Bhadradri
-
ఆగని వన్యప్రాణుల వేట..!
లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీకాలనీ అటవీ శివారులో ఈనెల 2న తాగునీటి కోసం బయటకు వచ్చిన రెండు దుప్పులు వస్త్రం సమ్మయ్య, కారెంగుల సాంబయ్య పెట్టిన ఉచ్చుల్లో పడ్డాయి. వీటిని చంపగా అధికారులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే, వేసవి మొదలుకాగానే దాహంతో బయటకు వచ్చే వన్యప్రాణులను హతమార్చడం సాధారణమైపోయింది. చుంచుపల్లి: వేసవి ఆరంభంలోనే జిల్లాలో వన్యప్రాణుల వేట మొదలైంది. ఉచ్చులు, విద్యుత్ వైర్లను అమర్చి, వేటగాళ్లు అటవీ జంతువులను చంపతున్నారు. నదులు, చెరువులు, వాగుల వద్ద పొదల్లో ఉరులు, ఉచ్చులను బిగించి వేటగాళ్లు వన్యప్రాణులను పొట్టన పెట్టుకుంటున్నారు. జంతువుల వేటకు ఎక్కువగా ప్రమాదకరమైన విద్యుత్ తీగలనే వాడుతున్నట్లు తెలుస్తోంది. అటవీ సిబ్బంది నిర్లక్ష్యం, రాత్రిపూట అటవీ ప్రాంతాల్లో సరైన నిఘా లేకపోవడంతో వేటగాళ్లకు అనుకూలంగా మారుతోంది. విద్యుత్ తీగలు కొన్నిసార్లు మనుషుల ప్రాణాలూ తీస్తున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వేటగాళ్లు జంతువుల కొమ్ములు, మాంసం, గోళ్లు, చర్మం విక్రయిస్తున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతం జింకలు, అడవి పందులు, ముళ్ల పందులు, కొండ గొర్రెలు, ఎలుగుబంట్లు, దుప్పులు, ఉడుములు, నక్కలు, అడవి పిల్లులు, ముంగీసలు, ఇతర జంతువులకు అనువుగా ఉంది. వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, కిన్నెరసాని వంటి ఆరు అటవీ డివిజన్ల పరిధిలో 10.45 లక్షల ఎకరాల అడవులు విస్తరించి ఉన్నాయి. అడవి జంతువులను పెంచడం, వేటాడటం పూర్తిగా నిషేధం. మన పరిసరాల్లోనూ వాటిని మచ్చిక చేసుకోవడంతో పాటు మాంసం కలిగి ఉండటం నేరమని వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 చెబుతోంది. ఈ చట్టంలోనూ ఇటీవల కొన్ని మార్పులు చేశారు. జంతువులను వేటాడే వారికి ఏడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా.. నేరాన్ని బట్టి ఈ రెండింటినీ ఏకకాలంలో అమలు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. కొన్ని జంతువులను వేటాడితే బెయిల్ కూడా లభించదు. గ్రామాల్లోకి అడవి జంతువులు వస్తే హాని తలపెట్టకుండా అధికారులకు తెలపాల్సి ఉంటుంది. అయితే, వేసవిలో రాత్రి సమయాల్లో దప్పిక తీర్చుకునేందుకు నీటి వనరులను అన్వేషిస్తూ గ్రామాల సరిహద్దుల్లోకి జంతువులు రావటం సాధారణంగా మారింది. ఇదే అదునుగా వేటగాళ్లు నీటి కుంటలు, ప్రధాన కాల్వల వద్ద విద్యుత్ వైర్లు, ఉచ్చులు ఏర్పాటు చేసి వధిస్తున్నారు. విద్యుత్ తీగలు అమర్చడంతో మనుషులు, పశువుల ప్రాణాలు కూడా పోతున్నాయి. వేటగాళ్లు వన్య ప్రాణులను వేటాడి మాంసం, చర్మం, కొమ్ములు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కిన్నెరసాని, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, దమ్మపేట, చంద్రుగొండ, దుమ్ముగూడెం, పినపాక, ములకలపల్లి, జూలూరుపాడు, టేకులపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో జంతువుల వేట సాగుతున్నట్లు సమాచారం. జిల్లాలో నాలుగేళ్లలో 50 కేసులకుపైగా నమోదయ్యాయని అటవీ అధికారులు తెలిపారు. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం వస్తుంటాయి. వేటగాళ్లు కరెంట్ తీగలు, ఉచ్చులు అమర్చి వేటాడుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా పెట్టాం. అటవీ జంతువులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచుతాం. వేటకు పాల్పడితే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటాం. –కిష్టాగౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి 2021 డిసెంబర్లో దమ్మపేట మండలం రంగువారిగూడేనికి చెందిన తండ్రీకొడుకులు ప్రొద్దుటూరి డానియేలు, రాకేశ్ వేటకు వెళ్లి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతిచెందారు. 2022 మార్చిలో కొత్తగూడెం పట్టణానికి చెందిన సునీల్కుమార్ చుంచుపల్లి మండలం పెనుబల్లి అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు తగలడంతో మృత్యువాత పడ్డాడు. 2023 మార్చిలో ఫారెస్ట్ స్పెషల్ టీం కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద పులి చర్మం అమ్మడానికి వెళ్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. సుజాతనగర్ మండలం ఒడ్డుగూడెంలో కుక్కలదాడిలో చుక్కల దుప్పి చనిపోయింది. -
సిబ్బంది అప్రమత్తతతోనే ప్రాణరక్షణ
కరకగూడెం/చండ్రుగొండ: అత్యవసర సేవల సిబ్బంది అప్రమత్తంగా ఉండడం ద్వారా ఆపద లో ఉన్న వారి ప్రాణాలకు రక్షణ లభిస్తుందని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆడిట్ ఆఫీసర్ కిషోర్ తెలిపారు. మండలంలోని జానంపేట, కరకగూడెంల్లో 108 వాహనాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య పరికరాలు, మందుల లభ్యతను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. భద్రాచలం డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మనోహర్, ఈ ఎంటీలు, పైలట్లు బట్టా సుమలత, పుల్లయ్య, రమ్యకృష్ణ, గాడిపల్లి సాయి, సాంబశివరావు, తేజ పాల్గొన్నారు. అలాగే, చండ్రుగొండలోని 108 ఆంబులెన్స్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. సెంట్రల్ ఆఫీసర్ ఫయాజ్, ఉద్యోగులు పాల్గొన్నారు. రిటైర్డ్ సేల్స్మెన్తో బియ్యం పంపిణీపాల్వంచరూరల్: ఉద్యోగవిరమణ చేసిన జీసీ సీ సేల్స్మెన్ తిరిగి బియ్యం పంపిణీ చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పాల్వంచ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) బ్రాంచ్ పరిధిలోని కిన్నెరసాని, ఉల్వనూరు గ్రామాల్లో సేల్స్ డిపోలకు లక్ష్మణ్ సేల్స్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, డిసెంబర్ 31న ఉల్వనూరు సేల్స్మెన్ వెంకట్రావు ఉద్యోగ విరమణ చేయ గా, ఆయనతో కిన్నెరసాని సేల్స్మెన్గా లక్ష్మణ్ పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈనెల రేషన్ బియ్యం పంపిణీ కిన్నెరసానిలో వెంకట్రావు నేతృత్వాన చేపట్టగా, అవకతవకలు జరిగితే ఎవరు బాధ్యులనేది చర్చనీయాంశంగా మా రింది. ఈ విషయమై జీసీసీ మేనేజర్ లక్ష్మణ్ వివరణ కోరగా.. రిటైర్డ్ ఉద్యోగితో పనిచేయించిన విషయాన్ని డీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొండికట్ట బీట్లో భూమి పరిశీలన పాల్వంచరూరల్: గతంలో ఆక్రమణకు గురై తిరిగి అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న భూమిని రాష్ట్ర ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్ఓ రాజశేఖర్ మంగళవారం పరిశీలించారు. పాల్వంచ మండలం యానంబైల్ రేంజ్లోని మొండికట్ట బీట్లో గతంలో అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసు కోగా పరిశీలించిన డీఎఫ్ఓ.. ఆ తర్వాత కిన్నెరసాని డీర్పార్కులో అభివృద్ధి పనులను సైతం పరిశీలించారు. పాల్వంచ వైల్డ్లైఫ్ డివిజన్ ఎఫ్డీఓ బి.బాబు, రేంజర్లు కవిత, మాధవి, సెక్షన్ ఆఫీసర్ కిషన్ పాల్గొన్నారు. కారు డ్రైవర్కు ఏడాదిన్నర జైలుసూపర్బజార్(కొత్తగూడెం): నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక మహిళ మృతికి కారణమైన డ్రైవర్కు ఏడాదిన్నర జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ మంగళవారం తీర్పు చెప్పారు. జూలూరుపాడు మండలం పడమటినర్సాపురానికి చెందిన నాచబోయిన ప్రశాంత్ ఇంట్లో తల్లిదండ్రులు నాచబోయిన వెంకన్న– లలిత 2016 ఏప్రిల్ 21న రాత్రి నిద్రిస్తున్నారు. పాల్వంచకు చెందిన నందిగామ పవన్కుమార్ తన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ఇంట్లోకి దూసుకెళ్లగా లలిత తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. అంతకుముందు మాచినపేటకు చెందిన లాకావత్ సాయికుమార్, బోడా అశోక్కుమార్ బైక్ను సైతం పవన్ తన కారుతో ఢీకొట్టగా గాయపడ్డారు. ఘటనపై అప్పటి ఎస్ఐ పి.శ్రీనివాస్, హెడ్కానిస్టేబుల్ కె.రాందాస్ దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు 14 మంది సాక్షులను విచారించాక పవన్కుమార్కు ఏడాదిన్నర జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బి.విశ్వశాంతి వాదించగా, ఎస్ఐ డి.రాఘవయ్య, పీసీ ఉపేందర్రావు సహకరించారు. -
చికిత్స ఎలా.. భోజనం నాణ్యత ఎంత?
● అశ్వారావుపేట, ఇల్లెందులో పర్యటించిన కలెక్టర్ అంకిత్ ● ఇల్లెందులో ఇద్దరు వార్డెన్ల సస్పెన్షన్కు ఆదేశం అశ్వారావుపేట: విధుల్లో చేరిన నాటి నుంచి పాఠశాలలు, ఆస్పత్రుల్లో తనిఖీలు చేస్తున్న కలెక్టర్ అంకిత్ మంగళవారం కూడా కొనసాగించారు. ఈమేరకు అశ్వారావుపేట మైనార్టీ గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైనారిటీ గురుకులంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించడమే కాక డైనింగ్ హాల్, స్టోర్ రూం నిర్వహణపై ఆరా తీశారు. నిల్వ ఉంచిన బెల్లం నాణ్యతపై సందేహం వ్యక్తం చేసి సరఫరాదారుల వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు తాజా సరుకులతో నాణ్యమైన ఆహారం అందించాలని, వడ్డించేముందు నాణ్యత పరిశీలనలో 8, 9, 10వ తరగతి విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆతర్వాత విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ ఆహార నాణ్యత, మెనూ అమలుపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ పాఠశాలలోనూ మధ్యాహ్న భోజనం తయారీని పరిశీలించారు. ఆతర్వాత ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లిన కలెక్టర్ రోజువారీ వైద్యసేవలపై ఆరా తీశాక డయాలసిస్ సెంటర్ను పరిశీలించారు. చికిత్స పొందుతున్న వారికి ఇచ్చే ఆహారం, కిచెన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ నాణ్యమైన ఆహారాన్ని అందించడమే కాక భోజనంలో గుడ్డు, అరటిపండు ఉండాలని ఆదేశించారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రతిపాదిన స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ కిషోర్, ఎంపీడీఓ అప్పారావు, మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజు, ఆర్ఎంఓ మౌనిక, గురుకులం ప్రిన్సిపాల్ టి.సంగీత తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతే ప్రధాన లక్ష్యం
సూపర్బజార్(కొత్తగూడెం): మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు భావించాలని ఎస్పీ రోహిత్రాజ్ సూచించారు. చుంచుపల్లిలోని షీ టీమ్స్, ఏహెచ్టీయూ కార్యాలయాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల నమోదు, దర్యాప్తు వివరాలు ఆరా తీశాక ఎస్పీ మాట్లాడారు. మహిళలు వారికి ఎదురయ్యే లైంగిక వేధింపులు, ర్యాగింగ్, బ్లాక్ మెయిలింగ్పై షీ టీమ్స్ను సంప్రదించొచ్చని తెలిపారు. నేరుగా రాలేకపోతే 87126 82131 నంబర్కు ఫోన్ చేసినా సిబ్బంది స్పందిస్తారని తెలిపారు. నిందితులను పిలిచించి తొలుత కౌన్సెలింగ్ ఇస్తారని, పరిస్థితి తీవ్రత ఆధారంగా కేసు నమోదు చేస్తారని చెప్పారు. కాగా, షీ టీమ్స్ సిబ్బంది రద్దీ ప్రదేశాల్లో గస్తీ కాస్తూ మహిళలు, విద్యార్థినులకు భరోసా కల్పించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మణ్, ఏఎస్సై నాగయ్య, సభ్యులు మల్లికాంబ, రాంబాబు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజ్ -
పంటకు మరో తడి..
● సాగుకు డోకా లేకుండా సాగర్ జలాలు.. ● రైతుల వినతులతో గడువు పొడిగింపు? ఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లాలో రబీ పంటల సాగు ఆఖరి దశలో ఉండగా ఇబ్బందులు ఎదురుకాకుండా సాగర్ జలాలు మరికొన్నాళ్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఈనెల 7వ తేదీతో సరఫరా నిలిపివేయాల్సి ఉంది. అయితే, రైతుల డిమాండ్ దృష్ట్యా మరికొన్నాళ్లు నీటి విడుదల కొనసాగించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించినట్లు సమాచారం. హైదరాబాద్లో తాజాగా నిర్వహించిన సమీక్షల్లో ఇంజనీర్ల నుంచి అందిన నివేదికలు, ఆయకట్టులో పంటల సాగుపై చర్చించారు. ఈమేరకు పంటలు ఎండి పోకుండా మరో తడి వరకు నీరు విడుదల చేయడానికి మంత్రి అంగీకరించినట్లు తెలిసింది. దీంతో మరో వారం నుంచి పది రోజుల వరకు సాగర్ జలాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 25వేల ఎకరాలకు అవసరం జిల్లాలోని రైతులు యాసంగిలో సాగర్ ఆయకట్టు కింద 2,54,250 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 90 శాతం పంటలకు నీటి అవసరం తీరింది. అయినా దాదాపు 25వేల ఎకరాలకు నీటి అవసరం ఉన్నట్లు అధికారులు నివేదించారు. ఈ పంటలన్నీ చివరి దశలో ఉన్నందున ఒక్క తడి అందిస్తే సాఫీగా చేతికొచ్చే అవకాశముంది. ఈమేరకు రైతుల విన్నపాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అంతేకాక జూలై వరకు ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా సాగర్ పరిధిలోని చెరువులను నింపాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం సాగర్ నుంచి పాలేరు వరకు 4,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, దిగువకు సుమారు 4వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 23 అడుగులకు గాను ప్రస్తుతం 21.5 అడుగులుగా ఉంది. ఈ నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ సాగు, తాగు అవసరాలకు మళ్లించాలని ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. చెరువులు ఎండిపోవు... సాగర్ జలాల పొడిగింపు నిర్ణయం జిల్లా రైతులకు ఉపశమనం కలిగించనుంది. ఇదే సమయాన తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. జిల్లాలో 1,400కి పైగా చెరువులు ఉంటే, అందులో 700 చెరువులకు సాగర్ జలాలు చేరతాయి. ఆయా చెరువుల్లో ఇప్పటికే 50 – 100 శాతం నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా చేపల వేట కోసం నీరు విడుదల చేస్తే తప్ప సాగర్ పరిధిలో చెరువులు ఎండిపోయే అవకాశం లేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో నేరుగా సాగర్ జలాలతో నిండే 236 చెరువులకు సుమారు 2 టీఎంసీలు అవసరమనే అంచనాతో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.జిల్లాలో సాగర్ జలాలు చేరే చెరువుల పరిధిలో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం లేదు. అయినా ప్రభుత్వ సూచనల మేరకు అన్ని చెరువులను నింపుతాం. ఇక పంటలు ఎక్కడా ఎండిపోకుండా నీరు అందించాం. కొన్నిచోట్ల ఇంకా నీరు అవసరమని విజ్ఞప్తులు అందుతున్నాయి. నిల్వల ఆధారంగా విడుదల చేసే అవకాశాన్ని పరిశీలిస్తాం. అయితే, తొలి ప్రాధాన్యత మాత్రం తాగు అవసరాలకు ఇస్తాం. – మంగళపూడి వెంకటేశ్వర్లు, సీఈ, జలవనరులశాఖ -
స్టాప్లు స్మార్ట్గా!
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నగరపాలక సంస్థ కీలక అడుగు వేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం నగరంలోని ఏడు ప్రాంతాల్లో రెండు రకాల అత్యాధునిక బస్షెల్టర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఈమేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ అర్బన్ మేనేజ్మెంట్(ఎన్ఐయూఎం) ప్రతినిధులు ఇప్పటికే మూడు డిజైన్లతో పాటు నిర్మాణ అంచనాలను కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు అందజేశారు. కేవలం కాంక్రీట్ కట్టడాలుగా కాకుండా పర్యావరణహితంగా, స్మార్ట్ ఫీచర్లతో ఈ షెల్టర్లు రూపుదిద్దుకోనున్నాయి. బస్ షెల్టర్లతో పాటు ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద సెక్యూరిటీ క్యాబిన్లు సైతం ఏర్పాటు చేయనున్నారు. ‘వెర్నాక్యులర్’ ఎలా ఉంటుందంటే... పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకునేలా ‘డిజైన్ అవేర్’ సంస్థ ప్రత్యేకంగా వెర్నాక్యులర్ బస్ షెల్టర్ నమూనా రూపొందించింది. స్టీల్ స్ట్రక్చర్పై వెదురు సూపర్ స్ట్రక్చర్, కాన్వాస్ కవర్తో షెల్టర్ నిర్మిస్తారు. అంతేకాక వేసవిలో ప్రయాణికులకు చల్లదనాన్ని ఇచ్చేలా మిస్టింగ్ సిస్టమ్(నీటి తుంపర్ల వ్యవస్థ) ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం షెల్టర్పై 2వేల లీటర్ల నీటి ట్యాంకు అమర్చుతారు. ఒక్కో షెల్టర్ 5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో ఉండి, చుట్టూ ప్లాంటర్లు, ల్యాండ్ స్కేపింగ్, స్టోన్ క్లాడింగ్తో ప్రకృతి ఒడిలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఒక్కో షెల్టర్ నిర్మాణానికి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. మెట్రో లుక్ ఈ– ఫ్రాస్కేప్స్ సంస్థ మెట్రో నగరాల తరహా రూపును ఇచ్చేలా ఎంఎస్ స్ట్రక్చర్ బస్షెల్టర్లను డిజైన్ చేసింది. 15 అడుగుల ఎత్తుతో ఉండే ఈ షెల్టర్లకు 10 ఎంఎం మందపాటి మల్టీవాల్ పాలీ కార్పొనేట్ షీట్తో కప్పు నిర్మిస్తారు. ఇందులో ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలతో పాటు రద్దీ సమయంలో ఆసరా కోసం స్టాండింగ్ బెంచీలు కూడా ఉంటాయి. మున్సిపాలిటీకి ఆదాయం చేకూర్చేలా ప్రకటనలు ప్రదర్శించుకునేందుకు ప్రత్యేక స్థలం కేటాయిస్తారు. ఈ మోడల్ బస్ షెల్టర్ల నిర్మాణానికి రూ.6లక్షల చొప్పున వ్యయం కానుండగా.. నాలుగు ప్రాంతాలను గుర్తించారు. ఏడు ప్రాంతాల ఎంపిక వెర్నాక్యులర్ రూపుతో పాటు ఎంఎస్ స్ట్రక్చర్లో బస్ షెల్టర్ల నిర్మాణానికి కేఎంసీ అధికారులు ప్రధాన ప్రాంతాలను గుర్తించారు. వెర్నాక్యులర్ డిజైన్తో ఐటీ హబ్, ప్రభుత్వ ఆస్పత్రి, ఖానాపురం ఎన్నెస్సీ కెనాల్ బ్రిడ్జిపై షెల్టర్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఇక ఎంఎస్ స్ట్రక్చర్తో బల్లేపల్లి స్టేజీ, ఇందిరానగర్ పర్ణశాల, ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళా శాల, ఇల్లెందు క్రాస్లోని విద్యుత్శాఖ స్టోర్ వద్ద నిర్మించనున్నారు.ఖమ్మంలో అత్యాధునిక హంగులతో బస్షెల్టర్లు ఖమ్మం అభివృద్ధితో పాటే మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆధునాతన హంగులు, సౌకర్యాలతో కూడిన బస్ షెల్టర్లు నిర్మించనున్నాం. హైదరాబాద్కు చెందిన ఆర్కిటెక్చర్లు ఇప్పటికే నమూనాలు సమర్పించారు. త్వరలోనే వీటి నిర్మాణాలను ప్రారంభిస్తాం. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ బస్ షెల్టర్లతో పాటు భద్రతను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో సెక్యూరిటీ క్యాబిన్లు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఫారెస్ట్ చెక్పోస్ట్ సెక్యూరిటీ గదిని మోడల్ క్యాబిన్గా తీర్చిదిద్దుతారు. వుడ్ కాంపోజిట్ రాఫ్టర్లతో నిర్మించే ఈ క్యాబిన్కు రూ.5లక్షలు వ్యయం అవుతుంది. ప్రతిపాదిత మూడు ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే ఖమ్మం స్మార్ట్ సిటీగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. -
ఆస్పత్రులకు అవార్డుల పంట
చుంచుపల్లి/భద్రాచలం అర్బన్/మణుగూరు టౌన్/దుమ్ముగూడెం/పాల్వంచ :ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఆస్పత్రులు, వైద్యులు, ఉద్యోగులకు అవార్డులు ప్రకటించగా జిల్లా సత్తా చాటింది. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన, సమయోచిత వైద్యసేవలు అందించడంలో చూపిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు, వైద్యులు అవార్డులు అందుకున్నారు. ఈమేరకు సీహెచ్సీ పాల్వంచకు చెందిన డాక్టర్ శైలేష్ కుమార్, డాక్టర్ పి.రామ్ప్రసాద్, భద్రాచలం ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణతో పాటు డాక్టర్ క్రాపా విజయ్, నర్సింగ్ ఆఫీసర్ కృష్ణవేణి, ఏ.వెంకటరావు జాబితాలో ఉన్నారు. అలాగే, మణుగూరు ఏరియా హాస్పిటల్ నర్సింగ్ ఆఫీసర్ మానస, ఫార్మసిస్ట్ ఏ.శారదాదేవి అవార్డులు అందుకున్నారు. అంతేకాక భద్రాచలం, మణుగూరు, చర్ల వంటి గిరిజన ప్రాంతాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ట్రైబల్ ఏరియా’ విభాగంలో ఆస్పత్రుల సూపరింటెండెంట్లు రామకృష్ణ, గౌరీప్రసాద్, సాయివర్ధన్తో కలిసి డీసీహెచ్ఎస్ జి.రవిబాబు అవార్డులు స్వీకరించారు. ఇక దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల పీహెచ్సీ రాష్ట్రస్థాయిలో ఉత్తమ పీహెచ్సీగా ఎంపిక కాగా డాక్టర్ రేణుకా రెడ్డి అవార్డు స్వీకరించారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు -
సాగర్ ప్రధాన కాల్వ కట్టపై పగుళ్లు
● ప్రమాదాలకు చేరువగా పరిస్థితి? ● క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులుఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం పరిధి సాగర్ ప్రధాన ఎడమ కాల్వ కట్ట ప్రమాదం ముంగిట ఉన్నట్లు తెలుస్తోంది. పల్లెగూడెం నుంచి కరకట్టకు వెళ్లే మార్గంలో కాల్వకు ఇరువైపులా కట్టపై బీటలు (నెర్రెలు) వారాయి. వారం రోజులుగా పగుళ్లు బయటపడుతుండగా రోజురోజుకూ విస్తరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. సుమారు అర కిలోమీటరు పొడవునా ఈ పగుళ్లు ఏర్పడ్డాయి. పగుళ్లు పెరుగుతున్న వేళ వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టకపోతే భవిష్యత్లో పెనుప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం సాగునీటి విడుదల కొనసాగుతుండగా, పగుళ్లు మరింత పెరిగితే ప్రమాదం జరగొచ్చని స్థానికులు అంటున్నారు. కట్ట దెబ్బతింటే సమీప గ్రామాలకు ముప్పు ఏర్పడే అవకాశముందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించిన అధికారులు కాల్వ కట్టపై పగుళ్లు ఏర్పడ్డాయనే సమాచారంతో జలవనరులశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు నెర్రలు బారిన కట్ట ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించారు. అంతేకాక ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిసింది. జలవనరులశాఖ ఈఈ అనన్య, డీఈ ఉదయ్ప్రతాప్, ఏఈ సతీశ్ పాల్గొన్నారు. -
బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు శిక్షణ ఉంటుంది. హెయిర్ కటింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్, గ్రూమింగ్ ఫేషి యల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8నుంచి 13వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్ సమయాన రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆపై 14 నుంచి వచ్చేనెల 12 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వర్క్షాపు ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఖమ్మం మామిళ్లగూడెంలోని వాసవి కిరాణం సమీపాన ఉన్న లహరి బ్యూటీపార్లర్ – ట్రైనింగ్ సెంటర్లో సంప్రదించాలి. వివరాలకు 96660 13544, 96182 16701 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ప్రజలకు నాణ్యమైన వైద్యమే లక్ష్యం
పాల్వంచ/పాల్వంచరూరల్: ఏజెన్సీ ప్రాంత ప్రజానీకానికి నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా వారిలో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య దినో త్సవం సందర్భంగా పాల్వచంలోని వైద్య, ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందించడానికి వైద్యులు, సిబ్బంది కృషిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరో గ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యాన అందరూ బాధ్యతగా భావించాలన్నారు. ఇతర జిల్లాలతో పోలి స్తే మంచి పేరు ఉన్నప్పటికీ భవిష్యత్లో మెరుగైన సేవలతో రాష్ట్ర, జాతీయఅవార్డులు సాధించాలని తెలి పారు. అనంతరం డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ మా ట్లాడుతూ.. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా చేపడుతు న్న కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. ఆతర్వాత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ప్రతి భ కనబరిచిన 43 మంది ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రసాద్నాయక్, వైద్యులు స్పందన, తేజస్విని, ఉద్యోగులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
శాస్త్రోక్తంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కాగా, మంగళవారం కావడంతో ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి తప్పనిసరి డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ బూర్గంపాడు: ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇబ్బందులు ఎదురవుతాయని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మోరంపల్లి బంజర పీహెచ్సీ ఆధ్వర్యాన బూర్గంపాడు కేజీబీవీలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. శారీరక శ్రమ తగ్గడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నందున జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తొలుత బూర్గంపాడు ప్రధాన కూడలి నుంచి కేజీబీవీ వరకు ర్యాలీ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్, డీపీఎంఓ మోహన్, ఎంపీహెచ్ఈఓ రవి, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. 13న ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్ మేళా రుద్రంపూర్: చుంచుపల్లి మండలం రుద్రంపూర్లోని ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 13న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఐటీఐ పూర్తిచేసిన వారికి వివిధ పరిశ్రమల్లో అప్రెంటిస్ అవకాశం కల్పించేందుకు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి ఉన్న జిల్లాలోని అభ్యర్థులు www. apprenticeshipindia. org. in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకుని, ఆ కాపీతో పాటు బయోడేటా, విద్యార్హత పత్రాలతో మేళాకు హాజరుకావాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్! వాట్సాప్ సాయంతో సమాధానాలు రాసిన విద్యార్థి కొత్తగూడెంఅర్బన్/సుజాతనగర్: జిల్లాలో ఎస్సెస్సీ విద్యార్థి ఒకరు సెల్ఫోన్ సాయంతో పరీక్ష రాస్తుండడం బయటపడింది. పదో తరగతి విద్యార్థులకు మంగళవారం జీవశాస్త్రం పరీక్ష నిర్వహించారు. ఈమేరకు సుజాతనగర్ జెడ్పీహెచ్ఎస్ కేంద్రంలో ఓ విద్యార్థి సెల్ఫోన్ తీసుకొచ్చి వాట్సప్ ఆధారంగా సమాధానాలు రాస్తుండగా ఇన్విజిలేటర్ గుర్తించారు. ఈమేరకు విద్యార్థిని డిబార్ చేసి మాల్ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు డీఈఓ నాగలక్ష్మి తెలిపారు. అయితే, సదరు విద్యార్థి ముందు రోజే కేంద్రానికి సెల్ఫోన్ తీసుకొచ్చి దాచినట్లు తేలింది. అంతేకాక ముందుగా సిద్ధం చేసుకున్న జవా బులను వాట్సాప్లో చూస్తూ రాశాడని గుర్తించినట్లు సమాచారం. కాగా, మంగళవారం పరీక్షకు జిల్లాలో 12,728 మంది విద్యార్థులకు గాను 12,700 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరయ్యారని డీఈఓ తెలిపారు. 10నుంచి డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2016 కంటే ముందు డిగ్రీ చదివి ప్రాక్టికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బానోతు రెడ్డి తెలిపారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 10, 11వ తేదీల్లో, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 12, 13వ తేదీల్లో, ప్రథమ సంవత్సరం వారికి 14, 15వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఖమ్మం మహిళా డిగ్రీ కళాశాలలో జరిగే పరీక్షల వివరాల కోసం 91605 38938నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
కాస్త మెత్తగా.. పుచ్చులు త్వరగా..
దారి మళ్లకుండా.. పౌర సరఫరాల శాఖ ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే కాక ఆహార భద్రత, అంత్యోదయ కార్డుల ద్వారా బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అయితే, గతంలో బియ్యం దొడ్డుగా ఉండడంతో చాలామంది ఆహారంలో భాగంగా తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఈ బియ్యం దళారుల ద్వారా కోళ్లఫారాల్లో దాణాగా చేరడం మొదలైంది. అంతేకాక కొన్నిచోట్ల మిల్లర్లు దక్కించుకుని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు సరఫరా చేశారు. ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాక సన్నరకాల సాగును ప్రోత్సహించేందుకు మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వడం ప్రారంభించింది. ప్రచారం చేసిన సీఎం! ఏడాది కాలంగా రేషన్ లబ్ధిదారులకు నన్న బియ్యాన్నే సరఫరా చేస్తున్నారు. బియ్యం నాణ్యత బాగుండడంతో అందరూ వినియోగించడం ప్రారంభించారు. అలాగే, సీఎం రేవంత్రెడ్డి 2025 ఏప్రిల్ 6న సారపాకలోని లబ్ధిదారుడి ఇంట్లో సన్నబియ్యంతో వండిన అన్నమే తినడం ద్వారా మరింత ప్రచారం ఏర్పడింది. ఫలితంగా పక్కదారి పట్టడం దాదాపు ఆగిపోయింది. అయితే, ఆరు నెలల తర్వాత పరిస్థితిలో మార్పు మొదలైంది. రేషన్షాపుల్లో ఇచ్చే సన్నబియ్యం వండితే మెత్తగా కావడం, త్వరగా పురుగులు పడుతోందని తెలిసినా యంత్రాంగం దృష్టి సారించలేదు. దృష్టి సారించకపోతే... నాణ్యత తగ్గిపోతుండడంతో లబ్ధిదారులకు సన్నబియ్యంపై ఆసక్తి తగ్గుతుందని తెలిసినా అందుకు తగిన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. సన్న బియ్యానికి సంబంధించి 32 రకాలు పండిస్తున్నా అత్యంత నాణ్యమైన బీపీటీ రకానికి పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువ. దీంతో ఈ రకాన్ని పండించిన రైతులు ఎక్కువ మంది ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముతున్నారు. ఒకవేళ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరినా తిరిగి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇక మండల లెవల్ స్టాక్ పాయింట్లలో ఏడాది కాలంగా నిల్వ ఉన్న దొడ్డు బియ్యానికి పురుగులు పట్టి అవి సన్నబియ్యాన్ని సైతం ఆశిస్తుండడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా సన్నబియ్యం సాగు మొదలు పంపిణీ వరకు అధికారులు శ్రద్ధ పెట్టకపోతే ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న పథకానికి చెడ్డపేరు వచ్చే అవకాశముంది.ప్రస్తుతం షాపుల ద్వారా ఒకేసారి మూడు నెలల సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. ముగ్గురు లబ్ధిదారులు ఉన్న కుటుంబానికి నెలకు 18కిలోల చొప్పున మూడు నెలలకు సంబంధించి 54కిలోల బియ్యం వస్తుండడంతో వాడుకోలేని పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. బియ్యం పురుగు పడుతుండడం, నూకలు ఎక్కువగా ఉండడమే కాక ఎంత జాగ్రత్త పడినా అన్నం మెత్తగా అవుతుండడంతో లబ్ధిదారులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా ఏళ్ల తరబడి రేషన్ బియ్యం దందా సాగించిన దళారులు రంగంలోకి దిగారు. పాత పరిచయాలు, నెట్వర్క్ను ఉపయోగించుకుని బియ్యం సేకరించడం మొదలు పెట్టారు. తొలినాళ్లలో ఇది ప్రచారమేనని సివిల్ సప్లయీస్ అధికారులు కొట్టి పారేసినా ఇటీవల పలుచోట్ల బియ్యం పట్టుబడడం గమనార్హం. జిల్లా కేంద్రంలోనే లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించేందుకు వెళ్తున్న ట్రాలీఆటో గత నెల చివరలో ప్రమాదానికి గురవడంతో విషయం బయటకు పొక్కింది. అంతేకాక ఈనెలారంభంలో టేకులపల్లిలో రేషన్ బియ్యం తరలిస్తున్న మరో ఆటో పట్టుబడింది. సన్న బియ్యంపై జనాల నిర్లిప్తత ! -
సత్వరమే పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణి దరఖాస్తు ల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డీ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్లతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పెన్షన్ ఆగిపోయిందని కొత్తగూడెం సన్యాసి బస్తీకి చెందిన దివ్యాంగురాలు ఉమామహేశ్వరి ఫిర్యాదు చేయగా, డీఆర్డీఓకు ఎండార్స్ చేశారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా బుక్ కోసం టేకులపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బానోత్ తోలచంద్ వినతిపత్రం ఇవ్వగా, జిల్లా అటవీశాఖ అధికారికి, రేషన్కార్డు కోసం సుజాతనగర్కు చెందిన నునావత్కుమార్ దరఖాస్తు చేసుకోగా, డీఎస్ఓకు ఎండార్స్చేశారు. వివిధ సమస్యలపై పలువురు దరఖాస్తు చేసుకోగా, పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలలు, హాస్టళ్లలో మెనూ ప్రకారం ఆహారం అందడం లేదని, మండల ప్రత్యే క అధికారులు, వసతి గృహాల పర్యవేక్షణ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ అంకిత్ -
కళలపై దృష్టి సారించాలి
భద్రాచలం: గిరిజన విద్యార్థులు విద్యతోపాటు కళలపైకూడా దృష్టి సారించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. ఖమ్మం గిరిజన సంక్షేమశాఖ గురుకులం డిగ్రీ కళాశాల విద్యార్థిని ఇర్పా స్వాతి పెయింటింగ్లను సోమవారం ఐటీడీఏలో పరిశీలించి ప్రశంసించారు. చిత్రాలను ట్రైబల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతామని పేర్కొన్నారు. అనంతరం ఖమ్మంలోని డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనులకు రూ. 2లక్షలు, స్వాతికి ప్రోత్సాహకంగా రూ.22,500 చెక్కులను అందజేశారు. దర్బార్లో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులొద్దు గిరిజనదర్బార్లో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులను సమర్పించొద్దని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నా రు. సోమవారం ఐటీడీఏలో జరిగిన గిరిజన దర్బార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత యూనిట్ అధికారులకు అందచేసి పరిష్కరించా లని సూచించారు. ప్రభుత్వ సహకారంతో గిరిజనులు స్వయం ఉపాధి, చిన్నత తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు అశోక్, అరుణ కుమారి, సైదులు, రాంబాబు, వేణుగోపాల్, లక్ష్మినారాయణ, నాగేశ్వరరావు, గన్యా, హేమంత్, హరికృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవానం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కోటి రామస్వరూప్కు ప్రధాన అర్చకుడిగా పదోన్నతి దేవస్థానంలో ఉప ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న కోటి రామస్వరూప్ రాఘవాచార్యులుకు ప్రధాన అర్చకుడిగా పదోన్నతిని కల్పించారు. ఈ మేరకు ఈఓ దామోదర్రావు ఉత్తర్వులు అందజేశారు. కాగా ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న పొడిచేటి సీతారామానుజాచార్యులు నవమి ఉత్సవాల అనంతరం పదవీ విరమణ చేశారు. మరో ప్రధాన అర్చకుడిగా విజయరాఘవన్ విధులు నిర్వరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. ఎండ నుంచి ఉపశమనానికి తివాచీలు దేవస్థానంలో భక్తులు పాదరక్షలు లేకుండా స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్రమంలో వేసవి ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి ఆలయ పరిసర ప్రాంతాల్లో తివాచీలు ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఆలయంలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. -
ఆహార భద్రతపై అవగాహన ర్యాలీ
సూపర్బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి నుంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు ర్యాలీలో కొనసాగగా, జిల్లా ఆహార భద్రత అధికారి శరత్, డీఎంహెచ్ఓ డాక్టర్తుకారామ్ రాథోడ్ పాల్గొని మాట్లాడారు. అనంతరం కలెక్టరేట్లో ఎక్స్పో నిర్వహించి, ఆహార భద్రతా నియమాలు, ప్రభుత్వమార్గదర్శకాలు, అందుబాటులో ఉన్న సేవలపై ప్రజలకు వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల వంట కార్మికులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించి, పోషకాహారం తయారీ, పరిశుభ్రత ప్రమాణాలు, భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు.రేపు దిశ సర్వసభ్య సమావేశంచుంచుపల్లి: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై సమగ్ర సమీక్ష కోసం ఈ నెల 8న దిశ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న ఉదయం 11 గంటలకు ఐడీఓసీ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. తొలుత సమావేశాన్ని మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించా లని నిర్ణయించగా, పరిపాలనా కారణాల వల్ల సమయాన్ని సవరించి ఉదయం 11.00 గంటలకు మార్చినట్లు వివరించారు. జిల్లాలో అమలవుతున్న కేంద్రప్రభుత్వ పథకాల పురో గతి, నిధుల వినియోగం, లక్ష్యాల సాధన, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై చర్చించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమస్యలపై ఆరాపాల్వంచ: పాల్వంచ ఆర్టీసీ బస్టాండ్ను తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సోమవారం సందర్శించారు. ప్రయాణికులను సమస్యలు అడిగి తెలు సుకున్నారు. పార్కింగ్ సమస్య పరిష్కరించా లని, బస్టాండ్ ముందు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను తొలగించాలని కార్పొరేటర్లు విన్నవించా రు. బస్టాండ్కు మరమ్మతులు చేయాలని మరి కొందరు వినతి పత్రం అందించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు, కార్పొరేటర్లు అడుసుమల్లి సాయిబాబా, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, సింధు తపస్వీ, దంతెబోయిన నరేష్, ధర్మసోతు నరేష్, నాయకులు కొల్లి శ్రీని వాస్ రావు, పాటిబండ్ల అభివన్ తదితరులు పాల్గొన్నారు. బాధితులకు అండగా నిలవాలిఎస్పీ రోహిత్ రాజు మణుగూరు టౌన్: బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. సోమవారం ఆయన మణుగూరు పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 డయల్కు ఫోన్ రాగానే తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకోవాలని, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతతో మెలగాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న పోలీస్స్టేషన్ భవనం, పాత పోలీస్ క్వార్టర్లను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. డీఎస్పీ రవీంద్రరెడ్డి, ఎస్బీ సీఐ శ్రీనివాస్, సీఐ నాగబాబు, ఎస్ఐ శ్రావణ్ తదితరులు ఉన్నారు. -
ఎందుకింత కాఠిన్యం?
సింగరేణి యాజమాన్యం అవసరం తీరేవరకు ఒకలా, అవసరం తీరాక మరోలా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు ప్రాణాలకు తెగించి సంస్థ అభివృద్ధికి తోడ్పడిన సీనియర్ కార్మికుల కుటుంబాల క్షేమాన్ని విస్మరిస్తోంది. తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి కనీస అవసరాలకు కూడా కొర్రీలు పెడుతోంది. ఆఖరికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికీ ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ల రక్షణకు ఇటీవల చట్టం తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే సీనియర్ కార్మిక వాడల వెతలను పట్టించుకోవాలనే డిమాండ్ వస్తోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం21 పిట్ గని సమీపంలో కార్మికులు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత గనికి సమీపంలోనే స్ట్రట్పిట్, 24, సెంచరీ ఇంక్లైన్ వంటి భూగర్భ గనులు, ఏరియా పరిధిలో జవహర్ఖని వంటి ఓపెన్కాస్ట్లు వచ్చాయి. మెజారిటీ కార్మికులు 21లోనే నివాసం ఉంటూ ఆయా గనుల్లో పని చేసేవారు. ఫలితంగా 1990వ దశకంలో రొంపేడు మేజర్ గ్రామపంచాయతీగా మారింది. ఆ తర్వాత విభజనలో కార్మికవాడలు ఉన్న ప్రాంతాలు శేషగిరి బస్తీ, విజయలక్ష్మినగర్, తిలక్నగర్ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. కార్మిక వాడల విషయంలో 2000 దశకం నుంచి సింగరేణి తీరులో మార్పు మొదలైంది. ఇల్లెందులో బొగ్గు గనులు, కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ముందుగా కార్మిక వాడలకు ఉచిత కరెంటు సరఫరాను నిలిపేసింది. ఆ తర్వాత నీటి సరఫరా బాధ్యతల నుంచి తప్పుకుంది. చివరకు అంతర్గత రోడ్ల నిర్మాణాలకు మంగళం పలికింది. కాగా, జవహర్ఖని విస్తరణతో మళ్లీ మంచిరోజులు వస్తాయనే నమ్మకం కలిగింది. అయితే, ఆ ఆశలకు ఆదిలోనే సింగరేణి గండి కొడుతోంది. -
గాలివాన బీభత్సం
● విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ● తడిసిన ధాన్యం, మిర్చి, దెబ్బతిన్న ఇళ్లుఅశ్వారావుపేటరూరల్/చర్ల: గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం అశ్వారావుపేట, చర్ల తదితర మండలాల్లో అకాల వాన కురిసింది. భారీవర్షం కురవడంతో ఇళ్ల పైకప్పులు, రేకులు ధ్వంసమయ్యాయి. చెట్లు విరిగి పలుచోట్ల పైకప్పులు, రేకుల షెడ్లు ధ్వంసం కాగా, ఇళ్లలోఉన్న వారంతా భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఆసుపాక గ్రామంలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. అశ్వారావుపేట–భద్రాచలం, ఖమ్మం ప్రధాన రహదారుల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మామిడి, పొగాకు తోటలకు నష్టం జరిగింది. చర్లలో రాళ్ల వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి పంటలు తడిసిముద్దయ్యాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. చేతికొచ్చిన పంటలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రజావాణిలో సమయపాలనేది..?
