breaking news
Bhadradri
-
ఫలించిన ‘అంగన్వాడీ బాట’
● కొత్తగా 13,760 మంది చిన్నారుల చేరిక ● ఐదేళ్లు నిండిన 6,154 మంది పాఠశాలల్లో చేరిక ● టీచర్ పోస్టులు భర్తీ చేస్తే మరింతమంది చేరే అవకాశం భద్రాచలంఅర్బన్ : రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 10 నుంచి 17 వరకు నిర్వహించిన ‘అమ్మమాట – అంగన్ వాడీ బాట’ కార్యక్రమం విజయవంతమైంది. అంగన్వాడీ కేంద్రాలు అందించే సేవలను తల్లిదండ్రులకు వివరించడంతో జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 13,760 మంది చిన్నారులు చేరగా, 3,966 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. పౌష్టికాహారం, ఆటపాటలతో విద్య.. జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో చిన్నారులకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భోజనం, గుడ్డు, మురుకులు, బాలామృతం వంటి పౌష్టికాహారం అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు కూడా పాలు, గుడ్డు వంటి పోషకాహారం అందుతోంది. ఆటపాటలు, కథలు, సంభాషణ నైపుణ్యాలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య ద్వారా చిన్నారులకు మంచి అలవాట్లు నేర్పుతున్నారు. పుట్టిన వెంటనే తల్లులు, చిన్నారుల పేర్లను అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయడం ద్వారా బాలింతలకు పోషకాహారం, చిన్నారులకు బాలామృతం పంపిణీ చేస్తున్నారు. ఖాళీల భర్తీతో మరింత బలోపేతం.. జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 1,869 మంది టీచర్లు, 1,103 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఇంకా 191 టీచర్ పోస్టులు, 957 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సమీప కేంద్రాల టీచర్లు ఖాళీగా ఉన్న కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇది వారికి అదనపు భారంగా మారుతోంది. గతేడాది నుంచి ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపినా ఇంకా భర్తీ చేయలేదు. పోస్టుల భర్తీతో పాటు ఆయా సెంటర్లకు పక్కా భవనాలు నిర్మిస్తే లబ్ధిదారులకు మరింతగా సేవలు అందే అవకాశం ఉంటుంది. ఆరు నెలలుగా అద్దె పెండింగ్ కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు ఆరు నెలలుగా అద్దె బకాయిలు విడుదల కాకపోవడంతో టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. అద్దె చెల్లించక ఇంటి యజమానుల నుంచి ఒత్తిడి ఎదురవుతోందని వాపోతున్నారు. అలాగే, రెండేళ్లుగా ఈవెంట్ బిల్లులు, మూడేసి నెలలుగా ఆరోగ్యలక్ష్మి, గ్యాస్ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని చెబుతున్నారు. జిల్లాలో 785 అంగన్వాడీలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, ఒక్కో భవనానికి నెలకు రూ.వెయ్యి నుంచి రూ.4వేల చొప్పున ఆరు నెలలుగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. అలాగే, సంక్షేమశాఖ ద్వారా అమలయ్యే కార్యక్రమాలు వివరించేందుకు ఈవెంట్లకు రూ.200 నుంచి రూ.500 వెచ్చిస్తుండగా ఒక్కో సెంటర్కు దాదాపు రూ.6 వేల నుండి రూ.9 వేల వరకు చెల్లించాల్సి ఉంది. అంగన్వాడీలకు వచ్చేలా చర్యలు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సమీప చిన్నారులు చేరేలా అమ్మమాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని చేపట్టాం. వారం రోజుల్లోనే మంచి ఫలితాలు నమోదయ్యాయి. చిన్నారులను చేర్పించే కార్యక్రమం కొనసాగిస్తూనే, కేంద్రాల్లో చిన్నారులకు అవసరమైన వసతులు కల్పిస్తాం. అలాగే, అద్దె బకాయిలు, ఈవెంట్ బిల్లులపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించాం. చిన్నారులందరికీ యూనిఫామ్ ఇచ్చేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. – స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమశాఖ అధికారిఈసారీ కొందరికే యూనిఫామ్ కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు 2024 నుంచి రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ అందిస్తోంది. అయితే, జిల్లాలో 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటిల్లో ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు వయస్సు వారు 33,800 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలు 2,800 ఉన్నారు. అయితే, గత ఏడాది 612 కేంద్రాల్లోని 6,362 పిల్లలకే యూనిఫామ్ పంపిణీ చేశారు. అమ్మాయిలకు గౌన్, అబ్బాయిలకు నిక్కరు, చొక్కా కుట్టించి ఇవ్వగా.. మిగతా మిగతా కేంద్రాల్లో చిన్నారులకు నిరాశ ఎదురైంది. ఈసారి సైతం జిల్లాలో అదే సంఖ్యలో యూనిఫామ్ పంపిణీ చేయనున్నారని తెలుస్తుండగా.. అందరికీ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వ భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల చిన్నారులకు యూనిఫామ్ ఇచ్చి మిగతా వారిని విస్మరించడం సరికాదని చెబుతున్నారు. -
సీలింగ్ భూముల స్వాధీనం
ఖమ్మంఅర్బన్: సీలింగ్ భూములను లబ్ధిదారులు సాగు చేసుకోకుండా ఇతరులకు అమ్ముకున్నట్లు తేలడంతో స్వాధీనం చేసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. ఈమేరకు ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు గ్రామంలో సర్వే నంబర్ 196లో ఉన్న 9.9 ఎకరాల భూమిని కోర్టు ఆదేశాలతో గురువారం ఖమ్మం అర్బన్ ఆర్ఐ వాహిద్, సర్వేయర్ నాగేశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటుచేశారు. ఈ భూమి విలువ సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనతో.. సర్వేనంబర్ 196లోని భూములను గతంలో ఇద్దరు రైతులకు అసైన్మెంట్ రూపంలో కేటాయించారు. అయితే, స్వయంగా సాగు చేసుకోవాలే తప్ప విక్రయించొద్దనే నిబంధన విధించారు. కానీ వారిద్దరు ఇతరులకు అమ్మగా.. ఆపై ఇంకొన్ని చేతులు మారినట్లు తేలింది. ఈనేపథ్యాన కోర్టు సూచనల మేరకు 9.9 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ సైదులు తెలిపారు. ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించగా, ఎవరూ ఆక్రమించకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. ఇతరులకు అమ్మినట్లు తేలడంతో చర్యలు స్వాధీనం చేసుకున్న భూమి విలువ రూ.50కోట్లు!ప్లాట్ల యజమానుల్లో ఆందోళన సీలింగ్ భూములు తీసుకున్న వారు సాగు చేయకపోవడమే కాక ఇతరులకు విక్రయించారు. ఆపై చేతులు మారగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు దక్కించుకుని ప్లాట్లుగా విడగొట్టి 80 మందికి విక్రయించినట్టు తెలిసింది. నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఉత్తర్వులతో స్వాధీనం చేసుకోవడంతో విషయం తెలియక ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియగానే పలువురు అక్కడకు చేరుకుని డాక్యుమెంట్ల ఆధారంగా పరిశీలించడం కనిపించింది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన సమర్పించి హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. సివిల్స్ అభ్యర్థులకు శిక్షణ భద్రాచలంటౌన్: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. రెసిడెన్షియల్ విధానంలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్, శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. వార్షికాదాయం రూ.3లక్షలకు మించని అభ్యర్థులు శుక్రవారం లోగా http.// twd. telangana gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆపై ఆబ్జెక్టివ్ టైప్, ఆస్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేసిన శిక్షణ ఇస్తారని తెలిపారు. ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి డీఎంహెచ్ఓ జయలక్ష్మి గుండాల : ప్రజల ఆరోగ్యంపై సిబ్బంది దృష్టి పెట్టాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి జయలక్ష్మి అన్నారు. ఆళ్లపల్లి పీహెచ్సీని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు, రక్తహీనతపై ప్రతీ గ్రామాన్ని, పాఠశాలలను సందర్శించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యశిబిరాలు నిర్వహించాలన్నారు. పాము, తేలు, కుక్క కాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని అన్నారు. నెలలు నిండిన గర్భిణులను ముందుస్తుగా ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. అనంతరం అనంతోగు బాలికల ఆశ్రమ పాఠశాల, మర్కోడు బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి సికిల్సెల్ పరీక్షలను పరిశీలించారు. ఆమె వెంట వైద్యాధికారి సంఘమిత్ర, రేవంత్, సీహెచ్ఓ సోమ్లా నాయక్, ఎస్యూఓ హరికృష్ణ, హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి, హెచ్ఏ నరేష్, శ్రీధర్బాబు, రేవతి, సావిత్రి, రమణ తదితరులు పాల్గొన్నారు. -
విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం కొత్తగూడెంఅర్బన్ : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రకాల మందులు, పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఏ చిన్న సమస్య వచ్చినా.. వెంటనే తన దృష్టికి తేవాలన్నారు. ఇన్సులిన్, మలేరియా మందుల సరఫరాకు కృషి చేస్తానని చెప్పారు. ‘భవిత’తో మనో వికాసం.. భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు మనోవికాసం కలుగుతుందని కలెక్టర్ అన్నారు. కొత్తగూడెం రైటర్ బస్తీలోని భవిత కేంద్రాన్ని గురువారం సందర్శించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల బోధనకు అవసరమైన అన్ని పరికరాలు, స్టడీ మెటీరియల్ తెప్పించాలని, రెయిలింగ్, రాంప్ వంటివి పటిష్టంగా ఏర్పాటు చేయాలని అన్నారు.ఫిజియోథెరపిస్టులు కచ్చితంగా కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ తనిఖీ చేశారు. గోడౌన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేకుండా ఎవరినీ లోనికి వెళ్లనివ్వొద్దని సిబ్బందికి సూచించారు. మేకపాల విశిష్టతను తెలియజేయాలి.. జిల్లాలోని మారుమూల గ్రామాల గిరిజనులు, మహిళల వద్ద గల మేకల సంతతిని అభివృద్ధి చేయాలని, అధిక పాల దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఆయన పశువైద్య అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేకపాల విశిష్టతపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. మేకపాల నుంచి పెరుగు, మజ్జిగ, జున్ను, పన్నీరు, చీజ్ వంటి ఉత్పత్తులు తయారు చేసి వినియోగించే పద్ధతులపై ప్రచారం కల్పించాలన్నారు. జిల్లా ప్రజలకు ఆరోగ్యకరమైన మేకపాలు అందించేందుకు ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వీటి మార్కెటింగ్ ద్వారా గిరిజనులు, మహిళల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు. బాతులు, కౌజు పిట్టల పెంపకంపై కూడా ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, కొత్తగూడెం ఎంఈఓ ప్రభుదయాల్, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, ఎలక్షన్ సెల్ సిబ్బంది నవీన్, పశువైద్యాధికారి ఎం. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్ల బదిలీ జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లు, ఏడుగురు నాయబ్ తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. -
యూరియా కోసం పడిగాపులు
ఇల్లెందు: పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటలకు యూరియా వేసేందుకు వస్తుండడంతో మార్కెట్లోని యూరియా విక్రయ కేంద్రం కిటకిటలాడుతోంది. గురువారం రెండు లారీల యూరి యాను రైతులు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు ఇల్లెందు పీఏసీఎస్లో సుమారు 2వేల మంది రైతులు 300 టన్నులు యూరియా కొనుగోలు చేశారు. యూరియా బస్తాలను పీఏసీఎస్ వద్ద కొనుగోలు చేస్తుండగా.. డీఏపీ, 20:20 ఎరువులు మాత్రం ప్రైవేట్ వ్యాపారుల వద్ద తీసుకెళ్తున్నారు. వర్షాలకు ఏపుగా ఎదిగి వస్తున్న పంటలకు యూరియా అవసరం పెరిగింది. అయితే యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైనంత అందిస్తున్నానమని పీఏసీఎస్ సీఈఓ హీరాలాల్ తెలిపారు. -
ప్రజలకు నిత్యం అండగా ఉండాలి
కొత్తగూడెంటౌన్: భారీ వర్షాలు కురుస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో, అండగా ఉండాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. డీడీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. రాబోయే వర్షాలదృష్యా ప్రమాదవశాత్తు వరదల్లో చిక్కుకునే వారిని రక్షించడానికి పోలీసులతో పాటు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డీడీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రెస్యూ సమయంలో అవసరమైన లైఫ్ జాకెట్లు, రోప్ల వంటి సామగ్రిని సమకూర్చుతామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నరేందర్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి మురహరి క్రాంతికుమార్, ఆరో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ రవి తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు -
కునుకు లేదు
చినుకు పడితే..అసెంబ్లీలో చర్చిస్తానన్న పోలవరం ఎమ్మెల్యే.. పెదవాగు ఆయకట్టు మొత్తం 16 వేల ఎకరాల్లో 13 వేల ఎకరాలు ఏపీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోనే ఉంది. అందుకే ప్రాజెక్టు పునర్నిర్మాణానికి 80 శాతం నిధులు భరించేందుకు జీఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ఇరిగేషన్ అధికారులు అంగీకరించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఫిబ్రవరి 11న అశ్వారావుపేటకు వచ్చినపుడు పెదవాగు అంశాన్ని ప్రస్తావిస్తూ అసెంబ్లీలో ప్రాజెక్టు సమస్యపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే నాటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగకున్నా.. అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి నేరుగా సీఎంతో మాట్లాడొచ్చు కదా అని రైతులు అంటున్నారు. పోల‘వరం’ ఎమ్మెల్యే హామీ కూడా ఆచరణ సాధ్యం కాలేదని ఆవేదన చెందుతున్నారు. అశ్వారావుపేట : గోదావరి బేసిన్ పరిధిలోని పెదవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయకుండా ఏపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందంటూ ఆయకట్టు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతేదాడి జూలై 18న క్లౌడ్బరస్ట్కు ప్రాజెక్టు కట్టతెగిన సంగతి తెలి సిందే. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సైతం సందర్శించారు. అనంతరం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సమావేశంలోనూ ఇరురాష్ట్రాల ఇరిగేషన్ అధి కారులు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి సమష్టి అంగీకారం తెలిపారు. ఈ సీజన్కే సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని, ఆయకట్టు రైతులకు న్యా యం చేయాలని, దిగువ గ్రామాలకు వరద ముప్పు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఇందుకు రూ.19 కోట్ల వ్యయంతో తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా అందులో 80 శాతం నిధులు జీఆర్ఎంబీకి డిపాజిట్ చేసేందుకు ఏపీ అధికారులు అంగీకరించారు. ఇక ఆ తర్వాత నిధుల్లేవు, పనుల్లేవు. దీంతో రైతులు, లోతట్టు ప్రాంతాల వారి పరిస్థితి ‘చినుకు పడితే .. కునుకు లేదు’ అన్నట్టుగా మారింది. అటకెక్కిన తుమ్మల హామీ.. గతేడాది జూలై 18వ తేదీ రాత్రి పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోగా 21న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. పంటలు, ఇళ్లు దెబ్బతినడంపై విచారం వ్యక్తం చేయడమే కాక ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతులు కాదు.. రీడిజైన్ చేయడమే శాశ్వత పరిష్కారమని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతానని ప్రకటించారు. జీఆర్ఎంబీ, ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. 2025 వానాకాలం నాటికి రీ డిజైన్, నిర్మాణ పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. అయితే ఏడాది కావొస్తున్నా ఇవేమీ ఆచరణకు నోచుకోకపోవడంతో వారిలో నిరాశ అలుముకుంది. ‘రింగ్బండ్’కు ముప్పు.!అశ్వారావుపేటరూరల్: పెదవాగు ప్రాజెక్టులో రూ.కోట్ల వ్యయంతో తాత్కాలికంగా నిర్మించిన రింగ్బండ్కు వర్షాలు, వరదతో ముప్పు పొంచి ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మట్టికట్టకు బీటలు ఏర్పడుతుండగా, ఓ చోట భారీగా కోతకు గురై గుంత ఏర్పడింది. వర్షాలు ఇంకా కొనసాగితే మట్టికట్ట వద్ద గండి పడే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ. 3.50 కోట్లు వెచ్చించి నిర్మించిన రింగ్బండ్ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. రింగ్బండ్పై ఆధారపడి పంటలు సాగు చేయాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ●భయాందోళనలో పెదవాగు ఆయకట్టు రైతులు, లోతట్టు ప్రజలు ఏపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందంటూ అసహనం జిల్లా మంత్రి పరిచయాలు, ప్రయత్నాలు ఏమయ్యాయని నిలదీత -
అమ్మకానికి ‘సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ’
● ప్రైవేటు సెక్యూరిటీ గార్డు పోస్టుల నియామకాలకు వసూళ్లు ● ఒక్కో ఔట్సోర్సింగ్ ఉద్యోగానికి రూ.1.50 లక్షలు ! ● డబ్బులు ఇచ్చినా ఉద్యోగం రాక ఓ యువకుడి ఆత్మహత్య ● సదరు ఏజెన్సీపై చర్యలు చేపట్టని సింగరేణి అధికారులు నా చావుకు వారే కారణంమణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో ప్రైవేట్, ఔట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డు పోస్టుల నియామకంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు ఇచ్చినా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏజెన్సీ ఉద్యోగం ఇవ్వకపోవడంతో బాధితులు మనోవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే పినపాక మండలానికి చెందిన యువకుడు పూనెం సంప్రీత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ సంఘటన సింగరేణిలో చర్చనీయాంశంగా మారగా, సూసైడ్ నోట్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఒక్కో పోస్టుకు రూ. 1.50 లక్షలు! సదరు కంపెనీ 2024లో సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్ దక్కించుకోగా, 2025 డిసెంబర్తో గడువు ముగియనుంది. పోస్టులకు ప్రారంభం నుంచే డబ్బులు వసూళ్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో పోస్టుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు సదరు కంపెనీ సూపర్వైజర్ వసూళ్లు చేసినట్లు సమాచారం. సంప్రీత్ కూడా సూపర్వైజర్ అమరేందర్రెడ్డికే డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నెలలు గడుస్తున్నా ఉపాధి చూపకపోవడంతో పలుమార్లు అడుగగా అమరేందర్రెడ్డి ఖాళీ చెక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. చెక్కు ఇచ్చినా డబ్బులు అందక, ఉపాధి లభించక మరోవైపు అప్పు, వడ్డీలు కట్టలేక సంప్రీత్ మనోవేదన చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విప్పలసింగారానికి చెందిన ఓ యువకుడి నుంచి రూ. లక్ష తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలల తరబడి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కల్పించకపోవడంతో వడ్డీకి తెచ్చిన డబ్బులు కావడంతో కుటుంబ పెద్ద గుండెపోటుతో మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. గతంలో పగిడేరుకు చెందిన కొందరు యువకులు రన్నింగ్లో ఎంపికై నా డబ్బులు డిమాండ్ చేయడంతో.. వారు సూపర్వైజర్కు డబ్బులు ఇచ్చి మోసపోయారు. స్థానిక పోలీస్స్టేషన్లో సంప్రదించి డబ్బులు తిరిగి పొందారు. చర్యలు తీసుకోని సింగరేణి యాజమాన్యం సింగరేణి నిర్వాసితులకు, ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు యాజమాన్యం ప్రైవేటు సెక్యూరిటీ గార్డులుగా ఉపాధి కల్పిస్తుంది. కానీ సదరు కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుని స్థానికేతరులను నియమించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై డైరెక్టర్(పా), సెక్యూరిటీ జీఎంలకు ఫిర్యాదులు అందినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా సింగరేణి యాజమాన్యం స్పందించి సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని బాధితులు, కార్మిక నాయకులు కోరుతున్నారు. కాగా ఈ వ్యవహారంపై సింగరేణి మణుగూరు ఏరియా డీజీఎం (పర్సనల్) సలగల రమేష్ను వివరణ కోరగా.. సమస్యపై మురళి మ్యాన్ పవర్ కంపెనీ బాధ్యులతో చర్చించామని, సమస్యను పరిష్కరించాలని సూచించామని తెలిపారు. సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య పినపాక: సింగరేణి మణుగూరు ఏరియాలో కాంట్రాక్ట్ పద్ధతిన సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏడాది క్రితం డబ్బు వసూలు చేసిన సంస్థ.. ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరం చెందాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పినపాక మండలం పోట్లపల్లి గ్రామానికి చెందిన పూనెం సంప్రీత్(25) సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కోసం గతేడాది మురళీ మ్యాన్ పవర్ కంపెనీకి రూ.1.50 లక్షలు చెల్లించాడు. ఐదారు నెలలు గడిచినా ఉద్యోగం రాకపోవడంతో సంస్థ సూపర్వైజర్ అమరేందర్రెడ్డిని నిలదీశాడు. దీంతో ఆయన సంప్రీత్కు ఖాళీ చెక్కు ఇవ్వగా.. ఆ చెక్కు కూడా బౌన్స్ అయింది. అయినా కంపెనీ వారు కోర్టు విచారణకు రాకపోవడం, మరోవైపు సంప్రీత్ చేసిన అప్పలకు వడ్డీలు పెరుగుతుండడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం పురుగుల మందు తాగగా.. కుటుంబుసభ్యులు భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కాగా, ‘అమ్మా, నాన్నా నన్ను క్షమించండి, నా చావుకు మురళీ మ్యాన్ పవర్ సెక్యూరిటీ ఏజెన్సీనే కారణం, ఏజెన్సీకి చెందిన మురళి, వెంకట్, మణికంఠ, అమరేందర్రెడ్డే బాధ్యులు’ అంటూ సంప్రీత్ రాసిన సూసైడ్ నోట్ గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. -
‘డ్రాగన్’ కాసులు!
ఏడెకరాల రాళ్ల భూమిలో రైతు వెంకటేశ్వరరావు ప్రయోగం ● నాటిన 20 నెలల్లో ప్రారంభమైన డ్రాగన్ పండ్ల దిగుబడి ● తొలి కాతలో ఎకరాకు ఐదు టన్నుల కాయలు ● టన్ను డ్రాగన్ పండ్లకు రూ. లక్ష ఆదాయం అశ్వారావుపేటరూరల్: రాళ్లభూమిలో ఓ రైతు ధైర్యంతో సాగు చేసిన డ్రాగన్ పంట కాపునకు వచ్చింది. అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామ శివారులో రైతు బిర్రం వెంకటేశ్వరరావు తన ఏడెకరాల చేలో దాదాపు ఇరవై నెలల క్రితం డ్రాగన్ తోట సాగు చేశాడు. ప్రయోగాత్మకంగా, లక్షలాది రూపాయాల పెట్టుబడితో సాగు చేపట్టాడు. దిగుబడి మొదలుకాగా రైతు మోములో ఆనందం వ్యక్తమవుతోంది. ఎకరానికి ఐదు టన్నులు.. డ్రాగన్ తోటకు ఒక్కసారి పెట్టుబడి పెట్టి సాగు చేస్తే దాదాపు ఇరవై ఏళ్లవరకు దిగుబడి వస్తుంది. పంట సాగుకు ఒక ఎకరానికి సుమారు రూ.6 నుంచి రూ.7 లక్షల దాకా ఖర్చు అవుతుండగా, ఎకరానికి దాదాపు నాలుగు వేల డ్రాగన్ మొక్కలు నాటుకోవచ్చు. ఎకరాకు 500 సిమెంట్ స్తంభాలు అవసరం కాగా, ఒక్కో స్తంభానికి 10 మొక్కలు పెట్టుకోవచ్చు. మొక్కలకు డ్రిప్ ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉండగా, ఈ పంట సాగుకు నీరు పెద్దగా అవసరం లేదు. పంట సాగు చేసిన 18 నెలల తర్వాత పంట దిగుబడి ప్రారంభమైంది. ఏటా జూన్ మాసంలో పంట దిగుబడి మొదలై నవంబర్ వరకు ఉంటుంది. తొలిసారి పంట దిగుబడిగా ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు కాయలు దిగుబడి వచ్చాయి. తొలి ఏడాది దిగుబడి తక్కువ వచ్చినా రెండో ఏడాది నుంచి దిగుబడి రెండింతలు పెరిగే అవకాశం ఉంది. కాగా, మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ టన్ను ధర రూ.లక్ష వరకు ఉంది. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో లాభదాయకంగా మారింది. డ్రాగన్ పండ్లను అశ్వారావుపేట, సత్తుపల్లి, ఏపీలోని విజయవాడ మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నామని, తోట వద్ద కేజీ రూ.150కు విక్రయిస్తున్నామని రైతు తెలిపాడు. మార్కెటింగ్కు ఇబ్బందే.. పంట సాగుకు రూ. లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. అయినా ఆసక్తి ఉండటంతో ముందుకు సాగా. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ పండ్లకు డిమాండ్ ఉంది. కానీ విక్రయాలకు కొంతమేర ఇబ్బందులు ఉన్నాయి. కాయల కోత తర్వాత మూడు రోజుల్లోనే విక్రయించాలి. లేనిపక్షంలో కాయ దెబ్బతిని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దూర ప్రాంతాలకు రవాణా చేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – బిర్రం వెంకటేశ్వరరావు, ఆసుపాక, అశ్వారావుపేట మండలం -
కిష్టారంలో ‘చావు’ కష్టాలు
టేకులపల్లి: మండల పరిధిలోని కిష్టారం గ్రామంలో అంతిమ సంస్కారాలకు తిప్పలు తప్పడంలేదు. గ్రామానికి చెందిన కొర్స నర్సయ్య బుధవారం మృతి చెందాడు. శ్మశాన వాటిక ముర్రేడు వాగు అవతల వైపు ఉంది. దీంతో గురువారం దహనసంస్కారాలు చేసేందుకు వాగు దాటి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. సుమారు రెండు వేల ఎకరాల వ్యవసాయ భూములు కూడా అటువైపే ఉన్నాయి. చిన్న వర్షానికి కూడా వాగు ఉధృతంగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. హైలెవెల్ బ్రిడ్జి నిర్మించాలని 40 ఏళ్లుగా అధికారులకు, ప్రజాప్రతినిదులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇప్పటికై నా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని రైతులు, గ్రామ పెద్దలు చింత జోగయ్య, జబ్బ జోగయ్య, పాయం లక్ష్మినర్సు, బొల్లి కృష్ణ, చింత రాంబాబు, వేప లక్ష్మయ్య, చింత నాగేశ్వరరావు, కంగలభద్రయ్య, చింత సంపత్, ఏపె పగడయ్య కోరారు.అంతిమ సంస్కారాలకు వర్షాకాలంలో వాగు దాటేందుకు అవస్థలు -
ఉన్నతంగా రాణించాలి
బూర్గంపాడు: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని జీవితంలో ఉన్నతంగా రాణించాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. బూర్గంపాడులోని సరస్వతి శిశుమందిర్ను గురువారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని వసతులను పరిశీలించారు. విద్యార్థులతో, పాఠశాల నిర్వహకులతో మాట్లాడారు. ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, ఉన్నత లక్ష్యాలను విద్యార్థులకు చిన్నతనం నుంచే నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్గోపాల్, చెంగలరావు, తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య పనుల పరిశీలనకొత్తగూడెంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం కొత్తగూడెంలోని జరిగిన పారిశుద్ధ్య పనులను ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ పరిశీలన చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగంలో రికార్డులను పరిశీలించారు. కాగా 2,5,4,20,23 డివిజన్లలో మురుగు కాల్వల్లో సిల్ట్ తొలగించారు. అంతర్గత రహదారులు వెంట ఉన్న చెట్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమాల్లో మేనేజర్ ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, శానిటరీ జవాన్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలిములకలపల్లి: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ తెలిపారు. మండల పరిధిలోని కమలాపురం ఆశ్రమ పాఠశాలలో మంగపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సికిల్ సెల్ వ్యాఽధి నిర్ధాఽరణ పరీక్షల శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరు పరిశీలించి పలు సూచనలు చేశారు. వైద్యాధికారి సాయికల్యాణ్, ప్రోగ్రాం ఆఫీసర్ మధు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ముష్టికుంట్ల విద్యార్థులు బోనకల్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో బోనకల్ మండలం ముష్టికుంట్ల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా 90 మంది విద్యార్థులు పాల్గొనగా అండర్ పాఠశాల విద్యార్థులు బొడ్డుపల్లి నవ్యశ్రీ, షేక్ ఫరీదా ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎంపికయ్యారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడిపాల్వంచ: ఆర్టీసీ బస్సు డ్రైవర్పై గురువారం ఆటో డ్రైవర్ దాడికి పాల్పడటంతో కేసు నమోదైంది. మణుగూరు నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు పాల్వంచ బస్టాండ్లోకి వస్తోంది. ఈ క్రమంలో ఇన్ గేట్ వద్ద ఆటో ఉండటంతో స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో బొల్లేరుగూడేనికి చెందిన ఆటో డ్రైవర్ తరాల సంతోష్ ఆగ్రహంతో బస్సు డ్రైవర్ జక్కం రమేష్ను దూషించి, దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. -
నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి
దమ్మపేట : అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. గురువారం మండలంలోని గండుగులపల్లి నివాసంలో మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారేతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అవసరమైన చోట రహదారులు, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. అంతకుముందుగా మంత్రి తుమ్మలను, సత్తుపల్లి నూతన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, విద్యుత్ , పంచాయతీరాజ్, అటవీ శాఖల అధికారులు, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు అలపాటి ప్రసాద్, కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, కేవీ సత్యనారాయణ, ఎర్రా వసంతరావు, మన్నెం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
‘రివర్సైడ్’కు ఆదరణ కరువు
గోదావరి నదీ తీరంలోని విడిది కుటీరాల తొలగింపు భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానం సందర్శించిన భక్తులతోపాటు పర్యాటకులు గోదావరి నదీ తీరంలో బస చేసే విధంగా ఏర్పాటు చేసిన విడిది కుటీరాలను తొలగిస్తున్నారు. వర్షాకాలం కావడంతో గోదావరికి వరదలు వస్తే మునిగిపోతుందనే కారణంతోపాటు పర్యాటకుల నుంచి ఆదరణ లేకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. గత జనవరిలో భద్రాచలం నదీ తీరంలో ఏర్పాటు చేసిన ఏరు ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ విడిది (రివర్సైడ్ క్యాంప్) కుటీరాలు ఏర్పాటు చేయించారు. ప్రారంభం నుంచీ పర్యాటక ఆదరణ లభించలేదు. మొదటిసారి ఆన్లైన్లో బుక్ చేసుకుని 17 మంది విడిది చేశారు. ఆ తర్వాత ఒకరిద్దరు తప్ప ఎప్పుడూ పర్యాటకులతో కుటీరాలు నిండింది లేదు. చార్జీలు భారీగా ఉండటంతో పర్యాటకులు ఆసక్తి చూపడంలేదని భావించిన అధికారులు.. చార్జీలు తగ్గించారు. ఆఫ్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ముగ్గురు, నలుగురు సభ్యులు కలిగిన కుటుంబం బస చేసేలా సిద్ధం చేశారు. 12 గంటలు బస చేసే పర్యాటకులకు రూ.500 చార్జీతో పాటు వారి అభ్యర్థన మేరకు భోజన వసతి కల్పించాలని నిర్ణయించారు. అయినా ఆదరణ లేకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. దీంతో నిర్వహణ బాధ్యతను డీఆర్డీఏ అధికారుల నుంచి స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ఎండాకాలం తాటాకు పందిళ్లు కూడా ఏర్పాటు చేశారు. అయినా మార్పులేకపోవడంతో వాళ్లు కూడా వదిలేశారు. దీంతో పిచ్చి మొక్కలు పెరిగిపోయి, రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇక చండ్రుగొండ మండలం బెండాలపాడు, దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్ప, పాల్వంచ మండలం కిన్నెరసాని, ఐటీడీఏ గిరిజన మ్యూజియం వద్ద ఏర్పాటు చేసిన గిరిజన పల్లె వాతావరణ ఆవాసాలను పర్యాటకులు తిలకించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అధికారులు సుమారు రూ.35 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. వాటికి కూడా ఆదరణ లేకపోవడంతో ప్రజాధనం వృథా అయిందని పలువురు పేర్కొంటున్నారు. -
బడి బస్సులు భద్రమేనా?
● ఫిట్నెస్ లేకున్నా కొన్ని బస్సులకు సర్టిఫికెట్ల జారీ ● 33 బస్సుల లైఫ్టైం ముగిసినట్లు నిర్ధారణ ● ఇంకా కొన్ని ఫిట్నెస్ పరీక్షలకు రాని బస్సులు కొత్తగూడెంటౌన్: విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆయా విద్యాసంస్థలకు చెందిన బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించాల్సి ఉంటుంది. విద్యాసంస్థల బస్సులను ఆర్టీఏ కార్యాలయాలకు కొందరు తీసుకురాగా మరికొందరు తీసుకురాకుండానే ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నా యి. 2025 ఏప్రిల్ నుంచి జూన్ 30 వరకు దాదాపు 1,392 వాహనాలను తనిఖీల్లో పట్టుకుని సీజ్ చేయ గా నిబంధనలు పాటించని వాహనాల ద్వారా ఫైన్ల రూపంలో దాదాపుగా రూ.2కోట్ల 26లక్షలను ఆర్టీఏ అధికారులు రాబట్టా రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా దాదాపు 256 విద్యాసంస్థలకు చెందిన బస్సులు ఉన్నాయి. మే నుంచి జూన్ 27 వరకు 219 బస్సులకు ఫిట్నెస్ టెస్టులు చేయించినట్లు, అవి ఫిట్గా ఉన్నట్లు తేలింది. మరో 33 బస్సులు లైఫ్టైం ముగియడం, అందులో కొన్ని ఇంకా ఫిట్నెస్ టెస్టుల కు రాలేదని జిల్లా రవాణాశాఖ ఇన్చార్జ అధికారి (ఆర్టీఏ) వెంకటరమణ తెలిపారు. అయితే మే నెలలో దాదాపు చాలావరకు బస్సులను ఫిట్నెస్ కోసం కార్యాలయానికి తీసుకురాలేదని, జూన్ నెలఖరు వచ్చే సరికి 219 బస్సులను రవాణాశాఖ కార్యాల యానికి ఫిట్నెస్ టెస్టు కోసం తీసుకువచ్చి పరీక్షలు చేయించినట్లు తెలుస్తోంది. విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికీ ఆర్టీఏ ఆధికారులు బడి బస్సుల ఫిట్నెస్పై తూతూమంత్రంగా టెస్టులు నిర్వహించారని, ఫిట్నెస్సాధించిన బస్సుల్లోనూ చాలా వరకు ఫిట్గా లేవని, అయినా ధికారులు ధ్రువీకరించారని విమర్శలు ఉన్నాయి. పరీక్షలు పూర్తి చేశాం.. జిల్లాలో విద్యాసంస్థలకు చెందిన బస్సులు 256 ఉండగా 219 బస్సులకు ఫిట్నెస్ టెస్టులు పూర్తి చేశాం. విద్యాసంస్థల బస్సులతోపాటు వివిధ వాహనాలను తనిఖీ చేసి రూ.2.26 కోట్లను జరిమానాల రూపంలో వసూలు చేశాం. ఫిట్నెస్లు లేకుండా బస్పులు తిరిగితే చర్యలు తప్పవు. మరో 33 బస్సుల లైఫ్టైం ముగిసింది. కొన్ని బస్సులు ఇంకా ఫిట్నెస్ టెస్టులకు రాలేదు. ప్రతి ఒక్కరూ రవాణాశాఖ నియమ, నిబంధనలు పాటించాలి. –వెంకటరమణ, ఇన్చార్జ్ రవాణాశాఖ అధికారి -
షిరిడీ, తిరుపతికి రైళ్లు...!
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం కార్పొరేషన్గా రూపాంతరం చెందడంతో భవిష్యత్ వ్యాపార, వాణిజ్య పరంగా ఇతర ప్రాంతాల నుంచి గతంలో కంటే రాకపోకలు పెరిగే అవకాశం ఉంటుంది. దక్షణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రానికి కూడా భక్తులసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంతోమంది భక్తులు భద్రాచలం వచ్చి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుని ఇక్కడి నుంచే షిరిడీ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని అనుకుంటుండగా రైళ్ల సౌకర్యం లేక ఆగిపోతున్నారు. షిరిడీ, తిరుపతికి కొత్తగూడెం నుంచి రైళ్లు నడిపించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఎన్నోసార్లు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినప్పటికీ ఫలితం కాన రాలేదు. ఇదిలా ఉండగా గత మంగళవారం హైద రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం భర్తేశ్కుమార్జైనీ ఆధ్వర్యంలో డీఆర్యూసీసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం నుంచి డీఆర్యూసీసీ సభ్యులు శ్రీనివాసరెడ్డి పాల్గొని ఇక్కడి సమస్యలు వివరించారు. కరోనా సమయంలో రద్దయిన రైళ్ల పునరుద్ధరణ, షిరిడీ, తిరుపతికి రైళ్ల ఏర్పాట్లు, కాకతీయ రైలును మణుగూరు వరకు పొడిగించడం, బెల్గావి రైలు పునరుద్ధరణ లాంటి అంశాలను లేవనెత్తినట్లు ఆయన తెలిపారు. అధికారుల నుంచి సానుకూల స్పందన రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలు సాగించే రైళ్లు ఇలా.. కొత్తగూడెం రైల్వేస్టేషన్ నుంచి నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఏడు రైళ్లు రాకపోకలు సాగించేవి. సింగరేణి, కొల్హాపూర్ ఎక్స్ప్రెస్లు, డోర్నకల్, విజయవాడ కాజీపేట, కాకతీయ ప్యా సింజర్లతోపాటు మణుగూరు సూపర్ఫాస్ట్ సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం మణుగూరు సూపర్ఫాస్ట్, సింగరేణి ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్, విజయవాడ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. బెల్గావి రైలు ను 2024 జనవరి నుంచి రద్దుచేశారు. ఇదిలా ఉండగా.. అమృత్ పథకంలో భాగంగా భద్రాచలం రోడ్డు రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. జాప్యం లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పనులపై కూడా డీఆర్ఎం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పను లు వేగవంతం చేయాల్సిన అవసరముంది. అత్యధిక ఆదాయం.. ఆదరణ కరువు.. పారిశ్రామిక జిల్లాగా పేరున్న భద్రాద్రి కొత్తగూ డెం నుంచి నిత్యం ఉద్యోగులు, వ్యాపారులు, విద్యా ర్థులు, కాంట్రాక్టర్లు, అధికారులు పలు అవసరాల నిమిత్తం వచ్చి వెళ్లే వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడపకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారు లు ఆదాయానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రయాణికుల సౌకర్యాలను గాలికి వదిలేశారనే ఆరోపణలున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో అత్యధిక ఆదాయం భద్రాచలంరోడ్డు రైల్వేస్టేషన్ నుంచే గడిస్తున్నారు. బొగ్గు రవాణా ద్వారా ఏడాదికి సుమారు రూ.650 కోట్లకుపైగా ఆదాయం పొందుతున్నారు. కరోనా సమయం నుంచి బీడీసీఆర్ స్టేషన్ నుంచి నడిచే రైళ్లు పూర్తి స్థాయిలో ప్రయాణికులకు సేవలందించడం లేదు. డీఆర్యూసీసీ సమావేశంలో చర్చ చిగురిస్తున్న భక్తులు, ప్రజల ఆశలు రద్దయిన రైళ్లకు మోక్షం కలిగేనా? అత్యధిక ఆదాయం వచ్చే కొత్తగూడెం స్టేషన్పై డీఆర్ఎం దృష్టి..రైల్వే డీఆర్ఎం హామీ ఇచ్చారు.. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి షిరిడీ, తిరుపతికి రైళ్లు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటా మని డీఆర్ఎం హామీఇచ్చారు. ఆయన హామీ ప్రకా రం రైళ్లు ఏర్పాటు చేస్తే ప్రైవేట్ వాహనాలు, బస్సు ల్లో వెళ్లే బాధలు తప్పుతాయి. రైలు ఏర్పాటుతో కుదిరిన సమయంలో మొక్కులు తీర్చుకునే అవ కాశం భక్తులకు దొరుకుతుంది. –శ్రీనివాసరెడ్డి, రైల్వే డీఆర్యూసీసీ సభ్యుడు -
ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు
జూలూరుపాడు: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను పని చేసే పాఠశాలలోనే తన ఇద్దరు పిల్లలను చేర్పించి ఆదర్శంగా నిలిచాడు. జూలూరుపాడు జెడ్పీహెచ్ఎస్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నండ్రు గురుమూర్తి పెద్ద కుమారుడు నిశాంత్ను ఇదే పాఠశాలలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివించాడు. గతేడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో నిశాంత్ 563 మార్కులు సాధించాడు. ఈ విద్యాసంవత్సరంలో ఆయన తన చిన్నకుమారుడు విశ్వసన్నిధ్ను 7వ తరగతిలో చేర్పించాడు. బుధవారం గురుమూర్తిని హెచ్ఎం లక్ష్మీనర్సయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. విత్తన లైసెన్స్ సస్పెన్షన్సుజాతనగర్: అనుమతులు లేని ప్రదేశంలో విత్తనాలు విక్రయించిన సుజాతనగర్ మండల కేంద్రంలోని ఓ విత్తన దుకాణంపై వ్యవసాయాధికారులు చర్యలు తీసుకున్నారు. సుజాతనగర్లోని హేమంత్ కృష్ణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణానికి చెందిన డీలర్ నిబంధనలకు విరుద్ధంగా చండ్రుగొండ మండలంలో ఇటీవల విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. విచారణ అనంతరం దుకాణానికి సంబంధించిన విత్తన లైసెన్స్ను జిల్లా వ్యవసాయాధికారి సస్పెండ్ చేసినట్లు ఏఓ జి.నర్మద బుధవారం తెలిపారు. బాలిక గర్భానికి కారణమైన బాలుడిపై పోక్సో కేసు కామేపల్లి: పధ్నాలుగేళ్ల బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెబుతూ లోబర్చుకున్న పదిహేడేళ్ల బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కామేపల్లి పోలీసులు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదువుతుండగా, మరో గ్రామానికి చెందిన బాలుడు ప్రేమ, పెళ్లి పేరిట మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెకు ఇటీవల కడుపునొప్పి రాగా కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పరీక్షించగా గర్భం దాల్చినట్లు తేలింది. కుటుంబీకుల ఫిర్యాదుతో బాలుడిపైనే కాక ఆయన స్నేహితుడిపై పోక్సో కేసు నమోదు చేసి బాలికను భరోసా కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. యువకుడిపై... బోనకల్: మండలంలోని ఓ గ్రామంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.వెంకన్న తెలిపారు. మూడో తరగతి చదివే బాలికపై లక్ష్మీకాంత్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఏడుస్తూ వెళ్లి తల్లికి చెప్పగా ఆమె ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేశారు. కాగా, ఏసీపీ రెహమాన్ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. ప్రేమ పేరుతో వేధిస్తున్న వ్యక్తిపై.. బోనకల్: ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న వ్యక్తిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి. వెంకన్న తెలిపారు. వైరాకు చెందిన ఆదూరి బాలు నాలుగేళ్లుగా కలకోటకు చెందిన యువతిని ప్రేమిస్తున్నాననంటూ వెంట పడడమే కాక ఆమెకు వస్తున్న పెళ్లి చెడగొడుతున్నాడు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పురుగులమందు తాగి యువకుడి ఆత్మహత్య సింగరేణి(కొత్తగూడెం): పురుగులమందు తాగి యువకుడు మృతిచెందిన ఘటన బుధవారం రామవరంలో చోటుచేసుకుంది. కొత్తగూడెం ఏరియా పీవీకే–5 ఇంక్లైన్ గనిలో ఎల్లగొండ రఘు పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన ఎల్లగొండ హేమసాగర్ (25) హైదరాబాద్లో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం యువకుడు పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన తల్లితండ్రులు హుటాహుటిన హైదరాబాద్ తరలివెళ్లారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హేమసాగర్ బుధవారం మృతి చెందాడు. కాగా, అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హైవేపై వర్షపు నీరు తల్లాడ: తల్లాడ రింగ్ సెంటర్లోని జాతీయ రహదారిపై వర్షం నీరు నిల్వ ఉండడంతో నేషనల్ హైవే అదికారులు బుధవారం పరిశీలించారు. వర్షం వచ్చినప్పుడుల్లా ఇదే పరిస్థితి ఎదురవుతుండగా.. నేషనల్ హైవే సైట్ ఇంజనీర్ జి.కిరణ్ తదితరులు పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అయితే, రహదారిపై చెత్తాచెదారం పేరుకుపోవడమే సమస్యకు కారణమని, చెత్త తొలగిస్తే నీరు నిల్వ ఉండదని ఎంపీడీఓ సురేష్బాబు తెలిపారు. ఈమేరకు అవసరమైన మరమ్మతులు చేయిస్తామని అధికారులు వెల్లడించారు. -
కళలపై మక్కువ పెంపొందించాలి
దుమ్ముగూడెం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు చదువుతోపాటు వారికి నచ్చిన కళలపై ఇష్టాన్ని పెంపొందించాలని, వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. బుధవారం మండలంలోని కొత్తపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, గ్రంథాలయం, బోధిస్తు న్న పాఠ్యాంశాలను పరిశీలించారు. ముందుగా మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయించి వాటి అర్థాలను తెలుగులో చెప్పించారు. అనంతరం ఆరు నుంచి 9వ తరగతి వరకు నిర్వహిస్తున్న క్లాసులను, బోధనా తీరును పరిశీలించారు. చిన్నారుల చేత ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయించి వాటి అర్థాలను తెలుగులో పూర్తిగా చెప్పేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అదనంగా విద్యార్థులకు ఇష్టమైన వ్యాసరచన, క్విజ్, నాటికలు, ఏకపాత్రాభినయానికి సంబంధించిన కళలపై అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాలు మొదలైనందున రాత్రిపూట విద్యార్థులు బయటకు రాకుండా చూడాలని, ప్రతీ రోజు వంటగది శుభ్రం చేసి మెనూ ప్రకారం విద్యార్థులకు వేడిగా ఆహారాన్ని వడ్డించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం నరసింహారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
తెగిపోయిన డైవర్షన్ రోడ్డు
ములకలపల్లి: ములకలపల్లి శివారులో ఊరవాగుపై వేసిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. తాజా వర్షాలతో కోత ఏర్పడగా తాళ్లపాయ జీపీపాటు, రింగిరెడ్డిపల్లి, బూర్గుకొయ్యగుంపు, మధ్యగుంపు, మంగలిగుట్ట, సుందర్నగర్ తదితర గ్రామాలకు వెళ్లే వాహనాలకు దారి మూసుకుపోయింది. ఈ వాగుపై రెండేళ్ల కిందట హైలెవెల్ వంతెన నిర్మాణం మొదలుపెట్టినా నేటికీ పూర్తి కాలేదు. గతేడాది పలుమార్లు డైవర్షన్ రోడ్డు తెగిపోవడంతో ఇనుప వంతెన వేశారు. కానీ, దీనిపైకి చేరే మార్గం బురదమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాగా, వాగు వద్ద తెగిన డైవర్షన్ రోడ్డును ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. బురదలో ప్రజల పాట్లు -
రైతు భరోసా ఎన్నికల జిమ్మిక్కే..
