు తాగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. నాటి నుంచి రాణి మానసికంగా ఒత్తిడికి గురవుతోంది. శుక్రవారం కుటుంబ సభ్యులు ఖమ్మంలో శుభ కార్యానికి వెళ్లగా ఆమె ఇంట్లో ఉన్న టాబ్లెట్లు మింగింది. గమనించిన బంధువులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇల్లెందు రేంజ్ అటవీసిబ్బంది, యూనియన్ నాయకులు కోటి, మురళి తదితరులు రాణిని పరామర్శించారు. -
కేటీపీఎస్ సొసైటీ అధ్యక్ష పీఠం ఎవరికో?
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ అధ్యక్ష పీఠం కోసం మంతనాలు జోరందుకున్నాయి. పాలక మండలి పదవుల కోసం ఎవరికివారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్థానిక డీఏవీ పాఠశాలలో సొసైటీ డైరెక్టర్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం అర్ధరాత్రి ముగిసింది. ఎన్నికల్లో బీసీ కేటగిరీలో తోట అనిల్ కుమార్, కోన నాగేశ్వరరావు, ఎస్సీ ఉమెన్ విభాగంలో దాసరి వీరమణి, ఓసీ ఉమెన్ విభాగంలో రావు స్పందన, ఎస్టీ విభాగంలో నూనావత్ కేశులాల్, ఎస్సీ జనరల్ విభాగంలో వల్లమల ప్రకాశరావు, జనరల్ విభాగంలో దానం నరసింహారావు, డోలీ శ్రీనివాసరావు, వీరమల్లు రఘుకృష్ణ, సిద్ది ప్రశాంత్, బుద్దార్ధి మహేందర్, ధర్మరాజుల నాగేశ్వరరావు, సిద్దెల హుస్సేన్లు డైరెక్టర్లులుగా గెలుపొందారు. విజేతలు రంగులు పులుముకుని సంబరాలు జరుపుకున్నారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పాలక మండలి అధ్యక్ష పీఠం కోసం గతంలో పనిచేసిన దానం నర్సింహారావు, ధర్మరాజుల నాగేశ్వరరావులు పోటీ పడుతున్నారు. చెరో రెండేళ్ల చొప్పున అధ్యక్ష పదవిలో ఉండేలా ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. సెక్రటరీ పోస్టు కోసం డోలి శ్రీనివాసరావు, కోన నాగేశ్వరరావు, కోశాధికారిగా మహేందర్, కేశులాల్లు పోటీ పడుతున్నారు. వైస్ ప్రెసిడెంట్గా తోట అనిల్కుమార్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం కొత్తపాలక వర్గం కొలువు దీరేలా కార్మిక సంఘాల నాయకులు చొరవ తీసుకుంటున్నారు.పాలక మండలి పదవుల కోసం పావులు కదుపుతున్న డైరెక్టర్లు -
ముమ్మరంగా డిజిటల్ క్రాప్ సర్వే
● క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నమోదు ● అక్టోబర్ 25 వరకు నమోదుకు గడువు బూర్గంపాడు: జిల్లా వ్యాప్తంగా పంటల నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. గతేడాది సీసీఐ పత్తి విక్రయాల్లో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది వ్యవసాయశాఖ పంటల నమోదును పక్కాగా చేస్తోంది. ఏఈఓలు వానాకాలంలో రైతులు సాగు చేసిన పంటల చేలకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల వివరాలు, విస్తీర్ణం, ఏ పంట వేశారు, రైతు ఆధార్కార్డు నంబర్, ఫోన్ననంబర్ తదితర వివరాలను డీసీఎస్(డిజిటల్ క్రాప్ సర్వే) యాప్లో నమోదు చేస్తున్నారు. తొలుత పట్టా భూములలో పంట నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఆ తర్వాత నాన్ డిజిటల్ సైన్ భూముల్లో సాగు చేసిన పంటల వివరాలను నమోదు చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 2.10 లక్షల ఎకరాలలో పత్తి సాగు ఈ ఏడాది జిల్లాలో సుమారు 2.10 లక్షల ఎకరాలలో పత్తి, 1.85లక్షల ఎకరాలలో వరి సాగు చేశారు. మిర్చి, అపరాల సాగు ఇంకా కొనసాగుతోంది. అక్టోబర్ 25 వరకు పంటల నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది, ఇప్పటికే జిల్లాలో 40శాతం మేర నమోదు పూర్తయింది. డిజిటల్ క్రాప్ సర్వేలో పంటలు నమోదు చేసుకుంటే సీసీఐలో పత్తి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు ఇబ్బందులు ఉండవు. గతేడాది చాలామంది రైతులు క్రాప్ బుకింగ్ చేసుకోకపోవటంతో పత్తి, ధాన్యం అమ్మకాల సమయంలో నానా అగచాట్లు పడ్డారు.గతేడాది పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులు పత్తి విక్రయించుకునేందుకు వ్యవసాయశాఖ అధికారులు టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్)రాసి ఇచ్చారు. కొందరు ఏఈఓలు వ్యాపారులకు కూడా టీఆర్లు ఇవ్వడం, వాటిని మార్కెటింగ్శాఖ అధికారులు ధ్రువీకరించటంతో సీసీఐ పత్తి అమ్మకాల్లో అవకతవకలు జరిగాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. కొందరు వ్యవసాయశాఖ అధికారులు, 17మంది మార్కెటింగ్శాఖ కార్యదర్శులపై సస్పెన్సన్ వేటు పడింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలించాకే వివరాలు నమోదు చేస్తున్నారు. పంట నమోదు చేసుకుంటే పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టం జరిగినప్పుడు పరిహారం అందించేందుకు వీలుంటుంది. పంట నమోదు చేసుకోకుంటే ఏ పథకాలకు కూడా అర్హులు కాలేరని అధికారులు చెబుతున్నారు. -
అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
దమ్మపేట: అంతరాష్ట్ర గంజాయి ముఠాను శుక్రవారం దమ్మపేట పోలీసులు అరెస్ట్ చేశారు. దమ్మపేట స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీష్కుమార్ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. దమ్మపేట పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి ఎస్సై సాయికిషోర్ రెడ్డి మండలంలోని పట్వారిగూడెం గ్రామ శివారులో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పాల్వంచ నుంచి దమ్మపేట వైపు వెళ్తున్న కారు అనుమానాస్పదంగా కనిపించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వాహనంలో తనిఖీ చేయగా రూ.43 లక్షల విలువైన 86 కేజీల గంజాయి లభించింది. కారులో ఎనిమిది మంది వ్యక్తులు ఉండగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. నిందితుల్లో సీఐఎఫ్ఎఫ్ కానిస్టేబుల్ పోలీసులు పట్టుకున్న ఐదుగురిలో ఏపీలోని మోతుగూడేనికి చెందిన పనగుడు శివకృష్ణ, తమిళనాడుకు చెందిన జయరామన్ మహేష్కుమార్, కృష్ణమూర్తి మారియప్పన్, కందసామి రంజిత్, రాము వసంత్ ఉన్నారు. వీరిలో శివకృష్ణ సీఐఎస్ఎఫ్లో కానిస్టేబు ల్. ప్రస్తుతం డిప్యూటేషన్పై ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తూ కేరళలో నివాసం ఉంటున్నాడు. పరారైన వారిలో ఏపీలోని రాజమండ్రికి చెందిన ఓ మహిళ, ఒడిశా, తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. గంజాయి అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్లో ఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు వీర, లక్ష్మయ్య, రమేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
అనర్హులకు పోస్టింగ్ ఇచ్చారు..
టేకులపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ స్కూళ్లలో టీచర్, ఆయా పోస్టుల నియామకాల్లో అనర్హులకు పోస్టింగ్లు ఇచ్చారని బాధితులు ఆరోపించారు. నోటిఫికేషన్ రద్దు చేసి అర్హులను నియమించాలని కోరారు. శుక్రవారం మండలంలోని తావుర్యాతండా పంచాయతీ స్టేషన్ తడికలపూడి ప్రాథమిక పాఠశాల వద్ద పలువురు బాధితులు సుమారు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. స్టేషన్తడికలపూడి ప్రీ ప్రైమరీ స్కూల్లో టీచర్, ఆయా ఇద్దరు శుక్రవారం విధుల్లో చేరేందుకు రావడంతో వివాదం మొదలైంది. ఈ పంచాయతీకి చెందిన తమకు అన్ని అర్హతలున్నా నిబంధనలకు విరుద్ధంగా ఇతర పంచాయతీల నుంచి టీచర్, ఆయాలను నియమించారని బాధిత అభ్యర్థులు బాదావత్ మంగ, బానోతు మంజుల, బొర్ర స్వరూపారాణి, బాణోతు జ్యోతి, గుగులోత్ దివ్య భారతి ఆరోపించారు. ఈ విషయమై ఎంఈఓ జగన్ను వివరణ కోరగా.. టీచర్, ఆయా నియామకాలు జరగలేదని, దరఖాస్తులను అమ్మ ఆదర్శ కమిటీలకు పంపించామని తెలిపారు. వారు ఎంపిక చేసి వివరాలు పంపిస్తే, కలెక్టర్కు నివేదిస్తామని పేర్కొన్నారు. కాగా పైలట్ ప్రాజెక్ట్గా జిల్లాలో 21 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించనున్నారు. వీటిల్లో స్టేషన్ తడికలపూడి ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. పాఠశాలల్లో టీచర్, ఆయా పోస్టుల భర్తీకి గత నెల 26న నోటిఫికేషన్ విడుదల చేశారు. స్టేషన్ తడికలపూడి పాఠశాలలో బాధితుల ఆందోళన -
వేతన వెతలు..
● ‘ఆశ్రమ’ వంట కార్మికులకు ఆరు నెలలుగా జీతాల్లేక ఇక్కట్లు ● గుదిబండగా మారనున్న జీఓ 64 ● ఉమ్మడి జిల్లాలో 490 మంది డైలీవేజ్ వర్కర్లు ● సమస్యల పరిష్కారానికి నేటి నుంచి సమ్మెబాటకరకగూడెం: ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులు గత ఆరు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 64.. వారికి గుదిబండగా మారింది. దీంతో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 60 ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న 490 మంది డైలీ వేజ్ కార్మికులు శుక్రవారం నుంచి సమ్మె బాట పట్టనున్నారు. అసలే అరకొర.. అందులోనూ జాప్యం ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న వంట కార్మికులకు చెల్లించే అరకొర వేతనాలు కూడా నెలల తరబడి పెండింగ్ ఉంటున్నాయి. దీంతో నిత్యావసరాలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 64 అమల్లోకి వస్తే తమ వేతనం సగానికి సగం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈజీఓ అమలైతే.. ప్రస్తుతం నెలకు రూ.26వేలు పొందే కార్మికుడి వేతనం.. రూ.11,700కు పడిపోవచ్చని తెలుస్తోంది. ఈ జీఓ అమలు చేయొద్దని, తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద కార్మికులు, ఆయా సంఘాల నాయకులు భారీ ఆందోళన చేసి, మంత్రి అట్లూరి లక్ష్మణ్కు వినతిపత్రం అందజేశారు. పాత వేతన విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో చేపట్టిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు శుక్రవారం నుంచి సమ్మె బాట పట్టేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు ఐటీడీఏ అధికారులకు సమ్మె నోటీసు అందించారు. ఈ విషయమై ఐటీడీఏ డీడీ మణెమ్మను వివరణ కోరగా వేతనాలు చెల్లించడానికి నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ, కొత్త జీఓ ప్రకారం తీసుకునేందుకు కార్మికులు అంగీకరించడం లేదని తెలిపారు. జీతాలు లేక అప్పుల పాలయ్యాం. ఆరు నెలలుగా జీతం ఆగిపోతే ఎలా బతకాలి. ఇప్పుడిస్తు జీతాలే సరిపోవడం లేదు. ఇక కొత్త జీఓ అమలైతే ఇంకా తగ్గుతాయని అంటన్నారు. పాత జీతాలు ఇవ్వడంతో పాటు కొత్త జీఓ రద్దు చేయాలి. – కౌసల్య, డైలీవేజ్ కార్మికురాలు, ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల గిరిజన ఆశ్రమ పాఠశాలల కార్మికుల కష్టాలు చెప్పలేనివి. ఆరు నెలల వేతనాలు పెండింగ్ ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆ జీతాలు ఇవ్వకపోగా ప్రభుత్వం కొత్త జీఓ తెచ్చి వారి పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోంది. కార్మికులకు అన్యాయం జరిగితే సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. –కె.బ్రహ్మచారి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడుఆరు నెలలుగా జీతాలు లేవు. ఈ జీతంపైనే మా కుటుంబం ఆధారపడి ఉంది. ఎండాకాలమైనా, వానాకాలమైనా కష్టపడి విద్యార్థులకు భోజనం వండి పెడుతున్నాం. ఇప్పుడిచ్చే వేతనాలే అరకొరగా ఉన్నాయి. ఇక కొత్త జీఓతో జీతాలు ఇంకా తగ్గుతాయంటున్నారు. ప్రభుత్వం మా గోడు విని న్యాయం చేయాలి. – ముసలయ్య, డైలీవేజ్ కార్మికుడు, చిరుమళ్ల ఆశ్రమ పాఠశాల -
టీఎల్ఎంతో సులభంగా..
దమ్మపేట: టీఎల్ఎం(బోధన అభ్యసన సామగ్రి) వినియోగంతో బోధన, అభ్యాసన ప్రక్రియ మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఇటీవల జిల్లా వ్యాప్తంగా మండలాల స్థాయిలో టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేశారు. ఐటీడీఏ పరిధిలోని పాఠశాలలకు ఏటీడీఓ స్థాయిలో ఈ నెల 1న పార్కలగండి, ఇతర ప్రాంతాల్లో టీఎల్ఎం మేళా నిర్వహించారు. ఈ నెల 16న భద్రాచలం గిరిజన భవన్లో గిరిజన పాఠశాలలకు జిల్లాస్థాయి మేళా నిర్వహించనున్నారు. ఇతర యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలలకు మండలస్థాయిలో మేళాలు కొనసాగుతున్నాయి. మరో వారంలో వాటికి కూడా జిల్లాస్థాయి మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా.. ప్రధానంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యాంశాల బోధనలో టీఎల్ఎంను వినియోగిస్తే బోధన సులభతరం అవుతుంది. విద్యార్థుల్లో ఆసక్తి కూడా పెంపొందుతుంది. ఈ క్రమంలో నమూనా చిత్రాలు, మ్యాపులు, బొమ్మలు, చార్టులు, దృశ్య, శ్రవణ పరికరాలతో ఉపాధ్యాయులు బోధన అభ్యసన సామగ్రిని రూపొందించి మేళాలో ప్రదర్శించారు. పార్కలగండి గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలకు నిర్వహించిన టీఎల్ఎం మేళాలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు తయారు చేసిన వివిధ పాఠ్యాంశాలకు సంబంధించిన బోధన అభ్యసన పరికరాలను పరిశీలించి అభినందించారు. టీఎల్ఎంను జోడించి బోధించడం ద్వారా విద్యార్థులకు నేర్చుకోవాలని ఆసక్తి పెరగడంతోపాటు దృశ్య అనుభూతి కలుగుతుందని తెలిపారు. టీఎల్ఎం తయారీతో ఉపాధ్యాయుల అంతర్గత ప్రతిభ కూడా బయటకు వస్తుందని పేర్కొన్నారు. బోధన అభ్యసన సామగ్రి బోధన ప్రక్రియను సులభతరం చేసి, విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఉపయోగపడే ప్రతీ వస్తువు, వనరు, పరికరం, సాధనం బోధన అభ్యసన సామగ్రిగా చెప్పవచ్చు. ఈ తరహా బోధనలో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య జరిగే బోధన అభ్యసన ప్రక్రియ మెరుగుపడుతుంది. వీటి ద్వారా ఉపాధ్యాయుడు బోధనను అత్యంత ప్రభావవంతంగా నిర్వహించవచ్చు. విద్యార్థులు కూడా చురుగ్గా నేర్చుకుంటారు. అభ్యసన ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. సమాచారం ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. విద్యార్థుల్లో ఆలోచన, విమర్శనాత్మక శక్తి పెరుగుతుంది. దృశ్య, శ్రవణ, దృశ్య–శ్రవణ సాధనాలను టీఎల్ఎం బోధనలో ఉపయోగిస్తారు. దృశ్య సాధనాలుగా చిత్రాలు, పోస్టర్లు, నమూనాలు, మ్యాపులు, బొమ్మలను ఉపయోగిస్తారు. శ్రవణ సాధనాలుగా ఆడియో టేపులు, పాటలు, కవితలు, ప్రసంగాలను వినియోగిస్తారు. దృశ్య–శ్రవణ సాధనాలుగా టెలివిజన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మల్టీమీడియా ప్రజెంటేషన్లను ఉపయోగిస్తారు. టీఎల్ఎంతో ప్రయోజనాలు ●ఉపాధ్యాయుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. ●విద్యార్థులకు అభ్యసన పట్ల సన్నద్ధతతో పాటు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. ●ఇంద్రియ అనుభవాల ద్వారా ప్రత్యక్ష అనుభూతి కలుగుతుంది. ●దృశ్య, శ్రవణ పరికరాల ద్వారా నేర్చుకున్న పాఠ్యాంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. ●తరగతి గదిలో అభ్యసన వాతావరణం మెరుగుపడుతుంది. ●కష్టతరమైన పాఠ్యాంశాలు నేర్చుకోవడం సులభతరం అవుతుంది. ●వాస్తవ ప్రపంచ పరిచయం, సమస్యల పరిష్కారం, ఆలోచనా శక్తి పెంపొందుతుంది. ●చదువులో వినోదాన్ని, ఆచరణాత్మకతను, అనుభూతిని కలిగిస్తుంది.మెరుగుపడనున్న బోధన, అభ్యసన ప్రక్రియ టీఎల్ఎం ద్వారా తరగతి గదిలో బోధనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు పాఠ్యాంశాలు నేర్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తారు. విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు, సమగ్ర అభ్యసన సామర్థ్యాలు పెరుగుతాయి. అవగాహన, ఇంద్రియ అనుభవంతో నేర్చుకోవడం వల్ల పాఠ్యాంశాలు దీర్ఘకాలం గుర్తుంటాయి. – విజయలక్ష్మి, ఉపాధ్యాయురాలు, మొద్దుల గూడెం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల పాఠ్యాంశాల బోధనలో బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగిస్తే విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తితోపాటు అవగాహన పెరుగుతుంది. బోధనలో దృశ్య, శ్రవణ సాధనాల వినియోగం వల్ల ప్రత్యక్ష అనుభూతి పెరిగి, కష్టతరమైన పాఠ్యాంశాలు కూడా సులభంగా అర్థమవుతాయి. టీచర్ల బోధన కూడా మెరుగుపడుతుంది. – కీసర లక్ష్మి, ఎంఈఓ, దమ్మపేట -
సర్కారు సేవలకు సై!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. సర్కారు దవాఖానాల్లో వైద్యుల పోస్టులు భర్తీ చేయడం, రోగ నిర్ధారణ పరీక్షలు, శస్త్ర చికిత్సలు ఉచితంగా అందిస్తుండడంతో ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుండగా, పేషెంట్ల తాకిడి పెరుగుతోంది. వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదవుతున్న ఐపీ, ఓపీ రికార్డులే అందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. చర్ల సామాజిక ఆస్పత్రిలో నిన్నామొన్నటి వరకు 50 మంది వరకు ఓపీ రికార్డు ఉండగా ఇప్పుడది 220కి పెరిగింది. మణుగూరు ఏరియా ఆస్పత్రిలో ఈ ఏడాది జనవరిలో ఎనిమిది ప్రసవాలు మాత్రమే జరగగా, ఆగస్టు నాటికి ఆ సంఖ్య 100 దాటింది. గోదావరి తీరానికి రెండువైపులా ఉన్న ఆస్పత్రుల్లో గైనకాలజిస్ట్ సేవలు అందుబాటులోకి రావడంతో ఏజెన్సీ వాసులకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. అశ్వారావుపేట ఏజెన్సీలోనూ ఇదే తరహా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. దీంతో ఏజెన్సీలో ఆర్ఎంపీల దూకుడుకు బ్రేకులు పడుతున్నాయి. శస్త్ర చికిత్సలూ అదే స్థాయిలో.. సాధారణ వైద్య సేవలకు తోడు ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు సైతం పెరిగాయి. భద్రాచలం ఆస్పత్రిలో ప్రతీ నెల సగటున 14 మందికి కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. పాల్వంచ, భద్రాచలం ఆస్పత్రుల్లో ఎముకలకు (ఆర్థోపెడిక్) సంబంధించి నెలకు 50 వరకు ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా ప్రారంభించారు. ఇల్లెందు ఆస్పత్రిలో ఫిజియోథెరపీ చికిత్స విజయవంతంగా నడుస్తోంది. ఇక్కడ నెలకు 200 మందికి పైగా ఫిజియోథెరపీ సేవలు పొందుతున్నారు. దంత విభాగంలోనూ జిల్లా వాప్తంగా ప్రతీ నెల 300 పైగా శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ సేవలు మెరుగవడంతో ఇక్కడ అందే వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. ఉదాహరణకు ఇల్లెందు ఆస్పత్రిని పరిశీలిస్తే ఇక్కడ 100 పడకలు ఉండగా గత నాలుగైదు నెలలుగా 120 మందికి పైగా ఇన్ పేషెంట్లు(ఐపీ) ఉంటున్నారు. దీంతో ఇక్కడ కొత్తగా ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి స్థలం దొకరని పరిస్థితి నెలకొంది. రక్త నిల్వ కేంద్రాలు గతంలో జిల్లాలో ఎక్కడ రక్తం అవసరమైనా కొత్తగూడెం, భద్రాచలం ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కొత్తగా మణుగూరు, అశ్వారావుపేటలోనూ రక్త నిల్వ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఇల్లెందులోనూ ప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో కలిపి డయాలసిస్ కోసం 54 మిషన్లు అందుబాటులో ఉండగా 400 మందికి డయాలసిస్ చేసే వీలుంది. కాగా ప్రస్తుతం రోగుల సంఖ్య 350 లోపే ఉంది. అయితే స్పెషాలిటీ సేవలు అందించే వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో డాక్టర్ల సంఖ్య మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ అనూహ్యంగా డిమాండ్కు సరిపడా నర్సులు లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు జిల్లా వ్యాప్తంగా 90 మంది నర్సుల అవసరం ఉంది. మరోవైపు ఆస్పత్రుల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, డాక్టర్లకు సైతం గత నాలుగు నెలల నుంచి వేతనాలు అందడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ వైద్య చికిత్సలు రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సబ్ సెంటర్ల నుంచి ఏరియా ఆస్పత్రుల వరకు వైద్య సిబ్బంది అహర్నిశలూ ప్రయత్నిస్తున్నారు. అయితే వీటికి అందాల్సిన ఆస్పత్రి అభివృద్ధి నిధులు(హెచ్డీఎఫ్) రెండు, మూడేళ్లుగా పెండింగ్లో ఉంటున్నాయి. ఈ నిధులు అందుబాటులో ఉంటే ఆస్పత్రుల్లో అసరమైన అత్యవసర మందుల కొనుగోలు, చిన్న చిన్న మరమ్మతులు చేయించే అవకాశం ఉంటుంది. ఏళ్లుగా హెచ్డీఎఫ్ నిధులు లేక ప్రతీ పనికి కలెక్టర్ అందించే ప్రత్యేక నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఏజెన్సీ జిల్లాల్లో గతంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేవి కావు. ఏ జబ్బు చేసినా ఖమ్మం, కొత్తగూడెంపైనే ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. – జి.రవిబాబు, డీసీహెచ్ఎస్ మూడు రోజులు క్రితం జ్వరం రావడంతో ఇల్లెందు ఆస్పత్రికి వచ్చా. పెద్ద డాక్డర్లు పరీక్షించి బెడ్ ఇచ్చారు. ఇప్పుడు జ్వరం తగ్గుముఖం పట్టింది. రోజూ గ్లూకోజ్ పెట్టి ఇంజెక్షన్లు వేస్తున్నారు. ప్రైవేట్లో అయితే రూ.10వేలకు పైగా ఖర్చయ్యేది. ఇక్కడ రూపాయి ఖర్చులేకుండా రోగం నయం చేస్తున్నారు. – సీహెచ్ విజయ, రేపల్లెవాడ, ఇల్లెందు మండలం -
మట్టి ట్రాక్టర్ల అడ్డగింత
అశ్వారావుపేటరూరల్: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గురువారం గ్రామస్తులు పట్టుకున్నారు. మండలంలోని జమ్మిగూడెం శివారు చెరువు శిఖం భూముల్లో నుంచి మూడు రోజులుగా జేసీబీతో మట్టి తవ్వి ఏడు ట్రాక్టర్లతో తరలించి విక్రయిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన కొందరు గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకుని పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీస్ సిబ్బంది, ఆర్ఐ పద్మావతి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమతులు లేవని గుర్తించి ట్రాక్టర్లను తహసీల్కు తరలించారు. కాగా, తవ్వకాలు చేసిన జేసీబీతోపాటు మరో మూడు ట్రాక్టర్లను మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న వ్యక్తులు తప్పించడం గమనార్హం. ట్రాక్టర్లను అడ్డుకున్న వారిలో స్థానికులు మిద్దిన కొండయ్య, మిద్దిన రాములు, సింగలూరి కృష్ణ, దానపు సింగయ్య, లక్కదాసు శ్రీను, రెడ్డి లక్ష్మి, దానపు జయమ్మ ఉన్నారు. అక్రమార్కులు! -
గందరగోళంగా ‘కేటీపీఎస్’ ఓట్ల లెక్కింపు
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ (పాల్వంచ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. బుధవారం కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం వైటీపీఎస్, బీటీపీఎస్ నుంచి పోలింగ్ బాక్స్లను పాల్వంచకు తీసుకొచ్చారు. ఎన్నికల అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో డీఏవీ పాఠశాలలో బుధవారం రాత్రి 9 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. గురువారం రాత్రి వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఫలితాల కోసం అభ్యర్థులు, ఉద్యోగులు కౌంటింగ్ కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఫలితాల్లో వెల్లడిలో తీవ్ర జాప్యం కావడం విమర్శలకు దారి తీసింది. తొలుత పోలిగ్ బాక్స్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారని, అది ఎటూ తేలకపోవడంతో ఆ తర్వాత అన్ని బాక్స్లను ఒక్కచోట కలిపి మళ్లీ లెక్కింపు చేపడుతున్నారని పలువురు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం వరకు వెల్లడవుతుండగా కేటీపీఎస్ సొసైటీ ఫలితాలు మాత్రం 24 గంటలపాటు లెక్కించినా తేలలేదు. మొత్తం 2,996 ఓట్లకుగాను 2,543 ఓట్లు పోలుకాగా, ఆ ఓట్లను లెక్కించేందుకు అధికారులు హైరానా పడుతున్నారు. ఆరుగురు డైరెక్టర్ల గెలుపు ఎస్సీ మెన్ కేటగిరీలో వల్లమల్ల ప్రకాష్ 237 ఓట్లతో సొసైటీ డైరెక్టర్గా గెలుపొందినట్లు అధికారులు వెల్లడించారు. కేశులాల్, తోట అనిల్కుమార్, కోన నాగేశ్వరరావు, ఆర్. స్పందన, వీరస్వామి డైరెక్టర్లుగా విజయం సాధించారు. రాత్రి 10 గంటలు దాటినా మరో ఏడుగురి డైరెక్టర్ల ఫలితాలు వెల్లడి కాలేదు. కాగా విజేతలు, వారి మద్దతుదారులు రంగులు చల్లుకుని విజయోత్సవాలు నిర్వహించారు. ఫలితాల కోసం పడిగాపులు కాసిన ఉద్యోగులు, అభ్యర్థులు -
విద్యుత్ సిబ్బంది సాహసం
మద్దుకూరు సాగునీటి ప్రాజెక్ట్లో మరమ్మతులు చండ్రుగొండ: మండలంలోని మద్దుకూరు సాగునీటి ప్రాజెక్ట్లో నుంచి వెళ్లే విద్యుత్లైన్ పిడుగుపాటుకు మరమ్మతులకు గురికాగా, గురువారం విద్యుత్ సిబ్బంది నీటిలోనే మరమ్మతులు పూర్తి చేశారు. మద్దుకూరు ప్రాజెక్ట్ మీదుగా మద్దుకూరులోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి చండ్రుగొండలోని 33/11 సబ్స్టేషన్కు స్టాండ్బై విద్యుత్ లైన్ ఉంది. బుధవారం పిడుగుపాటుకు ప్రాజెక్ట్ మధ్యలో విద్యుత్లైన్ ఇన్సులేటర్ తెగిపోయింది. దీంతో రెండు సబ్స్టేషన్ల మధ్య విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో సిబ్బంది దాదాపు 10 అడుగుల లోతులో నీటిలో ప్రయాణించి, తాడు మోకుల ద్వారా స్తంభం వద్దకు చేరుకుని మరమ్మతులు పూర్తి చేశారు. దీంతో పలువురు విద్యుత్ సిబ్బందిని అభినందించారు. పోలీసు అదుపులో గంజాయి విక్రేతలు? ఐదుగురు అనుమానితులను దమ్మపేటలో విచారిస్తున్న పోలీసులు! అశ్వారావుపేట: మండలంలోని ఆసుపాక గ్రామం గంజాయి రవాణాకు హబ్గా మారిందని ప్రచారం సాగుతోంది. దమ్మపేట పోలీస్ స్టేషన్లో సీఐ పింగళి నాగరాజు రెడ్డి ఆసుపాకకు చెందిన కొందరు వ్యక్తులను మూడు రోజులుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆసుపాకకు చెందిన ఓ వ్యక్తి 20 ఏళ్ల క్రితం భద్రాచలంలో గుమస్తాగా పని చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఏర్పడ్డ పరిచయాలతో గుట్కా, ఖైనీ, గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గంజాయిని ఆసుపాకలో డంప్ చేసి ఇతర ప్రాంతాలకు వేరే వ్యక్తుల ద్వారా చేరవేసేవాడని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అశ్వారావుపేట పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. గురువారం అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో ఓ కారును స్వాధీనం చేసుకుని, ఇతర రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సీఐ నాగరాజు రెడ్డిని సంప్రదించగా.. ప్రచారం వాస్తవం కాదని తెలిపారు. ప్రహరీని ఢీకొట్టిన ట్రాక్టర్గోడ కూలి వృద్ధురాలి మృతిదమ్మపేట: ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రహరీ కూలి మీద పడి ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన మండలంలోని లచ్చాపురం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లచ్చాపురం గ్రామానికి చెందిన అబ్బిశెట్టి నారాయణమ్మ(65) తన ఇంట్లో లోపలవైపు ప్రహరీకి ఆనుకుని కూర్చుంది. ఈ క్రమంలో అశ్వారావుపేట మండలంలోని దిబ్బగూడెం గ్రామానికి చెందిన యువకుడు రావుల సాయి ట్రాక్టర్ను నిర్లక్ష్యంగా నడుపుతూ నారాయణమ్మ ఇంటి ప్రహరీని ఢీకొట్టాడు. దీంతో గోడ కూలి పడి ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. పేకాటరాయుళ్ల అరెస్ట్మణుగూరు టౌన్: తోగ్గూడెం ఆలయ సమీపంలోని సమ్మక్క–సారక్క ఫంక్షన్ హాల్లో గురువారం కొందరు పేకాట ఆడుతుండగా పోలీసులు దాడులు చేశారు. పేకాటరాయుళ్లు వట్ట రాంబాబు, చనుమోలు పూర్ణచంద్రరావు, నంబూరి శ్రీనివాసరావు, చావ సత్యనారాయణ, తాతా రమణ, శ్రీరామోజు అనంతరాములు, గుదే వెంకట్రావు, వెల్లంకి కిశోర్, గడ్డం మల్లికార్జునరావు, తోటకూర వెంకటేశ్వరరావు, బట్ట మేకల చంద్రశేఖర్, మాదినేని రాధాకృష్ణ, అడపా వెంకటేశ్వర్లు, కాసబోయిన శ్రీను, ఆరే నవీన్కుమార్లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నాగబాబు తెలిపారు. రూ.1.69 లక్షల నగదు, 15 సెల్ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం
కరకగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లవుతున్నా ప్రజా సమస్యలు పరిష్కారం కావడంలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కరకగూడెంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరోగమనంలోకి వెళ్తోందని విమర్శించారు. మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన వట్టివాగు ప్రాజెక్ట్ను రద్దు చేశారని ఆరోపించారు. కొత్త టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించి మూన్నాళ్ల ముచ్చటగా వదిలేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు ఊకే రామనాథం, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, బుడగం రాము, రంజిత్ కుమార్, చిరంజీవి, రాంబాబు, కృష్ణ, ప్రసాద్, వేణు, ప్రభాకర్, సుధాకర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు -
అమరుల త్యాగాలు మరువలేనివి
● సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ● హాజరైన ఎస్పీ రోహిత్రాజ్, డీఎఫ్ఓ కిష్టాగౌడ్ చుంచుపల్లి: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. అటవీ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గొత్తిగోయల చేతిలో హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అడవులు వనరులు మాత్రమే కాదని, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువుగా నిలుస్తాయని చెప్పారు. అడవుల సంరక్షణలో ఉద్యోగుల కృషి ఎనలేనిదని అన్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నారని అభినందించారు. ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ అటవీ సిబ్బందికి ఎదురవుతున్న సవాళ్ల విషయంలో పోలీస్ శాఖ అండగా నిలుస్తుందని తెలిపారు. అటవీ సిబ్బంది నిత్యం ప్రమాదాలు ఎదుర్కొంటూ అడవులను కాపాడుతున్నారని అన్నారు. డీఎఫ్ఓ కిష్టాగౌడ్ మాట్లాడుతూ అమరుల త్యాగాలు తమకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. అంతకుముందు ప్రకాశం స్టేడియం నుంచి సెంట్రల్ పార్కు వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు కుటుంబసభ్యులు, వివిధ విభా గాల అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సెంట్రల్ మెడికల్ స్టోర్ తనిఖీ రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని సెంట్రల్ మెడికల్ స్టోర్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులకు అవసరమయ్యే ఔషధాలు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రధాన రహదారి నుంచి స్టోర్కు వచ్చే రోడ్డు మరమ్మతు చేయాలని, స్టోర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మందుల నిల్వకు ర్యాక్లు, బరువైన బాక్సులు ఎత్తడానికి అవసరమైన యంత్రాలు సమకూర్చాలని సిబ్బంది కోరగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట సీనియర్ ఫార్మసీ అధికారి శారద, ఫార్మసిస్ట్ రామచందర్ ఉన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువు దీరిన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి గురువారం అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఆ తర్వాత హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపడింతులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు.శరన్నవరాత్రుల ప్రచార రథం ప్రారంభం..పెద్దమ్మతల్లి ఆలయంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల విజయంతానికి ప్రత్యేక రథం ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రథాన్ని పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో చెవుగాని పాపారావు, పెండ్లి రామిరెడ్డి, శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు.22 నుంచి డీఎల్ఈడీ థియరీ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: ఈనెల 22 నుంచి 27 వరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయని, చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని వివరించారు. హాల్టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు 8919279238 నంబర్లో సంప్రదించాలని సూచించారు.జాతీయ స్థాయి టోర్నీకి ఉపాధ్యాయుడి ఎంపికదుమ్ముగూడెం : మండలంలోని ఆర్లగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు శ్యామల ఆంజనేయులు అలిండియా సివిల్ సర్వీసెస్ స్పోర్ట్స్ టోర్నమెంట్కు ఎంపికయ్యారు. ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించిన షటిల్ విభాగంలో అండర్ – 40 విభాగంలో ఆయన ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆంజనేయులును గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కారం సర్వేష్, పూనెం నర్సింహారావు తదితరులు అభినందించారు.‘ఆది కర్మయోగి’వివరాలు సమర్పించాలిభద్రాచలంఅర్బన్ : ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన వివరాలు, ప్రతిపాదనలు పంపించాలని ఏటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఐటీడీఏ కార్యాలయం నుంచి 19 మండలాల అధికారులు, నోడల్ అధికారులు, జిల్లా, మండల లెవెల్ మాస్టర్ ట్రైనింగ్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో 19 మండలాల పరిధిలోని 130 గ్రామాల్లో ఆది కర్మయోగి అభియాన్ పథకంపై ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన ఎలా ఉందనే వివరాలతో నివేదికలు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి రాంబాబు, లక్ష్మీనారాయణ, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
దళిత బంధు యూనిట్ల తనిఖీ
జూలూరుపాడు: మండల కేంద్రంలో గతంలో మంజూరైన దళిత బంధు యూనిట్లను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరగిరి ప్రీతమ్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అడ్డగోలుగా ఇచ్చిందని, కొందరు లబ్ధిదారులు యూనిట్లను అమ్ముకున్నారని తెలిపారు. అలాంటి యూనిట్లను గుర్తించేందుకే తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్, దళిత బంధు లబ్ధిదారుడు మోదుగు రామకృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాళోత్ మంగీలాల్ నాయక్, నాయకులు గోపు రామకృష్ణ, పోతురాజు నాగరాజు, మెంతుల కృష్ణ పాల్గొన్నారు. రామయ్యను దర్శించుకున్న ప్రీతమ్.. భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో పూజల అనంతరం వేదాశీర్వచనం చేసి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. అనంతరం టూరిజం శాఖ హోటల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ్కు ఘన సన్మానంసుజాతనగర్: ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ను టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రీతమ్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమములో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పతి కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బొందయ్య, నాయకులు గద్దల రమేష్ పాల్గొన్నారు. -
జర్నలిస్టుల హక్కులపై ఉక్కుపాదం
చంద్రబాబు ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోంది. కక్షగట్టి సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసు నమోదు చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజం, జర్నలిస్టుల హక్కుల రక్షణకు పాలకులు పాటుపడాలి. అంతేతప్ప ప్రభుత్వం – ప్రజలకు వారధిగా ఉంటూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలను ఫాసిస్టు చర్యగా భావిస్తున్నాం. – ఆకుతోట ఆదినారాయణ, టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్), ఖమ్మం జిల్లా అధ్యక్షుడు -
మునగ, వెదురు సాగు లాభదాయకం
డీఆర్డీఓ విద్యాచందనములకలపల్లి: మునగ, వెదురు పంటల సాగు ఎంతో లాభదాయకమని డీఆర్డీఓ విద్యాచందన అన్నారు. మండల పరిధిలోని మూకమామిడి పంచాయతీలో సాగు చేస్తున్న మునగ తోటలను పరిశీలించారు. మహిళా రైతులతో మాట్లాడి, సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐకేపీ కార్యాలయంలో వెదురు సాగు చేస్తున్న మహిళా సమాఖ్య గ్రూపు సభ్యులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. డీపీఎం సమ్మక్క, ఇంచార్జ్ ఎంపీడీఓ రామారావు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు. వైకల్యం అధిగమించి ఉన్నతస్థాయికి ఎదగాలిజిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ కొత్తగూడెంటౌన్: వైకల్యం అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఎం. రాజేందర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం బాబుక్యాంప్లోని భవిత సెంటర్లో గురువారం ప్రపంచ బధిరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మూగ, చెవిటి పిల్లలకు కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముగ్గురు బధిర పిల్లలకు వినికిడి పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అంగవైకల్యం అడ్డురాదని, అలాంటి వారిని అందరూ ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వాలు దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డిస్ట్రిక్ వేల్పేర్ ఆఫీసర్ స్వర్ణలత లెనినా, ఎంఈఓ బాలాజీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రి సిబ్బంది పఫీన్ తదితరులు పాల్గొన్నారు. రైతు వేదికల్లోనూ యూరియా విక్రయాలుడీఏఓ బాబూరావు ఇల్లెందురూరల్: యూరియా సరఫరాలో సమస్యతో రైతులు పీఏసీఎస్ విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరకుండా ఇక నుంచి రైతు వేదికల్లోనూ యూరియా అందుబాటులో ఉంచుతామ ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు తెలిపారు. మండలంలోని సుదిమళ్ల, రేపల్లెవాడ రైతు వేదికల్లో యూరియా విక్రయాలను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇల్లెందులో ఇప్పటికే మూడు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏడీఏ లాల్చంద్, ఏవో సతీష్, రైతులు పాల్గొన్నారు. నేటి నుంచి సింగరేణి వ్యాప్తంగా క్రీడలుకొత్తగూడెంఅర్బన్: సింగరేణి వ్యాప్తంగా గురువారం నుంచి క్రీడా పోటీలు ప్రారంభంకానున్నాయి. 2025–26 సంవత్సరానికి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యూపీఎస్–జీఏ) ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లో క్రీడలు నిర్వహించనున్నారు. కార్పొరేట్ ఏరియాలో 12న ఫుట్బాల్ పోటీలతో క్రీడలు ప్రారంభమై, సెప్టెంబర్ 28న సాంస్కృతిక కార్యక్రమాలతో ముగియనున్నాయి. ఇందుకోసం ప్రకాశం స్టేడియం, సీఈఆర్, కేసీఓఏ క్లబ్ సిద్ధమవుతున్నాయి. ఇతర ఏరియాల్లో కూడా క్రీడా మైదానాలు, క్లబ్ భవనాలు వేదికలుగా నిలుస్తున్నాయి. క్రీడా పోటీల సమన్వయానికి అధ్యక్షుడిగా జి.వి.కిరణ్ కుమార్ (జిఎం, పర్సనల్ వెల్ఫేర్–సీఎస్ఆర్ )తోపాటు మరికొందరు బాధ్యులను నియమించారు. ఏరియా స్థాయి విజేతలను ప్రాంతీయస్థాయి, ఆపై సంస్థ స్థాయి పోటీలకు పంపనున్నారు. ఎస్పీని కలిసిన డీఎస్పీకొత్తగూడెంటౌన్: ఎస్పీ బి.రోహిత్రాజును జిల్లా సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేటర్ సెంటర్ డీఎస్పీ బి.అశోక్ మర్యాదపూర్వకంగా కలిశా రు. సీఐగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై గురువారం డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎస్పీని కలిసి పూల మొక్కను అందజేశారు. -
జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా..
ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసేలా కుట్ర జరుగుతోంది. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్కడి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. జర్నలిస్టులను ఏదోలా లోబర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో సాక్షిపై, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. ఆధారాలు లేకున్నా సాక్షి ఎడిటర్ ధనుంజయ్రెడ్డిపై అక్కడి ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరించడాన్ని మానుకోవాలి. – కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఈ ఏడాది భారీగా నష్టపోయాం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్ కారణంగా ఏడాది కాలంలో క్షేత్రస్థాయి నుంచి అగ్రనాయకుల వరకు మొత్తంగా 366 మంది విప్లవకారులు మృతి చెందినట్టు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ వెల్లడించింది. ఈనెల 21 నుంచి 27 వరకు సీపీఐ (మావోయిస్టు) 21వ వార్షికోత్సవాలను నిర్వహించుకోవాలంటూ పార్టీ శ్రేణులకు నాయకత్వం ఈ నెల 6న జారీ చేసిన లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 17 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 26 మంది జిల్లా కమిటీ సభ్యులు, 86 మంది ఏరియా కమిటీ /ప్లాటూన్ సభ్యులు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు 152 మంది, స్థానిక నిర్మాణాల సభ్యులు 38 మంది ఉన్నారని అందులో వెల్లడించారు. అలాగే మృతిచెందిన వారిలో వివరాలు తెలియని వారు మరో 43 మంది వరకు ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ స్థాయిలో సభ్యులను కోల్పోవడం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అయితే దీనిని అధిగమించి ముందుకు సాగాలని కేడర్కు ఆ పార్టీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది. అందువల్లే పార్టీకి నష్టాలు.. కేంద్ర కమిటీ రూపొందించిన ఎత్తుగడలను, గెరిల్లా యుద్ధ నియమాలను సరిగా అమలు చేయకపోవడం వల్లనే ఆపరేషన్ కగార్ కారణంగా ఎక్కువగా నష్టపోయినట్టు నాయకత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. కార్యక్షేత్రాన్ని చిన్న ప్రాంతాలకే పరిమితం చేయకుండా విశాల భూభాగాలకు మార్చాలని, కేంద్రీకృత పద్ధతిలో కాకుండా వికేంద్రీకృత పద్ధతిలో పని చేయాలని కేడర్కు సూచించింది. చట్టబద్ధ, చట్ట వ్యతిరేక, రహస్య – బహిరంగ పోరాటాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పేర్కొంది. పట్టణ, మైదాన, అటవీ ప్రాంతాలలో ప్రజలను విప్లవ ఉద్యమం వైపు సమీకరించాలని కోరింది. మానసిక యుద్ధం ఎదురు కాల్పుల్లో పోలీసుల వైపు కూడా భారీ నష్టాలు చోటు చేసుకుంటున్నాయని, కానీ వాటిని బయటకు వెల్లడించకుండా ప్రభుత్వం మానసిక యుద్ధం చేస్తోందని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. కర్రిగుట్టల దగ్గర చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో 45 – 50 మంది జవాన్లు మరణించారని, మరో 70 మంది గాయపడ్డారని పేర్కొంది. ఈ ఆపరేషన్ మొదలైన తర్వాత 16 రోజుల పాటు భద్రతా దళాలు అడుగు కూడా ముందుకు వేయలేకపోయాయని, చివరకు తమ నుంచి పారిపోయి సరెండెర్ అయిన మాజీ మావోయిస్టును పట్టుకుని, అతడి సాయంతోనే ఆపరేషన్లో భద్రతా దళాలు ముందుకుసాగాయని పేర్కొంది. ఇతర ఆపరేషన్లలోనూ ఇలాంటి పరిస్థితే భద్రతా దళాలకు ఎదురైందని, అందుకే ప్రతీ గెరిల్లా సభ్యుడికి 30 నుంచి 100 మంది వంతున భద్రతా దళాలను మోహరిస్తున్నారని తెలిపింది.శాంతి చర్చలకు సిద్ధంప్రజా ప్రయోజనాల రీత్యా శాంతి చర్చలకు సిద్ధమేనని మావోయిస్టు పార్టీ మరోసారి ప్రకటించింది. అయితే అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ను ఆపేయాలని, ఉద్యమ ప్రాంతాల్లో సాయుధ బలగాల క్యాంపులు ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఓటు చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించింది. -
రాముడి ఆదాయం రూ.1.52 కోట్లు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. ఆలయ ఈఓ దామోదర్ రావు ఆధ్వర్యంలో దేవస్థానంలోని హుండీలను తెరిచి చిత్రకూట మండపానికి తరలించారు. ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు లెక్కింపు చేపట్టారు. 72 రోజులకు రూ.కోటి 52 లక్షల 59 వేల 499ల నగదు, మిశ్రమ బంగారం 0.089 గ్రాములు, మిశ్రమ వెండి కేజీ వచ్చినట్లు ఈఓ తెలిపారు. యూఎస్ డాలర్లు 624, సౌత్రాఫికా ర్యాండ్స్ 450, ఆస్ట్రేలియా డాలర్లు 10, యూఏఈ దిరామ్స్ 10, కెనడా డాలర్లు 230, యూరప్ యూరోలు 30తోపాటు మరికొన్ని ఇతర దేశాల మాదక ద్రవ్యం వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం నగదును బ్యాంకర్లుకు అందజేవారు. లెక్కింపులో ఆలయ ఏఈవోలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమనీయం... కల్యాణంరామయ్య స్వామివారి నిత్యకల్యాణం బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భద్రాచలంలో 72 రోజుల హుండీ కానుకల లెక్కింపు -
గ్రామాల్లో మళ్లీ ‘రెవెన్యూ’
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో గ్రామ పాలనకు పునర్వైభవం సంతరించుకోనుంది. గ్రామ పరిపానాధికారుల(జీపీఓ)ల నియామకంతో గ్రామస్థాయిలో రెవెన్యూ పాలన పునరుజ్జీవం పోసుకోనుంది. క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖలో అవినీతి పెరిగిపోయిందని, దీని కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని 2020లో గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దుచేసింది. వీఆర్వో, వీఆర్ఏలను ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. దీంతో గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కనుమరుగైంది. ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. ఐదేళ్లుగా గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడ స్తంభించాయని భావించిన ప్రస్తుత ప్రభుత్వం తిరిగి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జీపీఓల నియామకానికి శ్రీకారం చుట్టింది. దీంతో మళ్లీ గ్రామస్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు అందనున్నాయి. గతంలో వీఆర్ఓ, వీఆర్ఎలుగా విధులు నిర్వహించిన వారికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్గా నిర్ణయించి, ఆసక్తి ఉన్న వారికి అర్హత పరీక్ష నిర్వహించారు. గతంలో జిల్లాలో 329 మంది వీఆర్ఏలు, 247 మంది వీఆర్ఓలు ఉండగా, వారిలో 176 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో 67 మంది వీఆర్ఏలు, 109 మంది వీఆర్ఓలు ఉన్నారు. గ్రామస్థాయిలో కీలకం జీపీఓలు గ్రామస్థాయిలో కీలకంగా మారనున్నారు. భూభారతి, రైతాంగ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు అండగా నిలవడం, ఓటర్ల జాబితాలో కీలకంగా వివిధ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ప్రాథమిక నివేదికలో విధులను నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితా తయారీలో కీలకంగా మారడంతో పాటు ఎన్నికల సమయంలో బీఎల్ఓలుగా వ్యవహరించనున్నారు.జిల్లాలోని 23 మండలాల్లో 376 రెవెన్యూ గ్రామాలను 204 క్లస్టర్లుగా నిర్ణయించారు. ఆసక్తి ఉండి పరీక్ష రాసిన 176 మందితో పాటు మరో 18 మందిని అడిషనల్ జీపీఓలుగా ఎంపిక చేశారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఇంకా 10 మందిని జీపీఓలుగా నియమించాల్సి ఉంది. గత సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా జీరో సర్వీసుగా నిర్ణయిస్తారని జరుగుతున్న ప్రచారం కారణంగా కూడా కొందరు జీపీఓలుగా రాకుండా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గతంలో నిర్వహించిన విధులను తిరిగి నిర్వహించే అదృష్టం రావడం సంతోషంగా ఉంది. ప్రజలకు అవసరమైన సేవలను అంకిత భావంతో అందిస్తాం. మాకు ఈఅవకాశం కల్పించిన ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు. – కాక శ్రీను, జీపీఓల అధ్యక్షుడు ప్రజలకు గ్రామస్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి తిరిగి అవకాశం రావడం పునర్జన్మగా భావిస్తున్నాను. తిరిగి మా విధులను మేము నిర్వహించుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, అధికారులకు రుణపడి ఉంటాం. శాయశక్తులా ప్రజలకు మా సేవలను పారదర్శకంగా అందిస్తాం. –పోడెం వరలక్ష్మి, జీపీఓల కోశాధికారి గ్రామరెవెన్యూ వ్యవస్థ బలోపేతమవుతోంది. ప్రజలు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాలకు వ్యయప్రయాసలతో వచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గ్రామస్థాయిలో జీపీఓల విధులను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. –డి.వేణుగోపాల్, అదనపు కలెక్టర్ -
మహిళా శక్తికి ప్రతీక.. ఐలమ్మ
సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్య సాహసంతో పోరాడిన చాకలి ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, శ్రామిక జన విముక్తి కోసం ఐలమ్మ చాటిన పోరాటపటిమ నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విజయలక్ష్మీ, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి శ్రీలత, బీసీ సంఘం నాయకులు అజిత్కుమార్, ముదిగొండ రాంబాబు, సర్వేష్, జంగంపల్లి రాజు, దురిశెట్టి కుమార్, విజయలక్ష్మి, కొదుమూరి సత్యనారాయణ, కాపర్తి వెంకటాచారి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 17 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు సూపర్బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: మహిళల ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యవంతంగా నిలుస్తుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం స్వాస్థ్ నారీ–స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో స్వాస్థ్ నారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల ఆరోగ్య కేంద్రాల్లో సమగ్ర ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు. మారిన జీవనశైలి కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారని, శిబిరాల్లో వ్యాధుల నిర్ధారణ జరిగితే తగిన చికిత్స, అవసరమైన మందులు అందించవచ్చని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ, శక్తిమంతమైన కుటుంబ నిర్మాణం, సమాజాభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డీసీహెచ్ఓ రవిబాబు, డీపీఓ చంద్రమౌళి, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా, మున్సిపల్ కమిషనర్లు సుజాత, శ్రీకాంత్ తదితరరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
పరిషత్ ఓటర్లు 6,69,048 మంది
చుంచుపల్లి: జిల్లాలో జిల్లా, మండల పరిషత్ ఓటర్ల లెక్క తేలింది. మొత్తం 6,69,048 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,25,045 మంది, మహిళలు 3,43,979 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు. ఈ మేరకు బుధవారం జెడ్పీ అధికారులు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 2న జిల్లాలోని 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా సిద్ధం చేశారు. ఆ ప్రకారమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్ల జాబితాపై అధికారులు కసరత్తు చేశారు. గత ఫిబ్రవరిలో ప్రచురించిన జాబితా కంటే ప్రస్తుత జాబితాలో 12,126 మంది ఓటర్లు తగ్గారు. జిల్లాలోని 233 ఎంపీటీసీ స్థానాలు, 22 జెడ్పీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1,271 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండగా, ఇప్పటికే ఆర్వోలు, ఏఆర్వోలకు తొలి విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు గతేడాది ఆగస్టు మొదటి వారంతో ముగియటంతో ప్రత్యేకాధికారులను నియమించారు. మండల ప్రజా పరిషత్ పాలనను జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు, జిల్లా పరిషత్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ను ప్రత్యేక అధికారులుగా పర్యవేక్షిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో పరిషత్ ఎన్నికలు కొంత ఆలస్యమవుతాయనే ప్రచారం జరుగుతోంది. దసరా తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.రెండు విడుతలుగా..జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు అధికారులు దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల పరిధిలోని ఓటర్ల జాబితాలను, పోలింగ్ కేంద్రాలపై కసరత్తు చేశారు. ఈ నెల 6న పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల ముసాయిదా జాబితాను మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. 6 నుంచి 8 వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరించారు. 8న మండల, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 9న అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం జెడ్పీ అధికారులు బుధవారం తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను వెల్లడించారు. త్వరలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికలను జిల్లాలో రెండు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 22 మండలాలకు తొలుత 12 మండలాలు, తర్వాత 10 మండలాలకు పోలింగ్ జరగనుంది.ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిజిల్లాలో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. 22 జెడ్పీటీసీలు, 233 ఎంపీటీసీలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. తుది ఓటర్ల జాబితాలతో పాటు పొలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచాం. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా పోలింగ్కు సిద్ధంగా ఉన్నాం.– బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓమండలాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా...మండలం; పురుషులు; మహిళలు; ఇతరులుఆళ్లపల్లి; 4,641; 4,673; 0అన్నపురెడ్డిపల్లి; 8,363; 8,569; 0అశ్వాపురం; 16,069; 17,278; 0అశ్వారావుపేట; 14,927; 15,770; 2భద్రాచలం; 19,624; 21,136; 1బూర్గంపాడు; 24,676; 25,673; 2చండ్రుగొండ; 11,640; 12,214; 1చర్ల; 15,686; 16,963; 4చుంచుపల్లి; 18,743; 19,814; 5దమ్మపేట; 21,288; 23,255; 0దుమ్ముగూడెం; 17,370; 19,389; 3గుండాల; 6,629; 6,701; 0జూలూరుపాడు; 13,681; 14,303; 1కరకగూడెం; 6,393; 6,476; 0లక్ష్మీదేవిపల్లి; 15,845; 16,725; 1మణుగూరు; 17,924; 18,556; 0ములకలపల్లి; 13,887; 14,493; 0పాల్వంచ; 13,972; 14,947; 2పినపాక; 13,227; 14,122; 1సుజాతనగర్; 7,109; 7,311; 1టేకులపల్లి; 20,677; 21,391; 0ఇల్లెందు; 22,674; 24,220; 0 -
వేధిస్తున్న సిబ్బంది కొరత
● పశువైద్య శాఖలో 69 పోస్టులు ఖాళీ ● మూగజీవాలకు సక్రమంగా అందని వైద్యం ● ఏడాది కాలంగా భర్తీ చేయని ఉన్నతాధికారులు పాల్వంచరూరల్: పశుసంవర్థక శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పశువులకు సక్రమంగా వైద్యసేవలు అందడంలేదు. జిల్లాలో 2018–2019 లెక్కల ప్రకారం పశుసంపద 4.55 లక్షలు ఉన్నాయి. ఇందులో తెల్లపశువులు 2.80 లక్షలు, నల్లపశువులు (గేదెలు) 1.70లక్షలు, మేకలు 2.50 లక్షలు, గొర్రెలు 2.60 లక్షలు, నాటుకోళ్లు 1.38 లక్షలు, పందులు 3,180, కుక్కలు 30వేలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 80 పశువైద్యశాలలు ఉండగా, వీటిలో ఆరు ప్రాంతీయ పశువైద్యశాలలు, 30 ప్రాథమిక పశువైద్యశాలలు, 44 పశువైద్యశాలల ఉపకేంద్రాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా అధికారులు, సిబ్బంది కలిపి 219 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 150 మంది మాత్రమే ఉన్నారు. మరో 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాల్వంచ పట్టణంలోని ఏరియా పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. ఇన్చార్జితో నెట్టుకొస్తున్నారు. పశువైద్యంపై ప్రభావం వెటర్నరీ శాఖలో ఖాళీ పోస్టులు ఏడాది నుంచి భర్తీ చేయడంలేదు. సిబ్బంది కొరతతో జిల్లాలోని పశు సంపదపై ప్రభావం పడుతోంది. పశువులు, గేదెలు అనారోగ్యం బారిన పడి సకాలంలో వైద్యసేవలు అందక మృత్యువాత పడుతున్నాయి. ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పశుసంవర్థక శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రైతులు కోరుతున్నారు.హోదా మొత్తం ప్రస్తుతం ఖాళీలు పోస్టులు ఉన్నది డిప్యూటీ డైరెక్టర్ 1 1 0 అసిస్టెంట్ డైరెక్టర్లు 8 6 2 వెటర్నరీ అసిస్టెంట్లు 30 28 2 ఆఫీస్ సూపరింటెండెంట్లు 2 2 0 సీనియర్ అసిస్టెంట్లు 6 4 2 జూనియర్ అసిస్టెంట్లు 10 10 0 టైపిస్ట్ 1 1 0 లైవ్స్టాక్ ఆఫీసర్లు 10 5 5 జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లు 18 14 4 లైవ్ స్టాక్ అసిస్టెంట్లు 24 24 0 వెటర్నరీ అసిస్టెట్లు 23 11 12 ఎన్యూమరేటర్ 1 1 0 వెటర్నరీ వ్యాక్సినేటర్లు 14 3 11 డ్రైవర్లు 2 1 1 ఆఫీసు అటెండర్లు 69 39 30 219 150 69 -
వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
చుంచుపల్లి: వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రాంతీయ ఆస్పత్రులు మణుగూరు, ఇల్లెందు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు పాల్వంచ, చర్లలో మత్తు డాక్టర్లు, గైనకాలజీ, రేడియాలజీ, జనరల్సర్జన్, పిల్లల వైద్య నిపుణుల పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయనున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఏడు పోస్టులు ఉన్నాయని, అభ్యర్థులు ఈ నెల 20లోపు కలెక్టరేట్లోని సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. వివరాలకు 93472 77353 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. 2,680 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు పంపిణీ ఖమ్మంవ్యవసాయం: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే రేక్ పాయింట్కు బుధవారం ఐపీఎల్ కంపెనీకి చెందిన 2,680 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ ఎరువును ఖమ్మం జిల్లాకు 1,380, భద్రాద్రి జిల్లాకు 800, మహబూబాబాద్ జిల్లాకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున పంపిణీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వ్యవసాయ శాఖ ద్వారా కూపన్లు జారీ చేసి యూరియా పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేయగా.. పోలీసు పహారాలో అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలికొత్తగూడెంటౌన్: ఈ నెల నెల 13న జిల్లా కోర్టులో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ సూచించారు. బుధవారం జిల్లా కోర్టులోని లైబ్రరీహాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో అందరూ సమన్వయంతో పని చేయాలని చెప్పారు. జిల్లాను ఉన్నత స్థానంలో తీసుకొచ్చేందుకు పోలీసు అధికారులు కృషి చేయాలని తెలిపారు. మునగ సాగుతో ఆదాయంజిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు టేకులపల్లి: మునగ సాగుతో అనేక లాభాలు ఉన్నాయని, రైతులు మునగ సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన టేకులపల్లిలో మునగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య విలువలు, పోషకాలు, ఔషధ గుణాలు ఉండటం వల్ల మునగకు మార్కెట్లో ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఆ తర్వాత శంభునిగూడెంలో డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీని పరిశీలించారు. డ్రోన్ ద్వారా ఎకరానికి రూ. 300తో నానో యూరియా, పురుగుల మందు పిచికారీ చేయవచ్చని, తద్వారా కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చని చెప్పారు. డీపీడీ సరిత, ఏఓ నీరుడు అన్నపూర్ణ, ఏఈవోలు శ్రావణి, రమేష్ రైతులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్ట్పై నిర్లక్ష్యం తగదు
మణుగూరు రూరల్: కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించిందని, ఆ ప్రాజెక్ట్పై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం కూలిపోతుందంటూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిషన్ కావాలనే తప్పుడు నివేదికలను ప్రకటించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి పెట్టుబడిగా పెడితే, 20 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2.50లక్షల కోట్లకు పైగా అప్పు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కావాలనే కుట్రలు పన్నుతున్నాయని, రానున్న రోజుల్లో ప్రజలే ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అసత్య ఆరోపణలు మానుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, పోశం నర్సింహరావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, వట్టం రాంబాబు,నూకారపు రమేష్, వేర్పుల సురేష్, అక్కి నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు -
కోలాహలంగా ‘కేటీపీఎస్’ ఎన్నికలు
పాల్వంచ/మణుగూరురూరల్: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ (పాల్వంచ) ఎన్నికలు బుధవారం కోలాహంగా జరిగాయి. కేటీపీఎస్ కాలనీలోని డీఏవీ పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో 2,100 మంది సభ్యులకు 1,728 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మణుగూరులోని బీటీపీఎస్ ఎస్పీఎఫ్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన పోలింగ్ కేంద్రంలో 500 మంది ఉద్యోగస్తులకు గాను 450మంది ఓటు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వైటీపీఎస్లో 396 మంది ఓటర్లకుగాను 367 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్ల ను ఆకర్షించేలా ఫ్లకార్డులు, కరపత్రాలు, గుర్తులను సూచిస్తూ అభ్యర్థులు సందడి చేశారు. పోటీలో ఉన్న 37 మంది డైరెక్టర్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రా ల వద్ద ఉద్యోగులను కలుస్తూ తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. సొసైటీలో మొత్తం 2,996 మంది ఓటర్లు ఉండగా, 2,545మంది ఓటు హక్కు విని యోగించుకున్నారు. మొత్తం84.94శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలీస్, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. 84.94 శాతం పోలింగ్ -
యూరియా పక్కదోవ పట్టిందని ఆందోళన
పాల్వంచ: కో ఆపరేటివ్ సొసైటీ సిబ్బంది యూరి యా బస్తాలను పక్కదోవ పట్టించారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం సొసైటీ కార్యాలయం నుంచి నుంచి 15 బస్తాల యూరి యాను ఆటోలో ఎక్కించి మహబుబాబాద్కు పంపించే ప్రయత్నం చేస్తుండగా స్థానిక రైతులకు అనుమానం వచ్చి ఆందోళన చేపట్టారు. యూరియా కోసం వచ్చిన వ్యక్తి స్థానికుడు కాదంటూ వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ బీసీఎం రహదారిపై నిరసన తెలిపారు. దీంతో సీఐ సతీష్కుమార్, ఎస్ఐ సుమన్లు అక్కడికి చేరుకుని ఆటోను స్టేషన్కు తరలించారు. రైతులను శాంతింపజేశారు. ఆత్మకమిటీ టెక్నికల్ అసిస్టెంటే సూత్రధారి? యూరియా బస్తాల అక్రమ తరలింపునకు ఆత్మకమిటీ టెక్నికల్ అసిస్టెంట్ సూత్రధారి అని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బుధవారం అతని తండ్రి ఓ ఆటోను పాల్వంచ సొసైటీకి పంపించగా, బిల్లులు లేకుండా 15 యూరియా బస్తాలో ఆటోలో ఎక్కించాడు. రైతులు గమనించి ఆందోళన చేపట్టడంతో పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అప్పటికప్పుడు సదరు వ్యక్తి కార్యాలయం నుంచి బయటకు వెళ్లి దొంగ బిల్లులు సృష్టించి తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. సిబ్బంది సహకారంతో టెక్నికల్ అసిస్టెంట్ అక్రమంగా యూరియా తరలించినట్లు తెలిసింది. ఈ విషయమై సీనియర్ అసిస్టెంట్ లక్ష్మిని వివరణ కోరగా.. యూరియా బస్తాలను స్లిప్ల ప్రకారం ఇచ్చామని, అవి ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయం తమకు సంబంధం లేదన్నారు. ఎస్ఐ సుమన్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. -
కొనసాగుతున్న టిమ్ డ్రైవర్ల నిరసన
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ డిపోలో టిమ్ డ్రైవర్లు చేపట్టిన నిరసన మూడో రోజు బుధవారం కూడా కొనసాగింది. 42 మంది టిమ్ డ్రైవర్లు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొంటున్నారు. దీంతో అధికారులు 10 సర్వీసులను తగ్గించారు. ఫలితంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు యూనియన్ల నాయకులు జేఏసీగా ఏర్పడి, టిమ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డీఎం తిరుపతిని కోరారు. లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని చెప్పారు. భద్రాచలానికి డిపోనకు చెందిన టిమ్ డ్రైవర్ నాగరాజు పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తోటి డ్రైవర్లు తెలిపారు. కాగా భద్రాచలం డిపోలో సేప్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ (ఎస్డీఐ)గా విధులు నిర్వహిస్తున్న పోకల సురేష్ తన పోస్టుకు మంగళవారం రాత్రి రాజీనామా చేశారు. -
పాఠశాలలకు ప్రోత్సాహకాలు
● జాతీయిస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ. లక్ష నగదు ● స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్తో సర్కారు స్కూళ్ల ఎంపికలు ● 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారుల వెల్లడి కొత్తగూడెంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, అభివృద్ధి, విద్యార్థుల నైపుణ్యం, హరిత వాతావరణం ప్రమాణికాలుగా రేటింగ్, నగదు ప్రోత్సాహకం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా 200 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో స్కూల్కు రూ.లక్ష నగదును ప్రోత్సాహకంగా అందించనున్నారు. సంబంధిత ఉపాధ్యాయులను మూడు రోజులపాటు దేశవ్యాప్త విహార కేంద్రాల సందర్శనకు తీసుకెళ్లనున్నారు. ఇవీ అర్హతలు.. గతంలో స్వచ్ఛ పురస్కారాలు అందజేసే వారు. ప్రస్తుతం రేటింగ్ పేరుతో పురస్కారాలు అందించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సమాజంలో శుభ్రతపై అవగాహన పెంచడం, పాఠశాల ప్రాంగణాన్ని పచ్చదనం వైపు మలచడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వ్యర్థాలను వర్గీకరించడం, నీటి వినియోగంలో మితవ్యయం పాటించడం, వర్షపునీటి సేకరణకు ఏర్పాట్లు, విద్యార్థుల్లో పర్యావరణ స్నేహపూర్వక అలవాట్లను పెంపొందించడం, స్వచ్ఛ విద్యాలయం, మరుగుదొడ్ల శుభ్రత, తాగునీటి సదుపాయం, తరగతి గదుల శుభ్రత, దినసరి పరిశుభ్రత కార్యక్రమాలు, పాఠశాలల్లో మొక్కల పెంపకం, విద్యుత్ పొదుపు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న పాఠశాలలను పరిశీలించి రేటింగ్ ఇవ్వనున్నారు. అర్హతలున్న పాఠశాలలు ఈ నెల 30 లోగా దరఖాస్తులను అందజేయాలి. జిల్లాలో అర్హతలు కలిగిన పాఠశాలలు ఎక్కువగానే ఉన్నాయని, ఆయా పాఠశాలలన్నీ దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. కేటగిరీలు ఇలా... జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, సబ్బుతో చేతులు కడగడం, వినియోగం, నిర్వహణ, ప్రవర్తన మార్పు, సామర్థ్య నిర్మాణం, జీవన శైలిలో మార్పులు, పాఠశాలల్లోని నిర్మాణాలు, మరుగుదొడ్లు, నీటి వసతి, హరితావరణం, వ్యర్థాల నిర్వహణ, ఆరోగ్యకర వాతావరణం వంటి కేటగిరీలలో రేటింగ్ ఇవ్వనున్నారు. జిల్లాలో మొత్తం 1,685 పాఠశాలలు ఉన్నాయి. డీఈఓ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు 1,081, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 310, సోషల్ వెల్ఫేర్ 09, మైనారిటీ వెల్ఫేర్ 07, బీసీ వెల్ఫేర్ 11, ఎయిడెడ్ 30, ప్రైవేట్ (అన్ ఎయిడెడ్) 223, జూనియర్ కళాశాలలు 14 ఉన్నాయి. ఇవన్నీ రేటింగ్ పరిధిలోకి రానున్నాయి. 0–50 మార్కులు: ఒక నక్షత్రం 51–74 మార్కులు: రెండు నక్షత్రాలు 75–80 మార్కులు: మూడు నక్షత్రాలు 81–89 మార్కులు: నాలుగు నక్షత్రాలు 90–100 మార్కులు: ఐదు నక్షత్రాలు జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి ఆన్లైన్లోనే స్వీయ నివేదికలు సమర్పించాలి. రేటింగ్లో మెరుగైన పాఠశాలలకు జాతీయ స్థాయిలో ఎంపిక చేస్తారు. రూ. లక్ష ప్రోత్సాహక బహుమతి అందిస్తారు. రేటింగ్ ప్రక్రియలో పాల్గొనే పాఠశాలల ఆవరణ అందంగా పచ్చదనం, పరిశుభ్రతతో ఉండేలా చర్యలు తీసుకోవాలి. –బి. నాగలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి గతంలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ పేరుతో ఈ అవార్డులను ఇచ్చేవారు. ఈ సంవత్సరం నుంచి స్వచ్ఛ, హరిత విద్యాలయ రేటింగ్ పేరుతో అమలు చేస్తున్నారు. అవార్డుల వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో పాఠశాల పట్ల బాధ్యత పెరుగుతుంది. సమాజంలో స్వచ్చ భారత్ –హరిత భారత్ లక్ష్యాల సాధనకు తోడ్పడుతుంది. –ఎస్కే సైదులు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి -
విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలి
మణుగూరు టౌన్/అశ్వాపురం: విద్యార్థినులకు చదువుతోపాటు పౌష్టికాహారం అందించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. బుధవారం మణుగూరు మండలంలోని గుట్ట మల్లారంలో గిరిజన సంక్షేమ గురుకుల బాలి కల, జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. వంటగది, సామగ్రి, స్టోర్ రూంలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి మెనూ అమలుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. విషకీటకాలు సంచరించే అవకాశం ఉన్నందున రాత్రివేళ బయటకు రావొద్దని విద్యార్థులకు చెప్పారు. జీసీసీ కార్యాలయం నుంచి బియ్యం సరఫరాలో జాప్యం జరుగుతోందని ఉపాధ్యాయులు తెలుపగా, వెంటనే అధికారులతో మాట్లాడారు. కొందరు విద్యార్థులు వైరల్ ఫీవర్తో బాధపడుతుండగా పీహెచ్సీ వైద్యులతో మాట్లాడి చికిత్స అందించారు. అశ్వాపురం రైతువేదికలో నిర్వహించిన ఆది కర్మయోగి అభియాన్ పథకంలో భాగంగా నిర్వహించిన గ్రామస్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలు గిరిజనులకు అందేలా మండల లెవల్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మామిళ్లవాయి, తుమ్మలచెరువు, పాములపల్లి, గొందిగూడెం గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి పథకాల గురించి వివరించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు అంశాలపై తహసీల్దార్తో చర్చించారు. ఆ తర్వాత తహసీల్దార్ డేవిడ్రాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మణిధర్, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, ఎంపీఓ ముత్యాలరావు, తదితరులు పాల్గొన్నారు. -
రికార్డుల తనిఖీ
మణుగూరు రూరల్: మండల పరిషత్ కార్యాల య ప్రాంగణంలోని మెప్మా కార్యాలయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎం.విద్యాచందన బుధవారం సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. మెప్మా ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై ఆరా తీశారు. అనంతరం తోగ్గూడెంలోని సర్క్యూలేటరీ ఆక్వా సిస్టం, కొర్రమీను చేపల పెంపకం కేంద్రం, కూనవరంలో మునగ తోటను సందర్శించారు. మునగ సాగు వల్ల రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలి పారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధిలోని ఐకేపీ సంఘాల గోదాంను, ఎస్హెచ్జీ మహిళా సంఘాల సభ్యులకు దసరా కానుకగా అందించే చీరల పంపిణీ వ్యవస్థను పరిశీలించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఐకేపీ, ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాల అమలుపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, ము న్సిపల్ కమిషనర్ ప్రసాద్, ఎంపీఓ పి వెంకటేశ్వరరావు, అహ్మదుల్లా పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలిపాల్వంచ: విద్యుత్ అంతరాయాలను తగ్గించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వినియోగ దారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ రావు సూచించారు. బుధవారం జెన్కో ట్రైనింగ్ సెంటర్లో విద్యుత్ సరఫరా–అంతరాయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ అంతరాయాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, విద్యుత్ నియంత్రికల నిర్వహణ, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు, ప్రమాదాల నివారణపై తీసుకుంటున్న కార్యక్రమాలు, వినియోగదారులకు, రైతులకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది రక్షణ పరికరాలు ఉపయోగించాలని సూచించారు. ఎల్సీ యాప్ను పూర్తి స్థాయిలో వినియోగించుకుని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్, జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ మహేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. హత్యాయత్నం కేసు నమోదుదమ్మపేట: భార్య మీద హత్యాయత్నం చేసిన భర్తపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఏపీలోని ఏలూరు జిల్లా టీ.నర్సాపురం మండలం సోములపాలేనికి చెందిన మునీశ్వరికి మండలంలోని తాటిమల్లప్పగుంపునకు చెందిన వాడే బుజ్జిబాబుతో వివాహం జరిగింది. భర్త ప్రవర్తన సరిగాలేదని మునీశ్వరి గతంలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆమె భర్త నుంచి వేరుగా పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో భార్యపై పగ పెంచుకున్న బుజ్జిబాబు బుధవారం మండలంలోని గండుగులపల్లి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ ఎదుట పిల్లల కోసం వేచి చూస్తున్న భార్య మునీశ్వరిపై కొడవలితో దాడి చేశారు. దీంతో మెడపై, కుడి చేతికి గాయాలై రక్తస్రావం జరిగింది. చికిత్స నిమిత్తం ఆమెను ఏపీలోని జంగారెడ్డిగూడెం తరలించారు. బాధితురాలి సోదరి పోడియం సుంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. ఇంకుడుగుంతలో పడి చిన్నారి మృతిసత్తుపల్లిరూరల్: ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతలో పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘసటన సత్తుపల్లి మండలం సత్యంపేటలో చోటుచేసుకుంది. మండలంలోని రుద్రాక్షపల్లి పంచాయతీ సత్యంపేట గ్రామంలో సోయం శివ, సంధ్యారాణి దంపతుల సంవత్సరం వయసు గల కుమార్తె మోక్షదుర్గ.. మంగళవారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ మూతలేని ఇంకుడుగుంతలో పడింది. కుటుంబ సభ్యులు గమనించకపోవడతో కొద్ది సేపటికి చిన్నారి మృతి చెందింది. ఆ తర్వాత చిన్నారి కోసం వెదుకుతుండగా ఇంకుడుగుంతలో మృతదేహం కనిపించింది. కాగా, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్విజయ్కుమార్ బుధవారం సత్యంపేటకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి చిన్నారి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పిడుగుపాటుతో ముగ్గురు కూలీలకు అస్వస్థత
టేకులపల్లి: వరి చేనులో పని చేస్తున్న ముగ్గురు వ్యవసాయ కూలీలు బుధవారం పిడుగు పాటుతో అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని ప్రెగళ్లపాడు పంచాయతీ తూర్పుగూడెం గ్రామానికి చెందిన ఈసం రాజమ్మ, కొడెం పాపమ్మ, గొగ్గెల శిరీష గ్రామం సమీపంలోని స్టేషన్బేతంపూడి గ్రామంలో వరి పొలంలో కలుపు తీసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం భారీ వర్షంతోపాటు వరి పొలంలో పిడుగు పడటంతో కూలీలు స్పృహ కోల్పోయి అస్వస్థతకు గురయ్యారు. వారిని రైతులు సమీపంలోని పీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. పిడుగుపాటుకు కూలిన పోర్టికోసుజాతనగర్: మండలంలో బుధవారం సుమారు 3 గంటలపాటు భారీవర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాఘవాపురంలో తెల్లబోయిన పెద్ద శ్రీను ఇంటి పొర్టికో పిడుగుపాటుతో కూలిపోయింది. ఆర్ఐ కాంతారావు పరిశీలించి సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వర్షం ప్రభావంతో మండల కేంద్రం చెరువును తలపించింది. దొంగలకు దేహశుద్ధిపాల్వంచరూరల్: కిన్నెరసాని వాగు ఒడ్డున, పంట పొలాల వద్ద ఉన్న వ్యవసాయ విద్యుత్ మోటార్లను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. మండలంలోని నాగారం గ్రామ శివారులో వ్యవసాయ విద్యుత్ మోటార్లతోపాటు ద్వి చక్రవాహనాల ఇంజన్లను చోరీ చేస్తుండగా మంగళవా రం రాత్రి స్థానికులు ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు పారిపోయాడు. నిందితులు బూర్గంపాడు పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు తేలడంతో వారిని బూర్గంపాడు పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఐ సురేష్ బుధవారం తెలిపారు. సైబర్ కేసు నమోదుదమ్మపేట: దమ్మపేట పోలీసు బుధవారం సైబర్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని లచ్చాపురం గ్రామానికి చెందిన కంపాటి చిలకమ్మ(32) సెల్ఫోన్కు కొద్దినెలల క్రితం తక్కువ పెట్టుబడితో అధికంగా లాభాలు అర్జించవచ్చంటూ ఓ మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె పలు దఫాలుగా రూ.2,80,000 ఓ యాప్లో పెట్టుబడిగా పెట్టింది. లాభాలు రాకపోవడంతో గత నెల 16న ఎన్సీఆర్పీ పోర్టల్లో ఆన్లైన్లో ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు మోసగాళ్ల బ్యాంకు ఖాతాలో రూ.80,264ను స్తంభింపజేశారు. బాధితురాలు బుధవారం స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కరకగూడెం: మండలంలోని చిరుమల్ల రాయనిపేట గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, బుధవారం గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు పొలకమ్మతోగు గ్రామానికి చెందిన ఊకే ప్రసాద్ (35)గా గుర్తించారు. గతంలో తల్లిదండ్రులు మృతి చెందగా, భార్య కూడా వదిలివెళ్లిందని బంధువులు తెలిపారు. కుటుంబ సమస్యలు, ఒంటరితనం, మద్యం అలవాటు కారణంగా తీవ్ర మనస్తాపం ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై పీవీఎన్రావు కేసు నమోదు చేశారు. ఎల్సిరెడ్డిపల్లిలో వ్యక్తి..పినపాక: మండల పరిధిలోని ఎల్సిరెడ్డిపల్లి పంచాయతీ డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయంలో నివాసముంటున్న చెంచు వీరబాబు (40) పవర్ ప్లాంట్లో ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధసాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు పిల్లలు కాగా భార్య ఎనిమిది సంవత్సరాల క్రితమే మృతి చెందింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్ఐ సురేష్ తెలిపారు. పాల్వంచలో ఆర్టిజన్ కార్మికుడు..పాల్వంచ: ఆర్టిజన్ కార్మికుడి ఆత్మహత్యపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాత పాల్వంచ గడియ కట్టకు చెందిన కేటీపీఎస్ గ్రేడ్–4 ఆర్టిజన్ రెండేళ్లుగా గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో గత మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా పాత పాల్వంచ డౌన్లో బీసీఎం రోడ్ పక్కన పురుగుల మందు తాగి పడిపోయి ఉన్నాడు. ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మృతుడి భార్య శివలక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేశారు. -
