breaking news
Bhadradri
-
వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం
సూపర్బజార్(కొత్తగూడెం): వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరమని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ చాంబర్లో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు లేదా సేవకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, అందులో ఉన్న వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ ప్రేమ్కుమార్, డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్, అధికారులు పాల్గొన్నారు. గ్యాస్ ఏజెన్సీ తనిఖీ చుంచుపల్లి: జిల్లా అదనపు కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారి డి.వేణుగోపాల్ మంగళవారం విద్యానగర్లోని ఎంఎస్ సూర్య గ్యాస్ ఏజెన్సీ గోదాం, కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో ఉన్న ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బుకింగ్, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వినియోగదారులకు ఎల్పీజీ రీఫిల్ సిలిండర్లను సీనియారిటీ క్రమంలోనే పారదర్శకంగా అందజేయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బోరు వేస్తుండగా అటవీ అధికారుల అడ్డగింత
పాల్వంచరూరల్: ఓ రైతు తన భూమిలో బోరు వేస్తుంటే వైల్డ్లైఫ్ రేంజర్ కవిత మాధురి సిబ్బందితో కలిసి బోరు వేయకుండా అడ్డుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని తీసుకెళ్తుండగా రైతులు అడ్డుకున్నారు. మండలంలోని ప్రభాత్నగర్(రెడ్డిగూడెం) శివారులోని తేజావత్ జ్యోతి, ప్రకాష్ భూమిలో మంగళవారం బోరు వేస్తుండగా సమాచారం అందుకున్న యానంబైల్ రేంజర్ ఘటనా స్థలానికి చేరుకుని ఫారెస్టు భూమిలో బోరు వేస్తున్నారని ఆరోపిస్తూ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దానిని తీసుకెళ్తుండగా బాధిత రైతు తేజావత్ ప్రకాష్, సుమత్ నరేశ్, సురేశ్, సామ భాగ్యమ్మ, సామ మోహన్రెడ్డి, జక్కుల రాములు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు వాహనాన్ని వదిలేసి వెనుతిరిగి వెళ్లారు. కాగా, ఈ భూమికి రెవెన్యూ పరంగా 1969 నుంచి సిస్తు కట్టిన రశీదులు, 1995 నుంచి పహాణీ నకళ్లు, మీ సేవ నుంచి తీసుకున్న ధరణి పహాణీలు ఉన్నాయని అయినా అటవీశాఖ అధికారులు బోరు వేస్తుంటే అడ్డుకుంటున్నారని బాధిత రైతు వాపోయాడు. -
సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కిశోర్
భద్రాచలంటౌన్: జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా సారపాక మేజర్ పంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిశోర్శివరాంనాయక్ ఎన్నికయ్యారు. భద్రాచలంలోని రెడ్ల సత్రంలో మంగళవారం సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సాదాని భూమన్నయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన్ను ఎన్నుకున్నారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణను నియమించారు. కాగా, కిశోర్శివరాంనాయక్ ఎన్నిక ఏకగ్రీవమని ముందే ప్రకటించడంతో జిల్లాలోని పలువురు సర్పంచులు ఈ సమావేశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఆంధ్రాలో ఆళ్లపల్లి వాసి మృతి గుండాల: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతుండగా విద్యుదాఘాతంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన దారం వెంకటేశ్ అలియాస్ గద్దర్ (20) రెండు నెలల క్రితం విద్యుత్ కంపెనీలో పనిలో చేరాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఓ గ్రామంలో విద్యుత్ పనులు చేస్తుండగా 11 కేవీ నుంచి ఒక్కసారిగా కరెంటు సరఫరా కావడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని బుధవారం స్వగ్రామమైన ఆళ్లపల్లికి తీసుకురానున్నారు. -
ప్రజారోగ్య పరిరక్షణ పాటించాలి
పాల్వంచ: ఆహార భద్రత, పరిశుభత్ర పాటించడం ప్రజా రోగ్య పరిరక్షణకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అన్నారు. స్థానిక డిప్యూటీ డిఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం ఆయన రెస్టారెంట్ యజమానులు, ఆహార విక్రేతలు, వంటచేసే వారికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఆహార పదార్థాల తయారీ, వంటచేసే పరిసరాలు, తాగునీటితో పాటు వంట తయారీదారులు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్, రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ, హైజిన్ ట్రైనర్ నందిని పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత డీఎంహెచ్ఓను సన్మానించారు. -
గ్యాస్ కోసం ఇక్కట్లు
● సింగరేణి గ్యాస్ గోడౌన్ వద్ద బారులు మణుగూరురూరల్: గ్యాస్ కోసం వినియోగదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మండలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద డీలర్లు నో స్టాక్ (గ్యాస్ లేదు) అంటూ బోర్డు ఉంచడంతో వినియోగదారుల్లో కలకలం రేగింది. గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చిన వినియోగదారులంతా ఈ బోర్డును చూసి నిరాశకు గురై వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ.. మణుగూరు గ్యాస్ ఏజెన్సీ నో స్టాక్ బోర్డు పెట్టడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. గ్యాస్ సరఫరాలో నిజంగా అంతరాయం ఏర్పడిందా..? లేదా కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా.? అన్న సందేహాలు వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వారిపై అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మణుగూరులో గ్యాస్ అందుబాటులో లేకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ ఏజెన్సీ యాజమాన్య తీరుపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడితే చివరకు నో స్టాక్ అని చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాళీ సిలిండర్లతో.. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. సోషల్ మీడియాల్లో గ్యాస్ కొరత ఉందంటూ ప్రచారం అవుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెంది మంగళవారం గ్యాస్ గోడౌన్ల వద్ద బారులుదీరారు. మణుగూరు ఏరియాలోని సింగరేణి గ్యాస్ గోడౌన్ వద్ద కూడా వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో క్యూలో గంటల కొద్ది నిరీక్షిస్తూ అవస్థలు పడుతున్నారు. కొందరు ఆన్లైన్లో బుక్ చేసుకుని ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుంటుండగా.. మరికొందరు గ్యాస్ కోసం తమ విధులను మానుకొని గోడౌన్కు చేరుకుని అవస్థలు పడుతున్నారు. గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా ఉన్నతాధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని వినియోగదారులు, ప్రజలు కోరుతున్నారు. -
వైభవంగా వేంకటేశ్వరుడి రథోత్సవం
పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాస గిరిపై కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తోలేటి నగేష్ శర్మ, ఆరుట్ల ఫణిరాజాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టువస్త్రాలు, పూల మాలలతో అలంకరించిన స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పాదాల మండపం వద్ద ముస్తాబు చేసి రథంపై ఆశీనులు చేశారు. భక్తుల గోవింద నామ స్మరణల నడుమ అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొత్తా వెంకటేశ్వరరావు, కో చైర్మన్ ముక్కంటేశ్వరరావు, బిక్కసాని సుధాకర్రావు, నరసింహకుమార్ పాల్గొన్నారు. మురుగు నిల్వ ఉండొద్దు.. ములకలపల్లి: జనావాసాల మధ్య మురుగునీటి నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని డీఆర్డీఓ విద్యాచందన అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జగన్నాథపురం గ్రామంలో పర్యటించి, వీధులను పరిశీలించారు. గ్రామ సమాఖ్యలతో సమావేశం నిర్వహించి, బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లించాలన్నారు. ప్రధాన కూడలిలో ఇంకుడుగుంత నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. సర్పంచ్ కుంజా వినోద్, ఎంపీఓ రమేశ్బాబు, ఈజీఎస్ ఏపీఓ హుస్సేన్, ఐకేపీ ఏపీఎం రామ్కుమార్, జీపీ కార్యదర్శి ఇబ్రహీం తదితరులు ఉన్నారు. సేవారత్న అవార్డు ప్రదానం అశ్వాపురం: మండలంలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన ఐటీసీ ఉద్యోగి, కోలాటం మాస్టర్ తోకల రమేశ్కు ఈ నెల 16న తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 18వ నేషనల్ కాన్ఫరెన్స్లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా సేవారత్న జాతీయ అవార్డు అందుకున్నారు. రమేశ్ చేస్తున్న ప్రాచీణ జానపద కోలాట ప్రదర్శనలు, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు, మహిళా సాధికారత కోసం ఉచిత కోలాట శిక్షణ ఇవ్వటం లాంటి కార్యక్రమాలు గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ సేవారత్న జాతీయ అవార్డును రమేశ్కు అందజేశారు. ఆయనకు అవార్డు రావడంపై ఐటీసీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు గోనె రామారావు, ఉద్యోగులు అభినందించారు. ఆశ్రమ పాఠశాల ఉదంతంపై విచారణ చండ్రుగొండ: మండల కేంద్రం చండ్రుగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఉదంతంపై ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్ మంగళవారం ఆరా తీశారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన ఆయన పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థినులతో మాట్లాడారు. బయటి వ్యక్తులు రాత్రి వేళ తరగతి గదుల్లో ప్రవేశించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మ్యాట్రిన్తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థినులతో వేర్వేరుగా మాట్లాడి సమాచారం సేకరించారు. పూర్తి వివరాలతో నివేదిక ఐటీడీఏ పీఓకు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. బస్ డ్రైవర్పై ప్రయాణికుడి దాడి ఇల్లెందు: ఇల్లెందు బస్టాండ్లో ఓ ప్రయాణికుడు బస్ డ్రైవర్పై దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ డిపో బస్సు ఇల్లెందుకు వస్తుండగా అదే బస్సులోని శ్రావణ్ ప్రయాణిస్తున్నాడు. ఆర్డినరీ బస్సుకు ఎక్స్ప్రెస్ బోర్డు పెట్టి నడిపిస్తున్నావంటూ డ్రైవర్ బాలాజీతో ఘర్షణకు దిగాడు. డ్రైవర్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇల్లెందు బస్టాండ్లోకి రాగానే దిగి డ్రైవర్ బాలాజీపై దాడి చేశాడు. బాలాజీ ఫిర్యాదు మేరకు సీఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సర్వైకల్ కేన్సర్కు చెక్..
భద్రాచలంఅర్బన్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద అనారోగ్య భూతం కేన్సర్. ఈ వ్యాధి మహిళలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తూ శాపంగా మారుతోంది. అందులో గర్భాశయ ముఖద్వార కేన్సర్ ఒకటి. గర్భాశయ ముఖ ద్వార కేన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ వైరస్ను నివారించడానికి హెచ్పీవీ టీకా రూపొందించారు. దీనిని తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార కేన్సర్ను పూర్తిగా నివారించవచ్చు. ఈ టీకా వైజెనల్ కేన్సర్తపాటు మరో మూడు కేన్సర్లను కూడా నివారిస్తుందని వైద్యులు చెబుతున్నారు. 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా ఈ టీకాను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కేన్సర్కు కారణమయ్యే హెచ్పీవీ టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఒక డోస్ వ్యాక్సిన్ అందించడం వల్ల బాలికలకు ఈ వైరస్ నుంచి దీర్ఘకాలిక రక్షణ అందుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 10,393 మందిని టీకాకు అర్హులుగా గుర్తించారు. జిల్లాలో ఈ టీకా పంపిణీ ఈ నెల 8న ప్రారంభం కాగా ఇప్పటివరకు కేవలం 471 మందికి మాత్రమే వేశారు. ఈ వ్యాక్సిన్పై ఎలాంటి అపపోహలు, భయాలు పెట్టుకోవద్దని, 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు ఈ టీకాను తప్పనిసరిగా వేయించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఉచితంగా వ్యాక్సినేషన్.. హెచ్పీవీ వ్యాక్సిన్ 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించింది. అయితే, వ్యాక్సిన్పై బాలికలు, వారి తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హులైన బాలికలను గుర్తించినా వారు ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. కరోనా సమయంలో వ్యాక్సిన్ వేయించుకుని.. ఇప్పుడు వాటి కారణంగా అనేక మందికి గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా మృతిచెందారని, పలువురికి మోకాళ్ల నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయిస్తే రానున్న రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయోనని తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. పదో తరగతి పరీక్షలు నడుస్తుండటంతో తక్కువ మంది బాలికలు టీకా వేయించుకున్నారని వైద్యాధికారులు వెల్లడించారు. టీకా కొత్తదేమీ కాదు.. 2006 నుంచే ఈ టీకా అందుబాటులో ఉంది. సీ్త్రల గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణకు ఉపయోగిస్తున్న హెచ్పీవీ టీకాను కొత్తగా ప్రవేశపెట్టారని, ఇది ఎలా పనిచేస్తుందో అనే భయం బాలికల తల్లిదండ్రుల్లో నెలకొంది. అయితే, ఈ టీకా కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. 2006 నుంచే అందుబాటులో ఉంది. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ టీకాకు దాదాపు రూ.10 వేలు చెల్లించి మహిళలు వేయించుకుంటున్నారు. సర్వైకల్ కేన్సర్పై అవగాహన ఉన్నవారు, డబ్బున్న వారే హెచ్పీవీ టీకాను వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. హెచ్పీవీ వ్యాక్సినేషన్తో గర్భాశయ ముఖద్వార కేన్సర్ పూర్తిగా నివారించవచ్చు. 14–15 ఏళ్లలోపు బాలికలకు మాత్రమే ప్రస్తుతం ఈ టీకా వేస్తున్నారు. దీంతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఆయా వయసు కలిగిన బాలికలు ముందుకు రావాలి. అలాగే వారి తల్లిదండ్రులు కూడా బాలికలను ప్రోత్సహించాలి. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీలతో పాటు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సిన్ వేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాల్లో బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. –తుకారాంరాథోడ్, డీఎంహెచ్ఓ -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
గుండాల: నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి మొక్కజొన్న చేనులో విగతజీవిగా కనిపించిన ఘటన మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన మాదాల వెంకన్న (45) కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు రెండు రోజులుగా చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, కన్నాయిగూడెంలోని మొక్కజొన్న చేనులో విగతజీవిగా పడి ఉండగా గుండాల సీఐ తిరుపతి అక్కడికి వెళ్లి పరిశీలించారు. చనిపోయి మూడు రోజులు అవుతుండగా పోస్టుమార్టం అక్కడే నిర్వహించారు. కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు. 52.1 కేజీల గంజాయి పట్టివేత భద్రాచలంఅర్బన్: కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు మంగళవారం పట్టణంలో పట్టుకున్నారు. పట్టణంలోని కూనవరం రోడ్డులో గల ఇసుక ర్యాంప్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు కారుకి నంబర్ లేకుండా వెళ్తుండగా ఆపారు. తనిఖీ చేయగా ఎండు గంజాయి లభించింది. కారులో ఉన్న వ్యక్తిని విచారించగా మల్కాన్గిరికి చెందిన మిథున్రాయ్గా తేలింది. గంజాయిని ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి నుంచి జహీరాబాద్కు తరలిస్తున్నట్లు అతడు ఒప్పుకున్నాడని ఎకై ్సజ్ సీఐ శ్రీహరి తెలిపారు. గంజాయి, కారు, మొబైల్ను స్వాధీనం చేసుకున్నామని, గంజాయి 52.1 కేజీలు ఉండగా.. రూ.41 లక్షల విలువ ఉంటుందని ఆయన వివరించారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్, విజయ్, హనుమంతరావు, వీరబాబు పాల్గొన్నారు. -
లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
పినపాక: కళ్లముందే ఎన్నో కలలు.. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపన.. కానీ విధి ఆ యువకుడిపై పగబట్టింది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎల్సిరెడ్డిపల్లికి చెందిన మర్రి సంజయ్ (18) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఎప్పటిలాగే ఆటో తీసుకుని బయ్యారం నుంచి క్రాస్ రోడ్ వైపు వస్తుండగా ఎరువుల లోడుతో వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. సంజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇప్పుడిప్పుడే ఇంటికి పెద్ద దిక్కుగా మారుతున్న కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని, మృతుడి మేనమామ మద్దబోయిన జంపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ–బయ్యారం ఎస్ఐ సురేశ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం -
రేగుబల్లిలో మద్యం బంద్..
దుమ్ముగూడెం: మండలంలోని డబ్ల్యూఎల్ రేగుబల్లి పంచాయతీ పరిధి గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో మద్యం, నాటుసారా విక్రయాలను నిలిపివేయాలని సర్పంచ్ పూనెం విజయకుమారి అధ్యక్షతన మంగళవారం జరిగిన గ్రామసభలో తీర్మానం చేశారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు, నాటుసారా విక్రయాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామ పంచాయతీలోని ప్రజల అభీష్టం మేరకు వాటిని బంద్ చేయాలని నిర్ణయించుకుని తీర్మానం చేశామని సర్పంచ్ వెల్లడించారు. ఇక నుంచి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు, నాటుసారా విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప సర్పంచ్ ఖాదర్పాషా, పంచాయతీ కార్యదర్శి యాకూబ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం
భద్రాచలం : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జీపీఎస్, గురుకులాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఇక్రిశాట్ సైంటిస్టులు మంగళవారం ఏజెన్సీ సందర్శనకు రాగా, పీఓను మర్యాదపూర్వకంగా కలిశారు. గిరిజన గ్రామాల్లోని చిన్నారులకు, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న ఏడు నుంచి పదేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందిచేందుకు ఇక్రిశాట్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్లు సీనియర్ సైంటిస్ట్ రూప బెనర్జీ, సీనియర్ ఆఫీసర్ తమిళ్ సెల్వి పీఓకు వివరించారు. రక్తహీనత గల చిన్నారులను గుర్తించి న్యూట్రీషన్ ఫుడ్ అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. చిన్నారులకు బలవర్థక ఆహారం అందించే న్యూట్రిషన్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వాహకులకు చేయూత అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, గురుకుల ఆర్సీఓ అరుణకుమారి, జేడీఎం హరికృష్ణ పాల్గొన్నారు. నేడు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ పర్యటన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారని పీఓ రాహుల్ తెలిపారు. నేడు మధ్యాహ్నం పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుంటారని, ఆ తర్వాత ఐటీడీఏలోని గిరిజన మ్యూజియాన్ని సందర్శించి ఐటీసీలో రాత్రి బస చేస్తారని పేర్కొన్నారు. 19న ఉదయం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నాక, పాపికొండల విహారయాత్రకు వెళ్తారని, తిరిగి రాత్రికి ఐటీసీలో బస చేసి 20న ఉదయం హైదరాబాద్ వెళ్తారని వివరించారు. సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన ఐటీడీఏలో క్వార్టర్లు, ఇతర కార్యాలయాలకు విద్యుత్ అంతరాయం లేకుండా సబ్స్టేషన్ నిర్మాణానికి పీఓ రాహుల్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఐటీడీఏ పరిధిలోని శివారు కాలనీల్లో లోవోల్టేజీ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఇది దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్, డీఈలు జీవన్కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వైద్యుల సేవలు అభినందనీయం పాల్వంచ: పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అభినందనీయమని పీఓ రాహుల్ అన్నారు. మంగళవారం ఆయన ఆస్పత్రిలోని ల్యాబ్, ఫార్మసీ, బ్లడ్ స్టోరేజీ సెంటర్, మెడికల్ వార్డును పరిశీలించారు. ఇటీవల మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స పొందిన కవితను పరామర్శించారు. అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు డాక్టర్ శైలేష్ కుమార్, డాక్టర్ రాంప్రసాద్ను సత్కరించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ సోమరాజు దొర, సిబ్బంది పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
సమన్వయంతో విధులు నిర్వర్తించాలి
భద్రాచలం : శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని, పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ముస్తాబు చేయాలని సూచించారు. ప్రధాన రహదారులు, ఆలయ మార్గాల్లో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రత పాటించాలని అన్నారు. తాగునీరు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, హోటళ్లు, అన్నదాన కేంద్రాల్లో నాణ్యతను పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్యాస్ సరఫరాలో కొరత లేకుండా ముందస్తుఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 30 పడకలు సిద్ధంగా ఉంచాలని, దర్శన లైన్ల వద్ద ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, అంబులెన్స్లు, రక్త నిల్వలు సిద్ధం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, సెక్టార్ల వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగించాలని పోలీసులకు సూచించారు. అనుమతి లేని ఫ్లెక్సీలు తొలగించి, ఆధ్యాత్మిక వాతావరణానికి అనుగుణంగా మాత్రమే ప్రచార సామగ్రి ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మిథిలా స్టేడియం, మాఢ వీధులను పరిశీలించారు. సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాళ్ శ్రేష్ట, ఐటీడీఏ పీఓ రాహుల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్, దేవస్థానం ఈఓ దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి గుండాల : ఏజెన్సీ ప్రాంతంలో నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. మండలంలోని ముత్తాపురం ఏకలవ్య పాఠశాలను సందర్శించిన కలెక్టర్.. పరిసరాలతో పాటు కిచెన్ షెడ్, వంటశాల అపరిశుభ్రంగా ఉండడం, సిబ్బంది కొరత, కంప్యూటర్ ల్యాబ్లో దుమ్ము పేరుకుపోవడం, మెనూ ప్రకారం భోజనం అందించకపోవడం వంటి అంశాలను గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పనితీరు సక్రమంగా లేదని, రెండురోజుల్లో పరిస్థితిని చక్కదిద్దకుంటే ఏజెన్సీ గుర్తింపు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఆస్పత్రిలో మందుల గది, ల్యాబ్, స్టోర్ రూమ్, రక్త పరీక్ష విభాగాలను పరిశీలించారు. టెస్టులు సక్రమంగా చేస్తూ సకాలంలో వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ ఖాసీం, ఎంపీడీఓ బాలరాజు, ప్రత్యేకాధికారి ఇంతియాజ్ ఖాన్ తదిరులు ఉన్నారు.బూర్గంపాడు: హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్ మంగళవారం జిల్లా పర్యటనకు రాగా, సారపాక ఐటీసీ గెస్ట్హౌస్లో కలెక్టర్ అంకిత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. -
డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించాలి
కొత్తగూడెంఅర్బన్ : సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ను తరిమి కొట్టేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని డీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. జిల్లాస్థాయిలో ఎంపిక చేసిన 20 పాఠశాలల నుంచి 60 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ‘డ్రగ్స్ వినియోగానికి అడ్డుకట్ట – భవితకు బంగారు బాట’ అనే అంశంపై మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాకు మూడు రాష్ట్రాల సరిహద్దులు ఉండడంతో పలు మార్గాల ద్వారా గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయని, వాటి వినియోగం కూడా పెరిగే ప్రమాదం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లను మానుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పాల్వంచ ఎకై ్సజ్ సీఐ ప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగిస్తూ లేదా సరఫరా చేస్తూ పట్టుబడినా కఠిన శిక్షలు ఉంటాయని వివరించారు. వైద్యులు శైలేష్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగదారుల్లో విపరీత ధోరణలు పెరుగుతాయని, తద్వారా వారు శారీరకంగా సర్వశక్తులు కోల్పోవడమే కాక, సమాజంలో ఎందుకు పనికిరాని వారుగా తయారవుతారని తెలిపారు. అశ్వారావుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సాయి కౌశిక్ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కార్యక్రమంలో సీఎంఓ సైదులు, అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ. నాగరాజశేఖర్, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్.సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఈఓ నాగలక్ష్మి అన్నారు. జిల్లా విద్యాశిక్షణ కేంద్రంలో ఎయిడ్స్ నిర్మూలనపై మంగళవారం జిల్లా స్థాయి పోస్టర్ మేళా పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ప్రాజెక్టు మేనేజర్ సత్య కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ కేసులు అక్కడక్కడా నమోదవుతున్నాయని, వీటి నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. అనంతరం పోస్టర్ మేళాలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. -
ఫలించని చర్చలు.. కొనసాగుతున్న ధర్నా
సూపర్బజార్(కొత్తగూడెం): తమ భూ సమస్య పరిష్కరించాలంటూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు కలెక్టరేట్ ధర్నాచౌక్లో చేపట్టిన ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. రెవెన్యూ, అటవీ అధికారులతో ఉద్యమకారులు మంగళవారం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో దీక్షలు కొనసాగించాలని ఆదివాసీలు నిర్ణయించారు. దీనిపై కొత్తగూడెం ఆర్డీఓ మధు మాట్లాడుతూ.. ఆదివాసీలు డిమాండ్ చేస్తున్న 573 ఎకరాలు రెవెన్యూ పరిధిలో లేవని, మిగిలిన 400 ఎకరాల భూమి మాత్రమే తమ శాఖ పరిధిలో ఉందని తెలిపారు. అందులో 250 ఎకరాలకు గతంలో పట్టాలిచ్చామని, మిగిలిన 150 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గతంలో సర్వే చేశామని చెప్పారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మరోసారి పారదర్శంగా సర్వేచేసి పాస్బుక్, సాగులో ఉన్న భూములను గుర్తించి అర్హులకు పట్టాల పంపిణీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. రామన్నగూడెం సర్పంచ్, ఉద్యమకారుల సంఘం నాయకుడు మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ భూసమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. 180 మందితో కలిసి దీక్షలు చేస్తున్నామని, 573 ఎకరాలు తమకు పంపిణీ చేయాలని అధికారులను కోరారు. -
మిథిలా.. వ్యథ
మిథిలా స్టేడియం దిగువ భాగంలో ఒక హాలులో పోకల దమ్మక్క నిత్యాన్నదాన సత్రం, మరో హాల్లో హనుమాన్ భజన మందిరం కొనసాగుతున్నాయి. ఫలితంగా ఈ రెండు హాళ్లు ఎంతో శుభ్రంగా ఉన్నాయి. భద్రాచలం వచ్చే భక్తులకు తమ వంతుగా ఉపయోగపడుతున్నాయి. మిగిలిన హాళ్లను శుభ్రం చేసి వినియోగంలోకి తెచ్చేందుకు దేవాదాయశాఖతో పాటు మరే ఇతర ప్రభుత్వ విభాగాలూ పట్టించుకోవడం లేదు. దీంతో అవన్నీ నిరుపయోగంగా మారి అపరిశుభ్రతకు చిరునామాగా కనిపిస్తున్నాయి. ఆలయం పక్కనే సుమారు 15వేల మంది భక్తులకు అవలీలగా వసతి సౌకర్యం కల్పించే సామర్థ్యం గల ఈ స్టేడియాన్ని ఇకనైనా అభివృద్ధి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. 1988లో గ్యాలరీల నిర్మాణం దేశంలో ఎక్కడా లేని విధంగా చైత్ర శుద్ధ నవమి రోజున సీతారాముల కల్యాణం జరిపించే సంప్రదాయాన్ని భక్త రామదాసు భద్రాచలంలో ఆరంభించారు. ఆ రోజుల్లో నాటి పాలకుడైన తానీషా స్వయంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు జానకిరాములకు సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. అలాగే రామయ్య కల్యాణ క్రతువు చూసేందుకు వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నవమికి భద్రాద్రికి పోటెత్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని ఆలయం వెలుపల 1960లో కల్యాణ మండపం పనులు మొదలుపెట్టగా 1964లో ప్రారంభమైంది. ఆ తర్వాత మండపంలో సీతారాముల కల్యాణాన్ని భక్తులు కనులారా చూసేందుకు వీలుగా 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కల్యాణ మండపం చుట్టూ గ్యాలరీలు నిర్మించి మిథిలా స్టేడియంగా నామకరణం చేశారు. సమస్యల తిష్ట.. ఒకేసారి దీన్ని స్టేడియం తరహాలో నిర్మించకపోవడంతో కల్యాణ మండపం, గ్యాలరీల మధ్య సమన్వయం కొరవడింది. దీనికి తోడు కాల క్రమంలో మిథిలా స్టేడియం మధ్య భాగంలో ఎత్తుగా మట్టి పోయడంతో కల్యాణ మండపం, గ్యాలరీల మధ్య సమాంతరం లేకుండా పోయింది. దీంతో సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూద్దామనే ఆశతో భద్రాచలం వచ్చి గ్యాలరీలో కూర్చునే సామాన్య భక్తులకు కల్యాణ మండపం పైకప్పు తప్ప మరేమీ కనిపించని దుస్థితి నెలకొంది. ఈ అవస్థను కొంతైనా దూరం చేసేందుకు గ్యాలరీల వద్ద కనీసం ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇక స్టేడియం గ్యాలరీల దిగువ భాగంలో పరిస్థితి చెప్పనలవి కానంత దారుణంగా ఉంది. ప్రతీ శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి సమయాల్లో ఈ స్టేడియాన్ని ౖపైపెన శుభ్రం చేస్తుండగా ఆ తర్వాత రోజుల్లో ఇటు కన్నెత్తి చూడడం లేదు. పేర్లే ఘనం.. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో మిథిలా స్టేడియం నిర్మించారు. భక్తులు కూర్చునే గ్యాలరీలకు దిగువ భాగంలో పెద్ద పెద్ద హాళ్లు ఉన్నాయి. వీటికి గోదావరి ఉప నదులైన సీలేరు, శబరి, కిన్నెరసాని, తాలిపేరు, వశిష్ట, ఇంద్రావతి, ప్రాణహిత, మానేరు, మంజీర, పెన్గంగా, వార్దా వంటి పేర్లు పెట్టారు. ఉప నదుల పేరుతో ఏర్పాటు చేసిన పెద్ద హాళ్లన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. వీటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో బూజు పట్టి, దుమ్ము కొట్టుకుపోయి గబ్బిలాలకు నిలయంగా మారుతున్నాయి. ఇక మిథిలా స్టేడియంలోకి వచ్చి పోయే ద్వారాలన్నీ సులభ్ కాంప్లెక్సుగా మారాయని చెప్పక తప్పదు. స్టేడియంలోకి వచ్చివెళ్లేందుకు ఆరుకు పైగా ప్రవేశమార్గాలు ఉండగా ఒకటి మినహా మిగిలిన చోట కనీసం అడుగు పెట్టలేనంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ హయాంలో స్టేడియం నిర్మాణం భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవం జరుగుతున్న మిథిలా స్టేడియం నిర్వహణ మేడిపండు చందంగా మారింది. కేవలం శ్రీరామనవమి సమయంలో తప్పితే మిగతా రోజుల్లో దీన్ని పట్టించుకునేవారు లేరు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో అయినా ౖపైపె మెరుగులతో కాకుండా పూర్తి స్థాయిలో ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులు ఉపయోగించుకునేందుకు అనువుగా మార్చాల్సిన అవసరం ఉంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
నేత్రపర్వంగా నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రహోమంపాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో మంగళవారం మాసశివరాత్రి సందర్భంగా రుద్రహోమం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. మండపారాధన, గణపతి పూజ చేశాక రుద్రహోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత శివాలయంలో నందీశ్వరస్వామికి పంచామృతాభిషేకం చేశారు. ఇస్రో రీసెర్చ్ స్కాలర్గా మల్కారం వాసిదమ్మపేట : మండలంలోని మల్కారం గ్రామానికి చెందిన కొవల ముత్యాలరావు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పరిధిలోని తిరువనంతపురం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో జూనియర్ రీసెర్చ్ స్కాలర్గా ఎంపికయ్యారు. కాగా ఆయన హైదరాబాద్ జేఎన్టీయూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (మెకానికల్ ఇంజనీరింగ్)లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం మల్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ముత్యాలరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం మారెమ్మ, ఉపాధ్యాయులు శ్యామలాదేవి, ఈశ్వర్ రెడ్డి, నాగాచారి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ తెరపైకి రూ.100 కోట్లు..
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ప్రతీ ఏడాది శ్రీరామనవమి రోజున సీతారామచంద్రస్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వేడుక సమయంలోనే ప్రభుత్వం ఆలయ అభివృద్ధి మంత్రాన్ని పఠించి, ఆ తర్వాత పట్టించుకోదనే విమర్శలు తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచీ వస్తూనే ఉన్నాయి. రూ.100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామనే మాటలు పుష్కరకాలంగా భక్తులు వింటూనే ఉన్నారు తప్ప ఆచరణ సాధ్యం కాలేదు. అయితే ఈనెల 27న శ్రీరామనవమి రోజున రూ.100 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల చెప్పడంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. మంత్రుల ప్రత్యేక దృష్టితో.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రామాలయాన్ని పట్టించుకోలేదని, తాము అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఆ పార్టీ గద్దెనెక్కిన రెండున్నరేళ్లలో మాఢ వీధుల విస్తరణకు భూ సేకరణ ప్రక్రియ మాత్రమే పూర్తయింది. కాగా, ఆలయ అభివృద్ధిపై జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల దృష్టి సారించగా ప్లాన్పై కొంతమేర ప్రగతి కనిపిస్తోంది. వారిద్దరూ భద్రాచలంలో పర్యటించిన ప్రతీసారి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్లాన్పై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. అంతేకాక వైదిక పెద్దల అభిప్రాయాల మేరకే ఆలయంలో మార్పులు చేపడుతూ డిజైన్ చేయాలని సూచించారు. దీంతో ఆర్కిటెక్ట్ అధికారులు వైదిక పెద్దలతో పలుమార్లు చర్చించి రూ.350 కోట్లతో మాస్టర్ప్లాన్ రూపొందించారు. ఇందులో తొలి విడతగా శ్రీరామనవమి రోజున రూ.100 కోట్ల పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల ఇటీవల ప్రకటించారు. రేపు కీలక సమావేశం ! భద్రాద్రి రామాలయ మాస్టర్ ప్లాన్పై ఈనెల 19వ తేదీ ఉగాది రోజున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఆర్కిటెక్ట్లు, దేవాదాయ శాఖ అధికారులతో సెక్రటేరియట్లో సమావేశం కానున్నట్లు తెలిసింది. గతంలో ప్రస్తావించిన ప్లాన్లో ఆలయ ప్రాంగణంలో పనులపై వైదిక పెద్దలు మార్పులు చూపించారని సమాచారం. ఈ క్రమంలో తుది ప్లాన్ ఖరారు చేస్తారని తెలుస్తోంది. తొలి విడత : ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, మండపాలు, క్యూ హాళ్లు, ప్రసాద విభాగం, పరిపాలన భవనాల నిర్మాణాలకు రూ.115 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. రెండో విడత : ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల అభివృద్ధి పనుల్లో భాగంగా విస్తా కాంప్లెక్స్, అడ్మిన్ బ్లాక్, ఘాట్లు, రహదారులు ఉన్నాయి. దీనికి రూ. 35 కోట్లుగా అధికారులు సూచించారు. మూడో విడత : కరకట్ట దిగువ భాగాన గల కాపా రామలక్ష్మమ్మ భూమిని అభివృద్ధి చేయాలని, ఇందులో రామాయణ మ్యూజియం, తూము నర్సింహదాసు ఆడిటోరియం, భక్త రామదాసు ప్లాజా, మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. దీనికి రూ.100 కోట్లు అవసరమని పేర్కొన్నారు. నాలుగో విడత : ఆలయ అభివృద్ధితో పాటు పట్టణాభివృద్ధి చేయాలని, హోటళ్లు, గిరిజన మ్యూజియం, రామవనం, పట్టణ సుందరీకరణ అంశాలను ఇందులో పొందుపర్చారు. దీనికి రూ.100 కోట్లతో ప్లాన్ రూపొందించారు. -
తమ్మినేని ఆరోగ్యం కుదుటపడుతోంది
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, పార్టీ శ్రేణులు ఆందోళన చెందొద్దని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించగా హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స అందించిన వైద్యులు సోమవారం క్యాజువాలిటీ వార్డులోకి మార్చారు. ఊపిరితిత్తుల సమస్య, మూత్రపిండాల్లో క్రియాటిన్ లెవెల్స్ పెరగడం, రెండుసార్లు గుండెపోటుకు గురికావడం తదితర అనారోగ్య కారణాలతో ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారని వెల్లడించారు. మరో రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కాగా, తమ్మినేనిని నున్నా నాగేశ్వరరావుతో పాటు సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్ రెడ్డి, నాయకులు వీరబాబు తదితరులు పరామర్శించారు. -
రిటైనింగ్.. రైట్ రైట్!
● వాల్ నిర్మాణానికి లైన్ క్లియర్ ● ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే వేగంగా పనులు ● మిగతా చోట్ల భూసేకరణకు జీఓ జారీ ● త్వరలోనే నిర్వాసితులకు భూమి, ప్లాట్లుఖమ్మంఅర్బన్: ఖమ్మం నగరంలో మున్నేరు నదికి ఇరువైపులా రూ.690 కోట్లతో 18 కిలో మీటర్ల మేర చేపట్టిన రిటైనింగ్ వాల్ పనులకు భూసేకరణ సమస్య కొలిక్కి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో పనులు శరవేగంగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది. మొత్తం 18 కి.మీ. మేర నిర్మించే వాల్ పనుల్లో భూ సమస్యలు లేని, ప్రభుత్వ భూముల పరిధిలో 10 కి.మీ. పరిధిలో పనులు చేపట్టగా 50 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 8 కి.మీ. పరిధిలో నిర్మాణానికి పట్టా భూములు, ప్లాట్లు కూడా సేకరించాల్సి రావడంతో జాప్యం జరిగింది. దీంతో పాటు నగరంలో వరద నీరు మున్నేరులోకి వచ్చేలా సైడ్ డ్రెయిన్లు నిర్మించాల్సి ఉంది. భూ సమస్యకు పరిష్కారం లభిస్తే వర్షాలు, వరద ప్రభావం లేని ఈ నాలుగు నెలల్లో అత్యధిక శాతం పనులు జరిగే అవకాశం ఉంది. మిగులు భూమి వినియోగం రిటైనింగ్ వాల్ నిర్మాణంలో భూములు, ప్లాట్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామ సమీపంలో సాగర్ మిగులు భూమిగా ఉన్న 125 ఎకరాలను జలవనరుల శాఖ అవసరాలకు వినియోగించుకునేలా జీఓ నం.128 జారీ చేియడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.53 కోట్లు కూడా విడుదల చేసింది. ఇక రెవెన్యూ పరంగా సర్వే చేసి ఎంత మేర భూమి సేకరించాలి, ఎంతమందికి పట్టాలు ఇవ్వాలి, కేటాయించిన భూమిలో లే ఔట్ చేయడం వంటి పనులు జరగాల్సి ఉంది. దీనిపై ఇటీవల కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరుగుతుంది. భూ సేకరణకు కూడా ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తూ జీఓ వచ్చింది. ఇప్పటికే 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేస్తాం. – మంగళపూడి వెంకటేశ్వర్లు, ఎస్ఈ, జలనవరుల శాఖ రిటైనింగ్ వాల్ నిర్మాణంలో భూములు, ప్లాట్లు కోల్పోయే బాధితులు సుమారు 750 మందికి పైగా ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. పట్టా భూమి కోల్పోయే రైతులకు ఎన్నెస్పీ మిగులు భూమిలో ఎకరం భూమికి బదులు 690 గజాల స్థలం కేటాయించేలా ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే ప్లాట్లు కోల్పోయే వారికి వారి విస్తీర్ణాన్ని బట్టి 75 గజాలు, 100 గజాలు, 300 గజాల చొప్పున ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలేపల్లి సమీపంలోని భూమిలో లే ఔట్ రూపొందించి అభివృద్ధి పనులకు సిద్ధం చేసినట్లు సమాచారం. అన్ని అనుమతులు పూర్తయ్యాక నిబంధనల ప్రకారం ఆ భూమిని అభివృద్ధి చేసి భూములు కోల్పోయిన పట్టాదారులు, ప్లాట్ యజమానులకు స్థలాలు కేటాయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు మరింత వేగంగా సాగే అవకాశం ఉంది. -
పోటెత్తారు..