సూపర్బజార్(కొత్తగూడెం): నూతన కలెక్టర్గా అంకిత్ బాధ్యతలు స్వీకరించాక క్రమం తప్పకుండా ప్రతీ సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారిగా కలెక్టర్కు వివిధ పనుల కారణంగా ఒక్కోసారి కొంత ఆలస్యమైనా మిగతా అధికారులు ప్రజావాణిలో సమస్యల దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. అయితే అధికారులు సకాలంలో రావడంలేదు. కలెక్టర్ వచ్చారా? అని ఆరా తీసి ఆ తర్వాతే అధికారులు ప్రజావాణి హాలులోకి వస్తున్నారు. సోమవారం కూడా 10.30 గంటలకు ప్రజావాణి ప్రారంభం కాగా, ఆ సమయానికి సుమారు 10 మంది అధికారులు కూడా రాలేదు. ఎండాకాలం, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అనేక వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్కు చేరుకుని క్యూలైన్లో బారులుదీరారు. కానీ అధికారులు లేకపోవడంతో నిరీక్షించాల్సి వచ్చింది. ఆలస్యం కావడంతో వినతి పత్రాలు ఇచ్చాక తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఎండ తీవ్రతకు ఇబ్బంది పడ్డారు. ఇకనైనా అధికారులు సకాలంలో హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
ఆలయ అభివృద్ధి.. పుష్కరాల పనులు
● నిరంతర పర్యవేక్షణ, సమన్వయం అవసరం ● ఐఏఎస్ అధికారికి బాధ్యత అప్పగిస్తే మేలు భద్రాచలం: గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అభివృద్ధి పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేస్తామని ప్రకటించింది. అయితే సమయం తక్కువగా ఉండటంతో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి పను ల పర్యవేక్షణ, గోదావరి పుష్కరాల పనుల బాధ్యతలను ఐఏఎస్ అధికారికి అప్పగించాలని భక్తులు కోరుతున్నారు. మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలకు భారీగా నిధులు గోదావరి పుష్కరాలు 2027, జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో గోదావరి కారిడార్లో పుష్కరాల విజయవంతానికి సుమారు 300 రూ. కోట్ల వరకు కేటాయించింది. భక్తులు అధికసంఖ్య లో వచ్చే భద్రాచలం వద్ద ఏర్పాట్లపై దృష్టి సారించింది. నెల రోజుల క్రితం పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్రస్థాయిలో ఇరిగేషన్, దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. భద్రాచలం వద్ద సుమారు రూ.60కోట్ల నుంచి రూ. 80 కోట్లతో పనులు చేపట్టేలా ప్రతిపాదనలు అందజేశారు. దీంతో ఈ ఏడాది పుష్కరాల పనులు నిర్విరామంగా జరగనున్నాయి. ఇటీవల భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశా రు. మొత్తంగా రూ.586 కోట్లు కేటాయించగా, మూ డు విడతలుగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడతలో రూ.75కోట్లతో గోదావరి ఘాట్ల విస్తరణ, రూ.180 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, రూ.96 కోట్లతో ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి.. మొత్తంగా రూ.351 కోట్ల పనులను చేయనున్నారు. వీటిని మార్చి 2027 లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. రెండో విడతలో 2028 నాటికి కాపా రామలక్ష్మమ్మ ట్రస్టు వద్ద ఉన్న ఆరెకరాల స్థలంలో రూ.108 కోట్లతో పనలు చేపట్టాల్సి ఉంది. మూడో విడతలో రూ.127 కోట్లతో భద్రాచలం టెంపుల్ టౌన్ అభివృద్ధి పనులు 2029వరకు పూర్తిచేయనున్నారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.400 కోట్లతో గోదావరి పుష్కరాలు, ఆలయ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఐఏఎస్కు బాధ్యతలు అప్పగిస్తే... పుష్కరాలు, ఆలయ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి. ఇందుకోసం వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత పుష్కరాల సమయంలో చివరి నిమిషంలో పనులు పూర్తి కాక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఇటువంటి సమస్య రాకుండా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తే మేలనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుతం భద్రాచలంలో సబ్ కలెక్టర్గా మృణాళ్ శ్రేష్ఠ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బి.రాహుల్ ఇద్దరు ఐఏఎస్లు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తగిన ఆలోచన చేసి వీరిద్దరిలో ఒకరికి లేదా మరో సీనియర్ అధికారికి అభివృద్ధి పనుల బాధ్యతలను అప్పగించాలని భక్తులు కోరుతున్నారు. -
విపత్తులపై అవగాహన ఉండాలి
సూపర్బజార్(కొత్తగూడెం): విపత్తులపై సరైన అవగాహనతోపాటు ముందస్తు సన్నద్ధత ఉంటేనే ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని కలెక్టర్ అంకిత్ అన్నా రు. సామాజిక చైతన్యం లక్ష్యంగా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ (ఫామెక్స్)–2026 కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎన్డీఆర్ఎఫ్ ఫామెక్స్ నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ శాఖల అధికారులతో, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి సమీక్ష నిర్వహించారు. విపత్తులకు గురయ్యే ప్రాంతాల గుర్తింపు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, విపత్తు నిర్వహణ ప్రణాళిక అమలు, రెవెన్యూ, అగ్నిమాపక, పంచా యతీరాజ్, పోలీస్, రవాణా, ఆర్అండ్బీ, ఇరిగేషన్, వ్యవసాయ తదితర శాఖల సమన్వయంపై చర్చించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంగళవారం నుంచి 15 రోజులపాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలలో అవగాహన, సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్స్పెపెక్టర్ బిటన్సింగ్, బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ విధానాలను సమగ్రంగా పరిశీలించి, రిజిస్టర్లో సంతకం చేశారు. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ.. ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజనను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పథకం ద్వారా ఇళ్ల పైభాగంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవచ్చని అన్నారు. అర్హులు pmsuryaghar. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలూరుపాడు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యసిబ్బందిని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. జూలూరుపాడు ప్రభు త్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీచేశారు. మందుల నిల్వలు, వైద్యులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. వడదెబ్బ కేసుల నమోదును గుర్తించిన కలెక్టర్ ఎండల తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చలివేంద్రాలు, ఉపాధి పనిప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పారు.ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యా చందన జెడ్పీ సీఈ ఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, వైద్య శాఖాధి కారి తుకారాం రాథోడ్, విద్యుత్ ఎస్ఈ జి మహేందర్, టీజీఆర్ఈడీసీఓ జిల్లా మేనేజర్ పి.అజయ్ కుమార్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ అంకిత్ జిల్లాలో వివిధశాఖల పరిధిలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, రోడ్లు–భవనాలు, ట్రైబల్ వెల్ఫేర్, విద్యుత్ శాఖల పనుల పురోగతిని సమీక్షించారు. అటవీ శాఖ అనుమతులు, భూసంబంధిత సమస్యలు వంటి ఆటంకాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. రహదారుల నిర్మాణం, ఇందిర మహిళా శక్తి భవనాలు, యంగ్ ఇండియా పాఠశాలలు, సీతమ్మ సాగర్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ల పనుల పురోగతిని కూడా సమీక్షించారు. ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వలు, పంప్ హౌస్లు తదితర పనులను సమయానికి పూర్తిచేయాలని సూచించారు. అధికారులు అర్జున్ రావు, శ్రీనివాస్, నాగేశ్వరరావు, మహేందర్, తిరుమలేష్, నళిని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కొడుకును కాలేజీలో చేర్చడానికి వెళ్తూ...
● రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి ● లారీ రూపంలో కబళించిన మృత్యువుకొణిజర్ల: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడికి బంగారు భవిష్యత్ ఇవ్వాలని ఆ దంపతులు కల కన్నారు. అందులో భాగంగా ఉత్తమ బోధన ఉండే కాలేజీని ఎంచుకుని చేర్పించాలని హైదరాబాద్ బయలుదేరారు. కానీ వారు గమ్యాన్ని చేరకుండానే కన్నుమూశారు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందగా కుమారుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. కొణిజర్ల వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు... రాజమండ్రి నుంచి ప్రయాణం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మోరంపూడి గాదాలమ్మనగర్కు ఉండమట్ల వీర్రాజు(46) ధవళేశ్వరంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య వీర శైలజ (36), కుమారుడు యశ్వంత్ ఉన్నారు. యశ్వంత్ ఇటీవల పదోతరగతి పూర్తిచేయగా ఇంటర్లో చేర్పించేందుకు హైదరాబాద్లోని కళాశాలలు చూడడమే కాక బంధువులను కలవాలని కారులో బయలుదేరారు. వీరి కారు సోమవారం తెల్లవారుజామున కొణిజర్లలోని సాగర్ కాల్వ బ్రిడ్జిపైకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లారీ ముందు టైరు రిమ్ము విరిగిపోవడమే కాక కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఆపై లారీ అదుపు తప్పి బ్రిడ్జిపై అడ్డంగా తిరిగింది. అదే సమయాన వైరా వైపు నుంచి వస్తున్న మరో లారీని సైతం ఢీకొట్టింది. ఘటనలో కారు నడుపుతున్న వీర్రాజు, ముందు సీట్లో కూర్చున్న వీరశైలజ తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, లారీ డ్రైవర్ అలుగోలు శ్రీను కేబిన్లో ఇరుక్కుపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగా.. అప్రమత్తమైన స్థానికులు కారులో నుంచి వీర శైలజను, యశ్వంత్ను బయటకు తీసి 108లో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. అలాగే, వీర్రాజు కారు సహా లారీ కింద ఇరుక్కుపోవడంతో పోలీసులు రెండు జేసీబీల సాయంతో విడదీసి వీర్రాజు, లారీ డ్రైవర్ శ్రీనును బయటకు తీసి ఆస్పత్రికి పంపించారు. అయితే, ప్రమాదం జరిగాక గంటకు పైగా తీవ్ర రక్తస్రావం జరగడంతో వీర్రాజును ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందాడు. కాగా, కారును ఢీకొట్టిన లారీ అడ్డం తిరిగి బ్రిడ్జిపై అడ్డంగా నిలిచిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గంటన్నర పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ఎస్ఐ జి.సూరజ్ నేతృత్వాన జేసీబీలతో వాహనాలను పక్కకు తప్పించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఇక ట్రాఫిక్ జామ్ అయిన క్రమాన కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిలిచిన లారీని ధాన్యం లోడ్తో వచ్చిన మరో లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఘటనలో ధాన్యం లోడు లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
పాల్వంచరూరల్: కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి సోమవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఉల్వనూరు గ్రామంలో నివాసం ఉంటున్న రజినీ ఆదినారాయణ(25)ఈ నెల 4న పురుగుల మందుతాగాడు. కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య పద్మ పోలీసులకు సమాచారం అందించింది. వడదెబ్బతో వ్యక్తి.. భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో సోమవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు పట్టణంలోని అశోక్నగర్ కొత్తకాలనీకి చెందిన శివకుమార్ రెడ్డిగా గుర్తించారు. ఇటీవల మద్యానికి బానిసగా మారాడని, ఈ క్రమంలో అతిగా మద్యం తాగి ఎండదెబ్బతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి సోదరుడు చుక్కా శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో ఎస్ఐ శ్యాంప్రసాద్ కేసు నమోదు చేశారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యఅశ్వాపురం: Ð]l$…yýlÌS MóS…{§é-°MìS ^ðl…¨¯]l K Ð]lÅMìS¢ ç³#Æý‡$-VýS$ÌS Ð]l$…§ýl$ ™éW B™èlÃ-çßæ™èlÅ ^ólçÜ$-MýS$-¯é²yýl$. AÔ>Ó-ç³#-Æ>°MìS ^ðl…¨¯]l } §ýl$Æý‡Y IÆý‡¯Œl àÆŠḥzÐólÆŠḥ Ķæ$fÐ]l*° MýS…§ýl$ÌS Ð]l$«§ýl$-çÜ*-§ýl¯Œl Æ>Ð]l# (46) D ¯ðlÌS 4¯]l ç³#Æý‡$-VýS$ÌS Ð]l$…§ýl$ ™éV>yýl$. ©…™ø MýS$r$…½MýS$-Ë$ QÐ]l$Ã… Bçܵ-{†MìS ™èlÆý‡-Í…^éÆý‡$. ç³Çíܦ† ÑçÙ-Ð]l$…-V> Ð]l*Ç _MìS-™èlÞMýS$ ÔèæÈÆý‡… çÜçßæ-MýS-Ç…^èlyýl… Ìôæ§ýl° OÐðl§ýl$Å-Ë$ ™ðlÌS-ç³-yýl…-™ø C…sìæMìS ¡çÜ$-MýS$-Æ>V>, B¨ÐéÆý‡… Æ>{† Ð]l$–† ^ðl…§éyýl$. Ð]l$–™èl$yýl$ Ýù§ýl-Æý‡$yýl$}°ÐéçÜ-Æ>Ð]l# íœÆ>Å-§ýl$-™ø MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ-¯]lr$Ï ïÜI AÔZMŠSÆð‡yìlz ™ðlÍ´ëÆý‡$. రెండు బైక్లు ఢీ : ఇద్దరికి గాయాలుపాల్వంచరూరల్: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు గాయపడ్డ ఘటన మండలంలోని రంగాపురం వద్ద సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం నకిరిపేటకు గ్రామానికి చెందిన ఎన్.లింగయ్య ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అదే సమసయంలో జింకలగూడేనికి చెందిన ఎస్కె.రెహమాన్ మరో ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రంగాపురం శివారు కిన్నెరసాని వాగు బ్రిడ్జి వద్ద రెండ్ బైక్లు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. లింగయ్యకు తీవ్ర గాయాలుకాగా, కొత్తగూడెం తరలించి చికిత్స అందిస్తున్నారు. -
పరీక్ష లేదు.. ఫలితం లేదు
● ఖమ్మం పెద్దాస్పతిలోని టీ హబ్లో నిలిచిన టెస్టులు ● యంత్రాలకు కాలం చెల్లడంతో రెండు రోజులుగా బంద్ ● ఆస్పత్రుల నుంచి శాంపిళ్ల సేకరణకు బ్రేక్ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని తెలంగాణ డయోగ్నస్టిక్ హబ్లో పరీక్షలు పూర్తిగా నిలిచిపోయాయి. తరచుగా యంత్రాలు మొరాయించడం, రసాయనాల సరఫరాలతో అవాంతరాలతో పరీక్షలు ఆగిపోవడం ఇక్కడ సర్వసాధారమే అయినా ప్రస్తుతం యంత్రాల కాలం చెల్లడంతో రెండు రోజులుగా టెస్టులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి శాంపిళ్లు కూడా పంపించడం లేదు. 57నుంచి 134 పరీక్షలకు... పేద ప్రజలకు ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసేందుకు గత ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పింది. క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయో కెమిస్ట్రీకి చెందిన 57 రకాల పరీక్షలు నిర్వహించగా, దశల వారీగా పరీక్షల సంఖ్య 134కు చేరింది. పెద్దాస్పత్రికి వచ్చేవారే కాక జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పట్టణ దవాఖానాలు, ఏరియా ఆస్పత్రుల నుంచి నిత్యం 2 వేలకు పైగా శాంపిళ్లు వచ్చేవి. ఇక్కడ పరీక్షలు చేశాక నేరుగా రోగి సెల్కు రిపోర్టు పంపిస్తే వైద్యులకు చూపించి చికిత్స చేయించుకునేవారు. అయితే, ఖమ్మం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సెంటర్ ద్వారా కొద్దినెలల పాటు సక్రమంగానే పరీక్షలు జరిగినా, ఇటీవల రసాయనాల కొరత, యంత్రాల లోపాలతో తరచూ అవాంతరాలు ఎదురయ్యాయి. ఇప్పుడు యంత్రాలు పూర్తిగా మూలనపడటంతో పరీక్షలన్నీ నిలిపివేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే వారిలో కొందరు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు. మరికొందరు పేదలు నిరాశగా వెనుతిరుగుతున్నారు. లక్షలాది మందికి సేవలు పెద్దాస్పత్రిలోని డయాగ్నస్టిక్ హబ్ ద్వారా ఇప్పటి వరకు లక్షలాది మందికి సేవలు అందాయి. 2021లో హబ్లో డయాగ్నస్టిక్ సేవలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు 6,92,681 మంది నుంచి 12,74,564 శాంపిళ్లు సేకరించగా, 25,89,677 పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు కొత్త యంత్రాలు వస్తే తప్ప సెంటర్ తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అప్పటి వరకు రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఎదురుకానుంది. ఆస్పత్రిలోని హబ్లో పరీక్షలు నిలిచిపోయిన విషయం వాస్తవమే. హబ్లోని యంత్రాల పరిస్థితిని కలెక్టర్కు నివేదించాము. కొత్త యంత్రాల అవసరాన్ని ప్రతిపాదించాము. కలెక్టర్ చొరవతో త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. – డాక్టర్ రాంబాబు, ఖమ్మం ఆస్పత్రి ఇన్చార్జ్ మెడికల్ సూపరింటెండెంట్డయాగ్నస్టిక్ హబ్లో గంటకు 1,520 పరీక్షలు సామర్ధ్యంతో యంత్రాలు ఉన్నాయి. ఇందులో కెమిస్ట్రీ ఎనలైజర్ మిషన్ ద్వారా 1,200 పరీక్షలు, ఇమ్యూనో ఎనలైజర్ మిషన్ ద్వారా 220, సీబీపీ మిషన్ ద్వారా వంద మందికి ఒకేసారి పరీక్షలు జరిగేవి. అయితే సీబీపీ మిషన్ మిషన్ మినహా కెమిస్ట్రీ ఎనలైజర్, ఇమ్యూనో ఎనలైజర్ యంత్రాలు పూర్తిగా మూలనపడ్డాయి. వీటి కాలం తీరడంతో తరచూ మొరాయిస్తుండగా ఇంజనీర్లను పిలిపించి తాత్కాలికంగా మరమ్మతులు చేయిస్తే కొద్దిరోజులే పనిచేసేవి. ప్రస్తుతం కీలకమైన ఈ యంత్రాలు మరమ్మతు చేయడానికి కూడా వీల్లేకుండా పాడయ్యాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. -
ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు
చుంచుపల్లి: బీజేపీ ఆవిర్భావ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి జెండా ఎగరవేసి మాట్లాడారు. ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించటమే బీజేపీ లక్ష్యమని, మోదీజీ నేతృత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవీకే మనోహర్, బలగం శ్రీధర్, పైడిపాటి రవీందర్, వెంకన్న నాయక్, జల్లారపు శ్రీనివాస్, సముద్రాల గాయత్రి, ధారావత్ విష్ణు ప్రియ, జజ్జూరు మోహన కృష్ణ, రమణ, నరహరి బండి వీరస్వామి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మార్క్ఫెడ్ మేనేజర్గా శ్యామ్కుమార్ ఖమ్మంవ్యవసాయం: మార్క్ఫెడ్ సంస్థ రాష్ట్రంలోని 13మంది మేనేజర్లను బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మేనేజర్ సునీతను సిద్దిపేటకు బదిలీ చేశారు. అలాగే, హనుమకొండ జిల్లా మేనేజర్ ఐ.శ్యామ్కుమార్కు ఖమ్మం, భద్రాద్రి జిల్లా మేనేజర్గా బదిలీ చేయడంతో పాటు మహబూబా బాద్ జిల్లా మేనేజర్గా బాధ్యతలు అప్పగించా రు. ఈమేరకు శ్యామ్కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించగా, మొక్కజొన్నకొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. హైటెక్ వ్యభిచారం?ఫొటోలతో బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్న మహిళ పాల్వంచ: పట్టణానికి చెందిన ఓ మహిళ ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలు, విద్యార్థినులను వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరానగర్కాలనీకి చెందిన సద రు మహిళ ధనికవర్గాలు నివసించే కాంట్రాక్టర్స్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఈ వ్య వహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మహిళలు, విద్యార్థినులకు మాయమాటలు చెబుతూ రొంపిలోకి దింపుతున్నట్లు సమాచారం. వారి ఫొటోలను తీసుకుని, తిరిగి వారినే బ్లాక్ మెయిల్ చేస్తూ, భారీ ఎత్తున డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ వీడి యో కాల్స్ ద్వారా హాస్టళ్లలో ఉండే విద్యార్థినులు, మహిళలను చూపించి విటులను ఆకర్షిస్తూ డబ్బులు వసూలు చేసి, బాధితులకు నామమాత్రపు సొమ్ము ఇచ్చి మిగిలినదంతా దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కిలాడీ మహిళ వేధింపులు తాళలేక ఓ బాధితురాలు ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీబూర్గంపాడు: మండలంలోని అంజనాపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు భూక్యా రుక్మిణమ్మ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును ఆదివారం రాత్రి దొంగలు అపహరించారు. ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా, గొలుసు చోరీ చేశారు. ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మార్కెట్కు పోటెత్తిన మిర్చి
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సోమవారం మిర్చి పోటెత్తింది. గడిచిన గురువారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో సోమవారం భారీగా సరుకు వచ్చింది. జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ, ఏపీలోని ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల రైతులు దాదాపు 45 వేల బస్తాల మిర్చి విక్రయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మిర్చి విక్రయాలతో పాటు ధరలోనూ పురోగతి నమోదై మునుపటి కన్నా జెండా పాట ఎక్కువగా పలికింది. ఈనెల 2వ తేదీన తేజా రకం జెండాపాట క్వింటాకు రూ.19,450 పలకగా, సోమవారం రూ.19,500కు చేరింది. అలాగే, మో డల్ ధర రూ. 18వేలుగా నమోదైంది. అలాగే, తాలు మిర్చికి గరిష్టంగా రూ.10వేలు, మోడల్ ధర రూ. 8,200గా పలికింది. కొనుగోళ్లను మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్కుమార్ పర్యవేక్షించారు.‘తేజా’ రకం క్వింటాకు రూ.19,500 -
ఎకై ్సజ్లో బదిలీల గందరగోళం
● నాలుగు జిల్లాల పరిధిలో ట్రాన్స్ఫర్లు ● నేటితో ముగియనున్న ఆప్షన్ల గడువు ● కుటుంబాలకు దూరమవుతామని సిబ్బంది ఆవేదనఖమ్మంక్రైం: ఎకై ్సజ్ శాఖ ఉద్యోగుల బదిలీల్లో 317 జీవో గందరగోళానికి దారితీసిందని చెబుతున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎకై ్సజ్శాఖలోని హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ బదిలీల ప్రక్రియ మొదలుకావడంతో ఉద్యోగులు ఆనందపడ్డారు. కానీ ఈ జీఓ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని వాపోతున్నారు. నాలుగు జిల్లాల పరిధి 2019 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖలో 317 జీఓను అమల్లోకి తెచ్చింది. ఈ జీఓ ప్రకారం సీడీ(4) కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలు ఉన్నాయి. ఫలితంగా ఇప్పుడు నాలుగు జిల్లాల్లో ఎక్కడైనా బదిలీ చేసే అవకాశం ఉంది. సీనియారిటీ, మైదాన, ఏజెన్సీ ప్రాంతాలే కాక ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా బదిలీలు ఉంటాయని అధికారులు చెబుతున్నా.. ఉమ్మడి జిల్లాను వీడి వెళ్లాల్సి రానుండడంపై సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. 41 స్టేషన్లకు ఆప్షన్ ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్ల బదిలీలకు సంబంధించి ఆప్షన్లు పెట్టుకునే గడువు మంగళవారంతో ముగియనుంది. కాగా, నాలుగు జిల్లాలో 44 ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా.. ఉద్యోగులు 41 స్టేషన్లకు ఆప్షన్ పెట్టుకోవాలని ఆదేశాలు అందాయి. దీంతో సిబ్బంది ఆప్షన్లు నమోదు చేస్తున్నా ఏ జిల్లాకు బదిలీ అవుతుందోనని ఉత్కంఠకు లోనవుతున్నారు. కాగా, ఆప్షన్ల పరిశీలన అనంతరం 133 మంది కానిస్టేబుళ్లు, 32 హెడ్కానిస్టేబుళ్లకు ఈనెల 10వ తేదీన బదిలీ ఉత్తర్వులు అందనున్నాయి. పైరవీలు ప్రారంభం 317 జీఓపై అవగాహన లేదని చాలా మంది ఎకై ్సజ్ సిబ్బంది చెబుతున్నారు. గతంలో ఖమ్మంలో పని చేసిన వారు భద్రాద్రి జిల్లాకు, భద్రాద్రి జిల్లాలో పనిచేసిన వారు ఖమ్మంకు బదిలీపై వచ్చారు. అయితే జీఓ 317 ప్రకారం ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్కానిస్టేబుల్ను భద్రాద్రి జిల్లాకు కాకుండా వరంగల్ లేదా హనుమకొండ జిల్లాకు బదిలీ చేసినా తప్పక వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే కుటుంబం, పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉండదని, తద్వారా ఇబ్బంది వస్తుందని తల పట్టుకుంటున్నారు. ఈనేపథ్యాన కొందరు తమకు తెలిసిన ఎకై ్సజ్ ఉన్నతాధికారుల ద్వారా పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. పని చేస్తున్న ప్రాంతంలోనే మరో స్టేషన్కు బదిలీ చేయాలని, లేకపోతే పక్క జిల్లాకు పంపించాలని కోరుతున్నట్లు సమాచారం. ఇంకొందరు రాజకీయ నాయకుల ద్వారా కూడా పైరవీలు మొదలుపెట్టినట్లు తెలిసింది. అయితే, ఎలాంటి పైరవీలకు తావు లేదని, ఎక్కడకు బదిలీ చేసిన వెళ్లాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. మహనీయుల ఆశయాలు సాధించాలికలెక్టర్ అంకిత్ సూపర్బజార్(కొత్తగూడెం): మహనీయుల ఆశయాలను సాధించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ఈకార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ సామాజిక న్యాయ సాధనకు కృషి చేశారని కొనియాడారు. ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి ఎం.శ్రీలత, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ దాసరి శ్రీనివాస్, కో కన్వీనర్లు చదలవాడ సూరి, కూసపాటి శ్రీనివాస్, మంద హనుమంతు, మద్దెల సూరి తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై లిఖిత పూర్వక ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించాలిసింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు టేకులపల్లి: రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను అధిగమించాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం ఆయన ఇల్లెందు ఏరియాలోని ఇల్లెందు, కోయగూడెం ఓపెన్కాస్టుల్లో పర్యటించారు. కేఓసీ వ్యూ పాయింట్ నుంచి పని స్థలాలను పరిశీలించారు. ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనుల వివరాలను జీఎం వి.కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో నూతన జేకే ఓసీ ప్రాజెక్ట్ రికార్డులు, ప్రణాళికలను పరిశీలించారు. ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఆ తర్వాత నూతన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న రోడ్డు, తదితర పనులను పరిశీలించారు. జేకే కాలనీలోని సీ–2 క్వార్టర్లను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. అధికారులు రామస్వామి, జాకీర్ హుస్సేన్, అజ్మీర తుకారాం, రవికుమార్, పూర్ణచందర్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యవర్గం ఎన్నిక
పాల్వంచ: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్–142) అనుబంధ ఎన్పీడీసీఎల్ కంపెనీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ ‘ఏ’ కాలనీలో ఉన్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్–142) కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ.రామారావు ఆధ్వర్యాన జరిగిన సమావేశానికి కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.దేవ్సింగ్, ఉపాధ్యక్షులుగా బి.స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎ.నాగరాజు, సహాయ కార్యదర్శిగా వి.మోతీలాల్, ప్రచార కార్యదర్శిగా ఆర్.యాకయ్య, కోశాధికారిగా సీహెచ్.కృష్ణయ్యతో పాటు కార్యవర్గ సభ్యులుగా కె.బాలరాజు, జి.వేణు, ఎం.రాజు, ఎల్.బలరాంను ఎన్నుకున్నారు. అలాగే, వివిధ జిల్లాలకు చెందిన నాయకులు యూనియన్లో చేరగా వారిని ఆహ్వానించాక రామారావు మాట్లాడారు. కార్మికులు కష్టించి పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి చేయూతనివ్వాలని సూచించారు. అలాగే, నూతన కార్యవర్గం కార్మిక సంక్షేమం కోసం కృషి చేయాలని తెలిపారు. నాయకులు ఎస్.శ్రీనివాసాచారి, డి.సత్యరాజ్ స్టీవెన్, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్.సయ్యద్, వి.కోటేశ్వరరావు, యాకయ్య, భిక్షపతి, గణేశ్, అమర్ తదితరులు పాల్గొన్నారు. విద్యా కమిషన్ సిఫారసులపై చర్చ జరగాలి మధిర: రాష్ట్ర విద్యా కమిషన్ ఇటీవల సమర్పించిన నివేదికలోని సిఫారసులపై సమగ్ర చర్చ జరపాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. అంతేకాక ప్రభుత్వ విద్యారంగానికి నష్టం కలిగించేవి, ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే అంశాలను తొలగించి విద్యాభివృద్ధికి దోహదపడే అంశాలనే అమలు చేయాలని సూచించారు. మధిరలో యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్ నాగూర్ వలీ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగ నిపుణులతో చర్చించకుండా, కనీసం అసెంబ్లీలో చర్చకు పెట్టకుండా ఏకపక్షంగా సిఫారసులు అమలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. అలాగే, ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుచేయడమే కాక పెండింగ్ బిల్లులు, డీఏలు విడుల చేయాలని కోరారు. అంతేకాక సర్వీసు నిబంధనలు, పదోన్నతులు, టెట్ మినహాయింపు, సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ టీచర్లు, కేజీబీవీ, సమగ్ర శిక్షా అభియాన్, మోడల్ స్కూళ్లు, గురుకులాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నట్టు రవి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు అనుమోలు కోటేశ్వరరావు, రామకృష్ణ, నాగరాజు, వీరయ్య పాల్గొన్నారు. రైతులకు పరిహారం అందించాలి మధిర: మధిరలోని సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజీ ఇటీవల అగ్నిప్రమాదంలో కాలిపోగా, మిర్చి నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కోరారు. మధిరలో ఆదివారం జరిగిన కోల్డ్ స్టోరేజీ బాధిత రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో రూ.కోట్ల విలువైన మిర్చి నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్సూరెన్స్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, బాధితులు పక్షాన పోరాడేందుకు కమిటీని ఏర్పాటుచేసి కన్వీనర్గా దొండపాటి నాగేశ్వరరావు, కోకన్వీనర్గా గువ్వల సీతారామిరెడ్డిని నియమించారు. ఈ సమావేశంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, నాయకులు శీలం నరసింహారావు, మందా సైదులు, మందడపు ఉపేందర్, రైతులు పాల్గొన్నారు. పేకాట స్థావరంపై దాడి పాల్వంచ: పట్టణ పరిధిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. బంగారుజాల, పేటచెరువు శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు కొత్తగూడెం సీసీఎస్ పోలీస్, పట్టణ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులును అదుపులోకి తీసుకుని, మూడు బైక్లు, కారు, నాలుగు సెల్ఫోన్లు, రూ.13 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేశామని చెప్పారు. -
వేధిస్తున్న ‘గ్యాస్’ కొరత
పాల్వంచరూరల్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో ఎల్పీజీ గ్యాస్ కొరత వినియోగదారులను వేధిస్తోంది. సిలిండర్లు అందక హోటళ్లు మూసివేసే పరిస్థితి నెలకొంది. బుక్ చేసుకున్నాక రెండు, మూడు రోజులకు అందించాల్సిన గృహ వినియోగ సిలిండర్లను ఆలస్యంగా సరఫరా చేస్తున్నారు. ఒకసారి గ్యాస్ బుక్ చేసుకున్నాక, మళ్లీ రెండోసారి బుక్ చేసుకునేందుకు 45 రోజుల సమయం పడుతోంది. ఇక శుభకార్యాలు జరుపుకుంటే కట్టెల పొయ్యిపై వంటలు చేసుకుంటున్నారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవని పౌరసరఫరాల శాఖ అధికారి చెబుతున్నా క్షేత్రస్థాయిలో వినియోగదారులకు అవస్థ తప్పడం లేదు. బ్లాక్లో విక్రయిస్తున్న కొందరు డీలర్లు జిల్లాలో 4,69,075 మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా, వీరిలో సింగిల్ గ్యాస్ సిలిడర్లు కలిగినవారు 2,41,175 మంది, డబుల్ సిలిండర్ కలిగినవారు 98,868 మంది, దీపం కనెక్షన్లు 53,405, సీఎస్ఆర్ కనెక్షన్లు 2,465, ఉజ్వల కనెక్షన్లు 73,162 ఉన్నాయి. జిల్లాలో రోజుకు నాలుగువేలకు పైగా బుకింగ్లు జరుగుతున్నాయి. అయితే బుక్ చేసుకున్నా గ్యాస్ సరఫరా జరగడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో బ్లాక్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు బ్లాక్లో ఒక్కో సిలిండర్ రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని కొనుగోలు దారులు చెబుతున్నారు. కొందరు డీలర్లు కూడా బ్లాక్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 364 సిలిండర్లు స్వాధీనం బ్లాక్ సిలిండర్ల విక్రయిస్తుండగా, పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారుల తనిఖీల్లో 364 సిలిండర్లు పట్టుబడగా, 52మందిపై 6ఏ కేసు నమోదు చేశారు. కొత్తగూడెంలో 11 సిలిండర్లు, లక్ష్మీదేవిపల్లిలో 17, జూలూరుపాడులో 34, దమ్మపేటలో 36, భద్రాచలంలో 24, మణుగూరులో 172, సుజాతనగర్లో 70 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదు. వినియోగదారులు బుక్చేసుకుంటే 45 రోజుల్లో డెలివరీ ఇస్తున్నారు. ఓటీపీ ద్వారా మాత్రమే గ్యాస్ వినియోగదారునికి అందుతుంది. ఎక్కడా బ్లాక్ చేసే అవకాశంలేదు. గృహ వినియోగ సిలిండర్లు కమర్షియల్గా వినియోగిస్తే కేసులు నమోదు చేస్తున్నాం. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెంచాం. ఇటీవల పలు ప్రాంతాల్లో దాడులు చేసి కేసులు నమోదు చేశాం. బ్లాక్లో విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం. –ప్రేమ్కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
గోదాం పేరుతో గుట్ట గుల్ల
కారేపల్లి: అదొక గుట్ట.. అది రెవెన్యూ శాఖ పరిధిలో ఉండడంతో ప్రభుత్వం గోదాం నిర్మాణానికి నిర్ణయించి కాంట్రాక్టర్కు పనులు కట్టబెట్టింది. దీన్ని అలుసుగా తీసుకున్న సదరు కాంట్రాక్టర్ పరిమితికి మించి గుట్టను జేసీబీలతో తవ్విస్తూ మట్టి, రాళ్లను కిందకు తరలించి అమ్మకోవ డం మొదలు పెట్టాడని తెలిసింది. ఇందుకోసం గుట్ట పైనుంచి కిందకు ఏకంగా రోడ్డు మాదిరి చదును చేయించడం గమనార్హం. దీన్ని పక్క న పెడితే హద్దులుదాటి అటవీ భూమిలోనూ తవ్వకాలు మొదలుపెట్టడంతో అటు స్థానికులు, ఇటు అటవీ అధికారులు పనులను అడ్డుకున్నారు. ఫలితంగా గోదాం నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే, ఇదంతా జరిగేలోగా సదరు కాంట్రాక్టర్ రూ.లక్షల్లో ఆర్జించినట్లు విమర్శలు వస్తున్నాయి. అది కూడా మనదే ! మండలంలోని చీమలపాడులో 33 ఎకరాల మేర అటవీ భూమిని సీతారామ ప్రాజెక్టు కాల్వ నిర్మాణంలో సేకరించారు. ఇందుకు బదులుగా రెవెన్యూ గుట్ట అయిన గంగదేవి గుట్టపై 33 ఎకరాలను అటవీశాఖకు కేటాయించారు. కాగా, రెవెన్యూ పరిధిలోనే గోదాం నిర్మాణ పనులు చేపట్టాల్సిన కాంట్రాక్టర్ అక్కడ మట్టి తవ్వి తరలిస్తూనే కొద్దికొద్దిగా అటవీ శాఖకు కేటాయించిన భూమి నుంచి కూడా తవ్వకాలు మొలుపెట్టాడు. ఈ విషయాన్ని ఫిబ్రవరి 25న గుర్తించిన కారేపల్లి అటవీ అధికారులు టిప్పర్లను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి ఒకరు కలగజేసుకోవడంతో అప్పటి వరకు అటవీ అధికారులు – కాంట్రాక్టర్ నడుమ వివాదం సద్దుమణిగింది. మేం ఊరుకునేదే లేదు.. తవ్వకాల విషయంలో అటవీ అధికారులు కాస్త మెత్తబడినా.. స్థానికులు మాత్రం ససేమిరా అన్నారు. నూరు శాతం ఆదివాసీ గ్రామమైన గుట్టకింది గుంపు గ్రామంలోని గంగదేవి గుట్టను గోదాం నిర్మాణం పేరుతో ధ్వంసం చేస్తున్నారని, మట్టి తరలిస్తూ కాంట్రాక్టర్ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నాడంటూ తుడుందెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులే కాక గుట్టకిందిగుంపు సర్పంచ్ ఉండం రాఘవులు, గ్రామస్తులు పనులు అడ్డుకుని మార్చి 25న ఆందోళన చేపట్టారు. జీపీ తీర్మానం లేకుండా పనులు చేపట్టడమే తప్పు కాగా, ఇక మట్టి తవ్వకాలను సహించేది లేదని హెచ్చరించారు. స్థానికులు, నాయకుల తిరుగుబాటును గమనించిన కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడు. అప్పటికి కానీ స్పందించని ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించారు. ఈమేరకు రెండు రోజుల క్రితం గిడ్డంగుల సంస్థ ఎస్ఈ ఆర్.శ్రీనివాసరావు గ్రామానికి వచ్చారు. పనుల ప్రదేశాన్ని పరిశీ లించడమే కాక సర్పంచ్, గ్రామస్తులతో మాట్లాడి అభ్యంతరాలపై ఆరా తీశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన నేపథ్యా న.. ఆ తర్వాత ఏం జరగనుందోనని స్థానికులు ఎదురుచూస్తున్నారు.ఎక్కడ.. ఏమిటీ కథ? కారేపల్లి మండలం గుట్టకిందిగుంపు గ్రామ సమీపా న గంగదేవి గుట్ట ఉంటుంది. ఈ గుట్టపై గోదాం నిర్మించేందుకు ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించడమే కాక రూ.9కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈమేరకు కాంట్రాక్టర్కు అప్పగించగా మూడునెలల క్రితం పనులు మొదలయ్యాయి. మొదట్లో అంతా సవ్యంగానే సాగినా సదరు కాంట్రాక్టర్ గుట్టపై చెట్లు నరికివేయడమే కాక మట్టిని జేసీబీలతో కొల్లగొట్టి టిప్పర్లతో తరలించడం ప్రారంభించాడు. ఇందుకోసం గుట్టను తొలిచి ఇల్లెందు–కారేపల్లి ప్రధాన రహదారి వరకు సుమారు 500 మీటర్ల రోడ్డు వేసేశాడు. దీంతో స్థానికులు పరిశీలించడంతో జేసీబీలతో తొలుస్తూ పదుల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నట్లు తేలగా పనులు చేపట్టేందుకు వీల్లేదని పట్టుబట్టారు. ఇష్టారాజ్యంగా మట్టి, రాళ్ల తవ్వకం, తరలింపు -
మీ సేవలకు ‘సెలవు’!
● గురుకులాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి నెలన్నర విరామం ● మైనార్టీ విద్యాసంస్థల్లో అమల్లోకి నిర్ణయం ● తిరిగి జూన్లో విధుల్లోకి తీసుకుంటామని అధికారుల వెల్లడి ఖమ్మం మయూరిసెంటర్: గురుకుల విద్యాసంస్థల్లో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తాత్కాలికంగా పక్కనపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలు పనిచేసే పది నెలలే వేతనం చెల్లిస్తూ, వేసవి సెలవుల్లో వీరి సేవలు వినియోగించుకోనందున వేతనం చెల్లించొద్దనే భావనతో విధులకు విరామం ప్రకటించినట్లు తెలిసింది. ఇప్పటికే మైనార్టీ గురుకులాల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందికి గతనెల 31నుంచి, పాఠశాలల్లో ఈనెల 24నుంచి విరామం అమలుకానుంది. అయితే, ఇది నిబంధనల ప్రకారం ఇచ్చే విరామమే తప్ప ఎవరినీ తొలగించడం లేదని మైనార్టీ గురుకులాల అధికారులు స్పష్టం చేస్తున్నారు. మిగతా గురుకుల సొసైటీల్లో కూడా ఈ నిర్ణయం అమలుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ కాకపోవడంతో.. ఏటా ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చే విరామంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా రెగ్యులర్ ఉద్యోగులు కానందున ప్రస్తుతానికి పక్కనపెట్టి జూన్ 1వ తేదీన తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెబుతున్నారు. ఈ ప్రభావం ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిపై పడుతుందని అంచనా. ఇందులో నాన్ – టీచింగ్ సిబ్బంది 70 మంది, బోధన విభాగంలో 30 మంది ఉంటారని తెలిసింది. ఇటీవలే ఉపాధ్యాయుల నియామకం జరగడంతో ఔట్సోర్సింగ్ టీచర్ల సంఖ్య తగ్గింది. వీరికి మినహాయింపు గురుకులాల్లో అత్యవసర విధులను దృష్టిలో ఉంచుకుని కొందరికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆఫీస్ సూపరింటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, ప్రిన్సిపాళ్లు మాత్రం యథావిధిగా విధుల్లో కొనసాగుతారు. అంతేకాక భద్రత కోసం సెక్యూరిటీ గార్డులు, పరిశుభ్రత కోసం స్కావెంజర్లు కూడా విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు. -
బైక్, లారీ ఢీ..