● బీసీ రిజర్వేషన్లు అమలయ్యేవరకు ఎన్నికలు వద్దు ● ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితఖమ్మంఅర్బన్/నేలకొండపల్లి: రైతులను మభ్యపెట్టి ఓట్లు సాధించేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని ఇచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇది నిజమైన సంక్షేమం కాదని, కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఖమ్మంలో ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ కుటుంబంతో పాటు నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురంలో తెలంగాణ జాగృతి నాయకురాలు అనిత తండ్రి నల్లబోతు నరసింహారావు మృతి చెందగా వారి కుటుంబాలను కవిత బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా వడ్ల కొనుగోలులో ఇబ్బంది ఎదుర్కొన్న రైతులను పలకరించలేదని తెలిపారు. సన్న రకం పేరుతో బోనస్ అంటూ రైతులను మభ్యపెట్టారని చెప్పారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని, అప్పటివరకు ఎన్నికలు నిర్వహించొద్దని డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదానికి ఈనెల 17న రైల్రోకో నిర్వహిస్తుండగా, మద్దతు ఇవ్వాలని బీసీ సంఘాలను కోరడమే కాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు లేఖ రాశామని ఆమె వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన హామీలేమయ్యాయి? ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఎమ్మెల్సీ ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధిని విస్మరించడమే కాక ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాగా, గోదావరి జలాల తరలింపుపై జిల్లా మంత్రులు మాట్లాడకపోవడం ఏమిటని ప్రశ్నించిన కవిత, భద్రాద్రి రాముడి అభివృద్ధికి ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజుతో పాటు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, సేవాలాల్నాయక్, కిషన్నాయక్, వాంకుడోత్ సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
నాటుకోళ్ల చోరీకి విఫలయత్నం
చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లిలో పలువురు దుండగులు నాటుకోళ్ల చోరీకి యత్నించారు. గ్రామంలోని అబ్దుల్కలాంబజార్కు మంగళవారం అర్ధరాత్రి చేరుకున్న సుమారు పదిమంది పలువురి ఇళ్లలో నుంచి 50 నాటుకోళ్లను అపహరించి సమీపంలోని మసీద్లోని మూత్రశాలల్లో దాచారు. ఆపై ఇంకొన్ని కోళ్లను చోరీ చేసేందుకు కొందరు యత్నిస్తుండగా, మిగతా వారు దాచిన కోళ్లను తరలించే యత్నంలో నిమగ్నమయ్యారు. బుధవారం తెల్లవారుజామున నమాజ్ సమయం కావడంతో మసీద్ కమిటీ ఉపాధ్యక్షుడు బషార్ వచ్చేసరికి కోళ్ల అరుపు లు వినిపిస్తుండడంతో చూసేసరికి దొంగలు పారి పోయారు. ఆపై గ్రామస్తులు చేరుకుని ఎవరి కోళ్లను వారు తీసుకెళ్లారు. జూదరుల అరెస్ట్ ములకలపల్లి: హౌజీ (జూదం) ఆటాడతున్న 9 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ రాజశేఖర్ కథనం మేరకు.. మండలంలోని మొగరాలగుప్ప గ్రామంలో హౌసీ ఆట ఆడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ సిబ్బందితో దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.1,680 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలిపై కేసుపాల్వంచ: సకాలంలో వైద్యం అందించక పోవడంతో శిశువు మృతి చెందిన ఘటనలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీదేవిపల్లి మండలం తోకబంధాలకు చెందిన రాంప్రసాద్ తన భార్య కరుణకు నొప్పులు రావడంతో గత మంగళవారం పాల్వంచ సీహెచ్సీకి తీసుకొచ్చాడు. ఆమెను ఉదయం 10.30 గంటలకు పరిశీలించిన వైద్యురాలు అనూషలక్ష్మీ నార్మల్ డెలీవరీ అవుతుందని తెలిపారు. ఆపరేషన్ చేయమని కోరుతున్నా వినకుండా బ్లీడింగ్ అవుతున్నా ఎక్సర్ సైజ్ చేయించారని, అనంతరం 12.50 గంటలకు ఆపరేషన్ చేసి మగ శిశువును అందించి చనిపోయాడని చెప్పారని, వైద్యురాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సకాలంలో ఆపరేషన్ చేస్తే శిశువు మృతి చెందే పరిస్థితి ఉండేది కాదని రాంప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరకట్న వేధింపులపై ఫిర్యాదు ఇల్లెందు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పట్టణంలోని జేకేకాలనీకి చెందిన బండారు మౌనిక బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. జేకేకాలనీకి చెందిన బండారు వీరన్న, మౌనిక ప్రేమించి పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత భర్త వీరన్న, అతని తల్లితండ్రులు, ఆడపడుచు వరకట్నం తేవాలంటూ మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, భర్త మద్యం సేవించి తమ కుటుంబం పట్ల అసభ్యకరంగా దూషిస్తున్నాడని మౌనిక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘బ్లీచింగ్కూ నిధులు ఇవ్వని ప్రభుత్వం’నేలకొండపల్లి: రాష్టంలో కొందరు మీడియా ముసుగులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు రాకపోవడం, ట్రాక్టర్లలో డీజిల్ పోయించే పరిస్థితి లేక కార్యదర్శులు సెలవులో వెళ్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ను సీఎంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ ప్రభావం కనపడుతుందని ఎమ్మెల్సీ ధీమా వ్యక్తం చేశారు. -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి బుధవారం నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. అప్రమత్తంగా ఉండాలి● వర్షాల నేపథ్యంలో హెల్ప్లైన్ల ఏర్పాటు ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు సూపర్బజార్(కొత్తగూడెం)/కొత్తగూడెంటౌన్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ బి.రోహిత్రాజు సూచించారు. ఈ మేరకు బుధవారం వేర్వేరుగా ప్రకటనలు జారీ చేశారు. వర్షాలతో నదులు, వాగులు, చెరువులు పొంగి రోడ్లపైకి వరదనీరు చేరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, బయటకు వస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులు, నదుల వద్దకు సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురికావొద్దని హెచ్చరించారు. విపత్కర పరిస్థితుల్లో కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లోని హెల్ప్లైన్ల నంబర్లకు, డయల్ 100కు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు సమాచారం అందించి సహాయం పొందవచ్చని వివరించారు. రెవెన్యూ, పోలీస్, రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు సమన్వయం తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరదల్లో, ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు డీడీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. హెల్ప్లైన్ నంబర్లు08744–241950 – కలెక్టర్ కార్యాలయం 08743–232444 – భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం వాట్సాప్ నంబర్లు 9347910737 – భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం 9392919747– కలెక్టర్ కార్యాలయం -
కాలినడకా కష్టమే
అశ్వారావుపేట: మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ కాలనీ, పాత పేరాయిగూడెం, దొంతికుంట, అటెండర్స్ కాలనీ, ఏఎస్ఆర్ కాలనీ, బీఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. సీసీ రహదారులు నిర్మించకపోవడంతో వర్షాకాలంలో కాలినడక కూడా కష్టంగానే ఉంటోంది. పేద, మధ్యతరగతి ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడంలేదని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నడక కష్టమే మోడల్ కాలనీలో అన్ని వీధుల్లో సీసీ రహదారులు నిర్మించలేదు. గుంతలు, పిచ్చిమొక్కలతో ఇబ్బందిగా ఉంటోంది. పాములు సంచరిస్తున్నాయి. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించాలంటే భయంగా ఉంటోంది. –ఆదినారాయణ, మోడల్ కాలనీ● -
కార్పొరేషన్లో అధ్వానం..
కొత్తగూడెంఅర్బన్: మున్సిపల్ కార్పొరేషన్లోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. సీసీ, బీటీ రోడ్లలో గుంతలు పడ్డాయి. ప్రధాన పోస్టాఫీసు సెంటర్ నుంచి మొదలుకొని కోర్టు వరకు, అక్కడి నుంచి శేషగిరినగర్ వరకు కూడా అడుగడుగుకో గుంత ఉంది. ఆ రూట్లో భారీ వాహనాలు నడవడంతో గుంతలు ఏర్పడ్డాయి. పాతకొత్తగూడెం, రామవరంలోని సుభాష్ చంద్రబోస్ నగర్ ఏరియాలో మిషన్ భగీరథ పైపులైన్ కోసం తవ్వకాలు జరిపి పూడ్చకుండానే వదిలేశారు. వర్షాలకు గుంతల్లో నీరు నిల్వడంతో చిన్న పిల్లలు పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. సెవెన్హిల్స్ ఏరియా రోడ్డు నుంచి బూడిదగడ్డ వరకు కూడా రోడ్డు విస్తరణలో భాగంగా రెండు వైపులా తవ్వకాలు జరిపారు. ఆరు నెలలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయలేదు. సూపర్బజార్ నుంచి రైతుబజార్ వెళ్లే రోడ్డులో కూడా గుంతలు అధికంగా ఉన్నాయి. రోడ్లపై ప్రయాణించలేకపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రోడ్ల నిర్మాణం చేపట్టాలి పాతకొత్తగూడెంలోని పాతూరులో రోడ్లు గుంతలు పడి అధ్వానంగా మారాయి. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం తవ్వకాలు జరిపి పూడ్చకుండా వదిలివేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. గుంతలను పూడ్చాలి. –ఇందిరమ్మ, పాతకొత్తగూడెం● -
వర్షం.. రైతుల హర్షం
● రెండు రోజుల్లో లోటు నుంచి అధిక వర్షపాతం నమోదు ● పత్తి 1,90,831 ఎకరాల్లో సాగు, మొక్కజొన్న 54,223 ఎకరాల్లో.. ● జిల్లాలో సాధారణం కంటే 14 శాతం అధిక వర్షపాతం వర్షపాతం ఇలా.. (మి.మీ లలో) మండలం బుధ జూన్ 1 నుండి వారం జూలై 2 వరకు కరకగూడెం 25.2 112.4 పినపాక 26.4 114.8 చర్ల 31.2 211.8 దుమ్ముగూడెం 36.6 145.6 అశ్వాపురం 55.6 211.8 మణుగూరు 34.6 151.6 ఆళ్లపల్లి 36.8 163.8 గుండాల 28.0 122.8 ఇల్లెందు 52.6 157.2 టేకులపల్లి 56.2 214.8 జూలూరుపాడు 49.2 367.2 చండ్రుగొండ 38.0 284.2 అన్నపురెడ్డిపల్లి 36.4 236.8 చుంచుపల్లి 59.2 171.0 సుజాతనగర్ 65.4 214.2 కొత్తగూడెం 49.0 176.8 లక్ష్మీదేవిపల్లి 35.4 142.4 పాల్వంచ 86.2 286.8 బూర్గంపాడు 81.6 293.2 భద్రాచలం 64.6 206.2 ములకలపల్లి 52.2 179.2 దమ్మపేట 23.0 227.0 అశ్వారావుపేట 13.6 337.2 జిల్లా సరాసరి 45.1 205.6సూపర్బజార్(కొత్తగూడెం): రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది. జూన్ మాసంలో లోటు వర్షపాతం నమోదైంది. రెండు రోజుల నుంచి వానలు దంచి కొడుతుండటంతో వ్యవసాయ పనులను వేగవంతం చేశారు. ఈ సీజన్ ప్రారంభంలో రుతుపవనాలు ముందుగానే ఊరించాయి. ఆ తర్వాత ముఖం చాటేశాయి. దీంతో నాటిన పత్తి విత్తనాలు మొలకెత్తక రైతులు నష్టపోయారు. ఆ తర్వాత వర్షాలు కొంతమేర కురిసినా గత నెలలో లోటు వర్షపాతమే నమోదైంది. మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు లోటు పూడిపోయింది. గత నెల 1 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 180 మి.మీ కాగా 205.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 14 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. తొమ్మిది మండలాలు అశ్వారావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, టేకులపల్లి, జూలూరుపాడు సుజాతనగర్, బూర్గంపాడు, పాల్వంచలలో అధిక వర్షపాతం నమోదైంది. మరో తొమ్మిది మండలాలు ములకలపల్లి, చర్ల, అశ్వాపురం, ఆళ్లపల్లి, ఇల్లెందు, చుంచుపల్లి, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, భద్రాచలం మండలాల్లో సాధారణ వర్షపాతం, మిగిలిన ఐదు మండలాలు పినపాక, కరకగూడెం, దుమ్ముగూడెం, మణుగూరు, గుండాలలో లోటు వర్షపాతం నమోదైంది. పంటల సాగు ఇలా.. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట పత్తిని వర్షాధారంగా సాగు చేస్తారు. రుతుపవనాలు ఊరించడంతో విత్తనాలు నాటిన సుమారు 30 శాతం మంది రైతులు మొక్కలు మొలవక నష్టపోయారు. ఆ తర్వాత అడపాదడపా వర్షాలతో పత్తి సాగు ఊపందుకుంది. సాగునీటి సౌకర్యం ఉన్న రైతులు వరినార్లు పోశారు. జీలుగు, జనుము సాగు చేసిన రైతులు పచ్చిరొట్టను కలియదున్నేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కొందరు రైతులు వెదజల్లే పద్ధతిలో వరి సాగు ప్రారంభించారు. అక్కడక్కడా నాట్లు కూడా వేస్తున్నారు. ఇప్పటివరకు వెదజల్లే పద్ధతిలో 2,124 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. పత్తి 1,90,831 ఎకరాల్లో మొక్కజొన్న 54,223 ఎకరాల్లో సాగు చేశారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సలహాలను పాటించి సాగు చేయాలి. –వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారిపనులు వేగవంతం చేశాం ఇప్పటివరకు వర్షాలు భయపెట్టినా ఇప్పుడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. సాగుకు అనుకూలం. అందుకే వ్యవసాయ పనులు వేగవంతం చేశాం. –మల్లయ్య, రైతు, గరీబ్పేట, సుజాతనగర్ మండలం -
గోదావరి, జలాశయాలకు వరద..
భద్రాచలంటౌన్/పాల్వంచరూరల్/అశ్వారావుపేటరూరల్/టేకులపల్లి: రెండు, మూడు రోజులుగా ఎగువన, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో మంగళవారం రాత్రికి 13 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం బుధవారం రాత్రి 12 అడుగులకు తగ్గి నిలకడగా ప్రవహిస్తోంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా, ఎగువ ప్రాంతాల నుంచి 4,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. జలాశయం నీటిమట్టం మంగళవారం 396.80 అడుగులు ఉండగా, బుధవారం 397.50 అడుగులకు పెరిగింది. అశ్వారావుపేటలోని పెదవాగు ప్రాజెక్ట్కు వరద పోటెత్తగా రింగ్బండ్ జలకళ సంతరించుకుంది. రింగ్బండ్ లెవల్ దాటితే నీళ్లు క్రస్ట్ గేట్ల నుంచి బయటకు వెళ్తున్నాయి. వర్షంతో టేకులపల్లిలోని సింగరేణి కేఓసీలో 8,269 టన్నుల బొగ్గు ఉత్పత్తితోపాటు ఓబీ వెలికితీత నిలిచిపోయింది. ఓసీలోని నీటిని ఎత్తిపోస్తున్నారు. -
విలీన వార్డుల్లో బురద..
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీలోని నాలుగు విలీన వార్డులు ఉన్నాయి. వీటిల్లో అన్నీ కచ్చా రోడ్లే ఉండటంతో వర్షాకాలంలో బురదలో నడవాల్సిందే. చినుకు పడితే నేలంతా చిత్తడిగా మారుతోంది. పట్టణంలోని 1వ వార్డు సత్యనారాయణపురం పూర్తిగా సుదిమళ్ల గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీలో విలీనం చేశారు. 2వ వార్డు, 22వ వార్డులో, 23వ వార్డుల్లో కూడా విలీన గ్రామాలే ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికీ కచ్చా రోడ్లు ఉన్నాయి. గ్రామపంచాయతీలుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన రోడ్లే తప్ప మున్సిపాలిటీలో విలీనం చేశాక కొత్తగా రోడ్లు నిర్మించలేదు. దీంతో పాటు పట్టణంలోని 24 వార్డుల్లో మిషన్ భగీరథ పైపులైన్ పనుల కోసం రోడ్లు తవ్విన ప్రదేశాలు గుంతలమయంగా మారాయి. కాలుబయట పెట్టలేం సత్యనారాయణపురంలో వానాకాలంలో అడుగు బయట పెట్టాలంటే బురదలో దిగాల్సిందే. చినుకు పడితే నేలంతా చిత్తడిగా మారుతుంది. విలీన వార్డుల్లో అన్ని మట్టి రోడ్లే ఉన్నాయి. బీటీ రోడ్లు నిర్మించాలి. – బి.గోపి, 1వ వార్డు, ఇల్లెందు● -
ఎందుకిలా..?
కృష్ణా ఆయకట్టు స్థిరీకణ పనులకు నిధుల మంజూరు ● మంత్రుల ఇలాఖాలో వేగంగా జరుగుతున్న పనులు ● జిల్లాలో మాత్రం ముందుకు సాగని ఎత్తిపోతల పథకాలు ● ఏజెన్సీ ప్రాంతమైనా నిధులు విదల్చని ప్రభుత్వంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకర్గంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జోన్–3 కింద ఉన్న ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు జవహర్ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రూ.600 కోట్లతో ప్రాజెక్టు నిర్మించనుండగా, సాగర్ జలాలతో సంబంధం లేకుండా ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అంతకుముందు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని రఘునాథపల్లి మండలంలో నాలుగు వేల ఎకరాలకు నాగార్జునసాగర్ జలాలు అందించేందుకు మంచుకొండ ఎత్తిపోతల పథకం చేపట్టారు. వెనువెంటనే పాలనాపరమైన అనుమతులతోపాటు రూ.66 కోట్లు మంజూరు చేశారు. నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసమే గతేడాది సీతారామ ప్రాజెక్టులో అదనంగా రాజీవ్ కెనాల్ను చేర్చి రికార్డు వేగంతో పనులు పూర్తి చేశారు. లిఫ్టులకు నిధుల గ్రహణం మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో సాగర్ ఆయకట్టు స్థిరీకరణ పనులకు నిధులు గలగల ప్రవహిస్తున్నాయి. కానీ గోదావరి జలాలను ఏజెన్సీ రైతుల పొలాల్లో పారించేందుకు ఉద్దేశించిన చిన్న, మధ్య తరహా ఎత్తిపోతలకు నిధుల గ్రహణం పడుతోంది. నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణపై మంత్రులు చూపుతున్న శ్రద్ధనే, కనీస ఆయకట్టు లేని గిరిజన, ఏజెన్సీ రైతుల మీద కూడా చూపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లాలో గోదావరి, కిన్నెరసాని, ముర్రేడు, పెద్దవాగు లాంటి జలవనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక సీతారామ ప్రాజెక్ట్ ఇక్కడే నిర్మిస్తున్నారు. దీని వల్ల అడవులు, భూమిని ఈ జిల్లానే నష్టపోయింది. కానీ, ఇప్పటివరకు జిల్లాలో ఒక్క ఎకరాకు గోదావరి నీరు ఇవ్వలేకపోయారు. కనీసం సీతారామకు ఇరువైపులా ఉన్న పినపాక, భద్రాచలం నియోజకర్గాలకు కూడా న్యాయం జరగడం లేదు. కదలని ‘మారెళ్లపాడు’ మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి 2023 జనవరిలో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం కేవలం రూ. 25 కోట్లు. సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్హౌస్ (బీజీ కొత్తూరు) సమీపంలో ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకుని తుమ్మల చెరువు, చింతల చెరువు, ఎర్రబొక్కల చెరువు, తీగల చెరువులను నింపుతారు. తద్వారా అశ్వాపురం, మణుగూరు మండలాల్లోని 17 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. శంకుస్థాపన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు మినీ పంప్హౌస్ ఎర్త్ వర్క్ కొంత పూర్తి చేయడం మినహా మరేం చేయలేదు. ఇక్కడ లిఫ్టుతోపాటే మారెళ్లపాడు డిస్ట్రిబ్యూటరీ కాల్వల కోసం రూ.90 కోట్లతో గతంలో సిద్ధం చేసిన ప్రతిపాదనలు ఎప్పుడో అటకెక్కాయి. కనీసం ఈ ప్రాజెక్టు పూర్తి చేసినా భద్రాద్రి జిల్లాకు సీతారామ తొలి ఫలాలు అందేవి. పులుసుబొంత రీడిజైన్కే పరిమితం తెలంగాణ ఏర్పాటుకు ముందే కరకగూడెం మండలంలో 4,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు పెద్దవాగుపై పులుసుబొంత ప్రాజెక్ట్కు ఉమ్మడి ఏపీలో శ్రీకారం చుట్టారు. అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి రూ.20.10 కోట్లు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగాక దాదాపు తొమ్మిదేళ్లపాటు అడుగుముందుకు పడలేదు. రెండేళ్ల కిందట ఆయకట్టును 35 వేల ఎకరాలకు పెంచుతూ సుమారు రూ.400 కోట్లతో పులుసుబొంత ప్రాజెక్ట్కు రీడిజైన్ చేయించారు. నష్టపోయే అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూములు ఎక్కడ ఇవ్వాలనే అంశంపై స్పష్టత వచ్చిన దశలో ప్రభుత్వం మారిపోయింది. దీంతో మళ్లీ మరుగునపడింది. ఇదే తరహాలో పినపాక మండలంలోని చింతల బయ్యారం, టి.కొత్తగూడెం ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ప్రతిపాదనల్లోనే ప్రగళ్లపాడు తాలిపేరు ప్రాజెక్టు కింద చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో 24,700 ఎకరాల ఆయకట్టు ఉంది. దీన్ని మూడు జోన్లుగా విభజించారు. ఖరీఫ్లో పూర్తి స్థాయిలో 24,700 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రబీకి వచ్చే సరికి రొటేషన్ పద్ధతిలో ఒక్కో జోన్లో ఉన్న ఎనిమిది వేల ఎకరాలకే నీరు అందుతోంది. తలాపునే గోదావరి ఉన్న ఈ రెండు మండలాల్లో రెండు పంటలు సాగు చేయడం సాధ్యం కావడం లేదు. దుమ్ముగూడెం మండలం కోసం గతంలో రూ.634 కోట్లతో ప్రగళ్లపాడు ఎత్తిపోతల పథకానికి అంచనాలు రూపొందించినా కార్యరూపం దాల్చలేదు. -
అధ్వానంగా అంతర్గత రోడ్లు
● కార్పొరేషన్తోపాటు మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి ● వీధుల్లో గుంతలమయంగా మారిన రహదారులు ● అన్నిచోట్లా వాహనదారులకు తప్పని అవస్థలు నిర్మించిన ఎనిమిది నెలలకే బీటలు వారిన గుడిపాడు సీసీ రోడ్డుపురపాలికల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. గుంతలమయంగా తయారయ్యాయి. వర్షాలకు నీరు నిలిచి రోడ్లు ఇంకా పాడవుతున్నాయి. వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వీధుల్లో వాహనాలు నడపాలంటే అవస్థ పడుతున్నారు. శివారు, విలీన ప్రాంతాల్లో కచ్చా రోడ్లు బురదమయంగా మారాయి. మిషన్ భగీరథ పైపులైన్ పనుల కోసం తవ్విన చోట సరిగ్గా పూడ్చకపోవడంతో గుంతలు ఏర్పడి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట పట్టణాల్లో రోడ్లు మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. అన్నీ గుంతలే..మణుగూరు టౌన్: మున్సిపాలిటీలో విసిరేసినట్లుగా ఉండే కమలాపురంలో రోడ్డు గుంతలమయంగా మారింది. రాయిగూడెం వైపు నుంచి ఇసుక లారీలు భారీ లోడ్లతో వెళ్తుండటంతో రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయి. రోడ్లు బాగు చేసి డ్రెయిన్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధుల చెవికి ఎక్కడంలేదు. మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు మొత్తం సుమారు 40 కిలోమీటర్లు ఉండగా, కమలాపురంలోని సుమారు ఒక కిలోమీటరు బీటీ రోడ్డు నిర్మించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. బాగు చేయాలి మణుగూరులో వానాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ గుంతలమయంగా మారతాయి. పాలకులు దృష్టి సారించి ఎప్పటికప్పుడు అంతర్గత రహదారులకు మరమ్మతులు చేపట్టాలి. మురుగు కాల్వలు నిర్మించాలి. – మునిగెల వీరమ్మ, కమలాపురం గ్రామస్తురాలుసీసీ రోడ్లకు బీటలుపాల్వంచ: పాల్వంచ పట్టణంలో సీసీ రోడ్లు నాణ్యత లేకుండా నిర్మించడంతో బీటలువారి నిధులు దుర్వినియోగమయ్యాయి. వర్షాలకు ఆ రోడ్లు మరింత దెబ్బతింటున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం ఇటీవల అనేక చోట్ల సీసీ రోడ్లను ధ్వంసం చేశారు. వాటిని సరిచేసేందుకు నెలల తరబడి పనులు చేపడుతున్నారు. ఒడ్డుగూడెం రోడ్లో పైపులైన్ల లీకేజీలతోపాటు, కొత్త కనెక్షన్ల కోసం మట్టి తీసి, సీసీ రోడ్లు తవ్వారు. గుడిపాడు వెళ్లే దారిలో 8 నెలల క్రితం సీసీ రోడ్డు నిర్మించారు. మార్కెట్ ఏరియాలో నూతనంగా రోడ్డు వేశారు. ఇవి బీటలు వారుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో బీటలు వారి గతుకులమయంగా తయారవుతున్నాయి. ఎనిమిది నెలలకే బీటలు పట్టణంలోని శివారు ప్రాంతం గుడిపాడుకు ఎనిమిది నెలల క్రితం సీసీ రోడ్డు నిర్మించారు. నాణ్యత లేకుండా పనులు చేపట్టడంతో రహదారి బీటలు వారింది. ఎన్నో సంవత్సరాలు ఉండాల్సిన రోడ్డు దుస్థితి ఇప్పటికే దెబ్బతింది. అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. –ఆరెం ప్రశాంత్, గుడిపాడు -
ప్రారంభమైన ఎప్సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం సహకారనగర్: ఎప్సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ మంగళవారం మొదలైంది. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటుచేయగా, ఉదయం 9నుంచి సాయంత్రం 6–30గంటల వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే, చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉదయం 8–30గంటలకల్లా కేంద్రానికి చేరుకున్నారు. రెండు రోజుల నుంచి స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించగా, తొలిరోజు 570మంది విద్యార్థులకు గాను 510మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. ఇతర జిల్లాల నుంచి సైతం... ఖమ్మంలోని ఎప్సెట్ కౌన్సెలింగ్ కేంద్రానికి ఉమ్మడి జిల్లా నుంచే కాక సమీప జిల్లాల విద్యార్థులు సైతం హాజరయ్యారు. రాష్ట్రంలో ఎక్కడైనా కౌన్సెలింగ్కు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల విద్యార్థులు కూడా వచ్చారు. కాగా, సెంటర్ వద్ద పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల సిబ్బంది తమ కళాశాలల్లో చేరాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బ్రోచర్లు ఇస్తూ ప్రచారం చేయడం కనిపించింది. సర్వర్ మొరాయింపు కౌన్సెలింగ్కు మొదటిరోజైన మంగళవారం ఎక్కువ మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో సర్వర్ మొరాయించింది. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన నత్తనడకన కొనసాగగా విద్యార్థులు, తల్లిదండ్రులు గంటల తరబడి వేచిచూడాల్సి రావడంతో అసహనానికి గురయ్యారు. తొలిరోజు మొరాయించిన సర్వర్ గంటల తరబడి వేచి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు -
అవే.. తిప్పలు తప్పవా..?
● లో–లెవెల్ వంతెనలతో ప్రజల కష్టాలు ● అనేక గ్రామాలకు నిలిచిపోనున్న రాకపోకలు ● వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం చుంచుపల్లి: వర్షాకాలం వచ్చింటే లోతట్టు ప్రాంతా ల ప్రజలు వణికిపోతారు. ప్రతి సీజన్లోనూ ఏజె న్సీ ప్రాంత వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాలు, వరదలతో అనేక గ్రామాలకు లో–లెవెల్ చప్టాలతో రోజుల కొద్దీ రాకపోకలు స్తంభిస్తాయి. అవి దాటే ప్రయత్నంలో ఎదరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. జిల్లాలో అనేకగ్రామాలకు ఇప్పటికీ రహ దారులు, సరైన వంతెన సౌకర్యం లేదు. అత్యవసరమైన చోట హై–లెవెల్ వంతెనలు నిర్మించక పోవడంతో వర్షాకాలం సీజన్ మొత్తం ప్రజలు ఇబ్బందు లు ఎదుర్కొంటారు. వాగులు, వంకలపై ఎప్పుడో నిర్మించిన లో–లెవెల్ చప్టాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలకు పరిమితమయ్యారు. గ్రామాలకు రాకపోకలు బంద్ జిల్లాలో 35కు పైగా చిన్న, పెద్ద తరహా వాగులు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో పొంగి పొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ప్రధానంగా జూలై, ఆగస్టు మాసాల్లో కురిసే అతి భారీవర్షాలు, వరదలకు ఎక్కువ ప్రాంతాలు పూర్తి గా జలమయమవుతుంటాయి. లో–లెవెల్ వంతెనలు, కల్వర్టులు వరద పోటుకు గురవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పాల్వంచ, ములకలపల్లి, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, జూ లురుపాడు, అశ్వాపురం, చర్ల, పినపాక, బూర్గంపాడు, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, పినపాక, కరకగూడెం, దుమ్ముగూడెం, అశ్వారావుపేట మండలాల పరిధిలోని అనేక గ్రామాలకు చెందిన ప్రజ లకు వరద కష్టాలు తప్పడం లేదు. కిన్నెరసాని గేట్లు ఎత్తితే 24 గ్రామాలపై ప్రభావం పడుతుంది. వరదలతో నష్టాలు 2022 జూలై 16న వచ్చిన వరదతో గోదావరి 70.3 అడుగుల స్థాయిలో ప్రవహించింది. పరిసర గ్రామా లు నీట మునిగాయి. భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలోని 120 గ్రామాలకు చెందిన 16 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, సుమారు రూ. 120కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు అంచ నా వేశారు. దాదాపు 10 వేల ఎకరాలకుపైగా పంటల నష్టం జరిగింది. సుమారు 5,400 ఎకరాల్లో పంటలు పూర్తిగా ధ్వంసం కావటంతో రూ.6.50 కోట్ల మేర నష్టం జరగగా.. ఉద్యాన పంటల నష్టం రూ.40.58 లక్షల వరకు ఉంది. పంచాయతీరాజ్, ఆర్ఆండ్బీ పరిదిలోని రోడ్లు వరద తాకిడి కోతకు గురయ్యాయి. పంచాయతీరాజ్ శాఖకు రూ.9.08కోట్లు, ఆర్అండ్బీ శాఖకు రూ.94 లక్షలు, ఎన్హెచ్లకు రూ.2.52 కోట్ల మేర నష్టం జరిగింది. సబ్స్టేషన్ల ధ్వంసం, స్తంభాలు కొట్టుకపోవడంతో విద్యుత్ శాఖకు రూ.5.80 కోట్ల నష్టం వాటిల్లింది. మిషన్ భగీరథకు సంబంధించి 212 హాబిటేషన్లలో పంపుసెట్లు, ప్యానల్బోర్డులు, మంచినీటి పైప్లైన్లు, ఇంటేక్వాల్స్ వరద పోటుకు గురవ్వడంతో రూ.1.17 కోట్ల మేర నష్టం జరిగింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంచాయతీరాజ్ పరిధిలోని లో–లెవెల్ చట్టాల మరమ్మతులతో పాటు కొత్త వాటి కోసం నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇక వచ్చే వర్షాలు, వరదలను దృష్టిలో పెట్టుకొని లో–లెవెల్ వంతెనల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నాం. వీఆర్వోలు, సెక్రటరీలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రజలు ప్రవాహం దాటకుండా అడ్డుగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను పెట్టడమే కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. –శ్రీనివాసరావు, పంచాయతీరాజ్, ఈఈజిల్లాలో.. లో–లెవెల్ వంతెనలు, కల్వర్టులు.. పీఆర్ లో–లెవెల్ చప్టాలు: 102 ఆర్అండ్బీ లో–లెవెల్ చప్టాలు: 91 ఎక్కువ వరద పోటుకు గురయ్యేవి: 67 ఎక్కువ ప్రవాహం వచ్చేవి: 43 మధ్యతరహా వరదపోటుకు గురయ్యేవి: 35 మధ్యతరహా వరద కాజ్వేలు: 48 -
నాణ్యమైన విద్యే భవిష్యత్కు పునాది
కరకగూడెం: నాణ్యమైన విద్యే భవిష్యత్కు పునాది అని జీసీడీఓ అన్నమణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె పినపాక, కరకగూడెం మండలాల్లోని ఎల్చిరెడ్డిపల్లి, భట్టుపల్లి కేజీబీవీలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. విద్యార్థినుల హాజరు పట్టిక, బోధనా ప్రణాళికలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, ఆరోగ్య రికార్డులు తనిఖీ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. బోధనా ప్రమాణాలను మెరుగుపరచాలని, పాఠ్యపుస్తకాల లభ్యత, అభ్యసన, వాతావరణం వంటి అంశాలపై విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జి.పద్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పెదవాగులో చేరిన వరదనీరు
అశ్వారావుపేటరూరల్: మండలంలో రెండు రోజులుగా వర్షం కురుస్తుండగా, సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురిసింది. అశ్వారావుపేటతోపాటు మండలంలోని కావడిగుండ్ల, కంట్లం, అనంతారం, గాండ్లగూడెం, గుమ్మడవల్లి, నారాయణపురం, వినాయకపురం, తిరుమలకుంట, నందిపాడు, అచ్యుతాపురం, నారంవారిగూడెంతోపాటు అన్నీ గ్రామాల్లో జోరుగా వర్షం కురిసింది. భారీ వర్షాలతో పెదవాగుతోపాటు పంట పొలాల్లోకి వరదనీరు పొటెత్తింది. పెదవాగు నిండుగా ప్రవహించగా, ప్రాజెక్టులో తాత్కాలికంగా గతేడాది నిర్మించిన రిండ్బండ్కు వరదనీరు పోటెత్తింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి..