కొత్త దళపతి.. తిరుపతి
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కోరుట్ల: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీని ఆ పార్టీ ఎన్నుకున్నట్టు తెలిసింది. పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతాదళాలతో జరిగిన కాల్పుల్లో మే 21వ తేదీన మరణించారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. మే 21 తర్వాత పొలిట్బ్యూరో, కేంద్ర మిలటరీ కమిషన్ సంయుక్త సమావేశం జరగకపోవడంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎవరినీ ఎన్నుకోలేదు. తీవ్ర నిర్బంధం ఉన్నా, ఇటీవల జరిగిన సమావేశంలో తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తిరుపతి కేంద్ర మిలటరీ కమిషన్ చీఫ్గా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. తిరుపతి ఎన్నికతో రెండోసారి కరీంనగర్ జిల్లాకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు లభించినట్టు అయ్యింది. పీపుల్స్వార్ నుంచి కొండపల్లి సీతారామయ్యను తప్పించిన తర్వాత కరీంనగర్ జిల్లా బీర్పూర్కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.వృద్ధాప్యం పైబడడంతో ఆయన ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళికి చెందిన నంబాళ్ల కేశవరావు మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్గా వ్యవహరించారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తిప్పరి తిరుపతికి ముప్పాళ్ల లక్ష్మణ్రావుకు ప్రియశిష్యునిగా పార్టీలో పేరుంది. మిలటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న ముఖ్య నేతల్లో ఒకరైన దేవుజీకి ఈ బాధ్యతలు అప్పగించడమే సముచితంగా ఉంటుందని పార్టీ భావించినట్టుగా సమాచారం. దండకారణ్యంలో పార్టీ కార్యకలాపాల నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, రెడ్ కారిడార్ ఏరియాలో చాలా భూభాగాన్ని బలగాలు కైవసం చేసుకున్నాయి.పార్టీ ప్రధాన నాయకులే లక్ష్యంగా బలగాలు ఆపరేషన్లు చేపడుతున్న క్రమంలో ఎదురు దాడులు చేయాల్సిన ఆవశ్యకతను కూడా కేంద్ర కమిటీ నాయకులు గమనించినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే అటు మిలటరీ ఆపరేషన్లు, ఇటు రాజకీయ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్న దేవుజీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. కాగా, మడావి హిడ్మాకు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జ్తోపాటు ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ బాధ్యతలు అప్పగించారు. కమలేశ్ విచారణలో విజయవాడలోని పోరంకికి చెందిన నాగరాజు అలియాస్ కమలేశ్ ఆలియాస్ రామకృష్ణ మావోయిస్టు పార్టీలో 34 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ ఏడాది జూలై 26న ఏపీ పోలీసుల ముందు లొంగిపోయాడు. వారి విచారణలో మావోయిస్టు కొత్త సారథిగా తిరుపతిని ఎన్నుకున్నట్టు కమలేశ్ వెల్లడించాడని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంజినీర్ కావాలనుకొని.. కోరుట్లలోని అంబేడ్కర్నగర్కు చెందిన తిప్పరి వెంకటనర్సయ్య–గంగుబాయి దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో పెద్ద కుమారుడైన తిరుపతి చిన్నప్పటి నుంచి చదువులో రాణించేవాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆయన.. 1980లో పదో తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఇంజినీర్ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో చేరాడు. అప్పటికే కాలేజీలో ఏబీవీపీ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాల మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. ఈ ప్రభావానికి గురైన తిరుపతితోపాటు పలువురు విద్యార్థులపై పోలీసుల నిర్బంధం సాగింది. అయినా, ఇంటర్ పూర్తి చేసి 1982లో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడా విద్యార్థి సంఘాల మధ్య జరిగిన గొడవల్లో తిరుపతిపై కేసులు నమోదయ్యాయి. దీంతో డిగ్రీ పూర్తి కాకముందే మల్లోజుల కోటేశ్వర్రావు ముఖ్య అనుచరుడు మెట్పల్లి మండలంలోని కొండ్రికర్లకు చెందిన సాయిని ప్రభాకర్ ఆధ్వర్యంలో తిరుపతితోపాటు మరికొందరు అడవి బాట పట్టినట్టు సమాచారం.1984లో బస్తర్కు వెళ్లి అక్కడే అంచెలంచెలుగా ఎదిగారు. బస్తర్ బాధ్యతలు హిడ్మాకు కేంద్ర కమిటీలో స్థానం సంపాదించిన తొలి ఛత్తీస్గఢ్ మావోయిస్టుగా పేరున్న మడ్వి హిడ్మాకు మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ ఇన్చార్జ్తోపాటు ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ బాధ్యతలు అప్పగించారు. గెరిల్లా దాడులు చేయడంలో దిట్టగా పేరున్న హిడ్మాకు బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాల దూకుడుకు బ్రేకులు వేసేపని అప్పగించినట్టు తెలుస్తోంది. తెలంగాణతో సరిహద్దులు పంచుకునే సుక్మా, బీజాపూర్ జిల్లాలతో కూడిన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైంది. ఒకప్పుడు ఐదువేల మందికి పైగా సాయుధ మావోయిస్టులు ఈ కమిటీలో ఉండేవారు. ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో అత్యధిక సాయుధులు ఈ కమిటీలోనే ఉన్నారు. దీంతో రాబోయే రోజుల్లో దండకారణ్యం దద్దరిల్లే అవకాశం కనిపిస్తోంది. దండకారణ్యం బాధ్యతలు ఇప్పటివరకు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ చూస్తుండగా, ఇక్కడే ఉన్న జనతన సర్కార్ బాధ్యతలు మరో కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత అలియాస్ మైనా నిర్వర్తిస్తున్నారు. కొత్తగా హిడ్మా ఈ పోస్టులోకి రావడంతో ఆ ఇద్దరికి ఏ విధులు అప్పగిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. మిలిటరీ బాధ్యతల్లో మిసిర్ బెహ్రా: కేంద్ర కమిటీలో ముగ్గురు పొలిట్బ్యూరో సభ్యులు ఉన్నారు. వీరిలో తిప్పిరి తిరుపతి జనరల్ సెక్రటరీగా ఎన్నికవడంతో సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు జార్ఖండ్కు చెందిన మిసిర్ బెహ్రాకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనుదాదా అలియాస్ అభయ్ ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాలు చూస్తున్నారు. -
నేడు కేటీపీఎస్ క్రెడిట్ సొసైటీ ఎన్నికలు
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ(పాల్వంచ) ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈ మేరకు కేటీపీఎస్తో పాటు బీటీపీఎస్, వైటీపీఎస్ల్లో ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి జి.గంగాధర్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 13 డైరెక్టర్ పోస్టులకు గాను 37 మంది బరిలో నిలవగా 3,003 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పాల్వంచ కేటీపీఎస్ కాలనీలోని డీఏవీ పాఠశాలలో ఏడు, మణుగూరు బీటీపీఎస్లో ఎస్పీఎఫ్ భవనంలో రెండు, నల్లగొండ జిల్లా దామరచర్ల వైటీపీఎస్లోని స్పోర్ట్స్ ఆఫీస్లో రెండు బూత్లు ఏర్పాటుచేశారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్స్లను పాల్వంచకు తీసుకొచ్చి ఓట్లు లెక్కించాక ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, సాధారణ ఎన్నికల మాదిరిగానే డైరెక్టర్ పోస్టులకు బరిలో నిలిచిన వారు ఉద్యోగులకు నగదు పంపిణీ చేయడమే కాక విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
నిర్లక్ష్యానికి మూడు ప్రాణాలు బలి
● ఓ రైతు సహా ఇద్దరు కూలీలు దుర్మరణం ● మిషన్ భగీరథ ట్యాంకులో ఊపిరాడక ప్రమాదం చర్ల: నిర్మాణ సమయాన ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. వివరాలిలా.. చర్ల మండలం ఉంజుపల్లిలో రూ.29 లక్షల వ్యయంతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మిస్తుండగా అధికారులు ఈ పనిని సోనీ కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించారు. కాగా, మంగళవారం స్లాబ్ పనులు చేస్తున్న క్రమంలో ట్యాంక్లోని నీటిని బయటకు తోడేందుకు డీజిల్ మోటార్ ఏర్పాటు చేశారు. మోటార్లో డీజిల్, ట్యాంక్లో ఏర్పాటుచేసిన సెంట్రింగ్ కర్రలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పరిశీలించేందుకు మొదట లింగాపురంపాడు గ్రామానికి చెందిన నీలం తులసీరాం(38) ట్యాంక్లోకి దిగాడు. ఆయన ఎంతసేపటికీ రాకపోవడంతో ఏపీలోని తణుకు ప్రాంతానికి చెందిన తాటిగడప ఇస్సాకు(43), కాకినాడకు చెందిన అసునూరి అప్పలరాజు(55) ట్యాంకులోకి దిగారు. చాలాసేపటి దాకా వీరు ముగ్గురూ బయటకు రాకపోవడంతో అక్కడున్న కూలీలు పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోని పత్తి చేనులో పని చేస్తున్న ఉంజుపల్లికి చెందిన కాకా మహేష్(38) కూడా ట్యాంక్లోకి దిగాడు. వీరు నలుగురూ అందులో ఊపిరాడక స్పృహ తప్పి పడిపోవడంతో కూలీలు అతికష్టం మీద బయటకు తీసి హుటాహుటిన చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే కాక మహేష్, నీలం తులసీరాం మృతిచెందారు. అపస్మారక స్థితిలో ఉన్న అసునూరి అప్పలరాజు, తాటిగడప ఇస్సాకును వేర్వేరు అంబులెన్సుల్లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇస్సాకు మరణించాడు. గాలి, వెలుతురు లేకనే.. వాటర్ ట్యాంకుకు స్లాబ్ వేసే సమయంలో అందులో వెలుతురు ఉండేలా లైట్లు, చెడు గాలిని బయటకు పంపిస్తూ బయటి గాలి లోపలికి వెళ్లేందుకు వీలుగా ఫ్యాన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆక్సిజన్ సిలిండర్లు కూడా అమర్చాలి. లోపలికి దిగేవారికి కచ్చితంగా సేఫ్టీ బెల్ట్లు ఏర్పాటుచేయాలి. కానీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని కూలీలు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలకు పోస్ట్మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, ప్రమాద స్థలాన్ని మిషన్ భగీరథ(గ్రిడ్) ఈఈ నళిని, డీఈ యేసుబాబు, తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, ఎంపీడీఓ చంద్రయ్య పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే, అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే కూలీలు మృతి చెందినందున వారి కుటుంబాలకు న్యాయం చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
కాళోజీ సేవలు చిరస్మరణీయం
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాకవి కాళోజీ నారా యణరావు సేవలు చిరస్మరణీయమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణసాహిత్యం, సంస్కృతి, భాషలకు కాళోజీ చిరస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టారని కొనియాడారు. ఆయన కవి మాత్రమే కాదని, సామాజిక ఉద్యమకారుడిగా, ప్రజా చైతన్యవేత్తగా తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారని వివరించారు. భావితరాలకు ఆయన రచనలు ధైర్యాన్ని, సామాజిక అవగాహనను కలిగిస్తాయని చెప్పారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మవిభూషణ్ తో సత్కరించిందని వివరించారు. కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, కలెక్టరేట్ ఏఓ అనంతరామకృష్ణ, ఓఎస్డీ వెంకటరమణ, జిల్లా ఉపాధి కల్ప నాధికారి శ్రీరామ్, బీసీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ జయలక్ష్మి పాల్గొన్నారు. కాళోజీ రచనలు స్ఫూర్తిదాయకం భద్రాచలం : కాళోజీ నారాయణరావు రచనలు నవ సమాజ నిర్మాణానికి, నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నిజాం నిరంకుశత్వానికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా కాళోజీ రచనలు సాగాయన్నారు. ఆయనను స్ఫూర్తిగాతీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఏఓ సున్నం రాంబాబు, అధికారులు సైదులు, హరికృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు.జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ విద్యాచందన -
‘డ్వాక్రా’కు కోక.. బతుకమ్మ కానుక
చుంచుపల్లి : ఈ ఏడాది బతుకమ్మ పండుగకు మహిళలకు ఇందిరమ్మ చీరలు కానుకగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందరికీ కాకుండా పొదుపు సంఘాల సభ్యులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఇందిరమ్మ చీరల పేరుతో ఎస్హెచ్జీ సభ్యులు ఒక్కొక్కరికి రెండు చీరలను ఈనెల 22 నుంచి ఉచితంగా అందించనుంది. చీరల తయారీకి సిరిసిల్ల నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వగా.. సుమారు 65 లక్షల మేర చీరలు తయారవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ బతుకమ్మ పండుగకు 18 ఏళ్లు నిండిన మహిళలకు ఒక్కో చీర అందించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేయగా.. విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఏడాది పొదుపు సంఘాల మహిళలకు చీరలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయితే అప్పుడు నాసిరకం చీరలు పంపిణీ చేశారంటూ వ్యతిరేకత రాగా, ఈసారి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తుండడంతో ఒక్కో చీర ధర రూ.800 వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మణుగూరుకు 17 వేలు, అశ్వారావుపేటకు 13 వేల చీరలు చేరగా, మిగితావి ఈనెల 15 నాటికి చేరతాయని అంటున్నారు. జిల్లాలో 2,16,257 మందికి.. ఈనెల 21 నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానుండగా మహిళలకు చీరల పంపిణీకి సర్కారు సమాయత్తమవుతోంది. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులో పేరుండి, 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు ఒక చీర చొప్పున ఇచ్చేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఈసారి స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు మాత్రమే రెండేసి చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం మెప్మా, సెర్ప్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధిలోని సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 471 గ్రామ పంచాయతీల పరిధిలో 2,16,257 మంది ఎస్హెచ్జీ సభ్యులు ఉన్నారు. ఇందులో సెర్ప్ పరిధిలో 1,82,454 మంది, మెప్మా పరిధిలో 33,803 మంది మహిళలు ఉన్నారని లెక్క తేలగా.. వీరికి రెండు చీరల చొప్పున ఇచ్చేందుకు జిల్లా అధికారులు ఇండెంట్ పంపారు. వీరందరికీ 4,32,514 చీరలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. జిల్లాకు వచ్చే ఇందిరమ్మ చీరలను నిల్వ చేసేందుకు డీఆర్డీఏ అధికారులు కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఆరు గోదాంలను సిద్ధం చేశారు. జిల్లాలో ఈనెల 22 నుంచి 30 వరకు చీరల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు వచ్చే బతుకమ్మ కానుక చీరలను నిల్వ చేసేందుకు ఆరు గోదాంలను సిద్ధం చేశాం. వీటికి ఇన్చార్జ్ అధికారులకు సైతం నియమించాం. ఒక్కో గోదాంలో 30 వేల నుంచి 60 వేల వరకు చీరలు నిల్వ చేస్తున్నాం. ఇప్పటికే 30వేల చీరలు చేరగా, మిగితావి మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ప్రతీ మహిళా సంఘం సభ్యురాలికి రెండు చీరలు అందేలా చూస్తాం. – ఎం.విద్యాచందన, డీఆర్డీఓ గోదాం కేటాయించిన చీరలు పాత డీఆర్డీఓ ఆఫీస్(కొత్తగూడెం) 55,000 మెప్మా ఆఫీస్(మణుగూరు) 40,000 మున్సిపల్ ఆఫీస్(పాల్వంచ) 45,000 సీఆర్సీ భవనం (ఇల్లెందు) 40,000ఎంఎస్ ఆఫీస్(భద్రాచలం) 30,000ఎంఎస్ ఆఫీస్(అశ్వారావుపేట) 30,000మండల సమాఖ్యలు : 22గ్రామ సమాఖ్యలు : 981స్వయం సహాయక సంఘాలు : 22,055సంఘాల్లోని మహిళా సభ్యులు : 2,16,257 -
‘సమ్మక్క’ చిక్కులు
సీతారామ తీర్చేనా?సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని బీడు భూములకు గోదావరి జలాలు అందించేందుకు జే చొక్కారావు దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ రెండు పథకాల కింద గోదావరి నదిపై ములుగు జిల్లాలో సమ్మక్క సాగర్, భద్రాద్రి జిల్లాలో సీతమ్మసాగర్ బరాజ్లను నిర్మిస్తోంది. ఇప్పటికే సమ్మక్క బరాజ్ పనులు 95 శాతం పూర్తి కాగా సీతమ్మ సాగర్ నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి. అయితే ఈ రెండు బరాజ్లకు సంబంధించిన డిజైన్లు, ఆయకట్టు తదితర అంశాలతో కూడిన సమగ్ర నివేదిక (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు)కు ఇప్పటివరకు కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు రాలేదు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా కృషి చేస్తోంది. సమ్మక్క బరాజ్కు కొర్రీలు.. సమ్మక్క బరాజ్కు సంబఽంధించి సీడబ్ల్యూసీకి సమర్పించిన డీపీఆర్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ కింద ఉన్న 4.40లక్షల ఆయకట్టును స్థిరీకరిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఇదే ఆయకట్టును కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్లోనూ ప్రభుత్వం చూపించింది. దీంతో ఒకే ఆయకట్టును రెండు ప్రాజెక్టుల కింద చూపడంపై సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టును కాళేశ్వరం ప్రాజెక్టుకే పరిమితం చేస్తే సమ్మక్క బరాజ్కు సంబంధించిన ప్రాజెక్టు ప్రయోజనాల వ్యయం (కాస్ట్ బెనిఫిట్ రేషియో) తగ్గుతోంది. ప్రస్తుత డీపీఆర్లో ఒక రూపాయి ఈ ప్రాజెక్టుపై ఖర్చు చేస్తే కొత్త పాత ఆయకట్టుల ద్వారా రూ.1.67 లాభం వస్తుందని తెలిపారు. కానీ ఎస్సారెస్పీ ఆయకట్టును తొలగిస్తే రూపాయి ఖర్చుకు రూపాయి మేరకు కూడా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో సమ్మక్క బరాజ్ కింద కొత్తగా రెండు లక్షల ఆయకట్టును చూపాలంటూ కేంద్ర జల సంఘం సూచించింది. రీడిజైన్తో అన్యాయం.. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు గోదావరి నీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. అయితే కిన్నెరసాని అభయారణ్యం కారణంగా అనుమతులు రావడంలో ఆలస్యం జరుగుతోందంటూ ఈ ప్రాజెక్టు అలైన్మెంట్లో మార్పులు చేశారు. దీంతో ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని బీడు భూములకు గోదావరి నుంచి చుక్క నీరందే పరిస్థితి లేదు. కొత్తగూడెం, వైరా, ఖమ్మం నియోజకవర్గాలకు కూడా పాక్షికంగానే అందుతోంది. ఉభయతారకంగా.. గోదావరి నీటిని పాకాల మీదుగా బయ్యారం పెద్ద చెరువు, రోళ్లపాడుకు తరలించే అంశంపై మంత్రి ధనసరి అనసూయ(సీతక్క), ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేశారు. ఇప్పుడు సమ్మక్క బరాజ్ విషయంలో సీడబ్ల్యూసీ లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుని సీతారామతో న్యాయం జరగని నియోజకవర్గాలను సమ్మక్క ఆయకట్టు కింద చూపే అంశాన్ని పరిశీలించాలని భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల రైతులు కోరుతున్నారు. సీతారామ ప్రాజెక్టుకు 2016లో శంకుస్థాపన చేసినప్పుడు టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద 16 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్ సముద్ర మట్టానికి 216 అడుగుల ఎత్తులో ఉండడంతో గ్రావిటీ ద్వారానే ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు నీరందించే వీలుంది. అలాగే కొత్తగూడెం, పినపాక, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లో సీతారామ కింద ఆయకట్టు లేని మండలాలకు సాగు నీరందించే వీలుంది. అయితే గోదావరి – రోళ్లపాడు మధ్య కిన్నెరసాని అభయారణ్యం కారణంగా ఈ ప్లాన్ అటకెక్కింది. ఇప్పుడు అభయారణ్యంతో చిక్కులు లేకుండా సమ్మక్క బరాజ్ నుంచి రోళ్లపాడుకు నీరు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే సమ్మక్క బరాజ్ నుంచి ఎత్తిపోసిన నీటిని రామప్ప మీదుగా పాకాల చెరువు వరకు తీసుకొస్తున్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ పాకాల నుంచి మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువుకు, అక్కడి నుంచి రోళ్లపాడు చెరువుకు తరలించాలనే డిమాండ్ వినిపిస్తోంది. సమ్మక్క సాగర్ కింద ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణపై అభ్యంతరాలు -
పర్యాటక హబ్గా నేచర్ పార్క్
● నూతన ఒరవడికి ఇల్లెందు నుంచే శ్రీకారం ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడిఇల్లెందురూరల్ : సుభాష్నగర్లోని అటవీశాఖ సహజ వనాన్ని(నేచర్ పార్క్) పర్యాటక హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని, తద్వారా జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అటవీశాఖ సహజ వనాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. పార్క్ మధ్యలోని కోరగుట్టను అధికారులతో కలిసి అధిరోహించి రోప్వే ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు. పార్క్ సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పర్యాటకుల వినోదం, విశ్రాంతి, భద్రత అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పార్క్లో పరిశుభ్రత, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, చెత్త నిర్వహణ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలని, ఇక్కడ ఏర్పాటయ్యే స్టాళ్లు, ఫుడ్ కార్నర్లు, హ్యాండీ క్రాఫ్ట్ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని సెర్ప్ అధికారులకు సూచించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాలు సహజ సిద్ధంగా అద్భుత సౌందర్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మైనింగ్ ఏడీ దినేష్, డీవైఎస్ఓ పరంధామరెడ్డి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, డీఈ రాంకిషన్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్సింగ్, ఎఫ్డీఓ కరుణాకరాచారి, ఎంపీఓ చిరంజీవి, ఏఈ రాజు, ఎఫ్ఆర్ఓ చలపతిరావు పాల్గొన్నారు. రోళ్లపాడు పాఠశాల పరిశీలన.. టేకులపల్లి: మండలంలోని రోళ్లపాడు ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం, వసతి వివరాలు ఆరా తీశారు. ఒకటి, రెండో తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు తగిన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. టీచర్ల హాజరు, బోధనా విధానాలను అధికారులు తరచుగా పరిశీలిస్తారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు చిట్టిబాబు, పంచాయతీ సెక్రటరీ రాజు తదితరులు ఉన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోపలకు అనుమంతించొద్దని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్, వివిధ పార్టీల నాయకులు నోముల రమేష్, లక్ష్మణ్ అగర్వాల్, రాంబాబు, సలిగంటి శ్రీను, ఎస్కే సలీం ఉన్నారు. -
క్యూలో చెప్పులు..
మణుగూరుటౌన్: మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట మంగళవారం తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టారు. మణుగూరు మండలానికి 60 – 70 టన్నులు యూరియా రావాల్సి ఉండగా, రెండు మూడు రోజులుగా 10 టన్నుల చొప్పున దిగుమతి అవుతోంది. అయితే మండలానికి సోమవారం 10 టన్నుల యూరియా దిగుమతి కాగా, విషయం తెలుసుకున్న రైతులు మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి చెప్పులు క్యూలో పెట్టి నిరీక్షించారు. సిబ్బంది ఉన్న యూరియాను రైతులకు పంపిణీ చేశారు. ఇంకా 30 – 40 టన్నుల యూరియా మండల రైతులకు అవసరం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘డబుల్’ కష్టాలు..
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఆర్టీసీ డిపోలో కండక్టర్ లేకుండా టికెట్ ఇష్యూ మిషన్ (టిమ్)తో డ్రైవింగ్ చేస్తున్నవారి పరిస్థితి అధ్వానంగా మారింది. డబుల్ డ్యూటీ (కండక్టర్, డ్రైవర్) చేయాలంటే ఇబ్బందిగా ఉందని, ఏకాగ్రత కోల్పోతున్నామని వారు తెలిపారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు వెళ్లే టిమ్ సర్వీసులకు అదనపు డ్రైవర్ లేదా కండక్టర్ను ఇస్తే కానీ వెళ్లమని సోమవారం డ్రైవర్లు విధులను బహిష్కరించారు. సుమారు 10 సర్వీసులకు టిమ్ డ్రైవర్లు వెళ్లకుండా డిపో వద్దే ఉన్నారు. ఈ సర్వీసులతో తాము తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నామని, అనారోగ్యం పాలవుతున్నామని వాపోయారు. ఇప్పటికే వారం రోజులుగా 8 మంది సర్వీసులకు వెళ్లివచ్చి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని, ఇప్పటికే ఆర్టీసీ డీఎం తిరుపతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. డ్రైవర్లు వెళ్లకపోవడంతో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి పది గంటల వరకు హైదరాబాద్కు వెళ్లాల్సిన బస్సులు ఆగిపోయాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ఒక డ్రైవర్ ఆరున్నర గంటలు నిరంతరాయంగా పనిచేసిన తర్వాత ఎనిమిది గంటలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ భద్రాచలం ఆర్టీసీ డిపో అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టిమ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా.. పలు కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్న వ్యక్తిని సేప్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్గా నియమించడంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. తమ సమస్యను పరిష్కరించే వరకు విధులు బహిష్కరించి డిపోలోనే ఉంటామని చెబుతున్నారు. టిమ్తో ఇబ్బందులు ఇవే.. భద్రాచలం డిపో పరిధిలో 101 బస్సు సర్వీసులు నడుస్తుండగా, ఇందులో 79 ప్రభుత్వ బస్సులు కాగా, 22 ప్రైవేట్ బస్సులున్నాయి. వీటిల్లో టిమ్ (టిక్కెట్ ఇష్యూ మిషన్) డ్రైవర్లు పనిచేసే 25 బస్సులున్నాయి. డిపో పరిధిలో ఉన్న బస్సులకు 185 మంది డ్రైవర్లతోపాటు 163 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం డిపో నుంచి హైదరాబాద్కు–17, మంచిర్యాల–3, తిరుపతి–1, శ్రీశైలం–1, విజయవాడ–1, విశాఖపట్నం–2 టిమ్ బస్సులను నడుపుతున్నారు. బస్టాండ్లో నిలిపి టిక్కెట్ కొట్టడం వల్ల ప్రయాణానికి ఆలస్యమవుతోంది. టికెట్ మరిచిపోతే ఉద్యోగం ఎక్కడ పోతుందోనన్న ఆందోళన ఉంటోందని, ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోయినా డ్రైవర్పై క్రమశిక్షణ చర్యలు ఉంటున్నాయని, బస్సు ఎక్కడైనా దెబ్బతిన్నా డ్రైవర్లే ఇబ్బంది పడాల్సి వస్తోందని వాపోతున్నారు. డ్రైవింగ్పై ఏకాగ్రత కోల్పోతున్నామని, ఉద్యోగ భద్రతకు గ్యారెంటీ ఉండదని పేర్కొంటున్నారు. డ్రైవరు ఒక్కరే ఉండటం వల్ల లగేజీ ఏం వేస్తున్నారో చూసుకోవడం కష్టమని చెబుతున్నారు.కండక్టర్ లేకుండా టికెట్లు ఇచ్చుకుంటూ.. ప్రయాణికులను పర్యవేక్షిస్తూ.. లోపల పరిశీలిస్తూ బస్సు నడపాలంటే భయపడుతున్నారు. అందరూ టికెట్ తీసుకున్నారా? లేదా? అని, దిగాల్సిన ప్రయాణికులను చూసుకుంటూ పనిచేయాలంటే ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. బస్సు నడిపే సమయంలో ఒత్తిడికి గురైతే ఏకాగ్రత కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశాలుఉన్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు టిమ్ సర్వీసులు నడపాలనే ఆదేశాలు ఉన్నతాధికారుల నుంచి వచ్చాయి. అది నా పరిధిలో ఉండేది కాదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే మేము నడుచుకుంటున్నాం. డ్రైవర్లపై కక్షపూరితంగా వ్యవరించడం లేదు. డ్రైవర్లతో పాటు నేను కూడా ఉన్నతాధికారుల వద్దకు సమస్యను తీసుకెళ్లేందుకు సహకరిస్తాను. –తిరుపతి, భద్రాచలం ఆర్టీసీ డీఎం -
ఎదురెదురుగా లారీలు ఢీ
అశ్వారావుపేటరూరల్: ఎదురెదురుగా లారీలు ఢీ కొన్న ఘటలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి టవర్లకు సంబంధించి ఇనుప సామగ్రితో వస్తున్న లారీ, ఏపీ వైపు నుంచి ఖమ్మం వెళ్తున్న మరో లారీ అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం కాలనీ శివారులో ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీడ్రైవర్లు రాజ్కుమార్, తిరుమలరెడ్డి క్యాబిన్లలో ఇరుక్కుపోవడంతో ఘటన స్థలానికి వెళ్లిన సీఐ నాగరాజు, ఎస్ఐ అఖిల గ్రామస్తుల సహకారంతో బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, లారీలో ఉన్న ఇనుప సామగ్రి రోడ్డుపై పడిపోవడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ఇనుప సామగ్రిని తొలగించడంతో వాహనాల రాకపోకలు సాగాయి. ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గృహోపకరణాలు దగ్ధం
మణుగూరురూరల్: మండలంలోని విప్పలసింగారానికి చెందిన కర్నె దిలీప్కుమార్ ఇంట్లోని గృహోపకరణాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమయ్యాయి. దిలీప్ కుమారుడు ఇంట్లో టీవీ చూస్తుండగా కరెంట్ పోవడంతో పక్కనే ఉన్న నాన్నమ్మ ఇంటికి ఆడుకునేందుకు వెళ్లాడు. కరెంట్ వచ్చాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, ఏసీ, కూలర్, దుస్తులు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు కరెంట్ కట్ చేయడంతో ప్రమాదం తప్పినట్లయింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, వేర్పుల సురేశ్, అక్కి నర్సింహారావు, జావిద్పాషా, పద్దం శ్రీను, రంజిత్, హర్ష, ఎం.శ్రీను,నాగయ్య, టి.శ్రీను, మణెమ్మ ఘటనా ప్రాంతానికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. -
యూరియా కోసం వచ్చి సొమ్మసిల్లిన రైతు
అశ్వారావుపేటరూరల్: యూరియా బస్తాలు తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ గిరిజన రైతు సొమ్మసిల్లి పడిపోయిన ఘటన అశ్వారావుపేట మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జెట్టివారిగూడేనికి చెందిన జెట్టి సింగరాజు నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. పంటకు అవసరమైన యూరియా కోసం నారాయణపురంలోని సహకార సంఘం కార్యాలయానికి సోమవారం రాగా, సిబ్బంది మంగళవారం రావాలని చెప్పడంతో వెళ్లాడు. అప్పటికే చుట్టు పక్కల గ్రామాల నుంచి మరికొందరు రైతులు రావడంతో క్యూలైన్ ఏర్పాటు చేశారు. సింగరాజు గంటకు పైగానే నిలబటంతో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే ఉన్న ఐరన్ కుర్చీ తగిలి చెవి భాగంలో స్వల్ప గాయమైంది. తోటి రైతులు సింగరాజును సమీపంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. -
పారదర్శకతకు శ్రీకారం !
● లంచం అడిగితే టోల్ఫ్రీ నంబర్ ● లబ్ధిదారుడే యాప్ ద్వారా ఫొటోలు అప్లోడ్ అర్హత గలవారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాం. లబ్ధిదారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇళ్లు నిర్మించుకోవాలి. మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని నిరంతరం సమీక్షిస్తున్నాం. ఎవరైనా లంచం అడిగినా, ఇబ్బందులకు గురి చేసినా టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలి. – శ్రీనివాసరావు, మణుగూరు ఎంపీడీఓ మణుగూరు టౌన్: పేదల సొంతింటి కల నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టగా మొదటి విడతలో నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడక్కడా బిల్లుల మంజూరు కోసం లబ్ధిదారుల నుంచి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో పారదర్శకత పాటించేందుకు లబ్ధిదారులే నేరుగా యాప్లో నిర్మాణ ఫొటోలు అప్లోడ్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా, క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, ఇబ్బంది పెట్టినా టోల్ఫ్రీ నంబర్ 1800 599 5991కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. అప్లోడ్ ఇలా.. లబ్ధిదారుడు తమ స్మార్ట్ఫోన్లో ఇందిరమ్మ ఇళ్ల యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేశాక మొబైల్ నంబర్తో లాగిన్ అయి ఓటీపీని ఉపయోగించాలి. ఇంటి నిర్మాణం ప్రతిదశలో స్పష్టమైన ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫొటోలు ప్రభుత్వ సర్వర్కు చేరాక అధికారుల పరిశీలన అనంతరం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బిల్లులు జమవుతాయి. అక్రమాలకు చెక్.. ఇంతకుముందు మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు, పంచాయతీల్లో కార్యదర్శులు లబ్ధిదారుల ఇంటి నిర్మాణాల ఫొటోలను యాప్లో అప్లోడ్ చేసేవారు. సోమవారం నుంచి ప్రభుత్వం ఈ అవకాశం నేరుగా లబ్ధిదారులకే కల్పించడంతో అక్రమాలకు చెక్ పెట్టినట్టయింది. -
భారీగా గంజాయి పట్టివేత
జూలూరుపాడు: వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మీ పట్టుకున్నారు. మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఎస్ఐ రవితో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు. మాచినేనిపేటతండా శివారులో ఎస్ఐ రవి, పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. కొత్తగూడెం వైపు నుంచి వస్తున్న బొలేరోను ఆపి తనిఖీ చేయగా 63.580 కిలోల గంజాయి దొరికింది. దీని విలువ రూ.31.79 లక్షలు ఉంటుందని, దీనిని ఒడిశా నుంచి పుణేకు అశ్వాపురం మండలం రామచంద్రాపునికి చెందిన డ్రైవర్ కె.తేజ్కుమార్, హైదరాబాద్కు చెందిన ఎల్లా భాస్కర్రావు పట్టుబడ్డారని సీఐ తెలిపారు. కాగా, హైదరాబాద్కు చెందిన జి.నాగరాజు, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి, ఒడిశాకు చెందిన అజాజ్ అలియాస్ అజయ్ పరారయ్యారన్నారు. బొలెరోను సీజ్ చేశామని, నిందితులను రిమాండ్కు తరలించామని సీఐ శ్రీలక్ష్మీ వివరించారు. కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి, కానిస్టేబుళ్లు వెంకట్, కోటేశ్వరరావు, రామకృష్ణ, సురేశ్, సూర్యం, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
పాల్వంచరూరల్: కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు పంట చేను వద్ద గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లికి చెందిన బి.ప్రసాద్ (35) మంగళవారం పంట చేను వద్ద గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఉల్వనూరు ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు లేకపోవడంతో ద్విచక్రవాహనంపై పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి అంబులెన్స్లో కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. అంబులెన్స్ ఉండి కూడా.. కాగా, ఉల్వనూరు ఆస్పత్రిలో అంబులెన్స్ ఉన్నా దానిని నడిపే డ్రైవర్ అందుబాటులో లేడు. యువకుడు గడ్డిమందుతాగి ఆస్పత్రికి వస్తే అంబులెన్స్ డ్రైవర్తోపాటు వైద్యులు కూడా లేకపోవడంతో ద్విచక్రవాహనంపై యువకుడిని సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి తీసుకెళ్లారు. అంబులెన్స్, వైద్యులు ఉన్నా.. లేకపోయినా ఒకటేనని బాధితులు వాపోయారు. అధికారులు అంబులెన్స్ డ్రైవర్ను 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తూరుబాకలో చోరీ.. దుమ్ముగూడెం: మండలంలోని తూరుబాక గ్రామానికి చెందిన నిమ్మకంటి కోటేశ్వరి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు సోమవారం చోరీకి పాల్పడారు. కోటేశ్వరి ఖమ్మం వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ.25 వేల విలువగల బంగారం, రూ.6 వేల విలువ గల కిరాణా సామగ్రి చోరీ చేయడంతో పాటు రూ.48 వేల విలువ గల టీవీని ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఇంటికి చేరిన కోటేశ్వరి ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న సామగ్రిని గమనించి, చోరీ జరిగినట్లు గుర్తించి మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యం
ఎర్రుపాలెం: మారుమూల గ్రామాల్లోని ప్రజల అవసరాలు తీరుస్తూ, మౌలిక వసతులు కల్పించి జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో భట్టి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే 50ఏళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. తద్వారా రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మధిరను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈకార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎర్రుపాలెం మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని అయ్యవారిగూడెం, ఎర్రుపాలెం, పెద్దగోపవరం, బనిగండ్లపాడు బుచ్చిరెడ్డిపాలెం గ్రామాల్లో రూ.4 కోట్ల ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో నిర్మించే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. బనిగండ్లపాడులో భోజన విరామం అనంతరం ఖమ్మం కలెక్టర్ అనుదీప్, పీఆర్ ఎస్ఈ వెంకటరెడ్డి, డీపీఎ ఆశాలత, ఆర్అండ్బీ ఎస్ఈ యాకోబు, విద్యుత్ ఎస్ఈ శ్రీనివాసాచారి, తహసీల్దార్ ఉషాశారదతో అభివృధ్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఇక బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలోని ఇనద్రమ్మ చెరువును కలెక్టర్ అనుదీప్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్లతో కలిసి డిప్యూటీ సీఎం పరిశీలించారు. అక్కడకు వెళ్లే రహదారి ఇటీవల వర్షాలతో బురదమయంగా మారడంతో ట్రాక్టర్పై వెళ్లారు. -
కమ్యూనిజానికి అంతం లేదు..