అశ్వారావుపేటరూరల్: బ్చంధువుల ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరై, తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కాబోయే బావ, బామ్మర్ది దుర్మరణం చెందారు. పోలీసులు, బంధువుల కథ నం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం తాటి రామన్నగూడేనికి చెందిన మడకం సంతోష్ (19), తనకు కాబోయే బావ పండు సందీప్ (20) ఆదివారం ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం జీపీ చిచ్చొడిగుంపులోని సంతోష్ మేనమామ చిచ్చొడి సత్తిపండు కుమార్తె మొదటి జన్మదిన వేడుకలకు హాజరయ్యా రు. అనంతరం సంతోష్, సందీప్ కలిసి తమ స్వగ్రా మానికి బైక్పై వెళ్తుండగా మండలంలోని గాండ్లగూడెం శివారులో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో సంతోష్, సందీప్ అక్కడికక్కడే దుర్మర ణం చెందారు. ఎస్ఐలు యయాతిరాజు, అఖిల ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను ప్రభు త్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అఖిల తెలిపారు. తీరని విషాదం.. సంతోష్, సందీప్ మరణంతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. సంతోష్కు తల్లిదండ్రులు మడకం విజయ, నాగేశ్వరరావు, అక్క ఉంది. సంతోష్ అక్కను సందీప్ ప్రేమిస్తుండగా, త్వరలోనే పెళ్లి జరిపించేందుకు నిశ్చయించారు. ఈ క్రమంలో వారిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సందీప్ తల్లిదండ్రులు నాగేశ్వరరావు, నర్సమ్మ సైతం కన్నీటిపర్యంతమయ్యారు. కాబోయే బావ, బామ్మర్దుల దుర్మరణం -
రోడ్డు ప్రమాదంలో కార్పొరేటర్ తనయుడి మృతి
● తల్లిని బైక్పై తీసుకెళ్తుండగా ఘటన ● వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కొడుకు మృతి, తల్లికి గాయాలు పాల్వంచ: రోడ్డు ప్రమాదంలో తల్లి ముందే కొడుకు తీవ్రగాయాలై మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది. తల్లిని మోటార్ సైకిల్పై తీసుకెళ్తుండగా, కారు రూపంలో మృతువు దూసుకొచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచలో బాబుజగ్జీవన్రామ్ జయంతిలో పాల్గొనేందుకు కరకవాగుకు చెందిన 34వ డివిజన్ కార్పొరేటర్ భట్టు విజయలక్ష్మి శనివారం తన కుమారుడు అఖిల్ నందన్(19) బైక్పై బయలుదేరారు. బస్టాండ్ వద్ద కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టి.. కింద పడిన అఖిల్నందన్ పైనుంచి వెళ్లడంతో తల భాగం నుజ్జునుజ్జయింది. విజయలక్ష్మికి కూడా గాయాలయ్యాయి. వీరి వెనకాలే మరో బైక్పై వస్తున్న పెద్ద కుమారుడు చైతన్శ్రీ స్థానికుల సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అఖిల్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు తల్లిని తీసుకెళ్తున్న కుమారుడు రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం అందరినీ కలిచివేసింది. అఖిల్ తల్లిదండ్రులు భట్టు లక్ష్మణ్, విజయలక్ష్మిని పరామర్శించేందుకు బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకోగా రోదనలు మిన్నంటాయి. అలాగే, మేయర్ మూడ్ గణేశ్, డిప్యూటీ మేయర్ లలితకుమారి, కార్పొరేటర్లు, నాయకులు కూడా మృతదేహం వద్ద నివాళులర్పించారు. కాగా, ఇంటర్ పూర్తిచేసిన అఖిల్నందన్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యాన ప్రమాదం జరగడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై ఆయన తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
కార్మికుల సంఖ్య తగ్గుముఖం
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో క్రమంగా కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో గనులు, కాలనీలు వెలవెలబోతున్నాయి. యాజమాన్యం యాంత్రీకరణ పేరుతో భూగర్భ గనులను మూసివేసి ఓపెన్కాస్ట్ గనులు ఏర్పాటు చేస్తుండటంతో కార్మికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వీఆర్ఎస్, గోల్డెన్ హ్యాండ్షేక్ వంటి స్కీమ్లతో గత 14 ఏళ్లలో దాదాపు 28 వేల మంది కార్మికులు ఇంటిబాట పట్టినట్లు కంపెనీ గణాంకాలే చెబుతున్నాయి. 2013–14 సంవత్సరంలో 61,778 మంది కార్మికులు ఉండగా, ప్రస్తుతం 39,460 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. సంస్థలో కార్మికుల సంఖ్య తగ్గుతున్నా యాజమాన్యం మాత్రం ఏటా ఉత్పత్తి రేషియోను 10 శాతం పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించుకుంది. అయితే కార్మికుల సంఖ్య తగ్గుతుంటే, ఉత్పత్తి లక్ష్యం పెంచడం వల్లే కార్మికులపై పనిభారం పెరుగుతోందని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్లేవి?సింగరేణి సంస్థ మూడేళ్లుగా ఎక్స్టర్నల్ నోటిఫికేషన్లు విడుదల చేయడంలేదు. 2023 సంవత్సరంలో 10 విభాగాల్లో 272 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత నియామకాలు చేపట్టలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పనిచేసిన సీఎండీ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత సంస్థకు ఇద్దరు సీఎండీలు మారారు. కానీ ఎవరూ నోటిఫికేషన్లు, నియామకాలపై దృష్టిసారించలేదు. 2023 ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ఏటా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక నియామకాల విషయం విస్మరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది కార్మికుల ఉత్పత్తి (మిలియన్ సంఖ్య టన్నులు) 2013-14 61,778 50.47 2017-18 54,043 62.01 2021-22 43,672 65.02 2025-26 39,460 68.00సింగరేణిలో పెరుగుతున్న పనిభారం సింగరేణి సంస్థ ఉన్న గనుల్లో లక్ష్యాలను పెంచుకోవటం వల్ల బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పడుతున్నాయి. అదేరీతిలో కొత్త గనుల ఏర్పాటుకు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. అప్పుడు కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. –కాపు కృష్ణ, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సంస్థలో గత 14 ఏళ్లలో కార్మికుల సంఖ్య తగ్గిపోతోంది. యాజమాన్యం మాత్రం ఉత్పత్తి లక్ష్యం పెంచుతూ కార్మికులపై పనిభారం మోపుతోంది. దీనివల్ల కార్మికులు గనుల్లో ఎక్కువ కాలం పనిచేయలేక పోతున్నారు. –రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి -
పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు డిపోల వారీగా లబ్ధిదారులు
డిపో ప్రయాణించిన మహిళలు చార్జీల విలువ (రూ.ల్లో) ఖమ్మం 2,42,52,201 118,78,47,000సత్తుపల్లి 2,03,31,248 87,47,41,000మణుగూరు 1,52,83,995 69,55,96,000కొత్తగూడెం 1,50,25,096 61,29,67,000భద్రాచలం 1,19,42,306 61,78,98,000మధిర 1,04,86,537 75,52,54,000ఇల్లెందు 43,12,708 17,76,50,000మొత్తం 10,16,34,091 492,19,53,000 -
వేతనం ఆదా అవుతోంది..
ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తా. ఆర్టీసీ బస్సులో నిత్యం వచ్చి వెళ్తుంటాను. మహాలక్ష్మి పథకానికి ముందు ప్రతీనెల పాస్ కొనుగోలు చేశాను. ఇప్పుడు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రాగా పాస్ కొనే నగదు వేతనంలో ఆదా అవుతోంది. – మాధవి, నేలకొండపల్లిప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం మాకు కలిసొచ్చింది. తక్కువ వేతనాలతో పని చేసే మాకు ఈ పథకం వచ్చాక భారం తప్పింది. చార్జీల నగదును ఇతర అవసరాలకు వినియోగిస్తూ, కొంత పొదుపు చేసుకునే వెసులుబాటు కలిగింది. – ప్రియ, నేలకొండపల్లి -
‘సహకారం’లో సందిగ్ధం!
బూర్గంపాడు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల కోసం ఆశావహులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పదవీకాలం ముగిశాక కూడా ఏడాదిన్నరపాటు కొనసాగించిన ప్రభుత్వం గత నవంబర్లో పాలకవర్గాలను రద్దు చేసింది. అప్పటినుంచి పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్లను నియమించింది. ఆరు నెలలుగా పర్సన్ ఇన్చార్జ్ల పాలనే సాగుతుండగా, పాలకవర్గాలు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈసారి ప్రభుత్వం పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్లను, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక చేయాలని యోచించింది. అయితే ప్రస్తుతం ఆ ప్రతిపాదన కూడా అటకెక్కినట్లు తెలుస్తోంది. పర్సన్ ఇన్చార్జ్లతోనే పాలన కొనసాగిస్తారా? ఎన్నికలు నిర్వహిస్తారా? నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమిస్తారా? అనే చర్చ సంఘ సభ్యుల్లో సాగుతోంది. పర్సన్ ఇన్చార్జిలతో పాలనా వైఫల్యం.. జిల్లాలో 21 పీఏసీఎస్లు రైతులకు సేవలందిస్తున్నాయి. వ్యవసాయ రుణాలు ఇవ్వటంతోపాటు రైతులకు ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా పనిచేస్తున్నాయి. డీసీసీబీ నుంచి వ్యవసాయ భూములపై మార్ట్గేజ్ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణకు రుణాలు, పశుపోషణకు రుణాలు, బంగారంపై రుణాలు అందిస్తున్నాయి. జిల్లాలోని అన్ని పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలు సాగుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా, కాంప్లెక్స్ ఎరువుల ధరలు అధికంగా ఉండటంతో రైతులు పీఏసీఎస్ల్లోనే కొంటున్నారు. యూరియా 80శాతం మేర సొసైటీల నుంచే రైతులకు అందుతోంది. పీఏసీఎస్లు 88 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నాయి. రాయితీపై వరి, కంది, పెసర, మినుము, జనుము, జీలుగ విత్తనాలను కూడా విక్రయిస్తున్నాయి. తద్వారా ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. 2004కు ముందు నిర్వీర్యమైన పీఏసీఎస్ల్లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జవ సత్త్వాలు నింపాడు. అప్పటి నుంచి ఆర్థిక పరిపుష్టి సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత తరుణంలో పాలకవర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం కో ఆపరేటివ్ అధికారులనే పర్సన్ ఇన్చార్జిలుగా నియమించటంతో పాలనా వైఫల్యాలు కనిపిస్తున్నాయని సంఘ సభ్యుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సకాలంలో ఎరువులు అందటం లేదని, ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. -
●‘సాక్షి’ ఫొటోగ్రాఫర్కు అవార్డు
‘సాక్షి’ ఖమ్మం యూనిట్ చీఫ్ ఫొటోగ్రాఫర్ రాధారపు రాజుకు అవార్డు లభించింది. తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్(టీపీజేఏ) ఆధ్వర్యాన గత ఏడాది జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఆయన తీసిన ఫొటో అవార్డుకు ఎంపికై ంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగిన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా రాజు అవార్డు అందుకున్నారు. – ఖమ్మం మయూరిసెంటర్ -
కిన్నెరసానిలో పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. డీర్ పార్కులోని దుప్పులు, డ్యామ్, జలాశయాలను వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 277 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.15,450 ఆదాయం లభించింది. 250 మంది బోటింగ్ చేయగా టూరిజం శాఖకు రూ.17,140 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.మార్కెట్ల రిటైర్డ్ ఉద్యోగుల కమిటీ ఎన్నిక ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ మార్కెట్ కమిటీల విశ్రాంత ఉద్యోగుల ఉమ్మడి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఖమ్మం మార్కెట్లో టి.విశ్వనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమస్యలపై చర్చించాక నూతన కమిటీని ప్రకటించారు. గౌరవ సలహాదారుగా ఆమంచి కోటయ్య, గౌరవ అధ్యక్షుడిగా టి.విశ్వనాథం, అధ్యక్షుడిగా జల్లా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా శ్రీపాద నిరంజన్, కోశాధికారిగా సీహెచ్.నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా డి.ఉప్పలయ్య, బి.సుధాకర్, రెంటాల చిన్నహుస్సేన్, పరిటాల సత్యనారాయణ, మూర్తి, సంయుక్త కార్యదర్శులుగా ఎం.ఆంజనేయులు, ఎం.కేశవరావు, కె.సురేందర్రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎం.అరుణ్కుమార్, పి.వెంకయ్య, డి వెంకటేశ్వర్లు, ఉమామహేశ్వరరావు, ఆర్.రెడ్డి, బాబులాల్, ఉదయలక్ష్మి, శర్మ, సారంగపాణిని ఎన్నుకున్నారు.ప్రభుత్వం పీఏసీఎస్లకు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాల మాదిరిగా నామినేటేడ్ పద్ధతిలో నియమించాలనే ప్రతిపాదనలు తీసుకువచ్చింది. దీనిపై మంత్రివర్గ సమావేశాల్లో చర్చ కూడా సాగింది. అధికార పార్టీకి చెందిన పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలూ మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను కూడా పక్కకు పెట్టి పర్సన్ ఇన్చార్జిలను నియమించటంతో ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విపక్ష పార్టీల నాయకుల నుంచి ఎన్నికలు జరపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వానాకాలం వ్యవసాయ సీజన్ ఆరంభం కాకమునుపే పీఏసీఎస్లకు ఎన్నికలు నిర్వహించాలని సంఘ సభ్యుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. -
ఐఎన్టీయూసీ నేతకు డాక్టరేట్
రుద్రంపూర్: ఐఎన్టీయూసీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్కు డాక్టరేట్ లభించింది. కార్మికుల హక్కుల పరిరక్షణ ఉద్యమానికి గాను ఆయనకు జీహెచ్ఆర్టీ ఇండియా సంస్థ ఆధ్వర్యాన డబ్ల్యూఈబీబీఐసీ – ఏఐయూ యూనివర్సిటీ ల సంయుక్త ఆధ్వర్యాన గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరి గిన కార్యక్రమంలో ఆయన కేంద్ర మంత్రులు, వివిధ దేశాల ప్రతినిధుల చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. 85 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనంటేకులపల్లి: అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై రెవెన్యూ అధికారులు దాడిచేసి 85 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా.. టేకులపల్లి మండలం బోడులో రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేటలకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లు శివకుమార్, మహేష్, ప్రభాకర్లు శనివారం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదా ల్లో గ్రామానికి చెందిన ఇరుప సమ్మయ్య నివా సంలో అక్రమంగా నిల్వ ఉంచిన 85 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారించగా.. బి య్యం నిల్వలు గౌతమ్కు చెందినవి కావడంతో ఆయనపై అధికారులు కేసు నమోదు చేశా రు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేదల బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినా, రవా ణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. పట్టుబడిన బియ్యాన్ని సంబంధిత శాఖకు అప్పగించి, తదుపరి విచారణను వేగవంతం చేశారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు.. పాల్వంచరూరల్: మండల పరిధి నాగారం కాలనీ చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు దాడుతున్న గుర్రం దుర్గాప్రసాద్(48)ను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మృతిచెందాడు. మృతుడి భార్య పద్మ శనివారం ఫి ర్యాదు చేయగా.. లారీడ్రైవర్ సువర్ణపాక రవితేజ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. కొత్తగూడెంఅర్బన్: ఆస్తి తగాదాల నేపథ్యాన సుపారీ తీసుకున్న వ్యక్తులు ఒకరిపై దాడి చేసిన ఘటన ఇది. కొత్తగూడెం గొల్లగూడెంకు చెందిన రాము శుక్రవారం రాత్రి డయాలసిస్ చేయించుకుని ఇంటికి వెళ్తుండగా భావన బార్ దగ్గర మేదరబస్తీకి చెందిన సంతోష్, చింటూ ఆపి వాహన లిఫ్ట్ అడిగి ఎవరూ లేని ప్రాంతానికి వెళ్లాక దాడి చేశారు. ఆ సమయాన స్పృ హ కోల్పోయిన రాము తేరుకున్నాక త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రాము బంధువుల వద్ద సంతోష్, చింటూ సుపారీ తీసుకొని దాడి చేసినట్లు తేలడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్టిజన్లకు భరోసా కల్పించాలి
పాల్వంచ: ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేసి, విద్యు త్ సంస్థల్లో పనిచేస్తున్న 19వేల మంది ఆర్టిజన్ల కుటుంబాలకు భరోసా కల్పించాలని పలువురు రాజకీయ, ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు అన్నారు. శనివారం కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో టీవీఏఈ జేఎసీ ఆధ్వర్యంలో ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులను ఆర్టి జన్లుగా గుర్తించినా బ్రిటీష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్ను అంటగట్టి తీవ్రఅన్యాయం చేశారని ఆరో పించారు. ఈ నెల 7వ తేదీలోగా డిమాండ్లను పరి ష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హె చ్చరించారు. ధర్నాకు కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు భట్టు లలిత, చెరకు భాగ్యలక్ష్మి, టీఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ఎ.జలీల్, సీపీఐ నాయకులు పూర్ణచందర్రావు, నిమ్మల రాంబాబు, రాహుల్, గౌని నాగేశ్వరరావు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు చారు గుండ్ల రమేష్, రాధాకృష్ణ, అంకిరెడ్డి నరసింహారావు, రావుల మురళి, గొర్రె వేణుగోపాల్, పూరపాటి రమేష్, జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి, సాయిలు, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్ ఠాగూర్, శారద తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో రాజకీయ, జేఏసీ నాయకులు -
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అన్నిఏరియా ఆస్పత్రుల సూ పరింటెండెంట్లు, వైద్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆస్పత్రుల పనితీరు, అభివృద్ధి పనులు, ఆరోగ్యశ్రీ సేవలపై సమీక్షించారు. సమస్యలు, సిబ్బంది, వైద్యుల కొరత, ఆరోగ్య శ్రీ సేవలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నూతన నిర్మాణా లు, మరమ్మతులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించాలని చెప్పారు. మౌలిక సదుపాయాల మెరుగుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రులపైనే విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు తగిన శానిటేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల పనితీరు, రక్త నిల్వల వివరాలను పరిశీలించి అత్యవసర సేవలకు లోటు లేకుండా చూడాలని సూచించారు., ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. సికిల్ సెల్ అనీ మియా కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూ చించారు. డీసీహెచ్ఓ రవిబాబు, ఏరియా ఆస్పత్రు ల సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికా రులు పాల్గొన్నారు. 61.25 శాతానికి ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో జిల్లాలో ఇప్పటికే 61.25 శాతానికి చేరుకుందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. రాష్ట్రముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి హా జరైన అంకిత్ మా ట్లాడుతూ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్నివిభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. రాజకీ య పార్టీల ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ బూత్ లెవెల్ ఏజెంట్ల నియమిస్తామన్నారు. అదనపు కలెక్టర్ డీ వేణుగోపాల్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసా ద్, సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.గుండాల: క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. శని వారం ఆళ్లపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మండలాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. భూ భారతిలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించా లని ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి ఎదురయ్యే సమస్యలపై ఆరాతీశారు. అనంతరం కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కిచెన్, స్టోర్, రూములను పరిశీలించారు. విద్యుత్ సమస్య నివారణకు ఇన్వర్టర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆళ్లపల్లిలో ఆయిల్పామ్ తోటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసి ల్యాబ్, మందుల గదులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సైవలపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం సరిగ్గా ఉండటం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. మెనూపాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు జగదీశ్వర్ ప్రసాద్, శ్రీను, లాల్చంద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..
అశ్వాపురం: మండల పరిధి మొండికుంట వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా.. బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన బొజ్జా హేమంత్ (25) సంగు వెంకటేశ్వరరెడ్డితో కలసి ఈ నెల 3న ట్రాక్టర్ ట్రక్కులో సున్నపు బస్తాలు వేసుకొని కరకగూడెం మండలం అనంతారం గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈక్రమంలో మెండికుంట గ్రామ శివారు మల్లన్న గుడి సమీపాన మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో ట్రక్కులో కూర్చున్న హేమంత్ రోడ్డుపై పడ్డాడు. దీంతో లారీ అతడిపై నుంచి వెళ్లి కొంత దూరం మేర ఈడ్చుకుని వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్వరరెడ్డికి ఎలాంటి దెబ్బలు తగల లేదు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సీఐ అశోక్రెడ్డి, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి లారీని పోలీస్స్టేషన్ తీసుకెళ్లారు. మృతుడు తండ్రి బొజ్జా బొజ్జయ్య ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రూ.1.39 లక్షలు చెల్లించాలని తీర్పు ఖమ్మంలీగల్: సేవా లోపం నిర్థారణ అయినందున ఫిర్యాదుదారుడికి రూ.1,39,810 చెల్లించాలని ఖమ్మం వినియోగదారుల కమిషన్ శనివారం తీర్పు వెలువరించింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన మండలేపు నాగేశ్వరరావు 2024 ఫిబ్రవరి 12న పాల్వంచలోని డిస్ట్రిబ్యూటర్ బానోత్ బిక్కులాల్ వద్ద ఒకాయ ఫ్రీడమ్ సిల్వర్ ఎలక్ట్రికల్ వాహనాన్ని రూ.54,810 చెల్లించి కొనుగోలు చేశాడు. ఆ సమయాన ఒకసారి చార్జ్ చేస్తే 70 – 75 కిలోమీటర్లు మైలేజీ వస్తుందని, 250 కిలోల బరువు మోస్తుందని తెలిపారు. కానీ మైలేజీ 12 – 18 కి.మీ. దాటకపోగా, సర్వీస్ ఇంజనీర్ బ్యాటరీ లోపం ఉందని తేల్చినా..మార్చడంలో కాలయాపన చేశారు. ఈమేరకు ఆయన న్యాయవాది ద్వారా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు దాఖలు చేశాడు. దీన్ని విచారించిన కమిషన్ ఫిర్యాదుదారుకి కొత్త వాహనాన్ని ఇవ్వాలని లేదా రూ.54,810ను తిరిగి చెల్లించడంతో పాటు మానసిక వేదనకు రూ.75వేలు చెల్లించాలని, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.10వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ మొత్తం 45 రోజుల్లో చెల్లించకపోతే ఏడు శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని తీర్పులో వెల్లడించింది. -
పోటీలతోనే ప్రతిభ వెలుగులోకి..
సూపర్బజార్(కొత్తగూడెం): పోటీల నిర్వహణ ద్వారానే క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తుందని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం పరంధామరెడ్డి అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామవరం సాధన గ్రౌండ్లో శనివా రం జిల్లా సీనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నైపుణ్యం కలిగిన అథ్లెట్లు ఉన్నారని, రెండుసార్లు రాష్ట్ర సీఎం కప్ చాంపియన్షిప్ సాధించాని గుర్తుచేశారు. కార్పొరేటర్లు ఎర్రవెల్లి శంకర్, కూరపాటి సుధాకర్ రాజు, ఆకునూరి సుప్రియ, మునిగడప పద్మ మాట్లాడుతూ క్రీడాలఅభివృద్ధికి తమవంతు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహీధర్ మాట్లాడుతూ ఈ నెల 11న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు 20 మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం బహుమతులను ప్రదానం చేశారు. సీనియర్ క్రీడాకారుడు మోరె రమేష్, అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రెటరీ డి.మల్లికార్జున్, కోచ్లు రియాజ్ పాషా జొన్నగిరి ప్రసాద్, పవన్, పీడీ శ్వేత, రామవరం వర్తక సంఘం బాధ్యులు జాకీర్, సుభాష్, ముస్తఫా పాల్గొన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి -
డీసీసీబీ లాభాల్లో పీఏసీఎస్లకు వాటా
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) 2025–26 ఆర్థిక సంవత్సరం సాధించిన రూ.30 కోట్ల లాభాల నుంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లకు రూ.6 కోట్లను డివిడెంట్ రూపంలో అందించింది. ఈమేరకు డీసీసీ బీ ఆర్థిక ప్రగతి వివరాలను బ్యాంకు సీఈఓ ఎన్.వెంకట్ ఆదిత్య శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వ్యాపారంతో పాటే లాభాలు గతంతో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.878 కోట్ల వ్యాపారాన్ని పెంచుకొని మొత్తం రూ.4,338 కోట్ల లావాదేవీలకు చేరిందని సీఈఓ తెలిపారు. తద్వారా రాష్ట్రంలోని ఉన్న తొమ్మిది కేంద్ర సహకార బ్యాంకుల్లో రెండో స్థానాన నిలిచిందని పేర్కొన్నారు. రుణాలను సకాలంలో వసూలు చేయడం ద్వారా నిరర్ధక ఆస్తుల శాతాన్ని 0.95కు తగ్గించామని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5.30 కోట్ల లాభాలు గడిస్తే.. 2025–26లో రూ.30 కోట్లకు చేరాయని, ఇందులో నుంచి పీఏసీఎస్లకు డివిడెంట్గా అందించామని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారం, కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్చార్జి అనుదీప్ దురిశెట్టి పర్యవేక్షణలో అధికారులు, ఉద్యోగుల కృషి ఫలితంగా ఆర్ధికాభివృద్ధి నమోదైందని, 2026–27లో లావాదేవీలను రూ. 6 వేల కోట్లకు పెంచేలా కృషి చేస్తున్నామని తెలిపారు.డివిడెంట్గా రూ.6కోట్ల పంపిణీ -
క్రీడలతో దేహదారుఢ్యం, ఆరోగ్యం
సూపర్బజార్(కొత్తగూడెం): క్రీడలతో దేహదారుఢ్యం, మానసికోల్లాసం, ఆరోగ్యం దరిచేరుతుందని రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో గాయత్రి క్రికెట్ చాంపియన్ షిప్ టోర్నీని శనివారం ఆయన ప్రారంభించా రు. తొలుత బీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్, వనమా రాఘవేందర్, కాపు సీతాలక్ష్మి, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ యువత క్రీడలపై దృష్టి సారించి సూచించారు. పోటీల నిర్వాహకులు బి. శ్రీనివాస్, కన్నీ, బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్రెడ్డి, రంగనాథ్, బాదావత్ శాంతి, కార్పొరేటర్లు మల్హోత్రా సాగర్, సింధు తపస్వీ పాల్గొన్నారు. కొత్తగూడెంఅర్బన్: ఎన్నికలలో గెలిచినా, ఓడినా బీఆర్ఎస్ నేతలు ప్రజలకు అండగా నిలుస్తారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కొత్తగూడెంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన మాజీ కౌన్సి లర్ రుక్మాంగధర్ బండారి ఇంట్లో నాయకులతో మా ట్లాడారు. పద్మశాలీ సంఘం నూతన కమిటీని అభినందించారు. మాజీ ము న్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, డి.రాజేందర్, ఎ.గాంధీ, ప్రసాద్, వేణు పాల్గొన్నారు. -
జాగ్రత్తలు పాటించాలి
భద్రాచలం: భద్రగిరి గిరిజన మార్ట్కు విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఉత్పత్తుల్లో నాణ్యత ఉండేలా జాగ్రత్తలు పాటించాలని ఐటీడీఏ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. శనివారం ఐటీడీఏ సమావేశం మందిరంలో నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్న యజమానులు, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం శిక్షణ డిప్యూటీ కలెక్టర్లతో సమావేశమయ్యారు. గిరిజన నిరుద్యోగ కేరళలో నెపుణ్య శిక్షణ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు పీఓ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థలో శిక్షణకు తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన యువతకు 25 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 10వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
రూ.3.50 కోట్లతో ఇల్లు కొని మోసపోయి.. ఆత్మహత్య
అమీర్పేట: రూ.3.50కోట్లు చెల్లించి ఇంటిని కొనుగోలు చేశాడు... గృహ ప్రవేశానికి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భద్రాద్రి కొత్తగూడెం సారపాకకు చెందిన ప్రవీణ్కుమార్రెడ్డి (42) స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల వనస్థలిపురంలో రూ.3.50 కోట్లతో ఇల్లు కొనుగొలు చేశాడు. గృహప్రవేశం కోసం ఈ నెల 2న భార్య అనూష, కూతురుతో కలిసి నగరానికి వచ్చి నిజాంపేటలోని బావమరిది ఇంట్లో దిగారు. శుక్రవారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన ప్రవీణ్రెడ్డి తిరిగి రాకపోవడంతో భార్య ఫోన్ చేస్తే సమయం పడుతుందని తెలిపాడు. అర్ధరాత్రి 12 గంటల సమయాన మరోసారి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అంతకుముందు భార్యకు పంపిన లొకేషన్ ఆధారంగా వెతుక్కుంటూ అమీర్పేట రాగా, రెనెక్సా అపార్ట్మెంట్ సమీపాన ఫుట్పాత్పై చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు చేరుకుని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు అమ్మిన వ్యక్తులు నకిలీ పత్రాలతో తనను మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని అందులో పేర్కొన్నాడు. ఘటనపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ పత్రాలతో నమ్మించారని సూసైడ్నోట్ -
హైవేపైకి స్వాగతం !
వైరా: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. అయితే, ఖమ్మంలో కాకుండా వైరా మండలం సోమవరం వద్ద హైవేపైకి ఈనెల 2వ తేదీ నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం వస్తున్న వాహనాలు వైరా దాటాక సోమవరం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే పైకి చేరుకుంటున్నాయి. ఫలితంగా దేవరపల్లి వరకు జాతీయ రహదారిపై రాకపోకలు ఊపందుకుంటున్నాయి. 162కి.మీ. నిడివితో నిర్మాణం.. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల నిడివితో జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ హైవే ఖమ్మం జిల్లాలోనే 105 కి.మీ. మేర ఉంది. అయితే, ఖమ్మం సమీపాన మున్నేటిపై వంతెన, ధంసలాపురం వద్ద రైల్వేలైన్పై బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సమయాన వైరా వద్ద హైవేపైకి వాహనాలను అనుమతించినా ప్రమాదాలు జరగడంతో నిలిపివేశారు. కాగా, మున్నేరు, రైల్వేలైన్పై బ్రిడ్జిల నిర్మాణ పనులకు ఇంకా సమయం పట్టనుండడంతో రద్దీని నియంత్రించేలా వైరా మండలం సోమవారం వద్ద హైవేపైకి వాహనాలను అధికారికంగా అనుమతిచాలని నిర్ణయించారు. ఈవిషయమై అవగాహన కల్పించేలా ఖమ్మం నుంచి వైరా వరకు పలు ప్రాంతాల్లో సైన్బోర్డులు ఏర్పాటు చేశారు. అంతా సిద్ధం.. రెండు బ్రిడ్జిలు మినహా హైవే నిర్మాణం దాదాపు పూర్తయింది. డివైడర్ల నిర్మాణం పూర్తికాగా పూల మొక్కలు నాటడమే కాక వేగ నియంత్రణను తెలిపేలా సైన్ బోర్డుల ఏర్పాటు, రెస్ట్ రూమ్లు, పెట్రోల్ బంక్లు, వైద్య సదుపాయం కోసం కల్లూరు మండలం లింగాల సమీపాన గదులు నిర్మించారు. అంతేకాక టోల్ రుసుము వసూలుకు గేట్లు కూడా ఏర్పాటు చేశారు. రాత్రి వేళ వెలుగుల కోసం సోలార్ లైట్లు బిగించారు. ఈనేపథ్యాన హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా ఖమ్మం చేరుకుంటున్న వాహనాలు.. ఆపై 20 కి.మీ. ప్రయాణిస్తే వైరా మండలం సోమవరం వద్ద ఎంట్రీ పాయింట్ వస్తుంది. అక్కడ హైవేపైకి చేరితే దేవరపల్లి వరకు సులువుగా వెళ్లే అవకాశం ఉండడంతో వాహనదారులు వినియోగించుకుంటున్నారు. -
గిరిజన సంస్కృతిపై అధ్యయనం..
భద్రాచలం/దుమ్ముగూడెం: ఏజెన్సీ ఏరియాలోని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై అధ్యయనం, వారి జీవనశైలిని తెలుసుకునేందుకు భద్రాచలం, దుమ్ముగూడెం మండలంలో గ్రూప్ వన్ శిక్షణ డిప్యూ టీ కలెక్టర్ల బృందం పర్యటించింది. గ్రూప్ వన్ ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ల రెండురోజుల శిక్షణలో భాగంగా భద్రాచలం ఏజెన్సీలో పర్యటిస్తున్నారు. ఈక్రమాన ఐటీడీఏ పీఓ సూచనల మేరకు శనివారం భద్రాచలంలోని గిరిజన వికాసం ప్రత్యేక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి అల్పాహారం తీసుకుని వారికి తర్ఫీదునిస్తున్న సిబ్బందిని అభినందించారు. అనంతరం బృంద సభ్యుడు రాజ్కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్ర పోషించి మంచి విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా నిష్ణాతులను చేయాలన్నారు. అదేవిధంగా దుమ్ముగూడెం మండలంలోని గౌరారం గ్రామపంచాయతీ పరిధి లింగాపూరం జీపీఎస్ పాఠశాలను సందర్శించిన బృంద సభ్యులు గ్రామంలోని మంచినీటి వసతి, వైద్యసేవలు, విద్య, అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలు, భూ సమస్యలు, రోడ్డు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం లక్ష్మీనగరం గ్రామంలోని కే.రేగుబల్లి ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసిభోజనం చేశాక 10వ తరగతి విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళికలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్కుమార్, ఏఓ సున్నం రాంబాబు, తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీడీఓ వివేక్ రామ్, సెక్రటరీ స్రవంతి, జీపీఓ వెంకన్న, సర్పంచ్ శ్యామల రవివర్మ, ఆర్ఐ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ అరుణకుమారి, గ్రామస్తులు పాల్గొన్నారు. మండలాల్లో పర్యటించిన డిప్యూటీ కలెక్టర్ల బృందం -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజ లు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాతసేవ, సేవా కా లం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు.విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. వా రాంతపు సెలవు రోజులు కావడంతో స్వామి వారి ఆర్జితసేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వృద్ధాశ్రమానికి సోలార్ ప్లాంట్ వితరణభద్రాచలం: భద్రాచలంలోని సరోజమ్మ వృద్ధాశ్రమానికి దాతలు రూ.5లక్షల విలువైన సోలా ర్ ప్లాంట్ సమకూర్చారు. బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన గతంలో ఆశ్రమానికి భవనం నిర్మించారు. ఇప్పుడు ట్రస్టు చైర్మ న్ పంచాక్షరయ్య మనవడు సాయిపంచాక్షర్ తన మొదటి నెల వేతనం నుంచి రూ.5 లక్షలతో సోలార్ ప్లాంట్ సమకూర్చారు. ప్లాంట్ను పంచాక్షరయ్య శనివారం ప్రారంభించారు. తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ – నీలిమ, వల్లూరిపల్లి వంశీకృష్ణ, బూర్గంపాడు పీఏసీఎస్ మాజీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, అడుసుమిల్లి జగదీశ్, పల్లంటి దేశప్ప, మోతుకూరి వీరయ్య, బొడ్డపాటి రామారావు, చావా లక్ష్మీనారాయణ, జలగం చంద్రశేఖర్, ఆశ్రమం నిర్వాహకులు సరోజనమ్మ, రఫీ పాల్గొన్నారు. 4.5 కిలోల శిశువు జననంఅశ్వారావుపేటరూరల్: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బాలభీముడు జన్మించాడు. మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన ముంగర మమత కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి రాగా, వైద్యులు ఆమెకు సాధారణ ప్రస వం చేశారు. ఆమె 4.5కిలోల బరువు ఉన్న మగ శిశువు జన్మించాడు. సహజంగా అప్పుడే జన్మించే శిశువులు రెండు నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారని, 4.5కిలోల బరువు ఉండటం అరుదైన ఘటనగా ఆస్పత్రి గైనకాలజిస్టు మౌనిక తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏకకాలంలో పోలీసుల నాకాబందీసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో పోలీసులు నాకాబందీ కార్యక్రమం చేపట్టారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పటిష్టమైన ప్రణాళికతో వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, పాత నేరస్తులను గుర్తించేందుకు ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. -
అనాథలను ఆదుకోరూ..
● వదిలేసిన తల్లి.. మరణించిన తండ్రి.. ● ఇద్దరు చిన్నారులను పోషిస్తున్న నాయనమ్మ పాల్వంచరూరల్: తల్లి వదిలేసి వెళ్లింది.. తండ్రి ఇటీవల మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ గండికోట ప్రసాద్, కృష్ణవేణిని వివాహం చేసుకున్నాక ఇద్దరు కుమారులు ఆరేళ్ల భార్గవ్, ఐదేళ్ల రోహిత్శర్మ జన్మించారు. వీరు స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈనేపథ్యాన తల్లిదండ్రుల మధ్య వివాదం కారణంగా తల్లి ఇద్దరి పిల్లలను వదిలేసి హైదరాబాద్కు వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ పిల్లల ఆలనాపాలన చూసుకుంటున్న తండ్రి కూడా ఇటీవల మృతిచెందడంతో అనాథలుగా మిగిలారు. పోషణ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఒంటరి వృద్ధురాలైన నాయనమ్మ ఐలమ్మ వద్ద ఆ ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. అయితే తాను ఉన్నంత వరకే పిల్లలను పోషించగలను.. తదనంతరం పరిస్థితి ఏంటని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలో ఇద్దరి చిన్నారుల ఉన్నత చదువులకు సహకారం అందిస్తానని మాజీ జెడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య తెలిపారు. -
బాధితుడి ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు
చండ్రుగొండ: బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదైన సంఘటన మండలంలోని జర్పులతండాలో జరిగింది. ఎస్ఐ శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్సైట్ ఎఫ్ఐఆర్ నమోదు కార్యక్రమంలో భాగంగా జర్పులతండా గ్రామానికి చెందిన గుగులోతు రాములు ఇంటికి ఈ నెల 2న రాత్రి సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి మేకను అపహరించుకుని వెళ్లారు. బాధితుడి సమాచారం మేరకు సంఘటన స్థలానికి శనివారం వెళ్లిన పోలీసులు విచారణ జరిపి అక్కడే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని బాధితుడికి అందించారు. అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై.. పాల్వంచరూరల్: మహిళపై మద్యం సేవించి అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచకు చెందిన ఆజ్మీరా అనుష గత నెల 30న తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా మండల పరిధి కోడిపుంజులవాగు గ్రామంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కేక్ కట్టింగ్ అయ్యాక వీధులో వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన తేజావత్ రాధాకృష్ణ అకారణంగా అసభ్య పదజాలంతో దూషించి గొడవ పెట్టుకున్నాడని శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. అట్రాసిటీ కేసు నమోదు ఇల్లెందు: వైన్స్షాప్ టెండర్లో పెట్టుబడి కోసం తన వద్ద డబ్బులు తీసుకొని తిరిగి అడిగితే కులం పేరుతో దూషించాడని పట్టణంలోని స్టేషన్బస్తీకి చెందిన కొండపల్లి గణేష్పై అదే బస్తీకి చెందిన బానోత్ గోపీచంద్ శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకొని నెలలు గడిచినా తిరిగి ఇవ్వకపోవడంతో ఊరకొండ ధనుంజయ్, దమ్మాలపాటి ప్రసాద్లతో కలిసి ప్రశ్నించేందుకు వెళితే తనను కులం పేరుతో దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు గణేష్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సీఐ సురేష్ తెలిపారు. -
ఒక్కొక్కటిగా కొలిక్కి..