కొత్తగూడెంఅర్బన్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటుదామని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారుచెలక, మైలారం, గట్టుమల్ల, రేగళ్ల, లక్ష్మీదేవిపల్లి, చాతకొండ, సీతారాంపురం, తెలగరామవరం, హేమచంద్రాపురం గ్రామాల్లో కాంగ్రెస్ నాయకు లు, కార్యకర్తల ఆత్మీయ సమావేశాలకు హాజరై మా ట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీమెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్య త అందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజ లకు వివరించాలని, రూ.22 వేల కోట్లతో రైతుభరో సా అమలు చేసిందని, రూ.12 వేల కోట్లతో పేదల కు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తోందని, 55 లక్షల ఇళ్లకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, ఉచిత బస్సు పథకానికి రూ.4 వేలకోట్లు ఖర్చుపెడుతున్నట్టు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, పెద్దబాబు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి
పాల్వంచ: తొమ్మిది నెలలు నిండిన గర్భిణి ప్రసవం కోసం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి రాగా సకాలంలో వైద్యులు స్పందించక పోవడంతో శిశువు కడుపులోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుల కథనం మేరకు.. లక్ష్మీదేవిపల్లి మండలం తోకబంధాల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోరెం రాంప్రసాద్ భార్య కరుణ గర్భిణి కాగా నెలలు నిండటంతో ప్రసవం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి మంగళవారం ఉద యం తీసుకొచ్చారు. అయితే వైద్యులు సాధారణ కాన్పు కోసం మధ్యాహ్నం 12గంటల వరకు ప్రయత్నించారు. అనంతరం ఆపరేషన్ చేయగా.. బాబు గర్భంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. అనంతరం ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. రాంప్రసాద్, ఆయన బంధువు రాము మాట్లాడుతూ.. కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని, ఉదయం 7 గంటలకు ఆస్పత్రిలో చేరితే ఆలస్యం చేశారని, కరుణ ఎంత ప్రాధేయపడినా చేయలేదని, చివరికి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి కడుపులోనే చనిపోయాడని బిడ్డను చేతిలో పెట్టార ని కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్నతాధికారులు స్పందించి, పూర్తి విచారణచేసి ఆపరేషన్ చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, తమ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విష యమై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంప్రసాద్ను వివరణ కోరగా ఉమ్మనీరు, మలమూత్రం మింగడం, మెడలో పేగు వేసుకుని ఉండటంతో ఊపిరాడక మృతి చెందాడని, వైద్యుల తప్పిదం ఏమీలేదని, వారు తమవంతు కృషి చేశారని, శిశువు మృతి చెందడం తమకు కూడా బాధాకరమని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణ -
నర్సరీ యజమానులకు అవగాహన సదస్సు
సూపర్బజార్(కొత్తగూడెం): మిరప, కూరగాయల నారు పెంచే నర్సరీ యజమానులకు మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి జంగా కిశోర్ మాట్లాడుతూ.. జిల్లాలోని నర్సరీల్లో పలు పంటలకు చెందిన నారు 29.4 కోట్ల మేర ఉత్పత్తి జరుగుతోందని, జిల్లాలో మిరప 17,589 ఎకరాల్లో సాగు చేస్తున్నారని, సుమారు రెండు వేల కేజీల మిరప విత్తనం నుంచి 20 కోట్ల మిరపనారు ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. నర్సరీలన్నీ కొత్త నర్సరీ నియంత్రణ నియమావళి–2017 ప్రకారం నాణ్యమైన, ప్రాచుర్యంలో ఉండి పేరెన్నిక గల అధిక దిగుబడినిచ్చే రకాలను పెంచి రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. సదస్సులో ఉద్యాన అధికారులు జి.దేవప్రసాద్, కె.మీనాక్షి, ఎం.స్రవంతి, బి.స్రవంతి, సీహెచ్ సాయికృష్ణ, జిల్లాలోని వివిధ నర్సరీల యజమానులు పాల్గొన్నారు. -
కాంగోలో జిల్లా వాసి మృతి
కొత్తగూడెంఅర్బన్: దక్షిణాఫ్రికా ఖండం కాంగోలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ పంచాయతీకి చెందిన సయ్యద్ అనీశ్ (45) మృతి చెందాడు. లక్ష్మీదేవిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. పదేళ్ల కిందట దుబాయ్ వెళ్లిన అనీశ్.. అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా కాంగో వెళ్లిన అనీశ్ కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రమాద ఘటనను అక్కడి దేశస్తులు స్థానిక పోలీసులకు తెలపగా వారు అనీశ్ తండ్రి అక్రమ్కు, కుటుంబ సభ్యులకు తెలిపారు. ఢిల్లీలో ఉండి ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అనీశ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పి ఓదార్చారు. చికిత్స పొందుతున్న వివాహిత మృతిదుమ్ముగూడెం: మండలంలోని నందులచలక గ్రామానికి చెందిన గుండి నాగమణి (30) పురుగులమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్ఐ గణేశ్ కథనం ప్రకారం.. నాగమణి గత నెల 22వ తేదీన కుటుంబ గొడవల కారణంగా పురుగులమందు తాగింది. అప్పటి నుంచి వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి భర్త గుండి భద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆటోను ఢీకొన్న ట్రాక్టర్పాల్వంచరూరల్: ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టగా ముగ్గురు గాయపడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉల్వనూరు నుంచి పాల్వంచ వైపు వస్తున్న ఆటోను వేగంగా వచ్చిన ట్రాక్టర్ యూటర్న్ తీసుకుంటూ ఢీకొట్టింది. ఆటోడ్రైవర్ కొక్కు యాదగిరి, బుల్లి, గండికోట రమేశ్ గాయపడ్డారు. ఆటోడ్రైవర్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ట్రాక్టర్ డ్రైవర్ కాలం ప్రవీణ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. అట్రాసిటీ కేసు నమోదుఅశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన వ్యక్తిపై మంగళవారం అశ్వాపురం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లెలమడుగు గ్రామ పంచాయతీలోని చింతకుంట గ్రామానికి చెందిన గిరిజన యువతి పొలంలో ఉండగా మొండికుంట గ్రామానికి చెందిన తోవిటి యాదగిరి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుప్రసాద్ తెలిపారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఘనంగా వనమహోత్సవంశ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో మంగళవారం వనమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈఓ ఎల్.రమాదేవి మొక్క నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ఏఈఓలు భవానీ రామకృష్ణ, శ్రావణ్కుమార్, ఈఈ రవీంద్రనాథ్, సీసీ శ్రీనివాసరెడ్డి, సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘సాహిత్య సూచి’లో జిల్లా వాసికి అవకాశంఅశ్వారావుపేటరూరల్: తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించిన సాహిత్య గ్రంథ సూచిలో అశ్వారావుపేటకు చెందిన ప్రముఖ రచయిత సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు రాసిన గ్రంథాలకు స్థానం దక్కింది. ఆయన రచించిన కాళికాంబసప్తశతి, రాతిపూలవనం తదితర గ్రంథాల సమగ్ర వివరాలను సూచిలో పొందుపర్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని ప్రభాకరాచార్యులు అందుకున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో తనిఖీలు కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంగళవారం ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ సందర్శించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విభాగంలో రికార్డులను, జరుగుతున్న పనులకు సంబంధించిన నివేదికలను పరిశీలించారు. ప్రస్తుతం ఏ పను లు జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? అని డీఈ రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు. -
ఉద్దీపనం పుస్తకాల్లో నాణ్యత ఉండాలి
భద్రాచలం : విద్యార్థులకు అందించే ఉద్దీపనం పుస్తకాల్లో నాణ్యత పాటించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల కోసం రూపొందించిన ఈ పుస్తకాల ముద్రణ టెండర్లను తన చాంబర్లో మంగళవారం ఆయన ఖరారు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం పుస్తకాలు ముద్రించాలని సూచించారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు 30,89,784 వర్క్బుక్లు ముద్రించి ఆయా పాఠశాలలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ, ఏసీఎంఓ రమేష్, జీసీసీ డీఎం జయరాజ్, ఏటీడీఓ అశోక్ కుమార్తో పాటు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ మండలాలకఉ చెందిన ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. 7న అశ్వారావుపేటలో గిరిజన దర్బార్ మారుమూల గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజన కుటుంబాల సౌకర్యార్థం ఈనెల 7న అశ్వారావుపేటలో గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు, యూనిట్ అధికారులు పూర్తి నివేదికలతో సోమవారం ఉదయం 10 గంటలకు అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల గిరిజనులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజన దర్బార్పై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
చెత్త వేసే చోటే లేదు..
అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీలో నిత్యం వెలువడే చెత్త వేసేందుకు డంపింగ్ యార్డు ఉన్నా.. అది నిండిపోయి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో యార్డుకు వెళ్లే దారిలోని వ్యవసాయ భూముల్లోనే వేస్తున్నారు. పేరుకు రెండెకరాల డంపింగ్ యార్డు ఉన్నా.. రోడ్డు పక్కనే చెత్త వేస్తుండడంతో మెరుపు కాలనీ, అటెండర్స్ కాలనీ, కోతమిషన్ బజారు వాసులు దుర్వాసన భరించలేకపోతున్నారు. చెత్త కాలిస్తే పొగ, ఈగల బెడద తీవ్రంగా ఉందని వాపోతున్నారు. పట్టణంలో చెత్త సేకరణకు 3 ట్రాక్టర్లు, 7 ట్రాలీలు వినియోగిస్తున్నారు. వీటి నిర్వహణకు నెలకు రూ.లక్ష డీజిల్కు, 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రూ.6.64 లక్షలు వ్యయం అవుతోంది. ఎవరికి చెప్పాలో తెలియడం లేదు చెత్తను మా కాలనీ పక్కనే వేస్తున్నారు. ట్రాక్టర్లు, ఆటోలు వెళ్లేటపుడు వీధుల్లో పడుతోంది. రోజూ తగలబెడుతుండగా తట్టుకోలేని పొగ, కంపు కొడుతోంది. ఇంటి నిండా ఈగలు ముసురుతుంటాయి. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – కోరుకొండ రాజేశ్వరి, మెరుపు కాలనీ ● -
డీసీసీబీ ఉద్యోగుల వేతన సవరణ
● 26–29 శాతం మేర పెరిగే అవకాశం ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఉద్యోగుల వేతన సవరణపై ఒప్పందం కుదిరింది. ఈ అంశంపై ఉద్యోగులు మూడేళ్లుగా ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్నేని రవీందర్రావు ఆధ్వర్యాన హైదరాబాద్లోని టీజీకాబ్ కార్యాలయంలో డీసీసీబీ ఉద్యోగ యూనియన్ల ప్రతినిధులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఉద్యోగుల ప్రస్తుత వేతనాలపై 26నుంచి 29 శాతం మేర సవరణకు నిర్ణయించి, 2022 నవంబర్ 1 నుంచి అమయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎం.శ్రీనివాస్, నున్నా సందర్రావు, జె.అనిల్కుమార్, ఎండీ.అఫ్జల్, పి.మంగయ్య, యూ.రవీందర్కుమార్, డి.రవి, ఎస్.కే.జానీమియా, ఎం.స్రవంతి, బి.రవికుమార్, పి.వెంకట్రామయ్య, జి.క్రాంతి, ప్రకాష్ పాండే పాల్గొన్నారు. కాగా, వేతన సవరణకు సహకరించిన మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేతన ఒప్పందాన్ని జిల్లాల వారీగా బ్యాంకు పాలకవర్గాలు తీర్మానించి అమలు చేయాల్సి ఉంటుంది. బాల కార్మికులు కనిపించొద్దు.. కొత్తగూడెంటౌన్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆపరేషన్ ముస్కాన్–11 వాల్పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జూలై 1 నుంచి 31 వరకు జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో బాల కార్మికులను గుర్తిస్తారని, ఈ బృందంలో ఒక ఎస్ఐతోపాటు నలుగురు సిబ్బంది ఉంటారని తెలిపారు. పోలీస్ శాఖతో పాటు ఇతర అధికారులతో కలిసి జిల్లావ్యాప్తంగా 5 ప్రత్యేక బృందాలతో నెల రోజుల పాటు బాల కార్మికులను గుర్తించేందుకు దాడులు నిర్వహిస్తామని వెల్లడించారు. బాల కార్మికులను గుర్తిస్తే తక్షణమే 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీపీఓ హరికుమారి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఫక్రుద్దీన్, సందీప్, రమాదేవి, విజయకుమారి, ఏసోబు, సూర్యం పాల్గొన్నారు. -
రోడ్డుపైనే చెత్త..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో 29 డివిజన్లు ఉండగా.. వెలువడుతున్న చెత్తను పాతకొత్తగూడెంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గతంలో రామవరంలో ఉన్న డంపింగ్ యార్డ్ సామర్థ్యానికి మించి చెత్త వెలువడుతుండగా.. దుర్వాసన, చెత్త కాల్చడంతో వెలువడే పొగతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వారి ఆందోళనతో చెత్తను పాతకొత్తగూడెం డంపింగ్ యార్డుకు మార్చారు. గత నాలుగేళ్లుగా అక్కడే డంప్ చేస్తున్నా.. ప్రస్తుతం ఆ స్థలం కూడా సరిపోక రోడ్డుపైనే పడేస్తున్నారు. కొత్త డంప్ యార్డ్ల ఏర్పాటుకు డీఎంఏకు ప్రతిపాదనలు పంపించిన అధికారులు.. స్థలాల ఎంపిక పనిలో పడ్డారు. పట్టణంలో నిత్యం 31 టన్నుల చెత్త వెలువడుతుండగా తరలింపునకు 36 ట్రాలీలు, ఐదు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, డీజిల్, నిర్వహణ ఖర్చులు నెలకు రూ.35 లక్షలు అవుతోందని అధికారులు వెల్లడించారు. పగలు, రాత్రి తేడా లేదు పాతకొత్తగూడెంలో ఇళ్ల సమీపంలోనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. చెత్త తీసుకొచ్చే వాహనాలు రాత్రీ పగలు తేడా లేకుండా తిరుగుతూనే ఉంటాయి. వాహనాలు చప్పుడు, చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. – మరియమ్మ, పాతకొత్తగూడెం ● -
యార్డు ఉన్నా.. ఉపయోగం సున్నా
పాల్వంచ: పాల్వంచలో డంపింగ్ యార్డ్కు గతంలో 11 ఎకరాలు కేటాయించారు. అయినా పలుచోట్ల రోడ్లపైనే చెత్త వేస్తున్నారు. శివనగర్ పక్కన ఇప్పటికే భారీ డంపింగ్ యార్డు ఉంది. మసీదు గుట్టకు వెళ్లే దారిలోనూ చెత్త డంప్ చేస్తున్నారు. జెన్కో స్థలంలో మరో చోట చెత్త పడేస్తున్నారు. నవభారత్ వెనుక పునాది రాయి అక్రమ తరలింపుతో అక్కడ లోతైన గుంతలు ఏర్పడగా ప్రస్తుతం వాటిలోనూ చెత్త పడేస్తున్నారు. ఇలా అనేక చోట్ల డంపింగ్ యార్డులు ఉండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని పట్టణ వాసులు అంటున్నారు. డివిజన్లో 24 వార్డుల ద్వారా రోజుకు 18 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతోంది. తరలింపునకు 8 ట్రాక్టర్లు, 26 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయి. ఒకేచోట డంప్ చేయాలి పాల్వంచలో మూడు, నాలుగు చోట్ల చెత్త డంప్ చేస్తున్నారు. శివనగర్, మసీద్ గుట్ట, జెన్కో స్థలం, జగ్గుతండాల్లో చెత్త వేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలవారు ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ సూచించిన జగ్గుతండా వద్దే డంపింగ్ చేయాలి. –సాంబశివరావు, పాల్వంచ● -
ఊరు శివారే ఆవాసం !
మణుగూరు టౌన్: వానాకాలం వస్తే మణుగూరులోని చెత్త డంపింగ్ యార్డుకు వాహనాలు వెళ్లే పరిస్థితి ఉండదు. దీంతో చెత్త డంప్ చేసేందుకు పట్టణ శివారే దిక్కవుతోంది. పట్టణం నుంచి రోజుకు సుమారు 17 టన్నుల చెత్తను వాహనాల ద్వారా తరలిస్తారు. వర్షం పడితే డంప్యార్డ్ దారంతా బురదమయం అవుతుంది. రోడ్డు పక్కనే చెత్త పడేస్తుండడంతో పందులు స్వైర విహారం చేస్తుండగా దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతూ దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దుర్వాసన భరించలేకపోతున్నామని, ఈగలు, దోమలతో వ్యాధులు ప్రబలుతున్నాయని యార్డ్కు సమీపంలోని బెస్తగూడెం గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. డంప్యార్డ్ను మరో చోటకు మార్చాలంటున్నారు. ఇంట్లో ఉండలేకపోతున్నాం దోమలు, ఈగలతో నిత్యం చస్తున్నాం. వానాకాలం వచ్చిందంటే రోడ్డు బాగా లేదంటూ చెత్త బండ్లను ఇటే తీసుకొస్తున్నారు. చెత్త నుంచి వచ్చే దుర్గంధంతో ఇళ్లలో ఉండలేకపోతున్నాం. దోమలతో సతమతం అవుతున్నాం. – మర్రి వెంకటనర్సమ్మ, బెస్తగూడెం● -
ఎక్కడ పడితే అక్కడే..
ఇల్లెందు: ఇల్లెందులో డంపింగ్ యార్డు ఉన్నా సేకరించిన చెత్త అక్కడికి చేరడం లేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వెంట పడేస్తుండగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పట్టణం నుంచి నిత్యం 8 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా కొంత డంప్ యార్డుకు చేరుతున్నా.. అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు డ్రైవర్లు రోడ్డుపైనే పడేస్తున్నారు. ఇక యార్డుకు చేరిన చెత్తను సైతం రీసైక్లింగ్ చేయడం లేదు. తడి చెత్తతో ఎరువు తయారు చేయాల్సి ఉండగా ఈ ప్రక్రియ కూడా అడుగంటింది. వార్డులకు రెండు, మూడురోజు లకోసారి చెత్త వాహనం వస్తోంది. దీంతో ఇళ్లల్లో చెత్త నిల్వలు పెరిగి దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయని పట్టణ వాసులు అంటున్నారు. రోడ్డు పక్కన వేస్తున్నారు డంప్ యార్డుకు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే చెత్త పడేస్తుండగా పక్క చేల్లోకి వస్తోంది. చెత్త నుంచి దుర్వాసన వస్తోంది. అన్ని రకాల మలినాలు, కోళ్లు, జంతువుల కళేబరాలు వదిలి వేస్తుండడంతో రోడ్డు వెంట ప్రయాణం చేయటం, సమీప రైతులు చేలలో పనులు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. – హరిప్రసాద్ యాదవ్, ఇల్లెందు ● -
మురికి కంపు
● పట్టణాల్లో డంపింగ్ యార్డ్ల నిర్వహణ అస్తవ్యస్తం ● పలుచోట్ల రోడ్డుపైనే పడేస్తున్న సిబ్బంది ● వాసన, పొగ భరించలేక సమీప ప్రజలు అవస్థలు చెత్త డంపు..పట్టణాల్లో చెత్త సేకరణ, డంప్ చేయడం ప్రహసనంలా మారింది. చాలా చోట్ల డంపింగ్ యార్డులు ఉన్నా అవి సరిపోక చెత్తను రోడ్లపైనే పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు. అటుగా వెళ్లే వారు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చెత్త రీసైక్లింగ్ చేస్తే ఈ సమస్య కొంత పరిష్కార మయ్యే అవకాశ ం ఉన్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, అశ్వారావుపేట, ఇల్లెందులో డంపింగ్ యార్డుల సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్.. -
బోన్లెస్ చేపలతో రుచి, లాభాలు!
సూపర్బజార్(కొత్తగూడెం): మునగ సాగు తదితర అంశాలపై ప్రజలకు వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్న కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఈసారి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిపై దృష్టి సారించారు. కొత్తగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం చేపల వ్యాపారులు, మత్స్యకారులతో సమావేశమై చేపల్లో ముళ్లు తీయడంపై ప్రత్యేకంగా వివరిస్తూ.. వీటితో తయారుచేసే వంటలు, ఆదాయ మార్గాలపై అవగాహన కల్పించారు. బోన్లెస్ చేపలతో టిక్కా తదితర వంటలు చేస్తే ప్రజలకు కొత్త రుచులు అందించొచ్చని.. తద్వారా వారికి పోషకాహారం అందడమేకాక మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. అలాగే చేపల తలలు, మిగిలిన భాగాలతో సూప్ తయారుచేస్తే అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఇవన్నీ పోగా మిగిలిన వ్యర్థాలతో ఎరువు తయారీకి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో కలెక్టర్ స్వయంగా చేపల నుంచి ముల్లులు తీస్తూ అవగాహన కల్పించగా, మత్స్యకారులు, ఆదివాసీలు, చేపల పెంపకం, అమ్మకంపై ఆధారపడి జీవించే కుటుంబాలు, ఎస్హెచ్జీల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పాటిల్ సూచించారు. 9, 10వ తేదీల్లో మెగా ఆధార్ క్యాంపుఆధార్ కార్డుల్లో అవసరమైన సవరణల కోసం ఈనెల 9, 10 తేదీల్లో మెగా ఆధార్ క్యాంప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డుల్లో తప్పులున్నవారు, కొత్త సమాచారం జత చేయాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేరు మార్పు, పుట్టిన తేదీ, చిరునామా సవరణ, మొబైల్ నంబర్ అప్డేట్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో కొన్ని వివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చని, మరికొన్ని మాత్రం ఆధార్ సేవా కేంద్రం నుంచే చేయాల్సి ఉంటుందని తెలిపారు. మరమ్మతులకు అంచనాలు రూపొందించండికొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతు పనులకు అంచనాలు రూపొందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన జూనియర్ కళాశాలను సందర్శించారు. ప్రాక్టికల్ ల్యాబ్లు, రెనవేషన్ కంప్యూటర్ ల్యాబ్ సామగ్రి, ఎలక్ట్రికల్ ల్యాబ్ సామగ్రి, బాలుర, బాలికల టాయిలెట్ల మరమ్మతులు, ఎలక్ట్రికల్ పనుల వంటి వాటికి అంచనాలు తయారు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. కళాశాల ఆవరణలోని జీహెచ్ఎస్ తరగతి గదులను కూడా రిపేర్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్, ఇన్చార్జ్ డీఐఈఓ సులోచనారాణి, పాఠశాల హెచ్ఎం సబితా సంధ్యారాణి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, డీఈ నాగేందర్ పాల్గొన్నారు. తయారీ విధానాన్ని వివరించిన కలెక్టర్ -
కార్మిక శ్రేయస్సుకు నిరంతరం కృషి
ఇల్లెందు: ఇల్లెందు ఏరియా సింగరేణి ఉద్యోగి, ఐఎన్టీయూసీ నాయకుడు కళ్లం కోటిరెడ్డి నిరంతరం సింగరే ణి అఽభివృద్ధి, కార్మిక శ్రేయ స్సు కోసం పాటుపడ్డారని సింగరేణి ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం ఇల్లెందు జేకే ఓసీలో ఉద్యోగ విరమణ పొందిన ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కోటిరెడ్డి హక్కుల సాధనకు కృషి చేశాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు జాకీర్ హుస్సేన్, చిన్నయ్య, నాయకులు లచ్చిరామ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జేకే సీఈఆర్ క్లబ్లో గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ మడత రమా వెంకట్గౌడ్ మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నేటివరకు ఇల్లెందు ప్రజలకు, కార్మికులకు ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. అనంతరం కళ్లం కోటిరెడ్డి మాట్లాడుతూ 42 ఏళ్ల పాటు ఇల్లెందు ఏరియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన తాను ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని, కార్మికుల సంక్షేమం, సింగరేణి అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, మడత వెంకట్గౌడ్ల సారథ్యంలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ జనరల్ త్యాగరాజ్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, యదళ్లపల్లి అనసూర్య, మాజీ వైస్ చైర్మన్లు మడత వెంకట్గౌడ్, బాస శ్రీనివాసరావు, సయ్యద్ జానీపాషా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అబ్దుల్ నబీ, నాయి ని రాజు, ఎస్కె జానీ, డానియేల్, పులి సైదులు, కార్మిక నాయకులు జే. వెంకటేశ్వర్లు, కె సారయ్య, నజీర్ అహ్మద్, ఎస్ రంగనాధ్, దిండిగాల రాజేందర్, పులిగళ్ల మాధవరావు, పత్తి స్వప్న, ఇమామ్, కుటుంబ సభ్యులు కళ్లం అమరనాఽథ్, శాలినీ రెడ్డి, మురళీరెడ్డి, లావణ్య పాల్గొన్నారు. రెండు లారీలు ఢీ : డ్రైవర్లకు గాయాలుబూర్గంపాడు: సారపాక పుష్కరవనం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు గాయాలపాలయ్యారు. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని లారీ కేబిన్లలో ఇరుక్కుపోయి గాయాలైన డ్రైవర్లను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. లారీలను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.జీఎం వీసం కృష్ణయ్య -
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
● ఎస్సై సహా కుటుంబీకుల వేధింపులే కారణమని ఆరోపణ ● ఆస్పత్రి మార్చురీ వద్ద భర్త తండ్రికి దేహశుద్ధి జూలూరుపాడు/ఖమ్మం క్రైం: భర్త పోలీసు శాఖలో ఎస్సై, బావ కూడా అదే ఉద్యోగం.. మామ సైతం రిటైర్డ్ పోలీసు అధికారి. సమాజంలో ప్రజల కష్టాలు తీర్చే ఉద్యోగుల ఇంటికి కుమార్తెను ఇస్తే బిడ్డ జీవితం బాగుంటుందని భావిస్తే వివాహేతర సంబంధాల పేరిటే కాక రకరకాల కారణాలతో వేధిస్తుండడంతో ఆమె తనువు చాలించింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములుతండాకు చెందిన బానోతు రాణాప్రతాప్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన రాజేశ్వరి(34)కి 2018లో వివాహం జరిగింది. ఆ సమయాన రూ.40 లక్షలతో పాటు, 35 తులాల బంగారం, మరో రూ.4లక్షల విలువైన కానుకలను ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉండగా.. కొన్నాళ్ల నుంచి భర్తతో పాటు అత్తామామలు పుష్పరాణి – చంద్రం, బావ మహేష్ (ఎస్సై, మహబూబాబాద్ వీఆర్) రాజేశ్వరికి వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తున్నట్లు సమాచారం. కాగా, రాణాప్రతాప్కు ఖమ్మం జీఆర్పీ ఎస్సైగా పోస్టింగ్ రావడంతో భార్యాపిల్లలను జూలూరుపాడులోనే ఉంచి రాకపోకలు సాగిస్తున్నాడు. అయితే, కుటుంబీకుల వేధింపులు తాళలేక రాజేశ్వరి జూలూరుపాడులోని అద్దె ఇంట్లో జూన్ 25న పురుగుల మందు తాగగా ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం, ఆపై హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందింది. మామపై దాడి.. హైదరాబాద్ నుంచి రాజేశ్వరి మృతదేహాన్ని సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈక్రమాన రాణాప్రతాప్ తండ్రి చంద్రం మార్చురీ వద్దకు రావడంతో తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తూ రాజేశ్వరి కుటుంబీకులు దాడి చేశారు. దీంతో జూలూరుపాడు, ఖమ్మం టూటౌన్ పోలీసులు అడ్డుకుని ఆయనను టూటౌన్కు తరలించారు. ఘటనపై మృతురాలు తండ్రి సోమ్లా ఫిర్యాదుతో రాణాప్రతాప్, పుష్పరాణి, చంద్రం, మహేష్పై కేసు నమోదు చేసినట్లు జూలూరుపాడు ఎస్ఐ రవి తెలిపారు. కాగా, రాణాప్రతాప్, ఆయన సోదరుడు మహేష్ మొదటి నుంచీ వివాదాస్పదులుగానే ఉన్నారు. ఖమ్మం పాత బస్టాండ్ సమీపాన ఓ చెప్పు ల షాపు యజమానిపై కొన్నాళ్ల క్రితం అకారణంగా దాడి చేసిన రాణాప్రతాప్ తుపాకీతో బెదిరించాడు. ప్రస్తుతం ఆయన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
అనుమతి లేకుండా వెళ్లిపోయిన టీచర్
పాఠశాలలో బిక్కు బిక్కుమంటూ గడిపిన విద్యార్థులు టేకులపల్లి: మండలంలోని బద్దూతండా పంచాయతీ మద్దిరాలతండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సోమవారం మధ్యాహ్నం తర్వాత అనుమతి లేకుండానే విధుల నుంచి వెళ్లిపోయాడు. సెలవు చీటి పిల్లలకు ఇచ్చి ఎవరైనా వస్తే చూపించండని చెప్పాడు. కాగా, పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ సాయంత్రం వరకు గడిపారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు కాంప్లెక్స్ హెచ్ఎం నుంచి అనుమతి తీసుకుని వెళ్లాల్సి ఉంది. కానీ అనుమతి తీసుకోకుండానే, కనీస బాధ్యతను మరిచి పిల్లలను వదిలేసి వెళ్లిపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కాంప్లెక్స్ హెచ్ఎం జోగ రవిని వివరణ కోరగా... అనుమతి కోసం తనను సంప్రదించలేదని తెలిపారు. బకాయిలు విడుదల చేయాలిఖమ్మం మామిళ్లగూడెం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.వెంకటేష్, బెస్ట్ అవైలబుల్ పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యుడు గురుస్వామి రాష్ట్రవ్యాప్తంగా రూ.200కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఫలితంగా పాఠశాలల యజమాన్యాలు పిల్లలను ఇబ్బంది పెడుతున్న నేపథ్యాన ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. -
వెదురు, మునగతో అధిక లాభాలు
కలెక్టర్ జితేష్ వి పాటిల్ఇల్లెందురూరల్ : వెదురు, మునగ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని కొమరారంలో సోమవారం ఆయన పోడు రైతులతో మాట్లాడారు. పోడు భూముల్లో రైతులు పత్తి, మొక్కజొన్న మాత్రమే సాగు చేస్తూ సరైన ఆదాయం పొందడం లేదని, దీనికి ప్రత్యామ్నాయంగా లాభసాటి పంటలు సాగు చేయాలని చెప్పారు. పోడు భూములు మునగ, వెదురు సాగుకు అనుకూలంగా ఉంటాయని, సాగు చేసే రైతులకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. తమకు పోడు పట్టాలు రాలేదని కొందరు మహిళలు కలెక్టర్ దృష్టికి తేగా దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొమరారంలో ఏఎంసీ సబ్యార్డ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మొండితోగులో ఎరువులు, పురుగుమందుల దుకాణాన్ని తనిఖీ చేశారు. మొక్కజొన్న, పత్తి పంటలకు రైతులు వినియోగించే విత్తనాలు, ఎరువులు, పురుగు ముందుల వివరాలు, వాటి ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైటీసీని సందర్శించిన కలెక్టర్.. ఈ కేంద్రానికి అవసరమైన మరమ్మతులు చేసి త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ బానోత్ రాంబాబు, ఏడీఏ లాల్చంద్, ఎఫ్డీఓ కరుణాకరా చారి, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్సింగ్, ఎంఈఓ ఉమాశంకర్, ఏఓ సతీష్, ఏపీఎం దుర్గారావు పాల్గొన్నారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి ఇల్లెందు : అత్యంత ఖరీదైన రూట్ కెనాల్ చికిత్సను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో అందించాలని, అందుకు అవసరమైన దంత వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సోమవారం ఆయన ఇల్లెందు ఆస్పత్రిని పరిశీలించి దంత సమస్యలతో రోజుకు ఎంతమంది వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. బర్త్ వెయిటింగ్ గదులను స్పెషల్ రూంలుగా రీ మోడల్కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆస్పత్రి ఆవరణలో లోతట్టుగా ఉన్న చోట గ్రావెల్తో లెవెల్ చేయాలని సూపరింటెండెంట్ హర్షవర్ధన్కు సూచించారు. శానిటేషన్ సిబ్బంది పని తీరు ను అభినందించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ రవిబాబు, ఆర్ఎంఓ రాంనివాస్ పాల్గొన్నారు. -
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
భద్రాచలం : గిరిజన దర్బార్లో వినతులు ఇచ్చే వారి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని, ఈ విషయంలో ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఏఓ సున్నం రాంబాబు, గురుకుల ఆర్సీఓ అరుణకుమారి, ఎస్డీసీ రవీంద్రనాథ్, అధికారులు భాస్కర్, వేణు, లక్ష్మీనారాయణ, రమేష్, ఆదినారాయణ, హరికృష్ణ పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థల సేవలు భేష్ దుమ్ముగూడెం : గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్షబ్ వారి సేవలు అభినందనీయమని పీఓ రాహుల్ అన్నారు. ములకపాడు ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి శిబిరాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయని చెప్పారు. శిబిరం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు మాట్లాడుతూ.. 219 మందికి కంటిచూపు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని, అందులో 142 మందిని కేటరాక్ట్ ఆపరేషన్లకు ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో డీడీఎంహెచ్ఓ చైతన్య, వైద్యులు, ఆయా సంస్థల బాధులు సూర్యనారాయణ, ఎ.జగదీష్, కమలా రాజశేఖర్, నక్కా వెంకన్న యాదవ్, వి.కామేశ్వరరావు, సిద్ధారెడ్డి, యుగంధర్, బానోత్ రాము, ప్రసాద్, మధు, పి.ప్రజ్ఞ, మధుమోహన్ రెడ్డి, జి.సంజీవరావు, బాలకృష్ణ, ఆర్. కృష్ణవేణి, ఆదినారాయణ పాల్గొన్నారు. కాగా. పెద్ద నల్లబల్లి గ్రామానికి చెందిన 70 మంది పోడు పట్టాలు రాలేదని ఎమ్మెల్యే వెంకట్రావుతో కలిసి పీఓ రాహుల్ను కలిశారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
‘సీతారామ’తో న్యాయం చేయాలి
● జిల్లా నీరు, భూములతో ప్రాజెక్టు నిర్మాణం ● గోదావరి జలాలు మాత్రం ఖమ్మం జిల్లాకా.. ● ‘చలో పూసుగూడెం’లో బీఆర్ఎస్ నేతలు ● పిండప్రదానం చేయకుండా అడ్డుకున్న పోలీసులుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పరాయి ప్రాంతం వాడు ద్రోహం చేస్తే తరిమి కొడతామని, ఈ ప్రాంతం వాడు ద్రోహానికి పాల్పడితే వంద అడుగుల గొయ్యి తీసి పాతిపెడతా’మని కాళోజీ చెప్పిన సూక్తికి తగ్గట్టుగా జిల్లాకు అన్యాయం చేయాలని చూస్తే ఇక్కడి కాంగ్రెస్ నేతలను ప్రజలు బొంద పెడతారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ రేగా కాంతారావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగునీరు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ చేపట్టిన ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండ ప్రదానం – ఛలో పూసుగూడెం’ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీతారామ నీళ్లు ఖమ్మం జిల్లాకు ఇస్తే తమకు సంతోషమేనని, అయితే అంతకంటే ముందు భద్రాద్రి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించాలని డిమాండ్ చేశారు. జిల్లాకు న్యాయం జరిగే వరకూ దశల వారీగా పోరాటం కొనసాగుతుందన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు న్యాయం చేయలేకపోయారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 20 శాతం పనులు చేయడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. చండ్రుగొండ మండలంలో చేపట్టే ప్యాకేజీలో రైతులకు పరిహారం ఇవ్వకుండా భూ సేకరణ ప్రయత్నం సరికాదన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..సీతారామ ప్రాజెక్టులో జిల్లాకు నీరు ఇవ్వకుండా ఖమ్మం తరలించుకుపోతున్నారని అన్నారు. జిల్లాకు న్యాయం చేసేవరకూ తమ పోరాటం ఆగదన్నారు. ‘ఇల్లెందు’కు అనుమతి ఇవ్వాలి సీతారామ ప్రాజెక్టుకు గతంలో ఇల్లెందు నియోజకర్గంలోని రోళ్లపాడులో శంకుస్థాపన జరిగిందని, అక్కడి నుంచి ప్రాజెక్టును ఇతర ప్రాంతానికి తీసుకెళ్లినా అప్పటి ఎమ్మెల్యే నోరు మెదపలేదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లెందు కోసం రూ.3,200 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేయించానని, ఆర్థిక శాఖ వద్ద ఫైల్ పరిశీలనలో ఉండగా ప్రభుత్వం మారిందని, దానికి మంజూరు తేవడంలో ప్రస్తుత ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు.. నిరసన కార్యక్రమాలను అణచివేయడంపై కాకుండా ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి పెడితే బాగుంటుందని బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డి సూచించారు. దమ్మపేట రోడ్డులో ట్రాఫిక్ జామ్ బీఆర్ఎస్ చేపట్టిన నిరసన, పోలీసుల అడ్డగింత, అరెస్టులతో ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాల్వంచ – దమ్మపేట రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. రెండు వైపులా కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నేతల అరెస్ట్తో వారు వచ్చిన వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉండటం, పోలీస్ బారికేడ్లతో ట్రాఫిక్ క్లియరెన్స్కు కొంత సమయం పట్టింది. మరోవైపు పూసుగూడెం పంప్హౌస్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని లోపలికి ఎవరినీ వెళ్లకుండా అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను మధ్యాహ్నం 12 గంటలకు పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించగా కార్యకర్తలు స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ములకలపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు మోరంపూడి అప్పారావు, తాండ్ర రాంబాబు, శనగపాటి సీతారాములు, పుష్పాల చందర్రావు, కోండ్రు సుందర్రావు, సున్నం లలిత తదితరులు పాల్గొన్నారు.తండ్రి పోలీస్ డ్యూటీ.. కూతురు అరెస్ట్ ములకలపల్లి : తండ్రి ములకలపల్లి పోలీస్స్టేషనల్లో తండ్రి ఒగ్గెల లక్ష్మణ్ హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ చేపట్టిన ‘చలో పూసుగూడెం’ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కూతురు పూజను అరెస్ట్ చేసి అదే స్టేషన్కు తరలించారు. అయితే విధి నిర్వహణలో భాగంగా అరెస్టయిన కూతురి వివరాలు సేకరిస్తూ రికార్డు చేశారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
పాల్వంచరూరల్: భూ వివాదం కారణంగా ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామంలో సాగుచేసిన జామాయిల్ కర్రను సోమవారం నరుకుతుండగా.. నరకవద్దని గ్రామానికి చెందిన ఇట్టి అలివేలు కోరింది. అయినా నరుకుతుండటంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడిపోయింది. దీంతో స్థానికులు, బంధువులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కొత్తగూడెం, ఆ తర్వాత వరంగల్కు తరలించారు.ఎస్ఐ బెదిరింపుల వల్లే : సీపీఎంరూరల్ ఎస్ఐ బెదిరింపుల వల్లే అలివేలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని సీపీఎం నాయకుడు కె.వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రెస్క్లబ్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండ్రుగొండ గ్రామంలోని సర్వేనంబర్ 135లో ఆరెకరాల భూమికి సంబంధించిన వివాదంపై ఇటీవల ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయని తెలిపారు. సీపీఐ నాయకుల ఒత్తిడి కారణంగా ఎస్ఐ ఓ వర్గానికి కొమ్ముకాస్తూ దొంగపత్రాలు సృష్టించిన వారికి అండగా ఉండి బాధితులకు అన్యాయం చేస్తుండటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిదని పేర్కొన్నారు.అసత్యపు ఆరోపణలు : ఎస్ఐ సురేష్నేను ఎవరికీ కొమ్ము కాయడంలేదని, నాపై చేసిన ఆరోపణల్లో నిజంలేదని, ఆధారాలు చూపకుండా అసత్యపు అరోపణలు చేయడం సరికాదని రూరల్ ఎస్ఐ సురేష్ తెలిపారు. -
ఉద్యోగులను బలి తీసుకున్న ప్రమాదం
ఏన్కూరు: రోజు మాదిరిగానే విధులకు వెళ్తున్న ఇద్దరు ఉద్యోగులను రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. ఉద్యోగాలకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి బయలుదేరగా.. కాసేపటికే ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం అందడంతో విషాదం అలుముకుంది. ఏన్కూరు మండలం హిమామ్నగర్లో సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. కొణిజర్ల మండల పల్లిపాడుకు చెందిన ఇమ్మడి రఘుపతి(51) కొత్తగూడెంలో హోంగార్డుగా, భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం అంకపాలెంకు చెందిన బత్తుల రాజేష్(30) ఖమ్మంలో ఉంటూ కొత్తగూడెం ఎంఈఓ కార్యాలయంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే ద్విచక్ర వాహనంపై రాజేష్ కొత్తగూడెం వెళ్తుండగా పల్లిపాడు వద్ద రఘుపతి లిఫ్ట్ అడిగి ఆయనతోపాటు బయలుదేరాడు. మార్గమధ్యలో ఏన్కూరు మండలం హిమామ్నగర్ సమీపాన వీరి బైక్ను జూలూరుపాడు నుండి ఏన్కూరు వైపు వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజేష్, రఘుపతికి తీవ్ర గాయాలు కాగా, 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. బస్సులో వెళ్లినా బతికేవాడేమో... కొత్తగూడెంలో హోంగార్డుగా పనిచేసే రఘుపతికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే, రాజేష్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. రఘుపతి ప్రతీరోజు పల్లిపాడు నుంచి బస్సులో కొత్తగూడెం వెళ్లివచ్చేవాడు. అయితే, సోమవారం విధులకు ఆలస్యమవుతుండడంతో పల్లిపాడు వద్ద రాజేష్ను లిఫ్ట్ అడిగి ఆయన బైక్పై బయలుదేరాడు. దీంతో గమ్యం చేరకుండానే మార్గమధ్యలో ప్రమాదం బారినపడ్డాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రఫీ తెలిపారు. ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలిపాల్వంచరూరల్: పత్తి పంటను ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రేంజర్కు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బండ్రుగొండ గ్రామ శివారు భూమిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గార్డు, వాచర్లు కలిసి ఎనిమిది ఎకరాల్లో నిరుపేద రైతులు సాగు చేసుకుంటున్న పత్తి పంటను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల విశ్వనాథం, వీసంశెట్టి పూర్ణచందర్రావు, అడుసుమల్లి సాయిబాబా, ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు, చెన్నయ్య, ఆదినారాయణ, బొమ్మన నారాయణ, బొమ్మన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.వ్యాన్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి -
● చెత్త వాహనాలు ఐదే..
మణుగూరు టౌన్: మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ తూతూ మంత్రంగానే సాగుతోంది. పట్టణంలో 20 వార్డులు ఉండగా, ప్రధాన వార్డుల్లో ఒకటైన సుందరయ్యనగర్లో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ముఖ్య వీధులకు మాత్రమే వారంలో రెండు సార్లు చెత్త సేకరణ ఆటోలు వస్తున్నాయి. మొత్తం మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాలు ఐదే ఉండగా అవి ఎటూ సరిపోవడం లేదు. గాంధీనగర్లోనూ అదే పరిస్థితి. చెత్త సేకరణ వాహనాలు రాక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నారు. దీంతో అటువైపు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇక డ్రెయినేజీలను పట్టించుకునే నాథుడే లేడు. దోమల బారిన పడుతున్నాం సుందరయ్యనగర్లో కొన్ని వార్డుల్లో మాత్రమే రెండు రోజులకోసారి చెత్త బండ్లు వస్తున్నాయి. లోపలి వీధులకు మాత్రం 20 రోజులకోసారి వస్తున్నారు. కాల్వల్లో మురుగునీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. వాటి బారిన పడితే వ్యాధులు వస్తాయని భయంగా ఉంది. –లక్ష్మి, సుందరయ్యనగర్ ● -
పోలీసుల సేవలు వినియోగించుకోండి
కొత్తగూడెంటౌన్: ప్రతీ పౌరుడు పోలీసుల సేవలను ఉపయోగించుకోవాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన పలువురు తమ సమస్యలు ఎస్పీకి వివరించారు. ఆయా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ ఆయా స్టేషన్ల అధికారులను ఆదేశించారు. పోలీసు స్టేషన్ల వారీగా నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సమస్యలు ఉన్నవారు మధ్యవర్తులను సంప్రదించకుండా నేరుగా సమీప పోలీస్స్టేషన్కు వచ్చి తెలియజేయాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి సన్మానం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ముగ్గురిని ఎస్పీ రోహిత్రాజు సన్మానించారు. ఏడూళ్ల బయ్యారం పీఎస్ ఎస్సై మహమ్మద్ షఫీ, భద్రాచలం ట్రాఫిక్ పీఎస్ ఎస్సై సత్యనారాయణ, ఆశ్వాపురం పీఎస్ హెడ్ కానిస్టేబుల్ చిన్న వెంకటేశ్వర్లును ఘనంగా సత్కరించారు. గ్రీవెన్స్లో ఎస్పీ రోహిత్రాజు -
కొరవడిన చెత్తశుద్ధి !