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని ● సురవరం సంస్మరణ సభలో పలువురి నివాళి సూపర్బజార్(కొత్తగూడెం): కమ్యూనిజానికి అంతం లేదని.. కమ్యూనిస్టులకు మరణం లేదని.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక కొత్తగూడెం క్లబ్లో మంగళవారం సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభను పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా అధ్యక్షతన నిర్వహించారు. సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యేలు రాందాస్నాయక్, పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో పాటు పలు పార్టీల నాయకులు నివాళులర్పించారు. సురవరం జీవితం తెరచిన పుస్తకమని, విద్యార్థి దశ నుంచే కమ్యూనిజాన్ని నమ్మి నిరంతర పోరాటాలు చేశారని కూనంనేని సాంబశివరావు కొనియాడారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి సీపీఐ జాతీయ కార్యదర్శి స్థాయికి ఎదిగారన్నారు. పదునైన ఉద్యమాలను ముందుకు తీసుకువెళ్లడమే సుధాకర్రెడ్డికి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. 2026 మార్చి వరకు మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమీత్షా ప్రకటించడం సమంజసం కాదని, మావోయిస్టు ప్రతి రక్తపు బొట్టు నుంచి తిరిగి ఉద్భవిస్తారని వ్యాఖ్యానించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, మాస్లైన్ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు, కంచర్ల చంద్రశేఖర్రావు, కనగాల అనంతరాములు, సంకుబాపన అనుదీప్, పసుపులేటి వీరబాబు, వీరహనుమంతరావు, రామనాథం, మురళి తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదంలో ఇరువర్గాల ఘర్షణ
మణుగూరు టౌన్: భూ వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడులు చేసుకుని ఫిర్యాదులు చేసుకోవడంతో సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లంపాడులోని తాటికుంట చెరువు సమీపంలో చల్లా పెద్ద రాములుకు 14 ఎకరాలు ఉండగా, 5.10 ఎకరాల పట్టా భూమి చల్లా ఆయన పేరుతోనే ఉందని ఒక వర్గానికి చెందిన చల్లా సుమతి తెలిపారు. 8.30 ఎకరాల గెట్టు భూమి అన్నదమ్ముల పేరిట ఉందని, 2016లో పెద్ద రాములు మృతి చెందాడని పేర్కొన్నారు. పెద్ద రాములు బతికి ఉన్న సమయంలో కౌలుకు తీసుకున్న వ్యక్తులు ఇప్పుడు ఆ భూమి తమదేనని అంటున్నారని వాపోయారు. ఈ విషయమై తహసీల్దార్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని సర్వే చేస్తుండగా కొందరు అడ్డుకుని దాడులు చేశారని తెలిపారు. సదరు భూమిని ప్రస్తుతం మణుగూరు ఓసీ విస్తరణలో సింగరేణి తీసుకుంటోందని పేర్కొన్నారు. కాగా ఆ భూమిని తాము 22 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని మరో వర్గానికి చెందిన తమ్మిశెట్టి వెంకటనర్సు కుటుంబ సభ్యులు తెలిపారు. శిస్తు కట్టడంతోపాటు, సొసైటీకి ధాన్యం విక్రయించిన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో సర్వే చేస్తుండగా కొందరు వ్యక్తులు అడ్డగించి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కాగా ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన చల్లా నర్సయ్య, చల్లా తిరుపతిరావు, మౌనిక, మల్లేశ్లతో పాటు తమ్మిశెట్టి వెంకటనర్సు, కుటుంబ సభ్యులు మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. బాధితులు మణుగూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై సీఐ నాగబాబును వివరణ కోరగా.. ఇరువర్గాల ఫిర్యాదులతో 17 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.17 మందిపై కేసు నమోదు -
‘పోడు’పై దాడులు చేయొద్దని..
సూపర్బజార్(కొత్తగూడెం): పోడుసాగుదారులపై అటవీశాఖాధికారులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులకు స్వస్తి పలకాలని కోరుతూ సీపీఐ, బీకేఎంయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వలస ఆదివాసీలకు కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని నినదించారు. ఈ సందర్భంగా పారీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా మాట్లాడుతూ అనాదిగాసాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అధికారులు కందకాలు తవ్వి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో 200 పనిదినాలు కల్పించాలని, కూలి రూ. 700 చెల్లించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు వీసంశెట్టి పూర్ణచందర్రావు, రేసు ఎల్లయ్య, నాయకులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, నరాటి ప్రసా ద్, ఎస్డీ సలీం, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, బి నాగయ్య, ఎండీ యూసుఫ్, పి శ్రీనివాస్ పాల్గొన్నారు.సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా -
‘చేతబడి’ అనుమానంతో ముగ్గురిపై దాడి
● బాధితులపై మూత్రం పోసిన వైనం ● దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు అశ్వారావుపేటరూరల్: చేతబడి, క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో ముగ్గురు వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన వారు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన పాయం వెంకటేశ్వరరావు, మడకం రంగయ్య, డేరంగుల దయాకర్తోపాటు మరో మహిళ కలిసి గ్రామ శివారులోని వంతెన వద్ద పసుపు, కుంకుమతో పూజలు చేసి చేతబడి చేస్తున్నట్లు అనుమానంతో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి శుక్రవారం రాత్రి దాడికి పాల్పడ్డాడు. కాగా, గ్రామస్తులు రావడాన్ని గమనించిన మహిళ అక్కడి నుంచి పారిపోగా, పాయం వెంకటేశ్వరరావు, మడకం రంగయ్య, దయాకర్పై దాడికి పాల్పడ్డారు. బాధితులపై మూత్రం పోసి చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దాడిలో వెంకటేశ్వరరావు చేయి విరిగిపోగా, రంగయ్య, దయాకర్లు స్వల్పంగా గాయపడ్డారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితులు సోమవారం పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని, మిగిలినవారి వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్సై అఖిల తెలిపారు. -
రేషన్ డీలర్ల ఎదురుచూపులు
● కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు నెలలుగా అందని కమీషన్ ● అమలుకు నోచుకోని గౌరవ వేతనం, కమీషన్ పెంపుఇల్లెందురూరల్: రేషన్ డీలర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదునెలలుగా కమీషన్ అందడంలేదు. దీంతో డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని 23 మండలాల పరిధిలో 442 రేషన్షాపులు ఉన్నాయి. ప్రతినెలా 3,17,273 రేషన్కార్డులకు డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారు. క్వింటా బియ్యం పంపిణీకి డీలర్లకు రూ.140 చొప్పున కమీషన్ చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేపట్టింది. జూన్లో మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేసింది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన నాటి నుంచి డీలర్లకు కమీషన్ చెల్లింపు నిలిచిపోయింది. కమీషన్ డబ్బులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన కమీషన్ను ఇటీవలే విడుదల చేసింది. ఐదు నెలల కమీషన్ రూ.69,98,015.5లను డీలర్లలో అకౌంట్లో జమ చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం కమీషన్ చెల్లించకుండా జాప్యం చేస్తోంది. ఐదు నెలలకు సంబంధించి రూ. 3,49,90,077.5 కమీషన్ పెండింగ్లో ఉంది. దీంతో డీలర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. షాపు అద్దె, గుమస్తా జీతం అప్పులు చేసి చెల్లించాల్సివస్తోంది. దీనికితోడు బియ్యం దిగుమతి ఖర్చులు కూడా డీలర్లే భరిస్తున్నారు. ఐదు నెలలుగా కమీషన్ చెల్లింపు నిలిచిపోవడంతో రేషన్ డీలర్లకు దుకాణాల నిర్వహణ భారంగా మారింది. అమలుకాని హామీలు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్వింటాకు కమీషన్ రూ.300, గౌరవ వేతనం నెలకు రూ.5 వేలు చొప్పున చెల్లిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు హామీలు అమలు చేయడంలేదు. కమీషన్ సక్రమంగా చెల్లించాలని, హామీలు అమలు చేయాలని కోరుతూ రేషన్డీలర్లు జిల్లా వ్యాప్తంగా నిరసన బాట పట్టారు. తహసీల్దార్ కార్యాలయాల్లో డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. ఈ నెల 6న రేషన్ దుకాణాలను ఒక రోజు బంద్ చేసి నిరసన తెలిపారు. జిల్లాకు వచ్చే బియ్యం : 59,982.99 కేంద్రం కోటా: 49,985.825 రాష్ట్ర ప్రభుత్వం కోటా : 9,997.165 మొత్తం కమీషన్ : రూ.83,97,618.6 కేంద్రం వాటా: రూ.69,98,015 ఐదు నెలల పెండింగ్ కమీషన్ : రూ. 3,49,90,077.5 రాష్ట్ర ప్రభుత్వ వాటా : రూ.13,99,603.1 ఇటీవల చెల్లించిన ఐదు నెలల కమీషన్ : రూ.69,98,015.5 ఐదు నెలలుగా కేంద్ర ప్రభుత్వం కమీషన్ చెల్లించకపోవడంతో రేషన్ షాపుల నిర్వహణ భారంగా మారింది. షాపు నిర్వహణ, కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. కేంద్రం పెండింగ్ కమీషన్ విడుదల చేయాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి. –ఊకే శేఖర్రావు, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
రెక్కీ చేసి.. సొత్తు ఎత్తుకెళ్తూ..
ఖమ్మంక్రైం: ఖమ్మం జిల్లాలో వివిధ ప్రాంతాలతో పాటు ఖమ్మం వన్టౌన్, టూటౌన్, అర్బన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వివరాలను సోమవారం నగర ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు. ఖమ్మం ముస్తఫానగర్లో కారు డ్రైవర్గా పనిచేస్తూ చోరీలకు పాల్పడుతున్న పాతనేరసుప్తడు చల్లా వెంకటేశ్వర్లు, భద్రాచలం శ్రీరామ్నగర్కు చెందిన దేవనబోయిన మహేష్ అలియాస్ బాతు పలు ప్రాంతాల్లో తిరుగుతూ తాళాలు వేసి ఇళ్లను గుర్తించేవారు. ఆపై రాత్రివేళ చోరీ చేసి ఆ డబ్బుతో మూడు ద్విచక్రవాహనాలు కొనుగోలు చేశారు. వీటిపై తిరుగుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు.ఖమ్మం నగరంతోపాటు, ఖమ్మం రూరల్, బోనకల్, కామేపల్లి, వేంసూరు, ఏన్కూరు, సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో చోరీ చేయగా, చల్లా వెంకటేశ్వర్లుపై గతంలోనే 15చోరీ కేసులు ఉన్నాయి. జైలు నుంచి విడుదలైనా తీరు మారకపోగా బట్టల షాపులో పనిచేసే మహేష్తో కలిసి చోరీలు మొదలుపెట్టాడు. ఖమ్మం నూతన బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనం పై వెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకోవడం చోరీల విషయం బయటపడింది. దీంతో నిందితుల నుంచి రూ.13లక్షల విలువైన 127గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండితో పాటు టీవీ, సౌండ్బాక్స్, మూడు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.తప్పుడు సమాచారంతో ఇక్కట్లుసొత్తు పోగొట్టుకున్న వారిలో కొందరు అబద్ధపు వివరాలతో ఫిర్యాదు చేస్తున్నారని ఏసీపీ రమణమూర్తి తెలిపారు. రెండు తులాల ఆభరణాలు పది తులాలని, రోల్డ్గోల్డ్ నగలు పోతే నిజమైన నగలుగా ఫిర్యాదు చేస్తుండడంతో రికవరీలో ఇబ్బంది అవుతోందని పేర్కొన్నారు. కాగా, చోరీ అయిన సమయాన ఫిర్యాదు చేసేవారు బిల్లులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, అపార్ట్మెంట్లలో చోరీచేసిన మధ్యప్రదేశ్కు చెందిన ధార్ ముఠాను గుర్తించామని చెప్పారు. కొన్ని అపార్ట్మెంట్లలో వాచ్మెన్లు లేకపోగా, ఉన్నచోట మద్యం సేవించి నిద్రిస్తుండడంతో దొంగలకు పని సులువవుతోందని తెలిపారు.ఈ సమావేశంలో సీసీఎస్ ఏసపీ సర్వర్, సీఐలు కరుణాకర్, బాలకృష్ణ, భానుప్రకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు యూరియా సరఫరా చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): పంటలకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తొలుత నవభారత్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ కన్వీనర్ కెచ్చెల రంగారెడ్డి, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ అధిక వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. పోడు భూముల్లో పంటలు తొలగించిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.10,075 చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్రా వెంకన్న, కల్లూరి కిషోర్, మాచర్ల సత్యం, భానోత్ ధర్మ, జి.వెంకటేశ్వర్లు, పి.వీరబాబు, ఎన్ నాగేశ్వరరావు, ఆర్ వెంకటేశ్వర్లు, నూపా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలోని జ్యోతిబాపూలే గురుకులం విద్యార్థులు రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఖమ్మం జిల్లా బోనకల్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి ఎంపికల్లో విద్యార్ధులు ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థులు శ్రీహరి, ఎం.రఘురాం, ధనుష్, కే.వినయ్, ఎం.చరణ్, ఐ.జానకీరాంలను ప్రిన్స్పాల్ ఎస్కే బురాన్, ఏటీపీ శ్రీకాంత్, డిప్యూటీ వార్డెన్ మధు, పీడీ డాక్టర్ రఘువరన్, ఇతర అధ్యాపకులు సోమవారం అభినందించారు. రేపు వాహనాల వేలంపాల్వంచ: వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 10న వేలం వేయనున్నట్లు పాల్వంచ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ సీఐ ఎం.ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో, ద్విచక్ర వాహనాలకు వేలం వేస్తామని, ఆసక్తి కలిగినవారు ఉదయం 10.30 గంటలకు ఎకై ్సజ్ స్టేషన్లో హాజరు కావాలని కోరారు. రెండు ఇళ్లల్లో చోరీలుచండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి, మద్దుకూరు గ్రామాల్లో ఆదివారం రాత్రి రెండు ఇళ్లల్లో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. తిప్పనపల్లి గ్రామానికి చెందిన ప్రైవేటు వైద్యుడు ఎస్కే బషీర్ ఈ నెల 6న భార్యతో కలిసి ఖమ్మంలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లాడు. తలుపు పగులగొట్టి ఉండటంతో పక్కింటివారు గమనించి సమాచారం ఇచ్చారు. సోమవారం వచ్చి చూడగా బీరువాలో ఉంచిన బంగారం, రూ. 12 వేలు నగదు చోరీకి గురైంది. మద్దుకూరు గ్రామానికి చెందిన చాపల వసంత ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆలయంలో నిద్రపోయింది. సోమవారం ఉదయం ఇంటికి చేరుకుని పరిశీలించగా బీరువాలో రూ. లక్ష నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. -
తప్పని యూరియా తిప్పలు
● తెల్లవారకముందే బారులుదీరుతున్న అన్నదాతలు ● సత్యనారాయణపురంలో సొమ్మసిల్లిన రైతు సుజాతనగర్/అశ్వాపురం/చర్ల/టేకులపల్లి : జిల్లాలో యూరియా కోసం రైతుల కష్టాలు తప్పడం లేదు. విక్రయ కేంద్రాల వద్ద తెల్లవారకముందే బారులు దీరుతున్నారు. ఎక్కువ సేపు క్యూలో నిల్చోలేక చెప్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలను వరుసక్రమంలో పెట్టి చెట్ల కింద సేద తీరుతున్నారు. చర్ల మండలం సత్యనారాయణపురం పీఏసీఎస్ వద్ద గంటల తరబడి క్యూలో నిల్చున్న ఓ గిరిజన రైతుకు మూర్చ రాగా సొమ్మసిల్లి పడిపోయాడు. తిప్పాపురం గ్రామానికి చెందిన వృద్ధ రైతు కారం సోమయ్య.. తనకు ఇచ్చిన కూపన్తో క్యూలో నిల్చోగా ఒత్తిడి పెరగడంతో సొమ్మసిల్లగా అధికారులు, సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అశ్వాపురం మండలం మొండికుంట పీఏసీఎస్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయమే భారీగా క్యూ కట్టారు. ఏఓ మహేష్చంద్ర చటర్జీ అక్కడికి చేరుకుని ఉన్న నిల్వలను రైతులందరికీ సమానంగా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. సుజాతనగర్ సొసైటీ కార్యాలయంలో యూరియా నిల్వలు లేకపోయినా ఆధార్ కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలను క్యూలో పెట్టి రైతులు వేచి చూశారు. వారం, పది రోజులుగా తిండీ, తిప్పలు మానుకొని తిరుగుతున్నామని, బస్తా యూరియా కోసం అరిగోస పడుతున్నామని రైతులు వాపోయారు. టేకులపల్లిలోనూ గంటల తరబడి క్యూలైన్లో నిల్చునా బస్తా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ కార్యాలయం తెరవకముందే అక్కడికి చేరుకుని చెప్పులు లైన్లో పెట్టి చెట్టుకింద కూర్చున్నారు. దీంతో సిబ్బంది ఉదయం 7 గంటలకే తాళాలు తీసి యూరియా పంపిణీని ప్రారంభించారు. ఎకరం ఉన్న వారికి ఒకటి, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రెండు బస్తాలు చొప్పున పంపిణీ చేస్తున్నట్లు ఏఓ నీరుడు అన్నపూర్ణ తెలిపారు. -
పరిశోధనల దిశగా ముందుకు సాగాలి
విద్యార్థులకు కలెక్టర్ సూచన కరకగూడెం: విద్యార్థులు పరిశోధన దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం ఆయన కరకగూడెంలోని నవోదయ విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. వ్యక్తిగత లక్ష్య సాధనతో పాటు దేశాభివృద్ధికి తోడ్పడే దిశగా చదవడం, పరిశోధనలు చేయడం ముఖ్యమని, సమాజ సమస్యలకు పరిష్కారం చూపే శాస్త్రవేత్తలుగా తయారు కావాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత డైనింగ్ హాల్ను పరిశీలించి దోమలు, ఈగలు రాకుండా మెష్ ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కూరగాయలు, పెరుగు వంటివి నిల్వ చేసేందుకు ఫ్రిడ్జ్ అవసరమని సిబ్బంది కోరగా వెంటనే ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంటా ప్రతాప్, ఎంఈఓ మంజుల, ఆర్ఐ కృష్ణప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కరాచారి, ఉపాధ్యాయులు నయనాదేవి, చంచల్, అనిత, స్టాఫ్ నర్స్ రాధిక పాల్గొన్నారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి.. చుంచుపల్లి: త్వరలో జరగనున్న పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా అన్ని పార్టీల వారు సహకరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కోరారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాల కోసం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం ఆయన ఐడీఓసీలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఓటర్ల నమోదుకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని, నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పేర్లు చేర్పులు ఉండవని స్పష్టం చేశారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిప్యూటీ జెడ్పీ సీఈఓ చంద్రశేఖర్, ఆయా పార్టీల నాయకులు బాల ప్రసాద్, అనుదీప్, ఎస్.శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, నోముల రమేష్, రాంబాబు పాల్గొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి మణుగూరు రూరల్ : ప్రభుత్వం కల్పించే అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని కలెక్టర్ పాటిల్ సూచించారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఐటీఐలను ఆధునికీకరించి ఏటీసీలుగా ఏర్పాటు చేశామని, వీటిలో శిక్షణ పొందిన విద్యార్థులకు పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, ఎంపీఓ పి.వెంకటేశ్వరరావు, ఐటీఐ సూపరింటెండెంట్ జ్యోతిరాణి, ఏటీఓలు కృష్ణారావు, వేణుగోపాల్ పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభం అశ్వాపురం: మండలంలోని మిట్టగూడెం గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో ఖమ్మం, వరంగల్, భద్రాద్రి జిల్లాల ఎన్సీసీ శిక్షణా శిబిరాన్ని కలెక్టర్ జితేష్ సోమవారం ప్రారంభించారు. క్యాంప్ కమాండెంట్ కల్నల్ సంజయ్కుమార్ భద్ర, క్యాంప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ నవీన్యాదవ్తో మాట్లాడి శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలపై చర్చించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మణిధర్, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, ఎంపీఓ ముత్యాలరావు, ఏఎన్ఓలు తారాచంద్, నాగులు, సిబ్బంది శేఖర్బాబు, ప్రశాంత్, ప్రభాకర్ పాల్గొన్నారు. -
ఉమ్మడిగా సర్వే నిర్వహిస్తాం
అశ్వారావుపేటరూరల్: గత కొన్నేళ్లుగా వివాదం నెలకొన్న ఫారెస్టు, రెవెన్యూ భూములపై త్వరలోనే ఉమ్మడి సర్వే చేపడతామని కొత్తగూడెం ఆర్డీఓ మధు తెలిపారు. మండలంలోని రామన్నగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 30,36,39 లోగల భూములపై రెవెన్యూ, అటవీ కార్పొరేషన్ అధికారులు, గ్రామస్తులతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం సమావేశం నిర్వహించారు. భూములకు సంబంధించి గిరిజనుల వద్ద ఉన్న పూర్వ పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర పత్రాలు, ఫారెస్టు, రెవెన్యూ రికార్డులు, మ్యాప్లను పరిశీలించారు. అనంతరం భూ వివాదాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఉమ్మడి సర్వే చేస్తామని తెలిపారు. ఇందుకు గిరిజనులు కూడా అంగీకరించారు. ఈ సమావేశంలో ఎఫ్డీవో దామోదర్ రెడ్డి, సత్తుపల్లి, కొత్తగూడెం ఎఫ్డీసీ డీఎంలు గణేష్, చంద్రమోహన్, తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, సత్తుపల్లి జోన్–1 ప్లాంట్ మేనేజర్ బ్రహ్మాచారి, ప్లాంట్ మేనేజర్ చంద్రకళ, సీఐ నాగరాజు, ట్రైనీ ఎస్సై అఖిల పాల్గొన్నారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు -
మొర్రేడులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి
పాల్వంచ: మొర్రేడు వాగు దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని వనమా బజార్కు చెందిన ఆటో డ్రైవర్ యాట సురేష్(35) ఆదివారం బంగారు జాలలో ఉండే అత్తగారింటికి వెళ్లేందుకు గుడిపాడు వద్ద మొర్రేడు వాగు దాటుతున్నాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండి నీళ్లలో కొట్టుకు పోయాడు. సాయంత్రం ఇంటికి రాక పోవడంతో సోమవారం కుటుంబ సభ్యులు వెతుకగా మొర్రేడు వాగు బ్రిడ్జి వద్ద నీళ్లలో సురేష్ మృతదేహం లభించింది. మృతుడి భార్య దుర్గాభవాని ఫిర్యాదుతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గడ్డి మందుతాగిన వివాహిత మృతిపాల్వంచరూరల్: గడ్డి మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కోడిపుంజులవాగు గ్రామానికి చెందిన కొర్ర ఈరీ(42) కుటుంబ సభ్యుల మందలించారని మనస్తాపం చెంది ఈ నెల 6న ఇంట్లో పురుగుల మందు తాగింది. అపస్మారకస్థితిలోపడి ఉండగా కుటుంబ సభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు, అనంతరం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుబూర్గంపాడు: పినపాక పట్టీనగర్ గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ వైపు నుంచి భద్రాచలం వైపు వస్తున్న ఓ మోటార్ సైకిల్ను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో మోటార్సైకిల్పై ప్రయాణిస్తున్న యువకుడికి, యువతికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. కాగా బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ తెలిపారు. పేకాట స్థావరంపై దాడిఅశ్వారావుపేటరూరల్: పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఎస్సై అఖిల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఫైర్ కాలనీ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. రూ.1,850 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రెండు తాచుపాముల పట్టివేత
కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామపంచా యతీకి చెందిన రజాక్ అనే వ్యక్తి ఇంట్లోకి సోమవా రం తాచుపాము వచ్చింది. ప్రాణధా ర ట్రస్ట్ అధ్యక్షుడు, కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. శ్రీనగర్ కాలనీ నాలుగో లైన్లో కూడా ఓ ఇంట్లోకి తాచుపాము రాగా సంతోష్ వెళ్లి పట్టుకున్నారు. అనంతరం రెండు పాములను అటవీప్రాంతలో వదిలిపెట్టినట్లు తెలిపారు.నేడు సురవరం సంస్మరణ సభసూపర్బజార్(కొత్తగూడెం): సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ మంగళవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఉదయం 10 గంటలకు నిర్వహించే సంస్మరణ సభకు హాజరుకావాలని కోరారు. -
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ
అశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. మణుగూరు డిపోకు చెందిన బస్సు ఖమ్మం వెళ్తుండగా ఇటుక లోడ్తో ట్రాక్టర్ మణుగూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో మిట్టగూడెం వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి ట్రాక్టర్ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు దిగి గుంతలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వడ్డె రాజయ్య, కండక్టర్ జిల్లేపల్లి రవీంద్రచారితో పాటు ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రమబద్ధీకరించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బస్సు కండక్టర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్రెడ్డి తెలిపారు.63 కిలోల గంజాయి స్వాధీనం?జూలూరుపాడు: నిషేధిత గంజాయిని అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తుండగా సోమవారం జూలూరుపాడు పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. మండలంలోని మాచినేనిపేటతండా గ్రామ శివారులో జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా కొత్తగూడెం వైపు నుంచి హైదరాబాద్ వెళుతున్న బొలెరో వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్తోపాటు, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇద్దరి నుంచి సుమారు 63 కిలోల గంజాయి ప్యాకెట్లు పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇసుక లారీ సీజ్దమ్మపేట: అనుమతులు లేకుండా ఆంధ్రా నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు సోమవారం సీజ్ చేశారు. మండలంలోని ముష్టిబండ గ్రామ శివారులో లారీని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేశామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. -
పోషకాలు అందేదెలా?
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే వివిధ రకాల పౌష్టికాహార పదార్థాలు వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు మరింతగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 1 నుంచి రాగి జావ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ జిల్లా, మండల, కాంప్లెక్స్ విద్యాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో జిల్లాలో ఎక్కడా ఈ పథకం ఇంతవరకూ అమలు కాలేదు. స్నాక్స్పైనా కొరవడిన స్పష్టత.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులకు రెండు పూటలా స్నాక్స్ అందించాలి. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున కేటాయిస్తామని, వాటితో పల్లిపట్టి, అరటిపండ్లు, బిస్కట్లతో పాటు విద్యార్థులకు అదనపు శక్తినిచ్చే అల్పాహారం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇంతవరకూ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులకు స్నాక్స్ అందించడం ఎలా అని ప్రధానోపాధ్యాయులు ఆలోచనలో పడ్డారు. స్నాక్స్ అందించేందుకు ఎవరైనా దాతలు ముందుకొస్తారా అని ప్రయత్నాలు చేస్తున్నారు. భారమవుతున్న గుడ్డు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6 చొప్పున భోజన కార్మికులకు అందిస్తుండగా.. మార్కెట్లో ప్రస్తుతం గుడ్డు ధర రూ.7, కొన్నిచోట్ల రూ.8 కూడా ఉంది. దీంతో తమపై భారం పడుతోందంటూ కార్మికులు విద్యార్థులకు సక్రమంగా కోడిగుడ్డు వడ్డించడం లేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం హెచ్ఎంలు బలవంతంతో అందిస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో మండలానికి ఒక పాఠశాలను ఎంపిక చేసి విద్యార్థులకు ఉదయం అల్పాహారం కింద రోజుకో రకమైన టిఫిన్ పెట్టేవారు. క్రమంగా అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు. కానీ ఎన్నికల తర్వాత ఆ పథకం కూడా నిలిచిపోయింది. ఇలా విద్యార్థులకు అందాల్సిన అన్ని రకాల పోషకాహారాలు నిలిచిపోతుండడంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాగిజావ అమలుపై డీఈఓ నాగలక్ష్మిని వివరణ కోరగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక ట్రస్ట్కు ఈ బాధ్యత అప్పగించిందని, ప్రస్తుతం వారు సిద్ధంగా ఉన్నందున వారం రోజుల్లో జిల్లాలో ప్రారంభిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఒక గంట ముందు విద్యార్థులకు బెల్లంతో కాచిన రాగిజావ అందించేవారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ పథకం నిలిచిపోయింది. కాగా, సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్కారు స్కూళ్లలో రాగిజావ అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఈ పథకం ఇటీవల ప్రారంభమైనా.. ఇక్కడ మాత్రం ఇంకా అమలుకు నోచుకోలేదు. అయితే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారుచేసే కార్మికులు.. రాగిజావ కాచడం తమకు అదనపు పని అని, ఒక్కో విద్యార్థికి రూ.2 చొప్పున అదనంగా చెల్లిస్తే సిద్ధమని ముందుగానే ప్రకటించారు. జావ తయారీకి అవసరమైన వంట గ్యాస్ కూడా ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్కో విద్యార్థికి అదనంగా 25 పైసలు(పావలా) మాత్రమే చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో రాగి జావ కాయడం కుదరదని భోజన కార్మికులు స్పష్టం చేస్తున్నారు. -
దర్బార్ సమస్యలకు సత్వర పరిష్కారం
ఐటీడీఏ పీఓ రాహుల్భద్రాచలం : గిరిజన దర్బార్లో వివిధ ప్రాంతాల వారు విన్నవించిన సమస్యల సత్వర పరిష్కారానికి ఆయా విభాగాల అధికారులు చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వారి సమస్యలను ఆలకించారు. అనంతరం మాట్లాడుతూ.. వినతుల సమర్పణ, సమస్యల పరిష్కారానికి ఐటీడీఏకు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అర్హులైన వారికి వెంటనే ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని గిరిజనులకు సూచించారు. దర్బార్లో వచ్చిన అర్జీలను పరిష్కరిస్తామని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఏడీఎంహెచ్ఓ సైదులు, ఏఓ సున్నం రాంబాబు, ఎస్ఓ ఉదయభాస్కర్, ఆర్ఓఎఫ్ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, ఏపీఓ వేణు, ఉద్యానవనాధికారి ఉదయ్కుమార్, జేడీఎం హరికృష్ణ, నేజర్ ఆదినారాయణ పాల్గొన్నారు. -
సర్వే సరే.. సాయమేదీ?