ప్రజావాణికి ● గ్రీవెన్స్ డే కార్యక్రమానికి విశేష స్పందన ● సమస్యలు చెప్పుకునేందుకు బారులు దీరిన ప్రజలు ● ఏడాది కాలంపాటు ఆగుతూ సాగిన కార్యక్రమం సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను చెప్పుకునేందుకు జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)కి ప్రజలు పోటెత్తారు. గోదావరి వరదలు, వర్షాలు, వరుసగా వచ్చిన ఎన్నికల కారణంగా ఏడాది కాలంగా ఐడీఓసీ(కలెక్టరేట్)లో జరిగే గ్రీవెన్స్ డే నిస్తేజంగా మారిపోయింది. మండల, డివిజన్ స్థాయిలకే పరిమితమైంది. ఇటీవల కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ ఐడీవోసీలో గ్రీవెన్స్డేను తిరిగి ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచే.. సోమవారం ఉదయం పది గంటలకే పలువురు బాధితులు ఐడీఓసీకి చేరుకున్నారు. తొలుత అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రనాథ్లు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడం మొదలు పెట్టారు. ఉదయం 11:30 గంటలకు కలెక్టర్ గ్రీవెన్స్కు చేరుకోగా ఒక్కసారిగా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు క్యూలైన్లలో నిల్చున్నారు. మధ్నాహ్నం రెండు గంటల వరకు విజ్ఞప్తులను స్వీకరించారు. కాగా, ఐడీఓసీలో క్యాంటీన్ సోమవారం తెరుచుకోకపోవడం వల్ల ఇక్కడికి వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు. గ్యాస్ కొరత కారణంగానే క్యాంటీన్ ఓపెన్ చేయలేదని తెలుస్తోంది. నా బిడ్డను ఆదుకోండి.. పాల్వంచలోని సబ్స్టేషన్ ఏరియాకు చెందిన పి.దేవి తన ఐదేళ్ల కూతురు తనూషతో కలెక్టరేట్కు వచ్చింది. తన కూతురు జన్మతహా ఎంఆర్ సెలబ్రల్ పల్సీ అనే వ్యాధితో బాధపడుతోందని, శారీరక, మానసిక ఎదుగుదల లేదని, వైద్యానికి ప్రతీ నెల రూ. 50వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని కలెక్టర్కు మొరపెట్టుకుంది. కలెక్టర్ ఆదేశాలతో గ్రీవెన్స్లోనే ఉన్న డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్, పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ వీరబాబులు పాపను పరిశీలించారు. మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు రిఫర్ చేస్తామని తెలిపారు. పాపకు దివ్యాంగురాలు సర్టిఫికెట్తోపాటు పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన 180 కుటుంబాలు మరోసారి ఐడీఓసీ ఎదుట నిరవధిక దీక్షకు దిగాయి. సర్వే నంబరు 30, 33, 39లలో ఉన్న 573 ఎకరాల భూమి విషయంలో గ్రామస్తులు, ఫారెస్టు శాఖకు మధ్య 2011లో వివాదం రాజుకుంది. దీనిపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు జాయింట్ సర్వే చేపట్టి 2012లో రిపోర్టు ఇచ్చారు. రిపోర్టు ప్రకారం తమకు న్యాయం చేయాలంటూ రామన్నగూడెంవాసులు గతేడాది ఆగస్టులో పాదయాత్రగా కలెక్టరేట్కు చేరుకుని 9 రోజులపాటు రేయింబవళ్లు నిరవధిక దీక్ష చేపట్టారు. దీంతో సమస్య పరిష్కారానికి అప్పటి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హామీ ఇచ్చారు. ఆరు నెలలు కావొస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం మళ్లీ కలెక్టరేట్కు చేరుకున్నారు. నిరవధిక దీక్ష చేపట్టేందుకు వీలుగా టెంట్, వంట సామన్లు, చద్దర్లు, దుప్పట్లు, కంచాలు వాహనాల్లో తరలించుకుని వచ్చారు. ఐదేళ్ల చిన్నారి నుంచి డైబ్బె ఏళ్ల వృద్ధుల వరకు ఊరంతా దీక్షకు హాజరవడం విశేషం. -
ఆర్టీసీ డ్రైవర్కు జాతీయస్థాయి అవార్డు
అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెం గ్రామ వాసి, మణుగూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న ఇల్లుటూరి మహేశ్కు బహుజన సాహి త్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో సోమవా రం జరిగిన కార్యక్రమంలో సేవారత్న జాతీయ అవార్డు అందజేశారు. విధినిర్వహణలో నిజాయితీతో బస్సులో దొరికిన సొమ్మును ఆర్టీసీ అధికారులకు అప్పగించిన మహేశ్ తెలంగాణ ఆర్టీసీ అధికారులు మన్ననలు పొందాడు. మహే ష్ నిజాయితీని గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ఆధ్వర్యంలో అవార్డు అందజేశారు. సారపాక వాసికీ.. బూర్గంపాడు: సారపాకకు చెందిన పరుశురాం పరివార్ రాష్ట్ర అధ్యక్షులు ముత్తవరపు రాజశేఖర్కు బెస్ట్ సోషల్ సర్వీస్ జాతీయ పురస్కారం దక్కింది. తిరుపతిలో సోమవారం జరిగిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 18వ నేషనల్ కాన్ఫరెన్స్లో ఆయనకు అవార్డును అందించారు. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా రాజశేఖర్ అవార్డు అందుకున్నారు. హెచ్ఎం డిప్యూటేషన్ రద్దు దుమ్ముగూడెం: మండలంలోని కె.రేగుబల్లి–2 బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం భారతి డిప్యూటేషన్ను ఐటీడీఏ పీఓ రాహుల్ రద్దు చేసి పాత స్థానానికి పంపారు. కె.రేగుబల్లి–2 బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం భారతి వేధింపుల కారణంగా పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పాయం ధనుష్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని బాలిక తండ్రి కార్తీక్ ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అధికారులు విచారణ చేపట్టి ఐటీడీఏ పీఓకు నివేదిక అందించగా.. భారతిని కె.రేగుబల్లి–1 బాలికల ఆశ్రమ పాఠశాలకు పంపారు. ఆమె గతంలో అక్కడ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నప్పుడే కె.రేగుబల్లి–2 పాఠశాలకు హెచ్ఎంగా డిప్యూటేషన్పై వచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు ఇల్లెందురూరల్: మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన ఐక్య కూటమి నాయకుడు ఎల్లంపల్లి బుచ్చయ్య, కాంగ్రెస్ నేత నాగుల్మీరా సోమవారం బైక్పై ముకుందాపురం నుంచి ఇల్లెందు వెళ్తుండగా బైపాస్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగుల్మీరాకు స్వల్పంగా గాయం కాగా ఎల్లపల్లి బుచ్చయ్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బుచ్చయ్యను మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటో ఢీకొని మహిళ మృతి భద్రాచలంటౌన్: భద్రాచలం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు లో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన తల్లీకూతుర్లు నాగేశ్వరమ్మ (55), చిట్టెమ్మ రాత్రి సమయంలో రోడ్డు పక్క న నడుచుకుంటూ వెళ్తున్నారు. అతివేగంగా వచ్చిన ఆటో వీరిని ఢీకొట్టడంతో నాగేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. చిట్టెమ్మకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిట్టెమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ పాషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. కాగా, ఫారెస్ట్ ఆఫీస్ ప్రాంతంలో రోడ్డుపైకి వచ్చేలా నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన దుకాణాల కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నా రు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోతున్నారు. వాడపల్లికి ప్రత్యేక బస్సు ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం డిపో నుంచి వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం డీఎం శివప్రసాద్ తెలిపారు. ఖమ్మం కొత్తబస్టాండ్ నుంచి ప్రతి శుక్రవారం బస్సు రాత్రి 8 గంటలకు బయలుదేరి, శనివారం తెల్లవారుజామున 2 గంటలకు వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటుందని, దర్శనం తర్వాత తిరిగి ఖమ్మం చేరుకుంటుందని వెల్లడించారు. ఈ సర్వీసుకు రాను–పోను చార్జి పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.470గా నిర్ణయించామని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం 91364 46666 నంబర్లో సంప్రదించాలని, ఇంటి వద్ద నుంచే సీట్ బుక్ చేసుకోవచ్చని, ఆన్లైన్ అయితే www. tgsrtcbus. in వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
విశారదన్ మహరాజ్ అరెస్టు
కొణిజర్ల/మధిర: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ను కొణిజర్ల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్ఐ జి.సూరజ్ కథనం ప్రకారం.. విశారదన్ మహరాజ్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా కొణిజర్ల హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి పరిశీలించి, ఆయనను అదుపులోకి తీసుకుని కొణిజర్ల పోలీస్స్టేషన్కు తరలించారు. విశారదన్ మహరాజ్పై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం ఆయనను మధిర టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ రద్దీగా ఉండటంతో మధిర రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. సుమారు రెండు గంటల తర్వాత హైదరాబాద్కు తిరిగి పంపించారు. -
మళ్లీ ఆదివాసీల పోరుబాట
సూపర్బజార్(కొత్తగూడెం): తమ భూసమస్య పరిష్కరించాలని రామన్నగూడెం ఆదివాసీలు సోమవారం కలెక్టరేట్ ధర్నా చౌక్లో ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. పిల్లా పాపలతో ఆదివాసీ కుటుంబాలు దీక్షలో పాల్గొంటున్నాయి. గతంలో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఇచ్చిన హామీని నెరవేర్చక పోవడంతో దీక్షలను మళ్లీ ప్రారంభించినట్లు ఉద్యమ నాయకుడు మడకం నాగేశ్వరరావు తెలిపారు. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామ రెవెన్యూ సర్వే నంబర్లు 30, 36, 39లలో ఉన్న ఆదివాసీల పట్టా భూములకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ 2012 ఆగస్టు 31న ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భద్రాద్రి కలెక్టర్ 2025 సెప్టెంబర్ 29న ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 2025 అక్టోబర్ 10 నుంచి రెవెన్యూ, అటవీ శాఖ సంయుక్తంగా సర్వే చేసి పంచనామా నిర్వహించిన భూములను ఆదివాసీ రైతులకు అప్పగించాలనే డిమాండ్తో ఆందోళన చేపట్టారు. ఆదివాసీ రైతులపై తప్పుడు ప్రచారం చేసిన అటవీ శాఖాధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్కమ్మ చెరువు వరద కాలువల నష్ట పరిహారం 2013 భూసేకరణ ప్రకారం మంజూరు చేసి ఆదివాసీ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాత్రి కలెక్టర్ అంకిత్ను కలిసి సమస్యు వివరించి వినతిపత్రం అందించగా వెంటనే అటవీ, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేశారని రాత్రి వరకు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారని నాగేశ్వరరావు తెలిపారు. రాత్రి 10.30 వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో దీక్షను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కాగా మంగళవారం ఉద్యమ ప్రతినిధులు, అటవీ, రెవెన్యూ ప్రతినిధులు కలెక్టరేట్లో సమావేశమై పరిష్కార చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రామన్నగూడెంవాసుల ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం -
‘మక్కల’ కొనుగోళ్లకు సుముఖత !
మార్క్ఫెడ్ ద్వారా కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్నల కొనుగోళ్లకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మక్కలకు క్వింటాకు కనీస మద్దతు ధర రూ. 2,400గా నిర్ణయించగా, ప్రైవేట్ వ్యాపారులు రూ.1,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యాన ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా పంట పడిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో రైతులు యాసంగి పంటగా 1.67 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. భద్రాద్రి జిల్లాలో 72 వేల ఎకరాల్లో పంట సాగైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2.40 లక్షల ఎకరాల్లో పంట సాగు చేయగా, 6.24 లక్షల టన్నుల పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 40 నుంచి 55 వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మంగళ, బుధవారాల్లో ఈ ప్రక్రియకు ప్రభుత్వ శాఖలు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చా రు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంత రం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. హెచ్టీ సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థవిద్యుత్ ఎస్ఈ మహేందర్ సూపర్బజార్(కొత్తగూడెం): హెచ్టీ 11కేవీ, 33కేవీ ఆపై ఓల్టేజీ సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ అందుబాటులోకి తెచ్చినట్లు విద్యుత్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ తెలి పారు. ఈ మేరకు సోమవారం ఆయన వివరా లు వెల్లడించారు. హెచ్టీమానిటర్ సెల్ను సర్కి ల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్లో ఏర్పాటు చేశామని అన్నారు. సింగిల్ విండో కొత్త విధానంలో వినియోగదారులు టీజీఎన్పీడీసీఎల్పోర్టల్లో అవసరమైనపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను తమశాఖ అధికారులు పర్యవేక్షిస్తారని, ఫీజిబిలిటీ కోసం క్షేత్రస్థాయిలో సిబ్బంది పరి శీలిస్తారని చెప్పారు. సింగిల్ విండో వ్యవస్థతో త్వరితగతిన సర్వీసులు మంజూరవుతాయని, పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులకు దరఖాస్తుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచా రం ఇస్తామని వివరించారు. హిందీ భాషా అభివృద్ధి ప్రాజెక్ట్ మంజూరుపాల్వంచరూరల్: గిరిజన విద్యార్థుల్లో హిందీ భాషా అభివృద్ధి పరిశోధనకు ఐసీఎస్ఎస్ఆర్ మైనర్ రీసె ర్చ్ ప్రాజెక్టు మంజూరైంది. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో హిందీ అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ టి.అరుణకుమారికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ద్వారా ప్రతిష్టాత్మకమైన మైనర్ రీసెర్చ్ ప్రాజెక్టు మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి. పద్మ తెలిపారు. ఆది వాసీ విద్యార్థులకు హిందీ భాషా అభ్యాసంలో ఉన్న సవాళ్లు, పరిష్కారాలు, బహుభాష, సామాజిక, సాంస్కృతిక అధ్యయనంపై అరుణకుమారి పరిశోధన చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆమెను ప్రిన్సిపాల్తోపాటు తోటి అధ్యాపకులు సన్మానించారు. బరిలో 20 మందిఈ నెల 26న బార్ అసోసియేషన్ ఎన్నికలు సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికల బరిలో 20 మంది మిగి లారు. స్క్రూట్నీ అనంతరం 49 మంది బరిలో ఉండగా, సోమవారం 29 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 20 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి పలివెల గణేష్బాబు, సహాయ ఎన్నికల అధికారులు అరకల కరుణాకర్, పీ వేణువాసరావు తెలిపారు. వీరిలో మహిళా ప్రాతినిధ్యం కింద నిమ్మలూరి ఉషారా ణి ఏకగ్రీవమయ్యారు. అధ్యక్ష పదవికి ఇద్దరు , మహిళా వైస్ ప్రెసిడెంట్కు ఇద్దరు, వైస్ ప్రెసిడెంట్–2 కు ఇద్దరు, జనరల్ సెక్రటరీకి ముగ్గురు, జాయింట్ సెక్రటరీకి ఇద్దరు, లైబ్రరీ సెక్రటరీకి ఇద్దరు, మహిళా ట్రెజరర్కు ఇద్దరు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీకి ఇద్దరు, మహిళా స్పోర్ట్స్ అండ్కల్చరల్ సెక్రటరీకి ఇద్దరు బరిలో ఉన్నారు. కాగా ఈ నెల 26న ఎన్నికలు జరుగనున్నాయి. -
ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం
చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో ఇటీవల మృతిచెందిన వ్యక్తిని ఖననం చేయ గా.. ఆ మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి సోమ వారం శవపరీక్ష నిర్వహించారు. వివరాలిలా ఉన్నా యి. ఈ నెల 11వ తేదీన గ్రామానికి చెందిన ఎస్కే జాఫర్ (35) అనుమానాస్పదస్థితిలో మృత్యువాత పడ్డాడు. మృతుడి తమ్ముడు జావిద్ ఫిర్యాదు మేర కు ఎస్ఐ శివరామకృష్ణ దర్యాప్తు చేపట్టారు. ఓ వ్యక్తి అర్ధరాత్రి వచ్చి తనతల్లితో కలిసి తండ్రిని చంపేశారని మృతుడి కుమార్తె ఆసియా చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మురంగా సాగుతోంది. ఫోరెన్సిక్ నిపుణులతో పాటు డాక్టర్ వెంకటరమణమూర్తి, తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించారు. సంప్లో పడిన కాంట్రాక్టర్ఇల్లెందు: పట్టణంలోని నంబర్–2 బస్తీకి చెందిన ఓ సింగరేణి కాంట్రాక్టర్ నీటి సంప్లో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు ఆయ న్ను ఖమ్మానికి తరలించారు. గఫార్ సింగరేణిలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా పను లు లేకపోవటం, చేసిన పనులకు బిల్లులు రావాల్సి ఉండటంతో పాటు ఖమ్మంలో ఓ వ్యాపారితో ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన ఆయన మానసికంగా కుంగిపోయ్యారు. ఆదివారం ఇంటి వద్ద నీటి సంప్లో పడిపోయాడు. తీవ్రగాయాలు కావటంతో ఖమ్మా నికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మెడికల్ షాపు వద్ద పర్సు చోరీ టేకులపల్లి: మెడికల్ షాపు వద్ద ఓ మహిళకు చెందిన పర్సును ఇద్దరు గుర్తు తెలియని మహిళలు చోరీ చేసిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. సోమ వారం బోడు గ్రామానికి చెందిన కుంపటి శ్రీలత మండల కేంద్రంలోని బాలాజీ మెడికల్ షాప్ వద్దకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తుండగా, గుర్తు తెలియని ఇద్దరు మహిళలు శ్రీలత చేతిలోని ప్లాస్టిక్ కవర్ను బ్లేడుతో కట్చేసి, అందులోని పర్సును చోరీచేశారు. పర్సులో రూ.10 వేలు ఉన్నాయని, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇరువర్గాల మధ్య ఘర్షణఇల్లెందు: పట్టణంలోని దాసరిగడ్డలో అర్ధరాత్రి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి రాజు కుటుంబంపై నరసింహం కుటుంబం దాడి చేసింది. రాజు కుమారుడు, నరసింహం కుమార్తె ప్రేమలో ఉన్నారని, రెండు రోజులుగా వీరు కనిపించకుండా పోవటంతో నరసింహం కుటుంబం రాజు కుటుంబంపై దాడి చేసింది. రాజు తలకు తీవ్రగాయాలు కాగా.. కుటుంబ సభ్యు లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాజును ఖమ్మానికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రాజు భార్య పద్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు విచారణ చేపట్టారు. సర్వీసు సెంటర్లో చోరీచుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లిలోని గణేశ్ హోండా సర్వీస్ సెంటర్లో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుకాణంలోని సుమారు రూ.6 లక్షల విలువైన వాహన ఇంజన్లు, చాంబర్లు, అలై చక్రాలు, గేరు చక్రాలు, బోర్లు, క్లచ్ సెట్లు, కాపర్, ఎలక్ట్రికల్ సామగ్రి.. మొత్తంగా 4 క్వింటాళ్ల స్క్రాప్ను తస్కరించినట్లు గుర్తించారు. షాపు యజ మాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సామాన్యులపై ధరాఘాతం
ఖమ్మంమయూరిసెంటర్: ట్రంప్ యుద్ధ కాంక్ష భారతదేశంలో సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు అన్నారు. గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. గ్యాస్ సహా ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేడ్కర్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు కేంద్ర విధానాలే కారణమని నినదించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంపన్న దేశాలపై దాడులు చేసి అక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇజ్రాయెల్తో చేతులు కలిపి ఇరాన్పై దాడులు చేస్తున్నారన్నారు. మోదీ అలీన దేశపు ప్రధానిగా యుద్ధాన్ని నివారించకపోగా యుద్ధం వల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్తోపాటు సిద్దినేని కర్ణకుమార్, బీజీ క్లెమెంట్, శింగు నర్సింహారావు, తాటి వెంకటేశ్వరరావు, రావి శివరామకృష్ణ, మిడికంటి వెంకటరెడ్డి, పగడాల మల్లేశ్, ఏనుగు గాంధీ, యానాలి సాంబశివరెడ్డి, సుధాకర్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు. -
సాగర్ మిగులు భూమి ఆక్రమణ?
రఘునాథపాలెం: నాగార్జునసాగర్ ప్రధాన కాల్వకు చెందిన రూ.కోట్ల విలువైన సాగర్ మిగులు భూమిపై ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ భూముల ఆక్రమణపై జిల్లావ్యాప్తంగా చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు కొందరు భూములను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రఘునాథపాలెం మండలంలోని వీవీపాలెం రెవెన్యూ పరిధిలో ఎన్ఎస్పీ ప్రధాన కాల్వ సమీపంలో సర్వే నంబర్ 273లో సుమారు 10 ఎకరాలకుపైగా మిగులు భూమి ఉన్నట్లు సమాచారం. అందులో కొంత ఇటీవల పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించేందుకు లేఔట్ చేసి హద్దురాళ్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే ఆ భూమిలో ఉన్న కాల్వ తవ్వకంలోని మట్టి కుప్పలను ప్రభుత్వం తరలించి చదును చేసి ఉంచింది. ఆ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం లేఔట్ చేసిన దానికి ఆనుకొని ఇంకా ఉన్న మిగులు భూమిలో కొంత భాగానికి కొందరు ఫెన్సింగ్ వేసి, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఎకరం భూమి రూ.3 కోట్లు పలుకుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై జల వనరుల శాఖ ఏఈ సతీశ్ను సంప్రదించగా ఫెన్సింగ్ వేస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పనులను నిలిపివేయించామని, భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించాలంటూ తహసీల్దార్కు లేఖ రాశామని చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని స్పష్టం చేశారు. -
ఫంక్షన్కు హాజరై.. గుండెపోటుకు గురై..
ఖమ్మంఅర్బన్: బంధువుల గృహ ప్రవేశ వేడుకకు హాజరైన మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో విషాదాన్ని నింపిన ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన బొమ్మ సుస్మిత(40) ఖమ్మం 15వ డివిజన్లోని పుట్టకోట వద్ద బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి ఆదివారం వెళ్లింది. అందరితో ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో గుండెపోటుకు గురై కుప్పకూలింది. వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుస్మిత ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుండగా, ఆమె భర్త బొమ్మ వెంకటరమణ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి విశ్వ జయంత్ అనే కుమారుడు ఉన్నాడు. సంతోషకరమైన వేడుకలో పాల్గొంటూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. విషాద చాయల నడుమ సోమవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలు కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఖమ్మంలో మహిళ మృతితో విషాదం -
చకచకా రామయ్య పెళ్లి పనులు
శ్రీరామవనమి ఉత్సవాల పనులు జోరందుకున్నాయి. భద్రగిరి వీధులు శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. మరో రెండు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, రామయ్య పెళ్లి పనులు చకచకా సాగుతున్నాయి. సోమవారం ఆఫ్లైన్లో కూడా కల్యాణ టికెట్ల విక్రయాలను ప్రారంభించారు. – భద్రాచలం ● భద్రగిరిలో శ్రీరామనవమి సందడి ● మిథిలా స్టేడియంలో ముమ్మరంగా ఏర్పాట్లు ● మరో రెండు రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభంవీఐపీలకు పెళ్లి పిలుపులు ఈ నెల 27న శ్రీ సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గోడ పత్రికలను, ఆహ్వాన పత్రికలను ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఆలయ అధికారులు ఉత్సవాలకు వీఐపీలను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, స్థానిక ఏఎస్పీ, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అందజేశారు. సోమవారం కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, భద్రాచలం జ్యుడీషియల్ జడ్జి శివనాయక్ తదితరులకు ఆలయ ఈఓ దామోదర్రావు ఆహ్వాన పత్రికలు ఇవ్వగా పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ నెల 19న ఉగాది తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్లకు ఆహ్వాన పత్రికలు అందించనున్నారు. ఆఫ్లైన్లో టికెట్ల విక్రయం ప్రారంభం శ్రీరామనవమి వీక్షణ టికెట్లను ఇప్పటికే ఆన్లైన్లో విక్రయిస్తుండగా, సోమవారం ఆఫ్లైన్ విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఆలయ ఈఈ రవీందర్ ప్రారంభించారు. దేవస్థానంలోని ప్రధాన కౌంటర్, తానీషా కల్యాణ మండపంలోని సీఆర్వో కార్యాలయం వద్ద, బ్రిడ్జి పాయింట్ వద్ద నున్న సీఆర్వో, భద్రాచలం సబ్ కలెక్టరేట్ కార్యలయం వద్ద కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉభయ దాతలతోపాటు ఇతర సెక్టార్ల టికెట్లను విక్రయించనున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు ఈ నెల 20 నుంచి 27వ తేదీ ఉదయం 6గంటల వరకు ధ్రువీకరణ పత్రాలతో టికెట్లు పొందాలని ఆలయ అధికారులు తెలిపారు. ఇక మిథిలా స్టేడియంలోని పనులు చకచకా సాగుతున్నాయి. స్టేడియం నిండా షామియానాల ఏర్పాటుకు పెండిలమ్ వర్క్ పూర్తయింది. సీఎం, ఇతర సెక్టార్ల విభజన పనులు కొనసాగుతున్నాయి. బారికేడ్లు, ఇనుప కంచె పనులు సాగుతుండగా, పెయింటింగ్ పనులు ముగిశాయి. స్వాగత ద్వారాల ఏర్పాటుతో భద్రాచలంలో నవమి శోభ ముందస్తుగానే సంతరించుకుంది. ఈ నెల 19న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఏప్రిల్ 2న ముగియనున్నాయి. 27న శ్రీ రామ పునర్వసు దీక్ష ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 24న ముగియనుంది. 19న ఉగాది పర్వదినం రోజున బ్రహ్మోత్సవాలకు రక్షాబంధనం, స్నప న తిరుమంజనం, మృత్సంగ్రహణంతో అంకురార్పణ చేయనున్నారు. 23న మండల లేఖ, కుండ, కలశ, యాగశాల, అలంకరణాదులతో పాటుగా సార్వభౌమ సేవ జరగనుంది. 24న గరుడధ్వజపట లేఖనం, గరుడధ్వజపటావిష్కరణ, గరుడధ్వజాధివాసం, 25న అగ్ని ప్రతిష్ట, ధ్వజా రోహణం, దేవతాహ్వానం, బలిసమర్పణం, హనుమద్వాహన సేవలు నిర్వహించనున్నారు. 26న యాగశాల పూజ, చుతుఃస్థానార్చనం, గజ,గరుడ వాహన సేవలు, ఎదుర్కోలు ఉత్సవం, 27న ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు సీతారాముల తిరు కల్యాణోత్సవం, చంద్రప్రభ వాహన సేవ, 28న పట్టాభిషేకం, రథోత్సవం జరగనున్నాయి. 29న సదస్యం, 30న తెప్పోత్స వం, చోరోత్సవం, 31న ఊంజల్ సేవ, ఏప్రిల్ 1న వసంతోత్సవం, 2న పూర్ణాహుతి, ధ్వజావరోహణం, పుష్పయాగంలతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు. -
రూ.300 కోట్లతో భద్రగిరి పనులు
● నవమికి భద్రాచలానికి సీఎం రేవంత్ రాక ● ఎన్హెచ్ 930పీ, మల్కన్గిరి పనులపై దృష్టి ● సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయాలి ● కలెక్టర్ అంకిత్కు మంత్రి తుమ్మల ఆదేశాలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రూ.300 కోట్లతో భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆల య పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో సుమారు రూ. 100 కోట్లతో ఆలయ ప్రాకారం నిర్మాణ పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి తుమ్మలతో కలెక్టర్ అంకిత్ కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్హౌస్లో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా సీఎం పర్యటనతోపాటు జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ పనులకు సంబంధించిన అంశాలపై కలెక్టర్కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు.. శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలానికి రానున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల సూచించారు. భద్రతా ఏర్పాట్లు, రవాణా, భక్తులకు సౌకర్యాలు, వసతి తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఎయిర్పోర్ట్కు అనువైన భూమిని గుర్తించాలి భద్రాచలం–మల్కన్గిరి రైల్వేలైనులో భాగమైన పాండురంగాపురం–మల్కన్గిరి సెక్షన్లో ట్రాక్ నిర్మాణానికి అనుమతి లభించిందని మంత్రి తెలిపారు. రైల్వేలైను నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులు సారపాకలో పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఇల్లెందు మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి (ఎన్హెచ్ 930పీ)కి సంబంధించి జిల్లా పరిధిలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. గతంలో జిల్లాలో రెండు చోట్ల విమానాశ్రయాలు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని, అయితే, సాంకేతిక, భౌగోళిక కారణాల వల్ల ఆ ప్రదేశాలు ఎయిర్పోర్ట్ నిర్మానానికి అనుకూలంగా లేవని తేలిందన్నారు. దీంతో భద్రాచలం–కొత్తగూడెంల మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలమైన భూమిని గుర్తించాలని కలెక్టర్ను ఆదేశించారు. రవాణా రంగంలో సౌకర్యాలు మెరుగుపడితే దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం సాంస్కృతిక శోభ వెల్లి విరుస్తుందన్నారు. సీతారామ భూసేకరణ.. సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. భూసేకరణ పూర్తయితే ప్రాజెక్టు పనులు వేగవంతమై రైతులకు త్వరగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. యాతాలకుంట టన్నెల్లో మిగిలిన సుమారు 100 మీటర్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు యాభై వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు అందిస్తున్న సబ్సిడీలపై రైతులకు విస్త్రృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. -
నేటి నుంచి ‘చిలకలగండి’ జాతర
అశ్వారావుపేటరూరల్: మండల పరిధిలోని వినాయకపురం గ్రామ శివారులో వేంచేసియున్న శ్రీ చిలకలగండి ముత్యాలమ్మతల్లి జాతర ఉత్సవాలు మంగళవారం నుంచి శనివారం వరకు ఐదు రోజులపాటు వైభవంగా సాగనున్నాయి. ఉత్సవాలకు అశ్వారావుపేట, దమ్మపేట మండలాలతోపాటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి, వేంసూరు, ఏపీలోని ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, చింతలపూడి, టీ నర్సాపురం ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఉగాది పర్వదినం రోజున దాదాపు రెండు లక్షల మంది భక్తులు హాజరు అవుతారని అంచనా. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ సూర్యప్రకాశ్రావు, పాలక మండలి చైర్మన్ నరాల శ్రీనివాసరావు ఏర్పాట్లు పూర్తి చేవారు. జాతర నేపథ్యంలో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.22.63 లక్షలుఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించారు. 52 రోజులకు గానూ రూ.22,63,330 ఆదాయం లభించిందని దేవాదాయ శాఖ పరిశీలకులు రెంటాల సమత, ఆలయ ఈఓ కె. జగన్మోహన్రావు తెలిపారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, అర్చకులు ఉప్పల మురళీమోహన్శర్మ పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి..
బూర్గంపాడు: ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, వార్డెన్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ అన్నారు. ఉప్పుసాకలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హ్యాండ్వాష్ టెక్నిక్స్ వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలో తెలిపారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించటం, భావోద్వేగాలను నియంత్రించుకోవటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డీవార్మింగ్ కార్యక్రమంలో భాగంగా అల్బెండజోల్ మాత్రలు వేయించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ను ఘనంగా జరుపుకోవాలిపాల్వంచ: ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం నటరాజ్ సెంటర్లోని జమా మసీద్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ రంజాన్ ఐక్యతను చాటుతుందని, తోటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశాన్ని తెలుపుతుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేందర్ రావు, మల్లెల రవిచంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 17 మిలియన్ టన్నుల లక్ష్యం రుద్రంపూర్: సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధన కోసం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీ వరకు 67.76 మిలియన్ టన్నులు సాధించాల్సి ఉండగా, 55.00 మిలియన్ టన్నులు 81 శాతం ఉత్పత్తి చేసింది. రానున్న మార్చి 31 నాటికి 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి పూర్తి చేయాల్సి ఉంది. అంటే ఈ 15 రోజుల్లో 17 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలి. గతేడాది ఈరోజు నాటికి 63.50 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించగా.. ఈ ఏడాది 55.00 మిలియన్ టన్నులు ఉత్పత్తి కాగా.. సుమారు 8.50 మిలియన్ టన్నులు వెనుకబడింది. అటవీ అధికారిణిని బెదిరించిన వ్యక్తి అరెస్ట్ చండ్రుగొండ: మండలంలోని బ్రహ్మలకుంట ఫారెస్ట్ బీట్ అధికారిణి పూనెం లావణ్యను బెదిరింపులకు గురి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ శివరామకృష్ణ ఆదివారం రాత్రి తెలిపారు. బ్రహ్మలకుంట ఎఫ్బీఓ లావణ్యను బెండాలపాడు గ్రామానికి చెందిన కారం సునీల్ అలియాస్ బంటి ఈ నెల 12న బెదిరింపులకు గురిచేశారు. కేసు నమోదు చేసి, సునీల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. రేషన్ బియ్యం పట్టివేత చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామంలో అక్కిరెడ్డి సురేశ్ ఇంటి నుంచి రేషన్ బియ్యం రవాణా జరుగుతోందనే సమాచారం మేరకు ఆదివారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. 10 క్వింటాళ్ల బియ్యాన్ని 24 బస్తాల్లో నింపి, వాహనంలో తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశారు. అక్కిరెడ్డి సురేశ్, భూక్యా లాలు, శ్యామ్పై కేసు నమోదు చేశారు. మండలంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 14 గ్యాస్ సిలిండర్లను గుర్తించారు. ద్విచక్రవాహనం, లారీ ఢీ కొణిజర్ల: మండలంలోని గుబ్బగుర్తి సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన బాణోత్ గణేశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బంది సతీశ్, మోహనకృష్ణ ప్రాథమిక చికిత్స అందించారు. -
కోర్టు ఉద్యోగిపై పోలీస్ దాష్టీకం
● వాతలు తేలేవరకు లాఠీతో దాడి ● విచారణకు ఆదేశించిన న్యాయమూర్తిమధిర: కోర్టు ఉద్యోగిపై పాతకక్షను దృష్టిలో పెట్టుకొని లాఠీ విరిగేలా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మధిర కోర్టులో కోర్టు ప్రాసెస్ సర్వర్గా పనిచేస్తున్న అంబర్ అలీ పాషా విధి నిర్వహణలో భాగంగా కొంతకాలం క్రితం మధిర రైల్వేస్టేషన్లో ఉన్న జీఆర్పీ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అలీపాషాతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. కోర్టు పని మీద నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన తనతో అసభ్యంగా మాట్లాడుతున్నారని, తాను కూడా ప్రభుత్వ ఉద్యోగినని సమాధానం చెప్పినట్లు తెలిసింది. తననే ప్రశ్నిస్తావా అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయగా అలీ పాషా వాదన ఎందుకని వెళ్లిపోయాడు. కాగా, తన బంధువును రైలు ఎక్కించేందుకు శనివారం అలీ పాషా మధిర రైల్వేస్టేషన్కు వెళ్లి, కదులుతున్న రైలులో ఉన్న తన బంధువుకు టికెట్ కొని అందించాడు. గమనించిన వెంకటేశ్వర్లు పాత కక్షను దృష్టిలో పెట్టుకొని పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి లాఠీతో చితకబాదినట్లు సమాచారం. ఈ విషయాన్ని బాధితుడు కోర్టు సిబ్బందికి తెలిపాడు. విషయం న్యాయమూర్తికి తెలిసి, మధిర టౌన్ సీఐ రమేశ్ను ఆదేశించినట్లు తెలిసింది. ఆయన ఖమ్మంలోని గవర్నమెంట్ రైల్వే పోలీస్కి కేసును బదిలీ చేశారు. కాగా, ఘటనపై ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లను వివరణ కోరగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అదుపుతప్పి బొలేరో బోల్తా
కొణిజర్ల: అతివేగంగా వస్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా ఐదుగురికి గాయాలైన ఘటన మండల పరిధిలోని తనికెళ్లలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్ఐ సూరజ్ కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయమాధారానికి చెందిన చిచ్చడి రాము తన బంధువుల ఇంటి నిర్మాణం నిమిత్తం టైల్స్ తీసుకొచ్చేందుకు బొలేరో వాహనంలో హైదరాబాద్ బయలుదేరాడు. హైదరాబాద్ చూసేందుకని అదే గ్రామానికి చెందిన మొట్టుం సిద్ధు (19), కుంజా చరణ్, పల్లా రాము, కట్టం కార్తీక్, పాయం విష్ణు, తురం రామ్చరణ్, పల్లా రాజశేఖర్ అదేవాహనంలో వెళ్లారు. హైదరాబాద్ నుంచి టైల్స్లోడు చేసుకుని తిరుగు ప్రయాణంలో తనికెళ్ల విజయ కళాశాల సమీపంలోని ఓ పెట్రోలు బంక్ వద్ద ఆగి ఉన్న లారీ ఒకేసారి రోడ్డు పైకి రావడంతో దానిని తప్పించబోయి బొలేరో రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. క్యాబిన్లో కూర్చున్న ఆరుగురు యువకులు కింద పడటంతో వారిపైన టైల్స్ పడ్డాయి. మొట్టుం సిద్ధు అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రక్లో ఉన్న కుంజా చరణ్, కుంజా మంగరాజు, కారం రాంబాబు, కట్టం కార్తీక్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు.ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు -
కోడి పైకి.. గుడ్డు కిందకు
ఖమ్మంవ్యవసాయం: చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. అలాగే, కోడిగుడ్డు ధర పతనమైంది. కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చికెన్ రేటు పెరిగిందని, గుడ్ల ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. డిసెంబర్, జనవరిలో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి, ఆ తరువాత మేడారం జాతర సందర్భంగా స్కిన్లెస్ చికెన్ కిలో రూ.300 మొదలు, రూ.350 వరకు పలికింది. ఇక ఫిబ్రవరిలో కిలోకు రూ.100 తగ్గి రూ.250కు దిగి వచ్చింది. మార్చి ఆరంభం నుంచి మళ్లీ చికెన్ ధరలు పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే కిలో చికెన్కు రూ.100 వరకు ధర పెరిగింది. మరో మూడు, నాలుగు రోజుల్లో రంజాన్ పండగ వస్తుంది. ఈ పండగ వేళ సహజంగా మాసం ధరలు కొంత పెరగటం సహజం. ప్రస్తుతం కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవటంతో చికెన్ ధరలు మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. గుడ్డు ధర తగ్గింది.. మూడు నెలల క్రితం రిటైల్ గుడ్డు ధర ప్రాంతాన్ని బట్టి రూ.8 నుంచి రూ.9 వరకు విక్రయించారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.5.50 నుంచి రూ.6కు విక్రయిస్తున్నారు. చలికాలంలో గుడ్డు వినియోగం ఎక్కువగా కాబట్టి ధర ఎక్కువగా ఉండటం.. వేసవిలో తగ్గడం సాధారణమే. కానీ, ధర సగానికి పడి పోయేంతగా ఎప్పుడూ తగ్గలేదు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటం, దేశం నుంచి గుడ్లు ఎగుమతికి చెక్ పడటంతో ఆ ప్రభావం గుడ్డు ధరపై పడిందని పౌల్ట్రీ పరిశ్రమల బాధ్యులు చెబుతున్నారు. ఉత్పత్తి లేక.. వేసవిలో పౌల్ట్రీ యజమానులు కోళ్ల పెంపకానికి ఆసక్తి చూపరు. దీంతో కోళ్ల ఉత్పత్తి తగ్గింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిత్యం 80 నుంచి 90 టన్నుల చికెన్ వినియోగం ఉంటుందని అంచనా. జిల్లాలోని పరిశ్రమల్లో 60 లక్షల వరకు కోళ్లను పెంచే అవకాశాలు ఉండగా, ప్రస్తుతం 20 నుంచి 25 లక్షలకు మించి కోళ్లను పెంచడం లేదని సమాచారం. దీంతో వరంగల్, కరీంనగర్, ఏపీలోని విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటుడటంతో చికెన్ ధరకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిత్యం 18 నుంచి 20 లక్షల వరకు గుడ్లు వినియోగిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కోడిగుడ్లు ఉత్పత్తి చేసే పరిశ్రమలు తక్కువ. కాగా, కోడిగుడ్డు ధర ఒక్కసారిగా పతనమవటం రైతులను కుంగదీస్తోంది. ప్రస్తుతం ఉన్న దానా ధర, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ఒక్క గుడ్డు ఉత్పత్తికి రూ.4.50 ఖర్చవుతోంది. ప్రస్తుతం గుడ్డు ధర రూ.4.20గా ఉండటంతో రూ.0.30 నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం లేయర్ కోళ్ల పరిశ్రమల నిర్వహణ నుంచి కనీస పెట్టుబడులు కూడా రాని పరిస్థితితులు ఉన్నాయి. -
అడుగంటుతోంది !