ముందస్తుగా ఇంటిపన్ను చెల్లిస్తే రాయితీ ఇస్తామంటూ ఎర్లీబర్డ్ పథకాలు.. కొత్తగా ఇల్లు కట్టాలంటే అనుమతి పేరుతో ఫీజు వసూళ్లు.. ఇంటిపన్ను, నల్లా పన్ను, లైబ్రరీ సెస్.. ఇలా అనేక పేర్లతో పన్నులు విధిస్తున్న ప్రభుత్వం.. మున్సిపాలిటీల్లో సమస్యలపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. జిల్లాలోని ఏ పట్టణంలో చూసినా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడం, డ్రెయినేజీల్లో పూడిక తీయక భరించరాని దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ల నుంచి తడిచెత్త, పొడిచెత్త సేకరించే వాహనాలు నెలకు ఒకటి, రెండు సార్లు మాత్రమే వస్తున్నాయి. మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు లేకపోగా, అధికారులు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇక వర్షాలు ఉధృతమైతే ఈ సమస్య మరింతగా పెరుగుతుందని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపై చెత్త, డ్రెయినేజీల్లో సిల్ట్ పేరుకుపోతే దోమలు వృద్ధి చెందుతాయని, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు తప్పవని భయపడుతున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పేరకుపోయిన సమస్యలపై సాక్షి ఫోకస్.. ● చెత్త సేకరణ ఊసేలేదు పాల్వంచ: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. నిత్యం చెత్త సేకరణకు రావాల్సిన స్వచ్ఛ ఆటోలు వారికి ఒకటి, రెండు సార్లు కూడా రావడం లేదు. దీంతో ఇళ్లలో రోజుల తరబడి చెత్త నిల్వ చేయలేక స్థానికులు వీధుల్లో పడేస్తుండగా కుప్పలుగా పేరుకుపోతోంది. ప్రధాన వీధుల్లో మాత్రమే చెత్త తొలగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఇతర కాలనీలవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇక డ్రెయినేజీల్లో మురుగు తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. సీతారాం పట్నం, బొల్లేరుగూడెం ఏరియాల్లో డ్రెయినేజీల పక్కన పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వాటి ఆనవాళ్లే కనిపించడం లేదు. డ్రెయినేజీ ఆనవాళ్లే కనిపించడం లేదు డ్రెయినేజీలకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి వాటి ఆనవాళ్లు కనిపించడం లేదు. వాటిలో మురుగు తొలగించక చాలా నెలలైంది. వర్షాలు పెరిగితే మా ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సీతారాంపట్నంలోని అన్ని వీధుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. – పోటు శ్రీనివాసరావు, సీతారాంపట్నం -
కాంగ్రెస్తోనే అభివృద్ధి
ములకలపల్లి: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి సోమవారం మండలకేంద్రంతోపాటు మాధారం, జగన్నాథపురం, పాతగంగారం, సీతాయిగూడెం, కమలాపురం, చాపరాలపల్లి, రామచంద్రాపురం గ్రామాల్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. రూ 2.68 కోట్లతో నిర్మించిన కార్యాలయ భవనాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు. అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్రావు, మాజీ జెడ్పీటీసీ బత్తుల అంజి, కారం సుధీర్, శనగపాటి అంజి, నాగళ్ల వెంకటేశ్వరరావు, గాడి తిరుపతి రెడ్డి, గుంపుల రవితేజ, సురభి రాజేశ్, పాలకుర్తి సుమిత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి -
● అధ్వానంగా పారిశుద్ధ్యం
ఇల్లెందు : పట్టణంలోని సత్యనారాయణపురం 1, 2 వార్డుల్లో శానిటేషన్ అధ్వానంగా మారింది. కాల్వల్లో చెత్త తొలిగించడం లేదు. నెలల తరబడి పూడిక తీయకపోవడంతో వర్షపు నీరు ఇళ్లలోనే నిల్వ ఉంటోంది. తద్వారా దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఇంటింటా చెత్త సేకరించా ల్సిన వాహనాలు 15 రోజులకోసారి కూడా రావడం లేదు. సుదిమళ్ల గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కలవగా రోడ్లపై పశువులు, గేదెల మలమూత్రాలతో దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త తొలగించక చాలా రోజులైంది.. సత్యనారాయణపురంలో చెత్త తొలగించక, కాల్వలు శుభ్రం చేయక చాలా రోజులైంది. రోడ్లపై పశువుల మల మూత్రాలు తొలిగించక అపరిశుభ్రంగా ఉంటున్నాయి. పేరుకే మున్సిపాలిటీ కానీ, పంచాయతీ తరహాలోనే రోడ్లు, కాల్వల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. –కందుల వీరారెడ్డి, సత్యనారాయణపురం, ఇల్లెందు● -
పట్టణాల్లో లోపించిన పారిశుద్ధ్యం
● వీధుల్లోకి వస్తే భరించరాని దుర్గంధం ● అస్తవ్యస్త డ్రెయినేజీలతో ప్రజల ఇక్కట్లు ● ఇంటింటి చెత్త సేకరణా అంతంతే ● పన్ను వసూళ్లలో మాత్రం ముందుంటున్న అధికారులు● పేరులోనే మధురం కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మధురబస్తీలో పారిశుద్ధ్య సమస్య ప్రజలను పట్టిపీడిస్తోంది. బస్తీమధ్యలో నుంచి ప్రధా న డ్రెయినేజీ ఉండగా స్థానికుల ఇళ్లలో నుంచి కంటే ఎగువ ప్రాంతాల నుంచి మురికి నీరు, చెత్తాచెదారం చేరుతోంది. బస్తీ చివరన ఉన్న కిన్నెరసాని పైపులైన్ ఈ డ్రెయినేజీలో ఉండేది. మున్సిపల్ అధికారులు ఈ పైపులైన్ డమ్మీ చేసి పక్కనే మరో పైపులైన్ ఏర్పాటు చేశారు. అయితే డమ్మి చేసిన పైపులైన్ను డ్రెయినేజీనుంచి తొలగించకపోవడంతో మురికి నీరు, సిల్ట్ ముందుకెళ్లడం లేదు. దీంతో దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయని బస్తీ వాసులు అంటున్నారు. బయటకు వెళితే డ్రెయినేజీ నుంచి భరించరాని దుర్గంధం వస్తోందని, కనీసం రెండు రోజులకోసారైనా సిల్ట్ తొలగించాలని కోరుతున్నారు. పైపులైన్ను తొలగించాలి మధురబస్తీ ప్రధాన డ్రెయినేజీలో అడ్డుగా ఉన్న కిన్నెరసాని పైపులైన్ తొలగించాలి. డ్రెయినేజీలో మురికినీరు పోకుండా అడ్డుగా ఉండడంతో వర్షం వస్తే మురుగంతా ఇళ్లలోకే వస్తోంది. దీనిపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – అరుణ్, మధురబస్తీ -
● అంతర్గత వీధులపై పట్టింపేది ?
అశ్వారావుపేట: నూతనంగా మున్సిపాలిటీ హోదా పొందిన అశ్వారావుపేటలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. 100 రోజుల కార్యాచరణ సక్రమంగా అమలుకాక ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. బస్టాండ్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో వాణిజ్య చెత్త అధికంగా ఉత్పన్నం అవుతోంది. హోటళ్లు, మాంసం, చేపల దుకాణాలు, ఇతర దుర్వాసన వెదజల్లే వ్యర్థాలు రోడ్లపైనే వేస్తున్నారు. అయితే ప్రధాన రహదారిపై రోజూ చెత్త సేకరిస్తున్న సిబ్బంది అంతర్గత రోడ్లను మాత్రమ పట్టించుకోవడం లేదు. డ్రెయినేజీల్లో పూడికతీత పనులు సైతం సక్రమంగా లేక సిల్ట్ పేరుకుపోతోంది. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును పరిశీలించాలిఅదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును నిశితంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఆయన వినతులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంఽధిత అధికారులకు ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ 9వ వార్డులో మసీదుకు వెళ్లే దారిలో వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. చర్ల మండలం దోసినపల్లిలో తమకు ఆరెకరాల పొలం ఉందని, తమ పెద్ద సోదరుడు ఒక్కరే పట్టా చేయించుకున్నాడని, తనకు, తన తమ్ముడికి అన్యాయం చేశాడని అంబేద్కర్ నగర్కు చెందిన చింతల భాస్కర్రావు ఫిర్యాదు చేశాడు. ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా జయలక్ష్మికొత్తగూడెఅర్బన్ : జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎల్.భాస్కర్నాయక్ సోమవారం ఉద్యోగ విరమణ చేయగా డిప్యూటీ డీఎంహెచ్ఓగా డాక్టర్ జయలక్ష్మి ఇన్చార్జ్ డీఎంహెచ్ఓగా బాధ్యతలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె ఈ పోస్టులో కొనసాగుతారు. కాగా, ఉద్యోగ విరమణ పొందిన భాస్కర్ను సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజకుమార్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాధామోహన్, డీసీహెచ్ఎస్ రవిబాబు, ప్రోగ్రామ్ ఆఫీసర్ మధువరణ్, ఏఓ సుకృత తదితరులు పాల్గొన్నారు. సెర్ప్లో బదిలీలు షురూచుంచుపల్లి : ఉమ్మడి జిల్లా సెర్ప్ ఉద్యోగుల్లో బదిలీల సందడి నెలకొంది. మొదట ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది మంది డీపీఎంలకు సోమవారం స్థాన చలనం కలిగించారు. వీరిలో జిల్లా నుంచి ఐదుగురు, ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి బదిలీ అయిన వారికి ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, హైదరాబాద్ సెర్ప్ కార్యాలయాల్లో పోస్టింగ్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో జిల్లా నుంచి జి.రమాకాంత, సునందన్, నాగజ్యోతి, యాదయ్య, శేఖర్ ఉండగా, ఖమ్మం నుంచి శ్రీనివాస్, అంజనేయులు, లక్ష్మీనారాయణ ఉన్నారు. కాగా, ఏపీడీ, ఏపీఎంలు, ఎంఎస్ సీసీలు, సీసీలు, అడ్మిన్ అసిస్టెంట్లకు కూడా త్వరలో బదిలీలు కానున్నాయి. స్వయం ఉపాధితో ఆదర్శంభద్రాచలం: స్వయం ఉపాధి పొందుతూ, ఆర్థికాభివృద్ధి సాధిస్తూ దేశంలో గిరిజన మహిళలు ఆదర్శనీయంగా నిలుస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిజన దర్బార్కు వచ్చిన ఆయన సమస్యలపై పీఓతో చర్చించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ యూనిట్ ద్వారా తయారు చేసిన న్యూట్రిషన్ పదార్థాలు అమ్మకాలు జరిపే స్టాల్ను సందర్శించారు. మిల్లెట్ బిస్కెట్లు, సబ్బులు, షాంపుల తయారీ, అమ్మకాల వివరాలు తెలుసుకున్నారు. పీఎం మోదీ మన్కీ బాత్లో భద్రాచలం ఐటీడీఏ గిరిజన మహిళల ప్రస్తావన తెచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారిని అభినందించారు. సరసమైన ధరలలో విక్రయించాలని, తగిన మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. గ్రూప్ మహిళలు విజయలక్ష్మి, సమ్మక్క, సున్నం ఈశ్వరి, సున్నం స్వాతి, బేబీ రాణి, జగ్గా కుమారి పాల్గొన్నారు. -
థమ్సప్ అనుకుని గడ్డిమందు తాగిన బాలుడు
కరకగూడెం: థమ్సప్ అనుకుని ఓ బాలుడు గడ్డిమందు తాగిన ఘటన మండలంలోని చొప్పల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జాడి నవీన్ – వరలక్ష్మి దంపతుల కుమారుడు ఐదేళ్ల వరుణ్తేజ ఆదివా రం ఉదయం ఇంట్లో ఆడుకుంటుండగా.. థమ్సప్ బాటిల్లో పోసిన గడ్డిమందు కనిపించింది. అయితే దాన్ని థమ్సప్గా భావించిన బాలుడు కొంత తాగాడు. కాసేపటికి కడుపునొప్పితో బాధపడడంతో నోరు వెంట నురగలు వస్తూ వాంతి చేసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులు ఆటోలో కరకగూడెం పీహెచ్సీకి, అక్కడి నుంచి 108 ద్వారా మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఖమ్మం తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గంజాయి పట్టివేత పాల్వంచ: కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు. ఈనెల 28వ తేదీ సాయంత్రం స్థానిక రెజీనా కాన్వెంట్ సమీపంలో ఎస్ఐ సుమన్ వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన కారు ను ఆపేందుకు యత్నించగా.. అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. మరో ముగ్గురితోపాటు 11.100 కేజీల గంజాయి పట్టుబడింది. వారు చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన కందిమళ్ల శ్రీహరి, జొన్నలగడ్డ రాకేశ్రెడ్డి, బోనకల్ మండలం ముష్టికుంట్లవాసి ఎస్కే జావిద్గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. యూరియా తిని 11 మేకల మృతిములకలపల్లి: యూరియా తినడంతో 11 మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని మంగపేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మంగపేట గ్రామానికి చెందిన వాడె దారయ్యకు చెందిన మేకలు గ్రామశివారు లో మేతకు వెళ్లాయి. ఈ క్రమంలో ఓ రైతు ట్రాక్టర్లో యూరియా బస్తాలు తరలిస్తుండ గా ఒకటి రోడ్డుపై పడటంతో యూరియా కిందపడింది. సమీపంలో ఉన్న 11 మేక లు యూరియా తిని మృతిచెందాయి. సుమారు రూ.1.5 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు. -
జూలై 5న కౌన్సెలింగ్
సింగరేణి(కొత్తగూడెం): నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 150 సీట్ల భర్తీ కోసం సింగరేణి కార్మికులు, మాజీ కార్మికుల పిల్లలు ఈ నెల 28 నుంచి 3వ తేదీ వరకు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్–30, కంప్యూటర్–30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్– 30, మెకానికల్–30, మైనింగ్–30 సీట్లు ఉన్నా యని, https:# scp. scpolytechnic. com/ online& admission వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసి, కాపీని డౌన్లోడ్ చేసి, సంభందిత గని, డిపార్ట్మెంట్ హెచ్ఓడీతో అటెస్టేషన్ చేయించి జూలై 5వ తేదీన జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలని పేర్కొంది. వివరాల కోసం 90102 22161, 87901 12515, 94911 44168 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. నేడు 10 మంది అధికారుల ఉద్యోగ విరమణసింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో 10 మంది అధికారులు సోమవారం ఉద్యోగ విరమణ పొందనున్నారు. వారిలో ఐదుగురు జీఎంలు ఉన్నారు. జీఎం ఈఅండ్ఎం (సోలార్) జీఎస్ జానకీరామ్, జీఎం ఈఅండ్ఎం (ట్రాన్స్పోర్ట్) జె.నాగరాజు, కార్పొరేట్ ఏరియా ఆడిట్ జీఎం (ఎఫ్ అండ్ ఏ) గొర్రెపాటి వెంకటరమణ, జీఎం ఆర్అండ్డీ నారాయణరావు, హైదరాబాద్ సింగరేణి భవన్లో ఎంఎం విభాగంలో జీఎం ఈఅండ్ఎం ఎన్వీ రాజశేఖర్, డైరెక్టర్ ఈఅండ్ఎం అడిషినల్ జీఎం కామిశెట్టి వెంకటేశ్వరరావు, కార్పొరేట్ సివిల్ డీవైజీఎం (సివిల్) రాజశేఖర్, కార్పొరేట్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ ఏజీఎం (ఐఈ) గోనే శ్రీకాంత్, మెయిన్ ఆస్పత్రి డీవైసీఎంఓ డాక్టర్ టి.రవీంద్ర, కార్పొరేట్ పర్సనల్ విభాగం సీనియర్ పీఓ తీటి శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ చేయనున్నారు. మృతుడి వివరాలు లభ్యందమ్మపేట: పామాయిల్ క్షేత్రంలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. శనివారం మండలంలోని మందలపల్లి శివారులోని పామాయిల్ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం విదితమే. కాగా మృతుడి వివరాల కోసం పోలీసులు, మృతదేహం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఈ మేరకు ఏపీ, ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కుసిన వెంకటేశ్వరరావు, పాంచాలి దంపతులు మృతదేహం ఫొటో చూసి అశ్వారావుపేట మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి, తమ కుమారుడు సాయి (21)గా గుర్తించారు. కాగా మృతుడు అవివాహితుడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మృతుడి తల్లితండ్రులకు అప్పగించారు. విచారణ చేస్తున్నామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. పేకాట స్థావరంపై దాడిరఘునాథపాలెం: మండలంలోని పాపటపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై ప్రత్యేక బృందంతో దాడులు చేపట్టారు. రూ.2,500 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
‘సతత్ వికాస్’పై అవగాహన
● జాతీయ అవార్డుల దరఖాస్తు ప్రక్రియకు కసరత్తు ● క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణఇల్లెందురూరల్: పంచాయతీలను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ పేరుతో 2021–22 నుంచి అవార్డులు ఇస్తోంది. ఈ ఏడాది కూడా జాతీయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణకు కసరత్తు ప్రారంభించింది. దరఖాస్తు ప్రక్రియపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా, మండలస్థాయి అధికారులకు శిక్షణ పూర్తిచేశారు. ప్రస్తుతం ఎంపీడీఓలు గ్రామపంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో అంశంలో ఉత్తమ గ్రామపంచాయతీ, మండలం, జిల్లా పరిషత్ను ఎంపిక చేయనున్నారు. కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులో పొందుపర్చిన అంశాలను పరిశీలించనున్నాయి. కాగా, త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. తొమ్మిది అంశాలు.. 147 ప్రశ్నలు ప్రధానంగా తొమ్మిది అంశాల్లో కేంద్ర ప్రభుత్వం వార్డులు ప్రదానం చేయనుంది. ఆయా అంశాల పరిధిలో 147 ప్రశ్నలకు పంచాయతీ కార్యదర్శులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. మెరుగైన జీవనోపాధి, వైద్యసేవలు, ఇంటింటికి తాగునీరు, పచ్చదనం, పరిశుభ్రత, మహిళా సంఘాలకు రుణాలు, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళల సమస్యల సాధన, హక్కుల పరిరక్షణ అంశాల్లో అవార్డులు ఇవ్వనున్నారు. అవగాహన కల్పిస్తున్నాం కేంద్ర ప్రభుత్వ అవార్డులకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఏఏ అంశాలపై స్పష్టత ఉండాలి, నిబంధనలు, పరిశీలన ప్రక్రియ ఎలా ఉంటాయనే అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాం. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యేలోగా కార్యదర్శులను సన్నద్ధం చేసేందుకు కృషి చేస్తున్నాం. – ధన్సింగ్, ఇల్లెందు ఎంపీడీఓ -
అధికారం కోసమే బీజేపీ దైవజపం
● మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని నేలకొండపల్లి : అధికారం కోసమే బీజెపీ రామ జపం, దైవ జపం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండలంలోని మోటాపురంలో ఆదివారం జరిగిన సీపీఐ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దేవుడి పేరుతో ప్రజలను వంచిస్తోందని, మతం మాటున ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆ పార్టీకి అధికార ధ్యాసే తప్ప దేశభక్తి లేదన్నారు. దేశం కోసం బీజెపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదల అభ్యున్నతి, హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, త్యాగాల చరిత్ర తమ సొంతమని అన్నారు. కార్పొరేట్ల కోసమే పనిచేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సంపద సృష్టి కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించారు. మావోయిస్టులను హతమార్చడానికి అమిత్షా వంటి వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి రావాలని కోరారు. సీపీఐ శత వసంతాల ముగింపు సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో ఐదు లక్షల మందితో చారిత్రిక సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సభలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు హేమంతరావు, మహ్మద్ మౌలానా, దండి సురేష్, జితేందర్రెడ్డి, కర్ణకుమార్, కర్నాటి భానుప్రసాద్, రామ్మూర్తి, మారిశెట్టి వెంకటేశ్వరరావు, పాల్తీయ శ్రీనివాసరావు, రాంకోటి, కాశిబోయిన అయోధ్య, మేకల పుల్లయ్య, మల్లెబోయిన ఉపేందర్, సీతారాములు, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అతివలకు అండగా ‘సఖి’
● రెండేళ్లలో 565 కేసులు.. 216 పరిష్కారం ● అత్యధికంగా గృహహింస కేసులే.. ● ఫిర్యాదుల స్వీకరణకు అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ 181 కొత్తగూడెంటౌన్: సమస్యల్లో ఉన్నామని మహిళలు ఫోన్ చేస్తే చాలు.. అండగా సఖి సెంటర్ నిర్వాహకులు ఉంటున్నారు. జిల్లావ్యాప్తంగా 2023 మే నుంచి 2025 మే వరకు 565 కేసుల్లో బాధితులు సఖీ సెంటర్కు ఫిర్యాదు చేశారు. వాటిలో 216 కేసులు రాజీ కాగా, మిగిలినవి విచారణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. కొత్తగూడెంలో సఖి వన్స్టాప్ సెంటర్ను మొదటగా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో 2019లో ఏర్పాటు చేశారు. 2025లో ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాల వద్ద సఖి సెంటర్ను నిర్వహిస్తున్నారు. గృహ హింస, వరకట్న వేధింపులు, ఆస్తి తగాదాలు, వయోవృద్ధులు, ప్రేమించి మోసానికి గురైన బాధితులకు ఆశ్రయం కల్పిస్తూ, పొలీసుశాఖతో పాటు న్యాయ సేవలు, కౌన్సెలింగ్తో వారి సమస్యలు పరిష్కారిస్తున్నారు. తాత్కాలిక వసతితో పాటు అత్యవసర సరిస్థితుల్లో బాధిత మహిళలకు వాహన సదుపాయం కల్పిస్తున్నామని సఖి సెంటర్ అడ్మిన్ జులుమూరి సుభశ్రీ తెలిపారు. రెండేళ్లలో నమోదైన కేసులు జిల్లావ్యాప్తంగా రెండేళ్లలో 565 కేసులు నమోదు కాగా అత్యధికంగా గృహ హింస కేసులు 402 ఉన్నాయి. వరకట్న వేధింపులు–18, లైంగిక వేధింపులు–6, బాల్య వివాహాలు–2, బాలికలపై లైంగిక వేధింపులు (పోక్సో)–3, ఆస్తి తగాదాలు, వయోవృద్ధులు, ఇతర సమస్యలు–94, మోసం, ప్రేమ పేరుతో మోసగించడం కేసులు–40 ఉన్నాయి. వాటిలో రాజీ అయిన కేసులు–216, విచారణ దశలో–311, శక్తి సదన్, ఇతర గృహాలకు పంపిన కేసులు–38 ఉన్నాయి. అవగాహన సదస్సులు–311 వరకు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సక్సెస్ స్టోరీ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాకు చెందిన బుస్కి కల్ము, సాతిమండల్తో కలిసి భద్రాచలంలోని సారపాకకు గత నవంబర్లో వచ్చారు.కూలీ పనులు చేస్తూ సహజీవనం చేశారు. మహిళ గర్భం దాల్చింది. ఇంట్లో అమ్మను పెళ్లికి ఒప్పించి తీసుకెళ్తానని చెప్పి వెళ్లిన సాతిమండల్ తిరిగి రాలేదు. గర్భిణికి స్థానిక కారం చిట్టెమ్మ ఆశ్రయం కల్పించింది. అంగన్వాడీ టీచర్ గర్భిణిగా ఉన్న విషయాన్ని మే 4న.. ప్రసవించిన విషయాన్ని మే 19న ఐసీడీఎస్ అధికారులకు తెలిపింది. సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా, సఖి సెంటర్ అడ్మిన్ సుభశ్రీ, హరికుమారి బృందం చేరుకుని విచారించారు. సదరు మహిళ, బిడ్డను సఖి సెంటర్కు తరలించారు. సాతిమండల్ వివరాలు సేకరించి గ్రామస్తుల సాయంతో సఖి సెంటర్కు తీసుకువచ్చి పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. యువతిని పెళ్లి చేసుకుని తీసుకెళ్లేందుకు సాతిమండల్ అంగీకరించాడని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. కాగా, గత మే 29న బుస్కి కల్మును ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ అనితారామచంద్రన్ పరామర్శించారు. కష్టాల్లో ఉన్న వారికి భరోసా ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ చేస్తే సహాయం చేసి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తాం. రెండేళ్లుగా 565 కేసులు నమోదు కాగా అందులో అత్యధికంగా భార్యభర్తలు విడిపోతామంటూ ఆశ్రయిస్తున్నారు. అందులో ఎక్కువగా వరకట్న వేధింపుల కేసులు ఉన్నాయి. వేధింపులకు గురైన వారు టోల్ ఫ్రీ నంబర్ 181, లాండ్లైన్ 08744 – 248222, సెల్ నంబర్ 86880 05934కు సమాచారం అందించాలి. –జులుమూరి సుభశ్రీ, అడ్మిన్, సఖి వన్స్టాప్ సెంటర్ -
‘వాగు’.. బాగు చేయరూ..?
● పెదవాగు ప్రాజెక్టుకు గండి పడి ఏడాది ● సమావేశాలు.. సందర్శనలు.. ప్రతిపాదనలతో సరి.. ● ఇప్పటివరకు నిధుల కేటాయింపు శూన్యం ● ఇక వర్షాధారంతోనే పంటలు వేసుకోవాలా? అశ్వారావుపేట: అశ్వారావుపేట, ఏపీలోని కుక్కు నూరు, వేలేరుపాడు మండలాల మారుమూల ఏజె న్సీ గిరిజన గ్రామాల కల్పతరువు పెదవాగు ప్రాజె క్టు. 1981 నుంచి ప్రాజెక్టుకు దిగువనున్న ఆయకట్టు గ్రామాలు పంటలతో కళకళలాడేవి. గతేడాది జులై 18న వచ్చిన క్లౌడ్బరస్ట్కు పెదవాగు ప్రాజెక్టు కట్ట 250 మీటర్ల మేర కోతకు గురైంది. పలు చోట్ల కట్టలు దెబ్బతిన్నాయి. దీంతో గుమ్మడవల్లి, కొత్తూ రు, అనంతారం గ్రామాల్లో 71 నివాస గృహాలు దెబ్బతినగా, 391 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. అనంతరం ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. కానీ, ప్రయో జనం శూన్యమే. కంటితుడుపుగా రింగ్బండ్ నిర్మించినా.. నాణ్యతాలోపాల కారణంగా దానికి కూడా గండ్లు పడుతున్నాయని సమాచారం. నీటినిల్వలు పెరిగితే రింగ్ బండ్ కొట్టుకుపోతుందని ఆయకట్టు రైతులు, గుమ్మడవల్లి వాసులు ఆందోళన చెందుతున్నారు. నిధులు లేవు.. సందర్శనలు, సమావేశాలు,అంచనాలు తప్ప నిధు ల కేటాయింపు మాత్రంలేదు. 80శాతం ఆయకట్టు ఏపీ లో ఉండటంతో 80శాతం నిధులు సమకూర్చుతామని జీఆర్ఎంబీ సమావేశంలో అంగీకరించి నా.. కదలిక లేదు. ప్రాజెక్టు సామర్థ్యం 20 వేల క్యూ సెక్కులు కాగా ప్రస్తుతం రింగ్బండ్ సామర్థ్యం కేవలం 1.8వేల క్యూసెక్కుల లోపే. వరదఉధృతి ఎక్కువగా ఉన్నా.. రింగ్ బండ్ నిలిచి ఉంటుందనే నమ్మకం లేదు. ఏపీ ప్రభుత్వం 82శాతం నిధులు జీఆర్ ఎంబీకీ చెల్లిస్తే పనులు మొదలవుతాయని రైతులంటున్నారు.సందర్శనలు.. గతేడాది జులై 21వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెదవాగు ప్రాజెక్టును సందర్శించారు. అదే నెల 22వ తేదీన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాజెక్టును పరిశీలించి.. పున:నిర్మిస్తామని ప్రకటించారు. అదే నెల 26వ తేదీన రూ.3.5 కోట్ల వ్యయంతో తాత్కాలిక రింగ్ బండ్ నిర్మాణానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఆగస్టు 31వ తేదీ నాటికి రింగ్బండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి నీరు నిల్వ చేశారు. సెప్టెంబర్ 1వ తేదీన కురిసిన భారీ వర్షంతో రింగ్బండ్కు భారీ గండి పడి 30 మీటర్ల దాకా కొట్టుకుపోయింది. ఈ ఏడాది మార్చి 17వ తేదీన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్, మాజీ మంత్రి జలగం ప్రసాద్రావు పెదవాగు ప్రాజెక్టును సందర్శించారు. అదే రోజు కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కూడా వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్లో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం నిర్వహించారు. తెలంగాణతోపాటు ఏపీకి చెందిన నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు (ఇంజినీర్ ఇన్చీఫ్ అనిల్కుమార్, వెంకటేశ్వరరావు) హాజరయ్యారు. గండ్లు పూడ్చేందుకు రూ.19 కోట్లు అవసరమని గుర్తించారు. -
అమ్మవారికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్ ద్వారా భక్తులు దర్శించుకుని అమ్మవారికి ఒడిబియ్యం, తలనీలాలు, చీరలు, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించగా, భక్తులు బోనాలు, సారె సమర్పించారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయకమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కిన్నెరసానికి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. రోజంతా సరదాగా గడిపారు. 537 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.29,100 ఆదాయం లభించగా, 250 మంది బోటుషికారు చేయగా టూరి జం కార్పొరేషన్ సంస్థకు రూ.14,060 ఆదా యం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
డిగ్రీ.. డీలా
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు తగ్గుతున్న ఆదరణ ● దోస్త్ గడువు ముగిసినా సగం సీట్లు ఖాళీ ● జిల్లాలోని ఆరు కాలేజీల్లో మూడింటికే రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు ● గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల్లాలోనూ భర్తీకాని సీట్లు ● పాల్వంచలో అధికంగా భర్తీ.. 2025–2026లో మే 30వ తేదీ నుంచి దోస్త్ ప్రక్రియ మొదలైంది. మొదటి విడత ఈ నెల 9 వరకు, రెండో విడత 13 నుంచి 19 వరకు, మూడో విడత 23 నుంచి 28 వరకు నిర్వహించారు. రేపటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభంకానున్నాయి. మూడు విడతలుగా అడ్మిషన్లు చేపట్టినా విద్యార్థులు నామమాత్రంగానే చేరారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నా ఆదరణ లేదు. పాల్వంచలోని కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధతో ప్రచారం చేపట్టగా జిల్లాలోని మిగతా కాలేజీలకంటే అధికంగా విద్యార్థులు చేరారు. జిల్లాలోని 10 డిగ్రీ కళాశాలల్లో 3,980 సీట్లు ఉండగా, ఇప్పటివరకు 1,813 మంది చేరారు. ఇంకా 2,167 ఖాళీలు ఉన్నాయి. పాల్వంచరూరల్: అడ్మిషన్లు లేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు డీలా పడుతున్నాయి. డిగ్రీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. సంప్రదాయ డిగ్రీ కోర్సులపై విముఖత చూపుతున్నారు. అడ్మిషన్ ప్రక్రియ దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ) గడువు ముగిసినా కాలేజీల్లో సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక పాల్వంచ, అంకంపాలెంలలో గిరిజన సంక్షేమ శాఖ బాలికల డిగ్రీ కళాశాల, కొత్తగూడెంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం, మణుగూరులో గిరిజన సంక్షేమ బాలుర డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కాగా దమ్మపేట మండలంలోని అంకంపాలెం గిరిజన బాలికల గురుకులాన్ని రెండు, మూడేళ్ల క్రితం అశ్వారావుపేటలోని పెదవాగుకు తరలించారు. జిల్లాలో ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, పాల్వంచ, భద్రాచలం, ఇల్లెందులలోనే రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ ఉన్నారు. మిగిలినచోట్ల ఇన్చార్జి ప్రిన్సిపాల్స్తో నెట్టుకొస్తున్నారు. విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. ఏటేటా అడ్మిషన్ల సంఖ్య తగ్గుతుండగా, ఈ ఏడాది అధికంగా తగ్గుముఖం పట్టాయి డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల భర్తీ ఇలా.. మొత్తం భర్తీ ఖాళీలు గతేడాది సీట్లు అయినవి భర్తీ ప్రభుత్వ కళాశాలలుపాల్వంచ 660 313 347 420 కొత్తగూడెం 420 177 243 134 భద్రాచలం 840 311 529 470 మణుగూరు 360 120 240 180 ఇల్లెందు 300 80 220 134 అశ్వారావుపేట 280 289 191 303 గురుకుల కళాశాలలు కొత్తగూడెం 280 103 177 142 పాల్వంచ 280 172 108 200 మణుగూరు 280 160 120 200 పెదవాగు 280 88 192 62● విద్యార్థుల చూపంతా ఇంజనీరింగ్ వైపే.. విద్యార్థులు అధికంగా ఇంజనీరింగ్ విద్యవైపే ఆసక్తి చూపుతున్నారు. దీంతో డిగ్రీ కళాశాలల్లో సీట్లు భర్తీ కావడంలేదు. గతంలో ఇంటర్లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్లు లభించేవి. సీట్ల కోసం పైరవీలు కూడా చేసేవారు. కానీ క్రమంగా అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. కాగా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయితే, అక్కడ సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశం ఉంది. దీనికితోడు అడ్మిషన్లకు స్పెషల్ డ్రైవ్ కూడా చేపడ తామని, ఇంకా చేరనివారు ఎవరైనా ఉంటే వినియోగించుకోవచ్చని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. -
ప్రణాళికే కీలకం
గోదావరి పుష్కరాలకు గతంలో 2015లో.. పన్నెండేళ్లకు ఒకమారు జరిగే పుష్కరాలు 2015 జూలై 14 నుంచి 25 వరకు జరిగాయి. మళ్లీ 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నారు. బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, పర్ణశాల, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు పుష్కర స్నానం చేయనున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి అత్యధిక భక్తులు తరలివస్తుంటారు. గత పుష్కరాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 70 లక్షల మంది భక్తులు హాజరయ్యారని పేర్కొంటుండగా, 2027లో కోటి మందికి పైగానే భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం, పర్ణశాల, మోతె తదితర ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.భద్రాచలం: భక్తులు మహా పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు రెండేళ్ల సమయమే ఉంది. 2027లో జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కూడా ప్రకటించారు. కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కోసం ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద నున్న త్రయంబకంలో పుట్టిన గోదావరి నిజామాబాద్ జిల్లా రేంజర్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, ములుగు జిల్లాల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ద్వారా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. గోదావరి రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 180 కిలోమీటర్లు ప్రవహించగా, విభజనం అనంతరం ఏపీలో ఏడు మండలాలు విలీనం చేయటంతో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. ప్రణాళిక ప్రకటించని ప్రభుత్వం 2027లో పుష్కరాలను విజయవంతం చేయాలంటే కనీసం రెండేళ్ల ముందు నుంచే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా స్నానఘాట్ల పెంపు, రోడ్లు వెడల్పు, ఆలయ పరిసర ప్రాంతాల విస్తరణ, భక్తులకు శాశ్వత, తాత్కాలిక వసతుల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ముందస్తు పనులకు రూ.50 కోట్ల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రోడ్లు విస్తరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఘాట్ల పెంపు, ఇతర మౌలిక వసతుల కల్పనకు, శాశ్వత పనులకు ఇంకా నిధులు అవసరమవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈ పుష్కరాల పనులపై సమీక్ష, బడ్జెట్తో ప్రణాళిక ప్రకటించారు. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఏ ప్రకటనా వెలువడలేదు. పుష్కరాలను ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని ప్రణాళిక, నిధులు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకటించాలి 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాలను విజయవంతం చేయాలంటే ముందస్తు ప్రణాళిక ఎంతో కీలకం. నేను 2003, 2015 పుష్కర స్నానాలను భద్రాచలంలోనే చేశాను. భక్తుల రద్దీ, గత అనుభవాల దృష్ట్యా అన్ని శాఖల అధికారులను ముందస్తుగా అప్రమత్తం చేసి ఏర్పాట్లు చేయాలి. – పరిమి సోమశేఖర్, భక్తుడు2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా ఇంకా ప్రణాళిక, నిధులు విడుదల చేయని ప్రభుత్వం ఉమ్మడి జిల్లా మంత్రులు దృష్టి సారించాలని వేడుకోలు -
● మోడు కాదు తోడు!
ఈ చిత్రాన్ని చూడగానే వ్యవసాయ క్షేత్రంలో అలంకరణ కోసం పెట్టినట్లుగా కనిపిస్తున్నాయి కదా! అశ్వారావుపేటలోని నందమూరినగర్ నుంచి పేటమాలపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఓ రైతుకు వ్యవసాయ క్షేత్రం ఉంది. కొన్నేళ్లు సాగులో ఉన్న కొబ్బరి తోట ముదిరిపోగా దీన్ని తొలగించే క్రమాన వృక్షాల మోడులను అలాగే వదిలేశారు. వీటి మధ్య ప్రస్తుతం అరటి పంట సాగు చేస్తున్నారు. భవిష్యత్లో పందిరి, తీగ జాతుల తోటలు సాగు చేస్తే ఈ మోడులు ఆలంబనగా నిలుస్తాయని అలాగే వదిలేసినట్లు తెలుస్తోంది. – అశ్వారావుపేట రూరల్ -
మెలకువలతోనే వ్యాపారాభివృద్ధి
భద్రాచలంటౌన్: గిరిజన యువత మెలుకువలు తెలుసుకుని వ్యాపారాభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న గిరిజన యువతులతో మాట్లాడారు. అనంతరం పీఎంఆర్సీ కార్యాలయాన్ని, శ్రీరామ జాయింట్ లయబిలిటీ మిల్లెట్ బిస్కెట్ యూనిట్ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల అభిరుచికి తగినట్లు దుస్తులు డిజైనింగ్ చేయాలని, ముక్కోటి, శ్రీరామనవమి పండుగల సమయాల్లో దుస్తుల విక్రయాలకు వెసులుబాటు కల్పిస్తానని తెలిపారు. హైదరాబాద్లో కొత్త డిజైన్లపై శిక్షణ ఇప్పిస్తామని, కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు ఎంబ్రాయిడరీ మిషన్ ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని రకాల సంక్షేమ పథకాల పెయింటింగ్ డిజైనింగ్ వేయించాలని పీఎంఆర్సీ సిబ్బందికి సూచించారు. మిల్లెట్ బిస్కెట్ల ఘనత జాతీయస్థాయి వరకు తీసుకెళ్లి ఐటీడీఏ పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించి ప్రశంసలు కురిపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మిల్లెట్ బిస్కెట్లకు అవసరమయ్యే రాగులు, సజ్జలు ఇక్కడి పొలాల్లోనే పండించుకోవాలని సూచించారు. అనంతరం మిల్లెట్ బిస్కెట్ తయారీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రస్తావించినందుకు కృతజ్ఞతగా పీఓ బి.రాహుల్, ఏఎస్పీ, విక్రాంత్ కుమార్ సింగ్, శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మలకు మహిళలు మిల్లెట్ బిస్కెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సున్నం రాంబాబు, ఈఈ హరీష్, ఏసీఎంఓ రమేష్, శ్రీనివాస్, ఆదినారాయణ, నరసింహారావు, జేడీఎం హరికృష్ణ, మిల్లెట్ బిస్కెట్ తయారీదారులు వెంకటలక్ష్మి, లలిత, మంగ వేణి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు. ఉచిత కేన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరంభద్రాచలంఅర్బన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కళాశాల, లయన్స్ క్లబ్, వికాస తరంగిణిల అధ్వర్యంలో ఆదివారం నర్సింగ్ కళాశాలలో ఉచిత కేన్సర్ నిర్ధారణ, చికిత్స, నేత్ర శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రి, సికిందరాబాద్కు చెందిన పుష్పగిరి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించగా, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్య సంరక్షణకు శిబిరాలు దోహదం చేస్తాయని అన్నారు. 650 మందికి కంటి చూపు పరీక్షలు నిర్వహించి, 326 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. పలువురికి కేన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీఓ కె.దామోదర్రావు, ఎంవీఐ వెంకట పుల్లయ్య, రెడ్క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కాంతారావు, ఎ.జగదీష్, డాక్టర్ బి. సుబ్బరాజు, డాక్టర్ జయభారతి, కేన్సర్ వైద్య నిపుణులు, ప్రజ్ఞా, కమలా రాజశేఖర్, నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలి
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల వినతి భద్రాచలం: పునర్విభజనలో భాగంగా ఏపీలో కలిసిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్లో పసుపుబోర్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఏపీలో కలిపిన భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలైన ఎటపాక, కన్నాయిగూడం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నంలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. వీటివల్ల పరిపాలన, అభివృద్ధి పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. భద్రాచలం, ఇతర మండలాల మధ్య రవాణా అంతరాయం ఏర్పడుతోందని, భద్రాచలంలో చదివే గిరిజన విద్యార్థులకు రాకపోకల్లో ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. -
ఏజెన్సీ నుంచి లండన్ దాకా..