సాక్షిప్రతినిది, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో కేంద్రం చేయూతతో జరగాల్సిన పనుల్లో ముందడుగు పడడం లేదు. గత ఏడాది భారీ వరదలతో ఉమ్మడి జిల్లాలో పంటలకు అపార నష్టం వాటిల్లింది. రూ.వందల కోట్ల మేర రైతులు నష్టపోయి ఏడాది దాటినా సర్వేతోనే సరిపెట్టారు తప్ప రూపాయి సాయం కూడా విదిల్చలేదు. అలాగే కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు, క్రూడ్ పామాయిల్పై సుంకాల తగ్గింపు, ధన ధాన్య యోజనలో భద్రాద్రి జిల్లాకు స్థానం, రఘునాథపాలెం మండలంలో ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు నిధులు, సరిపడా యూరియా కేటాయింపులోనూ రిక్తహస్తమే ఎదురవుతోంది. ఈ అంశాలపై ఇటీవల ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశారు.యూరియా మంటలుకేంద్రం నుంచి తగిన రీతిలో యూరియా సరఫరా కాక కొరత ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా పంపిణీ కేంద్రాల వద్ద బారులు దీరిన రైతులే కనిపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో 54,825 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 27,865 మెట్రిక్ టన్నులు పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులోనూ 22,653 మెట్రిక్ టన్నులే చేరింది. సెప్టెంబర్కు సంబంధించి 5,212 మెట్రిక్ టన్నుల కోటా రావాలి. భద్రాద్రి జిల్లాకు ఈ నెలలో 10,014 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా 2,600 మెట్రిక్ టన్నులు చేరడంతో కొరత ఎదురవుతోంది. ఇంకా 6,677 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. ఈ క్రమాన మంత్రి తుమ్మల ఇటీవల కేంద్ర మంత్రులను కలిసి సరిపడా యూరియా కేటాయించాలని, నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం, సల్ఫర్పై ఇచ్చే రాయితీలు పెంచాలని కోరారు.ఎస్టీపీకి నిధులివ్వరూ..రఘునాథపాలెం బ్లాక్లోని గిరిజన తండాల్లో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు రూ.110 కోట్ల అంచనా వ్యయంతో సిమెంట్ కాంక్రీట్ డ్రెయినేజీ నెట్వర్క్ కోసం డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) సిద్ధం చేశారు. వ్యర్థ జలాలను శుద్ధి చేసి మున్నేటికి వదిలేలా ప్రాజెక్టును రూపొందించారు. దీనికి ఆమోదం లభిస్తే రఘునాథపాలెం బ్లాక్ లోని 37 ఆవాసాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నందున గ్రామీణ రహదారి కనెక్టివిటీ ప్రోగ్రామ్ కింద కేంద్రం ఆమోదించాలని ప్రతిపాదించారు.ఎయిర్పోర్ట్పై మరోసారి..కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశాక ప్రతిపాదిత ప్రాంతం ఆచరణీయం కాదని తేల్చారు. కానీ భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు, కొత్తగూడెంలోని పరిశ్రమలకు వచ్చివెళ్లే వారి కోసం ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు తప్పనిసరి. ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి, మరోసారి అధ్యయనం చేశాకే విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు పడనున్నందున కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.ఆయిల్పామ్ రైతులకు ఎదురుదెబ్బఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా ఆయిల్పామ్ సాగవుతోంది. ఈ క్రమాన కేంద్రం పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించింది. గతంలో దిగుమతి సుంకం దాదాపు 44 శాతం ఉండడంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కింది. కానీ ఇప్పుడు సుంకం తగ్గించడంతో రైతులపై ప్రభావం పడనుంది. రైతులను ఆదుకునేలా కేంద్రం స్పందించి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంది.భద్రాద్రి జిల్లాకు అర్హత లేదా?భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని రకాల పంటలు కలిపి 7లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఈ జిల్లా అంతా ఏజెన్సీ, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వర్షాధారంగానే సాగు చేస్తారు. చెరువులు, ఇతర నీటి వనరుల ఆధారంగా వరి, తరి పంటలను సాగు చేస్తున్నారు. ఈ వానాకాలం భద్రాద్రి జిల్లాలో వరి 1,61,257.24 ఎకరాల్లో, పత్తి 2,21,344.76 ఎకరాల్లో, మొక్కజొన్న 96,842 ఎకరాల్లో, కందులు 1,881ఎకరాల్లో సాగు చేశారు. రైతులకు అండగా నిలిచేలా పంట వైవిధ్యీకరణ, నీటిపారుదల, రైతుల సమిష్టీకరణకు మద్దతు అవసరం. ఇందులో భాగంగా జిల్లాను కేంద్రం అమలుచేస్తున్న ధన ధాన్య కృషి యోజన పథకం కింద చేరిస్తే రైతుల సంక్షేమంతోపాటు స్థానికంగా జీవనోపాధి మెరుగవుతుంది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నందున భద్రాద్రి జిల్లానూ చేర్చాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి.గత ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో మున్నేరు వరదతో పరీవాహక ప్రాంతాలైన ఖమ్మం నగరం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లోని ప్రజలకు అపార నష్టం కలిగింది. అధికారులు చేపట్టిన సర్వేలో దాదాపు రూ.339 కోట్ల మేర నష్టం వాటిల్లిందని నిర్ధారించి కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఆ తర్వాత ఢిల్లీ బృందం కూడా తమ పర్యటనలో ఇక్కడి పరిస్థితులు చూసి చలించిపోయారు. సాయం అందేలా సిఫారసు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చినప్పటికీ ఏడాది దాటినా ఆ ఊసే లేదు.గతేడాది వరదలపై సర్వేతోనే సరి -
కేవీకేకు రెండు పురస్కారాలు
సూపర్బజార్(కొత్తగూడెం): ఇటీవల తమిళనాడులో జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రానికి రెండు పురస్కారాలు లభించాయి. తేనెటీగల పెంపకంలో యువ రైతులను ప్రోత్సహించడం, ఉత్తమ వార్షిక కార్యక్రమాలకు గాను ఈ అవార్డులు అందుకున్నామని కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ తెలిపారు. ఈ పురస్కారాలు తమ బాధ్యతను మరింతగా పెంచాయన్నారు. సహకరించిన శాస్త్రవేత్తలు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. వసతి గృహానికి శంకుస్థాపన.. కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం వసతిగృహ నిర్మాణానికి తెలంగాణ మండల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ హెచ్ఓడీ డాక్టర్ ఆర్.ఉమారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివిధ శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి. భరత్, శాస్త్రవేత్తలు నీలం హేమశరత్చంద్ర, బి.శివ పాల్గొన్నారు. -
వాగులో మునిగి వ్యక్తి మృతి
దుమ్ముగూడెం: మండలంలోని పెద్దబండిరేవు సమీపంలోని గుబ్బలమంగి వాగులో ప్రమాదవుశాత్తు మునిగి చిన్నబండిరేవు గ్రామానికి చెందిన పశువుల కాపరి పెనుగొండ వెంకన్న (55) మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వెంకన్న పశువులను తీసుకుని గుబ్బలమంగి వాగు వైపు వెళ్లగా అక్కడ గేదె వాగులో దిగడంతో దానిని బయటకు తరలించేందుకు వెళ్లి ప్రమాదవుశాత్తు మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అశోక్కుమార్, సీఐ వెంకటప్పయ్య ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా వెంకన్న మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లోయలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్గుండాల: కిన్నెరసాని నుంచి ఇసుక తోలుతున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలోకి దూసుకెళ్లింది. ఇసుకలో కూరుకుపోయిన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎస్కే పాషా (65) ఇసుక తీసుకొచ్చేందుకు కిన్నెరసాని వాగుకు ట్రాక్టర్ డ్రైవర్గా వెళ్లాడు. ఇసుక లోడు చేసుకుని వచ్చే క్రమంలో సాయనపల్లి – గుండాల మార్గంలో దేవరచింత వద్ద రోడ్డు పక్కన గుంతలోకి పోయి.. అటుపక్కన లోయలోకి దూసుకెళ్లింది. పాషాకు చెట్ల కొమ్మలు తగిలి ఇంజన్ టైరు పక్కన పడి ఇసుకలో కూరుకుపోయి, అక్కడికక్కడే మృతి చెందాడు. గుండాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. కిన్నెరసాని వాగు నుంచి ఇస్టానుసారంగా ఇసుక తరలిస్తుండడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మాజీ సర్పంచ్ ఇంటిపై దాడిపాల్వంచరూరల్: మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాలోత్ హరి ఇంటిపై ఆదే గ్రామానికి చెందిన కొందరు యువకులు శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. వినాయకుని ఊరేగింపు సందర్భంగా దుస్తుల విషయంలో తలెత్తిన వివాదంతో మాజీ సర్పంచ్ ఇంటిపై దాడి చేశారు. దీంతో హరి, ఆయన భార్య అనూష, తల్లి హచ్చమ్మ గాయపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేశారని, విచారణ జరుపుతున్నామని, కేసు నమోదు చేయలేదని ఎస్ఐ సురేశ్ తెలిపారు. డ్రైవర్ మృతి -
జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మృతి
తిరుమలాయపాలెం: జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు, యూటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, సీపీఎం మండల మాజీ కార్యదర్శి సుబ్లేడు గ్రామానికి చెందిన ఎస్డీ జియాఉద్దీన్ (76) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో పలు పార్టీల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బెల్లం శ్రీనివాస్, బోడ మంచానాయక్, ఆర్మి రవి, తుళ్లూరు నాగేశ్వరరావు, నర్సయ్య, రమేశ్, స్వామి, బాబూరావు, నిర్మల్రావు, ఉపేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీయాఉద్దీన్ మృతి తీరని లోటు ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయ, ప్రజా ఉద్యమ నేత జియాఉద్దీన్ ఆకస్మిక మృతి తీరని లోటనీ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావా రవి, ఎ.వెంకట్ అన్నారు. నగరంలో ఆదివా రం జరిగిన సంస్మరణ సభలో వారు మాట్లాడారు. జియాఉద్దీన్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా సేవలందించారని తెలిపారు. కార్యక్రమంలో దుర్గాభవాని, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నున్నా నాగేశ్వరరావు, మచ్చ వెంకటేశ్వర్లు, పొన్నం వెంకటేశ్వరరావు, సోమయ్య విక్రమ్, సాయిబాబు, సరళ, హైమావతి పాల్గొన్నారు. కాగా, జియాఉద్దీన్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. పలు పార్టీల నాయకుల సంతాపం -
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటలు తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులను వీక్షించారు. ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 410 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.22,395 ఆదాయం లభించింది. 270 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.16,210 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ జెన్కో డైరెక్టర్(హైడల్) ఎం.సుజయ్కుమార్, ఏపీ ట్రాన్స్కో రిటైర్డ్ సీఈ ప్రతాప్రెడ్డి, సీలేరు జలవిద్యుత్ కేంద్రం రిటైర్డ్ సీఈ రాంబాబు, కేటీపీఎస్ 5,6 దశల చీఫ్ ఇంజనీర్(సీఈ) ప్రభాకర్రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కిన్నెరసానిని సందర్శించారు. అనంతరం రిజర్వాయర్లో బోటు షికారు చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా సాగు
● ఆయిల్పామ్ సాగుకు అశ్వారావుపేటనే ఆదిగురువు ● వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వారావుపేటరూరల్: దేశంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలోనే అత్యధికంగా ఆయిల్పాం తోటలు సాగు చేస్తున్నారని, ఆ తర్వాత కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సాగవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ఆయన అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు. గెలల నిల్వలు, కన్వేయర్ బెల్ట్, యంత్రాలతోపాటు పవర్ ప్లాంట్ తనిఖీ చేశారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆయిల్పాం తోటల సాగుకు అశ్వారావుపేట మండలం ఆదిగురువని, ఇక్కడ పంట బాగుందంటేనే మిగిలిన ప్రాంతాల్లో విస్తరిస్తోందని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎకరం విలువ రూ.5 కోట్లపైనే ఉన్నా ఆయిల్పాం తోటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. సిద్ధిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కాగా ట్రయిల్ రన్ నడుస్తోందని తెలిపారు. వేంసూరు మండలం కల్లూరిగూడెంలో, కొణిజర్లలో పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం ఏడాదిలోపు పూర్తవుతుందని అన్నారు. వనపర్తి, బీచ్పల్లిలో కూడా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్పామ్ గెలల టన్ను ధర రూ.25 వేలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులకు విన్నవించినట్లు తెలిపారు. తొలుత పామాయిల్ తోటలు, ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చిన యాద్రాద్రి జిల్లా రైతులు మంత్రిని కలిశారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ అధికారులు సుధాకర్ రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్లు నాగబాబు, కల్యాణ్, నాయకులు ఆలపాటి రామచంద్రప్రసాద్, మొగళ్లపు చెన్నకేశవరావు, బండి భాస్కర్, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, ఎస్కే పాషా, పి.జీవన్రావు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ‘ఉద్యాన’ విద్యార్థులు మండలంలోని గంగారంలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని ఆదివారం హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు సందర్శించారు. సాగు చేస్తున్న వక్క, ఆయిల్పామ్, కొబ్బరి తోటలతోపాటు అంతర పంటలను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థుల సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్, యూనివర్సిటీ అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఆనకట్ట తెగినా.. పెరిగిన వరిసాగు
న్యూస్రీల్సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025గతేడాది పెదవాగు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు పడిన భారీ గండి (ఫైల్)అశ్వారావుపేటరూరల్: పెదవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట తెగినా ఆయకట్టులో సాగు పెద్దగా తగ్గలేదు. గతంకంటే కేవలం 178 ఎకరాల్లోనే సాగు తగ్గింది. కానీ వరి సాగు మాత్రం గతం కంటే పెరిగింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలో 0.6 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1975లో ప్రాజెక్ట్ నిర్మించారు. అశ్వారావుపేట మండలంతోపాటు, ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 16 వేల ఎకరాలకు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగు నీరు అందించారు. తెలంగాణలో 3 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, మిగతాది ఆంధ్రాలో ఉంది. భారీ వర్షాలు, అధికారుల నిర్లక్ష్యంతో గతేడాది జూలై 18న ప్రధాన ఆనకట్టకు గండ్లు పడ్డాయి. దీంతో ఆయకట్టు సాగు భారీగా తగ్గిపోతుందనే ఆందోళన నెలకొంది. కానీ పంటల విస్తీర్ణం స్వల్పంగా మాత్రమే తగ్గింది. గతేడాది వానాకాలంలో 3,053 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేయగా, ఈ ఏడాది 2,875 ఎకరాల్లో సాగు చేశారు. వరి పంట గతేడాది 1,194 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 1,420 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది కంటే 226 ఎకరాల్లో వరి సాగు పెరిగింది. 250 మీటర్ల మేర గండ్లు పెదవాగు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు 250 మీటర్ల దాకా గండ్లు పడి కొట్టుపోగా, దాదాపు 20 చోట్ల ప్రధాన కట్ట దెబ్బతిన్నది. కుడి, ఎడమ కాలువ స్టచ్చర్లు దెబ్బతిన్నాయి. ఆయకట్టు కింద అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి, వడ్డర రంగాపురం, కోయ రంగాపురం, బచ్చువారిగూడెం, కొత్తూరు పరిధిలో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలను సాగు చేస్తుండగా, గతేడాది కంటే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగింది. పత్తి పంట సాగు స్వల్పంగా తగ్గింది. ప్రాజెక్ట్ నుంచి సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో ఆయకట్టు రైతులంతా వర్షాధారంగా సాగు చేపట్టారు. ఈ క్రమంలో వరి సాగుకు మొగ్గుచూపారు. మొక్కజొన్న ఒక్క ఎకరాలో కూడా సాగు చేయలేదు. మిర్చి గతేడాది 250 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి 50 ఎకరాలను వర్షాధారంగా.. పెదవాగు ప్రాజెక్ట్ పునర్నిర్మాణం ఇప్పట్లో జరిగే అవకాశాలు లేకపోవడంతో అశ్వారావుపేట మండలంలోని రైతులు వర్షాధారంపైనే పంటలను సాగు చేస్తున్నారు. పెదవాగు ఆయకట్టు కింద వరిక్షేత్రాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోతే వరి పంట సాగు చేసే రైతులకు తీరని నష్టం వాటిల్లే అవకాశాలు ఉండగా, వాన దేవుడే దిక్కుగా పంటను సాగు చేస్తున్నారు. పెదవాగు ప్రాజెక్టు కింద గత ఏడాది కంటే ప్రస్తుత ఖరీఫ్ సీజ్లో వరి పంట సాగు పెరిగింది. గతేడాది ఆనకట్టకు గండ్లు పడిన తర్వాత పంట నష్టం వాటిల్లింది. దీంతో క్రాప్ బుకింగ్లో వరి పంట సాగు కొంతమేర నమోదు తగ్గింది. తాజాగా ఆయకట్టు రైతులు వర్షాధారంగా వరి పంట సాగుకు అధికంగా మొగ్గు చూపారు. మొక్కజొన్న పంటలు సాగు చేసే రైతులు కుడా వరి పంట సాగు చేయడం వల్ల వరిసాగు పెరిగి ఉండొచ్చు. – పి.శివరామ ప్రసాద్, ఏఓ, అశ్వారావుపేటపంట పేరు గతేడాది ఈ ఏడాది వరి 1,194 1,420 పత్తి 1,429 1,405 మొక్కజొన్న 180 00 మిర్చి 250 50 మొత్తం 3,053 2,875 గతేడాది కొట్టుకుపోయిన పెదవాగు ప్రాజెక్ట్ ఆనకట్ట -
జేఎంఈటీలు మళ్లీ ఉద్యోగంలోకి..
● టర్మినేట్ అయిన 43 మంది పునర్నియామకం ● సింగరేణి చరిత్రలో తొలిసారి అవకాశం సింగరేణి(కొత్తగూడెం): అధికార హోదా (జేఎంఈటీ–జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రెయినీ)లో ఉండి టర్మినేట్ అయిన 43 మంది అధికారులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. వారు విధులకు సక్రమంగా హాజరుకాకపోవడం, నిర్ణీత గడువులోకి స్టడీ సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతోపాటు పలు కారణాలతో టర్మినేట్ అయ్యారు. దీంతో యాజమాన్యం వారికి మరో అవకాశం కల్పించింది. 2023లో గుర్తింపు సంఘంగా ఎన్నికై న ఏఐటీయూసీ జేఎంఈటీల సమస్యను తెలుసుకుంది. అనంతరం యూనియన్ నాయకులు యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడంతో యాజమాన్యం ఈ నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరంతా సంస్థ ఏర్పాటు చేసిన హైకమిటీ ఎదుట తమ వివరాలు 45 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండి, (ఓవర్మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్, ఫస్డ్ ఎయిడ్ సర్టిపికెట్లు) సమర్పించుకోవాల్సి ఉంది. కమిటీ సూచన మేరకు ఫిట్నెస్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ప్రాథమిక అపాయింట్మెంట్ జారీ అన్ని పరీక్షలు పూర్తి అయితేనే జేఎంఈటీలకు ప్రాథమిక అపాయింట్మెంట్ను సంస్థ జారీ చేస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరిన జేఎంఈటీలకు గ్రేడ్–సీ, ప్రాథమిక నియామకం అందిస్తారు. తొలి ఏడాదిలో 190 మస్టర్లు తగ్గకుండా చేస్తే పర్మనెంట్ ఉద్యోగం వచ్చినట్లవుతుంది. లదంలే తిరిగి టర్మినేట్ అవుతారు. గతంలో బదిలీ వర్కర్లు, జనరల్ అసిస్టెంట్లు వివిధ కారణాలతో డిస్మిస్ అయితే సంస్థ వారికి ఉద్యోగ అవకాశం కల్పించేది. కానీ, సింగరేణిలో తొలిసారిగా టర్మినేట్ అయిన జేఏంఈటీలకు మరో అవకాశం కల్పించటం వారి అదృష్టం. ఇప్పటికై నా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి పనిచేసి, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి. –ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి -
అలుపెరుగని ఆటసారి..
భద్రాచలంటౌన్: కృషి ఉంటే మనుషులు ఋషుళవుతారు.. మహాపురుషులవుతారు.. అని ఒక సినీ కవి అన్నట్టుగానే సాధించాలనే తపన ముందు లక్ష్యం చిన్నదైపోతుందని నిరూపించాడు భద్రాచలం పట్టణానికి చెందిన బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగి డీవీ శంకర్రావు. 73 ఏళ్ల వయస్సు.. బైపాస్ సర్జరీ అయినా జీవితంలో ఏదైనా సాధించాలనే ఆకాంక్షతో బెంచ్ ప్రెస్ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయిలో ఒకేసారి నాలుగు బంగారు పతకాలు సాధించి అందరి మన్ననలు పొందాడు. భారత్లో బైపాస్ సర్జరీ చేసుకుని బెంచ్ ప్రెస్ 83 కిలోల విభాంగంలో నాలుగు బంగారు పతకాలు సాధించిన ఏకై క వ్యక్తిగా రికార్డ్ సాధించాడు. డీవీ శంకర్రావు 73 ఏళ్ల వయసులో జాతీయస్థాయి రికార్డు సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరు నెలల కృషితో.. ఎస్బీఐ ఉద్యోగిగా విరమణ పొందిన డీవీ శంకర్రావు రోజూ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకింక్ చేసేవారు. తోటి మిత్రుడు శోభన్నాయక్ సలహాతో పవర్ లిఫ్లింగ్లో కోచింగ్ కోసం స్థానిక సిటీ స్టైల్ జిమ్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో చేరారు. బైపాస్ సర్జరీ కావడంతో వైద్యుడు శివరామకృష్ణ ఆధ్వర్యంలో శంకరరావుకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తొలిసారి ఖమ్మంలో జరిగిన జిల్లాస్థాయి బెంచ్ ప్రెస్ పోటీల్లో 60 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు. తర్వాత హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించి.. గత నెల 2 నుంచి 7 వరకు కేరళలోని కోజికోడ్లో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్లింగ్ చాంపియన్షిప్లో ఏకంగా నాలుగు బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. 83 కిలోల విభాగంలో బరిలోకి దిగి, వ్యక్తిగత విభాగాల్లో మూడు, ఓవరాల్ చాంపియన్గా మరో బంగారు పతకం సాధించి, ఔరా అనిపించారు. ఇలా బైపాస్ సర్జరీ అయి, జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించిన ఏకై క క్రీడాకారుడిగా చరిత్రలో నిలిచిపోయారు. పతకాలు మిస్.. పతకాలు సాధించిన తర్వాత ఆటోలో శంకర్రావు బృందం వారు బస చేసిన చోటుకు బయలుదేరారు. పతకాలు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయి హోటల్ రూమ్కు వెళ్లిపోయారు. తర్వాత చూసుకుని కోజికోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆటోను గుర్తించి, మరుసటి రోజు బ్యాగును పోలీసులు శంకర్రావుకు అప్పగించారు. రికార్డుల కోసం నమోదు శంకర్రావు తాను సాధించిన ఘనతలపై లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ రికార్డ్స్ అకాడమీ, బెస్ట్ ఆఫ్ ఇండియన్ రికార్డ్స్కు దరఖాస్తు చేశారు. బైపాస్ సర్జరీ చేసుకుని కూడా ఒకేసారి నాలుగు బంగారు పతకాలు సాధించిన తీరుకు సంబంధించిన పూర్తి సమాచారం పంపించారు. జీవితంలో ఏదో సాదించాలనే తపన శంకర్రావులో చూసి పవర్ లిఫ్టింగ్లో శిక్షణ ఇచ్చాం. కానీ మా అంచనాలకు మించి ఆయన బంగారు పతకాలు సాధిస్తుంటే ఆశ్చర్యమేసింది. జాతీయస్థాయి పోటీల్లో ఒకేసారి నాలుగు బంగారు పతకాలు సాధించడంతో ఎంతో ఆనందపడ్డాం. 73 ఏళ్ల వయసులోనూ చిన్న పిల్లాడిలా వర్కవుట్లు చేస్తుంటారు. తన లక్ష్యాల సాధనకు మా వంతు కృషి చేస్తాం. –రామిరెడ్డి, జిమ్ కోచ్, భద్రాచలంజాతీయస్థాయిలో ఒకే సారి నాలుగు బంగారు పతకాలు సాధించడం సంతోషంగా ఉంది. ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొని సత్తా చాటాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తున్నాను. అనుకోకుండా పవర్ లిఫ్టింగ్ నేర్చుకుని జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించడం కలగా ఉంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన శిక్షకుడు రామిరెడ్డికి, వైద్యుడు శివరామకృష్ణకు ధన్యవాదాలు. –డీవీ శంకర్రావు, పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు -
మహిళా ‘వికాసం’
మహిళలు స్వయం ఉపాధి పొందుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాలనేదే లక్ష్యం. ఇప్పటివరకు 12 వేల మందికి పైగా శిక్షణ ఇచ్చాం. ఈ ఏడాది 350 మందికి వివిధ రంగాల్లో శిక్షణ కొనసాగుతోంది. ఉన్నతాధికారుల తోడ్పాటుతో మహిళాభివృద్ధికి కృషి చేస్తున్నాం. – వేల్పుల విజేత, మహిళా ప్రాంగణం మేనేజర్ ఖమ్మంఅర్బన్: మహిళలు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో ఖమ్మం నగరంలోని దుర్గాబాయి మహిళా వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం) పని చేస్తోంది. ఇక్కడ ఇప్పటివరకు 12 వేల మందికిపైగా మహిళలు వివిధ కోర్సుల్లో శిక్షణ పొంది ఆర్థికాభివృద్ధి సాధించారు. ఇంకా వందలాది మంది శిక్షణ పొందుతూనే ఉన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన కొందరు మహిళలు మరో బ్యాచ్ వారికి ట్రెయినర్లుగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు అంటున్నారు. శిక్షణతో పాటు వసతి.. మహిళా ప్రాంగణంలో వ్యవసాయం, టైలరింగ్, కంప్యూటర్లు, బ్యూటీషియన్, డ్రోన్ వినియోగం, నర్సింగ్ వంటి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. శిక్షణతో పాటు వసతి, భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పంటల సాగులో డ్రోన్ విని యోగంపై శిక్షణతీసుకోవాలంటే ప్రైవేట్గా అయితే రూ.45వేలు, కంప్యూటర్ కోర్సుకు రూ. 20వేలు, నర్సింగ్కు రూ.లక్ష వరకు ఖర్చవుతుండగా ఇక్కడ పూర్తి ఉచితంగా నేర్పిస్తున్నారు. పంటలపై పురుగుమందులు పిచికారీ చేయడంలో డ్రోన్ వినియోగం ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ కోర్సులో 45 రోజుల పాటు శిక్షణ ఇస్తుండగా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకు చెందిన 30 మంది ట్రెయినింగ్ పొందుతున్నారు. టైలరింగ్లో రెండునెలల పాటు శిక్షణ ఇస్తుండగా ప్రస్తుతం 30మంది, రెండునెలల కంప్యూటర్ కోర్సులో 30మంది, 45రోజుల బ్యూటీషియన్ శిక్షణ పొందుతున్న వారు 20మంది ఉన్నా రు. రెండేళ్ల నర్సింగ్ కోర్సులో 40మంది మహిళలకు శిక్షణ కొనసాగుతోంది. -
23 నుంచి దసరా వేడుకలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు అశ్వయుజ మాసంలో జరిగే ఉత్సవాలు, విజయ దశమి వేడుకల వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 2న జరిగే విజయదశమి వేడుకలతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 23 నుంచి రోజుకో అలంకరణలో భక్తులకు కనువిందు చేయనున్నారు. అక్టోబర్ 7న శబరి స్మృతియాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్రావు, వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. తొమ్మిదిరోజులపాటు ప్రత్యేక పూజలు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతీ ఏడాది తొమ్మిది రోజులపాటు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. స్వామివారి సన్నిధిలో తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుతారు. దశమి రోజున భక్తరామదాసు నిర్మించిన దసరా మండపంలో శమీ, ఆయుధ పూజలు, లీలా మహోత్సవం కనుల పండువగా నిర్వహిస్తారు. కాగా ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో 24 నుంచి 2వ తేదీ వరకు శ్రీరామాయణ పారాయణం జరగనుంది. ఇందులో భక్తులను, స్వామి వారి ఆరాధకులను ఈ ఏడాది భాగస్వామ్యం చేయనున్నారు. శ్రీలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అభిషేకం, చిత్రకూట మండపంలో సామూహిక శ్రీ రామాయణ పారాయణం, మధ్యాహ్నం శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిఽధిలో సామూహిక కుంకుమార్చనలు జరగనున్నాయి. అక్టోబర్ 2న శమీ, ఆయుధ పూజ, శ్రీ లీలా మహోత్సవం నిర్వహించనున్నారు. వచ్చే నెల 7న శబరి స్మృతి యాత్ర వచ్చే నెల 7వ తేదీన అశ్వయుజ మాస పౌర్ణిమ సందర్భంగా శబరి స్మృతి యాత్రను జరపనున్నారు. రాముడి అపర భక్తురాలు శబరికి ఫల, పుష్పాలతో అంజలి ఘటించనున్నారు. అదే రోజున వాల్మీకి జయంతి వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 20వ తేదీన నరక చతుర్దశి దీపావళి సందర్భంగా మూలమూర్తులకు తెల్లవారుజామున అభిషేకం, సాయంత్రం మంగళ స్నానాలు, ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.తేదీ అలంకారం పారాయణం ఈ నెల 23న ఆదిలక్ష్మి బాలకాండ 24న సంతాన లక్ష్మి అయోధ్యకాండ 25న గజలక్ష్మి అయోధ్యకాండ 26న ధనలక్ష్మి అరణ్యకాండ 27న ధాన్య లక్ష్మి కిష్కింధకాండ 28న విజయలక్ష్మి సుందరకాండ 29న ఐశ్యర్యలక్ష్మి యుద్ధకాండ 30న వీరలక్ష్మి యుద్ధకాండ అక్టోబర్ 1న మహాలక్ష్మి (నిజరూప) యుద్ధకాండ -
పత్తికి ప్రతికూలమే
● భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తి చేలు ● తేమ పెరిగి ఎర్రబారిన మొక్కలు ● రాలిపోతున్న పూత, పిందె, కాయలు ● దిగుబడిపై రైతుల్లో భయాందోళన బూర్గంపాడు: ఆగస్టు రెండో వారం వరకు ఆశాజనకంగా ఉన్న పత్తిచేలు, ఆ తర్వాత కురుస్తున్న భారీ వర్షాలతో దెబ్బతింటున్నాయి. అధిక వర్షాలతో చేలలో నీరు నిలిచి తేమ పెరగడంతో మొక్కలు ఎర్రబారుతున్నాయి. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలతో పూత, పిందె రాలిపోతున్నాయి. కొన్నిచోట్ల కాయ దశకు రాగా అవి నల్లబడి కుళ్లిపోతున్నాయి. దీనికి తోడు ఎడతెరిపిలేని వర్షాలతో చేలలో కలుపు పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది దిగుబడి ఎలా ఉంటుందోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. నిలిచిన ఎదుగుదల.. జిల్లాలో ఈ ఏడాది 2.15 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జూన్లో పత్తి గింజలు వేయగా, జూన్, జూలైలో కురిసిన సాధారణ వర్షాలతో పంట ఏపుగా పెరిగింది. ఆగస్టు రెండో వారం వరకు పత్తి చేలు పూత, పిందె, కాయలతో కళకళలాడాయి. ఆ తర్వాత నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో క్రమంగా దెబ్బతింటూ వస్తున్నాయి. గత 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పంటను మరింతగా కుంగదీశాయి. దసరా నాటికి పత్తి చేతికందుతుందని రైతులు ఆశించగా.. ఇటీవలి భారీ వర్షాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటికే రెండు విడతల ఎరువులు వేయడంతో పాటు మూడుసార్లు పై మందులు(దోమ, పురుగు, తెగుళ్ల మందులు) పిచికారీ చేశారు. అయితే వర్షాల కారణంగా పత్తిచేలలో ఎదుగుదల నిలిచిపోయింది. అధిక వర్షాలతో దోమ, పురుగు ఉధృతి పెరుగుతోంది. తేమశాతం ఎక్కువగా ఉండగా బూజు తెగుళ్లు, చీడపీడలు అధికమవుతున్నాయి. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు వానలు అడ్డంకిగా మారాయి. మందులు పిచికారీ చేస్తే వర్షానికి పనిచేయదని, మందులు, కూలీలు ఖర్చు వృథా ఆవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మొక్కకు 10 నుంచి 20 కాయల వరకు వర్షాలతో దెబ్బతిన్నాయని చెబుతున్నారు. దీంతో ఎకరాకు కనీసం రెండు క్వింటాళ్ల మేర నష్టం తప్పదని అంటున్నారు.జిల్లాలో నల్లరేగడి, లోతట్టు ప్రాంతాల్లోని పత్తి చేలే అధిక వర్షాలతో ఎక్కువగా దెబ్బతింటున్నాయి. అయితే ఎర్రరేగడి, ఇసుక, బెట్ట ప్రాంతాల్లో మాత్రం అంతగా నష్టం వాటిల్లడం లేదు. అయితే ఆ చేలలో కూడా పూత, పిందె, కాయలు కొంతమేర రాలిపోతున్నా మొక్కలు మాత్రం ఎర్రబారలేదు. పంట దెబ్బతిన్న ఈ తరుణంలో యూరియా వినియోగించాల్సి ఉండగా కొరత కారణంగా అందుబాటులో లేదు. దీంతో రైతులు వ్యవసాయ పనులు మానుకుని యూరియా కోసం నానా అగచాట్లు పడుతున్నారు. కొందరు రైతులు నానో యూరియా పిచికారీ చేస్తున్నారు. ఇక భారీగా కలుపు పెరుగుతుండగా తీసేందుకు వర్షాల ప్రభావంతో కూలీలు రావడం లేదు. ఇప్పటికే రూ.వేలు పెట్టుబడి పెట్టగా కనీసం ఆ డబ్బయినా తిరిగివస్తుందా లేదా అని రైతులు భయపడుతున్నారు. -
విద్యార్థినులకు పౌష్టికాహారం
భద్రాచలంటౌన్: బీఈడీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికరమైన ఆహారం అందిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. పట్టణంలోని బీఈడీ కళాశాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థినులకు వడ్డించే ఆహారాన్ని పరిశీలించారు. మెనూ అమలు, కళాశాలలోని సమస్యలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ చికెన్ సరఫరాలో ఆలస్యం కావడంతో కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది వంట విషయంలో అశ్రద్ధ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని ఏటీడీఓకు సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం ఏటీడీఓ అశోక్ కుమార్, టీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
పర్ణశాల ఆలయం మూసివేత
దుమ్ముగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం మూసేశారు. స్వామివారికి మధ్యాహ్నిక, సాయంకాల ఆరాధన, ఆరగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనం కల్పించి అనంతరం ఆలయ తలుపులు మూసేశారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ, శుద్ధి తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 7.30 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఇన్చార్జ్ అనిల్కుమార్ తెలిపారు. వైభవంగా చండీహోమంపాల్వంచరూరల్ : పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం, చండీహోమం, విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని యాగశాలలో చండీహోమం పూజ లు చేశారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణ పతి పూజలు చేశాక చండీహోమం జరిపారు. చి వరన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమం పూజలోపాల్గొన్న భక్త దంపతులకు అ మ్మవారి శేషవస్త్ర ప్రసాదాలను అందజేశారు. పూ జా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, సభ్యులు చందుపట్ల రమ్య, పాపారావు, రామిరెడ్డి, శ్రీనివాస్, సాయిబాబా, సుధాకర్, శేఖర్ అర్చకులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లి ఆలయం మూసివేత.. చంద్రగ్రహణం సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలనుంచి మూసివేశారు. సోమవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు. కొత్తగూడెం, భద్రాచలంలో నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొత్తగూడెం డివిజన్కు సంబంధించి కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో, భద్రాచలం డివిజన్కు సంబంధించి భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర సమస్యలు ఉన్నవారు కలెక్టరేట్లోని ఇన్వార్డ్ సెక్షన్లో తమ దరఖాస్తులను అందించి రశీదు పొందాలని, వాటిని సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపిప్తామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ఉండదని తెలిపారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు. కిన్నెరసాని నుంచి నీటి విడుదలపాల్వంచరూరల్: ఎగువ నుంచి కిన్నెరసాని జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులుకాగా, 1000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం నీటిమట్టం 405.50 అడుగులకు పెరిగింది. ప్రాజెక్ట్ గేటు ఎత్తి ఉంచి 5 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. -
న్యూఢిల్లీలో సీసీఆర్టీ ట్రైనింగ్కు ఎంపిక
దుమ్ముగూడెం : మండలంలోని పెదపాడు ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎం.మోహన్కుమార్ సీసీఆర్టీ ట్రైనింగ్కు ఎంపికయ్యాడు. మోహన్కుమార్ గత మే 25న జరిగిన జిల్లా స్థాయి బెస్ట్ ప్రాక్టీసెస్లో జిల్లా నుంచి ఎస్టీటీ కేడర్లో నామినేట్ అయ్యాడు. ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఎస్జీటీ బెస్ట్ ప్రాక్టీసెస్లో రాష్ట్రవ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేయగా, వారిలో జిల్లా నుంచి మోహన్కుమార్ ఉన్నాడు. వీరికి న్యూ ఢిల్లీలో సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్) 15 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. -
కొనసాగుతున్న నిమజ్జనం
● రాష్ట్ర నలుమూలల నుంచి గణనాథులతో తరలివచ్చిన భక్తులు ● గోదావరి ఒడ్డుకు ఇప్పటివరకు 1,595 ప్రతిమలు ● ఆకట్టుకున్న విభిన్న రూపాలు, విగ్రహాలు ● భారీ విగ్రహాల నిమజ్జనంలో ఆలస్యం భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని గోదా వరిలో నిమజ్జనం చేసేందుకు రాష్ట్ర నలుమూలాల నుంచి వినాయకుడి విగ్రహాలతో భక్తులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత భారీగా చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి కూడా విరామం లేకుండా సిబ్బంది వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు. కాగా, ఆదివారం ఉదయం కూనవరం రోడ్డులో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద నుంచి నిమజ్జన ఘాట్ వరకు బారులుదీరిన గణనాథులను ఒక్కొక్కటిగా గోదావరి ఒడ్డుకు చేర్చారు. రెండు రోజులుగా భద్రాచలంలో ఎండతీవ్రత ఎక్కువ గా ఉండటం ఆదివారం వర్షం పడటంతో నిమజ్జన ఘాట్ చల్లగా మారింది. ఆదివారం సాయంత్రం వరకు 353 గణేశ్ విగ్రహాలు రాగా, వీటిలో భారీ విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి నిమజ్జనం ఆలస్యమైంది. వారం రోజులుగా 1,595 గణపతి విగ్రహాలు గోదావరిలో నిమజ్జనమయ్యాయని సిబ్బంది తెలిపారు. బల్లకట్టు ఏర్పాటు చేస్తే.. ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్న గోదావరిలో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు రెండు లాంచీలను ఏర్పాటు చేశారు. కాగా ఇందులో ఒక లాంచీకి గేర్ బాక్స్లో సమస్య తలెత్తడంతో మరో చిన్న బోట్కు తాడుకట్టి నిమజ్జనానికి తీసుకు వెళ్లాల్సివస్తోంది. వచ్చే ఏడాది వరకై నా గోదావరిలో బల్లకట్టు ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్యలు ఉండవని భక్తులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది బల్లకట్టు ఏర్పాటు చేయాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అనుకున్నప్పటిటీ సాధ్యం కాలేదు. ఈ నెల 4న నిమజ్జన ఘాట్కు వచ్చిన కలెక్టర్ బల్లకట్టు ఏర్పాటుపై చర్చించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న లాంచీలు కూడా పాతవి. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు బల్లకట్టు ఏర్పాటుపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. -
వైరా ‘కారు’లో వార్!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య పోరు జిల్లా పార్టీకి తలనొప్పులు తెస్తోంది. ఎవరి అనుమతి లేకుండానే నియోజకవర్గంలోని కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు మండలాల కమిటీలను నియమించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉండగా అటు భద్రాద్రి, ఇటు ఖమ్మం జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకే జూలూరుపాడు కమిటీ ఎన్నిక జరిగిందని అక్కడి నేతలు ప్రకటించారు. కానీ ఎవరి ఆమోదం లేదని, ఇది పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనంటూ కమిటీలను రద్దు చేస్తూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. బహు నాయకత్వంతో గందరగోళం భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధికారంలో ఉన్న పదేళ్లు వైరా నియోజకవర్గంలో బహు నాయకత్వం రాజ్యమేలింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బానోతు చంద్రావతి పోటీ చేసి ఓడిపోగా.. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచిన బానోతు మదన్లాల్ బీఆర్ఎస్లో చేరారు. ఆపై 2018లో బానోతు మదన్లాల్ ఓడిపోగా, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్ బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్లో మొదటి నుంచి ఉన్న నేతలకు ఆదరణ దక్కకపోగా.. ప్రతీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తుండడంతో నాయకులు పెరిగి పార్టీ కేడర్లో అసంతృప్తికి కారణమైంది. కాగా, బీఆర్ఎస్లో మదన్లాల్ తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాక రాములునాయక్ చేరడంతో రాజకీయాలు మలుపు తిరిగాయి. పార్టీ కేడర్ రెండు వర్గాలుగా విడిపోవడమే కాక మదన్లాల్, రాములునాయక్ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగానే నిర్వహించారు. అయినా జిల్లా, రాష్ట్ర నాయకత్వాలు వర్గపోరును ఆపలేకపోయాయి. చివరకు 2023లో పార్టీ తరఫున మదన్లాల్కు టికెట్ ఇచ్చినా విజయం దక్కలేదు. చుక్కాని లేని నావలా.. అధికారంలో ఉండగా బహు నాయకత్వంతో ఇబ్బంది పడిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు.. అధికారం కోల్పోయాక నాయకత్వ సమస్య ఎదుర్కొంటున్నాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం మదన్లాల్కు టికెట్ ఇవ్వగా, సిట్టింగ్ ఎమ్మెల్యే రాములునాయక్ను బుజ్జగించినప్పటికీ ఆయన రాజీనామా చేశారు. అయితే, మదన్లాల్కు ఓటమి ఎదురుకావడం, ఆపై ఆయన మృతితో నియోజకవర్గంలో బీఆర్ఎస్కు నాయకత్వం కరువైంది. ప్రతిపక్షంలో ఉండడంతో ఏ ఆందోళన నిర్వహించాలన్నా సమన్వయం చేసే వారు లేకపోగా, మండల కమిటీల నియామకం కూడా కొన్నిచోట్ల జరగలేదు. ఎవరికి వారే.. ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్లో నైరాశ్యం నెలకొని, పార్టీ కేడర్ను పట్టించుకునే నాయకుడు కరువయ్యాడు. ఈక్రమంలోనే మండల కమిటీలు లేకపోగా అటు రాష్ట్ర, ఇటు జిల్లా అధిష్టానం అనుమతి లేకుండానే జూలూరుపాడు, ఏన్కూరు, కొణిజర్ల మండల కమిటీలను నియమించుకోవడం వివాదాస్పదమైంది. జూలూరుపాడులో గత నెల 31న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధుసూదన్ అనుమతితో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పగా, ఆతర్వాత ఏన్కూరు, కొణిజర్ల మండల కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ఆ నియామకాలు చెల్లవు మండల కమిటీల నియామకాలు చెల్లవని తాజాగా బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ ప్రకటించారు. అధిష్టానం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామకాలు జరగుతాయని, అప్పటి వరకు చేపట్టే నియామకాలు చెల్లవని పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. -
ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాలి
అశ్వారావుపేటరూరల్/మణుగూరురూరల్ : ఆధునిక సాంకేతిక విధానంలో పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలను శనివారం ఆయన సందర్శించారు. బోధన సిబ్బందితో మాట్లాడి వ్యవసాయ కోర్సులు, ఉన్నత విద్య తదితర అంశాలపై ఆరా తీశారు. ఉద్యానతోటల్లో అంతర పంటల సాగు, పంటల వైవిధ్యం, నూతన సాంకేతికతతో విద్యార్థులకు బోధన, మామిడి దేశ, విదేశీ వంగడాలు, కొబ్బరి తోటల్లో అంతర పంటల సాగు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఐ.వి. శ్రీనివాసరెడ్డి, ఏఓ శివరామ ప్రసాద్, ఏఈఓ ఆరేపల్లి సతీష్, బోధన సిబ్బంది రాంప్రసాద్, కె. శిరీష, టి. శ్రావణ్కుమార్, స్రవంతి, జాంబమ్మ, జెమీమ, దీపక్రెడ్డి పాల్గొన్నారు. పంటల సాగుపై సమీక్ష మణుగూరు మండలం గుట్టమల్లారం రైతు వేదికను సౌరభ్ శర్మ శనివారం సందర్శించారు. రైతువేదిక ప్రాంగణంలో మొక్క నాటిన తర్వాత పంటల సాగు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతపై అధికారులతో చర్చించారు. పంటల నమోదు, పంట కోత ప్రయోగాలు, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, బయో చార్కోల్, కంపోస్ట్ ఎరువు తయారీ, మునగ సాగు తదితర అంశాలను అధికారులు ఆయనకు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ బి.తాతారావు, ఏఓలు వెంకటేశ్వర్లు, చటర్జీ, రాహుల్రెడ్డి, ఏఈఓలు కొమరం లక్ష్మణ్రావు, నాగేశ్వరరావు, హారిక, రమేష్, రమాదేవి, సౌమ్య, సిబ్బంది సత్యనారాయణ, లక్ష్మీదేవి పాల్గొన్నారు.ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ -
అడవి రామవరం
అతి చిన్న పంచాయతీ..● గ్రామంలో ఓటర్లు 85 మంది ● పంచాయతీలో నాలుగు వార్డులుచుంచుపల్లి: ఆళ్లపల్లి మండలంలోని అడవి రామవరం జిల్లాలోనే అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామ గ్రామపంచాయతీగా నిలిచింది. గ్రామంలో కేవలం 85 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 40 మంది, పురుషులు 45 మంది ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 2న గ్రామాల వారీగా ఓటర్ల తుది జాబితాలు వెల్లడించారు. దీంతో అడవి రామవరం జిల్లాలో అతి చిన్న గ్రామపంచాయతీగా తేలింది. 2019లో 71 మంది ఓటర్లు అడవి రామవరం పినపాక నియోజకవర్గం ఆళ్లపల్లి మండలంలో అత్యంత మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి రహదారి సౌకర్యం లేని కుగ్రామం. 2018లో అప్పటి ప్రభుత్వం తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా మర్కోడు గ్రామం నుంచి విడదీసి అడవి రామవరాన్ని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. గ్రామంలో 105 మంది జనాభా నివసిస్తున్నారు. 2019లో తొలిసారిగా 71 మంది ఓటర్లతో నాలుగు వార్డులకు, సర్పంచ్ పదవికి ఎన్నికలు నిర్వహించారు. సర్పంచ్గా ఎస్టీ మహిళ ఎన్నికయ్యారు. గ్రామపంచాయతీ కార్యాలయం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనంలో కొనసాగిస్తున్నారు. గతంలో దొంగతోగు రికార్డు దొంగతోగు గ్రామం రాష్ట్రంలోనే అతిచిన్న పంచా యతీగా నిలిచింది. ఇది గుండాల నుంచి 2018లో కొత్త పంచాయతీగా ఏర్పాటైంది. 2019లో 36 మంది ఓటర్లతో నాలుగు వార్డులు, సర్పంచ్ స్థానానికి ఎన్నికలను నిర్వహించారు. తాజా లెక్కల ప్రకారం దొంగతోగు గ్రామపంచాయతీ ప్రస్తుతం 88 మంది ఓటర్లతో ద్వితీయస్థానంలో నిలిచింది. ఇందులో పురుషులు 48మంది, మహిళలు 40 మంది ఉన్నారు. అడవి రామవరం గ్రామానికి సంబంధించిన ఓటరు జాబితాను ఈ నెల 2న పంచాయతీ కార్యాలయంలో ప్రచురించాం. గ్రామంలోని 4 వార్డుల పరిధిలో కేవలం 85 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో అతి తక్కువ ఓటర్లు ఉన్న గ్రామంగా అడవి రామవరం నిలిచింది. –తంబాల పుష్పరాజ్, కార్యదర్శి, అడవిరామవరంఈ నెల 2న జిల్లాలోని 471 గ్రామ పంచాయతీల పరిధిలోని 4,168 వార్డులకు సంబంధించిన ఓట రు జాబితాలను ప్రచురించారు. మొత్తం 6,69, 048 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారికంగా లెక్క తేల్చారు. వీరిలో పురుషులు 3,25,045 మంది, మహిళలు 3,43,979 మంది, ఇతరులు 24మంది ఉన్నా రు. పురుషుల కంటే 18,934 మంది మహిళలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. గతేడాది సెప్టెంబర్లో ప్రకటించిన జాబితా కంటే 45,101 మంది ఓటర్లు ఎక్కువగా నమోదయ్యారు. అడవి రామవరం అత్యల్పంగా 85 మంది ఓటర్లును కలిగిఉండగా, ఆ తర్వాత దొంగతోగులో 88 మంది ఓటర్లు ఉన్నారు. నల్లబండబోడులో 144 మంది, వెంకటేష్ఖనిలో 183 మంది, చింతల తండాలో 219 మంది, పెద్దిపల్లిలో 252 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. జిల్లాలో అత్యధికంగా భద్రాచలం గ్రామపంచాయతీలో 20 వార్డుల పరిధిలో 40,761 మంది ఓటర్లు ఉన్నారు. -
ఎకో టూరిజం అభివృద్ధికి కృషి
పాల్వంచరూరల్ : కిన్నెరసాని అభయారణ్యంలో ఎకో టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) డాక్టర్ సువర్ణ అన్నారు. మండల పరిధిలోని కిన్నెరసానిని శనివారం సీసీఎఫ్ భీమానాయక్, డీఎఫ్ఓ జి.కిష్టాగౌడ్, వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బాబుతో కలిసి ఆమె సందర్శించారు. వాచ్టవర్, డీర్పార్కు, అద్దాలమేడ, కాటేజీలు, కిన్నెరసాని జలాశయం మధ్యలో ఉన్న ఆనందద్వీపాన్ని బోటులో వెళ్లి పరిశీలించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎకో టూరి జం అభివృద్ధి చేసి పర్యాటకులకు ఆహ్లాదంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రెక్కింగ్, సఫారీ టూర్ మ్యాప్ను సిద్ధం చేసి వారం రోజుల్లో పంపించాలని ఆదేశించారు. అటవీ శాఖ సిబ్బంది క్వార్టర్లు ప్రారంభం అశ్వాపురం: మండల పరిధిలోని మనుబోతులగూడెంలో నిర్మించిన అటవీ శాఖ సిబ్బంది క్వార్టర్లను పీసీసీఎఫ్ సువర్ణ ప్రారంభించారు. క్వార్టర్ల ఆవరణలో అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మనుబోతులగూడెంని ప్లాంటేషన్ను పరిశీలించారు. కార్యక్రమంలో సీసీఎఫ్, డీఎఫ్ఓతో పాటు ఎఫ్డీఓ మక్సూద్, ఎఫ్ఆర్ఓ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. అడవుల విస్తరణకు కృషి చేయాలి భద్రాచలంటౌన్: నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో అడవుల విస్తరణకు కృషి చేయాలని పీసీసీఎఫ్ సువర్ణ అధికారులను ఆదేశించారు. భద్రాచలంలో శనివారం ఆమె సీసీఎఫ్ క్యాంప్ కార్యాలయాన్ని, దుమ్ముగూడెంలో క్వార్టర్లను ప్రారంభించారు. అనతరం టింబర్ డిపోతో పాటు నర్సరీని పరిశీలించి మాట్లాడారు. అడవుల సంరక్షణ బాధ్యత సిబ్బందిపై ఉందని, సమన్వయంతో విధులు నిర్వహించి వనాలను కాపాడాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వినతి.. మణుగూరు టౌన్: ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపాడు పినపాక మండలాల్లో ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సువర్ణను కోరారు. ఈ మేరకు మణుగూరులో శనివారం వినతిపత్రం అందించారు. రహదారులు లేక గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. ఆయన వెంట సింగరేణి ఏరియా జీఎం దుర్గం రాంచందర్ ఉన్నారు.పీసీసీఎఫ్ సువర్ణ వెల్లడి -
ఆర్థిక లావాదేవీల్లో వివాదం
ఇల్లెందు/కారేపల్లి: ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన విబేధాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. మృతుడు, ప్రముఖ కాంట్రాక్టర్ గడిపర్తి శ్రీనివాసరావు(53).. ఇల్లెందు మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ)కు వరుసకు బావమరిది కావడం, ఘటనకు డీవీనే కారణమంటూ ఆయన బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. ఇల్లెందు కాకతీయనగర్కు చెందిన గడపర్తి శ్రీనివాసరావు – డీవీ కలిసి కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టు పనులు చేస్తుండగా ఏడాది నుంచి వివాదం మొదలైంది. డీవీ తనకు రూ.కోటిన్నర ఇవ్వాలని శ్రీనివాసరావు చెప్పినట్లు తెలుస్తుండగా, ఇదే విషయమై ఖమ్మంలో శుక్రవారం పెద్దల సమక్షాన పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. అక్కడ ఆయనను కొందరు దూషించినట్లు సమాచారం. అంతేకాక డీవీ అనుచరుడు దమ్మాలపాటి ప్రసాద్, ఆయన కుటుంబీకులు శ్రీనివాసరావు, ఆయన భార్య విషయంలో అసభ్యంగా మాట్లాడడంతోపాటు బాకీ రూ.కోటిన్నరలో రూ.49లక్షలే ఇవ్వాలని నిర్ణయించినట్లు పలువురితో ఫోన్లో చెప్పుకుని వాపోయినట్లు తెలిసింది. ఆతర్వాత ఏం జరిగిందో కానీ కారులో ఇల్లెందు బయలుదేరిన శ్రీనివాసరావుకు రమ రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ చేయగా కారేపల్లి క్రాస్ రోడ్కు వచ్చినట్లు చెప్పిన ఆయన ఆతర్వాత ఇంటికి చేరకపోగా ఫోన్ కూడా తీయలేదు. ఈక్రమంలోనే కుటుంబీకులు వెతుకుతుండగా కారేపల్లి – ఇల్లెందు మండలాల సరిహద్దు మొట్లగూడెంలోని ఆయన తోట వద్ద కారును గుర్తించారు. అందులో పరిశీలించగా కూర్చున్న స్థితిలోనే మృతి చెంది ఉండడం, పక్కనే పురుగుల మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్మ చేసుకున్నట్లు గుర్తించారు. డీవీ ఇంటి ఎదుట ఆందోళన శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించగానే కారేపల్లి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ఇల్లెందు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఘటనకు దమ్మాలపాటి వెంకటేశ్వరరావే కారణమంటూ మృతదేహాన్ని ఇల్లెందులోని ఆయన నివాసం వద్దకు తరలించారు. డీవీ ఇంటి ఆవరణలో మృతదేహాన్ని పెట్టి ఆందోళన ఆందోళన నిర్వహించారు. డీవీ వాహనం, ఫర్నీచర్ను సైతం ధ్వంసం చేయగా ఇల్లెందు సీఐ సురేష్, కారేపల్లి ఎస్ఐ బి.గోపి, సిబ్బంది అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. కాగా, శ్రీనివాసరావు ఆత్మహత్యకు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కుటుంబసభ్యులు, దమ్మాలపాటి ప్రసాదే కారణమంటూ మృతుడి భార్య రమ ఆరోపించారు. శుక్రవారం ఖమ్మంలో పంచాయితీలో ఉందని సమీప బంధువులు పాకాలపాటి చంద్రయ్య, భారతీరాణి తదితరులతో వెళ్లినశ్రీనివాసరావు మృతదేహంగారావడంతో కుటుం బీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.గోపి తెలిపారు. కాగా, ఇల్లెందు ఆస్పత్రిలో శ్రీనివాసరావు మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు. అయితే, ఖమ్మంలో శుక్రవారం రోజంతా నగదు విషయమై పంచాయితీ జరిగిందని సమాచారం. ఈక్రమాన తనకు రావాల్సిన రూ.1.50కోట్లకు బదులు రూ.49లక్షలే ఇస్తామనడం, పలువురు దూషించడంతోనే శ్రీనివాసరావుఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. డీవీ భార్య ఫిర్యాదుతో కేసు నమోదుఇల్లెందు: ఇంటికి మీదకు వచ్చి దాడి చేసిన సుమారు 50 మంది, అందుకు ప్రోత్సహించిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు భార్య బేబి భార్గవి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగిరెడ్డి, జానీపాష ప్రోద్బలంతో మీర్జంబేగ్, గడపర్తి వెంకటేశ్వర్లు, దుద్దుకూరి రోశమ్మ, శృతి, చింతనిప్పు కృష్ణారావు, చింతనిప్పు రాంబాబుతో మరికొందరు తమ ఇంటికి వచ్చి అద్దాలు, తలుపులు ధ్వంసం చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తహసీల్దార్ను బురిడీకొట్టించిన మాఫియా!