వైరా రిజర్వాయర్లోకి ప్రస్తుతం సాగర్ జలాలు రోజుకు 320 క్యూసెక్కులు వస్తున్నాయి. వారం రోజుల పాటు సాగర్ నీరు చేరుతుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. – శ్రీనివాస్, ఐబీ, డీఈ, వైరావైరా: వైరా రిజర్వాయర్ నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు సాగు అవసరాలకు విడుదల చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 13 అడుగులకు చేరుకుంది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 467 గ్రామాలకు ఈ రిజర్వాయర్ నుంచి రోజుకు 10 కోట్ల లీటర్ల నీటిని మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. మరో వైపు రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా వారబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీ వరకు సాగు నీరు అందిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రానున్న రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనుండగా, నీటి లభ్యతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 1.6 టీఎంసీలు అవసరం వైరా రిజర్వాయర్ నుంచి ప్రతీ రోజు 33 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుండగా 37 క్యూసెక్కుల నీరు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఇలా నిత్యం 70 క్యూసెక్కుల నీరు ఖర్చవుతోంది. ఈ ఏడాది వేసవి గట్టెక్కాలంటే 1.6 టీఎంసీల నీరు రిజర్వాయర్లోకి రావాల్సి ఉంది. మరో వైపు జిల్లాలో ఏప్రిల్ 15 వరకు సాగర్ జలాలు వారబందీ పద్ధతిన నీరు విడుదల చేయనున్నారు. రిజర్వాయర్లోకి సాగర్ జలాలు విడుదల చేస్తే తాగునీటికి ఇబ్బందులు తప్పుతాయి. అయితే ఈ విషయమై అధికారులకు స్పష్టమైన హామీ లభించలేదు. ముందస్తుగా మేల్కొంటేనే.. రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని వైరా, మధిర, కల్లూరు మున్సిపాలిటీలతో పాటు మరో 8 మండలాలకు 10 కోట్ల లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. ఈ క్రమంలో రిజర్వాయర్లో నీటి వినియోగంతో పాటుగా ఆవిరి శాతం మరో 10 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవి ఉధృతిని దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్ పూర్తి స్థాయిలో ఖాళీ కాకముందే మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే వేసవిలో గృహ వినియోగానికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. రిజర్వాయర్లోని ప్రతికూల పరిస్థితులను బట్టి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. -
నేత్రపర్వంగా కల్యాణం..
పాల్వంచ: పాల్వంచలోని శ్రీనివాస గిరి భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. గోవింద నామస్మరణతో మారుమోగింది. అశేష భక్త జన సందోహాం నడుమ శ్రీనివాసకాలనీ గుట్టపై ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. గర్భగుడి నుంచి ఉత్సవ మూర్తులను పల్లకీలో మేళతాళాలతో కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి కల్యాణాన్ని వనపర్తికి చెందిన సౌమిత్రి రామాచార్యులు, హైదరాబాద్కు చెందిన హరిచార్యులు, తోలేటి నగేశ్శర్మ, ఆరుట్ల ఫణిరాజాచార్యులు, సంపత్కుమార్ అప్పలాచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. వేలాది మంది భక్తులు తరలి రావడంతో శ్రీనివాసగిరి కిటకిటాడింది. ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు 1,600 మెట్లు ఎక్కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బదులు తలెత్తకుండా భక్తులకు తాటి ఆకులతో చలువ పందిళ్లు వేశారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందించారు. ఆలయ నిర్వాహకులు తాగునీటి వసతి కల్పించారు. గుట్టపైకి వచ్చే వారికి మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పాల్వంచ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిత్రాజు, కొత్వాల శ్రీనివాసరావు, డీసీసీ అధ్యక్షులు తోట దేవీప్రసన్న, నాగా సీతారాములు, డిప్యూటీ మేయర్ లలితకుమారి, కొత్త వెంకటేశ్వరరావు, డాక్టర్ ముక్కంటేశ్వరరావు, ఆరుట్ల లక్ష్మణాచార్యులు, డాక్టర్ బిక్కసాని సుధాకర్, ఊకే భద్రయ్య, శ్రీలత, భక్తులు పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో మార్మోగిన శ్రీనివాసగిరి -
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్ ద్వారాఅమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి,ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పేర్కొన్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని, అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడిపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 293 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.17,010 ఆదాయం లభించింది. 170 మంది బోటుషికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,160 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాపారులు సహకరించాలిభద్రాచలంటౌన్: గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ఏర్పాటు చేస్తున్న భద్రగిరి మార్ట్ విజయవంతానికి స్థానిక వ్యాపారులు సహకరించాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ కోరారు. ఐటీడీఏ కార్యాలయంలో ఆదివారం స్థానిక వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు వేణు, ప్రభాకర్ రావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నేడు ‘షబ్–ఏ–ఖదర్’కరకగూడెం: పవిత్ర రంజాన్ మాసం కావడంతో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల 19 నుంచి ఉపవాస దీక్షలు పాటిస్తున్నారు. నేడు (సోమవారం) రాత్రి మసీదుల్లో ప్రత్యేక జాగారం చేయనున్నారు. రంజాన్ మాసం చివరి పది రోజుల్లో వచ్చే ఐదు బేసి రాత్రుల్లో ఒకటైన ఈ రాత్రికి ఇస్లాంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ రాత్రి చేసే ప్రార్థనలు వెయ్యి మాసాల ప్రార్థనల కంటే ఎక్కువ పుణ్యఫలాన్ని ఇస్తాయని ముస్లింలు విశ్వసిస్తారు. జిల్లా వ్యాప్తంగా 110 మసీదులు ఉండగా, సుమారు 80 వేల మంది ముస్లింలు ఉన్నారు. జాగారం చేసేందుకు మసీదులను ముస్తాబు చేశారు. రాత్రంతా మేల్కొని ఖురాన్ పఠించనున్నారు. -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా చర్చిస్తా
రాష్ట్రంలో ధరణి స్థానాన తీసుకొచ్చిన భూ భారతితో ఆశించిన ప్రయోజనాలు రాలేదు. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతా. సీతారామ ప్రాజెక్టు, ఆర్టీసీ, సింగరేణి పరిరక్షణపై చర్చిస్తా. కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు, 444, 999, 817, 727, 410 సర్వే నంబర్లలో భూసమస్యలపై ప్రస్తావిస్తా. – కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే పులుసుబొంత ప్రాజెక్ట్కు నిధులు, మణుగూరు, పినపాక మండలాల్లో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయాలని అడుగుతా. మణుగూరులో ఆర్టీసీ బస్టాండ్, సీతారామ పంప్ హౌస్ నుంచి మిట్టగూడెం వరకు గ్రావిటీ కెనాల్కు నిధులు మంజూరు చేయాలని, దోమలవాగు చెరువును మినీ రిజర్వాయర్గా చేయాలని కోరుతా. – పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే వైరా నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అసెంబ్లీలో కోరతా. జూలూరుపాడు పీహెచ్సీలను 30 పడకల ఆస్పత్రులుగా అప్గ్రేడ్ చేయాలని కోరుతా. – మాలోతు రాందాస్నాయక్, వైరా ఎమ్మెల్యే -
వైభవంగా నదీ హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలో గోదావరి స్నానఘట్టాల వద్ద పాప విమోచన ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం నిర్వహించిన నదీహారతి కార్యక్రమం కనుల పండువగా సాగింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హైదరాబాద్కు చెందిన శ్రీ వాగ్దేవి కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నాదోపాసన, కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీత కచేరి భక్తులను ఆకట్టుకున్నాయి. పురోహితులు గణపతి పూజ, దీపోత్సవం నిర్వహించి గోదావరి మాతకు, శ్రీరామునికి అష్టోత్తర శతనామార్చన చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ దామోదర్ రావు, సర్పంచ్ పునెం కృష్ణ దొర, డీఈ రవీందర్, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, పురోహితులు సురేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 10 గంటలపాటు కీర్తనల ఆలాపన భద్రగిరి రామయ్య సన్నిధిలో ఆదివారం అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం చోటుచేసుకుంది. శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ చిత్రకూట మండపంలో అల్లం రమాదేవి నిర్విరామంగా 10 గంటలపాటు 108 భక్తి సంకీర్తనలు ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. ఆమె ప్రతిభను గుర్తించిన ‘తెలంగాణ స్టేట్ రికార్డ్స్’ ప్రతినిధులు రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. రమాదేవి దంపతులను ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, ఈఓ సత్కరించి సర్టిఫికెట్ను ప్రదానం చేశారు. డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నిత్యకల్యాణం భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్ల కీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామయ్య కల్యాణానికి గోటి తలంబ్రాలు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణోత్సవానికి శ్రీ రామదాసు భక్త మండలి (చెల్పూర్) ఆధ్వర్యంలో ఆదివారం గోటి తలంబ్రాలను సమర్పించారు. సేంద్రియ పద్ధతిలో పండించి, గోటితో ఒలిచిన 2.10 క్వింటాళ్ల తలంబ్రాలను వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ ఈఓ దామోదర్రావుకు అందజేశారు. అనంతరం నిత్య అన్నప్రసాదం కోసం భక్తుల నుంచి సేకరించిన 14 క్వింటాళ్ల బియ్యాన్ని తానీషా భవనంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో 400 మంది మహిళా భక్తులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
జనగణన సమర్థంగా నిర్వహించాలి
● ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి ● శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్ సూపర్బజార్(కొత్తగూడెం): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనాభా గణన–2027 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. జనగణనలో భాగంగా మొదటి దశ అయిన గృహాల జాబితా, గృహ వసతుల గణనపై అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి కలెక్టరేట్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15, 16, 17 తేదీల్లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనాభా గణనలో విధి విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. డేటా సేకరణ సమయంలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశించారు. జనగణన ద్వారా సేకరించే గణాంకాలు గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది వంటివని అన్నారు. పాఠశాలలు, ఆస్పత్రులు, రహదారులు, తాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల కల్పనకు, సంక్షేమ పథకాలు అర్హులకు చేరవేసేందుకు ఉపయోగపడతాయని అన్నారు. ఈసారి జనాభా లెక్కలు పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా సేకరిస్తున్నట్లు తెలిపారు. పౌరులు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ, రెండో దశలో జనాభా వివరాల సేకరణ జరుగుతాయని వివరించారు. గృహ నిర్మాణం, నీటి వనరు, మరుగుదొడ్డి, విద్యుత్, వంట ఇంధనం, ఇంటర్నెట్ సౌకర్యం వంటి 33 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందనానరు. ఈ శిక్షణ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీఓ మధు, గణాంక అధికారి ఉదయ భాస్కర్, ఈడీఎం సైదేశ్వర రావు, మాస్టర్ ట్రైనర్లు, పాల్గొన్నారు. -
బడ్జెట్పైనే ఆశలు..
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు వస్తాయి.. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి.. రహదారులు కొత్త రూపు సంతరించుకుంటాయి.. స్థానిక సమస్యలు పరిష్కారం అవుతాయి..’ అని ప్రజలు సోమవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు, ఖమ్మంలో రిటైనింగ్ వాల్, మున్నేరుపై తీగల వంతెన పనులు సాగుతున్నాయి. అలాగే పర్యాటక రంగ అభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటన్నింటికీ నిధులు కేటాయిస్తే ఈ ఏడాదే పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మంసీతారామకు ప్రాధాన్యత దక్కేనా..? ఉమ్మడి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ప్రాధాన సాగునీటి వనరుగా ఉంది. గతంలో దీని అంచనా వ్యయం రూ.19,324 కోట్లు కేటాయించారు. అలాగే రిజర్వాయర్తోపాటు పాలేరు లింక్ కెనాల్ పనులు చేపట్టారు. మరోవైపు కొత్త కాల్వల తవ్వకానికి అనుమతులిచ్చారు. ఈ నేపథ్యంలో బడ్జెట్లో నిధుల కేటాయింపు ప్రధానంగా మారింది. అలాగే జిల్లాలో యాతాలకుంట, తిరుమలాయపాలెం తదితర ప్రాంతాల్లో టన్నెల్ నిర్మాణాలు పూర్తి కావాలి. గతేడాది బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు (ఖమ్మం సీఈ పరిధిలో) రూ.643.04 కోట్లు కేటాయించారు. ఈసారి బడ్జెట్లో ఎంత మేరకు కేటాయింపులు ఉంటాయో తేలాల్సి ఉంది. నిధుల వరద పారాలి.. ఎర్రుపాలెం వద్ద ఎన్నెస్పీపై లిఫ్ట్ ఇరిగేషన్ను సర్కారు చేపట్టింది. గతేడాది బడ్జెట్లో ఈ పథకానికి రూ.39.90 కోట్లు కేటాయించారు. దీన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈసారి ఎన్ని నిధులు కేటాయిస్తారో వేచి చూడాల్సిందే. అలాగే జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురయ్యాయి. ఇందుకోసం నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. ఇక లంకాసాగర్, వైరా, తాలిపేరు తదితర ప్రాజెక్టులకు పలు రకాల పనుల నిమిత్తం నిధులు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. రిటైనింగ్ వాల్, తీగల వంతెన పూర్తయితే .. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఖమ్మం నగరలోని మున్నేరుకు వచ్చే వరదతో పరీవాహక ప్రాంతంలోని ఖమ్మం రూరల్ మండలం, నగరంలోని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. 2023లో వరదల సమయంలోనే మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించి రూ.690 కోట్లు కేటాయించింది. ఇరువైపులా 8.50 కి.మీ. చొప్పున 17 కి.మీ. గోడ నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం రూరల్ మండల పరిధిలో 6 కి.మీ. మేరకు, ఖమ్మం నగరం వైపు 3 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. అయితే భూసేకరణ సమస్యతో పనులు కొంత ఆలస్యమయ్యాయి. ఇటీవల కేబినెట్ సమావేశంలో 125 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం అనుమతించింది. మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈ రెండింటికీ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే పనులు చకచకా పూర్తయి ఖమ్మానికి కత్త కళ రానుంది. పర్యాటకాభివృద్ధికి అవకాశం.. ఉమ్మడి జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకునే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వీటి అభివృద్ధికి ప్రణాళికతోపాటు నిధులు కేటాయిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోనుంది. కనకగిరి గుట్టలు, నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం, పలు జలపాతాలు, జమలాపురం వంటి పుణ్యక్షేత్రాలు పర్యాటక రంగానికి ఊతమివ్వనున్నాయి. -
సాగునీరు, విద్యకు నిధులు అడుగుతా
అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి ప్రాజెక్టు పునర్నిర్మాణం, ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాజెక్టు ఆధునికీరణకు నిధులు కేటాయించాలని కోరుతా. నియోజకవర్గంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా మార్చేందుకు నిధులు కావాలని ప్రభుత్వానికి విన్నవిస్తా. విద్య, సాగునీటి పథకాలకు రూ. 500 కోట్లు అవసరమని సీఎం దృష్టికి తీసుకెళ్తా. – జారే ఆదినారాయణ, అశ్వారావుపేట ఎమ్మెల్యే జీఓ 76పై అసెంబ్లీలో ప్రస్తావిస్తా ఇల్లెందు వాసులు ప్రస్తుతం నివాసం ఉంటున్న భూమిపై హక్కులు కల్పించేందుకు జీఓ 76ను నిరంతరం అమల్లో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతా. ఆ భూమిలో సింగరేణి లీజు పూర్తయి, వందల ఏళ్లుగా ఉంటున్న వారికి హక్కులు లేవు. కొమరారం, బోడు మండలాలు ఏర్పాటు, ఇల్లెందు రెవెన్యూ డివిజన్ తదితర అంశాలు ప్రస్తావిస్తా. – కోరం కనకయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే భద్రాచలం శ్రీ సీతామచంద్రస్వామి వారి ఆలయంలో జరగనున్న కల్యాణ మహోత్సవం, పట్టాభిషేకం నిర్వహణకు నిధులు కావాలని కోరుతా. ఆలయ అభివృద్ధి, మాఢ వీధుల విస్తరణకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ కొలిక్కి వచ్చినందున నిధులు త్వరగా మంజూరు చేయాలని అడుగుతా. రహదారులు, తాగునీరు, రైతుల సమస్యలు ప్రస్తావిస్తా. –తెల్లం వెంకట్రావ్, భద్రాచలం ఎమ్మెల్యే -
నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్అశ్వారావుపేటరూరల్: నాణ్యమైన, నిరంతర విద్యుత్ సేవలు అందిస్తామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ(ఆపరేషన్) జి.మహేందర్ తెలిపారు. మండలంలోని వినాయకపురం గ్రామంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని 3.15 ఎంవీఏ నుంచి 5 ఎంవీఏ సామర్థ్యానికి పెంచారు. నారాయణపురం సబ్ స్టేషన్ నుంచి కావడిగుండ్ల గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్కు 17 కిలోమీటర్ల మేర 33 కేవీ విద్యుత్ లైన్ పనులు పూర్తయ్యాయి. వీటిని ఆదివారం ఎస్ఈ ప్రారంభించి మాట్లాడారు. వేసవి కాలం నేపథ్యంలో వినాయకపురం సబ్ స్టేషన్ పరిధిలో లోఓల్టేజీ సమస్య ఉత్పన్నం రాకుండా పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచామని తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కావడిగుండ్ల పరిధిలో కూడా వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ సేవలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు నందయ్య, వెంకటేశ్వర్లు, ఏడీఈలు బి.వెంకట రత్నం, రాంబాబు, మధు, ఏఈలు విజయ్ కృష్ణ, నరసింహారావు పాల్గొన్నారు. -
శక్తినిచ్చే గంజి, హలీం..
కరకగూడెం: పవిత్రమైన రంజాన్ మాసంలో సాయంత్రం వేళ ఇఫ్తార్ సమయం సమీపించగానే మసీదుల పరిసరాల్లో గంజి, హలీం వంటకాలు నోరూరిస్తున్నాయి. ముస్లింలు ఉపవాసం విరమించే సమయంలో గంజి, హలీం తీసుకుంటున్నారు. జిల్లాలోని అనేక మసీదుల్లో దాతల సహకారంతో పెద్ద గిన్నెల్లో (దేగుల్లో) వేడివేడి గంజిని వండి ఇఫ్తార్ సమయానికి సిద్ధం చేస్తున్నారు. ఉపవాసం ఉన్నవారితోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే పేదలు, బాటసారులకు కూడా గంజిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రుచి, ఆరోగ్యం గంజి, హలీం వంటకాలు రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. రోజంతా ఉపవాసం ఉన్న శరీరాన్ని తిరిగి శక్తిమంతం చేస్తాయి. గంజి తక్షణ శక్తిని అందిస్తుంది. రోజంతా నీరు తాగకుండా ఉండటం వల్ల కలిగే అలసట, డీ హైడ్రేషన్ను తగ్గిస్తాయి. బియ్యపు రవ్వ, పెసరపప్పుతో తయారు చేసే ఈ వంటకం తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో కలిపే అల్లం, పుదీనా, కొత్తిమీర వంటి పదార్థాలు శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. అందువల్ల ఉపవాసం విరమించాక గంజి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు కూడా సూచిస్తున్నారు. హలీం తయారీకి ఎంతో కష్ట పడాలి. రోజూ తెల్ల వారుజామునే పనులు మొదలుపెట్టి దాదాపు 10 నుంచి 12 గంటల పాటు కట్టెల పొయ్యి మీద సన్నని మంటపై మటన్, గోధుమలు, నెయ్యి మరియు సుగంధ ద్రవ్యాలను ఉడికిస్తాం. హలీం మెత్తగా, వెన్నలా రావాలంటే గంటల తరబడి కరల్రతో కలియతిప్పాలి. సాయంత్రం ఇఫ్తార్ సమయానికి సిద్ధం చేస్తాం. ముస్లింలే కాకుండా అన్ని వర్గాల వారు ఈ రుచిని ఇష్టపడతారు. – ఎండీ రఫీ, జే హోటల్, పాల్వంచరోజంతా ఉపవాసం ఉండి, ఇఫ్తార్ సమయంలో వేడి గంజి తీసుకున్నప్పుడు ఒంటికి వెంటనే శక్తి వచ్చి అలసట దూరమవుతుంది. ఇదికాక సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో కూడిన హలీం తింటే శరీరానికి బలం వస్తుంది. ఆకలి తీర్చుకోవడమే కాదు కులమతాలకు అతీతంగా కలిసి కూర్చుని రుచులను ఆస్వాదించడం మనుషుల మధ్య ఐక్యత చాటిచెబుతోంది. – సయ్యద్ ఆరిఫ్, కరకగూడెంరంజాన్ మాసం వచ్చిందంటే గుర్తుకు వచ్చే మరో ప్రత్యేక వంటకం హలీం. మాంసం, గోధుమలు, పప్పు దినుసులతో గంటల తరబడి మగ్గించి తయారు చేసే ఈ వంటకంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. రోజంతా ఉపవాసం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంలో ఇది సహాయపడుతుంది. ఎముకలతో కలిపి మగ్గించడం వల్ల కాల్షియం కూడా లభిస్తుంది. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కలపడం వల్ల శరీరానికి అవసరమైన కొవ్వు లభిస్తుంది. అందుకే రంజాన్లో హలీం ఇఫ్తార్ విందుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సాధారణంగా మటన్ హలీం ప్లేట్ రూ.120 నుంచి రూ.150 వరకు, చికెన్ హలీం ప్లేట్ రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. కుటుంబ సభ్యులు కలిసి ఆస్వాదించేందుకు ఫ్యామిలీ ప్యాక్ ధర రూ.600 నుంచి 800 వరకు ఉంది. హలీం తయారీకి పలువురికి ఉపాధి కూడా దొరుకుతుంది. మసీదు ప్రాంగణాల్లో ఇఫ్తార్ వేళల్లో రెడీ -
మెట్ల దారిన.. దేవుని చెంతకు!
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీనివాసగిరి భక్తుల కోలాహలంతో నిండిపోయింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన తిరుకల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన భార్య మాధురితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. పొంగులేటి దంపతులు 1,600 మెట్లను కాలినడకన ఎక్కి గిరి శిఖరానికి చేరుకున్నారు. దారి పొడవునా గోవింద నామస్మరణ చేస్తూ, తనను పలకరించిన భక్తులకు చిరునవ్వుతో సమాధానమిస్తూ ముందుకు సాగారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పట్టువ్రస్తాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వారికి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. పర్యాటక ప్రాంతంగా శ్రీనివాసగిరి.. ‘ప్రకృతి ఒడిలో ఉన్న శ్రీనివాసగిరిని దర్శించుకోవడం నా అదృష్టం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అటవీ శాఖ అధికారుల సహకారంతో ఈ క్షేత్రాన్ని గొప్ప ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతాం. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’అని మంత్రి పొంగులేటి చెప్పారు. స్వామివారి కల్యాణ వేడుకలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా పాల్గొన్నారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశా రు. అనంతరం మేళతాళాల నడు మ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రో క్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. గురుకులాలకు గ్యాస్ సిలిండర్లు సరఫరాపాల్వంచరూరల్: అధికారులు సంక్షేమ గురుకులాలకు ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. హెచ్పీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో సంబంధిత గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు జాప్యం చేయడంతో గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు నిండుకున్నాయి. దీంతో కట్టెల పొయ్యి పై వంటలు వండుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సంక్షేమ విద్యా సంస్థలపై గ్యాస్ బండ’ శీర్షిక న ఈ నెల 13 సాక్షి ప్రధాన ఎడిషన్లో కథనం ప్రచురితమైంది. దీంతో సంబంఽధిత శాఖ అధికారులు స్పందించారు. ఇక నుంచి గ్యాస్ ఇండెంట్ పెట్టుకున్న వెంటనే సంబంధిత గురుకుల పాఠశాలలకు, హాస్టళ్లకు హెచ్పీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ప్రేమ్కుమార్ శనివారం తెలిపారు. ఎక్కడా గ్యాస్ కొరత లేదని పేర్కొన్నారు. రేపు జాబ్మేళా రుద్రంపూర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 16న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్కా రెనాల్ట్లో ఉద్యోగాల భర్తీకి జాబ్మేళా నిర్వహిస్తుండగా, డిగ్రీ అర్హత, 22 – 32ఏళ్ల వయస్సు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. కొత్తగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో 16వ తేదీన ఉదయం 10గంటలకు మొదలయ్యే జాబ్మేళాకు సర్టిఫికెట్ల జిరాక్స్లతో హాజరుకావాలని, వివరాలకు 703690 2902 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
సేద్యానికి సాంకేతిక ఊతం..
బూర్గంపాడు: వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వం రైతులకు రాయితీపై డ్రోన్లు అందించేందుకు చర్యలు చేపట్టింది. పంటల సాగులో ఖర్చులు తగ్గించి సాంకేతికతతో కూడిన యంత్ర పరికరాలను అందించేందుకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్(స్మామ్) పథకం కింద జిల్లాలోని రైతులకు అందించనున్నారు. ఇందుకోసం దశల వారీగా అందించేందుకు వ్యవసాయశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది. దీంతో రైతులకు గరిష్టంగా రూ.4లక్షల వరకు రాయితీ అందనుంది. తొలుత సన్న, చిన్నకారు, మహిళా రైతులకు, ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రాధాన్యతనివ్వనున్నారు. తగ్గనున్న పెట్టుబడులు.. పంటల సాగులో ముఖ్యంగా పురుగుమందుల పిచి కారీలో ఖర్చులను తగ్గించేందుకు డ్రోన్లు ఎంతగానో రైతులకు ఆదా చేస్తాయని వ్యవసాయశాఖ చెబుతుంది. పిచికారీకి గతంలో అయ్యే ఖర్చులో 70శాతం వరకు తగ్గుతుందని అధికారులు సూచిస్తున్నారు. పురుగుమందులతో పాటుగా లిక్విడ్ ఎరువులు, మైక్రోన్యూట్రియట్స్ను కూడా పిచికారీ చేసు కుని పెట్టుబడులు తగ్గించుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాలలో డ్రోన్ల వినియోగం అందుబాటులోకి వచ్చింది. కూలీల కొరతకు చెక్.. కూలీల కొరతతో రైతులు సకాలంలో పంటలపై మందులు పిచికారీ చేసుకోలేకపోతున్నారు. కూలీ లు దొరికిన రోజుకు నాలుగైదు ఎకరాలలోని పంటలకే మందులు పిచికారీ చేసే పరిస్థితులున్నా యి. ఒక ఎకరాలో మందుల పిచికారీకి రైతులకు మాన్యువల్గా రూ.700 వరకు ఖర్చవుతుండడంతో పాటు మందుల విషప్రభావంతో వారు అస్వస్తులై అనా రోగ్యానికి గురవుతున్నారు. అదే డ్రోన్తోనైతే ఎకరాకు రూ.200 ఖర్చు మాత్రమే సరిపోతుంది. మనుషులపై కూడా ఎలాంటి విషప్రభావం లేకపోవడం కూడా కలిసొచ్చే అంశం. ఇప్పటికే డ్రోన్ల వినియోగంపై పలువురు రైతులు శిక్షణ కూడా తీసుకుంటున్నారు. సామర్థ్యం ఆధారంగా ధరలు.. రాయితీపై రైతులకు అందించే డ్రోన్లకు సంబంధించిన తొమ్మిది కంపెనీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆయా కంపెనీలు తమ డ్రోన్ల సామ ర్థ్యం ఆధారంగా కనిష్టంగా రూ.9.80లక్షలు, గరి ష్టంగా రూ.14.95లక్షల ధరలతో ముందుకు తీసుకొచ్చా యి. యువ రైతులు కొందరు ఇప్పటికే వీటి ని కొనుగోలు చేసి తమ పంటలకు వినియోగించడంతో పాటు ఇతర రైతులకు కూడా మందుల పిచికా రీకి వినియోగించి ఆదాయం పొందుతున్నారు. జిల్లాలో రైతులు పత్తిచేలలో మందుల పిచి కారీ కి గతఐదారేళ్లుగా ట్రాక్టర్కు స్ప్రేయర్లు బిగించి వాడుకుంటున్నారు. దీంతో సమయం ఆదా చేసుకోవడంతో పాటు కూలీల ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అయితే వరి మాగాణులలో బురదలో దిగి మందులు కొట్టేందుకు కూలీలు రావడంతో చాలామంది రైతులు డ్రోన్ల వైపు దృష్టి సారించారు. అదేవిధంగా మిర్చి,కూరగాయ ల పంటల సాగులోనూ వీటి వినియోగం తప్పనిసరి పరిస్థితులున్నాయి. ప్రభుత్వం రాయితీ తో డ్రోన్ల కొనుగోలుకు ప్రోత్సహిస్తుండడంతో కొందరు యువ రైతులు ముందుకొస్తున్నారు.ఆధునిక సాగువైపు రైతాంగం -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
అశ్వాపురం: బ్రెయిన్ స్ట్రోక్తో ఖమ్మంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని మొండికుంటకు చెందిన సంగు కిరణ్కుమార్(38) శనివారం మృతి చెందాడు. వివరాలిలా.. గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేసే కిరణ్కుమార్ తండ్రి అనా రోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటుండగా.. తల్లి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈక్రమంలో కిరణ్కుమార్ అనారోగ్యంతో బ్రెయిన్స్ట్రోక్కు గురికాగా.. వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో కొడుకుకు ఎలాగైనా బతికించుకోవాలని తల్లి దాతల సహాయం కోరింది. దీంతో ఈనెల 13న ‘ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా.. కొందరు తమ వంతు సహాయం చేసినా మృత్యు పోరాటంలో కిరణ్కుమార్ గెలవలేక మృతి చెందాడు. అయితే హైదరాబాద్కు చెందిన జీవన్దాన్ సంస్థ బాధ్యులు అవయవదానం కోసం మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడగా.. వారి అంగీ కారంతో కాలేయాన్ని దానం చేశారు. తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభ్యం అశ్వాపురం: మండల పరిధిలోని ఎలకలగూడెం గ్రామానికి చెందిన తాటి భువన్చందు గొందిగూడెం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాడు. ఈక్రమంలో శుక్రవారం స్కూల్ కి వెళ్లి సాయంత్రం ఇంటికి రాలేదు. రాత్రి వరకు ఎదురుచూసిన విద్యార్థి తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా ఆచూ కీ లభించకపోవడంతో వారు అశ్వాపురం పోలీసులకు సమాచా రం అందించారు. దీంతో సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యాన పోలీసులు విచారించగా.. శనివారం బాలుడు వైరా పోలీస్స్టేషన్లో ఉన్నట్టు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆతర్వాత వారు అక్కడకు చేరుకుని బాలుడిని ఇంటికి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 11వ తేదీన అర్ధరాత్రి ప్రియుడు మీరాతో కలిసి భార్య ఖతిజా, భర్త జాఫర్ను హతమార్చిన విష యం విదితమే. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదాంతంపై పోలీసులు దర్యాప్తు చేపట్టి మృతుడి భార్య ఖతిజాతో పాటు చింతలపుడికి చెందిన ప్రియుడు మీరాను అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మణుగూరు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపాల్, వార్డెన్ సస్పెన్షన్.. మణుగూరు టౌన్: మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల, మెస్ పర్యవేక్షణతో వార్డెన్, ప్రిన్సిపాల్ విధుల్లో నిర్లక్ష్యం చూపిన కారణంగా ఈ నెల 9వ తేదీన విద్యార్థినులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురై 100 పడకల ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం విధితమే. ఈ నేపథ్యాన 11న వార్డెన్, ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువడగా.. ఈ విషయం శనివారం సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఇదిలా ఉండగా.. గత ఆదివారం విద్యార్థుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారం తినడంతోనే అస్వస్థతకు గురయ్యారని హాస్టల్ నిర్వాహకులు అధికారులకు చెప్పారు. ఆతర్వాత ఒకరి తర్వాత మరొకరు ఇలా సుమారు 15 మంది అస్వస్థతకు గురికాగా అందులో కొందరు హాస్టల్లోనే చికిత్సలు పొందారు. డీసీఓ విచారణతో పాటు అధికారుల తనిఖీల్లో హాస్టల్ నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అంకిత్ సస్పెన్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ప్రజల పక్షాన పనిచేయాలి
● ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ● ముగిసిన సీపీఐ శిక్షణా తరగతులు పాల్వంచ: కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు ఎల్లప్పు డూ ప్రజల పక్షానే పనిచేయాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. పాల్వంచలో నిర్వహిస్తున్న సీపీఐ ప్రజా ప్రతినిధుల రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు రెండో రోజు శనివారం ముగిశాయి. తరగతుల్లో ‘ప్రజా ప్రతినిధులుగా కమ్యూనిస్టుల పాత్ర’ అనే అంశంపై నాగేశ్వర్ మాట్లాడారు. కమ్యూనిస్టులతోనే మెరుగైన పాలన సాధ్యమని, నూతనంగా ప్రజా ప్రతినిధులు సుపరిపాలన దిశగా అడుగులు వేయాలని అన్నారు. యూపీఏ–1 ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కలిసి ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి ప్రజా ప్రయోజన చట్టాలు అమల్లోకి వచ్చాయన్నా రు. యూపీఏ–2 ప్రభుత్వం నుంచి కమ్యూనిస్టులు వైదొలగడంతో అన్నీ కుంభకోణాలే జరిగాయని అన్నారు. ఆర్టీఐ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూసి శ్రీధర్ మాట్లాడుతూ హక్కుల కోసం పోరాడటంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పారు. పాలకులు సమాచారహక్కు చట్టా న్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలతో మమేకం కావాలి జనం మన్ననలు పొందగలిగిన వారే నిజమైన నాయకులు అని.. అందుకోసం కమ్యూనిస్టులు నిరంతరం ప్రజలతో మమేకం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. కమ్యూనిస్టు నాయకులకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని తెలిపారు. పదవులే కావాలనుకుంటే జ్యోతిబసు లాంటి యోధులు ప్రధాని అయ్యే వారని, చండ్రా రాజేశ్వరరావు ఎమ్మెల్సీ పదవినీ సైతం తృణప్రాయంగా భావించి రాజీనామా చేశారని తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్పై పార్లమెంట్కు వెళ్లారని, ఐదు సార్లు గెలిచిన గుమ్మడి నర్సయ్య సాదాసీదా జీవనం సాగిస్తున్నారని, రజబ్ అలీ వంటి మేధావులు కమ్యూనిజమే ఊపిరిగా బతికారని వెల్లడించారు. మీడియా అకాడమీ చైర్మ న్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. సీపీఐ నేత రామకృష్ణ, మేయర్ మూడ్ గణేష్, నాయకులు పశ్య పద్మ, సృజన్, ఎస్కె.సాబీర్పాషా, వెంకటేశ్వరరావు, విశ్వనాథం, భిక్షపతి, అజయ్, మునిగడప పద్మ, ఉమా, మురళి పాల్గొన్నారు. -
రామయ్య పెళ్లికి రండి
భద్రాచలం: భద్రాచలంలో జరగనున్న సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం వేడుకలకు హాజరు కావా లని డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులకు ఆలయ అధికారులు శనివారం హైదరాబాద్లో ఆహ్వాన పత్రికలను అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పశుసంవర్థక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను వారి నివాసాల్లో కలిశారు. ఈఓ దామోదర్, శ్రీనివాస రామానుజం, అంతర్వేది కృష్ణమాచార్య, భవాని రామకృష్ణ ఉన్నారు. డిప్యూటీ సీఎం, మంత్రులకు ఆహ్వానం -
మా కష్టాన్ని లాక్కోవద్దు..