రాష్ట్ర విభజనకు ముందు 2013 ఏప్రిల్లో నియోజకవర్గానికో మినీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించారు. ఒక్కో స్టేడియానికి కనీసం ఐదెకరాల స్థలం ఉండాలని నిబంధనలు విధించారు. అందులో భాగంగా ప్రస్తుత జిల్లాకు ఐదు స్టేడియాలు మంజూరయ్యాయి. అయితే, బడ్జెట్ అనుమతులు తీసుకోకుండానే పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. దీంతో సకాలంలో అనుమతులు రాక నిర్మాణ పనులు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారాయి. ప్రకటన వెలువడి పన్నెండేళ్లు దాటినా కొత్తగూడెం మినహా ఎక్కడా స్టేడియాలు అందుబాటులోకి రాలేదు. ఇటీవల విడుదలైన కాగ్ నివేదిక సైతం స్టేడియం పనులు జరుగుతున్న తీరుపై విమర్శలు గుప్పించింది. అయితే, ఇప్పుడీ పరిస్థితిలో మార్పు వస్తోంది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంపినపాకలో తొలగిన చిక్కులు పినపాక నియోజకవర్గ మినీ స్టేడియాన్ని కరకగూడెంలో నిర్మిస్తున్నారు. నిధుల కొరత కారణంగా నిర్మాణ పనులు ఆగుతూ..సాగుతూ ఉన్నాయి. ఇటీవల రూ.1.20 కోట్లు మంజూరుకాగా, ఇక పనులు ఊపందుకోనున్నాయి. 2013లో ఒక్కో స్టేడియానికి రూ.2.32 కోట్లు కేటాయించగా, మారిన పరిస్థితులు, క్రీడా వసతులు పెంపునకు ఉన్న డిమాండ్ను దృష్ట్యా కొత్తగా నిర్మించబోయే స్టేడియాలకు బడ్జెట్ పెంచే అవకాశం ఉంది. ఒక్కో స్టేడియానికి రూ.3.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఇల్లెందులో ప్రారంభానికి సిద్ధం ఇల్లెందులో సీఈఆర్ (సింగరేణి ఎంప్లాయీస్ రిక్రియేషన్) క్లబ్ సమీపంలో స్టేడియం నిర్మాణ పనులు మొదలు పెట్టారు. నిధుల గ్రహణంతో తీవ్ర జాప్యం జరిగినా.. ఎట్టకేలకు పనులు తుది దశకు చేరుకున్నాయి. సివిల్ వర్క్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇక్కడ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, చెస్, క్యారమ్స్ వంటి గేమ్స్తోపాటు జిమ్ రూమ్ కూడా ఉంది. ఔట్డోర్ విభాగంలో వాకింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్ట్ విత్ 18 ఫీట్స్ నెట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం 200 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్ పనులు జరుగుతున్నాయి. మరో నెలరోజుల్లో ఈ స్టేడియం ప్రారంభానికి సిద్ధంకానుంది. కొత్తగూడెం.. ఆర్చరీలో మేటి కొత్తగూడెం నియోజకవర్గానికి మంజూరైన మినీ స్టేడియాన్ని పాల్వంచలో నిర్మించారు. ఇక్కడ ఆర్చరీలో ఉత్తమ శిక్షణ లభిస్తోంది. టేబుల్ టెన్నిస్, టెన్నిస్, బ్యాడ్మింటన్లో క్రీడాకారులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ప్రతిభ చాటుతున్నారని జిల్లా క్రీడాధికారి పరంధామరెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన సీఎం కప్ టోర్నమెంట్లో జిల్లా క్రీడాకారులు సత్తా చూపించారని పేర్కొన్నారు. భద్రాచలానికి 2013లో స్టేడియం మంజూరుకాగా, ఆ తర్వాత ఏడాదికే రాష్ట్ర విభజన జరిగి పట్టణం మినహా మిగిలిన ప్రాంతమంతా ఏపీ పరిధిలోకి వెళ్లింది. దీంతో స్థల సమస్య కారణంగా పన్నెండేళ్లుగా మినీ స్టేడియం పనులు పట్టాలెక్కలేదు. తాజాగా ఐటీడీఏ ఆఫీస్ రోడ్డులో ఐదెకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. భూబదలాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇక అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఆరంభంలో ఎంపిక చేసిన స్థలం ఊరికి దూరంగా ఉండటంతో పనులు మొదలుపెట్టలేదు. ఈ లోగా ఆ స్థలాన్ని పల్లె ప్రకృతి వనానికి కేటాయించారు. తాజాగా జంగారెడ్డిగూడెం రోడ్డులో బీసీ వెల్ఫేర్ హాస్టల్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అనుమతులు రాగానే భద్రాచలం, అశ్వారావుపేటలలో పనులు మొదలయ్యే అవకాశం ఉంది. -
కొత్త పింఛన్లకు మోక్షం
● రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో దరఖాస్తుదారుల్లో ఆశలు ● జిల్లాలో 69,136కు పైగా పెండింగ్ దరఖాస్తులుచుంచుపల్లి: చేయూత పథకం కింద కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అర్జీదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా 2 లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించడంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,13,942 మంది చేయూత పింఛన్లు పొందుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఆసరా పథకం కోసం వచ్చిన కొత్త అర్జీలను వెనువెంటనే పరిష్కరించి పింఛన్లు విడుదల చేసేవారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత, బీడీ కార్మికులకు రూ. 2016 చొప్పున, దివ్యాంగులకు రూ. 4016 చొప్పున ప్రతి నెలా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమచేశారు. కానీ ఆ తర్వాత పింఛన్ల మంజూరులో జాప్యం జరుగుతోంది. భారీగా చేయూత దరఖాస్తులు 2018లో అప్పటి ప్రభుత్వం పింఛన్ అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు కుదించింది. 2021 ఆగస్టు వరకు దరఖాస్తులను స్వీకరించి, 2022 ఆగస్టులో కొందరికి కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. మరికొందరికి మంజూరు కాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాపాలన పేరుతో మళ్లీ దరఖాస్తుల స్వీకరించింది. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువు, చేనేత, బీడీ కార్మికులు, బోధకాలు, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కొత్త పింఛన్ల కోసం జిల్లాలో 69,136 దరఖాస్తులు అందాయి. ఇందులో దివ్యాంగులు 7,438 మంది ఉండగా, ఇతర పింఛన్ల కోసం 61,698 మంది దరఖాస్తులు సమర్పించారు. ఆ తర్వాత కూడా పలువురు దరఖాస్తులు అందజేశారు. తాజాగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దరఖాస్తుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకంలో భాగంగా ప్రతినెలా రూ. 25.73 కోట్లను జిల్లాలోని లబ్ధిదారులకు అందజేస్తోంది. కొత్తగా మంజూరు చేయబోయే పింఛన్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 233 కోట్లను మంజూరు చేసింది. ఈ విషయమై డీఆర్డీఓ ఎం.విద్యాచందనను సంప్రదించగా.. పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఉన్నతాధికారుల నుంచి వచ్చే మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. -
అప్రమత్తతే శరణ్యం..
● ఠారెత్తిస్తున్న ఎండలు ● ఆస్పత్రుల్లో పెరుగుతున్న ఓపీలు ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులుపాల్వంచరూరల్: భానుడి భగభగలతో పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఉద యం 9 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వారం వరకు సరైన రక్షణ చర్యలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించడంతో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్పత్రులపాలు కాకతప్పదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో చల్లటి గాలుల మూలంగా వాతావరణంలో మార్పులు చేసుకుని ప్రధానంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో ఓపీల సంఖ్య ఎక్కువవుతోంది. ఆరోగ్యంపై ప్రభావం.. ఎండాకాలంలో చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు ఎక్కువగా డీహైడ్రేషన్కు గురవుతుంటారు. వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునే శక్తి ఉండకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతుండగా.. గంటకోసారి నీళ్లు లేదా ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటి పౌష్టికాహారంతో రోగనిరోధక శక్తి పెరిగి ఎండ తీవ్రత నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఉదయం ఎండలు, రాత్రి చల్లటి గాలుల ప్రభావంతో చిన్నారుల్లో విరోచనాలు, దగ్గు, జలుబు, జ్వరం, వృద్ధుల్లో జ్వరంతో పాటు ఒళ్లు, కీళ్ల నొప్పులు, శ్వాసకోస, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తుండగా సమీపంలోని వైద్యులను సంప్రదించడం మేలు. ఎండ త్రీవతను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ, భవన నిర్మాణ, వ్యవసాయ కార్మికులు ప్రతి రోజు ఉదయం 11 గంటలకు పనులు పూర్తి చేసుకోవడం లేదా సాయంత్రం 4 గంటల తర్వాత పనులు చేసుకుంటే ఉత్తమం. ఎండ తగలకుండా టోపీలు, ముఖానికి కర్చీఫ్ లేదా కండువా కప్పుకోవడంతో పాటు నీడపట్టున ఉండాలి. లూజు దుస్తులు ధరించాలి. పనిచేస్తున్న సమయాన తలనొప్పి, కళ్లు తిరగడం, నీరసంగా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.వేసవిలో ఎండదెబ్బ తగలకుండా ఎక్కువ శాతం ఓఆర్ఎస్, మంచినీరు, మజ్జిగ, పండ్ల జ్యూస్ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా చిన్నారులను కూలర్లకు దగ్గరగా పడుకోపెట్టకూడదు. టూర్లకు వెళ్లే వారికి జాగ్రత్తలు తప్పనిసరి వాంతులు, వీరోచనాలు వంటి లక్షణాలు ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ ముక్కంటేశ్వరరావు, చిన్నపిల్లల ప్రభుత్వ వైద్యుడు ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో బయట తిరగకూడదు. పనిచేస్తున్న సమయంలో అప్పుడప్పుడు నీడలో విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుడైన శరీరం డీహైడ్రేషన్కు గురైనట్లు తేలితే పండ్ల రసం, ఓఆర్ఎస్ వంటి ద్రావణాలు తీసుకోవడంతో పాటు వైద్యులను సంప్రదించాలి. – రాజు, పీహెచ్సీ వైద్యుడు, జగన్నాధపురం -
గళమెత్తారు..
యేసు త్యాగాలను స్మరిస్తూ..జిల్లావ్యాప్తంగా శుక్రవారం క్రైస్తవులు గుడ్ఫ్రైడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అన్ని చర్చిలు, మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు క్రీస్తు త్యాగాలను మననం చేసుకుంటూ ప్రదర్శనలు నిర్వహించారు. సిలువ యాత్రల్లో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. మానవాళి రక్షణకు ప్రభువు సిలువ మోశారని మత పెద్దలు వివరించారు. రైతుల ఆందోళన– వివరాలు 9లో... పార్లమెంట్లో పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఎరువుల కొరత ఏర్పడుతుందని ప్రచారంరవిచంద్రతెలంగాణ రాష్ట్రానికి అంచున ఉన్న జిల్లా ఛత్తీస్గఢ్, ఏపీలతో సరిహద్దులు పంచుకుంటోంది. ఒడిశా సరిహద్దు సైతం సమీపంలోనే ఉంది. పైగా ఈ నాలుగు రాష్ట్రాల పరిధిలో నివసిస్తున్న గిరిజనులు వివిధ అవసరాల నిమిత్తం జిల్లాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో సెంటర్ పాయింట్గా ఉన్న భద్రాచలం, భద్రాచలంరోడ్ రైల్వే స్టేషన్న్లను జంక్షన్గా అప్గ్రేడ్ చేయాలని, కొత్తగూడేనికి రైల్వే డివిజన్గా హోదా ఇవ్వాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎగువ సభలో కోరారు. మావోయిస్టుల ప్రభావం నుంచి ఇప్పుడే బయటపడుతున్న దండకారణ్య ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీ పెరిగితే అభివృద్ధి త్వరితగతిన సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్కు వినతి పత్రం ఇచ్చారు. దీంతోపాటు తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టు అభివృద్ధికి కేంద్రం సహకరించాలని, అందులో భాగంగా కొత్తగూడెంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరగా.. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. -
గోదాం నిర్మాణ అభ్యంతరాలపై ఆరా
కారేపల్లి: మండలంలోని గుట్టకిందిగుంపు గ్రామంలో గంగదేవి గుట్టపై గోదాం నిర్మాణ ప్రదేశాన్ని గిడ్డంగుల సంస్థ ఎస్ఈ ఆర్.శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. గోదాం నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మట్టిని జేసీబీలతో తొలగించి బయటకు తరలిస్తుండడంతో ఇటీవల సర్పంచ్ ఉండం రాఘవులుతో పాటు స్థానికులు అడ్డుకున్నారు. అంతేకాక గోదాం కోసం గుట్టను ధ్వంసం చేయవద్దని ఆందోళన చేపట్టారు. ఈ మేరకు నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఎస్ఈ శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే, గోదాం కోసం గుట్టను తొలగిస్తూ పర్యావరణాన్ని నాశనం చేయొద్దని కోరడమే కాక గ్రామపంచాయతీ పాలకవర్గ తీర్మానం లేకుండా పనులు చేపట్టారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాగా, నిర్మాణానికి కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని వెల్లడించిన ఎస్ఈ.. స్థానికులు అభ్యంతరం చెబితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సింగరేణి సీఐ సాగర్, సర్పంచ్ ఉండం రాఘవులు, కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, తొగర శ్రీను పాల్గొన్నారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
దుమ్ముగూడెం: మండలంలోని ములకపాడు గ్రామానికి చెందిన బోడ బాబూరావు (72) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. బాబూరావు గురువారం అంతా వ్యక్తిగత పనులపై బయట తిరుగగా అస్వస్థతకు గురై, వాంతులు, విరేచనాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్సఅందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ములకపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణంపాల్వంచరూరల్: రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కరీంనగర్లోని నోసలాపుర్కు చెందిన, హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న గుర్రం దుర్గారావు (48) పాల్వంచలోని వెంగళరావుకాలనీలో ఉన్న ఇంటిని విక్రయించేందుకు కొద్దిరోజుల క్రితం వచ్చాడు. నాగారంకాలనీ పాత చెక్పోస్టు వద్ద టీకొట్టు పెట్టుకున్న తన బంధువు రమణమ్మ వద్దకు వచ్చి వెళ్తుంటాడు. శుక్రవారం కూడా టీకొట్టు నుంచి ఎదురుగా ఉన్న లారీ సర్వీస్ సెంటర్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా పాల్వంచ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో దుర్గారావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు ఉన్నారు. ఎస్ఐ సురేశ్ మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఇసుక లారీలు సీజ్దమ్మపేట/బూర్గంపాడు: ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని దమ్మ పేట పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. ఏపీలోని కుక్కునూరు ప్రాంతం నుంచి అనుమతి లే కుండా మండలంలోని గంగుల గూడెంకు వచ్చిన లారీ.. ఇసుక డంప్ చేసి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డంప్ చేసిన ఇసుకను సీజ్ చేయడమే కాక లారీని తహసీల్దార్కు అప్పగించామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి వెల్లడించారు. అలాగే, పరిమితికి మించి ఇసుక తీసుకెళ్తున్న లారీని బూర్గంపాడు పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. లోడ్కు మించి ఉండటంతో తదుపరి చర్యల కోసం తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆదర్శం దొడ్డి కొమరయ్య జీవితంకలెక్టర్ అంకిత్ సూపర్బజార్(కొత్తగూడెం): దొడ్డి కొమరయ్య జీవితం భావితరాలకు ఆదర్శమని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దొడ్డికొమరయ్య జయంతిని నిర్వహించారు. కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్. మైనార్టీసంక్షేమాధికారి సంజీవరావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కొమరయ్య పోరాట స్ఫూర్తి ఆచరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, దూడల బుచ్చయ్య, సుంక పెద్దాపురం, కంచర్ల లింగయ్య, బైరి రవి కుమార్, కె.సాయికుమార్, దూడల కిరణ్, సంక్షేమాధికారులు పాల్గొన్నారు. గిరిజనుల సంక్షేమానికి కృషిఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలంఅర్బన్: గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఐటీడీఏ కృషిచేస్తున్నట్లు పీఓ బి. రాహుల్ తెలిపారు. శిక్షణ పొందుతున్న గ్రూప్–1 అధికారులు రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చారు. శుక్రవారం ఐటీడీఏలో సమావేశం నిర్వహించగా, పీఓ వారికి వివిధ సంక్షేమ పథకాల అమలుతీరును వివరించారు. అనంతరం వారు భద్రాచలం ఏరి యా ఆస్పత్రిని సందర్శించగా, బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ వివరించారు. ఆ తర్వాత తాత గుడిసెంటర్లోని గ్రంథాలయాన్ని సందర్శించి పోటీ పరీక్షలకు సిద్ధవుతున్న యువతకు సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో అధికారులు అశోక్, మధుకర్, అరుణ కుమారి, ఉదయ్ కుమార్, వేణు పాల్గొన్నారు. గోదావరిలో తగ్గిన నీటిమట్టంమణుగూరు రూరల్: గోదావరిలో నీటిమట్టం తగ్గిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తింది. మున్సిపాలిటీ పరిధిలోని చినరాయిగూడెం ఇంటేక్వెల్కు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసి నీటిని ఇంటేక్వెల్ వైపు మళ్లించే పనులు కొనసాగుతున్నాయి. పనులను పూర్తికాగానే పుర ప్రజలకు నీటి సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. -
క్షుద్రపూజల కలకలం..?
ములకలపల్లి (అన్నపురెడ్డిపల్లి): క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు కన్పించడంతో మైబూబ్నగర్వాసులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో కొద్దిరోజలుగా ఈ అంశం వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఇంటి సమీపంలో నిమ్మకాయులు, పసుపు, కుంకుమ, బియ్యం, ఎండు మిరపకాయలు, మేకు లు తదితరాలు దర్శనమివ్వడంతో కుటుంబీకులతోపాటు స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గురువారం అర్ధరాత్రి వరకూ గస్తీకాసి, నిద్రకు ఉపక్రమించగా, శుక్రవారం తెల్లవారేలోగా కోడిగుడ్లు, నిమ్మకాయలు, పసుపు వేసినట్లు కని పించాయని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై ఎస్ఐ విజయసింహారెడ్డిని సంప్రదించగా, ఘటనా ప్రదేశాన్ని సందర్శించానని, క్షుద్రపూజలేవీ చేయలేదని స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి ఆవరణలో పసుపు, కుంకుమ తదితరాలు వేస్తున్నారని, విచారణ చేపట్టామని పేర్కొన్నారు. -
వార్షిక లక్ష్యం 60 మిలియన్ టన్నులు
రుద్రంపూర్: సింగరేణి సంస్థ 2026–27 ఆర్థిక సంవత్సరానికి 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గతేడాది తొలుత 76, అనంతరం 72, ఆ తర్వాత 60 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని, చివరకు 58 మిలియన్ టన్నుల ఉత్పత్తితో సరిపెట్టుకుంది. అయితే యాజ మాన్యం మాత్రం యాడ్ కోల్ (సింగరేణి వ్యాప్తంగా గనుల్లోమిగిలిపోయిన 4 మిలియన్ టన్నుల బొగ్గు) ను రవాణాలో చూపించి మొత్తం 62 మిలియన్ టన్నుల రవాణా చేసినట్లు పేర్కొనడం గమనార్హం. గతంలో కూడా ఉత్పత్తి చేయకుండానే సుమారు 5 మిలియన్ టన్నుల బొగ్గును అధికంగా చూపిందనే ఆరోపణలు వచ్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 502 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీకి 367 క్యూబిక్ మీటర్ల ఓబీ మాత్రమే సాధించింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ప్రణాళికసింగరేణి సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడింది. అధికంగా వర్షాలు రావటంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఈసారి ముందస్తు చర్యలు చేపట్టి ఏప్రిల్ నుంచే ఉత్పత్తిపై దృష్టి సారిస్తాం. కంపెనపీ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తాం. –ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (ఆపరేషన్స్) -
భారజల ఉద్యోగి ఆత్మహత్య
అశ్వాపురం: మణుగూరు భారజల కర్మాగారం ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు, కర్మాగారం ఉద్యోగి మలుకూరి వెంకటరెడ్డి (59) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలోని గౌతమీనగర్కాలనీలోని క్వార్టర్లో రాత్రి కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నా డు. ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఆరోగ్య సమస్యలే కారణమని మృతుడి తోడల్లుడు ప్రతాప్రెడ్డి ఫిర్యాదు మేరకు సీఐ అశోక్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా, ఏఐటీయూసీ డిఫెన్స్ విభాగం జాతీయ కమిటీ సభ్యుడిగా, ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా, సహాయ కార్యదర్శిగా, డీసీ మెంబర్గా పనిచేసి, అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ఆయన మృతదేహాన్ని జీఎం శ్రీనివాసరావు, అధికారులు, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు సందర్శించిన నివాళులర్పించారు. ఐరన్ షాపులో నగదు చోరీ బూర్గంపాడు: సారపాకలోని ఓ ఐరన్ షాపులో గురువారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సారపాకలోని భవానీ ఐరన్ షాపులో గురువారం రాత్రి క్యాష్ కౌంటర్లోని రూ.30వేల నగదును దుండగులు చోరీ చేశారు. శుక్రవారం షాపు యజమాని వచ్చి చూసి, చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంపాల్వంచ: పట్టణ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ఎస్ఐ నాగరాజు కథనం మేరకు.. బీసీఎం రోడ్లోని కేఎస్ఎం బంక్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయసు 55–60 ఏళ్ల మధ్య ఉంటుందని, గుర్తించినవారు పట్టణ పోలీస్ స్టేషన్లో కానీ 87126 82051 నంబర్లో గానీ సంప్రదించాలని ఎస్ఐ కోరారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి రఘునాథపాలెం: మండలంలోని సుకినితండా వద్ద మూలమలుపులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని రాంక్యాతండాకు చెందిన మాలోతు సేటీ (54) గతనెల 29న కారేపల్లి నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా సుకినితండా వద్ద ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆయనకు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించారు. ఆపై వైద్యుల సూచనతో ఖమ్మం తీసుకొస్తుండగా మృతిచెందాడు. ఘటనపై సేటీ భార్య సేవ్రీ ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ ఫరీష్ తెలిపారు. కాగా, సేటీ కుటుంబీకులను సర్పంచ్ గుగులోతు మూర్తి, చిరుమామిళ్ల రవికిరణ్, అజ్మీరా ఈరునాయక్ పరామర్శించారు. -
గ్రంథాలయంలో ఎమ్మెల్యే సభ్యత్వం
టేకులపల్లి: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా టేకులపల్లి శాఖా గ్రంథాలయంలో లైబ్రేరియన్ ఆర్.నాగన్న ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు సాగుతోంది. శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన సతీమణి కోరం లక్ష్మి అధికారికంగా సభ్యత్వాన్ని స్వీకరించారు. లైబ్రేరియన్ వారికి సభ్యత్వ రశీదులను అందజేశారు. అస్మిత యోగాసన పోటీల్లో ప్రతిభచుంచుపల్లి: న్యూఢిల్లీ ఆనందాశ్రమంలో మార్చి 31 వరకు నిర్వహించిన అస్మిత యోగాసన నేషనల్ లీగ్ పోటీల్లో జిల్లా ప్రతినిధులు ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రధానంగా లక్ష్మిదేవిపల్లి చాతకొండకు చెందిన బుట్టి ప్రమీల జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. మహిళల ఆరోగ్యం, క్రీడా అభివృద్ధికి అస్మిత లీగ్ ఎంతో ఉపయోగకరంగా మారాయన్నా రు. బుట్టి ప్రమీలకు జిల్లాకు చెందిన పలువురు యోగా ప్రముఖులు అభినందనలు తెలిపారు. వృద్ధుడికి అండగా నిలిచిన స్థానికులు కరకగూడెం: మండలంలోని వట్టంవారిగుంపు గ్రామానికి చెందిన ఓర్సు మల్లయ్య మతిస్థిమితం కోల్పోయి శుక్రవారం మండల కేంద్రంలోని డ్రెయినేజీలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. అటువైపుగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ గమనించి స్థానికులతో కలిసి వృద్ధుడిని బయటకు తీశారు. అనంతరం నూతన వస్త్రా లు అందించి ఔదార్యం చాటుకున్నారు. కార్య క్రమంలో పోలేబోయిన పాపారావు, సంపత్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు చేయాలి సూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ సాయుఽ ద పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఏర్పాటు చేయాలని తెలంగాణ కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దూడల బుచ్చయ్య కోరారు. శుక్ర వారం కలెక్టరేట్లో నిర్వహించిన దొడ్డి కొమర య్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్కు వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెం, పాల్వంచలలో సుమారు 20 మంది ఒగ్గుడోలు కళాకారులకు పెన్షన్, ఐడీ కార్డులు ఇవ్వాలని, పాల్వంచ పట్టణంలో కమ్యూనిటీ హాల్ కోసం స్థలం ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో కులపెద్దలు కంచర్ల లింగయ్య, బైరి రవి, సుంకా పెద్దాపురం, దూడల కిరణ్ కుమార్, జంగిలి రాజు, పోలే సాయి పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో యువకుడికి గాయాలు పినపాక: మండలంలోని సీతారాంపురంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మణుగూరుకు చెందిన ఇమ్రాన్ సీతారాంపురంలో చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల గాలివానకు పడిపోయిన సర్వీసు విద్యుత్ తీగను సాయంత్రం సరిచేయడానికి యత్నిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై గాయపడ్డాడు. స్థానికులు యువకుడికి సీపీఆర్ చేసి, 108 ద్వారా మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. -
ప్రభుత్వాస్పత్రుల్లో రేడియాలజీ సేవలు
చుంచుపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన మాతృ, శిశు వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషి చేస్తున్నారు. ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులను నియమించడంతోపాటు టిఫ్ఫా స్కానింగ్కు అందుబాటులోకి తెచ్చారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని భద్రాచలం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు ఆస్పత్రుల్లో ఇప్పటికే టిఫ్ఫా స్కానింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక అశ్వారావుపేట, చర్ల ఆస్పత్రుల్లో గత కలెక్టర్ జితేష్ పాటిల్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు చొరవతో టిఫ్పా స్కానింగ్ యంత్రాలు సమకూరాయి. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అంకిత్ చొరవతో అశ్వారావుపేట, చర్ల ఆస్పత్రుల్లో రేడియాలజిస్టులను నియమించారు. దీంతో జిల్లాలోని ఆరు ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో రేడియాలజీ సేవలు అందుతున్నాయి. టిఫ్ఫా స్కానింగ్ అందుబాటులోకి రావడంతో గర్భిణులు పూర్తిస్థాయిలో మాతృసేవలు పొందుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వ్యయప్రయాసలు తప్పాయి. గర్భంలోని శిశువు అవయవాల అభివృద్ధిని వివరంగా పరిశీలించి, పుట్టుకలో వచ్చే లోపాలను టిఫ్ఫా స్కాన్తో ముందుగానే గుర్తించవచ్చు. తద్వారా అవసరమైన చికిత్స అందించే అవకాశం ఉంది. టిఫ్ఫా స్కానింగ్ సేవలు కూడా అందుబాటులోకి -
‘ఈస్ట్ కోస్ట్’ పరిధిలోకి భద్రాచలం రైల్వేలైన్
● పాండురంగాపురం–సారపాక మార్గానికి నిధులు శూన్యం ● 2026–27 కేంద్ర బడ్జెట్లో రైల్వే కేటాయింపుల వెల్లడి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని పాండురంగాపురం–సారపాక రైల్వే లైన్కు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. పైగా 174 కి.మీ కలిగిన ఈ లైనులో 125 కి.మీలను ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో చేర్చారు. కేంద్ర బడ్జెట్ 2026–27కు సంబంధించి రైల్వే పరమైన కేటాయింపుల వివరాలను శుక్రవారం రైల్వేశాఖ వెల్లడించింది. ఇందులో మల్కన్గిరి–పాండురంగాపురం వయా భద్రాచలం మార్గాన్ని ఈస్ట్కోస్ట్ రైల్వేజోన్ పరిధిలో చూపించింది. బడ్జెట్లో కేవలం రూ.3.13 కోట్లను కేటాయించారు. ఇవి కూడా ఒడిశాలోని మల్కన్గిరి సెక్షన్లోనే ఖర్చు పెట్టనున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వచ్చినా ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపీల పరిధిలోకి వచ్చే 125 కి.మీ నిడివి కలిగిన ట్రాక్ ఈస్ట్ కోస్ట్ పరిధిలోకి వెళ్లనుంది. కేవలం తెలంగాణ పరిధిలో 49 కి.మీలు ఉండనుంది. ఇందులో సారపాక–పాండురంగాపురం సెక్షన్ పరిధి 14 కి.మీలను మినహాయిస్తే, భద్రాచలం స్టేషన్ నుంచి 35 కి.మీ పరిధి వరకు అంటే పాత భద్రాచలం మండలం పరిధి వరకే దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఉండనుంది. ఈ లైనుకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కేటాయింపుల్లో స్పష్టత లేదు జిల్లాకు సంబంధించి మణుగూరు–రామగుండం, కొత్తగూడెం–కిరండోల్, కొత్తగూడెం –కొండపల్లి, డోర్నకల్–భద్రాచలంరోడ్ డబ్లింగ్ పనులు ఎప్పు డో మంజూరయ్యాయి. నిర్మాణ పనులు పూర్తి కావడానికి కనీసం రూ.5 వేల కోట్లు అవసరమవుతాయి. అయితే, ఏ మార్గానికి ఎన్ని నిధులు కేటాయించారనే అంశాలపై రైల్వే శాఖ స్పష్టత ఇవ్వలేదు. ఈ మార్గాలకు సంబంధించి భూసేకరణ వివిధ దశల్లో ఉండగా, ఈ ప్రక్రియ పూర్తయితేనే పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అందువల్లే బడ్జెట్లో కూడా మరోసారి ఫైనల్ లొకేషన్ సర్వే చేపడతామని సరిపెట్టారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి కాజీపేట – విజయవాడ మార్గంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడో లైన్తోపాటు నాలుగో లైను నిర్మాణం కోసం సర్వే చేపట్టబోతున్నట్టు పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు నిరాశే.. కేంద్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో గిరిజన ప్రాంతాల అభివృద్ధితోపాటు కోల్కతా–విజయవాడ–కాజీపేట సెక్షన్కు ప్రత్యామ్నాయ మార్గంగా అసన్సోల్–వరంగల్ రూట్లో నూతన మార్గాన్ని నిర్మిస్తామని పేర్కొంది. అందులో భాగంగా ఒడిశాలోని మల్కన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు 174 కి.మీ కొత్త మార్గాన్ని మంజూరు చేసింది. ఈ రైలు మార్గం ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణలలో నిర్మించాల్సి ఉంది. అయితే, ఈ లైనుకు సంబంధించి పాండురంగాపురం నుంచి సారపాక వరకు 14 కి.మీ మార్గాన్ని ముందుగా నిర్మించాలని తెలంగాణ సర్కార్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ కేంద్రానికి, రైల్వేశాఖకు వినతి పత్రాలు సమర్పించారు. కేవలం 14 కి.మీ ట్రాక్ నిర్మిస్తే సికింద్రాబాద్, విజయవాడ, నాగ్పూర్ల నుంచి నేరుగా భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంతో బడ్జెట్లో కేటాయింపులు జరుగుతాయని ఆశించగా, నిరాశే ఎదురైంది. -
వరదలొచ్చేలోగా వారధి!
● మున్నేటిపై చకచకా తీగల వంతెన పనులు ● వచ్చే వానాకాలంలోగా పూర్తిచేసేలా వేగం ఖమ్మంఅర్బన్: ఖమ్మం జిల్లా కేంద్రానికి కొత్త అందాలను తీసుకొచ్చేలా మున్నేటిపై నిర్మిస్తున్న తీగల వంతెన పనుల్లో వేగం పెరిగింది. రూ.180 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే 70 శాతం పూర్తయింది. అగ్రిమెంట్ ప్రకారం మార్చి నెలలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నా మున్నేటికి వచ్చిన వరదలో కొన్నాళ్లు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత పనులు మొదలుపెట్టి వేగంగా చేయిస్తున్న అధికారులు వచ్చే వర్షాకాలం సీజన్కల్లా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ఖమ్మంలోకి వాహనాల రాకపోకలు సులువు కావడంతో పాటు నగరం కొత్త అందాలు సంతరించుకోనుంది. పురాతన బ్రిడ్జి స్థానంలో.. ఖమ్మంలో మున్నేటిపై ఏళ్ల క్రితం కాల్వొడ్డు ప్రాంతాన బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జి చిన్నాపెద్ద వాహనాల రాకపోకలతో శిథిలావస్థకు చేరింది. అనంతరం ప్రకాశ్నగర్లో ఒకటి, కరుణగిరి వద్ద ఇంకో బ్రిడ్జి కూడా నిర్మించారు. కాగా, 2024లో మున్నేటికి వచ్చిన వరదల సమయాన కాల్వొడ్డు బ్రిడ్జి రాకపోకలకు అనువుగా లేదని తేల్చి అక్కడ కొత్త బ్రిడ్జిని ఆకట్టుకునేలా నిర్మించాలని నిర్ణయించారు. అలా అక్కడ తీగల వంతెన నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 650 మీటర్ల పొడవుతో.. మున్నేటిపై కాల్వొడ్డులో ఉన్న పాత బ్రిడ్జికి ఆనుకుని 690 మీటర్ల పొడవైన తీగల వంతెనకు సంబంధించిన పిల్లర్లు, ఇతర అనుబంధ నిర్మాణాలు పూర్తిచేశారు. ఆపై తీగల అమరిక పనులు వేగంగా చేపడుతున్నారు. ఈ నెలాఖరుకు తీగల అమరికతో పాటు సెగ్మెంట్ల నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆపై అప్రోచ్ రోడ్లు, ఇతర అనుబంధ పనులు పూర్తి చేసి సెప్టెంబర్ నాటికి వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.140 కోట్ల విలువైన పనులు పూర్తవగా, మిగిలిన పనులను దశలవారీగా పూర్తి చేసేలా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఖమ్మంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించడమే కాక నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. -
పాలన పరేషాన్..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం కార్పొరేషన్గా మారి న తర్వాత అభివృద్ధి పరుగులు పెట్టడంతో పాటు ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడుతాయని భావిస్తే అందుకు భిన్నంగా పాలన సాగుతోంది. కార్పొరేటర్లు డివిజన్లలోని ప్రజల సమస్యలపై విన్నవించినా పరిష్కారం కావడం లేదు. చేసిదేమీ లేక కార్పొరేటర్లు వారి డివిజన్ సమస్యలను సోషల్ మీడియా గ్రూప్లలో పోస్టులు పెట్టి పరిష్కరించాలని మేయర్, కమిషనర్ను అడుగుతున్న దుస్థితి నెలకొంది. అయినా కూడా స్పందన రాకపోవడంతో ప్రజల వద్ద అవమానానికి గురవుతున్నామని కార్పొరేటర్లు వారి సన్నిహితులతో వాపోతున్నట్లు సమాచారం. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్లోని డివిజన్లలో కోతులు, కుక్కల దాడులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. గతంలో ఏపీనుంచి ప్రత్యేక సిబ్బందిని కొత్తగూడెం తీసుకవచ్చి కోతు లు, కుక్కలను పట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించే వారు. పట్టిన కోతులను అడవుల్లో వదిలి, కుక్కలను ఏబీసీ సెంటర్కు తరలించి వ్యాక్సినేషన్ చేయించేవారు. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో జరిగిన ప్రక్రియ కార్పొరేషన్ అయిన తరువాత కనుమరైందని, నూతన పాలకవర్గం, కమిషనర్పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలో విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుడిపై కోతులు దాడి చేసి గాయపరిచగా.. మేయర్, కార్పొరేటర్లు పరామర్శించి వదిలేశారు. కానీ, కోతులు, కుక్కలను పట్టించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ తొలి పాలకవర్గ సమావేశంలో కమిషనర్, మేయర్ కార్ల అలవెన్స్లంటూ ఎజెండాలో అంశాలుగా చేర్చారు కానీ, ప్రజ ల సమస్యల పరిష్కరించే అంశాలపై దృష్టి సారించలేదని కార్పొరేటర్లే నిలదీశారు. అలాగే, పాల్వంచలోని రెసిడెన్షియల్ భూములను కమర్షియల్గా, కమర్షియల్ భూములను రెసిడెన్షియల్గా మార్చేందుకు ఎజెండాలో అంశాలుగా చేర్చడంతో కొందరు కార్పొరేటర్లు అధికారులను, మేయర్ను నిలదీశారు. ఎవరి ప్రయోజనం కోసం భూములను మార్చాలని ఎజెండాలో చేర్చారని ప్రశ్నించారు. పాల్వంచపైనే నజర్.. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ కలుపుకొని 60 డివిజన్లతో కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. కాగా, మేయర్, కమిషనర్ కార్పొరేషన్ కార్యాల యంలో కంటే పాల్వంచలోనే ఎక్కువ సమయం ఉంటున్నారని, కొత్తగూడెం సమస్యలు కూడా పట్టించుకోవాలని కార్పొరేటర్లు, ప్రజలు కోరుతున్నారు. పార్టీలకు అతీతంగా పని చేయాల్సిన మేయర్ కొంత మంది ఫోన్లకు సైతం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. పాల్వంచలోని డివిజన్లలో పర్యటిస్తున్నారు కానీ, కొత్తగూడెం డివిజన్లలో కూడా ఎన్నో సమస్యలపై దృష్టిసారించడం లేదని వాపోతున్నారు. సమస్యలెన్నో.. కొత్తగూడెంలో ఎన్నో సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని కార్పొరేటర్లు చెబుతున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సింగరేణి ఆస్పత్రి నుంచి సెవెన్హిల్స్ వరకు సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, కార్పొరేషన్లో వీకెండ్ స్పాట్గానీ, సాయంత్రం వేళల్లో ఆహ్లాదం పొందేందుకు పార్కులు గానీ చెప్పుకోదగినవి లేవని చెబుతున్నారు. పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసి రెండు నెలలు కావొస్తుండగా.. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ తొలిపాలకవర్గ సమావేశంలో బడ్జెట్ రూపకల్పన అంతా అయోమయంగా ఉంది. లెక్కలు కార్పొరేటర్లకు కూడా అర్థం కావడం లేదని తెలుస్తోంది. వచ్చే ఆదాయం, ఖర్చు, మిగులు ఆదాయం అన్నీ కూడా ఒక దానికి మరొకటి పొంతన లేకుండా ఉండడంతో కార్పొరేటర్లు నిలదీశారు. రంజాన్ సందర్భంగా దర్గాల్లో ఏర్పాటు చేసిన టెంట్లు, మంచినీటి సౌకర్యాలకు రూ.లక్షలు కేటాయించినట్లు ఎజెండాలో చూపించారు. పరీక్షకేంద్రాల్లో తాగు నీటి ఏర్పాటు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల ఏర్పాట్లకు కూడా రూ.లక్షల్లో ఖర్చయినట్లు చూపిస్తూ ఎజెండాలో చేర్చడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి సమావేశమే ఇలాఉంటే.. భవిష్యత్లో జరిగే పాలకవర్గ సమావేశాలు ఎలాఉంటాయోనని కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు.పాల్వంచపైనే దృష్టి సారిస్తున్న మేయర్, కమిషనర్ -
జనగణన సమగ్రంగా చేపట్టాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో జాతీయ జనగణన కార్యక్రమాన్ని సమగ్రంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ అధికారులకు సూ చించారు. కచ్చితమైన డేటా సేకరించాలని ఆదేశించారు. జాతీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 1నుంచి 3వ తేదీ వరకు కలెక్టరేట్లో ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన శిక్షణ కార్యక్రమంంలో సిబ్బందికి సమగ్ర అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్లు ఎన్.శివరామకృష్ణ, డాక్టర్ పి.సుస్మిత రజినిలు 34 మంది ఫీల్డ్ ట్రైనర్లకు జనగణన నిర్వహణ, హౌస్ సెన్సెస్, డేటా సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలు, డిజిటల్ పద్ధతుల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా మూడో రోజు పాలకోయతండా ప్రాంతంలో డెమో నిర్వహించారు. ఫీల్డ్ ట్రైనర్లను తీసుకెళ్లి ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించే విధానాన్ని ప్రదర్శించా రు. మొదటి ఇంట్లో హౌస్ సెన్సెస్ కార్యక్రమాన్ని కలెక్టర్ అంకిత్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ డేటా సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెన్సెస్ జిల్లా అధికార సిబ్బంది, సీపీఓ సంజీవరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ అంకిత్ -
డీసీసీబీ లావాదేవీలు ౖపైపెకి..
