Bhadradri
-
డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
దమ్మపేట: కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న దమ్మపేట మండలం అంకంపాలెం గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు గిరిజన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. బీఏ (హెచ్ఈపీ), బీఎస్సీ (బీజెడ్సీ, ఎంపీపీఎస్), బీకాం (జనరల్, సీఏ) కోర్సుల్లో ప్రథమ సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఉచితంగా నాణ్యమైన విద్యతో పాటు భోజనం, వసతి, డిజిటల్ తరగతులు, గ్రంథాలయం, ప్రయోగశాల సౌకర్యాలే కాక అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేజీ గంజాయి స్వాధీనంమణుగూరురూరల్: మండలంలోని కొత్త పద్మగూడెం గ్రామంలోని ఓ ఇంట్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు సీఐ పాటి నాగబాబు తెలిపారు. మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారంతో కొత్త పద్మగూడెంలోని మిడియం గోవింద్ ఇంట్లో తనిఖీ చేయగా 1.085 కేజీల గంజాయి లభ్యమైందని తెలిపా రు. ఈ సందర్భంగా గోవింద్ను అదుపులోకి తీసుకోవడమే కాక ఆయనకు గంజాయి అమ్మిన గుట్టమల్లారం వాసి సాయి అలియాస్ గుట్ట సాయి, కొనుగోలు చేస్తున్న సత్తుపల్లికి చెందిన జుజునూరి సింహాద్రి అలియాస్ సందీప్పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. గోవింద్ను రిమాండ్కు తరలించి, మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ సీహెచ్ నగేశ్, సిబ్బంది పాల్గొన్నారు. అదుపు తప్పి లారీ బోల్తా అశ్వాపురం: మండలంలోని సీతారాంపురం వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. కంకరలోడ్తో మణుగూరు వైపు వెళ్తున్న లారీ సీతారాంపురం వద్ద మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారి వెంట అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఆపై కాల్వలో బోల్తాపడగా, డ్రైవర్ అప్రమత్తమై కిందకు దూకడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పేకాట స్థావరంపై దాడిచండ్రుగొండ: మండలంలోని గుర్రాయిగూడెం శివా రు అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై కొత్తగూ డెం టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. టాస్క్ఫోర్స్ ఎస్ఐరమాకాంత్ కథనం ప్రకారం.. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టడంతో పేకాట ఆడుతున్న పదిమంది పట్టుబడ గా, మరో తొమ్మిదిమంది పారిపోయారు. పట్టుబడిన వారి నుంచి రూ.42,460నగదు, సెల్ఫోన్లు, ద్విచక్రవాహనాలను స్వాధీనంచేసుకున్నారు. నింది తులపై కేసు నమోదు చేసినట్లు చండ్రుగొండ ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. -
సాంకేతికతను అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు పోలీసు శాఖ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. సైబర్ నేరగాళ్లు బలమైన నెట్వర్క్ ద్వారా ప్రజలను మోసగిస్తున్నారు. ఈనేపథ్యాన పాత నేరస్తులు, రౌడీషీటర్ల మాదిరిగానే సైబ
జిల్లాపై పంజా జిల్లాలో పలువురు సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.లక్షల్లో నష్టపోతున్నారు. లాటరీ వచ్చిందని, బ్యాంక్లో నగదు జమ అయిందని ఓటీపీ అడుగుతూ అకౌంట్ల నుంచి డబ్బు కాజేయడమే కాక, ఇతర రూపాల్లో సైబర్ నేరాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఓ ముఠా అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేరాలకు పాల్పడుతూ రూ.547 కోట్ల మేరకు లావాదేవీలు జరపడం షాక్కు గురి చేసింది. ఈ ముఠా అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో జత కలిసి విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహించినట్లు తేలింది. మ్యాట్రిమోనీ, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఇలా వివిధ రూపాల్లో నిందితులు ప్రజలను మోసగించారు. అంతేకాక స్థానికులతో ఖాతాలు తెరిపించి, వాటి ఆధారంగా లావాదేవీలు జరపడంతో అమాయకులు కేసుల పాలయ్యారు. నేరగాళ్లపై ‘సస్పెక్ట్’ అస్త్రం సైబర్ నేరాల కింద కేసులు నమోదైన వారిపై పోలీసులు సస్పెక్ట్ షీట్ తెరవనున్నట్లు తెలిసింది. ఈ తరహాల నేరాలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్లీ మోసాలకు పాల్పకుండా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా సస్పెక్ట్ షీట్ తెరిచి.. వారి నివాసాల వద్ద ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించడమే కాకుండా బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిసింది. అంతేకాక నేరగాళ్ల ఫొటో, చిరునామా, వారు గతంలో చేసిన నేరాల తీరు, కేసుల స్థితిగతుల సమాచారాన్ని ఈ షీట్లో పొందుపరుస్తారు. నిందితుల నివాసం ఉన్న పోలీసు స్టేషన్ అధికారుల వద్ద ఈ వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. తద్వారా అధికారులు మారినప్పటికీ నిఘా మాత్రం నిరంతరం కొనసాగనుంది. నిరంతర పరిశీలన ఒకసారి సస్పెక్ట్ షీట్ నమోదైతే.. సదరు వ్యక్తి పోలీసుల నిఘా నేత్రంలోకి వచ్చినట్టే. నిందితులు నేరస్తుడు జైలు నుంచి బెయిల్పై విడుదలైన వెంటనే ఆ సమాచారం స్థానిక పోలీసులకు చేరుతుంది. ఆపై బీట్ కానిస్టేబుళ్లు, గస్తీ బృందాలు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు వారిపై నిఘా పెంచుతారు. నేరస్తుల ప్రతి చర్యను గమనిస్తూ మళ్లీ ఏమైనా నేరాలకు పాల్పడుతున్నారా అని పరిశీలిస్తుంటారు. ఏమైనా అనుమానాస్పద కదలికలు నమోదైతే మరింత అప్రమత్తమై పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. వెబ్సైట్లలో వివరాలు సైబర్ నేరగాళ్ల వివరాలను కేవలం పోలీసుస్టేషన్లకే పరిమితం చేయకుండా.. ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. నేరగాళ్ల వివరాలు తెలిసేలా పోలీసు శాఖ, ఇతర వెబ్సైట్లలో పొందుపర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. తద్వారా స్థానికులు కూడా వారి విషయంలో అప్రమత్తంగా ఉంటారని చెబుతున్నారు. అయితే, సైబర్ నేరాల కట్టడి పోలీసులతో మాత్రమే సాధ్యం కాదని.. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.సైబర్ నేరగాళ్లపై నిఘాహైదరాబాద్లో పట్టుబడిన ముఠాకు జిల్లాలోని సత్తుపల్లి ప్రాంత వాసులు పలువురితో లింక్లు ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఇందులో ఉడతనేని వికాస్చౌదరి, బొప్పన నాగప్రియ, అడపా రామవెంకట చరణ్, పోట్రు మనోజ్కల్యాణ్, మేడా భానుప్రియ, మేడా సతీష్కుమార్, బొప్పన నాగప్రసాద్, పోట్రు ప్రవీణ్, జుంజునూరి శివకృష్ణ, జొన్నాదుల తిరుమలసాయి తదితరులపై కేసుల నమోదయ్యాయి. వీరంతా రూ.కోట్ల లావాదేవీలకు సంబంధించి కేసుల్లో నిందితులు కాగా, మరికొందరూ సైబర్ నేరాల్లో పట్టుపడ్డారు.సాంకేతికత ఆధారంగా రూ.కోట్లు కొల్లగొడుతున్న మాయగాళ్లు -
మొండితోగులో ట్రెంచ్ పనుల అడ్డగింత
ఇల్లెందురూరల్: మండలంలోని మొండితోగు గ్రామంలో అటవీశాఖ పంట చేల వెంట చేపట్టిన ట్రెంచ్ కటింగ్ పనులను గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. నిబంధనలకు అనుగుణంగా పనులు చేస్తున్నామని ఎఫ్ఆర్ఓ చలపతిరావు, డీఆర్ఓ వీరబాబు గ్రామస్తులకు నచ్చజెప్పే పయత్నం చేసినా వారు ససేమిరా అంటూ ట్రెంచ్ కటింగ్ పనులను ముందుకు సాగనీయలేదు. మాజీఎంపీటీసీ పూనెం సురేందర్ అక్కడకు చేరుకొని అటవీశాఖ అధికారులతో చర్చించారు. రైతుల వద్ద పోడు పట్టాలు ఉన్నాయని, మరికొంత మందికి సర్వే ప్రక్రియ పూర్తయి పట్టాల మంజూరు పెండింగ్లో ఉందని గుర్తుచేశారు. అలాంటి వారిని గుర్తించిన తరువాత ట్రెంచ్ కటింగ్ పనులు చేసుకోవా లని అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రైతు ల దరఖాస్తులను పరిశీలించిన తరువాత పను లు కొనసాగిస్తామని అధికారులు తెలపడంతో వివాదం సద్దుమనిగింది. మార్కెట్లో మిర్చి చోరీలు అరికట్టాలని వినతి ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మా ర్కెట్లో మిర్చి దొంగతనాలను అరికట్టడమే కాక మార్కెట్ పరిసరాల్లో చిల్లర కొనుగోళ్లను నిలువరించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ మిర్చి శాఖ ప్రతినిధులు కోరారు. మంగళవారం వారు మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్కు వినతిపత్రాలు అందించారు. మార్కెట్లో రైతులు విక్రయించిన మిర్చి బస్తాలను కొందరు కోసి దొంగిలిస్తుండడంతో వ్యాపారులకు నష్టం జరుగుతోందని తెలిపారు. అలాగే, పరిసరాల్లో చిల్లర కౌంటర్ల ద్వారా మార్కెట్ ఆదాయానికి గండి పడుతోందని చెప్పారు. కార్యక్రమంలో మిర్చి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు మెంతుల శ్రీశైలం, యడ్లపల్లి సతీశ్కుమార్, చాంబర్ ప్రధాన కార్యదర్శి సోమ నర్సింహారావు, ఉపాధ్యక్షుడు బత్తిని నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. రేపు కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజాదర్బార్ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఈనెల 30న ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ తెలిపారు. గురువారం ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా, నగర, మండలాల బాధ్యులు పాల్గొంటారని ఓ ప్రకటనలో తెలిపారు. నేడు న్యాయవాద సంక్షేమ సంఘం ఎన్నికలు ఖమ్మంలీగల్: ఖమ్మం న్యాయవాద సంక్షేమ సంఘం ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. మొత్తం 534 మందికి ఓటు హక్కు కలిగి ఉండగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు గుద్దేటి రమేశ్, కూరపాటి శేఖర్ రాజు తెలిపారు. ఆ తర్వాత పోలైన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించా రు. కాగా, నాలుగు డైరెక్టర్ పదవులకు గాను మన్నేపల్లి బసవయ్య, తెరళ గంగాధర్, షేక్ మల్సూర్, కొలకలూరి ప్రసాద్, దొంతబోయిన రామారావు, చెన్నోజు వెంకటరమణాచారి, చింతల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ పోటీ పడుతున్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్లో తేడాలు రావొద్దుఖమ్మంసహకారనగర్: పూర్తిస్థాయి సమాచారంతో ఎస్ఐఆర్ మ్యాపింగ్ కచ్చితంగా పూర్తి చేయాలని హైదరాబాద్ సీఈఓ కార్యాలయ ఎస్డీసీ శ్రీరామ్ప్రసాద్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఎస్ఐఆర్ మ్యాపింగ్, డేటా సమన్వయంపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ప్రసాద్ మాట్లాడుతూ.. 2002 నుంచి 2025 వరకు రికార్డులను పరిశీలించి ఎస్ఐఆర్ మ్యాపింగ్ చేపట్టాలని తెలిపారు. ప్రతీ దశలో వివరాలను సరిపోల్చుకోవడం ద్వారా పొరపాట్లు దొర్లవని చెప్పా రు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, బీఎల్ఓలు, సూపర్వైజర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్డీసీ రాజేశ్వరి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజు, టీటీ అన్సారి తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో మంగళవారం స్వామి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూ జలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం జరిపించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణఽ దారణ, యోక్త్రధారణ గావించాక నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారం కావడంతో ఆంజ నేయస్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు జరిగాయి. నర్సరీ నిర్వహణపై ప్రత్యేక దృష్టిజూలూరుపాడు: వేసవి నేపథ్యాన నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించా లని జిల్లా అటవీ శాఖాధికారి కిష్టాగౌడ్ సూ చించారు. జూలూరుపాడు మండలం వినోభా నగర్లోని అటవీ నర్సరీని మంగళవారం ఆయ న సందర్శించారు. ఈ సందర్భంగా వేసవిలో మొక్కల సంరక్షణపై అటవీ సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే, వచ్చే ఏడాది నాటేందుకు కావాల్సిన మొక్కలు సిద్ధం చేయాలని తెలిపా రు. అంతేకాక అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా స్థానికులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎఫ్ఆర్ఓ జి.ప్రసాద్రావు, ఎఫ్ఎస్ఓ మల్లయ్య, బీట్ ఆఫీసర్ రేఖ తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల రవాణాకు వాహనాలుసూపర్బజార్(కొత్తగూడెం): రైతులకు నాణ్య మైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ఎన్పీడీసీఎల్ ద్వారా ట్రా న్స్ఫార్మర్ల రవాణాకు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ జి.మహేందర్ తెలిపారు. జిల్లాలో 13 వాహనాలు అందుబాటులో ఉండగా, ప్రతీ వా హనానికి జీపీఎస్ అమర్చినట్లు వెల్లడించారు. ప్రతీ డివిజన్, సబ్ డివిజన్ పరిధిలో వాహనాలు అందుబాటులో ఉన్నందున, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందనే సమాచారం తెలియగానే సిబ్బంది వెళ్లి తీసుకొచ్చి మరమ్మతు అనంతరం తిరిగి చేరుస్తారని తెలిపా రు. ఈమేరకు ఎక్కడైనా సమస్య తలెత్తితే తమ సిబ్బందికి నేరుగా కానీ 1912 నంబర్కు కానీ సమాచారం ఇవ్వాలని ఎస్ఈ ఓ ప్రకటనలో సూచించారు. ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించండిగుండాల: రైతులు ఏటేటా పంట మార్పిడి చేస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు సూచించారు. గుండాల రైతువేదికలో మంగళవారం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సులో ఆయన మాట్లాడారు. అవసరం మేరకే యూరియా వా డడం ద్వారా ఖర్చులు తగ్గి, భూమి సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అంతేకాక సాగునీరు ఆదా చేయాలన్నారు. అలాగే, పంట అవశేషాలను తగలబెట్టకుండా కలియదున్నడంతో భూసారం పెరుగుతుందని తెలిపారు. అనంతరం వచ్చే వానాకాలంలో పంటల సాగుకు విత్తనాల ఎంపిక తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏడీఏ తాతారావు, కేవీకే కోఆర్డినేటర్ కె.భరత్, శాస్త్రవేత్త శివ, సర్పంచ్ కకె.సీతారాములు, ఏఓ వెంకటరమణ, ఏఈఓలు బాలరాజు, లెనిన్ పాల్గొన్నారు. -
మహిళా పవర్ !
రైతుల స్థానంలో మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో నానాటికీ విద్యుత్ వినియో గం పెరుగుతోంది. దీంతో థర్మల్, హైడల్ పవర్ ప్లాంట్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈనేపథ్యాన వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ వాటా పెంచేందుకు కేంద్రం పీఎం కుసుమ్ పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రైతులు సహకార, సంయుక్త పద్ధతిలో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగా వాట్ల వరకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే కేంద్రం ప్రోత్సాహకాలను అందిస్తుంది. కానీ ఈ స్థాయిలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే రెండు నుంచి పదిహేను ఎకరాల వరకు స్థలం అవసరమవుతుంది. రైతు సంఘాల దగ్గర ఆ స్థాయిలో భూములు అందుబాటులో లేవు. దీంతో ఇంచుమించు పీఎం కుసుమ్ తరహాలోనే మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. జిల్లాలో రెండు యూనిట్లు ఇందిరా మహిళా శక్తి పేరుతో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యాన జిల్లాలో ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా సుజాతనగర్, ముణుగూరు మండలాలను ఎంపిక చేశారు. మండల సమాఖ్య సభ్యులు బృందంగా ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ను నిర్వహిస్తారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వమే ఎంపిక చేస్తుంది. 25 ఏళ్ల లీజుతో అప్పగించనుంది. పదేళ్ల పాటు పూర్తి ఆదాయం మహిళా సంఘాల ఆధ్వర్యాన ఏర్పాటుచేసే సోలార్ పవర్ ప్లాంట్ నుంచి సగటున ప్రతీరోజు 4,500 యూనిట్ల విద్యుత్ గ్రిడ్కు సరఫరా అవుతుంది. ప్రస్తుతం ఒక్క యూనిట్కు విద్యుత్ సంస్థలు రూ.3.13 చెల్లిస్తున్నాయి. ఈ లెక్కన నెలకు సుమారు రూ.4లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో కొంత మొత్తాన్ని ప్లాంట్ నిర్వహణ ఖర్చులకు, మరికొంత భాగాన్ని మహిళా సమాఖ్యలకు కేటాయించి.. సింహభాగాన్ని బ్యాంకు రుణాల చెల్లింపునకు ఉపయోగిస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారం బ్యాంకు రుణం కనిష్టంగా పదేళ్ల నుంచి గరిష్టంగా 15 ఏళ్లలో తీరిపోతుంది. ఆ తర్వాత పదేళ్ల పాటు వచ్చే ఆదాయం మహిళా సమాఖ్యలకే చెందుతుంది. ఈ సొమ్మును స్వయం సహాయ సంఘాల అభ్యున్నతికి ఉపయోగిస్తారు. ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అందుబాటులో ఉన్నస్థలం, అక్కడి భౌగోళిక పరిస్థితులను ఆధారంగా సగటున రూ.3 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో పది శాతం పెట్టుబడిని మహిళా సమాఖ్యలు సమకూర్చుకోవాలి. మిగతా 90శాతం పెట్టుబడిని రుణాల రూపంలో బ్యాంకులు అందిస్తాయి. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. ఆపై వచ్చే ఆదాయం నుంచి నిర్వహణ ఖర్చులు పోగా నెలకు కొంత చెల్లిస్తే రుణభారం తగ్గుతుంటుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం మండలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పనులు చివరి దశకు చేరగా, కల్లూరు మండలంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాకు సంబంధించి మండలాలు, మహిళా సమాఖ్యల ఎంపిక, స్థలం కేటాయింపుపై స్పష్టత రావడంతో త్వరలోనే పనులు మొదలుకానున్నాయి.మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధి కోసం ఇప్పటికే బస్సులు ఇప్పించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్నాయి. వీటిలో పాటు పెట్రోలు బంక్లు నిర్వహణలోనూ సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈనేపథ్యాన మరో అడుగు ముందుకేసి సోలార్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ మహిళా సంఘాల సభ్యులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
●రహదారి వెంట ఆహ్లాదం..
చర్ల మండలంలో రాళ్లగూడెం నుంచి సుబ్బంపేట వరకు ప్రధాన రహదారి వెంట కొన్నేళ్లుగా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. భద్రాచలం – వెంకటాపురం రాష్ట్రీయ రహదారి–12పై దేవరాపల్లి, కుదునూరు, ఆర్.కొత్తగూడెం, సత్యనారాయణపురం, సి కత్తిగూడెం, కొయ్యూరు, సుబ్బంపేట తదితర గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు వృక్షాలుగా మారి కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం వేసవి తీవ్రత నేపథ్యాన ఈ మార్గంలో వెళ్తున్న వాహనదారులు కాసేపు ఆగి సేదదీరుతున్నారు. – చర్ల -
కలెక్టర్ను కలిసిన సంఘాల నాయకులు
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం అర్బన్/ఖమ్మం మామిళ్లగూడెం: కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన దివాకర టీఎస్ను టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఉద్యోగులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కార్యదర్శి కొణిదన శ్రీనివాసరావుతో పాటు జైపాల్, యర్రా రమేష్, అస్లాం ఖాన్, లలితకుమారి, తాళ్లూరి శ్రీకాంత్, కోనార్ హరికృష్ణ, రాధికారెడ్డి, రుక్మారావు, ఫజల్, సైదులు, రాజ్కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే, రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు ఆధ్వర్యాన కలెక్టర్ను సన్మానించడంతో పాటు మిల్లర్ల సమస్యలను వివరించారు. అంతేకాక నూతన కలెక్టర్ దివాకరను రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వెలిగేటి చంద్రమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట సొసైటీ సభ్యులు జెల్లా వెంకటేశ్వర్లు, మూలగుండ్ల శ్రీహరి, కొత్త సత్యనారాయణరెడ్డి, గజేంద్రుల నాగేశ్వరరావు, గట్టు మోహన్రావు, షకీల్ అహ్మద్ తదితరులు ఉన్నారు. -
చదువులో ఆడపిల్లలను ప్రోత్సహించాలి
చండ్రుగొండ: తల్లిదండ్రులు ఎలాంటి వివక్ష చూపకుండా ఆడపిల్లలను సైతం చదువులో ప్రోత్సహించాలని భద్రాద్రి జిల్లా డీఆర్డీఓ విద్యాచందన సూచించారు. చండ్రుగొండలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వివక్ష లేకుండా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను చదువు, అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాక మైనర్లకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. కాగా, యువతులు భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలే తప్ప సైబర్ నేరాల బారిన పడొద్దని సూచించారు. సదస్సులో డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కవిత, తహసీల్దార్ జగదీశ్వర్ప్రసాద్, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, సీఐ శ్రీలక్ష్మి, సీడీపీఓ సలోమి పాల్గొన్నారు. డీపీఓగా అదనపు బాధ్యతలు సూపర్బజార్(కొత్తగూడెం): భద్రాద్రి జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)గా డీఆర్డీఓ విద్యాచందన మంగళవారం అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. -
తెగిపడిన విద్యుత్ తీగ
వైరా: భారీ వాహనం వెళ్లే క్రమాన విద్యుత్ తీగలకు తాకి తెగిపడడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఏపీకి చెందిన భారీ ట్రాలీ వాహనం మంగళవారం ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారిపై వెళ్తోంది. ఈ క్రమాన వైరా శాంతినగర్ వద్ద విద్యుత్ తీగలకు తగలడంతో అవి తెగి నడి రోడ్డుపై పడ్డాయి. అంతేకాక తీగలకు అనుసంధానంగా ఉన్న స్తంభం సైతం ద్విచక్రవాహనంపై పడి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. అయితే, తీగలు రోడ్డుపై పడి ఉండటంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మేరకు విద్యుత్ అధికారులు చేరుకుని తీగలను తొలగించి మరమ్మతులు చేపట్టగా.. పోలీసులు రాకపోకలను క్రమబద్ధీకరించారు. స్తంభించిన వాహనాల రాకపోకలు -
మహిళ ఆత్మహత్యాయత్నం
మధిర: మధిర లడకబజార్లోని తన ఇంటి ముందు మెట్లను మున్సిపల్ సిబ్బంది అన్యాయంగా కూల్చివేశారని ఆరోపిస్తూ వల్లాపురపు జానకిరామయ్య కుటుంబీకులు నిరసన తెలిపారు. ఆయన భార్య నాగరాణి, ఆమె సోదరుడు బాలాజీ, కుటుంబీకులు మంగళవారం రైల్వే గేట్ సమీపాన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నాగరాణి ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు చేరుకుని వారిని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా జరిగిన పెనుగులాటలో బాలాజీ చేతికి గాయమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నా పట్టించుకోకుండా, తమ ఇంటి ముందు మెట్లను మాత్రం ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారని ఆరోపించారు. కమిషనర్ తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని తెలిపారు.మున్సిపల్ సిబ్బంది మెట్లు కూల్చారని ఆవేదన -
ఆలయాలను పరిశీలించిన అధికారులు
చింతకాని: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మండలంలోని పలు ఆలయాల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు సీతంపేటలోని శ్రీగజగిరి లక్ష్మీనర్సింహాస్వామి, నాగులవంచలోని అంకమ్మతల్లి ఆలయాలను దేవాదాయ శాఖాధికారులు మంగళవారం పరిశీలించారు. శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ముందు మహామండపం, కల్యాణ మండపం, అతిథిగృహాలు, కళావేదిక, ఆలయ గోపురం నిర్మాణమే కాక కోనేరు అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అలాగే, నాగులవంచలోని అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ స్తపతి శివశంకర్, ఏఈ వెంకటరమణ, ఆలయ ఈఓ చుండూరు రామకోటేశ్వరరావు, మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు, నాగులవంచ సర్పంచ్ నారగాని రాంబాయి, ఆలయ కమిటీ చైర్మన్ ముత్తినేని వెంకటేశ్వర్లుతో పాటు వెచ్చా మంగపతిరావు, సిరిసాని రమణప్రసాద్, వెగ్గళం పాండురంగాచారి, సామినేని రామారావు, ఆళ్ల పానకాలరావు, కంభం వీర భద్రం, ఆలస్యం బస్వయ్య, మద్దినేని వెంకటేశ్వరరావు, ఏ.రవి, ఎస్.సైదులు పాల్గొన్నారు. -
అందరి బాధ్యత
మహిళలు, బాలికల రక్షణ టేకులపల్లి: మహిళలు, బాలికల భద్రత అనేది చట్టాలకు పరిమితం కాకుండా.. అందరూ బాధ్యతగా భావించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా టేకులపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో పాల్గొన్న కలెక్టర్ బాలికల రక్షణ చట్టాలతో రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరించాక మాట్లాడారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో సెల్ఫోన్ల వినియోగం పెరగడంతో బాలికలు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నందున విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి లెనినా మాట్లాడుతూ అపరిచితుల మాట లు నమ్మి మోసపోకుండా, ఆపద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహా లు చట్టరీత్యా నేరమైనందున ఎవరైనా బలవంతం చేస్తే ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆతర్వాత బాలికలు, మహిళల సంరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. సదస్సులో సర్పంచ్ నాకా, సీడీపీఓ కే.ఎం తార, తహసీల్దార్ ఎల్.వీరభద్రం, వైద్యాధికారి వెంకటేశ్, వివిధ శాఖల ఉద్యోగులు జేఎల్.గణేష్గాంధీ, హరికుమారి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పరిశీలన టేకులపల్లి మండలం బొమ్మనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, కొనుగోళ్లు, నాణ్యత పరిశీలనపై చర్చించారు. తేమ శాతం నిర్ధారణలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. రికార్డుల నిర్వహణ, ఎండల దృష్ట్యా ఏర్పాట్లపై సూచనలు చేశారు. తహసీల్దార్ వీరభద్రం, ఏఓ అన్నపూర్ణ, సొసైటీ సీఈఓ ప్రేమాచారి, ఏఈఓలు భాగ్యశ్రీ, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అవగాహన సదస్సులో కలెక్టర్ అంకిత్ -
బదిలీ కలెక్టర్కు ఘన సన్మానం
ఖమ్మంసహకారనగర్: ఖమ్మం కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన అనుదీప్ దురిశెట్టిని జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం ఘనంగా సత్కరించింది. తొలుత నూతన కలెక్టర్ దివాకర.. అనుదీప్కు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ కలెక్టర్గా అనుదీప్ సేవలను కొనియాడారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్ తదితరులు మాట్లాడాక సన్మానించారు. టీఎన్జీవోస్, టీజీవోస్ నాయకులతో పాటు జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్వో పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సింథటిక్ ట్రాక్ పనుల్లో వేగం పెంచాలి
ఖమ్మం స్పోర్ట్స్: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ పనుల్లో వేగం పెంచి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడకుండా ట్రాక్ను సిద్ధం చేయాలని తెలిపారు. ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అవకాశం ఉంటుందని చెప్పారు. అనంతరం మంత్రి ఖమ్మం 18వ డివిజన్, శ్రీరామ్హిల్స్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
బూడిదంపాడులో మొక్కజొన్న పంట దగ్ధం
రఘునాథపాలెం: మండలంలోని బూడిదంపాడులో మంగళవారం సాయంత్రం మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన రైతు గుమ్మడి సత్యం చేనుకు తొలుత మంటలు అంటుకోగా.. ఆ తర్వాత విస్తరిస్తూ పక్కన ఉన్న నలుగురు రైతులకు చెందిన చేలకు కూడా మంటలు అంటుకున్నాయి. మొత్తం ఐదెకరాల్లో పంట నష్టం జరిగినట్లు సమాచారం. సాయంత్రం ఐదు గంటల సమయాన మంటలు మొదలుకాగా స్థానికులు అదుపుచేసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఉద్యోగులు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
మేలైన వ్యవసాయంకోసం..
● ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ పేరిట సదస్సులు ● ఉమ్మడి జిల్లాలో 72 చోట్ల నిర్వహణ ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చే వానాకాలం సీజన్ దృష్ట్యా పంటల సాగు, విత్తనాల ఎంపిక, ఎరువుల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమం ద్వారా సదస్సులు నిర్వహిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం పర్యవేక్షణలో వ్యవసాయ శాఖ ద్వారా మొదలైన ఈ సదస్సులు వచ్చేనెల 23వ తేదీ వరకు కొనసాగుతాయి. ఎరువులు, సుస్థిర ఆదాయం ఎరువుల వినియోగం, సుస్థిర ఆదాయాన్ని పొందేలా, పంటలు సాగుచేసేలా రైతులకు ఈ సదస్సుల్లో అవగాహన కల్పిస్తారు. యూరియా వాడకం తగ్గింపుతో సాగుఖర్చును తగ్గించుకోవాలని.. తద్వారా నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే అంశాన్ని రైతుల్లోకి తీసుకెళ్తారు. ప్రధానంగా వరిలో 75 – 90 కిలోల యూరియాకు బదులు రైతులు 180 కిలోల వరకు వినియోగిస్తున్నారు. దీంతో వ్యయం పెరగడమే కాక భూగర్భ జలాలు విషతుల్యం కావటం, నేలలోని సూక్ష్మ జీవులకు హాని కలుగుతోంది. అవసరం మేరకు రసాయనాలను వినియోగిస్తే ప్రకృతిని రక్షించుకోవచ్చని, పంట మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందాలని సదస్సుల్లో సూచిస్తారు. అంతేకాక మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేసేలా చైతన్యం కల్పిస్తారు. అంతేకాకుండా పండ్ల తోటలు, పాడి పరిశ్రమ ఏర్పాటుతో లాభాలపై అవగాహన పెంపొందించాలని నిర్ణయించారు. వరిలో సన్న రకాలు జిల్లాలో వరి ప్రధానమైన పంటగా సాగవుతోంది. మద్దతు ధరకు తోడు ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుండడంతో రైతులు సన్న రకాల సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యాన తక్కువ విత్తన వ్యయం, నాణ్యత, విశ్వసనీయత, చీడపీడలను తట్టుకునేలా రకాల ఎంపికపై రైతులకు వివరిస్తారు. వరిలో కూనారం (కేఎన్ఎం 1638), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్–15048), సాంబమసూరి (బీపీటీ–5204), సిద్ధి(డబ్ల్యూజీఎల్–44), జైశ్రీరామ్, హెచ్ఎంటీ సోనా వంటి రకాల ప్రత్యేకతలపై అవగాహన కల్పిస్తారు. ఇక కాటన్ దొర సన్నాలు (ఎంటీయూ–1010), కూనారం సన్నాలు (కేఎన్ఎం–118)పై వివరిస్తూ.. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ సాగులోతీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడాన్ని కూడా ఈ సదస్సుల్లో అజెండాగా చేర్చారు. సహజ వనరులు, సుస్థిర వ్యవసాయ విధానాలను అలవర్చుకునేలా రైతులను చైతన్యపర్చాలని నిర్ణయించారు. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పంటల మార్పిడి, జీవ కీటక నియంత్రణ, పచ్చిరొట్ట పంటల పెంపకం, మల్చింగ్, పంట అవశేషాలు నేలలో కలియదున్నడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో సదస్సులు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’కార్యక్రమం ఈ నెల 27న మొదలుకాగా.. ఉమ్మడి జిల్లాలో 72 క్లస్టర్లు, గ్రామాల్లో వచ్చేనెల 23వ తేదీవరకు కొనసాగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 52, ఖమ్మం జిల్లాలో 20 సదస్సుల నిర్వహణకు వేదికలు ఖరా రు చేశారు. అశ్వారావుపేట వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ హేమంత్కుమార్తో కూడిన శాస్త్రవేత్తల బృందంతో పాటు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కృషి విజ్ఞాన కేంద్రాల, పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సదస్సుల్లో పాల్గొంటున్నారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల వ్యవసాయాధికారులు ధనసరి పుల్లయ్య, బాబూరావు పర్యవేక్షిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కొణిజర్ల: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలపాలైన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ జి.సూరజ్ కథనం ప్రకారం.. మండలంలోని పెద్ద మునగాలకు చెందిన తుప్పతి సత్యనారాయణ (34), చింతల కేశవులు పెద్దగోపతిలోని బంక్లో డీజిల్ కోసం ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. పెద్దగోపతి నుంచి పెద్దమునగాల వైపు రాజారాపు నారాయణ బైక్పై వస్తుండగా.. ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్నాయి. ఘటనలో కేశవులు బైక్పై వెనుక కూర్చున్న సత్యనారాయణ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమైంది. కేశవులు, నారాయణ కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రు లను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ సత్యనారాయణ మృతి చెందాడు. ఆయనకు భార్య త్రివేణి,కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. నీళ్ల కోసం వచ్చి నగదు చోరీ దమ్మపేట: తాగునీరు కావాలని వచ్చిన పలువురు నగదు చోరీ చేసిన ఘటన ఇది. మండలంలోని మందలపల్లిలో నూతక్కి రాజశేఖర్ ఇంటికి మంగళవారం నలుగురు మహిళలు, ఓ పురుషుడు వచ్చి తాగడానికి నీరు కావాలని అడిగారు. దీంతో రాజశేఖర్ భార్య రమ్య తన చేతిలోని రూ.2 వేల నగదు కుర్చీలో పెట్టి లోపలికి వెళ్లింది. తిరిగి నీళ్లతో వచ్చేసరికి నగదు, అపరిచిత వ్యక్తులు కనిపించలేదు. ఈ మేరకు రాజశేఖర్ కుటుంబీకులు గ్రామంలో గాలించి వారిని పట్టుకుని అప్పగించగా, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. -
మొదలైన తునికాకు సేకరణ
● రేటు కుదరడంతో రంగంలోకి.. ● తొలుత చెట్టుపల్లి యూనిట్లో ప్రారంభం ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎట్టకేలకు తునికాకు సేకరణ మొదలైంది. నాలుగు రోజులుగా చెట్టుపల్లి యూనిట్లోని పలు గ్రామాల్లో గిరిజనులు ఆకు సేకరణ ప్రారంభించారు. కొన్నేళ్ల క్రితం వరకు మే డే తర్వాత ఆకు సేకరణ మొదలు పెట్టేవారు. కానీ, రెండేళ్ల నుంచి ముందుగానే ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా ఏప్రిల్ మొదటి వారంలో రేటు ఒప్పందం జరగడంతో గిరిజనులు అడవి బాట పడుతున్నారు. పాతికేళ్ల క్రితం పండుగలా.. వేసవి వచ్చిందంటే చాలు పాతికేళ్ల క్రితం వరకు తునికాకు సేకరణ పల్లెల్లో పండుగలా జరిగేది. గిరిజనులు రెండో పంటగా భావిస్తూ వేసవిలో ఆకు సేకరణకు ఆసక్తి చూపేవారు. అంతేకాక రేటు పెంచాలనే డిమాండ్తో ఆందోళనలు, పార్టీల మధ్య చర్చలు కొనసాగేవి. ఇందులో మావోయిస్టులు, ఇతర పార్టీల నేతల ప్రభా వం కనిపించేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కానరావడం లేదు. కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యాన చర్చ లు, ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈసారి కూడా గుండాల మండలం కాచనపల్లిలో చర్చించి ధర ఖరారు చేశారు. అయితే, కాలక్రమేణా అడవి అంతరించడం, పోడు వ్యవసాయంతో చెట్లు లేకపోవడంతో ఆకు సేకరణ కూడా తగ్గిపోతోంది. ఏపుగా పెరగని తునికాకు తునికాకు సీజన్కు ముందు ఒకటి, రెండు వర్షాలు కురవడం, ఆకు ఏపుగా ఎదగడం పరిపాటిగా ఉండేది. కానీ ఈదఫా వర్షాలు లేకపోవడంతో ఆకు అంతగా ఎదగలేదు. దీంతో ఆకు సేకరణ తక్కువ రోజులే కొనసాగే అవకాశముంది. ప్రస్తుతానికి గుండాల మండలం చెట్టుపల్లిలో ఆకు సేకరణ మొదలుపెట్టారు. భద్రాద్రి జిల్లాలో.. జిల్లాలో 19 మండలాల్లో పోరాట కమిటీతో కాంట్రా క్టర్లు రేటు ఒప్పందం చేసుకున్నారు. న్యూడెమోక్రసీ, మాస్లైన్, చంద్రన్న వర్గం, సీపీఐ, సీపీఎం, తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాల నేతలతో కాంట్రాక్టర్లు ఈ నెల 18న గుండాల మండలం కాచనపల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 50 ఆకుల కట్టకు రూ. 3.42 ధర ఖరారైంది. అయితే, భద్రాద్రి జిల్లాలోని 19 మండలాల్లో లభించే తునికాకు నాణ్యతగా ఉంటుంది. దీంతో కాంట్రాక్టర్లు ఆయా మండలాల మీదే ఆధారపడతారు. ప్రస్తు తం పెంచిన ధర కూడా గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, పినపాక, కరకగూడెం, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, ముల్కలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, ఇల్లెందు, బయ్యారం, గంగారం, పాకాల, గూడూ రు తదితర మండలాల్లో అమలుకానుంది. మిగతా చోట్ల ప్రభుత్వం ఖరారు చేసిన ధర ప్రకారమే చెల్లిస్తారు. -
మద్యం వ్యాపారుల సిండికేట్ ?
అశ్వారావుపేట: అశ్వారావుపేటలో మద్యం వ్యాపారులు సిండికేట్ అవుతున్నట్లు తెలిసింది. గత ఏడాదిడిసెంబర్లో వైన్స్ దక్కించుకున్న వ్యాపారు లు ఇన్నాళ్లు ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ఆరు వైన్స్ను దక్కించుకున్న వారి రాజకీయ, సామాజిక నేపథ్యాలు వేర్వేరు కావడంతో సిండికేట్ కావడానికి సుముఖత చూపలేదు. ఈ నేపథ్యాన ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు కొనసాగుతున్నా యి. అయితే, ఇప్పుడు ఎవరు చొరవ చూపారో తెలియదు కానీ అంతా సిండికేట్ కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదే జరిగితే లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే చీప్లిక్కర్, ఇతర బ్రాండ్ల మద్యం, బీర్లను అమ్మొ ద్దని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాక క్వార్టర్ సీసాపై ఎమ్మార్పీకి రూ.40 అదనంగా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అది కూడా ఫుల్ బాటిళ్లనుంచే లూజ్ చేసి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే సమయాన కాస్త ఖరీదైన మద్యం మాత్రం యథావిధిగా అమ్మాలని భావిస్తుండగా.. ఒకటి, రెండు రోజుల్లో చర్చలు కొలిక్కి వచ్చే అవకాశముందని తెలిసింది.ఒక్కో క్వార్టర్పై రూ.40 అదనం -
‘నీట్’ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో నీట్(యూజీ) నిర్వహణలో లోపాలు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి అధికారులతో సమీక్షించారు. మే 3వ తేదీన మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం 5గంటల వరకు జరిగే పరీక్షకు 1,078 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. ఇందుకోసం మూడు కేంద్రాలను ఏర్పాటుచేశామని, విద్యార్థులను ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు అనుమతించాలని సూచించారు. అంతేకాక కేంద్రాలు, సమీప ప్రాంతాల్లో భద్రతా చర్యలపై సూచనలు చేశారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, నీట్ పరీక్ష ఇన్చార్జ్ ప్రసాద్, డీఎస్పీ ఆదినారాయణ, సీఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రగిరిలో జీర్ణోద్ధరణ..