కారేపల్లి: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయాన అన్యాయం చేయొద్దని రైతులు కోరారు. కారేపల్లి మండలం రేలకాయలపల్లి రెవెన్యూ చీమలపాడులో పలువురు రైతుల నుంచి సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి సేకరించారు. ఇక్కడ 67 ఎకరాల్లో సుబాబుల్ తోటలు సాగు చేయగా, చేతికి వచ్చే సమయాన భూసేకరణ పూర్తయి పరిహారం కూడా చెల్లించారు. అయితే, చివరి పంట తమకే ఇవ్వాలని కోరుతూ రైతులు శనివారం తోటలను నరికేందుకు సిద్ధమయ్యారు. దీంతో డీఈ కిషోర్, ఏఈ రంజిత్, వర్క్ ఇన్స్పెక్టర్ రామస్వామి చేరుకుని అడ్డగించారు. పంట తీసుకునే హక్కు కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే రాందాస్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినందున సహకరించాలని కోరారు. ఈమేరకు నిర్వాసిత రైతులు పాటి రమేష్, బచ్చలి వెంకటేశ్వర్లు, పాటి రాంబాబు, మాలోతు స్వామి, గుజ్జర్లపూడి సైదులు, పాటి రంగయ్య, పాటి రామయ్య, మాలోతు బావ్సింగ్, మాచర్ల రమేష్ తదితరులు కోరినా అధికారులు వినకపోవడంతో తోపులాట, వాగ్వాదం జరిగింది. చివరకు డీఈ కిషోర్ కారేపల్లి పోలీసులకు పిర్యాదు చేశారు.సుబాబుల్ నరికివేత సందర్భంగా వాగ్వాదం -
సీఎస్ఆర్ సహకారాన్ని సమన్వయం చేసుకోవాలి
సూపర్బజార్(కొత్తగూడెం): భద్రాచలంలో ఈ నెల 27న నిర్వహించనున్న శ్రీరామ నవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) సంస్థల సహకారం అవసరమని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం వివిధ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీసీ, నావా లిమిటెడ్, కేటీపీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సింగరేణి, టీజీ గ్రామీణ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు గతంలో అందించిన సహకారం మాదిరిగానే ఈ సంవత్సరం అందించే సహాయంపై వివరించారు. నవమి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలిరానుండగా.. వారికి తాగునీరు, అన్నదానం, వసతి, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాల కల్పన కోసం సీఎస్ఆర్ సంస్థలు సహకారం అందించాలని కోరారు. ఈక్రమాన దేవస్థానం ఈఓతో కావాల్సిన వివరాలను సేకరించాలని సీపీఓ సంజీవరావును ఆదేశించారు. అవసరాల మేరకు సీఎస్ఆర్ సంస్థల సహకారాన్ని సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, వివిధ సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విశ్వవ్యాప్తం
రామనామం..● భద్రగిరిలో శిలాన్యాస్ తయారీ ● ఒక్కో శ్రీరామనామ ఇటుక రూ.60 ● నిర్మాణాలు, బహుమతులుగా ఇచ్చేందుకు పలువురి ఆసక్తిభద్రాచలం: ‘శ్రీరామ రక్ష సర్వఽజగద్రక్ష’ శ్లోకం విశ్వవ్యాప్తమైంది. దీనిని బుద్ధ కౌశిక రుషి రచించారని, శ్రీరాముడు రక్షకుడు, సమస్త జగత్తుకు అండగా ఉంటాడని అర్థమని పండితులు చెబుతున్నారు. ఈ శ్లోకా న్ని భద్రగిరి క్షేత్రంలో మరింతగా పఠిస్తుంటారు. అలాంటి శ్రీరామ నామాన్ని ఇటుకల్లో సైతం ముద్రించి భక్తులకు విక్రయించే కార్యక్రమాన్ని భద్రగిరి రామాలయ వర్గాలు చేపట్టాయి. దీంతో రామనామం విశ్వవ్యాప్తమవుతోందని అర్చకులు పేర్కొంటున్నారు. శిలాన్యాస్కు శ్రీకారం శ్రీరామ శిలాన్యాస్ కార్యక్రమానికి భద్రాచలంలో ఆల య అధికారులు శ్రీకారం చుట్టారు. రామాయణ కా లంలో ఇటుకను శిలాన్యాస్ అని పిలిచారని, ఇక్కడ తయారుచేసే ఇటుకకు శ్రీరామ శిలాన్యాస్ అని నామకరణం చేశామని పండితులు చెబుతున్నారు. మట్టి, ఇసుక కలిపి ఇటుకల తయారీకి ప్రత్యేక అచ్చులను సిద్ధం చేశారు. ఇటుకలపై ‘జై శ్రీరామ్’ అని వచ్చేలా చేశారు. కాగా, మొదట మట్టితోనే ఇలాంటి ఇటుకలు తయారు చేసినా.. భక్తులు కొనుగోలు చేసి తీసుకెళ్లే సమయంలో పగిలిపోతున్నాయి. దీంతో ఇటీవల ఇసు క, సిమెంట్తో ఇటుకలను తయారుచేస్తున్నారు. వీటి కి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ ద్వారా విక్రయిస్తున్నా రు. ఒక్కో ఇటుక రూ.60 చొప్పున భక్తులకు అందజేస్తున్నారు.ఆలయంలోని గోశాలప్రాంగణంలో తయా రు చేసి ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయిస్తున్నారు. పెరుగుతున్న ఆదరణ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వీటిని కొనుగోలు చేసేందుకు క్రమంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటిని బస్సుల్లో తీసుకెళ్తుంటే విరిగిపోతాయని, ప్రయాణం కూడా భారమని కొందరు భయపడుతున్నారు. కార్లు, ఆటోల్లో వచ్చిన భక్తులు మాత్రం అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్ సౌకర్యంతోపాటు, ఆలయం వారే నేరుగా ఇంటివరకు రవాణా చేస్తే మరింతగా ఆదరణ పెరుగుతుందని భక్తులు భావిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాలు, ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన సమయంలో ఈ ఇటుకలు వినియోగిస్తున్నామని చెబుతున్నారు. బంధువులకు, స్నేహితులకు గిఫ్ట్గా ఇవ్వడంతో పాటు భక్తి, ఆధ్యాత్మికను పెంచే ధార్మిక కార్యక్రమాల్లో ఈ ఇటుకలు ఉపయోగించవచ్చని ఆలయ అధికారులు అంటున్నారు. శ్రీరాముడు కొలువై ఉన్న ప్రాంగణంలో ఇటుకలు తయారు చేసి, శ్రీరామ నామాన్ని ఆవాహనం చేస్తున్నాం. ఈ ఇటుక భక్తి భావనకు చిహ్నంగా మారుతుంది. భద్రాచలంలో మాత్రమే ప్రత్యేకమైన ఈ ఇటుకలు నిత్యం అందుబాటులో ఉంటాయి. – కె.దామోదర్రావు, రామాలయ ఈఓ, భద్రాచలం భద్రాచలం శ్రీరామనామంతో ఇటుక ఉంటే మాకు శ్రీరామరక్షగా ఉందని భావిస్తాం. ఇంటిలో దేవుడి గదిలో పెట్టుకుని పూజి స్తాం. ఇంటి నిర్మాణాలకు ఇది వాడితే శ్రీరామచంద్రుడి అనుగ్రహం ఉంటుందని మా విశ్వాసం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – నరేష్, విశాఖపట్టణం -
మోకాలు కీళ్ల మార్పిడి విజయవంతం
పాల్వంచ: పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మోకాలి మార్పిడి (టోటల్ నీ రీప్లేస్మెంట్) శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించా రు. వరంగల్కు చెందిన ఐ.కవిత(52) గత మూడేళ్లుగా ఎడమ మోకాలు కీళ్ల నొప్పితో బాధపడుతూ కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. దీంతో శస్త్ర చికిత్సకు సుమారు రూ.1.50 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో ఆర్థిక స్తోమత లేక పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ శైలేష్కుమార్ను సంప్రదించారు. దీంతో పరీక్షించి, వైద్య బృందంతో కలిసి శనివారం సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మోకా లు కీళ్ళ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనస్తీషియా వైద్యుడు, సూపరింటెండెంట్ రాంప్రసాద్, సిబ్బంది రేవతి, స్వర్ణలత, ఉమ, సర్పరాజ్, నర్సింహ, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
● తొలిరోజు 33 మంది విద్యార్థులు గైర్హాజరు ● కేంద్రాల్లో తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ: జిల్లాలో పదోతరగతి వార్షిక పరీక్షలు తొలిరోజు శనివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష నిర్వహించగా, కేంద్రంలోకి ఉదయం 8:30 గంటల నుంచే విద్యార్థులను అనుమతించారు. హాల్ టికెట్లను పరిశీలించి, విద్యార్థులను తనిఖీ చేశా క కేంద్రంలోకి పంపించారు. కలెక్టర్ అంకిత్ పాల్వంచ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లాపరిషత్ ఉన్నత బాలికల అభ్యు దయ పాఠశాల పరీక్ష కేంద్రాల్లో తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూ చించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు ఇలా... జిల్లా వ్యాప్తంగా మొదటిరోజు తెలుగు పరీక్షకు 12,720 మంది హాజరు కావాల్సి ఉండగా, 12,687 మంది హాజరయ్యారు. 33మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థుల్లో 20మందికిగాను 14మంది హాజరుకాగా, 6మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 99.74శాతం హాజరు నమోదైనట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 (బి) అమలు చేశారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కొత్తగూడెంలోని సింగరేణి హైస్కూల్, కొత్తగూడెం, చుంచుపల్లి హైస్కూల్లలో తనిఖీలుచేయగా, జిల్లా పరిశీలకులు నాంపల్లి రాజేష్ మూడుసెంటర్లు, జిల్లా విద్యాశాఖాధికారి నాలుగు సెంటర్లు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఐదు సెంటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ 23 సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ నాగలక్ష్మి తెలిపారు. నిర్లక్ష్యంతో విద్యార్థుల తంటాలు ములకలపల్లి: ములకలపల్లి హైస్కూల్ సెంటర్ వద్ద 9 గంటల వరకు నోటీస్ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో తమ నంబర్ ఏం రూంలో తెలుసుకునేందుకు పదో తరగతి విద్యార్థులు ఆందోళన చెందారు. ఆ తర్వాత కనిపించని అక్షరాలతో నామమాత్రంగా బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు గదులను చూసుకునేందుకు నానాతంటాలు పడ్డారు. -
ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలి
జూలూరుపాడు: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయాలని డీఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ విద్యాచందన అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యా చరణలో భాగంగా శనివారం అనంతారం, గాంధీనగర్ గ్రామ పంచాయతీల నర్సరీలను ఆమె పరిశీ లించారు. డ్రైన్ ఎండ్ ఇంకుడు గుంతలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామ సమాఖ్య భవనాల ప్రగతిపై సర్పంచ్లు, సిబ్బందిని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎంపీఓ టి.తులసీరామ్, ఈజీఎస్ ఏపీఓ రామారావు, అనంతారం, గాంధీనగర్ సర్పంచ్లు కొర్సా రమేష్, బానోత్ మంగూలాల్, పంచాయతీ కార్యదర్శులు శైలజ, లక్ష్మీనారాయణ, ఈజీఎస్ టీఏ జోదా భాయి, ఎఫ్ఏ నాగమణి, మేట్లు, వన సేవకులు పాల్గొన్నారు. -
పార్లమెంట్ ముట్టడికి తరలిరండి
ఖమ్మంమయూరిసెంటర్: అఖిల భారత యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 16న తలపెట్టిన పార్లమెంట్ ముట్టడి కార్యకమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈమేరకు ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన చలో ఢిల్లీ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వేజెండ్ల సాయికుమార్ అధ్యతన జరిగిన సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోని రైతుల పొట్ట కొట్టేలా కేంద్రప్రభుత్వం అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుందన్నారు. ఫలితంగా రైతులను రోడ్డున పడనుండగా, ఒప్పందాన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలన్నీ నిలదీసినా మోదీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ ఈనెల 16న పార్లమెంట్ ఎదుట జరిగే ధర్నాకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో వెళ్లనున్నట్లు తెలిపారు. నాయకులు అంజనీకుమార్, బాలగంగాధర్, ఆదర్శ్, కిరణ్, బెల్లం సాయి తేజ, అంబటి ఈశ్వర్, చల్లగొండ్ల సాయితేజ, ఖైసర్, యశ్వంత్, యడ్లపల్లి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.‘చలో ఢిల్లీ’ పోస్టర్ల ఆవిష్కరణలో డీసీసీ అధ్యక్షుడు నూతి -
సీఎన్జీ కారులో మంటలు..
బద్దుతండా సర్పంచ్కు తప్పిన ప్రమాదం టేకులపల్లి: సీఎన్జీ కారు ఇంజిన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. అందులో ఉన్న సర్పంచ్కు తృటిలో ప్రమాదం తప్పినట్లయింది. వివరాలిలా.. టేకులపల్లి మండలం బద్దుతండా సర్పంచ్ బాణోతు నరేష్ తన స్నేహితులతో కలిసి శనివారం టీజీ–28 1090 నంబర్ గల టాటా ఆల్ట్రో కారులో బొజ్జాయిగూడెం సమ్మక్క గద్దెల వద్ద ఓ శుభకార్యానికి వెళ్లి తిరుగు పయణమయ్యారు. ఈనేపథ్యాన కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోళ్లపాడు వైపు వెళ్లి కారుని రివర్స్ చేస్తున్న క్రమంలో కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే కారులో ఉన్న సర్పంచ్, మరో ఇద్దరు కిందకు దిగి ఇల్లెందు ఫైర్స్టేషన్కు ఫోన్ చేయగా.. సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కాగా అప్పటికే కారు అంతా దగ్ధమైంది. యువతి అదృశ్యంపై కేసు నమోదుఅశ్వారావుపేటరూరల్: ఓ యువతి అదృశ్యం కాగా, స్థానిక పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ యయాతీ రాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేట పట్టణ కేంద్రానికి చెందిన ఓ యువతి(19) శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తండ్రి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గ్రామం మీదుగా లైన్ వద్దేవద్దు..
సత్తుపల్లిరూరల్: మండలంలోని కిష్టారం మీదుగా సింగరేణి అధికారులు ప్రతిపాదించిన 32/11 కేవీ విద్యుత్ లైన్ను గ్రామస్తులు వ్యతిరేకించారు. గ్రామంలో సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి అప్పారావు ఆధ్వర్యాన శనివారం గ్రామసభ నిర్వహించగా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారుల గృహసముదాయాలకు 32/11 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించగా గ్రామస్తులు నిరాకరించారు. ఇప్పటికే సైలోబంకర్ కాలుష్యంతో ప్రాణాలు కోల్పోతుండగా, ఆ సమస్య ను పరిష్కరించకుండా మరో సమస్య తీసుకురావొద్దన్నారు. మూడు నెలల్లో సైలో బంకర్ సమస్యకు పరి ష్కారం చూపిస్తామని తమ దీక్షలు విరమింపచేసి, ఏడాది గడిచినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ బొగ్గు తవ్వకాలపై సింగరేణికి ఎంత అధికారం ఉందో, బాధితులను ఆదుకునే బాధ్యత అంతే కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అధికారులు గృహ సముదాయాలకు విద్యుత్ లైన్ ఏర్పాటులో ప్రజల నిర్ణయం మేరకే నడుచుకోవాలని సూచించారు. కాగా, సైలో బంకర్ సమస్యపై ఎమ్మెల్యే రాగమయి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సింగరేణి జేవీఆర్ ఓసీ పీఓ ప్రహ్లాద్, ఏఈ శరత్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ పార్లమెంటరీ గ్రూప్లో ఎంపీ రఘురాంరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్–స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యుడిగా ఆయనను లోక్సభ స్పీకర్ నామినేట్ చేశారు. ప్రస్తుత 18వ లోక్సభ కాలానికి సంబంధించి భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య పార్లమెంటరీ స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో రఘురాంరెడ్డికి స్థానం కల్పించినట్లు సమాచారం అందింది. ఈ గ్రూప్ ద్వారా రెండు దేశాల పార్లమెంటరీ సభ్యుల మధ్య పరస్పర సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఎంపీ కీలక గ్రూప్లో స్థానం దక్కడంపై ఉమ్మడి జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రతిభ
పాల్వంచ: ఈనెల 11, 12వ తేదీల్లో సంగారెడ్డి–హైదరాబాద్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యా డ్మింటన్ పోటీల్లో భద్రాద్రి క్రీడాకారులు ప్రతిభ కనబర్చినట్లు శనివారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్ తెలిపారు. అండర్–17 బాలుర విభాగంలో పాల్వంచకు చెందిన పి.నోయల్ విన్సెంట్, జాఫర్, షరీఫ్, కొత్తగూడేనికి చెందిన ఎం.రిషికుమార్, భద్రాచలానికి చెందిన తుషార్ మనస్, ఎ.వినయ్లు సత్తాచాటి బ్రాంజ్ మెడల్ సాధించారని, వీరు ఏప్రిల్లో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఈమేరకు క్రీడాకారులను డీఈఓ బి.నాగలక్ష్మి, డీవైఎస్ఓ పరంథామరెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ వాసిరెడ్డి నరేష్ తదితరులు అభినందించారు. ఏకలవ్య పాఠశాలల మెరిట్ జాబితా విడుదల భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏకలవ్య మోడల్ గిరిజన పాఠశాలల్లో బోధనేతర (ఔట్సోర్సింగ్) సిబ్బంది భర్తీకి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసినట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. గతేడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో జాబితాను భద్రాచలం ఐటీడీఏ ఆవరణలోని ఆర్సీఓ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఈనెల 18లోగా కార్యాలయ పనివేళల్లో స్వయంగా సమర్పించాలని సూచించారు. గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలలు(ఆర్జేసీ), ప్రతిభా కళాశాల(సీఓఈ)ల్లో 2026–27 విద్యాసంవత్సరం మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న గిరిజన విద్యార్థులు ఈనెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు http:// tgrjc. cgg. gov. in, www. tgtwgurukulam. telangana. gov. in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎంపికై న విద్యార్థులకు ఉచిత వసతితో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎప్సెట్కు నిష్ణాతులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సమీప గిరిజన గురుకులాల్లో సంప్రదించాలని పీఓ సూచించారు. ముగిసిన ఫస్ట్ ఎయిడ్–ఫైర్ ఫైటింగ్ శిక్షణకొత్తగూడెంఅర్బన్: సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి వచ్చిన 34 మంది సెక్యూరిటీ సిబ్బందికి వారం రోజులపాటు జరిగిన 38వ బ్యాచ్ ఫస్ట్ ఎయిడ్–ఫైర్ ఫైటింగ్ శిక్షణా తరగతులు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా సెక్యూరిటి అధికారి ఎండీ.జాకీర్హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రతీ యూనిఫాం సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్– ఫైర్ ఫైటింగ్పై అవగాహన కల్పించేందుకు సింగరేణి ప్రధాన ఆస్పత్రి, మైన్స్ రెస్క్యూస్టేషన్, ఫైర్ స్టేషన్ ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ అందించామన్నారు. తోటి వారు ఆపదలో ఉన్నప్పుడు, పని ప్రదేశాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే వాటిని నివారించి సింగరేణి ఆస్తులను పరిరక్షించాలో పూర్తిగా వివరించారు. అనంతరం శ్రీజ్యోతి అనాథ వృద్ధుల శరణాలయ నిర్వాహకులకు సెక్యూరిటీ సిబ్బంది చేత నిత్యావసర సరుకులను వితరణగా అందించారు. ఆతర్వాత శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎం.పెద్దులు, డి.అజయ్లకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఇన్స్పెక్టర్ డి.నారాయణరెడ్డి, సెక్యూరిటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 17న నందీశ్వరస్వామికి అభిషేక పూజలు పాల్వంచరూరల్: మండల పరిధిలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయ సముదాయంలోని శివాలయంలో ఈనెల 17 మంగళవారం మాఘమాస త్రయోదశిని పురష్కరించుకుని నందీశ్వరస్వామికి అభిషేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రదోషకాలంలో సాయంత్రం 5.30 గంటలకు నందీశ్వరస్వామికి పంచామృతాభిషేకం, అష్టోత్తర శతనామార్చన, మంత్రపుష్పం జరగనున్నట్లు చెప్పారు. -
కలెక్టర్ అంకిత్
ఎల్పీజీ గ్యాస్ కొరత లేదుసూపర్బజార్(కొత్తగూడెం):జిల్లాలోఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతోందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. గ్యాస్ కొరత ఉందన్న వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. కలెక్టరేట్లో శనివారం ఎస్పీ రోహిత్రాజు, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి పౌరసరఫరాలు, రెవెన్యూ, విద్య, వైద్య ఆరో గ్య, పోలీస్ శాఖలు, వివిధ సంక్షేమ గురుకులాల అధికారులు, ఎల్పీజీ సేల్స్ అధికారులు, జిల్లాలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల యజమానులతో గ్యాస్ సరఫరాపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గృహ వినియోగదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతోందన్నారు. ఆసుపత్రులు, విద్యాసంస్థలు,ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాలు వంటిఅత్యవసరసేవలకు గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు.. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్ బుకింగ్కు 45 రోజుల వ్యవధి ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల వ్యవధి అనంతరమే రీఫిల్ బుకింగ్కు అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్కు తరలించినా, హోటళ్లు, కమర్షియల్ సంస్థలు గృహ వినియోగానికి కేటాయించిన సబ్సిడీ సిలిండర్లను ఉపయోగించినా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీలర్లు రోజూ గ్యాస్ నిల్వలు, బుకింగ్ స్థితి, డెలి వరీ వివరాలు వంటి సమాచారాన్ని ప్రభుత్వానికి అందించాలని సూచించారు. పారదర్శకంగా గ్యాస్ సిలిండర్లు అందేలా డివి జన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిరు వ్యాపారులకు అవసరమైన 5 కేజీల సిలిండర్లు సరఫరా చేయాలన్నారు. ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గోదాముల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నాన్నను అమ్మే చంపేసింది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రియుడి సాయంతో భర్తను హతమార్చిన మహిళ.. మద్యం మత్తులో కింద పడి గాయాలై మృతి చెందాడని అందరినీ నమ్మించింది. నిజమేనని భావించి కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, ఈ దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె తన తండ్రిని అమ్మతోపాటు మరో వ్యక్తి చంపేశాడని చెప్పడంతో విషయం బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన సెంట్రింగ్ కూలీ ఎస్డీ జాఫర్కు 13 ఏళ్ల క్రితం ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఖతిజాతో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. కుమారుడు హాస్టల్లో ఉంటూ చదువుతుండగా, కూతురు వీరితోనే ఉంటోంది. వివాహం తర్వాత వీరు పదేళ్లపాటు తిప్పనపల్లిలోనే ఉన్నారు. అనంతరం ఈ దంపతులు మూడేళ్లు చింతలపూడిలో ఉన్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మీరాతో ఖతిజాకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం జాఫర్కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆరు నెలల క్రితం మళ్లీ తిప్పనపల్లి వచ్చేశారు. అయినా మీరాతో ఖతి జా ఫోన్లో రహస్యంగా మాట్లా డేది. ఈ విషయాన్ని కూడా జాఫర్ గుర్తించడంతో పది రోజులుగా తీవ్రంగా గొడవలు జరుగుతున్నా యి. దీంతో తమకు అడ్డుగా ఉన్న భర్తను హతమార్చాలని నిర్ణయించుకున్న ఖతీజా ఈనెల 11న ప్రియుడికి సమా చారం ఇచ్చింది. అదేరోజు మీరా అర్ధరాత్రి తిప్పనపల్లి చేరుకున్నాడు. ఖతీజా సాయంతో నిద్రిస్తున్న జాఫర్ ముఖంపై దిండుతో అదిమి పట్టి చంపేశాక మీరా తిరిగి వెళ్లిపోయాడు. అయితే, మద్యం తాగి వచ్చిన భర్త కింద పడటంతో గాయాలయ్యాయని, గురువారం ఉదయంకల్లా చనిపోయాడని ఖతిజా అందరినీ నమ్మించింది. దీంతో కుటుంబీకులు సహజ మరణంగా భావించి అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, కుటుంబీకులు శుక్రవారం మృతుని కూతురుతో మాట్లాడుతుండగా తండ్రిని తల్లి సహా మరో వ్యక్తి కలిసి చంపేశారని చెప్పింది. దీంతో వారు ఖతిజాను చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జూలూరు పాడు సీఐ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. -
ఆదివాసీల సంక్షేమానికి కృషి
కరకగూడెం/పినపాక: వలస ఆదివాసీ గ్రామాల అభివృద్ధి, సంక్షేమం కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శుక్రవారం వలస ఆదివాసీ గ్రామం నీలాద్రిపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పినపాక మండలం పాండురంగాపురం గ్రామపంచాయతీ దేవగిరి నగరంలో ఉన్న ప్రాచీన రాకాసి గూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని సూచించారు. చట్ట వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసేకుంటూ విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాలు అందేలా చూస్తామన్నారు. గ్రామాల్లోకి అనుమానాస్పద వ్యక్తులు ప్రవేశిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం మహిళలకు చీరలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. యువతకు టీ షర్టులు, వాలీబాల్ కిట్లు అందజేశారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోటుబుక్స్, సోలార్ స్టడీ ల్యాంపులను పంపిణీ చేశారు. కాసేపు యువతతో వాలీబాల్ ఆడి సందడి చేశారు. వైద్య శిబిరంలో దాదాపు 300 మంది ఆదివాసీలు సేవలు పొందారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేందర్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు పీవీఎన్.రావు, సురేష్, ప్రభుత్వ వైద్యాధికారి రవితేజ పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్ రాజు -
పుష్కర ఘాట్లు పెంచుతాం
భద్రాచలం: గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్యకు తగినట్లు ఘాట్ల సంఖ్య పెంచుతామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్టలతో కలిసి పుష్కరాల కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వాజేడు, వెంకటాపురం మధ్యలోని సుబ్బంపేట, మల్లేపల్లి గ్రామాల్లో గోదావరి ఘాట్లను నిర్మించాలని కోరారు. పరీవాహక ప్రాంతాల్లోని పురా తన, ఉపాలయాలను అభివృద్ధి చేయాలన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ భక్తులకు తగినట్లు ఘాట్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నా రు. రోడ్లకు మరమ్మతులు, కొత్తరోడ్ల నిర్మాణం చేపడతామని, సారపాక బ్రిడ్జి పక్కన ఘాట్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తామని వివరించారు. భద్రాచలం వచ్చే అన్ని రూట్లలో విద్యుత్ దీపాలు అలంకరిస్తామని, కరకట్ట ఎత్తు కూడా పెంచుతామని పేర్కొన్నారు. అనంతరం గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ చెత్త వేస్తే జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆ తర్వాత సీతారామ కల్యాణం నిర్వహించే మిథిలా స్టేడియంలో ఏర్పాట్లపై దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు వెంకటేశ్వర్, నాగేశ్వరరావు, సంజీవరావు, వెంకటేశ్వర్లు, రవీందర్, ధనియాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాపై పర్యవేక్షణ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో గ్యాస్ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా పరిస్థితిపై సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించామని వివరించారు. పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, పౌరసరఫరాల మేనేజర్ త్రినాథ్ బాబు పాల్గొన్నారు. రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువత రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఎస్సీ కార్యచరణ ప్రణాళిక–2025–26 ప్రకటించిందని పేర్కొన్నారు బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణాల కోసం ఈవీ టూ వీలర్, ఈవీ త్రీ వీలర్, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాకు 276 యూనిట్లకు రూ.265.28 లక్షల సబ్సిడీతో అందించిచనున్నట్లు తెలిపారు. రూ. లక్ష వరకు 90 శాతం సబ్సిడీ, రూ 2 లక్షలకు 80 శాతం సబ్సిడీ, రూ 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ, రూ.4 లక్షలు ఆపైన ఎంపిక చేసుకునే పథకాలకు 60 శాతం సబ్సిడీతో బ్యాంకుల ద్వారా రుణాలను అందజేస్తారని వివరించారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులను కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. జనరల్ ఆస్పత్రిలో తనిఖీ చుంచుపల్లి: కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో కలెక్టర్ అంకిత్ శుక్రవారం తనిఖీ చేశారు. వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్యసిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. ఔషధాల నిల్వగదిని సందర్శించి మందుల స్టాక్ను పరిశీలించారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలనిఅధికారులను ఆదేశించారు. ఔట్ పేషెంట్ క్యూలైన్లను పరిశీలించి, ఓపీ సేవల వివరాలు తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చిన బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పా రు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్, డాక్టర్ చైతన్య, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాల నిర్వహణ మెరుగుపడాలి పాల్వంచ: వసతి గృహాల నిర్వహణ పటిష్టంగా ఉండాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బొల్లేరుగూడెంలో బీసీ హాస్టల్ను ఆయన తనిఖీ చేశారు. బియ్యం, పప్పులు, నిత్యవసర సరుకులు, కూరగాయలు తదితర ఆహార పదార్థా నిల్వలను, రిజిస్టర్లను పరిశీలిచారు. సౌకర్యాలపై ఆరా తీశారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. తహశీల్దార్ దారా ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల సమీక్షలో కలెక్టర్ అంకిత్ -
హమాలీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
ఇల్లెందు: పట్టణంలోని కొత్త కాలనీ 13వ వార్డుకు చెందిన హమాలీ మేసీ్త్ర ఉప్పరి సమ్మయ్య గురువారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సమ్మయ్య భార్య తార కథనం ప్రకారం... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేశారంటూ తన భర్త సమ్మయ్యతోపాటు మరో ముగ్గురు హమాలీలను విధుల నుంచి తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన సమ్మయ్య ఆత్మహత్యకు యత్నించగా, కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి..పాల్వంచరూరల్: కుటుంబ కలహాల కారణంగా శుక్రవారం ఓ వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని నాగారం కాలనీకి చెందిన బి.ప్రసాద్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాభర్తల కలహాలతో పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. టేకు కలప సీజ్పినపాక: మండలంలోని భూపతిరావుపేట సమీపంలో గోదావరి తీర ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు టేకు మొద్దులను శుక్రవారం అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ.బయ్యారం రేంజర్ తేజస్వి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. టేకు మొద్దులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. జానంపేట డిప్యూటీ రేంజర్ వెంకటేశ్వర్లు, బీట్ ఆఫీసర్ శ్యామ్ తదితర అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూ జలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరా ట్కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజ లతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీ కుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. ‘ఏకలవ్య’లో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ తనిఖీలుదమ్మపేట: ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన మండల పరిధిలోని గండుగులపల్లి ఏకలవ్య మోడ్రన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రామోజీ రమేష్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్కు గల కారణాలపై పాఠశాల ప్రిన్సిపాల్ సంజయ్ మలాకర్ ద్వారా ఆరా తీశారు. జిల్లా ఆహార భద్రత అధికారి శరత్, స్టోర్ రూమ్లోని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి, బాధ్యులకు పలు సూచనలు చేశారు. ఐటీసీ గేట్ వద్ద ఆందోళనబూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ మెయిన్గేట్ వద్ద గురువారం నాగినేనిప్రోలు గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆందోళన చేపట్టారు. నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో సీఎస్ఆర్ నిధులు చేపట్టిన డ్రెయినేజీ పనులకు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని పిలవకుండా ఎమ్మెల్యేతో శంకుస్థాపనలు చేసి తమను అవమానించారని ఐటీసీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ సరోజ మాట్లాడుతూ ప్రొటోకాల్ పాటించకుండా విపక్ష పార్టీలో ఉన్నామనే కారణంగా ఎమ్మెల్యే కూడా పంచాయతీ పాలకవర్గాన్ని అవమానించారని ఆరోపించారు. ఐటీసీ పీఎస్పీడీ జనరల్ మేనేజర్(హెచ్ఆర్) శ్యామ్కిరణ్ నచ్చజెప్పడంతో శాంతించి, ఆందోళన విరమించారు. -
బీడు భూముల్లో కరెంట్ పంట!
ఖమ్మంవ్యవసాయం: బీడు భూములే కదా అని వదిలేయకుండా పంట పండించే రోజులు వచ్చేశాయి! అయితే, ఇది సాధారణ పంట కాకుండా కరెంట్ పంట కావడం విశేషం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇళ్లపై సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్లు మంజూరు చేస్తుండగా, అన్నదాతల కోసం ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోంది. పంటల సాగుకు పనికి రాకుండా నిష్ప్రయోజనంగా ఉన్న భూముల ద్వారా ఆదాయం లభించేలా ప్రధాన మంత్రి కుసుమ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంపై రెడ్–కో(రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) సంస్థ ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో పట్టాలు కలిగిన బీడు, బంజర భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. 56 మంది.. 86 మెగావాట్లు ఉమ్మడి జిల్లాలో పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటి వరకు 56మంది రైతులు ముందుకొచ్చారు. తమకు ఉన్న బీడుభూముల్లో నిర్మాణం వ్యయం ఆధారంగా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 86 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యం కలిగిన ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో ఖమ్మం జిల్లాలో 43 మంది రైతులు 70 మెగావాట్ల సామర్ద్యం కలిగిన ప్లాంట్లు నిర్మిస్తుండగా, భద్రాద్రి జిల్లాలో 13 మంది 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడలో బీరవల్లి శ్రీనివాసరావు తన భూమిలో 2 మెగావాట్ల సామర్ద్యం కలిగిన ప్లాంట్ను ఏర్పాటుచేయడంతో ఇటీవలే గ్రిడ్కు అనుసంధానం చేశారు. బీడు భూముల కలిగిన రైతులు ఇన్నాళ్లు ఏ పంట పండించలేక వదిలేస్తున్నారు. ఇప్పుడు ఆయా భూముల్లో కేంద్రం సోలార్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 3.20 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగి ఉండాలి. ప్లాంట్ ఏర్పాటుకు రూ. 3.20 కోట్ల నుంచి రూ.3.60 కోట్లు ఖర్చవుతుండగా పీఎం కుసుం పథకం ద్వారా 70 – 85 శాతం రుణ సౌకర్యాన్ని 12ఏళ్ల కాలపరిమితితో కల్పిస్తారు. 15 – 30 శాతం తమ వాటా చెల్లించాలి. 12 ఏళ్ల కాలపరిమితితో రుణసౌకర్యం కల్పిస్తారు. ప్లాంట్ ఏర్పాటుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రైతుల నుంచి ఒప్పదం కుదుర్చుకుంటుంది. తద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తితో రైతులకు ఏటా రూ.53 లక్షల నుంచి రూ.55 లక్షల ఆదాయం సమకూరుతుంది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులకు ఆదాయం సాగుకు పనికిరాని, నీటి వనరులు లేక వృథాగా వదిలేస్తున్న భూముల్లో రైతులు పీఎం కుసమ్ పథకం ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేసుకోవచ్చు. తద్వారా నిరంతరం ఆదాయం సమకూరుతుంది. దరఖాస్తు ఈనెల 31 వరకు అవకాశం ఉన్నందున అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – పి.అజయ్కుమార్, మేనేజర్, రెడ్కో ఉమ్మడి జిల్లా -
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం కెమిస్ట్రీ పేపర్–2, కామర్స్ పేపర్–2 పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 7,885 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 7,641 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని, అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశామని వివరించారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్నకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం సరిరామ్ తెలి పా రు. బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీఏ, ఇంజ నీరింగ్ / డిప్లమా తదితర డిగ్రీ కోర్సులు పూర్తి చేసినఅభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 2021 తర్వాత డిగ్రీపూర్తి చేసిన వారు దరఖా స్తు చేసుకోవచ్చనితెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు కేంద్రప్రభుత్వ ఎన్టీఏ 2.0 పోర్టల్ https:// nats. education. gov.in ద్వారా ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. ఎంపికై న వారికి ఆర్టీసీ ఖమ్మం రీజి యన్ పరిధిలోనిడిపోలు, వర్క్షాపుల్లో అప్రెంటిస్షిప్ శిక్షణ ఇస్తామని ఆర్ఎం తెలిపారు. కృత్రిమ మేధతో అభ్యసన అభివృద్ధికొత్తగూడెంఅర్బన్: కృత్రిమ మేధతో అభ్యసన అభివృద్ధి సాధించాలని జిల్లా అకాడమిక్ మాని టరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్ అన్నారు. జిల్లాలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న 84 పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు కృత్రిమ మేధ ద్వారా అభ్యసన అభివృద్ధి అనే కార్యక్రమంపై రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. శుక్రవా రం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత ఫిబ్రవరిలో 6 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభిచామని, ఈ సంవత్సరం 84 పాఠశాలకు విస్తరించామ ని వివరించారు. 592 మంది విద్యార్థులకు చేరువ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు 65 మంది ఉపాధ్యాయులు, రెండో రోజు 70 మంది, మొత్తం 135 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్గా రేణుక, వెంకట నిర్మల, పుష్పశ్రీ, శేషగిరిరావు, శ్రీనివాసరావు వ్యవహరించారు. హోటళ్లు, దుకాణాల్లో తనిఖీలు జూలూరుపాడు: జూలూరుపాడులో హోటళ్లు, దుకాణాల్లో శుక్రవారం పౌరసరఫరాల శాఖ, రెవె న్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించా రు. హోటళ్లలో వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. దుకాణాల్లో, అక్రమంగా గ్యాస్ సిలిండర్లు నిల్వచేసిన ప్రాంతాల్లో తనిఖీచేసి, గ్యాస్ సిలిండర్లు పట్టుకున్నారు. 34 గ్యాస్ సిలిండర్లు పట్టుకున్నామని, ఇందులో 33ఖాళీ సిలిండర్లు, ఒకటి ఫుల్ సిలిండర్ ఉన్నాయని కొత్తగూడెం ఏసీఎస్ఓ ఆర్.వరదరాజులు తెలిపారు. డీటీ రాజులు, ఆర్ఐలు ఎన్.వెంకటేశ్వర్లు, రాంబాబు పాల్గొన్నారు. స్నేహానికి నిదర్శనం ఇఫ్తార్ విందుఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లెందు: త్యాగం, స్నేహానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని సింగరేణి స్కూల్ ఆవరణలో ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలపగా, వారు ఎమ్మెల్యేకు దట్టి కట్టి టోపీతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడారు. ఎమ్మెల్యే సతీమణి లక్ష్మి, మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, వీసీ మార్కెట్ రాజు, సర్పంచ్లు, ముస్లిం కౌన్సిలర్లు ఖుష్భూ, సైదామియా, ఎండీ జాఫర్, ముస్లిం పెద్దలు, మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, డి. వెంకటేశ్వరరావు, యదళ్లపల్లి అనసూర్య పాల్గొన్నారు. -
ముత్యాల తలంబ్రాలు
ముంగిటకే.. ● దేవస్థానం, పోస్టల్, ఆర్టీసీ కార్గోల ద్వారా చేరవేత ● 3.5 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న అధికారులు ● రామయ్య కల్యాణానికి రాలేని భక్తులకు అందజేతభద్రాచలం: ఎంతో పవిత్రంగా భావించే ముత్యాల తలంబ్రాలు భక్తుల చెంతకే రానున్నాయి. శ్రీసీతారామ చంద్రస్వామి కల్యాణంలో వినియోగించే వీటిపై భక్తులు అమితాసక్తి చూపుతున్నారు. దీంతో దేవస్థానం ఆధ్వర్యంలో అవసరం మేర ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. ఆలయ వెబ్సైట్లో బుకింగ్ అవకాశం కల్పించగా, పోస్టల్ ఆర్టీసీ సంస్థలు కూడా తలంబ్రాల చేరవేతలో పాలుపంచుకుంటున్నాయి. మొత్తంగా భద్రగిరి ముత్యాల తలంబ్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భక్తుల వద్దకు చేరుతుండటం విశేషం. మూడున్నర లక్షల ప్యాకెట్లకు పైగా.. తొలినాళ్లల్లో ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను చేతితో తయారు చేసేవారు. అనంతరం కాలంలో డిమాండ్ భారీగా పెరగటంతో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన రెండు యంత్రాలతో ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో మిషన్ ద్వారా రోజుకు సుమారు పది వేల ప్యాకెట్లను తయారు చేస్తారు. ఈ నెల 6వ తేదీన ప్యాకింగ్ ప్రారంభం కాగా, ఉగాది లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి మూడున్నర లక్షల ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఇవి కాకుండా వీవీఐపీలు, ప్రముఖులు, వివిధ శాఖలకు అందించేందుకు మరికొన్ని ప్యాకెట్లను సిద్ధం చేస్తారు. ఇందుకోసం సుమారు25 క్వింటాళ్ల తలంబ్రాలు, పెద్ద ముత్యాలు 150 కేజీలు, చిన్న ముత్యాలు 150 కేజీలు వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. దేవస్థానం కార్గో, పోస్టల్ శాఖల ద్వారా.. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం వద్ద కౌంటర్లో రూ.25కు ఒక ముత్యం కలిగిన తలంబ్రాల ప్యాకెట్ను విక్రయిస్తారు. దేవస్థానం వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూ.60కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గ్రామాలకు చేరుస్తారు. ఇతర రాష్ట్రాలకు డెలివరీ చార్జీలు అదనంగా ఉంటాయి. ఇక ఆర్టీసీ సంస్థ కార్గో ద్వారా భక్తుల ఇంటికే తలంబ్రాలను అందిస్తోంది. కార్గోకు ఆదరణ లభిస్తుండగా, రూ.150కు రెండు ప్యాకెట్లను చేరవేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే సుమారు 6 వేల ప్యాకెట్లు ఆర్టీసీ ద్వారా బుక్ చేసుకోవడం విశేషం. ఇక పోస్టల్ శాఖ సైతం ఈ సేవలను అందిస్తోంది. గతేడాది రూ.110కు ఈ సేవలను అందించగా, ఈ ఏడాది చార్జీలను ప్రకటించి విడుదల చేయాల్సి ఉంది. ఆర్టీసీ కార్గో ద్వారా ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటి ముంగిటకు ఇవ్వటం 2023లో ప్రారంభించాం.తొలి ఏడాది కేవ లం 23 వేల ప్యాకెట్లను అందించాం. అనంతరం కాలంలో లక్షకు చేరింది. ఈ ఏడాది ఇప్పటికే బుకింగ్ ప్రారంభించాం. ఆర్టీసీ వెబ్సైట్లో సైతం బుక్ చేసుకోవచ్చు. రూ.150కు రెండు ప్యాకెట్లను జీఎస్టీతో కలిపి ఎక్కడికై నా బుక్ చేసుకోవచ్చు. –జంగయ్య, ఆర్టీసీ భద్రాచలం డిపో మేనేజర్ -
పరిమితికిమించి వైద్యం చేస్తే కఠినచర్యలు
దుమ్ముగూడెం: ఆర్ఎంపీలు, పీఎంపీలు పరిమితికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ హెచ్చరించారు. శుక్రవారం దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మండలంలోని ఆర్ఎంపీలు, పీఎంపీలతో సమావేశం నిర్వహించారు. దుమ్ముగూడెం, నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక మోతాదులో స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు ఇవ్వొద్దని హెచ్చరించారు. అనంతరం సిబ్బందితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీధర్, డీఐఓ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రతాప్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సిలిండర్!
ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తాలూకు ప్రతికూల ప్రభావం జిల్లాలో కూడా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్ల ధరకు బ్లాక్ మార్కెట్లో రెక్కలు వస్తున్నాయి. ఫలితంగా గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం● కమర్షియల్ సిలిండర్ సరఫరాలో కష్టాలు ● హోటళ్లలో తగ్గిన బిర్యానీ, ఇతర వంటకాల తయారీ ● బ్లాక్ మార్కెట్లో పెరుగుతున్న సిలిండర్ ధరలు ● జిల్లాను తాకిన పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపండుగ సీజన్లో హోటళ్లకు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంపై ప్రభుత్వ అధికారులు పునరాలోచన చేయాలి. గ్యాస్ పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతేనే రేషన్ పద్ధతిలో పరిమితంగానైనా గ్యాస్ అందివ్వాలి. – ఎండీ పాషా, రెయిన్బో హోటల్ యజమాని, కొత్తగూడెం ఇటీవల కాలంలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు కదా అని స్పేర్ సిలిండర్ను పెట్టుకోలేదు. ఉపయోగిస్తున్న సిలిండర్ అయిపోయింది. బుక్ చేసినా, సకాలంలో డెలివరీ కాలేదు. దీంతో చపాతీ సెంటర్ను మూసేశాం. – దేవరపల్లి అంబిక, చపాతీ సెంటర్, కేజీఎఫ్సీ ఫుడ్కోర్ట్ గృహ అవసరాలకు సంబంధించి రాబోయే రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయి. అయితే ముందు జాగ్రత్తగా ప్రైవే ట్ సెక్టార్కు కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆపేశాం. ప్రభుత్వ సెక్టార్లో ఉండే ఆస్పత్రులు, విద్యా సంస్థలకు అనుబంధంగా ఉండే హాస్టళ్లకు కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేస్తున్నాం. ప్రైవేట్ సెక్టార్కు సరఫరా ఆపేశాం. – ప్రేమ్కుమార్, జిల్లా అధికారి, పౌర సరఫరాల శాఖపశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సరఫరా సప్లై చెయిన్లో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై జిల్లా పౌర సరఫరాల శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. కమర్షియల్ సిలిండర్లను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల మెస్లు, గురుకుల పాఠశాల అవసరాల కోసం అట్టిపెట్టింది. హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా తగ్గించింది. మరోవైపు స్ట్రీట్ఫుడ్ సెక్టార్లో రోడ్ల వెంబడి తోపుడు బండ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు ఉపయోగించే గృహ అవసర సిలిండర్లపై నిఘా పెట్టింది. మార్చి 11న చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఒక్క కొత్తగూడెంలోనే 11 సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. మెనూలో కోత కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వంరేషన్ విధించడంతో హోటళ్ల నిర్వాహకులు తమ దగ్గరున్న స్టాక్ ను జాగ్రత్తగా వినియోగిస్తున్నారు. గ్యాస్ఎక్కువ అవ సరమయ్యే ఆహార పదార్థాలను మెనూ నుంచి తొలగిస్తున్నారు. నాన్ వెజ్ వంటకాలు, బిర్యానీల తయారీలో హోటల్/రెస్టారెంట్ యజ మానులు వెనకడుగు వేస్తున్నారు. సాధారణ అన్నం వండటానికంటే బిర్యా నీ వండేందుకు నాలుగురెట్ల వరకు గ్యాస్ వినియోగించాల్సి వస్తోంది. దీంతో పరిమితంగా నాన్ వెజ్, బిర్యానీ వంటివి చేస్తున్నారు. దీంతో ఈ వంటకాలు క్షణాల్లో అయిపోతున్నాయి. మరోవైపు ఎర్ర సిలిండ ర్లు వినియోగించే చపాతీసెంటర్లు, బజ్జీలకొట్లు, పానీ పూరి బండ్లు, టీ స్టాల్స్ నడిపే చిరు వ్యాపారులు సైతం తమ కార్యకలాపాలు తగ్గించారు. పీక్ అవర్స్లోనే గంట రెండు గంటల సేపు అమ్మకాలు సాగించి, ఆ తర్వాత తమ వ్యాపారాలను కట్టిపెడుతున్నారు. రెక్కలు విచ్చుకున్న బ్లాక్ మార్కెట్ గ్యాస్ సరఫరా విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలకు బయట జరుగుతున్న ప్రచారా నికి పొంతన లేకుండా పోయింది. గ్యాస్ దొరకదనే వదంతులు విపరీతంగా ప్రాచుర్యంలోకి వస్తున్నా యి. ఇదే అదనుగా గ్యాస్ సిలిండర్లకు బ్లాక్ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. గృహ అమసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952 ఉండగా ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లో రెండు వేల రూపాయల వరకు పలుకుతోంది. ఇక కమర్షియల్ సిలిండర్ విషయానికి వస్తే అసలు ధర రూ.2067 ఉండగా పరిస్థితులను బట్టి రూ.3,500ల నుంచి రూ. 4,000ల వరకు చేతులు మారుతున్నాయి. గ్యాస్ వదంతులు జోరందుకోవడంతో పరిమితంగానే గ్యాస్ను విని యోగించే గృహస్తులు సైతం ముందుస్తుగా సిలిండర్లు బుక్ చేసుకోవడం మొదలెడుతున్నారు. మొత్తంగా పశ్చిమాసియాలో ఆకాశంలో క్షిపణులు దూసుకుపోతుంటే ఇక్కడ గ్యాస్ సిలిండర్ ధరలు చీకటి దందాలో సర్రుమంటూ ౖపైపెకి పోతున్నాయి. -
మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభం
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం వైరారోడ్డులో ఐటీ టవర్ ఎదురుగా ఏర్పాటుచేసిన మాంగళ్య షాపింగ్ మాల్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ మాల్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో దశాబ్దాల అనుభవం కలిగి మూడు రాష్ట్రాల్లో శాఖలు కలిగిన మాంగళ్య షాపింగ్ మాల్ను ఖమ్మంలో ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. యాజ మాన్యం పీఎన్.మూర్తి, కాసం నమఃశివాయ బ్రదర్స్ కృష్ణార్జునుల మాదిరిగా వ్యాపారం చేస్తూ త్వరలోనే తమిళనాడులో శాఖ ఏర్పాటుచేయనున్నారని పేర్కొన్నారు. అనంతరం సినీ నటి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.ఖమ్మం ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్కు ఆదరిస్తారని నమ్మకం ఉందని, తద్వారా మాల్ విజయవంతమవుతుందని తెలిపారు. ఆతర్వాత మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహమూర్తి, కాసం నమఃశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ప్రతీ సందర్భానికి కావాల్సిన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తుండడమే తమ విజయ రహస్యమని తెలిపారు. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో 30 బ్రాంచ్లు ఉండగా.. ఈ మూడు రాష్ట్రాల్లోనే 9–10 కొత్త ప్రాజెక్టులతో పాటు తమిళనాడులోనూ విస్తరించనున్నట్లు వెల్లడించారు. రూ.99 నుంచి ప్రారంభమై రూ.లక్ష వరకు ధరల శ్రేణిలో వస్త్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు విశాల్, వరుణ్, కార్తీక్, అరుణ్, పనీత్, సాయికృష్ణ పాల్గొన్నారు. -
గెలుపు మార్పునకు నాంది పలకాలి
పాల్వంచ: ప్రజాస్వామిక పద్ధతుల్లో సాధించిన గెలుపు సమాజ మార్పునకు నాంది పలకాలని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సుగుణా గార్డెన్స్లో సీపీఐ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు రెండు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ శిబి రం శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్పాషా అధ్యక్షతన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులకు రాజకీయ దృక్పథంతోపాటు ప్రత్యేక లక్ష్యం ఉండాలని సూచించారు. పాలన రాజ్యాంగానికి లోబడి జవాబుదారీతనంతో ఉండాలని చెప్పారు. కీలక నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించా లన్నారు. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పునకు కృషిచేయాలని చెప్పారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల్లో నైతికత లోపించిందని అన్నారు. డబ్బు ప్రాధాన్యం పెరగడంతో రాజకీయాలు కలుషితమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. క్రమంగా మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని అన్నారు. సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ భారత దేశంపై యుద్ద ప్రమాదం పడిందని,గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోతున్నాయని అన్నారు. దేశం మోదీ విధానాల వల్ల అబాసుపాలవుతోందని, దేశ ప్రధానిగా మోదీ వ్యవహారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు సాగిలపడినట్లు అయిందని విమర్శించా రు. రాష్ట్రంలో పేదలు నివసిస్తున్న స్థలాలను క్రమబద్ధీకరించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పన, విద్యావైద్యం, తాగునీరు తదితర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, నాయకులు బేడవాడ వెంకటేశ్వర్లు, ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, భిక్షపతి, సూర్యదేవర రామ్మోహన్ రావు, సిద్దులు, పద్మ, ఉమ, వాసిరెడ్డి మురళి పాల్గొన్నారు. సీపీఐ రాజకీయ శిక్షణ తరగతుల్లో వక్తలు -
నవమి గోడపత్రికల ఆవిష్కరణ
భద్రాచలం: భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల గోడపత్రికలు, ఆహ్వాన పత్రికలను శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లో ఆవిష్కరించారు. నవమి ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. తొలుత దేవస్థానం అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, దేవస్థానం ఈవో దామోదర్రావు, ఏఈవో భవాని రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు. -
పరీక్షలకు అంతరాయం లేకుండా చూడాలి
కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ రూరల్: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అంతరాయం లేకుండా చూడాలని డీఈఓ నాగలక్ష్మి అన్నారు. 73 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా, శుక్రవారం ఆమె కొత్తగూడెం, పాల్వంచలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పాల్వంచ మండలం కేశవాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాలయాల పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీఈఓ వెంట పలువురు అధికారులు ఉన్నారు. -
ప్రగతి ప్రణాళికలో భాగస్వాములవ్వాలి
ఇల్లెందురూరల్/టేకులపల్లి: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధి కారులు సమష్టిగా భాగస్వాములవ్వాలని గ్రామీణా భివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాలత సూచించారు. ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల గ్రామపంచాయతీ పరిధిలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. టేకులపల్లి మండలంలో ప్రగతి ప్రణాళికలో భాగంగా సాగుతున్న పనులను సందర్శించారు. చీపురు పట్టి పరిసరా లను పరిశుభ్రం చేశారు. డ్రైన్ ఎండ్ సోక్ నిర్మాణం ప్రారంభించారు. అజోల్లా పిట్, నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల కోసం క్లష్టర్కోటి చొప్పున మీటింగ్ హాల్ నిర్మాణం కోసం రూ. 20లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బంది ప్రజారోగ్యం మెరుగ్గా ఉండేలా వైద్యశిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించా లని సూచించారు. మిషన్ భగీరథ నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఫ్రైడే, డ్రైడే నిర్వహించారు. వీధుల్లో అవగా హన ర్యాలీ చేపట్టారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్ , డీఎల్పీవో ప్రభాకర్ అధికారులు బైరు మల్లేశ్వరి, గణేష్ గాంధీ, ధన్సింగ్, చిరంజీవి, పద్మావతి, ఇతర అధికారులు, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి
టీయూఎఫ్ఐడీసీ ఈఈ రవి శంకర్ అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని టీయూఎఫ్ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఈఈ రవి శంకర్ అన్నారు. శుక్రవారం ఆయన 99 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణంలోని పశు సంవర్ధక శాఖ కార్యాలయం, పాత ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను పరిశీలించారు. నీటి తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. వేసవి కాలం నేపథ్యంలో పట్టణంలో తాగునీటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. సంత వేలం నేటికి వాయిదాకామేపల్లి: కొమ్మినేపల్లి(పండితాపురం)లోని శ్రీకృష్ణప్రసాద్ పశువుల వారాంతపు సంత కౌలు వేలాన్ని వాయిదా వేశారు. ఈ వేలం శుక్రవారం జరుగుతుందని ప్రకటించగా, గ్రామానికి చెందిన భూక్యా వీరన్న, బోడా గణేష్, బోడా శ్రీను, ధరావత్ విన్నిబాబు, గుగులోత్ వినోద్కుమార్ ధరావత్ సొమ్ము, సాల్వెన్సీ రూ.35 లక్షల చొప్పున చెల్లించి హాజరయ్యారు. మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్ట్యా వేలం వద్ద బందోబస్తు ఏర్పాటుచేయలేమని పోలీసులు వెల్లడించారు. దీంతో వేలాన్ని శనివారానికి వాయిదా వేశారు. -
రంజాన్ తోఫా.. ఇఫ్తార్ నిధులు
● నియోజకవర్గాలకు చేరిన గిఫ్టు ప్యాకెట్లు ● ఇఫ్తార్ విందుకు కూడా నిధులు కేటాయింపు ● అరకొర కేటాయింపులతో ముస్లింల్లో నిరాశఅశ్వారావుపేటరూరల్: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు తోఫా(గిఫ్టు)తోపాటు ఉపవాస దీక్షదారులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 26 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా మైనార్టీ శాఖ ద్వారా ఆయా గిఫ్టు ప్యాకెట్లు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చేరగా, మండలాల వారీగా లబ్ధిదారులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు మొత్తం 4 వేల గిఫ్టు ప్యాకెట్లు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గానికి అత్యధికం మంజూరు కాగా, భద్రాచలం నియోజకవర్గానికి అతి తక్కువగా మంజూరు చేశారు. తోఫా ప్యాకెట్లో మహిళల కోసం చీర, జాకెట్, పంజాబీ డ్రెస్, పురుషులకు లాల్చీ, పైజామా ఇవ్వనున్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో మసీదు కమిటీలను భాగస్వామ్యం చేసి లబ్ధిదారులకు అందించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇఫ్తార్కు నిధులు కేటాయింపు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు నిధులు కేటాయించారు. ఒక్కో మసీదుకు రూ. లక్ష చొప్పున జిల్లాలో 16 మసీదులకు రూ.16 లక్షలు మంజూరు చేశారు. వాస్తవంగా జిల్లాలో 149 మసీదులు గుర్తింపు పొంది ఉండగా, కేవలం 16 మసీదులకే నిధులు కేటాయించడంపై నిరాశ వ్యక్తమవుతోంది. జిల్లాలో 63వేల మంది ముస్లిం జనాభా ఉండగా, కేవలం 4 వేల గిఫ్టు ప్యాకెట్లు కేటాయించడంపైనా విమర్శలు వస్తున్నాయి. అరకొర కేటాయింపులతో ప్రభుత్వం ముస్లింలను చిన్నచూపు చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.నియోజకవర్గం తోఫా ప్యాకెట్లు కొత్తగూడెం 1250 అశ్వారావుపేట 750 పినపాక 750 ఇల్లెందు 750 భద్రాచలం 500రంజాన్ మాసం పురస్కరించుకొని రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు గిఫ్టులు, ఇఫ్తార్ విందుకు నిధులు కేటాయించడం హర్షణీయం. గిఫ్టులు, ఇఫ్తార్ విందు నిధులు అరకొరగా కేటాయించడం సరికాదు. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చుకోవాలి. – ఎండీ యాకూబ్ పాషా, మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
గిరిజన ఉత్పత్తులన్నీ భద్రగిరి మార్ట్లో..
భద్రాచలం: గిరిజన ఉత్పత్తులన్నింటిని భద్రగిరి మార్ట్లో అందుబాటులో ఉంచుతామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఎస్హెచ్జీ గ్రూపు మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, గిరిజన రైతుల నుంచి సేకరించాల్సిన బియ్యం, పప్పుధాన్యాల వివరా లు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడు తూ తేనె, మిల్లెట్ బిస్కెట్లు, పప్పుధాన్యాలు, వివిధ రకాల బియ్యం తదితర సరుకులు ఆర్గానిక్గా ఉండాలని సూచించారు. భద్రగిరి మార్ట్ను శ్రీరామనవమికి ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తికావా లని ఆదేశించారు. అనంతరం వ్యవసాయశాఖ అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రగిరి మార్ట్కు సహకారం అందిచాలని, గిరిజన రైతులు సేంద్రియ ఎరువులతో పండించే పంటలను మార్ట్లో విక్రయించాలని సూచించారు. డేవిడ్రాజ్, ఉదయ్ కుమార్, రాంబాబు, వేణు, రమేష్, గన్యా, సమ్మ య్య, ప్రభాకర్రావు, హరికృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించాలిఎటువంటి భయాందోళనలు లేకుండా పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలి తాలు సాధించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ సూచించారు. శుక్రవారం భద్రాచలం గురుకుల కళాశాలలో పదో తరగతి విద్యార్థినులకు పరీక్షా కిట్లను, హాల్ టికెట్లను పంపిణీ చేసి మాట్లాడారు. సమాధానాలు అర్థమయ్యే రీతి లో చేతిరాత ఉండాలని సూచించారు. గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, కళాశాల ప్రిన్సి పాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
భద్రాచలం: గిరిజన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలను సాధించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అఽధికారి రాహుల్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువు పూర్తి చేసుకున్న ఆలెం వెంకటప్రసాద్, కురుస నవీన్ ఈ నెల 25 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ఛతీస్గఢ్లో జరిగే ఆలిండియా ట్రైబల్ కేలో ఇండియా రెజ్లింగ్ క్రీడల్లో పాల్గొననున్నారు. గురువారం పీఓ తన చాంబర్లో వారికి క్రీడా సామగ్రి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికై విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడల అధికారి గోపాలరావు, ఏఎస్ఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
‘పది’కి సన్నద్ధం
● రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ● 73 కేంద్రాలు.. 13,141 మంది విద్యార్థులు ● ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు ● సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ కొత్తగూడెంఅర్బన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 73 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 12,731 రెగ్యులర్, 410 మంది సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 73 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, ఏడుగురు అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారులు, 73 మంది సిట్టింగ్ స్క్వాడ్, ఐదుగురు ఫ్లయింగ్ స్క్వాడ్, 832 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు.. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో విద్యార్థులకు చల్లటి తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా సందేహాల నివృత్తికి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏమైనా సందేహాలుంటే 99666 00678 నంబర్కు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఐదు నిమిషాల వరకు గడువు.. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుండగా, ఆ తర్వాత ఐదు నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతించనున్నారు. అయితే విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్షలు రాయాలని అధికారులు చెబుతున్నారు. కాగా, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను ప్రతీ కేంద్రం వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షల సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయిస్తారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్టాన్రిక్ వస్తువులకు అనుమతి లేదని ఇప్పటికే వెల్లడించారు. పరీక్షలకు ముందే హాల్ టికెట్లు తీసుకోవాలని, ఏదైనా పాఠశాలలో సంబంధిత యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వకుంటే ఫిర్యాదు చేయొచ్చని, లేదంటే వెబ్సైట్ నుంచి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకున్నా అనుమతిస్తామని అధికారులు వివరించారు. అన్ని పరీక్ష కేంద్రాల వైపూ సకాలంలో బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు పరీక్షలు.. గతంలో మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఒక్కో పరీక్షకు మధ్య నాలుగైదు రోజుల వ్యవధి ఉండనుంది. విరామ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, శ్రద్ధగా చదివి ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. పరీక్షలు లేని రోజుల్లో తప్పనిసరిగా పాఠశాలకు రావాలని చెబుతున్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సైతం ఇటీవల టీ – శాట్ ద్వారా పరీక్షలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కాగా, గతేడాది కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధిస్తామని విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు ఽధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం చేశాం. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు, తాగునీరు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం. పరీక్ష సమయానికి అనుకూలంగా బస్సులు నడిచేలా ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేశాం. విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. – నాగలక్ష్మి, డీఈఓ -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తగా నిర్వహించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు. కాగా, పెద్దమ్మతల్లి ఆలయంలో ఈనెల 19 నుంచి 27 వరకు శ్రీదేవీ వసంత నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. ప్రతీ రోజు గణపతిపూజ, పుణ్యావాచనం, పంచగవ్య ప్రాసన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి లక్ష కుసుమార్చన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 28న జాతీయ లోక్ అదాలత్జిల్లా జడ్జి పాటిల్ వసంత్ సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 28న జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. చెక్ బౌన్స్, బ్యాంకు రికవరీ, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహారం, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, ఆస్తి పంపకాలు, అద్దె వివాదాలు, ఇతర సివిల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ–చలాన్, సైబర్ క్రైమ్, చోరీ, మనోవర్తి తదితర కేసులను పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా తక్షణమే తీర్పు లభిస్తుందని, లోక్ అదాలత్లో గెలుపు ఓటములు ఉండవని, ఇరుపక్షాల అంగీకారంతోనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలోని కక్షిదారులు, ప్రతివాదులు తమ న్యాయవాదుల ద్వారా లేదంటే నేరుగా సంబంధిత కోర్టులలో సంప్రదించి తమ కేసులను లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని సూచించారు. Ð]l¬Wíܯ]l C…rÆŠæḥ ప్రథమ సంవత్సర పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు గురువారం ముగిశాయని డీఐఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. చివరి రోజున జిల్లాలోని 37 కేంద్రాల్లో మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించామని, మొత్తం 9,150 మంది విద్యార్థులకు గాను 8,660 మంది హాజరయ్యారని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని, మాల్ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. -
మత్తుకు బానిస కావొద్దు
ఎస్పీ రోహిత్ రాజు చుంచుపల్లి: మత్తుకు బానిస అయితే జీవితం అంధకారంగా మారుతుందని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. లక్ష్మీదేవిపల్లి పోలీసులు, ఈగ ల్ టీమ్ ఆధ్వర్యంలో చాతకొండ రోడ్డులోని కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో భాగంగా డ్రగ్స్ విని యోగంపై గురువారం నిర్వహించిన అవగాహ న కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను ఏర్పరచుకుని, ఆ లక్ష్యాలను సాధించే దిశగా కష్టపడి చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ ఉండాలని అన్నా రు. జిల్లాలో గంజాయి మహమ్మారిని అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది నుంచి ఇప్పటివరకు సుమారు 6,500 కేజీల గంజాయిని సీజ్ చేశామన్నారు. అనంతరం అందరూ ప్రతిజ్ఞ చేశారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఫారెస్ట్ డివిజనల్ అధికారి కోటేశ్వరరావు, ఎకై ్సజ్ అడిషనల్ ఎస్పీ కరంచంద్, ఎంఈఓ కృష్ణయ్య, సీఐలు రామ్ ప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్సై రమణారెడ్డి పాల్గొన్నారు. ‘ప్రాణం తీసిన పైసలు’ పుస్తకం ఆవిష్కరణఇల్లెందు: పట్టణానికి చెందిన టీబీజీకేఎస్ నేత ఎస్.రంగనాథ్ రచించిన ‘ప్రాణం తీసిన పైసలు’ పుస్తకాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. గురువారం హైదరాబాద్లో కేసీఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కవులు, కళాకారులు ఇలాంటి పుస్తకాలు తీసుకురావటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులుఅశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు సంగు కిరణ్కుమార్ బ్రెయిన్ స్ట్రోక్తో అపస్మారక స్థితికి వెళ్లాడు. ఖమ్మంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కూలి పనులు చేసుకుని జీవించే కుటుంబం కావడంతో కిరణ్ తల్లిదండ్రులు వైద్య ఖర్చులకు ఆర్థిక స్థోమత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిస్సహాయ స్థితిలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుమారుడి వైద్యం కోసం సహాయం చేయాలని దాతలను కోరుతున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి మెరుగైన వైద్యం అందించాలని వేడుకుంటున్నారు. ఆర్థికసాయం చేయాల్సిన ఫోన్ పే నంబర్ 9848137116 (తాటిపాముల రమేష్). మట్టి తరలించకుండా కందకం..ములకలపల్లి: సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐపీ) ప్రధాన కాలువ మట్టి అక్రమ తోలకాలను అడ్డుకునేందుకు అధికారులు దృష్టి సారించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలు కలిసి కాలువకు వెళ్లే ప్రధాన దారికి అడ్డంగా గురువారం రాత్రి ట్రంచ్ (కందకం) తవ్వించారు. మాధారం–పూసుగూడెం అటవీ ప్రాంతంలోని కెనాల్ పరిసరాల్లోని మట్టి అర్ధరాత్రి వేళ భారీగా బయటకు తరలిపోతోంది. ఆర్అండ్బీ రోడ్డు సైడ్బర్మ్ పేరిట నవంబర్, డిసెంబర్ నెలల్లో నెలకు మూడు, నాలుగు రోజులపాటు అనుమతిపొంది ఇష్టారీతిన అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. పందెంరాయుళ్లపై కేసు నమోదుదమ్మపేట: మండలంలోని దురదపాడు గ్రామ శివారులో గురువారం కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడిచేశారు. ఏడుగురు పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. రెండు కోడి పుంజులు, రూ.8 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు. -
రామయ్య పెళ్లికి.. పోచంపల్లి కానుక
భద్రాచలం: భద్రగిరి క్షేత్రంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి సికింద్రాబాద్కు చెందిన పోచంపల్లి చేనేత కార్మికులు పట్టు వస్త్రాలను ప్రతి ఏడాది సమర్పిస్తారు. అయితే గత కొన్నేళ్లుగా భద్రాచలంలోనే ఈ వస్త్రాలను నేచి, స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం రోజున అందజేస్తున్నారు. చేనేత పనులను రంగనాయకుల గుట్టపైన ఉన్న భక్తరామదాసు మందిరంలో చేపట్టగా ఆలయ ఈఓ దామోదర్రావు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. చేనేత వస్త్రాల తయారీని ప్రారంభించిన ఈఓ -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు
కరకగూడెం: పాఠశాలల్లో విధి నిర్వహణలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని మైనింగ్ డీఈ, మండల ప్రత్యేకాధికారి దినేష్కుమార్ అన్నారు. మండలంలోని భట్టుపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. తరగతి, వసతి గదులు, డైనింగ్ హాల్, ఆర్వో వాటర్ప్లాంట్ పనితీ రును పరిశీలించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశా రు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థినులు ఆరో గ్యకరమైన వాతావరణంలో చదువుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బాలికల సంక్షేమం, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ వట్టం కాంతయ్య, పాఠశాల ఎస్ఓ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ తదితరులు ఉన్నారు. -
చికిత్స పొందుతున్న మహిళ మృతి
జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందిన సంఘటనపై గురువారం పోలీసులు కేసు మోదు చేశారు. ఏఎస్సై డి.వెంకట సుబ్బారావు కథనం ప్రకారం.. ఈ నెల 6న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీ కొండి కశ్యపు(51) తీవ్రంగా గాయపడింది. దీంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక స్థోమత లేక ఆమె ను భర్త ప్రైవేట్ ఆస్పత్రి నుంచి తీసుకెళ్లి ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి భర్త నాగ్ సుకుదేవ్ ఫిర్యాదుతో పోలీసులు రోడ్డు ప్రమాదానికి కారణమైన, అనంతారం గ్రామానికి చెందిన పూనెం చంద్రశేఖర్పై కేసు నమోదు చేశారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గర్భిణి..భద్రాచలంఅర్బన్: భద్రాచలంఏరియా ఆస్పత్రిలో గురువారం ఉదయం 24 వారా ల గర్భిణి మృతి చెందింది. బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీరాంపురానికి చెందిన గర్భిణి బుల్లెమ్మ (26) హెల్ప్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతూ ఈ నెల 9న ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు 24 గంటలపాటు పరిశీలనలో ఉంచారు. ఈ క్రమంలో 11న బాధితురాలికి బీపీ పెరిగి నోటి నుంచి రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు. జ్వరంతో జేఎన్టీయూ విద్యార్థిని..మణుగూరు టౌన్: మండలంలోని చాకలి ఐలమ్మనగర్కు చెందిన రాపర్తి అనూష(22) అనారోగ్యంతో హైదరాబాద్లో గురువారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని జేఎన్టీయూలో అనూష బీటెక్ చదువుతుండగా టైఫాయిడ్ జ్వరంతో 40 రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతోంది. వారం రోజుల క్రితం బ్రెయిన్ ట్యూమర్ కూడా రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. చదువులో ముందుండే అనూష మృతితో ఐలమ్మనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిరుపేద కుటుంబం కావడంతో మేము సైతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దహన సంస్కారాలకు రూ.3 వేలు ఆర్థికసాయం అందజేశారు. వరుస చోరీలతో భయాందోళనఇల్లెందురూరల్: మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న చోరీలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం ఒకే రోజు సుభాష్నగర్, సంజయ్నగర్ గ్రామాల్లో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. సుభాష్నగర్లోని సరికొండ గోప య్య, సంజయ్నగర్లో జానీమియా ఇద్దరు ఊరికి వెళ్లడంతో రాత్రి సమయంలో దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.20వేలు నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యంములకలపల్లి: వివాహిత అదృశ్యమైన ఘటనపై గురువారం పోలీసులు కేసు నమోదుచేశారు. ఎస్సైమధుప్రసాద్ కథనంప్రకారం.. మండలంలోని నల్లివారిగూడెం గ్రామానికి చెందిన మెహరీనా, భర్త మీరాతో కలిసి జీవనం సాగిస్తోంది. గత ఫిబ్రవరి 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన మెహరీనా తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కల్యాణం చూతము రారండి..!
● శ్రీరామనవమికి ప్రత్యేక బస్సులు ● ఉమ్మడి జిల్లాతో పాటు ఏపీ నుంచి సర్వీసులు ● హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు రిజర్వేషన్ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో శ్రీసీతా రామచంద్ర స్వామివారి కల్యాణ మహో త్సవానికి వచ్చే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 27, 28వ తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని డిపోల నుంచి షెడ్యూల్ సర్వీసులకు తోడు వీటిని నడిపిస్తారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భద్రాచలానికి బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి 234, ఆంధ్రప్రదేశ్ నుంచి 172 బస్సులు శ్రీరామనవమికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో మహాలక్ష్మి, ఆంధ్రప్రదేశ్లో సీ్త్ర–శక్తి పథకం అమల్లో ఉన్నందున భక్తుల సంఖ్య గణనీ యంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ నుంచి... హైదరాబాద్ నుంచి భద్రాచలానికి, భద్రాచలం నుంచి హైదరాబాద్కు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడమే కాక వీటిని రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇవికాక ఖమ్మం నుంచి నేరుగా హైదరాబాద్ ఒక బస్సు నడిపిస్తారు. ఖమ్మం రీజియన్లోని డిపోల నుంచి భద్రాచలానికి షెడ్యూల్ బస్సులతో పాటు అదనంగా 234 సర్వీసులు, భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే భక్తుల కోసం 30 బస్సులు ఏర్పాటు చేస్తారు. గత అనుభవాల దృష్ట్యా ఆర్టీసీ ఖమ్మం ఆర్ఎం ఏ.సరిరామ్ నేతృత్వాన అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రోజువారీ సర్వీసులకు అదనం ఉమ్మడి జిల్లా నుంచి భద్రాచలానికి రోజువారీ 113 సర్వీసులు కొనసాగుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా రెండు రోజుల పాటు మరో 121 బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి రోజువారీ 45 బస్సులకు తోడు అదనంగా 127బస్సులు ఏర్పాటు చేస్తారు. విజయవాడ – భద్రాచలం రూట్లో అత్యధికంగా 103 బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. విజయవాడ, రాజమండ్రి, గుంటూ రు, ఏలూరు, కాకినాడ, అమలాపురం వైపు వెళ్లే భక్తుల కోసం భద్రాచలం జూనియర్ కళాశాల మైదానంలో పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాయింట్లో దిగిన వారు ఆలయానికి వెళ్లేందుకు ఆలయ ఆర్చీవరకు రెండు ప్రత్యేక బస్సులను నిరంతరాయంగా నడిపిస్తూ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తారు.డిపో రూట్ బస్సుల సంఖ్య విజయవాడ విజయవాడ – భద్రాచలం 103 తిరువూరు తిరువూరు – భద్రాచలం 06 జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం – భద్రాచలం 15 తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం – భద్రాచలం 08 కాకినాడ కాకినాడ – భద్రాచలం 23 విశాఖపట్నం విశాఖపట్నం – భద్రాచలం 07 రాజమండ్రి రాజమండ్రి – భద్రాచలం 10 శ్రీరామనవమికి భద్రాచలం వచ్చే భక్తుల కోసం ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయి. అన్ని బస్టాండ్ల నుంచి రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపిస్తాం. ఇందులో ఖమ్మం, హైదరాబాద్కు ఎక్కువ సర్వీసులు ఉంటాయి. తెలంగాణ, ఏపీలోని ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నాం. ఏపీ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ కూడా అదనపు సర్వీసులు నడిపిస్తుంది. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్ -
పదో తరగతి విద్యార్థులకు తప్పనిపాట్లు
పాల్వంచరూరల్: పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండటంతో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్సైడ్ గిరిజన గురుకుల బాలుర కళాశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. యానంబైల్, ఉల్వనూరు, కిన్నెరసాని గ్రామాల పరిధిలోని విద్యార్థులకు ఇక్కడి కేంద్రం కేటాయించారు. 220 మంది విద్యార్థులను కేటా యించగా దూరాభారం కావడంతో అవస్థలు తప్పని పరిస్థితి నెలకొంది. పాల్వంచ మండలంలోని పాండురంగాపురం హైస్కూల్లో 32 మంది విద్యార్థులు ఉండగా, వీరికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని బూర్గంపాడు మండలం ఉప్పుసాక స్కూల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. నాగారం హైస్కూల్లో 35 మంది, జగన్నాథపురం హైస్కూల్లో 45 మంది విద్యార్థులు ఉండగా, వీరికి పాల్వంచ పట్టణంలో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. పునుకుల గ్రామంలో పదో తరగతి విద్యార్థులు 12 మంది ఉండగా, ఐదు కిలోమీటర్ల దూరంలోని కిన్నెరసాని వెళ్లి పరీక్ష రాయాల్సి ఉంది. ఒకవైపు ఎండల తీవ్రత, మరో వైపు కేంద్రాలు దూరంగా ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆటోల ద్వారా పరీక్షలకు పంపాల్సి వస్తుందని, ప్రభుత్వం స్పందించి కనీసం వాహన సౌకర్యమైనా కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా రేపటి నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈఏడాది కూడా దూరంగా పరీక్ష కేంద్రాల కేటాయింపు -
అందరి బంధువుకు ఆదరణేది?
పదేళ్ల వెనుకబాటు తనం తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల వద్ద మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని రూ. వందల కోట్లతో అభివృద్ధి చేశారు. వేములవాడలోనూ పనులు మొదలయ్యాయి. వరంగల్ వేయిస్తంభాల గుడి ప్రాంగణం విశాలంగా మారింది. రామప్ప ఆలయం ఏకంగా ప్రపంచ స్థాయి యునెస్కో గుర్తింపు దక్కించుకుంది. ఇటీవల సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని రాబోయే 200 ఏళ్లకు తగ్గట్టుగా గద్దెల ప్రాంగణాన్ని పునఃనిర్మించారు. రోడ్లు విస్తరించడంతో పాటు హోటళ్లు నిర్మించి కూడళ్లను అందంగా మార్చారు. జంపన్నవాగులో ఏడాది పొడవునా నీరుండేలా చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన కారణంగా ఎదురైన స్థల సమస్య, పోలవరం ముంపు కారణంగా గత పదేళ్లుగా భద్రాచలంలో చెప్పుకోదగిన అభివృద్ధి పనులేమీ జరగలేదు. ఆఖరికి పావన గోదావరి తీరంలో భక్తులు స్నానాలు ఆచరించే స్థలానికి ఎగువన నదిలో కలిసే మురుగునీరు కూడా మళ్లించలేని దుస్థితి ఇక్కడ నెలకొంది. కన్సల్టెన్సీ కావాల్సిందే.. రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భద్రాచలంలో చేపట్టే అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. మరి రాకరాక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో దేవాదాయ శాఖ ఏ మేరకు సఫలం అవుతుందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఎప్పటిలాగే భక్తుల సౌకర్యం పేరుతో షెడ్ల నిర్మాణం, కల్యాణకట్ట విస్తరణ, పిండప్రదానం గదులు అంటూ సాధారణ ప్రతిపాదనలతోనే సరిపెడతారనే ఆందోళన భక్తుల్లో నెలకొంది. బాసర టు భద్రాచలం వరకు చేపట్టే పనుల్లో రాజీ పడేది లేదని సర్కారు పదేపదే ప్రకటిస్తోంది. అందుకు తగ్గట్టే రాష్ట్రంలోనే పుష్కరాలకు సంబంధించిన నంబర్ వన్ స్థానంలో ఉండే భద్రాచలంలో చేపట్టబోయే పనులు గేమ్ చేంజర్లా ఉండాలని భక్తులు ఆశిస్తున్నారు. ఆ మేరకు ఈ రంగంలో అనుభవం కలిగిన కన్సల్టెన్సీలకు పుష్కర ప్రతిపాదనల రూపకల్పన పనులు అప్పగించాలనే డిమాండ్ వస్తోంది. ఇప్పటికే ఆలయ మాస్టర్ ప్లాన్ కోసం నియమించిన కన్సల్టెన్సీ గతంలో రిలీజ్ చేసిన ఆలయ నమూనా వివరాలు వైరల్గా మారిన వైనాన్ని భక్తులు గుర్తుచేసుకుంటున్నారు. అలా కాకుండా సాదాసీదా ప్రతిపాదనలతో సరిపెడితే మళ్లీ ఈ అవకాశం కోసం మరో పన్నెండేళ్ల వరకు వేచి చూడక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అభివృద్ధికి నోచుకోని భద్రగిరి భద్రాచలం అంటే గుర్తొచ్చేది ముందుగా శ్రీరామనవమి, ముక్కోటి పర్వదినాలు. ఇటీవల హనుమాన్ జయంతికి కూడా భక్తకోటి పోటెత్తుతోంది. ఆ రోజుల్లో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి. అయితే, ఒకటి రెండు రోజుల కోసమే తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు తప్పితే శాశ్వత పనులేమీ ఇక్కడ జరగడం లేదు. అప్పుడప్పుడూ అరకొరగా మిథిలా స్టేడియం, చిత్రకూట మండపం పేరుతో నిర్మాణాలు జరిగినా సాంకేతిక లోపాలు, నిర్వహణ పరమైన నిర్లక్ష్యంతో ఈ రెండూ సామాన్య భక్తులకు అంతగా ఉపయోగపడడం లేదు. పర్వదినాల్లో కిక్కిరిసిపోయే భక్తులు సర్దుకుపోయేందుకే ఇవి ఉపకరిస్తున్నాయి. వందేళ్ల చరిత్రను బయటకు తవ్వి తీసినా 2003, 2015 గోదావరి పుష్కరాల సందర్భాల్లోనే చెప్పుకోదగిన, నేటికీ భక్తులకు, భద్రాద్రి వాసులకు ఉపయోగపడే రీతిలో పనులు జరిగాయి. మళ్లీ 2027 జూలైలో పుష్కరాలు వస్తేనే భద్రాచలంలో అభివృద్ధి పనులకు, మాస్టర్ ప్లాన్కు మోక్షం లభిస్తుందనే పరిస్థితి నెలకొంది. -
‘సంక్షేమం’ అందరికీ అందాలి
ప్రజాప్రతినిధులకు కలెక్టర్ సూచనచుంచుపల్లి : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని, పార్టీలకతీతంగా అందరికీ సమ న్యాయం చేయాలని కలెక్టర్ అంకిత్ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇటీవల గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు స్థానిక కొత్తగూడెం క్లబ్లో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. ఈనెల 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగుతుందని, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా చూడడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాలు, పట్టణాల్లో అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే ప్రజా ప్రతినిధుల బాధ్యత అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ చేరేలా కృషి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను గుర్తించాలని, అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ముందుగా ఆయన తన పాటతో అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ అక్రమంగా నిల్వ చేస్తే చర్య తప్పదు సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో సాగుభూమి వివరాలు, ప్రస్తుత సాగు పరిస్థితులు, ప్రధాన పంటలు, రైతులకు అందుతున్న ప్రభుత్వ పథకాల అమలు పరిస్థితులపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలు, లబ్ధిదారుల సంఖ్య, రైతులకు అందుతున్న ప్రయోజనాలపై సమగ్ర సమాచారం అందించాలని సూచించారు. సాగునీటి వనరులను సమర్థంగా వినియోగిస్తూ రైతులకు సకాలంలో నీరందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గ్యాస్ నిల్వలు, రేషన్ దుకాణాలపై దృష్టి పెట్టాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నప్పటికీ, వినియోగదారులు కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే అధిక మొత్తంలో బుకింగ్ చేయడం వల్ల కొన్నిచోట్ల తాత్కాలిక సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, గ్యాస్ కొరత లేదనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, గ్యాస్ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఏఓ బాబూరావు, పౌర సరఫరాల అధికారి ప్రేమ్కుమార్, మేనేజర్ త్రినాథ్ బాబు, ఇరిగేషన్ ఈఈ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలి
భద్రాచలంఅర్బన్ : శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కరీంనగర్ ఈడీ సోలోమన్ అన్నారు. భద్రాచలంలో గురువారం ఆయన ఖమ్మం ఆర్ఎం సరిరామ్, డిప్యూటీ ఆర్ఎం మల్లయ్యతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామయ్య కల్యాణానికి వచ్చిన ప్రతీ భక్తుడిని తిరిగి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలని, ఈ మేరకు ప్రతీ ఉద్యోగి కృషి చేసి ఆర్టీసీకి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నందున శ్రీరామనవమికి భారీగా భద్రాచలం వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని రూట్లలో ప్రయాణికులకు ఎలాంటి సమస్య రాకుండా బస్సులు ఏర్పాటు చేయాలని ఖమ్మం రీజియన్ పరిధిలోని డీఎంలకు సూచించారు. ఖమ్మం రీజియన్ నుంచి భద్రాచలం – ఖమ్మం – హైదరాబాద్ రూట్లలో నడిచే బస్సుల సంఖ్య ప్రస్తుతం 113 ఉండగా అదనంగా 121 సర్వీసులు పెంచి మొత్తం 234 బస్సులు తిప్పనున్నామని, ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చే బస్సుల సంఖ్య 45 కాగా, రద్దీని దృష్టిలో పెట్టకుని అదనంగా మరికొన్ని బస్సులు నడుపనున్నామని వివరించారు. హైదరాబాద్ – భద్రాచలం వచ్చి వెళ్లే ప్రయాణికులకు రిజర్వేషన్ సదుపాయం కూడా కల్పించామని, అవసరమైన వారు www.tgsrtc.in ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు. సమావేశంలో డీఈఈ రవీందర్, ఖమ్మం రీజియన్, ఏపీ ప్రాంత డీఎంలు పాల్గొన్నారు. ఆర్టీసీ కరీంనగర్ ఈడీ సోలోమన్ -
సర్వేను అడ్డుకున్న రైతులు
చండ్రుగొండ: మండలంలో నిర్మించనున్న సీతారామ ప్రాజెక్ట్ ఉప కాల్వ నిర్మాణ సర్వేను రైతులు బుధవారం అడ్డుకున్నారు. మద్దుకూరు శివారు నుంచి అయన్నపాలెం, చండ్రుగొండ గ్రామాల మీదుగా ఉప కాల్వ చెరువుల మీదుగా వెళ్లనుంది. అయితే అనేకసార్లు కాల్వడిజైన్ మార్చడం వల్ల అవసరం లేని చోట విలువైన భూములు దెబ్బతింటు న్నాయని అయన్నపాలెం రైతులు అభ్యంతరం వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న కాల్వ నిర్మా ణం విభాగం డీఈ నాగేశ్వరరావు, ఏఈ గణేశ్ అక్కడికి చేరుకున్నారు. ప్రధాన రైతులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, తుమ్మలపల్లి సురేశ్ ఆధ్వర్యంలో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాల్వ పాత డిజైన్ ప్రకారం పనులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సమస్యను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారెఆదినారాయణకు ఫోన్ ద్వారా తెలిపారు. మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకే కాల్వపనులు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి కాల్వ సర్వే చేయాలని, వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రితోపాటు ఎమ్మెల్యేహామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -
సర్పంచ్కు ప్రజల అభినందన
ఇల్లెందురూరల్: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కొమరారం గ్రామంలో తాగునీటి ట్యాంకును సర్పంచ్.. కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. కార్మికులతో కలిసి వాటర్ ట్యాంకు పైకి ఎక్కిన సర్పంచ్ బిచ్చా.. లోపలికి దిగి ట్యాంక్ మొత్తం శుభ్రం చేయడంతో ప్రజలు ఆయన్ను అభినందించారు. పత్తి చేలల్లో జీవాలకు మేతబూర్గంపాడు: పత్తితీతలు పూర్తికావడంతో ప్రస్తుతం గొర్రెలు, మేకలకు కడుపు నిండా మేత దొరుకుతోంది. మహబూబ్నగర్ జిల్లా నుంచి వేలసంఖ్యలో గొర్రెలు మేత కోసం బూర్గంపాడు మండలానికి వచ్చాయి. ఏటా పత్తితీతలు పూర్తయ్యే సమయంలో గొర్రెల మందలు అక్కడి నుంచి ఇక్కడకు వస్తాయి. ఈ సారి మండలానికి సుమారు లక్ష గొర్రెల వరకు వచ్చాయి. రైతులు వాటిని నాలుగు రోజులు చేలల్లో ఉంచడం వల్ల అవి మేత మేసి, పెంట వేస్తాయి. అది భూసారం పెరగడానికి దోహ దం చేస్తుంది. సేంద్రియ సాగుపై దృష్టి పెడుతున్న రైతులు జీవాలను తమ పొలాల్లో మంద కట్టిస్తున్నారు. ఎరువుల వాడకం తగ్గించాలిచండ్రుగొండ: పంటల సాగులో మందుల వాడకాన్ని తగ్గించుకోవాలని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ భరత్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం నిర్వహించిన రైతు శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని, పంటలపై మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తే భూసారం దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపుతుందని తెలిపారు. నానో యూరియా, నానో డీఏపీ వల్ల కలిగే ప్రయోజనాలు, వరిలో ప్రస్తుతం ఉన్న వంగడాలు, ఆయిల్ పాం సాగు, సాయిల్ హెల్త్ కార్డు ఉపయోగం, నేచురల్ ఫార్మింగ్, కిచెన్ గార్డెనింగ్ గురించి వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ రవికుమార్, ఏఓ వినయ్, ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శివ పాల్గొన్నారు. ఎరువులతో నాణ్యమైన దిగుబడిములకలపల్లి: నాణ్యమైన పంట దిగుబడికి ఎరువులు దోహదపడుతాయని ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్) జనరల్ మేనేజర్ రామ్మోహన్రావు అన్నారు. ‘ప్రత్యామ్యాయ ఎరువులు, సేంద్రియ ఎరువుల వాడకం’పై జగన్నాథపురం రైతువేదికలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. కృషివిజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ భరత్, డాక్టర్ హేమచంద్ర, బి.శివ పలుఅంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అశ్వారావుపేట ఏడీఏ రవికుమార్, ఎంఏఓ అరుణ్బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు అశ్వారావుపేటరూరల్: గతేడాది డిసెంబర్లో జరిగిన గోదావరి తెలుగు ప్రతిభా పరీక్షలో అశ్వారావుపేట ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి సత్తా చా టారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో అశ్వారావుపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థి సాయిల లక్కీప్రశాంత్, ఉన్నత పాఠశాల విద్యార్థి అమీసాఫాతిమా, కె.మైథిలి, పేరాయిగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థి నార్లపాటి ఐశ్వర్య రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకులు సాధించారు. బీసీకాలనీ పాఠశాలకు చెందిన జ్ఞానేశ్, కె.తేజరాంచరణ్, జి.భవ్యశ్రీ ద్వితీయ ర్యాంకులు సాధించినట్లు కాంప్లెక్స్ హెచ్ఎం హరిత తెలిపారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి, త్వరలోనే ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని వివరించారు. -
గోదాముల్లో తనిఖీ
నేలకొండపల్లి: రాష్ట్రంలో రూ.500 కోట్లతో 50 గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. మండల కేంద్రంలోని గోదాములను బుధ వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం స్టాక్కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రాను న్న సీజన్కు సంబంధించిన పంట ఉత్పత్తులు నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. వచ్చే సీజన్లో పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు 32 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను సిద్ధం చేశామని, 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ప్రైవేట్ గోదాములు, వ్యవసాయ మార్కెట్లకు చెందిన మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను అద్దెకు తీసుకుంటున్నట్లు వివరించారు. జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, నంబూరి రామారావు, యడవల్లి నాగరాజు, నరేశ్ పాల్గొన్నారు. -
సర్పంచ్ మృతికి నివాళి
కారేపల్లి: మండలంలోని పాతకమలాపురం సర్పంచ్ తేజావత్ బాబూరావు (50) గుండెపోటుతో బుధవారం మృతి చెందగా పలువురు నివాళులర్పించారు. పాతకమలాపురం గ్రామ పంచాయతీ చిమ్నాతండా గ్రామానికి చెందిన తేజావత్ బాబూరావు కాంగ్రెస్ పార్టీలో ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందితో పని చేయించి సాయంత్రం 6 గంటల సమయంలో బాబూరావు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. -
రేపు ఖమ్మంలో ‘మాంగళ్య’ ప్రారంభం
ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 29 బ్రాంచ్లతో వస్త్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మాంగళ్య షాపింగ్ మాల్ను ఖమ్మంలో ఈ నెల 13వ తేదీన ప్రారంభించబోతున్నట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు. ఆధునిక ఫ్యాషన్ ట్రెండ్స్కు అనుగుణంగా, ఖమ్మం నగర ప్రజలకు సరికొత్తడిజైన్లు, విభిన్న మోడళ్లతో ఈ షాపింగ్ మాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. వెడ్డింగ్ కలెక్షన్లు, మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం వేలాది రకాల దుస్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. కాగా, ప్రారంభోత్సవానికి ముందే నగరమంతా ఆకట్టుకునే విధంగా హోర్డింగ్స్, బ్యానర్లతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీనటి శ్రీలీల మాల్ను ప్రారంభించనుండగా ప్రముఖులు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. -
పరుగు అంతర్జాతీయం వైపు..