● రూ.3,460 కోట్ల నుంచి రూ.4,338 కోట్లకు చేరిక ● రూ.30 కోట్ల లాభాలతో రికార్డు ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) లావాదేవీలు 2025–26 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. గత ఏడాది(2024–25) రూ.3,460 కోట్లుగా లావాదేవీలు రూ.4,338 కోట్లకు పెరిగినట్లు అధికారులు తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు. డీసీసీబీ పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురంలో కలిపి 101 సహకార సంఘాలు, 176 వ్యవసాయేతర సంఘాలు ఉన్నాయి. అలాగే, 52 డీసీసీబీ బ్రాంచ్లు కొనసాగుతుండగా వ్యవసాయ రుణాలే కాక మార్ట్గేజ్, బంగారం, విద్యా, గృహ, వాహన రుణాలు మంజూరు చేస్తున్నారు. తాజాగా ముగిసిన 2025–26లో రూ.1,423.86 కోట్ల డిపాజిట్లు, రూ. 2,915.12 కోట్ల అడ్వాన్సులు రాగా, మొత్తం రూ.4,338.98 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అంతేగాక పాత బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి. మొత్తంగా దాదాపు రూ.900 కోట్ల లావాదేవీలు పెరగగా, రాష్ట్రంలో కరీంనగర్ డీసీసీబీ తర్వాత ఖమ్మం రెండో స్థానాన నిలిచింది.ఖమ్మం డీసీసీబీ లాభాల్లోనూ చరిత్ర సృష్టించింది. మునుపెన్నడూలేని విధంగా ఈ ఏడాది రూ.30.9 కోట్ల లాభాలు గడించింది. గత ఏడాది రూ.5.30 కోట్లుగా లాభాలు ఒక్కసారిగా రూ.30కోట్లకు పైగా పెరగడం విశేషం. రెండేళ్ల క్రితం నష్టాల్లో ఉన్న బ్యాంకు క్రమంగా లాభాల బాట పట్టి ఈ స్థాయికి చేరింది. లాభాల విషయంలో కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ తర్వాత నాలుగో స్థానాన ఖమ్మం డీసీసీబీనిలిచింది. -
గిరిజన విద్యార్థులు వృద్ధిలోకి రావాలి
స్కూల్ భవనాన్ని ప్రారంభించిన ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మపాల్వంచరూరల్: ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ గిరిజన విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాలకు చేరాలని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ అన్నారు. పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామపంచాయతీ పరిధి కొయ్యగట్ట ఆదివాసీ గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చొరవతో ఇక్కడ 44మంది విద్యార్థుల కోసం గ్రామస్తులతో ఇటుకలు తయారు చేయించి రూ.3లక్షలతో స్కూల్ భవనం నిర్మించినట్లు తెలిపారు. ఎంఈఓ శ్రీరాంమూర్తి, ఎంపీడీఓ బొగ్గ నారాయణ, పీఆర్ ఏఈఈ శ్రీనివాస్, హౌజింగ్ ఏఈ హేమంత్, సర్పంచ్ సురేష్, ఉపసర్పంచ్ వెంకట్రావ్, పాఠశాల హెచ్ఎం భిక్షం, ఉపాధ్యాయులు రవికుమార్, కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. శిక్షణ కలెక్టర్ సౌరభ్శర్మకు వీడ్కోలు సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఐఏఎస్ అధి కారి సౌరభ్శర్మ ఏడాది పాటు శిక్షణ పూర్తయిన సందర్భంగా గురువారం కలెక్టరేట్లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. దివ్యాంగుల పాఠశాల నిర్మాణానికి సౌరభ్శర్మ రూపొందించిన డిజైన్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందని అభినందించారు. అనంతరం ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ.. జిల్లాలో సికిల్సెల్ అనీమియా సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు పరీక్షలు నిర్వహించడంలో ప్రత్యేక చొరవ చూపారని తెలిపా రు. అనంతరం సౌరభ్శర్మ మాట్లాడగా.. అధికారులు సన్మానించారు. అదనపు కలెక్టర్లు డి.వేణుగోపా ల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఆర్డీఓ మధు, సీపీఓ సంజీవరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మూడు జిల్లాల అవసరాలకు ఎరువులు
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్కు ఇఫ్కో కంపెనీకి చెందిన 2,676.96 మెట్రిక్ టన్నుల యూరియా గురువారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,176.96 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 800 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 500 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మిగతా 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు వెల్లడించారు. పేకాట ఆడుతున్న ఐదుగురి అరెస్ట్ అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి గుర్రాల చెరువు గ్రామ శివారులో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టుబడిన ఐదుగురి నుంచి రూ.3,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యయాతీ రాజు తెలిపారు. నలుగురిపై కేసు నమోదు జూలూరుపాడు: ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కల్గించడంతో పాటు దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. జూలూరుపాడు ఏఎస్సై వెంకట సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతనగర్ మండలానికి చెందిన అజ్మీర లక్ష్మణ్, అజ్మీర రాజ్కుమార్, బండి భాస్కర్, ఆదినారాయణలు జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో గురువారం లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ట్రాలీ ఆటోలో కొత్తగూడెం వైపు వస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సివిల్ సప్లై ఆర్ఐ నిక్కిలి వెంకటేశ్వర్లు కొమ్ముగూడెం శ్రీపెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఆ ట్రాలీ ఆటోను ఆపి తనిఖీ చేయగా 20 సూపర్ బస్తాల్లో బియ్యం ఉన్నట్లు గుర్తించి ఫొటోలు తీస్తున్నాడు. ఈక్రమంలో ఆ నలుగురు వ్యక్తులు ఆర్ఐని దుర్భాషలాడి, చంపుతామంటూ బెదిరించి, దాడి చేసి అక్కడ నుంచి ట్రాలీ ఆటోతో పారిపోయారు. ఆర్ఐ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై వెంకట సుబ్బారావు పేర్కొన్నారు. బంగారం చోరీపై.. భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో గత నెల 27న జరిగిన శ్రీరామనవమి వేడుకను చూసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్కు చెందిన చాకలి లక్ష్మి వచ్చింది. ముందుగా గోదావరి నదిలో స్నానం చేసిన ఆమె రాముల వారి కల్యాణానికి వెళ్లింది. ఈ క్రమంలో తన మెడలో ఉన్న సుమారు 37 గ్రాముల బంగారపు చైన్ మాయమైనట్లు గుర్తించి ఆ పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో గురువారం భద్రాచలం టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఎస్ఐ శ్యాంప్రసాద్ కేసు నమోదు చేశామన్నారు. దుప్పులు వేటాడిన ఇద్దరు వ్యక్తులపై.. చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం హమాలీకాలనీ అటవీ ప్రాంతంలో గురువారం దుప్పులను వేటాడిన ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. స్థానికంగా నివాసముండే సాంబయ్య, సమ్మయ్య ఇద్దరు అటవీ ప్రాంతంలో ఉచ్చులు పెట్టడంతో రెండు దుప్పులు చిక్కగా వాటిని చంపారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు విచారణ చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సాగునీటి కోసం ఘర్షణ ఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామపంచాయతీ నిజాంపేట గ్రామంలో సాగునీటి కోసం గురువారం ఇద్దరు రైతులు ఘర్షణపడ్డారు. తన మొక్కజొన్న చేను ఎండిపోతుండడంతో రైతు అమడగాని భిక్షం పెద్దచెరువు కాలువ నుంచి నీటిని వినియోగించుకుంటున్నాడు. ఇదే సమయాన అక్కడకు వచ్చిన రైతు సూర్నపాక కోటేశ్వరరావు నీటిని తన పొలం దిశగా మళ్లించే ప్రయత్నం చేయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈక్రమంలో కోటేశ్వరరావు రాయితో భిక్షం తలపై కొట్టడంతో అతనికి తీవ్ర గాయమైంది. భిక్షం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్ తెలిపారు. పెళ్లికి వచ్చి అనంతలోకాలకు..ములకలపల్లి: పెళ్లికి వచ్చి విగతజీవిగా మారాడు ఓ యువకుడు. ఆటో నడుపుతూ ఫోన్ మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తాకొట్టి మృత్యువాతపడ్డాడు. ఎస్హెచ్ఓ లక్ష్మణ్ కథనం మేరకు.. మొగరాలగుప్ప గ్రామానికి చెందిన తానం శివ (25) సీతాయిగూడెం గ్రామంలో మిత్రుడు మడివి వీరస్వామి వివాహానికి బుధవారం వచ్చాడు. ఈక్రమంలో అదే పెళ్లికి వచ్చిన మిత్రుడు అశ్వాపురానికి చెందిన బొర్రా నరేందర్ ఆటోలో తోటిమిత్రులు మిడియం నవదీప్, సున్నం వంశీ, ఎలకం సతీష్లతో కలిసి సాయంత్రం మంగపేట గ్రామంలోని పెళ్లికి వచ్చారు. వివాహం అనంతరం తిరిగి రాత్రి సీతాయిగూడెం వెళ్తున్న క్రమంలో శివ ఆటో నడుపుతుండగా.. కమలాపురం శివారులోని చలమన్ననగర్ సమీపానికి రాగానే శివకు ఫోన్ రావడంతో సెల్ మాట్లాడుతుండగా అదుపు తప్పిన ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో శివ తలకు బలమైన గాయం కావడంతో దగ్గరలోని ఆస్పత్రుల్లో వైద్యం అందించి అక్కడి నుంచి ఖమ్మంకు తరలించగా.. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య ప్రియాంక, రెండేళ్లలోపు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. -
ప్రగతి ప్రణాళికతో సమస్యల పరిష్కారం
మణుగూరు రూరల్: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సమస్యలు పరిష్కారమవుతాయని ఐటీడీఏ పీఓ, స్పెషల్ ఆఫీసర్ రాహుల్ అన్నారు. ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా 12వ వార్డు మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో జరిగిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. అమలవుతున్న ప్రభుత్వ పథకాలపైన లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకుని వారి ఆర్థిక స్వావలంబనకు సహకరించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, సిబ్బంది తదితరులు ఉన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
కేసులు సత్వరమే పరిష్కరించాలి
చుంచుపల్లి: పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. గురువారం ఆయన చుంచుపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్పైన ఉన్న డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్ను సందర్శించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ నేరాల వివరాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఆదినారాయణ, అశోక్, సీఐ జితేందర్, చుంచుపల్లి ఎస్సైలు రవి, ఉమ, జుబేదా పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజు -
ఉచ్చు బిగుస్తోంది..
● ముగ్గురు బ్యాంక్ ఉద్యోగుల అరెస్ట్ ● ‘సైబర్’కేసులో 48కి చేరిన అరెస్టుల సంఖ్యసత్తుపల్లి: అమాయకుల నుంచి రూ.కోట్లలో దండుకున్న వారిపై నమోదైన సైబర్ కేసు విచారణలో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో మూల్ అకౌంట్లు ఇచ్చి ఆర్థిక నేరాలకు సహకరించిన ముగ్గురు బ్యాంకు ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫిబ్రవరి 24న ప్రధాన నిందితుల్లో ఒకరైన ఉడతనేని వికాస్ చౌదరితో పాటు 14 మంది పేర్లతో కేసు నమోదైంది. ఇదే కేసులో భద్రాద్రి జిల్లా చండ్రుగొండ సీఎస్బీ బ్యాంక్ మేనేజర్ అఖిల్ అబ్దుల్కు సహకరించిన కస్టమర్ రిలేషన్ ఆఫీసర్లు ఓర్సు కృష్ణ(బెండాలపాడు, చండ్రుగొండ మండలం), మందా శ్రీహరిబాబు(బయ్యన్నగూడెం, పెనుబల్లి మండలం), బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్ జుంజునూరి రాధాకృష్ణ(మద్దుకూరు, చండ్రుగొండ మండలం)ను గురువారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు సత్తుపల్లి సీఐ శ్రీహరి వెల్లడించారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం తొలుత సైబర్ మోసంలో రూ.547 కోట్లు లావాదేవీలు జరిగినట్లు భావించినా, విచారణ తర్వాత భారీగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈమేరకు పోట్రు మనోజ్ కల్యాణ్ ఖాతాలో రూ.114.18 కోట్లు, ఆయన సతీమణి మేడా భానుప్రియ ఖాతాలో రూ.40.21 కోట్లు, బావమరిది మేడా సతీష్ ఖాతాలో రూ.135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి(మనోజ్ కల్యాణ్ బినామీ) ఖాతాలో రూ.81.72 కోట్లు, నర్సింహా కృష్ణ(కరీంనగర్) ఖాతాలో రూ.92.54 కోట్లు, ఉడతనేని వికాస్చౌదరి ఖాతాలో రూ.80.41 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. ఈ నగదుతో నిందితుల కూడబెట్టిన ఆస్తులను జప్తు చేసేందుకు పోలీసులు ఇప్పటికే రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాశారు. అంతేకాక ఆస్తుల పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసినట్లు తెలిసింది. కాగా, కల్లూరు డివిజన్ పరిధిలో నమోదైన రెండు సైబర్ క్రైం కేసుల్లో ఇప్పటివరకు 48 మందిని అరెస్ట్ చేశారు. అలాగే, కమీషన్లకు ఆశ పడి 130 మంది మూల్ అకౌంట్లు ఇచ్చినట్లు తేలిన నేపథ్యాన ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈవిషయమై కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ మాట్లాడుతూ సైబర్ కేసులు విచారణ దశలో ఉన్నాయని తెలిపారు. నిందితుల ఆస్తులు జప్తు చేసేందుకు సంబంధిత శాఖలకు లేఖలు రాశామని వెల్లడించారు. నేరాలకు పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టబోమని, చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇంకా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. -
అర్హులకు న్యాయం చేస్తాం
అశ్వారావుపేటరూరల్: అర్హులైన గిరిజనులకు అన్యాయం చేయబోమని, భూ సమస్యలకు తగిన పరిష్కారాన్ని చూపిస్తామని కొత్తగూడెం ఆర్డీఓ డి.మధు అన్నారు. మండలంలోని రామన్నగూడెంలో 30,36,39 సర్వే నంబర్లలో భూముల్లో కొన్నేళ్లుగా గిరిజనులు, అటవీ శాఖ మధ్య వివాదం నెలకొన్నది. ఆ భూమిలో గురువారం రెవెన్యూ అధికారులు సర్వే మొదలు పెట్టారు. ఆర్డీఓ సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే, హద్దుల గుర్తింపు తర్వాత చర్యలు తీసుకుంటామని, ఇరువర్గాలు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ, సర్వేయర్లు, గిరిజనులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన జరిపారు. హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం..భద్రాచలం: సేంద్రియ వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు భద్రగిరి మార్టు కోసం విక్రయిస్తే గిట్టుబాటు ధరలను ఇస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు ఐటీడీఏ కార్యాలయంలోని అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి (వ్యవసాయ విభాగం) ఉదయ్కుమార్ను 95818 10020 నంబర్లో లేదా, భద్రాచలంలోని భద్రగిరి మార్ట్లో సంప్రదించాలని సూచించారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్కు నివాళిసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పాపన్నగౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి.విజయలక్ష్మి, గౌడ సంఘ నాయకులు బండి రాజుగౌడ్, బుర్ర ధన్రాజ్, కమ్మగాని శంకర్, పాసిని వెంకన్న, బొమ్మగాని రమేష్, లక్ష్మీనారాయణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలుఅశ్వాపురం: అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్ఓ కృష్ణాగౌడ్ హెచ్చరించారు. గురువారం ఆయన అశ్వాపురం రేంజ్లో పర్యటించారు. బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ బీట్లో వలస ఆదివాసీలు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం ఆక్రమించి వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ అధికారులు తొలగించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాన్ని డీఎఫ్ఓ పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అనంతరం అశ్వాపురం బీట్లో కొమ్ముగూడెం ప్లాంటేషన్, అటవీ శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఉపేందర్, డీఆర్ఓలు సుజాత, ధనలక్ష్మి, వెంకటరావు, కిరణ్, సునీల్, ఉపేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: ఐదో రోజు పదో తరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గురువారం నిర్వహించిన భౌతికశాస్త్రం పరీక్షకు 12,728 మందికి గాను 12,700 మంది హాజరయ్యారు. 28 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సప్లిమెంటరీ విద్యార్థులు 268 మందికి గానూ 241 మంది హాజరు కాగా, 27 గైర్హాజరయ్యారు. కలెక్టర్ అశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజర జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, జిల్లా విద్యాశాఖాధికారి మూడు సెంటర్లు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మూడు సెంటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ 17 సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. -
23 నుంచి రైతు సంఘం రాష్ట్ర మహాసభలు
రుద్రంపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలపై చర్చించడంతో పాటు ఉద్యమాల కార్యాచరణ రూపకల్పనకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను వేదికగా చేసుకోనున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ తెలిపారు. కొత్తగూడెంలో ఈనెల 23 నుంచి 25వ తీదీ వరకు సంఘం రాష్ట్ర మూడో మహాసభలు జరగనుండగా, గురువారం కొత్తగూడెంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశంలో 50శాతం మందికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నా కేంద్ర బడ్జెట్లో కనీస కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. అంతేకాక విద్యుత్ సవరణ చట్టం తీసుకొచ్చి ఎరువులపై సబ్సిడీ తొలగించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో అరకొర కేటాయింపులతో రైతులను మోసం చేసిందన్నారు. ఈ సమస్యలపై చర్చించి పోరాట కార్యాచరణ రూపొందించనున్న మహాసభలను విజయవంతం చేయాలని సుదర్శన్ కోరారు. ఈ సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జలసూత్రం శివరాంప్రసాద్, నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, ఎలమంచి వంశీకృష్ణ, కున్సోత్ ధర్మా, కొండబోయిన వెంకటేశ్వర్లు, భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్రావు -
విద్యుత్ ఆర్టిజన్లను పర్మనెంట్ చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా సర్కిల్ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యాన ధర్నాతో పాటు వంటా వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికులకు, పర్మిట్ కార్మికులకు వేర్వేరు రూల్స్ లేకుండా వారి విద్యార్హతను బట్టి పర్మనెంట్ జాబ్లు ఇవ్వాలన్నారు. అన్మాన్ వర్కర్లనూ ఆర్టిజన్లుగా గుర్తించాలని, బిల్ కలెక్టర్లు, మీటర్ రీడింగ్, ఎస్పీఎం కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలన్నారు. లేనిపక్షంలో ఈనెల 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామన్నారు. వివిధ సంఘాల నాయకులు కొలగాని రమేష్, భూక్య రమేష్, బొల్లి వెంకటరాజు, రాజేష్, హేమంత్, పులి గణేష్బాబు, శివరంజని, జిల్లా జేఏసీ చైర్మన్ కూనరాజు శ్రీనివాస్, నాయకులు రేఖ, గ్లోరీ పూర్ణిమ, కె.నీలవేణి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి గ్రామసభలే కీలకం
అశ్వాపురం: గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి గ్రామసభలు కీలకమని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయుర్వేద వైద్యశాల ఆవరణలో గురువారం నిర్వహించిన అశ్వాపురం గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలుత మల్లెలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, మందుల గది, వార్డు, ఆవరణను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆ తర్వాత నెల్లిపాకలో కశ్మీర్ ఆపిల్ బేర్ తోటను సందర్శించారు. గొందిగూడెం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో కంప్యూటర్ గదిలో కంప్యూటర్లు అపరిశుభ్రంగా ఉండటంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంపై వార్డెన్పై మండిపడ్డారు. హెచ్ఎం, వార్డెన్కు షోకాజ్ నోటీసులు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ మణిధర్, ఎంపీడీఓ ముత్యాలరావు, వైద్యాధికారి సంకీర్తన, ఆయుర్వేద వైద్యాధికారి అరుణ, అశ్వాపురం సర్పంచ్ బాణోత్ సదర్లాల్ పాల్గొన్నారు. భూభారతి అర్జీలు పరిష్కరించాలి సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, భూభారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి గురువారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని సూచించారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను బీఎల్ఓల వారీగా, మండలాల వారీగా విభజించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక రీచ్ల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు సంజీవరావు, రంగా ప్రసాద్, స్వర్ణలత, దినేష్, యాసిన్ పాల్గొన్నారు.కలెక్టర్ అంకిత్ -
చెప్పేదెవరు.. వినేదెవరు?
● గాడి తప్పిన మార్కెటింగ్ శాఖ ● రైతు ప్రయోజనాలను విస్మరించి వ్యాపారులకే సహకారం ● పన్నుల వసూళ్లలోనూ వెనుకబాటు ● ఉద్యోగులపై అజమాయిషీ కరువై ఇష్టారాజ్యం ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్ శాఖ గాడి తప్పిందా అన్న ప్రశ్నకు ఔననే సమాధానమే వస్తోంది. రైతుల ప్రయోజనాల కోసం నెలకొల్పబడిన మార్కెట్లలోని అధికారులు ఆ పనిని పక్కన పెట్టి వ్యాపారుల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదేకాక పన్నుల వసూళ్లలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 15 మార్కెట్లకు గాను ఖమ్మం జిల్లాలో తొమ్మిది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు మార్కెట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో వరి, పత్తి, మిర్చి, అపరాలు పంటలే కాక ఉద్యాన పంటల సాగులోనూ రైతులు ముందంజలో నిలుస్తున్నారు. ఈనేపథ్యాన వ్యవసాయ మార్కెట్లు రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేస్తూ మార్కెటింగ్ శాఖకు ఆదాయాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగుల పట్టింపులేని తనం, అధికారుల అజమాయిషీ లోపించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్నిచోట్ల కమిటీలే పూర్తి పెత్తనం చెలాయిస్తుండడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందని తెలుస్తోంది. వ్యాపారుల అక్రమాలకు అండ రైతులకు మేలు చేయాల్సిన అధికారులు పూర్తిగా వ్యాపారుల అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రైతుల వద్ద పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న కొందరు వ్యాపారులు.. బినామీల పేరిట తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించడం వెనుక ఉద్యోగుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లలో ఇలాంటి అక్రమాలు వెలుగు చూడడం ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. గత ఏడాది తాతాల్కిక రిజిస్ట్రేషన్ల(టీఆర్) పేరిట పంట విక్రయాలకు రైతులకు అవకాశం కల్పించగా, మార్కెట్ ఉద్యోగులు వ్యాపారులకు కట్టబెట్టినట్లు బయటపడింది. దీంతో భద్రాచలం మార్కెట్ కార్యదర్శిపై వేటు పడింది. ఇదే ఘటనలో మరికొందరు ఉద్యోగులపైనా విచారణలు కొనసాగుతోంది. అయినా ఈ ఏడాది కూడా పత్తి విక్రయాల్లో వ్యాపారుల ఆధిపత్యమే కొనసాగడం గమనార్హం. లక్ష్యం చేరని వసూళ్లు ఏటా మార్కెటింగ్ శాఖ మార్కెట్ల వారీగా ఫీజు వసూళ్లకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈసారి ఖమ్మం జిల్లాలో రూ.70 కోట్ల లక్ష్యానికి రూ.45 కోట్లు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ.20 కోట్ల లక్ష్యానికి గాను రూ.15 కోట్లకు మించకపోవడం గమనార్హం. వ్యాపారులు కొందరు పంట కొనుగోళ్లలో జీరో దందాకు పాల్పడుతూ ఫీజు కట్టడం లేదని తెలిసినా అధికారులు, ఉద్యోగులు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరుగుతోందని తెలుస్తోంది. ఈ ఏడాది పంటల ఉత్పత్తి తగ్గింది. దీనికి తోడు ధరలు కూడా లేవు. అందుకే ప్రభుత్వం నిర్దేశించిన మేర ఫీజుల లక్ష్యాన్ని చేరలేదు. నేలకొండపల్లి మార్కెట్ కార్యదర్శి మద్యం మత్తులో విధులకు హాజరైన ఘటనపై విచారణ చేపట్టాం. త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాం. – ఎంఏ అలీం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మంఅధికారుల అజమాయిషీ కరువవడంతో పలు మార్కెట్లలోని ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇంకొందరు అసలు విధులకే హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఇటీవల మార్కెట్ కార్యదర్శి పంతులు మద్యం మత్తులో విధులకు హాజరైనట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి తనిఖీల్లో తేలింది. అయినా చర్యలు తీసుకోకపోగా, చివరకు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ మందలించడంతో విచారణ చేపట్టారు. ఇక పత్తి విక్రయాల్లో జరిగిన అక్రమాలపై భద్రాచలం కార్యదర్శిపై వేటు వేసి జగిత్యాల జిల్లా ధర్మపురి మార్కెట్కు బదిలీ చేశారు. అయితే, ఆయన తిరిగి ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పాటైన మత్కేపల్లి మార్కెట్ కార్యదర్శిగా రావడం గమనార్హం. ఇలాంటి ఘటనలను పరిశీలిస్తే అక్రమాలకు పాల్పడే వారికి శాఖలో పెద్దల అండదండలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాక ఇల్లెందు మార్కెట్లో ఉద్యోగులు – పాలకవర్గానికి మధ్య సమన్వయం లోపించడంతో ఇద్దరు ఉద్యోగులను అదర్ డ్యూటీ పేరిట కొత్తగూడెం డీఎంఓ, వరంగల్ డీడీ కార్యాలయానికి పంపించారు. -
ఆశ.. నిరాశ!
నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని రాష్ట్రస్థాయి కార్పొరేషన్, జిల్లాస్థాయి పదవులు భర్తీ అయినా ఇంకా చాలా పోస్టులు మిగిలే ఉన్నాయి. వీటి భర్తీపై ఎప్పటికప్పుడు ప్రకటనలు వస్తున్నా, ఆతర్వాత కదలిక ఉత్సాహంలేక నీరుగారుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు కూడా భర్తీ ప్రక్రియ మొదలుకాకపోవడంతో వేచిచూస్తున్న నేతల్లో నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్నా ఏ పదవి దక్కక సీనియర్ నేతలు అసంతృప్తికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంఐదింటితో సరి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎనిమిదింట కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈక్రమాన ఇక్కడి కాంగ్రెస్ నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులే కాక జిల్లాస్థాయి పదవులను ఆశించారు. తొలిసారి 2024లో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఆతర్వాత వ్యవసాయ మార్కెట్లకు పాలకవర్గాలను నియమించారు. అయితే ఇంకా, పలు నామినేటెడ్ పదవులు మిగిలే ఉండగా.. ఆయా పదవులు ఆశిస్తున్న నేతలు ఎక్కువ మంది ఉన్నారు. ప్రకటనలతో ఉత్సాహం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఓసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేయగా.. ఆ తర్వాత తరచూ ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. ప్రధాన పండుగలు, ఎన్నికల సమయాన ఈ అంశంపై తెరపైకి వస్తున్నా ప్రక్రియ ముందుకు కదలడం లేదు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులు నియామకం, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మార్చి 15లోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్లోని సీనియర్ నేతలు, ఆశావహులు తమ వంతు ప్రయతాల్లో నిమగ్నమయ్యారు. అయితే, సీఎం చెప్పిన తేదీ దాటినా ఫలితం లేకపోవడంతో ఆశావహులకు మరోమారు నిరాశే నెలకొంది. రాష్ట్రస్థాయి గుర్తింపు కోసం.. ఉమ్మడి జిల్లాలోని నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులవైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా రాయల నాగేశ్వరరావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పొదెం వీరయ్య, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్గా మువ్వా విజయ్బాబు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్గా నాయుడు సత్యనారాయణ, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్ధిక సంస్థ చైర్పర్సన్గా నూతి శ్రీకాంత్కు అవకాశం దక్కింది. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే అత్యధిక పదవులు దక్కగా.. మరికొందరు కూడా గురి పెట్టారు. రాష్ట్రస్థాయి పదవులైతేనే తమకు తగిన గుర్తింపు ఉంటుందనే భావనతో వారు ఉన్నట్లు తెలుస్తోంది.అధికార పార్టీ నేతలను ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు -
కొత్తగూడెం స్టేషన్ రహదారి విస్తరణలో వేగం పెంచాలి
రైల్వే బోర్డు చైర్మన్కు ఎంపీ విజ్ఞప్తి ఖమ్మంమయూరిసెంటర్: కొత్తగూడెం(భద్రాచలం రోడ్డు) రైల్వేస్టేషన్ ఎదుట ప్రధాన రహదారి విస్తరణ చాన్నాళ్లుగా పెండింగ్ ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నందున భూమార్పిడి ప్రక్రియను త్వరగా ఆమోదించాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. ఈమేరకు రైల్వే బోర్డు చైర్మన్ సతీష్కుమార్కు ఆయన ఢిల్లీలో వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కొత్తగూడెం స్టేషన్ వద్ద 4,556 చ.మీ. రైల్వే భూమి రహదారి విస్తరణకు అవసరమని తెలిపారు. ఈ భూమి కేటాయిస్తే రహదారి విస్తరణ చేపట్టనుండగా ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని వెల్లడించారు. ఇందుకోసం ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద 3,969.5 చ.మీ. ప్రభుత్వ భూమిని రైల్వేశాఖకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఇరు జిల్లాల కలెక్టర్లు అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ 14న బోర్డుకు ప్రతిపాదన పంపిన నేపథ్యాన త్వరగా ఆమోదించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. కొనసాగుతున్న కబడ్డీ టోర్నీ తల్లాడ: మండలంలోని కుర్నవల్లిలో నాలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి. వేంకటాచలపతి దేవాలయంలో తిరు కల్యాణం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు గురువారం రెండు తెలుగు రాష్టాలకు చెందిన జట్లు, తమిళనాడుకు చెందన నిలపురం, కర్ణాటక కుదునూరు జట్ల మధ్య మ్యాచ్లు జరిగాయి. పోటీలను తల్లాడ ఏడీఈ సతీష్, ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించగా.. మ్యాచ్లు చూసేందుకు కుర్నవల్లి పరిసర గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఆరు గ్యారంటీలు అమలు చేయండి మణుగూరుటౌన్: కేరళ ఎన్నికల పర్యటనలో రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి కేరళ సీఎం విజయన్కు ఓటేస్తే మోదీకి ఓటేసినట్లేనని చెప్పిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య అన్నారు. గురువారం స్థానిక శ్రామికభవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు తప్ప మరే గ్యారంటీలు అమలు చేయలేదని, వైద్యాన్ని వ్యాపార మయం చేశారని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, కౌలు రైతులకు రూ.15వేలు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు, పిట్టల నాగమణి, సత్యనారాయణ, శ్రీను, గుండి భీమా తదితరులు ఉన్నారు. వృద్ధుడిని చేరదీసిన ఎస్సై.. కరకగూడెం: ఆపదలో ఉన్న వృద్ధుడిని చేరదీసి తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు కరకగూడెం ఎస్సై పీవీఎన్.రావు. మండల పరిధి వట్టంవారిగుంపు గ్రామ పంచాయతీకి చెందిన వృద్ధుడు ఓర్సు మల్లయ్య గత కొన్ని నెలల క్రితం భార్య మరణించడంతో మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఎస్సై గురువారం ఆ వృద్ధుడిని చేరదీసి కటింగ్తో పాటు కొత్తబట్టలు అందజేసి ఆహారాన్ని పెట్టించాడు. పోలీసు అధికారిగా శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా వృద్ధుడి పట్ల ఆయన చూపిన చొరవను మండల ప్రజలు అభినందిస్తున్నారు. -
బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
● రామయ్యకు స్నపనం, సుదర్శన చక్రస్నానం ● నేటి నుంచి నిత్యకల్యాణం తిరిగి ప్రారంభం భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాలు గురువారంతో పరిసమాప్తమయ్యాయి. అర్చకులు ఘనంగా పవిత్ర పూజలతో ముగింపు పలికారు. స్వామివారి సుదర్శన చక్రానికి చక్రస్నానం కమనీయంగా నిర్వహించారు. తొలుత సుదర్శన చక్రాన్ని, ఉత్సవ మూర్తులను ప్రత్యేక పల్లకీలో మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పవిత్ర గోదావరి వద్దకు వచ్చారు. పునర్వసు మండపంలో స్వామివారిని కొలువుదీర్చి స్నపన తిరుమంజనం, హారతులను సమర్పించారు. అనంతరం గోదావరిలో సుదర్శన చక్రానికి సంప్రదాయబద్ధంగా చక్రస్నానం జరిపారు. సాయంత్రం ధ్వజావరోహణం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు నిర్వహించారు. యాగశాలలో పుష్పయాగం, పూర్ణాహుతిలతో బ్రహ్మోత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు. సాయంత్రం శేషవాహనంపై స్వామివార్లను కొలువుదీర్చి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవను వైభవోపేతంగా జరిపారు. ఈ పూజల్లో ఆలయ ఏఈఓ శ్రవణ్కుమార్ దంపతులు, ఆలయ అర్చకులు, పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో భక్తుల రద్దీ హనుమాన్ జయంతి సందర్భంగా రామాలయంలో గురువారం రద్దీ నెలకొంది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ మాల ధారులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం దేవస్థానంలోని అభయాంజనేయస్వామి ఉపాలయంలో అర్చకులకు తమ ఇరుముడిని సమర్పించారు. అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. నేటి నుంచి నిత్యకల్యాణం, దర్బారు సేవ తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బేడా మండపంలో నిలిపివేసిన నిత్యకల్యాణం, దర్బారు సేవ శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. స్వామివారి నూతన పర్యంకోత్సవం ఈ నెల 11న జరపనున్నారు. అదే రోజు పవళింపు సేవ కూడా నిర్వహించనున్నారు. ఈనెల 23న శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ, సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నారు. -
హనుమాన్ జయంతికి
ఏర్పాట్లేవి?సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జై శ్రీరామ్ నినాదం వినిపించడంలో అగ్రస్థానం ఎప్పుడూ హనుమంతుడిదే. సిరియ తంబిగా రాముడి చేత ప్రశంసలు హనుమంతుడికి దక్కాయి. అందుకే ఆంజనేయుడి భక్తులు శ్రీరాముడి చెంతన హనుమాన్ దీక్షా విమరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఎంతో భక్తితో వచ్చే దీక్షాపరులకు ఇక్కడ కనీస సౌకర్యాలు కరువైపోతున్నాయి. రెండుసార్లు జయంతి ఉత్సవాలు హనుమంతుడి భక్తుల్లో వేర్వేరు సంప్రదాయాలను, క్యాలెండర్లను పాటించేవారు ఉన్నారు. దీని ప్రకారం హనుమాన్ జయంతిని ఏటా రెండు వేర్వేరు తేదీల్లో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2, మే 12వ తేదీల్లో హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. ఏప్రిల్ 2న జరిగే వేడుకలను చిన్న జయంతిగా, మే 12న జరిగే వేడుకలను పెద్ద జయంతిగా గుర్తిస్తున్నారు. చిన్న జయంతి సందర్భంగా ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయం ఉన్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకి వెళితే, పెద్ద జయంతి సందర్భంగా సీతారాములు కొలుదీరిన భద్రాచల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శబరిమల తరహాలో.. ఏటా లక్షలాది మంది భక్తులు హనుమాన్ మాల ధరిస్తున్నారు. వీరిలో కొందరు చిన్న జయంతి రోజున మాల విరమణ చేస్తే, మరికొందరు అదే రోజున మాల ధరించి పెద్ద జయంతి రోజున విరమిస్తున్నారు. చిన్న జయంతికి కొండగట్టు క్షేత్రంలో దీక్ష తీసుకునే భక్తులు పెద్ద జయంతికి భద్రాచలంలో మాల విరమణ చేస్తున్నారు. ఫలితంగా గడిచిన దశాబ్దకాలంగా పెద్ద జయంతి రోజున వేలాదిగా హనుమాన్ మాలధారులు భద్రాచలం చేరుకుంటున్నారు. క్రమేణా అయ్యప్ప మాల ధరించిన వారికి శబరిమల ఎలాగో హనుమాన్ మాలధారులకు భద్రాచలం క్షేత్రం అలాగే అన్నట్టుగా భక్తుల్లో నమ్మకం, విశ్వాసం పెరుగుతోంది. మూడో వేడుకగా.. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వందల ఏళ్లుగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, ఆ ముందు రోజు తెప్పోత్సవం సైతం కనుల పండువగా జరుపుతున్నారు. ఈ రెండు వేడుకలు కనులారా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు భద్రాచలం చేరుకుంటారు. ఇప్పుడు అదే స్థాయిలో హనుమాన్ జయంతి సందర్భంగా కూడా భద్రగిరికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతిని భద్రాచలంలో జరిగే మూడో అతిపెద్ద వేడుకగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కావాలి కార్యాచరణ శ్రీరామనవమి, ముక్కోటి పండుగల తరహాలో హనుమాన్ జయంతి సందర్భంగా దేవస్థానం, జిల్లా, రాష్ట్ర యంత్రాంగం తరఫున ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం లేదు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హనుమాన్ మాలధారులకు ఇబ్బంది రాకుండా డార్మిటరీలు, తాగునీరు వంటి అదనపు సౌకర్యాలు, మాల విరమణకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, భజన మందిరం వంటివి ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. పెద్ద జయంతికి ఇంకా నలభై రోజుల సమయం అందుబాటులో ఉన్నందున కార్యాచరణ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.నడి వేసవిలో రామభక్తితో భద్రాచలం వచ్చే దాసాంజనేయ మాలధారులకు కనీసం నీడ కరువైపోతోంది. గొంతెండితే గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చే దీక్షాపరులకు మండే ఎండల ధాటికి ఆలయం నుంచి గోదావరినదీ తీరానికి వెళ్లి వచ్చే సరికి కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. చలు వ పందిళ్లు, షామియానాలు, తాగునీటి సౌకర్యం, ప్రత్యేక క్యూలైన్లు వంటి ఏర్పాటు చేస్తే దీక్షా పరులకు ఇబ్బందులు తొలగిపోతాయి.భద్రగిరికి పోటెత్తుతున్న హనుమాన్ మాలధారులు -
వైభవంగా చండీహోమం
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలోని యాగశాలలో బుధవారం చండీ హోమం పూజలు నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ చండీహోమం జరిపారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. పూజలో పాల్గొన్న 15 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమంలో అర్చకులు, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. భద్రగిరికి ఏటేటా పెరుగుతున్న భక్తులుభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దర్శనానికి భద్రగిరికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశ నలుమూలల నుంచి భక్తులు భద్రాచలం దారి పడుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 26.75 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. 2024–25 సంవత్సరంలో 23.51 లక్షల మంది దర్శించుకున్నారు. కాగా 2026 మేలో స్వామి వారిని 2.54 లక్షల మంది దర్శించుకోగా, గతేడాది మేలో 1.97 లక్షల మంది ఆలయాన్ని సందర్శించారు. 4న అథ్లెటిక్స్ ఎంపికలుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు రామవరం సాధన మైదానంలో జిల్లా సీనియర్ అథ్లెటిక్స్ ఎంపికలకు పోటీలు నిర్వహిస్తామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే మహీధర్ బుధవారం తెలిపారు. ఈ పొటీల్లో ప్రతిభ చూపినవారిని ఈనెల 11న హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. 20 ఏళ్ల లోపు బాలబాలికలకు పోటీలు ఉటాయని, వివరాలకు 99486 01361 నంబరులో సంప్రదించాలని సూచించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కమిటీ ఎంపికకొత్తగూడెంఅర్బన్/సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెంలో బుధవారం జిల్లా రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. రాబోయే మూడేళ్ల కాలానికి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జుగల్ కిషోర్ ఖండేల్వాల్, వర్కింగ్ ప్రెసిడెంట్గా పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శిగా ఏలిపిద్ది శ్రీనివాస్రెడ్డి, కోశాధికారిగా పల్ల పోతు శ్రీనివాసుతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులను కూడా ఎంపిక చేశారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్లను కలిసి కార్యవర్గ వివరాలను వెల్లడించారు. కాగా, జిల్లా రైస్ మిల్ పరిశ్రమ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా తెలిపింది. పెరిగిన ఆయిల్పామ్ ధరఅశ్వారావుపేటరూరల్: ఆయిల్పామ్ గెలల ధర కొద్ది నెలలుగా పెరుగుతోంది. తాజాగా రేటు భారీగా పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెలలో టన్ను గెలల ధర రూ.21,546 ఉండగా, ప్రస్తుతం రూ.1,459 పెరిగింది. దీంతో టన్నుకు రూ. 23,005 చొప్పున రైతులకు చెల్లించనున్నారు. డీఈఓ ఆకస్మిక తనిఖీపాల్వంచ: పాల్వంచలోని వికలాంగుల కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాల అభివృద్ధిపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. హెచ్ఎం రామకృష్ణ పాల్గొన్నారు. -
మద్యం అమ్మకాల్లో కిక్కు!