భద్రాచలం : కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్న గిరిజన మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతమయ్యారు. ఏజెన్సీ నుంచి ప్రారంభమైన వీరి వ్యాపారం లండన్ వరకూ విస్తరించింది. ప్రధాని మోదీ ‘మన్కీబాత్’లో భద్రాచలం గిరిజన మహిళల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఏడేళ్ల క్రితం ప్రారంభం.. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో స్వయం శిక్షణ కింద ఏడేళ్ల క్రితం ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ను ప్రారంభించారు. గిరిజన మహిళ ఊకే వెంకటలక్ష్మి మరో ఏడుగురితో కలిసి శిక్షణ తీసుకుంది. అనంతరం రూ.5 లక్షల పెట్టుబడితో శానిటరీ నాప్కిన్ తయారీని ‘భద్రాద్రి శ్రీరామ్ జేఎల్ గ్రూప్’అనే సెల్ఫ్హెల్ప్ గ్రూప్తో ప్రారంభించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని ఓ భవనాన్ని అధికారులు వీరికి కేటాయించారు. మిషనరీతో తయారీ ప్రారంభించిన కొద్ది కాలంలోనే కరోనా వచ్చింది. దీంతో వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ కోవిడ్ కాలం పూర్తయ్యాక మొక్కవోని ధైర్యంతో శానిటరీ ప్యాడ్ల తయారీ ప్రారంభించారు. ఐటీడీఏ సహకారం తోడవడంతో ప్యాడ్లను గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలు, కళాశాలల్లో బాలికలకు సరఫరా చేశారు. నాడు నెలకు 100 ప్యాడ్లతో ప్రారంభం కాగా, ప్రస్తుతం 40 వేలకు చేరింది. ఆర్గానిక్ మిల్లెట్ బిస్కెట్ల తయారీతో...వెంకటలక్ష్మి మదిలో మరో ఆలోచన ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయ దినుసులతో ఆర్గానిక్ మిల్లెట్ బిస్కెట్ల తయారీని ప్రారంభించాలనుకుంది. మరో ముగ్గురు సభ్యులతో కలిసి అప్పటి ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు దృష్టికి తీసుకెళ్లగా ఆయన తగిన శిక్షణతో పాటు బ్యాంకు లోన్ కూడా ఇప్పించారు. ఇలా ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’పేరిట బిస్కెట్ల తయారీని ప్రారంభించారు. కొర్రలు, రాగులు, జొన్న, సామలతో రకరకాల బిస్కెట్లను తయారు చేసి అమ్మకం ప్రారంభించారు. మైదా, పంచదార లేకుండా పూర్తిగా ఆర్గానిక్తో తయారు చేయడం వీరి ప్రత్యేకత. బెల్లం, నెయ్యి, బటర్లతో తయారు చేసిన బిస్కెట్లు అనతికాలంలో అందరికీ నచ్చాయి. ఐటీడీఏ పీఓల సహకారంతో..గౌతమ్ పొట్రు తర్వాత పీఓగా వచ్చిన రాహుల్ మార్కెటింగ్పై తగిన శ్రద్ధ చూపి పలుచోట్ల కౌంటర్లు ఇప్పించారు. దీంతో వ్యాపారం విస్తరించింది. భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం వద్ద, పట్టణంలోని పలుచోట్ల, ఐటీడీఏ, గిరిజన మ్యూజియంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శిల్పారామం, ఢిల్లీ రాష్ట్రపతి భవన్తోపాటు ఇతర ముఖ్య కేంద్రాల్లోనూ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. సుదూర ప్రాంతాలకు కార్గో ద్వారా సైతం ఆర్డర్లతో సరఫరా చేస్తున్నారు. ఎన్ఐఆర్ల ద్వారా లండన్కు సైతం వీరి బిస్కెట్లు పలుమార్లు చేరాయి. అందరి సహకారం మరువలేనిదిమొదట ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఐటీడీఏ పీఓలు, కుటుంబసభ్యుల సహాయ సహకారా లతో ముందుకొచ్చాం. గ్రూప్లో ప్రతీ మహిళ ఐదంకెల జీతంతో సమానంగా సంపాదిస్తున్నాం. ప్రధాని మోదీ మమ్మల్ని మెచ్చుకోవడం మరింత స్ఫూర్తినిచ్చింది. కొత్తగా ఆలోచించి ఇంకా ముందుకెళ్లాలని ఉంది. – ఊకే వెంకటలక్ష్మి, గ్రూప్ లీడర్ -
శాస్త్ర విజ్ఞానానికి ప్రయోగశాలలు దోహదం
సుజాతనగర్/చండ్రుగొండ: పాఠశాలల్లో ప్రయోగశాలల నిర్వహణ సక్రమంగా లేకపోతే విద్యార్థులు శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి కోల్పోతారని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ అన్నారు. శనివారం సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్తో పాటు సాధారణ ప్రయోగశాలలను సందర్శించిన ఆయన వీటి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రయోగశాలలు ఎంతగానో దోహదపడతాయని, వారిలోని సామర్థ్యాలను వెలికితీసేందుకు ఇవి చాలా అవసరమన్నారు. ప్రయోగశాలలకు ఏమైనా పరికరాలు అవసరమైతే తనను సంప్రదించాలని సూచించారు. అనంతరం ఎస్సెస్సీ విద్యార్థులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అలాగే చండ్రుగొండలోని జెడ్పీ హైస్కూల్ను ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ సందర్శించి అందులోని అటల్ టింకరింగ్ ల్యాబ్, సైన్స్ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రెరీతో పాటు పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. సైన్స్తోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్, సీఎంఓ సైదులు, హెచ్ఎం ఎంఏ వాజీద్, సేవ్యా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
దమ్మపేట: మండలంలోని రంగువారిగూడెం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి ఆళ్ల లోకేష్ రాష్ట్రస్థాయి క్రీడా ప్రతిభ పోటీలకు ఎంపికయ్యాడు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశం కోసం ఈ నెల 26న కొత్తగూడెంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా ప్రతిభ పోటీల్లో ప్రతిభ చూపగా.. జూలై 1 నుంచి 5 వరకు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా లోకేష్ను ఎంఈఓ కీసర లక్ష్మి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత
పాల్వంచ: కళలను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని కేటీపీఎస్ 7వ దశ సీఈ పి.శ్రీనివాసబాబు అన్నారు. శనివారం స్థానిక కేటీపీఎస్ సీతారామ కల్యాణ మండపంలో పాకాలపాటి కృష్ణయ్య సాంస్కృతిక కళాపీఠం సమక్షాన తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలమైందని అన్నారు. చిన్నప్పటి నుండే కళలపై మక్కువ పెంచుకునేలా కృషి చేయాలని, కళాకారుల ఆదరించి ప్రోత్సహించాలన్నారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు తోట దేవీప్రసన్న, మధిర రంగ స్థల కళాకారుల సమైఖ్య అధ్యక్షులు పుతుంబాక కృష్ణ ప్రసాద్, బాబులాల్, ఎస్వీఆర్కే.ఆచార్యులు, వెంకటాచారి, జోన్నాడ కృష్ణ, ముత్యాల హనుమంతరావు, కృష్ణ, వెంకన్న, రోశయ్య చౌదరి, బాషా, పాకాలపాటి రోశయ్య చౌదరి, దామోదర్రావు, బాలస్వామి, పున్నయ్య పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్లో ప్రతిభఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): హైదరాబాద్లో జరిగిన 11వ, ఉమ్మడి రాష్ట్ర రైఫిల్ షూటింగ్లో మండలంలోని కట్టుగూడెం గ్రామానికి చెందిన బాలుడు రియాన్ పఠాన్ రాణించాడు. హైదరాబాద్లో గచ్చిబౌలి షూటింగ్ రేంజ్లో శనివారం జరిగిన పోటీల్లో రియాన్ పాల్గొని, ప్రతిభ చూపి, కేరళలో జరగబోయే ప్రీనేషనల్ (సౌత్జోన్), ఆలిండియా మౌలాన్క్లర్కోలో అతడు స్థానం సాధించాడు. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జె.కిరణ్, ఏపీ రైఫిల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రాజ్కుమార్ రియాన్ పఠాన్ను సత్కరించారు. ఆయన తండ్రి రహీం పఠాన్ జాతీయస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీల్లో పతకాలు సాధించాడు. గుర్తు తెలియని మృతదేహం లభ్యందమ్మపేట: మండలంలోని మందలపల్లి గ్రామ శివారులోని పామాయిల్ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. పామాయిల్ క్షేత్రంలో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని శనివారం స్థానికులకు కనపడగా.. పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మూడు రోజుల క్రితమే ఆ వ్యక్తి మరణించినట్లుగా భావించారు. మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, అతడి ముఖంపై పలు గాయాలు కాగా రక్తస్రావం జరిగిందని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అశ్వారావుపేట మార్చురికీ తరలించారు. మందలపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి మహాదేవ గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, మృతుడి వివరాలు తెలిసినవారు 87126 82065 నంబర్కు తెలపాలని ఎస్సై సాయికిషోర్రెడ్డి సూచించారు. -
బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై ఆరా
ఇల్లెందు/టేకులపల్లి: సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు శనివారం సింగరేణి ఇల్లెందు ఏరియాలో పర్యటించి పలు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేకే ఓసీ, సీహెచ్పీని సందర్శించి అక్కడి వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్తత్తి, ఉత్పాదకతతో పాటు జేకే ఓసీ కాల పరిమితి, సీహెచ్పీలోని లోడింగ్, బొగ్గు గ్రేడింగ్ పని తీరును ఏరియా జీఎం వీసం కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. అలాగే పూసపల్లి ఓసీ ఏర్పాటు తీరును తెలుసుకున్నాక రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం జాకీర్ హుస్సేన్, డీజీఎం పర్సనల్ తుకారం, అధికారులు పాల్గొన్నారు. అలాగే కోయగూడెం ఓపెన్కాస్టును సందర్శించి కేఓసీ వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనులపై ఆరా తీసి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. అనంతరం కేఓసీలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం జాకీర్ హుస్సేన్, కోయగూడెం పీఓ గోవిందరావు, డీజీఎం పర్సనల్ అజ్మీర తుకారం, ఇల్లెందు ఏరియా ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
భద్రాచలంఅర్బన్: నిర్మాణ రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు రక్షించుకునేందుకు వచ్చే నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.కోటంరాజు తెలిపారు. బండారు చందర్రావు భవన్లో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల సంక్షేమ చట్టం రద్దయిందని దీన్ని కాపాడుకోవాల్సిన ప్రతీ ఒక్క కార్మికుడిపై ఉందన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ నేతలు ఏజే రమేష్, ఎంబీ నర్సారెడ్డి, నరసింహారావు, శరత్బాబు, ఎర్రంశెట్టి వెంకటరామారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సన్నబియ్యం తూకంపై విచారణ ములకలపల్లి: ములకలపల్లి రేషన్షాపులో బియ్యం తూకం తేడా అంశంపై ‘రేషన్ షాపులో మాయాజాలం’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురిమైంది. దీనికి స్పందించిన అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. తహసీల్దార్ బి.గనియా ఆదేశాల మేరకు గిర్దావర్–2 భద్రు ఆ రేషన్ షాపులోని బియ్యం నిల్వలు, స్టాకు రిజిస్టర్లను పరిశీలించి సేల్స్మెన్ అగ్గిరామ్తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించనున్నట్లు గిర్దావర్–2 తెలిపారు. -
ఇల్లెందులో కోల్డ్ స్టోరేజీ..
పంటల భద్రతకు వీలుగా.. ఇటీవల ఇల్లెందు మార్కెట్లో జరిగిన పాలక మండలి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లెందులో కోల్డ్ స్టోరేజీ నిర్మాణం విషయాన్ని ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో రైతులకు ఉపయోగపడేలా ఇక్కడ కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపడతామన్నారు. పంటలకు సరైన ధరలు లేనప్పుడు కొంతకాలం దాచేందుకు వీలుగా ఇల్లెందులో ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో.. ప్రభుత్వం నుంచి కోల్డ్ స్టోరేజీకి సరిపడా నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. ఈ తరుణాన ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలనుకున్నారు. దీనికి కనీసం 5 ఎకరాల స్థలం కావాల్సి ఉంది. ప్రభుత్వ భవనాలకే స్థలం కొరత తీవ్రంగా ఉండగా.. మండలం వెలుపల నిర్మిద్దామంటే 1/70 చట్టం అడ్డుగా మారబోతుంది. దీన్ని అధిగమించేందుకు ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో 6 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ హమాలీలు రెండు ముఠాలుగా విడిపోయి ఘర్షణలు జరగడంతో ఎన్నో ఏళ్లుగా మార్కెట్ సాగడం లేదు. దీనిలోని గోదాంలు సైతం సరుకు నిల్వకు ఆశించినంత ఉపయోగపడకపోవడంతో సివిల్ సప్లై శాఖ పీడీఎస్ బియ్యం నిల్వకు వినియోగించుకుంటున్నారు. దీనికి తోడు కొంతమంది వ్యాపారులు తమ సరుకు నిల్వలకు వాడుకుంటున్నారు. పడావుపడిన మార్కెట్ యార్డులో పశువులు, కోతులు, కుక్కలకు ఆవాసాలుగా మారిన తరుణంలో కోల్డ్ స్టోరేజీగా మారిస్తే రైతులకు, వ్యాపారుల సరుకు నిల్వలకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ దిశగా స్థానిక మార్కెట్ కమిటీ సమాలోచనలు చేస్తోంది. ఎన్ఓసీ అవసరం.. కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి ఐదెకరాల భూమి, విద్యుత్, ఫైర్, బీమా, లీగల్ మెట్రాలజీ, పొల్యూషన్ శాఖ నుంచి ఎన్ఓసీ కావాల్సి ఉంటుంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో అయితే బ్యాంకుల నుంచి రుణం కూడా పొందే అవకాశం ఉంది. నిర్మాణం జరిగితే మార్కెట్కు నిరంతరం ఆదాయంతో పాటు సరుకుకు భద్రత కలగనుంది. పడావుపడిన మార్కెట్ యార్డును ఉపయోగంలోకి తెచ్చి సబ్ యార్డుల్లో క్రయవిక్రయాలు సాగించే అవకాశం ఉంటుందని మార్కెట్ అధికారులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి మార్కెట్ .. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1975 మే నెల 4న ఆనాటి సీఎం జలగం వెంగళరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ నెమరుగొమ్ముల రాఘవేంద్రరావు, ఉపాధ్యక్షుడు పర్సా లక్ష్మీనర్సింహారావులు శంకుస్థాపన చేశారు. ప్రారంభంలో జోరుగా క్రయవిక్రయాలు జరిగిన ఈ మార్కెట్ యార్డులో క్రమంగా చెక్ పోస్టుల ద్వారా ఆదాయం సమకూర్చుకునే దిశకు చేరాయి. ఆరు ఎకరాల స్థలం కలిగిన ఈ మార్కెట్ పరిధిలో ప్రస్తుతం మూడు జిల్లాలో ఎనిమిది మండలాల పరిధిలో మార్కెట్ విస్తరించి ఉంది. మార్కెట్ యార్డులో ఐదు ఎకరాల్లో నిర్మాణం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు లక్ష బస్తాలు నిల్వ దిశగా ప్రణాళిక మిర్చి, బెల్లం, ఎల్లిపాయలు, అల్లం, పసుపు నిల్వలకు చాన్స్ రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు లేవు. ఏ పంట నిల్వ చేసుకోవాలన్నా ఖమ్మం, మహబూబాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈనేపథ్యాన ప్రస్తుత మార్కెట్ పాలక వర్గం ఇల్లెందు పట్టణ నడిబొడ్డున గల వ్యవసాయ మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావించి ఓ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రణాళికలు చేస్తోంది. ఇందుకు తగిన ప్రతిపాదనలను రూపొందించేలా చర్యలు ప్రారంభించింది. – ఇల్లెందుకోల్డ్స్టోరేజీ లేని జిల్లా.. జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు లేవు. ఎవరైనా నిర్మాణం చేయాలంటే భూమి సమస్య తీవ్రంగా ఉంది. లేదంటే 1/70 చట్టం అడ్డుగా ఉంది. ఇల్లెందులో మార్కెట్ స్థలంలో మాత్రమే ఈ అవకాశం ఉండడంతో పాలక వర్గం ఆవైపుగా దృష్టి సారించింది. ఇక్కడ నిర్మాణం చేపడితే ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాలతో పాటు భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం వంటి ప్రాంతాల వారు ఉపయోగించుకునే అవకాశం ఉంది. కనీసం లక్ష క్వింటాళ్ల సరుకు నిల్వ చేసేలా నిర్మాణం చేయాలని భావిస్తున్నారుప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. ఇల్లెందులో కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. పాలకులు మారుతున్నారే కానీ దీని నిర్మాణానికి ఎలాంటి ఆలోచన చేయలేదు. ప్రస్తుత పాలక వర్గం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. – బానోతు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్రైతుల మేలు కోసం.. ఇల్లెందులో గిరిజన రైతుల మేలు కోసం నిర్మించే కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. దీని ద్వారా మిర్చి, ఇతర పంటలతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకుని గిట్టుబాటు ధరలు పొందొచ్చు. – నాళ్ల సోమసుందర్, వ్యాపారి -
చిన్నారికి కలెక్టర్ అభినందన
చుంచుపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ ‘వాక్ ఫర్ ట్రీస్’అనే అంశంతో ప్రతిరోజూ మొక్కలు నాటుతున్న చిన్నారి మూడు విశ్వామిత్ర చౌహాన్ను శుక్రవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. ఈమేరకు ఇటీవల అడవుల నుంచి సేకరించిన వివిధ రకాల చెట్ల గింజల ను అటవీఅధికారులకు అందజేసిన సందర్భంగా శనివారం ప్రశంసపత్రాన్ని అందించారు. అనంతరం విశ్వామిత్రతో కలిసి కలెక్టర్తో పాటు డీఎఫ్ఓ కిష్టాగౌడ్ మామిడి మొక్కలు నా టారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాహు ల్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూల్కు విద్యార్థిని ఎంపికఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): మండలంలోని అబ్బుగూడెం ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఓరుగంటి తరుణ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికై ంది. ఈ నెల 26న ఖమ్మంలో జరిగిన ఎంపికల్లో విద్యార్థిని ప్రతిభ చూపింది. ఈ మేరకు శనివారం పాఠశాలలో బాలికను ఎంఈఓ ఉండేటి ఆనంద్కుమార్ అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.లక్ష్మణ్, డి.రమేష్, ఎం. బాలు, జి.రామ్మోహన్, ఎ.సుభద్ర పాల్గొన్నారు. గిరిజన విద్యార్థినికి ఆర్థిక సాయంభద్రాచలంటౌన్: నీట్ శిక్షణ తీసుకుంటున్న గిరిజన విద్యార్థిని వజ్జ రోజాకు ఐటీడీఏ రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని పీఓ బి.రాహుల్ శనివారం తన చాంబర్లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖ అంకంపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన రోజా ‘పది’ఫలితాల్లో పాఠశాలల్లో 2వ ర్యాంకు, ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకు గాను 424 సాధించిందని తెలిపారు. విద్యార్థిని చదువుకు చేయూతనందించేందుకు ఈ సాయం అందించామన్నారు. ఏపీఓ డేవిడ్ రాజ్, ఎస్ఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయానికే మొగ్గు..
ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపని రైతులు ● జిల్లాలో మరీ తక్కువగా నూనె పంటల సాగు ● ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న కర్షకులుసూపర్బజార్(కొత్తగూడెం): రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించాలంటే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు సూచిస్తున్నారు. కానీ రైతులు మాత్రం సంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న, వాణిజ్య పంటలు పత్తి, మిర్చి వైపే మొగ్గు చూపుతున్నారు. ఆయిల్పామ్, మునగసాగు విషయంలో మాత్రం అధికా రుల కృషి ఫలిస్తోంది. నూనె పంటలైన వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, మద్దతు ధర లభిస్తుందని అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నా సుముఖత వ్యక్తం చేయడంలేదు. దీంతో జిల్లాలో సంప్రదాయ పంటలే అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ప్రస్తుత వానాకాలం సీజన్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్లో వరి 1,60,956 ఎకరాల్లో, మొక్కజొన్న 85,544 ఎకరాల్లో, పత్తి అత్యధికంగా 2,04,632 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఆయిల్పామ్లో ప్రథమస్థానం.. వ్యవసాయ, ఉద్యానశాఖల కృషితో ఆయిల్పామ్ సాగులో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంటోంది. అంతర పంటలకు సాగుకు అవకాశం, రాయితీలు అధికంగా ఉండటం, ప్రకృతి వైపరీత్యాలకు తోటలు దెబ్బతినకపోవడంతో పలువురు రైతులు ఆయిల్పామ్పై ఆసక్తి చూపుతున్నారు. ఈ వానాకాలంలో 75 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు సిద్ధమయ్యారు. ఇక నూనె పంటల్లో వేరుశెనగ 2,791 ఎకరాల్లో సాగు చేయనుండగా మిగతా పంటలు నామమాత్రంగా సాగు చేయనున్నారు. ఇటీవల కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మునగ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ విస్తృత ప్రచారం చేయడంతో కొందరు రైతులు మునగ వైపు మొగ్గు చూపుతున్నారు. గత వానాకాలంలో 550 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 2,500 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. కూరగాయల సాగుతో ఎక్కువ ఆదాయం లభించే అవకాశం ఉన్నా రైతులు ఆ దిశగా దృష్టి సారించడంలేదు. దీంతో జిల్లా ప్రజల కోసం కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తే సంప్రదాయ పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
అలనాటి ప్రాభవమేది..?
వేణుగోపాలా.. వెండిపూలతో పూజలు జిల్లా చరిత్రపై ఇప్పటికీ సరైన పరిశోధనలు జరగడం లేదు. పాల్వంచ సంస్థానం కేంద్రంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం, అంతకు ముందు నైజాం జమానాలో చర్ల కేంద్రంగా కొనసాగిన పాలన, బొగ్గు గనుల పేరుతో ఇల్లెందులో బ్రిటీషర్లు వదిలి వెళ్లిన గుర్తులు ఇప్పటికీ ఈజిల్లా వాసులకు పెద్దగా తెలియ దు. అంతకుముందు చోళులు, రాష్ట్రకూటులు, కాకతీయుల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు చరిత్రలో కలిసిపోయినప్పటికీ.. ఇంకా మౌనసాక్షులుగా మోతె వీరభద్రస్వామి ఆలయం, ఇరవెండి సంతాన వేణుగోపాలస్వామి ఆలయాలు నిలిచి ఉన్నా యి. గోదావరి తీరం వెంబడి మోతె పరిపాలన కేంద్రంగా ఉంటే ఇరవెండి గ్రామం అగ్రహారంగా ఉండేదని తెలుస్తోంది. ఇక్కడున్న సంతాన వేణుగోపాల స్వామికి వెండి పూలతో ప్రతీ రోజు అర్చన చేయడంతో ఈ గ్రామానికి ఇరవెండి అనే పేరు స్థిరపడిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. 1400 ఏళ్లకు పూర్వం సంతాన వేణుగోపాల స్వామి ఆలయం 1400 ఏళ్లకు పూర్వం నాటిదని ఇక్కడ పూజలు నిర్వహించే అర్చకులు చెబుతున్నారు. వైష్ణవఆలయాల్లో నిర్మించే లక్ష్మీ మండప ద్వారం.. ఆలయ నిర్మాణం జరిగిన వెయ్యేళ్లకు కచ్చితంగా పగులుతుందని ఆగమ శాస్త్రాల్లో పేర్కొన్నారంటూ ఇక్కడున్న ఆలయ ద్వారానికి కూ డా పగులు ఉండటాన్ని వారు ఉదహరిస్తున్నారు. దీనికి తోడు పాల్వంచ తహసీల్దార్గా ఈ ప్రాంతానికి వచ్చిన కంచర్ల గోపన్న నేలకొండపల్లిలో ఉన్నప్పుడు వేణుగోపాలుడి భక్తుడని, భద్రాచలంలో సీతా సమే త శ్రీరాముడికి ఆలయం నిర్మించే ముందు తరుచుగా ఇరవెండి వేణుగోపాలుడిని దర్శించుకునేవాడని భద్రాచలం వాసులు చెబుతున్నారు. ఇక్కడ వేణుగోపాలస్వామి ఆలయ నమూనాలోనే భద్రాచలం ఆలయం కూడా ఉంటుందని వారు అంటున్నారు. లక్ష్మీ మంటప ద్వారం పగుళ్లు, భక్త రామదాసు (కంచర్ల గోపన్న)ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఆలయానికి 1400 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, చోళుల కాలంలో నిర్మించి ఉంటారని అంచనా వేస్తున్నారు. వరదలతో.. గోదావరి తీరంలో ఎత్తైన కొండపై ఉన్న సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ఉత్సవాలు జరిగి ప్పుడు వంద కేజీల నువ్వులు, బెల్లం ప్రసాదం తయారు చేసిన సరిపోదనే కథ ప్రచారంలో ఉంది. గోదావరికి వరదలొచ్చినప్పుడు ఆల యం ముంపున కు గురి కాలేదని, కానీ చుట్టూ ఉన్న ఊళ్లు ముని గిపోయాయని, అలా నెమ్మదిగా ఇక్కడున్న వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని స్థానికులు చెబు తున్నారు. ముఖ్యంగా 1953, 1986లలో వచ్చిన వరదలతో ఈ చారిత్రక ఆలయం క్రమంగా తన ప్రాభవం కోల్పోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం ధూపదీప నైవేద్యాలకే ఈ ఆలయం పరిమితమవుతోంది. హోలీ పండుగ సమయంలో ఇక్కడ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుడికి ఘనంగా పెళ్లి వేడుక జరిపిస్తారు. అప్పుడు భక్తులతో ఈ ప్రాంతం కళకళలాడుతుంది. ప్రచారం కల్పిస్తే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యతీర్థానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో మోతె వీరభద్రుడు, 13 కిలోమీటర్ల దూరంలో ఇరవెండి వేణుగోపాలస్వామి ఆలయాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన చరిత్రపై శాసీ్త్రయ ఆధారాలు సంపాదించి, సరైన రీతిలో ప్రచారం చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తే పర్యాటకం పరంగా భద్రాచలం ప్రాంతానికి మరింత గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. ఇరవెండిలో శతాబ్దాలనాటి సంతాన వేణుగోపాలస్వామి ఆలయం ఒకప్పుడు వెండిపూలతో నిత్యం అర్చనలు ప్రస్తుతం ధూపదీప నైవేద్యాలకే పరిమితం చారిత్రక ప్రాంతాలపై దృష్టి పెట్టని జిల్లా అధికారులుఅనాదిగా నదీ తీరాలు నాగరికతకు కేంద్రాలుగా వర్థిలాయి. ఇదే ఒరవడిలో గోదావరి నది వెంబడి ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రదేశాలు ఆనాటి ప్రాభవం కోల్పోయాయి. ఇందుకు బూర్గంపాడు మండలంలోని మోతె వీరభద్రస్వామి, ఇరవెండి సంతాన వేణుగోపాల స్వామి ఆలయాలే నిదర్శనంగా చెప్పవచ్చు. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంకానరాని పరిశోధనలు ఇరవెండి సంతాన వేణుగోపాలస్వామి, మోతె వీరభద్రుడి ఆలయాల నిర్మాణ శైలిని పరిశీలిస్తే కాకతీయు కాలం లేదా అంతకంటే ముందువని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ ఆలయాలను ఎవరు నిర్మించారు? ఏ కాలంలో నిర్మించారనే ఆధారాలు శిలాశాసన రూపంలోకానీ, గ్రంథ రూపంలో కానీ లభ్యం కాలేదు. భక్తరామదాసు రచనలు, రామదాసు గురించి ఇతరుల రచనల్లో కూడా ఈ ఆలయాల ప్రస్తావన లేదు. ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయాలు వారసత్వ సంపదగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇక్కడి చరిత్రపై పరిశోధనలు చేసే బృందాలు పెరిగాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలు కేంద్రంగా రీసెర్చులు జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లా విషయంలోనూ ఈ తరహా పరిశోధనలకు ప్రోత్సాహం అందివ్వాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. -
‘సర్వే’శ్వరా..!
● గౌరవ వేతనం కోసం ఎన్యుమరేటర్ల ఎదురుచూపులు ● గతేడాది నవంబర్లో సమగ్ర కుటుంబ సర్వే ● ఏడు నెలలు గడిచినా చెల్లింపులు చేపట్టని ప్రభుత్వం కష్టపడి పనిచేశాం సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులను రాత్రింబవళ్లు కష్టపడి ఆన్లైన్ చేశాం. రోజుకు 30 నుంచి 40 వరకు దరఖాస్తుల వివరాలు నమోదు చేశాం. వీటి డబ్బుల కోసం ఏడు నెలలుగా ఎదురుచూస్తున్నాం. – భూక్యా కిషోర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విడుదల చేయాలి ఒక్కో ఆపరేటర్ 400 నుంచి 550 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేశారు. ఆ ప్రకారం పారితోషికం చెల్లించాల్సి ఉంది. త్వరగా విడుదల చేసేలా జిల్లా అధికారులు చొరవ తీసుకోవాలి. –పి.సతీష్, డేటా ఎంట్రీ ఆపరేటర్చుంచుపల్లి: గతేడాది నవంబర్లో ప్రభుత్వం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ఏడు నెలలు గడిచినా ఆ సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటివరకు గౌరవ వేతనం చెల్లించలేదు. ఎప్పుడు చెల్లిస్తామనే విషయం కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో ఎన్యుమరరేటర్లు, ఆపరేటర్లు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడంతోపాటు సంక్షేమ పథకాల అమలుకు గతేడాది నవంబర్ 6 నుంచి 21 వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే చేపట్టింది. జిల్లాలో సర్వేలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ వార్డు అధికారులు, సెర్ప్ సిబ్బంది, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లుగా పని చేశారు. ఒక్కొక్కరు 150 కుటుంబాల వరకు సర్వే చేశారు. అనంతరం నవంబర్ 22 నుంచి డిసెంబర్ 6 వరకు వివరాలను 1,753 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేశారు. 4,372 మంది సిబ్బంది సేవలు సమగ్ర కుటుంబ సర్వేలో 2,383 మంది ఎన్యుమరేటర్లు, 236 మంది సూపర్వైజర్లు పనిచేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 103 వార్డులు, 481 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,36,407 కుటుంబాల నుంచి సుమారు 20 రోజులపాటు వివరాలు సేకరించారు. ఎన్యుమరేటర్లకు రూ.10 వేల చొప్పున, సూపర్ వైజర్లకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.7 చొప్పున ఇస్తామని చెప్పింది. మొత్తం ఆపరేటర్లందరికీ కలిపి సుమారు రూ.3.40 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు చెల్లించకపోవడంతో ఎన్యుమరేటర్లు మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సర్వే జరిపిన కుటుంబాలు: 3,36,407సేవలందించిన సిబ్బంది: 4,372 చెల్లించాల్సి పారితోషికం (సుమారు) : రూ.3.40 కోట్లు -
కరెంట్తో అప్రమత్తంగా ఉండాలి
సూపర్బజార్(కొత్తగూడెం): విద్యుత్ వినియోగదారులు, ప్రధానంగా రైతులువిద్యుత్ ప్రమాదా ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ ఎస్ఈ జి.మహేందర్ తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సి జాగ్రత్తలను ఆయన వివరించారు. ఎవరూ సొంతంగా విద్యుత్ సంబంధిత మరమ్మతులు చేపట్టొద్దని సూచించారు. ఇవి పాటించాలి ●తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కు వ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకొద్దు. ప్రమాదకరంగా ఉన్నట్లు గమనించిన వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి లేదా టోల్ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలి. ●ఇళ్లలో బట్టలు ఆరవేసేందుకు ప్లాస్టిక్ దండేలను మాత్రమే వినియోగించాలి ●ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉంటుంది. విద్యుత్ సరఫరా అయ్యే వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండేలకు, రేకులకు తగలకుండా జాగ్రత్త వహించాలి ●యజమానులు పశువులను మేతకు తీసుకెళ్లేటప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. విద్యుత్ వైర్లు కిందపడి ఉంటే గమనించి పశువులను దూరంగా తోలుకెళ్లాలి. ●ఇంటి వైరింగ్కు ఎర్తింగ్ చేయాలి. నాణ్యమైన ప్లగ్గులను సెల్ చార్జర్లకు వినియోగించాలి ●ఎవరికై నా పొరపాటున విద్యుత్ షాక్ సంభవిస్తే సమీపంలోని వ్యక్తులు అతని తాకొద్దు. అతన్ని కాపాడేందుకు కర్ర, ప్లాస్టిక్ వస్తువులు వాడాలి. ●వినియోగదారులు గృహాల్లో నాణ్యమైన వైరింగ్ చేయించుకోవాలి. రైతులు స్విచ్ బోర్డులు/మోటారు స్టార్టర్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం వల్ల విద్యుత్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి ●వ్యవసాయ మోటార్ల వద్ద వైర్లకు ఇన్సులేషన్ తొలగిపోయే అవకాశం ఉంది. ఫుట్ వాల్వులు, ఇతర ఇనుప పరికరాలకు విద్యుత్ ప్రసారమయ్యే అవకాశం ఉంటుంది. రైతులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. విధిగా ఎర్తింగ్ చేయాలి. ●అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతో మాత్రమే వినియోగదారులు, రైతులు పనులు చేయించుకోవాలి ●విద్యుత్ కంచె ఏర్పాటు చేయొద్దు. ఇది చట్టరీత్యా నేరం. ●విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు మార్చడం, రిపేరు చేయడం, ఏబీ స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం వంటివి చేయొద్దు. ఆ పనులను విద్యుత్ సిబ్బందితోనే చేయించాలి. ●వ్యవసాయ మోటార్లకు, గృహాల్లో నాణ్యత కలిగిన, అతుకులు లేని సర్వీస్ వైరును మాత్రమే వినియోగించాలి. ●గ్రామీణ వినియోగదారులు విద్యుత్ సిబ్బంది లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సబ్ ఇంజనీర్, సెక్ష న్ ఆఫీసర్లను సంప్రదించి సేవలు పొందాలి. ●ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ 1912 సమాచారం ఇవ్వాలి. కెపాసిటర్ అమర్చుకోవాలిజూలూరుపాడు: రైతులు వ్యవసాయ మోటా ర్లకు కెపాసిటర్ అమర్చుకోవాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ జి మహేందర్ సూచించారు. శనివా రం వినోభానగర్లో విద్యుత్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ మోటార్లకు కెపాసిటర్ అమర్చకపోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్పై అధిక భారం పడటంతో కాలిపోతాయన్నారు. ఇంట్లో బట్టలు ఆరవేసేందుకు దండెంగా జీఐ వైరు వినియోగించొద్దని అన్నారు. డీఈలు కృష్ణ, జి.రంగస్వామి, ఏఈ నరసింహారావు, విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. విద్యుత్ ఎస్ఈ మహేందర్ -
‘ఉపాధి’లో నిబంధనలు పాటించాలి
చుంచుపల్లి: నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పనులు చేపట్టాలని, లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో ఎంపీడీఓలు, పీఆర్ ఏఈలు, ఉపాధి సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి కూలీకి కనీస వేతనం రోజుకు రూ.300 వచ్చేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ, అంగన్ వాడీ కేంద్రాల భవనాల పనులు ప్రారంభించాలని చెప్పారు. వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పాలసీలను నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేస్–11లో జిల్లాలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు 16 మంజూరుకాగా, నాలుగింటి పనులే ప్రారంభించారని, మిగిలిన 12 పనులను మొదలు పెట్టాలని సూచించారు. డీఆర్డీఓ ఎం. విద్యాచందన, జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, అదనపు డీఆర్డీఓ ఎన్. రవి పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. శాశ్వత నిత్యాన్నదానానికి విరాళం శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని కాకినాడకు చెందిన భక్తురాలు సత్య అనురాధ రూ.లక్ష చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వా మివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అధికారులు స్వామి వారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలిఅశ్వాపురం: పెండింగ్లో కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ రోహిత్రాజు పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. అశ్వాపు రం పోలీస్స్టేషన్ను శనివారం ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలు, గదులను పరిశీ లించి రికార్డులు తనిఖీ చేశారు. కేసుల వివరా లు తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ అశోక్రెడ్డి పాల్గొన్నారు. ఆయిల్ రికవరీని కాపాడాలిఅశ్వారావుపేట/దమ్మపేట: ఆయిల్పామ్ ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీని కాపాడాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ సూచించారు. శనివారం అశ్వారావుపేట, దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలను నారంవారిగూడెంలోని ఆయిల్పామ్ నర్సరీని ఆయన సందర్శించారు. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనులు, గెలల క్రషింగ్ సామర్థ్యంపై అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ఆయిల్ రికవరీ శాతం తగ్గకుండా ఉండేందుకు గెలల దిగుమతి నుంచి క్రూడాయిల్ సేకరణ వరకు అన్ని అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పక్వానికి రాని గెలలను తీసుకురావొద్దని రైతులను సూచించాలన్నారు. ప్లాంట్ల మేనేజర్లు ఎం.నాగబాబు, సత్యనారాయణ, అధికారులు పవన్, కళ్యాణ్, వెంకటేష్, కార్తీక్, రాజేష్, శివ,రాధాకృష్ణ ఉన్నారు. -
గోదావరి వరదలతో అప్రమత్తంగా ఉండాలి
భద్రాచలంటౌన్: గోదావరికి గతేడాది వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని ముంపు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఆర్టీఓ దామోదర్ రావు అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం డివిజన్స్థాయి సమావేశం నిర్వహించారు. ముంపునకు గురయ్యే ఏజెన్సీ గ్రామాల్లో కల్పించాల్సిన మౌలిక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంపు ప్రాంత గ్రామాలను గుర్తించి పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రధానంగా ఏడు ముంపు మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరదల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అన్నారు. మత్స్యశాఖ అధికారులు బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. మళ్లీ నిర్వహించే సమావేశానికి అధికారులు పూర్తిస్థాయి ప్రణాళికలు తయారు చేసుకుని రావాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఎస్డీసీ రవీంద్రనాథ్, జిల్లా, డివిజనల్ అధికారులు పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో ఆర్డీఓ దామోదర్రావు -
గిరిజన సంక్షేమానికి నిరంతరం కృషి
భద్రాచలంటౌన్: మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల జేసీగా పనిచేసిన సమయంలో విద్యార్థుల అభివృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుని, అమలు చేయడంతో సత్ఫలితాలు వచ్చాయని, అదే తరహాలో ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టిన్నప్పటి నుంచి గిరిజన సంక్షేమానికి తన వంతు కృషి చేస్తున్నానని పీఓ బి.రాహుల్ తెలిపారు. ఐటీడీఏ పీఓగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీఓ పాల్గొని మాట్లాడారు. గిరిజన విద్యను పునాది నుంచి బలోపేతం చేసేందుకు ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టామని, మంచి ఫలితాలు వచ్చాయని, పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమం రూపొందించి మంచి ఫలితాలు సాధించా మని పేర్కొన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదా యాలు అంతరించిపోకుండా మ్యూజియం రూపకల్పనలో అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సహకారం మరిచిపోలేనిదన్నారు. అనంతరం యూనిట్ అధికారులు సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేశారు. పీఓను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఆర్సీఓ అరుణ కుమారి, హరీశ్, భాస్కర్, ఉదయ్కుమార్, సున్నం రాంబాబు, అశోక్కుమార్, రమేశ్, భాస్కర్నాయక్, సమ్మయ్య, చైతన్య, జేడీఎం హరికృష్ణ, ఆదినారా యణ ఐటీడీఏ కార్యాలయంలోని అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దత్తత గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక గవర్నర్ దత్తత తీసుకున్న గ్రామాల్లోని కొండరెడ్ల గిరిజనుల అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగిస్తామని పీఓ రాహుల్ తెలిపారు. రాజభవన్ క్యాంప్ కార్యాలయం నుంచి గవర్నర్ ఆఫ్ తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఓ రాహుల్తో శుక్రవారం సమీక్షించారు. జిల్లాలోని దమ్మపేట మండలంలోని పూసుకుంట, అశ్వారావుపేట మండలంలోని గోగులపూడి గ్రామాల్లోని కొండరెడ్ల సంక్షేమానికి రూ.48.17 లక్షలు విడుదల చేశామని, వాటిని కేవలం కొండరెడ్ల కుటుంబాల రైతులు, నిరుద్యోగ యువత కోసం, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలని సూచించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. పూసుకుంట, గోగులపూడిలో నిరుద్యోగులకు టెంట్హౌస్లు, రైతులకు రెండు పవర్ టిల్లర్లు, 20 సోలార్ పంపుసెట్లు అందిచామన్నారు. ఇంకా జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. ఏడాది పూర్తయిన సందర్భంగా పీఓ రాహుల్ -
మోకాళ్లపై గని కార్మికుల నిరసన
మారుపేర్ల సమస్య పరిష్కరించడంలేదని ఆవేదన సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కొత్తగూడెంలోని ఇల్లెందు గెస్ట్హౌస్, సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట 11 ఏరియాల బాధితులు ప్లకార్డులతో మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. గెస్ట్హౌస్లో డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు అధ్యక్షతన కంపెనీస్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహిస్తుండగా బయట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022లో ఆర్ఎస్సీ సమావేశంలో మారుపేర్ల సమస్య పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నా, అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రెండు ప్రాణాలను బలితీసుకున్న సింగరేణి యాజమాన్యం తీరు సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్క శ్రావణ్ గౌడ్, తిరుమల శ్రీనివాస్, ఈర్ల రాజయ్య, డీఎస్ బాబు, హరీష్ యాదవ్, వంగా సంతోష్, పార్దపల్లి హరీష్, పొన్నం వెంకటేశ్, కొమురమ్మ, ప్రదీప్, జిల్లాల శ్రావన్, గుర్రం సుధాకర్, అజ్మీర నరేష్, అంబటి రాజశేఖర్, ఆకుల కిరణ్, మోత్కరి రవికుమార్, కలావతి, ఇప్టూ నాయకులు గౌని నాగేశ్వరావు, ఎన్.సంజీవ్, శ్రవణ్, శ్రీనివాస్, వెంకటేశ్, రవి, సందీప్, బిందు, కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి ఆధారంగా ఉద్యోగ అవకాశం కల్పించాలి డిపెండెంట్ ఉద్యోగాలకు 10వ తరగతి ఆధారంగా ఉద్యోగ అవకాశం కల్పించాలని టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీరభద్రం డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సమావేశం సింగరేణి ప్రధాన కార్యాలయంలో నిర్వహించకుండా గెస్ట్హౌస్లో నిర్వహించటం సరికాదని అన్నారు. ఈ సందర్బంగా ర్యాలీగా వెళ్లిన నాయకులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు సంఘం నిర్మాణాత్మక సమావేశం సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలోని ఇల్లెందు గెస్ట్హౌస్లో శుక్రవారం సింగరేణి డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రుతో గుర్తింపు సంఘం 51వ నిర్మాణాత్మక సమావేశం నిర్వహించింది. నాయకులు పలు సమస్యలను లేవనెత్తారు. యాక్టింగ్ క్లర్క్లను క్రమబద్ధీకరణ చేయాలని, సెక్యూరిటీ గార్డు ఖాళీలను అంతర్గత అభ్యర్థులతో భర్తీ చేయాలని, ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, రాష్ట్ర లేబర్ ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న డ్రిల్ ఆపరేటర్ కేడర్ స్కీమ్ కేసును పరిష్కరించాలని, సింగరేణి ఉద్యోగులతోనే బొగ్గు ఉత్పత్తి చేయించాలని, కారుణ్య నియమకాలు, గని ప్రమాద మృతుల వారసులకు విద్యార్హతలకు తగిన ఉద్యోగం ఇవ్వాలని గుర్తింపు సంఘం నాయకులు కోరగా.. వీలైనంత త్వరలో పరిష్కరిస్తామ డైరెక్టర్ తెలిపారు. అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ గైర్హాజరు ఉద్యోగుల కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, భూగర్భ గనుల్లో ఉద్యోగుల హాజరుశాతం పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు. -
బిల్లులు రాట్లే..
● ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఆవేదన ● నిలిచినపోయిన నాలుగు నెలల చెల్లింపులు ● పెండింగ్లోనే రూ.41.50 లక్షల గౌరవ వేతనం పాల్వంచరూరల్: ‘విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని అఽధికారులు ఆదేశిస్తారు. అప్పడప్పుడూ తనిఖీలు చేస్తూ వంటలు బాగాలేవని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ మాకు బిల్లులు రాకపోయినా ఎవరూ పట్టించుకోరు.’ అని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న ఏజెన్సీలకు నాలుగు నెలల బిల్లు పెండింగ్లో ఉంది. జనవరి నుంచి బిల్లులు రాకపోవడంతో అప్పు చేసి పిల్లలకు వంటలు వండిపెడుతున్నారు. కిరాణం, కూరగాయల దుకాణాల్లో ఖాతా రూ. వేలల్లో ఉంటోందని నిర్వాహకులు వాపోతున్నారు. గౌరవ వేతనమూ పెండింగే.. జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ 1,309 ఉండగా 112 హైస్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో వేల మంది విద్యార్థులు ఉండగా వంట నిర్వాహకులు 2,075 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం గౌరవ వేతనం కింద నెలనెలా రెండువేల చొప్పున చెల్లిస్తోంది. మార్చి నెల నుంచి రూ.41.50 లక్షల గౌరవ వేతనాలు రావాల్సిఉంది. పేరుకుపోతున్న కోడిగుడ్ల బకాయిలు విద్యార్థులకు కోడిగుడ్డు వండి వడ్డించేందుకు ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.6 చొప్పున చెల్లిస్తోంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి సుమారు రూ.10 లక్షలకు పైగా గుడ్ల బకాయి పెండింగ్లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలకు నిధులు ఖర్చు చేస్తున్నారు. కేంద్రం ద్వారా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున ఖర్చు భరిస్తున్నాయి. ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.19, 6 నుంచి 8వ తరగతులకు రూ.9.22, 9 నుంచి 10వ తరగతి వరకు రూ.11.67 చొప్పున ఖర్చు చేస్తున్నాయి. కిచెన్ షెడ్లులేక అవస్థలు జిల్లాలోని పలుచోట్ల పాఠశాలల్లో కిచెన్ షెడ్లు సక్రమంగా లేవు. పాల్వంచ మండలం నాగారం హైస్కూల్లో కిచెన్ షెడ్ను నిర్మించలేదు. దీంతో వంట చేసేందుకు ఇక్కట్లు తప్పడంలేదు. వర్షాకాలంలో వంటలు చేయాలంటే మధ్యాహ్న భోజన నిర్వాహకులకు కత్తి మీద సాములాగా మారింది. అధికారులు స్పందించి కిచెన్ షెడ్ నిర్మించాలని నిర్వాహకులు కోరుతున్నారు. అప్పులు తెచ్చి వండి పెడుతున్నాం మధ్యాహ్న భోజనం బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేసి వంట సామగ్రి తెస్తున్నాం. గౌరవ వేతనంతోపాటు నాలుగు నెలల బిల్లులు రావాల్సి ఉంది. అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. – రాములమ్మ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు, పాండురంగాపురంబిల్లులు విడుదల చేయాలి బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. గౌరవ వేతనాలు, గుడ్ల డబ్బులు కూడా రావాల్సి ఉంది. పనులకు వెళ్లకుండా వంటలు చేయడానికి వస్తే బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. – డేరంగుల అనసూయమ్మ, నాగారంబడ్జెట్ రాగానే... మధ్యాహ్న భోజన బిల్లులు, గౌరవ వేతనం, గుడ్ల బకాయిలు బడ్జెట్ రాకపోవడంతో పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు తయారుచేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపాం. బడ్జెట్ రాగానే ఖాతాల్లో జమ చేస్తాం. – వెంకటేశ్వరాచారి, డీఈఓ -
అంతా చెత్తచెత్తగా..!
టేకులపల్లి మండలం దాసుతండా గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరించి డంపింగ్యార్డుకు తరలించి తగలబెడుతున్నారు. ఫలితంగా పర్యావరణం కలుషితమవుతోంది. మరోవైపు డంపింగ్ యార్డు నిర్వహణ సక్రమంగా లేక పిచ్చిచెట్లతో దర్శనమిస్తోంది. మండలానికి ఒకటి, రెండు పంచాయతీల్లో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారే తప్ప మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. చుంచుపల్లి: జిల్లాలో చెత్త డంపింగ్ షెడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రామాల్లో పరిశుభ్రతతోపాటు అదనపు ఆదాయం సమకూర్చాలనే ప్రభుత్వ లక్ష్యం అటకెక్కింది. పాలకవర్గాలు లేకపోవడం, పంచాయతీ అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో కార్మికులు సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేయడంలేదు. గ్రామాల్లో పరిసరాల శుభ్రతకు ప్రభుత్వం ప్రతి పంచాయతీలో డంపింగ్ యార్డుతో పాటు, సేంద్రియ ఎరువు తయారీ కేంద్రాలను నిర్మించింది. జిల్లాలో పాత 481 పంచాయతీల్లోనూ నిర్మాణం చేపట్టింది. ఒకో షెడ్డుకు ఉపాధి హామీ నిధుల నుంచి రూ.2.50 లక్షల చొప్పున ఖర్చు చేశారు. ఆ తర్వాత చెత్త సేకరణకు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసుకునేందుకు ఇంటింటికీ చెత్తబుట్టలు అందించారు. పారిశుద్ధ్య సిబ్బంది ఇళ్ల వద్దనే వేర్వేరుగా చెత్తను సేకరించి, డంపింగ్ యార్డుకు తరలించాలి. అక్కడ కంపోస్ట్ షెడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో వాటిని పోసి, సేంద్రియ ఎరువుగా మార్చాల్సి ఉంటుంది. కానీ కార్మికులు ఒకే ట్రాక్టర్లో తడి, పొడి చెత్తను తరలించి డంపింగ్ యార్డులో పారబోస్తున్నారు. పొడి చెత్తలో లభించే ప్లాస్టిక్ గాజు, ఇనుము ఇతరత్రా సామగ్రిని విభాగాల వారీగా వేరుచేయడం లేదు. చాలా చోట్ల చెత్తను డంపింగ్ యార్డులో పోసి నిప్పు పెడుతున్నారు. తొలుత గ్రామపంచాయతీల్లో వెలువడే చెత్తను సెగ్రిగేషన్ షెడ్ల ప్రాంగణానికి తరలించి సేంద్రియ ఎరువు తయారు చేశారు. ఆ తర్వాత క్రమంగా ఆ ప్రక్రియకు స్వస్తి పలికారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలోనే పంచాయతీల్లో సేంద్రియ ఎరువును తయారీ ప్రక్రియ సాగుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో మిగతా చోట్ల సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. తొట్లలో పిచ్చిమొక్కలు పెరిగాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడకు తరలించాలనే విషయంలోనూ పంచాయతీ కార్యదర్శులకు ఇంత వరకు స్పష్టత లేదు. ప్రజల్లో అవగాహన లేకపోవడం, పంచాయతీల్లో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన సమస్యగా మారింది. పర్యవేక్షణ లోపం కారణంగా ఎరువు తయారీపై స్థానిక సిబ్బంది దృష్టి పెట్టడంలేదు. డంపింగ్ యార్డులు, సేంద్రియ ఎరువుల కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికై నా జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి చెత్త సేకరణ, సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. అలంకారప్రాయంగా సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు తడి, పొడి చెత్త వేరుచేయకుండా తగులబెడుతున్న కార్మికులు నిర్వహణలేక పిచ్చిచెట్లతో దర్శనమిస్తున్న డంపింగ్ షెడ్లు పట్టించుకోని జిల్లా పంచాయతీ అధికారులుదృష్టి సారిస్తాం.. జిల్లాలోని డంపింగ్ యార్డుల నిర్వహణపై దృష్టి సారిస్తాం. తడి, పొడి చెత్త సేకరణపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాం. కొన్ని చోట్ల డంపింగ్ యార్డుల నిర్వహణ, ఎరువుల తయారీ జరుగుతోంది. మిగిలిన చోట్ల డంపింగ్ యార్డులను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటాం. –వి.చంద్రమౌళి, డీపీఓ -
ఘనంగా జగన్నాథ రథయాత్ర
అశ్వాపురం: మండల కేంద్రంలోని గౌతమీనగర్ కాలనీలో శుక్రవారం జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒడిశాలో జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలో 26 సంవత్సరాలుగా గౌతమినగర్లో వేడుకలు నిర్వహిస్తుండటం విశేషం. ఉత్కల్ పతాగర్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవి దేవతా మూర్తులకు తొలిరోజు ఆధ్యాపూజ, మధ్యాహ్నపూజ, పహాండి, ఛెరపహారా తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక పల్లకీలో మేళతాళాలు, కోలాటాలు, నృత్యాల నడుమ దేవతా మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత మండపంలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. భారజల కర్మాగారం జీఎం శ్రీనివాసరావు వేడుకలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఛెరపహారా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులు కొలువైన రథాన్ని భక్తులు ఇరువైపులా బారులుదీరి లాగారు. ఆ తర్వాత గుండిచాఘర్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రథయాత్రకు ఒడిశావాసులు, భారజల కర్మాగార ఉద్యోగులు, అశ్వాపురం పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాగా ఈ వేడుకలు 9 రోజులపాటు సాగనున్నాయి. గౌతమీనగర్ కాలనీలో సందడి -
అభివృద్ధి చేయడంలో విఫలం
పాల్వంచరూరల్: అవసరమైన వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వాల వైఫల్యం కారణంగా అభివృద్ధి కుంటుపడుతోందని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ విమర్శించారు. స్థానిక ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయిన మాట్లాడా రు. కేటీపీఎస్, ఎన్ఎండీసీ, ఏపీ స్టీల్ వంటి పరిశ్రమలతో నాడు వెలుగు వెలిగిన పాల్వంచ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక ప్రజలు వలస పోతున్న దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పాల్వంచ, కొత్తగూడెంను కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేసే సమయంలో సంప్రదింపులు జరపలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణలో జాప్యం చేస్తోందని ఆక్షేపించారు. సమావేశంలో నాయకులు భూక్యా సీతారాములు, బుడగం రవికుమార్, యడ్లపల్లి శ్రీనివాస్కుమార్, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, దున్నపోతుల రాజు, రవి, రమేశ్, వెంకట్, రామారావు, వీరన్న, సురేశ్ పాల్గొన్నారు. పది సప్లిమెంటరీ ఫలితాల్లో 66.97 శాతం ఉత్తీర్ణతకొత్తగూడెంఅర్బన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో జిల్లాలో 66.97 ఉత్తీర్ణత శాతం నమోదైందని డీఈఓ ఎం.వెంకటేశ్వరచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. పరీక్షలకు 1,205 మంది విద్యార్థులు హాజ రు కాగా, 807 మంది ఉత్తీర్ణత సాధించారని వివరిచారు. బాలురు 775 మందికి 512 మంది (66.06 శాతం) ఉత్తీర్ణత, బాలికలు 430 మందికి గాను 295 మంది (68.60శాతం) ఉత్తీర్ణత సాధించారని పేర్కొ న్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూలై 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు విద్యార్థులు చదివిన పాఠశాలల హెచ్ఎంలను సంప్రదించాలని లేదా ప్రభుత్వ పరీక్షల సహయ కమిషనర్ ఎస్.మాధవరావు 99890 27943 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జగన్నాథపురంలో చోరీపాల్వంచరూరల్: తాళం వేసి ఉన్న ఇంట్లో పట్టపగలే చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన కొత్త దయాకర్రెడ్డి పాల్వంచలోని డీఏవీ పాఠశాలలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దయాకర్రెడ్డి భార్య వెంకటలక్ష్మి కేటీపీఎస్లో ఉద్యోగం చేస్తోంది. గురువారం ఉదయం ఇంటికి తాళం వేసి ఇద్దరు విధులకు వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చి చూసే సరికి ఇంటి తలుపు తాళం, బీరువా తాళం పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉన్న రూ.25 వేల విలువైన వెండి వస్తువులను చోరీ చేశారు. వెంకటలక్ష్మి శుక్రవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. కుక్కల దాడిలో దుప్పి మృతిదమ్మపేట: కుక్కల దాడిలో మచ్చల దుప్పి పిల్ల మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ ఇన్చార్జ్ అధికారి రవికిరణ్ కథనం ప్రకారం.. మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన మేకలు మేత కోసం సమీపంలోని అడవికి వెళ్లాయి. సాయంత్రం వాటితోపాటు మచ్చల దుప్పి పిల్ల తప్పిపోయి గ్రామానికి వచ్చింది. గ్రామంలోని కుక్కలు ఆ దుప్పిని చూసి వెంటాడి, శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో దాడి చేశాయి. దీంతో ఆ దుప్పి పిల్ల మృతి చెందింది. గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి వారు చేరుకుని, దుప్పి పిల్ల కళేబరాన్ని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. కాగా, పోస్టుమార్టం శనివారం జరగనుండగా నివేదిక వచ్చాక వివరాలు వెల్లడిస్తామని రేంజర్ తెలిపారు. -
ఏటీఎం కార్డు చోరీ..
టేకులపల్లి: సహాయం చేస్తున్నట్లు నమ్మించిన ఓ వ్యక్తి.. ఏటీఎం కార్డు చోరీచేసి, అందులోని రూ.31 వేలు డ్రాచేసిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎలక్ట్రానిక్స్, నెట్ సెంటర్ నిర్వాహకుడు యదళ్లపల్లి బాలకృష్ణ శుక్రవారం తన దుకాణంలో పనిచేసే పూనెం తేజకు తన ఏటీఎం కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేసుకుని రావాలని పంపించాడు. సూర్యతేజ ఏటీఎంలో డబ్బులు తీస్తున్న క్రమంలో అదే సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తేజను తికమకపెట్టి అలా కాదు ఇలా అంటూ చెప్పి.. కార్డు మార్చేసి వేరే కార్డుని తేజకు ఇచ్చారు. తిరిగి సూర్యతేజ ఏటీఎం కార్డును యజమానికి ఇవ్వగా ఆ కార్డు తనది కాదని గుర్తించి వెంటనే ఏటీఎం వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. కొద్ది సేపటికే ఇల్లెందు సుదిమళ్ల ఏటీఎం వద్ద రూ.31 వేలు డ్రా చేసినట్లు గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతుల కోసం పొలం బాట ● జిల్లా విద్యుత్ సర్కిల్ సేఫ్టీ ఆఫీసర్ ఎన్.కృష్ణ సూపర్బజార్(కొత్తగూడెం): రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి పొలం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా విద్యుత్ సర్కిల్ సేఫ్టీ ఆఫీసర్, డివిజనల్ ఇంజనీర్(టెక్నికల్) ఎన్.కృష్ణ శుక్రవారం తెలిపారు. వంగిన పోల్లు, లూజ్ లైన్లను సరిచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు పొలం బాటలో వంగిన పోల్లు 1,215, లూజ్లైన్లు 1,255, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు 149 మార్చినట్లు వెల్లడించారు. విద్యుత్ మోటార్లు వినియోగించేపుడు రైతులు జాగ్రత్తగా ఉండాలని, వ్యవసాయ పంపుసెట్లకు విధిగా ఎర్తింగ్ చేయాలని, వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే వెంటనే రైతులు 1912 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, 48 గంటలు దాటి ఆలస్యమైందని గుర్తిస్తే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను యుద్ధప్రాతిపదికన తీసుకుంటారని స్పష్టం చేశారు. దామరచర్లలో డెంగీ కేసు నమోదు చండ్రుగొండ: మండలంలోని దామరచర్ల గ్రామంలో డెంగీ కేసు నమోదైంది. కంచు బీరయ్య కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా శుక్రవారం పీహెచ్సీలో పరీక్షలు నిర్వహించగా డెంగీ పాజిటివ్గా తేలిందని డాక్టర్ కె.తనూజ వెల్లడించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ కార్యదర్శితోపాటు సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సత్వర చర్యలకు ఉపక్రమించారు. గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడంతోపాటు కాల్వలు శుభ్రం చేయించారు. -
బీమాతో ఎస్హెచ్జీ సభ్యులకు ప్రయోజనం
చుంచుపల్లి: మహిళా స్వయం సహాయక సంఘాలకు శుక్రవారం కలెక్టరేట్లో ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన ఇన్సూరెన్స్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ ఎం.విద్యాచందన మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులకు రూ.20 ప్రీమియంతో బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నానరు. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, టేకులపల్లి మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు 391 మందికి ఇన్సూరెన్స్ చేశామన్నారు. ఏపీఎంలు, సెర్ప్, సీసీలు, బ్యాంకు సిబ్బంది, మండల సమాఖ్యలు పాల్గొన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలిఎస్పీ రోహిత్రాజు చండ్రుగొండ : సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిత్రాజు పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. చండ్రుగొండ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఆయన సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. క్రైం రేట్పై ఆరా తీసి, రికార్డులను శీలించారు. సమస్యలతో స్టేషన్కు వచ్చేవారికి న్యాయం చేకూర్చాలన్నారు. విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ శివరామకృష్ణ పాల్గొన్నారు. పాఠశాలల్లో వసతులు కల్పిస్తాం జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి బూర్గంపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి తెలిపారు. బూర్గంపాడులోని తెలంగాణ గురుకుల పాఠశాల(బాలికలు)లో రూ 3 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ టాయిలెట్లకు శుక్రవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పర్ణశాల రామయ్యకు వెండి కవచాల బహుకరణ దుమ్ముగూడెం/భద్రాచలంటౌన్: పర్ణశాల శ్రీసీతారామ చంద్రస్వామివారికి ఏపీలోని నెల్లూరుకు చెందిన ఒగిలి సంతోష్రెడ్డి–సాహిత్య దంపతులు రూ.11 లక్షల విలువైన వెండి కవచాలను శుక్రవారం బహుకరించారు. 10.500 కేజీల వెండిపై బంగారు పూతతో తయారు చేసిన కవచాలను ఆలయ ఇన్చార్జ్ అనిల్కుమార్కు అందించారు. ఈ సందర్భంగా సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించి ప్రత్యేక పూజలను చేశారు. తొలుత భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఘనంగా గిరి ప్రదక్షిణభద్రాచలంటౌన్: శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. శ్రీరామచంద్రుని జన్మనక్షత్రం (పునర్వసు)ని పురస్కరించుకుని భక్తరామదాసు ట్రస్ట్ కొత్తగూడెం నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రగిరి ప్రదక్షిణా ర్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అధికారులు శ్రవణ్ కుమార్, శ్రీనివాస రెడ్డి, సాయిబాబు, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, నేత్రగంటి కృష్ణమోహన్, టి.రామదాసు, ముక్తీశ్వర్, విజయవాడ భజనమండలి సభ్యులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చర్ల: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావులతో కలిసి ఆమె చర్ల మండలంలో పర్యటించారు. లక్ష్మీకాలనీలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. చర్లలోని రైతు వేదికలో ఇందరిమ్మ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే రైతును రాజును చేసే ప్రభుత్వమని, పేదల కష్టాలను తీర్చే ప్రభుత్వమని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఈదయ్య, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క -
ఆర్డర్పై అడవి మాంసం!
రెచ్చిపోతున్న వేటగాళ్లు రాష్ట్రంలోనే అత్యధికంగా అడవులు ఉన్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. జిల్లా కేంద్రంగా ఉంటూ పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న కార్పొరేషన్ పరిధి చుట్టూ కిన్నెరసాని అభయారణ్యం ఉంది. దీంతో పల్లె ప్రజలకే కాదు పట్టణ వాసులకు అడవి జంతువులు కనిపించడం ఇక్కడ సాధారణ విషయం. దీంతో కొందరు సరదాగా అడవి పందులను వేటాడటం మొదలెట్టారు. ఇలా వచ్చిన మాంసాన్ని రహస్యంగా అమ్ముకుని తమ అవసరాలను తీర్చుకునే వారుకొందరు. వన్యప్రాణుల మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గడిచిన రెండేళ్లుగా వేటనే ప్రధాన పనిగా పెట్టుకునే ముఠాలు తయారయ్యాయి. జిల్లాలో పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, ఆళ్లపల్లి, గుండాల, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, అశ్వాపురం, కిష్టారం (బూర్గంపాడు) రేంజ్లలో వన్యప్రాణులను వేటాడేవారు పెరిగిపోయారు. పోగుల్లేవు.. ఏకంగా శాల్తీలే.. ఒకప్పుడు పొలాలకు రైతులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి లేదా వేటగాళ్లు అమర్చిన ఉచ్చుల్లో చిక్కుకుని అడవి పంది లేదా ఇతర జంతువులు చనిపోతే, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచేవారు. బయటకు తెలియకుండా ఆ జంతువు కళేబరాలను పాతి పెట్టడమో, కొద్దిపాటి ధైర్యం చేసి పొతం చేసి పోగులు వేసి తమకు పరిచయస్తులైన కొందరికే ఆ మాంసాన్ని పంపించేవారు. కానీ ఇటీవల అదే పనిగా జంతువుల మాంసం కోసం అడవులపై కన్నేసే వారు పెరిగిపోయారు. ఉచ్చులు బిగించిప్పుడు, తుపాకులు పట్టుకుని అడవిలోకి వెళ్లేప్పుడే తమ ‘సర్కిల్’లో ఉన్న వారికి సమాచారం ఇచ్చి ఆర్డర్లు తీసుకుంటున్నారు. చుక్కల దుప్పి మాంసానికి కేజీ రూ. 1,000 నుంచి రూ.1,500, అడవి పంది మాంసానికి రూ. 600 వంతున ఒక్కో జంతువుకు ఒక్కో రేటు చెబుతున్నారు. ఇటీవల ఒక అడుగు ముందుకు వేసి ఇటు వేటగాళ్లు, అటు మాంసం తీసుకునే వారు పోగుల కంటే ఏకంగా శాల్తీలకు శాల్తీలే బేరం చేయడానికి ఎక్కువగా ఉబలాటపడుతున్నారు. వన్యప్రాణుల వేటకు సంబంధించి వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు ఫారెస్ట్ శాఖ నిఘా వైఫల్యాలను ఎత్తి చూపుతోంది.జిల్లాలో రెచ్చిపోతున్న వన్యప్రాణి వేటగాళ్లు నాటు తుపాకులతో అడవుల్లో సాగుతున్న వేట కరెంటు తీగల ఏర్పాటుతో అటవీ జంతువుల వధ ఈ నెల 15న వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి అన్నపురెడ్డిపల్లి మండలంలో ఎనిమిది గేదెలు మృత్యువాత. ఈ నెల 15న ములకలపల్లి మండలంలో కొందరు వేటగాళ్లు నాటు తుపాకులతో సంచరిస్తుండగా అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మే 26న అశ్వారావుపేట మండలంలో కస్తూరి జింకకు సంబంధించిన అవశేషాలు పట్టుబడ్డాయి ఏప్రిల్ 17న దమ్మపేట మండలంలో ఓ తోటలో దుప్పి మాంసంతో విందు చేసుకుంటుండగా అటవీ శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు ఏప్రిల్ 9న నాటు తుపాకులతో వేటకు వచ్చిన ముగ్గురిని అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. మే 23న చుక్కల దుప్పి దారి తప్పి అశ్వారావుపేటలో సంచరించినట్టుగా ఫొటోలు బయటకు వచ్చాయి. అంతకు కొద్ది రోజుల ముందు కొత్తగూడెం నగరంలో గాజులరాజం బస్తీలోకి ఒక దుప్పి వచ్చినట్టుగా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ఏడాది ఆరంభంలో గుండాల మండలం కాచనపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణి మాంసం విక్రయాలు జరగగా ఆ విషయాన్ని బహిర్గతం కానివ్వలేదననే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల అడవుల్లోనూ ఈ తరహా ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
బైక్ పల్టీ.. ఎఫ్బీఓకు గాయాలు
ములకలపల్లి: ద్విచక్ర వాహనం పల్టీ కొట్టిన ఘటనలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్బీఓ) శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని ముత్యాలంపాడు బీట్ ఎఫ్బీఓగా విధులు నిర్వర్తిస్తున్న శంకర్.. పని ముగించుకుని ములకలపల్లి వైపు వస్తున్నాడు. ముత్యాలంపాడు క్రాస్రోడ్డు సమీపంలో అకస్మాత్తుగా కోతులు అడ్డురాడంతో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. శంకర్ తల, కాళ్లు, చేతులకు బలమైన గాయాలవగా.. స్థానికులు ఆటోలో మంగపేట పీహెచ్సీలో ప్రాథమిక చికిత్స నిర్వహించి, పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెనగడపలోని రైతు ఇంట్లో చోరీ.. కొత్తగూడెంటౌన్: తెల్లవారుజామున ఓ రైతు ఇంట్లోకి చొరబడిన దుండగులు 25 గ్రాముల బంగారం, రూ. 1.25 లక్షల నగదును అపహరించిన ఘటన శుక్రవారం రామవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. టూ టౌన్ సీఐ ప్రతాప్ కథనం ప్రకారం.. పెనగడప గ్రామంలో నివాసం ఉంటున్న రైతు ఎస్కే అబ్బాస్.. తన ఇంటి సమీపంలోనే కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. తెల్లవారుజామున దుకాణం తెరిచేందుకు వెళ్లగా కిటికి తెరిచి ఉండటం గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా.. బీరువా తాళం పగులగొట్టి 20 గ్రాముల బంగారం, 5 గ్రాముల బంగారు ఉంగరంతో పాటు రూ.1.25 లక్షల నగదు చోరీ చేసినట్లు గుర్తించాడు. టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా.. వారు క్లూస్ టీంతో వచ్చి వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రతాప్ తెలిపారు. సింగరేణిలో ఆరుగురు సర్వే ఆఫీసర్ల బదిలీ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న ఆరుగురు సర్వే ఆఫీసర్లను బదిలీ చేస్తూ కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్ఓడీ మురళీధర్రావు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. వారిలో ఒక సర్వే ఆఫీసర్, ఐదు గురు జూనియర్ సర్వే ఆఫీసర్లు ఉన్నారు. వీరంతా జూలై 5వ తేదీలోపు కేటాయించిన ఏరియా ల్లో విధుల్లో చేరాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.1.25 లక్షల నగదు, 25 గ్రాములు బంగారం అపహరణ -
ఆధార్ అప్డేట్ తప్పనిసరి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం విద్య, గ్రామీణాభివృద్ధి, బ్యాంకు, పంచాయతీ, తపాలా, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఆధార్ నమోదు కేంద్రాలు పనిచేయాలని, ఐదేళ్లు, పదిహేనేళ్లు దాటిన వారు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, పాఠశాలల్లో ఆధార్ నమోదు ప్రక్రియ చేపట్టాలన్నారు. ఆధార్ నమోదు కేంద్రాలు, ఆధార్ కార్డులపై అభ్యంతరాలు ఉంటే కలెక్టరేట్లో ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావును సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ రీజియన్ యూఐడీ అసిస్టెంట్ మేనేజర్ మహ్మద్ సౌరబ్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత పాల్గొన్నారు. -
డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
ఐదో సెమిస్టర్లో 50.56, ఆరో సెమిస్టర్లో 50.16శాతం ఉత్తీర్ణతకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ ఐదు, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. కేయూ క్యాంపస్లో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేయగా పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ వివరాలు వెల్లడించారు. ఐదో సెమిస్టర్ పరీక్షలకు 13,963 మంది విద్యార్థులు హాజరుకాగా, 7,059 మంది (50.56శాతం) ఉత్తీర్ణులయ్యారని, ఆరో సెమిస్టర్ పరీక్షల్లో 37,999మందికి 19,060 (50.16శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. కాగా, ఫలితాలపై రీవాల్యుయేషన్కు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. పదిహేను రోజుల్లోగా ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. -
ఇసుక లారీలతో ట్రాఫిక్ చిక్కులు
● చర్ల–వెంకటాపురం మార్గంలో రెండు చోట్ల స్తంభించిన రాకపోకలు ● ట్రాఫిక్లో నిలిచిన గర్భిణిని ఆస్పత్రికి తరలించే అంబులెన్స్ చర్ల: ప్రధాన రహదారులపై ఇసుక లారీలు నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నెల రోజులుగా ఇదే తంతు కొనసాగుతున్నా ఇసుక క్వారీల నిర్వాహకులు, అధికారులు పట్టించుకోకపోవడంలేదు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించే వారి పట్ల క్వారీల నిర్వాహకులు దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా గురువారం సాయంత్రం చర్ల–వెంకటాపురం మార్గంలో సీ కత్తిగూడెం వద్ద ప్రధాన రహదారిపై రెండువైపులా అధిక సంఖ్యలో ఇసుక లారీలను నిలిపారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సుమారు రెండున్నర గంటల పాటు ఈ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోగా ఈ ట్రాఫిక్లో ఓ గర్భిణిని వెంకటాపురం వైపు నుంచి భద్రాచలం వైపు తరలిస్తున్న అంబులెన్సు కూడా ఇరుక్కుపోయింది. చర్ల సీఐ రాజువర్మ, ఎస్ఐ కేశవ్ అక్కడకు చేరుకుని అతికష్టం మీద ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. గురువారం రాత్రి కూడా ఇదే మార్గంలోని సుబ్బంపేటలో ప్రధాన రహదారిపై ఇసుక లారీలు నిలపడంతో కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడికి కూడా పోలీసులు వెళ్లి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రధాన రహదారిపై ఇసుక లారీలను నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కలిగి ఉన్నారంటే భారత రాజ్యాంగమే కారణమని, రాజ్యాంగంలోని ఆర్టికల్స్, షెడ్యూళ్లను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ అన్నారు. సింగరేణి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో 75 ఇయర్స్ జర్నీ ఆఫ్ ద ఇండియన్ కాన్సిట్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనే అంశంపై గురువారం రాష్ట్రస్థాయి సింపోజియం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడారు. గౌరవ అతిథి మారపాక రమేష్, సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ జీకే కిరణ్కుమార్, మేనేజర్ మల్లేశం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ శారద కూడా మాట్లాడారు. అనంతరం అతిథులను సన్మానించారు. అధ్యాపకురాలు జి మేఘన పాల్గొన్నారు. -
ఫార్చునర్ కారులో గంజాయి రవాణా!
● 21.5 కేజీలు స్వాధీనం ● ఐదుగురు నిందితుల అరెస్ట్మణుగూరు టౌన్: ఒడిశా నుంచి హైదరాబాద్కు ఫార్చునర్ కారులో తరలిస్తున్న గంజాయిని మణుగూరులో ఎకై ్సజ్ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐలు సుంకర రమేశ్, రాజిరెడ్డి కథనం ప్రకారం... హైదరాబాద్కు చెందిన షేక్ సమీర్, సయ్యద్ అబూబకర్, ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచకు చెందిన తానంకి ప్రవీణ్, కోట హరీశ్, యశ్వంత్కుమార్లు గంజాయికి అలవాటుపడి స్నేహితులుగా మారారు. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి హైదరాబాద్లోని పాతబస్తీకి కారులో 21.5 కేజీల గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మణుగూరులోని రథంగుట్ట అర్బన్ పార్క్ వద్ద ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. గంజాయితోపాటు కారు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 13 లక్షలు ఉంటుందని, నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని అధికారులు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న హైదరాబాద్కు చెందిన షేక్ పైసల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. -
రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ఎమర్జెన్సీ
మాజీ ఎంపీ సీతారాం నాయక్ఇల్లెందు: ఎమర్జెన్సీ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ ఎంపీ, బీజేపీ నేత ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. గురువారం ఆయన ఇల్లెందులో విలేకరులతో మాట్లాడారు. ఎమర్జెన్సీ చీకటి రోజులకు 50 ఏళ్లు నిండిందని, నాటి చీకటి రోజుల్లో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని అన్నారు. ఈ ప్రాంతంలో ఎంపీలు ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేక పోయారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, జాతీయ రహదారులకు అతీగతీ లేదని అన్నారు. కాళేశ్వరం కమీషన్, ఫోన్ ట్యాపింగ్, ఈ–రేస్ అంటూ సీరియల్స్ నడపటం తప్ప కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ము సీఎం రేవంత్కు లేదన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నాయకులు గోపీకృష్ణ, సుచిత్ర ఉన్నారు. -
మత్తుకు బానిసలు కావొద్దు
భద్రాచలంఅర్బన్: యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సూచించారు. పట్టణంలో బుధవారం అర్ధరాత్రి, గురువారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వారికి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి, హెచ్చరించి వదిలేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు యువకులు గంజాయి, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై సామాన్య ప్రజలను ఇబ్బందులు కలిగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. దీంతో అనుమానిత ప్రాంతాలు, గంజాయి హాట్స్పాట్లలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. భద్రాచలం మీదుగా ఇతర ప్రాంతాలకు నిషేధిత పదార్థాలు తరలివెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రీడా పాఠశాలలో ప్రవేశానికి ఎంపికలుకొత్తగూడెంటౌన్: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశానికి ఎంపికలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మండలస్థాయిలో ఎంపికై న 124 మంది బాలబాలికలకు తొమ్మిది రకాలు పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన 10 మంది బాలికలు, 10 మంది బాలురను ఎంపిక చేశారు. వీరిని జూలై 2 నుంచి జరిగే రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపుతారు. రాష్ట్రస్థాయిలో అర్హత సాధించినవారికి హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని స్పోర్ట్స్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తారని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు. ఎస్జీఎఫ్ నుంచి నరేష్, పీడీలు, పీఈటీలు, స్పోర్ట్స్ కార్యాలయం నుంచి తిరుమలరావు, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఆఫ్టైప్ మొక్కలపై విచారణఅశ్వారావుపేట: ఆయిల్ఫెడ్ నర్సరీల నుంచి సరఫరా అయిన మొక్కల్లో ఆఫ్టైప్ రావడంతో నష్టపోయినట్లు పలువురు రైతులు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ ఇటీవల హైదరాబాద్లో అధికారులు, రైతులతో సమావేశమై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈమేరకు అశ్వారావుపేట మండలంలోని పలువురి తోటలను ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు గురువారం పరిశీలించారు. మండలానికి చెందిన నున్నా కృష్ణ, కుంచం సుబ్బారావు తోటలను పరిశీలించిన వారు ఆఫ్టైప్, సాధారణ మొక్కల ఎదుగుదల, దిగుబడిపై అధ్యయనం చేశారు. ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు ఎంవీ.ప్రసాద్, రామచంద్రుడు, బి.కళ్యాణ్, ఆయిల్ఫెడ్ ఓఎస్డీ ఏ కిరణ్, జిల్లా ఇన్చార్జ్ రాధాకృష్ణ, అశ్వారావుపేట, దమ్మపేట హెచ్ఓలు వేణుమాధవ్, సందీప్, హెచ్ఆర్ఎస్ సైంటిస్ట్ విజయకృష్ణ, ఆయిల్ఫాం గ్రోయర్స్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య పాల్గొన్నారు. డీఐఈఓకు ప్రశంసలుకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యావిధాన పర్యవేక్షణ, కళాశాలల మెరుగైన నిర్వహణ, ఉత్తీర్ణతా శాతం పెంపునకు కృషి చేసినందుకు డీఐఈఓ హాసవత్ వెంకటేశ్వరరావును ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ కృష్ణ ఆదిత్య ప్రశంసించారు. గురువారం హైదరాబాద్లో అన్ని జిల్లాల డీఐఈఓ, ప్రిన్సిపాల్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చేసిన కృషిని అభినందించారని వెంకటేశ్వరరావు తెలిపారు. ముద్దాయిలకు రెండేళ్ల జైలుశిక్షబూర్గంపాడు: బూర్గంపాడులో 2021 ఏప్రిల్ 12న వంగపూడి నాగమణి ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులకు భద్రాచలం ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శివనాయక్ రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు. నాగమణి ఇంట్లో రూ 10.లక్షల విలువైన బంగారం, నగదు చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టిన సారపాకకు చెందిన కునమళ్ల సందీప్, బూర్గంపాడుకు చెందిన పుట్టి నవీన్లపై కేసు నమోదు చేసి, కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను విచారించిన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. -
పరిహారం ఇస్తాం.. ఉపాధి కల్పిస్తాం
మణుగూరు టౌన్: మణుగూరు ఓసీ విస్తరణ నిర్వాసితులకు ఎకరానికి రూ.22.5 లక్షలు నష్టపరిహారం అందిస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ తెలిపారు. గురువారం పట్టణంలోని కొమ్ముగూడెం కమ్యూనిటీ హాల్లో గ్రామపెద్ద కంగాల భిక్షం అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రూ.5.5 లక్షలు, ప్రభుత్వ భూమిలోని గిరిజనులకు పూర్తి పరిహారం, గిరిజనేతరులకు రూ.11.25 లక్షలు అందిస్తామని తెలిపారు. నిర్వాసిత నిరుద్యోగులకు కనీస వేతనం తగ్గకుండా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి, ఓసీల్లో ఉపాధి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కోల్పోతున్న భూముల్లో చెట్లు, బోరు, బావి, కట్టడాలు ఉంటే సంబంధిత అధికారుల వాల్యుయేషన్ తెప్పించి అదనంగా ప్రయోజనం చేకూరుస్తామని వివరించారు. చెరువుపై ఆధారపడిన అర్హులైన మత్స్యకారులకు రూ.5.5 లక్షల ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందిస్తామని తెలిపారు. దీంతో సింగరేణి కాలరీస్ మణుగూరు ఓసీ విస్తరణ కోసం భూ సేకరణకు గ్రామస్తులు సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ టి.ప్రసాద్, తహసీల్దార్ అద్దంకి నరేశ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.మణుగూరు ఓసీ విస్తరణ గ్రామసభలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ -
పోడు వివాదంపై ఆర్డీఓ విచారణ
బూర్గంపాడు: ఇరవెండి ఫారెస్ట్ బీట్లోని వలస ఆదివాసీ గ్రామమైన కొసగుంపులో ఇటీవల పోడు సాగుదారులైన మహిళలకు, అటవీశాఖ అధికారులకు మధ్య జరిగిన వివాదంపై భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు గురువారం విచారణ చేపట్టారు. పోడు భూములకు కందకాలు తీసేందుకు జేసీబీతో వచ్చిన అటవీశాఖ అధికారులను కొసగుంపు మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తమ విధులకు ఆటంకం కలిగించారని అటవీశాఖ అధికారులు, మహిళలని చూడకుండా తమపై దాడులకు పాల్పడ్డారని కొసగుంపు మహిళలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ వ్యవహారం రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఈ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో ఆర్డీఓ దామోదర్రావు గ్రామానికి వచ్చి ఆదివాసీ మహిళలతో మాట్లాడారు. అటవీశాఖ అధికారుల వాదనలు కూడా విన్నారు. గ్రామంలోని 34 ఆదివాసీ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మూడెకరాల చొప్పున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలిప్పించేందుకు ఉన్నతాధికారులకు నివేదికలిస్తామని ఆర్డీఓ తెలిపారు. మిగతా అటవీభూములలోకి వెళ్లవద్దని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శిరీష, అశ్వాపురం రేంజ్ ఆఫీసర్ రమేష్, ఐటీడీఏ ఏఓ రాంబాబు, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, భజన సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలి
కొత్తగూడెంటౌన్: భద్రాద్రిని డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని, అందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాడాలని, ఆ మహమ్మారిని తరిమికొట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగంతో అనేక దుష్ఫలితాలు కలుగుతాయన్నారు. గంజాయి, డ్రగ్స్ బారిన పడుతున్న యువత తమ అమూల్యమైన జీవితాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అంతకుముందు డ్రగ్స్ వినియోగించబోమంటూ యువతతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, కరమ్చంద్, జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనినా, కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరరావు, సీఐలు ఎం.కరుణాకర్, శివప్రసాద్, ప్రతాప్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మత్తు నుంచి విముక్తికి సైనికుల్లా పోరాడుదాం గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే పిలుపు -
ఉత్పత్తి వ్యయం తగ్గించాలి
● యంత్రసామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించాలి ● సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రుమణుగూరు టౌన్: యంత్ర సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, శ్రమశక్తిని ఉపయోగించి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రు సూచించారు. సింగరేణి మణుగూరు ఏరియాలో గురువారం పర్యటించిన ఆయన పీకేఓసీ గనులు, కోల్ బెంచ్ను పరిశీలించాక యంత్రాల పనితీరుపై ఆరాతీశారు. అలాగే, వ్యూ పాయింట్ నుంచి డ్రిల్ మిషన్లు, షావెల్స్, బొగ్గు లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం గౌతమ్ మాట్లాడుతూ వినియోగదారులు కోరిన విధంగా నాణ్యమైన బొగ్గు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడుతూ.. నిర్దేశిత 8 గంటల పనిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ప్రతి ఉద్యోగి, రక్షణతో కూడిన ఉత్పత్తికి పాటుపడేలా చూడాలని, సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం సింగరేణి ఆస్పత్రి సౌకర్యాలు, మణుగూరు ఓసీ భూ సేకరణ అనుమతుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం దుర్గం రాంచందర్, పీకేఓసీ పీఓ లక్ష్మీపతిగౌడ్, అధికారులు శ్రీనివాస్, శ్రీనివాసాచారి, చంద్రశేఖర్, వెంకట్రావు, రమేశ్, అనురాధ, వీరభద్రుడు, సురేశ్కుమార్, రమణరెడ్డి, నాగరమేశ్, ఎస్ఓటూ డైరెక్టర్ సుశీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నియామకం, ఉద్యోగులకు 250 గజాల స్థలం కేటాయింపు, గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు నిధుల పెంపు, అన్ని ఓసీల్లో భోజనం సౌకర్యం కల్పించడమే కాక ప్లేడేలలో ఎన్–1, పీహెచ్డీలో పీ2 సర్క్యులర్ రద్దు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు తదితర అంశాలపై ఐఎన్టీయూసీ నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, గట్టయ్య, షాబుద్దీన్ తదితరులు డైరెక్టర్ గౌతమ్కు వినతిపత్రం అందజేశారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవా పురం–జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదన, హారతి సమర్పించిన అర్చకులు మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, పాలకమమండలి చైర్మన్ బాలినే ని నాగేశ్వరరావు, వేద పడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. సీల్డ్ కొటేషన్ల ఆహ్వానంపెద్దమ్మతల్లి ఆలయంలో దసరా ముందు నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా వివిధ వస్తువుల సరఫరా, పనుల నిర్వహణకు సీల్ట్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఈఓ రజనీకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయానికి రంగులు, సత్రాలతో పాటు అవసరమైన చోట్ల సునం వేసేందుకు కార్మికుల సరఫరా, రుత్విక్ల ఏర్పాటు, వారికి, భక్తులకు వంట చేసేందుకు, సన్నాయి వాయిద్యకారుల ఏర్పాటు, ఆలయం చుట్టూ లైటింగ్, బోర్డుల ఏర్పాటు, పూల అలంకరణ, పూలదండల సరఫరా వంటి పనులు చేసేందుకు ఆసక్తి గలవారు ఈనెల 28వ తేదీ ఉదయం 11 గంటలోపు కార్యాలయం బాక్స్లో కోటేషన్లు వేయాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం అందరి సమక్షంలో వాటిని తెరిచి ఖరారు చేయనున్నట్లు ఈఓ తెలిపారు. వివరాలకు 6303408458 నంబర్లో సంప్రదించాలని కోరారు. రేపు సబ్ జూనియర్ అఽథ్లెటిక్స్ ఎంపికలుకొత్తగూడెంటౌన్: జిల్లా స్థాయి సబ్జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు భద్రాచలంలో శనివారం జరుగుతాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 10, 12, 14 ఏళ్ల బాలబాలికలకు 60 మీటర్ల పరుగు పందెం, స్టాండింగ్, బ్రాడ్ జంప్, లాంగ్జంప్, కిడ్స్, జావెలిన్త్రో తదితర అంశాల్లో ఎంపికలు ఉంటాయని వివరించారు. ఇక్కడ ప్రతిభ చాటిన వారిని జూలై 6న హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 85220 67157 నంబర్లో సంప్రదించాలని కోరారు. 30 లోగా రేషన్ తీసుకోండికొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని తెల్ల రేషన్కార్డుదారులు ఈనెల 30 లోగా బియ్యం తీసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రుక్మిణిదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు నెలలకు కలిపి ఒకేసారి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రేషన్ దుకాణాలు, డీఆర్ డిపోల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పంపిణీ చేయాలని సూచించారు. ఆయా సమయాల్లో షాపులు తెరవని డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనెల 30 తర్వాత రేషన్ కార్డుదారులు బియ్యం పొందేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. వృత్తి విద్యలో రాణించడం అభినందనీయంపాల్వంచ: వృత్తి విద్యా కోర్సుల్లో మహిళలు రాణించడం అభినందనీయమని నవ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ దేవినేని, వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు అన్నారు. గురువారం స్థానిక నవ మహిళా సాధికార కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నవ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా తాటి ఆకుల కళాకృతులు, యూనిఫాంలు కుట్టి విక్రయించడం ద్వారా వచ్చిన రూ.2,59,690 నగదును మహిళలకు చెక్కుల రూపంలో అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో పలు రకాల వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టి స్థానిక యువత, మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఎంజీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మాతృమరణాల నివారణకు చర్యలు చేపట్టాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఎక్కడా మాతృ మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ పద్ధతులు అవలంబించాలని, గర్భిణులు ఇళ్లలో మునగ చెట్లు నాటేలా ప్రోత్సహించాలని సూచించారు. మునగలో ఉండే అధిక పోషక విలువలు, వ్యాధుల నివారణకు ఎలా ఉపకరిస్తుందనే విషయాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను కాలానుగుణంగా పర్యవేక్షించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అర్హత కలిగిన సిబ్బందిని మాత్రమే నియమించాలని, ఈ మేరకు తనిఖీలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, డీఎంహెచ్ఓ భాస్కర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డీఎస్పీ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ఫలించిన 18 ఏళ్ల పోరాటం!