● రూ.8.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెటిక్ ట్రాక్ ● సర్దార్ పటేల్ స్టేడియంలో శరవేగంగా నిర్మాణ పనులు ● ఈనెల చివరి నాటికి అందుబాటులోకి.. ● అంతర్జాతీయ టోర్నీలకు వేదికగా నిలవనున్న స్టేడియం ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆధునిక సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ ముస్తాబవుతోంది. ఇక అంతర్జాతీయ టోర్నీలకు సైతం ఆతిథ్యమిచ్చేందుకు అత్యాధునిక సదుపాయాలతో, సకల సౌకర్యాలతో సిద్ధమవుతోంది. క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పించాలనే లక్ష్యంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.8.50 కోట్ల వ్యయంతో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల చివరి నాటికి ట్రాక్ అందుబాటులోకి రానుంది. ప్రయోజనాలు ఎన్నో.. సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ నిర్మాణం వల్ల క్రీడాకారులకు మెరుగైన శిక్షణ లభించనుంది. ఈ ట్రాక్ ప్రత్యేక ఉపరితలాన్ని కలిగి ఉండటం వల్ల అథ్లెట్లు వేగంగా పరుగెత్తడానికి సహాయపడుతుంది. అలా గే, గాయాల తీవ్రత తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ ట్రాక్పై శిక్షణ కొనసాగించవచ్చు. కనీస నిర్వహణతోనే దీర్ఘకాలం ఉపయోగించుకునేలా ఇది రూపొందింది. సహజ మట్టి ట్రాక్తో పోలిస్తే సింథటిక్ ట్రాక్ అథ్లెట్లకు మెరుగైన ఉపరితలం, సౌకర్యం అందిస్తుంది. మట్టి ట్రాక్పై సాధన చేసి సింథటిక్ ట్రాక్పై పోటీల్లో పాల్గొన్నప్పుడు రన్నర్ల సామర్థ్య వేగం రెండింతలు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో లక్ష్యాన్ని వేగంగా ఛేదించే ఆవకాశాలుంటాయి. అంతేగాక సుమారు 1.5 నుంచి 2 సెకన్ల తేడా రావడం వల్ల పతకాలు కోల్పోయే పరిస్థితులు జిల్లా అథ్లెట్లకు ఎదురయ్యా యి. దీంతో జిల్లాస్థాయి నుంచే సింథటిక్ ట్రాక్పై శిక్షణ చాలా అవసరమని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రీడాకారుల్లో ఆనందం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న ఈ ట్రాక్ వల్ల ఖమ్మం జిల్లా యువతకు అథ్లెటిక్స్లో మరింత ప్రో త్సాహం లభించనుంది. ఇప్పటికే సీఎం కప్–2024 రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో జిల్లాకు చెందిన అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించి, అధిక సంఖ్యలో పతకాలు సాధించారు. అంతేగాక జాతీయస్థాయి టోర్నీలకు అర్హత సాధిస్తున్నారు. ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీ ఏర్పడిన నాటి నుంచి పతకాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వస్తే జిల్లాలో మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు పెరుగుతాయని శిక్షకులు భావిస్తున్నారు. -
ఆశ్రమ పాఠశాల హెచ్ఎంపై ఫిర్యాదు
దుమ్ముగూడెం: మండలంలోని కె.రేగుబల్లి–2 బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం భారతిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని తండ్రి పాయం కార్తీక్ ఐటీడీఏ డీడీ అశోక్కు బుధవారం ఫిర్యాదు చేశారు. విద్యార్థిని పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గతంలో పాఠశాలలో మెనూ సరిగా లేకపోవడంతో సదరు విద్యార్థిని ఆశ్రమ పాఠశాల తనిఖీకి వచ్చిన అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హెచ్ఎం భారతి తన కుమార్తెను నిరంతరం మానసిక వేధింపులకు గురిచేస్తోందని, భరించలేక ఈ నెల 4వ తేదీన నెయిల్ పాలిష్ బాటిల్ను పొడి చేసి మింగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడు ఇసుక లారీలు స్వాధీనంఅశ్వారావుపేటరూరల్: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను స్థానిక పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీ రాష్ట్రం కొవ్వూరు గోదావరి ర్యాంపు నుంచి మూడు లారీల్లో ఇసుకను అశ్వారావుపేట మీదుగా తరలిస్తుండగా, సరిహద్దు చెక్పోస్టు వద్ద పట్టుకున్నారు. ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో విచారణ చేసి జిల్లా మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్ స్టేషన్లో శానిటైజర్ తాగిన మహిళ ఇల్లెందు: ఇంటి నుంచి పారిపోయిన వివాహితను పోలీస్ స్టేషన్కు తీసుకురాగా.. ఆమె అక్కడి శానిటైజర్ తాగిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన విజయలక్ష్మి మూడు నెలలు కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళను గుర్తించి, విచారించేందుకు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఆమె అక్కడే ఉన్న శానిటైజర్ సేవించింది. ఆమెను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించి, కౌన్సెలింగ్ నిర్వహించి, భర్తకు అప్పగించినట్లు సీఐ సురేశ్ తెలిపారు. -
స్పోర్ట్స్ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం
గుండాల: ప్రభుత్వ మోడల్ స్పోర్ట్స్ కాచనపల్లి, కిన్నెరసాని పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని జిల్లా క్రీడా అధికారి బొల్లి గోపాలకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేదీన కాచనపల్లి పాఠశాలలో బ్యాటరీ టెస్టు ఉంటుందని, 4వ తరగతి చదువుతున్న గిరిజన బాలబాలికలు 5వ తరగతి అడ్మిషన్ల కోసం ఆధార్కార్డు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, పుట్టినతేదీ ధ్రువపత్రం, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో కిన్నెరసాని పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గాలికుంటు టీకా వేయించాలిగుండాల: మండలంలోని రైతులు తమ పశువులకు గాలికుంటు టీకా తప్పని సరిగా వేయించాలని జిల్లా పశువైధ్యాధికారి మామిళ్ల వెంకటేశ్వర్లు అన్నా రు. ఆళ్లపల్లి మండలంలోని అనంతోగు గ్రామంలో 8వ విడత టీకా కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడా రు. రైతులు నల్ల, తెల్ల జాతి పశువులకు ఈ టీకాలు వేయించాలని సూచించారు. స్థానిక పశువైద్యాధికారులు గ్రామాల్లోకి వస్తున్నారని ఆ సమయంలో పశువులను పాకలోనే ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోడు పశువైద్యాధికారి సతీశ్, సిబ్బంది రమేశ్, పాషా, రైతులు పాల్గొన్నారు. చోరీ కేసులో నిందితుడు అరెస్ట్ అశ్వాపురం: మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఈ నెల 10న నిమ్మల సత్యనారాయణ ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీతారాంపురానికి చెందిన సప్కా పవన్చోరీ చేసినట్లు సీఐ అశోక్రెడ్డి వివరించారు. -
తప్పిపోయిన వృద్ధురాలు కుటుంబం చెంతకు..
ఖమ్మంఅర్బన్: నగరంలోని వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని మతిస్థిమితం లేని వృద్ధురాలిని చేరదీసిన పోలీసులు, అన్నం ఫౌండేషన్ సభ్యులు బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పాత ఎస్పీ కార్యాలయం ప్రాంతంలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వృద్ధురాలిని మంగళవారం సాయంత్రం ఏఆర్ ఎస్ఐ గుర్తించి వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అప్పగించారు. అనంతరం వన్టౌన్ ఎస్ఐ రామకృష్ణ అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఫౌండేషన్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్కు వచ్చి విచారించగా, వృద్ధురాలు మూడు రోజుల క్రితం తప్పిపోయినట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఎస్ఐ సమక్షంలో తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు శ్రీకాకుళం జిల్లా నుంచి ఐదు నెలల క్రితం వలస కూలీలుగా వచ్చి ఖమ్మం నగరంలోని శ్రీనగర్కాలనీలో నివసిస్తూ పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అన్నం శ్రీనివాసరావు, ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గాయపడిన విద్యార్థి మృతి
నేలకొండపల్లి: అనంతనగర్ – నేలకొండపల్లి గ్రామా ల మధ్య మూలమలుపు వద్ద గత శుక్రవారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి అభి నయ్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మండలంలోని అనంతనగర్ సమీపంలో ఈ నెల 6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కోరట్లగూడెంనకు చెందిన బచ్చలకూరి అభినయ్ (19) నేలకొండపల్లి ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. పరీక్షరాసి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరగా.. ఖమ్మంలోని ఓ ప్రవేట్ వైద్యశాలకు తరలించారు. బుధవారం హైదరాబాద్కు తరలిస్తుండగా మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదుచేశారు. మృతదేహాన్ని రాష్ట్రగిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, కడియాల నరేశ్ సందర్శించి నివాళులర్పించారు. రోడ్డు ప్రమాదంలో యువతి..మధిర: రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందిన ఘటన బుధవారం ఇల్లెందులపాడు సమీపంలోని మాత కోల్డ్ స్టోరే జ్ వద్ద చోటుచేసుకుంది. మధిర పట్టణానికి చెందిన స్వర్గం శ్రీనివాసరావు, రాణి దంపతులు దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. పాఠశాలకు ప్రతీరోజు బైక్ లేదా కారులో వెళ్లి వస్తుంటారు. శ్రీనివాసరావుకు వేరే పని ఉండటంతో తల్లిని తీసుకురమ్మని.. పెద్దకుమార్తె శరణ్య (21)కు చెప్పాడు. ఆమె మధిర నుంచి దెందుకూరు పాఠశాలకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రాయపట్నం గ్రామానికి చెందిన కృష్ణ తన టాటా ఏస్ వాహనంతో మాత కోల్డ్ స్టోరేజీ వద్ద ఢీకొట్టాడు. దీంతో శరణ్య అక్కడికక్కడే మతి చెందింది. టౌన్ పోలీసులు చేరుకుని, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతురాలు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. బాణాపురం సమీపంలో యువకుడు.. ముదిగొండ: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలోని బాణాపురం సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఏపీలోని జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన నగరి శ్రీనివాస్ (25) ట్రాక్టర్పై కూర్చుని వస్తున్నాడు. అతివేగంగా, నిర్లక్ష్యంగాడ్రైవర్ పల్లెబోయిననరసింహారావు ట్రాక్టర్ను నడపడంతో శ్రీనివాస్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ను జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేర కు ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద స్దితిలో మహిళ ..ఖమ్మంక్రైం: నగరంలోని త్రీటౌన్ పరిధిలో బుధవారం అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచైందిన ఘటన చోటుచేసుకుంది. సీఐ మోహన్బాబు కథనం ప్రకారం.. నక్కా వెంకటరమణ (33) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమె భర్త మల్లేశ్ గత నెల 9వ తేదీన ప్రమాదవశాత్తు మృతిచెందాడు. దీంతో ఆమె ఖమ్మంలోని శ్రీనివాసర్నగర్ ప్రాంతంలో ఉంటున్న ఆమె తండ్రి వంగూరి సైదులు ఇంటికి వచ్చింది. మంచంపై మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. తన అక్క మృతిపై అనుమానం ఉందని, విచారణ చేయాలని ఆమె సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు సాయంతో మార్చురికి తరలించారు. -
విశిష్టం.. రామయ్య తలంబ్రాలు
భద్రాచలం: ‘జానకి దోసిట కెంపుల ప్రోవై.. రాముడి దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములె తలంబ్రాలుగా..’అంటూ సీతారాముల కల్యాణ తలంబ్రాల విశిష్టత తెలిపారు ఓ కవి. భద్రాచలంలోని సీతారాముల కల్యాణ తలంబ్రాలను తమపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇంట్లో ఉంచుకున్నా అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ క్రమంలో ఏటేటా శ్రీరామనవమి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు పొందే భక్తుల సంఖ్య పెరుగుతోంది. తానీషా కాలం నుంచి.. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణంలో భక్తులతోపాటు రాజ్యమంతా (ప్రభుత్వం) రామయ్య సేవలో గడపాలనే తలంపుతో తానీషా ప్రభువు ముత్యాలను సమర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా కొనసాగించాలని శాసనం కూడా చేశారు. నిజాం నవాబు హయాంలో ధంసా పాలనా కాలంలో కొంత కాలం ముత్యాల తలంబ్రాలను పంపడం నిలిపేయగా, రాజ్యంలో కలతలు, ఉపద్రవాలు సంభవించినట్లు అప్పటి చరిత్ర కారులు పుస్తకాల్లో తెలిపారు. తర్వాత పగ్గాలు చేపట్టిన నిజాం నవాబులంతా సీతారాముల కల్యాణానికి ప్రభుత్వ తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించగా ఇది నేటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రభుత్వమే సమర్పించాలని అప్పట్లోనే రూ. 1,350ను ప్రభుత్వ నిధి నుంచి కేటాయిస్తూ ప్రత్యేక జీఓ తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రతీ ఏటా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తున్నారు. ఏటేటా పెరుగుతున్న భక్తుల ఆసక్తి ఏటేటా శ్రీ సీతారాముల తలంబ్రాలకు ప్రాచుర్యం పెరుగుతోంది. ఐదేళ్ల క్రితం 100 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేయగా, భక్తుల డిమాండ్ దృష్ట్యా క్రమంగా పెంచుతున్నారు. ఈ ఏడాది 400 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. ఫాల్గుణ పౌర్ణమి రోజు నుంచి తలంబ్రాలను కలిపే పనులు చేపడతారు. ఇటీవల కాలంలో గోటి తలంబ్రాలు సమర్పించే భక్తులు కూడా పెరుగుతున్నారు. ఐటీసీ సంస్థ ఏటా 100 క్వింటాళ్లను అందజేస్తుండగా, ఏపీ, తెలంగాణలోని భక్తులు మరో 100 క్వింటాళ్ల వరకు అందజేస్తున్నారు. ఇతర బియ్యాన్ని సైతం దేవస్థానం వర్గాలు దాతల ద్వారా సేకరించి తలంబ్రాలను తయారు చేస్తారు. శ్రీరామనవమి రోజు ప్రత్యేక కౌంటర్ల ద్వారా, ప్రధాన కూడళ్లలో, బస్టాండ్లలో, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తలంబ్రాలు అందజేస్తారు.సీతారాముల కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో ప్రాచుర్యం ఉంది. ముత్యం చంద్రునికి గుర్తు. చంద్రుడు మనస్సుకు అధిపతి అని, మనస్సుకు ప్రశాంతతను కలిగించేవాడు చంద్రుడు గనుక అతనికి గుర్తుగా ముత్యాలను తలంబ్రాలలో కలుపుతారని వేద పండితులు పేర్కొంటున్నారు. ముత్యాలు కలిపిన తలంబ్రాలను శిరస్సుపై పోసుకుంటే దంపతుల మధ్య మరింత అనురాగం పెంపొంది అన్యోన్యంగా జీవిస్తారని చెబుతున్నారు. దీనికి ప్రతీకగా భద్రాచలంలో ముత్యాల తలంబ్రాలను శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవంలో ఉపయోగిస్తారని పేర్కొటున్నారు. -
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
చండ్రుగొండ : గ్రామాల సమగ్రావృద్ధికి ప్రభుత్వం ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. మండలంలోని బెండాలపాడు, చండ్రుగొండ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. బెండాలపాడు పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాగునీటి సరఫరాను పరిశీలించారు. మరుగుదొడ్లు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల పరిసరాలు, బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్నం భోజనం వంటకాలను, సరుకులను పరిశీలించారు. గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను, సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం చండ్రుగొండలో నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ కేంద్ర భవనాన్ని పరిశీలించారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించగా, విద్యార్థినులు కలెక్టరేట్ ఎదుట సమస్యల ఏకరువు పెట్టారు. దీంతో స్పందించిన కలెక్టర్ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తిరుమలేష్, సైదురెడ్డి, శ్రీనివాస్, సాయికృష్ణ, సంధ్యారాణి, బయ్యారపు అశోక్, సంజీవరావు, నాయకులు భోజ్యానాయక్, బొర్రా సురేష్ పాల్గొన్నారు.ప్రజాప్రతినిధులకు అవగాహన ఉండాలిసూపర్బజార్(కొత్తగూడెం): ఇటీవల ఎన్నికై న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన ఉండాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించే ప్రజాప్రతినిధుల శిక్షణపై బుధవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. శిక్షణ విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఐడీ కార్డులు అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అంకిత్ -
వీకేసీఎంలో 1.5 లక్షల టన్నుల బొగ్గు..
రుద్రంపూర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం ఏరియా వీకే సీఎం(కోల్మైన్) గని నుంచి సుమారు 1.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తామని ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేంరాజు తెలిపారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలోని ఆర్పీఓఏ క్లబ్లో నిర్వహించిన ఆత్మీ య సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 9న సంస్థ సీఎండీ బుద్ధ ప్రకాశ్జ్యోతి బొగ్గు రవాణాను ప్రారంభించారని పేర్కొన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న 10 ఏళ్లలో పీవీకే–5 గనిలో నిక్షేపాలు తగ్గుతాయని అన్నారు. అయితే వీకే ఓసీ విస్తరణ జరగనుందని, తద్వారా 35 ఏళ్ల వరకు బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు మోహన్రావు, రామకృష్ణ, యోహాన్, నర్సింహారావు, నాయకులు ఎండీ రజాక్, గట్టయ్య పాల్గొన్నారు. -
పరేషాన్!
కార్పొరేషన్.. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం నగర పాలక సంస్థగా అప్గ్రేడై ఏడాది కావొస్తోంది. కొత్త పాలకవర్గం కొలువుదీరి నెల గడుస్తోంది. అయినా ఇప్పటివరకు కార్పొరేషన్ తరహా పాలన అందడం లేదు. కనీసం నగర పాలక సంస్థ కార్యాలయాన్ని కూడా శుభ్రంగా ఉంచడం లేదు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు సుజాతనగర్ మండలంలో ఏడు గ్రామపంచాయతీలను కలుపుతూ 2025, మార్చి 24న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. నగర పాలక సంస్థగా మారడంతో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం మెరుగువుతుందని, ఆధునిక, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయనే ఆశలు చిగురించాయి. కానీ మొదటి పది నెలలపాటు మున్సిపాలిటీ కార్యాలయం బోర్డు మారడం, మున్సిపల్ చైర్మన్ స్థానంలో కమిషనర్ రావడం మినహా పాలన పరంగా మరే విధమైన మార్పు కనిపించలేదు. ఆఖరికి పాల్వంచ, కొత్తగూడెం మున్సిపల్ వెబ్సైట్లు సైతం వేర్వేరుగానే సేవలు అందిస్తూ వచ్చాయి. అప్పటికే పాల్వంచకు ఎన్నికలు జరగకపోవడం, కొత్తగూడెంలో పాలక మండలి లేకపోవడంతో ఈ పరిస్థితి ఉందనే అభిప్రాయం ఉండేది. మిగిలిన చోట్ల.. సింగరేణి బొగ్గు గనులు విస్తరించిన ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. దీంతో ఇక్కడ ఉమ్మడి జిల్లా కేంద్రాలకు దీటుగా రామగుండం (గోదావరిఖని), మంచిర్యాల, కొత్తగూడెంలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ అయ్యాయి. కొలువుదీరిన వెంటనే రామగుండం కార్పొరేషన్లో కొత్త పాలకవర్గం తన మార్క్ చూపించడం మొదలు పెట్టింది. ఆఫీస్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చడం మొదలుపెట్టింది. ముందుగా కార్యాలయంలో గుట్టలుగా పేరుకుపోయిన దరఖాస్తులు, ఫైళ్లను క్లియర్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నగరంలో కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దడం మొదలెట్టారు. మంచిర్యాలలోనూ ఈ తరహా పరిస్థితి నెలకొంది. అధికారులు, పాలకవర్గానికి స్పృహ ఏదీ? కొత్తగూడెం కార్పొరేషన్గా మారినా, కొత్త పాలకవర్గం కొలువుదీరినా అందుకు సంబంధించిన మార్పు కనిపించడం లేదు. నగరం సంగతి పక్కన పెడితే, కనీసం కార్పొరేషన్ కార్యాలయంలో పేరుకు పోయిన చెత్త, స్క్రాప్ను కూడా తొలగించలేదు. కార్యాలయం లోపల కాగితాల గుట్టలు అల్మరాల్లో బూజుపట్టిపోతున్నాయి. కార్యాలయం వెలుపల పాడుపడిన వాహనాలు దర్శనం ఇస్తున్నాయి. వాటి చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి, తిరిగి ఎండిపోయి చెత్తకుప్పగా మారినా, వాటిని తొలగించాలనే స్పృహ ఇక్కడ పాలకవర్గానికి, అధికారయంత్రాంగానికి కరువైంది. ప్రతీ విషయంలో ఇంటర్నెట్, సోషల్మీడియా, యాప్లు దూసుకుపోతున్నాయి. కనీసం కొత్తగూడెం కార్పొరేషన్కు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ను సరైన రీతిలో ఉపయోగించడంలోనూ నగరపాలక సంస్థ అట్టడుగున ఉండిపోయింది.న్యాయపరమైన చిక్కులు దాటుకుని కొత్తగూడెం కార్పొరేషన్కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో అధికార భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐ మిత్ర పక్షాల ఆధ్వర్యంలో పాలకవర్గం కొలువుదీరింది. తొలి మేయర్గా మూడ్ గణేశ్, డిప్యూటీ మేయర్గా సిరిపురపు లలిత కుమారి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే కమిషనర్గా సుజాత కొనసాగుతున్నారు. దీంతో కార్పొరేషన్ స్థాయిలో పాలనసాగుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటివరకు పాలకవర్గం మార్క్ కనిపించే విధంగా ఒక్క నిర్ణయం కూడా జరగలేదు. ప్రమాణ స్వీకారం తర్వాత చెప్పుకోతగ్గ ఏ ఒక్క పనీ ఇక్కడ జరగలేదు. కనీసం కార్పొరేషన్ వెబ్సైట్లో సైతం సరైన సమాచారాన్ని పొందు పరచడంలో కొత్త పాలకవర్గం విఫలమైంది. ప్రస్తుతం వెబ్సైట్లో కొత్తగూడెం ప్రొఫైల్ విభాగంలో 60 డివిజన్లను 60 వార్డులుగా పేర్కొన్నారు. తొలిమేయర్గా మూడ్ గణేశ్ ఉండగాా.. ఇప్పటికీ వెబ్సైట్లో చైర్పర్సన్గా కాపు సీతాలక్ష్మి పేరునే కొనసాగిస్తున్నారు. మ్యాప్లో కేవలం కొత్తగూడెం పట్టణాన్ని మాత్రమే చూపుతున్నారు. -
పేదలందరికీ లబ్ధి
భూదాన్ భూముల్లో డిసెంబర్ 9న గృహప్రవేశాలుసాక్షిప్రతినిది, ఖమ్మం : ‘వెలుగుమట్లలో పేదలకు కేటాయించిన భూదాన్ భూముల్లో యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో పాలు పొంగించి.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా కాలనీని ప్రారంభింపజేస్తాం’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కలెక్టరేట్లో బుధవారం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్వాసితులైన 311 మందికి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందజేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు మండలాలకు చెందిన 101 మంది లబ్ధిదారులకు వారి స్వస్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అధికారులతో పంపిణీ చేయించారు. 311 మంది అర్హులకు ఒకేసారి ర్యాండమైజేషన్ ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయించి.. ప్లాట్ నంబర్లు కేటాయించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు కావాలనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ కాలనీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని సైతం నిర్మిస్తామన్నారు. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా భూదాన్ భూముల్లో ఇబ్బందులు పడ్డారని, ఈ సమస్యకు నేడు పరిష్కారం లభించిందని అన్నారు. తాగునీరు, రోడ్లు, ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్, స్కూల్, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వెలుగుమట్ల నిర్వాసితుల్లో ప్రతీ లబ్ధిదారుకు ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. నిరుపేదలకు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పట్టాలు పంపిణీ చేశామని, వారి పిల్లల భవిష్యత్ కోసం ఇక్కడ మోడల్ స్కూల్ నిర్మిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పెద్ద మాఫియా నడుస్తోందని అన్నారు. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రత్యేక కేసుగా పరిగణించి ఇంటి నిర్మాణ నిధులు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రామయ్యకు స్నపన తిరుమంజనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్యకు స్నపన తిరుమంజనం జరిపారు. నిత్యకల్యాణం కమనీయంగా నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. డిగ్రీ కళాశాల లెక్చరర్కు డాక్టరేట్పాల్వంచరూరల్: మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటాన్మస్)లో ఇంగ్లిష్ లెక్చరర్గా పనిచేస్తున్న లీలా సౌమ్య ఉత్తర్ప్రదేశ్లోని గ్లోబల్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా సాధించారు. భారతీయ ఆంగ్ల సాహిత్యంపై ఆమె పరిశోధనా పత్రం సమర్పించడంతో వర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా బుధవారం ఆమెను కళాశాలలో ప్రిన్సిపాల్ పి.పద్మ, అధ్యాపకులు సన్మానించారు. ఏఈఓకు గౌరవ డాక్టరేట్మణుగూరు టౌన్: మండల వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) కొమరం లక్ష్మణరావుకు హైదరాబాద్లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్, రీసెర్స్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అఖిల భారతీయ ఆదివాసీ వికాస్ పరిషత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సేవలందస్తున్న సందర్భంగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. నిత్యావసరాలన్నీ ‘గిరి’ మార్ట్లోనే..ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ భద్రాచలం: ప్రజలందరికీ అవసరమైన ఆర్గానిక్ నిత్యావసర సరుకులన్నీ గిరిజన మార్ట్లో లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ తెలిపారు. బుధవారం ఐటీడీఏలో గిరిమార్ట్లో సంప్రదాయ గిరిజన ఉత్పత్తుల సేకరణ యూనిట్ అధికారులతో చేపట్టాల్సిన కార్యాచరపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గిరిమార్ట్లో ఎస్హెచ్జీ మహిళలు, గిరిజనుల చిన్న తరహా పరిశ్రమల ద్వారా తయారు చేస్తున్న తినుబండారాలు, తృణధాన్యాలు, స్వీట్లు, నూనె, ఇతర సామగ్రి, అన్ని రకాల పచ్చళ్లు తదితర నిత్యావసరాలు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు సమ్మయ్య, మధుకర్, ఉదయ్ కుమార్, వేణు, గన్యా, లక్ష్మీనారాయణ, ప్రభాకర్ రావు, రమేష్, హరికృష్ణ పాల్గొన్నారు. -
ప్రతీ ఇంట్లో చెత్త సేకరించాలి
పాల్వంచ: ప్రతీ ఇంటి నుంచి సిబ్బంది చెత్త సేకరించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ జోత్స్న అన్నారు. బుధవారం ఆమె నగర పాలక సంస్థ పరిధిలోని పాల్వంచలో పర్యటించారు. 39వ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య పనులు, డ్రెయినేజీ వ్యవస్థ, మున్సిపల్ చెత్త వాహనాల చెత్త సేకరణ, విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో కమర్షియల్ ట్రాక్టర్ చెత్త సేకరణ, డీఆర్సీసీ, బయోమైనింగ్ పనితీరును, కలెక్టరేట్ ఏరియాలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని, క్రమం తప్పకుండా ఇంటింటి చెత్త సేకరణ జరగాలని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సుజాత, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రవిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐదు గంటల్లో.. ఐదు సాధారణ కాన్పులు
అశ్వారావుపేటరూరల్: ఐదు గంటల సమయంలో ఐదుగురు గర్భిణులకు సాధారణ కాన్పులు చేసి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల బృందం రికార్డు నెలకొల్పింది. అశ్వారావుపేటలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 5గంటల సమయం లోపు ఐదుగురు గర్భిణులు పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆస్పత్రి వైద్యుల బృందం గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి దాదాపు ఐదు గంటల వ్యవధిలో వారందరికీ సాధారణ కాన్పులు చేయగా వీరిలో ముగ్గురికి మగ సంతానం, మరో ఇద్దరికి ఆడ సంతానం కలిగారు. తల్లీబిడ్డలంతా క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి తెలిపారు. ప్రసూతి వైద్యురాలు డాక్టర్ మౌనిక, హెడ్ నర్సింగ్ ఆఫీసర్ ఆశవర్ధని, వీర కుమారి, ఏఎన్ఎం సుజాత, అనూష తదితరులు సేవలందించారు. అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రిలో రికార్డు నమోదు -
భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?..