2025–26లో రూ.2,297 కోట్లుగా నమోదువైరా: మద్యం అమ్మకాలు ఏటేటా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2025–26)లో లెక్కకు మిక్కిలిగా పెరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2024 – 2025లో రూ.167.11కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, 2025–26లో మాత్రం రూ.2,297 కోట్లుగా నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 204 వైన్ షాపులు, 52 బార్లు, మూడు క్లబ్లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఏడాది కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో వైన్స్ దక్కించుకున్న వారు భారీగా సరుకు కొనుగోలు చేశారు. అంతేకాక గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల సమయాన మద్యం అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా సాగడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్టస్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం సంవత్సరంలో 27,576 కేసుల మద్యం, 1,63,1729 కేసుల బీర్ల అమ్మకాలుసాగాయి. -
ముగిసిన తునికాకు టెండర్లు
● మొదలైన మోడెం కొట్టే పనులు ● వేసవిలో గిరిజన కూలీలకు ఉపాధి పాల్వంచరూరల్: తునికాకు సేకరణ టెండర్ల ప్రక్రియ ముగింది. ఆకు చిగురించడంకోసం నిర్వహించే మోడెం(ప్రూనింగ్) కొట్టే పనులను చేపట్టారు. జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, వైల్డ్లైఫ్, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు డివిజన్ల పరిధిలోని 31 యూనిట్లలో 25,900 స్టాండర్డ్ బ్యాగులు లక్ష్యంగా నిర్దేశించారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఐదుసార్లు టెండర్లు నిర్వహించగా కొత్తగూడెం డివిజన్లోని కనకగిరి యూనిట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఇక్కడ తునికాకు సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. కనకగిరి మినహా 30 యూనిట్లలో తునికాకు సేకరణను కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. పది రోజులపాటు మోడెం పనులు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆయా డివిజన్లలో అగ్రిమెంట్ చేసుకుని తునికి చెట్ల కొమ్మ (మోడెం) కొట్టే పనులను చేపట్టారు. వారం పది రోజులపాటు అటవీ ప్రాంతాల్లో మోడెం కొట్టే పనులు నిర్వహించనున్నారు. మోడెం కొట్టాక నెల రోజులకు ఆకు చిగిరించి కోతకు సిద్ధమవుతుంది. ఈ నెల చివరి వారం నుంచి తునికాకు సేకరణ జరగనుంది. గిరిజనులకు ఆదాయ మార్గం వేసవి కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లోని వేలాది మంది కూలీలకు ఉపాధిని కల్పించే తునికాకు సేకరణకు అటవీశాఖ ఈ ఏడాది ముందస్తుగానే పనులను వేగవంతం చేస్తోంది. గతేడాది టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా నిర్వహిచండంతోపాటు ఆకు సేకరణ సమయంలోనే అకాల వర్షాలు కురవడంతో నిర్దేశించిన ఆకు లక్ష్యం ఎరవేరలేదు. దీంతో గుత్తేదారులకు, ఆటవీశాఖకు, కూలీలకు నష్టం వాటిల్లింది. యూనిట్కు 200మందికి పైగా.. ఏప్రిల్, మే నెలల్లో తునికాకు సేకరణకు జిల్లాలో పదివేల మందికి పైన కూలీలు ఉపాధి కోసం శ్రమిస్తారు. ఒక్కో యూనిట్లో 200 నుంచి 300 మంది వరకు తునికాకు సేకరణ జరుపుతున్నట్లు అటవీశాఖాధికారులు గుర్తించారు. సేకరించాక 50 ఆకులను ఒక్క కట్టగా కడతారు. ఇలా కట్టిన ఆకుల కట్టలను కల్లాలకు తీసుకెళ్లి కాంట్రాక్టర్కు అప్పగిస్తారు. కాంట్రాక్టర్ కట్టకు రూ.1.40 చొప్పున చెల్లిస్తారు. నాణ్యమైన తునికాకు కోసం ఆకు ఫ్రూనింగ్ పనులు (కొమ్మ కొట్టడం) కొనసాగుతున్నాయి. -
‘మీ సేవ’ మరింత భారం
● యూజర్ చార్జీలు రెట్టింపు చేసిన ప్రభుత్వం ● 3 నుంచి 5 వ తేదీ వరకు సేవల్లో అంతరాయం సూపర్బజార్(కొత్తగూడెం)/సుజాతనగర్: మీ సేవ కేంద్రాల్లో యూజర్ చార్జీలు పెరిగాయి. ఈ నెల ఒకటి నుంచి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న చార్జీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం వినియోగదారులను కలవరపెడుతోంది. మీ సేవ దరఖాస్తుల్లో ఏ, బీ కేటగిరీలు రెండు రకాలు ఉండగా, రెండింటిలోనూ చార్జీలు పెంచారు. కేటగిరీ–ఏ దరఖాస్తులకు గతంలో యూజర్ చార్జీ రూ.35 ఉండగా, ప్రస్తుతం రూ.62కు పెంచారు. కేటగిరీ–బీ దరఖాస్తులకు ఇప్పటివరకు రూ.45 ఉండగా, ఇక నుంచి రూ.80 వసూలు చేస్తారు. బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రుసుం కూడా మూడు రకాలుగా ఉండనుంది. రూ.20గా ఉన్న చార్జీని రూ.35, రూ.25 ఉన్న చార్జీని రూ.45, రూ.30 ఉన్న చార్జీని రూ.53గా నిర్ణయించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మొత్తానికి అనుగుణంగా మూడు రకాల యూజర్ చార్జీలు పెంచారు. గతంలో రూ.2 ఉన్న చార్జీని రూ.4, రూ.5 ఉన్న చార్జీని రూ.9, రూ.10 ఉన్న చార్జీని రూ.18, రూ.25 ఉన్న చార్జీని రూ.44కి పెంచారు. ప్రభుత్వం యూజర్ చార్జీల పెంపు ఒకేసారి రెట్టింపు చేయడంపై వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సేవలకు తాత్కాలిక అంతరాయం జిల్లాలో సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుందని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు సర్వర్ నిర్వహణ పనులు కొనసాగుతాయని తెలిపారు. సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణ కోసం చేపట్టే ఈ–నిర్వహణ ప్రక్రియతో అన్ని ఆన్లౌన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తామని వివరించారు. ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని సూచించారు. ఈ–నిర్వహణ పూర్తయ్యాక వేగవంతమైన సేవలు అందుతాయన్నారు. ఇక మీ సేవ కేంద్రాల్లో సర్వీసు చార్జీలను పెంచినట్లు తెలిపారు. అదనంగా కరెంటు బిల్లులు, ఈ–పాస్ సేవలు, బయోమెట్రిక్ సేవలు, డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన సేవలకు కూడా సవరించిన చార్జీలు వర్తిస్తాయని వెల్లడించారు. -
చిన్నారులకు తొలిముద్ద
భద్రాచలంఅర్బన్: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ‘తొలిముద్ద’పేరుతో అల్పాహారం అందించనున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం హైదరాబాద్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆచరణలోకి తేవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతం అయిన భద్రాచలం పరిసర ప్రాంతంలో చిన్నారులు పోషకాహార లోపంతో ఉండటం, ఎత్తుకి తగ్గ బరువు లేక ఏరియా ఆస్పత్రిలోని ఎన్ఆర్సీ సెంటర్లో చికిత్స పొందుతున్న విషయాలు విదితమే. ఇలాంటి లోపాలను అధిగమించేందుకు ఈ పథకం ఉపయోగపడనుందని పలువురు చెబుతున్నారు. పిల్లల ఎదుగుదలకు.. పిల్లలకు పోషకాహారం అందితేనే వారి శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. సమతుల పోష కాహారం అందకపోవడంతో పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చాలా మంది చిన్నారుల తల్లిదండ్రు లు కూలీ, వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఉద యం పూట చిన్నారులు ఇంట్లో తినీతినకుండానే కేంద్రాలకు వెళ్లడంతో అక్కడ నీరసించిపోతున్నా రు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరికి భోజనం పెడతారు. అప్పటివరకు నిరీక్షించాల్సిందే. ఈ క్రమంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బక్కచిక్కిపోవడంతో పాటు వివిధ రుగ్మతలు వెంటాడుతున్నాయి. పౌష్టికాహా రం అందించడంతో వారిలో ఎదుగుదలతో పాటు కేంద్రానికి వచ్చే చిన్నారుల సంఖ్య సైతం పెరగనుంది. చాలా మంది చిన్నారులు 10 గంటలు దాటితే కానీ కేంద్రాలకు రావడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలు నడుస్తుండగా. చాలా కేంద్రాల్లో చిన్నారుల గైర్హాజరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఆరేళ్ల లోపు చిన్నారులకు ఉదయం పూట అల్పాహారం అందించనున్నారు. ఈ మేరకు రెడీ టూ కుక్ ఉప్మా, కిచిడీ సరఫరా బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్కు అప్పగించారు. కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు పిల్లలకు ఏకరూప దుస్తులు అందిస్తుండగా, కొత్తగా అల్పాహారం పథకం అమలుతో కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 2061 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో మూడేళ్లు పైబడి 31,711 మంది చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం ఏడు నెలల నుంచి మూడేళ్ల వరకు చిన్నారులకు బాలామృతం, నెలకు 16 కోడిగుడ్లు ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రతిరోజూ ఉడికించిన గుడ్డు, ఒక పూట భోజనం పెడుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, సాంబార్తో వడ్డిస్తున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలకు ఈ కార్యక్రమం అమలవుతోంది. అయితే, మధ్యాహ్నం తర్వాత చిన్నారులకు భోజనంతో పెడుతుండటంతో వారు నీరసించిపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చిన్నారులకు కిచిడీ, ఉప్మా తదితర అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తోంది. పథకం అమలుకు మార్గదర్శకాలు రాగానే అన్ని కేంద్రాల్లో అమలయ్యేలా చర్యలు చేపడతాం. పథకం అమలుతో పోషకాహార లోపం ఉన్న పిల్లల సంఖ్యను మరింత తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకా రెడీ టూ కుక్ అల్పాహారం ప్యాకెట్లు కేంద్రాలకు సరఫరా కావాల్సి ఉంది. –జ్యోతి, దుమ్ముగూడెం సీడీపీఓ -
గిరిజన మహిళలకు జీవనోపాధి
భద్రాచలం: గిరిజన, ఎస్హెచ్జీ గ్రూపుల మహిళలు నిర్వహించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. బుధవారం పట్టణంలోని భద్రగిరి మార్టులో నిత్యావసర సరుకులను పరిశీలించేందుకు వచ్చిన సెర్ప్ సీనియర్ మేనేజర్ భవానీ శంకర్కు మార్ట్లోని ఆర్గానిక్ సరుకుల గురించి వివరించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకున్న మహిళలు మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతుండటంతో మార్ట్ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, వేణు, హరికృష్ణ, సమ్మయ్య, ఆదినారాయణ, జయరాజ్, భార్గవి, నర్సయ్య, వెంకన్న పాల్గొన్నారు.భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ -
స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు, ఏటీసీ కళాశాలల నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, అనుమతుల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పెండింగ్ ఫైళ్లను పరిష్కరించి పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సంబంధిత భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా సమగ్ర పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇల్లందు, అశ్వారావుపేటల తహసీల్దార్లు రవికుమార్, రామకృష్ణ , ఈ–సెక్షన్ సూపరింటెండెంట్ స్వర్ణలత పాల్గొన్నారు. నేడు జిల్లావ్యాప్తంగా గ్రామసభలు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో సూచించారు. గ్రామ సభలను విజయవంతం చేయాలని కోరారు. సభలకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, నీడ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో సమగ్ర నివేదికలు సిద్ధం చేసి ప్రజలకు వివరించాలని సూచించారు. సభలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, గురువారం నుంచి జిల్లాలో వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని వివరించారు. -
జాతీయస్థాయిలో రాణించాలి
పాల్వంచరూరల్: జెన్కో క్రీడాకారులు ప్రతిభ చూపి జాతీయస్ధాయిలో రాణించాలని కేటీపీఎస్ 5,6 దశల చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్రావు అన్నారు. విద్యుత్ కళాభారతి మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న ఇంటర్ ప్రాజెక్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. భూపాలపల్లి జట్టు ప్రథమ, కేటీపీఎస్ 5,6 దశల జట్టు ద్వితీయ, కేటీపీఎస్ 7వ దశ జట్టు తృతీయ స్థానాల్లో నిలవగా, బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ జెన్కో యాజమాన్యం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెన్కో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, స్పోర్ట్స్ సెక్రటరీ వీరస్వామి, కోశాధికారి రాజు, వెంకటేశ్వర్లు, జమీల్, అరుణ్, బాబీ, లింగమూర్తి పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యతలేని భోజనం
దమ్మపేట: దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకులంలో విద్యార్థుల భోజనంలో నాణ్యత లేకపోవడంతో బాధ్యులపై కలెక్టర్ అంకిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా అని ప్రశ్నించారు. బుధవారం మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్, పలు రెసిడెన్షియల్ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన నాణ్యత, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా ఆరా తీశారు. ముందుగా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేసి, దరఖాస్తుల పరిష్కారంపై తహసీల్దార్ రామనరేష్, అఽధికారులను నేరుగా ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. మీ సేవలో చెల్లించాల్సిన దరఖాస్తుల రుసుం వివరాలను కార్యాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. భూసమస్యలు, ధ్రువీకరణ పత్రాల విషయంలో ప్రజలు జిల్లా కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి వ్యయ ప్రయాసలు పడకుండా వాటిని స్థానికంగానే పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. మండల స్థాయిలోని పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దమ్మపేట గిరిజన గురుకులంలో మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం చికెన్, బగారా రైస్కు బదులుగా మిల్మేకర్ కూర, రైస్ వండటంపై బాధ్యులను ప్రశ్నించారు. కలెక్టర్ భోజనం తిని, ఆహార నాణ్యతను పరిశీలించారు. రుచి, నాణ్యతాలోపంతో పాటు పోషక విలువల లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వీడకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కూడా పరిశీలించారు. ఎంపీడీఓ రవీంద్రా రెడ్డి, తహసీల్దార్ రామనరేష్, ఎంఈఓ జగపతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.దమ్మపేట గిరిజన గురుకుల అధికారులపై కలెక్టర్ అంకిత్ ఆగ్రహం -
లారీకింద పడి మహిళ దుర్మరణ ం
దమ్మపేట: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతిచెందింది. మండలంలోని ముష్టిబండ శివారులో బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు మండలం, రేపూడి గ్రామానికి చెందిన నీలగిరి ఝాన్సీ (41),రవికుమార్ దంపతులు. ఝాన్సీ పుట్టిల్లు అయిన దమ్మపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ముష్టిబండ శివారుకు చేరుకోగా సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట వైపునకు అతివేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. బైక్పై నుంచి ఝూన్సీ రోడ్డుకు కుడి పక్కకు లారీటైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. రవికుమార్కు స్వల్పగాయాలయ్యాయి. భార్య మృతదేహం చూసిన అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు పోలీస్స్టేషన్కు తరలించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
●విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన? ఇల్లెందు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక ప్రాణం గాలిలో కలిసిపోయింది. విద్యుదాఘాతంతో బొజ్జాయిగూడెం పంచాయతీ మర్రిగూడెంనకు చెందిన కుంజా ఉదయ్ (34) మృతిచెందాడు. వివ రాలిలా ఉన్నాయి. బుధవారం పట్టణంలో ట్రాన్స్ఫార్మర్లు మార్చే పనులను కాంట్రాక్టర్ రాము చేపట్టారు. అందులో భాగంగా కూరగాయల మార్కెట్ ఎదురుగా ఆర్ఆర్ చికెన్ సెంటర్ వద్ద హైటెన్షన్ లైన్, లోకల్ లైన్లపై ఎల్సీ తీసుకున్నామని కూలీ, మర్రిగూడెంనకు చెందిన ఉదయ్ను స్తంభం పైకి ఎక్కించారు. ఉదయ్ విద్యుత్ లైన్ను ముట్టుకోగానే షాక్కు గురై పైనుంచి కింద పడ్డాడు. దీంతో విద్యుత్ సిబ్బంది, మిగతా కూలీలు భయంతో పరుగులు తీశారు. చుట్టుపక్కల వారు గమనించి క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఒకే స్తంభంపై రెండు లైన్లు ఉన్నా విద్యుత్ అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. బైక్ ఢీకొని ఒకరు.. దమ్మపేట: రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని గున్నేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన చిలువేరు రమేశ్(32) హైదరాబాద్లోని సింధు పార్సిల్ సర్వీస్ సంస్థలో లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం హెదరాబాద్ నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడెంనకు బయలుదేరాడు. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో గున్నేపల్లి శివారుకు చేరుకోగా లారీ టైర్ పంక్చరైంది. దీంతో పంక్చర్ షాపు కోసం కాలి నడకన రోడ్డుపై ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన బూరుగు వంశీ, నారం నాగరాజు సత్తుపల్లి నుంచి మొద్దులగూడెం వైపునకు బైక్పై వస్తూ రమేశ్ను ఢీకొట్టారు. రమేశ్ తలకు తీవ్ర గాయం కాగా.. బైక్పై వెళ్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమేశ్ పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పార్సిల్ ఏజెంట్ మౌలాలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. గాయపడిన వ్యక్తి ...చండ్రుగొండ: మండల కేంద్రంలోని కేసీఆర్కాలనీకి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి వరంగల్లోని ఎంజీఎంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బుధవారం రాత్రి హెడ్కానిస్టేబుల్ రవి తెలిపారు. కేసీఆర్కాలనీకి చెందిన కణితి సిసింద్రి (27) మార్చి 26న బెండాలపాడులోని అత్తగారింటికి వెళ్లి వస్తానని ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చండ్రుగొండలోని చనగచెరువు సమీపంలో రోడ్డు పక్కన పంట చేలల్లో పడి పోయాడు. ఉదయం వాకింగ్ చేసే వ్యక్తులు గమనించి, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం అనంతరం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
అంత్యక్రియలకు అడ్డుపడిన అటవీశాఖ
ఇల్లెందురూరల్: మహిళ అంత్యక్రియలను అటవీశాఖ అధికారులు అడ్డుకున్న ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మండలంలోని ఇందిరానగర్ వడ్డెరకాలనీ ప్రజలు అంత్యక్రియలు నిర్వహించే భూమిని ఐదేళ్ల కిందట ఆ భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇందిరానగర్కు మంజూరైన వైకుంఠధామం కోసం ఆ భూమిలోనే కొంత స్థలం అటవీశాఖ అధికారులు కేటాయించారు. కానీ, వైకుంఠధామాన్ని వేరే ప్రాంతంలో నిర్మించడంతో ఆ భూమిని అర్బన్ పార్క్ నిర్మాణానికి కేటా యించారు. దీంతో అటవీశాఖ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టగా.. భవిష్యత్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు తమకు ద్వారం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. అందుకు నాటి అధికారులు అంగీకరించడంతో ఫెన్సింగ్ ఏర్పాటుకు స్థానికులు అభ్యంతరం తెలుపలేదు. మంగళవారం వడ్డెరకాలనీకి చెందిన మంజల వెంకటమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేశారు. అటవీశాఖ అధికారులు అడ్డుగా నిలిచి ఫెన్సింగ్ దాటి లోపలికి రావొద్దని స్పష్టం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరి స్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్థానికులు ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో మహిళ మృతదేహాన్ని బాలాజీనగర్ వైకుంఠధామంలో ఖననం చేశారు. -
లక్ష్యం చేరని మార్కెటింగ్ శాఖ
● 2025–26లో ఆదాయ లక్ష్యం రూ.22.65 కోట్లు ● జిల్లాలోని ఆరు మార్కెట్లు సాధించింది రూ.17.67 కోట్లు ఇల్లెందు: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్దేశిత ఆదాయ లక్ష్యం చేరుకోలేకపోయాయి. ఇల్లెందు మార్కెట్ పురోగతిలో ఉన్నా అది కూడా లక్ష్యం సాధించలేదు. అధికారుల చిత్తశుద్ధి లోపించటం, మార్కెట్ కమిటీల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవటంతో మార్కెటింగ్ శాఖ ఆదాయం కోల్పోయింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లక్ష్యం రూ.22.65 కోట్లు కాగా, రూ.17.67 కోట్లు మాత్రమే వసూలైంది. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కూడా ఈ దఫా లక్ష్యం సాధించలేక చతికిల పడింది. ఏడాది లక్ష్యం రూ. 5.16 కోట్లు కాగా, లక్ష్య సాధనకు మార్కెట్ అధికారులు కుస్తీ పట్టారు. వ్యాపారుల నుంచి ఫీజు రాబట్టే ప్రయత్నం చేశారు. అయినా లక్ష్యం చేరుకోలేకపోయారు. మార్కెట్ లక్ష్యం సాధించింది (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) బూర్గంపాడు 6.25 4.62 దమ్మపేట 3.67 2.88 ఇల్లెందు 5.16 4.03 భద్రాచలం 1.95 1.46 కొత్తగూడెం 3.47 2.30 చర్ల 2.12 2.11 మొత్తం 22.65 17.67 -
15 రోజుల్లో వివాహం..
●రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ఇల్లెందురూరల్/మహబూబాబాద్రూరల్: మరో పదిహేను రోజుల్లో పెళ్లి కుమారుడిగా ముస్తాబు కావాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివార్లలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు.. ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం జీపీ పరిధి నెహ్రూనగర్తండాకు చెందిన బానోత్ శ్రీను – వినోద దంపతుల ఏకై క కుమారుడు మహేందర్(23) హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన బైక్పై మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఆయనకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చేరుకుని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ సూరయ్య తెలిపారు. 15 రోజుల్లో రెండో మరణం నెహ్రూనగర్కు చెందిన మహేందర్ కుటుంబంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. ఆయన తాత భోజ్యా పదిహేను రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఇప్పుడు మహేందర్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. కాగా, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువతిని మహేందర్ ప్రేమించగా, ఇద్దరి పెళ్లికి పెద్దలు అంగీకకరించారు. దీంతో 15 రోజుల్లో వివాహ ముహూర్తం నిర్ణయించగా, ఆయన మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరయర్యారు. -
రూ.35.61 లక్షలకు మోరంపల్లిబంజర సంత వేలం
బూర్గంపాడు: మోరంపల్లిబంజర గ్రామ పంచాయతీలో ప్రతి శుక్రవారం నిర్వహించే పశువుల సంత, వారపు సంత వేలంపాటను బుధవారం నిర్వహించారు. ఎంపీడీఓ జమలారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ బొర్రా సుభద్ర అధ్యక్షతన జీపీ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటను భద్రాచలానికి చెందిన భూక్యా రంజిత్నాయక్ రూ.35.61 లక్షలకు దక్కించుకున్నా రు. గతేడాది రూ.33.50 లక్షలకు సంత వేలం పాట ఖరారు కాగా ఈ ఏడాది రూ.35.61 లక్షలకు ఖరారైంది. ఉప సర్పంచ్ పొక్కుల రవి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ పనుల్లో భద్రతా పరికరాలు తప్పనిసరి●ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆదేశాలు సూపర్బజార్(కొత్తగూడెం): క్షేత్రస్థాయిలో విద్యుత్ పనులు నిర్వహించే ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా భద్రతా పరికరాలు ధరించాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ జి.మహేందర్ బుధవా రం ఆదేశాలు జారీచేశారు. హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్ రాడ్ వంటి భద్రతా పరికరాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయొద్దన్నారు. కొన్ని చోట్ల భద్రతా పరికరాలు ఉపయోగించకుండా పనిచేయడం వల్ల ప్రమాదా లు చోటుచేసుకుని, విలువైన ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు బాధాకరమని పేర్కొ న్నారు. ఇకపై నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎల్సీ యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్, గిర్దావర్ మధ్య వాగ్వాదం?ములకలపల్లి: ములకలపల్లి ఇన్చార్జ్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, గిర్దావర్–2 భద్రు మధ్య ఓ భూమి పత్రాల విషయంలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని అన్నారం రెవెన్యూ పరిధిలోని ఓ భూమి పత్రాల విషయంలో నెలకొన్న సందిగ్ధతపై ఇరువురూ వాదనకు దిగిగగా తహసీల్దార్ వాహన డ్రైవర్, ఆమె సోదరు జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో భద్రు తీవ్రంగా స్పందించాడని, తమ కార్యకలాపాల్లో బయటి వ్యక్తి ఎలా చేసుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై తహసీల్దార్ భాగ్యలక్ష్మిని వివరణ కోరగా.. గిర్వావర్–2 భద్రు సైతం గతంలో ఓ ప్రైవేట్ వ్యక్తితో కార్యకలాపాలు నిర్వహించారని ఆరోపించారు. తమను భద్రు అకారణంగా దూషించాడని, తన సోదరుడు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలుగుండాల: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఆళ్లపల్లి మండలం ఇప్పనపల్లి గ్రామానికి చెందిన గొగ్గెల రాంబాబు, గొగ్గెల నందకిషోర్, ఈసం రమేశ్లు ఆళ్లపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. రామానుజగూడెం గ్రామానికి చెందిన రవి, పగిడిద్దరాజు ఆళ్లపల్లి నుంచి తమ స్వగ్రామానికి వెళ్తున్నారు. చింతోనిగుంపు పెట్రోల్ బంక్ సమీపంలో రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ సంఘటలో ఐదుగురు కిందపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా ఆళ్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రవి, పగిడిద్దరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. అశ్వారావుపేటలో.. అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన వెంకటపతి, మంగరాజుతోపాటు మరికొందరు కలిసి కొద్ది రోజులుగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంటలో తాపీ పనులు చేస్తున్నారు. బుధవారం జంగారెడ్డిగూడెం నుంచి తిరుమలకుంట గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలోని వినాయకపురం శివారులోని శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం సమీపంలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటపతి, మంగరాజును స్థానికులు అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఏలూరు ఆస్పత్రికి తరలించారు. పినపాకలో.. పినపాక: కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఐలాపురం నుంచి ఉప్పాక వైపు ద్విచక్ర వాహనం వెళ్తుండగా మణుగూరు నుంచి జానంపేట వైపు కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఉప్పాక గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు కొండేరు తరుణ్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు 108లో పినపాక ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కేసు నమోదు చేస్తామని ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
పోడు సాగుదారులను ఇబ్బంది పెట్టొద్దు..
చుంచుపల్లి: పోడు సాగుదారులను అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెట్టొద్దని, వారికి ఉపాధి లేకుండా చేసే చర్యలకు స్వస్తిచెప్పి సహకరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా డిమాండ్ చేశా రు. బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్కు వినతిపత్రం అందించి, సమస్యలను వివరించారు. బందెగిరినగర్తోపాటు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పేదలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కొనే యత్నాలు చేయొద్దని, సర్వే పూర్తయిన ప్రతి ఎకరాకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా పోడు చేయడాన్ని సీపీఐ వ్యతిరేకిస్తోందని, తరతరాలుగా పోడుపైనే ఆధారపడినవారికి హక్కు పత్రాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బండి నర్సింహ, తాటి ఎల్లయ్య, సున్నం పాపారావు, ఆదిలక్ష్మి, వెంకటేశ్వర్లు, కుంజా వెంకటేశ్, పడిగె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ సీపీఐ.. సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా పోరాటాల స్ఫూర్తిని ఇంటింటికీ తీసుకెళ్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా అన్నారు. పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం జిల్లాలోని అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి గడపకు వెళ్లి కమ్యూనిస్టుల పోరాటాలు, త్యాగా లను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. 15వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి గ్రామంలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కా రం కోసం కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, దుర్గరాశి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జి.వీరస్వామి, భూక్యా దస్రు, ఎస్కే ఫహీమ్, కుమారి హన్మంతరావు, ధీటి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు ఉరి తాళ్లు
లేబర్ కోడ్లు.. సూపర్బజార్(కొత్తగూడెం): ఏప్రిల్ ఒకటి నుంచి దేశంలో నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయా లని నిర్ణయించడం కార్మిక వ్యతిరేకమని, కార్పొరేట్ల సంపద పెంపు కోసం 145 కోట్ల ప్రజలకు, 70 కోట్ల కార్మికుల గొంతుకు ఉరితాడు బిగించడానికి సిద్ధమవడమేనని కార్మిక సంఘాల నాయకులు ఎస్ఏ జలీల్, జె.సీతారామయ్య, కంచర్ల జమలయ్య, దొడ్డా రవికుమార్, షేక్ యాకుబ్షావలి అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట బ్లాక్ డే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. యావత్ కార్మిక వర్గం లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మె నిర్వ హించి వ్యతిరేకత చాటినప్పటికీ మోదీ ప్రభుత్వం.. అంబానీ, అదానీలాంటి కార్పొరేట్లు, పెట్టుబడి దారులకు సంపదను కట్టబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ బ్లాక్ డే జరపాలని పిలుపునిచ్చాయని, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. ఈ కోడ్లతో యూనియన్ పెట్టుకునే హక్కు, కనీస వేతనాలు, సమ్మె హక్కు ఉండవని, కార్మికులకు రక్షణ లేకుండా పోతుందని, 8 గంటల పనివిధానం పోయి 14 గంటలు రానుందన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయమని ప్రకటించాయని, రాష్ట్రంలో కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు త్యాగరాజన్, కాయల నాగభూషణం, పీతాంబరం, గౌని నాగేశ్వరరావు, ఎన్.సంజీవ్, మల్లికార్జున్రావు, భూక్య రమేశ్, కె.సత్య, తులసీరామ్, మధుసూదన్రెడ్డి, సతీశ్, వెంకన్న, ఎం.రాజు, ఎం.వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, శిరీష, పద్మ, వాణి, క్రాంతి, మాధవి పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ ఎదుట నిరసనలో కార్మిక సంఘాల నేతలు -
పెనుప్రమాదంగా సామ్రాజ్యవాద పోకడలు
సూపర్బజార్(కొత్తగూడెం): అమెరికా సామ్రాజ్య వాద పోకడలు యుద్ధానికి దారితీసి ప్రపంచశాంతికి పెనుప్రమాదంగా మారాయని.. యుద్ధంతో ప్రాణనష్టమే కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నానికి కారణమవుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండ లం లోతువాగులో మంగళవారం జరిగిన జిల్లా కౌ న్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధం కారణంగా భారత్లోనూ ధరలు పెరగడమే కాక ఇతర సమస్యలు తలెత్తుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. కాగా, అడవుల్లో సహజ వనరులను దోచు కునేందుకే కేంద్రం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను తుదముట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే కాక సింగరేణి కార్మికుల హక్కులను కాలరాయడం మానుకోవా లని డిమాండ్ చేశారు. సేవ్సింగరేణి పేరుతో సోమవారం చేపట్టిన సింగరేణి ప్రధాన కార్యాల యం ముట్టడి విజయవంతం ద్వారా ప్రభుత్వానికి తమ సత్తాచాటామని తెలిపారు. కార్మికులు, రైతు లు, మహిళలు, విద్యార్థులు, జర్నలిస్టుల సమస్యలపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన గళా న్ని అసెంబ్లీలో వినిపిస్తున్నారని సాబీర్పాషా వెల్లడించారు. సీపీఐ నాయకుడు జి.వీరస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, మిరియాల రంగయ్య, కొత్తగూడెం మేయ ర్ మూడ్ గణేశ్తో పాటు నాయకులు కె.సారయ్య, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, సలీం, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి మురళి, మువ్వా వెంకటేశ్వరరావు, కంచర్ల జమలయ్య, రేసు ఎల్లయ్య, వీసంశెట్టి పూర్ణచందర్రావు, అడుసుమిల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా -
రబీ ధాన్యం మిల్లింగ్ చేయలేం..
సూపర్బజార్(కొత్తగూడెం): రాబోయే రబీ సీజన్ ధాన్యంలో నూక శాతం ఎక్కువగా రానున్నందున మిల్లింగ్కు తీసుకోలేమని రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులు తెలిపారు. మంగళవారం కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్కు వినతిపత్రాలు అందజేశాక వారు మాట్లాడారు. గత ఖరీఫ్ సీజన్కు సంబంధించిన బియ్యం 50 శాతం మేర మిల్లుల్లోనే ఉండడంతో రబీ ధాన్యం దిగుమతికి ఖాళీ కూడా లేదని తెలిపారు. ఖరీఫ్ సీజన్ బియ్యానికి అలాట్మెంట్ ఇవ్వాలని కోరారు. అలాగే, పదేళ్లుగా రైస్ మిల్లర్లకు బకాయి ఉన్న రవాణా, గోదాం తదితర చార్జీలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జుగల్ కిషోర్ఖండేల్వాల్, కొండూరు రాజేంద్రప్రసాద్, కోశాధికారి బచ్చు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఇంజన్కు నిప్పు పెట్టిన దుండగులు
జూలూరుపాడు: మండలంలోని సాయిరాంతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇంజన్కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. పంచాయ తీ ట్రాక్టర్ను రోజులాగే సోమవారం రాత్రి సమయంలో ఖాళీ స్థలంలో నిలిపారు. అర్ధరాత్రి సమయాన నిప్పు పెట్టగా మంటలు రావడంతో స్థానికులు సర్పంచ్కు ఫోన్ చేశారు. సర్పంచ్ బానోతు సుమలత, తదితరులు చేరుకునే సరికి బ్యాటరీ, వైరింగ్, టైర్లు కాలిపోయాయి. రెండేళ్లుగా మూలనపడిన ట్రాక్టర్కు ఇటీవల రూ.90 వేలు సొంత నగదుతో మరమ్మతు చేయించామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో సమీప గ్రామాల సర్పంచ్లు తాటి సువార్త, గడిగ సింధు, కొర్సా రమేశ్, బానోత్ కృష్ణ, లకావత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వాంకుడోత్ వెంకన్న, బోడా భీమారావు, బానోత్ రాంజీ, కిషన్ పాల్గొన్నారు. -
నేడు పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పాల్వంచరూరల్: పౌర్ణమిని పురస్కరించుకుని మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో బుధవారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 63034 08458 నెంబర్ను సంప్రదించాలని ఈఓ వివరించారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు సన్మానం సూపర్బజార్(కొత్తగూడెం): పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ చేస్తున్న ఇద్దరు ఎస్ఐలు, ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ను మంగళవారం ఎస్పీ రోహిత్రాజ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏళ్లుగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించిన ఎస్ఐలు మీర్జా కమల్షా బేగ్, వంక రామరాఘవయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పరిశిక మల్లికార్జున్రావు సేవలు మరువలేనివని కొనియాడారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్యానాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ లాల్బాబు, ఎంటీఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బౌద్ధక్షేత్రాన్ని సందర్శించిన అధికారులు నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రాన్ని పురావస్తు శాఖ అధికారులు మంగళవారం సందర్శించారు. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్నాయక్ క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై చర్చించారు. పురావస్తు శాఖ ఏఈ శంకర్, నేలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, గ్రీన్వే ఎన్విరాన్మెంటల్ సొసైటీ అధ్యక్షుడు దుడ్డెల రవి తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జైపాల్ఖమ్మంసహకారనగర్: టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకోగా ఉమ్మడి జిల్లా నుంచి జడ్ఎస్.జైపాల్కు స్థానం దక్కింది. ఆయన మంగళ వారం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీ కరించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు జైపాల్ను టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. ఆ తర్వాత టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావును జైపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం తల్లాడ: మండలంలోని కుర్నవల్లి గ్రామంలో నాలుగు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. వేంకటాచలపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను తల్లాడ తహసీల్దార్ కరుణాకర్రెడ్డి, అంతర్జాతీయ చెస్ చాంపియన్ శీలం రఘురామిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
మణుగూరుటౌన్: కుటుంబ కలహాల నేపథ్యాన మండలంలోని రామానుజవరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (37).. సోమవారం తన కుమారుడు కౌశిక్కు గడ్డిమందు తాగించి తాను కూడా తాగిన విషయం విదితమే. ఇద్దరినీ మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా కౌశిక్ పరిస్థితి కొంత కుదుటపడింది. ఆపై నాగేశ్వరరావును మెరుగైన చికిత్సనిమిత్తం మణుగూ రు నుంచి భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. సింగరేణి ఐరన్ స్క్రాప్ స్వాధీనం మణుగూరుటౌన్: సింగరేణి మణుగూరు ఏరియాలోని ఐరన్ స్క్రాప్ ను ఎత్తుకెళ్తున్న మహిళలను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఏరి యా సింగరేణి సెక్యూరి టీ అధికారి కె.శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సుమారు 200 కేజీల ఐరన్ స్క్రాప్ను సోమవారం రాత్రి చోరీ చేసిన మహిళలు ఆటోలో తరలిస్తున్న క్రమాన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు. దీంతో నిందితులను పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. పేకాట స్థావరంపై దాడిఅశ్వారావుపేటరూరల్: మండలంలోని దుబ్బతోగు శివారులో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్ఐ టి.యయాతిరాజు ఆధ్వర్యాన మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.10,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్య తరఫు బంధువుల దాడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పాల్వంచరూరల్: ఓ వ్యక్తిపై భార్య తరఫు బంధువులు దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాల్వంచ మండలం మొండికట్ట గ్రామానికి చెందిన గండికోట ప్రసాద్ (25) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య కృష్ణవేణి, పిల్లలు ఉండగా ఇటీవల పిల్లలను భర్త వద్దే వదిలేసిన ఆమె హైదరాబాద్లోని ఉప్పల్లో ఉంటోంది. అయితే, పిల్లలు తల్లి కోసం బాధపడుతుండడంతో ప్రసాద్ ఆమె వద్దకు వెళ్లాడు. ఈక్రమాన భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భార్య తరఫు బంధువులు ఆయనపై దాడి చేయడంతో బలమైన గాయాలయ్యాయి. ఈమేరకు కొత్తగూడెంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు మృతదేహంతో మంగళవారం రాత్రి కిన్నెరసాని పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. -
ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేసే వరకు పోరాడుతామని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భూదాన్ భూముల నుంచి పేదలను తొలగించిన ప్రభుత్వం, ఇప్పటికీ పునరావాసం కల్పించకపోవడం గర్హనీయమన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అనంతరం ధర్నాచౌక్ నుంచి కలెక్టరేట్ ప్రధాన గేటు వరకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత నాయకులతో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపారు. మొత్తం 729 కుటుంబాలు ఇళ్లు కోల్పోగా పలువురికి వెలుగుమట్లలో, ఇంకొందరికి స్వగ్రామాల్లో ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. కాగా, కేటాయింపుల్లో లోపాలు ఉన్నట్లు తేలడంతో పునఃపరిశీలన చేస్తున్నామని, జాబితాలో అర్హులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, నాయకులు బండారు రమేశ్, షేక్ మీరాసాహెబ్, ఎస్.నవీన్రెడ్డి, షేక్ నాగుల్మీరా, బోడపట్ల సుదర్శన్, బేగం, బాగం అజిత, ఏవీ రెడ్డి, కూచిపూడి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు -
మున్సిపల్లో ఏసీబీ తనిఖీలు
● పన్ను వసూళ్ల రికార్డులు పరిశీలన ● రాత్రి వరకు కొనసాగిన సోదాలు సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటల సమయాన ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ నేతృత్వాన ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 15 మంది సిబ్బంది కూడిన బృందం కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయంలోకి అడుగు పెట్టగానే తలుపులు మూసివేసి వారు సిబ్బంది సెల్ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఖమ్మంలో సమావేశానికి వెళ్తూ మధ్యలో ఉన్న మున్సిపల్ కమిషనర్ కొండ్ర నర్సింహను వెనక్కి పిలిపించారు. ఆపై ఉద్యోగులను తప్ప మిగతా వారెవరూ లోనకు రాకుండా కార్యాలయం గేట్లు కూడా మూసివేయించారు. సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీల సమచారం బయటకు పొక్కడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, అధి కారులు కార్యాలయంతో పాటు కమిషనర్ నర్సింహ, మేనేజర్ శ్రీనివాసరావు గృహాల్లో తనిఖీ చేయగా రాత్రి 10 గంటల వరకు సోదాలు కొనసాగాయి. పన్నులపై ఫిర్యాదులు రావడంతో.. మున్సిపాలిటీ పరిధిలో ఇంటి, నీటి పన్నుల వసూళ్లకు సంబంధించి రికార్డుల నిర్వహణపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీ చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. ఈమేరకు రెవెన్యూ, శానిట రీ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల ఉద్యోగులను విడివిడిగా విచారించడమే కాక రికార్డులను పరిశీలించామని వెల్లడించారు. పరిశీలన పూర్తయ్యాక ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. -
ఉద్యానవనానికి ఊతం..
ఏన్కూరు: సంప్రదాయ పంటలు సాగు చేసి వాటికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులు ఉద్యానవన పంట సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో ఆయిల్పామ్ సాగు ఒకసారి సాగు చేస్తే 30 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తుండడంతో ఎక్కువ మంది రైతులు ఆసక్తి కబరుస్తున్నారు. ఫలితంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చే ఆయిల్పామ్ సాగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏటేటా పెరుగుతోంది. అత్యధికంగా ఇక్కడే... రాష్ట్రంలో ప్రస్తుతం 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లా 1.20 ఎకరాలతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలి చింది. ఖమ్మం జిల్లాలో 40వేల ఎకరాలు, భధ్రాద్రి – కొత్తగూడెం జిల్లాలో 80వేల ఎకరాల్లో పంట సాగవుతోంది. ఈ సాగువలన కోతుల బెడద కూడా లేకపోవడంతో సాగుపై ఆదరణ పెరుగుతోంది. సంప్రదాయ పంటలను మార్కెట్లో విక్రయించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుండగా.. అయిల్పామ్ సాగు చేసిన రైతులకు దళారీలు లేకుండా నేరుగా కంపెనీ వారే కొనుగోలు చేయడంతో గిట్టుబాటు ధర పొందుతున్నారు. ఆయిల్ ప్రతి ఇంట్లో నిత్యావరస వస్తువు కాగా ప్రతీ మనిషి ఏడాదికి 19.5 కేజీలు వాడుతున్నారు. దీంతో ఆయిల్పామ్ సాగు చేసినప్పటికీ అది సరిపోకపోవడంతో మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి 71 లక్ష మెట్రిక్ టన్నుల ఆయిల్ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వం ఆయిల్పామ్ రైతులను ప్రోత్సహిస్తుండగా.. ఆ సాగు కష్టాలు తీర్చే కల్పతరువు అయింది. ఆయిల్పామ్ సాగు 2022 లో ఉమ్మడి జిల్లాలో 50వేల ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పెట్టుబడులు ఇలా ఆయిల్పామ్ సాగు ఎకరానికి మొక్కలు, ఎరువులు కలిపి రూ,25వేల వరకు పెట్టుబడులు అవుతాయి. సాగు చేసినప్పటి నుంచి 4వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు దిగుబడి వస్తూ ఏటేటా పెరుగుతూ ఉంటుంది. 8వ సంవత్సరం నుంచి ఎకరానికి 12 టన్నుల వరకు దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్పామ్ టన్ను రూ. 21,450 పలుకుతుంది. దీంతో ఆయిల్పామ్ సాగు కు డిమాండ్ పెరగడంతో కౌలు ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఇస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో.. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ కింద సుమారు ఎకరానికి రూ.51వేల వర కు ఇస్తుంది. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్, పంట చేతి కోచ్చే వరకూ నాలుగేళ్ల వరకు రైతుకు అండగా ఉంటుంది. రైతులకు ఆయిల్పామ్ మొక్క ఒకటి రూ. 193 ఉంటుంది, రైతు మాత్రం మొక్కకు రూ.20 చొప్పున చెల్లిస్తే ఎకరానికి 57 మొక్కలు అందిస్తారు. తద్వారా రైతుకు రూ.11వేల వరకు ఆదా అవుతుంది. ఇక డ్రిప్ ఇరిగేషన్కు రూ.23,200 ఇస్తుంది. రైతులు ఆయిల్పామ్ సాగు చేసిన నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ 4,200 చొప్పున అకౌంట్లో పడుతుంది. దీంతో రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి వారిని ప్రొత్సహిస్తుంది. ఆయిల్పామ్ సాగులో ఉమ్మడి జిల్లా ప్రథమం ఉమ్మడి జిల్లాలో ఆయిల్పామ్ సాగు నానాటికి పెరుగుతోంది. 2022లో ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఉన్న ఆయిల్పామ్ సాగు చేయగా 2026 నాటికి 1.20 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైతులకు సబ్సిడీ ఇచ్చి గిట్టుబాటు ధర రావడంతో పాటు కోతుల బెడద కూడా లేకపోవడంతో చాలామంది రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. – ఎం.వి మధుసూదన్, ఉద్యానవన శాఖాధికారి, ఖమ్మం -
అంగన్వాడీల్లోనూ ఒంటి పూట
● నేటి నుంచి నిర్వహణకు ఆదేశాలు ● చిన్నారులకు వేసవిలో ఉపశమనం భద్రాచలంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలను సైతం ఒకటే పూట నిర్వ హించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పలు కేంద్రాల్లో ఫ్యాన్లు కూడా లేకపోగా.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యాన బుధవారం నుంచి ఒకే పూట నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 12–30 గంటల వరకే నిర్వహించనున్నారు. ఇక మే 1 నుంచి 31వ తేదీ వరకు కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ఆ సమయాన కేంద్రాల్లో పిల్లలకు భోజనం వడ్డించే బదులు వారి ఇళ్లకే సరుకులు అందిస్తారు. మే నెలలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కూడా సెలవులు ప్రకటించినప్పటికీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 60 వేల మందికి పైగా చిన్నారులు భద్రాద్రి జిల్లాలో చాలా అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేవు. దీంతో అద్దె భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో వసతులు సరిగ్గా లేకపోవడంతో ఎండ కారణంగా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 2,061 అంగన్వాడీ కేంద్రాలకు గాను 8,829 మంది గర్భిణులు, 3,652 మంది బాలింతలకు పౌష్టికాహారం, ఇతర సేవలు అందుతున్నాయి. అలాగే, మూడేళ్ల లోపు 34,944 మంది, 3–6 ఏళ్ల లోపు చిన్నారులు 31,711 మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. ఎండ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పంపించడం లేదని ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఏప్రిల్ నెలంతా ఒక పూట నిర్వహణకు నిర్ణయించారు. అంగన్వాడీ కేంద్రాలను ఒకే పూట నిర్వహించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీవరకు కేంద్రాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12–30 వరకే నిర్వహిస్తాం. ఈ విషయమై తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాం. –స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి -
పంట మార్పిడితో రైతులకు లాభాలు
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రతీ సీజన్లో ఒకే పంట కాకుండా మార్పిడి ద్వారా రైతులకు లాభాలు ఉంటాయని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ తెలిపారు. కొత్తగూడెం కేవీకే ఆధ్వర్యాన మంగళవారం రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ పంట మార్పిడితో నీరు, ఎరువుల వాడకం తగ్గుతుందని తెలిపారు. వానాకాలంలో వరి సాగు చేసే రైతులు యాసంగిలో పెసర, మినుము, బొబ్బెర, ఉలవలు, వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆవాలు వేసుకోవాలని సూచించారు. తద్వారా భూసారాన్ని పరిరక్షించినట్లవుతుందని తెలిపారు. అలాగే, ప్రకృతి వ్యవసాయం ద్వారా సురక్షితమైన దిగుబడులు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి రాజేశ్వరి, ఉద్యాన అధికారి మీనాక్షి, శాస్త్రవేత్తలు శివ, శాస్త్రవేత్త రవీందర్ పాల్గొన్నారు. రూ.1.15కోట్లు పలికిన ఆశీలు మూడోసారి ముడిపడిన వేలం భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామపంచాయతీ ఆధ్వర్యాన ఆశీలు (వాహనాల పార్కింగ్ ఫీజు వసూళ్లు) అప్పగించేందుకు వేలం ఖరారైంది. గత ఏడాది వేలంలో రూ.1.25 కోట్లు పలకగా, ఈ ఏడాదికి గాను గతనెల 18న మొదటిసారి నిర్వహించిన వేలంలో రూ.82లక్షలే నమోదైంది. దీంతో వాయిదా వేసిన అధికారులు మార్చి 30న నిర్వహిస్తే రూ.88 లక్షలకు మించి పాడకపోవడంతో మళ్లీ వాయిదా వేశారు. ఈమేరకు మూడోసారి మంగళవారం వేలం నిర్వహించగా ఇద్దరు పోటీ పడడంతో రూ.1.15కోట్లకు సోడే రామారావు దక్కించుకున్నాడు. కాగా, మొదటి రెండు సార్లు కాంట్రాక్టర్లు కుమ్మకై ్క ధర పెంచొద్దని నిర్ణయించుకున్నట్లు తెలియగా, మూడోసారి కూడా ఫలితం లేకపోతే గ్రామపంచాయతీ ఆధ్వర్యాన ఆశీలు నిర్వహించాలనే భావనకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి కాంట్రాక్టర్లు పోటీ పడినట్లు తెలిసింది. అయినా గత ఏడాదితో పోలిస్తే రూ.10లక్షలు తగ్గడం గమనార్హం. ‘మన్ కీ బాత్’లో ప్రధాని ప్రశంసలు వ్యవసాయ కళాశాల విద్యార్థికి సన్మానం అశ్వారావుపేటరూరల్: ప్రధాన మంత్రి మోదీ మన్కీ బాత్లో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థిని ప్రశంసించడం కళాశాలకు గర్వకారణమని అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్కుమార్ అన్నారు. మై భారత్ పోర్టల్ ద్వారా వికసిత్ కృషి, వ్యవసాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతు సంక్షేమం అంశంపై కళాశాల విద్యార్థి కె.రఘువీర్రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వగా, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. ఈ విషయాన్ని ఇటీవల ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించిన మోదీ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా రఘువీర్తోపాటు భారత్ యంగ్ లీడర్ డైలాగ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిన ఎస్.సాత్విక, వికసిత్ భారత్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న మహర్షి వేద వ్యాస్ తదితరులను మంగళవారం సన్మానించాక హేమంత్కుమార్ మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.స్రవంతి, డాక్టర్ పి.ఝాన్సీరాణి, ప్రొఫెసర్లు డాక్టర్ నాగాంజలి, రాంప్రసాద్, జంబమ్మ, శిరీష, దీపక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు రూ.200కోట్ల రాబడిచివరి మూడు రోజులు రాత్రి 8 గంటల వరకు కార్యాలయాలు ఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరమంతా కలిపి 45 వేల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేశారు. వీటితో పాటు మ్యారేజీలు, మార్టిగేజ్లు, స్టాంపుల విక్రయాలు కలిపి రూ.200 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఆర్థిక సంవత్సరం చివరి మూడు రోజులు రాత్రి 8గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు విధులు నిర్వహించారు. అయితే, అధికారులు ఆశించిన విధంగా ముగింపు రోజైన మంగళవారం రిజిస్ట్రేషన్లు జరగలేదని తెలుస్తోంది. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 13,864 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగినా రూ.104.30 కోట్ల ఆదాయమే వచ్చింది. 2024–25లో 14,258 డాక్యుమెంట్లకు గాను రూ.107.63 కోట్లు ఆదాయం నమోదైంది. దీంతో గత ఏడాది కంటే ఈసారి రూ.3.08 కోట్ల ఆదాయం తగ్గింది. -
ధాన్యం కొనుగోళ్లకు 168 కేంద్రాలు
● చివరి గింజ వరకూ కొనుగోళ్లకు సిద్ధం ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అంకిత్ సూపర్బజార్(కొత్తగూడెం): యాసంగిలో రైతులు సాగు చేసిన ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 1,87,309 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో సన్న రకం 1,35,365 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 51,944 మెట్రిక్ టన్నులు ఉండగా.. కొనుగోళ్లకు 168 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అవసరానికి అనుగుణంగా అదనపు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,389, ‘బీ’ గ్రేడ్కు రూ.2,369 ధర నిర్ణయించగా, సన్న రకం వడ్లకు అదనంగా రూ.500 బోనస్ అందుతుందని తెలిపారు. ఈమేరకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక ఎండల దృష్ట్యా కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమకూర్చాలని ఆదేశించారు. అలాగే, రద్దీ నియంత్రణ కోసం రైతులకు టోకెన్లు జారీ చేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని తెలిపారు. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లలో నిమగ్నం కావాలని సూచించారు. ఇదేసమయాన సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టుల వద్ద నిఘా పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈసమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆర్డీఓ మధు, సివిల్ సప్లయీస్ డీఎం త్రినాధ్బాబు, డీఎస్ఓ ప్రేమ్కుమార్, డీఏఓ బాబురావు, తూనికలు, కొలతల అధికారి మనోహర్, డీఎంఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామసభల నిర్వహణపై... 99రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం నుంచి గ్రామసభల నిర్వహణపై ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామపంచాయతీల వారీగా సభలు నిర్వహించి ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలు, అందుతున్న నిధులపై వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ విద్యచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబురావు, డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, డీపీఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.జూలూరుపాడు: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే కాక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. జూలూరుపాడులోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం, కళాశాల, పడమటనర్సాపురంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ విద్యార్థులతో మాట్లాడిన ఆయన మెనూ అమలుపై ఆరా తీశాక విద్యాసామర్థ్యాలను పరీక్షించారు. అలాగే, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్ధాల నాణ్యతను తనిఖీ చేయగా మెనూ పాటించడంలేదని తేలడంతో అసహనం వ్యక్తం చేశారు. తాజా కూరగాయలతో ఆహారం అందించాలని ఆదేశించారు. అలాగే, ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేయించాలని తెలిపారు. అనంతరం పడమటనర్సాపురం ఏజీహెచ్ఎస్లో తనిఖీ సందర్భంగా స్టోర్ రూమ్లో కూరగాయలు దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ మిషన్ పని చేయకపోవడంపైనా ఆరా తీశారు. తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంఈఓ బానోత్ జుంకీలాల్, ఎంపీఓ టి.తులసిరామ్, ఆర్ఐ సీహెచ్.ఆదినారాయణ, కేజీబీవీ ఎస్ఓ పద్మ, ఏజీహెచ్ఎస్ హెచ్ఎం సుభద్రమ్మతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఈసారీ లోటే..
● బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనుకంజ ● గత ఏడాది కంటే మింత తక్కువగా నమోదు రుద్రంపూర్: సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యం మేర బొగ్గు ఉత్పత్తి చేయలేకపోయింది. సంస్థ వ్యాప్తంగా 12 ఏరియాల్లో 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా.. మంగళవారంతో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 58 మిలియన్ టన్నులకే పరిమితమైంది. దీంతో 14 మిలియన్ టన్నుల లోటు నమోదైంది. గత ఏడాది 72 మి.టన్నుల లక్ష్యంలో 69 మి.టన్నుల ఉత్పత్తి సాధిస్తే, ఈసారి అంత కంటే 11 మి.టన్నుల వెనుకంజలో ఉండడం గమనార్హం. అగ్రస్థానాన సత్తుపల్లి ఏటా సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఇందులో నుంచి 18 ఓపెన్కాస్ట్ గనులు, 20 భూగర్భ గనులకు రోజు, నెల వారీ లక్ష్యాలను కేటాయిస్తారు. అయితే, ఈసారి సంస్థ పరిధిలోని 12 ఏరియాలకు గాను రెండు ఏరియాల్లోనే 100 శాతం ఉత్పత్తి సాధ్యమైంది. సత్తుపల్లిలో 103 శాతం, బెల్లంపల్లి ఏరియా 101 శాతం ఉత్పత్తి సాధించి మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక మిగిలిన కొత్తగూడెం ఏరియా 92, ఇల్లెందు 50, మణుగూరు 92, మందమర్రి 71, శ్రీరాంపూర్ 68 శాతానికి పరిమితమయ్యాయి. అలాగే, రామగుండం–1 ఏరియాలో 82, రామగుండం–2 ఏరియా 89 శాతం, రామగుండం–3లో 71 శాతం, ఆండ్రియాల ఏరియాలో 11 శాతం, భూపాలపల్లి ఏరియా 61 శాతమే ఉత్పత్తి నమోదు చేయగలిగాయి. లక్ష్యాన్ని సవరించినా.. సింగరేణి సంస్థ 2025–26కు తొలుత 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ భారీ వర్షాలకు తోడు మొదటి మూడు నెలల్లో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి నమోదు కాకపోవడంతో లక్ష్యాన్ని 72 మిలియన్ టన్నులకు కుదించారు. ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో 60 మిలియన్ టన్నులకు తగ్గించారు. అయితే, ఇది కూడా చేరలేక 58 మిలియన్ టన్నులకే పరిమితం కావడం గమనార్హం. సవాలక్ష కారణాలు సంస్థ నిర్దేశించుకున్న మేర బొగ్గు ఉత్పత్తి సాధించలేకపోవడానికి కారణాలు ఏమిటనే చర్చ జరుగుతోంది. ప్రతీనెల లక్ష్యం, దాన్ని చేరుకునేలా కార్యాచరణపై ప్రతీ మంగళవారం, శనివారం అన్ని ఏరియాల్లో అధికారులు సమీక్షిస్తారు. ఈ సందర్భంగా ఆ నెల వెనుకబడడానికి కారణాలపై చర్చిస్తూనే మరుసటి నైలెనా మెరుగుపడాలని ఆదేశిస్తారు. అయినా ఫలితం లేకపోగా ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి లక్ష్యానికి దూరంగానే ఉండడం గమనా ర్హం. అంతేకాక గతంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కార్మికులంతా విధులకు హాజరుకావాలని, నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తే ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించేవారు. కానీ ఈసారి అలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. లక్ష్యం మేర ఉత్పత్తి చేస్తే లాభాలు కూడా అధికంగా ఇవ్వాల్సి వస్తుందనే భావనతోనే అధికారులు పట్టనట్టుగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. -
ప్లాన్ లేదా.. మరిచారా?!
ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క దానికీ ఇప్పటివరకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ప్లాన్ తయారీకి ప్రయత్నాలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యాన మాస్టర్ ప్లాన్పై దృష్టి సారించాల్సిన అవసరముంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఅప్పుడు విడివిడి.. ఇప్పుడు కలిసి తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే 2014లో కొత్తగూడెం మాస్టర్ ప్లాన్, పాల్వంచకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ 2005లో ఆమోదం పొందింది. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ భవన నిర్మాణ అనుమతులు, రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే గతేడాది ఈ రెండు మున్సిపాలిటీలకు తోడు సుజాతనగర్లోని ఏడు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ 60డివిజన్లతో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)ను ఏర్పాటుచేశారు. దీంతో పెరిగిన హోదాకు తగినట్లు, ఉమ్మడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈమేరకు కొత్తగూడెం, పాల్వంచలో డ్రోన్ సర్వే చేపట్టగా.. సుజాతనగర్లో నిర్వహించాల్సి ఉంది. కార్పొరేషన్ చుట్టూ విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్, 1/70 చట్టాలను పరిగణనలోకి తీసుకోవడమే కాక చుట్టుపక్కల అర్బన్ ప్రాంతంగా మారిన లక్ష్మీదేవిపల్లి, శ్రీనగర్ కాలనీ, చుంచుపల్లి మండల పరిధిలోని సబ్ అర్బన్ ఏరియాను కూడా పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్లో ఇబ్బందులు ఏర్పడవు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా.. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన, అంతర్గత రోడ్లన్నీ ఇరుకుగా మారాయి. రెండు పట్టణాల్లో పార్కింగ్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగూడెంలో ఎంజీ రోడ్డు, చిన్న బజార్, పెద్దబజార్, పాల్వంచలోని శాస్త్రి రోడ్డు వంటి వాణిజ్య కేంద్రాలు పార్కింగ్ సమస్య కారణంగా గత వైభవాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యాన పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపడం అత్యవసరం. ఇక రెండు జాతీయ రహదారుల కారణంగా నగరానికి బైపాస్ రోడ్డు వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆటోనగర్తో పాటు ఈ రహదారిని కేంద్రంగా చేసుకుని కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటును పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటిపోరుతో వెనక్కి.. వందేళ్లకు పైగా అర్బన్ ప్రాంతంగా చరిత్ర కలిగిన ఇల్లెందు పట్టణానికి మాస్టర్ ప్లాన్ కరువైంది. ఇక్కడి 24 వార్డుల్లో 50 వేలకు పైగా జనాభా ఉంది. సింగరేణి గనులు తగ్గిపోవడంతో ఒకప్పుడు కళకళలాడిన పట్టణం క్రమంగా ప్రాభవం కోల్పోయింది. అయితే జీఓ 76 తర్వాత పట్టణానికి కొత్త కళ వచ్చింది. సింగరేణిపై ఆధారపడకుండా రూరల్ ఎకానమీ ఆధారంగా ఇల్లెందు పుంజుకుంటోంది. దీనికి తగినట్లుగా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. గత పాలకమండలి 2023లో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆలోచన చేసినా.. చైర్మన్, కౌన్సిలర్ల మధ్య వివాదంతో అది మరుగున పడింది. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గమైనా ఈ దిశగా అడుగులు వేయాలని ఇల్లెందు వాసులు కోరుతున్నారు. జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు కొత్త మాస్టర్ ప్లాన్ కోరుతున్న కేఎంసీ -
తొలిసారిగా
మేజర్ గ్రామపంచాయతీ అయిన అశ్వారావుపేట మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. దీంతో తొలి పాలకవర్గం కొలువుదీరగానే.. మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అశ్వారావుపేట ప్రధానంగా ఉద్యాన పంటలు, పామాయిల్ తోటలు, పామాయిల్ పరిశ్రమలు ఆధారంగా ఎదిగిన పట్టణం. ఆకట్టుకునే పచ్చదనం ఇక్కడి ప్రత్యేకత. దీన్ని దృష్టిలో ఉంచుకుని పారిశ్రామికంగా, పర్యాటకంగా పట్టణం అభివృద్ధి చెందేలా, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇక 2005లో మున్సిపాలిటీగా మణుగూరు అప్గ్రేడ్ అయ్యింది. అయితే, రకారకాల కారణాలతో 19ఏళ్లుగా అధికారుల పాలనే సాగుతోంది. ఫలితంగా డ్రెయినేజీలు, మార్కెట్, పార్కులు వంటి కనీస సదుపాయాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉన్నందున ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావావాల్సిన అవసరముంది. -
రామయ్యకు వసంతోత్సవం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరాయి. శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం వసంతోత్సవాన్ని కన్నుల పండువగా జరిపారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారి ఉత్సవమూర్తులను అంతరాలయం నుంచి బేడా మండపంలోని నిత్యకల్యాణ వేదికపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యావచనం తదితర ప్రత్యేక పూజలు చేశాక, పసుపులోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఆపై మూలమూర్తులు, లక్ష్మీ అమ్మవారు, ఆండాళ్ అమ్మవారు, భద్రుని గుడి, ఆంజనేయస్వామి వార్లకు చివరగా ఉత్సవ మూర్తులపై వసంతాన్ని చల్లారు. అంతేకాక నూతన వధువరులైన సీతారామయ్యను ఎదురెదురుగా ఉంచి జరిపిన వసంతోత్సవ క్రతువు భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వసంతోత్సవ విశిష్టతను వేద పండితులు వివరించారు. అలాగే, సూర్యప్రభ వాహనంపై స్వామి వార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ జరిపారు. కాగా, శ్రీరామనవమి తిరుకల్యాణ ఉత్సవాల్లో చివరిరోజైన బుధవారం చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఉత్సవాల సందర్భంగా నిలిపివేసిన స్వామి వారి నిత్యకళ్యాణాలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు -
కొత్తగూడెం రైల్వే డివిజన్!
● రానున్న కాలంలో కేంద్రస్థానంగా భద్రాచలం రోడ్ స్టేషన్ ● సికింద్రాబాద్ నుంచి విడదీసి కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తే మేలు ● కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతిపత్రం.. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ మధ్య రైల్వేను విభజించి గుంతకల్, గుంటూరు, విజయవాడ జోన్లతో విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జోన్ల విభజనతోపాటే సికింద్రాబాద్ డివిజన్ను కూడా విభజించి భద్రాచలం రోడ్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలనే పలువురు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో 6,424కి.మీ పరిధిలో విస్తరించి ఉంది. దీని పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. 1556 కి.మీ ట్రాక్తో అతి పెద్దగా ఉన్న సికింద్రాబాద్ డివిజన్ను విభజించి కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దకాలంగా ఉన్నా రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. 1932లో కొత్తగూడెం స్టేషన్.. బొగ్గు రవాణాకు డోర్నకల్ జంక్షన్ను పాయింట్గా తీసుకుని 1927లో ఇల్లెందు (సింగరేణి కాలరీస్)కు రైల్వేలైన్ నిర్మించారు. ఆ తర్వాత 1932లో కొత్తగూడెం (భద్రాచలంరోడ్)కు రైల్వే కనెక్టివిటీ వచ్చింది. 1987లో మణుగూరుకు కూడా రైల్వే లైన్ వచ్చింది. అయితే 2005లో ఇల్లెందుకు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు ఆ స్టేషన్ను కూడా ఎత్తివేశారు. అయితే, కొత్తగూడెం స్టేషన్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. 2032 నాటికి స్టేషన్కు వందేళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఇటీవల కలిసి విన్నవించారు. రాబోయే రోజుల్లో భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ విజయవాడ తరహాలో కీలక జంక్షన్గా మారనుంది. ప్రస్తుతం మంజూరైన మణుగూరు –రామగుండం, భద్రాచలంరోడ్ – కొవ్వూరు, భద్రాచలం–మల్కన్గిరి, కొత్తగూడెం– కిరండోల్ లైన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి తోడు డోర్నకల్–విజయవాడ కు ప్రత్యామ్నయంగా కొత్తగూడెం – కొండపల్లి (పెనుబల్లి –కొండపల్లి) మార్గానికి ఇప్పటికే సర్వే జరిగింది. వీటిలో ఏఒక్కటి అందుబాటులోకి వచ్చి నా, దానికి కేంద్ర స్థానం కొత్తగూడెమే అవుతుంది. 740.కి.మీ కొత్త రైల్వే లైను అందుబాటులోకి వస్తుంది. దీనికి ప్రస్తుతం ఉన్న డోర్నకల్–భద్రాచలంరోడ్–మణుగూరు (106 కి.మీ) రైల్వేలైన్ను కూడా కలిపితే మొత్తం ట్రాక్ 846 కి.మీ అవుతుంది. దీంతో రైల్వే ఉద్యోగులు/కార్మికుల సంఖ్య కూడా పెరుగుతుంది. పరిపాలన పరంగా సికింద్రాబాద్ 280 కి.మీ దూరంలో ఉండగా, భద్రాచలంరోడ్ కేంద్రంగా కొత్త డివిజన్ డిమాండ్కు హేతుబద్ధత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే రైల్వే లైన్లు అన్నీ రిజర్వ్ ఫారెస్ట్ గుండా సాగేవే. ఈ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తే పాలనాపరమైన సౌలభ్యం కలగనుంది. -
కార్పొరేషన్ బడ్జెట్ రూ.140.71 కోట్లు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి పాలకవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా, బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.140.71 కోట్ల ఆదాయం, రూ.159.60కోట్ల వ్యయంతో అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టగా, పాలకవర్గం ఆమోదించింది. జీతా లు, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, కరెంట్ బిల్లులు, రుణ వాయిదాల చెల్లింపులు, పట్టణ ప్రగతి నిధులు, 15వ ఆర్ధిక సంఘం నిధులు, పార్కులు, అభివృద్ధి పనులు, ప్రజా మరుగుదొడ్లు, జంతు వధశాలలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలకు కేటాయింపులను కూడా బడ్జెట్లో పొందుపరిచారు. అయితే బడ్జెట్లో ఆదా యం రూ.140.71కోట్లుగా, ఖర్చు రూ.159.60 కోట్లు చూపి, మిగులు ఆదాయం రూ.68 లక్షలుగా పేర్కొనడం గమనార్హం. బడ్జెట్ ప్రజామోదితంగా ఉండాలి. మురికివాడల్లోని ప్రజల జీవనం ప్రమాణస్థాయిని పెంచేలా ఉండాలి. కార్పొరేషన్ వ్యాప్తంగా కమర్షి యల్, నాన్ కమర్షియల్ నుంచి వచ్చే ఆదాయ పద్దులు వివరించాలి. కానీ ఈ బడ్జెట్ అంకెల గారడీ, ఊహాజనిత బడ్జెట్గా ఉంది. – మునిగడప పద్మ, సీపీఐ కార్పొరేటర్ కార్పొరేషన్ బడ్జెట్ అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం.నగర వాసులకు ఒరిగేదేమీ లేదు. బడ్జెట్లో పేర్కొన నిధులు ఎలా సమకూరుతాయో స్పష్టత లేకపోవడం పెద్ద లోపం. రూపకల్పనలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. – సీతాలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్కొత్తగూడెం కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశంలో అధికారుల అవగాహన రాహిత్యం బయటపడింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వర కు నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో వచ్చే ఆదా యం, ఖర్చులు,వేతనాలు, కార్యాలయం, వాహనా ల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించా ల్సిన నిధులు,రావాల్సిన పన్నులపై చర్చలు జరపా ల్సి ఉంది. కానీ గ్రేడ్–2 మున్సిపాలిటీకి కమిషనర్గా వ్యవహరించిన అధికారి, ఇతర అధికారులు ఫ్లెక్సీలు,పారిశుద్ధ్య అంశాలను చర్చించడంతో పలు వురు అధికారులు, పాలకవర్గ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం అనంతరం జరిగి న సర్వసభ్య సమావేశం ఎజెండాలోని 19 అంశాల పై చర్చ జరపాల్సిన వారు, అది పక్కన పెట్టి బడ్జెట్ లెక్కలు గుర్తుకు వచ్చి వాటిపై మాట్లాడారని కొందరు కార్పొరేటర్లు తెలిపారు. అయితే ఏ సమస్యపై మాట్లాడినా మేయర్, కమిషనర్ దాటవేసే ధోరణితోనే వ్యవహరించాని పేర్కొన్నారు. కాగా సమావేశం రాత్రి వరకు కొనసాగింది. -
జెన్కో క్రీడా పోటీలు ప్రారంభం
పాల్వంచ: కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి క్రీడా మైదానంలో టీజీ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ ఫుట్బాల్, కల్చరల్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. కేటీపీఎస్ 5,6,7 దశలు, బీటీపీఎస్, పులిచింతల, సింగూర్, విద్యుత్ సౌధ, కేటీపీపీ కర్మాగారాల క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. పోటీలను సీఈలు ఎం.ప్రభాకర్ రావు, జె.సూర్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. క్రీడా స్ఫూర్తి చాటాలని సూచించారు. ఎస్ఈ మోక్షవీర్, డిప్యూటీ స్పోర్ట్స్ ఆఫీసర్ రామారావు, స్పోర్ట్స్ సెక్రటరీలు వీరస్వామి, మహేష్, జమీల్, అరుణ్, బాబి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పొగాకు బ్యారన్ దగ్ధం
అశ్వారావుపేటరూరల్: అగ్ని ప్రమాదంలో ఓ పొగాకు బ్యారన్ దగ్ధమైన ఘటన సోమవారం మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..నల్లబాడు గ్రామానికి చెందిన రైతు సింహాద్రి వీర్రాజు ఈ నెల 24న వర్జీనియా పొగాకును క్యూరింగ్ చేసేందుకు బ్యారన్లో ఎక్కించగా, ఈ క్రమంలోనే మంటల వ్యాపించి సుమారు రూ.6లక్షల విలువైన పొగాకు కాలి బూడిదైంది. స్థానికుల సమాచారంతో అశ్వారావుపేట అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్తో వచ్చి మంటలను అదుపు చేశారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిదమ్మపేట: పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... దమ్మపేట గ్రామానికి చెందిన పసుమర్తి వీర వెంకటేశ్వరరావు (57), అతడి భార్యకు వ్యవసాయ పనుల విషయంలో ఈ నెల 3న గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్రెడ్డి తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి ..దమ్మపేట: కారు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని ముష్టిబండ గ్రామ శివారులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ముష్టిబండ గ్రామానికి చెందిన గద్దల నాగబాబు (39) వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ శివారుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా అశ్వారావుపేట వైపు నుంచి సత్తుపల్లికి వెళుతున్న కారు ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలై నాగబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్యనాగమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయికిషోర్రెడ్డి తెలిపారు. క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నం●తండ్రీ కొడుకుల పరిస్థితి విషమం మణుగూరు టౌన్: భార్యతో కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త గడ్డిమందు తాగి, కుమారుడికి తాగించిన సంఘటన మణుగూరులోని రామానుజవరంలో సోమవారం జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... జూలూరుపాడుకు చెందిన నగేష్ భార్య, కుమారుడు కౌశిక్తో కలిసి రామానుజవరంలో వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు జరగ్గా, భార్య అక్కడికి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. భార్యతో గొడవ అనంతరం క్షణికావేశంతో నగేష్ గడ్డిమందు తాగాడు. కుమారుడికి కూడా తాగించాడు. దీంతో ఇద్దరు అపస్మారక స్థితికి వెళ్లగా, స్థానికులు మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తీసుకెళ్లారు. గంజాయి రవాణాదారుల అరెస్ట్అశ్వాపురం: గొల్లగూడెంలో ఆదివారం రాత్రి నలు గురు గంజాయి రవాణాదారులను అరెస్ట్ చేసినట్టు సీఐ అశోక్రెడ్డి సోమవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లగూడెం వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన కారు ను ఆపి సోదా చేశారు. దీంతో రూ.57,500 విలువైన 1.150 కేజీల గంజాయి లభించింది. విచారణ చేపట్టగా హైదరాబాద్కు చెందిన ముస్తాపూర్ రాహుల్, ప్రశాంత్, బిత్తిరి విజయ్కుమార్, యోగేంద్రజాదవ్లు ఒడిశాలోని మల్కన్గిరి నుంచి గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. దీంతో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, కారు సీజ్ చేశామని సీఐ తెలిపారు. ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్ నర్సంపేట రూరల్: ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వరంగల్ జిల్లా నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. నర్సంపేట పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పొన్నాల శివశంకర్, ఆయన భార్య రేణుక, పర్ని అశోక్ వాహనాల చోరీకి పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా వారి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఈమేరకు నిందితులను రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రవికుమార్, గూడ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
పీడీ యాక్ట్ కేసు నమోదు
బూర్గంపాడు: గంజాయి అక్రమ రవాణా, విక్రయాల్లో ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న సారపాకకు చెందిన షేక్ మున్వర్పై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఇతనిపై బూర్గంపాడు పోలీస్స్టేషన్లో రెండు, లక్ష్మీదేవిపల్లి, ఏడూళ్ల బయ్యారం, దుండిగల్ పోలీస్స్టేషన్లలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ రోహిత్రాజు పర్యవేక్షణలో ఆధారాలను పరిశీలించిన పీడీ యాక్ట్ను నమోదు చేశారు. సోమవారం నిందితుడు మున్వర్కు పీడీ యాక్ట్కు సంబంధించిన నిర్బంధ ఉత్తర్వులను పాల్వంచ సీఐ సతీష్ అందజేశారు. ఏడాది కాలంపాటు చర్లపల్లి జైలు నిర్బంధించాలని ఉత్వరుల్లో పేర్కొన్నారు. -
● ప్రతీవారం నిర్వహిస్తుండటంతో బాధితుల హర్షాతిరేకాలు ● కలెక్టర్ హెచ్చరికలతో హాజరవుతున్న జిల్లాస్థాయి అధికారులు
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చికి ముందు సుమారు ఆరునెలల వరకు కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించలేదు. దీంతో బాధితులు తీవ్ర నిరాశ చెందారు. గత నెల చివరిలో నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ అధికారులతో మొదట ప్రజావాణి నిర్వహణపైనే ఆరా తీశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మార్చి 2న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించా రు. కొందరు జిల్లాస్థాయి అధికారులు హాజరుకాకుండా వారి స్థానంలో ఇతర అధికారులను పంపించడంతో గట్టిగా హెచ్చరించారు. శాఖాపరమైన అత్యవసర పనులను ఉంటే ముందుగానే అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ప్రజా వాణి కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారుల హాజ రు పెరిగింది. ప్రజలు సమస్యలపై దరఖాస్తు చేసుకునే సందర్భంలో అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులను పిలిచి వారికి ఆ దరఖాస్తును అందజేసి పరిష్కారానికి ఉన్న అవకాశాలు, ఒక వేళ లేకపోతే కారణాలను నివేదికల రూపంలో అందజేయాలని ఆదేశిస్తున్నారు. దీంతో వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వచ్చే బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారానికి ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలు ● కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ వాహబ్ అశ్వారావుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 911/33లో 5 గుంటల రిజిస్టర్ భూమి తన పేరున ఉన్నా ఆర్ఎస్ఆర్ సమస్య కారణంగా పట్టాదారు పాస్పుస్తకం అందలేదని విన్నవించారు. పట్టాదారు పాస్పుస్తకం మంజూరు చేయాలని కోరగా, కలెక్టర్ భూ భారతి విభాగానికి ఎండార్స్ చేశారు. ● ఇందిరా జలప్రభ పథకంలో బోరు మంజూరైనా మోటార్ మీటర్కు సర్వీస్ నంబర్ ఇవ్వలేదని టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన ఆంగోతు సంతులాల్ ఫిర్యాదు చేశారు. అర్జీని పరిశీలించిన కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. ● తన భర్త మృతితో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, పీజీ చదువుకున్న తన కుమార్తెకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఆళ్లపల్లి మండలం చెలగట్టు గ్రామానికి చెందిన కొమరం సారమ్మ విన్నవించగా, దరఖాస్తును సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ● ఎనిమిదేళ్లుగా తమ ఇంటికి కిన్నెరసాని తాగునీటి సరఫరా నిలిచిపోయినా నీటి బిల్లులు విధిస్తున్నారని కొత్తగూడెం మేదరబస్తీ 53వ డివిజన్కు చెందిన శ్రీనివాస్ వివరించారు. నీటి బిల్లులను రద్దు చేసి కొత్త కనెక్షన్ మంజూరు చేయాలని కోరుతూ అందజేసిన దరఖాస్తును పరిశీలించి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు ఎండార్స్ చేశారు. ● రంజాన్, బక్రీద్ పర్వదినాల్లో సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు పినపాక, ఏడూళ్ల బయ్యారం, జానంపేట, టి.కొత్తగూడెం పరిసర ప్రాంతాల ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. ఈద్గాకు స్థలం కేటాయించాలని కోరుతూ అందజేసిన దరఖాస్తును పరిశీలించి పినపాక తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
భద్రాచలం: గిరిజనుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన గిరిజనదర్బార్లో ఆయన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి ఆయాశాఖల అధికారులకు ఎండార్స్ చేశా రు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎల్టీఆర్ భూ సమస్య పరిష్కరించాలని పెనుబల్లి మండలం వీఎంబంజరకు చెందిన లక్ష్మి, చర్ల మండలానికి చెందిన ఇసుక సొసైటీ మహిళలు సొసైటీ సమస్యలు పరిష్కరించాలని, ఏకలవ్య పాఠశాల నిర్మాణంలో తమ భూమి పోయినందున ఉపాధి కల్పించాలని రేలకాయలపల్లి గ్రామానికి చెందిన రమ్య ఫిర్యాదులు అందజేశారు. దుమ్ముగూడెం మండలం మహాదేవపూర్ గ్రామానికి చెందిన బాబూరావు సోలార్ విద్యుత్ కనెక్షన్ కోసం, గుండాల మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన వెంకన్న ఆశ్రమ పాఠశాలలో వాచ్మెన్ పోస్టు కోసం, పాల్వంచకు చెందిన రాంబాబు ట్రైకార్ రుణం కోసం, మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన వరలక్ష్మి కిరాణా షాప్ పెట్టుకునేందుకు రుణం ఇప్పించాలని వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, అశోక్, అరుణకుమారి, మధుకర్, సైదులు, రాంబాబు, లక్ష్మీనారాయణ, ఉదయ్కుమార్, నాగేశ్వరరావు, మేనేజర్ ఆదినారాయణ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఆయిల్పామ్ సాగు మరింత విస్తరణ
అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయిల్పామ్ సాగును మరింత విస్తరించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. సోమవారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పామాయిల్ ఫ్యాక్టరీలు, ఆయిల్పామ్ తోటల్లో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రైతులు అధ్యయన యాత్రలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేటలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ సీఎం నియోజకవర్గంలో ప్రతిపాదిత ఆయిల్పాం ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులకు అవగాహన కోసం ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే కల్లూరిగూడెం ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని, అశ్వారావుపేటలో కూడా అదనపు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఆయిల్ఫెడ్ ఓఎస్డీ అడపా కిరణ్కుమార్, ఓపీడీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, స్థానిక మేనేజర్లు శబావత్ శంకర్, నాగబాబు పాల్గొన్నారు. ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి -
ప్రభుత్వాలు సింగరేణిని దోచుకుంటున్నాయి..
● సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ ● సింగరేణి ప్రధాన కార్యాలయం ముట్టడి, నాయకుల అరెస్ట్రుద్రంపూర్: సింగరేణి సిరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే.నారాయణ విమర్శించారు. సింగరేణి పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కోల్బెల్ట్ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్మికులు, యూనియన్ కార్యకర్తలు కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హెడ్డాఫీస్ చేరుకుని ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పొర్లు దండాలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉద్రిక్తత నెలకొనగా, సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, ఏఐటీయూసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్కుమార్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి వన్టౌన్కు తరలించారు. అంతకుముందు ఆందోళనను ఉద్దేశించి నారాయణ, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలన్నీ పరిష్కరించాలని, లేకపోతే సమ్మె సైరన్ మోగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, నాయకులు సాబిర్పాషా, మిర్యాల రంగయ్య, కే.సారయ్య, వీరభద్రయ్య, వైవీ రావు, ముస్కే సమ్మయ్య, వంగా వెంకట్, జి. వీరస్వామి, రమణమూర్తి పాల్గొన్నారు. -
శ్రీనివాసగిరిపై పుష్పాభిషేకం
పాల్వంచ: పాల్వంచలోని శ్రీనివాసగిరిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహించి పదహారు రోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవ మూర్తులకు ప్రధాన అర్చకులు తోలేటి నగేష్ శర్మ, అర్చకుడు ఆరుట్ల ఫణిరాజాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, పుష్పాభిషేకం జరిపించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. సేవా ట్రస్ట్ చైర్మన్ కొత్త వెంకటేశ్వరరావు, కో చైర్మన్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, అధ్యక్షుడు బిక్కసాని సుధాకర్రావు, ఆరుట్ల లక్ష్మణాచా ర్యులు, మధుసూదన్రావు, ఊకే భద్రయ్య, తాటికొండ శ్రీలత, నరసింహాకుమార్, లక్ష్మీరెడ్డి, కందుకూరి రామకృష్ణ, బండి నారాయణ, శ్రీనివాసరావు, నరేష్ పాల్గొన్నారు. దరఖాస్తు గడువు పెంపుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా షెడ్యూల్డ్ కులా సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక–2025–26 పథకాల నమోదుకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 8వ తేది వరకు పొడిగించినట్లు కలెక్టర్ అంకిత్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు అనుసంధానంతో రవాణా విభాగానికి సంబంధించి ఈవీ ద్విచక్ర వాహనాలు, త్రిచక్రాల గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు, పశుసంవర్థక రంగంలో పాడి పశువులు, సోలార్ పంప్సెట్ వంటి పథకాలకు అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 98499 05990 నంబరులో సంప్రదించాలని సూచించారు. స్కాలర్ షిప్ గడువు కూడా.. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీపోస్ మెట్రిక్ స్కాలర్షిప్, రెన్యూవల్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎ.శ్రీలత సోమవారం ఒకప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2024–25 స్కాలర్షిప్ల మంజూరుకు ఇంకా ఆధార్ సీడింగ్కాని బ్యాంకు అకౌంట్ కలిగిన విద్యార్థులు పోస్టల్ బ్యాంక్ అకౌంట్లు తీసుకోవాలని వివరించారు. పురాతన నాణేలు లభ్యంఅశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామ పంచాయ తీ బీజీ కొత్తూరు గ్రామంలో పొలా న్ని చదును చేస్తుండగా పురాతన నాణేలు లభ్యమైన సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఓ రైతు తన పొలంలో జేసీబీతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నాడు. ఈ క్రమంలో జేసీబీ తగిలి భూమిలో ఉన్న కుండపగిలి పోయి నాణేలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ట్రాక్టర్ల డ్రైవర్లు గుట్టుచప్పుడు కాకుండా వాటిని తీసుకెళ్లి భద్రపరుచుకున్నారు. అనంతరం వారి మధ్య తగాదా జరగడంతో నాణేల విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, స్థానికులు ఏఐ పరిజ్ఞానం ద్వారా అవి 12వ, 13వ శతాబ్దాలనాటి రాగి నాణేలుగా గుర్తించినట్టు సమాచారం. బీజీ కొత్తూరు గ్రామానికి కాకతీ యులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు ఉంది. సమీపంలో కాకతీయులు నిర్మించిన తుమ్మలచెరువు, చెరువు సమీపంలో ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై పురావస్తుశాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సంఘటనపై సీఐ అశోక్రెడ్డిని వివరణ కోరగా.. ఈ విష యం తమ దృష్టికి వచ్చిందని, వారిని పిలిపించి పరిశీలించగా అవి రాగి నాణేలా లాగా ఉన్నాయని తెలిపారు. -
మృతుడి కుటుంబానికి రూ.57 లక్షల పరిహారం
●ఓబీ కంపెనీ యాజమాన్యంతో కార్మిక సంఘాల ఒప్పందం మణుగూరు రూరల్: ఓసీలో డంపర్ టైర్ పేలి మృతి చెందిన కార్మికుడు సర్ఫరాజ్ కుటుంబానికి రూ.57లక్షల నష్టపరిహారం చెల్లించేలా ఓబీ కంపెనీ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య సోమవా రం ఒప్పందం కుదిరింది. సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసీ–2లో ఓబీ వెలికితీత పనులు నిర్వహిస్తున్న వీపీఆర్(దుర్గా) ఓబీ కంపెనీలో ఆది వారం ప్రమాదం జరిగిన విషయం విదితమే. ఒప్పందం ప్రకారం రూ.43లక్షలను నెలరోజుల్లో నేరుగా మృతిడి కుటుంబానికి చెల్లించనుండగా, రూ. 14లక్షల వర్క్ మెన్ కాంపెన్సేషన్ చట్టపరంగా అందజేయనున్నారు. సింగరేణి అఽధికారుల మధ్యవర్తిత్వంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీన, ఇఫ్టూనాయకులు ఓబీ కార్మికుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. మృ తదేహాన్ని బిహార్కు తరలించి, అంత్యక్రియల ఖర్చులు కూడా యాజమాన్యమే చెల్లించనుంది. వీపీఆర్ కాంట్రాక్ట్ కొనసాగినంతకాలం మృతుడి కుటుంబానికి జీతంకూడా చెల్లించేలా ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు భవి ష్యత్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవా లని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులు ఎం.రమేష్, ఎస్.రమేష్, కె.శ్రీనివాస్, రామేశ్వర్, వంశీ, కిరణ్, కార్మిక సంఘాలనాయకులు వై.రాంగోపాల్, కె.కృష్ణంరాజు, నాసర్పాషా, మేకల ఈశ్వర్రావు, శనిగరపుకుమారస్వామి, సురేందర్, సిల్వేరు గట్టయ్య, అబ్దుల్ రవూఫ్, మంగీలాల్, జంపన సీతారామరాజు, మధుబాబు, హరి, రవి తదితరులు పాల్గొన్నారు. -
మద్యం సిండికేట్లో విభే దాలు
ఇల్లెందు: మద్యం వ్యాపారుల మధ్య విభేదాలు పొడసూపి పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. ఇల్లెందులో వ్యాపారి గణేష్తోపాటు పంబాల సబిత, గోవిందరావు, బి. శ్రీనివాసరావు, చల్లా రామారావు, అర్వపల్లి లక్ష్మీనారాయణ, లగ్గల పురుషోత్తం, పెరుమాళ్ల సరిత, కందుల బేబీ ప్రసన్న, దారా ఉమామహేశ్వరరావు, రామగిరి షణ్ముఖరాజు, ఏపూరి స్రవంతి భాగస్వాములుగా కొన్ని మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. రూ. 70 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు భాగస్వాములు చెబుతున్నారు. అయితే గణేష్ షాపుల ద్వారా వచ్చే ఆదాయం లెక్కలు తమకు చూపడం లేదని పేర్కొంటూ ఆదివారం భాగస్వాములు మద్యం షాపులకు తాళాలు వేశారు. తమకు న్యాయం చేయాలని సోమవారం ఇల్లెందు సీఐ తాటిపాములు సురేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. దుకాణాలు మూసివేయడంతో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. కాగా, ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ టి. సురేష్, ఎకై ్సజ్ సీఐ రాంప్రసాద్ వేర్వేరుగా తెలిపారు. పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ -
బస్సు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతి
డ్రైవర్పై కేసు నమోదు బూర్గంపాడు: సారపాక బస్టాండ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామచంద్రాపురం గ్రామానికి చెందిన అమృతపు మల్ల మ్మ (60) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మణుగూరు డిపోకు చెందిన బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని కదిలించడంతో ఆమె బస్సు కింద పడగా.. మల్లమ్మ కుడి కాలిపై నుంచి బస్సు టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను భద్రాచలం ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం తరలించినప్పటికీ పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు డ్రైవర్పై బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. రైస్ మిల్లులో మహిళ మృతివరిపొట్టు పడడంతో ఊపిరి ఆడక ఘటన నేలకొండపల్లి: నిబంధనలు విస్మరించిన ఓ రైస్ మిల్లు యాజమాన్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అయితే, ఘటన జరిగాక కూడా యాజమాన్యం స్పందించలేదని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని రాజేశ్వరపురం వద్ద ఉన్న అరుణాచల రైస్ మిల్లులో కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన పప్పుల కళ్యాణి (34) రోజువారీ కూలీ పనులకు వస్తోంది. ఆదివారం కూడా ఆమె వరి పొట్టు తీస్తుండగా పొట్టు ఒక్కసారిగా మీద పడడంతో కూరుకుపోయింది. సహచర కూలీలు ఆమెను బయటకు తీసి సీఆర్పీ చేసి నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదంలో యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహించిన బంధువులు, కుటుంబ సభ్యులు కళ్యాణి మృతదేహంతో నేలకొండపల్లి సెంటర్లో రాస్తారోకోకు దిగారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవడమే కాక మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలకు సీపీఎం మండల కార్యదర్శి కే.వీ.రెడ్డి, సీపీఐ నాయకుడు కర్నాటి భానుప్రసాద్ తదితరులు సంఘీభావం తెలపగా ఖమ్మం – కోదాడ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు చేరుకుని దర్యాప్తు అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
మృతుడి ఆచూకీ లభ్యం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని వేదాంతపురం సమీపాన గంగారంచెరువులో శనివారం మృతుడి ఆచూకీ లభ్యమైంది. ఈ ఘటన వివరాలను ఆదివారం స్థానిక ఎస్ఐ టి.యయాతీ రాజు ఇలా తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ ఎడ్లబంజర్ ప్రాంతానికి చెందిన బూరుగు నాగేశ్వరరావు(65) గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అశ్వారావుపేట మండలం వేదాంతపురం చుట్టు పక్కల ప్రాంతాల్లో సంచరించగా.. శనివారం గంగారం గ్రామ శివారులోని సాగునీటి చెరువులో శవమై కనిపించాడు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి ఆరా తీయగా బూరుగు నాగేశ్వరరావుగా గుర్తించినట్లు తెలిపారు. మృతుడి భార్య కొద్ది నెలల క్రితమే మృతి చెందగా, ఇతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని సోమవారం కుటుంబీకులకు అప్పగిస్తామని ఎస్ఐ తెలిపారు. అగ్నికి ఆహుతైన పశువుల పాకలు.. దుమ్ముగూడెం: మండలంలోని సుబ్బారావుపేట గ్రామానికి చెందిన వెంకయ్య, చిన్నయ్య, చిన్నారావులకు చెందిన మూడు పశువుల పాకలు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదవశాత్తు అగ్గిరవ్వలు అంటుకోవడంతో మొదటగా వెంకయ్య పశువుల పాకకు మంటలు వ్యాపించి వరుసగా ఉన్నా మూడు పాకలకు అంటుకోవడంతో పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రూ.65వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. -
మణుగూరు ఓసీ–2లో ప్రమాదం..