● ఉపాలయాల్లో మూర్తులకు కళావాహన ● పూజల్లో పాల్గొన్న త్రిదండి చినజీయర్ స్వామిభద్రాచలం: భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో ప్రధాన ఘట్టం ఆదివారం ఆవిష్కృతమైంది. ఆలయ నిర్మాణం అనంతరం ఏకకాలంలో 15 ఉపాలయాల్లోని 72 మూలమూర్తులకు, మూడు గోపురాలకు ఒకే రోజు కళావాహన నిర్వహించటం తొలిసారని రిటైర్డ్ అర్చకులు పేర్కొంటున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఉపాలయాలు, ఆళ్వార్ల గుడులను తొలగించాల్సి వస్తోంది. దీంతో మూలమూర్తులను తరలించేందుకు కళావాహన చేపట్టారు. జీర్ణోద్ధరణకు అర్చకులు మూలమూర్తుల వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చిన జీయర్ స్వామి హాజరయ్యారు. అనంతరం భక్త రామదాసు, భద్రగిరి మహర్షి, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, ఇతర ఉపాలయాల్లో కళావాహన చేశారు. 60 మంది రుత్విక్కులతో.. యాదగిరి గుట్ట, ధర్మపురి, సింహాచలం ఇతర ఆలయాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన 60 మంది రుత్వి క్కులు, ఆలయ అర్చకులు మేళతాళాల నడుమ పవిత్ర గోదావరి నుంచి పుణ్యజలాలను తీసుకొచ్చి యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. కళావాహన అనంతరం విగ్రహాలను కదిలించారు. శ్రీ లక్ష్మీతా యారు, గోదాదేవి అమ్మవార్లను ప్రధాన ఆలయ ముఖమండపం వద్ద భక్తుల దర్శనార్థం ఉంచుతామని, ఇతర మూర్తులను రంగనాయకుల గుట్టపై ధ్యానమందిరంలో నిర్మించిన తాత్కాలిక బాలాలయంలో కొలువుదీర్చుతామని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, మధ్యాహ్నం వరకు స్వామివారి దర్శనం నిలిపివేయగా, సమాచారం తెలియని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేచి చూశారు. భక్త రామదాసుకు ప్రాధాన్యం ప్రపంచ వ్యాప్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం భద్రాచలం రామాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. కళావాహన అనంతరం ఆలయ విలేకర్లతో మాట్లాడారు. రామ య్య స్వామి ఆలయం నిర్మించిన భక్త రామదాసుకు నూతన ఆలయ అభివృద్ధిలో కీలక ప్రాధాన్యం కల్పించాలని అన్నారు. ప్రధానాలయంలో రామయ్యకు ఒక వైపు శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, మరో వైపు గోదాదేవి, లక్ష్మీతాయారు అమ్మవారికి ఎదురుగా భక్తరామదాసు విగ్రహంఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు. నిత్యం రామయ్యతో పాటు రామదాసుకు పూజలు జరగాలన్నారు. ఆలయ అభివృద్ధి అనంతరం ఉపాలయాలన్నీ ఒక వైపు, ఆళ్వార్లు మరో వైపు ఒకే చోట భక్తులకు దర్శనానికి ఉంటారని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పూజల్లో పాల్గొని, ఈఓను అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్రావు దంపతులు, ఏఈఓలు శ్రవణ్కుమార్, భవాని రామకృష్ణ, ఉత్సవ కమి టీ బాధ్యులు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యులు, ఆలయ రిటైర్డ్ ప్రధానాచార్యులు పొడిచేటి రామచంద్రాచార్యులు, పొడిచేటి సీతా రామానుజాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు విజయరాఘవన్, కోటి రామ స్వరూప్లు, స్థానా చార్యులు స్థలశాయి, వేదపండితులు గుది మళ్ల కృష్ణమాచార్యులు, ఇతర అర్చకులు, గాదె మాధవరెడ్డి, ఎండీ నవాబ్, రాజు పాల్గొన్నారు. -
బలి తీసుకుంటున్న ఎండ
● ఉమ్మడి జిల్లాలో గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు ● పెరుగుతున్న వడదెబ్బ మరణాలు ● అయినా అవగాహన చర్యలు శూన్యం చుంచుపల్లి: రాష్ట్రంలోని మిగతాప్రాంతాల్లో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో గరిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండకు తోడు వడగాలుల ప్రభావం ఉండడంతో నానాటికీ వడదెబ్బ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో వృద్ధులు, రైతులు, పిల్లలు, ఉపాధి కూలీలు తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో 44.1 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం నుంచి రాత్రి ప్రభావం ఉంటుండడంతో తప్పనిసరి బయటకు వస్తున్న వారు వడదెబ్బ బారిన పడుతున్నారు. అవగాహన.. అంతంతే ఉమ్మడి జిల్లాలో గరిష్ట స్థాయిలో ఎండల నేపథ్యాన రోజువారీ పనుల కోసం బయటికి వెళ్లేవారు వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంది. ఈక్రమాన అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినా... ఉమ్మడి జిల్లాలో అలాంటి చర్యలేవీ కనిపించడం లేదు. పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడమే కాక ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే, వైద్యులతో సదస్సులు ఏర్పాటుచేసి ఎండ సమయాన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బకు గురైతే చికిత్సపై అవగాహన కల్పించాలి. ఇలాంటివి జరకపోవడం.. పలువురు వడదెబ్బ బారినపడి మృతి చెందుతుండడం కలిచివేస్తోంది. విపత్తు నిధి కింద పరిహారం వడదెబ్బతో మృతి చెందే వారి కుటుంబాలకు ప్రభుత్వం రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద పరి హారం చెల్లిస్తోంది. ఈ పరిహారం గతంలో రూ.50వేలే ఉండగా.. ఆపద్బంధు పేరుతో రూ.4 లక్షలు పరిహారం చెల్లించనున్నట్లు గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా వడదెబ్బతో మృతి చెందితే స్థానిక వైద్యాధికారి ధ్రువీకరించాలి. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి పంచనామా నిర్వహిస్తారు. వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ కోసం తప్పనిసరిగా శవపరీక్ష నిర్వహించాలి. ఈ నివేదిక ఆధారంగా ఎఫ్ఆర్, మరణ ధ్రువపత్రం, పంచనామా నివేదికలను తహసీల్లో అందిస్తే వైద్యాధికారి, ఎస్ఎచ్ఓ, తహసీల్దార్లతో కూడిన కమిటీ ఆర్డీఓకు.. అక్కడి నుంచి కలెక్టర్ నివేదిక పంపించి పరిహారం మంజూరు చేస్తారు. అయితే ఈ పరిహారంపైనా చాలామందికి అవగహన లేకపోవడంతో దూరమవుతున్నారు.అశ్వాపురం మండలం జగ్గారానికి చెందిన రైతు మాదినేని బాబు(57) ఆదివారం చేను వద్దకు వెళ్లగా వడదెబ్బతో మృతి చెందాడు. చండ్రుగొండ మండలం గానుగపాడుకు చెందిన వ్యవసాయ కూలీ పణితి వెంకటేశ్వర్లు(57) ఈనెల 23న ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఈనెల 22న వైరా మండలం గరికపాడుకు చెందిన సుంకర వెంకటేశ్వర్లు(75) ఉపాధి పనులకు వెళ్లి వస్తూ, కల్లూరు మండలం గోపాలకుంటకు చెందిన ఫఠాన్ అమీన్భీ(75) ఇంట్లోనే ఎండదెబ్బతో గురై మృతి చెందాడు. ఇదేరోజు గేదేలను మేపడానికి వెళ్లిన పినపాక మండలం పోతిరెడ్డిపల్లి వాసి వెంకటేశ్వర్లు(51) సైతం మృత్యువాత పడ్డాడు. ఈనెల 20న కల్లూరు అంబేడ్కర్ నగర్కు చెందిన కూలీ పాలవలస రాజు(68), ఎర్రుపాలెం మండలం రాజుపాలేనికి చెందిన స్వర్ణ నర్సింహరావు(62) మృతి చెందారు. ఈనెల 19న చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన వ్యవసాయ కూలీ మీరా(42), దమ్మపేట మండలం వడ్లగూడెంకు చెందిన పల్లెపు వెంకటలక్ష్మి(60) వడదెబ్బతో మృత్యువాత పడింది. ఈనెల 17న వైరా మండలం విప్పలమడకకు చెందిన మేడా లక్ష్మి(65), నాగులవంచకు చెందిన ఏ.ధనలక్ష్మి(40) ఎండ తీవ్రతతో అస్వస్తతకు గురై మృతి చెందారు. ఈనెల 14న కొణిజర్ల మండలం తణికెళ్లకు చెందిన ముత్యాల సత్యవతి(55) మిర్చి ఏరేందుకు వెళ్లి వడదెబ్బ లక్షణాలతో తీవ్ర అస్వస్తతకు గురై ఇంటివద్ద కుప్పకూలి మృతి చెందింది.ఎండల నేపథ్యాన 70 ఏళ్లు పైబడిన వారు, పిల్లలు ఉన్న వారు ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండడం శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాక ప్రతిరోజు మూడు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలని, నీటిలో నిమ్మకాయ రసం, ఉప్పు లేదా పంచదార కలిపి తాగితే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. తప్పనిసరై బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి రక్షణ పొందాలని సూచిస్తున్నారు. -
భూమికి బలం..
రైతుకు భారంఖమ్మంవ్యవసాయం: సేంద్రియ పద్ధతిలో భూసారాన్ని పెంచేందుకు అవకాశం ఉన్న పచ్చిరొట్ట సాగుకు ప్రోత్సాహం కొరవడుతోంది. నాణ్యమైన పంటల ఉత్పత్తికి తోడ్పడే పచ్చిరొట్ట విత్తనాలకు ప్రభుత్వం ఏటేటా రాయితీలను తగ్గిస్తోంది. ఇదే సమాయన విత్తనాల ధరలు పెరుగుతుండడంతో పచ్చిరొట్ట సాగు రైతులకు భారంగా మారుతోంది. అంఏకాక తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీకి నిధుల కేటాయింపు ఉన్నప్పటికీ కొంత మేరకు మాత్రమే రాయితీలకు వినియోగిస్తున్నారు. మరోపక్క సమయానికి విత్తనాలు అందుబాటులోకి రావడం లేదు. ఇలా రకరకాల కారణాలతో భూమికి మేలు చేస్తూ అధికోత్పత్తులకు దోహదపడే పచ్చిరొట్ట సాగు కూడా రైతుల నుంచి దూరమయ్యే పరిస్థితులు దాపురించాయి. కర్బనం తక్కువగా... తెలంగాణలోని భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉందని నిపుణులు గుర్తించారు. ఈనేపథ్యాన సేంద్రియ కర్బనం పెంచాల్సిన అవసరముందని నిపుణులతో పాటు, ప్రభుత్వం కూడా చెబుతోంది. పచ్చిరొట్ట సాగు చేసి భూమిలో కలియదున్నడం ద్వారా అంతరాలను సరిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఐదేళ్లుగా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ తగ్గడంతో దాదాపు రాష్ట్రమంతటా పచ్చిరొట్ట సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. రాయితీ తగ్గి.. ధరలు ౖపైపెకి.. పచ్చిరొట్ట విత్తనాలపై రాయితీ గడిచిన మూడేళ్ల కాలంలో 65 శాతం నుంచి 50 శాతానికి పడిపోయింది. ఐదేళ్ల క్రితం వివిధ రకాల పంటల విత్తనాలకు రాయితీలు ఎత్తివేసిన ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాల విషయంలో అదే తీరు అవలంబిస్తోంది. జీలుగు, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలకు 2023లో 65 శాతం రాయితీ ఇవ్వగా, 2024లో 60 శాతానికి, 2025లో 50 శాతానికి కుదించారు. ఇదే సమయాన పచ్చిరొట్ట విత్తన ధరలు పెరుగుతున్నాయి. 2023లో 30 కిలోల జీలుగు విత్తన బ్యాగ్ రైతు వాటా రూ.842 ఉంటే 2025లో ఏకంగా రూ. 2,137కు పెరిగింది. జనుము 40 కిలోల బ్యాగ్ ధర రూ.1,225 నుంచి రూ. 2,510కు, పిల్లి పెసర 20 కిలోల విత్తనాల బ్యాగ్ ధర రూ. 703 నుంచి రూ.2,055కు పెరగడం గమనార్హం. నిధులు వృథా ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్లో 50 శాతమే పచ్చిరొట్ట విత్తనాల రాయితీలకు వినియోగిస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వం రూ.130 కోట్లు కేటాయిస్తే.. విత్తనాల సబ్సిడీకి రూ.67 కోట్లను మాత్రమే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వినియోగించింది. ఫలితంగా మిగిలిన రూ.63 కోట్ల నిధులు వృథా అయ్యాయి. సగానికి పడిపోయిన సాగు ఐదేళ్ల కాలంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ క్రమంగా తగ్గుతుండగా, సాగు విస్తీర్ణం కూడా పడిపోతోంది. 2021లో రాష్ట్రంలో 1.75 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేస్తే 14.45 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఇక 2022లో 1.66 లక్షల క్వింటాళ్లే పంపిణీ చేయగా 13.66 లక్షల ఎకరాల్లో, 2023లో 1.27 లక్షల క్వింటాళ్ల విత్తనాలతో 10.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అలాగే, 2024లో 1.16 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయగా 9.31 లక్షల ఎకరాల్లో, 2025లో 0.87 లక్షల క్వింటాళ్ల విత్తనాలే పంపిణీ చేయగా పచ్చిరొట్ట సాగు 7.05 లక్షల ఎకరాలకు పరిమితమైంది. అంటే 2021తో పోలిస్తే 2025కు వచ్చే సరికి పచ్చిరొట్ట సాగు విస్తీర్ణం రాష్ట్రంలో సగానికి పడిపోయింది. ఎరువుల లభ్యత లేని ఈ సమయంలోనైనా పచ్చిరొట్ట విత్తనాల రాయితీని పెంచి పంపిణీ చేస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఈపాటికే రావాలి... పచ్చిరొట్ట విత్తనాలు సమయానికి రైతులకు అందడం లేదు. తొలకరికి ముందుగానే మే మొదటి వారంలో విత్తనాలను అందుబాటులోకి తీసుకురా వాలి. కానీ ఈసారి కూడా ఆ పరిస్థితి కానరావడం లేదు. అకాల వర్షాలకు రైతులు దుక్కలు చేసుకొని భూసారాన్ని పెంచుకునేందుకు పచ్చిరొట్ట విత్తనాలు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, విత్తనాల లభ్యత లేక ఈ ఏడాది కూడా సాగుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.పచ్చిరొట్ట విత్తనాలపై తగ్గుతున్న రాయితీలు సంవత్సరం రాయితీ శాతం రైతు వాటా (విత్తన బ్యాగ్కు.. రూ.ల్లో) జీలుగు జనుము పిల్లిపెసర 2023 65 842 1,225 703 2024 60 1,116 1,448 1,084 2025 50 2,137 2,510 2,055 -
పెట్రోల్, డీజిల్ కొరత తీర్చాలి
సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్రంలోనిపలు జిల్లా ల్లో వేధిస్తున్న పెట్రోల్, డీజిల్ కొరతలపై బీఆర్ఎస్ ఎంపీ, పెట్రోల్, సహజవాయు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పందించారు. ఆయా కంపెనీల సరఫరాదారులు, ఉన్నతాధికారులతో ఆదివారం మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ కొరతలను తక్షణమే తీర్చాలని సూచించా రు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఎంపీని పలు వురు పెట్రోల్ బంకుల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులు కలిసి సమస్యను వివరించారు. దీంతో ఆయన ఆయిల్ కంపెనీ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంపెనీల ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. బంక్ల యజమానులు డీడీలు చెల్లించినా ఆయిల్ ఎందుకు సరఫరా చేయడంలేదని ప్రశ్నించారు. రేట్ల హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. దీనికి స్పందించిన బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీల ఉన్నతాధికారులు సోమవారం వరకు సమస్యను అధిగమిస్తామని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎంపీ రవిచంద్రకు హామీ ఇచ్చారు. జిల్లాలో కొరత లేదు :పౌర సరఫరాల శాఖ అదనపు సంచాలకుడు రోహిత్సింగ్ కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ అదనపు సంచాలకుడు రోహిత్సింగ్ అన్నారు. ఆది వారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు, సంబంధితశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో ఇంధన లభ్యతపై సమీక్ష నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్కుమార్ హాజరై వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 83 పెట్రోల్ బంకులు ఉండగా, అన్ని బంకుల్లోనూ పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని తెలిపారు. కొందరు ప్రజలు అనవసరంగా భయాందోళనలకు లోనై ప్లాస్టిక్ కేన్లలో ఇంధనాన్ని నిల్వ చేసుకుంటుండగా, తాత్కాలికంగా కొన్ని చోట్ల ఇంధనం త్వరగా అమ్ముడవుతున్నదని వివరించారు. సోమవారం నుంచి అవసరమైన మేరకు పెట్రోల్, డీజిల్ సరఫరా పెంచేందుకు ప్రభుత్వరంగ చమురు సంస్థలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని తెలి పారు. పెట్రోల్, డీజిల్ సరఫరా, గ్యాస్ డెలివరీలపై పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించాలని కోరారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర -
‘పరిషత్’ రిజర్వేషన్లపై ఉత్కంఠ
చుంచుపల్లి: ప్రాదేశిక ఎన్నికలకు ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీల పరిధిలో పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలని, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు ఇతర ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో గ్రామాల్లో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను గతేడాది సెప్టెంబర్లోనే నిర్వహించేందుకు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించి అన్ని ఏర్పాట్లు చేయగా, హైకోర్టు ఆదేశాలతో చివరి నిమిషంలో ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రకటించిన విధంగానే రిజర్వేషన్లను అమలు చేస్తారా? లేదంటే.. కొత్తగా చేపడతారా? అన్న సందేహం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆశావహులు ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎక్కువ మందిలో మాత్రం రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్నది తెలియక ఉత్కంఠకు గురవుతున్నారు. అన్నీ అనుకూలిస్తే మే చివరలో లేదా జూన్ ఆరంభంలో ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రెండు విడతల్లో నిర్వహణకు ప్రతిపాదనలు జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గతేడాది సెప్టెంబర్లో జిల్లాలోని 22 ఎంపీపీ, 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. అప్పట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రచారం చేశారు. అది అమలులోకి రాకపోవడంతో 27 శాతం బీసీలకు, 15శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయించి గ్రామపంచాయతీ ఎన్నికలు జరిపారు. ప్రాదేశిక ఎన్నికలకు కూడా అదే నిబంధన వర్తిస్తుంది. గతంలో కేటాయించిన బీసీ స్థానాల్లో మార్పులు ఉంటాయని, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6,69,048 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఇందులో పురుషులు 3,25,045 మంది కాగా, మహిళలు 3,43,979 మంది ఉన్నారు. ఇతరులు మరో 24 మందిగా గుర్తించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా 1,271 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. వీటికి రెండు విడతల్లో ఎన్నికలను నిర్వహించేలా కొత్తగా ప్రణాళిక తయారు చేశారు. జంబో బ్యాలెట్ బాక్సులు 1,811, మీడియం బాక్సులు 351 అందుబాటులో ఉంచారు. ఇవి కాకుండా మరో 1,000 బ్యాలెట్ బాక్సులు అదనంగా తెిప్పించి ఉంచారు. అశ్వాపురం 12 అశ్వారావుపేట 11 భద్రాచలం 14 బూర్గంపాడు 17 చంద్రుగొండ 8 అన్నపురెడ్డిపల్లి 6 చర్ల 12 దమ్మపేట 17 దుమ్ముగూడెం 13 గుండాల 5 ఆళ్లపల్లి 5 జూలూరుపాడు 10 లక్ష్మీదేవిపల్లి 11 సుజాతనగర్ 5 చుంచుపల్లి 12 మణుగూరు 11 ములకలపల్లి 10 పాల్వంచ 10 పినపాక 9 కరకగూడెం 5 టేకులపల్లి 14 ఇల్లెందు 16 రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో మరోసారి ఓటరు జాబితా సిద్ధం చేస్తున్నాం. గతంలోనే దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసి ఉంచాం. షెడ్యూల్ ఎప్పుడొచ్చినా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈసారి రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. – బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ -
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివా రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. అమ్మవారి సేవలో బీసీ కమిషన్ సభ్యుడుపెద్దమ్మతల్లి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సురేందర్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పామర్తి అంకివీడు ప్రసాద్గౌడ్, నాయకులు శ్రీరాములు, మహేష్, శ్రీనివాస్ యాదవ్, మహాంకాళీ బిక్షపతి, లోగాని శ్రీనివాసరావు, శనిగ రామచందర్, గాజుల శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతిసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివా రం శ్రీ కన్యకా పరమేశ్వరి జయంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. డీఐఈఓ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్, లేబర్ ఆఫీసర్ షరీఫుద్దీన్, డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, డీవైఎస్ ఓ పరంధామరెడ్డి, ఆర్యవైశ్య ప్రముఖులు దారా నగేష్, దారా రమేష్, కంభంపాటి రమేష్, కొదుమూరి శ్రీనివాస్, కొదుమూరి సురేష్, జూలూరి ఆనంద్ పాల్గొన్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ముగిసిన ఓపెన్ స్కూల్ పరీక్షలుఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఆదివారంతో ముగిసినట్లు డీఈఓ చైతన్య జైనీ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావులు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 918 మందికి గాను 772 మంది హాజరయ్యారని, 146 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్లో 1,509 మందికిగాను 1,285మంది హాజరు కాగా, 224 మంది గైర్హాజరైనట్లు వివరించారు. 28 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 28నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ ద్వారా బిల్లుల చెల్లింపు సులభంవిద్యుత్ ఎస్ఈ మహేందర్ సూపర్బజార్(కొత్తగూడెం): ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున వినియోగదారులు బిల్లుల చెల్లింపు కోసం బయటకు వచ్చి ఎండ దెబ్బకు గురికావద్దని ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ విజ్ఞప్తి చేశారు. టీజీఎన్పీడీసీఎల్ యాప్, టీ వ్యాలెట్, గూగుల్పే, ఫోన్పే, పేటీఎం వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా చెల్లించాలని సూచించారు. ఏటేటా ఆన్లైన్లో బిల్లులు చెల్లించే వినియోగదారుల సంఖ్య పెరుగుతోందని పేర్కొన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6,73,254 మంది, 2025–26 ఆర్థిక సంవత్సరంలో 8,27,984 మంది వినియోగదారులు డిజిటల్ విధానం ద్వారా చెల్లింపులు చేశారని వివరించారు. -
బీటెక్ విద్యార్థినికి రూ.78వేల ఆర్థికసాయం
కల్లూరు: నిరుపేద విద్యార్థిని బీటెక్ చదువుతుండగా, ఆమె ఫీజు ఇతర అవసరాల కోసం స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యాన ఆదివారం రూ.78 వేల ఆర్థికసాయం అందచేశారు. పాతికేళ్ల క్రితం కేరళ నుంచి వచ్చి కల్లూరు స్థిరపడిన గార్నెట్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భార్య నాగమణి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుండగా కుమార్తె మోరియర్ డయానా బీటెక్ చదువుతుంది. ఆమె ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉండడంతో స్ఫూర్తి ప్రతినిధి వరకా రామారావును సంప్రదించగా ఎన్ఆర్ఐల చేయూతతో ఆయన రూ.78 వేలు అందజేశారు. పోలీసుల దాతృత్వం తల్లాడ: తల్లాడ మండలం మల్లారం గ్రామం నుంచి పోలీసు శాఖలో ఉన్న పలువురు దాతృత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన షేక్ యాకుబ్ పాషాకు కాలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో విరగగా కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఆయన కుటుంబం పరిస్థితిని గమనించిన మల్లారం పోలీసులు ఆదివారం రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గాదెరంజిత్, కుంచం రాంప్రసాద్, దుగ్గి దేవర ముత్యాలరావు, పసుపులేటి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. మూడు నెలల బియ్యం తరలింపులో ముందంజ నేలకొండపల్లి: ప్రభుత్వం ఈసారి మూడు నెలల బియ్యాన్ని రేషన్షాపుల ద్వారా లబ్ధిదారుల పంపిణీ చేస్తోంది. ఈనేపథ్యాన షాప్లకు సకాలంలో బియ్యం చేర్చడంలో జిల్లాలోనే నేలకొండపల్లి మండల లెవల్ స్టాక్ పాయింట్ ఆదర్శంగా నిలిచింది. ఇక్కడి స్టాక్ పాయింట్ పరిధిలో కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ మండలాలు ఉండగా, 119 షాప్లకు 3,900 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశారు. అనుకున్న సమయం కంటే ముందుగానే తరలించిన ఉద్యోగులు, హమాలీలను జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు అభినందించారు. ఈమేరకు ఆదివారం పాయింట్ ఇన్చార్జ్ గుగులోత్ లక్ష్మణ్ను సిబ్బంది సన్మానించారు. ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ మృతి నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడగా డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామానికి చెందిన యడవల్లి నాగేశ్వరరావు(51) ఆదివారం ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు. బుద్ధారం–చెరువుమాధారం రహదారిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇందిరమ్మ ఇంటి కోసం తప్పుడు పత్రాలుచింతకాని: తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి తమకు దక్కాల్సిన ఇందిరమ్మ ఇంటిని మరో మహిళ దక్కించుకుందని చింతకాని మండలం నాగిలికొండకు చెందిన పామర్తి లక్ష్మీతిరుపతమ్మ ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన పామర్తి కళావతిపై ఆమె ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందజేసింది. దీంతో కళావతితో పాటు ఆనాటి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. వేధింపుల కేసు నమోదుమండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన దాసరి సందీప్కుమార్, ఆయన తల్లిదండ్రులు సంపత్, భారతిపై పోలీసులు ఆదివారం వేధింపుల కేసు నమోదు చేశారు. సందీప్ భార్య సౌమ్యను ఆయనతో పాటు మామ సంపత్, అత్త భారతి వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
పనిమంతులు!
ఖమ్మం మయూరిసెంటర్: భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నా ఉపాధి హామీ పథకం పనులకు గ్రామీణులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజామునే పని ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ఈక్రమంలోనే ఖమ్మం జిల్లాలో పనులకు వస్తున్న వారిలో మహిళల సంఖ్య అధికంగా ఉంటుండడం విశేషం. ఉపాధి పనుల్లోనూ తామే మేటి అని నిరూపిస్తున్న ఆడపడుచులు.. పురుషులకు దీటుగా చెమట చిందిస్తూ పనిదినాలను పూర్తి చేస్తున్నారు. జిల్లాకు నిర్దేశించిన భారీ లక్ష్యంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో పనులకు వ్యత్యాసం ఉండడం.. వడగాల్పుల సెగలతో ఉపాధి లక్ష్యం కుదేలవుతున్న వేళ.. కేవలం మహిళా కూలీల శ్రమతో పథకం ముందుకు సాగుతోంది. మహిళలే యాక్టివ్.. ఖమ్మం జిల్లాలో యాక్టివ్గా ఉన్న కూలీల్లో అత్యధికులు మహిళలే కావడం విశేషం. ప్రస్తుతం ఉన్న 2,70,821 మంది యాక్టివ్ కూలీల్లో 1,57,605 మంది మహిళలే కావడం వారి భాగస్వామ్యాన్ని చాటిచెబుతోంది. ఏప్రిల్ నెలలో ప్రభుత్వం నిర్దేశించిన 9.93 లక్షల పనిదినాల లక్ష్యాన్ని చేరుకోవడం ఉష్ణోగ్రతల కారణంగా గగనంగా మారింది. ఈనెల ముగియడానికి నాలుగు రోజులే ఉండగా.. ఇప్పటివరకు కేవలం 1.2394,011 పనిదినాలే పూర్తయ్యాయి. ఇందులో సింహభాగం అంటే 70 వేలకు పైగా పనిదినాలను మహిళా కూలీలే పూర్తి చేసి జిల్లా గౌరవాన్ని చాటుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎండల ప్రభావంతో వెనుకబాటు ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం ఉపాధి పనుల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రభుత్వం జిల్లాకు 9.93 లక్షలకు పైగా పనిదినాల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భానుడి సెగలతో కూలీల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గతంలో ఏప్రిల్ నెలలో అత్యధిక పనిదినాలను పూర్తి చేసేవారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెల ముగిసేందుకు నాలుగు రోజుల గడువే ఉన్నా లక్ష్యంలో కనీసం సగం కూడా చేరకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 1,23,462 పనిదినాలే పూర్తికావడం ద్వారా కేవలం 10 – 11 శాతంగానే నమోదైంది. పర్యవేక్షణతోనే లక్ష్య సాధన ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ లక్ష్యం మేర పనిదినాలు పూర్తి చేయాలంటే జిల్లా అధికారులు మొదలు క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శుల నిరంతర పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత, ఉపాధి హామీ పథకం సిబ్బందికి వేతనాల్లో జాప్యం తదితర కారణాలతో పర్యక్షణ కొరవడి పనులు మందకొడిగా సాగుతున్నాయని తెలుస్తోంది. ఇకనైనా అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పనులపై కూలీలకు అవగాహన కల్పించడమే కాక పాటు క్షేత్ర స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తే లక్ష్యసాధన సులువు కానుంది.చెమట చిందిస్తున్న చైతన్యమూర్తులు -
అధికారులు తవ్వారు... అక్రమార్కులు పూడ్చారు!
పాల్వంచరూరల్: మండల పరిధిలోని తోగ్గూడెంలో నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో మైనింగ్ నిర్వహిస్తున్నారు. అక్రమ మైనింగ్ను అరికట్టేందుకు క్వారీకి వెళ్లే దారిలో ఇటీవల ఎస్ఐ సురేష్, మైనింగ్ శాఖ అధికారులు కలిసి కందకాలు తవ్వించారు. ఆ తర్వాత పర్యవేక్షణ మరిచిపోయారు. అదే అదునుగా క్రషర్ల నిర్వాహకులు కందకాలను పూడ్చి క్వారీలను నిర్వహిస్తున్నారు. బ్లాస్టింగ్ అనుమతులు లేకున్నా పట్టపగలు శక్తివంతమైన జిలిటెన్ స్టిక్స్తో బండరాళ్లను పగులగొట్టి లారీల్లో క్రషర్ మిల్లులకు తరలిస్తున్నారు. బండరాళ్లను క్రషింగ్ చేసి కంకరను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ ఏడీ స్పందించి క్వారీల వద్ద ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మైనింగ్ ఏడీ దినేష్ను ఫోన్ ద్వారా వివరణ కోసం ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. కందకాలు పూడ్చి క్వారీలో మైనింగ్ -
ప్రభుత్వాస్పత్రులపై పర్యవేక్షణ పెరగాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ వెద్యశాలలపై మరింత పర్యవేక్షణ పెరగాలని కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలని సూచించారు. వైద్యశాలల్లో సదుపాయాలు సమకూర్చాలని చెప్పారు. జిల్లా వైద్యశాఖ అధికా రి తుకారాం రాథోడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వృద్ధురాలికి గాయాలుటేకులపల్లి: ఇంటి గోడ కూలి శతాధిక వృద్ధురాలికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం జరిగింది. మండలంలోని కొత్తతండా జి గ్రామంలో ఆదివారం రాత్రి 110 సంవత్సరాల మహిళ బోడ అస్లీ కుటుంబ సభ్యులతో కలిసి ఉంది. ఒక్కసారిగా గోడకూలి పడటంతో ఆమె తల, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 ద్వారా కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపనలో అపశృతి
● విరిగి పడిన రాతి ధ్వజస్తంభం ● నలుగురికి గాయాలుబూర్గంపాడు: సారపాకలోని వినాయకుడి గుడి వద్ద ఆదివారం నిర్వహించిన ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపనలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాతిశిలతో చేసిన ధ్వజస్తంభాన్ని క్రేన్ సాయంతో పునఃప్రతిష్ట చేసేందుకు ఏర్పాట్లు చేశా రు. వేడుకకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యా రు. వేదపండితులు మంత్రోచ్ఛరణలతో భక్తుల జయజయ నామస్మరణలతో ధ్వజస్తంభ ప్రతిష్ట వైభవంగా జరిగింది. అయితే ధ్వజస్తంభం ఒకపక్కకు వంగి ఉండటతో క్రేన్తో సరిచేస్తుండగా రాతి ధ్వజస్తంభం మధ్యకు విరిగిపడింది. క్రేన్ రోప్ కట్టిఉండటంతో విరిగిన ధ్వజస్తంభం నెమ్మదిగా కిందపడిపోయింది. ఈ క్రమంలో కొందరు భక్తులకు గాయాలయ్యాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన నలుగురిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వందలాది మంది భక్తులు ఉన్నప్పుడు జరిగిన ఈ ఘటనలో నలుగురికి మాత్రమే స్వల్పగాయాలు కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భద్రాచలంలో చికిత్స భద్రాచలంఅర్బన్: గాయపడ్డ మహిళ, ఇద్దరు చిన్నారులను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు
కల్లూరురూరల్: కల్లూరు మండలంలోని కొర్లగూడెం, ఖాన్ఖాన్పేట, పేరువంచ రేషన్ దుకాణాల్లో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొర్లగూడెం దుకాణంలో 12.5 క్వింటాళ్లు, పేరువంచలో 168 క్వింటాళ్లు, ఖాన్ఖాన్పేట రేషన్ దుకాణంలో 128 క్వింటాళ్ల బియ్యం రికార్డుల కంటే అదనంగా ఉన్నట్లు గుర్తించి మూడు దుకాణాలను సీజ్ చేశారు. అంతేకాక డీలర్లపై 6–ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఓఎస్డీ అంజయ్య, సివిల్ సప్లయీస్ ఆర్ఐ నరేశ్, ఏఎస్ఐ వెంకటకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. 6.50 టన్నుల బియ్యం స్వాధీనం మండలంలోని ముగ్గు వెంకటాపురం నుంచి ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న 6.50 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామం నుంచి బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో శనివారం తెల్లవారుజామున జీపీఓ నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేశారు.మూడు రేషన్ షాపులు సీజ్ -
తెలంగాణను కాపాడుకునే బాధ్యత అందరిది..
టీఆర్ఎల్డీ అధ్యక్షుడు దిలీప్కుమార్ ఖమ్మంమామిళ్లగూడెం: అన్ని వర్గాల వారు పోరాడి తెలంగాణను సాధించుకోగా, గత సీఎం కేసీఆర్ పాలన కారణంగా ఆగమైనందున కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ అన్నారు. ఖమ్మం మామిళ్లగూడెంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో కలిసి తాను చురుకై న పాత్ర పోషించానని తెలిపారు. అయితే, తెలంగాణ ఏర్పడ్డాక దళితులకు సీఎం పదవిపై మాట తప్పిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా కుటుంబ పాలన కొనసాగించారని విమర్శించారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి అయినా ప్రజాభీష్టం మేరకు పాలన కొనసాగించాలని సూచించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీరప్ప, రాష్ట్ర, జిల్లాల నాయకులు కె.గిరీశ్, రాజ్కుమార్రెడ్డి, డాక్టర్ విక్రమ్శర్మ, డాక్టర్ సోమగాని నరేందర్, జానీ మహమ్మద్, ఎం.వెంకటేశ్వరాచారి, ఎన్.భాస్కరరావు, సుధాకర్యాదవ్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ కార్యాలయంలో చోరీకి యత్నం పాల్వంచరూరల్: మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ కార్యాలయం పక్కన ఉన్న ఐకేపీ కార్యాలయానికి చెందిన స్టోర్ రూం వద్దకు శనివారం ఉదయం వచ్చిన సిబ్బంది పరిశీలించారు. తలుపు వద్ద మంటపెట్టి, తాళాన్ని పగలగొట్టి, చోరీకి యత్నించినట్లు గుర్తించారు. కార్యాలయంలో రూ.10 లక్షల విలువ గల పనిముట్లు, 7 టేబుళ్లు, కుర్చీలు ఉన్నాయని, చోరీకి యత్నం చేశారని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఏపీఎం ఎండీ మీరాబీ తెలిపారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. దరఖాస్తుల ఆహ్వానంచుంచుపల్లి: అశ్వారావుపేట, ఇల్లెందు సామాజిక ఆరోగ్య కేంద్రం, చర్ల ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిన ఎంబీబీఎస్ వైద్యులను నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేతనం నెలకు రూ.50 వేలు చెల్లిస్తామని, అభ్యర్థులు ఈ నెల 29వ తేదీలోగా కలెక్టరేట్లోని జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. చర్లలో ల్యాబ్టెక్నీషియన్ పోస్టుకు, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో రేడియాలజిస్ట్ పోస్టుకు కూడా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. రేడియాలజిస్ట్కు నెలకు రూ.2 లక్షల వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’అశ్వారావుపేట: రైతులకు సలహాలు సూచనలు చేసేందుకు వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు 9 బృందాలుగా ఏర్పడి నాలుగు వారాల పాటు రైతుల వద్దకు వెళ్లి అవగాహనా కార్యక్రమాలు చేపడతారని పేర్కొన్నారు. 72 గ్రామాల్లో వ్యవసాయ, అనుబంధ అధికారులతో కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలిఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పీఓ రాహుల్భద్రాచలం: సమ్మర్ క్యాంపుల్లో విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. శనివారం భద్రాచలంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల గిరిజన విద్యార్థులకు చేపట్టిన సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఓ రాహుల్ మాట్లాడుతూ మే నెల 9వ తేదీ వరకు క్యాంపు కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు సబ్జెక్ట్లతోపాటు యోగా, డ్యాన్స్, వివిధ క్రీడలు, పెయింటింగ్, కుట్లు, అల్లికలు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, వ్యాసరచన పోటీలు తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్ మాట్లాడుతూ ఐటీడీఏవ్యాప్తంగా 200 మందిని బాలబాలికలను ఎంపిక చేశామని, బాలికలకు బాలికల గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో, బాలురకు వికాసం పాఠశాలలో సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేశామని వివరించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశారు. అధికారులు రమేష్, అలివేలు మంగతాయారు, సుభద్ర, నాగరాజు పాల్గొన్నారు. -
కళావాహనకు అంకురార్పణ
భద్రాచలం: భద్రగిరి శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం చరిత్రలో ఆదివారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆలయంలో కళావాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిన్నజీయర్ స్వామి శనివారం రాత్రి భద్రాచలం చేరుకున్నారు. కళావాహనకు సంబంధించిన శనివారం అంకురార్పణ జరపగా, వైదిక పరమైన పూజా కార్యక్రమాల నేపథ్యంలో ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేయనున్నారు. కళావాహన, జీర్ణోద్ధరణకు అనుమతి ఆలయ అభివృద్ధిలో భాగంగా తొలి విడతలో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ చేపట్టారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని భద్రమహర్షి గుడి, శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం, ఆళ్వార్లు, ఇతర ఉపాలయాలను తొలగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గుడుల్లోని మూలమూర్తుల జీర్ణోద్ధరణకు ఆదివారం అంతరాలయంలోని మూలమూర్తుల అనుజ్ఞ(అనుమతి) తీసుకోనున్నారు. అనంతరం మూలమూర్తులను కలశాలలోకి ఆవాహనం చేసే కళావాహనను భక్తిశ్రద్ధలతో జరపనున్నారు. ఆ తర్వాత 72 మూర్తులను ఏక కాలంలో రంగనాయకుల గుట్టపై తాత్కాలికంగా నిర్మించిన బాలాలయానికి తరలించనున్నారు. శ్రీ లక్ష్మీతాయారు, గోదాదేవి అమ్మవార్ల విగ్రహాలను ప్రధానాలయంలో ముఖమండపం వద్ద కొలువుదీర్చనున్నారు. వైదిక కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరిపేందుకు రాష్ట్రంలోని పలు ఆలయాల నుంచి 30 మంది రుత్విక్కులను భద్రాచలం పిలిపించనున్నారు. ఆలయంలో ఈ కార్యక్రమాన్ని జరిపే బాధ్యతలను కోటి శ్రీమన్నారాయణాచార్యులు, అమరవాది మురళీకృష్ణమాచార్యులుకు అప్పగించారు. ఆలయ రిటైర్డ్ ప్రధానాచార్యులు పొడిచేటి రామచంద్రాచార్యులు సూచనలను అందించనున్నారు. కాగా, ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు ఈఓ దామోదర్రావు ప్రకటనలో తెలిపారు. అంకురార్పణకు అనుజ్ఞ కళావాహనకు ఆలయ అర్చకులు శనివారం సాయంత్రం అంకురార్పణ చేశారు. మేళతాళాలు, అర్చకుల వేద మంత్రాల నడుమ తీర్థె బిందెతో పవిత్ర గోదావరి జలాలను తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు అంకురార్పణకు అంతరాలయంలోని మూలమూర్తుల వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. ఆ తర్వాత బేడా మండపంలో అర్చకులు, వేద పండితులు విష్ణు సహస్రనామార్చన జరిపారు. ఉపాలయాల్లోని మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు.భద్రగిరి ఆలయాన్ని తొలుత భక్త రామదాసు నిర్మించగా, కాలక్రమంలో అనేక మార్పులు జరిగాయి. 1960 తర్వాత గోపురం పనులు చేపట్టారు. తర్వాత మిథిలా స్టేడియం, గ్యాలరీలు ఏర్పాటు చేశారు. తాజాగా ఆలయంలో అభివృద్ధి పరంగా సమూల మార్పులు జరగనున్నాయి. ప్రధాన అంతరాలయం మినహా అన్ని చోట్ల మార్పులు జరగనున్నాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలు, ఆళ్వార్ల మూర్తుల తరలింపును వైదికపరంగా నిర్వహించనున్నారు. -
ఏదీ ఆహ్లాదం..?