అశ్వారావుపేటరూరల్: అనుమతి లేకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్న మట్టి, ఇసుక మాఫియా ముఠాకు చెందిన కొందరు తహసీల్దార్కు చిక్కినట్లే చిక్కి బురిడీ కొట్టించి పారిపోయారు. మండలంలోని ఊట్లపల్లి, వినాయకపురం, జగన్నాథపురం, ఊట్లపల్లి గ్రామాల వైపు ఇసుక, మట్టిను ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ సిబ్బందితో కలిసి అశ్వారావుపేట–వినాయకపురం మార్గంలో తనిఖీ లు చేపట్టారు. ఈ క్రమంలో 8 ట్రాక్టర్లను పట్టుకుని పత్రాలను పరిశీలించగా, రెండింటికి మాత్రమే ఇసుక రవాణా అనుమతి పత్రాలు ఉన్నట్లు తేలింది. అనుమతి లేని ఆరు ట్రాక్టర్లను పట్టుకుని తన సిబ్బందితో తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. కాగా, పట్టుబడిన ట్రాక్టర్లను సిబ్బంది కార్యాలయానికి తరలిస్తుండగా, మార్గమధ్యలో ట్రాక్టర్లతో సహా పారిపోయారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ.. ట్రాక్టర్లను సీజ్ చేసేందుకు కార్యాలయానికి పంపించామని, కానీ మార్గమధ్యలో నుంచి పారిపోయినట్లు సిబ్బంది చెప్పారని తెలిపారు. ట్రాక్టర్ల వివరాలను సేకరించి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లతో సహా పరారీ -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నేడు పర్ణశాల ఆలయం మూసివేత దుమ్ముగూడెం : చంద్రగ్రహణం సందర్భంగా పర్ణశాల రామాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మూసివేస్తామని ఆలయ ఇన్చార్జ్ అనిల్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి సంప్రోక్షణ, వైదిక కార్యక్రమాల అనంతరం 7.30 గంటలకు దర్శనాలు పునఃప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. 13న జాతీయ లోక్ అదాలత్ పోలీసుల సూచనలు పాటించాలి : ఎస్పీ గణేశ్ నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి ఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలం : గణేశ్ నిమజ్జనోత్సవాల సందర్భంగా భక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఐటీడీఏ కార్యాలయ సిబ్బంది క్వార్టర్ల వద్ద గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం న్నదాన కార్యక్రమం నిర్వహించగా పీఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ వేడుకలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. పోలీసులు, ఇతర అధికారులు సూచనలు పాటిస్తూ విగ్రహాలను నిమజ్జనం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏటీడీఓ అశోక్ కుమార్, డీఈ హరీష్, టీఏ శ్రీనివాస్, ఆర్ఓఎఫ్ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, ఈఈ వెంకటస్వామి, డీడీ ప్రమీలాబాయ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు తప్పని పాట్లు
అశ్వాపురం/టేకులపల్లి : రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. విక్రయ కేంద్రాల వద్ద బారులుదీరడం తప్పడం లేదు. అశ్వాపురం మండలం నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద శనివా రం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కట్టారు. ఒక్కొక్కరికి రెండు బస్తాలు మాత్రమే విక్రయించడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అందరికీ సరిపోక కొందరు నిరాశగా వెనుదిరిగారు. టేకులపల్లి పీఏసీఎస్కు కూడా రైతులు భారీగా చేరుకుని క్యూలో నిల్చున్నారు. మధ్యాహ్నం భారీ వర్షం పడగా, కార్యాలయ వరండాలో నిల్చోవాలని అధికారులు సూచించారు. దీంతో వరుస క్రమం తప్పగా రైతుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు చేరుకుని రైతులను శాంతింపజేశారు.యూరియా కోసం అవే బారులు -
పోటెత్తిన ఆయిల్పామ్ గెలలు
దమ్మపేట: మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి శనివారం ఆయిల్పామ్ గెలలు పోటెత్తాయి. ఫ్యాక్టరీ బయట ప్రాంగణంలో గెలలతో వచ్చిన వందకు పైగా ట్రాక్టర్లు బారులుదీరా యి. ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం గంటకు 90 టన్నులు కాగా సాయంత్రం 5 గంటలకే 2,500 టన్నుల గెలలను ఫ్యాక్టరీలో ప్లాట్ఫాం కింద దిగుమతి చేశారు. ఇటీవల కొద్దిరోజులపాటు వర్షాలు కురిశా యి. ఆ సమయంలో గెలల కోత వీలుకాదు. వర్షాలు తగ్గిపోవడంతో రైతులు గెలలు కోస్తుండటంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీలకు పోటెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ మాట్లాడు తూ శనివారం రాత్రి వరకు 3 వేల టన్నుల గెలలు రావచ్చని తెలిపారు. రోజుకు సుమారుగా 1,500 టన్నుల మేరకు గెలలను క్రషింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక వాహనం అన్లోడ్ కావడానికి సుమారుగా 3గంటల సమయం పడుతోందని, ఆదివారంనుంచి యథావిధిగా అశ్వారావుపేట ఫ్యా క్టరీకీ గెలలను తరలించవచ్చని వివరించారు. అశ్వారావుపేటలో సామర్థ్యానికి మించి.. అశ్వారావుపేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి కూడా క్రషింగ్ సామర్థ్యానికి మించి గెలలు వచ్చాయి. సుమారు 700 టన్నుల గెలలు వచ్చినట్లు తెలుస్తుండగా, అంతకు మించి నిల్వ చేసేందుకు స్టాక్యార్డు కూడా లేదు. దీంతో శుక్రవారం నుంచి అటువైపు వెళ్లాల్సిన గెలలను కూడా అప్పారావుపేటకే తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా క్రషింగ్ సామర్థ్యానికి మించి గెలలు వస్తున్నాయి. అప్పారావుపేట ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం గంటకు 90 టన్నులు కాగా, ఆ మేరకు క్రషింగ్ జరగనట్లు తెలుస్తోంది. రోజుకు 1,800 టన్నులను క్రషింగ్ జరగాల్సి ఉండగా యంత్రాల్లోని లోపాల కారణంగా 1,500 టన్నులనే క్రషింగ్ చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం గంటకు 30 నుంచి 60 టన్నులకు పెంచామని యాజమాన్యం పేర్కొంటున్నా.. ఆ మేరకు క్రషింగ్ జరగడం లేదని రైతులు చెబుతున్నారు. అప్పారావుపేట ఫ్యాక్టరీవద్ద బారులుదీరిన 100 ట్రాక్టర్లు -
గణంగా వీడ్కోలు !
గంగమ్మ ఒడికి చేరిన వినాయక విగ్రహాలు ● జిల్లాలో ఘనంగా నిమజ్జనోత్సవాలుగోదావరిలో నిమజ్జనానికి లాంచీలో తరలిస్తున్న వినాయక విగ్రహాలు నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లా వ్యాప్తంగా శనివారం గణపతి శోభాయాత్రలు, నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శోభాయాత్రను ప్రారంభించగా.. పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు హాజరై విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలం వద్ద వినాయక నిమజ్జనోత్సవాలను ఎస్పీ రోహిత్రాజుతో పాటు పలువురు అధికారులు పరిశీలించి భక్తులకు సూచనలు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి 8 గంటల వరకు గోదావరిలో 1091 విగ్రహాలను నిమజ్జనం చేయగా, అర్ధరాత్రి దాటాక కూడా వేడుక కొనసాగింది. ఆదివారం చంద్రగ్రహణం ఉండడంతో కొందరు సోమవారం కూడా నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే జిల్లాలో ప్రతిష్ఠించిన వాటిలో అత్యధిక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శనివారమే పూర్తయింది. – భద్రాచలంఅర్బన్/కొత్తగూడెంటౌన్ -
రూ. 2 లక్షలు పలికిన లడ్డూ
అశ్వారావుపేటరూరల్: వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట రికార్డు స్థాయిలో ధర పలికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అశ్వారావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్దగల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా శనివారం 37 కేజీల స్వామి వారి లడ్డూకు వేలంపాట నిర్వహించారు. అశ్వారావుపేటకు చెందిన సెల్ఫోన్ షాపు వ్యాపారి శీమకుర్తి జితేంద్ర అత్యధికంగా రూ.2 లక్షలకు లడ్డూను కై వసం చేసుకున్నాడు. కాగా ఇక్కడి మండపంలో గతేడాది స్వామివారి లడ్డూ వేలం పాటలో రూ.38 వేలు పలికింది. ‘గణేష్’ లడ్డూను కై వసం చేసుకున్న ముస్లింఇల్లెందు: ఓ ముస్లిం యువకుడు వేలంపాటలో గణేష్ లడ్డూను కై వసం చేసుకుని మతసామరస్యం చాటాడు. పట్టణంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో 6వ లైన్ పరుశురాం యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో శనివారం లడ్డూ వేలం పాట నిర్వహించారు. దీంతో ముస్లిం యువకుడు ఇమామ్ పాల్గొని రూ. 49,116కు కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడి యూత్ సభ్యులు అభినందించారు. కాగా శనివారం ఇల్లెందులో ఘనంగా వినాయక నిమజ్జనం జరిగింది. సత్యనారాయణపురం కుంటలో నిమజ్జనం చేశారు. వినాయక ప్రతిమల ఊరేగింపుతో పట్టణంలో సందడి నెలకొంది. -
మొక్కలు నాటి పరిరక్షించాలి
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య చర్ల: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య పిలుపునిచ్చారు. బయోడైవర్సిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఐటీసీ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని కొయ్యూరు శివారు అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని అన్నారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల విజయ భాస్కర్రెడ్డి, నాయకులు సోడి చలపతి, ఇందుల బుచ్చిబాబు, బండారు రామకృష్ణ, మేడిచర్ల వీరకుమార్, ఆవుల పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలిబీఆర్ఎస్ జిల్లా అఽధ్యక్షుడు రేగా కాంతారావు మణుగూరు రూరల్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ జిల్లాఽ అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ పోశం నర్సింహరావు, నాయకులు లక్ష్మణ్, ముత్యంబాబు, అడపా అప్పారావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ఆవుల నర్సింహరావు, వేర్పుల సురేష్, అక్కి నర్సింహరావు, మేకల రవి, జావిద్పాషా, బోశెట్టి రవి, గుర్రం సృజన్ పాల్గొన్నారు. సింగరేణిలో 49 మంది అధికారుల బదిలీసింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని ఈఅండ్ఎం విభాగంలో పనిచేస్తున్న 49 మంది అధి కారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్వోడీ ఏజే మురళీధర్ రా వు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు ఏజీఎంలు, ఏడుగురు డిజీఎంలు, 19 మంది ఎస్ఈలు, 10 మంది డీవైఎస్ఈలు, ఆరుగురు ఈఈలు, ఇద్దరు జేఈలు ఉన్నారు. వీరంతా ఈ నెల 19లోపు కేటాయించిన ప్రదేశాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీజే సౌండ్కు కుప్పకూలిన మహిళనేలకొండపల్లి: వినాయక నిమజ్జనంలో ఏర్పా టు చేసిన డీజే శబ్దంతో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. మండలంలోని మంగాపురంతండా లో శనివారం రాత్రి గణేశ్ శోభాయాత్ర జరుగుతుండగా డీజే పాటలకు అనుగుణంగా భూక్యా పార్వతి నృత్యం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కుప్పకూలగా స్థానికంగా చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. అలాగే, మండల కేంద్రంలో వినాయక శోభాయాత్రలో భాగంగా బాణసంచా కాల్చేక్రమాన ప్రమాదంజరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతంతో మేకల కాపరి మృతితిరుమలాయపాలెం: మేకలు మేపేందుకు వెళ్లి చెట్టుకొమ్మలు కొడుతున్న క్రమాన విద్యుదాఘాతానికి గురైన కాపరి మృతి చెందాడు. మండలంలోని ఇస్లావత్తండాకు చెందిన ఇస్లావత్ సక్లాల్ (26) వ్యవసాయంతో పాటు మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం మేకలతో అడవికి వెళ్లిన ఆయన చెట్ల కొమ్మలు కొట్టి వేస్తుండగా, ఆపైన ఉన్న విద్యుత్ లైన్ తాకడంతో షాక్కు గురై పక్కనే బావిలో పడ్డాడు. కొద్దిసేపటికి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని బయటకు తీయించారు. సక్లాల్కు భార్య సరిత ఉంది. ఆయన తండ్రి నాగులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుక్కల దాడిలో లేగదూడ.. నేలకొండపల్లి: చెరువుమాధారంలో కుక్కలుదాడి చేయగా లేగ దూడ మృతి చెందింది.గ్రామానికి చెంది న రైతు తెల్లగొర్ల అనిల్ అప్పుడే పుట్టిన లేగదూడను శనివారం పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. ఈక్రమాన కుక్కల గంపు దాడిచేసి దూడనుఈడ్చుకెళ్లి దాడి చేయడంతో చనిపోయింది. మరికొన్ని పశువుల వెంట పడడంతో స్థానికులు స్పందించగా కుక్కలు పారిపోయాయి. -
కెమిస్ట్రీ అధ్యాపకుడికి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్రం అధ్యాపకుడు గుగులోతు వీరన్నకు హైదరాబాద్లోని జేఎన్టీయూ నుంచి డాక్టరేట్ లభించింది. ప్రొఫెసర్లు వడ్డే రవీందర్, సీహెచ్.వెంకటరమణారెడ్డి పర్యవేక్షణలో ఆయన ‘న్యూ పర్సెక్టివ్స్ ఇన్ట్రాన్షిషన్ మెటల్ క్యాటలిస్టు డిజైన్ సింథసిస్ అండ్ హోమోజీనియస్ ఆక్సిడేషన్ అండ్ ఇపాక్సిడేషన్’ అంశంపై పరిశోధనాపత్రం సమర్పించారు. ఈమేరకు కామేపల్లి మండలం మద్దులపల్లికి చెందిన వీరన్న డాక్టరేట్ అందుకోగా, ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా, అధ్యాపకులు ఏఎల్.శాస్త్రి, ఎం.మాధవరావు, సీహెచ్.సుధాకర్, పి.సర్వేశ్వరరావు, ఎం.సునంద, సత్యవతి తదితరులు అభినందనలు తెలిపారు. సంత వేలం.. రూ.6.63లక్షలు కారేపల్లి సంతకు గత ఏడాది కంటే రూ.1.33లక్షలు అధికం కారేపల్లి: కారేపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యాన ప్రతీ ఆదివారం కొనసాగే సంత నిర్వహణను అప్పగించేందుకు శుక్రవారం వేలం నిర్వహించారు. నార్కట్పల్లికి చెందిన వెంకటేశ్వర్లు, కారేపల్లికి రాము, పండితాపురం గ్రామానికి చెందిన మేకల మహేష్బాబు యాదవ్, రాములు పాల్గొనగా ఏడా ది కాలానికి అత్యధికంగా రూ.6.63లక్షలకు పాడిన మహేష్బాబు దక్కించుకున్నారు. గత ఏడాది రూ.5.30లక్షలు పలకగా ఈసారి రూ.1.33లక్షలు అధికంగా నమోదైంది. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఓ నల్లమోతు శేషయ్య ఆధ్వర్యాన వేలం నిర్వహించగా సంతగుడి మాజీ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్తో పాటు వాసురెడ్డి సంపత్, మూడ్ మోహన్ చౌహాన్, జవ్వాజి రంగయ్య పాల్గొన్నారు. పేకాట శిబిరంపై దాడిదమ్మపేట: మండలంలోని చిన్నగొల్లగూడెం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు శుక్రవారం దాడిచేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, ఏడుగురు వ్యక్తులు పరారయ్యారు. మూడు ద్విచక్ర వాహనాలు, రూ.2,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. -
రూ.350 కోట్లతో ప్రతిపాదనలు
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ రూ.350 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, దేవాదాయ శాఖ ఉన్నతాఽధికారులు ప్రాథమిక నమూనా సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో కలెక్టర్ ఆలయ అధికారులతోపాటు వైదిక కమిటీ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి ఉంటుందని, ప్రధాన ఆలయంలో మార్పులు లేకుండా ఇతర అభివృద్ధి పనులు చేపతామని పేర్కొన్నారు. నాలుగు విడతలుగా.. రామాలయం, పరిసర ప్రాంతాల అభివృద్ధి నాలుగు విడతల్లో చేపట్టేలా నూతన నమూనాలో ప్రతిపాదనలు రూపొందించారు. తొలి విడతలో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ పూర్తి చేయాలని ప్రతిపాదించారు. మండపాలు, క్యూ హాళ్లు, ప్రసాదం విభాగం, అడ్మినిస్ట్రేషన్ భవనాలు ఉన్నాయి. ఇందుకు రూ. 115 కోట్లు అవసరమని సూచించారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల అభివృద్ధిని రెండో విడతలో ప్రాధాన్యాంశాలుగా పేర్కొన్నారు. ఇందులో విస్తా కాంప్లెక్స్, అడ్మిన్ బ్లాక్, ఘాట్లు, రహదారులు ఉన్నాయి. ఈ పనులను రూ.35 కోట్లతో ప్రతిపాదించారు. మూడో విడతలో కరకట్టకు దిగువ భాగాన ఉన్న కాపా రామలక్ష్మమ్మ భూమిని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇది గతంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండగా, సుదీర్ఘ కాలం కోర్టులో వాదనల అనంతరం రామాలయ సొంతమైంది. ఇందులో రామాయణ మ్యూజియం, తూము నర్సింహాదాసు ఆడిటోరియం, భక్త రామదాసు ప్లాజా, మల్టీ లెవల్ పార్కులు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు రూ.100 కోట్లతో ప్రతిపాదించారు. ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి పనులకు నాలుగో విడతలో ప్రతిపాదించారు. హోటళ్లు, గిరిజన మ్యూజియం, రామవనం, పట్టణ సుందరీకరణ పనుల చేపట్టేలా పొందుపర్చారు. ఇందుకోసం రూ.100 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇలా మొత్తం రూ.350 కోట్లతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీన్ని సర్కారు ఆమోదించి తగిన బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంది. భద్రాచలం రామాలయ అభివృద్ధికి ప్రణాళిక -
హోరాహోరీగా ప్రచారం
పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ(పాల్వంచ) ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఈ నెల 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 3,008 ఓట్లు ఉండగా, గెలుపే లక్ష్యంగా ఎవరికీవారు పావులు కదుపుతున్నారు. రాజకీయ పార్టీల తరహాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 13 డైరెక్టర్ పోస్టులకు 46 మంది నామినేషన్లను సమర్పించారు. ముగ్గురు రెండుసార్లు సమర్పించడంతో స్క్రూట్నీలో తొలగించారు. ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో 37 మంది మిగిలారు. గురువారం గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచార హోరు సాగిస్తున్నారు. భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కర్మాగారంలో వివిధ విభాగాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కార్మికుల ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని కోరుతున్నారు. మూడు చోట్ల పోలింగ్ ఈ నెల 10న మూడు కర్మాగారాల్లో ఓటింగ్ జరగనుంది. కేటీపీఎస్ డీఏవీ పాఠశాలలో మూడు బూత్లు, బీటీపీఎస్(మణుగూరు)లో రెండు బూత్లు, వైటీపీఎస్(దామరచర్ల, నల్లగొండ)లో రెండు బూత్లు ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం పాల్వంచలో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ప్రచారానికి రూ. లక్షల్లో ఖర్చు అభ్యర్థులు ప్రచారానికి రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. కేటీపీఎస్ కాంప్లెక్స్లోని కాలనీలు, కర్మాగారాల పరిసరాలు, కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సామాజిక వర్గాల వారీగా ఓట్లు రాబట్టుకునేందుకు మూడు రోజులుగా మద్యం పార్టీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కార్మికులతో బేరసారాలు సాగిస్తూ ఎన్నికల ముందు రోజు నగదు పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు సైతం విధులకు డుమ్మా కొట్టి ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణకరకగూడెం: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై శుక్రవారం మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి విచారణ చేపట్టారు. చిరుమళ్ల గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర భార్య చందా భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కరకగూడెం మండల కేంద్రంలోని ఆమెకు చెందిన పట్టా భూమిని కొందరు వ్యక్తులు ట్రాక్టర్తో దున్నిన ఘటనలో కేసు నమోదుకాగా, డీఎస్పీ విచారించారు. బాధితురాలు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఘటనాస్థలిని పరిశీలించి, సాక్షులను విచారించారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆమోదిస్తే సవరణే...
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ సవరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత ఏడాది జూన్లో ధరల సవరణకు ప్రభుత్వం కమిటీలను నియమించింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీలు అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ భూముల విలువ సవరణకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వానికి నివేదించారు. ఆతర్వాత ప్రక్రియ నిలిచిపోయింది. గతనెలలో ఓఆర్ఆర్ లోపల, వెలుపల 20 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలోనే విలువ సవరణ ప్రతిపాదనలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించింది. కానీ రాష్ట్రమంతటా సవరించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించడంతో గతేడాది పంపిన ప్రతిపాదనల మేరకు పెంచేలా కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. రెండేసి కమిటీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా బహిరంగ మార్కెట్లో భూముల ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్ విలువ నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంది. గతంలో అత్యధిక ధర ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం మార్కెట్ విలువ స్తబ్దుగా ఉంది. వీటిని సవరించేందుకు గత ఏడాది జూన్లో కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామీణ కమిటీలకు ఆర్డీఓ చైర్మన్గా, తహసీల్దార్, ఎంపీడీఓ, మార్కెట్ వాల్యూ సబ్ రిజిస్ట్రార్లు సభ్యులుగా, స్థానిక సబ్ రిజిస్ట్రార్ను కన్వీనర్గా ఉన్నారు. అర్బన్ కమిటీలకు అదనపు కలెక్టర్(రెవెన్యూ) చైర్మన్గా, జెడ్పీ సీఈఓ, మున్సిపల్ కమిషనర్, సుడా వైస్ చైర్మన్లు సభ్యులుగా, స్థానిక సబ్ రిజిస్ట్రార్ను కన్వీనర్గా నియమించారు. ప్రభుత్వానికి నివేదికలు కమిటీలు పలు ప్రాంతాల్లో ధరల్లో తేడాలను పరిశీలించాయి. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల విలువ సవరణ కోసం ప్రతిపాదనలను గత ఏడాది జులైలో ప్రభుత్వానికి పంపారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ విలువ, బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా కొన్నిచోట్ల పెంపు, ఇంకొన్ని చోట్ల తగ్గింపునకు ప్రతిపాదించారు. వీటి ప్రకారం ఖమ్మం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో భూ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. కమర్షియల్ ప్రాంతాలను పక్కాగా గుర్తించి ధరలు పెంచేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. పూర్తిస్థాయి పరిశీలన కోసం.. భూముల మార్కెట్ విలువ సవరణపై ప్రభుత్వానికి నివేదిక అందాక ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించారు. ధరల పెంపు మరింత పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా వ్యత్యాసాలు ఉండకూడదని ఆదేశించారు. దీంతో ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కర్ణాటకలో పరిశీలనకు ఓ కమిటీ వెళ్లగా.. అందులో జిల్లా రిజిస్ట్రార్ కూడా ఉన్నారు. ప్రతిపాదనలకే సై... ఉమ్మడి జిల్లాలో భూముల మార్కెట్ విలువ సవరణపై అందిన ప్రతిపాదనలను ఆమోదించే అవకాశముందని తెలుస్తోంది. తద్వారా ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతంలోని రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం, చింతకాని మండలం వందనం, కొణిజర్ల మండలం తనికెళ్ల, అమ్మపాలెం రెవెన్యూ పరిధిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువ భారీగా పెరిగే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ప్రభుత్వ, బహిరంగ మార్కెట్ ధర ఆధారంగా అన్నిరకాల భూముల ధరలు 50 శాతం వరకు పెరగొచ్చని భావిస్తున్నారు. కాగా, బహిరంగ మార్కెట్ ధరకు దగ్గరగా ఉన్న చోట మాత్రం యథావిధిగా కొనసాగించన్నుట్లు తెలుస్తోంది. కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధి : నివాస ప్రాంతాల్లో గజం కనీస ధర రూ.300 నుంచి రూ.500కు, గరిష్ట ధర రూ.29,900 నుంచి రూ.32వేల మేర పెంపునకు ప్రతిపాదించారు. వాణిజ్య ప్రాంతాల్లో కనీస ధర రూ.1,700 నుంచి రూ.2 వేలకు, గరిష్ట ధర రూ.29,900 నుంచి రూ.32వేలకు పెంచాలని సూచించారు. అపార్ట్మెంట్లో చదరపు అడుగు ధరను రూ.1,300 నుంచి రూ.1,500కు, గరిష్ట ధర రూ.3వేల నుంచి రూ.3,200 పెంచొచ్చని తెలిపారు. వ్యవసాయ భూమి ఎకరా కనీస ధర రూ.2,25 లక్షల నుంచి రూ.4,లక్షలకు, గరిష్ట ధర రూ.52.50 లక్షల నుంచి రూ.55 లక్షలకు పెంచేలా ప్రతిపాదించారు. భద్రాచలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం : నివాస ప్రాంతాల్లో గజం కనీస ధర రూ.500 నుంచి రూ.800కు, గరష్ట ధర రూ.7,800 నుంచి దానిని రూ.10వేలకు పెంచొచ్చని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. వాణిజ్య ప్రాంతాల్లో కనీస ధర రూ.4,800 నుంచి రూ.6 వేలకు, గరిష్ట ధర రూ.7,800 నుంచి రూ.15 వేలకు ప్రతిపాదించారు. అపార్ట్మెంట్లలో కనీస ధర రూ.1,300 నుంచి రూ.1,500కు పెంచాలని, గరిష్ట ధరను కొనసాగించాలని సూచించారు. వ్యవసాయ భూమి ఎకరా కనీస ధరను రూ.2,25 లక్షల నుంచి రూ.4లక్షలకు, గరిష్ట ధర రూ.2.25లక్షల నుంచి రూ.4లక్షలకు మించి పెంచేలా ప్రతిపాదించారు. -
అస్తవ్యస్తంగా విద్యాశాఖ!
కొత్తగూడెంఅర్బన్: డీఈఓ సహా ఎంఈఓలు కూడా ఇన్చార్జిలే కావడంతో జిల్లా విద్యాశాఖలో పర్యవేక్షణ కొరవడింది. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో విద్యార్థులకు నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. పాలన కూడా గాడితప్పుతోంది. గత నెలలో డీఈఓ వెంకటేశ్వరాచారి ఉద్యోగ విరమణ చేశారు. దీంతో జెడ్పీ సీఈఓకు ఇన్చార్జ్ డీఈఓ బాధ్యతలు అప్పగించారు. అప్పటికే గందరగోళంగా మారిన విద్యాశాఖ ఇన్చార్జిలతో అస్తవ్యస్తంగా తయారవుతోంది. విద్యాశాఖ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. కుమ్ములాటలు ఎక్కువ కావడంతో ఓ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్కు గురయ్యాడు. ఇన్చార్జులే అధికం.. జిల్లా విద్యాశాఖలో డీఈఓ సహా ఎంఈఓలు అందరూ ఇన్చార్జులే. ప్రస్తుతం డీఈఓ నాగలక్ష్మి జెడ్పీ సీఈవోగా కూడా పని చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆమె ఎక్కువ సమయం ఎన్నికల విధులకే కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యాశాఖపై దృష్టి సారించడం కష్టమవుతోంది. జిల్లాలోని 23 మండలాల్లో ఒక్కరూ రెగ్యులర్ ఎంఈఓ లేరు. దీంతో పర్యవేక్షణ కుంటుపడుతోంది. ఎంఈఓలు పాఠశాలల హెచ్ఎంలుగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. హెచ్ఎం, ఎంఈఓ విధులతోపాటు పాఠ్యంశాల బోధన కూడా చేయాల్సి ఉంటుంది. దీంతో వారిపై పనిభారం పడుతోంది. ఫలితంగా విద్యార్థులకు సరైన బోధన అందడంలేదు. అన్ని రకాల బిల్లుల్లో కూడా జాప్యం జరుగుతోంది. పదో తరగతి విద్యార్థులపై కూడా ప్రభావం పడుతోంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించలేదు. ప్రత్యేక తరగతుల్లో ఇచ్చే స్నాక్స్పై కూడా స్పష్టత లేదు. విద్యాశాఖ కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు పక్క జిల్లాల నుంచి రోజూ విధులకు వచ్చి వెళ్తున్నారు. సమయపాలన పాటించకుండా ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారు. డీఈఓ కార్యాలయంలో చేతులు తడపందే పనులు కాని పరిస్థితి నెలకొంది. విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి రెగ్యులర్ డీఈఓను నియమించాలని లేదా ఖమ్మం తరహాలో అదనపు కలెక్టర్కు/విద్యాశాఖలోని అధికారులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్లోనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ జరగాల్సి ఉంది. కొరత ఉన్న పాఠశాలల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల నుంచి టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉంది. సబ్జెక్ట్ టీచర్ల కొరత లేకుండా చూడాలి. కానీ సెప్టెంబర్ వచ్చినా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ జరగలేదు. జిల్లాలో ఈ సంవత్సరం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఆదర్శ బోధన పద్ధతులు అవలంబించేవారిని ఆధారాలతో గుర్తించి ఉత్తములుగా ఎంపిక చేయాల్సి ఉంది. కానీ దరఖాస్తుదారులందరినీ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘స్వగృహ’ మాకే కావాలి!