సూపర్బజార్(కొత్తగూడెం): అత్తింటి వేధింపులతో ఉపాధ్యాయురాలు భూక్య కవిత(36) ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వన్టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. భూక్య కవిత భద్రాచలంలో, ఆమె భర్త నాగేశ్వరరావు బూర్గంపాడులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దంపతులకు 5, 6 తరగతులు చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, తరచూ భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఘర్షణ జరిగింది. భర్త బయటకు వెళ్లివచ్చేసరికి తలుపు గడియపెట్టి ఉంది. కిటికీలో నుంచి చూడగా కవిత ఉరి వేసుకుని ఉండటంతో 108కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చాక తలుపు పగులగొట్టి ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. భర్త, అత్త, మామ, బావ, తోటి కోడలు, భర్త మేనకోడలు కలిసి నాగేశ్వరరావుకు వేరే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఆత్మహత్యకు ప్రేరేపించారని మృతురాలి తల్లి ఫిర్యాదు చేయగా, వన్టౌన్ ఎస్ఐ విజయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం
● వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారమే లక్ష్యం ● టీజీఎన్పీడీసీఎల్ ఫోరం చైర్మన్ వేణుగోపాలచారికరకగూడెం: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యమని టీజీ ఎన్పీడీసీఎల్ ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి అన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కరకగూడెంలో మంగళవారం ఏర్పాటు చేసిన ‘లోకల్ కోర్టు’లో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సాంకేతిక లోపాలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ, మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని వెల్లడించారు. విద్యుత్ నాణ్యత పెంపుతో వ్యవసాయ, పారిశ్రామిక, గృహావసరాలకు మెరుగైన సరఫరా అందుతుందని చెప్పారు. వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఎదురైతే నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా ఫోరం దృష్టికి తీసుకురావచ్చని సూచించా రు. ప్రతీ సమస్యనూ పారదర్శకంగా పరిష్కరించడమే ఫోరం బాధ్యతని స్పష్టం చేశారు. అనంతరం గృహజ్యోతి పథకం అందండం లేదని, పోడు భూముల్లో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని చైర్మన్కు వినతులు అందజేయగా, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ టెక్నికల్ మెంబర్ రమేష్, ఇండిపెండెంట్ మెంబర్ రామారావు, ఎస్ఈ మహేందర్, ఎస్ఏఓ శ్రీధర్, డీఈ జీవన్కుమార్, ఏడీఈ ఉమామహేశ్వరరావు, ఏఈలు రాజశేఖర్, వేణుగోపాల్, లారెన్స్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీల హక్కులపై మరోపోరాటం
చుంచుపల్లి: ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రాజ్యసాధన కోసం రాష్ట్రస్థాయిలో మరో పోరాటం చేయాలని జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షు డు చందా లింగయ్య పిలుపునిచ్చారు. మంగళవా రం ఆదివాసీ సంఘాలు, ఉపాధ్యాయ – ఉద్యోగ ఆదివాసీసంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో జరి గిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతాల్లోని వనరులను గిరిజనేతరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో దోచుకుంటున్నా రని ఆరోపించారు. 1/70, పెసా, అటవీ హక్కుల చట్టాలను తుంగలో తొక్కి, ఆర్థిక వనరులు, ఆదివాసీల ఆస్తులు, భూములను కాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ ఇసుక సొసైటీల పేరుతో గిరిజనేతర కాంట్రాక్టర్లు ఆదివాసులను మోసం చేసి ఇసుక క్వారీల ద్వారా పన్నేండేళ్లుగా వచ్చిన ఆదాయం సుమారు రూ.67వేల కోట్లను దిగమింగారని దుయ్యబట్టారు. సమావేశంలో నాయకులు పొడుగు శ్రీనాథ్, పాయం సత్యనారాయణ, వట్టం నారాయణదొర, రమణాల లక్ష్మ య్య, పూనెం శ్రీనివాస్, వాసం రామకృష్ణదొర, తాటివెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఇల్లెందురూరల్: నాన్న పిలుస్తున్నాడంటూ ఈ నెల 6వ తేదీన పురుగులమందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన మండలంలోని పోలారం గ్రామానికి చెందిన వల్లోజు సత్యనారాయణ ఖమ్మంలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు వల్లోజు కల్యాణ్చక్రధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కొమరారం ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. జామాయిల్ చెట్ల నరికివేతపై విచారణటేకులపల్లి: సుమారు 15 ఏళ్ల క్రితం మండలంలోని కేఓసీ ఓబీ గుట్టలపై సింగరేణి యాజమా న్యం నాటిన జామాయిల్ మొక్క లు ప్రస్తుతం ఏపుగా పెరిగాయి. ఇటీవల కొందరు వీటిని నరికి అక్రమంగా అమ్ముకుంటున్నట్లు ‘సాక్షి’సహా పలు పత్రికల్లో మంగళవారం కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. సింగరేణి పర్యావరణ అధికారి, సెక్యూరిటీ సిబ్బంది ఓబీ గుట్టలపై జామాయిల్ తోటలను పరిశీలించారు. విషయం తెలుసుకున్న స్మగ్లర్లు సామగ్రి వదిలేసి పారిపోయారు. ఉద్యోగులు వెళ్లేసరికి నరికిన కొన్ని జామాయిల్ మొక్కలు, గొడ్డలి లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. అయితే, కొద్ది నెలలుగా జామాయిల్ కలప అక్రమంగా తరలిస్తున్నా అధికారులు స్పందించకపోవడం, చివరకు పత్రికల్లో కథనాలు వచ్చాక పరిశీలించినా రక్షణ చర్యలు కట్టుదిట్టం చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది. పశువుల పట్టివేతభద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న పశువులను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చర్ల నుంచి హైదరాబాద్కు వాహనంలో పది పశువులను తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో చేపట్టిన తనిఖీల్లో గుర్తించారు. పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించి, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్ఐ శ్యాంప్రసాద్ తెలిపారు. వాట్సాప్ పోస్టింగులపై ఫిర్యాదుఇల్లెందు: తన ప్రతిష్టను దిగజార్చే విధంగా నిరాధార ఆరోపణలతో వాట్సాప్ లో తప్పుగా ప్రచారం చేస్తున్నారని కొత్తకాలనీకి చెందిన మడుగు సాంబమూర్తి మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశాడు. తనపై తప్పుగా వాట్సాప్ గ్రూపులలో ఎందుకు ప్రచారం చేస్తున్నారని పోస్టింగ్ పెట్టిన మాళోత్ బాసును ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సీఐ సురేశ్ తెలిపారు. ఇల్లెందులో చోరీఇల్లెందు: పట్టణంలోని వెంగళరావుకాలనీకి చెందిన నర్సింహసూరి ఈ నెల 8వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి 9వ తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వేసిన తాళం పగలగొట్టి ఉండటంతో ఇంట్లో సామగ్రిని పరిశీలించారు. బీరువాలో ఉన్న రూ.60 వేల విలువ చేసే వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడు నర్సింహసూరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సురేశ్ మంగళవారం తెలిపారు. విద్యార్థుల రాస్తారోకోదుమ్ముగూడెం: మండలంలోని కె.రేగుబల్లి–2 పాఠశాలకు చెందిన విద్యార్థులు మంగళవారం చర్ల – భద్రాచలం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పాఠశాల హెచ్ఎం భారతిని ఇక్కడే విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాగా, తోటి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమైన ఆమె కోసం ధర్నా చేస్తారా? అంటూ గ్రామస్తులు వచ్చి విద్యార్థులను పాఠశాలకు తీసుకుని వెళ్లారు. ఈ పాఠశాలలో కొన్ని రోజుల క్రితం హెచ్ఎం, సిబ్బంది వేధింపులతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా ఘటనపై ఐటీడీఏ అధికారులు విచారణ సాగిస్తున్నారు. పాఠశాలలో హెచ్ఎం, ఉపాధ్యాయులు లేని సమయంలో విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి రాస్తారోకో చేయడం గమనార్హం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే లోగానే విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు. -
ఆర్చరీ టోర్నీలో పతకాలు
సూపర్బజార్(కొత్తగూడెం): హైదరాబాద్ కేంద్రంగా తెల్లాపూర్ ఏకలవ్య ఆర్చరీ అకాడమీ లో జరిగిన ఆర్చరీ మినీ స్టేట్ మీట్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. అండర్–10 విభాగంలో మొత్తం 76మంది క్రీడాకారులు పాల్గొనగా ఎం.విక్రాంత్ బంగారు పతకం సాధించాడు. అండర్–15 విభాగంలో 50 మందికి గాను ఎం.కార్తీవర్మ రజతం, అండర్–13 లో ఆర్.రిషి తొమ్మిదోస్థానం సాధించాడు. అంతేకాక పలువురు ఈ నెల 26వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జరిగే జాతీయస్థాయి టోర్నీకి ఎంపికయ్యారు. క్రీడాకారులతో పాటు కోచ్ తానం కల్యాణ్ను డీవైఎస్ఓ పరంధామరెడ్డి మంగళవారం అభినందించారు. లాభాల పంటలనే సాగుచేయండి.. గుండాల: మండలంలో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, రైతులు తక్కువ కాలంలో అధిక దిగుబడి ఇచ్చే పంటలపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జంగా కిశోర్ అన్నారు. మండలంలో సాగుచేస్తున్న ఆయిల్పాం తోటలను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రస్తు తం మార్కెట్లో డిమాండ్ ఉన్న బొప్పాయి, అరటి, తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు, పూలు, తైవాన్ జామ, నిమ్మ, కరివేపాకు, బోడ కాకర, తీగ చిక్కుడు, మునగ, నేరేడు, సీతాఫలం, డ్రాగన్ఫ్రూట్ తదితర పంటలను సాగు చేస్తే.. ఎకరానికి నికరంగా రూ.లక్ష ఆదాయం పొందవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయిల్ పాం పంట ప్రాధాన్యత, సాగు విధా నం, అధిక దిగుబడులు పొందే పద్ధతులు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వివరించారు. కార్యక్రమంలో సాయనపల్లి సర్పంచ్ కల్తీ కృష్ణవేణి, ఉద్యానవన అధికా రి దేవీప్రసాద్, ఆయిల్ఫెడ్ ప్రతినిధి శంకర్, వికాస్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. చదువే విద్యార్థుల భవితకు పునాదికొత్తగూడెంఅర్బన్: చదువే విద్యార్థి భవితకు పునాదిఅని, ప్రతి విద్యార్థి చదువుకుంటేనే ఉన్న త స్థానానికి చేరుకోవచ్చని కొత్తగూడెం మున్సి పల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్ అన్నా రు. పాత కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో మంగళవారం జరిగిన జిల్లాస్థాయి బాలమేళా 2.0 కార్యక్రమం ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లా లో మాత్రమే వినూత్నంగా చేపట్టిన బాలమేళా విజయవంతం కావడం సంతోషకరమన్నారు. అనంతరం డీఈఓ బి.నాగలక్ష్మి మా ట్లాడుతూ.. జిల్లాస్థాయి బాలమేళాలో ప్రతిభ కనబర్చిన పిల్లలు.. ప్రోత్సహించిన ఉపాధ్యాయులూ అభినందనీయులని పేర్కొన్నారు. 11వ డివిజన్ కార్పొరేటర్ పడాల ఆకాంక్ష మాట్లాడారు. అనంతరం 1 నుంచి 5 తరగతుల వరకు ఎఫ్ఎల్ఎన్లో గెలుపొందిన విద్యార్థులకు, 1 నుంచి 9తరగతుల వరకు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎ. నాగరాజశేఖర్, ఎస్కే సైదులు, ఎన్.సతీశ్కుమా ర్, బి.సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల గ్రంథాలయం ప్రారంభం
నేలకొండపల్లి: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మంగళవారం ప్రారంభించారు. 1989 బ్యాచ్ విద్యార్థులు రూ. 1.70 లక్షల వ్యయంతో భక్తరామదాసు స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 2,500 పుస్తకాలను సమకూర్చగా రిటైర్డ్ అసిస్టెంట్ కలెక్టర్ గండికోట భాస్కర్ పూర్వ విద్యార్థులతో కలిసి లైబ్రరీని ప్రారంభించారు. ‘సాక్షి’దినపత్రిక కార్టూనిస్ట్ పి.శంకర్ సతీమణి మంగ పాఠశాల పూర్వ విద్యార్థిని కావడంతో ఆయన సమకూర్చిన పుస్తకాలు, పలువురు ప్రముఖుల క్యారికేచర్లను నిర్వాహకులకు అందజేశారు. అనంతరం ఎంఈఓ బి.చలపతిరావు మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం గ్రంథాలయం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. హెచ్ఎం గోపగాని రమేశ్, సర్పంచ్ వెంకటలక్ష్మి, వార్డు సభ్యుడు వంగవీటి పవన్, పూర్వ విద్యార్థులు రేలా నరసింహారెడ్డి, పుల్లారావు, పాపారావు పాల్గొన్నారు. పుస్తకాలు సమకూర్చిన ‘సాక్షి’ కార్టూనిస్ట్ శంకర్ -
నాణ్యమైన భోజనం అందించాలి
బూర్గంపాడు: విద్యార్థుల ఆరోగ్యం విషయంలో రాజీ పడితే చర్యలు తప్పవని కలెక్టర్ అంకిత్ హెచ్చరించా రు. బూర్గంపాడులోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలతో పాటు కేజీబీవీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, విద్యా ప్రమాణా లను పరి శీలించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో వంట, తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బయటి ఆహార పదార్థాలను అనుమతించవద్దని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వారిని చూసేందుకు వచ్చే తల్లిదండ్రులకు కూడా భోజనం పెట్టాలని అధికారులను ఆదేశించా రు. అనంతరం కేజీ బీవీలో మెనూ అమల్లోఉన్న లోపా లపై తీవ్రఅసహనం వ్యక్తంచేశారు. నిర్ణీత మెనూ ప్రకా రం నాణ్య మైన భోజనం అందించాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థుల ఇంగ్లిష్ పఠనా సామర్థ్యాన్ని పెంచేలా ప్రణాళిక రూపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లలకు ఉదయం రాగిజావ, పల్లీపట్టీలు అందించాలన్నారు. అధికారుల పనితీరు రికార్డుల్లో కాకుండా క్షేత్రస్థాయిలో మెరుగ్గా ఉండాలన్నారు. కలుషిత ఆహారం పునరావృతం కావొద్దు మణుగూరు రూరల్: వసతిగృహాలు, విద్యాసంస్థల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని అన్నారు. ఇటీవల మణుగూరులో కొందరు విద్యార్థినులు కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురయ్యారని, ఇలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహించా లని అధికారులకు సూచించారు. పాఠశాలలు, వసతిగృహాల్లో ఆహార భద్రత కమిటీ సభ్యులు రుచి చూశాకే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. ‘పది’ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి సూపర్బజార్(కొత్తగూడెం): ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16వరకు జరిగే పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో మంగళవారం వివిధ శాఖల అధి కారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 73 కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,731 మంది రెగ్యులర్, 404 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 బీ సెక్షన్ అమలు, జిరాక్స్ కేంద్రాలపై నియంత్రణ వంటిచర్యలు తీసుకోవా లని సూచించారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా రవాణాసౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. శిక్షణ ఏర్పాట్ల పరిశీలన చుంచుపల్లి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99రోజుల కార్యాచరణపై సర్పంచ్లు, వార్డు సభ్యులకు కొత్తగూడెం క్లబ్లో ఈనెల 12న నిర్వహించే శిక్షణ ఏర్పాట్లను కలెక్టర్ అంకిత్ పరిశీ లించారు. హాజ రయ్యే ప్రజాప్రతినిధులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా సీట్లు కేటాయించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శిక్షణ సజావుగా సాగేలా అవసరమైన సామగ్రిని ముందుగానే సిద్ధం చేయాలన్నారు. హాజరయ్యే ప్రతీ ఒక్కరికి గుర్తింపు కార్డులు అందజేయాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డీఓ మధు, డీఈఓ నాగలక్ష్మి, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డీఎంహెచ్ఓ తుకా రాం రాథోడ్, డీపీఓ సుధీర్, తహసీల్దార్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
మణుగూరు రూరల్ : వసతి గృహాల్లోని విద్యార్థినుల అరోగ్యంపై నిర్వాహకులు శ్రద్ధ చూపాలని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అన్నారు. మణుగూరులోని జ్యోతిబా పూలే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి 17 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురి కాగా 16 మందికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఒక బాలికను హాస్టల్కు పంపించారు. చికిత్స పొందుతున్న వారిని డీఎంహెచ్ఓ మంగళవారం పరామర్శించారు. హాస్టల్లో తీసుకున్న ఆహారం, ఎదురైన లక్షణాలపై ఆరా తీయగా వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నట్లు విద్యార్థినులు తెలిపారు. వారికి మెరుగైన సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే స్థానిక వైద్యాధికారులకు సమాచారం అందించాలని హాస్టల్ నిర్వాహకులకు సూచించారు. విమర్శలకు తావిస్తున్న ఉపాధ్యాయినుల వైఖరి మణుగూరు టౌన్: జ్యోతిబాపూలే వసతి గృహంలోని ఉపాధ్యాయినుల తీరు విమర్శలకు తావిస్తోంది. 15 మంది బాలికలు అస్వస్థతకు గురైతే మొదట నలుగురిని మాత్రమే చికిత్సకు పంపడం, ఆ తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్నకు మరో 11 మందిని తరలించడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రోజున నలుగురు విద్యార్థినులు వారి కుటుంబసభ్యులు తెచ్చిన చికెన్ బిర్యాని తినడంతో అది వికటించిందని టీచర్లు చెప్పారు. ఆ తర్వాత మరో 11 మందికి ఇదే సమస్య రాగా, వారంతా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసుకుని తిన్నారని.. ఆ ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని అన్నారు. విద్యార్థినులు ఒకరిని చూసి మరొకరు వాంతులు చేసుకున్నారని, అందుకే కడుపు నొప్పి వచ్చిందని సోమవారం మరోసారి ప్రకటించారు. ఇలా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, విద్యార్థినులపై హాస్టల్ బాధ్యుల నిర్లక్ష్యం, నాసిరకమైన ఆహారంతోనే అస్వస్థతకు గురయ్యారని, ఇంటి నుంచి తెచ్చిన బిర్యానీ వల్లే ఇలా జరిగిందంటూ తల్లిదండ్రులపై ఆ నెపాన్ని మోపే ప్రయత్నం సరికాదని ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ నాయకులు మండిపడ్డారు. ఎవరినీ అనుమతించలే.. విద్యార్థినులు అస్వస్థతకు గురైనప్పుడు వైద్య సిబ్బంది సహా ఎవరినీ హాస్టల్ బాధ్యులు లోపలికి అనుమతించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ బాలికలు నిజాలు చెప్పకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మెనూ ప్రకారం భోజనం వడ్డింపుపై విద్యార్థినులు చెబుతుంటూ తరచూ అడ్డుపడ్డారని అంటున్నారు. అస్వస్థతకు గురైన విషయం కనీసం తల్లిదండ్రులకు కూడా సకాలంలో సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే పరిస్థితి ఇలా మారిందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను సోమవారం రాత్రి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మంగళవారం పలువురు సీపీఐ నాయకులు పరామర్శించారు. డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ -
సింగరేణికి గడ్డుకాలం?
● 2030 నాటికి మూతపడనున్న 10 గనులు ● సంస్థలో అదనం కానున్న మరో 10 వేల మంది కార్మికులు ● తగ్గిపోనున్న 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిరుద్రంపూర్: దక్షిణ భారత దేశానికే తలమానికమైన సింగరేణి సంస్థకు రానున్న నాలుగైదు ఏళ్లలో గడ్డుకాలం ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. 2030 సంవత్సరం నాటికి మరో 10 గనులు మూతపడే అవకాశం ఉంది. సంస్థలో ఒకప్పుడు 56 భూగర్భ గనుల్లో సుమారు 1.20 లక్షల మంది కార్మికులు పనిచేసేవారు. బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడంతో కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. గనులు కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం సంస్థ వ్యాప్తంగా 12 ఏరియాల్లో 18 ఓపెన్కాస్ట్ గనులు, 19 భూగర్భ గనుల్లో సుమారు 39వేల మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. రోజుకు 2.40 లక్షల టన్నుల బొగ్గు వెలికితీయాల్సి ఉండగా, 1.50 లక్షల టన్నులు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. మూతపడే గనులివే.. సత్తుపల్లి ఏరియా పరిధిలోని కిష్టారం ఓసీ, మణుగూరులోని పీకే ఓసీ, కొడాపురం భూగర్భ గని, కోయగూడెం ఓసీ–2, బెల్లంపల్లి రీజయన్లోని కేకే–5, శ్రీరాంపూర్–1 ఇంక్లైన్, న్యూటెక్, ఆర్కే–5, భూపాలపల్లిలోని కేటీకే–6, గోదావరిఖని–11 గనులు మూడు, నాలుగేళ్లలో మూతపడే అవకాశం ఉంది. ఆయా గనుల్లో సుమారు 10 వేల మంది పర్మనెంట్, మరో 8 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఏడాదికి సుమారు 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నారు. గనులు మూతపడితే సింగరేణి వార్షిక లక్ష్యంలో మరో 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి వెనుకబడనుంది. బకాయిలు రూ.45 వేల కోట్లు సింగరేణి 25 ఏళ్లుగా లాభాలు గడిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సంస్థకు సుమారు రూ.45 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గత, ప్రస్తుత ప్రభుత్వాలు బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సింగరేణి కంటే తక్కువ ధరకు లభిస్తుండడంతో కొన్ని ప్రైవేటు పరిశ్రమలు ఇతర దేశాల నుంచి వచ్చిన బొగ్గును కొంటున్నాయి. బొగ్గు విక్రయించినా పైసలు రాక, ఉత్పత్తి చేసిన బొగ్గును వినియోగదారులకు అమ్మలేక సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. నెలకు సుమారు రూ.500 కోట్లు కార్మికులు, అధికారులకు వేతనాలు, సుమారు రూ.100 కోట్ల వరకు ఓబీ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. ఈ డబ్బు కోసం కూడా ఫైనాన్స్ విభాగం అధికారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. సంస్థలో ఇప్పటికే సుమారు 1,500 మంది కార్మికులు అధికంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గత మార్చి నుంచి మెడికల్ బోర్డులు నిర్వహించడం లేదని తెలుస్తోంది. ప్రతీ నెల రెండుసార్లు మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహిస్తే సుమారు రెండు, మూడు వందల మంది కార్మికులను ఇన్వ్యాలిడేషన్ చేసి, వారి స్థానంలో వారసులకు ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పటికే కార్మికులు అధికంగా ఉన్నారని, మళ్లీ కారుణ్య నియామకాలు చేపడితే సంస్థకు భారమవుతుందని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 11 నెలలుగా మెడికల్ బోర్డులు నిర్వహించడం లేదు. కారుణ్య నియామకాలకు ఎంపికై న సుమారు 300 మందికి కూడా ఉత్తర్వులు ఇవ్వడం లేదు. గనులు మూతపడితే సంస్థకు మరో 10 వేల మంది కార్మికులు అధికం కానున్నారు. అయితే నాలుగేళ్లలో 2 వేల మంది కార్మికులు ఉద్యోగ విరమణ చేసే అవకాశం ఉంది. -
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి
ఇల్లెందు: నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోత్స్నారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె ఇల్లెందులో పర్యటించి, 99 రోజుల ప్రగతి నివేదిక ప్రజా ప్రణాళిక కార్యక్రమాన్ని, అభివృద్ధి పనులను పరిశీలించారు. డీఆర్సీ భవన్లో ఎరువు తయారీ విధానం, తడి, పొడి చెత్త వేరు చేసే పద్ధతిని తనిఖీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అంకుషావలీ, డీఈ మురళి, అతహార్ తదితరులు పాల్గొన్నారు. సీడీఎంఏ అధికారి జ్యోష్ణారెడ్డి -
పట్టాలెక్కేనా ?
పుష్కరాల నాటికి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి పుష్కరాల నాటికై నా భద్రాచలంరోడ్ – కొవ్వూరు రైల్వే లైన్ను పట్టాలెక్కించేందుకు గతేడాది కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టుగా ఉంటున్నాయి. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని రాజమండ్రి స్టేషన్లో అభివృద్ధి పనులు త్వరగా చేయాలని, అలాగే కొవ్వూరు – భద్రాచలంరోడ్ రైల్వే లైన్ పనులు కూడా చేపట్టాలని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరీ గతేడాది జూలైలో దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు. అంతకుముందు 2025 ఏప్రిల్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఇదే అంశాన్ని లోక్సభలో లేవనెత్తారు. ఎన్డీయే సర్కారులో భాగస్వాములుగా ఉన్న ఎంపీల నుంచి ఒత్తిడి రావడంతో ఈ రైల్వేలైన్ పనుల్లో కదలిక వస్తుందనే నమ్మకం కలిగినా.. నిరాశే మిగిలింది. వ్యయం చెరి సగం.. భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) నుంచి కొవ్వూరు వరకు నూతన రైల్వేలైన్ నిర్మాణంపై తొలిసారిగా 1969 – 70 రైల్వే బడ్జెట్లో ప్రతిపాదనలు వచ్చాయి. ఇప్పటికి 55 ఏళ్లు గడిచినా ఈ లైన్ పూర్తి స్థాయిలో నిర్మాణానికి నోచుకోలేదు. అనేక ఎత్తుపల్లాల నడుమ 2011 – 12 బడ్జెట్లో దీనికి రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 199.60 కి.మీ. నిడివి కలిగిన ఈ మార్గం నిర్మాణ వ్యయంలో సగం భరించేలా అప్పటి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దీంతో 200 కి.మీ. రైలు మార్గంలో దాదాపు 100 కి.మీ. నిర్మాణ వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం చెల్లించాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలంరోడ్ నుంచి సత్తుపల్లి వరకు సుమారు 54 కి.మీ. నిర్మాణ వ్యయాన్ని బొగ్గు రవాణా అవసరాల దృష్ట్యా తెలంగాణ తరఫున సింగరేణి సంస్థ భరించింది. దీంతో ఈ రైలు నిర్మాణంలో రాష్ట్ర బాధ్యత నెరవేర్చినట్టయ్యింది. మిగిలిన పనులు ముందుకు సాగాలంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాల్సి ఉంది. రెండు రాష్ట్రాలకు లబ్ధి కొవ్వూరు – భద్రాచలంరోడ్ రైలు మార్గం అందుబాటులోకి వస్తే తెలంగాణ, ఆంధప్రదేశ్లో ఉన్న ఏజెన్సీ నియోజకర్గాలకు రవాణా సౌకర్యాలు మెరగువుతాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఏపీలో జంగారెడ్డిగూడెం, పోలవరం, కొవ్వూరు నియోజకర్గాలకు కొత్త రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. విద్య, వైద్య పరంగా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న కాజీపేట – డోర్నకల్ – విజయవాడ – విశాఖపట్నం రైలు మార్గానికి సుమారు 100 కి.మీ. తక్కువ నిడివితో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. కాకినాడ, విశాఖ పోర్టుల నుంచి తక్కువ రవాణా ఖర్చుతో ఎగుమతులు, దిగుమతులు చేసుకునే వీలు కలుగుతుంది. భద్రాచలంరోడ్ – కొవ్వూరు రెల్వే లైన్ నిర్మాణ పనులకు సంబంధించి ఏపీ తరఫున నిర్మాణ వ్యయం వాటా చెల్లింపు విషయంలో అక్కడి ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు 150 కి.మీ. నిర్మించే నూతన రైలు మార్గానికి రూ.2,155 కోట్ల వ్యయం అవుతుందని గతేడాది తేల్చారు. ఇందులో ఏపీ ప్రభుత్వం తన వాటాగా రూ.1,100 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పనుల్లో కదలిక తెచ్చేందుకు ఏలూరు, రాజమండ్రి ఎంపీలు తమ వంతు ఒత్తిడి తీసుకొచ్చినా, నిర్మాణా వ్యయం చెల్లింపు విషయంలో ఏపీ సర్కార్ నుంచి ఎటువంటి ప్రయత్నాలూ జరగడం లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున మొత్తం వ్యయం రైల్వే శాఖనే భరించేలా ఒత్తిడి తెస్తున్నారా అంటే అదీ లేదు. ఫలితంగా కేవలం ప్రకటనలకే అక్కడి ప్రభుత్వం పరిమితం అవుతోంది. నెరవేరని భద్రాచలం రోడ్ – కొవ్వూరు రైల్వేలైన్ కల -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవా రం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశా రు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. రామయ్య సన్నిధిలో ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి మంగళవా రం రాగా, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచ నం చేయగా, ఏఈఓ శ్రవణ్కుమార్స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. కొనసాగుతున్న మీడియేషన్ ట్రైనింగ్ ఖమ్మం లీగల్: ఉమ్మడి జిల్లాలోని న్యాయవాదులకు ఖమ్మంలోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 40 గంటల మీడియేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం కొనసాగుతోంది. ఈ మేరకు రిసోర్స్ పర్సన్లుగా చైన్నె నుండి వచ్చిన అరుణాచలం, విజయకమల, శశిదేవి, రత్నతార తరగతులు బోధిస్తున్నారు. మీడియేషన్ సులభతరమైన పరిష్కార ప్రక్రియ అని, దీంతో కాలయాపనలేని సత్వర పరిష్కారం లభిస్తుందని తెలి పారు. ఈ విధానం ద్వారా కక్షిదారుల సమస్యలు తెలుసుకుని కేసులను ఎలా పరిష్కరించాలో రోల్ ప్లే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, డిబేట్ల ద్వారా వివరించారు. ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కల్పన తరగతులను పరిశీలించారు.పశువుల్లో గాలికుంటు నివారణకు టీకాలుచండ్రుగొండ: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివా రణ టీకాలు వేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 9న ప్రత్యేక శిబిరాలు ప్రారంభించామని, ఏప్రిల్ 10వ తేదీ వరకు ఈ క్యాంపులు కొనసాగుతా యని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని దామరచర్లలో మంగళవారం ఆయన టీకాల కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి పశువుల్లో వైరస్ వల్ల సోకుతుందని, అలాంటి పశువుల్లో ఉత్పాదక, పునరుత్పత్తి శక్తి తగ్గుతుందని వెల్లడించారు. రైతులు తమ పశువులకు విధిగా గాలికుంటు టీకాలు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పి.సావిత్రి, మండల పశువైద్యాధికారి డాక్టర్ వి. సంతోష్, సిబ్బంది ఎండీ సలీం, ఆకుల శ్రీనివాసరావు, నరేష్, రాము పాల్గొన్నారు. విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయాలిపాల్వంచ: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభు త్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. నేషనల్ కో ఆర్డినేన్ కమిటీఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీ ర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు కేటీపీఎస్ ఏడో దశ గేట్ ఎదుట మంగళవారం భోజన విరామ సమయంలో ఆందోళన చేశారు. కార్యక్రమంలో జేఎసీ నాయకులు యాస్మిన్, బ్రహ్మాజీ, మహేష్, రఘువీర్, రాధాకృష్ణ, రాజేందర్ పాల్గొన్నారు. -
రికార్డులు పర్యవేక్షిస్తుండాలి
భద్రాచలం: ఐటీడీఏలోని అన్ని శాఖల అధికా రులు రికార్డులతో పాటు వాటిని భద్రపరిచే గదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళి క కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పలు కార్యాలయాలు, రికార్డులను పరిశీ లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మోటార్ వెహికల్, డీజిల్, మరమ్మతులు, కోర్టు కేసులు, ఎల్టీఆర్ కేసులు, ఆర్టీఐ, ఆర్ఓఎఫ్ఆర్, వ్యవసాయం, విద్యు త్, ఉద్యానవన, మత్స్య తదితర శాఖలతో పాటు కొండరెడ్ల విభాగాలను సందర్శించామని వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు, ఆర్ఓఎఫ్ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, డీఎస్ఓ ప్రభాకర్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం కూలుతోంది..
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా కేంద్రంలో ఉన్న భూసార కేంద్రం శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రైతులకు చెందిన పొలా ల్లోని మట్టి నమూనాలను పరీక్షించి, భూసార ఫలితాలను వెల్లడించాల్సిన కార్యాలయంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1998లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం శిథిలావస్థకు చేరగా, వర్షం వచ్చి గోడలు తడిస్తే విద్యుత్షాక్ వస్తోందంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా భూసార కేంద్రం పరిసరాలు పిచ్చిమొక్కలతో నిండి ఉండడంతో పాముల సంచారం కూడా ఉంటోంది. కొంతకాలం క్రితం ఓ పాము కేంద్రంలోకి హల్చల్ చేసిన ఘటన చోటుచేసుకున్న విషయం విదితమే. భూసార కేంద్రంలో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. భూసారకేంద్రంలో మండలస్థాయి ఎస్టీఎల్ (సాయిల్ టెస్టింగ్ లేబోరేటర్) ఉంటారు. అసలైతే భూసారకేంద్రంలో ఇద్దరు మండలస్థాయి వ్యవసాయాధికారులు ఉండాలి. కానీ, ప్రస్తుతం జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఏఓ టెక్నికల్గా విధులు నిర్వహించాల్సిన వారిని డిప్యూటేషన్పై ఎస్టీఎల్గా నియమించా రు. మహిళా ఎస్టీఎల్తో పాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే మరో స్వీపర్ లేదా అటెండర్ స్థాయి మరో మహిళ మాత్రమే భూసార కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పేరుకే రెండు భూసార కేంద్రాలు ఉన్నాయని చెప్పుకోవడమే కానీ భద్రాచలంలో ఉన్న భూసార కేంద్రం గతంలో చాలాకాలం పనిచేయక మూతపడింది. అందుకు కారణం ప్రస్తుతం బోరు పనిచేయడం లేదనే సాకు వినిపిస్తోంది. కేవలం జిల్లా కేంద్రంలో ఉండే భూ సార కేంద్రం మాత్రమే అరకొర వసతులతో పని చేస్తూ రైతులకు సేవలందిస్తోంది. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా నాలుగువేల మంది రైతులకు సంబంధించిన మట్టి నమూనాలకు భూసార పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది కొరత.. భూసార కేంద్రంలో ఇద్దరు ఏఓ స్థాయి ఎస్టీఎల్లు, ఒక ఏఈఓ, అటెండర్, వాచ్మెన్ ఉండాలి. కానీ, ప్రస్తుతం డిప్యూటేషన్పై వచ్చిన ఎస్టీఎల్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మరో మహిళ తాత్కాలిక ప్రాతిపదికన అటెండర్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ భూసార దినోత్సవాన్నీ మరిచారు.. కొత్తగూడెం మార్కెట్ యార్డు ఆవరణలో వ్యవసా య సంబంధితశాఖల బాధ్యులందరూ కలసి డిసెంబర్ 5న భూసార దినోత్సవం నిర్వహించే వారు. ఎనిమిదేళ్లుగా ఆ ఊసు లేకుండాపోయింది. భూసార దినోత్సవం రోజున జిల్లావ్యాప్తంగా కొందరు రైతులను ఎంపిక చేసి, వారికి వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాగు పద్ధతులు, విత్తన ఎంపికలపై అవగాహన కల్పించేవారు. ఈ సంప్రదాయానికి కూడా తిలోదకాలిచ్చారు. శిథిలావస్థలో భూసార కేంద్రంజిల్లా కేంద్రంలోని భూసార పరీక్ష కేంద్రానికి వెళ్తే అన్నీ అరకొర సౌకర్యాలే. నూతన భవనం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే, అవసరమైన సిబ్బందిని, సౌకర్యాలను సమకూర్చాలి. రైతులకు తగిన సేవలను అందించాలి. –వాంకుడోత్ కోబల్, రైతు, రేగళ్ల -
మూడు ఇసుక లారీలు సీజ్
అశ్వారావుపేటరూరల్: ఏపీ రాష్ట్రం నుంచి సరిహద్దులు దాటించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీల ను స్థానిక పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ యయాతీ రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు నుంచి అశ్వారావుపేట మీదుగా సత్తుపల్లి, ఖమ్మం అక్రమంగా తరలిస్తుండగా సోమవారం తెల్ల వారుజామున పట్టణ శివారులో గుర్తించి పట్టుకున్నారు. మూడు లారీలను సీజ్ చేసి మైనింగ్ శాఖకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడి బైండోవర్అశ్వాపురం: పశువులు అక్రమ రవాణా కేసుల్లో నిందితుడుగా ఉన్న, హైదరాబాద్కు చెందిన మహ్మద్ మోయిజ్ ఖురేషిని సోమవారం సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ మణిధర్ ఎదుట బైండోవర్ చేశారు. మళ్లీ పశువుల అక్రమ రవాణాకు పాల్పడకుండా రూ.ఐదు లక్షల పూచీకత్తు తీసుకుని బైండోవర్ చేసినట్లు సీఐ తెలిపారు. చోరీకి యత్నంపినపాక: ఓ వ్యక్తి కిరాణా షాపులో చోరీకి యత్నించగా, గ్రామస్తులు గమనించి దేహశుద్ధి చేశారు. మండలంలోని జానంపేట గ్రామంలో ఓ కిరాణా షాపులో ఆదివారం అర్ధరాత్రి చేగర్శల గ్రామానికి చెందిన యువకుడు చోరీకి ప్రయత్నించాడు. దుకాణం పైన ఉన్న రేకుల తొలగిస్తుండగా శబ్దం రావడంతో గ్రామస్తులు మేల్కొని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
17న సింగరేణి గనుల్లో నిరసన
రుద్రంపూర్: సింగరేణిలో పెండింగ్ సమస్యల పరి ష్కారం, సంస్థ పరిరక్షణకు ఈ నెల 17న సంస్థవ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంట్ల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏఐటీయూసీ అదనపు కార్యదర్శి మిరియాల రంగయ్య ితెలిపారు. సోమవారం కొత్తగూడెంలోని శేషగిరిభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. డైరెక్టర్ (పా) ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదని, దీంతో సమస్యలు విన్నవించేందుకు వివిధ ఏరియాల నుంచి వస్తున్న కార్మికులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. గతేడాది కంపెనీ ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చూపిందని, తక్కువ లాభం వచ్చినా, ఎక్కువ వచ్చి నట్లు ప్రకటించిందని ఆరోపించారు. రూ.6వేల కోట్ల లాభం ప్రకటించి, అందులో రూ.4వేలకోట్లు నూతన ప్రాజెక్ట్ కోసం కేటాయించినట్లు కంపెనీ పేర్కొందన్నారు. ఆ రూ.4వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కంపెనీకి వచ్చిన లాభాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు వంగా వెంకట్, మల్లికార్జున్రావు, వీరస్వామి, గట్టయ్య, సందెబోయిన శ్రీనివాస్, హుమాయిన్, రాము, క్రిష్టాఫర్, ఎర్రగాని కృష్ణయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ గిరిజనుడికి ప్రభుత్వ సంక్షేమం
భద్రాచలం: ప్రతీగిరిజనుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా అధికారులు పనిచేయాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన గిరిజనుల నుంచి ఫిర్యాదు ల స్వీకరించారు. పరిశీలించి సంబంధిత యూ నిట్ అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్బంగా ఏపీఓ మాట్లాడుతూ గిరిజనులు స్వ యం ఉపాధిపథకాలు, చిన్న,మధ్యతరహా పరి శ్రమలద్వారా జీవనోపాధిని పొందాలని చెప్పా రు. అధికారులు సున్నం రాంబాబు, మధుకర్, లక్ష్మీనారాయణ, వేణు, ఉదయ్కుమార్, హెచ్ లింగానాయక్ తదితరులు పాల్గొన్నారు. గనుల కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించాలిసింగరేణి డైరెక్టర్ తిరుమలరావు మణుగూరు టౌన్: సాంకేతిక పరిజ్ఞానం విని యోగంతో గనులకార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలని సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ఎం) తిరుమలరావు అన్నారు. సోమవా రం ఆయన పీకేఓసీ–2, కేసీహెచ్పీలను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. నిబంధనలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఫ్యాబ్రికేషన్యార్డ్లో సాంకేతిక సదుపాయాలను పరి శీలించారు.ప్రాజెక్ట్కు సంబంధించిన పరికరాల తయిరీ విధానం, నాణ్యత ప్రమాణాలను సాంకేతిక అంశాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. ప్రాజెక్ట్లవివరాలు, పనుల పురోగతి భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.కార్యక్రమంలో జీఎంలు దుర్గం రాంచందర్, డి.వెంకటేశ్వర్లు, రామమూర్తి, ఇతర అధికారులు కేశవరా వు, శ్రీనివాస్, రమేశ్, కరీముల్లా, గౌడే, మధుసూదన్, సురేశ్, శ్రీనివాస్, శోభన్బాబు, ప్రవణ్ తదితరులు పాల్గొన్నారు. రోళ్లపాడు చెరువులో కొండచిలువటేకులపల్లి: మండలంలోని రోళ్లపాడు చెరువులో కొండచిలువ కలకలం రేపింది. రోళ్లపాడు గ్రామానికి చెందిన మత్స్యకారుడు చీమల నరేష్ ఆదివారం చేపలు పట్టేందుకు చెరువులో వల వేశాడు. సోమవారం వచ్చి తీయగా వలలో కొండచిలువ దర్శనమిచ్చింది. బయటకు తీసి చూడగా చనిపోయి ఉంది. కొండచిలువ 12 అడుగుల పొడవు ఉన్నట్లు మత్స్యకారుడు తెలిపాడు. మహిళా డిగ్రీ కళాశాలలో తనిఖీ పాల్వంచరూరల్: స్థానిక సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం గురుకుల విద్యాలయాల జిల్లా కోఆర్డినేటర్ (డీసీఓ) కె.వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఆహార నిల్వ ప్రదేశాలు, వంటగది, భోజనశాలను తనిఖీ చేశా రు. ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బోయిన ఝాన్సీరాణి పాల్గొన్నారు. వ్యక్తి మృతి కామేపల్లి: మద్యం మత్తులో పురుగులు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని ముచ్చర్లకు చెందిన రేగుల సుధాకర్(35) కొద్ది కాలంగా మద్యానికి బానిసై భార్య రేణుకతో తరచూ గొడవపడే వాడు. దీంతో ఆమె పిల్లలను తీసుకొని నెల క్రితం అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. భార్య రావడం లేదనే మనస్తాపంతో సుధాకర్ ఆదివారం మద్యం మత్తులో ఇంట్లోని పురుగుల మందు తాగాడు. స్థానికులు 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సోమవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్యతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
పన్నుల కోసం పరుగులు..
ఇల్లెందు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానిక మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెలాఖరు నాటికి 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు మున్సిపాలిటీల్లో వసూళ్లు ఇప్పటివరకు 50 శాతానికి మించలేదు. గత రెండు నెలలుగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి కుస్తీ పడుతున్నా లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోతున్నారు. బిల్లు చెల్లించగానే ఆన్లైన్.. మున్సిపల్ అధికారులు, సిబ్బంది తమ వెంట పేయింగ్ మిషన్తో ఇంటింటికీ వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారు. గతంలో మ్యానువల్గా డబ్బు తీసుకుని రసీదు ఇచ్చేవారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాక ఆపరేటర్లతో కంప్యూటరీకరణచేయించేవారు. అయితే ఇప్పుడు పేయింగ్మిషన్ల వినియోగంతో బిల్లు చెల్లించిన వెంటనే నేరుగా ఆన్లైన్ అవుతోంది. ఇదంతా బాగానే ఉన్నా మరో 20 రోజుల్లో పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేయడం ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో మున్సిపాలిటీ పరిధిలోనిప్రతీరోజు కనీసం రూ.2లక్షలు వసూలుచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇంటి, నల్లా పన్నులతో పాటు ట్రేడ్ లైసెన్స్లు రెన్యువల్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వసూలైతేనే వేతనాలు.. పట్టణాల్లో ఇంటి, ఇతర పన్నులు వసూలయితేనే శానిటేషన్, వాటర్ వర్క్స్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్లకు వేతనాలు అందేది. ఈ నిధులను జనరల్ ఫండ్ఖాతాలో జమ చేసి అవసరమైనప్పుడు శానిటేషన్, వాటర్వర్క్స్ మెటీరియల్ కొనుగోలు కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు మూడు మున్సిపాల్టీల్లో మాత్రమే సగానికి మించి వసూలు చేయగా మిగిలిన మున్సిపాల్టీలు సగానికి దరిదాపుల్లో ఉన్నాయి. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దు
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు భారీగా పోటెత్తగా.. వారి నుంచి వినతులు స్వీకరించాక ఆయన మాట్లాడారు. అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా సమర్థమైన పాలన అందించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ రవీంధ్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని ఇలా.. ●అశ్వాపురం మండలం వేములూరు గ్రామానికి చెందిన కొమరం నాగమణి తనకు ఇంటి స్థలం ఉన్నా ఇల్లు లేదని, ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తనకు ఇల్లు ఉన్నట్లు చూపించారని, తన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందించగా హౌసింగ్ పీడీకి ఎండార్స్ చేశారు. ●ఇల్లెందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన సుశీల.. గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి లబ్ధి కలగలేదని ఫిర్యాదు చేయగా ఇల్లెందు ఎంపీడీఓకు ఎండార్స్ చేశారు. ●బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఎం.రమణ.. 77 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నానని, జీవనోపాధి కోసం దివ్యాంగుల స్కూటీ మంజూరు చేయాలని కోరగా, దరఖాస్తును సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. నాణ్యమైన భోజనం అందించాలి ములకలపల్లి: విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. స్థానిక కేజీబీవీతో పాటు మూకమామిడిలోని ఏకలవ్య మోడల్ స్కూల్ను సోమవారం ఆయన సందర్శించారు. విద్యార్థుల హాజరు, బోధన, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ప్రత్యేక లక్ష్యాన్ని నిర్ధారించుకొని, సాధనకు కృషి చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్లో స్నాక్స్ అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఏలకవ్య మోడల్ స్కూల్లో పేరెంట్స్ వెయిటింగ్ హాల్ నిర్మించాలని స్థానిక సర్పంచ్ కొర్సా ఆదిలక్ష్మి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మి, ఎంపీడీఓ రామారావు, ఎంఈఓ సత్యనారాయణ, ఎంపీఓ సురేష్ బాబు, కేజీబీవీ ఎస్ఓ మహేశ్వరి, ఏకలవ్య ప్రిన్సి పాల్ అశోక్ పాల్గొన్నారు.ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ -
సహజ వనరుల వినియోగంతో పురోగతి
పాల్వంచరూరల్: గిరిజన ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులు, స్థానిక నైపుణ్యాలను ఉపయోగించుకుని వ్యాపారాలను అభివృద్ధి చేస్తే ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు) కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శివరాంప్రసాద్ అన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీ య సదస్సు సోమవారం ప్రారంభమైంది. ‘ఎంపవరింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ త్రూ అపార్చునిటీస్, చాలెంజ్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్స్’ అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజన సహజ సాధికారితలో పారిశ్రామిక అవకాశాల ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఫొప్రెసర్ పి.పద్మ, రిసోర్స్ పర్సన్ డాక్టర్ సత్యావతి, రిటైర్డ్ ఫొఫ్రెసర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ నారాయణస్వామి, వైస్ ప్రిన్సిపాల్ జె.మాధవి, కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 95 మంది రిజిస్ట్రర్ చేసుకున్న పరిశోధన పత్రాల పుస్తకాలను ఆవిష్కరించారు. -
మనువాదమే మహిళలకు శత్రువు
రుద్రంపూర్: మహిళలు పురుషుడి ముందు, సమాజం ముందు అణిగిమణిగి ఉండాలని చెప్పే మనువాద భావజాలమే మహిళలకు మొదటి శత్రువని సామాజిక కార్యకర్త పీఏ దేవి అన్నారు. అంతర్జాతీ య మహిఽళాదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కొత్తగూడెం క్లబ్లో సీఐటీయూ, ఐద్వా, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళల శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ రోజు ఇంటి పని, పిల్లలు, వృద్ధుల సంక్షేమం కోసం మహిళ 10 గంటలకు పైగా శ్రమిస్తోందని, ఈ శ్రమకు ఎక్కడ లెక్కింపు లేదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, తెలుగుదేశం నాయకులు మహిళలను పిల్లలను కనే యంత్రాలలాగా చూస్తున్నారే తప్ప, మనుషులుగా గుర్తించటం లేదన్నారు. ఇది సమాజంలో పెరుగుతున్న వివక్షకు, మనువాద భావజాలానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ శాఖ జిల్లా అధికారి లెనినా, ఐద్వా కార్యదర్శి ఎం.జ్యోతి, జి. పద్మ, 21వ డివిజన్ కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, శెట్టి వినోద, శ్రీదేవి, ఏజే రమేష్, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు సత్యనారాయణ పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త పీఏ దేవీ -
కడుపు తరుక్కుపోతోంది..