కొత్తగూడెంఅర్బన్: పిల్లలకు గత శుక్రవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సరదాగా సాయంత్రం పార్క్లకు వెళ్లి ఆడుకుందామంటే ఆట సామగ్రి, వాకింగ్ ట్రాక్ అన్నీ అధ్వానంగా మారాయి. కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు జిల్లాలోని ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట మున్సిపాలిటీలలో ప్రధాన పార్కులతోపాటు మినీ పార్కుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. శిథిలావస్థకు చేరి.. కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రధానంగా సింగరేణి చిల్డ్రన్ పార్కు, రాజీవ్పార్కు ఉన్నాయి. మిగతావి మినీ పార్కులు. వీటితోపాటు డివిజన్లు, వార్డులలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాలు కూడా చెత్తాచెదారంతో నిండిపోయాయి. సింగరేణి చిల్డ్రన్ పార్కులో ఆట సామగ్రి శిథిలావస్థకు చేరింది. కొత్తగా పార్కుకు తెచ్చిన క్రీడా సామగ్రి నెలలు గడిచినా ప్రారంభించకపోవడంతో దుమ్ముధూళితో నిండిపోతున్నాయి. పార్కులో ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. కొత్త పార్కులకు లేని మోక్షం కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా రూపాంతరం చెందినా పాలకవర్గం, అధికారులకు కొత్త పార్కుల ఏర్పాటు యోచనే లేదు. గతంలో రైల్వే అండర్ బ్రిడ్జిపైన ఉన్న స్థలంలో పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రం, కార్పొరేషన్ నడిబొడ్డున పార్కు ఏర్పాటు చేస్తే నగరానికి మరింత ఆకర్షణ వస్తుందని, ప్రజలు సేదతీరడానికి అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. చిట్టడవిని తలపిస్తున్న వనాలు కార్పొరేషన్తోపాటు మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. అందులో వాకింగ్ ట్రాక్లు నిర్మించారు. నిర్వాహణ లేకపోవంతో పట్టణ ప్రకృతి వనాలు చిట్టడవులను తలపిస్తున్నాయి. వనాలకు గేటు లేకపోవడంతో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. డివిజన్లు, వార్డుల్లో ఏర్పాటు చేసిన మినీ పార్కులు కూడా చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. రాత్రి వేళల్లో కొందరు పార్కుల్లో మద్యం తాగుతున్నారు. దీనివల్ల చుట్టు పక్కల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా కార్పొరేషన్, మున్సిపల్ పాలకవర్గాలు, అధికారులు స్పందించి పార్కుల్లో ఆహ్లాదం పంచేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. శిథిలావస్థలో మున్సిపల్ పార్కులు -
జన గణన.. స్వీయ గణన
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జన గణనకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్)ను ఈసారి కొత్తగా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అంకిత్ శనివారం ఐడీఓసీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. రేపటి నుంచి మొదలు సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కోసం https:// se. census. gov. in వెబ్సైట్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 2026 ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఇందులో వివరాలు నమోదు చేయవచ్చు. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. సైట్ను ఉపయోగించి జన గణనలో అందివ్వాల్సిన వివరాలను స్వయంగా ఏ కుటుంబానికి ఆ కుటుంబం పొందు పరిచే వీలుంది. తదుపరి దశలో జన గణన చేసే అధీకృత వ్యక్తులు ఇంటికి వచ్చి, వెబ్సైట్లో పొందు పరిచిన వివరాలను సరి చూస్తారు. ఈ వెబ్సైట్ను ఉపయోగించడం ద్వారా జనగణన ప్రక్రియ వేగవంతంకావడంతోపాటు ప్రజల విలువైన సమయం ఆదా అవుతుంది. సెల్ఫ్ ఎన్యుమరేషన్కు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. నాలుగు అంచెల్లో.. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ ద్వారా ప్రభుత్వం సూచించిన వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ముందుగా మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ ప్రాంతం, అడ్రస్ తదితర వివరాలు నమోదు చేయాలి. ఇదే సమయంలో కచ్చితమైన ఇంటి అడ్రెస్ను సైతం గూగుల్ మ్యాప్స్ ద్వారా పొందు పరిచే అవకాశం ఉంది. మూడో దశలో 31 రకాల ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మీరు ఎలాంటి ఇంటిలో ఉంటున్నారు. అంది సొంతమా? అద్దె ఇల్లా? ఇంట్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి. కులం, వృత్తి ఇలాంటి సమాచారం అందివ్వాలి. ఇందులో 7వ, 9వ ప్రశ్నలు తప్ప మిగిలిన వాటికి సంబంధించిన వివరాలు నమోదు చేయవచ్చు. ప్రక్రియ పూర్తయ్యాక 11 అంకెల కోడ్తో ఐడీ (ఐడెంటిఫికేషన్ నంబర్) జనరేట్ అవుతుంది. జన గణనకు సంబంధించిన అధికారులు వ్యక్తిగతంగా ఇంటికి వచ్చినప్పుడు 11 అంకెల ఐడీ నంబర్ను చెబితే సరిపోతుంది. దాని ఆధారంగా మరోసారి ఆ ఇంటికి, ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలను వెరిఫై చేసుకుని, చివరగా ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని అందజేస్తారు.మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టేషన్.. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఒక కుటుంబానికి ఒకే మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. అదే విధంగా కుటుంబ యజమాని పేరును మార్చే వీలు లేదు. వీటిని దృష్టిలో ఉంచుకుని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, సీపీఓ సంజీవరావు పాల్గొన్నారు. -
విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికులు
● ప్రభుత్వ హామీలతో ముగిసిన సమ్మె ● డిపోల్లో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకంచుంచుపల్లి: ఆర్టీసీ కార్మికులు శనివారం విధుల్లో చేరారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించడంతో ఎట్టకేలకు శనివారం ఉదయం కార్మికులు సమ్మె విరమించారు. జిల్లాలో ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు కొనసాగిన సమ్మె ముగియడంతో అన్ని ప్రాంతాలకు బస్ సర్వీసులు తిరుగుతున్నాయి. అధికారులు డిపోల వారీగా షిఫ్టుల ప్రకారం సిబ్బందికి విధులు కేటాయించారు. సమ్మెతో జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో దాదాపు రూ.80 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. కాగా, రెండు రోజులపాటు తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శనివారం సైతం విధులకు రాగా, అధికారులు తిప్పి పంపించారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ముందుకు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ కార్మికులు డిపోల పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల భాస్కర్ రావు, వైఎన్ రావు, పీఎన్ రావు, కర్నాటి నగేష్, భూక్య శ్రీనివాస్, రత్నకుమారి, సింగ్, అనిల్, కిరణ్, నజీర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్, డీజిల్కు కటకట
బూర్గంపాడు/దమ్మపేట/ములకలపల్లి/సుజాతనగర్: రెండు రోజులుగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని బూర్గంపాడు, దమ్మపేట, ములకలపల్లి, సుజాతనగర్తో పాటు దాదాపు అన్ని మండలాల్లో, అన్ని కంపెనీల బంక్ల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడైనా ఒక బంకులో పెట్రోల్, డీజిల్ ఉందని తెలిస్తే వాహనదారులు వందల సంఖ్యలో క్యూ కడుతున్నారు. బూర్గంపాడులోని ఓ పెట్రోల్ బంక్కు శనివారం ఓ ట్యాంకర్ (15 వేల లీటర్లు) డీజిల్ వస్తే మూడు గంటల వ్యవధిలోనే అయిపోయింది. దమ్మపేటలోని పెట్రోల్ బంక్ల ఎదుట నోస్టాక్ బోర్టులు పెట్టగా, ఒక బంక్లో పెట్రోల్ ఉందని తెలియడంతో వాహనదారులు బారులుదీరారు. ఇక సుజాతనగర్, జూలూరుపాడు మండలాల పరిధిలో ఐదు బంక్లు ఉండగా... అన్నిచోట్ల శనివారం ‘నో స్టాక్’బోర్డులే దర్శనమిచ్చాయి. గతంలో ఎప్పుడంటే అప్పుడు ట్యాంకర్లు వచ్చేవని, ప్రస్తుతం సరఫరాలో జాప్యం జరుగుతోందని బంక్ల యజమానులు చెబుతున్నారు. ఇంధనం కొరతతో బంక్ల మూత -
తాగునీటి సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్ అంకిత్ సూపర్బజార్(కొత్తగూడెం): నాలుగు రోజుల్లో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని మండలాల్లో హెల్ప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టరేట్ నుంచి శనివారం ఆన్లైన్ ద్వారా ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో తాగునీటి సరఫరా పర్యవేక్షణ బాధ్యత ఎంపీడీఓలదేనని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ అధికారులు, ఎంపీడీఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి తాగునీటి సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలం, గ్రామంలో బోరులు, చేతి పంపులు వంటి ప్రత్యామ్నాయ వనరులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలనానరు. సమస్య తలెత్తిన 24 గంటల్లోపు పరిష్కరించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు ప్రతీ వార్డులో ఉదయం నీటి సరఫరా సమయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. పాల్వంచలో 55, చర్లలో 54, దుమ్ముగూడెంలో 55 ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఉన్నా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన 99 రోజుల కార్యాచరణలో వాటిని ఎందుకు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరించారు. పోస్టర్లు ఆవిష్కరణ యువత సమగ్ర అభివృద్ధి, క్రీడా రంగ ప్రోత్సాహం లక్ష్యంగా యువజన సర్వీసులు, క్రీడల శాఖ రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్ను కలెక్టర్ అంకిత్ శనివారం ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సీపీఓ సంజీవరావు, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి పాల్గొన్నారు. -
అర్హులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి
కలెక్టర్కు టీయూడబ్ల్యూజే వినతిపత్రం సూపర్బజార్(కొత్తగూడెం): అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులను అందజేయాలని, అక్రిడిటేషన్ కమిటీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, డెస్క్ జర్నలిస్టులకు కూడా గతంలో మాదిరిగా అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్ అంకిత్కు శనివారం టీయుడబ్ల్యూజే (143) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ను సన్మానించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కళ్లోజి శ్రీనివాస్, టెంజూ అధ్యక్షులు వట్టికొండ రవి, స్టాఫ్ రిపోర్టర్లు కృష్ణగోవింద్, తాళ్లూరి రమేశ్, కాగితపు వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు చావా పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఓఆర్ఎస్, తాగునీరు అందుబాటులో ఉంచాలి అశ్వాపురం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మండుటెండలకు రైతులు ఇబ్బందులు పడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్శ్రేష్ఠ ఆదేశించారు. మండలంలోని అశ్వాపురం, అమ్మగారిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన సందర్శించారు. ధాన్యం పరిశీలించి నిర్వాహకులు, రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు సబ్కలెక్టర్కు సూచించారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తహసీల్దార్ సూర్యప్రకాష్, ఏఓ చటర్జి, ఆర్ఐ లీలావతి, పౌరసరఫరాలశాఖ డీటీ శివకుమార్ పాల్గొన్నారు. భార్యను కత్తితో పొడిచిన భర్త.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. చండ్రుగొండ: వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో భర్త కట్టుకున్న భార్యనే కత్తితో పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతిచెందింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అయన్నపాలెం గ్రామానికి చెందిన బొప్పి నాగరాజు తన భార్య బొప్పి పున్నేశ్వరి (42)ని.. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ నెల 21వ తేదీన కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత కొత్తగూడెం ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి సోదరి చాపలమడుగు చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. ఏకకాలంలో పోలీసుల నాకాబందీసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో నాకాబందీ నిర్వహించారు. శనివారం రాత్రి 7.30 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఎస్పీ రోహిత్ రాజు వివరాలు వెల్లడించారు. వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను గుర్తించేందుకు ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపట్టామని వివరించారు. జిల్లాలోని ఐదు సబ్ డివిజన్ల డీఎస్పీల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లతో పాటు గ్రామాలలో కూడా నాకాబందీని నిర్వహించినట్లు తెలిపారు. విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతిపాల్వంచరూరల్: ఇంట్లో కూలర్ స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఇల్లెందులపాడు తండాలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఇల్లెందులపాడు తండాకు చెందిన గుగులోతు ఉమ్లా(60) ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఎండవేడి తీవ్రంగా ఉండటంతో ఇంట్లోని కూలర్ స్విచ్ వేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారకస్థితిలో పడిపోగా కుటుంబ సభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు
బోనకల్: మండల పరిధిలోని వైరా – జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి. ఏపీలోని గుంటూరుకు చెందిన గరికపాటి నవీన్, గరికపాటి విజయలక్ష్మి (62), నెమలిగంటి దాసు, అశోక్, సుబాకర్ ఖమ్మంలో జరిగిన శుభకార్యానికి ఇన్నోవా కారులో వచ్చారు. తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా బోనకల్ బ్రాంచ్ కెనాల్ వద్ద ముందు ఉన్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమాన జగ్గయ్యపేట వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో వాహనంలో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, స్థానిక పీహెచ్సీలో ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. సీఐ మధు బోనకల్కు చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. కాగా, క్షతగాత్రులకు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో విజయలక్ష్మి మృతి చెందింది. ఆమె భర్త నవీన్కు కూడా తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమించగానే ఉందని తెలిసింది. కాగా, ఖమ్మం జిల్లా అమ్మపాలెంకు చెందిన నవీన్ కొన్నేళ్ల క్రితం గుంటూరు వెళ్లి స్థిరపడ్డారు.చికిత్స పొందుతూ మహిళ మృతి -
మలేరియాను నిర్మూలిద్దాం
గుండాల: 2030 నాటికి మలేరియాను పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందితో పాటు ప్రజలపై కూడా ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం కార్యక్రమం సందర్భంగా శనివారం ఆయన ప్రభుత్వాస్పత్రిని సందర్శించి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆస్పత్రిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవల్లో మెరుగుదల కనిపించాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. వైద్యాధికారి సుదీప్, బద్రు పాల్గొన్నారు. చుంచుపల్లి: ఎండల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకో వాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. ప్రో గ్రాం ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్ఓలతో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. -
ఆస్పిరేషనల్ బ్లాక్లపై సమీక్ష
సూపర్బజార్(కొత్తగూడెం): ఆస్పిరేషనల్ జిల్లా, బ్లాక్లలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష జరిపారు. మినిస్టరీ ఆఫ్ పవర్ అడిషనల్ సెక్రెటరీ డాక్టర్ సాయిబాబు అధ్యక్షతన కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ అంకిత్, జిల్లా నోడల్ అధికారి లోకేష్, సీపీఓ సంజీవరావులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు చేపడుతున్న కార్యక్రమాల అమలు, పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ చర్యలను పరిశీలించారు. ఆరోగ్య సేవలు, అంగన్వాడీ, విద్య, వ్యవసాయ,విద్యుత్, ఆర్అండ్బీ తదితర శాఖల కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయిబాబు మాట్లాడుతూ ఆస్పిరేషనల్ జిల్లాలకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. మొదటి స్థానంలో నిలిచిన జిల్లాకు రూ.10 కోట్లు, రెండో స్థానానికి రూ.5 కోట్లు, వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన జిల్లాలకు రూ.3 కోట్లు చొప్పున మొత్తం రూ 30 కోట్ల వరకు ప్రోత్సాహక నిధులు అందజేయనున్నట్లు చెప్పారు. ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మండలాలకు రూ.20 కోట్ల ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ అభివృద్ధి సూచికల్లో రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలిచేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, ఆస్పిరేషన్ బ్లాక్ ఫెలో నవనీత్ పాల్గొన్నారు. వైద్య సేవలు చేరువకావాలిగుండాల: మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన గుండాలలో ప్రజలకు వైద్య సేవలు అత్యంత చేరువకావాలని కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ సాయిబాబా అన్నారు. ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా ఆయన మండలంలో కేజీబీవీ, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. వైద్య సేవలపై ఆరా తీశారు. మలేరియా టెస్టుల వివరాలను అడిగితెలుసుకున్నారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంతోపాటు, కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎంహెచ్ఓ తుకారం, సీపీఓ సంజీవరావు, ఎంపీడీవో బాలరాజు, తహసీల్దార్ కాసీం, ఎంఈఓ పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై ఉద్యమాలు
● రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో తీర్మానం ● 93 మందితో నూతన కమిటీ ఎన్నిక రుద్రంపూర్: భవిష్యత్లో రైతు సమస్యలపై ఉద్యమించాలని రైతు సంఘం మహాసభల్లో తీర్మానించారు. ఈ నెల 23 నుంచి కొత్తగూడెంలో నిర్వహిస్తున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలు శనివారం ముగిశాయి. మహాసభల్లో పలు తీర్మానాలను ఆమోదించారు. అనంతరం సంఘం నాయకులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రైతులకు సంబంధించిన 30 అంశాలపై తీర్మానాలు రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయ ప్రణాళికను శాసీ్త్రయంగా రూపొందించాలని, పంటలకు సక్రమంగా సాగునీరు అందించాలని, భూభారతి, ధరణి చట్టాలను సరిచేయాలని, పోడు సాగుదారులకు రుణాలు మంజూరు చేయాలని, దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని మహాసభల్లో తీర్మానించినట్లు వివరించారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ. 2400 చెల్లించాలని కోరారు. ఈ నెల 27వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తామని తెలిపారు. నూతన కమిటీ ఎన్నిక మహాసభలో 93 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పోతినేని సుదర్శన్రావు, కార్యదర్శిగా తీగల సాగర్, ఉపాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ ఆరిబండి ప్రసాదరావు, పి.జంగారెడ్డి, నంద్యాల నర్సింహా రెడ్డి, రమేష్, కందాల ప్రమీల, మల్లు నాగార్జునరెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, శెట్టి వెంకన్న, ఎం.శ్రీనివాస్, తుమ్మల వెంకటరెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శులుగా అన్నవరపు సత్యనారాయణ, బొంతు రాంబాబు, శీలం ఫకీరమ్మ, లెల్లల బాలకృష్ణ, ఉడుత రవీందర్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాటూరి బాలరాజ్ గౌడ్, ఈసంపల్లి బాబు, వెంకటేశ్, బాల్రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, వెంకట్, మావో, దుబ్బాక రాంచందర్, చందు నాయక్, కోశాధికారిగా మూడుశోభన్లను ఎన్నుకున్నారు. -
ఎన్ఎఫ్బీఎస్ పథకంలో మార్పులు
అశ్వాపురం: కుటుంబంలో పెద్ద దిక్కు.. యజమాని మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్)లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి బాధ్యతలు, నిధుల విడుదల ప్రక్రియ ఇకపై మండలాల్లో ఎంపీడీఓల పరిధిలోకి, మున్సిపాలిటిల్లో కమిషనర్ల పరిధిలోకి మారుస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్ తహసీల్దార్ కార్యాలయాల్లో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. గతంలో వీటి పరిశీలన, ఆమోదం, ప్రభుత్వానికి నివేదించడం అంతా రెవెన్యూ శాఖ పరిధిలోనే ఉండేది. రెవెన్యూ అధికారులు పని ఒత్తిడి కారణంగా క్షేత్రస్థాయిలో విచారణలోనూ, నిధుల విడుదలలోనూ పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో బాధ్యతలను ఎంపీడీఓలు, పురపాలికల కమిషనర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల ద్వారా వచ్చే దరఖాస్తులను ఎంపీడీఓలు పరిశీలించి త్వరితగతిన నిధులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకుంటారు. 18 నుంచి 60 ఏళ్ల లోపు.. ఈ పథకం కింద అర్హత పొందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి 18 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉండి మృతి చెంది ఉండాలి. లబ్ధిదారులు స్థానిక గ్రామ పంచాయతీల ద్వారా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. పంచాయతీ కార్యదర్శుల ద్వారా విచారణ వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. కుటుంబ యజమాని మరణిస్తే ఎన్ఎఫ్బీఎస్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హత ఉంటే పథకాన్ని అమలు చేసి వారికి ఆర్థికసాయం అందజేస్తాం. ఈ పథకం బాధ్యతలు ఇటీవల ప్రభుత్వం ఎంపీడీఓలకు అప్పగించింది. అర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –ముత్యాలరావు, ఎంపీడీఓ, అశ్వాపురం బాధ్యతలు ఎంపీడీఓలకు, కమిషనర్లకు అప్పగింత -
వేసవి క్రీడా శిక్షణ శిబిరం షురూ
గుండాల: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో పీఓ రాహుల్ ఆదేశాల మేరకు స్పోర్ట్స్, గేమ్స్ కోచింగ్ క్యాంప్ నిర్వహించి పలు క్రీడల్లో గిరిజన విద్యార్థులకు తర్ఫీదు ఇస్తామని ఇల్లెందు ఏటీడీఓ భారతిదేవి అన్నారు. శనివారం కాచనపల్లి క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సర్పంచ్ జరుపుల కిషన్తో కలిసి ఆమె ప్రారంభించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు, యోగా, డ్యాన్స్, పెయింటింగ్, ఆర్ట్స్, క్రాఫ్ట్, క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, వ్యాసరచన, ఒక్క నిమిషం ప్రసంగం, దేశభక్తి గీతాలు.. లాంటి అంశాల్లో తర్ఫీదు ఇస్తామని వెల్లడించారు. మొత్తం 80 మంది విద్యార్థులు పాల్గొంటుండగా.. మే 9వ తేదీ వరకు శిబిరం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఏసీఎంఓ రాములు, డిప్యూటీ వార్డెన్ జి.పాపయ్య, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ బండ రాంబాబు, క్యాంప్ ఇంచార్జ్ పి.శిరోమణి తదితరులు పాల్గొన్నారు. -
కేరళ మోడల్ అంగన్వాడీ కేంద్రం పరిశీలన
పాల్వంచరూరల్: మండల పరిధిలోని తోగ్గూడెంతండాలో నీతి అయోగ్ నిధులు రూ.15 లక్షలతో కేరళ మోడల్లో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం కేంద్ర మంత్రిత్వశాఖ అడిషనల్ సెక్రటరీ డి.సాయిబాబు సందర్శించి పరిశీలించారు. భవన సముదాయ ప్రయోజనాలు, కేంద్రంలో ఆరోగ్యం, విద్య, పోషణ, ప్రాథమిక వసతులపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆటవస్తువులు అందుబాటులో ఎందుకు ఉంచలేదని సిబ్బందిని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బొగ్గనారాయణ, ఎంపీఓ కేశవరావు, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. -
నేరుగానే!
ఎన్నిక లేదు..సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకమండళ్ల భర్తీ ఇకపై నామినేటెడ్ విధానంలో జరగనుంది. సంఘాల పదవీకాలం ముగిసి చాన్నాళ్లు కాగా, ఇన్చార్జి అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ దశలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోగా, పీఏసీఎస్ల చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేయనుంది. అయితే, ఎంపికలో ఎమ్మెల్యేల పాత్ర కీలకం కానుండడంతో కాంగ్రెస్లోని ఆశావహులు తమ వంతు ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఏడాదిగా ఇన్చార్జిల పాలనే.. ఖమ్మం డీసీసీబీ పరిధిలో ఉమ్మడి జిల్లాలో 101 పీఏసీఎస్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21తో పాటు మహబూబాబాద్ జిల్లాలో రెండు, ములుగు జిల్లాలో రెండు కొనసాగుతున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడంతో పాటు ఎరువులు, విత్తనాల అమ్మకం, పంట ఉత్పత్తుల భద్రతకు గోదాంల సదుపాయాలు కల్పిస్తాయి. అంతేకాక ధాన్యం కొనుగోలు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాయి. అయితే, పీఏసీఎస్ల పాలక మండళ్ల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి ఇన్చార్జి అధికారుల పర్యవేక్షణలోనే సంఘాలు కొనసాగుతున్నాయి. పీఏసీఎస్ టూ డీసీసీబీ... ఇప్పటి వరకు పీఏసీఎస్ల పాలకమండళ్లు ఎన్నికల ప్రక్రియ ద్వారా కొలువుదీరాయి. సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు తమ ఓటు ద్వారా 10 – 12 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. వీరు పీఏసీఎస్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను.. ఆపై చైర్మన్లు డీసీసీబీ డైరెక్టర్లను, వారు డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ను ఎన్నుకునే విధానం కొనసాగుతోంది. దీంతో గ్రామంలో ఉన్న రైతు నుంచి జిల్లా కేంద్రంలో ఉన్న డీసీసీబీ వరకు అనుబంధం ఉండి.. రుణాలు, ఎరువులు, విత్తనాల కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేది. నామినేటెడ్కు ‘జై’ ఇకపై పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో పదవులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమాన డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్లనే కాక.. డీసీసీబీ, డీసీఎంఎస్లో ఇదే తరహాలో పాలక మండళ్లను నియమించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఎమ్మెల్యేల ప్రతిపాదనలు కీలకం కానున్నాయి. జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రులు కూడా ఇందులో భాగం కానున్నారు. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నాక పోస్టుల భర్తీ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమాన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పదవుల భర్తీపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది.ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నాయకులు పలువురు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ తమకు పదవులు దక్కుతాయో, లేదోనన్న ఆందోళన వారిలో పెరిగిపోతోంది. ఈక్రమాన పీఏసీఎస్ల రూపంలో కొన్ని పదవులైనా భర్తీ చేయొచ్చనే భావనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుండగా.. ఆశావహుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్ చైర్మన్ల రూపంలోనే 101 మందికి.. ఒక్క ఖమ్మం జిల్లాలో 76 మందికి అవకాశం దక్కనుంది. మే నెలాఖరుకల్లా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా నిరాశతో ఉన్న పార్టీ శ్రేణులను సంతృప్తిపరిచినట్లు అవుతుందనే భావనలో ఉన్నట్లు సమాచారం. ఏదీఏమైనా ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో రాజకీయ వేడి మొదలుకాగా.. ఏదో ఒక పదవి దక్కించుకోవాలనే ఉద్దేశంతో నాయకుల నుంచి కార్యకర్తల వరకు స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులను కలిసేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పీఏసీఎస్లకు నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లు -
కార్పొరేట్ల కోసం బీజేపీ ఒప్పందాలు
రుద్రంపూర్: కార్పొరేట్ సంస్థల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోందని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ విమర్శించారు. కొత్తగూడెంలోని సామినేని రామారావునగర్, కాసాని ఐలయ్య ప్రాంగణంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాతో మోదీ ప్రభుత్వం చేసుకున్న సామ్రాజ్యవాద అనుకూల ఒప్పందాలు భారతదేశంలో ఉత్పత్తి దారులు, రైతులకు తీవ్రనష్టమని అన్నారు. ఐక్య పోరాటాలతో ఈ ఒడంబడికలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ట్రంప్ ఏకపక్షంగా ఒడంబడిక ప్రకటించిన వెంటనే నరేంద్రమోదీ విజయం సాధించినట్లు పేర్కొనడం విడ్డూరమన్నారు. మనదేశ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతిచేస్తే 18 శాతం పన్ను వేస్తుండగా, అమెరికా ఉత్పత్తులు పన్ను లేకుండా పాలకులు దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆ దేశంలో ఏటా ఒక్కో రైతుకు రూ.20 లక్షలకు సబ్సిడీ ఇస్తుండగా, ఇక్కడ సగటున రూ.34 వేలు మాత్రమే వస్తున్నట్లు వివరించారు. విదేశీ ఒప్పందాలతో భారతీయ రైతులకు తీరని నష్టమని తెలిపారు. జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ పంటమార్పిడి ఉద్యమంలా సాగాలని సూచించారు. రైతుల మేలు కోసం ప్రభుత్వా మెరుగైన విధానాలు తీసుకురావా లని అన్నారు. కుటుంబ ఆదాయం, ఖర్చుల మధ్య భారీ వ్యత్యాసాల వల్ల రైతులు క్రమంగా సంక్షోభంలోకి కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పోవాలని ఆకాంక్షించారు. సభలో సీనియర్నేత సారంపల్లి మల్లారెడ్డి, ప్రొఫెసర్ ఆరుబండి ప్రసాదరావు, నాయకులు టి. సాగర్, జంగారెడ్డి, కందాల ప్రమీల, శోభనా నాయక్, మచ్చా వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, ఎ. కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్ -
ఆలయ విస్తరణ మార్కింగ్ పరిశీలన
భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా ఆర్అండ్బీ అధికారులు చేపట్టిన మార్కింగ్ ప్రక్రియను శుక్రవారం తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఆలయం చుట్టూ ప్రభుత్వం సేకరించిన భూమి, మాఢ వీధుల విస్తరణపై ఆర్అండ్బీ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఆలయ పునరుద్ధరణ కోసం గతంలోనే నిబంధనల ప్రకారం భూసేకరణ పూర్తి చేసి, నిర్వాసితులకు పరిహారం అందించామని తెలిపారు. సేకరించిన భూమిని పంచనామా నిర్వహించి దేవాదాయ శాఖకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రూ.351 కోట్లతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనులు ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయని వివరించారు. -
గురుకులాలు పిలుస్తున్నాయ్!
నేలకొండపల్లి: సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల జూనియర్ కాలేజీలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయి. పాఠ్యాంశాల బోధనే కాక జేఈఈ, నీట్, ఎప్సెట్కు ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థినులు అటు ఇంటర్లో, ఇటు పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటుతున్నారు. ఈమేరకు గురుకులాల్లో 2026–28 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆధునాతన తరగతి గదులు, విశాలమైన మైదానాలతో పాటు నిష్టాతులైన అధ్యాపకులు ఉన్నందున కాలేజీల్లో చేరాలని అధ్యాపకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. బాలురకు మూడు, బాలికలకు పది ఖమ్మం జిల్లాలో 13 సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కాలేజీలు ఉన్నాయి. ఇందులో మూడు బాలుర కాలేజీలు కాగా, పది బాలికలకు 10 కాలేజీలు కొనసాగుతున్నాయి. ఒక్కో కాలేజీలో గ్రూప్కు రెండు సెక్షన్ల చొప్పున 80 మందికి ప్రవేశాలు కల్పించే అవకాశముంది. మొత్తంగా జిల్లాలోని అన్ని గురుకులాల్లో 1,040 సీట్లు ఉండగా, పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కాగా, ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించే గడువు శనివా రంతో ముగియనుంది. 2025–26లో పదో తరగతి చదివిన విద్యార్థులనే అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. విద్యతోపాటు క్రీడల్లో ప్రోత్సాహం గురుకుల కాలేజీల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. విశాలమైన మైదానాలు ఉండడంతో ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. కాలేజీల విద్యార్థులు పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో రాణించారు. నేలకొండపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కాలేజీ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడాపోటీల్లో సత్తా చాటారు. అంతేకాక ప్రాక్టికల్స్ కోసం అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్లు, కంప్యూటర్ బోధనకు సైతం ఆధునిక కంప్యూటర్లు ఉన్నందున ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధ్యాపకులు సూచిస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధి లోని గురుకుల కాలేజీల్లో నాణ్యమైన విద్య అందుతుంది. ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నా రు. అంతేకాక ప్రాక్టికల్స్, కంప్యూటర్ బోధనకు అత్యాధునిక ల్యాబ్లు ఉన్నా యి. ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి. – జి.శ్రీలత, ప్రిన్సిపాల్, గురుకుల కాలేజీ, నేలకొండపల్లి -
కేజీబీవీల్లో ఐఓఈలు..
కరకగూడెం: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో విద్యార్థినులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తొలుత పదో తరగతి వరకు బోధించగా, క్రమంగా ఇంటర్మీడియట్ స్థాయికి ఉన్నతీకరించారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, కంప్యూటర్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కేజీబీవీల్లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఐఓఈ) కేంద్రాలను ప్రారంభించింది. జిల్లాలో 14 కేజీబీవీలు ఉండగా, భద్రాచలం(జేఈఈ), పాల్వంచ (నీట్), చంద్రుగొండ(క్లాట్) ఐఓఈ కేంద్రాలుగా ఎంపిక చేశారు. వీటిలో 400 మంది విద్యార్థినులు శిక్షణ పొందుతున్నారు. ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ, బైపీసీ విద్యార్థినులకు నీట్తోపాటు క్లాట్ పరీక్షలకు నిపుణులైన అధ్యాపకులతో ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోచింగ్ తీసుకోలేకపోతున్న విద్యార్థినులకు మేలు జరుగుతోంది. ఏఐ ఆధారిత బోధన.. భవిష్యత్ తెలంగాణ కార్యక్రమం పేరుతో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత బోధనను ప్రవేశపెట్టింది. దీనిపై అవగాహన కోసం జిల్లాలోని సీఆర్టీలు, పీజీ సీఆర్టీలకు ఇటీవల హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఐఓఈ కేంద్రాల్లో బోధించే అధ్యాపకులకు అధునాతన ల్యాప్టాప్లు అందజేశారు. వీటి ద్వారా ఆన్లైన్లో నిపుణుల పాఠాలను ప్రత్యక్షంగా వినే అవకాశం కలగడంతోపాటు, విద్యార్థినులు సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థినులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అకడమిక్ చదువులతోపాటు అత్యున్నత స్థాయి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలో మూడు ఐఓఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. జేఈఈ, నీట్, క్లాట్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –అన్నామణి, జీసీడీఓ -
ధాన్యం శుభ్రం చేసి తీసుకురావాలి
సూపర్బజార్(కొత్తగూడెం): రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం శుభ్రపరిచి, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. శుక్రవారం ఎర్రగుంటలో రైతులు ఆందోళన చేపట్టగా, ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఆరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సుమారు 15 లారీల ధాన్యం వచ్చిందని తెలిపారు. పౌరసరఫరాల శాఖ అధికారుల పరిశీలనలో ధాన్యంలో తేమ శాతం అనుకూలంగా ఉన్నప్పటికీ, ధాన్యం పరిశుభ్రత లోపించడం గమనించినట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలకు సరిపోకపోవడంతో కొనుగోలులో ఇబ్బందులు తలెత్తినట్లు వివరించారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించగా ధాన్యం శుభ్రపరిచే ప్రక్రియ సరిగా జరగలేదని వెల్లడించినట్లు చెప్పారు. వెంటనే ప్యాడీ క్లీనర్లను వినియోగించి ధాన్యాన్ని శుభ్రపరిచాక కొంత మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, కొందరు రైతులు శుభ్రపరచకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ధర్నాకు దారితీసిందన్నారు. ఈ విషయంపై తక్షణమే పౌరసరఫరాల శాఖ అధికారులు, సంబంధిత మేనేజర్లు రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, కేంద్రాల ఇన్చార్జ్లకు ఇప్పటికే మార్గదర్శకాలు అందించినట్లు వెల్లడించారు.రైతులకు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ విజ్ఞప్తి -
పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడులు
బూర్గంపాడు: సారపాక గ్రామపంచాయతీలోని సుందరయ్యనగర్కు సమీపంలో ఓ జామాయిల్ తోటలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్ఫోర్స్ సీఐ రమాకాంత్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన పోలీసులు 11మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. రూ 57,950 నగదు, 13 సెల్ఫోన్లు, రెండు మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న పేకాటరాయుళ్లను బూర్గంపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా, మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఈ దాడులలో టాస్క్ఫోర్స్ ఎస్ఐ సుమన్, బూర్గంపాడు అడిషనల్ ఎస్ఐ నాగభిక్షం పాల్గొన్నారు. జేసీబీ సీజ్అశ్వాపురం: మండల పరిధిలోని అమ్మగారిపల్లి గ్రామంలో గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలించేందుకు గోదావరిలో రోడ్డు చేస్తున్న జేసీబీని సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. జేసీబీ డ్రైవర్ ముంతాజ్, యజమాని అనంతనేని సురేష్పై పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జేసీబీని సీజ్ చేశారు. ఇసుక లారీ.. బూర్గంపాడు: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న లారీని గురువారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధిలోని మోతె పట్టీనగర్ వద్ద నుంచి ఇసుక తరలిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. లారీని పోలీస్స్టేషన్కు తరలించి బాధ్యులపై కేసు నమోదు చేశారు. మణుగూరు బార్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం మణుగూరు టౌన్: 2026 సంవత్సరానికి మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గురుకృష్ణ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోర్టు ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ కంబపుసూరి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్, బెంచ్ మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగాలని సూచించారు. జూనియర్, సీనియర్ న్యాయ వాదులు ఐక్యంగా పనిచేసి, కోర్టు గౌరవాన్ని మరింత పెంచాలని సూచించారు. వైన్షాపు నిర్వాహకుడిపై దాడి పాల్వంచరూరల్: బీరు కొనుగోలు చేసిన వ్యక్తి గ్లాస్ అడిగితే ఇవ్వకపోవడంతో వైన్షాపు నిర్వాహకునిపై దాడి చేసిన ఘటన శుక్రవారం జరిగింది. మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద గల వైన్షాపులో జగన్నాథపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దుర్గాప్రసాద్ బీరు కొనుగోలు చేశాడు. బీరు తాగేందుకు వైన్షాపు కౌంటర్లో ఉన్న గద్దె రమేష్ను గ్లాస్ అడగగా, ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఆవేశంతో దుర్గాప్రసాద్ వైన్షాపు కౌంటర్లో ఉన్న రమేష్పై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో దాడిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.సురేశ్ తెలిపారు. -
ఆరోగ్యవంతులైన పౌరులే దేశానికి సంపద
సూపర్బజార్(కొత్తగూడెం): ఆరోగ్యవంతమైన పౌరులే దేశానికి అసలైన సంపదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. కలెక్టరేట్లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పక్వాడలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే, అక్షరభ్యాసం, అన్నప్రాసన, గర్భిణులకు సీమంతం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి మెమెంటో, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2026 గడిచేలోగా జిల్లాను పోషకాహార లోపరహితంగా మార్చుకోవాలని సూచించారు. అధికారులు స్వర్ణలత లెనీనా, విజయలక్ష్మి, శ్రీలత, సతీష్, రాకేష్, సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ విద్యాచందన -
భద్రాచలం ఏఎస్పీకి సన్మానం
భద్రాచలంఅర్బన్: మెదక్ ఏఎస్పీగా బదిలీపై వెళ్తున్న భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ను గురువారం రాత్రి సన్మానించారు. రాజుల సత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్రాజు, భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ ముఖ్యఅతిథులుగా హాజరుకాగా, జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గజమాలతో సన్మానం చేసి పుష్పగుచ్ఛాలు అందించారు. డీఎస్పీలు సతీష్, వంగా రవీందర్రెడ్డి, సీఐలు నాగరాజు, రాజువర్మ, వెంకటప్పయ్య ఎస్ఐలు, స్వప్న, సతీష్, శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. మొరాయించిన ‘మీ సేవ’ సర్వర్కరకగూడెం: జిల్లా వ్యాప్తంగా మీ సేవ పోర్టల్ సర్వర్ శుక్రవారం ఒక్కసారిగా నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే సైట్ ఓపెన్ కాకపోవడంతో మీ సేవ కేంద్రాల వద్ద జనం బారులుదీరారు. క్షేత్రస్థాయిలో ఈఎస్డీ (ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ) సర్వర్ సమస్య తలెత్తడంతో కేంద్రాల నిర్వాహకులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. దీంతో వివిధ ప్రవేశ పరీక్షలు, విద్యాసంస్థల అడ్మిషన్ల దరఖాస్తులకు గడువు ముగుస్తుండటంతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సాంకేతిక లోపాలను సరిచేయాలని కోరారు. మిషన్ భగీరథ పైపులైన్ లీక్ఇల్లెందు: పట్టణంలోని బుగ్గవాగు రైల్వే బ్రిడ్జి సమీపంలో శుక్రవారం మిషన్ భగీరథ పైపులైన్ లీకై ంది. భారీగా నీళ్లు ఎత్తి చిమ్మడంతో రోడ్డంతా జలమయంగా మారింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాకపోకలకు అంతరాయం కలిగింది. వ్యాక్సిన్లు జాగ్రత్తగా భద్రపరచాలిబూర్గంపాడు: ప్రభుత్వ ఆస్పత్రులలో వ్యాక్సి న్స్ను జాగ్రత్తగా భద్రపరచాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ ఆదేశించారు. మోరంపల్లిబంజర పీహెచ్సీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించిన కోల్డ్చైన్ నిర్వహణ, వ్యాక్సిన్ ఫ్రీజింగ్ సదుపాయాలు, ఉష్ణోగ్రతల నిర్వహణ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లా మలేరియా నిర్మూలన అధికారి డాక్టర్ రాందాస్, డీపీఎంఓ మోహన్, సీహెచ్ఓ నాగభూషణం పాల్గొన్నారు. లాటరీ పేరిట రూ.1.50లక్షలకు టోకరా కారేపల్లి: తక్కువ ధరలకే సబ్బులు ఇస్తాం.. సబ్బులు కొనుగోలు చేసిన వారు లక్కీ లాటరీలో రూ.లక్షలు గెలుచుకోవచ్చని ఓ వ్యక్తి మాయమాటలు చొప్పి రూ.1.50లక్షల మేర వసూలు చేసిన ఘటన మండలంలోని గాదెపాడులో వెలుగు చేసింది. ఏపీకి ఓ వ్యక్తి ఇటీవల గాదెపాడుకు రాగా, తక్కువ ధరతో నాణ్యమైన సబ్బులు విక్రయిస్తున్నట్లు నమ్మబలికాడు. అంతేకాక సబ్బులు కొన్న వారు లాటరీలో రూ.లక్షలు బహుమతిగా గెలుచుకోవచ్చని తెలిపాడు. దీంతో పలువురు సబ్బులు కొనుగోలు చేయగా ఫోన్నంబర్లు తీసుకుని వెళ్లిపోయాడు. ఆతర్వాత ఫోన్ చేసి లాటరీ తగిలిందని చెబుతూ రూ.20వేలు, రూ.30వేల చొప్పున ఫోన్పే ద్వారా డిపాజిట్ చేస్తే రూ.లక్ష ఖాతాలో జమ అవుతుందని చెప్పడంతో పలువురు రూ.1.50లక్షల మేర చెల్లించారు. కానీ డబ్బు జమ కాకపోగా, సదరు వ్యక్తి పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో మోసపోయామని గుర్తించారు. దీంతో గ్రామానికి చెందిన రాయల మాధవరావు తదితరులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.గోపి తెలిపారు. -
అన్నదాత ఆగ్రహం
బూర్గంపాడు: అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా కొనుగోళ్లలోనూ ఆలస్యం చేస్తోంది. కొన్న ఒకటి, రెండు లారీల ధాన్యాన్ని నాణ్యత లేదంటూ మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో రైతులు విసిగిపోయి శుక్రవారం బూర్గంపాడు మార్కెట్యార్డులో ఆందోళనకు దిగారు. అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మండుటెండల్లో నెలరోజులుగా పడిగాపులు పడుతున్నా ధాన్యం కొనకుండా సాకులు చెబుతున్నారని కోపోద్రిక్తులయ్యారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవటంతో వ్యవసాయ అధికారులను, పీఏసీఎస్ అధికారులను రైతువేదికలో నిర్బంధించారు. నాలుగురోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటివరకు ఒక్క లారీ ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని రైతులు మండిపడ్డారు. ఆ లారీ కూడా మిల్లు వద్ద దిగుమతి చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరగంట తర్వాత తలుపులు తీసి అధికారులకు తమ దుస్థితిని వివరించారు. తూర్పారా పోసిన ధాన్యాన్ని మళ్లీ తుర్పారా పట్టించాలని, నాణ్యత పరిశీలించాలని నిబంధనలు పెట్టి ఇబ్బందులు పెట్టడం సరికాదని వాపోయారు. మిల్లుల దగ్గరకు వెళ్లిన లారీలలోని ధాన్యం దిగుమతి చేసుకోకుండా తరుగు పేరుతో బస్తాకు ఐదారు కిలోల కోత విధించడమేమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు, పీఏసీఎస్ అధికారులు మాట్లాడుతూ నాణ్యత పరిశీలనలో భాగంగానే కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. పురుగుమందు తాగేందుకు ఓ రైతు యత్నం ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో ఓయువరైతు పురుగుల మందు తాగేందుకు యత్నించగా. పక్కనే ఉన్న రైతులు నిలువరించారు. గుంపెన సొసైటీ (పీఏసీఎస్) కొనుగోలు కేంద్రంలో విక్రయాలు సాగట్లేదని, తరుగు పేరిట క్వింటాకు 5 కేజీల కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకో చేస్తున్న సమయంలో కట్టుగూడేనికి చెందిన రైతు పంకు భద్రయ్య పురుగు మందు తాగేందుకు యత్నిండంతో, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పక్కనే ఉన్న రైతులు స్పందించి నిలువరించారు. డబ్బాలోని మందు కింద పారబోశారు. ఈక్రమంలో పోలీసులు మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.డీఎస్ఓ ప్రేమ్కుమార్ మధ్యాహ్నం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వెళ్తుండగా, వాహనాన్ని అడ్డుకున్నారు. అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. ఎస్సై విజయసింహా రెడ్డి రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా రైతులు శాంతించలేదు. ఈ సందర్భంగా డీఎస్ఓ మాట్లాడుతూ ఎగుమతి చేసిన నాలుగు లారీల ధాన్యంలో నాణ్యత లేకపోవడంతో మిల్లర్లు దిగుమతి చేసుకోలేదన్నారు. తూర్పారబట్టే మిషన్ల సక్రమంగా పనిచేయలేదని, వాటి స్థానంలో నూతనంగా మిషన్లు ఏర్పాటు చేస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తహసీల్దార్ స్వర్ణ, సీఈఓ కుంచారపు శ్రీనివాసరావు, సొసైటీ మాజీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్రావు, రైతులు వేముల హరీష్, పోట్రు రాంబాబు, వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, కృష్ణారావు, సుఽధీర్, రవి తదితరులు ఉన్నారు. -
వేసవిలో నిరంతర తాగునీటి సరఫరా
సూపర్బజార్(కొత్తగూడెం)/పాల్వంచ: వేసవిలో జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరా నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వివరాలు, కొనుగోలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, షెడ్లు, తూకం యంత్రాలు, రవాణా వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయం కలిగితే తక్షణమే పరిష్కారం చూపాలని చెప్పారు. టేకులపల్లి ప్రాంతంలో ఏర్పడ్డ తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చైల్డ్ సేఫ్టీ, ప్రొటెక్షన్, సే నో టు డ్రగ్స్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. వృత్తి నైపుణ్యం అవసరం యువతకు విద్యతోపాటు వృత్తి నైపుణ్యం అవసరమని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం 99 రోజుల ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నవ మహిళా సాధికార కేంద్రం, ఒకేషనల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో నైపుణ్యాభివృద్ధి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టాలీ, వెల్డింగ్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించారు. తాటి ఆకులతో బుట్టల తయారీ వల్ల వచ్చిన నగదు రూ.63,821 చెక్కును అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సుల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, డీఎస్ఓ ప్రేమ్ కుమార్, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, డీపీఓ సుధీర్, నవ లిమిటెడ్ అధికారులు ఎం.శ్రీనివాసరావు, కె.సంజయ్కుమార్, ఆర్.శ్రీనివాస్ రెడ్డి, సీహెచ్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. పోస్టర్లు ఆవిష్కరణమన జనగణన – మన అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆవిష్కరించారు.సీపీఓ సంజీవరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
ఓటీటీలో భద్రాద్రి క్షేత్ర దర్శిని డాక్యుమెంటరీ
భద్రాచలంటౌన్: దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి క్షేత్ర మహిమను చాటిచెప్పే భద్రాద్రి క్షేత్ర దర్శిని డాక్యుమెంటరీ విడుదల చేసినట్లు చిత్ర బృందం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీ సీతా రామచంద్ర స్వామివారి దివ్యక్షేత్ర చరిత్ర ను, ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్లకు కట్టేలా రూపొందించిన చిత్రాన్ని ఓటీటీ వేదిక ‘ఆహా’లో ప్రసారం చేస్తున్నారు. డాక్యుమెంటరీకి కృష్ణ ప్రభాత్ శర్మ వివరణ అందించగా, సాయి భారతి నిర్మాతగా వ్యవహరించారు. అభిలాష్ దర్శకత్వ పర్యవేక్షణలో, వెంకట్ ఛాయాగ్రహణంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. శ్రీ వెంకట్ సంగీతాన్ని అందించారు. -
యథేచ్ఛగా విద్యుత్ చౌర్యం..