● కారుణ్య నియామకం సాధించిన దివ్యాంగుడు ● తొలి ప్రజాదర్బార్లో దరఖాస్తుతో పీఆర్ శాఖలో ఉద్యోగం అశ్వారావుపేటరూరల్: ఓ దివ్యాంగుడు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేందుకు ఏకంగా 18 ఏళ్ల పాటు పోరాడాడు. ఎట్టకేలకు ఆయన పోరాటం ఫలించగా ఇటీవల నియామకపత్రం అందుకున్నాడు. కొత్తగూడెం విద్యానగర్కాలనీకి చెందిన కర్నాటి నాగేశ్వరరావు పంచాయతీరాజ్ శాఖలో గ్యాంగ్ మజ్దూర్గా ఉద్యోగం చేస్తూ 2007లో గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు దివ్యాంగుడైన రామకృష్ణ కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో 2017లో హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం కూడా రామకృష్ణకు ఉద్యోగం ఇవ్వాలని తీర్పు ఇచ్చినా ఫలితం కానరాలేదు. ప్రజాదర్బార్లో వినతితో కదలిక.. న్యాయస్థానంలో పోరాడుతూనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి 2023 డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్లో నిర్వహించిన ప్రజాదర్బార్లో రామకృష్ణ పాల్గొని మంత్రి సీతక్కకు దరఖాస్తు ఇచ్చాడు. దీంతో ఉన్నతాధికారులకు పంపించగా.. ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్కుమార్ పరిశీలించి ఈనెల 23వ తేదీన రామకృష్ణను ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం పీఆర్ ఎస్ఈ వెంకటరెడ్డికి ఈ ఉత్తర్వులు అందగా అశ్వారావుపేట పీఆర్ కార్యాలయంలో రామకృష్ణకు పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత డిప్యూటేషన్పై కొత్తగూడెం పంచాయతీరాజ్ కార్యాలయంలో గురువారం ఆయన విధుల్లో చేరాడు. -
ఏసీబీ దాడులతో బెంబేలు
● బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు ● అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు బూర్గంపాడు: జిల్లాలో ఏసీబీ వరుస దాడులు, సోదాలు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ దాడుల్లో కొందరు ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతుండగా మరికొందరు తృటిలో తప్పించుకుంటున్నారు. జిల్లాలో ఇటవల వరుసగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న క్రమంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, ఉద్యోగులు వారం, పది రోజుల పాటు జాగ్రత్తగా ఉంటున్నా.. ఆ తర్వాత ‘మామూలు’గానే తమ పని కానిచ్చేస్తున్నారు. ఈ నెల 21న బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్ట్ క్రాంతి కొత్త రేషన్కార్డు ప్రాసెస్ చేసేందుకు రూ. 2,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన జరిగిన ఐదురోజులకే గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. రికార్డులు, కంప్యూటర్ డేటా, భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల పత్రాలను, వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలు, ల్యాండ్ కన్వర్షన్ తదితర ఫైళ్లను తనిఖీ చేశారు. కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంపై సబ్ రిజిస్ట్రార్ను ప్రశ్నించారు. సోదాల సమయంలో కార్యాలయంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల చాలా ఫిర్యాదులందాయని, ఈ క్రమంలోనే ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. అవినీతి, అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని డీఎస్పీ తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు చెల్లింపులకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు కూడా నిర్థారణకు వచ్చామన్నారు. సోదాలు పూర్తిస్థాయిలో కొనసాగించాక బాధ్యులపై శాఖాపరమైన చర్యల కోసం ఏసీబీ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఏ ప్రభుత్వ అధికారైనా, ఉద్యోగైనా లంచం అడిగితే ఏసీబీకి సమాచారం అందించాలని కోరారు. ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064 లేదా 9154388981 నంబర్లకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని సూచించారు. -
సీహెచ్సీలో వైద్యుల నియామకం
బూర్గంపాడు: ఎట్టకేలకు బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో ముగ్గురు వైద్యులను నియమించారు. ‘సీహెచ్సీనా.. డెంటల్ ఆస్పత్రా!’ శీర్షికన ఈనెల 11న సాక్షిలో ప్రచురితమైన కథనానికి వైద్యావిధాన పరిషత్ అధికారులు స్పందించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు డీసీహెచ్ఎస్ రవిబాబు.. సీహెచ్సీలో ముగ్గురు వైద్యులను నియమించారు. వీరిలో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు కాగా, ఒకరు గైనకాలజిస్ట్ ఉన్నారు. కాగా, ఈ ఆస్పత్రిలో ప్రసవాలు జరిగేలా చూడాలని పలుమార్లు కలెక్టర్ ఆదేశించినా గైనకాలజిస్ట్ లేక డెలివరీలు చేయడం లేదు. ఎట్టకేలకు గైనకాలజిస్ట్ నియామకంతో ప్రసవాలు పెరిగే అవకాశాలున్నాయి. గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రావణి విధుల్లో చేరిన తొలిరోజే ఓ గర్భిణికి సుఖప్రసవం చేయడం విశేషం. -
రామయ్యకు కాసుల పంట
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కాసుల పంట పండింది. చిత్రకూట మండపంలో గురువారం ఆలయ హుండీలను లెక్కించగా రూ.1,97,79,049తో పాటు 65 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, విదేశీ ద్రవ్యం లభించాయని ఈఓ రమాదేవి తెలిపారు. గత మే 6న చివరిసారి హుండీలు లెక్కించారు. ఇప్పుడు 50 రోజుల్లో రూ.2 కోట్లకు దగ్గరగా ఆదాయం సమకూరడం విశేషం. వేసవి సెలవుల నేపథ్యంలో మే, జూన్ నెలల్లో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదాయం భారీగా రావడంతో ఆలయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. హుండీ లెక్కింపు అనంతరం నగదును బ్యాంకు అఽధికారులకు అందజేశారు. 50 రోజుల హుండీ ఆదాయం రూ.1.97 కోట్లు -
నిబంధనలకు విరుద్ధంగా వైద్యసేవలు
● భద్రాచలం ఏజెన్సీలో ఇష్జారాజ్యంగా క్లినిక్ల నిర్వహణ ● స్థాయికి మించి చికిత్స అందిస్తున్న కొందరు ఆర్ఎంపీలు ● చర్యలు తీసుకోని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు భద్రాచలంఅర్బన్: ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తూ, మోతాదుకు మించి మందులు ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రథ మ చికిత్స వరకే పరిమితం కావాల్సిన వారు క్లినిక్లలో పడకలు ఏర్పాటు చేస్తూ, ల్యాబ్లు నిర్వహిస్తూ నిబంధనలను కాలరాస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం భద్రాచలంలో పలువురు అనుమతులు లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్, వైద్యఆరోగ్యశాఖ అధి కారులతో సమావేశం నిర్వహించి ఆర్ఎంపీలు పరిధి దాటి చేయకుండా చర్యలు తీసుకోవాలని హె చ్చరించారు. అయినా వైద్యారోగ్యశాఖ అధికారుల్లో చలనం లేదు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలో సుమారు 40 మంది వరకు ఆర్ఎంపీలు ఉన్నారు. ప్రథమ చికిత్స కేంద్రానికి ఎలాంటి పేరు పెట్టకూడదు. అతని పేరు కూడా డాక్టర్గా రాసుకోకూడదు. కట్లు కట్టడం, సైలెన్లు ఎక్కించడం, ఇంజెక్షన్లు వేయడం, వైద్య పరీక్షలకు సిఫారసులు, వంటివి చేయకూడదు. గర్భిణిలు, బాలింతలు, చిన్న పిల్లలకు వైద్య అందించొద్దు. కానీ కొందరు ఆర్ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా వైద్యం పేరుతో రోగుల నుంచి సొమ్ము దండుకుంటున్నారు. పట్టించుకోని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఏజెన్సీ ప్రాంతాల్లో టైఫాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలకు, ఇతర వ్యాధులకు ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్నారు. భద్రాచలం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులు, రక్త పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో కుమ్మకై ్క బిల్లుల్లో కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జిల్లాలో ఆర్ఎంపీల వైద్యం వికటించి పలువురు మృతి చెందిన సంఘటనలు సైతం ఉన్నాయి. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆర్ఎంపీల క్లినిక్లను తనిఖీలు చేయడంలేదు. కొందరు అధికారులు మామూళ్లకు అలవాటు పడి వారిని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధిక మోతాదులో మందులు ఇస్తూ.. గ్రామాల్లో, బస్తీల్లో జ్వర బాధితులు సాధారణంగా ఆర్ఎంపీల వద్దకే వెళ్తుంటారు. వారు పెయిన్ కిల్లర్, స్టెరాయిడ్ వంటి మందులను ఇస్తూ, త్వరగా నయం చేస్తున్నట్లు నమ్మిస్తున్నారు. దీంతో ప్రజలు వారి వద్దే చికిత్స పొందుతున్నారు. ఆ మందులు వాడితే అనంతరం కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు వస్తాయనే అవగాహన ప్రజల్లో లేదు. అవగాహన కల్పించే దిశగా అధికారులూ చర్యలు చేపట్టడంలేదు. మందుల ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఉండటం వల్ల జీవక్రియ దెబ్బతింటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా వాడితే జబ్బులు కోరి తెచ్చుకుంటున్నట్లేనని పేర్కొంటున్నారు. బీపీ, స్థూలకాయం, ఎముకల బలహీనత, కంట్లో శుక్లాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. అంతకు మించి మించి వైద్యం చేయొద్దు. రోగుల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాస్పత్రి లేదా ఎంబీబీఎస్ డాక్టర్కు రెఫర్ చేయాలి. ఆర్ఎంపీలు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – డాక్టర్ చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ, భద్రాచలం -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాహస అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంటౌన్: జాతీయ సాహస అవార్డులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వారు అందించే జాతీయ సాహస అవార్డులు – 2024 కోసం అన్లైన్లో పోర్టల్ https:// awards. gov. in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూమి, ఆకాశం, సముద్రంపై సాహస యాత్రలు చేసిన వారిలో ఒక్కో విభాగంలో ఒకరికి అవార్డు అందిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో సాహసం చేసి, విజయం సాధించిన యువతీ, యువకులు ఈనెల 30వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తామని తెలిపారు. 2022 నుంచి 2024 వరకు సాహసాలు చేసిన వారి దరఖాస్తులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని వివరించారు. సక్రమంగా విధులు నిర్వర్తించాలిబెటాలియన్ సిబ్బందికి డీఐజీ సన్నీ ఆదేశం కొత్తగూడెంఅర్బన్: బెటాలియన్ పోలీసులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని బెటాలియన్స్ డీఐజీ సి.సన్నీ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ బెటాలియన్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెటాలియన్ పోలీసుల విధి, విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశాక ఆవరణలో మొక్కలు నాటారు. శరత్ మ్యాక్స్ విజన్ కంటి ఆస్పత్రి వారు ఏర్పాటు చేసిన నేత్ర పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు డి.శ్రీనివాసరావు, హెచ్.అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. నియోనాటల్ వాహనంలో అధునాతన పరికరాలు నేలకొండపల్లి: అధునాతన పరికరాలతో కూడిన నియోనాటల్ వాహనం ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఈఎంఆర్ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఉమ్మడి జిల్లా పోగ్రామ్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని సీహెచ్సీ వద్ద బుధవారం నియోనాటల్ వాహనంలో పరికరాల పనితీరుపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అనంతరం శివకుమార్ మాట్లాడుతూ జిల్లాకు తొలిసారిగా ఈ వాహనాన్ని కేటాయించగా అత్యాధునిక పరికరాలు, వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రత్యేకంగా నవజాత శిశువుల సంరక్షణకు ఈ వాహనం సమకూర్చారని చెప్పారు. కాగా, 108 అంబులెన్స్లు ఖమ్మం జిల్లాలో 21, భద్రాద్రి జిల్లాలో 28 ఉండగా, ఒక్కో వాహనంలో కనీసం నెలకు 120 ట్రిప్పుల ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ అధికారి దుర్గాప్రసాద్, 108 సిబ్బంది అజీమ్, పుష్పలత పాల్గొన్నారు. -
మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు
సుజాతనగర్: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని, వాటితో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ బి.రోహిత్రాజు అన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సుజాతనగర్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ధన్వంతరీ ఫార్మసీ కళాశాలలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, గంజాయి రహిత ప్రాంతమే లక్ష్యంగా తమ శాఖ కృషి చేస్తోందని, ఇందులో భాగంగా నిరంతరం విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని, వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూడాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐలు ప్రతాప్, రాయల వెంకటేశ్వర్లు, కరుణాకర్, శివప్రసాద్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రాము, కళాశాల చైర్మన్ అరికెల భాస్కర్, ప్రిన్సిపాళ్లు నాగరాజు, రామకోటేశ్వరరావు, ఎస్సై ఎం.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు సూచన -
పరిశ్రమలతోనే ఆర్థిక ప్రగతి
కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూపర్బజార్(కొత్తగూడెం): పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ట్రైనీ కలెక్టర్ సౌరబ్శర్మతో కలిసి నిర్వహించిన టీజీ ఐపాస్, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు జిల్లా అననుకూలమని, దీంతో పరిశ్రమల స్థాపనకు పలువురు ముందుకొస్తున్నారని అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికీ సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన పథకం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ , మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువతకు అవసరమైన శిక్షణ అందించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో బయోచార్, ఏబీసీడీ డ్రైవ్లపై అవగాహన కల్పించాలని సూచించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు, నవభారత్ లిమిటెడ్ వారు సమన్వయంతో ఉపాధిహామీ పథకం ద్వారా ఇటుకలతో వర్క్షెడ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఐటీఐ విద్యార్థులకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తిరుపతయ్య, ఎల్బీఎం రాంరెడ్డి, గిరిజన సంక్షేమాధికారి అనసూయ, ఉపాధి కల్పన శాఖాధికారి శ్రీరామ్, భూగర్భ జల శాఖ ఏడీ రమేష్, మైనింగ్ ఏడీ దినేష్ పాల్గొన్నారు. మునగపై పర్యవేక్షణ ఉండాలి నవంబర్, డిసెంబర్ నెలల్లో నాటిన మునగ తోటలు ప్రస్తుతం పూత, కాత దశలో ఉంటాయని, సరైన పర్యవేక్షణ లేకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని కలెక్టర్ పాటిల్ ఒక ప్రకటనలో సూచించారు. వర్షాకాలంలో తోటల్లో నీరు నిల్వకుండా చూడాలని, ఉపాధి హామీ పథకం ద్వారా నీటి గుంతలు నిర్మించుకోవాలని తెలిపారు. పుష్పో త్పత్తి, కాత దశలో పశువుల ఎరువు (5–10 కేజీలు), యూరియా (100 గ్రా), పొటాష్ (50గ్రా) మొక్కలకు వేయాలని, ప్రతీ వారం కలుపు తొలగించాలని సూచించారు. రైతులు ఈ సూచనలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించొచ్చని పేర్కొన్నారు. ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించాలి.. పాల్వంచరూరల్ : అవసరాలకు వినియోగించే నీరు బయటకు రాకుండా ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని మురుగునీరు కళాశాలలోకి వస్తోందని ప్రిన్సిపాల్, అధ్యాపకులు కలెక్టర్ దృష్టికి తేగా.. ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. కళాశాల ప్రాంగణంలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలతో పాటు యూకలిఫ్టస్, వెదురు మొక్కలు నాటాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, ఏపీఓ పొరండ్ల రంగా, ఏఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.పరిశుభ్రతే ప్రధానం.. కొత్తగూడెంఅర్బన్: అంటువ్యాధుల నివారణలో చేతుల పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని, దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉపాధ్యాయులకు సూచించారు. డయేరియా నివారణపై బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, సురక్షిత తాగునీటిని అందించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.విద్యా చందన, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, డీఎంహెచ్ఓ భాస్కర్, డీసీహెచ్ఎస్ రవిబాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎస్.జయలక్ష్మి, సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తేజశ్రీ, కోరా శ్రీ యాదవ్, సీహెచ్ఓ నాగభూషణం పాల్గొన్నారు. -
శంకుస్థాపన శిలాఫలకం ధ్వంసం
అశ్వాపురం: మండల పరిధిలోని తుమ్మలచెరువులో లోతువాగుపై వంతెన శంకుస్థాపన శిలాఫలకాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. హైలెవల్ వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో రూ.3 కోట్లు మంజూరు కాగా అప్పటి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికలు రావడంతో పనులు చేపట్టలేదు. నూతన ప్రభుత్వంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవ తీసుకొని వంతెన పనులు పూర్తి చేయించారు. బుధవారం ఎమ్మెల్యే పాయం వంతెనను ప్రారంభించనుండగా, మంగళవారం రాత్రి శంకుస్థాపన శిలాఫలకం పగులగొట్టారు. రేగా కాంతారావు పేరు ఉండకూడదని కాంగ్రెస్ శ్రేణులు ధ్వంసం చేశాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ వాళ్లే ప్రచారం కోసం ధ్వంసం చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆర్అండ్బీ వర్క్ ఇన్స్పెక్టర్ కృష్ణ ఫిర్యాదుతో సీఐ అశోక్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీవీకే–5 ఇంక్లైన్లో కేబుల్ అపహరణసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్ గని ప్యాన్ ఆవరణలోని కాపర్ కేబుల్ చోరీ జరిగిన విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం ఏరియాలో మాజీ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి ఈ నెల 23న మృతి చెందగా, 24న అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది దిగ్బ్రాంతికిలోనై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇది అదునుగా భావించిన దొంగలు ఈ నెల 23, 24 రెండు రోజుల్లో కాపర్ కేబుల్ను ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో నిక్షిప్తమైంది. సుమారు 10 మీటర్లు కేబుల్ చోరీకి గురైందని సిబ్బంది చెబుతుండగా, విచారణలో పూర్తి వివరాలు తేలాల్సి ఉంది. ఈ విషయమై ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ను వివరణ కోరగా.. చోరీ చేసినవాళ్లను గుర్తించామని, గురువారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
సీఐ మెడకు.. ఎన్ఆర్ఐ కేసు
● ఇల్లెందు సీఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు ● ఉత్తర్వులు జారీ చేసిన ఐజీఇల్లెందు: ఓ ఎన్ఆర్ఐ దంపతుల మధ్య ఏర్పడిన వివాదం.. చివరకు ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణ మెడకు చుట్టుకుంది. పోలీస్స్టేషన్కు వచ్చిన తమ పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించారంటూ ఎన్ఆర్ఐ నవీన్రెడ్డి తల్లిదండ్రులు మల్టీజోన్ –1 ఐజీ చంద్రశేఖర్రెడ్డికి ఫిర్యాదు చేయగా.. సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలిలా.. ఇల్లెందు కరెంటాఫీస్ ఏరియాకు చెందిన పి.నవీన్రెడ్డికి హైదరాబాద్లోని శంగిచెర్లకు చెందిన శ్రావ్యతో 2023 జూన్లో వివాహం జరిగింది. కొంతకాలం పాటు అమెరికాలోని డల్లాస్లో కాపురం సాగించాక హోం సిక్ పేరుతో ఇంటికి వచ్చిన శ్రావ్య తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. సుమారు ఏడాది గడిచినా నవీన్రెడ్డి శ్రావ్యను తీసుకెళ్లకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఈనెల 19న ఇల్లెందు పోలీసులను ఆశ్రయించగా సీఐ సత్యనారాయణ, షీం టీం సభ్యులు ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తమను స్టేషన్కు పిలిచి శ్రావ్య కుటుంబసభ్యుల సమక్షంలో సీఐ బెదిరించారని నవీన్రెడ్డి తల్లిదండ్రులు ఉప్పల్రెడ్డి, పద్మజ ఐజీకి ఫిర్యాదు చేయడంతో సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఖమ్మం అదనపు డీసీపీ విచారణ.. సీఐ సత్యనారాయణపై ఫిర్యాదు అందగా ఐజీ ఆదేశాల మేరకు ఖమ్మం అదనపు డీసీపీ ప్రసాదరావు బుధవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్లో విచారణ నిర్వహించారు. నవీన్ రెడ్డి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిచిన సమయంలో సీసీ పుటేజీలను పరిశీలించడంతో పాటు ఆరోజు విధుల్లో ఉన్న సిబ్బందిని విచారించారు. పోస్టింగ్ కోసం అంతర్గత పోరు.. ఇల్లెందు పోలీస్ స్టేషన్లో సీఐ మార్పు జరుగుతుందని కొంతకాలంగా ప్రచారం జోరందుకుంది. దీంతో పాటు ఈ సబ్ డివిజన్కు చెందిన ఓ అధికారి ఇల్లెందు సీఐ పీఠంపై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సత్యనారాయణను తప్పించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్ఆర్ఐ కేసు ముందుకు రావడంతో అతడి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేశాడంటూ ఐజీకి ఫిర్యాదు చేయడం, సీఐపై సస్పెన్షన్ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. నా భర్త నుంచి న్యాయం చేయండి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకెళ్లిన ఏడాదికే తిరిగి ఇంటికి పంపించి తన జీవితంతో ఆడుకుంటున్న ఎన్ఆర్ఐ నవీన్రెడ్డి నుంచి న్యాయం చేయాలంటూ శ్రావ్య పోలీసులను కోరారు. తన తల్లిదండ్రులు దుబ్బాక వేణుగోపాల్రెడ్డి, శ్రీలతతో కలిసి బుధవారం ఆమె ఇల్లెందు పోలీస్స్టేషన్కు వచ్చారు. ఈ వివాదంపై మాట్లాడేందుకు తమను సీఐ రమ్మని చెప్పడంతోనే తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. అమెరికాలో ఉన్న రోజుల్లో తనకు సమాచారం ఇవ్వకుండానే పలువురు డాక్టర్లతో కొన్ని పరీక్షలు చేయించాడని, ఆ తర్వాత వీసా గడువు ముగిసిందంటూ ఇంటికి పంపించాడని తెలిపారు. 2025లో మళ్లీ వీసా వచ్చినా రద్దు చేయించాడని, ఈ విషయం అడిగితే దురుసుగా సమాధానం ఇస్తున్నాడని, దీంతో తాను పోలీసులను సంప్రదించానని వివరించారు. -
‘శానిటరీ కాంప్లెక్స్’ పూర్తి చేయాలి
పాల్వంచరూరల్: పక్షం రోజుల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన ఆదేశించారు. మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయ సముదాయంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ ఏడాది రూ.3 లక్షలతో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్వహిస్తున్నారు. ఆలయ ఈఓ పర్యవేక్షణలో పనులు కొనసాగుతుండగా, నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నట్లు సమాచారం రావడంతో ఆమె బుధవారం తనిఖీలు నిర్వహించారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఆలయ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఎస్బీఎం కన్సల్టెంట్ రేవతి పాల్గొన్నారు. ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు మృతిభద్రాచలంఅర్బన్: పట్టణంలోని శిల్పినగర్లో బుధవారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు ట్రాలీ ఆటో కింద పడి మృతి చెందాడు. స్థాని కుల కథనం ప్రకారం.. బుధవారం సాయంత్రం శిల్పినగర్లోని ఓ దుకాణం వద్ద తెప్పల మనోజ్(18)కు, నాగేంద్రకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు. కాగా, నాగేంద్ర తాను పని చేస్తున్న కంపెనీ ట్రాలీ ఆటోలో ఎక్కుతుండగా, నాగేంద్రను కిందకు లాగే ప్రయత్నంలో మనోజ్ కింద పడిపోయాడు. ఈ క్రమంలో ట్రాలీ ఆటో వెనుక టైరు మనోజ్ తల మీదుగా పోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి కల్యాణ్ ఫిర్యాదు మేరకు నాగేంద్రతోపాటు ట్రాలీ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు భద్రాచలం పోలీసులు తెలిపారు. ఇద్దరు వైదిక సిబ్బందికి షోకాజ్ నోటీసులుభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైదిక సిబ్బందికి దేవాదాయ శాఖ అధికారులు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరి గిన గ్రూప్ చర్చల్లో దేవస్థానంలో భక్తులు అర్చకులకు సమర్పించే కానుకలు తమకే చెందుతాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. ఈ విషయం ఆలయ అధికారులకు తెలి యడంతో పూర్తి వివరణతో కూడిన నివేదికను రెండు రోజుల్లో అందించాలని షోకాజ్ నోటీసులు అందజేశారు. లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోల్బంక్ నిర్వహణపై విచారణదుమ్ముగూడెం: మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ నిర్వహణపై వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో డీసీఎస్ఓ రుక్మిణి బుధవారం విచారణ చేపట్టారు. వినియోగదారుల వాంగ్మూలం రికార్డు చేసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు. నిర్వహణ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండాలని బంక్ నిర్వాహకులకు సూచించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ ఎస్వో వరదరాజులు, సివిల్ సప్లాయీస్ డీటీ రాజు, ఆర్ఐ కల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
అడవి బిడ్డకు అనారోగ్యం..
కరకగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో రహదారులు లేక అడవి బిడ్డల కష్టాలకు పరిష్కారం లభించడం లేదు. కరకగూడెం మండలంలో వలస ఆదివాసీ గ్రామమైన నీలాద్రిపేటలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. నీలాద్రిపేటకు చెందిన మడివి ఉంగమ్మకు బుధవారం వాంతులు, విరేచనాలు తీవ్రమై ఆరోగ్యం విషమించింది. దీంతో కుటుంబీకులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా నీలాద్రిపేటకు సరైన రహదారి లేక వాహనం వచ్చే పరిస్థితి కనిపించలేదు. దీంతో వైద్యంలో జాప్యం జరుగుతుందని భావించిన ఉంగమ్మ భర్త జోగ య్య, తదితరులు డోలీ కట్టి ఆమెను అటవీ మార్గంలో బురద, ఎగుడుదిగుడు మార్గంలో ఆరు కి.మీ. మేర మోస్తూ రెండు గంటల అనంతరం అశ్వాపురంపాడు మీదుగా మోతె సమీపంలోని ప్రధాన రహదారి వద్దకు చేర్చారు. అక్కడ సిద్ధంగా ఉన్న 108లో ఉంగమ్మను మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. డోలీలో ఆరు కి.మీ. మోసుకెళ్లిన కుటుంబీకులు -
ఆగని అరెస్టులు
సింగరేణి మెడికల్ బోర్డులో బదిలీలు, డిప్యుటేషన్లను ఆధారంగా చేసుకుని ఇంత కాలం దందాకు పాల్పడిన వ్యక్తులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఈ అంశంపై ఏసీబీ సీరియస్గా దృష్టి పెట్టడంతో ఆరు నెలల్లో ముగ్గురు అరెస్టయ్యారు. రాబోయే రోజుల్లో మరికొందరిని సైతం అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ సిద్ధమవుతోందని సమాచారం. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంసింగరేణిలో అవినీతి దందాపై ఏసీబీ నజర్ ● కార్పొరేట్ కార్యాలయానికీ అంటుతున్న మరకలు ● 40 రోజుల్లో మూడు చోట్ల దాడులు ● ఏసీబీ చేతికి కీలక సమాచారం, మరిన్ని దాడులకు అవకాశం !కార్పొరేట్ ఆఫీస్ అడ్డాగా.. తెలంగాణలో భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం అసిఫాబాద్ జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. సుమారు 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. బొగ్గు వెలికితీతలో సంస్థకు వందేళ్ల చరిత్ర ఉండగా ఇటీవల థర్మల్, సోలార్ విద్యుత్ రంగంలోనూ అడుగు పెట్టింది. సంస్థ పరిధిలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం, నియామకాలు, బదిలీలకు సంబంధించిన ప్రక్రియ అంతా కొత్తగూడెంలోని కార్పొరేట్ ఆఫీస్ వేదికగా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ గతంలో పని చేసిన ఓ వ్యక్తి తనకు ఉన్నతాధికారుల వద్ద పలుకుబడి ఉందంటూ కార్మికులను నమ్మించాడు. ఆ తర్వాత బదిలీలు, డిప్యుటేషన్లు, మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలు ఇప్పించడం వంటి పనులు చేయించగలనంటూ నమ్మబలికాడు. అందుకు తగ్గట్టే నాలుగైదేళ్ల క్రితం వరకు సదరు ఉద్యోగి మాట సంస్థలో చలామణి అయింది. అయితే చివరకు సంస్థ ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. అయినప్పటికీ డిప్యుటేషన్లు, బదిలీలు, మెడికల్ బోర్డు వ్యవహారంపై తరచూ అవినీతి ఆరోపణలు రావడంపై దృష్టి సారించింది. ఇతరుల సంగతేంటి? కార్మికుల సంక్షేమం విషయంలో కార్మిక సంఘాలు గతంలో రాజీలేకుండా పని చేశాయి. కానీ గత పదేళ్లలో కారుణ్య నియామకాలు మొదలైన తర్వాత కార్మిక సంఘాల కంటే ఖద్దరు నేతల పెత్తనం పెరగడం మొదలైంది. ఆ తర్వాత ఈ విష సంస్కృతి బదిలీలు, డిప్యుటేషన్లకు విస్తరించింది. ఎవరు పడితే వారు కాసులిస్తే చాలు సింగరేణిలో పనులు చక్కబెడతామని ప్రచారం చేసుకోవడం ప్రారంభమైంది. మొదట్లోనే ఈ విధానాలకు అడ్డుకట్ట వేయకపోవడంతో ఈ వ్యవహారం శృతి మించింది. చివరకు విజిలెన్స్తో పని కావడం లేదని ఏసీబీని రంగంలోకి దించారు. మెడికల్ బోర్డులోకి ఆర్మీ డాక్టర్ను తీసుకురావాలనే ప్రతిపాదనను పరిశీలించాల్సి వచ్చింది. అంతేకాదు.. బదిలీలు, డిప్యుటేషన్ల విషయంలో అవినీతిని అరికట్టేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఈ అంశంపై ఆరు నెలలుగా నిర్విరామంగా దృష్టి పెట్టడంతో ఒక్కొక్కరుగా ఏసీబీకి చిక్కుతున్నారు. అయితే ప్రస్తుత విచారణ అంతా గతంలో సంస్థలో పని చేసిన ఓ వ్యక్తి, అతని కోటరీకి సంబంధించిన సింగరేణి ఉద్యోగులు/వ్యక్తుల కేంద్రంగానే సాగుతోందనే విమర్శ ఉంది. బదిలీలు, మెడికల్ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే ఈ కాసుల దందాతో సంబంధం ఉన్న అందరిపైనా దృష్టి సారించాలని సింగరేణి కార్మికులు కోరుతున్నారు. కాగా, సంస్థలో జరుగుతున్న అవినీతి వివరాలు తెలిపేందుకు ప్రత్యేకంగా 94911–44104 నంబర్ను సింగరేణి అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఫోన్ చేయడం లేదా వాట్సాప్ ద్వారా వివరాలు అందించొచ్చని తెలిపారు.ఒక్కొక్కరుగా.. లిఖిత పూర్వకంగా, ఫోన్కాల్స్, వాట్సాప్, ఈమెయిళ్ల ద్వారా అందిన సమాచారానికి తోడు సంస్థలో ఉన్నతాధికారులు ఇచ్చిన నమ్మకమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఏడాది మే 6న కొత్తగూడెంలోని మెయిన్ వర్క్షాప్లో పని చేస్తున్న అన్నెబోయిన రాజేశ్వరరావు అనే ఉద్యోగిని ఏసీబీ అధికారులు విచారించారు. తిరిగి జూన్ 6న ఇదే అంశంపై కొత్తగూడెం నివాసి, సంస్థతో సంబంధం లేకపోయినా సింగరేణి వ్యవహారాల్లో కీలకంగా మారిన ఓ మహిళనూ విచారించారు. తాజాగా భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ ఖని 1 ఇంక్లైన్ లో జనరల్ మజ్దూర్గా పని చేస్తున్న ఎస్. ప్రశాంత్ అనే ఉద్యోగిని ఏసీబీ విచారణ చేస్తోంది. భూపాలపల్లి విచారణలో కీలక అంశాలు లభించాయని, వాటి ఆధారంగా త్వరలో కొత్తగూడెం ఏరియాలో మరికొందరిని కూడా విచారించే అవకాశం ఉంది. -
● ఇల్లెందు పట్టణంలో తరచూ తాగునీటి సమస్య ● నీరు సరిపడా, సకాలంలో రావడంలేదు : మున్సిపల్ శాఖ ● వారే సకాలంలో ట్యాంకులకు ఎక్కించడంలేదు: మిషన్ భగీరథ ● రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో సమస్య తీవ్రం
ఇల్లెందు: వర్షాకాలం మొదలైనా ఇల్లెందు పట్టణ వాసులకు తాగునీటి తిప్పలు తప్పడంలేదు. గత జనవరి నుంచి మూడు, నాలుగు రోజులకోసారి, అదికూడా అరగంటపాటే సరఫరా చేస్తున్నారు. వారం రోజుల క్రితం నాలుగు రోజులపాటు పట్టణంలో నీటి కటకట ఏర్పడింది. పట్టణానికి నీటిని అందించే బాధ్యత మున్సిపాలిటీది కాగా, నీటిని ట్యాంకుల వరకు మిషన్ భగీరథ చేర్చాల్సి ఉంది. ఈ రెండు శాఖల మధ్య తీవ్ర సమన్వయ లోపంతో తరచు నీటి సమస్య ఏర్పడుతోంది. భగీరథ నుంచి సమయపాలన పాటించకుండా, అది కూడా తక్కువ సమయమే నీరు సరఫరా చేస్తున్నారని, అందుకే నీటి ఎద్దడి ఏర్పడుతోందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు సకాలంలో ట్యాంకులకు ఎక్కించుకుని ట్యాప్లకు సరఫరా చేయకపోవటం లేదని మిషన్ భగీరథ అధికారులు పేర్కొంటున్నారు. రెండు శాఖల అధికారులను సమన్వయం చేసే అధికారి, ప్రజాప్రతినిధి లేకపోవటంతో ప్రజలకు ఇక్కట్లు తప్పటం లేదు. మున్సిపల్ పాలకవర్గం కూడా లేకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. మూడు, నాలుగు రోజులకోసారి.. ఇల్లెందు పట్టణంలో 24 వార్డులు ఉండగా, మిషన్ భగీరథ, మున్సిపాలిటీ పరిధిలోని చెరువు, సింగరేణి నీరు సరఫరా చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మున్సిపాలిటీ వాటర్ సప్లైలో మోటార్లు మొరాయించటంతో నీటిరు సరఫరాలో లోపం తలెత్తింది. తోగ్గూడెంలోని మిషన్ భగీరథ ఫిల్టర్బెడ్లో మరమ్మతుల కారణంగా సక్రమంగా నీరు అందడంలేదు. దీంతో నాలుగు రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడింది. అసంపూర్తిగా భగీరథ పనులు ఇల్లెందులో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ట్యాంకుల నిర్మాణం నుంచి మొదలుకుని పైపులైన్లు, నల్లాలు అన్ని అసంపూర్తిగానే వదిలేశారు. మెయిన్ లైన్, సబ్లైన్లు, ఇంటింటికీ నల్లాలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. కొన్ని వీధుల్లో పైపులైన్లు లీకవుతున్నాయి. పట్టణంలో ఐదు వేలకు పైగా నల్లా కనెక్షన్లు ఉండగా, వీటన్నింటికీ భగీరథ పైపులైన్ల అనుసంధానం చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో తాగునీటి సమస్య తలెత్తుతోంది. ● -
ఫిట్నెస్లేని మూడు బస్సులు సీజ్
ఇల్లెందు: పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన మూడు బస్సులను సీజ్ చేఽశారు. బుధవారం ఇల్లెందు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.నిర్మల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇల్లెందు పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులతో కళాశాలకు వస్తుండగా జేకే బస్టాప్ సమీపంలో తనిఖీ చేశారు. ఫిట్నెన్ లేని కారణంగా మూడు బస్సులను సీజ్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. కొంత కాలంగా పట్టణంలో పలు కళాశాలలు, పాఠశాలలకు చెందిన బస్సులను ఫిట్నెస్ లేకుండా తిప్పుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులు విద్యాసంస్థల బస్సులను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ఇతర సంస్థల బస్సులను కూడా తనిఖీ చేస్తామని ఇన్స్పెక్టర్ నిర్మల తెలిపారు. -
పాఠశాలకు ప్రాణం పోశారు..