ఖమ్మం సహకారనగర్: ఎన్నో ఏళ్ల అనంతరం సొంత ఇంటి కల నెరవేరుతుందనే ఆశతో ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా... వారి ఆశలను అడియాసలు చేసేలా కొందరు వ్యాపారులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో ఏళ్ల క్రితం రాజీవ్ స్వగృహ పేరిట నిర్మాణం మొదలుపెట్టిన అపార్ట్మెంట్ల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఆతర్వాత ఎవరూ పట్టించుకోలేదు. సుమారు ఏడేళ్లుగా ఉన్నవి ఉన్నట్లుగా తమకు కేటాయిస్తే మిగతా నిర్మాణం చేసుకుంటామని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన పలు మార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, చివరకు ముఖ్యమంత్రిని సైతం కలిశారు. ఈ వినతిపై ఇటీవలే స్పందన రావడంతో ఒక్కో అడుగు ముందుకు పడుతుండగానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగంలోకి దిగడం వారిని ఆందోళనకు గురిచేస్తోందని సమాచారం. హౌసింగ్ పీడీ పరిశీలన రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ఉద్యోగులకు నిర్ణీత ధరతో కేటాయించేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన సమావేశమై ఫ్లాట్ల ధర చదరపు అడుగుకురూ.1,150గా నిర్ణయించారు. అదే అభివృద్ధి చేశాక రూ.2,500గా ఖరారు చేశారు. అభివృద్ధి తర్వాత రాజీవ్ స్వగృహ ప్రాంగణం ఎలా మారనుందో బ్రోచర్లు ముద్రించారు. ఈక్రమంలోనే హౌసింగ్ పీడీ వీ.పీ.గౌతమ్ ఇటీవల పరిశీలించి సూచనలు చేశారు. ఆపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ కూడా సమీక్షించి రాజీవ్ స్వగృహ ప్రాంగణాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలంగాణ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీకి కేటాయిస్తామని ప్రకటించారు. తొలి దఫాగా రూ.5కోట్లు రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం తొలిదశలో ప్రభుత్వానికి రూ.5కోట్లు చెల్లించాల్సి ఉండడంతో నగదు సేకరణలో ఉద్యోగ సంఘాలు నిమగ్నమయ్యాయి. అలాగే, ఖమ్మం కలెక్టర్ సమీక్ష సందర్భంగా మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నందున వరద నుంచి ఎలాంటి ముప్పు ఉండదని, బఫర్ జోన్ కాకపోవడంతో భవిష్యత్లోనూ ఇబ్బందులు ఉండవని తెలిపారు. దీంతో ఉద్యోగులు ఫ్లాట్లు బుక్ చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.గతంలో రెండు సార్లు రాజీవ్ స్వగృహను వేలం వేయగా ఏ ఒక్క వ్యాపారి ముందుకు రాలేదు. కనీసం టెండర్లు కూడా దాఖలు చేయలేదు. కానీ మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తుండడం, నిర్మాణ ప్రాంతం బఫర్ జోన్ పరిధిలోకి రాదని ఏకంగా ఖమ్మం కలెక్టర్ ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుకొస్తున్నట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యాన నిర్మించిన బ్రోచర్లు కూడా ఆకట్టుకునేలా ఉండడంతో వ్యాపారులే సముదాయాన్ని దక్కించుకుని అభివృద్ధి చేశాక అధిక ధరలో అమ్ముకోవాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. అయితే, ఏళ్ల అనంతరం సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో ఉన్న ఉద్యోగులు ఈ ప్రచారంతో ఆందోళన చెందుతుండగా.. ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. -
ఇకపై పీఏసీఎస్ల ద్వారానే..
● డీలర్ల ద్వారా యూరియా పంపిణీ నిలిపివేత ● రైతుల ఇబ్బందుల నేపథ్యాన ప్రభుత్వ నిర్ణయం ● ఇప్పటికే పాలేరు నియోజకవర్గంలో అమలు ఖమ్మంవ్యవసాయం: యూరియా పంపిణీని పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)ల ఆధ్వర్యంలోనే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం 40 శాతం మేర డీలర్ల ద్వారా, మిగతా పీఏసీఎస్ల ఆధ్వర్యాన పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే యూరియాకు ఈసారి కొరత ఏర్పడగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యాన పీఏసీఎస్ల ద్వారా పంపిణీ చేస్తేనే ఎరువులు పక్కదారి పట్టకుండా పారద్శకత ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే ఈ విధానం అమలవుతుండగా, మిగతా ప్రాంతాల్లోనూ అమలుచేయనున్నారు. డీలర్లకు నిలిపివేత ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని 500 డీలర్లకు యూరియా సరఫరాను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇకపై పూర్తిగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ జరుగుతుంది. పీఏసీఎస్లకు దూరంగా ఉన్న గ్రామాల్లో సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేస్తారు. పాలేరు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ఈ విధానాన్ని జిల్లాలోని 76 పీఏసీఎస్ల పరిధిలో అమలుకు నిర్ణయించారు. ఇందుకోసం సహకార సంఘాలకు తోడు మరో 55 సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో ఏఈఓల ద్వారా కూపన్లు జారీ చేయనుండగా, పీఏసీఎస్ల సీఈఓలు, ఉద్యోగులు యూరియా అందిస్తారు. మరో రెండు వ్యాగన్ల యూరియా పందిళ్లపల్లి రేక్ పాయింట్కు రెండు రోజుల్లో రెండు వ్యాగన్ల యూరియా రానుందని ఖమ్మం జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఒక్కో వ్యాగన్లో 2,600 మెట్రిక్ టన్నుల యూరియా ఉంటుందని పేర్కొన్నారు. ఈ యూరియాను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు సరఫరా చేస్తామని తెలిపారు. కాగా, శుక్రవారం ఉమ్మడి జిల్లాకు 1,333 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, ఇందులో ఖమ్మం జిల్లాకు 483, భద్రాద్రి జిల్లాకు 500, మహబూబాబాద్ జిల్లాకు 250 మెట్రిక్ టన్నుల చొప్పున కేటాయించామని వెల్లడించారు. -
ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నిక
అధ్యక్ష,కార్యదర్శులుగా పవన్ కుమార్, మహేష్పాల్వంచ: టీజీ జెన్కో, ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల పరిధిలోని అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఫలితాలు శుక్రవారం వెల్లడించారు. కేటీపీఎస్ కాలనీలోని ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్లో ఎలక్షన్ ఆఫీసర్ బి.రవికుమార్ ఆధ్వర్యంలో కౌంటింగ్ నిర్వహించారు. అసోసియేషన్లో సుమారు 2,500 మంది సభ్యులు ఉండగా, ఈ నెల 2న రాష్ట్రంలో సుమారు 25 చోట్ల పోలింగ్ నిర్వహించారు. మొత్తం 1,814 ఓట్లు పోలయ్యాయి. 14 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగడం విశేషం. అధ్యక్షుడిగా గువ్వల పవన్కుమార్ (ట్రాన్స్కో), జనరల్ సెక్రటరీగా తాళ్లపల్లి మహేష్(జెన్కో–కేటీపీఎస్), అసోసియేట్ ప్రెసిడెంట్గా కె.కుమారస్వామి, అడిషనల్ జనరల్ సెక్రటరీగా కె.రామకృష్ణ ఎన్నికయ్యారు. వీరితోపాటు ఎం.చందు, జి.శ్రీపాల్ రెడ్డి, కె.వెంకటేష్, ఆర్సీ, భరత్కుమార్, వి.మహిపాల్, డి.వంశీ, హెచ్.రంజిత్ రెడ్డి, ఆర్.కిరణ్, డి.మహేష్, జి.శ్రీకాంత్, కె.చంద్రశేఖర్ రెడ్డి, ఎం.నాగేంద్ర, దయానంద్, టి.సందీప్ రెడ్డి, ఎ.శ్రీకాంత్, ఎ.శ్రీనివాస్, పి.రజినికాంత్, బి.నరేష్, శ్రీకాంత్, వై.శ్రావణ్కుమార్, తుమ్మల నవీన్, ఎం.దిలీప్ కుమార్, సీహెచ్.నవీన్ కుమార్లు వివిధ పోస్టులకు పోటీ చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఏఈల సమస్యల పరిష్కారానికి కోసం కృషి చేస్తామని తెలిపారు. అనంతరం స్వీట్లు పంచుకుని సంబురాలు నిర్వహించారు. -
గురువులదే గురుతర బాధ్యత
● ఐటీడీఏ పీఓ రాహుల్ ● గిరిజన ఉపాధ్యాయులకు ఘన సత్కారంభద్రాచలం: విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులేదనని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గిరిజన భవన్లో నిర్వహించిన గురుపూజోత్సవాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కవిత రూపంలో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ విద్యతోపాటు సామాజికంగా విద్యార్థులను తీర్చదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 116 పాఠశాలలకు మెడికల్ కిట్లు అందించారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. సన్మానం చేశారు. ఉద్దీపకం–2 రూపకల్పనలో సహకారం అందించినవారికి కూడా పురస్కారాలు ఇచ్చారు. బీఈడీ, డీఈడీ కళాశాలల్లో 100 శాతం ర్యాంకుల సాధనకు కృషి చేసిన లెక్చరర్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మణెమ్మ, రమేష్, రాములు, అశోక్ కుమార్, చంద్రమోహన్, అలివేలు మంగతాయారు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తరలివస్తున్న గణనాథులు
భద్రాచలంఅర్బన్: భక్తి, శ్రద్ధలతో పూజలందుకున్న గణనాథులను గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా శనివారం వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం భద్రాచలం గోదావరి వద్ద పోలీసు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ బందోబస్తు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో గతేడాది 1,300 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయగా, ఈసారి జిల్లావ్యాప్తంగా 2 వేల ప్రతిమలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 729 విగ్రహాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. భద్రాచలంలో ప్రతిష్టించిన అధిక శాతం వినాయక ప్రతిమల నిమజ్జనం మొదలుకాగా, రెండు, మూడు రోజులుగా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వినాయక విగ్రహాలను తీసుకొస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతోపాటు సమీప జిల్లాల నుంచి భక్తులు తీసుకొచ్చే వినాయక విగ్రహాల నిమజ్జనం శని, ఆదివారాల్లో కొనసాగనుంది. భద్రాచలంలోని మండపాల వద్ద లడ్డూ వేలం పాట నిర్వహించాక గణపతి బప్పా మోరియా అంటూ నిమజ్జనానికి శోభాయాత్రగా బయలుదేరారు. శోభాయాత్ర వీక్షణకు భక్తులు బారులుదీరడంతో పట్టణంలోని రహదారులు, గోదావరి కరకట్ట వద్ద రద్దీ నెలకొంది. భక్తులు తీసుకొచ్చిన విగ్రహాలను గోదావరి తీరంలో దించి.. ఆ తర్వాత వరుస క్రమంలో క్రేన్ల ద్వారా లాంచీల్లో ఎక్కించి గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నదిలోకి విగ్రహాలను తీసుకెళ్లేలా పడవలను సమకూర్చి గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. మాది హైదరాబాద్లోని ఎల్బీ నగర్. రాధేకృష్ణ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు నిర్వహించి భద్రాచలం వద్ద గోదావరిలో నిమజ్జనం చేసేందుకు వచ్చాం. మా చేతులతో నిమజ్జనం చేయాలని అనుకున్నాం. కానీ పోలీసుల సూచనలతో సిబ్బందికి విగ్రహాన్ని అప్పగించాం. మేము నాలుగేళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మూడుసార్లు హైదరాబాద్లోనే నిమజ్జనం చేశాం. ఈసారే భద్రాచలం వచ్చాం. – పాండురంగ, రాధేకృష్ణ యూత్, హైదరాబాద్ఇప్పటికే దూరప్రాంతాల నుంచి భద్రగిరికి వినాయక ప్రతిమలు -
ఉత్తములకు అవార్డుల ప్రదానం
కొత్తగూడెంఅర్బన్: కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయులకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు దేశ భవిష్యత్కు మార్గనిర్దేశకులు అని పేర్కొన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందిన చండ్రుగొండ మండలం గుర్రాయిగూడెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బి.ప్రవీణను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, డీఈఓ నాగలక్ష్మి, చండ్రుగొండ ఎంఈఓ అభినందించారు. అనంతనం మిగతా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విత్తన సేకరణలో పాఠశాలలకు బహుమతులు ఇల్లెందురూరల్/జూలూరుపాడు: విత్తన సేకరణలో జూలూరుపాడు హైస్కూల్ మండలస్థాయిలో ప్రథమ బహుమతి దక్కించుకుంది. శుక్రవారం కలెక్టర్ జితేష్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణలు రూ.5,000లు నగదు పురస్కారం, జ్ఞాపికను ఉపాధ్యాయులకు అందజేశారు. ఇల్లెందు మండలం ముత్తారపుకట్ట ప్రాథమిక పాఠశాలకు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కబ్బాకుల రవి, ఉమ, శాంతకుమారిలను అభినందించారు. మణుగూరు ప్రిన్సిపాల్కు రాష్ట్రస్థాయి అవార్డు మణుగూరు టౌన్: మణుగూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నల్లగడ్డ సత్యప్రకాశ్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రిన్సిపాల్గా అవార్డు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రాణా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సత్యప్రకాశ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసేందుకు మరింత కృషి చేస్తానని తెలిపారు. -
హోరాహోరీగా ప్రచారం
కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కొత్త మాస్టర్ ప్లాన్పై ఆలయ వైదిక కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి తమను సంప్రదించకుండానే ప్లాన్ రూపొందించటంపై కినుక వహించినట్లు తెలుస్తోంది. గతంలో చినజీయర్ స్వామి సూచనతో ఆనంద సాయి రూపొందించిన ప్లాన్ను వీరు ఆమోదించారు. అయితే ప్రస్తుత ప్లాన్పై వీరు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం పర్యటన సమయంలో వైదిక కమిటీ సలహాలను తప్పకుండా తీసుకోవాలని, వారి ఆమోదం తర్వాతే ప్లాన్ను ఫైనల్ చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే వైదిక కమిటీ, పండితులు, దేవాదాయ శాఖ అధికారులు సమష్టిగా ఈ ప్రణాళికను ఆమోదిస్తేనే ఆలయాభివృద్ధి కల సాకారం కానుంది. లేదంటే ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశమే ఉండదు. -
నేచర్ పార్కులో సౌకర్యాలు కల్పిస్తాం
పాల్వంచరూరల్/ఇల్లెందు రూరల్/గుండాల: ఇల్లెందు కోరగుట్ట చుట్టూ అటవీశాఖ తీర్చిదిద్దిన నేచర్ పార్క్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సువర్ణ అన్నారు. ఇల్లెందు మండలం రొంపేడు అటవీ ప్రాంతంలో ప్లాంటేషన్ను, కోరగుట్ట వద్ద నేచర్ పార్క్ను శుక్రవారం ఆమె సందర్శించారు. కిన్నెరసాని అభయారణ్యం పరిధిలోని రేగళ్ల, ఆళ్లపల్లి, రంగాపురం ఏరియాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ప్లాంటేషన్లు, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫలాలనిచ్చే మొక్కలు నాటాలని సూచించారు. పార్క్లో ఏర్పాటు చేసిన వాచ్టవర్ను ప్రారంభించారు. శనివారం కిన్నెరసాని డీర్ పార్కు, జలాశయం మధ్యలోని ఆనంద ద్వీపాన్ని సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్ భీమా నాయక్, డీఎఫ్వో కిష్టాగౌడ్, ఎఫ్డీఓలు బాబు, కరుణాకరాచారి, ఎఫ్ఆర్ఓ చలపతిరావు, డీఆర్వోలు వెంకటరావు, వీరబాబు, ఎఫ్బీఓ సుజాత పాల్గొన్నారు.పీసీసీఎఫ్ సువర్ణ -
● అంకితభావంతోనే అవార్డు
పాల్వంచ: పాల్వంచలోని కొమ్ముగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు పర్చా సత్య శ్రీదేవి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. తాను బోధించే గణితంలో పదో తరగతిలో 100 శాతం ఫలితాలు రావడమే కాక, సొంత డబ్బుతో పాఠశాలలో పలు సౌకర్యాలు కల్పించారు. 1996లో ఉద్యోగంలో చేరిన సత్య శ్రీదేవి..మొదట పాల్వంచ అభ్యున్నత బాలికోన్నత పాఠశాలలో పని చేసి, కొమ్ముగూడెం పాఠశాలకు బదిలీ అయ్యారు. సమయ పాలన, విధుల్లో అంకితభావంతో ఉండడమే కాక విద్యార్థులతో కలిసిపోయి చదువులో ప్రోత్సహించేవారు. రూ.70వేల వ్యయంతో పాఠశాలలో ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్, రూ.35 వేలతో సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేశారు. విస్తృతంగా మొక్కలు నాటించడమే కాక సొంత ఖర్చుతో పలు రకాల హెర్బల్, క్రోటాన్, పూల మొక్కలు నాటించి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా కృషి చేశారు. అంతేగాక తెలంగాణా మ్యాఽథ్స్ టీచర్స్ ఫోరం సభ్యురాలిగా ఎన్నికై పలు కార్యక్రమాలు నిర్వహించారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. -
ఎమ్మెల్యే సార్ !
ఆత్మగౌరవానికి ప్రతీక.. ఎమ్మెల్యేగా ఖద్దరు బట్టల్లో నిత్యం కనిపించినప్పటికీ ఏదైనా స్కూల్కు వెళ్లి విద్యార్థులను కలిసేప్పుడు కచ్చితంగా పైన కోటు ధరిస్తాను. కోటుతో హుందాతనం వస్తుంది. ఆత్మగౌరవం పెరుగుతుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిన్ననాటి నుంచి అనేక కష్టాలు అనుభవించినా ఆత్మగౌరవ ప్రతీకగా సూటు కోటు ధరించేవారు. నేను ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ స్థాయికి వచ్చాను. అందుకే విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఫుల్ సూట్ ధరిస్తుంటాను. బియ్యంలో పురుగులు ఏరుకుని.. మాది దమ్మపేట మండలం గండుగులపల్లి. తల్లిదండ్రులు చుక్కమ్మ, సత్యనారాయణ. మాకు నాలుగెకరాల పొలం ఉండేది. అయినా ఆర్థిక ఇబ్బందులు మా కుటుంబాన్ని వెంటాడుతూనే ఉండేవి. అందుకే నా చదువంతా ఆశ్రమ పాఠశాలల్లోనే సాగింది. ఐదో తరగతి వరకు అంకంపాలెం, ఆ తర్వాత పదో తరగతి వరకు పార్కలగండి ఆశ్రమ స్కూళ్లలో, ఇంటర్ కిన్నెరసాని స్పోర్ట్స్ కాలేజీలో చదివాను. అప్పుడు ఆశ్రమ పాఠశాలకు సరఫరా చేసే బియ్యంలో పురుగులు ఎక్కువగా ఉండేవి. ప్రతీ ఆదివారం విద్యార్థులందరం ఆ పురుగులు ఏరేవాళ్లం. అలా శుభ్రం చేసిన బియ్యాన్నే ఆ తర్వాత వారం పాటు వండిపెట్టేవారు. అలా డిగ్రీ వరకు ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ)గా 2005లో సున్నంబట్టి స్కూల్లో ఉద్యోగం సాధించా. 1998లో ప్రెసిడెంట్ మెడల్.. హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్లో చురుగ్గా ఉండేవాడిని. ఈ క్రమంలో 1998లో ఒడిశాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి (వరల్డ్ జంబోరి) పోటీల్లో 48 దేశాలు పోటీపడగా భారత్ నుంచి ఎనిమిది మందిమి ప్రాతినిధ్యం వహించాం. అందులో నాకు ‘ఎ’ గ్రేడ్ రావడంతో అప్పటి ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణ్ చేతుల మీదుగా ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నాను. స్కౌట్స్లో పని చేయడం వల్ల చిన్నతనంలోనే క్రమశిక్షణ, సమయ పాలన, సామాజిక బాధ్యతలు అలవాటయ్యాయి. స్పోర్ట్స్ జూనియర్ కాలేజ్లో ఉన్నప్పుడు రన్నింగ్, జావెలిన్త్రో, హైజంప్ బాగా చేసేవాడిని. దీంతో శారీరక దారుఢ్యం పెరిగింది. మ్యాథ్స్లో ఎమ్మెస్సీ పూర్తి చేసినప్పటికీ డిమాండ్ ఉన్న లెక్కల టీచర్గా వెళ్లడం కంటే విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పే పీఈటీగా పని చేసేందుకే మొగ్గు చూపాను. రాజకీయ ప్రస్థానం.. మా మేనమామ ముత్యాలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. ఆయన ప్రోద్బలంతో 2014లో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అశ్వారావుపేట నుంచి పోటీ చేశా. ఆ సమయంలో నాచుట్టూ ఎప్పుడూ కార్యకర్తలే ఉండేవారు. కానీ ఓటమి తర్వాత పక్కన ఉండే కేడర్ సంఖ్య తగ్గుతూ వచ్చింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్నందుకు హేళన చేసేవారు. ఇది చాలదన్నట్టు ఆ ఎన్నికల్లో నాపై నెగ్గిన తాటి వెంకటేశ్వర్లు సైతం బీఆర్ఎస్లో చేరారు. దీంతో 2019 ఎన్నికల్లో టికెట్ ఆయనకే కన్ఫర్మ్ అయింది. ఆ ఎన్నికల్లో గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్లో చేరడంతో పార్టీలో నేను మూడో స్థానానికి పడిపోగా పలకరించే వారు కరువయ్యారు. క్రమశిక్షణ.. సమయపాలన.. స్కౌట్స్లో పని చేయడం వల్ల చిన్నప్పటి నుంచి అలవడిన క్రమశిక్షణ, సమయపాలన నాకు అండగా నిలిచాయి. కష్టాలు ఎదురైనా నీరుగారిపోకుండా లక్ష్యం వైపు నడిచేలా దోహదం చేశాయి. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అశ్వారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. ఒక వ్యక్తి లేదా సమాజం ఎదుగుదలలో విద్య ప్రాముఖ్యత తెలిసిన వాడిని కాబట్టే ఎమ్మెల్యే కోటాలో వచ్చిన రూ.10 కోట్ల నిధుల్లో రూ. 5 కోట్లు విద్య మీదనే ఖర్చు పెట్టాను. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నా. మా ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువ. అందుకే విద్యా పరిమాణాలు ఉద్యాన రైతులకు చేరువ చేసేందుకు హార్టికల్చరల్ యూనివర్సిటీని అశ్వారావుపేటలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నా.ఆచార్యా.. ఆదర్శంవిద్యార్థుల్లో స్ఫూర్తి కోసమే సూటు బూటు విద్యార్థులకు ఆరంభంలోనే క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు నేర్పిస్తే వారి జీవితాల్లో వెలుగు రేఖలు రావడంతో పాటు పేదరికం తొలగిపోతుంది అంటున్నారు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. గతంలో ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పని చేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తన గళం వినిపిస్తున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా, ఎమ్మెల్యేగా అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
● వ్యవసాయ కళాశాల డీన్కు..
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. ఇప్పటికే ఆయన జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు అందుకోగా, తాజాగా మరోసారి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో గత 18 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న హేమంత్కుమార్.. 51 పరిశోధన పత్రాలు సమర్పించారు. దీంతో 2017 నుంచి 2023 వరకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో 31 అవార్డులు అందుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు పంటల సాగు, యాజమాన్య పద్ధతులు, వ్యవసాయ విస్తరణ సేవలు అందించడంతో పాటు వ్యవసాయ కళాశాలలో స్ఫూర్తిదాయకంగా బోధన చేస్తున్నారు. కాగా, హేమంత్కుమార్కు మరో అవార్డు రావడం పట్ల వ్యవసాయ కళాశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. -
భూ సేకరణపై కలెక్టర్ సమీక్ష
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో నూతన బొగ్గు ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ కోసం సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులతో గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లో ప్రతిపాదిత బొగ్గు గనులను త్వరగా ప్రారంభించేలా భూ సేకరణతో పాటు అటవీ శాఖ అనుమతులపై చర్చించారు. సమావేశంలో డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ కిష్టాగౌడ్, ఆర్డీఓ మధు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల జీఎంలు శాలేంరాజు, దుర్గం రాంచందర్, వీసం కృష్ణయ్య, డీజీఎం(ఎస్టేట్స్) టి.హీర్యా తదితరులు పాల్గొన్నారు. -
నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం గోదావరి వద్ద వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గోదావరి ఘాట్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ఆయన సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిమజ్జనం విధులు నిర్వర్తించే సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉండాలని, ప్రమాదాల నివారాణకు కృషి చేయాలని అన్నారు. విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొచ్చే భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, డీజే, సౌండ్ బాక్సులు ఏర్పాటు చేయొద్దని కోరారు. కాగా ఈ ఏడాది భద్రాచలంలో సుమారు రెండు వేల విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉందన్నారు. బల్లకట్టు ఏర్పాటుకు చర్యలు.. గోదావరి నదిలో జరిగే అన్ని కార్యక్రమాలకు(తెప్పోత్సవం, ఏరు ఫెస్టివల్, వినాయక, దుర్గామాత విగ్రహాల నిమజ్జనం) ఉపయోగపడేలా బల్లకట్టు ఏర్పాటుకు మత్స్యశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇక కరకట్ట వద్ద అనధికార డంపింగ్ యార్డులో వేసే చెత్తతో గోదావరి నీరు కలుషితం అవుతోందని అన్నారు. రోడ్డుపైన, అనధికార డంపింగ్ యార్డులో చెత్త, బయోవేస్ట్ డంప్ చేసేవారికి జరిమానా విధించాలని, అయినా తీరు మారకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఈఓ శ్రీనివాసరావును ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ, డీఈఈ మధుసూదన్, జేఈ వెంకటేష్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్, టౌన్ సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.భద్రాచలంటౌన్: గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా అర్హులకే అందాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలులో భాగంగా ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించాలని, పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాల్లో మునగ, ఇప్ప, ఇతర చెట్లు నాటించాలని, వాటి ద్వారా కలిగే లాభాలను వివరించాలని అన్నారు. అనంతరం మూడు రోజుల శిక్షణ పూర్తయిన సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో పీఓ రాహుల్, ఏపీఓ డేవిడ్రాజ్, ఏఓ సున్నం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్.వి.పాటిల్ -
కనీస వేతనాలు చెల్లించాలి
ఇల్లెందు: ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ అనుబంధ తెలంగాణ రారష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం ఇల్లెందులోని ఐతా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన యూనియన్ జిల్లా 4వ మహాసభలో ఆమె మాట్లాడారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని కోరారు. డబ్ల్యూహెచ్ఓ లాంటి అంతర్జాతీయ సంస్థలు ఆశా వర్కర్ల సేవలు గుర్తించినా కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవం కల్పించడంలేదని ఆరోపించారు. ప్రమాద బీమా సదుపాయం రూ.50 లక్షలు అందజేస్తామని ప్రకటించి జీఓ విడుదల చేయటం లేదని విమర్శించారు. తొలుత యూనియన్ నాయకులు చీమల రమణ సంఘం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాచారి, ఉపాధ్యక్షుడు ఎంవీ అప్పారావు, కోశాధికారి జి. పద్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యాదర్శి దుబ్బా ధనలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ, ఎస్ఏ నబీ, ఈసం వెంకటమ్మ, టి. కృష్ణ, సుల్తానా, వజ్జా సుశీల, హైమా, భాగ్య, విజయ, సుజాత, సుగుణ పాల్గొన్నారు. ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి -
● మణుగూరు కళాశాల ప్రిన్సిపాల్కు..
మణుగూరు టౌన్: అశ్వాపురానికి చెందిన నల్లగడ్డ సత్యప్రకాశ్ 2002లో గుంటూరులో అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి 2021 మార్చిలో అశ్వాపురం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ప్రతి ఏటా గౌతమీ ఫౌండేషన్ సహాయంతో 30 మంది పేద విద్యార్థులకు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున, మరికొందరు పేద విద్యార్థులకు ఐటీసీ ద్వారా ఏడాదికి రూ.లక్ష విలువ చేసే నోట్బుక్స్ అందించేలా కృషి చేశారు. అనంతరం మణుగూరు జూనియర్ కళాశాల ప్రిన్సి పాల్గా బదిలీ అయి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కళాశాల రూపురేఖలు మార్చడంతో పాటు అదనపు తరగతులు, సీసీ రోడ్ల నిర్మాణానికి విశేష కృషి చేశారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేశారు. ఎఫ్సెట్, నీట్లో విద్యార్థులకు శిక్షణనిస్తూ పరీక్షలకు సన్నద్ధం చేశారు. గతేడాది స్వచ్ఛంద సంస్థ సహకారంతో 100 రోజులు విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయించారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 163 మంది పిల్లలు ఉండగా ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్య 240కి పెంచి ప్రభుత్వ కళాశాల బలోపేతానికి విశేష కృషి చేశారు. గత ఆగస్టు 15న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ జితేష్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు అందుకున్నారు. సత్యప్రకాశ్ను ప్రస్తుతం రాష్ట్ర స్థాయి అవార్డు వరించడం పట్లఅధ్యాపకులు, విద్యార్థులు చేస్తున్నారు. -
కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు..
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం గోదావరి నదిలో వినాయక నిమజ్జనాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 8 గంటల వరకు 315 విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి మరింతగా పెరిగే అవకాశం ఉందని, ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గణపతి లడ్డూ @ రూ.లక్షదమ్మపేట : మండలంలోని మొద్దులగూడెం వినాయకుడి మండపం వద్ద గురువారం లడ్డూ వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన బాల వెంకటేశ్వరరావు రూ.లక్షకు కై వసం చేసుకున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావుతో పాటు కుటుంబసభ్యులు ముకుందం, శ్రీనివాసరావు, రవికి లడ్డూ అందజేశారు. వ్యవసాయ క్షేత్రాల్లో ట్రెయినీ కలెక్టర్టేకులపల్లి: మండలంలోని బేతంపూడిలో గల వ్యవసాయ క్షేత్రాలను ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ గురువారం పరిశీలించారు. వరి, మొక్కజొన్న, మిర్చి, టమాట పంటలను సందర్శించి రైతులతో మాట్లాడారు. పంటలకు పెట్టుబడి ఖర్చు ఎంత అవుతుంది, ఎంత ఆదాయం వస్తుందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన నీటికుంటల తవ్వకం, చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. ఆయన వెంట ఏఓ నీరుడు అన్నపూర్ణ, ఏఈఓలు శ్రావణి, విశాల ఉన్నారు. సహకార కార్యదర్శుల బదిలీలపై స్టే ఖమ్మంవ్యవసాయం: డీసీసీబీ పరిధి పీఏసీఎస్ల కార్యదర్శుల బదిలీపై హైకోర్టు స్టే ఇచ్చింది. బదిలీలపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా ప్రస్తుత స్థానాల్లో కొనసాగించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీసీసీబీల పరిధిలో కార్యదర్శులను బదిలీ చేయగా, ఖమ్మం డీసీసీబీ పరిధిలో 69మందికి స్థానచలనం కల్పించారు. దీనిపై రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్లగొండతో పాటు ఖమ్మం కార్యదర్శులు 35మంది కోర్టును ఆశ్రయించటంతో స్టే వచ్చింది. ఫలితంగా మొత్తం కార్యదర్శుల బదిలీ ప్రక్రియ ఆగిపోయినట్లేనని భావిస్తున్నారు. ఈ అంశంపై డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకట ఆదిత్యను గురువారం కలిసి బదిలీల్లో మార్పు చేయాలని కోరారు. అయితే, కేసు విరమించుకుంటే పునఃపరిశీలనకు అవకాశముందని తెలుస్తోంది. -
● ‘గురి’ తప్పని మారెప్ప
పాల్వంచరూరల్: అశ్వారావుపేట మండలం గొప్పన్నగూడెం గ్రామానికి చెందిన మారెప్ప ప్రస్తుతం కాచనపల్లి బాలిక క్రీడాపాఠశాలలో ఆర్చరీ కోచ్గా పనిచేస్తున్నారు. గతంలో కిన్నెరసాని గిరిజన క్రీడా పాఠశాలలో పనిచేశారు. ఆర్చరీలో జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారు. 1989–90లో రష్యా, ఇటలీలో జరిగిన పోటీల్లో పాల్గొని ఇండియా టీమ్ బ్రాంజ్ మెడల్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. వ్యక్తిగత విభాగంలో సిల్వర్మెడల్ సాధించారు. మారెప్ప వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు క్రీడా రంగాల్లో ఉన్నతస్థానాలకు చేరారు. కాచనపల్లి బాలికల క్రీడా పాఠశాలకు చెందిన అవంతిక, బి.సంజనశ్రీ, ఎం.గౌతమి, కె.అనందుజ, కె.లక్ష్మీసౌజన్య, కె.లవణ్య జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపారు. కిన్నెరసాని విద్యార్థులు శివశంకర్ ఆర్మీలో, వెంకన్న రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారు. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది ప్రతిభ కలిగిన నిరుపేద గిరిజన విద్యార్థులు ఉన్నారు. వారికి చదువుతోపాటు ఆటల్లో కూడా శిక్షణ ఇస్తే రాణిస్తారు. గిరిజనులకు ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో శిక్షణ ఇస్తున్నాను. ఐటీడీఏ పీఓ ఆర్చరీ క్రీడను ప్రోత్సహిస్తున్నారు. కాచనపల్లిలో బాలికలకు విలువిద్యలో తర్ఫీదు ఇస్తున్నాను. –మారెప్ప, ఆర్చరీ కోచ్ -
● అవయవాల ఆకృతులతో..
మణుగూరు టౌన్: మణుగూరు జెడ్పీ పాఠశాలలో సైన్స్ టీచర్ పరమయ్య ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. పాఠాలను ప్రయోగపూర్వకంగా చెబుతూ విద్యార్థుల్లో సైన్స్పట్ల ఆసక్తి రేకెత్తిస్తున్నారు. మనిషిని పోలిన విధంగా ఉండే మేక గుండె, ఊపిరితిత్తులు వంటి భాగాలను పాఠశాలకు తీసుకొచ్చి విద్యార్థులకు వాటి పని విధానంపై వివరిస్తారు. చార్ట్ వర్క్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ వారిలో పరిజ్ఞానం పెంచేందుకు కృషిచేస్తున్నారు. చమ్కీలు, చొక్కా బటన్స్, స్టిక్కర్స్, క్లే, దారం వంటి వాటితో మానవ అవయవాల ఆకృతులు తయారు చేసి బోధన చేపడుతున్నారు. వీఆర్, ఏఆర్ టెక్నాలజీని సమ్మిళితం చేసి పాఠాలు బోధిస్తున్నారు. ఎన్జీసీ(నేషనల్ గ్రీన్ కార్ప్)లో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా ఐదేళ్లు పనిచేసిన ఆయన ఉత్తమ టీచర్స్ లెర్నింగ్ మెటీరియల్స్ (టీఎల్ఎం) తయారు చేశారు. అది దేశ వ్యాప్తంగా రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్లో జరిగిన సీసీఆర్టీకి ఎంపికై ంది. పలుమార్లు జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు బోధనాపద్ధతులపై శిక్షణ కూడా ఇచ్చారు. విద్యార్థులకు బోధించే పాఠం ఎంతమేరకు అర్థమవుతుందనేదే ముఖ్యం. మారుతున్న టెక్నాలజీతో పాటు దైనందిన అంశాలతో ముడి పడి ఉన్న అంశాలు క్షుణ్ణంగా వివరించాలి. ప్రయోగాలు చేస్తూ వాటిలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ విద్యాబోధన చేయడం వారికి పరిజ్ఞానం పెరుగుతుంది. –పరమయ్య, సైన్స్ ఉపాధ్యాయుడు -
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో బాలింత మృతి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గురువారం ఉదయం మూడు రోజుల బాలింత మృతి చెందింది. బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్కు చెందిన గర్భిణి అంజలముడి సింధు (25)ను ప్రసవం కోసం ఈ నెల 1న మధ్యాహ్నం ఆస్పత్రిలో చేర్చారు. అదే రోజు సాయంత్రం వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయగా, ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా బుధవారం ఉదయం సింధు నోట్లో నుంచి నురగ వచ్చి, కోమాలోకి వెళ్లింది. దీంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. స్థానిక కార్డియాలజిస్ట్ సాయితేజ రెడ్డి వచ్చి పరీక్షించగా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. పుట్టిన బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణను వివరణ కోరగా.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి చెందలేదని, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డం కట్టడంతో మృతి చెందిందని తెలిపారు. -
● వసతుల కల్పనకు కృషి
ఇల్లెందురూరల్: మండలంలోని ముత్తారపుకట్ట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కబ్బాకుల రవి నిబద్ధతతో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులకు గుణాత్మకవిద్య అందించడంతోపాటు సామాజిక సేవలో భాగస్వాములను చేస్తున్నారు. ఏ పాఠశాలలో పనిచేసినా మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నారు. రవి అంకితభావాన్ని గుర్తించిన గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు మార్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు సొంత డబ్బుతో కరపత్రాలు వేయించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. బాల కార్మికులు, బడిబయట పిల్లలను గుర్తించి పాఠశాల, వసతిగృహాల్లో చేర్పించారు. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములు చేస్తున్నారు. దాతల సాయంతో విద్యార్థులకు ప్లేట్లు, టేబుళ్లు, కుర్చీలు, నోటుపుస్తకాలు, టీవీ, సౌండ్బాక్స్లు, బీరువా తదితర సౌకర్యాలు సమకూర్చారు. బాలల కమిటీలు వేసి పాఠశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించడం, తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బ్యాడ్జీలు పెట్టి ప్రోత్సహించడం, తల్లిదండ్రులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆదివాసీ హెల్ప్ సెంటర్ ద్వారా సామాజిక సేవలు కూడా అందిస్తున్నారు. -
పోడు సాగు వివాదం
జూలూరుపాడు: మండలంలోని ఎలుకలొడ్డు గ్రామ సమీపంలో పోడు సాగు వివాదం నెలకొంది. పాపకొల్లు బీట్–బీ, కంపార్ట్మెంట్ 31లోని రాసగానిగుట్ట దగ్గరలో అటవీ అధికారులకు, గొత్తికోయలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. కొందరు గొత్తికోయలు అక్రమంగా మారుజాతి, తదితర కలప చెట్లు నరికి పోడు భూమిలో పత్తి సాగు చేపట్టారు. ఈ క్రమంలో గత నెల 29న పాపకొల్లు అటవీ సెక్షన్ ఆఫీసర్ మల్లయ్య, బీట్–బీ ఆఫీసర్ కె.విజయలక్ష్మి, వాచర్ తేజావత్ రాము అటవీభూమిలో వెదురు మొక్కలు నాటేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆదివాసీలకు, అటవీశాఖ సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. గొత్తికోయ మహిళ ఇడిమా, ఎఫ్బీఓ విజయలక్ష్మి మధ్య పెనుగులాట జరిగింది. పెనుగులాడుతున్న దృశ్యాలు గురువారం సామాజిక మధ్యమాల్లో వైరల్గా మారాయి. కాగా 29నే బీట్ ఆఫీసర్ విజయలక్ష్మి జూలూరుపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీలు మడి సీతారాములు, మడి ప్రవీణ్, మడి ముత్తమ్మలు ఇడిమాను రెచ్చగొట్టారని, దీంతో ఆమె ఎఫ్బీఓపై రాయితో దాడి చేసిందని, బచ్చల నర్సమ్మ అనే మహిళ కూడా దురుసుగా ప్రవర్తించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీట్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మడి సీతారాములు, ప్రవీణ్, ముత్తమ్మ, ఇడిమా, నర్సమ్మ ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాదావత్ రవి తెలిపారు. 29న ఫిర్యాదు చేస్తే.. 4న కేసు నమోదు పోడు సాగును అడ్డుకునేందుకు వెళ్లిన ఎఫ్బీఓ విజయలక్ష్మి, గొత్తికోయ మహిళ మధ్య ఘర్షణ జరిగిందని జూలూరుపాడు ఎఫ్ఆర్ఓ జి.ప్రసాద్రావు తెలిపారు. ఎఫ్బీఓపై గొత్తికోయ మహిళ దాడి చేసిందన్నారు. కాగా ఈ ఘటనపై గత నెల 29న అటవీశాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు గురువారం విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేశాక ఆరు రోజుల తర్వాత కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా ఎఫ్బీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ తనను దూషించి, దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అటవీ ప్రాంతంలో విధులకు వెళ్లాలంటేనే భయంగా ఉందని పేర్కొంది. ఐదుగురిపై కేసు నమోదు -
పాము కాటుతో రైతు మృతి
టేకులపల్లి: పాము కాటుతో రైతు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. మండలంలోని రామచంద్రునిపేట పంచాయతీ మురుట్ల గ్రామానికి చెందిన వజ్జా లక్ష్మయ్య (40) చేలో పనిచేస్తుండగా పాము కాటువేసింది. దీంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కాలినడకన బయలుదేరాడు. ఎదురొచ్చిన కుటుంబీకులు అతడిని తొలుత గ్రామీణ వైద్యుడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో సులానగర్ పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడా వైద్యులెవరూ లేకపోవడంతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
● బోధనలో ప్రత్యేక శైలి..