● అనధికార వినియోగంతో డిమాండ్కు మించి సరఫరా ● అడపాదడపా కేసులు నమోదవుతున్నా మారని తీరు ● నిర్లక్ష్యం వీడి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టని అధికారులు భద్రాచలంఅర్బన్: విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వీడి విద్యుత్ చౌర్యాన్ని అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. జరిమానా కూడా పూర్తి స్థాయిలో వసూలు చేయడంలేదు. పేదలు బిల్లు చెల్లించపోతేనే విద్యుత్ కనెక్షన్ తొలగిస్తున్న అధికా రులు విద్యుత్ చౌర్యం చేస్తున్న వారిపై మాత్రం చర్యలు తీసుకోవడంలేదు. అక్రమార్కులతో విద్యుత్ శాఖకు నష్టం అక్రమార్కుల చర్యలతో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ఏడాది నుంచి జిల్లా వ్యాప్తంగా అనుమానం ఉన్న దుకాణాలు, నివాసాలపై దాడులు నిర్వహించి, మీటర్లను తనిఖీ చేస్తున్నారు. పదుల సంఖ్యలో ట్యాంపరింగ్ చేసినట్లు తేలగా, మీటర్లు సీజ్ చేసి వినియోగదారులకు జరిమానాలు విధించారు. విజిలెన్స్ విభాగం అధికారులు పసిగట్టిన ప్రతీ వినియోగదారుడి మీటరు ట్యాంపరింగ్కు పాల్పడినట్లు తేలుతుండగా, జిల్లా వ్యాప్తంగా భారీగా అక్రమాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ వాడకం ఎక్కువగా ఉన్న దుకాణాలన్నీ బిల్లు తక్కువగా వచ్చేలా అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు గుర్తించి జరిమానా విధిస్తున్నా విద్యుత్ చౌర్యానికి అడ్డుకట్ట పడటం లేదు. అనధికార విద్యుత్ వినియోగం ఎక్కవ కావడంతో డిమాండ్కు మించి కరెంట్ సరఫరా చేయాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనలు సుజాతనగర్ మండలం నర్సింహాసాగర్లో రూ. 2లక్షలు, సర్వరం తండాలో రూ. 2.5లక్షలు జరిమానా విధించారు. జూలూరుపాడు మండలం బేతాళపాడులో రూ.2లక్షలు, పాల్వంచ మండలం సూ రారంలో రూ.1.5లక్షలు, పెద్దమ్మగుడి వద్ద ఫ్యాక్టరీకి రూ.70వేలు, దుమ్ముగూడెం నర్సాపురం రూ. 1.8 లక్షలు, మణుగూరు మండలం రామానుజవరంలో రూ.1.5 లక్షల జరిమానా విధించారు. 455 కేసులు విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. సాధారణంగా విద్యు త్ చౌర్యానికి పాల్పడితే మొదటిసారి విద్యుత్ చట్టం–2003 సెక్షన్ 135 ప్రకారం జరిమానా విధిస్తారు. రెండోసారి చౌర్యానికి పాల్పడితే కేసు సమోదు చేసి అరెస్ట్ చేయడంతోపాటు 10రెట్లు అధికంగా జరిమానా విధిస్తారు. జిల్లా వ్యాప్తంగా 2025 మార్చి నుంచి 2026 మార్చి వరకు 455 మందిపై కేసులు నమో దు చేశారు. ఈ కేసుల్లో రూ.52.46 లక్షల జరిమానా విధించారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 455 మీటర్లు ట్యాంప్రింగ్కు పాల్పడినట్లుగా తెలిసింది. ప్రత్యేక సిబ్బంది తో తనిఖీ చేయిస్తున్నాం. విద్యుత్ చౌర్యానికి పాల్ప డినవారికి జరిమానా విధిస్తున్నాం. ఆలస్యం చేస్తే సరఫరా నిలిపివేస్తాం. అనధికార విద్యుత్ వినియోగంపై నిఘా ఏర్పాటు చేస్తాం. – మహేందర్, విద్యుత్శాఖ ఎస్ఈ -
స్వయం ఉపాధి కోర్సులతో ఆర్థికాభివృద్ధి
భద్రాచలం: గిరిజన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పథకాలపై దృష్టి సారించాలని, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి బి.రాహుల్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం గిరిజన నిరుద్యోగ యువతకు ఏర్పాటుచేసిన ఉచిత శిక్షణ, అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పోటీ ప్రపంచంలో వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటే ప్రైవేట్ రంగంలో సైతం ఉపాధి అవకాశాలు లభించనున్నందున ఐటీడీఏ ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సుకు 170 మంది యువతీ, యువకులు హాజరుకాగా.. ఐటీ హెల్ప్డెస్క్ అటెండెంట్ కోర్సుకు 45 మంది, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు ఎనిమిది మంది, ఎంబ్రాయిడరీ మిషన్ ఆపరేటర్ శిక్షణకు 20 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు 35 మంది, టైలరింగ్ శిక్షణకు 52 మంది ఆసక్తి చూపారని పీఓ తెలిపారు. వీరికి మూడు నుంచి ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వడమే కాక ఉచిత భోజన, వసతి కల్పిస్తామని వెల్లడించారు. ఈసమావేశంలో సర్పంచ్ పూనెం కృష్ణ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్, ఏఓ సున్నం రాంబాబు, జేడీఎం హరికృష్ణ, వైటీసీ సెంటర్ ఇన్చార్జ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణ కవచాలంకరణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలంకరణలో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. కాగా, ఆదివారం జరగనున్న కళావాహన కార్యక్రమానికి శనివారం అంకురార్పణ జరపనున్నారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈఓ రజనీకుమారి పాల్గొన్నారు. భూ పంపిణీతోనే కొనుగోలు శక్తి..వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్ రుద్రంపూర్: భూ పంపిణీతోనే దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ అన్నారు. కొత్తగూడెంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉపాధికి గ్యారెంటీ ఉంటే, ఇప్పుడు నిరుద్యోగం గ్యారెంటీ అయిపోయిందని విమర్శించారు. మతానికి రిజర్వేషన్లకు ముడిపెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, తక్షణమే సమ్మెను విరమింపజేయాలని కోరారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పెంపునకు దోహదపడుతున్న ఇండియన్స్, చైనీస్ను ట్రంప్ అవమానిస్తూ మాట్లాడటం అవివేకమన్నారు. మోదీ, రేవంత్రెడ్డి పాలనకు వ్యతిరేకంగా మూడు నెలల పాటు క్విట్ ఇండియా, సేవ్ ఇండియా, సేవ్ అగ్రికల్చర్ సేవల్ లేబర్ నినాదంతో ఆందోళన చేపట్టనున్నామని తెలిపారు. గ్రామీణ ఉపాధి చట్టం పరిరక్షణకు మే 15న సేవ్ ఉపాధి పేరుతో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుర్రి ప్రసాద్, మచ్చా వెంకటేశ్వర్లు, రేపాక శ్రీనివాస్,అన్నవరపు కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ–పాస్తో పకడ్బందీ భద్రతసబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ భద్రాచలంటౌన్: జిల్లాలో భారీ ఈవెంట్లు, పండుగల నిర్వహణకు ఏఐ ఆధారిత ఈ–పాస్ వ్యవస్థ కీలకంగా మారిందని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2026 శ్రీరామనవమి వేడుకల్లో అమలు చేసిన ఈ విధానం ద్వారా నిరోధిత జోన్లలో ప్రవేశ నియంత్రణ, భద్రతా పర్యవేక్షణను సమర్థవంతంగా నిర్వహించగలిగామని పేర్కొన్నారు. ఫొటో ఆధారిత డిజిటల్ పాస్ల వల్ల అనధికార ప్రవేశాలకు అడ్డుకట్ట పడిందని వివరించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, కేజీబీవీలకు ఐఐటీ, జేఈఈ, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు ప్రొజెక్టర్లు, సౌండ్ సిస్టమ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థుల కోసం పాఠశాలల్లో వాటర్ ఫిల్టర్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేశామని, కేజీబీవీలలో అనారోగ్యంతో ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
ముగ్గురు నిందితుల అరెస్ట్
జూలూరుపాడు: బైక్ను అపహరించిన ముగ్గురు దొంగలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై బాదావత్ రవి కథనం ప్రకారం.. మండలంలోని వెంగన్నపాలేనికి చెందిన మాలి సురేష్ ఈ నెల 22న తన బైక్ను కొత్తగూడెం–ఖమ్మం ప్రధాన రహదారి పక్కన బండి రామనాథం ఇంటి ముందు పార్క్ చేశాడు. మరుసటి రోజు ఉదయం చూడగా బైక్ కన్పించలేదు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం చండ్రగొండ క్రాస్ రోడ్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరం టేకులపల్లి డబుల్ బెడ్రూం సముదాయ ప్రాంతానికి చెందిన, నిందితులు మామిడాల నీరజ్, విన్నీ నవీన్, మహమ్మద్ నాసిర్లను రిమాండ్కుతరలించినట్లు ఎస్సై తెలిపారు. మూడు రోజుల జైలుశిక్షసూపర్బజార్(కొత్తగూడెం): పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో డ్రంక్ అండ్ ౖడ్రెవ్ కేసులో పట్టుబడిన ఎస్.రాజుకు న్యాయమూర్తి మూడు రోజుల జైలుశిక్ష విధించారు. కొత్తగూడెం మూడో అదనపు జ్యుడీషియల్ మొదటి శ్రేణి న్యాయమూర్తి వినయ్కుమార్ శుక్రవారం తీర్పు చెప్పగా, నిందితుడిని భద్రాచలం సబ్జైలుకు తరలించారు. -
హోరెత్తిన నిరసనలు
● మూడు రోజు కొనసాగిన ఆర్టీసీ సమ్మె ● బస్టాండ్లు, డిపోల వద్ద కార్మికుల ఆందోళన ● సమ్మెకు సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్ తదితర పార్టీల సంఘీభావంచుంచుపల్లి: ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు శుక్రవారం ఆందోళనలతో హోరెత్తింది. నర్సంపేటలో కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో నిరసనలు ఉద్రిక్తంగా మారగా, పోలీసులు ఉదయం నుంచే డిపోల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మె విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రవాణా శాఖ మంత్రి కార్మికులను, సంస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు గురువారం జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో తాత్కాలిక సిబ్బందిని నియమించడంతో శుక్రవారం ఎక్కువ సంఖ్యలో బస్సులు రోడ్డెక్కాయి. దీంతో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించారు. భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో సగానికి పైగా బస్సులు వివిధ ప్రాంతాలకు అధికారులు తిప్పారు. అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దూరంగా ఉండి బస్సులను నడిపారు. కాగా, సమ్మెకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, మచ్చా వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా నాయకులు రంగాకిరణ్, విద్యాసాగర్, తెలంగాణ జాగృతి నాయకులు డి.వీరన్న తదితరులు సంఘీభావం తెలిపారు. తెగించి పోరాడుదాం: ఎమ్మెల్యే కూనంనేని ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని, తెగించి పోరాడి హక్కులను సాధించుకుందామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం బస్టాండ్ ఔట్ గేట్ వద్ద కార్మికులు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ తప్పిదమే, ప్రస్తుత ప్రభుత్వం కూడా చేస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సమ్మెకు ఆందోళనలో తెలిపినవారిలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ ఎంపీపీ బదావత్ శాంతి, జేబీపీ పార్టీ నాయకులు ఝెర్రా కామేష్, గంధం మల్లికార్జున రావు తదితరులు ఉన్నారు.నర్సంపేట కార్మికుడు శంకర్గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొత్తగూడెం ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు శుక్రవారం డిపో నుంచి బస్టాండ్ కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ ఆత్మహత్య బాధాకరమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల భాస్కర్రావు, నజీర్, అనిల్, బోసు, రాధమ్మ, మాధవి, సురేఖ, రేణుక, సింగ్, సబిత, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పంచిన భూములు లాక్కుంటున్న పాలకులు
● రామ్జీ చట్టం బోగస్, ట్రేడ్ ఒప్పందాలు దేశానికే ప్రమాదకరం ● రైతు సంఘం మహాసభలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్దావలె రుద్రంపూర్: రైతాంగ సాయుధ పోరాటం ద్వారా తెలంగాణలో కమ్యూనిస్టులు భూములు పంచితే.. పాలకులు వాటిని గుంజుకుంటున్నారని ఆలిండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దావలే ఆరోపించారు. గురువారం కొత్తగూడెంలోని సామినేని రామారావునగర్లో మూడు రోజులపాటు జరిగే రైతు సంఘం 3వ మహాసభలను ఆయన జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సామినేని రామారావు, కాసాని ఐలయ్యకు నివాళులర్పించి, మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రవేటీకరణ విధానాలతో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రామ్జీ చట్టం బోగస్ అని, బీజేపీ విధానాలు దేశానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది వీరమరణం పొందారని, పది లక్షల ఎకరాల భూములను కమ్యూనిస్టులు పంచారని గుర్తుచేశారు. నేడు ఏ రాష్ట్రంలో చూసినా కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు పేదల భూములను గుంజుకుంటున్నాయని, దీంతో రైతులు వ్యవసాయ కూలీలుగా, కార్మికులుగా మారుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం ధనికుల చేతుల్లో 80 శాతం భూములున్నాయని, దీంతో అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం రైతులతోపాటు దేశానికే ప్రమాదమని హెచ్చరించారు. అనంతరం ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్ఞాకృష్ణన్ మాట్లాడారు. కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం, ఎం.సాయిబాబు, బి.వెంకట్, సాగర్, సారంపల్లి మల్లారెడ్డి, అరిబండి ప్రసాద్, జంగారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, కందాల ప్రమీల, యలమంచిలి వంశీకృష్ణ, వెంకట్రాములు, బుర్రి ప్రసాద్, శివరాంప్రసాద్, రవికుమార్, శ్రీరాంనాయక్, ఆశయ్య, రవీందర్, అన్నవరపు కనకయ్య, ఏజే రమేశ్, లిక్కి బాలరాజు పాల్గొన్నారు. -
గిరిజన నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు
భద్రాచలంటౌన్: విదేశాల్లో ఉద్యోగాల కోసం గిరిజన నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ఆస్ట్రేలియా, జర్మనీ, ఒమన్ దేశాల్లో ఉద్యోగాలకు నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్ప్రే పెయింటర్, ప్యానల్ బీటర్, ఆటోమొబైల్ మెకానిక్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, నర్సింగ్ వంటి పోస్టులకు ఐటీఐ, డిప్లొమా విద్యార్హత, అనుభవం ఉన్నవారు అర్హులని వివరించారు. ఎంపికై న వారికి రూ.24 లక్షల నుంచి రూ.48 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ, పాస్పోర్ట్, విద్యార్హత పత్రాలతో ఈ నెల 27, 28వ తేదీల్లో భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలోని భవిత సెల్లో దరఖాస్తులు సమర్పించాలని పీఓ సూచించారు. ముగిసిన జెన్కో క్రీడలు పాల్వంచ: స్థానిక విద్యుత్ కళాభారతి క్రీడా మైదానంలో కేటీపీఎస్ 7వ దశ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రీడా పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. వాలీబాల్ పోటీల్లో కేటీపీపీ జట్టు ప్రథమ, బీటీపీఎస్ ద్వితీయ, కేటీపీఎస్ 5, 6 దశలు తృతీయస్థానాల్లో నిలిచాయి. కబడ్డీలో వైటీపీఎస్ ప్రథమ, జూరా ద్వితీయ, కేటీపీఎస్ 7వ దశ తృతీయ స్థానాల్లో నిలిచాయి. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు సీఈ జె.సూర్యనారాయణ బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్ఈ ఎస్.యుగపతి, డిప్యూటీ సెక్రటరీ లోహిత్ ఆనంద్, స్పోర్ట్స్ సెక్రటరీలు వీరస్వామి, నరసింహ పాల్గొన్నారు. ‘ముత్తంగి’ కవచాల విరాళం భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తులు ముత్తంగి కవచాలను విరాళంగా అందజేశారు. ధర్మవరం వేణుమాధవ్ – శిరీష దంపతులు సుమారు రూ.80 వేల విలువైన ఈ కవచాలను గురువారం ఆలయ ఈఓ దామోదర్రావుకు అందజేశారు. కార్యక్రమంలో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష ఖమ్మంలీగల్: చెల్లని చెక్కు జారీ చేసిన వ్యక్తికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యామూర్తి బి.రజని గురువారం తీర్పు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేశ్వాపురం వాసి వద్ద రుద్రంపూర్కు చెందిన జి.శ్రీనివాసరావు 2015 నవంబర్లో రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2017 నవంబర్లో రూ.3 లక్షలకు చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. అంతేకాక సంతకం సరిపోలకపోవడంతో.. కేశ్వాపురం వాసి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం శ్రీనివాసరావుకు జైలుశిక్షతో పాటు ఫిర్యాదికి రూ.3 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. వివాహిత ఆత్మహత్య కరకగూడెం: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రాజశ్రీ (38) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బావ రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ పీవీఎన్ రావు తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ పాల్వంచ: పట్టపగలు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఈ నెల 22వ తేదీన పట్టణంలోని వెంకటేశ్వరహిల్స్కాలనీకి చెందిన తబస్సీన్ ఉద్యోగ విధుల నిమిత్తం భద్రాచలానికి ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని ఫోన్, సిల్వర్ నాణెం, గ్యాస్ సిలిండర్, ఇతర వస్తువలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వనమాకాలనీకి చెందిన కల్లూరి వంశీని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీ చేసినట్లు తేలడంతో చోరీ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి
బూర్గంపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వేసవిలో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని డీఈఓ నాగలక్ష్మి సూచించారు. మండల కేంద్రంలోని కేజీబీవీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను మంగళవారం ఆమె పరిశీలించారు. కేజీబీవీలోని క్లాస్రూమ్స్, వంటగదులు, భోజనశాల, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను అందించి, మాట్లాడారు. ప్రభుత్వం విద్యాసంస్థల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో అదేస్థాయిలో విద్యాప్రమాణాలను మెరుగుపరచాలని, ఉపాధ్యాయులు విద్యాబోధన తీరును ఎప్పటికప్పుడు మార్చుకుని, నాణ్యతతో కూడిన విద్యను అందించాలని పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వేసవిలో ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి యదుసింహరాజు, కేజీబీవీ ప్రిన్సిపాల్ సుశీల, హెచ్ఎం శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
రెండోరోజు కొనసాగిన సమ్మె
● సగం మేర రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు ● తాత్కాలిక సిబ్బందితో నడిపించిన యాజమాన్యం ● డిపోల వద్ద నిరసన తెలిపిన కార్మికులుచుంచుపల్లి: సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు గురువారం కూడా జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో కొనసాగింది. జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు డిపోల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు విన్నవించారు. రెండో రోజు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టగా, జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో సగం బస్సులు రోడ్డెక్కాయి. తాత్కాలిక సిబ్బందిని నియమించుకుని అధికారులు డ్యూటీలు కేటాయించడంతో వివిధ ప్రాంతాలకు బస్సులు తిరగడం ప్రారంభమయ్యాయి. అటు అద్దె బస్సులతోపాటు ఆర్టీసీ బస్సులు సైతం రాకపోకలు సాగించాయి. మొదటి రోజు కంటే రెండో రోజు కొత్తగూడెం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కొంత ఊరట కలిగింది. డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. బస్సులను నడిపేందుకు తాత్కాలిక సిబ్బందిని కండక్టర్లుగా నియమించడంతో పురుషులకు సైతం టికెట్లను జారీ చేశారు. రెండో రోజు మణుగూరు నుంచి 51 సర్వీసులు, కొత్తగూడెం నుంచి 46, భద్రాచలం నుంచి 42, ఇల్లెందు 15 నుంచి బస్సుల చొప్పున వివిధ ప్రాంతాలకు నడిపారు. అయితే ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి సమ్మెను ఉధృతం చేయాలని భావిస్తున్నారు. యూనియన్ కార్యాలయాల ముందు టెంట్లు వేసి వంట వార్పు వంటి నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. నర్సంపేట డిపో పరిధిలో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఆర్టీసీ యాజమాన్యంతోపాటు పోలీసులు అప్రమత్తమైనట్లు తెలిసింది ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేస్తాం ప్రభుత్వం ఆర్టీసీ నేతలతో తక్షణమే చర్చల జరిపి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో శుక్రవారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. గురువారం కొత్తగూడెం డిపో గేటు వద్ద కార్మికులు, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు అనేక ఏళ్లుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను సానుకూలంగా చర్చించి పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటు చేసి బస్సులను నడిపేందుకు ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కందుల భాస్కర్ రావు, వైఎన్రావు, పీఎన్ రావు, కర్నాటి నగేష్, భూక్య శ్రీనివాస్, రత్నకుమారి, అనిల్, కిరణ్, నజీర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
తాచుపాము పట్టివేత
కొత్తగూడెంఅర్బన్: ఇంట్లోకి దూరిన తాచుపామును స్నేక్ రెస్క్యూ స్పెషలిస్టు సంతోష్ గురువారం పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలివేశాడు. పాత కొత్తగూడెం తెలంగాణ పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న స్వచ్ఛ్ ట్రాలీ డ్రైవర్ చెల్ల రాము ఇంట్లోకి తాచుపాము రావడంతో వెంటనే ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్కు సమాచారం ఇచ్చారు. ట్రస్ట్ సభ్యులు శ్రీకాంత్ (చోటు), తుమ్మ శ్రీకాంత్తో వెళ్లి రాము ఇంట్లోని 5 అడుగుల తాచుపామును పట్టుకుని, పాముకు సంబంధించిన 18 గుడ్లు అటవీ ప్రాంతంలో వదివేశారు. -
గిరిజన మ్యూజియాన్ని సందర్శించిన ఉత్తర్ప్రదేశ్వాసులు
భద్రాచలం టౌన్: ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియాన్ని గురువారం ఉత్తరప్రదేశ్ పర్యాటకులు సందర్శించారు. గిరిజనుల జీవన విధానానికి సంబంధించిన, పురాతన వస్తువులు, కళాఖండాలు, పరికరాలను ఎంతో ముగ్ధులైనట్లు సుస్మిత యాదవ్ అనే పర్యాటకురాలు తెలిపారు. గిరిజన వరస్త్తధారణలో ఆకట్టుకున్నారు. డీఎస్ఓ ప్రభాకర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. పీఓకు సన్మానం భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ను గురువారం భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పీఓగా రాహుల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గిరిజనుల సంక్షేమం కోసం కృషిని గుర్తించి ఇటీవల ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివాసీ వికాస్ రత్న బిరుదును అందజేశారు. దీంతో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసన్, వైస్ ప్రెసిడెంట్ సున్నం రమేష్, కోశాధికారి రాము, న్యాయవాదులు ప్రసాద్, మంత్రి ప్రగడ గణపతి, పలివెల నరసింహారావు, పడిశిరి శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, రవి, నరసింహమూర్తి, సురేష్ కుమార్, నరేష్, రవితేజ, రామ్మోహన్రావు, సంధ్య, అంజలి పాల్గొన్నారు. -
2 ప్రాకారాలు.. 8 గోపురాలు
● ప్రధాన ఆలయానికి నాలుగువైపులా నిర్మాణం ● మార్కింగ్ చేసిన ఆర్అండ్బీ, ఆర్కిటెక్ట్ల బృందం ● 26న కళావాహన పూజలతో మూర్తుల తరలింపు ● భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులు వేగవంతం భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అభివృద్ధి పనులకు అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆర్అండ్బీ శాఖ అధికారులు ఆర్కిటెక్ట్ బృందంతో కలిసి మార్కింగ్ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లను ప్రకటించి, వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికి మొదటి విడత పనులు పూర్తిచేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. దీంతో తొలి విడతలోనే రూ.180 కోట్లతో ప్రధాన ఆలయం అభివృద్ధి పనులు చేపట్టారు. పనులు ఆర్అండ్బీ శాఖకు అప్పగించటంతో ఆర్కిటెక్ట్ బృందంతో కలిసి ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రాకారాలు, గోపురాల నిర్మాణం ఇలా.. దక్షిణం వైపు ప్రస్తుతం చిత్రకూట మండపం ఉన్న స్థలంలో సగంలోపు మొదటి ప్రాకార గోపురం, జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసిన పైకప్పు వరకు రెండో ప్రాకార గోపురం నిర్మించనున్నారు. తూర్పు వైపు ప్రస్తుతం ఉన్న మొదటి ప్రాకార గోపురం కాకుండా రెండో ప్రాకార గోపురం ఆంజనేయ స్వామి ఉపాలయం అవతల నుంచి రానుంది. పడమర వైపు ప్రస్తుతం ఉన్న ప్రాకార గోపురం కాకుండా రెండోది లడ్డూ కౌంటర్లను దాటుకుని వస్తుంది. ఉత్తరం వైపు ప్రస్తుతం ఉన్న ప్రాకార గోపురం కాకుండా రెండో గోపురం వైకుంఠ ఉత్తర ద్వారం వరకు నిర్మించనున్నారు. వీటికి మార్కింగ్ ఇచ్చిన అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రస్తుత ప్రాకారాల ఎత్తు పెంచి, కింది భాగంలో ఖాళీ స్థలాన్ని వివిధ మండపాలకు ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శుక్రవారం ప్రాకారాల ఏర్పాటు వద్ద మట్టి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపనున్నారు. 26న తరలింపునకు ముహూర్తం ఆలయ అభివృద్ధిలో కీలకమైన ఉపాలయాల్లోని మూలమూర్తుల తరలింపునకు ముహూర్తం ఖరారు చేశారు. 25న అంకురార్పణ జరపనుండగా, 26న కళావాహనం జరపనున్నారు. 26న ఉదయం 7.48 గంటలకు అంతరాలయంలోని మూలమూర్తుల పాదాల వద్ద అనుజ్ఞ తీసుకోనున్నారు. మూలమూర్తులను కలశాల్లోకి ఆవాహనం, ఇతర ప్రత్యేక పూజలు చేశాక, మూలమూర్తులను స్థపతులు తొలగించనున్నారు. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు, గోదాదేవి అమ్మవార్ల మూర్తులను అంతరాలయంలో ఏర్పాటు చేసిన పూజా మందిరంలో ఏర్పాటు చేయనున్నారు. ఇతర మూలమూర్తులను, ఆళ్వార్లను రంగనాయకుల గుట్టపై ఏర్పాటు చేసిన బాలాలయానికి తరలించి నిత్య పూజలు జరపనున్నారు. 26న జరిగే పూజలకు ధర్మపురి, యాదగిరి గుట్ట, సింహాచలం దేవస్థానాల నుంచి పండితులు డిప్యూటేషన్పై రానున్నారు. ఇక మరో 30 మంది రుత్విక్కులను ప్రత్యేక విధుల కోసం రప్పించనున్నారు. పూజల్లో చిన్నజీయర్ స్వామి పాల్గొననున్నారు. మే 1 నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసేలా ఆర్అండ్బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అంచనాలను సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, టెండర్లు ఆహ్వానించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆలయానికి ఉన్న ప్రాకారానికి తూర్పు, పడమర, ఉత్తరం వైపు ఒక్కో గోపురం ఉన్నాయి. తాజాగా ఆలయానికి రెండు ప్రాకారాలు, ఒక్కో వైపు రెండు గోపురాల చొప్పున నాలుగు వైపులా మొత్తం ఎనిమిది గోపురాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆలయం ప్రధాన భాగంలో ఒకటి, దానికి మరికొద్ది దూరంలో రెండో ప్రాకారం నిర్మించేలా గురువారం మార్కింగ్ ఇచ్చారు. -
పర్ణశాల వద్ద తగ్గుతున్న గోదావరి
● జిల్లా తాగునీటి అవసరాలు తీరుస్తున్న నది ● మరో 20 రోజులకే భరోసా దుమ్ముగూడెం: మండలంలో గోదావరి నిత్యం పరవళ్లు తొక్కుతూ ఉండేది. 15 రోజులుగా పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలతో గోదావరిలో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఏప్రిల్ చివరికే గోదావరి వట్టిపోతోంది. మే నెలలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద గోదావరిలో నీటి నిల్వలు తగ్గిపోయి రాళ్లు బయటకు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక కార్యాచరణ అవసరం కానుంది. నిత్యం 8.5 ఎంఎల్డీ వినియోగం పర్ణశాల మిషన్ భగీరథ ఇంటేక్ వాల్ నుంచి దుమ్ముగూడెం, చర్ల మండలాలకు ప్రతీ రోజు 8.5 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఇందు కోసం ప్రధాన గ్రామాల్లో అంతటా ఓవర్ హెడ్ ట్యాంక్లు నిర్మించడంతో పాటు ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. అయితే, ఇందుకు అవసరమైన రా వాటర్ను దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల గోదావరి నుంచి తీసుకుంటున్నారు. మిషన్ భగీరథకు ప్రతీ రోజు రెండు మండలాలకు 8.5 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలో ప్రవాహాలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగేలా ఉన్నాయి. తేలిన బండరాళ్లు కాటన్ ఆనకట్టకు ఎగువన ఉన్న లక్ష్మి, సమ్మక్క బరాజ్ నుంచి కనీస ప్రవాహాలే దిగువకు వదులుతున్నారు. దిగువకు వస్తున్న నీటికి, ఉపయోగిస్తున్న నీటికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో క్రమంగా గోదావరి ఎండిపోతోంది. నదిలో ఎడమ వైపు మిషన్ భగీరథ, హెవీవాటర్ ప్లాంట్ ఇన్టేక్ వెల్స్ దగ్గరగానే ప్రవాహాలు ఉన్నాయి. కుడివై పున ఉన్న పర్ణశాల వైపు నదిలో ఇసుక మేటలు వేయగా, నదీ గర్భంలోని బండలు బయటకు కనిపిస్తున్నాయి. 20 రోజులకే.. ప్రస్తుతం గోదావరిలో నీటి నిల్వల పరిస్థితి చూస్తుంటే మరో 20 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, మేనెలలో ఎండలు మరింతగా ముదిరితే నీటి ఆవిరి నష్టాలు పెరిగి గోదావరిలోని నీటి నిల్వలు వేగంగా తగ్గిపోయే అవకాశముంది. కాగా మండలంతో పాటు జిల్లాలో నీటి సమస్య రాకుండా అధికారులు పైనున్న లక్ష్మి, సమ్మక్క బరాజ్ నుంచి నీరు విడుదల చేయించడంతో పాటు వచ్చే ప్రవాహాలను జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. -
తిరిగి పుంజుకోకుండా..
దేశంలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపు అంతరించిపోయినా మరికొన్నాళ్లు యాంటీ నక్సల్స్ యాక్షన్ ప్లాన్ కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించింది. ఏయే జిల్లాల్లో ప్లాన్ అమల్లో ఉంటుందనే వివరాలను సైతం వెల్లడించింది. ఈ జాబితాలో జిల్లాతోపాటు పొరుగునే ఉన్న ములుగు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలు కూడా ఉన్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంజాబితాలో స్థానం మావోయిస్టుల ప్రభావం ప్రస్తుతానికి తగ్గిపోయినా.. తిరిగి పుంజుకోకుండా, మళ్లీ సాయుధ పోరాట పంథా అనుసరించకుండా మరికొన్నాళ్లు లా అండ్ ఆర్డర్ పరంగా చర్యలు తీసుకునే ప్రాంతాలను లెగసీ అండ్ థ్రస్ట్ టెరిటరీ కేటగిరీలో చేర్చారు. ఇందులో తెలంగాణ నుంచి భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ములుగు జిల్లా కూడా ఉంది. గతంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఉన్న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను జాబితా నుంచి తప్పించారు. ములుగు, భద్రాద్రి జిల్లాలకు సరిహద్దుగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఉంటుంది. ఈ మూడు జిల్లాల సరిహద్దులో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. తెలంగాణ సరిహద్దులో ఉన్న ఏపీలోని అల్లూరి సీతారామారాజు, పోలవరం జిల్లాలకు సైతం ఇదే జాబితాలో చోటు కల్పించింది. యాక్షన్ ప్లాన్–2015 కొనసాగింపు వామపక్ష తీవ్రవాద ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ – 2015 పేరిట కేంద్రం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాలను గుర్తించగా.. ఆయా జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించింది. భద్రతా కోణంలో నూతన రహదారులు, వంతెనలకు నిధులు మంజూరు చేసింది. దీంతోపాటు నక్సల్స్ ఆపరేషన్స్ కోసం ప్రత్యేక బడ్జెట్ అందుబాటులో ఉంచింది. ఈ నిధులతో పోలీస్శాఖ సరెండర్లను ప్రోత్సహించడతోపాటు నక్సల్స్ ప్రభావిత జిల్లాలో యువతకు క్రీడామైదానాలు, ఉపాధి అవకాశాలను కల్పించే పనులు చేపట్టింది. మావోయిస్టుల కార్యకలాపాలపై నిఘా వేసేందుకు ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. నక్సల్స్ విముక్త్ భారత్ అని ప్రకటించడంతో ఈ నిధులన్నీ ఆగిపోతాయనే సందేహాలు నెలకొన్నాయి. అయితే, నక్సల్స్ ప్రభావిత జిల్లాలు లేవని కేంద్రం ప్రకటించినా లెగసీ అండ్ థ్రస్ట్ టెరిటరీస్ పేరుతో కొత్త కేటగిరీ పెట్టింది. దీంతో జాబితాలో ఉన్న తెలంగాణలోని రెండు జిల్లాల్లో యాక్షన్ ప్లాన్–2015 అమలు కొనసాగనుంది. తగ్గుముఖం ఇలా మావోయిస్టు పార్టీ ఏర్పాటైనప్పుడు పదహారు రాష్ట్రాల్లో 156 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా ఉండేవి. 2018 నాటికి ఈ సంఖ్య 126కి పడిపోయింది. ఆ తర్వాత వరుసగా 2021లో 90 జిల్లాలకు 2024 నాటికి 38 జిల్లాలకు చేరింది. ఆపరేషన్ కగార్తో ఆ 38 జిల్లాల్లో కేవలం రెండు జిల్లాలో నామ్ కే వాస్తేగా ఆ పార్టీ మిగిలింది. మావోయిస్టు కార్యకలాపాలు అంతమైనా మరికొన్నాళ్లు యాక్షన్ ప్లాన్ సాయుధ పోరాట పంథాను అనుసరించే సీపీఐ(మావోయిస్టు) పార్టీ అనేది ముగిసిన అధ్యాయమని కేంద్రం హోంమంత్రి అమిత్షా మార్చి 27న పార్లమెంట్లో ప్రకటించారు. తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమంతోపాటు హింసాయుత పద్ధతులపై ఉక్కుపాదం మోపడంతో మావోయిస్టులు దేశంలో అంతరించిపోయారని పేర్కొన్నారు. ఆ తర్వాత తాజా పరిస్థితిపై కేంద్రం వివరాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా అత్యంత మావోయిస్టు ప్రభావిత జిల్లాలనేవి లేవని తెలిపింది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల కేటగిరీలో కేవలం బీజాపూర్(ఛత్తీస్గఢ్), వెస్ట్ సింగ్భూమ్ (జార్ఖండ్) మాత్రమే ఉన్నట్టు పేర్కొంది. గతేడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 38 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత జిల్లాల కేటగిరీలో ఉండేవి. ఇందులో బీజాపూర్, వెస్ట్ సింభూమ్ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన 36 జిల్లాలను లెగసీ అండ్ థ్రస్ట్ టెరిటరీస్(ఎల్టీటీ) పేరుతో ఏర్పాటు చేసిన నూతన కేటగిరీలో చేర్చారు. -
ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయింపు
● ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపణ ● కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు పాల్వంచ: ప్రేమ పేరుతో తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. టెంటు వేసి కుటుంబ సభ్యులతో కలిసి దీక్ష చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పట్టణంలోని బొల్లేరుగూడెం ఏరియాకు చెందిన రావూరి శ్రీరామ్ ఇంటి ముందు గురువారం ఓ యువతి తన కుటుంబ సభ్యులతో వచ్చి టెంటు వేసుకుని బైఠాయించింది. తాను, శ్రీరామ్ ఇద్దరం ఆరేళ్లుగా ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకోమని కొంతకాలంగా కోరుతున్నా పట్టించుకోకుండా దాట వేస్తుడని ఆరోపించింది. తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకున్నాడని వాపోయింది. ఈ క్రమంలో శ్రీరామ్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబ సభ్యులు తెలపారు. పారాసిటమోల్ మాత్రలు వేసుకుని మరో డ్రామాకు ఆడుతున్నాడని యువతి ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగరాజు అక్కడికి చేరుకుని వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. 21న జరగాల్సిన పెళ్లి కాగా, బొల్లేరుగూడెం ఏరియాకు చెందిన ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయంపై 20వ తేదీన పంచాయితీ జరిగింది. ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా, కుల పెద్ద మనుషులు, ఇరు కుటుంబాల సమక్షంలో ప్రేమిస్తున్న యువతిని 21వ తేదీన పెళ్లి చేసుకుంటానని శ్రీరామ్ ఒప్పుకుని లేఖ రాసి పెద్దమనుషులతో పాటు, ప్రతిని పోలీసులకు సమర్పించినట్లు తెలిసింది. అయితే పెళ్లి చేసుకోకుండా వాయిదా వేయడం, పట్టించుకోక పోవడంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపి వాయిదా వేస్తూ వచ్చినట్లు సమాచారం. పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు రాలేదని, ఆందోళన చేస్తున్న వారిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇస్తున్నామని, పూర్తి వివరాలు తర్వాత చెబుతామని తెలిపారు. -
సఫారీలో ట్రయల్ రన్
పాల్వంచరూరల్: అభయారణ్యంలో వన్యప్రాణులను పర్యాటకులు వీక్షించేందుకు వైల్డ్లైఫ్శాఖ సిద్ధం చేసిన సఫారీ వాహనంలో గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. జిల్లా అటవీశాఖాధికారి జి.కృష్ణాగౌడ్, ఎఫ్డీఓ బి.బాబు, రేంజర్ కవితమాధురి, సెక్షన్ ఆఫీసర్ కిషన్, బీట్ ఆఫీసర్ నాగేశ్వరరావు తదితరులు సఫారీలో తిరుగుతూ వీక్షించారు. అద్దాలమేడ వైపు మార్గంలోని వాచ్ టవర్ వరకు, మరో మార్గంలో మొండికట్ట వరకు సఫారీలో తిరిగారు. నాలుగు, ఐదు రోజుల్లో సఫారీని ప్రారంభిస్తామని డీఎఫ్ఓ తెలిపారు. అనంతరం డీర్ పార్కు సమీపంలో నిర్మిస్తున్న జింకల ఫీడింగ్ స్టోరేజీ గదులను పరిశీలించారు. -
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
● కుటుంబ కలహాలే కారణమని పోలీసులకు ఫిర్యాదు ● ఆర్టీసీ సమ్మె నేపథ్యాన ఆందోళన ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం రీజియన్లోని భద్రాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న గూడూరు లింగారెడ్డి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న తరుణాన ఆయన గడ్డి మందు తాగినట్లు తెలియగానే అధికారులు, కార్మికులు ఉలిక్కిపడ్డారు. లింగారెడ్డిని చికిత్స నిమిత్తం కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే.. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఖమ్మం డిపో వద్ద గురువారం జరిగిన నిరసనలో పాల్గొన్న లింగారెడ్డి సాయంత్రం 4 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ నాయుడుపేటలోని నివాసానికి వెళ్లాడు. ఇంటి బయటే ద్విచక్రవాహనం నిలిపి బండిలో ఉన్న గడ్డిమందు తీసి భార్య ముందే తాగాడు. దీంతో ఆయన భార్య జయమ్మ అడ్డుకుంటూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే టూటౌన్ పోలీసులు ఆస్పత్రికి వెళ్లి లింగారెడ్డి, ఆయన భార్య స్టేట్మెంట్ రికార్డు చేశారు. లింగారెడ్డి తన భార్య పెడుతున్న ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పాడని వెల్లడించారు. ఆయన భార్య జయమ్మ మాత్రం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెకు డబ్బులు ఇస్తుండడమే కాక.. ఇప్పుడు తన పేరు బద్నాం చేస్తున్నాడని ఆరోపించింది. కాగా, ఆస్పత్రికి ఆర్టీసీ ఆర్ఎం ఎ.సరిరామ్ చేరుకొని లింగారెడ్డితో మాట్లాడాక ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. అయితే, లింగారెడ్డి ఆత్మయత్యాయత్నం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కార్మికులు, నేతలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
భానుడి భగభగ
● జిల్లాలో 44 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు ● నేటి నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత చుంచుపల్లి: భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లాలో రోజురోజుకూ ఎండతీవ్రత పెరిగిపోతోంది. ఉదయం 10 గంటలు దాటితే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండవేడిమి తాళలేక జనం గడప దాటేందుకు భయపడుతున్నారు. వడగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం 5 గంటలు దాటినా ఎండతీవ్రత తగ్గడం లేదు. మధ్యాహ్న సమయంలో ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. 44 డిగ్రీలు దాటి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో అత్యధిక ఉష్ణోగ్రత 44.01 డిగ్రీలుగా నమోదైంది. ఇక శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ గురువారం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మరో వారం రోజుల పాటు ఎండలు నిప్పుల కొలిమిని తలపించేలా ఉండనున్నాయి. కొద్ది రోజులుగా ప్రజలు ఎండవేడిమిని తట్టుకోలేక మధ్యాహ్నంపూట పరిమితమవుతున్నారు. కూలర్లు, ఏసీలను అధికంగా వినియోగిస్తున్నారు. ఇటీవలకాలంలో విద్యుత్ వాడకం ఇళ్లలో విపరీతంగా పెరిగిపోయింది . శీతలపానీయాలు, కొబ్బరిబొండాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. కాగా, పలువురు ఎండ వేడిని తట్టుకోలేక వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్నారు. తేదీ గరిష్ట ప్రాంతం ఉష్ణోగ్రతలు 17 43.0 గరిమెళ్లపాడు 18 43.7 అశ్వాపురం 19 43.4 అశ్వాపురం 20 43.3 దుమ్ముగూడెం 21 43.5 సత్యనారాయణపురం 22 43.9 దుమ్ముగూడెం 23 44.1 ఏడూళ్లబయ్యారం -
మనమూ అవుదాం.. హీరో
భద్రాచలంఅర్బన్: జిల్లాలో నిత్యం ఎక్కడోచోట జరిగే రహదారి ప్రమాదాల్లో పలువురు మత్యువాత పడుతున్నారు. ప్రమాదం జరిగిన గంటలోపు అందించే సాయాన్ని గోల్డెన్ అవర్గా పరిగణిస్తారు. ఈ సమయంలో చికిత్స అందించ గలిగితే మరణాల శాతాన్ని సగానికి పైగా తగ్గించవచ్చనేది వైద్యుల అంచనా. కానీ, ప్రమాదాలు జరిగినపుడు అక్కడే ఉన్న చాలామంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తీసుకెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. పోలీస్ కేసుల భయమే ఇందుకు కారణం. ప్రజల్లో నెలకొన్న ఇలాంటి భయాన్ని పోగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించే వారిని రహ–వీర్ (రహదారి హీరో), గుడ్ సమారిటన్ పేరుతో ప్రోత్సహించడమే కాకుండా నజరానా, ప్రత్యేక గుర్తింపు ఇవ్వనుంది. ఏడాది వ్యవధిలో ఐదుసార్లు.. రోడ్డు ప్రమాదం జరిగిన గంటలోపే క్షతగాత్రులకు వైద్యం అందిస్తే వారి ప్రాణాలను రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కీలకమైన గోల్డెన్ అవర్లో బాధితులను ఆస్పత్రికి తరలించిన వ్యక్తులను కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్) రహ–వీర్ పురస్కారంతో సత్కరించనుంది. ఏడాది వ్యవధిలో ఐదుసార్లు ఈ నగదు పారితోషికాన్ని పొందవచ్చని రవాణా, పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏడాది కాలంలో ఎక్కువసార్లు అవార్డు పొందినవారిని గుర్తించి కేంద్ర మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తామని అధికారులు తెలిపారు. వారిలో 10 మందికి జాతీయ స్థాయిలో అవార్డు ప్రకటించి రూ.లక్ష నగదు పారితోషికంతోపాటు జాతీయస్థాయి ప్రశంసాపత్రాన్ని అందజేస్తారని పేర్కొన్నారు. ప్రజల్లో బాధ్యతారాహిత్యాన్ని తగ్గించి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే క్షతగాత్రులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని అధికారులు చెబుతున్నారు. నమోదు ఇలా.. బాధితులను ఆస్పత్రికి తరలించిన తర్వాత సదరు వైద్యుడి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం పోలీసులు విచారణ చేపట్టి అధికారిక లెటర్ ప్యాడ్లో రహ–వీర్ పేరు, మొబైల్ నంబర్, చిరునామా, ప్రమాదం జరిగిన ప్రదేశం, తేదీ, సమయం, బాధితులను కాపాడడంలో అతను ఎలా సహాయం చేశారనే వివరాలు నమోదు చేస్తారు. రశీదు కాపీని సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా అప్రూవల్ కమిటీకి పంపిస్తారు. అప్రూవల్ కమిటీలో జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, వైద్యాధికారి, రవాణాశాఖ అధికారి ఉంటారు. కమిటీ ఎంపిక చేసిన వ్యక్తులకు రహ–వీర్ అవార్డు మొత్తాన్ని రవాణాశాఖ ద్వారా వారి ఖాతాల్లోకి జమచేస్తారు. రూ.లక్షన్నర వరకు ఉచితవైద్యం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఏ ఆస్పత్రికి వెళ్లినా తక్షణమే వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఎలాంటి షరతులు, ముందస్తు చెల్లింపులు లేకుండా బాధితులకు రూ.1.50 లక్షల విలువైన వైద్యాన్ని ఆస్పత్రులు వెంటనే అందించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఆస్పత్రులకు చెల్లిస్తుంది. ఈ విధానంతో ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా నిరుపేదలకూ వైద్యసాయం అందుతుంది. రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారిని ఎవరైనా మానవతా దృక్పథంతో ఆస్పత్రికి తీసుకువెళ్లి సాయం అందిస్తే వారిని పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది వేధించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడిన వ్యక్తికి చట్టపరమైన రక్షణ కల్పిస్తోంది. పోలీసుల వేధింపుల భయం లేకుండా ‘రహ–వీర్’ సేవలందించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. క్షతగ్రాతులను ‘గోల్డెన్ అవర్’లో తరలిస్తే రూ.లక్ష వరకు నజరానా -
గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం
మణుగూరు టౌన్: విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా రు. లంకమల్లారం గ్రామంలోని టీటీఆర్జేసీ బాలి కల పాఠశాలకు ప్రధానరహదారి నుంచి కోటి రూ పాయలతో నిర్మించే అప్రోచ్ రహదారికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల డార్మెటరీ హాల్ను ప్రారంభించారు. తోగ్గూడెంలో రైల్వేస్టేషన్ సమీపంలో రెడ్డీస్ కల్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల రూ.2.70 కోట్లతో బాలి కల వసతి గృహాన్ని ప్రారంభించామని, రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వాస్పత్రులను మెరుగుపర్చుతున్నామని అన్నారు. అనంతరం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినందుకు ప్రిన్సిపాల్, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమాల్లో పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్రాజు, సర్పంచ్ పూనెం రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ రాణి పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
శ్రీరామస్మరణతో గిరిప్రదక్షిణ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం మాలధారులు శ్రీరామ పునర్వసు దీక్ష విరమించారు. భద్రగిరి మాఢ వీధులు మాలధారుల శ్రీరామనామస్మరణతో మార్మోగాయి. తొలుత ఆలయ ఏఈఓ శ్రావణ్ కుమార్ శ్రీరామ పాదుకలను శిరస్సుపై ధరించారు. రామపాదుకలతో ఊరేగింపుగా మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ జరిపారు. శ్రీరామదాసు విగ్రహానికి పూలమాలలను అలంకరించారు. అనంతరం బేడా మండపంలో శ్రీరామ దీక్షా విరమణ పూజలు, సంక్షిప్త రామాయణ హవనం జరిపారు. ఉపాలయంలో మాలధారణ విరమించాక యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి వేళ స్వామివారికి రథసేవ నిర్వహించారు. బేడా మండపంలో శ్రీ సీతారాముల నిత్యకల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఎస్పీ రోహిత్ రాజు, ఈఓ దామోదర్రావు ఆలయ అర్చకులు, పండితులు రామదాసు వారసులు కంచర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు జరిపారు. ఆలయ ఈఓ రజనీకుమారి, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవుకలెక్టర్ అంకిత్ హెచ్చరిక కరకగూడెం/పినపాక: ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. గురువారం పినపాక, కరకగూడెం మండలాల్లో పర్యటించిన ఆయన ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత పినపాక మండలంలోని ఈ.బయ్యారం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ పౌరసరఫరాల శాఖ డీటీ శివ కుమార్ అందుబాటులో లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపాలరావు పేటలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించి, నాణ్యత పాటించాలని ఆదేశించారు. అనంతరం కరకగూడెం, భట్టుపల్లి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారురు. సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, మైనింగ్ ఏడీ దినేష్ కుమార్, ఏడీఏ తాతారావు, తహసీల్దార్ వట్టం కాంతయ్య, ఎంపీడీఓలు వెంకటేశ్వరరావు, కుమార్, ఎంఈఓలు నాగయ్య, మంజుల, ఏఓలు చటర్జీ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జాతీస్థాయిలో రెండోస్థానంబీచ్వాలీబాల్ పోటీల్లో రాణించిన రాష్ట్ర జట్టు పాల్వంచరూరల్: గోవా రాష్ట్రంలోని పనాజీలో జరుగుతున్న జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలు గురువారం రాత్రి ముగిశాయి. తెలంగాణ జట్టు సెమీఫైనల్స్ల్లో గుజరాత్ జట్టును ఓడించి ఫైనల్కు చేరింది. ఫైనల్ మ్యాచ్లో తమిళనాడు జట్టుతో తలపడి పోరాడి ఓడింది. జాతీయస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. జట్టులో క్రీడాకారులు జి.విష్ణువర్ధన్(పాల్వంచ జూనియర్ కళాశాల), రిషి వర్మ (కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్), కార్తీక్ (సిద్దిపేట) రాణించినట్లు కోచ్ వెంకటరమణ తెలిపారు. -
కర్రెగుట్టల్లో రయ్.. రయ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రెండేళ్ల క్రితం వరకూ మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఉన్నాయి. అయితే ఈ రెండు జిల్లాల సరిహద్దులో విస్తరించిన కర్రె గుట్టల వద్ద చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్తో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మావోయిస్టులు పూర్తి ఆత్మరక్షణలోకి వెళ్లిపోయారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా పోయింది. అయితే, భవిష్యత్లోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా కర్రె గుట్టల దగ్గర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులో తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రె గుట్టలే కేంద్రంగా మావోయిస్టులు ఆయుధ తయారీ కేంద్రం, ఆయుధ నిల్వాగారం, ఆస్పత్రి, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆపరేషన్ కగార్ పతాక స్థాయికి చేరాక గాయపడిన కేడర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుల వరకు ఇక్కడి రక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో మావోయిస్టులను తుదుమట్టించే లక్ష్యంతో గతేడాది ఏప్రిల్ 21న 5వేల మందికి పైగా బలగాలు, మూడు హెలికాప్టర్లతో కర్రెగుట్టల గాలింపు చర్యలను ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరిట కేంద్రం చేపట్టింది. 21 రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులు చనిపోగా, ఇక్కడ ఆశ్రయం పొందుతున్న మరో 700 మంది మావోలు ఈ ప్రాంతాన్ని వీడి వెళ్లక తప్పలేదు. ఆపై శిక్షణ కేంద్రాలు, ఆయుధ నిల్వలను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. క్యాంపులతో కట్టడి ఎత్తయిన కొండలు, ఎక్కడిక్కడ జలపాతాలు, లోయలు వంటి సహజ వనరులు కర్రె గుట్టల ప్రాంతంలో మెండు. ఇక్కడ జనసంచారం తక్కువ కావడంతో ఈ గుట్టలను సైనిక దుర్గంగా మావోయిస్టులు మార్చుకున్నారు. ఐదు వేల అడుగుల ఎత్తులో 50 కి.మీ పొడవు, 15 కి.మీ వెడల్పుతో రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ గుట్టలను ఖాళీగా వదిలేస్తే భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయని నిఘా వర్గాలు అంచనాకు వచ్చాయి. దీంతో ఏడాది కాలంగా కర్రె గుట్టల చుట్టూ తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఛత్తీస్గఢ్లో బీజాపూర్ వైపు కొత్త క్యాంపుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేశారు. జనసంచారం పెంచేలా భౌగోళికంగా కర్రె గుట్టలకు తెలంగాణ వైపు ములుగు జిల్లా, ఛత్తీస్గఢ్ వైపు బీజాపూర్ జిల్లా ఉంటుంది. ఈ రెండు జిల్లాల మధ్య ఎత్తయిన కర్రె గుట్టలు ఉండడంతో బీజాపూర్ జిల్లాలోని పూజారి కాంకేర్, గుంజపర్తి, పెద్ద ఊట్ల, కస్తూరిపాడు తదితర గ్రామాల ప్రజలు దూరమైనా, తమ అవసరాల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అందుకే ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం మండలాల కంటే కూడా చర్లపై మావోయిస్టులు ఎక్కువ ప్రభావం చూపించగలిగారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జన సంచారం పెంచే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. 32 కి.మీ రోడ్డు బీజాపూర్ జిల్లాలోని నంబీ నుంచి తెలంగాణలోని వాజేడు మండలం మురుమూరు వరకు కర్రె గుట్టల మీదుగా 32 కి.మీ. మేర రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే మురుమూరు నుంచి పామునూరు వరకు 14 కి.మీ మేరకు ఘాట్లో మట్టి రోడ్డు నిర్మించారు. వేసవి ముగిసేలోగా దీన్ని తారు రోడ్డుగా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా వాజేడు వైపు నుంచి కర్రె గుట్టల మీదకు సులువుగా వాహనాల్లో చేరుకోవడం సాధ్యమవుతుంది. వానాకాలం ముగిశాక పామునూరు నుంచి కర్రె గుట్టల మీదుగా ఛత్తీస్గఢ్ వైపు దిగుతూ నంబి–పూజారికాంకేర్ రోడ్డును తాకేలా మరో 18 కి.మీ రోడ్డు అందుబాటులోకి తెస్తారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక ఎకో టూరిజం అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా ఉంది. కర్రె గుట్టల్లో రోడ్డు నిర్మాణం జరిగితే చర్ల, దుమ్ముగూడెం మండలాలు పూర్తి స్థాయిలో మావోయిస్టు ప్రభావం నుంచి బయటపడతాయి. -
రామయ్యకు స్నపన తిరుమంజనం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి బుధవారం స్నపన తిరుమంజనం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.26న ‘కళావాహన’భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో ఈ నెల 26న ఆలయంలో కళావాహన కార్యక్రమం నిర్వహించనునున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనుల కారణంగా చుట్టుగుళ్లలోని దేవతామూర్తులను రంగనాయకులగుట్టపై ఉన్న రామదాసు ధ్యాన మందిరానికి, ఆండాళ్, లక్ష్మీతాయారు అమ్మవార్లను ప్రధాన ఆలయ ముఖమండపానికి తరలించి ప్రతిష్ఠించనున్నారు. ఈ క్రమంలో 26న మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనాలను నిలిపివేయనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ మేరకు ఈఓ కె. దామోదర్ రావు బుధవారం వివరాలు వెల్లడించారు. గుబ్బల మంగమ్మ ఆలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ అశ్వారావుపేటరూరల్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సరిహద్దు అశ్వారావుపేట మండలంలోని గోగులపూడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వేణుగోపాల్ సందర్శించారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తాటి కృష్ణ, జీపీఓ వెంకటేశ్వర్లు, వీఆర్ఏలు విజయ్, రాము పాల్గొన్నారు. -
అభివృద్ధి ఫలాలు త్వరగా అందాలి
● మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి ● రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర రావుఖమ్మంసహకారనగర్: అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో వివిధ అంశాలపై బుధవారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వరి ధా న్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ఆటంకాలు రాకుండా ఏర్పాటుచేయాలని తెలిపారు. అలాగే, జూన్ మొదటి వారంకల్లా ఖమ్మం బైపాస్ నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తిచేయాలని చెప్పారు. అంతేకాకుండా 20ఎకరాల్లో ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం, క్రీడాకారుల వసతి గృహాలు, కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి రూ.92 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కాగా, వెలుగుమట్ల అర్బన్ పార్క్కు వెళ్లే మార్గంలో డివైడర్ అధిక స్థలం ఆక్రమించినందున, భవిష్యత్లో మార్పు చేయాలని పేర్కొన్న మంత్రి... ధంసలాపురం ఎస్టీపీ స్థలం అప్పగింత, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైప్లైన్ పనులు, రోప్ వే నిర్మాణంలో వేగంపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో 2.17 లక్షల టన్నుల మొక్కజొన్నల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 39 వేల టన్నులు సేకరించామని తెలిపారు. అలాగే, వరి ధాన్యం కొనుగోళ్లకు 240 కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో కేఎంసీ కమీషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాళ్లు పట్టుకుని ఒప్పించే వాడిని కదా? సత్తుపల్లి: ‘ఏడాది నుంచి పట్టించుకోకుండా భూసేకరణ సమస్య ఉందని ఇప్పుడు చెబుతారా.. ముందే చెబితే నేనే కాళ్లు పట్టుకునైనా ఒప్పించేవాడిని కదా.. నిధులు ఇచ్చినా అధికారులు చేసిన తప్పుకు పనులు ఆగితే ఎలా?’ అంటూ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. అన్నపురెడ్డిపల్లి, సత్తుపల్లి మండలాల్లో సీతారామ కాలువ, యాతాలకుంట టన్నెల్ పనులను భద్రాద్రి, ఖమ్మం కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, అంకిత్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం యాతాలకుంటలో అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. రూ.700 కోట్లతో చేపట్టిన సత్తుపల్లి ట్రంక్ పనుల్లో కేవలం 50మీటర్లు పరిహారం చెల్లింపులో పొరబాటు కారణంగా ఆగడానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. పరిహారం చెల్లింపులో పేరు మారడం వల్ల ఇబ్బంది ఎదురైందని అధికారులు చెప్పగా.. ఎవరికై నా చెప్పారా అని నిలదీశారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్ను ఆదేశించారు. ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటూ కాలం వెళ్లదీస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఏదిఏమైనా వచ్చే వర్షాకాలానికి సత్తుపల్లి ట్రంక్ పనులు, యాతాలకుంట టన్నెల్ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి తుమ్మల తెలిపారు. సత్తుపల్లి ట్రంక్ పూర్తయితే సత్తుపల్లి, వేంసూరు, దమ్మపేట మండలాలకు గోదావరి జలాలు వస్తాయన్నారు. కాల్వ మట్టి కొన్ని చోట్ల కుంగి పడిపోతుందని.. దీన్ని పరిగణనలోకి తీసుకుని నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని తెలిపారు. కల్లూరు సబ్కలెక్టర్ అజయ్యాదవ్, సీతారామ ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, కృష్ణ, ఎం.డీ.రెహానాబేగం, బొంతు సుమలత, దోమ ఆనంద్బాబు, మట్టా దయానంద్, చల్లగుళ్ల నర్సింహారావు, చెన్నారావు పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో నిందితుడు అరెస్ట్
సూపర్బజార్(కొత్తగూడెం): ధన్బాద్ పోచమ్మ గుడిలో ఈ నెల 20న అర్ధరాత్రి జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. గుడిలోని హుండీని పగులగొట్టి అందులోని రూ.300, అమ్మవారి త్రిశూలం చోరీపై.. అదేరోజు అర్ధరాత్రి రామవరం వనందాసు గడ్డలో భూక్య లావణ్య కిరాణా షాపులో మద్యం బాటిళ్లు, రూ.4,000 చోరీకి సంబంధించి కేసులు నమోదు చేశామని తెలిపారు. కాగా, టూటౌన్ సీఐ ప్రతాప్ బుధవారం సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన మర్రిగూడెం గ్రామానికి చెందిన మడివి భద్రయ్యను పట్టుకుని విచారించారు. రెండు చోరీలకు అతడే పాల్పడ్డాడని, అతడి వద్ద మద్యం బాటిళ్లు, రూ.300 నగదు రికవరీ చేశామని డీఎస్పీ వివరించారు. నిందితుడు మడివి భద్రయ్యను రిమాండ్కు తరలించామని వివరించారు. సమావేశంలో సీఐ ప్రతాప్, ఎస్ఐ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు. -
సెమీ ఫైనల్స్కు తెలంగాణ జట్టు
సూపర్బజార్(కొత్తగూడెం)/పాల్వంచరూరల్: జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో ఎస్జీఎఫ్ఐ తెలంగాణ బాలుర జట్టు రాణిస్తోంది. గోవా రాష్ట్రంలోని పనాజీలో పోటీలు నిర్వహిస్తుండగా, తెలంగాణ జట్టు సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. బుధవారం పంజాబ్ జట్టుపై 2–0 స్కోర్తో విజయం సాధించింది. జట్టులో పాల్వంచ ప్రభుత్వ జూనియ ర్ కళాశాల విద్యార్థి ఎ.విష్ణువర్థన్, కిన్నెరసాని క్రీడా పాఠశాల 9వ తరగతి విద్యార్థి రిషివర్మ, సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఆర్ఆర్ఆర్ కాలనీ జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థి బి.కార్తీక్ ప్రతిభ చూపుతున్నారు. కాగా జట్టుకు కె.వెంకటనారాయణ, కె.రామానందం, వై.రామారావు కోచ్లుగా వ్యవహరిస్తున్నారు.జాతీస్థాయి పోటీల్లో రాణిస్తున్న బీచ్ వాలీబాల్ బాలుర టీమ్ -
ఎదురుతిరిగిన ఇసుక స్మగ్లర్లు..
సత్తుపల్లిరూరల్: ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసేందుకు వెళ్లిన సత్తుపల్లి ఎస్ఐ అశోక్కుమార్కు స్మగ్లర్లు ఎదురుతిరిగినట్లు సమాచారం. దీంతో మంగళవారం రాత్రి అదనపు బలగాలను పంపించి టిప్పర్ను సత్తుపల్లి పోలీసుస్టేషన్కు తరలించారు. ఏపీలోని కొవ్వూరు నుంచి చింతలపూడి మండలం మేడిశెట్టివారిపాలెం తీసుకెళ్తున్నట్లు అనుమతి తీసుకుని సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెంకు టిప్పర్లో ఇసుక తరలిస్తుండగా, పోలీసుల తనిఖీలో పట్టుబడింది. అందులోని స్మగ్లర్లు కొందరు యువకులను రెచ్చగొట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ క్రమాన సత్తుపల్లి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద ఎస్ఐ అశోక్కుమార్ ఆధ్వర్యాన చేపట్టిన తనిఖీల్లో బేతుపల్లికి చెందిన గద్దల శ్రీను, గద్దల శివ ఇసుక టిప్పర్కు కారులో ఎస్కార్ట్గా వస్తున్నట్లు గుర్తించారు. వీరిలో గద్దల శివ పట్టుబడగా, శ్రీను పరారయ్యాడు. ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు ఒప్పుకోవడమే కాక ఏపీ సరిహద్దు సీతానగరం వద్ద పోలీసు తనిఖీల సమాచారాన్ని గంగారం గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ కువ్వారపు నాగేంద్రబాబుకు చేరవేసినట్లు శివ అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.ప్రదీప్ వెల్లడించారు.ఏపీలోని గ్రామం పేరిట అనుమతి, సత్తుపల్లికి తరలింపు -
తొలిరోజు సమ్మె సక్సెస్
చుంచుపల్లి: న్యాయమైన డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు బుధవారం తెల్లవారుజాము నుంచి సమ్మెకు దిగారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. మొదటిరోజు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగింది. అధికారులు ఔట్సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేటు బస్సుల కార్మికులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ఫలితం కనిపించలేదు. ఆర్టీసీ సమ్మె సమాచారం లేక బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది. బస్సులు నిలిచిపోవడంతో గంటల కొద్దీ వేచి చేశారు. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలంతో పాటు ఆంధ్రరాష్ట్రం వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో పలువురు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. తొలి రోజు ఆర్టీసీకి భారీ నష్టం సమ్మె కారణంగా బుధవారం జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లింది. భద్రాచలంలో 27 సర్వీసులు, కొత్తగూడెంలో 31 సర్వీసులు, ఇల్లెందులో ఆరు, మణుగూరులో ఒకటి చొప్పున.. మొత్తం 65 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. ఉదయం నుంచి డిపో గేట్ల వద్ద బస్సులు బయటకు రాకుండా ఆర్టీసీ జేఏసీ నాయకులు అడ్డుకోవడంతో అధికారులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత పలువురు నాయకులు, కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించడంతోపాటు బస్టాండ్లు, డిపోల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అధికారులు కొద్ది సర్వీసులను మాత్రం తిప్పగలిగారు. భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు నాలుగు డిపోల పరిధిలో మహాలక్ష్మి టికెట్లతో కలిపి నిత్యం రూ. 60 లక్షల నుంచి రూ. 65 లక్షల వరకు ఆదాయం వస్తోంది. సమ్మె నేపథ్యంలో కండక్టర్లు అందుబాటులో లేకపోవడంతో తిప్పిన కొన్ని సర్వీసుల్లో పురుషులకు సైతం ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. దీంతో ఆర్టీసీ పూర్తి ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. జిల్లావ్యాప్తంగా నాలుగు డిపోల పరిధిలో 879 మంది కార్మికులు తొలిరోజు విధులు బహిష్కరించారు. మొదటి రోజు సమ్మె విజయవంతం కావడంతో ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక సిబ్బందిని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కండక్టర్కు రోజుకు రూ. 800, డ్రైవర్కు రూ.1000 చొప్పున చెల్లిస్తూ గురువారం నుంచి నియామకం చేపట్టనుంది. ప్రభుత్వం మొండివైఖరి వీడి ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లను పరిష్కరించాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. బుధవారం కొత్తగూడెం ఆర్టీసీ బస్ డిపో గేటు వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతియుతంగా సమ్మెకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తి లేదని, గురువారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు కందుల భాస్కర్ రావు, సలిగంటి శ్రీనివాస్, జమలయ్య, కర్నాటి నగేష్, భూక్య శ్రీనివాస్, రత్నకుమారి, సింగ్, అనిల్, కిరణ్, నజీర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.మాకు ఆర్టీసీలో సమ్మె తెలియదు. సత్తుపల్లి వెళ్లాలని కుటుంబ సభ్యులతో వచ్చాం. గంట నుంచి బస్సుల కోసం అవస్థలు పడుతున్నాం. ఎలా ఇంటికి వెళ్లాలో తెలియడం లేదు. అధికారులు కూడా ఏమీ చెప్పడం లేదు. –వెంకటమ్మ, ప్రయాణికురాలునేను విజయవాడ వెళ్లేందుకు ఉదయం 9 గంటలకు బస్టాండ్కు వచ్చాను. రెండు గంటలపాటు ఎదురుచూశాను. బస్సులు రాలేదు. మరికొద్ది చూపు చూసి ప్రైవేటు వాహనాలు ఉంటే వెళ్తా, లేకపోతే ఇంటిదారి పడతాను. –ఎస్.ఆదినారాయణ, ప్రయాణికుడు -
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యాన కొనసాగుతున్న ప్రత్యేక గిరిజన డీఎల్ఎడ్ కళాశాలలో ప్రవేశాల (2026–28 విద్యాసంవత్సరం)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ బి.రాహుల్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థుల కోసం ఉద్దేశించిన రెగ్యులర్ కోర్సులో మొత్తం 50 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్లో కనీసం 45 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని, మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ఉంటుందని వివరించారు. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏ కార్యాలయాల్లో లభించే దరఖాస్తులు తీసుకుని, మే 11వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు 99595 75539, 86390 84543, 83099 72776 నంబర్లను సంప్రదించాలని పీఓ వివరించారు. టీయూవీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నర్సయ్య సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా శ్రావణబోయిన నర్సయ్యను బుధవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీయూవీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ.. నర్సయ్య 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, 1969 తెలంగాణ ఉద్యమ పోరాట సమితి స్థాపించి ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్, ఇంటి స్థలం, ఉచిత వైద్యం, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని పోరాటాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆస్పత్రిలో ‘కాయకల్ప’ పరిశీలనఅశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని బుధవారం కేంద్ర ప్రభుత్వ కాయకల్ప అవార్డు బృందం సందర్శించింది. డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జ్యోత్స్న ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి తెలుసుకున్నారు. ల్యాబ్స్, మందులు, స్కానింగ్, డయాలసిస్, వ్యాక్సినేషన్, పోస్టుమార్టం, శానిటేషన్ విభాగాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, మెడికల్ సూపరిటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రెండు లారీలు ఢీ మణుగూరుటౌన్: మండలంలోని 100 పడకల ఆస్పత్రి సమీపంలో రెండు లారీలు ఢీకొన్న ఘటన బుధవారం రాత్రిచోటుచేసుకుంది. ఇద్దరు గాయపడగా, ప్రాణాపాయం తప్పింది. లోడ్తో కొత్తగూడెం వైపు వెళ్తున్న టిప్పర్ను, అదే దిశగా వెళ్తున్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లారీ ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్, టిప్పర్ క్లీనర్కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 100 పడకల ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు అశ్వాపురం: మండలంలోని గోపాలపురం వద్ద మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన ప్రైవేట్ బస్సుడ్రైవర్ గాదెనబోయిన మహేశ్ బైక్పై మణుగూరు నుంచి వస్తుండగా గోపాలపురం వద్ద మణుగూరు వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మహేశ్ను 108 వాహనంలో మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఊపందుకోని ధాన్యం కొనుగోళ్లు
● కేంద్రాల్లో మండుటెండలో పడిగాపులు కాస్తున్న రైతులు ● విధిలేక తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయం బూర్గంపాడు: యాసంగి ధాన్యం విక్రయించుకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లాలో నెలరోజులుగా ధాన్యం చేతికివస్తున్నా కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకోలేదు. ఈ సీజన్లో 83,650 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 168 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఇటీవల ప్రారంభించింది. అయితే కొనుగోళ్లు వేగవంతం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 20 రోజుల నుంచి రైతులు ధాన్యం ఆరబెట్టి ఎదురుచూస్తున్నారు. మండుటెండల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వాతావరణ మార్పులతో మబ్బులు పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. బుధవారం సాయంత్రం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురియగా, రైతులు ఉరుకులు, పరుగులతో పట్టాలు కప్పుకుని ధాన్యం కాపాడుకున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2,389 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు రూ.1500కే కొంటున్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో రాశులు పేరుకుపోతున్నాయి. మిగతా రైతులకు ధాన్యం ఆరబెట్టుకునేందుకు స్థలం కూడా ఉండటం లేదు. ఈ వెతలన్నీ పడలేక రైతులు ప్రైవేటు వ్యాపారులకు, మిల్లర్లకు తక్కువ ధరకే విక్రయించుకుంటున్నారు. కాగా ప్రభుత్వ కేంద్రాల్లో నాలుగైదు లారీల ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించగా, నాణ్యత లేదంటూ తీసుకునేందుకు మిల్లర్లు విముఖత చూపినట్లు తెలుస్తోంది. -
నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
టేకులపల్లి: అభివృద్ధి పనులు త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని మొక్కంపాడు నుంచి పూబెల్లి వరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.8.75 కోట్లతో నిర్మించే బీటీ రహదారి, మొక్కంపాడు వద్ద హైలెవెల్ బ్రిడ్జి, మద్రాస్ తండా నుంచి మేళ్లమడుగు వరకు రూ.6.80 కోట్లతో నిర్మించే బీటీ రహదారి నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. కోయగూడెం పంచాయతీలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు. ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ రాహుల్, అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, డీఎస్పీ వెంకన్నబాబు, సర్పంచ్లు బాణోతు నరేష్, మాలోతు గంగ్లీ, కోరం సుభాష్, ఎంపీడీవో బైరు మల్లేశ్వరి, తహసీల్దార్ వీరభద్రం, సీఐలు బత్తుల సత్యనారాయణ, టి.సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
204 క్వింటాళ్ల రేషన్బియ్యం స్వాధీనం
ఖమ్మంఅర్బన్: హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ టాస్క్ఫోర్స్ బృందం ఓఎస్డీ అంజయ్య నేతృత్వాన జి ల్లాలో మంగళ, బుధవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. 204క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. తల్లాడ మండలం పాతమిట్టపల్లిలో 48 క్వింటాళ్లు, ఖ మ్మం పార్శీబంధంలోని ఖాదర్ ఇంట్లో 63 క్వింటాళ్లు, అదే ప్రాంతానికి చెందిన షబానా ఇంట్లో మరో 26 క్వింటాళ్లే కాక గోపాలపురానికి చెందిన శ్రీనివాస్ ఇంట్లో 67 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా, వీరంతా ఎర్ర ప్రసాద్, రాము, జగదీశ్కు బియ్యం అమ్ముతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఏఎస్ఐ వెంకటకృష్ణ, తహసీల్దార్ పాల్గొన్నారు. -
అడవిలోకి దూసుకెళ్లడమే..!