● భూదాన్ బాధితులతో కలిసి ధర్నాలో ఎమ్మెల్సీ కవిత ● అరెస్ట్ చేసిన పోలీసులు, విడుదల తర్వాత దీక్ష ప్రారంభం ఖమ్మం అర్బన్: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూమిలో ఇటీవల ఇళ్ల కూల్చివేతతో రోడ్డున పడిన వారి ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులకు ఆడబిడ్డల ఉసురు తాకడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో ఆశ్రయం పొందుతున్న నిర్వాసితులను సోమవారం ఆమె పరామర్శించి మాట్లాడారు. పిల్లల పరీక్షల సమయాన రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. బాధితులను అనేక మంది నాయకులు చూసి వెళ్లినా, సమస్య పరిష్కారం కోసం నిజమైన ప్రయత్నాలు చేయలేదన్నారు. బాధితుల ఇళ్లు ఎక్కడ నేలమట్టం చేశారో అదే ప్రాంతంలో వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కూల్చివేతలపై సీఎం, జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాలీ, ధర్నా.. భూదాన్ బాధితులకు అండగా రాజ్యాధికార సాధన జేఏసీ రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజ్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తోట రాఘవేంద్ర ముదిరాజ్, పొడకంటి రాంబాబుతో పాటు గుడిశ బాలయ్య తదితరుల ఆధ్వర్యంలో ఖమ్మంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ భవన్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగగా అక్కడి అంబేద్కర్ విగ్రహం ఎదురుగా చేపట్టిన ధర్నాలో బాధితులు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. మూడు గంటల పాటు ధర్నా కొనసాగగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆర్డీఓ, ఏసీపీ రమణమూర్తి చర్చించినా నాయకులు వెనక్కి తగ్గలేదు. ఈమేరకు పోలీసులను మోహరించి బాధితులను వివిధ పోలీసుస్టేషన్లకు తరలించే క్రమాన తోపులాట జరిగింది. ఆపై కల్వకుంట్ల కవిత, విశారదన్ తదితరులను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీక్ష ప్రారంభం ఖమ్మం రూరల్ పోలీసుస్టేషన్కు కవిత, విశారదన్ తదితరులను తీసుకెళ్లాక కొద్దిసేపటికి సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఆ తర్వాత వారు రాత్రి 9గంటలకు తిరిగి అంబేద్కర్ భవన్కు చేరుకుని నిర్వాసితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. -
సమగ్రాభివృద్ధి
సమన్వయంతోనే సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) డైరెక్టర్ శ్రీరామ్ తరణికంటి తెలిపారు. సోమవారం ఆయన జిల్లా పర్యటనకు రాగా, కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్శర్మ, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో.. జిల్లా మొత్తం జనాభా, జననాల రేటు, ప్రజల సగటు జీవనకాలం, వ్యవసాయ భూముల విస్తీర్ణం, రహదారుల పొడవు, అటవీ ప్రాంతాల శాతం, సాగునీటి వనరులు, అంగన్వాడీ కేంద్రాల సంఖ్య, డీఆర్డీఏ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి వాటిపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ అధికారి బాధ్యత నిర్వహణలో నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని సూచించారు. అధికారులకు తమ శాఖలే కాకుండా ఇతర విభాగాలపైనా అవగాహన కలిగి ఉండాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తే జిల్లా అభివృద్ధిలో వేగం పెరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరు విధి నిర్వహణలో 70 శాతం సమయాన్ని కార్యాలయ పనులకు, 30 శాతం సమయాన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ఆలోచనకు కేటాయించాలని సూచించారు. తమ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతారో, ప్రభుత్వ భవనాల నిర్వహణపైనా అంతే శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లా అధికారిని ఒక మండలానికి నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఆయా మండలాల్లో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా వారు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యాచరణ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలంటౌన్: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రతలో ప్రజలు కూడా భాగస్వాములైతేనే భద్రాచలం సుందరంగా విరాజిల్లుతుందని శ్రీరామ్ తరణికంటి అన్నారు. గోదా వరి ఘాట్ వద్ద కార్మికులతో కలిసి ఆయన సోమవారం పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోదావరి పరిసరాలను, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా పంచాయతీ సిబ్బంది ప్రత్యే క శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూనెం కృష్ణదొర, ఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎల్బీఎస్ఎన్ఏఏ డైరెక్టర్ శ్రీరామ్ తరణికంటి -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడామండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ,యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణా న్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, లాల్బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీరామ్ తార్నికంటి శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.కోటి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీలను సోమవారంచిత్రకూటమండపంలో లెక్కించా రు. 40 రోజులకు గాను రూ. 1,05,94,000తో పాటు 80 గ్రాముల బంగారం, 650 గ్రామల వెండి, యూఎస్ డాలర్లు 91, వియత్నాం కరెన్సీ 5,000 న్యూజిలాండ్ డాలర్లు 110, ఇతర విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఈఓ దామోదర్రావు తెలిపారు. అనంతరం నగదును బ్యాంకర్లుకు అప్పగించారు. ప్రతీ ఉద్యోగి రక్షణ సూత్రాలు పాటించాలిపాల్వంచ: కర్మాగారంలోని ప్రతీ ఉద్యోగి విధి గా రక్షణ సూత్రాలు పాటించాలని కేటీపీఎస్ 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్రావు అన్నారు. సోమవారం స్థానిక కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. భద్రత చర్యలు పాటిస్తే సంస్థ, ఉద్యోగి, కార్మి కులతో పాటు వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో జెన్కో ట్రైనింగ్ సెంటర్ సీఈ పార్వతి, డిప్యూ టీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం.వెంకన్న, ఎస్ఈలు బి.శివరాంరెడ్డి, టి.సత్యనారాయణ, ధర్మారావు, సీసీఏ రామారావు, వెంకటేశ్వర్లు, సీహెచ్పీ సునీల్, డీఈ సమ్మయ్య, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ చంద్రశేఖర్, ఫైర్ ఆఫీసర్ వై.శ్రీనివాస్, ఏఈ మహేష్, నాగరాజు, రజిని పాల్గొన్నారు. ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికఅశ్వారావుపేటరూరల్: భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారత ప్రభత్వ శాస్త్ర సాంకేతిక విభాగం వా రు ప్రతీ సంవత్సరం నిర్వహించే ఇన్స్పైర్ అవార్డుకు అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి నూతి సాయి కౌశిక్ ఎంపికై నట్లు హెచ్ఎంహరి త తెలిపారు. ఈమేరకు ఆమె సోమవారంమాట్లాడుతూ.. పాఠశాల సైన్స్ ఉపా ధ్యాయుడు చలపతిరావు పర్యవేక్షణలో బహుళ ప్రయోజనాల గొడుగును సాయి ప్రయోగాత్మకంగా తయారు చేస్తున్నాడని, ఈఏడాది అక్టోబర్ లో నిర్వహించే జిల్లాస్థాయి ప్రదర్శనలో ప్రదర్శించనున్నాడని వివరించారు. వంద శాతం ఫలితాలు సాధించాలికొత్తగూడెంఅర్బన్: జిల్లాలో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ యోగితారాణా సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీ–శాట్ ద్వారా సోమవారం ప్రసారం అయిన యోగితారాణా మోటివేషన్, గైడెన్స్ స్పీచ్ను విద్యార్థులు వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్షల సమయంలో ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. పరీక్షల వేళ ఉపాధ్యాయులు వ్యవహరించాల్సిన తీరుపై కూడా యోగితారాణా పలు సూచనలు చేశారని డీఈఓ నాగలక్ష్మి తెలిపారు. -
మక్కకు మద్దతు కరువు
● ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 ● ప్రైవేట్ మార్కెట్లో రూ.1,600 మాత్రమే ● పంట సీజన్ ప్రారంభమవుతున్నా కొనుగోళ్లపై స్పష్టతనివ్వని ప్రభుత్వం ● ఆందోళనలో మొక్కజొన్న రైతులు ఖమంవ్యవసాయం: యాసంగిలో మునుపెన్నడూ లేనంతగా మొక్కజొన్న సాగు చేయడంతో పంట ఉత్పత్తికి కనీస మద్దతు ధర దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో మక్కల ధర క్వింటాలుకు రూ.1,600కు మించి పెట్టడం లేదు. యాసంగిలో సాగు చేసిన మక్క పంట చేతికందే దశకు చేరగా.. అక్కడక్కడా ముందస్తుగా సాగు చేసిన పంట కోతలు సాగుతున్నాయి. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలకు జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉండటం, భూగర్భ జలం కూడా ఉండటంతో యాసంగిలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో కనీస మద్దతు ధర దక్కడం లేదు. సాధారణంగా యాసంగిలో సాగుచేసిన మొక్కజొన్న పంట ఏప్రిల్ ఆరంభం నుంచి చేతికందుతుంది. కానీ, ఈసారి పత్తిని తొలగించిన కొందరు ముందస్తుగా పంట సాగు చేయటంతో మార్చి రెండు, మూడు వారాల నుంచి పంట చేతికందే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో.. వానాకాలంలో సాగు చేసిన పత్తి అధిక వర్షాలకు దెబ్బతినటంతో దానిని తొలగించి, మొక్కజొన్న సాగు చేశారు. జలాశయాల్లో నీరు ఉండటంతో ఉమ్మ డి ఖమ్మం జిల్లాలో 2,40,222 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ఖమ్మం జిల్లాలో 1,67,282 ఎకరాల్లో, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 72,940 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేస్తున్నారు. కాగా, సాగు విస్తీర్ణం ఆధారంగా ఉమ్మడి జిల్లాలో 6,24,577 టన్నుల పంట దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా (ఎకరాకు సుమారు 26 క్వింటాళ్లు) వేసింది. కానీ, పంట దిగుబడి ఎకరాకు 40 క్వింటాళ్లు వస్తుందని రైతులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో సాగు చేసిన విస్తీర్ణం నుంచి 4,34,933 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగుచేసిన పంట నుంచి 1,89,644 టన్నుల పంట దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు.. యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట కొనుగోళ్లపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టతనివ్వలేదు. పలుచోట్ల పంట కోతలు ప్రారంభమై ప్రైవేట్ మార్కెట్లో విక్రయాలు కూడా సాగుతుండగా.. గ్రామాల్లో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాలుకు రూ.1,600కు మించి ధర పెట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొక్కజొన్నల కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400గా నిర్ణయించగా.. వ్యా పారులు మాత్రం క్వింటాలుకు రూ.800 ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మరోవారం రోజుల్లో కోతలు ముమ్మరం కానుండగా, పంట కొనుగోళ్లపై ప్రభు త్వం నుంచి స్పష్టత లేకుండాపోయింది. ప్రభు త్వం కనీస మద్దతు ధరతో మక్కలను కొనుగోలు చేయా లని మార్క్ఫెడ్ను ఆదేశించాలని రైతులు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం పంట కొనుగోళ్లకు ముందుకు వచ్చినా నిబంధనల ఆధారంగా 30 శాతం పంటను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతో దిగుబడి ఆధారంగా ఖమ్మం జిల్లాలో 1,30,500 టన్నులు, భదాద్రి కొత్తగూడెంజిల్లాలో56,900 టన్నులు మాత్ర మే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలుస్తోంది. రైతుల్లో ఆందోళన పైవేట్ మార్కెట్లో మొక్కజొన్న ధర దయనీయంగా ఉండటం, ప్రభుత్వం పంట కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోకపోవటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కోతలు ప్రారంభమవుతుండటంతో ఇదే అదనుగా వ్యాపారులు పంటకు డిమాండ్ లేదనే సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం పంట సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.మొక్కజొన్నల కొనుగోళ్లపై ఇంకా అనుమతులు రాలేదు. ప్రభుత్వం అనుమతిస్తే మార్క్ఫెడ్ రాష్ట్ర శాఖ చర్యలు తీసుకుంటుంది. సాధారణంగా ఏటా ఏప్రిల్ నుంచి యాసంగి మొక్కజొన్నల కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలుంటాయి. యాసంగిలో కొందరు ముందస్తుగా సాగు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట కొనుగోళ్లు ఉంటాయి. – సునీత, మేనేజర్, మార్క్ఫెడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా -
గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
● మణుగూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు ● విచారణ చేపట్టిన బీసీ గురుకులాల డీసీఓ బ్యూలారాణిమణుగూరుటౌన్: మండలంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై 100 పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం కొందరు విద్యార్థినులు బయట నుంచి తెచ్చిన బిర్యానీలు తినగా, రాత్రివేళ 8 గంటల సమయంలో 10 మంది విద్యార్థులకు వాంతులయ్యాయి. దీంతో గురుకుల సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సోమవారం ఉదయం నలుగురిని, సాయంత్రం 11 మందిని మణుగూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే హాస్టల్లో వడ్డించిన భోజనమే తిన్నామని, బయటి ఫుడ్ తినలేదని చికిత్స పొందుతున్న విద్యార్థినులు తెలిపా రు. మెడికల్ క్యాంప్ నిర్వహించి, ఇతర ఫుడ్ తిన్నవారితోపాటు హాస్టల్లో ఉన్న సుమారు 20 మంది వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి మందులు అందించినట్లు సమాచారం. డీసీఓ విచారణ..అంతా గోప్యం హాస్టల్లో మొత్తం 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం సాగింది. బీసీ గురుకులాల జిల్లా కన్వీనర్ బ్యూలారాణి హాస్టల్లో విచారణ చేపట్టారు. విద్యార్థుల ఆరోగ్యం క్షీణించి 12 గంటలు గడిచినా వారి కుటుంబ సభ్యులకు తెలపకపోవడంపై హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్యాంపు నిర్వహించేందుకు వచ్చిన వైద్య సిబ్బందిని గురుకుల అధికారులు లోపలకు అనుమతించలేదు. గంటసేపు ఎండలోనే నిలబెట్టారు. మహిళా సంఘాలను సైతం లోపలికి రానివ్వలేదు. విచారణపై గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పలు విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ తదితరులు గంటల తరబడి వేచి చూసినా లోపలికి రానివ్వకపోవడంతో వాగ్వాదానికి దిగారు. వార్డెన్, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీరసంగా, కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థినులకు పీహెచ్సీ సిబ్బంది మందులు అందించగా, మెడికల్ క్యాంప్ను డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్ పుల్లారెడ్డి, మధువరన్ సందర్శించారు. కాగాా చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 100 పడకల ఆస్పత్రిలో పరామర్శించారు. మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ నాయకుడు గురిజాల గోపి కూడా విద్యార్థినులను పరామర్శించి, పండ్లు అందజేశారు. -
సింగరేణి జామాయిల్ నరికివేత
టేకులపల్లి: ఓబీ మట్టి గుట్టలపై ఉన్న జామాయిల్ కలపను నరికి తరలిస్తున్నా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడంలేదు. సుమారు 15 ఏళ్ల క్రితం సింగరేణి ఓబీ గుట్టలపై కేఓసీ యాజమాన్యం జామాయిల్ మొక్కలను నాటింది. అవి ఏపుగా ఎదిగాయి. దీంతో అక్రమార్కులు జామాయిల్ కలపను రాత్రికి రాత్రే నరికి విక్రయించుకుంటున్నారు. నెల రోజులుగా ఈ వ్యవహారం సాగుతున్నా కేసీఓ అధికారులు పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అంబులెన్స్ డ్రైవర్కు పదేళ్ల జైలు శిక్షసూపర్బజార్(కొత్తగూడెం)/బూర్గంపాడు: మద్యం మత్తులో రోడ్డు ప్రమాదంతో తల్లీకూతుళ్ల మృతికి కారణమైన అంబులెన్స్ డ్రైవర్కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సోమవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా.. 2020, జనవరి 1న బూర్గంపాడు సమీపంలోని పుల్లేరు వాగు వద్ద తోట చంద్రకళ (28), ఆమె కూతురు శ్రీ లాస్య రోడ్డు పక్కన ద్విచక్రవాహనం ఆపి నిల్చున్నారు. ఈ క్రమంలో భద్రాచలానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ ఆకుల దుర్గాప్రసాద్ మద్యం మత్తులో అంబులెన్స్ నడుపుతూ ఢీకొట్టాడు. దీంతో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదుతో బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. న్యాయమూర్తి 14 మంది సాక్షులను విచారించగా, నేరం రుజువు కావడంతో పదేళ్ల కఠిన కారాగార శిక్ష , రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఏపీపీ పీవీడీ లక్ష్మి వాదనలు వినిపించారు. కోర్టు నోడల్ ఆఫీసర్, ఎస్ఐ డి రాఘవయ్య, సిబ్బంది ఎన్.వీరబాబు, పీసీ మహ్మద్ అక్రమ్ సహకరించారు. -
ఫీడర్లకు యూనిక్ పోల్ నంబర్
● సమస్యల సత్వర పరిష్కారానికి కృషి ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్సూపర్బజార్(కొత్తగూడెం): జీఐఎస్ అసెట్ మ్యాపింగ్ అండ్ ట్రాకింగ్ ప్రక్రియలో భాగంగా అన్ని 33 కేవీ లైన్లలోని 38 ఫీడర్ల పనులు పూర్తిచేసినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు. 11 కేవీ లైన్లలోని 252 ఫీడర్లకు యూనిక్ పోల్ నంబర్ రాస్తున్నట్లు తెలిపారు. దీంతో నిర్వహణ పనులను కూడా సమర్థవంతంగా ట్రాక్ చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. విద్యుత్ అంతరాయాలు, ట్రాన్సఫార్మర్ల వైఫల్యాలు వంటి వివరాలను కూడా సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే ఆ పోల్ నంబర్ ఆధారంగా లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకుని, సిబ్బంది సత్వరమే అక్కడికి చేరుకుంటారని అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా రియల్ టైమ్లో కచ్చితమైన సమాచారం పొందే అవకాశం ఉండటంతోపాటు వేగవంతంగా చర్యలు చేపట్టవచ్చని, ఫీడర్ల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్ఈ వివరించారు. -
దేవేరుల గనులు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదీ తీరంలో ప్రాణహిత దగ్గర నుంచి మొదలు పెడితే పాపికొండల వరకు ప్రాచీన జీవజాతులకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తాయి. ఒకప్పటి దండకారణ్యంలో భాగంగా ఉన్న జిల్లాలో ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. పినపాక మండలం పాండురంగాపురం దగ్గర రాకాసి గూళ్లు (పురాతన సమాధులు), ములకలపల్లి మండలం అక్షరలొద్ది, ఒంటిమిట్టగుండుల దగ్గర రాక్ పెయింటింగ్లు ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. బౌద్ధ విహారాలు, రాష్ట్ర కూటులు, కాకతీయులు కట్టించిన ఆలయాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. అయితే, చరిత్ర గర్భంలో కలిసిపోయిన దేవీదేవేరులను సింగరేణి సంస్థ వెలుగులోకి తెచ్చింది. విభిన్నంగా.. ఖని అంటే గని అనే అర్థం. ఆరంభంలో సింగరేణి గనులకు నంబర్లతో లేదా ఆ గనికి పర్యవేక్షకుడిగా ఉన్న అధికారుల పేర్లతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. కొత్తగూడెంలో అధికారి పేరు మీద బర్లి పిట్ గని ఉండేది. బొగ్గును వెలికితీసే పద్ధతిని బట్టి ఇల్లెందులో 21 పిట్, స్ట్రట్పిట్ ఉండగా, ఇతర ఏరియాల్లో 5 ఇంక్లైన్, 7 ఇంక్లైన్, 8 ఇంక్లైన్, సెంచరీ ఇంకై ్లన్ పేర్లతో గనులు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో జాతీయ నాయకుల పేర్ల మీదుగా కూడా గనులు వచ్చాయి. ఇల్లెందులో జవహర్లాల్ నెహ్రూ పేరు మీదుగా జవహర్ఖని (జేకే), రామకృష్ణాపూర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద రవీంద్రఖని (ఆర్కే), మణుగూరులో టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద ప్రకాశంఖని (పీకే) ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. భూపాలపల్లి ఏరియాలో గనులను కాకతీయఖని (కేకే), బెల్లంపల్లిలో శాంతిఖని, మందమర్రిలో కల్యాణిఖనిగా నామకరణం చేశారు. కొన్ని గనులు అక్కడున్న గ్రామం పేరుతో కూడా వచ్చాయి. మణుగూరులో కొండాపూర్ ఓసీ, ఇల్లెందులో పొలంపల్లి గనులు ఉన్నాయి. రామగుండం దగ్గర గోదావరి నది తీరంలో బొగ్గు గనులు రావడం, అక్కడ కార్మిక బస్తీలు పెరిగిపోవడంతో ఏకంగా గోదావరిఖని (రామగుండం) పేరుతో కార్పొరేషన్ ఏర్పాటైంది. కానీ, సింగరేణి వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఒక్క కొత్తగూడెం ఏరియాలోనే వెంకటేశ్ఖని, పద్మావతిఖని అంటూ దేవుడి పేర్లతో గనులు వచ్చాయి. వెలుగులోకి వెంకటేశ్వరుడు పద్మావతిఖనికి సమీపంలో వెంకటేశ్వరుడి విగ్రహం లభ్యమైంది. అప్పటికే కొత్తగూడెంలో 1 నుంచి 6 వరకు నంబర్లతో గనులు వచ్చాయి. దీంతో 1957లో మొదలైన గనికి వెంకటేశ్ఖని, ఆ తర్వాత వీకే–7గా పేరు పెట్టారు. 70 ఏళ్లకు పైగా వీకే, పీవీకే పేర్లతో కొత్తగూడెం ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆయువుపట్టుగా పద్మావతి, వెంకటేశ్ గనులు నిలిచాయి. గత చరిత్రకు గుర్తుగా ఇక్కడున్న ఓ కొండపై శ్రీభూనీల సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సింగరేణి నిర్మించింది. బొగ్గు నిక్షేపాలు తరిగిపోవడంతో వీకే గని 2021లో మూతపడింది. తాజాగా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ఏకకాలంలో భూగర్భ, ఓపెన్కాస్ట్ పద్ధతుల్లో బొగ్గును వెలికి తీసే వీకే మెగా మైన్గా మళ్లీ వెలుగులోకి వచ్చింది. బుద్ధుడికీ ఓ గని.. కొత్తగూడెం సమీపంలో కారుకొండ దగ్గర గౌతమ బుద్ధుడి విగ్రహాలు వెలుగు చూశాయి. వీటిని ఆర్కియాలజీ సంస్థ రక్షిత స్థలాలుగా ప్రకటించింది. ఈ చరిత్రకు గౌరవాన్ని కల్పిస్తూ గౌతంఖని పేరుతో ఒక ఓపెన్కాస్ట్ మైన్ను సింగరేణి సంస్థ 1991లో ప్రారంభించింది. ఈ గనిలో పని చేసే కార్మికుల కోసం కట్టించిన కాలనీకి గౌతంపూర్ కాలనీగా పేరు పెట్టింది. అయితే, ఈ గని కూడా 2021లో మూతపడింది.స్వాతంత్య్రానికి ముందే సింగరేణి బొగ్గు గనులు ఇల్లెందు, బెల్లంపల్లిలో ప్రారంభయ్యాయి. ఆ తర్వాత కొత్తగూడేనికి 1936లో విస్తరించాయి. ఈ క్రమంలో తొలి గనిగా ప్రస్తుత హెడ్ ఆఫీస్ దగ్గర బర్లిపిట్ మొదలైంది. అయితే, ఇక్కడ అగ్నిప్రమాదం జరగడంతో ఈ గని మూతపడింది. ఆ తర్వాత రామవరం దగ్గర గనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో అక్కడున్న కొండలు, గుట్టల్లో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ సాగిస్తుండగా అక్కడ భూమి పొరల్లో మరుగున పడిన ఓ శిలా విగ్రహం లభ్యమైంది. ఆనవాళ్లను బట్టి పద్మావతిదేవి విగ్రహంగా గుర్తించారు. దీంతో ఈ ప్రాంతంలో 1952లో మొదలైన గనిని పద్మావతిఖని పేరుతో పిలవడం మొదలైంది. కొత్తగూడెంలో బొగ్గు బావులకు దేవుళ్ల పేర్లు -
భద్రగిరి రామయ్యకు అభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి హాజరుకావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు ఐటీడీఏలో గిరిజన దర్బార్భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో.. భద్రాచలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. ‘మిల్లెట్’ మహిళకు సత్కారంభద్రాచలం: ఐటీడీఏ సహకారంతో స్వయం ఉపాధి పొందుతున్న గిరిజన మహిళను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానించారు. భద్రాచలం గిరిజన మహిళలు మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. వీరి స్ఫూర్తి కథపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా మన్కీ బాత్లో ప్రస్తావించారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కొమరం భీమ్ భవనంలో మిల్లెట్ బిస్కెట్ తయారీదారు వెంకటలక్ష్మి ఘనంగా సత్కరించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, ధనసరి సీతక్క, పురస్కారం అందజేశారు. -
వంటింటిపై భారం
● గ్యాస్ సిలిండర్ ధర రూ. 60 పెంపు ● రూ. 952కు చేరిన 14.2 కేజీల సిలిండర్ రేటు ● పెరిగిన ధరతో జిల్లాపై రూ. 2.81కోట్ల భారంపాల్వంచరూరల్: పశ్చిమాసియాలో నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశంలోని చమురు సంస్థలు వంట గ్యాస్ ధర పెంచాయి. దీంతో వినియోగదారులపై మరింత భారం పడుతోంది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.842 ఉండగా, గతేడాది రూ. 50 పెంచడంతో రూ.892కు చేరింది. శనివారం నుంచి మరో రూ. 60 పెంచడంతో ప్రస్తుతం రూ.952కు పెరిగింది. పెరిగిన ధరతో జిల్లాలోని గ్యాస్ వినియోగదారులపై రూ.2,81,44,500 భారం పడుతోంది. వంట గ్యాస్ ధరలు పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతుంటే గ్యాస్ ధర పెంపుతో మరింత భారం పడిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కమర్షియల్ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1,953 ఉండగా, రూ.114 పెంపుతో ప్రస్తుతం రూ.2,067కు పెరిగింది. జిల్లాలో 4,69,075 మంది గృహ వినియోగదారులు జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులు 4,69,075 మంది ఉన్నారు. ఇందులో సింగిల్ సిలిండర్ వినియోగదారులు 2,41,175 మంది, రెండు సిలిండర్లు కలిగినవారు 98,868 మంది ఉన్నారు. దీపం కనెక్షన్లు 53,405, కార్పొరేట్ రెస్పాన్స్ బిలిటీ పర్సన్(సీఎస్ఆర్) కనెక్షన్లు 2465, ఉజ్వల పథకం కనెక్షన్లు 73,162 ఉన్నాయి. -
హెచ్పీవీ టీకాతో కేన్సర్ నిర్మూలన
ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ అంకిత్చుంచుపల్లి: హెచ్పీవీ టీకాతో మహిళల్లో గర్భాశయ ముఖ కేన్సర్ను నివారించవచ్చని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. టీకాల కార్యక్రమాన్ని ఆదివారం ఆయన కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కలెక్టర్ అంకిత్తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. వ్యాక్సినేషన్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ అర్హులైన బాలికలందరికీ టీకా అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, డీఎంహెచ్ఓ తుకారామ్ రాథోడ్, డీసీహెచ్ఎస్ రవిబాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధామోహన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా పాల్గొన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్లు అందించాలి పాల్వంచ: పద్నాలుగు ఏళ్లు నిండి, 15 ఏళ్ల లోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్లు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త డాక్టర్ రవిబాబు అన్నారు. ఆదివారం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వైద్యాధికారులు డాక్టర్ ప్రసాద్, హరీష్, సీతమ్మ, రాంప్రసాద్, సిబ్బంది ఎస్.కృపామణి, ఎం.రమాదేవి, సల్మా పాల్గొన్నారు. సింగరేణి సీఎండీని కలిసిన కొత్తగూడెం ఎమ్మెల్యే రుద్రంపూర్: సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతిని శనివారం రాత్రి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలిశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం సింగరేణి డైరెక్టర్లు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు, నాయకులు ఎస్కే సాబీర్పాషా, వంగా వెంకట్ పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’లో టాప్
● రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందంజ ● గ్రౌండింగ్ అయిన ఇళ్లలో 70 శాతం పూర్తిసాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వ మానస పుత్రిక అయిన ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల పురోగతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా అగ్రస్థానాన నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి, జనగామ, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో గ్రౌండింగ్ అయిన ఇళ్లలో 70.25 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే పలువురు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయడం విశేషం.ప్రణాళికాయుతంగా పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పొరపాట్లకు తావివ్వకుండా ప్రభుత్వం ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతోంది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించడమే కాక, ఆ నిధులతోనే మోడల్హౌస్లు నిర్మించి చూపించింది. వీటి ఆధారంగా అధికారులు మేసీ్త్రలు, లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. 400 చదరపు అడుగుల్లో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్తో బెడ్రూమ్, ఇంటి లోపల గదులు, వరండాల్లో టైల్స్ వేశారు. డాబా మెట్ల కింద మరో టాయిలెట్ నిర్మించారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు ఫ్యాన్లు, రంగులు వేయడం ఇలా అన్ని పనులూ ఈ బడ్జెట్లోనే ఎలా పూర్తిచేయొచ్చో వివరించారు. ఐదు జిల్లాల్లో జెట్ స్పీడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం ఊపందుకుంది. ఖమ్మం జిల్లాలో మొత్తం గ్రౌండింగ్ అయిన 14,470 ఇళ్లల్లో 10,165 నిర్మాణాలు పూర్తి కాగా 70.25 శాతంతో అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత 58.34 శాతంతో మేడ్చల్ మల్కాజ్గిరి, 57.50 శాతంతో జనగామ, 57.31 శాతంతో వరంగల్, 31.71 శాతంతో యాదాద్రి భువనగిరి రెండు నుంచి ఐదో స్థానం వరకు దక్కించుకున్నాయి. ఖమ్మం జిల్లాకు 16,524 ఇళ్లు.. ఖమ్మం జిల్లాకు తొలుత పైలట్ ప్రాజెక్టు కింద 26 గ్రామాల్లో 867 ఇళ్లు మంజూరయ్యాయి. ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లో 15,657 ఇళ్లు కేటాయించారు. మొత్తంగా 16,524 మంజూరు కాగా.. 2,054 ఇళ్లు మినహా మిగతావి పునాదులు, గోడలు, స్లాబ్ దశల్లో ఉన్నాయి. మొత్తం 988 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తూ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చూస్తున్నారు. ఎవరైనా ఇళ్లు ప్రారంభించకపోతే అవగాహన కల్పిస్తున్నారు. -
ఇష్టంతోనే విద్య..
వృత్తి విద్యా కోర్సులతో పాటు రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయనే విశ్వాసంతో డిగ్రీ కోర్సులను ఎంపిక చేసుకున్నా. తల్లిదండ్రులకు చదువుపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో మంచి కళాశాలను ఎంచుకొమ్మని మాకే చెబుతున్నారు. కొన్ని అంశాల్లో మాత్రం వారి సూచనలు పాటిస్తున్నాం. – వేముల నందిని, డిగ్రీ ద్వితీయ సంవత్సరంతల్లిదండ్రులు, స్నేహితుల సలహాలు, సూచనలతో ఎంచుకున్న కోర్సులోనే చదువుతున్నా. అందరి తల్లిదండ్రులు కూడా చదువు విషయంలో పిల్లలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా చూడాలి. తద్వారా విద్యార్థులు లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. పిల్లలు కూడా క్రమశిక్షణతో చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు. – జి.చంద్రమౌనిక, డిగ్రీ విద్యార్థిని -
బాధితులకు అండగా..
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా కేంద్రంలోనిభరోసా సెంటర్ మహిళలకు అండగా నిలుస్తోంది. 2024, ఫిబ్రవరి 6న ప్రారంభించగా, లైంగిక నేరాల బాధితులకు సమగ్ర సహా యం అందిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 214 కేసులు భరో సా సెంటర్లో నమోదయ్యాయి. వాటిలో 163 పోక్సో కేసులు, 35అత్యాచార కేసులు, 16ఇతర కేసులు ఉన్నాయి. బాధితులకు రూ.45లక్షల పరిహారం అందించాలని 113దరఖాస్తులు ప్రభుత్వానికి సమర్పించారు. రూ.18లక్షలు మంజూరు కాగా,49 మందికి పరిహారం అందించారు. అదనంగా విక్టిమ్ అసిస్టెన్స్ ఫండ్ ద్వారా 15మందికి రూ.1,10,000 సహాయం అందజేశారు. భరోసా కేంద్రంలో మొత్తం 214 కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించారు. బాధితులకు మానసిక సహాయం, వివిధ థెరపీలు, నిరంతర ఫాలో అప్ సేవలు అందిస్తున్నారు. భరోసా కేంద్రం సేవలు భరోసా కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 214 కేసులు నమో దు చేశాం. బాధితులకు న్యాయం, వైద్య సహాయం అందిస్తున్నాం. మానసిక పరి రక్షణ, పునరావాససేవలు అందించడంలో భరోసా సెంటర్ నిరంతర కృషి చేస్తోంది. –చల్లా అరుణ, భరోసా సెంటర్ ఎస్ఐ -
మా ఊళ్లో మద్యం వద్దు
దుమ్ముగూడెం:మండల పరిధిలోని గౌ రారం గ్రామపంచాయతీలో మద్యం విక్రయించొద్దని గ్రామసభలో తీర్మానించారు. ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ. లక్ష జరిమానా విధించాలని నిర్ణయించారు. శనివారం సర్పంచ్ శ్యామల రవి వర్మ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. మూడు అంశాలు విద్యపై అవగాహన, మత్తు పదార్థాల నిరోధంపై అవగాహన, మద్యపాన నిషేధంపై చర్చించారు. గ్రామ మహిళలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకు న్న తర్వాత మద్యపాన నిషేధం పాటించాలని నిర్ణయించినట్లు పాలకవర్గ సభ్యులు తెలి పారు. గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐ వెంకట ప్పయ్య మత్తు పదార్థాలవల్ల కలిగే నష్టాలపై అవగాహ న కల్పించారు. అనంతరం సీఐని పంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సున్నం రమేష్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, సోడె శ్రీనివాసరావు, ముర్రం వీరభద్రం, కల్లూరి ఆదినారాయణ, సోందె నర్సింహారావు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం -
మహిళల రక్షణే ధ్యేయంగా..
● సత్వర సేవలందిస్తున్న జిల్లా షీ టీమ్ ● రాష్ట్రంలోనే ద్వితీయ స్థానం సొంతం సూపర్బజార్(కొత్తగూడెం): మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న జిల్లా షీ టీమ్ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. మహిళలు, యువతులు, బాలికలకు అండగా నిలబడుతోంది. ఆకతాయిలు, ఇతరులెవరైనా వేధింపులకు పాల్ప డితే నిర్భయంగా సంప్రదించేలా షీ టీం ఎస్ఐ రమాదేవి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ బృందాలను కూడా నియమించారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్లకు గురైనా, తప్పుడు మెసేజ్లు వచ్చినా, రాంగ్ కాల్స్తో ఇబ్బంది పెట్టినా, ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసినా, పనిచేసే ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురైనా, బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా షీ టీమ్ పోలీసులను ఆశ్రయిస్తే సత్వర న్యాయం అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవలని, ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నేరుగా లేదా 8712682131 నంబర్కు లేదా డయల్ 100కు ఫోన్చేసి సమాచారం అందించి సమస్యలు పరిష్కరించుకోవాలని షీ టీమ్ అధికారులు కోరుతున్నారు.గతేడాది జిల్లా వ్యాప్తంగా 472 ఫిర్యాదులు స్వీకరించాం. 76 మందికి కౌన్సెలింగ్ ఇచ్చాం. 346 పెట్టీ కేసులు, 50 కేసులు ఎఫ్ఐఆర్ చేయించి బాధితులకు న్యాయం అందించాం. షీ టీమ్ విధులు, ఫిర్యాదు చేసే విధానం, నూతన చట్టాలు, సైబర్ క్రైమ్స్ తదితర విషయాలపై జిల్లా వ్యాప్తంగా 152 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాం. –రమాదేవి, షీ టీం ఎస్ఐ -
సంస్థను మరింత అభివృద్ధి చేద్దాం
● సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ● కొత్తగూడెంలో వీకే–7 కోల్మైన్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం రుద్రంపూర్: నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంతోపాటు లోతుగా చర్చించి సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి చేద్దామని, ఇందుకోసం జనరల్ అసిస్టెంట్ నుంచి జీఎంల వరకు అందరూ సహకరించాలని సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి అన్నారు. శనివారం ఆయన కొత్తగూడెంలోని వీకే–7 కోల్మైన్లో బొగ్గు ఉత్పత్తి, రవాణాను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఆ తర్వాత పీవీకే–5 ఇంక్లైన్ గని ఆవరణలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గనిలో సీములు, ఉత్పత్తి, నిక్షేపాల నిల్వ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగినితో కొబ్బరికాయలు కొట్టించారు. కార్మికులకు స్వయంగా ప్రసాదం తినిపించారు. అనంతరం గనిలోకి దిగి బొగ్గు ఉత్పత్తి ప్రదేశాన్ని సందర్శించారు. కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థలో సబార్డినేటర్లు ఎవరూ లేరని, అందరూ ఒకే కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. గనుల్లో 60 శాతం, ఓసీల్లో 90శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఈ నెల 6న మణుగూరు ఏరియాలో సందర్శించి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. త్వరలో సమసలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కార్మిక సంక్షేమానికి కృషి చేస్తామని, సింగరేణి సంస్థ ప్రత్యేకమైన పబ్లిక్ సెక్టార్ అని, రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలు అందిస్తోందని వివరించారు. అందరిని సమన్వయం చేసుకుంటూ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. తొలుత యూనియన్ నాయకులను శాలువాలతో సన్మానించారు. కాగా, కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతిని కలెక్టర్ అంకిత్ కలిశారు. మొక్క అందజేశారు. జిల్లా మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించాలని సీఎండీని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమాల్లో శిక్షణ కలెక్టర్ సౌరభ్శర్మ, సింగరేణి డైరెక్టర్లు కేవీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, తిరుమలరావు, సీడీఎన్ శ్రీనివాస్ రావు, కొత్తగూడెం జీఎం ఎం.శాలేంరాజు, ఇతర అధికారులు కోటిరెడ్డి, మోహన్రావు, రామకృష్ణ శ్యాంప్రసాద్, కార్మిక నాయకులు ఎండీ రజాక్, వంగా వెంకట్, మల్లికార్జున్రావు పాల్గొన్నారు.