పాల్వంచరూరల్ : రాష్ట్రస్థాయిలో ఉత్తమ అధ్యాపకుడిగా పాల్వంచ డిగ్రీ కళాశాల బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవసాని రమేష్ ఎంపికయ్యారు. ఆయన ప్రత్యేక శైలిలో బోధించడమే కాక పర్యావరణ ప్రేమికుడిగా గుర్తింపు పొందారు. 1993 జూన్ 14న కొత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాలో ఉపాధ్యాయుడిగా చేరిన రమేష్.. 2001 వరకు టీచర్గా, 2001 నుంచి 2013 వరకు జూనియర్ లెక్చరర్గా పని చేశారు. 2013 నుంచి ఇప్పటివరకు పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, మొక్కలు నాటి సంరక్షించడంతో పాటు కళాశాలలో అడ్మిషన్ల సంఖ్యను 350 నుంచి 500కు పెరిగేలా కృషి చేశారు. విద్యార్థులకు కాలేజీలో, జూమ్ ద్వారా ఆధునిక పద్ధతిలో బోధిస్తూ, ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వారికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. వరిలో చీడపీడల నివారణకు పరిశోధన చేసి పుస్తకం రచించారు. ఇలాంటి సేవలు ఆయనను రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక చేశాయి. కాగా, రమేష్ను కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, అధ్యాపకులు గురువారం ఘనంగా సత్కరించారు. -
● వినూత్నంగా బోధన..
కరకగూడెం: మండలంలోని భట్టుపల్లి జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తేజావత్ మోహన్ బాబు వినూత్నంగా బోధిస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నాడు. హెచ్ఎం కాకముందు సోషల్ బోధించిన ఆయన 2023లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. స్వచ్ఛ విద్యాలయం పురస్కారం కూడా వరించింది. వీటితోపాటు మరో 24 అవార్డులు వచ్చాయి. చరిత్ర, సామాజిక శాస్త్రం సబ్జెక్ట్లను కథల రూపంలో బోధిస్తే విద్యార్థులకు సులువుగా అర్థమవుతుంది. పాఠం పూర్తయ్యాక ప్రశ్నలు తయారు చేయాలని విద్యార్థులను ప్రోత్సహించాను. విద్యార్థులతో ప్రాజెక్ట్ వర్క్ చేయించాను. స్మార్ట్ క్లాస్ రూమ్స్ వినియోగించి, వీడియోల ద్వారా శాసీ్త్రయ సూత్రాలను వివరించాను. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులతో చెట్లు నాటించాను బడిబాట కార్యక్రమాన్ని ఆదర్శంగా నిర్వహించి ఎక్కువ మంది పిల్లలు పాఠశాలలో చేరేలా చేశాను. తరగతి గది పుణ్యక్షేత్రం వంటిది. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు నావంతు కృషి చేస్తున్నాను. –తేజావత్ మోహన్ బాబు,హెచ్ఎం -
● పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ..
టేకులపల్లి: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎం.మోహన్రావు కృషి చేస్తున్నారు. ఉన్నతి, వృత్యంతర శిక్షణలో జిల్లా రిసోర్స్ పర్సన్గా పని చేసి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేత ప్రశంసలు పొందారు. ఆయన పర్యవేక్షణలో పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించారు. ● 2019లో టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రాజేశ్వరి తయారు చేసిన గాలి మరల ద్వారా విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్ సైన్స్ఫేర్లో రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. 2024లో సైన్స్ఫేర్లో నెల్లూరి గీత జిల్లాస్థాయిలో ప్రథమ బహమతి పొందింది. ● 2022లో చెకుముకి పోటీల్లో విద్యార్థులు గీత, శ్రీహరి, హర్షిత జట్టు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించారు. ● 2024లో చెకుముకి పోటీలో దివ్యశ్రీ, శ్రీహరిణి పవార్, గీతలు జిల్లాలో ప్రథమ, రాష్ట్రస్థాయిలో నాలుగో బహుమతి సాధించారు. ● 2018–19లో విద్యార్థులు తేజావత్ రామరాజు, కోరండ్ల సాయికిరణ్, 2023–24లో తేజస్వి, మహేందర్, గీతాంజలి, గురుచరణ్లు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్నకు ఎంపికయ్యారు. ● 2019–20లో ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిజికల్ సైన్స్ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులో విద్యార్థులు కార్తికేయని, పావని, చరణ్తేజ, గ్రీష్మలు జిల్లా ద్వితీయ బహుమతి, 2025లో నిర్వహించిన టాలెంట్ టెస్టులో నెల్లూరి గీత జిల్లా ప్రథమ బహుమతి పొందారు. -
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి సుజాతనగర్/కొత్తగూడెం అర్బన్: పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. సుజాతనగర్, సింగభూపాలెం, గరీభ్పేట, లక్ష్మీదేవిపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 134 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను స్థాఽనిక రైతు వేదికలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ రూ.60 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చుంచుపల్లి మండలం ధన్బాద్, అంబేద్కర్ నగర్, రాంపూర్లో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించినట్లు తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టిపల్లి, లక్ష్మీదేవిపల్లిలో రూ.24 లక్షల వ్యయంతో నిర్మించిన జీపీ కార్యాలయ మీటింగ్ హాల్, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించామని వివరించారు. విద్యానగర్, సారయ్య కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.70 లక్షలతో వాటర్ ట్యాంక్, నూతన పైప్ లైన్ నిర్మాణం, పైపులైన్ల పొడగింపు పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. విద్యానగర్లో రూ.5.22 కోట్ల ఎల్డబ్ల్యూఈ నిధులతో నిర్మించిన భవనంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, సొసైటీ చైర్మెన్ మండె వీరహనుమంతరావు, ఎంపీడీఓ బి.భారతి, తహసీల్దార్ వి.కృష్ణప్రసాద్, నాయకులు చింతలపూడి రాజశేఖర్, నాగ సీతారాములు, ఆళ్ల మురళి, సొసైటీ చైర్మన్ హన్మంతరావు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు, కూచిపూడి జగన్, రజాక్, పూనెం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
● అవార్డుల అధ్యాపకురాలు..
సూపర్బజార్(కొత్తగూడెం): సింగరేణి డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశాల వ్యాయామ అధ్యాపకురాలు డాక్టర్ కె.సావిత్రి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిభ చాటుతున్నారు. అంతర్జాతీయస్థాయిలో నాలుగుసార్లు, జాతీయస్థాయిలో అనేకసార్లు పతకాలను సాధించారు. ఆమె వద్ద శిక్షణ పొందిన నలుగురు విద్యార్థినులు అంతర్జాతీయస్థాయిలో రాణించారు. 300 మంది జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచారు. విద్యార్థినులకు క్రీడలో శిక్షణనిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పలు అవార్డులు అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ ఎడ్యుకేషన్ నుంచి ఎమినెన్స్ అవార్డు ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్–2025 అవార్డును రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, టూరిజం, కల్చర్ అండ్ అర్కియాలజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా అందుకున్నారు. రోటరీక్లబ్ ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు ఇచ్చి సత్కరించారు. సొంత ఖర్చులతో బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. -
ఓనర్ రమణమ్మ గారూ.. రండి !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో రిబ్బన్ కటింగ్కే సీఎం రేవంత్రెడ్డి పరిమితం కాలేదు. ఇంజనీర్ తరహాలో ప్రతీ గోడను పరిశీలించారు. ఎలా నిర్మించారు.. నాణ్యత ఉందా లేదా అని ఆరా తీశారు. నిర్మాణ నాణ్యతపై సంతృప్తి చెందిన సీఎం, ఇదే తరహాలో ఇతర చోట్ల కూడా నిర్మించాలని అధికారులకు సూచించారు.ఓనర్ రమణమ్మ గారూ.. రండి !బెండాలపాడులో గృహప్రవేశం సమయంలో పూజ పూర్తయిన వెంటనే కొబ్బరికాయ కొట్టే సమయంలో ‘ఇంటి ఓనర్ రమణమ్మ గారూ.. రండి’ అని సీఎం రేవంత్రెడ్డి పిలిచారు. ఇల్లు బాగుందని మెచ్చుకున్నారు. ఈ సమయంలో రమణమ్మ కూతురు లిఖితను ఏం చదువుతున్నావని ప్రశ్నించగా.. డిగ్రీ చదువుతున్నానని బదులిచ్చింది. బాగా చదువుకోవాలని సీఎం సూచించారు. అనంతరం ఆ ఇంటి ఆవరణలో కొబ్బరి మొక్క నాటి.. ఇది ఎంత ఎదిగితే మీ కుటుంబం అంత పచ్చగా ఉంటుందన్నారు. అనంతరం కుటుంబంతో ఫొటో దిగారు.ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ?‘నర్సమ్మా.. అంతా సంతోషమేనా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా’ అని రేవంత్రెడ్డి అడిగినప్పుడు ‘మాకు అంతా మంచే జరిగింది సార్, మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది.. సీఎం సార్ వచ్చి మా ఇల్లు ఓపెన్ చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ ఆమె బదులిచ్చింది. అనంతరం ఇంట్లో చాప మీద కూర్చున్నాక ఇంటిని పరిశీలిస్తూ పిల్లర్లు వేసి కట్టారా లేక గోడ మీదనే శ్లాబ్ వేశారా అని అడిగారు. పిల్లర్లు వేసి కట్టామంటూ నర్సమ్మ కుటుంబ సభ్యులు చెప్పగా.. అలా కడితేనే ఇల్లు బాగా ఆగుతుందని సీఎం అన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డికి మక్క గారెలు, పాయసం అందించారు. నర్సమ్మ ఒడిలో ఉన్న ఆమె మనుమరాలు పాన్యశ్రీ వెన్సికకు సీఎం పాయసం తినిపించారు. ‘నీ పేరేంటి, ఏ ఊరు’ అని అడగగా.. ఆ చిన్నారి నమస్తే సార్ అంటూ బదులిచ్చింది. గృహ ప్రవేశం సందర్భంగా కుటుంబసభ్యులకు చీర, ప్యాంటు, షర్టులను ప్రభుత్వం తరఫున సీఎం అందించారు. తమ గ్రామానికి పీహెచ్సీ కావాలని సీఎంను కోరుదామనుకున్నామని, కానీ హడావుడిలో సాధ్యం కాలేదని ఇందిరమ్మ లబ్ధిదారులు తెలిపారు. -
పేదల ఆత్మగౌరవమే లక్ష్యం
● ఎంత ఖర్చయినా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● మంత్రి పొంగులేటి వెల్లడివరుణుడు కరుణించాడు..ములకలపల్లి : సీఎం సభకు వరుణదేవుడు కరుణించాడు, మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురవగా సభా ప్రాంగణం బురదమయం కావడం, రహదారులన్నీ చిత్తడిగా మారడంతో అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం కూడా చిరుజల్లులు కురిసి, కారుమబ్బులు కమ్ముకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే రెండు పర్యాయాలు కార్యక్రమం వాయిదా పడగా మరోసారి కూడా ఏం జరుగుతుందోనని భయపడ్డారు. అయితే సభ సమయానికి వాతావరణం అనుకూలించడంతో సభ విజయవంతమైంది. బెండాలపాడులో గృహప్రవేశ సమయంలో రేవంత్రెడ్డి లబ్ధిదారులతో మాట్లాడుతూ చిరుజల్లులు కురిసినా, వెంటనే నిలిచిపోయాయని, భవవంతుడి ఆశీస్సులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఫలించిన ‘ఖాకీ’ల శ్రమ సీఎం సభకు 1,200 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేకుండా సభ విజయవంతం కావడంతో ఖాకీల శ్రమ ఫలించినట్ట యింది. భారీగా బస్సులు వచ్చినా, నిర్ణీత ప్రదేశాలకు తరలించారు. పెద్దగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించారు. అశ్వారావుపేట: రాష్ట్రంలో పేదల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చండ్రుగొండ మండలం దామరచర్లలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడిని చీడపురుగులా చూసిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరమే రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామని, వచ్చే రెండున్నరేళ్లలో మరో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి 25వేల ఇళ్లు అదనంగా కేటాయిస్తామన్నారు. తాము పదవులు అడగలేదని, సీఎం రేవంత్రెడ్డి పిలిచి పదవులివ్వడంతో పాటు ఆడపడుచులకు ఇళ్లు ఇవ్వడమే కాక స్వయంగా జిల్లాకు వచ్చి శంకుస్థాపనలు, గృహప్రవేశాలు చేశారని వివరించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. నాడు దివంగత ముఖ్యమంత్రి పాదయాత్ర చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తే, నేడు రేవంత్రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తెచ్చారని అన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని బతికించి అధికారంలోకి తెచ్చిన టైగర్ రేవంత్ రెడ్డి అని కొనియాడారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేరిన రోజిది అన్నారు. భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు ఈ జిల్లాలోనే చేయడం హర్షణీయమని అన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఈ రోజు తన జన్మలో మరిచిపోలేనిదని అన్నారు. బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు కార్యక్రమం రెండుసార్లు వాయిదా పడినా.. మూడోసారి హాజరైన సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొట్లాడాలన్నా.. పోరాడాలన్నా.. నిప్పుకణికల్లా ఆందోళన చేయాలన్నా తమకు సాటి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఆయనతో కలిసి ఉన్నామని చెప్పారు. సీతారామ నీళ్లు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు వచ్చేలా చూడాలని, కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. నాడు వైఎస్సార్ భద్రాచలంలో పోడు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని.. నాటి, నేటి సీఎంలకు సారూప్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరామ్నాయక్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ మాలోతు రాందాస్నాయక్, గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ట్రెయినీ ఐఏఎస్ సౌరభ్శర్మ, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఎస్పీ రోహిత్రాజు, దిశ కమిటీ సభ్యడు బొర్రా సురేష్ తదితరులు పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, ఖమ్మం: దామరచర్లలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్న సభలో వక్తలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి నామస్మరణ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించినప్పుడల్లా అభిమానులు, ప్రజలు కేరింతలు కొట్టారు. సీఎం తన ప్రసంగంలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తుండగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వైఎస్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా తమ ప్రసంగాల్లో వైఎస్సార్ పేరు ప్రస్తావించారు. ఆయన సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడే సమయాన ప్రజలు ఈలలు, చప్పట్లతో తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. -
నిమజ్జనం.. జర భద్రం
భద్రాచలంఅర్బన్: జిల్లావ్యాప్తంగా వినాయకచవితి సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. విభిన్న రూపాల్లో కొలువుదీరిన ఆదిదేవుడిని భక్తులు పూజిస్తూ పరవశిస్తున్నారు. అయితే విగ్రహాలను నిమజ్జనం చేసే సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. నవరాత్రులు ప్రారంభమైన ఐదోరోజు నుంచే నిమజ్జన కార్యక్రమాలు సాగుతుండగా.. ఈ నెల 6న వేలాది విగ్రహాలను భద్రాచలం గోదావరి తీరానికి తీసుకురానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైవర్ పాత్ర కీలకం.. నిమజ్జన శోభాయాత్రలో ప్రధానంగా ఆయా వినాయక ప్రతిమలను ఊరేగించే వాహనాల డ్రైవర్లు అనుభవజ్ఞులై ఉండాలి. పొరపాట్లు జరగకుండా ముందుగానే సదరు డ్రైవర్లకు పోలీసులతో పాటు ఉత్సవ కమిటీ నిర్వాహకులు సలహాలు, సూచనలు ఇవ్వాలి. రోడ్లపై గతుకులు, గుంతలు, స్పీడ్ బ్రేకర్ల వద్ద జాగ్రత్తగా నడపాలి. విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. ప్రతిమ వద్ద ఎక్కువ మంది జనం లేకుండా చూసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి.. గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొనే పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పి బయటకు పంపాలి. నిమజ్జనానికి చిన్నారులను ఒంటరిగా పంపడం మంచిదికాదు. తెలిసిన వారితో లేదా కుటుంబ సభ్యులు తోడుగా ఉండేలా చూసుకోవాలి. శోభాయాత్రను చూసేందుకు ఎత్తుగా ఉన్న భవనాలు, రేకుల షెడ్లు, పాతభవనాలు ఎక్కినపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక నిమజ్జనం సందర్భంగా క్యూ పద్ధతి పాటించాలి. ఒక వాహనం తర్వాత ఇంకో వాహ నం వెళితే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఇక ప్రతిమలను చెరువు లు, కుంటలు, ప్రాజెక్టుల వద్ద నిమజ్జనం చేసే సమయాన జాగ్రత్తలు పాటించాలి. ఈత రాని వారు, పిల్లలు సహా ఎవరూ లోనికి వెళ్లకుండా సిబ్బందికి విగ్రహాలు అప్పగించాలి. నిమజ్జనానికి భారీ బందోబస్తు భద్రాచలం గోదావరిలో గణేశ్ నిమజ్జనం చేయనున్న ఘాట్ వద్ద భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్ పర్యవేక్షణలో 250 మంది పోలీసులు అంతేకాక 15 మంది వైద్య బృందం (మూడు షిఫ్ట్లలో), ఒక 108 అంబులెన్సు, మరో లైఫ్ సపోర్ట్ ఎమర్జెన్సీ వాహనాన్ని సిద్ధంగా ఉంచారు. రెండు షిఫ్ట్లలో 36 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 10 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది, అంతే కాకుండా 12 మంది గజ ఈతగాళ్లు, దేవస్థానం సిబ్బంది 24గంటల పాటు కూడా అందుబాటులో ఉండను న్నారు. నిమజ్జనానికి మూడు భారీ క్రేన్లతో పాటు జేసీబీలను అధికారులు అందుబాటులో ఉంచారు. సిబ్బందికి బాధ్యతలపై సూచనలిస్తున్న భద్రాచలం టౌన్ సీఐ నాగరాజువినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులు అధికారుల సూచనల మేరకు నడుచుకోవాలి. ఏ నిబంధన అమలు చేస్తున్నా అది మీ భద్రత కోసమేనని గుర్తుంచుకోవాలి. నిమజ్జనంలో పాల్గొనే భక్తులు, కమిటీ సభ్యులు పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ ద్వారానే రావాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే డయల్ 100కి కాల్ చేయండి. తొందర పాటుతో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. –బి.రోహిత్ రాజు, ఎస్పీ భద్రాచలం గోదావరిలో జరగనున్న నిమజ్జనోత్సవంలో ఈ సారి ప్రత్యేకంగా 250 మంది పనిచేస్తున్నాం. ఎక్కడా వినాయకులు ఎక్కువ సేపు ఆగకుండా మా సిబ్బంది ముందుకు సాగనంపుతారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. ఆరుగురు సీఐలతో పాటు 15 మంది ఎస్ఐలు, 231 మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నాం. –విక్రాంత్ కుమార్సింగ్, ఏఎస్పీ, భద్రాచలం -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన భాస్కర్రామ్ రూ.2లక్షల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోగా, అధికారులు ఆయనకు ప్రసాదం, స్వామివారి జ్ఞాపిక అందజేశారు. అధికారుల ఆట విడుపు !టెన్నిస్ ఆడిన ఐటీడీఏ పీఓ, హౌసింగ్ ఎండీ పాల్వంచరూరల్ : నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే ఇద్దరు ఐఏఎస్ అధికారులు అటవిడుపుగా కాసేపు టెన్నిస్ ఆడారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్, గృహ నిర్మాణ శాఖ ఎండీ వి.పి.గౌతమ్ చండ్రుగొండ మండలం బెండలపాడులో సీఎం రేవంత్రెడ్డి సభా కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో పాల్వంచ శ్రీనివాసకాలనీలోని మినీ స్టేడియం వద్ద ఆగారు. బుధవారం రాత్రి కొందరు టెన్నిస్ ఆడుతుండగా వారు కూడా సరదాగా కాసేపు లాన్ టెన్నిస్ ఆడారు. వారి వెంట టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిరెడ్డి యుగంధర్ ఉన్నారు. మళ్లీ ‘మొదటి’కొచ్చిన గోదావరిభద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వదర నీరు భారీగా వస్తుండగా బుధవారం రాత్రి 9.50 గంటలకు నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 11 గంటలకు 43.30 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం 9 గంటల వరకు తగ్గుతూ వచ్చిన నీటి ప్రవాహం సాయంత్రానికి ఒక్కసారిగా పెరిగింది. మరోసారి గోదావరి ఉప్పొంగుతుండడంతో ఏజెన్సీ వాసుల్లో భయం పట్టుకుంది. కాగా, ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పటివరకు మూడు సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక, రెండుసార్లు రెండో ప్రమాద హెచ్చరిక జారీ కావడం గమనార్హం. -
తాలిపేరుకు వరద ఉధృతి
చర్ల: తాలిపేరు ప్రాజెక్ట్లోకి వరద నీటి ప్రవాహం ఒక రోజు పెరుగుతుండగా, మరో రోజు తగ్గుతోంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంటోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రాజెక్ట్లో భారీగా వరదనీరు వస్తుండటంతో 14 గేట్లను ఎత్తి ఉంచి 30,054 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు గోదావరిలో కూడా వరద ఉధృతి ఉండగా, బ్యాక్ వాటర్తో తేగడలోని హైలెవల్ వంతెన వద్ద వరద ఉగ్రరూపం దాల్చుతోంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ గేటు ఎత్తివేతపాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1,700 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో బుధవారం నీటిమట్టం 405.30 అడుగులకు పెరిగింది. ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తి ఉంచి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కారు ఢీకొని మహిళ మృతిమణుగూరు టౌన్: కారు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పినపాక మండలానికి చెందిన కోడిరెక్కల సావిత్రి (55) మణుగూరు నుంచి భద్రాచలం వైపు ఆటోలో వెళ్తోంది. ఈ క్రమంలో తోగ్గూడెం శివారులో ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీ కొట్టింది. దీంతో సావిత్రి రోడ్డుపై పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెను 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. అటు సీత.. ఇటు రాధ! ఇందిరమ్మ ఇంటి స్థలంపై వివాదంబోనకల్: మండలంలోని రాపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి స్థల విషయమై వివాదం నెలకొనగా ఇరువర్గాలతో అధికారులు చర్చించారు. గతంలో కులవృత్తులతో జీవిస్తున్న పలువురికి ప్రభుత్వం స్థలాలు కేటాయించగా గ్రామంలో రాచకొండ సీతకు సైతం కేటాయించారు. కొన్నేళ్ల పాటు అక్కడే ఉన్న ఆమె మరో గ్రామానికి వెళ్లింది. దీంతో ఆమె బంధువైన రాచకొండ రాధకు ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో ఆ స్థలంలో ముగ్గులు పోశారు. గ్రామంలో నాయకులు రెండు వర్గాలుగా ఉండడంతో నిర్మాణం జరపొద్దని ఓ వర్గం, ఆ స్థలాన్ని రాచకొండ రాధ కొనుగోలు చేసిందని ఇంకో వర్గం వారు వాదించారు. ఈ విషయం జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి వెళ్లగా ఆమె నెల క్రితం పరిశీలించి వివా దం లేని స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవాలని సూ చించారు. దీంతో ఎస్ఐ పి.వెంకన్న, తహసీల్దార్ రమాదేవి బుధవారం ఇరు వర్గాలను పిలిచి విచా రణ చేపట్టారు. గతంలో కొన్నాళ్లు ఉన్న రాచకొండ సీతను ఈనెల 6న పిలిపించే వరకు ఇరు వర్గా లు సమన్వయంతో ఉండాలని సూచించారు. వ్యక్తిపై పోక్సో కేసు నమోదువైరా: వైరా పాత ఎకై ్సజ్ స్టేషన్ రోడ్డులో ఓ బాలికపై లైంగికదాడికి ప్రయత్నించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. కాలనీకి చెందిన ఓ బాలిక ఇంట్లో ఉండగా దుగ్గిరాల రత్తయ్య వెనుక నుంచి వెళ్లి లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయాన బాలిక తండ్రి ఇంట్లోనే నిద్రిస్తున్నా డు. బాలిక కేకలు వేయడంతో రత్తయ్య పారిపోయాడు. కాగా బుధవారం పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ పి.రామారావు తెలిపారు. -
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
మణుగూరు రూరల్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాకు చెందిన కార్మిక సంఘ నాయకుడు ఊకంటి ప్రభాకర్ రావు అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కేటీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మణుగూరు మాజీ జెడ్పీటీసీ పోశం నర్సింహరావు, నాయకులు పాల్గొన్నారు. -
యూరియా పంపిణీలో ఇంత నిర్లక్ష్యమా ?
జూలూరుపాడు: యూరియా సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తమకు సరిపడా పంపిణీ చేయాలని కోరుతూ జూలూరుపాడు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు బుధవారం ఆందోళన చేశారు. కార్యాలయం లోపలికి వచ్చి షెట్టర్ మూసి అధికారులు, సిబ్బందిని నిర్భందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో రైతుకు మూడు బస్తాల యూరియా ఇవ్వాలని, ఒక బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని కార్యాలయ షెట్టర్ను తీశారు. రైతులు సంయమనం పాటించాలని సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత రైతులకు ఒక్కో యూరియా బస్తా చొప్పున పంపిణీ చేశారు. సొసైటీ కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ రోజుకు 40 టన్నుల యూరియా అవసరమని ఇండెంట్ పెట్టామని, 10 టన్నులు మాత్రమే వస్తుండటంతో ప్రతీ రైతుకు ఒక్కో బస్తా చొప్పున ఇస్తున్నామని తెలిపారు. -
మిషన్ భగీరథ వాల్వ్లో పడి వ్యక్తి మృతి
కరకగూడెం: మిషన్ భగీ రథ స్కోర్ వాల్వ్లో పడి ఓ వ్యక్తి మృతి సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అశ్వాపురం మండలం మల్లెలమడుగు ఎస్సీ కాలనీకి చెందిన వంగూరి వెంకన్న (43) కొద్ది రోజులుగా తాటిగూడెం గ్రామంలో ఉంటున్నాడు. కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి వంట సామాన్ల కోసం దుకాణానికి వెళ్తున్న సమయంలో ప్రధాన రహదారి పక్కన తెరుచుకుని ఉన్న మిషన్ భగీరథ స్కోర్ వాల్వ్లో పడిపోయాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తోటి కూలీలు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మిషన్ భగీరథ స్కోర్ వాల్వ్ను అసంపూర్తిగా, సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ, బైక్ ఢీ : విద్యార్థి మృతిపాల్వంచరూరల్: పాస్పోర్టు వెరిఫికేషన్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బీటెక్ విద్యార్థి మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జర్పుల చరణ్(22) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. హైదరాబాద్లో పాస్పోర్టు వెరిఫికేషన్కు వెళ్లేందుకు మంగళవారం అర్ధరాత్రి పాల్వంచ వెంగళరావుకాలనీలోని బంధువు పవన్ బైక్ తీసుకుని వెళ్తున్నాడు. అదే సమయంలో ములకలపల్లి వైపు వెళ్తున్న లారీ పాల్వంచ దమ్మపేట సెంటర్లో టర్నింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ ఇండికేటర్ ఇవ్వకపోవడంతో బైక్ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలై చరణ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదుతో లారీ డ్రైవర్ ఉకే కళ్యాణ్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ సుమన్ తెలిపారు. -
ఆలస్యమే కలిసొచ్చింది!
చుంచుపల్లి: సకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వేటు పడిన అభ్యర్థులకు మేలు చేసింది. ఇప్పుడు వారందరికీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు నిర్ణీత వ్యవధిలో తమ ఖర్చుల లెక్కలు సమర్పించలేదు. దీంతో వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం మూడేళ్లపాటు అనర్హత వేటు వేసింది. అయితే నిషేధ కాలపరిమితి ముగిసింది. దీంతోవేటు పడిన వారందరిలో ఇప్పడు ఆశలు చిగురిస్తున్నాయి. మరోసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు సకాలంలో జరగక.. 2019 జనవరిలో జిల్లాలోని 479 గ్రామ పంచాయతీలకు 4,232 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి 1తో ముగిసింది. ఆ వెంటనే లోక్సభకు ఎన్నికలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనను అమల్లోకి తెచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం సైతం గతేడాది ఆగస్టు మొదటి వారంతో ముగియగా, పరిషత్లో కూడా స్పెషలాఫీసర్ల పాలనే కొనసాగిస్తోంది. అయితే సకాలంలో పంచాయతీలకు ఎన్నికలు జరిగితే జిల్లాలో అనర్హతకు గురైన అనేక మంది అభ్యర్థులు పోటీకి దూరమయ్యేవారు. 292 మందిపై అనర్హత వేటు నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం 2019లో జనవరిలో 479 గ్రామ పంచాయతీలకు, మేలో 219 ఎంపీటీసీలు, 21 జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీపడిన అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత 45 రోజుల్లోగా తమ ప్రచారానికి ఎంత ఖర్చు చేశారో నిర్దేశిత నమూనాలో ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించాలి. ఐదు వేల లోపు జనాభా కలిగిన పంచాయతీలో పోటీచేసే వార్డు సభ్యుడు రూ. 30,000 వరకు, సర్పంచ్ అభ్యర్థులు రూ.1,50,000 వరకు ఖర్చు చేయాలని, 5 వేలకు పైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే వార్డు సభ్యులు రూ.50వేలు, సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం నిమిత్తం రూ.2,50,000 వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పించారు. నిబంధనల ప్రకారం గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను వెల్లడించాలి. ఇందులో కొందరు వార్డు సభ్యులు గెలిచినా నిర్లక్ష్యంతో అధికారులకు ఖర్చు ల వివరాలు సమర్పించలేదు. ఓడిపోయిన మరి కొందరు ఎన్నికల నిబంధనలను అతిక్రమించారు. ఆయా అభ్యర్థులకు ఈసీ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. దీంతో ఎంపీడీఓలు సమర్పించిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం 2021 నవంబర్లో కొందరు అభ్యర్థులపై అనర్హత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో గెలిచిన 96 మంది అభ్యర్థులతోపాటు ఓడిపోయిన మరో 196 మంది.. మొత్తం 292 మంది అనర్హతకు గురయ్యారు. వీరిలో ములకలపల్లి మండలంలోనే 96 మంది వరకు అభ్యర్థులు గెలుపొందిన ఉన్నారు. కొందరు ఉపసర్పంచ్లు కూడా ఉండటం గమనార్హం. వీరంతా 2024 ఏప్రిల్ వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో అనర్హత వేటు కాలపరిమితి ముగిసిపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలో నిర్వహిస్తామని ప్రకటించడంతో వారు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. -
పది రోజుల్లో ప్రత్యేక దృష్టి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన తనకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పలు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేశారని, వీటన్నింటిపై పది రోజుల్లో ప్రభుత్వ పరంగా దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. చండ్రుగొండ మండలం బెండాలపాడులో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం అనంతరం దామరచర్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల సమస్యలు, పనులపై వినతిపత్రాలు ఇచ్చారు. పది రోజుల్లో వారితో మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పా. వినతిపత్రాలు, ప్రతిపాదనలపై జిల్లా అధికారులతో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల వద్దే కీలక శాఖలు ఉన్నాయి. సారపాకలో సన్న బియ్యం భోజనం.. గతంలో రేషన్కార్డులపై పేదలకు దొడ్డుబియ్యం పంపిణీ చేసేవారు. ఆ బియ్యంతో అన్నం తినలేక చాలా మంది అమ్ముకునే వారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించాం. సారపాకలో సామాన్యుడి ఇంట్లో భోజనం చేయడానికి వెళ్లినప్పుడు రేషన్కార్డుపై వచ్చిన బియ్యంతోనే అన్నం వండమని చెప్పాం. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పా. కానీ ఆ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు జూబ్లీహిల్స్లోని మా ఇంట్లో, శీనన్న(పొంగులేటి శ్రీనివాసరెడ్డి) ఇంట్లో అన్నం తిన్నట్టే అనిపించింది. సన్నబియ్యంతో అన్నం తింటున్నప్పుడు సామాన్యుడి కళ్లలో కనిపించే ఆనందం కోటి రూపాయలు ఇచ్చినా రాదు. ఆత్మగౌరవంతో బతికేలా తొలిదశ తెలంగాణ ఉద్యమం పాల్వంచలో ప్రారంభమై తెలంగాణకు దిశాదశ చూపించింది. ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించేది ఖమ్మం జిల్లానే. ఈ జిల్లా వాసులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఇక్కడ గూడేలు, తండాల వారికి తల్లితో సమానంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై గౌరవం ఉంది. అందుకే పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజం చేస్తోంది. పేదలు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గడిచిన పదేళ్లుగా ఎదురుచూసి నిరాశ చెందారు. ఇప్పుడు నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 4.50లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. అశ్వారావుపేటకు మాత్రం ఏకంగా 4,500 ఇళ్లు ఇచ్చాం. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. 2–30 గంటల పాటు.. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు సీఎం రేవంత్రెడ్డి చండ్రుగొండకు రావాల్సి ఉంది. అయితే మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన కారణంగా మధ్యాహ్నం 3 : 40 గంటలకు చండ్రుగొండకు చేరుకున్నారు. తొలుత బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నాక పైలాన్ ఆవిష్కరించి ఇందిరమ్మ లబ్ధిదారులతో మాటామంతీ నిర్వహించారు. ఆ తర్వాత దామరచర్లలో బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. అక్కడ 29 నిమిషాల పాటు ప్రసంగించిన సీఎం.. సాయంత్రం 6 : 10 గంటలకు తిరుగు పయనమయ్యారు. మొత్తంగా రెండున్నర గంటల పాటు జిల్లాలో సీఎం పర్యటన కొనసాగింది.ఎమ్మెల్యేల నుంచి విజ్ఞాపనలు అందాయి.. -
భవిష్యత్కు బలమైన పునాది !
కొత్తగూడెంఅర్బన్: నాలుగేళ్లు పైబడిన చిన్నారుల భవిష్యత్కు బలమైన పునాది వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో బోధించే ఎల్కేజీ, యూకేజీ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ ప్రైమరీ (పూర్వ ప్రాథమిక విద్య) తరగతులు అందుబాటులోనికి రానున్నాయి. రూ.వేల ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపించలేని తల్లిదండ్రులకు ఇదో వరంలా మారనుంది. జిల్లాలోని 21 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే తరగతుల ప్రారంభానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నారుల విద్యాబోధనకు గాను ప్రత్యేకంగా టీచర్లు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 18 – 44 ఏళ్ల వయసు గల స్థానిక మహిళలే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బోధకుల కనీస విద్యార్హత ఇంటర్మీడియట్గా, ఆయాలకు ఏడో తరగతిగా నిర్ణయించారు. వారి ఎంపిక కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, డీఈఓ కన్వీనర్గా, అదనపు కలెక్టర్(రెవెన్యూ)తో పాటు కలెక్టర్ నామినేట్ చేసిన మరొకరు సభ్యులుగా ఉంటారు. బోధకులకు నెలకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేల చొప్పున గౌరవ వేతనం పది నెలల పాటు చెల్లించనున్నారు. ఎంపికై న పాఠశాలలివే.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు తొలి విడతగా 21 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో ఆళ్లపల్లితో పాటు మండలంలోని పాతూరు ఎంపీపీఎస్, అశ్వారావుపేట మండలం కుడుములపాడు, ఐవీ ఎంప్లాయ్ కాలనీ, చండ్రుగొండ మండలం పోకలగూడెం, చర్ల మండలం పూసుగుప్ప, దమ్మపేట మండలం బాలరాజుగూడెం, దుమ్ముగూడెం మండలం గోవిందాపురం కాలనీ, గుండాల మండలం కొడవటంచ, జూలూరుపాడు మండలం కాకర్ల, లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల, మణుగూరు మండలం మామిడితోట గుంపు, పినపాక మండలం గోవిందాపురం, పాండురంగాపురం, ఉప్పాక, సింగిరెడ్డిపల్లి, టేకులపల్లి మండలం బేతంపూడి, తడికలపూడి స్టేషన్, రామచంద్రునిపేట, కొప్పురాయి, ఇల్లెందు మండలం రొంపేడు ఎంపీపీఎస్లు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు చెల్లించే విద్యార్థులకు మాత్రమే ప్రీప్రైమరీ క్లాసులు వినే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రావడంతో పేద పిల్లలకు లబ్ధి చేకూరనుంది. చిన్నారులు ఆట, పాటలతో సరదాగా నేర్చుకునేలా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ తరగతులతో పిల్లల విద్యా పునాది బలపడటమే కాక సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెరగనున్నాయి. – నాగలక్ష్మి, డీఈఓ నాలుగేళ్లు నిండిన చిన్నారులకు మాత్రమే ఇందులో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. బోధనకు ఎల్కేజీ, యూకేజీ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ ప్రక్రియ ఆలస్యమైతే సంబంధిత మెటీరియల్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని బోధన సాగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులకు ఆటపాటలతో కూడిన బోధన అందించనున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు గంట సేపు నిద్రించేందుకు కూడా సమయం కేటాయించారు. ఎంపికై న పాఠశాలలకు రూ.1.70 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందులో రూ.1.50 లక్షలు ఫర్నిచర్, పెయింటింగ్, బోధన పరికరాలు, ఇతర వస్తువుల కోసం ఖర్చు చేయనున్నారు. మిగితా రూ.20 వేలతో విద్యార్థులకు బూట్లు, యూనిఫామ్ కొనుగోలు చేస్తారు. 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు అదనపు నిధులు మంజూరు చేస్తారు.