పాల్వంచరూరల్: పర్యాటకులు ఇక అడవిలోకి దూసుకెళ్లొచ్చు. బుధవారం పాల్వంచ వైల్డ్లైఫ్ డివిజన్ కార్యాలయానికి సఫారీ వాహనాలు చేరుకున్నాయి. వారం రోజుల్లో అవి అభయారణ్యంలో తిరగనున్నాయి. పర్యాటకులకు జంతువులతోపాటు సహజసిద్ధమైన అడవిని వీక్షించే అవకాశం ఉంది. రాష్ట్రంలో అమ్రాబాద్, కల్వాల్, గడ్పూర్లో ఏర్పాటు చేసిన మాదిరిగా సఫారీతోపాటు జలాశయంలో ప్రత్యేక బోటు సౌకర్యాన్ని కిన్నెరసాని అభయారణ్యంలో ఏర్పాటు చేయాలని గతేడాది కార్యాచరణ రూపొందించారు. అయితే సఫారీ వాహనాల తయారీలో జాప్యం జరిగింది. తొలుత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పులిగుండాల పరిధిలోని అటవీ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అడవిని సంరక్షిస్తూనే స్థానిక గిరిజనులకు ఉపాధి, లబ్ధి చేకూర్చేలా ఎకో టూరిజం ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఇటీవల ఆదేశించారు. వన సంవరక్షణ సమితుల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఒక సమితిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, రూ.20 లక్షలు ప్రకటించారు. ఇటీవల పులిగుండాల విహారయాత్ర కోసం రెండు సఫారీ వాహనాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ములుగు జిల్లాలో కొత్తగా పర్యాటకులను ఆకర్షించేందుకు సఫారీ వాహనాలు ఏర్పాటు చేయగా, మంత్రి సీతక్క ప్రారంభించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే.. కిన్నెరసాని డీర్ పార్కు నుంచి పది కిలోమీటర్ల దూరంలో గల బేస్క్యాంప్ గుట్టవరకు సఫారీ ద్వారా అభయారణ్యం అందాలు, వన్యప్రాణులను తిలకించేవిధంగా ప్రణాళిక రూపొందించారు. అందుకోసం రూ.45 లక్షలు వ్యయం చేసి పదిమంది కూర్చునేలా మూడు సఫారీ వాహనాలను వైల్డ్లైఫ్ శాఖ కొనుగోలు చేసింది. ఈ వాహనాల్లో ఇంకొన్ని మార్పులు చేయాల్సి ఉంది. కిన్నెరసాని డీర్ పార్కు వద్ద నుంచి సఫారీ వాహనాలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సఫారీలో ప్రయాణించే వారికి ముందుగా రూ.200 లోపు టికెట్ నిర్ణయించాలనుకుంటున్నాం. డీర్ పార్కు నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మొండికట్ట వాచ్టవర్ వరకు, మరో వాహనం డీర్పార్కు నుంచి కాటేజీలు, అద్దాల మేడ వరకు ముందుగా తిప్పుతాం. –జి.కృష్ణాగౌడ్, జిల్లా అటవీ శాఖాధికారి జీవవైవిధ్యం, కనుచూపు మేర విస్తరించిన అడవి, కొండలు, కోనలు, పచ్చని చెట్లు, జలాశయం, వన్యప్రాణులకు నిలయమైన కిన్నెరసానిలో సఫారీ వాహనాల ఏర్పాటుపై హర్షం వ్యక్తమవుతోంది. కాగా, కిన్నెరసానిలో తొమ్మిది కాటేజీలు, అద్దాల మేడ పనులు పూర్తి చేశారు. వాటిని ఇంతవరకు ప్రారంభించలేదు. -
గోదావరి జలాలు వచ్చేనా..?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాళేశ్వరం ప్రాజెక్ట్లో కూలిన మేడిగడ్డ బరాజ్ మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాణహిత ఎత్తిపోతల విషయంలోనూ కదలిక వచ్చింది. కానీ రాజీవ్ ఆయకట్టుకు నీరు అందించే విషయంపై ఎలాంటి పురోగతి లేకపోవడం జిల్లా వాసులను నిరాశకు గురిచేస్తోంది. రాజీవ్సాగర్ టు సీతారామ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో రాజీవ్సాగర్, ఇందిర సాగర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రాజీవ్సాగర్ కింద కొత్తగూడెం, ఇల్లెందు, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకర్గాల పరిధిలో రెండు లక్షల కొత్త ఆయకట్టు రావాల్సి ఉంది. అలాగే, ఇందిరారసాగర్ కింద అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకర్గాల పరిధిలో కొత్తగా రెండు లక్షల ఎకరాల ఆయకట్టు రావాలి. తద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పది అసెంబ్లీ నియోజకర్గాల రైతులకు కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చేవి. అయితే రాష్ట్ర విభజనతో ఇందిరాసాగర్ ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం ఏపీలోకి వెళ్లింది. దీంతో తెలంగాణ ఏర్పడ్డాక రాజీవ్సాగర్, ఇందిరసాగర్ ప్రాజెక్టులకు ఒక్కటిగా చేస్తూ సీతారామ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. పదేళ్ల క్రితం మొదలు టేకులపల్లి మండలం రోళ్లపాడు దగ్గర సీతారామ ప్రాజెక్ట్ పనులకు 2016 ఫిబ్రవరిలో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రోళ్లపాడు ప్రాంతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతం కావడంతో ఇక్కడ 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని ప్రతిపాదించారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర గోదావరిపై సీతమ్మ సాగర్ బరాజ్ను నిర్మించాలి. అక్కడి నుంచి కిన్నెరసాని మీదుగా రోళ్లపాడు వరకు గోదావరి నీటిని ఎత్తిపోయాలి. ఆపై గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని కొత్తగూడెం, ఇల్లెందు, మహబూబాబాద్, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలకు తరలించాలనే ప్రణాళిక రూపొందించారు. హామీలతోనే సరి సీతారామ ప్రాజెక్ట్ పంప్హౌస్లను 2024 ఆగస్టులో సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు ప్రాజెక్టు పనులపై సమీక్షలు నిర్వహించారు. బహుళార్థ సాధక ప్రాజెక్టులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేకపోవడం పెద్ద లోటని, రోళ్లపాడు దగ్గర రిజర్వాయర్ నిర్మించే ప్రణాళికను పరిశీలించాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. ఇది జరిగాక ఏడాది తర్వాత 2025 ఏప్రిల్ 17న ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సైతం సీఎం రేవంత్రెడ్డి వద్ద ప్రత్యేక అపాయింట్మెంట్ సాధించి ఇల్లెందుకు గోదావరి జలాల అంశాన్ని ప్రస్తావించారు. అదే ఏడాది మే 12న సీతారామపై జరిగిన సమావేశానికి గుమ్మడిని సైతం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఇల్లెందుకు న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం నుంచి హామీ దక్కింది. హామీల మీద హామీలు వచ్చాయే తప్పితే ఇల్లెందు నియోజకవర్గానికి గోదావరి నీళ్లు అందించే అంశంపై చిత్తశుద్ధి కరువైందనే విమర్శలు ప్రభుత్వంపై వస్తున్నాయి.‘రాజీవ్ ఆయకట్టు’కు కలగానే మిగులుతున్న సాగునీరు -
జనగణనకు సన్నద్ధం
చుంచుపల్లి: జిల్లాలో జనగణన–2027కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రణాళిక గణాంక శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. 2020 ఏప్రిల్లోనే జనగణన ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా, కరోనా కలకలంతో వాయిదాపడింది. 2027 జనాభా లెక్కలను రెండు విడుతల్లో 33 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఈసారి ప్రత్యేకంగా సీఎంఎంఎస్(సెన్సెస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) మొబైల్ యాప్లు వాడనున్నారు. జిల్లాలో 1,780 మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో 40 మంది మండల స్థాయి అధికారులు కాగా, 1,615 మంది వరకు ఎన్యుమరేట్లర్లు, మరో 125 మంది సూపర్వైజర్లు ఉన్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించారు. ఎన్యుమరేటర్లకు శిక్షణ తరగతులు కొనసాగుతుండగా, ఈ నెల 30వ తేదీ లోగా శిక్షణ కార్యక్రమం పూర్తికానుంది. రెండు విడతల్లో గణన జనాభా గణన రెండు విడతల్లో చేపట్టనున్నారు. మొదట మే 11 నుంచి జూన్ 9 వరకు బ్లాక్ పరిధిలోని మొదట ఇళ్ల సంఖ్యను లెక్కిస్తారు. దాదాపు 45 రోజులపాటు ఇళ్ల జాబితాను సేకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టే రెండో దశలో జనాభా, పూర్తి వివరాలను నమోదు చేస్తారు. ఇళ్లలో ఉన్న జనాభా (జాతీయ జనాభా రిజిస్టర్)ను లెక్కిస్తారు. ప్రాథమికంగా 200 నుంచి 250 గృహాల వరకు ఒక బ్లాక్గా విభజించి ఓ ఎన్యుమరేటర్ను నియమిస్తారు. జనగణనకు ముందు పశుగణన కూడా చేపడతారు. 16వ సారి ఇప్పటివరకు 15 సార్లు దేశ వ్యాప్తంగా జనాభా లెక్కలు సేకరించగా, మే నెలలో చేపట్టబోయేది పదహారోసారి కానుంది. చివరగా 2011లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనాభా లెక్కల వివరాలు సేకరించారు. 2016 అక్టోబర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడగా, కొత్త జిల్లాలో తొలిసారిగా జనగణన జరగనుంది. కాగా జనాభా లెక్కల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక ఆర్థిక, అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాయి. ఆహార ధాన్యాల నిల్వలు, ఉపాధి, ఉద్యోగాల కల్పన సహా అన్ని రంగాల్లో రూపొందించే ప్రణాళికలు జనాభా లెక్కలపై ఆధారడి ఉంటాయి. జిల్లాలో 2027 జనాభా లెక్కల సేకరణ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతీ పదేళ్లకోసారి జనగణన నిర్వహించడం ఆనవాయితీ. కొత్తగా ఏర్పడిన జిల్లాలో తొలిసారిగా జనాభా లెక్కలు సేకరించనున్నారు. జనగణనపై అధికారులు, ఎన్యుమరేటర్లకు శిక్షణలో అవగాహన కల్పిస్తున్నాం. –కే.సంజీవరావు, సీపీఓజనాభా గనణలో వ్యక్తి పేరు, ఇంటిపేరు, కుటుంబ యజమాని, యజమానితో బంధుత్వం, వయసు, లింగం, చదువు, టీవీ, ద్విచక్ర వాహనం, కారు వంటి వివరాలు నమోదు చేస్తారు. ఎస్సీ, ఎస్టీల కులం వివరాలు కూడా సేకరిస్తారు. పురుషులు, మహిళలు, థర్డ్ జెండర్స్ వివరాలు వేర్వేరుగా నమోదు చేస్తారు. సిగ్నల్, సాంకేతిక సమస్యలతో యాప్లో విరాలు నమోదు చేయలేని పక్షంలో ఎప్పటిలా సాధారణ పద్ధతి (మాన్యువల్)లో కూడా గణన చేయనున్నారు. తర్వాత ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారు.జిల్లాలో గృహాల సంఖ్య: 2,79,190 మొత్తం జనాభా: 10,69,261 పురుషులు: 5,32,390 మహిళలు: 5,36,871 గ్రామీణ జనాభా: 7,30,178 (68.01శాతం) పట్టణ జనాభా: 3,39,083 (31.71 శాతం) ప్రతి వెయ్యిమంది పురుషులకు సీ్త్రలు: 1008 -
నేటి నుంచి రైతు సంఘం మహాసభలు
రుద్రంపూర్: కొత్తగూడెంలో గురువారం నుంచి మూడు రోజులపాటు జరిగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ తెలిపారు. కొత్తగూడెంలోని సీపీఎం కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల్లో ఢిల్లీ రైతు పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కిషన్, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. భూమి హక్కులు, సాగునీరు, కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, రుణమాఫీ, రైతు భరోసా, పెండింగ్లో ఉన్న అటవీ హక్కులు తదితర సమస్యలపై సభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ జానయ్య, ఏఐకేఎస్ జాతీయకార్యదర్శి విజ్జు కిషన్ ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో శివరాం ప్రసాద్, మచ్చ వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, అన్నవరం సత్యనారాయణ, కొలగాని బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్, లిక్కి బాలరాజు, కున్సోత్ ధర్మా, తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణం కోసం స్వామిని పల్లకీసేవగా బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రాధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. మంగళవారం కావ డంతో ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నేడు వేలంపాట
కొత్తగూడెంఅర్బన్: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలకు బుధవారం కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్లో వేలంపాట జరగనుందని సీఐ జయశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఎవరైనా ఉదయం 10 గంటలకు హాజరై వేలంపాటలో పాల్గొనవచ్చని తెలిపారు. వాటర్ డిస్పెన్సరీ వితరణ జూలూరుపాడు: పాపకొల్లు రైతు వేదికకు అదే గ్రామానికి చెందిన రైతు ధర్మరాజుల వెంకటనారాయణ రూ.9వేల విలువ గల వాటర్ డిస్పెన్సర్ను మంగళవారం వితరణ చేశారు. కార్యక్రమంలో రైతులు యాసా రోశయ్య, బాలు, చందర్, నర్సింగ్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇంటి బిల్లులు చెల్లించాలి సుజాతనగర్: ఇందిరమ్మ ఇంటి బిల్లులు తక్షణమే చెల్లించాలని బీజేపీ మండల అధ్యక్షడు గుగులోత్ రాజేష్ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీలను విస్మరించి గ్రామసభల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి ఏడాది కావస్తున్నా మొదటి బిల్లులు రాక పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, పెండింగ్ బిల్లులు త్వరితగతిన చెల్లించాలని పేర్కొన్నారు. -
పడకేసిన మున్సి‘పాలన’
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాల్టీలో ఏడాదిన్నరగా ఎక్కడి అభివృద్ధి అక్కడే నిలిచిపోయింది. నిధులు ఉన్నా పనులు పనులు జరగడం లేదు. తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేసిన పనులు కూడా ప్రారంభం చేయలేదు. గత పాలకవర్గం పదవీకాలం 2025 జనవరి నెలాఖరుతో ముగిసింది. గత ఏడాదిన్నర కాలంలో ఏ వార్డులోనూ ఒక్క పని పూర్తి చేయలేదు. నాటి నుంచి నేటి వరకు మున్సిపాల్టీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. రూ.కోట్ల రూపాయల నిధులు ఉన్నా వివిధ కారణాలతో వాటిని ప్రారంభించకుండా రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుత పాలకవర్గం రెండు నెలల క్రితం పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా మరోమారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం మున్సిపాల్టీలో పర్యటించనున్నారు. ఇప్పటికై నా పాత అభివృద్ధి పనులు పూర్తి చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచనలు చేస్తారా అని పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. నేడు పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం, మున్సిపల్ నూతన చైర్మన్ చాంబర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇబ్బడి ముబ్బడిగా నిధులు.. ఇల్లెందు పట్టణాభివృద్ధికి నిధులు సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.15 కోట్లు 24వార్డుల్లో 56 పనులు చేపట్టాలని నిర్ణయించారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఆఘమేఘాల మీద మంత్రి పొంగులేటి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించారు. ఈ పనుల్లో ఒక్కటీ ప్రారంభించలేదు. ఇలా మంత్రితో శంకుస్థాపన చేసిన పనులకే దిక్కు లేకుంటే ఎలా అంటూ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. నేడు మంత్రి పొంగులేటి రాక -
మంత్రి సభను జయప్రదం చేయండి..
ఇల్లెందు: నూతన మున్సిపల్ పాలకవర్గాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం సత్కరించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్మిత్ర కోరారు. మంగళవారం ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పి.రాజు, కౌన్సిలర్లు చిల్లా విజయభారతి, సైదామియా, వంశీ, దొడ్డ డానియేల్, సుదర్శన్ కోరీ, మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, చిల్లా సూర్యం, రవిశంకర్, ఉల్లింగ సతీష్ తదితరులు పాల్గొన్నారు. టేకులపల్లి: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం టేకులపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం మాట్లాడుతూ సాయంత్రం 5.40లకు ఇటీవల జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న కేశెట్టి ఖాదర్బాబు నివాసం రామచంద్రునిపేటలో తేనీటి విందులో పాల్గొంటారు. అనంతరం మొక్కంపాడు గ్రామంలో బ్రిడ్జి, రోడ్డు నిర్మాణానికి, మద్రాస్తండా నుంచి మేళ్లమడుగు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. -
ఆర్టీసీలో సమ్మె సైరన్
టీజీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు యూనియన్లను అనుమతించాలనే తదితర 32డిమాండ్లతో బుధవారం తెల్లవారుజాము (మొదటి షిప్ట్) నుంచి కార్మికులు విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టనున్నారు. గడిచిన వారం రోజులుగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యాన సమ్మెకు కార్మికులను సన్నద్ధం చేస్తున్నారు. ఈక్రమాన ఉన్నతాధికారులు హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన చర్చలు విఫలం కావడంతో సమ్మె ఖాయమని ప్రకటించారు. – చుంచుపల్లి ఇవీ ప్రధాన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు కార్మిక సంఘాల పునరుద్ధరణ, రెండో వేతన సవరణ, విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు వంటి కీలక డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. అంతేకాక ఖర్చులు తగ్గించుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టిమ్స్ డ్యూటీలు పెంచుతూ ఇబ్బంది పెడుతోందని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎనిమిది గంటలకు బదులు 12 గంటల వరకు పనిచేయిస్తూ స్పెషల్ ఆఫ్ కూడా ఇవ్వకపోవడంతో డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు బస్సుల్లో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక రద్దీ దృష్ట్యా కండక్టర్లతో పాటు డ్రైవర్లకు సమస్యలు వస్తున్నాయని వెల్లడించారు. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో డ్రైవర్లే టికెట్లు ఇవ్వాల్సి రావడంతో పని భారం పెరుగుతోందని వాపోతున్నారు. ఈమేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించాలని, 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయడమే కాక 2025 వేతన సవరణ చేపట్టాలని కోరుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ.350 కోట్లను నెలనెలా విడుదల చేయాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సుల కంపెనీలకు ఇవ్వకుండా ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఉద్యోగులపై పనిభారం తగ్గింపు, కేఎంపీఎల్, ఏపీకే వేధింపులు మానుకోవాలని, 2019 సమ్మె కాలంలో నమోదైన కేసులను ఎత్తివేసి సంస్థలోని అన్ని కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో చాలాకాలం తర్వాత కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఇదేసమయాన స్కూళ్లకు వేసవి సెలవులు రావడంతో వేలాది మంది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే, సమ్మె దృష్ట్యా డిపోల వారీగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. డిపోల పరిధిలో ఔట్సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ బస్సులు నడిపే కార్మికుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు డిపోల్లో 286బస్సులు ఉండగా, 929 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతీరోజు లక్ష మందికి పైగా ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.డిపో బస్సులు సిబ్బంది కొత్తగూడెం 69 204భద్రాచలం 109 362మణుగూరు 72 210ఇల్లెందు 36 103డిమాండ్ల సాధన కోసం కార్మికుల పోరుబాట ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం సాగుతుంది. ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని కార్మికులకు ఆండగా నిలవాలి. చాలారోజులుగా వేచి చూశాకే సమ్మెబాట పడుతున్నాం. ఆర్టీసీ కార్మికులను అణగదొక్కాలని చూస్తే సహించేది లేదు. జేఏసీ ఆధ్వర్యాన కార్మికులు, అన్ని యూనియన్లు పాల్గొంటాయి. – కె.భాస్కర్రావు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి -
చలివేంద్రాలతో తీరనున్న దాహార్తి
పాల్వంచ: వేసవి దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక శాసీ్త్రరోడ్డులో రైస్ మిల్లు యజమాని నరిగే కృష్ణ, సరోజినీదేవిల జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కొత్వాల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో రైస్మిల్లు నిర్వాహకులు నరిగే శ్రీనివాసరావు, నరిగే రమేష్, రవీందర్, సుజాత, లింగా రమేష్, సీహెచ్ వెంకటేశ్వర్లు, చీకటి బాబు, కొప్పరపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందురూరల్: విజయలక్ష్మీనగర్ గ్రామపంచాయతీ పరిధి ఇల్లెందు – గుండాల ప్రధాన రహదారి వెంట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ చందావత్ రమేష్బాబు మంగళవారం ప్రారంభించారు. మాట్లాడుతూ.. మండుతున్న ఎండల దృష్ట్యా ప్రయాణికులు వేసవితాపానికి గురికాకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ సౌకర్యం కల్పించామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రేణుక, వార్డు సభ్యులు, కార్యదర్శి రజినీకాంత్ పాల్గొన్నారు. -
అవగాహనతోనే ప్రమాదాల కట్టడి
సూపర్బజార్(కొత్తగూడెం): రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్ల బారిన పడకుండా ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలని ఎస్పీ రోహిత్రాజ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తొలుత విధుల్లో విధుల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ నివారణా చర్యలను చేపట్టాలని సూచించారు. అలాగే, పెండింగ్ కేసుల విచారణలో వేగం పెంచాలని, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చార్జీషీట్లు పకడ్బందీగా రూపొందించాలని ఎస్పీ తెలిపారు. అంతేకాక గంజాయి రవాణా, మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారితో పాటు సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్న వ్యక్తులతో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వేసవి సెలవుల నేపథ్యాన దొంగతనాలు జరగకుండా గస్తీ పెంచాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల డీఎస్పీలు సతీష్కుమార్, వెంకన్నబాబు, రవీందర్రెడ్డి, మల్లయ్య స్వామి, అశోక్, సీఐలు శ్రీనివాస్, సర్వయ్య, రమాకాంత్, రాము, ఏఓ మంజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.నేర సమీక్షలో ఎస్పీ రోహిత్రాజ్ -
లోవోల్టేజీ సమస్య రావొద్దు
ఇల్లెందురూరల్/టేకులపల్లి: వేసవి దృష్ట్యా గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి సూచించారు. ఇల్లెందు మండలం చల్లసముద్రం, ఒడ్డుగూడెం గ్రామాల్లో ఎన్పీడీసీ ఎల్ ఆధ్వర్యాన చేపడుతున్న పనులతో పాటు మంగళవారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్లో సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పరి శీలంచిన ఆయన మాట్లాడారు. పనుల్లో నాణ్యత, భద్రతా సూత్రాలు పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. వ్యవసాయానికి ఇబ్బంది కలుగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, అవసరమైన చోట్ల మరమ్మతులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్ఈ మహేందర్, డీఈలు అనిల్, రంగస్వామి, వెంకటేశ్వర్లు, ఏడీఈలు రాంబాబు, మధు, రామారావు, ఏఈలు హనీష, దేవా పాల్గొన్నారు. స్పోర్ట్స్ ప్రాంగణం పరిశీలన పాల్వంచ: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి సూచించారు. పాల్వంచ సీతారాంపట్నంలో జిల్లా స్టోర్స్ ప్రాంగణం నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఉద్యోగులతో సమావేశమయ్యారు. వేసవి నేపథ్యాన ట్రాన్స్ఫార్మర్లు, నిర్వహణలో లోపాలను సరిచేయాలని తెలిపారు. ఎస్ఈ జి.మహేందర్, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి -
పోస్టర్లు ఆవిష్కరణ
ఇల్లెందు: అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జాతీయ కన్వినర్ కిచ్చెల రంగయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కోరారు. ఈ మేరకు మంగళవారం ఇల్లెందులోని ఎల్లన్న భవన్లో పోస్టర్లు ఆవిష్కరించారు. మాట్లాడుతూ మే 11, 12, 13 తేదీల్లో ఇల్లెందులో మహాసభలు జరుగుతాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభల్లో చర్చించి పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్లైన్ నాయకులు చండ్ర అరుణ, నాయిని రాజు, ఈసం శంకర్, మాచర్ల సత్యం, యాకుబ్షావలీ, బోసు, బుర్ర వెంకన్న, పాయం వెంకన్న, సావిత్రి, శాంతయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
గ్రామదేవత విగ్రహం ధ్వంసం
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధి చుంచుపల్లి మండలంలోని ధన్బాద్ పంచాయతీ పొలిమేరలో స్వయంభుగా వెలిసిన పోచమ్మ తల్లిని స్థానికులు ఇలవేల్పుగా కొలుచుకుంటున్నారు. ఇట్టి అమ్మవారి గుడిని సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీని పగులకొట్టి, కానుకలను దొంగలించారు. అదేవిధంగా అమ్మవారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ మేరకు స్థానికులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలి.. చుంచుపల్లి: గ్రామీణ ప్రాంత ప్రజలు, హిందువుల ఆరాధ్య దైవమైన పోచమ్మ తల్లి ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ రోహిత్రాజుకు వినతిపత్రం అందించారు. జాతోత్ వెంకన్న, బలగం శ్రీధర్, పొన్నకంటి రాజు, బడే రమేష్, మంగీలాల్ పాల్గొన్నారు. -
రోప్వే స్థలం స్వాధీనం..
రుద్రంపూర్: సింగరేణికి సంబంధించి చాతకొండ పరిధిలోని 44–29 ఎకరాల భూమిని కొంత కాలంగా ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుని పంటలు సాగుచేస్తున్నారు. ఈమేరకు స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. సుమారు 40ఏళ్ల క్రితం గనుల్లోకి కావాల్సిన ఇసుకను రోప్వే ద్వారా తీసుకొచ్చి తెల్ల వాగు సమీపాన డంప్ చేసేవారు. అయితే గనుల్లో ఇసుక వాడకం తగ్గడంతో రోప్వే విధానాన్ని రద్దుచేయగా, సంస్థ ఈ స్థల పరిరక్షణను విస్మరించింది. దీంతో స్థానికులు ఆక్రమించుకుని పంటలు సాగుచేస్తున్నారు. ఈమేరకు సెక్యూరిటీ సిబ్బంది.. ఎస్టేట్స్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా, పంటలు ఉండడంతో ఇన్నాళ్లు వేచి ఉన్నారు. ప్రస్తుతం పంట కోతలు పూర్తికావడంతో స్థలాన్ని చదును చేయిస్తూ మంగళవారం ఫెన్సింగ్ వేసే క్రమాన ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పంటలు పూర్తిగా తీసుకునే వరకు ఇవ్వాలని స్థానికులు కోరగా అధికారులు మరో మూడు రోజుల గడువు ఇచ్చారు. సింగరేణి ఆధీనంలోకి 44 ఎకరాల భూమి -
రెగ్యులర్ అధికారిని నియమించండి..
సూపర్బజార్(కొత్తగూడెం): బీసీ సంక్షేమ శాఖలో రెగ్యులర్ ఏబీసీడబ్ల్యూఓను నియమించాలని డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామ్ చరణ్తేజ్ డిమాండ్ చేశారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ హాస్టళ్లలో రెగ్యులర్ ఏబీసీడబ్ల్యూఓ లేకపోవడం వలన పూర్తిస్థాయిలో పర్యవేక్షణ జరగడం లేదన్నారు. మణుగూరు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట ఏజెన్సీ మండలాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో మెనూ అందక, అధికారుల పర్యవేక్షణ లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు హాస్టళ్లకు హెచ్డబ్ల్యూఓగా విధులు నిర్వహిస్తున్న అధికారికి ఏబీసీడబ్ల్యూఓగా బాధ్యతలు ఇస్తారో ఉన్నతాధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే కలెక్టర్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు
రైతులకు ఇబ్బంది లేకుండా... సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా రైతులకు ఇబ్బంది ఎదురుకాకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. తహసీ ల్దార్లు, ఎంపీడీఓలతో పాటు వివిధశాఖలతో అధికా రులు కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లాలో 83, 635 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 168 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని 56 కేంద్రాలకు ధాన్యం చేరినందున వ్యవసాయశాఖ అధికారులు గ్రేడింగ్ చేపట్టాలని చెప్పారు. అంతేకాక కేంద్రాల్లో టెంట్లు, తాగునీరు, విద్యుత్ వసతి సమకూర్చి సరిపడా టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే, రైస్ మిల్లర్ల నుంచి నిబంధనల ప్రకారం బ్యాంక్ గ్యారంటీలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ● బూర్గంపాడు: యాసంగి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా, పకడ్బందీగా చేపడతామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. బూర్గంపాడు మార్కెట్యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యంగా ఉన్న ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. రైతులు అపోహలు పెట్టుకోవద్దని, ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. పీఆర్–126 దొడ్డు రకం నాణ్యతపై రైతుల సందేహాలను వ్యవసాయశాఖ అధికారులు నివృత్తి చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు, తహసీల్దార్ కేఆర్కేవీ ప్రసాద్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఏఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బూర్గంపాడులోని కేజీబీవీని తనిఖీ చేశారు. విద్యార్థులకు సమకూరుస్తున్న భోజనం, వంట సామగ్రిని పరిశీలించాక మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ క్రమాన టాలెంట్ టెస్ట్. డ్రాయింగ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల అభినందించారు. ● సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ను ప్రణాళికాయుతంగా గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఏఈఆర్ఓలు, బూత్ లెవల్ అధికారులు, సూపర్వైజర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 70 శాతం ఎస్ఐఆర్ మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన పనులను అత్యంత ప్రాధాన్యతతో వేగంగా చేపట్టాలని స్పష్టం చేశారు. మణుగూరు మండలంలో కేవలం 37శాతమే పూర్తికావడంపై కారణాలు ఆరా తీశారు. మ్యాపింగ్లో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని ఆదేశించారు. అనంతరం సాదా బైనమా దరఖాస్తులపై కలెక్టర్ సమీక్షించారు.కలెక్టర్ అంకిత్ -
మమ్ముల్ని పట్టించుకోండి..
ఇల్లెందురూరల్: ఏజెన్సీ చట్టాలు.. రాజ్యాంగం కల్పించిన హక్కులు.. ఏవీ వారికి ఊరటనివ్వలేకపోతున్నాయి. వాటిని అమలు చేయాల్సిన అధికారులు ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. ఫలితంగా దశాబ్ధాలుగా ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలను అందుకోలేక.. ఉపాధి కోసం కూలీలుగానే దుర్భర స్థితిలో ఇల్లెందు ఏజెన్సీలోని పలు గ్రామాలలో గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. బుధవారం మండలంలో పర్యటిస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ సమస్యలను ఆలకించి పరిష్కారం చూపాలని ఏజెన్సీ వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆక్రమణలోనే ప్రభుత్వ భూములు మండల, పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములు అధికారుల కనుసన్నల్లోనే ఆక్రమణకు గురవుతున్నాయి. గతేడాది పర్యటనకు వచ్చిన మంత్రి ప్రభుత్వ భూముల ఆక్రమణలను చూసి నిర్ఘాంతపోయి పక్షం రోజుల్లో స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కానీ నేటికీ ఆచరణకు నోచుకోలేదు. 40 ఏళ్లుగా అపరిష్కృతంగానే.. మామిడిగుండాల రెవెన్యూ పరిధిలో 40 ఏళ్లుగా సీలింగ్ భూముల సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. 1990కి ముందే నాటి రెవెన్యూ అధికారులు స్థానిక గిరిజన రైతులకు సీలింగ్ పట్టాలు ఇచ్చారు. కానీ పట్టాలలో సరిహద్దులు పేర్కొనకపోవడంతో ఎవరి భూమి ఎక్కడుందో నేటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఫలితంగా గిరిజన రైతులు రైతు భరోసాకు, రైతు బీమాకు నోచుకోవడం లేదు. అవసరం కోసం అక్కున చేర్చుకొని.. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి పురుడు పోసింది కూలీలే. ప్రమాదాల గనులుగా పేరొందిన బొగ్గు బావుల్లో వందేళ్ల క్రితం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని శ్రమించి పని చేసిన కూలీలు సంస్థను నిలబెట్టారు. నాడు తమ పూర్వీకులు నిర్మించిన ఆవాసాలలో వారి వారసులు అసౌకర్యాల నడుమనే నేటికీ జీవనం సాగిస్తున్నారు. వారిని ప్రస్తుతం జేకే ఓసీ విస్తరణ ప్రాజెక్టు పేరుతో ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతోంది. -
జనగణన త్వరగా పూర్తిచేయాలి
పాల్వంచరూరల్: జనగణనలో భాగంగా బీఎల్ఓలు డోర్ టూ డోర్ మ్యాపింగ్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని కొత్తగూడెం ఆర్డీఓ మధు ఆదేశించారు. స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన బీఎల్ఓల సమీక్ష సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో కమిషనర్ సుజాత, ఎంపీడీఓ బొగ్గ నారాయణ, తహసీల్దార్ దారా ప్రసాద్, సీడీపీఓ లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. రామకృష్ణకు ఎమ్మెల్యే అభినందన జూలూరుపాడు: భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా నియమితులైన జూలూరుపాడు మండలం భేతాళపాడు గ్రామానికి చెందిన గోపు రామకృష్ణను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అభినందించారు. మంగళవారం కొత్తగూడెంలోని ఎమ్మెల్యే తన నివాసంలో రామకృష్ణకు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో కోనేరు సత్యనారాయణ, మాలోత్ మంగీలాల్ నాయక్, గుగులోత్ కృష్ణ, మెంతుల కృష్ణ ఉన్నారు. జేఈఈ మెయిన్స్లో మెరిసిన ‘గురుకులం’ పాల్వంచరూరల్: జేఈఈ మెయిన్స్లో సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల గిరిజన విద్యార్థులు అర్హతను సాధించారు. కిన్నెరసాని డ్యామ్సైడ్ గిరిజన గురుకుల బాలుర కళాశాలకు చెందిన డి.సిద్దు 94.7, వి.జివన్ 94, బి.సంతోష్ 79.1, బి.చరణ్ 71.2, జి.రోహిత్ 66.9, ఎం.శ్రీరాం 57, బి,హెమంత్ 52.6 పర్సంటైల్ సాధించి అడ్వాన్స్కు అర్హత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ మంగళవారం తెలిపారు. అదేవిధంగా సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా జూనియర్ కళాశాలలో డి.అనంద్బాబు 87, టి.ప్రభాస్ 76, ఆదిత్య 67శాతం పర్సంటైల్ సాధించినట్లు ప్రిన్సిపాల్ అన్వేష్ తెలిపారు. ఆరోగ్య కేంద్రం తనిఖీ పాల్వంచ: శేఖరం బంజర పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రోగ్రాం ఆఫీసర్ (సీహెచ్ఐ) డాక్టర్ ప్ర తాప్, సీహెచ్ఓ నాగభూషణం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీ లించి, సీసీపీ, వాక్సిన్ ఐఎల్ఆర్ గదిని పరిశీ లించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎంజేబీపీసీడబ్ల్యూ కళాశాలను సందర్శించి హెచ్పీవి వాక్సిన్పై ప్రిన్సిపాల్తో చర్చించారు. -
నెరవేరనున్న దశాబ్దాల నాటి కల
టేకులపల్లి: మొక్కంపాడు గ్రామంతో పాటు బోడు పరిసర మారుమూల ఏజెన్సీ ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ హైలెవెల్ బ్రిడ్జి, పూబెల్లి వరకు బీటీ రోడ్డు మంజూరైంది. సుమారు 15 ఏళ్ల క్రితం మృతి చెందిన బిజ్జ భిక్షమయ్య గ్రామాభివృద్ధికి బోడు రోడ్డు నుంచి మొక్కంపాడుకు, మొక్కంపాడు నుంచి పూబెల్లికి బీటీ రోడ్డు, పెద్దవాగుపై హైలెవెల్ బ్రిడ్జి కోసం పలుమార్లు ఉన్నతాధిరుల, పాలకులకు వి న్నవించారు. బ్రిడ్జి, రోడ్డు కోసం అధికారులను కలి సేందుకు కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాల వద్దనే రాత్రిసూట పడుకునేవారు. అనేక పర్యాయాలు ఆనాటి మంత్రి తుమ్మల వద్దకు వెళ్లి వినతిపత్రం ఇచ్చి గోడు చెప్పుకునేవారు. ఎక్కడ కలిసినా పేరుతో పిలిచేంతగా తుమ్మలకు పరిచయమయ్యారు. అయినా బ్రిడ్జి, బీటి రోడ్డు కల నెరవేరలేదు. ఈయ న తరువాత కుంజా వెంకటేశ్వర్లు గ్రామాభివృద్ధికి, రోడ్లు, బ్రిడ్జి కోసం నిరంతరం కృషి చేశారు. మూడేళ్ల క్రితం ప్రమాదంలో ఈయన మృతి చెందా రు. గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేసుకునేంతగా స్థానికుల గుండెల్లో నిలిచారు. వీరికి దొర, పటేల్, పెద్ద మనుషులతో పాటు గ్రామస్తులు సహకారం అందించారు. ఎట్టకేలకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో మొక్కంపాడు పెద్దవాగుపై హైలెవెల్ బ్రిడ్జి, మొక్కంపాడు నుంచి పూబెల్లి వరకు ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్డుకు రూ.8.90 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రిడ్జి, బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. తగ్గనున్న దూరాభారం.. బోడు, కొప్పురాయి, ఆర్సీ పేట, బర్లగూడెం, గంగారం, పెట్రాంచెలక, ఎర్రాయిగూడెం, కిష్టారం, లచ్చగూడెం, మొక్కంపాడు 10 పంచాయతీలు సుమారు 50 గ్రామాలకు పైగా ప్రజలు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు ఇల్లెందు వెళ్లాలంటే మొక్కంపాడు మీదుగా రాకపోకలు సాగిస్తుండేవారు. వాగు ఉధృతంగా ఉన్నప్పుడు టేకులపల్లి మీదుగా వెళ్లేవారు. మొక్కంపాడు నుంచి పూబెల్లి, హనుమంతులపాడు, కొత్తూరు, ధర్మాపురం, సుదిమళ్ల మీదుగా ఇల్లెందుకు 10 కిలోమీటర్లు. బోడు నుంచి మొక్కంపాడు మీదుగా ఇల్లెందుకు కేవలం 15 కిలోమీటర్లు మాత్రమే. ఇదే టేకులపల్లి వరకు అయితే 20 కిలోమీటర్లు. టేకులపల్లి నుంచి ఇల్లెందు 20 కిలోమీటర్లు. మొత్తం 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. మొక్కంపాడు బ్రిడ్జి నిర్మిస్తే 20 కిలోమీటర్ల దూరాభారం తగ్గనుంది. వాగు అవతల వందల ఎకరాల్లో సాగు భూములు ఉండటంతో వ్యవసాయ పనులకు కూడా వెసులుబాటు ఉంటుంది.నేడు మొక్కంపాడు – పూబెల్లి బ్రిడ్జి, రోడ్డుకు శంకుస్థాపన చేయనున్న మంత్రి పొంగులేటి -
గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
భద్రాచలంటౌన్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణా ళిక’లో భాగంగా గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఈనెల 24న భద్రాచలం వైటీసీలో అవగాహన సద స్సు ఏర్పాటుచేసినట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్ తెలిపారు. బ్యూటీ థెరపిస్ట్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ వంటి కోర్సుల్లో శిక్షణకు 8వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్హత కలిగి 18 – 35 ఏళ్ల వయస్సు వారు అర్హులని వెల్లడించారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం, స్టడీ మెటీరియల్ సమకూర్చడమే కాక పూర్తయ్యాక సర్టిఫికెట్లు అందజేస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటోలు, విద్యార్హతల సర్టిఫికెట్లతో ఈనెల 24న సదస్సుకు హాజరుకావాలని, వివరాలకు 93474 66615, 63026 08905, 93912 92594 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు. కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధం కావాలికొత్తగూడెంఅర్బన్/సూపర్బజార్ (కొత్తగూడెం): ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రగతిని సమీక్షించుకొని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి స్పష్టమైన ప్రణాళికతో సిద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి సూచించారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో మంగళవారం ఆమె కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం వివిధ స్థాయిల్లో ప్రగతి, లోటుపాట్లను సమీక్షించుకోవడం ద్వారా వచ్చే విద్యాసంవత్సరం మెరుగైన ప్రణాళిక అమలుకు అవకాశముంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించడమే కాక మూతబడిన పాఠశాలను తిరిగి తెరిపించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే, పాఠశాలల్లో మరమ్మతులు, నిర్మాణ పనులపై ఆమె సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఎస్.కే.సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్.సతీష్కుమార్, బాలిక విద్యా కోఆర్డినేటర్ జే.అన్నామణి పాల్గొన్నారు. బీఏఎస్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: బెస్ట్ అవైలబుల్ పథకం(బీఏఎస్) కింద జిల్లాకు చెందిన అర్హులైన గిరి జన విద్యార్థులు 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. మొత్తం 156 సీట్లు అందుబాటులో ఉండగా, 3వ తరగతికి 78, 5వ తరగతికి 39, 8వతరగతికి 39సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. దమ్మపేట, భద్రాచలం, ఇల్లెందు గిరిజన సంక్షేమ కార్యాలయాలతో పాటు ఐటీడీఏ కార్యాలయంలో లభించే దరఖాస్తులు తీసుకుని మే 7వ తేదీలోగా పూర్తి వివరాలతో అందజేయాలని తెలిపారు. మే 14న ఐటీడీఏ కార్యాలయంలో జరిగే లాటరీ ప్రక్రియలో విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు దరఖాస్తులకు కులం, నివాసం, ఆదాయ ధ్రువపత్రాలు (గ్రామీణ వాసులైతే రూ.1.50 లక్షలు, పట్టణ వాసులైతే రూ.2 లక్షలులోపు) జతపర్చాలని పీఓ సూచించారు. మిర్చి ధర వెనకడుగు ఖమ్మంవ్యవసాయం: మిర్చి ధరకు కళ్లెం పడింది. సోమవారం వరకు దూకుడు ప్రదర్శించిన ‘తేజా’ రకం మిర్చి ధర మంగళవారం వెనకడుగు వేసింది. ఖమ్మం మార్కెట్లో క్వింటా మిర్చికి సోమవారం అత్యధికంగా రూ.22 వేల ధర పలకగా, మంగళవారం రూ.600 తగ్గి రూ.21,400గా నమోదైంది. అంతేకాక మోడల్ ధర రూ.20,500 నుంచి రూ.18 వేలకు పడిపోయింది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేకపోవడం, ప్రస్తుతం వస్తున్న మిర్చి చివరి కోత కావడంతో నాణ్యత లేకపోవడం ధర తగ్గడానికి కారణాలుగా చెబుతున్నారు. -
కిన్నెరసాని గిరిజన గురుకులంలో సమ్మర్ క్యాంప్
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కిన్నెరసాని డ్యామ్సైడ్లోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన వాలీబాల్ సమ్మర్ క్యాంప్ను గిరిజన గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని తిరుమలాయపాలెం, సింగరేణి, గుండాల, దమ్మపేట బాలుర పాఠశాలల నుంచి పది మంది చొప్పున 50మంది విద్యార్థులు క్యాంప్లో పాల్గొంటారని తెలిపారు. ఈ 29వరకు కొనసాగే క్యాంప్లో విద్యార్థులకు వాలీబాల్ శిక్షణ ఇవ్వడమే కాక ప్రత్యేక ఆహారం, దుస్తులు సమకూరుస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాళ్లు శ్యామ్కుమార్, ప్రిన్సిపాల్ రమేష్, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి, పీడీలు ఎం.భద్రయ్య, ఎం.నాగార్జున తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలి భద్రాచలంటౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లా పేరు నిలబెట్టాలని భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణదొర సూచించారు. భద్రాచలం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉమ్మడి జిల్లాలోని వంద మంది విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఆర్చరీ, అథ్లెటిక్స్ సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపును ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రిన్సిపాళ్లు హేమలత, పద్మావతి, ఏఓ నరేందర్, కోచ్లు గోపాలకృష్ణ, సరిత పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
కారేపల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగిన రైతు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మండలంలోని కొత్తకమలాపురానికి చెందిన శాగంటి కృష్ణయ్య(46) వ్యవసాయంలో పెట్టుబడి కోసం అప్పులు చేయగా, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో నష్టాలు ఎదురయ్యాయి. దీంతో కుటుంబంతో సహా ఖమ్మం వెళ్లి వివిధ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమాన పెరిగిన అప్పులు తీర్చే మార్గంలేక ఆదివారం స్వగ్రామానికి వచ్చిన కృష్ణయ్య పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా సోమవారం పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆయనకు భార్య స్వప్న, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఇంటర్ పాస్ కాలేదనే మనస్తాపంతో విద్యార్థిని.. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయ్యాయనే మనస్థాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కారేపల్లి మండలం దుబ్బతండాకు చెందిన గుగులోతు బాలాజీ–అరుణ దంపతులు కుమార్తె సంజన(17) కారేపల్లిలోని తాతయ్య–నాన్నమ్మ ఇంట్లో ఉంటూ అక్కడే ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివించింది. ఇటీవల ఫలితాల్లో ఆమె ఫెయి ల్ కాగా, ఈనెల 17వ తేదీన ఎలుకల మందు మింగింది. ఈమేరకు కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందింది. -
దాహం తీరట్లే..