టేకులపల్లి : టేకులపల్లి మండలం దాసుతండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక మూసివేస్తారనే ప్రచారం సాగగా.. ఇద్దరు విద్యార్థినులు చేరి బడికి ప్రాణం పోశారు. ఇక్కడ గతేడాది మూడో తరగతిలో ముగ్గురు, నాలుగో తరగతిలో ముగ్గురు విద్యార్థులు చదువుకున్నారు. ఈ సంవత్సరం అందులో నలుగురు టీసీ తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. నాలుగో తరగతిలో అనన్య, ఐదో తరగతిలో ఝాన్సీ మాత్రమే మిగిలారు. వారు కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తామంటూ ఇంతకాలం బడికి రాలేదు. దీంతో విద్యార్థులు లేక పాఠశాల మూతపడుతుందనే ప్రచారం సాగింది. ఈనెల 6 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాఠశాల పేరుతో ప్రత్యేకంగా కరపత్రాలు ముద్రించిన ప్రధానోపాధ్యాయురాలు(సింగిల్ టీచర్) విజయనిర్మల.. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, మెరుగైన బోధనపై గ్రామంలో ప్రచారం చేశారు. గ్రామంలో 20 మంది బడీడు పిల్లలు ఉండగా అంతా ప్రైవేట్ స్కూళ్లపై మోజుతో అటే పంపించారు. దీంతో హెచ్ఎం మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి నచ్చజెప్పడంతో నాలుగో తరగతి చదివే గుగులోత్ అనన్య అనే విద్యార్థిని బుధవారం పాఠశాలలో చేరింది. ఐదో తరగతికి చెందిన ఝాన్సీని కూడా గురువారం చేర్పిస్తామని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. దీంతో మూసివేస్తారనే ప్రచారం జరిగిన పాఠశాలకు ప్రాణం పోసినట్టయింది. -
కరెంట్ షాక్తో నలుగురి దుర్మరణం
ఇల్లెందురూరల్/నేరడిగొండ/గంగారం : వేర్వే రు చోట్ల విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మూడు జిల్లాల పరిధిలో బుధవారం ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన ఏనుగు నర్సయ్య (60), ఎర్రమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. అందరికీ వివాహాలు జరగ్గా, చిన్న కుమారుడు ప్రవీణ్ (35) తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. పొలం పనులకు వెళ్లాలని బుధవారం తెల్లవారుజామునే నిద్రలేచారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఆరుబయట నేల బురదమయంగా మారింది. ముందుగా ఎర్రమ్మ నిదానంగా అడుగులు వేస్తూ చేతికందే ఎత్తులో ఉన్న దండెం తీగను ఆసరాగా పట్టుకుంది. అప్పటికే విద్యుత్ సర్వీసు వైరుకు తగిలి ఉన్న దండెం నుంచి కరెంట్ ప్రసారం కావడంతో ఎర్రమ్మ షాక్తో కింద పడింది. ఆ వెనుకాల వస్తున్న నర్సయ్య.. భార్య జారి పడిందని భావించి పైకిలేపే ప్రయత్నం చేయగా ఆయనకు కూడా షాక్ తగలడంతో బిగ్గరగా అరిచాడు. ఏం జరిగిందోనని పరుగున బయటకు వచ్చిన ప్రవీణ్ నేరుగా వారి వద్దకు వెళ్లి కాపాడే ప్రయత్నం చేయడంతో ఆయనా షాక్కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో నర్సయ్య, ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఎర్రమ్మను స్థానికులు తొలుత ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన యువ రైతు సాబ్లే సుభాష్ (35) తన పత్తి చేలో కలుపు తీస్తుండగా.. వేలాడుతున్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని మృతుని బంధువులు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన చిలుక ప్రవీణ్(28) గత ఏడాది మార్చిలో జూనియర్ లైన్మ్యాన్గా మహబూబాబాద్ గంగారం మండలంలో విధుల్లో చేరారు. కోమట్లగూడెం రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి త్రీఫేజ్ విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకొని మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం కావడంతో ప్రవీణ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సౌమ్య ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి. -
మావోయిస్టులకు సహకరించొద్దు..
పాల్వంచరూరల్: సంఘ విద్రోహ శక్తులు, మావోయిస్టులకు ఆదివాసీ గిరిజనులు సహకరించవద్దని జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) జి.నరేందర్ సూచించారు. మండలంలోని మల్లారం జీపీ మామిడికుంట గ్రామాన్ని మంగళవారం సీఐ సతీశ్కుమార్తో కలిసి అడిషనల్ ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో మాట్లాడారు. పిల్లలకు స్టడీ మెటీరియల్, పుస్తకాలు పంపిణీ చేశారు. వలస ఆదివాసీలకు పోలీసుల సహకారం ఎప్పుడూ ఉంటుందని, మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలపాలని చెప్పారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ సురేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఉద్దీపనం పుస్తకాల సరఫరాకు టెండర్లుభద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ గిరిజన ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలల్లో ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ఉద్దీపకం వర్క్ బుక్–2 ఇవ్వనుండగా, ముద్రించి సరఫరా చేసేందుకుటెండర్లు ఆహ్వా నిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. సుమారు 13,206 మంది విద్యార్థులకు అన్నిపుస్తకాలు కలిపి 30,89,784 పేజీ ల మేర ముద్రించి సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లా లోని ప్రింటింగ్ప్రెస్ల యజమానులు నిర్ణీత రుసుం డీడీ రూపంలో చెల్లించి ఐటీడీఏ కార్యాలయంలో టెండర్ దరఖాస్తులు తీసుకుని ఈ నెల 28వ తేదీ వరకు సమర్పించాలని సూచించారు. వివరాలకు ఐటీడీఏ ఉపసంచాలకుల కార్యాలయంలో 97013 15526, 91828 61609 నంబర్ల ద్వారా సంప్రదించాలని పీఓ ఓ ప్రకటనలో తెలిపారు.కేవీకే కోఆర్డినేటర్ రవికుమార్ బదిలీవ్యవసాయ కళాశాల ప్రొఫెసర్గా నియామకం వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని కృషి విజ్ఞా న కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ బదిలీ అయ్యారు. ఆయన ను భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్గా నియమించారు. అయితే, రవికుమార్ స్థానంలో కేవీకే కోఆర్డినేటర్గా ఎవరి నీ నియమించలేదు. కేవీకేలో సీనియర్ శాస్త్రవేత్తకు కోఆర్డినేటర్గా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.జిల్లా అథ్లెట్కు అభినందనకొత్తగూడెంటౌన్: కరకగూడెంనకు చెందిన అథ్లెట్ తోలెం శ్రీతేజకు బంగారు పతకం రావ డం హర్షణీయమని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహీధర్ మంగళవారం తెలిపారు. యూపీలోని ప్రయోగరాజ్లో జరుగుతున్న జాతీయ జూనియర్ (అండర్–20) ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తోలెం శ్రీతేజ.. ఈవెంట్లో బంగారు పతకం సాధించినట్లు తెలిపారు. శ్రీతేజ, కోచ్ నాగేందర్బాబును యువజన క్రీడలశాఖ అధికారి ఎ. పరందామరెడ్డి, అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.సారంగపాణి, కోచ్ నాగపూరి రమేశ్ తదితరులు అభినందించారని ఆయన పేర్కొన్నారు.వైన్స్ వద్ద ఘర్షణ.. కత్తిపోట్లుఖమ్మంఅర్బన్: వైన్స్ వద్ద మందుబాబుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసింది. ఖమ్మం విజయ డెయిరీ ఎదురుగా వైన్స్ వద్ద మంగళవారం రాత్రి ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఇందిరానగర్కు చెందిన మనీశ్ వైన్స్ వద్ద మద్యం సేవిస్తూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో టేకులపల్లి లక్ష్మీనగర్కు చెందిన తాపీ మేసీ్త్ర మేడరాజుల వెంకటేశ్వర్లు ఇదేమిటని ప్రశ్నించగా వాగ్వాదం తలెత్తినట్లు సమాచారం. ఈక్రమంలోనే మనీష్కు ఆయన స్నేహితులు తోడై వెంకటేశ్వర్లుపై దాడి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి మనీష్పై దాడి చేయగా ఆయన మెడపై తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత వెంకటేశ్వర్లు పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. కాగా, ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించగా, ఈ గొడవతో ఆ ప్రాంతంలో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. -
‘సీతారామ’ జలాలు ఇవ్వకపోతే సహించం..
మణుగూరురూరల్: సీతారామ జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఇవ్వకుండా అన్యాయం చేయాలని చూస్తే సహించబోమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతాంగానికి సంబంధించి పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టి 90 శాతం నిధులతో పనులను పూర్తి చేసిందన్నారు. రాష్ట్రంలో మాయమాటలతో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి జిల్లా మంత్రులు పూసగూడెం వద్ద ప్రాజెక్ట్ను ప్రారంభించి ఈ జిల్లాకు నీరు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తరలించుకుపోవడం దుర్మార్గమని, ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటు న్న కాంగ్రెస్ మంత్రులు.. నేడు జిల్లా రైతాంగాన్ని విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ నెల 30వ తేదీన జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నేతృత్వంలో పూసగూడెం నిరసన చేపట్టనున్న ట్లు తెలిపారు. సమావేశంలో కుర్రి నాగేశ్వరరావు, కుంటా లక్ష్మణ్, పోశం నర్సింహరావు, వేర్పుల సురేశ్, అక్కి నర్సింహారావు, యాదగిరిగౌడ్, రామ కోటి, సృజన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు -
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని ఫ్యూన్ బస్తీ(సింగరేణి ప్రధాన కార్యాలయం వెనుక ప్రాంతం)లోని సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మార్క బ్రహ్మయ్య(75) మంగళవారం మృతిచెందారు. ఆయనకు ఇద్దరూ కుమార్తెలే. వీరిలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న పెద్ద కుమార్తె సిరికొండ రాధిక తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకుంది. కాగా, బ్రహ్మయ్యకు కొడుకులు లేని లోటును కుమార్తెలే తీర్చారని స్థానికులు చర్చించుకున్నారు. ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యపాల్వంచరూరల్: ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మండలంలోని మందెరకలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాటి అయోధ్య హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. గతేడాది పూసలతండాకు చెందిన బి.సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల సంధ్య భర్త, కుటుంబ సభ్యుతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. సోమవారం సంధ్య ఇంటికి వెళ్లి.. గొడవపడి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని, సంధ్య తల్లి, కుటుంబ సభ్యులు మంజుల, ఆమె భర్త కుమార్ కారణమని మంగళవారం మృతుడి తండ్రి వీరభద్రం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. గంజాయి సేవిస్తున్న ఐదుగురు అరెస్ట్పాల్వంచ: గంజాయి సేవిస్తున్న ఐదుగురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పాత పాల్వంచ చింతలచెర్వు కట్టపైన గంజాయి తాగుతున్న గాంధీనగర్ ఏరియాకు చెందిన సయ్యద్ సాజిద్పాషా, షేక్ సమీర్, షేక్ వసీంలతో పాటు మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 1.750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్షఖమ్మం లీగల్: చెల్లని చెక్కు కేసులో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన మహ్మద్ జూనీమియాకు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి బిందుప్రియ ముంగళవారం తీర్పు చెప్పారు. ముదిగొండ మండలం పెద్దమండవకు తాళ్లూరి శీతయ్య వద్ద జానీమియా 2018 ఆగస్టులో రూ.2లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమాన చెక్కు జారీ చేయగా అది బౌన్స్ అయింది. శీతయ్య కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం జానీమియాకు ఆరు నెలల జైలుశిక్షతో పాటు ఫిర్యాదికి రూ.2.24క్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. -
ఆగస్టు 15 నాటికి దరఖాస్తుల పరిష్కారం
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా 58,365 దరఖాస్తులు వచ్చాయని, ఆగస్టు 15 వరకు పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసి నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వన మహోత్సవంలో 70 లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని వివరించారు. సమావేశంలో జిల్లా అటవీశాఖాధికారి కృష్ణగౌడ్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, డీఏఓ బాబూ రావు, డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, జిల్లా ఉద్యాన శాఖాధికారి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.భూ భారతిపై వీసీలో కలెక్టర్ పాటిల్ -
గంజాయి రవాణాలో యువతులు
ఖమ్మంక్రైం: పోలీసులు, ప్రయాణికులకు అనుమానం రాకుండా అమ్మాయిలతో కొందరు అక్రమార్కులు గంజాయి రవాణా చేయిస్తునట్లు తేలింది. గంజాయి రవాణా సమాచారంతో ఎకై ్సజ్ ఏఈ ఎస్ తిరుపతి ఆధ్వర్యాన మంగళవారం ఖమ్మం కొత్త బస్టాండ్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక యువకుడు, ఇద్దరు యువతులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి బ్యాగుల్లో పరిశీ లించగా రూ.2.50 లక్షల విలువైన గంజాయి బయటపడింది. ఒడిశా నుంచి గంజాయితో బయలుదేరిన వారు బస్సులు మారుకుంటూ ఖమ్మం చేరుకుని, బెంగళూరుకు వెళ్లడానికి సిద్ధమైనట్లు గుర్తించారు. నిందితులు ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాకు చెందిన శుభకర్మండల్, కాజల్మండల్, శుశు లిశిల్గా గుర్తించామని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీహరిరావుతో పాటు ఉద్యోగులు కరీం, హరీష్, వెంకట్, సుధీర్, విజయ్కుమార్, ఉపేందర్, వీరబాబు, స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం కొత్త బస్టాండ్లో పట్టుబడిన నిందితులు -
రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలి
కొత్తగూడెంఅర్బన్: సికింద్రాబాద్లోని రైల్వే భవన్లో మంగళవారం జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు డీఆర్యూసీసీ సమావేశంలో కొత్తగూడెం నుంచి డీఆర్యూసీసీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం బర్తేశ్కుమార్ జైనీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో రద్దయిన రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. మణుగూరు నుంచి కొత్తగూడెం మీదుగా తిరుపతి, షిరిడీకి ప్రత్యేక రైలు నడపాలని, సింగరేణి, కాకతీయ రైళ్లను పాత పద్ధతిలో అదనంగా భోగీలు ఏర్పాటు చేసి నడిపించాలన్నారు. రైల్వే అధికారులు మాట్లాడుతూ.. త్వరలోనే మణుగూరు టు కొత్తగూడెం మీదుగా తిరుపతి, షిరిడీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తామని, రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయిస్తామని వివరించారు. సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ ఏడీఆర్ఎం డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్, సీనియర్ డీసీఎం సిపాలికుమార్, సీనియర్ డీఓఎం డాక్టర్ సురేశ్రెడ్డి, డీసీఎం బి.చరణ్నాయక్, గూడ్స్ డీసీఎం విశాల్ అర్జున్, డీఆర్యూసీసీ సభ్యులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
కొత్తగూడెంటౌన్: విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం మాదకద్రవ్య నివారణ వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాఽలకు బానిస కావొద్దని సూచించారు. డ్రగ్ నిర్మూలన సోల్జర్గా నమోదు చేసుకునేందుకు లింక్ ఏర్పాటు చేశామని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై పోలీస్ శాఖ తరఫున అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినట్లు తెలిసినా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఏస్పీ మల్లయ్యస్వామి, సీఐ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వన్టౌన్ సీఐ కరుణాకర్, ఐటీ సెల్ రాము, జూలూరుపాడు, అశ్వారావుపేట సీఐలు ఇంద్రసేనారెడ్డి, నాగరాజురెడ్డి, ఆర్ఐలు నర్సింహారావు, కృష్ణారావు పాల్గొన్నారు. నిరుపయోగ వస్తువులకు రేపు వేలంజిల్లా పోలీసు శాఖలో నిరుపయోగ వస్తువులను ఈ నెల 26న వేలం వేస్తామని ఎస్పీ రోహిత్రాజు ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు హెడ్ క్వార్టర్స్లో వేలం ఉంటుందని, కంప్యూటర్, మానిటర్లు, సీపీయూలు, కీ బోర్డులు, మౌస్లు, యూపీఎస్లు, ట్యాబ్లు, యాపిల్ ఐపాడ్లు, ఇన్వెర్టర్, ఇన్వర్టర్ బ్యాటరీలు, డ్రాగన్ లైట్లు, టెంట్లు, టేబుళ్లు, కుర్చీలు, బీరువా తదితర వస్తువులను వేలం వేస్తామని వివరించారు. పాల్గొనేవారు జిరాక్స్, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని, వివరాలకు 87126 82143 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
అందరికీ తెలిసేలా..
గిరిజన సంస్కృతిభద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ పీఓగా రాహుల్ బాధ్యతలు స్వీకరించి బుధవారంతో ఏడాది పూర్తయింది. విద్య, వైద్య రంగాలకు ప్రాముఖ్యత ఇస్తూనే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు అందరికీ తెలిసేలా ఆయన చేపట్టిన చర్యలు విజయవంతం అయ్యాయి. రాహుల్ ప్రత్యేక చొరవతో రూపుదిద్దిన గిరిజన మ్యూజియం పర్యాటక ప్రాంతంగా మారింది. చదువును చక్కదిద్దుతూ.. ఏజెన్సీలో విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, గిరిజనాభివృద్ధికి కృషి చేస్తానని విధుల్లో చేరిన రోజే చెప్పారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పర్యటించి కొందరు విద్యార్థులు కనీస సామర్థ్యాల్లో వెనుకబడ్డారని గుర్తించారు. అలాంటి వారి కోసం ‘ఉద్దీపనం’ పేరిట 1 నుంచి 4వ తరగతుల వరకు గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో స్టడీ మెటీరియల్ రూపొందించారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థుల కోసం ‘కెరీర్ గైడెన్స్ వాల్’ను ఏర్పాటు చేయించారు. నిరుద్యోగులకు ప్రోత్సాహం.. నిరుద్యోగ యువత, గిరిజన మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మిల్లెట్స్తో బిస్కెట్లు, సబ్బులు, షాంపూల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమల్లో వారిని భాగస్వాములను చేశారు. మార్కెటింగ్కు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. జాబ్మేళాలు నిర్వహించి ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు ఇప్పించారు. నిరుద్యోగులు చదువుకుని ఉద్యోగాలు సాధించేలా భద్రాచలంలోని లైబ్రరీని పంచాయతీ నిధులతో అభివృద్ధి చేయడంతో పాటు స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేశారు. మెరిట్ ర్యాంకర్లకు ల్యాప్టాప్లు, ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆదివాసీల వంటకాలు అందరికీ తెలిసేలా.. ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన మ్యూజియాన్ని ఆధునికీకరించడంతో పాటు ఆదివాసీ వంటకాల రుచులు అందరికీ తెలిసేలా స్టాళ్లు ఏర్పాటు చేసి మంత్రులు, ఉన్నతాధికారుల మెప్పు పొందారు. ఆదివాసీ ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేసేందుకు ఢిల్లీ భవన్లో సైతం ప్రదర్శనకు ఉంచారు. అంతేకాక ఆదివాసీ భాష తాను నేర్చుకుంటూ వారితో మమేకమయ్యేలా ప్రయత్నించారు. ప్రత్యేక కార్యక్రమాలకు కోయ భాషలో ఆహ్వానాలు అందిస్తూ గిరిజన సంస్కృతిని విశ్యవ్యాప్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలందేలా.. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రణా ళికలు రూపొందించారు. గోదావరి వరదల సమయంలో గర్భిణులను గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టిక రూపొందించి అధికంగా వసూలు చేయకుండా కట్టడి చేశారు. అయితే మూడు రాష్ట్రాల గిరిజనులకు కేంద్రంగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిపై మాత్రం తనదైన మార్క్ చూపించలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదివాసీ భాష, కట్టుబాట్లను పదిలపరుస్తున్న పీఓ స్వయం ఉపాధి, విద్యారంగంపై ప్రత్యేక దృష్టి రాహుల్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది -
● జీసీసీ నుంచే ఆలస్యం
పాల్వంచరూరల్ : వర్షాకాలంలో పేదలు ఇబ్బంది పడకుండా మూడు నెలల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా.. క్షేత్రస్థాయిలో జాప్యంతో లబ్ధిదారులు ఇబ్బంది పడ్డాల్సి వస్తోంది. పాల్వంచ మండలంలోని కొన్నిషాపులకు జీసీసీ పాయింట్ నుంచి బియ్యం సరఫరా ఆలస్యమవుతోంది. మరికొన్ని చోట్ల వేలిముద్రలు పడక, మిషన్లకు సిగ్న ల్ అందక డీలర్లు, లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కిన్నెరసాని షాప్ పరిధిలో 556 రేషన్కార్డులకు గాను 308.18 క్వింటాళ్ల బియ్యం వచ్చా యి. ఇందులో ఇప్పటివరకు 251 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయగా ఇంకా 57క్వింటాళ్లు మిగిలి ఉన్నా యి. లక్ష్మీదేవిపల్లి షాప్ పరిధిలో 962 రేషన్కార్డులు ఉండగా ఇంకా 150 మందికి బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. జీసీసీ పాయింట్ నుంచి బియ్యం సరఫరాలో జాప్యంతోనే మిగిలిన వారికి బియ్యం అందించలేదని డీలర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మూడుసార్లు తిరిగినా బియ్యం ఇవ్వలే మూడు నెలల బియ్యం ఇస్తున్నారంటే ఇప్పటికి మూడు సార్లు వచ్చినా ఇంకా ఇవ్వలేదు. జీసీసీ పాయింట్ నుంచి బియ్యం రాలేదని డీలర్ అంటున్నాడు. బియ్యం పంపిణీ గడువు పెంచి అందరికీ వచ్చేలా చూడాలి.– తేనె వెంకటేశ్వర్లు, లబ్ధిదారుడు -
గిరిజన మ్యూజియం భేష్..
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోకుండా నాటి గుర్తులతో నిర్మించి గిరిజన మ్యూజియం బాగుందని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ – న్యూఢిల్లీ(మోటా) ప్రత్యేకాధికారి సుభాష్ అన్నారు. భద్రాచలం డివిజన్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలోని మ్యూజియాన్ని సందర్శించి కళాఖండాలు, పెయింటింగ్లు, గిరిజన వంటకాలను ఆస్వాదించారు. అనంతరం మాట్లాడుతూ.. పర్యాటకులకు కనువిందు కలిగేలా ట్రైబల్ మ్యూజియం రూపొందించడం హర్షణీయమని అన్నారు. జిల్లాలో రెండు రోజులు పర్యటించి దేవాలయాలతో పాటు మ్యూజియాన్ని సందర్శించడంతో మంచి అనుభూతి కలిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గిరిజనులకు సక్రమంగా అందిస్తున్న ఐటీడీఏ అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పీఓ బి.రాహుల్, ఏపీఓ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు ఉన్నారు.నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.సీఐపై సస్పెన్షన్ వేటు ?ఇల్లెందు: ఇల్లెందు పోలీస్ సబ్ డివిజన్లోని ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఎన్ఆర్ఐ ఒకరు కేసు విషయమై సదరు సీఐతో ఇటీవల ఫోన్లో మాట్లాడగా దురుసుగా బదులిచ్చినట్లు సమాచారం. దీంతో సదరు ఎన్ఆర్ఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఈమేరకు సీఐని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జర్నలిస్టు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరాచారి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నాయకులు రాయితీ కోసం వినతిపత్రం అందజేయగా, స్పందించి వెంటనే 50 శాతం ఫీజు రాయితీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్, ఎండీ షఫీ, టెంజు జిల్లా అధ్యక్షులు వట్టికొండ రవి, నేషనల్ కౌన్సిల్ సభ్యులు చండ్ర నరసింహారావు, జర్నలిస్టులు కృష్ణ్ణగోవింద్, ప్రభాకర్రెడ్డి, రాజ్కుమార్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. -
బూడిద.. చెరువుల పాలు..
● యాష్ రేటు పెంచడంతో తగ్గిన కొనుగోళ్లు ● విధిలేక బూడిదను చెరువులకు వదులుతున్న అధికారులు ● అవి నిండుతుండడంతో కట్టల ఎత్తు పెంచుతున్న వైనం..పినపాక: పినపాక – మణుగూరు మండల సరిహద్దులోని భద్రాద్రి పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అవుతున్న బూడిద రేట్లను పెంచడంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆ బూడిదను చెరువుల్లోకి తరలిస్తున్నారు. ఫలితంగా ఐదు నుంచి 10 అడుగుల వరకు ఉండాల్సిన బూడిద చెరువులను 30నుంచి 40అడుగుల ఎత్తువరకు పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అదికూడా నిండితే అధికారులు ఏం చేస్తారోనని పరిసర ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ బూడిదను ఇటు కల బట్టీలు, సిమెంట్ కంపెనీలు, కన్స్ట్రక్షన్లలో వినియోగిస్తారు. పెరుగుతున్న ధరలు అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి బూడిద రేట్లను భారీగా పెంచుతున్నారు. పాల్వంచ కేటీపీఎస్లో టన్ను ధర రూ.30 నుంచి రూ.60 ఉండగా, టీబీపీఎస్లో రూ.150 నుంచి 200వరకు విక్రయిస్తున్నా రు. ఇది కాక లోడింగ్ చార్జీలు, కాటా చార్జీల ఆధారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తద్వారా విక్రయాలు తగ్గి బూడిదను చెరువులకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిండిన చెరువులు పవర్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిద ఎక్కువ శాతం బంకర్ల ద్వారా ఇటుకల బట్టీలకు, సిమెంట్ కంపెనీలకు విక్రయించి, కొంత శాతం బూడిదను వాటర్ ద్వారా బూడిద చెరువుకు తరలిస్తారు. కానీ పవర్ ప్లాంట్లో దానికి భిన్న పరిస్థితి ఉంది. అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి అధిక రేట్లకు టెండర్లు వేసి బూడిద విక్రయిస్తున్నారు. రేట్లు అధికంగా ఉండడంతో సిమెంట్ కంపెనీలు, ఇటుకల బట్టీల యజమానులు మరోచోట బూడిదను కొనుగోలు చేస్తుండటంతో.. మిగులుతున్న బూడిదను గొట్టాల ద్వారా చెరువులకు తరలిస్తున్నారు. తద్వారా బూడిద చెరువులు నిండుతున్నాయి. ఇలా ఐదునుంచి పదిఅడుగులు ఉండాల్సిన బూడిదచెరువులు బూడిదతో నిండటం, వేరే ఒకమార్గం లేక సుమారు 30 నుంచి 40 అడుగులఎత్తుకు చెరువులను పెంచుతున్నారు. అది నిడితే అధికారులు ఏంచేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉచితంగా ఇవ్వాలి పవర్ ప్లాంట్ నిర్వాసిత గ్రామాల్లో ఉంటున్న ప్రజలకు, ఇటుకల బట్టీలకు, అవసరమైన వారికి ఉచితంగా బూడిద అందజేయాలి. అధిక రేట్లకు కొనలేని పరిస్థితి ఉంది. అధికారులు బూడిదను కూడా విక్రయిస్తుండడం సరికాదు. ఈ అంశంపై ఇప్పటికై నా పునరాలోచించాలి. –సుబ్బారెడ్డి, ఇటుకల బట్టీ యజమాని, ఐలాపురం ధరలు తగ్గించాలి బీటీపీఎస్లో బూడిద ధరలను తగ్గించాలి. నామమాత్రపు ధరలకు బూడిదను విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలి. టన్నుకు రూ.180 నుంచి రూ.200 పెట్టుకుని బూడిద కొంటే ఇటుకలు అధిక రేట్లకు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అధికారుల తగు చర్యలు తీసుకోవాలి. –రవి, బట్టుపల్లి -
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
దుమ్ముగూడెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మారుమూల ప్రాంతాల ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. నర్సాపురంలో మంగళవారం నిర్వహించిన ధర్తీ ఆబాజాన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ యోజన సదస్సులో వారు మాట్లాడారు. గిరిజనులు ఆయా సంక్షేమ పథకాలు పొందాలంటే వ్యక్తిగత గుర్తింపు కార్డులు అవసరమని, వివిధ రకాల గుర్తింపు కార్డులు అందించేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్, కేవైసీ, రేషన్ కార్డులతో పాటు కుల ధ్రువీకరణ పత్రాలను గ్రామ సభల్లోనే పొందొచ్చని చెప్పారు. ఆహార నియమాలు పాటించకపోవడంతో ఎక్కువ మంది సికిల్సెల్ అనీమియా వ్యాధితో బాధ పడుతున్నారని, ఆయుష్మాన్ భవ కార్డు ద్వారా ఇలాంటి వ్యాధులకు రూ.5లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఏఓ సున్నం రాంబాబు, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఈఓ సమ్మయ్య, ఆర్ఐ వెంకటేశ్వర్లు, డాక్టర్ సుభాష్, ఏఓ నవీన్ కుమార్, ఐకేపీ ఏపీఎం హేమంతిని, ఏపీఓ సుకన్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాలి భద్రాచలంటౌన్ : ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని పీఓ రాహుల్ అన్నా రు. గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ కాలేజీలో సీటు సాధించిన దుమ్ముగూడెం మండలం లింగాపురం గ్రామానికి చెందిన కాక జోగారావుకు మంగళవారం ఆయన రూ. 47 వేల చెక్కు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మణిపూర్లో సీటు సాధించిన జోగారావుకు ఉన్నత చదువుల కోసం ఐటీడీఏ నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఎమ్మెస్సీ చదువుతూ స్పోర్ట్స్ కోచింగ్ తీసుకొని జాతీయస్థాయిలో ఎనిమిదో ర్యాంకు, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాడని అభినందించారు. -
వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే
దమ్మపేట: మండలంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నాచారం గ్రామంలో వరి నాట్లు వేస్తున్న మహిళలతో కలిసి నాట్లు వేశారు. మంగళవారం మండలంలోని లింగాలపల్లి, జమేదారుబంజర, గుర్వాయిగూడెం, పార్కలగండి, అంకంపాలెం, అర్లపెంట, కొడిసెలగూడెం, చెన్నువారిగూడెం, జగ్గారం, నాగుపల్లి, నాచారం, తొట్టిపంపు, మొద్దులగూడెం, అల్లిపల్లి, మల్కారం, పెద్దగొల్లగూడెం, దమ్మపేట గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. రూ.3,44,50,000 వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, పాఠశాల ప్రహరీలు, తాగునీటి బోర్లు, పైపులైన్లను ప్రారంభించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నాచారంలో లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి, వైద్య సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. దమ్మపేటలో ఉపాధి హామీ కూలీలకు గడ్డపారలు, బాల్చాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, ఎంపీడీఓ చంద్రశేఖరరెడ్డి, ఎంపీఓ రామారావు, ఏఈలు, డీఈలు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
● నిల్వ సామర్థ్యం లేక ఇక్కట్లు
ఇల్లెందు: ఇల్లెందులోని 13వ నంబర్ బస్తీ 16వ వార్డులో రెండు గదుల రేకుల షెడ్డులో రేషన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఒక నెలకు సరిపడ బియ్యం కూడా నిల్వచేసే పరిస్థితిలేదు. దీంతో మూ డు నెలల స్టాక్ను ఐదు దఫాలుగా అందజేశారు. ఈ షాపు పరిధిలో 730 రేషన్ కార్డులు ఉండగా ఇప్పటికి 630 మందికి బియ్యం పంపిణీ చేశారు. కొందరు వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడంతో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రేషన్ అందజేస్తున్నారు. కాగా, తమకు మూడు నెలలుగా కమీషన్ ఇవ్వడం లేదని డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రతీ నెల కమిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. -
అర్హులందరికీ బియ్యం
● మూడు నెలలకు 16,773 మెట్రిక్ టన్నులు అవసరం ● రేషన్ షాపులకు చేరిన బియ్యం 16,258 మె.టన్నులు ● 2,41,760 కార్డులకు పూర్తయిన పంపిణీ ● కొన్నిచోట్ల కొనసాగుతున్న సరఫరాకొత్తగూడెంఅర్బన్: వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్కార్డుదారులకు మూడు నెలల సన్నబియ్యాని ఈనెల 1 నుంచి సరఫరా చేస్తోంది. ఈనెల 30 వరకు అర్హులందరికీ బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టింది. అయితే కొన్ని దుకాణాల్లో మూడు నెలల స్టాక్ నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో బియ్యం అయిపోగానే మళ్లీ పంపించేలా ఏర్పాట్లు చేశారు. 81.34 శాతం పూర్తి.. జిల్లాలో 2,97,189 రేషన్కార్డులు ఉండగా ఇప్పటికే 2,41,760 కార్డులవారికి బియ్యం పంపిణీ చేశామని, 81.34 శాతం ప్రక్రియ పూర్తయిందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి రుక్మిణి తెలిపారు. మూడు నెలల కోటా 16,773 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను ఇప్పటివరకు 16,258 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపులకు చేరాయని, మరో 515 మెట్రిక్ టన్నుల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ఈనెలాఖరు లోగా అవికూడా పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. అయితే క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల బియ్యం స్టాక్ లేక లబ్ధిదారులు మరో దుకాణానికి వెళ్లాల్సి వస్తుండగా, ఇంకో చోట సరఫరాలో జాప్యం జరుగుతోంది. ● బియ్యం లేక షాప్ మూత.. భద్రాచలంటౌన్: భద్రాచలంలోని ఒక రేషన్ షాపులో బియ్యం నిల్వలు లేక దుకాణాన్ని మూసివేశారు. మండలంలో మొత్తం 21 రేషన్ షాపులు ఉండగా మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించడంతో అధికారులు పూర్తి స్థాయిలో బియ్యం నిల్వ ఉంచారు. కానీ, మెడికల్ కాలనీలోని 19వ నంబర్ షాపులో బియ్యం లేక డీలర్ షాపునకు తాళం వేశాడు. దీంతో లబ్ధిదారులు వేరే దుకాణానికి వెళ్లాల్సివచ్చింది. కాగా, మంగళవారం పట్టణంలో విద్యుత్ కోత ఉండడంతో బయోమెట్రిక్ మిషన్లు పనిచేయక చాలా రేషన్ షాపులను మూసివేశారు. -
మున్సిపాలిటీల్లో పదోన్నతులు, బదిలీలు
అశ్వారావుపేట/ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పలువురు ఉద్యోగులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఖమ్మం నగరపాలక సంస్థ అసి స్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లాను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. అలాగే, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ జె.అనిల్కుమార్కు పదోన్నతి కల్పించి కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్గా నియమించారు.అంతేకాకుండా మధిర, వైరా కమిషనర్లుగావిధులు నిర్వర్తిస్తున్న ఏ.సంపత్కుమార్, సీహెచ్.వేణును అక్కడే పూర్తిస్థాయి కమిషనర్లుగా పోస్టింగ్ ఇచ్చా రు. అంతేకాక పలు మున్సిపాలిటీల్లో జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించి పోస్టింగ్ ఇచ్చారు. కొత్తగూడెంలో పనిచేస్తున్న జె.సుజితకు కేఎంసీలో సీనియర్ అసిస్టెంట్గా, ఇల్లెందులో పనిచేస్తున్న బి.సుధీర్కు వైరాలో, కేఎంసీలో పనిచేస్తున్న డి.నాగరాజుకు కొత్తగూడెం కార్పొరేషన్లో, సత్తుపల్లిలో పనిచేస్తున్న బి.రామచంద్రుకు కేఎంసీలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అలాగే, ఇల్లెందులో పనిచేస్తున్న ఎం.వీరకుమారి, మధిరలో పని చేస్తున్న ఆర్.నాగలక్ష్మి, కొత్తగూడెంలో పనిచేస్తున్న మూడ్ అశోక్, పి.సరస్వతికి పాత కేంద్రాల్లోనే పోస్టింగ్ ఇవ్వగా, మహబూబాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న కే.పీ.దిలీప్కుమార్ను సత్తుపల్లి సీనియర్ అసిస్టెంట్గా నియమించారు. విధుల్లో చేరిన అశ్వారావుపేట కమిషనర్ గ్రేడ్–3 కమిషనర్గా పదోన్నతి పొందిన బి.నాగరాజును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కమిషనర్గా నియమించారు. దీంతో ఇన్నాళ్లు ఇన్చార్జ్ కమిషనర్గా వ్యవహరించిన సుజాత నుంచి బాధ్యతలు స్వీకరించిన నాగరాజు ఆతర్వాత ఎమ్మెల్యే జారె ఆదినారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో కొత్త కమిషనర్ను ఎమ్మెల్యే సన్మానించి మున్సిపాలిటీలో అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళికపై సూచనలు చేశారు. అశ్వారావుపేట కమిషనర్గా నాగరాజు -
రైతు భరోసాను సద్వినియోగం చేసుకోవాలి
పాల్వంచరూరల్: వానాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా డబ్బులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన పేర్కొన్నారు. మండలంలోని జగన్నాథపురం గ్రామంలోని రైతువేదికలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల నిధులను రైతు ల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, ఏడీఏ యు.నర్సింహారావు, ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, ఏఓ శంభోశంకర్, సీడీపీఓ లక్ష్మీప్రసన్న, ఏపీఓ పొరండ్ల రంగా, ఏపీఎం రాంబాబు, పంచాయతీ కార్యదర్శులు చెన్నకేశవ, ఏఈఓలు సత్యం, శాంతి, ఇతర శాఖల అధికారులు కె.వెంకటేశ్వర్లు, మాధవీలత, అశోక్కుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీఐ ఆధ్వర్యాన రక్తదానం
ఖమ్మంగాంధీచౌక్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 70వ వ్యవస్థాపక వేడుకల్లో భాగంగా మంగళవారం ఖమ్మం మమత కాలేజ్ రోడ్డు బ్రాంచ్లో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 123 మంది ఎస్బీఐ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్యాంక్ రీజినల్ మేనేజర్ బి.రాజేఖర్ మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకోవడంలో రక్తదానం కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మోహన్నాయక్, బ్యాంక్ ఆఫీసర్ల అసోసియేషన్ ఏజీఎస్ షేక్ ఇబ్రహీం, రీజనల్ సెక్రటరీ ఆర్.శివకుమార్, హెచ్ఆర్ మేనేజర్ ఉదయ్, స్టాఫ్ యూనియన్ వైస్ ప్రసిడెంట్ నందన్, రీజనల్ సెక్రటరీ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మరో ముందడుగు
రెండేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్న సీతమ్మ సాగర్ బరాజ్, కరకట్టల నిర్మాణం విషయంలో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్కు కీలకమైన టెక్నికల్ కమిటీ అనుమతులు గత ఏప్రిల్లో జారీ కాగా, ఇప్పుడు భూ నిర్వాసితులకు పరిహారం విషయంలోనూ ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వచ్చింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంసీతమ్మసాగర్ కరకట్ట నిర్వాసితులకు పరిహారంలో కదలిక ● ఈ ప్రాజెక్టుతో ఎగువ ప్రాంతాల్లో ముంపు సమస్య ● వరద నివారణకు ఎత్తుగా కరకట్టల నిర్మాణం ● పరిహారం ఇవ్వాలంటూ కొంతకాలంగా ఆందోళనలు 100 అడుగుల ఎత్తుతో.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల మధ్య గోదావరి నదిపై సీతమ్మసాగర్ పేరుతో బరాజ్ నిర్మాణ పనులు 2022 చివరలో ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్ణయించిన ప్లాన్లో బరాజ్కు ఇరువైపులా కొద్ది దూరం మేరకే రివిట్మెంట్ నిర్మాణాలు ఉన్నాయి. అయితే అదే ఏడాది జూలైలో 29 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద గోదావరికి రావడంతో నదీ తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అంతేకాదు.. నదిలో కలిసే వాగుల్లోకి సైతం గోదావరి వరద ఎగపోటు వేసింది. ఈ భారీ వరద ఫలితాలను దృష్టిలో ఉంచుకుని సీతమ్మ సాగర్ బరాజ్కు ఎగువన ఇరువైపులా, నదిలో కలిసే వాగులకు సైతం కరకట్టలు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద కరకట్ట ఎత్తు 80 అడుగులుగా ఉంటే బరాజ్కి ఎగువన వంద అడుగుల ఎత్తుతో నిర్మించేలా డిజైన్ చేశారు. భూసేకరణ సమస్య.. సీతమ్మ సాగర్కు ఎగువన ఒక వైపు అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాలు, మరోవైపు దుమ్ముగూడెం, చర్ల మండలాలు ఉన్నాయి. అశ్వాపురం వైపు 40 కి.మీ., దుమ్ముగూడెం వైపు 55 కి.మీ. కరకట్టల పనులు వెంటనే ప్రారంభించారు. ఈ కొత్త నిర్మాణాల కోసం స్థానిక రైతుల నుంచి భూములు సేకరించాల్సి వచ్చింది. ఇందులో కొన్ని పట్టా భూములు ఉండగా మరికొన్ని పట్టా లేనివి ఉన్నాయి. అయితే కరకట్ట పనులు చేపట్టడానికి ముందే తమకు పరిహారం చెల్లించాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఈ తరహా ఆందోళనలు ఎక్కువగా జరిగాయి. ఓ వైపు రైతుల ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు నిర్మాణ పనులు మొదలయ్యాయి. కోర్టు ఆదేశాలతో.. సీతారామ ప్రాజెక్టులో ప్రధానమైన సీతమ్మ సాగర్ బరాజ్, కరకట్ట నిర్మాణ పనులకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదని, తమకు సరైన పరిహారం అందించలేదని కొందరు న్యాయస్థానం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దీంతో 2023 మే చివరి వారంలో సీతమ్మ సాగర్ బరాజ్ పనులు ఎక్కడివక్కడే ఆపేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో బరాజ్తో పాటు కరకట్ట పనులు సైతం నిలిచిపోయాయి. దీంతో రెండేళ్లుగా కరకట్ట పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థల వారు కొందరు యంత్రాలతో పాటు కార్మికులను ఇతర ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని సంస్థలు భారీ యంత్రాలను నదీ తీరంలోనే నిలిపి ఉంచగా.. అవి తుప్పు పట్టే దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి సీతమ్మసాగర్ విషయంలో సానుకూల నిర్ణయం వెలువడింది.దశలవారీగా పరిహారం.. కరకట్టల నిర్మాణం కారణంగా నష్టపోయే రైతులను ప్రభుత్వం రెండేళ్ల క్రితం గుర్తించింది. అయితే వారికి పరిహారం మాత్రం అందలేదు. తాజాగా చర్ల మండలం దేవరపల్లి(జెడ్) గ్రామంలో 13.26 ఎకరాల స్థలానికి సంబంధించి పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దశల వారీగా పరిహారం చెల్లింపులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అంతకుముందే సీతమ్మ సాగర్ బరాజ్, సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు కేంద్రం నుంచి ఆమోదం తెచ్చే విషయంలోనూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత ఏప్రిల్లో టెక్నికల్ కమిటీ నుంచి అనుమతులు వచ్చాయి. పర్యావరణ అనుమతులు రావడం ఇక లాంఛనమే అనే తరుణంలో భూ నిర్వాసితుల పరిహారం విషయంలోనూ కదలిక వచ్చింది.