● డంపర్ టైరు పేలి ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు, ముగ్గురికి గాయాలు ● పరిశీలించిన జీఎం, యూనియన్ నేతలుమణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఓసీ–2లో ఓబీ వెలికితీత పనులు నిర్వహిస్తున్న వీపీఆర్ (దుర్గా) కంపెనీలో సానియో డంపర్ టైర్ పేలిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలు, ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను తోటి కార్మికులు, యూనియన్ల ప్రతినిధులు ఇలా తెలిపారు. ఓసీ–2లో హాల్ రోడ్ వద్ద సాయబ్ లాల్ యాదవ్ ఆపరేట్ చేస్తున్న 196 నంబర్ గల 60 టన్ శానియో డంపర్ ఫ్రంట్ వీల్ జామ్ అయి బ్రేక్డౌన్ అయింది. దాన్ని బిహార్కు చెందిన టైర్ ఫిట్టర్ సర్ఫరాజ్(40), మంతూ కుమార్(మెకానిక్), జగదీష్ కాశ్వా (టైర్ హెల్పర్), తాజ్ అన్సార్ (టైర్ సెక్షన్)లు సాయంత్రం 4.10 నిమిషాల సమయంలో మారుస్తుండగా టైరు ఒక్కసారిగా పేలి సమీపంలో ఉన్న సర్ఫరాజ్కు వేగంగా వచ్చి తగలడంతో తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. మిగిలిన వారికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సింగరేణి ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా.. సర్ఫరాజ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రగాయాలైన సాహెబ్ లాల్ యాదవ్ను మెరుగైన వైద్యసేవల నిమిత్తం కొత్తగూడెం తరలించారు. ఛిద్రమైన పక్కటెముకలు.. సంఘటనా స్థలంలో టైరుకు అతి దగ్గరగా ఉన్న సర్ఫరాజ్కు టైరు రింగు చాతిభాగంలో తగలడంతో 10 పక్కటెముకలు విరిగాయి. ఈక్రమంలోనే రక్తం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. ఈనేపథ్యాన బాధితులను ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వై.రాంగోపాల్, రామనర్సయ్య, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వత్సవాయి కృష్ణంరాజు, సిలివేరు గట్టయ్య, సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి వెంకటరత్నం, ఇఫ్టూ నేత నాజర్పాషా, టీబీజీకేఎస్ నేత నాగెల్లి వెంకట్, ఏరియా జీఎం దుర్గం రాంచందర్, పీఓ శ్రీ రమేశ్, ఇంజనీర్ శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి శ్రీని వాస్లు మృతుడి భౌతికకాయాన్ని ఆస్పత్రిలో సందర్శించి చికిత్స పొందుతున్న బాధితులతో మా ట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అత్యవసర వైద్య సేవలు అందించాలని జీఎం వైద్య బృందాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా యూని యన్ నాయకులు మాట్లాడుతూ.. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఓబీ కంపెనీలో ఎస్ఓపీ అమలు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
‘డబుల్’ ఇళ్లను ఆక్రమించిన పేదలు
పాల్వంచ: పాల్వంచలోని నవభారత్ గాంధీనగర్ ఏరియాలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను ఆదివారం సీపీఎం సమక్షంలో పేదలుఆక్రమించా రు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ దారా ప్రసాద్, ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. ఆక్రమణలు చట్ట విరుద్ధమని అధికారులు చెప్పి ఖాళీ చేయాలన్నారు. దీంతో సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూ ఇళ్లు నిర్మించి నెలలు గడుస్తున్నా.. ఇంకా అర్హులైన పేదలకు ఇవ్వకపోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. అసంపూర్తి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి పేదలకు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తులసీరాం, కె.సత్య, సత్యవాణి, క్రాంతి, సులోచన, మాధవి, వింజ రాములు, గౌసియా తదితరులు పాల్గొన్నారు. మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత బూర్గంపాడు: మండల కేంద్రం బూర్గంపాడుకు సమీపంలోని కిన్నెరసాని నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకుని ట్రాక్టర్లను పోలీస్స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు. తదుపరి చర్యల కోసం తహసీల్దార్కు తెలియజేశామన్నారు. -
●ప్రమాదపుటంచున ప్రయాణం..
పాల్వంచలోని గోవర్థనగిరి కాలనీ మూలమలుపు వద్ద సీసీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు దిగువ భాగం లోతుగా ఉండడంతో అటుగా వస్తున్న వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈనేపథ్యాన ఆదివారం ఓ ట్రాలీ ఆటో అదే రోడ్డులో అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ క్రమంలో అందులోని డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. సరైన డ్రెయినేజీ లేకపోవడం, కాల్వ దిగువగా ఉండడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సరైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. – పాల్వంచ -
పోరాటాలతోనే హక్కుల సాధన
ఖమ్మంగాంధీచౌక్: సమస్యల పరిష్కారం, హ క్కుల సాధన పోరాటాలతోనే సాధ్యమని ఎన్ఎఫ్పీఈ(నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్) రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్కుమార్ అన్నారు. ఎన్ఎఫ్పీఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ద్వైవా ర్షిక మహాసభ ఆదివా రం ఖమ్మంలోని తపాలా ప్రధాన కార్యాలయంలో జరిగింది. యూనియన్ ప్రతినిధులు ఏలూరి శ్రీని వాసరావు, వై.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా పనిభారం మోపుతోందని విమర్శించారు. ఈనేపథ్యాన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు తప్పవని పేర్కొన్నారు. యూనియన్ నాయకులు మహేందర్, మధుసూదన్రావు, లెనిన్ శ్రీనివాస్, ఎస్వీ.రావు, రామశాస్త్రి, నాగేశ్వరరావు, జయరాజు, ఖాజామోహినుద్దీన్, మౌ లాలి, రాజ్యలక్ష్మి, సుబేదాబేగం, ఖమ్మం డివిజ న్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టుమెన్ల సంఘం అధ్యక్షుడిగా వై.సత్యనారాయణ, కార్యదర్శిగా పెరుగు నాగేశ్వరరావు, క్లాస్–3 యూనియన్ అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు, కార్యదర్శిగా బందెల నాగరాజు, కోశాధికారిగా రవీందర్ను ఎన్నుకున్నారు. తపాలా ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్కుమార్ -
ఒకేసారి మూడు నెలల రేషన్
● రేషన్ దుకాణాలకు సన్నబియ్యం తరలింపు ● జిల్లాలో 17,282 టన్నుల బియ్యం పంపిణీకి సిద్ధంపాల్వంచరూరల్: వేసవికాలంలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం మూడు (ఏప్రిల్, మే, జూన్) నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం 443 రేషన్ దుకాణాలు ఉండగా, ప్రతి నెలా ఆయా రేషన్షాపులకు 5,500 టన్నుల సన్న బియ్యాన్ని పౌరసరఫరాల కార్పొరేషన్ అధికారులు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచి రేషన్కార్డుదారులకు ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అధికా రులు సివిల్ సప్లాయీస్ గోదాములనుంచి రేషన్ దుకాణాలకు బియ్యాన్ని తరలిస్తున్నారు. రేషన్ దుకాణాలు బియ్యం బస్తాల నిల్వలతో నిండిపోతున్నాయి. కొన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ లకు తోడు మార్చిలో మిగిలిన బియ్యం నిల్వలు, మూడు నెలల రేషన్తో భారీగా నిల్వలు పేరుకుపోయినట్లు డీలర్లు తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల బియ్యం పంపిణీ చేయనుండగా, ఈసారి 18 కేజీల సన్నబియ్యం అందించనున్నారు. మూడు నెలల రేషన్ బియ్యాన్ని జిల్లాలోని అన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నాం. 17,282 టన్నుల బియ్యాన్ని నిర్దేశిత రేషన్షాపులకు అందిస్తున్నాం. ప్రతినెలా మాదిరిగా పంపిణీ జరుగుతుంది. గడువు పొడిగింపుపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. –త్రినాథ్బాబు, జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ డీఎం -
దాచుకుందాం.!
దోచుకుందాం.. ● ఇసుక, ఇటుక మాఫియా సరికొత్త ప్రతిపాదన ● ట్రాక్టర్పై ఒక్కసారిగా రేటు పెంచిన వైనం ● ఇందిరమ్మ లబ్ధిదారులపై పెరుగుతున్న భారంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రం చుట్టూ పాగా వేసిన ఇసుక, ఇటుక మాఫియాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు చివరకు దోచుకుందాం.. దాచుకుందాం... అన్నట్టుగా మారింది. ఇరువర్గాలు నష్టపోకుండా సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టే సరికొత్త ప్లాన్ను తెర మీదకు తెచ్చాయి. బయటకు ఎలా పొక్కింది? లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి సమీపంలో ఇటుక, ఇసుక అక్రమ వ్యాపారం విషయంలో చోటుచేసుకున్న ఆధిపత్య పోరు, చెలరేగిన ఘర్షణ, కుదిరిన రాజీపై గత బుధవారం ‘సాక్షి’లో వచ్చిన ‘రణరంగం’ కథనం ఇసుక–ఇటుక మాఫియాకు చెందిన కీలక వ్యక్తుల్లో కలవరం కలిగించింది. అర్ధరాత్రి వేళ జరిగిన వివాదానికి సంబంధించిన విషయాలు బయటకు ఎలా పొక్కాయి? ఎవరు చెప్పారనే అంశంపై ఆరా తీయడం మొదలెట్టారు. మీ పంచాయతీలకు మా నుంచి డబ్బులు రావాలంటే గొడవకు సంబంధించిన విషయాలు ఎవరు బయటకు చెబుతున్నారో, తమకు చెప్పాలంటూ గ్రామస్తులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఏది జరిగినా మన మధ్యనే ఉండాలని, అప్పుడే ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని గ్రామస్తులకు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ విషయాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు ఇసుక, ఇటుక బట్టీల నుంచి అనధికారిక లోకల్ ట్యాక్స్లను మరింతగా అందిస్తామని ఆఫర్ చేసినట్టు సమాచారం. ఇందిరమ్మ ఇళ్లపై భారం సామాన్యుల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. దీంతో స్థానిక వాగుల్లో దొరికే ఇసుకతోపాటు ఇక్కడ తయారయ్యే ఇటుకలకు డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో లెక్కాపత్రం, నియమ నిబంధనలు పాటించకుండా ఇటుక, ఇసుక సరఫరా చేస్తున్న వ్యక్తులుఒక్కసారిగాధరలు పెంచేయడంతో సామా న్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణం మరింత భారంగా మారింది. సరికొత్త జీఎస్టీ ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) పేరుతో ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. ఇలా వచ్చిన నిధులను పాలన, అభివృద్ధి పనులు, సంక్షేమం, దేశ రక్షణ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే, ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, నిబంధనలతో పని లేకుండా అక్రమంగా ఇసుకను తరలించడం, అడవిని నరికి ఆ కర్రలతో ఇటుకలు తయారు చేయడమనేది చట్ట విరుద్ధమైన పనులు. వీటికి తోడు ఇప్పుడు అనధికారిక లోకల్ ట్యాక్సెస్ కూడా వారే నిర్ణయించుకోవడం మరో వింత. ఈ అనధికారిక దందాకు చెక్ పెట్టాల్సిన మైనింగ్, ఫారెస్ట్, పోలీస్ శాఖ అధికారులు ఇసుక, ఇటుక దందాపై చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్ల నే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ అభివృద్ధి కమిటీల పేరు చెప్పి కొందరు రాజకీయ నేతలు రంగంలోకి దిగి తెర లేపిన సరికొత్త దందాతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం పాడైపోతుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ లబ్ధిదారులపై అదనపు భారం పడుతోంది. కొత్తగా కుదిరిన ఒప్పందం ట్రాక్టర్ ఇసుకపై రూ.2,000 చెల్లిస్తామని ఇసుక మాఫియా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇటుక బట్టీలకు సరఫరా అయ్యే మట్టి విషయంలో ట్రాక్టర్కు రూ.2,500 చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అనధికారిక లోకల్ ట్యాక్స్ల ద్వారా వచ్చిన సొమ్ములో సగం మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని, మిగిలిన మొత్తాన్ని ‘మేనేజ్మెంట్’ కోసం వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒక్క అనిశెట్టిపల్లి గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే ఇక్కడ నుంచి ప్రతీ రోజు లక్ష రూపాయల వరకు అదనంగా వసూలు చేయాలనే ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడ వ్యవహారం సాఫీగా సాగితే రాబోయే కొద్ది రోజుల్లో పరిసర గ్రామాల్లోనూ దందాను విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
సీతారాములకు మహ దాశీర్వచనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివా రం సీతారాముల జంటకు పండితులు మహ దా శీర్వచనం అందజేశారు. స్వామివారి నిత్యకల్యాణ మహోత్సవం అనంతరం నూతన వధూవరులైన సీతారామచంద్రుల వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వడమే ఈ సదస్యం పరమార్ధం. సీతారాముల కల్యాణంలో పాల్గొని తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ క్రతువు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు వివరించారు. కల్యాణం జరిగిన మూడోరోజున స్వామి వారికి మహ దాశీర్వచనం అందజేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని వెల్లడించారు. ఈ సందర్భంగా స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి పూలు, పండ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారికి తెప్పోత్సవం, దొంగల దోపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ పూజల్లో వేద పండితులు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైభవంగా నదీ హారతిభద్రాచలం టౌన్: భద్రాచలం గోదావరి తీరంలో ఆదివారం సాయంత్రం నదీ హారతి కార్యక్రమం కనువిందుగా సాగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి స్నానఘట్టాల వద్ద ప్రత్యేక పూజలు, దీపోత్సవం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని నదికి హారతులు సమర్పించారు. ప్రతీ ఆదివారం నిర్వహిస్తున్న ఈ హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోందని పురోహితుడు రామవజ్జల రవికుమార్ తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నేడు రామయ్యకు తెప్పోత్సవం, దొంగల దోపు -
అంగన్వాడీల్లో ‘ఒంటిపూట’ ఎప్పుడో..?
సూపర్బజార్(కొత్తగూడెం): అంగన్వాడీ కేంద్రాల్లో ఇంకా ఒంటిపూట బడులు అమలు చేయకపోవడంతో వేసవి తాపానికి చిన్నారులు అల్లాడుతున్నారు. విద్యాసంస్థల్లో ఒంటిపూట బడులను అమలు చేస్తున్నా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడులను అమలు చేయడం లేదు. అసలే అరకొర సౌకర్యాలతో నడుస్తున్న అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు ఎండలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నడుస్తుండటంతో మధ్యాహ్న సమయాన చిన్నారులు వేడి భరించలేక పోతున్నారు. దీంతో చాలా కేంద్రాల్లో హాజరుశాతం తగ్గిపోతోంది. అద్దె భవనాల్లో నిర్వహించే అంగన్వాడీ కేంద్రాల్లో పరి స్థితి మరింత దయనీయంగా మారింది. ఉదయం పదిగంటల నుంచే ఎండ తీవ్రత ఉండటంతో చిన్నారులు ఉక్కపోత భరించలేకపోతున్నారు. ఇటీవల కలెక్టరేట్ ఎదుట కొన్ని యూనియన్లు అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలు పరిష్కరించాలని ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభించినా అంగన్వాడీ సెంటర్లలో మాత్రం పాటించడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. తక్షణమే ఒంటి పూట బడులు ప్రా రంభించడంతోపాటు మే నెలలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తరచూ అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసి కనీస సౌకర్యాలను కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చల్లటి తాగునీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండ వేడికి అల్లాడుతున్న చిన్నారులు ఒంటిపూట బడులకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఉన్నతాధికారులకు సమస్యను నివేదించాం. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒంటిపూట బడులకు అవకాశం ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటాం. – స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూఓ -
చూసి వెళ్లండి
ఆగండి.. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రెండు రాష్ట్రాలనే కాక ఖమ్మం – భద్రాద్రి జిల్లాలను కలిపే కీలకమైన ఖమ్మం–తల్లాడ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. 33 కి.మీ. మేర ఉన్న ఈ మార్గంలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రహదారి గుంతలమయంగా మారినా అధికారులు తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతుండడం.. మరోపక్క ట్రాఫిక్ విపరీతంగా పెరగడం ఇందుకు కారణమవుతోంది. ప్రమాదాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని అధికార యంత్రాంగం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. ఇక్కడే ప్రమాదాలు.. ఖమ్మం–తల్లాడ రహదారిలో జరుగుతున్న ప్రమాదాల కారణంగా కొందరు మృత్యువాత పడుతుండగా.. మరికొందరు దివ్యాంగులుగా మిగులుతున్నారు. ప్రధానంగా తనికెళ్ల, కొణిజర్ల ప్రధాన రహదారి, వైరా రింగ్ సెంటర్, వైరా బ్రిడ్జి, తల్లాడ సెంటర్లలో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆయా ప్రాంతాలను హాట్ స్పాట్లును గుర్తించి హెచ్చరికల బోర్డులు, ఇతర చర్యలు చేపడతామని చెప్పినా ప్రమాదాలు తగ్గడం లేదు. దూరప్రాంతాల నుంచి వస్తున్న వాహనదారులకు రహదారిపై అవగాహన లేక అతివేగంగా వెళ్తూ గుంతలను తప్పించే క్రమాన ఇతర వాహనాలను ఢీకొడుతున్నారు. గతంలో జిల్లాలో హామ్ (హైబ్రిడ్ యాన్యుయిటీ మోడల్) రోడ్లు నిర్మిస్తామని చెప్పినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత తాత్కాలిక మరమ్మతులకే నిర్ణయించి.. హామ్ నిధులను జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వినియోగించనున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే మొదలైతేనే.. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా పలు కారణాలతో ఆలస్యమైంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే భారీ వాహనాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన వాహనాలన్నీ ఆ మార్గంలోనే వచ్చివెళ్తాయి. దీంతో ఖమ్మం – తల్లాడ రహదారిపై ట్రాఫిక్ తగ్గనుంది. ఈ రహదారి మే నెలలో హైవే అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నా... ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.హైదరాబాద్ తదితర నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఈ రహదారి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఇటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు నిత్యం ఆర్టీసీ బస్సులే కాక లారీలు, కార్లు తిరుగుతుంటాయి. సరుకు రవాణాకు ఇది ప్రధాన మార్గం కావడంతో రాత్రీపగలు తేడా లేకుండా రద్దీ ఉంటుంది. అయితే, ఇది సింగిల్ రోడ్డు కావడంతో కాస్త ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతోంది. జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు సరుకు రవాణా చేసే లారీల డ్రైవర్లు త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో వేగంగా నడపడంతో ప్రమాదాలకు కారణమవుతున్నారు.ప్రమాదకరంగా ఖమ్మం–తల్లాడ రహదారి ఖమ్మం నుంచి వెంకటాయపాలెం వరకు నాలుగు లేన్ల రోడ్డు ఉన్నా ఆ తర్వాత సింగిల్ రోడ్డు ఉంటుంది. భారీ వాహనాల రాకపోకలతో రహదారిపై పలుచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో రోడ్లు మరింతగా దెబ్బతిని గుంతల్లో నీరు నిలుస్తుండగా.. ఈ విషయాన్ని గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. ప్రధానంగా కొణిజర్ల సమీపాన అధ్వానంగా మారిన రోడ్డుపై గుంతలను తప్పించబోయి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతలు పెద్దవై, ప్రమాదాలు జరిగి విమర్శలు వచ్చినప్పుడే కంకర, ఇసుక, తారుతో తాత్కాలికంగా పూడుస్తుండడంతో కొద్దిరోజులకే సమస్య పునరావృతమవుతోంది. దీనికి తోడు తాత్కాలిక మరమ్మతులు చేయడంతో రోడ్డు ఓచోట ఎత్తుగా.. మరోచోట దిగుడుగా మారి వాహనదారులు అదుపు తప్పుతున్నారు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయప్రాంగ ణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ పాలకవర్గం, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): సమస్యల పరి ష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ఉద యం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు. గోదావరిపై వారధి!అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెం వద్ద గోదావరి నదిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్ట అశ్వాపురం–దుమ్ముగూడెం మండలాలకు వారధిలా పనిచేస్తోంది. గోదావరి నీటిమట్టం తగ్గడంతో ఆనకట్టపైనుంచి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పర్యాటకులూ సందర్శిస్తున్నారు. ఆనకట్ట వేసవిలో వారధిలా, శీతాకాలంలో జలపాతంలా, వర్షాకాలంలో నీరు ఉప్పొంగుతూ.. కాలానికో అందంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటక సందడి నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యా మ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 265 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్లైఫ్ శాఖకు రూ. 15,635 ఆదాయం లభించింది. 210 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.12,860 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ముగిసిన ఇంటర్ మూల్యాంకనం ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్ వాల్యూయేషన్) ఆదివారంతో ముగిసింది. ఖమ్మంలోని నయా బజార్ జూనియర్ కళాశాలలో క్యాంప్ ఏర్పాటుచేయగా క్యాంప్ ఆఫీసర్గా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు వ్యవహరించా రు. రాష్ట్రంలోని వివిధజిల్లాలకు చెందిన 3,14,501 జవాబుపత్రాలు పంపించారు. ఈ నెల 4వ తేదీన మొదలైన ముల్యాంకనంలో 1,220మంది అధ్యాపకులు పాల్గొనగా ఆదివా రం ముగిసిందని డీఐఈఓ రవిబాబు తెలిపా రు. అయితే, ఏప్రిల్ 2వ తేదీ వరకు రీకౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. -
వీఐపీల జపం.. మితిమీరిన ఆంక్షలు
● ఎప్పటిలాగే సామాన్యులకు తప్పని వసతి కష్టాలు ● కలెక్టర్గా అంకిత్కు తొలి నవమి, సీఎం, గవర్నర్ టూర్లు సక్సెస్ ● ఉత్సవాల విజయవంతంతో ఊపిరి పీల్చుకున్న అధికారులుభద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, పట్టాభిషేకం విజయవంతంగా ముగిశాయి. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటనలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగియటంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, వీఐపీల సేవల్లో మునిగి తేలారని, సామాన్య భక్తుల ఇక్కట్లను పట్టించుకోలేదనే అపవాదును మాత్రం మిగుల్చుకున్నారు. మితిమీరిన ఆంక్షలతో సామాన్యులు, స్థానికులతోపాటు ప్రముఖులను కూడా ఇబ్బందులకు గురిచేశారు. సీఎం పర్యటనపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నవమి వేడుకల్లో పాల్గొనడంతోపాటు అభివృద్ధి పనులు కూడా ప్రారంభించడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్గా అంకిత్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి టాస్క్గా సీఎం పర్యటన నిలిచింది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన అధికారులను సమన్వయం చేసుకుంటూ సీఎం టూర్ సక్సెస్లో కీలక పాత్ర పోషించారు. వేడుకల ఏర్పాట్లు, నిర్వహణపై కూడా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, ఇతర అధికారులతో పలుమార్లు సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. చివరి నాలుగు రోజులు మిగతా అధికారులతో కలిసి రోజూ స్టేడియాన్ని పరిశీలించి సెక్టార్ వివరాలను, పనులను నిరంతరం పర్యవేక్షించారు. సమన్వయంతో సమష్టి విజయం.. ఉత్సవాల విజయవంతానికి ఐఏ ఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాజేడు, భద్రాచలం పర్యటన సందర్భంగా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎదుర్కోలు ఉత్సవం రోజునే వచ్చి ఏర్పాట్లను పరిశీలించి సలహాలు, సూచనలను చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. అధికారులు వీఐపీల పర్యటనపైనే దృష్టి సారించటంతో సామాన్య భక్తుల ఇక్కట్లు షరామామూలుగానే నిలిచాయి. ఎదుర్కోలు, నవమి వేడుకలకు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు గదులు, డార్మెటరీలు తగినట్లు లభించలేదు. దీంతో గోదావరి ఘాట్ మెట్లు, కరకట్టలు, పార్క్లే పాన్పులుగా మారాయి. వేలాదిగా వచ్చిన భక్తులు ఎండ వేడిమికి విలవిల్లాడారు. స్టేడియంలోని గ్యాలరీలలో ఎడమ పక్కన కొద్ది మేర శాశ్వత షెడ్, తాత్కాలిక పందిళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం సైతం బతిమిలాడుకోవడం కనిపించింది. గ్యాస్ కొరత ఉండటంతో గతేడాది కంటే పులిహోర, అన్నదాన సేవలు తగ్గాయి. సేవా సంస్థలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో అధికారులు విఫలయ్యారనే విమర్శలు వచ్చాయి. అధికారులు వీఐపీల పర్యటనపైనే దృష్టి సారించటంతో సామాన్య భక్తుల ఇక్కట్లు షరామామూలుగానే నిలిచాయి. ఎదుర్కోలు, నవమి వేడుకలకు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు గదులు, డార్మెటరీలు తగినట్లు లభించలేదు. దీంతో గోదావరి ఘాట్ మెట్లు, కరకట్టలు, పార్క్లే పాన్పులుగా మారాయి. వేలాదిగా వచ్చిన భక్తులు ఎండ వేడిమికి విలవిల్లాడారు. స్టేడియంలోని గ్యాలరీలలో ఎడమ పక్కన కొద్ది మేర శాశ్వత షెడ్, తాత్కాలిక పందిళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం సైతం బతిమిలాడుకోవడం కనిపించింది. గ్యాస్ కొరత ఉండటంతో గతేడాది కంటే పులిహోర, అన్నదాన సేవలు తగ్గాయి. సేవా సంస్థలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో అధికారులు విఫలయ్యారనే విమర్శలు వచ్చాయి. ఉత్సవాలు విజయవంతమైనా అధికారుల మితిమీరిన ఆంక్షలతో విమర్శలు వచ్చాయి. ఎప్పటిలాగే జ్యుడీషియరీ ప్రముఖులను గుర్తించటంతో అధికారులు విఫలమయ్యారు. గతేడాది సైతం సీఎం సెక్టార్లో న్యాయశాఖ వీఐపీలు నొచ్చుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది కూడా ఖమ్మం ఫ్యామిలీ కోర్టు జడ్జి అర్చనాకుమారిని ట్రైనీ కలెక్టర్ అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. రామదాసు వారసుడు, దేవస్థానం ఈవోలను అడ్డుకోవడం మచ్చలుగా మిగిలాయి. ఇలాంటివి పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులకు తప్ప ఇతర శాఖల అధికారులకు మాత్రమే ఎదురవుతున్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమాచార శాఖ ఈ ఏడాది సైతం ముందస్తు ప్రణాళిక లేకుండా పాస్లు జారీ చేయడంతో గందరగోళంగా మారింది. -
●గిరిజన ఉత్పత్తులు భేష్
●భద్రగిరి మార్ట్ ప్రారంభోత్సవంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భద్రాచలం: స్వచ్ఛమైన, నాణ్యమైన గిరి జన ఉత్పత్తులను అందించేందుకు, గిరిజ నులు ఉపాధి పొందేందుకు ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ భేష్ అని గవర్నర్ శివ ప్రతాప్శుక్లా దంపతులు అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి గిరిజ న మార్ట్ను గవర్నర్ శుక్లా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. మార్ట్లోని అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. గవర్నర్ గిరిజన ఆయి ల్ ఉత్పత్తులను కొనుగోలు చేయగా, ఆయన సతీ మణి నగదును పీఓకు అందజేశారు. గిరిజన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పీఓ చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
గ్రంథాలయ సేవలు మెరుగు పరుస్తాం
మణుగూరు రూరల్ : గ్రంథాలయ సేవలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ముత్యాలమ్మనగర్ గ్రామపంచా యతీ శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రంథాలయంలో వైఫై ఏర్పాటు చేసిన దూపకుంట్ల అనిల్ను అభినందించారు. అనంతరం పలువురికి గ్రంథాల య మెంబర్షిప్, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమరం జంపేశ్వరి, ఉపసర్పంచ్ శ్రీను నాయక్, గ్రంథాలయ సిబ్బంది గీత పాల్గొన్నారు. అడవిని సంరక్షించాలిచుంచుపల్లి/పాల్వంచరూరల్: అటవీ సంరక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని కాంపా సీసీఎఫ్ క్షితిజ సూచించారు. శనివారం ఆమె చాతకొండ, హేమచంద్రాపురం, లోతు వాగు ప్లాంటేషన్లను, వనవిహార్ కాంప్లెక్స్లోని మీటింగ్ హాల్, కిన్నెరసాని డీర్ పార్కు, మందెరకలపాడు బీట్, సఫారీ రూట్లను పరిశీలించారు. అనంతరం ట్రెక్కింగ్ చేశారు. ప్లాంటేషన్లలో మొక్కల పెరుగుదల, సంరక్షణ చర్యలు, నీటి వనరుల వినియోగం, మట్టి సంరక్షణ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎఫ్ఓ కృష్ణగౌడ్, ఎఫ్డీఓ కోటేశ్వరరావు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సింహాసనం అధిష్టించగా..
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల దివ్యక్షేత్రంలో శనివారం రామయ్య పట్టాభిషేక మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. పంచారాత్ర ఆగమ శాస్త్రాలను అనుసరిస్తూ వేడుక నిర్వహించగా, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రభుత్వం తరఫున శ్రీరాముడికి పట్టువస్త్రాలను సమర్పించారు. రాజాధిరాజుగా కొలువుదీరిన స్వామివారిని వీక్షించి భక్తులు తరించారు. భద్రాచలం: సీత, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడిని ప్రధాన ఆలయం నుంచి మాడ వీధులు గుండా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన, పుణ్యావాచనం చేశాక, పండితులు రుత్విక్కులైన వశిష్టు డు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడిని తమపై ఆవాహన చేసుకున్నారు. రుత్వికరణం తర్వాత పండితులు మండపత్ర పూజలు ప్రారంభించారు. పట్టాభిషేకం వేదిక దిగువ భాగంలో ఏర్పాటు చేసిన మూడు కలశాల్లో సమస్త దేవతలు, సమస్త నదీ, సముద్ర జలాలతో పాటు రామపరివారాన్ని, అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర శతనామార్చన చేశారు. ఆపై త్రిదండి దేవనామ రామానుజాచార్యులు శ్రీరాముడి పాలన విశిష్టతను వివరించారు. రాజలాంఛనాలతో పట్టాభిషేక అలంకరణ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ముందుగా రాజదండాన్ని శ్రీరాముడి కుడిచేతిలో ఉంచారు. అనంతరం రాజముద్రికను తొడిగారు. ఆ తర్వాత రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకాన్ని సీతాదేవికి, రామమాడను లక్ష్మణుడికి అలంకరించారు. శ్రీరాముడికి ఇరువైపులా చామరాలను ఉంచారు. ఆపై స్వర్ణఛత్రాన్ని స్థిరం చేశారు. చివరగా రాజఖడ్గాన్ని రామయ్య ఎడమ చేతిలో ధరింప చేశారు. ఆ తర్వాత రుత్విక్కులు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండపత్రయంలోని మూడు కలశాల్లోని సమస్త దేవతలు, సమస్త జలాలు, రామపరివారంతో కూడిన మంత్రించిన జలాన్ని శ్రీరాముడిపై ప్రోక్షణ చేశారు. మంగళహారతితో పట్టాభిషేక తంతు ముగిసింది. పట్టాభిషేకం అనంతరం సీతమ్మవారు ఆంజనేయుడి మెడలో ముత్యాల దండ ధరింపచేస్తూ ఆంజనేయ స్వామి పట్టాభిషేకాన్ని నిర్వహించారు. వేడుకగా పట్టాభిషిక్తుడైన రాముడిని పల్లకీలో ప్రధాన ఆలయానికి తీసుకెళ్లారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సారపాకలోని ఐటీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా ప్రధాన ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. అనంతరం పట్టాభిషేకం జరిగే మిథిలా స్టేడియానికి చేరుకుని సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
శ్రీవారికి చక్రస్నానం, మహాపూర్ణాహుతి
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యాగశాలలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ ఆధ్వర్యాన మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉత్సవాల ముగింపు సూచికగా ధ్వజ పతాకాన్ని అవనతం చేశారు. అలాగే, ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో చక్రస్నానం ఆచరించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, శ్రీరామచంద్రమూర్తి, పుష్కరిణి నిర్మాణ దాత గుదే వెంకటేశ్వరరావు దంపతులు, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, ముఖ్య అర్చకులు మురళీమోహన్శర్మ, రాజీవ్శర్మ పాల్గొన్నారు. -
లోక్ అదాలత్తో కేసుల పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సూపర్బజార్(కొత్తగూడెం): కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు లోక్అదా లత్ అద్భుతమైన వేదికని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శని వారం జాతీయ లోక్ అదా లత్ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఇరుపక్షాలు రాజీ మార్గంలో, స్నేహపూర్వక వాతావరణంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారమైతే కోర్టు ఫీజు తిరిగి చెల్లిస్తారని, దీనివల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని వివరించారు. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు సివిల్ కోర్టు డిక్రీతో సమానమని, దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఎస్బీఐసౌజన్యంతో కక్షిదారులకు పులిహోర, తాగు నీటి సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.సరిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్, జడ్జిలు కిరణ్కుమార్, సుచరిత, బత్తుల రవికుమార్, వినయ్కుమార్, సాయిశ్రీ, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. 7,866 కేసుల పరిష్కారంజిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 7,866 కేసులు పరిష్కారమయ్యాయి. కొత్తగూడెం కోర్టులో 5,054, ఇల్లెందులో 797, భద్రాచలంలో 1,729, మణుగూరులో 286 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు. 31న క్రీడా పాఠశాలలకు ఎంపికలుసూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 31న జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి ఎం పరంధామరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు మండలస్థాయి ఎంపికలు ఆయా మండలాల ఎంఈఓల సమక్షంలో జరిగాయని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో 10 మంది బాలురు, 10 మంది బాలికలు.. మొత్తం 20 మందిని ఎంపిక చేసి ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపిస్తామని వివరించారు. వివరాలకు 95054 23226 నంబరులో సంప్రదించాలని సూచించారు. సస్పెండ్ చేస్తావా.. కోర్టుకు వెళ్తా ! నేలకొండపల్లి: బాధ్యత కలిగి న ఉద్యోగి మద్యం మత్తులో విధులకు హాజరు కావడమే కాక జిల్లా అధికారితో వాగ్వాదానికి దిగిన ఘటన ఇది. నేలకొండపల్లి వ్యవసాయ మార్కె ట్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న పంతులు శనివారం మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఏం.ఏ.అలీం సాధారణ తనిఖీల్లో భాగంగా కార్యాలయానికి వెళ్లగా ఈ విషయాన్ని గుర్తించారు. మద్యం తాగి రావడం ఏమిటని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ వాగ్వాదానికి దిగాడు. అంతేకాక ‘ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారా, చేసుకోండి... కోర్టుకు వెళ్తా’ అంటూ గొడవ పడ్డాడు. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు మార్కెట్ చైర్మన్కు ఫోన్లో వివరించిన డీఎంఓ.. 108 వాహనం పిలిపించి వైద్యపరీక్షల కోసం ఆయనను ఖమ్మం ఆస్పత్రికి పంపించారు. ఇటీవల పంతులు కార్యాలయ సిబ్బందిని కూడా దూషించినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఈ విషయమై డీఎంఓ అలీంను వివరణ కోరగా.... మద్యం మత్తులో విధులకు హాజరైన కార్యదర్శిపై వైద్యుల నుంచి నివేదిక వచ్చాక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలి
భద్రాచలంటౌన్: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహచ్ఓ తుకారాంరాథోడ్ పేర్కొన్నారు. పట్టణంలోని జాబిల్లి, రాధ ఆస్పత్రులను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నా రు. ఆస్పత్రి రిసెప్షన్ వద్ద సేవల చార్జీలు, అందుబాటులో ఉన్న చికిత్స, వైద్యుల పేర్లు, అర్హతలు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ఆయన వెంట ఇమ్యునైజేషన్ అధికారి ప్రతాప్, మలేరియా నిర్మూలన అధికారి రాందాస్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. తేనెటీగల పెంపకంతో ఉపాధిభద్రాచలంటౌన్: తేనెటీగల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుని గిరిజన యువత ఆర్థికంగా బలపడాలని ఐటీడీ ఏ పీఓ బి.రాహుల్ సూ చించారు. శనివారం స్థానిక వైటీసీలో ఐదు రోజులపాటు నిర్వహించిన హనీబీ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో లభించే తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలతో తేనె ఉత్పత్తి, మార్కెటింగ్లో రాణించాలని కోరారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు, హనీబీ బాక్సులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వేసవిలో మెరుగైన విద్యుత్ సరఫరావిద్యుత్ ఎస్ఈ మహేందర్ సూపర్బజార్(కొత్తగూడెం): వేసవి కాలంలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ను అందించడంపై దృష్టి సారించామని విద్యుత్ ఎస్ఈ గొట్టిముక్కల మహేందర్ శనివారం తెలిపారు. గతేడాది నుంచే వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని, ఎలాంటి అవాంతరం ఎదురైనా అధిగమిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లోడ్ పెరిగే 225 ప్రాంతాల్లో నూతన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఉపకేంద్రాల సామర్థ్యం పెంచేలా రెండు సబ్స్టేషన్లు, 32 పవర్ ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఇంటర్ లింకింగ్ వ్యవస్థను తీసుకొచ్చామని, అత్యవసర పరిస్థితులు ఎదురైనా, ఏదైనా ఉపకేంద్రంలో సమస్య తలెత్తినా పరిష్కరించేవరకు మరో కేంద్రం నుంచి సరఫరాను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ ప్రస్తుతం 13 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తి చేశామని వివరించారు. వినియోగదారుల సేవలకు ఆధునిక సాంకేతికతను జోడించామని, కార్యాలయాలకు రాకుండా ‘వాట్సప్, చాట్–బాట్, విద్యుత్ ప్రజావాణి, 1912 టోల్ఫ్రీ నంబర్లను ఫోన్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. -
అటు ఆధ్యాత్మికం.. ఇటు చోరీలు
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో రెండురోజులుగా శ్రీరామనవమి, పట్టాభిషేకం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగగా.. మరోవైపు దుండగులు తమ చేతివాటం ప్రదర్శించారు. శుక్రవారం శ్రీరామనవమి రోజున సుమారు 50 సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయి. ముందురోజు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవంలో ఓ మహిళ మెడలో రూ. 2.50 లక్షల విలువైన బంగారుగొలుసు చోరీకి గురైంది. శనివారం మరో రెండు సెల్ఫోన్లు చోరీకి గురయ్యా యి. ఈ రెండు రోజుల వేడుకల్లో గతంలో కంటే తక్కువ మంది భక్తులు వచ్చినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం పోలీసుల వైఫల్యమేనని ప్రజ లు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ నిలిపివేత.. శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పట్టాభిషేకం మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన సారపాక ఐటీసీ నుంచి భద్రాచలం వచ్చే సమయంలో ఐదు నిమిషాలు, మిథిలా స్టేడియం నుంచి భద్రగిరి మార్ట్ను ప్రారంభించేందుకు వెళ్లే సమయంలో మరో ఐదు నిమిషాలు, భద్రగిరి మార్ట్ నుంచి సారపాక ఐటీసీ గెస్ట్హౌస్కు వెళ్తున్న సమయంలో మరో ఐదు నిమిషాల వరకు ట్రాఫిక్ను పోలీసులు నిలిపివేశారు. కాగా, భద్రాచలంలో శుక్రవారం, శనివారం జరిగిన వేడుకల్లో బందోబస్తు నిర్వహించిన కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్వాహనాలను అనుమతించి, ప్రజలవాహనాలను అడ్డుకున్నారని, మీడియా ప్రతి నిధుల ద్విచక్రవాహనాలు సైతం ఆపి,వాగ్వాదానికి దిగారని విమర్శలు వస్తున్నాయి. భద్రాచలంలో ఏ వేడుక జరిగినా ఇలాగే జరుగుతోందని, వచ్చే ఏడా ది అయినా ఈ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేయా లని స్థానికులు కోరుతున్నారు.