కొత్తగూడెంఅర్బన్: బొగ్గు గనుల ప్రాంతం.. తీవ్ర మైన ఎండ, భరించలేని ఉక్కపోత.. వెరసి కార్పొరేషన్ ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిమీద బయటకు వెళ్లినవారికి దాహం వేస్తే చలివేంద్రాలు కనిపించడం లేదు. కార్పొరేషన్ పాలకవర్గం సర్వసభ్య సమావేశంలో ఆమోదం పొందిన పలు అంశాలను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.. సుమారు 21 రోజుల కిందట పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో రూ.6 లక్షలతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సభ్యులు ఆమోదించగా.. శనివారం అరకొరగా.. చలివేంద్రాలు ఏర్పాటు చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కమిషనర్ అనుభవ రాహిత్యంతో అభివృద్ధి పనులు జరగడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మార్చి నుంచే ఎండల తీవ్రత మార్చి నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ప్రతీ రోజు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతుండడంతో దాహానికి ప్రజలు, కార్మికులు, ఆటోడ్రైవర్లు అవస్థలు పడుతున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీగా ఉన్న సమయంలో ప్రధాన కూడళ్లలో ఆరు వరకు చలివేంద్రాలు మూడు నెలల పాటు ఏర్పాటు చేసేవారు. ప్రతీ రోజు చలివేంద్రంలో ఏర్పాటు చేసిన మట్టికుండల్లో నీటిని నింపి పాదచారులతో పాటు గా అన్నివర్గాల వారికి తాగునీటి సదుపాయం కల్పించే వారు. ప్రస్తుతం మున్సిపాలిటీ కార్పొరేషన్గా రూపాంతరం చెందిన నేపథ్యంలో చలివేంద్రాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. కానీ, పాలకవర్గం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎండల్లో ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో వారం రోజులు అయితే ఏప్రిల్ కూడా ముగిసిపోతుంది. అయినా కూడా అధికారులలో చలనం లేకపోవడంపై కార్పొరేటర్లతో పాటు ప్రజలు కూడా వారి తీరును తప్పుబడుతున్నారు. శనివారం కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్లలో చలివేంద్రాలను అరకొరగా ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పాలకవర్గ సర్వసభ్య సమావేశం గత నెల 28వ తేదీన జరిగింది. ఎజెండాలోని 6వ అంశంగా చలివేంద్రాల ఏర్పాటు కోసం చర్చలు జరిపారు. అనంతరం పాలకవర్గ సభ్యులు ఆమోదించారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్లలో 12 చోట్ల రూ.6 లక్షలతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నిర్ణయం తీసుకొని 21 రోజుల తరువాత అరకొరగా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు ఉన్న చోట తప్పనిసరిగా చలివేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బీ–గ్రేడ్ మున్సిపాలిటీకి కమిషనర్గా వ్యవహరించాల్సిన వారిని కార్పొరేషన్ కమిషనర్గా కొనసాగించడంతో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, కార్పోరేషన్ స్థాయికి ఐఏఎస్ అధికారిని వీలైనంత త్వరగా నియమించాలని కార్పొరేటర్లు సహా ప్రజలు కోరుతున్నారు. ప్రధాన కూడళ్లలో వ్యాపారం చేసే వారు, ఆటో యూనియన్ల వారు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్లలో చలివేంద్రాల సంఖ్యను పెంచాల్సిన అవసరముంది. ఎండలు పెరిగిపోవడంతో ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాల సంఖ్యను పెంచి, అన్ని వర్గాల ప్రజలకు నీటి సదుపాయం కల్పించాలి. –సాగర్ మలోత్రా, కార్పొరేటర్ -
మా ఇంటి వివాహం.. సైబర్ పాఠం !
ఖమ్మంమయూరిసెంటర్: ఓ పోలీసు ఉద్యోగి విధుల్లో బాధ్యతగా వ్యవహరించడమే కాక తన ఇంటి జరిగే శుభకార్యంలోనూ పలువురికి అవగాహన కల్పించేలా ముందడుగు వేశాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బోనగిరి నాగేశ్వరరావు – విజయలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె వివాహం ఈనెల 30న జరగనుంది. ఈమేరకు ఆహ్వాన పత్రికను అందరిలా కాకుండా తన వృత్తిధర్మాన్ని కలగలిపి రూపొందించడం ఆకట్టుకుంటోంది. శుభకార్యానికి ఆహ్వానం పలుకుతూనే... సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. సైబర్ హెచ్చరికలు, అపరిచిత లింక్లతో జాగ్రత్తలు, ఉచిత బహుమతుల ప్రకటనలకు దూరంగా ఉండడం, పార్సిళ్లలో జరిగే మోసాలు, డిజిటల్ భద్రత, పెట్టుబడి మోసాలు ఎలా జరుగుతాయో క్షుణ్ణంగా వివరించారు. అలాగే సైబర్ నేరానికి గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలను సైతం సూచించగా.. కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.వివాహ ఆహ్వానపత్రికపై భద్రతా సూచనలు -
బాలుడి మృతితో విషాదం
అశ్వాపురం: మండలపరిధిలోని మామిళ్లవాయి గ్రామంలో మాజీ ఎంపీటీపీ బొర్రా శ్రీను కుమారుడు బాలుడు బొర్రా రాహుల్(17) మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ చదువుతున్న రాహుల్ సెలవులు కావడంతో ఇల్లెందులోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఆదివారం బైక్పై వెళ్తుండగా అదుపు తప్పి కింద పడి తలకు బలమైన గాయాలై కోమాలోకి వెళ్లాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. హత్య కేసులో యావజ్జీవ శిక్షమహబూబాబాద్ రూరల్: కొత్తగూడెం రైల్వేస్టేషన్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.వేయి జరిమానా విధిస్తూ మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం(భద్రాచలం రోడ్) రైల్వేస్టేషన్లో 2023 ఏప్రిల్ 8న కూలీ లైన్ ప్రాంతానికి రావి మన్మథరావు బెంచీపై కూర్చోగా, ఛత్తీస్గఢ్కు చెందిన యోగేశ్ రావడంతో సీటు విషయమై వాగ్వాదం జరిగింది. ఈ క్రమాన యోగేశ్ కుర్చీకి ఉన్న ఇనుప పట్టీ తీసి దాడి చేయడంతో తీవ్ర గాయాలపై మన్మథరావు అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసిన డోర్నకల్ జీఆర్పీ పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఇన్చార్జ్ కొంపెల్లి వెంకటయ్య వాదనలు వినిపించారు. తిప్పనపల్లిలో వరుస చోరీలుచండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో వరుస చోరీలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం రాత్రి కందిమళ్ల శ్రీను అనే రైతు ఫామ్లో రూ. 2.50 లక్షలు విలువైన నాటు కోళ్లను అపహరించారు. ఫారం ఇనుప గేటు, గ్రిల్స్ను కత్తిరించి చోరీ చేశారు. రెండు వారాల క్రితం ఇద్దరు రైతుల నాటుకోళ్లను అపహరించారు. రెండు నెలల క్రితం కూడా కొందరు ఇళ్లలోని నాటుకోళ్లను చోరీ చేసిన దుండగులు మసీదు ప్రాంగణంలోని మరుగుదొడ్లల్లో దాచారు. వాహనంలో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు మేల్కోవడంతో పరారయ్యారు. తాజాగా జరిగిన చోరీ ఘటనలో బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. -
గ్రీన్ఫీల్డ్ హైవేపై టోల్ వసూళ్లు
నేటి నుంచి బైక్లు, ఆటోల నిషేధంవైరా: ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మించిన గ్రీన్ఫీల్డ్ హైవేపై టోల్ వసూళ్లు సోమవారం అధికారికంగా మొదలయ్యాయి. అయితే, ఖమ్మంలోని మున్నేటిపై బ్రిడ్జి, ధంసలాపురం వద్ద ట్రాక్పై బ్రిడ్జి నిర్మాణాలు తప్ప మిగతా హైవే పనులు పూర్తయ్యాయి. దీంతో వైరా మండలంలోని సోమవరం వద్ద ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్ నుంచి వాహనాలకు రాకపోకలకు కొద్దిరోజులుగా అనుమతిస్తున్నారు. ఈనేపథ్యాన సోమవరంలోని టోల్ పాయింట్ వద్ద వసూళ్లను ఎన్హెచ్ఏఐ పీడీ దివ్య సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఇకపై అధికారికంగా టోల్ వసూళ్లు మొదలుకానున్నాయని తెలిపారు. అంతేకాక హైవేపై ద్విచక్రవాహనాలు, ఆటోల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తున్నందున వాహనారులు గమనించాలని సూచించారు. ఏడు టోల్ బూత్లకు అనుమతి ఖమ్మం – దేవరపల్లి హైవే నిర్మాణాన్ని 120 కి.మీ. నిడివితో చేపట్టారు. ప్రస్తుతానికి ఖమ్మంలో పనులు పూర్తికాకపోవడంతో వైరా మండలం సోమవరం నుంచి చివరి పాయింట్ వరకు 60 కి.మీ. హైవేపై ప్రయాణానికి అనుమతిస్తున్నారు. హైవేపై జిల్లా పరిధిలోని పది ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్లకు గాను, తల్లంపాడు, కోదాడ క్రాస్, ధంసలాపురం మినహా సోమవరం సహా ఏడు చోట్ల అనుమతి ఉంది. దీంతో వాహనదారులు ఆయా పాయింట్ల వద్ద హైవేపైకి ప్రవేశించి రాకపోకలు సాగించే వెసులుబాటు లభించింది. కాగా, హైదరాబాద్లోని ఔటర్ రింగ్(ఓఆర్ఆర్) రోడ్డు మాదిరిగా హైవేపైకి చేరుకునే పాయింట్ నుంచి దిగే పాయింట్ వరకే కి.మీ. లెక్కించి టోల్ వసూలు చేసేలా బూత్లను ఏర్పాటుచేశారు. -
ఇద్దరికి గౌరవ డాక్టరేట్
అశ్వాపురం/మణుగూరు రూరల్: సామాజిక, సాంస్కృతిక, వ్యాపార రంగాల్లో చేస్తున్న సేవలను గుర్తించి ఇద్దరికి అమెరికా యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన, ఐటీసీ ఉద్యోగి తోకల రమేష్కు అమెరికాలోని లూసియానా రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మహారాష్ట్ర పుణేలో సోమవారం డాక్టరేట్ను అందజేశారు. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణకు రమేష్ చేస్తున్న కృషికి గౌర వం దక్కగా, ఐటీసీ ఉన్నతాధికారులు, గుర్తింపు సంఘం అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్ తదితరులు అభినందించారు. మణుగూరుకు చెందిన పారిశ్రామిక వేత్త, సామాజికవేత్త వందనపు శ్రీనివాసరావుకు అమెరికాకు చెందిన మేరీ ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరాపురం హాబిటేట్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ స్నాతకోత్సవంలో డాక్టరేట్తోపాటు బంగారు పతకం అందజేశారు. వ్యాపార, సామాజిక సేవ రంగాల్లో ఆయన చేస్తున్న సేవలకు ఈ పురస్కారం అందించగా, రాజకీయ పార్టీలు, వ్యాపార వర్గాలు అభినందించాయి. -
ఉద్యోగులు క్రీడలపై దృష్టి సారించాలి
పాల్వంచ: ఉద్యోగులు క్రీడలపై దృష్టి సారించాలని, తద్వారా శారీరక, మానసికోల్లాసం పొందవచ్చని కేటీపీఎస్ 7వ దశ సీఈ జె.సూర్యనారాయణ అన్నారు. 7వ దశ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న టీజీ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ వాలీబాల్, కబడ్డీ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కేటీపీఎస్ 5,6,7 దశలు, బీటీపీఎస్, కేటీపీపీ, జూరాల, పోచంపల్లి పులిచింతల, విద్యుత్సౌదజట్లు హాజరయ్యాయి. సీఈ పోటీ లను ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఎస్ఈలు ఎస్.యుగపతి, జి.శ్రీనివాస్, జి. రాజ్కుమార్, డివైసీసీఎ నాగరాజు, స్పోర్ట్స్ డిప్యూటీ సెక్రటరీ లోహత్ ఆనంద్, కేటీపీఎస్ 5,6,7 దశల సెక్రటరీలు వీరస్వామి, మహేష్, పలువురు కోచ్లు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలిజూలూరుపాడు: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకా రాం రాథోడ్ అన్నారు. సోమవారం జూలూరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, కళాశాలను డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని రికార్డులను పరి శీలించారు. వార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. విద్యార్థినులకు పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్ సుందర్, హెచ్ఎస్ రత్నకుమార్, హెచ్వీ రాధిక, కేజీబీవీ ఎస్ఓ పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రత పాటించాలిడీఈఓ నాగలక్ష్మి చండ్రుగొండ: వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి డి.నాగలక్ష్మి సూచించారు. చండ్రుగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. వంటశాలలను, పరిసరాలను, తరగతి గదులను, విశ్రాంతి గదులతోపాటు మరుగుదొడ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, తహసీల్దార్ జగదీశ్వర్ప్రసాద్, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిదుమ్ముగూడెం: మండలంలోని గంగారం గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎటపాక మండలం గట్టుగూడేనికి చెందిన పద్దం సాయిరాం (26) భార్య సంధ్యతో కలిసి పౌలూరిపేటలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అనంతరం తిరిగి బైక్పై వెళ్తుండగా గంగారం గ్రామంలో ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రమాదంలో సంధ్యకు కూడా గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందజేశారు. రఘునాథపాలెంలో యువకుడు.. రఘునాథపాలెం: రఘునాథపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. రఘునాథపాలెంకు చెందిన బి.ఉపేందర్ (21) ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై సెంటర్లోని ఆటోస్టాండ్ నుంచి ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారిపైకి వస్తుండగా చెరువుగట్టు వద్ద డివైడర్ను ఢీకొన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉపేందర్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు మృతుడి సోదరుడి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. పశువులు స్వాధీనంకరకగూడెం: అక్రమంగా తరలిస్తున్న పశువులను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. కరకగూడెంలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు పశువులను స్వాధీనం చేసుకుని పాల్వంచలోని గోశాలకు తరలించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పీవీఎన్ రావు తెలిపారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
డీఏఓ బాబూరావు ఇల్లెందురూరల్: రైతుభరోసా సహా పథకాల లబ్ధికి ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు తెలిపారు. మండలంలోని చల్లసముద్రం గ్రామపంచాయతీ మీ సేవ కేంద్రం వద్ద రైతులతో సోమవారం సమావేశమై ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాధాన్యత, నమోదు విధానం, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే రైతుభరోసా సహా ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. ఏవో సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదుభద్రాచలంఅర్బన్: పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండల పరిధి సారపాక గ్రామానికి చెందిన సాయి అనే వ్యక్తి భద్రాచలం పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. మూడు నెలల క్రితం డెలివరీ కాగా సదరు యువతి మగ శిశువుకి జన్మనిచ్చింది. కాగా, పెళ్లి చేసుకోవాలని ఆమె అడగగా సాయి నిరాకరించాడు. దీంతో బాధితురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేశారు. -
రెండు కాళ్లు కోల్పోయినా...
సూపర్బజార్(కొత్తగూడెం): దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన మట్టా లక్ష్మణరావు రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. బాధుతుడి కథనం ప్రకా రం... హోటల్లో పనిచేస్తూ రాత్రి సమయంలో ఇంటికి వెళ్తుండగా లారీ ఢీ కొట్టటీ ప్రమాదం జరి గింది. వైద్య ఖర్చులు రూ. 7 లక్షల య్యాయి. ఇళ్లు అమ్ముకుని చికిత్స చేయించుకున్నాడు. సదరన్ క్యాంపులో విచిత్రంగా రెండు కాళ్లు కోల్పోయిన లక్ష్యణరావుకు 21 శాతం మాత్రమే వైక్యల్యం ఉందని ధ్రువీకరించి కార్డు ఇచ్చారు. దీంతో దివ్యాంగ పెన్షన్కు అర్హత లేకుండా పోయింది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ మాత్రం వస్తుంది. తనకు వికలాగుల పెన్షన్ మంజూరు చేయాలని పలుమార్లు అధికారులను వేడుకున్నా, ప్రజావాణిలో దరఖాస్తులు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవా రం మరోసారి ప్రజా వాణికి వచ్చిన ఆయ న కన్నీళ్ల పర్యంతమయ్యాడు. వికలాంగ పెన్షన్తోపాటు బ్యాటరీ వాహనం, ఇంటి స్థలం, ఇలు మంజూరు చేయాలని కోరాడు. వైకల్యం 21 శాతమేనట.. -
కలెక్టరేట్లో సెంట్రల్ రికార్డ్ రూమ్ ప్రారంభం
సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో నూ తనంగా ఏర్పాటుచేసిన సెంట్రల్ రికార్డ్ రూమ్ ను కలెక్టర్ అంకిత్ సోమవారం ప్రారంభించారు. పాత రికార్డులను భద్రపరచడం, రికా ర్డుల ప్రక్షాళన, డిజిటలైజేషన్ ద్వారా రికార్డులను సులభంగా గుర్తించి వినియోగించుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యా చందన, కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణ, ఎలక్షన్ సూపరింటెండెంట్ రంగాప్రసాద్ పాల్గొన్నారు. బసవేశ్వరుడి బోధనలు అనుసరణీయం సామాజిక సమానత్వానికి బసవేశ్వరుడి బోధనలు మార్గదర్శకమని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం బసవేశ్వరుడి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బసవేశ్వరుడు జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని అన్నారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఇతర అధికారులు దినేష్, ఉపేందర్, పరంధామరెడ్డి, బీసీ సంఘాల నాయకులు గుమలాపురం సత్యనారాయణ, ముదురుకోళ్ల కిశోర్ పాల్గొన్నారు. -
సంప్రదాయాలను కాపాడుకోవాలి
అశ్వారావుపేటరూరల్/భద్రాచలంటౌన్/దమ్మపేట: పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఆయన అశ్వారావుపేట మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న కొండరెడ్ల గ్రామమైన గోగులపూడిని సందర్శించారు. గ్రామంలో కొండరెడ్లు నిర్వహించిన మా మిడి కాయల పండుగకు హాజరయ్యారు. ఏటా మామిడి కాయల సీజన్ కావడంతో కొండరెడ్లు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజ లు చేశారు. ఊరంతా మామిడాకులు, ఆరిటాకులతో తోరణాలతో అలంకరించారు. నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. పీఓ కూడా కొద్దిసేపు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఊరంతా ఆటపాటలతో పండుగ జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా చేపట్టిన మ్యాపింగ్ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఐటీడీఏ పీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వీసీకి దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం నుంచి ఐటీడీఏ పీఓ బి. రాహుల్, తహసీల్దార్లు హాజరయ్యారు. అర్జీలు పరిష్కరించాలి గిరిజన దర్బార్కు వచ్చే ప్రతీ అర్జీని పరిష్కరించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోడు భూముల సమస్యలు, స్వ యం ఉపాధి రుణాలు, రైతుబంధు, వైద్య సహాయం, ట్రైకార్ రుణాలు, గిరివికాసం ద్వారా సౌర విద్యుత్ కనెక్షన్లు, ఉన్నత చదువులకు ఆర్థిక సాయం, వ్యవసాయ బోరు మోటార్ల కోసం గిరిజనుల నుంచి విజ్ఞప్తులు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్, ఎస్డీసీ ఆనంద్ కుమార్, సర్పంచ్ గుజ్జు సంకురురావు, గ్రామస్తులు గురుగుంట్ల బాబురెడ్డి, సోమిరెడ్డి, మంగిరెడ్డి, కొటిరెడ్డి దుర్గారెడ్డి, చల్లెమ్మ, సీతమ్మ, సంధ్య పాల్గొన్నారు. ఎన్ఐటీ విద్యార్థికి అభినందన నిరుపేద కుటుంబంలో పుట్టి పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ ఎన్ఐటీలో బీటెక్ సీటు సాధించిన ఆదివాసీ బాలిక వాగె సంధ్యను ఐటీడీఏ పీఓ రాహుల్ అభినందించారు. సోమవారం తన కార్యాలయంలో రూ. 50 వేల ప్రోత్సాహక చెక్కును పీఓ అందజేశారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ -
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
● కలెక్టర్ అంకిత్ ● ప్రజావాణిలో వినతులు స్వీకరణసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల పరిష్కారం విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, గృహ నిర్మాణశాఖ పీడీ రవీంద్రనాథ్తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజావాణి వినతుల్లో కొన్ని ఇలా... ● తన కుమారుడికి గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించాలని భద్రాచలానికి చెందిన జనగాం సుజల అనే మహిళ వినతిపత్రం ఇచ్చింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ● తన ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రంలో తన బదులు వేరే వ్యక్తి ఫొటో వచ్చిందని, మార్పు చేయాలని చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామపంచాయతీకి చెందిన కొమరం భద్రయ్య ఫిర్యాదు చేశాడు. ● సర్వే నంబర్ 817/36లోని తమ భూమి భూభారతి ఆన్లైన్లో నిషేధిత జాబితాలో చూపిస్తోందని పాల్వంచకు చెందిన మంగళగిరి నాగమ్మ అనే మహిళ విన్నవించింది. ● జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామ శివారులో నివాసముంటున్న గుగులోత్ రాందాస్ తమకు ఉన్న పట్టా భూమిలో చేపల చెరువు నిర్మాణానికి మత్స్యశాఖ పథకం కింద ఆర్థికసాయం మంజూరు చేయాలని కోరారు. నాణ్యమైన భోజనం అందించాలి టేకులపల్లి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పాఠశాలలో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టర్ టేకులపల్లి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. వంటగదిని పరిశీలించి భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించి, పాఠశాలలోని ఆర్వో ప్లాంట్ను వినియోగంలోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం నంద్యా తండాలోని ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. మెనూ అమలుపై వివరాలు సేకరించారు. డైనింగ్ హాల్, ఆహార పదార్థాలను పరిశీలించారు. స్టోర్ రూమ్లో కూరగాయలు నేలపై ఉంచగా, గమనించి వార్డెన్ను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్య మైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరామ్, తహసీల్దార్ వీరభద్రం, గురుకులం ప్రిన్సిపాల్ రవీంద్ర, ఏకలవ్య ప్రిన్సిపాల్ కృష్ణ, ఎంపీఓ గణేష్ గాంధీ, తదితరులు పాల్గొన్నారు. -
రేపు మంత్రి పొంగులేటి పర్యటన
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీలో ఈ నెల 22న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించనున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డ డానియేల్ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఉదయం 10.30 గంటలకు మున్సిపల్ సమావేశంలో పాల్గొంటారని, అనంతరం చైర్ పర్సన్ చాంబర్ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 1 నుంచి టీటీసీ శిక్షణ కోర్సులు..కొత్తగూడెంఅర్బన్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్(టీటీసీ) 42 రోజుల వేసవి కాల శిక్షణ కోర్సు మే 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు హైదరా బాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలలో నిర్వహించినున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారు అర్హులని, పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పాసై ఉండాలని పేర్కొన్నారు. అడ్మిషన్లు ఈ నెల 29వ తేదీ వరకు జరుగుతాయని, పూర్తి వివరాలకు 99890 27943 నంబరులో సంప్రదించాలని కోరారు. 27 నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంపులురుద్రంపూర్: సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి మే 21వ తేదీ వరకు సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నట్లు జీఎం పర్సనల్ (వెల్ఫేర్ అండ్ సీఎస్సార్) జీవీ కిరణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రూ.9.83 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. సంస్థవ్యాప్తంగా 11 ఏరియాల్లో వివిధ రకాల క్రీడల్లో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ ఏరియా పరిధిలో 27న క్యాంపు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియం, సీఈఆర్ క్లబ్లో బాస్కెట్బాల్, బాక్సింగ్, కరాటే, ఫుట్బాల్, వాలీబాల్, ఉషు, డ్రాయింగ్ తదితర క్రీడల్లో నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ప్రశాంతంగా ‘ఓపెన్’ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మొదటి రోజు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. పదో తరగతిలో 764 మంది అభ్యర్థులకు గానూ 660 మంది హాజరు కాగా, 104 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్లో 922 మందికి గానూ 788 మంది హాజరు కాగా, 134 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి నాగలక్ష్మి తెలిపారు. డీఈఓ మూడు సెంటర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ 7 సెంటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ 10 సెంటర్లను పరిశీలించారు. ఎర్ర బంగారమే..! రూ.22 వేలకు చేరిన క్వింటామిర్చి ధర ఖమ్మంవ్యవసాయం: ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి ధర రోజురోజుకు ఎగబాకుతోంది. దేశ, విదేశాల్లో డిమాండ్ ఆధారంగా ధర పెరుగుతోంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ‘తేజా’ రకం మిర్చి ధర క్వింటాకు శనివారం రూ.21,700 ఉండగా, సోమవారం మరో రూ.300 పెరిగి రూ.22 వేలకు చేరింది. ఈ నెల ఆరంభంలో రూ.19,400 ఉన్న ధర 20రోజుల్లో రూ.2,500 రూ.22 వేలకు చేరడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చి ధర కూడా ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం, దిగుమతులు తగ్గడంతో మిర్చికి డిమాండ్తో పాటు ధర పెరుగుతోందని విశ్లేషిస్తున్నారు. కాగా, సోమవారం ఖమ్మం మార్కెట్కు వివిధ ప్రాంతాల రైతులు దాదాపు 30 వేల బస్తాల మిర్చి తీసుకొచ్చారు. దరఖాస్తుల ఆహ్వానంభద్రాచలంటౌన్: పినపాక మండలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మినీ గురుకుల (బాలికల) విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 1వ, 5వ తరగతుల్లో మిగిలిన బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి. రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో 30 సీట్లు, 5వ తరగతిలో 5 సీట్లు ఉన్నాయని, ఈ నెల 21 నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థినులను ఎంపిక చేస్తామని, వివరాలకు 97014 95907 నంబర్లో సంప్రదించాలని పీఓ వివరించారు. -
పేటకు ఉద్యాన కళాశాల..
● మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● ఉద్యాన హబ్గా అభివృద్ధికి అవకాశం అశ్వారావుపేట: అశ్వారావుపేట ప్రత్యేకతల జాబి తాలోకి మరో విద్యాసంస్థ చేరింది. రాష్ట్రంలో మరో ఉద్యాన కళాశాలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వంనిర్ణయం తీసుకోగా, ఇందుకు అశ్వారావుపేటను ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే రాజేంద్రనగర్, సిద్దిపేట జిల్లా ములుగు, వనపర్తి జిల్లా మోజెర్లలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉధ్యాన యూనివర్సిటీ అనుబంధ ఉద్యాన కళాశాలలు ఉన్నాయి. కొత్తగా అశ్వారావుపేటలో కూడా మరో కళాశాల ఏర్పాటు చేయనున్నారు. గత శనివా రం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన యూ నివర్సిటీ వీసీ డాక్టర్ దండా రాజిరెడ్డిలతో సమావేశమై వచ్చే విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తొలి ఏడాది 30 సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. 160 సీట్లతో వ్యవసాయ కళాశాల ఇప్పటికే అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను 160 సీట్లతో నిర్వహిస్తున్నారు. విశాల మైదానం, అధ్యయనానికి అన్ని రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల బ్లాక్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 1989లో వ్యవసాయ కళాశాల ప్రారంభంకాగా, రైతులకు వ్యవసాయ సలహా కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రొఫెసర్ల సలహాలతో మెట్ట పంటలు, మా మిడి, జీడి తోటల నుంచి క్యారట్, కాప్సికం, అల్లం, బ్రకోలి, డ్రాగన్ ఫ్రూట్, కోకో, వక్క, దాల్చిన చెక్క, లవంగాలు వంటి అరుదైన పంటలు సాగు చేసేలా ఇక్కడి రైతులు మార్పు చెందారు. 2005లో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన వైఎస్సార్.. 2005లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అశ్వారావుపేటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అప్పటి నుంచి క్రమంగా ఆయిల్ పామ్ సాగు తెలంగాణలో 2లక్షల హెక్టార్లకు విస్తరించింది. అనంతరం దమ్మపేటలో మరో ఫ్యాక్టరీ ఏర్పా టు చేశారు. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద ఉన్న కొబ్బరి విత్తనోత్పత్తి క్షేత్రం, అచ్యుతాపురం మామిడి విత్తనోత్పత్తి క్షేత్రం తోడ్పాటుతో పదుల సంఖ్యలో ప్రైవేటు నర్సరీలు నిర్వహిస్తూ రూ.కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన ఉద్యాన మొక్కలకు కేరాఫ్ అడ్రస్గా అశ్వారావుపేట చరిత్రకెక్కింది. కొత్తగూడెం, వైరా కృషి విజ్ఞాన కేంద్రాలు, పొరుగు రాష్ట్రంలో 80 కిలోమీటర్ల దూరంలోని తాడేపల్లి గూడెం వద్ద డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ, పెదవేగిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్పామ్ రీసెర్చ్ స్టేషన్, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్లు విద్యార్థులకు ప్రాక్టికల్ విద్యకు దోహదపడే అవకాశం ఉంది. -
భక్తులకు ఎండ దడ
● కాలినడకన భద్రాచలం వస్తున్న హనుమాన్ మాలధారులు ● మరో ఇరవై రోజులపాటు కొనసాగనున్న యాత్రలు ● జిల్లా వ్యాప్తంగా కనీస అతిథి మర్యాదలు కరువుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాలినడకన భద్రాచల రాముడి దర్శనం కోసం వెళ్లే హనుమాన్ మాలధారులతో జిల్లాలోని అన్ని ప్రధాన రహదారులు కాషాయ వర్ణం సంతరించుకుంటున్నాయి. మండే ఎండలో గాయపడిన పాదాలతో నడుస్తూ వెళ్తున్న భక్తులకు జిల్లాలో కనీస అతిథి మర్యాదలు కరువయ్యాయి. ఆఖరికి శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ కార్యనిర్వాహక వ్యవస్థ సైతం మొక్కుబడి ఏర్పాట్లకే పరిమితమైంది. కాలినడకన భద్రాచలం హనుమాన్ మాలధారులు ఎక్కువ మంది కాలికనడకన వచ్చి భద్రాచల సీతారాములను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వేసవి కావడంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. రోడ్లపై పట్టుమని పది నిమి షాలు ఉంటేనే వడదెబ్బ తగిలే పరిస్థితులు ఉన్నా యి. అయినా భక్తులు మండే ఎండలకు వెరవకుండా కాలినడకన భద్రాచలం వస్తున్నారు. మాల ధరించిన వారు కాళ్లకు చెప్పులు వేసుకోరు. భగ్గుమంటున్న రోడ్లపైనే నడుస్తుండటంతో కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. గాయాలు కావడంతో పాదాలకు రెండు, మూడు జతల సాక్సులు ధరించి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పట్టించుకోని దేవాదాయశాఖ ఒక్క హనుమాన్ జయంతి అనే కాదు ముక్కోటి, నవమి, గోటి తలంబ్రాల తయారీ ఇలా అనేక పర్వదినాలకు భద్రాచలానికి పాదయాత్రగా వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతూ వస్తోంది. ఇలా వచ్చే భక్తులకు దారి పొడవున కనీస ఏర్పాట్లు కల్పించే విషయంలో ఇటూ దేవాదాయశాఖ, అటు భద్రాచలం ఆలయం నుంచి కనీస స్పందన కరువైంది. మహిళా భక్తుల కోసమైనా దారి వెంబడి కనీస ఏర్పాట్లు చేయడం లేదు. వివిధ సంస్థల సహకారం తీసుకుంటే.. గడిచిన దశాబ్దం కాలంగా ప్రతీ పర్వదినానికి అన్నదానం చేయడం సర్వసాధారణంగా మారింది. కాలనీ అసోసియేషన్లు, వివిధ ఆర్గనైజేషన్లు ఈ పనిని స్వచ్ఛందంగా చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దారి పొడవున కల్యాణ మంటపాలు, ఫంక్షన్ హాల్స్ అందుబాటులో ఉన్నాయి. దేవాదాయశాఖ పరిధిలో అనేక ఆలయాలు ఉన్నాయి. దేవాదాయశాఖ కానీ, భద్రాచలం ఆలయం కానీ ఒక్క పిలుపునిస్తే పాదయాత్రగా వచ్చే భక్తులకు అతిథి సేవలు చేసేందుకు ముందుకు వచ్చేసంస్థలు చాలా ఉన్నాయి. కానీ ఆ దిశగా చొరవ కరువైంది. మాది కోదాడ. హనుమాన్ మాల ధరించిన ప్రతీ సారి భద్రాచలం కాలినడకన వస్తుంటాం. ఇది నాలుగోసారి. ఉదయం నాలుగు గంటలకే నడక మొదలు పెట్టి మధ్యాహ్నం 12 గంటల వరకు నడుస్తున్నాం. సాయంత్రం 4గంటలకు మళ్లీనడక మొదలు పెట్టి ఓపిక ఉన్నంత వరకు నడుస్తాం. సగటున రోజూ 40 కి.మీ ప్రయాణిస్తున్నాం. దారి మధ్యలో నీడ దొరికిన చోట సేద తీరుతున్నాం. – శ్రీనివాస్, కోదాడ హనుమాన్ మాల ధరించి భద్రాచలం చేరుకున్న భక్తులకు తానీషా మండపం, మారుతి సదనంలో వసతి కల్పిస్తున్నాం. పోకల దమ్మక్క నిత్యాన్నదాన సత్రంలో భోజనం అందుబాటులో ఉంటుంది. – దామోదరరావు, భద్రాచలం రామాలయ ఈఓఎన్నో ఏళ్లుగా కాలినకడన భద్రాచలం వచ్చే భక్తులు కొత్తగా వచ్చే వారికి సూచనలు చేస్తున్నారు. వాటిని అనుసరిస్తూ ఖమ్మం ––కొత్తగూడెం–భద్రాచలం, మహబూబాబాద్–ఇల్లెందు– పాల్వంచ –భద్రాచలం, పెనుబల్లి –కొత్తగూడెం – భద్రాచలం, అశ్వారావుపేట –దమ్మపేట/వేలేరుపాడు –భద్రాచలం మార్గాల్లో ఎక్కడెక్కడ నీడనిచ్చే పెద్దవైన చెట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ కనీస ఆశ్రయం ఇచ్చే ఆలయాలు ఉన్నాయనే వివరాలు తెలుసుకుని అక్కడ కొంత మేరకు సేద తీరుతున్నారు. మార్గమధ్యంలో ఏ హోటళ్ల దగ్గర తమకు ఆహారం లభిస్తుందో ముందుగానే తెలుసుకుని వారికి చెప్పి, తాము తాత్కాలిక విశ్రాంతి తీసుకునే చోటుకు ఆహారం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాసీనియర్ భక్తుల సూచనలు లేని కొత్త భక్తులైతే భద్రాచలం చేరుకునే లోపు ఎన్నో కష్టాలను జై శ్రీరామ్, జై హనుమాన్ అనే నినాదాల నడుమ ఓర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. -
యూనివర్సిటీ విభజనపై భేటీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న కొత్తగూడెంలోని మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఈమేరకు ఆస్తులు, ఇతర అంశాల విభజన కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర కాలేజిఝెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన, ఓయూ వీసీ ఎం.కుమార్, మాజీ వీసీ తిరుపతిరావు, కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, ఎర్త్ యూనివర్సిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఓఎస్డీలు ప్రొఫెసర్ జగన్మోహన్రాజు, కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్ ఉన్నారు. ఈ కమిటీ బాధ్యులు సోమవారం కేయూలో సమావేశం కాగా, స్థిర, చరాస్తులు, అధ్యాపకులు, ఉద్యోగుల పంపకాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. -
నేటితో ముగియనున్న గడువు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయ పాలకవర్గ గడువు నేటి(మంగళవారం)తో ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గాన్నే మరో ఏడాది కొనసాగిస్తారా? నూతన పాలకవర్గాన్ని నియమిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. పాలకవర్గ గడువు పొడిగిస్తే ప్రస్తుత చైర్మన్కు తిరిగి చైర్మన్ పదవి లభిస్తుందా? మార్పులు జరుగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 21న నియామకం జిల్లాలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయం తర్వాత ఎక్కువ ఆదాయం పాల్వంచ మండలంలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయం నుంచే వస్తోంది. 2025 ఏప్రిల్లో ప్రభుత్వం జీఓ 66 ద్వారా 15మంది సభ్యులతో కూడిన జాబితా విడుదల చేసింది. అయితే ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆ కమిటీని రద్దు చేసి, మరో 15మంది సభ్యులతో కూడిన కొత్తా జాబితా ప్రకటించింది. గతేడాది ఏప్రిల్ 21న బాలినేని నాగేశ్వరరావు చైర్మన్గా మరో 14 మంది పాలకవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. వీరి పదవీకాలం ఈ నెల 21న ముగియనుంది. ఈ నేపథ్యంలో తిరిగి నూతన పాలకమండలి నియామకానికి ప్రతిపాదనలు పంపిస్తామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామి తెలిపారు. ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు తిరిగి నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. అయితే ప్రస్తుత పాలకవర్గమే మరో ఏడాది పొడిగింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు కమిటీ సభ్యులు ఈసారైన చైర్మన్ పదవి దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. కాగా ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చాక పాలకవర్గ చైర్మన్లుగా గంగిరెడ్డి సుందర్రెడ్డి, జీవీ భద్రం, కె.వెంకటేశ్వర్లు తదితరులు బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఆలయ ఈఓ రజనీకుమారిని వివరణ కోరగా.. పాలకవర్గం పదవీ కాలం మంగళవారంతో ముగుస్తున్నట్లు పాలకవర్గ కమిటీకి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్కు సర్క్యులర్ ద్వారా సమాచారం ఇచ్చామని తెలిపారు. పెద్దమ్మతల్లి ఆలయానికి కొత్త పాలకవర్గాన్ని నియమిస్తారా..? -
మూడు ఇసుక లారీల పట్టివేత
పాల్వంచరూరల్: రాత్రుళ్లు ఇసుక అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ ప్రసాద్ కథనం మేర కు.. మండలంలోని తోగ్గూడెం సమీపంలోని మొర్రేడు వాగునుంచి ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఆర్ఐలు నళినికుమార్, రవికుమార్రెడ్డి శనివారం రాత్రి దాడి చేశారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను సీజ్ చేసి, కార్యాలయానికి తరలించి, జరిమానా విధించా మని తహసీల్దార్ ప్రసాద్ వెల్లడించారు. వన్యప్రాణుల వేటగాళ్లు అరెస్టు చండ్రుగొండ: వన్యప్రాణుల వేటగాళ్లను ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు. చండ్రుగొండ ఫారెస్టు రేంజర్ ఎల్లయ్య కథనం ప్రకారం.. మండలంలోని కరిశెలబోడుతండా బీట్ పరిధిలో అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు విద్యుత్ వైర్లు అమర్చి వన్యప్రాణుల వేట సాగిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున అందిన సమాచారం మేరకు దాడి చేసి, బానోత్ వీరన్న, ఇస్లావత్ సిత్తు, తేజావత్ రమేశ్, బానోత్ సురేశ్, బాదావత్ చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ఇస్లావత్ జామ్ల పరారైనట్లు రేంజర్ ఎల్లయ్య వెల్లడించారు. వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన వైర్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను పోలీసులకు అప్పగించామని రేంజర్ వివరించారు. సాగర్ కాల్వలో మునిగి వ్యక్తి మృతి ఖమ్మంరూరల్: సాగర్ కాల్వలో కొట్టుకుపోతున్న గేదెలను అదిలించేందుకు దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి తెల్దారుపల్లికి చెందిన చింతిరాల బాబు (68) ఆదివారం గేదెలను మేపుతుండగా.. అవి సాగర్ కాల్వలోకి దిగాయి. దీంతో వాటిని బయటకు అదిలించేందుకు దిగిన ఆయన లోతును గమనించకపోవడంతో నీట మునిగిపోయాడు. గట్టుపై ఉన్న స్థానికులు గుర్తించి ఇచ్చిన సమాచారంతో గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహం లభ్యమైంది. ఇటీవల ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుని గృహ ప్రవేశం చేసిన బాబు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. వ్యక్తి ఆత్మహత్యదుమ్ముగూడెం: మండలంలోని వర్క్షాప్ గ్రామానికి చెందిన తోకల సమ్మయ్య (48) మద్యంమత్తులో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సమ్మయ్య ఉదయం పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో పురుగులమందు తాగడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించగా.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యార్థి మృతదేహం లభ్యం
మణుగూరుటౌన్: మండలంలోని రేగులగండి చెరువులో శనివారం మధ్యాహ్నం గల్లంతైన విద్యార్థి నక్కా హర్షవర్దన్ (14) మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. మణుగూరు సీఐ నాగ బాబు, తహసీల్దార్ అద్దంకి నరేశ్ పర్యవేక్షణలో ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. విగతజీవిగా పడిఉన్న కుమారుడిని చూసిన కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. కాగా, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బాబు మృత్యువాత పడ్డాడని, ఒక్కపూట బడుల నేపథ్యంలో బాబు ఇంటికి రాకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేసినా యాజమాన్యం స్పందించలేదని మృతుడి తల్లి ఆరోపించారు. ఈ విషయమై విజ్ఞాన పాఠశాల కరస్పాండెంట్ సాంబశివారెడ్డిని వివర ణ కోరగా.. ఒక్కపూట బడుల నేపథ్యంలో విద్యార్థులను మధ్యాహ్నమే వారి ఇళ్లకు బస్సుల్లో పంపించేశామని, అందుకు సంబంధించిన సీసీ పుటేజీని పోలీసులకు అందించామని తెలిపారు. కాగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ నాగబాబు తెలిపారు. రోడ్డుప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి ఎర్రుపాలెం: సైకిల్ రిక్షా, బైక్ ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన మండలంలోని బనిగండ్లపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బుచ్చిరెడ్డిపాలెం రోడ్డులో సైకిల్ రిక్షా నడుపుతూ బలుసుపాటి ఆనందరావు బనిగండ్లపాడు గ్రామం వైపు వస్తున్నాడు. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నండ్రు సుధాకర్ (48) బైక్పై వెళ్తున్న క్రమంలో ఢీకొన్నారు. ఘటనలో రిక్షాపై ఉన్న చెక్క మొద్దు సుధాకర్ను బలంగా తాకడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలంలో పరిశీలన అనంతరం కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్కుమార్ తెలిపారు. తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు .. ఖమ్మంరూరల్: ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడిన గీతకార్మికుడు మృతి చెందాడు. మండలంలోని చింతపల్లికి చెందిన ఎనిగళ్ల వీరభద్రం (48) ఆదివారం రోజుమాదిరిగానే తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా మోకు జారడంతో కింద పడ్డాడు. దీంతో సమీపంలో ఉన్న వారు వచ్చిచూసే సరికి ఆయన తీవ్ర గాయాలై మృతి చెందాడు. వీరభద్రంకు భార్య, కూతురు, కుమారుడు ఉండగా, కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ, ఆలయ కమిటీ సభ్యులతోపాటు అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు.నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని, ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్, జలాశయం వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 256 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్కు రూ.13,665 ఆదాయం లభించింది. 135 మంది బోటింగ్ చేయగా రూ.8,140 ఆదాయం టూరిజం శాఖకు లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్ల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు కొత్తగూడెం నగరంలో 10 కేంద్రాలు ఏర్పాటు చేయగా, పదో తరగతి అభ్యర్థులు 1,045 మంది, ఇంటర్ అభ్యర్థులు 1,196 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. నిర్వహణకు 10 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 10 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 140 మంది ఇన్విజిలేటర్లు, 10 సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతి లేదని డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అనుమతి ఉండదని, అభ్యర్థులు హాల్ టికెట్ తెచ్చుకోవాలని సూచించారు. సీఈఓల్లో ప్రవేశపరీక్షకు 88.59శాతం హాజరు భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ గిరిజన గురుకుల(సీఓఈ) కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుచేసిన ఐదు పరీక్ష కేంద్రాలను ఆర్సీఓ, పరీక్షల పరిశీలకురాలు అరుణకుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న 1,692 మంది విద్యార్థులకు గాను 1,468 మంది(88.59 శాతం) హాజరయ్యారని తెలిపారు. ఎంపీసీ విభాగంలో 1,035 మంది, బైపీసీ విభాగంలో 796 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. -
వైభవంగా నదీ హారతి
భద్రాచలంటౌన్: భద్రగిరి పుణ్యక్షేత్రంలో గోదావరి మాత నదీ హారతి కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో కరకట్ట వద్ద నిర్వహించిన ఈ వేడుకలో సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా గణపతి పూజ, 108 ప్రమిదలతో దీపోత్సవం, గోదావరి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రస్వామికి 12 సార్లు, గోదావరి నదికి 21 సార్లు విశేష హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సురేష్ వర్మ, రామాచార్యులు, తేజశర్మ తదితరులు పాల్గొన్నారు. భద్రగిరి రామయ్యకు అభిషేకంభద్రాచలంటౌన్: శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కేఓసీలో స్క్రాప్ చోరీకి యత్నం
టేకులపల్లి: కోయగూడెం ఓపెన్కాస్టులో స్క్రాప్ చోరీ యత్నాన్ని సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది ఆదివారం భగ్నం చేశారు. అక్రమంగా తరలిస్తున్న ఇనుప రాడ్లు, ట్రాలీని పోలీసులకు అప్పగించారు. బోడు ఎస్ఐ శ్రీనివాస్రెడ్డి కథనం మేరకు.. కోయగూడెం ఓపెన్కాస్టులో సివిల్ పనులు నిర్వహించే కాంట్రాక్టర్ వద్ద సబ్ కాంట్రాక్టర్ కె.గణేశ్ ఆదివారం ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు రూ.25 వేల విలువైన 30 ఎంఎం, 10 ఎంఎం ఇనుప రాడ్లను ట్రాలీలో తరలిస్తుండగా సింగరేణి సెక్యూరిటీ విభాగం జమీందార్ లక్ష్మయ్య ట్రాలీని అడ్డుకున్నాడు. అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి వెంటనే బోడు పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. గణేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గుడుంబా తాగినా, అమ్మినా కేసులు..
ఇల్లెందురూరల్: గ్రామాభివృద్ధితోపాటు యువత ను సన్మార్గంలో నడిపించేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడు గ్రామపంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గ్రామపంచాయతీ పరిధిలో ఎవరైనా గుడుంబా తాగినా, అమ్మినా పోలీసులు, ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేయడమే కాక సంక్షేమ పథకాలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జీపీ పాలకవర్గ సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించామని సర్పంచ్ సనప సావి త్రి ఆదివారం వ్లెడించారు. పలువురు గుడుంబాకు బానిసలై ఆరోగ్యం పాడు చేసుకుంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గుడుంబా తాగిన, విక్రయించిన వారికి ప్రభుత్వ పథకాలను రద్దు చేసేలా గ్రామపంచాయతీ తీర్మానంతో అధికా రులకు సిఫారసు చేస్తామని తెలిపారు. అంతేకాక గ్రామపంచాయతీ తరపున జరిమానా విధిస్తామని, జరిమానా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేసేలా అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు. ఈ అంశంపై గ్రామస్తులకు అవగాహన కల్పించేలా పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు రద్దుచేసేలా ఏకగ్రీవ తీర్మానం -
‘సీతారామ’ను పక్కన పెట్టారు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ఖమ్మం వైరారోడ్: ‘రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 2.60 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కానీ మక్కలతో పాటు ధాన్యం కొనే దిక్కు లేదు. ఈ జిల్లా నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉండి ఏం లాభం... రైతుల ఉసురు తీస్తారా?’ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ప్రశ్నించారు. అంతేకాక ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా పక్కన పెట్టిందన్నారు. కొద్ది ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉన్నా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఖమ్మంలో ఆదివారం సాయంత్రం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇదే వేదికపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జన్మదిన వేడుకలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమంలో హరీష్రావు మాట్లాడుతూ మక్కలు, వడ్ల కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా మంత్రులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దాష్టీకాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. నాడు కేసీఆర్ హయాంలోనే ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలకు వంద పడకల ఆస్పత్రులు మంజూరయ్యాయని గుర్తుచేసిన హరీష్రావు, ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని ఎవరూ చెరిపి వేయలేరని చెప్పారు. ఆయన ప్రేమను అందుకోవడానికి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలని పిలుపునిచ్చారు. తుది శ్వాస వరకు కేసీఆర్ వెంటే.. : పువ్వాడ తుది శ్వాస వరకు తన రాజకీయ ప్రయాణం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కోసమేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాకు తెలంగాణ సెంటిమెంట్ లేదనే ప్రచారంలో నిజం లేదన్నారు. తొలిదశ ఉద్యమకారుడు అన్నబత్తుల రవీంద్రనాథ్ నుంచి మలిదశ ఉద్యమానికి ప్రాణం పోసిన కేసీఆర్ ‘ఖమ్మం దీక్ష’ వరకు ఈ ప్రాంత పాత్ర మరువలేనిదని తెలిపారు. కేసీఆర్ అండతో ఎదిగి పదవులు అనుభవించి, నేడు అధికారం కోసం పార్టీలు మారిన నాయకులు ఇప్పుడు కేటీఆర్, హరీష్రావును విమర్శించడం గర్హనీమన్నారు. తప్పుడు కేసులకు బీఆర్ఎస్ కేసులు భయపడాల్సిన అవసరం లేదని, మరో రెండున్నర ఏళ్లలో మళ్లీ కేసీఆర్ పాలన వస్తుందని తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కొట్లాడడానికి పూర్తి శక్తితో సిద్ధంగా ఉన్నానని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనిచ్చేది లేదని చెప్పిన వారిని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే గేటు తాకకుండా చేస్తారని వెల్లడించారు. గులాబీ జెండా ఎగురవేస్తాం : ఎంపీ రవిచంద్ర రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జిల్లా నుంచి పదికి పది నియోజకవర్గాలను గెలిపించి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఇంకా ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్రావు, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, గట్టు రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కురాకుల నాగభూషణంతో పాటు గుండాల కృష్ణ, దిండిగాల రాజేందర్, పగడాల నాగరాజు, వనమా రాఘవ, కర్నాటి కృష్ణ, మగ్బూల్, మెంతుల శ్రీశైలం, బత్తుల మురళి, భూక్యా దళ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీలో తాగునీటి వెతలు
పాల్వంచరూరల్: ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండటంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గ్రామాల్లో ఉన్న ఒకటి, రెండు చేతిపంపులు కూడా పనిచేయడం లేదు. ఏప్రిల్లోనే ఈ పరిస్థితి ఉంటే మే లో ఎలా ఉంటుందోనని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఆదివాసీ గూడేల్లో తీవ్ర నీటిఎద్దడి అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న ఆదివాసీలను తాగునీటి ఎద్దడి మరింత త్రీవంగా వెంటాడుతోంది. తాగునీటి కోసం కిలోమీటరు దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. అయినా కలుషితమైన చెలిమ నీరే లభిస్తోంది. ఏజెన్సీ ప్రాంతమైన పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ పంచాయతీ, బంజర, రేగులగూడెం పంచాయతీల పరిధిలోని చిరుతానిపాడు, రాళ్లచెలక, బూసురాయి, పెద్దకలశ గ్రామాల్లో తాగునీరు దొరకడం లేదు. సుమారు 120మందికి పైగా ఆదివాసీ గిరిజనులు నివాసం ఉంటున్న పెద్దకలశలో ఒకే ఒక్క బోరు ఉంది. ఆ బోరు నీరు గ్రామస్తులకు సరిపోవడంలేదు. దీంతో కిలోమీటర్ దూరంలో ఉన్న వాగు నీటిని తెచ్చుకుంటున్నారు. చిరుతానిపాడు గ్రామంలో గతేడాది ఒక చేతి పంపు ఏర్పాటు చేసినా ప్రస్తుతం నీళ్లు సక్రమంగా రావడంలేదు. రాళ్లచెలక, బూసురాయి గ్రామాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. కావడ్లు, బిందెలు, బుర్రలతో సుదూర ప్రాంతాల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఎండలకు చెలిమల్లో కూడా ఊట సక్రమంగా రావడంలేదని ఆదివాసీలు వాపోతున్నారు. -
తీరొక్క గోస
మక్క రైతు.. ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఇటీవల వర్షాలతో పంట కొంత దెబ్బతింది. అయినా ప్రభుత్వం ధర రూ.2,400 వస్తుందని సంతోషపడితే కేంద్రం ఏర్పాటు కాలేదు. బయట వ్యాపారులకు రూ.1,600, రూ.1,700కు అమ్మితే పెట్టుబడి కూడా రాదు. అధికారులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నా. – అరెం నరసింహారావు, గుండాలసాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని మొక్కజొన్న సాగు చేసిన రైతాంగం పంట అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరవక, తెరిచిన చోట కొనుగోళ్లు జరగక పడిగాపులు కాస్తున్నారు. అవసరమైన చోట కాకుండా ఇతర ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటుచేయడం, కొనుగోలు చేసిన చోట లారీలు సమకూర్చకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఇదేఅదునుగా ప్రైవేట్ వ్యాపారులు ధరలో కోత విధించి దోచుకుంటుండడం రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. సంతోషం లేదు.. వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురవడం, భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉండటంతో ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. ఖమ్మం జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెంలో 73 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. సాగు సమయాన రైతుల్లో ఆనందం వ్యక్తమైనా కొనుగోళ్ల వరకొచ్చే సరికి నిరాశే ఎదురవుతోంది. బహిరంగ దోపిడీ మొక్కజొన్న కోతలు పూర్తయి పంట ఇంటికి వచ్చే సమయానికి ధర గిట్టుబాటు కాకపోవడం రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా, బహిరంగ మార్కెట్లో నాణ్యత సాకుతో రూ.1,800 నుండి రూ.2వేల మధ్యే వ్యాపారులు కొనుగోలు సాగిస్తున్నారు. తద్వారా క్వింటాకు దాదాపు రూ.400 నుండి రూ.600 వరకు నష్టం జరుగుతోంది. ఈ కారణంగా పెట్టుబడి ఖర్చు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళన బాట మార్క్ఫెడ్ కేంద్రాల్లో ఆలస్యంతో రైతులు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొన్నిచోట్ల బస్తాలు లేకపోవడం, బస్తాలు ఉన్న చోట్ల కాంటా పూర్తయినా లారీలు రాకపోవడంతో సమస్య ఎదురవుతోంది. ఈ కారణంగానే కొణిజర్లలో రైతులు శనివారం రాస్తారోకో చేపట్టారు. అలాగే, తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఆందోనకు దిగారు. అసలే అరకొరగా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అవి కూడా అవసరమైన చోట ఏర్పాటుచేయలేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.గుండాల మండల వ్యాప్తంగా సుమారు 20వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగైంది. ఖరీఫ్లో పీఏసీఎస్ల ద్వారా కొనుగోలు చేసిన అధికారులు ఈసారి ఇప్పటివరకు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే వారంలోగా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కానీ తేమశాతం పూర్తిగా పోయి మొక్కజొన్న పంట కల్లాల్లోనే పాలిపోతోంది. దీంతో చేసేదేం లేక స్థానిక వ్యాపారులకు అమ్ముతున్న రైతులు క్వింటాపై రూ.500 మేర నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో సాగు బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడంతో మార్క్ఫెడ్ ఆధ్వర్యాన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈమేరకు ఖమ్మం జిల్లాలో 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనిమిది కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించినా అధికారుల నిర్లక్ష్యంతో ఫలితం దక్కడం లేదు. పంట సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఈ కేంద్రాలు ఏ మూలకు సరిపోవని చెబుతుండగా.. అవసరమైన చోట కేంద్రాలు ఏర్పాటుచేయలేదనే విమర్శలు వస్తున్నాయి. తేమ శాతం ఎక్కువగా ఉందని నిరాకరిస్తుండడంతో కేంద్రాల్లో పంట ఆరబోసి రైతులు ఎదురుచూస్తున్నారు. అంతేకాక ఆన్లైన్ ఎంట్రీలు, ఆధార్ లింకింగ్, పట్టాదారు పాస్ పుస్తకాల తనిఖీ పేరుతో తిప్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
క్రికెట్ టోర్నీకి ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక
ఖమ్మంస్పోర్ట్స్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యాన ఈ నెల 20 నుంచి వరంగల్లో జరగనున్న సమ్మర్ క్రికెట్ లీగ్ టోర్నీకి ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కూరపాటి ప్రదీప్ ఆదివారం జెర్సీలను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఖమ్మం లయన్స్ పేరిట ఒక జట్టును ఎంపిక చేశామని తెలిపారు. జట్టు కెప్టెన్గా ఇమ్రాన్ (ఖమ్మం) వ్యవహరించనుండగా, ఎం.పవన్, సూర్య, కరుణాకర్, వరప్రసాద్, ఆర్యన్, రిత్విక్, రుషికుష్, జీవన్, ఉజ్వల్ ఎంపికయ్యారని చెప్పారు. కోచ్గా జి.వీరేశ్, అసిస్టెంట్ కోచ్గా సుధాకర్, మేనేజర్గా జకీర్ వ్యవహరిస్తారని తెలిపారు. చిన్నారికి ప్రాణం పోసిన వైద్యులుఇల్లెందు: ఇల్లెందు ఏరియా వైద్యశాలలో ఓ శిశువును వైద్యులు ప్రాణాపాయం నుంచి తప్పించారు.ఆదివారం గుండాలమండలం నాగా రం గ్రామానికి చెందిన నవీన్ తన మూడు నెలల శిశువు అభినేహాన్ను హృదయ స్పందన సరిగ్గా లేని స్థితిలో ఇల్లెందు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు భగత్సింగ్ తన బృందంతో అత్యవసర చికిత్స అందించి, తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు. అలాగే, అంబులెన్స్లో చిన్నారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి, ఖమ్మం తరలించారు.వైద్యుడు భగత్సింగ్, వైద్య బృందానికి చిన్నారి కుటుంబ సభ్యు లు కృతజ్ఞతలు తెలిపారు. వారిని డీసీహెచ్ఎస్ జి.రవిబాబు, వైద్యశాల సూపరింటెండెంట్ జి.హర్షవర్దన్ సైతం అభినందించారు. మే 3వ తేదీ వరకు రైల్వేగేట్ మూసివేత కారేపల్లి: కారేపల్లి – ఇల్లెందు రైల్వేలైన్ పరిధి లోని సూర్యతండా – అప్పాయిగూడెం మధ్య ఉన్న గేట్ను మే 3వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గేటు వద్ద ట్రాక్, రోడ్డు మరమ్మతుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సూర్యతండా, చండ్రళగూడెం గ్రామాల ప్రజలు, వాహనదారులు ఇల్లెందు వెళ్లేందుకు కారేపల్లి మీదుగా దారి మళ్లించాలని రెవెన్యూ అధికారులకు రైల్వే అధికారులు లేఖ అందజేశారు. నటుడు ప్రకాష్రాజ్పై పోలీసులకు ఫిర్యాదుభద్రాచలంటౌన్: శ్రీ రాముడిపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశారంటూ సినీనటుడు ప్రకాష్ రాజ్పై ఆదివారం భద్రాచలం పోలీసుస్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్రఎగ్జిక్యూటివ్ సభ్యుడు కుంజా ధర్మారావు ఆధ్వర్యాన నాయకులు పోలీసులకు ఫిర్యాదుపత్రం అందజేశారు. ఇటీవల ఓ వేదికపై మా ట్లాడిన రామాయణంపై ప్రకాష్రాజ్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనో భావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయనపై కేసు నమోదు చేయాలని కోరా రు. బీజేపీ నాయకులు కుంజా సంతోష్, ముత్యాల శ్రీనివాస్, నాగబాబు, రాంమోహన్రావు తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బతో వృద్ధురాలు మృతిదమ్మపేట: మండలంలోని వడ్లగూడెం గ్రామంలో వడదెబ్బ కారణంగా వృద్ధురాలు మృతి చెందిందని, ఆమె బంధువులు తెలిపారు. గ్రామానికి చెందిన వల్లెపు వెంకటలక్ష్మి (60) శనివారం దైవ దర్శనం కోసం భద్రాచలం వెళ్లి అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చింది. అనంతరం ఆమె అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. -
నిమ్మ.. ధరహాసం!
వేసవికాలం వచ్చిందంటే నిమ్మకాయలకు డిమాండ్ బాగా ఉంటుంది. నిమ్మరసంతో చేసే షర్బత్ శరీరానికి కావాల్సిన శక్తిని అందించి వేసవి తాపం నుంచి ఉపశమనం కల్గిస్తుండడంతో వీటిని గిరాకీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలించక నిమ్మకాయ దిగుబడి తగ్గడంతో బహిరంగ మార్కెట్లో ధర అమాంతం పెరిగింది. దీంతో వినియోగదారులకు ఆర్థిక భారంగా మారింది. – ఇల్లెందురూరల్గతంలో ఎన్నడూ లేని విధంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 150 ఎకరాల్లో నిమ్మ తోట సాగవుతోంది. వేసవిలో దిగుబడినిచ్చే నిమ్మసాగుకు నీటి అవసరం అధికంగా ఉంటుండగా ఈ వేసవిలో నీటిలభ్యత తరిగిపోయి సరైన నీటి తడులను రైతులు అందించలేకపోతున్నారు. దీనికితోడు కొన్నేళ్లుగా మిర్చి, మామిడితోటలకు పరిమితమైన నల్ల తామర పురుగు గతేడాది నుంచి నిమ్మతోటలనూ ఆశిస్తోంది. దీంతో పూత దశలోనే పురుగు ఆశించి రాలిపోవడం, పిందె దశలోనే కాయలు రాలిపోవడం, సైజుకు రాకముందే కాయలు నల్లటి మచ్చలతో నాణ్యత కోల్పోవడం, కాయలు చిన్నసైజుకే పరిమితమవడం వంటి కారణాలు ఈ ఏడాది దిగుబడిపై తీవ్రప్రభావం చూపిందని రైతులు వా పోతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సాధారణం కంటే దిగుబడి చాలావరకు తగ్గిందని చెబు తున్నారు. నిమ్మ ధరకు రెక్కలు.. నిమ్మ రైతులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. పంట దిగుబడి భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతుండగా మార్కెట్లో మాత్రం నిమ్మకాయలకు మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక ధర పలుకుతోంది. డిమాండ్కు తగినంత సరుకు మార్కెట్కు రాకపోవడంతో నిమ్మకాయ ధరలకు రెక్కలొచ్చాయి. వ్యాపారులు ఎక్కు వ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నా.. చేతిలో పంట లేకపోవడంతో రైతులకు ఆశించిన లాభాలు రావడం లేదు. ఈ ఏడాది ‘నిమ్మ’దించిన సాగుప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నిమ్మకాయ ధర రూ.5 నుంచి రూ.10 వరకు ఽపలుకుతోంది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం మార్కెట్కు వస్తున్న వినియోగదారులు కాయల సైజును చూసి నిర్ఘాంతపోతున్నారు. కొనుగోలు చేసిన కాయ నుంచి రసం ఆశించిన మేర రాకపోవడంతో వినియోగదారులు నష్టపోవాల్సి వస్తోంది. డిమాండ్కు అనుగుణంగా దిగుబడి లేకపోవడం, మార్కెట్లోఽ ధర అధికంగా ఉండడంతో కాయలు పక్వానికి రాకముందే రైతులు వాటిని కోసి మార్కెట్కు తరలిస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
కలెక్టర్ అంకిత్సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు, మీ సేవ కేంద్రాల మేనేజర్లతో ఆదివారం ఆన్లైన్ ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతీ రైతుకు 14 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య (ఫార్మర్ ఐడీ) కేటాయించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. భూమి కలిగిన ప్రతీ రైతుకు సంబంధించిన భూ యాజమాన్య వివరాలు, వ్యక్తిగత సమాచారం ఆధారంగా ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందిస్తారని చెప్పారు. రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ రికార్డులను రైతుల ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసి ఫార్మర్ ఐడీ జారీ చేస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఫార్మర్ రిజిస్టేషన్ను అనుసంధానం చేస్తారని చెప్పారు. ఇక నుంచి పీఎం కిసాన్ పథకం లబ్ధి పొందాలన్నా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరిగా ఉండాలన్నారు. రాబోయే వర్షాకాలం సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రైతు భరోసా, రుణమాఫీ, మొక్కజొన్న, పత్తి, ధాన్యం కొనుగోళ్లు, యూరియా, ఇతర ఎరువుల పంపిణీకి ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని వివరించారు. రైతులు ఆధార్ కార్డు, భూ యాజమాన్య పాస్బుక్, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్తో సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించవచ్చని, సమీప మీ సేవ కేంద్రాలను సంప్రదించి ఫార్మర్ ఐడీ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. అశాసీ్త్రయమైన కోర్సులను ప్రవేశపెట్టొద్దు ఖమ్మం సహకారనగర్: ఉన్నత విద్యలో అశాసీ్త్రయమైన కోర్సులుప్రవేశపెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఆదివారం జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు చెలిమల రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన విద్యాసదస్సులో వివిధ అంశాలపై విశ్లేషకుడు డాక్టర్ అందె సత్యం, విశ్రాంత ఆచార్యులు కోయ కోటేశ్వరరావు, ఎడమ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. విశ్వవిద్యాలయాలే స్వయంగా నిధులు సమకూర్చుకుని నడపడం వల్ల ధనిక విద్యార్థులకే అవకాశం దక్కుతోందన్నారు. ఇది ఎంత మాత్రం సరైన విధానం కాదని తెలిపారు. అలాగే, గ్రేడింగ్ విధానం ద్వారా డిగ్రీ చదివే వారి సంఖ్య తగ్గిపోతుందని పేర్కొన్నారు. అంతేకాక ప్రీ ప్రైమరీ విధానం పిల్లల్లో మనోవికోసాన్ని పెంచేలా ఉండాలే తప్ప చదువును ఆ స్థాయిలో చేర్చొద్దని సూచించారు. అనంతరం పలు ప్రతిపాదనలను ఆమోదించారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మోహన్, కె.రామారావుతో పాటు అలవాల నాగేశ్వరరావు, శివన్నారాయణ, ఎల్వీ.రెడ్డి, అరుణశ్రీ, మల్లెంపాటి వీరభద్రరావు, వంజాకు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు. తహసీల్లో ప్రజావాణి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తునికాకు ధర పెంపు
గుండాల: గిరిజనుల వేసవి పంట తునికాకు సేకరణకు సమయం ఆసన్నమైంది. గతేడాది 50 ఆకుల తునికాకు కట్టకు రూ. 3.31 పైసలు ఉండగా, ఈ ఏడాది రూ.3.42 పైసలుగా ధర నిర్ణయించారు. మండలంలోని చెట్టుపల్లి గ్రామంలో శనివారం తునికాకు రేటుపై కార్మికులు, తునికాకు పోరాట కమిటీ, కాంట్రాక్టర్ల మధ్య చర్చలు జరిగాయి. గతేడాది ప్రభుత్వం ధర రూ.3.30 ఉండగా, ఈ ఏడా ది 10 పైసలు పెంచి రూ. 3.40 ధర నిర్ణయించింది. కాంట్రాక్టర్లు మరో 5 పైసలు పెంచా లని పోరాట కమిటీ డిమాండ్ చేయగా, చర్చల అనంతరం 2 పైసలు పెంచారు. దీంతో 50 ఆకుల తునికాకు కట్టకు ధర రూ. 3.42గా నిర్ణయించారు. మిగతా ధరలు కూడా... గతంలో కల్లేదార్ల కమీషన్, హ్యాండ్లింగ్ చార్జీలను 10శాతం పెంచారు. కల్లేదార్ల కమీషన్ రూ. 190.05, ఉల్టా, పల్టా కుచ్చాలకు రూ. 96.62, భర్తీకి రూ. 115.95గా ధర నిర్ణయించారు. తునికా కు సేకరణ సమయంలో ప్రమాదానికి గురైతే సంబంధిత కాంట్రాక్టర్లు ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం పట్టణానికి తరలించేందుకు వాహన సౌకర్యం కల్పించాలని, బీమా వర్తింపచేయాలని నాయకులు కాంట్రాక్టర్లను కోరారు. ఈ నిబంధనలు కొత్తగూడెం డివిజన్ పరిధిలోని గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, పినపాక, బూర్గంపాడు, కరకగూడెం, అశ్వాపురం, మణుగూరు, లక్ష్మీదేవిపల్లి, ముల్కలపల్లి, అన్నపురెడ్డి పల్లి, పాల్వంచ, చండ్రుగొండ, ఇల్లెందు, బయ్యారం, గంగారం, పాకా ల, గూడూరు, మహబూబాబాద్ మండలాల్లో అమలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపా రు. చర్చల్లో కాంట్రాక్టర్లు అబ్దుల్ రెహమాన్, అతహూల్ రెహమాన్, అజిజుల్ రెహమాన్, సుపుద్దీన్, సంపత్రెడ్డి, నాగరాజు, ముంతాజిమ్, సయ్యద్ అజ్జు, ఖుద్దూస్, తునికాకు పోరాట కమిటీ నాయకులు గుమ్మడి నర్సయ్య, ఆవునూరి మధు, ముక్తి సత్యం, మాచర్ల సత్యం, రేసు ఎల్లయ్య, రమేష్, కొమరం శాంతయ్య, బానోత్ ఊక్లా, గోవింద నర్సింహారావు, పూనెం శ్రీను, సైదులు, సాగర్, ఆశోక్, కిషన్, గోపన్న తదితరులు పాల్గొన్నారు. -
బైక్ చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి
అశ్వాపురం: మండలపరిధిలోని నెల్లిపాక గ్రామశివారులో శనివారం తెల్లవారుజామున మొండికుంట–భద్రాచలం రహదారి వెంట బైక్ చెట్టుకు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మండల పరిధిలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన కొమరం మహేష్ (34) బంధువులు అనారోగ్యంతో భద్రాచలం ఆస్పత్రి లో ఉండగా చూడటానికి వెళ్లేందుకు బైక్పై బయలుదేరాడు. నెల్లిపాక శివారులో మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందా డు. ఉదయం స్థానికులు ఆయనను గుర్తించి ఇచ్చిన సమాచారంతో సీఐ అశోక్రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య మల్లూరమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రేగులగండిలో విద్యార్థి గల్లంతుమణుగూరుటౌన్: మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదివే విద్యార్థి రేగులగండి చెరువులో గల్లంతైన ఘటన మణుగూరులో శనివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గుట్టమల్లారంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివే ముగ్గురు విద్యార్థులు నక్కా హర్షవర్దన్, శశిధర్, గిరిధర్.. ఒక్కపూట బడులు కావడంతో మధ్యాహ్నం సమయంలో రేగులగండి చెరువు వద్దకు వెళ్లారు. లోపలికి దిగాక హర్షవర్దన్ గల్లంతయ్యాడన్నాడు. మిగిలిన విద్యార్థులు బాధిత కుటుంబ సభ్యులకు తెలపగా, వారు పోలీసులను సంప్రదించి జాలర్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థిది మున్సిపాలిటీలోని ఆదర్శ్నగర్ కాగా, ఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సీఐ నాగబాబు సందర్శించారు. మహిళ అదృశ్యంపై కేసుభద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణ పరిధిలోని మెడికల్కాలనీకి చెందిన రాజ్యలక్ష్మి ఈ నెల 16వ తేదీన ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో శనివారం ఆమె కుమారుడు గౌరీ శశాంక్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
శిశుగృహం పరిసరాలపై దృష్టి
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని బ్రిడ్జిసెంటర్ లోని శిశుగృహం పరిసరాల పరిశుభ్రతపై భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ స్పందించారు. సమీపంలో ఉన్న పండ్ల దుకాణాల వద్ద పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించాలని దుకాణాల నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం చిన్నారుల బాగోగులపై ఆరా తీశారు. కార్యక్రమంలో శిశుగృహం మేనేజర్ చంటిబాబు, తదితరులు పాల్గొన్నారు.పీజీ కోర్సులకు ముందడుగు చుంచుపల్లి: ప్రభుత్వం వైద్య విద్యను బలోపేతం చేయడానికి తీసుకున్న కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో తొలిసారిగా స్టాండ్ అలోన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులు ఏరియా ఆస్పత్రుల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కింగ్ కోటి, పఠాన్చెరు ఆస్పత్రులతో పాటు భద్రాచలం ఏరియా ఆస్పత్రి కూడా ఎంపిక కావడం విశేషం. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్ విభాగాల్లో ప్రతి విభాగానికి 4 చొప్పున పీజీ సీట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం డీసీహెచ్ఎస్ జి.రవిబాబును డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయానికి పిలిపించగా, దరఖాస్తును సోమవారం సమర్పించనున్నారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పీజీ కోర్సులు ప్రారంభమైతే గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు, వైద్యవిద్యలో ఒక ముందడుగుగా నిలుస్తుందని డీసీహెచ్ఎస్ రవిబాబు వివరించారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ బదిలీభద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్ బదిలీ అయ్యారు. ఆయనను మెదక్ జిల్లా అదనపు ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్కు చెందిన విక్రాంత్ కుమార్ 2025 జనవరిలో భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మెదక్ అదనపు ఎస్పీగా ఉన్న ఎస్.మహేందర్ స్థానంలో ఆయనను నియమించారు. అయితే, భద్రాచలం ఏఎస్పీగా మాత్రం ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. -
సేవలకు అంతరాయం లేకుండా..
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనుల ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఏడాది వరకే గడువు ఉండటంతో యుద్ధప్రాతిపదికన, నిత్యం భద్రాచలం వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దేవస్థానం అభివృద్ధిలో తొలి విడతే కీలకం కానుంది. రూ.75 కోట్లతో గోదావరి ఒడ్డున సుదర్శన చక్రం, రూ. 180 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, రూ. 96 కోట్లతో పరిసర ప్రాంతాల అభివృద్ధి, ఇతర కార్యాలయాల నిర్మాణం చేపట్టనున్నారు. స్వామివారికి నిత్య ఆరాధన, నివేదనలతో అంతరంగిక పూజలు నిర్వహిస్తూనే మరోవైపు భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించాల్సి ఉంది. కాగా, పనులను ప్రారంభించాక భక్తులకు ఆర్జిత సేవలను నిలిపివేసి సాధారణ దర్శనాలను కల్పించే అవకాశం ఉంది. పకడ్బందీ ప్రణాళిక.. మార్చి 2027 నాటికి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2027 జూలై చివరి వారంలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. అప్పటిలోగా ఆలయ ప్రధాన పనులను పూర్తి చేయాల్సి ఉంది. జూలై, ఆగస్టు నెలల్లో గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ముక్కోటి, శ్రీరామనవమి ప్రధాన ఉత్సవాలు ఉన్నాయి. ఈ ఉత్సవాలకు సుమారు లక్ష వరకు భక్తులు తరలి వస్తారు. ప్రధాన ఆలయం మినహా ఇతర ప్రాంతాలన్నింటిలోను ఏడాదంతా పనులు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో పకడ్బందీ ప్రణాళికతో, యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా, ఇది అధికారులకు కత్తి మీద సాము లాంటిదనే చెప్పవచ్చు. ఇటీవల పర్యటించిన మంత్రి పొంగులేటి ఇటీవల భద్రాచలంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారుల ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల వేగవంతానికి సిబ్బందిని పెంచాలని, ప్రాకారాలు, ఫుట్పాత్లు, మాఢ వీధులు తదితర ప్రతిపాదిత నిర్మాణాలకు ఆన్ గ్రౌండ్ మార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాత నిర్మాణ శైలిని అనుకరిస్తూనే కొత్త సాంకేతికతను మిళితం చేస్తూ పనులు చేపట్టాలన్నారు. రామదాసు కాలం నాటి రాళ్లను తిరిగివినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తర భాగంలో రిటైనింగ్ గోడలకు సమస్యలు తలెత్తకుండా, పనులను చేపట్టాలని సూచించారు. ఇప్పటికే పలుమార్లు పత్రికలలో కథనాలు వచ్చిన గోదావరి ఘాట్ నుంచి దేవస్థానం వరకు నేరుగా కనెక్టివిటీ విషయమై మంత్రి స్పందించారు. నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని ఆదేశించారు. అయితే రోడ్డు నిర్మాణంతోపాటే తీగల వంతెన కూడా నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.రామాలయ అభివృద్ధికి పక్కా ప్రణాళిక ఆవశ్యం -
చిరుధాన్యాలు తీసుకోవాలి
దుమ్ముగూడెం: చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు అందించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. శనివారం మండలంలోని నరసాపురంలోని రైతువేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. చిన్నపిల్లల్లో రక్త వృద్ధి, రోగ నిరోధక శక్తి, జీవక్రియలు మెరుగుపరిచి శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి చిరుధాన్యాలు క్రమం తప్పకుండా అందించాలన్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలని, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల ఆహారం అందించొద్దని, ఇంట్లో వండిన ఆహారాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. అనంతరం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. అనంతరం నాలుగు సెక్టార్ల అంగనవాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను అందించారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ స్వర్ణలతలెనీనా, తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీడీఓ వివేక్రామ్, సీడీపీఓ జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, ఏపీఎం జగదీశ్, సత్యనారాయణ, సర్పంచులు కుంజా కనకరత్నం, మట్ట వెంకటేశ్వర్లు, పోడియం సుబ్బారావు, కల్లూరి ఆదినారాయణ, పలు గ్రామాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా సంక్షేమ వారం
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న ఏడు రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. వీసీకి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాల్లో వంటగది, పారిశుద్ధ్యం, మరమ్మతు పనులు చేపడతామని, విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేస్తామని, రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ జనగణన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలన్నారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, పీడీ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.కలెక్టర్ అంకిత్ -
73 మందితో జిల్లా కాంగ్రెస్ కమిటీ..
కొత్తగూడెంఅర్బన్: జిల్లా కాంగ్రెస్ కమిటీని 73 మందితో ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న తెలిపారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులను నియమించినట్లు పేర్కొన్నారు. కమిటీలో ఉపాధ్యక్షులు 9 మంది, జనరల్ సెక్రెటరీలు 15 మంది, ఒక ట్రెజరర్, ఐదుగురు అధికార ప్రతినిధులతోపాటు సెక్రెటరీలు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉన్నారని వివరించారు. భద్రాచలం ఆస్పత్రిలో కాయకల్ప బృందం తనిఖీభద్రాచలంఅర్బన్: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ముగ్గు రు సభ్యులతో కూడిన కాయకల్ప బృందం శనివారం సందర్శించింది. 200 పడకల ఆస్పత్రిలో కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం సభ్యులు డాక్టర్ రఘు పూజా రి, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ శైలజ పరిశీలించారు. క్యాజువాలిటీ, శస్త్ర చికిత్సల విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రి వ్యర్థాల సేకరణపై శానిటేషన్ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. రోగుల కేసుషీట్లను పరిశీలించి ఓపీ, ఐపీల సంఖ్యను గుర్తించారు. కాన్పుల విభాగం వార్డు లు, బ్లడ్ బ్యాంక్, రక్తశుద్ధి వార్డు, ఐసీయూ, చిన్నపిల్లల విభాగాలను తనిఖీ చేశా రు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ, ఆర్ఎంఓలు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.


